breaking news
Andhra Pradesh
-
వైఎస్ జగన్ అనకాపల్లి, విశాఖ జిల్లాల పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం అనకాపల్లి,విశాఖ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ జగన్ పర్యటన వివరాలను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఆ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్ జగన్ రేపు (09.10.2025) ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు, అక్కడినుంచి అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం (వయా-ఎన్ఏడీ జంక్షన్, వేపకుంట, పెందుర్తి, కొత్తూరు జంక్షన్, తాళ్ళపాలెం జంక్షన్) వెళ్ళి మధ్యలో నిర్మాణం నిలిపివేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం అక్కడినుంచి బయలుదేరి విశాఖపట్నం కేజీహెచ్ (వయా - తాళ్ళపాలెం జంక్షన్, కొత్తూరు జంక్షన్, పెందుర్తి, వేపకుంట, ఎన్ఏడీ జంక్షన్)కు చేరుకుంటారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్ధులను పరామర్శిస్తారు. అనంతరం సాయంత్రం అక్కడి నుంచి తిరుగుపయనమవుతారు. -
‘వైఎస్ జగన్ పర్యటన యథావిధిగా కొనసాగుతుంది’
విశాఖ. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నర్సీపట్నం పర్యటన రేపు(గురువారం, అక్టోబర్ 9వ తేదీ) యథావిధిగా కొనసాగుతుందని పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. రేపు ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ ఎయిర్పోర్టుకు చేరుకుని, రోడ్డు మార్గాన మెడికల్ కాలేజ్కి వెళ్తారని తెలిపారు. స్టీల్ప్లాంట్ మీదుగా వెళ్లేందుకు పోలీసులు రూట్ మార్చారన్నారు. ‘ వైఎస్ జగన్ తన తిరుగు ప్రయాణంలో కేజీహెచ్కు వెళ్తారు. పచ్చకామెర్లతో బాధపడుతున్న విద్యార్థులను పరామర్శిస్తారు. 70 మంది వివిధ హాస్పిటల్స్ లో అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఇప్పటివరకు నలుగురు విద్యార్థులు మరణించారు. వైఎస్ జగన్ అంటే చంద్రబాబుకు భయం. వైఎస్ జగన్ బయటకు వస్తున్నారంటేనే చంద్రబాబుకు వణుకు పుడుతుంది.జగన్ పర్యటనకు ప్రజలు రాకుండా భయపెడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు కట్టే ఫ్లెక్సీలను అడ్డుకుంటున్నారు.అరిచేతను అడ్డంపెట్టి సూర్యకాంతిని అడ్డుకోలేరు. ఆంక్షలుతో వైఎస్ జగన్ను ఆపలేరు. మనుషులు ఉండే హాస్పటల్లో నిర్మించలేని చంద్రబాబు పశువులకు హాస్టల్స్ పెడతారట’ అని విమర్శించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘జగన్ పర్యటనపై పోలీసులు హైడ్రామా నడిపారు. స్టీల్ ప్లాంట్ కార్మికులను కలవడానికి వీల్లేదు అంటూ రూటు మార్చారు. మాకు ప్రజా సమస్యల ముఖ్యం. పోలీసుల రూట్ మార్చిన వైఎస్ జగన్ నర్సీపట్నం వెళుతున్నారు. వైఎస్ జగన్ కలవడానికి వచ్చే ప్రజలను పోలీసులు అడ్డుకోవాలని చూస్తున్నారు. జగన్ పర్యటనకు లేనిపోని ఆంక్షలు పెట్టారు. 10 కార్లు మాత్రమే కాన్వాయ్ లో ఉండాలంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా?, రాచరిక పాలనలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతుంది. జగన్ పర్యటనను ఎంత అణగదొక్కాలని చూస్తే అంత తిరుగుబాటు మొదలవుతుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్, గోవాడ సుగర్ ఫ్యాక్టరీ, చిరు వ్యాపారుల సమస్యలు ఉన్నాయి’ అని తెలిపారు. -
‘నకిలీ మద్యం కేసును సీబీఐతో విచారణ జరిపించాలి’
సాక్షి,అమరావతి: టీడీపీ పెద్దల నకిలీ మద్యం సిండికేట్ అమాయకుల ప్రాణాలను హరిస్తూ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తోంది. ప్రాంతాల వారీగా నకిలీ మద్యం ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంది. ఈ నకిలీ మద్యం దందాపై సీబీఐతో విచారణ చేపట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి డిమాండ్ చేశారు.2024 ఎన్నికల మందు తంబెళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి భాగస్వామ్యంతో అక్రమ మద్యం వ్యాపారం సాగించారు. కూటమి అధికారంలోకి రావడంతో అధికారమే అండగా రెచ్చిపోయారు. తంబళ్లపల్లె,ఇబ్రహీంపట్నం స్థావరాలుగా నకిలీ మద్యం తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని పలు ప్రాంతాలకు తరలించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న నకిలీ మద్యం దందాపై ఎంపీ మిథున్రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు.టీడీపీ నేతలే నకిలీ మద్యం కేసులో దొరికారు. రాష్ట్రంలో డంపులు డంపులుగా నకిలీ మద్యం సీజ్ అవుతోంది. టీడీపీ నేతలు నకిలీ మద్యాన్ని అనేక చోట్ల తయారు చేస్తున్నారు.. నా నియోజకవర్గ పరిధి లో ఉన్న తంబాళపల్లిలో చిన్న పరిశ్రమనే స్టార్ట్ చేశారు. తంబళ్ళపల్లెలో టీడీపీ తరుపున పోటీ చేసిన వ్యక్తే పట్టుబడ్డాడు. జయచంద్ర రెడ్డి అనే వ్యక్తి టీడీపీ మనిషి. ఇంత నిస్సిగ్గుగా మీ నాయకులే పట్టుబడితే.. మా మీద ఆరోపణలు చేస్తున్నారు.వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళారు. వాళ్ళు మా కోవర్టులు అంటున్నారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ముగ్గురు, నలుగురు ఇప్పుడు కేబినెట్లో ఉన్నారు. కెబినెట్ మంత్రులు కూడా మా కోవర్టులే అవుతారా? దీనిపై నిజనిజాలు ప్రజలకు తెలియాలి. రాష్ట్ర అధికారులతో విచారణ చేస్తే దర్యాప్తు తప్పుదోవ పడుతుంది. అందుకే సీబీఐతోనే నకిలీ లిక్కర్పై విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు. -
ఏపీని చంద్రబాబు మద్యాంధ్రప్రదేశ్గా మార్చారు: కాకాణి పూజిత
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ముందు వైఎస్సార్సీపీ నిరసనకు దిగింది. మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆధ్వర్వంలో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో ఎన్ బ్రాండ్ నకిలీ మద్యం తయారీ, అమ్మకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం సీసాలతో మహిళలు నిరసన తెలిపారు. ఏపీని చంద్రబాబు మద్యాంధ్రప్రదేశ్గా మార్చారని కాకాణి పూజిత దుయ్యబట్టారు. యూరియా కోసం క్యూలైన్లో నిల్చొవాలి.. కానీ మద్యం మాత్రం ఎక్కడైనా దొరుకుతుందంటూ మండిపడ్డారు.కర్నూలు: ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కల్తీ మద్యంతో ప్రాణాలు తీస్తున్న కూటమి ప్రభుత్వంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యాని విక్రయాలను నిరసిస్తూ మద్యం బాటిళ్లను ధ్వంసం చేసి వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసన వ్యక్తం చేసింది. తక్షణమే కల్తీ లిక్కర్ను అరికట్టాలని.. బెల్టు షాపులు తొలగించాలని మహిళలు డిమాండ్ చేశారు.అనంతపురం: కల్తీ మద్యంపై మహిళలు, యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం ఎక్సైజ్ డీసీ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ మహిళా, యువజన విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మద్యం బాటిళ్లు ధ్వంసం చేసి నిరసన తెలిపారు. కల్తీ మద్యం తయారు చేసే టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యం అరికట్టండి. పేదల ప్రాణాలు కాపాడాలంటూ నినాదాలు చేశారు. -
‘విద్యార్థుల మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత’
సాక్షి,విశాఖ: విద్యార్థుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏపీ మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి డిమాండ్ చేశారు. విశాఖ కేజీహెచ్లో పచ్చకామెర్లతో బాధపడుతున్న విద్యార్థులను పరామర్శించారు. అంనతరం,ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘విద్యార్థులకు స్క్రినింగ్ టెస్టులు చేయించారనేది అబద్ధం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పచ్చకామెర్లతో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. గురుకుల పాఠశాలలో శాటినేషన్ లోపమే కారణం.ఇప్పటికీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో పరీక్షలు చేయించడం లేదు. అసలు ఎంతమందికి వైద్య పరీక్షలు నిర్వహించారో చెప్పాలి. ఇవాళ మరో ఆరుగురు విద్యార్థులు కేజీహెచ్ వచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పచ్చ కామెర్లతో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు’అని ’ధ్వజమెత్తారు. -
‘గిరిజన విద్యార్థులు చనిపోతే సీఎం చంద్రబాబు పట్టించుకోరా?’
కేజీహెచ్(విశాఖ): పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గురుకుల బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థులు పచ్చ కామెర్ల బారిన పడితే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టింకోరా? అని నిలదీశారు వైఎస్సార్సీపీ నేత సీదిరి అప్పలరాజు. ఇందులో ఇద్దురు విద్యార్థినులు చనిపోయినా చంద్రబాబు గానీ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం కానీ కనీసం పట్టించుకోలేదన్నారు. ఈరోజు(బుధవారం, అక్టోబర్ 8వ తేదీ) విద్యార్థులను పరామర్శించడానికి విశాఖ కేజీహెచ్కు వెళ్లిన సీదిరి అప్పలరాజు.. మీడియాతో మాట్లాడారు. ‘ గిరిజన విద్యార్థులు చనిపోతే సీఎం చంద్రబాబు పట్టించుకోరా?,గిరిజన విద్యార్థుల ఆరోగ్యం ప్రభుత్వానికి పట్టదా?, పవన్కు జలుబు చేస్తే సీఎం చంద్రబాబు పరామర్శిస్తారు. గిరిజన విద్యార్థుల మరణాలు.. ప్రభుత్వ హత్యలే. గతంలె నాడు-నేడు ద్వారా విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు కల్పించాం’ అని సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. కాగా, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గురుకుల బాలికల పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థినులు పచ్చకామెర్ల బారిన పడిన విషయం తెలిసిందే. వీరిలో తొమ్మిదో తరగతి విద్యార్థిని తోయిక కల్పన, 10వ తరగతికి చెందిన పువ్వల అంజలి పచ్చకామెర్లతో మృత్యువాత పడ్డారు. మంగళవారం మరో ఏడుగురు విద్యార్థినులు ఆస్పత్రిలో చేరడంతో.. ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 50కి చేరుకుంది. ప్రాథమిక చికిత్స కోసం కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో 15 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. కేజీహెచ్ ఆస్పత్రి నుంచి రికవరీ అయిన కొంతమందిని డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. పాఠశాలలో మంచి నీటి వసతులు, మరుగుదొడ్లు, మరియు పోషకాహారం సరిగా లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
వైఎస్ జగన్ను కలిసిన డీఎస్సీ అభ్యర్థులు
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. డీఎస్సీ-2025 ను రద్దు చేసేలే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. రీ నోటిఫికేషన్ ఇచ్చి ఒకే పేపర్తో పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు కోరారు. నచ్చినట్లుగా మార్కులు కలిపే నార్మలైజేషన్ విధానం మోసపూరితంగా ఉందని డీఎస్సీ అభ్యర్థులు అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 77 రద్దుచేసేలా ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. డిఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తి పట్ల వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. -
కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ఏంటి?.. మంచు విష్ణు ఆగ్రహం
సాక్షి,తిరుపతి: మోహన్బాబు వర్సిటీపై వస్తున్న వార్తలను హీరో, మోహన్ బాబు యూనివర్శిటీ ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు ఖండించారు. ఈ మేరకు ఆయన బుధవారం (అక్టోబర్8న) ఓ నోట్ను విడుదల చేశారు.అందులో.. యూనిర్సిటీకి అనుకూలంగా హైకోర్టు స్టే ఉత్తర్వులు ఉండగా.. వాటిని ధిక్కరించి ఉన్నత విద్యామండలి పోర్టల్లో పెట్టడమేంటి? అని ప్రశ్నించారు. ఉన్నత విద్యామండలి సిఫార్సులు సరికాదు. మా యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చడానికి కొందరు సోషల్ దుష్ప్రచారం చేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు. -
నెల్లూరు డబుల్ మర్డర్.. గంజా బ్యాచ్ పనే!
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో గంజాయి వ్యాపారం స్వైర విహారం చేస్తోంది. అక్రమ రవాణా, నిల్వ, వినియోగం వంటి కార్యకలాపాలు వెలుగు చూస్తుండడం.. పోలీసుల నిఘా లోపాలను బయటపెడుతోంది. తాజాగా నెల్లూరు జిల్లా పెన్నా బ్యారేజ్ వద్ద వెలుగు చూసిన డబుల్ మర్డర్ కేసు.. గంజాయి బ్యాచ్ పనేనని నిర్ధారణ అయ్యింది. మంగళవారం ఉదయం.. పెన్నా బ్యారేజీ వద్ద రోడ్డుపై నెత్తురు మరకలు, మూడు జతల చెప్పులు ఉండడం చూసిన స్థానికులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సంతపేట పోలీసులు అనుమానంతో నదిలో గత ఈతగాళ్లను దింపి రెండు మృతదేహాలను వెలికి తీయించారు. అయితే అక్కడి సీసీటీవీ ఫుటేజీలు పని చేయకపోవడంతో నిందితులను పట్టుకోవడం కష్టమనే భావించారంతా. దీంతో.. ఎస్పీ అజితా ఆదేశాలతో నాలుగు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలించాయి.ఈ తరుణంలో.. కందుకూరు వద్ద బుధవారం ఉదయం నిందితులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హంతకులిద్దరూ గంజాయ్ బ్యాచ్గా గుర్తించారు. అడిగితే నగదు ఇవ్వలేదని కోపంతో ఇద్దరిని హత్య చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలతో పాటు నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. -
కోనసీమలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి
సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. క్షతగాత్రుల్ని అనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో బుధవారం ఉదయం సిబ్బంది బాణాసంచా తయారు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు ఎగసిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆరుగురు మృతుల్లో ఐదుగురిని పోలీసులు గుర్తించారు. వెలుగుబంటి సత్యసనారాయణ(55) యజమాని, పాకా అరుణ (30), చిట్టూరి శ్యామల, కుడిపూడి జ్యోతి, పెంకే శేషారత్నంగా గుర్తించారు.బాణాసంచా తయారీ కేంద్రం నుంచి మంటలు ఎగసి పడుతుండగా.. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మృత దేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పేలుడు తీవ్రతకు బాణసంచా తయారీ కేంద్రానికి 50 మీటర్ల దూరంలో ఉన్న రిటైల్ కేంద్రం కూడా దగ్ధమైంది. పేలుడు తీవ్రతకు షెడ్డు కుప్పకూలింది. సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ,ఎస్పి రాహుల్ మీనా పరిశీలించారు. జిల్లాలో 35 బాణాసంచా తయారీ కేంద్రాలకు అనుమతులు ఇచ్చామని.. బాణాసంచి కేంద్రాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. -
యువతకు ఉపాధి శిక్షణా కార్యక్రమాలు..
నిరుపేద వర్గాలకు చెందిన విద్యార్థులకు వృత్తి శిక్షణను అందించే లాభాపేక్షలేని సంస్థ అయిన ‘ఉన్నతి ఫౌండేషన్’ కాకినాడలో కొత్త శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించింది. కెప్టెన్ సుబ్బారావు ఉదార మద్దతుతో ప్రారంభమైన ఈ కేంద్రం, కీలకమైన ఉపాధి నైపుణ్యాలను , ఉద్యోగ అవకాశాలను పొందేందుకు యువతకు వీలు కల్పిస్తోంది.2024లో కాకినాడలో తన శిక్షణా కార్యక్రమాలను ఉన్నతి ప్రారంభించింది. ఇప్పటి వరకు దాదాపు 70 మందికి పైగా యువతకు విజయవంతంగా శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించడంలో సహాయసహకారాలు అందించింది. అంతేకాకుండా, ఈ సంస్థ కళాశాలల్లో UNXT శిక్షణా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కాకినాడలో దాదాపు 1,700 మంది విద్యార్థులకు చేరువవుతోంది. కొత్తగా ఏర్పాటుచేసిన ఈ వృత్తి శిక్షణా కేంద్రం, UNXT మోడల్తో కలిసి.. ప్రతి ఏడాది కాకినాడలో 2 వేల మందికి పైగా యువతకు నైపుణ్యం, వృత్తి శిక్షణ, ఉపాధి అవకాశాలను ఈ ఉన్నతి సంస్థ అందించనుంది . వృత్తి శిక్షణ కేంద్రంలో, శిక్షణ పొందిన ప్రతి వ్యక్తికి 35వ రోజు శిక్షణ నాటికి ఉద్యోగం లభిస్తుందనే భరోసా అందిస్తోంది. ఇది దీర్ఘకాలిక, స్థిరమైన కెరీర్లకు పునాది వేస్తుంది.“ఈ కేంద్రం ప్రారంభించడం ద్వారా, కాకినాడలో వీలైనంత ఎక్కువ మంది యువతను ఉద్యోగ రంగంలో అభివృద్ధి చెందడానికి అవసరమైన నైపుణ్యాలతో సన్నద్ధం చేయడమే మా లక్ష్యం. ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేయడంలో ఉదార మద్దతు ఇచ్చినందుకు కెప్టెన్ సుబ్బారావు ప్రభలకు తాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆయన నమ్మకం నిజంగా ప్రశంసనీయం, ఆయనతో భాగస్వామ్యం చేసుకోవడాన్ని గౌరవంగా ఉన్నతి భావిస్తోంది ” అని ఉన్నతి ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ స్వామి అన్నారు.ఈ కార్యక్రమంపై తన ఆలోచనలను కెప్టెన్ ప్రభల వెల్లడిస్తూ , “ఆంధ్రప్రదేశ్కు అపారమైన సామర్థ్యం ఉంది, కానీ అర్థవంతమైన ఉపాధిని పొందడానికి విద్య ఒక్కటి మాత్రమే ఎల్లప్పుడూ సరిపోదు. ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేసి ఉన్నతికి మద్దతు ఇచ్చి, తమ స్వంత కాళ్ళపై నిలబడేలా చేయడమే గాక, గౌరవప్రదంగా బతికేలా చేసేందుకు తమవంతు సహాయసహకారాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే చాలామంది బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, భీమా(BFSI)లో బిజినెస్ అసోసియేట్ వంటి ప్రొఫెషనల్ ఉద్యోగాలు పొందారు. మరికొందరు బీపీవో, టెలికాలింగ్ కార్యకలాపాల్లో చేరారు. అలాగే ప్రభుత్వ కళాశాలలలో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థతో కలిసి ఉన్నతి ఫౌండేషన్ పనిచేస్తుంది. ఒక్క కాకినాడలోనే, 5 నుంచి 6 కళాశాలలతో ఉన్నతి భాగస్వామ్యం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 29 వేలు కంటే ఎక్కువ మంది యువత దీని నుంచి పలు రకాల ప్రయోజనాలు పొందారు.(చదవండి: ఐఏఎస్ అధికారిణికి బంగారు పల్లకితో వీడ్కోలు..!) -
మాజీ మంత్రి జోగి రమేష్పై మరో అక్రమ కేసు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి జోగి రమేష్పై చంద్రబాబు సర్కార్ మరో అక్రమ కేసు నమోదైంది. టీడీపీ నేతల కల్తీ మద్యాన్ని ప్రశ్నించినందుకు చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం కేసులో ఏ1 టీడీపీ నేత అద్దేపల్లి జనార్ధనరావుకు చెందిన గోడౌన్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు నిర్వహించగా.. భారీ కల్తీ మద్యం తయారీ డెన్ బయటపడింది.పచ్చ నేత కల్తీ మద్యం డెన్ను పరిశీలించిన మాజీ మంత్రి జోగి రమేష్.. టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల కల్తీ మద్యాన్ని ప్రశ్నించడంతో ఆయనపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు. తమ విధులకు అడ్డంకి కలిగించడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం స్టేషన్లో ఎక్సైజ్ ఎస్ఐ పెద్దిరాజు ఫిర్యాదు చేశారు. జోగి రమేష్తో పాటు మరో 25 మందిపై కేసు నమోదైంది. -
ఏపీ కల్తీ మద్యం కేసు.. రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు
సాక్షి, విజయవాడ: నకిలీ మద్యం తయారీ కేసు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ మద్యం తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నట్టు పోలీసుల ఎదుట నిందితులు ఒప్పుకున్నారు. నకిలీ మద్యం తయారు చేయుటలో టీడీపీ నేత జనార్థన్ రావు, అతని సోదరుడు జగన్మోహన్రావు ప్రధాన పాత్ర పోషించినట్లు ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.మద్యం అమ్మకాలలో అధిక లాభాలు ఆర్జించడం కోసమే నకిలీ మద్యం తయారీ విధానం మొదలు పెట్టినట్లు నిందితుడు జగన్మోహన్రావు ఒప్పుకున్నట్లు అధికారులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. నాలుగు నెలల నుంచి మొలకల చెరువు ప్రాంతంలో నకిలీ మద్యం డెన్ మొదలు పెట్టినట్టు రిమాండ్ రిపోర్ట్లో అధికారులు పేర్కొన్నారు. మూడు నెలల క్రితం ఇబ్రహీంపట్నంలో డెన్ ఏర్పాటు చేసి వివిధ వైన్ షాపులు, బెల్ట్ షాపులు, బార్ల లో అమ్మకాలు జరిపినట్టు గుర్తించారు.హైదరాబాద్కి చెందిన రవి అనే వ్యక్తి నకిలీ లేబుళ్లు తయారు చేసినట్టు పోలీసులు గుర్తించారు. మొలకల చెరువులో తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఇబ్రహీంపట్నం తీసికొనివచ్చినట్టు పోలీసులు గుర్తించారు. నకిలీ మద్యం తయారీలో బెంగుళూరుకు చెందిన బాలాజీది కీలక పాత్ర వహించినట్లు పోలీసులు నిర్థారించారు. మద్యం బాటిళ్లకు ఫేక్ సీల్స్ బెంగుళూరు నుంచి బాలాజీ పంపినట్లు పోలీసులు గుర్తించారు.నకిలీ మద్యం కేసులో నిందితుల పై U/sec.13 (e), 1 3 (1), 34(a) =/w 34 (a)(1)(ii), 34 (e), 3 4 (f), 34 (h) r/w 34 (2) & 36 (1)(b)& (c), 37, 42, 50, 50(B) of A.P. Excise (Amendment) Act, 2020 OF PROH.& EXCISE సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అచ్చం ఒరిజినల్లా ఉండేలా బాటిళ్లపై సీల్స్ తయారు చేయడంతో అనుమానం రాకుండా మద్యం అమ్మకాలు సాగిస్తున్నట్లు పోలీసుల విచారణ తేలింది. -
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, గుంటూరు: బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు(YS Jagan Congratulate PM Modi). పాతికేళ్ల పాలనా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నందుకు ఆయన్ని అభినందిస్తూ ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారాయన. పాలనాధిపతిగా విశిష్ట సేవలందిస్తూ.. 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు నరేంద్ర మోదీకి అభినందనలు, దేశ సేవలో ఆయన అంకితభావం, పట్టుదల, నిబద్ధతను ప్రతిబింబించే గొప్ప మైలురాయి ఇది. ఈ సందర్భంగా.. ఆయనకు మరింత శక్తి కలగాలని, మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా అంటూ వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ సందేశం ఉంచారు.Congratulations to Shri @narendramodi ji on entering the 25th year of distinguished service in heading governance. A remarkable milestone reflecting dedication, perseverance, and commitment in service to the Nation. Wishing you continued strength and success.— YS Jagan Mohan Reddy (@ysjagan) October 8, 2025నరేంద్ర దామోదరదాస్ మోదీ.. 2001 అక్టోబరు 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలా.. 2014 మే 22 వరకు ఆ పదవిలో కొనసాగారు. అటుపై సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించగా.. మే 26వ తేదీన తొలిసారిగా భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. అలా.. 11 ఏళ్లకు పైబడి మూడు పర్యాయాలు వరుసగా ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఈ మైలురాయి సందర్భంగా.. భారత ప్రజలకు కృతజ్ఞుడిని అంటూ మంగళవారం మోదీ(Modi On 25 Years Governance) ఓ ప్రకటన విడుదల చేశారు.ఇదీ చదవండి: ఇందిరా గాంధీ రికార్డు బద్ధలు కొట్టిన ప్రధాని మోదీ -
విశాఖ పెదగంట్యాడలో ఉద్రిక్తత.. పోలీసులతో వాగ్వాదం, కుర్చీలు విసిరేసి..
సాక్షి, విశాఖ: విశాఖపట్నంలోని పెదగంట్యాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంబుజా సిమెంట్ ఫ్యాకర్టీ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న వేదిక వద్ద స్థానికులు నిరసన చేపట్టారు. దీంతో, స్థానికులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పోలీసులపైకి స్థానికులు తిరగబడ్డారు. పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకుని నిరసనలు తెలుపుతూ ఖర్చీలను విసిరేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.ఇదిలా ఉండగా.. విశాఖలోని పెదగంట్యాలడ (Pedagantyada)లో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఈ సిమెంట్ ఫ్యాక్టరీని స్థానికంగా ఉన్న 26 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రభుత్వ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ (Referendum) చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మొదటి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్న అన్ని గ్రామల ప్రజలు అక్కడకు చేరుకున్నారు. అనంతరం సిమెంటు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అయితే, ముందస్తుగా పోలీసులతో బందోబస్తు (arrangement)ను ఏర్పాటు చేసినప్పటికీ.. నిరసన కారులతో ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో స్థానికులు. సిమెంట్ కంపెనీతో జనావాసాలకు ఇబ్బంది కలుగుతుందంటూ ఆందోళన దిగారు. గోబ్యాక్ అంబుజా సిమెంట్ (Ambuja Cement) అంటూ నినాదాలు చేస్తూ ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసుల వారిని అదుపు చేసే ప్రయత్నం చేయడంతో.. ఆగ్రహించిన స్థానికులు మీటింగ్ స్థలంలో ఉన్న కూర్చీలను విసిరేశారు. -
పశ్చిమ గోదావరి జిల్లాలో వందేళ్ల గంధర్వ మహల్..ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
ఆంధ్రప్రదేశ్కు పట్టిన గ్రహణమేమిటో?
ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ఒకపక్క నకిలీ మద్యం.. ఇంకోపక్క కలుషిత నీరు. ప్రజల ఆరోగ్యం గాల్లో దీపం అవుతోంది. ప్రభుత్వానికేమో ఏదీ పట్టదాయె! అధికార పార్టీ తన దందాల్లో బిజీ!. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువు వద్ద నకిలీ మద్యం ప్లాంట్ను గుర్తించడం తెలుగుదేశం పార్టీ నేతల దుర్మార్గాలకు అద్దం పడుతోంది. అలాగే ప్రభుత్వ నిష్క్రియాపరత్వానికి కూడా. రాష్ట్రంలో అనకాపల్లి, పాలకొల్లు, గూడూరుల్లోనూ నకిలీ మద్యం అమ్ముతున్నట్లు గుర్తించారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద కూడా ఒక టీడీపీ నాయకుడి డంప్ ఒకటి బయటపడింది. వీటి పుణ్యమా అని ఏపీలో కల్తీ మద్యం ఏరులైపారుతోందన్నది కళ్ల ముందే కనిపిస్తోంది. ఎన్ని లక్షల మంది అనారోగ్యం పాలయ్యారో తెలియని పరిస్థితి. కల్తీ మద్యం అమ్మకాలకు ఒక నెట్ వర్క్.. తెలుగుదేశం నేతల అండ ఉండవచ్చని తెలుస్తోంది(AP Spurious Liquor Racket). జగన్ టైమ్లో ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో పెట్టి నానా యాగీ చేసిన చంద్రబాబు, ఆయన మిత్ర మీడియా ఇప్పుడు నిమ్మకు నీరెత్తితే ఒట్టు. పైగా నిందితులు వైసీపీ వారన్న కలరింగ్ ఇచ్చే ప్రయత్నాలు వెంటనే మొదలుపెట్టింది. తంబళ్లపల్లెలో టీడీపీ పక్షాన పోటీ చేసిన జయచంద్రా రెడ్డి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడని, ఆయనే టీడీపీలోకి పంపించారని చిత్రమైన ప్రచారం ఆరంభించింది. చంద్రబాబును కాపాడేందుకా? అన్నట్టు నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టవదన్నారని కథనాలు వండి వార్చింది. అన్ని కోణాలలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని చంద్రబాబు అన్నారట. నిష్పక్షపాతం వరకు ఓకే గాని, అన్ని కోణాల్లో అనడంలోనే మతలబు ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొందరు మంత్రులకూ సంబంధం ఉన్న ఈ కేసు నిందితులను చంద్రబాబు కాపాడుతున్నారని ఆరోపించారు. పైకి తూతూ మంత్రంగా తంబళ్లపల్లె ఇన్ఛార్జి జయచంద్రా రెడ్డి, సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీడీపీ ప్రకటించింది. వీరికీ చంద్రబాబు, లోకేశ్లకు ఉన్న దగ్గరి సంబంధాలు, కలిసి దిగిన ఫొటోలిప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. జగన్ సీఎంగా ఉండగా ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించేది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఇదంతా ప్రైవేట్ వ్యక్తుల పరమైంది. ఈ క్రమంలో వేలాది దుకాణాలను దక్కించుకున్న టీడీపీ నేతలు ఇతరులకు దక్కకుండా ఎమ్మెల్యేల చేత భయపెట్టించిన వార్తలూ మనం చూశాం. మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూములు కాస్తా మినీబార్లుగా మారాయి. వీటికి లెక్కకు మిక్కిలి బెల్ట్ షాపులు వెలిశాయి. ఒక్క తంబళ్లపల్లె నియోజకవర్గంలోనే వెయ్యి బెల్ట్ షాపులు ఉండగా..రాష్ట్రం మొత్తమ్మీద వీటి సంఖ్య లక్షకు మించిపోయాయని తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే మీడియానే అంచనా వేస్తోంది. ఈ బెల్ట్ షాపులతోపాటు అనుమతి కలిగిన మద్యం దుకాణాలకూ కల్తీమద్యం సరఫరా అయి ఉంటుందన్నది కొందరి అనుమానం. ములకల చెరువు నకిలీ మద్యం కేసు నిందితులు కొంతమందికి లైసెన్స్డ్ వైన్ షాపులు కూడా ఉండటం గమనార్హం.అప్పట్లో చంద్రబాబు నాసిరకం మద్యం వల్ల 30 వేల మంది చనిపోయారని నిరాధారంగా ఆరోపిస్తే(Chandrababu AP Spurious Liquor Racket Drama).. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మీడియా చిలువలు వలువలు చేసింది. టీడీపీ నేతలు స్వయంగా విషపూరిత మద్యం సరఫరా వెనుక ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. అత్యంత ప్రమాదకరమైన స్పిరిట్కే రంగులు, ఎస్సెన్స్లు కలిపి, గుర్తింపు పొందిన బ్రాండ్ల బాటిళ్లలో నింపి మార్కెట్ లోకి వదలుతున్నట్లు వెల్లడవుతోంది. నాణ్యమైన మద్యం రూ.99 రూపాయలకే ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మరీ గద్దెనెక్కిన కూటమి నేతలిప్పుడు ఏకంగా విషం ఇస్తున్నారని వీటి బారినపడి ఎన్నివేల మంది అనారోగ్యానికి గురయ్యారో, ఎంతమంది అకాల మృత్యువుకు గురయ్యారో ఎవరూ చెప్పలేకపోతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి పాలనలో నకిలీ మద్యం ఒక పరిశ్రమగా(Kutami Prabhutvam Fake Liquor) వర్ధిల్లుతోందని, ప్రజలకు ఉపాధి, మేలు కలిగించే పరిశ్రమలు ఏవీ రావడం లేదని విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకున్నారంటూ ఒక కల్పిత స్కామ్ ను సృష్టించి ఎవరెవరిపైనో దాడులు చేస్తూ, పలువురు ప్రముఖులపై కేసులు పెట్టిన చంద్రబాబు సర్కార్, ఇంత పెద్ద నకిలీ మద్యం స్కామ్ జరిగితే ఆ స్థాయిలో విచారణ చేయించే పరిస్థితి కనబడడం లేదని అంటున్నారు.ములకల చెరువు నకిలీ మద్యం దందా విలువ సుమారు రూ.6,000 కోట్లంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్సైజ్ అధికారులకు వెయ్యి లీటర్లకుపైగా స్పిరిట్, వేల బాటిళ్ల నకిలీ మద్యం పట్టుబడడం, జాతీయ రహదారికి కిలోమీటరు దూరంలోనే అన్ని రకాల యంత్ర సామాగ్రీ, హంగులతో ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారంటే.. పై స్థాయి నుంచి గట్టి మద్దతే ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ కేసులో జనార్ధనరావు అనే నిందితుడికి విజయవాడ వద్ద కూడా ఒక బార్ లైసెన్స్ ఉందట. ఈయన తంబళ్లపల్లెకు వెళ్లి ఈ నకిలీ మద్యం ప్లాంట్ పెట్టడానికి ఎవరి అండ ఉందన్నది దర్యాప్తు చేయవలసిన అధికారులు ఆ పని చేస్తారా? లేదా? అన్నదానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ములకల చెరువు కేసులో అసలు సూత్రధారులను తప్పించేస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో వెలుగులోకి వచ్చిన డైరీలోని వివరాలు, పేర్లు ఎవరివి? సూత్రధారులు ఎవరు? వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు? అన్న అంశాలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఎందుకు నియమించలేదు?.. ఒక వేళ నిజంగానే సిట్ ను ఏర్పాటు చేసినా, వారికి స్వేచ్చ ఉంటుందా?.. మరో వైపు కలుషిత నీరు వల్ల కురుపాం వద్ద గిరిజన విద్యార్థుల ఆశ్రమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్ధులు మరణించారు. సుమారు వంద మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుంటూరు సమీపంలోని తురకపాలెం గ్రామంలో 24 మంది అంతుపట్టని వ్యాధితో మృతి చెందారు. దీనికీ కలుషిత నీరే కారణం కావచ్చని భావిస్తున్నారు. మంచినీరు దొరుకుతుందో లేదో కాని, మద్యం విచ్చలవిడిగా పారుతోంది. దానికి తోడు విషపూరితమైన నకిలీ బ్రాండ్లు అడ్డూ, ఆపు లేకుండా అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు . ఫలితంగా అనేక అనర్ధాలు సమాజంలో ఏర్పడుతున్నాయి.అందువల్లే ఏపీకి ఏమైంది? అని ఆందోళన చెందాల్సి వస్తోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నకిలీ మద్యం కేసు: నాగరాజు అరెస్ట్.. సీఐ హిమబిందుపై వేటు
ములకలచెరువు/మదనపల్లె/గన్నవరం/గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన ములకలచెరువు నకిలీ మద్యం కేసులో రెండో ప్రధాన నిందితుడు కట్టా నాగరాజును మంగళవారం అరెస్ట్ చేసినట్టు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నంకు చెందిన నాగరాజు ములకలచెరువు నకిలీ మద్యం తయారీ ప్లాంట్లో కూలీలను సమకూర్చడంతోపాటు నకిలీ మద్యం రవాణా తదితర కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించామన్నారు. మిగిలిన నిందితులను అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ నీలకంఠేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు ఎక్సైజ్ సీఐ హిమబిందు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మరో ఇద్దరిని వేరుగా అరెస్ట్ చేశారు.ఇప్పటివరకు ఈ కేసులో నిందితులుగా తేలిన వారి సంఖ్య 14 మంది. తొలిరోజు 10 మందిని అరెస్ట్ చేయగా.. మిగిలిన నలుగురిలో కట్టా నాగరాజును మంగళవారం అరెస్ట్ చేశారు. కొడాలి శ్రీనివాసరావు, జయచంద్రారెడ్డి పీఏ రాజేష్, విదేశాల్లో ఉన్న జనార్దనరావు అరెస్ట్ కావాల్సి ఉంది. ఇదే కేసులో మరో ఏడుగురిని నిందితులుగా చేర్చబోతున్నట్టు ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి. ఆ ఏడుగురు ఎవరన్నది చర్చనీయాంశమైంది. కాగా.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగుచూసిన కల్తీ మద్యం తయారీ కేసులో మద్యం నింపేందుకు ఖాళీ బాటిళ్లను సరఫరా చేసిన సూరంపల్లి ఇండ్రస్టియల్ ఎస్టేట్కు చెందిన శ్రీనివాసరెడ్డిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మద్యం నింపేందుకు వినియోగించిన 90 ఎంఎల్ (క్వార్టర్) ఖాళీ బాటిళ్లను కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని సూరంపల్లి ఇండ్రస్టియల్ ఎస్టేట్లోని శ్రీనివాస పెట్ బాటిల్స్ కంపెనీ నుంచి కొనుగోలు చేసినట్టు గుర్తించారు. మంగళవారం ఆ కంపెనీలో సోదాలు నిర్వహించిన అధికారులు కంపెనీ నిర్వాహకుడైన గుంటూరుకు చెందిన శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని కంప్యూటర్ను స్వాధీనం చేసుకున్నారు.నిందితులకు 17 వరకు రిమాండ్ఇబ్రహీంపట్నంలో అరెస్టు చేసిన ముగ్గురికి కోర్టు ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో నిందితులు అద్దేపల్లి జగన్మోహన్రావు, బాధల్ దాస్, ప్రతాప్దాస్ను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని మంగళవారం 6వ ఎంఎం ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరు పరచగా, ముగ్గురికీ రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.అధికార పార్టీ నేతల్ని వదిలేసి.. ములకలచెరువు ఎక్సైజ్ సీఐపై బదిలీ వేటు మదనపల్లె: అధికార పార్టీ పెద్దల అండదండలతో సాగిన నకిలీ మద్యం దందాలో అసలైన సూత్రధారులు, పాత్రధారులను వదిలేసి ఎక్సైజ్ అధికారిపై వేటు వేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ములకలచెరువు నకిలీ మద్యం తయారీ రాకెట్ దందా నేపథ్యంలో ఎక్సైజ్ సీఐ హిమబిందును విజయవాడ కమిషనరేట్కు బదిలీ చేశారు. ఇప్పుడు వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ ప్లాంట్ ములకలచెరువు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.ఎక్కడో అటవీ ప్రాంతంలో నాటు సారా తయారు చేస్తుంటేనే దాడులు చేసే ఎక్సైజ్ అధికారులకు ఈ నకిలీ మద్యం తయారీ ప్లాంట్ గురించి తెలియక పోవడం విడ్డూరం అని ప్రజల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఐపై బదిలీ వేటు పడింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఈ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న అందరిపై అన్ని విధాలా విచారణ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా నకిలీ మద్యం, బెల్డ్ షాపులు, కర్ణాటక మద్యం అమ్మకాలు.. ఇలా ఇన్ని జరుగుతున్నా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విస్తుగొలుపుతోంది. -
తిరుమలలో మరో అపచారం.. వెకిలి చేష్టలతో అసభ్యకర రీల్స్
సాక్షి, తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు వెలసిన పవిత్రక్షేత్రం తిరుమలలో(tirumala) రీల్స్ తీసి వాటికి పాటలు జోడించి వెకిలి చేష్టలతో సోషల్ మీడియాలో(Social Media Reels) హల్చల్ చేస్తున్న ఘటనలు అధికమవుతున్నాయి. శ్రీవారి దర్శనానికి తిరుమల వస్తున్న కొందరు యువతీ యువకులు రీల్స్ పేరుతో తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు. ముఖ్యంగా శ్రీవారి ఆలయం మాడవీధుల్లో, ఆలయ గోపురాలు కనిపించే విధంగా కొన్ని అసభ్యకరమైన రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.తాజాగా శ్రీవారి ఆలయం ముందు ఓ యువతి రీల్స్ చేశారు. ఈ వీడియోను తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కొందరు యువకులు మాడవీధుల్లో రీల్స్ చేయడం కూడా వైరల్గా మారింది. టీటీడీకి సంబంధించిన కొందరు వ్యక్తుల ద్వారా వీరు మాడవీధుల్లోకి ప్రవేశించారని, భద్రతా సిబ్బంది పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వామి సేవలో నిత్యం పాల్గొనేవారే ఇలా సోషల్ మీడియా వారితో కలిసి రీల్స్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రీల్స్ చేయడమే కాదు, తిరువీధుల్లోకి ఎలా వచ్చామో కూడా వారు తమ రీల్స్లో చెప్పుకొచ్చారు.చూశారా తమ్ముళ్లు మన మంచి ప్రభుత్వంలో తిరుమలలో కూడ రీల్స్ చేసుకునే సదుపాయం కల్పించాం pic.twitter.com/ZHj0oJyGq8— Ꮩᴀʀsʜᴀ Ꭱᴇᴅᴅʏ 🐬 (@YSvarshareddy) October 6, 2025గతంలో తిరుపతిలోని అలిపిరిలో డ్యాన్స్ చేస్తున్న యువతి వీడియో వైరల్ కావడంతో టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏకంగా కొండపైనే సోషల్ మీడియా వ్యక్తులు వెర్రిపోకడలు పోతున్నారు. తిరుమల ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. తిరుమలలో అసభ్యకరమైన రీల్స్ తీయడంపై భక్తులు మండిపడుతున్నారు. టీటీడీ పాలకమండలి, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. గుడిముందు ఇంత జరుగుతున్నా టీటీడీ మొద్దునిద్ర పోతోందా అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో వెంగమాంబ అన్నదాన సత్రంలో సోషల్ మీడియా రీల్స్ చేయించడం పై శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తినే విధంగా ఉన్నాయంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. pic.twitter.com/8bUxzZ8W62— TOVINO𓃵 (@Vamos_Rafa23) October 7, 2025 -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈ నెల 9న తాను సందర్శిస్తానని.. అదే రోజు నుంచే ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు ఈనెల 10వ తేదీన గ్రామ, వార్డు స్థాయిల్లో మొదలయ్యే రచ్చబండ కార్యక్రమం నవంబరు 22 వరకు కొనసాగుతుందని తెలిపారు.ఈనెల 28న నియోజకవర్గ కేంద్రాల్లో, నవంబరు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సేకరించే కోటి సంతకాల పత్రాలను నవంబరు 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు, నవంబరు 24న అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తామన్నారు. అనంతరం గవర్నర్ను కలిసి అన్ని విషయాలు నివేదిస్తామన్నారు. సేకరించిన కోటి సంతకాల పత్రాలు గవర్నర్కు అందజేస్తామన్నారు.మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ముఖ్యంగా కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. యథేచ్ఛగా సాగుతున్న నకిలీ మద్యం విక్రయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేలా చొరవ చూపాలని ఆదేశించారు. సమావేశంలో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ప్రభుత్వమే ఎందుకు నిర్వహించాలంటే..? మనం మన హయాంలో శ్రీకారం చుట్టిన 17 మెడికల్ కాలేజీల్లో 10 కళాశాలలను ప్రైవేటుకు కట్టబెడుతూ పేదలకు చంద్రబాబు తీవ్ర ద్రోహం చేస్తున్నారు. రాష్ట్రంలో 1923 నుంచి 2019 వరకు కేవలం 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే మనం ఒక విజన్తో ఏకంగా 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో తెచ్చాం. దీనిపై అందరూ ఆలోచన చేయాలని కోరుతున్నా. మీరు ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఈ విషయాన్ని మాట్లాడమని కోరుతున్నా.అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూళ్లను నడుపుతుంది? ఎందుకు ఆస్పత్రులను నడుపుతుంది? ఎందుకు ఆర్టీసీ బస్సులను నడుపుతుంది? వాటిని ప్రభుత్వాలే ఎందుకు నడుపుతున్నాయి? ఎందుకంటే.. ప్రభుత్వాలు అవి చేయకపోతే ప్రైవేటు ఎక్స్ప్లాయిటేషన్ (దోపిడీ) జరుగుతుంది. ప్రభుత్వం కనుక ఆస్పత్రులను నడపకపోతే ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీతో ఏ పేదవాడికీ వైద్యం అందని దుస్థితి తలెత్తుతుంది. ప్రభుత్వం కనుక స్కూళ్లను నడపకపోతే.. నారాయణ, చైతన్య యాజమాన్యానికి ఫీజులు కట్టలేక పేదలు తమ పిల్లలను చదివించలేని పరిస్థితిలోకి వెళ్లిపోతారు. గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులను నడపకపోతే.. ప్రైవేటు ఆపరేటర్ల దెబ్బకు ఎవరూ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్లే పరిస్థితి ఉండదు. అందుకే గవర్నమెంట్ వీటన్నింటిలో ఎంటరవుతుంది. అందుకనే ప్రభుత్వం స్కూళ్లను, బస్సులను, హాస్పటళ్లను నిర్వహించాలి. లేదంటే ప్రైవేటు దోపిడీకి అడ్డూ అదుపూ ఉండదు. జిల్లా మొత్తానికి హబ్గా.. మన హయాంలో ప్రతి జిల్లాలో ఒక టీచింగ్ హాస్పటల్ను తెచ్చే ప్రయత్నం చేశాం. ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చాం. ఒక మెడికల్ కాలేజీ రాకతో 8 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ప్రైవేటు దోపిడీ ఆగిపోతుంది. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెడికల్ స్టూడెంట్లు, నర్సింగ్ స్టూడెంట్లు టీచింగ్ హాస్పటల్లో పని చేస్తారు. రకరకాల విభాగాలతో సూపర్ స్పెషాలిటీ సేవలు అక్కడ అందుబాటులోకి వస్తాయి. తద్వారా పేద, మధ్యతరగతి వారికి ఉచితంగా వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఇదే కాకుండా జిల్లా మొత్తానికి టీచింగ్ హాస్పటల్ ఒక హబ్గా పని చేస్తుంది. పేదవాడికి ఉచితంగా వైద్యం అందుతుంది. అందుకే ప్రివెంటివ్ కేర్ మన పాలనలో సువర్ణాధ్యాయంగా నిలిచింది. మెడికల్ సీట్లు పెరిగేవి.. నేను ముఖ్యమంత్రి అయ్యే వరకు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మెడికల్ సీట్లు 2,360 మాత్రమే. మనం ఏర్పాటు చేసిన 17 మెడికల్ కాలేజీల ద్వారా మరో 2,550 సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చేవి. మొత్తంగా 4,900 మందికిపైగా డాక్టర్లు ప్రతి సంవత్సరం బయటికి వచ్చేవారు. అంతమంది డాక్టర్లు మన రాష్ట్రంలో అందుబాటులో ఉండే పరిస్థితి ఉత్పన్నమయ్యేది. అది కూడా మెడికల్ సీట్లలో 50 శాతం కోటా ఉచితం. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కాబట్టి మిగిలిన 50 శాతం సీట్లు కూడా ప్రైవేటు మెడికల్ కాలేజీలతో పోలిస్తే తక్కువ ఫీజుకే విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. చంద్రబాబు ఇప్పుడు ప్రైవేటీకరణ ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. ఉచిత వైద్యం పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. ఏడు కాలేజీలు పూర్తి చేశాం.. మన హయాంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి ఐదింటిని పూర్తి చేశాం. వాటితోపాటు పాడేరు మెడికల్ కాలేజీని కూడా కలిపితే 800 ఎంబీబీఎస్ సీట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చేశాయి. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల.. ఇలా ఐదు మెడికల్ కాలేజీలు మనం అధికారంలో ఉండగానే 2023–24లోనే ప్రారంభమయ్యాయి. మరో రెండు కాలేజీలు.. పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలను కూడా ప్రారంభించేందుకు చంద్రబాబు రాకముందే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. పులివెందుల మెడికల్ కాలేజీకి 50 మెడికల్ సీట్లు శాంక్షన్ అయితే.. మాకొద్దంటూ చంద్రబాబు అడ్డుకుని ఎన్ఎంసీకి లేఖ రాయించారు. 9 నుంచి కార్యాచరణకూటమి సర్కారు ప్రజా కంటక పాలనను నిలదీస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈనెల 9న నేను స్వయంగా సందర్శిస్తా. ఆ రోజుతో ఈ కార్యాచరణ ప్రారంభమవుతుంది. మర్నాడు 10వ తేదీన గ్రామ, వార్డు స్థాయిల్లో రచ్చబండ కార్యక్రమం మొదలై నవంబరు 22 వరకు కొనసాగుతుంది. అక్టోబరు 28న నియోజకవర్గ కేంద్రాల్లోనూ, నవంబరు 12న జిల్లా కేంద్రాల్లోనూ ర్యాలీలు నిర్వహిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలు నవంబరు 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు, 24న జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు తరలిస్తారు. అనంతరం గవర్నర్ను కలిసి అన్ని విషయాలు నివేదించి కోటి సంతకాల పత్రాలు అందజేస్తాం. ఏటా రూ.1000 కోట్లు ఖర్చు చేయలేరా? మనం దాదాపు రూ.3 వేల కోట్లు మెడికల్ కాలేజీలకు ఖర్చు చేశాం. ఇక మిగిలింది రూ.5 వేల కోట్లు. ఇన్ని లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో సంవత్సరానికి రూ.1000 కోట్లు చొప్పున మిగిలిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయడానికి ఖర్చు పెట్టలేరా? వాటిని పూర్తి చేయడానికి మన హయాంలోనే నాబార్డ్ ఫండింగ్ తీసుకువచ్చాం. సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫాస్ట్రక్చర్ అనే పథకంలో మెడికల్ కాలేజీలను కూడా పెట్టించాం. 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణం స్పెషల్ అసిస్టెన్స్ కింద ఇస్తారు. నేను చంద్రబాబును సూటిగా అడుగుతున్నా.మెడికల్ కాలేజీల కోసం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఇవ్వలేరా? సంవత్సరానికి రూ.1000 కోట్లు ఇవ్వలేరా? అమరావతిలో రూ.70 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని చెబుతున్నారు. ఇప్పుడున్న 50 వేల ఎకరాలు సరిపోవు. ఇంకో 50 వేల ఎకరాలు కావాలని అడుగుతున్నారు. మొదట 50 వేల ఎకరాలను డెవలప్ చేయడానికి చంద్రబాబు ఇచ్చిన రిపోర్టు ప్రకారమే కావాల్సింది రూ.లక్ష కోట్లు. కానీ ఇంతకు ముందు ఆయన ఖర్చు చేసింది చూస్తే రూ.4500 కోట్లు. అది అలా ఉండగానే మరో 50 వేల ఎకరాలు కావాలంటున్నారు.అంటే అక్కడ మరో రూ.లక్ష కోట్ల ఖర్చుకు సిద్ధమయ్యారు. అంటే మొత్తం రూ.రెండు లక్షల కోట్లు అమరావతిలో పెట్టడానికి సిద్ధమయ్యారు. అలాంటిది రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి కొత్త మెడికల్ కాలేజీలు ఉపయోగపడతాయి. అవి చిరస్థాయిగా నిలి్చపోయే విలువైన సంపద. ప్రైవేటు వారు పేదలను దోచుకోకుండా శ్రీరామరక్ష లాంటిది. అలాంటి వాటికి ఐదేళ్లలో కేవలం రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేరా? ఆశ్చర్యంగా ఉంది. కార్యక్రమాల నిర్వహణ ఇలా.. ఈ కార్యాచరణలో భాగంగా ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తాం. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం వల్ల జరిగే నష్టాన్ని, సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు ప్రజలకు చేస్తున్న మోసాలను వివరిస్తాం. అదే సమయంలో ఆ గ్రామంలో పార్టీ గ్రామ కమిటీలు, అనుబంధ సంఘాల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలి. మెడికల్ కాలేజీలకు సంబంధించి క్యూఆర్ కోడ్తో ముద్రించిన పాంప్లెట్లు, కోటి సంతకాల సేకరణ కోసం క్యూఆర్ కోడ్తో రూపొందించిన లెటర్ కాపీలను గ్రామ కమిటీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులకు అందచేయాలి. ప్రతి నియోజకవర్గంలో దాదాపు 100 పంచాయతీలు ఉంటాయనుకుంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కనీసం 500 మందితో సంతకాలు సేకరిస్తాం.ఆ బాధ్యతను కొత్తగా నియమించే గ్రామ కమిటీలు, అనుబంధ సంఘాలకు అప్పగిస్తాం. ఈనెల 10 నుంచి నవంబరు 22 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరోవైపు నియోజకవర్గాల్లో అన్ని వర్గాల వారితో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తాం. ప్రతి నియోజకవర్గం ఇన్చార్జీ రోజూ రెండు గ్రామాలను సందర్శించి సంతకాల సేకరణను పర్యవేక్షించి అక్కడే మీడియాతో మాట్లాడతారు. అక్టోబర్ 28న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీ నిర్వహించి, నియోజకవర్గ స్థాయి అధికారికి డిమాండ్ పత్రాన్ని అందచేస్తాం. అప్పుడు ఏదో ఒక నియోజకవర్గంలో నేను స్వయంగా ర్యాలీలో పాల్గొంటా.నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందచేయాలి. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలు నవంబరు 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు, నవంబరు 24న జిల్లా కేంద్రాల నుంచి విజయవాడ తరలిస్తారు. తదుపరి గవర్నర్ను కలిసి అన్ని విషయాలు నివేదిస్తాం. కోటి సంతకాల పత్రాలూ ఆయనకు అందజేస్తాం. -
ఏ 'మాత్ర'o తగ్గలేదు!
జీఎస్టీ భారాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈనెల 22 నుంచి కొత్త స్లాబులను అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా నిత్యావసరాలు, వాహనాలు, ఎలక్ట్రికల్ వస్తువులు, గృహోపకరణాలతోపాటు, ప్రజారోగ్యం దృష్ట్యా పలు మందులపైనా జీఎస్టీని కుదించింది. అయితే మెడికల్ షాపుల్లో జీఎస్టీ తగ్గింపు బోర్డులు కనిపించని పరిస్థితి నెలకొంది. పాత ధరలతోనే కొనుగోలు చేసి జేబులకు చిల్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. దీనిపై ఏ ఒక్కరూ నోరుమెదపకపోగా.. డ్రగ్ ఇన్స్పెక్టర్లు కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాణిపాకం: చిత్తూరు జిల్లాలో దాదాపు 1,500 మెడికల్ స్టోర్లు, 200పైగా హోల్ సేల్ షాపులున్నాయి. వీటి ద్వారా రోజువారీ రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. ఫలితంగా ట్యాక్స్ ఎగ్గొట్టాలని చాలామంది మెడిసిన్ కొనుగోలుపై బిల్లులు ఇవ్వడం లేదు. బిల్లు అడిగితే ఇస్తామని చెప్పి జాప్యం చేస్తున్నారు. కొనుగోలు ధర ఒకటి, బిల్లులో నమోదు చేసే ధర మరొకటిగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక మందుల ప్యాకెట్లపై గడువు తేదీలు కూడా సరిగా కనిపించక పోవడం ఆందోళన కలిగిస్తోంది. బేరాల్లేవ్! చాలా ప్రైవేట్ ఆస్పత్రుల్లో సొంతంగా మెడికల్ షాపులు నడుపుతూ రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన రోగులు అక్కడే మందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. వైద్యులు సైతం తమ షాపుల్లో లభించే మందులనే రాయడం గమనార్హం. ఈ షాపుల్లో మందులపై ఎలాంటి తగ్గింపులు లేకుండా ఎంఆర్పీకే విక్రయిస్తున్నారు. నిబంధనలు పాటించరే మందులపై జీఎస్టీ తగ్గింపు ధర ఈనెల 22 నుంచి అమలులోకి వచ్చింది. సవరించిన ధరలతో మెడికల్ షాపుల్లో బోర్డులు పెట్టాలి. ఎక్కడా ఈ బోర్డులు కనపించడం లేదు. దుకాణదారులు నిబంధనలు పాటించడం లేదు. అధికారుల వత్తాసు ఉందని జీఎస్టీకి తూట్లు పొడుస్తున్నారు. ప్రజలను మందులు, మాత్రలతో మాయ చేస్తున్నారు. జీఎస్టీ తగ్గింపు ధరలు అమలుపై నిఘా కొరవడింది. ఔషధ నియంత్రణ శాఖ పర్యవేక్షణలో ఎక్కడా తనిఖీలు గానీ, సోదాలు గానీ చేసినట్లు కనిపించడం లేదు. ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి జీఎస్టీ తగ్గింపు అమలయ్యేలా చూడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పాత మందులంటూ బూచీ జీఎస్టీ తగ్గింపు కారణంగా క్యాన్సర్, గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన అత్యవసర మందుల ధరలు తగ్గుతాయనే ప్రచారం ఆర్భాటంగానే మిగిలిపోయింది. మందుల షాపుల యాజమా నులు పాత స్టాక్ పేరు చెప్పి ఆ ధరలకే విక్రయిస్తున్నారు. పాత స్టాక్ పూర్తయిన తర్వాతే కొత్త ధరలు అమలవుతాయని బుకాయి స్తున్నారు. పాత స్టాక్ నిల్వలపై కొత్త ధరలు వర్తింపజేయడానికి నిబంధనలు ఉన్నా వాటిని అమలు చేయడం లేదు. ఈ విషయా న్ని సంబంధిత డ్రగ్ ఇన్స్పెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. తగ్గింపు ధరలు అమలు కావాలి ఇప్పుడున్న రోజుల్లో తిండికంటే ముందు ముఖ్యమైనవి మందులు, మాత్రలు. ప్రస్తుత పరిస్థితుల్లో గుండె జబ్బులు, క్యాన్సర్, షుగర్, బీపీ వంటి వ్యాధులు అధికంగా ఉన్నాయి. మందులు, మాత్రలకు పేద కుటుంబాల వారు కూడా నెలవారీగా వేలల్లో ఖర్చు చేస్తున్నా రు. జీఎస్టీ ఊరటతో కాస్త తగ్గుతుందని అనుకుంటే..ఇంకా మందుల దుకాణాల్లో పాత ధరలే అమలవుతున్నాయి. అధికారులు స్పందించి జీఎస్టీ తగ్గింపు వర్తించేలా చూడాలి. – రాజారత్నంరెడ్డి, ప్రజాహిత సేవా సంస్థ అధ్యక్షుడు, చిత్తూరు -
జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుయుక్తులు
8 ఏప్రిల్ 2025న సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లెలో టీడీపీ నేతల చేతుల్లో హత్యకు గురైన వైఎస్సార్సీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులు అనేక అడ్డంకులు సృష్టించినా ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. జనాభిమానాన్ని పోలీసులు నిలువరించలేకపోయారు. 18 జూన్ 2025న పోలీసుల వేధింపులు తట్టుకోలేక పోయిన పార్టీ కార్యకర్తను పరామర్శించేందుకు పల్నాడు జిల్లాకు వైఎస్ జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా కేవలం 100 మంది మాత్రమే రావాలంటూ అర్థంపర్థం లేని నిబంధనలను పోలీసులు విధించారు. ఎక్కడికక్కడ అరెస్టులకు తెగబడ్డారు. ఆంక్షలు పెట్టారు. అయినా ప్రజలు పొలాల మధ్యలోనుంచి గట్ల వెంబడి పరుగులు తీసుకుంటూ తమ అభిమాన నేతను చూసేందుకు వచ్చారు. 31 జూలై 2025న అక్రమ కేసులతో జైలుకు వెళ్లి తిరిగివచ్చిన మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు వెళ్లారు. పోలీసులు జగన్ పర్యటనను విఫలం చేయాలని శాయశక్తులా యత్నించారు. ఎవ్వరూ రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పాటు ఏకంగా రోడ్లపైన అప్పటికప్పుడు తవ్వేశారు. అయినా ప్రజాభిమానాన్ని ఆపలేకపోయారు. ఈ ఘటనలను సాకుగా చూపి ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పరోక్షంగా తన అసమర్థతను అంగీకరిస్తున్నట్టుగా ఉంది. వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనకు 66వేల మంది వస్తారని, వారిని నిలువరించలేమని పోలీసులే పేర్కొనడం, జగన్ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలన్న సర్కారు కుట్రలో వారు పావులుగా మారడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం శతవిధాలా యత్నిస్తోంది. కొత్త ఎత్తులు వేస్తోంది. వైఎస్ జగన్ వెళ్లిన ఎక్కడికి వెళ్లినా జనాదరణ వెల్లువెత్తుతుండడంతో సర్కారులో వణుకుపుడుతోంది. ప్రజావ్యతిరేకత పెరిగిపోవడంతో జంకుతోంది. ఫలితంగా ఎలాగైనా వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనను అడ్డుకోవాలని ఆంక్షలు విధిస్తోంది. పోలీసులను అడ్డుపెట్టుకుని దొంగాట ఆడుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ పర్యటనకు ఏకంగా 65 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నామని, విశాఖపట్నం విమానాశ్రయం నుంచి మెడికల్ కాలేజీ నిర్మాణమవుతున్న మాకవరపాలెం మండలంలోని భీమబోయినపాలెం వరకు రోడ్డు మార్గాన వెళితే భద్రత కల్పించలేమంటూ అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, విశాఖ సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చితో ప్రత్యేకంగా విలేకరుల సమావేశాలు పెట్టి మరీ అప్పటికప్పుడు ప్రకటించడం గమనార్హం. 63 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గంలో అవసరమైన పోలీసు బలగాలను ఇప్పటికిప్పుడు కేటాయించలేమంటూ సెలవివ్వడం చర్చనీయాంశమైంది. విశాఖలో ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోందంటూ సాకుగా చూపడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. అంతిమంగా ఈ పర్యటన జరగకుండా చూసేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒకవైపు స్వయంగా పోలీసులే... 65 వేల మంది తరలివచ్చేందుకు అవకాశం ఉందని, అంత మందికి అక్కడి ప్రాంతం సరిపోదంటూ మాజీ మంత్రి అమర్నాథ్కు పంపిన సమాధానంలో పేర్కొనడం ఈ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని పరోక్షంగా అంగీకరించినట్టు స్పష్టమవుతోంది. సవాల్ విసిరి.... చల్లారిపోయి....! వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో ప్రారంభించారు. ఉమ్మడి విశాఖలోని పాడేరు మెడికల్ కాలేజీని పూర్తిచేసి ఈ విద్యాసంవత్సరం విద్యార్థులకు 50 సీట్లు కేటాయించారు. మరో ఐదు కళాశాలలను అంతకుముందే ప్రారంభించారు. అదే విధంగా కొత్తగా ఏర్పాటైన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవారిపాలెం మండల పరిధిలోని భీమబోయినపాలెం వద్ద రూ. 500 కోట్లతో 50 ఎకరాల్లో 13.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వమే చేపట్టింది. ఇప్పటికే 60 శాతం మేర నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం వచి్చన తర్వాత ఈ పనులను పూర్తిగా నిలిపివేసింది. పైగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్దతిలో ప్రైవేటు పరంచేసేందుకు సర్కారు కుట్రపన్నింది. దీనిపై ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తడంతో ఈ కాలేజీకి అనుమతులు లేవంటూ ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కొత్తరాగం అందుకున్నారు. శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అయితే నర్సీపట్నం మెడికల్ కాలేజీకి అసలు అనుమతి లేదని, జీఓ ఉందా? దమ్ముంటే రమ్మనండి.. ఎవరినైనా రమ్మను అంటూ బీరాలు పోయారు. అర్థంపర్థం లేని సవాల్ విసిరారు. అయితే, స్పీకర్ మాటలు అబద్ధాలేనని భీమబోయినపాలెంలో కనిపిస్తున్న మెడికల్ కాలేజీ భవనాలే సమాధానమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ప్రత్యేక నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దీంతో నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ భవనాలను పరిశీలించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న రానున్నారు. ఇప్పటివరకు దమ్ముంటే రమ్మనండి అంటూ సవాళ్లు విసిరిన కూటమి నేతలు ఇప్పుడు వైఎస్ జగన్ వస్తుంటే నిజాలన్నీ బయటకు వస్తాయని వణికిపోతున్నారు. ఆయన పర్యటనను అడ్డుకునేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారు.హెలికాప్టర్పై అయితే అనుమతిస్తారట..! వాస్తవానికి వివిధ సమస్యలపై ప్రజల వద్దకు వెళ్లేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యత్నించిన ప్రతీసారి ఏదో ఒక రూపంలో అడ్డంకులు కల్పించడం పోలీసులకు పరిపాటిగా మారింది. అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటన సందర్బంగా జరిగిన ఘటనను పేర్కొంటూ హెలికాప్టర్ ల్యాండింగ్కు పలు సందర్భాల్లో అనుమతి నిరాకరించిన పోలీసులు... ఇప్పుడు అందుకు విరుద్ధంగా హెలికాప్టర్లో వస్తే అనుమతిస్తామంటూ కొత్త పల్లవి అందుకోవడం గమనార్హం. అయితే, గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హెలికాప్టర్లో ప్రయాణం సాధ్యం కాదని తెలిసినా.. అందుకు అంగీకరిస్తామని చెప్పడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదో విధంగా జగన్ను అడ్డుకోవాలన్న కుట్రలో భాగంగానే ఈ పల్లవి ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది. ఎట్టకేలకు ఆంక్షలతో అనుమతివిశాఖ సిటీ: మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు అనుమతులు లేవంటూ మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ అటు అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, ఇటు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మీడియాకు స్పష్టం చేశారు. ఈ విషయమై తీవ్ర విమర్శలు రావడంతో నాటకీయ పరిణామాల మధ్య పలు షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నామని మంగళవారం అర్ధరాత్రి విశాఖ పోలీస్ కమిషనర్ ప్రకటించారు. పర్యటన ఇలా సాగాలి » విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఎన్ఏడీ కొత్త రోడ్డు, బాజీ జంక్షన్, గోపాలపట్నం పెట్రోల్ బంక్ జంక్షన్, వేపగుంట జంక్షన్ రావాలి.» అక్కడి నుంచి సుజాతనగర్, పెందుర్తి పోలీస్ స్టేషన్ జంక్షన్, పెందుర్తి జంక్షన్, సరిపల్లి జంక్షన్ మీదుగా రోడ్డు మార్గంలో వెళ్లాలి. » ట్రాఫిక్ ఏసీపీ అనుమతి లేకుండా ఈ మార్గం నుంచి ఎటువంటి మార్పులు, పొడిగింపు లేదా అనుమతి లేని హాల్ట్ చేయకూడదు. » ఈ మార్గంలో ఏదైనా జంక్షన్, రోడ్డు పక్కన ఉన్న పాయింట్ లేదా వేదిక వద్ద నిర్వాహకులు ప్రజలను సమీకరించకూడదు. గుమిగూడటానికి కూడా అనుమతి లేదు. » మార్గంమధ్యలో సమావేశాలు, రిసెప్షన్లు, ప్రజల్ని సమీకరించడం చేయకూడదు. » ఊరేగింపులు, రోడ్ మార్చ్లపై నిషేధం ఉంటుంది. -
ప్రభుత్వ తీరుపై గురువుల ‘ధర్నా’గ్రహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను ప్రభుత్వమే నిర్వీర్యం చేస్తోందని, ఉపాధ్యాయులు పాఠాలు చెప్పకుండా బోధనేతర పనులతో వేధిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) గళమెత్తింది. ఇకపై బోధనేతర కార్యక్రమాలు నిర్వహించబోమని, విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు సమాఖ్య నాయకులు ప్రకటించారు. తమకు రావాల్సిన ఆర్థిక బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ తీరుపై నిరసనగా మంగళవారం ఫ్యాప్టో ఆధ్వర్యంలో విజయవాడలో ‘పోరుబాట’ పేరుతో మహా ధర్నా నిర్వహించారు. రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఉపాధ్యాయులతో ధర్నా చౌక్ నిండిపోయింది. హామీలు అమలు చేయకుంటే సత్తా చూపిస్తాంమహాధర్నాను ఉద్దేశించి ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో బోధనేతర కార్యక్రమాలు విపరీతంగా పెరిగిపోయి ఉపాధ్యాయులు పనిచేయలేని విధంగా మారిందన్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని విమర్శించారు. గత నెలలో జిల్లాల్లో నిరసన తెలిపినా పట్టించుకోలేదని, ఇకనైనా పట్టించుకోకపోతే సహించేది లేదన్నారు. ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు రూ.28 వేలకు పైగా చెల్లించాలని.. వీటిని ఎప్పుడిస్తారో చెప్పాలన్నారు. 12వ పీఆర్సీ ప్రకటించాలన్నారు. 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అంశాలను విమర్శించిన కూటమి నాయకులు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఏకీకృత సర్వీసు రూల్స్ వెంటనే అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో–57 అమలు చేసి 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఫ్యాప్టో ప్రధాన కార్యదర్శి ఎస్.చిరంజీవి మాట్లాడుతూ.. పాఠశాలల్లో ప్రవేశపెట్టిన విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ చనిపోయిన ఉపాధ్యాయుల వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. 1998 డీఎస్సీలో మిగిలిపోయిన వారికి పోస్టింగులు ఇవ్వాలని, 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. దొడ్డిదారి బదిలీలు అసమంజసమని, న్యాయబద్ధమైన కౌన్సిలింగ్ విధానానికి తూట్లు పొడవడమేనని దుయ్యబట్టారు. ఈ తరహా బదిలీలను వెంటనే రద్దు చేయాలని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, గత ప్రభుత్వం గ్రామీణ పేద బాలికల ఉన్నత విద్య కోసం ప్రారంభించిన హైసూ్కల్ ప్లస్లను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఫ్యాప్టో ఇచ్చిన నోటీసులోని 20 డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే తమ సత్తా ఏంటో చూపిస్తామని ఉపాధ్యాయ నాయకులు హెచ్చరించారు. పోరుబాట ధర్నాలో రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉభయ గోదావరి టీచర్స్ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, కత్తి నరసింహారెడ్డి, ఏపీ జేఏసీ చైర్మన్ ఎ.విద్యాసాగర్, ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణ, ఏపీ సీపీఎస్సీఏ బాధ్యులు సీఎం దాస్, సతీష్, బాజీ పఠాన్ తదితరులు మద్దతు ప్రకటించారు. పాఠాలు చెప్పనీయడం లేదు గత ప్రభుత్వం గ్రామీణ బాలికల విద్యను ప్రోత్సహించేందుకు హైసూ్కల్ ప్లస్లను ప్రవేశపెడితే.. ఈ ప్రభుత్వం వాటిని రద్దు చేసేందుకు ప్రయత్నించింది. దీనిపై పెద్దఎత్తున నిరసన రావడంతో వెనక్కి తగ్గి, ఆ స్కూళ్లల్లో పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులను సర్ప్లస్ పేరిట బదిలీ చేసింది. ఈ విధానం పేద బాలికలు చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వం కాలరాయడమే అవుతుంది. బడుల్లో ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాలతో పాఠాలు చెప్పనివ్వడం లేదు. ఉపాధ్యాయులను తరగతి గదులకే పరిమితం చేయాలి. యాప్ల భారం తగ్గించి బోధనేతర విధులకు విముక్తి కల్పించాలి. ఇకపై ఉపాధ్యాయులు, విద్యార్థులు, మధ్యాహ్న భోజన పథకం వివరాలు మాత్రమే యాప్లలో నమోదు చేస్తాం. మిగిలినవి బహిష్కరిస్తాం. – సాయి శ్రీనివాస్ (ఎస్టీయూ), ఫ్యాప్టో చైర్మన్ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది ఎన్నికల ముందు చంద్రబాబు డైరెక్ట్ పీఆర్సీ ఇస్తామన్నారు. 16 నెలలుగా కాలయాపన చేస్తున్నారు తప్ప సమస్యలు పరిష్కరించడం లేదు. ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. కనీసం ఒక్కసారి కూడా ఉపాధ్యాయులతో చర్చించలేదు. మైకుల ముందు, శాసనసభలో ప్రకటనలు తప్ప చేసిందేమీ లేదు. ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రిగా ఉంటే ప్రభుత్వ పాఠశాలలు గొప్పగా ఉంటాయనుకున్నాం. కానీ.. పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. బడుల్లో ఉపాధ్యాయులు ఎవరూ పాఠాలు చెప్పే పరిస్థితి లేదు. ఏడాదిన్నర అవుతున్నా విద్యారంగ సమస్యలపై మంత్రి స్పందించలేదంటే ప్రభుత్వ విద్య అంటే ఎంత నిర్లక్ష్యమో అర్థం చేసుకోవచ్చు. – పి.అశోక్ కుమార్రెడ్డి, అధ్యక్షుడు, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్గిన్నిస్ రికార్డుల కోసమే తపన కూటమి నాయకులు ఎన్నికల ముందు యాప్లు రద్దు చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక మరిన్ని యాప్లతో వేధిస్తున్నారు. గిన్నిస్ రికార్డుల పేరుతో ప్రభుత్వం ఉపాధ్యాయులతో ఆడుకుంటోంది. యాప్ల ద్వారా పిల్లలకు అక్షరాలొస్తాయా. దీనికి మంత్రి నారా లోకేశ్ సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వానికి వారం రోజులు గడువు ఇస్తున్నాం, ఈలోగా మా డిమాండ్లపై స్పందించాలి. ప్రభుత్వం దిగిరావాలి. – ఎన్.వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు, యూటీఎఫ్ఉపాధ్యాయులు దొంగలా?ఉపాధ్యాయులు దొంగలా? మేం దొంగలమైతే పదో తరగతిలో ఎందుకు అంత స్థాయిలో ఫలితాలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం, మంత్రి లోకేశ్ చిలక పలుకులు ఉపాధ్యాయుల వద్ద ఇక సాగవు. కూటమి ప్రభుత్వ విద్యారంగ సంస్కరణలు ప్రభుత్వ బడులను దిగజారుస్తున్నాయి. సమస్యలను పరిష్కరించకుంటే ఉపాధ్యాయులు పెద్ద ఉద్యమబాట పడతార – ఎన్.వెంకటేశ్వర్లు, డెప్యూటీ సెక్రటరీ జనరల్, ఫ్యాప్టో విద్యాశాఖవిద్యాశాఖ మంత్రి లోకేశ్ ఎక్కడఉపాధ్యాయ సమస్యలపై చర్చించేందుకు మంత్రి లోకేశ్ ఎక్కడఉపాధ్యాయ సమస్యలపై చర్చించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కోసం ప్రయత్నిస్తే ఆయన సమయం కేటాయించటం లేదు. విద్యారంగం చాలా విస్తృతమైన విషయమని గుర్తించటం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 మాసాలైంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయి? ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలి. విద్యారంగాన్ని నాశనం చేయటానికి ప్రపంచ బ్యాంక్ సూచించిన సాల్ట్ పథకాన్ని అమలు చేస్తున్నారు. దానిని వెంటనే రద్దు చేయాలి. 12 పీఆర్సీ కమిషన్ను తక్షణం నియమించాలి. ఎన్నికల్లో పదేపదే ప్రకటించిన తెలుగు మీడియంను ప్రవేశ పెట్టాలి.– కె.ఎస్.లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ -
విద్యుత్ ఉద్యోగుల మెడపై కత్తి
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించకపోగా వారి మెడపై కత్తులు వేలాడదీస్తోంది కూటమి ప్రభుత్వం. తమ డిమాండ్ల సాధన కోసం గత నెల నుంచి ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలను అణచివేయాలని చూస్తోంది. విద్యుత్ ఉద్యోగులను చర్చలకు పిలుస్తూనే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. అందులో భాగంగా ఉద్యోగులకు సెలవులను రద్దుచేసింది. ఇప్పటికే సెలవులో ఉన్నవారంతా తక్షణమే విధుల్లో చేరాలని హుకుం జారీచేసింది. అత్యవసరమైతే.. ఉన్నతాధికారుల అనుమతిపత్రం తీసుకోవాలని, లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.బెదిరిస్తే నిరవధిక సమ్మె.. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇవ్వాల్సిన నాలుగు డీఏ బకాయిలను విడుదల చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని, ఐఆర్ ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా మార్చాలని, ఎనర్జీ అసిస్టెంట్లను జూనియర్ లైన్మెన్లుగా గుర్తించాలని, పింఛన్ విధానాన్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కొంతకాలం కిందట ఆందోళనకు శ్రీకారం చుట్టింది. పలు దఫాలుగా ప్రభుత్వానికి, యాజమాన్యానికి వినతిపత్రాలు ఇచ్చినా ప్రయోజనం కనిపించలేదు. దీంతో ఈ నెల 15 వరకు గడువు ఇచ్చి, అప్పటికీ స్పందించకపోతే నిరవధిక సమ్మె చేపడతామని నోటీసు ఇచ్చింది. దీంతో బుధవారం (నేడు) విజయవాడలోని విద్యుత్ భవన్లో చర్చలకు రావాలని ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే అంతకుముందే ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసే చర్యలు చేపట్టింది. జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో.. ఉద్యోగులంతా సెలవులను రద్దుచేసుకుని విధులకు హాజరుకావాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఆదేశాలు జారీచేశారు. మెడికల్ ఎమర్జెన్సీ వస్తే తప్ప ఎవరికీ సెలవులు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. ఎవరైనా హెడ్క్వార్టర్ దాటి వెళ్లాలంటే ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. కార్పొరేట్ కార్యాలయాల్లో, జిల్లా కేంద్రాల్లో పనిచేసే శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు తప్పనిసరిగా కార్యాలయానికి రావాల్సిందేనని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక నమూనా హాజరుపట్టీలో వారి హాజరు నమోదుచేసి రోజూ సీఎండీ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. దీనిపై ఉద్యోగసంఘాలు మండిపడుతున్నాయి. తమను బెదిరించి ఆందోళనలను విరమింపజేయాలని ప్రయత్నిస్తే వెంటనే నిరవధిక సమ్మెలోకి వెళతామని జేఏసీ హెచ్చరించింది. -
అంబరాన్నంటిన సిరిమాను సంబరం
జై పైడిమాంబ... జై జై పైడిమాంబ... అంటూ లక్షలాది భక్తజనం జయజయధ్వానాల నడుమ సిరులతల్లి... విజయనగర ప్రజల కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం అంబరాన్ని తాకింది. విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. మధ్యాహ్నం 4.24 గంటలకు ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమాను అధిరోహించి భక్తులకు అమ్మవారి ప్రతిరూపంలో దర్శనమిచ్చారు. అనంతరం మూడుసార్లు అమ్మవారి చదురుగుడి నుంచి కోట వరకు సాగిన ఉత్సవం సాయంత్రం 5.47 గంటలకు ముగిసింది. ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజుతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కోట బురుజుపై నుంచి, విజయనగరం అర్బన్ బ్యాంక్ భవనం ఉన్న ప్రాంగణంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక వేదిక నుంచి రాష్ట్ర శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ వీక్షించారు. అయితే, ఏర్పాట్లలో డొల్లతనం కారణంగా ఈ వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. వేదికపై కూర్చున్న బొత్స సత్యనారాయణతోపాటు ఆయన సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తదితరులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబు, ఒక ఎస్ఐ, మరో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. – సాక్షిప్రతినిధి, విజయనగరం -
నేడు భీమవరంలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఆయన భీమవరం చేరుకుంటారు, అక్కడినుంచి పెదఅవిురం చేరుకుని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి సిరిమానోత్సవం సందర్భంగా ప్రజలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం విజయనగరంలో నిర్వహించే సిరిమానోత్సవం సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రారి్థస్తున్నానని ‘ఎక్స్’లో మంగళవారం పోస్ట్ చేశారు.ఆదర్శనీయుడు వాల్మీకి మాజీ సీఎం వైఎస్ జగన్ ఘన నివాళి సాక్షి,అమరావతి: ప్రపంచానికి రామాయణ ఇతిహాసాన్ని అందించిన మహర్షి వాల్మీకి అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనియాడారు. వేటగాడైన వాల్మీకి రామనామాన్ని జపిస్తూ మహర్షిగా మారిన తీరు అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. మంగళవారం వాల్మీకి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి వైఎస్ జగన్ నివాళులరి్పంచారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషా శ్రీచరణ్, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ధర్మాన కృష్ణదాస్, పార్టీ సీనియర్ నేతలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, దూలం నాగేశ్వరరావు, బీవై రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
రాజధానిలో మరో దోపిడీకి స్కెచ్!
