Andhra Pradesh
-
అమానుషం.. సాక్షి కార్యాలయాలపై పచ్చదండు దాడులు
తిరుపతి: రాష్ట్రంలో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. నిరసనకారుళ ముసుగులో సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగుతున్నారు. ఆందోళన పేరుతో విజయవాడ, తిరుపతి, కడప, శ్రీకాకుళం, అనంతపురంలోని సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. రేణిగుంట సాక్షి ఆఫీస్ వద్ద టీడీపీ గూండాల బీభత్సం సృష్టించారు. రేణిగుంటలోని సాక్షి కార్యాలయంపై టీడీపీ గూండాలు రాళ్ల దాడికి దిగారు. అదే సమయంలో సాక్షి కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు యత్నించారు.అనంతపురంలోని సాక్షి కార్యాలయంపై సైతం టీడీపీ గూండాలు దాడికి యత్నించారు. నిరసనకారల ముసుగులో సాక్షి కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన టీడీపీ నేతలు.. సాక్షి బోర్డు తొలగించేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. శ్రీకాకుళం, కడప సాక్షి కార్యాలయాల వద్ద కూడా పచ్చమూకలు రెచ్చిపోయాయి. ఆందోళన పేరుతో సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగారు. -
చేయని వ్యాఖ్యలకు కొమ్మినేని క్షమాపణలు చెప్పారు: విడదల రజిని
సాక్షి, గుంటూరు: తాను చేయని వ్యాఖ్యలకు కొమ్మినేని శ్రీనివాసరావు క్షమాపణలు చెప్పారని, అయినా కూడా అక్రమంగా అరెస్ట్ చేశారని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అరాచకాలు, విధ్వంసాలే చోటు చేసుకుంటున్నాయి. ఏడాది పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో మహిళలకు భద్రత లేదు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని కనిపించకుండా పోయింది. అదృశ్యం అయిన వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఆరు రోజుల తర్వాత ఆ విద్యార్థిని చనిపోయింది. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఇంతటి దారుణం జరిగేది కాదు. ఇది పోలీసుల వైఫల్యం కాదా? అని విడదల రజిని ప్రశ్నించారు. -
కొమ్మినేని అరెస్ట్పై వైఎస్ జగన్ స్పందన
సాక్షి,తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా మారిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం (జూన్9న) ఉదయం హైదరాబాద్ తన నివాసంలో ఉన్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుని ఏపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. ఆ అరెస్టుపై వైఎస్ జగన్ ఎక్స్ వేదిగా ట్వీట్ చేశారు.‘ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా చంద్రబాబు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా, ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబుగారు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారు.సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు, వక్తలు మాట్లాడే మాటలకు, యాంకర్కు ఏం సంబంధం? సహజంగానే ఓ డిబేట్లో వక్తలు కొందరు అనుకూలంగానూ, కొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్ట్లు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ కొనసాగడం లేదా? ప్రజల తరఫున మీడియా నిలవకూడదని, చంద్రబాబు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్లను డైవర్ట్ చేస్తూ, వక్రీకరిస్తూ, సాక్షి మీడియాపైనా దాడులు చేయిస్తున్నారు. కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారికాదు. గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టాడు. ఆయన నిష్పక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014-19 మధ్య ఆ ఛానల్పై ( గతంలో, సాక్షి కాదు) ఆంక్షలు విధించారు. ఇప్పుడుకూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్షసాధిస్తున్నారు. కొమ్మినేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.చంద్రబాబుగారూ.. ప్రజలు మీకు ఇచ్చిన అధికారం ఐదేళ్లే. అందులో ఏడాది గడిచిపోయింది. నాలుగేళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చెడు సంప్రదాయాలకు నాందిపలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో, రేపు అదే పండుతుంది, అది రెండింతలవుతుందని మర్చిపోకండి’ అని ట్వీట్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా @ncbn గారు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 9, 2025 -
కొమ్మినేని పారిపోయే రకం కాదు: దేవులపల్లి అమర్
సాక్షి, హైదరాబాద్: కొమ్మినేని శ్రీనివాస్ను ఏపీ అరెస్ట్ చేయడం దురదృష్టకరమని, వేధించడం పద్ధతి కాదని మరో సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ అన్నారు.. మీడియాను కూటమి నేతలు రాజకీయమయం చేసేశారు. విశ్లేషకుడి మాటలను సాక్షి మీడియా ఖండించింది. అయినా కూడా 70 ఏళ్ల వయసులోనూ కొమ్మినేనిపై అక్రమ కేసు పెట్టి వేధించడం సరికాదు.మీడియాను కూటమి ప్రభుత్వం శత్రువుగా చూస్తోంది. కొమ్మినేని టెరరిస్ట్ కాదు. పారిపోయే వ్యక్తి అంతకన్నా కాదు. విశ్లేషకుల అందరిపైనా కొమ్మినేనిపై పెట్టినట్లే అక్రమ కేసులు పెడతారా?. ఒకరికి ఒక న్యాయం.. మరొకరికి మరో న్యాయం అంటే ఎలా? అని అమర్ ప్రశ్నించారు. -
‘కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష గట్టారు.. సాక్షి ఆఫీస్పై ఉన్మాదపు చర్య’
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని.. కూటమి ప్రభుత్వం దానిని అసలే పట్టించుకోదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యత కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ నేపథ్యంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల్లో కొత్త సంప్రదాయానికి తెర లేపింది. కిర్రాక్ ఆర్పీ, సీమ రాజాలాంటిళ్లు దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్లపై ఫిర్యాదులు చేసినా చర్యలు ఉండవు. ఎల్లో చానెల్స్ దారుణంగా మాట్లాడుతున్నాయి. అయినా పట్టించుకోరు. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని అరెస్ట్ అప్రజాస్వామికం. చంద్రబాబు ఆయనపై కక్ష గట్టారు. కొమ్మినేనిని దారుణంగా తిడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. పోగేసుకొచ్చిన జనాలతో సాక్షి ఆఫీస్ మీద జరిపారు. మరి దీనిని ఏమనాలి?. ఇది ఉన్మాదపు చర్య కాదా?.. అని అంబటి ప్రశ్నించారు.కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్(Kommineni Srinivasa Rao Arrest) అక్రమం. డైవర్షన్ పాలిటిక్స్కు ఇదొక ఉదాహరణ. అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. లేని అంశాన్ని ఉన్నట్లుగా చూపేందుకు చంద్రబాబు,ఆయన అనుకూల మీడియా ప్రయత్నం చేస్తోంది. కొమ్మినేని శ్రీనివాసరావు ఎంతో సీనియర్ జర్నలిస్ట్. చంద్రబాబు తప్పుల్ని ఖండించే ప్రయత్నం చేసినందుకు ఎన్టీవీ పై ఒత్తిడి తెచ్చి కొమ్మినేని లైవ్ షో ఆపేశారు. కొమ్మినేనిని తీసేస్తేనే ఛానల్ ప్రసారాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఎన్టీవీలో తీసేస్తేనే కొమ్మినేని సాక్షిలో చేరారు. తన డిబేట్లలో కొమ్మినేని నిక్కచ్చిగా మాట్లాడతారు. మా సామాజికవర్గమై మమ్మల్నే విమర్శిస్తావా అని కొమ్మినేని పై చంద్రబాబు కక్ష కట్టాడు. టివి5,ఏబీఎన్ లో జరిగే డిబేట్లకు ఆ ఛానల్ యాజమాన్యాలు బాధ్యత వహిస్తాయా?. తోటి జర్నలిస్ట్ ఒకడు ‘ఒరేయ్’ అని సంభోదిస్తాడు. ఏ కుక్క బిస్కెట్లు తిని మాట్లాడుతున్నారు టీవీ5,ఏబీఎన్లో?. కృష్ణంరాజు వ్యక్తం చేసిన అభిప్రాయం తప్పు కావొచ్చు. దానికి ఛానల్కి, కొమ్మినేనికి ఏం సంబంధం?. చంద్రబాబు దేశంలోని అన్ని మీడియాలను మభ్యపెట్టినా... సాక్షిని మభ్యపెట్టలేకపోయాడు. అందుకే సాక్షి పై కక్ష కట్టి బురద జల్లుతున్నాడు. చంద్రబాబు ప్రేమ అమరావతి రైతుల మీద కాదు...అమరావతిలో తాను దోచుకునే భూముల మీద. జగన్ మోహన్ రెడ్డి, భారతిపై చాలా దారుణంగా పోస్టులు పెట్టిన వాళ్ల పై చర్యలు లేవు. నేనే స్వయంగా కిరాక్ ఆర్పీ,సీమ రాజా మీద ఫిర్యాదు చేశా.. కనీసం పట్టించుకోలేదు. కానీ కొమ్మినేని వంటి వారిని మాత్రం హైదరాబాద్ వెళ్లి అరెస్ట్ చేశారు. ఇదెక్కడి ధర్మం?. బెయిల్ రాకుండా చేసేందుకే కొమ్మినేని పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. సాక్షి ఛానల్ను ఆపాలని చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి కుట్రలు పన్నారు. కేసులుపెట్టి ఛానల్ ను ఆపాలని ప్రయత్నించారు...కానీ తట్టుకుని సాక్షి నిలబడింది. టీవీ ఛానల్స్ లో కొన్ని వందల డిబేట్లు నడుస్తాయి...దానికి ఆ ఛానల్ ను బాధ్యుల్ని చేస్తారా?. సాక్షి కార్యాలయాల పై దాడులు చేస్తారా. ఒక పథకం ప్రకారం మొదట టీడీపీ, తర్వాత లోకేష్, ఆ తర్వాత చంద్రబాబు, ఆ వెంటనే పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తారు. నేనూ అనేక డిబేట్లలో పాల్గొన్నా. డిబేట్లకు వచ్చిన వ్యక్తులు మాట్లాడితే ఆ ఛానల్స్ కు ఆపాదిస్తారా?. రాష్ట్రంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయ్. కానీ కొమ్మినేని అరెస్ట్ ఒక్కటే తమకు ముఖ్యమైన పనిలాగా చంద్రబాబు పనిచేస్తున్నారు. చంద్రబాబు చాలా దారుణమైన కార్యక్రమానికి పూనుకున్నారు.బాధ్యత కలిగిన టీడీపీ నాయకులు కూడా సాక్షి కార్యాలయం పైకి దాడులకు వెళతారు. సాక్షి కార్యాలయాలపై దాడులకు జనాన్ని పోగేసుకొచ్చారు. సందుదొరికింది కదా అని సాక్షి పైనో మరో కార్యాలయం పైనో దాడులు చేయడం కరెక్టేనా?. ఇలాగైతే సమాజం ఎటుపోతుంది. మాకూ వ్యతిరేకంగా ఉన్న మీడియాలకు కార్యాలయాలున్నాయ్ కదా!. అక్రమ కేసులుపెట్టి అరెస్ట్ చేస్తారు, జైల్లో వేస్తారు అంతకంటే ఏం చేయగలరు?. ఇప్పటికే చాలామందిని జైల్లో పెట్టారు కదా. పరిపాలన చేతకాని వారే ఇలా అరెస్టులతో కాలక్షేపం చేస్తారు. అరెస్టుల పైన పెట్టిన శ్రద్ధ ప్రజల సమస్యల పై పెడితే బాగుంటుంది అని అంబటి రాంబాబు చంద్రబాబుకి హితవు పలికారు. -
ఆంధ్ర జట్టుకు మారిన సీనియర్ రంజీ ప్లేయర్
ఉత్తర్ప్రదేశ్ సీనియర్ ఆల్రౌండర్ సౌరభ్ కుమార్ వచ్చే రంజీ సీజన్ 2025-26 కోసం ఆంధ్రప్రదేశ్ జట్టుకు మారాడు. ఈ మేరకు ఇరు జట్లకు సంబంధించిన అన్ని లాంఛనాలు పూర్తయ్యాయి. బీసీసీఐ అప్రూవల్ రావడమే తరువాయి. 32 ఏళ్ల సౌరభ్ కుమార్ 2014లో సర్వీసస్ తరఫున ఫస్ట్క్లాస్ అరంగేట్రం చేసి దశాబ్ద కాలానికి పైగా ఉత్తర్ప్రదేశ్కు ప్రాతినిథ్యం వహించాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన సౌరభ్.. ఇప్పటివరకు 79 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 25 ఐదు వికెట్ల ప్రదర్శనల సాయంతో 324 వికెట్లు తీశాడు. లోయర్ ఆర్డర్లో మంచి బ్యాటర్ కూడా అయిన సౌరభ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 2 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీల సాయంతో 2374 పరుగులు చేశాడు.లిస్ట్-ఏ ఫార్మాట్లో 2015లో అరంగేట్రం చేసిన సౌరభ్ ఇప్పటివరకు 40 మ్యాచ్లు ఆడి 52 వికెట్లు తీశాడు. ఓ హాఫ్ సెంచరీ సాయంతో 340 పరుగులు చేశాడు. 2016లో టీ20 అరంగేట్రం చేసిన సౌరభ్.. 33 మ్యాచ్ల్లో 24 వికెట్లు తీసి 148 పరుగులు చేశాడు. సౌరభ్ 2017 ఐపీఎల్ సీజన్లో ధోని నేతృత్వంలోని రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్కు ఎంపికయ్యాడు. అయితే అతనికి ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. 2021 సీజన్లో సౌరభ్ను పంజాబ్ కింగ్స్ ఎంపిక చేసుకుంది. ఆ సీజన్లోనూ అదే పరిస్థితి. 2022 ఫిబ్రవరిలో సౌరభ్కు భారత టెస్ట్ జట్టులో చోటు దక్కింది. శ్రీలంకతో జరిగిన ఆ సిరీస్లో సౌరభ్ నెట్ బౌలర్గా సేవలందించాడు. ఇటీవలికాలంలో సౌరభ్ ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంక సిరీస్లకు కూడా నెట్ బౌలర్గా ఎంపికయ్యాడు. బీసీసీఐ అధికారిక అనుమతి లభించాక సౌరభ్ రికీ భుయ్, హనుమ విహారి, కేఎస్ భరత్లతో కలిసి ఆంధ్ర జట్టుకు ఆడతాడు. -
Sakshi: విజయవాడ సాక్షి కార్యాలయంపై పచ్చమూకల దాడి
విజయవాడ,సాక్షి: విజయవాడలో పచ్చమూకలు రెచ్చిపోయారు. విజయవాడ సాక్షి కార్యాలయంపై టీడీపీ నేతలు దాడికి దిగారు. సాక్షి కార్యాలయం వద్ద టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అనుచరులు వీరంగం సృష్టించారు. సాక్షి యూనిట్ కార్యాలయం బోర్డులను టీడీపీ నేతలు పగలకొట్టారు. సాక్షి బోర్డులు పీకేసీ తగులబెట్టారు. అనంతరం, సాక్షి కార్యాలయంలోకి కోడిగుడ్లు, రాళ్లు విసిరేశారు. సాక్షి కార్యాలయంపై దాడి గద్దె రామ్మోహన్ సతీమణి అనురాధ సమక్షంలోనే జరిగింది. అయితే, సాక్షి కార్యాలయంపై పచ్చమూకలు దాడి చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం గమనార్హం. -
చంద్రబాబు,పవన్,లోకేష్ కనుసన్నల్లోనే.. కొమ్మినేని అరెస్ట్ ముందు జరిగిన కుట్ర
సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారు. ఏడాది పాలనా వైఫల్యాలతో పాటు అనంతపురంలో టీడీపీ కార్యకర్తల గ్యాంగ్ రేప్, ఇంటర్ విద్యార్థిని హత్యా ఘటనలతో ఏపీ ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. దీన్నినుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు సర్కారు కేఎస్ఆర్ లైవ్ షోను అడ్డం పెట్టుకుంది. తాను చేయని వ్యాఖ్యలకు.. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయించింది. అయితే ఈ అరెస్ట్కు ముందుకు కొమ్మినేనిపై కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్రకు తెరతీసింది. ఆ కుట్రంతా లోకేష్ కనుసన్నల్లోనే జరిగింది. అసలేం జరిగిందంటే? ఈ నెల 6న సాక్షి టీవీ డిబేట్లో విశ్లేషకులు కృష్ణం రాజు వ్యాఖ్యలను డిబేట్లో కొమ్మినేని వారించారు. ఇది జరిగిన 24 గంటల తర్వాత.. ఈ నెల 7న ఆ వ్యాఖ్యలను ఐటీడీపీ వైరల్ చేసింది. కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీకి, వైఎస్ జగన్కు ఆపాదిస్తూ విషప్రచారం చేయించింది. వెను వెంటనే పథకం ప్రకారం టీడీపీ అనుకూల వ్యక్తులతో అమరావతిలో లోకేష్ అమరావతిలో ప్రదర్శనలు చేయించారు.తాను చేసిన వ్యాఖ్యలపై కృష్ణం రాజు క్షమాపణ చెప్పినా.. వైఎస్ జగన్ కుటుంబసభ్యులపై అసభ్య వ్యాఖ్యలు, పోస్టింగ్లు పెట్టారు. నిన్న (ఆదివారం) టీడీపీ వారితో రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదు చేయించారు.ఇది ఓ వైపు జరుగుతుండగా ప్రణాళికా బద్ధంగా నిన్న మధ్యాహ్నం 1.49కి సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. చర్యలు తీసుకుంటామంటూ చంద్రబాబు ట్వీట్లో పేర్కొన్నారు. దీనికి మద్దతుగా పవన్ ఆఫీస్ నుంచి మధ్యాహ్నం 3.40కి ప్రెస్ నోట్ విడుదలైంది. తర్వాత సాయంత్రం 6.45కి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోపే హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఇలా చంద్రబాబు అండ్ కో.. ఏపీలో కొనసాగుతున్న దారుణల్ని, అరాచకాల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు కొమ్మినేని అరెస్ట్ చేశారంటూ ఏపీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టులు సైతం కూటమి ప్రభుత్వం తీరును ఖండిస్తున్నారు. -
‘కొమ్మినేని అరెస్ట్.. అధికారం ఇచ్చింది అక్రమ కేసులు పెట్టడానికా?’
సాక్షి, హైదరాబాద్: ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అమరావతిలో మహిళలను కించపరిచారంటూ ఆయనపై ఏపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్కు చేరుకున్న పోలీసులు.. సోమవారం ఉదయం కొమ్మినేనిని అరెస్ట్ చేసి ఏపీ తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొమ్మినేని అరెస్ట్ను పలువురు జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు ఖండిస్తున్నాయి. కూటమి సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 👉సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును జూపూడి ప్రభాకర్రావు ఖండించారు. కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సరికాదన్నారు.👉సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. టీడీపీ, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కృష్ణంరాజు వ్యాఖ్యలను కొమ్మినేని తప్పుబట్టారు. అధికారం ఇచ్చింది అక్రమ కేసులు పెట్టడానికా?. దీనిపై మూడు రోజులుగా టీడీపీ, ఎల్లో మీడియా రాద్ధాంతం దారుణం. విశ్లేషకుల అభిప్రాయాలు వారి వ్యక్తిగతం. కృష్ణంరాజు వ్యాఖ్యలను కొమ్మినేని ఆపేశారు. లేని విషయాన్ని క్రియేట్ చేసి విష ప్రచారం చేయడమే టీడీపీ పని.. అనవసర విషయాలపై రాద్ధాంతం చేస్తున్నారు. సాక్షిలో కేఎస్ఆర్ న్యూట్రల్గా డిబేట్లు నిర్వహిస్తారు. ఆయన పొరపాటున కూడా అసభ్యకరంగా మాట్లాడరు. చంద్రబాబు పాలనలో అరాచకమే ఉంది. సంక్షేమం లేదు.👉భూమన కరుణాకర్ రెడ్ది స్పందిస్తూ.. రాజకీయ లబ్ధి కోసమే కొమ్మినేని అరెస్ట్. ఉద్దేశ్యపూర్వకంగానే టీడీపీ, జనసేనలు నిరసనలు. కృష్ణంరాజు వ్యాఖ్యలను సాక్షి ఖండించింది. మహిళలను టీడీపీ, జనసేన పార్టీలు రెచ్చగొడుతున్నాయి. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. సాక్షిపై దాడి.. ప్రజల గొంతుకలపై ఉక్కుపాదం. టీడీపీ గూండాలే దాడికి పాల్పడుతున్నారు.👉 జర్నలిస్ట్ తిలక్ స్పందిస్తూ.. కొమ్మినేని అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నా. కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా పెడతారు? అని ప్రశ్నించారు. 👉 మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి స్పందిస్తూ.. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం. లైవ్ డిబెట్లో ఎవరో మాట్లాడిన మాటలకు కేఎస్ఆర్కు సంబంధం ఏంటి అని ప్రశ్నించారు. 👉 హైకోర్టు లాయర్ వెంకటేశ్ శర్మ స్పందిస్తూ.. కొమ్మినేని ఎప్పుడూ పరిధి దాటరు. కొమ్మినేనిని అక్రమంగా అరెస్ట్ చేశారు. కొమ్మినేనిపై రాజకీయ కక్ష పెంచుకున్నారు. కేఎస్ఆర్ చర్చల్లో ప్రజల వాణి వినిపిస్తుంది. సాక్షి, హైదరాబాద్: ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అమరావతిలో మహిళలను కించపరిచారంటూ ఆయనపై ఏపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్కు చేరుకున్న పోలీసులు.. సోమవారం ఉదయం కొమ్మినేనిని అరెస్ట్ చేసి ఏపీ తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొమ్మినేని అరెస్ట్ను పలువురు జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు ఖండిస్తున్నాయి. కూటమి సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 👉 జర్నలిస్ట్ తిలక్ స్పందిస్తూ.. కొమ్మినేని అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నా. కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా పెడతారు? అని ప్రశ్నించారు. 👉 మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి స్పందిస్తూ.. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం. లైవ్ డిబెట్లో ఎవరో మాట్లాడిన మాటలకు కేఎస్ఆర్కు సంబంధం ఏంటి అని ప్రశ్నించారు. 👉 హైకోర్టు లాయర్ వెంకటేశ్ శర్మ స్పందిస్తూ.. కొమ్మినేని ఎప్పుడూ పరిధి దాటరు. కొమ్మినేనిని అక్రమంగా అరెస్ట్ చేశారు. కొమ్మినేనిపై రాజకీయ కక్ష పెంచుకున్నారు. కేఎస్ఆర్ చర్చల్లో ప్రజల వాణి వినిపిస్తుంది. 👉 వైఎస్సార్సీపీ నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి స్పందిస్తూ.. కొమ్మినేని అరెస్ట్ను ఖండిస్తున్నాం. ప్రజా గొంతుక వినిపించడంలో కొమ్మినేని ముందుంటారు. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు మాటలను ఎవరూ సమర్థించరు. వైఎస్సార్సీపీ, సాక్షి పత్రిక కృష్ణం రాజు వ్యాఖ్యలను ఖండించింది. సాక్షికి సంబంధంలేని మాటలను పట్టుకుని కొమ్మినేని ఎలా అరెస్ట్ చేస్తారు. కూటమి ప్రభుత్వ చర్యలతో ఐఏఎస్, ఐపీఎస్లు కూడా భయపడుతున్నారు. ప్రజల గొంతుక, జర్నలిస్టుల గొంతులు నొక్కడమే కూటమి ప్రభుత్వం పని. -
కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్
సాక్షి,హైదరాబాద్: ప్రముఖ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం హైదరాబాద్లో కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటికి మఫ్టీలో చేరుకున్న ఏపీ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కొమ్మినేని పోలీసులను నిలదీయడం గమనార్హం.ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా తన ఇంటికి ఎందుకు వచ్చారని కొమ్మినేని అడిగారు. దీంతో, పోలీసులు.. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు చెప్పుకొచ్చారు. అయితే, కేసు ఏంటని కొమ్మినేని ప్రశ్నించగా.. వారు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అరెస్టు చేసి వాహనంలో తరలించారు. ఎఫ్ఐఆర్ కాపీని మాత్రమే చూపించి.. ఆయనను వాహనంలో తీసుకువెళ్లారు. అరెస్ట్ సమయంలో లోకల్ పోలీసులు లేకపోవడం విశేషం. మరోవైపు, ఇంటి వద్ద అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన ఏపీ పోలీసుల్ని కొమ్మినేని శ్రీనివాసరావు పలు ప్రశ్నలు సంధించారు. తనని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు?. ముందస్తు నోటీసులు ఇచ్చారా? లోకల్ పోలీసులకు సమాచారం ఇచ్చారా?.. అని అడిగారు. అందుకు ఏపీ పోలీసులు నోరు మెదపలేదు. కానీ అరెస్ట్ అనంతరం రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఏపీ పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకు వెళ్లారు. కొమ్మినేనిని అరెస్ట్ చేసి ఏపీకి తీసుకెళ్తున్నామని జూబ్లీహిల్స్ పోలీసులకు తుళ్లూరు పోలీసులు సమాచారం ఇచ్చారు. అనంతరం, కొమ్మినేనిని ఏపీకి తరలించారు. ఒక సీనియర్ జర్నలిస్టుకే ఇలాంటి పరిస్థితా? కొమ్మినేనిఏపీ పోలీసుల అక్రమ అరెస్ట్పై కొమ్మినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను సీనియర్ సిటిజన్ని.. ఎలా అరెస్ట్ చేస్తారు? సీనియర్ జర్నలిస్ట్ ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితేంటి?. కేసు ఎవరు పెట్టారో చెప్పడం లేదు. సాక్షిలో నా డిబేట్లు రాకుండా చేయాలని చూస్తున్నారేమో. ప్రభుత్వ వ్యతిరేకత వాయిస్ వినిపించకుండా చేసే యత్నం’ జరుగుతోందని అన్నారు.కొమ్మినేనిపై నమోదైన సెక్షన్లుకొమ్మినేని శ్రీనివాసరావుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 79,196(1) 353 (2),299,356(2),61(1),bns 67 ఐటీఏ 3(1), ఎస్సీఎస్టీ పీవోఏ యాక్ట్ నమోదైంది.సంబంధం లేదని చెప్పినా పట్టించుకోని ఏపీ ప్రభుత్వంమరోవైపు, ఇటీవల అమరావతి మహిళల విషయమై జర్నలిస్ట్, విశ్లేషకులు కృష్ణం రాజు వ్యాఖ్యల్ని సాక్షి యాజమాన్యం ఇప్పటికే ఖండించింది. కొమ్మినేని శ్రీనివాసరావు సైతం ఆ వ్యాఖ్యల్ని ఖండించారు. అమరావతి మహిళలకు క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ ఇలా అరెస్ట్ చేయడం గమనార్హం. ఇక, సాక్షి టీవీ డిబేట్లో విశ్లేషకుడు కృష్ణంరాజు వ్యాఖ్యలకు కొమ్మినేని శ్రీనివాసరావు సర్ధి చెప్పారు. ఆ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని పదే పదే స్పష్టం చేసినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. నిన్న, ఇవాళ తన లైవ్ షోలో కృష్ణంరాజు తరుఫున.. కృష్ణంరాజు వ్యాఖ్యలను అడ్డుపెట్టుకుని కొమ్మినేనిపై ఏపీ ప్రభుత్వం రెడ్బుక్ ప్రయోగించింది.జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలను ఖండించిన సాక్షి టీవీగత శుక్రవారం నాటి కేఎస్ఆర్ లైవ్ షోలో విశ్లేషకుడు కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని సాక్షి టీవీ పేర్కొంది. కృష్ణంరాజు వ్యాఖ్యలను కూటమి నేతలు సాక్షి టీవీకి ఆపాందించడం సరికాదని తీవ్రంగా ఖండించింది. సాక్షి మీడియా ఎల్లప్పుడూ మహిళల పట్ల అత్యంత గౌరవాభిమానాలు చూపుతుందని.. సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలను.. సాక్షి మీడియా ఎంత మాత్రం సమర్ధించదని సాక్షి టీవీ స్పష్టం చేసింది.ఎవరినీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు: కృష్ణంరాజుఇదిలా ఉండగా, కృష్ణంరాజు కూడా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. మహిళల మనోభావాలను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదన్నారు. ఒకవేళ ఎవరి మనోభావాలైన కించపరిచి ఉంటే క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కృష్ణంరాజు అన్నారు. -
ఎన్ని జన్మలెత్తినా.. కూతురు, అల్లుడిపై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కాకినాడ: తన కుమార్తె, అల్లుడి కుటుంబంపై మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబంపై మరో కుటుంబం కొంత కాలంగా దాడి చేస్తోందని ముద్రగడ చెప్పుకొచ్చారు. తనకు కాన్సర్ వచ్చిందని.. తన చిన్న కొడుకు పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రేలాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన కుమారుడి ఎదుగుదలను చూసి కొందరు ఏడుస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఎవరో ఏడుస్తున్నారని రాజకీయాలను వదిలిపెట్టను అంటూ క్లారిటీ ఇచ్చారు.తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మాజీ మంత్రి ముద్రగడ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ముద్రగడ లేఖను విడుదల చేశారు. లేఖలో ముద్రగడ..‘మా కుటుంబంపై మరో కుటుంబం కొంతకాలంగా దాడి చేస్తుంది. మా కుటుంబాల మధ్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి. మా అబ్బాయి ఎదుగుదల చూసి కొందరు దారుణంగా ఏడుస్తున్నారు. వారితో మాకు ఏమాత్రం సంబంధం లేదు. నాకు క్యాన్సర్ వచ్చిందని, నా చిన్న కొడుకు పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రేలాపన చేస్తున్నారు. నాకు, నా కొడుకుకు మధ్య మనస్పర్థలు పెంచి దూరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని జన్మలెత్తినా వారి గుమ్మం ఎక్కను.నాకు, నా వియ్యంకుడు శివాజీకి మధ్య మనస్పర్థలు తేవాలని చూస్తున్నారు. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు మానుకోండి. నా కొడుకునే కాదు.. మనవడిని కూడా రాజకీయాల్లోకి తీసుకెళ్తాను. వారిని ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను. నాపై ఎవరో ఏడుస్తున్నారని రాజకీయాలను వదిలిపెట్టను. తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి.. పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు. ఆమె మామగారికి క్యాన్సర్ వస్తే రాజమండ్రి హాస్పిటల్లో నేను 15 రోజులు సేవ చేశాను. వీళ్ళు నా మీద ప్రేమ ఒలకబోస్తున్నారు. వయసు రీత్యా నాకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి తప్ప.. మరేవీ లేవు. గతంలో నా భార్యకు క్యాన్సర్ వచ్చినప్పుడు వారింటికి వెళ్తే ఐదు నిమిషాలు కూడా మా వద్దకు రావద్దని కూతురు, అల్లుడు చెప్పారు. వీళ్లా ఈరోజు మాట్లాడేది. వీళ్లతో ఏడాది నుంచి రాకపోకలు ఆగిపోయాయి. ఏం ఆశించి నన్ను టార్గెట్ చేస్తున్నారు. వీరు బెదిరిస్తే బెదిరి పోతానా?. అన్ని కార్యక్రమాలు చేస్తున్నాను. కార్యకర్తలతో కూడా మాట్లాడుతున్నాను.ప్రభుత్వ జీవోలపై ఆ కుటుంబం వారు సలహా ఇచ్చామని అంటున్నారు. మీకు అంత దమ్ము, ధైర్యం ఉంటే కాపులను బీసీల్లో కలిపి కార్యక్రమం చేయించండి. సూపర్ సిక్స్ పథకాలు ముఖ్యమంత్రితో అమలు చేయించండి. పథకాలు అమలు చేపించి చూపించండి.. అప్పుడు మీ డబ్బా కొట్టుకోండి. మీ చీప్ పబ్లిసిటీ కోసం ఇంతగా దిగజారి బతకొద్దు. ఎన్ని జన్మలెత్తినా మీకు మాకు సంబంధాలు ఉండవు. అనవసరంగా నా ప్రస్తావన తేవద్దు. సిగ్గు, మర్యాద ఉంటే ఈరోజు నుంచి తప్పుడు ప్రచారం ఆపండి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. pic.twitter.com/QeI22pfm0Z— Mudragada Padmanabhareddy (@Iam_Mudragada) June 9, 2025 -
వైఎస్సార్ జిల్లాలో విషాదం.. ఇద్దరు చిన్నారులు మృతి
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నీటి సంపులో పడి ఇద్దరు పిల్లలు మృతిచెందారు. మృతులు ఇద్దరు పిల్లలను నాగసానీపల్లెకు చెందిన వారిగా గుర్తించారు.వివరాల ప్రకారం.. చక్రాయపేట మండలం బాలతిమ్మయ్య గారి పల్లెలో విషాదం నెలకొంది. మామిడి తోటకు కాపలాగా ఉన్న ఇద్దరు పిల్లలు నీటి సంపులో పడి సోమవారం ఉదయం మృతి చెందారు. మృతులు ఖాజీపేట మండలం నాగసానీ పల్లెకు చెందిన వారిగా గుర్తించారు. అయితే, పిల్లలు ఇద్దరు బతుకు దెరువు కోసం కాజీపేట నుండి చక్రాయపేటకు వచ్చినట్టు తెలుస్తోంది. చిన్నప్పుడే పిల్లల తండ్రి చనిపోవడంతో మేనమామ దగ్గర పెరుగుతున్నారు. -
విశాఖపట్నం : మంత్రి లోకేష్ మోసం.. తిరగబడ్డ టీచర్లు (ఫొటోలు)
-
మిస్ యూనివర్స్ 2025 పోటీలకు మన తెలుగు తేజాలు (ఫొటోలు)
-
టీటీడీ విజిలెన్స్ వైఫల్యం.. తిరుమలలో మరో అపచారం.. వీడియో
తిరుపతి: తిరుమలలోని అలిపిరి చెక్ పాయింట్కు సమీపంలోని ఏటీఎం సెంటర్ వద్ద ఇద్దరు వ్యక్తులు బహిరంగంగా మద్యం తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మద్యం తాగిన వ్యక్తులు ఖాళీ సీసాను అలిపిరి మెట్ల మార్గంలో వేయడం శ్రీవారి భక్తులు ఆగ్రహానికి కారణమైంది.అయితే, అలిపిరి తనిఖీ కేంద్రానికి కూతవేటు దూరంలో అలిపిరి నడక మార్గం ప్రారంభం అవుతుంది. ఈ ప్రాంతంలో దాదాపు 50కి పైగా సీసీ కెమెరాల ద్వారా టీటీడీ నిఘా ఉంచింది. అలిపిరి మెట్ల మార్గం ప్రారంభ ద్వారం వద్ద లగేజీ కౌంటర్కు అభిముఖంగా ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో అండర్ పాస్ ద్వారా అలిపిరి మెట్ల మార్గం ప్రారంభమవుతుంది. భక్తులు ఈ అండర్ పాస్ ద్వారాకాలినడక ప్రారంభిస్తారు. ఏటీఎంకు ఆనుకుని కొంత ఖాళీస్థలం ఉండటంతో మందుబాబులు రెచ్చిపోతున్నారు.టీటీడీ విజిలెన్స్ నిఘా వైఫల్యమే ఇందుకు కారణమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ నిద్ర మత్తులో తూలుతోందనే విషయం ఇటీవల వరుస ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగిన ‘మాకేం అవుతుందిలే’ అనే నిర్లక్ష్య ధోరణి విజిలెన్స్ నిఘా విభాగం సిబ్బందిలో పెరిగిపోయింది. సిబ్బంది పనితీరును నిరంతరాయంగా పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో వరుస నిఘా వైఫల్యాలు వెలుగు చూస్తున్నాయి. పవిత్రమైన క్షేత్రంలో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.🚨 #BRNaiduUnfitForTTDఅలిపిరి మెట్ల మార్గంలో కాకుండా.. మద్యం సీసాలపై నడుచుకుంటూ భక్తులు కొండపైకి వెళ్లాలా @ncbn, @PawanKalyan, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ?శ్రీవారి సన్నిధిలో మద్యాన్ని ఏరులైపారిస్తున్న కూటమి ప్రభుత్వం. మందు తాగేసి బాటిల్స్ ను మెట్లపై విసురుతున్న మందుబాబులు… pic.twitter.com/HftbdINhv1— YSR Congress Party (@YSRCParty) June 8, 2025 -
పెళ్లి పేరుతో మాయలేడీ మోసం
కృష్ణలంక(విజయవాడతూర్పు)/అనంతపురం: తనకు పెళ్లి కాలేదని చెప్పిన ఒక మహిళ, అమాయకపు యువకుడిని పెళ్లి చేసుకుని మోసం చేసి కనిపించకుండా పోయిన ఘటనపై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం ప్రకారం సత్యసాయి జిల్లా కొత్తచెరువు గ్రామానికి చెందిన మైలవరపు రాజశేఖరరెడ్డి బెంగళూరులోని ఆటోమొబైల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని నెలలుగా తన పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరోలను సంప్రదిస్తున్నాడు. ఈ క్రమంలో అతని స్నేహితుడైన కృష్ణారెడ్డి ద్వారా గుంటూరుకు చెందిన మల్లేశ్వరి, మంగళగిరికి చెందిన కొండలమ్మ అనే ఇద్దరు మధ్యవర్తులు పరిచయమయ్యారు. ఒక మంచి యువతిని ఇచ్చి పెళ్లి చేస్తామని మధ్యవర్తులు ఈ సందర్భంగా రాజశేఖరరెడ్డిని నమ్మించారు. కరుణావతి అనే యువతికి తల్లిదండ్రులు లేరని, ఎదురు కట్నంగా నగదు ఇస్తే పెళ్లి చేస్తామని నమ్మబలికారు. వారి మాటలను నమ్మిన రాజశేఖరరెడ్డి ఆ యువతి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఎదురుకట్నంగా అతను మధ్యవర్తులకు రూ.2 లక్షలు చెల్లించి తన గ్రామంలోనే ఈ నెల ఒకటో తేదీన కరుణావతిని వివాహం చేసుకున్నాడు. ఈనెల 6న తన నాయనమ్మకు ఆరోగ్యం క్షీణించిందని, చనిపోయే పరిస్థితిలో ఉందని కరుణావతి భర్తకు చెప్పడంతో ఇద్దరు కలిసి బయలుదేరి శనివారం ఉదయం విజయవాడ బస్టాండ్కు చేరుకున్నారు.బస్టాండ్లో టాయిలెట్కు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన కరుణావతి ఎంతకూ తిరిగి రాలేదు. ఆమె సెల్ఫోన్కు ఫోన్ చేస్తే స్విచ్ఆఫ్ వచ్చింది. ఎంతసేపటికీ ‘తన భార్య’ తిరిగి రాకపోవడంతో రాజశేఖరరెడ్డి కృష్ణలంక పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. వివరాలు తెలుసుకున్న సీఐ నాగరాజు, ప్రత్యేకంగా టీమ్లను ఏర్పాటు చేశారు. ఆ టీమ్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ దర్యాప్తు కొనసాగించారు. అయితే కొండపల్లి ప్రాంతానికి చెందిన ఈ మాయ‘లేడీ’కి అప్పటికే వివాహం జరిగి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. దర్యాప్తు కొనసాగుతోంది. -
ఈఏపీ సెట్లో బాలురు భళా
బాలాజీ చెరువు (కాకినాడ సిటీ)/కందుకూరు రూరల్/ శ్రీకాళహస్తి/పెనమలూరు/ఆలమూరు/పాలకొల్లు సెంట్ర ల్/తాడేపలిలగూడెం : బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, ఫార్మాడీ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఇంజినీరింగ్, అగ్రిక ల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రెస్ట్ టెస్ట్ (ఏపీ ఈఏపీ సెట్) ఫలితాల్లో అబ్బాయిలు పూర్తి ఆధిపత్యం కనబరిచారు. ఇంజినీరింగ్తో పాటు అగ్రికల్చర్ విభాగంలో టాప్–10 ర్యాంకులను వారే కైవసం చేసుకున్నారు.గత ఏడాది ఇంజినీరింగ్లో టాప్–10 ర్యాంకులు అబ్బాయిలు దక్కించుకోగా, అగ్రికల్చర్ విభాగంలో ఆరుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు ర్యాంకులు సాధించారు. కానీ, ఈ ఏడాది మాత్రం రెండు విభాగాల్లోనూ బాలురే టాప్–10 ర్యాంకులన్నింటినీ కొల్లగొట్టారు. ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలను జేఎన్టీయూ–కాకినాడలో సెట్ చైర్మన్, వర్సిటీ వైస్ చాన్సలర్ సీఎస్ఆర్కే ప్రసాద్, సెట్ కన్వీనర్ వీవీ సుబ్బారావు ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగానికి 2,80,611 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,64,840 మంది హాజరయ్యారు. 1,89,748 మంది (71.65 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 1,05,436 (70.33 శాతం) మంది, బాలికలు 84,313 (73.37 శాతం) మంది ఉన్నారు. అలాగే, అగ్రికల్చర్ విభాగంలో 81,837 మంది దరఖాస్తు చేసుకోగా 75,460 మంది పరీక్ష రాశారు. వీరిలో 67,761 మంది (89.8 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 16,097 (89.92 శాతం) మంది, బాలికలు 51,664 (89.76 శాతం) మంది ఉన్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇంజినీరింగ్ వైపు అత్యధికంగా బాలురు, అగ్రి కల్చర్ వైపు బాలికలు మొగ్గు చూపారు. మొత్తం మీద 75.67 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.25 శాతం వెయిటేజీతో ర్యాంకులు..మే 19 నుంచి 27 వరకు కంప్యూటర్ బేస్డ్ (సీబీటీ) విధానంలో పరీక్ష నిర్వహించినట్లు సెట్ చైర్మన్, జేఎన్టీయూకే వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ చెప్పారు. పరీక్షలు పూర్తయిన 12 రోజుల్లో ఫలితాలు విడుదల చేశామన్నారు. ఈఏపీ సెట్ పూర్తయిన తరువాత ప్రాథమిక కీ విడుదల చేశామని, అభ్యంతరాలు స్వీకరించేందుకు కీ అబ్జర్వేషన్స్ వెరిఫికేషన్ కమిటీ నియమించామని చెప్పారు. జువాలజీ, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో టైపోగ్రాఫికల్ లోపం వలన రెండు ప్రశ్నలకు సంబంధించి ఆప్షన్లు మార్చామని, అలాగే.. మాల్ ప్రాక్టీస్కు సంబంధించి ఫలితాలు విడుదల చేయలేదన్నారు.రాష్ట్రంలో రెగ్యులర్ ఇంటర్మిడియెట్లో ఉత్తీర్ణులై ఈఏపీ సెట్లో అర్హత సాధించిన వారందరికీ ఇంటర్ మార్కుల ఆధారంగా 25 శాతం వెయిటేజీ ఇచ్చి, ర్యాంకులు ప్రకటించామని వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూకే ఇన్చార్జి రిజిస్ట్రార్ రవీంద్ర, కో కన్వీనర్ రాము, సుమతి, కో ఆరి్డనేటర్ సానబోయిన చంద్రశేఖర్, జయప్రసాద్, ఉషాదేవి, దిలీప్కుమార్ పాల్గొన్నారు.ఇంజినీరింగ్లో రెండో ర్యాంకర్ భానుచరణ్రెడ్డి..ఇంజినీరింగ్ విభాగంలో రెండో ర్యాంకు సాధించిన భానుచరణ్రెడ్డిది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి. జేఈఈ అడ్వాన్స్డ్ ఓపెన్ కేటగిరీలో 51వ ర్యాంకు, జేఈఈ మెయిన్స్ ఓపెన్ కేటగిరిలో 158, జేఈఈ బీఆర్క్ ఓపెన్ కేటగిరిలో 54వ ర్యాంకు సాధించాడు. ఈయన తండ్రి రాయలసీమ జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ మాండవ్యపురం జయభారత్. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ తీసుకుని క్వాంటం కంప్యూటర్స్ను డెవలప్ చేయడమే తన లక్ష్యమని భానుచరణ్రెడ్డి చెప్పాడు.ఇంజినీరింగ్లో పాలకొల్లు విద్యార్థికి మూడో ర్యాంకుపశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కోటివల్లి యశ్వంత్ సాత్విక్ ఇంజినీరింగ్ విభాగంలో 3వ ర్యాంకు సాధించాడు. యశ్వంత్ సాత్విక్ గతంలో పాలిసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు, జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మొదటి స్థానం, జేఈఈ మెయిన్స్ రెండో సెషన్లో ఓపెన్ కేటగిరీలో 53వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 3వ ర్యాంకు సాధించాడు. జేఈఈ అడ్వాన్స్డ్లో ఓపెన్ కేటగిరీలో 113వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 8వ ర్యాంకు సాధించాడు. యశ్వంత్ తండ్రి వెంకట సత్యనారాయణ పండ్ల వ్యాపారి. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ చదవాలనేది తన కోరికని యశ్వంత్ చెప్పాడు.ఇంజినీరింగ్లో కందుకూరు విద్యార్థికి 10వ ర్యాంకు..శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన బద్రిరాజు వెంకట మణి ప్రీతమ్ ఏపీ ఈఏపీసెట్ (ఎంసెట్) ఫలితాలు ఇంజినీరింగ్ విభాగంలో 10వ ర్యాంకు సాధించాడు. జేఈఈ అడ్వాన్స్డ్లో 234వ ర్యాంకు, మెయిన్స్లో 129వ ర్యాంకు, తెలంగాణ ఎంసెట్లో 39వ ర్యాంకు సాధించిన ప్రీతమ్.. ఈఏపీసెట్లోనూ హవా కొనసాగించాడు. ప్రీతమ్ తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే.అగ్రిఫార్మాలో హర్షవర్థన్కు ఫస్ట్ ర్యాంకు..అగ్రి, ఫార్మా ఫలితాల్లో కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరుకు చెందిన రామాయణం వెంకట నాగసాయి హర్షవర్థన్కు రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకు వచ్చింది. నంద్యాలకు చెందిన తండ్రి నాగసత్యనారాయణ, తల్లి హేమలలిత కొన్నేళ్లుగా కానూరులో నివసిస్తున్నారు. నాగసత్యనారాయణ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ట్రాన్స్పోర్టేషన్ గ్రూప్ స్టేట్ హెడ్గా పనిచేస్తున్నారు. నాగసాయి హర్షవర్థన్కు 149.5 మార్కులతో స్టేట్ ఫస్ట్ వచ్చాడు. తనకు మెడిసిన్ చదవాలని ఉందని వెంకట నాగసాయి హర్షవర్థన్ తెలిపారు. మెడిసిన్ చదవాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమించానన్నారు.అగ్రిఫార్మాలో మల్లేశ్కుమార్కు మూడో ర్యాంకు..అగ్రి, ఫార్మా విభాగంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామానికి చెందిన డేగల అకీరానంద వినయ్ మల్లేష్కుమార్ మూడో ర్యాంకు సాధించాడు. మల్లేష్ తండ్రి శివప్రసాద్ రైస్మిల్లు యజమాని కాగా తల్లి వెంకటలక్ష్మి గృహిణి. నీట్లో మంచి ర్యాంకు సాధించి కార్డియాలజిస్ట్గా సేవలు అందించడమే తన లక్ష్యమని మల్లేశ్ కుమార్ తెలిపాడు.అగ్రి, ఫార్మా విభాగంలో ‘గూడెం’ విద్యార్థికి ఐదో ర్యాంకు..ఆగ్రి, ఫార్మా విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన యలమోలు సత్య వెంకట్ ఐదో ర్యాంకు సాధించాడు. సత్యవెంకట్ తల్లిదండ్రులు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ సుచరిత ఇద్దరూ డాక్టర్లే. తల్లి, తండ్రి, సోదరి బాటలోనే వైద్యుడిగా చేయాలనేది తన సంకల్పమని సత్య వెంకట్ చెప్పాడు. మంచి వైద్యుడిగా సమాజంలో విశేష సేవలందించాలనేది తన లక్ష్యమని సత్య వెంకట్ చెప్పారు -
ఏపీ ఎన్నికల్లోనూ ఈవీఎంల మాయాజాలం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల మాయాజాలం చోటుచేసుకుందనే చర్చ మరోసారి ఊపందుకుంది. మహారాష్ట్రలో ఈవీఎంల మాయాజాలంవల్లే బీజేపీ గెలిచిందని.. వచ్చే ఎన్నికల్లో బిహార్లోనూ అదే రీతిలో గెలిచేందుకు బీజేపీ ఎత్తులు వేస్తోందని కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత, రాహుల్గాంధీ ఓ ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసంలో ఆరోపించారు. ఈ వ్యాసాన్ని ఉటంకిస్తూ మహారాష్ట్ర తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ ఈవీఎంల మాయాజాలంతో కూటమి గెలిచిందంటూ ‘ఎక్స్’ వేదికగా రిటైర్డు ఐఏఎస్ పీవీఎస్ శర్మ ఉద్ఘాటించారు. ‘ఆంధ్రప్రదేశ్లో 2024, మేలో జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 6 గంటలకు 68.12 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత 81.86 శాతం ఓట్లు పోలైనట్లు తుది పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. అంటే.. తొలుత ప్రకటించిన దానికి.. చివరిసారిగా ప్రకటించిన శాతానికి, పోలింగ్ 13.74 శాతం ఎక్కువగా ఉంది. దీనివల్ల 46 లక్షల ఓట్లు అధికంగా పోలయ్యాయి. అంటే.. సగటున ఒక్కో నియోజకవర్గానికి 26 వేల ఓట్లు అధికంగా పోలయ్యాయి. చివర్లో పెరిగిన పోలింగ్ శాతమే అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసింది’ అంటూ తన ‘ఎక్స్’ ఖాతాలో పీవీఎస్ శర్మ ఆదివారం కుండబద్దలు కొట్టారు.రాయచోటిలో అధికంగా పోలైన ఓట్లన్నీ ఒకే పార్టికా!? : గడికోటవైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘నేను ప్రాతినిధ్యం వహించి పోటీచేసిన రాయచోటి నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన తీరు, పోలింగ్ సరళి తదితర అంశాలను, గణాంకాలను పరిశీలిస్తే.. కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. 2012 ఉప ఎన్నిక, 2014, 2019, 2024లో జరిగిన రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలను పరిశీలిస్తే.. 2012, 2014, 2019 ఎన్నికల్లో 62 వేల నుంచి 66 వేల ఓట్లు టీడీపీకి వచ్చాయి. వైఎస్సార్సీపీకి 92 వేల నుంచి 98 వేల మధ్య ఓట్లు వచ్చాయి.2014తో పోలిస్తే 2019లో పోలైన ఓట్ల పెరుగుదల కేవలం 200 మాత్రమే. 2019తో పోల్చితే 2024లో 30 వేల ఓట్లు అధికంగా పోలయ్యాయి. గతంలో ఇంత పెరుగుదల ఎప్పుడూలేదు. కానీ, 2024లో వైఎస్సార్సీపీకి 95 వేల ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల ఫలితాలతో చూస్తే.. వైఎస్సార్సీపీ ఓట్లు అలానే ఉన్నాయి. కానీ, టీడీపీకి మాత్రం 96 వేల ఓట్లు వచ్చాయి. అంటే.. 2019తో పోలిస్తే 2024లో అధికంగా పోలైన 30 వేల ఓట్లు కూడా టీడీపీకే పడ్డాయని అర్థమవుతోంది. అధికంగా పోలైన ఈ 30 వేల ఓట్లు ఒకే పార్టికి ఎలా పడతాయి? ఇది సాధ్యమేనా? ఇది నమ్మశక్యమేనా?’ అంటూ గడికోట శ్రీకాంత్రెడ్డి ‘ఎక్స్’లో ప్రశ్నించారు. -
కీచక రాజ్యం.. ఆగని అఘాయిత్యాల పర్వం
సగటున రెండు రోజులకొక అత్యాచారం.. చంబల్ లోయ దురాగతాలను తలపిస్తున్న రాష్ట్రం చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. రెడ్బుక్ సేవలో తరిస్తున్న పోలీసు యంత్రాంగం రామగిరి మండలంలో 9వ తరగతి బాలికపై 14 మంది ఆరు నెలలపాటు అత్యాచారం.. బాధిత బాలికను స్వయంగా విచారించిన ఎస్పీ.. అయినా ఇప్పటిదాకా కేసే లేదు! మహిళలంటే టీడీపీ నేతలకు చిన్నచూపు.. అందుకే బాలికలు, మహిళల భద్రతకు కూటమి సర్కారు తిలోదకాలుసాక్షి, అమరావతి: కీచక చంద్రబాబు ప్రభుత్వం గురివింద నీతిని వల్లె వేస్తోంది. మహిళల పట్ల ఒక్కసారిగా మొసలి కన్నీరు కారుస్తోంది. ఓ వైపు రాష్ట్రంలో అసాంఘిక శక్తులు.. మహిళలు, బాలికలపై విచ్చలవిడిగా అత్యాచారాలకు పాల్పడుతున్నా, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. మరోవైపు మహిళల భద్రత, గౌరవం, ఆత్మాభిమానం అంటూ వైఫల్యాన్ని కప్పిపుచ్చేకునేందుకు యత్నిస్తోంది.ఒకప్పటి చంబల్ లోయను తలపిస్తూ రాష్ట్రంలో మహిళలు, బాలికలపై యథేచ్ఛగా అఘాయిత్యాలతో ఆంధ్రప్రదేశ్ అంతటా భీతావహ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వాటిని కట్టడి చేయడం చేతగాని చంద్రబాబు ప్రభుత్వం.. ఎవరో ఓ ప్రైవేటు వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీకి ఆపాదిస్తూ దుష్ప్రచారానికి తెగబడుతోంది. తమ ఏడాది పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాల కుట్రకు తెగిస్తోంది. కానీ, రాష్ట్రంలో రోజు రోజుకూ దిగజారుతున్న మహిళల భద్రత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అత్యాచారాలతో అట్టుడుకుతున్న రాష్ట్రంబాలికలు, మహిళలపై అత్యాచారాలతో రాష్ట్రం హడలిపోతోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న అత్యాచార పర్వం యావత్ దేశాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఎంతగా అంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో ఇప్పటి వరకు ఏకంగా 188 మంది బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరగడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇందులో అత్యాచారం ఆపై హత్యకు గురైన వారు 15 మంది ఉన్నారు. మరో తొమ్మిది మంది బాలికలు, మహిళలు అనుమానాస్పదంగా మృతిచెందారు. ఈ లెక్కన దాదాపు ప్రతి రెండు రోజులకు ఓ అత్యాచారం జరుగుతోందని పోలీసు రికార్డులే వెల్లడిస్తున్నాయి. ఒకప్పుడు చంబల్ లోయలో మహిళలపై ఈ తరహాలో అఘాయిత్యాలకు పాల్పడేవారని పత్రికలు ప్రచురించేవి. ఆనాటి చంబల్ లోయలోని దారుణ పరిస్థితులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొనడం తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. మహిళల ఆక్రందనలు పట్టని చంద్రబాబు ప్రభుత్వంరాష్ట్రంలో బాలికలు, మహిళల భద్రత రోజు రోజుకూ దిగజారుతున్నా చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. బాలికలు, మహిళల భద్రత గురించి నామమాత్రంగా కూడా చర్యలు తీసుకోవడం లేదు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో దిశ వ్యవస్థ ద్వారా మహిళల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఆపదలో ఉన్నామని బాలికలు, మహిళలు ఆ యాప్ ద్వారా సమాచారం ఇస్తే చాలు కేవలం 5–10 నిమిషాల్లోనే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని భద్రత కల్పించేవారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసింది.రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయడం.. అక్రమ కేసులు నమోదు చేసి వేధించడమే పోలీసుల ఏకైక విధి అని స్పష్టం చేసింది. దాంతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. పోలీసులు శాంత్రి–భద్రతల పరిరక్షణ, మహిళా భద్రత వంటి కీలకమైన తమ విధులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. టీడీపీ నేతలకు ఏకపక్షంగా మద్యం దుకాణాల లైసెన్సులు దక్కేలా, ఇతర కాంట్రాక్టులు లభించేలా ప్రత్యర్థులు, పోటీదారులను బెదిరించడమే తమ విధి అని భావిస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు చెప్పిన వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తూ వేధించడమే ఏకైక పనిగా పెట్టుకున్నారు.దాంతో రాష్ట్రంలో బాలికలు, మహిళా భద్రత గాలిలో దీపంలా కొట్టుమిట్టాడుతోంది. శ్రీవారి దివ్యక్షేత్రం తిరుపతి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురం, మంత్రి లోకేశ్ నియోజకవర్గం మంగళగిరి, హోమ్ మంత్రి అనిత నియోజకవర్గం పాయకారావుపేట.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మహిళలు, బాలికలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యమైపోయాయి. విద్యార్థినులు బడికి వెళ్లి ఇళ్లకు తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. టీడీపీ పెద్దల తీరే అంత.. అందుకే ఈ దుస్థితిటీడీపీ కూటమి పెద్దలు, కీలక నేతలే మహిళల గౌరవానికి భంగం కలిగిస్తూ బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండటం ప్రభుత్వ మైండ్ సెట్కు నిదర్శనం. ‘ఆడది కనిపిస్తే ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చేయాలి’ అని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ‘కారు షెడ్డులో ఉండాలి.. ఆడవాళ్లు ఇంట్లో ఉండాలి’ అని దివంగత కోడెల శివ ప్రసాదరావు తదితరుల వ్యాఖ్యలే రాష్ట్రంలో బాలికలు, మహిళల భద్రత పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి తార్కాణం. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక మహిళా ఎమ్మార్వోను జుట్టు పట్టుకొని ఈడ్చి.. దాడి చేసినా చంద్రబాబు పట్టించుకోక పోగా, సదరు బాధితురాలినే తప్పు పట్టడం తెలిసిందే. ఇక నారా లోకేశ్ విదేశాల్లో మహిళలతో అసభ్యకరంగా వ్యవహరించిన వీడియోలు, ఫొటోలు గతంలోనే వెలుగులోకి వచ్చాయి. అప్పట్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే.14 మంది రేప్ చేస్తే కేసు కట్టరా?చీమ కుట్టినట్టుగా కూడా లేదా?హోం మంత్రి ఎక్కడ?ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి పరిటాల సునీత సొంత ప్రాంతం రామగిరి మండలం పేరూరు పంచాయతి పరిధిలోని ఏడుగుర్రాలపల్లిలో తొమ్మిదో తరగతి చదువుతున్న దళిత బాలికపై 14 మంది యువకులు కొన్ని నెలలపాటు సామూహిక అత్యాచారం చేసిన ఘటన యావత్ రాష్ట్రాన్ని తీవ్రంగా కలచి వేస్తోంది. ఆ బాలిక గర్భం దాల్చడంతో ఆ దారుణం బయటకు పొక్కింది. అదే గ్రామానికి చెందిన బడగొర్ల అభిషేక్, బూడిద రాజేష్, బాసి గిరి, బాసి కార్తీక్, బాసి రాజేంద్ర, బాసి సోనప్ప, బాసి అంజి, తలారి మురళి, రొద్దకంపల్లి మహేశ్, హెచ్.సురేశ్, హెచ్.హేమంత్ పేర్లు బయటపడ్డాయి. మరో ముగ్గురి పేర్లు తెలియరాలేదు. అందరూ టీడీపీ కార్యకర్తలే కావడంతో నిందితులకు అధికార పార్టీ నేతలు అండగా నిలుస్తుండటం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.బాధిత బాలిక తండ్రి గతేడాది టీడీపీ గెలిచిన సంబరాల్లో తప్పెట వాయించుకుంటూ బొలెరో నుంచి జారి కింద పడి చనిపోయారు. బాలిక తల్లికి మతి స్థిమితం లేదు. అలాంటి ఆ బాలికపై వీడియోలు చూపి బ్లాక్ మెయిల్ చేస్తూ 14 మంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బెదిరించడంతో బాలిక ఎవరికీ చెప్పుకోలేని దుస్థితి. అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వెళ్లగా.. ఆరు నెలల గర్భంతో ఉన్నట్లు నిర్ధారించారు.దీంతో బాలికను బంధువులు నిలదీయగా.. అసలు విషయం వెలుగు చూసింది. బాధిత బాలికను స్వయంగా ఎస్పీనే విచారించారు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స, పరీక్షలు చేయిస్తున్నారు. ఇంత దారుణమైన ఘటనపై ఇప్పటి వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఎవరు అడ్డు పడుతున్నారు? ఎంకా ఎన్నాళ్లు నాన్చుతారు? వింటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తున్న ఈ ఘటనలో ఇటు పోలీసులు, అటు పాలకులకు చీమ కుట్టినట్లుగా కూడా లేకపోవడం దుర్మార్గం. స్థానిక మహిళా శాసన సభ్యురాలు సునీత, మహిళా హోం మంత్రి అనిత ఇప్పటి దాకా ఎందుకు నోరు విప్ప లేదు? కళ్లెదుటే ఎన్నో ఘటనలు..⇒ అనంతపురానికి చెందిన ఓ యువతిని కొందరు యువకులు కిడ్నాప్ చేశారు. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరుకు తీసుకువెళ్లి హత్య చేయడం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు తాజా ఉదాహరణ. ⇒ 2024 జూలై 7వ తేదీన నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఓ బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. 11 నెలలు గడిచినప్పటికీ ఇప్పటికీ బాలిక మృతదేహాన్ని కూడా గుర్తించలేకపోయారు. నిందితులను శిక్షించనే లేదు. ⇒ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే మహిళలకు భద్రత లేకుండాపోయింది. పిఠాపురం టీడీపీ పట్టణ అధ్యక్షురాలు, మాజీ కౌన్సిలర్ దుర్గాడ విజయలక్ష్మి భర్త, దుర్గాడ జాన్ ఓ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ⇒ బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం హిందూపురం మండలం తూమకుంట పరిధిలో 2024 ఆగస్టు 2వ తేదీన ఎనిమిదేళ్ల చిన్నారిని గంగాధర్ (45) అనే వ్యక్తి దారుణంగా చంపి ఇసుకలో పాతిపెట్టాడు. అంతకు ముందు అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.⇒ వైఎస్సార్ జిల్లా గోపవరం మండలంలో ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేశాడు. బద్వేలు పట్టణంలోని రామాంజనేయనగర్కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థినిని విఘ్నేష్ అనే వివాహితుడు ప్రేమ పేరుతో వేధించాడు. బాలికను గోపవరం మండలంలోని సెంచురీ పానెల్స్ పరిశ్రమ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేసి.. అనంతరం వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఆమెపై పోసి నిప్పు అంటించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు, మేకల కాపరులు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక మృతిచెందింది.⇒ తిరుపతి జిల్లా కేవీబీ పురం ఓళ్లూరు గిరిజన కాలనీకి చెందిన భార్య, భర్త, తన ఇద్దరు పిల్లలతో కలిసి పది రోజుల క్రితం వడమాలపేట మండలం ఏఎం పురం ఎస్టీ కాలనీకి చేరుకున్నారు. చిన్నారి మేనమామకు ప్రమాదవశాత్తు కాలు విరిగింది. చిన్నారి తండ్రి, కుటుంబీకులు కలిసి సమీపంలోని పుత్తూరు రాచపాలెంలో శల్య వైద్యశాలకు తీసుకెళ్లారు. ఆ సమయంలో చిన్నారి తల్లితో ఉంది. ఏఎం పురానికి చెందిన సుశాంత్ చిన్నారికి చాక్లెట్ తీసిస్తానని అంగడికి తీసుకెళ్లాడు. చిన్నారిని తిరిగి నివాసానికి తీసుకెళ్లకుండా.. పక్కనే ఉన్న సచివాలయం, పాఠశాల మధ్యలోకి తీసుకెళ్లి కిరాతకంగా లైంగిక దాడి చేశాడు. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు కిరాతకుడైన సుశాంత్.. చిన్నారిని పక్కనే ఉన్న మురికి కాలువలో తొక్కి చంపేశాడు.⇒ దర్శి సమీపంలోని గ్రామంలోని ఓ బాలికను టీడీపీ నేత కుమారుడు ఏనుగంటి చరణ్ సాయి తన స్నేహితుల రూమ్కు తీసుకుని వెళ్లి కూల్ డ్రింక్లో మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ⇒ అభంశుభం తెలియని చిన్నారులకు తెలుగుదేశం పార్టీకి చెందిన యువకులు మద్యం తాగించి, వారిని లైంగికంగా వేధించిన అమానవీయ ఉదంతం నంద్యాల జిల్లా డోన్ మండలం మల్యాల గ్రామంలో చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తలైన యువకులు బాలికలపై అత్యాచారానికి పాల్పడి వీడియోలు కూడా చిత్రీకరించారు. టీడీపీ నేత ఈడిగె వీరాంజనేయులు గౌడ్ కుమారుడు ఈడిగె రాంబాబుగౌడ్ తన ఇద్దరు స్నేహితులతో కలసి బాలికలను బెదిరించి మద్యం తాగించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. -
