breaking news
Andhra Pradesh
-
మరోసారి భారీ అప్పు చేసిన కూటమి ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ఇదివరకే అప్పులలో రికార్డు సృష్టించిన చంద్రబాబు ప్రభుత్వం మరో భారీ అప్పు తెచ్చింది. ఈ రోజు (మంగళవారం) రూ. 3800 కోట్లు అప్పుగా తీసుకవచ్చింది. రిజర్వు బ్యాంకులో సెక్యూరిటీలు వేలం వేయడం ద్వారా ఈ అప్పుతెచ్చింది. చంద్రబాబు అధికారం చేపట్టిన 26 నెలల్లోనే రూ. 3 లక్షల 68 వేల కోట్లు అప్పు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలోనే అత్యధికంగా అప్పు తెచ్చిన ప్రభుత్వంగా చంద్రబాబు సర్కార్ రికార్డు సృష్టించింది. -
AP: పడకేసిన పంటల బీమా పథకం.. లోక్సభ సాక్షిగా తేటతెల్లం!
ఢిల్లీ: ఏపీలో పంటల బీమా పథకం పడకేసిందనే విషయం లోక్సభ సాక్షిగా తేటతెల్లమైంది. 2025-26 లో కేవలం 18.88 లక్షల మంది రైతులు మాత్రమే ఎన్రోల్ అయిన విషయం వెలుగు చూసింది. ఏపీలో పంటల బీమా పథకం గురించి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి అడగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి రామ్నాథ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. రైతులకు సంబంధించి పంట దిగుబడి డేటాను రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలి. డేటా అందిన 21 రోజులలో బీమా కంపెనీల ద్వారా క్లైమ్ పరిష్కారం అవుతుంది. అంటే చంద్రబాబు సర్కారు.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం పై దృష్టి పెట్టలేదనే విషయం కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం సాక్షిగా బయటపడంది. ఈ పథకం ఎందుకో తెలుసా..?ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) అనేది ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు లేదా అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక భద్రత కల్పించే కేంద్ర ప్రభుత్వ పంట బీమా పథకం. రైతులు తక్కువ ప్రీమియంతో తమ పంటలకు పూర్తి రక్షణ పొందేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఇది చంద్రబాబు సర్కారు అలసత్వం..మరి ఈ పథకాన్ని వినియోగించుకోవడంలో ఏపీ ప్రభుత్వం చూపిన అలసత్వం ఏమిటన్నది తాజాగా రుజువైంది. చంద్రబాబు సర్కారుకు రైతు సమస్యలపై దృష్టి లేదనడానికి ఇదొక ఉదాహరణ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అదే వైఎస్ జగన్ హయాంలో.. ప్రజా సంక్షేమాన్ని కానీ వారి సమస్యలను కానీ అత్యంత ఎక్కువ శ్రద్ధ పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ జగన్ నేతృత్వంలోని గత ప్రభుత్వం. అందుకు ఈ గణాంకాలే ఉదాహరణం. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 2022-23లో 123.87 లక్షలు, 2023-24 లో 132.55 లక్షల మంది రైతులకు పంట బీమాకు ఎన్రోల్ అయ్యారు. మరి ఇప్పుడు ఆ సంఖ్య 18.88 లక్షలకు పడిపోయి చంద్రబాబు సర్కారు వైఫల్యానికి నిదర్శనంగా నిలిచింది. -
కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో వైఎస్సార్సీపీ నేతల భేటీ
ఢిల్లీ: కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని మంగళవారం వైఎస్సార్సీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, తనుజారాణి, గురుమూర్తి , మేడా రఘునాథ్ రెడ్డి , గొల్ల బాబురావు మంగళవారం కలిశారు. పంచదార్లలో అక్రమ మైనింగ్ ఆపివేయాలని విజ్ఞప్తి చేశారు. మైనింగ్ ఫ్రీ హెరిటేజ్ జోన్గా ప్రకటించాలని కోరారు.పంచదార్లలో గ్రావెల్ క్వారీ కార్యకలాపాలపై తక్షణ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ జరిపాలని మైనింగ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని వైఎస్సార్సీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. క్వారీ లీజు, అనుమతి సరిహద్దులు, అప్రూవ్డ్ మైనింగ్ ప్లాన్, అనుమతించిన లోతు-పరిమాణాలు పరిశీలించాలని అన్నారు. రెవెన్యూ, కడాస్ట్రల్, GPS/GIS రికార్డులతో జాయింట్ సర్వే నిర్వహించి లీజు సరిహద్దులు దాటి తవ్వకాలు జరిగాయో లేదో నిర్ధారించాలని చెప్పారు.అనధికార క్వారీ, బ్లాస్టింగ్ కార్యకలాపాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. గ్రావెల్ తవ్విన పరిమాణం, రవాణా వివరాలు పరిశీలించి అధిక తవ్వకాలు, అక్రమ రవాణా ఉన్నాయో తేల్చాలని అన్నారు. ASI రక్షిత బౌద్ధ అవశేషాలు, ధర్మలింగేశ్వరస్వామి ఆలయం సమీపంలో బ్లాస్టింగ్ ప్రభావం అంచనా వేయాలని కోరారు. -
"ఏపీ ఫర్ సేల్" అనే పరిస్థితి వచ్చింది.. కన్నబాబు
సాక్షి, కాకినాడ: కూటమి ప్రభుత్వం ఆడిండే ఆట పాడిందే పాట అన్న చందాన ప్రభుత్వం సాగుతుందని మాజీమంత్రి కన్నబాబు అన్నారు. చంద్రబాబు పాలనలో "ఏపీ ఫర్ సేల్" అనే పరిస్ధితి వచ్చిందన్నారు. ప్రజల పక్షాన నిలబడి పని చేయ్యాల్సిన చంద్రబాబు కార్పోరేట్ల పక్షాన నిలబడ్డాడని ధ్వజమెత్తారు. ఈ రోజు (మంగళవారం) కాకినాడలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి తన సొంత మనుషుల కోసం.. కార్పొరేట్ సంస్ధల కోసమేనని తేటతెల్లమైందన్నారు.కన్నబాబు మాట్లాడుతూ..పీపీపీ ద్వారా రాష్ట్రాన్ని ఏం చేయ్యాలనుకుంటున్నారు. ప్రభుత్వమే గ్యాప్ ఫండింగ్ తో పాటుగా వడ్డీ లేని రుణాలను ప్రైవేటు సంస్ధలకు కట్టబెడుతుంది.ప్రభుత్వ ఆస్ధులు..వనరులను దోచి పెట్టి యూజర్ ఛార్జీల పేరుతో ప్రైవేటు సంస్ధలు దోచుకునేలా చేస్తున్నారు. పీపీపీకీ ఇవ్వకుండా ఇంకా ఏ రంగం మిగిలింది? వ్యవసాయం గిట్టుబాటు కాదని వదిలేసినట్లు ఉన్నారు. మీ ప్రభుత్వాన్ని కూడా పీపీపీ క్రింద నడపండి. ఇప్పటికే ఆర్టిసీ ఆస్ధులను ప్రైవేటు పరం చేస్తున్నారు. అన్ని రంగాలను ప్రైవేటు పరం చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు.కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏం చేయ్యాలనుకుంటుందని చంద్రబాబును భుజాన మోసే కార్యక్రమంలో పచ్చ మీడియా సంస్థలు అన్ని మరచిపోయాయని ధ్వజమెత్తారు. ఈనాడులో పీపీపీ మీద ఆహ ఓహో అంటూ రాస్తారా? ఇదే మీ రామోజీ ఫిల్మ్ సిటీ ఐతే ఒప్పుకుంటారా? పీపీపీ పాలసీ సిగ్గు చేటు...ప్రజలకు ప్రమాదకరమని ఒక్కసారి ప్రభుత్వ రంగ ఆస్ధులను కట్టబెడితే మళ్ళీ వెనక్కి తీసుకోలేరని అన్నారు. ఈ అధికారం మీకు ఎవ్వరూ ఇచ్చారని ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ ఆస్ధులను పప్పు బెల్లాల్లా పంచేస్తారా అని విమర్శించారు. నవ్విపోదురు గాక నాకేంటీ సిగ్గూ అని మీరు అనుకుంటే... ప్రజలు నవ్వే పరిస్థితి లో లేరని, పీపీపీ పాలసీని ఎండగట్టే పరిస్ధితి వచ్చిందన్నారు.పీపీపీ ద్వారా డబ్బులు, రుణాలు, భూమి, ఆస్ధులను ప్రభుత్వమే ఇస్తుందని ప్రైవేటు సంస్ధలు యూజర్ ఛార్జీలను వసూల్ చేస్తుందని దోపిడికి తెర తీసి తరతరాలకు నష్టం చేస్తామంటే ఒప్పుకోమన్నారు. ముక్కు పిండి జనాల దగ్గర సేవలకు ఛార్జీలు వసూలు చేస్తామని పీపీపీ పాలసీ ద్వారా చెబుతున్నారు. పారిశుద్ధ్యం చేయ్యాల్సిన మున్సిపాలిటీని.. పంచాయితీలను ప్రైవేటు పరం చేస్తే చెత్త మీద పన్ను వేసినట్లు కాదా? అని ప్రశ్నించారు.చంద్రబాబు ఎప్పుడూ అధికారంలోకి వచ్చినా వాళ్ళ సొంత మనుషులకు దోచి పెడతారు. వైజాగ్ లో ఆర్టీసీ స్ధలాన్ని ప్రైవేటు సంస్ధకు చంద్రబాబు ఇచ్చేశారు. అక్కడ నిర్మించిన సిఎంఆర్ మాల్ ఆర్టీసీ స్ధలం అని ఈ నాటీ యువతకు తెలియదు. జన్మభూమి నుండి నీరు చెట్టు వరకు అంతా దోపిడియే. ఆల్వీన్ మొదలు కొని కాకినాడ గోదావరి ఫెర్టిలైజర్ వరకు అన్ని ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మేశారు అని మాజీ మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు -
మార్గాని భరత్ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
రాజమండ్రి: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మృతి చెందిన మెడికో ప్రియాంక కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని మార్గాని భరత్ క్యాండిల్ ర్యాలీకి సిద్ధమయ్యారు. దీంతో భరత్ ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.ఈ కేసులో నిందితులను కాపాడే అదృశ్యశక్తులు ఉన్నాయా అంటూ మార్గాని భరత్ మంగళవారం మీడియా సమావేశంలో నిలదీసిన విషయం తెలిసిందే. ప్రియాంక కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఆ ఘటన మూడో తేదీన జరిగితే, ఆరో తేదీన నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారని తెలిపారు. అంత ఆలస్యం ఎందుకు అయ్యిందని, ఆ సమయంలో నిందితులు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. వారిని ఎవరైనా దాచారా అని ప్రశ్నించారు. వారి వెనుక ఎవరు ఉన్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. -
‘జీవోలు మార్చడం వల్ల ఏం ప్రయోజనం చేకూరింది చంద్రబాబూ..’
తాడేపల్లి: ఆక్వా రైతుల పట్ల చంద్రబాబుకు కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ సమన్వయకర్త, అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డి రఘురాం ధ్వజమెత్తారు. ఆక్వా రైతులకు పవర్ సబ్సిడీ పై గతంలో ఇచ్చిన జీవోనే సవరించి మళ్లీ ఇచ్చారని. జీవో నంబర్ 169లో ఏముందో.. ప్రస్తుతం ఇచ్చిన జీవో నంబర్ 57లో కూడా అదే ఉందన్నారు. ఆ జీవోలు మార్చడం వల్ల ఆక్వా రైతులకు ఏం ప్రయోజనం చేకూరిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 0.9 నుంచి 0.95 పవర్ ఫ్యాక్టర్ 2027 వరకూ మెయింటినెన్స్ చేస్తేనే సబ్సిడీ ఇస్తామని చెప్పారు. జగన్ రావడం వల్ల తమకు మంచి జరుగుతుందనే ఆలోచనలో ఆక్వా రైతులు ఉన్నారు. రైతులను డైవర్ట్ చేయడం కోసమే జీవో నెంబర్ 57ను విడుదల చేశారు. పవర్ ఫ్యాక్టర్ 50HP మెయింటినెన్స్ చేయాలి. రైతులు 50HP కెపాసిటర్లను పెట్టుకోవడం వల్ల ఓ పెద్ద కంపెనీకి వెయ్యికోట్లు లబ్ధి చేకూర్చాలని చూస్తున్నారు. ఈ వెయ్యికోట్లలో చంద్రబాబు ,లోకేష్ ,పవన్ ట్యాక్స్ (CLP Tax)ఎంతో సమాధానం చెప్పాలి. ఎన్ని ఎకరాలున్నా రూపాయిన్నర సబ్సిడీ ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు చెప్పారు. వైఎస్ జగన్ హయాంలో 50800 వేల కనెక్షన్లను ఆక్వాజోన్ పరిధిలోకి తెచ్చి రూపాయిన్నర సబ్సిడీ ఇచ్చారు. ఫీడ్ రేట్లు తగ్గించాలని రైతులు కోరినా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ఢిల్లీ వెళ్లి ఆక్వా రైతులకు ఏం ఊడబొడిచారు. జగన్ భీమవరం వెళ్లడం వల్లే రొయ్యల కౌంట్ ధరలు పెరిగాయి. ఆక్వా రైతులకు రూపాయిన్నర సబ్సిడీ ఎప్పట్నుంచి ఇస్తారో సమాధానం చెప్పాలి. ఆక్వా రైతుల తరపున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పొగాకు రైతులకు సంఘీభావంగా జగన్ దేవరపల్లిలో పర్యటించారు. ప్రజాధరణ పొందిన జగన్కు ప్రభుత్వం భద్రత కల్పించలేదు. జగన్కు వస్తున్న జనాన్ని చూసి చంద్రబాబు, టిడిపి నేతలకు బీపీ పెరిగిపోతుంది. జగన్ సంఘీభావం తెలిపిన తర్వాత పొగాకు ధర 260 రూపాయల నుంచి 300 రూపాయలకు పెరిగింది’ అని స్పష్టం చేశారు. -
‘చంద్రబాబూ.. మీ లోకేష్ ఒక్కడు బాగుంటే చాలా?’
తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై ఇంత పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు జరుగుతున్నా ప్రభుత్వ పెద్దల మౌనం వెనుక కారణమేంటని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. రహస్యంగా జరగాల్సిన డీఎస్సీ ప్రశ్నా పత్రాల తయారీ, అప్ లోడింగ్ అవుట్ సోర్సింగ్ వారికి అప్పగించారని, అందుకే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు ఫస్ట్ ర్యాంకు వచ్చిందన్నారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో మెరిట్ లిస్ట్లో ఉన్న నవీన్ పేరును, డేటాను తీసేశారని, డీఎస్సీ పేపర్ లీక్ అయ్యిందనడానికి ఇంతకన్నా ఆధారం ఏముందన్నారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబుఘెందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ‘స్పోర్ట్స్ కోటాలో ముమ్మాటికీ అక్రమాలు జరిగాయి. జీవోలు ఇచ్చి పరీక్షలు లేకుండానే స్పోర్స్ కోటాలో ఉద్యోగాలిచ్చుకున్నారు. తమ పని పూర్తవ్వగానే జీవోలను రద్దు చేశారు. కేవలం ఇంటర్ కాలేజీల స్థాయిలో పాల్గొన్న వారికి ఉద్యోగాలిచ్చుకున్నారు. ఆర్చరీలో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన దుర్గయ్యకు ఉద్యోగం ఇవ్వలేదు. దుర్గయ్యను పక్కన పెట్టి ఇంటర్ స్థాయిలో పాల్గొన్న వారికి ఉద్యోగాలిచ్చారు. దుర్గయ్యకు జరిగింది అన్యాయం కాదాఒక్కో పోస్టును ఒక్కో రేటుకు అమ్ముకున్నారు. ఉద్యోగం కోసం జరిగిన బేరసారాల ఆడియో వీడియోలు బయటపడ్డాయి. పక్కా ఆధారాలున్నప్పటికీ లోకేష్ సమాధానం చెప్పకుండా ఛాలెంజ్ లు విసురుతున్నాడు. తప్పు జరగనప్పుడు మీకు భయమెందుకు?, దమ్ముంటే సిబిఐతో విచారణ జరిపించండి.బాధితులు జగన్మోహన్రెడ్డి వద్దకు వచ్చాకే డీఎస్సీ అక్రమాలపై పోరాటం మొదలుపెట్టాం. రూ. 9500 కోట్ల విద్యాదీవెన, వసతి దీవెన ఎగ్గొట్టేశారు. విద్యార్ధులు చదువుకోవాలా... మీచుట్టూ తిరగాలా?, మీ కొడుకు లోకేష్ ఒక్కడు బాగుంటే చాలా రాష్ట్ర ప్రజల సంక్షేమం మీకు అవసరం లేదా చంద్రబాబు. తక్షణమే లోకేష్ నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
‘‘సీబీఐ విచారణ జరపాలి.. లోకేశ్ రాజీనామా చేయాలి’’
నగరి: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని అన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని చెప్పారు. నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.మెగా డీఎస్సీలో అక్రమాలకు బాధ్యతవహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలంటూ నగిరి నియోజక వర్గంలో ఆర్కే రోజా ఆధ్వర్యంలో నిరసన రాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పుత్తూరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రోజా మాట్లాడారు.‘‘ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మొదటి ఉద్యోగ నోటిఫికేషన్ ఇది. ఆ తర్వాత జరిగిన అవకతవకతల గురించి చూశాం. క్వశ్చన్ పేపర్ తయారు చేసే నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో అక్కడే మీకు పేపర్ లీకేజ్ అయింది అనేది అందరికీ అర్థమయింది. పేపర్ లీకేజ్ కాకపోతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ కి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? రెండో ర్యాంక్ నుంచి ఎందుకు ఇచ్చారు అనేది వాళ్లు చెప్పాలి. రెండోది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం. ఎప్పుడు కూడా స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్ పెట్టి, ఆ ఎగ్జామ్ ద్వారా సర్టిఫికేట్లు వెరిఫై చేసే ఉద్యోగాలు ఇస్తారు. కానీ వీళ్లు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాక దొంగ జీవోలు తీసుకొచ్చారు. పోస్ట్ లను అమ్ముకునేందుకు దాని ద్వారా డబ్బులు దోచుకోవడానికి ఈ జీవోలని వాడారు’’ అని వ్యాఖ్యానించారు. -
భారతి సిమెంట్స్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత
వైఎస్సార్ జిల్లా: భారతి సిమెంట్స్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. హైకోర్టును ఆశ్రయించినప్పటికీ టీడీపీ మూకలు వెనక్కి తగ్గట్లేదు. స్థానిక టీడీపీ నేతల ప్రోద్బలంతో ఇప్పటికీ మైనింగ్ పనుల అడ్డగింత కొనసాగుతోంది. వాహనాలను మైనింగ్లోకి వెళ్లకుండా టీడీపీ మూకలు అడ్డుకుంటున్నాయి. అంతా సవ్యంగానే ఉందని, మైనింగ్ జరుగుతుందంటూ మభ్య పెడుతున్నారు పోలీసులు. అధికార పార్టీ ఆదేశాల ప్రకారం భారతి సిమెంట్స్ సజావుగా జరుగుతుందంటూ నివేదికలు ఇస్తున్నారు. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో టీడీపీ మూకల గూండాయిజం కొనసాగుతోంది. భారతి సిమెంట్స్ లో ఉత్పత్తి నిలిచిపోయినా యంత్రాంగం స్పందించడం లేదు. వారం రోజులుగా భారతి సిమెంట్స్ పై పచ్చ మూకలు దండయాత్ర చేస్తున్నా చర్యలు శూన్యంగా ఉన్నాయి. అధికార పార్టీ ప్రోద్బలంతో భారతి సిమెంట్స్ ను దెబ్బతీసేందుకు భారీ కుట్ర పన్నారు. ఎన్నిసార్లు విన్నవించినా స్థానిక పోలీసులు స్పందించడం లేదు. యథాతథంగా టీడీపీ మూకల గూండాగిరి కొనసాగుతోంది. -
అసభ్యకర పోస్టులు.. వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
సాక్షి, గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఏఐ టెక్నాలజీ సాయంతో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఈ రోజు (మంగళవారం) గుంటూరు ఏఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ను కించపరుస్తూ ఏఐ వీడియోలు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.దీనిలో భాగంగా కేందమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పైన అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ పాత్రలు వేసి నటించేవారిపైనా చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ఫ్యాక్టరీ పెట్టారని ఈ విషయమై గతంలో కూడా ఫిర్యాదులిచ్చామన్నారు. తన ఇంటిపై జరిగిన దాడిలో పెమ్మసానే ప్రధాన కుట్రదారుడని ఆయన సినిమా చూపిస్తానని హెచ్చరించన తర్వాతే తనపై తన ఇంటిపై దాడి జరిగిందన్నారు.అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టారని ప్రజాస్వామ్యబద్ధంగా కార్యక్రమాలు చేస్తే తమపై కేసులా అని ప్రశ్నించారు. రోడ్లకు అడ్డంగా టెంట్లు వేసిన టీడీపీ నేతలపై కేసులు కట్టరా అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులకు ఒక న్యాయం వైఎస్సార్సీపీ నేతలకు మరోక న్యాయమా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఏసీపీకి మూడు ఫిర్యాదులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. -
రేపు వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ శాసనసభా పక్షం రేపు)బుధవారం) భేటీ కానుంది. ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తాజా రాజకీయ పరిణామాలు, డీఎస్సీలో జరిగిన అవతవకలు, అక్రమాలకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణతో పాటు ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. -
ఈశ్వరా.. ప్రాణం నిలపరా!
శ్రీ సత్యసాయి జిల్లా: రెక్కాడితే గాని డొక్కాడని ఆ నిరుపేద కుటుంబంలో అనూహ్యంగా సంభవించిన అనారోగ్యం కోలుకోలేని దెబ్బ తీసింది. ఉన్నంతలో సాధారణ జీవితం గడుపుతూ, రేపటి భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటున్న ఆ పేద గూటిలో ప్రస్తుతం గుండెల్ని పిండేసే విషాదం అలుముకుంది. తలుపుల మండలం వేపమానుపేట పంచాయతీ కొత్తపూల వాండ్లపల్లికి చెందిన యోగేశ్వర్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుండటంతో ఆ కుటుంబం పూర్తిగా రోడ్డున పడింది. ఆయన శరీరంలో తెల్ల రక్త కణాలు ఊహించని విధంగా, అత్యంత వేగంగా పడిపోతుండటంతో ప్రాణాలు గాల్లో దీపంగా మారాయి. ప్రస్తుతం కార్పొరేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై ఆయనకు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. చిన్న ఉద్యోగం.. అంతలోనే సంక్షోభం యోగేశ్వర్ రెడ్డి బెంగళూరులో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని కంటికి రెప్పలా పోషించే వారు. కుటుంబానికి ఏకైక జీవనాధారమైన వ్యక్తి ఇలా ఆసుపత్రి పాలుకావడంతో ఆ ఇల్లు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న భార్య, బంధువులు, మిత్రులు ఆస్పత్రి ఖర్చులు భరించలేక కన్నీరుమున్నీరవుతున్నారు. యోగేశ్వర్ రెడ్డి ప్రాణాలు నిలవాలంటే రూ.50 లక్షలకు పైగా భారీ వ్యయంతో కూడిన అత్యవసర చికిత్స అవసరమని వైద్యులు తేల్చి చెప్పారు. ఉన్న భూమిని అమ్మేసినా.. భర్తను కాపాడుకునేందుకు ఆ ఇల్లాలు తన సర్వస్వం ఖర్చు పెట్టింది. తమకున్న ఒకే ఒక్క జీవనాధారమైన వ్యవసాయ భూమిని సైతం విక్రయించి, ఇప్పటివరకు రూ.25 లక్షలను వైద్య ఖర్చుల కోసం వినియోగించింది. ఉన్న ఆస్తిని అమ్ముకున్నా భర్తను ఇంకా ఇంటికి తెచ్చుకోలేకపోయామే అని ఆ భార్య పడుతున్న వేదన వర్ణనాతీతం. ఇప్పటికే సగం ఖర్చు భరించిన ఆ నిరుపేద కుటుంబం ఇప్పుడు రూపాయి కూడా పుట్టని దయనీయ స్థితిలో పడింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సను ఇలాగే కొనసాగించాలన్నా, ఆయనకు పూర్తిస్థాయి ప్రాణభిక్ష దక్కాలన్నా తక్షణమే అదనంగా రూ.25 లక్షల ఆర్థిక సహాయం అత్యవసరంగా మారింది.తండ్రి ప్రేమకు నోచుకోని పసిగుడ్డు ఆ పసిగుడ్డుకు ఇంకా ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియదు. కేవలం 45 రోజుల వయసు మాత్రమే ఉన్న ఆ పసిబిడ్డ, తండ్రి ఒడిలో తలవాల్చి హాయిగా నిద్రించాల్సిన అపురూపమైన సమయం అది. కానీ, విధి ఆ చిన్నారిపై కనికరం చూపలేదు. పుట్టిన నలభై ఐదు రోజులకే.. కన్నతండ్రి ప్రాణాలతో కొట్టుమిట్టాడాల్సిన దయనీయ స్థితి ఎదురైంది. చేయూతే ఆశాకిరణం కళ్లముందే కుటుంబ పెద్ద అవస్థను చూస్తూ ఆ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు కలచివేస్తోంది. సమాజంలోని దాతలు, సేవా సంస్థలు, మానవతావాదులు స్పందించి యోగేశ్వర్ రెడ్డి చికిత్సకు ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్న సహాయం కూడా, అనేక మంది కలిసి అందిస్తే ఒక ప్రాణాన్ని కాపాడటానికి పెద్ద బలంగా మారుతుంది. ఒక్క సహాయం ఒక కుటుంబానికి ఆశను ఇవ్వగలదు. దాతలు తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని నేరుగా ఆ కుటుంబానికి అందించి కనిపించని దేవుడికి ప్రతిరూపాలుగా నిలవవచ్చు. సహాయం చేయాలనుకునే వారు 9494852304 నంబర్కు ఫోన్పే,గూగుల్పే ద్వారా నగదు పంపవచ్చు. లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మాండూరు శాఖకు చెందిన అకౌంట్ నంబర్: 30754629889, ఐఎఫ్ఎస్సీ కోడ్: SBIN0010187 ద్వారా కూడా నేరుగా వారి బ్యాంక్ ఖాతాకు డబ్బు బదిలీ చేసి యోగేశ్వర్ రెడ్డి ప్రాణాలను కాపాడవచ్చు. -
ప్రియాంక కేసు.. నిందితుల కాల్ డేటా ఏదీ?: మార్గాని భరత్
సాక్షి, రాజమహేంద్రవరం: మెడికో ప్రియాంక హత్య కేసులో నిందితులను కాపాడే అదృశ్య శక్తులు ఉన్నాయా? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్. ఈ కేసులో నిజాలేమైనా దాచారా? అంటూ చంద్రబాబు సర్కార్పై ఆయన మండిపడ్డారు. సమాధానం చెప్పాలంటూ కూటమికి పది ప్రశ్నలు సంధించారు. డాక్టర్ ప్రియాంకను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇంతటి తీవ్రమైన ఘటనను మొదట్లో ఎందుకు తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరిగిందని ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘మూడు రోజులు నిందితులు ఎక్కడున్నారు?’ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అనుమానాలు ఉన్నాయని మాజీ ఎంపీ ఆరోపించారు. మూడో తేదీన ఘటన జరిగితే.. ఆరో తేదీన నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారని, ఆ మధ్య మూడు రోజులు నిందితులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వారిని ఎవరైనా దాచారా? దాచితే ఎవరి అండ ఉందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.‘చిన్న యాక్సిడెంట్గా ఎలా చెబుతారు?’డాక్టర్ ప్రియాంక మృతిని మొదట చిన్న ప్రమాదంగా పేర్కొనడంపై భరత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు తొలుత ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశారని, హత్య అంశం వెలుగులోకి వచ్చిన తర్వాతే సెక్షన్లు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. తాము ఆందోళన చేపట్టే వరకు కేసు తీవ్రతను ఎందుకు గుర్తించలేదని నిలదీశారు.‘నిందితుల ఫోన్ డేటా ఎందుకు సేకరించలేదు?’హత్య జరిగిన రోజు రాత్రి నిందితులు ఎవరెవరితో మాట్లాడారో, ఎవరిని సంప్రదించారో తెలుసుకోవడానికి ఫోన్ డేటాను ఎందుకు పరిశీలించలేదని భరత్ ప్రశ్నించారు. ఘటన వెనుక ఉన్న శక్తులను బయటకు తీసుకురావాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.‘మద్యం మత్తులో జరిగిన ఘటనగా ఎలా చెబుతారు?’స్థానిక ఎమ్మెల్యే ఘటనను మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్ కేసుగా పేర్కొనడంపై కూడా భరత్ స్పందించారు. ఒక మనిషి ప్రాణం పోయిన ఘటనను కేవలం ప్రమాదంగా ఎలా చూస్తారని భరత్ ప్రశ్నించారు. సోషల్ మీడియా పేజీలు ఎందుకు మూగబోయాయి?రెండు రాష్ట్రాల్లో చర్చకు వచ్చిన ఈ ఘటనపై రాజమహేంద్రవరం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, పేజీలు ఎందుకు స్పందించలేదని భరత్ ప్రశ్నించారు. వారిపై ఎవరి ఒత్తిడి ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు.‘అధికార పార్టీ ఆదేశాలతోనే కప్పిపుచ్చే ప్రయత్నం’ఈ ఘటనలో అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నాయంటూ మార్గాని భరత్ ఆరోపించారు. నిందితులు ఘటన అనంతరం వెళ్లిన మార్గాల్లో సీసీ కెమెరాలను ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. పోలీసులు వారికి సంబంధించిన వివరాలు ముందుగానే తెలుసుకున్నా.. ఆలస్యంగా అరెస్ట్ చేసినట్లు చూపించారని ఆరోపించారు.సీఐపై చర్యలు ఎందుకు లేవు?ఇంతటి వివాదం నెలకొన్నప్పటికీ ప్రకాష్నగర్ సీఐపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని భరత్ ప్రశ్నించారు. కేసులో పూర్తి నిజాలు బయటకు రావాలంటే సమగ్ర దర్యాప్తు అవసరమని అన్నారు. -
పాఠశాలకు వెళ్తూ వాగులో కొట్టుకుపోయిన టీచర్
అల్లూరి సీతారామరాజు జిల్లా : పాఠశాలకు వెళ్లేందుకు వాగు దాటే క్రమంలో ఓ ఉపాధ్యాయురాలు ప్రవాహంలో కొట్టుకుపోయారు. కర్లపొదర్ గ్రామస్తులు కాపాడడంతో ప్రమాదం తప్పింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ కర్లపొదర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎం.మణి ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. సోమవారం పాఠశాలకు వెళ్లే క్రమంలో కర్లపొదర్ వద్ద ఉన్న వాగును దాటుతున్న సమయంలో లోతును అంచనా వేయలేక, నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో కొంతదూరం కొట్టుకుపోయారు. అదృష్టవశాత్తూ చేతికి చెట్టుకొమ్మ తగలడంతో దానిని పట్టుకుని గట్టిగా కేకలు వేయడంతో గమనించిన కర్లపొదర్ గ్రామస్తులు పరుగు పరుగున సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను కాపాడి, వాగు నుంచి బయటకు తీసుకువచ్చారు. ఈ విష యం తెలుసుకున్న ఎంఈవో–2 త్రినాథరావు, సీఆర్పీ ఈశ్వర్ కర్లపోదర్ గ్రామానికి వెళ్లి బాధితురాలిని పరామర్శించి, ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా లబ్బూరు ఆస్పత్రికి తరలించారు.వైద్యులు పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. కర్లపోదర్ వాగుపై చేపట్టిన వంతెన నిర్మాణానికి త్వరితగతిన పూర్తి చేయాలని లక్ష్మీపురం మాజీ సర్పంచ్ కొర్రా త్రినాథ్, కర్లపోదర్ గ్రామస్తులు కోరారు. -
‘ఆనం అంటే అవినీతి.. అవినీతి అంటే ఆనం’
సాక్షి, నెల్లూరు జిల్లా: ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ప్రశ్నించడమే పాపం అన్నట్లు ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలొ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి ఒక సుస్థిర స్థానం ఉంది. తమ సానుభూతిపరులను ఉద్దేశించి నీచంగా మాట్లాడటం సరికాదంటూ విక్రమ్రెడ్డి హితవు పలికారు.ఆనం గెలిచాక మర్రిపాడులో ఇసుక కొండను మాయం చేశారు. ఆత్మకూరులో ఇసుక దందాకు పాల్పడుతున్నారు. మంత్రి ఆనం ధనదాహానికి ఏడుగురు బలయ్యారు. మంత్రి ఆనం చికెన్ వేస్ట్ మాఫియా తయారు చేశారు. అవినీతి, అక్రమాలు, ఇసుక రవాణా, చికెన్ వేస్ట్ దందాలు చేసిన చరిత్ర మాది కాదు. వైఎస్ జగన్ని తిట్టి మంత్రి అయిన చరిత్ర హీనుడివి నువ్వు. భూ సేకరణ చేయకుండా నూతన ప్రాజెక్ట్ అంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నాడు. పోలీస్ స్టేషన్లో సైతం మాముళ్ళు వసూళ్లు చేసిన నీచపు చరిత్ర నీది’’ అంటూ విక్రమ్రెడ్డి దుయ్యబట్టారు.‘‘మంత్రి ఆనం ఇసుక దందా ద్వారా రూ.3 కోట్లు సంపాదిస్తున్నారు. ఐదేళ్లకోసారి పార్టీ మార్చే ఊసరవెల్లి నైజం మీదే. ఆనం అంటే అవినీతి.. అవినీతి అంటే ఆనం. నాపై ఆరోపణలునిరూపిస్తే రాజీనామా చేస్తా. నా సవాల్ స్వీకరించే దమ్ముందా?’’ అంటూ విక్రమ్రెడ్డి సవాల్ విసిరారు. -
పెళ్లైన 24 గంటల్లోనే భార్యను బేరం పెట్టిన భర్త..!
ఏలూరు జిల్లా: ప్రియురాలిని ప్రేమ వివాహం చేసుకుని తన ఇంటికి తీసుకెళ్లిన యువకుడిపై యువతి తల్లిదండ్రులు రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గొల్లపల్లికి చెందిన యువతి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలోని తన మేనమామ ఇంటి దగ్గర ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ, మూడు రోజుల క్రితం వివాహం చేసుకుని బాపులపాడు మండలం వీరవల్లి పోలీసులను ఆశ్రయించారు. వారిద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి, యువతిని భర్త ఇంటికి పంపించారు. అయితే, తమ అమ్మాయిని తమ దగ్గరకు పంపించాలంటే ఆమె భర్త రూ.12 లక్షలు డిమాండ్ చేస్తున్నాడంటూ సోమవారం నూజివీడు రూరల్ పోలీస్స్టేషన్లో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కానీ యువకుడిని పెళ్లి చేసుకున్న యువతినుంచి ఎలాంటి ఫిర్యాదు లేకపోవడంతో.. యువతి తల్లిదండ్రులు పెట్టిన ఆరోపణలు ఎంత వరకు నిజం ఉందేనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ఏపీలో సమ్మె సైరన్ మోగించిన జూనియర్ డాక్టర్లు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. అత్యవసర సేవలు మినహా విధులను జూనియర్ డాక్టర్లు బహిష్కరించారు. దీంతో కింగ్ జార్జ్ ఆసుపత్రిలో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. సూపరింటెండెంట్ కార్యాలయం వద్దకు చేరుకున్న జూనియర్ డాక్టర్లు.. స్టైఫండ్ పెంచకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.కాగా, ప్రభుత్వ ఆస్పత్రులను నమ్ముకున్న పేద రోగులకు ‘సమ్మె’ కష్టాలు మొదలయ్యాయి. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు (జూడాలు) మంగళవారం నుంచి నిరవధిక సమ్మెబాట పట్టారు. సోమవారం అమరావతి వైద్య ఆరోగ్యశాఖ వైద్య విద్యా డైరెక్టర్(డీఎంఈ), ఇతర అధికారులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో నిరవధిక సమ్మెలోకి దిగుతున్నట్లు జూడాలు ప్రకటించారు. దీంతో కేజీహెచ్తో పాటు ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు విఘాతం కలుగుతుంది.సమ్మెలో భాగంగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓపీ సేవలను జూనియర్ డాక్టర్లు పూర్తిగా నిలిపివేస్తున్నారు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే హాజరవుతామని వెల్లడించారు. ఆస్పత్రుల్లో రోజూ వార్డుల నిర్వహణ, శస్త్రచికిత్సలు, పరీక్షలు చేయడంలో పీజీ డాక్టర్లు, హౌస్సర్జన్లదే కీలక పాత్ర. వీరంతా విధులకు దూరం కావడంతో దూర ప్రాంతాల నుంచి ఆస్పత్రులకు వచ్చే వేలాది మంది పేద రోగులు, వృద్ధులు, గర్భిణులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.ఈ ఏడాది జనవరి నుంచి రావాల్సిన స్టైపెండ్ పెంపును వెంటనే విడుదల చేయాలని, చెల్లింపులను క్రమబద్దీకరించాలని జూనియర్ డాక్టర్ల సంఘం నాయకుడు డాక్టర్ శిరాజ్ డిమాండ్ చేశారు. డీఎంఈతో చర్చలు విఫలమవడంతోనే సమ్మెకు దిగామన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి హామీలను అమలు చేయాలని, లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఏపీజేయూడీఏ నేతలు హెచ్చరించారు. -
మెడికో ప్రియాంక కేసు.. అసలు మాల్లో ఏం జరిగింది?
సాక్షి, తూర్పుగోదావరి: రాజమహేంద్రవరం ప్రసాదిత్య మాల్ వద్ద కారుతో ఢీకొట్టిన సంఘటనలో మృతి చెందిన వైద్య విద్యార్థిని కనికే ప్రియాంక కేసులో అనుమానాలు వీడడం లేదు. ఇప్పటి వరకు మాల్లో ప్రియాంకపై వాహనంతో జరిగిన దాడికి సంబంధించి మాత్రమే సీసీ ఫుటేజ్ బయటికి వచ్చింది. నిందితులు మాల్లోకి వచ్చిన ఫుటేజ్ గాని, ప్రియాంక మాల్లోకి ఎప్పుడు వచ్చిందన్న ఫుటేజ్ గాని పోలీసులు బయట పెట్టలేదు.మాల్లో ఏం జరిగిందన్న విషయంపై సందేహాలు తొలగలేదు. ప్రసాదిత్యా మాల్లో నిందితులతో మాల్ సిబ్బందికి జరిగిన గొడవ పుటేజ్ బయటకు ఎందుకు రాలేదన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్ ప్రియాంక పోస్ట్మార్టం రిపోర్ట్, కెమికల్ ఎనాలసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అల్టర్ చేసే అవకాశం ఉంది.కాగా, ప్రియాంక మృతదేహానికి సోమవారం రాజమహేంద్రవరం డీఎస్పీ సుభాష్ బృందం పోస్టుమార్టం నిర్వహించారు. ప్రియాంక కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు పోస్టుమార్టం నిర్వహించేందుకు క్రైం డీఎస్పీ సుభాష్, ప్రకాశ్నగర్ సీఐ బాజీలాల్, ఎస్సై సతీష్, ఇద్దరు కానిస్టేబుళ్ల బృందం ఆదివారం రాత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.మర్నాడు పోస్టుమార్టం పక్రియ పూర్తి చేసి ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం ప్రియాంక మృతదేహాన్ని భారీ ఊరేగింపుతో స్వగ్రామమైన గద్వాల్ జిల్లా అయిజ మండలంలోని ఎక్లాస్పురానికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. -
చంద్రబాబు కాకి లెక్కలు.. ఆ భయంతోనేనా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గణాంకాలు చెప్పడంలో ఘనాపాటి అని ఒప్పుకోవాలి. కొందరు వాటిని కాకి లెక్కలు అనవచ్చు. మరికొందరు భలే లెక్కలు అనవచ్చు. కాని వాటిని విశ్లేషించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఏపీ ప్రజలు వాటిని ఎంతవరకు నమ్ముతారో తెలియదు. ఆయన మాత్రం ఏకధాటిగా మూడు గంటలపాటు ప్రజెంటేషన్ ఇచ్చి ఏదో జరిగిపోతోందన్న భ్రమ కల్పించడానికి యత్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం పేరుతో ఇచ్చిన ప్రజెంటేషన్ రెండు రకాలుగా కనిపిస్తుంది. ఒకటి ఏపీ ఆర్థికంగా ఇబ్బందులలో ఉందన్న భయం. మరోపక్క లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయన్న భ్రాంతి.. ఈ రెండు విషయాలు ఆయనే చెప్పగలరు. ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ప్రజలకు బాండ్ పత్రాలు ఇచ్చారు. అందులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిస్తే ఒక్కో కుటుంబానికి ఎంత మొత్తం లబ్ధి చేకూరుతుందో తెలిపారు. వీరిద్దరూ త్రికరణ శుద్దిగా ప్రమాణం చేసి బాండ్లు ఇస్తున్నామని అన్నారు. బాగానే ఉంది. త్రికరణ శుద్ది ఉంటే ఏమి చేసి ఉండాలి. నిజంగానే ఆయా కుటుంబాలకు ఈ రెండేళ్లలో ఎంతెంత ఇచ్చింది మళ్లీ లెక్కలు ఇవ్వాలి కదా! ఆ పని చేయకుండా ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నామని, అప్పులు చేసి సంక్షేమ స్కీములు అమలు చేస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారు.గతంలో అప్పులు చేసేవారికి సంక్షేమ స్కీములు అమలు చేసే అర్హత ఉందా అని ఆయనే ప్రశ్నించేవారు. డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజన్ గ్రోత్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియా ప్రముఖంగా కథనాన్ని ఇచ్చింది. సీమాంధ్ర, కోస్తా, ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్దే లక్ష్యమని ఆయన చెప్పారు. బాగానే ఉంది. ఆ తర్వాత ఇచ్చిన లెక్కలు చూస్తే మతి పోవల్సిందే. ఈ మూడు ప్రాంతాలలో కలిపి ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టుల ద్వారా సుమారు 46 లక్షల ఉద్యోగాలు వస్తాయట. అందులో 2032 లోపు 30 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందట. బహుశా 1956 నుంచి ఉమ్మడి ఏపీలో కూడా ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయో, లేదో తెలియదు. కాని విభజిత ఏపీలో మాత్రం అన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబితే నమ్మగలమా? 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు అని ప్రచారం చేశారు. శ్వేతపత్రంలో వాటిని డబుల్ చేసేశారన్నమాట.ఒకవైపు ప్రపంచం అంతటా సంక్షోభం, ఎల్నినోలో ప్రభావం వంటివాటితో ఉపాధి సమస్యలు వస్తుంటే ఏపీలో మాత్రం ఈ రకంగా లక్షల ఉద్యోగాలు వస్తాయంటున్నారు. నిజంగా అలా చేయగలిగితే గొప్పపేరే వస్తుంది. దానిని అంతా స్వాగతిస్తారు. కాని కేవలం ప్రజలను మభ్య పెట్టేరీతిలో ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ప్రచారం చేస్తే మాత్రం ఏపీకి తీరని అన్యాయం చేసినట్లవుతుందని గ్రహించాలి. చంద్రబాబు చెబుతున్నదాని ప్రకారం అమరావతి ఆర్థిక రీజియన్ను టెక్నాలజీ, పరిశ్రమలు మౌలిక వసతులు, ఇంధనం విభిన్న ఆర్థిక వ్యవస్థలకు కేంద్రంగా తీర్చిదిద్దుతారట. ఇక్కడ మొత్తం 6-8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రాథమిక అంచనా అట. వీటి ద్వారా 2032 నాటికి పది లక్షల ఉద్యోగాలు వస్తాయని సీఎం చెబుతున్నారు. విశాఖ ఎకనమిక్ రీజియన్లో 49 ప్రాజెక్టులతో పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయట. ఈ పెట్టుబడుల ద్వారా 24 లక్షల మందికి ఉపాధి లబ్ధిస్తుందని ఆయన అంటున్నారు. 2032 నాటికి పది లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందట. ఇక తిరుపతి ఆర్థిక రీజియన్లో 11-12 లక్షల కోట్ల పెట్టటుబడులు ఆకర్షించడం ద్వారా 2032 నాటికి పది లక్షల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం అని ఆయన తెలిపారు. ఏపీ ఆదాయంలో 40 శాతం రాయలసీమ నుంచే వచ్చేలా తయారు చేస్తారట. లక్ష కోట్లతో ఉద్యానవన హబ్ను ఏర్పాటు చేస్తామని కూడా ఆయన వెల్లడించారు. ఒక పక్క మామిడి రైతులు తమకు గిట్టుబాటు ధరలు రావడం లేదని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎల్నినో ప్రభావంతో చీని తోటలు ఎండిపోతున్నాయని, టాంకర్లు తెచ్చి నీరు పెట్టుకోవల్సి వస్తోందని ఈ మధ్య ఎల్లో మీడియానే వార్తలు ఇచ్చింది. మరో వైపు చంద్రబాబు మాత్రం లక్ష కోట్ల ఉద్యానవన హబ్ అని ఊదరగొడుతున్నారు. ఇందులో కేంద్రం నలభైవేల కోట్లు ఇవ్వాలట. ఇవన్ని ఎప్పటికి జరిగేనో ఎవరు చెప్పగలరు? మరో విషయం ఏమిటంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా 2030 నాటికి రెండున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబుతున్నారు.విశేషం ఏమిటంటే విశాఖ, తిరుపతి రీజియన్లకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఎంత పెట్టుబడి పెడతారన్నది క్లారిటీ లేదు కాని, అమరావతిలో నిర్మాణాలు, మౌలిక వసతులకోసం ఇంతవరకు 40887 కోట్ల మొత్తాన్ని సమీకరించామని ఆయన తెలిపారు. ఇటీవల ఏపీలో ఒక అసంతృప్తి ఏర్పడింది. ప్రభుత్వం వేల కోట్ల అప్పు చేసి మొత్తం అంతా అమరావతిలోనే ఖర్చు చేస్తోందని మిగిలిన ప్రాంతాల ప్రజలు విమర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా విశాఖ, తిరుపతి రీజియన్లలో పెట్టుబడులు రాబోతున్నాయని, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని నమ్మబలకాలని ఆశిస్తున్నట్లుగా ఉంది. ఇవన్ని చదువుతుంటే ఒకప్పుడు చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా 2002 ప్రాంతంలో విజన్ 2020 అంటూ పెద్ద ఎత్తున హడావుడి చేశారు. అందులో కూడా ఏవేవో లెక్కలు రాస్తే అంతా చూసి నవ్వుకున్నారు. తదుపరి టీడీపీ 2004 ఎన్నికలలో ఓటమిపాలైంది. తిరిగి 2014లో విభజిత ఏపీలో టీడీపీ మళ్లీ పవర్లోకి వచ్చింది. ఆ టరమ్లో ఒక్కసారి కూడా విజన్ 2020 ఊసు ఎత్తినట్లు కనిపించలేదు. అప్పట్లో స్వర్ణాంధ్ర, 2029నాటికి దేశంలోనే నెంబర్ ఒన్ అంటూ కొత్త నినాదాలతో కాలం గడిచిపోయింది. 2019 ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది. తిరిగి ఈ టరమ్లో 2047 విజన్తో పాటు డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్ అని కొత్త పదాలు అందుకున్నారు. అంటే ఒక్కో టరమ్లో ఒక్కో నినాదంతో కథ నడిపేయడం, ప్రజలు వాటిని వినీ.. విని విసుగుచెంది ఓడించడం జరుగుతోందని అనుకోవాలా? మరి వచ్చే ఎన్నికలలో ఏమవుతుందో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అందమైన అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం..!
అనంతపురం సెంట్రల్: అనంతలో హైటెక్ వ్యభిచారం గుట్టు బయట పడింది. గుంటూరు, అమలాపురం, రాజమండ్రి ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిలను, మహిళలను తీసుకొచ్చి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. నగరానికి చెందిన విటులను రప్పించి ఎవరికి నచ్చిన వారు.. వారితో గడిపే విధంగా సెటప్ చేశారు. నగరానికి చెందిన బాలాజీ అనే వ్యక్తి ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆయనతో మరికొందరు చోటా నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం అర్ధర్ధరాత్రి వన్టౌన్ పోలీసులు సదరు వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించారు. మొత్తం 10 మంది వేశ్యలు, 10 విటులను అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళలను విచారణ నిమిత్తం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నడస్తున్న ఓ హోంకు తరలించారు. ఈ వ్యభిచార కేంద్రం వెనుక పెద్ద రాకెట్ ఉండడంతో కూపీ లాగేందుకు పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. త్వరలో దీనిపై వివరాలు అధికారికంగా వెల్లడికానున్నాయి. -
దగ్గుపాటి .. సొంత పబ్లిసిటీ!
అనంతపురం నగర నడిబొడ్డున భారత స్వాతం్రత్యానికి గుర్తుగా క్లాక్ టవర్ నిర్మించారు. చారిత్రక కట్టడాల యాక్ట్ ప్రకారం క్లాక్టవర్ చుట్టూ ఎలాంటి బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, హోర్డింగ్లు ఏర్పాటు చేయడం నిషేధం. చట్టరీత్యా నేరం.. అయితే ‘ అధికారం మాదే.. మాకెవరు అడ్డు.. చారిత్రక కట్టడం చుట్టూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తాం...?’ అన్నరీతిలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జన్మదిన వేడుకల సందర్భంగా క్లాక్ టవర్ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నగరపాలక సంస్థ కమిషనర్ జశ్వంతరావును అడగ్గా.. ఆయన స్పందించలేదు. – సాక్షి, ఫొటోగ్రాఫర్, అనంతపురం: -
తెరపైకి మరో పెద్దపులి మరణం
ఆత్మకూరు రూరల్: నాగార్జునసాగర్–శ్రీశైలం అభయారణ్యంలో పెద్ద పులుల అసహజ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనలపై దర్యాప్తు సాగుతుండగానే మరో పెద్దపులి ఉచ్చులకు చిక్కి మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పులి కళేబరాన్ని రహస్యం గా దహనం చేసినట్లు తెలిసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న కొందరు కిందిస్థాయి అటవీ సిబ్బందిని ఉన్నతాధికారులు విచారిస్తున్నట్లు సమాచా రం. ఈ కేసులో ఇటీవల ఎఫ్బీవో నుంచి ఎఫ్ఎస్ఓ గా పదోన్నతి పొందిన ఒక జూనియర్ అధికారిపై వేటు కూడా పడనున్నట్లు చర్చ జరుగుతోంది. గతేడాది వర్షాకాలం ఆరంభంలో నాగలూటి రేంజ్ ఇందిరేశ్వరం సెక్షన్ పరిధిలో ఓ పులి ఉచ్చులో చిక్కుకుని మరణించి కనిపించింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పకుండా గుట్టుగా దహ నం చేసినట్లు సమాచారం. ఇటీవల గిద్దలూరు, ఆత్మకూరు డివిజన్లలో 2 పెద్దపులులు అసహజ మరణాలకు గురైన ఘటనలపై దర్యాప్తు జరుపుతున్న క్రమంలో రహస్యంగా మరో పులి కళేబరాన్ని దహనం చేసిన అంశం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై దర్యాప్తు జరుపుతున్నామని, త్వరలోనే ఓ ప్రకటన చేస్తామని ఆత్మకూరు డిడి విగ్నేష్ అపావ్ను చెప్పారు. -
ఎస్ఐ ప్రవళ్లిక కేసు.. ఘటనా స్థలంలో లేని వ్యక్తిపై కేసు!
శ్రీకాకుళం క్రైమ్ : టీడీపీ నేతల ఒత్తిడితో వైఎస్ జగన్ జిల్లా పర్యటన నాడు ఘటనా స్థలిలో లేని వ్యక్తిపై హత్యాయత్నం, ఇతర నాన్బెయిల్బుల్ సెక్షన్లు ఆపాదించిన పోలీసులు.. ఇప్పుడు తూచ్ తూచ్ అంటున్నారు. మహిళా ఎస్ఐపై అనుచిత ప్రవర్తన కేసులో వైఎస్సార్సీపీ ఆమదాలవలస ఇన్చార్జి చింతాడ రవికుమార్తో పాటు మరో 20 మందిపై అక్రమ కేసులు కట్టి రిమాండ్కు పంపిన విషయం విదితమే. వీరిలో ఓ ప్రైవేటు ఉద్యోగి గురుగుబెల్లి తేజేశ్వరరావు పంజాబ్ యూనివర్సిటీలో అదే రోజు తన కుమార్తెతో ఉన్నట్లు ఆధారాలు నిర్ధారణ కావడంతో కేసు నుంచి ఆయనని తొలగిస్తున్నట్లు కోర్టుకు మెమో సమరి్పంచామని డీఎస్పీ వివేకానంద స్పష్టం చేయడం విశేషం. ఇప్పటికే ఈ అక్రమ కేసుకు సంబంధించి జిల్లా పీడీఎం కోర్టు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి హత్యాయత్నం, ఉద్దేశపూర్వకంగా నేరం చేయు సెక్షన్లైన 109, 111 సెక్షన్లు వర్తించవని ఆదివారం రిమాండ్ రిపోర్టులో రాసిన విషయం పాఠకులకు విదితమే. ప్రజల్లో అబాసుపాలు.. టీడీపీ అధిష్టానం, స్థానిక నాయకత్వం ఒత్తిడి మేరకు పోలీసు ఉన్నతాధికారులు తమ పోలీసులతో ఇలాంటి నాన్బెయిల్బుల్ సెక్షన్లు వేయించడం, అదనంగా కేసులో మరో ఏడుగురిని కేసులో చేర్చడం, రి మాండ్కు తరలించే సమయంలో చింతాడ రవిని రెండు చోట్ల హైకోర్టు నిబంధనలు కాలరాసి నడిపించుకుని తీసుకువెళ్లడం వంటి అంశాలతో ప్రజల్లో అబాసుపాలయ్యారు. ఈ కేసులో 14 మంది రిమాండ్కు వెళ్లడం తెలిసిందే. మరికొంతమంది మంగళవారం ఆమదాలవలస స్టేషన్లో లొంగిపోతున్నట్లు సమాచారం. మరోసారి అప్పలరాజును కస్టడీ కోరిన పోలీసులు.. అంపోలు జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కాశీబుగ్గ పోలీసులు మరోసారి కస్టడీ విచారణ కోరుతూ సోమవారం పలాస కోర్టులో పిటిషన్ వేసినట్లు సమాచారం. -
డాక్టర్ ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల సాయం
తూర్పు గోదావరి జిల్లా: జీఎస్ఎల్ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతికి విచారాన్ని వ్యక్తం చేస్తూ కళాశాలలో సోమవారం సంతాప సభ నిర్వహించారు. పీజీలో డెర్మటాలజీ ఫస్టియర్ చదువుతున్న ఆమె ఇకలేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నామని, ఆమె కుటుంబానికి మనోధైర్యాన్ని అందించి, ఆమె ఆత్మకు శాంతిని చేకూర్చాలని దేవుడిని ప్రార్థించారు. ఆఖరి నిమిషం వరకు ఆమెను బతికించుకునేందుకు తల్లిదండ్రులు ఎంతో ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. ఆమె చిత్రపటం వద్ద సహ విద్యార్థులు, అధ్యాపకులు, మేనేజ్మెంట్ ప్రతినిధులు పుష్పాంజలి ఘటించారు. ఆమె కుటుంబానికి రూ.20 లక్షలు ఆర్థిక సాయాన్ని అందించాలని జీఎస్ఎల్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుందని వైద్య కళాశాల ఎండీ డాక్టర్ గన్ని సందీప్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆ కుటుంబానికి ఈడీ డాక్టర్ గన్ని సాధిక ద్వారా త్వరలోనే అందజేస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ గన్ని సారిక, డాక్టర్ సీతారామ్, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ తేజస్విని, డాక్టర్ సుభాషిణి, విద్యార్థులు పాల్గొన్నారు. -
చేనేత కార్మికుల భారీ నిరసన
ధర్మవరం: చేనేత కార్మీకుల కడుపు మండింది. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ప్రభుత్వం ‘నేతన్న సాయం’ పథకం ద్వారా సాయం అందిస్తుందని అనుకుంటే అనర్హులకు కట్టబెట్టి అర్హులకు మొండిచేయి చూపింది. దీంతో అర్హులైన నేతన్నల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇది శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని శివానగర్ కదిరి గేట్ వద్దనున్న నేతన్న విగ్రహం వద్ద సోమవారం ధర్మవరం–అనంతపురం ప్రధాన రహదారిపై భారీ నిరసనకు దారితీసింది. ఈ కార్యక్రమానికి వందలాది మంది చేనేత కార్మీకులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. దాదాపు రెండు గంటల పాటు రాస్తారోకో చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వారు ససేమిరా అన్నారు. ఇంత అన్యాయం చేస్తారా..? ఈ సందర్భంగా శివానగర్, కేశవనగర్, శాంతినగర్, గ్యాస్ గోడౌన్ ప్రాంతాలకు చెందిన నేత కార్మీకులు మాట్లాడుతూ.. నేతన్న సాయం పథకం ద్వారా ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేలు ఇస్తామంటే ఎంతోకొంత ఉపశమనం కలుగుతుందని భావించామని.. కానీ, ఇటీవల టీడీపీ కూటమి నాయకులు అనేక వార్డులలో అనర్హుల పేర్లను ఎక్కించడంతో అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. హ్యాండ్లూమ్ అధికారులు సైతం ఎవరికి మగ్గాలు ఉన్నాయో కూడా విచారించకుండా అనర్హులకు డబ్బులు ఎలా జమచేస్తారని ప్రశి్నంచారు. చంద్రబాబు ప్రభుత్వంలోని మూడు పారీ్టల కార్యకర్తల కోసం మాత్రమే నేతన్న సాయం పథకాన్ని తెచ్చారా అని ఆగ్రహంతో నిలదీశారు. ధర్మవరంలో ఇంతటి దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదని వారు మండిపడ్డారు. పట్టణంలో నాలుగు వేల మందికి పైగా అనర్హులకు పథకం అందించి.. ఆ మేర అర్హులకు తీరని ద్రోహం చేశారని తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అర్హులందరికీ నేతన్న నేస్తం పథకం అందిందని, జగనన్న ప్రతిఏటా రూ.24 వేలు ఠంఛన్గా అందించారని బాధిత చేనేత కార్మీకులు గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. చివరకు.. పట్టణ సీఐ రెడ్డప్ప హ్యాండ్లూమ్ అధికారులతో మాట్లాడి ఐదు రోజుల్లో అర్హులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో «నిరసన విరమించారు. -
అంగన్వాడీ, ఆశా వర్కర్లపై ఖాకీల క్రౌర్యం
విజయనగరం గంటస్తంభం: కనీస వేతనం నెలకు రూ.26,000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 12 గంటల పనిదినాలను ఉపసంహరించుకుని లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వేతన సవరణ వెంటనే చేపట్టి ఆశా, అంగన్వాడీ, స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన చలో కలెక్టరేట్ రణరంగంగా మారింది. వేలాదిమంది కార్మికులు ర్యాలీగా విజయనగరం కలెక్టరేట్కు చేరుకున్నారు. సమస్యలు, డిమాండ్ల పరిష్కారంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంపై నినదించారు. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆశా వర్కర్లు సొమ్మసిల్లి పడిపోయారు. పలువురు సీఐటీయూ నేతలను పోలీసులు ఈడ్చుకుపోయి, బలవంతంగా అరెస్టుచేశారు. ఆందోళనలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నర్సింగరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.ఎం.శ్రీనివాస్, జిల్లా అధ్యక్ష, కార్యదర్ములు కె.సురేష్, టి.వి.రమణ తదితరులు పాల్గొన్నారు. -
ఇక తల్లీబిడ్డ పేరుతో దోపిడీ!