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం ముసుగులో మరో దోపిడీకి ముఖ్యనేత స్కెచ్ వేశారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, ఎన్టీఆర్ విగ్రహం, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జి, స్పోర్ట్స్ సిటీ, రివర్ఫ్రంట్ డెవలప్మెంట్, రోప్వే, ఇన్నర్ రింగ్ రోడ్(ఐఆర్ఆర్)తోపాటు ఎప్పటికప్పుడు గుర్తించే ప్రత్యేక ప్రాజెక్టులను చేపట్టడానికి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)ని ఏర్పాటుచేస్తూ మంగళవారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ), ఎస్పీవీ సిఫార్సుల ఆధారంగా ప్రత్యేక ప్రాజెక్టులను చేపడతారు. ఆ ప్రాజెక్టులకు పీపీపీ, హైబ్రీడ్ యాన్యుటీ, ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్(ఈపీసీ) పద్ధతుల్లో టెండర్లు పిలిచి పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. ఆ కాంట్రాక్టర్లతో సీఆర్డీఏ, ప్రభుత్వం, ఎస్పీవీ త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటాయి. భూములు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుని పనులు రాజధానిలో ప్రత్యేక ప్రాజెక్టుల పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్లకు నేరుగా భూములు కేటాయిస్తారు. ఆ భూములు తనఖా పెట్టి అప్పులు తీసుకోవడానికి కాంట్రాక్టర్కు హక్కులు కల్పిస్తారు. ఆ ప్రాజెక్టుల ద్వారా పన్నులు, యూజర్ చార్జీల రూపంలో వచ్చే ఆదాయంలో వాటా (రెవెన్యూ షేరింగ్) వంటి అంశాలను సీఆర్డీఏ ఖరారు చేస్తుంది. అప్పటికీ ఆ ప్రాజెక్టుల్లో నష్టం వస్తే వయబులిటీ గ్యాప్ ఫండ్(వీజీఎఫ్) కింద కాంట్రాక్టర్లకు ప్రభుత్వమే నిధులు ఇస్తుంది. వీటిని పరిశీలిస్తే.. ప్రత్యేక ప్రాజెక్టులను సన్నిహితులకు కట్టబెట్టి భారీ ఎత్తున భూములు కేటాయించి.. వాటిని తనఖా పెట్టి.. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తెచ్చే అప్పులతో వాటిని చేపట్టి ‘నీకింత... నాకింత’ అంటూ దోచుకోవడానికి ముఖ్యనేత స్కెచ్ వేశారన్నది స్పష్టమవుతోందని ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ ప్రాజెక్టుల కోసమే ప్రభుత్వం రాజధానిలో మలి విడత భూసమీకరణకు సిద్ధమైందన్నది స్పష్టమవుతోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. గ్రీన్ఫీల్డ్ ఎయిర్ పోర్ట్, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ వంటి వాటి కోసం భూములు అవసరమని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ పదేపదే చెబుతుండటం విదితమే.రాజధాని భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ సర్కార్ ఉత్తర్వులుసాక్షి, అమరావతి: రాజధానిలో భూసమీకరణ పథకం(ల్యాండ్ పూలింగ్ స్కీం) కింద భూములు ఇవ్వని రైతుల నుంచి భూములను సేకరించే ప్రక్రియను చేపట్టడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో 343.36 ఎకరాల భూసేకరణకు జారీ చేసిన నోటిఫికేషన్లో చట్టపరమైన లోపాలు ఉండటంతో దాన్ని ఉపసంహరించుకుంది. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో 217 చదరపు కిలోమీటర్లు(53,749.49) ప్రాంతాన్ని రాజధానిగా 2015లో ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిలో 15,807.91 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, 37,941.58 ఎకరాలు రైతులది. భూసమీకరణ పథకం కింద 34,396.87 ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది. మరో 3,544.71 ఎకరాలను సమీకరణ కింద ఇచ్చేందుకు రైతులు అంగీకరించలేదు. ఇప్పుడు ఆ భూములను సేకరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. -
నకిలీ మద్యానికి నలుగురు బలి
నరసరావుపేట టౌన్/తనకల్లు/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి నేతల నకిలీ మద్యం జనం ఉసురు తీస్తోంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఒకరు, శ్రీ సత్యసాయిజిల్లాలో మరొకరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇద్దరు... మొత్తంగా నలుగురు మృతి చెందారు. నరసరావుపేటలోని బరంపేట చాకిరాలమిట్ట ప్రాంతానికి చెందిన పాలెపు కోటేశ్వరరావు (50) లారీ క్లీనర్. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సోమవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన కోటేశ్వరరావు గుంటూరు రోడ్డులో ఓ దుకాణం ఎదుట అకస్మారక స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న టూటౌన్ ఎస్ఐ అశోక్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు. మద్యానికి అలవాటు పడ్డ కోటేశ్వరరావు కొన్ని రోజులుగా ఇంటికి సరిగ్గా రావడం లేదని భార్య వివరించింది. అతిగా మద్యం సేవించడం వల్లే మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.ములకలచెరువులో వ్యక్తి మృతిశ్రీసత్యసాయి జిల్లాలో పూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఎర్రబల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు (58) బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ పని నుంచి ఇంటికి రాగానే అన్నమయ్య జిల్లా మొలకలచెరువుకు వెళ్లి మద్యం తాగేవాడు. అక్కడికే ఎందుకు వెళ్తున్నావని కుటుంబసభ్యులు ప్రశ్నిస్తే... అక్కడే మద్యం ‘ఫుల్ కిక్’ ఇస్తుందని చెప్పేవాడు. ఈక్రమంలోనే రెండు రోజుల క్రితం మొలకలచెరువుకు వెళ్లిన శ్రీరాములు రాత్రి ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సమీప ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం మొలకలచెరువులోని ప్రభుత్వాస్పత్రి పక్కన అనుమానాస్పద స్థితిలో శ్రీరాములు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు శ్రీరాములు మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. తన కుమారుడు నకిలీ మద్యం తాగడం వల్లే ప్రాణాలు కోల్పోయాడని తల్లి గంగులమ్మ బోరు విలపించారు. మృతునికి భార్య శాంతమ్మ, కుమార్తె రేణుక ఉన్నారు.నెల్లూరు జిల్లాలో ఇద్దరు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం వెలగపాడు గ్రామ సచివాలయం సమీపంలో బెల్టు షాపు ఉంది. 45 ఏళ్ల వ్యక్తి నాలుగు రోజులుగా అక్కడే తిరుగుతూ డబ్బులు అడుక్కుని బెల్టుషాపులోనే నకిలీ మద్యం తాగేవాడు. పక్కనే ఉన్న బస్షెల్టర్ పడుకునేవాడు. అయితే సోమవారం ఉదయం అతను అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడి చొక్కా కాలర్పై పామూరుకు చెందిన పవన్ మెన్స్వేర్ లేబుల్ను గుర్తించారు. శరీరంపై గాయాల్లేవు. దీంతో నకిలీ మద్యం తాగడం వల్లే తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని ఓ మద్యం దుకాణం సమీపంలో గుర్తుతెలియని 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. తరచూ అక్కడే మద్యం తాగేవాడు. అతడి మృతదేహాన్ని మద్యం షాపునకు సమీపంలోని చెట్ల మధ్య స్థానికులు గుర్తించారు. నకిలీ మద్యం అతిగా తాగడం వల్లే అపస్మారక స్థితిలో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
బాబు ష్యూరిటీ పోయింది.. మోసం గ్యారెంటీగా మారింది
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరు, కళ్లార్పకుండా ఆడుతున్న అబద్ధాలు, ఏమాత్రం జంకూ బొంకూ లేకుండా పొడుస్తున్న వెన్నుపోట్లు చూసి ప్రజలకు భ్రమలు పూర్తిగా తొలగిపోయాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై వైఎస్ జగన్ మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎందుకు ఉన్నారు?ఈ రోజు వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎలా పని చేస్తోందని ఒకసారి సామాన్యుడిగా ఆలోచిస్తే.. అసలు పాలన మీద ధ్యాస లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఉన్నారు? ఈ రోజు ఎంత ఆదాయం వచ్చింది? రేపటికి ఇంకా ఎంత పెంచుకోవాలి? సొంత ఆదాయాలు ఎలా పెంచుకోవాలి? అన్న వాటిపైనే వారికి ధ్యాస. ఈరోజు ఎక్కడ చూసినా అవినీతి, అరాచకమే. రాష్ట్ర ఆదాయాలు తగ్గుతున్నాయి. అది పక్కదారి పట్టి.. చంద్రబాబు, ఆయన కుమారుడు, బినామీలు, ఆయన మనుషుల జేబుల్లోకి పోతోంది. దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఏది చూసినా దోపిడీయే. ఇసుక చూస్తే మన హయాంలో కన్నా రెండింతలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. కానీ రాష్ట్ర ఖజానాకు డబ్బులు రావడం లేదు. మట్టి, క్వార్ట్జ్, సిలికా, లేటరైట్.. ఏదైనా అంతే. మద్యం అన్నది ఏ స్థాయిలోకి వెళ్లిపోయిందో మనం చూస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయి. తమకు సంబంధించిన వారికి పావలా, అర్ధ రూపాయి, రూపాయికి భూములు పంచి పెడుతున్నారు. మన హయాంలో.. ప్రజలకు, రైతులకు మంచి జరగాలి.. మరో 30 ఏళ్లు ప్రభుత్వంపై భారం పడకూడదని యూనిట్ని రూ.2.49 చొప్పున విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే నానా యాగీ చేసిన వారు ఈరోజు యూనిట్ ఏకంగా రూ.4.60 చొప్పున పీపీఏ చేసుకుంటున్నారు. డబ్బుల కోసం వీళ్లు ఏ స్థాయికి దిగజారారనేది చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మోసాలుగా మారిన హామీలు..మరోవైపు చూస్తే చంద్రబాబు ష్యూరిటీ పోయి మోసం గ్యారెంటీ అయ్యింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ల పేరుతో ఎన్నికలకు ముందు ఈనాడులో ఆయనిచ్చిన యాడ్స్ ఇప్పటికే చాలాసార్లు చూపించా. మొన్న అనంతపురంలో విజయోత్సవ సభ నిర్వహించి అన్నీ చేసేశామని చెబుతూ ఇచ్చిన యాడ్స్ కూడా చూపించా. ఆ హామీలు ఎలా మోసాలుగా మారిపోయాయో వివరించా. ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి మహిళకు ఏటా రూ.18 వేల చొప్పున ఇస్తామని ఎన్నికలకు ముందు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఎగ్గొట్టారు. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు ఇస్తామన్నారు. విజయోత్సవ సభ అడ్వర్టైజ్మెంట్లో నిరుద్యోగ భృతి హామీ తీసేశారు. ఎన్నికలకు ముందు కనిపించిన 50 ఏళ్లకే పింఛన్ – ఏడాదికి రూ.48 వేలు హామీ ప్రకటన విజయోత్సవ సభకు వచ్చేసరికి మాయమైంది. ఆ పార్ట్ అంతా కటింగే. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పోయి.. బాబు ష్యూరిటీ అనేది మోసం గ్యారెంటీగా మిగిలిన పరిస్థితులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. విద్యా వ్యవస్థ నిర్వీర్యం.. పేదింటి చదువులపై కుట్రలురాష్ట్రంలో విద్యారంగాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నారో చూస్తుంటే బాధాకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్ అనే వ్యక్తి ఇంకో ఐదేళ్లు పరిపాలన చేసుంటే.. ప్రతి గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లాడు, ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు మన హయాంలో చదివిన వారు ఇంగ్లిష్ మీడియం, ఐబీ సర్టిఫికెట్తో పాసయ్యేవారు. మూడో తరగతి నుంచే టోఫెల్ క్లాసులు అటెండ్ అవుతూ పదో తరగతి పూర్తయ్యే నాటికి వెస్ట్రన్ యాక్సెంట్ (అమెరికన్ యాక్సెంట్)తో అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడేవాడని నేను కచ్చితంగా చెప్పగలను. ఇక ఎనిమిదో తరగతి పిల్లాడు మనమిచ్చే ట్యాబ్లతో ఐబీ చదువులు, టోఫెల్లో ఉత్తీర్ణత సాధించేవాడు. ట్యాబ్లతో ఇంటర్నెట్తో అనుసంధానమై సాఫ్ట్వేర్పై అవగాహన వచ్చేది. మనం సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఇవన్నీ కలిసి ఆ పిల్లాడు ఏ స్టేజ్కి వచ్చే వాడంటే.. ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ గేట్వేగా నిలిచేది. అటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషన్ను రాష్ట్రంలో ప్రతి పేద, మధ్యతరగతి పిల్లలకు మనం అందుబాటులోకి తెచ్చాం. చంద్రబాబు, రామోజీ, ఆంధ్రజ్యోతి ఎండీ మనవళ్లు ఈ ఐబీ చదువులు చదివారు. వాళ్లలో ఎవరూ తెలుగు మీడియం చదవడం లేదు. మన దగ్గరకి వచ్చేసరికి వీళ్లంతా కుట్ర పన్ని పేదవాడి మీద, మిడిల్ క్లాస్ వారి మీద రాక్షసుల మాదిరిగా యుద్ధం చేసి విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇంగ్లిష్ మీడియంలో ఐబీ నుంచి సీబీఎస్ఈ వరకు పేద పిల్లల ప్రయాణాన్ని అడ్డుకున్నారు. టోఫెల్ క్లాసులు పూర్తిగా రద్దయి పోయిన పరిస్థితి. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇవ్వకపోగా ఆ పేరెత్తే ధైర్యం కూడా వీరికి లేదు. సబ్జెక్టు టీచర్ కాన్సెప్టు ఊసే లేదు. దారుణంగా గవర్నమెంట్ స్కూళ్లు.. 5 లక్షల మంది విద్యార్థుల తగ్గుదలప్రభుత్వ విద్యా సంస్థల్లో నాడు–నేడు పనులు పూర్తిగా ఆగిపోయాయి. చివరకు నిర్వహణ కూడా చేయలేని అధ్వాన్న స్థితిలోకి విద్యా వ్యవస్థను నెట్టేశారు. ఆర్వో ప్లాంట్ల నిర్వహణ కూడా సరిగా చేయకపోవడంతో కురుపాంలో ఇద్దరు పిల్లలు చనిపోయారు. 143 మంది పిల్లలకు పచ్చకామెర్లు సోకాయి. 30 మంది ఇంకా ఆస్పత్రుల్లోనే ఉన్నారు. నెలరోజుల క్రితం జాండిస్ కేసులు బయటపడితే కనీసం పట్టించుకున్న నాథుడే లేడు. మన మాజీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి వెళితే గానీ ప్రభుత్వంలో కదలిక రాలేదు. రోజుకొక మెనూతో గొప్పగా అందించిన గోరుముద్ద కనుమరుగైంది. మన హయాంలో గవర్నమెంట్ స్కూళ్లలో నో వేకెన్సీ బోర్డులు చూశాం. గవర్నమెంట్ స్కూల్లో సీటు కోసం ఏకంగా ఎమ్మెల్యేల రికమండేషన్ లెటర్స్ కోసం వచ్చిన పరిస్థితులు చూశాం. అదే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్లలో 5 లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. అమ్మ ఒడి పేరుతో మనం తీసుకొచ్చిన పథకానికి తల్లికి వందనం అని పేరు మార్చారు. ఎంతమంది పిల్లలుంటే అంత మందికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి గత ఏడాది పూర్తిగా ఎగరగొట్టేశారు. రెండో ఏడాది తూతూమంత్రంగా అమలు చేసి 30 లక్షల మంది పిల్లలకు ఎగరగొట్టేశారు. రూ.15 వేలు కాస్తా రూ.13 వేలు చేశారు. అది కూడా ఇవ్వకుండా కొందరికి రూ.9 వేలు, కొందరికి రూ.8 వేలు, కొందరికి రూ.10 వేలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు.విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు.. ఆగుతున్న పిల్లల చదువులు..ఫీజురీయింబర్స్మెంట్కు సంబంధించి ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇస్తుంటాం. కానీ 2024 మార్చి 16న ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఇవ్వలేకపోయాం. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్.. ఇప్పుడు 2025 సెప్టెంబర్ నాటికి 7 త్రైమాసికాలు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు రూ.4,500 కోట్లకుగానూ ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు మాత్రమే. మిగతాదంతా గాలికొదిలేశారు. వసతి దీవెన కింద మన హయాంలో ఏటా ఏప్రిల్లో రూ.1,100 కోట్లు ఇచ్చేవాళ్లం. 2024లో ఎలక్షన్ కోడ్ కారణంగా ఆగిపోయింది. రెండేళ్లకు కలిపి రూ.2,200 కోట్లు ఇవ్వాల్సినా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పూర్తిగా నిలిపేశారు. దీంతో పిల్లలు చదువులు మానుకుంటున్న దుస్థితి. వ్యవసాయం.. నిస్సహాయ పరిస్థితుల్లోపంటల పరిస్థితి ఇక చెప్పాల్సిన పని లేదు. రైతులకి మనమిచ్చిన ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ గాలికి ఎగిరిపోయింది. ఇన్పుట్ సబ్సిడీ గురించి పట్టించుకునే నాథుడే లేడు. ఈ–క్రాప్ అనేది కనపడకుండా పోయింది. మన హయాంలో సీఎం–యాప్ ద్వారా ఎప్పటికప్పుడు గ్రామ స్థాయిలో ధరలను పర్యవేక్షించాం. ఏ పంటకు గిట్టుబాటు ధర లేకపోయినా వెంటనే ఆర్బీకేలో అలెర్ట్ వచ్చేది. ఇప్పుడు అన్నీ పోయాయి. రైతు భరోసాగా మనం పెట్టుబడి సహాయం కింద ఏటా రూ.13,500 చొప్పున ఇచ్చి రైతుకు అండగా నిలిస్తే కళ్లబొల్లి మాటలతో భ్రమలు కల్పించారు. పేరు మార్చి అన్నదాతా సుఖీభవ అన్నారు. పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6 వేలు కాకుండా తామే సొంతంగా రూ.20 వేలు ఇస్తామన్నారు. రెండేళ్లకు కలిపితే ఒక్కో రైతుకు రూ.40 వేలకుగాను విదిల్చింది కేవలం రూ.5 వేలు. ఇవాళ ఏ పంట తీసుకున్నా గిట్టుబాటు ధర లేదు. ధాన్యం కొనుగోలు దగ్గర్నుంచి మొదలుపెడితే మిర్చి, పొగాకు, అరటి, మామిడి, టమాటా, సజ్జలు, పెసలు, మినుములు, చీని, ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా దళారీ వ్యవస్థ, కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులే. ఎరువులను ఆర్బీకేల ద్వారా రైతులకు సరఫరా చేయాల్సింది పోయి ప్రైవేటుకి ఎక్కువగా కేటాయించి దళారీలతో డీల్ కుదుర్చుకుంటున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏ రోజైనా రైతులు ఎరువుల కోసం రోడ్డెక్కడం చూశామా?ప్రజారోగ్యం నేడు గాలికి..వైద్య రంగం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన హయాంలో గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ కనిపించేవి. 14 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసేవారు. 105 రకాల మందులు అందుబాటులో ఉండేవి. అక్కడే ఏఎన్ఎంలు రిపోర్టింగ్ చేసేవారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉండేవారు. తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చాం. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు సేవలందించేవారు. అన్ని ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ పాలసీ అమలు చేసి నియామకాలు చేపట్టాం. దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 61% ఉంటే.. మన హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 4% మాత్రమే. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షల వరకు పెంచాం. 1,000 ప్రొసీజర్లను 3,300 వరకు తీసుకెళ్లాం. ఆరోగ్య ఆసరా తెచ్చి కోలుకునే సమయంలో జీవన భృతికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు అవన్నీ తెరమరుగైపోయాయి. ఆరోగ్యశ్రీ కోసం నెలకు రూ.300 కోట్లు కావాలి. ఈ 16 నెలలకు గాను రూ.4,800 కోట్లు అవసరం. కానీ ఈ పెద్ద మనిషి రూ.1,000 కోట్లు కూడా ఇవ్వలేదు. రూ.3,800 కోట్లు పెండింగ్ పెట్టడంతో నెట్వర్క్ ఆస్పత్రులు సేవలు నిలిపేశాయి. 108, 104 సర్వీసుల నిర్వహణ స్కాములమయం. కనీసం రూ.5 కోట్ల టర్నోవర్ కూడా లేని, టీడీపీ ఆఫీస్ బేరర్గా ఉన్నవారికి 108, 104 సర్వీసుల నిర్వహణ కాంట్రాక్ట్ అప్పగించారు. ఇక అది కుయ్.. కుయ్ అని ఏమంటుంది? బుయ్.. బుయ్ అంటుంది.ఉద్యోగులకు తోడుగా వైఎస్ జగన్ఐఆర్, పీఆర్సీ, నాలుగు డీఏలు పెండింగ్ తదితర సమస్యలపై ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. నాడు మనం సీపీఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకువచ్చి ఉద్యోగులకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తే వారు దానిపై దుష్ప్రచారం చేశారు. ఓపీఎస్ ఇస్తామని చెప్పి మోసం చేశారు. వీటన్నింటిపైనా.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా మన వంతు కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఉద్యోగులకు మనం తోడుగా ఉన్నామన్న భరోసాను కల్పించడంతో పాటు ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ చాటేలా కార్యక్రమాలు నిర్వహించాలి. -
మద్యం ఆదాయం బాబు మాఫియాకే: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం సరఫరా, విక్రయాలన్నీ ఒక మాఫియా వ్యవహారంలా సాగుతున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వ దుకాణాలన్నీ మూసివేసిన సీఎం చంద్రబాబునాయుడు ఆయన మాఫియాకు సంబంధించిన ప్రైవేటు దుకాణాలను తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు. ఊరూరా 70 వేలకుపైగా బెల్టు షాపులను నెలకొల్పి పోలీసు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి మరీ మద్యం దుకాణాలకు వేలం పాటలు నిర్వహించారని దుయ్యబట్టారు. వేలం పాటలు పాడి డబ్బులు వసూలు చేసి.. మంత్రులకు ఇంత, ఎమ్మెల్యేకు ఇంత, పోలీసులకు ఇంత, పైన పెద్దబాబుకు, చిన్నబాబుకు ఇంత.. అంటూ మొత్తం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను వారి నియంత్రణలోకి తీసుకున్నారన్నారు. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యాన్ని విక్రయిస్తూ ప్రాణాలను హరిస్తున్నారన్నారు. కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారీతో ఒకవైపు భారీగా దోపిడీ చేస్తూ మరోవైపు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్సైజ్ అధికారులు ర్యాండమ్గా జరిపిన దాడుల్లో నకిలీ మద్యం తయారీ డంపులు భారీగా బహిర్గతమయ్యాయన్నారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, కూటమి సర్కారు ప్రజా కంటక పాలనపై చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. యథేచ్ఛగా, అంతు లేకుండా సాగుతున్న కల్తీ మద్యం విషయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ నిర్దేశించారు. కల్తీ మద్యానికి వ్యతిరేకంగా పార్టీ పరంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందజేస్తామన్నారు. సమావేశంలో జగన్ ఏమన్నారంటే.మద్యం మాఫియా నెట్వర్క్ఇవాళ మద్యం సరఫరా, విక్రయాలన్నీ ఒక మాఫియా వ్యవహారంలా సాగుతోంది. మొత్తం వ్యవస్థను తమ కంట్రోల్లోకి తీసుకున్న తరువాత ఎమ్మార్పీకి మించి మద్యం అమ్ముతున్నారు. వైన్ షాపుల పక్కనే పర్మిట్ రూముల్లో పెగ్గుల రూపంలో ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు లిక్కర్ అమ్మకాలు సాగిస్తున్నారు. వేలంపాటలో గ్రామాల్లో బెల్ట్ షాపులు పొందిన నిర్వాహకులు ఒక్కో బాటిల్పై రూ.20 నుంచి రూ.30 వరకు ఎక్కువ రేటుకు మద్యం అమ్ముతున్నారు. ఏ స్థాయిలో అవినీతి జరుగుతోందో కళ్ల ముందే కనిపిస్తోంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మాఫియా జేబుల్లోకి వెళ్తోంది. మరోవైపు డిస్టిలరీల నుంచి మద్యం సేకరణలో అక్రమాలు చేస్తున్నారు. ప్రముఖ బ్రాండెడ్ డిస్టిలరీల నుంచి కాకుండా బాగా డబ్బులిచ్చే (కమీషన్లు) డిస్టిలరీల నుంచి మద్యం సేకరిస్తున్నారు. వీళ్లకు కావాల్సిన డిస్టిలరీలకు ఇండెంట్లు ప్లేస్ చేసి వాళ్లకు సంబంధించిన సరుకు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నారు. ఇవన్నీ వీళ్ల సొంత ఆదాయం పెంచుకునే ఎత్తుగడలు.నకిలీ లిక్కర్ తయారీదారులు, విక్రేతలు అందరూ టీడీపీ వాళ్లేనని వివరిస్తూ నిందితుడు కట్టా సురేంద్రనాయుడు.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్తో ఉన్న ఫొటోలను చూపిస్తున్న వైఎస్ జగన్ నకిలీ మద్యంతో బరి తెగింపు.. బాబు పరిపాలనలో రాక్షసయుగంబాధ కలిగించే విషయం ఏమిటంటే.. వీళ్ల డబ్బు ఆశ ఏ స్థాయికి వెళ్లిపోయిందంటే.. ప్రజలు ఏం తాగినా పర్వాలేదు... చనిపోయినా పర్వాలేదు.. తమ జేబుల్లోకి డబ్బులు ఇంకా ఎక్కువగా రావాలనే తలంపుతో దారుణంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పరిపాలనలో రాక్షసయుగం నడుస్తోంది. భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీసుల ద్వారా పరిపాలన సాగిస్తున్నారు. నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ఆ మాఫియాను కంట్రోల్ చేసే కొందరు కేబినెట్ మంత్రులు, ప్రముఖ రాజకీయ పదవుల్లో ఉన్నవారు, పెద్దబాబు, చినబాబు ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ విచ్చలవిడిగా సాగుతోంది. ఏకంగా ఫ్యాక్టరీలు నెలకొల్పి క్వాలిటీ లేని లిక్కర్ తయారు చేసి వారి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా షాపుల్లోకి, బెల్ట్ షాపుల్లోకి నేరుగా పంపిస్తున్నారు.ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ.. పరిశ్రమను స్థాపించి యంత్ర పూజ...మరో విషయం ఏమిటంటే.. ఇవాళ ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యం బాటిల్. అది తాగి మనుషులు చనిపోతున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జనార్దన్రావు, సురేంద్రనాయుడు ఈ నకిలీ మద్యం దందా నడుపుతున్నారు. వీళ్లపై పర్యవేక్షణ బాధ్యతలు మంత్రి రాంప్రసాద్రెడ్డికి అప్పగించారు. ములకలచెరువులో ఏకంగా పరిశ్రమను స్థాపించి పెద్ద సంఖ్యలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. దానికి సంబంధించిన ట్యాంక్, క్యాన్లు, బాటిళ్లు, మూతలు, బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ లేబుళ్లు అన్నీ అక్కడ ఉన్నాయి. చివరకు దసరాకు అక్కడ యంత్ర పూజ కూడా చేశారు. అంటే అంత పకడ్బందీగా నకిలీ మద్యం తయారు చేస్తున్నారు.అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో బయటపడిన నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలోని యంత్రాలు, మద్యం బాటిళ్ల ఫొటోలు చూపిస్తున్న వైఎస్ జగన్ ఒక్కో ఏరియా పంచుకున్నారు.. ఇబ్రహీంపట్నంలో రెండు భారీ డంప్లుఅధికార పార్టీ అండతో రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం యూనిట్లు నెలకొల్పి ఒక్కొక్కరు ఒక్కో ఏరియా పంచుకున్నారు. ములకలచెరువులో నకిలీ మద్యం తయారు చేస్తున్న జనార్దన్రావు, సురేంద్రనాయుడు.. నారా లోకేశ్, చంద్రబాబుతో కలసి ఫొటోలు కూడా దిగారు. ఇక్కడ తయారైన నకిలీ సరుకు రాయలసీమలో మద్యం షాపులు, బెల్ట్షాపులకు పంపిణీ చేసే బాధ్యతను మంత్రి రాంప్రసాద్రెడ్డి సూçపర్వైజ్ చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసేందుకు ఇబ్రహీంపట్నంలో ఏకంగా రెండు చోట్ల భారీగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. రాయలసీమ నుంచి రవాణా చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని ఇబ్రహీంపట్నంలోనే యూనిట్ ఏర్పాటు చేశారు. అక్కడ వాళ్లే బాటిళ్లు, లేబుల్స్, మూతలు తయారు చేసుకుంటూ బ్రాండ్లు కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా కార్టన్ బాక్సుల్లో స్పిరిట్ నింపిన డ్రమ్స్, ఖాళీ సీసాలు, బాటిళ్లను చూసి ఎక్సైజ్ అధికారులే విస్తుపోయారట. నర్సీపట్నంకు చెందిన నేత ఉత్తరాంధ్ర బాధ్యతలు చూసుకుంటారు. ఈయన స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సన్నిహితుడు. ఏలూరుకు చెందిన వివాదాస్పద ఎమ్మెల్యే బాగా దౌర్జన్యం చేస్తాడని ఆయనకు ఉమ్మడి గోదావరి జిల్లా బాధ్యతలు అప్పగించారు. పాలకొల్లులో మరో పరిశ్రమ.. అక్కడ కూడా మిషన్, క్యాన్లు, బాటిళ్లు, లేబుల్స్ అన్నీ ఏర్పాటు చేశారు. అమలాపురంలో కూడా మిషన్లు, కల్తీ మద్యం, బాటిల్స్, లేబుల్స్, మూతలు, స్పిరిట్ అన్నీ అమర్చుకున్నారు. నెల్లూరులో డిస్ట్రిబ్యూషన్ ఛానల్, అనకాపల్లి జిల్లా పరవాడలో పరిశ్రమ ఏర్పాటు చేశారు. నకిలీ మద్యానికి అమాయకులు బలి..ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరులోని ఓ మద్యం షాపులో లిక్కర్ తాగిన కొద్దిసేపటికే షేక్ చిన్న మస్తాన్ మరణించాడు. జూపూడి వైన్ షాప్లో మద్యం తాగి ఇంటికి వెళ్తూ కిలేశ్వరం గ్రామానికి చెందిన నాగరాజు చనిపోయాడు. అనంతపురం జిల్లా గుంతకల్లులోని వైన్ షాపులో మద్యం సేవిస్తూ బెల్దారీ పెద్దన్న అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. నకిలీ మద్యానికి అమాయకులు బలి అవుతున్నారు (ఆ ఫొటోలను పీపీటీలో చూపారు).అనకాపల్లి జిల్లా పరవాడలో నకిలీ మద్యం తయారీ నిందితుడు రుత్తల రాము శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సన్నిహితుడని తెలిపే ఫొటో చూపిస్తున్న వైఎస్ జగన్ దాడుల్లో వేలాదిగా నకిలీ బాటిళ్లు స్వాధీనం..రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బుల కోసం ఏ స్థాయిలోకి దిగజారి పోతున్నారంటే.. సొంత ఆదాయాలు పెంచుకునేందుకు రాష్ట్ర ఖజానాను లూటీ చేయడంతో సరిపెట్టుకోకుండా అమాయకుల జీవితాలతో చెల గాటమాడుతున్నారు. ఆయన రాష్ట్రాన్ని ఏ రకంగా లూటీ చేస్తున్నారో ఇవాళ స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఇబ్రహీంపట్నంలోని గోడౌన్లలో దాడులు చేసి నకిలీ మద్యం బాటిళ్లు, లేబుల్స్, సిద్ధం చేసిన వివిధ బ్రాండ్ల నకిలీ మద్యం, మిషన్లు, పెద్ద సంఖ్యలో ఖాళీ బాటిల్స్, లేబుల్స్ లేని బాటిల్స్, స్పిరిట్ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. గోడౌన్లలో నిల్వ ఉంచిన 95 క్యాన్లలో 3,325 లీటర్ల స్పిరిట్ను సీజ్ చేశారు. అందులో ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ 725 బాటిల్స్, క్లాసిక్ బ్లూ 44 బాటిల్స్, కేరళ మాల్ట్ 384 బాటిల్స్, మంజీరా బ్లూ 24 బాటిల్స్.. ఇలా మొత్తం 1,300 బాటిళ్లను ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్నారు. లేబుల్స్ లేని 136 కేసులు, 6,578 బాటిల్స్, ఓఏబీ లేబుల్స్ 6,500, ఖాళీ బాటిల్స్ 22 వేలు, ఖాళీ కార్టూన్లు 6, ఒక మిషన్, రెండు పైపులను సీజ్ చేశారు. ఇవన్నీ చూస్తే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.నకిలీ మద్యంపై ఆందోళన ఇలా..ప్రజల ప్రాణాలను హరిస్తున్న నకిలీ మద్యంపై పార్టీ పరంగా నిరసనలు తెలియచేయాలి. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యం విక్రయిస్తున్నారు. కల్తీ మద్యం వద్దు, మా ప్రాణాలను కాపాడాలని, అయ్యా చంద్రబాబు... మా ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని నియోజకవర్గ కేంద్రంలోని మద్యం దుకాణాల వద్ద ప్లకార్డులతో ఆందోళనలు చేయాలి. ఇందులో మహిళా విభాగాన్ని కూడా భాగస్వామిగా చేయాలి. మద్యం సేవించే వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, పేదల ప్రాణాలతో ఆటలాడతారా అంటూ కల్తీ మద్యంపై నిరసనలు తెలియచేయాలి. నియోజకవర్గ ఇన్చార్జిల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించాలి.నాడు.. పరిమిత వేళల్లో క్వాలిటీతో విక్రయాలు..మన ప్రభుత్వ హయాంలో క్వాలిటీ లిక్కర్ ప్రఖ్యాతి గాంచిన డిస్టిలరీల నుంచి మాత్రమే ప్రొక్యూర్ జరిగేది. అది కూడా అంతకు ముందు ప్రభుత్వం ఎంపిక చేసిన 20 డిస్టిలరీల నుంచే సేకరించాం. పూర్తి క్వాలిటీ చెక్ తర్వాత, దారి తప్పకుండా నేరుగా ప్రభుత్వ దుకాణాలకు వచ్చేవి. అప్పుడు ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించింది కాబట్టి ఇష్టారీతిన కాకుండా నిర్దిష్ట సమయాల్లో మాత్రమే పరిమితంగా విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకున్నాం. మద్యం షాపులను 2,934కి తగ్గించాం. అక్రమ పర్మిట్ రూములతోపాటు 43 వేల బెల్టుషాప్లను పూర్తిగా రద్దు చేశాం. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే షాపులు నడిపించడం వల్ల ఎక్కడా అక్రమాలు చోటు చేసుకోలేదు. నాడు సరఫరా చేసిన లిక్కర్ బాటిళ్ల మీద క్యూఆర్ కోడ్ ఉండేది. వాటిని స్కాన్ చేసి అమ్మేవారు. అందువల్ల క్వాలిటీ నూటికి నూరు శాతం ఉండేది. -
మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ షాక్
తిరుపతి జిల్లా: సినీ నటుడు మంచు మోహన్ బాబు యూనివర్సిటీకి ఉన్నత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ విచారణ చేపట్టింది. పేరెంట్స్ అసోసియేషన్ పిర్యాదుతో ఉన్నత విద్యాశాఖ అధికారులు విచారణ జరిపారు.గత మూడేళ్ల నుంచి ఫీజు రీయింబర్స్ వర్తించే విద్యార్థుల నుంచి ఫీజులు రూపేణా 26 కోట్లు అదనంగా వసూలు చేశారని అధికారులు గుర్తించారు. ఈ విషయంపై విచారణ జరిపిన ఏపీ ఉన్నత విద్యా రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ 15 లక్షలు రూపాయలు ఫైన్ విధించింది.ఆ మొత్తాన్ని మోహన్ బాబు యూనివర్సిటీ చెల్లించింది. యూనివర్సిటీ గుర్తింపుని రద్దు చేయాలని ఉన్నత విద్యా కమిషన్ ఏపీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) తిరుపతిలో ఉన్న ప్రైవేట్ విశ్వవిద్యాలయం, 2022లో శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల నుంచి విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందిన విషయం తెలిసిందే. -
‘వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనలో ఎలాంటి మార్పులేదు’
తాడేపల్లి : ఈనెల 9వ తేదీన నర్సీపట్నంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటిస్తారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. జగన్ పర్యటనలో ఎలాంటి మార్పు లేదని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు(మంగళవారం, అక్టోబర్ 7వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన కురసాల కన్నబాబు.. వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనపై క్లారిటీ ఇచ్చారు. వైఎస్ జగన్ పర్యటనలపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించిన క్రమంలో కన్నబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.‘జగన్ పర్యటనలో ఎలాంటి మార్పు లేదు. విశాఖ ఎయిర్ పోర్టు నుండి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి రోడ్డు మార్గాన వెళ్తారు. ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు సృష్టించినా ఆగేదే లేదు. వాతావరణం బాగ లేకపోయినా హెలికాప్టర్లో వెళ్లమనడం ఏంటి?ఉత్తరాంధ్రాలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి ప్రభుత్వానికి తెలీదా?, విధ్వంసకర పాలన ఏపీలో జరుగుతోంది. జగన్ తెచ్చిన పథకాలను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారు. 17 కొత్త మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ తెచ్చారు. చంద్రబాబు వాటిని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతున్నారు. తరతరాల వారికి నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారు. 9న నర్సీపట్నం పర్యటనకు జగన్ వెళ్లబోతున్నారు. జగన్ను చూసి ప్రభుత్వం వణికిపోతోంది. అందుకే రకరకాలుగా ఆయన పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. జడ్ ప్లస్ భద్రత ఉన్న జగన్ పర్యటనను అడ్డుకోవడం అంటే పోలీసుల చేతగాని తనమే. జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తికి భద్రత కల్పించలేరా?, భద్రత కల్పించలేనప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ప్రభుత్వం అంగీకరించినట్టే. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా జగన్ పర్యటన కొనసాగుతుంది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. అలాంటప్పుడు హెలికాప్టర్ లో ప్రయాణం ఎలా సాధ్యం అవుతుంది?, జనం వస్తే రోప్ పార్టీలను పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చాలా పర్యటనలు చేశారు. కందుకూరు, గుంటూరు, పీలేరులో తొక్కిసలాట జరిగినా ప్రభుత్వం ఆయన పర్యటనలను అడ్డుకోలేదు. జగన్ ఎక్కడా మైకులు పెట్టి మాట్లాడే పోగ్రామ్లు లేవు. మెడికల్ కాలేజ్ను చూసి మీడియాతో మాట్లాడుతారు. మధ్యలో ఎవరైనా జనం ఫిర్యాదులు ఇస్తే తీసుకుంటారు. జగన్ పర్యటనకు వెళ్లొద్దని నాయకులకు నోటీసులు ఇస్తున్నారు. ఇలాంటి బెదిరింపులతో మమ్మల్ని అణచివేయలేరు. జగన్ ఎప్పుడు బయటకు వస్తున్నా ప్రభుత్వం ఆంక్షలతో చెలరేగిపోతోంది. అయినాసరే జగన్ పర్యటనను ఆపగలిగారా?, నర్సీపట్నం పర్యటన కూడా అలాగే కొనసాగి తీరుతుంది. పోలీసు అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలి.జగన్ విశాఖ ఎయిర్ పోర్ట్ నుండి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి రోడ్డుమార్గాన వెళ్తారు’ అని మరోసారి స్పష్టం చేశారు కన్నబాబు. ఇదీ చదవండి:చంద్రబాబు ధ్యాసంతా అదే..: వైఎస్ జగన్ -
పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో అపశ్రుతి
సాక్షి, విజయనగరం: శ్రీపైడి తల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బొత్స సత్యనారాయణ కుటుంబం కూర్చున్న వేదిక కుంగిపోయింది. ఉద్దేశపూర్వకంగా డీసీసీబీ వేదికను టీడీపీ నేతలు రద్దు చేశారు. 30 ఏళ్లుగా సిరిమానోత్సవం వీక్షిస్తున్న ప్రాంతానికి బొత్స కుటుంబాన్ని టీడీపీ నేతలు అనుమతించలేదు. అర్బన్ బ్యాంక్ ప్రాంగణంలో కూర్చోవాలంటూ ఆదేశించారు. సిరిమాను రథం తిరగకముందే వేదిక కుంగిపోయింది. కుంగిపోయిన వేదిక నుంచే ఉత్సవాన్ని బొత్స కుటుంబం వీక్షించారు. టీడీపీ దిగజారుడు రాజకీయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
వైఎస్ జగన్ను కలిసిన కాకినాడ మత్స్యకారులు
తాడేపల్లి ; ఇటీవల శ్రీలంక జైలు నుంచి విడుదలైన కాకినాడ మత్స్యకారులు.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈరోజు(మంగళవారం, అక్టోబర్ 7వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిశారు మత్స్యకారులు. దీనిలో భాగంగా 54 రోజుల తర్వాత శ్రీలంక జైలు నుంచి విడుదల కావడానికి వైఎస్సార్సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి ఎంతో సహకరించారని వైఎస్ జగన్కు వివరించారు సదరు మత్స్యకారులు. ఈ క్రమంలో శ్రీలంకలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులు, సమస్యల గురించి వైఎస్ జగన్కు వివరించారు. -
‘ఆఫ్రికా వెళ్లి నకిలీ మద్యం తయారీకి ట్రైనింగ్ తీసుకున్నారు’
తాడేపల్లి: డబ్బుకోసం ఏదైనా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధపడతారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. అందుకు మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టడమే ఉదాహరణ అని పేర్ని నాని మండిపడ్డారు. ఈ రోజు(మంగళవారం, అక్టోబర్ 7వ తేదీ) తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. ‘ ఈ నెల 9న నర్సీపట్నం మెడికల్కాలేజ్ సందర్శనకు వైఎస్ జగన్ వెళ్తారు. మేము ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపడతాం. ప్రభుత్వంపై ప్రజాగ్రహం ఏ విధంగా ఉందో గవర్నర్కు చూపిస్తాం. మా హయాంలో మద్యం అమ్మకాలపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా అదేడిస్టరీలను కొనసాగించారు. కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం తయారవుతోంది. ఈ ప్రభుత్వానికి అంతిమ గడియలు వచ్చాయి. ఆఫ్రికా వెళ్లి నకిలీ మద్యం తయారీకి టీడీపీ నేతలు ట్రైనింగ్ తీసుకున్నారు. నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ మంత్రికి ముడుపులు అందుతున్నాయి’ అని మండిపడ్డారు.ఇదీ చదవండి: ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ పోరు.. ఇక రచ్చబండ, ధర్నాలు.. -
వైఎస్ జగన్ పర్యటనపై చంద్రబాబు సర్కార్ ఆంక్షలు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నర్సీపట్నం పర్యటనపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. మళ్లీ తమ కుట్రలకు తెరతీసిన ప్రభుత్వ పెద్దలు.. ఎల్లుండి( గురువారం,అక్టోబర్ 9) నర్సీపట్నం పర్యటనను అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. అనకాపల్లి ఎస్పీ తువీన్ సిన్హాతో చంద్రబాబు సర్కార్ ప్రకటన చేయించారు. గతంలోనూ జగన్ పర్యటనలకు చంద్రబాబు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది.ప్రజల్లోకి ఎప్పుడు వెళ్లినా ఏదో సాకు చూపుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోంది. చివరికి రైతుల సమస్యలపై పోరాడినా ఆంక్షలే.. ఇప్పుడు మెడికల్ కాలేజీ సందర్శనకు వెళ్తున్నా అడ్డంకులే పెడుతోంది. ఎన్ని ఆటంకాలు సృష్టించినా పర్యటన ఆగేది లేదని వైఎస్సార్సీపీ తేల్చి చెప్పింది. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్లి తీరుతామని స్పష్టం చేసింది.ఈ నెల 9వ తేదీన నర్సీపట్నం మెడికల్ కాలేజీని వైఎస్ జగన్ సందర్శించనున్నారు. రోడ్డు మార్గం గుండా వెళ్లనున్న వైఎస్ జగన్కు తమ సమస్యలు చెప్పుకునేందుకు బాధితులు సిద్ధమయ్యారు. వైఎస్ జగన్ను కలవడానికి స్టీల్ ప్లాంట్ కార్మికులు బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు, గోవర్ షుగర్ ఫ్యాక్టరీ రైతులు సిద్ధమయ్యారు. బాధితులను వైఎస్ జగన్ను కలవనీయకుండా ప్రభుత్వం చేస్తోంది. పోలీస్ ఆంక్షలతో వైఎస్ జగన్ పర్యటనను ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. -
చంద్రబాబు ధ్యాసంతా అదే..: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆయన ఇవాళ(మంగళవారం, అక్టోబర్ 7) తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, పార్లమెంటు పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా రెండేళ్లు కావొస్తోందని.. ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు భ్రమలు తొలగిపోయాయన్నారు.‘‘ఈ ప్రభుత్వం కళ్లార్పకుండా అబద్ధాలు చెప్తోంది. జంకు లేకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తోంది. వ్యవస్థలన్నీ నిర్వీర్యం, అరాచకం, అవినీతి కనిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబుకు పాలనపై ధ్యాస లేదు. పూర్తిగా పాలన గాడితప్పింది. కేవలం సొంత ఆదాయాలు పెంచుకోవడం మీదే వీళ్ల ధ్యాస. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయాలు తగ్గుతున్నాయి. చంద్రబాబు, ఆయన కుమారుడు, ఆయన బినామీలు.. వారి జేబుల్లోకి ఆదాయాలు వెళ్తున్నాయి. దోచుకో.. పంచుకో.. తినుకో.. కనిపిస్తోంది’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.‘‘అక్రమాలకు అవకాశం లేకుండా మన హయాంలో లిక్కర్ పాలసీ ఉండేది. క్వాలిటీ విషయంలో ఏరోజు కూడా రాజీ పడలేదు. లిక్కర్ కొనుగోలు ఎంపానెల్ డిస్టలరీస్ నుంచే కొనుగోలు. ప్రతికోటా క్రమం తప్పకుండా క్వాలిటీ చెక్ చేసేవాళ్లు. క్వాలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వ దుకాణాల్లోకి లిక్కర్. నిర్దిష్టమైన సమయాల్లోనే మాత్రమే లిక్కర్ అమ్మేవాళ్లం. షాపులు తగ్గించి, బెల్టుషాపులు ఎత్తివేశాం. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే నిర్వహించింది. ఇల్లీగల్ పర్మిట్ రూమ్స్ రద్దు చేశాం. మూడింట ఒక వంతు షాపులు తగ్గించాం. మన హయాంలో ప్రతి బాటిల్పైన క్యూ ఆర్కోడ్ ఉండేది. ప్రతి బాటిల్ అమ్మేటప్పుడు క్యూ ఆర్కోడ్ స్కాన్ చేసి అమ్మేవాళ్లు. నూటికి నూరుశాతం క్వాలిటీతోనే మద్యం అమ్ముడుపోయేది...కాని, రాష్ట్రంలో ఇప్పుడు కల్తీ లిక్కర్ మాఫియా నడుస్తోంది. దీనికోసం ప్రభుత్వ దుకాణాలను మూసేశారు.. చంద్రబాబు, ఆయనకు సంబంధించిన మాఫియాకు ప్రైవేటు దుకాణాలు అప్పగించారు. వేలం పాట నిర్వహించి.. బెల్టుషాపులు వారి మనుషులకే అప్పగించారు. వీళ్లందరికీ మళ్లీ పోలీసుల నుంచి ప్రొటెక్షన్. ఎమ్మెల్యేకు ఇంత, పోలీసులకు ఇంత, పైనున్న పెదబాబుకు ఇంత, చినబాబుకు ఇంత అని పంచుకుంటున్నారు. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను మొత్తం చేతుల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఇల్లీగల్గా ఆదాయాలు పెంచుకోవడానికి తెరలేపారు. వీరికి సంబంధించిన షాపుల నుంచి తమకు కావాల్సిన వారికి మాత్రమే ఆర్డర్లు ఇస్తున్నారు, ఇదోరకం మాఫియా...ఇదికాక మరో రకం మాఫియా నడుపుతున్నారు. ప్రజలు చనిపోయినా పర్వాలేదు, తమ జేబుల్లోకి డబ్బు వస్తే చాలనుకుంటున్నారు. చంద్రబాబు పరిపాలనలో రాక్షస పరిపాలన నడుస్తోంది. ఒక పద్ధతి ప్రకారం కల్తీ మద్యాన్ని పరిశ్రమ మాదిరిగా నడుపుతున్నారు. క్వాలిటీ లేని లిక్కర్ను తయారుచేసి, తన ప్రైవేటు మాఫియా నెట్వర్క్ద్వారా నేరుగా పంపిస్తున్నారు. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీ బాటిల్. ఆ కల్తీ మద్యాన్ని తాగి మనుషులు చనిపోతున్న పరిస్థితి. ప్రాంతాల వారీగా కల్తీ దందా నడుపుతున్నారు. కల్తీ మద్యం తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇబ్రహీపట్నంలో భారీగా దొరికిన మద్యం, దాని తయారీకి సంబంధించిన వస్తువులు మాఫియా తీవ్రతను తెలియజేస్తున్నాయి. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ లూటీ చేస్తున్నారు..ప్రభుత్వ స్కూళ్లలో ఐదు లక్షలమంది విద్యార్థులు తగ్గిపోయారు. మన హయాంలో నో వేకెన్సీ బోర్డులు చూశాం. ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కడం చూస్తున్నాం. మన హయాంలో ఐదేళ్లలో ఎప్పుడూ అలాంటివి లేవు. ఎరువుల పంపిణీలో కూడా స్కాం చేశారు. దళారీలతో చేతులు కలిపారు. ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారు. పేదలను ఇంకా అన్యాయం చేస్తున్నారు. వారిని మరింత పేదరికంలోని నెడుతున్నారు. భవిష్యత్తులో కూడా ఉచితంగా నాణ్యమైన వైద్యం అందనీయకుండా చేస్తున్నారు. మనం కొత్తగా పెట్టిన కాలేజీలను ఇప్పుడు తన బినామీలకు, తన మనుషులకు తెగనమ్ముతున్నాడు...మనం వచ్చేంతవరకూ రాష్ట్రంలో ఉన్నవి 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మాత్రమే. మనం ఒక విజన్ను ఆవిష్కరించాం. ప్రతి జిల్లాల్లో గవర్నమెంటు కాలేజీ ఉండాలన్న సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలు పెట్టాం. ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రులు, బస్సులు ఎందుకు నడుపుతుంది?. అలా చేయకపోతే ప్రైవేటు వాళ్లు ప్రజలను దోచుకుంటారు. ఇవి నడపకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. ఈ విషయాన్ని ప్రజలకు బాగా అర్థమయ్యేలా చెప్పాలి. మనం ఉన్నప్పుడే 2023-24లోనే కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. మరో రెండు కాలేజీలు క్లాసులకు అందుబాటులోకి తెచ్చాం. తద్వారా 800 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. పులివెందులోల 50 సీట్లు NMC ఇస్తే.. వద్దని చంద్రబాబు లెటర్ రాశాడు. మన హయాంలోనే అవసరమైన నిధులకు ఫైనాన్సియల్ టై అప్ చేశాం. అమరావతికి 50వేల ఎకరాలు సరిపోవని, మరో 50వేల ఎకరాలు సేకరిస్తున్నాడు...మొదటి 50 వేల ఎకరాలకే మౌలిక సదుపాయాలకోసం రూ.1లక్ష కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు కేవలం మౌలిక సదుపాయాలకే 2 లక్షల కోట్లు అవుతుందని చెప్తున్నారు. అలాంటి లక్షలమందికి, కోట్ల మందికి వైద్యం అందించి, చిరస్థాయిగా నిలబడే ఆస్తులైన మెడికల్ కాలేజీలను అప్పనంగా అమ్మేస్తున్నారు?. ఐదేళ్లలో రూ.5వేల కోట్లు పెట్టలేరా?. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజల్లో చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది...అక్టోబరు 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తాను. అక్టోబరు 10 నుంచి నవంబర్ 22వరకూ రచ్చబండ కార్యక్రమం. మెడికల్ కాలేజీల ప్రైవటీకరణపై కరపత్రాలు పంపిణీ. కోటి సంతకాలను రచ్చబండ కార్యక్రమాల ద్వారా సేకరణ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కనీసం ప్రతి పంచాయతీ నుంచి 500 మందితో సంతకాల సేకరణ చేస్తాం. ప్రతి నియోజకవర్గ సమన్వయ కర్త ప్రతిరోజూ రెండు గ్రామాల సందర్శన. అలాగే నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్స్ ద్వారా చైతన్యపరిచే కార్యక్రమాలు. అక్టోబరు 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తాం. నియోజకవర్గ స్థాయిలో ఉన్న అధికారికి డిమాండ్ పత్రాల సమర్పణ. జిల్లా కేంద్రాల్లో నవంబర్ 12న ర్యాలీలు. ఒక జిల్లాలో నేనుకూడా పాల్గొంటాను. నవంబర్ 23న నియోజకవర్గ కేంద్రాల నుంచి సేకరించిన సంతకాలు జిల్లా కేంద్రానికి. నవంబర్ 24న సేకరించిన సంతకాలతో కూడిన వాహనాలను జిల్లా కేంద్రంలో జెండా ఊపి విజయవాడకు. సేకరించిన ఈ సంతకాలు గవర్నర్కు అప్పగించే కార్యక్రమం తదుపరి జరుగుతుంది’ అని వైఎస్ జగన్ వివరించారు. -
ఏపీలో 172 బావుల ఏర్పాటుకు రూ.8,110 కోట్లు
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ఆంధ్రప్రదేశ్లోని ఎనిమిది పెట్రోలియం మైనింగ్ లీజు (PML) బ్లాకుల్లో 172 ఆన్షోర్ బావులను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. వీటి ద్వారా చమురు, గ్యాస్ ఉత్పత్తి కోసం రూ.8,110 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అడవులు, వాతావరణ మార్పులకు సంబంధించిన ఒక కమిటీ గత నెలలో జరిగిన సమావేశంలో ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి (EC) ఇవ్వడానికి సిఫార్సు చేసింది.ఈ ఆన్షోర్ బావుల ఏర్పాటు కోసం పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (EMP)కు సంబంధించి మూలధన వ్యయం రూ.172 కోట్లుగా కంపెనీ నిర్ణయించింది. ఏటా ఈఎంపీ రెన్యువల్ కోసం చేసే ఖర్చు రూ.91.16 కోట్లు ఉంటుందని చెప్పింది. కమిటీ బహిరంగ విచారణలో చేసిన హామీల కోసం రూ.11 కోట్లు కేటాయించనున్నట్లు పేర్కొంది. పర్యావరణ అనుమతిని సిఫార్సు చేస్తూ కమిటీ ఓఎన్జీసీని అన్ని పర్యావరణ పరిరక్షణ చర్యలు, భద్రతా ఏర్పాట్లను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.మే నెలలో జారీ చేసిన ఎన్ఓసీ (NOC) ప్రకారం కోరింగా వన్యప్రాణుల అభయారణ్యం పర్యావరణ సున్నిత ప్రాంతం (eco-sensitive area) నుంచి 10 కి.మీ. లోపు ఏ బావిని కూడా ఏర్పాటు చేయరు. ముందస్తు అనుమతి లేకుండా అటవీ భూమి/ రక్షిత ప్రాంతంలో పైప్లైన్లు ఏర్పాటు చేయరు.ఇదీ చదవండి: బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే.. -
పైడితల్లి సిరిమానోత్సవం.. వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, గుంటూరు: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ప్రారంభ వేళ.. భక్తులను ఉద్దేశిస్తూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారు. నేడు విజయనగరంలో నిర్వహించే సిరుల తల్లి సిరిమానోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా అని అన్నారాయన. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారు. నేడు విజయనగరంలో నిర్వహించే సిరుల తల్లి సిరిమానోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. pic.twitter.com/tEKuDLMhMm— YS Jagan Mohan Reddy (@ysjagan) October 7, 2025 సిరిమానోత్సవం సందర్భంగా.. అమ్మవారు సిరిమాను అనే చెట్టు కొమ్మపై కూర్చొని భక్తులకు దర్శనమిస్తుంది. మహారాజ కోట నుంచి ప్రారంభమై, ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలతో ఊరేగింపు ఉంటుంది. ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే సకల కష్టాలు తొలగిపోతాయని, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని భక్తుల నమ్మకం. -
ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ పోరు.. ఇక రచ్చబండ, ధర్నాలు..