గిరిజన విద్యార్థిని దారుణహత్య
అనంతపురం /కూడేరు: కూటమి సర్కారు పాలనలో మరో ఘాతుకం జరిగింది. అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని ఎన్సీసీ నగర్ సమీపాన ముళ్ల పొదల్లో ఇంటర్ విద్యార్థిని తన్మయి(19) దారుణహత్యకు గురైంది. ఆమె తలపై బలమైన గాయం ఉంది. ఘటనాస్థలంలో బీరుబాటిల్ లభ్యమైంది. దీంతో దుండగులు బీరుబాటిల్తో కొట్టి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం నగరంలోని టీవీ టవర్ దగ్గర ఉన్న రామకృష్ణ కాలనీకి చెందిన గిరిజన సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీపతి, అరుణ దంపతులకు కొడుకుతోపాటు కుమార్తె తన్మయి ఉన్నారు. తన్మయి ప్రస్తుతం ఆకుతోటపల్లి వద్ద గల ఓ కాలేజీలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తన్మయి ఈ నెల 3న అదృశ్యం కావడంతో మరుసటి రోజు తండ్రి లక్ష్మీపతి అనంతపురం వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రాత్రి 9గంటల సమయంలో కడుపు నొప్పిగా ఉందని కూల్ డ్రింక్ తాగడానికి బయటకు వెళ్లిందని, తిరిగి ఇంటికి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తుండగానే.. కూడేరు మండల పరిధిలోని ఎన్సీసీ నగర్ సమీపాన ముళ్ల పొదల్లో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. అప్పటికే కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని ఆదివారం తన్మయి తల్లిదండ్రులు చూసి తమ కూతురేనని గుర్తించారు. అనంతపురం సర్వజనాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.హత్యగా ధ్రువీకరించిన వైద్యులు తలకు బలమైన గాయమైందని, దేనితోనో కొట్టడంతోనే తన్మయి మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహం లభ్యమైన ప్రాంతంలో బీర్ బాటిల్ ఉండడంతో దాంతోనే తలపై కొట్టి చంపారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తన్మయి కాల్డేటా ఆధారంగా కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం.నిందితులను కఠినంగా శిక్షించాలిగిరిజన విద్యార్థిని దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేసి నిందితులను అరెస్ట్ చేయాలన్నారు. హోంమంత్రి దళిత మహిళ అయినా కూటమి పాలనలో రాష్ట్రంలోని దళిత, గిరిజన మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. -
కాలుష్య బడ‘బాన’లం
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయని పర్యావరణం దెబ్బతింటుందని ప్రపంచ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. 2030 నాటికి కర్బన ఉద్గారాలను 45 శాతం తగ్గించాలని, 2070 నాటికి సున్నా స్థాయికి తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్యారిస్లో అన్ని దేశాలూ కలిసి సమావేశమై ఈ విషయంపై తీవ్రంగా చర్చించి ఒప్పందం కూడా చేసుకున్నాయి. అయినా మార్పు సాధించింది మాత్రం నామ మాత్రమే. ప్రధానంగా పరిశ్రమలు, వాటిలోని బాయిలర్లు (కాగు బాన) విపరీతంగా కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడింగ్(డీపీఐటీ) తాజా అధ్యయనం తేల్చింది. రసాయనాలు, దుస్తులు తయారీ, ఆహార పదార్థాల ప్రాసెసింగ్ వంటి పరిశ్రమల్లోని బాయిలర్లు మరింత ఎక్కువగా కాలుష్యం ఉత్పత్తి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. పాతికేళ్ల నాటి బాయిలర్లే అధికం దేశ వ్యాప్తంగా 42,500 బాయిలర్లు ఉన్నట్లు ఓ అంచనా. ఇవన్నీ కలిసి 1.26 బిలియన్ టన్నుల ఆవిరిని విడుదల చేస్తున్నాయి. పైగా ఇప్పుడున్నవన్నీ 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల పాత బాయిలర్లు కావడంతో సల్ఫర్ డయాక్సైడ్ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల్లో 7 శాతం బాయిలర్ల నుంచే వస్తుందని అంచనా. అంటే ఏటా 182 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను బాయిలర్లు విడుదల చేస్తున్నాయన్నమాట. ఇది రవాణా రంగంలోని అన్ని వాహనాల నుంచి వచ్చే కాలుష్యం కంటే ఎక్కువ. ఇతర పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్యంలో నాలుగో వంతు కంటే అధికం. 40 శాతం బాయిలర్లు బొగ్గు, గ్యాస్, ఆయిల్ వంటి శిలాజ ఇంధనాలపై ఆధారపడి నడుస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. ఏపీలో నియంత్రణ చర్యలు శూన్యంప్రమాదకర బాయిలర్లను వాడుతున్న మొదటి ఐదు రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్తోపాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. బాయిలర్లు అధిక స్థాయిలో కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లను ఉత్పత్తి చేయకుండా అడ్డుకోవడానికి ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. కానీ అది ఖర్చుతో కూడుకున్న పని కావడంతో దాని గురించి ఎవరూ పెద్దగా ఆలోచించడం లేదని అధ్యయనం తెలిపింది. ఈ పరిశ్రమల్లో ‘గ్రీన్ బాయిలర్ మిషన్’ను అమలు చేయాలని సూచించింది. ఆ దిశగా ఉత్తరప్రదేశ్ ముందడుగు వేసింది. తాజాగా బాయిలర్స్ యాక్ట్ 2025ను ఆ రాష్ట్రం అమలులోకి తీసుకువచ్చింది. అలాగే శిలాజ ఇంధనాలకు బదులు వరి గడ్డిని బాయిలర్లు మండించడానికి వాడే పరిశ్రమలకు మూలధన రాయితీలను పంజాబ్ రాష్ట్రం ప్రకటించింది. టాప్ 5లో ఉన్న మన రాష్ట్రం మాత్రం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. -
యాంత్రీకరణ విఫలం
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రారంభించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఘోరంగా విఫలమైంది. అవసరం లేని పరికరాలను బలవంతంగా అంటగట్టాలని చూడటంతో ఈ పథకం కింద పరికరాలు తీసుకునేందుకు రైతులు ఏమాత్రం ఆసక్తి చూపలేదు. పైగా ఆ పరికరాలకు ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే బహిరంగ మార్కెట్లో ధరలు తక్కువగా ఉండడం, జీఎస్టీతో పాటు రవాణా భారంగా మారడం, రాయితీ తక్కువగా ఉండటం వంటి కారణాలతో రైతులు ముందుకు రాలేదు. దీంతో అర్ధాంతరంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని నిలిపి వేయాల్సిన దుస్థితి ఏర్పడింది.అంతన్నారు.. ఇంతన్నారుకూటమి అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ఏర్పాటైన యంత్ర సేవా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. వ్యక్తిగత యాంత్రీకరణ పథకం అమలు చేయబోతున్నామని గొప్పగా ప్రకటించారు. కేంద్ర పథకమైన స్మామ్ (సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్) ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరానికి 50 శాతం సబ్సిడీపై 42,864 పరికరాలు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రూ.75.80 కోట్లు కేటాయించింది.మార్కెట్ ధరలకు మించి ఉండటంతో..వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు కమిటీలు తాము కోరుకున్న పరికరాన్ని కోరుకున్న కంపెనీ వద్ద కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉండేది. పైగా బేరమాడుకుని తక్కువ ధరకు కొనుగోలు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేకుండా ప్రభుత్వమే ధరలు నిర్దేశించింది. ఈ ధరలకు అదనంగా ప్రతి పరికరంపై 12% నుంచి 18% జీఎస్టీతో పాటు.. 2% ఆగ్రోస్ సేవా చార్జీలు చెల్లించాలని నిర్దేశించారు. అంటే దాదాపు పరికరంపై ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే 14% నుంచి 20% వరకు అదనపు భారం పడుతోంది. అంటే ఓ పరికరం ధర రూ.25 వేలు అయితే.. కనీస జీఎస్టీ, ఆగ్రోస్ రుసుం కలిపి 14% చొప్పున లెక్కేసినా రూ.3,500, అదే రూ.లక్ష విలువైన పరికరమైతే రూ.1.14 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అదే రైతు నేరుగా కొనుక్కుంటే డీలర్ల వద్ద బేరమాడుకుంటే తక్కువ ధరకే లభిస్తుంది. తైవాన్ స్ప్రేయర్ బహిరంగ మార్కెట్లో రూ.18 వేల నుంచి రూ.20 వేలకు లభిస్తుండగా, యాంత్రీకరణ పథకంలో రూ.26 వేలుగా నిర్ణయించి, అందులో రూ.10 వేల రాయితీ ప్రకటించారు. దీనిపై జీఎస్టీ, వ్యవసాయ ఆగ్రోస్ సేవా చార్జీలు అదనం. ట్రాక్టర్ ఆధారిత యంత్ర పరికరాలు కూడా రైతులు సొంతంగా కొనుక్కుంటేనే తక్కువకు వస్తున్నాయి. పైగా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు కూడా రైతులకు ప్రతిబంధకంగా మారాయి.కవీుషన్లకు కక్కుర్తిపడి రైతులకు అవసరం లేని, డిమాండ్ లేని, పనికి రాని పరికరాలను అంటగట్టాలని చూడటంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సాధారణంగా వ్యక్తిగత పరికరాలు సబ్సిడీపై ఇస్తామంటే రైతులెవరైనా ఎగబడతారు. అలాంటిది రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రభుత్వం అమలు చేసిన ఈ యాంత్రీకరణ పథకం ఏడాదిలోనే అట్టర్ఫ్లాప్ అయ్యింది. ఇందుకోసం కేటాయించిన మొత్తంలో చాలావరకు కమీషన్ల రూపంలో పక్కదారి పట్టినట్టు విమర్శలు వచ్చాయి. దీంతో పథకాన్ని 2024–25 ఏడాదికి అర్థంతరంగా నిలిపివేశారు. -
నీటిలో మునిగి ఆరుగురి మృతి
డుంబ్రిగుడ/అమరావతి/ఏయూ క్యాంపస్(విశాఖ జిల్లా): అల్లూరి సీతారామరాజు, పల్నాడు, విశాఖ జిల్లాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో నీటిలో మునిగి ఆరుగురు మృతి చెందారు. అల్లూరి జిల్లా పోతంగి పంచాయతీ బిల్లాపుట్టు గ్రామానికి చెందిన అన్నదమ్ములు గుంట కమందన్, గుంట రామదాస్ కుమారులు గుంట సాయికిరణ్ (14), గుంట భానుతేజ్ (14)లు 9వ తరగతి చదువుతున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో వీరు డుంబ్రిగుడ మండలం గంగవలస గ్రామంలో ఉన్న తమ మేనత్త ఇంటికి వెళ్లారు. ఆదివారం మామిడి పండ్లు సేకరించేందుకు కొండ వద్దకు వెళ్లి వస్తున్న తరుణంలో..అదే గ్రామానికి చెందిన వీరి స్నేహితుడు కొర్ర సుశాంత్(14)తో కలిసి చెరువులో స్నానాలకు దిగారు. ఇటీవల మన్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులో 12 అడుగుల మేరకు నీరు చేరింది. ఇది గమనించని విద్యార్థులు ఈతకు దిగి..మునిగిపోయారు. వారిని రక్షించేందుకు సమీపంలోని పొలాల వద్ద ఉన్న వారు వచి్చనా ఫలితం లేకపోయింది. దీంతో ముగ్గురూ మృతి చెందారు. అలాగే, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అగతవరప్పాడు ఏవీఎస్ కాలనీ నుంచి రెండు కుటుంబాలకు చెందిన 10 మంది బక్రీద్ అనంతరం నదిలో స్నానాలు చేసేందుకు ఆదివారం పల్నాడు జిల్లాలోని అమరావతికి వచ్చారు. అమరేశ్వరఘాట్ సమీపంలో కృష్ణానదిలోని ఇసుకలో బాల్తో ఆడుకుంటుండగా.. బాల్ పక్కనే ఉన్న నదిలో పడింది. బాల్ కోసం సయ్యద్ ఖాదర్ వలి (13), సయ్యద్ కాజా(21)లు నీటిలో దిగి...మునిగిపోయారు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పగా..సీఐ అచ్చియ్య ఘటనా స్థలాన్ని సందర్శించి గజ ఈతగాళ్లను రప్పించారు. వారు గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. బాలుడిని బలిగొన్న అలలు విశాఖ సాగర తీరంలో విక్టరీ ఎట్ సీ ఎదురుగా బీచ్లో స్నానానికి దిగి ఎం.శ్రీపాద సూర్య(7) కెరటాలకు బలయ్యాడు. ఆదివారం ఉదయం అగనంపూడికి చెందిన ఓ కుటుంబం బీచ్కు వచ్చింది. వీరిలో స్టీల్ప్లాంట్లో పనిచేస్తున్న సతీష్ది శనివారం పెళ్లి రోజు. వేడుకల అనంతరం ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి బీచ్కు వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తుండగా బలమైన కెరటాలు బాలుడిని లోపలికి లాక్కెళ్లాయి. సమీపంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు పరదేశి వెంటనే ఘటనాస్థలికి చేరుకుని బాలుడిని రక్షించే ప్రయత్నం చేశారు. బాలుడిని వెంటనే ఒడ్డుకు తీసుకువచ్చి 108 వాహనంలో కేజీహెచ్కు తరలించారు. బాలుడు నీరు ఎక్కువగా తాగడంతో మరణించినట్లు కేజీహెచ్ వైద్యులు వెల్లడించారు. బాలుడి తల్లిదండ్రులను వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్లబాబురావు పరామర్శించారు. -
కర్షకుల ‘సేవకు’ కత్తెర
సాక్షి, అమరావతి: కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది మొదలు, వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రజారంజక విధానాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజారంజక పాలనపై ఆయన ముద్రను చెరిపేయడమే ఈ నిర్ణయాల వెనుక ఉన్న ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ జాబితాలో ఇప్పటికే సచివాలయాలు చేరగా, తాజాగా రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) వంతయ్యింది. క్రమబద్దీకరణ పేరిట కూటమి ప్రభుత్వం వీటిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. హేతుబద్దీకరణ పేరుతో రెండు లేదా మూడు సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్గా విలీనం చేశారు. తాజాగా వ్యవసాయ, సంబంధిత శాఖల హేతుబద్ధీకరణ సాకుతో రైతు సేవా కేంద్రాలను (ఆర్ఎస్కే), వీటిలో పనిచేస్తున్న సిబ్బందిని సగానికి పైగా కుదించేస్తున్నారు. దీంతో ఆర్ఎస్కేలు రైతు సేవలకు దూరం అయ్యే పరిస్థితి నెలకొంది. ‘ప్రజల ఇంటికే పాలనను తీసుకొస్తాం’ అని ఒక వైపు చెబుతున్న ప్రభుత్వం మరో వైపు ‘హేతుబద్దీకరణ’ పేరుతో ప్రజలకు, రైతులకు పలు సేవలను దూరం చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పేరు మార్పు నుంచి నిర్వీర్యం వరకూ.. ప్రజల ముంగిట పౌరసేవలు అందించాలన్న సంకల్పంతో జగన్ హయాంలోని ప్రభుత్వం ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం చొప్పున 10,965 సచివాలయాలను ఏర్పాటు చేసింది. వీటికి అనుబంధంగా రైతు సేవలకు 10,778 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు– ఇప్పటి ఆర్ఎస్కేలు) ఏర్పాటయ్యాయి. గ్రామ స్థాయిలో రైతులకు సేవలు, సంక్షేమ ఫలాలు అందించాలన్నది దీని ప్రధాన లక్ష్యం. ఆర్బీకేల సేవల విషయంలో ఉద్యోగ నియామకాల ప్రతిపాదన సంఖ్య 21,796కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీగా పట్టభద్రులైన 15,667 వ్యవసాయ (6,162), ఉద్యాన (2,303), పట్టు (377), మత్స్య (720), వెటర్నరీ (6,105) సహాయకులను నియమించింది. మిగిలిన వారిని నియమించేందుకూ అప్పట్లో కసరత్తు ప్రారంభించింది. సచివాలయాల పరిధిలోనే వీరి నియామకాలు జరిగినప్పటికీ, ఆర్బీకేలు కేంద్రంగా సేవలందించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు పేరు మార్పుసహా రైతు సేవా కేంద్రాల నిర్వీర్యమే లక్ష్యంగా పని చేస్తోంది. సచివాలయాల తరహాలోనే ఆర్ఎస్కే క్లస్టర్స్ కూటమి ప్రభుత్వ నిర్ణయంతో 10,965 సచివాలయాలు 5,678 క్లస్టర్స్గా (విలీనం) మారాయి. ఇదే తరహాలోనే 10,778 ఆర్ఎస్కేలను సగానికి సగం కుదించి క్లస్టర్స్గా మార్చడానికి కూటమి ప్రభుత్వం తాజాగా సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చేపడుతున్న ఈ ప్రక్రియలో సిబ్బందిని కూడా అదే పరిధిలో సర్దుబాటు చేస్తున్నారు. గతంలో స్థానికంగా సాగు విస్తీర్ణాన్ని బట్టి వీఏఏ (గ్రామ వ్యవసాయ సహాయకులు), వీహెచ్ఏ (గ్రామ ఉద్యాన సహాయకులు) వీఎస్ఏలు (గ్రామ పట్టు సహాయకులు) ఉండేవారు. కొన్ని చోట్ల వ్యవసాయ, ఉద్యాన సహాయకులు, మరికొన్ని చోట్ల గ్రామ పట్టు సçహాయకులు ఉండేవారు. తీర మండలాల్లోని ఆర్బీకేల్లో మత్స్య సహాయకులే ఇన్చార్జిలుగా ఉండేవారు. స్థానికంగా ఉండే పాడి సంపద ఆధారంగా దాదాపు మెజార్టీ ఆర్బీకేల్లో గ్రామ పశుసంవర్ధక సహాయకులు ఉండేవారు. ప్రభుత్వ తాజా ప్రతిపాదనల ప్రకారం, ఇక నుంచి సచివాలయ క్లస్టర్ ప్రాతిపదికన ఆర్ఎస్కే క్లస్టర్లో ఒకరు మాత్రమే ఉంటారు. వీఏఏ, వీహెచ్ఏ, వీఎస్ఏలలో ఎవరో ఒకరిని మాత్రమే ఉంచేలా సర్దుబాటు చేస్తున్నారు. మిగిలిన వారిని సచివాలయాల్లో ఇతర సేవలకు సర్దుబాటు చేస్తారు. రెండు వేల ఎకరాలకు ఒకరు.. కాగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతి 2 వేల ఎకరాల విస్తీర్ణం ప్రాతిపదికన ఆర్ఎస్కేలను క్లస్టర్స్ పరిధిలోకి తీసుకొస్తోంది. స్థానికంగా వ్యవసాయ/ ఉద్యాన/పట్టు పంటల సాగు విస్తీర్ణం ఏవి ఎక్కువగా ఉంటే వాటి ఆధారంగా సహాయకులను నియమిస్తారు. అంటే ప్రతీ 2 వేల ఎకరాలకు ఒక ఆర్ఎస్కే ప్రతినిధి మాత్రమే ఉంటారన్నమాట. తక్కువ విస్తీర్ణం ఉన్న ఆర్ఎస్కేలను విలీనం చేస్తారు. విలీనం అనంతరం క్లస్టర్ కేంద్రంగానే కార్యకలాపాలు కొనసాగించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. మిగిలినవి ‘పేరుకు మాత్రం కేంద్రాలు’గా మిగలనున్నాయి. విస్తీర్ణం ఎక్కువగా ఉన్న క్లస్టర్స్కు అవసరం మేరకు ఏఈవో, ఎంపీఈవోలను అదనంగా కేటాయిస్తారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టు విస్తరణ అధికారులుగా పదోన్నతులు కల్పించిన ఆర్ఎస్కే అసిస్టెంట్స్ను కూడా ఈ సర్దుబాటు పరిధిలోకి తీసుకురావడం గమనార్హం. రేషనలైజేషన్ ప్రక్రియ ఓ కొలిక్కి తీసుకువచ్చి ఆ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. దీనికి సంబం«ధించి త్వరలో ఉత్తర్వులు రానున్నాయి. -
జనసేనలో ‘మట్టి’ కుస్తీ
పిఠాపురం: వరుస వివాదాలతో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని జనసేన నాయకులు పరువు తీసుకుంటున్నారు. శనివారం ఇసుక వివాదం సద్దుమణగక ముందే ఆదివారం చెరువు మట్టి కోసం జనసేనలోని రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణలో తమపై దాడి చేశారని విరవ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కురుమళ్ళ రాంబాబు పిఠాపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలివీ.. రైతుల అవసరాల పేరుతో ఎఫ్కే పాలెం – విరవాడ గ్రామాల మధ్య పాపిడిదొడ్డి చెరువులో మట్టి తవ్వకాలకు అధికారుల నుంచి జనసేన నాయకులు అనుమతులు పొందారు. చెరువులోని మట్టిని మండలంలోని పలు ఇటుక బట్టీలకు విక్రయిస్తున్నారు. మట్టి తరలింపులో కొన్ని బట్టీలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, మిగిలిన వారికి ఇవ్వడం లేదని జనసేన నేత కురుమళ్ళ రాంబాబు ఆరోపించారు. చెరువులో మట్టి తవ్వకాలను పరిశీలించేందుకు ఆదివారం వెళ్లిన ఆయన మట్టి తరలింపు చేపడుతున్న వారిని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మట్టి తవ్వకందారులు రాంబాబుతోపాటు సకుమళ్ళ నాగేశ్వరరావు, కురుమళ్ళ మణికంఠ స్వామి, ఆకుల ఆదినారాయణలపై దాడికి పాల్పడ్డారు. రాంబాబు చొక్కా చించివేశారు. కొందరికి గాయాలయ్యాయి. దీంతో కురుమళ్ళ రాంబాబు తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వారిని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ప్రభుత్వాస్పత్రికి పంపించారు. పేట్రేగిపోతున్న మట్టి మాఫియాపై అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
కొండపై విష‘నాగులు’
నాగులకొండ.. ప్రకృతి రమణీయతకు నెలవు! అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మైనింగ్ మాఫియా కబళిస్తోంది. ఏకంగా 100 అడుగుల లోతులో విచ్చలవిడిగా లేటరైట్ తవ్వకాలు చేపడుతున్నారు. సహజ సిద్ధంగా ఉన్న గెడ్డలను ఆక్రమిస్తూ కొండతో పాటు చెట్టు చేమలను కొట్టేస్తోంది. ఫలితంగా చుట్టుపక్కల ఉన్న 10 గిరిజన గ్రామాలు తాగు నీరు, వంట చెరుకు కోసం అల్లాడే దుస్థితి నెలకొంది.నాగులకొండ.. ప్రకృతి రమణీయతకు నెలవు! అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మైనింగ్ మాఫియా కబళిస్తోంది. ఇక్కడ మైనింగ్కి అనుమతించింది కేవంలం 60 అడుగుల లోతు వరకే. కానీ ఏకంగా 100 అడుగుల లోతులో విచ్చలవిడిగా లేటరైట్ తవ్వకాలు చేపడుతున్నారు. సహజ సిద్ధంగా ఉన్న గెడ్డలను ఆక్రమిస్తూ కొండతో పాటు చెట్టు చేమలను కొట్టేస్తోంది. ఫలితంగా చుట్టుపక్కల ఉన్న 10 గిరిజన గ్రామాలు తాగు నీరు, వంట చెరుకు కోసం అల్లాడే దుస్థితి నెలకొంది. ఇక్కడినుంచి రోజుకు దాదాపు 15 వేల టన్నుల నుంచి 20 వేల టన్నుల లేటరైట్ను కూటమి నేతలు వందల టిప్పర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. టన్ను లేటరైట్ రూ.3,800 నుంచి రూ.4 వేల దాకా విక్రయిస్తూ రోజూ రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు కొల్లగొడుతున్నారు. అంటే, ఏడాదికి రూ.2,044 కోట్ల నుంచి రూ.2,190 కోట్లు వరకు అక్రమంగా ఆర్జిస్తున్నారు. ఇక టీడీపీ ప్రజాప్రతినిధి కుమారుడి ఖాతాలోకి టన్నుకు రూ.250 వెళుతుండగా ఓ ఎంపీకి రూ.200 చొప్పున ముట్టచెబుతున్నట్లు తెలుస్తోంది. – సాక్షి టాస్క్ఫోర్స్గిరిజనుడి ముసుగులో అడ్డగోలు దోపిడీకూటమి పార్టీలోని ఓ ఎంపీకి విధేయుడైన గిరిజనుడు లక్ష్మణరావు పేరుతో నాగులకొండపై అక్రమ మైనింగ్ జరుగుతోంది. ప్రభుత్వానికి నామమాత్రంగా లీజు, రాయల్టీ చెల్లిస్తూ మైనింగ్ మాఫియా రూ.వందల కోట్లను ఆర్జిస్తోంది. అత్యంత విలువైన లేటరైట్ మైన్ ని హెక్టార్కు ఏడాదికి రూ. 26 వేల నామమాత్రపు ధరకు అధికార పార్టీ నేతలకు రాసిచ్చేశారు. అంటే 119 హెక్టార్లకు గాను ప్రభుత్వానికి వచ్చే లీజు ఆదాయం కేవలం రూ.30.94 లక్షలు మాత్రమే. ఇక రాయల్టీ మోసానికి అంతేలేదు. ఇక్కడ నుంచి రోజూ 15 వేల టన్నులకు పైగా లైటరైట్ను తరలిస్తూ 5 వేల టన్నులను మాత్రమే లెక్కల్లో చూపిస్తున్నారు. టన్నుకు రూ.150 చొప్పున (అంటే రోజుకు రూ.7.5 లక్షలు) మాత్రమే రాయల్టీ కింద చెల్లిస్తున్నారు. అంటే రాయల్టీ కింద ఏడాదికి రూ.27.67 కోట్లు మాత్రమే చెల్లించి.. మిగతా రూ.2 వేల కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు జమ కావలసిన ప్రజాధనాన్ని యథేచ్ఛగా దోచుకుంటున్నారు.విలువైన హై గ్రేడ్ లేటరైట్..నర్సీపట్నం నియోజకవర్గం నాతవరంలో హై గ్రేడ్ (ఉన్నత శ్రేణి) లేటరైట్ లభిస్తుంది. ఇందులో 43–44 శాతం వరకు అల్యూమినియం ఉంటుంది. కాగా, లేటరైట్ అనేది ఇనుప ఖనిజం (ఐరన్ ఓర్) ఒక రూపం. ఇంత నాణ్యమైనది కావడంతో సిమెంట్ కంపెనీలకు కాకుండా స్టీల్ ప్లాంట్లకు తరలిస్తున్నారు. కాకినాడ పోర్టును దీనికి వినియోగించుకుంటున్నారు. మరోవపు ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. నాణ్యమైన ఖనిజాన్ని.. నాసిరకంగా చూపించి అనుమతులు తీసుకున్నారు. అల్యూమినియం 38–40 శాతంలోపే ఉందని నివేదికలు సమర్పిస్తున్నారు. తద్వారా రాయల్టీ తక్కువగా చెల్లిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. లీజుదారు లక్ష్మణరావు ద్వారా ఆండ్రూ మినరల్స్కు విక్రయిస్తున్నట్లు ఒప్పందం చేసుకున్నారు.వర్షంలో సైతం లేటరైట్ను తరలిస్తున్న టిప్పర్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అక్రమ మైనింగ్పై ఉక్కుపాదంనిర్ణీత మొత్తానికి మించి తవ్వినందుకు విచారణరూ.5 కోట్ల మేర జరిమానా వసూలునాతవరం మండలం సుందరకోట పంచాయతీ భమిడికిలొద్దిలో నిర్ణీత మొత్తానికి మించి మైనింగ్ చేసేందుకు వీల్లేందంటూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. 68,279 టన్నుల లేటరైట్ను ఎక్కువగా తవ్వినట్లు తేలడంతో సుమారు రూ.5 కోట్ల మేర పెనాల్టీ విధించారు. 2023 జూన్లో మైనింగ్ నిలిచిపోగా కూటమి ప్రభుత్వం వచ్చాక లేటరైట్ తవ్వకాలకు టీడీపీ నేతలు పావులు కదిపారు. ఈ క్రమంలో గనుల శాఖ పెనాల్టీని సైతం రద్దు చేసినట్లు తెలుస్తోంది. గత నెలలో మళ్లీ మైనింగ్ ప్రారంభించారు. అయితే, ఫిబ్రవరి నుంచే లేటరైట్ తరలింపు మొదలైనట్లు చెబుతున్నారు. పర్మిట్ల మంజూరు మొత్తం కాకినాడ జిల్లాలోని రౌతులపూడి నుంచి జరుగుతోంది. లేటరైట్ను తవ్వి తరలించే వాహనాలకు జీపీఎస్, మైనింగ్ ప్రాంతంలో వే బ్రిడ్జి లాంటివి ఏమీ లేవు. దీంతో యథేచ్ఛగా భారీ లోడ్ వాహనాల్లో లేటరైట్ తరలిపోతోంది.‘సాక్షి’ బృందాన్ని అడ్డుకున్న మాఫియానాతవరం మండలం సిరిపురం వద్ద మైనింగ్ జరుగుతుండగా.. ఇక్కడినుంచి లేటరైట్ను కాకినాడ జిల్లా రౌతులపూడికి తరలిస్తున్నారు. ఆ తర్వాత అన్నవరం రవికంపాడు వద్ద ఉన్న రైల్వే సైడింగ్ నుంచి ఒడిశాలోని వేదాంత ప్లాంటుకు చేరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించి వాస్తవాలను వెలికితీస్తున్న ‘సాక్షి’ ప్రతినిధుల వాహనాన్ని రాఘవపట్నం దాటిన తర్వాత మైనింగ్ మాఫియా ఆయుధాలతో అడ్డుకుని బెదిరించింది. వాహనాన్ని వెంటాడింది. సిరిపురం చేరుకునేలోగా మరికొందరిని పోగేసి గిరిజనులతో మాట్లాడకుండా అడ్డుకున్నారు. -
తిరగబడ్డ టీచర్లు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ అభాసుపాలైన చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు తమ బదిలీలను సైతం ప్రహసనంగా మార్చేసిందని ఉపాధ్యాయులు నిప్పులు చెరుగుతున్నారు. సంఖ్యాపరంగా అధికంగా ఉన్న ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపడతామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆన్లైన్లోనే ఈ ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించడంపై వారు తిరుగుబాటు ప్రకటించారు. ఒక్కో ఎస్జీటీ 2,500కు పైగా ఆన్లైన్ ఆప్షన్లు ఇవ్వడం అసాధ్యమని, అదీ కేవలం 48 గంటల్లో పూర్తి చేయాలనడంపై మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మాన్యువల్ కౌన్సెలింగ్ ఉంటుందని భావించిన వారికి శనివారం ఆన్లైన్ విధానం మాత్రమే ఉంటుందని ప్రకటించడంతో కంగుతిన్నారు. దీంతో శనివారం బదిలీ కౌన్సెలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో నిరసన తెలిపిన ఎస్జీటీలు.. ఆదివారం బదిలీ కౌన్సెలింగ్ను బహిష్కరించి పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లాల్లోని కలెక్టరేట్లు, డీఈవో కార్యాలయాలను ముట్టడించారు. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖలో 1.79 లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా, ఎస్జీటీలు 1.20 లక్షల వరకు ఉన్నారు. ప్రస్తుత బదిలీల్లో సుమారు 65 వేల మందికి స్థాన చలనం కల్పించాలి. వీరిలో 35 వేల మంది వరకు ఎనిమిదేళ్లు పూర్తయ్యి, తప్పనిసరి బదిలీల్లో ఉన్నారు. విద్యా శాఖ గత నెలలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10వ తేదీతో ఎస్జీటీల కౌన్సెలింగ్ ప్రక్రియ ముగియాలి. కానీ ఆందోళన నేపథ్యంలో ఆ ప్రక్రియకు బ్రేక్ పడినట్టయింది. మాన్యువల్కు హామీ.. ఆన్లైన్కు ఉత్తర్వులు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గతేడాది సెప్టెంబర్ నుంచి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో విద్యా రంగంలో చేయాల్సిన మార్పులపై సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రతి శుక్రవారం విద్యాభవన్లో జరిగే ఈ సమావేశాల్లో ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్, 3–5 తరగతులు తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. గత 9 నెలల్లో 40కి పైగా సమావేశాలు నిర్వహించి, ప్రతి సమావేశంలోనూ సంఘాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే, ప్రభుత్వం మార్చి నెలలో ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం–2025’ తీసుకొచ్చింది. ఇందులో పలు అంశాలపై అభ్యంతరాలను లేవనెత్తి ఆందోళన వ్యక్తం చేయడంతో తుది చట్టంలో మార్పులు చేస్తామని నాడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, ఏప్రిల్లో చేసిన ‘ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ చట్టం–2025’లో ఆన్లైన్ కౌన్సెలింగ్ అని పేర్కొన్నారు. గత నెలలో జరిగిన సమావేశంలో మాన్యువల్ కౌన్సెలింగ్పై పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చర్చలను బహిష్కరించి నిరసన తెలిపారు. అయితే, మరుసటి రోజే విద్యా శాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేసి, ఎస్జీటీల డిమాండ్ మేరకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వు (జీవో నం.22)లో మళ్లీ ఆన్లైన్ విధానమే ఉంటుందని పేర్కొన్నారు. ఇలా ఉపాధ్యాయులను మభ్యపెడుతూ వచ్చిన ప్రభుత్వం, కౌన్సెలింగ్ ప్రక్రియ దగ్గర పడేసరికి ఉపాధ్యాయులు ఆన్లైన్లోనే ఆప్షన్లు పెట్టాలని, 48 గంటల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఒత్తిడి చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిలువునా మోసం చేశారు» సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) బదిలీలను మాన్యువల్ కౌన్సెలింగ్ విధానంలోనే చేపడతామని ఉపాధ్యాయ సంఘాల సమక్షంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. నమ్మించి మోసం చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ఆదివారం ఉపాధ్యాయులు ముట్టడించారు. వెబ్ కౌన్సెలింగ్ వద్దు, మాన్యువల్ కౌన్సెలింగ్ ముద్దు.. అంటూ ఉపాధ్యాయులు చేసిన నినాదాలతో డీఈఓ కార్యాలయాల ప్రాంగణాలు మార్మోగాయి. ఈ సందర్భంగా డీఈవోలను ఘెరావ్ చేశారు. » ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ కౌన్సెలింగ్ను తప్పుల తడకగా నిర్వహించారని, ఎక్కువ పాయింట్లు వచ్చిన వారికి కాకుండా తక్కువ పాయింట్లు వచ్చిన వారికి క్లస్టర్ వేకెన్సీల్లో అవకాశం ఇచ్చారని ఈ సందర్భంగా పలువురు ఆరోపించారు. ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉపాధ్యాయులు జనరల్ ఆప్షన్లు పెట్టినా ప్లేసులు కేటాయించక పోవడం అన్యాయమన్నారు. » రాష్ట్ర ప్రభుత్వ తీరు చెప్పేదొకటి.. చేసేది మరొకటి అన్నట్లుగా ఉందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడ్డారు. ఉపాధ్యాయుల హక్కులు, ఆత్మ గౌరవంతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్కు ఈ–మెయిల్, వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపాలన్నారు. విద్యా శాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని, ప్రభుత్వ వైఖరి నశించాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. మాన్యువల్గా కౌన్సిలింగ్ నిర్వహించకపోతే ఎంత దూరమైనా పోవడానికి సిద్ధమని స్పష్టం చేశారు. చిత్తూరులో మండుటెండలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. » నిరసన కార్యక్రమంలో ఎస్టీయూ, పీఆర్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఏపీయూఎస్, వైఎస్సార్ టీఏ, ఎస్టీఎఫ్, పీఈటీ అసోసియేషన్, ఎస్ఆర్టీఎఫ్, ఎన్టీఏ, ఎస్సీ, ఎస్టీ యూనియన్ తదితర సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఉపాధ్యాయుల కడుపు కొడుతున్న చంద్రబాబుఎన్నికల సమయంలో ఉపాధ్యాయులు తనకు మద్దతుగా నిలవడంతో తన కడుపు నిండిపోయిందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడు ఉపాధ్యాయుల కడుపుకొడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా, ఉపాధ్యాయులు, ఉద్యోగుల గురించి ఆలోచించిన పాపాన పోలేదు. వరల్డ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగానే సాల్ట్ ఒప్పందంలో భాగంగా ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే ఉపాధ్యాయుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. – బొర్రా గోపిమూర్తి, ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీఉద్యమం మరింత ఉధృతంఉపాధ్యాయుల బదిలీల్లో ఎస్జీటీలు, సమాన కేడర్ టీచర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మాన్యువల్ కౌన్సెలింగ్ చేపట్టాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఉద్యామాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉమ్మడి జిల్లాల్లోని డీఈవో కార్యాలయాలను ముట్టడించారు. సోమవారం ఆయా డీఈవో కార్యాలయాల వద్ద నిరహార దీక్ష చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ప్రభుత్వం అప్పటికీ దిగిరాకపోతే మంగళవారం విద్యా భవన్ (డైరెక్టరేట్)ను ముట్టడికి తరలి రావాలంది. -
‘పోలవరం’లో కమీషన్ల కథ
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు. కమీషన్ల కక్కుర్తితో జీవనాడి జీవం తీసేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తుండటంపై ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్ను తుంగలో తొక్కి.. 1.5 మీటర్ల మందంతో కాకుండా 0.9 మీటర్ల మందంతో ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో పునాది డయాఫ్రం వాల్ నిర్మిస్తుండటంపై ఇంజినీరింగ్ నిపుణులు మండిపడుతున్నారు. గతంలో 2016–18 మధ్య ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రం వాల్ నిర్మాణంలో అవకతవకలకు పాల్పడటం వల్లే అది కోతకు గురై దెబ్బతిన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కమీషన్ల కోసం పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని 2019లో ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని ఇంజినీరింగ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. గతంలో డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని కట్టబెట్టిన కాంట్రాక్టు సంస్థ బావర్కే కొత్త డయాఫ్రం వాల్ పనులను అప్పగించడాన్ని తప్పు పడుతున్నారు. టెండర్లు పిలవకుండా కట్టబెట్టేశారురూ.990 కోట్ల వ్యయంతో చేపట్టిన కొత్త డయాఫ్రం వాల్ పనులకు టెండర్లు పిలవాలి. కానీ.. ఆ పనులను ప్రధాన కాంట్రాక్టు సంస్థ మేఘాకు అప్పగించి.. ఆ తరువాత ఆ సంస్థపై ముఖ్యనేత ఒత్తిడి తెచ్చి అనధికారికంగా బావర్ సంస్థకు కట్టబెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డయాఫ్రం వాల్ మందం తగ్గించడం వల్ల పనుల పరిమాణం తగ్గుతుందని.. ఆ మేరకు కాంట్రాక్టు సంస్థకు భారీ ఎత్తున లబ్ధి చేకూర్చి కమీషన్లు దండుకునేందుకు పథకం రచించారని స్పష్టం చేస్తున్నారు. సీపేజీ(ఊటనీరు)ని సమర్థవంతంగా అడ్డుకట్ట వేయడానికే డయాఫ్రం వాల్ నిర్మిస్తున్నారు. డయాఫ్రం వాల్ ఎంత నాణ్యంగా, పటిష్టంగా ఉంటే ప్రధాన డ్యామ్ అంత పటిష్టంగా ఉంటుంది. డయాఫ్రం వాల్ మందం తగ్గడం వల్ల పటిష్టత తగ్గుతుందని.. ప్రధాన డ్యామ్ బరువు ప్రభావం వల్ల డయాఫ్రం వాల్లో చీలికలు ఏర్పడి ఊటనీటి ఉధృతి పెరగడానికి దారి తీస్తుందని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల ప్రధాన డ్యామ్కు గండ్లుపడి ప్రాజెక్టు భద్రతను ప్రశ్నార్థకం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమీషన్ల కక్కుర్తితో జీవనాడి భద్రతను ప్రశ్నార్థకంగా మార్చారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రూ.వందల కోట్లు కాజేసేందుకే..పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ గ్యాప్–1లో 393 మీటర్ల పొడవున డయాఫ్రం వాల్ పనులను 2022లో మేఘా సంస్థ పూర్తి చేసింది. ఆ డయాఫ్రం వాల్ సమర్థవంతంగా పనిచేస్తోందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తేల్చింది. ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్కు 6 మీటర్ల ఎగువన కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను రూ.990 కోట్లతో ప్రభుత్వం చేపట్టింది. ఈ పనులను ప్రధాన కాంట్రాక్టు సంస్థ మేఘాకు కాగితంపై ప్రభుత్వం అప్పగించింది. కానీ.. మేఘాపై ఒత్తిడి తెచ్చి బావర్ సంస్థకు ఆ పనులను అనధికారికంగా సబ్ కాంట్రాక్టు కింద ఇచ్చేసింది. పనులను సబ్ కాంట్రాక్ట్ కింద అధికారికంగా ఇస్తే మేఘా, బావర్, ప్రభుత్వం మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాలి. కానీ.. మేఘా, బావర్ మధ్య అంతర్గత ఒప్పందం చేసుకోవడాన్ని బట్టిచూస్తే ముఖ్యనేత కమీషన్ల కక్కుర్తి బయటపడిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గతంలో అంటే 2016–18లో డయాఫ్రం వాల్ పనులను బావర్ సంస్థకే అప్పగించగా.. కొత్త డయాఫ్రం వాల్ పనులను తిరిగి ఆ సంస్థకే కట్టబెట్టడం గమనార్హం. కొత్త డయాఫ్రం వాల్ను 1.5 మీటర్ల మందం.. గరిష్టంగా 93.5 మీటర్ల లోతు.. 1,396.6 మీటర్ల పొడవుతో టీ–16 ప్లాస్టిక్ కాంక్రీట్ సమ్మేళనంతో నిర్మించేలా జనవరి 16న సీడబ్ల్యూసీ డిజైన్ను ఆమోదించింది. ఆ డిజైన్ ప్రకారం 66,002 వేల చదరపు మీటర్ల పరిధిలో పనులు చేయాల్సి ఉంటుంది. కానీ.. డయాఫ్రం వాల్ మందం తగ్గించడం వల్ల చేయాల్సిన పనుల పరిమాణం సగానికి తగ్గే అవకాశం ఉందని ఇంజినీరింగ్ నిపుణులు లెక్కలు వేస్తున్నారు. పనుల పరిమాణం తగ్గినా.. అత్యంత కఠిన శిల (సౌండ్ హార్డ్ రాక్)లోకి రెండు మీటర్ల లోతు వరకూ ప్యానళ్లను దించి డయాఫ్రం వాల్ వేయడం వల్ల అదనపు పనులు చేశామని చూపి రూ.వందల కోట్లు కాంట్రాక్టు సంస్థకు దోచిపెట్టి కమీషన్లు రాబట్టుకునేందుకు ముఖ్యనేత పథకం వేశారని చెబుతున్నారు.కమీషన్ల కోసం చారిత్రక తప్పిదం» సీడబ్ల్యూసీ ఆమోదించిన పోలవరం ప్రాజెక్టు డిజైన్ ప్రకారం.. తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ చానల్ను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తిచేసి.. వాటి మధ్యన ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రం వాల్ నిర్మించి దానిపై ప్రధాన డ్యామ్ను పూర్తి చేయాలి. » కానీ.. 2016, డిసెంబర్లో ఒకేసారి స్పిల్ వే, స్పిల్ చానల్, ప్రధాన డ్యామ్ డయాఫ్రం వాల్ పనులను నాటి చంద్రబాబు సర్కారు ప్రారంభించి చారిత్రక తప్పిదం చేసింది. కమీషన్ల కక్కుర్తితో ఆ పనులను బావర్ సంస్థకు సబ్ కాంట్రాక్టు కింద కట్టబెట్టేసింది. గోదావరికి అడ్డంగా 2016 డిసెంబర్ నుంచి 2017 జూలై వరకు చెయినేజ్ 1,485.7 నుంచి 480 మీటర్ల వరకూ 1,006 మీటర్లు.. 2017 డిసెంబర్ నుంచి 2018 జూన్ వరకూ చెయినేజ్ 480 నుంచి 89 మీటర్ల వరకూ 390.6 మీటర్ల పొడవున మొత్తం 1,396.6 మీటర్ల మేర ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ను నిర్మించింది. » డయాఫ్రం వాల్ను అప్పట్లో బావర్ సంస్థ ఇష్టారాజ్యంగా చేసిందని.. ప్యానళ్లను సౌండ్ హార్డ్ రాక్లోకి రెండు మీటర్ల లోతు వరకూ దించలేదని, కేవలం సాధారణ రాతి నేల వరకూ మాత్రమే పనులు చేసిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. » కానీ.. అవేమీ పట్టించుకోకుండా డయాఫ్రం వాల్ పనులకు 2018 జూన్ నాటికే రూ.393.32 కోట్ల మేర బిల్లులు చెల్లించింది. మరో రూ.94 కోట్ల మేర బిల్లులు చెల్లించాలని బావర్ సంస్థ ప్రతిపాదనలు పంపింది. ఈ వ్యవహారంలో భారీఎత్తున ముడపులు చేతులు మారాయి. అప్పటి ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ అధినేత రాయపాటి రంగారావు మీడియా సాక్షిగా వెల్లడించిన అంశాలే దీనికి నిదర్శనం. ఇప్పుడు కొత్త డయాఫ్రం వాల్ను అదే సంస్థకు కట్టబెట్టడం.. లోపభూయిష్టంగా పనులు చేస్తుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన డ్యామ్ భద్రతకే ప్రమాదంపోలవరం ఎగువ కాపర్ డ్యామ్ వద్ద ఇసుక నేలలో ఊటనీటి (సీపేజీ) ఫర్మియబులిటీని 2016–17లో తప్పుగా లెక్కించారు. దీనివల్ల ఎగువ కాఫర్ డ్యామ్ పునాది జెట్ గ్రౌటింగ్ వాల్ను 20 మీటర్ల లోతు నుంచే నిర్మించారు. వాస్తవంగా ఆ వాల్ను 40 మీటర్ల లోతు నుంచి నిర్మించాలి. దీన్ని బట్టి చూస్తే కమీషన్ల కక్కుర్తితో జెట్ గ్రౌటింగ్ వాల్ను తక్కువ లోతుతో నిర్మించారనే విషయం స్పష్టమవుతోంది. 2018లో గోదావరి ప్రవాహం జెట్ గ్రౌటింగ్ వాల్ మీదుగానే ప్రవహించింది. ఆ వరద ఉధృతికి జెట్ గ్రౌటింగ్ వాల్లో చెయినేజ్ 1,040 మీటర్ల నుంచి 1,330 మీటర్ల మధ్య 27 చోట్ల భారీగా చీలికలు ఏర్పడ్డాయని.. దానివల్లే ఎగువ కాఫర్ డ్యామ్లో సీపేజీ అధికంగా ఉందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తేల్చింది. వరద ఉధృతి పెరిగినప్పుడు సీపేజీ తీవ్రత పెరిగి ఎగువ కాఫర్ డ్యామ్కు గండ్లు పడకుండా ఉండేందుకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఎగువ కాఫర్ డ్యామ్ దిగువన దానికి పొడవునా సమాంతరగా బట్రెస్ బర్మ్ను ప్రభుత్వం నిర్మిస్తోంది. గతంలో చేసిన తప్పునకు పరిహారం రూ.200 కోట్లకుపైగా వ్యయం చేస్తోంది. డయాఫ్రం వాల్ మందం 1.5 మీటర్ల నుంచి 0.9 మీటర్లకు తగ్గించడం వల్ల.. ఎగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ వాల్ దెబ్బతిన్న తరహాలోనే ప్రధాన డ్యామ్ బరువు ప్రభావం వల్ల డయాఫ్రం వాల్లో చీలికలు ఏర్పడి, సీపేజీ పెరగడానికి.. ప్రధాన డ్యామ్లో గండ్లు పడటానికి దారి తీస్తుందని.. ప్రాజెక్టు భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తుందని ఇంజినీరింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మిస్ యూనివర్స్లో.. తెలుగు అందాలు
మరో ప్రతిష్టాత్మక గ్లోబల్ ఫ్యాషన్ ఈవెంట్కు రెండు తెలుగు రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ సారి నిర్వహించనున్న మిస్ యూనివర్స్ పోటీలకు సంబంధించి మిస్ ఇండియా ఎంపికకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రం నుంచి మిస్ యూనివర్స్ స్టేట్గా ఎంపిక చేసి, మిస్ యూనివర్స్ ఇండియా పోటీకి పంపిస్తారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి మిస్ యూనివర్స్ తెలంగాణగా కశ్వి, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్గా ప్రకృతి ఎంపిక అయ్యారు. హైదరాబాద్ అజీజ్ నగర్లోని ధారా రిసార్ట్లో నిర్వహించిన మిస్ యూనివర్స్ గ్రాండ్ ఫినాలేలో ఈ అందాల ముద్దుగుమ్మలను ఎంపిక చేశారు. – సాక్షి, సిటీ బ్యూరోమిస్ యూనివర్స్ ఎంపికలో భాగంగా నిర్వహించిన గ్రాండ్ ఫినాలే కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 30 మంది పోటీదారులు పాల్గొని ర్యాంప్ వాక్ చేసి అహూతులను అలరించారు. డిజైనర్ చారు పరాశర్, గత ఏడాది మిస్ యూనివర్స్ రన్నర్ అప్ రూపూజనే విసో, మిస్ ఇండియా యూనివర్స్ ఫ్రాంచైజ్ హెడ్ అంజద్ ఈ షోకి జడ్జిలుగా వ్యవహరించారు. ఈ గ్రాండ్ ఫినాలేలో తెలంగాణ రన్నరప్లుగా సృష్టి, రితిక నిలువగా.. సలోని, తనుశ్రీ ఆంధ్రప్రదేశ్ పేజెంట్ రన్నరప్లుగా నిలిచారు. ఈ ఫ్యాషన్ ఈవెంట్కు సినీ, రాజకీయ ప్రముఖులు, పలువురు వ్యాపారవేత్తలు హాజరయ్యారు. వనరుల వల్లే.. హైదరాబాద్లో ఉన్న వనరులు సమయానుకూలంగా ఉన్నందుకే ఈ షోను కేవలం రోజుల వ్యవధిలో సూపర్ సక్సెస్ చేయగలిగామని తెలంగాణ ఎడిషన్ డైరెక్టర్ ప్రసాద్ గారపాటి తెలిపారు. రేస్లో తెలుగు అమ్మాయిలు.. మిస్ వరల్డ్ పోటీల తర్వాత అతి తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా మిస్ యూనివర్స్ పేజెంట్కి హైదరాబాద్ నగరం అన్ని విధాలుగా సహకరించిందని ఈవెంట్ నిర్వాహకురాలు, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ డైరెక్టర్ డాక్టర్ సునీత తెలిపారు. చాలా తక్కువ సమయమే ఉన్నా.. పోటీదారులు అందరూ చాలా శ్రమించి అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలను చూపారని కొనియాడారు. వారం రోజుల పాటు జరిగిన ఫ్యాషన్, టాలెంట్, డ్రెస్సింగ్ వంటి విభిన్న రౌండ్స్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 30 మంది పాల్గొని తమ నైపుణ్యాలను గ్లామర్ ఇమేజ్ను అద్భుతంగా ప్రదర్శించారని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే తెలుగు అమ్మాయిలు మోడలింగ్లో రాణిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి పేజెంట్లో తమ సత్తా చాటుతున్నారు. ఈసారి మిస్ యూనివర్స్ ఇండియా ఎంపికలో తెలుగు మోడల్స్ టాప్లో ఉన్నారు. ఈ గ్లోబల్ పేజెంట్కు పోటీనిచ్చేలా మన అమ్మాయిలకు ప్రత్యేక శిక్షణ అందించాం. ఇందులో భాగంగా విదేశాల్లో మోడట్స్కు ట్రైనింగ్ ఇచ్చే ప్రముఖ బ్యూటీ పేజెంట్స్ ట్రైనర్, కొరియోగ్రాఫర్ ఆంటోనీ గుంజ్వాలెస్తో శిక్షణ అందించాం.విజేతగా నిలవడమే లక్ష్యం.. మిస్ యూనివర్స్ ఇండియాతో పాటు, మిస్ యూనివర్స్లోనూ విజేతగా నిలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. వారం రోజుల పాటు జరిగిన రౌండ్స్ మరింత అవగాహన కల్పించాయి. – కశ్వి, మిస్ యూనివర్స్ తెలంగాణమన గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తాం.. ఈసారి మిస్ యూనివర్స్లో తెలుగు అమ్మాయిల సౌందర్యాన్ని, విజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేస్తాం. ఈ గ్లోబల్ పేజెంట్కు తగినట్టుగా అన్ని అంశాల్లో శిక్షణ తీసుకున్నాను. నా చిరకాల కోరికకు కొద్ది దూరంలో ఉన్నాను. తెలుగు ప్రజలందరికీ ధన్యవాదాలు. – ప్రకృతి, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ -
టీడీపీ నాయకులు, టీడీపీ స్పాన్సర్డ్ ఐటీడీపీ కార్యకర్తలు వివిధ సందర్భాలలో మహిళలపై చేసిన గౌరవప్రదమైన వ్యాఖ్యలు ఇవీ...
-
రాష్ట్రంలో మహిళలు, బాలికలకు భద్రత కరువు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. అనంతపురంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండాపోయింది. శాంతిభద్రతల నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది. అనంతపురంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్య చేశారు. తమ కుమార్తె కనిపించడం లేదని ఈ నెల 3న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ అమ్మాయిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఆరు రోజుల తర్వాత కూడేరు మండలం బ్రాహ్మణపల్లె సమీపంలో తన్మయి మృతదేహాన్ని గుర్తించారు. తన్మయి హత్య పూర్తిగా యంత్రాంగ వైఫల్యమే. ఒక అమ్మాయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆరు రోజుల క్రితం ఫిర్యాదు వచ్చినా సరే ఎందుకు పట్టించుకోలేదు? అసలు రాష్ట్రంలో కేసుల దర్యాప్తు మీద, నేరాల అదుపు మీద దృష్టి ఉందా? కేవలం రెడ్బుక్ రాజ్యాంగం అమలు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప.. ఈ ప్రభుత్వానికి ప్రజల రక్షణ పట్ల బాధ్యత అనేది ఉందా? తన్మయి హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వం బాధ్యత వహించాలి’ అని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయింది. శాంతి భద్రతల నిర్వహణలో @ncbn గారి వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్యచేశారు. ఈనెల జూన్ 3న తమ కుమార్తె… pic.twitter.com/WSSOoiAIwL— YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2025 -
YSRCP: గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడిపై సస్పెన్షన్ వేటు
గుంటూరు,సాక్షి: గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడుపై సస్పెన్షన్ వేటు పడింది. కావటితో పాటు మర్రి అంజలి, యాట్ల రవికుమార్ అనే ఇద్దరు కార్పరేటర్లు కూడా వైఎస్సార్సీపీ నుండి సస్పెండ్ చేస్తూ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు మాజీ మేయర్ కావటి, ఇద్దరు కార్పొరేట్లపై ఫిర్యాదులు రావడంతోనే చర్యలకు ఉపక్రమించింది. -
‘కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్ట్ను నాశనం చేస్తున్నారు’
రాజమహేంద్రవరం: కమీషన్ల కక్కుర్తితో పోలవరం ప్రాజెక్ట్ను సీఎం చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నాడని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమహేంద్రవరం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరుగుతున్న అవకతవకలను తాజాగా ప్రాజెక్ట్ను పరిశీలించిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ తన నివేదికలో బయటపెట్టిందని అన్నారు. సీడబ్ల్యుసీ ఆమోదించిన దానికి భిన్నంగా డయాఫ్రం వాల్ డిజైన్లు, కాంక్రీట్ నాణ్యతలో ప్రమాణాలు లేకపోవడం, లోపభూయిష్టమైన విధానాలతో మొత్తం ప్రాజెక్ట్నే ప్రమాదంలోకి నెట్టేట్టుగా కూటమి సర్కార్ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరంపై ప్రభుత్వం మొద్దునిద్ర వీడి, అంతర్జాతీయ నిపుణుల కమిటీ చేసిన సిఫారస్ల మేరకు ప్రాజెక్ట్ను ముందుకు తీసుకువెళ్ళాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే....చంద్రబాబు సీఎం అయ్యాక గతంలో చేసిన తప్పులనే మళ్ళీ పునరావృతం చేస్తూ పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేస్తున్నారు. గతంలో చేసిన తప్పుల నుంచి ఇప్పటికీ కూటమి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోకుండా కమీషన్ల కక్కుర్తితో రూ.990 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. గతంలో సబ్ కాంట్రాక్టు పనులు చేసే బావర్స్ కంపెనీకి నేరుగా డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు అప్పగించేశారు. దీంతో పనుల్లో జాప్యం, నాణ్యతాలోపం కొట్టొచ్చినట్టు కనపడుతోందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తాజాగా పీపీఏ, సీడబ్ల్యూసీలకు ఇచ్చిన ఒక నివేదికలో వెల్లడించింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ను తుంగలో తొక్కి 1.5 మీటర్ల మందంతో కాకుండా 0.9 మీటర్ల మందంతో బావర్ సంస్థ డయా ఫ్రం వాల్ పనులు చేస్తోందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఎత్తిచూపింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన మందం కంటే 0.6 మీటర్లు మందం తగ్గించి పనులు చేస్తున్నారని తప్పుపట్టింది. కాంక్రీట్ మందం సగానికి సగం తగ్గించేసినట్టు నిపుణుల కమిటీ తన నివేదికలో బట్టబయలు చేసింది. రాబోయే రోజుల్లో 190 టీఎంసీల నీటిని నిల్వచేసే పోలవరం ప్రాజెక్టుకు ఏదైనా జరిగితే ఉభయ గోదావరి జిల్లాలు కూడా తుడిచిపెట్టుకుని పోయే ప్రమాదం ఉంది. ఇది ముమ్మాటికీ క్షమించరాని నేరం. పునర్ నిర్మాణం చేసే పనుల్లో కూడా కనీస బాధ్యత తీసుకోవడం లేదు.నిపుణుల పరిశీలనతో బయటపడ్డ డొల్లతనంపోలవరం ప్రాజెక్టు పనుల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి ఏడాది క్రితం సియాన్ హించ్బెర్గర్, మెస్సర్స్ సీ రిచర్డ్ డొన్నెళ్లి, గియానో ఫ్రాంకో డీ క్యాప్పో, డేవిడ్ పాల్ సభ్యులతో కూడిన అంతర్జాతీయ నిపుణుల కమిటీని సీడబ్ల్యూసీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నాలుగోసారి మే నెల 5 నుంచి 9వ తేదీ వరకు పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. పనులపై అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సమీక్షించింది. క్షేత్ర స్థాయి పర్యటనలో గుర్తించిన అంశాలు, అధికారుల సమీక్షలో వెల్లడైన విషయాలు ఆధారంగా ఈ నెల 4న పీపీఏ, సీడబ్ల్యూసీలకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. ప్రాజెక్టు పనుల్లో లోపాలను ఎత్తిచూపుతూ, వాటిని సరిదిద్దుకోవడానికి చేపట్టాల్సిన చర్యలను ఆ నివేదికలో సిఫార్సు చేసింది.నిబంధనలకు విరుద్ధంగా డయాఫ్రం వాల్ పనులుపోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) గ్యాప్-2లో కేంద్ర జల సంఘం ఆమోదించిన డిజైన్కు విరుద్ధంగా పనులు చేస్తుండటాన్ని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తీవ్రంగా ఆక్షేపించింది. మందం తగ్గించటంపై తక్షణమే సమీక్షించి, తగిన నిర్ణయం తీసుకోవాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సూచించింది. దీంతోపాటు డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగిస్తున్న టీ-16 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంలో నీటి శాతం అధికంగా ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణుల బృందం గుర్తించింది. ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం 32 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నాణ్యంగా ఉంటుందని, కానీ డయాఫ్రం వాల్లో వినియోగిస్తున్న కాంక్రీట్ మిశ్రమం ఉష్ణోగ్రత 35 డిగ్రీలు ఉందని ఎత్తి చూపింది. గత మూడు నెలల్లో 52 ప్యానళ్లతో డయాఫ్రం వాల్ పనులు చేశారని, అందులో 9 ప్యానళ్ల పరిధిలో డయా ఫ్రం వాల్ ఉపరితలంపై ఎయిర్ బబుల్స్ (సీపేజీ) ఉన్నట్లుగా చెప్పింది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా, సీపేజీ ఉన్న ప్యానళ్ల పరిధిలో డయా ఫ్రం వాల్ పైభాగంలో 1 నుంచి 2 మీటర్ల లోతు వరకు తొలగించి, మళ్ళీ కొత్తగా వేయాలని పీపీఏకు సూచించింది. డయాఫ్రం వాల్ నిర్మాణంలో ఒక ప్యానల్ను మరో ప్యానల్తో నిలువునా జత చేసేటప్పుడు 7.5 సెంటీమీటర్లకు బదులుగా కనీసం పది సెంటీ మీటర్ల పొడవున ఓవర్ ల్యాప్ చేయాలని సూచించింది. అప్పుడే సీపేజీకి సమర్థవంతంగా అడ్డుకట్ట వేయొచ్చని పేర్కొంది. ప్రాజెక్ట్ పనుల్లోనూ తీవ్ర జాప్యంప్రధాన డ్యాం గ్యాప్-2లో డయా ఫ్రం వాల్ పనులను 66 వేల చదరపు మీటర్ల పరిధిలో చేయాలి. నిర్దేశించుకున్న షెడ్యూలు ప్రకారం 2025 జూన్ నాటికి 28 వేల చదరపు మీటర్ల పరిధిలో డయాఫ్రం వాల్ పనులు పూర్తి చేయాలి. 2025 ఏప్రిల్ నాటికి 15 వేల చదరపు మీటర్ల పరిధిలో పనులు పూర్తి చేయాల్సి ఉండగా, 12 వేల చదరపు మీటర్ల పరిధిలో మాత్రమే పూర్తయ్యాయి. దాదాపు 3 వేల చదరపు మీటర్ల పరిధిలో పనులు వెనుకబడినట్లు నిపుణుల కమిటీ తేల్చింది. దాదాపు 35 రోజులు వెనుకబడి ఉన్నారు. పనుల్లో జాప్యానికి కాంట్రాక్టు సంస్థ బావర్ చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవని నిపుణుల కమిటీ కుండబద్దలు కొట్టింది. డయాఫ్రం వాల్ ప్యానళ్లను అత్యంత కఠిన శిల (సౌండ్ హార్డ్ రాక్) లోపలికి రెండు మీటర్ల లోతు వరకు దించితేనే, సీపేజీని సమర్థవంతంగా నియంత్రించవచ్చని పేర్కొంది. అలా చేయడం వల్లే పనులు ఆలస్యమవుతున్నాయని చెప్పడం విడ్డూరంగా ఉందని కమిటీ చెప్పింది.’ అని పేర్కొన్నారు. -
‘నువ్వా విలువల గురించి మాట్లాడేది’.. అనితపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్
సాక్షి,విశాఖ : హోంమంత్రి అనితపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైరయ్యారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతికి విలువలు నేర్పాల్సిన అవసరం లేదని,ఆ స్థాయి హోం మంత్రి అనితకు లేదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి. మహిళలపై జరుగుతున్న దాడులకు హోం మంత్రి నుంచి స్పందన లేదు. ఇవన్నీ పట్టించుకోకుండా హోం మంత్రి మాపై విమర్శలు చేస్తున్నారు. సాక్షి డిబేట్లో ఓ జర్నలిస్ట్ మాట్లాడిన మాటల్ని పట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ఆ మాటలు మాట్లాడిన వెంటనే ఆ వ్యాఖ్యలను సాక్షి టీవీ ఖండించింది. జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలను మా పార్టీ ఎంత మాత్రం సమర్ధించదు.రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మహిళల మాన ప్రాణాలు రక్షించడంలో ప్రభుత్వానికి శ్రద్ద లేదు. వైఎస్ భారతికి విలువలు నేర్పాల్సిన అవసరం లేదు. ఆ స్థాయి హోం మంత్రి అనితకు లేదు. దళిత బాలికను అత్యాచారం చేస్తే హోం మంత్రి అనిత ఏం చేశారు..? కనీసం స్పందించారా..? ఈ కుటుంబాలను ప్రభుత్వం ఓదార్చిందా..?. విలువలు నేర్పించే అర్హత హోం మంత్రి అనితకు ఉందా..? డైవర్షన్ పాలిటిక్స్ చేయడం మాత్రమే కూటమి ప్రభుత్వ పెద్దలకు తెలుసు. మహిళలకు రక్షణ కల్పించలేని చేతకాని ప్రభుత్వం ఇది. హోం మంత్రి సొంత ఇలాకాలో గంజాయి రవాణా జరుగుతుంది. ఇలాంటి వాటిపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు’ అని మండిపడ్డారు. -
AP: ‘టీచర్లను ఎలా మోసం చేశారంటే...’