నాడుకాంట్రాక్ట్ సంస్థ 500 మారుతి ఈకో వాహనాలను సమకూర్చింది. ప్రతి వాహనంలో ఏసీ, జీపీఎస్ ట్రాకింగ్, ఇతర సౌకర్యాలున్నాయి. ఈ వాహనంలో ప్రభుత్వాస్పత్రి నుంచి తల్లీబిడ్డను ఇంటి దగ్గరకు చేర్చినందుకు ట్రిప్పుకు రూ.895 చొప్పున వైఎస్ జగన్ సర్కార్ చెల్లించింది. నేడుఇప్పుడు కూడా మారుతి ఈకో వాహనాలే. ఏసీ, జీపీఎస్ ట్రాకింగ్ సహా నాటికీ, నేటికీ వాహనంలోని సౌకర్యాల్లో పెద్ద తేడా కూడా ఏమీ లేదు. ఈ వాహనంలో ప్రభుత్వాస్పత్రి నుంచి తల్లీబిడ్డను ఇంటి దగ్గరకు చేర్చినందుకు ట్రిప్పుకు ఏకంగా రూ.1,640 చొప్పున చంద్రబాబు సర్కార్ ఇవ్వబోతోంది.సాక్షి, అమరావతి: గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో, ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవల స్వరూపం ఏ మాత్రం మారకపోయినా ప్రాజెక్ట్ వ్యయం మాత్రం అమాంతం పెరిగిపోతోంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం ప్రభుత్వ పెద్దల కమీషన్ దాహమేనని తేటతెల్లం అవుతోంది. అమాంతం కాంట్రాక్ట్ విలువలు పెంచి, జనం సొమ్ము కాంట్రాక్టర్లకు మళ్లించి, వారి నుంచి సొమ్ము చేసుకునే క్రమంలో ప్రభుత్వ పెద్దలు తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను సైతం వదలడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019లో తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను గత వైఎస్ జగన్ ప్రభుత్వం బలోపేతం చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా 500 బ్రాండ్ న్యూ వాహనాలతో సేవలను విస్తరించింది. ఇందుకోసం 2021లో టెండర్లు పిలిచి, ఒక్కో ట్రిప్పుకు రూ.895 చొప్పున చెల్లించేలా కాంట్రాక్ట్ ఖరారు చేసింది. ఆ కాంట్రాక్ట్ సంస్థే 2022 నుంచి సోమవారం వరకు సేవలు అందించింది. ఈ క్రమంలో తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్పై కీలక ప్రజాప్రతినిధి కన్నేశారు. ట్రిప్పు ట్రిప్పునకు పెద్ద మొత్తంలో కమీషన్ పొందేలా ఆ ప్రజాప్రతినిధి డీల్ కుదర్చుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో ఆ ప్రజాప్రతినిధి అస్మదీయ సంస్థకు అనుకూలమైన నిబంధనలతో గతేడాదే వైద్య శాఖ టెండర్లు పిలిచింది.ఈ క్రమంలో ప్రజాప్రతినిధి అస్మదీయ సంస్థ ఏకంగా ఒక్కో ట్రిప్పునకు రూ.2,300 చొప్పున ధర కోట్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో నిధుల లూటీకి స్కెచ్ వేశారు. ఈ వ్యవహారాన్ని అప్పట్లో ‘సాక్షి’ బట్టబయలు చేయడంతో ఈ దోపిడీకి సహకరించలేమంటూ అధికారులు చేతులెత్తేశారు. దీంతో ఆ టెండర్ను రద్దు చేయించి, మరోమారు పిలిచారు. రెండోసారి టెండర్లో కుదిరిన రేటురెండోసారి పిలిచిన టెండర్లో అదే సంస్థ ట్రిప్పునకు రూ.1,640 చొప్పున కోట్ చేయగా, ప్రభుత్వం కళ్లు మూసుకుని కాంట్రాక్ట్ కట్టబెట్టేసింది. ఒకే తరహా సేవకు నాలుగేళ్ల వ్యవధిలో 83 శాతం రూ.745 (దాదాపు రెట్టింపు) చొప్పున ట్రిప్పునకు అదనంగా చెల్లించడానికి సిద్ధమైంది. వైద్య శాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుతం 500 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు నెలకు 15 వేల ట్రిప్లు వేస్తున్నాయి.ట్రిప్పునకు రూ.895 చొప్పున నెలకు రూ.1.34 కోట్లు.. ఏడాదికి రూ.15 కోట్ల పైనే ఖర్చు అవుతోంది. చంద్రబాబు సర్కార్ కొత్తగా ఖరారు చేసిన రూ.1,640 ధరతో నెలకు రూ.2.46 కోట్లు.. ఏడాదికి రూ.30 కోట్ల మేర వెచ్చించాల్సి ఉంటోంది. అంటే ప్రస్తుతం చేస్తున్న వ్యయంతో పోలిస్తే ఏడాదికి రూ.15 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. మూడేళ్ల కాల పరిమితితో ప్రభుత్వం కాంట్రాక్ట్ ఖరారు చేసింది. ఈ లెక్కన పెరిగిన రేట్ల ప్రకారం చూస్తే మూడేళ్లలో రూ.45 కోట్లు ఖజానాకు గండి పడనుంది.తొలుత 300 వాహనాలతోనే సేవలుటెండర్ నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ సంస్థ ఒకేసారి 500 వాహనాలతో సేవలు ప్రారంభించాల్సి ఉంది. అయితే 500 వాహనాలను ఒకేసారి అందుబాటులోకి తేవడంలో కొత్త కాంట్రాక్టర్ విఫలమైనట్టు వైద్య శాఖ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కేవలం 300 వాహనాలను మాత్రమే సమకూర్చడంతో వాటితోనే నేడు అంటే మంగళవారం ప్రభుత్వం సేవలు ప్రారంభిస్తోంది. మిగిలిన 200 వాహనాలు రెండో దశలో అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది. కమీషన్ల కోసం సామర్థ్యం, ఆర్థిక స్థోమత లేని సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టడంతోనే ఈ పరిస్థితులు తలెత్తాయని ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు 500 వాహనాలతో అందుతున్న సేవలు ఒక్కసారిగా 300కు పరిమితం చేసి, ప్రభుత్వాస్పత్రుల్లో బిడ్డకు జన్మనిచ్చిన మహిళలు ఇళ్లకు చేరుకోవడానికి తీవ్ర అవస్థలు పడాల్సిన దుస్థితికి చంద్రబాబు ప్రభుత్వం తెర తీసింది. -
పగలు లీడర్.. రాత్రి స్మగ్లర్
సాక్షి టాస్క్ఫోర్స్/రాజంపేట: ఆదివారం కదా.. పోలీసులు ఎందుకు గస్తీ కాస్తారులే అనుకున్నాడో లేక అధికార పార్టీ పెద్దల అండ ఉందన్న ధైర్యమోగానీ ఓ ఎర్రచందనం స్మగ్లర్ కారులో దుంగలు తరలిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అతను ఎవరంటే.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి ముఖ్య అనుచరుడు, అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం దిగువ మూల తూముకుంటకు చెందిన తోట వెంకటాద్రి. ఆదివారం రాత్రి అటవీ అధికారులు గస్తీ నిర్వహిస్తుండగా కోటిగేవాండ్లపల్లె దగ్గర పట్టుబడ్డాడు. అతని దగ్గర నుంచి పోలీసులు ఏపీ 26 ఏఎన్ 7119 స్కార్పియో వాహనంతో పాటు రూ.2,10,647 విలువగల 409 కిలోల బరువున్న 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని అరెస్టుచేసినట్లు సానిపాయి రేంజ్ అధికారి వైసీ రెడ్డి తెలిపారు.చరిత్రంతా నేరమయం..ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన తోట వెంకటాద్రి చరిత్ర అంతా నేరమయమని తెలుస్తోంది. ఇతను కొన్నేళ్లుగా స్మగ్లింగ్ సాగిస్తూ ఇప్పటికే రెండు, మూడు దఫాలుగా పోలీసులకు చిక్కి అరెస్టయ్యాడు. మదనపల్లె, రేణిగుంట, రాయచోటి ప్రాంతాల్లో ఇతనిపై ఐదు కేసులు నమోదైనట్లు సమాచారం. రాయచోటి పట్టణంలో నివాసముంటున్న వెంకటాద్రి.. తాను ఒక న్యాయవాదినని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. పగలంతా టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటాడు. ఇటీవల నిర్వహించిన ‘డోర్ టు డోర్’ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నాడు. రాత్రయితే మాత్రం స్మగ్లర్ అవతారమెత్తుతాడు. అయితే, ఎర్రచందనం స్మగ్లర్లపై అటవీశాఖ, పోలీసు అధికారులు సాధారణంగా పీడీ యాక్ట్ నమోదుచేస్తుంటారు. కానీ, అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉన్న తోట వెంకటాద్రి ఇప్పటికే పలుమార్లు పట్టుబడినా అతనిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
లోకేశ్ మళ్లీ మాయం
సాక్షి, అమరావతి: సీఎం తనయుడు, ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ మళ్లీ మాయమయ్యారు. రెండు రోజుల క్రితమే ఆయన రాష్ట్రాన్ని వీడి రహస్యంగా అమెరికా వెళ్లినట్లు తెలిసింది. డీఎస్సీలో మెగా కుంభకోణానికి పాల్పడిన కూటమి ప్రభుత్వంపైన, ఆ శాఖ మంత్రి లోకేశ్పైనా రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న విషయం తెలిసిందే. డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేయాలనే డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకున్న వేళ ఆయన విదేశాలకు వెళ్లడం గమనార్హం. తన శాఖలో జరిగిన అతిపెద్ద కుంభకోణంపై ప్రజలకు జవాబు చెప్పాల్సిన మంత్రి, ఇలా వ్యవహరించడాన్ని సర్వత్రా తప్పుపడుతున్నారు. లోకేశ్కు రహస్య విదేశీ పర్యటనలు కొత్తేమీ కాదు. నెలకోసారి ఆయన విదేశీ పర్యటనలకు వెళుతున్నారు. అయితే దీనిపై పార్టీలో ముఖ్యులకూ సమాచారం ఉండడం లేదు. సాధారణంగా ప్రభుత్వ అధికారులు, మంత్రులు హెడ్ క్వార్టర్ వీడి పక్క రాష్ట్రం వెళ్లినా ప్రభుత్వం అధికారికంగా జీఓ జారీ చేస్తుంది. ముఖ్యమంత్రి అయినా సరే అన్ని పర్యటనల గురించి జీఓ జారీ చేయాల్సిందే. లోకేశ్ గత రెండేళ్లుగా ఇప్పటికి చాలాసార్లు అసలు ఎక్కడికి వెళుతున్నారో కూడా తెలియకుండా అదృశ్యమైపోతున్నారు. ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేక విమానాల్లో విదేశాలకు రహస్యంగా చెక్కేస్తున్నారు. -
కొడుకును కాపాడుకోవడం కోసం చరిత్ర హీనులవుతారా?
సాక్షి, అమరావతి: ‘డీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి. ఈ స్కామ్కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.9 వేల కోట్ల బకాయి.. వసతి దీవెన బకాయి వెంటనే చెల్లించాలి. ఇంటింటికీ బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి బకాయిలతో కలిపి చెల్లించాలి. ఇంత స్పష్టంగా విద్యార్థులు, యువత, ప్రజలు చంద్రబాబును డిమాండ్ చేస్తుంటే, వాటిని డైవర్ట్ చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేయడం ఎంత వరకు సమంజసం?’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం చంద్రబాబును నిలదీశారు. ప్రజలు అడుగుతున్న డిమాండ్లను అంగీకరిస్తారా? లేక కొడుకును కాపాడుకోవడం కోసం చరిత్ర హీనులుగా మిగిలిపోతారా? అని ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీల్లో లక్షలాదిగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజలు పాల్గొన్నారని పేర్కొన్నారు. తప్పు చేసిన ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ, స్ఫూర్తిదాయకంగా నిలిచారని అభినందించారు. విద్యార్థులు, యువకుల కోసం, వారి భవిష్యత్తు కోసం గత రెండు నెలలుగా అన్ని వర్గాల మద్దతుతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన పోరాటాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. 10 కార్యక్రమాలకు విశేష మద్దతు‘చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ఉల్లంఘనకు పూనుకున్నారు. పోలీసు బలంతో అణచి వేయాలని చూశారు. నిర్బంధాలు, బెదిరింపులు, నోటీసులను ఖాతరు చేయకుండా, నియంతృత్వానికి ఎదురొడ్డి.. ప్రజలతో కలిసి, లక్షలాది సంఖ్యలో బయటకు వచ్చి గట్టిగా పోరాటం చేశారు. నిర్బంధాలన్నింటినీ ఎదుర్కొంటూ, ప్రతి అడ్డంకినీ అధిగవిుస్తూ శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం. గడిచిన 74 రోజుల్లో రాష్ట్ర గవర్నర్ను కలవడం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్వహించిన 10 కార్యక్రమాలు.. అశేష ప్రజానీకం మద్దతుతో అత్యంత విజయవంతం అయ్యాయి’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.మే 29 – రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విభాగం నిరసనలు⇒ జూన్ 1 – జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలు, వినతి పత్రాలు⇒ జూన్ 8, 9 – నియోజకవర్గ స్థాయి టౌన్ హాల్ సమావేశాలు⇒ జూన్ 12 – 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు⇒ జూన్ 18 – రాష్ట్ర గవర్నర్ను కలిసి డీఎస్సీపై విచారణ కోరుతూ వినతిపత్రం⇒ జులై 28 – రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజనుల నిరసన ర్యాలీలు⇒ జులై 31 – జిల్లా కలెక్టర్లు జేసీలకు వినతులు⇒ ఆగస్టు 3, 4 – రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్, టౌన్హాల్ సమావేశాలు⇒ ఆగస్టు 6, 8 – నియోజకవర్గాల స్థాయిలో రిలే నిరాహార దీక్షలు⇒ ఆగస్టు 10 – రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలుఇంత మంది అడుగుతున్నా నోరు విప్పరా?ఇన్ని కార్యక్రమాల ద్వారా లక్షల మంది ప్రశ్నించినా చంద్రబాబు నోరు మెదపడం లేదని, లోకేశ్ సమాధానం చెప్పడం లేదని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డీఎస్సీ పేపర్ లీకేజీ, అక్రమాలు, ఫీజు రీయింబర్స్మెంట్ (విద్యా దీవెన), వసతి దీవెన కింద దాదాపుగా రూ.9 వేల కోట్ల బకాయిల చెల్లింపు, ఎన్నికల సమయంలో బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టోలో పెట్టి, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరిట హామీలు, నెలా నెలా రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి.. ఇవేవీ లేవు. నిరుద్యోగ భృతి కింద ఏడాదికి రూ.36 వేల చొప్పున మూడేళ్లకు రూ.1.08 లక్షలు ప్రతి నిరుద్యోగికీ బాకీ పడ్డారు. ఈ బాకీ సహా ఏ డిమాండ్పైనా ఇప్పటి వరకు చంద్రబాబు నోరు తెరవలేదు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ కూడా ప్రజలు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. విద్యార్థులు, నిరుద్యోగులు, లక్షలాది కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై సీఎంగా చంద్రబాబు, సంబంధిత మంత్రిగా ఆయన కుమారుడు నోరు విప్పక పోవడం దౌర్భాగ్యం. సమాధానాలు చెప్పకుండా ప్రశ్నించే గొంతులను పోలీసులతో అణచి వేయడం పరిష్కారం కాదు. ఇది అధికార జులుంతో తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నమే అవుతుంది. ఉద్యోగం కోసం సంవత్సరాలుగా చదివిన అభ్యర్థులు.. తమ పిల్లల చదువుల కోసం అప్పులు చేసిన కుటుంబాలు, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు.. వీళ్లంతా చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన బాండ్లను చూపిస్తూ నిరుద్యోగ భృతి హామీ కోసం యువత నిలదీస్తోంది. చంద్రబాబు స్పందించకపోతే విద్యార్థులు, నిరుద్యోగులు, విడిచి పెట్టరు. జెన్–జీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పితీరాలి. అంత వరకు పోరాటాలు ఆగవు’ అని వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. -
అప్పర్ భద్ర ప్రాజెక్టుపై 2023లోనే సుప్రీంకోర్టుకు ఏపీ
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక చేపడుతున్న ఎగువ భద్ర ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో ప్రత్యేక అనుమతి పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసిందని కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి రాజ్భూషణ్ చౌదరి తెలిపారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. కృష్ణా జలవివాదాల ట్రైబ్యునల్–1 (కేడబ్ల్యూడీటీ–1) 1976 అవార్డు ప్రకారం కర్ణాటకకు మొత్తం 734 టీఎంసీల నీరు కేటాయించినట్లు తెలిపారు. ఎగువ భద్ర ప్రాజెక్టుకు కర్ణాటక కేటాయించిన 29.90 టీఎంసీల నీటి వినియోగం కేడబ్ల్యూడీటీ–1 కింద ఆ రాష్ట్రానికి చేసిన కేటాయింపుల పరిధిలోనే ఉందని కేంద్ర జలసంఘం పరిశీలనలో తేలిందన్నారు. దీంతో అంతర్రాష్ట్ర కోణంలో ప్రాజెక్టును ఆమోదయోగ్యంగా గుర్తించినట్లు తెలిపారు. అదే సమయంలో కేడబ్ల్యూడీటీ–2 తీర్పు ఇంకా అమల్లోకి రాలేదని స్పష్టం చేశారు. 20 శాతానికి మించి ఇథనాల్పై నిర్ణయం తీసుకోలేదు పెట్రోల్లో 20 శాతానికి మించి ఇథనాల్ కలపడంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుశాఖ సహాయమంత్రి సురేశ్ గోపీ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబూరావు ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. భవిష్యత్లో శాస్త్రీయ, సాంకేతిక అధ్యయనాలు, సంబంధిత భాగస్వాములతో సంప్రదింపుల అనంతరమే ఇథనాల్ మిశ్రమాన్ని పెంపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.నియామకాలు, బదిలీల్లో ఆన్లైన్ విధానం అవసరంలోక్సభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబుసాక్షి, న్యూఢిల్లీ: ఉపాధ్యాయుల నియామకాలు, బదిలీల్లో పారదర్శకమైన, పటిష్టమైన, సాధ్యమైనంతవరకు ఆన్లైన్ విధానాన్ని పాటించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచిస్తున్నట్లు కేంద్ర కారి్మక, ఉపాధిశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. లోక్సభలో సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. ఉపాధ్యాయుల నియామకం, వారి సరీ్వస్ పరిస్థితులు, పోస్టింగులకు సంబంధించిన అంశాలు రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన పరిధిలోనే ఉంటాయని తెలిపారు. విద్య ఉమ్మడి జాబితాలోని అంశం కావడంతో దేశంలోని మెజారిటీ పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన నియంత్రణలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పరీక్షల్లో పారదర్శకత, నిష్పాక్షికత, విశ్వసనీయత పెంచడంతో పాటు అక్రమాలను నిరోధించేందుకు పార్లమెంట్ 2024లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) చట్టాన్ని తీసుకొచి్చందని గుర్తుచేశారు. ఈ చట్టాన్ని రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా స్వీకరించవచ్చని చెప్పారు. తిరుపతిలో నవోదయ విద్యాలయానికి అనుమతి లేదు తిరుపతి జిల్లాలో కొత్త జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు అనుమతి మంజూరు చేయలేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. దేశంలోని ప్రతిజిల్లాలో ఒక నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలన్నది నవోదయ విద్యాలయ పథకం లక్ష్యమని తెలిపారు. అయితే కొత్త విద్యాలయాల ఏర్పాటు నిరంతర ప్రక్రియగా ఉంటుందని, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అనువైన భూమిని సమకూర్చడంతో పాటు శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యేవరకు తాత్కాలిక భవనాన్ని ఉచితంగా అందుబాటులోకి తేవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు నవోదయ పథకం పరిధిలో ఉన్నాయని, ప్రకాశం (ప్రస్తుతం మార్కాపురం), తూర్పుగోదావరి (ప్రస్తుతం పోలవరం) జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల ప్రాతిపదికన మంజూరైన మరో రెండు విద్యాలయాలు కూడా పనిచేస్తున్నాయని తెలిపారు. మొత్తం రాష్ట్రంలో 15 నవోదయ విద్యాలయాలు పనిచేస్తున్నాయని చెప్పారు.సాంకేతికతకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు అవసరంరాజ్యసభలో బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లుపై చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్రెడ్డి సాంకేతికతకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు అవసరం సాక్షి, న్యూఢిల్లీ: మారుతున్న కాలానికి, సాంకేతికతకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ ఎస్.నిరంజన్రెడ్డి చెప్పారు. రాజ్యసభలో సోమవారం బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు–2026పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. పాత చట్టాలను ఆధునికీకరిస్తూ సాంకేతికతను జోడించి ఈ బిల్లును తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ రంగానికి చట్టబద్ధమైన ప్రామాణిక ఫారం తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ ఫారాన్ని జారీచేసే బ్యాంకు అధికారి.. కంప్యూటర్, క్లౌడ్ వ్యవస్థల డేటా సమగ్రతను (ఇంటిగ్రిటీని) ధ్రువీకరించాల్సి ఉంటుందన్నారు. ఒక సామాన్య బ్యాంకు అధికారికి క్లౌడ్ డేటా భద్రతను ధ్రువీకరించడం కష్టసాధ్యమనే విష యాన్ని ఆరి్థకమంత్రి పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. బిల్లులోని క్లాజ్ 14 ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఆదేశాలిచ్చే అవకాశం ఉండటం ఉపశమనం కలిగించే అంశమన్నారు. బిల్లుకు తమపార్టీ మద్దతు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. -
ఈపీఎస్–95 పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్–95) పరిధిలోకి వచ్చే లక్షలాదిమంది విశ్రాంత ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు, న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత పి.వి.మిథున్రెడ్డి కేంద్ర కారి్మక, ఉపాధి కల్పన, యువజన వ్యవహారాలు, క్రీడలశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కోరారు. ఈపీఎస్–95 నేషనల్ అజిటేషన్ కమిటీ సమర్పించిన వినతిపత్రాన్ని జతచేస్తూ వినతిపత్రం ఇచ్చారు.పార్టీ ఎంపీలు డాక్టర్ మద్దిల గురుమూర్తి, డాక్టర్ గుమ్మా తనూజారాణితో కలిసి ఆయన సోమవారం పార్లమెంట్ భవన్లో కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మిథున్రెడ్డి పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస పెన్షన్ మొత్తాన్ని గౌరవప్రదమైన రీతిలో పెంచాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అర్హులైన పెన్షనర్లందరికీ హైయర్ పెన్షన్ సదుపాయాన్ని తక్షణమే వర్తింపజేయాలన్నారు. ఈపీఎస్–95 పథకం పరిధిలోకి రాని ఇతర విశ్రాంత ఉద్యోగులకు కూడా ఆర్థికభద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మానవహక్కులకు విరుద్ధం ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో ఏళ్లకు ఏళ్లుగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కేంద్రమంత్రిని కోరారు. ఏపీ మెడికల్–హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఇచి్చన వినతిపత్రాన్ని జతచేస్తూ ఒక వినతిపత్రం ఇచ్చారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా కాంట్రాక్ట్ సిబ్బందికీ రెగ్యులర్ ఉద్యోగుల కనీస టైమ్స్కేల్కు సమానంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వారికి వారాంతపు సెలవు (వీక్లీ ఆఫ్) ఇవ్వకపోవడాన్నీ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇది శ్రామిక చట్టాలకు, వారి మానవ హక్కులకు విరుద్ధమని చెప్పారు. దీనికి స్పందించిన కేంద్రమంత్రి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఒకే రకమైన విధులు నిర్వర్తిస్తున్న అందరికీ ఒకేవిధంగా వేతనం ఉండేలా విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో క్రీడావసతులు పెంచాలి గిరిజన ప్రాంతాల్లో అపారమైన క్రీడా ప్రతిభ దాగి ఉన్న విద్యార్థులు, యువతను ప్రోత్సహించేందుకు ట్రైబల్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయను కోరారు. ఈ మేరకు ఆమె వినతిపత్రం ఇచ్చారు. అరకు కేంద్రంగా ట్రైబల్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్–అరకు పేరుతో ప్రత్యేక క్రీడాభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించాలని కోరారు. మిగతా ఏజెన్సీ ప్రాంతాల్లో క్రీడావసతులు మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. గిరిజనులకు ప్రత్యేక ఆసక్తి ఉండే విలువిద్య, షూటింగ్ వంటి విభాగాలకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, గిరిజన బాలబాలికల కోసం క్రీడాహాస్టళ్లు లేదా రెసిడెన్షియల్ అకాడమీలు నెలకొల్పాలని కోరారు. ఈ సదుపాయాలను ‘ఖేలో ఇండియా’ పథకంతో అనుసంధానించాలని విన్నవించారు. తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎంపీ తనూజారాణి చెప్పారు. గ్రామీణ డాక్ సేవకుల కోసం కమిటీ వేయాలి గ్రామీణ ప్రాంతాల పోస్టల్ సేవల్లో కీలకపాత్ర పోషిస్తున్న గ్రామీణ డాక్ సేవకుల (జీడీఎస్ల) వేతన నిర్మాణం, సర్వీసు నిబంధనలను సమీక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత పి.వి.మిథున్రెడ్డి కేంద్ర కమ్యూనికేషన్లశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కోరారు. ఈ మేరకు ఆయన కేంద్రమంత్రికి వినతిపత్రం అందించారు. -
పోలవరంలో నీటి నిల్వ ఎత్తు 41.15 మీటర్లే
సాక్షి, అమరావతి: పోలవరం రిజర్వాయర్ కానే కాదు... బ్యారేజ్ మాత్రమేనని రాజ్యసభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు కాదు.. కనిష్ట నీటి మట్టం 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు మాత్రమే ఇస్తామని పునరుద్ఘాటించింది. ఆ మేరకు ప్రాజెక్టు పూర్తికి 2023 ధరల ప్రకారం అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లకు సవరిస్తూ కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొంది. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టులో మిగిలిన పనులు పూర్తిచేయడానికి రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇస్తామని పునరుద్ఘాటించింది. రాజ్యసభలో ఎంపీ ఆర్.కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్శక్తి శాఖ సహాయమంత్రి రాజ్భూషణ్ చౌదరి ఈ మేరకు సోమవారం సమాధానం ఇచ్చారు.పోలవరం పనుల కోసం గత ఐదేళ్లలో 2021–22 నుంచి 2025–26 వరకూ రూ.12,620.53 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేశామని చెప్పారు. స్పిల్ వేలో మట్టి పనులు 96.87, కాంక్రీట్ పనులు 98.84, స్టీల్ పనులు 92.95 శాతం.. ఈసీఆర్ఎఫ్(ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం), జలాశయంతో కుడి, ఎడమ కాలువలను అనుసంధానం చేసే పనుల్లో మట్టి పనులు 75.76, కాంక్రీట్ పనులు 81.99, స్టీల్ పనులు 81.31 శాతం– కుడి, ఎడమ కాలువ పనుల్లో మట్టి పనులు 98.96, కాంక్రీట్ పనులు 88.44, స్టీల్ పనులు 55.68 శాతం పూర్తయ్యాయన్నారు. 41.15 మీటర్ల ఎత్తు వరకూ నీటి నిల్వకు వీలుగా ప్రాజెక్టులో ముంపునకు గుర య్యే గ్రామాల్లో ఇప్పటికే 17,892 నిర్వాసిత కుటుంబాలకు రూ.1,373.01 కోట్లు పరిహారం చెల్లించామని, పునరావాసం కల్పించడానికి రూ.1,581.08 కో ట్లు వ్యయం చేశామన్నారు. ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని కేంద్ర కేబినెట్ నిర్దేశించిందని, గడువు మరో ఏడాది పొడిగించామన్నారు.వరదల సమయంలో 1.98 లక్షల ఎకరాలకే .. పోలవరం గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు.. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు. కనీస నీటిమట్టం 41.15 మీటర్లు.. కనీస నీటి నిల్వ 119.4 టీఎంసీలు. పోలవరం నీటి మట్టాన్ని కనీస స్థాయికే పరిమితం చేస్తే.. కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కేవలం 1.98 లక్షల ఎకరాలకు అదీ గోదావరి వరద రోజుల్లో మాత్రమే నీళ్లందించడానికి అవకాశం ఉంటుందని అధికారులే స్పష్టం చేస్తున్నారు. ఇక కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు మళ్లించడానికి, గోదావరి డెల్టా ఆయకట్టు స్థిరీకరణకు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీళ్లందించటానికి అవకాశమే ఉండదని తేల్చి చెబుతున్నారు.ఎడమ గట్టుపై 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రంలోనూ గోదావరికి వరద వచ్చే రోజుల్లోనే అరకొరగా విద్యుదుత్పత్తికి అవ కాశం ఉంటుందంటున్నారు. అంటే– పోలవరం రిజర్వాయర్ను బ్యారేజ్గా మార్చేశారన్నది సుస్పష్టం. 45.72 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వకు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి రూ.25వేల కోట్లకుపైగా అవసరం. అంటే.. ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించకతప్పదు.38.41 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా పోలవరాన్ని చేపట్టిన వైఎస్సార్...అదే లక్ష్యంతో ప్రాజెక్టు పనులు వేగవంతం చేసిన నాటి సీఎం వైఎస్ జగన్.. గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచి్చన మేరకు సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం), అటవీ పర్యావరణం సహా అన్ని అనుమతులు సాధించి.. 45.72 మీటర్ల గరిష్ట నీటి మట్టం, 194.6 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 2005లో జలయ/æ్ఞంలో భాగంగా పోలవరం నిర్మాణాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలు.. కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు మళ్లించి 13.08 లక్షల ఎకరాలను స్థిరీకరించడం, గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలకు రెండో పంటకూ సమృద్ధిగా నీళ్లందించి స్థిరీకరించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలకు వెరసి 38.41 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా పోలవరాన్ని చేపట్టి పనులు వేగవంతం చేశారు. అనంతరం కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జూన్ 11 నాటికే 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేసేలా పోలవరం స్పిల్ వేను వైఎస్ జగన్ సర్కార్ పూర్తి చేసింది. 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు తాజా ధరల మేరకు ఇచ్చేందుకు 2020 మార్చి 17న కేంద్రం అంగీకరించింది. కానీ.. 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్లో పోలవరం నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ.. ఆ మేరకు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇచ్చేలా తీర్మానాన్ని ఆమోదిస్తే.. ఆ కేబినెట్లో సభ్యుడిగా ఉన్న టీడీపీ మంత్రి కె.రామ్మోహన్నాయుడు అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. ఇక దానిపై చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. దీన్ని బట్టి పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రజల హక్కులను తాకట్టు పెట్టేసినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రానికి జీవనాడి పోలవరానికి చంద్రబాబు సర్కార్ ఉరేసిందంటూ సాగునీటి రంగ నిపుణులు మండిపడుతున్నారు. -
విద్య, వైద్యం, తాగునీరు, రవాణా ప్రైవేట్ ఆధీనంలో!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం సామాజిక బాధ్యతల నుంచి వైదొలిగి పూర్తిగా ప్రైవేట్ సంస్ధలకు అప్పగించేసింది! ప్రజలకు కనీస సామాజిక బాధ్యతగా ప్రభుత్వం అందించాల్సిన విద్య, వైద్యం, తాగునీరు, రవాణా సేవలను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పేరుతో ప్రైవేట్ పరం చేస్తోంది. దీంతో విద్య, వైద్యం, తాగునీరు, రవాణా లాంటి సామాజిక సేవలకు ప్రజల నుంచి యూజర్ చార్జీలను వసూలు చేయనున్నారు. ఫలితంగా ఈ సేవలు ఖరీదు కానున్నాయి. అంతేకాకుండా పీపీపీ ప్రాజెక్టులు చేపట్టే ప్రైవేట్ సంస్ధలకు రాష్ట్ర ప్రభుత్వమే వడ్డీలేని రుణాలను ఇవ్వనుంది.వడ్డీ లేని రుణాలకు ‘వయబులిటీ బ్రిడ్జ్ ఫండ్’ అనే పేరు పెట్టింది. వడ్డీని ప్రభుత్వమే భరిస్తూ అసలు మాత్రమే ఆయా సంస్ధల నుంచి తిరిగి రికవరీ చేస్తుంది. దీంతో పాటు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) పేరుతో నిధులు సమకూర్చనుంది. ఇందుకోసం బడ్టెట్లో రూ.1,500 కోట్లు కేటాయించినట్లు పేర్కొంది. ప్రారంభ దశలో ఆర్థికంగా లాభదాయకం కానివి, భవిష్యత్లో ఆదాయాన్ని సమకూర్చే ప్రాజెక్టులకు వయబులిటీ బ్రిడ్జ్ ఫండ్ కింద వడ్డీ లేని రుణాలను ప్రభుత్వమే అందిస్తుంది. పొదుపుగా సేవల వినియోగం..! ప్రైవేట్ సంస్థలు లాభాలు ఆర్జించడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు పీపీపీ విధానాన్ని రూపొందించింది. మెడికల్ కాలేజీలకు వీజీఎఫ్తో పాటు రాయితీపై భూమి ఇస్తారు. ఇందుకోసం ‘పీపీపీ విధానం 2026’ పేరుతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేట్ సంస్ధలు వెచి్చంచిన వ్యయాన్ని వినియోగదారుల నుంచి యూజర్ చార్జీల రూపంలో కచ్చితంగా రాబట్టనున్నట్లు పీపీపీ విధానంలో స్పష్టం చేశారు. పీపీపీ విజయవంతమయ్యేందుకు వినియోగదారుడే చార్జీలు చెల్లించాలనేది కీలకమైన సూత్రమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇది పొదుపుగా సేవలను వినియోగించుకునేందుకు దోహదం చేస్తుందని స్పష్టం చేశారు. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం సామాజిక బాధ్యతల నుంచి వైదొలిగి పూర్తిగా ప్రైవేట్ సంస్ధలకు అప్పగించేసింది! ప్రజలకు కనీస సామాజిక బాధ్యతగా ప్రభుత్వం అందించాల్సిన విద్య, వైద్యం, తాగునీరు, రవాణా సేవలను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పేరుతో ప్రైవేట్ పరం చేస్తోంది. దీంతో విద్య, వైద్యం, తాగునీరు, రవాణా లాంటి సామాజిక సేవలకు ప్రజల నుంచి యూజర్ చార్జీలను వసూలు చేయనున్నారు. ఫలితంగా ఈ సేవలు ఖరీదు కానున్నాయి. అంతేకాకుండా పీపీపీ ప్రాజెక్టులు చేపట్టే ప్రైవేట్ సంస్ధలకు రాష్ట్ర ప్రభుత్వమే వడ్డీలేని రుణాలను ఇవ్వనుంది.వడ్డీ లేని రుణాలకు ‘వయబులిటీ బ్రిడ్జ్ ఫండ్’ అనే పేరు పెట్టింది. వడ్డీని ప్రభుత్వమే భరిస్తూ అసలు మాత్రమే ఆయా సంస్ధల నుంచి తిరిగి రికవరీ చేస్తుంది. దీంతో పాటు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) పేరుతో నిధులు సమకూర్చనుంది. ఇందుకోసం బడ్టెట్లో రూ.1,500 కోట్లు కేటాయించినట్లు పేర్కొంది. ప్రారంభ దశలో ఆర్థికంగా లాభదాయకం కానివి, భవిష్యత్లో ఆదాయాన్ని సమకూర్చే ప్రాజెక్టులకు వయబులిటీ బ్రిడ్జ్ ఫండ్ కింద వడ్డీ లేని రుణాలను ప్రభుత్వమే అందిస్తుంది. పొదుపుగా సేవల వినియోగం..! ప్రైవేట్ సంస్థలు లాభాలు ఆర్జించడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు పీపీపీ విధానాన్ని రూపొందించింది. మెడికల్ కాలేజీలకు వీజీఎఫ్తో పాటు రాయితీపై భూమి ఇస్తారు. ఇందుకోసం ‘పీపీపీ విధానం 2026’ పేరుతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేట్ సంస్ధలు వెచి్చంచిన వ్యయాన్ని వినియోగదారుల నుంచి యూజర్ చార్జీల రూపంలో కచ్చితంగా రాబట్టనున్నట్లు పీపీపీ విధానంలో స్పష్టం చేశారు. పీపీపీ విజయవంతమయ్యేందుకు వినియోగదారుడే చార్జీలు చెల్లించాలనేది కీలకమైన సూత్రమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇది పొదుపుగా సేవలను వినియోగించుకునేందుకు దోహదం చేస్తుందని స్పష్టం చేశారు. వ్యయాన్ని రాబట్టేందుకు తరచూ చార్జీల సవరణ.. వాణిజ్యపరంగా ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, ప్రైవేట్ రంగం భాగస్వామ్యాన్ని పెంచేందుకు అవసరమైన చోటల్లా యూజర్ చార్జీల విధింపును రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. చార్జీల నియంత్రణ కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. పీపీపీ ప్రాజెక్టుల్లో ప్రైవేట్ రంగం చేసిన వ్యయాన్ని రాబట్టేందుకు తరచూ చార్జీల సవరణ ప్రాతిపదికన వీటిని రూపొందించనున్నారు. పీపీపీలో ప్రైవేట్ సంస్థకు 51 శాతం లేదా అంతకంటే ఎక్కువ వాటా ఉంటుంది. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్ధలు, స్వయం ప్రతిపత్తి గల సంస్ధలు ఐదేళ్ల పాటు పీపీపీ ప్రాజెక్టులను రూపొందించాలి. రెండో సారి సింగిల్ బిడ్ వస్తే అదే సంస్థకు ప్రాజెక్టు ఖరారు చేస్తారు. వయబులిటీ గ్యాప్ ఫండింగ్ తక్కువ కోట్ చేయడమే ప్రాతిపదికగా సంస్ధలను ఖరారు చేస్తారు. సామాజిక రంగ ప్రాజెక్టులు ముఖ్యంగా ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, విద్య మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 40 శాతం మూలధన గ్రాంటుకు అర్హత కలిగి ఉంటాయి. వీజీఎఫ్ కింద అర్హత పొందిన ప్రాజెక్టుల్లో 100 శాతం నిర్వహణ వ్యయం వసూలు చేయాలని నిర్దేశించారు. ప్రభుత్వ పాత్ర ఇలా.. ప్రాజెక్ట్ అవసరాన్ని గుర్తించి పీపీపీ లక్ష్యాలు, ఉద్దేశాలను నిర్ధారించి ప్రాధాన్యత ఇవ్వడం. పీపీపీ ఎంపికను ఆమోదించి సిఫార్సులు చేయడం. ప్రాజెక్టు అమలును సులభతరం చేయడంతో పాటు భూసేకరణ, యుటిలిటీల తరలింపు లాంటి సహాయ చర్యలు. పారదర్శకమైన పోటీతో కూడిన బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహించడం. నిర్మాణం, నిర్వహణ సమయంలో పర్యవేక్షించడంతో పాటు రాయితీ కాలం ముగిసిన తర్వాత ఆస్తిని స్వాధీనం చేసుకోవడం. ప్రైవేట్ రంగం పాత్ర ఇలా.. పీపీపీ ప్రాజెక్టుకు ప్రత్యేకమైన నైపుణ్యాన్ని అందించడం. పోటీ బిడ్డింగ్ విధానాలను అనుసరించడం. రాయితీ ఒప్పందాన్ని ఖచి్చతంగా పాటించడం. రాయితీ కాలం ముగిసిన తర్వాత ఒప్పందం ప్రకారం ఆస్తిని బదిలీ చేయడం.పీపీపీ రంగం ప్రాజెక్టులు ఇలా..⇒ వ్యవసాయ మౌలిక సదుపాయాలు, ఉద్యానవన మార్కెట్లు, పూల పెంపకం పార్కులు, మార్కెట్లు, ఉద్యానవన–ఆహార శుద్ధి అనుబంధ మౌలిక సదుపాయాలు (శీతల గిడ్డంగులతో సహా) టెరి్మనల్ నిల్వ, పంట కోతల అనంతర నిల్వ, లాజిస్టిక్స్ పార్కులు, గిడ్డంగులు. ⇒ విద్య, వృత్తి శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, సైన్స్, టెక్నాలజీ పార్కులు, ఈ–గ్రంథాలయాలు. ⇒ విద్యుత్ ఉత్పత్తి (క్యాప్టివ్తో సహా), ప్రసారం, పంపిణీ, వర్తకం, గ్యాస్, పునరుత్పాదక, సంప్రదాయేతర శక్తి, ఈవీ చార్జింగ్, బ్యాటరీ మార్పిడి, స్మార్ట్ గ్రిడ్లు ⇒ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు: ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ, నర్సింగ్, రోగ నిర్ధారణ, గుండె జబ్బుల కేంద్రాలు, వృద్ధుల సంరక్షణ కేంద్రాలు, వైద్య విద్య మౌలిక సదుపాయాలు, ప్రమాద సహాయక కేంద్రాలు, పునరావాస, శిక్షణ కేంద్రాలు. ⇒ పారిశ్రామిక మౌలిక సదుపాయాలు: పారిశ్రామిక పార్కులు ⇒ నీటిపారుదల: ఆనకట్టలు, కాలువలు, అనుబంధ పనులు ⇒ ప్రజా మార్కెట్లు, భవనాలు: మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు. ⇒ వినోద, విహార, థీమ్ పార్కులు: హోటళ్లు/రిసార్టులు, సమావేశ కేంద్రాలు, లైట్–అండ్–సౌండ్ షోలు, సాంస్కృతిక కేంద్రాలు, వన్యప్రాణి పర్యాటకం, మ్యూజియంలు, సాహస క్రీడల మౌలిక సదుపాయాలు. ⇒ రోడ్లు, రోప్వేలు, అంతర్గత జల రవాణా, ఓడరేవులు, అంతర్గత ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, విమానాశ్రయాలు, లాజిస్టిక్స్ హబ్లు, రైల్వే, పట్టణ రవాణా వ్యవస్థలు, బస్/ట్రక్ టెరి్మనళ్లు, గిడ్డంగులు, పార్కింగ్ సౌకర్యాలు. ⇒ టౌన్íÙప్ల అభివృద్ధి: ఘన, బయో–మెడికల్, ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, పట్టణ నీటి సరఫరా. ⇒ కళలు, సాంస్కృతిక థియేటర్లు, క్రీడా స్టేడియంలు, హాస్టళ్లు/క్వార్టర్లు, క్రీడా శిక్షణా కేంద్రాలు, వ్యాయామశాలలు. ⇒ తక్కువ ధర గృహాలు, అందుబాటు ధరల గృహాలు, కారి్మకుల అద్దె గృహాలు. ⇒ గ్రామీణ తాగునీటి ప్రాజెక్టులు, చిన్న బహుళార్ధ సాధక జలాశయాలు, గ్రామీణ పర్యాటకం, గ్రామీణ మార్కెట్లు, గిడ్డంగులు, రవాణా సౌకర్యాలు. ⇒ టెలికమ్యూనికేషన్ ⇒ నీరు, పారిశుధ్యం: నీటి సరఫరా, శుద్ధి ప్లాంట్లు, మురుగునీటి సేకరణ, ⇒ ఇతర సామాజిక మౌలిక సదుపాయాలువ్యయాన్ని రాబట్టేందుకు తరచూ చార్జీల సవరణ.. వాణిజ్యపరంగా ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, ప్రైవేట్ రంగం భాగస్వామ్యాన్ని పెంచేందుకు అవసరమైన చోటల్లా యూజర్ చార్జీల విధింపును రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. చార్జీల నియంత్రణ కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. పీపీపీ ప్రాజెక్టుల్లో ప్రైవేట్ రంగం చేసిన వ్యయాన్ని రాబట్టేందుకు తరచూ చార్జీల సవరణ ప్రాతిపదికన వీటిని రూపొందించనున్నారు. పీపీపీలో ప్రైవేట్ సంస్థకు 51 శాతం లేదా అంతకంటే ఎక్కువ వాటా ఉంటుంది. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్ధలు, స్వయం ప్రతిపత్తి గల సంస్ధలు ఐదేళ్ల పాటు పీపీపీ ప్రాజెక్టులను రూపొందించాలి. రెండో సారి సింగిల్ బిడ్ వస్తే అదే సంస్థకు ప్రాజెక్టు ఖరారు చేస్తారు. వయబులిటీ గ్యాప్ ఫండింగ్ తక్కువ కోట్ చేయడమే ప్రాతిపదికగా సంస్ధలను ఖరారు చేస్తారు. సామాజిక రంగ ప్రాజెక్టులు ముఖ్యంగా ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, విద్య మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 40 శాతం మూలధన గ్రాంటుకు అర్హత కలిగి ఉంటాయి. వీజీఎఫ్ కింద అర్హత పొందిన ప్రాజెక్టుల్లో 100 శాతం నిర్వహణ వ్యయం వసూలు చేయాలని నిర్దేశించారు. ప్రభుత్వ పాత్ర ఇలా.. ప్రాజెక్ట్ అవసరాన్ని గుర్తించి పీపీపీ లక్ష్యాలు, ఉద్దేశాలను నిర్ధారించి ప్రాధాన్యత ఇవ్వడం. పీపీపీ ఎంపికను ఆమోదించి సిఫార్సులు చేయడం. ప్రాజెక్టు అమలును సులభతరం చేయడంతో పాటు భూసేకరణ, యుటిలిటీల తరలింపు లాంటి సహాయ చర్యలు. పారదర్శకమైన పోటీతో కూడిన బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహించడం. నిర్మాణం, నిర్వహణ సమయంలో పర్యవేక్షించడంతో పాటు రాయితీ కాలం ముగిసిన తర్వాత ఆస్తిని స్వాధీనం చేసుకోవడం. ప్రైవేట్ రంగం పాత్ర ఇలా.. పీపీపీ ప్రాజెక్టుకు ప్రత్యేకమైన నైపుణ్యాన్ని అందించడం. పోటీ బిడ్డింగ్ విధానాలను అనుసరించడం. రాయితీ ఒప్పందాన్ని ఖచి్చతంగా పాటించడం. రాయితీ కాలం ముగిసిన తర్వాత ఒప్పందం ప్రకారం ఆస్తిని బదిలీ చేయడం.పీపీపీ రంగం ప్రాజెక్టులు ఇలా..⇒ వ్యవసాయ మౌలిక సదుపాయాలు, ఉద్యానవన మార్కెట్లు, పూల పెంపకం పార్కులు, మార్కెట్లు, ఉద్యానవన–ఆహార శుద్ధి అనుబంధ మౌలిక సదుపాయాలు (శీతల గిడ్డంగులతో సహా) టెరి్మనల్ నిల్వ, పంట కోతల అనంతర నిల్వ, లాజిస్టిక్స్ పార్కులు, గిడ్డంగులు. ⇒ విద్య, వృత్తి శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, సైన్స్, టెక్నాలజీ పార్కులు, ఈ–గ్రంథాలయాలు. ⇒ విద్యుత్ ఉత్పత్తి (క్యాప్టివ్తో సహా), ప్రసారం, పంపిణీ, వర్తకం, గ్యాస్, పునరుత్పాదక, సంప్రదాయేతర శక్తి, ఈవీ చార్జింగ్, బ్యాటరీ మార్పిడి, స్మార్ట్ గ్రిడ్లు ⇒ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు: ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ, నర్సింగ్, రోగ నిర్ధారణ, గుండె జబ్బుల కేంద్రాలు, వృద్ధుల సంరక్షణ కేంద్రాలు, వైద్య విద్య మౌలిక సదుపాయాలు, ప్రమాద సహాయక కేంద్రాలు, పునరావాస, శిక్షణ కేంద్రాలు. ⇒ పారిశ్రామిక మౌలిక సదుపాయాలు: పారిశ్రామిక పార్కులు ⇒ నీటిపారుదల: ఆనకట్టలు, కాలువలు, అనుబంధ పనులు ⇒ ప్రజా మార్కెట్లు, భవనాలు: మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు. ⇒ వినోద, విహార, థీమ్ పార్కులు: హోటళ్లు/రిసార్టులు, సమావేశ కేంద్రాలు, లైట్–అండ్–సౌండ్ షోలు, సాంస్కృతిక కేంద్రాలు, వన్యప్రాణి పర్యాటకం, మ్యూజియంలు, సాహస క్రీడల మౌలిక సదుపాయాలు. ⇒ రోడ్లు, రోప్వేలు, అంతర్గత జల రవాణా, ఓడరేవులు, అంతర్గత ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, విమానాశ్రయాలు, లాజిస్టిక్స్ హబ్లు, రైల్వే, పట్టణ రవాణా వ్యవస్థలు, బస్/ట్రక్ టెరి్మనళ్లు, గిడ్డంగులు, పార్కింగ్ సౌకర్యాలు. ⇒ టౌన్íÙప్ల అభివృద్ధి: ఘన, బయో–మెడికల్, ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, పట్టణ నీటి సరఫరా. ⇒ కళలు, సాంస్కృతిక థియేటర్లు, క్రీడా స్టేడియంలు, హాస్టళ్లు/క్వార్టర్లు, క్రీడా శిక్షణా కేంద్రాలు, వ్యాయామశాలలు. ⇒ తక్కువ ధర గృహాలు, అందుబాటు ధరల గృహాలు, కారి్మకుల అద్దె గృహాలు. ⇒ గ్రామీణ తాగునీటి ప్రాజెక్టులు, చిన్న బహుళార్ధ సాధక జలాశయాలు, గ్రామీణ పర్యాటకం, గ్రామీణ మార్కెట్లు, గిడ్డంగులు, రవాణా సౌకర్యాలు. ⇒ టెలికమ్యూనికేషన్ ⇒ నీరు, పారిశుధ్యం: నీటి సరఫరా, శుద్ధి ప్లాంట్లు, మురుగునీటి సేకరణ, ⇒ ఇతర సామాజిక మౌలిక సదుపాయాలు -
దగా డీఎస్సీపై దద్దరిల్లిన రాష్ట్రం.. 'కదం తొక్కిన జనం'
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: దగా డీఎస్సీపై వైఎస్సార్సీపీ సోమవారం చేపట్టిన ర్యాలీలతో రాష్ట్రం దద్దరిల్లింది. మెగా డీఎస్సీ పేరుతో దగా చేసిన చంద్రబాబు సర్కారుపై యువత భగ్గుమంది. దగా డీఎస్సీకి కారకుడైన మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని, సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా పోరు విజయవంతమైంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం భారీ ర్యాలీల ద్వారా వైఎస్సార్సీపీ శ్రేణులు, యువత కదం తొక్కారు. టీడీపీ శ్రేణులను, పోలీసులను పురిగొల్పి ఎన్ని అడ్డంకులు కల్పించినా, మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలను విజయవంతం చేసిన జెన్ జీ యువత ర్యాలీలకు సైతం భారీగా తరలి వచ్చింది. మెగా డీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ, అక్రమాలు, స్పోర్ట్స్ కోటా అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు భృతి ఇవ్వాలని పెద్ద ఎత్తున నినదించారు. జెన్ జీ యువత పెద్ద ఎత్తున ఉద్యమానికి మద్దతు పలకడంతో తన కుమారుడి భవితవ్యం ఇబ్బందుల్లో పడుతుందని కలవరపడుతున్న చంద్రబాబు మూడు రోజులపాటు నిర్వహించిన రిలే దీక్షలను అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులను, పోలీసులను పురిగొల్పిన సంగతి తెల్సిందే. సోమవారం నిర్వహించిన ర్యాలీలను సైతం అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగించారు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడం, నోటీసులు ఇవ్వడం, హౌస్ అరెస్టులు, అరెస్టులతో రెచ్చిపోయారు. అయినా ప్రజలు, యువత నిరసన ర్యాలీలకు భారీగా తరలివచ్చారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ శ్రేణులు స్పష్టం చేశాయి. లోకేశ్ రాజీనామా చేయాల్సిందేనని సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో కదంతొక్కిన నిరుద్యోగులు, యువత అడుగడుగునా చంద్రబాబు సర్కారు జులుండీఎస్సీ స్కామ్పై వైఎస్సార్సీపీ, యువత ఆందోళనలతో బెంబేలెత్తిపోతున్న సీఎం చంద్రబాబు.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సోమవారం కూడా వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీలపై జులుం ప్రదర్శించారు. వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందులలో వైఎస్సార్సీపీ శ్రేణులపై డీఎస్పీ మురళీనాయక్ నాయకత్వంలో పోలీసులు అమానుషంగా లాఠీచార్జీ చేశారు. కడపలో వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి నేతృత్వంలో ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ను పోలీసులు అడ్డుకోగా, ఆయన ఇంటి గేటు వద్దే బైఠాయించి నిరసన తెలిపారు. భరత్ ఇంటిపై దాడికి టీడీపీ నేతలు దూసుకువచ్చారు. వైఎస్సార్సీపీ ర్యాలీకి పోటీగా కావాలనే టీడీపీ ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేయడంతో హైటెన్షన్ నెలకొంది. ఎక్కడ అడ్డుకుంటే అక్కడే బైఠాయింపుచిత్తూరులో ర్యాలీకి వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు దారుణంగా ఈడ్చి పడేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో శాసన మండలిలో వైఎస్సార్సీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణతోపాటు పార్టీ శ్రేణులు ముందుకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బొత్స తదితర నేతలు రోడ్డుపైనే బైఠాయించారు. అనంతపురం జిల్లాలో ముచ్చుకోట వద్ద తాడిపత్రికి వెళ్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపైనే బైఠాయించారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇంట్లోకి వెళ్లాలని పోలీసులు ఒత్తిడి చేశారు. ర్యాలీకి వస్తే కేసులు పెడతామని బెదిరింపులువిజయవాడ సెంట్రల్ వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును ఇంటి వద్దే అడ్డుకున్న పోలీసులు వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ను అడ్డుకోవాలని చూశారు. వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి అవినాష్ పోలీసుల బారికేడ్లు దాటుకుని వచ్చి ర్యాలీ నిర్వహించారు. విశాఖ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ను అరెస్ట్ చేసిన పోలీసులు జగదాంబ జంక్షన్లో వైఎస్సార్సీపీ ర్యాలీని అడ్డుకున్నారు. విశాఖ నార్త్లో ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకుని బైక్ల తాళాలు తీసుకుని పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావును పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ర్యాలీకి వస్తే కేసులు పెడతామని, బైకులు, కార్లు సీజ్ చేస్తామని భయపెట్టారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలకు నోటీలు ఇచ్చిన పోలీసులు పలుచోట్ల ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రికత్త నెలకొంది. చినమేరంగిలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఐలాండ్ సెంటర్లో వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన టెంట్ను పోలీసులు దౌర్జన్యంగా పీకేశారు. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అవనిగడ్డలో ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నెల్లూరు సిటీ నియోజకవర్గం ట్రంక్ రోడ్డులో వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీలో భారీగా పాల్గొన్న శ్రేణులు బెదిరింపులను ఖాతరు చేయని ప్రజలు కర్నూలులో మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఎస్వీ విజయ మనోహరిని పోలీసులు అడ్డుకోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ శ్రేణులు నినాదాలు చేశారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భరత్ ఇంటి గేటు వద్దే బైఠాయించి నిరసన చేపట్టారు. రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటి వద్ద పోలీసులు మోహరించడంతో ఆయన ఇంటి వద్దే ధర్నాకు దిగారు. నెల్లూరు జిల్లా మనుబోలులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, కాకాణి పూజిత ఆధ్వర్యంలో సాగిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. కాకినాడలో కురసాల కన్నబాబును అడ్డుకునేందుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీస్ ఆంక్షలను సైతం లెక్క చేయకుండా ఏడు కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ నిర్వహించారు.సాగు అవసరాల కోసం వెళితే పోలీస్స్టేషన్లో పెట్టారు‘మేమంతా సాగు అవసరాల కోసం టెక్కలి వచ్చాం. అయితే మీరంతా ధర్నాకు వెళ్తున్నారని పోలీసులు పోలీస్స్టేషన్కు తీసుకువచ్చారు’ అని శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం అన్నాపురం రైతులు వాపోయారు. వీరు యూరియా, ఇతర సాగు అవసరాల కోసం ఆటోలో టెక్కలి వస్తుండగా పోలీసులు ఆపేసి స్టేషన్కు తీసుకెళ్లారు. భూమి పత్రాలు చూపించినా వదల్లేదు. ఆటోతో సహా స్టేషన్కు తీసుకెళ్లారు. గంటల తరబడి స్టేషన్లోనే ఉంచారు.మెరిట్ సాధించినా అన్యాయమేనేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ అభ్యర్థిని. రేయింబవళ్లు కష్టపడి చదివి పరీక్ష రాయడంతో మొదటి మెరిట్ లిస్ట్లో చోటు సంపాదించా. జిల్లా స్థాయిలో 139వ ర్యాంకు సాధించాను. ఉద్యోగం గ్యారెంటీ అనుకున్న తరుణంలో నా పేరు ఫైనల్ లిస్ట్లో లేదు. ప్రస్తుతం ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పని చేస్తున్నాను. తక్కువ జీతంతో కుటుంబాన్ని నెట్టుకు రావడం కష్టంగా ఉంది. మానసిక ఆందోళనతో రోజూ ఇబ్బంది పడుతున్నా. నా ప్రతిభకు న్యాయం జరగాలని కోర్టుకు వెళ్దామంటే కనీసం లాయర్ ఫీజులు భరించే ఆర్థిక స్థోమత కూడా నాకు లేదు. మెరిట్ సాధించినా మా లాంటి పేద అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను.– జుత్తుగ శ్రీనివాస్, ఉండ్రాజవరం, నిడదవోలు నియోజకవర్గం, తూర్పుగోదావరి జిల్లాఫేక్ సర్టిఫికెట్లకే పెద్దపీట కఠోర శ్రమతో డీఎస్సీ పరీక్షకు చదివి స్కూల్ అసిస్టెంట్ (సోషల్)గా జిల్లా స్థాయిలో 130వ ర్యాంకు సాధించాను. ప్రభుత్వం కేటాయించిన ఈడబ్ల్యూఎస్ కోటాలో నేను ఉద్యోగానికి అర్హుడిగా నిలిచాను. అయితే నాకంటే తక్కువ అర్హత ఉండి, అక్రమ మార్గంలో ఫేక్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందిన ఒక అభ్యర్థికి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగం కట్టబెట్టారు. ఈ అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించగా, నా వాదనల్లోని నిజాయతీని గుర్తించి ఉద్యోగం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు ఇచ్చి ఇన్ని రోజులవుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం ఆ ఆదేశాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటంతో నాలాంటి డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది.– కరుటూరి వెంకట సతీష్, కాల్దారి, ఉండ్రాజవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా -
న్యాయమూర్తిపై నిరాధార ఆరోపణలా..?
సాక్షి, అమరావతి: న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్పై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి దాఖలు చేసిన అప్పీల్లో ఉపయోగించిన అభ్యంతరకర పదజాలంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తిపై తీవ్ర వ్యాఖ్యలు, నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేసింది. ఆరోపణలు చేయడం మాత్రమే కాదని.. వాటిని ఆధారాలతో నిరూపించాల్సిన బాధ్యత కూడా ఉందని తేల్చి చెప్పింది. దీంతో ప్రణతి తరఫు న్యాయవాది క్షమాపణ చెప్పడంతో పాటు, ఆ వ్యాఖ్యలను అప్పీల్ నుంచి తొలగిస్తామని కోర్టుకు విన్నవించారు.కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కోట్ల రూపాయల భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్ని, కోర్టునే తప్పుదోవ పట్టించిన వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశిస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి అప్పీల్ దాఖలు చేశారు. ఆ అప్పీల్లో సింగిల్ జడ్జిపై అభ్యంతరకరమైన భాష ఉపయోగించారు. ప్రణతి తన అప్పీల్లో సింగిల్ జడ్జిని ఉద్దేశించి ఉపయోగించిన... ‘అక్రమం, బుర్ర ఉపయోగించకపోవడం, పక్షపాతం, అసందర్భం, అనుచితం, మందబుద్ది, దురుద్దేశాలు’ వంటి పదాలను ధర్మాసనం చదివి వినిపించింది.పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రణతి తరఫు సీనియర్ న్యాయవాది బండారుపల్లి ఆదినారాయణ రావు కోర్టును క్షమాపణ కోరారు. అప్పీల్ నుంచి వాటిని తొలగిస్తామని చెప్పారు. అలా అయితే సింగిల్ జడ్జిని ఉద్దేశించి ఉపయోగించిన అభ్యంతకర పదజాలాన్ని తొలగిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రణతిని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.అటు భార్య.. భర్త.. ఇటు ఏసీబీ విచారణ...కాకినాడలో జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం ప్రజా ప్రయోజనాల నిమిత్తం కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్కు కొంత భూమిని బహుమానంగా ఇచ్చింది. ఈ భూమి విషయంలో కొందరు ప్రైవేటు వ్యక్తుల హక్కులు కోరుతూ హైకోర్టుకొచ్చారు. దీనిపై స్పందించిన కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్, ప్రైవేటు వ్యక్తుల హక్కులు కోరుతున్న భూమి తమదేనని, దానిని రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ మాట మార్చింది. ఆ భూముల విషయంలో తాము జోక్యం చేసుకోబోమంటూ హైకోర్టు ముందు కౌంటర్ దాఖలు చేశారు. అలాగే జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం న్యాయవాది కూడా ఆశ్చర్యకరంగా ఆ భూమిపై తాము జోక్యం చేసుకోమని కోర్టుకు వివరించారు. అయితే దీనిని జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం తోసిపుచ్చింది. ఆ భూముల విషయంలో జోక్యం చేసుకోబోమంటూ కోర్టుకు చెప్పాలని తాము ఎన్నడూ తమ న్యాయవాదికి చెప్పలేదని తెలిపింది. వీటన్నింటితో పాటు ఈ కేసులో గతంలో ప్రైవేటు వ్యక్తుల తరఫున హాజరైన ప్రణతి ఇప్పుడు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా ప్రభుత్వం తరఫున హాజరు కావడం, అలాగే ఆ ప్రైవేటు వ్యక్తుల తరఫున ప్రస్తుతం ప్రణతి భర్త రాహుల్ చౌదరి హాజరుకావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిన జస్టిస్ హరినాథ్, పలు అను మానాలు వ్యక్తం చేశారు. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఏసీబీ విచారణకు ఆదేశిస్తూ గత నెల 28న ఉత్తర్వులిచ్చారు.ఏసీబీ విచారణపై ధర్మాసనం ముందు ప్రణతి అప్పీల్...ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎస్జీపీ సింగమనేని ప్రణతి గురువారం ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి తన తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయాల వల్ల తన కెరీర్ తీవ్ర ప్రభావితమవుతుందని, అందువల్ల వాటిని తొలగిస్తూ ఆదేశాలు ఇవ్వాలని ప్రణతి తన అప్పీల్లో ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ అప్పీల్పై గత నెల 31న విచారణ జరిపిన సీజే ధర్మాసనం, ప్రణతిపై సింగిల్ జడ్జి వ్యక్తం చేసిన ప్రతికూల అభిప్రా యాలను, అలాగే ఆమెపై ఏసీబీ విచారణను తదుపరి విచారణ వరకు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.ప్రణతి సింగిల్ జడ్జిపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు...తాజాగా సోమవారం ప్రణతి దాఖలు చేసిన అప్పీల్ మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం తరఫు న్యాయవాది చల్లా వెంకట్ స్పందిస్తూ, ప్రణతి తన అప్పీల్లో సింగిల్ జడ్జిపై వ్యక్తిగత ఆరోపణలు చేశారని ధర్మా సనం దృష్టికి తీసుకొచ్చారు. ఏ ఏ పేరాల్లో వ్యక్తిగత ఆరోపణలున్నాయో చెప్పారు. దీంతో ధర్మాసనం ఆ పేరాలను పరిశీలించింది. అనంతరం వాటిని చదివి వినిపించింది. సింగిల్ జడ్జిను ఉద్దేశించి అప్పీల్లో ఉపయోగించిన పదజాలాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వాటిని అప్పీల్ నుంచి తొలగిస్తామని ప్రణతి తరఫు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు చెప్పడంతో, ఆ మేర అఫిడవిట్ను తమ ముందుంచాలని ధర్మాసనం ఆదేశించింది. -
ఇది రాజకీయశక్తుల కుట్ర!