సాక్షి, తాడేపల్లి: ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై(Medical Colleges Privatization) ఆందోళనలకు వైఎస్సార్సీపీ(YSRCP) సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ నెల 10 నుంచి 22 వరకు రచ్చబండ కార్యక్రమాలను ప్లాన్ చేసింది.ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరుకు వైఎస్సార్సీపీ ముందు సాగనుంది. రచ్చబండ(Rachabanda), కోటి సంతకాల సేకరణ, గవర్నర్ని కలవటం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో అక్టోబర్ పదో తేదీ నుంచి 22 వరకు రచ్చబండ కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గాల్లో 28న నిరసన ర్యాలీలు చేపట్టనుంది. జిల్లా కేంద్రాల్లో నవంబర్ 12న ధర్నాలు చేసేందుకు సిద్ధమైంది. ప్రతీ నియోజకవర్గం నుండి 50వేల సంతకాలు సేకరణ చేయనున్నారు. చివరగా నవంబర్ 26న పార్టీ నేతలు గవర్నర్ని కలిసేలా నిర్ణయం తీసుకున్నారు. -
ఏపీ ప్రభుత్వంపై వెంకయ్య ఘాటు వ్యాఖ్యలు!
సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిగించడం వల్ల కలిగే ప్రయోజం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆయన.. ఉచితాలను అలవాటు చేయకూడదంటూ మాట్లాడారు. ‘‘ప్రభుత్వాలు విద్యా, వైద్యంపై ఖర్చు చేయాలి. అంతేకానీ ఉచితాలు అలవాటు చేయకూడదు. విద్య వల్ల పేదవాడు సంపన్నులయ్యే అవకాశాలు ఉన్నాయి. వైద్యం ప్రతి మనిషికి అవసరమైనది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శ్వేత పత్రం రూపంలో ప్రజలకు తెలియపరచాలి. ఐదేళ్లలో అప్పులు ఎంత చేస్తున్నారు., ఎంత తిరిగి చెల్లిస్తున్నారు అన్నది ప్రకటించాలి. .. అసెంబ్లీలో బూతుల సాంప్రదాయానికి తెర వేయాలి. సభలో లేని వారి పట్ల అమర్యాదగా వ్యవహరించకూడదు. అటువంటి వ్యాఖ్యలు చేసే వారిని సస్పెండ్ చేయాలి. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సభలో ఎలా నడుచుకొవాలో ట్రైనింగ్ ఇవ్వాలి. పార్టీ ఫిరాయిస్తే చర్యలు తీసుకోవాలి.. న్యాయస్థానాలు ప్రజా ప్రతినిధులపై కేసులను రెండు సంవత్సరాలలో తీర్పులు ప్రకటించాలి. కోర్టులు తక్కువైతే, జడ్జిలు తక్కువ సంఖ్యలో ఉంటే వెంటనే ఆ సమస్యను పరిష్కరించుకోవాలి అని నెల్లూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వ్యాఖ్యలు చేశారు. -
బాబుకు మునిశాపం ఇంకా తీరినట్లు లేదు!
నెలకోసారి నాలుగు వేల పింఛన్ పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి హెలికాప్టర్లలో వెళుతున్నారు. ఖర్చుల సంగతి కాసేపు పక్కనబెడదాం. కానీ, ఈ పర్యటనల సందర్భంగా ఆయన అసత్యాలు, అర్ధ సత్యాలూ మాట్లాడుతుండటం ఆయన పదవికి శోభనిచ్చేది కాదు. అందరికీ ఆదర్శంగా నిలవాల్సినంత అనుభవం బాబు గారిది. అబద్ధాలకోరు అని ప్రజలు అనుకునేలా ఉండకూడదు. ప్రతిపక్షాల ఆరోపణలు కాకపోయినా ప్రజలందరికీ ఇట్టే అర్థమైపోయే అబద్ధాలు ఆడటం వల్లనే వస్తోంది చిక్కు.చంద్రబాబుకు సంక్షేమం మీద అస్సలు నమ్మకం లేదన్నది అందరికీ తెలిసిన సత్యమే. అప్పు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయకూడదని స్వయంగా అసెంబ్లీలోనే ప్రకటించిన వ్యక్తి ఈయన. కానీ.. ఎన్నికలు వస్తే చాలు.. ముందు వెనుకలు ఆలోచించకుండా.. ఖర్చులతో నిమిత్తం లేకుండా ఎడాపెడా హామీలు గుప్పించేస్తారు. 2024లోనూ ఇలాగే చేసి.. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత అరకొర అమలుతో మమా.. అనిపించేశారు. గోరుముద్దలు పెట్టేటప్పుడు ఇదే పప్పు అనుకో! ఇదే కూర అనుకో, ఇదే పచ్చడి అనుకో, ఇదే పెరుగు అనుకో.. అని పిల్లలకు చెబుతారు చూడండి.. సరిగ్గా అలాగే చంద్రబాబు కూడా వ్యవహరిస్తున్నారు.పర్యటనల సందర్భంగా ‘పేదల సేవలో ప్రజా వేదిక’ అనే పేరు స్టేజికి పెట్టి చంద్రబాబు మాట్లాడుతున్నారు. కానీ, తీసుకునే చర్యలేవీ పేదలకు అనుకూలంగా ఉండవు. పేదల పేరు చెప్పి ధనికులు, పెట్టుబడిదారులకు సేవ చేస్తున్నారన్న విమర్శలూ వస్తున్నాయి. విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం దత్తి గ్రామంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వాస్తవం దీనికి చాలా భిన్నం. ఒక ఫించన్ల మొత్తంలో పెంపు మినహా కూటమి సర్కారు తొలి ఏడాది ఎన్నికల హామీలు నెరవేర్చింది ఏమీ లేదు. అయినా సరే.. ఫించన్ల పంపిణీలో రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ అంటారు బాబుగారు.వాస్తవానికి ఈ క్రెడిట్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు దక్కాలి. ఎందుకంటే సుమారు 45 లక్షలుగా ఉన్న ఫించన్లను 64 లక్షలకు తీసుకువెళ్లారు. అదే సమయంలో 2024లో అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నాలుగున్నర లక్షల ఫించన్లు తొలగించారు. ఇదిలా ఉంటే.. ఫించన్ల సొమ్మును ఇంటి పన్నులకు జమ చేసుకునేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇలాంటిది జగన్ టైమ్లో జరిగి ఉంటే చంద్రబాబు పెద్ద ఎత్తున విమర్శలు చేసి ఉండేవారు. విజయనగరం జిల్లాను పేదరికం నుంచి బయటకు తీసుకువస్తామని చంద్రబాబు చెప్పడం స్వాగతించదగిందే. కాకపోతే ఇప్పటికే ఆయన సుమారు 15 ఏళ్లపాటు సీఎంగా ఉన్నారు. ఆ సంగతి మర్చిపోతుంటారు.చంద్రబాబు ఈ మధ్య చెబుతున్న పలు అసత్యాల్లో పెట్టుబడుల అంశం ఒకటి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో గత 15 నెలల్లో 4.71 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించారు. నిజమైతే ఇదో అద్భుతమైన రికార్డు. కేంద్రమే ప్రకటించి ఉండేది. అదేమీ జరగలేదు. ఎన్నికల సందర్భంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేకుంటే నెలకు మూడు వేలు నిరుద్యోగ భృతి కింద ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ఇప్పుడు నిరుద్యోగ భృతిని ఎగవేయడం కోసం ఇలా అబద్ధాలు చెబుతున్నట్లు స్పష్టమవుతోంది. వలంటీర్లు 2.5 లక్షల మందితోపాటు ఏడాది కాలంలో రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని వైఎస్సార్సీపీ ఆరోపిస్తుంటుంది. అలాగే 2014-19 మధ్య మాదిరిగానే ఇప్పుడు కూడా పెట్టుబడులపై అసత్యాలు కుమ్మరిస్తున్నారు. ఇప్పటికే పది లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చేశాయని ఆయన చెప్పారని ఎల్లో మీడియానే రాసింది. ఇందులో వాస్తవం ఎంతన్నది ఆయనకు, ఎల్లో మీడియాకు తెలుసు. ఎందుకంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండంటూ సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉండకపోవచ్చు.విశాఖలో జరగబోయే సదస్సుకు రావాలని చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్లు ఢిల్లీ వెళ్లి పారిశ్రామిక వేత్తలను కోరారు. ఇది తప్పు కాదు. కానీ, ఇంతకాలం చంద్రబాబు బ్రాండ్ను చూసి పారిశ్రామికవేత్తలు పరుగులు తీస్తున్నారని ప్రచారం చేశారు. ఆ బ్రాండ్ ఏమైందో తెలియదు కానీ.. వీరే వెళ్లి సదస్సుకు రావాలని పరిశ్రమల వారిని అభ్యర్ధించవలసి వస్తోంది. ఇదే పనిమీద వీరు దుబాయికి కూడా వెళుతున్నారట. సదస్సు తర్వాత మరో పదో, పదిహేను లక్షల కోట్లో లేదా అంతకన్నా ఇంకా ఎక్కువ పెట్టుబడులు వచ్చేస్తున్నట్లు చెబుతారు. ఆ తర్వాత అవి వచ్చేశాయని అంటారు.వైఎస్సార్సీపీ విద్యుత్తు ఛార్జీలతో ప్రజల నడ్డి విరిచిందని తాము ఆ పని చేయలేదని ఆయన చెబుతున్నారు. ఛార్జీల మోత తట్టుకోలేక ప్రజలు హాహాకారాలు చేస్తూంటే చంద్రబాబు అసలు పెరగలేదని ధైర్యంగా చెబుతున్నారు. దీని గురించి ఆయన జనాన్ని ప్రశ్నించి ఉంటే తెలిసేది. పైగా అనుమతించిన దానికన్నా ఎక్కువ వసూలు చేసినందుకు విద్యుత్ నియంత్రణ మండలి చివాట్లు పెట్టి డబ్బు వెనక్కు ఇవ్వాలని ఆదేశించిన విషయాన్నీ కప్పిపుచ్చుతున్నారు. ఈ సోషల్ మీడియా యుగంలోనూ ఇలాంటి అబద్ధాలను ఎవరైనా నమ్ముతారా? అన్నది కూడా ఆలోచించడం లేదు. 2024లో ఏపీకి స్వాతంత్రం వచ్చిందని అంతటి సీనియర్ నేత చెప్పడం దారుణంగా ఉంటుంది. నిజంగానే వైఎస్సార్సీపీ హయాంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే చంద్రబాబు కాని, ఆయన పార్టనర్ పవన్ కళ్యాణ్ తదితరులు అన్ని అసత్యాలు ప్రచారం చేయగలిగేవారా?.ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తలను కట్టడి చేయడానికి, హామీల గురించి ప్రశ్నించకుండా ఉండడానికి నిర్భంధకాండను అమలు చేస్తున్న సర్కార్, లోకేశ్ రెడ్ బుక్ పేరుతో అరాచకాలు సాగిస్తున్న కూటమి ప్రభుత్వం అధినేతగా చంద్రబాబు స్వాతంత్రం గురించి మాట్లాడడం అర్థరహితం అనిపిస్తుంది. ఇప్పుడు నియంతృత్వంగా ఉందా? గతంలో ఉందా అని ఆయన ఒక సర్వే చేయించుకుంటే మంచిది. పైగా సోషల్ మీడియాను అణచివేయడానికి మంత్రివర్గ ఉప సంఘాన్నే నియమించిన ఆయన స్వేచ్చ గురించి కథలు చెబుతున్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే తోలు తీస్తానని కూడా చంద్రబాబు హెచ్చరించారు. మంచిదే.. నిజంగా అందులో నిజం ఉంటే ఆయన ఎమ్మెల్యేలు, టీడీపీ కార్యకర్తలు ఎందరిపై మహిళల వేధింపులకు సంబంధించి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? ఎందరి తోలు తీశారో చెబితే బాగుండేది కదా!.జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించిన ఎమ్మెల్యేని ఏం చేశారు?. ఒక విద్యాలయ ప్రిన్సిపాల్ను వేధించిన మరో ఎమ్మెల్యేని ఏం చేశారు?. చిత్తూరులో ఒక యువతిని హింసించిన ఇద్దరు టీడీపీ కార్యకర్తల తోలు తీశారా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కబుర్లు చెప్పడం వేరు. కార్యాచరణ వేరు. లంచాలు ఇచ్చే అవసరం లేకుండా పని చేయించాలన్నది తమ ఆలోచన అని, అధికారులు, ఉద్యోగులు బాధ్యతగా పనిచేయకపోతే ప్రజల ముందు నిలబెడతానని ఆయన చెబుతున్నారు. ఎల్లో మీడియాలోనే వసూల్ రాజాలుగా మారిన టీడీపీ ఎమ్మెల్యేలు అంటూ వచ్చిన వార్తల సంగతేమిటి?. తొలుత వారిని కట్టడి చేసిన తర్వాత ఇలాంటి కబుర్లు చెప్పాలి.ప్రజలకు ఎలాంటి లంచాలతో పని లేకుండా జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవస్థలను ధ్వంసం చేసిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడేదో ఆకస్మిక తనిఖీల ద్వారా ఏదో చేస్తామంటే ఎవరు నమ్ముతారు!. దీపావళికి మూడు లక్షల గృహ ప్రవేశాలు చేయిస్తామని ఆయన అంటున్నారు. అవి ఎవరి హయాంలో నిర్మితమైంది అందరికీ తెలుసు. కాకపోతే వాటిని తామే నిర్మించామని చెప్పకుండా, గత ప్రభుత్వం ఏం చేసింది.. తమ సర్కార్ ఏం చేసింది వివరిస్తే గౌరవంగా ఉంటుంది. అలాకాకుండా జగన్ ప్రభుత్వం క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకున్నంత మాత్రాన జనానికి వాస్తవాలు తెలియకుండా పోవు కదా!. చంద్రబాబు నుంచి సత్యం ఆశించడం అత్యాశేనా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘మందుబాబులకూ బాబు వెన్నుపోటు.. పవన్ ఇక కలుగు నాయుడే’
సాక్షి, కృష్ణా: చంద్రబాబు, పవన్, లోకేష్.. గత 16 నెలలుగా ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్నికల ముందు సరసమైన ధరలకే నాణ్యమైన మద్యమని చెప్పి అధికారంలోకి వచ్చిన ఏకైక ప్రభుత్వం కూటిమిదే అని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఇక నుంచి కలుగు నాయుడు అని పిలవాలని అన్నారు. ఎన్నికల సమయంలో తప్ప ఆయన.. ఆ కలుగు నుంచి బయటకు రారంటూ సెటైర్లు వేశారు.మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు తనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచాడు. అప్పట్నుంచి ప్రతీ ఒక్కరికీ వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు. 85 లక్షల మంది పిల్లలకు తల్లికి వందనం వేస్తాను అన్నాడు. కేవలం 40 లక్షల మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. జగన్ను విమర్శించి.. ఇప్పుడు తల్లికి వందనంలో కోత పెట్టాడు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏడాదికి 15 వేలు వేస్తానని చెప్పారు. ఒక సంవత్సరం అయిపోయింది. రెండో సంవత్సరం కోతలు కోసి జగన్ వేసిన వారికే వేశారు. జగన్ వాహనమిత్ర వేసినప్పుడు హేళనగా నవ్వారు. ఈ రోజు సిగ్గు ఎగ్గు లేకుండా డ్రైవర్లందరికీ వెన్నుపోటు పొడిచాడు.పేదలకు ఇళ్లు ఇస్తానని చెప్పాడు కొత్త ఇల్లు ఒక్కటి కూడా ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రజలకు పథకాలు అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మందుబాబులకు కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. పవన్ కల్యాణ్ను ఇకపై కలుగు నాయుడు అని పిలవాలి. ఆ కలుగు నాయుడు కలుగులో నుంచి బయటకు రాడు. ఎన్నికలకు ముందు బయటకు వస్తాడు.. అరుస్తాడు, రెచ్చిపోతాడు. తలకాయ బాదుకుంటాడు.. ఊగిపోతాడు, తూగిపోతాడు, జుట్టు పీక్కుంటాడు. ఆడ పిల్లకు అన్యాయం జరుగుతుంటే.. అఘాయిత్యాలు జరుగుతుంటే కలుగులో నుండి బయటకు రాడు.వైఎస్ జగన్ ఉన్నప్పుడు మెక్డొనాల్డ్ లేదు, బ్యాక్ పైపర్, మాన్షన్ హౌస్ లేదన్నారు. మరి ఇప్పుడు దొరికే మందు పేరేంటి.. చంద్రబాబు బ్రాండేనా?. టీడీపీ ప్రభుత్వం ఆఫ్రికా నుండి కొత్త ఫార్ములా తెచ్చి కొత్త మందు అమ్ముతున్నారు. సూపర్ సిక్స్ బ్రాండ్, స్పెషల్ స్టేటస్ బ్రాండ్ మందు అంటున్నారు. రాయలసీమలో 2, ఎన్టీఆర్ జిల్లాలో 1, ఉత్తరాంధ్రలో కూడా ఉన్నాయని ఉందని ఎక్సైజ్ అధికారులే చెబుతున్నారు. టీడీపీ నాయకులను ఆఫ్రికా పంపి కల్తీ మద్యం తయారీ శిక్షణ ఇస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ప్రజలారా మద్యం సేవించడం మానేయండి. లేదా త్రాగకుండా ఉండలేకుంటే మాత్రం కొన్న బార్ వద్దే వాసన చూసి గుర్తుపట్టి తీసుకెళ్లండి. మీ కుటుంబం ముఖ్యం.. కల్తీ మందు తాగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు’ అని సూచించారు. -
పవన్, జనసేన నేతలపై సుగాలి పార్వతి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కర్నూలు: సుగాలి ప్రీతి కేసు విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు సైలెంట్గా ఉన్నారని బాధితురాలు తల్లి సుగాలి పార్వతి ప్రశ్నించారు. మాకు న్యాయం చేస్తానని నమ్మించి.. పవన్ నమ్మక ద్రోహం చేశారని ఆరోపించారు. జనసేన ఎమ్మెల్యేలు, నేతలు తమను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతికి న్యాయం జరగకపోతే.. చంద్రబాబు, పవన్, లోకేష్కు తమ ఉసురు తగులుతుందని ఘాటు విమర్శలు చేశారు.సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు ఆమె తల్లి పార్వతి . ఈ సందర్భంగా సుగాలి పార్వతి మాట్లాడుతూ..‘2017 నుండి నా కూతురు సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాం. ఎనిమిదేళ్లుగా నిందితులకు శిక్ష పడాలని పోరాటం చేస్తూనే ఉన్నాం. విజయవాడ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ప్రశ్నించాను అయినా మాకు న్యాయం జరగలేదు. కూటమి ప్రభుత్వంలో తమ కేసును సీబీఐకి అప్పగించినట్లు ప్రకటన చేయడం లేదు. దీనిపై స్పష్టత ఇవ్వలేదు.సూపర్ సిక్స్ పథకాలను అమలు చేశామని చంద్రబాబు, పవన్ గొప్పలు చెబుతున్నారు. మా సమస్యలను పట్టించుకోవడం లేదు. అసెంబ్లీలో ప్రస్తావిస్తామని చెప్పిన పవన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఒక్కసారైనా అసెంబ్లీలో ఈ విషయం ఎందుకు మాట్లాడలేదు. ఎందుకు సైలెంట్గా ఉన్నారు. జనసేన పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు మాపై అనేక ఆరోపణలు చేసి కించపరిచే విధంగా మాట్లాడారు. మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జనసేన పార్టీ ఎమ్మెల్యే గాద వెంకటేశ్వర్లు అనేక ఆరోపణలు చేశారు. ఎన్నికల ముందు పవన్ అనేక హామీలు ఇచ్చారు. కానీ అధికారంలో వచ్చిన తరువాత పట్టించుకోవడం లేదు. న్యాయం చేస్తానని చెప్పి.. నమ్మక ద్రోహం చేశారు. హైకోర్టులో పిటిషన్ వేశాం. మాకు న్యాయం జరగడం కోసం వీల్ చైర్ యాత్ర నిర్వహించేందుకు హైకోర్టును ఆశ్రయిస్తాం. మాకు న్యాయం జరగకపోతే పవన్, చంద్రబాబు, లోకేష్కు మా ఉసురు తగులుతుంది. వీల్ చైర్ యాత్ర చేస్తానంటే అడ్డుకున్నారు. చిత్తశుద్ధి ఉంటే వీల్ చైర్ యాత్రకు అనుమతి ఇప్పించాలి.బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కూడా మేము కలిసేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈనెల 16వ తేదీ ప్రధాని మోదీ కర్నూలు వస్తున్నారు.. అప్పుడు మోదీని కలిసి మా బాధను విన్నవించే ప్రయత్నం చేస్తాను. బీజేపీ నేతలు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి. మోదీని కలవడానికి అనుమతించకుంటే 13,14,15 తేదీలో కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తా. కలెక్టరేట్ ముందు ఆందోళన చేయకుండా అడ్డుకుంటే ఇంట్లోనే నిరాహార దీక్ష చేస్తా’ అని చెప్పుకొచ్చారు. -
నేడు వాల్మీకి జయంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు వాల్మీకి జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. వాల్మీకికి నివాళి అర్పించారు. ప్రపంచానికి రామాయణ ఇతిహాసాన్ని అందించిన మహర్షి వాల్మీకి అని ప్రశసించారు.వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వాల్మీకి జయంతి కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలో వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేసి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. అంతకుముందు ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్..‘ప్రపంచానికి రామాయణ ఇతిహాసాన్ని అందించిన మహర్షి వాల్మీకి, వేటగాడైన వాల్మీకి రామనామాన్ని జపిస్తూ మహర్షిగా మారిన తీరు అందరికీ ఆదర్శనీయం. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు’ అని పోస్టు పెట్టారు. ప్రపంచానికి రామాయణ ఇతిహాసాన్ని అందించిన మహర్షి వాల్మీకి, వేటగాడైన వాల్మీకి రామనామాన్ని జపిస్తూ మహర్షిగా మారిన తీరు అందరికీ ఆదర్శనీయం. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. pic.twitter.com/vOuTOBRGod— YS Jagan Mohan Reddy (@ysjagan) October 7, 2025ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషా శ్రీచరణ్, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ధర్మాన కృష్ణదాస్, పార్టీ సీనియర్ నేతలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, దూలం నాగేశ్వరరావు, బి.వై.రామయ్య తదితరులు పాల్గొన్నారు. 07.10.2025తాడేపల్లిమహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషా శ్రీచరణ్,… pic.twitter.com/GcSwK3UqYN— YSR Congress Party (@YSRCParty) October 7, 2025 -
పెన్నా బ్యారేజ్: డబుల్ మర్డర్ కలకలం
సాక్షి, నెల్లూరు: పెన్నా నది సమీపంలో డబుల్ మర్డర్ కేసులో నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు టవర్ డంప్ను సంతపేట పోలీసులు సేకరిస్తున్నారు. నిందితులను అతిత్వరలో పట్టుకుంటామని ఎస్పీ చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. పెన్నా బ్యారేజీ వద్ద రోడ్డుపై రక్తపు మరకలు ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్ల సాయంతో రెండు మృతదేహాలను పోలీసులు మంగళవారం వెలికి తీశారు. హత్య చేసి నదిలో పడేసి ఉంటారని.. అర్ధరాత్రి సమయంలో ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు మృతుల వివరాల కోసం సమీపంలోని గిరిజన తండాల్లో ఆరా తీస్తున్నారు. -
వైఎస్సార్సీపీ నేతలతో ముగిసిన వైఎస్ జగన్ భేటీ
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి నేతృత్వంలో జరిగిన ఆ పార్టీ కీలక భేటీ ముగిసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంతో పాటు రాష్ట్రంలో యదేచ్ఛగా నడుస్తున్న నకిలీ మద్యం వ్యవహారంపై వైఎస్ జగన్ ప్రముఖంగా ప్రసంగించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై ప్రజా పోరాటం చేయాలని కేడర్కు ఆయన పిలుపు ఇచ్చినట్లు సమాచారం. ఈ భేటీకి కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కాకాణి గోవర్దన్ రెడ్డి, పేర్ని నాని, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. జగన్ హయాంలో మొదలైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ప్రజా పోరాటానికి పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో 9వ తేదీన అనకాపల్లి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటించిన.. మాకవరం మెడికల్ కాలేజీని సందర్శించనున్న సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: బాబు చీటర్.. లోకేష్ లూటర్! -
కృష్ణా నది ఒడ్డున గుహలో ఉన్న అమరలింగేశ్వర ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)
-
తెలంగాణలో ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు వానలు, ఏపీలో ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో కొన్నిరోజులుగా భిన్నవాతావరణం నెలకొంటోంది. పగలంతా ఎండ ఉంటూ.. సాయంత్రం ఆకస్మికంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో.. వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో.. తెలంగాణలోని 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది(Telangana Yellow Alert). భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదుపు గాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే రేపు మాత్రం మహబూబ్నగర్, నల్లగొండ, వరంగల్, సిద్ధిపేట, మేడ్చల్, జనగాం, యాదాద్రి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక రాజధాని హైదరాబాద్ నగరంలో ఇవాళ సాయంత్రం సమయంలో, అలాగే రేపు కుండపోత కురిసే అవకాశముందని(Hyderabad Rains) వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. ఏపీలో వాతావరణం దాదాపుగా పొడిగా ఉండొచ్చని ఇక్కడి వాతావరణశాఖ చెబుతోంది. అయితే.. రాయలసీమ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది(AP Rains News). ఉదయం, సాయంత్రం ఆకస్మిక వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.అక్టోబర్ నెలలో 10+10+11.. అక్టోబర్ నెలలోనూ మొత్తం మూడు దశల్లో వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అక్టోబర్ 1–10 మధ్య ఉత్తర, తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు.. అక్టోబర్ 10–20 మధ్య ఓ మోస్తరు వర్షాలు, అక్టోబర్ 21–31 మధ్య ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది.ఇదీ చదవండి: ఇక నుంచి డిజిటల్ పాస్లు -
కొత్త కథ బాగా అల్లారు.. యువతి మృతి కేసులో పోలీసులపై హైకోర్టు ఫైర్
సాక్షి, అమరావతి: దళిత యువతి అనుమానాస్పద మృతి కేసులో గుంటూరు జిల్లా, నల్లపాడు పోలీసులపై హైకోర్టు మండిపడింది. తనే భవనం పైనుంచి దూకానంటూ మృతురాలే వాంగ్మూలం ఇచ్చినట్లు అఫిడవిట్లో పేర్కొనడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే ఆ యువతి మరణించిన నేపథ్యంలో, మరి ఆమె వాంగ్మూలం ఎలా నమోదు చేశారంటూ పోలీసులను ప్రశ్నించింది. పోలీసులు కొత్త కథ బాగా అల్లారంటూ వ్యాఖ్యానించింది. దీనిని బట్టి పోలీసుల దర్యాప్తు ఏ తీరులో సాగిందో అర్థమవుతోందని తెలిపింది.రాష్ట్రంలో పోలీసులకు కోర్టులన్నా.. కోర్టు ఉత్తర్వులన్నా.. కోర్టు సిబ్బంది అన్నా ఏ మాత్రం గౌరవం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. దళిత యువతి మృతి ఘటనను ఆత్మహత్యగా పేర్కొంటూ పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్ను పరిశీలించి, దానిపై వాదనలు వినిపించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.గుంటూరు జిల్లా బుడంపాడులోని సెయింట్ మేరీస్ ఇంనీరింగ్ కాలేజీలో అమృతలూరు మండలం, గోపాయపాళెంకు చెందిన గర్నెపూడి శ్రావణ సంధ్య పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతూ 2017 ఫిబ్రవరి 28న అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. తన కుమార్తెది హత్య అని, దీనికి కాలేజీ యాజమాన్యంతో పాటు రూంమేట్స్ కారణమంటూ మృతురాలి తల్లి జయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతి కిందే కేసు నమోదు చేసి చేతులుదులుపుకున్నారు. దీంతో జయలక్ష్మి 2017 జూలై 6న హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ లేదా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని తన పిటిషన్లో కోరారు. హైకోర్టు అసహనం.. ఈ ఘటన విచారణ సందర్భంగా సెప్టెంబర్లో జస్టిస్ బట్టు దేవానంద్ పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది దర్యాప్తు పూర్తయిందని చెప్పడంతో అయితే చార్జిషీట్ ఎందుకు దాఖలు చేయలేదు, చేయవద్దని మేము చెప్పలేదుకదా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. -
అంగరంగ వైభవంగా పైడితల్లి అమ్మవారి తొలేళ్ల ఉత్సవం (ఫొటోలు)
-
ఏపీలో నకిలీ మద్యం రింగ్ లీడర్లను బుజ్జగిస్తున్న కూటమి ప్రభుత్వ పెద్దలు
-
ఎయి‘డెడ్’ స్కూళ్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఎయిడెడ్ స్కూళ్ల విలీనం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నందున ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేయబోతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 763 ఎయిడ్ స్కూళ్లు ఉండగా.. 40 కంటే తక్కువ విద్యార్థుల నమోదు ఉన్న 251 స్కూళ్ల కరస్పాండెంట్లకు నోటీసులు జారీ చేయాలని డీఈవోలను పాఠశాల విద్యా శాఖ ఆదేశించింది. ఇటీవల ఇదే తరహాలో విజయనగరం జిల్లాలోని ఏడు స్కూళ్లను విద్యా శాఖలో విలీనం చేసింది. ఇప్పుడు మరో 251 స్కూళ్లకు నోటీసులు ఇవ్వబోతోంది. ఇప్పటికే ఈ స్కూళ్ల యాజమాన్యాలకు రెండుసార్లు నోటీసులు ఇచి్చనట్లు విద్యా శాఖ వర్గాలు తెలిపాయి.తుది నోటీసులు ఇచ్చి.. ఈ స్కూళ్లను సిబ్బందితో సహా విద్యా శాఖలో విలీనం చేయనున్నట్లు వెల్లడించాయి. నోటీసులో పేర్కొన్నా జాబితాలో అనకాపల్లి జిల్లాలో 2, అనంతపురంలో 8, అన్నమయ్యలో 3, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 12, బాపట్లలో 26, చిత్తూరులో 4, తూర్పు గోదావరిలో 10, ఏలూరులో 8, గుంటూరులో 29, వైఎస్సార్ కడపలో 18, కాకినాడలో 5, అంబేడ్కర్ కోనసీమలో 2, కృష్ణాలో 13, కర్నూలులో 2, మన్యంలో 5, నంద్యాలలో 8, నెల్లూరులో 6, ఎన్టీఆర్ జిల్లాలో 12, పల్నాడులో 17, ప్రకాశంలో 35, తిరుపతిలో 6, విశాఖపట్నంలో 3, విజయనగరంలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 14 ఎయిడెడ్ స్కూళ్లు ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విలీన ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారులను డైరెక్టరేట్ ఆదేశించింది. ఈ స్కూళ్ల విలీనం పూర్తయితే దాదాపు 900 నుంచి 1,000 మంది ఉపాధ్యాయులు.. అంతే సంఖ్యలో బోధనేతర సిబ్బంది కూడా విద్యా శాఖలో విలీనమయ్యే అవకాశం ఉంది. వారిని అదే మండలంలో నియమించాలి స్కూళ్ల విలీనం అనంతరం మిగులుగా తేలిన ఎయిడెడ్ ఉపాధ్యాయులను అదే మండలంలోని ప్రభుత్వ స్కూళ్లలో నియమించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ కోరారు. కాగా, రాష్ట్రంలోని ఎయిడెడ్ స్కూళ్లలో పనిచేస్తున్న 3 వేల మంది ఉపాధ్యాయులకు సెపె్టంబర్ నెల వేతనం ఇంకా జమ చేయలేదని.. వెంటనే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.చిట్టిబాబు, ఎల్కే చిన్నప్ప, ప్రతినిధి ప్రభాకర్రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. -
దొడ్డిదారి బదిలీలు!
మంగళగిరి మండలం నిడమర్రు జెడ్పీ హైసూ్కల్లో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్న హెచ్ఎం వెంకటేశ్వరరావును బదిలీ చేసి తాడికొండ మండలం పొన్నెకల్లు జెడ్పీ హైసూ్కల్కి పంపించారు. ఆ స్థానంలో కృష్ణాజిల్లా పెనమలూరు జెడ్పీ హైసూ్కల్ గ్రేడ్–2 హెచ్ఎం దుర్గాభవానికి పోస్టింగ్ ఇచ్చారు. ఆదివారం సెలవు అయినప్పటికీ ఆమె నిడమర్రు స్కూల్కు వచ్చి బాధ్యతలు తీసుకున్నారు.ఇదేమీ అంతర్ జిల్లా బదిలీ అనుకునేరు! కేవలం సిఫారసు లేఖతో జరిగిందే. ఇలా ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 150 మందికి సిఫారసు బదిలీలు చేసినట్టు సమాచారం. గతంలో సిఫారసు బదిలీలు జరిగినా ఖాళీస్థానాల్లో మాత్రమే అవకాశం ఇవ్వగా.. ఇప్పుడు ఏకంగా రెండున్నరేళ్ల సర్వీసు ఉన్నవారిని బలవంతంగా పంపించేసి తమకు కావాల్సిన వారికి పోస్టింగ్ ఇవ్వడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు తెరతీశారు. ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలు ఉన్నవారిని వారు కోరుకున్న స్థానాలకు బదిలీ చేస్తున్నారు. ఈ క్రమంలో మే/జూన్ నెలలో జరిగిన బదిలీల్లో వచ్చినవారిని సైతం బలవంతంగా మరోచోటుకు పంపిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. తాజాగా అన్ని జిల్లాల్లోను 150 మందికిపైగా ఉపాధ్యాయులను మార్చినట్టు తెలుస్తోంది. మరో 2 వేలమంది ఉపాధ్యాయులు తమ నియోజకవర్గ ముఖ్యనేతల లేఖలతో బదిలీకి సిద్ధంగా ఉన్నట్టు అంచనా.తాజా బదిలీలు ఉపాధ్యాయ బదిలీ చట్టం మేరకే చేసినట్టు చెబుతున్నా.. పూర్తిగా సిఫారసు లేఖలు, నగదు కీలకపాత్ర పోషించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏటా జూన్లో ఉపాధ్యాయుల సాధారణ బదిలీలుంటాయని, ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా పూర్తి పారదర్శకతతో బదిలీలు చేపపట్టేందుకు ఆన్లైన్ విధానం అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనిప్రకారం ఈ ఏడాది ఉపాధ్యాయ బదిలీ చట్టం కూడా తీసుకొచ్చారు.అయితే.. అవసరం అనుకుంటే ప్రభుత్వం ఎవరినైనా ఎప్పుడైనా బదిలీ చేయవచ్చన్న నిబంధన కూడా ఇందులో పొందుపరిచారు. దీని ఆధారంగానే కూటమి ప్రభుత్వం ‘సిఫారసు బదిలీ’లు చేపట్టినట్టు తెలుస్తోంది. నిడమర్రులో వెంకటేశ్వరరావు ఇంకా రెండున్నరేళ్లు పనిచేసే అవకాశం ఉన్నా బలవతంగా బదిలీచేసి, కృష్ణాజిల్లా టీచర్ను అక్కడ నియమించడంపై ఉపాధ్యాయసంఘాలు మండిపడుతున్నాయి. బదిలీకి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలు!రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఉపాధ్యాయుల సిఫారసు బదిలీలకు రంగం సిద్ధం చేశారు. జిల్లాల నుంచి కూటమిలోని ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమకు కావాల్సిన టీచర్లకు, డబ్బులిచి్చన వారికి కోరుకున్న చోటుకు బదిలీ కోసం లేఖలిచ్చి సిఫారసు చేశారు. ఇలా దాదాపు రెండువేలకు పైగా దరఖాస్తులు విద్యాశాఖకు చేరినట్టు అంచనా. ఒక్కో బదిలీకి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేసినట్టు ఉపాధ్యాయులే చెబుతున్నారు. అయితే.. వెంటనే బదిలీలు చేస్తే ఉపాధ్యాయవర్గాల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతుందని భావించిన ప్రభుత్వం.. సిఫారసు బదిలీలకు చట్టం ముసుగు వేసింది.ఈ ఏడాది ఏప్రిల్లో ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ చట్టం–2025’ చేసింది. ఇందులో సంవత్సరానికి ఒకసారి మాత్రమే బదిలీలుంటాయని చెబుతూ, అభ్యర్థన/పరస్పర/అంతర్ జిల్లా/అంతర్రాష్ట్ర బదిలీలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. అంటే సిఫారసు లేఖల కోసమే ఈ నిబంధన పెట్టినట్టు అప్పట్లోనే ఆందోళన వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు ఆ నిబంధనను తొలగించాలని పట్టుబట్టారు. కానీ ప్రభుత్వం అవేమీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ నిబంధనే తమ నెత్తిన కుంపటిలా మారిందని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది జూన్లో బదిలీపై కొత్త స్కూళ్లకు వెళ్లిన వారు సైతం ఎప్పుడు ఎవరి స్థానం మారుతుందోనని ఆందోళనగా ఉన్నట్లు తెలిసింది. -
దివ్యాంగులపై ‘రీవెరిఫికేషన్’ అస్త్రం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దివ్యాంగ పింఛన్ దారులకు రీ వెరిఫికేషన్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఏళ్ల తరబడి పెన్షన్ తీసుకుంటున్నా టీడీపీ కూటమి ప్రభుత్వం వాటి సంఖ్యను ఎలాగైనా కుదించాలన్న కుట్రతో వెరిఫికేషన్ ప్రక్రియకు తెరతీసింది. వైకల్యం నిరూపించుకోవాలంటూ ఇప్పటికే లబ్ధిదారులకు ఒకసారి నోటీసులిచ్చి రీవెరిఫికేషన్ పూర్తిచేయగా.. ఇప్పుడు తాజాగా ఈనెల 8 నుంచి మరోమారు వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి సోమవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. విడతల వారీగా నోటీసులివ్వడం ప్రారంభించింది. నిజానికి.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. అనర్హుల ఏరివేత పేరిట పింఛను అర్హతను నిరూపించుకోవాలంటూ నోటీసులు జారీచేసింది. మంచానికి పరిమితమైన వ్యాధిగ్రస్తులు 24,091 మందితో పాటు దివ్యాంగుల కోటా పింఛన్లు పొందుతున్న 7,86,091 మందితో కలిపి రాష్ట్రంలో మొత్తం 8.18 లక్షల మందికి వైద్యపరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, వీరిలో కొందరికే నోటీసులిచ్చి 5.50 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. దాదాపు లక్ష మంది లబ్ధిదారులు అనర్హులంటూ వీరి పింఛన్లు పూర్తిగా రద్దుకు రెండునెలల క్రితమే ప్రభుత్వం నోటీసులు జారీచేసింది.అలాగే, 30వేల మందికి వారు ప్రస్తుతం పొందుతున్న రూ.15 వేల పింఛన్ను రూ. 6వేలు లేదా రూ. 4 వేలకు మార్చేందుకు కూడా నోటీసులిచ్చింది. అయితే, వీటిని అందుకున్న దివ్యాంగ, వైద్య పింఛను లబ్ధిదారులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టడం.. పింఛన్ల భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వ కుట్రలను ‘సాక్షి’ ఎండగట్టడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సెప్టెంబరు ఒకటిన జరిగే పింఛన్ల పంపిణీని నిలిపివేస్తామని చెప్పి వాయిదా వేసింది. అయితే, తన పంతం ఎలాగైనా నెగ్గించుకోవాలన్న లక్ష్యంతో ఇప్పుడు మళ్లీ రీవెరిఫికేషన్ అంటోంది. రెండు నెలల క్రితం పింఛను రద్దు లేదంటే పింఛన్ కేటగిరి మార్పునకు నోటీసులిచ్చిన వారిలో దాదాపు 1.10 లక్షల మందికి ఈనెల 8న మళ్లీ వైద్య పరీక్షలు మొదలుపెట్టనుంది. ఈసారి పరీక్షల్లో అనర్హులుగా తేలితే పింఛను పూర్తిగా రద్దుచేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆసుపత్రుల వద్దే పరీక్షలు.. ఇక పెరాలసిస్, తీవ్ర కండరాల బలహీనత వంటి వ్యాధులతో మంచం నుంచి కదలలేని స్థితిలో ఉంటూ ఫించన్లు పొందుతున్న 24 వేల మంది లబ్ధిదారులకు తొలివిడత వైద్య పరీక్షలను ఇంటివద్దే నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు రెండో విడతలో మాత్రం ప్రభుత్వాసుపత్రులకు వెళ్లాల్సిందేనని తాజా మార్గదర్శకాల్లో తేలి్చచెప్పింది. వీరిలో ఎంపికైన అతికొద్ది మందికి మాత్రమే రోజుకు ఐదుగురు చొప్పున 108 లేదా 104లో ఆస్పత్రులకు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది.టీడీపీ సానుభూతిపరులకైతే నో వెరిఫికేషన్..ఇదిలా ఉంటే.. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ రాజకీయ వేధింపుల మాదిరిగా ఉందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే.. మొత్తం 8.18 లక్షల మంది దివ్యాంగ, వైద్య పింఛను లబ్ధిదారులందరినీ అప్పట్లో రీవెరిఫికేషన్ జరుపుతున్నట్లు ప్రకటించి.. వీరిలో కేవలం ఐదున్నర లక్షల మందికి మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహించి, వారిలో లక్ష మందికి పూర్తిగా పింఛను రద్దుకు ప్రభుత్వం నోటీసులిచ్చింది. ఇప్పుడు వీరికి మళ్లీ రెండో విడత రీ వెరిఫికేషన్ వైద్య పరీక్షలు మొదలుపెడుతున్నారు. అయితే, దాదాపు రెండున్నర లక్షల మంది టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న దివ్యాంగ పింఛనుదారులకు ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడం గమనార్హం.మిగిలిన వారి మీద మాత్రం ప్రత్యర్థి పార్టీల సానుభూతిపరులంటూ టీడీపీ నేతల ప్రోద్బలంతో ముద్రవేసి వేధిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, దాదాపు పదిహేను ఏళ్ల క్రితం కేంద్రం దేశవ్యాప్తంగా నిర్వహించిన జనగణనలో రాష్ట్రవ్యాప్తంగా 12,19,785 మంది దివ్యాంగులు ఉన్నారని తేలింది. కానీ, ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఇస్తున్న ఈ కేటగిరీ పెన్షనర్ల సంఖ్య అంతకన్నా చాలా తక్కువే. అయినా.. ఇందులోనూ కోత విధించేందుకు గత ప్రభుత్వం అనర్హులకు ఇచ్చిందంటూ రీవెరిఫికేషన్ జపం చేస్తోంది. -
ఊరిమీదపడి అరాచకం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రశాంతమైన పల్లెలో వారంతా కూలీలు... సన్న చిన్నకారు రైతులు... ఇతర పనులు చేసుకునేవాళ్లు... అర్ధరాత్రి ఆదమరిచి నిద్రిస్తున్నారు... అలాంటి సమయంలో 40 మంది పోలీసులు ఊరిమీద పడ్డారు. ఇళ్లల్లోకి చొరబడ్డారు... దొరికినవారిని దొరికినట్లు జీపుల్లో కుక్కేసి స్టేషన్కు తరలించారు. ఇదంతా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం జమ్ములో ఆదివారం జరిగింది. గ్రామంలో శనివారం పండుగ సందర్భంగా చోటుచేసుకున్న చిన్న తగాదాలో అధికార టీడీపీ నాయకుల మాటలు విని పోలీసులు చెలరేగిపోయారు.అసలు ఏం జరిగిందంటే.. జమ్ము గ్రామంలో శనివారం రాత్రి వైఎస్సార్సీపీ, టీడీపీ వారు వేర్వేరుగా దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. టీడీపీ ఊరేగింపులోని యువకులు వైఎస్సార్సీపీ ఊరేగింపులో అల్లర్లకు దిగారు. పోలీసులు కూడా వారికే మద్దతుగా నిలిచారు. వైఎస్సార్సీపీ యువతపై దాడి చేసి లాఠీలకు పని చెప్పారు. ప్రశాంతంగా ఊరేగింపు చేస్తున్నా ఎందుకు కొడుతున్నారని వైఎస్సార్సీపీ యువత ప్రశ్నించారు.ఈ సమయంలో అదుపుతప్పి ఒకరిద్దరు పోలీసులు కిందపడ్డారు. దీన్నే తీవ్రమైన నేరంగా పరిగణించిన పోలీసులు... ఆదివారం అర్ధరాత్రి జమ్ము గ్రామం మీద పడ్డారు. గర్భిణులని కూడా చూడకుండా కాళ్లతో తన్నారు. పురుషుల్లో దొరికినవారిని దొరికినట్లు కొట్టుకుంటూ జీపుల్లోకి ఎక్కించి విజయనగరం రూరల్ స్టేషన్కు తరలించారు. కాగా, సర్పంచ్ జమ్ము నరసింహమూర్తితో సహా 23 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ముగ్గురు టీడీపీ కార్యకర్తలను తప్పించి 20 మంది వైస్సార్సీపీ కార్యకర్తలను రిమాండ్కు తరలించారు. -
మా సమస్యలన్నీ పరిష్కరించాల్సిందే
లబ్బీపేట/పటమట (విజయవాడ తూర్పు): తమ సమస్యల పరిష్కారం కోసం పీహెచ్సీ వైద్యులు చేపట్టిన రిలే దీక్షలు మూడో రోజైన సోమవారం కూడా కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్లో నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో వైద్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లపై స్పందించి.. స్పష్టమైన రాతపూర్వక హామీ ఇచ్చే వరకు ఆందోళనను విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.చర్చలకు ఆహ్వానిస్తున్న ప్రభుత్వం.. తమ డిమాండ్ల పరిష్కారానికి మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. పీహెచ్సీ వైద్యులు 20 ఏళ్లుగా ఎలాంటి పదోన్నతులు లేకుండా పనిచేస్తున్నారని.. తమతోపాటు ఇతర శాఖల్లో చేరిన వారు రెండు, మూడు పదోన్నతులు పొందారని వివరించారు. టైమ్ బౌండ్ ప్రమోషన్లు, ఇన్–సర్వీస్ పీజీ కోటా పునరుద్ధరణ వంటి డిమాండ్లు నెరవేర్చాలన్నారు.వైద్యుల సమ్మెకు జీడీఏఏ మద్దతు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యుల సమ్మెకు తమ సంఘీభావం ప్రకటిస్తున్నామని జీడీఏఏ (గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) కార్యదర్శి డాక్టర్ బాబ్జీ శ్యామ్కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పీహెచ్సీ వైద్యుల డిమాండ్లు నెరవేర్చాలని, డీఎంఈ వైద్యులకు బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఇప్పటికే వినతిపత్రం అందించామన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన రిలే దీక్షలో పాల్గొన్న పీహెచ్సీ వైద్యులు -
అడ్వాన్సు నిధులు మళ్లిస్తే.. పోలవరం పూర్తయ్యేదెన్నడు?
సాక్షి, అమరావతి: ‘‘పోలవరం ప్రాజెక్టు పనులను 2027 మార్చి నాటికి పూర్తిచేసేలా నిధుల కొరత తలెత్తకుండా ఉండేందుకు 2024–25లో రెండు విడతల్లో రూ.5,052.71 కోట్లు అడ్వాన్సుగా ఇచ్చాం. వాటిని సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్ఎన్ఏ) ఖాతాలో జమ చేసి పోలవరం పనులకు మాత్రమే ఖర్చు పెట్టాలని నిర్దేశించాం. అయినాసరే ఆ నిధుల్లో ఇప్పటికీ రూ.1,830 కోట్లను ఎస్ఎన్ఏ ఖాతాలో వేయలేదు. అంటే, ఇతర అవసరాలకు మళ్లించారు. ఇలాగైతే పోలవరం గడువులోగా ఎలా పూర్తవుతుంది?’’ అంటూ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులను కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నిలదీశారు. ‘నిర్వాసితులకు నగదు పరిహారం చెల్లింపు, పునరావాస కాలనీల పనులు, సేకరించిన భూమికి నిర్వాసితులకు పరిహారం ఇవ్వడానికి సంబంధించిన బిల్లులే రూ.1,107.62 కోట్లు పెండింగ్లో పెట్టారు. కేంద్రం ఇచ్చిన అడ్వాన్సులో రూ.1,830 కోట్లు దారి మళ్లించేశారు. ఇలాగైతే సకాలంలో నిర్వాసితులకు ఎప్పుడు పునరావాసం కల్పిస్తారు?’’ అని సూటిగా ప్రశ్నించారు. గత ఆర్థిక సంవత్సరంలో అడ్వాన్సుగా ఇచ్చిన రూ.5,052.71 కోట్ల నిధుల వినియోగానికి సంబంధించిన వినియోగ పత్రాలు (యుటిలిటీ సరి్టఫికెట్–యూసీ) పంపితేనే, ఈ ఆర్థిక సంవత్సరంలో పోలవరానికి కేటాయించిన రూ.5,936 కోట్లను విడుదల చేస్తామని తేల్చిచెప్పారు.పోలవరం పనుల పురోగతిపై సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో, సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) చైర్మన్ అతుల్జైన్, వ్యాప్కోస్, సీఎస్ఎంఆర్ఎస్ అధికారులు, రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్సీ కె.నరసింహమూర్తి, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ⇒ పోలవరం పనుల పురోగతిపై పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్కు వివరించారు. ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయా ఫ్రం వాల్ పనులు 56 శాతం జరిగాయని, గ్యాప్–1లో వరద ఉధృతితో కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే, కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానించే, ఎడమ కాలువ పనులు సాగుతున్న తీరును సమగ్రంగా వెల్లడించారు. ఏడాదిగా ఒక్క కుటుంబానికీ పునరావాసం లేదు 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేయాలంటే 1,00,099 ఎకరాలకు గాను 91,156 ఎకరాలు సేకరించారని ఇంకా 8,943 ఎకరాలు సేకరించాల్సి ఉందని రఘురాం తెలిపారు. 38,060 నిర్వాసిత కుటుంబాలకు గాను ఇంకా 23,689 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందని, ఏడాదిగా ఒక్క కుటుంబానికి కూడా పునరావాసం కల్పించలేదని తెలిపారు. దీనిపై వీఎల్ కాంతారావు స్పందిస్తూ, అడ్వాన్సు నిధులను సద్వినియోగం చేస్తేనే ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయగలరని, కానీ... రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎన్ఏ ఖాతాలో వేయకుండా, ఇతర అవసరాలకు మళ్లిస్తోందని, ఇదే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ కూడా రాశామని ప్రస్తావించారు.ఇదిలా ఉంటే.. పోలవరం పనుల ప్రగతిపై కేంద్రం సంతృప్తి వ్యక్తంచేసిందని ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. సోమవారం కేంద్ర జల శక్తి మంత్రి పాటిల్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2027 డిసెంబరుకల్లా.. వీలైతే పుష్కరాలకు ముందే పోలవరం పూర్తిచేసి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామన్నారు.డిసెంబరులో వస్తా.. పనులను గాడిలో పెట్టాలి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ స్పందిస్తూ... పోలవరాన్ని 2026 మార్చి నాటికి విపత్తులు ఎదురైతే మరో ఏడాది (2027 మార్చి)లోగా పూర్తి చేయాలని గడువుగా నిర్దేశించి రూ.12,157 కోట్లను కేంద్ర కేబినెట్ మంజూరు చేసిందని కేంద్రమంత్రి పాటిల్ గుర్తు చేశారు. ఈ క్రమంలో నిధుల కొరత లేకుండా 2 విడతలుగా అడ్వాన్సు ఇచ్చామని చెప్పారు.వాటిని సది్వనియోగం చేసుకోకపోతే ప్రాజెక్టును సకాలంలో ఎలా పూర్తి చేయగలరని రాష్ట్ర మంత్రి రామానాయుడుని, జల వనరుల శాఖ అధికారులను నిలదీశారు. ‘‘నేను డిసెంబరులో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తా. ఆలోగా పనులను గాడిలో పెట్టాలి’’ అని స్పష్టం చేశారు. పీపీఏ, సీడబ్ల్యూసీ, అంతర్జాతీయ నిపుణుల కమిటీతో సమన్వయం చేసుకుంటూ 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. -
ఎరువుల కోసం టీడీపీ నేత ఇంటి వద్ద క్యూ
రైతులు క్యూ కట్టడం చూసి ఇదేదో ఎరువుల దుకాణం అనుకునేరు... కాదు.. సాక్షాత్తూ టీడీపీ నేత ఇల్లు. విషయమేమంటే... శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి గ్రామంలోని రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేయాల్సిన ఎరువులను తన వారికి ఇచ్చేందుకు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నాయకుడు ఎం. శ్రీనివాసరావు ఇంట్లో పెట్టుకుని, తనకు అనుకూలంగా ఉన్న రైతులకు టోకెన్లు ఇచ్చి మరీ పంపిణీ చేశారు.వాటిపై ఆ శ్రీనివాసరావు సంతకం కూడా ఉంది. ఇదే ఇక్కడ వివాదానికి దారితీసింది. పార్టీ పరంగా ఇంటికి పిలిపించుకుని అనుకూలమైన వారికి టోకెన్లు ఇవ్వడమేంటని కొందరు టీడీపీ నేతలను నిలదీశారు. ఈ విషయమై వ్యవసాయాధికారి నవీన్ను సంప్రదించగా కల్లేపల్లికి 333 బస్తాల ఎరువులు పంపామని, తమ సిబ్బంది సమక్షంలోనే అందించామంటూ బుకాయించారు. – శ్రీకాకుళం రూరల్ -
నౌకాదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం
భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. రెండో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్క్రాఫ్ట్ యుద్ధనౌక ఐఎన్ఎస్ ఆండ్రోత్ను విశాఖలోని నేవల్ డాక్యార్డులో తూర్పు నౌకా దళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ సోమవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యుద్ధ విమానాలు, సబ్మెరైన్లు, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ల నిర్మాణంతో ఆత్మనిర్భర్ భారత్లో భారత నౌకాదళం నంబర్ వన్గా దూసుకుపోతోందని చెప్పారు.80 శాతం కంటే ఎక్కువ స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా కోల్కతాలో ఈ యుద్ధనౌకను తీర్చిదిద్దారని తెలిపారు. వరుసగా భారత్లో తయారు చేసిన యుద్ధ నౌకలు అందుబాటులోకి రావడం సరికొత్త చరిత్రగా అభివరి్ణంచారు. ఆండ్రోత్ రాకతో సముద్ర రక్షణ మరింత బలోపేతమైందని తెలిపారు. లక్షదీవుల సమూహంలో ఉత్తరాన ఉన్న ప్రముఖ ద్వీపం ‘ఆండ్రోత్’ పేరును ఈ యుద్ధ నౌకకు పెట్టినట్టు వివరించారు.– సాక్షి, విశాఖపట్నంశత్రుదేశాల సబ్మెరైన్లు ఎక్కడ దాక్కున్నా పట్టేస్తుంది సముద్ర నిఘా, శోధన, రెస్క్యూ, తీరప్రాంత రక్షణ కార్యక్రమాల్లో ఆండ్రోత్ చురుగ్గా వ్యవహరిస్తుందని పెందార్కర్ చెప్పారు. శత్రుదేశాల సబ్మెరైన్లు ఎక్కడ దాక్కున్నా పసిగట్టేలా అధునాతన సెన్సార్లు, అత్యా«ధునిక ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలతో ఈ వార్íÙప్ నిరి్మంచినట్టు తెలిపారు. తూర్పు తీర సముద్ర రక్షణ విషయంలో తూర్పు నౌకాదళం రాజీలేని పోరాటం చేస్తోందని పునరుద్ఘాటించారు.ఆండ్రోత్ భారత నౌకాదళ అమ్ముల పొదిలో చేరిన తర్వాత.. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లో నావికాదళ సామర్థ్యాన్ని బలోపేతం చేసినట్టేనని తెలిపారు. లోతు తక్కువగా ఉన్న జలాల్లోని శత్రుదేశాల సబ్మెరైన్లని ఆండ్రోత్ వేటాడుతుందనీ.. తీరప్రాంతానికి చేరువలోని జలాలపై నిఘావేసే సామర్థ్యంతో పాటు విమానాలతో సమన్వయం చేసుకుంటూ శత్రు జలాంతర్గాముల్ని వేటాడే సత్తా ఆండ్రోత్ సొంతమని వివరించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నౌకాదళాధికారులు, జీఆర్ఎస్ఈ అధికారులు పాల్గొన్నారు.‘ఆండ్రోత్’ విశేషాలు ఇవీ..పొడవు: 77.6 మీటర్లు వెడల్పు: 10.5 మీటర్లు డ్రాఫ్ట్: 2.7 మీటర్లు బరువు: 1,500 టన్నులు వేగం: గంటకు 25 నాటికల్ మైళ్లుసామర్థ్యం: ఏకధాటిగా 100 నాటికల్ మైళ్లుఎక్కడ తయారు చేశారు: కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ)వ్యయం: రూ.789 కోట్లు పనులు ప్రారంభం: 2023 మార్చిలో సిబ్బంది: ఏడుగురు అధికారులు, 50 మంది సెయిలర్స్ (మొత్తం 57 మంది) లక్ష్యం: సముద్రం లోపల దాగివున్న శత్రు జలాంత ర్గాముల్ని గుర్తించడం, వాటిని ట్రాక్ చేసి నాశనం చేయడం అదనపు విధులు: సముద్ర నిఘా, పరిశోధన, విపత్తు, యుద్ధ సహాయక చర్యలు, తీరప్రాంత పరిరక్షణ సెన్సార్ వ్యవస్థ: డీఆర్డీవో కాంబాట్ సూట్, డీఆర్డీవో హల్ మౌంటెడ్ సోనార్, తక్కువ లోతులో సబ్మెరైన్లను గుర్తించే ఎల్ఎఫ్వీడీ సోనార్ ఆయుధ సంపత్తి: దేశీయంగా తయారు చేసిన 30 ఎంఎం సర్ఫేస్ గన్, 6,000 యాంటీ సబ్మెరైన్ రాకెట్ ఒకటి, 2 ట్రిపుల్ లైట్ వెయిట్ టార్పెడో లాంచర్లు, యాంటీ సబ్మెరైన్ మైన్స్, 2 ఓఎఫ్టీ రిమోట్ కంట్రోల్ గన్స్ -
రానున్న మూడు నెలల్లో కూటమి రూ.11,900 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అక్టోబరు నుంచి డిసెంబర్ వరకు బడ్జెట్లో రూ.11,900 కోట్ల అప్పు చేయనుంది. ఈ మేరకు సెక్యూరిటీల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల రుణాల సమీకరణ క్యాలెండర్ను ఆర్బీఐ నోటిఫై చేసింది.ఇందులో భాగంగా మంగళవారం ఏపీ రూ.1,900 కోట్లు అప్పు చేయనున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. నవంబర్ 4న రూ.5,000 కోట్లు, డిసెంబర్ 2న మరో రూ.5,000 కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. -
ఉద్యోగులకు ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు ఏమిటి..? చేస్తున్నది ఏమిటి..?
సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు ఉద్యోగులకు మీరు ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. తీపి తీపి మాటలతో ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపి... తీరా ఇప్పుడు వారిని మోసం చేస్తారా? రోడ్డు మీద నిలబెడతారా? ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.పీఆర్సీ, పెండింగ్ డీఏలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ లేదా ఎన్క్యాష్మెంట్ లీవ్ల కింద ఉద్యోగులకు దాదాపు రూ.31 వేల కోట్ల బకాయిలు పెట్టారని ఎత్తిచూపారు. తమకు రావాల్సిన వాటి కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నా ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో వారందరూ నరకయాతన అనుభవిస్తున్నారని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.మీరు పెట్టే బాధలు భరించలేకే ఇప్పుడు ఉద్యోగులంతా రోడ్డు మీదకు వస్తున్నాంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఉద్యోగులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన మేళ్లను.. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను జత చేస్తూ, చంద్రబాబు చేసిన మోసాలను ప్రశ్నిస్తూ తన ‘ఎక్స్’ ఖాతాలో సోమవారం వైఎస్ జగన్ పోస్టు చేశారు.అందులో ఆయన ఏమన్నారంటే...‘‘చంద్రబాబు గారూ... మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి, ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీల అమలు గురించి, వారికి చెల్లించాల్సిన బకాయిల గురించి మీ నుంచి ప్రకటన వస్తుందని వారు ఆశగా ఎదురుచూడడం, చివరకు ఉసూరు మనిపించడం మీకు అలవాటుగా మారింది. కేబినెట్ సమావేశాల్లో మీ శ్రద్ధ అంతా భూ పందేరం మీద తప్ప, ప్రజలు, ఉద్యోగస్తుల మీద కాదు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రజలు, ఉద్యోగుల మీద మీకున్నది కపట ప్రేమే. వారిని నమ్మించి వెన్నుపోటు పొడవడం మీకు అలవాటే.మీరు పెట్టే బాధలు భరించలేక ఇప్పుడు వారంతా రోడ్డు మీదకు వస్తున్నారు. చంద్రబాబు గారూ.. మీరు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమిటో ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. అందులో ఒక్కటైనా నెరవేర్చారా? అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ అన్నారు. మరి ఇచ్చారా? మెరుగైన పీఆర్సీ అంటూ ఊదరగొట్టారు. మరి దాని సంగతి ఏమైంది? మేం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాం. అంతేకాకుండా మా హయాంలోనే పీఆర్సీ వేసి, దానికి చైర్మన్ను కూడా నియమించాం.మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఐఆర్ ఇవ్వకపోవడం ఒక మోసమైతే, ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందని ఉద్దేశపూర్వకంగా పీఆర్సీ చైర్మన్ను వెళ్లగొట్టారు. ఆ తర్వాత కొత్తగా ఎవరినీ నియమించకుండా ఉద్యోగస్తులకు తీరని అన్యాయం చేస్తున్నారు. న్యాయంగా, ధర్మంగా వారికి పెరగాల్సిన జీతాలను కావాలనే ఆపుతున్నారు.ఇచ్చే ఆలోచన మీకు లేదనిపిస్తోంది..ఉద్యోగస్తులకు ఇచ్చే అలవెన్స్ పేమెంట్స్ను పెంచుతామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు దానిగురించి ప్రస్తావించడమే లేదు. ఇప్పటిదాకా ఇవ్వాల్సిన 4 డీఏలు మొత్తం పెండింగ్. దసరా పండుగకు డీఏలు క్లియర్ అవుతాయని ఉద్యోగులంతా ఎంతో ఎదురుచూశారు. ఇప్పుడు దీపావళి పండుగ కూడా వస్తోంది. కానీ, ఇచ్చే ఆలోచన మీకున్నట్టు అనిపించడం లేదు.⇒ సీపీఎస్/జీపీఎస్లను పునఃసమీక్షించి ఆమోదయోగ్య పరిష్కారం అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పారు. కానీ, మీరు అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా దీనిమీద రివ్యూ చేశారా? మా ప్రభుత్వ పాలనలో సీపీఎస్కు గొప్ప ప్రత్యామ్నాయంగా ఉద్యోగుల కోసం జీపీఎస్ తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు ఇప్పుడు ఇదే విధానంలో వెళ్తున్నాయి. మీరు... ఓపీఎస్ను తీసుకొస్తామన్నారు. మాకంటే గొప్పగా చేస్తామన్నారు. కానీ, ఏమీ చేయకపోగా, ఉద్యోగస్తులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టారు. మిమ్మల్ని నమ్మిన పాపానికి వారు తీవ్రంగా నష్టపోతున్నా, మీలో ఏ మాత్రం చలనం లేదు.ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితిప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి... ఇప్పుడు ఏ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తారో తెలియని పరిస్థితి తెచ్చారు. ప్రతి నెల ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభాల సమయంలోనూ మేం ఉద్యోగులకు జీతాలు సకాలంలోనే ఇవ్వగలిగాం. కానీ, ఆ రోజు మాపై మీరు తప్పుడు ప్రచారాలు చేశారు. ఇవాళ కరోనా లాంటి దారుణమైన పరిస్థితులు లేకపోయినా జీతాలు ఇవ్వలేకపోతున్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీ అమలు చేయడం లేదు.వాలంటీర్లకు ఎగ్గొట్టారు.. వైద్యాన్ని రోడ్డున పడేశారుమీరు అధికారంలోకి రాగానే వాలంటీర్ల జీతాలను రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి, కుట్ర పన్ని వారి పొట్టకొట్టి ఇప్పుడు రోడ్డుమీద పడేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకూ మేలు చేస్తామని చెప్పి వారినీ ఇప్పుడు రోడ్డు ఎక్కేలా చేశారు. విలేజ్ క్లినిక్లు, పీహెచ్సీలు మొత్తంగా ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ నిర్వీర్యం చేశారు. జీరో వేకెన్సీతో ప్రజలకు తోడుగా ఉండే వైద్య శాఖను రోడ్డున పడేశారు.⇒ మా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీలో పని చేస్తున్న దాదాపు 52 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేశాం. ఇతర శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను కూడా మొదలుపెట్టాం. అర్హులైన 10,117 మందిని గుర్తించాం. వీరిలో 3,400 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చాం. మిగిలినవారికి అన్ని ప్రక్రియలు ముగిసినా ఇప్పటివరకు అపాయింట్మెంట్లు ఇవ్వకుండా, వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మళ్లీ దళారీ వ్యవస్థ... ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలకు స్వస్తిపలుకుతూ, వారికోసం ఆప్కాస్ను తీసుకొచ్చి దళారీ వ్యవస్థను అంతం చేశాం. దాదాపు లక్షమందికి సకాలానికే ఎలాంటి కత్తిరింపులు లేకుండా జీతాలను క్రమంతప్పకుండా ప్రతి నెల 1వ తారీఖునే ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఆప్కాస్ను రద్దుచేసి మళ్లీ దళారీ వ్యవస్థను తెస్తున్నారు. ఇంతకంటే అన్యాయం ఏముంటుంది? ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారందరికీ మేం అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలు పెంచాం. మేం రాకమునుపు వరకు వీరి జీతాల చెల్లింపుల బిల్లు నెలకు రూ.1,100 కోట్లు అయితే, మేం వచ్చాక రూ.3 వేల కోట్లకు పెంచాం. పేరుకే హెల్త్ కార్డులు... వాటితో ప్రయోజనం లేదుఉద్యోగులకు ఈహెచ్ఎస్ కింద ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవడంతో ఆస్పత్రులన్నీ వైద్యాన్ని నిరాకరిస్తున్నాయి. పేరుకు హెల్త్ కార్డులున్నా వాటి వల్ల ప్రయోజనం లేకుండా పోతోంది. ఈహెచ్ఎస్ కోసం ప్రభుత్వం వాటాగా ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకపోవడమే కాదు, తమ వాటాగా ఉద్యోగులు చెల్లించిన దాన్నికూడా విడుదల చేయడం లేదు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? చంద్రబాబు గారూ.. దాదాపు రెండేళ్ల కాలంలో ఉద్యోగులకైనా, ప్రజలకైనా మీరు వెన్నుపోటే పొడిచారు. వారికి ఇచ్చిన హామీలన్నీ మోసాలుగా మారిపోయాయి. అందుకే ప్రతి ఒక్కరూ రోడ్డెక్కుతూ మిమ్మల్ని ఎండగడుతున్నారు’’. -
ష్.. గుట్టు విప్పొద్దు!