నెల్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల బదిలీల ప్రక్రియను కూటమి సర్కరా్ ప్రహాసనంగా మార్చేసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బదిలీల్లో మ్యానువల్ ఆప్షన్ అమలు చేస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఆఖరి నిమిషంలో ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ను తప్పనిసరి చేయడం ద్వారా మొత్తం ఉపాధ్యాయలోకంను పచ్చిగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్కు రెడ్బుక్పై ఉన్న శ్రద్దలో కాస్తైనా విద్యాశాఖపై లేకపోవడం వల్లే రాష్ట్రంలో విద్యావ్యవస్థ అధ్వన్నంగా మారిందని ధ్వజమెత్తారు. తక్షణం ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు మ్యానువల్ విధానంలోనే బదిలీ ప్రక్రియ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...తాజాగా కూటమి ప్రభుత్వం టీచర్ల బదిలీలకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ రోజు నుంచి 48 గంటల్లో ఆన్లైన్ బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలంటూ, ఒక్కో టీచర్ 2500 ఆప్షన్స్ పెట్టుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాల వల్ల రాష్ట్రంలో 1.20 లక్షల మంది ఎస్జీటీలకు సంబంధించి అటు హెచ్ఎం పదోన్నతులు లేకుండా చేశారు. మరోవైపు 48 గంటల్లో ఒక్కో టీచర్ 2500 ఆన్లైన్ బదిలీ అప్షన్స్ పెట్టుకోవాలంటూ ఒత్తిడి చేయడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు.టీచర్లను ఎలా మోసం చేశారంటే...టీచర్ల బదిలీలకు సంబంధించిన చట్టానికి విరుద్దంగా రోజుకోరకంగా నిబంధనలను మార్చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం టీచర్లకు వెన్నుపోటు పొడిచింది. 35 వారాల పాటు ప్రతి శుక్రవారం మీటింగ్లు పెట్టి మ్యానువల్ కౌన్సిలింగ్ ద్వారానే బదిలీలు చేస్తానని చెప్పి నమ్మించారు. తరువాత అసెంబ్లీలో మాత్రం మ్యాన్వల్కు బదులు ఆన్లైన్ కౌన్సెలింగ్ చేస్తామని చట్టం తీసుకువచ్చారు. దీనిపై టీచర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో అధికారులు చట్టంలో ఉన్న దానిని పక్కకుపెట్టి మ్యాన్వల్ బదిలీలనే చేస్తామని హామీ ఇచ్చారు. గత మే నెలలో ఆన్లైన్ బదిలీలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండటంతో డీఈఓ కార్యాలయాల ముందు మే 25న ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. దీనితో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీచర్ యూనియన్లతో ఒక మీటింగ్ పెట్టి చట్టప్రకారం ఆన్లైన్ బదిలీలు ఉన్నా కూడా, దానిని పక్కకు పెట్టి మ్యానువల్ బదిలీలే చేస్తామని హామీ ఇవ్వడంతో టీచర్ యూనియన్లు ఆందోళనను విరమించుకున్నారు. అదే క్రమంలో ప్రభుత్వం మే 25న బదిలీలకు సంబంధించి జారీ చేసిన జీఓ 22లో ఖచ్చితంగా ఆన్లైన్ బదిలీలే చేస్తామని స్పష్టం చేసింది. ఇంతకంటే మోసం ఎక్కడైనా ఉంటుందా? దీనిపై టీచర్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పొరపాటుగా ఆ జీఓ జారీ చేశామని, మ్యానువల్ బదిలీలే చేస్తామంటూ టీచర్ సంఘాలకు అధికారులు హామీ ఇచ్చారు. ఇప్పుడు హటాత్తుగా బదిలీలపై తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా పదేపదే టీచర్లను నమ్మించి, నిలువుగా దగా చేస్తూనే ఉన్నారు.బదిలీల ప్రక్రియ అస్తవ్యస్తంగత ప్రభుత్వం జారీ చేసిన 117 జీఓను రద్దు చేసి, కూటమి ప్రభుత్వం తొమ్మిది రకాల స్కూల్స్ను తీసుకువచ్చింది. బదిలీల కోసం వెబ్ అప్షన్స్లో ఫౌండేషన్, బేసిక్, మెడల్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అనే నాలుగు ఆప్షన్స్ కనిపించాల్సి ఉంది. కానీ కేవలం ఎంపీపీ, యుపీ స్కూల్స్ అని మాత్రమే పెట్టారు. దీనితో టీచర్లలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తాము ఆప్షన్ ఇచ్చే స్కూల్ ఏ కేటగిరిలోకి మార్పు చెందిందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. రేపు సాయంత్రంతో వెబ్ అప్షన్స్ గడువు ముగుస్తోంది. తొమ్మిదిరకాల స్కూల్స్గా మార్చిన నేపథ్యంలో కొన్ని మండలాల్లో బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఎక్కువగా పెడితే, మరికొన్ని మండలాల్లో ఫౌండేషన్ స్కూల్స్ను ఎక్కువగా పెట్టారు. ఎక్కడా హేతుబద్దత అనేది లేకుండా చేశారు. తెలుగుదేశం నాయకులు చెప్పినట్లుగా స్కూల్స్ కేటగిరిని మార్చారు. ఆర్జేడీ, డీఈఓ, ఎంఈఓలతో సంబంధం లేకుండా, నిబంధనలకు అనుగుణంగా ఏ స్కూల్ ఏ కేటగిరిలో ఉండాలని నిర్ణయించకుండా, టీడీపీ నాయకులు సూచించినట్లుగా స్కూల్స్ను మార్చేశారు. టీచర్లు ఎన్ని సంవత్సరాలు, ఎంత దూరంలో పనిచేశారనే దానిపై పాయింట్స్ ఇస్తారు. దాని ప్రకారమే బదిలీల్లో ప్రాధాన్యత ఉంటుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో ఈ పాయింట్స్ కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడుతున్నారు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని చూపి టీచర్లను భయపెట్టాలని అనుకుంటున్నారు. రాజకీయ ఒత్తిళ్ళతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే, రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతారు. ఎనిమిది అకడమిక్ ఇయర్స్ పూర్తయితే బదిలీ చేస్తామనే నిబంధనలు ఉంటే, ఎనిమిది క్యాలెండర్ ఇయర్స్ పూర్తి కాలేదంటూ సాకులు చూపి పాయింట్స్ ఇవ్వడం లేదు. అలాగే దాదాపు 4000 మంది స్కూల్ అసిస్టెంట్లు సర్ప్లస్గా మారిపోయారు. వారిని నిబంధనలకు విరుద్దంగా ప్రైమరీ స్కూల్కు కేటాయిస్తున్నారు. ఇరవై ఏళ్ళ సర్వీస్ ఉన్న స్కూల్ అసిస్టెంట్ను కూడా పీఎస్ హెచ్ఎంగా మోడల్ స్కూల్స్కు పంపడం దారుణం. దీనివల్ల ఎస్జీటీలకు పీఎస్ హెచ్ఎం పదోన్నతి రాకుండా పోయింది.పదో తరగతి మూల్యాంకనంతో పరువు పోయిందిమంత్రి నారా లోకేష్ అసమర్థత కారణంగా, పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో చూసిన నిర్లక్ష్యంతో విద్యాశాఖ పరువు పోయింది. పదోతరగతి పరీక్షలు విద్యార్ధుల భవిష్యత్తుకు తొలి మెట్టు. అటువంటి పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరిగాయో అందరికీ తెలుసు. నెల్లూరుకు చెందిన విద్యార్థిని సాయి కుందనకి అన్ని సబ్జెక్ట్ల్లో తొంబైకి పైగా మార్కులు వస్తే, హిందీ సబ్జెక్ట్లో 34 మార్కులు వచ్చాయి, బాలికను ఫెయిల్ చేశారు. ఆమె రీవాల్యుయేషన్ పెట్టకుంటే 90 మార్కులు వచ్చాయి. నెల రోజుల పాటు ఆ విద్యార్ధి ఎంత వేదన చెంది ఉంటారో అర్థం చేసుకోవాలి. బొర్రా శిశింద్రారెడ్డికి గణితంలో 32 మార్కులు వేశారు. అన్నింటిలో మంచి మార్కులు వచ్చిన ఈ విద్యార్ధి తిరిగి రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే 72 మార్కులు వేశారు. దీనిపైన మళ్ళీ రీకౌంటింగ్ చేయించుకుంటే 78 మార్కులు వచ్చాయి. ప్రొద్దుటూరుకు చెందిన గంగిరెడ్డి మోక్షితను సోషల్ లో 21 మార్కులతో ఫెయిల్ చేశారు. రీవాల్యుయేషన్లో 84 మార్కులు వచ్చాయి. ఇలా అనేక మంది విద్యార్ధుల జవాబుపత్రాలను తీసుకువస్తే, ఎంత దారుణంగా వాల్యుయేషన్ చేశారో అర్థమవుతుంది. ఒక సబ్జెక్ట్ను దిద్దడానికి పదిరోజులు సమయం ఇచ్చే పరిస్థితి ఉంటే, ఆరు రోజుల్లో పూర్తి చేయాలని ఒత్తిడి చేశారు’ అని చంద్రశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. -
AP EAPCET: ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల
విజయవాడ: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలకు గాను గత నెలలో జరిగిన ఏపీ-ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ విభాగంలో 1.89 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్ విద్యార్థి అనిరుద్రెడ్డికి తొలి ర్యాంక్ రాగా, శ్రీకాళహస్తి విద్యార్థి భాను చరణ్రెడ్డి రెండో ర్యాంక్ వచ్చిఇంది. ఇక పాలకొల్లు విద్యార్థి యశ్వంత్ మూడో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఇక అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 89.9 శాతం ఉత్తీర్ణత సాధించారు విద్యార్థులు. అగ్రి, ఫార్మాసీలో సాయి హర్షవర్థన్కు తొలి ర్యాంకు రాగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన నిశాంత్కు రెండో ర్యాంక్, కోనసీమ జిల్లా విద్యార్థి వినయ్ మల్లేశ్కు మూడో ర్యాంకు వచ్చింది. కాగా, గత నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ ఏపీ ఈఏపీ సెట్ నిర్వహించారు. ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు మొత్తం 3,62, 392 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 145 పరీక్షా కేంద్రాలతో పాటు హైదరాబాద్ లో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
AP: ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య
అనంతపురం: జిల్లాలో దారుణం చోటు చేసకుంది. ఇంటర్ చదువుతున్న తన్మయి అనే విద్యార్థిని దారుణంగా హత్య చేయబడింది. కొంతమంది దుండగులు ఇంటర్ విద్యార్థినిని తొలుత తలపై బండరాయితో కొట్టి చంపి.. ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఉరవకొండ నియోజవర్గం కూడేర మండలం బ్రహ్మణపల్లి వద్ద మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. తమ కుమార్తె కనిపిండం లేదని ఆరు రోజుల క్రితం ఫిర్యాదు చేసినా పోలీసలు పట్టించుకోలేదని, చివరకు ఇలా పూర్తిగా కాలిపోయి కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటర్ చదివే ఆ విద్యార్థినిని హత్య చేసిన తర్వాత పెట్రోల్ పోసి కాల్చివేసినట్ల తెలుస్తోంది. ఆర రోజుల క్రితం అదృశ్యమైనప్పటికీ పోలీసుల కాలయాపన చేయడంతోనే ఇలా జరిగిందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులు ముందుగానే పట్టించుకని ఉంటే తమ కూతురు బతికేదని తల్లిదండ్రలు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాల్లిస్ట్ పేరుతో పోలీసులు కాలయాపన చేశారని ఆ అమ్మాయి తరఫు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీర్ బాటిల్తో కొట్టడం వల్లే..విద్యార్థిని తన్మయిని బీర్ బాటిల్తో కొట్టడం వల్లే చనిపోయిందని అనంతపురం వన్ టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. ఈ నెల 3వ తేదీన తన్మయి అదృశ్యం అయినట్లు ఫిర్యాదు వచ్చిందన్నారు. వంటనే కేసు నమోదు చేసి అనుమానితులను విచారించామన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు సీఐ రాజేంద్రనాథ్. -
అదుపు తప్పిన కారు.. తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం..
సాక్షి,తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్లో కారు ప్రమాదం చోటు చేసుకుంది. డివైడర్ పైకి కారు దూసుకెళ్లింది. తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన భక్తులు కారులో తిరుమలకు ప్రయాణిస్తున్నారు. అయితే, వారు ప్రయాణిస్తున్న కారు కంట్రోల్ కాకపోవడంతో మొదటి ఘాట్ రోడ్డు 4వ మలుపు సమీపంలో డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో భక్తులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షత గాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్య చికిత్స కొనసాగుతోంది. -
‘అది డైవర్ట్ చేయడానికే టీడీపీ బురద చల్లుడు రాజకీయాలు’
సాక్షి, తాడేపల్లి: జర్నలిస్ట్ కృష్ణంరాజు సాక్షి టీవీ డిబేట్లో పాల్గొన్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవే, వాటిని వైఎస్సార్సీపీకి, సాక్షి టీవీ యాజమాన్యానికి ఎలా ఆపాదిస్తారని వైఎస్సార్సీపీ నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కృష్ణంరాజు తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తరువాత కూడా కూటమి సర్కార్ ఒక పథకం ప్రకారం వాటిని రాజకీయం చేసేందుకు, వైఎస్ కుటుంబం మీద వ్యక్తిత్వ హననానికి వాడుకుంటోందని మండిపడ్డారు.మహిళలను కించపరిచే ఎటువంటి వ్యాఖ్యలనైనా సరే సాక్షి టీవీ, వైఎస్సార్సీపీ సమర్థించే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. కూటమి ఏడాది పాలనపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం వెన్నుపోటు దినం విజయవంతం ద్వారా బహిర్గతం అవ్వడంతో, దానిని నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు కుట్రపూరితంగా టీడీపీ దానికి వంతపాడే ఎల్లోమీడియా, సోషల్ మీడియా ద్వారా పనిగట్టుకుని దుష్ప్రచారంకు దిగారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..గతంలో అనేక సందర్భాల్లో టీవీ డిబేట్లలో, పబ్లిక్ మీటింగ్ల్లో కూర్చుని టీడీపీ సీనియర్ నాయకులే ఇష్టారాజ్యంగా మాట్లాడినప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారంతా ఏమైపోయారు. ఈటీవీ, టీవీ 5, ఏబీఎన్ ఛానెళ్ల ముందు ఎందుకు ధర్నాలు నిర్వహించలేదు? ఆ పత్రికల ప్రతులను ఎందుకు తగలబెట్టలేదు? టీడీపీ నాయకులు మాట్లాడిన సందర్భాల్లో వారి మనోభావాలు దెబ్బతినలేదా?టీడీపీ నాయకులు, కిర్రాక్ ఆర్పీ, సీమ రాజా, చేబ్రోలు కిరణ్ మాట్లాడిన వీడియోలను కూడా ఈ సందర్భంగా పత్రికా సమావేశంలో ప్రజలు చూసేందుకు గానూ ప్రదర్శిస్తున్నాము. సాక్షాత్తు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి అనిత వైయస్ కుటుంబం గురించి, వారి ఇంటి మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినా వారి మీద ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. నాడు సీఎం వైయస్ జగన్ ను ఉద్దేశించి పదే పదే సైకో అని మాట్లాడిందే చంద్రబాబు. వైయస్సార్సీపీ నాయకులను ఉద్దేశించి పవన్ కళ్యాన్ నా కొడకల్లారా అని రెచ్చిపోయాడు. వారిద్దరి మీద కూడా ఎందుకు కేసులు పెట్టలేదు?ఐటీడీపీ పేరుతో రెచ్చిపోతున్న సైకోలువ్యక్తిత్వ హననం అనేది టీడీపీ జీన్స్ లోనే ఉంది. ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ నుంచి నేటి వైయస్ జగన్ వరకు వ్యక్తిత్వ హననం చేయడమే ఎజెండాగా సైకోలను ప్రోత్సహించడమే టీడీపీ పనిగా పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తోడేళ్లు వైయస్ కుటుంబంపై దారుణంగా విమర్శలు చేస్తున్నారు. ఐ-టీడీపీ పేరుతో నారా లోకేష్ ఒక సైకో వ్యవస్థను సృష్టించి డబ్బులిచ్చి పోషిస్తున్నాడు. చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహంతోనే వీడియోలు చేస్తున్నానని టీడీపీ సైకో చేబ్రోలు కిరణ్ స్పష్టంగా చెప్పాడు. అధికారం అండ చూసుకుని, రెడ్ బుక్ రాజ్యాంగం పొగరుతో ఏం చేసినా పోలీసులు మనల్ని ఏం చేయరులే అని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైకోలు దారుణాలకు తెగబడుతున్నారు. ఇలాంటి చర్యలను వైయస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. వైయస్ కుటుంబాన్ని కించపరిచేలా మాట్లాడే వారిని ఉపేక్షించే ప్రసక్తేలేదు.మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వానికి పట్టదుమహిళల మీద అత్యాచారాలు, దాడులు జరుగుతుంటే ఈ ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది. దళిత బాలికపై సామూహిక అత్యాచారం చేస్తే ఇంతవరకు కేసు నమోదు చేసి నిందితులను శిక్షించలేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ నియోజకవర్గాల్లో మహిళల మీద దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. ముచ్చుమర్రిలో చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటన జరిగి 9 నెలలు దాటినా ఇంతవరకు బాలిక మృతదేహాన్ని వెతికి తీయడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా ఫెయిలైంది.రాష్ట్ర వ్యాప్తంగా దళిత మీద దాడులు నిత్యకృత్యమైపోయాయి. పిఠాపురంలో ఏకంగా దళితులను సాంఘిక బహిష్కరణ చేసినా పవన్ కళ్యాణ్ దానిపై ఇంతవరకు నోరుమెదపలేదు. ఈ ఘోరాలపై నోరెత్తి మాట్లాడే తీరిక ప్రభుత్వ పెద్దలకు లేదు. శాంతి భద్రతలను కాపాడాల్సిన డీజీపీ ఎక్కడున్నారో తెలియదు. రాజధాని పేరుతో అమరావతి భూములను దోచుకోవడమే అజెండాగా చంద్రబాబు పనిచేస్తున్నాడని రాజధాని రైతులు, మహిళలు గుర్తించాలి. అమరావతిలోని వందల ఎకరాల భూములను తన బినామీల కంపెనీలకు చంద్రబాబు దోచిపెట్టడమే పనిగా పెట్టుకున్నాడు. గతంలో సేకరించిన భూములనే అభివృద్ధి చేయలేక చేతులెత్తేసిన సీఎం చంద్రబాబు, మళ్లీ 44 వేల ఎకరాలు సేకరిస్తానని చెప్పడం భూములు దోచుకునే కుట్రలో భాగమే. -
‘సీజ్ ద షిప్ అన్న మీరు.. లారీలను సీజ్ చేయలేకపోతున్నారా?’
విజయవాడ: ఏపీలో రేషన్ కార్డులను రద్దు చేసి నగదు బదిలీ చేస్తారనే వార్తల నేపథ్యంలో సీపీఐ స్పందించింది. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. ‘రేషన్ కార్డులను రద్దు చేసి నగదు బదిలీ చేస్తామంటున్నారు. బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసం డబ్బులిస్తామంటున్నారు. బియ్యం షిప్పుల్లో పోయినా.. లారీల్లో పోయినా ప్రభుత్వ పరిధిలోనే కదా జరిగేది. గతంలో పవన్ వెళ్లి సీజ్ ద షిప్ అన్నారు. పవన్ షిప్ను సీజ్ చేసినప్పుడు మీరు లారీలను సీజ్ చేయలేకపోతున్నారా?, కోటి 47 లక్షల కార్డులున్నాయంటున్నారు. వరల్డ్ బ్యాంక్ సర్వేలో బిలో ప్రోపర్టీ లైన్(బీపీఎల్) బాగా తగ్గి పోయింది. 5.3 శాతమే ఉందంటున్నారు. 5.3 శాతమే బీపీఎల్ కింద ఉంటే కోటి 47 లక్షల కార్డులు ఎందుకున్నాయ్?, ఆ కార్డులు ఎవరి పేరుతో ఉన్నాయ్ .. ఏ బీరువాలో మూలుగుతున్నాయ్. పక్కాగా మోసం జరుగుతుందని ప్రభుత్వానికి తెలుసు. ఈ మోసంలో ఎవరెవరి ప్రమేయం ఉందో, డబ్బులు వసూలు చేస్తున్నారో ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. దాన్ని అరికట్టలేక మొత్తం అంతా తొలగిస్తామంటున్నారు .మీతీరు ఇంట్లో ఎలకలు పడితే ఇంటికి అగ్గి పెట్టినట్లుంది. ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకుని వారి పై చర్యలు తీసుకోవాలి. అర్హులైన వారికి రేషన్ కార్డు ఇవ్వాలి. బియ్యం అవసరం లేని వర్గాలకు వేరే రకమైన కార్డులు ఇవ్వాలి. రేషన్ బియ్యం తినరు కాబట్టి అమ్ముతున్నారంటున్నారు.తెలంగాణ ప్రభుత్వం మంచి ఆలోచనతో సన్నబియ్యం ఇస్తోంది. జనం క్యూ కట్టి ఆ సన్నబియ్యాన్ని తీసుకుంటున్నారు. మీరు కూడా ప్రజలు తినేందుకు వీలుగా ఉండే బియ్యం ఇవ్వండి. రేషన్ బియ్యం పథకాన్ని కచ్చితంగా కొనసాగించాల్సిందే. పథకం తీసేస్తే నిజమైన లబ్ధిదారులు , పేదవారు నష్టపోతారు. టీడీపీ ప్రభుత్వమే రేషన్ పథకాన్ని తీసేస్తే ఎన్టీ రామారావుకే అన్యాయం చేసినట్లు. ప్రభుత్వం తమ ఆలోచన మార్చుకోకపోతే ప్రజలు తగిన బుద్ధిచెబుతారు’ అని కె రామకృష్ణ ధ్వజమెత్తారు. -
సెలూన్ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
సాక్షి,విజయవాడ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సెలూన్ను ఘనంగా ప్రారంభించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరు రోడ్డు అయ్యప్ప నగర్ సమీపంలో ఆదివారం ‘సెలూన్ కొనికి’ని ప్రారంభించారు. అయితే సెలూన్ ప్రారంభోత్సవానికి పవన్ టీషర్టు, షార్ట్ వేసుకొని వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి. Salon Koniki ఓపెనింగ్ కి విచ్చేసిన పవన్ కళ్యాణ్..#PawanKalyan pic.twitter.com/PqYwHZUcAL— N Media News (@NMediaNewsOffl) June 8, 2025మరోవైపు, రాష్ట్రంలో కొనసాగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం, అక్రమ కేసులు, ఆమడ దూరంలో అభివృద్ధితో రాష్ట్రం నుంచి పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలివెళ్లే అంశంపై పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పరిశ్రమలు రాక, వెంటాడుతున్న నిరుద్యోగాన్ని ప్రస్తావిస్తూ ఇదేనా రాష్ట్ర అభివృద్ధి అంటూ పవన్ తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. -
శుభ కార్యాలకు విరామం
ద్వారకాతిరుమల(పశ్చిమ గోదావరి): పెళ్లి పనులు ప్రారంభించడం దగ్గర నుంచి అన్ని పనులకు ముహూర్తాలు చూస్తారు. అటువంటి ముహూర్తాలకు 48 రోజుల పాటు బ్రేక్ పడింది. ఈ ఏడాది జనవరి 30 నుంచి జూన్ 7 వరకు వివాహాలు జోరుగా జరిగాయి. ఆయా ముహూర్తాల్లో జిల్లావ్యాప్తంగా వేలాది వివాహాలు నిర్వహించారు. ఈనెల 10 నుంచి గురు మూఢమి, 26 నుంచి ఆషాఢ మాసం కావడంతో జులై 25 వరకు పెళ్లి సందడికి విరామం వచ్చింది. తిరిగి వివాహ ముహూర్తాలు శ్రావణ మాసం జూలై 26 నుంచి ప్రారంభం కానున్నాయి. అప్పటివరకు వివాహాది శుభకార్యాలకు ఆగాల్సిందే. 48 రోజులు పనులు లేనట్టే.. వివాహాది శుభకార్యాలపై ఆధారపడి జీవనోపాధి పొందే పురోహితులు, పచ్చిపూల మండపాలు, డెకరేషన్, షామియానా పందిళ్లు నిర్మించే వారు, వాయిద్యకారులు, క్యాటరింగ్, లైటింగ్ కార్మికులకు 48 రోజుల పాటు పనులు లేనట్టే. వీరంతా మళ్లీ జులై 26 నుంచి బిజీ కానున్నారు. వివాహ ముహూర్తాలు : వివాహాలకు ఈ ఏడాది జూలై 26, 30, 31, ఆగస్టు 1, 3, 5, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 17, సెపె్టంబర్ 23, 24, 26, 27, 28, అక్టోబర్ 1, 2, 3, 4, 7, 8, 10, 11, 12, 16, 17, 22, 23, 24, 26, 28, 29, 30, 31, నవంబర్ 1, 2, 4, 7, 12, 13, 14, 15, 22, 23, 25, 26, 27 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. శ్రావణం వరకూ ఆగాల్సిందే.. ఈనెల 10 నుంచి గురు మూఢమి. అలాగే 26 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. దీంతో ఆషాఢ మాసం ముగిసే వరకూ వివాహాలు చేసుకునే వారు ఆగాల్సిందే. శ్రావణ మాసమైన జూలై 26 నుంచి బలమైన ముహూర్తాలు ఉన్నాయి. నవంబరు తర్వాత మళ్లీ ముహూర్తాలు లేవు. – గోవింద వఝుల వెంకటరమణ మూర్తి శర్మ, పురోహితుడు, ద్వారకాతిరుమల -
శాతవాహన కళాశాల ఎదుట వైఎస్సార్సీపీ ఆందోళన
సాక్షి, విజయవాడ: శాతవాహన కళాశాల ఎదుట వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి , వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రవిచంద్ర నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో శాతవాహన కాలేజీ భూములు కొట్టేసేందుకు రెండు ముఠాలుగా ఏర్పడ్డారని.. వైఎస్సార్, జగన్ హయాంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదన్నారు.అర్ధరాత్రి కాలేజీను బుల్డోజర్లతో కూల్చేశారు.. దీనికి ఎవరు బాధ్యులు?. 48 గంటలు గడుస్తున్నా.. ఇంతవరకూ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం, విద్యా శాఖ మంత్రి ఏం చేస్తున్నారు?. కాలేజీ కూల్చేస్తుంటే విద్యాశాఖ మంత్రికి పట్టదా?. ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు వినియోగించాలి. విశాఖ, అమరావతిలో రైతుల నుంచి వేల ఎకరాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఎందుకు ఈ కళాశాల భూమిని స్వాధీనం చేసుకోలేకపోతోంది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు క్రమశిక్షణతో ఉండాలని చంద్రబాబు చెబుతున్నారు. మీ ఎమ్మెల్సీ జాతకం.. అర్ధరాత్రి కాలేజీని కూలగొట్టిన వారి జాతకం మీదగ్గర లేదా?’’ అంటూ మల్లాది విష్ణు మండిపడ్డారు.విద్యార్థుల పక్షాన వైఎస్సార్సీపీ: డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డిటీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా బెజవాడలో కోట్లాది రూపాయల భూములు కబ్జాకు గురవుతాయి. కోట్ల విలువైన ఆస్తులు కబ్జా చేసుకోవడానికే ఆలపాటికి ఎమ్మెల్సీ ఇచ్చారా?. పేద విద్యార్ధులు చదువుకునే కాలేజీని కూలగొట్టడం దారుణం. ప్రజలు, విద్యార్థుల పక్షాన మేం నిలుస్తాంలోకేష్.. రెడ్ బుక్ వదిలి.. పాఠ్య పుస్తకాలు అందించు: రవిచంద్రరెండు ముఠాల మధ్య ఆధిపత్యంలో భాగంగా శాతవాహన కాలేజీని కూల్చేశారు. విద్యార్ధుల సర్టిఫికెట్లు, రికార్డులు శిథిలాల కిందే ఉన్నాయి. ఆలపాటి రాజేంద్ర కిడ్నాప్ చేసి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించకున్నాడు. అధికారపార్టీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఈ కాలేజీ భూముల కోసం కొట్టుకుంటున్నారు. తక్షణమే చంద్రబాబు, లోకేష్ జోక్యం చేసుకోవాలి. లోకేష్ రెడ్ బుక్ను వదిలి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించాలి. విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలి. -
మంత్రి లోకేష్ మోసం.. తిరగబడ్డ టీచర్లు
సాక్షి, విశాఖపట్నం: కూటమి సర్కార్పై ఉపాధ్యాయులు తిరగబడ్డారు. లోకేష్కు వ్యతిరేకంగా ఉపాధ్యాయలు రోడ్డెక్కారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో 13 ఉమ్మడి జిల్లాల డీఈవో కార్యాలయాల ముట్టడిని టీచర్లు చేపట్టారు. విశాఖ డీఈవో కార్యాలయం ముట్టడికి కదం తొక్కారు. పోలీసులు భారీగా మోహరించారు. ఎస్జీటీలకు మ్యాన్యూవల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. వెబ్ కౌన్సిలింగ్ వద్దు.. మ్యాన్యూవల్ కౌన్సిలింగ్ ముద్దు అంటూ టీచర్లు నినాదాలు చేశారు. డీఈవో కార్యాలయం ముందు మహిళా టీచర్లు బైఠాయించారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతోంది.టీచర్ల బదిలీలపై కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని ఉపాధ్యాయ సంఘాలు ఖండించాయి. ఎస్జీటీల బదిలీలను ఆన్లైన్లో కాకుండా మాన్యువల్గా చేపడతామని చెప్పి.. ఆన్లైన్ విధానం అమలు చేయడాన్ని తప్పుబడుతూ ఆ సంఘాలు ఆందోళన చేపట్టాయి. శనివారం కౌన్సెలింగ్ జరిగిన ఎంఈఓ కార్యాలయాల ఎదుట నిరసనలకు దిగారు. ఆదివారం కూడా అన్ని జిల్లాల్లో డీఈవో కార్యాలయాలను ముట్టడించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చాయి.ఈ అంశంపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు, విద్యాశాఖ మంత్రికి లేఖలు రాసినా ఎలాంటి సమాధానం ఇవ్వనందున తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన చేపడుతున్నట్టు ప్రకటించింది. వాస్తవానికి గతేడాది సెపె్టంబర్ నుంచి వారం వారం పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి బదిలీలు, పాఠశాలల పునర్ వ్యవస్థీకరణపై విజ్ఞప్తులు తీసుకున్నారు.ఈ క్రమంలో ఈసారి ఉపాధ్యాయ బదిలీలకు చట్టం చేస్తున్నామని, ఏటా ఈ చట్ట ప్రకారమే ఆన్లైన్ బదిలీలు చేపడతామని అధికారులు తెలిపారు. అయితే, సంఖ్యాపరంగా అత్యధిక ప్రాథమిక పాఠశాలలు ఉండటంతో వాటిలో పనిచేస్తున్న ఎస్జీటీలకు ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉన్నందున ఇబ్బందులు తలెత్తుతాయని.. ఎస్జీటీలకు మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ చేపట్టి బదిలీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. అందుకు అధికారులు అంగీకరించినా మార్చిలో చేసిన ఉపాధ్యాయ బదిలీ చట్టం–2025లో మాత్రం ఉపాధ్యాయులందరికీ ఆన్లైన్ కౌన్సెలింగ్ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.అయినప్పటికీ బదిలీ ఉత్తర్వుల్లో మార్పులు చేస్తామని అధికారులు సంఘాలకు హామీ ఇచ్చారు. నాడు తాత్కాలికంగా సమస్య పరిష్కారమైందని భావించినా.. మే నెలల విడుదల చేసిన ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వుల్లో తిరిగి ఆన్లైన్ విధానం ఒక్కటే ఉంటుందని పేర్కొన్నారు. దీంతో గత నెల 16న ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డీఈవో కార్యాలయాల ముట్టడి తలపెట్టింది. మరుసటి రోజు ఎస్జీటీల మాన్యువల్ కౌన్సెలింగ్కు అధికారులు హామీ ఇవ్వడంతో నిరసనను విరమించింది. తాజాగా ఆన్లైన్ కౌన్సెలింగ్ మాత్రమే ఉంటుందని, అందరూ ఎంఈవో కార్యాలయాలకు వచ్చి ఆప్షన్స్ పెట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఉపాధ్యాయ సంఘాలు ఆదివారం కూడా ఆందోళనకు దిగాయి. -
టీడీపీ నేతల బరితెగింపు.. పీఎస్ ఎదుటే వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడి
సాక్షి, అన్నమయ్య: ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగ పాలనలో టీడీపీ కార్యకర్తలు, నేతలు రెచ్చిపోతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లాలో టీడీపీ నాయకులు బరితెగించి పోలీస్ స్టేషన్ ముందే వైఎస్సార్సీపీ నాయకుడు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డిపై హత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలో నాగిరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని పుల్లంపేటలో టీడీపీ నాయకులు బరితెగించారు. పోలీసు స్టేషన్ లోపల నుంచి వచ్చి స్టేషన్ ముందే వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నం చేశారు. పుల్లంపేట టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట శనివారం రాత్రి వైఎస్సార్సీపీ నాయకుడు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డిపై హత్యాయత్నానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో సుదర్శన్ రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు.. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.గొల్లపల్లికి చెందిన సుదర్శన్ రెడ్డికి టీడీపీ వర్గీయులకు మధ్య గతంలో స్థల వివాదం ఉంది. గత మూడు నెలల క్రితం తన చిన్నాయనపై కూడా దాడిచేసినట్లు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాత్రి పోలీసు స్టేషన్ ఎదుట వాకింగ్ చేస్తుండగా ఐదుగురు టీడీపీ నాయకులు తనను చుట్టుముట్టి హత్యాయత్నం చేశారని బాధితుడు నాగిరెడ్డి చెప్పుకొచ్చారు. అప్పుడే మా చిన్నాయన కేసులో న్యాయం జరిగి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులకు నుంచి తనకు ప్రాణహాని ఉందని.. తక్షణమే రక్షణ కల్పించాలంటూ నాగిరెడ్డి.. పోలీసులను కోరారు. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు . శనివారం అర్ధరాత్రి వరకు 88,257 మంది స్వామిని దర్శించుకున్నారు. 45,068 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.68 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 7 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. జూన్ 9 నుంచి 11వ తేదీ వరకు జ్యేష్టాభిషేకంఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు తిరుమలలోని శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం జరుగనుంది.ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు.సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘’అభిద్యేయక అభిషేకం’’ అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు.మొదటిరోజు శ్రీ మయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు. రెండవరోజు ముత్యాల కవచం సమర్పిస్తారు. మూడవరోజు తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని పునః సమర్పిస్తారు.ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం సమయంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారు. -
కొత్త కనెక్షన్లకూ ఛార్జీల బాదుడు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ వినియోగదారులపై రూ.15,485 కోట్ల ఛార్జీల భారాన్ని మోపింది. ఇప్పుడు దీనికి అదనగా కొత్త కనెక్షన్ల ఛార్జీలను పెంచుతూ మరో షాక్ ఇస్తోంది. కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలంటే కొత్త ఛార్జీలు చెల్లించాలి్సందేనంటూ ప్రతిపాదన రూపొందించారు. వీటిని నిర్ణయించేందుకు, విద్యుత్ రెగ్యులేటరీ చట్టంలోని నిబంధనలకు నాలుగో సవరణను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రకటించింది. ఆ చట్టంలో మార్పులు చేస్తూ ముసాయిదాను రూపొందించింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే ఈనెల 23లోగా మండలికి ఈ–మెయిల్ ద్వారా పంపాలని కోరింది. అనంతరం.. ముసాయిదాను ప్రకటిస్తామని, ఇది ప్రకటించాక 21 రోజుల్లో కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని ఏపీఈఆర్సీ వెల్లడించింది.ప్రస్తుత విధానం ఇదీ..విద్యుత్ సర్వీసు అవసరమైనప్పుడు వినియోగదారులు సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)కు దరఖాస్తు చేసుకుంటారు. డిస్కం నుంచి అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలిస్తారు. అప్పటికే ఉన్న విద్యుత్ లైన్ల నుంచి కొత్త సర్వీసు ఇచ్చే ప్రాంతానికి ఎంతదూరం ఉంది?.. దానికెంత విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాలు అవసరమవుతాయని ఒక అంచనా రూపొందిస్తారు. దాని ప్రకారం ఆ ఖర్చులో కొంత మొత్తాన్ని లేదా పూర్తిగానూ చార్జీల రూపంలో చెల్లించాలంటూ వినియోగదారునికి నోటీసు జారీచేస్తారు. దాని ప్రకారం చెల్లించిన తరువాత సర్వీసును మంజూరుచేస్తారు. కానీ, ఇకపై అలా కుదరదు. దరఖాస్తు చేస్తున్నప్పుడే ముందే నిర్ణయించిన ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.కమిషన్కు ఛార్జీలు నిర్దేశించే అధికారంవిద్యుత్ లైన్ ఏర్పాటుకు అయిన ఖర్చుల రికవరీకి సంబంధించి 150 కిలోవాట్లు, అంతకుమించిన లోడ్కు కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు డిస్కంలు వసూలుచేయాల్సిన ఛార్జీలను నిర్దేశించే అధికారాన్ని కమిషన్కు కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ కట్టబెట్టింది. ఇందుకు అనుగుణంగా 150 కిలోవాట్ల వరకు కొత్త కనెక్షన్ ఇచ్చేందుకు డిస్కంలు వసూలుచేస్తున్న ఛార్జీలను పరిగణనలోకి తీసుకుని ముసాయిదా మార్గదర్శకాలను కమిషన్ ప్రతిపాదించింది. డిస్కంల నెట్వర్క్ నుంచి కిలోమీటర్ పరిధి.. 150 కిలోవాట్ల లోడ్ వరకు (కొత్త కనెక్షన్/ప్రస్తుతమున్న సర్వీస్కు అదనపు లోడ్ కింద) 2025–2026 ఆర్థిక ఏడాదిలో డెవలప్మెంట్ ఛార్జీలను కమిషన్ నిర్దేశించింది.లోడు 75 కిలోవాట్లకు మించితే అంతే..ఇక వినియోగదారుడు తన లోడ్ 75 కిలోవాట్లకు మించితే వారంతట వారే 150 కిలోవాట్ల వరకు ఎల్టీగానీ హెచ్టీగానీ ఎంచుకుని డెవలప్మెంట్ ఛార్జీలను చెల్లించాలి. ఈ ఛార్జీలతో పాటు అప్లికేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ను రెగ్యులేటరీ నిబంధనల మేరకు చెల్లించాలి. 2026–2027 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త, అదనపు లోడ్కు సంబంధించిన సర్వీస్లైన్ ఛార్జీల షెడ్యూల్ను డిస్కంలు కమిషన్కు సమర్పించవచ్చు. డిస్కంల నుంచి ఎలాంటి ప్రతిపాదనలూ రాకపోతే కొత్త ఛార్జీలను ఖరారు చేసేంత వరకూ 2025–2026 చార్జీలనే కమిషన్ పరిగణలోకి తీసుకుంటుంది. -
11న పొదిలికి వైఎస్ జగన్
పొదిలి రూరల్: పొగాకు రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 11న ప్రకాశం జిల్లా పొదిలికి రానున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి తెలిపారు. శనివారం పొదిలి–దర్శి రోడ్డులోని ఎస్ఆర్ పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ స్థలాన్ని వైఎస్సార్సీపీ ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, అన్నా కృష్ణచైతన్యతో కలిసి పరిశీలించారు.అనంతరం శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ గత నెల 28న పొదిలి పొగాకు బోర్డును వైఎస్ జగన్ సందర్శించాల్సి ఉండగా, వాతావరణ పరిస్థితుల వల్ల వాయిదా పడిందని పేర్కొన్నారు. ఈ నెల 11న కార్యక్రమం ఖరారైనట్లు చెప్పారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు పొదిలి పొగాకు బోర్డుకు వైఎస్ జగన్ చేరుకుంటారన్నారు. వైఎస్ జగన్ రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి కష్టాలు తెలుసుకుని భరోసా కల్పిస్తారని వివరించారు.అనంతరం మీడియా సమావేశం నిర్వహిస్తారని వెల్లడించారు. హెలిప్యాడ్ ప్రాంతంలో చేపట్టాల్సిన పనులు వేగవంతం చేయాలని బూచేపల్లి సిబ్బందికి సూచించారు. వారి వెంట వైఎస్సార్సీపీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, కేవీ రమణారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, వైఎం ప్రసాద్రెడ్డి, వై.వెంకటేశ్వరరావు, కె.నరసింహారావు తదితరులు ఉన్నారు. -
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారిందని.. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలే అందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూటమి ప్రభుత్వం చెప్పేదానికి పూర్తి విరుద్ధంగా కాగ్ నివేదికలు వాస్తవాలను వెల్లడిస్తున్నాయని చెప్పారు. ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలు, కాగ్ నివేదికల్లో వాస్తవాలను ఉటంకిస్తూ శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కూటమి సర్కార్ చెబుతున్న అబద్ధాలను కడిగి పారేశారు. ఇంకా ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..⇒కాగ్ 2025 ఏప్రిల్కు సంబంధించి కీలక సూచికలను వెల్లడించింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందన్నది స్పష్టమవుతోంది. జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 2025 ఏప్రిల్లో నికర జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా రూ.3,354 కోట్లు ఉన్నట్లుగా మే 1న ప్రభుత్వం పత్రిక ప్రకటన విడుదల చేసింది. ⇒ కానీ.. కాగ్ నివేదికలో వాస్తవ లెక్కలను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్క అబద్ధమని తేల్చింది. 2024 ఏప్రిల్తో పోల్చితే, 2025 ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వ జీఎస్టీ ఆదాయం ఏకంగా 24.20 శాతం తగ్గింది. కాగ్ వాస్తవాలను బట్టబయలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించింది. ఏప్రిల్కు సంబంధించిన జీఎస్టీ ఆదాయాలు చెప్పకుండా, మేలో జీఎస్టీ ఆదాయాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయంటూ రాష్ట్ర ప్రభుత్వం మరో పత్రికా ప్రకటనను విడుదల చేసింది.⇒ కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్కు సంబంధించి ఐజీఎస్టీ ముందస్తు సర్దుబాట్ల కారణంగా రాష్ట్ర జీఎస్టీ ఆదాయాలు రూ.796 కోట్లు తగ్గాయని ఆ పత్రికా ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. ఐజీఎస్టీ ముందస్తు సర్దుబాట్లను మైనర్ హెడ్ 110 కింద లెక్కిస్తారు. ప్రభుత్వ ఖాతాల మేజర్ హెడ్ 0006 కింద ఎస్జీఎస్టీని లెక్కిస్తారు. ఇది ఒక సాధారణ ప్రక్రియ. ఈ సర్దుబాట్లన్నింటినీ లెక్కించిన తర్వాతే నికర జీఎస్టీ ఆదాయాలను లెక్కకడతారు.⇒ 2025 ఏప్రిల్కు సంబంధించి నికర జీఎస్టీ ఆదాయం రూ.3,354 కోట్లుగా ఉన్నట్లు మే 1న పత్రికా ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం.. ఇపుడు సర్దుబాట్లు కారణంగా రూ.796 కోట్ల ఆదాయం తగ్గిందని చెబుతోంది. కానీ, జీఎస్టీ ఆదాయాల గురించి కాగ్ నిజాలను వెలుగులోకి తేగానే.. దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు చేస్తోంది. టీడీపీ ప్రభుత్వం చెప్పేదానికి పూర్తి విరుద్ధంగా కాగ్ నివేదికలు వాస్తవాలను వెల్లడిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దగమనంలో ఉంది. గతేడాది ఏప్రిల్తో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్లో పన్ను ఆదాయాలు 12.21 శాతం తగ్గాయి. పన్నేతర ఆదాయాలు 22.01 శాతం తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం 12.76 శాతం తగ్గింది. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరింత ఆందోళన కలిగించే అంశం. -
టూరు.. ఒక్కో తీరు
పర్యాటకుల ఆసక్తులు మారాయి. పర్యటనల ధోరణి మారింది. యువత సోలో జర్నీ సో బెటరూ అంటున్నారు. కొందరు సోషల్ మీడియా వీడియోలూ, వెబ్ సిరీస్లూ, సినిమాలూ చూసి అందులోని ప్రాంతాలకు ట్రిప్పులకు చెక్కేస్తున్నారు. మరికొందరు సపరివార సమేతంగా విహార యాత్రలు చేస్తున్నారు. ఇంకొందరు క్రికెట్ మ్యాచ్లను బట్టి తమ టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు.. యుద్ధభూముల్లో స్ఫూర్తి పొందుతున్నారు.. నిశీధిలో నింగిలోని చుక్కలను లెక్కపెట్టేస్తున్నారు.. ఇది నయా పర్యాటక ముఖచిత్రం.‘‘పాతాళ్లోక్ సీజన్ 2’.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన వెబ్ సిరీస్. ఈశాన్య భారతంలోని నాగాలాండ్లో ఎక్కువ భాగం షూట్ చేశారు. ఒక సినిమా లేదా వెబ్ సిరీస్ ఇంత స్థాయిలో అక్కడ షూట్ జరగడం ఇదే మొదటిసారి. అక్కడి పచ్చని కొండ ప్రాంతాలు, ఇళ్లు, దట్టమైన వెదురు అడవులు.. అన్నీ చూపరులను కట్టిపడేస్తాయి. అది చూశాక నాకు నాగాలాండ్ వెళ్లాలనిపించింది.స్నేహితులతో వెళ్లి వచ్చేశా’’ అంటాడు హైదరాబాద్కి చెందిన కె.ఉమావెంకట్. ప్రముఖ ప్రైవేటు సంస్థలో పనిచేసే అతడు వారాంతాల్లో కూడా స్నేహితులతో వరంగల్ వంటి చుట్టుపక్కల ప్రాంతాలకు సరదాగా వెళ్లి వచ్చేస్తుంటాడు. ‘ఉద్యోగంలో చేరిన తరవాత కొత్త స్నేహితులు వచ్చారు. వీళ్లే నాకు సహచరులు, స్నేహితులు’ అంటాడు. ఇలాంటి వాళ్లనే ఇప్పుడు ఫ్రొలీగ్స్ అని పిలుస్తున్నారు. అంటే ఫ్రెండ్స్ అయిన కొలీగ్స్ అన్నమాట. ఇలా సహచర ఉద్యోగ స్నేహితులతో షికార్లకు వెళ్లడం ఇటీవలికాలంలో పెరిగింది.దేశభక్తి.. ప్రకృతి సౌందర్యం..యుద్ధభూమి అంటే వీరత్వానికి ప్రతీక. సైనికుల ధైర్యసాహసాలకు వేదిక. అలాంటి రణభూమికి కూడా పర్యటనలకు వెళ్లేందుకు ఇప్పుడు ఇష్టపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘భారత రణభూమి దర్శన్’ పేరిట ప ర్యాటకాన్ని ప్రోత్సహించే కార్యక్రమం చేపట్టింది. జమ్మూ కశ్మీర్, లఢాక్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, అరు ణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్లలో 77 ప్రదేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. భారత సాయుధ దళాల త్యా గాలను ఇవి గుర్తుచేసి, సందర్శకులను రోమాంఛితం చేస్తాయి. ఇవి దేశభక్తి, ప్రకృతి సౌందర్యాల కలబోతలు.తారాలోకం చూస్తూ..రాత్రిపూట ఖగోళ రహస్యాలను, చందమామ, నక్షత్రాల సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. ఇది మానసిక ప్రశాంతతను ఇస్తోందని వారు చెబుతున్నారు. ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ‘ స్కైస్కానర్’ నిర్వహించిన సర్వేలో.. రాత్రిపూట ఆకాశాన్ని ఫొటోలు తీసేందుకు ఇష్టపడి పర్యటనలకు వెళ్లినవారు 56% మంది. రాత్రిపూట నక్షత్రాలు, చంద్రుడు ఉండగా కొండప్రాంతాల్లో నిద్రించేందుకు వెళ్లినవారు 53% మంది.సినిమాలు, వెబ్సిరీస్లు చూసి..సోషల్ మీడియాలో వచ్చే రీల్స్, వీడియోలు సామాన్యులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో అనేక ప్రదేశాల గురించి చెబుతున్నారు. అలాగే నెట్ఫ్లిక్స్, ప్రైమ్, జీ5, సోనీ లివ్ వంటి వేదికల్లో వస్తున్న వెబ్ సిరీస్లు, సినిమాలు కూడా పర్యటనలు చేయాలను కునేవారిని ప్రభావితం చేస్తున్నాయి. ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు థామస్ కుక్, ఎస్ఓటీసీ వి డుదల చేసిన ‘ఇండియా హాలిడే రిపోర్ట్ 2025’ సర్వేలో.. ఇలాంటి ప్రాంతాలకు పర్యటనలకు వెళ్తున్నామని 60 శాతం మంది చెప్పడం విశేషం. ఇలా వెళ్లేవారిలో యువతే∙అధికం.సపరివార సమేతంగా..యువతరం తమ తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మ / నాన్నమ్మలతో కలిసి విహార యాత్రలకు వెళ్లాలని అనుకుంటున్నారు. మంచి ఉద్యోగం, 5–6 అంకెల జీతం.. వీరిని ఇందుకు ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబంలోని పెద్దలు గతంలో ఎక్కువ పర్యటనలు చేయకపోవడం కూడా యువతను ఈ నిర్ణ యానికి ప్రేరేపిస్తోంది. దీంతో సపరివార సమే తంగా విహారయాత్రలు చేస్తున్నారు. ‘ఇండి యా హాలిడే రిపోర్ట్ 2025’ ప్రకారం దాదాపు 65% ఇలా పర్యటనలకు వెళ్తున్నారు.క్రికెట్ ప్రేమికులూ..క్రికెట్ను ఇష్టపడేవారు క్రికెట్ మ్యాచ్ల షెడ్యూల్ ప్రకా రం టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. టీ20, వన్డే వంటి మ్యాచ్లు జరిగే చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటిస్తూ.. రకరకాల స్థానిక రుచులను ఆస్వాదిస్తు న్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో మ్యాచ్లను ఇలా చాలామంది చూశారట. ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ స్కై స్కానర్ ‘పిచ్ పర్ఫెక్ట్ జర్నీస్’ ప్రకారం.. 48% మంది మ్యాచ్కి కనీసం 2 నెలల ముందే ఇలా ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నారు. వీరిలో స్నేహితులతో వెళ్లినవారు 74% కాగా, కుటుంబంతో వెళ్లినవారు 59%. భార్య లేదా ప్రియురాలు / సహజీ వనం చేస్తున్నవారితో వెళ్లినవారు 46 శాతం.మిమూనింగ్.. సోలో పర్యటనహనీమూన్ వినే ఉంటారు. అంటే జీవిత భాగస్వామితో వివాహానంతరం చేసే విహార యాత్ర. మి మూనింగ్ అంటే.. ఒక్కరే వెళ్లడం. ప్రభాస్ నటించిన ‘చక్రం’ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి చెప్పినట్టు ‘తనలో తామే రమించడం’. ఒక్కరే ఆ అనుభూతిని ఆస్వాదించడం. ట్రెకింగ్, వాటర్ రాఫ్టింగ్ వంటి సాహస యాత్రలు చేయడం. ఎలాంటి బాదరబందీ లేకుండా ఒక్కరే.. ‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది’ అనుకుంటూ ఎక్కడికైనా వెళ్లిపోవడం, ఎంజాయ్ చేయడం. ఇలా వెళ్లి స్థానికతను ఆస్వాదిస్తున్నారు.ఆయా ప్రాంతాల్లో స్థానిక పండుగలూ, కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. స్థానిక రుచులను టేస్ట్ చేస్తున్నారు. భారత్ సహా 7 దేశాల్లో నిర్వహించిన ‘అమెరికన్ ఎక్స్ప్రెస్ 2024 గ్లోబల్ ట్రావెల్ ట్రెండ్స్’ రిపోర్ట్ ప్రకారం.. 84 శాతం మంది మిమూనింగ్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచ సగటు 66 శాతం కంటే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం. భారత్ సహా 13 దేశాల్లోని 13 వేల మందిని 2024 జూన్లో సర్వే చేసిన రిపోర్టు ‘హిల్టన్ 2025 ట్రెండ్స్’. దీని ప్రకారం సోలో పర్యటనలు చేస్తున్నవారు 47 శాతం మంది. వీరిలో మిలీనియల్స్ (1981–96 మధ్య పుట్టినవారు) 51 శాతం కాగా, జనరేషన్ జెడ్ (1997–2012 మధ్య పుట్టినవారు) 55 శాతం కావడం విశేషం. -
మధ్యతరగతి.. అధోగతి
మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారింది. ఆర్థిక అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం చేకూరకపోవడంతో అప్పులబాట పడుతున్నారు. ఇదే అదనుగా పల్లెల్లో మైక్రో ఫైనాన్స్ వ్యాపారం కోరలు చాచింది. రూ.5 నుంచి రూ.10 వరకు వడ్డీ వ్యాపారం ఇష్టారాజ్యంగా సాగుతోంది.కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాది గడిచినా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకపోగా.. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో మధ్యతరగతి వర్గాలు సతమతమవుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి నెలా సంక్షేమ పథకాల రూపంలో బ్యాంకు ఖాతాల్లో నగదు జమకాగా.. ప్రజలు అప్పుల వైపు వెళ్లని పరిస్థితి. కూటమి ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత సామాన్యుడి కష్టాల తారాస్థాయికి చేరాయి. ఒకవైపు మండుతున్న నిత్యావసరాల ధరలు, మరోవైపు ప్రభుత్వ చేయూత లేకపోవడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో సూపర్సిక్స్ అంటూ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నాయకులు చేతులెత్తేశారు. తల్లికి వందనం అందించకుండా ఒక విద్యా సంవత్సరం, అన్నదాత సుఖీభవ సాయం ఇవ్వకుండా ఖరీఫ్, రబీ సీజన్లు గడిపేశారు. – సాక్షి ప్రతినిధి, ఏలూరుగత ప్రభుత్వంలో ఏటా రూ.1,850 కోట్లకు పైగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా రూ.1,850 కోట్లకు పైగా నగదు ఏలూరు జిల్లాలో లక్షలాది మంది బ్యాంకు ఖాతాల్లో జమకాగా.. నేడు ఒక్క రూపాయి కూడా జమ కాని పరిస్థితి. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ పథకాలకు పేర్లు, లబ్ధి నగదు మొత్తాన్ని మార్చి ప్రకటించినా అమలు చేయకపోవడం గమనార్హం. ఈ లెక్కన ఏలూరు జిల్లాలో రూ.2 వేల కోట్లకు పైగా సంక్షేమ పథకాల నగదు ప్రజల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. తగ్గిన కొనుగోలు శక్తి మార్కెట్లో నగదు లావాదేవీలతో పాటు ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గడంతో వ్యాపారాలు మందగించాయి. గత ప్రభుత్వ హయాంలో సంక్రాంతికి అ మ్మఒడి పథకం కింద ఏలూరు జిల్లాలో 1,78,214 మంది తల్లుల ఖాతాల్లో రూ.267.32 కోట్లు నగదు జమైతే కేవలం పండుగ రోజుల్లోనే జిల్లాలోనే రూ.150 కోట్ల నుంచి రూ.170 కోట్ల టర్నోవర్ జరిగినట్టు అంచనా. అయితే ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో 50 శాతం కూడా కొనుగోళ్లు లేవని వ్యాపార వర్గాలు అంటున్నాయి. గతంలో డీబీటీ పథకాలు కావడంతో మార్కెట్లో నగదు రోటేషన్లో ఉండటం, ప్రజల్లో కొనుగోలు శక్తి ఉండటంతో విక్రయాలు బాగా జరిగి వ్యాపారాలు కళకళలాడటంతో జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికీ ఆదాయం సమకూరేది. ఈ ఏడాది మాత్రం జీఎస్టీ మొదలు అన్ని లావాదేవీలు తగ్గిపోయాయి. కొన్ని రోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా ఇప్పటికీ తల్లికి వందనంపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. అప్పులతో ఇబ్బందులు గతంలో మా కుటుంబానికి మూడు పథకాల కింద ఏడాదికి రూ.50 వేల వరకూ వచ్చేవి. వాటితో అప్పులు తీర్చడంతో పాటు కొంత పొదుపు చేసుకునే వాళ్లం. ఇంట్లో అవసరమైన సామగ్రిని నెలవారీ వాయిదా పద్ధతిలో తీసుకుని పథకం డబ్బులతో చెల్లించేవాళ్లం. ఇప్పుడు పొదుపు మాట అటుంచి చేసిన అప్పులు తీర్చడానికే ఇబ్బందులు పడుతున్నాం. – గొంతిన ఝాన్సీలక్ష్మి , గృహిణి అవస్థలు పడుతున్నాం కుటుంబ అవసరాల కోసం గతంలో లేదనకుండా అప్పు ఇచ్చేవారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధితో అప్పులు తీర్చేవాళ్లం. ఇప్పుడు పథకాలు అమలు చేయకపోవడంతో మాకు ఆదాయం వచ్చే దారి లేదని గ్రహించి అప్పులు ఇచ్చేవాళ్లు నిరాకరిస్తున్నారు. అవసరానికి అప్పు పుట్టక అవస్థలు పడుతున్నాం. – పోలిశెట్టి ఈశ్వరి, ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయురాలు నమ్మి మోసపోయాం ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు నమ్మి మోసపోయాం. మాలాంటి మహిళలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న పథకాలు ఒక్కటి కూడా అమలు చేయకపోవడం బాధాకరం. రాష్ట్రంలోని మహిళల ఆవేదనను గ్రహించి ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అమలు చేస్తారని ఆశిస్తున్నాం. – కె.కనకదుర్గ, చిగురుకోట, ముదినేపల్లి మండలంపథకాలన్నీ ఇవ్వాలి గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలన్నీ మరలా ఇప్పుడు కూడా ఇచ్చేలా చూడాలి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అందించిన పథకాలు పేదలకు ఎంతో వెసులుబాటు కలిగించేవి. అవి నిలిపివేయడంతో చాలా మంది పేదలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తిరిగి పథకాలన్నీ ప్రవేశపెట్టాలి. – నల్గొండ నాంచారమ్మ, మండవల్లి -
బీసీ సంక్షేమ శాఖలో బదిలీ ‘బేరం’
సాక్షి, అమరావతి: సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంతో దాదాపు అన్ని శాఖల్లో పైరవీలు ఊపందుకున్నాయి. పైరవీలలో బీసీ సంక్షేమ శాఖ ఓ అడుగు ముందుకేసి తన రూటే సెప‘రేటు’ అని అంటోంది. ఉద్యోగుల బదిలీల గడువు ఈ నెల 9తో ముగియనుండటంతో నిబంధనలు బేఖాతరు చేస్తూ గురువారం జారీ చేసిన సర్క్యులర్ వివాదాస్పదంగా మారింది. తిరుపతి కేంద్రంగా రెండు రోజుల క్రితం జరిగిన బేరసారాల ‘డీల్’ నేపథ్యంలోనే ఆ సర్క్యులర్ జారీ చేశారని, ఇది ముమ్మాటికీ బదిలీ నిబంధనలకు విరుద్ధమని ఉద్యోగులు చెబుతున్నారు. ఇటీవల డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా జిల్లా బీసీ సంక్షేమ అధికారులు/సాధికారత అధికారులకు అడ్డగోలుగా అడ్హాక్ పదోన్నతులు కల్పించిన బీసీ సంక్షేమ శాఖ ఇప్పుడు సాధారణ బదిలీల్లోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం విమర్శల పాలవుతోంది. మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయంటే.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సాధారణ బదిలీలకు 2022 ఏప్రిల్ 8న మార్గదర్శకాలతో కూడిన జీవో 23ను రాష్ట్ర ఆరి్థక శాఖ జారీ చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి/ఉపాధ్యాయుడు ఒకేచోట (నగరం, పట్టణం, గ్రామం) పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుని బదిలీలు చేపట్టాలి. అదే ప్రాంతంలో స్థానిక బదిలీలు చేస్తే సంబంధిత కార్యాలయం లేదా సంస్థలో పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఈ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన వారి బదిలీకి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు రాష్ట్రంలో ఏ శాఖలోనూ లేనివిధంగా ఒక్క బీసీ సంక్షేమ శాఖలో తాజాగా జారీ చేసిన సర్క్యులర్ (మెమో నంబర్ ఎ/1210/2025) ఆరి్థక శాఖ జారీ చేసిన నిబంధనలకు విరుద్ధమని ఉద్యోగులు చెబుతున్నారు. జిల్లాల పునర్ర్విభజనతో 2022 ఏప్రిల్ 4న కొత్త జిల్లాలకు పాత జిల్లాల నుంచి కేటాయించిన ఉద్యోగులు ఉమ్మడి జిల్లా (పాత జిల్లా) సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకుని బదిలీల్లో అవకాశం ఇవ్వాలన్నది ఆ ఉత్తర్వుల సారాంశం. 2022 ఏప్రిల్ 3వ తేదీ వరకు అక్కడే కొనసాగిన వారి సర్వీసును కూడా లెక్కగట్టి బదిలీకి వెసులుబాటు ఇవ్వడం తొందరపాటు చర్య అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్ల నిబంధన.. మూడేళ్లకే బదిలీ రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్ వ్యవస్థీకరించిన నేపథ్యంలో ఆర్డర్ టు సర్వ్పై కొత్త జిల్లాలకు 2022 ఏప్రిల్లో ఉద్యోగులను కేటాయించారు. ఆ లెక్కన ఏదైనా ప్రాంతంలో ఆప్పటినుంచి పనిచేస్తున్న వారి సర్వీసు మూడేళ్లు మాత్రమే అవుతుంది. ఉదాహరణకు కొత్తగా ఏర్పడిన ఎనీ్టఆర్ జిల్లాకు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఓ ఉద్యోగిని కేటాయిస్తే.. ఆ ఉద్యోగి సర్వీసు ప్రస్తుతం మూడేళ్లు మాత్రమే ఉంటుంది. వారికి బదిలీల్లో అవకాశం ఉండదు. పునర్ వ్యవస్థీకరణకు ముందు పాత కృష్ణా జిల్లాలో పనిచేసి, పునర్ వ్యవస్థీకరణ తరువాత కూడా పనిచేస్తున్న ఉద్యోగికి మాత్రం ఐదేళ్ల సర్వీసు పూర్తవుతుంది. ఒకేచోట ఐదేళ్లు సర్వీసు ఉన్న వారిని బదిలీ చేయాలనే నిబంధనను బేఖాతరు చేస్తూ.. కొత్తగా ఏర్పడిన జిల్లాలో పనిచేసిన ఉద్యోగుల పాత సర్వీసును కూడా కలిపి బదిలీ అవకాశం ఇవ్వడానికి పెద్దఎత్తున పైరవీలు సాగినట్టు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో బదిలీ చేయాల్సి వచి్చనా.. వారికి ప్రత్యామ్నాయం (మ్యూచువల్)గా వేరొక ఉద్యోగి ఇష్టపడితేనే బదిలీ చేయాలి. అవేమీ పట్టించుకోకుండా పాత జిల్లా సర్వీసును కొత్త జిల్లా సర్వీసుకు కలిపి ఐదేళ్లు ఉంటే బదిలీ చేయాలని సర్క్యులర్ ఇవ్వడం ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ (రాష్ట్రపతి ఉత్తర్వుల)కు వ్యతిరేకమని ఉద్యోగులు చెబుతున్నారు. ఉమ్మడి (పాత) జిల్లాలతో సంబంధం లేకుండా కొత్త జిల్లాలను కూడా జిల్లాలుగానే పరిగణించి స్టేషన్ సీనియారిటీని విడివిడిగా లెక్కించాలనే నిబంధనను కాదని, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా బీసీ సంక్షేమ శాఖ మెమో జారీ చేయడం వెనుక తిరుపతి జిల్లాకు చెందిన ఒక అధికారి కీలకపాత్ర పోషించినట్టు సమాచారం. ముందుగానే బేరసారాలు కొనసాగించి.. ఒప్పందాలు కుదుర్చుకున్న తరువాతే మెమో జారీ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
శ్రుతి తప్పిన రుతురాగం
రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. వాతావరణ సీజన్లు పూర్తిగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మండు వేసవిలో భారీ వర్షాలు కురిసి వాతావరణం చల్లబడగా.. వర్షాల సీజన్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గత నెలాఖరుకే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి అన్నిచోట్లకు విస్తరించినా.. ఆ తర్వాత పూర్తిస్థాయిలో మందగించాయి. దీంతో వారం రోజులుగా రాష్ట్రమంతటా ఎండలు మండిపోతున్నాయి.విజయవాడ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, ఏలూరు, విజయనగరం, పార్వతీపురం మన్యం వంటి కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీలు నమోదవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు వాస్తవ ఉష్ణోగ్రత కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది. విజయవాడలో శనివారం 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. 44 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రభావం కనిపించింది. ఉదయం నుంచి రాత్రి వరకూ వేడి వాతావరణం ఉండటంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రోహిణీ కార్తె కావడంతో ఎండల తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటోంది. 15 రోజుల క్రితం వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండాల్సిన సమయంలో భారీ వర్షాలు కురిశాయి. –సాక్షి, అమరావతిసీజన్లు ఇలా మారాయిసాధారణంగా మార్చి నుంచి మే నెలాఖరు వరకూ వేసవి సీజన్. జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ వర్షాకాలం ఉంటుంది. కానీ.. ఈ ఏడాది సీజన్లు తారుమారయ్యాయి. మే నెలలో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. కర్నూలు, కడప, అనంతపురం, విజయవాడ, గుంటూరు, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి వేసవి అంతా వర్షాకాలంలా మారిపోయింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా తొలకరి వర్షాలు కురవడం లేదు. ఎండలు తగ్గాల్సిన జూన్లో మండిపోతోంది. కోస్తా ప్రాంతాల్లో వీచే గాలుల్లో తేమ శాతం తక్కువగా ఉండటంతో నమోదైన ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. వాతావరణ మార్పులతో అస్థిరంగా రుతుపవనాలుగ్లోబల్ వారి్మంగ్ వల్ల వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులు రుతుపవనాల సమయాన్ని, తీవ్రతను అస్థిరపరచడమే దీనికి కారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఒకటి, రెండు డిగ్రీలు పెరగడంతో తేమ స్థాయిలు పెరుగుతూ వర్షాలను అస్థిరపరుస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల అకాల వర్షాలకు కారణమవుతుండగా.. వేడి గాలులు, తక్కువ వాయు ప్రవాహం ఎండల తీవ్రతను పెంచుతున్నట్టు చెబుతున్నారు.జూన్ నెలాఖరు వరకు ఎండలుముందుగానే వచ్చిన రుతు పవనాలు ప్రస్తుతం మందగించాయి. నాలుగు రోజులుగా వాటిలో ఎలాంటి కదలిక లేదని వాతావరణ శాఖ తెలిపింది. వాటిని బలపరిచే ఉపరితల ఆవర్తనాలు లేకపోవడంతో స్థిరంగా ఉన్నచోటే ఉండిపోయాయి. జూన్ 15 తర్వాత కొద్దిగా మార్పు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఏదైనా జూన్ మధ్య నుంచి జూన్ చివరి వారం వరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. జూలై మొదటి వారం నుంచి వర్షాలు స్థిరంగా కురిసే అవకాశం ఉందని.. అప్పటివరకూ ఎండల తీవ్రత ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
ఈఫిల్ కన్నా ఎత్తైన వంతెనపై.. తెలుగుతేజం
తెనాలి: దేశానికి గర్వ కారణంగా నిలిచిన చినాబ్ రైల్వే వంతెన నిర్మాణంలో రాష్ట్రానికి చెందిన మహిళా ఇంజనీర్, ప్రొఫెసర్ మాధవీలత కీలక పాత్ర పోషించారు. ఈఫిల్ టవర్కన్నా 35 మీటర్ల ఎత్తైన ఈ ఇంజనీరింగ్ అద్భుత ‘వంతెన’ను ప్రధాని మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆర్చి బ్రిడ్జిగా చరిత్రకెక్కిన ఈ అద్భుత నిర్మాణంలో తన పాత్ర ఉండడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని ప్రొఫెసర్ మాధవీలత పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఉపకరించే ప్రాజెక్టులో 17 ఏళ్లపాటు తన భాగస్వామ్యం ఉండటం సంతృప్తికరంగా ఉందని అన్నారు. ఆమె శనివారం ఫోన్లో తన సంతోషాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే.. అవకాశం ఇలా వచ్చింది... రీసీ జిల్లా బాక్కల్ దగ్గర చినాబ్ నదిపై నిర్మించిన ఆర్చి బ్రిడ్జి నిర్మాణ పనులను కొంకణ్ రైల్వేస్ ‘ఆఫ్కాన్స్’ సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ జియో టెక్నికల్ కన్సల్టెంటుగా నాకు, ఈ వంతెన నిర్మాణంలో భాగం పంచుకునే అవకాశం లభించింది. 2004లో ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేసినప్పటి నుంచి ఇదే ప్రాజెక్టులో ఉన్నా. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ప్రొఫెసర్గా పనిచేశాను. అక్కడే సెంటర్ ఫర్ సస్టెయినబుల్ టెక్నాలజీస్ విభాగానికి చైర్పర్సన్గా సైన్స్ను, టెక్నాలజీని గ్రామీణాభివృద్ధికి చేరువ చేసే ప్రాజెక్టులకు నాయకత్వం వహించాను. ఐఐటీ మద్రాస్లో పీహెచ్డీ చేశాక, బెంగళూరులోని ఐఐఎస్సీలో ప్రొఫెసర్ సీతారాం ఆధ్వర్యంలో రాక్ మెకానిక్స్లో పోస్ట్ డాక్టోరల్ కొనసాగించాను. రాక్ మెకానిక్స్లో ఉన్న అనుభవమే నన్ను ఈ ప్రాజెక్టులో భాగస్వామిని చేసింది. కష్టాన్ని సవాలుగా తీసుకుని... నిజానికి చినాబ్ నదిపై బ్రిడ్జిని రెండు కొండల మధ్య నిర్మించటానికి ఇంజినీరింగ్ డిజైన్ పెద్ద సవాలుగా మారింది. అక్కడి రాళ్లను పరిశోధించి, అధ్యయనం చేశాం. పటిష్టమైన వాలు స్థిరీకరణ ప్రణాళికను రూపొందించి, అమలును నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చాను. నేను చేసిన విశ్లేషణ, సంకేతాలను విదేశీ నిపుణులు తనిఖీలు చేసి ఆమోదించటంతో బ్రిడ్జి నిర్మాణం కొనసాగింది. ఈ రైలు మార్గంలో నిర్మించిన కొన్ని సొరంగాల పనుల్లోనూ పాల్గొన్నాను. మొదట్లో ఒక కొండ నుంచి మరో కొండకు వెళ్లటానికి మార్గం కూడా లేదు. పడవలో ప్రయాణించాల్సి వచ్చింది. 17 ఏళ్లు నిరంతర శ్రమ, పట్టుదలతో ప్రపంచ అద్భుతం ఆవిష్కృతమైంది. సాధారణ రైతు కుటుంబం నేపథ్యం ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు నా సొంతూరు. సాధారణ రైతు కుటుంబం. తల్లిదండ్రులు అన్నపూర్ణమ్మ, వెంకారెడ్డి. కాకినాడలో ఇంజినీరింగ్ చేశాను. మా ఊరు నుంచి ‘తొలి ఇంజినీరు’ అని అనిపించుకున్నాను. బాపట్ల జిల్లా మోదుకూరు గ్రామానికి చెందిన హరిప్రసాద్రెడ్డితో వివాహమైంది. స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా భారత ప్రభుత్వం సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్ట్, మేనేజ్మెంట్ విభాగాల్లో జాతీయస్థాయిలో అత్యుత్తమ సేవలందించిన 75 మంది మహిళల వివరాలతో తీసుకొచి్చన ‘షి ఈజ్ 75’ పుస్తకంలో నాకు కూడా స్థానం కల్పించారు. ఈ ప్రాజెక్టుతో అందిన ప్రతిష్టాత్మక గౌరవం ఇది. -
ఏపీ సచివాలయ ఉద్యోగాల పేరిట రూ. 53లక్షలు వసూలు