సాక్షి, అమరావతి: భారతీ సిమెంట్స్ సంక్షోభం వెనుక రాజకీయ శక్తులున్నాయని ఆ కంపెనీ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. భారతీ సిమెంట్స్ ఉత్పత్తిని ఎలాగైనా ఆపేయాలన్న ఉద్దేశంతో కొన్ని రాజకీయ శక్తులు వెనకుండి తొలగింపునకు గురైన కార్మికులను ఉసిగొల్పుతున్నాయని ఆయన వివరించారు. సిమెంట్ ఫ్యాకర్టీని నమ్ముకుని 1,300 కుటుంబాలు బతుకుతున్నాయని, ఓ 10 మంది తీరు వల్ల వారంతా కూడా రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆయన తెలిపారు. రాజకీయ శక్తుల కుతంత్రాలతో గత ఐదు రోజులుగా లైమ్స్టోన్ తవ్వకాలు, సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయాయన్నారు.తద్వారా కంపెనీకి రోజుకు రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని ఆయన హైకోర్టుకు చెప్పారు. లైమ్స్టోన్ తవ్వకాల వాహనాలు ఫ్యాక్టరీలోకి వచ్చే పరిస్థితులు లేవని, లోపలికి వెళ్లే గేటు ముందు టెంట్ వేసి కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతున్నారని తెలిపారు. పోలీసుల కళ్ల ఎదుటే అంతా జరుగుతున్నా వారే మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. భారతీ సిమెంట్స్ చట్టబద్ధంగా వ్యాపారం చేస్తోందని, అన్ని అనుమతులు పొంది, అన్ని రకాలు పన్నులు చెల్లిస్తోందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చట్టబద్ధంగా నడుస్తున్న కంపెనీకి భద్రత కల్పించాల్సిన పోలీసులు రాజకీయ శక్తులకు కొమ్ముకాస్తూ చోద్యం చూస్తున్నారని మోహన్రెడ్డి వివరించారు. అందరి వాదనలు విన్న హైకోర్టు తగిన నిర్ణయం వెలువరిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు తమ విధి నిర్వహణలో విఫలయ్యారు..భారతి సిమెంట్ కంపెనీ వైఎస్ఆర్ కడప జిల్లా నల్లలింగాయపల్లె వద్ద ఉన్న తమ ప్లాంట్ కార్యకలాపాలతో పాటు మైనింగ్ కార్యకలాపాలను సైతం అడ్డుకుంటున్న మూకలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) అ«దీకృత ప్రతినిధి, డైరెక్టర్ జి.బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ మహేశ్వరరావు మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా భారతీ సిమెంట్స్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి వాదనలు వినిపించారు.రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ న్యాయస్థానాల బాధ్యతన్నారు. ఇదే సమయంలో శాంతి భద్రతల బాధ్యత పోలీసులపై ఉందని తెలిపారు. అయితే పోలీసులు తమ విధులను నిర్వర్తించడంలో దారుణంగా విఫలయ్యారని చెప్పారు. చర్యలు తీసుకోవాల్సిన కలెక్టర్ సైతం మౌనంగా ఉన్నారన్నారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలో 350 కుటుంబాలు తాము నిర్మీంచిన క్వార్టర్స్లో ఉంటున్నాయన్నారు. వారందరికీ కూడా రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతోందని చెప్పారు. ముడిసరుకు లైమ్స్టోన్ లోపలికి వెళితే, సిమెంట్ బయటకు వస్తుందని, ఇప్పుడు అలా జరగడం లేదన్నారు. ప్లాంట్ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. 10మంది ఆందోళన చేస్తున్నారు... అనంతరం పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది అడుసుమిల్లి జయంతి వాదనలు వినిపిస్తూ, ఫ్యాక్టరీలోకి వాహనాలు వెళుతున్నాయన్నారు. తొలగింపుకు గురైన 10 మంది ఆందోళన చేస్తున్నారని తెలిపారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. అన్నీ సక్రమంగా ఉంటే మేమెందుకు కోర్టుకొస్తాం.. ఈ సమయంలో సీవీ మోహన్రెడ్డి జోక్యం చేసుకుంటూ, అన్నీ సక్రమంగా ఉంటే తామెందుకు కోర్టుకు వస్తామని ప్రశ్నించారు. సక్రమంగా ఉంటే వ్యయప్రయాసల కోర్చి ఈ వ్యాజ్యాన్ని ఎందుకు దాఖలు చేస్తామని, కోర్టును ఎందుకు ఇబ్బంది పెడుతామన్నారు. తొలగింపునకు గురైన కార్మీకుల తరఫున సీనియర్ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ వ్యాజ్యంలో తాము ప్రతివాదులుగా చేరతామని, అందుకు అనుమతించాలని కోరారు. సాధారణ ఉద్యోగికి వీరారెడ్డిని పెట్టుకునేంత స్థోమత ఉంటుందా? ఇందుకు సీవీ మోహన్రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాము తమ వ్యాజ్యంలో వారికి వ్యతిరేకంగా ఎలాంటి అదేశాలు కోరడం లేదన్నారు. ఓ కాంట్రాక్ట్ ఉద్యోగికి అమరావతి వరకు వచ్చి వీరారెడ్డి వంటి సీనియర్ న్యాయవాదిని పెట్టుకునే స్థోమత ఉందంటే వారి వెనుక ఎవరో ఉన్నారన్న విషయం ఇట్టే అర్థమవుతోందన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ తీర్పును రిజర్వ్ చేశారు -
ఆలనాపాలన... రోడ్డుపాలు చేయొద్దు!
డాక్టర్ కావాల్సిన ప్రియాంక నూరేళ్ల జీవితం క్షణాల్లో కడతేరిపోయింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ ఘటన అందరి మనసునూ కలచివేసింది. పిల్లలకు కార్లిచ్చి పంపుతున్న తల్లిదండ్రులు ఆ పిల్లల ధోరణి గమనిస్తున్నారా?రేస్ ఉన్మాది – స్పీడ్ కోసం ప్రాణాలు తీసేవాడుఈగో ఉన్మాది – ‘దారి ఇవ్వలేదు’ అని గుద్దేవాడుమత్తు ఉన్మాది – తాగి స్టీరింగ్ పట్టేవాడుడాడీ పవర్ ఉన్మాది – ‘నాన్న చూసుకుంటాడు’ అని నడిపేవాడు. ఇంట్లో ‘బంగారు తండ్రి’ అని పిలుచుకునే కొడుకు రేపు ఈ నలుగురిలో ఒకడు కాకుండా చూసుకుంటున్నామా?ఆగస్టు 3, 2026 రాత్రి 10:00 గంటలు. రాజమండ్రిలోని ఒక మాల్లో సినిమా చూసి బయటకు వచ్చిన ప్రియాంక (28) తన స్కూటీ తీసి ఫ్రెండ్తో కలిసి ఇంటికి బయలుదేరింది. బహుశా ఆమె సినిమా కబుర్లలో మునిగి ఉంటుంది. హాస్టల్ నుంచి ఫోన్ వస్తే ‘ఇంకో పావుగంటలో చేరుకుంటున్నాం’ అని కూడా చెప్పి ఉంటుంది. కాని ప్రియాంక జీవితం సడన్గా విషాదంలో కూరుకుపోయింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ వాహనంతో ప్రియాంక స్కూటీని ఢీకొట్టడమే కాదు, ప్రియాంక తలపై నుంచి కారును పోనిచ్చి పరారయ్యారు.ఆ క్షణమే కోమాలోకి వెళ్లిన ప్రియాంక ఆగస్టు 9న మృతి చెందింది. ఆ అమ్మాయి చేసిన నేరం ఏమిటి? ఏ కొద్ది మందికో దక్కే ఎంబీబీఎస్ కోర్సు చదివి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్లో ఉన్న అమ్మాయి క్షణంలో ఉన్మాద చర్యకు ప్రాణం కోల్పోవడం ఏమిటి? ఆమె మృతికి ఇద్దరు వ్యక్తులే కారణంగా పైకి కనిపించవచ్చు. కాని వారి ‘మైండ్సెట్’ను అలా తయారు చేసిన వ్యవస్థ, పెంపకం, వ్యసనం, లెక్కలేనితనం... ఇవన్నీ కారణాలే. ఇవి సరికానంత వరకూ ఇలాంటి ఉత్పాతాలు జరగవని గ్యారంటీ ఇవ్వలేము. రోడ్డు మీద క్షేమంగా తిరగలేము.నాలుగు రకాల ఉన్మాదాలురోడ్ల మీద తిరిగే వాహనాల బ్రాండ్ కంటే వాటిని నడుపుతున్న మనుషుల మనస్తత్వాలు ముఖ్యం. నేటి రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే వాటికి కారణమైన వారిలో నాలుగు రకాల ఉన్మాదులు కనిపిస్తున్నారు.రేస్ ఉన్మాది: కేవలం స్పీడ్ కోసం, రోడ్డుపై థ్రిల్ కోసం పక్కవారి ప్రాణాలు తీసేవాడు. ‘మావాడు బైక్ స్పీడ్గా నడుపుతాడు’ అని తల్లిదండ్రులే గొప్పగా చెప్పి ఇలా తయారు చేస్తున్నారు. ‘ఫాస్ట్గా నడిపే వాడే గొప్ప’ అని కుర్రాడి బుర్రలో ఉంటే ఎవరిది దోషం?ఈగో ఉన్మాది: ‘నాకు దారి ఇవ్వలేదు’ అని, అహం దెబ్బతిన్నదని కావాలనే వెనుక నుంచి గుద్దేసేవాడు. ‘వాడికి ఎవరూ ఎదురు చెప్పడానికి వీల్లేదు’ అని తల్లిదండ్రులే చిన్నప్పటి నుంచి అహాన్ని సాకుతారు.మత్తు ఉన్మాది: ఒంట్లో ఎంత మద్యం ఉందో తెలియకుండానే స్టీరింగ్ పట్టి, రోడ్డుపై నడిచే ప్రతి ఒక్కరినీ టార్గెట్గా మార్చేవాడు. స్నేహితులు ఎలాంటివారో తల్లిదండ్రులు చూడకపోవడం, రాత్రి ఒంటి గంటకు కూడా రాకపోతే పార్టీకి వెళ్లాడు అని సరిపెట్టుకోవడం... దాని ఫలితం ఇది.డాడీ పవర్ ఉన్మాది: ‘నా వెనుక నాన్న ఉన్నాడు, ఏ తప్పు చేసినా చూసుకుంటాడు’ అనే నమ్మకంతో బరితెగించి వాహనం నడిపేవాడు. కొడుక్కు పద్దెనిమిదేళ్లు రాకముందే తండ్రి కారు కీ చేతికి ఇవ్వడం, పోలీసు ఆపితే నా పేరు చెప్పు అని తండ్రి అనడం... ఇంకేముంది?రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకను బలితీసుకున్నది ఈ ఉన్మాదాల కలయికే. ఈ విపరీత ధోరణులు రాత్రికి రాత్రి పుట్టవు. చిన్నప్పటి నుంచి తయారై ఉంటాయి. 20 సెకన్లలో జరిగిన ప్రియాంక మృత్యుఘటన వెనుక ‘20 ఏళ్ల బాధ్యతారాహిత్యపు పెంపకం’ కారణమై ఉండొచ్చు. రాత్రి పది తర్వాత కొడుకు బయట ఉంటే కారో, బైకో వేసుకుని తిరుగుతుంటే ‘ఎక్కడ ఉన్నావు?’ అని అడగ్గలిగే స్థితిలో తల్లిదండ్రులు లేకపోయినా, ‘చెప్పాల్సిన పని లేదనే’ ధోరణిలో పుత్రరత్నాలు ఉన్నా అది సమాజానికి అపాయకరం. మరవకూడని పాఠంఈ రోజు డాక్టర్ ప్రియాంక మన మధ్య లేదు. కానీ ఆమె మరణం నేర్పిన పాఠం చాలా పెద్దది. తల్లిదండ్రులారా.. మీ కొడుకులకు ఎదుటివారికి గౌరవం ఇవ్వడం, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం నేర్పండి. రోడ్డు మీద కారు స్టీరింగ్ చేతిలో ఉందనో, వెనుక అండ ఉందనో అహంకారంతో ప్రవర్తిస్తే చట్టం ముందు, సమాజం ముందు దోషులుగా నిలబడక తప్పదని హెచ్చరించండి. కొడుకులను బాధ్యతగల పౌరులుగా పెంచినప్పుడే మన ఇళ్లలో, సమాజంలో నిజమైన భద్రత ఉంటుంది. బతుకును మింగే ‘బెల్టు’కంటి రెప్ప కునుకేస్తేనే స్టీరింగ్ ఎటో పోతుంది. మరి మత్తు తలకెక్కితే? అడుగుకొక బెల్టు షాపు రారమ్మని పిలుస్తుంటే దారిన పోయేవాడు ఆగి కాసింత పోసుకొని బయల్దేరుదాం అనుకుంటాడు. ఆ తర్వాత ప్రాణాల మీదకు తెస్తాడు. వ్యవస్థ ఇలా ఉంటే దానిని ఆపాల్సిన బాధ్యత పాలనది, పౌర సమాజానిది. అధిక అందుబాటు, వేళాపాళా లేకుండా సాగే అమ్మకాలు సహించరానివి. దీనికి కారకులెవరు... నిజంగా మత్తులో తేలుతున్నది ఎవరు అనేది కూడా తేలాలి.ఏం చేయాలి?→ లైసెన్స్ తీసుకోకుండా, 21 ఏళ్లు రాకుండా కారు ఇవ్వకండి. ఇచ్చే ముందు ‘నువ్వు తప్పు చేస్తే నేను కేసు నుంచి తప్పించను’ అని గట్టిగా చెప్పండి → ప్రతి రాత్రి 9 గంటలకల్లా కొడుకు ఇంటికి వచ్చాడా? కారు ఎక్కడుంది? పార్టీలో ఉన్నాడా... ఫోన్ చేసి చెక్ చేయండి. ఇది అనుమానం కాదు. బాధ్యత → ‘సారీ’ చెప్పడం నేర్పండి. రోడ్డుపై ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే దిగి క్షమాపణ చెప్పే అలవాటు చేయండి. ఈగో కంటే మనిషితనం గొప్పదని చూపించండి → సినిమా, రీల్స్ గురించి మాట్లాడండి. ‘రేసింగ్ సీన్లు సినిమాకే బాగుంటాయి... నిజ జీవితంలో చాలా ప్రాణాంతకం’ అని కూర్చుని చెప్పండి. హీరోయిజం అంటే స్పీడ్ కాదు.... బాధ్యత అని చెప్పండి.→ శిక్ష నుంచి తప్పించకండి. చిన్న స్క్రాచ్ అయినా, చిన్న ఫైన్ అయినా అబ్బాయినే కట్టనివ్వండి. ‘నాన్న ఉన్నాడు’ అనే నెట్ తీసేయండి. భయం ఉంటేనే బుద్ధి వస్తుంది. -
సింగర్ రాహుల్ సిప్లిగంజ్పై కేసు నమోదు!
సాక్షి,విశాఖ: ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్పై విశాఖపట్నంలో కేసు నమోదైంది. తనపై బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖలోని ఎంవీపీ కాలనీ పోలీసులు రాహుల్ సిప్లిగంజ్తో పాటు మరో 11 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సదరు యువతి తన ఫిర్యాదులో రాహుల్పై పలు తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు సమాచారం. యువతి సమర్పించిన వివరాలు, ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రస్తుతం కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
జానకి రెడ్డి మృతి పట్ల వైఎస్ జగన్ తీవ్ర సంతాపం
సాక్షి,తాడేపల్లి: ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకి రెడ్డి మృతి పట్ల పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.జానకి రెడ్డి హఠాన్మరణం చెందడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆమె కుమార్తె అజితా రెడ్డితో వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. ఈ కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని ఆమెను ఓదార్చారు. జానకి రెడ్డి మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి ఆమె అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. వైఎస్సార్సీపీ కుటుంబం ఎల్లప్పుడూ జానకి రెడ్డి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీల సక్సెస్పై వైఎస్ జగన్ హర్షం
తాడేపల్లి : డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన ర్యాలీలు విజయవంతం కావడంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగుల మద్దతుతో ర్యాలీలు సక్సెస్ అయ్యాయని, అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని ప్రశంసించారు. ఇంత జరుగుతున్నా నోరు మెదపని చంద్రబాబు సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్వీట్ చేశారు వైఎస్ జగన్.‘విద్యార్థులు, యువకులు కోసం, వారి భవిష్యత్తుకోసం గడచిన 2 నెలలుగా అన్నివర్గాల మద్దతుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన పోరాటాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. చంద్రబాబూ.. మీరు అధికార దుర్వినియోగం చేస్తూ, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘిస్తూ, పోలీసు బలంతో అణచివేయాలని చూసినా నిర్బంధాలు, బెదిరింపులను లెక్క చేయకుండా, నోటీసులను ఖాతరు చేయకుండా, నియంతృత్వానికి ఎదురొడ్డి, ప్రజలతో కలిసి, లక్షలాది సంఖ్యలో బయటకు వచ్చి గట్టిగా పోరాటం చేశారు.నిర్బంధాలన్నింటినీ ఎదుర్కొంటూ, ప్రతి అడ్డంకినీ అధిగమిస్తూ శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అందుకే ఈ 74 రోజుల్లో గవర్నర్ను కలవడం దగ్గరనుంచి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిర్వహించిన 10 కార్యక్రమాలు అశేష ప్రజానీకం మద్దతుతో అత్యంత విజయవంతగా జరిగాయి’ అని పేర్కొన్నారు.డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ ఏ తేదీల్లో ఏం నిరసన కార్యక్రమ జాబితాను కూడా వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. మే 29, 2026 - రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి విభాగం నిరసనలుజూన్ 1, 2026 - జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలు, వినతిపత్రాలుజూన్ 8-9, 2026 - నియోజకవర్గ స్థాయి టౌన్ హాల్ సమావేశాలు.జూన్ 12, 2026 - 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలుజూన్ 18, 2026 - రాష్ట్ర గవర్నర్ను కలిసి డీఎస్సీపై విచారణ కోరుతూ వినతిపత్రంజులై 28, 2026 - రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువజనుల నిరసన ర్యాలీలుజులై 31, 2026 - జిల్లా కలెక్టర్లు/జాయింట్ కలెక్టర్లకు వినతిపత్రాలుఆగస్టు 3-4, 2026 - రాష్ట్రవ్యాప్తంగా రౌండ్టేబుల్, టౌన్హాల్ సమావేశాలుఆగస్టు 6-8, 2026 - నియోజకవర్గాల స్థాయిలో రిలే నిరాహార దీక్షలుఆగస్టు 10, 2026 - రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలుఇన్ని కార్యక్రమాల ద్వారా లక్షల మంది ప్రశ్నించినా చంద్రబాబు మీరు నోరుమెదపడంలేదు. డీఎస్సీ లీకేజీ, అక్రమాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ ( విద్యాదీవెన), వసతిదీవెన కింద దాదాపుగా రూ.9వేల కోట్లు బకాయిలు, పైగా ఎన్నికల సమయంలో బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టోలో పెట్టి, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరిట నిరుద్యోగ భృతికింద నెలా నెలా రూ.3వేల చొప్పున ఇస్తానన్న సొమ్ము చూస్తే ఈమూడేళ్లకు రూ.36,000X3సంవత్సరాలు = రూ.1,08,000లు చొప్పున ప్రతి నిరుద్యోగికీ పడ్డ బాకీ సహా ఏ డిమాండ్పైనా ఇప్పటివరకూ నోరు తెరవలేదు.మీ కుమారుడు లోకేష్కూడా ప్రజలు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలేదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. విద్యార్థులు, నిరుద్యోగులు, లక్షలాది కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రిగా మీరు, సంబంధిత మంత్రి అయిన మీ కుమారుడు నోరువిప్పకపోవడం దౌర్భాగ్యకరంగా ఉంది. సమాధానాలు చెప్పకుండా ప్రశ్నించే గొంతులను పోలీసులతో అణచివేయడం పరిష్కారం కాదు చంద్రబాబూ ఇది మీ తప్పులను మీ అధికార జులంతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడమే. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజల డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి.’ అని పేర్కొన్నారు.ఆ డిమాండ్ల జాబితా ఇదే..1.డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై సీబీఐ విచారణ2.దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా3.రూ.9వేల కోట్ల బకాయి పడ్డ ఫీజురీయింబర్స్మెంట్, వసతి దీవెనల చెల్లింపు4.ఇంటింటికీ బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి, బకాయిలతో కలిపి, ఈ మూడేళ్లకాలానికి చెల్లించాలి.ఇంత స్పష్టంగా డిమాండ్లు ఉన్నా, డైవర్ట్ చేస్తూ మీరు తప్పించుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం?, చంద్రబాబూ.. ప్రజలు అడుగుతున్న ఈ డిమాండ్లకు అంగీకరిస్తారా?, లేక కొడుకును కాపాడుకోవడం కోసం చరిత్ర హీనులుగా మిగిలిపోతారా?, ఉద్యోగం కోసం సంవత్సరాలుగా చదివిన అభ్యర్థులు,. తమ పిల్లల చదువుల కోసం అప్పులు చేసిన కుటుంబాలు, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు వీళ్లంతా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన బాండ్లను చూపిస్తూ నిరుద్యోగ భృతి హామీ కోసం యువత ప్రశ్నిస్తోంది. చంద్రబాబూ.. మీరు స్పందించకపోతే విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు మిమ్మల్ని విడిచిపెట్టరు.Gen-Z ప్రశ్నలకు మీరు తప్పక సమాధానాలు చెప్పాలి. అంతవరకూ ఈ పోరాటాలు ఆగవు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.విద్యార్థులు, యువకులు, నిరుద్యోగుల మద్దతుతో రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ వర్గాల్లో ఇవాళ వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీల్లో లక్షలాదిగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజలు పాల్గొని తప్పుచేసిన ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ, స్ఫూర్తిదాయకంగా నిలిచారు.… pic.twitter.com/7SSXeSc9zO— YS Jagan Mohan Reddy (@ysjagan) August 10, 2026 -
మృతి చెందిన రైతు కుటుంబానికి వైఎస్ జగన్ ఆర్థిక సాయం
ఏలూరు: గుండె పోటుతో మృతిచెందిన పొగాకు రైతు కుటుంబానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్థిక సాయం అందించారు. గత నెలలో బుట్టాయిగూడెం మండలం ముప్పినవారిగూడెంలో పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో మనస్థాపం చెంది గుండెపోటుకు గురై పాల వెంకటేశ్వర్లు అనే రైతు మృతి చెందారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పర్యటనలో మృతి చెందిన రైతు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించి భరోసా ఇచ్చారు. దీనిలో భాగంగా రైతు కుటుంబానికి ఆర్థిక సాయం కింద రూ.2 లక్షల చేక్కును పంపించారు వైఎస్ జగన్. ఈ చెక్కును పోలవరం నియోజవర్గం వైఎస్సార్సీపీ ఇంచార్జ్ తెల్లం బాలరాజు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాధరావుల చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. -
ఎమ్మెల్యే గోవిందరావు కుమారుడి వ్యవహారంలో సంచలన విషయాలు
శ్రీకాకుళం: ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడు సాయి గణేశ్ కారు ప్రమాదం వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏడాది క్రితం ర్యాష్గా కారు నడుపుతూ ఆటోను ఢీకొట్టారు సాయి గణేశ్. ఈ ప్రమాదంలో చేపల భోగయ్య అనే వ్యక్తి మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో సాయి గణేశ్ను తప్పించి మరో వ్యక్తిని డ్రైవర్గా చూపించారు ఎమ్మెల్యే గోవిందరావు. మృతి చెందిన బాధితుడి కుటుంబానికి రూ.5 లక్షలు, ఉద్యోగం, పెన్షన్ ఇస్తానని చెప్పారు. ఏడాది గడిచినా బాధితులకు గోవిందరావు సాయం చేయలేదు. తనకు చెప్ప లాయర్లు తెలుసంటూ బాధితులను బెదిరించారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. బాధితులతో చర్చల సమయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బెదిరింపు వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. -
‘చట్టం ఏమైనా మీ చుట్టమా?’
విజయనగరం: నిరంకుశ పాలన సాగిస్తున్న కూటమి సర్కారును మరోసారి ఉతికి ఆరేశారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు శాంతియుతంగా నిరసన చేపడితే అడ్డుకోవడమే కాకుండా లాఠీచార్జ్ చేస్తారా? అంటూ ధ్వజమెత్తారు. చట్టం ఏమైనా మీ చుట్టం అనుకుంటున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం నుంచి ప్రెస్మీట్ నిర్వహించిన ఆయన.. ‘కొత్త జీవోలో డైరెక్ట్గా ఉద్యోగాలు ఇచ్చే వెసులబాటు ఉందా లేదా అని అడుగుతున్నాం.. ఆటలు రాక పోయినా సర్టిఫికెట్లు ఇచ్చారు. లీకేజీ అయింది. అందులో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ర్యాంక్ వచ్చింది.శాంతియుతంగా నిరసన చేస్తుంటే వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్నారు. నిరసన చేసేందుకు వీలు లేదని పోలీసులు అడ్డుకోవడం ఏంటి?, కొన్ని ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. చట్టం ఏమైనా మీ చుట్టమా?, ఇదేనా కూటమి పరిపాలన. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, ప్రజలకు వాస్తవాలను చెప్పాలి. ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడిచారు. విద్య, వైద్య రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు’ అని మండిపడ్డారు.డీఎస్సీ అక్రమాలపై గత 74 రోజులుగా తాము చేస్తున్న పోరాటాలతో పాటు ఈరోజు(సోమవారం, ఆగస్టు 10వ తేదీ) చేపట్టిన ఏపీ వ్యాప్త ర్యాలీలు విజయవంతమయ్యాయన్నారు డీఎస్సీ అక్రమాలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామాతో పాటు థర్డ్ పార్టీ విచారణ చేయమని డిమాండ్ చేస్తున్నామన్నారు బొత్స. -
AP: రానున్న మూడుగంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు
సాక్షి, అమరావతి: వాతావరణ శాఖ రాష్ట్రానికి వర్ష హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడుగంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని చెట్లకింద, హోర్డింగుల వద్ద నిల్చోవద్దని వాతావరణ శాఖ సూచించింది. -
‘వైఎస్సార్సీపీ ర్యాలీలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన’
తాడేపల్లి: వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాజాగా డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసన ర్యాలీలు విజయవంతం కావడంతో సజ్జల మీడియాతో మాట్లాడారు. తాము అడిగిన దాంట్లో వాస్తవం లేకపోతే ప్రజల నుంచి ఇంత స్పందన ఎలా వస్తుందని ప్రశ్నించారు. ‘వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. డీఎస్సీ అక్రమాలపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. నిరసనలపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా పోరాటాలను అణచివేయాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీ ర్యాలీలు విజయవంతమయ్యాయి. వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. నిరసన కార్యక్రమాలను ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నాం. అందుకే వైఎస్సార్సీపీ పోరాటాను అణగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగింది వాస్తవం కాబట్టే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారు. ఈ స్కాం నుంచి చంద్రబాబు, లోకేష్ తప్పించుకోలేరు. డీఎస్సీ అక్రమాలపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. నిరసనలపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇప్పటివరకూ ఇవ్వలేదు. మేం అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోంది. డీఎస్సీలో అక్రమాలు జరిగినట్లు క్లియర్గా తెలుస్తోంది. ఉన్నతస్థాయిలోనే తప్పు జరిగిందనే విషయం అర్థమవుతోంది. అక్రమాలు జరిగాయి కాబట్టే సీబీఐ విచారణకు భయపడుతున్నారు. లీకేజీ జరిగిందనడానికి తిరుగులేని ఆధారాలున్నాయిఒక తప్పును కవర్ చేయడానికి తప్పుల మీద తప్పులు చేశారు. అక్రమాలు బయటకు రావడంతో సర్టిఫికెట్లు కూడా టాంపర్ చేసి మార్చారు’ అని ధ్వజమెత్తారు సజ్జల. -
శంకరంబాడి సుందరాచారికి వైఎస్ జగన్ నివాళి
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక గీతమైన "మా తెలుగు తల్లికి మల్లెపూదండ" రచించిన మహాకవి శంకరంబాడి సుందరాచారి జయంతి సందర్బంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతంతో తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటిన రచయిత, మహాకవి అంటూ వైఎస్ జగన్ ప్రశంసించారు. తెలుగు సంస్కృతి వైభవాన్ని అక్షరాల్లో అజరామరం చేసిన మహాకవి శంకరబాడి సుందరాచారి అని, తెలుగు నేల గొప్పతనాన్ని, తెలుగు తల్లి కీర్తిని తన కలంతో తరతరాలకు చాటి చెప్పారన్నారు. శంకరంబాడి సుందరాచారి సాహితీ సేవలు చిరస్మరణీయమన్నారు. ``మా తెలుగు తల్లికి మల్లెపూదండ`` గీతంతో తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, సంస్కృతి వైభవాన్ని అక్షరాల్లో అజరామరం చేసిన మహాకవి శంకరంబాడి సుందరాచారి గారు. తెలుగు నేల గొప్పతనాన్ని, తెలుగు తల్లి కీర్తిని తన కలంతో తరతరాలకు చాటిచెప్పిన ఆయన సాహితీ సేవలు చిరస్మరణీయం. శంకరంబాడి సుందరాచారి గారి… pic.twitter.com/zKzBsJneq6— YS Jagan Mohan Reddy (@ysjagan) August 10, 2026 -
తాగాను.. బండి నడిపాను అంటే సరిపోతుందా?
హైదరాబాద్లో ఇవాళ ఒక్కరోజే.. మూడు హిట్ అండ్ రన్ కేసులు నమోదు అయ్యాయి. హైదర్షా కోట్ ఘటనలో ఆర్మీ జవాన్ మృతి చెందగా.. కొండాపూర్ ప్రమాదంలో వనపర్తికి చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. బాలాపూర్ ఘటనలోనూ ఒకరు మృతి చెందారు. ఈ ఘటనల్లో రెండింటిలో.. నిందితులు ఫుల్గా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మెడికో ప్రియాంక కేసు విషాదాంతమైన సంగతి తెలిసిందే. రాజమండ్రిలో జరిగిన ఈ కేసులోనూ నిందితులు మద్యం సేవించిన స్థితిలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఘటనలు దేశం నలుమూలాల రోజు నమోదు అవుతూనే ఉన్నాయి. ఏరకంగా చూసుకున్నా.. మద్యం మత్తులో నిర్లక్ష్యం.. కుటుంబాలకు జీవితాంతం తీరని విషాదాన్నే మిగులుస్తోంది.ప్రియాంక.. పక్కన యాక్సిడెంట్ దృశ్యంప్రపంచంలోని అనేక దేశాలు మద్యం తాగి వాహనం నడపడాన్ని సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘనగా చూడవు. అది ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే తీవ్రమైన నేరంగా పరిగణిస్తాయి. ముఖ్యంగా ప్రమాదం జరిగి మరణాలు సంభవిస్తే శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి.అమెరికాలో మద్యం సేవించి వాహనం నడపడం (DUI/DWI) తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. రాష్ట్రాన్ని బట్టి చట్టాలు మారినా.. జరిమానాలు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, జైలు శిక్ష వంటి చర్యలు ఉంటాయి. ప్రమాదంలో మరణం జరిగితే కేసు తీవ్రత మరింత పెరుగుతుంది.బ్రిటన్లోనూ డ్రంక్ డ్రైవింగ్పై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. మద్యం మత్తులో డ్రైవ్ చేస్తూ మరణానికి కారణమైతే దీన్ని అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించి దీర్ఘకాల జైలు శిక్షలు విధించే అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ నిషేధం, భారీ జరిమానాలు కూడా ఉంటాయి.ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్ వంటి దేశాల్లోనూ మద్యం సేవించి డ్రైవింగ్పై కఠిన చర్యలు తీసుకుంటారు. సింగపూర్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు భారీ జరిమానాలు, జైలు శిక్షలు విధించే విధానం ఉంది. కొన్ని సందర్భాల్లో వాహనం స్వాధీనం చేసుకునే చర్యలు కూడా ఉంటాయి.లెక్కలు చెబుతున్న భయానక నిజంమద్యం మత్తులో స్టీరింగ్ పట్టడం.. కేవలం ట్రాఫిక్ తప్పిదం కాదు ప్రాణాలను బలిగొనే ప్రమాదకర నిర్ణయం. భారత్లో 2022లో డ్రంక్ డ్రైవింగ్తో 4,201 మరణాలు.. 2023లో 9,143 కేసులు.. 2024లో 8,270 ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ సంఖ్య ఈ మధ్యకాలంలో పెరుగుతూ పోతోంది. ఇవే కాకుండా.. ఇతరుల ప్రాణాలు తీయడమే కాకుండా, తాగి తమ ప్రాణాలు తీసుకుంటున్నవాళ్ల లెక్కలు ఇంకా బోలెడు ఉన్నాయి.భారత్లో చట్టాలు ఉన్నా.. భారత్లోనూ డ్రంక్ డ్రైవింగ్పై చట్టాలు ఉన్నాయి. మోటార్ వాహనాల చట్టం ప్రకారం మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు శిక్షకు అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగి మరణం సంభవిస్తే భారత న్యాయ సంహిత (BNS) కింద నిర్లక్ష్యపు చర్యలకు సంబంధించి మరింత తీవ్రమైన కేసులు నమోదు చేయవచ్చు. అయితే సమస్య చట్టాల కొరతలో కాదు.. వాటి అమలులో ఉందనే విమర్శలు ఉన్నాయి. తనిఖీలు జరుగుతున్నప్పటికీ.. కొందరు మద్యం మత్తులో వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు.శిక్ష భయం ఎందుకు రావడం లేదు?డ్రంక్ డ్రైవింగ్ అనేది కేవలం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనగా చూడలేం. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు పోవచ్చు.. ఎన్నో కుటుంబాలు జీవితాంతం తీరని విషాదాన్ని మిగులుస్తాయి. అయినప్పటికీ కొందరిలో ఈ నేరం పట్ల సరైన భయం కనిపించడం లేదు.ఇతర దేశాల్లో డ్రంక్ డ్రైవింగ్పై చట్టాల అమలు అత్యంత కఠినంగా ఉంటుంది. తప్పు చేసిన వెంటనే చర్యలు తీసుకోవడం, లైసెన్స్ రద్దు, భారీ జరిమానాలు, జైలు శిక్షలు వంటి పరిణామాలు ఉంటాయనే భయం వాహనదారుల్లో ఉంటుంది. ప్రమాదంలో మరణం సంభవిస్తే కేసును మరింత తీవ్రంగా పరిగణిస్తూ కఠిన శిక్షలు విధిస్తారు.హైదర్షా కోట్ హిట్ అండ్ రన్ దృశ్యం ఇదిభారత్లోనూ చట్టాలు ఉన్నప్పటికీ.. వాటి అమలు, శిక్షలు పడే వేగమే ప్రధాన సవాల్గా మారుతోంది. కేసులు దర్యాప్తు, న్యాయ ప్రక్రియలో ఎక్కువ కాలం కొనసాగడం.. శిక్షలు ఆలస్యంగా పడటం వల్ల కొందరిలో నేరం పట్ల భయం తగ్గుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.కఠిన చట్టాలతో పాటు.. వాటిని వేగంగా, సమర్థంగా అమలు చేయడం కూడా అంతే కీలకం. ఎందుకంటే మద్యం మత్తులో స్టీరింగ్ పట్టే ప్రతి వ్యక్తి తన ప్రాణాన్నే కాదు.. రోడ్డుపై ఉన్న ఎంతోమంది జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నాడు. శిక్ష భయం పెరిగినప్పుడే ఇలాంటి నిర్లక్ష్యాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది.మారాల్సింది మనస్తత్వం కూడా..ప్రపంచ దేశాలు చెబుతున్న పాఠం ఒక్కటే.. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం సరదా కాదు, అది ప్రాణాలతో చెలగాటం. కఠిన చట్టాలతో పాటు.. వాటి అమలు, ప్రజల్లో బాధ్యతాయుతమైన ప్రవర్తన పెరగాల్సిన అవసరం ఉంది. హిట్ అండ్ రన్ ఘటనలు పెరుగుతున్న వేళ.. ‘‘తాగాను.. డ్రైవ్ చేస్తాను’’ అనే నిర్లక్ష్య ఆలోచనకు అడ్డుకట్ట పడాల్సిన సమయం వచ్చింది. -
నేను చనిపోయినా మెదడు బతికుంటుందిగా.. ఆ 7 నిమిషాలు నీ గురించే..
ఆంధ్రప్రదేశ్: ‘చనిపోయిన ఏడు నిమిషాల తర్వాత వరకు మెదడు బతికే ఉంటుందట కదా..? అప్పుడు కూడా నేను నీ గురించే ఆలోచిస్తా..!’ అంటూ ఇన్స్ట్రాగామ్లో పోస్టుపెట్టి ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని తనువు చాలించిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తాను మరణించబోతున్నానని.. మరణించిన తర్వాత ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారు.. అంటూ ఐదు రకాల స్టేటస్లు పెట్టి మృతి చెందాడు. ఇది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.స్థానికుల వివరాల మేరకు.. గంగాధరనెల్లూరు మండలం, బంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పాకాలాయన, రాధిక కూమారుడు జనార్దన్రెడ్డి (24) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే తల్లిదండ్రులు మృతి చెందగా తనని పట్టించుకునే వారు లేక మద్యానికి బానిసమయ్యాడు. ఆదివారం ఉదయం గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరి వేసుకుని విగత జీవవై వేలాడుతూ కనిపించాడు. మృతుని బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.చర్చనీయాంశంగా మారిన చివరి స్టేటస్..జనార్దన్ మరణించే 24 గంటల ముందు తన ఇన్స్ట్రాగామ్ స్టేటస్లో తాను చనిపోతున్నట్లు ఓ సినిమాకు సంబంధించిన స్టేటస్, అలాగే చనిపోయిన తరువాత తన మెదడు ఏడు నిమిషాలు పనిచేస్తుందని.. అప్పుడు కూడా ఒక అమ్మాయి గురించే ఆలోచిస్తుందని.. చనిపోయిన తర్వాత తన స్నేహితులు అంత్యక్రియలు బాధతో నిర్వహిస్తారని అర్థం వచ్చేలా స్టేటస్ వీడియోలు పెట్టాడు. ఆపై ఉరి వేసుకుని మృతి చెందాడు. ఇది ప్రతి ఒక్కరినీ కదిలించింది.గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com -
అపార ప్రతిభ.. అకాల మరణం!
ఆంధ్రప్రదేశ్: టేబుల్ టెన్నిస్ బోర్డుపై ర్యాకెట్ పట్టి ప్రత్యర్థులను చిత్తుచేస్తూ.. రాష్ట్రస్థాయి పతకాలు సాధిస్తున్న ఆ చిరుచేతులు ఇక కదలవు. పట్టుదలతో కష్టపడి భవిష్యత్తులో దేశం గర్వించే క్రీడాకారుడిగా ఎదుగుతాడనుకున్న ఆ బాలుడి నవ్వులు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఒక చిన్నపాటి శారీరక లోపాన్ని సరిచేసుకుందామని ఆస్పత్రికి వెళ్తే.. విధి వెక్కిరించడంతో ఆ చిన్నారి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. కంటికి రెప్పలా కాపాడుకున్న కంటిపాప కన్నుమూయడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలాయి. అంతటి తీరని దుఃఖంలోనూ కుమారుడి నేత్రాలను దానం చేసి మరొకరి జీవితాల్లో వెలుగులు నింపారు.పతకాల రేసులో నిలిచి..బుచ్చిరాజుపాలెంలో నివాసముంటున్న తిరుమలరాజు హరిబాబు, భవానీ దంపతుల కుమారుడు హర్షవర్ధన్వర్మ (12) స్థానిక ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. చదువుతో పా టు ఆటల్లోనూ ఎంతో చురుగ్గా ఉండే హర్షవర్ధన్.. తనకు ఎంతో ఇష్టమైన టేబుల్ టెన్నిస్ను ఎంచుకున్నాడు. క్రమశిక్షణతో సాధన చేస్తూ అండర్–12 విభాగంలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటాడు. ఎన్నో పతకాలు సాధించాడు.లోపాన్ని సరి చేసుకోవాలనుకుంటే..బాలుడిలో ఉన్న చిన్నపాటి శారీరక లోపాన్ని సరిచేసేందుకు ఇటీవల ఒక ప్రైవేటు ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించారు. అయితే దురదృష్టవశాత్తు ఆరోగ్యం విషమించడంతో మృత్యువుతో పోరాడుతూ ఆదివారం హర్షవర్ధన్ కన్నుమూశాడు. హర్షవర్ధన్ భౌతికకాయాన్ని తరలించేందుకు బంధువు అశోక్ పెందుర్తిలోని ‘సాయి హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్’ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్ను సంప్రదించారు. ఆ సమయంలో శ్రీనివాస్ నేత్రదానం కోసం వివరించగా.. పుట్టెడు శోకంలో ఉన్న తల్లిదండ్రులు హరిబాబు, భవానీ ఏమాత్రం సంకోచించకుండా అంగీకరించారు. -
చంద్రబాబు సర్కార్ పిరికిపంద చర్య
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాలను నిలదీస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు కూటమి ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడిని పెంచాయి. అయితే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ర్యాలీలను అడ్డుకోవడం, నేతలను అదుపులోకి తీసుకోవడం.. పలు చోట్ల లాఠీఛార్జీలు చేయడంపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిరసనలను అడ్డుకోవడం చంద్రబాబు ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.డీఎస్సీ నియమకాల్లో జరిగిన అవినీతికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయడం, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ అభ్యర్థులు, డీఎస్సీ సంఘాలతో వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పలుచోట్ల పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు.పులివెందులలో లాఠీఛార్జ్.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి నియోజకవర్గంలో పోలీసులు దౌర్జన్యకాండకు పాల్పడ్డారు. పులివెందులలో ఆర్డీవోకు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులపై లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పలువురికి గాయాలు కాగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి. అంతకు ముందు.. ఎంపీ అవినాశ్రెడ్డికి ర్యాలీ నిర్వహించడానికి వీల్లేదంటూ పోలీసులు నోటీసులు అందించారు.చీపురుపల్లిలో బొత్సకు అడ్డంకులుచీపురుపల్లిలో నిర్వహించాల్సిన నిరసన కార్యక్రమానికి వెళ్తున్న సీనియర్ నేత, మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణను పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ పోలీసులు అడ్డుకోవడం సరికాదని బొత్స మండిపడ్డారు. రోడ్డుపైనే ఆయన ఆందోళన చేపట్టారు. కొడాలి నాని హౌస్ అరెస్ట్మాజీ మంత్రి కొడాలి నానిని గుడివాడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. డీఎస్సీ అంశంపై నిరసనల్లో పాల్గొనకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ పరిణామంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు మండిపడుతున్నారు.అటు రాజమండ్రిలోనూ మాజీ ఎంపీ భరత్ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతుండగా.. పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు. విశాఖలో అరెస్టులువిశాఖపట్నంలోని మారియట్ సెంటర్ వద్ద నిరసనకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కేకే రాజు సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.విజయవాడలో దేవినేని ర్యాలీకి అడ్డంకులువిజయవాడలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనుమతి లేదంటూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.అవనిగడ్డలోనూ అడ్డగింతఅవనిగడ్డలోనూ వైఎస్సార్సీపీ నేతల నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలపై గొంతెత్తే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించింది.తిరుపతిలో భూమన కరుణాకర్రెడ్డి నేతృత్వంలో.. గన్నవరంలో వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో ర్యాలీలు జరుగుతున్నాయి. నెల్లూరు, కర్నూల్, అనంతపురం, అవనిగడ్డ.. ఇలా పలు చోట్ల వైఎస్సార్సీపీ ర్యాలీలు నిర్వహించకుండా పోలీసులు అడ్డుపడుతున్నారు. నిరసన తెలియజేస్తున్న వాళ్లపైకి లాఠీ ప్రయోగిస్తున్నారు.‘శాంతియుత నిరసనలకు ఎందుకు అభ్యంతరం?’డీఎస్సీ అంశంపై శాంతియుతంగా ర్యాలీలు నిర్వహిస్తే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, దాన్ని అడ్డుకోవడం సరికాదని అన్నారు. -
అనంత పోలీసుల దౌర్జన్యం.. రోడ్డుపైనే పెద్దిరెడ్డి బైఠాయింపు
సాక్షి, అనంతపురం: ఏపీలో దగా డీఎస్సీపై ప్రజాపోరు కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ ఆధర్వ్యంలో పోరాటం ఉధృతమైంది. అయితే శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీలను మాత్రమే కాదు.. ఈ దౌర్జన్యకాండను నిలదీస్తున్న వైఎస్సార్సీపీ నేతలను సైతం పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం తాడిపత్రి నియోజకవర్గం ముచ్చుకోట వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రిలో ఇవాళ యువత ర్యాలీకి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఏర్పాట్లు చేశారు. అయితే పోలీసులు మాత్రం అధికార టీడీపీ కార్యక్రమం ఉందంటూ ఆ ర్యాలీని అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాడిపత్రికి బయల్దేరారు. మార్గమధ్యంలో ముచ్చుకోట వద్ద పోలీసులు ఆయన్ని అడ్డుకోవడంతో.. ఆయన రోడ్డుపైనే బైఠాయించి ఆయన నిరసన తెలియజేశారు. పోలీసులను నిలదీసిన పెద్దిరెడ్డిశాంతియుతంగా నిర్వహించే కార్యక్రమాలను ఎలా అడ్డుకుంటారని పోలీసులను పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు.. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.డీఎస్సీ అంశంపై ప్రభుత్వంపై విమర్శలుసాక్షితో మాట్లాడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వైఎస్సార్సీపీ ర్యాలీలను అడ్డుకోవడం దుర్మార్గమని ఆరోపించారు. “మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు? మంత్రి లోకేశ్ కనుసన్నల్లోనే డీఎస్సీలో అక్రమాలు జరిగాయి. నైతిక బాధ్యతగా ఆయన రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు.హైవేపై బైఠాయింపుపోలీసుల తీరుకు నిరసనగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు అనంతపురం-తాడిపత్రి హైవేపై బైఠాయించారు. పోలీసుల వ్యవహారశైలిపై నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు వెంకటరెడ్డి, విశ్వేశ్వర్రెడ్డి కూడా పోలీసుల తీరును తప్పుబట్టారు. శాంతియుత కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. -
డీఎస్సీపై ప్రశ్నిస్తే దాడులా?.. ‘క్రిమినల్స్ అడ్డా’ ఎవరిది బాబు?
విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావు తన అనుచరులతో కలిసి గత గురువారం నాడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్ష శిబిరంపై దాడి చేశారు. టెంట్ పీకేశారు. అక్కడ కొందరు టీడీపీ గూండాలు వికృత చేష్టలకు పాల్పడ్డారు. సరిగ్గా అదే టైమ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో ఉన్నారు. బోండా ఉమ అరాచక ప్రవర్తనపై ఆయనకు సమాచారం అందే ఉండాలి. అయినా అలాంటివి చేయవద్దని చెప్పకపోగా, వైఎస్సార్సీపీవారిని ఉద్దేశించి గొడ్డలి పార్టీ, క్రిమినల్స్ తయారీ అడ్డా అంటూ చంద్రబాబు విమర్శించారట.కొన్నాళ్ల క్రితం బోండా ఉమ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పక్కన కూర్చుంటే చంద్రబాబుకు కోపం వచ్చింది. వెంటనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి పార్టీ కమిటీ వేసి మందలించే ఏర్పాటు చేశారు. తదుపరి తన కుమారులతో కలిసి బోండా ఉమ చంద్రబాబును కలిశారు. అక్కడ ఏమి మాట్లాడుకున్నారో తెలియదు కాని, మరుసటి రోజే ఉమా విజయవాడలో గూండాయిజానికి బరి తెగించారు. వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై ఆయన అనుచరులు దాడి చేశారు. విజిటేరియన్ అయిన విష్ణుపై కోడిగుడ్లు విసిరారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు, మంత్రి లోకేష్ రాజీనామా కోరుతూ వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. వారు తమ డిమాండ్తో ప్రశాంతంగా దీక్షలు చేస్తున్నారు. దీనిని భరించడం టీడీపీ నాయకత్వానికి కష్టంగా మారింది.నీట్ ప్రశ్నాపత్రాల లీక్పై ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన ఫలితంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసి వచ్చింది. జార్ఖండ్లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆందోళనలు సాగుతున్నాయి. వాటికి ప్రభుత్వంలో భాగస్వామి అయిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా మద్దతు ఇస్తున్నారు. ఏపీలో కూడా డీఎస్సీ టీచర్ల ఎంపికలో అక్రమాలు జరిగాయని మాజీ సీఎం జగన్ ఆధార సహితంగా ఆరోపణలు చేశారు. ఆయన అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వ పక్షాన సరైన జవాబు ఇవ్వలేకపోతున్నారు. పలువురు డీఎస్సీ అభ్యర్ధులు తమకు అన్యాయం జరిగిందని సాక్ష్యాలు చూపుతున్నారు. అయినా ప్రభుత్వం డబాయించి తప్పించుకోవాలని చూస్తోంది.ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ వివిధ రూపాలలో ఆందోళనలు సాగిస్తోంది. డీఎస్సీ అక్రమాలపై జరుగుతున్న ప్రచారం ప్రజలలోకి వెళుతుండడంతో చంద్రబాబు, లోకేష్లు అసహనానికి గురవుతున్నారు. అందువల్లే ప్రభుత్వం అనుకుంటే రెండు నిమిషాలలో అణచివేయగలదని బెదిరించడం, ఆందోళన చేస్తున్న రైతులను, నిరుద్యోగ యువతను గంజాయి బాచ్ అని అనడం వంటివి చేశారనిపిస్తుంది. ఇవన్ని ముఖ్యమంత్రి స్థాయికి తగనివని ఆయనకు తెలిసినా ఏదో నిస్సహాయ స్థితిలో పడ్డారనిపిస్తుంది. ఎదురుదాడిలో భాగంగా కర్నూలులో కొందరితో ప్రదర్శన చేయించారు. వారు ఏ తరహా వారో తెలియదు. ఎల్లో మీడియా ప్రముఖంగా ఆ కథనాన్ని ఇచ్చింది. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ర్యాలీ చేస్తే వారు పవిత్రులు, వ్యతిరేకంగా చేస్తే గంజాయి బాచ్లని ప్రచారం చేస్తారన్నమాట. తనవైపు వాదన సరిగా లేనప్పుడే ప్రభుత్వాలు ఇలాంటి చర్యలకు పాల్పడతాయన్న అబిప్రాయం ఉంది. దేవరపల్లిలో జగన్ టూర్లో ఒక చిన్న హోటల్లో జరిగిన ఉదంతాన్ని కూడా పెద్దదిగా ఫోకస్ చేయాలని యత్నించి చంద్రబాబు అండ్ కో భంగపడ్డారు. ఆ హోటల్ యజమానురాలు లక్ష్మి వచ్చి జగన్ను కలిశారు. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలని ఒత్తిడి చేసినా ఆమె ఒప్పుకోకపోవడం గొప్ప విషయమే. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు, లోకేష్లను సంతృప్తిపరచడానికి బోండా ఉమా కాని, మరికొన్ని చోట్ల ఇతర టీడీపీ నేతలు కాని దాడులు చేస్తున్నట్లు వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. దానికి తగినట్లే ఉమా మాట్లాడుతూ లోకేష్ను విమర్శిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అనుమతి లేకుండా దీక్ష శిబిరాలు నిర్వహిస్తారా అని అంటున్నారు.నిజానికి విష్ణు పోలీసులకు చెప్పే దీక్ష శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. చిత్రంగా శిబిరానికి రక్షణ కల్పించవలసిన పోలీసులు దాడికి పాల్పడ్డ ఉమాను కాకుండా, శాంతియుతంగా కూర్చుని ఉన్న విష్ణును వాహనం ఎక్కించి తరలించారు. అదే టీడీపీ ఎక్కడైనా సభ పెడితే ఆ సమీపంలోకి అయినా విపక్షాలను రానిస్తారా? ఇప్పుడు చెప్పండి.. క్రిమినల్స్ తయారీ అడ్డాగా టీడీపీ ఉందా? వైఎస్సార్సీపీ ఉందా? ఈ దాడుల ద్వారా డీఎస్సీ అక్రమాల వ్యవహరం మరింతగా ప్రజలలోకి వెళుతుంది. ప్రభుత్వ తీరుపై మరిన్ని అనుమానాలు బలపడతాయి. మరికొన్ని ఉదాహరణలు గమనించండి.ఒక మంత్రి తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఒక ఎన్ఆర్ఐ మహిళ స్వయంగా లోకేష్కు ఫిర్యాదు చేశారట. అయినా ఆ మంత్రిపై చర్య తీసుకోలేదే? అంటే ఎవరు క్రిమినల్స్ అడ్డాలో ఉన్నట్లు అవుతుంది! ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై తప్పుడు ఆరోపణలు చేసి అరెస్టు చేశారే. ఒక టీడీపీ నేత తన భార్య నైటీని తానే చించి ఎమ్మెల్యేపై ఆరోపించిన విషయం వీడియో సహితంగా బయటపడి ఉండకపోతే, ఎమ్మెల్యేపై ఆరోపణలను నమ్మే పరిస్థితి వచ్చేది కదా? ఇలాంటివాటిని చేసేవారిని కదా క్రిమినల్స్ అనాల్సింది. అలాంటివారిని ఎంకరేజ్ చేసే పార్టీని కదా క్రిమినల్స్ తయారు చేసే అడ్డా అనాల్సింది అని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. దానిని కాదనగలరా?ఈ మధ్యనే గుంటూరులో ఒక మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసింది కూడా టీడీపీ నేతే కదా! అంతేకాదు. కొందరు కూటమి ఎమ్మెల్యేలు కొంతమంది మహిళలపై ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడింది ఫిర్యాదులు వచ్చాయే. ఏకంగా ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ నుంచే వీడియో కాల్ చేసిన ఘట్టం మరిచిపోయారా? ఆ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన యువతిని నడిరోడ్డులో పోలీసు లాఠీతో కొట్టింది జనసేన నేత కదా! ఆ ఎమ్మెల్యేపై కాని, దౌర్జన్యం చేసిన జనసేన నేతపై కాని ఏమైనా చర్య తీసుకున్నారా? పలు చోట్ల బాధితులపైనే కేసులు పెడుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.గతంలో వైఎస్సార్సీపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు, లోకేష్లు ఇలాగే క్రిమినల్స్ అంటూ ఆరోపణలు చేసేవారు. ఎన్నికల సమయానికి వారిలో పలువురిని టీడీపీలో చేర్చుకున్నారు. అంటే టీడీపీ క్రిమినల్స్ అడ్డాగా మారిందని ఒప్పుకుంటున్నటా?కాదా? డీఎస్సీలో అక్రమాలు జరిగాయన్నది వైఎస్సార్సీపీ ఆరోపణ. దానికి సమాధానం ఉంటే చెప్పాలి. లేదా ధైర్యం ఉంటే సీబీఐ విచారణకు ఒప్పుకోవచ్చు.గతంలో చంద్రబాబు డిమాండ్ చేసిన వెంటనే తన కుమారుడు జగన్పై సీబీఐ విచారణకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఒప్పుకున్న ఘటనను పలువురు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు తన కుమారుడిపై డీఎస్సీ ఆరోపణలు వస్తే ఆ ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. గత రెండేళ్లుగా వైఎస్సార్సీపీ నేతలపైన, కార్యకర్తలపైన జరిగిన హత్యలు, హత్యాయత్నం ఘటనలు, టీడీపీ నేతల దౌర్జన్యాలు ఇవన్ని చూస్తుంటే 1983లో తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో ఎన్టీ రామారావు చెప్పిన ఆదర్శాలు ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి?ఒక వైపు క్రిమినల్స్ను ప్రోత్సహిస్తూ మరో వైపు వైఎస్సార్సీపీపై అదే విమర్శ చేయడం చంద్రబాబుకే చెల్లిందని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరు తప్పు చేసినా తప్పే అని, నిష్ఫక్షపాతంగా పనిచేయండని పోలీసులకు చెప్పవలసిన సీనియర్ నేత చంద్రబాబు ఈ వయసులో కూడా ఇలాంటి ప్రమాణరహిత రాజకీయాలు చేయడం వల్ల ఆయనకు అప్రతిష్ట అవుతుందా? కాదా? అన్నది ఆలోచించుకోవాలి. రెడ్బుక్ అరాచకాలకు స్వస్థి పలికి, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే నష్టం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్త ర్యాలీలు విజయవంతం
వైఎస్సార్సీపీ నిరసనలు అప్డేట్స్.. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ చేపట్టిన ఏపీ రాష్ట్ర వ్యాప్త ర్యాలీలు విజయవంతమయ్యాయి. వైఎస్సార్సీపీ ర్యాలీలను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించినా ఆ నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. నిరసన ర్యాలీలకు విధించిన భారీ ఆంక్షలను ప్రజలు తమ నిరసనల రూపంలోనే తిప్పికొట్టారు. వైఎస్సార్సీపీ చేపట్టిన ర్యాలీలకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ సంఘీభావం తెలిపారు. ఈ నిరసన ర్యాలీల్లో డీఎస్సీ అక్రమాలపై నిగ్గు తేల్చాలని, సీబీఐ విచారణకు అప్పగించాలని, లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్లు ప్రధానంగా వినిపించాయి. వైయస్సార్ జిల్లాడీఎస్సీ అవకతవకలపై వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీర్యాలీని అడ్డుకునేందుకు భారీగా పోలీసులు మోహరింపు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి మెుదలైన ర్యాలీర్యాలీలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిఅడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేసిన పోలీసులుపోలీసుల బంధనాలను తెంచుకుని ముందుకు సాగిన ర్యాలీఎట్టిపరిస్థితిల్లో డీఎస్సీ ఆందోళనలు జరగడానికి వీళ్లేదంటూ పోలీసులకు ఆదేశాలిచ్చిన ఆదినారాయణరెడ్డిబీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆదేశాలతో నిన్న దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించిన పోలీసులుఒకరి తర్వాత ఒకరు దీక్షను కొనసాగించడంతో నేడు ర్యాలీని అడ్డుకోవాలని కుట్రవైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించినా ముందుకు సాగిన ర్యాలీపెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులు..కూటమి నేతలకు చెంపపెట్టులా ప్రారంభమైన ర్యాలీర్యాలీలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డివైయస్సార్ జిల్లాజమ్మలమడుగులో ఉద్రిక్త వాతావరణం2025లో జరిగిన డీఎస్సీ అవకతవకలపై ర్యాలీకి సిద్ధమైన వైఎస్సార్సీపీ నాయకులుఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీకి సిద్ధమైన కార్యకర్తలు వారిని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ భారీ గేట్లు వేసిన పోలీసు అధికారులుజమ్మలమడుగులో పెద్ద ఎత్తున మొహరించిన పోలీసు బలగాలుఎన్ని బలగాలు అడ్డుపడిన తగ్గేదేలే అంటున్న వైఎస్సార్సీపీ నేతలుఎట్టిపరిస్థితుల్లో ర్యాలీ చేసి తీరుతాం అంటున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలువైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలుఈ నేపథ్యంలో జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులుచిత్తూరు జిల్లాపూతలపట్టు నియోజకవర్గం కేంద్రం పూతలపట్టులో మెగా డీఎస్సీ అక్రమాలు పై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ..పోలీసులు ఆంక్షలు విధించినా భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొన్న వైఎస్ఆర్సిపి నాయకులు , కార్యకర్తలు.అంబేద్కర్ విగ్రహం నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీడీఎస్సీ నియామకాల అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ తిరుపతి జిల్లా:శ్రీకాళహస్తిలో డీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ..మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డినెల్లూరు జిల్లామనుబోలులో ఉద్రిక్త పరిస్థితిమనుబోలులో డీఎస్సీ అక్రమాలపై నిరసన ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కాకాణి పూజిత.వీరభద్ర దేవస్థానం నుండి జాతీయ రహదారి వద్ద ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద వరకు భారీ ర్యాలీ..ఈ ర్యాలీని అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు,వైఎస్సార్సీపీ నాయకులపై పోలీసుల తోపులాట.కాకాణి గోవర్ధన్ రెడ్డి కామెంట్స్నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం కూటమి సర్కార్ నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి..ప్రతిపక్ష నిరసనలపై పోలీసులతో అణచివేత, బ్యానర్లో చించి వేస్తూ తాడులకు తెగబడుతున్నారని మాజీ మంత్రి ఆరోపణ.వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న పోరాటం విజయవాడ..బోండా ఉమాకుదేవినేని అవినాష్ వార్నింగ్డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా నిరసనలు చేస్తున్నాంమేం నిరసనలు చేస్తుంటే కొంతమంది జోకర్లు , కమెడియన్లను మా పైకి పంపించారుజోకర్లు , కమెడియన్లు పులులం , సింహాలం అని బిల్డప్ ఇస్తున్నారుజోకర్లు , కమెడియన్లకు వైఎస్సార్సీపీ భయపడదువిద్యార్ధులకు జరిగిన అన్యాయం పై మాట్లాడమంటే మా కుటుంబం గురించి మాట్లాడుతున్నారుమా కుటుంబం గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారుమా ముత్తాత దేవినేని సూర్యనారాయణ నెప్పల్లి గ్రామానికి 18 ఏళ్లు సర్పంచ్ గా పనిచేశారుమా తాతగారు దేవినేని రామకృష్ణ వరప్రసాద్ ఈ జిల్లాలోనే తొలి ఇండస్ట్రియలిస్ట్ప్రకాశం బ్యారేజ్ కు గడ్డర్లు సప్లై చేసింది మా కుటుంబం నుంచి వచ్చిన సువర్ణ ఇండస్ట్రీస్ అనంతపురం..మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కామెంట్స్..డీఎస్సీ అక్రమాలపై మంత్రి నారా లోకేష్ను ప్రాసిక్యూట్ చేయాలినీట్ లీకేజీకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి రాజీనామా చేశారుడీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయలేదు?లక్షల మంది డీఎస్సీ అభ్యర్థుల జీవితాలతో టీడీపీ కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందిడీఎస్సీ అభ్యర్థుల నుంచి వచ్చిన 35వేల ఫిర్యాదులను ఎందుకు బుట్టదాఖలు చేశారు.దీనిపై చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలి తూర్పుగోదావరి జిల్లా..రాజమండ్రి రూరల్ బొమ్మూరులో మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీర్యాలీని అడ్డుకున్న పోలీసులుడీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్న పార్టీ శ్రేణులు. కృష్ణా..డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ భారీ నిరసన ర్యాలీపెనమలూరు నియోజకవర్గలో దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో ర్యాలీదేవభక్తుని చక్రవర్తి కామెంట్స్విద్యాశాఖ మంత్రి నారా లోకేష్పై సీబీఐ విచారణ జరపాలి.డీఎస్సీలో జరిగిన బాగోతాలు బయటపెడుతుంటే మాపై దాడులు చేస్తున్నారుఅర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారుకూటమి ప్రభుత్వం ఉద్యోగులను, యువతను మోసం చేసిందినారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా అనర్హుడునైతిక బాధ్యత వహించి నారా లోకేష్ రాజీనామా చేయాలితూర్పుగోదావరి జిల్లా..రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాలపై ఆందోళనరాజా ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు.పోలీసులు బయటకు వెళ్లనివ్వకపోవడంతో ఇంటివద్దే ధర్నాకు దిగిన జక్కంపూడి రాజాపెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్న పార్టీ నేతలు, యువకులుడీఎస్సీ అక్రమాలపై విచారణ కొనసాగాలని లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ కాకినాడ..కురసాల కన్నబాబు కామెంట్స్....డీఎస్సీ అక్రమాలపై సీబీఎన్ విచారణ కాదు.. సీబీఐ విచారణ కావాలి.డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి.ఫీజు రియింబర్స్మెంట్ , నిరుద్యోగ భృతి బకాయిలు విడుదల చేయాలి.డీఎస్సీపై విచారణ అంటే చంద్రబాబు వణికిపోతున్నాడుమంత్రి లోకేష్ భయపడుతున్నాడుర్యాలీ చేయవద్దని పోలీసులు నాకు రెండు నోటీసులు ఇచ్చారు.పోలీసులు కేసులు పెడతామన్నా ఏడు కిలోమీటర్ల దూరం బైక్ ర్యాలీ చేశాం వైఎస్సార్ జిల్లా...బద్వేలులో డీఎస్సీ అక్రమాలపై జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, రాష్ట్ర విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి ఆదిత్ రెడ్డి.శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే అడ్డుకున్న పోలీసులు..పోలీసులకు, పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం..ర్యాలీ జరగనివ్వమంటూ రవీంద్రనాథ్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు..పోలీసుల తీరుపై మండిపడ్డ రవీంద్రనాథ్ రెడ్డి..శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలుపోలీసులను తోసుకుని ముందుకు దూసుకుపోయి ర్యాలీని నిర్వహించిన నేతలు కృష్ణాజిల్లా..గన్నవరం వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.రోడ్డుపైకి రాకుండా బారికేడ్లు అడ్డు పెట్టిన పోలీసులు.పోలీసులు, నాయకుల మధ్య వాగ్వివాదం.పోలీసులు తీరుకు నిరసనగా రోడ్డుపై ధర్నాకు దిగిన వైఎస్సార్సీపీ నాయకులు.మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కామెంట్స్కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇస్తామని ఊదరగొట్టారు.అధికారంలోకి వచ్చాక డీఎస్సీ తీశారు.చంద్రబాబు ప్రభుత్వం తీసిన మెగా డీఎస్సీ దగా డీఎస్సీగా మారింది.అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.డీఎస్సీ నియామకం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయింది.డీఎస్సీపై ఎందుకు సీబీఐ విచారణ వేయడం లేదు.గతంలో ఎన్నో నీతులు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు?.ఎంతో మంది యువకులు కష్టపడి చదివి ఉద్యోగం రాకపోతే..బ్రోకర్లు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తున్నారు.ప్రతిపక్షంలో ఉండగా ఎన్ని చేసిన చంద్రబాబు..అధికారంలోకి వచ్చాక మాట్లాడిన వారిపై అక్రమ కేసులు, ఉపా కేసులు కూడా పెడుతున్నారు.వ్యవస్థ మీద నమ్మకం ఉండాలంటే చంద్రబాబు సీబీఐ విచారణ చేయాలి.విశాఖ..కదిరి బాబురావు కామెంట్స్.. అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్యానికి విరుద్ధం..శాంతియుతంగా నిర్వహించే ర్యాలీలను అడ్డుకోవడం సరికాదు.డీఎస్సీ అవకతవకలపై సీబిఐ విచారణ జరిపించాలి.మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి..ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అరెస్ట్..ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం..శాంతియుతంగా పోరాటం చేస్తున్నా అడ్డుకుంటున్నారు..పోలీసుల తీరు చాలా దారుణంగా ఉంది: కళ్యాణిగుంటూరు..అంబటి రాంబాబు కామెంట్స్..యువగళంలో లోకేష్తో నడిచిన వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చారుఇందుకోసం పేపర్ లీక్ చేశారుజీవో నెంబర్ 4, 47లు తెచ్చి అక్రమాలు చేశారుసర్టిఫికేట్ తెచ్చుకుంటే చాలు ఉద్యోగం ఇచ్చారుతమకు కావాల్సిన వారికి ఉద్యోగం ఇచ్చుకుని మరో జీవో తెచ్చారుదీనిపై మేము ఉద్యమం చేస్తే మా దీక్షా శిబిరాలపై దాడులు చేశారుటీడీపీ నేతలే టెంట్లు పీకటం దుర్మార్గంవాస్తవాలు బయటకు వస్తాయని టీడీపీ నేతలు భయపడుతున్నారుపోలీసులతో మా దీక్షలను అడ్డుకునే ప్రయత్నం చేశారుగాంధేయ పద్దతిలో చేసే నిరసనలను అడ్డు కోవటం సరికాదుపొన్నూరు, చిలకలూరిపేట, విజయవాడలో పోలీసులే టెంట్లు పీకారుపోలీసుల పని టెంట్లు పీకటమా?ఇప్పటికైనా లోకేష్ రాజీనామా చేసి చిత్తశుద్ది నిరూపించుకోవాలి.డీఎస్సీ అభ్యర్దులు లేరంటూ డైవర్షన్ పాలిటిక్స్కు టీడీపీ పాల్పడుతుంది.డీఎస్సీపై పోరాటం ఆపం.రాబోయే రోజుల్లో అందరూ ఉద్యమబాట పడతారు.వెంటనే లోకేష్ రాజీనామా చేయాలి. తూర్పుగోదావరి జిల్లా..రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ ఇంటి వద్ద ఉద్రిక్తతర్యాలీగా పార్టీ శ్రేణులతో శాంతియుతంగా బయలుదేరిన మాజీ ఎంపీని అడ్డుకున్న పోలీసులుపోలీసుల తీరుపై మండిపడిన భరత్ప్రభుత్వం పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలుడీఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్గేటు వద్దే కూర్చుని నుంచి ఆందోళన నిర్వహిస్తున్న భరత్పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలులోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్విశాఖ:విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉద్రిక్తత..ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు అరెస్ట్..పోలీసు వాహనాలను అడ్డుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు..కృష్ణాజిల్లా..గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులుడీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ..ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డుకుంటున్న పోలీసులు..విశాఖ..విశాఖలో తీవ్ర ఉద్రిక్తత..పోలీసులకు వైఎస్సార్సీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం.కేకే రాజును బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు.పోలీసులకు పార్టీ నేతలకు మధ్య తోపులాట.భారీ బందోబస్తు మధ్య కేకే రాజును అరెస్టు చేసిన పోలీసులు.విజయవాడవిజయవాడలో ఉద్రిక్తతదేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ర్యాలీని అడ్డుకున్న పోలీసులుపోలీసు బారికేడ్లు తోసుకుంటూ దూసుకెళ్లిన వైఎస్సార్సీపీ కార్యకర్తలుడీఎస్సీపై సీబీఐ విచారణ జరపాలని, లోకేష్ రాజీనామా చేయాలని ఆందోళనదేవినేని అవినాష్ కామెంట్స్..చంద్రబాబు ప్రభుత్వం భయపడుతుందియువత ఉద్యమాన్ని చూసి లోకేష్ భయపడుతున్నారుఅందుకే పోలీసులు చేత ఉద్యమాన్ని అణగదొక్కుతున్నారుఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదుడీఎస్సీలో భారీ అక్రమాలు జరిగాయిపేపర్ లీక్పై సీబీఐ విచారణ జరగాలితూర్పుగోదావరి జిల్లా..రాజమండ్రిలో మాజీ ఎంపీ భరత్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులుకార్యకర్తలు ఎవరిని లోపలికి రానివ్వకుండా బారికేడ్లు ఏర్పాటుర్యాలీకి అనుమతి లేదంటూ నోటీసులు జారీ చేసిన పోలీసులు వైఎస్సార్ జిల్లాపులివెందులలో తీవ్ర ఉద్రిక్తతఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులులోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసుల లాఠీఛార్జ్అనంతపురం..మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్..తాడిపత్రి వెళ్తున్న నన్ను అడ్డుకోవడం దుర్మార్గంశాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా?డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందేలోకేష్ డైరెక్షన్లోనే డీఎస్సీ అక్రమాలు జరిగాయిఒక్కో ఉపాధ్యాయ ఉద్యోగాన్ని లక్షల రూపాయలకు అమ్ముకున్నారుతాడిపత్రి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కక్ష సాధింపు చర్యలు దారుణంపెద్దారెడ్డి ఏ కార్యక్రమం నిర్వహించినా.. పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గంతాడిపత్రిలో వైఎస్సార్సీపీని లేకుండా చేయాలని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారుజేసీ ఆగడాలకు పోలీసులు వత్తాసు పలకడం సరికాదు. నెల్లూరు..డీఎస్సీ అవకతవకలపై నెల్లూరు సిటిలో వైఎస్సార్సీపీ భారీ నిరసన ర్యాలీఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువతతో ఆందోళనకార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కాకాణిభారీగా పోలీసుల మోహరింపు, ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులుఅంబేద్కర్ సర్కిల్ వద్దకు భారీగా చేరుకున్న విద్యార్థులు, యువత, పార్టీ శ్రేణులు విశాఖ..విశాఖ నార్త్ నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహం..ర్యాలీకి తరలివచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తల బైక్ తాళాలు తీసుకున్న పోలీసులు..ర్యాలీ నిర్వహించకుండా భారీగా పోలీసుల బందోబస్తు.పోలీసులు తీరుపై జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీవ్ర ఆగ్రహంవైఎస్సార్ జిల్లాపులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీప్రభుత్వం అడ్డంకులు సృష్టించినా ఆగని పోరాటంపెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్ధులు, వైఎస్సార్సీపీ శ్రేణులుర్యాలీలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డిడీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్చిత్తూరు జిల్లాకుప్పంలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మెగా డీఎస్సీ వ్యతిరేక ర్యాలీపై పోలీసుల ఆంక్షలు..కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ హౌస్ అరెస్ట్..ఇంటి ముందే నిరసన చేపట్టిన ఎమ్మెల్సీ భరత్..డీఎస్సీ అక్రమాలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి: ఎమ్మెల్సీ భరత్మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి.వారం రోజుల ముందే కుప్పం డీఎస్పీకి ర్యాలీకి పర్మిషన్ ఇవ్వాలని రిక్వెస్ట్ లెటర్ పెట్టాం.టీడీపీ వారు మాకన్నా ముందే పర్మిషన్ తీసుకున్నారని మాకు అనుమతి తిరస్కరించారు. అనకాపల్లినర్సీపట్నంలో నిరసన దీక్షకు పోలీసులు ఆంక్షలుమాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇంటి దగ్గర పోలీసులు మోహరింపు.గణేష్ ర్యాలీకి వెళ్లకుండా అడ్డగింత.నిరసన తెలిపి తీరుతామన్న మాజీ ఎమ్మెల్యే గణేష్ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోలీస్ వ్యవహరిస్తున్నారన్న గణేష్.రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారుప్రభుత్వం చేసిన తప్పులను తెలియ పరచడం ప్రతిపక్ష ధర్మం అనంతపురం..తాడిపత్రి నియోజకవర్గం ముచ్చుకోట వద్ద పోలీసుల అత్యుత్సాహంమాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అడ్డుకున్న పోలీసులుపోలీసులతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి వాగ్వాదంపోలీసుల తీరుకు నిరసనగా అనంతపురం-తాడిపత్రి హైవేపై బైఠాయించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిశాంతియుత ర్యాలీని ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించిన పెద్దిరెడ్డి.విజయవాడమాజీ మంత్రి వెల్లంపల్లి ఇంటి వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ..ర్యాలీలో భారీగా పాల్గొన్న విద్యార్థులు, యువకులు..మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నినాదాలు..చిత్తూరుచిత్తూరులో ఉద్రిక్తత వాతావరణంగంగినేని చెరువు వద్ద నుంచి విజయానంద రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన మెగా డీఎస్సీ నిరసన ర్యాలీ అడ్డుకున్న పోలీసులుపోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలుఅడ్డుకునేందుకు యత్నించిన పోలీసులు.. ముందుకు సాగుతున్న నిరసన ర్యాలీనర్సీపట్నం..నర్సీపట్నంలో నిర్వహించే నిరసన ర్యాలీకి అనుమతి లేదంటే పోలీసుల ఆంక్షలు.మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరింపు..పార్టీ నాయకులు ర్యాలీకి తరలి రాకుండా పోలీసుల ఆంక్షలు.నాయకులకు కార్యకర్తలకు ఫోన్ చేసి బెదిరిస్తున్న పోలీసులు.ర్యాలీకి వస్తే కేసులు పెడతామని బెదిరింపువిశాఖవైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలపై పోలీసులు ఆంక్షలు..ర్యాలీకి రావద్దంటూ పార్టీ శ్రేణులను బెదిరిస్తున్న పోలీసులు..నాయకులకు ఫోన్ చేసి ర్యాలీకి అనుమతి లేదంటున్న పోలీసులు.ర్యాలీకి వస్తే కేసులు పెడతామని బెదిరింపులు ..బైకులు, కార్లు సీజ్ చేస్తామని హెచ్చరిక.నిరసన ర్యాలీలు చేపట్టే ప్రాంతంలో భారీగా మోహరించిన పోలీసులు..పోలీసుల ఆంక్షలపై వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం.తూర్పుగోదావరి జిల్లా...మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన వైఎస్సార్సీపీపార్టీ ఆధ్వర్యంలో ఇవాళ నియోజకవర్గ స్థాయిలో భారీ ర్యాలీలుర్యాలీలకు అనుమతి లేదంటూ నేతకు నోటీసులు జారీ చేసిన పోలీసులుమాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటి వద్ద మొహరించిన పోలీసులు...గాజువాక..ర్యాలీ చేసేందుకు వెళుతున్న గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త దేవన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు..ర్యాలీకి అనుమతి లేదంటూ ఇంటి దగ్గరే ఆపివేసిన పోలీసులుఎన్టీఆర్ జిల్లా:తిరువూరు నియోజకవర్గంలో ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు హుకుం..తిరువూరు జెడ్పీటీసీ వై.రామచంద్రా రెడ్డి, విస్సన్నపేట లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి శిరసాని ప్రకాష్ పలువురి నేతలకు నోటీసులు..ర్యాలీ తలపెట్టిన ఫ్యాక్టరీ సెంటర్లో పోలీసులు మోహరింపు..విజయవాడమాజీ మంత్రి వెల్లంపల్లి ఇంటి వద్ద భారీగా మొహరించిన పోలీసులు..ర్యాలీకి అనుమతి లేదంటూ వాట్సాప్ ద్వారా వెల్లంపల్లికి తెలిపిన పోలీసులు..ర్యాలీకి సిద్దమైన వైఎస్సార్సీపీ శ్రేణులు..ర్యాలీ చేస్తే అరెస్ట్ చేస్తామంటున్నా పోలీసులు.. అనంతపురం:తాడిపత్రిలో ఉద్రిక్తతడీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పెద్దారెడ్డి భారీ ర్యాలీతాడిపత్రిలోని స్వగృహం నుంచి బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులుపోలీసులతో పెద్దారెడ్డి వాగ్వాదంవైఎస్సార్సీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాటతాడిపత్రికి వచ్చే వైఎస్సార్సీపీ శ్రేణుల వాహనాలను అడ్డుకున్న పోలీసులుడీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని పెద్దారెడ్డి డిమాండ్..చిత్తూరు జిల్లా ..కుప్పంలో వైఎస్సార్సీపీ తలపెట్టిన నిరసన ర్యాలీకి పర్మిషన్ లేదని నోటీసులు జారీ చేసిన డీఎస్పీ పార్థసారథిఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులుటీడీపీ తలపెట్టిన విజయోత్సవ ర్యాలీకి పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు నోటీసులు.పర్మిషన్ లేకపోవడంతో నేతలు ఎవరు ర్యాలీలో పాల్గొనకూడదని సూచించిన డీఎస్పీఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు..కాకినాడ..తునిలో వైఎస్సార్సీపీ ర్యాలీని అడ్డుకునేందుకు కూటమి కుట్రపార్టీ ముఖ్య నేతలకు నోటీసులు ఇచ్చిన పోలీసులుసెక్షన్ 30 అమలులో ఉందని.. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులునేడు వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలునేడు వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలుడీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలనీ..మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ నిరసన ప్రదర్శనలుఇప్పటికే పలు రూపాల్లో నిరసనలు తెలిపిన వైఎస్సార్సీపీకలెక్టర్లకు వినతి పత్రాలు, టౌన్ హాలు సమావేశాలు, రిలే నిరాహార దీక్షలు నిర్వహణప్రభుత్వం స్పందించేంత వరకు పోరాటం ఆపేదిలేదంటున్న వైఎస్సార్సీపీ. కర్నూలు..డీఎస్సీలో జరిగిన అవకతవకలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీర్యాలీకి అనుమతి లేదంటూ కర్నూలు టూ టౌన్ పోలీసులు ఆంక్షలుఅనుమతి లేకుండా ర్యాలీ నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని అంటూ పోలీసుల బెదిరింపులుకర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎటువంటి ర్యాలీకి అనుమతి లేదంటున్న పోలీసులువైఎస్సార్సీపీ నేతలకు అర్థరాత్రి నోటీసులు అందించిన పోలీసులు.గుడివాడలో.. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన ర్యాలీకి అనుమతి లేదంటూ వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ర్యాలీ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అర్ధరాత్రి వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు వెళ్లిన పోలీసులు నోటీసులు అందజేయడం గమనార్హం. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు.తాడిపత్రిలోనూ ర్యాలీకి బ్రేక్..అనంతపురం జిల్లా తాడిపత్రిలోనూ వైఎస్సార్సీపీ చేపట్టనున్న నిరసన ప్రదర్శనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ నిరసన ర్యాలీకి ఏర్పాట్లు చేశారు.అయితే ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్రెడ్డి, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్రెడ్డి పోటీగా మరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో రెండు వర్గాల కార్యక్రమాలకు అనుమతి ఇస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు.. అనుమతి నిరాకరించారు. -
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై సారె సంబరం (ఫొటోలు)
-
విశాఖపట్నంలో అల్లు అర్జున్ సందడి (ఫొటోలు)
-
పోలీస్స్టేషన్ అడ్డాగాదామచర్ల దౌర్జన్యాలు
ఒంగోలు టౌన్: ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రేషన్ బియ్యం నుంచి మద్యం.. ఇసుక.. గ్రావెల్, భూకబ్జా.. మెప్మా.. నగరపాలక సంస్థ కేంద్రంగా భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడని జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దామచర్ల ఏకంగా పోలీస్ స్టేషన్లే అడ్డాగా సెటిల్మెంట్లకు దిగారని మండిపడ్డారు. ఆదివారం తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దామచర్లపై విరుచుకుపడ్డారు. దామచర్ల అక్రమాలను బయటపెడుతున్న వారిపై పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కావాలనే తన అనుచరులను వేధిస్తున్నాడని మండిపడ్డారు. భూ కబ్జాల కోసం సీఐకు మళ్లీ పోస్టింగ్.. అవినీతి ఆరోపణలపై వీఆర్కు పంపిన తాలూకా సీఐ విజయకృష్ణ్ణను వారం తిరగకుండానే తిరిగి అక్కడే పోస్టింగ్ వేయించారని బాలినేని పేర్కొన్నారు. ఎమ్మెల్యే జనార్దన్ తనను తిరిగి రప్పిస్తారని, ఇక్కడ సెటిల్మెంట్లు చేయాల్సిన భూములు చాలా ఉన్నాయని వీఆర్కు వెళ్లే రోజు పోలీసులతో సీఐ విజయకృష్ణ చెప్పినట్లు తెలిసిందన్నారు. రేషన్ మాఫియా నుంచి నెలకు రూ.25 లక్షల వసూళ్లు... నియోజకవర్గంలో రేషన్ మాఫియా నుంచి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రతి నెలా రూ.25 లక్షలు వసూలు చేయడం నిజం కాదా? అని బాలినేని ప్రశ్నించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా తన మీద, తన కుమారుడి మీద దామచర్ల తప్పుడు ఆరోపణలు ప్రచారం చేశాడన్నారు. దామచర్ల అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలను తాను నిరూపిస్తానని స్పష్టం చేశారు. డ్వాక్రా రుణాల్లో అవినీతి నీ ఇంట్లో జరిగింది నిజం కాదా? అని నిలదీశారు. దీనిపై వేసిన విచారణ అధికారులు ఏం తేల్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో రూ.8 కోట్ల అవినీతి జరిగిందని అధికారులను సస్పెండ్ చేశారని, మరి అవినీతి డబ్బులను రికవరీ ఎందుకు చేయడం లేదన్నారు. ఒంగోలులో ఉన్న మద్యం దుకాణాలు ఎమ్మెల్యే జనార్దన్వి కావా? అని ప్రశ్నించారు. రాజు పాలెంలో ఆయనకు ఎన్ని రొయ్యల చెరువులు ఉన్నాయో వెల్లడించాలన్నారు. తన హయాంలో జరిగిన భూ వివాదాలపై అప్పటి ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. సిట్కు అందిన ఫిర్యాదుల లిస్టు తెప్పించుకొని దామచర్ల పోలీసుల ద్వారా బెదిరించి సెటిల్మెంట్ చేసుకుంటున్నారని ఆరోపించారు. తన అనుచరుల మీద ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని బాలినేని ఆరోపించారు. ఇక నుంచి ఇక్కడే ఉంటూ అమీతుమీ తేల్చుకుంటానని బాలినేని స్పష్టం చేశారు. పోలీసు స్టేషన్లో బలవంతంగా రాజీ..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒంగోలు వెంకట సుబ్బారావుకు చెందిన భూములు కబ్జా చేశారని ఆరోపించిన దామచర్ల జనార్దన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో చెప్పాలని బాలినేని ప్రశ్నించారు. సుబ్బారావును స్టేషన్కు పిలిపించి బలవంతంగా రాజీ చేసి సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. పోలీసు స్టేషన్లో అగ్రిమెంట్ చేసుకోవడం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. దీనికి సంబంధించి తాలూకా పోలీసు స్టేషన్లో జరిగిన పంచాయితీ వీడియోను మీడియా ముందు బాలినేని ప్రదర్శించారు. కార్మిక నగర్లో 15 ఏళ్లుగా నివసిస్తున్న పేదల ఇళ్లను రౌడీలు కూల్చి వేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. -
నేటి నుంచి విజయవాడ మునిసిపల్ కాంట్రాక్టర్ల సమ్మె
పటమట (విజయవాడ తూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు సోమవారం నుంచి సమ్మెబాట పడుతున్నారు. ది విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాయన ఆదిబాబు, అధ్యక్షుడు చనుమోలు వెంకట రమణ.. మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరి నారాయణ, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశను కలిసి సమ్మె నోటీసులు అందజేశారు. విజయవాడ నగర మౌలిక సదుపాయాలు, అభివృద్ధిలో కీలక భాగస్వామ్యంగా ఉన్న తాము ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని, జనరల్ ఫండ్ ద్వారా ఈ ఏడాది జూలై 31 వరకు రూ.350 కోట్లు, కంటింజెంట్ బిల్లులు (సీ–బిల్లులు) రూ.40 కోట్లు, ఇతరత్రా రూ.10 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్ ఉన్నాయని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించనందున సోమవారం నుంచి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటినీ నిలిపేయటంతోపాటు కొత్త పనులను బాయ్కాట్ చేస్తున్నామని ప్రకటించారు. -
నేడు నల్ల బ్యాడ్జీలతో జూడాల నిరసన
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో జూనియర్ వైద్యులు (జూడాలు) సమ్మెకు సిద్ధమవ్వడంతో ప్రభుత్వం చర్చలకు పిలిచింది. వైద్య శాఖ కార్యదర్శి వీరపాండియన్ అధ్యక్షతన అధికారుల కమిటీ సోమవారం ఏపీ జూడా అసోసియేషన్తో సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి తలపెట్టిన సమ్మె కార్యాచరణలో ఏపీ జూడా అసోసియేషన్ స్వల్ప మార్పులు చేసింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలపనున్నారు. ప్రభుత్వంతో చర్చల అనంతరం వచ్చే స్పందన ఆధారంగా సమ్మెపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఈశ్వర్ శంకర్ ప్రకటించారు. జూడాల స్టైపెండ్ పెంపుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండ టంతో వీరంతా సమ్మెకు సిద్ధమ య్యారు. ప్రభుత్వం ప్రతి రెండేళ్లకు ఒకసారి స్టైపెండ్ను పెంచాల్సి ఉంది. యథావిధిగా నడవాల్సిన ఈ ప్రక్రియను చంద్రబాబు సర్కారు ఆలస్యం చేస్తూ వస్తోంది. దీంతో గత ఏడాది డిసెంబర్ నుంచి స్టైపెండ్ పెంచాలని జూడా అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వైద్య శాఖ ఉన్నతాధికారులు, మంత్రి, సీఎంకు పలుమార్లు విన్నవించినా ప్రభుత్వంలో మాత్రం చలనం లేకుండా పోయింది.ఈ నేపథ్యంలో ఈనెల ఒకటో తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లాలని ఏపీ జూడా అసోసియేషన్ నిర్ణయించింది. దీంతో జూడా ప్రతినిధులతో చర్చలు జరిపి సమ్మె వాయిదా వేసుకోవాలని ఉన్నతాధికారులు కోరారు. ఈ క్రమంలో వారం పాటు సమ్మె వాయిదా వేసుకుంటామని, ఆలోగా స్టైపెండ్ పెంపు ఉత్తర్వులు ఇవ్వా లని ప్రభుత్వానికి జూడా అసోసియేషన్ ప్రతినిధులు షరతు పెట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో జూడాలు సమ్మెకు సిద్ధమైపోయారు. తమిళనాడు విధానం అమలుఇప్పటి వరకూ రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకు ఓసారి 15 శాతం చొప్పున జూడాల స్టైపెండ్ పెంచడం ఆనవాయితీ. ఇలా పెంచుకుంటూపోతే ఆర్థిక భారం ఎక్కువ అవుతోందని చంద్రబాబు సర్కా రు భావిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు తరహాలో 3 శాతం వార్షిక పెంపు విధానం అమలుకు డీఎంఈ నుంచి ప్రభుత్వానికి ఉత్తర్వులు పంపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంబీబీఎస్/బీడీఎస్ ఇంటర్న్స్కు రూ.25,906, పీజీలకు రూ.60 వేల నుంచి రూ.64,767 మేర స్టైపెండ్ ఉంది. ఈ మేరకు 2024లో ఆగస్టులో ప్రభుత్వం స్టైపెండ్పెంపు నిర్ణయం తీసుకుంది. -
10వ తేదీ వచ్చినా వేతనాల్లేవ్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు 1న జీతాలు ఇస్తున్నామంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని ప్రతి నెలా రుజువవుతోంది. ముఖ్యంగా వైద్య, ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కింద సేవలు అందించే ఉద్యోగులకు ప్రతి నెల వారం, రెండు వారాల ఆలస్యంగా ప్రభుత్వం వేతనాలు ఇస్తోంది. ఆగస్టు 10వ తేదీ వచ్చినా జూలై నెల వేతనాలు జమ అవ్వని దుస్థితి నెలకొంది.దీంతో తక్కువ వేతనాలకు పనిచేస్తున్న చిరుద్యోగులు ప్రతి నెలా ఇంటి అద్దెలు, ఈఎంఐలు, కుటుంబ పోషణ, ఇతర ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటోందని ఎన్హెచ్ఎం జేఏసీ రాష్ట్ర అధ్యక్షురాలు దయామణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నెలా 1న జీతాలు అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో డీసీపీ కుమార్తె దుర్మరణం
గుంటూరు రూరల్: గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ వద్ద హైవేపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షేక్ షిరీన్బేగం కుమార్తె అఫీఫా(24) దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. అఫీఫా తాడేపల్లిలో జిమ్కు వెళుతుంటారు. జిమ్ యజమాని రుతి్వక్, రోజూ జిమ్కు వచ్చే వంశీ, సుదీర్, అవినాష్ లు ఆమెకు స్నేహితులయ్యారు. వీరు ఆదివారం చీరాల బీచ్కి వెళ్లేందుకు విజయవాడ నుంచి కారులో బయలుదేరారు. ఏటుకూరు బైపాస్ వద్ద హైవేలో వెళుతుండగా ముందువెళుతున్న ప్రభుత్వ పౌరసరఫరాలశాఖ రేషన్ తరలించే లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న కారు అదుపు తప్పి లారీని, డివైడర్ను ఢీకొంది. కారు డ్రైవ్ చేసు్తన్న అవినాష్, సుధీర్, వంశీ, రుత్విక్లు గాయపడ్డారు. కారు వెనుక సీట్లో కూర్చున్న అఫీఫా తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, గాయపడినవారిని హైవేలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం విషయం తెలిసి ఆస్పత్రికి చేరుకున్న డీసీపీ షిరీన్.. తన కుమార్తె మరణించిందన్న విషయం తెలిసి స్పృహ కోల్పోయారు. ఆమెకు వైద్యులు చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అఫీఫా మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. నల్లపాడు సీఐ భాస్కర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యంత బాధాకరం: మాజీ సీఎం జగన్ సాక్షి, అమరావతి: విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం కుమార్తె అఫీఫా(24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. గుంటూరు ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అఫీఫా మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుమార్తెను కోల్పోయిన షిరీన్ బేగం, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
అంతులేని అరాచకం!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రోత్సహించాల్సిన ప్రభుత్వమే పరిశ్రమలను అడ్డుకోవడానికి మించిన దుర్మార్గమేముంటుంది? రాయితీలు, ప్రోత్సాహకాలిచ్చి పరిశ్రమలను ఆహ్వానిస్తున్నామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం భారతీ సిమెంట్స్పై దారుణమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం కనుసన్నల్లో ఆరురోజులుగా సాగుతున్న దమనకాండను రాష్ట్రంలోని పరిశ్రమ వర్గాలు నిర్ఘాంతపోయి చూస్తున్నాయి. భారతీ సిమెంట్స్ను మూతపడేలా చేయడమే లక్ష్యమన్నట్లు టీడీపీ గూండాలు మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నా జిల్లా యంత్రాంగం కానీ, రాష్ట్ర స్థాయి అధికారులు గానీ స్పందించకపోవడాన్ని బట్టి ఇది ముఖ్యమంత్రి స్థాయిలో నేరుగా అమలు చేస్తున్న కుట్రగానే భావించాలని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దాదాపు 15 వేల మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి కల్పిస్తున్న భారతీ సిమెంట్స్ పరిశ్రమలో ఉత్పత్తి నిలిచిపోయింది. రెండు యూనిట్లు మూతపడ్డాయి. మైనింగ్ ప్రాంతంలోకి కార్మికులను, వాహనాలను పోనీయకుండా అడ్డుకుంటున్న పచ్చముఠాలు అక్కడ రేయింబవళ్లు పహారా కాస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల దన్నుతో స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి అనుచరుల ముసుగులో గూండాలు, రౌడీషీటర్లు ఈ దుర్మార్గాన్ని కొనసాగిస్తున్నారు. వాస్తవానికి ఓ పరిశ్రమ తన కార్యకలాపాలను చట్టబద్ధంగా చేసుకోవడానికి జిల్లా యంత్రాంగం తమవంతు సహకారం అందించాలి. వైఎస్సార్ కడప జిల్లాలో మాత్రం చట్టాలు చెల్లడం లేదు. అధికార పార్టీ మూకలు ఓ పథకం ప్రకారం ప్లాంటుకు రావాల్సిన ముడి ఖనిజాన్ని రాకుండా అడ్డుకుంటూ దౌర్జన్యానికి దిగుతూనే ఉన్నారు.ఆరురోజులుగా మైనింగ్కు అడ్డుకట్ట..భారతి సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం గడిచిన ఆరు రోజులుగా పలుమార్లు మైనింగ్ ప్రారంభించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.. ఒక్క అడుగు కూడా కదలనివ్వకుండా టీడీపీ గూండాలు రేయింబవళ్లు మైనింగ్ ప్రాంతంలోనే తిష్టవేసి మరీ అడ్డుకుంటున్నారు. కార్మికులు భయపడ్డట్లే భారతి సిమెంట్ పరిశ్రమలో శనివారం నుంచి సిమెంట్ ఉత్పత్తి ఆగిపోయింది. ప్లాంటులో ఉన్న సున్నపురాయి నిల్వలు కూడా నిండుకున్నాయి. మైనింగ్ నిర్వహించి, సున్నపురాయిని ప్లాంటుకు తరలించకపోతే, ప్లాంటులో సిమెంట్ ఉత్పత్తి కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని నాలుగు రోజులుగా భారతి సిమెంట్స్ యాజమాన్యం అధికారులకు వివరిస్తూనే ఉంది. అయినప్పటికీ జిల్లా అధికారులకు పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. ప్లాంటులో ముడిఖనిజం లేక సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయింది.15వేల కుటుంబాలపై ప్రభావం..గత 17సంవత్సరాలుగా భారతి సిమెంట్స్ పరిశ్రమలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదు.. ప్రత్యక్షంగా 3వేల మందికి, పరోక్షంగా 12వేల మందికి ఉపాధి పొందుతున్న పరిశ్రమపై చంద్రబాబు సర్కార్ కక్షబూనింది. పరిశ్రమ అంతర్భాగంగా ఉన్న మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకుని, భారతీ సిమెంట్స్ మూతపడేలా చేయాలన్నదే సీఎంఓ లక్ష్యమన్నట్లు కనిపిస్తోందని అధికారవర్గాలలోనూ చర్చ నడుస్తోంది. తాము చేయగలిగింది ఏమీ లేదని, పైనుంచి వస్తున్న వత్తిడి వల్లే ఏమీ చేయలేకపోతున్నామని జిల్లా అధికారల్లో చర్చ జరుగుతోంది. భారతీ సిమెంట్స్ కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల 15వేల మంది కార్మికుల జీవితాలు, వారి కుటుంబాలపై తీవ్రమైన ప్రభావం పడనుంది. -
ఎన్ని అడ్డంకులున్నా నేడు ర్యాలీలు ఆగవు
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే చెల్లించాలని, నిరుద్యోగ భృతి అమలును డిమాండ్ చేస్తూ సోమవారం (ఆగస్టు 10న) రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో వైఎస్సార్సీపీ చేపట్టనున్న ర్యాలీలను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ప్రయోగించడాన్ని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యన్నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సోమవారం వైఎస్సార్సీపీ శాంతియుత ర్యాలీలు నిర్వహిస్తుందని ఆయన తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయనొక ప్రకటన విడుదల చేస్తూ.. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించే ర్యాలీలకు అనుమతులు నిరాకరించడం, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎక్కడికక్కడ పోలీసులు నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. బొత్స ఇంకా ఏమన్నారంటే.. ప్రశ్నించే హక్కునూ కాలరాస్తున్నారు.. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించే హక్కును కూడా కాలరాయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గత కొన్నిరోజులుగా వైఎస్సార్సీపీ ఉద్యమాలు అత్యంత శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడిచాయి. అయినా అడ్డుకునేందుకు కుట్రలు చేయడం దుర్మార్గం. డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతోంది? విద్యార్థులు, నిరుద్యోగులు తమ సమస్యలపై శాంతియుతంగా గొంతెత్తితే పోలీసులతో అణిచివేయాలని చూడటం చంద్రబాబు ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనం.నోటీసులతో ప్రజాస్వామ్యాన్ని నిర్బంధించలేరు ఎన్నికలకు ముందు యువతకు పెద్దఎత్తున హామీలు ఇచ్చిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయకుండా మోసం చేస్తుండడాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థులు, యువత, ప్రతిపక్షంపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాయి. డీఎస్సీ ప్రక్రియపై నిష్పక్షపాత విచారణ కోరుతుంటే ప్రభుత్వం పోలీసు నోటీసులతో గొంతునొక్కుతోంది. అరెస్టులు, కేసులు, నోటీసులతో ప్రజాస్వామ్యాన్ని నిర్బంధించలేరు. ఎన్ని ఆటంకాలు కల్పించినా సోమవారం వైఎస్సార్సీపీ శాంతియుత ర్యాలీలు జరుగుతాయి. విద్యార్థులు, యువత భవిష్యత్తుతో ముడిపడిన ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించే వరకు తమ పార్టీ వారి తరఫున పోరాటాన్ని కొనసాగిస్తుంది. -
ఈనెల 13న కర్నూలుకు మాజీ సీఎం వైఎస్ జగన్
కర్నూలు (టౌన్): మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 13వ తేదీన కర్నూలుకు రానున్నట్లు ఎమ్మెల్సీ, పార్టీ ప్రోగ్రామ్ కో–ఆర్డీనేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. ఆదివారం కర్నూలులో తలశిల మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లి నుంచి కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారని పేర్కొన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సబ్జైలుకు వెళ్లి విరూపాక్షిని పరామర్శిస్తారని వెల్లడించారు. -
భార్యను హత్యచేసిన భర్త
రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాత తుంగపాడులో ఆదివారం భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. రాజానగరం సీఐ వీరయ్యగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నతనంలోనే పోలియో ఉన్న కమ్మిడి లక్ష్మణరావు (32)కు మానసిక వికలాంగురాలు శ్యామల (30)తో ఏడాది క్రితం వివాహమైంది. వీరిద్దరూ ఆ గ్రామంలోనే మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ నడుపుకుంటూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. జగనన్న కాలనీలో ఉంటున్న లక్ష్మణరావు అన్న కమ్మిడి రాంబాబు ఆదివారం లక్ష్మణరావుకు ఫోన్ చేశాడు. ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో తమ్ముడి ఇంటికి వచ్చి చూసేసరికి భార్యాభర్తలిద్దరూ విగతజీవులై కనిపించారు.రెండు చేతుల నుంచి రక్తం కారుతూ శ్యామల మృతి చెందగా, పక్కనే ఉరివేసుకుని లక్ష్మణరావు మరణించాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, వారి మరణానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. భార్యను హతమార్చి, తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను వివరిస్తూ మృతుడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. లక్ష్మణరావు తల్లితో కలిసి ఉంటున్నాడు. మూడేళ్ల క్రితం ఆమె మృతి చెందింది. శ్యామలతో వివాహమైన తరువాత కూడా తల్లిని మర్చిపోలేకపోయాడు. దీంతో ‘అమ్మ నీవు లేని ఈ జీవితం నాకు వద్దు, నీ వద్దకే వచ్చేస్తాను, నేను చనిపోతే శ్యామల ఒంటరిదైపోతుంది. కనుక ముందుగా ఆమెను చంపి, నేను చనిపోతాను’ అంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వీరయ్యగౌడ్ తెలిపారు. -
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?
కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: ‘నా కుమార్తెను కావాలని కారుతో మూడుసార్లు ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా తలపై నుంచి కారును పోనిచ్చారు. వాళ్లు మనుషుల రూపంలో ఉన్న మృగాలు. నా బిడ్డ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. అయ్యా చంద్రబాబూ.. నీకు జాలిలేదా? అమ్మా అనితమ్మా.. నీకు ఆడ పిల్లల్లేరా? పవన్కళ్యాణ్.. నీకు మనసు లేదా?’ అంటూ మెడికో పీజీ డాక్టర్ ప్రియాంక తండ్రి వెంకటేష్ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రియాంక కేసును రాజకీయ ఒత్తిళ్లతో తారుమారు చేస్తున్నారనే అనుమానంతో ఆదివారం రాజమహేంద్రవరంలోని ప్రకాశ్నగర్ పోలీస్స్టేషన్కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.ఘటన అనంతరం ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారం అందలేదని, ఆసుపత్రి ఖర్చుల విషయంలోనూ సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఒకసారి ‘మీకు మేమున్నాం.. బాధపడకండి’ అంటూ ఫోన్ చేశారని, ఆ తర్వాత ఎలాంటి స్పందన లేదన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి లోకేశ్ కనీసం స్పందించక పోవడంపై వెంకటేష్ ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటనపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు. ప్రియాంకను హైదరాబాద్కు తరలించి చికిత్స అందిస్తున్నామని, ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యంకు ఫోన్ చేసి అందుతున్న చికిత్సపై ఒక్కసారైనా ఫోన్ చేశారా? మెరుగైన సేవలు అందించండని ప్రభుత్వం నుంచి మెస్సేజైనా పెట్టారా? ప్రభుత్వం పని చేస్తుందో లేదో అర్థం కావడం లేదు. మూడు సార్లు కావాలనే కారుతో ఢీకొట్టి, ఆ తర్వాత తలపై నుంచి కారును పోనిచ్చారంటే చంపాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. నిందితులు ఘటన తర్వాత కూడా సాధారణంగానే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లారని ఆరోపించారు. చట్టాలపై ప్రజలకు నమ్మకం కలగాలంటే కఠినంగా అమలు చేయాలని, తమకు న్యాయం చేయాలని వెంకటేష్ వేడుకున్నారు. ‘ఇంత దారుణానికి పాల్పడిన మృగాలను కఠినంగా శిక్షించండి.. ఉరి తీయండి’ అంటూ కన్నీటితో విజ్ఞప్తి చేశారు.మా కడుపు కోతను అర్థం చేసుకోండి‘మా కుటుంబంలో మొదటి డాక్టర్ కాబోతోందని, ఎంతో మంచి పేరు వస్తుందని ఆశించాం. ఒకరు సక్సెస్ అయితే ఎంతో మందికి ఇన్స్ఫిరేషన్గా ఉంటుందని ఆశపడ్డాం. నాకు ముగ్గురూ అమ్మాయిలే. మీకు పెళ్లిళ్లు చేశాక మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారని మాట్లాడినప్పుడు మొత్తం కుటుంబాన్ని నేను చూసుకుంటానని హామీ ఇచ్చింది ప్రియాంక. అలాంటి మెడికల్ పీజీ విద్యార్థిని అందమైన జీవితాన్ని చిదిమేశారు. మా కలల సౌధం కూల్చేశారు. మా కడుపు కోతను అర్థం చేసుకోండి. ఈ ఘటన మా కుటుంబానికి తీరని లోటు. మద్యం మత్తులో ఆడపిల్లను హత్య చేసిన వారు హాయిగా తిరగొచ్చా? చట్టాలపై భరోసా రావాలంటే సమాజంలో భయం కలిగేట్లు చేయండి’ అని వెంకటేశ్ కన్నీటిపర్యంతమయ్యారు. కీలక ఆధారాలు సేకరించాంవైద్య విద్యార్థిని ప్రియాంక కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించి నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ తెలిపారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 3న రాత్రి స్వతంత్ర ఆసుపత్రి నుంచి సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లగా ప్రియాంక వెంటిలేటర్పై ఉన్నట్లు తెలిపారు. ఆమె స్నేహితుడు ఉమేష్ నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశామన్నారు. మరుసటి రోజు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా, ప్రియాంక ప్రయాణిస్తున్న బైక్ను కారుతో మూడుసార్లు ఢీకొట్టినట్లు గుర్తించామని చెప్పారు. దీంతో ఇది ప్రమాదం కాకుండా ఉద్దేశ పూర్వకంగా జరిగిన ఘటనగా కేసు నమోదు చేసి, ఈ నెల 6న నిందితులిద్దరినీ రిమాండ్కు పంపినట్లు తెలిపారు. నిందితుల నేర చరిత్రపైనా ఆరా తీశామన్నారు. కారు నంబర్ ప్లేట్లు తొలగించి డిక్కీలో పెట్టారని, మొదటి నిందితుడు దస్వంత్ కారులోనే నిద్రిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. దస్వంత్ చెన్నైలో బీటెక్ చేశాడని, విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని, రెండో నిందితుడు జోసెఫ్ ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్నాడని తెలిపారు. ప్రియాంక మృతి చెందితే కేసును హత్య కేసుగా మారుస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు : సీఎం చంద్రబాబురాజమండ్రిలో ఈ నెల 3వ తేదీన ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో పీజీ మెడికో ప్రియాంక ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా అధికారులతో ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో సీఎం మాట్లాడారు. ప్రియాంక మృతికి కారణమైన నిందితులు ఇప్పటికే అరెస్టై జైల్లో ఉన్నారని ఎస్పీ వివరించారు. నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారిపై కఠిన సెక్షన్లతో శిక్షలు పడేలా చూడాలని, బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆరి్థక సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.వారం రోజులు మృత్యువుతో పోరాడి రాజమహేంద్రవరంలో ఈ నెల 3వ తేదీన కారుతో మూడు సార్లు ఢీకొట్టి.. తలపై నుంచి ఎక్కించడంతో తీవ్ర గాయాలపాలైన మెడికో పీజీ డాక్టర్ ప్రియాంక (28) ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మృతి చెందినట్లు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ప్రియాంక తల్లిదండ్రులు కర్నూలు నుంచి వెళ్లి జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంటున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రియాంక రాజానగరంలోని జీఎస్ఎం మెడికల్ కళాశాలలో డెర్మటాలజీ పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఘటన జరిగిన తర్వాత నుంచి ఆమెకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారు. -
డీఎస్సీలో అక్రమాలు జరిగినా మాట్లాడకూడదా?