సాక్షి, అమరావతి: బహుళ జాతి కూల్ డ్రింక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తుల కోసం ప్రాంచైజీలు ఇస్తాయి! ఆ కంపెనీలు కూల్ డ్రింక్ తయారీకి అవసరమైన మిశ్రమాన్ని సరఫరా చేస్తే... ఫ్రాంచైజీలు ఆ మిశ్రమంతో కూల్డ్రింకులు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తాయి. ఇలా తయారయ్యే ప్రతి బాటిల్పై ఫ్రాంచైజీలు కూల్ డ్రింక్ కంపెనీకి కమీషన్ చెల్లించాలి. ఇదీ వ్యాపారం..!సరిగ్గా అదే వ్యాపార సూత్రంతో ప్రభుత్వ పెద్దలు రాష్ట్రంలో నకిలీ మద్యం దందా సాగిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. కరకట్ట బంగ్లాకు 30 శాతం కమీషన్.. అంటే ఏడాదికి రూ.3వేల కోట్లు చెల్లించాలనే ఒప్పందం కుదరడంతో నకిలీ మద్యం ఫ్రాంచైజీ రాకెట్ రాష్ట్రవ్యాప్తంగా వేళ్లూనుకుంది. చినబాబు అండదండలతో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి, ఆయన ప్రధాన అనుచరుడు అద్దేపల్లె జనార్ధన్రావు నకిలీ మద్యం తయారీ ఫార్ములాను ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేయగా... టీడీపీ నేతల కుటుంబాలు ప్రాంతాలవారీగా ఆ ఫ్రాంచైజీలు తీసుకున్నాయి. ఏడాదిగా సాగుతున్న ఈ దందా ములకలచెరువులో వెలుగు చూసిన రాకెట్తో అనూహ్యంగా బయటపడింది. తమను ఈ కేసు నుంచి తప్పించకుంటే మొత్తం బండారం బయటపెడతామని జయచంద్రారెడ్డి, జనార్ధన్రావు బెదిరిస్తుండటంతో పెదబాబు, చినబాబు బెంబేలెత్తుతున్నారు. ఆ కేసు తప్పిస్తాం..! కంగారు పడొద్దు...! తమ గుట్టు విప్పొద్దని రాయబేరాలు సాగిస్తున్నారు. మమ్మల్ని కెలికితే... బండారం బయటపెడతాఅన్నమయ్య జిల్లా ములకలచెరువులో బయటపడిన నకిలీ మద్యం రాకెట్ టీడీపీ కూటమి సర్కారు పెద్దలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ నకిలీ మద్యం రాకెట్లో అడ్డంగా దొరికిన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి, ఆయన వ్యాపార భాగస్వామి అద్దేపల్లి జనార్ధన్రావు ఎదురు తిరగడంతో ప్రభుత్వ పెద్దలు హడలిపోతున్నారు. ఈ కేసును కప్పిపుచ్చేందుకు అమరావతి నుంచి ప్రభుత్వ ముఖ్యనేత వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. టీడీపీ నేతలే నకిలీ మద్యం దందా సూత్రధారులని ఆధారాలతో బట్టబయలు కావడంతో విధిలేని పరిస్థితుల్లో జయచంద్రారెడ్డిని టీడీపీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించారు. జనార్ధన్రావుతోపాటు కొందరు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. దాంతో ఈ వ్యవహారం సద్దుమణుగుతుందని భావించారు. కానీ అనూహ్యంగా జయచంద్రారెడ్డి, జనార్ధన్రావు ఎదురుతిరిగి ప్రభుత్వ ముఖ్యనేతకు షాక్ ఇచ్చారు. ఈ కేసు నుంచి తమను బయటపడేయాలని, లేకపోతే రాష్ట్ర స్థాయిలో సాగుతున్న నకిలీ మద్యం దందా గుట్టును బహిర్గతం చేస్తామని వారు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో టీడీపీ నేత పెట్టిన నకిలీ మద్యం ప్లాంటులోని యంత్రాలు, క్యాన్లు, (ఇన్సెట్లో) నకిలీ మద్యం బాటిళ్లు తామేమీ ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా నకిలీ మద్యం తయారు చేయడం లేదు కదా? అని వారిద్దరూ నిలదీయడంతో పెదబాబు, చినబాబులకు నోట మాట రాలేదు! ‘ ఎన్నికల ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రస్థాయిలో నకిలీ మద్యం దందాను వ్యవస్థీకృతం చేశాం. అందుకు ఎంతో ఖర్చు పెట్టాం. ఈ రాకెట్ను మేం పర్యవేక్షిస్తున్నాం... కానీ అందులో చాలా మంది టీడీపీ పెద్దలు ఉన్నారు కదా..! అంతకంటే పెద్దలకు కమీషన్లు వెళ్తున్నాయి కదా..?’ అని జయచంద్రారెడ్డి, జనార్ధన్రావు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ టీడీపీ సీనియర్ ప్రజాప్రతినిధి ద్వారా కబురు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. అదే విషయాన్ని ఈ కేసును అమరావతి నుంచి పర్యవేక్షిస్తున్న ఐపీఎస్ అధికారికి కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా ఓ టీడీపీ సీనియర్ ప్రజాప్రతినిధి, ఐపీఎస్ అధికారి ద్వారా తమ మనసులో మాటను ముఖ్యనేతకు తేల్చి చెప్పారు. అదే సమయంలో తమ డిమాండ్లను బలంగా వినిపించినట్లు తెలుస్తోంది. ఈ కేసు నుంచి తమను బయటపడేసే బాధ్యత ప్రభుత్వ పెద్దలదేనని... లేదంటే మొత్తం నకిలీ మద్యం గుట్టు విప్పుతామని తేల్చి చెప్పారు. మిమ్మల్ని మేం చూసుకుంటాం... నోరెత్తొద్దునకిలీ మద్యం దందా బండారం మొత్తం బయట పెడతామని జయచంద్రారెడ్డి, జనార్ధన్రావు బెదిరించడంతో పెదబాబు, చినబాబు షాక్ తిన్నారు. దాంతో తమకు సమాచారం ఇచ్చిన మధ్యవర్తుల ద్వారానే జయచంద్రారెడ్డి, జనార్దన్రావులతో రాయబేరాలు సాగించారు. తప్పనిసరి పరిస్థితుల్లో కేసు నమోదు చేయాల్సి వచ్చిందని.. పార్టీ పరువు బజారున పడటంతో సస్పెండ్ చేయాల్సి వచ్చిందని వారిద్దరినీ బుజ్జగించేందుకు యత్నించారు. ‘మీరు ఇప్పుడు మొత్తం గుట్టు విప్పితే మీకూ నష్టం... మాకూ నష్టం... పార్టీకి పూర్తిగా నష్టం.. ఎవరికి ప్రయోజనం ఉండదు..’ అని సర్ది చెబుతున్నట్లు తెలుస్తోంది. ‘అయినా అధికారంలో ఉన్నది మన ప్రభుత్వమే. ఇటీవల అన్నమయ్య జిల్లా ములకలచెరువులో పట్టుబడిన నకిలీ మద్యం బాటిళ్లు కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా చూస్తాం. మీవరకు రానివ్వకుండా పక్కదారి పట్టిస్తాం.. మీరేమీ ఆందోళన చెందవద్దు..’ అని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులు తెరవెనుక ఉండండి... తరువాత మళ్లీ పార్టీలో క్రియాశీలం కావచ్చని సూచించినట్లు సమాచారం. దాంతో జయచంద్రారెడ్డి, జనార్దన్రావు మెత్తబడినట్లు తెలుస్తోంది. అంతే కాదు.. ఈ నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతల ప్రమేయం లేదని వీడియో ద్వారా ప్రకటించాలని జనార్దన్రావును చినబాబు ఆదేశించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కేసు నుంచి బయటపడేస్తామని ప్రభుత్వ పెద్దల నుంచి హామీ లభించడంతో జనార్ధన్రావు సోమవారం సాయంత్రం వీడియో విడుదల చేసినట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.పెదబాబులో గుబులు.. చినబాబు బెంబేలు!టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, జనార్ధన్రావు హెచ్చరికలతో పెదబాబు, చినబాబు బెంబేలెత్తుతున్నారు. ఏడాదిగా రాష్ట్రవ్యాప్తంగా తాము వ్యవస్థీకృతం చేసిన నకిలీ మద్యం రాకెట్ వెనుక గూడుపుఠాణి బట్టబయలవుతుందని ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ మొత్తం దందా చినబాబు అండదండలతోనే సాగుతోంది. ఆయనకు సన్నిహితుడైన అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేత ఈ నకిలీ మద్యం రాకెట్కు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో సీనియర్ ప్రజాప్రతినిధులను కాదని మరీ ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ కీలక నేతకు సన్నిహితులైన జయచంద్రారెడ్డి, జనార్ధన్రావు, కట్టా సురేంద్రబాబు ఆఫ్రికా దేశాల్లో అనుసరించే నకిలీ మద్యం తయారీ విధానాన్ని రాష్ట్రంలోకి తీసుకొచ్చారు. చినబాబు ఆదేశాలతో ఆయనకు సన్నిహితులైన టీడీపీ నేతలను వ్యాపార భాగస్వాములుగా చేసుకున్నారు. రాష్ట్రాన్ని ప్రాంతాలవారీగా పంచుకుని నకిలీ మద్యం దందా సాగిస్తున్నారు. జయచంద్రారెడ్డి, జనార్దన్రావు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం తయారీ యూనిట్లను నెలకొల్పారు. అన్నమయ్య జిల్లాకు చెందిన కీలక నేత రాయలసీమలో... నర్సీపట్నానికి చెందిన సీనియర్ నేత కుటుంబం ఉత్తరాంధ్రలో... రెవెన్యూ, పోలీసు అధికారులపై దాడులకు దిగిన చరిత్ర కలిగిన ఏలూరు జిల్లాకు చెందిన వివాదాస్పద ఎమ్మెల్యే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో... బాపట్ల జిల్లా కీలక నేత ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో.. జయచంద్రారెడ్డి స్వయంగా రాయలసీమలో నకిలీ మద్యం రాకెట్ను నిర్వహిస్తున్నారు. టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాలు, బెల్ట్ దుకాణాలు, బార్లలో యథేచ్ఛగా నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్నారు.కరకట్ట బంగ్లా వాటా 30 శాతం...ఏడాదిగా రాష్ట్రంలో జరుగుతున్న మద్యం విక్రయాల్లో మూడో వంతు నకిలీనేనని ఎక్సైజ్ శాఖ అనధికారికంగా వెల్లడిస్తుండటం గమనార్హం. ఆ విధంగా టీడీపీ కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే రూ.5,280 కోట్ల మేర నకిలీ మద్యం అమ్మకాలు సాగాయి. మొత్తం అమ్మకాల్లో నకిలీ మద్యం వాటాను 50 శాతం దాటించాలన్నది ఈ సిండికేట్ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే రానున్న నాలుగేళ్లలో ఏడాదికి రూ.10 వేల కోట్లు చొప్పున రూ.40 వేల కోట్లు కొల్లగొట్టేందుకు పన్నాగం వేసింది. అందులో 30 శాతం అంటే రూ.12 వేల కోట్లు కరకట్ట నివాసానికి కమీషన్గా చెల్లించాలన్నది ఒప్పందం. ప్రాంతాలవారీగా పర్యవేక్షిస్తున్న టీడీపీ సీనియర్ నేతలకు 50 శాతం, మద్యం దుకాణాలు, బార్లు నిర్వహిస్తున్న టీడీపీ సిండికేట్కు 20 శాతం వాటా దక్కనుంది. -
16న కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన
కర్నూలు కల్చరల్: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈనెల 16న ప్రధాని మోదీ పర్యటించనున్నారని రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్రెడ్డి, టీజీ భరత్ తెలిపారు. సోమవారం కర్నూలులోని స్టేట్ గెస్ట్హౌస్లో జిల్లాలో ప్రధాని పర్యటనపై వీరు సమీక్ష చేపట్టారు.3 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. సభ ఏర్పాటుకు అనుగుణంగా ఉండే ప్రదేశాలను ఈ సందర్భంగా మంత్రులు గూగుల్ మ్యాప్ ద్వారా పరిశీలించారు. -
నకిలీ మద్యం భారీ డంప
సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి నెట్వర్క్: రంగు, వాసన, ఏమాత్రం తేడా లేకుండా కార్మెల్, రంగు నీళ్లు కలిపి నకిలీ మద్యం తయారీ... ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్కు నకిలీ సరుకు సిద్ధం... అక్కడ ఎటుచూసినా.. కార్టన్ బాక్స్ల్లో స్పిరిట్ నింపిన క్యాన్లు.. ప్రముఖ బ్రాండ్ల లేబుళ్లు అతికించిన నకిలీ మద్యం బాటిళ్లే.. ఎవరికీ అనుమానం రాకుండా బాక్సుల్లో అమర్చి పాల వ్యాన్లలో సరఫరా! ఏకంగా జనావాసాలు, షాపింగ్ కాంప్లెక్స్ల నడుమ నకిలీ మద్యం తయారీ!విజయవాడకు కూతవేటు దూరంలోని ఇబ్రహీంపట్నం కేంద్రంగా పచ్చముఠాలు, కల్తీ కేటుగాళ్లు సాగించిన నకిలీ మద్యం దందా ఇదీ!! తాజాగా అక్కడ తనిఖీల్లో భారీగా బయటపడ్డ స్పిరిట్ ఖాళీ క్యాన్లు, ఖాళీ సీసాలు, గోడౌన్లో పట్టుబడిన ప్యాకింగ్ యంత్రాలను చూసి ఎక్సైజ్ అధికారులే విస్తుపోయారంటే ఏ స్థాయిలో దందా సాగిందో ఊహించవచ్చు. పాత ఏఎన్నార్ బార్ భవనంలో నకిలీ తయారీ..టీడీపీ పెద్దల నకిలీ మద్యం సిండికేట్ అమాయకుల ప్రాణాలను హరిస్తూ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తోంది. ప్రాంతాలవారీగా నకిలీ మద్యం ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తోంది. బరి తెగించి అన్ని చోట్లా మద్యం, బెల్ట్ షాపులకు సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేసి రూ.కోట్లు పిండుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలంలో నకిలీ మద్యం తయారీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించగా తాజాగా మరో కీలక మలుపు తిరిగింది. నకిలీ మద్యం తయారీలో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దనరావుకు చెందిన ఇబ్రహీంపట్నంలోని ఏఎన్ఆర్ బార్ సమీపంలోని గోడౌన్, హైవే పక్కన ఉన్న పాత ఏఎన్నార్ బార్ (ఖాళీ భవనం)లో సోమవారం ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నివ్వెరపరిచే అంశాలు వెలుగులోకి వచ్చాయి.గోడౌన్లో సుమారు 162 కేసుల మద్యం సీసాలు, 35 లీటర్ల సామర్థ్యం కలిగిన 95 క్యాన్లు, మద్యం తయారీకి వినియోగించే యంత్రాలు, బ్లెండ్ (క్యారామిల్, రెక్టిఫైడ్ స్పిరిట్ ద్రావణం), పెద్ద సంఖ్యలో ఖాళీ సీసాలు, పలు కంపెనీల లేబుల్స్, సీసాలకు బిగించే మూతలు, మిషన్ను స్వాధీనం చేసుకున్నారు. పాత ఏఎన్నార్ బార్ భవనంలోనే నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. స్పిరిట్, క్యారామిల్ ద్రావణం కలిపేందుకు వినియోగిస్తున్న పీవీసీ ట్యాంక్, వివిధ రంగులు మిక్స్ చేసే యంత్రాలు లభ్యమయ్యాయి.రెండు గదుల నిండా ఉన్న స్పిరిట్ ఖాళీ క్యాన్లు, రెండు పెద్ద స్టీల్ డ్రమ్ములు, మద్యం తయారీ సామగ్రిని భవానీపురం ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు. ఏడాదిన్నరగా జనావాసాలు, షాపింగ్ కాంప్లెక్స్ల మధ్య గుట్టుచప్పుడు కాకుండా నకిలీ మద్యం తయారీ రాకెట్ నిర్వహిస్తుండటం కలకలం రేపుతోంది. నకిలీ మద్యాన్ని ఏఎన్ఆర్ బార్తో పాటు జనార్దన్రావుకు వాటాలున్న కంచికచర్ల, భవానీపురంలోని శ్రీనివాస వైన్స్లో విక్రయాలు చేస్తుంటారు. వీటితో పాటు కొండపల్లి, ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు, కోస్తా జిల్లాలోని పలు వైన్ షాపులు, బెల్ట్ షాపులకు ఇక్కడి నుంచే నకిలీ మద్యం సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. సీజ్ చేసిన అట్టపెట్టెలపై చింతలపూడి మండలం, పేదవేగి మండలం అని రాసి ఉండటం గమనార్హం.టీడీపీ ప్రజాప్రతినిధి అండతో..జనార్దనరావుకు స్థానిక టీడీపీ కీలక నేతలతో పాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధి, ఆయన బావమరిదితో సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వారి అండదండలు లేకుండా జనావాసాల మధ్య పెద్ద ఎత్తున నకిలీ మద్యం తయారీ సాధ్యం కాదని స్పష్టం అవుతోంది. జనార్దనరావు సోదరుడు అద్దెపల్లి జగన్మోహనరావు, మరో నిందితుడు కట్టా రాజును రెండు రోజులుగా విచారించడంతో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు వెలుగులోకి వచ్చాయి. జనార్దనరావుకు చెందిన ఏఎన్నార్ బార్ను ఆదివారం రాత్రి ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు.కూటమి అధికారంలోకి రావడంతో.. ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్దనరావు ఇంజనీరింగ్ చదివే రోజుల్లో తంబళ్లపాలెం టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డితో స్నేహం ఏర్పడింది. నిషేధించిన ప్రాంతంలో సుమారు పదేళ్ల క్రితం 65వ నంబర్ జాతీయ రహదారి పక్కన నకిలీ సర్టిఫికెట్తో ఏఎన్నార్ బార్ ఏర్పాటు చేశాడు. 2024 ఎన్నికల ముందు తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి భాగస్వామ్యంతో అక్రమ మద్యం వ్యాపారం సాగించారు. కూటమి అ«ధికారంలోకి రావడంతో అధికారమే అండగా రెచ్చిపోయారు. తంబళ్లపల్లె, ఇబ్రహీంపట్నం స్థావరాలుగా నకిలీ మద్యం తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని పలు ప్రాంతాలకు తరలించారు. అమాయకులు బలి..రూ.99కే నాణ్యమైన మద్యం వైన్ షాపుల ద్వారా విక్రయిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నమ్మబలికారు. కూటమి అధికారంలోకి వచ్చాక విచ్చలవిడిగా సాగుతున్న నకిలీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు సమీపంలోని ఓ వైన్స్లో ఇటీవల దాములూరుకు చెందిన వ్యక్తి మద్యం తాగిన కొద్దిసేపటికి అక్కడే మృతి చెందాడు. జూపూడి వైన్స్లో కిలేశపురం గ్రామానికి చెందిన మరో వ్యక్తి మద్యం తాగి ఇంటికి వెళుతూ దారిలో మృత్యువాత పడ్డాడు. ఈ రెండు ఘటనల్లో అక్రమ మద్యం వ్యాపారులు మృతుల కుటుంబాలతో రాజీ కుదుర్చుకున్నారు. ఇక వెలుగు చూడని కల్తీ మద్యం చావులు మరెన్నో ఉన్నాయి.నకిలీ మద్యంతో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. ఇంతకాలం తాము తీసుకున్నది నకిలీ మద్యం అని తెలియడంతో మద్యం ప్రియులకు నోట మాట రావడం లేదు. ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ రాకెట్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు ఎఫ్ఐఆర్లో తెనాలి ఐతానగర్కు చెందిన కొడాలి శ్రీనివాసరావును ఏ–12గా చేర్చారు. నకిలీ మద్యం తయారు చేస్తున్న భవనం లీజు అగ్రిమెంటు శ్రీనివాసరావు పేరుతో ఉండడంతో ఆయన్ను నిందితుడిగా చేర్చినట్లు పేర్కొన్నారు.కాగా తెనాలిలోని శ్రీనివాసరావు ఇంట్లో ఎక్సైజ్ అధికారులు జరిపిన తనిఖీల్లో నకిలీ మద్యం తయారీకి సంబంధించి ఎలాంటి సామగ్రి లభ్యం కాలేదని తెలుస్తోంది. కాగా నకిలీ మద్యంతో తంబళ్లపల్లె టీడీపీ నాయకులకు సంబంధం లేదని ఈ కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లె జనార్దనరావు తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో పేర్కొన్నాడు. ఆరోగ్య సమస్యలతో విదేశాల్లో ఉన్నానని, విచారణకు సహకరిస్తానని తెలిపాడు.భారీగా నకిలీ మద్యం సీజ్.. ములకలచెరువు నుంచి అందిన సమాచారం మేరకు ఇబ్రహీంపట్నంలోని గోడౌన్పై దాడులు చేశాం. దాడుల్లో నకిలీ మద్యం బాటిళ్లు, లేబుల్స్, సిద్ధం చేసిన వివిధ బ్రాండ్ల నకిలీ మద్యం, మిషన్ , పెద్ద సంఖ్యలో ఖాళీ బాటిల్స్, ఎటువంటి లేబుల్స్ లేని బాటిల్స్, స్పిరిట్ను సీజ్ చేశాం. గోడౌన్లో నిల్వ ఉంచిన 95 క్యాన్లలో (ఒక్కో క్యాన్ 35 లీటర్లు) 3,325 లీటర్ల స్పిరిట్, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ 720 బాటిళ్లు, క్లాసిక్ బ్లూ 144 బాటిళ్లు, కేరళ మాల్ట్ 384 బాటిళ్లు, మంజీర బ్లూ 24 బాటిళ్లు మొత్తం 1,272 బాటిల్స్ సీజ్ చేశాం.లేబుల్స్ లేని మద్యం 136 కేసులు, 6578 బాటిల్స్ , ఓఏబీ లేబుల్స్ 6500, ఖాళీ బాటిల్స్ 22,000, ఖాళీ క్యాన్లు 6, పైపులు 2, మిషన్–1 సీజ్ చేశాం. ఏ–1 ముద్దాయి అద్దెపల్లి జనార్దనరావు సోదరుడు జగన్మోహన్రావును అదుపులోకి తీసుకుని విచారించాం. జనార్దన్ సన్నిహితుడు కట్టా రాజును అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం గోడౌన్ను తనిఖీ చేశాం. జనార్దనరావు స్వదేశానికి రాగానే అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడతాం. – టి.శ్రీనివాసరావు, ఎక్సైజ్శాఖ డిప్యూటీ కమిషనర్, విజయవాడ -
సీజేఐ గవాయ్పై దాడిని ఖండించిన వైఎస్ జగన్
తాడేపల్లి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై దాడిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖండించారు. సీజేఐ గవాయ్పై సుప్రీం కోర్టులో జరిగిన దాడి కలవరపరచే విషయం అంటూ ట్వీట్ చేశారు. ‘‘ఈ ఘటన కేవలం ఒక వ్యక్తిపై దాడి మాత్రమే కాదు,. దేశంలోని అత్యున్నత న్యాయ సంస్థ గౌరవానికే ఇది అవమానకరమైనది. మనం అందరం కలిసి రాజ్యాంగ బద్ద సంస్థల సమగ్రతను కాపాడుదాం’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ పేర్కొన్నారు.The disgraceful attack on Hon’ble Chief Justice of India, Shri B.R. Gavai Ji, in the Supreme Court is deeply disturbing and must be unequivocally condemned. This is not only an assault on an individual but an affront to the dignity of our highest judicial institution. We must…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 6, 2025 -
విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలే: తాటిపర్తి చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో రక్షిత తాగునీటిని అందించలేని ప్రభుత్వ నిర్లక్ష్యమే.. విద్యార్ధుల మరణానికి కారణమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ ఓ బాధ్యత లేని విద్యాశాఖ మంత్రి కాగా.. చంద్రబాబు ఓ అసమర్థ ముఖ్యమంత్రి అని మండిపడ్డారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పార్వతీపురం మన్యం జిల్లాలో ఇద్దరు విద్యార్ధులు చనిపోయారని.. ఇవి ముమ్మూటికీ ప్రభుత్వ హత్యలేనని తేల్చి చెప్పారు.చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ హయాంలో విద్యావ్యవస్ధలో ఇంగ్లీష్ మీడియం, నాడు-నేడుతో స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పించి విద్యాలయాలను దేవాలయాలుగా మార్పు చేస్తే... కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూళ్లలో మౌలిక సదుపాయాల కోసం రూపాయి కాగితం ఖర్చుపెట్టిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. ఇది ప్రభుత్వ చేతగానితనానికి, అసమర్థతకు నిదర్శనమని తేల్చి చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..మొద్దు నిద్రలో విద్యా వ్యవస్థ..రాష్ట్రంలో విద్యావ్యవస్థ మొద్దునిద్రలో ఉంది. ప్రభుత్వరంగ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు అధ్వాన్న స్ధితిలోకి నెట్టబడ్డాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో మరణ మృదంగాన్ని తలదన్నే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో జూలై నెల నుంచి ఇప్పటివరకు దాదాపు 11 మంది గిరిజన బిడ్డలు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయారు. గిరిజన తల్లిదండ్రులు కొండా కోనలను దాటించి గురుకుల పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించారు.విద్యావంతులుగా వస్తారనుకుని గంపెడు ఆశలతో ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రులకు విగత జీవులుగా వస్తున్న పిల్లలను చూసి గుండె పగులేలా రోదిస్తున్నారు. ఇది ప్రభుత్వ చేతగాని తనానికి, అసమర్థతకు నిదర్శనం. ఈ పిల్లల మరణాలు కచ్చితంగా ప్రభుత్వ హత్యలే. చంద్రబాబు నాయుడు అసమర్థ పాలన చేస్తున్నాడని చెప్పడానికి, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పనికిరాడు అని చెప్పడానికి జరుగుతున్న ఉదంతాలే నిదర్శనం.వైఎస్ జగన్ హయాంలో దేవాలయాలుగా విద్యాలయాలుఒక కుటుంబంలో రేపటి తరాన్ని నడిపించాల్సిన బిడ్డలను అర్ధాంతరంగా పోగొట్టుకోవడం అత్యంత బాధాకరం. జూలై నెలలో పదో తరగతి చదువుతున్న పిల్లవాడు చనిపోతే.. ఇవాళ వారం రోజుల్లోనే ఇద్దరు బాలికలు కేవలం సరైన తాగునీటి సౌకర్యాలు లేకపోవడంతో మృత్యువాత పడడం దురదృష్టకరం. వైఎస్ జగన్ హయాంలో విద్యాలయాలను దేవాలయాలుగా మార్చారు.ప్రతి విద్యార్థి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దాలని ప్రతి స్కూల్లో ఫర్నీచర్, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి మంచినీళ్ల సరఫరా, డిజిటల్ క్లాస్ రూములు, ఇంగ్లిషు, తెలుగు మీడియంలో ముద్రించిన పాఠ్య పుస్తకాలు.. ఇంగ్లిషు మీడియం, టోఫెల్ విద్య అందించడంతో పాటు నూతనంగా తరగతి గదులు నిర్మించి వసతులు ఏర్పాటు చేశారు. నాడు-నేడు ద్వారా దాదాపు 50 వేల స్కూళ్లను అభివృద్ధి చేసి ప్రజలకందించారు. అదే విధంగా అమ్మఒడి పథకంలో రూ.2 వేలు మినహాయించి.. స్కూళ్లు అభివృద్ధి, మౌలిక వసతులను మెరుగుపర్చడానికి వాడితే ఆ రోజు అర్ధజ్ఞానం కలిగిన లోకేష్ అమ్మఒడి అర్ధవడి అయిందని మాట్లాడారు.హోం మంత్రి భోజనంలోనే బొద్దింకఇవాళ లోకేష్ కూడా అమ్మఒడిలో రూ.2వేలు కట్ చేసి... స్కూళ్ల అభివృద్ధికి, వసతుల కల్పనకు ఎక్కడైనా రూపాయి కాగితం వెచ్చించారా లోకేష్ ? ఏ స్కూల్ లోనైనా నాణ్యమైన భోజనం అందించారా? రాష్ట్ర ప్రజలు ఆలోచన్ చేయాలి. సాక్షాత్తూ ఈ రాష్ట్ర హోంమంత్రి భోజనం చేస్తున్న కంచంలోనే బొద్దింక ఆహారంలో వచ్చింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ 14 నెలల కూటమి పాలనలో అనేక సందర్భాల్లో కలుషిత ఆహారం తిని పెద్ద సంఖ్యలో పిల్లలు ఆసుపత్రిలో చేరిన సందర్బాలు ఉన్నాయి. ఇది చేతకాని పాలనకు పరాకాష్ట కాదా? ఇది అసమర్థ ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకంటే ఆధారాలు కావాలా? 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే ముఖ్యమంత్రికి పరిపాలన మీద ఏమాత్రం శ్రద్ధ ఉందో ఈ ఘటనలు చూస్తేనే అర్ధం అవుతుంది.కేవలం చంద్రబాబు కుమారుడు అనే ఒకే ఒక్క అర్హత తప్ప.. ఏ అర్హతా లేని లోకేష్ని విద్యాశాఖ మంత్రిగా కుర్చీలో కూర్చోబెట్టడంతోనే విద్యావ్యవస్థకు చెదలు పట్టడం మొదలైంది. వ్యవస్థను కొద్ది, కొద్దిగా చెదలు తిన్నట్టుగా కూటమి నేతలు తింటున్నారు. దీనంతటికీ కారణం మంత్రి నారాయణ. నారాయణ కాలేజీల సంస్థల చైర్మన్గా తన సంస్థలను పెంచి పోషించాలన్న దురుద్దేశమే కారణం.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 5 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేటు స్కూళ్లకు తరలిపోయారు. కారణం ప్రభుత్వమే ప్రైవేటు విద్యను ప్రోత్సహించడమే. ప్రభుత్వ విద్యాలయాలను నాశనం చేయడమే. వసతులు లేని ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్ధులు ఎందుకు ఉంటారు? అదే కారణంతో 5 లక్షల మంది ప్రైవేటుకు మారిపోయారు.చనిపోయిన పిల్లల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారమివ్వాలిచనిపోయిన విద్యార్ధుల కుటుంబాలకు కనీసం రూ.25 లక్షలకు తగ్గకుండా ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వం తక్షణమే మొద్దు నిద్రను వీడాలి. లోకేష్ ఫ్యాక్టరీలు, కంపెనీల తీసుకుని రావడానికి ఢిల్లీ వెళ్లాడని పెద్ద, పెద్ద అక్షరాలతో అచ్చు వేస్తున్న పచ్చ మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించాలి. ఇలాంటి ఘటనలను రాష్ట్రానికి, దేశానికి తెలియజేయాలి. ఇది ఒక వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కాదు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడమే? ఇంత చేతకాని వారికి పరిపాలించే అర్హత ఉందా? లోకేష్ ఏ రోజైనా ఈ ఏడాది కాలంలో ఈ సంస్కరణలను తీసుకురాగలిగాను, ఈ అభివృద్ధి చేశాను అని చెప్పగలిగాడా?ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్, వసతి దీవెన పెండింగ్, అమ్మఒడి పావు ఒడి చేశాడు. ఒక ఏడాది స్కీమ్ ఎగరగొట్టాడు. పేర్లు మార్చినంత మాత్రాన పనిమంతుడు కాలేవన్నవిషయాన్ని లోకేష్ గుర్తుంచుకోవాలి. పనితనం చూపించాలి. అడవిబిడ్డల ఘోషను, పాపాన్ని మూటగట్టుగుంటున్నావన్న విషయం గుర్తించుకో లోకేష్. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలి. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ కు సున్నామార్కులు వస్తాయి. తన శాఖలో సక్రమంగా పనిచేయలేని లోకేష్ అన్ని శాఖలను సంస్కరించాలని కుతూహలపడతాడు.మంచినీళ్లవ్వకుండా విలాసాలకు మంచినీళ్లలా ఖర్చుగిరిజన బిడ్డల మరణాలు కచ్చితంగా ప్రభుత్వ హత్యలే. ఒకే ఒక వసతి గృహం నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో దాదాపు 135 మంది ఆసుపత్రికి వెళ్లారు. వారిలో నుంచి దాదాపు 25 మందికి పచ్చకామెర్లు ఉన్నట్లు తేలింది. దీనికి కారణం ఆ హాస్టల్ లో ఆర్వో ప్లాంట్ నిర్వహించకుండా, సురక్షిత మంచినీటిని అందించలేకపోవడమే కారణం. చివరికి చిన్నపిల్లలకు మంచినీళ్లు కూడా అందించలేని ఈ చేతకాని ప్రభుత్వం... గొప్పలు చెప్పడానికి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని సభలు పెట్టడానికి, వందలసార్లు హైదరాబాద్ కు స్పెషల్ ఫ్లైట్లలో తిరగడానికి మాత్రం విచ్చలవిడిగా ఖర్చుచేస్తోంది.ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కొలుకుల స్కూల్, పుల్లలచెరువు స్కూల్లో ఉపాధ్యాయులు లేరు. 170 మంది ఉపాధ్యాయులు వెళ్లిపోతే.. 26 మంది మాత్రమే వచ్చారని విద్యాశాఖ అధికారులకు చెప్పాను. అయినా స్పందన లేదు. లోకేష్ శాఖలో నాణ్యమైన విద్య లేదు, నాణ్యమైన వసతీ లేదు. చివరకు నాణ్యమైన భోజనం కూడా అందివ్వలేని అసమర్థ మంత్రిగా లోకేష్ నిలబడ్డం ఖాయం. 611 మంది చదువుతున్న స్కూళ్లో మంచినీళ్ల ఆర్వో ప్లాంట్ నిర్వహణకు ప్రభుత్వం వద్ద డబ్బులేదా? ఈ డబ్బంతా ఎటు పోతుంది. కూటమి ప్రభుత్వం తెచ్చిన రూ.2.11 లక్షల కోట్ల డబ్బుంతా ఎవడి జేబులోకి పోయింది. దోచుకున్న మద్యం డబ్బు ఎటు పోతుంది.వీధుల్లో వరదలా మద్యం- ఆదాయం మాత్రం టీడీపీ నేతల జేబుల్లో..ఇవాళ ఇబ్రహీంపట్నంలో కూడా నకిలీ మద్యం రాకెట్ పట్టుబడింది. అతను కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడే. రోడ్ల మీద, వీధుల్లో విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతుంది.. రాష్ట్ర ఖజనాకు మాత్రం ఆదాయం రావడం లేదని ఆరా తీస్తే... చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో బయటపడ్డ నకిలీ మద్యమే అసలు కారణం. ఇవాళ మద్యం దుకాణాల్లో అమ్ముతున్న ప్రతీ మూడు సీసాల్లో ఒకటి నకిలీ మద్యం సీసాయే. నకిలీ మద్యం తాగి వందల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. కల్తీ భోజనం తిని వందలాది విద్యార్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది కచ్చితంగా మారాలని డిమాండ్ చేస్తున్నాం.ప్రభుత్వ స్కూళ్లలో వసతుల కోసం మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నారా లోకేష్ కు హితవు పలుకున్నాం. చాతగాని, చేవలేని ఎంత మంది నాయకులున్నా.. సమర్ధత గలిగిన వైయస్.జగన్ నాయకత్వం కాలిగోటికి సరిపోరు అన్న విధంగా కూటమి పాలన సాగుతోంది. వైయస్.జగన్ ఒంటరిగా 151 సీట్లు గెలిచి, ఎక్కడా ఏ రకమైన రాజకీయ ఒత్తిడి లేకుండా ప్రతి గ్రామంలో నూతన భవనాలను నిర్మించి, నూతన వ్యవస్థలను నెలకొల్పారు. 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే. .వాటిని కూడా కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పెడుతోంది. వ్యవస్థల్లోకి ప్రైవేటు వ్యక్తులు వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఇవాళ విద్యాశాఖను చూస్తే ఇట్టే అర్ధం అవుతుంది. విద్యాశాఖలో ప్రైవేటు వ్యవస్థ ఉండడం వల్ల ఏ విధంగా ప్రభుత్వవిద్యావ్యవస్ధ నాశనం అవుతుందో.. అదే విధంగా వైద్య వ్యవస్థ కూడా అలాగే మారబోతుందని వైయస్సార్సీపీ పదే పదే గళం వినిపిస్తుంది.చంద్రబాబు పాలనలో నీరుగారుతున్న వ్యవస్థలుచివరగా 40 ఏళ్ల అనుభవం కలిగిన నాయకుడు అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చేతిలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఒక్కొక్కటిగా నీరుగారిపోతున్నాయి. 40 ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి.. ఈ రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన వ్యవస్థలు ఏదైనా ఉన్నాయంటే.. నకిలీ మద్యాన్ని భారీ ఎత్తున తయారు చేసే ఫ్యాక్టరీలే తప్ప.. ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకొచ్చిన చరిత్ర చంద్రబాబుకు లేనే లేదు అని తాటిపర్తి చంద్రశేఖర్ తేల్చి చెప్పారు.విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ..ప్రకాశం జిల్లాలో చీమకుర్తి, బల్లికురవ ప్రాంతాలలో గ్రానైట్ క్వారీలున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీనరేజీ వసూళ్లుకు మంచి విధానం తెస్తే మాపై విషం కక్కారు. ఇవాళ కూటమి ప్రభుత్వం సీనరీ వసూళ్లు చేసే బాధ్యతను ఏ ఏం ఆర్ అనే ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగించింది. ఈ సంస్థ ప్రతీ రోడ్డులోనూ చెక్ పోస్టులు పెట్టి, ఏ మట్టి ట్రాక్టర్, ఇసుక లారీ, మట్టి బండి వెళ్లినా వాళ్లకు కప్పం కట్టాల్సిందే.వీళ్ల పేమెంట్ చేసేది రెండేళ్లలో రూ.1135 కోట్లు అని వాళ్ల కరపత్రిక ఈనాడులో రాశారు. అందులోనే గత ఏడాది సీనరేజ్ రూ.450 కోట్లు అని రాశారు. అలాంటప్పుడు కొత్తగా ఇవ్వాల్సిన అవసరం ఏంటి ? ఒక కంకర లారీ లోడ్ కు రూ.5010 చెల్లించాలి. ఈ విధంగా దాదాపు రూ.6 కోట్లు ఒక రోజుకు వసూలు చేస్తున్నారు. వారికి ఏడాదికి వస్తున్న ఆదాయం ఎంత? వారు కడుతున్న అమౌంట్ ఎంత ? గతంలో ఎవరైనా ఇంటికి మట్టి తోలుకుంటే డబ్బులు కట్టాల్సిన పనిలేదు. ఇవాళ ఏ ఏం ఆర్ సంస్థకు మాత్రం కప్పం కట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. -
కల్తీ మద్యం రాకెట్తో ప్రభుత్వ పెద్దలకు లింకులు: జూపూడి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో బయటపడ్డ కల్తీ మద్యం రాకెట్ లింకులు కూటమి ప్రభుత్వంలోని పెద్దల వరకు ఉన్నాయని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ఆరోపించారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందే రాష్ట్రంలో కల్తీ మద్యం దందాను సాగించేందుకు తెలుగుదేశం నేతలు ప్లాన్ చేసుకున్నారని, దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మద్యం పాలసీలో మార్పులు చేశారని అన్నారు.కల్తీ మద్యాన్ని కూటమి నేతల చేతుల్లో ఉండే ప్రైవేటు మద్యం దుకాణాలు, వాటికి అనుబంధంగా ఏర్పాటు చేసే బెల్ట్షాప్ల ద్వారా పెద్ద ఎత్తున చెలామణి చేయాలనే కుట్ర దీని వెనుక దాగి ఉందని అన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మద్యం విక్రయాల్లో ప్రతి మూడు బాటిళ్ళలో ఒకటి కల్తీ మద్యంగా తేలిందంటే, ప్రభుత్వ పెద్దల అండ లేకుండానే ఇంత పెద్ద ఎత్తున ఈ దందా జరుగుతోందా అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే...రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీలనే అధికార తెలుగుదేశం పార్టీ నేతలు నిర్వహిస్తున్నారు. సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు తన అనుయాయులతో కల్తీ మద్యం తమారు చేయిస్తున్నారనే ఆరోపణలకు ఆయన ప్రజలకు వివరణ ఇవ్వాలి. అన్నమయ్య జిల్లా మొలకలచెరువు సమీపంలో ఏకంగా నకిలీ మద్యం తయారీ పరిశ్రమే వెలుగుచూసింది. ఈ నకిలీ మద్యం మాఫియాను నడిపించేది సాక్షాత్తు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులేనని బయటపడింది.ఆఫ్రికా నుంచి ఆంధ్రాకు మద్యం మాఫియావిదేశాల నుంచి సంస్థలను ఆహ్వానిస్తున్నాం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తాం, ఉపాధి కల్పిస్తామని ప్రతిసారీ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్లు చెబుతుంటారు. వాళ్ళను ఆదర్శంగా తీసుకున్న టీడీపీ నాయకులు ఎన్నికలకు ముందే ఏపీలో కల్తీ మద్యం రాకెట్ను ఆఫ్రికా నుంచి తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆఫ్రికాలో మద్యం తయారీ, చెలామణిలో సంపాధించిన అనుభవాన్ని ఏపీలో వినియోగించి, కోట్లు సంపాదించేందుకు వ్యూహం పన్నారు. టీడీపీ పెద్దల ఆశీస్సులతో ఆ పార్టీ నాయకుడు జనార్ధన్ నాయుడు ఇందుకు అంతా రంగం సిద్ధం చేశాడు. ఈ దందాకు అనుగుణంగానే ఏపీలోనూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం పాలసీ నిబంధలను మార్పు చేసింది.గతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్యం విక్రయాలను ప్రైవేటు వారికి ఇచ్చేందుకు నిర్ణయించారు. లిక్కర్ షాప్లు అన్నీ లాటరీ అంటూ హంగామా చేసి, మొత్తం దుకాణాలను అధికార తెలుగుదేశం వారి చేతుల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమి నేతలే మద్యం సిండికేట్లను ఏర్పాటు చేశారు. అనధికారికంగా పర్మిట్ రూంలను నిర్వహించారు. మద్యం దుకాణాలకు అనుబంధంగా ఊరూరా బెల్ట్ షాప్లను ఏర్పాటు చేశారు. ఆ తరువాత తమ కల్తీ లిక్కర్ దందాను ప్రారంభించారు. ఎక్కడికక్కడ కల్తీ మద్యం డెన్లను, జిల్లాల్లో మద్యం గోడౌన్లను ఏర్పాటు చేసుకుని నిత్యం వేల సంఖ్యలో కల్తీ లిక్కర్ బాటిళ్ళను చెలామణి చేయడం ప్రారంభించారు. అక్రమంగా జరుగుతున్న ఈ వ్యాపారం ద్వారా దండుకుంటున్న సొమ్మును వాటాలు వేసుకుని పంచుకుంటున్నారు.ప్రజల ప్రాణాలతో చెలగాటంగత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కల్తీ మద్యం తాగి పెద్ద ఎత్తున మరణాలు జరిగాయంటూ కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు విష ప్రచారం చేశాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో, నేరుగా డిస్టిలరీల నుంచి వచ్చే మద్యాన్ని విక్రయిస్తూ, జవాబుదారీతనంతో విక్రయాలు చేసినా కూడా ఈ తప్పుడు ప్రచారం కొనసాగించారు. వారు చెప్పిన మరణాలు నిజమా అని చూస్తే, ఎక్కడా ఇది వాస్తవం అనేందుకు ఆధారాలు లేవు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందు తాను తక్కువ రేటుకే క్వాలిటీ మద్యం అందిస్తాను అంటూ హామీలు ఇచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో ఏకంగా ఫ్యాక్టరీలను పెట్టి తయారు చేస్తున్న కల్తీ మద్యంపై ఆయన ఏం సమాధానం చెబుతారు?ఇతర రాష్ట్రాల నుంచి స్పిరిట్ తీసుకువచ్చి, రంగు కలిపి, నకిలీ మద్యం లేబుళ్ళతో ఏకంగా మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్షాప్లకు పంపిణీ చేస్తున్నారు. రకరకాల కల్తీ మద్యం బ్రాండ్లను తయారు చేసి, అందమైన పేర్లతో చెలామణి చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా ఈ కల్తీ మద్యం బ్రాండ్లే కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలను కూడా మీడియా ముఖంగా ప్రదర్శిస్తున్నాం. 'సుమో, షాట్, బెంగుళూరు బ్రాందీ, ఛాంపియన్, కేరళా మాల్ట్...' ఇలా అనేక రకాల పేర్లతో మార్కెట్లో ఈ కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.ఈ కల్తీ మద్యం రాకెట్ ఎంత వేగంగా విస్తరించిందీ అంటే అన్నమయ్య జిల్లాలో తయారవుతున్న ఈ మద్యంను కోస్తా ప్రాంతంలో కూడా అమ్మేందుకు ఏకంగా ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం గోడవున్లో నిల్వ చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులే ఈ రాకెట్ను పట్టుకున్నారు. పట్టుబడని కల్తీ మద్యం గోడవున్లు ఇంకా ఎన్ని ఉన్నాయో అనే అనుమానం కలుగుతోంది. ప్రమాదకరమైన ఈ కల్తీ మద్యాన్ని తాగేవారు అతి త్వరగా అనారోగ్యంతో మృత్యువాత పడే ప్రమాదం ఉంది. ప్రజలు ఏమైపోయినా ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు. కేవలం తన ధనదాహంకు ప్రజల ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. -
‘జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం’
సాక్షి,తాడేపల్లి: సనాతన ధర్మం ముసుగులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితుడిని కఠినంగా శిక్షించి న్యాయ వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగేలా చూడాలని శింగనమల నియోజకవర్గ వైయస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకె శైలజానాథ్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా దళితులను చిన్నచూపు చూస్తూనే ఉన్నారని, ఉన్నత స్థానంలో ఉంటే ఇప్పటికీ కొందరు చూసి ఓర్చలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం ముసుగులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ మీద కోర్టు హాల్లో ఒక లాయర్ షూ విసరడానికి ప్రయత్నించడాన్ని సీరియస్గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయాధిపతిగా దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి మీద జాత్యహంకారంతో దాడి చేయాలని చూడటం క్షమించరాని తప్పుగా చూడాలన్నారు. దీన్ని దేశప్రజలంతా తీవ్రంగా ఖండించాలని చెప్పారు. ఉన్నత స్థానంలో ఉన్న సుప్రీం చీఫ్ జస్టిస్ మీదనే దాడి చేయడానికి ప్రయత్నించారంటే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదని మాజీ మంత్రి శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలను తగ్గించి చూపించే ప్రయత్నం చేయడం దేశానికి అంత మంచిది కూడా కాదని ఆయన అభిప్రాయపడ్డారు. భాష, ప్రాంతం, కులం, మతం పేరుతో ఇతరులపై దాడి చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. -
ఉద్యోగులను నడిరోడ్డుపై నిలబెడతారా బాబూ?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఉద్యోగులను చంద్రబాబు మోసం చేయటంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన హయాంలో అమలు చేసిన కార్యక్రమాలు, చంద్రబాబు మేనిఫెస్టోని చూపుతూ ట్వీట్ చేశారు. ‘‘చంద్రబాబూ.. ఎన్నికలకు ముందు మీరు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? తీపి తీపి మాటలతో అరచేతిలో వారికి వైకుంఠం చూపి, తీరా ఇప్పుడు వారిని మోసం చేస్తారా?. నడిరోడ్డుమీద నిలబెడతారా?.. ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది?’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి, ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీల అమలు గురించి, వారికి చెల్లించాల్సిన బకాయిల గురించి మీ నుంచి ప్రకటన వస్తుందని వాళ్లు ఆశగా ఎదురుచూడడం, చివరకు ఉసూరు మనిపించడం మీకు అలవాటుగా మారింది. కేబినెట్ సమావేశాల్లో మీ శ్రద్ధ అంతా భూ పందేరం మీద తప్ప, ప్రజల మీద, ఉద్యోగస్తుల మీద కాదు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రజలమీద, ఉద్యోగస్తుల మీద మీకున్నది కపట ప్రేమే. వారిని నమ్మించి వెన్నుపోటు పొడవటం, మీకు అలవాటే. మీరుపెట్టే బాధలు భరించలేక ఇప్పుడు వారంతా రోడ్డుమీదకు వస్తున్నారు. చంద్రబాబూ.. మీరు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఉద్యోగులకు మీరిచ్చిన హామీలు ఏమిటో ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. అందులో ఒక్కటైనా నెరవేర్చారా?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు...అధికారంలోకి వచ్చిన వెంటనే IR అన్నారు. మరి ఇచ్చారా? మెరుగైన PRC అంటూ ఊదరగొట్టారు. మరి PRC సంగతి ఏమైంది?. మేం అధికారంలోకి వచ్చిన వారంరోజుల్లోనే ఉద్యోగులకు IR ప్రకటించాం. అంతేకాకుండా మా హయాంలోనే మేం PRC వేసి, దానికి ఛైర్మన్నుకూడా నియమిస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, IR ఇవ్వకపోవడం ఒక మోసమైతే, ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందని ఉద్దేశ పూర్వకంగా PRC ఛైర్మన్ని వెళ్లగొట్టారు. ఆ తర్వాత కొత్తగా ఎవ్వరినీ నియమించకుండా ఉద్యోగస్తులకు తీరని అన్యాయం చేస్తున్నారు...న్యాయంగా, ధర్మంగా వారికి పెరగాల్సిన జీతాలను కావాలనే ఆపుతున్నారు. ఉద్యోగస్తులకు ఇచ్చే అలవెన్స్ పేమెంట్స్ను పెంచుతామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు దానిగురించి ప్రస్తావించడంలేదు. ఇప్పటిదాకా ఇవ్వాల్సిన 4డీఏలు మొత్తం పెండింగ్. దసరా పండుగకు డీఏలు క్లియర్ అవుతాయని ఉద్యోగస్తులందరూ ఎంతో ఎదురు చూశారు. ఇప్పుడు దీపావళి పండుగ కూడా వస్తోంది. కాని, ఇచ్చే ఆలోచన మీకున్నట్టు అనిపించడం లేదు. CPS/GPSలను పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పారు. కాని, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారైనా దీనిమీద రివ్యూచేశారా?..మా ప్రభుత్వ హయాంలో CPSకు గొప్ప ప్రత్యామ్నాయంగా ఉద్యోగులకోసం GPS తీసుకు వచ్చాం. ఇప్పుడు అదే విధానంలోకి కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు వెళ్తున్నాయి. మీరు.. OPSను తీసుకువస్తామన్నారు. మాకంటే గొప్పగా చేస్తామన్నారు. కాని ఏమీ చేయకపోగా, ఉద్యోగస్తులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టారు. మిమ్మల్ని నమ్మిన పాపానికి వారు తీవ్రంగా నష్టపోతున్నా, మీలో ఏ మాత్రం చలనం లేదు...ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన PRC బకాయిలు, పెండింగ్ డీఏలు, GPF, APGLI, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ లేదా ఎన్క్యాష్ మెంట్ లీవులు… వీటి కింద దాదాపు రూ.31వేల కోట్ల బకాయిలు పెట్టారు. తమకు రావాల్సినవాటికోసం ఉద్యోగస్తులు ఎదురుచూస్తున్నా ఒక్కపైసా కూడా ఇవ్వకపోవడంతో, వారంతా నరకయాతన అనుభవిస్తున్నారు...ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఏ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తారో తెలియడం లేదు. ప్రతినెలా జీతాలకోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభాల సమయంలోనూ మేం ఉద్యోగులకు జీతాలు సకాలంలోనే ఇవ్వగలిగాం. ఆరోజు మాపై మీరు తప్పుడు ప్రచారాలు చేశారు. ఇవాళ అలాంటి దారుణమైన పరిస్థితులు లేకపోయినా జీతాలు ఇవ్వలేకపోతున్నారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింప చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీదాన్ని అమలు చేయడంలేదు...మీరు అధికారంలోకి రాగానే వాలంటీర్లకు ఇచ్చే జీతాలు రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతామంటూ హామీ ఇచ్చి, కుట్రపన్ని, వారి పొట్టకొట్టి, ఇప్పుడు రోడ్డుమీద పడేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకూ మేలు చేస్తాం అని, వారినీ ఇప్పుడు రోడ్డు ఎక్కేలా చేశారు. విలేజ్ క్లినిక్కులూ, పీహెచ్సీలు మొత్తంగా ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ నిర్వీర్యం చేశారు. జీరో వేకెన్సీతో ప్రజలకు తోడుగా ఉండే వైద్య శాఖను రోడ్డున పడేశారు...మా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీలో పనిచేస్తున్న దాదాపు 52 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేశాం. ఇతర శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను కూడా మొదలుపెట్టాం. అర్హులైన 10,117 మందిని గుర్తించాం. వీరిలో 3,400 మందికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు కూడా మా హయాంలోనే ఇచ్చాం. మిగిలిన వారికి అన్ని ప్రక్రియలు ముగిసినా కూడా ఇప్పటి వరకు అపాయింట్ మెంట్లు ఇవ్వకుండా, వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు..@ncbn గారూ.. ఎన్నికలకు ముందు మీరు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? తీపితీపి మాటలతో అరచేతిలో వారికి వైకుంఠం చూపి, తీరా ఇప్పుడు వారిని మోసం చేస్తారా? నడిరోడ్డుమీద నిలబెడతారా? ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది? మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి,… pic.twitter.com/CFIDuN9w7W— YS Jagan Mohan Reddy (@ysjagan) October 6, 2025..అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలకు స్వస్తిపలుకుతూ, వారికోసం ఆప్కాస్ను తీసుకు వచ్చి దళారీ వ్యవస్థను అంతం చేశాం. దాదాపు లక్ష మందికి సకాలానికే ఎలాంటి కత్తిరింపులు లేకుండా వారి జీతాలను, క్రమం తప్పకుండా ప్రతినెలా ఒకటోతారీఖునే ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఆప్కాస్ను రద్దుచేసి మళ్లీ దళారీ వ్యవస్థను తీసుకువస్తున్నారు. ఇంతకంటే అన్యాయం ఏముంటుంది? మేం అధికారంలోకి వచ్చిన వెంటనే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారందరికీ జీతాలు పెంచాం. మేం రాకమునుపు వరకూ, వీరి జీతాల చెల్లింపుల బిల్లు నెలకు రూ.1,100 కోట్లు అయితే, మేం వచ్చిన తర్వాత దాన్ని రూ.3వేల కోట్లకు పెంచాం. ..ఉద్యోగులకు EHS కింద ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవడంతో ఆస్పత్రులన్నీ వైద్యాన్ని నిరాకరిస్తున్నాయి. పేరుకు హెల్త్ కార్డులున్నా దానివల్ల ప్రయోజనం లేకుండా పోతోంది. EHS కోసం ప్రభుత్వం తనవాటాగా ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకపోవడమే కాదు, తమ వాటాగా ఉద్యోగులు చెల్లించిన దాన్నికూడా విడుదలచేయడం లేదు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా?. చంద్రబాబుగారూ.. దాదాపు రెండేళ్ల కాలంలో ఉద్యోగులకైనా, ప్రజలకైనా మీరు వెన్నుపోటే పొడిచారు. వారికిచ్చిన హామీలన్నీ మోసాలుగా మారిపోయాయి. అందుకే ప్రతి ఒక్కరూ రోడ్డెక్కుతూ మిమ్మల్ని ఎండగడుతున్నారు’’ అంటూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. -
నకిలీ మద్యానికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు డబ్బులకు కక్కుర్తి పడి నకిలీ మద్యం తయారు చేసి.. బెల్ట్ షాపుల్లో అమ్మకాలు జరుపుతున్నారంటూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నకిలీ మద్యం చిత్తూరు నుంచి విజయవాడ లింక్లు పెరిగిపోయాయి.. ఇప్పుడు అవే బట్టబయలయ్యాయి.‘‘ఎన్నికలకు ముందు 99 రూపాయలు మద్యం అమ్ముతామంటే ఎదో అనుకున్నాం.. ఇలా నకిలీ మద్యం తయారు చేసి అమ్మకాలు చేస్తారు అనుకోలేదు. ఇబ్రహిపట్నంలో ఇప్పుడు నకిలీ మద్యం దొరికింది. టీడీపీకి చెందిన జనార్ధనరావు అనే వ్యక్తికి ఇబ్రహీంపట్నంలో వైన్ షాపు ఉంది. ఇక్కడ నుండే అన్ని బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. నకిలీ మద్యానికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ. ఎంపీ మిథున్ రెడ్డి, ధనుంజయ్రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు.. మరి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?. టీడీపీ నాయకుడు జనార్ధన్ రావు వెనుక ఎవరు ఉన్నారో వారి పై చర్యలు తీసుకోవాలి’’ అని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. -
AP: ఇబ్రహీంపట్నంలో భారీగా బయటపడ్డ కల్తీ మద్యం
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలో భారీగా కల్తీ మద్యం బయటపడింది. నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. టీడీపీ నేత అద్దేపల్లి జనార్ధనరావు గోడౌన్గా గుర్తించారు. జనార్ధన్ సోదరుడు జగన్మోహన్రావు, అనుచరుడు కట్టా రాజులను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జగన్మోహన్రావు, కట్టా రాజు ఇచ్చిన సమాచారంతో జనార్ధనరావు గోడౌన్లో తనిఖీలు చేపట్టారు. గోడౌన్లో భారీగా నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నారు.నకిలీ మద్యం బాటిళ్లకు లేబుల్స్ సీలింగ్ చేసే మిషన్లు, 35 లీటర్ల కెపాసిటీ కలిగిన 95 క్యాన్లు సీజ్ చేశారు. హోలోగ్రామ్ స్టిక్కర్లు , వందల కొద్దీ ఖాళీ బాటిళ్లు, కేరళ మార్ట్, ఓఎస్డీ బ్రాండ్లకు చెందిన స్టిక్కర్లు స్వాధీనం చేసుకున్నారు. స్పిరిట్, కారిమిల్ను మిక్స్ చేసి నకిలీ మద్యాన్ని నిందితులు సిద్ధం చేసినట్లు పోలీసులు గుర్తించారు. కల్తీ మద్యం కేసులో టీడీపీ నేత, ఏ1 జనార్థన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. జనార్ధన్ ఆఫ్రికా పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. జనార్ధన్ విదేశాల్లో ఉన్నట్లు తెలిసిందని ఎక్సైజ్ సీఐ తెలిపారు.మరోవైపు, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో ఎక్సైజ్ దాడులు కొనసాగుతున్నాయి. నకిలీ మద్యం తయారీ డంప్వద్ద బయటపడ్డ డైరీ ఆధారంగా ఎక్సైజ్ పోలీసులు సోదాలు చేపట్టారు. పీటీఎం మండలం సోంపల్లి గ్రామంలో బెల్ట్షాపుపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. పక్క జిల్లాలకు కల్తీ మద్యం సరఫరా చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. -
‘బాబు చీటర్, లోకేష్ లూటర్ అని ప్రజలే మాట్లాడుకుంటున్నారు’
సాక్షి, విశాఖ: చంద్రబాబు(Chandrababu) అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడతారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudiwada Amarnath) మండిపడ్డారు. కానీ, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం ఎప్పుడూ ఒకే మాట మాట్లాడుతారని తెలిపారు. విశాఖ స్టీల్ప్లాంట్(Vizag Steel Plant) ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ వ్యతిరేకమే అని మరోసారి అమర్నాథ్ క్లారిటీ ఇచ్చారు.ఈనెల తొమ్మిదిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) విశాఖ పర్యటనపై నేడు సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘ఏడు నియోజకవర్గాల మీదుగా వైఎస్ జగన్ రోడ్ షోగా వెళ్ళే అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్, షుగర్ ఫ్యాక్టరీ, బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు వైఎస్ జగన్ కలవనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ వ్యతిరేకమే. కేంద్రం చేస్తున్న ఆలోచనలు తెలిసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలి.చంద్రబాబులా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట జగన్ మాట్లాడరు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్టీల్ ప్లాంట్లో దాదాపు పదివేల మంది ఉద్యోగాలు పోయాయి. కూటమి ప్రభుత్వం పేదవారి కడుపు కొడుతోంది. పేదవాడికి ఉచిత వైద్యం అందడం ఈ కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేకనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు. చంద్రబాబు చీటర్, లోకేష్(Nara Lokesh) లూటర్ అని జనం మాట్లాడుకుంటున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఎవరికి లాభం? -
శ్రాద్ధకర్మల రోజు వేద ఆశీర్వచనమా?: టీటీడీ చైర్మన్పై భూమన ఆగ్రహం
సాక్షి, తిరుపతి: శ్రీవేంకటేశ్వర స్వామికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu) తీరని ద్రోహం చేస్తున్నారని.. ఎప్పుడు ఎలా ఉండాలో తెలియక ఆలయ మర్యాదలను మంటలో కలుపుతున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి(Bhumana Karunakar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ అదనపు జేఈవో వెంకయ్య చౌదరి తండ్రి చలమయ్య పెద్దకర్మకు వెళ్లి బీఆర్ నాయుడు పరామర్శించిన తీరు.. తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ పరిణామంపై సోమవారం తిరుపతిలో భూమన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీఆర్ నాయుడి మీద నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదు. కానీ, ఆయన ప్రవర్తన చాలా అభ్యంతరకంగా ఉంటోంది. పవిత్ర భాగవత వస్త్రాన్ని కర్మ రోజు వెంకయ్య చౌదరికి కప్పారు. పరివట్టం కట్టి, లడ్డూ శ్రాద్ధకర్మల రోజు వెంకయ్య చౌదరికి అందించారు. శ్రార్దకర్మల రోజు వేద ఆశీర్వచనం ఇవ్వడమేంటీ?. ఎప్పుడు ఎలా ఉండాలో.. ఏ వస్త్రం కప్పాలో కూడా బీఆర్ నాయుడికి తెలియదు. వధువు, విదవకు తేడా తెలియని వ్యక్తి బీఆర్ నాయుడు’’ అని భూమన అభ్యంతరాలు వ్యక్తం చేశారు... ప్రసాదాల దిట్టం పెంచడం లేదని ఎల్లో మీడియాలోనే వార్త వచ్చింది. రియల్ ఎస్టేట్ పెంచుకోవడానికి స్వామివారిని వాడుకుంటున్నారు. జీ స్క్వేర్ రియల్ ఎస్టేట్ సంస్థపై తమిళనాడు బీజేపీ నేత అన్నామలై రభస చేశారు. మరి ఆ సంస్థలో బీఆర్ నాయుడు భాగస్వామిగా ఉన్నారా? శ్రీ వెంకటేశ్వర స్వామికి బీఆర్ నాయుడు ద్రోహం చేస్తున్నాడు. ఆలయ పవిత్రతతను ధ్వంసం చేస్తున్నారు. అర్హత లేనివారికి అధికారమిస్తే అర్థరాత్రి గొడుగు పట్టకోమన్నాడట.. అలా ఉంది బీఆర్ నాయుడి తీరు అని భూమన ఎద్దేవా చేశారు.వైసీపీ పోరాటం వల్లే..ఏపీలో అన్ని వైన్ షాపుల్లో దొరికేది కల్తీ మద్యమే(AP Liquor Mafia). కూటమి పాలనలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. టీడీపీ, జనసేన నేతలు ఈ దందాను నడిపిస్తున్నారు. నకిలీ మద్యాన్ని టీడీపీ నేతలు పల్లెపల్లెకూ పంపించారు. ప్రతిచోటా ఏదో కుటీర పరిశ్రమలా.. నకిలీ మద్యం కోసం కేంద్రాలు ఏర్పాటు చేశారు. పైగా లిక్కర్ కేసు అంటూ మాపై అసత్య ప్రచారం చేశారు. మా నేతలను జైల్లో పెట్టారు. చివరకు మా పోరాటం వల్లే ములకలచెరువు మద్యం ఇష్యూ బయటపడింది అని భూమన అన్నారు. -
వైద్యకళాశాలల ప్రైవేటీకరణ ఎవరికి లాభం?