విజయనగరం క్రైమ్: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి రూ.53 లక్షలు వసూలు చేసిన ముఠాలోని ఐదుగురు సభ్యులను విజయనగరం వన్టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు కథనం ప్రకారం విజయనగరంలోని ప్రదీప్నగర్కు చెందిన నిందితుడు కె.సాయివెంకట్ సుజిత్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని తన ఫేస్బుక్లో పోస్టు పెట్టాడు. దీన్ని చూసిన పలు ప్రాంతాలకు చెందిన ఏడుగురు ఆయనను సంప్రదించారు. వారి నుంచి రూ.53 లక్షలు వసూలు చేశాడు. నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేసి విజయవాడలో నెల రోజులు ఉంచాడు. తరువాత సమాచారం వస్తుందని అప్పుడు విధుల్లో చేరవచ్చని వెనక్కి పంపేశాడు. ఎంతకీ సమాచారం రాకపోవడంతో విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన వినోద్ పోలీసులను ఆశ్రయించాడు. వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముమ్మరంగా దర్యాప్తు చేపట్టి శనివారం సుజిత్తో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారు. మిగిలిన నలుగురిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ చెప్పారు. వారి నుంచి రూ.6లక్షలు స్వా«దీనం చేసుకున్నారు. -
డయాఫ్రం వాల్ పనులు 'డిజైన్కు విరుద్ధం'
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) గ్యాప్–2లో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్కు విరుద్ధంగా డయా ఫ్రం వాల్ (పునాది) పనులు చేస్తుండటాన్ని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తీవ్రంగా ఆక్షేపించింది. డయా ఫ్రం వాల్ను 1.5 మీటర్ల మందంతో నిర్మించేలా డిజైన్ను ఆమోదిస్తే.. క్షేత్ర స్థాయిలో 0.9 మీటర్ల మందంతో బావర్ సంస్థ నిర్మిస్తోందని ఎత్తి చూపింది. మందం తగ్గించటంపై తక్షణమే సమీక్షించి.. తగిన నిర్ణయం తీసుకోవాలని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)కి సూచించింది. డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగిస్తున్న టీ–16 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంలో నీటి శాతం అధికంగా ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణుల బృందం గుర్తించింది. ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం 32 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నాణ్యంగా ఉంటుందని.. కానీ డయాఫ్రం వాల్లో వినియోగిస్తున్న కాంక్రీట్ మిశ్రమం ఉష్ణోగ్రత 35 డిగ్రీలు ఉందని ఎత్తి చూపింది. డిజైన్ ప్రకారం 1.5 మీటర్ల మందంతో డయాఫ్రం వాల్ నిర్మించాల్సి ఉండగా 0.9 మీటర్ల మందంతో నిర్మిస్తున్నారని.. మందం తగ్గించడంపై సమీక్షించాలని నివేదికలో పేర్కొన్న అంతర్జాతీయ నిపుణుల కమిటీ గత మూడు నెలల్లో 52 ప్యానళ్లతో డయాఫ్రం వాల్ పనులు చేశారని, అందులో 9 ప్యానళ్ల పరిధిలో డయా ఫ్రం వాల్ ఉపరితలంపై నీటి బుడగలు (సీపేజీ) ఉన్నట్లుగా చెప్పింది. సీపేజీ తీవ్రతను తేల్చడానికి ఇప్పటి దాకా వేసిన డయాఫ్రం వాల్పై రెండు నుంచి 3 మీటర్ల లోతు వరకు రంధ్రాలు చేసి, పరీక్షలు చేయాలని ప్రతిపాదించింది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా, సీపేజీ ఉన్న ప్యానళ్ల పరిధిలో డయా ఫ్రం వాల్ పైభాగంలో 1 నుంచి 2 మీటర్ల లోతు వరకు తొలగించి.. మళ్లీ కొత్తగా వేయాలని పీపీఏకు సూచించింది. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు పూర్తి చేయకుండానే 2016 డిసెంబర్లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్ పనులు ప్రారంభించి.. 2018 జూన్ నాటికి పూర్తి చేసింది. దీంతో 2018 జూన్ తర్వాత వచ్చిన వరదలకు కోతకు గురై దెబ్బతింది. దాంతో దెబ్బతిన్న దాని స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ వేయాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్తగా చేపట్టిన డయాఫ్రం వాల్ పనులను సైతం లోపభూయిష్టంగా ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం చేస్తుండటంపై ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు పాపాలు వెంటాడుతున్నాయనడానికి అంతర్జాతీయ నిపుణుల కమిటీ తాజాగా పీపీఏ, సీడబ్ల్యూసీలకు ఇచ్చిన నివేదిక తార్కాణమని రిటైర్డు చీఫ్ ఇంజినీర్ ఒకరు చెప్పారు. ఈ నెల 4న సీడబ్ల్యూసీకి నివేదికపోలవరం ప్రాజెక్టు పనుల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి ఏడాది క్రితం సియాన్ హించ్బెర్గర్, మెస్సర్స్ సీ రిచర్డ్ డొన్నెళ్లి, గియానో ఫ్రాంకో డీ క్యాప్పో, డేవిడ్ పాల్ సభ్యులతో కూడిన అంతర్జాతీయ నిపుణుల కమిటీని సీడబ్ల్యూసీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నాలుగోసారి గత నెల 5 నుంచి 9వ తేదీ వరకు పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సమీక్షించింది. క్షేత్ర స్థాయి పర్యటనలో గుర్తించిన అంశాలు, అధికారుల సమీక్షలో వెల్లడైన విషయాలు ఆధారంగా ఈ నెల 4న పీపీఏ, సీడబ్ల్యూసీలకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. ప్రాజెక్టు పనుల్లో లోపాలను ఎత్తిచూపుతూ.. వాటిని సరిదిద్దుకోవడానికి చేపట్టాల్సిన చర్యలను ఆ నివేదికలో సిఫార్సు చేసింది. ఆ నివేదికలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. పనుల్లో తీవ్ర జాప్యం ⇒ ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయా ఫ్రం వాల్ పనులను 66 వేల చదరపు మీటర్ల పరిధిలో చేయాలి. నిర్దేశించుకున్న షెడ్యూలు ప్రకారం వర్షాలు ప్రారంభం కావడానికి ముందే అంటే 2025 జూన్ నాటికి 28 వేల చదరపు మీటర్ల పరిధిలో డయాఫ్రం వాల్ పనులు పూర్తి చేయాలి. 2025 ఏప్రిల్ నాటికి 15 వేల చదరపు మీటర్ల పరిధిలో పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. 12 వేల చదరపు మీటర్ల పరిధిలో మాత్రమే పూర్తయ్యాయి. అంటే.. మూడు వేల చదరపు మీటర్ల పరిధిలో పనులు వెనుకబడినట్లు స్పష్టమవుతోందని నిపుణుల కమిటీ తేల్చింది. ⇒ పనుల్లో జాప్యానికి కాంట్రాక్టు సంస్థ బావర్ చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవని నిపుణుల కమిటీ కుండబద్దలు కొట్టింది. డయాఫ్రం వాల్ ప్యానళ్లను అత్యంత కఠిన శిల (సౌండ్ హార్డ్ రాక్) లోపలికి రెండు మీటర్ల లోతు వరకు దించితేనే.. సీపేజీని సమర్థవంతంగా నియంత్రించవచ్చని పేర్కొంది. అలా చేయడం వల్లే పనులు ఆలస్యమవుతున్నాయని చెప్పడం విడ్డూరమని పేర్కొంది. డయాఫ్రం వాల్లో సీపేజీ⇒ ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్ పనుల్లో ఏప్రిల్ వరకు 373 ప్యానళ్లు వేయాల్సి ఉండగా, 52 ప్యానళ్ల పరిధిలో మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఇందులో 9 ప్యానళ్ల పరిధిలో డయాఫ్రం వాల్ పైభాగంలో 1 నుంచి 2 మీటర్ల లోతు వరకూ నీటి బుడగలు బయటకు వస్తున్నట్లు(సీపేజీ) అంతర్జాతీయ నిపుణుల కమిటీ గుర్తించింది. ⇒ డయాఫ్రం వాల్లో వినియోగించే ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం 32 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నాణ్యంగా ఉంటుందని గతంలో నిర్వహించిన సమావేశాల్లో తాము అధికారులకు చెప్పామని స్పష్టం చేసింది. కానీ.. పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగిస్తున్న ప్లాస్టిక్ కాంక్రీట్ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు ఉన్నట్లుగా గుర్తించింది. ప్లాస్టిక్ కాంక్రీట్లో నీటి శాతం అధికంగా ఉన్నట్లుగా పసిగట్టింది. ⇒ కాంక్రీట్ మిశ్రమంలో ఉష్ణోగ్రత, నీటి శాతం ఎక్కువగా ఉండటం, ముడి పదార్థాల మోతాదు నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేక పోవడం వల్లే సిమెంట్, బెంటనైట్, కంకర, ఇసుక, నీరు విడిపోతోందని (సెగ్రిగేట్), దానివల్ల అది పటిష్టంగా, నాణ్యంగా ఉండదని స్పష్టం చేసింది. అందువల్లే డయాఫ్రం వాల్లో సీపేజీ వస్తోందని అభిప్రాయపడింది.⇒ సీపేజీ తీవ్రతను తేల్చడానికి తక్షణమే డయాఫ్రం వాల్పై రెండు మీటర్ల లోతు వరకు వరుసగా రంధ్రాలు వేసి.. పరీక్షలు చేయాలని పీపీఏకు సూచించింది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా సీపేజీ ఉన్న చోట్ల డయాఫ్రం వాల్ పైభాగం 1 నుంచి 2 మీటర్ల లోతు వరకూ తొలగించి.. దానిపై కొత్తగా డయాఫ్రం వాల్ వేయాలని సిఫార్సు చేసింది.నాడూ నేడూ అవే తప్పులు⇒ సీడబ్ల్యూసీ ఆమోదించిన ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళిక ప్రకారం.. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను తొలుత పూర్తి చేయాలి. గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించాక.. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ప్రధాన డ్యాం గ్యాప్–2లో 1,396.6 మీటర్లు్ల, గ్యాప్–1లో 393 మీటర్ల పొడవున డయాఫ్రం వాల్లను నిర్మించాలి.⇒ కానీ.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వరదను మళ్లించే పనులను పూర్తి చేయకుండానే 2016 డిసెంబర్లో ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్ పనులను ప్రారంభించి, చారిత్రక తప్పిదం చేసింది. 2017 జూన్ వరకూ డయాఫ్రం వాల్ పనులు చేసింది. ఆ తర్వాత గోదావరి వరద ఆ డయాఫ్రం వాల్ మీదుగా ప్రవహించడంతో కోతకు గురైంది. అయినా సరే.. 2017 నవంబర్లో మళ్లీ పనులు ప్రారంభించి, 2018 జూన్ నాటికి గ్యాప్–2లో 1.396.6 మీటర్ల పొడవున డయాఫ్రం వాల్ను పూర్తి చేసింది.⇒ ఆ డయాఫ్రం వాల్పై 2018 జూన్ తర్వాత వచ్చిన గోదావరి వరద ప్రవహించింది. దీంతో వరద ఉద్ధృతికి డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతిందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఆదిలోనే తేల్చింది. 2019 మే 30న వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేసి.. 2021 జూన్ 11న గోదావరి వరదను మళ్లించింది.⇒ ఆ తర్వాత గ్యాప్–1లో డయాఫ్రం వాల్ను పూర్తి చేసింది. గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ భవితవ్యాన్ని తేల్చడంలో సీడబ్ల్యూసీ తీవ్ర జాప్యం చేసింది. లేదంటే అప్పట్లోనే డయాఫ్రం వాల్ను పూర్తి చేసే వారని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు.. గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్కు ఎగువన కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి గతేడాది సెప్టెంబర్లో సీడబ్ల్యూసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణంలోనూ చంద్రబాబు సర్కార్ అవే తప్పులు చేస్తుండటంపై ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ తుంగలోకి⇒ పోలవరం ప్రాజెక్టు భద్రత దృష్ట్యా ప్రధాన డ్యాం గ్యాప్–2లో దెబ్బ తిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త డయా ఫ్రం వాల్ నిర్మించడం శ్రేయస్కరమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ చేసిన సూచనను సీడబ్ల్యూసీ ఆమోదించింది. దెబ్బతిన్న డయాఫ్రం వాల్కు 6 మీటర్ల ఎగువన కొత్త డయా ఫ్రం వాల్ నిర్మించాలని ప్రతిపాదించింది. ⇒ కొత్త డయా ఫ్రం వాల్ను 1.5 మీటర్ల మందంతో 1,396.6 మీటర్ల పొడవున 100 మీటర్ల లోతుతో (పునాది) నిర్మించేలా ప్రధాన కాంట్రాక్టు సంస్థ మేఘా డిజైనర్ ఆఫ్రి డిజైన్ (ఆకృతి)ను రూపొందించింది. దాన్ని అంతర్జాతీయ నిపుణుల కమిటీ సమీక్షించి, అనుమతి ఇచ్చింది. దాంతో ఆ డిజైన్ను సీడబ్ల్యూసీ ఆమోదించింది. టీ–16 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో డయా ఫ్రం వాల్ను నిర్మించాలని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ), రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులను నిర్దేశించింది. ⇒ డయాఫ్రం వాల్ నిర్మించే సమయంలో అధిక ఒత్తిడితో ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని పంపినప్పుడు విచలనం, భ్రమణానికి గురవడం వల్ల డయా ఫ్రం వాల్ మందం గరిష్టంగా 0.3 శాతం అంటే 4.5 సెంటీమీటర్ల వరకు తగ్గొచ్చని సీడబ్ల్యూసీ పేర్కొంది. ⇒ రూ.990 కోట్ల వ్యయంతో చేపట్టిన కొత్త డయాఫ్రం వాల్ పనులను 2016–18 మధ్య ఆ పనులు చేసిన బావర్ సంస్థకు మేఘా సబ్ కాంట్రాక్టుకు ఇచ్చింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ను తుంగలో తొక్కి.. 1.5 మీటర్ల (1500 మిల్లీ మీటర్లు) మందంతో కాకుండా 0.9 మీటర్ల (900 మిల్లీమీటర్లు) మందంతో బావర్ సంస్థ డయా ఫ్రం వాల్ పనులు చేస్తోందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఎత్తిచూపింది. అంటే.. సీడబ్ల్యూసీ ఆమోదించిన మందం కంటే 0.6 మీటర్లు మందం తగ్గించి పనులు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ⇒ మందం తగ్గించడంపై తక్షణమే సమీక్షించి.. దీనివల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్నది విశ్లేషించి.. దీనిపై సముచితమైన నిర్ణయం తీసుకోవాలని పీపీఏకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.⇒ డయాఫ్రం వాల్ నిర్మాణంలో ఒక ప్యానల్ను మరో ప్యానల్తో నిలువునా జత చేసేటప్పుడు (ఓవర్ల్యాప్).. 7.5 సెంటీమీటర్ల పొడవున ఒకదానితో మరొకటి జత చేస్తున్నారని.. కనీసం పది సెంటీ మీటర్ల పొడవున ఓవర్ ల్యాప్ చేయాలని సూచించింది. అప్పుడే సీపేజీకి సమర్థవంతంగా అడ్డుకట్ట వేయొచ్చని పేర్కొంది. -
కొండవీడు కత్తుల బావి
పర్యాటక ప్రాంతాల్లో అలనాటి రాజుల కోటలు ముందు వరుసలో ఉంటాయి. వాటి చరిత్ర, శిల్పకళ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. దేశంలో అనేక కోటలు పర్యాటక కేంద్రాలుగా మారి, చరిత్ర ప్రేమికులను, సాహస యాత్రికులను, సాధారణ పర్యాటకులను కూడా అలరిస్తున్నాయి. అలాంటి కోవకు చెందినదే ఈ కొండవీడు కోట.ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ కోటల్లో ఒకటి. కోటకు వెళ్లేమార్గం, పాములా వంకర్లు తిరిగిన ఘాట్ రోడ్డుపై ప్రయాణం ఉత్సాహభరితంగా సాగుతుంది. ఇప్పుడిప్పుడే పర్యాటకంగా కొండవీడు నూతన శోభను సంతరించుకుంటోంది. ఒకప్పటి ఈ అద్భుత నిర్మాణం నేడు శిథిలావస్థకు చేరింది. అయినా ఆనాటి కట్టడాలు, ప్రకృతి అందాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో సముద్ర మట్టానికి 1700 అడుగుల ఎత్తులో కొండవీటి కొండపై ఉంటుందీ కోట. రెడ్డి రాజుల్లో మొదటి వాడైన ప్రోలయ వేమారెడ్డి అద్దంకిని రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అనంతరం అతని కుమారుడు అనపోతారెడ్డి రాజయ్యాక, అద్దంకి నుంచి రాజధానిని కొండవీడుకు మార్చాడు. శత్రుమూకల దండయాత్రల నుంచి రాజ్యాన్ని కాపాడటానికి ఈ కోటను నిర్మించాడు.2010లో హైదరాబాద్ విశ్వవిద్యాలయం రీసెర్చ్ స్కాలర్ రుచీ సింగ్, హిస్టరీ ప్రొఫెసర్ కేవీ రావులు కొండవీడును సందర్శించారు. అదే సమయంలో శివాలయం గర్భగుడి కింద బౌద్ధ చైత్యం వెలుగు చూసింది. శాతవాహనుల కాలంలోనే కొండవీడు బౌద్ధక్షేత్రంగా విరాజిల్లిందని చరిత్ర చెబుతోంది.ఆ బురుజులే కాపలాకేంద్రాలు కొండవీడు దుర్గంలో 72 కోట బురుజులతో పాటు ప్రాకారాలు, ధాన్యాగారాలు, దేవాలయాలు, గుర్రపుశాలలు, ఆయుధశాల, మసీదు, ఖజానా వంటి నిర్మాణాలు నాటి చరిత్రకు ఆనవాళ్లుగా కనిపిస్తాయి. తారా బురుజు, జెట్టి బురుజు, నెమళ్ల బురుజులు వీటిలో ప్రత్యేకమైనవి. ఈ బురుజులే నాటి సైనికుల కాపలా కేంద్రాలుగా ఉండేవి. శత్రువులు కొండ వరకు రాకుండా కొండల దిగువ చుట్టూ కందకాలను వెడల్పుగా తవ్వి, ఆ నీటిలో మొసళ్లను వదిలారు.నీటి సమస్య రాకుండా..కోట పరిసరాల్లో పురావస్తుశాఖ తవ్వకాలు జరపగా రెండువేల ఏళ్లనాటి బౌద్ధస్థూపం, మట్టిపాత్రలు, చైనాకు సంబంధించిన పింగాణీ పాత్రల ముక్కలు బయటపడ్డాయి. నీటి అవసరాల కోసం కొండమీద ముత్యాలమ్మ, పుట్టాలమ్మ, వెదుళ్ల అనే మూడు గొలుసుకట్టు చెరువులు తవ్వారు. ఈ మూడూ సుమారు 12 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ మూడూ పూర్తిగా నిండితే కొండలమీదుగా కింది ప్రాంతాల్లోకి ప్రవహించి అక్కడి చెరువులు నిండేలా ఏర్పాటు చేసిన వ్యవస్థ నేటి తరానికి ఆదర్శప్రాయం.కత్తుల బావి నేపథ్యమిదీ!కొండవీడు కోట పేరు ప్రస్తావించగానే ముందుగా గుర్తుకొచ్చేది కత్తుల బావి. దీని వెనుక ఓ పెద్ద కథే వినిపిస్తుంది. ఆనాటి రెడ్డిరాజ్యంలోని 72 మంది సామంత రాజులను మట్టుబెట్టేందుకు ఓ బ్రాహ్మణుడు ఈ ఆలయం నిర్మించాడని ప్రతీతి. గర్భగుడి చెంతనే ఓ బావిని తవ్వించి, అందులో కత్తులు దాచి, సామంతరాజులను విందుకు ఆహ్వానించారని, బాలకృష్ణుని ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన సామంత రాజులంతా హత్యకు గురయ్యారని ఓ కథ ప్రచారంలో ఉంది. అలా ఆ బావిలో కత్తులు దాచినందువల్ల కత్తుల బావిగానూ, ఆ ప్రాంతం చీకటిగా ఉన్నందున చీకటి కోనేరుగానూ పేరొచ్చింది.విజయానికి చిహ్నంఈ ఆలయానికి అభిముఖంగా 45 అడుగుల ఎత్తులో ఏకశిలా విజయస్థూపం ఉంది. విజయనగర రాజులు కొండవీడును హస్తగతం చేసుకున్న విజయానికి సూచికగా ఈ ఏకశిలా స్థూపాన్ని ఏర్పాటు చేశారు. రెడ్డిరాజుల పతనానంతరం కోట విజయనగర ప్రభువుల పరమైంది. అనంతరం గోల్కొండ సుల్తానుల చేతుల్లోకి వెళ్లింది.యునెస్కో గుర్తింపు లభిస్తే!2016లో తొలిసారిగా కొండవీడును చారిత్రక ప్రదేశంగా గుర్తించి, యునెస్కో జాబితాలో చేర్చాలంటూ ప్రతిపాదనలు వెళ్లాయి. దీనిపై సమగ్రంగా పరిశీలించి నివేదిక పంపించాలంటూ కేంద్రప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కొండవీడు సమగ్ర స్వరూపాన్ని వివరించే బ్లూప్రింట్ పనులు నిర్వహించేందుకు హైదరాబాద్లోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్కిల్ సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక దీన్ని యునెస్కో చారిత్రక వారసత్వ కట్టడ జాబితాలో చేర్చితే ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న కట్టడాలకు పునరుజ్జీవం లభిస్తుంది. కోట పరిసర ప్రాంతాలన్నీ పర్యాటకంగా అభివృద్ధికి నోచుకుంటాయి. -
ఈ పతనం ఏ లోతుల్లోకి?
కమ్మ కులంలో పుట్టిన వ్యక్తి వైసీపీలో ఎలా ఉంటాడు? ఇది చట్ట విరుద్ధమైన చర్యగా కనిపించింది ఒక డీఎస్పీకి. ఇటువంటి సంఘ విద్రోహ చర్యలను అస్సలు క్షమించలేని సదరు డీఎస్పీ అటువంటి ఒక వ్యక్తికి తనదైన ట్రీట్మెంట్ ఇప్పించారు. పల్నాడు జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ అనే ఆ వ్యక్తి పోలీసు వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు.గుంటూరులో పని చేసే ఒక పోలీసు ఇన్స్పెక్టర్కు ప్రతిపక్ష రాజకీయ నేతల ముఖాల్లో శత్రుదేశం సైనికులు కనిపిస్తారట! ఆ నేత ఏ స్థాయి వాడైనా సరే! మొన్న ఏదో నిరసన కార్యక్రమంలో వైసీపీ నేత అంబటి రాంబాబు ఆ ఇన్స్పెక్టర్కు ఎదురుపడ్డారు. శత్రు సైనికుడిని చూసిన ఆగ్రహం ఆ పోలీసును ఆవహిం చింది. తక్షణమే పళ్ళు పటపట కొరుకుతూ, గుడ్లను గుర్రున ఉరుముతూ రాంబాబుపై ఆ పోలీసాయన లంఘిస్తున్న విజు వల్స్ టీవీల్లో కనిపించాయి.తెనాలి ఘటన తెలిసిందే! ఓ మఫ్టీ కానిస్టేబుల్కూ, ముగ్గురు యువకులకూ ఏదో ఒక చిన్న వివాదం జరిగింది. ఈ మఫ్టీ కానిస్టేబుల్ మీద ఆ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ జవాన్లందరికీ ప్రత్యేకమైన అభిమానం ఉంటుందట! ఈ మఫ్టీ బ్యాచ్ సివిల్ డ్రెస్లో ఉంటూనే, లా అండ్ ఆర్డర్ను చక్కబరుస్తూ, పోలీసు సహచరులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంటారట! అటువంటి మఫ్టీ కానిస్టేబుల్ను అనామక యువకులు ప్రశ్నించ డమేమిటి? అందులో దళితులు! ఆ యువకులు కట్టు తప్పారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వాళ్లకు బుద్ధి చెప్పాలని నిర్ణయానికి వచ్చారు. భారత న్యాయ సంహితలోని తమకు తోచిన సెక్షన్లన్నింటితో కేసులు పెట్టారు. నడిరోడ్డు మీద వారిని పడుకోబెట్టి అరికాళ్ళపై బెత్తాలతో చావబాది ఆటవిక న్యాయాన్ని అమలు చేసిన తీరు నాగరిక సమాజాన్ని నివ్వెర పరిచింది.కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ప్రైవేటు సైన్యంగా మార్చేసిన ఫలితం ఇది. స్వామికార్యంతో పాటు స్వకార్యం చక్కబెట్టుకోవచ్చు అనుకునే కొందరు పోలీసులకు ఈ విధానం బాగా నచ్చినట్టుంది. పొలిటికల్ బాసులను సంతృప్తి పరుస్తూనే సొంత పనులు చేసుకుంటున్నారు. పొలిటికల్ బాసులు ఏం చేసినా, ఏం చెప్పినా చిత్తం అనే స్థాయికి కొందరు దిగజారిపోయారు. అనంతపురం జిల్లాలో ఒక దళిత బాలికను బెదిరిస్తూ 14 మంది పాలక పార్టీ అనుయాయులు ఆరు మాసా లుగా అత్యాచారం చేస్తున్న పైశాచిక ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సాక్షి మీడియా ద్వారా ఈ దారుణం వెలుగు చూసేంత వరకు పోలీసులు కళ్ళు మూసుకుని కూర్చో వడం క్షమించరాని నేరం. ఇప్పుడు కూడా కేసును పలుచన చేసేటందుకు పొలిటికల్ బాసులు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ఈ కేసు పోలీసు యంత్రాంగానికి ఒక శీలపరీక్ష లాంటిదే! వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ మంత్రి సతీమణి పోలీసులను అడిగి మరి సెల్యూట్ కొట్టించుకుంటున్నదనే వార్తలు కూడా విన్నాము. పోలీసు యంత్రాంగం పట్ల కూటమి నేతల ప్రవర్తన అది.ఏడాది కూటమి పాలనలోని అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో! గల్లీగల్లీలో గంజాయి, చీప్ లిక్కర్ల కంపుతో అవినీతి పోటీపడుతున్నది. కడప జిల్లా టీడీపీ నాయకుడు ఒకరు బహిరంగ సమావేశంలో మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ఛోటామోటా అధికార పదవుల్లో ఉన్నవాళ్లు తమ ఖాళీ లెటర్ హెడ్పై సంతకం చేసి ఇచ్చినందుకు పాతిక, ముప్పై వేల నుంచి ఐదు లక్షల వరకు వసూలు చేస్తున్నారని ఆ నాయకుడు ఆరోపించారు. చిన్నచిన్న రికమండేషన్లకు కూడా వెలకట్టి వసూలు చేస్తున్న సంస్కృతిని రాష్ట్రమంతటా ప్రవేశ పెట్టారట! ఆ మధ్య ఓ యెల్లో పత్రికలోనే ఇటువంటి వార్త ఒకటి వచ్చింది. గోదావరి జిల్లాలోని ఒక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మార్వోకు తన లెటర్ హెడ్ పుస్తకాన్ని ఇచ్చి, దీని ద్వారా తిరుపతి దర్శనం రికమండేషన్లు అమ్మి తనకు నెలకో లక్ష రూపాయలు జమ కట్టాలని ఆర్డర్ వేశారని ఆ పత్రిక రాసింది. ప్రజా ప్రతినిధులు తమ ప్రాంతంలోని రెవెన్యూ, పోలీసు అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ నెల మామూళ్లు వసూలు చేసి ఇవ్వాలని వేధిస్తున్న ఒక విచిత్ర పరిణామం ఈ ఏడాదిలో ఏపీ అంతటా వ్యాపించింది. ప్రజలకు సేవకులుగా ఉండాల్సిన ప్రతినిధులు ప్రతి చిన్న పనికీ, ప్రతి చిన్న రికమండేషన్కూ కూడా వెలకట్టి వసూలు చేస్తున్న ప్రజాస్వామ్యం రాష్ట్రంలో అమలవుతున్నది.నాయకుని స్థాయిని బట్టి అవినీతిస్థాయి కూడా పెరుగు తుంది. ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ ఎక్కడ చూసినా కనిపిస్తున్నది. మద్యం మామూళ్లు ప్రజాప్రతినిధులకు హక్కు భుక్తంగా మారాయి. ఇవి చాలదన్నట్టు దర్జాగా భూకబ్జాలు అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్నాయి. విజయవాడ నగరం నడిబొడ్డున అర్ధ శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన శాతవాహన కాలేజీ స్థలం ఆక్రమణ కోసం జరుగుతున్న రౌడీయిజం తాజా ఉదాహరణ. సాక్షాత్తూ పాలక పార్టీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తనను కిడ్నాప్ చేశారని కళాశాల ప్రిన్సిపాల్ ఆరోపించారు. అయినా చట్టం స్పందించలేదు. అర్ధరాత్రి పూట బందిపోటు దొంగల మాదిరిగా కళాశాల షెడ్లను కూల్చివేశారు. లాఠీలు కదల్లేదు. ప్రతిపక్ష కార్యకర్తల మీద, సామాన్య ప్రజల మీద జులుం చూపిస్తున్న పోలీసు యంత్రాంగం, అధికార పార్టీ పెద్దలు బడిని మింగినా, గుడిని మింగినా చోద్యం చూడటానికే పరిమితమైపోతున్నారు. పోలీసు యంత్రాంగాన్ని ప్రైవేట్ సైన్యంగా దిగజార్చిన పర్యవసానం కనిపిస్తున్నది.ఇక అత్యున్నత స్థాయి ప్రభుత్వ పెద్దల అవినీతి వేలు లక్షల ఎకరాలు, వందల వేల కోట్ల టెండర్ల కొలమానంలో వెలిగి పోతున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమరావతి పేరుతో చేస్తున్న ఆర్భాటపు ప్రణాళికల వెనుక అంతులేని అవినీతి వ్యూహం తప్ప, వాస్తవికత ఇసుమంత కూడా లేదని వారు బల్లగుద్ది చెబుతున్నారు. రాజధాని కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న 55 వేల ఎకరాలకు తోడు మరో 45 వేల ఎకరాలను సేకరించాలన్న ప్రతిపాదనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులో ఐదు వేల ఎకరాలు సరికొత్తగా నిర్మించబోయే అంతర్జాతీయ విమానాశ్రయానికి కావాలట! ఇప్పుడు అందుబాటులో ఉన్న గన్నవరం విమానా శ్రయం సంగతి ఏమిటి? గన్నవరంలో 2024–25 సంవత్సరంలో 9,279 విమానాలు ల్యాండ్ అయ్యాయని రికార్డులు చెబుతున్నాయి. దాని వైశాల్యం 1,265 ఎకరాలు, కోల్కతా విమానాశ్రయం వైశాల్యం సుమారు 1,600 ఎకరాలు. ఇదే కాలంలో అక్కడ ల్యాండ్ అయిన విమానాల సంఖ్య ఒక లక్షా నలభై ఆరు వేల పైచిలుకు. గన్నవరం విమానాశ్రయం కోసం తలపెట్టిన అదనపు భూసేకరణను కూడా దృష్టిలో పెట్టుకుంటే ఎయిర్ ట్రాఫిక్ ఇరవై రెట్లు పెరిగినా గన్నవరం ఎయిర్పోర్ట్ నిక్షేపంగా సరిపోతుంది. అమరావతిలో ఇప్పటికే టెండర్లు పిలిచిన పరిపాలనా భవనాల ఆర్భాటపు అంచనాలు కూడా ఈ కోవలోనివే!ఎన్ని పాలనా భవనాలను నిర్మించినా, ఎన్ని సంస్థలను రప్పించినా అక్కడ నివసించవలసిన జనాభా ఏ విధంగా పెరుగుతుంది? ఎన్ని లక్షల మందికి ఉపాధిని, వసతిని అందు బాటులోకి తేగలరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని భవనాలను నిర్మించగానే జనం బిలబిలమంటూ వచ్చి నిండి పోరు కదా! ఇటువంటి ఆర్భాటాలతోనే అంచనా లేకుండా నిర్మించిన కొన్ని చైనా నగరాలు ఘోస్ట్ సిటీలుగా మిగిలిపోయిన ఉదంతాలను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. వేలకోట్ల రూపా యల అప్పు తెచ్చి ఖర్చు చేస్తున్న అమరావతి మరో ఘోస్ట్ సిటీగా మిగిలిపోతే పెద్దలకు గిట్టుబాటు కావచ్చునేమో గాని కొన్ని తరాల వరకు ఆంధ్ర ప్రజలు దానికి మూల్యం చెల్లించ వలసి ఉంటుంది. వడ్డే శోభనాద్రీశ్వర రావు వంటి తొలితరం తెలుగుదేశం నాయకులు కూడా అమరావతి ఊహల పందిరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.విచ్చలవిడి అవినీతి, వ్యవస్థల విధ్వంసం, అమరావతి పేరుతో జరుగుతున్న ప్రమాదకర క్రీడలు ఒకపక్క సామాన్య ప్రజలను గడ్డిపోచల కింద జమ కట్టే పెత్తందారీ పోకడ మరోపక్క... ఈ పాలనా రథానికి మోహరించి దౌడు తీస్తున్నాయి. భారత రాజ్యాంగం ఈ దేశంలో పుట్టి పెరిగే పౌరులందరినీ జాతి సంపదకు సమాన వాటాదారులుగా పరిగ ణిస్తున్నది. కానీ ఆంధ్రప్రదేశ్ పాలకులు మాత్రం సామాన్య ప్రజలను బిచ్చగాళ్ళుగా భావిస్తున్నారు. విద్యా, వైద్య రంగాల్లో గత ప్రభుత్వం వారికి నాణ్యమైన అవకాశాలను ఉచితంగా కలుగజేస్తే, ప్రస్తుత ప్రభుత్వం వాటిని తొలగించింది. ‘ఫ్యామిలీ డాక్టర్’ వంటి వ్యవస్థలను ఎత్తేసింది. ప్రభుత్వ రంగంలో నిర్మించిన వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రు లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నది. పేద కుటుంబాల విద్యార్థులకు జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆధు నిక బోధన పద్ధతులను రద్దు చేసింది.ఇప్పుడు తాజాగా కార్మికులు, కర్షకులు పనిచేయవలసిన సమయాన్ని ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలకు పెంచుతూ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసింది. 8 గంటల పని కోసం జరిగిన దశాబ్దాల పోరాటాలనూ, షికాగో వీధుల్లో చిందిన కార్మిక రుధిరాన్నీ అవహేళన చేసింది.ఇంత తక్కువ కాలంలో, ఇన్ని రకాలుగా పతనమవుతున్న ప్రభుత్వానికి ప్రజాదరణ తగ్గిపోవడంలో ఆశ్చర్యమేమున్నది! కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న వేళ కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు సర్వేలు చేస్తున్నాయట! ఈ సర్వేలన్నింటి సారాంశం ఈ ప్రభుత్వానికి ప్రజాదరణ తగ్గిందనే! ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 11 మంది మంత్రులు సహా 78 మంది కూటమి ఎమ్మెల్యేలు ఓడిపోతారని సగటు అంచనా వేశారు. వాస్తవ పరిస్థితి మాత్రం ఇంకా తీవ్రంగా ఉన్నది. ఇప్పటికే ప్రభుత్వ ప్రతిష్ఠ పాతాళానికి పడిపోయింది. దిగజార డానికి ఇంతకంటే లోతుల్లేకపోవచ్చు. కంటి తుడుపు కోసం ప్రభుత్వం కూడా ఐ.వి.ఆర్.ఎస్. ద్వారా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటున్నదట! నూటికి నూరు శాతం మంది ప్రభు త్వాన్ని భేష్ అంటున్నారని ఆ సర్వే వివరాలను ప్రభుత్వం కూడా ప్రకటించుకోవచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
కృష్ణంరాజు వ్యాఖ్యలను తమకు ఆపాదించడంపై వైఎస్సార్సీపీ ఖండన
సాక్షి, తాడేపల్లి: జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను తమకు ఆపాదించటంపై వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది. పార్టీకి, నాయకులకు ఆపాదిస్తూ టీడీపీ, దానికి కొమ్ము కాస్తున్న మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. ఈ వ్యవహారానికి రాజకీయాన్ని జోడించి బురదజల్లే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్సార్సీపీ పేర్కొంది. ‘‘జర్నలిస్టు కృష్ణంరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాదు. పాత్రికేయుడిగా ఆయన సాక్షి టీవీ చర్చలో పాల్గొన్నారు. ఆ వ్యాఖ్యలు ఆయనకు సంబంధించినవి. మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు’’అని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది.‘‘తన వ్యాఖ్యలపై జర్నలిస్ట్ కృష్ణంరాజు ఇచ్చిన వివరణను కూడా అనేక మాధ్యమాల్లో చూశాం. ఏ వేదికమీద అయినా మహిళల గౌరవమర్యాదలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తే అవి తప్పకుండా ఖండిచదగ్గవి. మా పార్టీ అభిప్రాయంకూడా ఇదే. కానీ, మా పార్టీకి సంబంధంలేని వ్యక్తి, టీవీలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తే, అవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవే అన్నట్టుగా, అవి మా పార్టీకి చెందిన నాయకులవే అన్నట్టుగా తెలుగుదేశంపార్టీ, దాని అనుబంధ మీడియా ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం...దీన్ని అడ్డం పెట్టుకుని మా పార్టీ అధ్యక్షులు, ఆయన కుటుంబ సభ్యుల మీద టీడీపీ సోషల్ మీడియా, వారి నాయకులు ఇష్టానుసారంగా, అనైతికంగా పోస్టులు పెడుతూ, తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. జర్నలిస్టు కృష్ణం రాజు వ్యాఖ్యలు వ్యక్తిగతమని, వాటిని సమర్థించడంలేదని సాక్షిటీవీ ప్రజలకు ప్రకటనచేసిన విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేస్తున్నాం. అదే సమయంలో ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా, అప్రయత్నంగానైనా మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యాఖ్యలను, ప్రకటనలను ఖండిస్తున్నామని, ఇలాంటి వాటిని సమర్థించబోమని మరోసారి స్పష్టం చేస్తున్నాం’’ అని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. -
కూటమి వైఫల్యాలు దృష్టి మళ్ళించేందుకే 'ఈనాడు' భజన కథనాలు
సాక్షి, శ్రీకాకుళం: అధికారం కోసం హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళ వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏడాది పాలనలో తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఎల్లో మీడియా 'ఈనాడు'లో ఒక భజన కథనాన్ని రాయించుకున్నారని మండిపడ్డారు.చంద్రబాబును జాకీలు పెట్టి పైకి లేపే ప్రయత్నంలో భాగంగా ఏడాదిలో చంద్రబాబు ప్రజలకు ఎంతో చేశారని, మిగిలింది ఎప్పుడంటూ ఈనాడు రాసిన కథనం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. గత చరిత్ర చూసినా ఎన్నడూ చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ హామీలను పూర్తిగా అమలు చేసిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమంటున్నారంటే..చంద్రబాబు సీఎంగా ఏడాది పాలనలో బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలను ఇచ్చారు. ఇంకా కొంత పెండింగ్లో ఉంది. వాటిని కూడా ఇచ్చేయండీ అంటూ ఈనాడు పత్రిక చంద్రబాబు పాలనను కీర్తిస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది. చంద్రబాబు 1999, 2014, 2024లో మేనిఫేస్టోలను పార్టీ పరంగా విడుదల చేశారు. ఈ మూడు సందర్భాల్లోనూ ఆయన అధికారంలోకి వచ్చారు. కానీ ఎప్పుడూ తాను మేనిఫేస్టోలో ప్రకటించిన హామీలను పూర్తిగా అమలు చేసిన దాఖలాలే లేవు. ప్రతిసారీ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతిసారీ రాష్ట్రం తిరోగమనంలోనే ఉంది.పెన్షన్ల పథకం అమలులోనూ మోసంకూటమి పాలనలో ప్రధానంగా ఇచ్చిన సూపర్ సిక్స్, అలాగే 143 హామీలను ఏ మేరకు అమలు చేశారో చెప్పాలి. పెన్షన్ల గురించి చెబుతున్న చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు యాబై ఏళ్ళకే పెన్షన్లు ఇస్తామని చెప్పలేదా? ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలి. అలా ఇచ్చినట్లయితే అదనంగా 20 లక్షల మంది కొత్త పెన్షన్లరు పెరగాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న 66 లక్షల పెన్షన్లకు అదనంగా మరో 20 లక్షలు కలిస్తే, మొత్తం 86 లక్షల పెన్షన్లను ప్రతినెలా ఇవ్వాల్సి ఉంటుంది.కానీ అలా జరుగుతోందా? పైగా వైయస్ జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటి ఉన్న పెన్షన్ల నుంచి ఏకంగా నాలుగు లక్షల పెన్షన్లకు కోత పెట్టారు. ఈ తొలగించిన పెన్షన్ల మొత్తాన్ని మిగిలిన పెన్షన్లకు కలిపి, వెయ్యి రూపాయల చొప్పున పెంచానని అబద్దాలు చెప్పుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఇస్తున్న పెన్షన్లను కూడా భారీగా తగ్గించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దివ్యాంగ పెన్షన్లు, మెడికల్ పెన్షన్లను తీసేసేందుకు కుట్ర చేస్తున్నారు. ఇళ్ళ వద్దే పెన్షన్లు అని చెబుతున్నా కూడా వాస్తవానికి వారిని టీడీపీ నేతల ఇళ్ళకు పిలిపించుకుని, వారి ఆత్మగౌరవం దెబ్బతీసేలా పంపిణీ చేస్తున్నారు.అధ్వాన్నంగా శాంతిభద్రతలురాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. దాడులు, హత్యలు, మహిళలపై లైంగిక దాడులు, కక్షసాధింపులు కనిపిస్తున్నాయి. రాజ్యాంగబద్దమైన పాలన జరగడం లేదు. పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. ఏదైనా ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే చాలు వెంటనే దానిపై డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభిస్తున్నారు. ఏదో ఒక అంశాన్ని తెరమీదికి తెచ్చి, బురదచల్లుతున్నారు. రాష్ట్రంలో ఇలా పెట్టుబడిదారుపై దాడులు, బెదిరింపులు ఎప్పుడూ చూడలేదు.కానీ కూటమి ప్రభుత్వంలో పరిశ్రమలపై మామూళ్ళ కోసం దాడులు, వేధింపులతో ఒక భయోత్పాతంను సృష్టించారు. శ్రీకాకుళం జిల్లాలో బ్రూవరీస్ కంపెనీని వేధించారు. అలాగే రాయలసీమలో సిమెంట్ కంపెనీలపై, పోర్ట్ల్లో రవాణా వాహనాల నుంచి మామూళ్ళ కోసం దౌర్జన్యాలకు పాల్పడ్డారు. వైయస్ జగన్ గారి ప్రభుత్వంలో ఎంఓయులు చేసుకున్న పెట్టుబడిదారులే ఇప్పుడు రాష్ట్రంలో పరిశ్రమలను ప్రారంభిస్తున్నారు. కూటమి హయాంలో ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా వచ్చిన దాఖలాలు లేవు. దావోస్కు వెళ్ళి వట్టి చేతులతో తిరిగి వచ్చారు.పథకాల అమలుపై స్పష్ట ఏదీ?రాష్ట్రంలో 1.60 కోట్ల దీపం కనెక్షన్లకు ఏడాదికి మూడు సిలెండర్లు ఉచితంగా ఇవ్వాలంటే రూ.4వేల కోట్లు కావాల్సి ఉంటే కేవలం రూ.869 కోట్లు కేటాయించారు. ఇవి వాస్తవం కాదా? ప్రజలను మోసం చేయడం కాదా? ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించారు. 1.80 కోట్ల మంది అర్హులైన మహిళలు ఈ పథకం కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు దీనిని అమలు చేస్తారు? ఏడాదికి సుమారు రూ.32,400 కోట్లు అవసరం. ఉచిత బస్సు అన్నారు, దాని అమలు ఊసే లేదు. యువగళం అంటూ నిరుద్యోగులకు భృతి ఇస్తామని హామీ ఇచ్చారు.ఎంతమంది నిరుద్యోగులకు దీనిని ఇచ్చారు? రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? ఇవ్వన్నీ ప్రజలను వెన్నుపోటు పొడవటం కాదా? అమ్మ ఒడి కింద గత ఏడాది పూర్తిగా దాదాపు 80 లక్షలకు పైగా విద్యార్ధులను, వారి తల్లులను దగా చేశారు. ఈ ఏడాది ఇస్తారో, ఎగ్గొడతారో తెలియదు. రైతులకు ఇస్తామన్న రైతుభరోసా ఏమయ్యిందీ? కేంద్రం ఇచ్చే దానితో కలిపి ఇచ్చే రైతుభరోసాపై గతంలో చంద్రబాబు పలుసార్లు వైయస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కేంద్రం నుంచి వచ్చే దానితో కలిపే ఇస్తామని సిగ్గు లేకుండా ఎలా చెబుతున్నారు? కనీసం అలా అయినా ఇస్తారా అని రైతులు ఎదురుచూస్తున్నారు. అవి కూడా ఎప్పుడు ఇస్తారో తెలియదు.రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన వైఎస్ జగన్గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థను సర్వ నాశనం చేశారు. వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి స్టేట్మెంట్ను ఈనాడులో ప్రచురించారు. ఇప్పటికే రాష్ట్రం అప్పులపాలైంది, చేయగలిగినంత అప్పులు చేసేశాము. కొత్తగా ఏర్పడిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం జూన్ 1న జీతాలు ఎల్లా చెల్లిస్తుందని ఆయన మాట్లాడిన దానిని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసినా కూడా సీఎం వైఎస్ జగన్ దానిని గాడిలో పెట్టారు. జీతాలు, పెన్షన్లను సకాలంలో చెల్లించారు. తొలి ఏడాదిలోనే వైఎస్సార్ వాహనమిత్ర, రైతు భరోసా, పెన్షన్ల పెంపు, సున్నావడ్డీ, లా నేస్తం, నేతన్ననేస్తం, అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, కంటివెలుగు, విదేశీ విద్యాదీవెన, చేదోడు, వసతి దీవెన, విద్యాదీవెన, కాపునేస్తం, మత్స్యకార భరోసా పథకాలను 3,54,77,428 మంది లబ్దిదారులకు రూ.36,361 కోట్లు ఖర్చు చేస్తూ ఈ పథకాలను అమలు చేశాం.దీనిలో 1.76 మంది బీసీలు, 62 లక్షల మంది ఎస్సీలు, 18.5 లక్షల మంది ఎస్టీలు, మరో 18.5 లక్షల మంది మైనార్టీలు, ఇతరులు 76 లక్షల మంది ఉన్నారు. వైఎస్ జగన్ పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్లో వరుసగా మూడుసార్లు మొదటి స్థానంలో రాష్ట్రం నిలబడింది. అలాగే 2023-24 లో రాష్ట్రానికి రూ.46 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దేశంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఇది 22 శాతం. పారిశ్రామిక, వ్యవసాయ గ్రోత్లో ప్రగతి సాధించాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూటమి పాలనలో జీడీపీ గ్రోత్ 22 శాతం తగ్గిపోయిందంటే వారి పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.2024-25కి సంబంధించి కూటమి ఏడాది పాలనలో స్టేట్ జీఎస్టీ రెవెన్యూ రూ.2652 కోట్లు అయితే, 2023-24 వైఎస్సార్సీపీ ఏడాది పాలనలో వచ్చిన రాష్ట్ర జీఏస్టీ రెవెన్యూ రూ.3499 వచ్చింది. అంటే సుమారు 24 శాతం ఆదాయం తగ్గిపోయింది. వైఎస్ జగన్ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని చంద్రబాబు ప్రతిసారీ చెబుతూ ఉంటారు. 3.3 లక్షల కోట్లు వైయస్ జగన్ ప్రభుత్వంలో చేసిన అప్పులు అని అసెంబ్లీలోనే చంద్రబాబు అంగీకరించారు. కానీ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో చేసిన అప్పులు రూ.1.50 లక్షల కోట్లు. ఏపీ చరిత్రలోనే అత్యధిక అప్పులు చేసిన ఘనత చంద్రబాబుదే. రాష్ట్రంలో కొత్త పోర్ట్లను, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకువచ్చిందే వైఎస్ జగన్. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 07-14)
-
కేఎస్ఆర్ లైవ్ షోలో కృష్ణంరాజు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: సాక్షి టీవీ
హైదరాబాద్: శుక్రవారం నాటి కేఎస్ఆర్ లైవ్ షోలో విశ్లేషకుడు కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని సాక్షి టీవీ పేర్కొంది. కృష్ణంరాజు వ్యాఖ్యలను కూటమి నేతలు సాక్షి టీవీకి ఆపాందించడం సరికాదని తీవ్రంగా ఖండించింది. సాక్షి మీడియా ఎల్లప్పుడూ మహిళల పట్ల అత్యంత గౌరవాభిమానాలు చూపుతుందని.. సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలను.. సాక్షి మీడియా ఎంత మాత్రం సమర్ధించదని సాక్షి టీవీ స్పష్టం చేసింది.ఎవరినీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు: కృష్ణంరాజుఇదిలా ఉండగా, కృష్ణంరాజు కూడా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. మహిళల మనోభావాలను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదన్నారు. ఒకవేళ ఎవరి మనోభావాలైన కించపరిచి ఉంటే క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కృష్ణంరాజు అన్నారు. -
తహసీల్దార్ ఇచ్చిన బొకేను విసిరేసిన మంత్రి సవిత
శ్రీసత్యసాయి జిల్లా, సాక్షి: శ్రీ సత్యసాయి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మంత్రి సవిత దురుసు ప్రవర్తన హాట్ టాపిగ్గా మారింది. పెనుకొండ తహసీల్దార్ శ్రీధర్ ఇచ్చిన బొకేను మంత్రి సవిత విసిరేశారు. ఈ ఘటన జిల్లా కలెక్టర్ చేతన్ సమక్షంలో ఘటన చోటు చేసుకుంది. అయితే, మంత్రి సవిత తీరుపట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి సవిత బొకేని విసిరేసిన దృశ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బొకే ఇస్తే తీసుకోవాలి. లేదంటే పక్కకు పెట్టాలి. లేదంటే తనతోపాటు ఉన్నవారికి ఇవ్వాలి. అంతే గాని ఇలా విసిరేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.మంత్రి సవిత దురుసు ప్రవర్తన.. పెనుకొండ తహశీల్దార్ శ్రీధర్ ఇచ్చిన బోకేను విసిరేసిన మంత్రి సవిత..! @MinisterSavitha సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ సమక్షంలో ఘటన!#AndhraPradesh @ncbn @PawanKalyan @naralokesh pic.twitter.com/6fniceqmql— ap-leaks (@ap_leaks) June 7, 2025ఇలా మంత్రి సవిత దురుసు ప్రవర్తన కొత్తేమీ కాదు. గతేడాది నవంబర్లో జరిగిన శాసన మండలిలో సవిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గతంలో టీబీటీ(Direct Benefit Transfer)నిధుల ద్వారా వచ్చిన సొమ్ముతో.. రాష్ట్రంలో మహిళలు గంజాయికి అలవాటు పడ్డారని అన్నారామె.జగన్మోహన్రెడ్డి టీబీటీ పథకాల వల్ల రాష్ట్రంలో మహిళలు గంజాయికి అలవాటు పడ్డారు అంటూ మంత్రి సవిత ప్రసంగించారు. దీంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించ పరిచేలా మంత్రి సవిత మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. మరోవైపు..మంత్రి సవిత వ్యాఖ్యలు పై చైర్మన్ మోషేన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శాంతించక పోవడంతో మండలిని వాయిదా వేశారాయన. -
రెడ్బుక్ రాజ్యాంగాన్ని కాలేజీలపై చూపిస్తారా?: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో బ్రాహ్మణులపై దౌర్జన్యాలు పెరిగిపోయామని.. బ్రాహ్మణులను కూటమి ప్రభుత్వం బలహీనులుగా చూస్తోందంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. అందుకు నిదర్శనమే విజయవాడలో శాతవాహన కాలేజీ కూల్చివేతేనన్నారు. కాలేజీని కూల్చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ విష్ణు డిమాండ్ చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లు సైతం శిథిలాల కింద ఉండి పోతే ప్రభుత్వం చోద్యం చూస్తోందని.. ఇదే కేసుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్సీ.. కాలేజీ ప్రతినిధిని కిడ్నాప్ చేశారు.. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘కాలేజీకి చెందిన ఐదు ఎకరాల భూమిని కబ్జా చేయటానికే ఇలా దౌర్జన్యం చేశారు. కోర్టు తీర్పు ఉందని ఎలాంటి దౌర్జన్యమైనా చేస్తారా?. బ్రాహ్మణులు బలహీనంగా ఉన్నారని ఇలాంటి దాడులు చేస్తారా?. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కాలేజీల మీద కూడా చూపిస్తారా?. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ దీనికి సమాధానం చెప్పాలి.అక్రమంగా భూములు లాక్కుంటే లోకేష్ ఏమీ మాట్లాడరా?. బ్రాహ్మణులను బలహీనులుగానే చూస్తారా?. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు కూడా నమోదు చేయలేదు. దీన్ని వైఎస్సార్సీపీ సీరియస్గా తీసుకుంటుంది. మా హయాంలో ఎప్పుడూ ఇలాంటి దారుణాలు జరగలేదు. విజయవాడలో దౌర్జన్యం రాజ్యమేలుతోంది. కిడ్నాప్ చేసిన వారి మీద, కాలేజీని ధ్వంసం చేసిన వారిపై న్యాయ పోరాటం చేస్తాం’’ అని మల్లాది విష్ణు హెచ్చరించారు. -
రైతుల గోడు పట్టదా?: కూటమి సర్కార్పై కారుమూరి ఫైర్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పొగాకు పండించిన రైతుల గోడు వర్ణనాతీతంగా ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కొనుగోలు చేసే వారు లేక పొగాకు రైతులు అల్లాడుతుంటే కూటమి ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు ఈనెల 11న ప్రకాశం జిల్లా పొదిలికి మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెడుతున్నారని వెల్లడించారు. ఒక్క పొగాకే కాకుండా రాష్ట్రంలో కోకో, మామిడి, మిర్చి ఇలా ఏ పంట చూసినా రైతుల కష్టాలను ఆదుకునే వారే కనిపించడం లేదని ధ్వజమెత్తారు. వ్యవసాయం దండుగ అనే రీతిలోనే సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..పొగాకు రైతుల కష్టాల గురించి తెలుసుకుని, వారికి అండగా ఉండేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ పొదిలి వెడుతున్నారని ప్రకటించగానే, కూటమి ప్రభుత్వం స్పందించి హడావుడిగా పొగాకు కొనుగోళ్ళ విషయంలో చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించి, చేతులు దులుపుకుంది. వర్షాల వల్ల వైఎస్ జగన్ ముందుగా ప్రకటించిన తేదీకి బదులుగా ఈ నెల 11వ తేదీన వెళ్ళేందుకు సిద్ధపడ్డారు.ఈ విషయం తెలియగానే మళ్లీ మంత్రులు ప్రెస్మీట్ పెట్టి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామంటూ హామీలు గుప్పిస్తున్నారు. కేవలం మాటలకే తప్ప చేతల పరంగా ఎటువంటి చర్యలు కనిపించడం లేదని రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం వందల కోట్ల రూపాయలతో కొత్త హెలికాఫ్టర్లను కొనుగోలు చేసేందుకు చూపే శ్రద్ధలో కనీసం రైతులను ఆదుకునేందుకు రూ.1000 కోట్లతో అయినా స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయలేరా అని రైతులే ప్రశ్నిస్తున్నారుసిండికేట్గా మారిన పొగాకు కంపెనీలురాష్ట్రంలో పొగాకు సాగు చేసిన రైతులు కొనుగోలు చేసేవారు లేక అల్లాడిపోతున్నారు. బర్లీ పొగాకును ప్రోత్సహించిన పలు కంపెనీలు తరువాత ఆ పొగాకును కొనుగోలు చేయకుండా మోసం చేస్తున్నా ప్రభుత్వం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. రెండుమూడు బేళ్ళు కొనుగోలు చేసి, మిగిలిన దానిని వదిలిస్తుండటంతో రైతులు అన్యాయమైపోతున్నారు. మొత్తం ఏడు కంపెనీలు సిండికేట్గా మారి రేటు పెరగకుండా రైతులను దగా చేస్తున్నాయి. ఈ రోజు రైతుల వద్ద మొత్తం 55 మెట్రిక్ టన్నుల పొగాకు నిల్వలు ఉంటే, ఇప్పటి వరకు కేవలం 25 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోళ్ళు చేశారు.మిగిలిన పొగాకును దాచుకునేందుకు కూడా అవకాశం లేకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి రూ.1.50 లక్షలు పెట్టుబడులు పెట్టిన వారికి కనీసం పెట్టిన వ్యయం కూడా గిట్టుబాటు కావడం లేదు. తక్షణం మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి పొగాకు కొనుగోళ్ళు జరిపించాలి. గతంలో వైఎస్ జగన్ పాలనలో పొగాకు రైతులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటే ఏకంగా రూ.100 కోట్లు కేటాయించి కొనుగోళ్ళు చేయించేందుకు చర్యలు తీసుకున్నారు. గతంలో ఈక్రాప్, ఇన్సూరెన్స్ కట్టించి, రైతులకు అండగా నిలిచారు. గతంలో ఒంగోలులో కందులు పండకపోతే ఈ-క్రాప్, ఇన్సూరెన్స్ వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.12000 పరిహారం అందింది.రైతుల వేదన అరణ్య రోదనరాష్ట్రంలో రైతుల వేదన అరణ్య రోదనగా మిగిలిపోతోంది. రాష్ట్రంలో కోకో రైతులు రూ.900 రేటు కావాలంటే రూ.450 కొంటున్నారు. అదనగా రూ.50 కల్పిస్తామని చెప్పారే తప్ప అది కూడా కల్పించడం లేదు. గత ప్రభుత్వంలో రేటు పడిపోయిన సందర్భంలో రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి, అవసరమైతే మార్క్ఫెడ్తో కూడా కొనుగోళ్ళు చేయించి రైతులను ఆదుకున్నాం. మిర్చి రైతులను ఆదుకున్న పరిస్థితి కనిపించడం లేదు. అమ్మబోతో అడవి, ప్రజలు కొనబోతే కొరివిలా తయారైంది.రాష్ట్రంలో దళారీ వ్యవస్థను పెంచిపోషిస్తున్నారు. మామిడి, కోకో, పొగాకు పంటలకు గిట్టుబాటు రేటు కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ధాన్యానికి మద్దతు ధర ఇస్తామని, 24 గంటల్లో సొమ్ము రైతుకు చెల్లిస్తామని చెప్పారు. ఏప్రిల్ 6న ధాన్యం కొనుగోలు చేసి, నేటికీ చెల్లింపులు చేయలేదు. మంత్రి దుర్గేష్ను రైతులు నిలదీసిన విషయం వాస్తవం కాదా? సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏం చేస్తున్నారు? పదిలక్షల మెట్రిక్ టన్నులకు కానూ, 7 లక్షల మెట్రిక్ టన్నులకే పశ్చిమ గోదావరిజిల్లాలో కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. మిగలిన ధాన్యంను ఎవరికి అమ్ముకోవాలి? తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలోనూ ధాన్యం రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. పట్టుబడిన బియ్యం వివరాలు బయటపెట్టండివైఎస్ జగన్ హయాంలో ఇంటింటికీ రేషన్ను వాహనాల ద్వారా ఇస్తే పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్కు తరలిపోతోందని కూటమి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసింది. అందుకోసం ఆ వ్యవస్థను రద్దు చేసి, రేషన్ షాప్ల వద్దకే వెళ్ళాలని ప్రజలకు సూచించింది. నేడు ఎండలకు రేషన్ కోసం వెళ్ళి క్యూలైన్లలో నిలబడి పేదలు వడదెబ్బ బారిన పడుతున్నారు. తాజాగా విశాఖలో అక్రమంగా తరలిస్తున్న రైస్ను పట్టుకున్నారు.ఎండీయు వాహనాల వల్లే రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించిన ప్రభుత్వం, ఇప్పుడు ఆ వాహనాలను రద్దు చేసిన తరువాత కూడా అక్రమంగా బియ్యం రవాణా ఎలా జరుగుతోందో చెప్పాలి. అలాగే పట్టుబడిన బియ్యంను మా ప్రభుత్వంలో వేలం వేసే విధానం ఉండేది. కానీ కూటమి ప్రభుత్వంలో ఇలా పట్టుకున్న బియ్యం ఎక్కడికి వెడుతుందో తెలియడం లేదు. ఏడాది కాలంగా ఎంత బియ్యాన్ని పట్టుకున్నారు, ఆ బియ్యాన్ని ఎలా వేలం వేశారో వెల్లడించాలి. -
బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. ‘చంద్రబాబుతో రేవంత్ కుమ్మక్కు’
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్ బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. బనకచర్ల ప్రాజెక్ట్పై ఏపీతో కుమక్కు అయ్యారని మాజీ మంత్రి హరీష్ మండిపడ్డారు. కాళ్లేశ్వరం కమిషన్ విచారణపై శనివారం హరీష్ రావు చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajendar) చెప్పిన విషయాలను ప్రసావించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆర్థికశాఖతో సమన్వయం చేసుకునే నిధులు తీసుకొచ్చాం. అర్థికశాఖకు సంబంధం లేదని ఈటల రాజేందర్ అనటం సరైంది కాదుఆర్థికశాఖకు సంబంధం లేకుండా ఉండదు. ఈటల రాజేందర్ కు కొన్ని గుర్తు ఉండి ఉండకపోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం నియమించిన సబ్ కమిటీలో నేను, ఈటల,తుమ్మల ఉన్నాం. సబ్ కమిటీ రిపోర్ట్పై నాతో పాటు ఈటల, తుమ్మల కూడా సంతకం చేశారు. తుమ్మల నాగేశ్వరరావును కూడా విచారణకు పిలవాలి కదా.కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న అప్పులపై కూడా త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను.గోదావరి బనకచర్ల ప్రాజక్ట్ వలన తెలంగాణకు జరుగనున్న నష్టంపై కూడా ప్రజెంటేషన్ ఉంటుంది. బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. రేవంత్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్ట్ పై ఏపీతో కుమక్కు అయ్యాడు. నా దగ్గర మరొక డాక్యుమెంట్ ఉంది. కమీషన్ దగ్గర అది బయట పెడతా. వాళ్ళు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ రాత పూర్వకంగా ఇస్తాను’ అని హరీష్ రావు చిట్ చాట్లో తెలిపారు. -
అమరావతి ప్రజలారా.. బాబుని నమ్మొద్దు.. టీడీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: అమరావతి ప్రజలారా.. బాబుని నమ్మొద్దు అంటూ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత శోభనాద్రీశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని మూడు దశల్లో నిర్మించేందుకు 35 ఏళ్లు పడుతుందని కూటమి ప్రభుత్వం వరల్డ్ బ్యాంకుకు చెప్పింది. ఇప్పుడే అదే రాజధానిని రెండు మూడేళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు,నారాయణ ఎలా చెబుతారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం కోసం మరో 45వేల ఎకరాలు సేకరించేందుకు సిద్దమైన తరుణంలో కూటమి ప్రభుత్వం తీరును విమర్శిస్తూ శోభనాద్రీశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ‘33 వేల ఎకరాలు ఇచ్చి రైతులు త్యాగం చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. పదేళ్లు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించుకునే అవకాశం ఉంది.అతి తెలివితేటలతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికో డబ్బిచ్చి దొరికిపోయారు. మన ప్రాంతం నుంచే పాలించుకోవాలని ఏపీకి వచ్చేశారు. ఇక్కడికి వచ్చిన చంద్రబాబు ఇల్లు ఏమైనా కట్టుకున్నాడా? ప్రజలకు అవసరమైన విధానాలను అమలు చేసేదే రాజధాని. ప్రజలను మెంటల్గా డైవర్షన్ చేయడానికి చంద్రబాబు, ఆయన మీడియా ప్రయత్నం చేస్తోంది.అమరావతి కోసం భూమి పూజ చేసిన వాడు నాలుగేళ్లలో రోడ్లు వేశారా?ఇప్పుడు మరో 45 వేల ఎకరాలు కావాలంటున్నారు. రాజధాని ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉంటేనే పెట్టుబడులు వస్తాయంటున్నారు. భారతదేశం మొత్తం మీద ఎక్కువ భూమి ఉన్న ఎయిర్ పోర్టు శంషాబాద్ మాత్రమే.ఇప్పుడు అమరావతిలో 5 వేల ఎకరాలతో ఎయిర్ పోర్టు కడతామంటున్నాడు. ఏపీలో ఇప్పటికే 6 ఎయిర్ పోర్టులున్నాయి. అమరావతిలో మరో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కడతానంటున్నాడు.భోగాపురంలో ఎయిర్ పోర్టు కడుతుంటే.. శ్రీకాకుళంలోనూ ఎయిర్ పోర్టు కడతామంటున్నాడు. శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధులతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వారికి తాగునీరు ఇవ్వకుండా ఎయిర్ పోర్టు కడతాననడానికి చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం లేదా?.మరో 45 వేల ఎకరాలు తీసుకోవాలనే ఆలోచనను చంద్రబాబు మానుకోవాలి. కుప్పం ప్రాజెక్టు చేసిన బిల్లీరావుతో చంద్రబాబుకు లింక్ ఏర్పడింది. హైదరాబాద్లో ల్యాండ్ ఇస్తే ఒలంపిక్స్ మెడల్స్ అన్నీ ఏపీకి తెచ్చేస్తానన్నాడు. సెంట్రల్ యూనివర్శిటీ పక్కన 400 ఎకరాల భూమిని ఎకరా 50 వేల చొప్పున అమ్మేశారు.శంషాబాద్లో 400 ఎకరాలు ఎకరా 25 వేల చొప్పున అమ్మేశారు. చంద్రబాబు 800 ఎకరాలు ఇస్తే వాడు స్టేడియం కూడా కట్టలేదు. వైఎస్సార్ సీఎం అయ్యాక ఆ భూముల ఒప్పందాన్ని రద్దు చేశారు. పొరపాటని తెలిసినా రాజకీయపార్టీలు మాట్లాడటం లేదు. దేశంలోనే అత్యంత సారవంతమైన భూములను నదీముఖ అభివృద్ధి పేరుతో తీసుకున్నారు. కృష్ణా కరకట్టకు రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో బ్లూ&గ్రీన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కట్టడానికి సాధ్యమని గ్రీన్ ట్రిబ్యునల్ తేల్చింది.విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు అక్క ఆరాటమే కానీ బావ బ్రతకడు సామెత మాదిరిగానే ఉంటుంది. లక్షల ఎకరాలు తీసుకుని కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారు. రైతులకు చేతులెత్తి మొక్కుతున్నా. చంద్రబాబు కోరుతున్న 45 వేల ఎకరాలను ఇవ్వాలనుకుంటున్న రైతులు వారి ఆలోచనను విరమించుకోండి. ఇలాంటి పిచ్చి ఆలోచనలను ప్రజలంతా వ్యతిరేకించాలి’ అని పిలుపునిచ్చారు. -
పవన్కు ఝలక్.. జనసేన నేతల దందాపై వర్మ సెటైర్లు
సాక్షి, కాకినాడ: ఏపీ డిప్యూటీ సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో యథేచ్ఛగా జనసేన నేతలు ఇసుక దందా చేస్తున్నారు. తాజాగా ఇసుక దందాను టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. దీంతో జనసేన, టీడీపీ మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ ఇలాకా పిఠాపురంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఈ నేపథ్యంలో ఇసుక మాఫియాపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా మల్లివారితోటలో ఇసుక అక్రమ తవ్వకాలను వర్మ పరిశీలించారు. అనంతరం, వర్మ మీడియాతో మాట్లాడుతూ.. రాత్రి కాగానే పిఠాపురం పోలీసులకు రేచీకటి వస్తోంది. పిఠాపురం పోలీసులకు స్పెషల్ గ్లాసెస్ ఇవ్వాలి. అనుమతులు లేకుండా ఇసుక తవ్వుతున్నారు. పోలీసులు మాఫియాతో కుమ్మక్కైపోయినట్టున్నారు. రోజుకు 200 నుండి 300 లారీల ఇసుక వెళ్లిపోతుంది. రాత్రుళ్లు ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఇసుక రవాణా కనిపించడం లేదంటే వాళ్లకు కావాల్సిన మామూళ్లు వస్తున్నాయి. పోలీసులు ముందే సమాచారం ఇచ్చి సర్దుకోమంటున్నారు. ఇక్కడ దొంగతనం జరుగుతుందని చెప్పినా పట్టించుకోవడం లేదు. 20 రోజులుగా పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు. రమణక్కపేటలో అక్రమ రవాణాకు మరో శంకుస్థాపన చేశారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
ఆందోళనకరంగా ఏపీ ఆర్థిక పరిస్థితి.. కాగ్ లెక్కలతో వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కూటమి పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారిందన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. కాగ్ నివేదికలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వైఎస్ జగన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం చెప్పేదానికి పూర్తి విరుద్దంగా కాగ్ నివేదికలు వాస్తవాలను వెల్లడి చేస్తున్నాయని చెప్పారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా కాగ్ నివేదికలను బయటపెట్టారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది. కాగ్ నివేదికలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా రూ.3,354 కోట్లు ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ, ఇది అబద్దమని కాగ్ నివేదిక వాస్తవ లెక్కలను ప్రకటించింది. 2024 ఏప్రిల్తో పోల్చితే 2025 ఏప్రిల్లో ప్రభుత్వ ఆదాయం ఏకంగా 24.20 శాతం తగ్గింది.ఈ వాస్తవాలను కాగ్ నివేదిక బయట పెట్టగానే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది. ఏప్రిల్ విషయాలు చెప్పకుండా మే నెలలో జీఎస్టీ ఆదాయాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంది. సర్దుబాటు కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన రూ.796 కోట్లు తగ్గిందనీ, అందువలన జీఎస్టీ ఆదాయాలు తగ్గాయని ప్రకటించింది. నిజానికి సర్దుబాట్లన్నీ లెక్కించిన తర్వాతనే నికర జీఎస్టీని లెక్కగడతారు. కానీ, జీఎస్టీ ఆదాయాల గురించి కాగ్ నిజాలను వెలుగులోకి తేగానే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలను చేస్తోంది.టీడీపీ ప్రభుత్వం చెప్పేదానికి పూర్తి విరుద్దంగా కాగ్ నివేదికలు వాస్తవాలను వెల్లడి చేస్తున్నాయి. దాన్ని బట్టి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉంది. గతేడాదితో పోల్చితే పన్ను ఆదాయాలు 12.21 శాతం తగ్గాయి. పన్నేతర ఆదాయాలు 22.01 శాతం తగ్గాయి. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరింత ఆందోళన కలిగించే అంశం’ అని చెప్పుకొచ్చారు. April 2025 fiscal performance indicates further distressThe CAG uploaded the Monthly Key Indicators for April 2025 and these figures bring to light a very disturbing picture regarding the State finances. On 1st May, the Government made a press release suggesting that the… pic.twitter.com/oGwLzKXzQZ— YS Jagan Mohan Reddy (@ysjagan) June 7, 2025 -
పొలిటికల్ బాసులు చెప్పినట్టు పోలీసుల వేధింపులు: సజ్జల
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగంతో భయాందోళన సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. లక్ష్మీనారాయణపై అక్రమ కేసులు పెట్టడంతో తీవ్ర మనస్థాపం చెందారని తెలిపారు. పొలిటికల్ బాసులు చెప్పినట్టు పోలీసులు నడుచుకుంటున్నారని ఆరోపించారు.రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త లక్ష్మీనారాయణను వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు పరామర్శించారు. అనంతరం, సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు నాయకత్వంలో కూటమి ఏర్పాటై ఏడాది అయ్యింది. ఎన్నికలకు ముందు వారి పాలన డిఫరెంట్గా ఉంటుందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. పోలీసు వ్యవస్థను ప్రైవేటు ఆర్మీలా తయారు చేసి ప్రత్యర్దులపై దాడులు, తప్పుడు కేసులు పెడుతున్నారు. రోజుకు కనీసం పది తప్పుడు కేసులు పెడుతున్నారు. అరాచక శక్తులు, గూండాలు చేసే పనులు పోలీసులు చేస్తున్నారు. ఆర్గనైజ్డ్ క్రైం చేస్తున్నారు. క్రిమినల్ గ్యాంగ్కు యూనిఫారం వేసినట్లుంది.లక్ష్మీనారాయణ ఏ పార్టీ అన్నది కాదు.. కులాన్ని తీసుకొచ్చారు. డీఎస్పీకి సివిల్ మ్యాటర్లో ఏం పని. ఫ్రెండ్లీ పోలీస్ మరిచి యాభై ఏళ్ల క్రితం ఎమర్జెన్సీకి తీసుకెళ్తున్నారు. రక్షించాల్సిన వారే అరాచక శక్తి అయితే ఎవరు ఏం చేయగలరు. శాతవాహన కాలేజీని అర్ధరాత్రి కూలగొట్టాల్సిన అవసరం ఏంటి. దీని వెనుక టీడీపీ నేత ఉన్నారు. సంఘ విద్రోహక శక్తుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. నిజాయితీ ఉన్న పోలీసులు లూప్ లైన్లో ఉన్నారు. వ్యవస్థ గాడి తప్పింది. ఒక్కరిపై చర్యలు లేవు. మరణవాంగ్మూలం కంటే ఏది ఎక్కువ కాదు.లక్ష్మీనారాయణ స్వయంగా పోలీసుల వేధింపుల గురించి చెప్పారు. కృష్ణవేణి, సుధారాణిలను వేధించారు. ఆర్గనైజ్డ్ అరాచకానికి చట్టాన్ని కాపాడే పోలీసులను అడ్డం పెట్టుకున్నారు. ఇంత కన్నా దిగజారడం ఉంటుందా?. చంద్రబాబు, లోకేష్లు పరిస్థితి గమనించాలి. అదుపు తప్పుతున్న వ్యవస్థలు రేపు మరింత డేంజర్ అవుతాయి. లక్ష్మీనారాయణ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి. వేధింపులకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. తప్పుడు కేసులు, వేధింపులపై కోర్టులు, మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తాం. దాడులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉపేక్షించలేదు’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఏడాదికే బండి బోరుకొచ్చేసిందా.. బాబు సర్వేలో ఇదే తెలిసిందా?