కర్నూలు (సెంట్రల్)/కల్లూరు: డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై మాత్రమే వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోందని.. కానీ, వాటిని ప్రశ్నించకూడదన్నట్లుగా టీడీపీ నేతల ప్రవర్తన ఉంటోందని వైఎస్సార్సీపీ నేత, మాజీమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. ఆదివారం కర్నూలులోని కాటసాని రాంభూపాల్రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై తమ పార్టీ ప్రశ్నిస్తుంటే టీడీపీ నాయకులు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇందులో భాగంగానే ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులతో ర్యాలీలకు తెరతీశారన్నారు. డీఎస్సీ–2025లో ఉద్యోగాలు పొందిన వారందరూ అక్రమ మార్గాల్లో పోస్టులు సాధించినట్లు తమ పార్టీ ఎక్కడా చెప్పలేదని బుగ్గన స్పష్టంచేశారు. అయితే వారు తమ పార్టీపై అభాండాలు వేస్తూ ర్యాలీల్లో పాల్గొనడం దురదృష్టకరమన్నారు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో నిబంధనలు పాటించలేదని, ఏదో ఒక ఫెడరేషన్ సర్టిఫికెట్ ఎలా చెల్లుబాటవుతుందని ఆయన ప్రశ్నించారు. సర్టిఫికెట్లను రూ.15 లక్షలు నుంచి రూ.25 లక్షల వరకు అమ్ముకున్నారని, ఇందులో టీడీపీ నేతల ప్రమేయం ఉందన్నదే తమ పార్టీ ఆరోపణ అన్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై సీబీఐ విచారణ, లోకేశ్ రాజీనామా చేసేవరకు తమ పార్టీ పోరాడుతూనే ఉంటుందని తేల్చి చెప్పారు. -
ప్రపంచ బ్యాంకు తేల్చిన నిజం.. వైఎస్ జగన్ హయాంలోనే 'ఆరోగ్య భాగ్యం'
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రాథమిక స్థాయి నుంచి సమూలంగా సంస్కరించారని ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రశంసించింది. విలేజ్ క్లినిక్స్, పట్టణ క్లినిక్స్తో పాటు తొలిసారిగా వినూత్న రీతిలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేయడం గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు ఎంతో మేలు చేసిందని విశ్లేషించింది. టెలి మెడిసిన్ ద్వారా గత ప్రభుత్వంలో ప్రజలకు భారీ ఎత్తున సేవలు అందాయని తెలిపింది. ఇక వైద్య ఆరోగ్య వ్యవస్థలో జీరో వేకెన్సీ విధానాన్ని అమలు చేస్తూ రెండేళ్లలోనే సుమారు 50,000 మంది వైద్య సిబ్బందిని నియమించారని పేర్కొంది. రాష్ట్ర ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలందించడంలో మాజీ సీఎం వైఎస్ జగన్ది ప్రభుత్వ రంగం బాట అయితే సీఎం చంద్రబాబుది ప్రైవేట్ రంగం బాట అని ప్రపంచ బ్యాంకు నివేదిక కుండబద్దలు కొట్టింది. వైద్య కళాశాలలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లాంటి వాటిని నడపడం కోసం చంద్రబాబు సర్కారు ప్రైవేట్ రంగం, అవుట్ సోర్సింగ్పై ఆధారపడటం ప్రారంభించిందని ప్రపంచ బ్యాంకు నివేదికలో స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ బలోపేతం ప్రాజెక్టును అమలు చేసింది. ఆ ప్రాజెక్టు అమలు ఫలితాల నివేదికను ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసింది. వైద్య ఆరోగ్య రంగంలో సేవలపై వైఎస్ జగన్ విధానాలు, చంద్రబాబు సర్కారు పోకడలపై ఈ నివేదికలో ప్రపంచ బ్యాంకు పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించింది. ఆ వివరాలివీ...⇒ ప్రపంచ బ్యాంకు నుంచి ప్రాజెక్టు ఆమోదం పొందిన వెంటనే వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రైవేట్ రంగ కాంట్రాక్టులపై ఆధారపడకుండా ప్రభుత్వ రంగంలో వైద్య సేవల నాణ్యత మెరుగుదల, ఆరోగ్య సేవలను విస్తరించడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ప్రాజెక్టు లక్ష్యాలను సాధించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం నిబద్ధత, అంకిత భావంతో పనిచేసింది. ముఖ్యమంత్రి క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించడంతో పాటు అగ్ర రాజకీయ నాయకత్వం ప్రాజెక్టుకు స్పష్టమైన ప్రాధాన్యత ఇచ్చింది. నిరంతర పర్యవేక్షణ, క్రమం తప్పకుండా సమీక్షలు ఫలితాల సాధనకు దోహదం చేశాయి. తద్వారా ప్రభుత్వ రంగంలోనే మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యాన్ని సాధించింది.⇒ వైద్య ఆరోగ్య రంగంలో దీర్ఘకాలంగా అనుసరిస్తున్న మూస విధానాలను పక్కనపెట్టి మాజీ సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఉదాహరణకు మెరుగైన ఆరోగ్య సేవలు, నాణ్యత అనే లక్ష్యాలను సాకారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్లో ‘సున్నా ఖాళీల విధానం’ (జీరో వేకెన్సీ) పాలసీని అమలు చేశారు. సిబ్బంది నియామకాలను హేతుబద్ధీకరించారు. అడ్డంకులను తొలగించి భారీ నియామక కార్యక్రమాన్ని చేపట్టారు. వైద్య ఆరోగ్య సిబ్బందికి ప్రోత్సాహకాలు, పదోన్నతులు కల్పించారు. మారుమూల ప్రాంతాలలో పని చేసినందుకు అదనపు వేతనాన్ని అందచేశారు. అరుదైన నైపుణ్యాలు కలిగిన వైద్య నిపుణులను ఆకర్షించేందుకు సాధారణం కంటే ఎక్కువ వేతనాలు ప్రకటించి ప్రజారోగ్యం పట్ల నిబద్ధత చాటుకున్నారు.⇒ ‘జీరో వేకెన్సీ’ విధానంలో భాగంగా వేగంగా నియామకాలు చేపట్టేందుకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు. జీతభత్యాలు, ప్రోత్సాహకాలను సవరించారు. పీజీ వైద్య విద్యార్థులందరికీ తప్పనిసరి గ్రామీణ సేవను ప్రవేశపెట్టారు. అన్ని పీహెచ్సీలు, వీహెచ్సీ (విలేజ్ హెల్త్ క్లినిక్)లలో తగినంత మంది సిబ్బందిని నియమించారు. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, 12 మంది పారామెడికల్ సిబ్బంది... ప్రతి వీహెచ్సీలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంతో పాటు ఆశాలు సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. రెండేళ్లలోనే సుమారు 50,000 మంది వైద్య ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించారు.⇒ ప్రజలు దూర ప్రాంతాల నుంచి వైద్య నిపుణులను సంప్రదించేందుకు టెలిమెడిసిన్ వేదికను ప్రారంభించారు. ఇది ముఖ్యంగా గ్రామీణ, గిరిజన జనాభాకు ప్రయోజనం చేకూర్చింది. రోజూ 75,000కిపైగా టెలికన్సల్టేషన్లు, ప్రిస్క్రిప్షన్లు అందచేశారు. దేశవ్యాప్తంగా జాతీయ టెలికన్సల్టేషన్లలో దాదాపు మూడింట ఒక వంతు ఆంధ్రప్రదేశ్లోనే నమోదయ్యాయి.⇒ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచి ఆరోగ్య రంగం మౌలిక సదుపాయాల బలోపేతం, పునర్నిర్మాణం చేపట్టింది. ప్రతి పీహెచ్సీని 12–13 వీహెచ్సీలకు మ్యాప్ చేశారు. ప్రతి వీహెచ్సీ పరిధిలో 2,500–4,500 మంది జనాభాకు సేవలందాయి (గిరిజన ప్రాంతాలలో స్థానిక అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేశారు). 4,345 కొత్త వీహెచ్సీలు, 88 కొత్త పీహెచ్సీలు ఏర్పాటు చేశారు. 977 గ్రామీణ, 184 పట్టణ పీహెచ్సీలను పునరుద్ధరించారు. హెల్త్ వెల్నెస్ సెంటర్లు రెట్టింపు చేయడం ద్వారా 10,086కు చేరాయి. అధిక రక్తపోటు, మధుమేహం, సాధారణ క్యాన్సర్ల కోసం స్క్రీనింగ్, తల్లి, శిశు ఆరోగ్య సంరక్షణ, కుటుంబ నియంత్రణ, నోటి ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, అత్యవసర ప్రసూతి సంరక్షణతో కూడిన విస్తరించిన సేవలను అందించడానికి అవసరమైన పరికరాలు, సిబ్బందిని సమకూర్చారు.⇒ 2022–23లో నిర్వహించిన ఎన్సీడీ–2 సర్వే ద్వారా రాష్ట్ర జనాభాలో సుమారు 80 శాతం మందికి స్క్రీనింగ్ నిర్వహించి ప్రత్యేకంగా ఆరోగ్య గుర్తింపు కార్డు కేటాయించారు. ⇒ అత్యవసర మందుల జాబితాలోని 105 ఔషధాలు, 14 ప్రాథమిక రోగ నిర్ధారణ పరీక్షల సామర్థ్యంతో మొబైల్ మెడికల్ యూనిట్లను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించారు. ప్రతి జిల్లాలో ఒక రిజర్వ్ మొబైల్ మెడికల్ యూనిట్ను ఏర్పాటు చేశారు. అవసరమైనప్పుడు విధులు నిర్వర్తించడానికి నలుగురు అదనపు వైద్యులను కేటాయించారు. వైద్యుడితో పాటు ప్రతి యూనిట్లో డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉండేలా చర్యలు తీసుకున్నారు.⇒ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ను అధికారికంగా 2023 ఏప్రిల్లో ప్రారంభించారు (2022 అక్టోబర్లో పైలట్ దశ తర్వాత). ఈ కార్యక్రమం కింద మొబైల్ మెడికల్ యూనిట్తో సహా డాక్టర్ ప్రతి నెలా రెండు సార్లు విలేజ్ హెల్త్ క్లినిక్స్ను సందర్శించారు. క్రమబద్ధమైన షెడ్యూల్తో వైద్యులను ఇంటి వద్దకే పంపించారు. ⇒ అన్ని ఆరోగ్య కేంద్రాలలో టెలికమ్యూనికేషన్ కనెక్టివిటీ, డిజిటల్ పరికరాలు ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది అందరికీ కొత్త డిజిటల్, వైద్య సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంలో శిక్షణ ఇచ్చారు. సెంట్రల్ డిజిటల్ క్వాలిటీ డాష్బోర్డ్ ద్వారా ఎప్పటికప్పుడు పనితీరు సూచికలను విశ్లేషించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు.కోవిడ్లో కాపాడారు..!⇒ కోవిడ్ సమయంలో 10,000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, ఇన్ఫెక్షన్ నివారణ సామగ్రితో సహా కీలకమైన వైద్య సామగ్రిని అందుబాటులో ఉంచారు. జిల్లా, బోధనాస్పత్రులలో ప్రత్యేకంగా కోవిడ్ వార్డులు, ఆక్సిజన్తో కూడిన పడకలు, క్రిటికల్ కేర్ యూనిట్లను సిద్ధం చేశారు. 100కు పైగా ప్రయోగశాలలకు కోవిడ్ పరీక్షా సామర్థ్యాన్ని కల్పించారు. మారుమూల ప్రాంతాలకు మొబైల్ పరీక్షా యూనిట్లను పంపించారు. గ్రామీణ, అణగారిన వర్గాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని చికిత్స, వ్యాక్సినేషన్ సకాలంలో అందించి ప్రజల ప్రాణాలను కాపాడారు. -
ఐషర్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
పామిడి: అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. సీఐ శివశంకర్ నాయక్ తెలిపిన మేరకు.. ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సు ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్, 35 మందితో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. అలాగే, ఐషర్ వాహనం జిమ్ పరికరాలతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతోంది. పొగరూరు గ్రామం వద్ద ఐషర్ వాహనం అదుపుతప్పి నీలూరు పుల్లేటి వంక బ్రిడ్జి ప్రారంభంలో ఉన్న డివైడర్ను ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా తిరిగింది. దాని వెనకే వేగంగా వస్తోన్న ట్రావెల్స్ బస్సు నియంత్రణ కోల్పోయి ఐషర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ రెండు వాహనాలూ బ్రిడ్జిపై నుంచి కిందకు దూసుకువెళ్లి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్కు ఎడమకాలు విరగ్గా, ఐషర్ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. బస్సులోని 25 మంది గాయాలపాలయ్యారు. వారిని స్థానికులు ఆస్పత్రులకు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమించడంతో అనంతపురం నుంచి బెంగళూరు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుపతిలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
తిరుపతి సిటీ: నీట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి ఎస్వీ నగర్కు చెందిన సాయి మేఘన (18) తల్లిదండ్రులు కూలీలు. తమ కుమార్తెను డాక్టర్గా చూడాలనే ఆకాంక్షతో వారు ఆమెను కష్టపడి చదివించారు. దానికి ప్రతిఫలంగా సాయిమేఘన ఇంటర్ బైపీసీలో ఉత్తమ మార్కులు సాధించి తిరుపతిలోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో నీట్ లాంగ్టర్మ్ శిక్షణ తీసుకుంది. ఈ ఏడాది మే లో జరిగిన నీట్ పరీక్ష రాసింది. అందులో 499 మార్కులు వచ్చాయి. అయితే నీట్ పేపర్ లీక్ కావడంతో ఎన్టీఏ మళ్లీ పరీక్ష నిర్వహించగా అందులో ఆమెకు 390 మార్కులే వచ్చాయి. దీంతో డాక్టర్ కావాలనుకున్న ఆమె ఆశ నిర్వీర్యమైందనే మనోవేదనతో 10 రోజుల క్రితం సాయిమేఘన ఆత్మహత్య చేసుకుంది. కానీ కుటుంబీకులు ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక మదనపడుతూ ఆదివారం కర్మక్రియలు నిర్వహించారు. అక్కడికి పలువురు ఎస్ఎఫ్ఐ నేతలు వచ్చి నివాళులర్పించిన సమయంలో అసలు విషయం బయటపడింది. దీంతో సాయిమేఘన కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. -
ఆ ఓట్లు ఎలా పడ్డాయో చెప్పండి
సాక్షి, అమరావతి : ‘ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగనంత వేగంగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగిందని చెబుతున్నారు. నిమిషానికి మూడు ఓట్లు పడేంత వేగంగా పోలింగ్ ఎలా సాధ్యమైంది? దీనిపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి. 2024 ఎన్నికల ఫలితాలను ప్రజా తీర్పు అనడం కష్టం’ అని ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు. స్వర్ణాంధ్ర వేదిక ఆధ్వర్యంలో ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల మాయాజాలం–వాస్తవాలు’ అంశంపై ఆదివారం విజయవాడలో జరిగిన సదస్సులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కె. బాలగంగాధర్ తిలక్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరకాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా 2024 ఏపీ ఎన్నికల పోలింగ్ గణాంకాలను విశ్లేషించారు. మే 13న సాయంత్రం 5 గంటలకు 68.04 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించగా, తుది లెక్కల్లో పోలింగ్ 81.79 శాతంగా నమోదైందన్నారు. ముఖ్యంగా రాత్రి 11.45 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల మధ్య 3,500 పోలింగ్ కేంద్రాల్లో 17,19,482 ఓట్లు నమోదయ్యాయని, అంటే ఒక్కో బూత్లో సగటున 492 ఓట్లు, నిమిషానికి 3.6 ఓట్లు చొప్పున పోలైనట్లు వివరించారు. పగటి సమయంలో ఒక్కో బూత్లో సగటున గంటకు 60.7 ఓట్లు మాత్రమే పోలవగా, అర్ధరాత్రి సమయంలో గంటకు 200కు పైగా ఓట్లు ఎలా నమోదయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఒక్కో ఓటుకు సుమారు 20 సెకన్ల సమయం మాత్రమే పట్టిందని, ఇది సాధ్యమేనా అని సందేహం వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో ఒక్క ఓటు వేయడానికి 76 నుంచి 123 సెకన్ల సమయం పడుతోందని తెలిపారు.ఓటర్ల వీడియోలు బయట పెట్టండిఅర్ధరాత్రి పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలో నిలబడ్డారంటే, వారి వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలు ఎందుకు బయటపెట్టడం లేదని పరకాల ప్రశ్నించారు. పోలింగ్ సిబ్బంది రికార్డు పుస్తకాల్లో క్యూలో ఉన్న ఓటర్ల వివరాలు నమోదు చేశారా అని ప్రశ్నించారు. నమోదు చేస్తే వాటిని వెల్లడించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఈవీఎంల ద్వారా నమోదయ్యే ఓట్లపై అనుమానాలు ఉన్నాయని, ఓటరు వేసిన ఓటు సరిగ్గా నమోదైందని, అదే లెక్కించబడిందని నిర్ధారించడమే ప్రజాస్వామ్య లక్ష్యమని అన్నారు. జర్మనీ వంటి దేశాలు ఈవీఎంలను పక్కనపెట్టి బ్యాలెట్ విధానాన్ని అనుసరిస్తున్నాయని చెప్పారు. వీవీప్యాట్ స్లిప్పులను ఎందుకు లెక్కించరు?ఓట్ల లెక్కింపుపై అనుమానాలు ఉంటే వీవీప్యాట్ స్లిప్పులను ఎందుకు లెక్కించడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ప్రశ్నించారు. అర్ధరాత్రి భారీగా పోలింగ్ జరిగిందని చెబుతున్నప్పుడు దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు ఎందుకు చూపించడం లేదని నిలదీశారు. ఈవీఎంలలో అవకతవకలకు అవకాశం ఉందన్న అంశాన్ని గతంలో చంద్రబాబే ప్రస్తావించారని, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నందున ఈ అంశంపై విచారణ జరిపించి వాస్తవాలను వెల్లడించాలని కోరారు. సర్ పేరుతో చాలా మంది ఓట్లు తీసేస్తున్నారని, ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో స్టాలిన్, మమతా బెనర్జీ ఓటమి చెందిన నియోజకవర్గాల్లో అదే జరిగిందని, ఏపీలోనూ అదే పరిస్థితి వస్తుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ మాట్లాడుతూ, ఒక బూత్కు చెందిన ఓటర్లను మరో బూత్కు తరలించి, గంటల తర్వాత అర్ధరాత్రి వరకు ఓట్లు వేయించిన ఘటనను వివరించారు. ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ సదస్సులో పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, విశ్లేషకులు పాల్గొన్నారు.రాజ్యాంగ పరిరక్షణకు ప్రజా సైన్యం కావాలి: పరకాలరాజ్యాంగ విలువలను ధ్వంసం చేసే శక్తులు బలపడుతున్న ప్రస్తుత తరుణంలో రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ప్రజలతో కూడిన ఒక బలమైన సైన్యం తయారు కావాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, దేశ ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విలువలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భారతదేశ ప్రజలమైన మనం (వి ద పీపుల్ ఆఫ్ ఇండియా) సంస్థ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం విజయవాడలోని నాస్తిక కేంద్రం (డాక్టర్ సమరం హాస్పిటల్)లో తెలుగు రాష్ట్రాల సదస్సు నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన డీవీవీఎస్ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి విశిష్ఠ అతిథిగా హాజరైన పరకాల ప్రభాకర్ ‘దేశంలో ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యలు–పౌర సమాజం కర్తవ్యాలు’ అనే అంశంపై ప్రసంగించారు. గతంలో ఐరోపా దేశాల్లో మైనార్టీలు ఎదుర్కొన్న పరిస్థితులను పరకాల ప్రభాకర్ వివరించారు. ప్రస్తుతం దేశంలో ఎస్ఐఆర్ (సర్) పేరుతో భారీ స్థాయిలో ఓట్ల తొలగింపు జరుగుతోందని పరకాల ప్రభాకర్ విమర్శించారు. తద్వారా ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, ఆదివాసీలు, నిరుపేదలు, రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవించే వర్గాలే ఎక్కువగా ప్రభావితమవుతున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ సమరం, సంస్థ వ్యవస్థాపకులు కటారి శ్రీనివాసరావు, బండ్ల శ్రీనివాస్, మనోరమ, చుండూరి రాజేంద్ర ప్రసాద్, రిటైర్డ్ జడ్జి అడవాల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో భారీగా అవకతవకలు, అక్రమాలు జరిగాయని ఏపీ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ కూటమి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. విజయవాడ ప్రెస్క్లబ్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో జేఏసీ కన్వీనర్ ఎంబేటి రామచంద్ర, నిరుద్యోగ జేఏసీ కో–కన్వినర్ రామ్ షా మాట్లాడారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. అర్హతలు, పరీక్షలు లేకుండానే కొంతమందికి సబ్జెక్ట్ టీచర్ పోస్టులు కల్పించేందుకు జీఓ నెం.4ను తీసుకురావడం.. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అవకతవకలు.. 1:1 సర్టిఫికెట్ వెరిఫికేషన్, స్పోర్ట్స్ సర్టిఫికెట్ల పరిశీలన అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. వారు ఇంకా ఏమన్నారంటే.. ఎందుకింత వివాదానికి తెరలేపారు? ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కేటాయింపులు, జీఓ నెం.4 తెచ్చిన మార్పులు, పేపర్ లీకేజీ అనుమానాలు లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా డీఎస్సీపై కోర్టులో 330 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో 60కి పైగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించినవే. ఇంత వివాదానికి ఎందుకు తెరలేపారు? ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణ జరిపించాలి. అసలు డీఎస్సీలో దాదాపు 32 వేల వినతిపత్రాలు, అభ్యంతరాలు ఎందుకొచ్చాయి? 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్కు పిలిచారంటేనే ఉద్యోగం వస్తుందని అభ్యర్థులు ఆశపడతారు. కానీ, చివరికి స్పోర్ట్స్ కోటా పేరుతో వారిని బయటకు పంపడం ఎంతవరకు సమంజసం? డీఎస్సీకి సరిగ్గా ఒకరోజు ముందు (ఏప్రిల్ 19న) తీసుకొచ్చిన జీఓ.4 తీవ్ర వివాదాస్పదమైంది. ఎటువంటి పరీక్షలు, అర్హతలు లేకపోయినా సబ్జెక్ట్ టీచర్లుగా పోస్టులిచ్చేలా ఈ జీఓ తెచ్చారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఇలా ఎలా మినహాయింపులు ఇస్తారు? రహస్యంగా డీఎస్సీ ప్రక్రియ ముగింపు.. ఇక చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డీఎస్సీ మెరిట్ లిస్ట్, కటాఫ్ మార్కులు, సెలెక్షన్ లిస్టులను డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ హెడ్ క్వార్టర్లలో లేదా వెబ్సైట్లో బహిరంగంగా పెట్టలేదు. కేవలం వ్యక్తిగత లాగిన్స్, మొబైల్స్కు మాత్రమే సమాచారం పంపి గోప్యంగా ప్రక్రియ ముగించారు. ఒక కోచింగ్ సెంటర్ నిర్వహకుడి భార్యకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం వెనుక ఉన్న అంతర్గత లింకులు బయటకు రావాలి. ఈ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలి. ప్రభుత్వం స్పందించకపోతే ఐక్య కార్యాచరణ ద్వారా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతాం. -
డీఎస్సీ అక్రమాలపై ఉద్యమం మరింత ఉధృతం
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం సాగించిన అక్రమాలపై వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సోమవారం భారీ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ శ్రేణులు, యువత స్వచ్ఛందంగా ర్యాలీల్లో పాల్గొని సర్కారుకు తమ నిరసనను తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను అడ్డంపెట్టుకుని ర్యాలీలను అడ్డుకునేందుకు కుట్రలకు తెరతీసింది. దమనకాండను దాటుకుని రిలే దీక్షలు విజయవంతంమెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను దగా చేశారని... డీఎస్సీ స్కామ్కు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని.. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలపై చంద్రబాబు సర్కారు దమనకాండ సాగించింది. 175 నియోజకవర్గాల్లో గాంధేయ మార్గంలో రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే టెంట్లను తొలగించేందుకు కుట్ర చేసింది. కొన్నిచోట్ల టీడీపీ నేతలతో పాశవికంగా దాడులు చేయించడంతోపాటు పోలీసులతో అక్రమ అరెస్టులకు పాల్పడింది. చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినీని ఈడ్చుకెళ్లడం, జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి, ఆయన సతీమణిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడం, విజయవాడలో దీక్షా శిబిరంపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా దాడి చేయడం, ఆ పార్టీ నాయకుడు బుద్దా వెంకన్న వర్గం బెదిరింపులకు దిగడం రాష్ట్ర ప్రజలంతా చూశారు. అయినప్పటికీ ఈ దీక్షలు విజయవంతం కావడం, జెన్–జీ(యువత) కదం తొక్కడంతో రోజురోజుకూ ఉద్యమం రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. అంతేకాకుండా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతితోపాటు ఎన్నికల్లో యువతకు ఇచ్చిన అన్ని హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలనే డిమాండ్లు దీక్షా శిబిరాల్లో పెద్ద ఎత్తున వినిపించాయి. యువతను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని జెన్–జీ మండిపడింది. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు లోకేశ్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించింది. ధర్మేంద్ర ప్రధాన్ తరహాలో లోకేశ్ రాజీనామా చేయాల్సిందే... నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, అదే తరహాలో డీఎస్సీలో అక్రమాలకు పక్కా ఆధారాలు ఉన్నాయని బాధిత అభ్యర్థులు వెల్లడిస్తున్నందువల్ల నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో లోకేశ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ జెన్–జీ, రాష్ట్ర ప్రజల నుంచి బలంగా వినిపిస్తోంది. దీంతో తన తనయుడు లోకేశ్ రాజకీయ భవిష్యత్పై చంద్రబాబులో తీవ్ర ఆందోళన నెలకొంది. డీఎస్సీ అక్రమాలపై జెన్–జీ, ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను డైవర్ట్ చేసేందుకు ఆయన కొత్త పన్నాగాలు పన్నుతున్నారు. దీక్షా శిబిరాల్లో ఉన్నవారిని రౌడీలు, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లుగా చంద్రబాబు చిత్రీకరించారు. అయినా యువత ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ‘పోలీసులతో అడ్డుకున్నా... మాపై అక్రమ కేసులు పెట్టినా మా పోరాటం ఆగదు. రిలే దీక్షలు ముగిసినా సోమవారం 175 నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యవాదులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తాం’ అని విద్యార్థులు, యువత, నిరుద్యోగులు స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. మలిదశ ఉద్యమంలో భాగంగా ఆందోళన కార్యక్రమాలను సోమవారం వైఎస్సార్సీపీ ప్రకటించనుంది. శాంతియుత ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసుల నోటీసులుఇదిలా ఉండగా, వైఎస్సార్సీపీ ర్యాలీలకు అనుమతి లేదంటూ ఆయా నియోజకవర్గ నేతలకు పోలీసులు నోటీసులిచ్చారు. 175 నియోజకవర్గ కేంద్రాల్లో శాంతియుతంగా చేపట్టే ర్యాలీలకు అనుమతి ఇవ్వాలని చట్టబద్ధంగా పోలీసులను వైఎస్సార్సీపీ నేతలు కోరారు. -
వ్యవస్థలు నిర్వీర్యం.. ప్రియాంక కేసే నిదర్శనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం ఏ స్థాయిలో నిర్వీర్యమైపోయాయో రాజమండ్రిలో మెడికల్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి ఘటన మరోసారి రుజువు చేసిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ ఘటనపై ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. ఆగస్టు 3వ తేదీ రాత్రి ఓ షాపింగ్మాల్ గేటు బయట ఘటన జరిగినా, నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసినా పోలీసులు వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించి, ఘటన తీవ్రతకు అనుగుణంగా కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించారని జగన్ పేర్కొన్నారు. కానీ, ఘటనను సాధారణ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి, నిందితులను కూడా వదిలేసి చేతులు దులుపుకోవడం అత్యంత దారుణమన్నారు. నిందితులు డాక్టర్ ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటర్ను కారుతో ఢీకొట్టడమే కాకుండా, ఆ తర్వాత కూడా అమానవీయంగా ప్రవర్తించారని జగన్ ఆరోపించారు. బాధితురాలి మీదుగా కారు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఎందుకు ఇంత అలసత్వంగా వ్యవహరించిందో తేల్చేందుకు పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.సామాన్యుల కేసుల్లో చట్టం ఎందుకు పనిచేయదు?ప్రతిపక్ష నేతలపైనా, ప్రశ్నించేవారిపైనా, ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపేవారిపైనా ‘రెడ్బుక్ రాజ్యాంగం’ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రభుత్వం.. సామాన్యులకు సంబంధించిన కేసుల్లో మాత్రం చట్టప్రకారం వ్యవహరించడంలో ఘోరంగా విఫలమవుతోందని జగన్ విమర్శించారు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపిస్తూ తప్పుడు కేసులు పెట్టడం, రాజకీయ వేధింపులు, కక్షసాధింపుల కోసం పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోవడం కూడా రాష్ట్రంలో వ్యవస్థల పతనానికి కారణమని ఆరోపించారు.తల్లిదండ్రుల ఆవేదనకు ప్రభుత్వం సమాధానం చెప్పాలిఎన్నో త్యాగాలు, కష్టాలను ఎదుర్కొని కుమార్తెను డాక్టర్గా తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు.. ఆమె ఎండీ చదువులు పూర్తి చేసి పదిమందికి వైద్య సేవలందించే స్థాయికి ఎదుగుతున్న సమయంలోనే తీవ్ర విషాదం ఎదురుకావడం అత్యంత బాధాకరమని జగన్ పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో భగవంతుడు ప్రియాంక కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాక్టర్ ప్రియాంక తండ్రి ఆవేదనకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తప్పకుండా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పౌరులందరినీ సమానంగా చూడాల్సిన వ్యవస్థల్లో రాజకీయ కక్షసాధింపులు, పక్షపాతం, ‘మీది ఏ పార్టీ?’ అనే ధోరణులను తీసుకురావడం వల్లే వ్యవస్థల పునాదులు కదిలిపోయే పరిస్థితి ఏర్పడిందని జగన్ విమర్శించారు. ఈ విషయాన్ని చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించాలని అన్నారు. మద్యం, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు తీరు..వీధికి రెండు బెల్టుషాపులు, ప్రతి కిలోమీటర్కు మద్యం దుకాణాలు, ప్రతి వీధి చివర బార్ అండ్ రెస్టారెంట్లతో మద్యం, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు తీరు ఉందని జగన్ మండిపడ్డారు. గుడి, బడి, బీచ్ అనే తేడా లేకుండా మద్యం అందుబాటును పెంచడం వల్లే ఇలాంటి ఘటనలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోందని విమర్శించారు. డాక్టర్ ప్రియాంక కేసులో వ్యవస్థల వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా, వాటికి సమాధానం చెప్పలేక ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం నిమిషాల వ్యవధిలో ఆ కంటెంట్ను తొలగిస్తోందని జగన్ ఆరోపించారు. -
భారతి సిమెంట్స్ వద్ద ఆగని టీడీపీ మూకల దౌర్జన్యం
కడప: ఏపీ రాష్ట్ర ఖజానాకు భారీగా పన్నులు చెల్లిస్తున్న భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (భారతి సిమెంట్స్)పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష పరాకాష్టకు చేరింది. నాలుగు రోజులుగా టీడీపీ మూకలు చేస్తున్న దౌర్జన్యంతో కాప్టివ్ మైన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి.మైన్లోకి వాహనాలు వెళ్లకుండా టీడీపీ మూకలు పదే పదే అడ్డుకుంటున్నాయి. సున్నపురాయి సరఫరా జరగకుండా భారతి సిమెంట్స్ ఉత్పత్తిని అడ్డుకునే కుట్రకు తెరలేపారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఎస్సీ, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం శూన్యంగానే ఉంది. టీడీపీ మూకల దౌర్జన్యంతో భారతి సిమెంట్స్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. టీడీపీ మూకల దౌర్జన్యంతో ఉత్పత్తి ఆగిపోతు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 15 వేల మంది కార్మికుల ఉపాధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.చంద్రబాబు నుంచి అందిన ఆదేశాలతో అధికార యంత్రాంగం చోద్యం చూస్తోందనే విషయం అర్థమవుతోంది. గత నాలుగు రోజులుగా అక్కడ కార్యకలాపాలను టీడీపీ మూకలు అడ్డుకుంటున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదంటే చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతుందా? అనే అనుమానం కలగమానదు.పరిశ్రమ నడవకూడదన్నదే లక్ష్యమా? రాజకీయ పగ కోసం రాష్ట్ర పారిశ్రామిక ప్రయోజనాలనే పణంగా పెడతారా? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇదే తరహాలో రాజకీయ కక్షతో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కార్యకలాపాలను అడ్డుకుని ఉంటే ఆ సంస్థ ప్రశాంతంగా వ్యాపారం కొనసాగించగలిగేదా? అని పలువురు పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈ తరహా దాడులకు ప్రభుత్వ పెద్దలు ఉసిగొల్పుతున్నారని అభిప్రాయపడుతున్నారు. -
డీఎస్సీ స్కామ్: వైఎస్సార్సీపీ ర్యాలీలపై కక్ష సాధింపు
సాక్షి: విజయవాడ: డీఎస్సీ అక్రమాలపై నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన ర్యాలీలపై ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలు చేపట్టింది. డీఎస్సీ స్కామ్లపై ర్యాలీలు చేయెుద్దంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. వైఎస్సార్సీపీ చేపట్టే ర్యాలీలకు అనుమతి లేదంటూ నోటీసులు అంటించారు పోలీసులు. డీఎస్సీలో జరిగిన అవకతవకలకు నిరసనగా రేపు 175 నియోజకవర్గాల్లో ర్యాలీలకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విజయవాడలో ర్యాలీకి పోలీసుల అనుమతి కోరారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ర్యాలీకి అనుమతి లేదంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్కు పోలీసులు నోటీసులిచ్చారు. -
సమ్మె సైరన్కు పిలుపిచ్చిన మున్సిపల్ కాంట్రాక్టర్లు
సాక్షి, విజయవాడ: మున్సిపల్ కాంట్రాక్టర్లు సమ్మె సైరన్కు పిలుపునిచ్చారు. రేపటి నుంచి విజయవాడ మున్సిపల్ పరిధిలో పనులు నిలిపివేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం రూ. 350 కోట్ల మేర బిల్లులు బకాయి ఉంచిన నేపథ్యంలో సమ్మెకు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. మున్సిపల్ కాంట్రాక్టర్ల సమ్మోతో రోడ్లు ,డ్రైనేజీ.. వాటర్ సప్లై పనులకు బ్రేక్ పడనుంది.గత 10 నెలలుగా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మున్సిపల్ కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ ఉన్న 350 కోట్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని బకాయిలు చెల్లించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. సమ్మెకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి
హైదరాబాద్: రాజమండ్రిలో ఇటీవల ఇద్దరు ఉన్మాదులు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి చెందారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు ప్రకటించారు. ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కొన్ని గంటల క్రితం ప్రకటించిన వైద్యులు.. అంతలోనే ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్దారించారు. ప్రియాంక కేసు ఇదే..ప్రియాంక కర్నూలుకు చెందిన యువతి. ఆమె తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఆగస్టు 3న రాజమండ్రిలో తోటి విద్యార్థినితో కలిసి సినిమా థియేటర్ నుంచి వస్తుండగా మద్యం మత్తులో ఉన్న దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్ కారును వేగంగా నడుపుతూ వచ్చి వీరి బైక్ను ఢీకొట్టారు. మరోసారి బలంగా ఢీకొట్టి ప్రియాంక మీద నుంచి కారు వెళ్లడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది.ప్రియాంకను సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమెను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. ప్రియాంక తండ్రి వెంకటేశ్ ఇటీవల మాట్లాడుతూ... కొన్ని రోజుల్లో వైద్య విద్య పూర్తి చేసుకుని వైద్యురాలిగా సేవలు అందిస్తుందని అనుకున్నామని ఆవేదన చెందారు. తమ కుమార్తెకు ఈ గతి పట్టించిన వాళ్లను వదలిపెట్టకూడదని అన్నారు. -
తమ చిన్నారి తిరిగి వస్తుందేమోననే ఆశతో..
కాకినాడ: 65 రోజుల కిందట కాకినాడ జిల్లాలోని సీహెచ్ అగ్రహారంలో ఇంటి నుండి వెళ్లి అదృశ్యమైన రెండున్నరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం తల్లి దండ్రులు నేటికి ఎదురుచూస్తూనే ఉన్నారు. తమ కూతురు ఎలా తప్పిపోయిందో అలానే ఇంటికి తిరిగి వచ్చేస్తే బాగుండు అనుకుంటూ కోటి ఆశలతో కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మరొకవైపు తమ కుమార్తెను ఎవరో వెంట తీసుకు వెళ్లిపోయారనే అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లి భవాని.. కూతురి ఆచూకీ చెప్పాలంటూ వేడుకుంటోంది. చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటికి కొత్తగా వచ్చిన అతిధిఅయితే వారి ఇంటికి ఓ అతిథి కొత్తగా వచ్చింది. జ్ఞానేశ్వరి తో పాటుగా వెంట వెళ్ళి మూడు రోజుల తరువాత ఇంటికి వచ్చి కుక్క చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే తమ కూతురు జ్ఞాపకాల నుంచి ఉపశమనం పొందడానికి మరో కుక్కను తెచ్చుకున్నారు జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు. *జ్ఞానేశ్వరి ముద్దు పేరైనా "జాను" పేరును కుక్క కు పెట్టారు చిన్నారి జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు భవానీ, గణేష్లు.కాగా, కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో ఈ ఏడాది జూన్ 6వ తేదీన అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యక్ష సాక్ష్యం లేదా బలమైన క్లూ లభించలేదు. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 09- 16)
-
మెడికో ప్రియాంక కేసు.. కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: ప్రియాంక ఘటన దురదృష్టకరమని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు. రాజమండ్రిలో కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసు వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు. ‘‘ఈ నెల మూడో తేదీ రాత్రి 10 గంటలకు మెడికల్ సమాచారం వచ్చింది...వెంటనే ప్రకాష్ నగర్ పీఎస్ పోలీసులు ఘటన స్థలానికి వెళ్లారు. ముందస్తు సమాచారంతో కేసు నమోదు చేశాం. ఆ మర్నాడు ఉదయానికి కల్లా నిందితులను గుర్తించాము. నిందితులు బైక్ మీద ఉన్న ప్రియాంకను మూడు సార్లు కారుతో ఢీకొట్టారు. ఇద్దరు నిందితులను విచారించి ఆరో తేదీన అరెస్ట్ చేశాం’’ అని ఎస్పీ తెలిపారు.‘‘గ్యాస్ కనెక్షన్ ఆధారంగా నిందితులను గుర్తించాం. నిందితులు మాల్లో కొందరితో ఘర్షణ పడ్డారు. ప్రియాంకది రోడ్డు ప్రమాదం కాదు.. క్రిమినల్ చర్య. ప్రియాంక ఫ్రెండ్ ఉమేశ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేశాం. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశాం. ప్రియాంక తండ్రికి ఈ కేసు విచారణపై బ్రీఫ్ చేశాం. నిందితులను పోలీసు కస్టడికీ తీసుకుంటున్నాం. ఉద్దేశపూర్వకంగా చేశారా? లేదా అనేదానిపై విచారణ చేస్తాం. ఘటన తరువాత ఒక చోటకు వెళ్లి నిందితులు పడుకున్నారు. నిందితులపై గతంలో కేసులు లేవు. నిందితులపై బీఎన్ఎస్ 110 సెక్షన్ నమోదు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. -
మూడు రోజుల మౌనం వెనుక..
సాక్షి, రాజమహేంద్రవరం: మత్తోన్మాదంతో వైద్య విద్యార్థిని కనికే ప్రియాంకను కారుతో ఢీకొన్న కిరాతకులను కాపాడేందుకు ఓ అదృశ్య శక్తి తెర వెనుక ప్రయత్నించిందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ దారుణానికి సంబంధించి వరుసగా జరిగిన పరిణామాలు, పోలీసులు వ్యవహరించిన తీరు రాజమహేంద్రవరం నగరంలో నివసిస్తున్న కూటమి ప్రజాప్రతినిధులు మౌనవ్రతం పాటించడం.. ఇవన్నీ ప్రజల అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి. ఈ దుర్మార్గం జరిగిన ప్రసాదిత్య మాల్ వద్ద సీసీ కెమెరాల ఫుటేజీల్లో నిందితుల అమానుషం స్పష్టంగా కనిపిస్తున్నా, వారిని అరెస్ట్ చేసేందుకు 72 గంటల సమయం తీసుకోవడం వెనుక ఏం జరిగిందనేది చర్చనీయాంశంగా మారింది. హిట్ అండ్ రన్.. అంటూ తప్పుడు వాదన సహజంగా రహదారిపై వెళ్తున్న వారిని ఓ వాహనం ఢీకొట్టి వెళ్లిపోతే హిట్ అండ్ రన్ అని పోలీసు పరిభాషలో చెబుతారు. అయితే రాజమహేంద్రవరంలో ఉద్దేశ పూర్వకంగానే వైద్య విద్యార్థిని స్కూటీని కిరాతకులు వెంట వెంటనే మూడుసార్లు ఢీకొట్టి.. కింద పడిపోయిన ప్రియాంక తల పైనుంచి కారు పోనిచ్చారు. ఇదంతా సీసీ కెమెరాల ఫుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ మద్యం మత్తులో ఢీకొట్టారని, హిట్ అండ్ రన్ అని పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతుండడం గమనార్హం. ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేశారని... హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ప్రియాంక తల్లిదండ్రులు, మాల్ వద్ద దుర్ఘటనను చూసిన స్థానికులు డిమాండ్ చేస్తున్నా.. ఆ దిశగా పోలీసులు చర్యలు చేపట్టకపోవడంతో మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ప్రియాంక కుటుంబీకులు స్థానికులు కాకపోవడంతో మద్యం మత్తులో జరిగిన ఘటన అని చెప్పేసి కేసును నీరుగార్చేందుకు ప్రయతి్నస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ మూడు రోజులూ ఎక్కడున్నారో... ఈ నెల 3న రాత్రి 9 గంటల సమయంలో ప్రియాంక స్కూటీని ఢీకొట్టిన సూరారపు ధస్వంత్, ఆండ్రూ జోషెఫ్ కారులో వేగంగా వెళ్లిపోయారు. చిన్న చిన్న విషయాలకే ప్రెస్మీట్లు పెట్టి ఫొటోలు తీసుకుని మీడియాకు పంపించే పోలీసులు.. బహిరంగంగా ఇంత పెద్ద అమానుష ఘటన జరిగినా మూడో రోజు వరకు నోరు విప్పకపోవడం గమనార్హం. సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ గట్టిగా నిలదీయడంతో పోలీసులు ఈ నెల 6న హడావుడిగా ప్రెస్మీట్ పెట్టి మద్యం మత్తులో ప్రమాదం జరిగిందని తేల్చేశారు. అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో ఇద్దరిని అరెస్ట్ చూపించి, మరుసటి రోజు రిమాండ్కు తరలించారు. మరి అప్పటివరకు నిందితులు ఎక్కడున్నారనే ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పడం లేదు. అదేవిధంగా నిందితులు మత్తులో ప్రసాదిత్య మాల్లోకి వెళ్లినప్పుడు, వైద్య విద్యారి్థని ప్రియాంకను ఢీకొట్టినప్పుడు కారుకు వెనుక, ముందు నంబర్ ప్లేట్లు ఉన్నాయి. ప్రమాదం అనంతరం నిందితుల నుంచి కారు స్వా«దీనం చేసుకున్న తర్వాత నంబర్ ప్లేట్లు మాయమయ్యాయి. నిందితులను రక్షించేందుకు ఓ ప్రజాప్రతినిధి పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారని, అందుకే నంబర్ ప్లేట్లు మాయమయ్యాయనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ప్రమాదంలో ఆదివాసీ భాషలు
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మనం ఆదివాసీల హక్కులు, అడవులు, జీవన విధానం గురించి మాట్లాడుతుంటాం. కానీ అత్యంత విలువైన వారి వారసత్వమైన మాతృభాష గురించి మాత్రం తక్కువగా ఆలోచిస్తాం. ఒక భాష కేవలం సంభాషణ సాధనం కాదు. అది ఒక జాతి చరిత్ర, సంస్కృతి, జానపద విజ్ఞానం, ప్రకృతి పరిజ్ఞానం, జీవన తత్వాన్ని మోసుకెళ్లే సజీవ సంపద. అందుకే ఒక భాష అంతరించిపోతే, ఆ భాషతో పాటు ఒక ప్రపంచ దృష్టికోణం కూడా శాశ్వతంగా కనుమరుగవుతుంది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతాల్లో నివసించే కోయల మాతృభాష అయిన ‘కోయతూర్’ నేడు సవాళ్లను ఎదుర్కొంటోంది. గ్రామాల్లో పెద్దలు ఇప్పటికీ కోయతూర్లో మాట్లాడుతున్నప్పటికీ, కొత్త తరం విద్య, ఉపాధి, పట్టణీకరణ ప్రభావంతో తెలుగు, హిందీ లేదా ఆంగ్ల భాషల వైపు మొగ్గు చూపుతోంది. ఇంట్లోనే మాతృభాష వినిపించని పరిస్థితి ఏర్పడితే, ఆ భాషకు భవిష్యత్తు మరింత సంక్లిష్టమవుతుంది. ఇది కేవలం కోయ భాష సమస్య మాత్రమే కాదు. భారతదేశంలో అనేక ఆదివాసీ భాషలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. యునెస్కో ప్రమాదంలో ఉన్న భాషల జాబితాలో భారతదేశానికి చెందిన అనేక భాషలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన కుపియా, గదబ, కొలామి, నాయకి, తోటి భాషా రూపాలు, అలాగే అండమాన్ దీవులలోని గ్రేట్ అండమానీస్, ఓంజీ వంటివారి భాషలు కూడా మాట్లాడేవారి సంఖ్య తగ్గిపోతోంది.ఆదివాసీ భాషలు అంతరించిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. పట్టణాలకు వలసలు, మాతృభాషలో విద్య లేకపోవడం, ప్రభుత్వ వ్యవహారాల్లో స్థానిక భాషలకు తగిన ప్రాధాన్యం లేకపోవడం, ఉద్యోగ అవకాశాల కోసం ఆధిపత్య భాషలను ఎంచు కోవడం వంటి అంశాలు కలిసి ఈ పరిస్థితిని తీసుకొచ్చాయి. భాషను కోల్పోవడం అనేది ఒక్కసారిగా జరిగే సంఘటన కాదు; ప్రతి తరం కొద్దికొద్దిగా దూరమవుతూ చివ రకు ఆ భాష మాట్లాడేవారు లేకుండా పోతారు. ‘‘మాకు వీలై నంతలో భాషను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్ప పూవుతో చాక్లెట్లు, లడ్డూలు చేస్తున్నాం. ఈ ఉత్పత్తులకు ‘పుంగార’ అనే పేరు పెట్టాము. పుంగార్ అంటే మా కోయ భాషలో పువ్వు అని అర్థం’’ అని చెప్పారు భద్రాచలంకు చెందిన స్వయం సహాయక సంఘ మహిళ సమ్మక్క.ఆదివాసీ పిల్లలకు మంచి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడం ఎంత అవసరమో, అంతే అవసరం వారిలో మాతృభాషపై గౌరవాన్ని పెంపొందించడం. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలు నేర్చుకోవడం తప్పు కాదు. కానీ వాటిని నేర్చుకునే క్రమంలో వారి భాషను మరచిపోవడం మాత్రం ఒక సాంస్కృతిక నష్టంగా మిగిలిపోతుంది.ప్రభుత్వాలు ఆదివాసీ ప్రాంతాల్లో మాతృభాష ఆధారిత ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం, వారి భాషలో పాఠ్యపుస్తకాలు, నిఘంటువులు, డిజిటల్ కంటెంట్ రూపొందించడం, భాష తెలిసిన ఉపాధ్యాయులను నియమించడం, జానపద గేయాలు, కథలు, సామెతలను డిజిటల్ రూపంలో భద్రపరచడం వంటి చర్యలు చేపట్టాలి.2020లో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన దివ్య దేవరాజన్ అక్కడి గోండుల సమస్యలు తెలుసుకోవడానికి స్వయంగా ఒక ట్యూటర్ని నియమించుకొని గోండు భాషను నేర్చుకున్నారు. ఆదివాసీ గూడేల్లో వారి అరుగుల మీద కూర్చొని వారి భాషలోనే ఆమె మాట్లాడుతున్నప్పుడు వారంతా వారి కష్టాలన్నీ ధైర్యంగా చెప్పుకునేవారు. దివ్య లాంటి అధికారులు ఆదివాసీ ప్రాంతాల్లో ఉండాల్సిన అవసరం ఉంది. భాషను కాపాడటం అంటే ఒక భాషను మాత్రమే కాదు, ఒక జాతి చరిత్రను, ప్రకృతితో ముడిపడిన జీవన తత్వాన్ని, వేల ఏళ్ల సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటమే. భాష బతికితేనే జాతి బతుకుతుంది.– శ్యాం మోహన్, ఆదివాసీ జీవనంపై అధ్యయనం చేస్తున్న జర్నలిస్ట్ (నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం) -
చంద్రబాబు శ్వేతపత్రంపై కాకర్ల ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు శ్వేతపత్రంపై ఏపీజీఈఎఫ్ మాజీ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులను చంద్రబాబు మోసం చేస్తున్న తీరును ఆయన వివరించారు. శ్వేత పత్రం పేరుతో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలేనని.. రూ.30 వేల కోట్ల బకాయిలు చెల్లించినట్లు చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారని.. డీఏ, పీఆర్సీ, ఐఆర్ వంటివి ఇక లేనట్టేనని ఎల్లోమీడియా రాస్తోందన్నారు.‘‘హిమాచల్ ప్రదేశ్లో ఉద్యోగులకు జీతాలు తగ్గించినట్టు ఎల్లో మీడియా రాసింది. అదే విధంగా ఏపీలో కూడా తగ్గించాలన్నట్టుగా రాశారు. ఇక మీదట జీతాలు ఇస్తే చాలన్నట్టుగా ఉద్యోగులను మానసికంగా సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు రూ.55 వేల కోట్లు బకాయి పడింది. ఇప్పటికే ఐదు డీఏలు పెండింగ్ పెట్టారు. రెండేళ్లుగా ఐఆర్ లేదు’’ అని వెంకట్రామిరెడ్డి దుయ్యబట్టారు.‘‘వైఎస్ జగన్ హయాంలో ఉద్యోగులకు ఎక్కువ ఖర్చు చేశారని చంద్రబాబే అంగీకరించారు. మూడున్నర లక్షల మంది ఉద్యోగులను రోడ్డున పడేసిన చరిత్ర చంద్రబాబుది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో ఉద్యోగుల జీతాలు ఖర్చు 45 శాతం మాత్రమే. కానీ చంద్రబాబు మాత్రం వచ్చే ఆదాయమంతా ఉద్యోగులకే సరిపోతుందనటం పచ్చి అబద్ధం కాదా?. అమరావతి ఆవకాయ, యోగా కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అద్దాల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.ఇక సీఎం, మంత్రుల విలాసాల కోసం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ ఉద్యోగుల మీద ప్రజలకు చెడు అభిప్రాయం తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమని మాత్రమే కోరుతున్నాం. కొన్ని శాఖల్లో రెండు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదు. ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగారు. ఆంధ్రా యునివర్సిటీ వీసీ రిటైర్మెంట్కు గంట ముందు సస్పెండ్ చేశారు. ఐదేళ్ల క్రితం సెలవు పెట్టారని ప్రతాప్ రెడ్డికి ఛార్జిమెమో ఇవ్వటం దుర్మార్గం’’ అంటూ వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. -
YSRCP: ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిరిజన మహిళలు.. సంప్రదాయ నృత్యాలతో అలరించారు. ఆదివాసీ నేతల చిత్రపటాలకు పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఆదివాసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర, గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణమూర్తి, ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, తదితరులు పాల్గొన్నారు. -
శునకానికి పూజలు.. సహపంక్తి భోజనాలు
అనంతపురం జిల్లా: శునకానికి పూజలు నిర్వహించారు. సహపంక్తి భోజనాలు చేశారు. వర్షం కోసం విడపనకల్లు మండలం కొట్టాలపల్లిలో గ్రామస్తులు పాటించిన వింత ఆచారం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల వర్షాలు కురవకపోవడంతో పంటల సాగుకు విరామం తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే వరుణుడి కరుణ కోసం విడపనకల్లు మండలం కొట్టాలపల్లివాసులు పూర్వ కాలం నుంచి వస్తున్న వింత ఆచారాన్ని శనివారం పాటించారు. కాటమయ్యగా భావించే శునకాన్ని పూలతో అలంకరించి, కొబ్బరి కాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుక్కను గ్రామంలో ఊరేగించారు. పెళ్లి భోజనాల తరహాలో పది రకాల వంటకాలు చేసి చుట్టు పక్కల గ్రామాల వారికి పొలంలోనే భోజనాలు ఏర్పాటు చేశారు. సహపంక్తి భోజనాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం గమనార్హం. అనంతరం కుక్కకు కూడా భోజనం పెట్టి దానికి నీళ్లు ఇవ్వకుండా వదిలేశారు. అలా వదిలేస్తే వర్షాలు కురుస్తాయని గ్రామస్తుల నమ్మకం. -
ఎమ్మెల్యే సారూ.. ఒక్కసారి కిందకు దిగి చూడండి..
అనంతపురం: ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు స్థానిక సమస్యలపై ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. శనివారం పాతగుంతకల్లులోని ఆరో వార్డు వాల్మీకి సర్కిల్ ఏరియా నుంచి దోనిముక్కల రోడ్డులో ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం నిర్వహించారు.ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకుని మరోచోట తాగునీటి సరఫరా మెరుగుదల పథకం భూమిపూజకు కారులో బయల్దేరారు. మార్గమధ్యంలో ఆరోవార్డు ప్రజలు ఎమ్మెల్యే కాన్వాయ్ని అడ్డుకున్నారు. దోనిముక్కలకు వెళ్లే ప్రధాన రహదారిలో డ్రెయినేజీ లేక రోడ్డుకు ఇరు వైపులా మురుగు పారుతోందని, వర్షం పడిన సమయంలో రొచ్చురొచ్చుగా మారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మురుగుపై దోమలు వాలడం వల్ల తాము అనారోగ్యాల పాలవుతున్నామని ప్రజలు తెలిపారు. ‘ఎమ్మెల్యే సారూ... ఒక్కసారి కిందకు దిగి రోడ్డుపై ఉన్న మురుగును చూడండి.. మా బాధలు తెలుసుకోండి’ అంటూ వేడుకున్నా ఎమ్మెల్యే పలకలేదు. ప్రజాప్రతినిధే పట్టనట్టు ఉంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు డ్రెయినేజీ ఏర్పాటు చేస్తామని ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి కారు దిగి వచ్చి హామీ ఇవ్వడంతో వార్డు ప్రజలు శాంతించారు. -
వైఎస్సార్సీపీ నేతలపై కొనసాగుతున్న కుట్ర ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు
సాక్షి,విజయవాడ:రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో జరిగిన భారీ అవకతవకలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడలో ఆందోళన నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు మరో 100 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు బనాయించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. విజయవాడ ముత్యాలంపాడులో వైఎస్సార్సీపీ నేతలు శాంతియుతంగా ఏర్పాటు చేసుకున్న దీక్షా శిబిరంపై బోండా ఉమా తన అనుచరులతో కలిసి దాడికి తెగబడ్డారు. దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేసి రౌడీయిజానికి పాల్పడిన బోండా ఉమాపై,ఆయన అనుచరులపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. కూటమి నేతల్ని వదిలేసి బాధిత వైఎస్సార్సీపీ నేతలపై కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు పెట్టిస్తోందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.డీఎస్సీ ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగాయని, అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై తాము పారదర్శకమైన చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసిన నేతలు, ఈ వ్యవహారంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతున్నారు. చర్చకు రావాల్సిందిగా తాము సవాల్ విసురుతున్నా మంత్రి నారా లోకేష్ ఎందుకు వెనుకాడుతున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఈ సందర్భంగా గట్టిగా నిలదీశారు. -
‘చంద్రబాబు, పవన్ కల్యాణ్ కనీసం స్పందించరా?’
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు సర్కార్పై మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్ల అన్యాయమైపోతే మహిళా హోంమంత్రి మనసు కరగలేదా? అంటూ ప్రియాంక తండ్రి మండిపడ్డారు. రెక్కలు ముక్కలు చేసుకుని మా పాపను చదివించుకున్నాం. మా పాపను బతికించుకోవాలనే తపనలో ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన లేదు. మా కడుపుకోత లోకేష్కు అర్థం కావడం లేదా?’’ అంటూ ప్రియాంక తండ్రి నిలదీశారు.‘‘ఆడపిల్లను చంపేసి హాయిగా తిరగొచ్చా.. మీ చట్టాలు సరిగా పనిచేస్తున్నాయా?. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కనీసం స్పందించలేదు. విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా పట్టించుకోలేదు. ప్రతినెల హైదరాబాద్ వస్తారు కదా.. మా బిడ్డ పరిస్థితి తెలుసుకోరా?. కనీసం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నా బిడ్డ పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. రాష్ట్ర హోం మంత్రి గాని, జిల్లా అధికారులు గానీ ఇప్పటివరకు ఈ ఘటన గురించి మాట్లాడలేదు. నా బిడ్డ అవయవదానం చేసే ఆలోచన లేదు. బతికించుకునే ప్రయత్నమే చేస్తున్నాం’’ అని ప్రియాంక తండ్రి పేర్కొన్నారు.కాగా, రాజమండ్రిలో కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కర్నూలుకు చెందిన ప్రియాంక తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది.ఈ నెల 3న రాజమండ్రిలో తోటి విద్యార్థినితో కలిసి సినిమా థియేటర్ నుంచి వస్తుండగా మద్యం మత్తులో ఉన్న దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్లు కారును వేగంగా నడుపుతూ వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. మరోసారి బలంగా ఢీకొట్టి ప్రియాంక మీద నుంచి కారు వెళ్లడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, గ్లాస్గో కోమా స్కేల్ (జీసీఎస్) తక్కువగా ఉండటంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. -
ఆదివాసీలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ఆదివాసీలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రకృతిని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తూ.. తరతరాలుగా తమ విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలను వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్న నా గిరిజన సోదర సోదరీమణులందరికీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ప్రకృతిని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తూ, తరతరాలుగా తమ విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలను వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్న నా గిరిజన సోదర సోదరీమణులందరికీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) August 9, 2026 -
ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
పెడన: కృష్ణా జిల్లా పెడన మండలంలోని బల్లిపర్రు గ్రామంలో ఉన్న ఓ బాలికల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం కావడం, వారిని గుర్తించిన పోలీసులు క్షేమంగా విద్యా సంస్థకు చేర్చడంతో కథ సుఖాంతమైందని అంతా అనుకున్నారు. పోలీసుల విచారణలో ఈ అదృశ్యం వెనుక ఇద్దరు యువకుల ప్రమేయం ఉందని, వారు బాలికలపై లైంగికదాడి చేసినట్లు తేలింది. దీంతో వారిపై పోక్సో, లైంగికదాడి కేసులను శనివారం నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. ఈ నెల ఆరో తేదీన పాఠశాల నుంచి అదృశ్యమైన ఇద్దరు బాలికలు మచిలీపట్నంలోని కోనేరుసెంటరుకు చేరుకున్నారు. అనంతరం బందరు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మద్దాల శ్యామ్కిరణ్కు ఫోన్ చేశారు. బాలికల విషయం తెలుసుకున్న శ్యామ్కిరణ్ శారదానగర్కు చెందిన స్నేహితుడు ఆటో డ్రైవర్ కొక్కిలిగడ్డ సిద్దును వెంటతీసుకువెళ్లాడు. కోనేరుసెంటరులో ఉన్న ఇద్దరు బాలికలను వారిద్దరూ ఆటోలో ఎక్కించుకుని బందరు మండలం రుద్రవరం గ్రామంలోని టిడ్కో గృహాల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఖాళీగా ఉన్న ఒక ప్లాట్లోకి బాలికలను తీసుకువెళ్లి ఇరువురు యువకులు వారిపై లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం బాలికలను రుద్రవరం తీసుకెళ్లి ఒక బాలిక ఇంటి సమీపంలో వారిని విడిచిపెట్టారు. మరుసటి రోజు ఒక బాలిక అస్వస్థతకు గురికావడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు నిలదీయగా ఆ బాలిక జరిగిన విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు బాలికను తీసుకుని పోలీసులకు వద్దకు వెళ్లారు. బాలికలపై లైంగిక దాడి జరిగినట్లు గుర్తించిన పోలీసులు ఇద్దరు ఆటో డ్రైవర్లపై పోక్సో, లైంగికదాడి కేసు నమోదు చేసినట్లు పెడన పోలీసులు తెలిపారు. జరిగిన సంఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాలతో దర్యాప్తును ముమ్మరం చేసినట్లు వారు పేర్కొన్నారు.చదవండి: ఇద్దరు బాలికల అదృశ్యంతో హైటెన్షన్ -
తణుకు అబ్బాయి.. రష్యా అమ్మాయి
పశ్చిమగోదావరి: తణుకు అబ్బాయి.. రష్యా దేశ అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తణుకు పట్టణానికి చెందిన సిర్రా బ్రహ్మయ్య కుమారుడు జానకి రామ్ పాల్, రష్యా దేశానికి చెందిన అనస్తాసియా డానిలోవా వివాహం శనివారం స్థానిక వీకే ఫంక్షన్ హాలులో క్రైస్తవ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నాలుగేళ్ల క్రితం జానకి రామ్ పాల్ బైబిల్ కోర్సులో శిక్షణ పొందేందుకు రష్యా దేశానికి వెళ్లారు.అక్కడ అనస్తాసియా డానిలోవాతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, అనంతరం ప్రేమగా మారడంతో ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియజేయగా, వారు కూడా సానుకూలంగా అంగీకరించారు. దీంతో రష్యా నుంచి వచ్చిన అనస్తాసియా కుటుంబ సభ్యులు, తణుకుకు చెందిన రామ్ పాల్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. -
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,అనంతపురం: హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని పామిడి మండలం పొగరూరు పరిధిలో వేగంగా ప్రయాణిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, ఎదురుగా వస్తున్న ఐషర్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ప్రైవేట్ బస్సు నియంత్రణ కోల్పోయి, హైవేపై ఉన్న ఒక కల్వర్టు పైనుంచి కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా రెండు వాహనాల ముందు భాగాలు పూర్తిగా నలిగిపోవడంతో, బస్సు, ఐషర్ వాహనాల డ్రైవర్లు క్యాబిన్లలోనే ఇరుక్కుపోయారు. పోలీసులు, స్థానిక ప్రజలు తీవ్రంగా శ్రమించి, వాహనాల భాగాలను కట్ చేసి ఇద్దరు డ్రైవర్లను సురక్షితంగా వెలుపలికి తీశారు. గాయపడిన డ్రైవర్ల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులందరినీ వెంటనే చికిత్స నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదంతో హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బడా సంస్థలకే ‘పుష్టి’!
సాక్షి, అమరావతి: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో విద్యార్థినులకు పుష్టికర ఆహారం అందించడం ప్రభుత్వం బాధ్యత. అయితే ఇందులోనూ తన అనుయాయ బడా సంస్థలకే లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు ప్రభుత్వం అక్రమాలకు తెరతీసింది. గతంలో ఆయా జిల్లాల స్థాయిలో డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ (డీపీసీ) ఆధ్వర్యంలో సరుకుల ప్రక్రియ జరిగేది. అయితే ఇప్పుడు ఈ ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జోన్లుగా విభజించి భారీ టెండర్లకు సర్కారు వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. బడా సంస్థలకు అనుకూలంగా నిబంధనలు రూపొందించి, చిన్న కాంట్రాక్టర్లను పోటీ నుంచి తప్పించే యత్నం జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేజీబీవీలకు నిత్యావసర వస్తువులను సేకరించి, సరఫరా చేయడానికి ప్రభుత్వం రూ. 177.95 కోట్లను వెచ్చించనుంది. దీనికోసం ఇటీవల టెండర్లు ఆహ్వానించింది. ఈ టెండర్లకు గతంలో ఉన్న నిబంధనలను అనేకమార్లు మార్చింది. ఇవన్నీ తన అనుయాయ బడా సంస్థల కోసమేననే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. భారీ నిధులు బొక్కేద్దాం: రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల్లో 355 టైప్–3 కేజీబీవీలు పనిచేస్తున్నాయి అలాగే, ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లకు అనుబంధంగా బాలికల కోసం మొత్తం 210 టైప్–4 కేజీబీవీలు(బాలికల వసతిగృహాలు) కొనసాగుతున్నాయి. 2025–26 సంవత్సరానికి సంబంధించి, టైప్–3 కేజీబీవీల రికరింగ్ గ్రాంటు కోసం ఏకంగా రూ. 352.11 కోట్ల నిధులు మంజూరు కాగా, ఇందులో కేంద్ర వాటా రూ. 211 కోట్లు. టైప్–4 కేజీబీవీల రికరింగ్ గ్రాంటు కోసం రూ. 84 కోట్ల నిధులు కేటాయించగా, ఇందులో కేంద్ర వాటా రూ. 50.4 కోట్లు. కేంద్ర ప్రభుత్వ నిధులు (75:25 లేదా 60:40 నిష్పత్తిలో) వస్తున్నాయి. దీంతో ఈ నిధులను టెండర్ల పేరుతో బొక్కేసే యత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి. బడా సంస్థల కోసం నిబంధనలు మార్పు టెండర్లలో స్థానిక చిన్న వ్యాపారులు, చిరు గుత్తేదారులు పాల్గొనకుండా బడా సంస్థలకు అనుకూలంగా నిబంధనలను అత్యంత వ్యూహాత్మకంగా మార్చారు. జోనల్ స్థాయిలో టెండర్లు ఆహ్వానించారు. కనీసం 20 వేల చదరపు అడుగుల సొంత, లీజు గోడౌన్ సదుపాయం, సరుకుల రవాణా కోసం కనీసం 20 సొంత, లీజు వాహనాలు తప్పనిసరిగా ఉండాలనే నిబంధనలు పెట్టారు. టర్నోవర్, గత అనుభవం పేరుతో నిబంధనలను కేవలం కొన్ని పెద్ద సంస్థలకు మాత్రమే కలిసొచ్చేలా మార్చారు. జోనల్ స్థాయిలో టెండర్ల వల్ల త్వరగా పాడైపోయే పాలు, గుడ్లు వంటి వస్తువుల సరఫరాను బడా సంస్థలు స్థానికంగా చిన్న కాంట్రాక్టర్లకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మధ్యలో భారీ శాతం కమీషన్లు పెద్ద కంపెనీలు కొల్లగొట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ ఖజానాకు గండిపడే ఆస్కారం ఉంది. పైగా జోనల్ స్థాయి నుంచి సరఫరా వల్ల నాణ్యమైన సరుకులు లభించే అవకాశం ఉండదు. కేజీబీవీల్లో సిబ్బంది నాణ్యతపై ఆ కంపెనీలను ప్రశ్నించే ఆస్కారమూ లభించదు. దీనివల్ల విద్యార్థినులకు తీరని నష్టం జరుగుతుంది. మాకేంటి ఈ భారం : ప్రిన్సిపాల్స్ ఆవేదన ఈ టెండర్ ప్రక్రియపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. ఈలోగా సరుకుల పంపిణీకి పాత కాంట్రాక్టర్లకు పొడిగింపు ఇవ్వడం అనేది సర్వసాధారణంగా జరగాలి. కానీ ప్రభుత్వం అలా చేయలేదు. జూలై 30న జరిగిన టెలీకాన్ఫరెన్స్లో ఆగస్టు మొదటి 15 రోజులకు అవసరమైన ప్రొవిజన్స్ను స్థానికంగా కొనాలని కేజీబీవీ, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్కు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఒక్కో పాఠశాల రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ముందుగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు, గ్యాస్, డైట్ బిల్లులు పెండింగ్లో ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంట్రాక్ట్ ప్రిన్సిపాళ్లపై ఈ నిర్ణయం మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తమవుతోంది.. టెండర్ వ్యవహారం తేల్చకుండా పాఠశాలల నిర్వహణ భారాన్ని క్షేత్రస్థాయి సిబ్బందిపై నెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. -
‘కనీసం’పై బ్యాంకులు భారీ వడ్డన
సాక్షి, అమరావతి: పొదుపు, కరెంటు, ఖాతాల్లో కనీస నిల్వ లేదంటూ బ్యాంకులు ఖాతాదారుల నడ్డి విరుస్తున్నాయి. ఈ చార్జీలు మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలైన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద తెరిచిన ఖాతాలకు కనీస నిల్వ చార్జీలు వర్తించవు. ఇక మిగతా పొదుపు, కరెంటు ఖాతాదారులు నెలవారీ కనీస నిల్వ నిర్వహించకపోతే ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు భారీ చార్జీలను వసూలు చేస్తున్నాయి. గత ఐదేళ్లలో దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు కలిసి కనీస నిల్వ నిర్వహించనందుకు చార్జీల రూపంలో ఏకంగా రూ.27,881.84 కోట్లను వసూలు చేశాయి. బ్యాంకులు ఈ చార్జీలను నిర్వహణ అవసరాలుగా సమర్థించు కుంటున్నప్పటికీ మధ్యతరగతి పరిమిత గృహ పొదుపును హరించివేసి, వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రూ.12,033.39 కోట్లు వసూలు » గత ఐదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కనీస నిల్వ నిర్వహించని ఖాతాల నుంచి చార్జీల రూపంలో రూ.12,033.39 కోట్లు వసూలు చేశాయి. అలాగే గత నాలుగేళ్లలో ప్రైవేట్ రంగ బ్యాంకులు రూ.15,848.45 కోట్లు వసూలు చేశాయి. » ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో గత ఐదేళ్లలో అత్యధికంగా కనీస నిల్వ నిర్వహించనందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా అత్యధికంగా రూ.2027.94 కోట్లు వసూలు చేసింది. ఆ తరువాత పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.1896.38 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.1776.85 కోట్లు వసూలు చేసింది. ఎస్బీఐ కరెంట్ ఖాతాలపై .... » స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొదుపు ఖాతాలపై కనీస నిల్వ చార్జీలను ఎత్తివేసినప్పటికీ కరెంటు ఖాతాలపై వసూలు చేస్తోంది. గత ఐదేళ్లలో రూ.1600.77 కోట్లు వసూలు చేసింది. ఇక ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ గత నాలుగేళ్లలో అత్యధికంగా రూ.5669.91 కోట్లు వసూలు చేసింది. ఆ తరువాత యాక్సిస్ బ్యాంక్ రూ.3787.30 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.1578.29 కోట్లు, కోటక్ మహీంద్ర బ్యాంక్ రూ.998.41 కోట్లు వసూలు చేసింది. -
రేపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతియుత రిలే నిరాహార దీక్షలను అడ్డుకోవడం, దీక్షా శిబిరాలపై దాడులు చేయడం, అక్రమ అరెస్టులు, లాఠీచార్జీలకు పోలీసులు పాల్పడటం చంద్రబాబు ప్రభుత్వ అప్రజాస్వావిుక వైఖరికి నిదర్శనమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆరోపించారు. రిలే దీక్షలు ముగిసినా ఈనెల 10న రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులతో కలిసి నిరసన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు.తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ–2025 అక్రమాలపై న్యాయంచేయాలని కోరుతూ గాంధేయ మార్గంలో నిరసన చేస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, పార్టీ శ్రేణులపై ఉక్కుపాదం మోపడం దారుణమన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాసే అధికారం ఎవరికీలేదని ఆయన చెప్పారు. డీఎస్సీ పరీక్ష ప్రక్రియ ప్రారంభం నుంచి అనేక అనుమానాస్పద పరిణామాలు చోటుచేసుకున్నాయని.. వీటన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.కీలక అధికారులు ఎందుకు బదిలీ అయ్యారు?అలాగే, డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సీబీఐ విచారణకు సిద్ధంకావాలని, మంత్రి లోకేశ్ రాజీనామా చేసేవరకూ పోరాటం కొనసాగుతుందని అప్పిరెడ్డి తేల్చిచెప్పారు. అప్పట్లో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులు వరుసగా ఎందుకు బదిలీ అయ్యారని ప్రశ్నించారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, కార్యదర్శి కోన శశిధర్, పీఎస్ గిరీష్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ ఇప్పుడా స్థానాల్లో లేరని.. స్పోర్ట్స్ కోటా, డీఎస్సీ పరీక్షలతో సంబంధం ఉన్న అధికారులు, శాప్ అధికారులను కూడా ఎందుకు మార్చారని ఆయన నిలదీశారు. ఇక డీఎస్సీపై శాసనసభ, శాసన మండలిలో వాయిదా తీర్మానం ద్వారా చర్చకు తీసుకొస్తామని.. మంత్రి లోకేశ్ చర్చకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇక అమరావతిలో అద్దాలు, భవనాల కోసం రూ.వేల కోట్లు ఖర్చుచేస్తున్న ప్రభుత్వం పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఎందుకు విడుదల చేయడంలేదని అప్పిరెడ్డి ప్రశ్నించారు.డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే: మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డీఎస్సీలో అక్రమాలు ఆధారాలతో సహా బయటపడినా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా, అధికారులతో పాత వివరణలే ఇప్పిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సాకే శైలజానాథ్ మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. అధికారులు ఇస్తున్న వివరణకు డీఎస్సీ అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్నలకు పొంతన ఉండటం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ఉందని చెబుతున్న చంద్రబాబు.. వైఎస్సార్సీపీ నేతలు డీఎస్సీ స్కాంపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాడులు చేయించడం ఏంటని నిలదీశారు. డీఎస్సీ అక్రమాలపై ఏదో ఒకటి చెప్పేసి తప్పించుకుందామంటే కుదరదని, మంత్రి లోకేశ్ దీనిపై సమాధానం చెప్పాల్సిందేనని అని అన్నారు.యువత కోసం వైఎస్సార్సీపీ రాజీలేని పోరు:వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుసాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తు కోసం వైఎస్సార్సీపీ రాజీలేని పోరాటం చేస్తుందని ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు స్పష్టంచేశారు. విశాఖ నగరంలో మూడో రోజు రిలే నిరాహార దీక్ష ముగిసిన అనంతరం శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం 2025 డీఎస్సీని ‘దగా డీఎస్సీ’గా మార్చేసిందని.. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేస్తూ టీచర్ పోస్టులను అమ్ముకుందని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై ప్రజలను చైతన్యపరుస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వీధిపోరాటాలు కొనసాగుతాయని కేకే రాజు స్పష్టంచేశారు. -
ఉద్యోగులను ప్రభుత్వం వంచిస్తోంది
నెల్లూరు (అర్బన్): ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలతో వంచిస్తోందని.. రాష్ట్ర బడ్జెట్ మొత్తం జీతాలకే సరిపోతుందని చెప్పడం దారుణమని ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్, గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(ఏపీ ఎన్జీజీవో) రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ దుయ్యబట్టారు. శనివారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు నయాపైసా ప్రయోజనం జరగలేదన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 95 శాతం ఉద్యోగుల జీతాలకే సరిపోతుందని శ్వేతపత్రంలో ప్రభుత్వం పేర్కొనడం దుర్మార్గమన్నారు. బడ్జెట్లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కలిపి 30 నుంచి 33 శాతమేనని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా అవాస్తవాలు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న అన్ని డీఏలు, బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, పీఆర్సీ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలన్నారు. జైళ్ల శాఖలో వార్డెర్లకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 26లోపు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. -
డీఎస్సీ అక్రమాలపై డైవర్షన్ ర్యాలీ
కర్నూలు(సెంట్రల్): డీఎస్సీ–2025 ఉపాధ్యాయుల ఆత్మగౌరవ ర్యాలీ ‘ఒక పక్కా స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్’ అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది చంద్రబాబు ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకత నుంచి... అర్హులకు న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ నేతృత్వంలో జెన్–జెడ్ చేస్తున్న ఆందోళనలకు వస్తున్న అనూహ్య స్పందన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేపట్టిన ‘సర్కారు స్పాన్సర్డ్ డైవర్షన్ ర్యాలీ’ అని స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే... ఈ ర్యాలీకి హాజరైన ఉపాధ్యాయులే ఆశ్చర్యపోయేలా వారికి తెలియకుండా చేసిన ఏర్పాట్లే ఇందుకు నిదర్శనం. పశ్చిమ రాయలసీమ పరిధిలోని ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాలకు సంబంధించిన డీఎస్సీ–2025 ఉపాధ్యాయులు కర్నూలులో శనివారం ర్యాలీ, సభ నిర్వహించారు. ఈ ర్యాలీకి తెరవెనుక నుంచి టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఆయా జిల్లాల నుంచి వచ్చే ఉపాధ్యాయుల కోసం సకల సౌకర్యాలతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. వారు బస్సు ఎక్కినప్పటి నుంచి కూల్డ్రింక్లు, స్నాక్స్, మధ్యాహ్నం భోజనం, దూర ప్రాంతాల వారికి రాత్రి భోజనాలను కూడా అందించారు. సభ జరిగిన ప్రదేశంలో సైతం విందు భోజనాలు వడ్డించారు. అంతటితో ఆగకుండా ర్యాలీలో రాజకీయ పార్టీలు నిర్వహించే 140 డెసిబుల్స్ సౌండ్ వచ్చే డీజే వాహనం, ఉపాధ్యాయులపై పాటల ఆడియోలు కూడా అందుబాటులోకి తెచ్చారు. చివరికి మొబైల్ టాయిలెట్లను సైతం ర్యాలీ వెంట తీసుకురావడం ఈ కార్యక్రమానికే హైలెట్. ఇవన్నీ పరిశీలిస్తే ఈ కార్యక్రమం ఎంత పక్కా స్క్రిప్టో అర్థమవుతోంది. మరోవైపు ఉపాధ్యాయులు ‘థ్యాంక్యూ సీఎం సర్’ అంటూ ప్రదర్శించిన ప్లకార్డులు కూడా పసుపు రంగులో ఉండడం రాజకీయ విమర్శలకు దారి తీస్తోంది. కర్నూలులో తిష్టవేసిన టీడీపీ ఎమ్మెల్సీలు ఉపాధ్యాయుల ర్యాలీని ఎలాగైనా విజయవంతం చేయాలని టీడీపీ ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్గోపాల్ కర్నూలులోనే తిష్టవేశారు. శుక్రవారమే వారు కర్నూలు చేరుకుని కడప ఆర్జేడీ శామ్యూల్ను పిలిపించుకుని డీఎస్సీ–2025లో ఎంపికైన ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీకి హాజరయ్యేలా చేయాలని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. దీంతో ఆయన అనధికారికంగా డీఈవోలు, ఎంఈవోలతో మాట్లాడి డీఎస్సీ–2025లో ఎంపికైన ప్రతి ఒక్కరూ హాజరయ్యేలా చూడాలని చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు ఎంఈవోలు తమ పరిధిలో కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులందరూ కచ్చితంగా కర్నూలులో ర్యాలీకి హాజరవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.అంతేకాకుండా స్థానికంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల బస్సులను కొన్నిచోట్ల ఎంఈవోలే ఏర్పాటు చేశారని సమాచారం. మరికొన్ని చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు ప్రైవేట్ ట్రావెల్స్, ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. చివరికి కొన్నిచోట్ల ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చే ఉపాధ్యాయుల హాజరు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఆరోగ్యం బాగోలేదన్నా కూడా కచ్చితంగా రావాల్సిందేనని చెప్పడంతో విధిలేని పరిస్థితిలో వచ్చిన ట్లు టీచర్లు చెబుతున్నారు. ఈ ర్యాలీకి టీడీపీ అనుబంధ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం మద్దతు ఇవ్వడంతో డీఎస్సీ–2025కు సంబంధంలేని టీచర్లు కూడా అనేక మంది హాజరయ్యారు. వీరికి తోడు యువగళం పాదయాత్ర బృందాలు కూడా ర్యాలీలో హల్చల్ చేశాయి. 100 మంది వరకు టీడీపీ అనుకూల యూ ట్యూబర్లు సైతం ర్యాలీని కవర్ చేస్తూ హడావుడి చేశారు. చంద్రబాబు, లోకేశ్ రాజకీయ వ్యూహాల్లో పావులుగా కొత్త టీచర్లు డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతోంది. ఈ ఉద్యమానికి జెన్–జీ (యువత) పెద్ద ఎత్తున కదలివస్తోండగా నిరుద్యోగులు జేఏసీగా ఏర్పడి పోరుబాట పట్టా రు. అన్ని వైపుల నుంచి డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో చంద్రబాబు, లోకేశ్ కొత్తగా ఎంపికైన టీచర్లను పావులుగా చేసుకుని డీఎస్సీలో అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ ర్యాలీకి వ్యూహం రచించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
లోకేశ్ తప్పుకోవాల్సిందే
సాక్షి, అమరావతి : మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను దగా చేశారని, డీఎస్సీ స్కామ్కు బాధ్యత వహించి మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని.. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలపై మూడవ రోజు శనివారం కూడా చంద్రబాబు సర్కారు దమనకాండ సాగించింది. అయినప్పటికీ ఎక్కడికక్కడ దీక్షలు విజయవంతం కావడం, జెన్ జీ యువత కదం తొక్కడంతో రోజురోజుకు ఉద్యమం ఉధృతం అవుతోంది. ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వానికి వణుకు పుట్టింది. డీఎస్సీ అక్రమాలపై జెన్ జీ యువత, ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు కొత్త పన్నాగాలు పన్నుతున్నారు. తన తనయుడి రాజకీయ భవితపై బెంబేలెత్తుతూ ఇప్పటికే పోలీసులు, టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి రిలే దీక్షల భగ్నానికి విఫలయత్నం చేస్తున్నారు. అడ్డంకులను అధిగమించి ఉధృతంగా పోరుడీఎస్సీ–2025 అక్రమాలపై వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజూ రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తాయి. వేలాది మంది నిరుద్యోగులు, డీఎస్సీ బాధిత అభ్యర్థులు, జెన్జీ యువత, వైఎస్సార్సీపీ శ్రేణులు దీక్షా శిబిరాలకు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. పోలీసుల ఆంక్షలు, నిర్బంధాలు, టీడీపీ శ్రేణుల అడ్డంకులను అధిగమించి రిలే దీక్షలను కొనసాగించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించడంతో పాటు.. స్కామ్కు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలనే డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగింది.ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతితోపాటు ఎన్నికల్లో యువతకు ఇచ్చిన అన్ని హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలనే డిమాండ్ దీక్షా శిబిరాల్లో విన్పించింది. యువతను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని జెన్ జీ యువత మండిపడింది. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు లోకేశ్ ఎందుకు భయపడుతున్నారని యువత ప్రశ్నించింది. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు పోరాటం ఆగదని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది. రోజురోజుకూ ఉద్యమానికి యువత మద్దతు పెరుగుతుండటంతో ప్రభుత్వ పెద్దల్లో ఆందోళన తీవ్రమైంది. చిలకలూరిపేటలో పోలీసుల దౌర్జన్యంచిలకలూరిపేటలో రిలే దీక్షలను అడ్డుకునేందుకు పోలీసులు దౌర్జన్యం చేశారు. దీక్షకు మద్దతుగా మాజీ మంత్రి విడదల రజిని, పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పాల్గొన్నారు. అంతలో దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు దీక్షా శిబిరాన్ని తొలగించేందుకు ప్రయత్నించడంతో రజిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో విడదల రజిని కిందపడిపోయారు. మహిళా నేత అని కూడా చూడకుండా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని అడ్డుకున్న పోలీసులువైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో టీడీపీ నేతల ఒత్తిడితో రంగంలోకి దిగిన పోలీసులు వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలను అడ్డుకున్నారు. దీక్షలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఆయన సతీమణి ఇందిరమ్మలను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇది సరికాదని వైఎస్సార్సీపీ శ్రేణులు నిలదీయడంతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. రామసుబ్బారెడ్డిని తరలించే క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. క్యారమ్స్ ఆడుతాం.. మాకూ ఉద్యోగాలివ్వండిబాపట్లలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శనివారం వినూత్న నిరసన నిర్వహించారు. డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పేరుతో పేకాట, లూడో ప్రామాణికంగా టీచర్ ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారని వినూత్న నిరసన చేపట్టడం ప్రజలను ఆలోచింపజేసింది. రిలే దీక్షా శిబిరం వద్ద క్యారం బోర్డు ఆడుతూ.. ‘మాకు కూడా డీఎస్సీ ఉద్యోగాలు ఇవ్వండి’ అంటూ నిరసన తెలిపారు. ఇదిలా ఉండగా చంద్రబాబు సర్కారు కుటిలయత్నాలు, కుట్రలను అధిగమించి వైఎస్సార్సీపీ శనివారం మూడవ రోజు రిలే దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమయ్యాయి. ఈ నెల 10న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి.సంతలో సరుకుల్లా డీఎస్సీ కొలువులు⇒ కూరగాయల బుట్టల్లో పోస్టుల విక్రయాల నాటిక⇒ క్రీడా కోటాకు ‘తొక్కుడు బిళ్ల’ ఆటలతో వినూత్న నిరసన పార్వతీపురం రూరల్: పార్వతీపురం వైఎస్సార్ కూడలి వద్ద వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో జరిగిన ఈ ఆందోళనలో మహిళలు, జెన్–జి యువత వినూత్న రీతిలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. డీఎస్సీ టీచర్ పోస్టులను కూటమి నాయకులు అంగడిలో సరుకుల్లా అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ దీక్షా శిబిరం వద్ద మహిళలు ప్రదర్శించిన నాటికలు అందరి దృష్టిని ఆకర్షించాయి.కూరగాయల బుట్టల్లో ‘ఎస్జీటీ పోస్టు’, ‘సూ్కల్ అసిస్టెంట్ పోస్టు’ అని బోర్డులు ఉంచి.. ‘రండి బాబు రండి.. రేటు మాట్లాడితే ఉద్యోగం మీదే.. చదువుతో పనిలేదు, డబ్బులిస్తే చాలు’ అంటూ వీధి వ్యాపారుల్లా అరుస్తూ నిరసన తెలిపారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు పోస్టులు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ.. మహిళలు ‘తొక్కుడు బిళ్ల’ ఆడుతూ, వీధి ఆటలను కూడా కూటమి ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో చేర్చే అవకాశం ఉంది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
బాబు సర్కారుపై ‘మహా’గ్రహం
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారుపై గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు నిప్పులుచెరిగారు. విజయవాడ వేదికగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం నాలుగు గంటలపాటు మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన ఉద్యోగులు కదంతొక్కడంతో బెజవాడ ధర్నా చౌక్ దద్దరిల్లింది. సర్కారు వ్యతిరేక నినాదాలతో మిన్నంటింది. బాబు సర్కారు పనిభారం తీవ్రంగా పెంచేసిందని ఉద్యోగ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన లేకుండా పగలూరాత్రీ వెట్టిచాకిరీ చేయిస్తున్నారని మండిపడ్డారు. చిరునవ్వుతో ప్రజల ఇంటి గడప వద్దకు వెళ్లి ప్రభుత్వ సేవలందించే గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల జీవితాల్లో ప్రభుత్వం చిరునవ్వే లేకుండా చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని, న్యాయమైన 22 డిమాండ్లు పరిష్కరించకుంటే అక్టోబర్ 2న మహోద్యమానికి శ్రీకారంచుడతామని సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు. తమ గోడు ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పుకున్నా సర్కారులో చలనం లేకపోవడంతో తప్పక చివరకు ఆత్మగౌరవం కోసం రోడ్డెక్కి ఆందోళన చేయాల్సి వచ్చిందంటూ పేర్కొన్నారు. జాబ్చార్ట్ను అమలు చేయడం లేదని, పండగపబ్బం లేకుండా సెలవు రోజుల్లోనూ ఏదోపని అప్పగిస్తూ చిత్రహింసలు పెడుతున్నారని ఆవేదన చెందారు. ప్రభుత్వం నుంచి సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన ఆటోమెటిక్ అడ్వాన్స్ స్కీం(ఏఏఎస్), నోçషనల్ ఇంక్రిమెంట్లు ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. సచివాలయ ఉద్యోగులకు పని లేదు అనే వాళ్లు ఓ మూడు రోజులు మా ఉద్యోగులందరికీ మాస్ లీవ్కి అనుమతిస్తే అప్పుడు పరిస్థితి ఏమిటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖ పేరును స్వర్ణ శాఖగా మార్చి, ఉద్యోగుల జీవితాల్లో మాత్రం స్వర్ణమే లేకుండా చేసిందంటూ తూర్పారబట్టారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలో పారదర్శకత అన్నదే లేకుండా ఎమ్మెల్యే సిఫార్సులు ఉంటే బదిలీ అన్నట్టు మార్చేసిందని దుయ్యబట్టారు. మహిళా ఉద్యోగులకూ సాయంత్రం ఆరు తర్వాత పనులుగ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులలో 63 శాతం మంది మహిళలే ఉన్నారని, వీరిపైనా ప్రభుత్వం కనికరం చూపడం లేదని, సాయంత్రం ఆరు తర్వాత కూడా పనులు అప్పగిస్తోందని ఉద్యోగులు ధ్వజమెత్తారు. ఇళ్లకు కరపత్రాలు అంటించే బాధ్యతా అప్పగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేలపై సర్వేలతో విసుగుతెప్పిస్తోందని, వివరాల కోసం పదేపదే ఇళ్లకు వెళ్లి ఓటీపీలు అడుగుతుంటే ప్రజల నుంచి ఈసడింపులు ఎదుర్కోవాల్సి వస్తోందని గోడువెళ్లబోసుకున్నారు. ప్రజలు తమను దొంగల్లా చూస్తున్నారని పేర్కొన్నారు. రేషనలైజేషన్ పేరిట ఒక్కో గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించి మిగులు ఉద్యోగులను ఇతర శాఖలకు డిప్యూటేషన్పై పంపి పనిభారం తీవ్రంగా పెంచేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 22 డిమాండ్లు తేలకుంటే భారీస్థాయిలో ఆత్మగౌరవ పోరాటంగ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నిర్ణీత జాబ్చార్ట్ అమలు చేయాలని, ఉద్యోగులకు సముచిత స్థాయి పదోన్నతులు కల్పించాలని, పని ఒత్తిడి తగ్గించాలని, ఉద్యోగులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నోషనల్ ఇంక్రిమెంటు, ఆటోమెటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీం అమలు, ఉద్యోగుల బదిలీలలో పారదర్శకత తదితర 22 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామని, వాటిని పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు కార్యరూపం దాల్చకుంటే అక్టోబరు 2న సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో భారీస్థాయిలో ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధపడతామని హెచ్చరించారు. ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహాధర్నాకు ప్రతినిధులు వెస్లీ, ప్రభాకర్, ప్రగతి, సుప్రియ తదితరులు నేతృత్వం వహించారు. సీపీఎస్ ఉద్యోగుల సంఘ ప్రతినిధులతోపాటు ఏఐటీయూసీ నేతలు మద్దతు తెలిపారు. -
అప్పులు పెంచడమే మీ ప్రోగ్రెస్?