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా తీసుకొచ్చిన వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. ఈ చర్యలో అసలు హేతుబద్ధత అన్నదే లేదని, టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి సర్కారు ప్రైవేటీకరణ పేరుతో వైద్యకళాశాలలను తమ తాబేదార్లకు అప్పగిస్తోందన్న విమర్శలు అటు సామాన్య ప్రజానీకంతోపాటు ప్రతిపక్ష వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణలు వినిపిస్తున్నారు. ఎన్నికలకు ముందు సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని బీరాలు పలికిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ప్రజల ఆస్తులు అమ్ముతూ ప్రైవేటువారికి సంపద సృష్టిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ వైద్యకళాశాలల్లో యాభై శాతం సీట్లను సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిని పెడతామన్న వైఎస్ జగన్ మాటలను అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించిన బాబు, లోకేశ్లు ఇప్పుడు మాటమార్చడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పైగా పీపీపీ విధానం ప్రైవేటేషన్ కాదని, జగన్కు ఆ విషయం తెలియదని బాబు అండ్ కో బుకాయిస్తున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తోంది. చంద్రబాబు నాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్లు అసెంబ్లీలోని ఇరు సభల్లో చేసిన వాదనలను పరిశీలిస్తే వీరు వైద్యకళాశాలల ప్రైవేటీకరించి కళ్లప్పగించి చూడబోతున్న వైనం స్పష్టమవుతోంది. పేదలకు వైద్యవిద్య అన్నది ఒట్టిమాటేనని, వ్యహారమంతా ధనికులకు అనకూలంగానే నడుస్తోందని విమర్శలు వస్తున్నాయి. పీపీపీ అంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధానమంటున్న చంద్రబాబు తద్వారా కాలేజీలు, ఆసుపత్రుల నిర్వహణలో తమ అసమర్థతను బయటపెట్టుకున్నట్లు అయ్యింది. జగన్ ప్రభుత్వం నాడు-నేడు కింద ఆస్పత్రులను బాగు చేయించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తే, సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వం కంటే ప్రైవేటు వారే బెటర్ అంటున్నారా? ఈ మాత్రం దానికి ప్రభుత్వం ఎందుకో? వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్మాణాల మాదిరి అయితే ఈ పది మెడికల్ కాలేజీలు పూర్తి కావడానికి 15 ఏళ్లు పడుతుందని చంద్రబాబు అనడం చూస్తే ఆయన తనను తాను అసమర్థుడిగా చెప్పుకుంటున్నట్లే కదా అని వైసీపీ వారు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో లక్ష కోట్లైనా ఖర్చు చేసి అమరావతి మొదటి దశ నిర్మాణం పూర్తి చేస్తామనడం మరీ విడ్డూరంగా ఉంది. జగన్ సీఎంగా రెండేళ్లలోనే ఐదు వైద్య కశాళాలలను అందుబాటులోకి తెచ్చారు. ఆ తరువాత ఇంకో రెండు దాదాపుగా పూరర్తయ్యాయి. మిగిలిన పదింటికీ అయ్యే రూ.ఐదారు వేల కోట్లు ప్రభుత్వం సమకూర్చుకోలేదా? లక్షల కోట్ల బడ్జెట్ కలిగిన ప్రభుత్వమే ఈ మాత్రం డబ్బు సమకూర్చు కోలేకపోతే ప్రైవేటు సంస్థలు ఎలా తెచ్చుకుంటాయి? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ఒక్కో వైద్యకళాశాలలకు కేటాయించిన దాదాపు యాభై ఎకరాల భూమిని ఎకరా రూ.వంద చొప్పున లీజుకు ఇవ్వడమంటే ఉత్తినే ఇచ్చినట్లు కదా? ప్రైవేట్ సంస్థలు ఈ భూములను తాకట్టు పెట్టి రుణం తెచ్చుకుంటే.. ప్రభుత్వం తన సంపదను రాసిచ్చినట్లే అవుతుంది.ప్రస్తుతం 33 ఏళ్లు ఉన్న లీజు భవిష్యత్తులో పొడిగించరన్న గ్యారెంటీ ఏమీ లేదు కాబట్టి.. ఇవి శాశ్వతంగా ప్రైవేటు వారి పరమవుతాయి. పేద ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులకు అమరావతి మాదిరే ప్రభుత్వం రుణాలు తేలేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ చంద్రబాబు ప్రభుత్వం 54 ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసింది. కొనుగోలు చేసిన సంస్థలు తమకు దక్కిన భూమితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాయని ఒక రిటైర్డ్ అధికారి చెప్పారు. ఎవరి సంపద ఎవరి పరమైనట్లు? జగన్ ప్రభుత్వం ఏభై శాతం సీట్లు సెల్ప్ ఫైనాన్స్ పద్దతిలో కేటాయించి, వాటికి రూ.20 లక్షల చొప్పున ఫీజ్ వసూలు చేయాలని నిర్ణయిస్తే, చంద్రబాబు, లోకేశ్లు తప్పు పట్టారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విధానాన్ని రద్దు చేసి అంతా ఫ్రీ చేస్తామని లోకేశ్ విద్యార్ధుల సమావేశంలోనే ప్రకటించారు. ఇప్పుడు మొత్తం ప్రైవేటుపరం చేయడమే కాకుండా, ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల ఖరీదు రూ.57 లక్షలు ప్రభుత్వ రంగంలో రూ.20 లక్షలు అంటే అంతే మొత్తం వసూలు చేస్తారు. అదే ప్రైవేటు వారు అయితే ఈ రూ.57 లక్షలే కాకుండా, అదనంగా రూ.కోటి పైనే వసూలు చేయవచ్చు అంటున్నారు. మొత్తం డబ్బు ప్రభుత్వ ఖాతాలోకి వచ్చేలా జగన్ చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు వేల కోట్ల రూపాయలు దక్కేలా చేస్తున్నారన్న విమర్శకు సమాధానం దొరకదు. ఇంతా చేసి ఆ వైద్య కళాశాలల ఆసుపత్రుల్లో ప్రజలందరికి ఉచిత వైద్య సేవలు అందుతాయన్న గ్యారంటీ కూడా లేదు. ప్రైవేటు సంస్థలు లాభాలు రాకపోతే మనలేవన్నది తెలిసిన సత్యమే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లక్ష రూపాయల విలువైన చికిత్స అయినా, ఆపరేషన్ అయినా ఉచితంగా చేస్తారు. మరి పీపీపీ మోడల్లో ఏర్పాటైన ప్రైవేట్ కళాశాలలు ఇలా చేస్తాయా? చేయవు. ఒకవేళ చేసినా ఆ మొత్తాలను ఎన్టీఆర్ వైద్య సేవ లేదా బీమా సదుపాయం పేరుతో ప్రభుత్వం నుంచే వసూలు చేసే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి పీపీపీ విధానంతో ప్రజలకు ఒరిగేదేమిటి? ప్రభుత్వానికి మిగిలేదేమిటి? ప్రైవేటీకరణే విధానమని నిర్ణయించుకుని ఉంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వీటిపై రూ.700 కోట్లు ఎందుకు ఖర్చు చేసినట్లు? ఇప్పటివరకూ ఆయా కళాశాలల ఏర్పాటుకు అయిన ఖర్చు (భూమి + నిర్మాణాలు) తీసుకుని ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి ఉంటే కనీసం ప్రభుత్వానికి కొంత డబ్బు మిగిలి ఉండేదేమో. ప్రస్తుతం ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీలలో కూడా ఏభై శాతం సీట్లు మెరిట్ ప్రకారం, రిజర్వేషన్లు పాటిస్తూ కేటాయించాల్సిందే. ఈ పరిస్థితిలో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటువారికి ఉత్తపుణ్యానికి ధారాదత్తం చేసి మెడికల్ కాలేజీలను నడపాలని చెప్పడం అర్ధరహితం. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి పొందిన సంస్థలు భూమిని స్వయంగా సమకూర్చుకుంటున్నాయి. భవనాలు సొంత ఖర్చుతో నిర్మించుకుంటున్నాయి. యంత్ర పరికరాలు ఇతర సదుపాయాలన్నీ సొంత ఖర్చుతోనే చేసుకుంటున్నాయి. కాని ఇప్పుడు ప్రభుత్వం భూమి, భవనాలు ఉచితంగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడంలో అర్ధం ఏమి ఉంటుంది? పైగా ఈ కాలేజీలకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులను కూడా అప్పగిస్తారట. ఈ సంస్థలు ఉచితంగా సేవలు అందించనప్పుడు ,ప్రభుత్వం వారికి రకరకాల రూపాలలో ఫీజులు చెల్లిస్తున్నప్పుడు ప్రైవేటు పరం చేయవలసిన అవసరం ఏమిటో తెలియదు. ప్రస్తుతం నాలుగు కాలేజీలకు పీపీపీ విదానం అమలు చేస్తున్నా, భవిష్యత్తులో మిగిలిన కాలేజీలన్నిటిని అదే రకంగా అప్పచెప్పనున్నారు. బహుశా పూర్తి అయిన ఏడు కాలేజీలను కూడా అలాగే ఇచ్చేస్తే జగన్ ప్రభుత్వ రంగంలో తీసుకు వచ్చిన ఆశయాన్ని పూర్తిగా నీరుకార్చిన ఘనత కూటమి సర్కార్ కు దక్కుతుంది. ఝార్కండ్ రాజధాని రాంచీలో ఒక ప్రభుత్వ ఆస్పత్రిని ఇదే విధంగా పీపీపీ అంటూ ప్రైవేటీకరించబోగా ప్రజాసంఘాలు, రాజకీయ పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఒడిశా లో గత బీజేడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన మెడికల్ కాలేజీలను ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేయలేదు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల్లో ప్రభుత్వాలే కొత్త కాలేజీలను నడుపుతున్నాయి. ఇవన్ని ఎందుకు! ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలలో ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేస్తోంది కదా! ఎందుకు వారు ప్రభుత్వరంగంలోనే నెలకొల్పుతున్నారు? కొత్తగా కేంద్రం ఇస్తున్న పదివేల మెడికల్ సీట్లను ప్రభుత్వ కాలేజీలకే ఎందుకు ఇస్తున్నారు? ఏపీ ప్రభుత్వం రోడ్లు, పోర్టులు ప్రైవేటైజ్ చేయడం లేదా అని పిచ్చి వాదన చేస్తోంది. రోడ్లకు, ఓడరేవులకు వైద్యరంగానికి పోలిక పెట్టడం అంటే ప్రజారోగ్యంపైన, పేదల వైద్యంపై చులకన భావం ఉన్నట్లు అనిపించడం లేదా?ఏది ఏమైనా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకు రాలేకపోయిన చంద్రబాబు నాయుడు, తనకంటే చిన్నవాడైన వైఎస్ జగన్ తీసుకు వచ్చిన మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటైకీరణకు దిగుతుండడం శోచనీయం. ఈ నేపథ్యంలోనే జగన్... బుద్ది జ్ఞానం ఉన్నవారెవరైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ కింద ప్రైవేటు వారికి అప్పగిస్తారా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక వీటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ప్రజల కోసం జగన్ సంపద సృష్టిస్తే,, ఆ సందపను చంద్రబాబు ప్రైవేటువారికి ధారాదత్తం చేయడం సరైనదా? ఇదేనా చంద్రబాబు చెప్పే విజన్?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మమ్మీడాడీ కావాలి!
అనంతపురం జిల్లా: రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందారనే విషయం తెలియని నాలుగేళ్ల బాలుడు తనకు మమ్మీ.. డాడీ కావాలంటూ రోదిస్తుండడంతో వైద్య సిబ్బందితో పాటు రోగులూ కన్నీటి పర్యంతమవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 4న విడపనకల్లు వద్ద రెండు కార్లు ఢీకొన్న విషయం తెలిసిందే. ఘటనలో పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమలో సీనియర్ ఇంజినీర్గా పనిచేస్తున్న విశాఖనగరానికి చెందిన రామ్సుధీర్ భార్య లావణ్య అక్కడికక్కడే మృతి చెందగా, అనంతపురంలోని జీజీహెచ్లో చికిత్స పొందుతూ రామ్సుధీర్ సైతం మృతిచెందాడు. వీరి కుమారుడు ఆద్విక్ కాలు విరిగి జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. అంతటి నొప్పిలోనూ తన తల్లిదండ్రుల కోసం చిన్నారి పరితపిస్తూ రోదిస్తున్నాడు. చిన్నారి రోదన చూసిన వారి హృదయాలు బరువెక్కిపోతున్నాయి. -
ప్రియాంక ఆత్మహత్య కేసుపై డీఎస్పీ విచారణ
శ్రీ సత్యసాయి జిల్లా: ప్రియాంక ఆత్మహత్య ఘటనకు సంబంధించి ఆదివారం గద్వాల డీఎస్పీ మొగు లయ్య, గట్టు ఎస్ఐ మల్లేశ్ చిన్నోనిపల్లె, దీనికి సమీపంలోని మిట్టదొడ్డి గ్రామాల్లో విచారణ చేపట్టారు. ప్రియాంక ఆత్మహత్యకు దారితీసిన పరిస్థి తులు, చుట్టుపక్కల వారితో ఆమె ఏ విధంగా ఉండేదనే వివరాలను డీఎస్పీ అడిగి తెలుసు కున్నారు. ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసు కోవాలన్న ఉద్దేశంతో కొత్తగూడెం జిల్లా పా ల్వంచ నుంచి గద్వాల జిల్లా చిన్నోనిపల్లె గ్రా మానికి చేరుకున్న ప్రియాంక.. దాదాపు రెండు నెలలపాటు ప్రియుడి ఇంటి వద్ద పోరాటం చేసినా.. చివరికి ఆ ప్రేమకథ విషాదాంతంగా మారిన విషయం తెలిసిందే. చిన్నోనిపల్లె గ్రామానికి చెందిన కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్ను పెళ్లి చేసుకోవడానికి పోరాటం సాగించిన ప్రియాంక, తన ప్రయత్నం విఫలం కావడంతో శుక్రవారం విషపు గుళికలను కూల్డ్రింక్లో కలుపుకొని తాగగా.. గద్వాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. పోస్టుమార్టం అనంతరం అదే రాత్రి ప్రియాంక కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తమ స్వగ్రామమైన కొత్తగూడెం జిల్లా పాల్వంచకు తరలించారు. యువతి ప్రేమకథ విషాదాంతం -
గుర్లలో పోలీసుల దౌర్జన్యం.. అర్ధరాత్రి భయానక అరెస్ట్లు
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో పోలీసులు దౌర్జన్యం చేశారు. అర్ధరాత్రి గ్రామంలో చొరబడి.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేశారు. జమ్మూ గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఇళ్ల నుంచి లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.వివరాల ప్రకారం.. గుర్ల మండలం జమ్మూలో గత రాత్రి దుర్గాదేవి నిమజ్జనంలో చెలరేగిన గొడవలో పోలీసుల లాఠీచార్జ్ చేశారు. దీనికి కొనసాగింపుగా గ్రామంలోకి వచ్చిన పోలీసులు అర్ధరాత్రి దౌర్జన్యం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి అక్రమ అరెస్టులు చేశారు. అర్ధరాత్రి గ్రామంలోకి చొరబడి భయానక వాతావరణం సృష్టించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఇళ్ల నుంచి లాకెళ్లారు. అంతటితో ఆగకుండా.. పోలీసులకు అడ్డుగా వచ్చిన వారికి చితకబాది.. వారిని వాహనాల్లో ఎక్కించారు.ఈ క్రమంలో వారికి ఎందుకు తీసుకు వెళ్తున్నారని కుటుంబ సభ్యులు ప్రశ్నించినా సమాధానం చెప్పలేదు. అంతేకాకుండగా.. ఈ ఘటనను వీడియో రికార్డ్ చేసిన వారి సెల్ ఫోన్లు లాక్కొని వాటిని ధ్వంసం చేశారు. అయితే, ఎవరిని ఎక్కడికి తీసుకు వెళ్లారో తెలియక గ్రామస్తులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి నుంచి భయానక వాతావరణంలో గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. -
విజయనగరం వైభవం ఉట్టిపడేలా..ఉత్సవాలు (ఫొటోలు)
-
సర్కారు నిర్లక్ష్యం వల్లే గిరిజన బాలికలకు అస్వస్థత
మహారాణిపేట(విశాఖపట్నం): కురుపాం గిరిజన బాలికల పాఠశాల విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం, ఇద్దరు బాలికలు చనిపోవడానికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, దీనికి సర్కారే బాధ్యత వహించాలని వైఎస్సార్సీపీ నేతలు, మాజీ ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్పశ్రీ వాణి, పి.రాజన్నదొర ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కురుపాం గిరిజన బాలికలను పుష్పశ్రీవాణి, రాజన్నదొర, అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు తదితరులు పరామర్శించారు. అనంతరం కేజీహెచ్ వైద్యులతో మాట్లాడి విద్యార్థులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పుష్పశ్రీ వాణి మాట్లాడుతూ గిరిజన గురుకుల పాఠశాలల నిర్వహణను కూటమి సర్కారు గాలికొదిలేసిందని విమర్శించారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అసమర్థురాలని ధ్వజమెత్తారు. పాఠశాల హాస్టల్లో కలుషిత నీరు తాగి పచ్చకామెర్ల బారిన పడి అంజలి, కల్పన అనే ఇద్దరు విద్యార్థులు మృతిచెందారని, సుమారు 120 మంది ఆస్పత్రి పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అంజలి మృతికి నాటు వైద్యం కారణమని సర్కారు సాకులు వెతుకుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక్క గురుకుల పాఠశాలకు కూడా ఈ సర్కారు దోమతెరలు ఇవ్వలేదని మండిపడ్డారు. ఆదివారం తీరుబడిగా స్పందించిన మంత్రి సంధ్యారాణి పాఠశాలల్లో నీరు బాగానే ఉందని చెప్పడం దారుణమని పేర్కొన్నారు. ఇద్దరు చిన్నారులు కలుషిత నీరు వల్లే చనిపోయారని, కల్పన సికిల్ సెల్ అనేమియాతో చనిపోయిందని మంత్రి ప్రకటించడం పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. ఎంపీ డాక్టర్ తనూజా రాణి మాట్లాడుతూ కూటమి సర్కారు ఆశ్రమ పాఠశాలల్లో కనీస వసతులు కలి్పంచడం లేదని మండిపడ్డారు. కలుషిత నీరే ఇద్దరు చిన్నారులను బలిగొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతమంది పిల్లలు పచ్చకామెర్ల బారిన పడుతుంటే కూటమి సర్కారు చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. వైద్యానికి డబ్బులు లేవని ఐటీడీఏ పీఓ చెప్పడం దారుణం మాజీ ఉప ముఖ్యమంత్రి పి.రాజన్నదొర మాట్లాడుతూ గిరిజన పిల్లల వైద్యం కోసం డబ్బులు లేవని ఐటీడీఏ పీఓ చెప్పడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. పేద చిన్నారులకు వైద్యం చేయించలేని మంత్రి, సర్కారు పెద్దలు పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి సర్కారు నిర్లక్ష్యం వల్లే ఇంతమంది పిల్లలు ఆస్పత్రుల పాలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చకామెర్లు చిన్న వ్యాధి అని కూటమి ప్రతినిధులు వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారులను, వారి వెంట ఉన్న తల్లిదండ్రులను పట్టించుకునే నాథుడు లేడని, పర్యవేక్షణకు ఒక్క అధికారినీ నియమించలేదని విమర్శించారు. -
మన్యంలో మరణ మృదంగం
సాక్షి, పార్వతీపురం మన్యం/కురుపాం: విద్యార్థుల మరణ మృదంగంతో మన్యం విలవిల్లాడుతోంది. పచ్చకామెర్లు, విష జ్వరాలు పార్వతీపురం మన్యం జిల్లాను కలవరపెడుతున్నాయి. గిరిజన బాలలను కబళిస్తున్నాయి. వారం వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు మరణించడం కలకలం రేపుతోంది. వంద మందికిపైగా విద్యార్థులు కామెర్లు, జ్వరాలతో పార్వతీపురం జిల్లా ఆస్పత్రి, విశాఖ కేజీహెచ్ల్లో చికిత్స పొందుతున్నారు. వీరంతా కురుపాం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, ఏకలవ్య పాఠశాల విద్యార్థులే కావడం గమనార్హం. జిల్లాలోని సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాల్లో అపరిశుభ్రత, కలుషిత ఆహారం–నీరు, వైద్యసదుపాయాల లేమి, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జ్వరాలు, పచ్చకామెర్లు ప్రబలాయనే వాదన బలంగా వినిపిస్తోంది. గత జులై నుంచి ప్రస్తుత అక్టోబరు వరకు జిల్లాలోని గిరిజన సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాల్లో చదువుతున్న 11 మంది విద్యార్థులు వివిధ అనారోగ్య కారణాలతో మరణించడం గమనార్హం. తాగునీటి కలుషితం వల్లేనా? కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల, ఏకలవ్య పాఠశాలల్లో 934 మంది విద్యార్థులు ఉండగా, నాలుగైదు రోజుల్లోనే 120 మంది విద్యార్థులకు పచ్చకామెర్లు, ఇతర అనారోగ్య సమస్యలు వచ్చాయి. తాగునీటి కలుషితం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మందిలో పచ్చకామెర్లు లక్షణాలు బయటపడటంతో శనివారం పాఠశాలల్లో రక్త పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో 79 మంది ఉన్నారు. విశాఖ కేజీహెచ్లో ముగ్గురు ఐసీయూలోనూ, 34 మంది జనరల్ వార్డులోనూ చికిత్స పొందుతున్నారు.మిగిలిన నలుగురు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కామెర్ల బారిన పడిన విద్యార్థినుల్లో గుమ్మలక్ష్మీపురం మండలం కంబగూడకు చెందిన పువ్వల అంజలి గత నెల 26న, కురుపాం మండలం దండసూర గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని తోయక కల్పన ఈ నెల 1న మృతి చెందారు. వారంలోనే ఇద్దరు మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హడావిడిగా రక్త పరీక్షలు జరిపి, మిగిలిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. పచ్చకామెర్ల బాధితుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి నాలుగు రోజుల క్రితం పాఠశాలను సందర్శించి, ఆర్వో ప్లాంట్ సమస్యపై అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు హడావిడిగా కొత్త ప్లాంట్ని ఏర్పాటు చేశారు. పట్టించుకోని కూటమి ప్రభుత్వంమన్యం జిల్లాలో గిరిజన పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నా.. ప్రభుత్వంలో చలనం రావడం లేదు. గత ఏడాది జులై నుంచి ఇప్పటి వరకు 11 మంది ఆశ్రమ, సంక్షేమ పాఠశాలల విద్యార్థులు వివిధ కారణాలతో మృతి చెందారు. వీరంతా అనారోగ్యానికి గురి కావడం.. సకాలంలో సరైన వైద్యం అందకపోవడం వంటి కారణాలతోనే ప్రాణాలు వదిలారు. తాము అధికారంలోకి వస్తే ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంల నియామకం చేపడతామని చెప్పిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హామీ ఇప్పటివరకు అమలుకునోచుకోలేదు. ఆమె సొంత జిల్లాలోనే గిరిజన విద్యార్థులు విషజ్వరాలు, పచ్చకామెర్ల బారిన పడినా ఇప్పటివరకు పట్టించుకోలేదు.తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం హడా వుడిగా మేల్కొన్న ఆమె విశాఖ కేజీహెచ్కు వెళ్లి, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి కూడా ఇప్పటి వరకు విద్యార్థుల పరిస్థితిపై స్పందించకపోవడం విచారకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని రెండు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లకు రెగ్యులర్ పీవోలు లేరు. పార్వతీపురం ఐటీడీఏ డీడీ కూడా ఇన్చార్జే కావడంతో ఆశ్రమ పాఠశాలలు అధ్వానంగా మారాయని విమర్శిస్తున్నారు. భయం వేస్తోంది.. గురుకుల పాఠశాలకు పిల్లలను పంపాలంటేనే భయం వేస్తోంది. నా ఇద్దరు కుమార్తెలు గురుకులంలో ఒకరు పదో తరగతి, ఇంకొకరు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. రక్త పరీక్షలు చేసేందుకు తీసుకొచ్చాను. ఇప్పటికే ఇక్కడ ఇద్దరు చనిపోవడంతో భయంగా ఉంది. – బిడ్డిక నాగరాజు, సంగెడ్డ గ్రామం, కురుపాం మండలం, విద్యార్థిని తండ్రి సౌకర్యాలు లేవు ఉన్నత చదువుల కోసం చేర్పిస్తే.. విగతజీవిగా ఇంటికి వస్తున్నారు. పాఠశాలలో వందల మంది పిల్లలకు వసతులు, మరుగుదొడ్లు సరిగా లేవు. కలుషిత నీరో, లేక కలుíÙత ఆహారమో తెలియదు. పచ్చకామెర్ల బారిన పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కరువైంది. – మండంగి కృష్ణ, లాబేసు గ్రామం, కొమరాడ మండలం, విద్యార్థిని తండ్రి విద్యార్థులందరికీ రక్త పరీక్షలు విద్యార్థులందరికీ రక్తపరీక్షలు నిర్వహించాం. నివేదికలు ఇంకా రాలేదు. జ్వరాలు, పచ్చకామెర్ల అనుమానిత లక్షణాలు ఉంటే మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలిస్తున్నాం. ముందు జాగ్రత్తగా కురుపాం మండలంలోని శివన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలకు ఈనెల 6వ తేదీ నుంచి వారం రోజుల పాటు సెలవులను ప్రకటించాం. – డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, కలెక్టర్, పార్వతీపురం మన్యం సమగ్ర విచారణ జరిపిస్తున్నాం.. బాధిత విద్యార్థులకు వైద్యసేవలు అందిస్తున్నాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యాధుల విజృంభణపై విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించాం. వారు సమగ్ర విచారణ జరిపి, నివేదికలు సమరి్పస్తే తదుపరి చర్యలు తీసుకుంటాం. – ఎం.గౌతమి, గిరిజన సంక్షేమ గురుకుల కార్యదర్శి -
మీ పరిపాలన సిగ్గుచేటు
సాక్షి, అమరావతి: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్వో ప్లాంటు పాడవ్వడంతో కలుషిత నీరు తాగి పచ్చ కామెర్లు సోకి నాలుగు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బాలికలు మృతి చెందడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరెంతో మంది తీవ్ర అనారోగ్యం పాలవ్వడం తనను కలచి వేస్తోందన్నారు.611 మంది చదువుతున్న పాఠశాలలో ఇంత జరుగుతున్నా అసలు పట్టించుకోరా.. మీరు, ఇంత మంది మంత్రులు ఉండి గాడిదలు కాస్తున్నారా? అంటూ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి పిల్లల ఆరోగ్యం పట్ల, బడుల్లో వసతుల పట్ల శ్రద్ధ పెట్టాలని హితవు పలికారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ⇒ చంద్రబాబు గారూ.. పాలనలో మీ నిర్లక్ష్యం, మీ అలసత్వం కారణంగా ఇవాళ పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా మీకు కనికరం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్వో ప్లాంటు పాడవ్వడంతో కలుషిత నీరు తాగడం మూలాన, పచ్చ కామెర్లు సోకి నాలుగు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు.మరెంతో మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి, మీ పరిపాలనకు ఇది సిగ్గుచేటు వ్యవహారం కాదా? 611 మంది చదువుతున్న స్కూల్లో ఇంత జరుగుతున్నా అసలు పట్టించుకోరా? ఒక ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా? ముఖ్యమంత్రిగా మీరు, ఇంత మంది మంత్రులు ఉండి గాడిదలు కాస్తున్నారా? గిరిజన బాలికలు, పేద పిల్లలు అంటే అంత చులకనా? ఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఒక్క ఏడాదిలో 11 మంది విద్యార్థులు అనారోగ్యంతో మరణించినా మీరు కళ్లు మూసుకున్న మాట వాస్తవం కాదా? ఈ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే చంద్రబాబు గారూ.⇒ పేదల తల రాతను మార్చేది చదువేనని మేం నమ్మి, అమ్మ ఒడి సహా ఎన్నో సంస్కరణలు తెస్తూ నాడు–నేడు పనుల ద్వారా ఆ స్కూళ్లను దేవాలయాలుగా మార్చాం. కరెంటు, లైట్లు, ఫ్యాన్లు, ఫరి్నచర్, డిజిటల్ ప్యానెళ్లు, తాగు నీరు, మరుగు దొడ్లు సహా 11 రకాల మౌలిక సదుపాయాలను కల్పించాం. పిల్లలు అనారోగ్యానికి గురికాకుండా రక్షిత తాగు నీటి కోసం ఆర్వో ప్లాంట్లు పెట్టాం. మా ప్రభుత్వ హయాంలో నిరంతర సమీక్ష, పర్యవేక్షణ ద్వారా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నాం.మీరు అధికారంలోకి వచ్చాక, మీ సుపుత్రుడు విద్యా శాఖను చేపట్టిన తర్వాత, ప్రైవేటు వ్యక్తుల లాభాల కోసం వారితో చేతులు కలిపి.. క్రమంగా ప్రభుత్వ విద్యా సంస్థలను నాశనం చేసుకుంటూ వచ్చారు. మా ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలకు వచి్చన మంచి పేరు ప్రతిష్టలను దెబ్బ తీశారు. ఇంగ్లిష్ మీడియంను, సీబీఎస్ఈ నుంచి ఐబీదాకా ప్రయాణాన్ని, టోఫెల్ క్లాసులు, స్కూలు పిల్లలకు ట్యాబులు, సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్ను, రోజుకో మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం గోరుముద్ద.. వీటన్నింటినీ నాశనం చేశారు. మీ దుర్మార్గాల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు తగ్గిపోయారు. ⇒ ఆర్వో ప్లాంట్లు రిపేరు వస్తే వాటిని పట్టించుకునే నాథుడే లేడు. హాస్టళ్లలో విషాహారం కారణంగా మరణాలు సంభవించడమో, ఆస్పత్రుల పాలవ్వడమో పరిపాటిగా మారింది. ఇలాంటి మీ నిర్లక్ష్యమే ఇవాళ కురుపాం గురుకుల పాఠశాలలో గిరిజన బాలికల ఉసురు తీసింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆ కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి. ఇప్పటికైనా కళ్లు తెరిచి.. వెంటనే పిల్లల ఆరోగ్యం పట్ల, బడుల్లో వసతుల పట్ల శ్రద్ధ పెట్టాలి. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రభుత్వం చేసిన తప్పిదం కాబట్టి. -
బాలికపై లైంగికదాడి
నెల్లూరు (క్రైమ్): ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి ఆమెపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నెల్లూరు నగరంలోని సంతపేట పోలీస్స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. సంతపేట పోలీసుల కథనం మేరకు.. సంతపేట కామాక్షినగర్కు చెందిన ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. అదే ప్రాంతంలోని ఓ దుకాణంలో శశి అనే యువకుడు పనిచేస్తున్నాడు. కొంతకాలంగా బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.ఈ నెల 3వ తేదీన బాలిక స్కూల్కు వెళుతుండగా మార్గమధ్యంలో యువకుడు అడ్డుకుని ఆమెను బాలాజీనగర్లోని తన పిన్ని ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై బలవంతంగా లైంగిక దాడి చేశాడు. అనంతరం ఆమెను బైక్పై మైపాడుబీచ్కు తీసుకెళ్లి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. సాయంత్రం అవుతున్నా బాలిక ఇంటికి రాకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు స్కూల్ వద్దకు వెళ్లి విచారించారు. బాలిక రాలేదని తెలియడంతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు రాత్రి 8 గంటల సమయంలో బాలికను ఆమె ఇంటికి సమీపంలో వదిలి వెళ్లాడు.ఇంటికి చేరుకున్న బాలికను కుటుంబ సభ్యులు నిలదీయగా జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాలిక నానమ్మ శనివారం రాత్రి సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. -
కన్న కొడుకే కాలయముడయ్యాడు
ప్రొద్దుటూరు క్రైం: డబ్బు పంపలేదనే కోపంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకే కన్న తల్లిని గొంతుకోసి హత్యచేసిన ఘటన వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. డబ్బు పంపకుంటే కొడుకు ఇంటికి వస్తాడనుకుంది ఆ తల్లి. కానీ ఆ ఆలోచనతోనే కుమారుని ఆగ్రహానికి ఆమె బలైపోయింది. ప్రొద్దుటూరు మండలంలోని శ్రీరాంనగర్లో ఆదివారం ఉప్పలూరు లక్ష్మీదేవి (51)ని ఆమె కుమారుడు యశ్వంత్రెడ్డి కత్తితో గొంతుకోసి హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముచ్చుగుంట్ల విజయభాస్కర్రెడ్డి, ఉప్పలూరు లక్ష్మీదేవి పట్టణంలోని శ్రీరాంనగర్లో నివాసం ఉంటున్నారు.వీరికి యశ్వంత్రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. లక్ష్మీదేవి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. విజయర్ భాస్కరెడ్డి గతంలో బార్లో పని చేసేవాడు. యశ్వంత్రెడ్డి చెన్నైలోని సత్యభామ ఇంజినీరింగ్ కాలేజీలో మూడేళ్ల క్రితం బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్కు వెళ్లిపోయాడు. జూబ్లీహిల్స్లోని హాస్టల్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. హాస్టల్, కోచింగ్ ఫీజులతో పాటు ఖర్చుల నిమిత్తం లక్ష్మీదేవి ప్రతినెలా అతనికి డబ్బు పంపేవారు. అయితే ఎప్పుడు ఇంటికి రమ్మన్నా వచ్చేవాడు కాదు.అతడికి సినిమాల్లో నటించాలనే కోరిక ఉందని, ఆ దిÔశగా ప్రయత్నాలు చేసేవాడని సన్నిహిత వర్గాల సమాచారం. కొన్ని నెలల క్రితం బంధువులు, కుటుంబ సభ్యులు యశ్వంత్రెడ్డిని కారులో బలవంతంగా ప్రొద్దుటూరుకు తీసుకొచ్చారు. ఆరోగ్యం సరిగా లేదని భావించిన తల్లిదండ్రులు అతనికి నాటు మందు కూడా తినిపించారు. రెండు నెలల పాటు ఇంటి వద్దే ఉన్న యశ్వంత్రెడ్డి తల్లిదండ్రులకు నచ్చజెప్పి మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఇటీవల కుమారుడిని ఇంటికి రమ్మని అనేకసార్లు తల్లిదండ్రులు ఫోన్ చేశారు. అయినా అతను రాలేదు. ఇటీవల యశ్వంత్రెడ్డి తల్లికి ఫోన్ చేసి హాస్టల్ ఫీజుతో పాటు తన ఖర్చులకు డబ్బు పంపించాలని కోరాడు. ఆమె పంపలేదు. అలా అయినా కొడుకు వస్తాడని తల్లిదండ్రులు భావించారు.ఆదివారం ఉదయాన్నే యశ్వంత్ ప్రొద్దుటూరుకు వచ్చాడు. నేరుగా వంట గదిలో ఉన్న తల్లి లక్ష్మీదేవితో గొడవపడ్డాడు. తండ్రి విజయభాస్కర్రెడ్డి బెడ్రూంలో స్నానం చేస్తుండగా గది తలుపులు మూసి గొళ్లెం పెట్టాడు. ఈ క్రమంలోనే వంటగదిలో ఉన్న కూరగాయలు కోసే కత్తి తీసుకొని లక్ష్మీదేవి గొంతుకోశాడు. ఆమె రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండగా ఈడ్చుకొచ్చి వరండాలో పడేశాడు. తర్వాత స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి బెడ్రూం తలుపులు తీయడంతో తండ్రి విజయభాస్కర్రెడ్డి బయటికి వచ్చాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. కాగా, తల్లిని హత్యచేసిన అనంతరం యశ్వంత్రెడ్డి ఇంట్లో టీవీ చూస్తూ కూర్చున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన పోలీసులుసైతం అవాక్కయ్యారు. -
స్టాక్స్పై అవగాహన ఉంది.. కానీ ఇన్వెస్ట్ చేయం
సాక్షి, అమరావతి: దేశీయ స్టాక్ సూచీలు నూతన గరిష్టస్థాయిల దిశగా దూసుకుపోతున్నా.. భారతీయులు అత్యధికమంది ఈ అంశాలను గమనిస్తున్నారేగానీ, పెట్టుబడి పెట్టడం ద్వారా వాటి ప్రతిఫలాలను పొందడం లేదు. స్టాక్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తాజాగా నిర్వహించిన ఇన్వెస్టర్ సర్వే–2025 ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అత్యధికమందికి స్టాక్మార్కెట్పై అవగాహన ఉన్నా వాస్తవంగా పెట్టుబడి పెడుతున్న వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉందని ఈ సర్వే వెల్లడించింది. స్టాక్మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ పథకాల్లో కనీసం ఒకదానిపైనైనా 63 శాతం మందికి అవగాహన ఉన్నప్పటికీ 9.5 శాతం మంది మాత్రమే ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది.దేశవ్యాప్తంగా 400 పట్టణాలు, వెయ్యికిపైగా గ్రామాల్లో 90 వేల కుటుంబాలపై సెబీ ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం.. 21.3 కోట్లమందికి స్టాక్మార్కెట్పై అవగాహన ఉన్నా ఇన్వెస్ట్ చేసింది మాత్రం 3.2 కోట్ల మందే. పట్టణ ప్రాంతాల్లో 15 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తుంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఆరుశాతం మంది మాత్రమే ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా ఢిల్లీలో 20.7 శాతం మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత గుజరాత్లో 15.4 శాతం మంది పెట్టుబడి పెడుతున్నారు.పెట్టుబడి రక్షణకే అధిక ప్రాధాన్యతభారతీయులు తక్కువ నష్టభయం ఉండే పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గుచూపుతున్నారు. 80 శాతం మంది ఎటువంటి నష్టభయం లేని సురక్షితమైన పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకే ముందుకొస్తున్నారు. పెట్టుబడిదారుల్లో 79.7 శాతం మంది తక్కువ నష్టభయం ఉన్నవాటిని, 14.7 శాతం మంది కొద్దిగా రిస్క్ ఉన్నవాటిని ఎంపిక చేసుకుంటుండగా.. 5.6 శాతం మంది ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఈక్విటీల్లో కూడా అత్యధికంగా సగటున 6.7 శాతం మంది ఇన్వెస్ట్ చేస్తుంటే షేర్లలో 5.3 శాతం మంది పెట్టుబడి పెడుతున్నారు.ఈక్విటీ పెట్టుబడుల్లో ఉండే సంక్లిష్ట పరిస్థితులపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో వెనుకాడుతున్నట్లు 74 శాతం మంది తెలిపారు. వీటిపై కొద్దిగా అవగాహన కలి్పస్తే పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన పెంచుకుని పెట్టుబడులు పెట్టడానికి యువతీయువకులు ముందుకొస్తున్నారు. ఏటా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోందని, వచ్చే ఏడాది నుంచి పెట్టుబడులు పెడతామని 22 శాతం మంది చెప్పడం ఒక శుభసంకేతమని సెబీ ఆ నివేదికలో పేర్కొంది. -
కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
సాక్షి, అమరావతి, విజయపురిసౌత్: నైరుతి బంగాళాఖాతం, తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ ఆదివారం తెలిపింది. ఇది దక్షిణ తమిళనాడు దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. అలాగే ఏపీ తీరప్రాంతం నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో వచ్చే వారం రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్రలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని, కొద్దిచోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొన్నారు. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. సోమవారం ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.మిగిలిన జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉండగా ఆదివారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడిరంలో 7.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పల్నాడు జిల్లా గుట్లపల్లిలో 6, నెల్లూరు జిల్లా జలదంకిలో 3.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.సాగర్లో మూతపడ్డ క్రస్ట్గేట్లు..నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద తగ్గటంతో అధికారులు ఆదివారం క్రస్ట్గేట్లు మూసివేశారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కు 63,398 క్యూసెక్కులు వచ్చి చేరటంతో ఇక్కడ నుంచి 55,537 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కుడి కాలువకు 10,040, ఎడమ కాలువకు 8,896, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 33,901, ఎస్ఎల్బీసీకి 2,400, వరద కాలువకు 300 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 305.8030 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
ఓటీటీ వీక్షకులు @ 60 కోట్లు
సకుటుంబ సపరివార సమేతంగా... టీవీ ముందు కూర్చుంటున్నారు. అది కేబుల్ కనెక్షన్ టీవీ కాదు.. ‘కనెక్టెడ్ టీవీ’. అందులో తమకు నచ్చిన సినిమా లేదా వెబ్ సిరీస్ లేదా షో చూస్తున్నారు. సంప్రదాయ టీవీ చానళ్లలో కాదు.. ఓటీటీ వేదికల్లో. ఇదే ఇప్పుడు ట్రెండ్. ఇది కరోనా తరవాత రికార్డు స్థాయిలో దేశమంతా పాకేసింది. దేశంలో ఓటీటీ చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య రికార్డు స్థాయిలో 60 కోట్లకు ఎగబాకిందన్న అంచనాలే ఇందుకు నిదర్శనం. అంటే దేశ జనాభాలో 40 శాతానికిపైగా ఓటీటీలకు అలవాటుపడ్డారన్నమాట.టీవీ కొనాలంటే.. వందసార్లు ఆలోచించడం లేదు. హాల్లోకి సరిపోయే పెద్ద సైజు టీవీని.. అది కూడా స్మార్ట్ టీవీనే కొనేస్తున్నారు. ‘మార్డోర్ ఇంటెలిజెన్స్’ అంచనా ప్రకారం 2025లో దేశీయ స్మార్ట్ టీవీ మార్కెట్ విలువ 22.39 బిలియన్ డాలర్లు. 2023లో ఇది సుమారు 11 బిలియన్ డాలర్లే. స్మార్ట్ టీవీల కొనుగోళ్లు ఎంతలా పెరిగాయో చెప్పడానికి ఈ అంకెలే నిదర్శనం. అంత ఖరీదైన టీవీ కొన్నాక.. సాధారణ కేబుల్ టీవీ ఒక్కటే ఉంటే ఏం బాగుంటుంది? అందుకే, ఏదో ఒకటి లేదా అంతకుమించి ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసేసుకుంటున్నారు. అంతే, ఎంచక్కా ఇక సకుటుంబ సపరివార సమేతంగా సినిమాలు, వెబ్ సిరీస్లు, షోలు చూస్తున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో ఈ ధోరణి పెరిగింది.కనెక్టెడ్ టీవీలో..: ఒకప్పుడు కేబుల్ టీవీ ప్రతి ఇంటా సర్వసాధారణంగా ఉండేది. ఇప్పుడు దాని స్థానాన్ని కనెక్టెడ్ టీవీ ఆక్రమిస్తోంది. కనెక్టెడ్ టీవీ అంటే ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యే టీవీ. ఇది మధ్య తరగతి, ఆపై స్థాయి కుటుంబాల్లో సర్వసాధారణం అయిపోయింది. మీడియా కన్సల్టింగ్ సంస్థ ఆర్మాక్స్ మీడియా ‘ఓటీటీ ఆడియన్స్ రిపోర్ట్ 2025’ ప్రకారం.. కనెక్టెడ్ టీవీ వీక్షకుల సంఖ్య 2024లో 6.97 కోట్లు మాత్రమే ఉండేది. 2025లో అది ఏకంగా 12.92 కోట్లకు పెరిగింది. అంటే.. దాదాపు రెట్టింపు అయిందన్నమాట.ఆకట్టుకునే కంటెంట్అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో విభిన్నమైన కంటెంట్తో వెబ్సిరీస్లు, సినిమాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కంటెంట్కు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఆర్మాక్స్ అంచనా ప్రకారం.. దేశంలో ఓటీటీ వీక్షకుల (నెలలో కనీసం ఒక్కసారైనా ఓటీటీ వీడియో చూసినవారు) సంఖ్య 60 కోట్లకుపైనే. 2024తో పోలిస్తే ఇది దాదాపు 10 శాతం ఎక్కువ. దేశ జనాభాలో ఇది 40 శాతానికిపైనే. వీక్షకులు పెరగడంతో ఓటీటీల్లో దేశీయ భాషల్లో వచ్చే వెబ్సిరీస్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఓటీటీల్లోనే విడుదల చేసే సినిమాలూ పెరుగుతున్నాయి. సెలవు రోజుల్లోనూ... రాత్రుళ్లు భోజన సమయాల్లోనూ కుటుంబ సభ్యులతో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా, జీ5, సోనీ లివ్.. ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో నచ్చిన సినిమా లేదా రియాలిటీ షో లేదా వెబ్సిరీస్ చూడటం సర్వసాధారణం అయిపోయింది.దేశంలో ఓటీటీ చందాదారుల సంఖ్య (సుమారుగా)⇒ జియో హాట్స్టార్ 30 కోట్లు⇒ అమెజాన్ ప్రైమ్ 2.8 కోట్లు⇒ నెట్ఫ్లిక్స్ 1.23 కోట్లుఆర్మాక్స్ మీడియా నివేదిక ప్రకారం.. 2025 జనవరి–జూన్ మధ్య ప్రసారమైన ఒరిజినల్స్లో వీక్షకులు అత్యధికంగా చూసినవి వెబ్ సిరీస్లే. వీక్షకుల పరంగా టాప్–50 ఒరిజినల్స్లో 80 శాతం వాటా వెబ్ సిరీస్లు కైవసం చేసుకోవడం విశేషం. ఆ తరవాతి స్థానంలో సినిమాలు, రియాలిటీ షోలు ఉన్నాయి. -
రేపు చలో విజయవాడ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోగా.. బోధనేతర పనులతో వేధిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సమస్యలపై ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని మండిపడింది. కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆగస్ట్లో జిల్లా స్థాయిలో ఆందోళనలు చేపట్టినా స్పందించలేదని.. అందుకే ఈనెల 7న ‘చలో విజయవాడ’ పేరుతో మహా ధర్నా చేస్తున్నట్లు ప్రకటించింది. సమాఖ్య చైర్మన్ ఎల్.సాయిశ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్.చిరంజీవి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎన్.వెంకటేశ్వర్లు ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు.ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అవుతున్నా ఇప్పటివరకు విద్యా సంస్కరణలపై నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వంలోని అన్ని మేనేజ్మెంట్ల ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్విస్ నిబంధనలు తెస్తామని హామీ ఇచ్చి.. ఇప్పటికీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ ఎన్క్యా‹Ùమెంట్ వంటి అనేక డిమాండ్లు పరిష్కరించలేదని.. ఐఆర్ ఇవ్వలేదని, పీఆర్సీ నియమించలేదని వాపోయారు.గత ప్రభుత్వం తెచి్చన హైసూ్కల్ ప్లస్లను పూర్తిగా నిర్విర్యం చేశారని.. అక్కడి పోస్టులను సర్ప్లస్ చేసి గ్రామీణ బాలికలకు ఉన్నత విద్యను దూరం చేశారని ధ్వజమెత్తారు. తాము ఆరోగ్య బీమా చెల్లిస్తున్నా వైద్యం చేయించుకోలేకపోతున్నామని మండిపడ్డారు. ఉపాధ్యాయులంటే ప్రభుత్వానికి గౌరవం లేదని.. సర్విసులో ఉంటూ చనిపోయిన వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు కూడా చేపట్టలేదని విమర్శించారు. అందుకే ఈనెల 7న ఉద్యమించబోతున్నట్లు తెలిపారు. పలు ఉపాధ్యాయ సంఘాల మద్దతుఈనెల 7న ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్లు వైఎస్సార్ టీచర్స్ అసోయేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ కుమార్రెడ్డి, గెడ్డం సుధీర్, స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాడిశెట్టి శ్రీనివాసులు తమ్మినాన చందనరావు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ సైతం ధర్నాకు మద్దతు పలికింది. -
డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు
సాక్షి, అమరావతి/కృష్ణలంక (విజయవాడ తూర్పు): విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె తప్పదని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించారు. విజయవాడలో కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగులతో ఉద్యమ కార్యాచరణ గురించి రౌండ్టేబుల్ సమావేశం ఆదివారం జరిగింది. అక్టోబర్ 14న వర్క్ టు రూల్ పాటిస్తామని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ చైర్మన్ పి.సుదర్శన్రెడ్డి వెల్లడించారు.విద్యుత్ సంస్థల్లో 27 వేల మంది కాంట్రాక్టు కార్మికుల్ని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు. 1999 ముందు నియామకమైన ఉద్యోగులకు మాత్రమే పెన్షన్ సౌకర్యం ఉందని, తర్వాత వారికి పెన్షన్ సౌకర్యం లేదన్నారు. ఉద్యోగులకు, కుటుంబ సభ్యులకు నగదు రహిత మెడికల్ కార్డు ఇవ్వాలన్నారు. జేఎల్ఎం గ్రేడ్–2 ఉద్యోగులకు ఏపీఎస్ఈబీ సరీ్వస్ రూల్స్ వర్తింప చేయాలని సమావేశంలో తీర్మానించింది. -
ఆఫ్రికా టు ఆంధ్రా!
సాక్షి టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వంలో అంతా తానై చక్రం తిప్పుతున్న ఓ కీలక నేత అండతోనే నకిలీ మద్యం మాఫియా రాష్ట్రంలో రెక్కలు విప్పుకుందని తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా ములకలచెరువు సమీపంలో నకిలీ మద్యం తయారీ రాకెట్ సూత్రధారిగా భావిస్తున్న తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డికి ఆ ‘కీలక’ నేతతో ఉన్న సంబంధం వల్లే ఇంత భారీ స్థాయిలో యథేచ్ఛగా ప్లాంట్ స్థాపించినట్లు విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. నిజానికి గత ఎన్నికల్లో తంబళ్లపల్లె నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డి పేరును ప్రకటించే వరకు ఆయనకు రాజకీయంగా పెద్ద గుర్తింపు లేదు. అయితే అంతకు కొద్ది రోజుల ముందు ‘మద్యం’ వ్యాపారానికి సంబంధించిన పలు విషయాలను ఈయన ‘కీలక’ నేతతో చర్చించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. పార్టీ అధికారంలోకి వస్తే స్థానికంగా మద్యం తయారీతోపాటు గోవాలో ఖాయిలా పడిన మద్యం పరిశ్రమను లీజుకు తీసుకుని వ్యాపారం చేయొచ్చని.. భారీ స్థాయిలో డబ్బు ఆర్జించవచ్చని లెక్కలతో సహా చెప్పడంతోనే టికెట్ ఇచ్చారన్న ప్రచారం ఉంది. అందువల్లే టీడీపీని ఎంతో కాలం నమ్ముకుని ఉన్న, ఆ పార్టీలో గట్టి పట్టున్న నేతగా పేరున్న శంకర్ యాదవ్ను కాదని చివరి క్షణంలో జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేయక ముందు నుంచి సౌత్ ఆఫ్రికాలో జయచంద్రారెడ్డి మద్యం వ్యాపారంలో ఉన్నారని ఆయన వర్గీయులే చెబుతున్నారు. ఆ అనుభవంతో రాష్ట్రంలో ‘మద్యం’ వ్యాపారం చేసే ‘స్కెచ్’ను ‘కీలక’ నేతకు ఇచ్చినట్లు సమాచారం. మొన్న ములకలచెరువులో బట్టబయలైన నకిలీ ప్లాంట్ తీరుతెన్నులు, ఇన్నాళ్లూ సాగించిన అక్రమ వ్యాపారం తీరు చూస్తుంటే ‘కీలక’ నేత అండదండలు లేకుండా ఇంత భారీగా దందా నడిపించడం అసాధ్యమని ఎక్సైజ్, పోలీసు వర్గాల్లో సైతం చర్చ జరుగుతోంది. ఈ నకిలీ మద్యం దందా సవ్యంగా సాగేందుకు ‘కీలక’ నేత ఆదేశాలతో అన్నమయ్య జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నేతతో జయచంద్రారెడ్డి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ములకలచెరువు తరహాలో విజయవాడ ప్రాంతంలో ఒకటి, కర్ణాటకలో కూడా మరో నకిలీ మద్యం ప్లాంట్ నడుస్తున్నట్లు సమాచారం. అయితే శనివారం నుంచి వీటిని తాత్కాలికంగా బంద్ చేసినట్లు తెలిసింది.జనార్దనరావును ముందు పెట్టి దందాకళ్లకు కనిపిస్తున్న ఆధారాలు, ఈమధ్య కాలంలో జరిగిన పరిణామాలు చూస్తుంటే ఈ కేసులో ఏ–1గా కేసు నమోదైన అద్దేపల్లె జనార్దనరావును ముందు పెట్టి.. జయచంద్రారెడ్డి కథ నడిపించారని స్పష్టమవుతోంది. జయచంద్రారెడ్డిది ములకలచెరువు సొంత మండలం. విజయవాడకు చెందిన జనార్దనరావుతో జయచంద్రారెడ్డికి కాలేజీ రోజుల నుంచే స్నేహం ఉంది. తిరుపతిలో చదువుకుంటున్న రోజుల్లో ఇద్దరి మధ్య ఉన్న స్నేహం జయచంద్రారెడ్డి సొంత మండలంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ప్రారంభించే స్థాయికి వచ్చింది. జయచంద్రారెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరినప్పుడు ఆయన పక్కనే ఉన్నాడు. చంద్రబాబు చేతుల మీదుగా బి–ఫాంను స్వీకరించే సమయంలోనూ జనార్దనరావు పక్కనే ఉన్నాడు. పైగా ఆ సమయంలో జనార్దనరావు చంద్రబాబుతో చాలా సేపు మాట్లాడినట్లు టీడీపీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో నకిలీ మద్యం రాకెట్పై ఆ పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. టీడీపీలో చేరిన రోజు జయచంద్రారెడ్డితో జనార్దనరావు (ఫైల్) అధికారమే అండగా..ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ రాకెట్ నడిపేందుకు ఎక్కడో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంకు చెందిన వ్యక్తికి సాధ్యం అవుతుందా? ఒకవేళ సాధ్యమైనా ఇంతటి ప్రమాదకరౖమెన నకిలీ మద్యం తయారీకి బలమైన స్థానికుల సహకారం లేకుండా సాహసం చేయగలడా? ఇలాంటి పనికి స్థానికులు భవనాలను లీజుకు ఇస్తారా? జయచంద్రారెడ్డి అధికార టీడీపీ ఇన్చార్జి కావడం, ‘కీలక’ నేత అండతో, అధికార బలంతో, వ్యవస్థలను మేనేజ్ చేయొచ్చని ఇక్కడ నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు. ఒకవేళ జయచంద్రారెడ్డికి సంబంధం లేకుంటే నకిలీ మద్యం వ్యాపారం ఏ ఇబ్బంది లేకుండా సాగడానికి సహకరించినదెవరో అధికారులు ఇప్పటి దాకా ఎందుకు తేల్చలేదు? నకిలీ మద్యం వ్యాపారం నిర్వహించడం కూలీలకో, అధికారం లేని వ్యక్తులకో సాధ్యమా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అలాగే జయచంద్రారెడ్డి పీఏ రాజేష్ నకిలీ మద్యం కేసులో ఐదో నిందితుడు కావడం ఆయన పాత్ర ఉందని నిర్ధారిస్తోంది. సాధారణ వ్యక్తి అయిన రాజేష్కు మద్యం దుకాణం నిర్వహించే స్థాయి లేదు. పాల వ్యాను కొనుగోలు చేసే ఆర్థిక స్థోమతా లేదు. ఈ లెక్కన కీలక సూత్రధారుల్లో జయచంద్రారెడ్డి కూడా ఒకరని స్పష్టమవుతోంది. అయితే ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని జయచంద్రారెడ్డి మాత్రం ఓ వీడియో విడుదల చేయడం తెలిసిందే.ఆ మంత్రికి భయం పట్టుకుందినకిలీ మద్యం తయారీ రాకెట్లో టీడీపీ నేతల ప్రమేయం లేదని ఇంత వరకు ప్రభుత్వం కానీ, టీడీపీ వర్గాలు కాని ఖండించలేదు. శుక్రవారం ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాయలసీమకు చెందిన ఓ మంత్రి ముందుండి పరిస్థితిని చక్కబెడుతున్నారని సమాచారం. టీడీపీ నేతల ప్రమేయం బయటకు వస్తే దాని ప్రభావం తనపై పడుతుందన్న భయంతో ఆ మంత్రి మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆ మంత్రి 2సార్లు ములకలచెరువులో జయచంద్రారెడ్డి ఇంటికి అనధికారికంగా వచ్చారని స్థానిక టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. -
పట్టు వీడని వైద్యులు.. రెండో రోజు కొనసాగిన రిలే దీక్షలు
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) వైద్యులు, ప్రభుత్వం మధ్య చర్చలు కొలిక్కి రావడం లేదు. పీజీ మెడికల్ కోర్సుల్లో ఇన్ సర్వీస్ కోటా క్లినికల్ విభాగంలో 20 శాతం కొనసాగించాలని వైద్యులు భీష్మించారు. ఇందుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఆదివారం కూడా చర్చలు విఫలమయ్యాయి. ఏటా ఇన్ సర్విస్ కోటాపై పునఃసమీక్షించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2030 వరకూ అన్ని క్లినికల్ కోర్సులకు 20 శాతం కోటా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు.తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పీహెచ్సీ వైద్యులు చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం రెండో రోజు కొనసాగాయి. ఎనీ్టఆర్ జిల్లా విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహిస్తున్న ఈ దీక్షల్లో రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన వైద్యులు పాల్గొంటున్నారు. తమ డిమాండ్లపై స్పష్టమైన రాతపూర్వక హామీ ఇచ్చే వరకూ ఆందోళన విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. పీహెచ్సీ వైద్యులు 20 ఏళ్లు పదోన్నతులు లేకుండా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.టైమ్ బౌండ్ ప్రమోషన్లు, ఇన్–సర్విస్ పీజీ కోటాను పునరుద్ధరించడం, నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరు, గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులకు 50 శాతం మూలవేతనాన్ని గిరిజన భత్యంగా చెల్లించడం, చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి రూ.5 వేల భత్యం మంజూరు చేయడం, స్థానికత్వం–పట్టణ వైద్యాధికారుల సర్విస్ అర్హత సమస్యలను పరిష్కరించడం తమ ప్రధాన డిమాండ్లని పేర్కొన్నారు. నిరసనలో అసోసియేషన్ నేతలతో పాటు, వందలాది మంది వైద్యులు పాల్గొన్నారు. కాగా, టైమ్ బౌండ్ పదోన్నతులు, ట్రైబల్ అలవెన్స్లకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని, అయినప్పటికీ వైద్యులు అంగీకరించలేదని సంక్షేమ కమిషనర్ వీరపాండియన్ ఓ ప్రకటనలో తెలిపారు. వైద్యుల తీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
సచివాలయ ఉద్యోగుల ‘ఆత్మగౌరవం’ భగ్నం
నెల్లూరు (పొగతోట): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవం కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. నెల్లూరు టౌన్హాల్లో ఆదివారం గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు ఆత్మగౌరవ సభ ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆత్మగౌరవ రొట్టె, ఆత్మగౌరవ సమావేశం, కొవ్వొత్తుల ప్రదర్శన తదితర కార్యక్రమాలకు పోలీసుల అనుమతి కోరారు. ఆత్మగౌరవ రొట్టె, కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతించకపోవడంతో ఆత్మగౌరవ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు టౌన్హాల్కు భారీగా తరలివచ్చారు. అక్కడ పెద్దఎత్తున మోహరించిన పోలీసులు సభ నిర్వహణకు అనుమతిలేదంటూ ఉద్యోగులను బయటకు పంపించేశారు. అనంతరం టౌన్హాల్ గేట్లకు తాళాలు వేశారు. పోలీసుల తీరుకు నిరసనగా జేఏసీ నాయకులు, ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా వీఆర్సీ మైదానం వద్దకు వెళ్లాలంటూ హుకుం జారీ చేయడంతో అక్కడికి చేరుకుని నిరసన కొనసాగించారు.మా డిమాండ్లు నెరవేర్చాలిఉభయ గోదావరి జిల్లాల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఆదివారం రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సమావేశం జరిగింది. 1,500 మంది సచివాలయ ఉద్యోగులు హాజరయ్యారు.ఐక్యవేదిక చైర్మన్ జానీ పాషా మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, వలంటీర్ విధుల నుంచి విముక్తి కల్పించాలని కోరారు. స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని, రికార్డ్ అసిస్టెంట్ పే స్కేల్ జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్తో క్యాడర్ అప్గ్రేడ్ చేయాలని కోరారు. సంఘ సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్కృష్ణ, కనీ్వనర్ షేక్ అబ్దుల్ రజాక్, నాయకులు పాల్గొన్నారు. -
నకిలీ మద్యంపై సీఎం సరికొత్త డ్రామా
సాక్షి, అమరావతి : అన్నమయ్య జిల్లాలో బయట పడిన నకిలీ మద్యం రాకెట్లో టీడీపీ కీలక నేతల ప్రమేయం బట్టబయలు కావడంతో సీఎం చంద్రబాబు సరికొత్త డ్రామాకు తెర లేపారు. ఈ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించి, పార్టీకి సంబంధం లేని వారిని బాధ్యులను చేయాలని చూసినా.. అది బెడిసి కొట్టింది. దీంతో టీడీపీ తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి, టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తద్వారా ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, కింది స్థాయిలో ఏదో జరిగిందని ప్రజల దృష్టి మళ్లించేలా కొత్త కుతంత్రం రచించారు.‘కల్తీ మద్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చంద్రబాబు ఆదేశాల మేరకు వారిద్దరిని సస్పెండ్ చేస్తున్నాం’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. భారీ యంత్రాలతో వివిధ బ్రాండ్లను పోలిన నకిలీ మద్యాన్ని ఈ యూనిట్లో తయారు చేస్తూ ‘కీలక’ నేత అండతో వారు ఉమ్మడి చిత్తూరు, అనంతపురం తదితర జిల్లాలకు గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ రాకెట్ బయట పడటంతో అమరావతి పెద్దలు తమకేమీ సంబంధం లేనట్లు.. స్థానిక నాయకులే కారణమంటూ డ్రామాలకు పూనుకోవడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. -
నకిలీ మద్యం సూత్రధారులు ప్రభుత్వ పెద్దలే
సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా ములకలచెరువు వద్ద భారీగా పట్టుబడ్డ నకిలీ మద్యం తయారీ వెనుక ఉన్నది ముమ్మాటికీ ప్రభుత్వ పెద్దలేనని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ప్రాయోజిత దందానేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక టీడీపీ నేత సురేంద్రనాయుడు పాత్రధారి మాత్రమేనని, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయటపెట్టాలని.. సీఎం చంద్రబాబు ఈ దందాకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..నాణ్యమైన మద్యం అంటే ఇదేనా!?..ప్రభుత్వ పెద్దల అండదండలు లేకుండా హైవే పక్కనే ఓ పరిశ్రమను తలపించేలా నకలి మద్యాన్ని ఎలా తయారు చేయగలరు? ఈ ప్రభుత్వ పెద్దలు గత ఎన్నికల్లో చేసిన వాగ్దానాలేంటి? అధికారంలోకి వచ్చాక చేస్తున్న దుర్మార్గాలేంటి? నాణ్యమైన మద్యం అంటే ఇదేనా!? ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్తో రోజుకు 30 వేల క్వార్టర్ బాటిళ్లు తయారుచేసి, మద్యం షాపులకు, బెల్టు షాపులకు పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.పైగా.. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తే.. పెద్దఎత్తున లిక్కర్ స్కాం జరుగుతోందని కూటమి పార్టీలు, ఎల్లో మీడియా సంస్థలు దుష్ప్రచారం చేశాయి. మరి ఇవాళ ములకలచెరువులో భారీగా బయటపడ్డ నకిలీ మద్యం గురించి టీడీపీ కూటమి ప్రభుత్వం, ఈ ఎల్లో మీడియా ఏం సమాధానం చెబుతాయి? అప్పుడు మద్యం తాగినవాళ్లందరికీ లివర్లు, కిడ్నీలు పాడైపోయాయని అన్నారుగా.. ఇప్పుడు పాడవవా? ఇక నిన్న అరెస్టైన సురేంద్రనాయుడు ఏ నాయకుడికి ముడుపులిస్తే ఈ దందా జరుగుతుందో సమాధానం చెప్పాలి.ములకలచెరువులోనే ఐదేళ్లలో రూ.500 కోట్ల దందా..ఇదిలా ఉంటే.. ఈ నకిలీ మద్యంతో కూడిన క్వార్టర్ బాటిల్ తయారీకి రూ.8 లేదా రూ.9 ఖర్చవుతుంది. అదే బాటిల్ను బెల్టుషాపుల వారికి రూ.110కి అమ్మితే వాళ్లు రూ.130కి అమ్ముతున్నారు. అంటే ఒక్కో బాటిల్ మీద రూ.100 ఆదాయం వస్తోంది. ఒక్క ములకలచెరువులో ఒక రోజులో 30 వేల బాటిళ్ల నకిలీ మద్యం తయారవుతుండగా రూ.30 లక్షల అక్రమార్జన జరుగుతోంది. ఇలా ఏడాదికి రూ.100 కోట్లు, ఐదేళ్లలో రూ.500 కోట్లు దండుకుంటున్నారు. ఇలా రాష్ట్రంలో ఇంకెన్ని చోట్ల నకిలీ మద్యం తయారుచేస్తున్నారో ప్రజలకు తెలియాలి. -
‘నకిలీ’ దందా డైరీలో నిక్షిప్తం
సాక్షి, రాయచోటి/ ములకలచెరువు/పెద్దతిప్పసముద్రం/ఇబ్రహీంపట్నం (మైలవరం): అన్నమయ్య జిల్లా ములకలచెరువులో బట్టబయలైన నకిలీ మద్యం తయారీ ప్లాంట్ వ్యవహారంలో మరి కొన్ని కీలక వివరాలు లభ్యమయ్యాయి. అక్కడ దొరికిన డైరీ (చిన్న పుస్తకం)లో నకిలీ మద్యం తయారీ కేంద్రం నుంచి వివిధ ప్రాంతాల్లోని బెల్ట్ షాపులకు సరఫరా అయిన వివరాలు రాసి ఉండటం చర్చనీయాంశమైంది. అయితే ఆయా బెల్ట్ షాపులపై సజ్ అధికారులు తొందరపాటుతో చర్యలకు ఉపక్రమించొద్దని పెద్దల నుంచి ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. దీంతో తూతూ మంత్రంగా ఒకటి రెండు షాపులపై దాడులు చేసి మమ అనిపించేలా ‘షో’ చేస్తున్నారు. కాగా, పాల వ్యాన్ తరహాలో ఉన్న ఆటోలో నకిలీ మద్యం సరఫరా అయ్యేది.ఈ విషయమై రెండు రోజులుగా ప్రజల్లో భారీగా చర్చ జరగడంతో రాజేష్కు చెందిన ఈ వ్యాన్ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పెద్దతిప్పసముద్రం మండల టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడు ఇంటిలో, ఆయన నిర్వహిస్తున్న ఆంధ్రా వైన్స్లో నకిలీ మద్యం గుర్తించగా ఆయన్ను ఇప్పటికే అరెస్ట్ చేయడం తెలిసిందే.టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జి జయచంద్రారెడ్డి పీఏ టి.రాజేష్ పరారీలో ఉన్నట్టు చెబుతూ ఆయన దుకాణం జోలికి వెళ్లక పోవడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆదివారం సాయంత్రం రాజేష్ నిర్వహిస్తున్న ‘రాక్ స్టార్’ మద్యం దుకాణాన్ని సీజ్ చేశారు. ఈ మేరకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూధనరావు మీడియాకు వెల్లడించారు. ఈ షాపులో ఎంత నకిలీ మద్యం నిల్వ ఉందనే వివరాలను మాత్రం వెల్లడించ లేదు. జనార్దనరావు, రాజు ఇళ్లల్లో తనిఖీలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నకిలీ మద్యం తయారీ కేసులో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన ఇద్దరు వ్యక్తుల ఇళ్లు, పచారీ దుకాణం, బార్లో శనివారం సోదాలు చేపట్టిన విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా పచారీ దుకాణం, బార్ నిర్వహిస్తున్న జనార్దనరావు, అతని పచారీ దుకాణంలో పనిచేసే కట్టా రాజు ఇళ్లను తనిఖీ చేశారు. వ్యాపార వేత్తగా ఉన్న జనార్దనరావు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండనప్పటికీ పలువురు టీడీపీ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. జనార్దనరావు ప్రస్తుతం విదేశాల్లో ఉండగా, కట్టా రాజు పరారీలో ఉన్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా, జనార్దనరావు బార్లో ఇన్నాళ్లూ మద్యం తాగిన వారంతా బెంబేలెత్తిపోతున్నారు.దానిమ్మ తోటలో నకిలీ లిక్కర్ బాక్సులు పెద్దతిప్పసముద్రం మండలం మల్లెల పంచాయతీ పరిధిలోని ఉప్పరవాండ్లపల్లిలో వెంకటరెడ్డి అనే రైతుకు చెందిన దానిమ్మ తోటలో మూడు బాక్సుల్లో బీర్లు, నకిలీ మద్యం పట్టుబడింది. ములకలచెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందుకు వచ్చిన సమాచారం మేరకు ఆదివారం సిబ్బందితో కలసి ఆ ప్రాంతానికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. పట్టుబడిన బీరు బాటిళ్ల హోలోగ్రామ్ లేబుల్ స్కాన్ కాకపోవడంతో బీర్లు కూడా నకిలీవని తేలింది. ఈ మేరకు సీఐ అనుమానం వ్యక్తం చేస్తూ విషయాన్ని ఫోన్ ద్వారా ఉన్నతాధికారులకు వివరించినట్లు సమాచారం.పట్టుబడిన మద్యం బాక్సులను కట్టా సురేంద్ర నాయుడు ఇటీవల బాబు అనే వ్యక్తి ద్వారా ఇక్కడకు పంపినట్లు రైతు వెంకటరెడ్డి పోలీసులకు తెలిపాడు. బాబు అనే వ్యక్తి మండలంలోని టి.సదుం పంచాయతీ పరిధిలోని చెన్నరాయునిపల్లికి చెందినవాడు. కట్టా సురేంద్ర నాయుడుకు నమ్మిన బంటు. కల్తీ మద్యం బాక్స్లను బెల్ట్ షాపులకు తరలించేవాడని తెలుస్తోంది. దానిమ్మ తోటలో పట్టుబడిన నకిలీ మద్యం వ్యవహారంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