నాచేతి మాత్ర.. వైకుంఠ యాత్ర.. అన్నట్లుగా తయారైంది చంద్రబాబు పాలన తీరు. అధికారంలోకి రావడానికి నడవని అడ్డదారి లేదు.. కరవని అడ్డమైన గడ్డీ లేదు. మునుపటి ఎన్నికల్లో మోదీని నానామాటలూ అన్న బాబు మొన్నటి ఎన్నికలకు ముందు పొత్తుకోసం ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే తక్కువ. అదీకాకుండా పవన్ కళ్యాణ్.. కాపు ఓట్లు.. వీటన్నిటికీ తోడు రాష్ట్రంలో కనిపించిన ప్రతివ్యక్తికి.. ప్రతి కులానికి.. ప్రతి వర్గానికి నోటికొచ్చిన హామీ ఇచ్చి గెలిచి ఏడాదైంది.ఏడాదిలో చాలా చేసేసాం అని బయటకు మేకపోతులా గాంభీర్యం చూపుతున్నా లోలోన బాబులు ముగ్గురిలోనూ గుబులు మాత్రం కలుగుతోంది. ముగ్గురు కలిసినా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను 40 శాతం ఓట్ల నుంచి కిందకు రప్పించలేకపోయారు. జగన్ కన్నా వాళ్ళు గొప్పగా సాధించిన ఓట్లేమీ లేకున్నా సీట్లు గణనీయంగా వచ్చాయి. ఈసారి కూడా ప్రజలు ఇలాగే తమ గాలిమాటలు నమ్ముతారన్న గ్యారెంటీ లేదు. అందుకే ఏడాది పాలన ముగిసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సెల్ఫ్ చెక్ చేసుకుంటోంది.బాబు పాలన ఎలా ఉంది అంటూ ప్రజలకు ఐవీఆర్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఏడాదిలోనే పనితీరును మదింపు చేసుకుంటున్నారు అంటే లోలోన చంద్రబాబు.. లోకేష్.. పవన్ కళ్యాణ్కు గట్టిగానే డౌట్ కొడుతోందని అర్థం అవుతోంది. ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయకుండా బాబు గారి పాలన ఎలా ఉంది అని ఫోన్లో అడుగుతున్నారు.. ప్రజలు ఆ కాల్ రాగానే.. తుపుక్.. తుపుక్ అని సమాధానాలు ఇస్తుండటంతో ఏం చేయాలో తోచడం లేదని తెలుస్తోంది. తల్లికివందనం.. ఆడబిడ్డ నిధి.. ఫ్రీ బస్సు.. నిరుద్యోగ భృతి.. రైతు భరోసా.. ఇలా ఏదీ అమలు చేయకపోవడంతో జనం ఘోరంగా తిడుతున్నట్లు ఐవీఆర్ఎస్ సర్వేలో తేలిందట. పైగా అభివృద్ధి.. సంక్షేమం వంటి అంశాలను వదిలేసి కేవలం వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేయడం.. అనవసరమైన అంశాలను ప్రచారంలోకి తెచ్చి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం వంటి చిల్లర పనులను ప్రజలు ఏవగించుకుంటున్నట్లు తెలుస్తోంది. కేకే సర్వే అనే సంస్థ కూడా ఇదే రిపోర్ట్ ఇచ్చింది. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు భారీగా గెలుస్తారని చెప్పింది కూడా ఈ కేకే సర్వే సంస్థ. అయితే అదే సంస్థ ఇప్పుడు దాదాపు 70 మందికి పైగా ఎమ్మెల్యేల మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతోంది. పవన్ కళ్యాణ్ కూడా ఈసారి పిఠాపురంలో గెలవడం కష్టమే అని అంటున్నారు. ఏడాదిలోనే ప్రజల్లో ఇంట నగుబాటు మొదలైందంటే రానున్న నాలుగేళ్లలో కూటమి నాయకులను వెంటాడి తరిమే పరిస్థితి ఉంటుందని కొందరు సర్వేలో చెబుతున్నారు. గ్రేటాంధ్ర.. ది తెలుగు న్యూస్.. జర్నలిస్ట్ సాయి వంటి వాళ్ళు పెట్టిన ఆన్లైన్ పోల్లో కూడా ఇలాగే దారుణమైన ఫలితాలు వచ్చాయి. గ్రామాల్లో నాయకుల దందాలు.. పెచ్చుమీరిన క్రైమ్.. రౌడీయిజం ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించాయి. ఆ భయం లోలోన ఉండబట్టే ఐవీఆర్ఎస్ సర్వే చేయించారని అంటున్నారు.-సిమ్మాదిరప్పన్న. -
రాష్ట్రాన్నిబట్టి న్యాయం మారుతుందా?
కర్ణాటక రాజధాని బెంగుళూరులో జరిగిన ఘోర విషాదం క్రీడాభిమానులు అందరినీ విచారంలోకి నెట్టింది. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో 18 ఏళ్ల ఎదురుచూపులు తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారి కప్పు గెలవడంతో విజయోత్సవాలు జరిగాయి. అయితే జనం అంత స్థాయిలో వస్తారని ఊహించలేదో.. పోలీసుల నిర్లక్ష్యమో తెలియదు కాని 11 మంది నిండుప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అనేక మంది గాయాలపాలయ్యరు. దీనిపై కర్ణాటక హైకోర్టు సుమోటోగా కేసు తీసుకుంది. దీనిని స్వాగతించవచ్చు. కర్ణాటక ప్రభుత్వం బెంగుళూరు జట్టు ప్రతినిధులను అరెస్టు కూడా చేసింది. సిటీ పోలీస్ కమిషనర్తో సహా ఆరుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది.ఈ ఘటన జరిగిన వెంటనే తెలుగు వారికి కొన్ని ఘటనలు గుర్తుకు వస్తాయి. రాజమండ్రి వద్ద పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణిస్తే కనీసం ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా సస్పెండ్ అవ్వలేదు. అంత పెద్ద ఘటనపై అప్పట్లో న్యాయ వ్యవస్థ కూడా స్పందించలేదు. అంతేకాదు.. కందుకూరు, గుంటూరులలో జరిగిన టీడీపీ ర్యాలీలలో, తిరుపతి, సింహాచలం పుణ్యక్షేత్రాలలో జరిగిన ఘటనల్లో పలువురు మరణించినా తూతూ మంత్రపు చర్యలే జరిగాయి. న్యాయ వ్యవస్థ స్పందించినట్లు కనబడదు. పాలన, న్యాయ వ్యవస్థలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా వ్యవహరించవచ్చా?.బెంగుళూరులో జరిగిన తొక్కిసలాట విషయానికి వస్తే, కొన్ని సందర్భాలలో ప్రజలు ఫ్రెంజీ అవుతారనిపిస్తుంది. చిత్రం ఏమిటంటే ఐపీఎల్ టోర్నమెంట్ జట్లలో స్థానికత నేతి బీరకాయ చందమే. బెంగుళూరు జట్టులో స్థానికులు లేదా కర్ణాటకకు చెందిన వారు అతి కొద్ది మంది. టోర్నీ మొత్తం వ్యాపారమే. క్రికెటర్లు కోట్ల రూపాయలకు అమ్ముడు పోతుంటారు. ఈ మొత్తాలు ఆట సమయంలో వారిని ఒత్తిడికి గురి చేస్తూంటాయి కూడా. బాగా ఆడలేకపోతే నిర్వాహకుల ఆగ్రహానికి గురవుతూంటారు. లక్నో జట్టుకు ఆడుతున్న సమయంలో కేఎల్ రాహుల్ను టీమ్ యజమాని బహిరంగంగా నిందించిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఇది కూడా ఒక కోణం. ఒక్కొక్క జట్టు రెండేసి సార్లు మరో జట్టుతో తలపడేలా ప్లాన్ చేశారు. పోటీల నిర్వహణ తీరును మనం తప్పు పట్టనక్కర్లేదు. సుమారు 18 ఏళ్లుగా దేశ ప్రజలను బాగా ఆకట్టుకున్న టోర్నీ ఇది. బెట్టింగులు కూడా జోరుగా సాగుతుంటాయని అంచనా. ఆటను ఆటగా చూడడం వరకు ఓకే కాని అది పిచ్చిగా మారకూడదు.బెంగుళూరు జట్టు గెలిచిన మాట నిజం. కానీ, అందులో ఎందరు ఆ నగరం లేదా రాష్ట్ర ప్లేయర్లు ఉన్నారు?. దానిని కూడా గమనించకుండా గెలిచిన జట్టును అభినందించడానికి వేలు, లక్షల సంఖ్యలో తరలి రావడం ఏమిటి?. ఫలితంగా తొక్కిసలాట జరగడం ఏమిటి?. అంతమంది మరణించడం ఏమిటి. కొన్ని యూరప్ దేశాలలో ఫుట్ బాల్ మ్యాచ్ తర్వాత ఘర్షణలు చోటు చేసుకుని అనేక మంది మరణించిన సందర్భాలు ఉన్నాయి. మన దేశంలో ఆ పరిస్థితి పెద్దగా కనిపించదు. అంతవరకు బాగానే ఉందనుకుంటే ఈ విజయోత్సవ కార్యక్రమం ప్రమాదం తెచ్చిపెట్టింది. ఈ ఘటనపై కర్ణాటక హైకోర్టు స్పందించి తొమ్మిది ప్రశ్నలు వేసి వివరంగా నివేదిక సమర్పించాలని కోరింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. నగర పోలీస్ కమిషనర్ దయానంద్, మరో ఐదుగురిని సస్పండ్ చేశారు. ఆర్సీబీ ప్రతినిధులను కూడా అరెస్టు చేశారు. యజమానులను అరెస్టు చేయాలని చెప్పకపోవడం గమనించదగ్గ అంశమే.కొన్ని నెలల క్రితం హైదరాబాద్లో ఒక థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి, ఇప్పటికీ కోలుకోలేదు. ఈ ఘటనలో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేశారు. నిజానికి ఇందులో అర్జున్ తప్పు ఏ మేరకు ఉందన్న మీమాంస ఉంది. చంద్రబాబు గత టర్మ్లో రాజమండ్రి వద్ద పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మరణించారు. ఆ తొక్కిసలాటకు కారణం చంద్రబాబు నాయుడు కుటుంబం. వీఐపీ ఘాట్ వద్ద కూడా సామాన్య ప్రజలకు కేటాయించిన ఘాట్లో స్నానం చేయడం, దానిని ప్రచార డాక్యుమెంటరీగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ చిత్రీకరించడం, ఆ క్రమంలో జనం పెరిగిపోయి గేట్లను ఒక్కసారిగా తెరవడంతో తొక్కిసలాట సంభవించడం జరిగింది.ఆ తర్వాత దీనికి సంబంధించిన సీసీటీవీ పుటేజ్ కూడా మాయమైందని చెబుతారు. ఇంతమంది మృతి చెందిన ఘటనపై ఆనాటి న్యాయ వ్యవస్థ స్పందించలేదు. అలాగే పాలనా వ్యవస్థ కనీసం సీనియర్ అధికారులను కాదు కదా!.. ఒక్క కానిస్టేబుల్ ను కూడా సస్పెండ్ చేయలేదు. ఎందుకంటే అలా చేస్తే చంద్రబాబు చేసిన తప్పిదాలు కూడా బయటకు వస్తాయనే కదా! న్యాయ విచారణ కు ఆదేశం అంటూ ఒక రిటైర్డ్ న్యాయమూర్తితో కమిషన్ వేశారు. ఆయనేమో ఇదంతా మీడియా ప్రచారం వల్ల అని తేల్చారు తప్ప చంద్రబాబు జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. దానిపై చాలా విమర్శలు వచ్చాయి. ఇక చంద్రబాబేమో ప్రమాదాలు ఎక్కడ జరగడం లేదు.. పూరీలో జరగలేదా? రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా.. అంటూ పుష్కరాల తొక్కిసలాట మరణాలను తక్కువ చేసే యత్నం చేశారు.అదే కాదు.. తిరుపతి శేషాచలం కొండలలో 20 మంది ఎర్ర చందనం కూలీలను ఎన్ కౌంటర్ చేస్తే కూడా న్యాయ వ్యవస్థ ఆశించిన రీతిలో స్పందించ లేదన్న విమర్శ ఉంది. ఆ కూలీలు తమిళులు కావడంతో అక్కడి ప్రభుత్వం వారికి పరిహారం ఇచ్చింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం వారిని నేరస్తులుగా పరిగణిస్తే, ఇంకో రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వారిని గుర్తించింది. ఈ మధ్యనే తిరుపతి తొక్కిసలాట, సింహాచలం ఆలయ గోడ కూలిన ఘటనలపై న్యాయవ్యవస్థ సుమోటోగా తీసుకోలేదు. విశాఖపట్నంలో సుధాకర్ అనే డాక్టర్ తాగి రోడ్డుపై అల్లరి చేసి ట్రాఫిక్కు ఆటంకం కలిగిస్తుంటే అక్కడ ఉన్న కానిస్టేబుల్ అతని చేతులు వెనక్కి కట్టి పోలీస్ స్టేషన్కు తీసుకువెళితే అప్పట్లో హైకోర్టు ఏకంగా సీబీఐ విచారణకే ఆదేశించిందింది. అదేమీ తేలలేదు. అది వేరే విషయం.మరి కొద్ది రోజుల క్రితం తెనాలిలో ముగ్గురు దళిత, ముస్లిం యువకులను పోలీసులు నడిరోడ్డులో అరికాళ్లపై లాఠీలతో కొడుతూ హింసించి వీడియో తీస్తే న్యాయ వ్యవస్థ ఎందుకు అదే స్థాయిలో స్పందించలేదో తెలియదు. న్యాయ వ్యవస్థలు కొన్ని ప్రభుత్వాల పట్ల సానుకూల ధోరణితో, మరికొన్ని ప్రభుత్వాల పట్ల వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తున్నాయన్న భావన ప్రజలలో నెలకొంది. ప్రత్యేకించి ఏపీలో జగన్ టైమ్లో న్యాయ వ్యవస్థ స్పందించిన తీరుపై చాలా విమర్శలు వచ్చేవి. చంద్రబాబుకు ఎప్పుడో అరుదుగా తప్ప న్యాయ వ్యవస్థ నుంచి ఎలాంటి ఇబ్బందులు రావన్న భావన నెలకొంది. అలాగే ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలను బట్టి కాకుండా, ధర్మం, న్యాయాలను బట్టి వ్యవస్థలు స్పందించడం అవసరం అని చెప్పవలసి ఉంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఏపీలోకి ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు కాసేపట్లో విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 1,35,826 మంది, రెండో ఏడాదిలో 97,963 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఒక్క క్లిక్తో ఫలితాలను ఇక్కడ చూడండి..ఫలితాల కోసం ఈ కింది లింక్లను క్లిక్ చేయండి.. AP Intermediate 1st Year Adv. Supplementary Results 2025 (General)https://results.sakshieducation.com/Results2025/Andhra-Pradesh/Inter/Jr-Inter/Supply/ap-intermediate-1st-year-results-2025.htmlAP Intermediate 2nd Year Adv. Supplementary Results 2025 (General)https://results.sakshieducation.com/Results2025/Andhra-Pradesh/Inter/Sr-Inter/Supply/ap-intermediate-2nd-year-results-2025.htmlAP Intermediate 1st Year Adv. Supplementary Results 2025 (Vocational)https://results.sakshieducation.com/Results2025/Andhra-Pradesh/Inter/Jr-Inter/Supply/VOC/ap-intermediate-1st-year-vocational-results-2025.htmlAndhra Pradesh Intermediate Second Year Supply Results 2025 (General)https://results.sakshieducation.com/Results2025/Andhra-Pradesh/Inter/Sr-Inter/Supply/Voc/ap-intermediate-2nd-year-vocational-results-2025.html -
టీడీపీకి బిగ్ షాక్.. సీనియర్ నాయకుడు రాజీనామా
సాక్షి, అన్నమయ్య: ఏపీలో అధికార కూటమి పార్టీ టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. అన్నమయ్య జిల్లాలో సీనియర్ నాయకులు సుగవాసి సుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖను అందజేశారు. దీంతో, పచ్చ పార్టీకి బిగ్ షాక్ తగలినట్టు అయ్యింది.అన్నమయ్య జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకులు సుగవాసి సుబ్రహ్మణ్యం పార్టీకి రాజీనామా చేస్తున్నట్ట ప్రకటించారు. ఈ మేరకు లేఖలో వెల్లడించారు. సుగవాసి సుబ్రహ్మణ్యం 2024లో రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్యే, ఎంపీగా ఉన్న సుగవాసి పాలకొండ్రాయుడు తనయుడు సుబ్రహ్మణ్యం.తన రాజీనామా సందర్భంగా సుగవాసి సుబ్రహ్మణ్యం పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం లేదని, మహానాడులో పాలకొండ్రాయుడికి నివాళులు సక్రమంగా అర్పించలేదని అన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి తమను తొక్కేస్తున్నాడని గతంలో బహిరంగంగా సుబ్రహ్మణ్యం విమర్శలు చేశారు. ఇక, సుబ్రహ్మణ్యం రాజీనామాతో రాయచోటి, రాజంపేటలో టీడీపీకి నష్టం జరిగే అవకాశం ఉన్నట్టు పలువురు రాజకీయ నేతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా సుగవాసి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ..‘ప్రజల అభిప్రాయాలను గౌరవించే పార్టీకి రాజీనామా చేశాను. రాజీనామా నిర్ణయం ఈరోజు తీసుకున్నది కాదు. ఐదారు నెలల నుంచే దీనిపై ప్రజాభిప్రాయాలు సేకరించాను. భవిష్యత్తులో ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రజలకు మేలు చేసేందుకు రాజకీయాల్లో కోనసాగుతాను. ప్రజలకు తోడ్పాటు అందిస్తాను. నా రాజీనామా విషయం మా తండ్రితో ముందే చర్చించాను. ఆయన అనుమతి ఉన్నట్లే భావిస్తున్నాను’ అని వ్యాఖ్యలు చేశారు. -
టీడీపీ నేతల కీచకపర్వం.. నిందితులకు ‘పరిటాల’ వత్తాసు!
సాక్షి టాస్క్ఫోర్స్ : దళిత మైనర్ బాలికపై ఆరు నెలలుగా 14 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పేరూరు పంచాయతీ పరిధిలోని ఏడుగుర్రాలపల్లిలో టీడీపీ కీచకులు సాగించిన ఈ దారుణకాండను శుక్రవారం ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ అమానుష ఘటన అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.రాజకీయ, పోలీసు వర్గాల్లో సైతం విస్మయం వ్యక్తమైంది. ఈ ఘటన గురించి స్థానిక పోలీసులకు ముందుగానే తెలిసినా, ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చే వరకు స్పందించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాక్షి కథనంతో ఈ ఘోరం బయటి ప్రపంచానికి వెల్లడైంది. నిందితుల్లో తొమ్మిది మందిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిని విచారణ కోసం అంటూ రామగిరి నుంచి ధర్మవరం తీసుకెళ్లినట్లు సమాచారం. వీరిని ఎక్కడ పట్టుకున్నారనే విషయాన్ని పోలీసులు వెల్లడించ లేదు. దాదాపుగా నిందితుల పేర్లన్నీ ఇప్పటికే బయటకు వచ్చినా, ఎందుకు ముందుగానే అదుపులోకి తీసుకోలేకపోయారనేది అనుమానాలకు తావిస్తోంది.టీడీపీ ప్రముఖ నేతల జోక్యంతో కేసును, నిందితులను తారుమారు చేసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత కనుసన్నల్లోనే నిందితులు దాక్కున్నట్లు సమాచారం. వీడియో వైరల్ చేస్తామని బెదిరించి మైనర్ బాలికపై 14 మంది టీడీపీ వర్గీయులు ఆర్నెల్ల పాటు అత్యాచారం సాగించారు. బాధిత బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటకు పొక్కింది. అయితే బాధితురాలు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా నిందితులు తీవ్రంగా బెదిరించారు. దీంతో గురువారం మధ్యాహ్నమే సదరు బాలిక.. తల్లితో కలిసి గ్రామం వదిలి వెళ్లిపోయారు. వారు ఒక టీడీపీ నేత ఇంట్లో ఉండగా.. పోలీసులు ఆ బాలికతో మాట్లాడినట్లు సమాచారం. నీకెవరూ దిక్కు లేరంటూ.. బాధిత బాలికను జిల్లా ఎస్పీ వి.రత్న నేతృత్వంలో ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం విచారించినట్లు తెలిసింది. విచారణలో బాలిక విస్తుగొలిపే వాస్తవాలు చెప్పినట్లు సమాచారం. 14 మందీ అదే గ్రామానికి చెందిన టీడీపీ వారేనని వివరించినట్లు తెలిసింది. మొదట ఒకరు బెదిరించి, అత్యాచారానికి పాల్పడి.. ఆ దృశ్యాలను సెల్ఫోన్లో వీడియో తీశాడని, ఆ తర్వాత ఆ వీడియోను ఇతరులకు పంపారని చెప్పినట్లు సమాచారం. అనంతరం ఒకరి తర్వాత మరొకరు ఆ వీడియో పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తూ అమానుషానికి పాల్పడ్డారని కన్నీటి పర్యంతమైనట్లు తెలిసింది. ఇలా దాదాపు ఆరు నెలలుగా అత్యాచారం చేశారని ఎస్పీ విచారణలో బాలిక వెల్లడించినట్లు సమాచారం.‘ఎవరికైనా చెబితే చంపేస్తాం. నీకు తండ్రి లేడు. తల్లికి మతి స్థిమితం లేదు. నీకెవరూ దిక్కు లేరు. మేం చెప్పినట్లు వినకపోతే నీ వీడియోలు బయట పెడతాం అని బెదిరించే వారు. అవి చూపుతూ తరచూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఎంతగా బతిమాలినా వదిలి పెట్టేవాళ్లు కాదు. ఏం చేయాలో తోచేది కాదు. దొంగగా ఏడ్చుకోవాల్సి వచ్చేది. దీంతో నాకు చాలా సార్లు చనిపోవాలనిపించింది. అయితే అమ్మ పరిస్థితి చూసి ఆ పని చేయలేకపోయాను’ అని బాధిత బాలిక తన నరకయాతనను పోలీసులకు వివరించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ బాలికను జువైనల్ హోమ్కు తరలిస్తున్నట్లు సమాచారం. నిందితులకు ‘పరిటాల’ వత్తాసు! సామూహిక అత్యాచారంలో పాల్గొన్నట్లు అనుమానం ఉన్న యువకులందరూ టీడీపీ సానుభూతిపరులే. దీంతో వారిని కాపాడేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ రంగంలోకి దిగినట్లు తెలిసింది. వాస్తవానికి బాధిత బాలిక కుటుంబం కూడా టీడీపీలోనే కొనసాగుతోంది. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత జరిగిన విజయోత్సవ సంబరాల్లో బాధిత బాలిక తండ్రి మరణించాడు. అయినప్పటికీ పరిటాల సునీత బాధిత బాలిక వైపు కాకుండా.. నిందితుల వైపు ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, శుక్రవారం ఏడుగుర్రాలపల్లిలో రెవెన్యూ, పోలీస్, ఐసీడీఎస్ అధికారులు పర్యటించారు. ఘటనకు సంబంధించి గ్రామస్తుల ద్వారా వివరాలు సేకరించారు. బాధిత బాలికకు న్యాయం జరిగేవరకు పోరాడతామని దళిత సంఘం నాయకులు పేర్కొన్నారు. -
ఏపీలో మండే ఎండలు.. వేడిగాలులతో జనాలు ఉక్కిరిబిక్కిరి (ఫొటోలు)
-
కోరేది కొండంత.. దాచేది పిసరంత!
సంపాదించుకోవాలి.. త్వరగా పదవీ విరమణ చేయాలి.. ఇదీ భారతీయ యువత ఆలోచన. ముఖ్యంగా 25 ఏళ్లలోపు వయసున్న ఉద్యోగుల్లో.. 43 శాతం మంది 45–55 సంవత్సరాలకే రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నారు. ముందస్తు పదవీ విరమణ కోరుకుంటున్నప్పటికీ 75% మంది తమ ఆదాయంలో కేవలం 1–15% మాత్రమే పెన్షన్ పథకాలకు కేటాయిస్తున్నారు. దేశంలో ప్రైవేటు రంగంలో పనిచేసేవారు, వ్యక్తిగతంగా ఉపాధి పొందుతున్నవారిపై ప్రముఖ ప్రొఫెషనల్ సేవల సంస్థ ‘గ్రాంట్ థోర్న్టన్ భారత్’చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నవారిలో.. తమ పదవీ విరమణ తరువాత ఆశిస్తున్న ఆదాయానికి, వారి ఆర్థిక ప్రణాళికలకు మధ్య చాలా అంతరం ఉంది. అంటే రిటైర్ అయ్యాక ఆశిస్తున్న ఆదాయం ఎక్కువ.. కానీ అందుకు తగ్గట్టుగా చేయాల్సిన పొదుపు మాత్రం తక్కువ అన్నమాట. ‘ఇండియాస్ పెన్షన్ ల్యాండ్స్కేప్: ఏ స్టడీ ఆన్ రిటైర్మెంట్ రియాలిటీ అండ్ రెడీనెస్’పేరుతో ‘గ్రాంట్ థోర్న్టన్ భారత్’సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది.2024 ఆగస్టు–సెప్టెంబర్ మధ్య నిర్వహించిన సర్వే ఆధారంగా దీన్ని రూపొందించారు. ఇందులో పాల్గొన్నవారిలో 79 శాతం మంది వయసు 25–54 ఏళ్లలోపే. 88 శాతం మంది ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నవారు కాగా, 5 శాతానికిపైగా వ్యక్తిగతంగా ఉపాధి పొందుతున్నవారు. వీరిలో వార్షికాదాయం రూ.5–10 లక్షలు ఉన్నవారు 12.6 శాతం కాగా, రూ.10–20 లక్షల మధ్య ఉన్నవారు 25.25 శాతం. రూ.20–30 లక్షల మధ్య ఆదాయార్జనపరులు 27.25 శాతం. రూ.40 లక్షలకుపైన ఆదాయం ఉన్నవారు 30.23 శాతం.సంపాదన ఉన్నప్పటికీ..56% మంది సంవత్సరానికి రూ.20 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పటికీ.. చాలా తక్కువ మందే పెన్షన్పథకాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అధిక ఆదాయం సంపాదించేవారిలో 30% మంది నెలకు రూ.2 లక్షల కంటే ఎక్కువ పెన్షన్లు ఆశిస్తున్నారు. సంవత్సరానికి రూ.40 లక్షల కంటే ఎక్కువ సంపాదించేవారిలో 58% మంది పదవీ విరమణ కోసం వారి జీతంలో 1–15% మాత్రమే కేటాయిస్తున్నారు. రూ.20–30 లక్షల ఆదాయం ఆర్జించేవారిలో 75% మంది పెన్షన్కోసం తమ వేతనంలో 6–20% సమకూరుస్తున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో సగం మందికి అటల్ పెన్షన్ యోజన గురించి అవగాహన లేదు. పెన్షన్ మొత్తాలను ఎలా లెక్కిస్తారో 30% మందికి తెలియదు. ఆర్థిక అక్షరాస్యత పెరగాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు చెబుతున్నాయి.రూ.లక్ష పెన్షన్ కావాలి55% మంది నెలకు రూ.లక్ష కంటే ఎక్కువ పెన్షన్ ఆశిస్తున్నారు. అయితే 11% మంది మాత్రమే తమ ప్రస్తుత పెట్టుబడులు ఈ అంచనాలను అందుకోవడానికి సరిపోతాయని నమ్ముతున్నారు. ప్రభుత్వ మద్దతు ఉన్న పెన్షన్ప్రణాళికల పట్ల సుమారు 39% మంది మొగ్గుచూపుతున్నారు. అధిక ముప్పు, అధిక రాబడి ఉన్న ప్రణాళికలు ముఖ్యంగా యువతను ఆకర్షిస్తున్నాయి. 25 ఏళ్లలోపు వారిలో 31% మంది ఈ పథకాలపై ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి నెలకు రూ.లక్ష పెన్షన్ పొందడానికి 30 ఏళ్ల వ్యక్తి 12% వార్షిక రాబడి, 6.75% యాన్యుటీ రేటును ఊహిస్తూ 60 సంవత్సరాల వయస్సు వరకు నెలకు రూ.6,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.సంప్రదాయ పెన్షన్..: 56% మంది 55–65 సంవత్సరాల మధ్య పదవీ విరమణ పొందాలని ఆలోచిస్తున్నారు. 45–50 ఏళ్ల మధ్య రిటైరైపోవాలని సుమారు 11 శాతం మంది చెప్పారు. 75% మంది తమ జీతంలో 15% లోపే పదవీ విరమణ పథకాలకు కేటాయిస్తున్నారు. అత్యధికులు ఇప్పటికీ సంప్రదాయ పెన్షన్ సాధనాలవైపే మొగ్గు చూపుతున్నారు. 35% మంది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఎంచుకుంటున్నారు.తరువాత గ్రాట్యుటీ, జాతీయ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) మీద ఆధారపడుతున్నారు. అయితే, గ్రాట్యుటీ మాత్రమే సరిపోదని 99% మంది భావిస్తున్నారు. 32% మంది మాత్రమే ఎన్పీఎస్ పనితీరుతో సంతృప్తి చెందారు. ఈపీఎఫ్కు ప్రజాదరణ ఉన్నప్పటికీ దాని పనితీరుపై కేవలం 46% మంది మాత్రమే సంతృప్తిగా ఉన్నారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) విషయంలో కూడా చాలా తక్కువ మందే ఆసక్తి చూపారు. పదవీ విరమణ తర్వాత స్థిర ఆదాయాన్ని అందించడంలో మంచివే అయినప్పటికీ 76% మంది యాన్యుటీ పథకాలలో పెట్టుబడి పెట్టడం లేదని నివేదిక వివరించింది.పొంచి ఉన్న సంక్షోభం..: శ్రామిక జనాభా పెరుగుతున్న కొద్దీ ఆశిస్తున్న పదవీ విరమణ అవసరాలు, వాస్తవ పొదుపుల మధ్య అంతరం స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని తగ్గించడానికి వ్యక్తుల జీవిత అవసరాలకు అనుగుణంగా ఉండే బలమైన పెన్షన్ వ్యవస్థ అవసరం. అత్యధికులు తమ గ్రాట్యుటీ మొత్తాలు సరిపోవని భావిస్తున్నారు. తక్కువ వార్షిక పెట్టుబడుల రేటు కారణంగా పదవీ విరమణ తర్వాత వచ్చే హామీ ఆదాయం విషయంలో అనిశ్చితి ఉంది. బలమైన ఆర్థిక విద్య, మరింత ఆకర్షణీయమైన పెన్షన్ ఉత్పత్తులు, అధిక పొదుపులను ప్రోత్సహించడానికి విధాన పరమైన సంస్కరణలు రాకపోతే రాబోయే దశాబ్దాలలో పదవీ విరమణ పొందిన వ్యక్తుల కుటుంబాల్లో సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
పచ్చని కాపురాల్లో... వివాహేతర చిచ్చు
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. తమ బంధానికి అడ్డుగా ఉన్నారన్న కారణంతో ఏకంగా హత్యలదాకా వ్యవహారం వెళ్తోంది. ఇలాంటి ఘటనల్లో ఎక్కువగా బాధితుల బిడ్డలు అనాథలుగా మారుతుండటం అందరినీ కలవరపెడుతోంది. ఈ మధ్యకాలంలో తరచూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. » సత్యసాయి జిల్లా దర్మవరం మండలం పోతుకుంట గ్రామానికి చెందిన ఓ వివాహితకు రొద్దం మండలానికి చెందిన పురుషుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అనుమానం వచ్చిన భర్త మంజునాథ్ నిత్యం వేధించసాగాడు. మధ్యలో అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి భార్య పన్నాగం పన్నింది. మద్యం మత్తులో ఉన్న భర్తను కిరాయి ఇచ్చి హత్య చేయించింది. గతేడాది జరిగిన ఈ ఘటనకు కారణాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఏడాది తర్వాత మృతదేహాన్ని రీపోస్టుమార్టం చేయడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. » సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం కుటాలపల్లిలో గతేడాది ఎన్నికల సమయంలో ఓ దారుణ హత్య వెలుగు చూసింది. ఇద్దరు వ్యక్తులు ఒకే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడమే దీనికి కారణంగా తేలింది. అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో అమర్నాథ్రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఒకరికి తెలియకుండా మరొకరు వివాహేతర సంబంధం కొనసాగించారు. అయితే ఆర్థిక లావాదేవీల్లో తేడా రావడంతో శ్రీనివాసరెడ్డి మరికొందరితో కలిసి అమర్నాథ్రెడ్డిని హతమార్చాడు. గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. సాక్షి, పుట్టపర్తి : రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులతో ముడిపడిందే భార్యాభర్తల బంధం. జీవితాంతం ప్రేమ, ఆప్యాయతలతో పాటు కష్టసుఖాలు, కుటుంబ బాధ్యతలను మోసుకుంటూ ముందుకు సాగేదే సంసారం. ఈ పవిత్ర బంధం.. మనస్పర్థలు, అనుమానాలు, కుటుంబ కలహాలతో విచ్ఛిన్నం అవుతోంది. చిన్నపాటి మనస్పర్థల కారణంగా పరాయి వ్యక్తులతో చనువుగా పెరిగి.. సాన్నిహిత్యం ఏర్పడుతోంది. అదే వివాహేతర సంబంధాలకు దారి తీస్తోంది. అలాంటి సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. ఈ క్రమంలో కొంతమంది అడ్డు తొలగించుకునే క్రమంలో భర్తలను, ప్రియులను చంపేస్తున్నారు. ఫలితంగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. హత్య చేసి పరారీ అవుతుండటంతో చిన్నారులు ఎవరి దగ్గర ఉండాలో అర్థం కాక బాల్యంలోనే కార్మికులుగా మారి అష్టకష్టాలు పడుతున్నారు. అఘాయిత్యాలకు దారి తీస్తూ.. వివాహేతర సంబంధాలతో భార్యభర్తల మధ్య మనస్ఫర్థలు పెరిగి అఘాయిత్యాలకు దారి తీస్తున్నాయి. ఇద్దరి మధ్యలోకి మరొకరు రావడంతో పరిస్థితులు నిమిషాల్లో మారిపోతున్నాయి. క్షణికావేశంతో హత్యలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. దంపతుల్లో ఎవరో ఒకరు జైలుకు వెళ్లినా.. కనీసం బెయిల్ ఇప్పించేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో అలాంటి దంపతుల పిల్లలు అనాథలుగా మారుతున్నారు. అంతేకాదు వివాహేతర సంబంధాలతో ఎలాంటి పరిణామాలు జరిగినా.. వారి కుటుంబ సభ్యులు సమాజంలో తలెత్తుకొని తిరగలేని పరిస్థితి నెలకొంది.కారణాలు ఎన్నెన్నో.. » పని ఒత్తిడితో జీవిత భాగస్వామికి సరైన సమయం కేటాయించకపోవడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. » చిన్న సమస్యలను పెద్దవిగా చూస్తూ.. పదే పదే చర్చించి.. తల్లిదండ్రుల వరకూ వెళ్లడం.. ఆ తర్వాత పోలీస్స్టేషన్ల మెట్లు ఎక్కుతున్నారు. » జీవిత భాగస్వాములు తాము చెప్పినట్లు వినలేదంటూ ఇద్దరిలో ఎవరో ఒకరు దారి తప్పి సమస్యల ఊబిలో కూరుకుపోతున్నారు. » స్మార్ట్ఫోన్లను అతిగా వినియోగించి సోషల్ మీడియా పరిచయాలతో ప్రాణాల మీదికి తెచ్చుకోవడం. » మద్యానికి బానిసై ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని .. కుటుంబ పోషణ గురించి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటం కూడా కారణమవుతోంది. సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి దంపతుల మధ్య మనస్పర్థలు రావడం సహజమే. అయితే క్షణికావేశాలకు వెళ్లకుండా.. సామరస్యంగా ఇద్దరూ పరిష్కార మార్గం ఎంచుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. వివాహం జరిగిన కొత్తలో మనస్ఫర్థలు వచ్చినా.. వెంటనే సరిదిద్దుకోవాలి. అయితే ఇరవై ఏళ్ల దాంపత్య జీవితంలో కూడా ఇంకా సమస్యలు వెలుగు చూస్తుండటం అవగాహన లోపమే. దంపతులిద్దరూ పిల్లలు, కుటుంబ బాధ్యతల గురించి తెలుసుకుంటే ఎలాంటి మనస్పర్థలు రావు. క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలతో కుటుంబం రోడ్డున పడుతుంది. అంతేకాకుండా చిన్నారులు అనాథలుగా మారాల్సి వస్తోంది. – వి.రత్న, సత్యసాయి జిల్లా ఎస్పీ -
జోసాలో సీట్ల జోష్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) సంస్థల్లో సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. వీటితోపాటు 2025–26 విద్యా సంవత్సరానికి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో నడిచే గ్రాడ్యుయేట్ ఫీల్డ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (జీఎఫ్టీఐ)లలో 62,853 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం సాంకేతిక మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు కొత్త కోర్సులను పరిచయం చేస్తూ అవకాశాలను మరింత మెరుగుపరుస్తోంది. దీంతో గత ఏడాదితో పోలిస్తే 2916 సీట్లు పెరిగాయి.జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఐఐటీ, ఎన్ఐటీలు ట్రిపుల్ఐటీలు, జీఎఫ్టీఐ లకు సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ను విడుదల చేసింది. అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య గత సంవత్సరం కంటే 4.86 శాతం పెరుగుదలను ప్రతిబింబించింది. ఐఐటీల్లో నిరుడు 17,760 సీట్లు ఉండగా తాజాగా 400 పెరిగాయి. ఎన్ఐటీల్లో 296 కొత్త సీట్లను చేర్చారు. ఈ ఏడాది ట్రిపుల్ ఐటీల్లో అత్యధికంగా 1,394 సీట్లు అందుబాటులోకి రావడం విశేషం.జీఎఫ్టీఐలలో 826 సీట్లు పెరిగాయి. ఈ నెల 3 నుంచి జోసా రిజిస్ట్రేషన్లు చేపట్టింది. 11 వరకు ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చు. అనంతరం రెండుసార్లు మాక్ సీట్ ప్రక్రియ నిర్వహిస్తారు. మాక్ సీట్ అలాట్మెంట్ ఆధారంగా ర్యాంకు ప్రకారం ఎక్కడ సీటు వస్తుందో విద్యార్థులకు అవగాహన ఏర్పడుతుంది. మాక్ సీట్–1 కేటాయింపు జాబితాను జూన్ 9న, మాక్ సీట్–2 కేటాయింపు జాబితాను జూన్ 11న ప్రకటిస్తారు. జోసా–2025లో భాగంగా అకడమిక్ ప్రోగ్రామ్స్ కోసం అభ్యర్థుల నమోదు, ఆప్షన్ల ప్రక్రియ జూన్ 12తో ముగుస్తుంది. ఈ ఏడాది కౌన్సెలింగ్లో 127 విద్యా సంస్థలు పాల్గొంటున్నాయి. జూన్ 14 నుంచి జూలై 16 వరకు ఆరు విడతల్లో సీట్లు కేటాయింపు జరుగనుంది.62 శాతం సీట్లు పెరుగుదలదేశంలో 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 26 ట్రిపుల్ ఐటీలతో పాటు 47 జీఎఫ్టీఐలు, ఇతర సంస్థలు జోసా కౌన్సెలింగ్లో పాల్గొంటున్నాయి. కొన్నేళ్లుగా ఐఐ టీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐల్లో సీట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. 2019కి ముందువరకు ఈ సంస్థల్లో సీట్ల సంఖ్య నామమాత్రంగానే ఉండేది. ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్య కోసం విద్యార్థులు ఏటా విదేశాలకు వెళ్లి రూ.లక్షలు ఖర్చుచేసి చదువుకోవాల్సి వచ్చేది. ఈ క్రమంలో ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సాంకేతిక విద్యను మెరుగుపరిచి విద్యార్థులకు అందుబాటులోకి వచ్చేలా ఏటా సీట్ల సంఖ్యను పెంచుతున్నారు. దీంతో 2019లో 38,704 సీట్లు ఉండగా.. ఇప్పుడు 62,853కు చేరాయి. అంటే ఆరేళ్లలో 24,149 సీట్లు (62 శాతం) పెరిగాయి. గతంలో డీపీ సింగ్ నివేదిక మేరకు 2024 నాటికి 50 శాతం సీట్ల పెంపు లక్ష్యాన్ని నెరవేర్చింది.ఐఐటీల్లో మరింత..ఐఐటీల్లో దశలవారీగా వచ్చే ఐదేళ్లలో మరో 6,500 సీట్లను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం 18,160 సీట్లు ఉండగా.. అవి 24 వేలు కానున్నాయి. కొత్త తరం ఐఐటీలైన తిరుపతి, ధార్వాడ్, పాలక్కాడ్, జమ్ము, భిలాయ్లో ఏటా 200కు పైగా కొత్త యూజీ సీట్లను పెంచుకునేలా చర్యలు చేపట్టింది. ఇలా ఏడాదికి దాదాపు 1,500 సీట్లు పెరగనున్నాయి. ఏపీ, తెలంగాణాల్లో 3,424ఏపీ, తెలంగాణలో జోసా ద్వారా 3,424 సీట్లను భర్తీ చేయనుంది. నిరుడు 3,384 ఉండగా 40 సీట్లు పెరిగాయి. హైదరాబాద్ ఐఐటీలో 630, తిరుపతి ఐఐటీలో 254, వరంగల్ నిట్లో 1049, తాడేపల్లిగూడెం నిట్లో480, స్పా విజయవాడలో 132, హైద్రాబాద్ సెంట్రల్ వర్సిటీలో 110, శ్రీ సిటీ ట్రిపుల్ ఐటీలో 438, కర్నూలు ట్రిపుల్ ఐటీలో 331 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ హైదరాబాద్లో 35 సీట్లు పెరిగాయి. నిరుడు నాలుగేళ్ల ఇంజినీరింగ్ ఫిజిక్స్ కోర్సును 10 సీట్లతో అందుబాటులోకి తేగా ఇప్పుడు 35కి పెంచారు. -
రైతుపై సర్కారు పగాకు
నాలుగేళ్లుగా నల్లబర్లీ సాగు చేస్తున్నా. కిందటి సంవత్సరం వరకు మంచి ధర లభించింది. కంపెనీలు ఇచ్చిన భరోసాతో 12 ఎకరాలు కౌలుకు తీసుకొని నల్లబర్లీ వేశా. కౌలుకే ఎకరాకు రూ.30 వేల వరకు చెల్లించా. సాగుకు ఎకరాకు రూ.1.30 లక్షలైంది. బంగారం కుదవపెట్టి రూ.4 లక్షలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.3 వడ్డీకి మిగిలిన మొత్తం తెచ్చా. నిరుడు ఎకరాకు 15–18 క్వింటాళ్ల దిగుబడి రాగా, క్వాలిటీతో సంబంధం లేకుండా క్వింటా రూ.15వేలు–18 వేల మధ్య కొన్నారు. ఈ ఏడాది కంపెనీల చుట్టూ తిరిగినా కొనేవారు లేరు. కంపెనీల మాయమాటలు నమ్మి మోసపోయాం. పూర్తిస్థాయిలో ప్రభుత్వం కొంటే కనీసం కొంత గట్టెక్కుతాం. లేదంటే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు. – గెద్దల నాగబాబు, బాపట్ల జిల్లా వంకాయలపాడు (బాపట్ల జిల్లా పర్చూరు, చీరాల ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధి) : నాలుగు జిల్లాలు.. దాదాపు లక్ష ఎకరాల్లో పంట.. వేలమంది రైతులు.. ఇప్పుడు లబోదిబోమంటున్నారు. పొగాకు కంపెనీల మాటలు నమ్మి నిండా మునిగామని గుండెలు బాదుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం చేతులెత్తేస్తుండడంతో ఏంచేయాలో తెలియక తీవ్ర ఆందోళనలో ఉన్నారు..! బాపట్ల, గుంటూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో ఏ పల్లెకు వెళ్లినా రైతుల్లో ఒకటే వ్యథ. ‘‘గతేడాది వరకు మంచి ధరలు లభించడంతో పాటు కంపెనీలు ఇచ్చిన భరోసాతో ఈసారి పెద్దఎత్తున నల్లబర్లీ పొగాకు (హెచ్డీ బర్లీ) సాగు చేశాం. పంట పండాక ప్రభుత్వం, కంపెనీలు మొహం చాటేస్తున్నాయి. ఎవరికి చెప్పుకోవాలి’’ అనే ప్రశ్నలు వస్తున్నాయి. కౌలు, కూలీల ధరలు, ఇతర ఖర్చులు పెరగడంతో ఎకరా సాగుకు రూ.లక్షన్నర అయిందని.. నిరుడు ఎకరాకు 15–18 క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈసారి సగటున 10–12 క్వింటాళ్లకు పడిపోయిందని వారు వాపోతున్నారు. ఐడీ నంబర్లు ఇచ్చి మరీ సాగుచేయించిన పొగాకు కంపెనీలు.. డిమాండ్ లేదనే సాకుతో పంట కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కళ్లుమూసుకున్న కూటమి ప్రభుత్వంసీఎం యాప్ ద్వారా ప్రతి పంటకు కోతకొచ్చే సమయంలోనే మార్కెట్ ధరలను అంచనా వేసి ఏ ఒక్క రైతు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని గొప్పలు చెబుతున్న కూటమి ప్రభుత్వం నల్లబర్లీ రైతులను గాలికొదిలేసింది. మిర్చి రైతుల మాదిరిగానే పొగాకు రైతులను ఏమార్చేందుకు యత్నిస్తోంది. నల్లబర్లీకి సాధారణంగా డిసెంబరు నుంచి ఆకు కొట్టడం మొదలుపెట్టి మార్చి ఆఖరుకు పూర్తిచేస్తారు. ఫిబ్రవరిలో కొనుగోళ్లు మొదలై ఏప్రిల్కు దాదాపు పూర్తవుతాయి. అరకొరగా ఆఖరులో వచ్చే పొగాకును మాత్రమే మే నెలలో మార్కెట్కు తెస్తుంటారు. ఈసారి జూన్ తొలివారంలోనూ కనీసం మూడో వంతు పొగాకు కూడా కొనని పరిస్థితి నెలకొంది.పంట అమ్మితేనే కూలీ డబ్బులిచ్చే దుస్థితిపంట కొనేవారు లేకపోవడంతో రైతులు పొలాల్లో కట్టెలు పెట్టి వాటిపై బేళ్లు నిల్వ చేశారు. పైన పట్టాలు కప్పి కాపలా కాస్తున్నారు. ఆకు కొట్టడం నుంచి తాళ్లకు గుచ్చడం వరకు కూలీలకు ఒప్పందాలు ఇచ్చి పనులు చేయించారు. పంట అమ్మితే కానీ వీరికి సొమ్ములివ్వలేని పరిస్థితి. ఇటుచూస్తే క్వింటా రూ.7 వేలకు కూడా కొనేవారు లేరు. దాదాపు ప్రతి రైతు ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష నష్టపోతున్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య యత్నాలు చేస్తున్నారు. పొగాకు రైతులకు అండగా వైఎస్సార్సీపీతో పాటు రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే కానీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. కాగా, చివరి కేజీ వరకు పొగాకును కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఖరీఫ్ సాగుకు దూరంగా ఉండాలని (క్రాప్ హాలిడే) భావిస్తున్నారు.కూటమి కార్యకర్తలకు మేలు చేసేందుకేకంపెనీల భరోసాతోనే రైతులు ఈసారి నల్లబర్లీ సాగు చేశారని, చాలా కంపెనీలు రైతులకు బాండ్లు ఇచ్చాయని ప్రభుత్వానికి తెలిసినా... వాటిపై ప్రభుత్వానికి కనీస నియంత్రణ కొరవడింది. పంట మార్కెట్కు వచ్చే సమయంలోనే ప్రభుత్వం జోక్యం చేసుకుని కంపెనీలపై ఒత్తిడి తెచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. పొగాకు కోతలు పూర్తయి రెండు నెలలు గడుస్తోంది. ఖరీఫ్ సీజన్ కూడా మొదలైంది. అయినా సరే నల్లబర్లీ పంట చేలల్లోనే ఉండిపోయింది. ఈ ఏడాది లక్ష టన్నుల దిగుబడి అంచనా వేయగా, గ్రేడ్లను బట్టి 85 వేల టన్నులు మార్కెట్కు వస్తుందని లెక్క. కానీ, ఇప్పటివరకు అదీ అతికష్టమ్మీద 24.58 వేల టన్నులు మాత్రమే కంపెనీలు, ట్రేడర్లు కొనుగోలు చేశారు. రైతు ఎవరైనా 10 చెక్కులు (క్వింటాళ్లు) తీసుకెళ్తే 3–4 చెక్కులు కొని మిగిలింది నాణ్యత లేదనే సాకుతో వెనక్కి పంపేస్తున్నారు. రైతుల వద్ద మరో 55 వేల టన్నుల పంట ఉంది. గత నెలలో వర్షాలకు పొగాకు దెబ్బతిన్నది. పంట నాణ్యతరోజురోజుకు తగ్గుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అండగా నిలవాల్సిన ప్రభుత్వం వ్యాపారులకు వత్తాసు పలికేలా వ్యవహరించింది. మిర్చి మాదిరిగానే కాలయాపన చేస్తూ పొగాకు రైతులను కంపెనీలకు వదిలేసింది. ఓవైపు ధర లేక రైతులు ఆత్మహత్య యత్నాలు చేస్తుండగా, మరోపక్క పొగాకు బేళ్లను తగలబెడుతున్నారు. కానీ, కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు. నెల రోజుల క్రితం కంపెనీలకు లక్ష్యాలను నిర్దేశించినా ఏ ఒక్కటీ కొనుగోలు చేసిన పాపాన పోలేదు. కాగా, ఏ గ్రామంలో ఎంత మంది రైతులు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు..? ఎంత దిగుబడి వచ్చింది..? ఎంత అమ్ముకున్నారు..? రైతుల వద్ద ఇంకా ఎంత ఉంది? అని ప్రభుత్వం తెలుసుకుంటోంది. ఇదంతా కూటమి పార్టీల కార్యకర్తలకు మేలు చేసేందుకే అన్న ఆరోపణలు వస్తున్నాయి.నాడు అండగా నిలిచిన వైఎస్ జగన్ ప్రభుత్వం» నేరుగా మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి చర్యలు» తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోళ్లు» 30 వేల మంది నుంచి రూ.139 కోట్ల పంట కొనుగోలునల్లబర్లీ పంట విషయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. 2019–20 సీజన్లో మార్కెట్లో ధర లేని సమయంలో ఏపీ మార్క్ఫెడ్ను రంగంలోకి దింపింది. తేమ శాతంతో సంబంధం లేకుండా 30 వేల మంది రైతుల నుంచి రూ.139.19 కోట్ల విలువైన 12,933 టన్నుల పొగాకు సేకరించింది. 2022–23లో 1.42 లక్షల టన్నుల పొగాకు కొనుగోలుకు బోర్డు అనుమతివ్వగా, మాండూస్ తుపాన్తో సగానికి పైగా పొగాకుతో పాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయి. అదే సమయంలో పొగాకు రేటు బాగుండడంతో రైతులంతా ఇదే పంట వేశారు. ఫలితంగా 1.72 లక్షల టన్నుల పొగాకు ఉత్పత్తయింది. సాధారణంగా అనుమతికి మించి ఉత్పత్తయిన సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితులుంటే 5 శాతం పెనాల్టీతో కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇస్తుంది. అలాంటిది నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవ కారణంగా పైసా పెనాల్టీ లేకుండా కొనుగోలుకు కేంద్రం ఒప్పుకొంది. నేడు ఈ చొరవ కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో రైతులు కంపెనీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది.ధరల నేలచూపు.. రైతుల వద్ద పేరుకున్న నిల్వలునల్లబర్లీ లక్ష టన్నుల దిగుబడి వచ్చింది. పొగాకు బోర్డుతో సంబంధం లేకుండా ట్రేడర్స్, కంపెనీలు కొనుగోలు చేసే ఈ పొగాకును బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 20 వేల మంది సాగు చేశారు. నిరుడు హై గ్రేడ్కు కిలో రూ.155–180 చొప్పున ధర లభించగా, ఈ ఏడాది రూ.70–80 మించడం లేదు. లో గ్రేడ్ గత ఏడాది కిలో రూ.80–100 ధర పలకగా, ఇప్పుడు రూ.30–45కు మించి కొనేవారు లేరు. రాష్ట్రంలో 21 పొగాకు కంపెనీలు ఉన్నాయి. జీపీఐ, ఐటీసీతో సహా ఏడు కంపెనీలు రైతుల నుంచి నేరుగా, మరో 12 ట్రేడర్స్ ద్వారా పరోక్షంగా కొనుగోలు చేస్తాయి. కానీ, ఈ ఏడాది కంపెనీలన్నీ సిండికేట్గా మారి రైతులను నిలువునా ముంచేశాయి.ఎకరాకు రూ.60 వేలు నష్టం తప్పేలా లేదుబాపట్ల జిల్లా ఇంకొల్లు మండలానికి చెందిన వంకాయలపాటి లోతుబాబు ఈ ఏడాది 3.5 ఎకరాల్లో నల్లబర్లీ వేశారు. గత ఏడాది ఎకరంలో పొగాకు పండించి రెండెకరాల్లో మిరప వేశారు. పంట దెబ్బతినడంతో తీసేసి మొక్కజొన్న పండించారు. ఈ ఏడాది నల్లబర్లీ ఎకరాకు రూ.1.50 లక్షలు పెట్టుబడి కాగా 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పొగాకు పండించమంటూ కంపెనీల వాళ్లు వచ్చి ప్రతి గ్రామంలో మీటింగ్ పెట్టారు. కానీ, ఒక్కరూ కొనడం లేదు. లోతుబాబు ఒక్క కేజీ కూడా అమ్మలేదు. ‘‘శనగ వేసుకున్నా మా డబ్బులు మాకు వచ్చేవి. ఎకరాకు రూ.60 వేలకు పైగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది’’ అని ఆయన ఇప్పుడు వాపోతున్నారు.నాలుగు చెక్కులు వేస్తే.. నాలుగూ వెనక్కినేను 10 ఎకరాల్లో నల్లబర్లి పొగాకు సాగు చేశా. ఎకరాకు రూ.1.50 లక్షల పెట్టుబడి పెట్టా.10 క్వింటాళ్లు వచ్చింది. కంపెనీ వాళ్లు కొంటామని చెప్పారు. నాలుగు చెక్కులు వేస్తే.. నాలుగూ వెనక్కి ఇచ్చేశారు. ఒక్క చెక్ కూడా ఇప్పటి వరకు కొనలేదు. నా దగ్గర దాదాపు 100 క్వింటాళ్ల పంట ఉంది. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. – భవనం వెంకటరెడ్డి, వంకాయలపాడు, ఇంకొల్లు మండలం, బాపట్ల జిల్లాగ్రేడింగ్ రావడం లేదని..3 ఎకరాల్లో కౌలుకు తీసుకొని నల్లబర్లీ పొగాకు సాగు చేశా. 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కౌలుకే రూ.27 వేలు అప్పులు చేసి ఇచ్చాను. బంగారం తాకట్టు పెట్టి అప్పులు చేశాను. 30 క్వింటాళ్ల పంట ఉంది. ఐదు చెక్లు తీసుకెళ్తే రెండు వెనక్కి ఇచ్చేశారు. చెక్కు చేరా రూ.1000 ఖర్చవుతోంది. క్వింటాకు గ్రేడ్ చేసి తొక్కాలంటే రూ.500. ఇక 10 క్వింటాళ్లు గ్రేడింగ్ చేస్తే 3 క్వింటాళ్లు బాగుంది. మిగిలింది గ్రేడింగ్ రావడం లేదు. కొనేవారు లేక ఇంటి వద్దే ఉంచా. – కాసు కోటిరెడ్డి, వంకాయలపాడు, ఇంకొల్లు మండలం, బాపట్ల జిల్లాపురుగుమందుల షాపులకే రూ.7లక్షలు కట్టాలి..11 ఎకరాల్లో నల్ల బర్లీ సాగు చేశా. ఎకరాకు రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టా. నిరుడు క్వింటా రూ.15,500కు కొన్నారు. ఈ సారి రూ.6–8 వేలకు కూడా తీసుకోవడం లేదు. పురుగుమందుల దుకాణం వాళ్లకే రూ.7 లక్షలు ఇవ్వాలి. బంగారం పూర్తిగా బ్యాంక్లోనే ఉంది. నిరుడు ఎకరాకు రూ.50వేలు మిగిలింది. ఈసారి ఎకరాకు రూ.50–70 వేలు నష్టపోతున్నాం. – ఎర్రం సుబ్బారెడ్డి, ఇంకొల్లు, బాపట్ల జిల్లాపొగాకు రైతు ఆత్మహత్య» ప్రకాశం జిల్లా కొండపిలో విషాదం» పంట సాగులో నష్టాలతో మనస్తాపంకొండపి: పొగాకు పంట సాగు చేసి నష్టాలు రావడంతో పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లా కొండపిలో శుక్రవారం జరిగింది. బాధిత రైతు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చల్లా మధుసూదన్రెడ్డి (43) పొగాకుతో పాటు కొన్ని వాణిజ్య పంటలు పండిస్తున్నాడు. గత సంవత్సరం లాభాలు వచ్చాయన్న ఆశతో ఈ ఏడాది 15 ఎకరాల్లో పొగాకు సాగు చేశాడు. అయితే వేలం ప్రారంభం నుంచి పొగాకుకు గిట్టుబాటు ధర లేదని కుటుంబ సభ్యులకు చెప్పుకుని ఆవేదన చెందాడు. ఇలాగైతే పంటసాగుకు చేసిన ఖర్చు కూడా తిరిగొచ్చే అవకాశం లేదని వాపోయాడు. ఈ క్రమంలో నాలుగో తేదీన కొండపికి వెళ్తున్నానని, సాయంత్రానికి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అయితే మధుసూదన్రెడ్డి ఇంటికి తిరిగి రాలేదు. శుక్రవారం స్థానిక పొగాకు బోర్డు వెనుక గుర్తుతెలియని మృతదేహం ఉందని పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులు వచ్చి చూడగా అది మధుసూదన్రెడ్డిదిగా గుర్తించారు. మృతుడి కుమారుడు మాట్లాడుతూ పొగాకు సాగు కోసం తన తండ్రి భారీగా అప్పులు చేశారని, అయితే గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్రంగా కలత చెందారని కన్నీంటిపర్యంతమయ్యాడు.ఈ ఘటనపై చల్లా మధుసూదన్ రెడ్డి తండ్రి బ్రహ్మారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. అయితే పోలీసులు మాత్రం రైతు ఆత్మ హత్యగా కాకుండా, రూ.200 కోసం తల్లిదండ్రులతో గొడవపడి నెన్నూరు పాడు నుంచి వచ్చి కొండపిలోని పొగాకు బోర్డు సమీపం ఒక పాకలో అనుమానాస్పదంగా మృతి చెందాడని కేసు నమోదు చేసినట్టు సమాచారం.పొగాకు నిల్వలను పూర్తిగా ప్రభుత్వమే కొనాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ సాక్షి, అమరావతి: రైతుల వద్ద పేరుకుపోయిన పొగాకు నిల్వలను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు ఇచి్చన హామీ లాగా బుట్టదాఖలు చేయకుండా రైతుల వద్ద ఉన్న చివరి కిలో పొగాకు వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసి కంపెనీల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరారు. పొగాకుతో పాటు మామిడి, కోకో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ప్రైవేటు కంపెనీలు దగా చేస్తున్నాయని ఆరోపించారు. -
ఎవరి కళ్లలో ఆనందం చూడటానికి ఇదంతా చేస్తున్నారు..?