సాక్షి, అమరావతి: వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ పచ్చి అబద్ధాల పుట్ట అని.. వైట్ పేపర్లు, ప్రోగ్రెస్ రిపోర్టుల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారని ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. అప్పులు పెంచడమే మీ ప్రోగ్రెస్ అని ఎద్దేవా చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు అండ్ కో చేస్తున్న అసత్య ప్రచారాలను ఆయన ఆధారాలతో తిప్పికొట్టారు. శనివారం బుగ్గన హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్పుకోవడానికి చంద్రబాబుకు సిగ్గుండాలన్నారు. ‘పంటలకు మద్దతు ధర లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఉచిత పంటల బీమా బంద్ చేశారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెలా రూ.1500 ఎవరికిచ్చారు? అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఎవరికైనా ఇచ్చారా? ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి ఏమైంది? మీ పాలనలో ప్రోగ్రెస్ తెలుసుకోవాలంటే ఒక సామాన్యుడిని అడిగితే చాలు. ఆరోగ్యశ్రీలో పేదలకు వైద్యం అందడం కూడా ఇబ్బందిగా మారింది. రైతులు, యువత, మహిళల జీవితంలో మార్పు కనిపించకుండా ప్రోగ్రెస్ ఎలా వచ్చింది?’ అని బుగ్గన నిలదీశారు. మామిడి, పొగాకు రైతులు, మత్స్యకారుల సమస్యలు తెలుసుకోవడానికి మాజీ సీఎం వైఎస్ జగన్ వెళితే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కి పడుతోందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బుగ్గన ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్సీపీ హయాంలోనే సంక్షేమాభివృద్ధి వైఎస్సార్సీపీ హయాంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశాం. 1.35 లక్షల యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. 10,032 విలేజ్ క్లినిక్స్ నిర్మించాం. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చడానికి రూ.17 వేల కోట్లు ఖర్చు చేశాం. ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు చేపట్టి, ఐదు పూర్తి చేశాం. రైతుల కోసం 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. ఉచిత పంటల బీమా కింద 54.5 లక్షల మంది రైతులకు రూ.8 వేల కోట్లు చెల్లించాం. నాడు–నేడు కింద మొదటి దశలో 15,715 స్కూళ్లు, రెండో దశలో 22,344 ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాం. రూ.25 వేల కోట్ల ఖర్చుతో 4 నూతన పోర్టులు, 6 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాం. అమ్మ ఒడి ద్వారా రూ.26 వేల కోట్లు, వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.25,500 కోట్లు, చేయూత ద్వారా రూ.20 వేల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా జమ చేశాం.మీది బూటక ప్రచారం కాదా?అప్పుల విషయంలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు. మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన లెక్కలు, కాగ్ లెక్కల ప్రకారమే 2024 నాటికి రాష్ట్ర ప్రత్యక్ష అప్పు రూ.4.92 లక్షల కోట్లు, గ్యారెంటీలతో కలిపితే రూ.6.47 లక్షల కోట్లు, విద్యుత్ రంగ బకాయిలను కలిపితే సుమారు రూ.7.22 లక్షల కోట్లుగా ఉంది. ద్రవ్య లోటు కూడా మా హయాంలో ఏటా రూ.39,500 కోట్ల నుంచి రూ.62,500 కోట్ల వరకు ఉంటే.. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024–25లో అది రూ.81 వేల కోట్లకు చేరింది. మా హయాంలో స్థూల ఉత్పత్తి వృద్ధి ఎక్కువ. పెట్టుబడులు, ఉద్యోగాలపై కూడా తప్పుడు ప్రచారమే. పార్లమెంట్లో కేంద్రం ఇచ్చిన సమాధానమే మీ బూటకపు ప్రచారాన్ని వెల్లడిస్తోంది. అమరావతిలో మీ రియల్ ఎస్టేట్ వ్యాపారంపై సమాధానం చెప్పాలి’ అని బుగ్గన మండిపడ్డారు. -
108 వాహనాల్లో పాము కాటుకు ఇంజెక్షన్లు
సాక్షి, అమరావతి: పాము కాటు బాధితుల కోసం 108 అంబులెన్సుల్లో యాంటీ స్నేక్ వీనం ఇంజెక్షన్లను అందుబాటులో తెచ్చినట్లు ఆరోగ్యశ్రీ సీఈవో చక్రధర్బాబు శనివారం తెలిపారు. పాముకాటు అత్యవసర కాల్స్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. గతేడాది జూన్ నుంచి 3,104 మంది పాముకాటు బాధితుల తరలింపు కోసం కాల్ సెంటర్కు ఫోన్లు వచ్చాయన్నారు. కడప, నంద్యాల, కర్నూలు జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ముగ్గురికి ఈఎంటీలు పాముకాటు విరుగుడు ఇంజెక్షన్లు అందించినట్టు చెప్పారు. వారికి ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. -
15 వరకే డెడ్లైన్
సాక్షి, అమరావతి: ‘‘ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే మేం కోరుతున్నాం. గొంతెమ్మ కోర్కెలేమీ కోరడం లేదు. హామీల అమలుపై స్పందించకుండా.. మేం ఉద్యమానికి సిద్ధమవుతుంటే బూటకపు లెక్కలతో ప్రజల్లో మాపై తప్పుడు సంకేతాలిస్తారా? గతనెల 22న మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపినా నేటికీ నిర్ణయాలు ప్రకటించనే లేదు. ఆగస్టు 15 వరకే ప్రభుత్వానికి డెడ్లైన్. ఆలోపు సానుకూల నిర్ణయాలు ప్రకటించకపోతే ఏ క్షణమైనా ఉద్యమంలోకి వెళ్తాం.’’ అని చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీ అమరావతి జేఏసీ అల్టిమే టం జారీ చేసింది. ఏటా ఉద్యోగుల జీతాల ఖర్చు తగ్గుతుంటే మా కోసమే రాష్ట్ర ఆదాయమంతా సరిపోతోందని సీఎం ఆర్థిక శ్వేతపత్రంలో తప్పుడు లెక్కలు వల్లె వేశారని జేఏసీ నాయకులు నిప్పులు చెరిగారు. శనివారం విజయవాడలోని రెవెన్యూ భవన్లో ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వ వైఖరిపై ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ కమిటీ సమావేశమైంది. అనంతరం చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర రావు, ఉద్యమ కమిటీ చైర్మన్ ఫణి పేర్రాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. జీతాల ఖర్చు తగ్గుతోంది.. కొత్త నియామకాల్లేవ్.. ఈ నెల నాలుగో తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక శ్వేత పత్రంలో ఉద్యోగులకు సంబంధించిన అంశాలు పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నాయని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారని, గొంతెమ్మ కోర్కెలేమీ కోరడం లేదన్నారు. ఉద్యోగులకే అంతా ఖర్చయిపోతోందని ఎలా ప్రకటిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. 2025–26లో ప్రభుత్వం రూ.2.26 లక్షల కోట్లు ఖర్చు చేస్తే అందులో ఉద్యోగులు, పెన్షనర్ల కోసం చేసిన ఖర్చు 37.41 శాతం మాత్రమేనని తెలిపారు. ప్రభుత్వానికి వస్తున్న పన్నుల రాబడిలో ఉద్యోగుల కోసం చేస్తున్న ఖర్చు 59 శాతం ఉందన్నారు. పన్నులతో పాటు, ఇతర రాబడి మొత్తంలో తమ ఖర్చు 47 శాతమే అన్నారు. అయితే ఉద్యోగులు, పెన్షనర్ల కోసం 94 శాతం నుంచి 98 శాతం ఖర్చు చేస్తున్నట్టు శ్వేత పత్రంలో ఎలా ప్రకటించారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రానున్న రోజుల్లో ఉద్యోగులు, పెన్షనర్లపై ఖర్చులు భారీగా తగ్గనున్నాయని తెలిపారు. 2024 నుంచి 2026లో ఇప్పటికే 41,321 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారన్నారు. వచ్చే ఐదేళ్లలో 1,51,755 మంది రిటైర్మెంట్కు సిద్ధంగా ఉన్నారన్నారు. రిటైర్ అవుతున్న ఉద్యోగుల స్థానంలో అవసరాలకు తగ్గట్టుగా కొత్త నియామకాలు లేవన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల జీతాల ఖర్చు సగానికిపైగా తగ్గిపోతోందన్నారు. అయితే ఉద్యోగులపై చేస్తున్న ఖర్చు పెరిగిపోతోందని సీఎం ఎలా అంటారని నిలదీశారు. ప్రభుత్వం శ్వేత పత్రంలో ప్రకటించిన ఉద్యోగులు, పెన్షనర్ల ఖర్చుల లెక్కలన్నీ బూటకమేనన్నారు. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెల్లిస్తోందో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు.15వ తేదీ తర్వాత ఉద్యమ కార్యాచరణ ఐఏఎస్లు, ప్రజాప్రతినిధుల వైద్య సేవలకు ఒక్క రూపాయి ఖర్చయినా సరే ఆగమేఘాల మీద రీయింబర్స్మెంట్ వచ్చేస్తోందని బొప్పరాజు అన్నారు. అదే ఉద్యోగులు, పెన్షనర్లు వైద్యం కోసం రూ. లక్షల్లో ఖర్చు చేసుకున్నా రీయింబర్స్మెంట్ రాదన్నారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) సమస్యలను పట్టించుకోరని మండిపడ్డారు. ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల ఇంత వివక్ష ఎందుకని నిలదీశారు. పీఆర్సీ, డీఏ, ఐఆర్లపై ఉలుకు పలుకు లేదన్నారు. సీపీఎస్, జీపీఎస్ను పునఃసమీక్ష చేసి ఆమోద యోగ్యమైన విధానం తెస్తామన్నారని గుర్తు చేశారు.అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు ఇస్తామన్నారని, వీటి గురించి పట్టించుకోవడం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో గత నెల 22న మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాలతో సుదీర్ఘ చర్చలు జరిపిందన్నారు. అయితే ఇప్పటి వరకూ ఒక్క నిర్ణయాన్ని కూడా ప్రకటించలేదన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రానిపక్షంలో ఇప్పటికే ప్రకటించిన విధంగా ఆగస్టు 15వ తేదీ తదుపరి ఐక్య కార్యాచరణతో ఏ క్షణమైనా ఉద్యమానికి దిగుతామన్నారు. సంపద సృష్టిస్తామని హామీలిచ్చి.. ఇప్పుడు ఖర్చు తగ్గిస్తామంటారా?ఉద్యోగుల ఇబ్బందులు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయని బొప్పరాజు పేర్కొన్నారు. వీటిని పరిష్కరించాలని మేం కోరుతుంటే ఉద్యోగ సంఘాలు తప్పు చేస్తున్నట్టుగా ప్రభుత్వం చిత్రీకరిస్తోందని పలిశెట్టి దామోదర్ పేర్కొన్నారు. సంపద సృష్టిస్తామని హామీలిచ్చి ఇప్పుడేమో ఉద్యోగుల కోసం చేసే ఖర్చును తగ్గిస్తామంటారా? అని నిలదీశారు. గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.50 లక్షల ఉద్యోగులను నియమించిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినట్టు గుర్తు చేశారు. వైద్య రంగంలో వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన, జాబ్ క్యాలెండర్ హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం చేసిందేంటని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చాక 40 వేల మందికిపైగా రిటైర్ అయ్యారన్నారు. ఇప్పుడు సీఎం చెబుతున్న మాటలు వింటుంటే ప్రభుత్వం భవిష్యత్లో శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేయబోదనే సంకేతాలు వెలువడుతున్నాయన్నారు. ఉద్యోగుల కోసం చేస్తున్న ఖర్చులపై పూర్తిగా తప్పుడు లెక్కలు వల్లె వేస్తున్నారన్నారు. ఉద్యమ కమిటీ చైర్మన్ ఫణి పేర్రాజు, మహిళా విభాగం చైర్పర్సన్ లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం మీన మేషాలు లెక్కపెట్టకుండా ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చలపై సానుకూల నిర్ణయాలు ప్రకటించాలని సూచించారు. -
దోపిడీకి నిలువుటద్దం!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో శాశ్వత సచివాలయం టవర్లకు అద్దాలను అమర్చే పనులకు ఏకంగా రూ.2,455.22 కోట్ల వ్యయంతో టెండర్లు పిలవడం విస్తుగొలుపుతోంది. కేవలం ఐదు బిల్డింగ్ల అద్దాల కోసం ఇంత భారీగా ప్రజా ధనాన్ని వెచ్చిస్తున్నారంటే కేవలం ప్రభుత్వ పెద్దలు దండుకునేందుకేనని స్పష్టమవుతోంది. తొలుత అంచనా వ్యయం రూ.1,901.71 కోట్లు కాగా, దానిని ఏకంగా రూ.2,455.22 కోట్లకు పెంచడం వెనుక ముఖ్య నేత కమీషన్ల బాగోతమేనని ఇంజనీరింగ్ వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అంచనా వ్యయంలోనే రూ.553.51 కోట్లు కొట్టేసే స్కెచ్ కనిపిస్తుండగా, మొత్తం వ్యయంలో నుంచి ఇంకెంత నొక్కేస్తారోనని సర్వత్రా చర్చ సాగుతోంది. సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) అధికారులు అందించిన సమాచారం ఆధారంగా జీఎస్టీ వంటి అన్ని పన్నులతో కలిపి అద్దాలు అమర్చే పనులకు చదరపు మీటరుకు రూ.80,892గా ధరను బీవోసీఈ (బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజినీర్స్) ఖరారు చేసింది. ఐదు టవర్లకు 2,35,092.75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అద్దాలు బిగించాలి.ఈ లెక్కన వాటి అంచనా వ్యయం రూ.1,901.71 కోట్లే. కానీ.. ఆ పనులకు రూ.2,455.22 కోట్ల వ్యయంతో మూడు ప్యాకేజీల కింద ఏజీఐసీఎల్ (అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్) టెండర్లు పిలిచింది. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు కట్టబెట్టి, పెంచిన అంచనా వ్యయాన్ని కమీషన్గా వసూలు చేసుకోవడానికి ముఖ్య నేత ఎత్తు వేశారని ఇంజినీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు. 15 నెలల్లో పూర్తి చేయాలని షరతు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో భాగంగా శాశ్వత సచివాలయం పేరుతో ఐదు టవర్ల నిర్మాణ పనులను చంద్రబాబు ప్రభుత్వం చేపట్టింది. డయా గ్రిడ్ విధానంలో 39 అంతస్తులతో నిర్మిస్తున్న నాలుగు టవర్లు.. 49 అంతస్తులతో నిర్మిస్తున్న మరో టవర్కు అద్దాలను అమర్చడం (గ్లాస్, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కాలమ్ క్లాడింగ్, స్కైలైట్), ఫొటో వోల్టాయిక్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు, బిల్డింగ్ మెయింటెనెన్స్ యూనిట్ (బీఎంయూ)లు ఏర్పాటు చేసే పనులకు ఏజీఐసీఎల్ ద్వారా మూడు ప్యాకేజీల కింద టెండర్లు పిలిచింది.ఈ పనులకు జీఏడీ టవర్కు రూ.522.15 కోట్లు (అంచనా వ్యయం రూ.442.06 కోట్లు+రూ.80.09 కోట్లు జీఎస్టీ రీయింబర్స్).. 1, 2 టవర్లకు రూ.1073.82 కోట్లు (అంచనా వ్యయం రూ.909.88 కోట్లు+రూ.163.94 కోట్లు జీఎస్టీ రీయింబర్స్).. 3, 4 టవర్లకు రూ.859.25 కోట్లు (అంచనా వ్యయం రూ.727.45 కోట్లు+ రూ.131.79 కోట్లు జీఎస్టీ రీయింబర్స్) వెరసి రూ.2,455.22 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచింది. బిడ్ల దాఖలుకు ఈనెల 26 తుది గడువు. అదే రోజున సాంకేతిక బిడ్, ఆ తర్వాత ఆరి్థక బిడ్ను తెరిచి.. తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకు పనులు అప్పగించనుంది. ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ 15 నెలల్లో వాటిని పూర్తి చేసి.. మరో 13 ఏళ్లు వాటిని నిర్వహించాలని ఏజీఐసీఎల్ షరతు విధించింది. ఎస్ఎస్ఆర్ బుట్టదాఖలు ళీ శాశ్వత సచివాలయం ఐదు టవర్లను డయాగ్రిడ్ వి«ధానంలో నిర్మిస్తున్నారు. ఈ టవర్లకు నలువైపులా అద్దాలు అమర్చుతారు. అందులో భాగంగా టవర్లకు గ్లాసింగ్, క్లాడింగ్ (అత్యధిక ఉష్ణోగ్రతను, శబ్ద కాలుష్యాన్ని తట్టుకునే డబుల్–గ్లేజ్డ్ అద్దాలను అమర్చడం).. క్రౌన్, అట్రియం (భవ నాల పైభాగంలో ఉండే శిఖరం నిర్మాణం, విశాలమైన గ్లాస్–రూఫ్ సెంట్రల్ అట్రియమ్)..కానోపి, స్కైలైట్ (ప్రధాన ప్రవేశ ద్వారాల వద్ద టెన్షన్–రాడ్ స్టీల్ కానోపిలు, సహజ వెలుతురు కోసం స్కై లైట్లు).. పీవీ ప్యానెల్స్ (భవనం వెలుపల సోలార్ విద్యుత్ను ఉత్పత్తిచేసే పర్యావరణ అనుకూల ఐజీబీసీ ప్లాటినమ్ గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాల ప్యానెళ్లు), బీఎమ్యూ (ఎత్తైన టవర్ల గ్లాస్ను శుభ్రం చేయడానికి, నిర్వహించడానికి ఉపయోగించే ఆటోమేటెడ్, రూఫ్–మౌంటెడ్ టెలిస్కోపిక్ క్రేన్ సిస్టమ్స్ ఏర్పాటు) పనులు చేయాలి. ⇒ ఈ పనులకు అంచనా వ్యయం రూపొందించడానికి ఇప్పటిదాకా ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్లు)ను ప్రభుత్వం ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో ఆ పనులకు ఎస్ఎస్ఆర్ను ఖరారు చేయడంలో భాగంగా సీఆర్డీఏ.. ఆ పనులు చేసే అనుభవం ఉన్న సంస్థల నుంచి కొటేషన్లు ఆహా్వనించింది. ముంబైకి చెందిన ఆల్మెక్ ఫెసాడ్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్కు చెందిన టీమ్ వర్క్ గ్లా్లస్ అండ్ అల్యూమినియమ్, బెంగళూరుకు చెందిన ఇంటెర్ని ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సీఆర్డీఏకు కొటేషన్లు ఇచ్చాయి. ⇒ అందులో ఆల్మెక్ ఫెసాడ్ సంస్థ తక్కువ ధరకు కోట్ చేసినట్లు సీఆర్డీఏ పేర్కొంది. శాశ్వత సచివాలయం ఐదు టవర్లకు డిజైన్లు రూపొందించిన ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థే.. చైనాలో షెన్జెన్లోని మర్చంట్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ భవనాలను డిజైన్ చేసింది. ఆ భవనాలకు అద్దాలు అమర్చడానికి చేసిన వ్యయాన్ని.. ఆల్మెక్ ఫెసాడ్ కొటేషన్లో పేర్కొన్న ధరను పరిగణలోకి తీసుకుని.. గ్లాసింగ్, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కానోపి, స్కైలైట్, పీవీ ప్యానెల్స్, బీఎంయూ వంటి పనులకూ జీఎస్టీతో కలిపి చదరపు అడుగుకు సగటున రూ.80,892గా బీవోసీఈ ఖరారు చేసింది. ⇒ ఐదు టవర్లలోనూ అన్ని రకాల అద్దాలు అమర్చే పనుల విస్తీర్ణం 2,35,092.75 చదరపు మీటర్లుగా లెక్కకట్టింది. పనుల అంచనా వ్యయం జీఎస్టీతో కలిపి రూ.1,901.71 కోట్లే.. కానీ రూ.2,455.22 కోట్ల వ్యయంతో ఏజీఐసీఎల్ టెండర్లు పిలిచింది. అంటే అద్దాలు అమర్చేందుకు చ.మీ. ధర రూ.1,04,436.22 కావడం గమనార్హం. అంటే.. బీవోసీఈ ఖరారు చేసిన ఎస్ఎస్ఆర్ను బుట్టదాఖలు చేసినట్లు స్పష్టమవుతోంది. చదరపు అడుగు రూ.20,439.58 ⇒ టవర్ల డిజైన్ల పనులను రూ.401.54 కోట్లకు ఫోస్టర్ పార్టనర్స్–హాఫీజ్ కాంట్రాక్టర్, జెనిసిస్ ప్లానర్స్కు అప్పగించారు. తాజాగా అద్దాలు అమర్చే పనులను రూ.2,540 కోట్లతో చేపట్టారు. దాంతో శాశ్వత సచివాలయ టవర్ల నిర్మాణ వ్యయం రూ.9,612.85 కోట్లకు చేరుకుంది. ఇక అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ) పేరుతో సచివాలయం టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మిస్తున్న 1,575 ఎకరాల లేఅవుట్లో రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాల పనులను రూ.1,057.62 కోట్లతో చేపట్టింది. దీన్ని కూడా కలుపుకుంటే.. సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం రూ.10,670.47 కోట్లకు చేరుకుంది. ఈ లెక్కన నిర్మాణ వ్యయం ఇప్పటికే చ.అ. రూ. 20,439.58కు చేరుకున్నట్లు స్పష్టమవుతోంది. ⇒ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలు, ఇటాలియన్ మార్బుల్స్తో నిర్మాణ వ్యయం చ.అ.కు రూ.4 వేల నుంచి రూ.4,500కు మించడం లేదని నిపుణులు చెబుతున్నారు. అంటే.. శాశ్వత సచివాలయం కాంట్రాక్టు పనుల్లో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయన్నది స్పష్టమవుతోందని ఆరోపిస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా.. డయాగ్రిడ్ విధానంలో నిర్మించినా, నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదంటున్నారు. డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ వ్యయం తగ్గుతుందని చెబుతున్నారు. అయినా శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం నానాటికీ పెరుగుతుండటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జాయింట్ వెంచర్లకు నో.. సబ్ కాంట్రాక్టుకు 50 శాతం ఇచ్చుకోవచ్చట!⇒ సచివాలయం టవర్లకు అద్దాలను అమర్చే పనుల టెండర్లలో బిడ్లు దాఖలు చేసేందుకు ఏజీఐసీఎల్ పెట్టిన నిబంధనలు చూసి ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జాయింట్ వెంచర్లు బిడ్లు దాఖలుకు అర్హతలేదని నిబంధన పెట్టింది. ⇒ కానీ.. టెండర్లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ ఏజీఐసీఎల్ చీఫ్ ఇంజినీర్ అనుమతితో 50 శాతం పనులను సబ్ కాంట్రాక్టర్కు ఇచ్చుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. పరస్పర విరుద్ధమైన ఈ నిబంధనల వెనుక లోగుట్టు ముఖ్యనేతకే ఎరుక. ఎవరు ఎక్కువ కమీషన్ ఇస్తే, వారికి పనులు అప్పగించడానికే ఇలాంటి నిబంధనలు పెట్టారంటూ నిపుణులు ఆరోపిస్తున్నారు. ⇒ జాయింట్ వెంచర్లకు టెండర్లో పాల్గొనేందుకు అర్హత కల్పిస్తే.. ఆ పనులు చేసే అనుభవం ఉన్న రెండు మూడు సంస్థలు కలిసి జట్టుగా ఏర్పడి బిడ్లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు అధిక సంస్థలు పోటీపడితే.. అంచనా విలువ కంటే తక్కువ ధరకే కోట్ చేస్తూ బిడ్లు దాఖలవుతాయి. అదే జరిగితే తమకు అధికంగా కమీషన్ ఇచ్చేందుకు ముందుకొచ్చిన సంస్థకు ఆ పనులు దక్కే అవకాశం ఉండదు. అందుకే ముఖ్యనేత సూచన మేరకు పరస్పర విరుద్ధమైన నిబంధనలు పెట్టారంటున్నారు. -
రైతు బతుకులో ‘సోలార్’ చీకట్లు
మూడు తరాల నుంచి ఆరు ఎకరాల్లో సాగు చేస్తున్నాం. ఈ భూమిపై ఇప్పటికే రూ.7 లక్షల పెట్టుబడి పెట్టినాం. ఇప్పుడేమో సోలార్ వాళ్లు నయా పైసా ఇవ్వకుండా భూములు కాజేయాలని చూస్తున్నారు. మాకు మా భూమి కావాలి. సోలార్ వద్దే వద్దు. ఉన్న భూమి పోతే మేమెలా బతకాలి? ఊరొదిలి వెళ్లిపోవాలా? – వేడిగింజల అనసూయమ్మసాక్షి, పుట్టపర్తి: రైతుల పొలాల్లో వెలుగులు నింపాల్సిన సోలార్ ప్రాజెక్టు.. అదే అన్నదాతల బతుకుల్లో చీకట్లు నింపుతోంది. పచ్చని పంట పొలాలపై సోలార్ పలకలు పరచేందుకు.. ఏళ్ల తరబడి ఆ భూములనే నమ్ముకుని జీవిస్తున్న రైతులను పక్కకు నెట్టేస్తున్నారు. మొత్తం మీద 16,000 ఎకరాలపై కన్నేయగా ముందుగా 600 ఎకరాలను ప్రైవేటు కంపెనీకి అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. రైతుల ప్రయోజనాల కంటే కంపెనీ ప్రయోజనాలే ముఖ్యమయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని జౌకుల గ్రామంలో పరిస్థితి ఇది. 16వేల ఎకరాలలో ఈ సోలార్ ప్రాజెక్టు వస్తోందని చెబుతున్నారు. అందులోభాగంగా తొలిదశలో జౌకుల గ్రామంలో పనులు మొదలయ్యాయి. ఏళ్ల తరబడి ఆ భూముల్లో సాగుచేసుకుంటున్న రైతులకు పైసా పరిహారమివ్వకుండా భూముల నుంచి బలవంతంగా వెళ్లగొడుతున్నారు. అదేమంటే అధికారమదంతో బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ పెద్దల దన్నుతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ఓ ప్రైవేటు కంపెనీతో రూ.25 కోట్లకు అగ్రిమెంట్ చేసుకుని అడ్వాన్సుకూడా తీసేసుకున్నారని వినిపిస్తోంది. కదిరి ఆర్డీఓ, పుట్టపర్తిలోని జిల్లా కలెక్టరేట్ చుట్టూ రైతులు ప్రదక్షిణ చేస్తున్నారు. సోలార్ ప్లాంటు వల్ల రైతులకు ఎదురవుతున్న కష్టనష్టాల గురించి తెలుసుకునేందుకు నంబులపూలకుంట మండలంలోని జౌకుల గ్రామాన్ని ‘సాక్షి’ బృందం విజిట్ చేయగా.. పలు విషయాలు వెల్లడయ్యాయి.ముందుగా 600 ఎకరాలపై..జౌకుల గ్రామ పరిసరాల్లోని భూములపై ఇప్పుడు సోలార్ ప్రాజెక్టు నీడ పడింది. ఈ ప్రాంతంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఓ ప్రైవేటు కంపెనీ రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా సర్వే నంబరు 179 పరిధిలోని సుమారు 600 ఎకరాల్లో తొలి దశ పనులకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ భూములను తాము ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని రైతులు పేర్కొంటున్నారు. పంటలు పండించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న తమను ఒక్కసారిగా భూముల నుంచి దూరం చేస్తే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. భూమిని సాగు చేసింది రైతు.. దానిపైనే కుటుంబాన్ని పోషించుకున్నది రైతు.. చివరకు భూమి పోతున్నప్పుడు పరిహారం మాత్రం శూన్యమా? అని నిలదీస్తున్నారు.శ్రీ సత్యసాయి జిల్లా జౌకులలో జేసీబీ యంత్రాలతో చేస్తున్న పనులు ప్రభుత్వ పెద్దల దన్నుతో..ప్రభుత్వ పెద్దల దన్నుతో కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ విపరీతంగా వ్యవహరిస్తున్నారని, తనను ఎవరూ అడ్డుకోలేరనే రీతిలో చెలరేగిపోతున్నారని రైతులు చెబుతున్నారు. తాము భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని చెబుతున్నప్పటికీ ‘ప్రాజెక్టు ఆగదు.. భూములు ఇవ్వాల్సిందే’ అన్న తరహాలో ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జౌకులలో ఎకరా రూ.6లక్షల వరకు పలుకుతోంది. 600 ఎకరాలు రూ. 36 కోట్లు. కానీ రైతుల నుంచి భూములు ఇప్పించే విషయంలో సోలార్ కంపెనీకి హామీ ఇచ్చి రూ.25 కోట్ల మేర ఎమ్మెల్యే ఒప్పందం కుదుర్చుకున్నారని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.కోటి వరకు అడ్వాన్స్గా ముట్టిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ‘రైతులు ధర్నాలు చేసినా.. ఆందోళనలు చేపట్టినా.. ప్రాణాలు అర్పించినా.. ఉరి వేసుకుని చచ్చిపోయినా అనుకున్న మేరకు కార్యక్రమాలు కొనసాగుతాయి’ అని ఇటీవల నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే వ్యాఖ్యానించినట్లు రైతులు చెబుతున్నారు. తమ సమస్యలు వినాల్సిన ప్రజాప్రతినిధి నుంచే ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాణాలకంటే సోలార్ ప్రాజెక్టే ముఖ్యమా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రూ.20 లక్షల పెట్టుబడి అయింది సోలార్ పేరుతో బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తున్నారు. పనులు చేసేందుకు యంత్రాలు వస్తున్నాయి. మొత్తం 10 ఎకరాలలో బోరు బావులు తవ్వించి, డ్రిప్ ఏర్పాటు చేసుకుని మామిడి చెట్లు నాటి పదేళ్లయింది. దాదాపు రూ.20 లక్షల పెట్టుబడి అయింది.. సోలార్ వద్దు.. మా భూమి మాకు కావాలి. పంటలు సాగు చేసుకుని బతుక్కుంటాం. – రమణస్క్రూటినీ అయ్యింది.. బుక్ ఇవ్వలేదు మాకు 3.5 ఎకరాల భూమి ఉంది. అందులో 2.5 ఎకరాలకు స్క్రూటినీ కూడా పూర్తయింది. ఈ భూమి లాగేసుకుంటే ఊరొదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితి. మండల స్థాయి నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు ప్రదక్షిణ చేసినా ఫలితం లేకుండా పోయింది. సోలార్ వద్దు. భూమిలో పంట వేసుకుంటాం. – బాబా ఫకృద్దీన్గొర్రెలు ఎలా మేపుకోవాలి? సోలార్ పలకలు ఏర్పాటు చేస్తే గొర్రెలు ఎలా మేపాలి? ఊర్లో చాలా గుంపుల గొర్రెలు ఉన్నాయి. అందరికీ నష్టమే. నా దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి. నాకు 9 ఎకరాల భూమి ఉంది. అది కూడా సోలార్కు లాగేయాలని చూస్తున్నారు. సోలార్ వస్తే బయట ప్రాంతాలకు వెళ్లేందుకు దారి కూడా ఉండదు. – మస్తాన్ వలి30 ఏళ్లుగా సాగులో ఉన్నాం మేం 30 ఏళ్ల నుంచి సాగులో ఉన్నాం. ఇప్పటి వరకు పది బోర్లు వేయించగా, మూడు చోట్ల నీళ్లు వస్తున్నాయి. ఇప్పటికే సుమారు రూ.5 లక్షల పెట్టుబడి అయ్యింది. బలవంతపు భూమి లాక్కోవాలనుకుంటే ఊరుకునేది లేదు. డబ్బులన్నీ భూమిపై పెట్టాం. భూమి పోతే రోడ్డున పడాల్సిన పరిస్థితి. – ఆర్.నగేశ్ఆత్మహత్యలే గతి మా తాతల కాలం నుంచి సాగులో ఉన్నాం. నిమ్మ సాగు చేస్తున్నాం. ఈ భూమి కూడా లాగేసుకుంటే ఆత్మహత్యలే గతి. రైతులకు పరిహారం చెల్లించకుండా సోలార్కు భూములు లాక్కోవాలని చూస్తే ఊరంతా ఖాళీ అవుతుంది. – ఖాదర్ వలిజీవాలకు గ్రాసమూ ఇబ్బందే.. మా గ్రామానికి ఈ భూములే జీవనాధారం. కొందరు పంటలు వేసుకుంటారు. ఇంకొందరు పశువులు, గొర్రెలు మేపుతుంటారు. సోలార్ ఏర్పాటు చేస్తే చిన్న జీవాలకు గ్రాసం ఇబ్బంది అవుతుంది. వేరే ఆధారం లేదు. ఊరొదిలి వలస వెళ్లాల్సిందే. సోలార్ను మా ఊరికి రానివ్వం. – వల్లెపు భారతిమా భూమి ఇచ్చేది లేదు..మా తాతల కాలం నుంచి సాగులో ఉన్నాం. శెనక్కాయ, వంకాయ, టమాట పంటలు వేస్తుంటాం. అప్పు చేసి బోరు బావి తవ్వించా. నీళ్లు పడ్డాయి. సోలార్కు ఇచ్చే పరిస్థితి లేదు. – వేమల రామచంద్ర -
పనిమనిషి హత్య.. ఇంటిపై నాటు బాంబులతో దాడి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం తాళంబేడు పంచాయతీ పరిధిలోని మంగాపురం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు పెంపుడు కుక్కలకు మత్తుమందు ఇచ్చి, పనిమనిషిని గొంతుకోసి హతమార్చడమే కాకుండా నాటు బాంబులతో కలకలం సృష్టించారు. బీఎన్ఆర్పేట ఎస్ఐ మణికంఠేశ్వర్రెడ్డి కథనం ప్రకారం.. మంగాపురం గ్రామానికి చెందిన పట్టాభినాయుడు అమెరికాలో ఉంటున్నారు.ఆ ఇంట్లో ఆయన సోదరి, ఆమె భర్తతోపాటు పనిమనిషి ఆనందరావు(50) ఉంటున్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడు గ్రామానికి చెందిన ఆనందరావు ఇక్కడ 11ఏళ్లుగా పనిచేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు, ముందుగా ఇంట్లోని పెంపుడు కుక్కలకు మత్తుమందు ఇచ్చి అచేతనంగా మార్చారు. ఆ తర్వాత ఇంట్లో ఆనందరావును అడ్డగించి గొంతు కోసి హత్య చేశారు. నాటు బాంబుల మోత... హత్య అనంతరం దుండగులు ఇంటి కిటికీ అద్దాలను ధ్వంసం చేసేందుకు నాటు బాంబులను పేల్చారు. పెద్ద ఎత్తున బాంబు పేలుడు శబ్దాలు రావడంతో ఇంట్లోని వారు అరుపులు కేకలు పెట్టారు. దీంతో గ్రామస్తులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకునేలోపే దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.ఘటన స్థలంతో పాటు రోడ్డులో రెండు నాటు బాంబులను స్వాదీనం చేసుకున్నారు. ఆనందరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వెల్లువెత్తుతున్న అనుమానాలు హత్యకు గురైన ఆనందరావు గత 11 ఏళ్లుగా పట్టాభినాయుడు ఇంట్లోనే నమ్మకంగా పనిచేస్తున్నాడు. యజమాని ఆర్థిక సహాయంతోనే ఆనందరావు తన కుమారుడిని పుత్తూరులోని ఒక ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదివిస్తున్నాడు. ఆనందరావు భార్య, కుమార్తె బాపట్ల జిల్లాలోని సొంత ఊరిలోనే ఉంటున్నారు. ప్రశాంతంగా ఉండే గ్రామంలో బాంబులు పేల్చి మరి హత్యకు పాల్పడడం వెనుక అసలు కారణాలు ఏమిటి? కేవలం పనిమనిషినే లక్ష్యంగా చేసుకుని దాడి చేశారా? లేక ఇంటి యజమానులను భయపెట్టేందుకు ఏమైనా ముఠా పన్నాగమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
చాలు బంగారం.. చాలు
సాక్షి, అమరావతి: పసిడి ప్రియులకు పేరొందిన భారత దేశంలో బంగారం కొనుగోళ్లు, దిగుమతులు తగ్గిపోతున్నాయి. 2021–22 సంవత్సరంతో పోలిస్తే 2025–26 ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 17.23 శాతం క్షీణించాయి. 2021–22లో 868.4 టన్నుల బంగారం దిగుమతి కాగా.. 2025–26లో 718.74 టన్నులకు పడిపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపింది. అంతర్జాతీయంగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు తోడు రూపాయి విలువ పడిపోవడం, బంగారం కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు విధించడం దిగుమతులు తగ్గడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం దిగుమతులను తగ్గించడానికి కేంద్రం ఈ ఏడాది మే నుంచి దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. మరోపక్క బంగారం కొనుగోళ్లు తగ్గించాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే పిలుపునివ్వడంతో అమ్మకాలపై గణనీయమైన ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు బంగారం దిగుమతులు ఆరేళ్ల కనిష్ట స్థాయికి 120 టన్నులకు పరిమితమైనట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రధాని పిలుపుతో ఆభరణాల అమ్మకాలు 24 శాతం తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. అలాగే పాత బంగారం అమ్మడం కూడా దిగుమతులు తగ్గడానికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. ఇదే సమయంలో బంగారం ధరలు భారీగా పెరగడంతో స్మగ్లింగ్ పెరుగుతోంది. విలువ పరంగా 58 శాతం పెరుగుదలపరిమాణం పరంగా బంగారం దిగుమతులు తగ్గుతున్నా.. పసిడి దిగుమతుల బిల్లు మాత్రం భారీగా పెరిగిపోతోంది. 2021–22లో 868.4 టన్నుల దిగుమతికి ప్రస్తుత రూపాయి ధర ప్రకారం రూ.4,36,800 కోట్లు చెల్లించాల్సి వస్తే, 2025–26లో 718.74 టన్నులకు ఏకంగా రూ.6,88,320 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అంటే దిగుమతులు తగ్గినా బిల్లు మాత్రం ఏకంగా 57.58 శాతం పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణం ఐదేళ్ల క్రితం ఔన్స్ బంగారం ధర 2,000 డాలర్లు ఉంటే ఇప్పుడది ఏకంగా 4,200 డాలర్లకు చేరడమే. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.1.40 లక్షల నుంచి రూ.1.50 లక్షల మధ్య కదులుతోంది. బంగారం ధరలు భారీగా పెరిగిపోవడంతో వినియోగదారులు తక్కువ బరువున్న ఆభరణాల కొనుగోలుకు మక్కువ చూపిస్తున్నట్లు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. -
AP: పెనమలూరు పీఎస్లో కీచక ఖాకీ
పెనమలూరు(కృష్ణా జిల్లా): ఏపీలో మరో కీచక పర్వం వెలుగు చూసింది. ఓ వివాహిత పట్ల హెడ్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన చోటు చేసుకుంది. ఓ బాధిత వివాహిత ఫిర్యాదు చేయడానికి పీఎస్కు వస్తే హెడ్ కానిస్టేబుల్ ఆమెను వేధింపులకు గురి చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. కృష్ణా జిల్లాలోని పెనమలూరు పీఎస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న అరిసె శ్రీనివాసరావు.. ఓ వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తన భర్త పట్టించుకోకపోవడంతో పెనమలూరు పీఎస్ను ఆశ్రయించింది ఓ మహిళ. న్యాయం కోసం వెళ్లిన బాధితురాలిని హెడ్ కానిస్టేబుల్ వేధింపులకు గురి చేశాడు. సాయం పేరుతో వివాహితకు పదే పదే ఫోన్ చేసి వేధించాడు. అర్థరాత్రి ఫోన్ కాల్స్ చేసి మరీ వేధించాడు. హబీస్ ఏంటని అంటూ కుశల ప్రశ్నలతో ట్రాప్ చేసేందుకు యత్నించాడని, ఇంటి లోకేష్ పట్టాలంటూ ఫోన్ కాల్స్లో వేధించ సాగాడు. వాట్సాప్ కాల్లో బాధిత వివాహితతో అసభ్యంగా మాట్లాడుతూ వేధించాడు. -
వైఎస్సార్సీపీ నేత చింతాడ రవికుమార్ అరెస్ట్
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేత చింతాడ రవికుమార్ను ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జంక్షన్ సమీపంలో పోలీసులు అదుపులో తీసుకున్నారు. శ్రీకాకుళం డిఎస్పీ ముందు లొంగిపోయేందుకు వెళ్తుండగా రోడ్డుపై ఆయన కారును ఆపి అదుపులోకి తీసుకున్నారు.చింతాడ రవి కుమార్ మాట్లాడుతూ.. ‘‘నా అనుచరులను ఇబ్బంది పెడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలను, నా కుటుంబ సభ్యులను విచారణ పేరుతో వేధిస్తున్నారు. దాదాపు 50 నుంచి 60 మంది వరకు కార్యకర్తలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. రాష్ట్రంలో అరాచక పాలన ఈ రోజు సాగుతుంది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ఎక్కడికి తీసుకు వెళ్తున్నారో కనీసం చెప్పడం లేదు. ప్రతిరోజు పదిమంది పోలీసులు వచ్చి వైఎస్సార్సీపీ నేతలను వేధిస్తున్నారు...హైకోర్టులో ఓ వైపు న్యాయ పోరాటం చేస్తున్నాం. కార్యకర్తలు ఇబ్బంది పడకూడదని డిఎస్పీ వద్ద లొంగిపోదామని వెళ్తున్నా.. మార్గ మధ్యలో నన్ను ఆపారు. ఎక్కడకి తీసుకువెళ్తున్నారో చెప్పడం లేదు. ఎవరు తీసుకెళ్తున్నారో తెలియదు.. బలవంతంగా కారు ఎక్కిస్తున్నారు’’ అంటూ చింతాడ రవికుమార్ మండిపడ్డారు. -
తిరుమలలో నకిలీ ఆధార్లతో గదుల దందా.. ఆరుగురి అరెస్ట్
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తులకు కేటాయించే గదులను నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలతో అక్రమంగా పొందుతూ.. అధిక ధరలకు విక్రయిస్తున్న రూమ్ దళారీల ముఠాను తిరుమల టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమలలో రూమ్ దళారీల అక్రమ కార్యకలాపాలపై పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది ప్రత్యేక నిఘా ఉంచారు.ఈ క్రమంలో ఇవాళ(శనివారం) ఉదయం తిరుమల సీఆర్వో కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా గదులు పొందేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురు వ్యక్తులను సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు ఒక ముఠాగా ఏర్పడి నకిలీ ఆధార్ కార్డులను తయారు చేసి, వాటిలో ఫొటోలను మార్ఫింగ్ చేసి, వాటి ద్వారా టీటీడీ సీఆర్వోలో గదులు పొందుతున్నట్లు వెల్లడైంది.అనంతరం ఆ గదులను గదులు లభించని భక్తులకు అధిక మొత్తానికి విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అదే విధంగా, తిరుమలలోని పీఏసీ-5 వద్ద భక్తులు ఛార్జింగ్కు ఉంచిన సెల్ఫోన్లను దొంగతనం చేసినట్లు కూడా విచారణలో వెల్లడైంది. నిందితులు బి. శ్రీనివాస్ (46), ఇరప్ప కాలప్ప (43), విష్ణు వర్ధన్ (33), అమూల్ కుమార్ సింగ్ (27), ఎస్. ప్రకాష్ (39), పి. సందీప్ (20)లను పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుల దగ్గర నుంచి గది బుకింగ్లు, నకిలీ గుర్తింపు పత్రాలకు సంబంధించిన కార్యకలాపాలకు ఉపయోగించిన సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల విచారణలో భాగంగా ఈ నెల 6న తెల్లవారుజామున తిరుమల పీఏసీ-5 దగ్గర దొంగతనం చేసిన రెండు సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.తిరుమలలో గదులను టీటీడీ అధికారిక కౌంటర్లు, అధికారిక ఆన్లైన్ విధానాల ద్వారా మాత్రమే పొందాలని పోలీసులు సూచించారు. రూమ్ దళారీలను నమ్మి టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి మోసపోవద్దని తెలిపారు. నకిలీ ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు పత్రాల ద్వారా గదులు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మవద్దని సూచించారు. రూమ్ దళారీల కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తులు.. భక్తులను మోసం చేసే ప్రయత్నాలు గుర్తించిన వెంటనే పోలీసు అత్యవసర సేవ 112, సంబంధిత టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. -
AP: ఆర్టీసీ జేఏసీకి ఉద్యోగ, కార్మిక సంఘాల మద్దతు
విజయవాడ:: ఏపీఎస్ ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత నెలలో వేల సంఖ్యలో సంతకాలు సేకరించిన జేఏసీ.. ఇప్పుడు తమ పోరుబాటను మరింత ఉధృతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా కార్యచరణ రూపొందిస్తున్న ఆర్టీసీ జేఏసీ.. తమ భవిష్యత్ ఉద్యమాలకు కార్మిక సంఘాల మద్దతు కోరుతుంది. ఈ మేరకు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలను ఆర్టీసీ జేఏసీ నేతలు కలిశారు. ఏపీజేఏసీ అమరావతి, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెడ్మాస్టర్స్ అసోసియేషన్ నేతలను కలిసి వారి మద్దతు కోరారు. ఆర్టీసీ జేఏసీ ఉద్యమాలకు పూర్తి మద్దతు ఇస్తామని ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. ఆర్టీసీ జేఏసీ ఉద్యమాలకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. రేపు, ఎల్లుండి( ఆగస్టు9, 10వ తేదీల్లో) ఇతర సంఘాల నేతలను కలిసి మద్దతు కోరనుంది ఆర్టీసీ జేఏసీ. -
‘విజయ డెయిరీ ఆస్తులను కొల్లగొట్టటానికి ఇదొక కుట్ర’
తాడేపల్లి : విజయ డెయిరీ ఆస్తులను కొల్లగొట్టడానికి ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆరోపించారు. అందుకే డెయిరీ చైర్మన్ను ఇద్దరు మంత్రులు బెదిరించి రాజీనామా చేయించారని విమర్శించారు. చివరికి డైరెక్టర్లను కూడా మంత్రి కొల్లు రవీంద్ర తన ఇంట్లో బంధించారన్నారు. మరో వైశ్రాయ్ హోటల్ తరహా వెన్నుపోటు డ్రామాకు తెరలేపారన్నారు అనిల్ కుమార్. ‘ఎండీ, ఇతర అధికారుల మీద కేసులు పెడతామని బెదిరించారు. ఛైర్మన్ తో రాజీనామా చేయించకపోతే విదేశాల్లో ఉన్న పిల్లల మీద కేసు పెడతామని బెదిరించారు. హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీని నిర్వీర్యం చేసినట్లే ఇప్పుడు విజయ డెయిరీ మీద పడ్డారు. చలసాని ఆంజనేయులుని బలవంతంగా రాజీనామా చేయించాల్సిన అవసరం ఏంటి?, ఆస్పత్రిలో ఉన్నప్పటికీ అక్కడకు వెళ్లి మరీ ఎందుకు బెదిరించారు?, ఇప్పటిదాకా ఆర్టీసీ డిపోల నుంచి మద్యం షాపుల వరకు అన్నిటినీ పంచుకు తిన్నారు. ఇప్పుడు విజయ డెయిరీ ఆస్తులను కూడా కొల్లగొట్టబోతున్నారు. సహకార సంస్థగా ఉన్న విజయ డెయిరీని ఎందుకు నిర్వీర్యం చేస్తారు?, విజయ డెయిరీ ప్రభుత్వానిది కాదు, రైతులది. రైతుల మీద కూడా రెడ్ బుక్ను ప్రయోగిస్తారా?, మా హయాంలో ఎప్పుడూ విజయ డెయిరీ గురించి పట్టించుకోలేదు. చంద్రబాబు ఇప్పుడు ఏ స్వార్ధంతో చలసానిని రాజీనామా చేయించారు?, రాష్ట్రంలో రైతులు యూరియా అందక, గిట్టుబాటు ధరల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ముందు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయండి’ అని హెచ్చరించారు. -
చంద్రబాబుపై బొప్పరాజు ఫైర్
-
‘డీఎస్సీలో అక్రమాలకు ఇవి నిదర్శనం కాదా?’