నకిలీ మద్యం తాగి ఒకరి మృతి
గుంతకల్లు టౌన్: అనంతపురం జిల్లా గుంతకల్లులోని హనుమాన్ సర్కిల్లో ఓ వైన్ షాపు వద్ద మద్యం తాగుతూ బేల్దారి పెద్దన్న (39) అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం యడవలి గ్రామానికి చెందిన పెద్దన్న బేల్దారి పని చేస్తుంటాడు. ఆదివారం ఉదయం ఓ వైన్ షాపులో మద్యం కొనుక్కున్నాడు. పక్కనే ఉన్న అనధికార పర్మిట్ రూమ్లో బండలపై కూర్చొని కొద్ది కొద్దిగా తాగుతుండగా 15 నిమిషాల్లోనే విపరీతంగా మైకం తలకెక్కి కిందకు ఒరిగిపోయాడు. అతని వెంట వచ్చిన మరో వ్యక్తి కూడా విపరీతమైన మైకంలో తూలుతూ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు.ఆ తర్వాత కొందరు వెళ్లి చూడగా పెద్దన్న మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్దన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరి చిన్న పెద్దక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు వన్టౌన్ సీఐ మనోహర్ చెప్పారు. మద్యం తాగిన వ్యక్తి కుప్పకూలిపోయి చనిపోయాడని తోటి మందుబాబులు, స్థానికులు వైన్ షాపు సిబ్బందికి చెప్పినా వారు పట్టించుకోక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.మద్యం తాగడానికి ఏర్పాటు చేసిన బండలను పగులగొట్టారు. కాగా, అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యం తయారీ రాకెట్ గుట్టు రట్టయిన నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చిన నకిలీ మద్యం తాగినందునే ఇలా జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
ఏం స్కెచ్ వేశావ్ చంద్రబాబూ?: వైఎస్ జగన్
2024–25 ఆర్థిక ఏడాది మొదటి ఐదు నెలల్లో ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం రూ.6,782.21 కోట్లు. ప్రైవేట్ మద్యం షాపులు, ఊరూరా బెల్ట్ షాపులు, ఇతరత్రా విచ్చలవిడి అమ్మకాల నేపథ్యంలో 2025–26 ఆర్థిక ఏడాది మొదటి ఐదు నెలల్లో ఆదాయం రూ.6,992.77 కోట్లు మాత్రమే. అంటే కేవలం 3.10 శాతం వృద్ధి మాత్రమే. ఏటా సహజంగా వచ్చే 10 శాతం పెరుగుదల కూడా రాలేదు. అంటే దీని అర్థం ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని సిండికేట్ల రూపంలో, నకిలీ లిక్కర్ తయారీ రూపంలో మీ ముఠా కొట్టేస్తున్నట్టేగా చంద్రబాబూ? –మాజీ సీఎం వైఎస్ జగన్సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యం మాఫియా వ్యవహారంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా స్పందించారు. నకిలీ మద్యం తయారీ కేసులో అసలు సూత్రధారులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు స్కెచ్ వేసి, రాత్రికి రాత్రే కేసు మార్చేశారని ఆరోపించారు. టీడీపీ నేతల సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటం న్యాయమేనా? అంటూ సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు, ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారంటూ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆదివారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..⇒ చంద్రబాబు గారూ.. మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన మీరు, ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమోకానీ, లిక్కర్ సిండికేట్లతో, నకిలీ మద్యం తయారీల ద్వారా, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మీ పార్టీ నాయకులు గడించిన అక్రమ సంపాదనను పైనుంచి కింది వరకూ వీరంతా పంచుకుంటున్నారు. వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతోంది.⇒ మీ లిక్కర్ సిండికేట్లకు, గ్రామ స్థాయి వరకూ విస్తరించిన బెల్టుషాపుల మాఫియాలకు, నకిలీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం మీరు ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారు. ఉద్దేశ పూర్వకంగా వాటిని తీసివేసి, వాటి స్థానంలో మీ సిండికేట్లకు అప్పగించారు. మద్యం దుకాణాలు టీడీపీ వాళ్లవే. బెల్టుషాపులు టీడీపీ వాళ్లవే. ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు టీడీపీ వాళ్లవే. అక్రమ మద్యం తయారీ దారులు కూడా టీడీపీ నేతలే. వాళ్లు తయారు చేస్తారు.. ఆ తయారు చేసిన దాన్ని మీ వాళ్లే, మీ షాపుల ద్వారా, మీ బెల్టుషాపుల ద్వారా అమ్ముతారు. అలా వచ్చిన డబ్బును వాటాలు వేసుకుని పంచుకుంటారు. రాష్ట్రంలో ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యమేనన్న వార్తలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి.⇒ లిక్కర్ వ్యవహారంలో మీ వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడ్డమే కాదు, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును మీరు దోచుకుంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి, విచ్చలవిడిగా మద్యం విక్రయాలను పెంచారు. మార్ట్లు పెట్టారు. తిరిగి మళ్లీ ఇల్లీగల్ బెల్టుషాపులు తెరిచి ప్రతి వీధిలోనూ పెట్టారు.రాత్రి పగలు అనే తేడా లేకుండా లిక్కర్ అమ్మడం మొదలు పెట్టారు. ఇంత విచ్చలవిడిగా తాగిస్తున్నా సరే, కాగ్ నివేదికల ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో, అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానే లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం రూ.6,782.21 కోట్లు కాగా, 2025–26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లో, విచ్చలవిడిగా లిక్కర్ అమ్మినా సరే ఆదాయం రూ.6,992.77 కోట్లు మాత్రమే వచ్చింది. కేవలం 3.10% వృద్ధి మాత్రమే. ఎక్కడైనా ప్రతి ఏటా సహజంగా వచ్చే 10% పెరుగుదల కూడా రాలేదు. అంటే దీని అర్థం ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని సిండికేట్ల రూపంలో, నకిలీ లిక్కర్ తయారీ రూపంలో మీ ముఠా కొట్టేస్తున్నట్టేగా అర్థం?⇒ నకిలీ లిక్కర్ వ్యవహారాలు కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి. ఉత్తరాంధ్రలోనూ, గోదావరి జిల్లాల్లోనూ, ఇప్పుడు రాయలసీమలోనూ ఈ ఘటనలు బయటకు వచ్చాయి. కానీ విచారణ, దర్యాప్తు తూతూ మంత్రంగానే సాగుతున్నాయి. కారణం.. ఈ అక్రమాల వెనుక ఉన్నది మీ బినామీలు అయిన మీ టీడీపీ వాళ్లే. దీన్ని అరికట్టాలన్న చిత్తశుద్ధి ఉండి ఉంటే, ఇవాళ ములకలచెరువు ఘటన తర్వాత సప్లై చేసిన మద్యం షాపుల్లోనూ, బెల్టుషాపుల్లోనూ విస్తృతంగా తనిఖీలు జరిగి, నకిలీ బాటిళ్లను పట్టుకునే వారు. కానీ అలా జరగలేదు.⇒ పైగా దీనికి కారకులైన వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అన్నమయ్య జిల్లా స్థాయి ముఖ్య నేత, టీడీపీ ఇన్ఛార్జి కనుసన్నల్లో ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తే, వీరిని తప్పిస్తూ తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు, టీడీపీ ఇన్ఛార్జి అనుచరుడి మద్యం దుకాణం వైపు అధికారులెవ్వరూ కన్నెత్తి చూడలేదు. ఈ నేరాన్నంతటినీ విదేశాల్లో ఉన్న మరో వ్యక్తి పైకి తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సూత్రధారులను కాపాడేలా స్కెచ్ వేసి, మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు మీ కార్యాలయ డైరెక్షన్లో రాత్రికి రాత్రే కేసు మార్చేశారు. దీనికి కారణం ఈ దందాకు మీ నుంచి, మీ చెప్పు చేతల్లో ఉన్న వ్యవస్థల నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టే. మీ సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటం న్యాయమేనా? -
పిన్నిని ముక్కలుగా నరికి..!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): స్వయాన అక్క కొడుకే ఆమె పాలిట రాక్షసుడిగా మారాడు. తన భార్య పుట్టింటికి వెళ్లిపోవడానికి పిన్నే కారణమని భావించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. వృద్ధురాలని కూడా చూడకుండా తన మైనర్ కొడుకుతో కలిసి ముక్కలుముక్కలుగా నరికి గోనె సంచుల్లో చుట్టి వేర్వేరు కాలువల్లో పడవేశాడు. సభ్యసమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భవానీపురం ఊర్మిళానగర్లో విజయలక్ష్మి(60) ఒంటరిగా నివసిస్తోంది.ఆమె ఇంటికి కొద్ది దూరంలో ఆమె అక్క కుమారుడు వంకదార హనుమాన్జీ సుబ్రహ్మణ్యం కుటుంబం నివసిస్తోంది. కొద్ది రోజులుగా సుబ్రహ్మణ్యం, అతని భార్య మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం భార్య అతడిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. దీనికి కారణం పిన్ని విజయలక్ష్మి చెప్పుడు మాటలేనని సుబ్రహ్మణ్యం భావించాడు. ఆమెపై పగ పెంచుకొని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం కొద్ది రోజులుగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. సుబ్రహ్మణ్యం గత బుధవారం విజయలక్ష్మి ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి మాయమాటలతో తన ఇంటికి ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చాడు.ఆ తరువాత ఆమెపై ఒక్కసారిగా కత్తితో దాడికి దిగాడు. ఆమెపై దాడి చేయటానికి సుబ్రహ్మణ్యం మైనర్ కుమారుడు సహకరించాడు. విజయలక్ష్మిని ముక్కలుగా చేసి ఆమె శరీర భాగాలను వేరు చేశారు. వాటిని వేర్వేరు గోనెసంచుల్లో మూటకట్టి ఊర్మిళానగర్, గొల్లపూడి తదితర ప్రాంతాల్లో మురుగుకాలువల్లో పడేశాడు. అయితే విజయలక్ష్మి కనపడటం లేదని భవానీపురం పోలీసులకు ఫిర్యాదు అందింది. శనివారం గొల్లపూడి పంటకాలువ రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి శరీర భాగాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.దీంతో అవి విజయలక్ష్మి శరీరభాగాలుగా పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసుల విచారణలో సుబ్రహ్మణ్యమే ఈ హత్యకు కారణమని నిర్ధారించారు. ఘటన తర్వాత నంద్యాల పరారైన సుబ్రహ్మణ్యం, అతనికి సహకరించిన కుమారుడిని నగరానికి తీసుకొచ్చి విచారణ చేస్తున్నట్లు సమాచారం. విజయలక్ష్మి శరీర భాగాలు పూర్తిగా లభించకపోవటంతో విచారణ కొనసాగుతోంది. -
తురకపాలెంలో మళ్లీ మొదలైన ఆందోళన.. మరో మహిళ మృతి
సాక్షి, గుంటూరు: గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మరో మహిళ మృతి చెందింది. చల్లా కృష్ణవేణికి తీవ్రంగా జ్వరం రావడంతో ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ చల్లా కృష్ణవేణి ఇవాళ(అక్టోబర్ 5, ఆదివారం) మధ్యాహ్నం మరణించింది. చల్లా కృష్ణవేణి మృతితో గ్రామస్తుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఇటీవలే తురకపాలెంలో 40 మందికిపైగా మృతిచెందారు.ప్రజారోగ్య పరిరక్షణలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలం అవుతోంది. తురకపాలెంలో తాజాగా తలెత్తిన మరో ఆరోగ్య అత్యవసర పరిస్థితి తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మృత్యువాతకు గురైన వారిలో ఎక్కువ మంది 18 నుంచి 50 ఏళ్ళలోపు వారే కావటం గమనార్హం. -
ఇదేం తీరు.. గాడిదలు కాస్తున్నారా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మన్యం జిల్లాలో పచ్చకామెర్లతో విద్యార్థినుల మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబూ.. పాలనలో మీ నిర్లక్ష్యం, మీ అలసత్వం కారణంగా ఇవాళ పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా మీకు కనికరం కూడా లేదు’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు.‘‘పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్వోప్లాంటు పాడవడంతో కలుషిత నీరు తాగడం మూలాన, పచ్చకామెర్లు సోకి 4 రోజుల వ్యవధిలోనే ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి, మీ పరిపాలనకు ఇది సిగ్గుచేటు వ్యవహారం కాదా?. 611 మంది చదువుతున్న స్కూల్లో ఇంత జరుగుతున్నా అసలు పట్టించుకోరా?. ఒక ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా?’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు...ముఖ్యమంత్రిగా మీరు, ఇంతమంది మంత్రులు ఉండి గాడిదలు కాస్తున్నారా?. గిరిజన బాలికలు, పేద పిల్లలు అంటే అంత చులకనా?. ఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఒక్క ఏడాదిలో 11 మంది విద్యార్థులు అనారోగ్యంతో మరణించినా మీరు కళ్లుమూసుకున్నమాట వాస్తవం కాదా?. ఈ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే చంద్రబాబూ. పేదల తలరాతను మార్చేది చదువేనని మేం నమ్మి, అమ్మ ఒడి సహా ఎన్నో సంస్కరణలు తెస్తూ నాడు-నేడు పనుల ద్వారా ఆ స్కూళ్లను దేవాలయాలుగా మార్చాం. కరెంటు, లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, డిజిటల్ ప్యానెళ్లు, తాగునీరు, మరుగుదొడ్లు సహా 11 రకాల మౌలిక సదుపాయాలను కల్పించాం...పిల్లలు అనారోగ్యానికి గురికాకుండా రక్షిత తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు పెట్టాం. మా ప్రభుత్వ హయాంలో నిరంతర సమీక్ష, పర్యవేక్షణ ద్వారా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక, మీ సుపుత్రుడు విద్యాశాఖను చేపట్టిన తర్వాత, ప్రైవేటు వ్యక్తుల లాభాలకోసం వారితో చేతులు కలిపి, క్రమంగా ప్రభుత్వ విద్యాసంస్థలను నాశనం చేసుకుంటూ వచ్చారు. మా ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన మంచి పేరు ప్రతిష్టలను దెబ్బతీశారు...ఇంగ్లిషు మీడియంను, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణాన్ని, టోఫెల్ క్లాసులు, 8వ తరగతి వారికి ట్యాబులు, సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్ను, రోజుకో మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద వీటన్నింటినీ నాశనం చేశారు. మీ దుర్మార్గాల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు తగ్గిపోయారు. ఆర్వో ప్లాంట్లు రిపేరు వస్తే వాటిని పట్టించుకునే నాథుడే లేడు. హాస్టళ్లలో విషాహారం కారణంగా మరణాలు సంభవించడమో, ఆస్పత్రుల పాలవడమో పరిపాటిగా మారింది. ఇలాంటి మీ నిర్లక్ష్యమే ఇవాళ కురుపాం ఆశ్రమ పాఠశాలలో గిరిజన బాలికల ఉసురు తీసింది...దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆ కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి. ఇప్పటికైనా కళ్లు తెరిచి, వెంటనే పిల్లల ఆరోగ్యం పట్ల, వారి బడుల్లో వసతులపట్ల శ్రద్ధపెట్టాలి. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రభుత్వం చేసిన తప్పిదం కాబట్టి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు..@ncbn గారూ.. పాలనలో మీ నిర్లక్ష్యం, మీ అలసత్వం కారణంగా ఇవాళ పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా మీకు కనికరం కూడా లేదు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్వోప్లాంటు పాడవడంతో కలుషిత నీరుతాగడం మూలాన, పచ్చకామెర్లు సోకి 4రోజుల వ్యవధిలోనే… pic.twitter.com/Dq0pocjxe6— YS Jagan Mohan Reddy (@ysjagan) October 5, 2025 -
KGH: గిరిజన బాలికలకు వైఎస్సార్సీపీ నేతల పరామర్శ
సాక్షి, విశాఖపట్నం: కేజీహెచ్లో గిరిజన బాలికలను వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. పచ్చ కామెర్లకు చికిత్స పొందుతున్న బాలికలను ఆ పార్టీ నేతలు పుష్పశ్రీవాణి, రాజన్నదొర, ఎంపీ తనూజారాణి, మజ్జి శ్రీను పరామర్శించి.. బాలికల తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను వారు కోరారు.ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇద్దరు బాలికలు చనిపోయారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. బాలికల అస్వస్థతకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. కురుపాం గిరిజన హాస్టల్లో సమస్యలున్నాయని మేం ముందే చెప్పాం. ఈ నెల 1న బాలికలు అస్వస్థతకు గురైతే 5న మంత్రి వచ్చారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా?’’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు. -
ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. రానున్న మూడు గంటల్లో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసింది. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించింది.కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. చెట్ల కింద ఉండకూడదని.. అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు కోనసీమ(జి) ముమ్మడివరంలో 79.7మిమీ, పల్నాడు(జి) గుట్లపల్లిలో 60మిమీ, నెల్లూరు(జి) జలదంకిలో 33.5మిమీ వర్షపాతం నమోదైంది. -
సంక్షేమం.. అభివృద్ధే వైఎస్సార్సీపీ అజెండా: బొత్స
సాక్షి, విశాఖపట్నం: రాబోయే కాలంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమిస్తామని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్సీపీ నేతల విస్తృతస్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మండలిలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై చర్చించాలని పట్టుబట్టామని.. ప్రజా సంక్షేమమే తమ అజెండా అన్నారు. ప్రజా సంక్షేమంపై తాము రాజీపడేది లేదని స్పష్టం చేశారు.‘‘మెడికల్ కాలేజీల ఏర్పాటు పేదవారి వైద్యానికి సంబంధించినది. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం. పేదవాడి ఆరోగ్య విషయంలో రాజీపడం. కూటమి ప్రభుత్వానికి జగన్ ఫోబియా పట్టుకుంది. ఇంకా ఎన్ని రోజులు జగన్ పేరు చెబుతూ బతుకుతారు. కురుపాంలో 39 మంది విద్యార్థులు పచ్చ కామెర్లతో బాధపడుతున్నారు. అందులో ఇద్దరూ మరణించారు. కూటమి ప్రభుత్వానికి పర్యవేక్షణ కొరవడింది...అశోక్ గజపతిరాజు జెనెటిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు ఆయనకు అహం ఎక్కువ. సింహాచలంలో ఆరుగురు భక్తులు మరణిస్తే కనీసం అశోక్ గజపతి రాజు పరామర్శించారా? ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరాలు, హత్యలు హత్యాచారాలు పెరిగిపోయాయి. మా హయాంలో ఎన్ని నేరాలు జరిగాయి, ఏడాదిన్నరగా కూటమి పాలనలో ఎన్ని జరిగాయో లెక్కేసుకోండి’’ అని బొత్స పేర్కొన్నారు. -
చంద్రబాబు పాలనలో ఎప్పుడూ మద్యం స్కామ్లే: సాకే శైలజానాథ్
సాక్షి, అనంతపురం: సీఎం చంద్రబాబు మాట్లాడిన 'దుష్టుల పాలన'కు కూటమి సర్కార్ అద్దం పడుతోందని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ మండిపడ్డారు. అనంతపురం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నాణ్యమైన మద్యాన్ని, సరసమైన ధరకే ఇస్తానంటూ బ్రాండ్ అంబాసిడర్గా మాట్లాడిన సీఎం చంద్రబాబు ఇప్పుడు తంబళ్ళపల్లిలో బయటపడ్డ కల్తీ మద్యం తయారీ డెన్పై ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.ఈ మద్యం తయారీదారులు తన సొంతపార్టీ వారే కావడంతో వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారని, సూత్రదారులను తప్పించేందుకు సిద్దమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, కల్తీ మద్యంతో జేబులు నింపుకునే వారికి కూటమి ప్రభుత్వ అండదండలు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా బయపడని కల్తీ మద్యం డెన్లు మరిన్ని ఉన్నాయని, మద్యం ముసుగులో దండుకోవడం చంద్రబాబుకు అలవాటేనని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..చంద్రబాబు ఆటోడ్రైవర్ల సేవ కార్యక్రమంలో మాట్లాడుతూ దుష్టుల పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వానికే దుష్టుల పాలన అనే పదం సరిగ్గా సరిపోతుంది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు ఈ రాష్ట్రానికి పట్టిన దుష్టగ్రహం ఎవరో? ఏడాదిన్నర కూటమి పాలనలో సీఎంగా చంద్రబాబు ఎన్ని అబద్దాలు ఆడారో లెక్కలేదు. చెప్పిన అబద్దాన్ని చెప్పకుండా రాజకీయం చేయడంలో చంద్రబాబు దిట్ట. సూపర్ సిక్స్ అనేదే పెద్ద అబద్దం. దాని గురించి ఎవరైనా మాట్లాడితే నాలుక మందం అంటూ మాట్లాడతారు.గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో లిక్కర్ స్కాం జరిగిందంటూ ఒక బేతాళకథను సృష్టించి, రోజుకో మలుపుతిప్పుతూ డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారు. అసలు స్కాం అంటే ఏమిటీ అంటే ప్రభుత్వపరంగా నడుస్తున్న లిక్కర్ దుకాణాలను ప్రైవేటు వారికి అప్పగించి, వేలం పేరుతో తమకు కావాల్సిన వారికి ఆ మద్యం దుకాణాలను కట్టబెట్టి, వాటికి అనుబంధంగా ఊరూరా బెల్ట్షాప్లను ఏర్పాటు చేసుకుని, ఎమ్మార్పీ రేట్లకు మించి ఇష్టం వచ్చిన ధరకు మద్యం అమ్ముకోవడాన్ని లిక్కర్ స్కాం అంటారు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది అక్షరాలా ఈ స్కామే.రాష్ట్రంలో తొంబై తొమ్మిది శాతం మద్యం దుకాణాలు కూటమి నేతల చేతుల్లోనే ఉన్నాయి. ఎవరికైనా వేలంలో వస్తే వారిని బెదరించి మరీ తమ పరం చేసుకున్నారు. దీనిపై విచారణకు సిద్దమా? అధిక ధరలకు, తమకు నచ్చిన బ్రాండ్లను మాత్రమే అమ్ముతూ దాని నుంచి వచ్చిన డబ్బును కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు వాటాలు వేసుకుని పంచుకుంటున్నారు.ప్రభుత్వానికి తెలియకుండానే కల్తీ మద్యం తయారు చేస్తున్నారా?తాజాగా తంబళ్లలపల్లిలో బయటపడ్డ నకిలీ మద్యం డెన్తో సీఎం చంద్రబాబు బండారం బయటపడింది. రోజుకు ఇరవై వేల బాటిళ్ళ నకిలీ మద్యాన్ని తయారు చేసి, పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారంటే, ఇది ఈ ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతోందా? స్పిరిట్తో ఒక పరిశ్రమ మాదిరిగా నకిలీ మద్యంను తయారు చేసి చెలామణి చేస్తున్నా ఈ ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం లేదా?తెలుగుదేశం నాయకులే ఈ నకిలీ మద్యం డెన్ను ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున మందుబాటు ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే ఈ ప్రభుత్వం నిద్రపోతోందా? లేక తన పార్టీ వారి నుంచి ఈ అక్రమ దందాలో వాటాలు అందుకుంటోందా? చంద్రబాబే దీనికి సమాధానం చెప్పాలి. తంబళ్ళపల్లిలో బయటపడింది గోరంత మాత్రమే. ఇంకా రాష్ట్రంలో కొండత నకిలీ మద్యం డెన్లు ఉన్నాయి. ఈ రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో ఉన్న మద్యం నాణ్యతను పరీక్షించాలి.కల్తీ మద్యం మాఫియాకు అండదండలుఏడాదిన్నరగా ఈ రాష్ట్రంలో ఎన్ని చోట్ల నకిలీ మద్యం కర్మాగారాలను ఏర్పాటు చేసి, మార్కెట్లో విక్రయించారో నిజాలు వెల్లడించాలి. ఈ నకిలీ మద్యం డెన్లలో పనిచేసేవారు ఒడిస్సా, తమిళనాడు నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినట్లుగా బయటపడింది. ఈ నకిలీ మద్యం తయారీ మాఫియాలో ఎవరెవరు భాగస్వాములూ ఉన్నారో బయటపెట్టాలి. ఈ వ్యవహారంలో చంద్రబాబుకు సంబంధించిన వారే సూత్రదారులు, పాత్రదారులు. డెన్లో పనిచేసే కొందరు కూలీలను పట్టుకుని, వారినే బాధ్యులుగా చూపి, అసలు మాఫియా ముఠాదారులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ నకిలీ మద్యం తయారీ కొనసాగుతోంది. ఎన్ని కోట్ల రూపాయలు ఈ దందాతో సంపాధించారో వెల్లడించాలి. ఇప్పుడు కూటమి పాలనలో జరుగుతున్న దానిని లిక్కర్ స్కాం అని కూడా అనలేం, దీనిని స్కాంలకే స్కాం అని పిలవాల్సి ఉంటుంది. నాణ్యమైన మద్యం ఇస్తామంటే దాని అర్థం తమ పార్టీ వారితో కుటీర పరిశ్రమ మాదిరిగా నకిలీ మద్యాన్ని తయారు చేయించి, చెలామణి చేయించడమేనా?. గత ప్రభుత్వంలో బార్లకు ప్రివిలేజ్ చార్జీలను పెంచాలని అధికారులు సిఫారస్ చేస్తే, దానిని హటాత్తుగా రద్దు చేయడం ద్వారా పెద్ద ఎత్తున ముడుగపులు అందుకుని, సీఐడీ విచారణలో ఆధారాలతో సహా దొరికిపోయిన చంద్రబాబు లిక్కర్ స్కాం గురించి మాట్లాడుతున్నాడురాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందిఅనంతపురం శిశుసంక్షేమ సంరక్షణ గృహంలో నవజాత శిశువుకు కనీసం పాలు ఇచి, ఆకలి తీర్చే వారు లేక శిశువు చనిపోయిందంటే దానికి ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం కాదా? ఏడుగుర్రాలపల్లిలో రెండేళ్ళపాటు ఇక దళిత బాలికపై పద్నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు దాష్టీకం చేసినా, ఈ ప్రభుత్వం మిన్నకుండిపోయింది. నారా లోకేష్ యువగళంలో ఈ రాష్ట్రంలో పదమూడు లక్షల మంది ఆటోడ్రైవర్లు ఉన్నారు, వారికి వైయస్ జగన్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ మాట్లాడిన మాటలు మరిచిపోయారా?ఆటోడ్రైవర్ల సేవ పేరుతో కేవలం 2.90 లక్షల మందికి మాత్రమే సాయంను అందించారు. ఎన్నికల ముందు ఒకలా, అధికారంలోకి రాగానే మరొకలా మాట్లాడటమేనా మీ గొప్పతనం? నారా లోకేష్ చెప్పినట్లుగా పదమూడు లక్షల మంది ఆటోడ్రైవర్లకు రూ.15వేల చొప్పున ఇవ్వాలంటే దానికి రూ.2250 కోట్లు అవసరం. కానీ మీరు ఇచ్చింది ఎంత అంటే కేవలం రూ.436 కోట్లు మాత్రమే. ప్రతి పథకంలోనూ ప్రచారం తప్ప, నిజంగా ఆ వర్గాలకు సాయం చేయాలనే చిత్తశుద్ది లేదు. కూటమి ఎన్నికల మేనిఫేస్టోలో లారీ, టిప్పర్ డ్రైవర్లకు కూడా సాయాన్ని ఇస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా? ఒక్క పథకాన్ని అయినా ఇచ్చిన హామీ మేరకు అమలు చేయలేని అసమర్థ పాలన చూస్తున్నాం. -
టీడీపీ నేతల దందా.. వెలుగులోకి మరో కల్తీ మద్యం డంప్
సాక్షి, అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లాలో మరో కల్తీ మద్యం డంప్ వెలుగులోకి వచ్చింది. ఉప్పరవాండ్ల పల్లిలో భారీ నకిలీ మద్యం డంప్ను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు.. ఇద్దరిని అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ములకల చెరువులో కోటి 75 లక్షల విలువ చేసే కల్తీ మద్యం సీజ్ చేసిన సంగతి తెలిసిందే. కల్తీ మద్యం డంప్ స్వాధీనం చేసుకుని 10 మందిని అరెస్ట్ చేశారు. కల్తీ మద్యం దందా అంతా టీడీపీ నేతల కనుసన్నలోనే జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.కాగా, తంబళ్లపల్లె నియోజకవర్గం మండల కేంద్రం ములకలచెరువుకు సమీపంలో శుక్రవారం (అక్టోబర్ 3) నకిలీ మద్యం తయారీ కేంద్రం బట్టబయలు కావడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఇంత భారీ రీతిలో నకిలీ మద్యం దందా సాగించడానికి ప్రభుత్వంలోని టీడీపీ ముఖ్య నేతల అండ ఉందని తెలుస్తోంది. ప్రతి నెలా కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరిగేవని తేలింది.ఇందులో కొంత సొమ్ము ముఖ్య నేతలకు ప్రతి నెలా చేరేదని సమాచారం. ఏడాదికి పైగా విచ్చలవిడిగా, నిర్భీతిగా యథేచ్ఛగా నకిలీ మద్యం తయారు చేసి.. జనంతో తాగించి వారి ప్రాణాలతో చలగాటం ఆడిన టీడీపీ నేతలు.. వారికి అన్ని విధాలా అండగా నిలిచిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా నోరెత్తడం లేదు.పైగా అసలు సూత్రధారులను తప్పిస్తూ.. పాత్రధారుల్లో అనామకులైన కొంత మందిపై మాత్రమే కేసులు నమోదు చేయించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా స్థాయిలో ముఖ్యనేత, తంబళ్లపల్లి ఇన్చార్జ్ కనుసన్నల్లో ఈ నకిలీ మద్యం ప్లాంట్ కార్యకలాపాలు కొనసాగాయని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు. ఇక్కడి కూలీలను పనిలో పెట్టుకుంటే బండారం బయట పడుతుందని భావించి, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు. ఈ విషయమై స్థానికులకు ఇదివరకే అనుమానాలు వచ్చినా, టీడీపీ నేతలకు జడిసి నోరు విప్పలేదు. -
‘భారీ కల్తీ మద్యం డంప్ దొరికితే ఎల్లో మీడియాకు కనిపించడం లేదా?’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పెద్దలు అక్రమార్జన కోసం చేసే ప్రయత్నాలు వెలుగులోకి వచ్చాయని.. కల్తీ మద్యం పరిశ్రమే బయటపడిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అధికారంలోకి రావడానికి కూటమి నేతలు చెప్పిందేమిటీ? చేస్తున్నదేమిటీ? అంటూ నిలదీశారు.అక్టోబర్ 3న ములకల చెరువులో భారీ కల్తీ మద్యం డంప్ స్వాధీనం చేసుకున్నారు. భారీ కల్తీ మద్యం డంప్ దొరికితే ఎల్లో మీడియాకు కనిపించడం లేదా.?. గత ప్రభుత్వ హయాంలో రూ.3,500 కోట్ల కుంభకోణం జరిగిదంటూ అనేక మందిని అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చే సమయంలో కోర్టు వ్యాఖ్యలు గుర్తు చేసుకోండి. అధికార దుర్వినియోగపరుస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారు. కూటమి ఆరోపణల్లో నిజముంటే కోర్టులో ఆధారాలు ఎందుకు చూపించలేదు?. మూలకల చెరువులో కల్తీ మద్యం డంప్ దొరికితే కూటమి నేతలు ఎందుకు మాట్లాడటం లేదు?. రోజుకి 30 వేల క్వార్టర్ బాటిళ్లు తయారు చేసే డంప్ దొరికితే ఏం చేస్తున్నారు?’’ అంటూ సతీష్రెడ్డి మండిపడ్డారు. -
కర్నూలు: రైతులను కంటతడి పెట్టిస్తున్న ఉల్లి పంట
సాక్షి, కర్నూలు: జిల్లాలో ఉల్లి పంట రైతుకు కంటతడి పెట్టిస్తోంది. ఉల్లికి మద్దతు ధర లేకపోవడంతో పంటను రైతులు పొలంలోనే వదిలివేస్తున్నారు. పంట పండించినా ప్రయోజనం లేకపోగా భూమి చదును చేసేందుకు రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉల్లి పంటను గొర్రెలకు, మేకలకు రైతులు వదిలేస్తున్నారు. పత్తికొండ మండలం పెద్దహుల్తి ఉల్లి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.ఎకరాకు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి అప్పుల ఊబిలో కూరుకు పోయమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతి కొచ్చిన పంటను వదిలేసి.. రైతు విశ్వనాథ్ ట్రాక్టర్తో దున్ని వేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా రైతులను ఆదుకోకపోతే భవిష్యత్తు కష్టమేనని రైతులు అంటున్నారు. -
‘బాబు అంటనే మోసం.. కబుర్లు తప్ప అభివృద్ధి శూన్యం’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు అంటనే మోసం అని వైఎస్సార్సీపీ నేత కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు కబుర్లు చెప్పడం తప్ప.. అభివృద్ధి చేయడం చేతకాదని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకమని తెలిపారు.ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు అధ్యక్షతన వైఎస్సార్సీపీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, ఎంపీలు గొల్ల బాబురావు, తనూజ రాణి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజక వర్గ సమన్వయ కర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, స్టీల్ ప్లాంటు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై చర్చ జరిగింది.అనంతరం, ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కన్నబాబు మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తుంది. వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందని ప్రైవేటుపరం చేస్తున్నారు. చంద్రబాబు అంటేనే ఒక మోసం. చంద్రబాబు కబుర్లు తప్ప ఎటువంటి అభివృద్ధి చేయలేదు. కూటమి పాలనలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంది. ఈ నెల తొమ్మిదో తేదీన వైఎస్ జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తారు’ అని తెలిపారు.రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు మాట్లాడుతూ..‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు లేదా మూసివేత తప్పదు అని కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పారు. స్టీల్ ప్లాంట్ను కాపాడే బాధ్యత మాది అని చెప్పారు. ఎన్నికలు తరువాత మాట మార్చారు. చంద్రబాబు ఎప్పుడూ నిజం చెప్పడు. చంద్రబాబు నిజం చెప్పితే ఆయన తల పగిలిపోతుంది. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం.మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ..‘ప్రజా సమస్యల మీద పోరాటం చేసేందుకు ఈ సమీక్ష సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుంది. 800 కోట్ల కేటాయించి కిడ్నీ హాస్పిటల్ కట్టించారు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఒక మంచి పని అయినా చేశారా?. వైఎస్ జగన్ చేసిన పనులను తాము చేసినట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. మూలపేట పోర్టులో 90 శాతం పని వైఎస్ జగన్ హయంలో జరిగింది. చేసింది చెప్పుకోవడంలో మనం వెనుకబడ్డము అని తెలిపారు.బొత్స ఝాన్సీ మాట్లాడుతూ..‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. స్టీల్ ప్లాంట్ కోసం వైఎస్సార్సీపీ ఎన్నో పోరాటాలు చేసింది. కూటమి ప్రభుత్వం 44 విభాగాలను ప్రైవేటీకరణ చేస్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే సంహరించుకోవాలి. ప్లాంట్కు సొంతంగా గనులు కేటాయించాలి.. లేదా సెయిల్లో విలీనం చేయాలి. గ్రామాల్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది. వైఎస్ జగన్ పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు.. కానీ ప్రజలకు ఏమీ చేయరు.ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ..‘ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి ప్రతిపక్ష పార్టీకి మంచి అవకాశం. స్థానిక సమస్యలు మీద నాయకులు పోరాటం చేయాలి. ఉత్తరాంధ్ర నిర్లక్షం చేయబడిన ప్రాంతం. అన్ని వనరులు ఉండి ఉత్తరాంధ్ర అభివృద్ధికి దూరంగా ఉంది. విభజన తర్వాత కేంద్రం ఇచ్చిన 23 సంస్థల్లో ఒకటి కూడా చంద్రబాబు శ్రీకాకుళంలో పెట్టలేదు. వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే ఉద్దానం కిడ్నీ హాస్పిటల్ 800 కోట్లతో ఏర్పాటు చేశారు. మూలపేటలో 3,600 కోట్లతో పోర్ట్ ఏర్పాటు చేశారు. 300 కోట్లతో ఫిషింగ్ హార్బర్స్ ఏర్పాటు చేశారు. దివంగత నేత వైయస్సార్, వైఎస్ జగన్ హయంలో ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందింది. స్టీల్ ప్లాంట్పై మన వైఖరి స్పష్టంగా ఉంది. ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం’ అని స్పష్టం చేశారు. -
చంద్రబాబు స్కెచ్.. రాత్రికి రాత్రే కల్తీ మద్యం సూత్రధారుల మార్పు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం సిండికేట్ వ్యవహారంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. కల్తీ మద్యం కేసులో అసలు సూత్రధారులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు స్కెచ్ వేసి.. ఆయన ఆదేశాల మేరకు రాత్రికి రాత్రే కేసు మార్చేశారని ఆరోపించారు. టీడీపీ నేతల సొంత ఆదాయాలకోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం న్యాయమేనా?’ అని ప్రశ్నించారు. నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్గా తీర్చిదిద్దాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నట్టున్నారు అంటూ విమర్శించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు.. మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన మీరు, ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమోకాని, లిక్కర్ సిండికేట్లతో, నకిలీ మద్యం తయారీల ద్వారా, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మీ పార్టీ నాయకులు గడించిన అక్రమ సంపాదనను పైనుంచి కింది వరకూ వీరంతా పంచుకుంటున్నారు. వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతోంది.మీ లిక్కర్ సిండికేట్లకు, గ్రామస్థాయి వరకూ విస్తరించిన బెల్టుషాపుల మాఫియాలకు, కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం మీరు ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారు. ఉద్దేశపూర్వకంగా వాటిని తీసివేసి, వాటి స్థానంలో మీ సిండికేట్లకు అప్పగించారు. మద్యం దుకాణాలు టీడీపీ వాళ్లవే. బెల్టు షాపులు టీడీపీ వాళ్లవే. ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు టీడీపీ వాళ్లవే. అక్రమ మద్యం తయారీ దారులు కూడా టీడీపీ నేతలే. వాళ్లు తయారుచేస్తారు, ఆ తయారు చేసిన దాన్ని మీ వాళ్లే, మీ షాపులద్వారా, మీ బెల్టు షాపుల ద్వారా అమ్ముతారు. అలా వచ్చిన డబ్బును వాటాలు వేసుకుని పంచుకుంటారు. రాష్ట్రంలో ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమేనన్న వార్తలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.లిక్కర్ వ్యవహారంలో మీ వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడ్డమే కాదు, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును మీరు దోచుకుంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దుచేసి విచ్చలవిడిగా మద్యం విక్రయాలను పెంచారు. మార్ట్లు పెట్టారు, తిరిగి మళ్లీ ఇల్లీగల్ బెల్టుషాపులు తెరిచారు, ప్రతి వీధిలోనూ పెట్టారు, రాత్రిపగలు తేడాలేకుండా లిక్కర్ అమ్మడం మొదలుపెట్టారు. ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు తెరిచారు..@ncbnగారూ.. మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన మీరు, ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన… pic.twitter.com/t329MJtbLe— YS Jagan Mohan Reddy (@ysjagan) October 5, 2025ఇంత విచ్చలవిడిగా తాగిస్తున్నా సరే, CAG నివేదికల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదునెలల్లో, అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానే లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం ₹6,782.21 కోట్లు కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లో, విచ్చలవిడిగా లిక్కర్ అమ్మినా సరే ఆదాయం ₹6,992.77 కోట్లు మాత్రమే వచ్చింది. కేవలం 3.10% వృద్ధి మాత్రమే. ఎక్కడైనా ప్రతిఏటా సహజంగా వచ్చే 10% పెరుగుదల కూడా రాలేదు. అంటే దీని అర్థం, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని, సిండికేట్ల రూపంలో, కల్తీ లిక్కర్ తయారీ రూపంలో మీ ముఠా కొట్టేస్తున్నట్టేగా అర్థం.కల్తీ లిక్కర్ వ్యవహారాలు కొన్ని నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా వెలుగుచూస్తున్నాయి. ఉత్తరాంధ్రలోనూ, గోదావరి జిల్లాల్లోనూ, ఇప్పుడు రాయలసీమలోనూ ఈ ఘటనలు బయటకు వచ్చాయి. కాని విచారణ, దర్యాప్తు తూతూమంత్రంగానే సాగుతున్నాయి. కారణం, ఈ అక్రమాల వెనుక ఉన్నది మీ బినామీలు అయిన మీ టీడీపీవాళ్లే. దీన్ని అరికట్టాలన్న చిత్తశుద్ధి ఉండి ఉంటే, ఇవాళ ములకలచెరువు ఘటన తర్వాత సప్లై చేసిన మద్యం షాపుల్లోనూ, బెల్టు షాపుల్లోనూ విస్తృతంగా తనిఖీలు జరిగి, కల్తీ బాటిళ్లను పట్టుకునేవారు. కాని అలా జరగలేదు.పైగా దీనికి కారకులైన వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అన్నమయ్య జిల్లా స్థాయి ముఖ్యనేత, టీడీపీ ఇన్ఛార్జి కనుసన్నల్లో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తే, వీరిని తప్పిస్తూ తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు, టీడీపీ ఇన్ఛార్జి అనుచరుడు మద్యం దుకాణంవైపు అధికారులెవ్వరూ కన్నెత్తిచూడలేదు. ఈ నేరాన్నంతటినీ విదేశాల్లో ఉన్న మరో వ్యక్తిపైకి తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సూత్రధారులను కాపాడేలా స్కెచ్ వేసి, మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు, మీ కార్యాలయ డైరెక్షన్లో రాత్రికి రాత్రే కేసు మార్చేశారు. దీనికి కారణం, ఈ దందాకు మీ నుంచి, మీ చెప్పు చేతల్లో ఉన్న వ్యవస్థల నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టే. మీ సొంత ఆదాయాలకోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం న్యాయమేనా?’ అని ప్రశ్నించారు. -
లైంగిక వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య
కొమరవోలు(పామర్రు): లైంగిక వేధింపులను తాళలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణాజిల్లా పామర్రు మండలం, కొమరవోలులో శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మేడపాటి ప్రవీణ్ రాజు, వసంత(24)కు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు చిన్నారులు. వీరి ఇంటికి సమీపంలో ఉన్న మెరుగుమాల పవన్ రోజూ వసంతను అసభ్య పదజాలంతో ఇబ్బంది పెడుతూ.. రెండు రోజుల నుంచి లైంగికంగా కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె శుక్రవారం ఉదయం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. ఆమెను భర్త హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున మృతి చెందింది. శనివారం రాత్రి బాధితురాలి వద్ద పోలీసులు వాగ్మూలం తీసుకున్నారు. తనను పవన్ నిత్యం లైంగికంగా వేధించడం వల్లే విషద్రావణం తాగానని చెప్పిందని పామర్రు ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, మృతదేహాన్ని పామర్రు–గుడివాడ జాతీయ రహదారిపై ఉంచి కుటుంబీకులు శనివారం రాస్తారోకో చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. -
ఐదుకి మించి చలాన్లు ఉన్నాయా?.. వాహనదారులకు షాకిచ్చిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వాహనదారులకు హెచ్చరిక. ట్రాఫిక్ రూల్స్(Traffic Rules) విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఇకపై తగిన మూల్యం చెల్లించక తప్పదు. చలాన్ల(Traffic Challans) చెల్లింపు విషయంలో కేంద్రం కీలక సవరణలను ప్రతిపాదించింది. దీని ప్రకారం.. 45 రోజుల్లోగా చలాన్లు కట్టాలి.. వాహనాలపై ఐదుకు మించి చలాన్లు ఉంటే ఏకంగా లైసెన్స్ సైతం రద్దు కావచ్చు. ఇకపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సిందే.వివరాల ప్రకారం.. సెంట్రల్ మోటారు వెహికిల్స్ రూల్స్-1989లో(Motor Vehicles Act) కేంద్ర రవాణాశాఖ ఈ కీలక సవరణలను ప్రతిపాదించింది. ఈ క్రమంలో చలాన్లపై చర్యల విషయమై కొత్తగా పలు కఠిన నిబంధనల్ని కేంద్ర రవాణాశాఖ తీసుకొచ్చింది. ఈ మేరకు డ్రాఫ్ట్ రూల్స్ నోటిఫికేషన్ను తాజాగా విడుదల చేసింది. చలాన్ల జారీ, చెల్లింపు, అప్పీల్ చేయడం వంటి అంశాలను డిజిటల్ మానిటరింగ్, ఆటోమేషన్ ఆధారంగా వేగవంతం చేయాలని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారుకు సంబంధిత అధికారులు మూడురోజుల్లోగా ఎలక్ట్రానిక్ రూపంలో నోటీసు జారీ చేయాలని, ఫిజికల్ రూపంలో 15 రోజుల్లోగా నోటీసు పంపాలని స్పష్టం చేసింది.కొత్త రూల్స్ ప్రకారం.. 👉ఎంవీ(మోటారు వెహికిల్) యాక్టు ప్రకారం.. ఒక వాహనంపై ఐదు, అంతకంటే ఎక్కువ చలాన్లు ఉంటే.. డ్రైవింగ్ లైసెన్సును సంబంధిత అథార్టీ సస్పెండ్ చేసే అధికారం ఉంది.👉అంతేకాకుండా లైసెన్స్ విషయంలో ఇప్పటికే ఉన్న నిబంధనలు కూడా అలాగే కొనసాగుతాయి.👉కొత్త నిబంధనల ప్రకారం.. చలాన్ చెల్లింపు గడువును 45 రోజుల్లో కట్టాల్సిందే. ప్రస్తుతం 90 రోజుల్లోగా చలాన్ చెల్లించాలి.👉చలాన్ కట్టకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది.👉ఒకవేళ చలాన్ల చెల్లింపు సకాలంలో జరగకపోతే.. సదరు వాహనంపై రవాణాశాఖ ఎలాంటి లావాదేవీలను అనుమతించదు.👉ఈ కారణంగా వాహనం అమ్మకం, కొనుగోలు వంటి జరగలేవు. లైసెన్సులో చిరునామా, పేరు మార్పుతోపాటు రెన్యువల్ కూడా కుదరదు.👉ప్రస్తుతం చలాన్లు వాహన యజమాని పేరుతో జారీ అవుతున్నాయి.👉కొత్త రూల్ ప్రకారం.. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో యజమాని వాహనం నడపలేదని నిరూపిస్తే.. డ్రైవింగ్ చేసిన వ్యక్తి బాధ్యుడు అవుతారు.అభ్యంతరాల స్వీకరణ..కేంద్ర రవాణా శాఖ ప్రతిపాదించిన ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే ఢిల్లీలో రహదారి రవాణా మంత్రిత్వశాఖలోని అదనపు కార్యదర్శికి పంపవచ్చని కేంద్రం తెలిపింది. comments-morth@gov.in కు ఈ-మెయిల్ కూడా చేయవచ్చని సూచించింది. -
పగలూరాత్రి తేడా లేకుండా బిర్యానీలు.. ఇలాగైతే కష్టమే!
ఒకప్పుడు వారంలో ఒకటి, రెండు రోజులు మాత్రమే మాంసాహారం తీసుకునే వాళ్లు. కొందరు ఏదైనా ప్రత్యేక సందర్భంగా మాత్రమే మాంసాహారం తినేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతిరోజూ మాంసాహారం తీసుకుంటున్న వారిని చూస్తున్నాం. అంతేకాదు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత కూడా మాంసాహారం లాగించేస్తున్నారు. అలాంటి వాళ్లు జబ్బులను కూడా కొనితెచ్చుకుంటున్నట్లు వైద్యులు చెపుతున్నారు. మాంసాహారం అధికంగా తీసుకునే వారిలో జీర్ణకోశ వ్యాధులతో పాటు, గుండెజబ్బులు, అధిక కొల్రస్టాల్, ఒబెసిటీతో పాటు, కొన్ని రకాల క్యాన్సర్లు కూడా సోకుతున్నాయంటున్నారు. వారంలో ఒకటి, రెండుసార్లు మాత్రమే మాంసాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇవే నిదర్శనం లబ్బీపేటకు చెందిన రాజేష్ వారంలో ఐదు రోజులు స్నేహితులతో కలిసి అర్ధరాత్రి ఫుడ్కోర్టుల్లో బిర్యానీలు లాగించేస్తుంటాడు. ఇటీవల అర్ధరాత్రి బిర్యానీ తిని ఇంటికి వెళ్లిన తర్వాత కడుపులో తీవ్రమైన మంట రావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. ఎండోస్కోపీ చేయగా అల్సర్స్ వచ్చినట్లు నిర్ధారించారు. పటమటకు చెందిన అన్వర్ ఎక్కువగా మటన్ తీసుకుంటుంటాడు. ఇటీవల ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరాడు. గుండె రక్తనాళంలో పూడికలు ఉన్నట్లు నిర్ధారించారు. కొల్రస్టాల్ స్థాయిలు కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇలా వీరిద్దరే కాదు కడుపు ఉబ్బరం, వాంతులు, విరోచనాలు, కడుపులో మంట వంటి జీర్ణకోశ సమస్యలతో వైద్యుల వద్దకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారమిలా.. మాంసాహారాన్ని మితంగా తీసుకోవాలి. వారానికి ఒకటీ, రెండు సార్లు మాత్రమే తీసుకోవడం మంచిది. కొవ్వు తక్కువగా ఉండే స్కిన్లెస్ చికెన్, చేపలు వంటివి ఎంచుకోవాలి. పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మాంసాహారం వల్ల కలిగే దు్రష్పభావాలను తగ్గించవచ్చు. వేపుడు కంటే ఉడికించిన కూరలు తినడం మేలు. జంక్ఫుడ్స్కు దూరంగా ఉండాలి, లేట్ నైట్ మాంసాహారం తీసుకోకూడదు. ఆహారం తీసుకోవడానికి సమయపాలన పాటించాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. సమస్యలు ఇలా... మటన్, బీఫ్, ఫోర్క్ వంటి రెడ్మీట్లో జీర్ణకోశ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. రెడ్మీట్ తినేవారిలో జీర్ణం కావడానికి అధిక సమయం పట్టడంతో పాటు, పేగుపై వత్తిడి పెరుగుతుంది. నిల్వ ఆహారం తినడం వలన కడుపు ఉబ్బరం, వాంతులు, విరోచనాలు అయ్యే అవకాశం ఉంది. రంగు, రుచి కోసం మాంసాహారంలో కొన్ని రకాల రంగులు వాడుతుంటారు. వాటి కారణంగా క్యాన్సర్లు పెరుగుతున్నాయి. సమయ పాలన లేకుండా జంక్ఫుడ్స్ తీసుకోవడం వలన జీర్ణకోశ సమస్యలతో పాటు, క్యాన్సర్లకు దారి తీస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 12 గంటలకు ఆహారం తీసుకోవడం మంచిది కాదు, ఆహారం తీసుకోవడంలో సమయపాలన పాటించాలి. మాంసాహారంలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలె్రస్టాల్ స్థాయిలను పెంచుతాయి, దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మాంసాహారంలో కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల, అధికంగా తింటే శరీర బరువు పెరుగుతుంది. జీర్ణకోశ సమస్యలు పెరిగాయి అధిక మాంసాహారం తీసుకునే వారిలో జీర్ణకోశ సమస్యలతో పాటు, గుండె జబ్బులు, ఒబెసిటీ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రెడ్మీట్ తినే వారిలో పేగులపై వత్తిడి పెరుగుతుంది. నిల్వ ఆహారం, జంక్ఫుడ్స్ తినే వారిలో అల్సర్స్, క్యాన్సర్లు సోకే అవకాశం ఉంది. కడుపు ఉబ్బరం, వాంతులు, విరోచనాలు, కడుపులో మంట వంటి సమస్యలతో మా వద్దకు ఎక్కువగా వస్తున్నారు. సమయపాలన లేని ఆహారపు అలవాట్లు జీర్ణ ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పళ్లు, కూరగాయలు, చిరుధాన్యాలకు ఆహారంలో ప్రాధాన్యత ఇవ్వాలి. – డాక్టర్ వీర అభినవ్ చింతా, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, సెంటినీ విజయవాడ -
మరణశయ్యపై విశాఖ ఉక్కు..!
‘‘విశాఖ స్టీలులో 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణపై 2021 జనవరిలో కేబినెట్ కమిటీ తీర్మానం చేసింది. దీనిని వెనక్కి తీసుకోలేదు. విశాఖ స్టీల్ ప్లాంటును సెయిల్లో విలీనం చేసే ప్రతిపాదన లేదు’’⇒ వైఎస్సార్సీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభలో అడిగిన పలు ప్రశ్నలకు ఆగస్టు 1వ తేదీన కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చేసిన ప్రకటన‘‘అప్పుల ఊబిలో కూరుకుపోయి నిర్వహణ సాధ్యం కాకుండా ఉన్న విశాఖ స్టీలు ప్లాంటు మూతపడటానికి దగ్గరగా ఉంది. ఉద్యోగుల భారాన్ని తగ్గించేందుకే వీఆర్ఎస్ అమలు చేస్తున్నాం’⇒ వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబురావు ఆగస్టు 8వ తేదీన అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి సెప్టెంబరు 16న సభలో ఇచ్చిన సమాధానం‘‘ఆర్ఐఎన్ఎల్కు సంబంధించి ప్రైవేటీకరణపై ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయంలో ఇప్పటివరకూ ఎటువంటి మార్పు లేదు’’⇒ విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణపై ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పాడి త్రినాథ్రావు 2025 మార్చి 2వ తేదీన ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు మార్చి 18న కేంద్ర ఆర్థికశాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) అండర్ సెక్రటరీ అజయ్ నాగ్పాల్ వివరణసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అనేక సందర్భాల్లో విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోలేదని... ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోలేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తూనే ఉంది. అయినప్పటికీ విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయిందంటూ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అటు పవన్, లోకేశ్లు ప్రకటిస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రజలతో పాటు స్టీలు ప్లాంటు సిబ్బందిని మభ్యపెట్టేందుకు పదేపదే ప్రజలను పక్కదారి పట్టిస్తూనే ఉన్నారు. వేతన బకాయిల సమస్యలో ఉద్యోగులుస్టీలు ప్లాంటుకు కేంద్రం రూ.11,400 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సమయంలో క్రెడిట్ తమదంటే తమదంటూ కూటమి నాయకులు గొప్పలు పోయారు. అయినప్పటికీ పూర్తిస్థాయిలో ప్యాకేజీ మొత్తం రాకపోగా, ఇప్పటికీ స్టీలు ప్లాంటు కార్మికులు భారీ వేతన బకాయిలతో సతమతమవుతున్నారు. మరోవైపు ఉద్యోగులను తొలగించేందుకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) అమలు చేస్తున్నారు. మొదటి దఫాలో వీఆర్ఎస్ ద్వారా 1,120 మంది కార్మికులతో రాజీనామా చేయించారు. రెండో విడతలో 464 మందిని ఇంటికి సాగనంపారు. అంతేకాకుండా కాంట్రాక్టు కార్మికులు 5,000 మందిని ఇప్పటికే తొలగించారు.కార్మిక సంఘాల ఆగ్రహంఅన్నింటికీ మించి విభాగాల వారీగా ప్రైవేటీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకుగానూ ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే 32 విభాగాల్లో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయాన్ని ఆహ్వానించేందుకు నిర్ణయించారు. తద్వారా ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రం ముందుకు తీసుకెళుతోంది. ఈ విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. రాష్ట్రంలోని అధికారపార్టీ నేతలు మాత్రం ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయిందంటూ ప్రకటనలు ఇవ్వడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ముడిసరుకుల కొరతతో విశాఖ స్టీల్ ఉత్పత్తి పెరగని పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం ప్రైవేటీకరణను ఆపేందుకు కూడా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం అవుతోంది.సెయిల్లో విలీనం అవశ్యం...స్టీల్ ప్లాంట్కు ప్రస్తుతం రోజుకు 6 ర్యాక్ల బొగ్గు అవసరం ఉంది. అయితే పూర్తిస్థాయి ఉత్పత్తికి 9 ర్యాక్లు కావాలి. నక్కపల్లిలో మిట్టల్ ప్రైవేటు ప్లాంటు ప్రారంభమైతే మొత్తం 13–14 ర్యాక్ల బొగ్గు అవసరం ఏర్పడుతుంది. కానీ ఒక్క రైల్వే లైన్తో ఈ సరఫరా సాధ్యం కాదు. మిట్టల్ సంస్థలు తమ వనరులతో సమస్య పరిష్కరించుకోగలుగుతాయి. విశాఖ స్టీలుకు అది కష్టమే. ఉద్యోగుల సంఖ్యను 12 వేల నుంచి 7 వేలకు తగ్గించే ప్రయత్నాలు జరుగుతుండగా, ఈ సిబ్బందితో పూర్తి ఉత్పత్తి సాధ్యం కాదంటున్నారు. కాబట్టి బొగ్గు గనులు కలిగిన సెయిల్లో విలీనం చేస్తేనే శాశ్వత పరిష్కారం సాధ్యమని భావిస్తున్నారు.వైఎస్సార్సీపీది దీర్ఘకాలిక పోరాటం...!విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొదటి నుంచీ వైఎస్సార్సీపీ ఒకే నిర్ణయంపై ఉంది. కేంద్రం చేసిన ప్రకటనను వెనక్కి తీసుకునేవరకూ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేస్తోంది. విశాఖ స్టీలు ప్లాంటును 100 శాతం ప్రైవేట్పరం చేసేందుకు అనుగుణంగా 2021 జనవరిలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి 2021 ఫిబ్రవరి 6వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. ఈ మేరకు 2021 మేలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఎప్పటికప్పుడు పార్లమెంటులో కూడా తన గళాన్ని గట్టిగా వినిపిస్తోంది. పార్లమెంటు సభ్యులతో కలిసి కేంద్రానికి పలు దఫాలుగా విశాఖ స్టీలును ప్రైవేటీకరించవద్దంటూ వినతిపత్రాలను వైఎస్ జగన్ సమర్పించారు.లక్షల మంది సాక్షిగా ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్లో 2022 నవంబరు 12న జరిగిన ప్రధాని మోడీ సభలో విశాఖ స్టీలు ప్లాంటును ప్రైవేటీకరించవద్దంటూ స్వయంగా ఆయన ఎదుటే వైఎస్సార్సీపీ తన గళాన్ని వైఎస్ జగన్ వినిపించారు. తద్వారా గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ సమయంలో ప్రైవేటీకరణపై కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ ప్రైవేటీకరణ దిశలో అడుగులు వేయడం ప్రారంభమైంది. -
క్షీణిస్తున్న పక్షుల జనాభా
దేశంలో పక్షుల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. ప్రధానంగా గడ్డి భూములు, చిత్తడి నేలల్లో కనిపించే పక్షులు 50 శాతం వరకూ తగ్గినట్లు సిటిజన్ సైంటిస్ట్ పోర్టల్ ఈ–బర్డ్ అధ్యయనంలో వెల్లడైంది. ఈ–బర్డ్ ప్లాట్ ఫాం ద్వారా 30 వేల మంది పక్షి ప్రేమికులు దేశంలో పక్షుల కదలికలను గమనిస్తూ వాటి ఫొటోలు తీసి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. ఆ సమాచారాన్నంతా క్రోడీకరించి విశ్లేíÙంచగా దేశంలోని పక్షుల జనాభా, వాటి వైవిధ్యం ప్రమాదకర రీతిలో పడిపోతున్నట్లు తేలింది.స్టేట్ ఆఫ్ ఇండియా బర్డ్స్ –2023 నివేదిక ప్రకారం దేశంలో 942 పక్షి జాతులున్నట్లు గుర్తించారు. తాజా అధ్యయనంలో వీటిలో 204 చాలా సంవత్సరాలుగా, మరో 142 జాతులు ప్రస్తుతం తగ్గుతున్నట్లు తేలింది. మొత్తంగా 346 పక్షి జాతులు కనుమరుగయ్యే దశలో ఉన్నట్లు తేలింది. 29 శాతం జాతులు స్థిరంగా ఉండగా, 11 శాతం కొంచెం పెరిగాయి. తగ్గుతున్న వాటిలో 178 జాతులను కాపాడేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని సిటిజన్ సైంటిస్టులు సూచిస్తున్నారు. –సాక్షి, అమరావతితగ్గుతున్న జాతుల్లో వలస వచ్చేవే ఎక్కువగా ఉన్నాయి. సైబీరియా తదితర ప్రాంతాల నుంచి శీతాకాలంలో భారత్లోని పలు ప్రాంతాలకు వచ్చే పక్షుల రాక తగ్గిపోయింది. చిత్తడి నేలలు, గడ్డి భూములు, చెరువులు, పొదలు కుంచించుకుపోవడంతో వలస పక్షుల ఆవాసాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతాల్లోనే 50 శాతం పక్షులు తగ్గిపోయినట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. రాష్ట్రంలో 557 పక్షి జాతులు ఉన్నట్లు గుర్తించగా వాటిలో 50 శాతం తగ్గాయి. చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో తరచూ కనిపించేవి ఇప్పుడు మాయమయ్యాయి.గడ్డి భూములు, చిత్తడి నేలలు పక్షుల ఆవాసాలు. అవి అధిక శాతం నాశనం కావడంతో ఆహారం దొరకడం లేదు. పర్యావరణంలో వస్తున్న పెను మార్పులు, పెరిగిన కాలుష్యం, ఆక్రమణల కారణంగా చిత్తడి నేలలు, గడ్డి భూములు తగ్గిపోయాయి. పక్షుల ఆవాసాలు చెదిరి వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ భూముల్లో ఉండే కీటకాలు, చిన్న జంతువులను తినే పక్షులు 25 శాతం కన్నా ఎక్కువ తగ్గాయి. పండ్లు, తేనె, తామరలు తినేవి మాత్రం స్థిరంగా ఉన్నాయి.తగ్గిపోతున్న కొన్ని పక్షులు1. బట్టమేక పక్షి (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్) 2. పిచ్చుకలు (హౌస్ స్పారో) 3. పాలపిట్ట (ఇండియన్ రోలర్) 4. నల్ల మెడ కొంగ (బ్లాక్–నెక్డ్ స్టార్క్) 5. గద్దలు (ఈగల్)6. అమూర్ ఫాల్కన్ (వలస పక్షి) 7. సైబీరియన్ కొంగ (సైబీరియన్ క్రేన్) 8. నల్లతోక పక్షి, బ్లాక్–టైల్డ్ గాడ్విట్ 9. నార్తర్న్ పింటెయిల్ 10. ఫ్లెమింగోస్అతక్షణ చర్యలు అవసరంపక్షి జాతుల సంరక్షణకు తక్షణం చర్యలు తీసుకోకపోతే మనుగడకే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పర్యావరణానికీ పెనుముప్పు అని చెబుతున్నారు. గడ్డి భూములు, చిత్తడి నేలలను కాపాడడం, స్థానికులతో కలిసి ఈ కార్యక్రమాలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో పక్షుల వైవిధ్యం వేగంగా తగ్గిపోతోందని బెంగుళూరు నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్కి చెందిన జీవ వైవిధ్య నిపుణుడు వివేక్ రామచంద్రన్ స్పష్టం చేశారు. -
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షం
చిత్తూరు రూరల్/తిరుపతి తుడా/చిత్తూరు రూరల్ (కాణిపాకం)/తిరుమల: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శుక్రవారం అర్ధరాత్రి వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం 8గంటల వరకు వాన పడుతూనే ఉంది. దీంతో పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండిపోయాయి. పలు మండలాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు పంటలు సైతం దెబ్బతిన్నాయి.⇒ చిత్తూరు జిల్లా సోమల మండలం పెద్ద ఉప్పరపల్లి వద్ద సీతమ్మ చెరువు నుంచి గార్గేయ నదికి వెళ్లే మార్గంలో వర్షం నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పది గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. టమాటా, వరి, పూలతోటలు, కూరగాయల పంటలు అధిక విస్తీర్ణంలో దెబ్బతిన్నట్లు రైతులు వాపోతున్నారు.⇒ చిత్తూరు జిల్లా తవణంపల్లిలోని మాధవరం వంక పొంగిపొర్లుతోంది. తొడతర బ్రిడ్జిపై వర్షపునీరు ఉధృతంగా పారుతోంది. ఈకారణంగా రాకపోకలు నిలిచిపోయాయి.తిరుపతిలో భారీ వర్షం భారీ వర్షం తిరుపతి నగరాన్ని ముంచెత్తింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత రెండు గంటల సమయంలో మొదలైన వర్షం ఉదయం 8 గంటల వరకు పడుతూనే ఉంది. కుండపోత కారణంగా కాలువలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు పెద్ద ఎత్తున చేరింది. లక్ష్మీపురం కూడలి, ఏఐఆర్ బైపాస్ రోడ్డు, లీలామహల్ కూడలి, కరకంబాడి రోడ్డు, కొర్లగుంట పెద్ద కాలువ ప్రాంతాల్లో వర్షం నీరు ఏరులై పారింది. ప్రమాదకరస్థాయిలో దాటడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అలానే రైల్వే అండర్ బ్రిడ్జ్ల వద్ద వరద నీరు ప్రమాదకర స్థాయికి చేరింది. తిరుమలలో కూడా..తిరుమలలో కూడా శనివారం భారీగా వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరపి లేని వర్షం కురవడంతో చలి తీవ్రత పెరిగింది. నాలుగు మాడవీధులు జలమయమయ్యాయి. రోడ్లన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి వెళ్లిన భక్తులు, దర్శనం అనంతరం ఆలయం బయటకు వచి్చనపుడు తడిసి ముద్దయ్యారు. వసతి గృహాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.వరి, టమాటా పంటలకు నష్టం అన్నమయ్య జిల్లాలో శనివారం పలుచోట్ల వర్షం కురిసింది. పీలేరులో భారీ వర్షం కురవడంతో రోడ్లపై నీరు నిలిచింది. ఆర్టీసీ బస్టాండ్ జలమయమైంది. పీలేరు–మదనపల్లె మార్గంలో నాలుగులేన్ల రహదారి విస్తరణలో భాగంగా నిర్మాణం కోసం కొత్తచెరువును తవ్వి వదిలేశారు. అయితే భారీ వర్షం కారణంగా చెరువు కట్ట తెగిపోయింది. దీంతో దిగువన ఉన్న పొలాల్లో వరి, టమాటా పంటలకు నష్టం వాటిల్లింది. భారీ వర్షానికి గార్గేయ ప్రాజెక్టు నిండి పింఛా నది పరవళ్లు తొక్కుతోంది. -
అతివేగంతోనే.. అత్యధిక ప్రమాదాలు!