తిరుపతి రూరల్: తనను లిక్కర్ స్కాంలో ఇరికించాలని కుట్రలు చేయడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. ‘నాకు చిన్నప్పటి నుంచి సన్నిహితుడైన, హైదరాబాద్లో నివసిస్తున్న వెంకటేశ్, ఆయన భార్య, ఏడాది వయసున్న కుమారుడిని సిట్ అధికారులు తీసుకువెళ్లి రెండు రోజులుగా హింసిస్తున్నారు. నాపై తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని వారిపై ఒత్తిడి తేవడం అన్యాయం, అనైతికం. మీ టార్గెట్ నేనే అయితే వచ్చి అరెస్టు చేసుకోండి. దయచేసి నాతో ఉన్నవాళ్లను ఇబ్బంది పెట్టకండి’ అని కోరారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని నివాసం వద్ద శుక్రవారం మీడియా సమావేశంలో చెవిరెడ్డి మాట్లాడారు. నైతిక విలువలున్న వెంకటేశ్ను సిట్ అధికారులు కార్యాలయంలో బంధించి భయపెడుతున్నారని మండిపడ్డారు. ఏఎస్పీ శ్రీనివాస్ విచక్షణ కోల్పోయి అనరాని మాటలతో మానసికంగా బాధించడం తగదన్నారు. తప్పుడు స్టేట్మెంట్లో సంతకం పెట్టకుంటే ఈ కేసులో కాకున్నా, తనవద్ద విచారణలో ఉన్న ఏదో ఒక కేసులో ఇరికించి శాశ్వతంగా జైలు జీవితం గడిపేలా చేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అయినా, వెంకటేశ్ అంగీకరించకపోవడంతో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఎంత డబ్బు కావాలన్నా తీసిస్తా, వర్కులు ఇప్పిస్తా, మంచి సంబంధాలు ఏర్పాటు చేయిస్తా. ఒక్క సంతకం పెట్టు చాలు అని ప్రలోభపెడుతున్నట్టు తెలిసిందని చెవిరెడ్డి వివరించారు. ‘ వెంకటేశ్ అంగీకరించకపోవడంతో ఏఎస్పీ శ్రీనివాస్ సిట్ కార్యాలయంలోని బల్లలను గుద్దుతూ గట్టిగా అరుస్తూ భయానక వాతావరణం సృష్టించారని సిబ్బందే చెబుతున్నారు. అమాయకులను వేధిస్తూ ఎవరి కళ్లలో ఆనందం చూడడానికి కొల్లు శ్రీనివాస్ ఇదంతా చేస్తున్నారో తెలియడం లేదు. నన్ను అరెస్టు చేయాలన్న తపన, తాపత్రయం, అందుకోసం చేస్తున్న అరాచకం చూసిన సిట్ కార్యాలయ సిబ్బంది మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారన్న విషయాన్ని శ్రీనివాస్ గమనించాలి’ అని చెవిరెడ్డి సూచించారు. అమాయకులను హింసిస్తున్న కొల్లు శ్రీనివాస్ను ప్రకృతి మర్చిపోదని, సమాజం హర్షించదని గుర్తించాలని పేర్కొన్నారు. -
ఆళ్లగడ్డలో ఆగని చికెన్ దందా!
ఆళ్లగడ్డ : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చికెన్ అంగళ్ల నిర్వాహకులపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మాట వినని వారిని ఎలాగైనా బెదిరించి లొంగదీసుకునేందుకు చేయని ప్రయత్నంలేదు. తాజాగా.. శుక్రవారం కొందరు అధికారులు చికెన్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలకు వెళ్లగా అందరూ తిరగబడటంతో అధికారులు వెనుదిరిగిన ఘటన ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ పట్టణంలో కప్పం కట్టేందుకు ససేమిరా అంటున్న కొన్ని చికెన్ అంగళ్లపై టీడీపీ నేతలు అధికారులను ప్రయోగించారు. అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు, పశుసంవర్థక శాఖ అధికారులతో కలిసి చికెన్ సెంటర్ల దగ్గరకు వెళ్లి ‘మీ దుకాణంలో ఉన్న చికెన్ తింటుంటే రోగాలు వస్తున్నాయని ఫిర్యాదులు వచ్చినందున కోళ్లను, చికెన్ను పరీక్షించేందుకు వచ్చాం’ అని చెప్పారు. ఈ విషయం మరికొంతమంది చికెన్ సెంటర్ల నిర్వాహకులకు తెలియడంతో అందురూ అక్కడికొచ్చి.. ‘40 ఏళ్లకు పైగా చికెన్ వ్యాపారం చేస్తున్నాం.. ఎప్పుడూలేనిది ఇప్పుడెందుకు వచ్చింద’ని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ‘ఎవరు పంపితే మీరు వచ్చారో మాకు తెలుసు, మా దగ్గర ఉన్న చికెన్ వండి పెడతాం.. మా కుటుంబ సభ్యులతో పాటు ప్రజలు ఎంతమందైనా తినండి. ఉదయం వారికి అస్వస్థత వస్తే మాపై చర్యలు తీసుకోండి. అంతేగానీ, ఈరోజు శాంపిల్గా చికెన్ తీసుకుపోయి రెండ్రోజుల తరువాత పరీక్షించి పాడైపోయిన చికెన్ అంటే ఎలా కుదురుతుంద’ని నిలదీశారు. అయినా, అధికారులు శాంపిల్ తీసుకెళ్తామనడంతో అందరు ఒక్కసారిగా పురుగు మందు డబ్బాలు పట్టుకుని మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిండంతో అధికారులు అక్కడి నుంచి పారిపోయారు. ఇంతవరకు రాజకీయ వేధింపులే అనుకుంటే.. ఇప్పుడు అధికారులు సైతం కిలోకు రూ.5 ఇవ్వండి అధికారులు అందరం పంచుకుంటామని బెదిరిస్తున్నారని చికెన్ సెంటర్ల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. చాగలమర్రి చికెన్ సెంటర్ల నిర్వాహకులకు నోటీసులు.. ఇక ఇంతవరకు ఆళ్లగడ్డ పట్టణానికే పరిమితమైన ఈ వేధింపుల పర్వం తాజాగా చాగలమర్రికీ చేరుకుంది. శుక్రవారం ఇక్కడ ఎనిమిది చికెన్ సెంటర్లకు పంచాయతీ అధికారులు నోటీసులిచ్చారు. లైసెన్స్లేని కారణంగా మీ సెంటర్లను సీజ్ చేస్తామని నోటీసులివ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది. దీనిపై ఈఓపీఆర్డీ తహీర్ హుస్సేన్ వివరణ కోరగా.. లైసెన్స్ లేకుండా మండలంలో ఎవరూ చికెన్ అమ్మకూడదని.. ప్రస్తుతం ఫిర్యాదు వచ్చిన కొన్ని సెంటర్లకు నోటీసులిచ్చామని మున్ముందు గ్రామాల్లో సైతం చికెన్ వ్యాపారం నిర్వహించుకునే వారందరికీ నోటీసులు ఇస్తామన్నారు. -
8 జిల్లాలతో ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’
సాక్షి, అమరావతి: ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’ను ఆంధ్రప్రదేశ్కు గ్రోత్ ఇంజిన్గా తీర్చిదిద్దాలని, 2032 నాటికి 120 బిలియన్ డాలర్ల సంపద సృష్టి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబైలా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతిపురం మన్యం మొత్తం 8 జిల్లాల పరిధిలో ఎకనమిక్ యాక్టివిటీ పెరిగేలా ప్రాజెక్టులు నెలకొల్పాలని పేర్కొన్నారు. వీటి కోసం లక్ష ఎకరాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ‘మూలపేట–విశాఖపట్నం, విశాఖపట్నం–కాకినాడ మధ్య బీచ్ రహదారులు నిర్మిస్తామని, వీటిని జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని సీఎం చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా 20 లక్షల మందికి అవకాశం కల్పించాలని యత్నిస్తున్నామని సీఎం చెప్పారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంపై సమీక్షలో ‘విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్’గా అభివృద్ధి చేసే అంశంపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆరు పోర్టులు, ఏడు మాన్యుఫాక్చరింగ్ నోడ్లు, 17 మేజర్ వ్యవసాయ క్షేత్రాలు, 6 సర్వీస్ హబ్స్, 12 పర్యాటక హబ్స్తో విశాఖ ఎకనమిక్ రీజియన్ను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్టు సీఎం చెప్పారు. దీనిపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ ట్రాన్సిషన్ రోడ్ మ్యాప్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీతి ఆయోగ్, ఐఎస్ఈజీ ఫౌండేషన్ మధ్య అవగాహనా ఒప్పందం జరిగింది. సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, నీతి ఆయోగ్ సీఈవో సుబ్రమణ్యం, సీఎస్ విజయానంద్ పాల్గొన్నారు. హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో పోలవరం–బనకచర్ల హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో శుక్రవారం నీటిపారుదల ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించారు. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టును చేపట్టడానికి జలహారతి కార్పొరేషన్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ని ఏర్పాటుచేశామని చెప్పారు. రూ.81,900 కోట్ల వ్యయంతో 50 శాతం రూ.40,950 కోట్లు ఈఏపీ(విదేశీ) రుణం, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్గా 20 శాతం రూ.16,380 కోట్లు సమకూర్చుకోవాలని.. రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీగా 10 శాతం రూ.8,190 కోట్లు, హ్యామ్(హైబ్రిడ్ యాన్యుటీ) విధానంలో మరో 20 శాతం రూ.16,380 కోట్లు ఖర్చు చేసేలా అధికారులు చేసిన ప్రతిపాదనను సీఎం చంద్రబాబు ఆమోదించారు. -
కాకినాడలో సైబర్ స్కామర్లు
కాకినాడ క్రైం: అమాయకులే లక్ష్యంగా కాకినాడలో ఓ ముఠా ఖాతాలు తెరచి, వాటిని వినియోగించుకుని సైబర్ నేరాలకు పాల్పడుతోంది. ఎస్పీ బిందుమాధవ్ «శుక్రవారం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన నార్ని సతీశ్ చంద్ర (37), దాసరి వీరవెంకట సత్యనారాయణ (31) కొద్ది నెలలుగా కాకినాడలోని వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపిస్తున్నారు. పాస్బుక్, చెక్బుక్, ఏటీఎం కార్డుతో కూడుకున్న బ్యాంక్ కిట్లు తమకు అప్పగిస్తే ఖాతా తెరిచేందుకు అయ్యే ఖర్చుతో పాటు మరో రూ.5 వేలు ఇస్తామని ప్రలోభ పెట్టేవారు. ఈ ఖాతాపై రెండు నెలల్లో రూ.5 లక్షల చొప్పున లోన్ ఇప్పిస్తామని నమ్మబలికారు. దీంతో పదుల సంఖ్యలో జనం ఖాతాలు తెరచి, కిట్లను వీరికి అప్పగించారు. కాకినాడకు చెందిన ఉదయ్కిరణ్కు ఈ కిట్లు అప్పగిస్తే అతను వీరికి డబ్బు ఇచ్చేవాడు. కాకినాడ సాంబమూర్తినగర్కు చెందిన కొర్రా లోవరాజు ఖాతా తెరచి కిట్ అప్పగించి రెండు నెలలైంది. లోన్ కోసం కాకినాడలోని బ్యాంక్ ఆఫ్ కర్ణాటకకు వెళ్లాడు. బ్యాంక్ అధికారులు అతని ఖాతా పరిశీలిస్తే కేవలం నెల రోజుల వ్యవధిలో రూ.50 లక్షల విలువైన లావాదేవీలు జరిగినట్లు వెల్లడైంది. దీంతో లోవరాజు పోలీసుల్ని ఆశ్రయించాడు. పోలీసులు సతీశ్ చంద్ర, వీర వెంకట సత్యనారాయణను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరు కాకినాడకు చెందిన ఉదయ్కిరణ్ అనే వ్యక్తికి ఈ ఖాతాల కిట్లు అప్పగిస్తే అతడు వీటిని దుబాయ్ పంపిస్తున్నాడని తేలింది. దుబాయ్లో ఈ బ్యాంకు వివరాలు పుట్టారామ్ అనే వ్యక్తికి పంపిస్తున్నాడని తెలిసింది. ఇందుకు ఉదయ్ కిరణ్కు ఖాతాకు రూ.30 వేల చొప్పున పుట్టారామ్ చెల్లిస్తున్నాడు. గడచిన 2 నెలల్లో సతీశ్ చంద్ర, వీర వెంకట సత్యనారాయణ కాకినాడ జిల్లాతో పాటు గుజరాత్, పశ్చిమ బెంగాల్, కర్ణాటకకు చెందిన పేర్లతో 48 ఖాతాలు తెరచి రూ.9 కోట్ల విలువైన మొత్తం జమ చేసినట్టు ఎస్పీ తెలిపారు. సతీశ్ చంద్ర, సత్యనారాయణను అరెస్టు చేయగా ఉదయ్కిరణ్ పరారీలో ఉన్నాడు. పుట్టారామ్ను పట్టుకునేందుకు కేంద్ర నిఘా విభాగాలకు సమాచారమిచ్చామని ఎస్పీ చెప్పారు. -
82.468 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
తగరపువలస/కూర్మన్నపాలెం: విశాఖ జిల్లాలోని రెండే వేర్వేరు చోట్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. ఆనందపురం మండలం పెద్దిపాలెంలో గురువారం రాత్రి రెండు రైస్ మిల్లులపై రెవెన్యూ, పౌరసరఫరా, విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి 82.468 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. భీమిలి ఆర్డీవో సంగీత్ మాథూర్, ఆనందపురం తహసీల్దార్ శ్యాంప్రసాద్, సీఎస్డీటీ శ్రీనివాసరావు జరిపిన తనిఖీలు రాత్రి 9 గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగాయి. శ్రీబాలాజీ మోడరన్ రైస్ మిల్లు నుంచి 50.800 టన్నులు, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ ముద్రతో రీప్రాసెస్ చేసి బయటకు తరలించిన బియ్యానికి సంబంధించి 388 గోనె పట్టాలు, అశోక్ లే ల్యాండ్ లారీని స్వా«దీనం చేసుకున్నారు. అలాగే శ్రీ సాయి రైస్ అండ్ ఫ్లోర్ మిల్లు నుంచి 31.668 టన్నుల బియ్యంతో పాటు 1,252 ఖాళీ గోనె సంచులు, మహీంద్రా బొలేరో వ్యాన్, ఆటోలను స్వా«దీనం చేసుకున్నారు.రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచి, పాలిష్ చేసి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. వీటిని సీజ్ చేసి జాయింట్ కలెక్టర్కు నివేదిక పంపించినట్టు తహసీల్దార్ తెలిపారు. ఈ రెండు మిల్లుల యజమానులు చెన్నా రాజేష్, రామారావులపై 6ఏ కేసుతో పాటు 7 బీఎన్ఎస్ కేసు నమోదు చేసినట్లు తెలిసింది.1,400కిలోల పీడీఎస్ రైస్ సీజ్ పేదలకు అందించాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆటోను దువ్వాడ పోలీసులు పట్టుకున్నారు. ఆటో నుంచి 1,400 కిలోల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. గూడ్స్ ఆటోలో గాజువాక నుంచి సబ్బవరం రైస్ మిల్లుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో దువ్వాడ చెక్ పోస్టు వద్ద పోలీసులు పీడీఎస్ రైస్ను గుర్తించి, స్వా«దీనం చేసుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. -
ధోకా బాబూ..!
రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం వివక్ష కొనసాగిస్తోంది. ఒకవైపు వక్ఫ్ బోర్డు సవరణకు వత్తాసు పలికిన సర్కారు... మరోవైపు రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో ముస్లిం మైనార్టీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేయకుండా సాచివేత ధోరణి అవలంబిస్తోంది. ఏడాదిగా హామీల అమలు కోసం నిరీక్షించిన ముస్లింలు ఇప్పుడు హామీల అమలెప్పుడు బాబూ అంటూ గళమెత్తుతున్నారు. ఈ ఏడాది రంజాన్ సందర్భంగా తోఫా కూడా అందించని కూటమి సర్కారు తాజాగా బక్రీద్(శనివారం) నాటికి కూడా హామీల అమలుకు కార్యాచరణ చేపట్టకపోవడంపై ఆగ్రహం పెల్లుబుకుతోంది.టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లిం మైనార్టీల కోసం ఇచ్చిన తొమ్మిది ప్రధాన హామీల్లో ఇప్పటివరకు ఏ ఒక్కటీ అమలు చేయలేదు. గతంలోను ఇదే మాదిరిగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు దగా చేసిన విషయాన్ని ముస్లింలు గుర్తు చేసుకుంటున్నారు. ఈసారి కూడా మేనిఫెస్టోలో పేర్కొన్నవి, సభల్లో ప్రకటించిన హామీల అమలుకు కూటమి ప్రభుత్వం కనీసం శ్రద్ధ చూపకపోవడాన్ని వారు తప్పుబడుతున్నారు. –సాక్షి, అమరావతిఏడాదైనా అమలు కాని ముస్లింలకు ఇచ్చిన హామీలివే..» ముస్లిం మైనార్టీలకు 50ఏళ్లకే పెన్షన్» ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరస్తాన్లకు స్థలాలు కేటాయింపు » విజయవాడ సమీపంలో హజ్హౌస్ నిర్మాణం » నూర్బాషా కార్పొరేషన్ ఏర్పాటు, ఏటా రూ.వంద కోట్ల కేటాయింపు » మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5లక్షల వరకు వడ్డీలేని రుణాలు » ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం బకాయిలతోసహా పూర్తిగా అందించే చర్యలు (వీటిని ఏడాదికి చెల్లిస్తున్నట్టు జీఓ ఇచ్చి 9నెలలకు సర్కారు సరిపెట్టింది. ఇంకా ఆరునెలలకు చెల్లించాల్సి ఉంది.)» అర్హత ఉన్న ఇమామ్లు ప్రభుత్వ ఖాజీలుగా నియామకం » మసీదుల నిర్వహణకు ప్రతినెలా రూ.5వేలు ఆర్థిక సాయం » హజ్ యాత్రకు వెళ్లే ప్రతి ముస్లింకు రూ.లక్ష (గత ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులూ 2024 హజ్ యాత్రకు వెళ్లిన వారికి చెల్లించకపోగా ఈ ఏడాది వెళ్లిన కూడా ఒక్క పైసా విదల్చలేదు.)జగన్ హయాంలో రూ.20,863కోట్ల లబ్ధి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదర్శంగా నిలిచారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన 51,00,771 మందికి రూ.20,863.40కోట్ల లబ్ధి చేకూర్చారు. ఇమామ్లకు నెలకు రూ.5 వేల నుంచి రూ.10వేలకు, మౌజన్లకు రూ.3 వేల నుంచి రూ.5వేలకు గౌరవ వేతనం పెంచి ఆదుకున్నారు. ఆదాయంలేని మసీదుకు రూ.5వేలు చొప్పున అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ఏడాదైనా దాని ఊసే ఎత్తడం లేదు. వడ్డీలేని రుణాల విషయంలోనూ కూటమి ప్రభుత్వం దగా చేసింది. ఎన్డీఏ కూటమికి ఓట్లేసిన ముస్లింలు మరోసారి మోసపోయామని ఇప్పుడు బాధపడుతున్నారు. –షేక్ నాగుల్ మీరా, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడుమైనారిటీలపై కూటమి ప్రభుత్వం వివక్ష రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో ఆదరిస్తే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోంది. నామినేటెడ్ పోస్టుల్లోనూ ప్రభుత్వం ముస్లింలకు తీరని అన్యాయం చేసింది. రాష్ట్రంలో నూర్ బాషా, దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, రూ.వంద కోట్లు కేటాయిస్తానని 2014, 2024 ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు దగా చేశారు. –షేక్ దస్తగిరి, ముస్లిం దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మైనార్టీ విద్యార్థుల విదేశీ విద్యపై కూటమి సర్కారు నిర్లక్ష్యంఆంధ్రప్రదేశ్లో ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ విద్యా పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కూటమి ప్రభుత్వం మైనారిటీ విద్యార్థుల కలల్ని చిదిమేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి కేవలం రూ.20 కోట్లు కేటాయించినా దానిలో ఇప్పటివరకు ఒక రూపాయి కూడా ఖర్చు చేయలేదు. జూన్, జూలై, ఆగస్టు నెల నుంచి విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు ప్రారంభమవుతున్నా విదేశీ విద్యా పథకానికి నోటిఫికేషన్ వెలువడకపోవడం వల్ల విద్యార్థులు అడ్మిషన్, వీసా ప్రక్రియల్ని కొనసాగించలేని దుస్థితిలో ఉన్నారు. –షేక్ మునీర్ అహ్మద్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ -
కుప్పకూలిన శాంతిభద్రతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. రాజకీయ కక్షలతో చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్ ఆర్డర్ (శాంతిభద్రతలు) కుప్పకూలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ, భద్రత లేకుండా పోయిందని, అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయంటూ ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలను గుర్తు చేశారు. అధికారంలో ఉన్న వారు అహంకారం, రౌడీయిజంతో చెలరేగిపోయి.. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ఫలితంగా జరుగుతున్న ఘటనలు అత్యంత దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు శ్రీకాళహస్తిలో జరిగిన ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అంటూ ఎత్తిచూపారు. మీ పద్ధతి మార్చుకోకపోతే.. ప్రజలు ఎల్లకాలం చూస్తూ ఊరుకోరని సీఎం చంద్రబాబును హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేలా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని భరోసా ఇస్తూ ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..1 అధికార పార్టీ.. పోలీసు యంత్రాంగాన్ని ఏ రకంగా అదుపాజ్ఞల్లోకి తీసుకుందో చెప్పడానికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భార్య వాహనం డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. దీంతో ఓ పోలీసు చలానా రాశాడు. దీంతో ఆ ఎమ్మెల్యే.. ఆ కానిస్టేబుల్ను రప్పించుకుని, సీఐ సమక్షంలో నిందితుడైన అదే డ్రైవర్తో దాడి చేయిస్తారా? చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆ ఘటనను మూసివేసేలా ప్రయత్నించి వ్యవస్థలకే తలవంపులు తెస్తున్నారు. ఒక పోలీసుకు లేని రక్షణ ఇక సామాన్యులకు ఎక్కడిది?2 రాజకీయ కక్షలతో నిర్దోషులపై తప్పుడు కేసులు పెట్టి, వారిని జైళ్లకు పంపడం పరిపాటిగా మారింది. వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త రెడ్యం శివలక్ష్మీనారాయణపై అక్రమంగా కేసుపెట్టి, తీవ్రంగా కొట్టారు. లంచం ఇవ్వలేదని.. లేని గంజాయి కేసుపెట్టి 2 నెలలపాటు జైలుకు పంపడంతో అవమానాలు భరించలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదేళ్ల కొడుకు, ఎనిమిదేళ్ల కూతురు ఉన్న లక్ష్మీనారాయణ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. చంద్రబాబు ఏడాది పాలనలో రెడ్బుక్ రాజ్యాంగానికి గురైన ఇలాంటి కుటుంబాలెన్నో ఉన్నాయి. లక్ష్మీనారాయణకు జరిగిన అన్యాయానికి బాధ్యత ఎవరిది? అక్రమ కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసిన వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారు? వ్యవస్థలు సక్రమంగా పని చేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేదా? 3 ప్రజా సమస్యల పరిష్కారంపై గళమెత్తుతూ వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందుకు టీడీపీ వాళ్లు కక్షగట్టి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్ నాయుడును కత్తులతో పొడిచి, బండరాయితో మోది చంపేశారు. ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా, ప్రజల తరఫున ఎవ్వరూ కార్యక్రమాలు నిర్వహించకూడదా? అలా చేస్తే చంపేస్తారా? పోలీసుల పర్యవేక్షణ, ఇంటెలిజెన్స్ సరిగ్గా ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు కదా? 4 శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై సామూహిక అత్యాచారం అత్యంత అమానవీయం. ఈ ఘటనపై కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనీయకుండా టీడీపీ వాళ్లు భయపెట్టారు. నిందితులకు అధికార పార్టీ అండదండలు ఉండడంతో వారిని ఎదిరించే ధైర్యం లేక, తండ్రి లేని ఆ బాలిక కుటుంబం ఏకంగా ఊరు విడిచి వెళ్లిపోయింది. పోలీసులది ప్రేక్షక పాత్రే అయ్యింది.5 ఈ ఘటనలన్నింటినీ వేర్వేరుగా చూడకూడదు. చట్టాన్ని అపహాస్యం చేసి, బాధితులకు న్యాయాన్ని నిరాకరించి, అధికార పార్టీకి చెందిన వారు అని, ఆ నిందితులను స్వేచ్ఛగా వదిలేసినప్పుడు, ఈ పరిణామాలన్నింటినీ మౌనంగా చూస్తున్నప్పుడు.. కేవలం పాలన మాత్రమే కాకుండా, ప్రజాస్వామ్యాన్ని నడిపించే వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోతాయి. చంద్రబాబూ.. మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు ఇక ఎల్లకాలం చూస్తూ ఊరుకోరు. బాధితులకు న్యాయం జరిగేలా వారి తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. -
పత్రికా స్వేచ్ఛపై సర్కారు మరోదాడి
సాక్షి, అమరావతి : రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం తాజాగా సాక్షి దినపత్రికను మరోసారి లక్ష్యంగా చేసుకుంది. ఏపీ శాసనసభ ద్వారా వేధింపులకు దిగింది. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికకు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. బడ్జెట్ సమావేశాలకు ముందు ఫిబ్రవరి 25న సాక్షిలో ప్రచురితమైన ఒక వార్త అసెంబ్లీకి, అసెంబ్లీ సభ్యుల హక్కులకు భంగం కలిగించిందని అందులో పేర్కొన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే జి. జయసూర్య ఇచ్చిన ఫిర్యాదును స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పంపారని, ఈనెల 2న సమావేశమైన కమిటీ పత్రిక ఎడిటర్, సంబంధిత రిపోర్టర్, ప్రింటర్ అండ్ పబ్లిషర్ స్పందన తెలుసుకోవాలని సూచించిందని పేర్కొన్నారు. వారం రోజుల్లో ఈ నోటీసుపై స్పందించాలని కోరారు. ఎవరి హక్కుల ఉల్లంఘనా జరగలేదు.. వాస్తవానికి.. ‘సాక్షి’ ప్రచురించిన కథనంలో ఎక్కడా సభా హక్కుల ఉల్లంఘన జరగలేదు. అసెంబ్లీ, అసెంబ్లీ సభ్యులు, అధికారుల ప్రస్తావన అందులో లేదు. వారి హక్కులకుగానీ, వారి హుందాతనానికి గానీ అగౌరవం కలిగే వ్యాఖ్యలు అసలేలేవు. కేవలం పరిపాలనాపరమైన లోపాలను మాత్రమే అందులో ప్రస్తావించారు. శిక్షణా తరగతుల పేరుతో అన్ని ఏర్పాట్లు చేశాక రద్దుచేయడం ద్వారా ప్రజాధనం వృధా అయిందని, ప్రణాళికా లోపంవల్లే ఇది జరిగిందని వ్యవస్థాపరమైన లోపాలను గుర్తుచేస్తూ ఈ కథనంలో రాశారు. కానీ, సాక్షి మీడియాపై కక్షగట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. బడ్జెట్ సమావేశాల్లో ఒక సభ్యుడితో దీనిపై ఫిర్యాదు చేయించి సభా హక్కుల ఉల్లంఘనగా ఆరోపించింది. ఆ సభ్యుడి ఫిర్యాదు మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు దాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపగా కమిటీ నోటీసులిచ్చింది. ఇలా కూటమి ప్రభుత్వం సాక్షి మీడియాపై వరుస దాడులు చేయిస్తోంది. జర్నలిస్టులను భయపెట్టాలని, పత్రికా స్వేచ్ఛకు పరిమితులు విధించాలనే కుతంత్రంతో ఇలా చేయిస్తున్నట్లు ప్రజాస్వామ్యవాదులు చెబుతున్నారు. సాక్షి, సాక్షి సిబ్బందిపై వరుస దాడులు.. ఇక ఇటీవలే సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డి నివాసంలో ‘సిట్’ పోలీసులు అకారణంగా సోదాలు జరిపారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా.. మద్యం కేసు నిందితుల కోసం అన్వేషించే పేరుతో ఒక పత్రిక ఎడిటర్ నివాసంలో సోదాలు జరిపి పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించారు. అలాగే, సమాజంలో జరిగే పలు అంశాలను ప్రతిబింబించే క్రమంలో రాసిన వివిధ కథనాలపై పరువు నష్టం కేసులు వేసింది. మరోవైపు.. సాక్షి విలేకరులపై రాష్ట్ర వ్యాప్తంగా అక్రమార్కులు దాడులకు తెగబడుతున్నారు. వారి తప్పులను ఎత్తిచూపడమే నేరమన్నట్లు భౌతిక దాడులకు దిగుతున్నారు. ఏలూరు సాక్షి కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడిచేసి కంప్యూటర్లు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అలాగే, గుంటూరు జిల్లా సాక్షి ఛానల్ ప్రతినిధిపై కూటమి నేతలు దాడికి పాల్పడ్డారు. శ్రీకాళహస్తిలోనూ సాక్షి విలేకరిపై దాడి చేశారు. ఇంకా అనేక చోట్ల సాక్షి మీడియాపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. ఇప్పుడు అసెంబ్లీ ద్వారా ప్రివిలేజ్ నోటీసు ఇచ్చి పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నారు. -
పోలీసు అరాచకాలకు నా చావు కనువిప్పు కావాలి
సాక్షి, టాస్క్ ఫోర్స్ : తన చావుతోనైనా పోలీసులకు కనువిప్పు కలగాలని, అమాయకులను వేధించడం ఆపాలని ఓ వ్యాపారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అధికార పార్టీ నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో ఆయన చివరిసారిగా మాట్లాడిన సెల్ఫీ వీడియో (వాంగ్మూలం) లోని మాటలు వైరల్ అయ్యాయి. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం పెద్దనెమిలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన ఎమ్వీఆర్ అలియాస్ గాం«దీతో కలిసి భాగస్వామ్యంతో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో వాయిదాలపై మిక్సీలు, గ్రైండర్లు వంటి సామగ్రిని విక్రయించే వ్యాపారం చేస్తున్నారు. వీరికి గాంధీ సోదరుడు వైఎన్ఆర్ హైదరాబాద్ నుంచి కావాల్సిన సరుకును పంపుతున్నాడు. ఈ క్రమంలో తన భాగస్వామి గాంధీ అలియాస్ ఎమ్వీఆర్ మృతి చెందడంతో ఎవరికి రావాల్సిన వాటాలు వారు తీసేసుకున్నారు. లక్ష్మీనారాయణ సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాడు. గాంధీ కింద పని చేస్తున్న హనుమంతు, వెంకటేష్, రెడ్డి, సునీల్ వచ్చి తాము కూడా వ్యాపారం చేసుకుంటామని, సరుకు ఇప్పించమని కోరారు. దీంతో లక్ష్మీనారాయణ వారికి కావాల్సిన సరుకు ఇవ్వమని వైఎన్ఆర్కు మాట సాయం చేశాడు. అప్పులకు తాను గ్యారెంటీ ఇవ్వలేనని చెప్పుకొచ్చాడు. కొన్ని రోజుల తర్వాత వీరి నుంచి నగదు చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో మొత్తంగా రూ.35 లక్షలు ఇవ్వాలంటూ వైఎన్ఆర్ ఏడాదిన్నర నుంచి లక్ష్మీనారాయణపై ఒత్తిడి తెచ్చారు. టీడీపీ రాకతో వేధింపులు సార్వత్రిక ఎన్నికల సమయంలో గుత్తా లక్ష్మీనారాయణ మరో నలుగురు కలిసి టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. ఎన్నికల్లో కూటమి విజయం సాధించటంతో వైఎన్ఆర్ రాజుపాలెం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రాజుపాలెం ఎస్ఐ మూడు నెలల క్రితం పిలిచి మాట్లాడి సెటిల్ చేసుకోమని చెప్పారు. పగబట్టిన వైఎన్ఆర్ ఎలా అయినా సరే లక్ష్మీనారాయణను వేధించాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా పిడుగురాళ్లకు చెందిన తెలుగుదేశం నాయకులు ఖలీల్ రామారావు, పట్టిపాటి రామారావు, వంశీలను ఆశ్రయించారు. ఈ ముగ్గురు తెలుగుదేశం నాయకులకు పోలీసులతో ఉన్న పరిచయాలతో లక్ష్మీనారాయణను రోజూ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. తాను వైఎన్ఆర్కు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఏమైనా డాక్యుమెంట్లు ఉంటే డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నానని పోలీసులతో తేల్చి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన తెలుగుదేశం నాయకులు పంచాయతీని సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు వద్దకు తీసుకువచ్చారు. నువ్వు కమ్మోడివి కాదా.. రెడ్లకు పుట్టావా? సత్తెనపల్లి డీఎస్పీ కార్యాలయం నుంచి నాలుగు రోజుల క్రితం లక్ష్మీనారాయణకు పిలుపొచ్చింది. అక్కడికి వెళ్లగానే.. ‘నువ్వు కమ్మోడివి. నీకు ఆ పార్టీ (వైఎస్సార్సీపీ)తో పని ఏంటి? రాజకీయాలు చేసే స్థాయికి ఎదిగావా? రాజకీయాలు చేయాలంటే నీకు ఇక పార్టీలే లేవా? నువ్వు కమ్మోడివేనా.. నువ్వేమైనా రెడ్లకు పుట్టావా?’ అంటూ పోలీసులు నోటికి వచ్చినట్లు దూషించారు. ‘మర్యాదగా టీడీపీ నేతలు ఇవ్వాలంటున్న రూ.35 లక్షలు చెల్లిస్తే ఓకే. లేదంటే నా సంగతి ఎలా ఉంటుందో తెలుసుగా’ అంటూ డీఎస్పీ బెదిరిస్తూ హెచ్చరికలు చేశాడు. డీఎస్పీ టార్చర్ పెట్టడాన్ని భరించలేక మనస్థాపం చెందిన లక్ష్మీనారాయణ శుక్రవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అనంతరం తను ఎదుర్కొన్న వేధింపులను వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. అందులో ‘జగనన్నా.. నేను బతికుంటానో లేదో తెలియదు. ఈ పోలీసుల అరాచకాలకు చెక్ పెట్టాలి. వైఎస్సార్సీపీ అంటే చాలు టార్చర్ పెడుతున్నారు. దయచేసి మీరు నా శవాన్ని తాకి పాడె మోయాలి. నా కుటుంబాన్ని పరామర్శించాలి. అప్పుడైనా ఈ అరాచకాలకు చెక్ పడుతుందేమో. మళ్లీ నాలాంటోడు ఇంకొకడు బలి కాకుండా, నాలాంటి కుటుంబం బలి కాకుండా ఉంటుందేమో. నా చావుకు నేను రాజకీయం పులమడం లేదు. చచి్చపోతూ అబద్ధం ఆడనన్నా. కేవలం వైఎస్సార్సీపీ అని వేధిస్తున్నారన్నా’ అని వాపోయారు. ఈ మేరకు లేఖ కూడా రాశారు. లక్ష్మీనారాయణను బంధువులు గుంటూరుకు తరలించగా వెంటిలేటర్పై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. రెడ్బుక్ రాజ్యాంగంతో చావు బతుకుల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తడీఎస్పీ సహా బాధ్యులపై చర్య తీసుకోవాలిసీఎం చంద్రబాబును డిమాండ్ చేసిన వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రెడ్బుక్ రాజ్యాంగం అమలుతో వైఎస్సార్సీపీ కార్యకర్త చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని, అందుకు బాధ్యులైన డీఎస్పీతో సహా అందరిపైనా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి వైఎస్సార్సీపీ కార్యకర్త గుత్తా లక్ష్మీనారాయణ సెల్ఫీ వీడియో, లేఖతో సహా శుక్రవారం ఎక్స్లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం పెదనెమలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణను పోలీసులు వేధించి, హింసించారు. ఆయనపై గతంలో వ్యాపార భాగస్వామి చేసిన ఆరోపణలకు సంబంధించి సత్తెనపల్లి సీఐ, ఎస్సై విచారించినప్పటికీ, లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు ఆ విషయాన్ని విడిచి పెట్టారు. కానీ, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇదే విషయంపై 2 నెలల తర్వాత సత్తెనపల్లి డీఎస్పీ పిలిపించుకుని తీవ్ర వేధింపులకు దిగారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడివైనా నువ్వు వైఎస్సార్సీపీలో ఎందుకున్నావు.. అని డీఎస్పీ తీవ్రంగా అవమానపరిచారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తామని, డబ్బులు ఇవ్వాల్సిందేనని బెదిరించారు. దీంతో లక్ష్మీనారాయణ ఈ తెల్లవారు జామున (శుక్రవారం) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతూ డీఎస్పీ దుర్మార్గంపై వీడియో వాంగ్మూలం ఇచ్చాడు. బాధ్యులైన వ్యక్తుల పేర్లతో లేఖ కూడా రాశాడు. ఇప్పుడు చావు బతుకుల మధ్య గుంటూరు ఆస్పత్రిలో ఉన్నాడు. లక్ష్మీనారాయణ కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. లక్ష్మీనారాయణకు, ఆయన కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. ఈ ఘటనకు బాధ్యులైన డీఎస్పీ సహా మిగిలిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా’ అని ఆ పోస్ట్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నంపై వైఎస్ జగన్ ఆవేదన
తాడేపల్లి: సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, పెదనెమలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణను పోలీసులు వేధించి, హింసించిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగంతో వైఎస్సార్సీపీ కార్యకర్త చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడన్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘ఆ కార్యకర్త గతంలో తన వ్యాపార భాగస్వాములు చేసిన ఆరోపణలకు సంబంధించి సత్తెనపల్లి సీఐ, ఎస్సై విచారించినప్పటికీ, లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు ఆ విషయాన్ని విడిచిపెట్టారు. కాని, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇదే విషయంపై 2 నెలల తర్వాత సత్తెనపల్లి డీఎస్పీ పిలిపించుకుని తీవ్ర వేధింపులకు దిగారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడివైనా నువ్వు వైఎస్సార్సీపీలో ఎందుకున్నావు అని డీఎస్పీ తీవ్రంగా అవమానపరిచి, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తామని, డబ్బులు ఇవ్వాల్సిందేనని బెదిరించారు. దీంతో లక్ష్మీనారాయణ ఈ తెల్లవారు జామున పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతూ డీఎస్పీ దుర్మార్గంపై వీడియో వాంగ్మూలం ఇచ్చాడు. బాధ్యులైన వ్యక్తుల పేర్లతో లేఖ కూడా రాశాడు. ఇప్పుడు చావుబతుకుల మధ్య గుంటూరు ఆస్పత్రిలో ఉన్నాడు. లక్ష్మీనారాయణ కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. లక్ష్మీనారాయణకు, ఆయన కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.రెడ్బుక్ రాజ్యాంగానికి వైయస్సార్సీపీ కార్యకర్త చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, పెదనెమలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణను పోలీసులు వేధించి, హింసించారు. తనపై గతంలో తన వ్యాపార భాగస్వాములు చేసిన ఆరోపణలకు సంబంధించి… pic.twitter.com/DQYqumM3Hz— YS Jagan Mohan Reddy (@ysjagan) June 6, 2025 -
‘48 గంటల తర్వాత కానీ పరిస్థితి చెప్పలేమన్నారు’
గుంటూరు: సత్తెనపల్లి పోలీసులు వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గుంటూరు రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి పరామర్శించారు. ఈ క్రమంలోనే లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు అడిగి తెలుసుకున్నాం. 48 గంటలు అబ్జర్వేషన్లో ఉంటే గాని పరిస్థితి ఏంటో చెప్పలేము అని డాక్టర్లు చెబుతున్నారు. లక్ష్మీనారాయణ పెద్ద నెమలిపురిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. పోలీసులు తనను ఎలా వేధించారో లక్ష్మీనారాయణ సెల్ఫీ వీడియో ద్వారా సూసైడ్ నోట్లో వివరంగా చెప్పాడు. ఒక సివిల్ మ్యాటర్ లో పోలీసులు జోకింగ్ చేసుకుని లక్ష్మీనారాయణ వేధించడం మంచి పద్ధతి కాదు. దీనికి కారకులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం’ అని అంబటి పేర్కొన్నారు.కాగా, పల్నాడు జిల్లాలో టీడీపీ నాయకులు, పోలీసుల వేధింపులు భరించలేక లక్ష్మీ నారాయణ అనే వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్మీనారాయణకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు.ఆత్మహత్యాయత్నం చమయంలో సెల్పీ వీడియో రిలీజ్ చేశాడు లక్ష్మీనారాయణ,. ఆ వీడియోలో టీడీపీ ప్రభుత్వం, పోలీసుల అరాచకాలపై మండిపడ్డారు. ఈ పోలీసుల అరాచకాలకు చెక్ పెట్టాలి. వైఎస్సార్సీపీ అంటేనే ప్రభుత్వం పెద్దల అండతో పోలీసులు టార్చర్ పెడుతున్నారు. నాలాగా మరొకరు బలి కాకూడదు’ అని పేర్కొని ఆత్మహత్యాయత్నం చేశాడు. -
మీరు మీ పద్ధతిని మార్చుకోకపోతే ప్రజలు చూస్తూ ఊరుకోరు: వైఎస్ జగన్
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్లో క్షీణించిన శాంతిభద్రతపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని ధ్వజమెత్తారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘రాజకీయ కక్షలతో చంద్రబాబుగారు, ఆయన పార్టీనాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయింది.అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అధికారంలో ఉన్నవారు అహంకారం, రౌడీయిజంతో చెలరేగిపోయి, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ఫలితంగా జరుగుతున్న ఘటనలు అత్యంత దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. అధికార పార్టీ పోలీసు యంత్రాంగాన్ని ఏ రకంగా అదుపాజ్ఞల్లోకి తీసుకుందో చెప్పడానికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భార్య డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే, చలానా రాసినందుకు ఆ ఎమ్మెల్యే ఆ కానిస్టేబుల్ను రప్పించుకుని, సీఐ సమక్షంలో నిందితుడైన అదే డ్రైవర్తో దాడిచేయిస్తారా? , చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆ ఘటనను మూసివేసేలా ప్రయత్నించి వ్యవస్థలకే తలవంపులు తెస్తున్నారు. ఒక పోలీసుకు లేని రక్షణ ఇక సామాన్యులకు ఎక్కడిది?’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెట్టడం పరిపాటిగా మారిపోయింది‘రాజకీయ కక్షలతో నిర్దోషులపై తప్పుడు కేసులు పెట్టి, వారిని జైళ్లకు పంపడం కూటమి ప్రభుత్వానికి పరిపాటిగా మారిపోయిందని వైఎస్ జగన్ మండిపడ్డారు. వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త రెడ్యం శివలక్ష్మీనారాయణపై అక్రమంగా కేసుపెట్టి, తీవ్రంగా కొట్టారు.. లంచం ఇవ్వలేదని లేని గంజాయి కేసుపెట్టి 2 నెలలపాటు జైలుకు పంపడంతో అవమానాలు భరించలేక లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.10 ఏళ్ల కొడుకు, 8 ఏళ్ల కూతురు ఉన్న లక్ష్మీనారాయణ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. .@ncbn గారి పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. రాజకీయ కక్షలతో చంద్రబాబుగారు, ఆయన పార్టీనాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయింది. అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయి.… pic.twitter.com/9w3zBRhTub— YS Jagan Mohan Reddy (@ysjagan) June 6, 2025చంద్రబాబుగారి ఏడాదిపాలనలో రెడ్బుక్ రాజ్యాంగానికి గురైన ఇలాంటి కుటుంబాలెన్నో ఉన్నాయి. లక్ష్మీనారాయణకు జరిగిన అన్యాయానికి బాధ్యత ఎవరిది?, అక్రమకేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసిన వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారు?, వ్యవస్థలు సక్రమంగా పనిచేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేదా?, ప్రజాసమస్యల పరిష్కారంపై గళమెత్తుతూ వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందుకు టీడీపీ వాళ్లు కక్షగట్టి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్నాయుడును కత్తులతో పొడిచి, బండరాయితో కొట్టి చంపేశారు.ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా, ప్రజల తరఫున ఎవ్వరూ కార్యక్రమాలు నిర్వహించకూడదా?’ అని నిలదీశారు వైఎస్ జగన్. మీ పద్ధతిని మార్చుకోకపోతే ప్రజలు చూస్తూ ఊరుకోరుఅలా చేస్తే చంపేస్తారా? పోలీసుల పర్యవేక్షణ, ఇంటెలిజెన్స్ సరిగ్గా ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు కదా? , శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడు గుర్రాకులపల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై సామూహిక అత్యాచారం అత్యంత అమానవీయం. ఈ ఘటనపై కనీసం ఫిర్యాదుకూడా ఇవ్వనీయకుండా టీడీపీ వాళ్లు భయపెట్టారు. నిందితులకు అధికారపార్టీ అండదండలు ఉండడంతో వారిని ఎదిరించే ధైర్యం లేక తండ్రిలేని ఆ బాలిక కుటుంబం ఏకంగా ఊరు విడిచి వెళ్లిపోయింది. పోలీసులది ప్రేక్షక పాత్రే అయ్యింది. ఈ ఘటనలన్నింటినీ వేర్వేరుగా చూడకూడదు.చట్టాన్ని అపహాస్యం చేసి, బాధితులకు న్యాయాన్ని నిరాకరించి, అధికార పార్టీకి చెందినవారని ఆ నిందితులను స్వేచ్ఛగా వదిలేసినప్పుడు, ఈ పరిణామాలన్నింటినీ మౌనంగా చూస్తున్నప్పుడు కేవలం పాలనమాత్రమే కాకుండా, ప్రజాస్వామ్యాన్ని నడిపించే వ్యవస్థలన్నీకూడా కుప్పకూలిపోతాయి. చంద్రబాబుగారూ మీరు మీ పద్ధతిని మార్చుకోకపోతే ప్రజలు ఇక ఎల్లకాలం చూస్తూ ఊరుకోరు. బాధితులకు న్యాయం జరిగేలా వారి తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది.’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు. -
మైనర్ బాలికపై టీడీపీ నేతల సామూహిక అత్యాచారం
రామగిరి: శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలో టీడీపీ నేతల కీచక పర్వం తాజాగా వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై టీడీపీ నేతలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన సంచలనంగా మారింది. రామగిరిమండలం ఏడుగురాకలపల్లిలో ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు టీడీపీ నేత. ఈ క్రమంలోనే ఆ బాలికను లోబర్చుకుని నగ్న దృశ్యాలు చిత్రీకరించారు. ఆపై ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేసి పలువురు టీడీపీ నేతలు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. దీనిపై ఆ బాలిక కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. దీనిపై ఆ బాధిత కటుంబంతో పాట దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఆ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తన్నారు. -
ముస్లింలకు వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
తాడేపల్లి : ముస్లిం సోదర, సోదరీమణులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాల పండగ బక్రిద్ కాగా, త్యాగం, సహనం.. ఈ రెండూ బక్రీద్ పండగ ఇచ్చే సందేశాలన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగ జరుపుకుంటారని, త్యాగనిరతికి ఈ పండుగ నిదర్శమన్నారు. ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో చేసుకుంటారని, అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ముస్లిం సోదర, సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ, త్యాగానికి, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు ప్రతీకగా నిలిచే బ్రకీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.#EidUlAdha— YS Jagan Mohan Reddy (@ysjagan) June 7, 2025 -
లిక్కర్ కేసు అంతా వట్టిదేనా?.. బాబుకు సీను అర్థమైపోయిందా?
అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారా..?వైఎస్ జగన్ హయాంలో లిక్కర్ కుంభకోణం జరిగింది.. మూడువేలకోట్ల అవినీతి జరిగిందని సొంతపేపర్లలో వార్తలు రాయించిందంతా నాటకాలేనా ... అసలువైఎస్ జగన్ హయాంలో కుంభకోణం జరగలేదని.. దానికి ఎలాంటి ఆధారాలూ లేవని బాబుకు ఇప్పుడు తెలిసొచ్చిందా ? అందుకే మొన్నటి కేబినెట్ భేటీలో పిల్లిలా సన్నాయినొక్కులు నొక్కారా ? అదే అనిపిస్తోంది. వాస్తవానికివైఎస్ జగన్ హయాంలో మద్యం వ్యాపారం మొత్తం బేవరేజెస్ కార్పొరేషన్ చేసింది.. లాభమంతా కార్పొరేషన్ కు వస్తుంది.. కార్పొరేషన్ అంటే ప్రభుత్వం .. అంటే సర్కారుకు లిక్కర్ వ్యాపారం ద్వారా భారీ ఆదాయం వచ్చింది.. పైగా వీధుల్లో ఇష్టానుసారం దుకాణాలు.. అక్రమ బెల్ట్ షాపులు కూడా లేకపోవడంతో రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. మద్యం ద్వారా భారీ ఆదాయం రావడంతోవైఎస్ జగన్ కూడా సంక్షెమ పథకాలు దర్జాగా అమలు చేసారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక లిక్కర్ కుంభకోసం అనే కాన్సెప్ట్ ను ప్రజల్లోకి ఎక్కించేందుకు యాతన పడ్డారు. అనుకూల మీడియాలో రకరకాల వార్తలు రాయించారు..పనిలోపనిగా అప్పటి ఏపీ బీసీఎల్ ఎండీ వసుదేవరెడ్డిని ... రాజ్ కసిరెడ్డిని ఇంకొందరిని అరెస్ట్ చేసి అదేదో పెద్ద కుంభకోణం అన్నట్లుగా ప్రజలను నమ్మించేందుకు తపనపడ్డారు. ఇదే ఊపులో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు అన్నట్లుగా లీకులు ఇచ్చారు. అయితే ఈ అంశం మీద చంద్రబాబు నిన్న వాస్తవాలు చెప్పేసారు. మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విషయం మీద స్పష్టత ఇచ్చేసారు. "నన్ను స్కిల్ స్కాములోవైఎస్ జగన్ సర్కారు అరెస్ట్ చేసింది కదాని నేను ఆయన్ను లిక్కర్ కుంభకోణంలో ఎలా అరెస్ట్ చేస్తాను.. ఆధారాలు ఉండాలి కదా.. అవి లేకుండా అరెస్ట్ చేస్తే ప్రజలకు దొరికిపోతాం కదా." అనేసారు.. అంటే రాష్ట్రంలో ఆనాడు కుంభకోణమే జరగలేదని చంద్రబాబు అన్యాపదేశంగా కేబినెట్లో ఒప్పేసుకున్నారు. అంటే అది అసలు కుంభకోణమే కాదని.. కేవలంవైఎస్ జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మొదలెట్టిన దుష్ప్రచారం అని చంద్రబాబు ఒప్పేసుకున్నట్లు కేబినెట్ సహచరులు చెబుతున్నారు. మరి ఏమీ లేనిదానికి ఇలా కుంభకోణం అని ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అంటే వచ్చి ఏడాది అయినా ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలుచేయలేని ఈ ప్రభుత్వం ఒక్కో నెల ఒక్కో అంశాన్ని జనంలోకి తీసుకెళ్లి వారి దృష్టిని మరల్చడానికి చేస్తున్నట్లు ఒప్పుకుంటున్నట్లు అర్థం అవుతోంది..-సిమ్మాదిరప్పన్న -
‘పవన్.,. మీ శాఖలో ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా?’