తాడేపల్లి : డీఎస్సీ అక్రమాలపై విచారణ అడిగితే భయమెందుకని మాజీ మంత్రి శైలజానాథ్ ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై బాధితులు, ప్రతిపక్షం అడిగే దానికి ప్రభుత్వం చెప్పే సమాధానాలకు పొంతన ఉండటం లేదన్నారు. అధికారులు మాత్రం అభ్యర్థులను తప్పుదారి పట్టించేలా మాట్లాడుతున్నారన్నారు.‘డీఎస్సీ-2025లో డీఎస్సీ కన్వీనర్ని ఎందుకు పక్కన పెట్టారు?, ఫస్ట్ ర్యాంకర్ నవీన్ అనే యువకుడికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు?, పరీక్షల సిస్టంలో పని చేసిన నవీన్కు ఫస్ట్ ర్యాంకు రావటం మీద అనుమానం ఉంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికీ ఎందుకు సరైన సమాధానం చెప్పటం లేదు?, రెండో ర్యాంకు వచ్చిన వ్యక్తికి మొదటి ర్యాంకు ఎందుకు ఇచ్చారు?, డీఎస్సీలో అక్రమాలు జరిగాయనటానికి ఇదొక నిదర్శనం. స్పోర్ట్స్ కోటాను 2 నుండి 3 శాతానికి పెంచటం వెనుక కుట్ర ఉంది. జీవో నెంబర్ 4, 47 తేవటం వెనుక కుట్ర ఉంది. ఆ జీవోలు సరైనవే ఆయితే మళ్ళీ జీవో నెంబర్ 56 ఎందుకు తెచ్చారు?ఈమధ్యలోనే భారీగా అక్రమాలు జరిగాయి. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ తెచ్చుకున్న దుర్గయ్యకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు?, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారి రాజకీయ బ్యాక్గ్రౌండ్ పై కూడా విచారణ జరపాలి. రూ.15 లక్షల చొప్పున ఉద్యోగాలను అమ్ముకున్నారు. దానిపై విచారణ జరపాలని అడిగితే కేసులు పెడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లాదిపై దాడి దుర్మార్గం..మల్లాది విష్ణుపై కోడిగుడ్లతో దాడి చేయటం దుర్మార్గపు చర్య. మా రిలే దీక్షల్లో రౌడీలు ఉన్నారన చంద్రబాబు అనటం దారుణం. ఆ మాటలను వెనక్కు తీసుకోవాలి. దీక్షల శిబిరాల దగ్గరకు వెళ్ళి చూస్తే చంద్రబాబుకు వాస్తవాలు తెలుస్తాయి’ అని స్పష్టం చేశారు. -
అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో రచ్చ
సాక్షి, గుంటూరు: అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో రగడ చోటుచేసుకుంది. స్టాల్స్ను తిలకించడానికి వచ్చిన మంత్రి దుర్గేష్ను డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు గన్మెన్ అడ్డుకున్నారు. జనసేన నేతలను రఘురామకృష్ణరాజు గన్మెన్ పక్కకు నెట్టేశారు. దీంతో రఘురామకృష్ణ రాజు గన్మెన్తో జనసేన నేతలు వాగ్వాదానికి దిగారు. అరుపులు, కేకలతో ప్రాంగణం దద్దరిల్లింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముందే గొడవ జరిగింది. -
ఏపీ విద్యాశాఖలో రెడ్బుక్ అరాచకం
సాక్షి, విజయవాడ: విద్యాశాఖలో రెడ్ బుక్ అరాచకం నడుస్తోంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. కల్పలత భర్త ప్రతాప్ రెడ్డిపై చర్యలకు ఛార్జ్ మెమో జారీ చేసింది. ఐదేళ్ల కిందట సెలవు పెట్టినందుకు ఇప్పుడు ఛార్జ్ మెమో ఇచ్చింది.ఎస్సీఈఆర్టీ డైరెక్టర్గా పనిచేసిన ప్రతాప్ రెడ్డి.. ప్రస్తుతం వయోజన విద్య జేడీగా ఉన్నారు. ఉద్యోగుల సమస్యలు లేవనెత్తినందుకు కల్పలత కుటుంబంపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెరతీసింది. ప్రభుత్వం కక్ష సాధింపుపై ఎమ్మెల్సీ కల్పలతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘నా గొంతు నొక్కడానికి కక్ష సాధిస్తున్నారు. మొట్టమొదటి మహిళా టీచర్ ఎమ్మెల్సీపై కక్ష సాధిస్తారా..?’’ అంటూ ఆమె మండిపడ్డారు.‘‘టీచర్లు, ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతున్నందుకు కక్ష కట్టారు. నా భర్త సెలవు పెడితే ఎన్నికల్లో ఎలా ప్రభావితం చేస్తారు..?. ఎంఈవోలు అసలు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ పరిధిలో ఉంటారా?. ఐదేళ్లలో ఒక్క సమావేశంకూడా పెట్టలేదు. నేను ఉద్యోగుల కోసం మాట్లాడితే ఇంకో ఛార్జ్ మెమో ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. నా పైనా, నా భర్త పైన జరుగుతున్న కక్ష సాధింపుపై పోరాడతాను. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి పోరాడతాను...మీరు ఎంత టార్గెట్ చేసిన ఉద్యోగుల సమస్యలపై మాట్లాడతాను. ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసింది. ఉద్యోగులకు ఐదు డీఏల బకాయిలు చెల్లించాలి. పోలీసులు, సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. మీరు ఎంత టార్గెట్ చేస్తే అంత గట్టిగా పోరాడతాను’’ అంటూ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి స్పష్టం చేశారు. -
పాపం! డాక్టర్ ప్రియాంక.. ఇంత దారుణమా?
ఇద్దరు వ్యక్తుల ఉన్మాదానికి యువ డాక్టర్ జీవచ్ఛవంలా మారింది. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం ఊరి కాని ఊరికి వచ్చిన ఆ యువతి ఇప్పుడు మృత్యువు ముంగిట నిలిచింది. మద్యం మత్తులో విచక్షణ మరిచిపోయి కండకావరంతో కారుతో తొక్కించి కిరాతకంగా వ్యవహరించిన దుర్మార్గులపై కఠినంగా వ్యవహరించడంలో పోలీసులు విఫలమయ్యారన్న ఆరోపణలు మిన్నంటుతున్నాయి.రాజమహేంద్రవరం (తూర్పుగోదావరి జిల్లా): వైద్య విద్యార్థిని కనికే ప్రియాంక(28) బ్రెయిన్ డెడ్ పాలైన కేసులో నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఘటన జరిగిన మూడు రోజుల వరకు పోలీసులు కేసును గుంభనంగా ఉంచారన్న దానిపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ఎందుకు తాత్సారం ప్రదర్శించారో తెలపాలని ప్రశ్నించారు. పోలీసులపై ఎవరి ఒత్తిడి ఉందని నిలదీస్తున్నారు. ప్రియాంక ప్రమాదానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రియాంకకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ మోరంపూడి జంక్షన్ వద్ద శనివారం నిర్వహించిన ధర్నాలో మార్గాని భరత్ పాల్గొన్నారు. 'జస్టిస్ ఫర్ డాక్టర్ ప్రియాంక' ప్లకార్లు ప్రదర్శిస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడుతూ.. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ప్రియాంకకు జరిగిన అన్యాయంపై తాము పోరాడుతున్నామని, న్యాయం జరిగే వరకు పోరాడేందుకు జనమంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.''డాక్టర్ ప్రియాంకను కారుతో మూడు సార్లు ఢీకొట్టడం అత్యంత దారుణం. ఆగస్టు 3న ఘటన జరిగితే మూడు రోజుల తర్వాత నిందితులను అరెస్ట్ చేసినట్టు చూపించారు. ఘటన జరిగిన రోజు రాత్రే నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు కానీ, అధికారికంగా వారి అరెస్ట్ గురించి వెల్లడించలేదు. ఏదో కుట్ర జరిగిందని మాకు అనుమానంగా ఉంది. మాకున్న సమాచారం ప్రకారం.. యాక్సిడెంట్ కేసుగా చూపించి, నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చూశారు. పోలీసులపై ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడి ఉందని అర్థమవుతోంది. డాక్టర్ ప్రియాంక కేసు గురించి పోస్టులు పెట్టొద్దని సోషల్ మీడియా ఇన్ప్లుయెన్సర్లు అందరినీ బెదిరించారు. ప్రజాస్వామాన్ని కూటమి ప్రభుత్వం ఖానీ చేస్తోంది. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని నారా లోకేశ్ చెప్పారు, ఇప్పుడు రాజమండ్రిలో అదే జరుగుతోంది. ఒక డాక్టర్ను కారుతో తొక్కించిన ఘటనలో నిందితులను పోలీసులు, ప్రభుత్వం కాపాడటానికి ప్రయత్నించడం దారుణం. నిందితులపై ముందే ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టలేదు? 3 రోజుల పాటు నిందితులను ఎందుకు దాచారు? ప్రియాంకకు జరిగిన అన్యాయంపైనా సీబీఐతో దర్యాప్తు చేయించాలి. యాక్సిడెంట్ చేసిన తర్వాత నిందితులు ఎవరెవరికి ఫోన్ చేశారనే కాల్ డేటా బయటపెట్టాలి. ఈ కేసులో నిజానిజాలు వెల్లడి కావాలంటే ప్రజలు బయటకు వచ్చి పోరాడాలి. నిందితులను ఎవరు కాపాడుతున్నారు, ఎందుకు కాపాడుతున్నారు, ఎన్ని సూటుకేసులు ఎన్ని చేతులు మారాయి.. ఇవన్ని బయటకు రావాలి. డాక్టర్ ప్రియాంకకు న్యాయం జరగాల''ని మార్గాని భరత్ అన్నారు.ఈనెల 21 వరకు నిందితులకు రిమాండ్ డాక్టర్ ప్రియాంక బ్రెయిన్ డెడ్కు కారణమైన కేసులో నిందితులు సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసఫ్లకు కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. వీరిద్దరూ మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. కాగా, హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో ప్రియాంకకు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. -
హైదరాబాద్లో మహిళ అనుమానాస్పద మృతి
చిలకలూరిపేట: వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన నూర్ బాష ఆశా (33) కొంతకాలంగా తన 12 ఏళ్ల కుమారుడితో కలసి తాగునీటి చెరువుకు వెళ్లే టిడ్కో గృహ సముదాయంలో నివాసం ఉంటుంది. సుమారు ఐదేళ్ల కిందట కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తతో విడిపోయింది. కొంతకాలంగా తన మాజీ భర్త ఊరికి చెందిన పర్చూరు మండలం నూతలపాడు గ్రామానికి చెందిన, సుల్తాన్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. సుల్తాన్ కూడా భార్యతో విడిపోయి వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఐదు రోజుల కిందట కుమారుడిని తెలిసిన వాళ్ల ఇంటిలో వదిలివేసి ప్రియుడు సుల్తాన్తో కలసి హైదరాబాద్ వెళ్లింది. అక్కడ మెకానిక్గా పనికి కుదిరిన సుల్తాన్ గురువారం ఉదయం పనుల నిమిత్తం షెడ్డుకు వెళ్లాడు. అతను పనిలో ఉండగా ఇంటి చుట్టుపక్కల వారు ఫోన్ చేసి ఆశా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉన్నట్లు, తాము కిటికీలో నుంచి చూశామని సమాచారం అందించారు. దీంతో ఇంటికి చేరుకున్న సుల్తాన్ మృతదేహాన్ని తీసుకొని అంబులెన్స్లో ఎక్కించుకొని చిలకలూరిపేటలోని వైఎస్సార్ కాలనీ వద్దకు చేరుకున్నాడు. అంబులెన్స్కు బాడుగ డబ్బులు తీసుకువస్తానని వెళ్లి ఎంతకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అంబులెన్స్ డ్రైవర్ డయల్ 100కు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో చిలకలూరిపేట పట్టణ పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సుల్తాన్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పల్నాడులో పోలీసుల దౌర్జన్యం.. కిందపడిపోయిన విడదల రజిని
సాక్షి, పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ నేతల దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు దౌర్జన్యానికి దిగారు. దీంతో, పోలీసులకు, మాజీ మంత్రి విడదల రజినికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తోపులాట సందర్భంగా విడదల రజిని కిందపడిపోయారు. మహిళ అని కూడా చూడకుండా పోలీసులు ఆమెను నెట్టేయడం గమనార్హం.చిలకలూరిపేట రంగా విగ్రహం సెంటర్లో డీఎస్సీ స్కాంపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో మూడో రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. దీక్షకు మద్దతు పలికి మాజీ మంత్రి విడదల రజిని, నాగార్జున యాదవ్ దీక్షలో పాల్గొన్నారు. అనంతరం, అక్కడికి చేరుకున్న పోలీసులు.. దీక్షకు అనుమతి లేదంటూ దౌర్జన్యానికి దిగారు. పార్టీ నేతలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయగా విడదల రజిని కిందపడిపోయారు.అనంతరం, మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ..‘డీఎస్సీ పరీక్షలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయి. సంతలో కూరగాయాల మాదిరి డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కచ్చితంగా నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. విద్యార్థులు, నిరుద్యోగులు నిరసన దీక్షలో పాల్గొంటే పోలీసులు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మూడు రోజుల నుంచి దీక్ష చేస్తుంటే పోలీసులు దీక్ష శిబిరాలను తొలగించడం, మైకులు లాగేయడం చేస్తున్నారు. డీఎస్సీలో అక్రమాలు ప్రజల్లోకి వెళ్లిపోవడంతో ప్రభుత్వానికి భయం పట్టుకుంది. తప్పు చేసిన వాళ్లే భయపడాలి. ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి పోలీసులు అడ్డం పెట్టుకొని మా దీక్ష శిబిరాలను ఇబ్బంది పెడుతుంది. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా.. ఎంత ఇబ్బంది పెట్టినా దీక్షలు కొనసాగుతాయి’ అని హెచ్చరించారు. -
మన్యం బంద్తో ఏపీలో హైటెన్షన్!
-
‘డీఎస్సీపై సీబీఐ విచారణ చేపట్టే వరకు నిరసనలు ఆగవు’
సాక్షి, చిత్తూరు జిల్లా: ఏపీ డీఎస్సీలో అవకతవకలపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చారని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర పిలుపు మేరకు మెగా డీఎస్సీ అక్రమాలపై నగరిలో మూడో రోజు రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు జరుగుతున్నాయి. నగరి రిలే నిరాహారదీక్షకు తిరుపతి, చిత్తూరు జిల్లాలు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ..‘మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. ప్రధాని మోదీ ఏపీలో జరుగుతున్న పరిణామాలపై వెంటనే దృష్టి పెట్టాలి, చర్యలు తీసుకోవాలి. మెగా డీఎస్సీని దగా చేశారు. మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఆనర్హులకు ఉద్యోగం ఇచ్చారు. వైఎస్సార్సీపీ దీక్షా శిబిరాలపై వెన్నుపోటు పార్టీ నేతలు దాడులు చేస్తున్నారు. బూతులు తిడుతూ, కోడి గుడ్లతో దాడులు చేస్తున్నారు. లంచాలు దండుకుని ఇష్టం వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఫీజు రియింబర్స్మెంట్ ఇవ్వకుండా పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. యువతకు అండగా నిలబడి వైఎస్సార్సీపీ పోరాడుతుంది’ అని తెలిపారు.అనంతరం, భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతిలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపడుతాం. సీబీఐ విచారణ చేపట్టే వరకూ నిరసనలు ఆగవు అని వ్యాఖ్యానించారు. -
పనులు చేయించుకుని డబ్బు ఎగ్గొట్టిన మంత్రి కొల్లు అనుచరుడు
విజయవాడ: మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు పామర్తి రాజా పెట్రోలు బంకుల నిర్మాణ పనులు చేయించుకుని తమకు ఇవ్వాల్సిన కూలి సొమ్ము రూ.1.54 కోట్లు ఎగ్గొట్టారని ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం గ్రామానికి చెందిన గిరిజన మహిళలు ఆరోపించారు. విజయవాడ కనకదుర్గమ్మకు సారె సమర్పించి గోడు చెప్పుకొంటామంటూ శుక్రవారం సంప్రదాయ వస్త్రధారణతో ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు వారిని ఇబ్రహీంపట్నంలో కొద్దిసేపు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. బాధితులు తెలిపిన మేరకు.. పామర్తి రాజా పెట్రోలు బంకుల నిర్మాణ కాంట్రాక్టరు. అతడి వద్ద కట్టుబడిపాలేనికి చెందిన బాణావతు రాజునాయక్ సబ్ కాంట్రాక్టర్గా పలు ప్రాంతాల్లో హెచ్పీసీఎల్ పెట్రోలు బంకులను నిరి్మంచారు. రాజునాయక్ తమ గ్రామానికి చెందిన 250 మందితో ఈ పనులు చేయించారు. దీనికి సంబంధించిన కూలి సొమ్ము, ఇతరత్రా రూ.1.54 కోట్లను పామర్తి రాజా ఇవ్వాల్సి ఉంది. ఈ డబ్బు ఇవ్వమని 20 నెలల నుంచి రాజునాయక్, కూలీలుగా పనిచేసిన గిరిజనులు మంత్రి రవీంద్ర, పామర్తి రాజా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఏడాది మే 8న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అప్పుడు మంత్రి రవీంద్ర బాధితులను పిలిపించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా తరువాత పట్టించుకోవడంలేదు. రూ.12 లక్షలు మాత్రమే ఇస్తామంటూ పామర్తి రాజా రాయబారాలు నడుపుతున్నారు. దీంతో బాధితులు శుక్రవారం రోడ్డెక్కారు. ఈ సందర్భంగా రాజునాయక్ మాట్లాడుతూ రావాల్సిన డబ్బు అడుగుతుంటే పామర్తి రాజా తమ కులాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది: సుగాలి మహిళలు రెండేళ్ల తమ కష్టార్జితం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న వారికి మంచి మనస్సు ప్రసాదించాలని సుగాలి మహిళలు అమ్మవారిని వేడుకున్నారు. 24 గంటల్లో తమకు డబ్బులు చెల్లించకుంటే టీడీపీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని వారు హెచ్చరించారు. అదే సమయంలో ఓ సుగాలి మహిళ తీవ్ర ఆందోళనకు లోనై స్పృహ కోల్పోవడంతో కలకలం రేగింది. -
చదవలేక.. తండ్రికి చెప్పలేక తనువు చాలించాడు
మధురానగర్(విజయవాడసెంట్రల్): చదువు ఒంటబట్టక.. ఈ విషయం తండ్రికి చెప్పలేక అర్ధంతరంగా ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుని తనువుచాలించాడు. విషాద ఘటన శుక్రవారం విజయవాడ మధురానగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురానగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన సమ్మెట దుర్గాప్రసాద్ ఎల్రక్టీషియన్. ఆయన భార్య ఎనిమిది సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించింది. కుమారుడు సమ్మెట తరుణ్ రాజ్ (13) సత్యనారాయణపురం ఏకేటీపీ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ప్రతి రోజూలాగే శుక్రవారం ఉదయం 9.15కి స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పి సైకిల్ మీద వెళ్లాడు. తర్వాత సుమారు 10 గంటల ప్రాంతంలో బయట నంబర్ నుంచి తండ్రికి ఫోన్ చేసి స్కూల్కు వెళ్లే సరికి గేటు వేసి ఉందని.. తాను ఇంటికి వచ్చేస్తున్నానని చెపాడు. దీంతో తండ్రి సరే వచ్చేసేయ్ అని చెప్పి తన పనిలో నిమగ్నమయ్యాడు. పని ముగించుకుని దుర్గాప్రసాద్ ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపు లోపల వేసి ఉంది. లోపలికి వెళ్లి చూడగా తరుణ్రాజ్ చున్నీతో ఫ్యాన్కి ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. దీంతో దుర్గాప్రసాద్ చుట్టుపక్కల బంధువులను పిలిచి గుణదల పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెడ్రూంలోని ఒక పుస్తకంలో ‘నాన్నా నువ్వు చదువు .. చదువు అని ఎప్పుడూ అంటూ ఉంటావు. నాకు చదవడం అంతగా రావడం లేదు అందుకే చనిపోతున్నాను’ అని రాసి ఉంది. ఇప్పటికే +భార్యను కోల్పోయిన దుర్గాప్రసాద్ ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క కొడుకు తనువు చాలించటంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. -
పాలన ఎలా ఉందో వాళ్లనే అడుగు: బాబుపై బుగ్గన ఫైర్
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు వాస్తవాలను ప్రతిబింబించేవి కావని.. అవి కేవలం రాజకీయ జిమ్మిక్కులేనని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అంటున్నారు. చంద్రబాబు మాటలకు, చేతలకు ఎలాంటి సంబంధం ఉండదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో బుగ్గన, కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించేలా చంద్రబాబు హామీలు ఇస్తారని, కానీ ఆచరణలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయన్నారు. ప్రొగ్రెస్ కార్డు అనే కాన్సెప్ట్ తెచ్చిన చంద్రబాబు.. అది తనకు తానే ఇచ్చుకుంటున్నాడని, కానీ అది ఇవ్వాల్సింది ప్రజలని బుగ్గన గుర్తు చేశారు. చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించే మీడియా కూడా అదే తరహాలో ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ‘హైదరాబాద్ను కడితే.. కుతుబ్ షా ఏం చేసినట్లు?’చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి గురించి చెప్పుకునే తీరుపై బుగ్గన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్ను తానే నిర్మించానన్నట్లుగా చెప్పుకోవడం సరికాదన్నారు. “చంద్రబాబు హైదరాబాద్ను కడితే.. కుతుబ్ షా ఏం చేసినట్లు? చంద్రబాబు బిర్యానీ కనిపెడితే.. ఇరానీయులు ఏం చేసినట్లు?. అందరినీ అమెరికాకు తానే పంపానని అంటారు.. ఇతర రాష్ట్రాల వాళ్లను కూడా ఆయనే పంపారా?” అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రకటనలు, రాజకీయ వ్యాఖ్యలు చూస్తే ఇతర దేశాల్లో అయితే ఆయనను పబ్లిక్ లైఫ్ నుంచి వెల్లగొట్టేవారని బుగ్గన అన్నారు.వాళ్లను అడిగితే సరిపోదా?.. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని బుగ్గన సూచించారు. చంద్రబాబు పాలన ఎలా ఉందో మహిళలను అడిగితే చెబుతారని, నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులను అడిగినా వాస్తవ పరిస్థితి తెలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో రైతులు సమస్యలతో రోడ్డెక్కుతున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని విమర్శించారు. ఆయన సభలకు వచ్చిన ప్రజలు మధ్యలోనే వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు.ఆరోగ్యశ్రీపై విమర్శలురాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం సరిగా అమలు కావడం లేదని బుగ్గన ఆరోపించారు. ప్రజా సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని అన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.జగన్ జనాదరణపై వ్యాఖ్యలుచంద్రబాబు మీటింగ్ పెడితే జనం మధ్యలో వెళ్లిపోతున్నారన్న బుగ్గన.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయటకు వస్తే లక్షలాది మంది ప్రజలు తరలివస్తున్నారని అంటున్నారు. అది చూసి చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బంది పడుతోందని అన్నారు. ప్రజల్లో తమ పార్టీకి ఇంకా ఆదరణ ఉందని పేర్కొన్నారు. -
అన్నా భయంగా ఉంది.. చంద్రకళ ఏదేదో మాట్లాడుతుంది..!
కాళ్ల పారాణి ఆరకముందే ఆ నవ వధువు నిండు జీవితం ముగిసిపోయింది.. కొత్త బంధంతో సరికొత్త ప్రపంచంలో అడుగుపెట్టిన నాలుగు నెలలకే ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయింది. ఉన్నత చదువులు అభ్యసించి ఉత్తీర్ణురాలైన ఆమె తన గుండెబాధను అధిగమించలేకపోయింది. విజయవాడ అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అయోధ్యనగర్ బసవతారక నగర్లో ఓ వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అయోధ్యనగర్ బసవ తారక నగర్ ప్రాంతానికి చెందిన గోనోల్ల దేవేంద్రకు అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంతానికి చెందిన మారాని చంద్రకళ (24) తో ఈ ఏడాది ఏప్రిల్ 23న పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. ఎంబీఏ చదువుకున్న చంద్రకళ ఇంటివద్దే ఉంటుండగా దేవేంద్ర హనుమాన్పేటలోని ప్రైయివేటు ట్రావెల్స్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. రోజూలానే శుక్రవారం ఉదయం దేవేంద్ర పనికి వెళ్లగా చంద్రకళ ఇంటిలోనే ఉంది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో దేవేంద్ర భోజనానికి ఇంటికి బయల్దేరుతుండగా చంద్రకళ స్నేహితుడు రమణ ఫోను చేసి అన్నా నాకు చాలా భయంగా ఉంది.. చంద్రకళ ఏదేదో మాట్లాడుతుంది.. నువ్వు త్వరగా ఇంటికి వెళ్లమని చెప్పాడు. దీంతో హుటాహూటిన పని నుంచి ఇంటికి వెళ్లగా భార్య తలుపు వేసుకొని, గొళ్లెం పెట్టుకొని ఉంది. కిటికీ తెరచి చూడగా చంద్రకళ తన చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకొని వేలాడుతూ కలినిపించింది. చుట్టుపక్కల వారి సాయంతో గొళ్లెం పగలగొట్టి లోపలకు వెళ్లి చంద్రకళను కిందకి దించాడు. అంబులెన్స్ డాక్టర్ పరీక్షించి అప్పటికే చనిపోనట్టు నిర్ధారించారు. ఇష్టం లేని వివాహం చేసినందుకేనా..? చంద్రకళకు ఇష్టం లేని వివాహం చేయడం వల్లే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంబీఏ చదువుకున్న ఆమెకు బెంగళూరులో ఉంటున్న తన స్నేహితుడంటే ఇష్టమై ఉండొచ్చని.. ఆమె కాల్ లిస్ట్లో చివరిగా మాట్లాడిన కాల్ కూడా అతనిదేనని సమాచారం. మృతికి కారణాలు పూర్తిగా తెలియడం లేదని.. యువతి తల్లిదండ్రులు నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): -
బొండా ఉమామహేశ్వరరావు బాటలో బుద్దా వెంకన్న..!
టీడీపీలో అంతర్గత అసంతృప్తి, అధిష్టానం మెప్పు కోసం జరుగుతున్న పోటీ ఇప్పుడు బహిరంగ దూకుడుకు దారి తీస్తోందా? విజయవాడ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు ఈ ప్రశ్నలను తెరపైకి తెస్తున్నాయి. ఇటీవల ముద్రగడ సంతాప సభలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.. ఆ తర్వాత పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే యత్నాల్లో భాగంగా వైఎస్సార్ సీపీ దీక్షా శిబిరంపై దాడికి దిగారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బొండా చర్యకు మరుసటి రోజే పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ బుద్దా వెంకన్న కూడా అదే తరహాలో వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అధిష్టానం మెప్పు కోసం టీడీపీ నాయకుల మధ్య మొదలైన ఈ పోటీ నగర రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది.సాక్షి ప్రతినిధి, విజయవాడ: అధిష్టానం మెప్పు పొందేందుకు విజయవాడ నగరంలోని టీడీపీ నాయకులు పోటీ పడుతున్నారు. తొలిరోజు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.. వైఎస్సార్ సీపీ దీక్షా శిబిరంపై దాడి చేస్తే దాన్ని చూసి రెండోరోజు నగరంలోని టీడీపీ ‘పశ్చిమ’ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా అదే బాట పట్టారు. టీడీపీ నేతలు చేస్తున్న ఈ రచ్చను నగర ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు.. తర్వాత ప్లేటు మార్చి.. తాను టీడీపీకి కట్టుబడి ఉన్నానని అధిష్టానం మెప్పు పొందేందుకే ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వైఎస్సార్ సీపీ దీక్షా శిబిరంపై దాడికి దిగారు. ఇటీవల వరకూ అసంతృప్తితో ఉండటం, అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఉమా ఒక్కసారిగా ప్లేటు మార్చారు. గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంతాపసభలో పాల్గొన్న బొండా ఉమా 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ముద్రగడ చేసిన ఉద్యమాలే కారణమంటూ వ్యాఖ్యానించడం, వైఎస్సార్ సీపీతోపాటు అన్ని పార్టీల్లోని కాపు నేతలతో మాట్లాడటం అధిష్టానానికి కోపం తెప్పించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆయనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడితో కమిటీ వేయడం, అ కమిటీ ముందు ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఆ కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నివేదిక ఇచ్చిన తర్వాత బుధవారం సంజాయిషీ ఇచ్చుకుని వచ్చారు. దాడికి వ్యూహరచన తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అబద్ధం అని చెప్పేందుకే వైఎస్సార్ సీపీపై దాడికి వ్యూహరచన చేశారు. గురువారం ఉదయం సింగ్నగర్కు చేరుకుని అక్కడ జన సమీకరణ చేసుకున్న తర్వాత నేరుగా ముత్యాలంపాడు ప్రభుత్వ ముద్రణాలయం వద్ద డీఎస్సీలో అక్రమాలపై జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దకు చేరుకుని దాడికి తెగబడ్డారు. షామియానాను తొలగించడంతో పాటు వైఎస్సార్ సీపీ నేతలపై తన అనుచరులను దాడులకు పురికొల్పారు. వెంకన్న దాడికి యత్నం రెండోరోజు శుక్రవారం పశ్చిమలో కేదారేశ్వరపేటలోని బాప్టిస్ట్పాలెంలో జరుగుతున్న దీక్షా శిబిరంపై దాడికి వెంకన్న ప్రయత్నించారు. ఆయనను పోలీసులు హౌస్ అరెస్టు చేయగా, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున చేరుకుని దాడికి తెగబడ్డారు. గురువారం ఘటనతో పరువు పోగొట్టుకున్న పోలీసులు అప్రమత్తమై వారిని అక్కడి నుంచి పంపించివేశారు. అధిష్టానం మెప్పుకు ఒకరిని చూసి మరొకరు వాతలు పెట్టుకుంటుండటంతో ఈ ట్రెండ్ ఎక్కడికి పోతోందనన్న భయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.బ్రాహ్మణ నేతపై దాడి బ్రాహ్మణ సామాజికవర్గానికి చెంది రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న మల్లాది విష్ణుపై కోడిగుడ్లతో బొండా వర్గం దాడి చేయడాన్ని ఆ సామాజికవర్గ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబు, లోకేష్ నుంచి మార్కులు కొట్టేయడం కోసమే ఈ దాడులకు దిగినట్లు సమాచారం. ఇటీవల గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై, కార్యాలయంపై దాడులకు దిగిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి పొలిట్బ్యూరోలో స్థానం కల్పించిన సంగతి తెలిసిందే.లోకేష్ దృష్టిలో పడటానికే హడావుడి ఈ నేపథ్యంలోనే తాను కూడా లోకేష్ దృష్టిలో పడేందుకు ఈ హడావుడి చేసినట్లు తెలుస్తోంది. రాజధాని రైతులను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్సార్ సీపీ కమిటీ సభ్యులపై మహిళలతో కోడిగుడ్లతో దాడి చేసిన సంఘటన స్ఫూర్తితోనే మహిళలకు కోడిగుడ్లు ఇచ్చి వారిని గొడవకు తీసుకువచ్చినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. విజయవాడ నడి»ొడ్డున రెండుగంటలపాటు టీడీపీ నేతలు హడావుడి చేసినా పోలీసులు చోద్యం చూడటం పోలీసుల పనితీరుకు అద్దం పడుతోంది. -
వెట్టిచాకిరీ చేయలేదని సస్పెండ్ చేశారు
పెనమలూరు/కోనేరుసెంటర్: పోలీస్ శాఖలో వెట్టిచాకిరీ వ్యవహారంపై తీవ్ర చర్చకు దారితీసిన అంశమిది. పెనమలూరు పోలీస్స్టేషన్లో హోంగార్డుగా పని చేసిన రూపకళ గురువారం యనమలకుదురులో మీడియాతో మాట్లాడుతూ వెట్టిచాకిరీ చేయడానికి నిరాకరించానని తనను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ‘భర్త మృతి చెందటంతో నాకు హోంగార్డు పోస్టు ఇచ్చారు. గన్నవరం డివిజన్ పెనమలూరు పీఎస్లో నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. గత నెల 14వ తేదీన హోంగార్డు కార్యాలయం నుంచి సాల్మన్ అనే కానిస్టేబుల్ ఫోన్ చేసి ట్రైనింగ్ ఉందని రమ్మని చెప్పడంతో 15వ తేదీన వెళ్లి కలిశాను. మాచవరంలో ఐజీ ఉంటారని అక్కడ పని చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. అనారోగ్యంతో ఉన్నానని వెళ్లలేనని చెప్పాను. దీనిని మనసులో పెట్టుకుని అప్పటి నుంచి నిన్నటి వరకూ ప్రతిరోజూ మచిలీపట్నం తిప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడ గడ్డి పీకించారు. ఆర్ఐని కలిసి నాకు ఆరోగ్యం బాగాలేదని మెడికల్ డాక్యుమెంట్లు చూపాను. ఆర్ఐ న్యాయం చేయకపోవటంతో గన్నవరం సర్కిల్లో హోంగార్డు విధులు పర్యవేక్షించే గుప్తాను కలిశాను. సొమ్ము ఇస్తే పనులు అవుతాయని గుప్తా చెప్పారు. నా నెల జీతం రూ.20 వేలేనని, సొమ్ము ఇవ్వలేనని చెప్పాను. దీంతో అక్కడి నుంచి నన్ను పంపించేశారు.ఉద్యోగం పీకేస్తానని ఎస్పీ బెదిరించారున్యాయం కోసం ఎస్పీని కలిసాను. ఆయన కూడా సీ క్యాటగిరీలో ఉన్న వారు ఇళ్లల్లోనే పని చేయాలని చెప్పారు. తన అర్హతను చూసి పోలీస్స్టేషన్కు కేటాయించారని, తన పరిస్థితి అర్థం చేసుకొని న్యాయం చేయాలని కోరితే ఉద్యోగం పీకేస్తానని బెదిరించారు. ఈ క్రమంలో బుధవారం హోంగార్డ్ ఆఫీసులో నాకు ఒక పేపర్ ఇచ్చి, అందులో ఏముందో కూడా చదువుకునే అవకాశం లేకుండా సంతకం చేయించుకున్నారు. తర్వాత సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెట్టారు. ఆదేశించిన మేరకు ట్రైనింగ్కు హాజరు కాలేదని ఆరోపించారు’ అని కన్నీంటి పర్యంతమయ్యారు. అధికారుల ఇళ్లల్లో పని చేయాలంటే వ్యక్తిగత పనులు, వెట్టి చాకిరి చేయాల్సిందేనని రూపకళ ఈ సందర్భంగా వివరించారు. ‘పిల్లలతో కాలకృత్యాలు తీర్పించి వారికి స్నానాలు చేయించాలి. బాత్ రూమ్లు కడగాలి. వృద్ధులు ఉంటే డైపర్లు మార్చాలి. వంట చేయాలి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.చేయాల్సిందే..మహిళా హోంగార్డు చేసిన ఆరోపణలను కృష్ణా జిల్లా పోలీసు శాఖ ఓ ప్రకటనలో ఖండించింది. సి–కేటగిరికి ఎంపికై న హోంగార్డులు గార్డెనింగ్, టైలరింగ్, శానిటేషన్ తదితర విధులను నిర్వర్తించాల్సి ఉంటుందని, పోలీస్స్టేషన్లలో మాత్రమే పనిచేస్తానని భీష్మిస్తే కుదరదని పేర్కొంది. -
ఇద్దరు బాలికల అదృశ్యంతో హైటెన్షన్
కృష్ణాజిల్లా: మండలంలోని బల్లిపర్రు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం కావడంతో గురువారం రాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు వెనుక ప్రహరీ దూకి పరారయ్యారు. ఆ ఇరువురు మచిలీపట్నం కోనేరు సెంటరుకు చేరుకుని ఇరువురిలో ఒక బాలిక దారిన పోయే ఒక వ్యక్తిని ఫోన్ అడిగి, తల్లికి ఫోన్ చేసింది. ఫోన్ ఇచ్చిన వ్యక్తికి ఫోన్పే ద్వారా డబ్బులు వేయాలని కోరింది. దీంతో అనుమానం వచ్చిన తల్లి సదరు ఫోన్గల వ్యక్తికి మరోసారి ఫోన్ చేసి.. పిల్లలు ఎక్కడ ఉన్నారనే ఆరా తీసి.. వారిని ఆటో ఎక్కించి పంపించాలని సూచించింది. కలెక్టర్కు ఫిర్యాదు.. ఆ తరువాత ఆ తల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రూతమ్మకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో స్పందించిన ప్రిన్సిపాల్ జిల్లా కలెక్టర్కు తెలిపారు. కలెక్టర్ వెంటనే జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వడంతో పెడన పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ వారు అప్రమత్తమయ్యారు. గురువారం రాత్రి వారంతా గాలింపు చేపట్టారు. బాలికలు బల్లిపర్రు నుంచి మెయిన్ రోడ్డు వెంబడి నడుస్తూ పెడనకు చేరుకున్నారు. పెడనలో ఆటో ఎక్కి మచిలీపట్నం కోనేరు సెంటరుకు చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ నుంచి మరొక ఆటో ఎక్కి రుద్రవరం వైపుగా వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. శుక్రవారం వేకువజామున బల్లిపర్రులోని గురుకుల పాఠశాలకు ఆ విద్యార్థినులను క్షేమంగా చేర్చడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. జరిగిన సంఘటనపై పెడన పోలీస్స్టేషన్లో ప్రిన్సిపాల్ గురువారం అర్ధరాత్రి ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేశారు. -
హెరిటేజ్ కోసమే చలసానిపై లోకేష్ కుట్ర: పేర్ని నాని
కృష్ణా జిల్లా: విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు రాజీనామా వ్యవహారంపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు పేర్ని నాని తీవ్రస్థాయిలో స్పందించారు. విజయ డెయిరీని దెబ్బతీసి హెరిటేజ్ వ్యాపారాన్ని పెంచుకునేందుకు మంత్రి నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కంచే చేను మేసిన చందంగా లోకేష్ తీరు ఉంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఆంజనేయులు రాజీనామా అంశంపై పేర్ని నాని తాజాగా స్పందిస్తూ.. సహకార సంఘాల ద్వారా నిర్మితమై విజయవంతంగా కొనసాగుతున్న విజయ డెయిరీని లోకేష్ ధనదాహం, అధికార మదంతో దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దాదాపు రూ.1,000 కోట్ల వ్యాపార లావాదేవీలతో విజయ డెయిరీ బలమైన సంస్థగా ఎదిగిందని, దాని విలువైన ఆస్తులను హస్తగతం చేసుకునే కుట్ర జరుగుతోందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకారంతో మండవ జానకిరామయ్య హయాంలో విజయ డెయిరీ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. 2019-24 మధ్య సహకార సంఘాల ద్వారా కొనసాగుతున్న డెయిరీ అభివృద్ధికి జగన్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. మండవ జానకిరామయ్య బాటలోనే చలసాని ఆంజనేయులు కూడా విజయ డెయిరీ అభివృద్ధికి సేవలు అందించారని చెప్పారు.చలసాని ఆంజనేయులు రాజీనామా వెనుక ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ ఉందని ఆరోపించారు. సహకార సంఘాల సభ్యుల ద్వారా ఎన్నికైన చైర్మన్ను పదవి నుంచి తప్పించేందుకు మంత్రులకు ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంజనేయులును ఐసీయూలోనే బెదిరించి రాజీనామా చేయించారని, రాజీనామా చేయకపోతే అక్రమ కేసులు పెట్టి ఆయన కుమార్తె, కుమారుడిని అరెస్టు చేయిస్తామని బెదిరించినట్లు ఆరోపించారు. కూటమి నేతల ఒత్తిడి, బెదిరింపుల కారణంగానే ఆంజనేయులుకు గుండెపోటు వచ్చింది. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు, అరెస్టుల పర్వం కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు టీడీపీ, జనసేన నేతలపైనా అదే విధానాన్ని ప్రయోగిస్తోందని విమర్శించారు.పాలు, పాల ఉత్పత్తుల విక్రయాలతో విజయవంతంగా నడుస్తున్న విజయ డెయిరీని బలహీనపరిచి హెరిటేజ్ను అభివృద్ధి చేసుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని నాని ఆరోపించారు. సహకార సంఘాల ద్వారా సమర్థవంతంగా నడుస్తున్న విజయ డెయిరీని అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లనివ్వబోమన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డెయిరీపై కుట్రలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. -
ఏజెన్సీ బంద్.. పాడేరులో ఉద్రిక్తత..
ఏజెన్సీ బంద్ అప్డేట్స్..పాడేరు బస్ డిపో ముందు ఉద్రిక్తత.బంద్పై పోలీసుల ఉక్కు పాదం..బంద్ను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం కుట్ర.బంద్ నేపథ్యంలో వందలాది మంది పోలీసులు మోహరింపు.బస్ స్టేషన్ ముందు జేఏసీ నేతలు నిరసన..జేఏసీ నేతలను నెట్టివేసిన పోలీసులు..దగ్గరుండి ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్న పోలీసులు.పోలీసులు తీరుపై మండిపడుతున్న జేఏసీ నేతలు.పోలవరం జిల్లా..గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మన్యం బంద్కు పిలుపు...ఏజెన్సీలో గిరిజనేతరుల ఆక్రమణలను అడ్డుకోవడం వంటి ప్రధాన డిమాండ్లతో రోడ్డెక్కిన గిరిజనులు..ఏజెన్సీలో పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం.పార్వతీపురం మన్యం జిల్లా..జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో గిరిజన బంద్ ప్రభావం.గుమ్మలక్ష్మి పురంలో మూత పడ్డ దుకాణలు.నిలిపేసిన ఆర్టీసీ బస్సుల రాకపోకలు..👉ఏపీలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, జీఓ నంబర్-3ను పునరుద్ధరించాలనే డిమాండ్లతో ఏజెన్సీ ప్రాంతంలో బంద్ కొనసాగుతోంది. బంద్కు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మన్యం బంద్ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.👉బంద్ను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జేఏసీ నేతలు ఆరోపించారు. వ్యాపారులు బంద్కు సహకరించకుండా పోలీసులు, అధికారులు సంప్రదింపులు జరిపారని, షాపులను యథావిధిగా తెరవాలని ఆదేశాలు ఇచ్చారని వారు పేర్కొన్నారు. అయితే బంద్కు సహకరిస్తామని పలువురు వ్యాపారులు, వర్తకులు స్పష్టం చేసినట్లు తెలిపారు.👉జీఓ నంబర్-3ను పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో 100 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అల్లూరి జిల్లాను జోన్-1లో కొనసాగించాలని కోరారు. అలాగే 1/70 చట్టంపై సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని, గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 👉బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు నిలిపివేయడంతో పాటు హైడ్రో పవర్ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరారు. ఏజెన్సీ బంద్కు అన్ని వర్గాల ప్రజలు సహకరిస్తున్నారని జేఏసీ నేతలు తెలిపారు. పోలీసు బలగాలను భారీగా మోహరించి బంద్ను విచ్ఛిన్నం చేయాలని ప్రభుత్వం చూస్తోందని వారు ఆరోపించారు. -
డిజైన్.. ఫీజు దిమ్మతిరిగెన్..
సాక్షి, అమరావతి : రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల వ్యయమే కాకుండా, వాటి ఆర్కిటెక్చర్ డిజైన్లను రూపొందించే ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ (యూకే) సంస్థకు చెల్లించే మొత్తాన్ని రూ.136.90 కోట్ల నుంచి రూ.206.59 కోట్లకు ప్రభుత్వం పెంచేసింది. హైకోర్టు భవనం నిర్మిత ప్రాంతం పెరగడం, అత్యాధునిక డిజైన్ల కోసం అదనపు నిపుణులను నియమించాల్సి రావడం, డిజైన్లను వేగంగా సమర్పించడం, బ్రిటీష్ పౌండ్ మారకపు విలువ పెరగడం.. వాటికి జీఎస్టీ కలపడం వల్ల ఫీజు వ్యయం పెరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు డిజైనర్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్కు అదనంగా చెల్లించేందుకు అనుమతి ఇస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణ వ్యయం ఇప్పటికి రూ.3,975.12 కోట్లు. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే.. వాటి నిర్మాణ వ్యయంలో 5.20 శాతాన్ని డిజైన్ల కోసం చెల్లిస్తుండటంపై ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా నిలిచే భవనానికే డిజైన్ల వ్యయం దాని నిర్మాణ వ్యయంలో ఒకటి లేదా 1.5 శాతం లోపే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. రానున్న రోజుల్లో బ్రిటీష్ పౌండ్ మారకపు విలువ పెరిగితే మళ్లీ డిజైనర్కు చెల్లించే మొత్తం పెరుగుతుందన్నది ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో చెప్పకనే చెప్పింది. రాజధానిలో శాశ్వత సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాలను నిర్మించే ప్రాంతాన్ని అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (ఏజీసీ) అని ప్రభుత్వం నామకరణం చేసింది. ఏజీసీ మాస్టర్ ప్లాన్తోపాటు కొత్త సచివాలయం టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ భవనాల డిజైన్లను 2016లోనే ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ రూపొందించింది. ఇందుకు ఆ సంస్థకు రూ.67.86 కోట్లు అప్పట్లోనే చెల్లించారు. ఇప్పుడు కేవలం హైకోర్టు, అసెంబ్లీ భవనాల సమగ్ర డిజైన్ల కోసం ఏకంగా రూ.206.59 కోట్లు చెల్లిస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. హైకోర్టు శాశ్వత భవనం వ్యయం రూ.2,027.76 కోట్లు » హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులకు రూ.752.06 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ విధానంలో 24 నెలల్లో పూర్తి చేసి, మరో మూడేళ్లు భవనాన్ని నిర్వహించాలన్న షరతుతో గతేడాది మార్చి 1న సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో 4.52 శాతం అధిక (ఎక్సెస్) ధరకు అంటే రూ.786.05 కోట్లకు కోట్ చేసిన ఎన్సీసీ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది. జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.138.64 కోట్లు అదనంగా ఇస్తామని టెండర్లో సీఆర్డీఏ పేర్కొంది. ఈ లెక్కన హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనుల కాంట్రాక్టు విలువ రూ.924.69 కోట్లన్నమాట. » ఈ భవనానికి హైసైడ్ ఎలక్ట్రికల్, హెచ్వీఏసీ (హీటింగ్ వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్), అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్వీ (సీసీ టీవీ, ఫైర్ అలారమ్తో కూడిన భద్రత వ్యవస్థ) పనులు చేపట్టడానికి మరో రూ.556 కోట్లను మంజూరు చేస్తూ ఫిబ్రవరి 27న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. » హైకోర్టు శాశ్వత భవనం వెలుపల అభివృద్ధి పనులు చేపట్టేందుకు జూన్ 5న రూ.547.07 కోట్లు మంజూరు చేసింది. దాంతో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ వ్యయం రూ.2,027.76 కోట్లకు చేరుకుంది. ఈ భవనాన్ని ఏజీసీలో ‘ఎఫ్’ బ్లాక్లో 42.36 ఎకరాల్లో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, ఏడు అంతస్తులు (బీ+జీ+7)లో 20,32,231 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తోంది. ఈ లెక్కన చదరపు అడుగుకు రూ.9,978లు చొప్పున ఖర్చు చేస్తోంది. » రాజధాని అమరావతిలో ఇప్పటికే రూ.173 కోట్ల వ్యయంతో హైకోర్టు తాత్కాలిక భవనాన్ని 2017–18లో ప్రభుత్వం నిర్మించింది. కొత్త భవనం పూర్తయితే తాత్కాలిక భవనం కోసం చేసిన వ్యయం రూ.173 కోట్లు వృథా అవనుంది. అసెంబ్లీ భవనం నిర్మాణ వ్యయం చదరపు అడుగు రూ.17,356.54 » అసెంబ్లీ భవనాన్ని ఏజీసీ ‘ఈ’ బ్లాక్లో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, 3 అంతస్తుల్లో (బీ+జీ+3) 11,21,975 చదరపు అడుగుల్లో ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ భవన డిజైన్ను కూడా ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ సంస్థే రూపొందించింది. » ఈ భవన నిర్మాణ పనులకు రూ.590.86 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ విధానంలో 24 నెలల్లో పూర్తి చేసి.. మరో మూడేళ్లు నిర్వహించాలనే షరతుతో గతేడాది మార్చి 1న సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో 4.48 శాతం అధిక ధరకు అంటే రూ.617.33 కోట్లకు కోట్ చేసిన ఎల్ అండ్ టీ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది. జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.107.69 కోట్లు అదనంగా ఇస్తామని టెండర్ నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. అంటే.. అసెంబ్లీ శాశ్వత భవనం నిర్మాణ కాంట్రాక్టు విలువ రూ.725.02 కోట్లు. » ఇటీవల ఈ భవనంలో ఎలక్ట్రికల్, హెచ్వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్వీ పనులు చేపట్టేందుకు రూ.424.34 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. » అసెంబ్లీ భవనంలో స్పైర్, పార్కింగ్ రింగ్, రింగ్ రూఫ్ వంటి సివిల్ స్ట్రక్చర్ పనులు చేపట్టడానికి మరో రూ.798 కోట్లు మంజూరు చేసింది. దాంతో అసెంబ్లీ భవన నిర్మాణ వ్యయం రూ.1,947.36 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగు రూ.17,356.54 కోట్లకు చేరుకుంది. రెండున్నరేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.971 కోట్లతోనే అత్యాధునిక వసతులతో భారత మణిహారంలో కలికితురాయిగా నిలిచేలా కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించడం గమనార్హం. -
హెరిటేజ్ కోసం ‘విజయ’కు ఎసరు!