దేశంలో 2023లో జరిగిన ప్రమాదాల్లో 4.44 లక్షల మంది మరణించారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, రైల్వే ప్రమాదాలు, రైల్వే క్రాసింగ్ ప్రమాదాల వంటి ‘ట్రాఫిక్ ప్రమాదాల్లో’ 1.98 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 45.8 శాతం ద్విచక్ర వాహనాల వల్లే జరిగాయి. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం.. అతివేగమే. ఇలా మొత్తం 2.81 యాక్సిడెంట్లలో 1.02 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా 20.7 శాతం సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల్లోపే జరిగాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల 2023లో 6,444 మంది ప్రాణాలు కోల్పోయారు.మహారాష్ట్రలో అత్యధికంగా 69,809 మంది ప్రమాదాల్లో మరణించగా, ఆ తరువాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (43,320), ఉత్తరప్రదేశ్ (43,207) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 19,949 ప్రమాదాల్లో 17,039 మరణించగా, తెలంగాణలో 22,903 ప్రమాదాల్లో 13,374 మంది ప్రాణాలు కోల్పోయారు.ట్రాఫిక్ మరణాలు..: రోడ్డు ప్రమాదాలు, రైల్వే ప్రమాదాలు, రైల్వే క్రాసింగ్ ప్రమాదాలు.. వీటిలో ప్రాణాలు కోల్పోయిన వారిని ‘ట్రాఫిక్ మరణాల’ కింద పరిగణించారు. 2019లో ఇలా 1.81 లక్షల మంది మరణిస్తే.. 2023 నాటికి ఈ సంఖ్య 1.98 లక్షలకు పెరిగింది. తెలంగాణలో 23,673 ట్రాఫిక్ ప్రమాదాల్లో 8,345 మంది మరణించగా.. ఏపీలో 21,078 కేసుల్లో 9,284 మంది ప్రాణాలు కోల్పోయారు.టూ వీలర్లే అత్యధికంమొత్తం రోడ్డు ప్రమాదాల్లో 45.8 శాతం ద్విచక్ర వాహనాల వల్లే జరిగాయి. కారు, జీపు, ఎస్యూవీల వల్ల 14.3 శాతం జరగ్గా.. ఆటోల వంటి త్రీవీలర్ల వల్ల 4.1 శాతం సంభవించాయి.అతివేగం అనర్థదాయకంరోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం పరిమితికి మించిన వేగంతో వెళ్లడమే. ఇలా 58.6 శాతం ప్రమాదాలు జరిగాయి. మొత్తం 2.81 యాక్సిడెంట్లలో 1.02 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్, ఓవర్ టేకింగ్ వంటి వాటివల్ల 23.6 శాతం యాక్సిడెంట్లు సంభవించాయి. మాదక ద్రవ్యాలు, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల 2.1 శాతం ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 60.2 శాతం (2.80 లక్షల కేసులు) గ్రామీణ ప్రాంతాల్లో నమోదు కాగా.. 39.8 శాతం (1.84 లక్షలు) పట్టణాల్లో జరిగాయి.రాత్రిపూటే అధికంమొత్తం రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా 20.7 శాతం (95,984) సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల్లోపే సంభవించాయి. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల్లోపు 17.3 శాతం, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల్లోపు 15 శాతం సంభవించాయి. -
పేరుకే కన్వినర్ కోటా.. లక్షల్లో ఫీజులు
పుత్తూరు: తిరుపతి జిల్లా పుత్తూరులోని అన్నాగౌరీ మెడికల్ కళాశాల యాజమాన్యం ఫీజుల బాదుడుకు విద్యార్థులు, తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పైవేటు వైద్య కళాశాలలు కన్వినర్ కోటా కింద ఒక్కో సీటుకు ఫీజు రూ.1.70 లక్షల వరకు వసూలుచేస్తుండగా అన్నాగౌరీ కళాశాల యాజమాన్యం మాత్రం హాస్టల్ విత్ ఏసీ అయితే రూ.5.36 లక్షలు, నాన్ ఏసీ అయితే రూ.4.56 లక్షలు కట్టాల్సిందేనంటున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. కళాశాల కమిటీ నిర్ణయం ఇదేనని.. మీకు ఇష్టముంటే చేరండి లేదంటే వెళ్లండంటూ సీఈఓ నిర్లక్ష్యంగా చెబుతున్నారంటూ కన్వినర్ కోటా కింద సీట్లు పొందిన 50 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు. మానసికంగా కుంగిపోయా.. అన్నాగౌరీ కళాశాలలో ఫీజులు వినగానే మానసికంగా కుంగిపోయాను. మాది వైట్కార్డ్ హోల్డర్కు చెందిన పేద కుటుంబం. మా అబ్బాయిని కష్టపడి చదివించుకున్నాం. అన్ని కళాశాలల్లాగే అన్ని ఫీజులు కలిపి రూ.1.70 లక్షలు ఉంటుందనుకున్నాం. కానీ, ఈ అన్నాగౌరీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ కిట్ రూ.1.10 లక్షలు పెట్టి తీసుకోవాలన్నారు. మా వద్ద కిట్ ఉంది కనుక మాకు అది అవసరం లేదు. స్పోర్ట్స్, కల్చర్ ఫీజు కింద రూ.55 వేలు చెల్లించాలన్నారు. హాస్టల్లో విధిగా ఉండాలన్నారు. హాస్టల్ రూమ్ ఫీజు రూ.1.10 లక్షలు, ఏసీ అయితే రూ.1.90 లక్షలతో పాటు, ఎక్కడాలేని విధంగా విద్యుత్ చార్జీలకు మరో రూ.40 వేలు కట్టాలన్నారు. ఎమినిటీస్ రూ.20 వేలు అంటున్నారు. ఇలా మొత్తం ఫీజు రూ.5.36 లక్షలు. – లత, నంద్యాలరూ.5 లక్షలు కడితే అది కన్వినర్ కోటా ఎలా అవుతుంది?.. రూ.నాలుగు నుంచి ఐదు లక్షల వరకు కడితే అది కన్వీనర్ కోటా ఎలా అవుతుంది? మా పాపకు కన్వినర్ కోటా కింద సీటొచి్చంది. గాయత్రి కళాశాలలో రూ.1.50 లక్షలు ఫీజు అయితే ఇక్కడ దాదాపు రూ.5 లక్షలు వరకు చెబుతున్నారు. ఇంత ఎక్కువ ఏమిటి సార్.. అని అడిగితే కమిటీ నిర్ణయం తీసుకుంది.. ఇష్టం ఉంటే చేరండి లేదంటే వెళ్లిపొండి అంటున్నారు. – ప్రియ, అనంతపురం -
నువ్వు టీడీపీలోకి రాకపోతే... నీ మనవడిని చంపేస్తాం
సాక్షి టాస్క్ ఫోర్స్: ‘ఆమెకు చెప్పండి... లక్ష్మీదేవమ్మ టీడీపీలో చేరకపోతే ఆమె మనవడిని చంపేస్తాం...’ అని కర్నూలు జిల్లా కోడుమూరు టీడీపీ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ డి.విష్ణువర్ధన్రెడ్డి కర్నూలు రూరల్ మండలం నూతనపల్లె వైఎస్సార్సీపీ మహిళా ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మను హెచ్చరించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి 40 కార్లలో లక్ష్మీదేవమ్మ ఇంటికి వెళ్లి పట్టపగలు పోలీసుల సమక్షంలోనే ఆమె మనవడు మహేంద్రను కిడ్నాప్ చేశారు.అడ్డొచ్చిన మహిళలపై విచక్షణారహితంగా టీడీపీ మూకలు దాడి చేశారు. ఈ దౌర్జన్యకాండను వీడియోలు తీసినవారి సెల్ఫోన్లు లాక్కుని ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఒక ఎమ్మెల్యేనే దగ్గరుండి కిడ్నాప్ చేయించడం, పోలీసులు చేష్టలుడిగి చూడటం రాష్ట్రంలో అరాచక పాలనకు మరో నిదర్శనమని గ్రామస్తులు మండిపడుతున్నారు. గ్రామంపైకి దండయాత్ర టీడీపీ నాయకులు కర్నూలు రూరల్ ఎంపీపీ పదవిపై కన్నేశారు. తమకు బలం లేకపోయినా వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను భయపెట్టి టీడీపీలో చేర్చుకోవాలని ఎమ్మెల్యే దస్తగిరి, విష్ణువర్ధన్రెడ్డి నిర్ణయించారు. గురువారం వైఎస్సార్సీపీకి చెందిన నూతనపల్లె ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మ, నందనపల్లె ఎంపీటీసీ జ్యోతి, రేమట ఎంపీటీసీ సుజాత, దిన్నెదేవరపాడు–1 ఎంపీటీసీ రామనాథ్రెడ్డిలను అభివృద్ధి పనులపై చర్చించాలని పిలిచి వారికి టీడీపీ కండువాలు వేశారు. నూతనపల్లె ఎంపీటీసీ లక్ష్మీదేవి తాను వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని శుక్రవారం ప్రకటించారు.దీనిని జీరి్ణంచుకోలేని టీడీపీ ఎమ్మెల్యే దస్తగిరి, విష్ణువర్ధన్రెడ్డి శనివారం ఉదయం 40 వాహనాలతో నూతనపల్లెపై దండయాత్ర చేశారు. ఊరిలో అడ్డువచ్చిన వారిని కొట్టి ఎంపీటీసీ సభ్యురాలి ఇంటిపై దండెత్తారు. ఆ సమయంలో ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మ, ఆమె కుమారుడు కృష్ణ ఇంట్లో లేరు. భయంతో ఆడవాళ్లు తలుపులు వేసుకుని లోపల ఉన్నారు. టీడీపీ మూకలు తలుపులు పగలగొట్టి అడ్డువచ్చిన మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసి లక్ష్మీదేవమ్మ మనవడు మహేంద్ర(22)ను లాక్కెళ్లి కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు.లక్ష్మీదేవమ్మ టీడీపీలోకి రాకపోతే మహేంద్రను చంపేస్తామని కుటుంబ సభ్యులను హెచ్చరించారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ మూకలు ఇష్టానుసారంగా కొట్టడం, యువకుడిని కిడ్నాప్ చేయడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. మరో ఎంపీటీసీ కుటుంబానికీ బెదిరింపులు గురువారం టీడీపీ నేతలు కండువా కప్పిన దిన్నెదేవరపాడు–1 ఎంపీటీసీ రామనాథ్రెడ్డి కూడా శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులను కూడా టీడీపీ నాయకులు బెదరించారు. రామనాథ్రెడ్డి టీడీపీలోకి రాకపోతే ఎంతవరకైనా వెళతామని, అంతు చూస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం ఖూనీ: ఎస్వీ మోహన్రెడ్డి నూతనపల్లె ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మీదేవమ్మ, దిన్నెదేవరపాడు–1 ఎంపీటీసీ రామనాథ్రెడ్డి కుటుంబ సభ్యులను టీడీపీ నాయకులు బెదిరించడం, కిడ్నాప్ చేయడంపై వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ నాయకులు బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, వారికి పోలీసులు వత్తాసు పలకడం అన్యాయమన్నారు. మహేంద్ర కిడ్నాప్పై వెంటనే కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బలం లేకపోయినా బరితెగింపుకర్నూలు రూరల్ మండలంలో 23 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 12, టీడీపీ 10 స్థానాల్లో విజయం సాధించాయి. ఇండిపెండెంట్ ఒక స్థానంలో గెలుపొందారు. వైఎస్సార్సీపీకి చెందిన జి.సింగవరం ఎంపీటీసీ డి.సవారన్న, పసుపల టీడీపీ ఎంపీటీసీ మురళీకృష్ణ చనిపోయారు. పంచలింగాల ఎంపీటీసీగా ఉన్న బస్తిపాటి నాగరాజు(టీడీపీ) కర్నూలు ఎంపీగా గెలిచారు. ఆర్.కొంతలపాడు ఎంపీటీసీ కె.గిడ్డమ్మ(టీడీపీ) సుంకేసుల సర్పంచ్గా గెలిచారు.దీంతో పంచలింగాల, ఆర్.కొంతలపాడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎంపీటీసీ బోయమద్దిలేటి(దిన్నెదేవరపాడు–2)తో కలుపుకొని వైఎస్సార్సీపీకి 12 మంది సభ్యుల బలం ఉంది. టీడీపీ బలం 7కు తగ్గింది. ఎంపీపీగా ఉల్చాల ఎంపీటీసీ వెంకటేశ్వరమ్మ(వైఎస్సార్సీపీ) కొనసాగుతున్నారు. తగిన బలం లేకపోయినా ఎంపీపీ పదవిని పొందాలని టీడీపీ నాయకులు కుట్రలు పన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను బెదిరించి తమ పార్టీలో చేర్చుకునేందుకు బరితెగించారు. -
డ్రైవర్ అన్నలకు బాబు బురిడీ
సాక్షి, అమరావతి: ‘అంతన్నాడింతన్నాడే గంగరాజు...’ అని ఉత్తరాంధ్రలో ఓ జానపద గీతం బాగా పాపులర్. ప్రస్తుతం చంద్రబాబు పనితీరూ అలానే ఉంది. మేనిఫెస్టోలో అంత చేస్తాం.. ఇంత చేస్తాం.. అని హామీలు ఇచ్చిన ఆయన తీరా అధికారంలోకి రాగానే మరోసారి తన ట్రేడ్ మార్కు శైలిలో బురిడీ కొట్టిస్తున్నారు. ‘ఆటో డ్రైవర్ల సేవలో..’ అని చెప్పి తీరా అమలులోకి వచ్చేసరికి కొందరికే అంటూ టోకరా వేశారు. మేనిఫెస్టోను యథాతథంగా ఏనాడూ అమలు చేయని చంద్రబాబు మరోసారి తన ట్రాక్ రికార్డును కొనసాగించారు. ఈసారి ఆయన్ను నమ్మి మోసపోయిన బాధితుల జాబితాలో పేద డ్రైవర్లు కూడా చేరారు. మొదటి ఏడాది పథకాన్ని అమలు చేయకుండా పూర్తిగా ఎగవేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. రెండో ఏడాది సరికొత్త మోసానికి తెరతీసింది. దరఖాస్తు చేసేందుకే అవకాశం లేకుండా నిబంధనల చట్రం బిగించి, ఏకంగా 80 శాతం మందికి పథకం అందకుండా చేసింది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం డ్రైవర్లకు ఎంతో చేసిందని చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ ఎల్లో మీడియా ద్వారా సొంత డబ్బా కొట్టుకోవడం విస్మయ పరుస్తోంది. ఇవ్వని హామీ నెరవేరుస్తున్నామని గొప్పలు చెబుతుండటం నివ్వెరపోయేలా చేస్తోంది.ఇద్దరూ బురిడీ బాబులేప్రతి ఎన్నికల ముందు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించే చంద్రబాబు.. 2024 ఎన్నికల ముందు అదే పన్నాగాన్ని అమలు చేశారు. బ్యాడ్జి ఉన్న ప్రతి డ్రైవర్కు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామని టీడీపీ–జనసేన–బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మాటలతో బూరెలు వండటంలో తన తండ్రిని మించిపోయేలా లోకేశ్ హామీలు గుప్పించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్థిక సహాయం పథకం లబ్ధిదారులయ్యేందుకు బ్యాడ్జి ఉన్న డ్రైవర్లు 13 లక్షల మంది ఉన్నారని ఆయన 2023లోనే ప్రకటించారు. అంటే కనీసం 13 లక్షల మందికి ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన చెప్పారు. ఈ రెండేళ్లలో మరో రెండు లక్షల మంది బ్యాడ్జి పొంది ఉంటారని రవాణా శాఖ వర్గాలే చెబుతున్నాయి. అంటే ప్రస్తుతం 15 లక్షల మంది అర్హులు ఉన్నారని లెక్క తేలుతోంది. ఆ ప్రకారం 15 లక్షల మందికి రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.2,250 కోట్లు ఆర్థిక సహాయం చేయాలి.ఇదీ టీడీపీ మేనిఫెస్టో బ్యాడ్జీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్కు ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న భాగం ఏకంగా 80 శాతం ఎగవేతమేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అర్హులందరికీ ఈ పథకాన్ని వర్తింప చేస్తామన్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా... ‘డ్రైవర్ అన్నల సేవలో..’ అంటూ కేవలం రూ.436 కోట్లే ఇచ్చింది. అందుకోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ తొక్కింది. బ్యాడ్జి ఉంటే చాలు పథకం వర్తింపజేస్తామన్న చంద్రబాబు.. తీరా ఆర్థిక సహాయం చేయాల్సి వచ్చే సరికి ఏకంగా 18 నిబంధనలు పెట్టారు. తద్వారా బ్యాడ్జి ఉన్న డ్రైవర్లు కనీసం దరఖాస్తు చేసేందుకు కూడా అవకాశం లేకుండా చేశారు. లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లు, రేషన్ సరుకులు డెలివరీ వాహనాలు.. ఇలా లక్షలాది మందికి పథకం అందకుండా ఆంక్షలు విధించారు. లోకేశ్ చెప్పినట్టు 2023లోనే 13 లక్షల మంది బ్యాడ్జి ఉన్న వారు ఉంటే.. టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రకటించిన ‘డ్రైవర్ అన్నల సేవలో’ పథకాన్ని 2.9 లక్షల మందికే పరిమితం చేసి, ఏకంగా 12 లక్షల మందికి ఎగ్గొట్టారు. ఈ 2.9 లక్షల మందిలో కూడా తుదకు ఎంత మందికి ఎగ్గొడతారో అని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లికి వందనం పథకాన్ని ఇందుకు ఉదహరిస్తున్నారు. ఆటో డ్రైవర్ల సేవలో.. పథకానికి సంబంధించి అర్హత నిబంధనల పేరుతోనే ఏకంగా 10 లక్షల మందికి కోత విధించారు. ఇక దరఖాస్తు చేసిన 3,21,531 మందికి కూడా పథకాన్ని వర్తింప చేయలేదు. వారిలో కూడా 2,90,669 మందినే అర్హులుగా ప్రకటించారు. దాంతో ఈ పథకం కింద ఆర్థిక సహాయం రూ.436 కోట్లకే సరిపెట్టారు. ఇస్తామని ఎన్నికల్లో చెప్పింది రూ.2,250 కోట్లు కాగా, ఇచ్చింది కేవలం రూ.436 కోట్లే. అంటే ఇచ్చిన హామీలో 80 శాతం కోత విధించారన్నది స్పష్టమవుతోంది. అదీ చంద్రబాబు మార్కు బురిడీ అంటే అని మరోసారి రాష్ట్ర ప్రజలకు తెలిసేలా చేశారు. తొలి ఏడాది పూర్తిగా ఎగవేత మేనిఫెస్టోను అమలు చేయకుండా అడ్డదారులు వెతకడంలో తనది మాస్టర్ మైండ్ అని చంద్రబాబు మరోసారి నిరూపించారు. బ్యాడ్జి ఉన్న డ్రైవర్లు అందరికీ ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్న ఆయన.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది అంటే 2024లో ఆ పథకం ఊసే ఎత్త లేదు. తొలి ఏడాది డ్రైవర్లకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం చేయలేదు. ఆ విధంగా ఒక ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది పథకం అమలు చేస్తామంటూనే ఏకంగా 18 నిబంధనలు విధించి అర్హుల జాబితాలో భారీగా కోత విధించారు. మేనిఫెస్టోను సక్రమంగా అమలు చేయకుండా మోసం చేయడంలో చంద్రబాబు ట్రేడ్ మార్క్ అంటే ఇదే మరి. ఇప్పటికే భారీగా ఆదాయం కోల్పోతున్న ఆటో డ్రైవర్లుచంద్రబాబు ప్రభుత్వ విధానాలతో ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇక్కట్లలో కూరుకుపోతున్నారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల ఆదాయం భారీగా పడిపోయింది. ఆటోల నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకం ద్వారా అయినా కాస్త ఊరట లభిస్తుందని ఆశించిన డ్రైవర్లకు నిరాశే మిగిలింది. ఏకంగా 10 లక్షల మందిని ఈ పథకానికి అనర్హులుగా చేసి కూటమి ప్రభుత్వం మోసం చేసిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పథకాన్ని సక్రమంగా అమలు చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంమేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేయడం అంటే ఏమిటో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు చేతల్లో చూపించింది. సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సి కేబ్, రేషన్ వాహనాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ‘వైఎస్సార్సీపీ వాహన మిత్ర’ పథకాన్ని అందించింది. మొదటి ఏడాది అని ఎగవేయలేదు. చివరి ఏడాది ఎన్నికల నియమావళి అని సాకుతో తప్పించుకోలేదు. అధికారంలోకి రాగానే పథకం అమలు చేసింది. కోవిడ్ సమయంలోనూ క్రమం తప్పకుండా అందించింది. చివరి ఏడాది ఎన్నికల నియమావళి అమలులోకి రావడానికి ముందే వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద ఆర్థిక సహాయం అందించింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అంటే ఏమిటో వైఎస్ జగన్ చేతల్లో చూపించారని డ్రైవర్లు ప్రస్తుతం గుర్తు చేసుకుంటుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ విరమించకపోతే ఉద్యమం
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్ని పీపీపీ విధానం పేరిట ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోకుంటే ఉద్యమం తప్పదని పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ సమితి హెచ్చరించింది. శనివారం పాలకొల్లులోని పూలపల్లి అంబేడ్కర్ భవనంలో సీపీఎం ఆధ్వర్యంలో ‘పాలకొల్లు ప్రభుత్వ మెడికల్ కళాశాల పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ’ అంశంపై నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో పలువురు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ వైద్య విద్య అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.ఇందులో భాగంగా 17 మెడికల్ కళాశాలలను జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇందుకోసం గత ప్రభుత్వం రూ.2,400 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఇంకా దాదాపు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు అని గొప్పలు చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం కనీసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పూర్తి చేయలేదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం అరకొర పనులు చేపట్టిందని కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ వాటిని ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించామని కబుర్లు చెబుతూ ప్రజలకు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. పీపీపీ అంటూనే వైద్యకళాశాలలు ప్రైవేటుపరం కావని చెప్పడం హాస్యాస్పదమని మండిపడ్డారు. పీపీపీ పద్ధతి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకే కాకుండా ఓసీ కులాల్లోని పేద విద్యార్థులకూ నష్టం కలిగిస్తుందన్నారు.వైద్యం, విద్య రెండూ ప్రభుత్వ రంగాల్లో ఉంటేనే ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. ఇప్పటికే విద్య, వైద్యం రెండూ ఖరీదయ్యాయని, మరింత ఖరీదు కాకుండా ఉండాలంటే కూటమి ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, సీపీఎం నేత జేఎన్వీ గోపాలన్, దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు గంటా సుందర్కుమార్, సంచార జాతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పెండ్ర వీరన్న, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు జవ్వాది శ్రీనివాసరావు, జేవీవీ జిల్లా నాయకుడు యర్రా అజయ్కుమార్, దగ్గులూరు సర్పంచ్ పేరయ్య, పట్టణ జేఏసీ చైర్మన్ గుడాల హరిబాబు తదితరులు మాట్లాడారు. -
విద్య, వైద్యాన్ని పెత్తందారుల చేతుల్లో పెట్టే కుట్ర
సాక్షి, విశాఖపట్నం: విద్య, వైద్యాన్ని పెత్తందారుల చేతుల్లో పెట్టేసి.. ప్రజలకు ప్రధాన అవసరాల్ని దూరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో కుట్ర పన్నుతోందని ‘పీపుల్స్ ఫర్ ఇండియా’ ధ్వజమెత్తింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీల్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) పేరుతో కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రజారోగ్యం ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరుతూ ప్రజారోగ్య వేదిక, పీపుల్ ఫర్ ఇండియా విశాఖపట్నం చాప్టర్ ఆధ్వర్యంలో స్థానిక అల్లూరి విజ్ఞాన కేంద్రంలో శనివారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. విలువైన ప్రజాధనాన్ని కారుచౌకగా ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేసే చంద్రబాబు వైఖరిపై ప్రజా ఉద్యమాలు చేపట్టాలని తీర్మానించారు.ఐదేళ్ల తర్వాత పదవిలో ఉంటామన్న గ్యారెంటీ లేదు ఐదేళ్ల తర్వాత గెలుస్తామో లేదో అన్న గ్యారెంటీ అధికారంలో ఉన్న వాళ్లకి లేదు. ఐదేళ్లలోనే 50 ఏళ్ల రాజకీయ జీవితంలో సంపాదించాల్సిందంతా సంపాదించేయాలన్న తొందరతోనే రాజకీయ నాయకులు తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు బలవుతున్నారు. కాబట్టి.. ప్రజలే ముందుకు రావాలి. నిరసనల్ని ఉద్యమంగా మార్చి.. ప్రజావ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. – ఎంవీఎస్ శర్మ, మాజీ ఎమ్మెల్సీప్రజాధనాన్ని ప్రైవేట్కివ్వడమే సంపద సృష్టా? సంపద సృష్టి అంటే ప్రజలకు అనుకున్నారు. కానీ.. ప్రైవేట్ వాళ్లకు అని చంద్రబాబు ప్రభుత్వ విధానాల ద్వారా అర్థమవుతోంది. వైద్య కళాశాలల్ని ప్రైవేట్పరం చేస్తే.. పేద విద్యార్థులు ఆర్థిక భారంతో చదువుకు దూరమవుతారు. ఇప్పటికే పేదలకు వైద్యం భారంగా మారింది. ఈ కాలేజీలు ప్రైవేట్పరం చేస్తే.. మరింత భారమవుతుందన్న విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. – కేఎస్ చలం, మాజీ ఉపకులపతి, ద్రవిడ యూనివర్సిటీప్రజాధనాన్ని ప్రైవేట్కివ్వడమే సంపద సృష్టా? సంపద సృష్టి అంటే ప్రజలకు అనుకున్నారు. కానీ.. ప్రైవేట్ వాళ్లకు అని చంద్రబాబు ప్రభుత్వ విధానాల ద్వారా అర్థమవుతోంది. వైద్య కళాశాలల్ని ప్రైవేట్పరం చేస్తే.. పేద విద్యార్థులు ఆర్థిక భారంతో చదువుకు దూరమవుతారు. ఇప్పటికే పేదలకు వైద్యం భారంగా మారింది. ఈ కాలేజీలు ప్రైవేట్పరం చేస్తే.. మరింత భారమవుతుందన్న విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. – కేఎస్ చలం, మాజీ ఉపకులపతి, ద్రవిడ యూనివర్సిటీప్రభుత్వం తీరు దుర్మార్గంగా ఉంది కేజీహెచ్కు రోజూ 3,200 ఓపీ వస్తోంది. చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ అన్నీ కలిపితే ఇందులో పావు వంతు కూడా ఓపీ ఉండదు. సింహభాగం ప్రజలకు వైద్యం ఉచితంగా.. ప్రభుత్వ హాస్పిటల్స్లోనే అందాలి. అమరావతికి రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.5 వేల కోట్లు కేటాయించలేరా. – టి.కామేశ్వరరావు, అధ్యక్షుడు, ప్రజారోగ్య వేదిక అప్పుడొకటి చెప్పి.. ఇప్పుడు ముంచేస్తున్నారు పీపీపీ పేరుతో సంపద మొత్తం ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే.. ఎవరికి సొంత ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో చంద్రబాబు వైఖరి స్పష్టంగానే ఉంది. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడుపుతుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు నిలువునా ముంచేస్తున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయం వల్ల విద్యార్థులతో పాటు.. ప్రజలూ తీవ్రంగా నష్టపోతారు. – పి.రామ్మోహన్, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్ఎఫ్ఐకార్పొరేట్ పీఎం, కార్పొరేట్ సీఎం వల్లే..! వైద్య కళాశాలలపై పోరాటం ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేంద్రంలో కార్పొరేట్ పీఎం, రాష్ట్రంలో కార్పొరేట్ సీఎం ఉన్నారు. ప్రజలకు సేవ చేయరు కానీ.. ప్రైవేట్ సంస్థలపై మాత్రం ప్రేమ కురిపిస్తారు. కనిపించిన ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్కు «కట్టబెట్టేలా చట్టం చేస్తారేమో. భూమి, భవనం, మౌలిక వసతులు అన్నీ కల్పించి ప్రైవేట్కు కాలేజీలను అప్పగించడం హేయమైన చర్య. – రామారావు, రిటైర్డ్ డీఎంహెచ్వో ప్రభుత్వం తీరు దుర్మార్గంగా ఉంది కేజీహెచ్కు రోజూ 3,200 ఓపీ వస్తోంది. చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ అన్నీ కలిపితే ఇందులో పావు వంతు కూడా ఓపీ ఉండదు. సింహభాగం ప్రజలకు వైద్యం ఉచితంగా.. ప్రభుత్వ హాస్పిటల్స్లోనే అందాలి. అమరావతికి రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.5 వేల కోట్లు కేటాయించలేరా. – టి.కామేశ్వరరావు, అధ్యక్షుడు, ప్రజారోగ్య వేదిక అప్పుడొకటి చెప్పి.. ఇప్పుడు ముంచేస్తున్నారు పీపీపీ పేరుతో సంపద మొత్తం ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే.. ఎవరికి సొంత ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో చంద్రబాబు వైఖరి స్పష్టంగానే ఉంది. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడుపుతుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు నిలువునా ముంచేస్తున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయం వల్ల విద్యార్థులతో పాటు.. ప్రజలూ తీవ్రంగా నష్టపోతారు. – పి.రామ్మోహన్, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్ఎఫ్ఐకార్పొరేట్ పీఎం, కార్పొరేట్ సీఎం వల్లే..! వైద్య కళాశాలలపై పోరాటం ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేంద్రంలో కార్పొరేట్ పీఎం, రాష్ట్రంలో కార్పొరేట్ సీఎం ఉన్నారు. ప్రజలకు సేవ చేయరు కానీ.. ప్రైవేట్ సంస్థలపై మాత్రం ప్రేమ కురిపిస్తారు. కనిపించిన ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్కు «కట్టబెట్టేలా చట్టం చేస్తారేమో. భూమి, భవనం, మౌలిక వసతులు అన్నీ కల్పించి ప్రైవేట్కు కాలేజీలను అప్పగించడం హేయమైన చర్య. – రామారావు, రిటైర్డ్ డీఎంహెచ్వో -
సిబ్బంది నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి
అనంతపురం సెంట్రల్: అనంతపురంలోని మహిళా శిశు సంక్షేమశాఖ పరిధిలోని శిశుగృహలో దయనీయ పరిస్థితి చోటు చేసుకుంది. సక్రమంగా పాలు పట్టకపోవడంతో తీవ్ర అనారోగ్యంపాలైన ఓ నవజాత శిశువు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శిశుగృహ, ఐసీడీఎస్ సిబ్బంది శిశువును ఖననం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఐసీడీఎస్ అధికారుల కథనం మేరకు.. 20 రోజుల క్రితం కళ్యాణదుర్గానికి చెందిన మహిళ మగబిడ్డకు జన్మనిచ్చి, ధర్మవరం వెళ్లే రోడ్డులోని ముళ్లపొదల్లో వదిలేసింది.స్థానికులు గమనించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని శిశుగృహకు అప్పగించారు. 2 రోజుల పాటు పాలు సక్రమంగా అందించకపోవడంతో దసరా రోజు అనారోగ్యం పాలైనట్లు సమాచారం. గురువారం అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో శిశువును చూసుకునే ఆయా స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లింది. అప్పటికే పసిబిడ్డ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన గురించి ఐసీడీఎస్ ఉన్నతాధికారులకు, చైల్ వెల్ఫేర్ కమిటీ సభ్యులకు తెలియజేయకుండానే కాంట్రాక్టు సిబ్బందే ఖననం చేసేశారు.చిన్నారి అనారోగ్యంతో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందగా, అదే రోజు ఖననం చేశారని అనంతపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ నాగమణి తెలిపారు. ఈ విషయం అధికారులకు తెలియడంతో.. నీ వల్లే అంటూ ఇద్దరు మహిళా సిబ్బంది ఒకర్నొకరు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు.నిర్లక్ష్యంతోనే పసివాడి ఆకలిచావుకాగా, శిశువు మృతికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. అనాథలు, పోషణ భారంగా మారిన వారి చిన్నారుల సంరక్షణ కోసం ప్రభుత్వం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శిశుగృహను నిర్వహిస్తోంది. ఇక్కడ గ్రూపు తగాదాల కారణంగా కొంతకాలంగా సిబ్బంది సక్రమంగా పనిచేయడం లేదు. శుక్రవారం ఇద్దరు ఆయాలు పనిచేయగా.. రాత్రి రావాల్సిన ఇద్దరు ఆయాల్లో ఒకరు సెలవు పెట్టారు. దీంతో పాల కోసం చాలాసేపు ఏడ్చిన శిశువు చివరకు అర్ధరాత్రి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. విధుల్లో ఉన్న ఆయా ఆ చిన్నారిని తీసుకొని ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. ఆమె ఆస్పత్రికి వెళ్లేలోగానే దారిమధ్యలోనే ఈ చిన్నారి ప్రాణాలు వదిలింది. -
నువ్వు చాలా అందంగా ఉన్నావ్..
సాక్షి, నంద్యాల: ఆమె భర్తను కోల్పోయిన ఒంటరి మహిళ. దీంతో ఆ సీఐ కన్నుపడింది. ‘‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్..! నిన్ను, నీ పిల్లలను బాగా చూసుకుంటాను’’ అంటూ మాటలు కలిపాడు. లోబర్చుకునేలా పొగిడాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు పెట్టించుకున్నాడు. ఇప్పుడు నీతో సంబంధమే లేదు పో అంటూ తిరస్కరిస్తున్నాడు. దీంతో నంద్యాల పట్టణంలోని మూలసాగరానికి చెందిన బాధితురాలు శనివారం మీడియా ముందుకు వచ్చి గోడు వెళ్లబోసుకుంది.ఆమె చెప్పిన వివరాలు... ‘‘నా భర్త రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూ 14 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో నాకు రైల్వేలో ఉద్యోగం ఇచ్చారు. నంద్యాల త్రీటౌన్ సీఐ కంబగిరి రాముడుది మా ఊరే. 8 నెలల క్రితం ఫోన్లో పరిచయమయ్యారు. సొంత ఊరి వారవడంతో అరమరికలు లేకుండా మాట్లాడాను. ఖాళీగా ఉంటే స్టేషన్ వద్దకు రా అంటూ పిలిచేవారు. ఈ విధంగా మా మధ్య చనువు ఏర్పడింది. అయితే, సీఐ మభ్యపెట్టి నా వీడియోలు, ఫొటోలు తీశారు. వీటిని చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. లైంగికంగా వేధిస్తున్నారు. సీఐపై చర్యలు తీసుకోవాలని కర్నూలు డీఐజీ, నంద్యాల జిల్లా గత ఎస్పీకి పలుసార్లు ఫిర్యాదు చేసినా వారు ఆయనకే వత్తాసు పలికారు.’అనిఆవేదన వ్యక్తం చేసింది.పిల్లల్ని చంపేస్తా.. గంజాయి కేసు పెడతానా వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, నన్ను, నా పిల్లలను చంపేస్తానని, గంజాయి కేసు పెడతానని సీఐ బెదిరించారు. నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని గత ఎస్పీకి ఫిర్యాదు చేశా. ఆ తర్వాత ‘‘నీ ఫొటోలు అన్నీ డిలీట్ చేయించా. సీఐ ఇక నీ జోలికి రాడు. ఆయనపై కేసు పెట్టొద్దు అని డీఎస్పీ తెల్లకాగితంపై సంతకం చేయాలని ఒత్తిడి చేశారు.నేను కర్నూలు డీఐజీని కలిసేందుకు వెళ్లి... సీఐ పేరు చెప్పగానే ఇక్కడినుంచి వెళ్లు, ఏమైనా ఉంటే అక్కడ తేల్చుకో అని కసురుకుని పంపించేశారు. సీఐ కారణంగా మానసికంగా కుంగిపోయా. ఎప్పుడు ఏం చేస్తారోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నా. కూటమి ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరగడం లేదు’’ అని బాధితురాలు వాపోయింది. కాగా, మహిళ ఆరోపణలపై సీఐ కంబగిరిరాముడును ఫోన్లో వివరణ కోరగా స్పందించలేదు. -
రిలే దీక్షలకు దిగిన పీహెచ్సీ వైద్యులు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): తమ దీర్ఘకాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వైద్యులు నిరవధిక సమ్మెకు దిగారు. గత ఏడాది ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేటివరకూ అమలుచేయకపోగా, వాటికి విరుద్ధంగా చర్యలు తీసుకోవడాన్ని నిరసిస్తూ విధులు బహిష్కరించిన వైద్యులు.. తాజాగా విజయవాడ ధర్నా చౌక్లో రిలే దీక్షలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం ప్రారంభించిన ఈ రిలే దీక్షలు తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకూ కొనసాగుతాయని అసోసియేషన్ నేతలు ప్రకటించారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. ⇒ అన్ని విభాగాల్లో 20 శాతం ఇన్సర్వీస్ పీజీ సీట్లు కొనసాగించాలి. టైమ్»ౌండ్ ఉద్యోగోన్నతులు ప్రకటించాలి. డీసీఎస్, సీఎస్ ఉద్యోగోన్నతులకు కాలపరిమితి నిర్ణయించాలి. ఆ మేరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలి. ⇒ గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు వెంటనే ట్రైబల్ అలవెన్స్ మంజూరుచేయాలి. ⇒ సంచార వైద్యసేవలకు తక్షణమే సదుపాయాలు కలి్పంచాలి. వాయిదా పడిన వేతన పెంపును తక్షణమే అమలుచేయాలి. రోగులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంలేదు.. రోగులను ఇబ్బంది పెట్టాలనేది తమ ఉద్దేశంకాదని, తమ సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్తోనే సమ్మెకు వెళ్లినట్లు తెలిపారు. తాము సమ్మెకు వెళ్తామని అధికారులకు ముందుగానే నోటీసులు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వం స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇచ్చేవరకూ తమ నిరసన కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఆమోదయోగ్యమైన డిమాండ్లు సీఎం దృష్టికిసాక్షి, అమరావతి: పీహెచ్సీ వైద్యుల డిమాండ్లలో ఆమోదయోగ్యమైన వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకుంటామని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ తెలిపారు. వెంటేనే వైద్యులు విధుల్లో చేరాలని కోరారు. శనివారం సత్యకుమార్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. వారి డిమాండ్లను పరిశీలిస్తామన్నారు. ఇన్ సర్వీస్ కోటా, ఉద్యోగ సర్వీస్ డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. -
టీడీపీ నేత మద్యం దుకాణం సీజ్
పెద్దతిప్పసముద్రం: ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై శుక్రవారం పోలీసులు జరిపిన దాడుల్లో మండలానికి చెందిన టీడీపీ కీలక నేత కట్టా సురేంద్రనాయుడు సహా మరికొందరు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జోగేంద్ర, సీఐ మల్లయ్య బృందం శనివారం అన్నమయ్య జిల్లా టి.సదుం పంచాయతీ చెన్నరాయునిపల్లి సమీపంలో కట్టా సురేంద్రనాయుడు ‘ఆంధ్రవైన్స్’ పేరుతో నిర్వహిస్తున్న మద్యం దుకాణంలో ఉన్న బాటిళ్లకు పంచనామా నిర్వహించి వైన్షాపు లైసెన్స్ను సీజ్ చేసి సీలు వేశారు.ఎక్సైజ్ పోలీసులు బృందంగా ఏర్పడి మఫ్టీలో కల్తీ మద్యం రవాణా, నిల్వలపై మండలంలో నిఘా వేసినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు పుట్టగొడుగుల్లా వెలసిన బెల్ట్షాపుల్లో దర్జాగా మద్యం విక్రయాలు చేపట్టేవారు. కల్తీ మద్యం రాకెట్ గుట్టు రట్టు కావడంతో బెల్ట్షాపులు నిర్వహిస్తున్న గ్రామస్థాయి కూటమి కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి కల్తీ మద్యంతో పట్టుబడితే ఎక్కడ కేసుల్లో ఇరుక్కుపోతామోనని భావించి బెల్ట్షాపులను మూసేసి పరిచయస్తులకు మాత్రమే చాటుగా మద్యం విక్రయిస్తున్నట్టు సమాచారం. -
‘పెద్దల’ దన్నుతోనే నకిలీ మద్యం రాకెట్
సాక్షి ప్రతినిధి, కడప: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మండల కేంద్రం ములకలచెరువుకు సమీపంలో నకిలీ మద్యం తయారీ కేంద్రం బట్టబయలు కావడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. కనీ వినీ ఎరుగని రీతిలో ఇంత భారీగా యంత్రాల సాయంతో వివిధ బ్రాండ్లను పోలిన నకిలీ మద్యం ములకలచెరువు వద్ద తయారవుతోందని తెలిసి ఉమ్మడి చిత్తూరు, అనంతపురం వాసులు విస్తుపోయారు. ఇన్నాళ్లూ తాము తాగిన మద్యం నకిలీదేనని తెలుసుకుని స్థానికంగా ఉన్న వారు బెంబేలెత్తుతున్నారు. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు, బెల్ట్ షాపులకు ప్రధానంగా ఇక్కడి నుంచి నకిలీ మద్యం సరఫరా అయ్యేదని శుక్రవారం నాటి ఎక్సైజ్ దాడుల్లో స్పష్టమైంది.ఇంత భారీ రీతిలో నకిలీ మద్యం దందా సాగించడానికి ప్రభుత్వంలోని టీడీపీ ముఖ్య నేతల అండ ఉందని తెలుస్తోంది. ప్రతి నెలా కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరిగేవని తేలింది. ఇందులో కొంత సొమ్ము ముఖ్య నేతలకు ప్రతి నెలా చేరేదని సమాచారం. ఏడాదికి పైగా విచ్చలవిడిగా, నిర్భీతిగా యథేచ్ఛగా నకిలీ మద్యం తయారు చేసి.. జనంతో తాగించి వారి ప్రాణాలతో చలగాటం ఆడిన టీడీపీ నేతలు.. వారికి అన్ని విధాలా అండగా నిలిచిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా నోరెత్తడం లేదు. పైగా అసలు సూత్రధారులను తప్పిస్తూ.. పాత్రధారుల్లో అనామకులైన కొంత మందిపై మాత్రమే కేసులు నమోదు చేయించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.అన్నమయ్య జిల్లా స్థాయిలో ముఖ్యనేత, తంబళ్లపల్లి ఇన్చార్జ్ కనుసన్నల్లో ఈ నకిలీ మద్యం ప్లాంట్ కార్యకలాపాలు కొనసాగాయని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు. ఇక్కడి కూలీలను పనిలో పెట్టుకుంటే బండారం బయట పడుతుందని భావించి, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు. ఈ విషయమై స్థానికులకు ఇదివరకే అనుమానాలు వచ్చినా, టీడీపీ నేతలకు జడిసి నోరు విప్పలేదు. శుక్రవారం నాటి నాటకీయ పరిణామాల నేపథ్యంలో అందరూ ఇదే విషయమై చర్చించుకుంటున్నారు. వారి పేర్లు ఎక్కడా రాకూడదునకిలీ మద్యం రాకెట్ను నడిపిస్తున్న టీడీపీ ముఖ్య నేతల పేర్లు ఎక్కడా రాకూడదని, కేసులో వారి పేర్లు ఉండకూడదని ఉన్నతాధికారులకు అమరావతి నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది. శుక్రవారం నాటి నాటకీయ పరిణామాలు, శనివారం సాయంత్రం ములకలచెరువులో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన ప్రెస్మీట్లో వెల్లడించిన అంశాలు పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టం అవుతోంది. అసలు వాస్తవాల జోలికి వెళ్లకుండా, సూత్రధారులెవరో చెప్పకుండా, కేవలం పాత్రధారుల వివరాలను మాత్రమే వెల్లడించి చేతులు దులుపుకున్నారు. నకిలీ మద్యం కేసులో అనుమానాలను నివృత్తి చేయాల్సిన ఎక్సైజ్ అధికారుల తీరుపైనా అనుమానాలు వ్యక్తం ఆవుతున్నాయి. ముఖ్యులను తప్పించేసినట్టేములకలచెరువు నకిలీ మద్యం వెలుగులోకి రాగానే ప్రభుత్వ నిఘా, ఎక్సైజ్ వర్గాలు తమ నివేదికలను సీఎంఓకు నివేదించాయని సమాచారం. మొదట టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడును అదుపులోకి తీసుకున్నాక.. అక్కడి పరిస్థితి ఉన్నత స్థాయి వ్యక్తుల దృష్టికి వెళ్లింది. మొదట దీనిపై కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయంతో సురేంద్ర నాయుడును అరెస్ట్ చేసినట్టు ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. శనివారం అసలు సూత్రధారుల వివరాలను వెల్లడిస్తారని భావించగా, పైస్థాయిలో జరిగిన పరిణామాలతో తంబళ్లపల్లె టీడీపీ ముఖ్యల పేర్లు బయటకు రాకుండా తొక్కిపెట్టినట్టు తెలిసింది.దీంతో ఇప్పటికే కేసులో నమోదు చేసిన నిందితుల పేర్లను మరోమారు వెల్లడించి సరిపెట్టుకున్నారు. నిజానికి తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి పాత్ర ఉందని ఈ ప్రాంతంలో అందరికీ తెలిసినా, ఆయనను తప్పిస్తూ ఆయనæ పీఏ రాజేష్పై మాత్రమే తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు. అయితే ఇతని అరెస్ట్పై కూడా అధికారులు ఆసక్తి చూపేలా కనిపించడం లేదు. పైగా రాజేష్కు చెందిన మద్యం దుకాణం వైపు శనివారం ఎక్సైజ్ శాఖ అధికారులు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ దుకాణాన్ని సీజ్ చేస్తామని, లైసెన్స్ కూడా రద్దు చేస్తామని శుక్రవారం చెప్పిన అధికారులు పై నుంచి ఒత్తిడి రావడంతో ఆ దిశగా చర్యలు తీసుకోలేదని స్పష్టంగా తెలుస్తోంది.ఈ కేసులో నిందితులుగా ఉన్న జనార్దనరావు, కట్టా రాజులు దొరికితే కానీ వాస్తవాలు తెలియవని ఎక్సైజ్ అధికారులు తప్పించుకునే ధోరణితో ముందుకెళ్తున్నారు. విజయవాడకు చెందిన జనార్దన్రావు ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నట్టు సమాచారం. ఇదే నిజమైతే అయన్ను ఇక్కడికి ఎప్పుడు రప్పిస్తారు.. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు.. నిజాలు ఎప్పుడు వెలికితీస్తారనే దానికి సంబంధించి అధికారుల నుంచి స్పందనే లేదు. ఈ నకిలీ మద్యం ఏడాది క్రితం నుంచి నడుస్తుండగా.. గత నెలలోనే పెట్టారంటూ అధికారులు తేల్చేయడం గమనార్హం.ఈ ప్రశ్నలకు బదులేదీ?⇒ ఈ కేంద్రానికి పెట్టుబడి పెట్టింది ఎవరు? ⇒ నగదు లావాదేవీల మాటేంటి? ఏయే అకౌంట్ల ద్వారా లావాదేవీలు నడిచాయి?⇒ ఒక్క రోజే రూ.1.75 కోట్ల విలువైన నకిలీ మద్యం దొరికిందంటే ఇన్నాళ్లూ సరఫరా చేసిన మద్యం విలువ ఎంత?⇒ ఏయే ఊళ్లలోని ఏయే దుకాణాలకు నకిలీ మద్యం సరఫరా చేశారు?⇒ ప్రముఖ బ్రాండ్లకు సంబంధించి నకిలీ మద్యం ఆర్డర్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి?⇒ నకిలీ మద్యం తయారీకి సంబంధించి ముడి సరుకులు ఎక్కడి నుంచి తెచ్చారు?⇒ లేబుళ్లు, సీసాలు, మూతలు, స్పిరిట్, ఫ్లేవర్లు, భారీ యంత్రాలతో కూడిన ప్లాంట్ను నడపడం కేసులో చూపుతున్న నిందితులకు సాధ్యమా?⇒ చిన్న చిన్న బడ్డీ కొట్లను సైతం వదలకుండా మామూళ్లు దండుకునే ప్రజా ప్రతినిధులకు ఇంత భారీ ప్లాంట్ గురించి తెలియదంటే ఎవరు నమ్ముతారు?⇒ ఈ కేంద్రాన్ని విజయవాడకు చెందిన జనార్దనరావు అనే వ్యక్తి చూస్తుంటాడని.. అంతా అతనిపైకి నెట్టేయడం ఎంత వరకు సమంజసం?⇒ అధికార పార్టీ నేతల అండ దండలు లేకుండా స్థానికేతరుడు ఇంత భారీ నకిలీ మద్యం ప్లాంట్ను నడపగలడా?⇒ రోజుకు 20వేలకు పైగా 180 ఎంఎల్ బాటిళ్ల మద్యం తయారు చేసే సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ నుంచి ఇప్పటి వరకు ఎంత సరుకు విక్రయించారు?⇒ ఒడిశా, తమిళనాడు నుంచి వచ్చిన తొమ్మిది మంది కూలీలపై కేసులు పెట్టి చేతులు దులుపుకోవడం సబబా? ⇒ పెద్దలంతా తప్పించుకుని ఒక్క కట్టా సురేంద్ర నాయుడిని మాత్రమే బలి పశువును చేస్తున్నారని నిలదీస్తున్న ఓ సామాజిక వర్గీయుల ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు?నకిలీ మద్యం ప్లాంట్ కేసులో పది మంది అరెస్ట్ములకలచెరువు: అన్నమయ్య జిల్లా ములకలచెరువు పాత హైవే సమీపంలో బట్టబయలైన నకిలీ మద్యం తయారీ కేంద్రం కేసులో 14 మందిపై కేసు నమోదు చేసి, 10 మందిని అరెస్ట్ చేశామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజ్ తెలిపారు. స్థానిక ఎక్సైజ్ పోలీస్స్టేషన్లో శనివారం ఆయన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో జనార్దనరావు, కట్టా రాజు, పి.రాజేష్, కొడాలి శ్రీనివాసరావు, నాగరాజు, హాజీ, బాలరాజు, మణిమారన్, ఆనందన్, సూర్య, వెంకటేషన్ సురేష్, మిథున్, అనంతదాస్, కట్టా సురేంద్ర నాయుడుపై కేసు నమోదు చేశారు.వీరిలో జనార్దనరావు, పి.రాజేష్, కట్టా రాజు, కొడాలి శ్రీనివాసులు పరారీలో ఉన్నారు. వీరి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. మిగతా వారిని అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం తయారీ కేంద్రం నుంచి ఎస్ఎస్ ట్యాంకు, డిస్టలరీ వాటర్ ట్యాంకు, బాటిళ్లకు మూతలు బిగించే 3 యంత్రాలు, మూడు వాహనాలు, ఎలక్ట్రికల్ మోటార్, 1,050 లీటర్ల స్పిరిట్, బాటిలింగ్కు సిద్ధంగా ఉన్న 1,470 లీటర్ల మద్యం, 20,208 బాటిళ్ల మద్యం, 12 వేల ఖాళీ బాటిళ్లు, వేలాది మూతలు, 70 క్యాన్లు, రాయల్ లాన్సర్ లేబుళ్లు 10,800, ఓల్డ్ అడ్మిరల్ లేబుళ్లు 1200, 4 వేల రోల్స్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న వీటి విలువ రూ.1.75 కోట్లని చెప్పారు. -
మనకు నచ్చకపోతే వినేదే లేదు
మనకు ఇష్టమైనదే వింటాం. ఏమాత్రం అసౌకర్యంగా అనిపించినా, ప్రతికూలంగా ఉన్నా ఆ సమాచారాన్ని వినడానికి కూడా ఇష్టపడం. కనీసం అటువైపు కూడా చూడం. తెలియనిది తమకు హాని కలిగించదని చాలామంది అనుకుంటారు. ఇది పెద్దవారిలో ఒక సాధారణ ప్రవర్తన అని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు. దీన్ని ‘ఆస్ట్రిచ్ ఎఫెక్ట్’ టారు. షికాగో విశ్వవిద్యాలయం చేపట్టిన కొత్త అధ్యయనం ప్రకారం యుక్త వయసుకు రాకముందే ఈ ధోరణి అభివృద్ధి చెందుతోందట.చాలామందికి ఆసుపత్రికి వెళ్లాలంటే భయం. అక్కడ ఏ టెస్టు చేస్తే ఏ సమస్య బయటపడుతుందో అని లోపల ఒక తెలియని ఆందోళన. అందుకే, ‘నువ్వు, ఈ మధ్య టెస్టులు చేయించుకున్నావా’ అని ఎవరైనా అడిగితే.. సంభాషణను వేరే విషయాలవైపు మళ్లిస్తుంటారు. కొన్ని కంపెనీలు లేదా సంస్థలు.. ఉచిత వైద్య శిబిరాలు పెట్టినప్పుడు కొందరు కనీసం అటువైపు కూడా చూడంది అందుకే. ఆస్ట్రిచ్ ఎఫెక్ట్గా పిలిచే ఈ ధోరణి పెద్దలతో పాటు పిల్లల్లోనూ ఉంటోందట.చిన్న పిల్లల్లోనూ..షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన రాధిక సంతాన గోపాలన్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం.. పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ కొత్త సమాచారాన్ని స్వీకరించని మనస్తత్వ ధోరణి పెరుగుతున్నట్టు గుర్తించింది. ముఖ్యంగా ఇది 7–10 ఏళ్ల పిల్లల్లో ఎక్కువగా ఉందట. అసలు చాలామంది.. కొత్త విషయాన్ని లేదా జ్ఞానాన్ని నేర్చుకునే విషయంలో ఎందుకు విముఖత చూపుతారో 5 కారణాలను ఈ బృందం గుర్తించింది.తప్పించుకునే ధోరణిఐదారేళ్ల పిల్లలు మరింత జ్ఞానం సంపాదించాలని ఉత్సాహంగా ఉన్నారు. 7 నుంచి 10 ఏళ్ల చిన్నారుల్లో కొందరు మాత్రం ఇందుకు కాస్త భిన్నంగా ఉన్నారు. వీళ్లు సమాచారం నుంచి తప్పించుకునే ధోరణులను ప్రదర్శించడం ప్రారంభిస్తున్నారు. ‘ఉదాహరణకు, ప్రతి ఒక్కరినీ తమకు ఇష్టమైన, తక్కువ ఇష్టమైన క్యాండీ ఏంటో చెప్పండని అడిగాం. ఆ క్యాండీ వారి దంతాలకు ఎందుకు చెడ్డదో వివరించే వీడియో చూడాలని అనుకుంటున్నారా అని అడిగాం. ఆసక్తికరంగా.. వారికి నచ్చే దాని గురించి వారు ‘అది ఎందుకు చెడ్డదో’ తెలుసుకోడానికి ఇష్టపడలేదు. కానీ తక్కువ ఇష్టమైన క్యాండీ ఎందుకు చెడ్డదో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు’ అని వివరించారు రాధిక.అన్ని వేళలా మంచిది కాదు‘కొన్ని సందర్భాల్లో సమాచారం నుంచి తప్పించుకోవడం మంచిదే. అతి సర్వత్రవర్జయేత్ అన్నారు కదా! అయితే ప్రతిసారీ వద్దనుకునే ధోరణి మంచిది కాదు. అప్పటికి మనకు నచ్చనిది లేదా మనసుకు ఇబ్బందిగా అనిపించేది తరవాత విలువైనదని తేలవచ్చు. మనుషులకు అనిశ్చితిని లేదా ఒక సమస్యను పరిష్కరించుకోవాలనే కోరిక ఉంటుంది. కానీ పరిష్కారం, సమాచారం తమకు ఇబ్బందికరంగా లేదా ముప్పుగా ఉన్నప్పుడు తప్పించుకోవడానికే మొగ్గు చూపుతారు. కాస్త చొరవ, ధైర్యం చూపెడితే చాలు.. దీన్నుంచి సులభంగా బయటపడవచ్చు’ అంటారు రాధిక.ఏమిటీ ఆస్ట్రిచ్ ఎఫెక్ట్?యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేంలోని ఇద్దరు ప్రొఫెసర్లు డాన్ గలాయ్, ఓర్లీ సేడ్.. మొట్టమొదట ‘ఆస్ట్రిచ్ ఎఫెక్ట్’ అనే పద బంధాన్ని ప్రయోగించారు. ఇజ్రాయెల్లోని క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడిదారులు.. ఎప్పటికప్పుడు నష్ట సమాచారాన్ని వెల్లడించే మార్గాల కంటే.. తమకు నష్టం వచ్చినా ఫర్వాలేదని ఆ విషయం బయటకు చెప్పని మార్గాల్లోనే పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడుతున్నట్టు గుర్తించారు.ఈ ధోరణిని ఆస్ట్రిచ్ ఎఫెక్ట్గా అభివర్ణించారు. ఆస్ట్రిచ్ పక్షి తనకు ఏదైనా ప్రమాదం వస్తుందనిపిస్తే.. వెంటనే తన తలను ఇసుకలో దాచేస్తుందని దీని అర్థం. నిజానికి ఆస్ట్రిచ్ అలా చేయదు. కానీ, ఇది మాత్రం మానసిక వైద్య శాస్త్రంలో ‘ఆస్ట్రిచ్ ఎఫెక్ట్’గా స్థిరపడిపోయింది.ఎందుకు తప్పించుకుంటారు?⇒ ఆందోళన లేదా నిరాశ వంటి ప్రతికూల భావోద్వేగాలను నివారించడం⇒ ఇతరులు మన ఇష్టాయిష్టాలను, సామర్థ్యాలను ఎలా అర్థం చేసుకుంటారో అనే ఆందోళన, భయం⇒ మన నమ్మకాలను సవాలు చేసే ఆలోచనలు, వాస్తవాల నుంచి తప్పించుకునేందుకు⇒ మన ప్రాధాన్యతలకు ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకు⇒ స్వార్థం లేదని నిరూపించుకునే క్రమంలో.. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం -
9న వైఎస్ జగన్ అనకాపల్లి పర్యటన
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 7, 8, 9 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు వివరాలను శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఈ నెల 7వ తేదీన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.8వ తేదీన భీమవరం(పెద అమిరం)లో వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. ఈ నెల 9వ తేదీన అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలోని భీమబోయినపాలెంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటుకు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకోవడంలో భాగంగా భీమబోయినపాలెంలో నిర్మాణం నిలిపివేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను మాజీ సీఎం వైఎస్ జగన్ సందర్శిస్తారు. -
సారీ చెప్పకుండా... సంబరాలా?