తాడేపల్లి : ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు 143 వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మాయ చేసి గెలిచారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ఈరోజు(శుక్రవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్.. చంద్రబాబు ప్రజలకు నిలువునా వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ‘ వైఎస్సార్సీపీ చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. కడప మహానాడుకి జనం నామమాత్రంగా కూడా రాలేదు. వైఎస్సార్సీపీ ఒక్క వెన్నుపోటు దినం అని పిలుపునిస్తే లక్షలమంది ప్రజలు వచ్చారు. మీరు ఏ అభివృద్ధి చేయలేక జగన్ని దూషించటమే పనిగా పెట్టుకున్నారు. మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి మరింత దిగజారి మాట్లాడుతున్నారు. అలా మాట్లాడటానికి మంత్రికి సిగ్గులేదా?. దళితులకు ఈ రాష్ట్రంలో అవమానం జరుగుతోంది. రాష్ట్రంలో గంజాయి వ్యాపారం చేస్తుంది టీడీపీ వాళ్లే అని గంటా శ్రీనివాసరావు చెప్పారు. టీడీపీ వలనే గంజాయి బజారులో కూడా దొరుకుతోంది. హోంమంత్రి అనితకు కులం కోటాలనే హోంమంత్రి పదవి వచ్చింది. దళితులను కొడితే హోంమంత్రి కేర్లేస్గా మాట్లాడుతున్నారు. టీడీపీలో చాలామందిపై కేసులు ఉన్నాయి. వారిని ఇలానే బజారులో కొడతారా?. పరిటాల సునీత ఇలాకాలో దళిత బాలికపై నెలల తడబడి అత్యాచారం చేశారు. ఈ ఘటన మీకు కనబడుటం లేదా, అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా?, ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబు వెన్నుపోటు దారుడు కాదా?, విద్యార్థులు, మహిళలు, తల్లులను మోసం చేసింది టీడీపీ కాదా?, రైతులను మోసం చేసింది నిజం కాదా?, చివరకు రాష్ట్రంలో సినిమా హాళ్లను కూడా మూసివేసే పరిస్థితికి తెచ్చారు. మీ నాయకుడు పవన్ కళ్యానే సినిమా వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖలో ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా?, పవన్ కళ్యాణ్ అన్న నాగబాబుకి మాత్రమే రాజకీయ ఉద్యోగం ఇప్పించారు. పంచాయతీ రాజ్ శాఖని నిర్వీర్యం చేశారు. గ్రామ పంచాయతీ వ్యవస్థని నాశనం చేశారు’ అని మండిపడ్డారు. -
టీడీపీ నేతల వేధింపులు.. వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
పల్నాడు జిల్లాలో టీడీపీ నాయకులు, పోలీసుల వేధింపులు భరించలేక లక్ష్మీ నారాయణ అనే వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్మీనారాయణకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు.ఆత్మహత్యాయత్నం చమయంలో సెల్పీ వీడియో రిలీజ్ చేశాడు లక్ష్మీనారాయణ,. ఆ వీడియోలో టీడీపీ ప్రభుత్వం, పోలీసుల అరాచకాలపై మండిపడ్డారు. ‘ ఈ పోలీసుల అరాచకాలకు చెక్ పెట్టాలి. వైఎస్సార్సీపీ అంటేనే ప్రభుత్వం పెద్దల అండతో పోలీసులు టార్చర్ పెడుతున్నారు. నాలాగా మరొకరు బలి కాకూడదు. నేను వైఎస్సార్సీపీ కార్యకర్త అయినందునే వేధిస్తున్నారు. నేనేమీ బాకీ లేకపోయినా పిడుగురాళ్లకు చెందిన టీడీపీ నాయకులు ఖలీల్ రామారావు, పత్తిపాటి రామారావు వంశీతో పాటు పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారు. నేనేమీ బాకీ లేకపోయినా పిడుగురాళ్ల కు చెందిన టిడిపి నాయకులు ఖలీల్ రామారావు పత్తిపాటి రామారావు వంశీలు పోలీసులు వేధిస్తున్నారు. డీఎస్సీ ఆఫీసుకు పిలిచి మరిచి వేధించారు. డీఎస్పీ ఆఫీసులో నువ్వు కమ్మవాడివా.. కమ్మవాడివైతే వైఎస్సార్సీపీలో ఎలా ఉంటావని దూషించారు’ అని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. -
వైఎస్సార్సీపీ నేత నారాయణరెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ నేత నారాయణరెడ్డి కుటుంబాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఫోన్ నుంచి కుటుంబ సభ్యులతో మాట్లాడిన వైఎస్ జగన్.. నారాయణరెడ్డి ఆత్మహత్యకు కారణాలను అడిగి తెలుసుకున్నారు.ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన నారాయణరెడ్డిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టి జైలుకు పంపడంతో ఆయన పరువు పోయిందని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అరెస్టు సమయంలో డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులు తీవ్రంగా హింసించారని వైఎస్ జగన్కు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పూలు అమ్ముకుని జీవించే నారాయణరెడ్డి మరణంతో భార్య, ఇద్దరి పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారింది. అధైర్య పడొద్దని కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ ఓదార్చారు. వారి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. -
తప్పు చేసినా అడగొద్దంటే ఎలా?
ఆరోపణలు ఉంటే విచారించి కోర్టుకు హాజరుపరచడం.. శిక్ష పడేలా చూడటం పోలీసుల బాధ్యత. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ బాధ్యతను మరచినట్టున్నారు. తెనాలిలో ముగ్గురు యువకులను రోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై లాఠీలు ఝళిపించిన ఘటన గురించే ఈ ప్రస్తావన. పోలీసుల తీరు ఎలా ఉందంటే.. ‘‘దౌర్జన్యం చేసినా మమ్మలను ఎవరూ ప్రశ్నించకూడదు!.. రోడ్లపై ఎవరినైనా కొట్టే అధికారం మాకుంది’’ అన్నట్టుగా ఉంది!!. ఇప్పటికే.. టీడీపీ నేత, మంత్రి లోకేశ్ రెడ్బుక్ రాజ్యాంగం(Red Book Constitution) అమలుతో మసకబారిన ఆంధ్రప్రదేశ్ పోలీసుల ప్రతిష్ట తెనాలి ఘటనతో మరింత దిగజారింది! పోలీసుల దౌర్జన్యానికి బలైన యువకులపై ఉన్న నేరాభియోగాలను సమర్ధించడం లేదు కానీ.. నిందితులను ఇలా నడిరోడ్డుపైనే కొట్టడం మొదలుపెడితే అది వారితో మాత్రమే ఆగదు. సామాన్యులపై కూడా ఇష్టారీతిన దౌర్జన్యానికి దారితీస్తుందన్నది గుర్తించాలి. 👉తెనాలిలో మానవ హక్కులను ఉల్లంఘించి(Tenali Incident Human Rights Violation) మరీ జరిగిన దాష్టీకంపై ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రశ్నలు సంధిస్తే తట్టుకోలేని అధికారపక్షం, ఎల్లోమీడియా.. జగన్ నేరస్తులకు అండ అంటూ వక్రీకరిస్తోంది. పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నాయి. తప్పు చేసిన పోలీసులపై చర్య తీసుకోవల్సిన హోం మంత్రి అనిత వారి దుశ్చర్యలకు మద్దతిస్తూ మాట్లాడడం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధ్వాన్న పాలనకు తాజా నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. 👉చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన కొన్ని పర్యటనలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సొంతపార్టీలో ఒకవర్గమే ఇంకో వర్గం నేత వీరయ్య చౌదరిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చినా మృతుడి అంత్యక్రియలకు హాజరవడం వీటిల్లో ఒకటి. హత్యకు కారణం కూడా అక్రమ దందాలే!. అలాంటి పలు ఆరోపణలు ఉన్న వ్యక్తి హత్యకు గురైతే చంద్రబాబు, ఆ తర్వాత ఆయన కుమారుడు లోకేశ్, హోంమంత్రి వారి ఇంటికి పరామర్శకు వెళ్లారు. అది దేనికి సంకేతం? నేరాభియోగాలకు గురైన వ్యక్తికి ముఖ్యమంత్రి స్థాయి నేత మద్దతు ఇచ్చినట్లు కాదా?. 👉తెనాలిలో పోలీసులు కొట్టిన ముగ్గురు యువకులపై కేసులు ఉంటే ఉండొచ్చు. వాటిల్లో కొన్నింటిని కోర్టులు కొట్టివేశాయనీ వార్తలున్నాయి. ఒక యువకుడిపై కేసులే లేవు. అయినా ఒక కానిస్టేబుల్ పై దాడి చేశారన్న కేసులో వీరిని నడిరోడ్డుపై హింసించారు. ఇదెక్కడి పద్ధతి?. విపక్షంలో ఉన్నప్పుడు మాచర్ల వద్ద ఫ్యాక్షన్ రాజకీయాల కారణంగా హత్యకు గురైన చంద్రయ్య అనే కార్యకర్త పాడెను చంద్రబాబు మోశారు. వ్యక్తిగత కక్షలను రాజకీయాలకు ముడిపెట్టి లబ్ది పొందే యత్నం చేశారు. మరి అది సరైనదేనా?. ఈ చర్య ఫ్యాక్షనిస్టులకు మద్దతు ఇచ్చినట్లా కాదా? పుంగనూరు వద్ద టీడీపీ కార్యకర్తల రౌడీయిజానికి ఒక కానిస్టేబుల్ కన్ను పోయింది. పోలీస్ వ్యాన్ దగ్ధమైంది. అక్కడే ఉన్న చంద్రబాబు టీడీపీ వారిని వారించారా? కనీసం ఆ కానిస్టేబుల్ పట్ల సానుభూతి చూపారా? అదేమీ చేయలేదే. అంటే రౌడీయిజంకు అండగా చంద్రబాబు నిలబడ్డారని ఒప్పుకుంటారా?. 👉2014-19 మధ్యకాలంలో ఇసుక అక్రమ తవ్వకాన్ని అడ్డుకున్నందుకు దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు వనజాక్షి అనే ఎమ్మార్వోపై దౌర్జన్యం చేశారు. అప్పుడు చింతమనేనిని మందలించకపోగా, వనజాక్షిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసి రాజీ పడాలని చెప్పారు. అంటే చంద్రబాబు అప్పుడు ఇసుక మాఫియాకు అండగా నిలబడినట్లే కదా?. ఇటీవలికాలంలో ఒకవైపు పోలీసులు, ఇంకోవైపు టీడీపీ కార్యకర్తలు ప్రతిపక్షంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం గురజాల వద్ద హరికృష్ణ అనే వైఎస్సార్సీపీ కార్యకర్తను స్థానిక సీఐ, టీడీపీ నేత వాహనంలో తరలించడమే కాకుండా, అతనిని తీవ్రంగా హింసించారు. ఇలా అనేక ఘటనలలో మానవ హక్కులకు భంగం వాటిల్లుతోంది. అలాంటప్పుడు జగన్ వాటిపై స్పందించకుండా ఎలా ఉంటారు? పోనీ ఈ మధ్యకాలంలో టీడీపీ ఎమ్మెల్యేలు, వారి మనుషులు చేస్తున్న దౌర్జన్యాలను అడ్డుకుంటున్నారా? అదేమీ లేదు. పైగా వారికి అండగా ఉంటున్నారు. 👉బలం లేకపోయినా పలు మున్సిపాల్టీలలో, కార్పొరేషన్లలో బలవంతంగా తమ అధీనంలోకి తీసుకోవడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తూ కిడ్నాప్ వంటి దౌర్జన్యాలకు పాల్పడుతుంటే పోలీసులు వారిని వారించలేదు. పైగా వారికి అండగా కనిపించారు. విశాఖపట్నం, తిరువూరు, తిరుపతిలలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం.ఇక ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నా, ఎవరిపై పోలీసులు చర్య తీసుకోవడం లేదు. జమ్మలమడుగు, పిడుగురాళ్లల వద్ద సిమెంట్ కంపెనీలు మూతపడేలా ఎమ్మెల్యేలే ప్రవర్తిస్తే పోలీసులు ఏమైనా చర్య తీసుకున్నారా?. శ్రీకాకుళం వద్ద తమకు రెడీమిక్స్ ఉచితంగా సరఫరా చేయాలని, నిర్దిష్ట మొత్తం లంచాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఘటనలు జరిగాయి. జమ్మలమడుగు వద్ద ఇద్దరు నేతలు బహిరంగంగా గొడవపడితే నో కేసు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. 👉జగన్ ప్రభుత్వ కాలంలో ఏదైనా చిన్న ఘటన జరిగినా చంద్రబాబు, ఎల్లో మీడియా విపరీతమైన హడావుడి చేసేవి. విశాఖలో మద్యం తాగి రోడ్డుపై నానా రగడ చేస్తున్న డాక్టర్ సుధాకర్ను ఒక పోలీస్ కానిస్టేబుల్ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా చేతులు వెనక్కి పెట్టి పోలీస్ స్టేషన్కు తీసుకువెళితే.. ‘‘దళితుడిపై అఘాయిత్యమా?’’ అని ప్రచారం చేశారు. తెనాలిలో ఇంత బహిరంగంగా దళిత, ముస్లిం యువకులను పోలీసులు కొడితే మాత్రం తప్పు కాదట!. రాజమండ్రి వద్ద ఏదో ఒక అభియోగంపై ఒక వ్యక్తికి శిరోముండనం చేయించిన పోలీసును అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేయించింది. అయినా టీడీపీ దీనిపై నానా యాగీ చేసింది. తెలుగుదేశం పార్టీ అన్నింటిలోనూ డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తుంటుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్సార్సీపీలో ఉండగా... ఎంపీడీవోతో దురుసుగా మాట్లాడారని ఆరోపణ రాగానే జగన్ ప్రభుత్వం ఆయనపై కేసుకు ఆదేశించింది. అప్పట్లో ఇదే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు కోటంరెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు జయరాం గత టర్మ్లో ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు. ఆయనపై చంద్రబాబు, లోకేశ్లు పలు నిందారోపణలు చేశారు. క్లబ్లు నడుపుతున్నారని, భూ కబ్జాలు చేశారని ఇలా అనేకం చెప్పారు. తీరా ఎన్నికల సమయానికి కోటంరెడ్డిని, గుమ్మనూరును తమ పార్టీలోకి చేర్చుకుని టిక్కెట్లు కూడా ఇచ్చారు. ప్రస్తుత డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణరాజు కూడా తెనాలి ఘటనలో పోలీసుల చర్యను సమర్థించడం విస్మయం కలిగిస్తుంది. ఒకపక్క తనపై వైఎస్సార్సీపీ హయాంలో పోలీసులు అరెస్టు చేసి 125 సార్లు కొట్టారని చెబుతూ, మరో పక్క తెనాలిలో నిందితులను పోలీసులు కొట్టడాన్ని ఎలా సమర్థిస్తారు?. తెనాలి యువకులు నేరం చేసి ఉంటే అది ఆ ఊరికే పరిమితం. కానీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో రచ్చబండ అంటూ రోజూ టీవీల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న అభియోగంపై అరెస్టు చేశారు. ఇందులో ఎవరిది పెద్ద తప్పు, ఎవరిది చిన్న తప్పు అన్నది ఆలోచించుకోవాలి. ఎవరినైనా పోలీసులు కొట్టడాన్ని సమర్థించరాదు. నిజానికి చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా పోలీసులపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారనే అభిప్రాయం ఉంది. అందుకే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారన్న విమర్శ ఉంది. తిరుమల శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలను ఎన్ కౌంటర్ చేస్తే ఒక్క పోలీసుపై కూడా చర్య తీసుకోలేదు. రాజమండ్రిలో పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందితే ఒక్క కానిస్టేబుల్ కూడా సస్పెండ్ కాలేదు. ఒకరిపై చర్య తీసుకుంటే అది తన మెడకు కూడా చుట్టుకుంటుందన్న భయం కూడా ఉండి ఉండవచ్చు. చంద్రబాబు పాలనలో అయితే ప్రలోభాలు పెట్టడం, లేకపోతే పోలీసులను ప్రయోగించి అరాచకంగా పాలించడం సర్వ సాధారణమేనని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. జగన్ తెనాలి వెళ్లడంపై విమర్శలు చేస్తున్న హోం మంత్రి అనిత తన ధర్మం ఏమిటో విస్మరించి పోలీసులు చేసిన హింసను సమర్ధిస్తూ మాట్లాడడం అంటే ఈమె చేతిలో ఏమీ లేదని అర్థం చేసుకోవాలి. అంతే!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విజయవాడ: శాతవాహన కాలేజీని కూల్చేసిన పచ్చ మాఫియా
సాక్షి, విజయవాడ: ప్రొక్లెయిన్లతో శాతవాహన కాలేజీ భవనాలను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. ఇటీవల శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ను టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. శాతవాహన కాలేజ్ ప్రిన్సిపాల్ కిడ్నాప్తో వివాదం మరింత ముదిరింది. తాజాగా బోయపాటి శ్రీనివాస అప్పారావు అనే వ్యక్తి తెరపైకి వచ్చారు. శాతవాహన కాలేజీ స్థలంలో బోయపాటి శ్రీనివాసరావు.. బోర్డులు ఏర్పాటు చేశారు.కూల్చివేతలపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. కూల్చివేతలను అడ్డుకుంటున్నారు. కూల్చేసిన శిథిలాల కిందే శాతవాహన కాలేజీ విద్యార్థులకు సంబంధించిన రికార్డులు ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని.. శాతవాహన కాలేజీ కూల్చివేతపై ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం మండిపడుతోంది.విద్యార్థుల పరిస్థితి ఏంటి?శాతవాహన కాలేజీ భవనాలు కూల్చివేతతో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస సమాచారం లేకుండా కూల్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రే కళాశాల భవనాలు కూల్చివేయడంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. శాతవాహన కాలేజీకికు దశాబ్ధాల చరిత్ర ఉందని.. కోర్టు ఆదేశాలను సాకుగా చూపి కళాశాల భవనాలు కూల్చేయడం దారుణమన్నారు.విద్యార్థుల భవిష్యత్తు, అధ్యాపకుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. సర్టిఫికెట్లు, రికార్డులన్నీ శిథిలాల కిందే ఉన్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి?. తక్షణమే ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించాలి. విద్యార్ధులకు న్యాయం చేయాలి’’ అని రవిచంద్ర డిమాండ్ చేశారు. -
వెన్నుపోటు వీరుడా.. చంద్రబాబు మీద సాంగ్ వైరల్
సాక్షి, అమరావతి: చంద్రబాబు మోసాలు, ప్రజలకు వెన్నుపోటు పొడిచిన తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక పాటను రిలీజ్ చేసింది. వెన్నుపోటు వీరుడా.. అబద్ధాల శూరుడా.. నీకు నీవే సాటి రా.. అంటూ సాగే ఆ వీడియో సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో రిలీజ్ చేయగానే అత్యధికులు దాన్ని డౌన్ లోడ్ చేసుకున్నారు. తల్లికి వందనం, మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి, ధరల పెరుగుదల.. ఇలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ, ప్రజలను చంద్రబాబు ఎలా మోసం చేశారో ఆ సాంగ్ స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.Here is the teaser of "వెన్నుపోటు వీరుడా.. అబద్దాల శూరుడా!" song!Vennupotu Veerudaa.. Abaddhaala Shurudaa!🎧 Stay tuned for the full song, releasing today at 8 PM — launching on the @we_ysrcp YouTube channel!📲 👇🏻https://t.co/VOuzq3sSkA#VennupotuVeerudaa… pic.twitter.com/PFu655VgvZ— YSR Congress Party (@YSRCParty) June 4, 2025 -
ఆంధ్రప్రదేశ్లో పచ్చ మాఫియా అరాచకాలు... యథేచ్ఛగా డ్రగ్స్ దందా... పేకాట క్లబ్బులతో భారీగా దోపిడీ
-
కోర్టు కేసులా.. అయితే నాకేంటి?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో రెండు గ్రూపుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. కూటమి ప్రభుత్వం అండదండలతో సూర్యనారాయణ ఇష్టానుసారం చెలరేగిపోతుండగా, అసలు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తమదేనని ఆస్కార్రావు వర్గం కోర్టును ఆశ్రయించింది. కోర్టులో మూడు కేసులున్నా లెక్క చేయకుండా సూర్యనారాయణ ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో నిబంధనలు పక్కనపెట్టి ఎన్నికలు నిర్వహించేసుకోవడం గమనార్హం.ఏడాది నుంచి రగడప్రభుత్వ ఉద్యోగుల సంఘం తమదంటే తమదని ఏడాది నుంచి సూర్యనారాయణ, ఆస్కార్రావు వర్గాలు కొట్లాడుకుంటున్నాయి. సూర్యనారాయణ గత ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తను మరిపించేలా కూటమి గెలుపు కోసం పని చేశారు. ఏడాది కిందట ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఉన్న సూర్యనారాయణ, ఆస్కార్రావు మధ్య విభేదాలు వచ్చాయి. ఆస్కార్రావును సంఘం నుంచి తొలగిస్తున్నట్లు కొద్ది నెలల కిందట సూర్యనారాయణ ప్రకటించారు. తనను తొలగించే అధికారం సూర్యనారాయణకు లేదని, అసలు ఆ సంఘం తమదేనని ఆస్కార్రావు న్యాయ పోరాటానికి దిగారు. ఈ నెల 3వ తేదీతో సంఘం రాష్ట్ర కార్యవర్గం గడువు ముగిసింది. కోర్టులో విచారణ జరుగుతుండగానే కొత్తగా ఎన్నికలు పెట్టడానికి సూర్యనారాయణ సన్నాహాలు మొదలుపెట్టారు.సమావేశం ముసుగులో ఎన్నికలు సూర్యనారాయణ వర్గానికి మండల స్థాయిలో కమిటీల నిర్మాణం లేదు. అందువల్ల ఆయన ప్రభుత్వ మద్దతుతో ఉద్యోగులను సమీకరించి ఎన్నికలకు సిద్ధమయ్యారు. గురువారం విజయవాడలో సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నామని, దానికి సీఎం చంద్రబాబు వస్తున్నారని ప్రచారం చేశారు. తన పలుకుబడి ఉపయోగించి ఈ సమావేశానికి హాజరయ్యేందుకు వీలుగా గురువారం ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ఇస్తూ ప్రభుత్వంతో ఉత్త్వులు జారీ చేయించారు. తద్వారా ఉద్యోగులను రప్పించి ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.దీనిపై ఆస్కార్రావు వర్గం కోర్టును ఆశ్రయించింది. స్టేట్ కౌన్సిల్ మీటింగ్ ముసుగులో సూర్యనారాయణ ఎన్నికలు నిర్వహిస్తున్నారని, నోటిఫికేషన్ లేకుండా, కింది స్థాయిలో ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరుపుతున్నారని, దాన్ని ఆపాలని హైకోర్టులో ఒకటి, మచిలీపట్నం కోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. మచిలీపట్నం కోర్టులో దీనిపై బుధవారం విచారణ జరిగి, గురువారానికి వాయిదా పడింది. గురువారం సాయంత్రం కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా, ఉదయమే సూర్యనారాయణ కోర్టులను కూడా లెక్క చేయకుండా విజయవాడలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో ఎన్నికలు నిర్వహించి తాను అధ్యక్షుడినని ప్రకటించుకున్నారు. ఉద్యోగుల పేరుతో టీడీపీ కార్యకర్తల హాజరు?ఈ సమావేశం కోసం ప్రతి జిల్లాకు ఐదు బస్సులు పెట్టి ఉద్యోగులను రప్పించారు. కొన్ని జిల్లాల నుంచి ఉద్యోగుల పేరుతో టీడీపీ కార్యకర్తలను బస్సులు ఎక్కించినట్లు తెలుస్తోంది. సూర్యనారాయణపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లోనూ ఆయన అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆఫీస్ బేరర్స్ సర్టిఫికెట్లను బదిలీలకు అనుమతించవద్దని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ ఉత్తర్వులివ్వడం విశేషం. ఇన్ని ఆరోపణలున్నా, అక్రమాలకు పాల్పడుతున్నా కూటమి ప్రభుత్వం సూర్యనారాయణకు మద్దతిచ్చి ఆయన అక్రమంగా నిర్వహించిన ఎన్నికలకు సహకరించడంపై ఉద్యోగవర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
అక్రమ కేసు పెట్టి..
ఖాజీపేట: పోలీసుల వేధింపులు.. తప్పుడు కేసుకు ఒక నిండు ప్రాణం బలైపోయింది. వైఎస్సార్ సీపీ కార్యకర్త ఆత్మహత్యకు కారణమైంది. తీవ్ర మానసిక వేదనకు గురైన అతను ఏకంగా విద్యుత్ సబ్స్టేషన్లో కరెంటు తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుని బంధువుల, స్థానికుల కథనం ప్రకారం.. వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామానికి చెందిన రెడ్యం శివలక్ష్మీనారాయణరెడ్డి పేకాట ఆడుతున్నట్లు అనుమానించి మే 6న ఖాజీపేట పోలీసులు స్టేషన్కు పిలిపించారు. అతనితోపాటు మరో 9 మందిని పిలిపించి విచారణ చేపట్టారు.తాము పేకాట ఆడలేదని వారు చెప్పినా.. పోలీసులు వినిపించుకోలేదు. రెడ్యం శివలక్ష్మీనారాయణరెడ్డిని పోలీసులు తీవ్రంగా వేధించారు. అనంతరం అతనితోపాటు విచారణకు వచ్చిన అందరినీ ఇంటికి పంపించారు. 7,8 తేదీల్లో స్టేషన్కు మళ్లీ విచారణ పేరుతో పిలిపించారు. 9న వారి పై పేకాట కేసుతోపాటు గంజాయి కూడా అమ్ముతున్నట్లు తప్పుడు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో రెడ్యం శివలక్ష్మీనారాయణరెడ్డి తోపాటు మరో 8 మందిని నిందితులుగా చూపుతూ, వారి వద్ద నుంచి 2.570 కిలోల గంజాయితోపాటు రూ 20,500 నగదు 52 పేకముక్కలు దొరికినట్లు చూపించారు. తనకు సంబంధంలేని గంజాయి కేసులో అరెస్టయిన శివలక్ష్మినారాయణరెడ్డి మే 29న బెయిల్పై బయటకు వచ్చారు.తన భార్య సుభాషిణికి జరిగిన విషయం వివరించారు. ఖాజీపేట సీఐ మోహన్ తనను అక్రమంగా పేకాట, గంజాయి కేసులో ఇరికించారని ఆవేదన చెందారు. తనను చిత్ర హింసలకు గురిచేసినట్లు చెప్పారు. తగిలిన దెబ్బలను భార్యకు చూపించి తీవ్ర మనోవేదన చెందారు. సీఐ మోహన్పై ప్రైవేటు కంప్లయింట్ వేసి కోర్డులోనే న్యాయం కోరదామని ఆమె నారాయణరెడ్డికి సర్ది చెప్పే యత్నం చేశారు. ఆయన బుధవారం మైదుకూరులో జరిగిన వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.జరిగిన అన్యాయాన్ని అక్కడ వైఎస్సార్సీపీ నాయకులకు చెప్పి బాధపడ్డాడు. తీవ్ర మనోవేదనతో రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి బయటకు పోయి పుప్పగిరి వెళ్లే దారిలో ఉన్న సబ్స్టేషన్ మెయిన్ తీగలను పట్టుకుని విద్యుదాఘాతానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఎంతకూ ఇంటికి రాక పోవడంతో భార్యతోపాటు బంధువులు వెతికారు. చివరకు సబ్స్టేషన్లో విద్యుత్ తీగ పట్టుకుని చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. సీఐ మోహన్పై మృతుడి భార్య ఫిర్యాదుఖాజీపేట సీఐ మోహన్ తన భర్త నారాయణరెడ్డిని డబ్బుల కోసం, వేధించారని, డబ్బులు ఇవ్వక పోవడంతో అక్రమంగా కేసు నమోదు చేసి జైలుకు పంపి తన భర్త మృతికి కారణమయ్యాడని సుభాషిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త ఆత్మహత్యకు కారణమైన సీఐ మోహన్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి కడప మేయర్ సురేష్ బాబు ఎస్పీ అశోక్ కుమార్ను కలిశారు. సీఐది తప్పని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని నాయకులకు ఎస్పీ భరోసా ఇచ్చారు. అనంతరం దుంపలగట్టు గ్రామంలో జరిగిన లక్ష్మీనారాయణరెడ్డి అంత్యక్రియల్లో నాయకులు పాల్గొన్నారు. -
నేటి నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగా ల భర్తీకి నిర్వహించే డీఎస్సీ–2025 పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 44 దశల్లో ఈనెల 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9, మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్షలు రెండు విడతల్లో జరుగుతాయి. పరీక్ష ప్రారంభానికి గంటన్నర ముందు నుంచే కేంద్రాల్లోకి ప్రవేశం ఉంటుంది. మొత్తం 16,437 పోస్టులకు 3,36,305 మంది 5,77,675 దరఖాస్తులు చేసుకున్నారని కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు.సీబీటీ విధానంలో జరిగే పరీక్షల కోసం రాష్ట్రంలో 137 పరీక్ష కేంద్రాలు, రాష్ట్రం వెలుపల హైదరాబాద్, కోదాడ, చెన్నై, బెంగళూరు, బెర్హంపూర్లో మరో 17 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొదటి ప్రాధాన్యత క్రమంలో 87.8 శాతం మందికి వారి జిల్లాల్లోనే కేంద్రాలు కేటాయించారు. అన్ని కేంద్రాల్లోనూ సీసీటీవీలు ఏర్పాటు చేశారు. సందేహాల నివృత్తి కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామని, ఏమైనా ఫిర్యాదులుంటే 6281704160, 8121947387, 8125046997, 9398810958, 7995649286, 7995789286 9963069286, 7013837359 నంబర్లలో సంప్రదించాలని కన్వీనర్ కృష్ణారెడ్డి సూచించారు. -
లోకేశ్ ఒత్తిడితోనే మూల్యాంకనంలో తప్పులు
సాక్షి, అమరావతి, మంగళగిరి: కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల మూల్యాంకనంలో జరిగిన తప్పులతో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురువారం మంగళగిరిలోని పాఠశాల విద్యా భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు.లోకేశ్ అసమర్థత వల్లే పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రహసనంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హడావుడికి విద్యార్థులు బలయ్యారని, లోకేశ్కు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. వారం రోజుల్లో మూల్యాంకనం పూర్తి చేయాలంటూ ఒత్తిడి తెచ్చిన విద్యా శాఖ, అందులో జరిగిన తప్పులకు టీచర్లను బాధ్యులను చేసి చేతులు దులుపుకొనేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ధర్నాలో వారు ఏమన్నారంటే..విద్యా శాఖను భ్రష్టు పట్టించారు..‘‘పదో తరగతి పరీక్షలను సరిగా నిర్వహించలేక చేతులెత్తేసిన ప్రభుత్వం, జవాబు పత్రాల మూల్యాంకనంలోనూ ఘోరంగా ఫెయిలైంది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు కుమారుడు నిర్వహించే శాఖలోనే పనితీరు ఇంత ఘోరంగా ఉందంటే.. మిగతా వ్యవస్థలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అన్ని సబ్జెక్టుల్లో 90 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ఒక్కదాంట్లో కేవలం 5, 10, 20 మార్కులతో ఫెయిలవడం, రీకౌంటింగ్ లో 90 మార్కులు రావడం చూస్తే విద్యాశాఖ ఎంత భ్రష్టుపట్టిందో అర్థమవుతోంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా 66,363 మంది రీవ్యాల్యూయేషన్, రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకుంటే 11 వేల మందికిపైగా ఉత్తీర్ణులయ్యారు. రికార్డుల కోసం విద్యార్ధుల జీవితాలతో ఆటలు వారం రోజుల్లో మూల్యాంకనం పూర్తి చేసి ఘనతగా చెప్పుకోవాలని భావించిన ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంది. సంఖ్యను పెంచకుండా ఉన్నవారితోనే మూల్యాంకనం చేయించడంతో టీచర్లు ఒత్తిడికి లోనయ్యారు. వైఎస్సార్ కడప జిల్లాలో గంగిరెడ్డి మోక్షితకు సాంఘిక శాస్త్రంలో 21 మార్కులు వేశారు. రీకౌంటింగ్ లో 84 మార్కులొచ్చాయి. బాపట్లలో తేజశ్వినికి అన్ని సబ్జెక్టుల్లో 90 శాతంకి పైగా మార్కులు వస్తే సాంఘిక శాస్త్రంలో 26 మార్కులతో ఫెయిలైంది. రీవెరిఫికేషన్ తర్వాత 96 మార్కులొచ్చాయి. రాష్ట్ర చరిత్రలో రీవెరిఫికేషన్ తర్వాత కేవలం 5, 10 మార్కులు పెరిగేవి. కానీ, ఇంత దారుణంగా 70 పైగా మార్కులు పెరిగిన సందర్భాలు లేవు. ఇదంతా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అసమర్థతను తెలియజేస్తుంది.విద్యార్థుల డబ్బులు తిరిగి చెల్లించాలిచాలామంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన లేక, రుసుములు భరించలేక రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది. లేదంటే ఫలితాలు ఇంకా దారుణంగా ఉండేవేమో? రాజమహేంద్రవరంలో మణికంఠకు మొత్తం 505 మార్కులు రాగా.. హిందీలో 52 మాత్రమే వచ్చాయి. రీవెరిఫికేషన్ లో కొన్ని జవాబులను కొట్టేసి ఉన్నట్టు వెల్లడైంది. దీనిపై ప్రశ్నిస్తే అవి సరైన సమాధానాలేనని.. కానీ, విద్యార్థే కొట్టేశాడని చెబుతున్నారు. కష్టపడి రాసిన విద్యార్థి ఎందుకు కొట్టేస్తాడు? మంత్రి లోకేశ్ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పి పదవికి రాజీనామా చేయాలి.రెడ్ బుక్ అమలు మీద పెట్టిన శ్రద్ధ విద్యా శాఖ మీద పెడితే బాగుంటుంది. విద్యార్థులకు ఉచితంగా రీ వ్యాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ కు అవకాశం కల్పించాలి. ఇప్పటికే రుసుములు చెల్లించినవారి డబ్బులు తిరిగివ్వాలి. లోకేశ్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కొందరు టీచర్లపై చర్యలు తీసుకుని ప్రభుత్వం చేతులు దులుపుకోవడం సిగ్గుచేటు’’ అని పానుగంటి చైతన్య, రవిచంద్ర దుయ్యబట్టారు. ధర్నాలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివారెడ్డి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు వినోద్, మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షుడు సందీప్, నాయకులు కోమల్ సాయి, గోపీచంద్, ఐ. శ్రీనివాస్, ఎస్కే ఆర్మాన్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.ర్యాలీని అడ్డుకున్న పోలీసులు..విద్యా భవన్ కు బైక్ ర్యాలీగా వస్తున్న విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం పరీక్షల విభాగం అధికారి కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డికి విద్యార్థి నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. -
దళిత బాలికను చెరచిన టీడీపీ కీచకులు
అభం శుభం తెలియని బాలికను మానవ మృగాలు కనీ వినీ ఎరుగని రీతిలో దారుణంగా కాటేశాయి.. స్కూలుకెళ్లే పిల్లలను సైతం వదిలి పెట్టని దారుణ రోజులు దాపురించాయి.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 14 మంది వంతు లేసుకుని.. వీడియో తీసి బెదిరిస్తూ.. బ్లాక్ మెయిల్ చేస్తూ.. వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా బలాత్కారం చేయడం దిగ్భ్రాంతి పరుస్తోంది.. అధికారం అండ ఉండగా అడిగే వారు లేరని ఏకంగా ఆరు నెలల పాటు కీచక పర్వం కొనసాగించడం విస్తుగొలుపుతోంది.. తండ్రి లేని పిల్ల.. మతి స్థిమితం లేని తల్లి.. పైగా ఎస్సీ బాలిక.. ఏం చేస్తుందిలే అన్న కండ కావరం, అధికార మదంతో ఆ బరితెగింపు రాష్ట్రంలో దౌర్భాగ్య పాలనకు అద్దం పడుతోంది.. పాపం.. ఎవరికీ చెప్పుకోలేని దయనీయ పరిస్థితి ఆ బాలికది.. ఒకవేళ ఎవరికైనా చెప్పుకోవాలనుకుని దాచుకున్న కాసింత ధైర్యాన్ని సైతం ఆ దుర్మార్గులు పదేపదే బెదిరింపులతో చంపేశారు.. దుప్పటి పంచాయితీలు, రాయ‘బేరాలు’తో వెల కట్టే పనిలో పాలకులు బిజీగా ఉండటం దురదృష్టం.సాక్షి, టాస్క్ఫోర్స్ : అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలకు కేరాఫ్గా మారిన ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో మరో దుర్మార్గం చోటుచేసుకుంది. మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురానికి కూతవేటు దూరంలోని ఏడుగుర్రాలపల్లిలో ఓ దళిత బాలికపై కొందరు టీడీపీ అల్లరి మూకలు కొన్ని నెలల పాటు పదే పదే అత్యాచారం చేశారు. వీడియోలు తీసి మరీ ఒకరి తర్వాత మరొకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగు చూసింది. టీడీపీ నేతల ఒత్తిడితో ఇప్పటికే బాధిత బాలిక కుటుంబం ఊరి నుంచి ఎక్కడికో వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. పేరూరు పంచాయతీ పరిధిలోని ఏడుగుర్రాలపల్లిలో 9వ తరగతి చదువుతున్న దళిత విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు కన్నేశారు. ఏడాది క్రితం టీడీపీ గెలుపు సంబరాల్లో తప్పెట కొడుతూ బొలెరో నుంచి జారి కింద పడి తండ్రి మృతి చెందాడు. తల్లికి మతి స్థిమితం సరిగా లేదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఆ విద్యార్థినిపై తొలుత కొందరు అత్యాచారం చేశారు. దాన్ని వీడియో తీశారు. ‘నీ వీడియో ఒకటి మా వద్ద ఉంది’ అంటూ బెదిరిస్తూ.. మరికొందరు లొంగదీసుకున్నారు. గత ఆరు నెలలుగా ఏకంగా 14 మంది ఆ చిన్నారిని ఆటబొమ్మను చేసి ఆడుకున్నారు. నిందితులందరూ టీడీపీకి చెందిన వారే కావడంతో మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ అండదండలు ఉన్నాయనే ఉద్దేశంతో స్థానికులు మౌనం వహించారు. గర్భం దాల్చిన బాలిక పోలీసులను ఆశ్రయించకుండా గ్రామంలోనే దుప్పటి పంచాయితీ చేసి మూసి పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. ఇబ్బందులు తప్పవని టీడీపీ నేతల నుంచి బెదిరింపు కాల్స్ వెళ్లినట్లు తెలిసింది. వీడియో ఉందని బెదిరిస్తూ.. ఆర్నెల్ల కాలంలో పేరూరు పంచాయతీకి చెందిన 14 మంది యువకులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. నిందితుల్లో బడగొర్ల అభిషేక్, బూడిద రాజేష్, బాసి గిరి, బాసి కార్తీక్, బాసి రాజేంద్ర, బాసి సోనప్ప, బాసి అంజి, తలారి మురళి, రొద్దకంపల్లి మహేశ్, హరిజన సురేశ్, హరిజన హేమంత్ పేర్లు బయటపడ్డాయి. మరో ముగ్గురి పేర్లు తెలియాల్సి ఉంది. కాగా నిందితుల్లో కొందరు ఇప్పటికే గ్రామం వదిలి పరారయ్యారు.బాధిత కుటుంబం అదృశ్యంగురువారం మధ్యాహ్నం నుంచి సామూహిక అత్యాచారం విషయం ఆ నోటా.. ఈ నోటా తెలియడంతో బాధిత బాలిక కుటుంబ సభ్యులను టీడీపీ నేతలు బెదిరించినట్లు తెలిసింది. సాయంత్రం నుంచి గ్రామంలో బాధిత కుటుంబ సభ్యులు కనిపించలేదు. రామగిరి సీఐ శ్రీధర్ వెళ్లి విచారణ చేయగా.. బాధిత బాలిక ఇంటికి తాళం వేసి ఉంది. పోలీసుల సహకారంతో టీడీపీ నేతలే వారిని ఎక్కడికో తరలించారని గ్రామంలో చర్చ జరుగుతోంది. అబార్షన్ చేయించుకోవాలని బెదిరింపు?సదరు బాలిక అబార్షన్ చేయించుకుని.. ఎలాంటి కేసులకు వెళ్లకుండా ఉండాలని టీడీపీ నాయకులు కొందరు బెదిరించినట్లు తెలిసింది. ఈ క్రమంలో బాలికను ఎక్కడో టీడీపీ నాయకులే దాచి ఆస్పత్రికి తరలించి, అబార్షన్ చేయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అబార్షన్ చేయిస్తే ఎలాంటి కేసు లేకుండా మూసేయాలని పన్నాగం పన్నినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. హరియాన్ చెరువుకు చెందిన రౌడీషీటర్ నాగరాజు కనుసన్నల్లో బాధిత బాలికను దాచినట్లు సమాచారం. పార్టీ కోసం ప్రాణాలు విడిచిన కుటుంబానికి అండగా నిలవాల్సిన పరిటాల కుటుంబం నిందితుల వైపు ఉందనే విషయంపై జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.ఎవరూ ఫిర్యాదు చేయలేదువిషయం నా దృష్టికి రాగానే గురువారం మధ్యాహ్నం ఏడుగుర్రాలపల్లి గ్రామానికి వెళ్లి విచారణ చేశాం. అయితే ఎవరూ వివరాలు చెప్పేందుకు ముందుకు రావడం లేదు. బాధిత బాలిక కుటుంబం నివసిస్తోన్న ఇంటికి తాళం వేసి ఉంది. వారి బంధువుల ఇళ్లన్నీ పరిశీలిస్తున్నాం. ఫిర్యాదు వస్తే ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. వెనుక ఎవరు ఉన్నా చట్టానికి అతీతులు కారు.– శ్రీధర్, రామగిరి సీఐహోం మంత్రి సమాధానం చెప్పాలి దళిత బాలికపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. దళిత, గిరిజనులపై రాష్ట్రంలో వరుసగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో పాలన పూర్తిగా విఫలమైంది. కూటమి ప్రభుత్వంలో మహిళలకు.. బాలికలకు రక్షణ లేకుండా పోయింది. దళిత సామాజిక వర్గానికి చెందిన హోం మంత్రి అనిత ఇందుకు సమాధానం చెప్పాలి.– సాకే హరి, ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడుమహిళా సమాజం సిగ్గు పడేలా.. రాప్తాడు ఎమ్మెల్యే కూడా మహిళే. పైగా ఎమ్మెల్యే పరిటాల సునీత స్వగ్రామానికి సమీపంలోనే ఏడుగుర్రాలపల్లి ఉంది. చుట్టుపక్కల గ్రామాల్లో మహిళలకు కూడా రక్షణ కల్పించలేని ఎమ్మెల్యే ఉంటే ఏం? లేకుంటే ఏం? శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ కూడా మహిళే. ఈ కేసులో న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం.– తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే -
పడగ విప్పిన పచ్చ మాఫియా
ఇంటింటికి రేషన్ బియ్యం డోర్ డెలివరీ పథకాన్ని రద్దు చేసిన చంద్రబాబు ప్రభుత్వం డ్రగ్స్ డోర్ డెలివరీకి మాత్రం పచ్చజెండా ఊపుతోంది.మహిళల భద్రతకు ఉద్దేశించిన దిశ వ్యవస్థను నిర్వీర్యం చేసిన టీడీపీ కూటమి సర్కారు.. బాలికలపై జరుగుతున్న సామూహిక అత్యాచారాల పట్ల చోద్యం చూస్తోంది.కూటమి ఎమ్మెల్యేలతో ఊరూరా పేకాట క్లబ్బుల దందాకు తెరతీసిన బాబు ప్రభుత్వం... పోలీసులను అడ్డుపెట్టుకుని అమాయకులు ఆత్మహత్యకు పాల్పడేంత తీవ్రస్థాయిలో అక్రమ కేసులతో వేధిస్తోంది....గురువారం ఒక్కరోజే వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న మూడు సంఘటనలు రాష్ట్రంలో దారుణంగా దిగజారుతున్న పరిస్థితులకు నిదర్శనంగా నిలిచాయి. రెడ్బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తోందని స్పష్టం చేశాయి. డ్రగ్స్ మాఫియా కరాళ నృత్యం చేస్తూ యువతను నిర్వీర్యం చేస్తోందని తేల్చిచెప్పాయి. బాలికలపై అత్యాచారాలకు తెగబడుతున్న అరాచక మూకకు ప్రభుత్వమే కొమ్ముకాస్తోందన్న కఠిన నిజాన్ని వెలుగులోకి తెచ్చాయి. పేకాట క్లబ్బుల దందాతో ఎందరో జీవితాలను రోడ్డు పాల్జేస్తోందని నిర్ధారించాయి. అరాచక, అసాంఘిక కార్యక్రమాలతో యావత్ రాష్ట్రం బెంబేలెత్తుతోందని కుండబద్దలు కొట్టాయి.సాక్షి, అమరావతి; ఏడాది క్రితం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. ఏకంగా కొరియర్ సర్వీసులతో డోర్ డెలివరీ చేసేంతగా దందా వేళ్లూనుకుంటోంది. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్కు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న డ్రగ్ డీలర్లు ఏడాదిగా ఆంధ్రప్రదేశ్నే ప్రధాన మార్కెట్గా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ నుంచి నూజివీడు మీదుగా విజయవాడ తరలిస్తున్న డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో రాష్ట్రంలో వేళ్లూనుకున్న మత్తు నెట్వర్క్ తీవ్రత వెలుగుచూసింది. విజయవాడలో పట్టుకున్నది గోరంతేనని.. రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న డ్రగ్స్ దందా కొండంత అని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. దేశంలో ప్రధాన నగరాలే కేంద్రంగా విస్తరించిన డ్రగ్స్ మాఫియా రాష్ట్రంలోని ఊరూరా విస్తరిస్తోంది. ఢిల్లీ, ముంబై, అమృత్సర్ తదితర నగరాల్లోని మాఫియా అప్ఘానిస్థాన్ తదితర దేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుంటున్న డ్రగ్స్ను మార్కెట్ చేయడానికి ఏపీనే గమ్యస్థానంగా ఎంచుకున్నాయి. వివిధ రూపాల్లోని ఎండీఎంఏ డ్రగ్స్ను రాష్ట్రంలోకి యథేచ్ఛగా తరలిస్తున్నారు. అందుకోసం విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కాకినాడ వంటి ప్రధాన నగరాలతో పాటు నూజివీడు, జగ్గయ్యపేట, భీమవరం, విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, హిందూపురం, నంద్యాల వంటి దాదాపు 50 పట్టణాల్లో ఏజెంట్ల వ్యవస్థను డ్రగ్స్ ముఠా ఏర్పాటు చేసుకుంది. ఢిల్లీ, ముంబై తదితర నగరాల నుంచి స్థానిక ఏజెంట్లకు డ్రగ్స్ను సరఫరా అవుతున్నాయి. ఇందుకోసం కొరియర్ సర్వీసులను వాడుకుంటున్నాయి. ఏజెంట్లు అందుకున్న డ్రగ్స్ను చిన్నచిన్న ప్యాకెట్లుగా వెండార్స్ (విక్రేతలు)కు అందిస్తున్నారు. ఆ వెండార్స్ గట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తూ యువతను మత్తులో ముంచుతున్నారు. విద్యాసంస్థలే టార్గెట్డ్రగ్స్ మాఫియా రాష్ట్రంలోని విద్యాసంస్థలను తమ దందాకు కేంద్రంగా చేసుకుంది. వెండార్స్ విద్యాసంస్థల ప్రాంగణాల సమీపంలోనే విక్రయిస్తున్నారు. జూనియర్ కాలేజీల నుంచి ఇంజినీరింగ్, మెడికల్, ఇతర వృత్తి విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలను లక్ష్యంగా చేసుకున్నారు. ఉన్నత విద్యాసంస్థల సమీపంలోనే బడ్డీలు, స్ట్రీట్ వెండార్స్ రూపంలో డ్రగ్స్, గంజాయి విక్రయాలు సాగిస్తున్నారు. సిగరెట్లు, చాక్లెట్లు, చూయింగ్ గమ్, పౌడర్ రూపంలో విక్రయిసు్తన్నారు. విజయవాడలోని ఉన్నత విద్యాసంస్థల ప్రాంగణాల సమీపంలో విక్రయించేందుకు ఢిల్లీ నుంచి కొరియర్ సర్వీసు ద్వారా నూజివీడు మీదుగా డ్రగ్స్ తరలించడమే అందుకు తాజా తార్కాణం.డ్రగ్స్పై చోద్యం చూస్తున్న చంద్రబాబు సర్కారురాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదు. డ్రగ్స్ను అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన కార్యాచరణ చేపట్టలేదు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన్ను రెండు దశల్లో సమర్థంగా అమలు చేసింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను ఏర్పాటు చేసి పటిష్ఠ కార్యాచరణ చేపట్టింది. ఏపీ–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో దశాబ్దాలుగా నడుస్తున్న గంజాయి సాగును కూకటివేళ్లతో పెకలించింది. ఏకంగా 11,500 ఎకరాల్లో పంటను ధ్వంసం చేసింది. గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహించింది. ఇందుకు రూ.500 కోట్లతో ప్రత్యేక పథకాన్ని తెచ్చింది. ఇక విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి డ్రగ్స్ అక్రమ రవాణాను సమర్థంగా కట్టడి చేసింది. సెబ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలతో అక్రమ రవాణాను అడ్డుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి కేసులు కూటమి రాకతో..టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పోలీసు వ్యవస్థ డ్రగ్స్పై పట్టు వదిలేసింది. సర్కారు కక్షపూరితంగా సెబ్ను రద్దు చేసింది. కొత్తగా ఈగల్ వ్యవస్థను తెచ్చామని చెప్పినప్పటికీ దానికి కనీసం మౌలిక వసతులు సమకూర్చలేదు. విస్తృత అధికారాలు కల్పించలేదు. ప్రధానంగా ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగా డ్రగ్స్ దందాకు టీడీపీ సీనియర్ నేత కుటుంబం అండదండలు ఉండడంతో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉదాసీనంగా ఉంటోందన్న విషయం స్పష్టమైంది. అందుకనే పోలీసు శాఖ కూడా డ్రగ్స్ దందా యథేచ్ఛగా సాగుతున్నా చోద్యం చూస్తోంది.రాష్ట్రంలో ఏరులై పారుతున్నమద్యంఇంటింటికీ డెలివరీ చేస్తున్న బెల్ట్ షాప్లుపోలీసులే దగ్గరుండి అమ్మిస్తున్న వైనంపైనుంచి కిందివరకు చేతులు మారుతున్న లంచాలుకూటమి ప్రభుత్వం పాలనలో డ్రగ్స్ దందాకు తోడు మద్యం ఏరులై పారుతోంది. వసూ్తనే ప్రైవేటు మద్యం దుకాణాల వ్యవస్థను మళ్లీ తెచ్చిన చంద్రబాబు సర్కారు.. పోలీసులను పెట్టించి మరీ దగ్గరుండి అమ్మకాలు సాగిస్తోంది. బార్లకు తోడు పర్మిట్ రూమ్లనూ ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మరోవైపు బెల్టు షాపులకు పచ్చజెండా ఊపింది. దీంతో ఒక్కో ఊరిలో రెండు, మూడు బెల్టుషాపులు వెలిశాయి. ఇంటింటికీ మద్యం డెలివరీ చేస్తున్నాయి. ఇక మద్యం మత్తులో జరుగుతున్న నేరాలు–ఘోరాలకు అంతే ఉండడం లేదు. మద్యం తాగేందుకు డబ్బులు కావాలంటూ అయినవారిపైనే దాడులకు దిగుతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. కాగా, మద్యం దందాలో పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు భారీఎత్తున లంచాలు చేతులు మారుతున్నాయి.అత్యాచారాలతో అట్టుడుకుతున్న రాష్ట్రంమహిళలు, బాలికలపై వరుసగా అత్యాచారాలతో రాష్ట్రం హడలిపోతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో అత్యాచారాలు, హత్యాచారాల గణాంకాలు చూస్తే భయాందోళనలు కలుగుతున్నాయి. చంబల్ లోయను తలపిస్తున్న రీతిలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు తెగబడుతుండడంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.ముక్కుపచ్చలారని బాలికలు, విద్యార్థినులకూ భద్రత కరువుచంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో అత్యాచార పర్వం యథేచ్ఛగా సాగుతోంది. శ్రీవారి దివ్యక్షేత్రం తిరుపతి, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురం, మంత్రి లోకేశ్ నియోజకవర్గం మంగళగిరి, హోం మంత్రి అనిత నియోజకవర్గం పాయకారావుపేట... ఇలా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి. ముక్కుపచ్చలారని బాలికలు, విద్యార్థినులకు ఏమాత్రం భద్రత లేకపోవడం తల్లిదండ్రులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది. ఈ దారుణపర్వంలో మరో దుర్ఘటన అనంతపురం జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత ప్రాంతం రామగిరి మండలం పేరూరు పంచాయతీ ఏడుగుర్రాలపల్లిలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై 13 మంది యువకులు సామూహిక అత్యాచారం చేశారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం బయటకు పొక్కింది. నిందితులు అందరూ టీడీపీ కార్యకర్తలే కావడంతో అధికార పార్టీ నేతలు వారికి అండగా నిలుస్తున్నారు. ఇది ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.బెజవాడలో డ్రగ్స్ రాకెట్పటమట (విజయవాడ తూర్పు): డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురు యువకులను విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ కమిషనరేట్ డీసీపీ కేజీవీ సరిత గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడలోని రామవరప్పాడు రింగ్ వద్ద ఈ నెల 4న వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు యువకులు రెండు స్కూటర్లపై అనుమానాస్పదంగా కనిపించారు. వారు ప్రయాణిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్, మరో ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేశారు. ఆ వాహనాల డిక్కీల్లో ఉన్న తెలుపు రంగు క్రిస్టల్ ఎండీఎంఏ (మిథలిన్ డయాక్సి మిథపేటావిున్) డ్రగ్ రెండు ప్యాకెట్లు, ఊదా రంగు క్రిస్టల్ ఎండీఎంఏ డ్రగ్ ఒక ప్యాకెట్, ఎరుపు రంగు ఎండీఎంఏ డ్రగ్ ఒక ప్యాకెట్ లభించాయి. సుమారు 33 గ్రాములు గల ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని అంచనా. వీటిని తీసుకొస్తున్న కృష్ణా జిల్లా పెనమలూరు మండలం సనత్నగర్ రామాలయం వీధికి చెందిన తిరుమలశెట్టి జీవన్కుమార్ (29), పటమట ఫన్టైం క్లబ్ రోడ్డులో నివాసం ఉండే బొంతు నితీష్కుమార్ (28), కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు ఇందిరానగర్–1కు చెందిన తులిమిల్లి తరుణ్ప్రసాద్(20)ను అరెస్ట్ చేశారు.ఢిల్లీ నుంచి నూజివీడుకు..ప్రమాదకరమైన ఈ డ్రగ్స్ను ఢిల్లీకి చెందిన రింకు అనే వ్యక్తి ట్రాక్ఆన్, డీటీడీసీ కొరియర్ ద్వారా నూజివీడులో ఉండే మనోహర్కు సరఫరా చేశారని డీసీపీ చెప్పారు. అక్కడి నుంచి ముగ్గురు నిందితులు విజయవాడకు తరలిస్తుండగా.. పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. నిందితులు జీవన్కుమార్, మనోహర్ ఇంటర్ క్లాస్మేట్స్. వీరికి యూపీలో ఉంటున్న మనోహర్కుమార్ మేనమామ ద్వారా ఢిల్లీకి చెందిన రింకూ పరిచయమయ్యారని డీసీపీ వివరించారు. విజయవాడ సరఫరా అయిన డ్రగ్స్ను నగర శివారులోని ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు సరఫరా చేస్తారని చెప్పారు. ఈ రాకెట్లో ఢిల్లీకి చెందిన రింకూ, నూజివీడుకు చెందిన మనోహర్కుమార్, యూపీలో ఉండే మనోహర్ మేనమామ కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు. నిందితుల నుంచి 2 స్కూటర్లు, 7 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పటమట సీఐ పవన్కిషోర్, ఎస్సై దుర్గాదేవీలను డీసీపీ అభినందించారు. డీసీపీ వెంట ఏసీపీ దామోదర్ ఉన్నారు.ఉసురు తీస్తున్న రెడ్బుక్ వేధింపులుపేకాట దందా కూటమి ఎమ్మెల్యేలది.. బలయ్యేది ప్రజలుఆత్మహత్య చేసుకునేంతగా తీవ్ర స్థాయి వేధింపులుచంద్రబాబు ప్రభుత్వ రెడ్బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమాయకుల ప్రాణాలు బలిగొంటోంది. ప్రభుత్వ పెద్దల కుట్రలకు వత్తాసు పలుకుతూ పోలీసులు అధికారిక గూండాల మాదిరిగా బరితెగిస్తున్నారు. తాజాగా వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం దంపలగట్టుకు చెందిన రెడ్యం శివలక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకునేలా అక్రమ కేసులతో వేధించడం దీనికి నిదర్శనం. దీంతో మనస్తాపం చెందిన ఆయన గురువారం రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లి పుప్పగిరిదారిలో ఉన్న సబ్స్టేషన్ మెయిన్ వైరు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు విషయం ఏమిటంటే... రాష్ట్రంలో పేకాట క్లబ్బులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిషేధించింది. కానీ, పేకాట మాఫియాకు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ప్రాణం పోసింది. గత ఏడాది టీడీపీ ప్రభుత్వం రాగానే పేకాట క్లబ్బులకు అనుమతులిచ్చింది. కూటమి ఎమ్మెల్యేలే స్వయంగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా జూదరులు వచ్చి పేకాడేలా అతిపెద్ద కాసినోలు నడుపుతుండడం గమనార్హం. రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలు, నగరాలు, ప్రధాన పట్టణాల్లో ఎంపిక చేసిన అపార్టుమెంట్లు, రిసార్టులు, లాడ్జిలు, మూసివేసిన సినిమా థియేటర్లు... ఇలా అన్నీ కూడా పేకాట క్లబ్బులుగా మారిపోయాయి. పోలీసులకు మామూళ్లు ముట్టజెబుతూ కూటమి ఎమ్మెల్యేలు భారీగా కమీషన్లు తీసుకుంటూ రోజుకు రూ.వందల కోట్లలో పేకాట దందా సాగిస్తున్నారు. కానీ, అసలు పేకాటతో నిమిత్తం లేని అమాయకులను ఇరికించి.. ఆత్మహత్యకు పాల్పడేలా అక్రమ కేసులతో పోలీసులు వేధిస్తున్నారు. ఇదీ చంద్రబాబు రెడ్బుక్ రాజ్యాంగం. -
‘ఈవీ’లకు ఫుల్ పవర్
విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో ప్రపంచ దేశాలు చేసుకున్న ఒప్పందంలో భాగంగా కేంద్రం పీఎం ఈ–డ్రైవ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రూ.2,000 కోట్లతో దేశ వ్యాప్తంగా 72 వేల ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. ప్రపంచంలో అత్యధిక కాలుష్యం గల దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో 2030కి సంప్రదాయ వాహనాల స్థానంలో 30% ఈవీ కార్లు, 80 %ఈవీ టూ వీలర్లు, 70% ఈవీ కమర్షియల్ వెహికిల్స్ ప్రవేశపెట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా 8 కోట్ల విద్యుత్ వాహనాలు వచ్చే ఐదేళ్లలో రోడ్లమీద నడవాలని నిర్దేశించుకుంది. తద్వారా 2030కి 1 గిగా టన్ కర్బన ఉద్గారాలు తగ్గుతాయని అంచనా. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మాత్రం ఈవీల వినియోగం పెరగాలి. అందుకోసం చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వేగవంతం కావాల్సిన అవసరం ఉంది.ఆలోచించి కొంటున్నారు..2024–25లో దేశ వ్యాప్తంగా 20 లక్షల విద్యుత్ వాహనాలను వాహనదారులు కొనుగోలు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో అమ్ముడైన ఈ విద్యుత్ వాహనాల్లో సగం (60%)పైగా ఈవీ ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. అంటే 12 లక్షలు ఈవీ మోటార్ సైకిళ్ల విక్రయాలు జరిగాయి. 2023తో పోల్చితే ఈవీ విక్రయాల వృద్ధి 24%గా ఉంది. దాదాపు లక్ష విద్యుత్ కార్లను వినియోగదారులు గతేడాది కొనుగోలు చేశారు.ఎలక్ట్రిక్ బస్సుల విక్రయాలు మాత్రం 3% తగ్గాయి. విద్యుత్ వాహనాలను కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ వాటికి చార్జింగ్ పెట్టడమనేది ప్రధాన సమస్యగా మారడంతో ఎక్కువ మంది సంశయిస్తున్నారు. కొనాలా వద్దా అని ఒకటికి పదిసార్లు ఆలోచించాకే నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ సమస్యను అధిగ విుంచాలంటే కేంద్రం చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావాలి.ప్రపంచ స్థాయికి చేరలేదు ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్లో ఇంకా ఆ స్థాయిలో ఈవీల వినియోగం పెరగలేదు. దీనికి ప్రధాన కారణం ఎక్కడికక్కడ చార్జింగ్ స్టేషన్లు లేకపోవడం. దేశంలో ప్రస్తుతం 12,146 విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ చెబుతోంది. 2030కి దేశ వ్యాప్తంగా 39 లక్షల ఈవీ చార్జింగ్ స్టేషన్లు అవసరం. భారత్లో ప్రతి 135 ఈవీలకు ఒక పబ్లిక్ చార్జర్ మాత్రమే ఏర్పాటైంది. ఇండియా ఎలక్ట్రిక్ వాహనం చార్జింగ్ మార్కెట్ గడిచిన ఐదేళ్లలో రూ.30 వేల కోట్లకుపైగా పెట్టుబడులను ఆకర్షించింది. అయినప్పటికీ, మౌలిక సదుపాయాల సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను, ప్రోత్సాహకాలను పెంచడం, ప్రపంచ ఉత్తమ పద్ధతులను అవలంబించడం ద్వారా ఈ సమస్యను అధిగవిుంచవచ్చని గుర్తించిన కేంద్రం ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రూ.2,000 కోట్లు కేటాయించింది. బాటలు వేసిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏపీలో ప్రస్తుతం 1,23,396 విద్యుత్ వాహనాలున్నాయి. 2030 నాటికి వీటి సంఖ్య 7,82,660కు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ వాహనాలు, చార్జింగ్ స్టేషన్ల విధి విధానాలను ప్రత్యేక పాలసీగా రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ప్రతి 3 కిలోమీటర్లకు ఒకటి, జాతీయ రహదారుల్లో 25 కిలోమీటర్లకు ఒకటి చొప్పున విద్యుత్ చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పాలని సంకల్పించింది.అందుకు అవసరమైన 4,000 స్థలాలు అప్పట్లోనే గుర్తించింది. విజయవాడ, అమరావతి, విశాఖ, తిరుపతిలను మోడల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నగరాలుగా గుర్తించింది. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల(పీసీఎస్)ను ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీనికి ఎటువంటి లైసెన్స్ తీసుకోనవసరం లేదని చెప్పింది. ఇప్పుడు కేంద్రం అదే బాటలో నడుస్తోంది. దేశవ్యాప్తంగా 50 జాతీయ రహదారుల వెంబడి, టోల్ ప్లాజాలు,విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వంటి ప్రజా రవాణా ఉండే ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్లు పెట్టనుంది. నగరాలు, పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ వాటిని అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటోంది. -
ఇలాగైతే.. మాకు చావే గతి
సాక్షి, అమరావతి: “ఏడాదిగా మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవని.. మాకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలు ఇప్పుడు ఇవ్వలేమని చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మా దగ్గర ఉన్న బస్సులు తగులబెట్టి ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు వేరే గత్యంతర లేదు’ అని వాపోతున్నారు ఆర్టీసీకి అద్దె బస్సులు నడుపుతున్న ఎస్సీ, ఎస్టీ అద్దె బస్సుల యజమానులు. ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు, తాము పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఏడాదిలో ఒక్క రూపాయైనా ఇవ్వలేదు ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన “వైఎస్సార్ బడుగు వికాసం’ పథకం కింద వీరంతా బస్సులు కొనుగోలు చేసి ఏపీఎస్ ఆర్టీసీకి అద్దె బస్సులుగా నడుపుతున్నారు. 300 మందికిపైగా ఎస్సీ, ఎస్టీ యువత గత ప్రభుత్వ ప్రోత్సాహంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని బస్సులు కొనుగోలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వీరికి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు నిలిపివేసింది. ఈ పథకం కింద లబ్ధి పొందిన ఎస్సీలకు సుమారు రూ.500 కోట్లు, ఎస్టీలకు రూ.150 కోట్లు పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేయకుండా కూటమి సర్కారు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కేవలం వైఎస్సార్ బడుగు వికాసం పథకం కింద లబ్ధి పొందారన్న ఏకైక కారణంతో బకాయిలు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు లోకేశ్, టీజీ వెంకటేష్తోపాటు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, డైరెక్టర్, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్లను అనేకసార్లు కలిసి తమ కష్టాలు మొరపెట్టుకున్నా ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని వాపోయారు. కనీసం రుణాల చెల్లింపునకు సంబంధించి బ్యాంకులతోనైనా మాట్లాడండి అని కోరుతున్నా ఉపయోగం లేకుండా పోతోందంటున్నారు. ఏడాది కావస్తున్నా బకాయిలతో పాటు ఈ ఏడాది ప్రోత్సాహకాల్లో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క అద్దె బస్సు నుంచి ప్రభుత్వానికి అన్ని ఖర్చులు పోనూ ప్రతినెలా రూ. 3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆదాయం వస్తోందని బస్సు యజమానులు చెబుతున్నారు. ప్రతినెలా 300 అద్దె బస్సుల ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.9 కోట్లకుపైగా ఆదాయాన్ని బడుగు పారిశ్రామికవేత్తలు సమకూరుస్తున్నా ప్రభుత్వం తమపై కనికరం చూపించడం లేదని వాపోతున్నారు. ఈ నెల 27న అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ డే లోగా పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేయాలని.. లేకపోతే ఆందోళన తీవ్రతరం చేసి సీఎం ఇంటిని ముట్టడించడానికి కూడా వెనుకాడబోమంటూ ఎస్సీ, ఎస్టీ అద్దె బస్సుల యజమానులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. డబ్బులు లేనప్పుడు హామీ ఎందుకిచ్చారు? చదువుకున్నా ఉద్యోగాలు లేని సమయంలో గత ప్రభుత్వ ప్రోత్సాహంతో ఎంటర్ప్రెన్యూర్గా తయారవుదామన్న ఆశతో వైఎస్సార్ బడుగు వికాసం పథకం కింద బస్సు కొనుగోలు చేసి నెల్లూరు–పామూరు మధ్య తిప్పుతున్నాను. ఈ పథకం కింద ఇస్తామన్న రాయితీలు ఇవ్వకపోవడంతో నాలాగే అనేకమంది ఎస్సీ, ఎస్టీ యువకులు బ్యాంకు ఈఎంఐలు కట్టలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులను కలిస్తే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు.. రాయితీలు ఇప్పుడు ఇవ్వలేం అంటున్నారు. డబ్బులు లేనప్పుడు ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇందుకు ఇచ్చారు. – హరి, నెల్లూరు–పామూరు అద్దె బస్సు ఓనర్ మా గోడు వినేవారేరి? బడుగులు గోడు వినిపించుకునే అధికారులే కనిపించడం లేదు. ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ వంటి పెద్ద కంపెనీలకు రాయితీలు ఇవ్వడానికి వస్తున్న డబ్బులు మా ఎస్సీ, ఎస్టీలకు చెందిన చిన్న కంపెనీలకు వచ్చేసరికి ఎందుకు ఉండటం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశాం. మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ను కలిసి విజ్ఞప్తి చేశాం. అధికారులనైతే లెక్కలేనన్నిసార్లు కలిశాం. అయినా ఉపయోగం లేదు. బ్యాంకు వాళ్లు పెడుతున్న ఇబ్బందులతో మేం బస్సులు నడపలేకపోతున్నాం. తక్షణం ప్రోత్సాహకాలు ఇప్పించండి. లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం. – రాపాక మహేష్, అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ హైర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ -
వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య
ఓర్వకల్లు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు, వైఎస్సార్సీపీ నాయకుడు రమేష్నాయుడు (45) దారుణహత్యకు గురయ్యారు. స్వగ్రామం నుంచి రాత్రి ఏడు గంటలకు మినరల్ వాటర్ కోసం నన్నూర్ నుంచి బైక్పై వస్తుండగా మీదివేముల సమీపంలోని దిగువయ్య దర్గా మలుపు వద్ద కాపుకాసిన గుర్తుతెలియని దుండగులు బైక్ను ఆపి రమేష్నాయుడుపై దాడిచేశారు. ఆయన బైక్ దిగి పారిపోయేందుకు ప్రయత్నించగా, వెంబడించి పొత్తికడుపుపై కత్తితో పొడిచారు. దీంతో రమేష్నాయుడు కిందపడిపోవడంతో ఆయన ముఖంపై బండరాయితో విచక్షణారహితంగా.. గుర్తుపట్టలేని విధంగా మోదడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యకు‡్ష్యలు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని రమేష్నాయుడు హత్య తీరును పరిశీలించి సీఐ చంద్రబాబునాయుడుతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ చంద్రబాబునాయుడు తెలిపారు. రమేష్నాయుడికి భార్య లక్ష్మీదేవితో పాటు కొడుకు, కుమార్తె ఉన్నారు. తమ పార్టీ బుధవారం నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’లో ఆయన చురుగ్గా పాల్గొన్నారని, గ్రామంలో ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందునే టీడీపీ వర్గీయులు ఓర్వలేక ఆయనను హత్యచేశారని నంద్యాల వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆరోపించారు. గతంలో కూడా ఈయన ఇంటిపై దాడిచేశారన్నారు.రాజకీయ నేపథ్యం..రమేష్నాయుడు మొదటి నుంచి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డికి సన్నిహితంగా మెలిగేవారు. ఇతని కుటుంబం మీద నాయకులకు అపారమైన నమ్మకం ఉండడంతో 2014 స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో దింపారు. ఆయన మంచితనం కారణంగా ప్రజలు గెలిపించారు. ఆ తర్వాత 2019లో విశేషమైన సేవలు అందించారు. రమేష్నాయుడు హత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. -
కానిస్టేబుల్పై ‘అధికార’ జులుం
సాక్షి టాస్క్ఫోర్స్: ప్రజలకు రక్షణ కల్పించే రక్షకభటులపైనా అధికార పార్టీ నేతలు జులుం ప్రదర్శించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే సతీమణి డ్రైవర్ బైక్ ఆపిన పాపానికి ఓ కానిస్టేబుల్ను ఇంటికి పిలిపించి మరీ థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు పట్టణంలో జోరుగా ప్రచారం సాగుతోంది. వివరాలివీ.. శ్రీకాళహస్తి పట్టణంలో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ అన్వర్బాషా 3వ తేదీ రాత్రి ఎస్ఐతో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఎమ్మెల్యే సతీమణి కారు డ్రైవర్ సాయికుమార్ బైక్పై అటుగా వెళ్తున్నాడు. కానిస్టేబుల్ అతన్ని ఆపి తనిఖీ చేయగా.. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్.. కానిస్టేబుల్పై తిరగబడ్డాడు. తాను ఎమ్మెల్యే భార్య కారు డ్రైవర్నంటూ రెచ్చి పోయి నానా హంగామా సృష్టించాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ సమయంలో డ్రైవర్కు నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లో ఆల్కహాల్ పర్సంటేజ్ 145గా చూపించడంతో అతని సంతకం తీసుకుని ఎస్ఐ ఫైన్ చలనా రాసి పంపేశారని తెలిసింది. అయితే, ఈ ఘటనలో ఆ కానిస్టేబుల్ తనపై దాడిచేసి కొట్టి గాయపరిచాడని ఎమ్మెల్యే సతీమణి ఎదుట డ్రైవర్ మొరపెట్టుకున్నట్లు సమాచారం. దీంతో.. బుధవారం ఉదయాన్నే ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కానిస్టేబుల్ అన్వర్ బాషాను శ్రీకాళహస్తి రూరల్ సీఐ రవినాయక్ ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లారని.. ఆ సమయంలో ఎమ్మెల్యే ఎదుటే కానిస్టేబుల్పై డ్రైవర్ సాయికుమార్ దాడిచేశాడని, సీఐ ఆ దాడిని అడ్డుకున్నారని సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే, కానిస్టేబుల్పై దాడి అవాస్తవమంటూ శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి ఆడియో మెసేజ్ విడుదల చేశారు. కానీ, కానిస్టేబుల్ అన్వర్బాషా ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే.. శ్రీకాళహస్తిలో పోలీసు కానిస్టేబుల్ అన్వర్బాషాపై దాడి జరగలేదని పోలీసు ఉన్నతాధికారులు ఖండించారు. -
మద్యం మత్తులో రెచ్చిపోయిన ‘సీమరాజా’!