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బరితెగింపు పరాకాష్టకు చేరింది. ప్రభుత్వ పెద్దల కన్ను పడితే చాలు ఎందాకైనా సై అంటూ రెచ్చిపోతున్న తీరు హద్దులు దాటింది. తమ స్వార్థం కోసం రూ.1200 కోట్ల టర్నోవర్, వందల కోట్ల ఆస్తులున్న విజయ డెయిరీ (కృష్ణా మిల్క్ యూనియన్)ని నిర్వీర్యం చేసే కుతంత్రానికి తెర లేపింది. ఈ క్రమంలో టీడీపీకే చెందిన విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు ను తీవ్రంగా బెదిరించి.. ఆస్పత్రి పాలయ్యేలా చేసి.. ఆస్పత్రి బెడ్పై చికిత్స పొందుతుండగానే ఆయనతో బలవంతంగా రాజీనామా లేఖ రాయించుకుని తీసుకెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో, టీడీపీ శ్రేణుల్లోనూ కలకలం రేపింది. చలసాని డెయిరీ చైర్మన్ పదవికి నామినేషన్ వేయకూడదంటూ కొద్ది రోజులుగా ప్రభుత్వ పెద్దలు మంత్రుల ద్వారా ఆయనపై ఒత్తిడి తెచ్చారు. అయితే అత్యధిక శాతం డైరెక్టర్లు చలసానికి మద్దతు ఇవ్వడంతో గురువారం చలసాని ఆంజనేయులు మరోసారి విజయ డెయిరీ (కృష్ణా మిల్క్ యూనియన్) చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారనే విషయం తెలుసుకుని ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారధి చలసాని వద్దకు వెళ్లారు. విజయ డెయిరీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే కేబినెట్ నుంచి అక్కడికి చేరుకుని మంత్రాంగం నడిపారు. ఆయన్ను నామినేషన్ వేయనీయకుండా అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే మెజార్టీ డైరెక్టర్లు ఆయన్ను చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో చంద్రబాబు, లోకేశ్ సూచనల మేరకు పక్కకు తప్పుకోవాలని మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి చిట్టి నగర్లోని డెయిరీ యూనిట్కు వెళ్లి మరీ ఆయన్ను బెదిరించారు. ఒకరోజు సమయం ఇస్తే అధిష్టానం చెప్పినట్లు చేస్తానని చెప్పినా, మంత్రులు ఒప్పుకోకుండా రాజీనామా చేయాల్సిందేనని పట్టుపట్టారు. తెల్ల పేపర్ ఆయన ఎదుట పెట్టి.. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాసి సంతకం చేయాలని తీవ్రంగా ఒత్తిడి చేశారు. దీంతో చలసాని అస్వస్థతకు గురవ్వగా కుటుంబ సభ్యులు ఆయన్ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యం కొనసాగుతున్నా రాజీనామాకు పట్టువైద్యం కొనసాగుతున్నప్పటికీ సదరు అమాత్యులు ఆయన్ను వదల్లేదు. వీరిద్దరూ కాకుండా.. గట్టిగా నోరేసుకుని విరుచుకుపడే మరో అమాత్యుడు ఏకంగా ఆ ఆస్పత్రి యాజమాన్యానికే ఫోన్ చేసి.. చలసానిని వెంటనే డిశ్చార్జ్ చేయాలని ఆదేశించినట్లు చర్చ జరుగుతోంది. అయితే మానవతా దృక్పథంతో ఆ ఆస్పత్రి వైద్యం కొనసాగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రి పార్థసారధి శుక్రవారం ఆ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రి బెడ్పై స్టెంట్ వేయించుకోవాల్సిన స్థితిలో ఉన్నా, మానవత్వాన్ని కూడా మరిచి రాజీనామా లేఖపై సంతకం చేయించి బలవంతంగా తీసుకున్నారు. ఆ లేఖ తీసుకుంటున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కాగా, ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. మంత్రి కొల్లు ఇంట్లో డైరెక్టర్ల నిర్బంధం మరోవైపు శుక్రవారం విజయ డెయిరీ డైరెక్టర్లందరినీ మంత్రి కొల్లు రవీంద్ర చర్చల కోసం తన ఇంటికి పిలిపించి నిర్బంధించారు. చలసానికి వారు మద్దతు పలుకుతుండడంతో రాత్రి వరకు అక్కడే ఉంచారు. తాము ఏకగ్రీవంగా ఎన్నుకున్న వ్యక్తిపై అవిశ్వాసం ఎలా పెడతామని డైరెక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈలోపు చలసాని ఆంజనేయుల్ని బెదిరించారు. డెయిరీ వ్యవహారాలపై విచారణ జరిపించి కేసులు పెడతామని, రాజకీయ భవితవ్యం లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా వదలకుండా రాజీనామాకు ఒప్పించాలని ఒత్తిడి చేశారు. ఆయన కుమార్తెను ఇబ్బంది పెట్టినట్లు తెలిసింది. మరోవైపు అమెరికాలో ఉన్న ఆయన కుమారుడికి ఫోన్ చేసి రాజీనామా చేయకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయని మంత్రులు హెచ్చరించారు. అధిష్టానం ఆదేశించిందట..ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా అధిష్టానం ఆదేశించింది రాజీనామా చేయాలని చలసానిపై ఒత్తిడి తేవడం ఎంతవరకు సమంజసం? బోర్డు మొత్తం చలసాని ఆంజనేయుల్ని ఎన్నుకుంది. మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్ధసారధి బోర్డు సభ్యులను పిలిచి ఆంజనేయుల్ని రాజీనామా చేయాలని ఒత్తిడి చేయాలని చెప్పారు. లేనిపక్షంలో అవిశ్వాసం పెట్టండని అడిగారు. నిబంధనలకు అనుగుణంగా ఎన్నికైన వారిని అదే రోజు రాజీనామా చేయమనడం, అనారోగ్యంతో ఉన్నా వేధించడం మంచి పద్దతి కాదు. – వేమూరి సాయి, డైరెక్టర్హెరిటేజ్ కోసమే!» విజయ డెయిరీ (కృష్ణా మిల్క్ యూనియన్) 1.50 లక్షల కుటుంబాల సంస్థ. ఒక్క విజయవాడలోనే 2.60 లక్షల లీటర్లు, రాష్ట్రమంతా కలిసి 4.60 లక్షల లీటర్ల పాలను ప్రతి రోజూ వినియోగదారులకు అందిస్తోంది. » పాలు, నెయ్యి, పెరుగుతో పాటు దాదాపు 84 రకాల పాల ఉత్పత్తులను తయారు చేస్తోంది. » బాపులపాడు మండలం వీరవల్లిలో ఇటీవల తన రెండవ యూనిట్ను ప్రారంభించింది. ఈ కొత్త యూనిట్ ప్రతిరోజూ సుమారు 3 లక్షల లీటర్ల పాలు, లక్ష లీటర్ల పెరుగు ఉత్పత్తి చేస్తోంది. రైతుల నుంచి ప్రతి రోజూ 10 లక్షల లీటర్ల పాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.» ఇది సాకారమైతే విజయవాడ, కృష్ణా జిల్లాల్లో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డైయిరీకి ఆదరణ పూర్తిగా తగ్గిపోతుంది. మరోవైపు మ్యాక్స్ చట్టంలోకి మారిన విజయ డైయిరీ విస్తరణ దిశగా ముందుకు పోతుంది. ఇది జరగకూడదనే చలసానిని బలవంతంగా చైర్మన్ పదవి నుంచి తప్పించారని స్పష్టమవుతోంది. » ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు తన హెరిటేజ్ డెయిరీ ప్రయోజనాల కోసం చంద్రబాబు చిత్తూరు డెయిరీని పక్కా ప్రణాళికతో నిర్వీర్యం చేసిన చరిత్ర గుర్తుకు తెస్తోందని రైతులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. » దీంతో పాటు విజయ డెయిరీకి ఉన్న రూ.వందల కోట్ల ఆస్తులతో పాటు.. గన్నవరం వద్ద ఉన్న 24 ఎకరాల భూమిపై పెద్దల కన్ను పడిందని తెలుస్తోంది. » ప్రభుత్వం తీరు సరికాదని విజయ డైరెక్టర్లు విమర్శిస్తున్నారు. బుడమేరు వరద సమయంలో ఏమాత్రం పట్టించుకోలేదని, అసలు సహకార రంగంలో ఉన్న డైయిరీ విషయంలో ఈ బెదిరింపులు ఏమిటని వారు నిలదీస్తున్నారు. » ఆరు దశాబ్దాలుగా లక్షలాది మంది రైతుల భాగస్వామ్యంతో అభివృద్ధి చెందిన విజయ (కృష్ణా మిల్క్ యూనియన్) డెయిరీని హెరిటేజ్ కోసం బలిచేసే లక్ష్యంతో ప్రభుత్వ పెద్దలే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఏపీ రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వీ.కృష్ణయ్య, కే.ప్రభాకర రెడ్డిలు తప్పుపట్టారు. -
రాజకీయ ఈర్ష్యతో ‘దిశ’ రద్దు దురదృష్టకరం
సాక్షి, అమరావతి: మహిళల భద్రతలో దేశానికే దిశా నిర్దేశం చేసిన ‘దిశ’ను ఉపసంహరించుకుంటూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు ఒక చీకటి రోజుగా అభివర్ణించారు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర్ష్య తో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు. మంత్రివర్గం తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ‘దిశ’ను నిర్వీర్యం చేయడం కాదు.. మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వానికి హితవు పలుకుతూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శుక్రవారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మహిళలు, చిన్నారులకు రక్షణ వ్యవస్థగా నిలిచిన ‘దిశ’‘దిశ’ను ఉపసంహరించుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో మహిళలు, చిన్నారులకు ఒక చీకటి రోజు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర‡్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరం. మహిళలు, చిన్నారులపై నేరాలు, దర్యాప్తులో జాప్యం, న్యాయ ప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలకు పరిష్కారంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘దిశ’ను తీసుకొచ్చింది.నేరం జరగకుండా నిరోధించడం నుంచి, నేరం జరిగితే వెంటనే స్పందించడం, బాధితులకు రక్షణ, వేగంగా దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, చార్జిషీటు, ప్రత్యేక కోర్టుల ద్వారా సత్వర న్యాయం వరకు ఒక సమగ్ర వ్యవస్థను నిర్మించాం. మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు ఫోన్లో ఎస్వోఎస్ బటన్ నొక్కినా, ఫోన్ను ఐదు సార్లు షేక్ చేసినా నిమిషాల వ్యవధిలో పోలీసులు స్పందించే వ్యవస్థ తీసుకొచ్చాం. 1.51 కోట్ల మంది ‘దిశ’ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ‘దిశ’ ద్వారా వచ్చిన 31,607 అత్యవసర కాల్స్ను అప్పట్లో మా ప్రభుత్వంలో పోలీసులు పరిష్కరించారు. 18 ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసును అందుబాటులోకి తీసుకొచ్చి 13,500 మందితో క్షేత్ర స్థాయి భద్రత, రిపోర్టింగ్ వ్యవస్థను నిర్మించాం. 900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలతో ప్రత్యేక పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. నేరస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే అవకాశం లేకుండా ఈ కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆరు నగరాల్లో ఫోరెన్సిక్ వ్యవస్థను బలోపేతం చేశాం. సత్వర విచారణ కోసం 13 ప్రత్యేక పోక్సో కోర్టులు, 12 మహిళా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశాం. 2,17,467 మంది లైంగిక నేరస్తుల వివరాలతో ప్రత్యేక డేటా బేస్ను రూపొందించాం. అందుకనే ‘దిశ’ విజయవంతంగా మహిళలకు, చిన్నారులకు గొప్ప భద్రతా సేవలను అందించింది. నిందితుడికి శిక్షపడే వరకూ రక్షణ నెట్వర్క్ 2017లో మహిళలపై నేరాల దర్యాప్తుకు సగటున 156 రోజులు పట్టగా, 2022 నాటికి అది 28 రోజులకు తగ్గించగలిగారు. 164 అత్యాచారం కేసులు, 378 లైంగిక నేరాల కేసుల్లో కేవలం 7 రోజుల్లోనే ఛార్జిషీట్లు దాఖలు చేశారు. తీవ్రమైన కేసుల్లో 51 శాతానికిపైగా నిందితులను 48 గంటల్లోపు అరెస్టు చేశారు. గతంలో డీఎన్ఏ నివేదికలకు నెలలు పట్టేది. ‘దిశ’ ఫోరెన్సిక్ వ్యవస్థతో వాటిని రోజుల్లోనే అందించే పరిస్థితి తీసుకొచ్చాం. 214 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. మే 2024 నాటికి మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయి. వార్షిక సగటు కేసులు 14,338 నుంచి 10,426కు తగ్గాయి. ఇదీ ‘దిశ’ ఇచ్చిన భరోసా.. ఇవీ ‘దిశ’ సాధించిన ఫలితాలు. అందుకే 19 జాతీయ అవార్డులను మా ప్రభుత్వ హయాంలో ‘దిశ’ గెలుచుకుంది. ‘దిశ’ అనేది కాగితాల మీదున్న పేరు కాదు. ప్రమాదంలో ఉన్న మహిళ ఎస్వోఎస్ నొక్కిన క్షణం నుంచి, నిందితుడికి శిక్ష పడే వరకు ఆమెకు అండగా ఉండే సజీవమైన మహిళా రక్షణ నెట్వర్క్.నేరస్తుల్లో చట్టంపై భయం తగ్గిస్తోంది ‘దిశ’ను ఉపసంహరించుకోవడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం నేరస్తుల్లో చట్టంపై ఉన్న భయాన్ని తగ్గిస్తోంది. బాధిత మహిళల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బ తీస్తోంది. మహిళలు తమ రక్షణ కవచంగా భావించిన వ్యవస్థను లేకుండా చేస్తోంది. మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ‘దిశ’ను రద్దు చేయడం కాదు– రక్షించాలి. ‘దిశ’ను నిర్వీర్యం చేయడం కాదు–మరింత బలోపేతం చేయాలి.న్యాయం అనే లక్ష్యానికి బీఎన్ఎస్ ఎలా ప్రత్యామ్నాయం?ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ‘బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) చాలు, దిశ అవసరం లేదు’ అంటోంది. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎస్వోఎస్ వ్యవస్థ, ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు, గ్రామ స్థాయి నుంచే మహిళా పోలీసులు, ప్రత్యేక పెట్రోలింగ్, లైంగిక నేరస్తుల డేటా బేస్, వేగవంతమైన ఫోరెన్సిక్ వ్యవస్థ, ప్రత్యేక ప్రాసిక్యూషన్, ప్రత్యేక కోర్టులు, నిర్ణీత సమయంలో దర్యాప్తుతో కూడిన న్యాయం అనే లక్ష్యానికి బీఎన్ఎస్ ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది? మహిళలు, చిన్నారులపై తీవ్రమైన దారుణాలు జరిగినప్పుడు ఏడు పని రోజుల్లో పోలీసు దర్యాప్తు, ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత 14 పని రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేసేలా ‘దిశ’ ద్వారా తీసుకొచ్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. 21 రోజుల్లోగా బాధితులకు న్యాయం అందించాలన్న అలాంటి లక్ష్యాన్ని కూడా ఈ ప్రభుత్వం విమర్శించడం మరింత బాధాకరం. ఆ లక్ష్యం వెనుక ఉద్దేశం ఒక్కటే. దర్యాప్తులో జాప్యం ఉండకూడదు.. విచారణలో ఆలస్యం ఉండకూడదు.. మహిళలు, చిన్నారులపై నేరాలను అత్యంత ప్రాధాన్యతతో వేగంగా విచారించాలి.. నేరం చేస్తే చట్టం వేగంగా, కఠినంగా స్పందిస్తుందనే భయం నేరస్తుల్లో ఉండాలి. అలాంటి వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సింది పోయి, వేగంగా న్యాయం అందించాలనే లక్ష్యాన్నే తప్పు పట్టడం మహిళలకు ఏ సందేశం పంపుతోంది? మహిళలు, చిన్నారులకు సకాలంలో న్యాయం జరగాలని కోరుకోవడమే ఈ ప్రభుత్వానికి అభ్యంతరమా?1.51 కోట్ల మంది ‘దిశ’ యాప్ డౌన్లోడ్31,607 అత్యవసర కాల్స్ పరిష్కారం18 ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు.. గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసులు13,500 మందితో క్షేత్ర స్థాయి భద్రత, రిపోర్టింగ్ వ్యవస్థ900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలతో ప్రత్యేక పెట్రోలింగ్ఆరు నగరాల్లో ఫోరెన్సిక్ వ్యవస్థ బలోపేతం, 13 ప్రత్యేక పోక్సో కోర్టులు, 12 మహిళా ప్రత్యేక కోర్టులు2,17,467 మంది లైంగిక నేరస్తుల వివరాలతో ప్రత్యేక డేటా బేస్ అందువల్లే ‘దిశ’తో గొప్పగా భద్రతా సేవలు.. 19 జాతీయ అవార్డులు -
వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మద్యం తాగిన ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఐదురోజులుగా మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని కనికే ప్రియాంక (28) శుక్రవారం మృతిచెందింది. ఈ నెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి ప్రసాదిత్య మాల్లో సినిమాకి వెళ్లి బైక్పై బయటకు వస్తుండగా.. మద్యం తాగిన ఇద్దరు యువకులు తమ కారుతో ఆ బైక్ను మూడుసార్లు ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయారు. ఈ ఘటనలో ప్రియాంక తలకు తీవ్రగాయాలయ్యాయి. తొలుత స్థానికంగా ఉన్న స్వతంత్ర ఆస్పత్రిలో చేర్చిన ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఆమె బ్రెయిన్డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. కుటుంబసభ్యులు ఆమె అవయవాలను దానం చేశారు. ఎంబీబీఎస్లో మెరిట్ స్టూడెంట్ కర్నూలు నుంచి తెలంగాణలోని గద్వాల్ జిల్లా ఎక్లాస్పురానికి వలస వెళ్లిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేష్కు ముగ్గురు కుమార్తెలు. వారిలో రెండో కుమార్తె ప్రియాంక. కర్నూలులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేసిన ఆమె మెరిట్ స్టూడెంట్గా ప్రతిభ కనబర్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18న రాజమహేంద్రవరంలోని జీఎస్ఎల్ మెడికల్ కళాశాలలో పీజీ డెర్మటాలజీలో చేరింది. ప్రియాంక మృతి వార్తతో ఎక్లాస్పురంలో విషాదం నెలకొంది. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి శుక్రవారం రాత్రి ఎక్లాస్పురానికి తీసుకెళ్లి, శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ వైద్య విద్యార్థిని వెళుతున్న బైక్ను కారుతో ఢీకొట్టి ఆమె మృతికి కారకులైన సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసెఫ్లను పోలీసులు అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. వీరిలో సూరారపు ధస్వంత్ సున్నపుబట్టీల వ్యాపారికాగా ఆండ్రు జోసెఫ్ ట్రాన్స్పోర్టు వ్యాపారం చేస్తున్నారు.వారిద్దరు ఘటన జరిగిన రోజు సాయంత్రం 5 గంటలకు ఏవీ అప్పారావు రోడ్డులోని స్కాచ్ బ్యారెల్ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేసి కారులో కూర్చుని కొంతసేపు తాగారు. తర్వాత మరో ప్రాంతంలో కూర్చుని తాగి, అనంతరం ప్రసాదిత్య మాల్కు వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరూ కారుని అతివేగంగా లోపలికి పోనివ్వడం, మాల్ సిబ్బంది వారిని అడ్డుకోవడం, వారు అదే వేగంతో బయటకు వెళుతూ ప్రియాంక కూర్చున్న బైక్ను మూడుసార్లు ఢీకొట్టిన విషయం తెలిసిందే. -
ఫీజుల ఒత్తిడి తాళలేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
కాకినాడ క్రైం: కాకినాడలో ఇంటర్మీడియెట్ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు జె.రామారావుపేట సమ్మెట వారి వీధికి చెందిన విద్యార్థి (16) స్థానిక శాంతినగర్లోనిఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మొదటి టర్మ్ ఫీజు గడువు ముగిసింది. అయితే, శుక్రవారం విద్యార్థి తన తండ్రితో కలిసి ఫీజు చెల్లించేందుకు వెళ్లాడు. కళాశాల యాజమాన్యం, ఆలస్యం అయిందని కట్టించుకునేందుకు ప్రధాన కార్యాలయ అనుమతి కావాలని, రేపు రావాలని చెప్పారు. దీంతో ఇద్దరు ఇంటికి బయల్దేరారు. మార్గ మధ్యంలో తండ్రి తాను పనిచేస్తున్న ఫాస్ట్ఫుడ్ సెంటర్కి వెళతానని, ఇంటికి జాగ్రత్తగా వెళ్లాలని కుమారుడిని పంపేశాడు. ఇంటికి వెళ్లిన విద్యార్థి, ఇంట్లో ఫ్యానుకు తన తల్లి చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిసేపటికి అతడి అన్నయ్య గమనించి కాకినాడ జీజీహెచ్కు తరలించాడు. అయితే అప్పటికే మరణించాడని వైద్యులు ధృవీకరించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వేధింపులు, ఫీజు ఒత్తిడి వల్లే తన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఫీజుల కోసం విద్యార్థిని పొట్టనబెట్టుకున్నారని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఆత్మహత్య ఘటనపై కాకినాడ వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆశ్రమ పాఠశాలలో విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి
వేలేరుపాడు: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం శివకాశీపురం గిరిజన బాలికోన్నత పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థిని కెచ్చెల లక్ష్మీపార్వతి (13) శుక్రవారం విద్యుదాఘాతంతో మృతిచెందింది. మండలంలోని చిట్టంరెడ్డిపాలెం గ్రామానికి చెందిన లక్ష్మీపార్వతి 8వ తరగతి చదువుతోంది. శుక్రవారం ఉదయం పాఠశాలకు ఆనుకుని ఉన్న మరో భవనంలో ఆరబెట్టిన దుస్తులు తీసుకునేందుకు వెళ్లింది. దుస్తులు అందకపోవడంతో అక్కడున్న ఇనుప స్టాండ్పై ఎక్కి ఇనుప కిటికీని పట్టుకుంది. ఆ కిటికీకి విద్యుత్ సరఫరా అవుతుండటంతో షాక్కు గురై కేకలు వేసింది. మరో విద్యార్థిని దీపిక ఆమెను చున్నీతో లాగింది. వెంటనే ఆమెను వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. లక్ష్మీపార్వతి మృతికి హాస్టల్ వార్డెన్, హెచ్ఎం కారణమంటూ తల్లిదండ్రులు కెచ్చెల అమల, సుధాకర్రెడ్డి, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని మోసుకుని ఆశ్రమ పాఠశాల గేటు వద్దకు తీసుకెళ్లి బైఠాయించారు. -
అంబులెన్స్ లేక ఆగిన చిన్నారి ప్రాణం
చింతూరు: పోలవరం జిల్లా చింతూరులో అంబులెన్స్ అందుబాటులో లేక గిరిజన చిన్నారి ప్రాణం ఆగింది. చింతూరు మండలం పెద్ద శీతనపల్లి గ్రామానికి చెందిన చోడి పాపయ్య కూతురు చోడే లాస్య (4) అనారోగ్యంగా ఉండటంతో శుక్రవారం చింతూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. చిన్నారికి వైద్యులు మలేరియాగా నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉన్నందున భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. చింతూరు ప్రభుత్వాస్పత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ వాహనంలో వెళ్లాలని సూచించారని బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. తమ వద్ద ఆర్థిక స్థోమత లేకపోవడంతో డబ్బుల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ఆలస్యం కావడంతో ఆస్పత్రిలో చిన్నారి మృతి చెందిందని వారు వాపోయారు. చిన్నారి మృతి చెందడంతో ఆగ్రహించిన గ్రామస్తులు స్థానిక గిరిజన సమీకృతాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఎదుట చిన్నారి మృతదేహంతో ఆందోళన చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీవో శుభమ్ నొఖ్వాల్ బాధిత కుటుంబంతో మాట్లాడారు. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. -
జగన్ పర్యటనతో పుంజుకున్న పొగాకు ధర
దేవరపల్లి: పొగాకు మార్కెట్లో ధరలో పెరుగుదల కనిపించింది. కిలోకు ఒక్కసారిగా రూ.15లు ఎగబాకింది. ఇదంతా వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమేనని రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ తమ సమస్యలను ప్రస్తావించడంతోనే ప్రభుత్వం ధర పెంచిందని పేర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ఈ నెల 5వ తేదీన పర్యటించి పొగాకు రైతులకు బాసటగా నిలిచారు. పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించడంతోపాటు రైతులు కష్టాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పంటకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నట్టు రైతులు వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా పోరాటం చేయాలని రైతులు కోరారు. అనంతరం వైఎస్ జగన్ మార్క్ఫెడ్ను రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పొగాకు మార్కెట్లో ధరల పెరుగుదల... జగన్ పర్యటన అనంతరం రెండు రోజులకే పొగాకు మార్కెట్లో ధరలు పెరిగాయి. కిలోకు రూ.15లు పెరుగుదలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీన కిలో గరిష్ట ధర రూ.275 ఉండగా, శుక్రవారం రూ.290 పలికింది. జగనన్న పర్యటన ప్రకటన వెలువడిన మరుసటి రోజు కిలోకు రూ.10 ధర పెరిగిందని, అప్పటి వరకు కిలో గరిష్ట ధర రూ.265 ఉండగా రూ.275కు పెరిగిందని తెలిపారు. పర్యటన అనంతరం కిలోకు రూ.15 పెరిగినట్టు చెబుతూ రైతులు సంతోషం వ్యక్తం చేశారు. జగనన్న పర్యటన వల్ల కిలోకు మొత్తంగా రూ.25లు అదనపు ధర లభించినట్టయిందని తెలిపారు. పొగాకు రైతుల హర్షాతిరేకాలు పొగాకు ధర పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వల్లభనేని సత్యనారాయణ, మండల అధ్యక్షుడు కూచిపూడి సతీష్, పొగాకు రైతులు సుంకర గంగరాజు, బాలం చంద్రశేఖర్, కవల సత్తిబాబు, పైడికొండల సత్యనారాయణ, కవల శ్రీనివాస్, తేతల బ్రహ్మరెడ్డి, సత్తి శ్రీనివాసరెడ్డి, తేతల వీరకాశీరెడ్డి, పప్పు ఆంజనేయరెడ్డి పాల్గొన్నారు. -
ఎయిడెడ్ జూనియర్ కళాశాలలపార్ట్టైమ్ లెక్చరర్లకు అండగా ఉంటాం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న పార్ట్టైమ్, అన్ ఎయిడెడ్ లెక్చరర్లు, బోధనేతర సిబ్బందికి న్యాయం జరిగే వరకు వారికి వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, అవసరమైన అన్ని వేదికలపై వారి సమస్యలను ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు. ఏపీ ఎయిడెడ్ జూనియర్ కాలేజెస్, పార్ట్టైమ్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో వైఎస్ జగన్ను కలిసి తమ దీర్ఘకాలిక సమస్యలను వివరించారు.అసోసియేషన్ ప్రెసిడెంట్ అరిగ జోషిరావు తదితరులు వైఎస్ జగన్కు వినతిపత్రం అందజేసి, తమ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలోని ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో 15 నుంచి 25 సంవత్సరాలుగా అన్ ఎయిడెడ్ పోస్టుల్లో పని చేస్తున్న పార్ట్టైమ్ లెక్చరర్లు, బోధనేతర సిబ్బందికి ఇప్పటికీ సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమ ప్రయోజనాలు కల్పించడం లేదని వాపోయారు. ప్రభుత్వం 10+2 విధానంలో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ చేపట్టే సమయంలో సుదీర్ఘ అనుభవం కలిగిన పార్ట్ టైమ్, అన్ ఎయిడెడ్ లెక్చరర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వారి సర్వీస్, అర్హతలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన వెయిటేజీ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మినిమమ్ టైమ్ స్కేల్తో పాటు సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేయాలని కోరారు. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న ఉద్యోగుల సర్వీస్, విద్యార్హతలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని వారి రెగ్యులరైజేషన్కు ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు.అసోసియేషన్ ప్రతినిధుల సమస్యలు, డిమాండ్లను సావధానంగా విన్న జగన్.. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పార్ట్టైమ్ లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు. -
భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 16 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ, ఏడుగురు అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీఏడీ స్పెషల్ సీఎస్ (సర్వీసెస్) ఎస్ఎస్ రావత్ను పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్గా బదిలీ చేశారు. అదనంగా యువజన సర్వీసుల శాఖతోపాటు అదనంగా జీఏడీ సర్వీసెస్, జీపీఎం అండ్ ఆర్ బాధ్యతలు ఇచ్చారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) జె. శ్యామలరావుకు విద్యా శాఖ బాధ్యతలు అప్పగించారు. ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి సంస్థ, జీఏడీ–పొలిటికల్ బాధ్యతలు అదనంగా అప్పజెప్పారు. పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ను రవాణా శాఖ కార్యదర్శిగా నియమించారు. వెయిటింగ్లో ఉన్న నలుగురు అధికారులకు పోస్టింగ్లు ఇచ్చారు. బదిలీ అయిన అధికారుల్లో ముగ్గురికి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. మరిన్ని వివరాలకు www.sakshi.com చూడండి. -
రాష్ట్రంలో దళితుల జీవనం దయనీయం..
తిరుపతి సిటీ: ‘రాష్ట్రంలో దళితుల జీవనం దయనీయంగా మారిందని, నిత్యం దాడులు, బెదిరింపులు, లాకప్డెత్లతో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితి ఏర్పడిందని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాలరాస్తూ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని మండిపడ్డారు. అయినా కేంద్రం పట్టించుకోవడంలేదని అన్నారు. దళితులపై దాడులను సోదాహరణంగా వివరిస్తూ పలుమార్లు ఢిల్లీ వెళ్లి జాతీయ ఎస్సీ కమిషన్కు వినతిపత్రాలు ఇచ్చిన ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి నేతృత్వంలో వైఎస్సార్సీపీకి చెందిన దళిత ప్రజాప్రతినిధులు మేరుగు నాగార్జున, నందిగం సురేష్, కె. నారాయణ స్వామి, ఆదిమూలం సురేష్, సుధాకర్బాబుతో పాటు పార్టీ నేత అంబటి మురళీకృష్ణ తదితరులు శుక్రవారం తిరుపతి వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాను కలిశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దారుణాలను విన్నవించారు. నల్ల బ్యాడ్జిలు దర్శించి నిరసన తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. జాతీయ ఎస్సీ కమిషన్ తక్షణం స్పందించాలి రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, లాకప్ డెత్లు, అక్రమ కేసులపై తక్షణం స్పందించాలని జాతీయ ఎస్సీ కమిషన్ను కోరినట్లు వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. దళితుల సమస్యలపై ప్రజా ప్రతినిధుల వినతులను కనీసం 5 నిమిషాల పాటు వినే పరిస్థితిలో చైర్మన్ లేకపోవడం బాధ కలిగించిందన్నారు. పేదల ఇళ్ల కూల్చివేతలు, దాడులు, లాకప్ డెత్ల వంటి ఘటనల్లో బాధితులకు న్యాయం జరగడంలేదని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి, ప్రశ్నించే దళితులపై దాడులు చేయడం, హింసించడం, పోలీస్ స్టేషన్లలో హత్యలు చేయడం వంటి అరాచక చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. జాతీయ ఎస్సీ కమిషన్ అధికార పార్టీకి వంతపాడుతోంది తప్ప పేద దళితుల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడం లేదన్నారు. దళితులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండడాన్ని చంద్రబాబు జీరి్ణంచుకోలేక పోతున్నారని చెప్పారు. బాబు సర్కారు పోలీసు వ్యవస్థను అ«దీనంలోకి తీసుకుని ఎంతోమంది దళితులను పొట్టన పెట్టుకుంటోందన్నారు. సీఐ నాగరాజు చేతిలో గతంలో పల్నాడు జిల్లాలో దళిత సాయి, మంద సాల్మాన్ హత్యకు గురయ్యారని చెప్పారు. -
క్వాంటమ్ వ్యాలీలో సిండికేట్ స్కామ్!
సాక్షి, అమరావతి: రాజధాని పనుల టెండర్లలో అక్రమాలు యధేచ్ఛగా సాగుతున్నాయి. క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్ల నిర్మాణ పనుల్లో కుమ్మక్కుతో స్కామ్కు పునాదులు పడ్డాయి. చదరపు అడుగుకు రూ.1,348.06 చొప్పున అదనపు ప్రయోజనం చేకూర్చుతూ.. ప్రజాధనాన్ని దోచిపెడుతూ ముఖ్యనేత సిండికేట్ కాంట్రాక్టు సంస్థ ఎల్ అండ్ టీకే ట్విన్ టవర్ల పనులను ప్రభుత్వం కట్టబెట్టింది. ట్విన్ టవర్ల నిర్మాణ పనులకు రూ.958.40 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి.. రెండేళ్లలో పూర్తి చేసి, మరో మూడేళ్లు నిర్వహించాలనే నిబంధనతో ఏజీఐసీఎల్ (అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్) టెండర్లు నిర్వహించింది. కాంట్రాక్టు విలువ కంటే 4.60 శాతం అధిక ధరకు అంటే రూ.1,002.49 కోట్లకు కోట్ చేసిన ఎల్ అండ్ టీ ఎల్–1గా నిలిచింది. అదే సంస్థకు పనులు అప్పగించడానికి అనుమతి ఇవ్వాలంటూ ఏజీఐసీఎల్ చేసిన ప్రతిపాదనపై ఈనెల 4న సీఆర్డీఏ 64వ సమావేశం ఆమోదముద్ర వేసింది. సీఆర్డీఏ కమిషనర్ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని వల్ల ఖజానాపై రూ.44.09 కోట్లు అదనంగా భారం పడుతుంది. ఇక మరో రూ.178.1 కోట్లను జీఎస్టీ, సీనరేజీ, మెరిట్, తదితర పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని ప్రభుత్వం టెండర్లో పేర్కొంది. అంటే.. ఈ పనుల కాంట్రాక్టు విలువ రూ.1,180.59 కోట్లకు చేరుకుంది. 4.83 ఎకరాల్లో ట్విన్ టవర్స్రాజధాని అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే పిచ్చుకలపాలెం వద్ద క్వాంటమ్ వ్యాలీలో 4.83 ఎకరాల్లో ట్విన్ (జంట) టవర్ల నిర్మాణ పనులను ఏజీఐసీఎల్ చేపట్టింది. ఒక్కో టవర్ను బీ+జీ+47 అంతస్తులతో నిర్మించాలని నిర్దేశించింది. బీ+జీ నుంచి నాలుగో అంతస్తు వరకూ ఒక్కో అంతస్తును 5 మీటర్లు.. అక్కడి నుంచి 47వ అంతస్తు వరకూ ఒక్కో అంతస్తు 4.2 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని నిర్ణయించారు. పార్కింగ్ ఏరియాతో పాటు ఒక్కో టవర్ నిర్మిత ప్రాంతం 1,53,708 చదరపు మీటర్లు. రెండు టవర్ల నిర్మిత ప్రాంతం 3,48,406 చదరపు మీటర్లు (37,50,210 చదరపు అడుగులు). అంటే ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి నిర్ణయించిన కాంట్రాక్ట్ విలువ రూ.3,148.06. అదీ కేవలం పునాదులు, పిల్లర్లు, బీమ్లు, లిప్ట్లు, షాప్్టలతో కూడిన భవనం మాత్రమే. ఈ స్థాయి నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.1,800లకు మించి వ్యయం కాదని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంటే.. చదరపు అడుగుకు రూ.1,348.06 చొప్పున అదనంగా చెల్లించేలా కాంట్రాక్టు పనులు అప్పగించినట్లు వెల్లడవుతోంది. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించడం పోలీసుల బాధ్యత
సాక్షి, అమరావతి: పచ్చ ముఠాల దౌర్జన్యం.. విధి నిర్వహణలో పోలీసుల ఉదాసీనతపై భారతీ సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్పై తాజాగా హైకోర్టు స్పందించింది. భారతీ సిమెంట్స్ మైనింగ్ కార్యకలాపాలను టీడీపీ మూకలు అడ్డుకుంటున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాంట్తో పాటు మైనింగ్ కార్యకలాపాలను సైతం అడ్డుకుంటున్న టీడీపీ మూకలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ భారతీ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) అ«దీకృత ప్రతినిధి, డైరెక్టర్ జి.బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ జరిపింది. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు! భారతీ సిమెంట్స్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి వాదనలు వినిపించారు. క్రమశిక్షణరాహిత్యంలో భాగంగా కాంట్రాక్టర్ తొలగించిన కొంత మంది, ఇతరులతో కలిసి భారతీ సిమెంట్స్ కార్యకలాపాలను అడ్డుకుని ఉత్పత్తి నిలిపేయాలన్న కుట్రతో వ్యవహరిస్తున్నారన్నారు. ప్లాంట్లోకి వెళ్లే దారులను మూసివేసి రాకపోకలకు తీవ్ర ఆటంకాలు సృష్టిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని నివేదించారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. అల్లరి మూకల దౌర్జన్యం వల్ల గని నుంచి లైమ్స్టోన్, ఫ్యాక్టరీ నుంచి సిమెంట్ రవాణా పూర్తిగా నిలిచిపోయిందన్నారు. గతంలో రోజుకు 400 ట్రక్కులు తిరుగుతుండగా, ఇప్పుడు ఒక్క ట్రక్కు కూడా తిరిగే పరిస్థితి లేదని మోహన్రెడ్డి వివరించారు. దీంతో కంపెనీకి రోజుకు సుమారు రూ.4 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోందన్నారు. అంతేకాక ప్లాంట్ కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకు సైతం నష్టం కలుగుతోందని తెలిపారు. కొందరి రాజకీయాలతో ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం... ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి వేల మంది ఉద్యోగులు బతుకుతున్నారని, కొందరి రాజకీయాల వల్ల వారంతా రోడ్డున పడే ప్రమాదం నెలకొందని మోహన్రెడ్డి తెలిపారు. దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. చట్టబద్ధంగా వ్యాపారం చేస్తూ, ఖజానాకు పన్నుల రూపంలో భారీ మొత్తాలు చెల్లిస్తున్న కంపెనీ విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం దారుణమన్నారు. గతంలో ఇదే రీతిలో కొందరు ఇండియా సిమెంట్స్ కార్యకలాపాలను అడ్డుకున్నారని, దీనిపై హైకోర్టు జోక్యం చేసుకుని పోలీసులకు తగిన ఆదేశాలు ఇచ్చిందని నివేదించారు. ఈ రోజు కూడా ప్లాంట్కు వెళ్లకుండా దారిలో టెంట్ వేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. 10 మందిపై చర్యలు తీసుకునేలా పరిస్థితిలో కూడా పోలీసులు లేరంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునన్నారు. ప్లాంట్లో రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. కంపెనీపై ఆధారపడి బతుకుతున్న కారి్మకులను దృష్టిలో పెట్టుకుని తగిన ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. కాగా పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది (జీపీ) అడుసుమల్లి జయంతి వాదనలు వినిపిస్తూ ఈ వ్యాజ్యం తొలిసారి విచారణకు వస్తోందని, పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
బాబు సర్కారు వి‘శ్వాస’ ఘాతుకం
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడే నిరుపేద రోగులకు ప్రాణాధారమైన వెంటిలేటర్ల కొనుగోళ్లలోనూ ప్రభుత్వ పెద్దలు అవినీతికి పాల్పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.22 లక్షల నుంచి రూ.26 లక్షల పలికే నియోనాటల్(నవజాత శిశువు)వెంటిలేటర్ను ఏకంగా రూ.30.24 లక్షలకు కొనుగోలు చేసేలా శుక్రవారం వైద్య శాఖ బిడ్ ఫైనలైజేషన్ కమిటీ(బీఎఫ్సీ) ఆమోదం తెలిపింది. అధిక ధరలకు వెంటిలేటర్ల కొనుగోళ్ల వ్యవహారంలో రూ.మూడు కోట్లకుపైనే నేతలు కమీషన్ల రూపంలో బొక్కేయనున్నారని విమర్శలు వస్తున్నాయి.వైద్య పరికరాల కొనుగోళ్లపై కీలక ప్రజాప్రతినిధి 10 శాతం అంతకంటే పైనే కమీషన్లు డిమాండ్ చేస్తున్నట్టు గత కొద్ది రోజులుగా వైద్య శాఖలో చర్చ నడుస్తోంది. దీనికి తోడు వైద్య సేవల కల్పన అభివృద్ధి సంస్థ (ఎంఎస్ఐడీసీ)లోని కొందరు అధికారులు కాంట్రాక్ట్ ఖరారు, పర్చేజింగ్ ఆర్డర్(పీవో) జారీ, బిల్లులు మంజూరు ఇలా వివిధ దశల్లో కాంట్రాక్టర్లను కమీషన్ల కోసం తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లు అందరూ సిండికేటై ఇతర రాష్ట్రాలు, కేంద్ర వైద్య శాఖలకు సరఫరా చేస్తున్న దాని కంటే అత్యధిక ధరలకు ఏపీలో టెండర్లు వేస్తున్నారు. ఏపీలో దోపిడీకి తమిళనాడు ధరలే సాక్ష్యం అధిక మొత్తంలో కమీషన్లు ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్న సంస్థలకే వెంటిలేటర్ల కాంట్రాక్ట్ కట్టబెట్టడం కోసం సుమారు రెండేళ్లుగా ఎంఎస్ఐడీసీలో టెండర్లను సాగదీశారు. ఎట్టకేలకు శుక్రవారం ఆ టెండర్లు ఖరారు అయ్యాయి. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని ఆస్పత్రులకు 38 నియోనాటల్ వెంటిలేటర్ల కొనుగోలుకు కాంట్రాక్టర్ను ఎంపిక చేశారు. ఎల్–1 సంస్థ వియాన్ ఫాబియాన్ హెచ్ఎఫ్ఓ వెంటిలేటర్ను రూ.30.24 లక్షలతో సరఫరా చేసేలా టెండర్ వేసింది. అయితే ఇదే మేక్, మోడల్ వెంటిలేటర్లు బహిరంగ మార్కెట్లో రూ.22 లక్షల నుంచి రూ.26 లక్షలు మాత్రమే పలుకుతున్నాయి. ఈ లెక్కన పరిశీలిస్తే ఒక్కో వెంటిలేటర్పై రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షలకుపైనే అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం 38, రెండేళ్ల రేట్ కాంట్రాక్ట్తో మరిన్ని వెంటిలేటర్లను ఇదే కాంట్రాక్టర్ ద్వారా సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బల్క్ ఆర్డర్ మీద బహిరంగ మార్కెట్లో రేట్లు తగ్గకుండా ఏపీలో మాత్రం రేట్లు అమాంతం పెరుగుతుండటం గమనార్హం. నియోనాటల్ వెంటిలేటర్ను రూ.25.50 లక్షలతో కొనుగోలుకు తమిళనాడు మెడికల్ కార్పొరేషన్ రేట్ కాంట్రాక్ట్ ఇదే టెండర్లో డ్రాగర్ బేబీలాగ్ వీఎన్ 600 మోడల్ వెంటిలేటర్ను రూ.30.93 లక్షలకు సరఫరా చేసేలా టెండర్ వేసిన మరో సంస్థ ఎల్–2గా నిలిచింది. ఇదే మోడల్ పరికరాన్ని తమిళనాడు మెడికల్ కార్పొరేషన్ రూ.25.50 లక్షలకే కొంటోంది. 2028 జూలై వరకూ ఈ రేట్ కాంట్రాక్ట్ ఉంది. ఇదిలా ఉండగా ఒకే రకం పరికరాన్ని ఏపీలో ఏకంగా రూ.5.50 లక్షల అధిక ధరకు సరఫరా చేసేలా కాంట్రాక్టర్ టెండర్ వేశారు. దీన్ని బట్టి పరిశీలిస్తే నేతలకు కమీషన్లు ఇవ్వడం కోసం కాంట్రాక్టర్లు పరికరాల ధరలు అమాంతం ఎలా పెంచేస్తున్నారో తేటతెల్లం అవుతోంది. నీకు సగం.. నాకు సగం.. పరికరాల కొనుగోళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సౌకర్యం అనే సాకు చూపి దోపిడీ జరుగుతోందని చర్చ నడుస్తోంది. టీబీ కార్యక్రమంలో భాగంగా 100 పోర్టబుల్ ఎక్స్రే పరికరాలను వైద్య శాఖ కొనుగోలు చేస్తోంది. కీలక ప్రజాప్రతినిధికి కమీషన్లు ముట్టజెప్పేలా రెండు సంస్థలు టెండర్కు ముందే డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఆ రెండు సంస్థలు పరికరాల సరఫరాను చెరి సగం పంచుకునేలా ఒప్పందం కుదుర్చుకోగా.. ఆ మేరకు కాంట్రాక్ట్ ఖరారుకు ఈ ఏడాది ఏప్రిల్లో, తాజాగా శుక్రవారం జరిగిన బీఎఫ్సీలోనూ చర్చ నడిచినట్టు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి జాతీయ టీబీ కార్యక్రమం కింద కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు రూ.15 లక్షలతో కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేసింది. ఇదే పోర్టబుల్ పరికరాల్లో ఏఐ జనరేటెడ్ రిపోర్టింగ్ సౌకర్యం సాకు చూపి దాదాపు రూ.7 లక్షల మేర అధిక ధరలతో ఓ సంస్థ టెండర్ వేసింది. ఈ లెక్కన వంద పరికరాల కొనుగోళ్లలో ఏకంగా రూ. ఏడు కోట్ల మేర ప్రజాధనం లూటీ అవుతోందని విమర్శలు వస్తున్నాయి. -
దగా డీఎస్సీపై ఉద్యమం ఉధృతం
సాక్షి, అమరావతి : ‘‘కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాం.. కానీ ఏం లాభం..? మాకు పేకాట రాదు.. బ్రిడ్జి గేమ్ సర్టిఫికెట్ లేదు.. చంద్రబాబు సర్కారు కొత్త కొత్త జీవోలు ప్రవేశపెట్టి తమ అనుయాయులు, పేకాట రాయుళ్లకు ఉపాధ్యాయ ఉద్యోగాలను కట్టబెట్టింది..! పేకాట తెలియకపోవడమే మా అనర్హతకు కారణమవుతుందని తెలిస్తే ఏదో విధంగా నేర్చుకునే వాళ్లం..! డీఎస్సీలో జాబ్ రావాలంటే కష్టపడటం ఒక్కటే చాలదు.. ఓ స్పోర్ట్స్ సర్టిఫికెట్, రూ.15 లక్షల డబ్బులు కూడా కావాలని అర్థమైంది..! అక్రమ పద్ధతిలో టీచర్ పోస్టులు భర్తీ చేసి మాకు కనీసం నిరుద్యోగ భృతైనా ఇవ్వరా..!’’ ఇదీ మెగా డీఎస్సీ స్కామ్పై రెండో రోజు దీక్షా శిబిరాల వద్ద బాధిత అభ్యర్థుల ఆవేదన!! మెగా డీఎస్సీ 2025 స్కామ్పై పోరులో భాగంగా రిలే దీక్షలతో వైఎస్సార్సీపీ చేపట్టిన శాంతియుత ఉద్యమం రెండో రోజూ నిరసనలతో హోరెత్తగా.. ప్రజాస్వామ్య హక్కులను పాశవికంగా కాలరాస్తూ చంద్రబాబు సర్కారు తన నియంతృత్వ పోకడలను కొనసాగించింది. టీడీపీ మూకల దాడులు, పోలీసుల ఆంక్షలు రెండో రోజు కూడా యథావిధిగా కొనసాగాయి. మెగా డీఎస్సీ స్కామ్కు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాల్సిందేనని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని బాధిత అభ్యర్థులు, నిరుద్యోగులు, జెన్జీ యువత నినదించింది. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి సహా ఎన్నికల హామీలన్నీ చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమానికి జెన్జీ మద్దతు రోజురోజుకూ పెరగడం ప్రభుత్వ పెద్దలను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. దీంతో రెండో రోజు కూడా ఒకవైపు పోలీసులతో ఆటంకాలు కల్పిస్తూ.. మరోవైపు దీక్షలను భగ్నం చేసేందుకు టీడీపీ గూండాలను బరిలోకి దించారు. అనంతపురంలో రిలే దీక్షలో పాల్గొన్న యువతీయువకులకు మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి సంఘీభావం బొండాగిరీ బాటలోనే బుద్ధా..! బెజవాడలో తొలిరోజు వైఎస్సార్ సీపీ శ్రేణుల దీక్షా శిబిరం వద్ద విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఆయన అనుచరులు దాడులకు తెగబడి అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. బ్రాహ్మణనేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దీక్షా శిబిరం టెంట్ను తొలగించి కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లు రువ్వి పచ్చమూకలు కవ్వింపు చర్యలకు దిగాయి. ఇక అమానవీయ చర్యలకు పరాకాష్టగా మరింత దిగజారిపోయి బాటిల్లో మూత్రం పట్టుకొచ్చి నిరసనకారులపై చల్లారు. దీనికి కొనసాగింపుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గ్యాంగ్ వైఎస్సార్సీపీ దీక్షా శిబిరం వద్ద శుక్రవారం హల్చల్ చేసింది. శాంతియుతంగా నిర్వహిస్తున్న నిరసనను భగ్నం చేసేందుకు రెచ్చగొట్టే నినాదాలు చేశారు. పచ్చమూకలు గొడవలు సృష్టించేందుకు యత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. విజయవాడలో దీక్ష చేస్తున్న యువత, విద్యార్థులకు మద్దతు పలుకుతున్న దేవినేని అవినాశ్ కడపలో రిలే దీక్షలో పాల్గొన్న యువకులు రోడ్డుపైనే బైఠాయించిన అబ్బయ్య చౌదరి దెందులూరు నియోజకవర్గం మాదేపల్లిలో వైఎస్సార్సీపీ చేపట్టిన దీక్షకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అంటూ వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద రోడ్డుపైనే అబ్బయ్య చౌదరి బైఠాయించారు. మాదేపల్లిలో దీక్షా శిబిరాన్ని తొలగించిన పోలీసులు వైఎస్సార్సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దెందులూరులో రోడ్డుపై అబ్బయ్యచౌదరి బైఠాయింపు బెజవాడలో దీక్షాశిబిరం వద్ద టీడీపీ గూండాగిరీ..తొండంగిలో టెంట్లు తొలగింపు.. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగిలో పోలీసుల తీరుతో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ సీపీ రిలే దీక్షలు చేపట్టిన రెండు టెంట్లను పోలీసులు తొలగించారు. గురువారం రాత్రి తొండంగి కార్పొరేషన్ బ్యాంక్ సమీపంలో ఏర్పాటు చేసిన టెంట్ను తొలగించగా శుక్రవారం ఉదయం జియో కార్యాలయం వద్ద టెంట్ను తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతల డైరెక్షన్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. మండుటెండను లెక్క చేయక రోడ్డుపై బైఠాయించి వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. దీక్షలకు పెరుగుతున్న జెన్ జీ మద్దతు.. మెగా డీఎస్సీ 2025 నియామకాల్లో అక్రమాలపై కేంద్ర సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్తో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దీక్షలకు జెన్ జీ యువత భారీగా మద్దతు పలుకుతోంది. తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు.. అనంతపురం నుంచి కోనసీమ దాకా దాదాపు అన్ని జిల్లాల్లో యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు భారీగా పాల్గొని కూటమి సర్కారు నిర్వాకాలపై మండిపడ్డారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాతోపాటు మొత్తం నియామక ప్రక్రియపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.నేడు కొనసాగనున్న రిలే దీక్షలు.. 10న భారీ ర్యాలీలు.. వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలు ఈ నెల 8న కూడా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో కొనసాగుతాయని పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నారు. ర్యాలీలు ముగిసిన తర్వాత ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెంచేలా మలిదశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నట్లు వైఎస్సార్సీపీ వెల్లడించింది.స్పోర్ట్స్ కోటాలో ’పేకాట’.. డీఎస్సీలో లూడో! దగా డీఎస్సీపై పార్వతీపురంలో వైఎస్సార్ సీపీ స్కిట్ పార్వతీపురం రూరల్: మెగా డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులను దొడ్డిదారిలో కట్టబెట్టి.. పేకాట, లూడో లాంటి వాటిని ప్రభుత్వం క్రీడా కోటా జాబితాలో చేర్చిందంటూ పార్వతీపురంలో వైఎస్సార్సీపీ శ్రేణులు శుక్రవారం వినూత్న రీతిలో నిరసన చేపట్టాయి. పట్టణంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు నేతృత్వంలో రెండో రోజు రిలే నిరాహార దీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా కూటమి నేతల్లా నటిస్తూ.. పేకాట, లూడో ఆడుతూ గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కష్టపడి చదివిన అభ్యర్థులను, ప్రతిభావంతులైన క్రీడాకారులను పక్కనపెట్టి.. స్పోర్ట్స్ కోటా పేరుతో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారని మండిపడ్డారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని, సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 4వ ర్యాంక్ సాధించినా నిరాశే..! పులివెందులలో డీఎస్సీ బాధిత అభ్యర్థి జిలాని పులివెందుల: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే టీచర్ పోస్టుపై ఎంతో మక్కువతో మెగా డీఎస్సీకి రెండేళ్ల పాటు సిద్ధమైనట్లు డీఎస్సీ బాధిత అభ్యర్థి జిలాని పేర్కొన్నాడు. ఇంటికి దూరంగా ఉంటూ కడప, ప్రొద్దుటూరులో డీఎస్సీకి ప్రిపేరైనట్లు చెప్పాడు. శుక్రవారం పులివెందులలోని ఆర్డీవో కార్యాలయం వద్ద తొండూరు మండల ఇన్చార్జీ వైఎస్ మధురెడ్డి డీఎస్సీ రిలే దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిలాని మాట్లాడుతూ బీఈడీలో 75 శాతంతో ఉత్తీర్ణత సాధించానన్నారు. డీఎస్సీ రాసిన తర్వాత వందకు 71 మార్కులు, టీచింగ్లో 69.60 మార్కులు వచ్చాయన్నారు. దీని ప్రకారం తాను నాలుగో ర్యాంకులో ఉన్నట్లు చెప్పాడు. కానీ డీఎస్సీలో జాబ్ రావాలంటే కష్టపడటం ఒక్కటే కాదు.. ఒక స్పోర్ట్స్ సర్టిఫికెట్, రూ.15 లక్షల డబ్బులూ కావాలని అర్థమైందన్నారు. టీజీటీలో ఆరు పోస్టులు ఉండగా.. బీసీలకు నాలుగు పోస్టులు ఉండాలని, కానీ 1, 2, 3వ ర్యాంకర్లకు పోస్టులు ఇచ్చాక జిల్లాలో 4వ ర్యాంకర్, టీజీటీలో 276వ ర్యాంకర్ను తీసేసి 2,217వ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి పోస్టు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు. డీఎస్సీలో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, అలాంటి సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ నేనున్నానని చెప్పడంతో ధైర్యం వచ్చిందన్నారు. నాకు పేకాట రాదు.. అందుకే ఉద్యోగం రాలేదు! నెల్లూరు (వేదాయపాళెం): మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పేరుతో అనేక అక్రమ నియామకాలు జరిగాయని బాధిత అభ్యర్థి షేక్ కరీంబాషా వాపోయాడు. శుక్రవారం నెల్లూరులోని కరెంటాఫీసు సెంటర్లో వైఎస్సార్ సీపీ రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దకు స్వచ్ఛందంగా వచ్చిన కరీంబాషా మైకు ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తాడు. కొత్త కొత్త జీవోలు ప్రవేశపెట్టి పేకాటను బ్రిడ్జి గేమ్ పేరుతో ఒక క్రీడగాపరిగణించి ప్రభుత్వం తమ అనుయాయులు, పేకాట రాయుళ్లకు ఉపాధ్యాయ ఉద్యోగాలను కట్టబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు పేకాట రాదని, తన వద్ద బ్రిడ్జి గేమ్ సర్టిఫికెట్ లేదని, కానీ తాను కష్టపడి చదివి మంచి మార్కులు సాధించానన్నారు. పేకాట తెలియకపోవడమే తన అనర్హతకు కారణమవుతుందని తెలిసి ఉంటే ఏదో విధంగా పేకాట నేర్చుకునే వాడినన్నాడు. ప్రభుత్వ ఉద్యోగానికి ఈ ఏడాదితో వయో పరిమితి దాటి పోయిందని కన్నీటి పర్యంతమయ్యాడు. అక్రమ పద్ధతిలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన చంద్రబాబు సర్కారు తనకు కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. -
మీ ప్రభుత్వం ఇంకా ఎంతగా దిగజారుతుంది?
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 ప్రశ్నాపత్రం లీకేజీ, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేపట్టిన శాంతియుత రిలే నిరాహార దీక్షలపై తమ అనుచరులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యేలు దాడులు చేయడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంతగా దిగజారుతుంది? అంటూ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగిన నిరుద్యోగ యువతకు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? అంటూ నిలదీశారు.నారా లోకేశ్ను బాధ్యత నుంచి తప్పించకుండా మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. డీఎస్సీ–2025 ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని మీరు చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? అంటూ చంద్రబాబును వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘మీరు దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చు.. మీ పోలీసులను, పార్టీ శ్రేణులను ప్రయోగించవచ్చు.. నిరసనకారులను అరెస్టు చేయవచ్చు.. కానీ డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ఆధారాలను మాత్రం చెరిపేయలేరు.నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచి వేయలేరు. ఆంధ్రప్రదేశ్ జెన్–జెడ్ గొంతును మూయలేరు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు’ అని స్పష్టం చేశారు. రిలే నిరాహార దీక్ష శిబిరాలపై టీడీపీ ఎమ్మెల్యేలు అనుచరులతో కలిసి చేసిన దాడుల వీడియోలను ట్యాగ్ చేస్తూ శుక్రవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వైఎస్ జగన్ పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తారా? ‘‘చంద్రబాబు గారూ.. మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంతగా దిగజారుతుంది? నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారు అడిగితే... దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? డీఎస్సీ–2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షపై మీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి, దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు. పోలీసుల కళ్ల ముందే, వారి సమక్షంలోనే టెంట్లు లాగి పడేశారు. మా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. మహిళలపై దాడులకు తెగబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా శిబిరాలపై నిర్బంధకాండను కొనసాగించారు. చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి, పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్లలో నిరసన శిబిరాలపై దాడులు చేశారు. నాయకులను నిర్బంధించారు. శాంతియుతంగా దీక్షలు చేస్తూ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కూడా నిరుద్యోగ యువతకు లేకుండా చేశారు. సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? నారా లోకేశ్ను బాధ్యత నుంచి తప్పించకుండా మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు? డీఎస్సీ–2025 ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని మీరు చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి చదివిన యువతకు న్యాయం జరగాలి. నియామకాల్లో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ప్రస్తుతం రూ.9,000 కోట్లకు చేరిన విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్మెంట్), వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. మీ ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని, గత రెండేళ్ల బకాయిలతో సహా వెంటనే చెల్లించాలి. న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదు చంద్రబాబు గారూ.. మీరు దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చు.. మీ పోలీసులను, పార్టీ శ్రేణులను ప్రయోగించవచ్చు.. నిరసనకారులను అరెస్టు చేయవచ్చు.. కానీ డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ఆధారాలను మాత్రం చెరిపేయలేరు. నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచి వేయలేరు. ఆంధ్రప్రదేశ్ జెన్ జెడ్ గొంతు నొక్కలేరు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. చేనేత కార్మికుల ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచాంజాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు ఐదేళ్లలో రూ.3,706.16 కోట్ల సాయం అందించాం ఆర్థికంగా, సామాజికంగా మద్దతుగా నిలిచాం చేనేత వ్రస్తాలకు దేశ, విదేశాల్లో మార్కెట్.. ఈ కామర్స్ సంస్థలతో ఒప్పందాలు ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేశాం ఎన్నికల హామీలను విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం సాక్షి, అమరావతి: చేనేత అనేది కేవలం ఒక వృత్తి కాదని.. మన సంస్కృతికి, సంప్రదాయానికి, తెలుగువారి కళా నైపుణ్యానికి నిలువెత్తు ప్రతీక అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నేతన్నలు, చేనేత కళాకారులు, వారి కుటుంబ సభ్యులందరికీ శుక్రవారం ఆయన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 2019–24 మధ్య తమ ప్రభుత్వంలో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని ప్రతి అడుగులోనూ అండగా నిలిచామని చెప్పారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేల చొప్పున ఐదేళ్లలో రూ.1.20 లక్షలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. ఈ ఒక్క పథకం ద్వారానే రూ.969.77 కోట్లు అందించామని, నేతన్నల పింఛన్ల కోసం రూ.1,396.45 కోట్లు, ఆప్కో పాత బకాయిల చెల్లింపునకు రూ.468.84 కోట్లు వెచ్చించామని చెప్పారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా మొత్తంగా రూ.3,706.16 కోట్ల సాయం అందించి నేతన్నలకు ఆర్థికంగా, సామాజికంగా మద్దతుగా నిలిచామన్నారు. చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్, పవర్లూమ్స్కు రాయితీ విద్యుత్ అందించామని తెలిపారు. నేతన్నలు తయారు చేసే వస్త్రాలకు దేశ, విదేశాల్లో మార్కెట్ కల్పించేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని, వారి ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేశామని చెప్పారు. ఎన్నికల హామీలకు చంద్రబాబు తూట్లు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండేళ్లుగా నేతన్న నేస్తం పథకాన్ని నిలిపి వేసిందని వైఎస్ జగన్ ఆరోపించారు. ఏడాదికి రూ.25 వేలు అందిస్తామన్న ఎన్నికల హామీని అమలు చేయలేదని విమర్శించారు. హ్యాండ్లూమ్స్కు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్స్కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి, ఆ హామీలను కూడా అమలు చేయలేదన్నారు. 1,03,534 కుటుంబాలకు పథకం వర్తింప జేస్తామని ప్రకటించి, నేడు కేవలం 71,536 కుటుంబాలకు ఇస్తున్నట్లు ప్రకటిస్తున్నారన్నారు. ఆచరణకు వచ్చేసరికి వారిలో ఎంత మందికి ఆ సాయం అందుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. జీఎస్టీ రీయింబర్స్మెంట్ హామీని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. నేతన్నల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం, చేనేత రంగ పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
అర్ధరాత్రి వరకూ పోలీసుల అదుపులో ఇద్దరు వైఎస్సార్సీపీ నేతలు
శ్రీకాకుళం: ఆమదాలవలసలో అర్ధరాత్రి పోలీసుల చర్యలు కలకలం రేపాయి. వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్పై నమోదైన కేసులో భాగంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎఫ్ఐఆర్లో పేర్లు లేని వారిని కూడా విచారణ పేరుతో స్టేషన్కు పిలిపిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.చింతాడ రవికుమార్ తమ్ముడు చింతాడ కృష్ణ, బొడ్డేపల్లి రమేష్ కుమార్లను సాయంత్రం 5 గంటలకు విచారణకు పిలిచిన పోలీసులు, ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. రాత్రి 12 గంటలు కావస్తున్నా ఇద్దరినీ పోలీసులు విడిచిపెట్టలేదని, పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో పోలీస్ స్టేషన్లోకి స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాలు చేరుకున్నాయి.కృష్ణ, రమేష్ కుమార్లను వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు సమాచారం. వారిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే విషయంపై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో వైఎస్సార్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్ల వద్దకు చేరుకుంటున్నారు. -
విజయ డెయిరీ ఛైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులు రాజీనామా
సాక్షి, విజయవాడ: విజయ డెయిరీ ఛైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు. మంత్రుల ఒత్తిడి తట్టుకోలేక రాజీనామా చేశారు. ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలంటూ నిన్నటి నుంచి చలసాని ఆంజనేయులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. మంత్రుల ఒత్తిడి తట్టుకోలేక చలసాని ఆంజనేయులు ఆసుపత్రి పాలయ్యారు. ఆసుపత్రి బెడ్ మీద ఉన్నా రాజీనామా చేయాలని ఒత్తిళ్లకు గురిచేశారు. దీంతో మంత్రుల ఒత్తిళ్లతో చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు.రెండు గంటల పాటు ఆసుపత్రిలో చలసాని ఆంజనేయులతో చర్చించిన మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్ధసారథి.. ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. పార్టీ ఆదేశాలతో చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారని మంత్రి పార్థసారథి ప్రకటించారు. విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులును మంత్రులు టార్గెట్ చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన ఆంజనేయులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే, బుధవారం సాయంత్రం జరిగిన సమావేశం అనంతరం విజయ డెయిరీ కార్యాలయానికి వచ్చిన టీడీపీ మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి.. చలసాని ఆంజనేయులతో సమావేశమైనట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందేనని, అధిష్టానం ఆదేశాలు ఉన్నాయని ఆయనకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.దీనిపై స్పందించిన చలసాని ఆంజనేయులు నిర్ణయం తీసుకోవడానికి ఒక్కరోజు గడువు ఇవ్వాలని కోరినప్పటికీ, అందుకు అవకాశం లేదని, వెంటనే పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని మంత్రులు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ పరిణామాల మధ్య మంత్రుల సమక్షంలోనే చలసాని ఆంజనేయులు అస్వస్థతకు గురికాగా, వెంటనే ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఉన్నా కానీ చలసాని ఆంజనేయులను మంత్రులు వదల్లేదు. రాజీనామా చేయాలంటూ తీవ్ర ఒత్తిడి చేశారు. దీంతో ఇవాళ ఆంజనేయులు.. విజయ డెయిరీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. -
ఏపీలో మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
సాక్షి, తాడేపల్లి: ‘‘దిశ”ను ఉపసంహరించుకోవటంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను.. రాజకీయ ఈర్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు.‘‘మహిళలు, చిన్నారులపై నేరాలు, దర్యాప్తులో జాప్యం, న్యాయ ప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలకు పరిష్కారంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం “దిశ”ను తీసుకొచ్చింది. నేరం జరగకుండా నిరోధించడం నుంచి, నేరం జరిగితే వెంటనే స్పందించడం, బాధితులకు రక్షణ, వేగంగా దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, చార్జిషీటు, ప్రత్యేక కోర్టుల ద్వారా సత్వర న్యాయం వరకు ఒక సమగ్ర వ్యవస్థను నిర్మించాం...దిశలో భాగంగా మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు SOS బటన్ నొక్కినా, ఫోన్ను 5 సార్లు షేక్ చేసినా నిమిషాల వ్యవధిలో పోలీసులు స్పందించే వ్యవస్థ తీసుకొచ్చాం. 1.51 కోట్ల మంది దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ ద్వారా వచ్చిన 31,607 అత్యవసర కాల్స్ను అప్పట్లో మా ప్రభుత్వంలో పోలీసులు పరిష్కరించారు. 18 ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసును అందుబాటులోకి తీసుకొచ్చి 13,500 మందితో క్షేత్రస్థాయి భద్రత, రిపోర్టింగ్ వ్యవస్థను నిర్మించాం...900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలతో ప్రత్యేక పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. నేరస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే అవకాశం లేకుండా ఈ కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆరు నగరాల్లో ఫోరెన్సిక్ వ్యవస్థను బలోపేతం చేశాం. సత్వర విచారణ కోసం 13 ప్రత్యేక POCSO కోర్టులు, 12 మహిళా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశాం. 2,17,467 మంది లైంగిక నేరస్తుల వివరాలతో ప్రత్యేక డేటాబేస్ను రూపొందించాం. అందుకనే దిశ విజయవంతగా మహిళలకు, చిన్నారులకు గొప్ప భద్రతా సేవలను అదించింది’’ అని వైఎస్ జగన్ వివరించారు.‘‘2017లో మహిళలపై నేరాల దర్యాప్తుకు సగటున 156 రోజులు పట్టగా, 2022 నాటికి అది 28 రోజులకు తగ్గించగలిగారు. 164 అత్యాచారం కేసులు, 378 లైంగిక నేరాల కేసుల్లో కేవలం 7 రోజుల్లోనే ఛార్జిషీట్లు దాఖలు చేశారు. తీవ్రమైన కేసుల్లో 51 శాతానికిపైగా నిందితులను 48 గంటల్లోపు అరెస్టు చేశారు. గతంలో డీఎన్ఏ నివేదికలకు నెలలు పట్టేది. దిశ ఫోరెన్సిక్ వ్యవస్థతో వాటిని రోజుల్లోనే అందించే పరిస్థితి తీసుకొచ్చాం. 214 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. మే 2024 నాటికి మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయి. వార్షిక సగటు కేసులు 14,338 నుంచి 10,426కు తగ్గాయి...ఇదీ దిశ ఇచ్చిన భరోసా. ఇవీ దిశ సాధించిన ఫలితాలు. అందుకే 19జాతీయ అవార్డులను మా ప్రభుత్వ హయాంలో “దిశ’’ గెలుచుకుంది. “దిశ” అనేది కాగితాల మీదున్న పేరు కాదు. ప్రమాదంలో ఉన్న మహిళ SOS నొక్కిన క్షణం నుంచి, నిందితుడికి శిక్ష పడే వరకు ఆమెకు అండగా ఉండే సజీవమైన మహిళా రక్షణ నెట్వర్క్. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం “BNS (భారతీయ న్యాయ సంహిత) చాలు, దిశ అవసరం లేదు” అంటోంది. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన SOS వ్యవస్థ, ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు, గ్రామ స్థాయి నుంచే మహిళా పోలీసులు, ప్రత్యేక పెట్రోలింగ్, లైంగిక నేరస్తుల డేటాబేస్, వేగవంతమైన ఫోరెన్సిక్ వ్యవస్థ, ప్రత్యేక ప్రాసిక్యూషన్, ప్రత్యేక కోర్టులు, నిర్ణీత సమయంలో దర్యాప్తు! న్యాయం అనే లక్ష్యానికి BNS ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది?“దిశ”ను ఉపసంహరించుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో మహిళలు, చిన్నారులకు ఒక చీకటి రోజు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరం.మహిళలు, చిన్నారులపై నేరాలు, దర్యాప్తులో జాప్యం,… pic.twitter.com/cF3dc8uSpT— YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2026..మహిళలు, చిన్నారులపై తీవ్రమైన దారుణాలు జరిగినప్పుడు 7 పని రోజుల్లో పోలీసు దర్యాప్తు, ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత 14 పని రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేసేలా దిశ ద్వారా తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా వైయస్సార్సీపీదే. 21 రోజుల్లోగా బాధితులకు న్యాయం అందించాలన్న అలాంటి లక్ష్యాన్ని కూడా ఈ ప్రభుత్వం విమర్శించడం మరింత బాధాకరం. ఆ లక్ష్యం వెనుక ఉద్దేశం ఒక్కటే, దర్యాప్తులో జాప్యం ఉండకూడదు. విచారణలో ఆలస్యం ఉండకూడదు. మహిళలు, చిన్నారులపై నేరాలను అత్యంత ప్రాధాన్యతతో వేగంగా విచారించాలి. నేరం చేస్తే చట్టం వేగంగా, కఠినంగా స్పందిస్తుందనే భయం నేరస్తుల్లో ఉండాలి. అలాంటి వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సింది పోయి.. వేగంగా న్యాయం అందించాలనే లక్ష్యాన్నే తప్పుపట్టడం మహిళలకు ఏ సందేశం పంపుతోంది?..మహిళలు, చిన్నారులకు సకాలంలో న్యాయం జరగాలని కోరుకోవడమే ఈ ప్రభుత్వానికి అభ్యంతరమా?. “దిశ”ను ఉపసంహరించుకోవడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం నేరస్తుల్లో చట్టంపై ఉన్న భయాన్ని తగ్గిస్తోంది. బాధిత మహిళల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. మహిళలు తమ రక్షణ కవచంగా భావించిన వ్యవస్థను లేకుండా చేస్తోంది. మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. దిశను రద్దు చేయడం కాదు.. రక్షించాలి. దిశను నిర్వీర్యం చేయడం కాదు.. మరింత బలోపేతం చేయాలి’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
ఎమ్మెల్యే బోండా ఉమాకు పేర్నినాని వార్నింగ్
పామర్రు: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దీక్షా శిభిరంపై దాడికి ఉసిగొల్పిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాకు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మల్లాది విష్ణు శిబిరంపై దుర్మార్గంగా బోండా ఉమా దాడి చేశారని, మరి కృష్ణలంకలో అవినాష్ టెంట్ జోలికి ఎందుకు వెళ్లలేకపోయావ్ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. అంత పోటుగాడివైతే అవినాష్ టెంట్ జోలికి వెళ్లాల్సింది అంటూ బోండా ఉమాకు వార్నింగ్ ఇచ్చారు పేర్ని నాని.ఈరోజు(శుక్రవారం, ఆగస్టు 7వ తేదీ) డీఎస్సీ అక్రమాలపై కృష్ణా జిల్లాలోని పామర్రులో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తున్న శిబిరాన్ని పేర్ని నాని సందర్భించి సంఘీభావం తెలిపారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుడూ.. ‘ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దీక్షా శిభిరం పై దుర్మార్గంగా దాడి చేశారు. మహిళలు అని కూడా చూడకుండా టీడీపీ గూండాలు దాడి చేశారు. శిభిరం వద్ద ఉన్న బస్ షెల్డర్ పైకెక్కి మూత్రం పోశారుఎమ్మెల్యే బోండా ఉమా ఎమ్మెల్యే బరితెగించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు , లోకేష్ను ఏదైనా అంటే ఇంటికొచ్చి కొడతానని బెదిరిస్తున్నారు. మల్లాది విష్ణు అమాయకుడు కాబట్టి టెంట్ మీదకు వెళ్లి దాడి చేశావ్. నువ్వు అంత పోటుగాడివైతే కృష్ణలంకలో అవినాష్ టెంట్ జోలికి ఎందుకు వెళ్లలేకపోయావ్లోకేష్ దగ్గర బోండా ఉమాకు శీలం పోయింది. బ్లాక్ మెయిల్ చేద్దామని చూస్తే బోండా ఉమాను వాషింగ్ మెషీన్ లో వేసి తండ్రీ కొడుకులు ఉతికినట్లున్నారు. అందుకే ఇప్పుడు తండ్రీ కొడుకుల పై బోండాకు ప్రేమ పుట్టుకొచ్చింది. వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం నిరసన చేస్తుంటే గంజాయి , బ్లేడ్ బ్యాచ్తో దాడులు చేస్తారా?, మీరు దాడులు చేసినంత మాత్రాన ఇక్కడ భయపడేవాడు ఎవడూ లేరు. ఈరోజు కూడా మల్లాది విష్ణు టెంట్ వేసి దీక్ష చేస్తున్నాడు ... దమ్ముంటే ఈరోజు వెళ్లు’ అని హెచ్చరించారు.