నవరాత్రి ఉత్సవాలు మొదలుకొని దీపావళి పండుగ ముగిసే వరకూ ఈ నెల రోజుల సీజన్ను ఎన్డీఏ సర్కార్ హైజాక్ చేసింది. జీఎస్టీ పేరుతో వసూలు చేస్తున్న పన్నులను హేతుబద్ధీకరణ చేయడం వల్ల పేద, మధ్య తరగతుల ప్రజలకు బాగా ఆదా అవుతుందనీ, అందువల్ల ఈ సీజన్ను పొదుపు ఉత్సవంగా పాటించాలనీ దేశ ప్రజలకు ఎన్డీఏ సర్కార్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వాలు అధికారిక కార్యక్రమాలను కూడా ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ దీంతో పాటు మరో అంశాన్ని కూడా జోడించింది. అయితే దాన్ని అధికారిక కార్యక్రమాల్లో కలపకుండా పార్టీ వేదికల ద్వారా ప్రచారం చేసుకోవాలని సంకల్పించారు. వసూలు చేసిన కరెంటు బిల్లుల్లో యూనిట్కు 13 పైసల చొప్పున తిరిగి వినియోగదారులకు జమ చేస్తారట! దీన్నే ట్రూ–డౌన్ అంటున్నారు. ఇది చరిత్ర ఎరుగని మహత్కార్యం అన్నట్టు ముఖ్యమంత్రి ట్వీట్ కూడా చేశారు.నిజంగా ఇవి సంబరాలు చేసుకోదగిన సందర్భాలేనా? ఒంటినిండా వాతలు పెట్టి అక్కడక్కడా ఆయింట్మెంట్ రాస్తే ఉపశమనం లభించినట్టేనా! ఆ బాధితుడు అందుకు కృతజ్ఞతగా ఎగిరి గంతేసి పండుగ చేసుకోవాలా? జీఎస్టీని హేతుబద్ధం చేస్తున్నారంటే ఎనిమిదేళ్ల నుంచి అనుసరిస్తున్న విధానం నిర్హేతు కమైనదని అంగీకరించినట్టే కదా! ఈ ఎనిమిదేళ్లుగా సాధారణ ప్రజల రక్తాన్ని తాము జలగల్లా పీల్చుకున్నామని పరోక్షంగా చెప్పినట్టే కదా! ఈ హేతుబద్ధీకరణ వలన ప్రజలకు రెండున్నర లక్షల కోట్ల మేరకు లబ్ధి జరుగుతుందని ప్రధానమంత్రి ప్రకటించారు. దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఇందులో మళ్లీ కొన్ని మెలికలున్నాయి. అందువల్ల ప్రభుత్వం చెబుతున్నంత స్థాయిలో ఉపశమనం కలుగదనే వాదన ఉన్నది. పాప్కార్న్ మీద జీఎస్టీ 5 శాతం మాత్రమే అన్నారు. కానీ బ్రాండెడ్ అయితే 12 శాతం, షుగర్ కోటెడయితే 18 శాతం జీఎస్టీ ఉంటుంది. జీవిత బీమా ప్రీమియం మీద జీఎస్టీ లేదన్నారు. కానీ అది వ్యక్తిగత బీమాలకు మాత్రమే వర్తిస్తుంది. గ్రూప్ బీమాకు జీఎస్టీ కట్టాల్సిందే. ఇలాంటివి చాలా ఉన్నాయి.స్థూలంగా పన్ను రేట్లు తగ్గడం వలన అదే నిష్పత్తిలో విని మయం కూడా పెరిగి ప్రభుత్వ ఖజానాకు వాటిల్లే నష్టం నామమాత్రంగానే ఉండబోతున్నదని ఎస్బీఐ ఇదివరకే అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగానే ఈ నవరాత్రి వేడుకల్లో వివిధ అంశాలవారీగా 25 శాతం నుంచి 100 శాతం వరకు గతంతో పోలిస్తే అమ్మకాలు పెరిగాయని అధికార వర్గాలను ఉటంకిస్తూ పత్రికల్లో వార్తలొచ్చాయి. ఈ ఎనిమిదేళ్లలో అమలు చేసిన గబ్బర్ సింగ్ ట్యాక్స్ విధానం వల్ల ప్రజలకు జరిగిన నష్టమెంత అనేదానిపై మాత్రం ఎటువంటి సింహావలోకనం అధికారికంగా జరగలేదు. జీఎస్టీ అమలుకు ముందు సంవత్సరం అంటే, 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఇప్పుడు జీఎస్టీ పరిధిలో ఉన్న పరోక్ష పన్నుల ద్వారా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వా లకు సమకూరిన ఆదాయం సుమారు 12 లక్షల కోట్లని అంచనా. ఇదే ఆదాయం 2024–25 నాటికి 22 లక్షల కోట్లకు ఎగబాకింది. ఇందులో ఏటికేడు సహజంగా వుండే వృద్ధి కొంత ఉండవచ్చు. కాని సింహభాగం వృద్ధి మాత్రం జీఎస్టీ ద్వారా సాధ్యమైనదే.అయితే ఇంత భారీ పెరుగుదలకు కారణమెవరు? దేశంలో ఈ పదేళ్లలో శరవేగంగా పుట్టుకొచ్చిన బిలియనీర్లూ, మిలియ నీర్లా? కానేకాదు. సాధారణ పేద మధ్య తరగతి ప్రజలు కడుపు కట్టుకొని ఖజానాకు ముడుపు కట్టిన ఫలితమే ఈ అసాధారణ పెరుగుదల. ఆదాయాల్లో, ఆస్తిపాస్తుల్లో అట్టడుగున ఉండే 50 శాతం మంది పేద ప్రజలు జీఎస్టీలో 64 శాతం చెల్లిస్తున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది. వీరికంటే ఎగువన ఉండే 40 శాతం మంది జీఎస్టీ చెల్లింపుల వాటా 33 శాతం. ఇక అగ్రశేణి పది శాతం సంపన్నుల సంగతి. ఈ పదేళ్లలో వీరి సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరిగిందని అనేక అధ్యయనాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ పది శాతం కుబేరులు సమష్టిగా మోస్తున్న జీఎస్టీ భారం కేవలం మూడు శాతం. యాభై శాతం మంది పేదలు 64 శాతం చెల్లిస్తుంటే 10 శాతం పెద్దలు 3 శాతం చెల్లిస్తున్నారనేది ఈ జీఎస్టీ రాజ్లో ఒక కఠిన వాస్తవం. అధికాదాయం కలిగిన వారు చెల్లించడానికి జీఎస్టీ కాకుండా వేరే పన్నులున్నాయని వాదించవచ్చు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయ పన్ను, అధికాదాయంపై సర్ఛార్జ్, కేపిటల్ గెయిన్స్ అంతా కలిపి సమకూరింది 11,56,000 కోట్లు. అదే సమయంలో 50 శాతం పేదలు జీఎస్టీ రూపంలో చెల్లించింది 22 లక్షల కోట్లలో 64 శాతం. అంటే సుమారు 14 లక్షల కోట్లు. మన సమాజంలో త్యాగమెవరిదో, భోగమెవరిదో చెప్పడానికి ఈ అంకెలు అద్దం పడతాయి. ఈ జీఎస్టీ కాలంలోనే దేశ ప్రజల ఆదాయాల్లో పెరుగుతున్న అసమానతలపై ఆక్స్ఫామ్ లాంటి సంస్థలు ఏటేటా సవివర మైన నివేదికలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ విష యాలకు మరో కొత్త పార్శ్వం తోడైంది. కార్తీక్ మురళీధరన్ అనే ఆర్థికవేత్త శనివారం నాటి ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో ఒక వ్యాసం రాస్తూ ఆదాయాల పరంగా ఇండియాను మూడు ఇండియా లుగా పేర్కొన్నారు. గతంలో లోహియా, ఫెర్నాండెజ్ వంటి సోషలిస్టులు గ్రామీణ భారత్, అర్బన్ ఇండియాలుగా రెండుగా విభజించి మాట్లాడేవారు. ఇప్పుడది మూడుకు చేరింది. ఇండస్ వ్యాలీ రిపోర్ట్ను ఉటంకిస్తూ కార్తీక్ మురళీధరన్ ఈ ప్రస్తావన చేశారు. ఇందులో ఒకటవ ఇండియా పది శాతం జనాభా గల సంప న్నులది. వీరి తలసరి ఆదాయం 15 వేల డాలర్లు. తర్వాత శ్రేణిలోని రెండో ఇండియా 20 శాతం మంది ప్రజలది. వీరి తలసరి ఆదాయం 3 వేల డాలర్లు. ఇక 70 శాతం మంది భారతీయుల ఆదాయం వెయ్యి డాలర్లు. వాళ్లే మూడో భారత్. ప్రపంచ బ్యాంకు వర్గీకరణ ప్రకారం 13,936 డాలర్ల కంటే ఎక్కువ తలసరి ఆదాయం వున్న దేశం అధికాదాయం గల దేశం కింద లెక్క. 14 కోట్లకు పైగా జనాభా ఉన్న మన ఫస్ట్ ఇండియా ఈ శ్రేణిలోకి వస్తుంది. 4,496 డాలర్ల నుంచి 13,935 డాలర్ల మధ్యన తలసరి ఆదాయం ఉండే దేశాలను అప్పర్ మిడిల్ ఆదాయం గల దేశంగా ప్రపంచ బ్యాంకు పరిగణించింది. మూడు ఇండియాల్లో ఒకటి కూడా ఈ శ్రేణిలోకి రాలేదు. లోయర్ మిడిల్ క్లాస్లోకి మన 20 శాతం జనాభా (సుమారు 30 కోట్లు) ఉన్న ఇండియా చేరింది. 1,136 డాలర్ల నుంచి 4,495 డాలర్ల తలసరి ఆదాయమున్న దేశాలు ఈ లోయర్ మిడిల్ క్లాసులోకి వస్తాయి. 1,135 డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయమున్న దేశాలు ప్రపంచ బ్యాంకు దృష్టిలో అల్పాదాయ దేశాలు, అంటే పేద దేశాలు. ఇందులోకి మన 70 శాతం (సుమారు వంద కోట్లు) జనాభా వస్తుంది. అంటే మన దేశంలోని వంద కోట్లమంది జీవన ప్రమాణాలు ఆఫ్రికా ఖండంలోని అతి పేద దేశాల ప్రజలతో ఇంచుమించు సమానమన్నమాట. ఇదిగో ఈ నిరుపేదలే గడచిన ఒక్క సంవత్సరంలో వసూలైన జీఎస్టీలో (22 లక్షల కోట్లు) అత్యధిక భాగాన్ని చెల్లించారు. ఈ ప్రజలకు ఇప్పుడు కొంత ఉపశమనం కలిగించడాన్ని స్వాగతించవలసిందే. కానీ ఈ ప్రభుత్వమే చెబుతున్నట్టు ఎనిమిదేళ్ల ‘నిర్హేతుక’ విధానానికి పేదలు చెల్లించిన మూల్యం సంగతి? కనీసం క్షమాపణలైనా చెప్పరా? పైగా పండుగ చేసుకోమనడం ఒక క్రూర పరిహాసం.ఇటువంటి పరిహాసాలు చేయడం ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి నాయకుడు చంద్రబాబుకు పరిపాటి. కరుడుగట్టిన పేద ప్రజల వ్యతిరేకిగా ఆయనది చెక్కుచెదరని ట్రాక్ రికార్డు. గడిచిన ఎన్నికలకు ముందు ఆయన చేసిన అనేక బూటకపు వాగ్దానాల్లో కరెంటు ఛార్జీలు తగ్గిస్తామనేది ఒకటి. కానీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 15,450 కోట్ల మేరకు ట్రూ–అప్ పేరుతో జనాన్ని బాదారు. విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఆమోదించిన దానికంటే విద్యుత్ కొను గోలు – పంపిణీ మీద ఎక్కువ వ్యయమైతే ఈఆర్సీ అనుమతితో పెరిగిన వ్యయానికి అనుగుణంగా ట్రూ–అప్ ఛార్జీలు వసూలు చేస్తారు. వివిధ కారణాల వల్ల ఆమోదించిన వ్యయం కంటే తక్కువ ఖర్చయినప్పుడు ఆ మిగులును వినియోగ దారులకు రీఫండ్ చేయవలసి ఉంటుంది. తొలి రోజుల్లో బాదేసిన 15,545 కోట్ల బాదుడుకు తోడు మరో విడత 2,700 కోట్ల బాదుడుకు ప్రతిపాదనలు పంపించారు. ట్రూ–డౌన్ చేయవలసిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అందులో 1,800 కోట్ల బాదుడుకే ఈఆర్సీ అనుమతించింది. అ సొమ్మును అప్పటికే వసూలు చేసినందున 900 కోట్లు వినియోగదారులకు రీఫండ్ చేయాలని ఆదేశించింది.ఇప్పటికే వినియోగదారులపై ట్రూ–అప్ పేరుతో బాదేసి వసూలు చేస్తున్న మొత్తం 15,545 కోట్లు, ట్రూ–అప్కు అదనపు ప్రతిపాదన 2,700 కోట్లు. వెరసి 18 వేల కోట్ల పైచిలుకు. ఇందులో 900 కోట్లను రీఫండ్ చేయాలని ఈఆర్సీ ఆదేశించింది. మొత్తం బాదుడులో ఇది ఐదు శాతం. వినియోగదారుని జేబు లోంచి రూపాయి లాగేసుకొని ఓ ఐదు పైసలు చేతిలో పెట్టి ఎంజాయ్ చేయాలని చెబుతున్నారు. మొదట్లో ఇదో గొప్ప వరంలాగా యెల్లో మీడియా, ‘దేశం’ పెద్దలు తెగ హడావుడి చేశారు. కానీ ఈఆర్సీ ఆదేశాల సంగతి బయటపడేసరికి జీఎస్టీ ఉత్స వాలలో కలపకుండా విడిగా పార్టీ వేదికల ద్వారా ఇదో అద్భుత చర్యగా ప్రచారం చేసుకోవాలని నిర్ణయించారు. చంద్రబాబు స్వయంగా ఇది కనీవినీ ఎరుగని కార్యక్రమంగా వర్ణించు కున్నారు. ఎన్నికల హామీకి అనుగుణంగా చార్జీలను తగ్గిస్తు న్నామనీ, ఇది తమ సమర్థ నిర్వహణ ఫలితమనీ కూడా ఆయన చెప్పుకొన్నారు. వంద రూపాయలు పెంచి ఐదు రూపాయలు తగ్గించడమా ఎన్నికల హామీని నెరవేర్చడమంటే? దీన్ని సమర్థవంతమైన నిర్వహణగా పరిగణించాలా?ప్రజలకు ఇటువంటి షాకులివ్వడం పండుగ చేసుకో మనడం చంద్రబాబు సర్కార్కు అలవాటే. ఈ పదహారు మాసాల కాలంలోనే ఆయన సర్కార్ చేసిన గాయాలు పేద, మధ్య తరగతి ప్రజల నిలువెల్లా కనిపిస్తున్నాయి. చేసిన నమ్మక ద్రోహాలకు ఊరూరా శిలాఫలకాలు వేయవచ్చు. ఏటా సమారు 32 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన ‘ఆడబిడ్డ’ పథ కాన్ని పూర్తిగా ఎత్తివేసి, ప్రతి నిరుద్యోగికి నెలకు 3 వేల రూపా యలు ఇస్తామన్న హామీని ఎగవేసి, మిగిలిన హామీలను అర కొరగా, అదీ ఏడాది ఆలస్యంగా ప్రారంభించి సూపర్ సిక్స్ను అమలుచేశామని చెప్పుకోగలిగిన ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుంది అనుకోవాలి.ఈ పదహారు మాసాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ కొలువులు తీసి ‘నరేగా’ పథకాన్ని నీరుగార్చి గ్రామీణ ఉపాధిని దెబ్బతీసినందువల్ల జరిగిన నష్టమెంత? పేద ప్రజలు కోల్పోయిన ఆదాయ మెంత? లెక్కతీయాలి కదా! ప్రజారోగ్యాన్ని పడకేయించిన కారణంగా, ఆరోగ్యశ్రీని కోమాలోకి పంపినందువల్ల, ఆరోగ్య ఆసరా గొంతు నులిమిన ఫలితంగా, అంబులెన్స్ సర్వీసులకు పెట్టిన పంచర్ల పాపం వలన పేద మధ్య తరగతి ప్రజలకు జరిగిన, జరుగుతున్న నష్టమెంత? వైద్య వ్యాపారులకు ఒన గూరిన లాభమెంత? విద్యారంగంలో గేమ్ ఛేంజర్ వంటి ‘నాడు–నేడు’ అనే బృహత్తర కార్యక్రమాన్ని నిలిపివేసి, పేద విద్యార్థులు అందుకున్న ఉన్నతమైన వసతులను ఊదిపారేసినందువల్ల ఐదున్నర లక్షలమంది పేద మధ్యతరగతి వర్గాల పిల్లలు ప్రభుత్వ స్కూళ్లను వదిలేశారు. ఫలితంగా విద్యా వ్యాపారులకు కలిగిన లాభమెంత? పేద ప్రజలకు కలిగిన నష్టమెంత? జగన్ ప్రభుత్వం కొనసాగి వుంటే అప్పటికే పూర్తయిన పది లక్షల ఇళ్ళకు అదనంగా మరో పది లక్షలు పూర్తయ్యేవి. ఆ కుటుంబాల కలలను కాల్చేసినందుకు వారి గుండెల్లో గూడుకట్టుకున్న విషా దపు విలువెంత? 30 లక్షల మంది నడివయసు స్త్రీల చేయూతను లాగేసినందువల్ల ఆ మహిళలు చేస్తున్న ఆక్రందనను ఎలా ఉపశ మింపజేస్తారు! ఇటువంటి పర్యవసానాలు ఈ పదహారు మాసాల పాలన ఫలితంగా ఎన్నో ఉన్నాయి. అన్ని లెక్కలూ వేసి లాభపడ్డవాళ్ళను పండుగ చేసుకోమంటే బాగుంటుంది. గాయ పడిన వారితో గేమ్స్ ఆడటం అమానుషం!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
7న వైఎస్సార్సీపీ కీలక సమావేశం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ఈ నెల 7వ తేదీన ఆ పార్టీ ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్న ఈ కీలక భేటీలో రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు హాజరు కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా పోరాటాలు సహా అనేక అంశాలపై ఈ కీలక భేటీలో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు.. ఈ నెల 8, 9 వ తేదీల్లో వైఎస్ జగన్ పర్యటనలకు సంబంధించిన అప్డేట్స్ను అందించాయి. ఈ నెల 8వ తేదీన వైఎస్ జగన్ భీమవరంలో పర్యటించనున్నారు(YS Jagan Bhimavaram Tour). మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన జంటను ఆశీర్వదించనున్నారు. అలాగే.. ఈ నెల 9వ తేదీన వైఎస్ జగన్ అనకాపల్లిలో పర్యటించనున్నారు(jagan Anakapalle Tour). నర్సీపట్నం మాకవరపాలెంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆయన సందర్శించనున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రజాగ్రహం వ్యక్తం అవుతున్న తరుణంలో ఇటు వైఎస్ జగన్ పర్యటన రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. -
కదిరిలో ‘దృశ్యం’ తరహా కేసు.. మిస్టరీ వీడింది
తన కూతురితో పాటు తనపైనా కన్నేసిన ఓ మృగాన్ని భార్య కడతేరిస్తే.. ఆ మృతదేహాం ఆనవాలు కూడా దొరక్కుండా మాయం చేస్తాడు ఓ భర్త. అటుపై ఈ కేసులో కుటుంబాన్ని రక్షించుకునేందుకు అతగాడు చేసే ప్రయత్నాల ఆధారంగా అటు మలయాళం, ఇటు తెలుగు, మిగతా భాషల్లోనూ సస్పెన్స్ థ్రిల్లర్గా ‘దృశ్యం’ సిరీస్ అలరిస్తూ వస్తోంది. తాజాగా ఒరిజినల్ లాంగ్వేజ్లో మూడో పార్ట్ షూటింగ్ కూడా మొదలైంది. అయితే.. ఈ సినిమా స్ఫూర్తితో చాలా నేరాలు జరగడమూ చూశాం. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోనూ ఈ తరహాలో జరిగిన ఓ నేరాన్ని పోలీసులు ఎట్టకేలకు చేధించగలిగారు. తన భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఓ వ్యక్తిని హత్య చేసి ఆ శవాన్ని కనపడకుండా చేశారు ఇక్కడ. వివరాల్లోకి వెళ్తే.. అల్లుగుండుకు చెందిన అమర్నాథ్ మిస్సింగ్ కేసు రెండేళ్ల తర్వాత సాల్వ్ అయ్యింది. తన భర్త, అతని ఇద్దరు స్నేహితుల సాయంతో ఓ మహిళ అతన్ని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అమర్నాథ్ తనను అసభ్యంగా ఫొటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడనే ఆమె రగిలిపోయింది. విషయాన్ని తన భర్త దాదా పీర్కు చెప్పి వాపోయింది. దీంతో.. అమర్నాథ్పై కోపంతో రగిలిపోయిన దాదా పీర్.. స్నేహితులు సాధిక్, యాసిన్లతో కలిసి అమర్నాథ్ను హతమార్చాడు. ఆపై మృతదేహాన్ని చెర్లోపల్లి రిజర్వాయర్లో పడేశాడు. తాజాగా కేసు మిస్టరీని చేధించిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 04-11)
-
ఆటో మీద చలాన్లు ఉంటే డబ్బులు వేయరా?: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: ఎన్నికల్లో ఇచ్చిన సూపర్-6 హామీలకు తూట్లు పొడిచారంటూ చంద్రబాబు, పవన్, లోకేష్లపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన మచిలిపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆర్టీసీ డ్రైవర్లకు ఎన్నో హామీలిచ్చారు.. ఇప్పుడు చేతులెత్తేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు రాష్ట్రవాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారు.. ఇప్పుడు జిల్లా సరిహద్దులు దాటడానికి వీల్లేదంటున్నారు’’ అంటూ చంద్రబాబు సర్కార్పై నిప్పులు చెరిగారు.మహిళలకు ఫ్రీ బస్సు అని చెప్పి చంద్రబాబు మోసం చేశాడంటూ పేర్ని నాని నిలదీశారు. చంద్రబాబు ఆటో డ్రైవర్లకు సాధికారిత సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు? ఏమైంది?. ఆటో డ్రైవర్లకు రూ. 10 లక్షల ప్రమాద బీమా చేస్తామన్నారు, చేశారా?. ఆటో డ్రైవర్ల పిల్లల చదువులకు రుణాలు ఇప్పిస్తామన్నారు, ఇచ్చారా?. ఆటో మీద చలాన్లు ఉంటే డబ్బులు వేయరా?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నలు గుప్పించారు.చంద్రబాబు, పవన్, లోకేష్ ముగ్గురూ కలిసి మూడు ఖాకీ చొక్కాలేశారు. ఆటో డ్రైవర్ సేవలో పేరుతో డ్రైవర్లకు డబ్బులేశామని చెబుతున్నారు. ఎన్నికల్లో రాష్ట్రమంతా మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారు. ఎవరైనా అడిగితే నా పేరు చెప్పండని చంద్రబాబు చెప్పాడు. ఎవరైనా ప్రశ్నిస్తే తోలు తీస్తామన్నారు. ఏడాదైనా ఫ్రీ బస్సు ఇవ్వకపోవడంతో విమర్శల పాలయ్యారు. వైఎస్ జగన్, ప్రజలు, ప్రతిపక్షాల దెబ్బకు చంద్రబాబు ప్రభుత్వం దిగొచ్చింది. ఫ్రీ బస్సులో జిల్లాల సరిహద్దులు దాటడానికి వీల్లేదని సాక్షాత్తూ మంత్రులే చెప్పారు. తీవ్ర వ్యతిరేకత రావడంతో పల్లె వెలుగులో రాష్ట్రమంతా తిరగొచ్చని ప్రకటించారు. బస్సులను తగ్గించేశారు.చంద్రబాబు దెబ్బకు ఆటోవాళ్లంతా రోడ్డెక్కారు. ఎన్నికల్లో ఊకదంపుడు ప్రసంగం చేసిన చంద్రబాబు, పవన్ను నిలదీశారు. 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు 436 కోట్లు వేశామని చంద్రబాబు చెబుతున్నాడు. భూ ప్రపంచం మీద తనే ఆటో డ్రైవర్లను ఆదుకున్నానని బిల్డప్ ఇచ్చాడు. చంద్రబాబు స్పీచ్ దెబ్బకు ఆటో డ్రైవర్లకు చెవుల వెంట రక్తం ఒక్కటే తక్కువ. ఆటో వాళ్ల కోసం యాప్ పెడతా.. కంట్రోల్ రూమ్ పెడతానంటున్నాడు. ఆటో, క్యాబ్, మ్యాక్సి క్యాబ్ డ్రైవర్లకు పండగే పండగ అని చంద్రబాబు చెబుతున్నాడు. చంద్రబాబు తీరు సినిమాలో బ్రహ్మానందం క్యామెడీ సీన్లా ఉంది...వాహనమిత్ర పథకం ప్రారంభించింది వైఎస్ జగన్. పాదయాత్రలో వైఎస్ జగన్ ఆటో డ్రైవర్ల కష్టాలు తెలుసుకున్నారు. మచిలీపట్నంలో ఆటో డ్రైవర్ల సమస్యలు స్వయంగా విన్నారు. తమకు ఏడాదికి పది వేలైనా ఇవ్వమని ఆటో డ్రైవర్లు అడిగారు. సొంతంగా ఆటో కొనుక్కుని నడుపుకుంటున్న వారికి 10 వేలు ఇస్తామని ఏలూరు వేదికగా ప్రకటించారు. జగన్ సీఎం అయిన వెంటనే 2 లక్షల 36 వేల మందికి వాహనమిత్ర ఇచ్చారు. ఎన్నికల సంవత్సరం కూడా వైఎస్ జగన్ 2 లక్షల 75 వేల మందికి వాహన మిత్ర ఇచ్చారు. ఇప్పుడు జగన్ కంటే చంద్రబాబు కేవలం 14 వేల మందికి మాత్రమే అదనంగా ఇచ్చారు. చంద్రబాబు మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్ల కోసం చాలా చెప్పాడు..డ్రైవర్లను ఓనర్లు చేసేస్తామన్నాడు. బ్యాడ్జి కలిగిన ప్రతీ ఆటో, ట్యాక్సి డ్రైవర్లు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఏటా 15 వేలు ఇస్తామని చెప్పారు. మీరు చెప్పినట్లు ప్రతి డ్రైవర్కి రూ.15 వేలు ఇచ్చారా?. ఏ ఒక్క ఆటో డ్రైవర్కైనా 4 లక్షల రుణం ఇప్పించారా? ఆటో డ్రైవర్లకు బీమా కల్పించారా?. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు .. చేశారా?. చలాన్లు ఉంటే డబ్బులు వేయరా?. 15 వేలు ఇవ్వడానికి సవాలక్ష ఆంక్షలు పెడతారా?. 13 లక్షల మంది లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్లు ఉన్నారని లోకేష్ యువగళంలో చెప్పారు. ఈ రెండేళ్లలో లైసెన్సులున్న వాళ్లు పెరగరా?బ్యాడ్జి కలిగిన ప్రతీ ఒక్కరికీ ఇస్తామన్నారు.. ఇచ్చారా?. ఈ రోజు మోసం.. దగా చేసి పండుగ చేసుకోమంటున్నారు. వైఎస్ జగన్ ఒక్క షరతు కూడా పెట్టకుండా వాహనమిత్ర ఇచ్చారు. 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకున్నారు. కానీ చంద్రబాబు, పవన్, లోకేష్ మీ మ్యానిఫెస్టోలో ఏం చెప్పారు?. ఇప్పుడు ఏం చేశారు?. ఈ రోజు జరిగింది ఆటో డ్రైవర్ల సేవ కాదు.. దగా. మీ మామ ఎన్టీఆర్కు ఏం చేశారో.. ఆటో డ్రైవర్లకు కూడా అదే చేశారు. ఒక సంవత్సరం ఎగ్గొట్టి.. ఇప్పుడు కబుర్లు చెబుతున్నారు.రోడ్లన్నీ వేసేశామంటున్న చంద్రబాబుకు ఇదే నా సవాల్. ఆటో ఎక్కి రండి.. బందరు వస్తారా..? అవనిగడ్డ వస్తారా?. కైకలూరు వస్తారా?. గుడివాడ వస్తారా?. ఆటోలో రండి గోతులున్న రోడ్లు మీకు చూపిస్తాం. ఆటోలో ప్రయాణించిన మీరు బందరు ఆసుపత్రిలో చేరడం ఖాయం. లోకేష్ సిగ్గు లేకుండా మహిళా ఆటోడ్రైవర్లతో బూతులు మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఆటో డ్రైవర్లందరినీ వంచన చేశారు’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు. -
‘ఎప్పుడు మేమే సర్దుకుపోవాలా?’.. జనసేన శ్రేణుల ఆగ్రహం
సాక్షి, కోనసీమ జిల్లా: ‘‘జనసేన నేతలు ఏ కార్యక్రమం చేసిన సీఎం చంద్రబాబు ఫోటో వేస్తున్నాం. కానీ, టీడీపీ నేతలు కార్యక్రమం చేస్తే పవన్ కల్యాణ్ ఫోటో అసలు వేయడం లేదు’’ అంటూ జనసేన కేడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం పి.గన్నవరంలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో(Auto Driver Sevalo) కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. డ్రైవర్లకు ఇచ్చిన చెక్పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటో లేకపోవడమే ఇందుకు కారణం. దీంతో.. స్థానిక జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సమక్షంలోనే టీడీపీ-జనసేన నాయకులు ఘర్షణకు(TDP Jana Sena Clash) దిగారు. వాగ్వాదంతో పాటు ఒకరినొకరు తోసేసుకున్నారు. రవాణా శాఖ అధికారులు ముద్రించిన పాంప్లెట్, మెగా చెక్కులోనూ పవన్ ఫోటో లేకపోవడంతో ఆందోళన చేపట్టారు. దీంతో ఆ కార్యక్రమం గందరగోళంగా మారింది. ఈ తరుణంలో.. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ(MLA Giddi Satyanarayana) ‘పోనీ..’ అంటూ వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే.. ప్రతీ విషయంలో తామే సర్దుకుపోతున్నామని, టీడీపీ వాళ్లు మాత్రం వాళ్లు చేసేది చేసుకుంటూ పోతున్నారంటూ జనసేన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఇంకో దుర్మార్గానికి తెర లేపిన నారా ఫ్యామిలీ! -
టీడీపీ నాయకులే కల్తీ లిక్కర్ డాన్లు: గడికోట శ్రీకాంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీడీపీ నాయకులు కల్తీ మద్యం డాన్లుగా మారి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులే పారుతోందని, టీడీపీ నేతలు కల్తీ మద్యం తయారీని పరిశ్రమ స్థాయికి తీసుకువెళ్ళారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కొత్త మద్యం పాలసీ ముసుగులో విచ్చలవిడిగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలు కేటాయించి, గ్రామగ్రామాన బెల్ట్ షాప్లను ఏర్పాటు చేయించి, ఈ కల్తీ మద్యాన్ని వాటి ద్వారా విక్రయిస్తున్నారని ధ్వజమెత్తారు. నాణ్యమైన మద్యం పేరుతో సీఎం చంద్రబాబు చెబుతున్నది ఈ కల్తీ మద్యం గురించేనని, ప్రజల ప్రాణాలను బలిపెట్టి, టీడీపీ నేతలు తమ జేబులు నింపుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇంకా ఆయనేమన్నారంటే..డిస్టిలరీల స్థాయిలో కల్తీ మద్యం తయారీ యూనిట్లునాణ్యమైన మద్యం సరఫరా చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, లక్షలాది మంది ప్రాణాలను పణంగా పెట్టి తెలుగుదేశం నాయకుల జేబులు నింపడమే ధ్యేయంగా కల్తీ మద్యం తయారీకి సహకారం అందిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అండదండలతో టీడీపీ నాయకులే కల్తీ లిక్కర్ తయారు చేసి మందు బాబుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వమే లిక్కర్ అమ్మకాలు జరిపితే దానిపై విషప్రచారం చేసిన చంద్రబాబు, కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడంతో వారు రెచ్చిపోయి కల్తీ లిక్కర్ తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు.తాజాగా మదనపల్లె సమీపంలోని తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో శుక్రవారం కల్తీ మద్యం రాకెట్ వ్యవహారం బయటపడింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏకంగా ఒక డిస్టిలరీ యూనిట్ స్థాయిలో రోజుకు 15వేల కేసుల కల్తీ లిక్కర్ తయారు చేసి బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. ఈ కేసులో మండల స్థాయి టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడుతోపాటు ఎనిమిది మంది కూలీలను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు.కానీ ఈ కల్తీ మద్యం రాకెట్ వెనుక రింగ్ మాస్టర్, సూత్రధారుల పేర్లపై ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించడం లేదు. అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేతను చంద్రబాబు, నారా లోకేష్లే కాపాడుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేలా ప్రతి రెండు జిల్లాలకు ఒక యూనిట్ నెలకొల్పి లిక్కర్ దందా సాగిస్తున్నారు. తాగడానికి మంచినీళ్లు లేని గ్రామాలున్నాయి కానీ, మద్యం సరఫరా జరగని గ్రామాలు ఏపీలో లేవు. వేళలతో సంబంధం లేకుండా 24 గంటలూ ఇంటికే మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చిల్లర అంగళ్లలో సైతం మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందో చెప్పాల్సిన పనిలేదు.లిక్కర్ స్కాం పేరుతో వైఎస్సార్సీపీపై బురదచల్లారువైయస్సార హయాంలో లిక్కర్ కుంభకోణం జరిగిందని ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు చేయని కుటిల ప్రయత్నం లేదు. ఆధారాలు లేకపోయినా వైయస్సార్సీపీ నాయకులను, వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులను కక్షపూరితంగా అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్టులు చేసి వేధించడమే ధ్యేయంగా లిక్కర్ కుంభకోణం సృష్టించారు. మాజీ ఐఏఎస్లు ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితోపాటు ఎంపీ మిధున్రెడ్డిలను అక్రమంగా అరెస్ట్ చేశారు. తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి అరెస్టులు చేసినా ఆ కేసులు కోర్టుల్లో నిలబడలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వరుసగా చీవాట్లు తింటోంది. కూటమి ప్రభుత్వ మోసాలతో ప్రజలు విసిగిపోయారు. 16 నెలల పాలనలోనే తీవ్రమైన వ్యతిరేకత తెచ్చుకుంది.స్పిరిట్ తో కల్తీ మద్యం తయారీరాష్ట్రంలో కల్తీ మద్యం రాకెట్ దందాను టీడీపీ మద్యం సిండికేట్ వ్యవస్థీకృతం చేసింది. ప్రభుత్వ పెద్దల అండదండలతో జిల్లాలు, రీజియన్ల వారీగా పంచుకుని మరీ కల్తీ మద్యం దందాను సాగిస్తోంది. నాడు కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో స్పిరిట్ను కొనుగోలు చేయడానికి కేంద్రం ఇచ్చిన ఆదేశాలను టీడీపీ మద్యం సిండికేట్ తమ దందాకు అవకాశంగా మలుచుకుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల్లోని స్పిరిట్ తయారీ పరిశ్రమల నుంచి డిస్టిలరీల పేరిట అవసరానికి మించి ‘ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (వాడుక భాషలో స్పిరిట్ అంటారు)ను అక్రమంగా కొనుగోలు చేస్తోంది. ఆ విధంగా భారీగా కొనుగోలు చేసిన స్పిరిట్తో కల్తీ మద్యం తయారు చేస్తున్నారు.అందుకోసం కల్తీ మద్యం యూనిట్లలో యంత్ర సామగ్రిని తెప్పించి పక్కాగా భారీ ప్లాంట్లనే నెలకొల్పారు. అక్రమంగా సేకరించిన స్పిరిట్ను డైల్యూట్ (పలుచన) చేసి అందులో కారమెల్, కలర్డ్ ఫ్లేవర్లు (రంగు నీళ్లు) కలిపి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. వివిధ ప్రముఖ బ్రాండ్ల పేరిట లేబుళ్లు, బిరడాలు ఇతర ప్రాంతాల్లో తయారు చేయించి తెప్పిస్తున్నారు. ఆ కల్తీ మద్యాన్ని బాట్లింగ్ చేసి బ్రాండెడ్ మద్యంగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.ఆ కల్తీ మద్యాన్ని తాగించడానికి గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగి బెల్ట్ షాపులు తెరుస్తున్నారు. లిక్కర్ షాపులకు అదనంగా పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలుంటే, వాటికి అనుబంధంగా దాదాపు 75 వేల బెల్ట్ దుకాణాలు నడుస్తున్నాయి. ఆ మద్యం దుకాణాలు, బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యాన్ని బ్రాండెడ్ మద్యంగా విక్రయిస్తున్నారు. మద్యం నెట్వర్క్ అంతా టీడీపీ సిండికేట్ గుప్పిట్లో ఉండటంతో ఈ దందా అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది.ప్రతి మూడు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీటీడీపీ సిండికేట్ సాగిస్తున్న కల్తీ మద్యం విక్రయాలు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25లో 4.26 కోట్ల ఐఎంఎల్ మద్యం కేసులు, 3.25 కోట్ల బీరు కేసులు విక్రయించారు. 4.26 కోట్ల ఐంఎఎల్ మద్యం కేసుల్లో 70 శాతం క్వార్టర్ బాటిళ్ల కేసులే ఉన్నాయి. అంటే 2.98 కోట్ల కేసుల్లో క్వార్టర్ బాటిళ్లే విక్రయించారు. ఒక్కో కేసులో 48 క్వార్టర్ బాటిళ్లు ఉంటాయి.ఈ లెక్కన 143 కోట్ల క్వార్టర్ బాటిళ్లు విక్రయించారు. దీన్నిబట్టి మొత్తం క్వార్టర్ బాటిళ్లలో మూడో వంతు కల్తీ మద్యం విక్రయించినట్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అమ్ముడవుతున్న ప్రతి మూడు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమే. ఆ ప్రకారం దాదాపు 48 కోట్ల క్వార్టర్ బాటిళ్ల మేర కల్తీ మద్యాన్ని విక్రయించారు. ఒక్కో క్వార్టర్ బాటిల్ను రూ.110 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ లెక్కన ఒక్క ఏడాదిలోనే రూ.5,280 కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని తాగించి సొమ్ము చేసుకున్నారు.పవన్ కళ్యాణ్ స్పందించాలిప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కూటమి పాలనలో యథేచ్ఛగా సాగుతున్న కల్తీ మద్యం విక్రయాలపై స్పందించాలి. టీడీపీ హయాంలో సుగాలి ప్రీతి హత్య జరిగితే వైయస్సార్సీపీ హయాంలో జరిగినట్టు విష ప్రచారం చేసి రాజకీయంగా వాడుకున్నాడు. 34 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారంటూ ఆయన చేసిన ప్రచారం కూడా పచ్చి అబద్ధమని అసెంబ్లీలో కూటమి ప్రభుత్వమే స్పష్టం చేసింది. లేనివాటిని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్.. కళ్ల ముందు కల్తీ మద్యం దందా సాగిస్తూ లక్షల మంది ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు?వైఎస్సార్సీపీ హయాంలో కల్తీ మద్యం విక్రయాలంటూ కూటమి నాయకులు విషం చిమ్మారు. కానీ కల్తీ లిక్కర్ తాగి ఒక్క మరణం కూడా సంభవించలేదని ఎన్సీఆర్బీ రిపోర్టులో స్పష్టం చేసింది. దీనిగురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు నమోదు చేయడమే కాకుండా సోషల్ మీడియాకి అడ్డుకట్ట వేయాలన్న దుర్భుద్ధితో మంత్రుల కమిటీ వేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బురదజల్లిన కూటమి నాయకులు, ఇప్పుడు వారు అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ నాయకులు నిజాలు మాట్లాడుతుంటే ఓర్వలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి కల్తీ మద్యం సరఫరా రాకెట్కి అడ్డుకట్ట వేయాలి. ప్రతిపక్షంపై దుష్ప్రచారం చేయడం మాని ప్రజల ప్రాణాలను కాపాడాలి. విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులను తక్షణం మూసేయాలి. -
ఆ లీజు వెనుక అసలు రహస్యం ఏంటి బాబూ?: వడ్డే శోభనాద్రీశ్వరరావు
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వం బలవంతపు భూ సమీకరణలకు వ్యతిరేకంగా ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక పోరాటానికి సిద్ధమవుతోంది. ఈ నెల 8న శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్టోబర్ 28న విజయవాడలో సభతో ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక పాదయాత్ర ముగియనుంది. ఏపీలో రోజురోజుకీ రైతాంగం భూమి ప్రశ్నార్థకంగా మారుతోందని చంద్రబాబుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు.తమ భూమి ఉంటుందో ఊడుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారని.. చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం కొత్త జమీందారులను సృష్టిస్తోందంటూ శోభనాద్రీశ్వరరావు దుయ్యబట్టారు. లక్షలాది ఎకరాలు నయా జమీందారులకు కట్టబెడుతున్నారు. విజయవాడలో ఆర్టీసీ స్థలం లూలుకి అప్పగించారు. రూ. 600 కోట్ల విలువైన భూమిని 99 ఏళ్లు లీజుకు ఇవ్వడం వెనుక చిదంబర రహస్యం ఏంటి?. లూలు మీద నీకు ఎందుకంత ప్రేమ చంద్రబాబు? వందల కోట్ల ఖరీదైన భూములు ఎలా కట్టబెడతారు’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు నిలదీశారు.‘‘ఏపీలో జరుగుతున్న భూదోపిడీపై ప్రజల్లో చైతన్యం చేస్తాం. ఆంధ్రా ఉద్యమాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నామని మహాదేవ్ అన్నారు. అక్టోబర్ 8న ఉద్ధానంలోని వెన్నెలవలస, మందస నుంచి ప్రారంభం ప్రారంభం కానుందని.. ప్రతీ చోటా హ్యూమన్ రైట్స్కు ప్రజల ద్వారా పిటిషన్లు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. చివరిగా విజయవాడలో 28న బహిరంగ సభ నిర్వహిస్తామని.. ఈ సభ ద్వారా ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక ఇస్తామని మహాదేవ్ వెల్లడించారు. -
కంగారు పెట్టకండి.. గుద్దితే నాకే బొ*.. : మంత్రి నారా లోకేష్
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఇందులో నేతలకు ఓ పద్ధతి అంటూ ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుంటారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక.. ఆ పార్టీ నేతల బూతు పురాణాలు నిత్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా.. స్వయంగా చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవువుతున్నాయి. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవంలో భాగంగా ఓ మహిళా ఆటోడ్రైవర్ పక్కనే కూర్చున్న లోకేష్.. ఆమె కంగుతినే రేంజ్లో మాట అన్నారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్.. ఇతర నేతలంతా ఆటోలో ప్రయాణించారు. ఆ సమయంలో.. ఆటో వెనుక రాసిన కొటేషన్లు చదువుతూ, లోకేష్ హాస్యం చేయబోయారు. ‘‘కంగారు పెట్టకండి..గుద్దితే నాకే బొ*’’ అంటూ లోకేష్ నోట మాట వచ్చింది. దీంతో ఆ మహిళా డ్రైవర్ ఒక్కసారిగా కంగుతింది. అయితే మంత్రిగారూ ఫీలవుతారనుకుందో ఏమో.. ఆమె కూడా ఇబ్బందిగానే నవ్వుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాకు చేరింది. కనీస గౌరవం లేకుండా ఓ మహిళ ముందు ఇలాగేనా మాట్లాడేంది అంటూ ప్రశ్నిస్తున్నారు పలువురు. -
అచ్చెన్నా.. ఆటో డ్రైవర్లు రానన్నారా?
పార్వతీపురం మన్యం జిల్లా: ఆటో డ్రైవర్లకు దసరా కానుక అంటూ ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమానికి స్పందన కరువైంది. ప్రభుత్వ చర్యలతో విసిగిపోయిన ఆటో డ్రైవర్లు.. సభలకు రావడానికి ఇష్టపడటం లేదని విషయం మంత్రి అచ్చెన్నాయుడు చేపట్టిన పార్వతీపురం సభలో తేటతెల్లమైంది. బలవంతంగా ఆటో డ్రైవర్లను ఆయా సభలకు తరలించినా కొన్ని చోట్ల అది సాధ్యం కాలేదు. అది కూడా తాను టీడీపీలో కీలక నేతగా ఫోజులిచ్చే అచ్చెన్న ‘ ఆటో డ్రైవర్ల సేవలో’ సభలో ఎటు చూసినా టీడీపీ శ్రేణులే కనిపించాయి. మరొకవైపు ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఆటో డ్రైవర్ల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు ఖాళీగా, బోసిగా మెరిసిపోయాయి. రూ. 15వేలను ప్రభుత్వం ఇస్తామని సభకు రమ్మని పిలిచినా ఆటో డ్రైవర్ల నుంచి సరైన స్పందన కాదు కదా.. కనీస స్పందన కూడా రాకపోవడం గమనార్హం. ఆ సభలో ార్యకర్తలు తప్ప ఆటో డ్రైవర్లు లేకపోవడంతో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే విజయచంద్రలు అవాక్కయ్యారు.చంద్రబాబు చేపట్టిన ఈ కార్యక్రమం ఒక దగా, మోసం అంటూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్స్ ఫెడరేషన్ విమర్శల గుప్పించిన నేపథ్యంలో చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమం వార్తల్లో నిలిచింది. ఆటో డ్రైవర్లకు రూ. 15 వేలు ఇస్తామని చెబుతున్నప్పటికీ ఇలా విమర్శలు రావడం ఏంటనేది ఒకటైతే, మంత్రి అచ్చెన్న సభలో ఆటో డ్రైవర్లు కనుచూపుమేర కనిపించకపోవడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఇదీ చదవండి:ఇది దసరా కానుక కాదు.. దగా, మోసం: ఆటో కార్మిక సంఘం ఫైర్ -
‘టీడీపీ నేతలే కల్తీ మద్యం తయారీ చేస్తున్నారు’
తాడేపల్లి : ఏపీలో కూటమి ప్రభుత్వం అండతో యథేచ్ఛగా కత్తీ మద్యం తయారవుతోందని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. టీడీపీ నేతలే కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు( శనివారం, అక్టోబర్ 4వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. ఈ కల్తీ మద్యానికి సామాన్య ప్రజలు బలి అవుతున్నారని ధ్వజమెత్తారు. ‘ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతల కల్తీ మద్యం వ్యాపారం జోరందుకుంది. చంద్రబాబు సొంత జిల్లా పక్కనే కల్తీ మద్యం తయారవుతోంది. కొన్ని లక్షల లీటర్ల కల్తీ మద్యం తయారీకి కావాల్సిన ముడి పదార్ధాలను కూడా పోలీసులు పట్టుకున్నారు. జగన్ హయాంలో జరగని మద్యం స్కాంని జరిగినట్టు చూపించే ప్రయత్నం చేశారు. కానీ మన కళ్లెదుటే జరుగుతున్న కల్తీ మద్యం గురించి ఎందుకు నోరు మెదపటం లేదు?, ఆర్గనైజ్డ్ స్కాం చేస్తున్నారు. తన తప్పులను కప్పి పుచ్చుకోవటానికి జగన్ చుట్టూ ఉన్న పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టారు. ప్రభుత్వానికి రావాల్సిన మద్యం ఆదాయం అంతా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయి. చంద్రబాబు చేసే వ్యవస్థీకృత పాపాల్లో ఎల్లోమీడియాకు కూడా భాగస్వామ్యం ఉంది. అందుకే టీడీపీ నేతల కల్తీ మద్యం గురించి వార్తలు కూడా రాయటం లేదు. చంద్రబాబు కల్తీ మద్యం తాగి 80% ఎస్సీ, ఎస్టీ, బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారు. నకిలీ, కల్తీ మద్యం రాకూడదనే జగన్ హయాంలో ప్రభుత్వ షాపుల ద్వారా విక్రయాలు చేశారు. మద్యం తాగొద్దని చెప్పాల్సిన ప్రభుత్వ పెద్దలే మద్యం అందిస్తామని చెప్తున్నారు. ఈ మద్యం తాగి ప్రజల ధన, మాన, ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రతి మూడు మద్యం బాటిళ్ళలో ఒకటి కల్తీ మద్యమే. సీబిఎన్ సిండికేట్ కల్తీ మద్యాన్ని తయారు చేస్తోంది. అంబేద్కర్ విగ్రహాన్ని తగులపెట్టిన వారిని వెంటనే అరెస్టు చేయాలి’ అని డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి:టీడీపీ నేతలే సూత్రధారులుగా.. నకిలీ మద్యం మాఫియా -
ఇది దసరా కానుక కాదు.. దగా, మోసం: ఆటో కార్మిక సంఘం ఫైర్
విజయవాడ: ఆటో కార్మికులకు దసరా కానుక పేరుతో ఈరోజు(అక్టోబర్ 4వ తేదీ) జరిగే సభ మోసపూరిత సభ అంటూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలోని ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ ధ్వజమెత్తింది. తాము చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వడానికి కలెక్టర్ను, ఎమ్మెల్యే బోండాను కలిస్తే, సీఎంను కలవడానికి వీల్లేదంటూ షరతులు పెట్టారని మండిపడ్డారు మరి అటువంటుప్పుడు ఈ రోజు జరగే సభ మోసపూరిత సభ కాకపోతే ఇంకేంటని ప్రశ్నించారు ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు పోలారి. ‘ఆటో కార్మికులను చూసి చంద్రబాబు భయపడుతున్నారు. మా సమస్యల పై వినతిపత్రం తీసుకోవడానికి జంకుతున్నారు. ఈ రోజు జరిగే సభలో వినతి పత్రం ఇస్తామని కలెక్టర్ను కలిశాం , ఎమ్మెల్యే బోండా ఉమాను కలిశాం. సీఎంను కలవడానికి వీల్లేదని మా వినతిని తిరస్కరించారు. ఈరోజు జరిపే సభ మోసపూరిత సభ. ఆటో డ్రైవర్లను బలవంతంగా బెదిరించి అధికారులు సభకు తీసుకెళ్లారు. సభలకు తరలిస్తే మంచి చేసినట్లు కాదు. నిజంగా మీరు మంచి చేస్తే స్వచ్ఛంధంగా మేమే తరలివస్తాం. సభకు బలవంతంగా ఆటో డ్రైవర్లను తరలించడం కాదు. ఇది దసరా కానుక కాదు..దగా మోసం. సూపర్ సిక్స్ పథకాలను భ్రష్టుపట్టించారు. జగన్ కంటే ఎక్కువ ఇస్తామన్నారు. ఏడాదిన్నరలో రూ. 2 లక్షల కోట్లు అప్పు తెచ్చిన మీరు ఆటో డ్రైవర్లకు రూ. 400 కోట్లు ఇవ్వలేకపోతున్నారా?, ఈ సభలోనైనా మీ హామీలను నెరవేరుస్తూ ప్రకటన చేయాలి. లేని పక్షంలో మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అన్ని సంఘాలను కలుపుకుని పోరాడుతాం’ అని ఆయన హెచ్చరించారు. ఐఎఫ్టీయూ ప్రధానకార్యదర్శి డి.శ్రీనివాసరావు మాట్లాడుతూ... ‘చంద్రబాబు ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారు. మా వినతిపత్రాలను కూడా తీస్కోవడం లేదు. ఎన్నికల ముందు మేం అడగకుండానే హామీలిచ్చారు. జగన్ కంటే ఎక్కువ ఇస్తామన్నారు. జగన్ రూ. 10 వేలు ఇచ్చాడు మేం రూ. 15 ఇస్తున్నామంటున్నారు. .చంద్రబాబుకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తెలియదు.పవన్ను చూసి ఓటేసిన నిరుద్యోగులు, యువత మోసపోయారు. మాకు ఇస్తామన్న ఆటో డ్రైవర్ లేవలో అనేక కొర్రీలు పెట్టారు. పెండింగ్ చలానాలు కడితేనే వాహనమిత్ర ఇస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటించడం సిగ్గు చేటు. జీవో నెంబర్ 21 రద్దు చేయలేదు. చంద్రబాబు నువ్వు మర్చిపోతే నీ ఎన్నికల మ్యానిఫెస్టోను చదువుకో. వీడియోలు చూసి గుర్తు తెచ్చుకో.సింగ్ నగర్ వేదికగా మాకు ఇచ్చిన ఐదు హామీలు నెరవేర్చాలి. అప్పటి వరకూ మా ఉద్యమం ఆగదు’ అని వార్నింగ్ ఇచ్చారు.ఇక్కడ చదవండి: ఇంకో దుర్మార్గానికి తెర లేపుతున్నారు! -
ఇంకో దుర్మార్గానికి తెర లేపుతున్నారు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నియంతృత్వ పోకడకు సిద్ధమవుతోంది. పౌరుల ప్రాథమిక హక్కులు, భావ స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నాలు ఆరంభించింది. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఇప్పటికే రెడ్బుక్ పేరుతో అరాచకపు పాలన సాగిస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సర్కారు సోషల్ మీడియా కట్టడికి రంగం తయారు చేస్తోంది. రెడ్బుక్ సృష్టికర్త, మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేశ్ సార్థ్యలోనే ఈ కమిటీ పని చేయబోతుండడం ప్రభుత్వ ఉద్దేశాలను స్పష్టం చేస్తున్నాయి. మంత్రుల కమిటీ బాధ్యతల ఉత్తర్వులు చూస్తే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న వారే లక్ష్యంగా పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే సోషల్ మీడియా కార్యకర్తలను రెడ్బుక్తో భయపెట్టడానికి చేసిన యత్నం విఫలమైన నేపథ్యంలో ఈ కొత్త అంకానికి తెరతీసినట్లు అర్థబవుతుంది. తమ దుర్మార్గపు పాలనకు పరాకాష్టగా తీసుకొస్తున్న ఈ కొత్త చట్టంపై వైఎస్సార్సీపీ నేతలు పలువురు తీవ్ర అభ్యంతరం తెలిపారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై 15 నెలల్లో 2300 అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని వారు అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్లు రాష్ట్రంలోను, వందల కొద్ది ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుతున్నారని, తద్వారా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై నిరంతరం విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలుఎ హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్తోపాటు విదేశాల్లోనూ ఉన్నాయని ఆరోపించారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలకు గురి అవుతున్న లోకేశ్ నేతృత్వంలో మంత్రుల కమిటీ ఎలాంటి సిఫారసులు చేస్తుంది? వాటికి ఉండే పవిత్రత ఏమిటి? సోషల్ మీడియా నియంత్రణకు ప్రస్తుతమున్న చట్టాలనే దుర్వినియోగం చేస్తున్నారని న్యాయ వ్యవస్థ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇంకేదో చేయాలని తెగబడడమేమిటి? కేంద్ర ప్రభుత్వ పరిధిలోని చట్టాలు వీళ్లు ఎలా మారుస్తారు? అని మాజీ అదనపు ఆడ్వకేట్ జనరల్ పోన్నవోలు సుధాకరరెడ్డి ప్రశ్నించారు. సోషల్ మీడియాతో పాటు, తన వైఫల్యాలను పదే, పదే గుర్తు చేసే ప్రదాన మీడియాను ముఖ్యంగా సాక్షి మీడియాను నియంత్రించడానికే ఈ ప్రయత్నంలా కనబడుతోంది. సోషల్ మీడియా వారిపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా, వారిపై లేని గంజాయి కేసులు పెడుతున్న తీరు, మహిళల అక్రమ రవాణా కేసులు పెడుతున్న వైనం పై న్యాయ స్థానాలు తీవ్రంగా స్పందించాయి. సోషల్ మీడియా యాక్టివిస్టు సవిందర్ రెడ్డి కేసులో అయితే ఏకంగా సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడం కూటమి ప్రభుత్వంలో కొందరు పోలీసుల అరాచకపు ప్రవర్తనను తేటతెల్లం చేసింది. హోం మంత్రి అనిత కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాపై అసెంబ్లీలో మాట్లాడిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొందరు తమ పేరులో రెడ్డి అని ఉన్నప్పటికీ ఆ పదం వాడడం లేదని, మరికొందరు రెడ్డి అయినప్పటికీ చౌదరి అని పెట్టుకుంటున్నారంటూ కొన్ని ఉదాహరణలు ఇచ్చి అప్రతిష్టకు గురయ్యారు. ఆమె చెప్పిన వారిలో ఒకరైన విజయ్ కేసరి ఎప్పుడూ అభ్యంతరకర విశ్లేషణలు చేయలేదు. ప్రభుత్వం మంచి, చెడులను గణాంకాలతో సహా విశ్లేషిస్తారు. ఆయన రెడ్డి అని బాధ్యత కలిగిన హోం మంత్రి మాట్లాడడం అందరిని నివ్వెరపరచింది. ఎవరైనా సోషల్ మీడియాలో తప్పులు ఏమైనా వస్తుంటే చెప్పాలి తప్ప, ఫలానా కులం అని చెప్పడం ఏపాటి విజ్ఞత? అలాగే మరొకరు చలపతి చౌదరి అని పేరు పెట్టుకుని యూ ట్యూబ్ నడుపుతున్నారని, అతని పేరు ముకేష్ రెడ్డి అని హోం మంత్రి అసెంబ్లీలో చెబితే, ఆ యువకుడు తన ఆధార్ కార్డు చూపి మరీ తాను చలపతి చౌదరినేనని రుజువు చేసుకున్నారు. దాంతో ఈ ప్రభుత్వ డొల్లతనం, మంత్రిగారి తొందరపాటుతనం అన్నీ బయటపడ్డాయి.మంత్రి అనిత చెప్పేది ప్రామాణికం అయితే స్వాతిరెడ్డి అనే పేరుతో సోషల్ మీడియాలో వైసిపిని విమర్శించే ఒకరు చౌదరి అట. పైగా ఆమెను గతంలో చంద్రబాబు అభినందించిన ఘట్టం కూడా జరిగిందట. ఆమె గురించిన సమాచారం అనిత వద్ద లేదా? లేక ఆమె తమ పార్టీ కనుక వదలి వేశారా అని కొందరు ప్రశ్నించారు. ఇక జగన్ ను ఉద్దేశించి మంత్రి ఎంత అనుచితంగా మాట్లాడేది అందరికి తెలిసిందే. అంతేకాదు. గతంలో ఈ మంత్రిగారు జగన్ కుటుంబ సభ్యులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు చట్టసమ్మతమేనా అని మరికొందరు ప్రశ్నించారు. ఇప్పుడు ఈ మంత్రిగారు కూడా ఈ కమిటీలో సభ్యురాలు. ఇక ప్రభుత్వ పెద్దలు నిత్యం అబద్దాలు ఆడుతారన్న విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు తిరుమల లడ్డూ ప్రసాదంపై చేసిన దారుణ వ్యాఖ్యల వల్ల జరిగిన నష్టాన్ని లోకేశ్ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందా? గతంలో పవన్ కళ్యాణ్ 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ చేసిన దారుణమైన అబద్దపు ప్రచారంపై ఈ కమిటీ ఏమైనా విశ్లేషిస్తుందా! సోషల్ మీడియా యాక్టివిస్టులు వ్యతిరేక ప్రచారం చేయకుండా కట్టడి చేయాలని చూస్తున్న ఈ కమిటీ ప్రభుత్వంలో అబద్దాలు ఆడే వారిపై కూడా కేసులు పెట్టవచ్చని సిఫారస్ చేయగలుగుతుందా? అప్పుడు ఈ కమిటీకి విలువ వస్తుంది.కాని అలా చేయలేరు. విపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎంత దుష్ప్రచారం చేసింది చంద్రబాబు, లోకేశ్ లకు తెలిసినట్లుగా మరెవ్వరికి తెలియకపోవచ్చు. దానిని ఎవరూ గుర్తు చేయకుండా ఉండడం కోసం, ఇప్పుడు ఈ కమిటీ ప్రయత్నిస్తుందన్న విమర్శ ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాకు సంబంధించి సుప్రీం కోర్టు నిర్దిష్టమైన గైడ్లైన్స్ ఇచ్చింది.వాటిని ఎపి పోలీసులు సరిగా పాటించడం లేదు. ఏడేళ్ల శిక్షకు అవకాశం ఉన్న సోషల్ మీడియా కేసులలో నోటీసు ఇచ్చి పంపాలి. అలా చేయడం ఇష్టం లేని రెడ్బుక్ రాజ్యంగం అమలు చేస్తున్న పోలీసులు పలు తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈ కమిటీ అలాంటి పోలీసులపై చర్య తీసుకోవడానికి సిఫారస్ చేస్తుందా? ఈ కమిటీ జవాబుదారితనం గురించి ఆలోచిస్తుందట. ముందుగా ప్రభుత్వంలో ఉన్నవారి జవాబుదారితనం గురించి ఈ కమిటీ చర్చించి, నిర్ణయాలు చేసి, అప్పుడు సోషల్ మీడియావారి జోలికి వెళితే మంచిది కదా! అంతర్జాతీయ ఉత్తమ పద్దతులను అధ్యయనం చేస్తారట. అదేమిటో తెలియదు. హానికరమైన కంటెంట్, తప్పుడు సమాచారం, జాతీయ భద్రతకు ముప్పు వంటి అంశాలలో ఎలా స్పందించాలో ఇప్పటికే చట్టాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా వీటిపై అప్రమత్తంగానే ఉంటుంది. అయినా ఆ పేరుతో పద్దతిగా ఉండే సోషల్ మీడియా యాక్టివిస్టులను నియంత్రించాలన్న ఉద్దేశం ఉందేమో అని పలువురు అనుమానిస్తున్నారు. పౌరహక్కులను కాపాడడంపై సలహా ఇవ్వాలన్నది ఈ కమిటీ బాధ్యతట. అదే నిజమైతే ప్రభుత్వం ఇంతవరకు అక్రమంగా అరెస్టు చేసిన సోషల్ మీడియా యాక్టివిస్టుల కేసులన్నిటీని సమీక్షించి, అన్యాయంగా అరెస్టు అయినవారిని విడుదల చేయడమే కాకుండా తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై చర్య తీసుకోవాలి. అప్పుడు ఈ కమిటీకి విలువ పెరుగుతుంది. ఆ పని చేస్తారా? నిరంతర పర్యవేక్షణ కోసం నోడల్ ఏజెన్సీలను పెట్టాలట. అంటే ఇప్పుడు ఉన్న పోలీసుల బెదిరింపులు చాలవన్నట్లుగా కొత్తగా కొన్ని సంస్థలను సృష్టించి వారికి కోట్ల రూపాయలు చెల్లించి సోషల్ మీడియా వారిని బెదిరించడమో, భయపెట్టడమో చేస్తారన్న డౌటు రావడం లేదా? ఇదంతా మీడియా గొంతు నొక్కడమేనని వైఎస్సార్సీపీ అభిప్రాయపడింది. ఈ కమిటీలో బీజేపీ నుంచి మంత్రి సత్య ప్రసాద్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, మరో మంత్రి పార్థసారథి కూడాఉన్నప్పటికీ, అంతిమంగా లోకేశ్ ఏమి డిక్టేట్ చేస్తే అది ఫైనల్ అన్న సంగతి బహిరంగ రహస్యమే! ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. తెలంగాణ డీజీపీగా నియమితులైన శివధర్ రెడ్డి తమ రాష్ట్రంలో రెడ్ లేదా పింక్, లేదా బ్లూ బుక్ లు ఏవీ ఉండవని, ఖాకీ బుక్ మాత్రమే ఉంటుందని, అది చట్టాల ప్రకారమే నడుస్తుందని వ్యాఖ్యానించారు. ఏపీ పోలీసులకు, ఏపీలో రెడ్ బుక్ అరాచకపు పాలనకు చెంపపెట్టు అనడానికి ఈ ఒక్క వ్యాఖ్య చాలదా!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఏపీలో 12 శిరస్సుల నాగేంద్రుడి రూపంలో సుబ్రమణ్య స్వామి క్షేత్రం ఎక్కడో తెలుసా.. (ఫొటోలు)
-
మైనర్ బాలుడిపై పోక్సో కేసు నమోదు
కర్నూలు(టౌన్): కర్నూలు నగరంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఓ మైనర్ బాలుడిపై పోక్సో కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. పాతబస్తీకి చెందిన ఓ మైనర్ బాలుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అదే వీధిలో 10వ తరగతి చదివే ఓ బాలికతో స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. చనువు పెరిగి ఇద్దరూ దగ్గరవడంతో ఆ బాలిక గర్భం దాల్చింది. గత నెల 20న బాలిక కడుపునొప్పితో బాధ పడుతుండటంతో తల్లి గ్రహించి ఆరా తీసింది. విషయం తెలుసుకుని ట్యాబ్లెట్లు ఇచ్చింది. తీవ్ర నొప్పితో బాధ పడుతున్న ఆ బాలిక ఇంట్లోనే శిశువుకు జన్మనిచ్చింది. తల్లిదండ్రులు వెంటనే కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే శిశువు మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. మైనర్ బాలికను మోసం చేసి గర్భవతిని చేసిన మైనర్ బాలుడిపై బాధిత తండ్రి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 75,188 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,640 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.66 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది.దర్శన టిక్కెట్లు లేని వారికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల్లో తిరుమలేశుని దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలైకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
ముత్యాలపాడులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. కర్రలు, బీరు బాటిళ్లతో దాడి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం ముత్యాలపాడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముత్యాలపాడులోని అరుంధతతీయ పాలెంలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతలకు దారి తీసింది. పాత కక్షల నేపథ్యంలో రెండు వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డాయి. సుధా, రాముడు, పెంచలయమ్మ అనే ముగ్గురి పై సుమారు 15 మంది దాడికి దిగారు. కర్రలు, బీరు బాటిళ్లు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు ఈ ఘటనలో రెండు వర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
AP: ఛలో విజయవాడకు పీహెచ్సీ వైద్యులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్సీ వైద్యుల సమ్మె ఎనిమిదో రోజు శుక్రవారం కొనసా గింది. గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు సైతం బహిస్కరించి సమ్మె చేస్తున్నారు. మెడికల్ పీజీ ఇన్- సర్వీస్ కోటా మరింపు, ఇతర సమస్యల పరిష్కారం కోసం వైద్యులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. 20 శాతం ఇన్ సర్వీస్ కోటా అన్ని వీటి క్లినికల్ బ్రాంచ్ కోర్సులకు వర్తింది. జేయాలని వైద్యులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లోని డీఎం హెచ్, కలెక్టర్ కార్యాలయాల ముందు శిబిరాల్లో పెద్ద ఎత్తున వైద్యులు ఆందోళన కార్యక్ర మాలు చేపట్టారు. వైద్యులతో ఉన్నతాధికారులు రెండు పర్యాయాలు నిర్వహించిన దర్శలు విఫల -మయ్యాయి. శుక్రవారం మూడోసారి ఏదీ దీహెచి వైద్యుల సంఘం ప్రతినిధులతో ప్రజారోగ్య కుటుం డాక్టర్ పద్మావతి, ఆరోగ్య కుటుంబ సంక్షేము కమిషనర్ వీరపాండియన్ సుదీర్ఘంగా భేటీ అయి. వైద్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ చర్చలు విఫల మయ్యాయి. ప్రభుత్వం చెప్పిన ప్రదిపాదనలకు వైద్యులు తలొగ్గలేదు. యధావిధిగా సమ్మెను కొన సాగిస్తామని వైద్యులు ప్రభుత్వానికి తేల్చి చెప్పాడు. శనివారం ఛలో విజయవాడలో భాగంగా ధర్నాచౌక్ లో ధర్నా చేయనున్నారు. దీనిలో భాగంగా పీహెచ్సీ వైద్యులు పె ద్ద సంఖ్య లో అక్కడ చేరుకున్నారు. మధ్యాహ్నం వరకూ ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు. ప్రభుత్వం దిగిరాని పక్షంలో ఆదివారం. నుంచి ఆమరణ దీక్షలు చేపడతామని ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు. -
ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం దందాకు కూటమి ప్రభుత్వం అండదండలు... తొలి ఏడాదే 5 వేల 280 కోట్ల రూపాయల దోపిడీ
-
ఉక్కిరిబిక్కిరి...సచివాలయాలకు ఊపిరందేనా!
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో తొలిసారిగా పౌర సేవలు, సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే చేరవేస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ గ్రామ, వార్డు సచివాలయాలను వ్యవస్థను ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రం వచ్చాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2019 అక్టోబరు 2కు ముందు రాష్టంలో 3 వేల గ్రామ పంచాయతీలకు కనీసం కార్యాలయ భవనాలు లేవు. పెద్ద గ్రామాల్లో సైతం శిథిలావస్థకు చేరిన పంచాయతీ కార్యాలయాలు తప్ప మరో ప్రభుత్వ కార్యాలయం ఉండని పరిస్థితి. 4–5 పంచాయతీలకు ఒక్కరే కార్యదర్శి. కానీ, ఆ పంచాయతీ కార్యాలయాన్ని ఎప్పుడు తెరుస్తారో ఆ గ్రామ ప్రజలకే తెలియదు. అలాంటి సమయంలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు తర్వాత ప్రతి గ్రామంలో 8 నుంచి 10 మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి గ్రామంలో, ప్రత వార్డులో అందుబాటులోకి వచ్చారు. » ప్రజల గడప వద్దనే సేవలు అందించేందుకు ప్రతి 50 మందికి ఓ వలంటీరును వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. రోజూ ఉదయం 10 గంటలకే వీరంతా ప్రభుత్వ సేవలకు ప్రజలకు సిద్ధంగా ఉండేవారు. సాయంత్రం 3–5 గంటల మధ్య సచివాలయ ఉద్యోగులు ప్రత్యేకంగా వినతుల స్వీకరణకే కేటాయించారు. కుగ్రామాల్లో ఉండే సచివాలయాల్లో 545 వరకు రాష్ట్ర ప్రభుత్వ సేవలతో పాటు పాస్పోర్టు బుకింగ్ తదితర కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల సర్వీసులనూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. ఈ వ్యవస్థకు అనుబంధంగా వాలంటీర్ల వ్యవస్థను నాడే ప్రవేశపెట్టారు. ప్రభుత్వం మారగానే కుదేలు 16 నెలల కిత్రం వచ్చిన టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీరు–సచివాలయ వ్యవస్థను బలహీనపరిచే చర్యలు మొదలుపెట్టింది. గత ప్రభుత్వంలో ఐదేళ్ల కాలంలో పనిచేసిన వలంటీర్ల వ్యవస్థను లేకుండా చేశారు. వలంటీర్లు చేసిన పనులకు గ్రామ, వార్డు సచివాలయాల్లోని శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకుంటున్నారు. దీంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయాల్సిన ప్రభుత్వ సేవలు కుంటుపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తిఅయిన సందర్భంగా సీఎం చంద్రబాబు ఫోటోతో కూడిన స్టిక్కర్లను ఇళ్లకు అంటించే బాధ్యతలను సచివాలయ ఉద్యోగులకే అప్పగించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసే కరపత్రాలను ఇంటింటికీ వెళ్లి పంచుతున్నారు అవినీతి, పైరవీ లేకుండా సేవలు గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, అంతకుముందు ఏ ప్రభుత్వ పథకం అమలు చేసినా ఊళ్లో ఏ ఐదు, పదిమందికో లబ్ధి దక్కేది. అది కూడా ఊళ్లో పెద్దలతో పైరవీలు చేసుకునేవారికో, లంచం ఇచ్చేవారికో అవకాశం ఉండేది. అయితే, వైఎస్ జగన్ పాలనలో సచివాలయాల ద్వారా ప్రతి ప్రభుత్వ పథకాన్ని సంతృప్త స్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అందే విధానం ప్రవేశపెట్టారు. ఎలాంటి పక్షపాతం, పైరవీలు, అవినీతికి తావివ్వలేదు. ఇరుకు భవనాల్లోని పంచాయతీ కార్యాలయాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం మోక్షం కల్పించింది. సచివాలయాల సేవలను ప్రజలకు అందించేలా ప్రతి చోటా రూ.43.60 లక్షలు ఖర్చుపెట్టి 2,623 చదరపు అడుగుల విశాలమైన రెండంతస్తుల గ్రామ సచివాలయం భవనాలను నిర్మించారు. రూ.4,750 కోట్ల ఖర్చుతో 10,893 గ్రామ సచివాలయాలను మంజూరు చేయగా చాలాచోట నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటి పక్కనే రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ల నిర్మాణాన్ని కూడా గత ప్రభుత్వం చేపట్టింది.వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు, భవనాల నిర్మాణానికి పరిమితం కాకుండా కార్యాలయాల్లో ఆధునిక మౌలిక వసతులు కల్పించింది. 4 నెలలకే 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఉమ్మడి ఏపీలో 40 ఏళ్ల కిందట మండల వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు ఎలాంటి ప్రత్యేక ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. దీంతో ప్రజలకు సమర్థంగా పథకాలు అందలేదు. సుస్థిర అభివృద్ధి (ఎస్డీజీ) లక్ష్యాల సాధనలో ఉమ్మడి ఏపీ మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే చాలా అంశాలలో వెనుకబడింది. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థతో ప్రజలకు సమర్థంగా సంక్షేమ కార్యక్రమాలు అందాలని భావించింది. దీనికోసం కొత్తగా ఏర్పాటు చేసిన 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు 1.34 లక్షల కొత్త శ్వాశత ప్రభుత్వ ఉద్యోగాలను మంజూరు చేసింది. 4 నెలల్లోనే భర్తీ ప్రక్రియను ముగించింది. సచివాలయాలకు అనుబంధంగా పనిచేసేందుకు గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒకరు, పట్టణాల్లో 75–100 ఇళ్లకు ఒకరు చొప్పున 2.66 లక్షల మంది వాలంటీర్లను వైఎస్ జగన్ ప్రభుత్వం నియమించింది. అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించి జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు, రెవెన్యూ డివిజన్లను 52 నుంచి 77కి పెంచడం ద్వారా ప్రభుత్వం పరిపాలనాపరమైన పునర్ నిర్మాణం చేపట్టింది. యునిసెఫ్ సైతం భాగస్వామ్యం ఐక్యరాజ్యసమితి అనుబంధ యునిసెఫ్ కూడా ఏపీలో సుస్థిర అభివృద్ధి, లక్ష్యాల సాధనకు గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ ప్రతినిధులు గ్రామ, వార్డు సచివాలయాల రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించారు. కోవిడ్ విపత్తు సమయంలో రాష్ట్రంలో ప్రాణ నష్టం చాలా తక్కువగా ఉండడానికి గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఒక కారణం అని కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసించింది. విపత్తు వేళ వాలంటీర్లు–సచివాలయాల సిబ్బంది మూడు రోజుల వ్యవధిలోనే రాష్ట్రమంతా ఇంటింటి సర్వేలు దాదాపు 30 విడతల పాటు నిర్వహించడం గమనార్హం. యునిసెఫ్తో పాటు కేంద్రం ప్రశంసలతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు.. గ్రామ, వార్డు సచివాలయాలను తమ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టేందుకు ఏపీలో పరిశీలన చేశాయి.నాడు... ఆరేళ్ల క్రితం అక్టోబరు 2న దేశ చరిత్రలో ఒక విప్లవాత్మక కార్యక్రమం. వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో గాం«దీజీ జయంతి సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు అంకురార్పణ. ప్రభుత్వ సేవలు, కార్యక్రమాలను ప్రజలకు గడప వద్దనే అందించడమే లక్ష్యంగా పనిచేశాయి...! కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూశాయి. అంకితభావంతో విధి నిర్వహణతో గాం«దీజీ చెప్పిన గ్రామ స్వరాజ్యానికి నిలువుటద్దంలా నిలిచాయి.నేడు... గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజల సేవల కన్నా ప్రభుత్వ పెద్దలు చెప్పే ఇంటింటి సర్వేలకు పరిమితం అయ్యాయి. ఎన్నో ఆశలతో ఉద్యోగాల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆత్మగౌరవం దక్కితే చాలని భావించే దుస్థితి. తమ డిమాండ్ల సాధనకు వారం, పది రోజులుగా నిరసనలు చేపడుతున్నా పట్టించుకునేవారు లేరు. రోడ్లపైకి వచ్చి, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేస్తున్న వీరు... గురువారం దసరా పండుగ నాడు ‘మహాత్మా మా గోడు వినయ్యా’అంటూ వాట్సాప్లో స్టేటస్ పెట్టి ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు.1.34 లక్షల ఉద్యోగాల భర్తీ దేశంలో ఇప్పటికీ రికార్డే 2019 జూలై–అక్టోబరు మధ్య 1.34 లక్షల శాశ్వత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 21.69 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. 19,50,630 మంది రాత పరీక్షలకు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయలేదు. యువత కూడా అంత పెద్ద సంఖ్యలో ఒకేసారి పరీక్షలు రాయడం దేశ చరిత్రలోనే లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. రేషనలైజేషన్ పేరిట ఉద్యోగుల కుదింపువైఎస్ జగన్ ప్రభుత్వంలో 10–11 మంది చొప్పున పనిచేసేలా సచివాలయాలు ఏర్పాటు కాగా, కూటమి ప్రభుత్వం... వాటి పరిధిలో నివాసం ఉండే జనాభా ఆధారంగా ఉద్యోగుల సంఖ్యను 6–8కి మధ్యకు పరిమితం చేయాలని నిర్ణయించింది. గ్రామాల్లో నిత్యం ప్రజలకు కావాల్సిన ప్రభుత్వ సేవలను అందించే వీఆర్వోలు, అగ్రికల్చర్, వెటర్నరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గతంలో ఒక్కో సచివాలయంలో ఒక్కొక్కరు చొప్పన పనిచేశారు. కానీ, ఆయా కేటగిరీ ఉద్యోగులను 2, 3 సచివాలయాలకు ఒకరు చొప్పున తగ్గించాలని కూటమి సర్కారు నిర్ణయించింది. ఈ ప్రక్రియ తిరిగి చాలా గ్రామాల్లో కొన్ని రకాల ప్రభుత్వ సేవలకు విఘాతం కలిగిస్తుందన్న విమర్శలున్నాయి. దీనికితోడు ఆరేళ్ల క్రితం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు సమయంలో సరఫరా చేసిన కంప్యూటర్లు, ప్రింటర్లు పనిచేయడం లేదు. ప్రభుత్వం కొత్తవి సరఫరా చేయడం లేదని ఉద్యోగ సంఘాల పేర్కొంటున్నాయి. -
గిరిజన బాలికపై గ్యాంగ్రేప్
పాడేరు: కూటమి పాలనలో బాలికలు, మహిళలకు రక్షణ లేదనటానికి ఈ దారుణ సంఘటన మరో ఉదాహరణ. అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలోని ఓ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తులు నాలుగు రోజులు అత్యాచారం చేశారు. ఈ దారుణంపై సెపె్టంబర్ 13న ఫిర్యాదు చేసినా చింతపల్లి పోలీసులు స్పందించలేదు. పాడేరు ఐటీడీఏలో శుక్రవారం కలెక్టర్ దినేష్ కుమార్కు బాధిత బాలిక ఫిర్యాదు చేసింది. ఆ బాలికతో పాటు గిరిజన నాయకులు బాలకృష్ణ (కాంగ్రెస్), చంటిబాబు (సీపీఐ) తదితరులు కలెక్టరును కలిసి న్యాయం చేయాలని కోరారు. బాలిక ఫిర్యాదు మేరకు.. సెపె్టంబర్ 5న లంబసింగికి చెందిన తెలిసిన మహిళ బాలికకు మాయమాటలు చెప్పి తనవెంట తీసుకెళ్లింది. కొద్దిదూరం వెళ్లాక తోటమామిడికి చెందిన యువకుడి బైక్పై వారు నర్సీపట్నం వెళ్లారు. అక్కడి నుంచి జి.మాడుగుల మండలం వంజరికి చెందిన యువకుడి కారులో వీరు ముగ్గురు విశాఖపట్నం వెళ్లారు. అక్కడ ఓ ఇంట్లో బాలికను బంధించి తోటమామిడి యువకుడు, వంజరి యువకుడు 3 రోజుల పాటు అత్యాచారం చేశారు. నాలుగో రోజు నర్సీపట్నం తీసుకొచ్చి లాడ్జిలో ఉన్నారు. అనంతరం లాడ్జి నిర్వాహకుడితో బాలికకు రూ.100 ఇప్పించి, అక్కడి నుంచి పరారయ్యారు. ఆ బాలిక సెపె్టంబర్ 12న కుటుంబ సభ్యులకు నర్సీపట్నం నుంచి ఫోన్ చేసి, జరిగిన దారుణాన్ని చెప్పడంతో తల్లిదండ్రులు సెపె్టంబర్ 13న చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు వ్యక్తుల వివరాలను కూడా పోలీసులకు ఇచ్చారు. అయినా పోలీసులు రేపు, ఎల్లుండి అంటూ కాలయాపన చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కలెక్టర్ను కోరారు. అనంతరం విలేకరులకు ఈ వివరాలను వెల్లడించారు. -
స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసులో రిమాండ్ కోరతారా?
కడప అర్బన్: ‘పోలీస్స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాల్సిన కేసులో రిమాండ్ కోరతారా? వెంటనే నిందితునికి 41ఏ నోటీసులిచ్చి విడుదల చేయాల’ని కడప వన్టౌన్ పోలీసులపై వైఎస్సార్ కడప జిల్లా మూడో అదనపు మేజిస్ట్రేట్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం సామాజిక మాధ్యమంలో ఒక పోస్టును షేర్ చేస్తేనే అరెస్టుచేసి రిమాండ్కు పెడతారా అని ఆమె ప్రశ్నించారు. వివరాలివీ.. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి తీరును నిరసిస్తూ టీడీపీ సీనియర్ మహిళలు 2024 ఎన్నికల్లో మూసాపేట సర్కిల్లో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన వీడియోలను అంజద్ బాషా పీఏ ఖాజా ఇటీవల షేర్ చేశారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసులరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో సెప్టెంబరు 29న పోలీసులు ఖాజాపై కేసు నమోదు చేశారు. ఈనెల 1న హైదరాబాద్లో ఖాజాను పోలీసులు అరెస్టుచేసి కడపకు తీసుకొచ్చారు. రిమాండ్ నిమిత్తం గురువారం మధ్యాహ్నం కోర్టులో ఖాజాను హాజరుపరిచారు. అయితే, పోలీసుల అక్రమ అరెస్టుపై కడప జిల్లా మూడో అదనపు మేజిస్ట్రేట్ విజయలక్ష్మి మండిపడ్డారు. స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులో రిమాండ్ కోరడం ఏమిటని ప్రశ్నించారు. కేవలం సోషల్ మీడియా పోస్ట్ షేర్చేస్తేనే రిమాండ్కి పెడతారా అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. 41ఏ నోటీసులిచ్చి వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. మేజిస్ట్రేట్ ఆదేశాలతో అంజాద్ బాషా పీఏ ఖాజాను పోలీసులు గురువారం సాయంత్రం విడుదల చేశారు.