సాక్షి ప్రతినిధి, కడప: టీడీపీ కూటమి ప్రభుత్వంలో నాయకులు, పోలీసులే కాదు.. ఆఖరికి ఆ పార్టీలకు కొమ్ముకాసే సోషల్ మీడియా యాక్టివిస్టులూ చెలరేగిపోతున్నారు. వీరి ఆగడాలకూ అంతులేకుండాపోతోంది. పోలీసులు చేష్టలుడిగి చూడటం మినహా వీరినేమీ చేయలేకపోతున్నారు. తాజాగా.. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టు మన్నూరు చంద్రకాంత్ చౌదరి (సీమరాజా) ఇలాగే అధికారం అండతో ఇష్టారాజ్యంగా రెచ్చిపోయాడు. మద్యం మత్తులో ముగ్గురిపై విచక్షణారహితంగా దాడిచేశాడు. పైగా.. వాళ్లపై గంజాయి కేసు నమోదుచేయాలంటూ పోలీసుస్టేషన్లో నానాయాగీ చేశాడు. అన్నమయ్య జిల్లా చిట్వేల్లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలివీ.. సీమరాజా, మరికొందరు ఫుల్గా మద్యం తాగి కారులో పెనగలూరు నుంచి చిట్వేల్ బయల్దేరారు. అదే సమయంలో రాజంపేటలో సినిమా చూసి మోటారుసైకిల్పై షేక్ రసూల్, కె.పెంచలయ్య చిట్వేల్ మండలం గట్టుమీదపల్లె స్వగ్రామానికి వెళ్తున్నారు. గొల్లపల్లి వద్ద మోటారు బైక్పై వెళ్తుండగా వెనుక నుంచి సీమ రాజా కారు వచ్చింది. కారు హారన్ కొట్టినా వెంటనే తప్పుకోకపోవడంతో సీమరాజాకు కోపం వచ్చింది. దీంతో కారు ఆపి బైక్పై వెళ్తున్న వారిపై దాడిచేశాడు. ‘అన్నా మీరు మాకు తెలుసన్నా, యూట్యూబ్లో చూస్తున్నాం, మేమేం చేశామన్నా’.. అంటూ ప్రాథేయపడ్డా వినకుండా.. ‘కొడకుల్లారా’.. అంటూ బండబూతులు అందుకున్నాడు. దీంతో భయపడ్డ రసూల్, పెంచలయ్య పరిచయస్తుడు శంకరయ్య ఇంట్లోకి వెళ్లి తలుపులు కొట్టారు. బయటికి వచ్చిన శంకరయ్యనూ సీమరాజా కొట్టాడు. ముగ్గురినీ కారులో చిట్వేల్ పోలీసుస్టేషన్కు తీసుకెళ్లాడు. పోలీసుస్టేషన్లో ముగ్గురిపై గంజాయి కేసు పెట్టండని పోలీసులపై ఒత్తిడి తెచ్చాడు. ‘అన్నా మేమేం చేశామన్నా’.. అంటూ పోలీసుల సమక్షంలో ఆ ముగ్గురూ బతిమాలినా విన్పించుకోకుండా అక్కడా రెచ్చిపోయాడు. కూటమి ప్రభుత్వం రాగానే ఆగడాలు..పెనగలూరు మండలం కట్టవారిపల్లెకు చెందిన మన్నూరు చంద్రకాంత్ చౌదరి జీవనోపాధి కోసం కువైట్ వెళ్లాడు. అక్కడుండగానే ‘సీమరాజా’ పేరుతో యూట్యూబ్ చానల్ మొదలెట్టాడు. అందులో వైఎస్సార్సీపీ వాడినంటూ వెటకారపు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకున్నాడు. నెమ్మదిగా ముసుగు తొలగించి తాను పనిచేసేది టీడీపీ కోసమేనని వీడియోలతో క్లారిటీ ఇస్తూ వచ్చాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీమరాజా అరాచకాలకు అంతులేకుండాపోయింది. చంద్రకాంత్ చౌదరి అత్యంత జులాయిగా వ్యవహరిస్తూ, మద్యం మత్తులో దాదాగిరి చేయడం అలవాటుగా మారిందని స్థానికులు చెబుతున్నారు. సీమరాజా వెకిలి వీడియోలపై వైఎస్సార్సీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు గుంటూరు పట్టాభిపురం పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు కూడా చేశారు.ఏమైందంటున్నా వినిపించుకోకుండా కొట్టారు నేను నిద్రపోతుండగా మా ఇంటి గేటు కొట్టారు. గేటు తీశాను. అంతే.. ఒక్క ఉదుటున నాపైనా దాడిచేశారు. వారు ఎవరన్నది నాకు తెలీదు. ఎందుకు కొడుతున్నారో అర్థం కాలేదు. ఏమైందని అడిగినా వినిపించుకోలేదు. ఇష్టారాజ్యంగా కొట్టారు.– కడియం శంకరయ్యఅకారణంగా కొట్టారు మాది చిట్వేలి మండలం గట్టుమీదపల్లె గ్రామం. నేను నా స్నేహితుడితో కలిసి రాజంపేట నుంచి రాత్రి 10.30 గంటల సమయంలో వస్తుండగా మా వెనుక కారొచి్చంది. హారన్ కొట్టగా మీరు వెళ్లాలని చేయిచూపిస్తూ బదులిచ్చాను. బండిని ఆపి సీమరాజా తీవ్రంగా కొట్టారు. కారులో ఊరు బయటికి తీసువెళ్లి చెప్పుతో కూడా కొట్టారు. నీకు దిక్కున్నచోట చెప్పుకోమని పచ్చిబూతులు తిడుతూ స్టేషన్లో అప్పగించారు. నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధంలేదని చెప్పినా చంపేస్తామని చిత్రహింసలు పెట్టారు. – షేక్ రసూల్పోలీస్ స్టేషన్లోనూ రెచ్చిపోయారుచిట్వేల్ మండలం కతిరోపల్లె వద్ద వెనుక వైపు నుంచి కారు హారన్ కొడుతూ వచ్చారు. దీంతో.. మీరు వెళ్లాలని సైగల ద్వారా చెప్పగానే కారు నిలబెట్టి బండ బూతులు తిడుతూ కొట్టాడు. గొంతు పట్టుకుని కొట్టాడు. పోలీసుస్టేషన్లో కూడా అలాగే రెచ్చిపోయాడు. – కె పెంచలయ్య -
గుండ్లపాడు జంట హత్య కేసులో ఆరుగురి అరెస్ట్
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు. ఈ కేసులో టీడీపీకి చెందిన తోట వెంకట్రామయ్య, జవిశెట్టి శ్రీనివాసరావు, తోట గురవయ్య, దొంగరి నాగరాజు, తోట వెంకటేశ్వర్లు, గెల్లిపోగు విక్రంలను ఈ నెల 4న సాయంత్రం వెల్దుర్తిలో అరెస్ట్ చేసినట్టు చెప్పారు.టీడీపీలో వర్గపోరు నేపథ్యంలో గత నెల 24న గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు (మొద్దయ్య), జవిశెట్టి కోటేశ్వరరావు హత్యకు గురైన విషయం విదితమే. వెంటనే ఘటనాస్థలానికి వెళ్లి ప్రాథమిక విచారణ జరిపిన ఎస్పీ శ్రీనివాసరావు చనిపోయిన, చంపిన వ్యక్తులు టీడీపీకి చెందిన వారేనని మీడియాకు వీడియో రూపంలో వివరించారు. మృతుల సమీప బంధువు తోట ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మిగిలిన ముగ్గురు నిందితులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, పిన్నెల్లి వెంకటరెడ్డి ఆచూకీ కోసం గాలిస్తున్నామని, త్వరలో అరెస్ట్ చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసుజంట హత్యల కేసును వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై నెట్టాలన్న దురుద్దేశంతో పోలీసులు ఓ కట్టుకథ అల్లారు. హత్యలపై టీడీపీ నేత తోట ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదులో గ్రామ టీడీపీలో ఆధిపత్య పోరు వల్లే హత్యలు జరిగాయని తెలిపాడు. జవిశెట్టి వెంకటేశ్వర్లును హతమారిస్తే టీడీపీలో తనకు ఎదురుండదని, రానున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ ఉండదన్న కారణంతోనే నిందితుడు తోట వెంకట్రామయ్య హత్య చేశాడని స్పష్టం చేశారు. ఆ తరువాత ఎలాగైనా పిన్నెల్లి సోదరులను కేసులో ఇరికించాలన్న దుర్బుద్ధితో కట్టుకథ అల్లారు. హత్యలో పాల్గొన్న నిందితులు జవిశెట్టి శ్రీను, తోట వెంకట్రామయ్య, తోట గురవయ్య, దొంగరి నాగరాజు హత్యానంతరం ప్రత్యక్ష సాక్షి తోట ఆంజనేయులును కారులోని కత్తులు తీసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజంగా కారులో కత్తులే ఉంటే.. జవిశెట్టి సోదరులను బండరాళ్లతో మోది ఎందుకు చంపుతారని, వారిని హత్య చేసేందుకు కత్తులే వాడేవారు కదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసుల ఎఫ్ఐఆర్, ప్రభుత్వ వైద్యుల పంచనామాలో ఎక్కడా కత్తులు వాడినట్టు పేర్కొనలేదు. ‘వచ్చేది మా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. మిమ్మల్ని బతకనివ్వం. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామరెడ్డి చెబితేనే మేం చేస్తున్నాం. మాకు ఏమైనా ఆపద వస్తే వాళ్లు చూసుకుంటారు’ అంటూ హత్యానంతరం నిందితులు కారులోంచి కతు్తలు చూపించి బెదిరిస్తూ వెళ్లిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజంగా హత్యకు పిన్నెల్లి సోదరులు కుట్ర పన్ని ఉంటే ఇలా చెబుతారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ఇది కేవలం పిన్నెల్లి సోదరులను అక్రమంగా ఇరికించేందుకే ప్రభుత్వం, పోలీసులు పన్నిన కుట్రగా అర్థమవుతోంది. నిందితులు బెదిరించారన్న కట్టుకథలు తప్ప ఈ హత్యలో పిన్నెల్లి సోదరుల పాత్రపై ఎటువంటి ఆధారాలు దొరకలేదు. -
అయినవారికి అనుకూలంగా బదిలీ మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ బదిలీల్లో సాంకేతిక విద్యాశాఖ కొత్త భాష్యం చెబుతోంది. పలుకుబడి ఉన్నవారికి, ముడుపులిచ్చిన వారికి అనుకూలంగా బదిలీ మార్గదర్శకాలు రూపొందించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇవి పట్టణాల్లో పనిచేసే సిబ్బందికే మేలుచేసేలా ఉన్నాయని.. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లోని పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న వారు పట్టణాలకు వచ్చే వీల్లేకుండా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ కమిటీల సూచనల మేరకు ‘0’ నుంచి 5 ఏళ్ల సర్వీసు ఉన్నవారిని బదిలీచేస్తున్నారు. ఇందుకోసం శాఖల్లోని ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలతో కమిటీ వేసి అందుకనుగుణంగా మార్గదర్శకాలు రూపొందిస్తారు. కానీ, సాంకేతిక విద్యాశాఖలో మాత్రం అందుకు భిన్నంగా కొందరు కిందిస్థాయి సిబ్బంది సూచనలతో రెండేళ్లు సర్వీసు దాటిన వారిని బదిలీ చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించారు. దీనిపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో పాటు ప్రభుత్వ కార్యదర్శికి ఫిర్యాదులు వెళ్లడంతో వాటిని రద్దుచేశారు. దీంతో.. కొత్త మార్గదర్శకాలు రూపొందించారు. అయితే, ఇవి కూడా అయినవారికి మేలు చేసేలాగే ఉన్నాయని పలువురు ఉద్యోగులు, అధ్యాపకులు ఇటీవల డైరెక్టరేట్కు వచ్చి నిలదీసినట్లు తెలిసింది. డెప్యుటేషన్లు అడ్డంపెట్టుకుని ఆటలు..ఉద్యోగుల బదిలీల్లో వారు పనిచేస్తున్న ప్రాంతాలను ఫొకల్ (పట్టణం), నాన్–ఫోకల్ (గ్రామీణ/ఏజెన్సీ)గా పేర్కొంటారు. ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి ఏడాదికి 3 పాయింట్లు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి 4 పాయింట్లు బదిలీల్లో కేటాయిస్తారు. అవసరాన్నిబట్టి పని సర్దుబాటుపైనా, డెప్యుటేషన్ పైనా సిబ్బందిని ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు అధికారులు పంపిస్తారు. అయితే, ఈ సర్దుబాటు సాంకేతిక విద్యాశాఖలో విచిత్రంగా జరుగుతోంది. నాన్–ఫోకల్కు బదిలీ అయిన వారిలో కొందరు తమ పలుకుబడిని ఉపయోగించి ఫోకల్ ప్రాంతాలకు డెప్యుటేషన్ వేయించుకుంటున్నారు. ఇందుకోసం ఫోకల్లో ఉన్న వారిని వర్క్ అడ్జెస్ట్మెంట్పై నాన్–ఫోకల్ ప్రాంతానికి పంపిస్తున్నారు. ఐటీడీఏ ప్రాంతాల్లోని కాలేజీల్లో పోస్టులు వచ్చిన వారు ఫోకల్ (పట్టణ) ప్రాంతాల్లోకి వర్క్ అడ్జెస్ట్మెంట్, డెప్యుటేషన్పై వచ్చి పనిచేస్తున్నారు. ప్రస్తుత బదిలీల్లో వీరు ఏజెన్సీ పాయింట్లు పొందుతున్నారు. వేతనం పొందే ప్రాంతం ఆధారంగా నిబంధనలు.. ఇక తమను పట్టణ ప్రాంతాల్లో (ఫోకల్) పోస్టింగ్ ఇచ్చినా గ్రామీణ ప్రాంతాల్లో డెప్యుటేషన్ వేశారని, కొన్నేళ్లుగా తాము అక్కడే పనిచేస్తున్నందున తమను నాన్–ఫోకల్గా గుర్తించాలని ఆ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ, వారి విజ్ఞప్తులను పట్టించుకోకుండా జీతం పొందుతున్న ప్రాంతం ఆధారంగా పాయింట్లు కేటాయించేందుకే డైరెక్టరేట్ నిబంధనలను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. దీనివల్ల తాము నష్టపోతామని, ఇప్పటికే నాన్–ఫోకల్లో డెప్యుటేషన్పై పనిచేస్తున్న తాము బదిలీల్లో మరి కొన్నేళ్లు ఇక్కడే పనిచేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వాస్తవంగా పనిచేస్తున్న ప్రాంతాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.స్కూలు అసిస్టెంట్లకు తప్పనిసరి బదిలీ..మరోవైపు.. ప్రభుత్వ పాఠశాల విద్యను తిరోగమనంలోకి నెట్టేస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయ (ఎంపీఎస్ హెచ్ఎం) పోస్టుల్లోకి మరికొందరిని తప్పనిసరిగా బదిలీ చేయాలని పాఠశాల విద్యాశాఖ డీఈఓలను ఆదేశించింది. చట్టానికి, ఉపాధ్యాయ నియామక నిబంధనలకు విరుద్ధంగా తీసుకొచ్చిన ఈ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో 3–5 తరగతుల విద్యార్థులకు మెరుగైన బోధన కోసం సబ్జెక్టు టీచర్లుగా స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తే.. కూటమి ప్రభుత్వం వారిని తొలగించింది. అంతేగాక.. ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఉన్నత తరగతుల విద్యార్థులకు సైతం స్కూల్ అసిస్టెంట్ల బోధనను రద్దుచేసింది. ఇలా మిగులుగా తేలిన 4,693 మంది స్కూల్ అసిస్టెంట్లను బోధనకు దూరంచేసి ఎంపీఎస్ హెచ్ఎంలుగా నియమిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో మొత్తం 3,781 మంది ఎస్ఏలను ఎంపీఎస్ హెచ్ఎంలుగా బదిలీచేశారు. మరో 912 మందిని ఈ పోస్టుల్లో నియమించాల్సి ఉంది. ఈ క్రమంలో.. మిగిలిన ఈ పోస్టుల్లో డీఎస్సీ–2025 వారికి 415 పోస్టులు కేటాయించారు. మరో 461 పోస్టుల్లో ఎస్జీటీలకు పదోన్నతులిచ్చి నియమిస్తారు. మిగిలిన 36 పోస్టుల్లో తప్పనిసరిగా స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.వాస్తవానికి.. ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ పోస్టులను ఎస్జీటీలకు సీనియారిటీ ఆధారంగా పదోన్నతిపై భర్తీచేస్తారు. కానీ, ఎన్నడూలేని విధంగా సబ్జెక్టు టీచర్లయిన స్కూల్ అసిస్టెంట్లను పీఎస్ హెచ్ఎం పోస్టుల్లో నియమిస్తున్నారు. దీంతో తమ పరిస్థితి ఏంటో అర్ధంగాక స్కూల్ అసిస్టెంట్లు ఆందోళన చెందుతున్నారు.టెక్నికల్గా ఎన్ని విచిత్రాలో..» ఏజెన్సీ ప్రాంతాలైన సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, రంపచోడవరం, కేఆర్పురంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో 2014 నుంచి పూర్తిస్థాయిలో పోస్టుల్లేవు. దీంతో మైదాన ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలోని పాలిటెక్నిక్ కాలేజీల సిబ్బందిని డెప్యుటేషన్, వర్క్ అడ్జెస్ట్మెంట్ కింద బదిలీ చేశారు. కొన్నేళ్లుగా వారు ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్నా వేతనం మాత్రం పోస్టింగ్ ఇచ్చిన పట్టణ కాలేజీల నుంచి పొందుతున్నారు. దీంతో వీరికి ఫోకల్ కింద ఏడాదికి 3 పాయింట్లే వస్తున్నాయి. » కృష్ణా జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలో పోస్టింగ్ వచి్చన ఒకరు డెప్యుటేషన్పై కాకినాడ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రిన్సిపాల్గా పోస్టింగ్ వేయించుకున్నారు. ఈయనకు నాన్–ఫోకల్ కింద ఏడాదికి 4 పాయింట్లు పొంది బదిలీల్లో తిరిగి ఫోకల్కే వెళ్లే అవకాశం ఉంది. » అలాగే, రాయలసీమలోని ఓ ఐటీడీఏ పరిధిలోని గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీలో పోస్టింగ్ పొందిన ఓ ఉద్యోగి కొద్దిరోజులకే రాష్ట్ర కార్యాలయానికి డెప్యుటేషన్ వేయించుకున్నారు. కానీ, ప్రస్తుత బదిలీల్లో ఆయనకు ఏజెన్సీ పాయింట్లు పొంది తిరిగి ఫోకల్ ప్రాంతానికి వెళ్లే ఛాన్స్ తెచ్చుకున్నారు. » మరికొందరు ఉద్యోగులు విజయవాడ ప్రసాదంపాడులోని డైరెక్టరేట్ ఉన్న సమయంలో కొన్నేళ్లు పనిచేశారు. డైరెక్టరేట్ తాడేపల్లికి మారే క్రమంలో విజయవాడ పాలిటెక్నిక్ కాలేజీకి పోస్టింగ్ వేయించుకున్నారు. దీంతో వారి స్టేషన్ మారిందని చెప్పి ప్రస్తుత బదిలీ తమకు వర్తించదని చెబుతున్నారు. ఇలాంటి చిత్రాలెన్నో సాంకేతిక విద్యాశాఖలో జరుగుతున్నాయి. రెండు మూడ్రోజుల్లో బదిలీలు చేపట్టనున్న క్రమంలో వర్క్ అడ్జెస్ట్మెంట్, డెప్యుటేషన్పై నాన్–ఫోకల్ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి న్యాయం చేస్తారా.. లేక పలుకుబడి ఉన్నవారికే ఫోకల్ పోస్టింగ్స్ ఇస్తారా అన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. -
ఈ రేయి వేడైనది..!
ఈ రేయి చల్లనిది అని పాడుకునే రోజులు పోయాయి. పగటి ఉష్ణోగ్రతలు మాదిరే రాత్రి కూడా వేడి వాతావరణం వేధించే రోజులు వచ్చేశాయి. అదీ చాలా ప్రమాదకర స్థాయిలో ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. రాత్రి వేడి వాతావరణం ఉండే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్–2లో ఉందని కేంద్ర ఇంధన, పర్యావరణ, నీటి మండలి (సీఈఈఈడబ్ల్యూ) చేసిన ‘హౌ ఎక్స్ట్రీమ్ హీట్ ఇంపాక్టింగ్ ఇండియా’ అనే తాజా అధ్యయనంలో వెల్లడైంది. తాజాగా విడుదలైన ఈ అధ్యయనం దేశంలో నాలుగు దశాబ్దాల వాతావరణ ఆధారిత ఉష్ణోగ్రతలను అంచనా వేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రాత్రిపూట వేడి పెరుగుతోందని హెచ్చరించింది. –సాక్షి, అమరావతిఐదు రెట్లు పెరిగిన రాత్రి వేడిదేశ వ్యాప్తంగా 734 జిల్లాల్లో వేడి ప్రమాదకర స్థాయిని అంచనా వేయడానికి 35 సూచికలను సీఈఈఈడబ్ల్యూ ఉపయోగించింది. తద్వారా 417 జిల్లాల్లో అత్యధిక ప్రమాదకరంగా వేడి పెరుగుతున్నట్లు గుర్తించింది. వేడి ఉష్ణోగ్రతల ప్రమాదం స్థాయి 201 జిల్లాల్లో మధ్యస్థంగానూ, 116 జిల్లాల్లో తక్కువగానూ ఉన్నట్లు తేల్చింది. కాగా ఇందులో ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, గోవా, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లు టాప్ 10లో ఉన్నాయి. 1982–2011 బేస్ లైన్తో పోలిస్తే గత దశాబ్దం(2012–2022) 70 శాతం జిల్లాల్లో వేసవిలో ఐదు రెట్లు వేడి పెరిగింది. 10 శాతం తేమ పెరిగిందని కూడా ఈ అధ్యయనం తెలిపింది. ఒక మెరుగైన ఇల్లు అంటే చలికాలంలో వెచ్చగా, వేసవిలో చల్లగా ఉండాలని ప్రముఖ గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ అనేవారట. ఆధునిక నాగరికతకు ముందే భవనాలను చలికాలంలో సూర్యరశ్మిని గ్రహించేలా, వేసవిలో నీడ ఎక్కువగా ఉండేలా ఇళ్లను నిర్మించేవారు. మళ్లీ అలాంటి సాంకేతికతతో భవన నిర్మాణాలు చేయాల్సిన ఆవశ్యకత నెలకొంది.పగలూ రాత్రీ ఏకమైపోతాయిగత ఐదు దశాబ్దాల్లో 700కు పైగా వేడి తరంగాల కారణంగా 17 వేల మంది మరణించారని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఇటీవల వెల్లడించింది. ఎక్కువకాలం ఉండే వేడి రాత్రుల యుగంలోకి ప్రవేశిస్తున్నామని సీఈఈఈడబ్ల్యూ అధ్యయనం ఇప్పుడు హెచ్చరించింది. ఈ పరిస్థితులను వెంటనే అర్థం చేసుకుని వాతావరణాన్ని చల్లబరిచేందుకు అత్యవసర చర్యలు చేపట్టకపోతే కొన్నేళ్లకు సూర్యుడు అస్తమించే సమయం తగ్గిపోతుందని, అంటే రాత్రి కూడా పగలుగానే మారిపోతుందని అధ్యయనం స్పష్టం చేసింది. హీట్ యాక్షన్ ప్లాన్స్(హెచ్ఎపీ) జాతీయ స్థాయిలో చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతోంది. -
AP: రాష్ట్రంలో చాప కింద నీరులా..'కోవిడ్'
రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా ప్రభుత్వం నియంత్రణ చర్యలను పూర్తిగా గాలికి వదిలేసింది. యోగా దినోత్సవం నిర్వహణే మీ ముందున్న లక్ష్యమని వైద్య శాఖకు సీఎం అల్టిమేటం జారీ చేయడంతో, ప్రాణాంతక వైరస్ కట్టడిని వైద్య శాఖ తేలికగా తీసుకుంటోంది. దీంతో చాప కింద నీరులా రాష్ట్రంలో వైరస్ వ్యాపించడమే కాకుండా, ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది. వైరస్ సోకిన వ్యక్తుల మరణాలను బయటకు పొక్కనివ్వకుండా వైద్య శాఖ కప్పెడుతోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. -సాక్షి, అమరావతి/నెల్లూరు(అర్బన్)/కర్నూలు(హాస్పిటల్)కొన్ని ఘటనలు ఇవీ..1 విజయవాడ జీజీహెచ్లో గురువారం కోవిడ్ సోకిన యువకుడు మరణించగా అధికారులు చడీచప్పుడు లేకుండా ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు తెలిసింది. 2 ఇదే ఆస్పత్రిలో గడిచిన ఐదారు రోజుల్లో వైరస్ బారిన పడిన ఇద్దరు మహిళలు మరణించినట్టు ఆస్పత్రి వర్గాలు చర్చించుకుంటున్నాయి. 3 గత వారంలో విశాఖపట్నంలో వైరస్ సోకిన వ్యక్తి మృతి చెందాడు. అతని చికిత్సకు సంబంధించిన కేస్ షీట్లో సైతం కోవిడ్ పాజిటివ్ అని వైద్యులు ధ్రువీకరించారు. అయితే సదరు వ్యక్తి ఇతర అనారోగ్య కారణాలతోనే మృతి చెందాడని వైద్య శాఖ అధికారులు కొట్టిపడేశారు. 4 రెండు రోజుల క్రితం వరకు కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారికి నెల్లూరు ప్రభుత్వ పెద్దాస్పత్రిలో ర్యాపిడ్ టెస్ట్ చేయగా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. దీంతో వారికి మెడికల్ కళాశాలలోని మైక్రో బయాలజి విభాగం ఆధ్వర్యంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా అందరికీ గురువారం కరోనా నిర్థారణ అయింది. వీరిలో ఇద్దరు నర్సింగ్ విద్యార్థినులున్నారు. వారు కేరళ నుంచి వచ్చి నెల్లూరులో వేర్వేరు నర్సింగ్ కళాశాలల్లో చదువుకుంటున్నారు. అలాగే నగరంలోని భక్తవత్సలనగర్కు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు, వెంకటాచలం మండలం అనికేపల్లి, పెదకూరపాడు, గూడూరు ప్రాంతాలకు చెందిన మరో ముగ్గురు యువకులు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతానికి వీరందరూ హోం ఐసోలేషన్లో ఉన్నారు. 5 కర్నూలు జిల్లాలో మరో నలుగురికి కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో జిల్లాలో పాజిటివ్ బాధితుల సంఖ్య 7కు చేరింది. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని వివిధ విభాగాల్లో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులకు బుధ, గురు వారాల్లో కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో కర్నూలు మండలం దిన్నెదేవరపాడుకు చెందిన 25 ఏళ్ల వ్యక్తికి, గోనెగండ్లకు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి, కర్నూలుకు చెందిన 20 ఏళ్ల మహిళకు, అనంతపురం జిల్లా పెద్దవడుగూరుకు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ నిర్థారణ అయింది. ఇందులో ఒక పీజీ వైద్య విద్యార్థిని ఉన్నారు. -
ఫోర్జరీ పోలీస్!
కాకినాడ క్రైం: తన స్థాయిని పెంచుకుని అడ్డగోలు దందాలకు పాల్పడేందుకు ఒక హెడ్ కానిస్టేబుల్ ఏకంగా డీఐజీ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. తనకు తానే ఎస్ఐగా ఐడీ కార్డును తయారు చేసుకున్నాడు. దాన్ని చూపించి ఎస్ఐగా చెప్పుకొంటూ చెలరేగిపోతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొప్పిశెట్టి యోగి కామేశ్వరరావు గవర్నమెంట్ రైల్వే పోలీస్ విభాగం(జీఆర్పీ)లో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు.రాజమహేంద్రవరం రైల్వే సబ్ డివిజన్లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన కొద్దికాలం కిందట రాష్ట్ర ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ డీఐజీ సంతకాన్ని ఫోర్జరీ చేసి తన పేరిట ఎస్ఐగా ఐడీ కార్డు తయారు చేసుకున్నాడు. దాన్ని చూపిస్తూ రాజమహేంద్రవరం రైల్వే సబ్ డివిజన్ పరిధిలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు కాకినాడ, తుని, సామర్లకోట, అన్నవరం, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లలో ఉద్యోగులపై అజమాయిషీ చేసేవాడు. కొన్ని కేసులను ఎస్ఐ హోదాలో సొంతంగా విచారణ చేసి డబ్బులు వసూలు చేయడం, చోరీ కేసుల్లోనూ రికవరీలు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కాకినాడకు చెందిన ఓ జవాన్ తనను వేధిస్తున్నాడని అతని భార్య నగరంలోని దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జవాన్ సోదరుడైన రైల్వే కానిస్టేబుల్, అతని తల్లి పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. రైల్వే కానిస్టేబుల్పై ఫిర్యాదు చేయడంతో విచారణ కోసం జీఆర్పీ స్టేషన్కు పంపారు. దీంతో వివరాలు సేకరించేందుకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ కామేశ్వరరావు... విచారణ పేరుతో రైల్వే కానిస్టేబుల్ భార్యను మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి బెదిరించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు చేసిన జవాన్ భార్యను రైల్వే గెస్ట్ హౌస్కి అనధికారికంగా తీసుకెళ్లి విచారించడం వివాదాస్పదంగా మారింది. అదే సమయంలో కామేశ్వరరావు నకిలీ ఐడీ కార్డు చూపించి తాను ఎస్ఐని అని బెదిరించాడని రైల్వే కానిస్టేబుల్ భార్య కాకినాడ టూ టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు డీఐజీ సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. మరికొందరు కూడా అతనిపై జీఆర్పీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో నకిలీ ఐడీ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగించారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.కామేశ్వరరావుపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని అనకాపల్లి జిల్లా ఎస్పీకి జీఆర్పీ అధికారులు సిఫార్సు చేశారు. రైల్వే నుంచి తిరిగి అతని మాతృవిభాగమైన అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయానికి బుధవారం పంపించారు. అతనికి సహకరించిన మరికొందరిని కూడా జీఆర్పీ నుంచి బదిలీ చేశారు. విశాఖ రేంజ్కి చెందిన స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఈ నెల ఒకటో తేదీన కాకినాడ వచ్చి కామేశ్వరరావుపై ఫిర్యాదు చేసిన బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కామేశ్వరరావుపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేస్తున్నామని, బాధితులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని కాకినాడ జిల్లా అదనపు ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు తెలిపారు. -
సజ్జల కుటుంబ సభ్యుల భూములపై స్టేటస్ కో కొనసాగించండి
సాక్షి, అమరావతి :వైఎస్సార్ కడప జిల్లా, సీకేదిన్నె మండల పరిధిలో వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల కుటుంబ సభ్యులకు చెందిన 63.72 ఎకరాల విషయంలో యథాతథస్థితి (స్టేటస్ కో)ని కొనసాగించాలని రెవెన్యూ అధికారులను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ ధర్మాసనం ఆదేశించింది. ఈనెల 30 వరకు స్టేటస్ కో కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆ భూమిని అటవీ భూమిగా పేర్కొంటూ స్వాదీనం చేసుకోవాలని కడప కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలును నిలుపుదల చేస్తూ, కలెక్టర్ ప్రొసీడింగ్స్ జారీకి ముందున్న యథాతథస్థితిని కొనసాగించాలని ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం గురువారం పాక్షికంగా సవరించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ప్రభుత్వం దాఖలుచేసిన అప్పీల్పై గురువారం జస్టిస్ కిరణ్మయి ధర్మాసనం విచారణ జరిపింది.ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లకు ఉన్న 201 ఎకరాల భూమిలో 63.72 ఎకరాలు అటవీ భూమి అని తెలిపారు. సజ్జల కుటుంబ సభ్యుల తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్రెడ్డి వాదనలు వినిపిస్తూ, చట్ట ప్రకారం ఎలాంటి నోటీసూ ఇవ్వకుండా, తమ వాదన వినకుండానే కలెక్టర్ ప్రొసీడింగ్స్ జారీ చేశారని పేర్కొన్నారు. అలాగే పంచనామా కూడా చట్ట విరుద్ధమేనని వివరించారు. పంచనామా కాగితాలపై మాత్రమే జరిగిందని, అధికారులు సర్వే నివేదికను తమకు అందజేయలేదని వాదించారు. ఈ భూముల విషయంలో హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అధికారులు తుంగలో తొక్కారని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, భూమి స్వా«దీనం విషయంలో గత విచారణ సమయంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవరించింది. భూమి ప్రభుత్వ స్వా«దీనంలో ఉన్న నేపథ్యంలో, ఆ భూమి విషయంలో యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. -
భగ్గుమన్న పొగాకు రైతు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : నల్లబర్లీ పొగాకును వారంలోగా జీపీఐ నుంచి కొనకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మయ్య హెచ్చరించారు. గుంటూరు విద్యానగర్లోని జీపీఐ పొగాకు రాష్ట్ర కార్యాలయం వద్ద గురువారం నల్లబర్లీ, తెల్లబర్లీ పొగాకు రైతులతో కలిసి రైతు సంఘం నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ పొగాకు కొనకుండా రైతులను మోసం చేస్తున్న ప్రైవేట్ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బర్లీ పొగాకు వేయాలని ప్రోత్సహించిన జీపీఐ సంస్థతోపాటు ఇతర పొగాకు కంపెనీలు ఇప్పుడు ముఖం చాటేశాయని ధ్వజమెత్తారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ జీపీఐ సంస్థ రైతుల నుంచి పది లక్షల టన్నుల తెల్లబర్లీ పొగాకు కొంటామని, బాండ్లు ఇచ్చి ఇప్పటి వరకు సగం కూడా కొనలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కె.వి.ప్రసాద్, కొల్లా రాజమోహన్, చుండూరు రంగారావు, కంచుమాటి అజయ్కుమార్, రాధాకృష్ణ, వేల్పూరు నరసింహారావు, పచ్చల శివాజీ, ఉల్లిగడ్డ నాగేశ్వరరావు, రామారావు, జగన్నాథరావు, హనుమరెడ్డి, వేణుగోపాలరావు, నళినికాంత్ పాల్గొన్నారు.ధర ఇంత అధ్వానమా?» ఒంగోలు, కనిగిరిలో పొగాకు వేలాన్ని అడ్డుకున్న రైతులు » పనిగట్టుకుని ధర తగ్గించారంటూ నిరసన » ఆందోళనను అడ్డుకున్న టీడీపీ మద్దతుదారులు » వ్యాపారులకు వత్తాసు పలికిన పొగాకు బోర్డు అధికారులు ఒంగోలు సబర్బన్/కనిగిరి రూరల్ : ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో గురువారం రైతులు పొగాకు వేలాన్ని అడ్డుకున్నారు. త్రోవగుంటలోని పొగాకు వేలం కేంద్రం–2లో వ్యాపారుల తీరును నిరసిస్తూ బేళ్లను అమ్మేందుకు రైతులు నిరాకరించారు. ఎఫ్–3 రకం పొగాకును రూ.18,500కు కూడా కొనుగోలు చేయక పోవటంతో ఆందోళనకు దిగారు. దీంతో వేలం కేంద్రానికి వచి్చన ఉలిచి, దశరాజుపల్లె గ్రామాలకు చెందిన టీడీపీ మద్దతుదారులైన కొందరు వేలం జరగాల్సిందేనని వాగ్వాదానికి దిగారు. వేలం కేంద్రంలో కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది.గిట్టుబాటు ధర కోసం మిగతా రైతులు పోరాటం చేస్తుంటే.. టీడీపీకి చెందిన కొందరు రైతుల పేరుతో దాన్ని అడ్డుకోవటాన్ని ఒంగోలు మండలంలోని రైతులు తీవ్రంగా ఖండించారు. గిట్టుబాటు ధర వస్తే రైతులంతా బాగు పడతారని, అందుకోసం పోరాటం చేయాల్సిందిపోయి.. ఇలా అడ్డుకోవడం తగదని మండిపడ్డారు. వేలం కేంద్రం అధికారిణి తులసి టీడీపీ వర్గీయులకు మద్దతుగా మాట్లాడటంతో రైతులు ఆమె తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఏకంగా 186 బేళ్లను రిజెక్ట్ చేయడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వేలం ఇదే విధంగా కొనసాగితే వేలం కేంద్రాలకు పొగాకు బేళ్లు తీసుకు రావటం మానుకుంటామని చెప్పారు. ఇదే అన్యాయం ఇంకా కొనసాగితే పొగాకు బేళ్లను తగలేస్తామన్నారు. కనిగిరిలోనూ ఆగిన వేలం ప్రకాశం జిల్లాలోని కనిగిరి పొగాకు వేలం కేంద్రంలో కూడా గురువారం వేలం ఆగిపోయింది. బయ్యర్లు, కంపెనీల ప్రతినిధులు ఎక్కువ శాతం బేళ్లను తిరస్కరించడంతో ఆందోళన చెందిన రైతులు కొద్దిసేపు పొగాకు వేలాన్ని ఆపేశారు. దీంతో వేలం నిర్వహణ అధికారి కోటేశ్వరరావు జోక్యం చేసుకుని రైతులు, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. వారం రోజులుగా పొగాకు బేళ్ల తిరస్కరణలు తీవ్ర స్థాయిలో కొనసాగుతుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కనిగిరి కేంద్రంలో గురువారం 164 బేళ్లను తిరస్కరించారు. -
‘రక్షించాల్సిన వ్యవస్థలు నైతికతను కోల్పోతున్నాయి’
తిరుపతి: ఏపీలో రక్షించాల్సిన వ్యవస్థలే నైతికతను కోల్పోతున్నాయని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి విమర్శించారు. యలమంద మైనర్ బాలికపై అత్యాచార ఘటనపై బాధితురాలికి అండగా ఉంటే తనపై ఫోక్సో కేసును పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా చెవిరెడ్డి తెలిపారు. తమతో తప్పుడు కేసులు పెట్టించారని బాధితులే చెప్పారని, తనను లిక్కర్ కేసులో ఇరికించాలని కూటమి ప్రభుత్వం చూస్తోందన్నారు. గన్మెన్తో బలవంతంగా స్టేట్మెంట్ తీసుకున్నారని, తనను అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వ పెద్దల కళ్లు చల్లబడతాయనుకుంటే అందుకు తాను సిద్ధమేనన్నారు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి. తప్పుడు స్టేట్మెంట్ రిట్ పిటిషన్ వేస్తానన్నారు చెవిరెడ్డి. ప్రస్తుతం అధికారంలో ఉన్న మీరు.. తన కింద సిబ్బందిని ఎందుకు వేధిస్తున్నారన్నారు. వైఎస్సార్ కుటుంబంతో తనకు మూడు తరాలుగా మంచి సంబంధాలు ఉన్నాయన్నారు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి. -
రాష్ట్రవాప్తంగా వైఎస్సార్సీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్య నాయకులతో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెలాఖరిలోగా ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. చంద్రబాబు పాలన ఏడాది వైఫల్యాలు, వైఎస్ జగన్ తీసుకొచ్చిన వివిధ కార్యక్రమాలను నిర్వీర్యంపై వివిధ రంగాల ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. ‘‘ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా.. ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ పోరాటాలకు కొనసాగింపుగా ఈ నెలాఖరిలోగా ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిద్దాం’’ అని సజ్జల పిలుపునిచ్చారు.‘‘ఈ సమావేశాల్లో కీలక రంగాలకు సంబంధించి గతంలో వైఎస్ జగన్ పాలన, ఈ ఏడాదిలో ఏ విధంగా నాశనం చేశారనేది, ఒక్కో రంగాన్ని ఎలా నిర్వీర్యం చేశారనేది చెప్పాలి. వ్యవస్థలు నాశనం చేయడం, ఏ విధంగా అరాచకం చేస్తున్నారనేది, ప్రభుత్వ వైఫల్యాలపై స్పష్టంగా చర్చ జరిగి ప్రజల్లోకి వెళ్ళాలి. విద్యార్థులు, మహిళలు, యువత, రైతులు ఇలా ప్రతి ఒక్కరికి సంబంధించి ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో చర్చ జరగాలి. కూటమి ప్రభుత్వ అరాచక పాలన ద్వారా రాష్ట్రం ఎలా నష్టపోయిందనేది చెప్పగలగాలి. రెడ్బుక్ పాలన పేరుతో చేస్తున్న అరాచకాలు ఇలా అన్నీ బయటికి రావాలి’’ అని సజ్జల చెప్పారు.ఉమ్మడి 13 జిల్లాల ప్రధాన కేంద్రాల్లో 13 రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. ఆయా రంగాల్లోని నిష్ణాతులు, మేధావులు, సివిల్ సొసైటీ సభ్యులు, రిటైరైన అధికారులు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, సోషల్ వర్కర్లు, రైతుసంఘం నాయకులు, అనుభవమన్న తటస్థులు ఇలా అందరినీ భాగస్వామ్యం చేద్దాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.ఈ టెలి కాన్ఫరెన్స్లో పార్టీ ప్రధాన కార్యదర్శులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి, పూడి శ్రీహరి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశాలను విజయవంతం చేద్దామన్నారు. -
‘లోకేష్ బంధువని సీఐ పొగరు, తలబిరుసుతో మాట్లాడారు’
తాడేపల్లి: వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనం నుంచి అద్భుతమైన స్పందన లభించిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించినా, దాన్ని అధిగమించి ప్రజలు సక్సెస్ చేశారనే విషయం కూటమి ప్రభుత్వం గ్రహించాలన్నారు. ఈరోజు(గురువారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. ఇప్పటికైనా చంద్రబాబు పాలన గురించి ఆలోచించాలని హితవు పలికారు. ‘ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మోసపూరితంగా ఉందని వైసీపీ వెన్నుపోటు దినం నిర్వహించాం.వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనంనుంచి అద్బుతమైన స్పందన లభించింది.వెన్నుపోటు దినం కార్యక్రమం అడ్డుకునేందుకు పోలీసులతో ప్రయత్నించారు.ఏడాదిగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై వందలాది తప్పుడు కేసులుపెట్టి వేధించారు.సోషల్ మీడియా యాక్టివిస్టులను జైళ్లకు పంపించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పండగలా నిర్వహించాలని పిలుపునిస్తే పెద్దగా స్పందన రాలేదు.ఇప్పటికైనా కూటమి నేతలు బుద్ది తెచ్చుకోవాలి. దోచుకునే బ్యాచ్కే పండుగ. చంద్రబాబు ఇప్పుడైనా తన పాలన గురించి ఆలోచించాలి .రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండో ఏడాది పూర్తైన సమయంలో వెన్నుపోటు-2 సమయానికి జనం తిరగబడొచ్చు.వెన్నుపోటు దినం కార్యక్రమానికి వెళ్తున్న నన్ను పట్టాభిపురం సీఐ అడ్డుకున్నారు. సీఐకి మంత్రి లోకేష్ సపోర్ట్. బెదిరించి, భయపెట్టాలని చూశారు. అనివార్య పరిస్థితుల్లో ఎదురుతిరగాల్సి వచ్చింది. నేను చేసిన రెండు ఫిర్యాదుల గురించి అడిగితే సీఐ దురుసుగా మాట్లాడారు. లోకేష్ బంధువని సీఐ పొగరు, తలబిరుసుతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నాపై కేసు నమోదు చేశారు’ అని అంబటి స్పష్టం చేశారు. -
‘కుప్పంలో బ్లడ్ బుక్ రాజ్యాంగం సడుస్తోంది’
చిత్తూరు జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో బ్లడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ భరత్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి తెరలేపిన కూటమి ప్రభుత్వం.. కుప్పంలో మాత్రం బ్లడ్ బుక్ రాజ్యాంగంతో మరింత అరాచకం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై వైఎస్సార్ సీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన ర్యాలీకి వేలాదిగా ప్రజలు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారని స్పష్టం చేశారు.‘ కుప్పంలో 32 మందిపై తప్పుడు కేసులు పెట్టారు. చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. పోలీసులు ఒత్తిడి చేసి మరీ వేధింపులు పర్వం కొనసాగిస్తున్నారు. కుప్పంలో మేం ప్రశాంతంగా నిరసన ర్యాలీ చేపట్టాం. మేము పోలీసులపై దాడి చేసినట్లు తప్పుడు కేసులు పెడుతున్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేసే వరకూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం’అని ఎమ్మెల్సీ భరత్ స్పష్టం చేశారు. -
మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఊరట
సాక్షి, గుంటూరు: మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. టీడీపీ ఆఫీస్ కేసులో ఆర్కేకు సీఐడీ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కి గత నెల.. సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఇప్పటి వరకు 126 మందిపై కేసులు నమోదు చేయగా.. ఆర్కేను 127వ నిందితుడిగా చేర్చారు. కూటమి సర్కార్ రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగానే ఆర్కేను వేధింపులకు గురిచేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పర్యావరణాన్ని పరిరక్షించాలి.. వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘ఈ భూ మండలాన్ని ప్లాస్టిక్ భూతం కమ్మేస్తోంది. ప్లాస్టిక్ను నిరోధించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ఐక్యరాజ్యసమితి ఇచ్చిన సందేశం అత్యంత ప్రాధాన్యమైనది. పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ ఇమిడి ఉందనేది అక్షర సత్యం. దీనికి మనమంతా బద్ధులై ఉండాలని ఆశిస్తున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ఈ భూమండలాన్ని ప్లాస్టిక్ భూతం కమ్మేస్తోంది. ప్లాస్టిక్ను నిరోధించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ఐక్యరాజ్యసమితి ఇచ్చిన సందేశం అత్యంత ప్రాధాన్యమైనది. పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ ఇమిడి ఉందనేది అక్షర సత్యం - దీనికి మనమంతా బద్ధులై… pic.twitter.com/v1nn0zvnqy— YS Jagan Mohan Reddy (@ysjagan) June 5, 2025 -
ఏపీలో ఆ పండగేదో వీళ్లకు మాత్రమే! మరి జనాలకు..?
ఏడాదికాలంగా ఏపీ ప్రజలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడించిందని వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు చేపడితే.. కూటమి నేతలు , ఎల్లో మీడియా మాత్రం రాష్ట్రంలో ప్రజలు పండగ చేసుకోవాలని అంటున్నారు. ఎవరు సత్యం చెబుతున్నారు? ఎవరు అసత్యం చెబుతున్నారు?. ఈ ఏడాదికాలంగా జరిగిన వివిధ పరిణామాలను పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది వాస్తవం అని ఆధారసహితంగా కనిపిస్తోంది. అదే టైంలో ప్రజలకు పండగ కాదు కాని.. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్, పవన్ కల్యాణ్లకు మాత్రం పండగే అని ఒప్పుకోవాలి. ఈ ముగ్గురితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కూటమి నేతల అక్రమ సంపాదనకు రహదారి వేసిందని కూడా అంగీకరించాలి. అందువల్ల వీరికి కూడా పండగే అని చెప్పుకోవాలి. ఏ మాటకు ఆ మాట.. ఎల్లోమీడియా పంట కూడా బ్రహ్మాండంగా పండుతోంది. వారి సంపాదనకు తిరుగులేదు కనుక వారికే పండగే!. కూటమి నేతలుకాని, ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి నిర్దిష్టంగా ఫలానా కారణాల వల్ల ప్రజలు పండగ జరుపుకుంటారని చెప్పలేకపోతున్నారు. అందుకే గత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. ముందుగా ఏ రకంగా ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడించిందో విశ్లేషిద్దాం.ఏపీలో తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ తో పాటు భారీ ఎన్నికల ప్రణాళికను అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్లు ప్రకటించారు. ఆ ప్రకారం తాము అమలు చేశామని వీరు ఎక్కడైనా చెప్పగలరా?. వృద్దాప్య పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచిన మాట మాత్రం వాస్తవం. కానీ అదే సమయంలో లక్షల పెన్షన్లు కోత పెట్టింది నిజమే కదా!. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదికి మూడు ఇస్తామని చెప్పి ఒక్కటి మాత్రం ఇచ్చారు. అది కూడా అందరికి అందలేదన్నది నిజం. ఈ రెండూ తప్ప ఫలానా ఘన కార్యాలు సాధించామని కూటమి నేతలు కాని, ఎల్లో మీడియా కాని చెప్పలేకపోతోంది. అందుకే సోషల్ మీడియాలో కూటమి వాగ్దానాలపై వ్యంగ్య పాటలు, వ్యాఖ్యలు భారీగా కనిపిస్తున్నాయి.సూపర్ సిక్స్ లో బాగంగా యువతకు నిరుద్యోగ భృతి కింద మూడువేల రూపాయల చొప్పున ఇస్తామని అన్నారు. ఇచ్చారా?లేదు. పైగా ఉన్న ఉద్యోగాలు ఊడపీకారు. జగన్ టైంలో ఏర్పర్చిన వలంటీర్ల వ్యవస్థను తాము కొనసాగిస్తామని.. పైగా పదివేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్పారా?లేదా?. అధికారంలోకి వచ్చాక.. ఏవో దొంగ కారణాలు చూపుతూ ఆ వ్యవస్థకు మంగళం పాడారా?లేదా?. దాంతో రెండున్నర లక్షల మందికి గౌరవ వేతనం రాకుండా పోయింది. ఇది యువతకు వెన్నుపోటు పొడిచినట్లే కదా!. జగన్ తీసుకు వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు,వ్యవస్థలు అన్నిటిని కొనసాగిస్తామని చంద్రబాబు,పవన్ లు పదే,పదే ప్రకటించారు. కాని పవర్ వచ్చిన వెంటనే ప్రజలకు ఇళ్లవద్దే అందే సేవలను దాదాపు రద్దు చేశారు. చివరికి రేషన్ బియ్యం తదితర సరుకులు అందించే వాహనాలను కూడా ఎత్తివేశారు. ఫలితంగా సుమారు ఇరవైవేల మంది వాహన నిర్వాహకులు, వారి కుటుంబాలు వీధినపడ్డాయి. రేషన్ కోసం ప్రజలు ముఖ్యంగా పేదలు కిలోమీటర్ల దూరం వెళ్లి రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడి ఉండాల్సి వస్తోంది. ఇది వెన్నుపోటు కాదా!. అమ్మ ఒడి కింద పదిహేనువేల రూపాయల చొప్పున జగన్ ఇస్తుంటే.. చంద్రబాబు ఏమని అన్నారు. జగన్ ఒక్క విద్యార్దికే ఇస్తున్నారు..అది అన్యాయం.తాము వస్తే ప్రతి విద్యార్ధికి పదిహేనువేల చొప్పున ఇంటిలో ఎంత మంది ఉంటే అందరికి ఇస్తామని అన్నారు. జనం అమాయకంగా నమ్మారు. కాని అధికారం వచ్చి ఏడాది అయినా దాని అతీగతి లేదు. ఈ జూన్ లో ఇస్తామని ఇప్పుడు చెబుతున్నారు. కాని ఇప్పటికే ఒక ఏడాది ఎగవేశారు కదా?ఇది వెన్నుపోటే కదా!. ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున డబ్బులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాని ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదు.ఇది వెన్నుపోటే కదా!అలాగే మహిళలకు ఉచిత బస్, రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇరవైవేల రూపాయలు ఇస్తామని చెప్పారు. అదీ జరగలేదు. దీనిని వెన్నుపోటు కాదని అనగలరా?. విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ సకాలంలో చెల్లించి వారి సర్టిఫికెట్లకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఇచ్చిన హామీ ఎంతవరకు అమలు చేశారు?. ఉచిత ఇసుక విధానం అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారా? లేదా?. ఇసుకను కూటమి నేతలకు ఆదాయవనరుగా మార్చడం ప్రజలకు వెన్నుపోటా ?కాదా?. పండగ కానుకలు వస్తాయని, బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ అని, పెళ్ళి కానుక కింద లక్ష రూపాయలు ఇస్తామని, ఇలా ఒకటేమిటి! చేతికి ఎముక లేని చందంగా చంద్రబాబు పధకాలు అమలు చేస్తారేమోలే అని భావించిన ప్రజలకు అవేవి చేయకపోవడం వెన్నుపోటు అవ్వదా?. అసలే చంద్రబాబు నాయుడికి వెన్నుపోటులో సిద్దహస్తుడు అనే పేరు ఉంది. తన మామ ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేసినప్పటి నుంచి ఆయన ప్రత్యర్ధులు ఈ విషయాన్ని తరచూ చెబుతుంటారు. 2014-2024లలో ఆయనకు పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు. ఇద్దరు కలిసి హామీల విషయంలో చేసిన వెన్నుపోటు ఒక రకం అయితే.. ప్రభుత్వాన్ని నడపడంలో, వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. నేతలపై కేసులు పెడుతూ రెడ్ బుక్ అంటూ లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న అరాచకం మరో ఎత్తుగా ఉంది. జగన్ రూ. 14 లక్షల కోట్ల అప్పు చేశారని అంటూ పచ్చి అబద్దాలు చెబుతూ.. అయినా తాము అన్ని హామీలు అమలు చేస్తామని, సంపద సృష్టించడం తెలుసునని ప్రచారం చేసుకున్నారు చంద్రబాబు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక సంపద ఎలా సృష్టించాలో చెవిలో చెప్పండని ప్రజలనే అడగడం వెన్నుపోటే అవుతుంది కదా!. ఏకంగా ఏడాదిలో లక్షన్నర కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించడం ప్రజలను మోసం చేసినట్లు కాదా?. తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందంటూ పచ్చి అబద్దాన్ని చెప్పడం ద్వారా దేవదేవుడిని కూడా వెన్నుపోటు పొడవడానికి వెరవలేదే!. ఇలా ఒకటేమిటి?.. అమరావతి పేరుతో లక్ష ఎకరాలు సమీకరించి, లక్షల కోట్లు ఆ గ్రామాలలోనే ఖర్చు పెట్టడానికి తయారవుతున్న తీరు చూస్తే ఇతర ప్రాంతాల ప్రజలను వెన్నుపోటు పొడవడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదని అర్దం అవుతుంది కదా!. దీనికన్నా ప్రభుత్వానికి అవసరమైన పదివేల ఎకరాలో, అంతకు కాస్త ఎక్కువో భూమిని మార్కెట్ రేటు ప్రకారం కొనుగోలు చేసి ఉంటే లక్షల కోట్లు ఆదా అయ్యేవి కదా అనేదానికి సమాధానం దొరకదు. ఉర్సా వంటి ఊరుపేరులేని కంపెనీలకు విశాఖలో విలువైన భూములు కట్టబెట్టడం ఆ ప్రాంతానికి వెన్నుపోటు అవుతుందా? కాదా?. ఆర్థికంగా బలంగా ఉన్న టీసీఎస్ కంపెనీ తనకు లీజుకు భూమి ఇవ్వాలని అడిగితే 99 పైసలకే భూమి అమ్మేస్తామని ఉదారంగా చెప్పడం ప్రజలకు వెన్నుపోటు కాదా!. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. పోలీసులు కొందరు ఇష్టారాజ్యంగా పెడుతున్న కేసులు బహిరంగంగా చట్టంతో సంబంధం లేకుండా నిందితులను దారుణంగా హింసిస్తున్న వైనం ఇవన్ని వెన్నుపోటుకు బోనస్ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే జగన్ రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆయన ప్రభుత్వం తమకు చేసిన మేలును గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఏ రకంగా కూటమి నేతలకు పండగ అని చూస్తే.. ప్రభుత్వం వచ్చీ రాగానే లక్షల టన్నుల ఇసుకను ఊదేసి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించగలిగారు. అది ఏ స్థాయిలో ఉందంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక టీడీపీ కార్యకర్తే జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరుల దందాను అరికట్టాలని కోరుతున్నానని, అలా చేయడానికి లంచం ఇవ్వడానికి కూడా సిద్దమని చెప్పి ,లక్షన్నర రూపాయల ఇవ్వడానికి సిద్దపడ్డారు!. దీనిని ఏమని అనుకోవాలి?. ఈ పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తోంది. మద్యం మాఫియా ఎలా విజృభిస్తోందో, లిక్కర్ షాపులలో కూటమి ఎమ్మెల్యేలకు వాటాలు, ఊరూరా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న కూటమి కార్యకర్తలకు పండగే కావొచ్చు. చంద్రబాబు, లోకేష్, పవన్లు తమ పదవులను ప్రజాసేవకు కాకుండా తమ ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ల దర్జాలకు వాడుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. అది వారికి పండగే కదా?. పిఠాపురంలో దళితుల బహిష్కరణ జరిగితే కనీసం పలకరించకుండా సనాతని వేషం కట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పవన్కు పండగే కదా?. పైళ్లను భారీగా పెండింగ్ లో పెట్టి, షూటింగ్ లలో కాలం గడుపుతున్న ఆయనను ప్రశ్నించేదెవ్వరు. అందుకే ఆయనకు ఇది పండగే. అమరావతి నిర్మాణాల వ్యయం రెట్టింపు చేసి కాంట్రాక్టర్లకు పందెం చేస్తున్నందున వారికి పండగే. టీడీపీ కార్యకర్తల పెండింగ్ అక్రమ బిల్లుల పేరుతో వందల కోట్లను ఇస్తూ పండగ చేసుకోండని చెబుతున్నారు. చంద్రబాబు, పవన్ల కన్నా తానే పవర్ ఫుల్ అని రెడ్ బుక్ పాలన చేస్తున్న లోకేష్ కి వీరిద్దరి కన్నా పెద్ద పండగగానే ఈ ఏడాది సాగిందని ఒప్పుకోవాలి. ఏతా వాతా చూస్తే ప్రజలకు వెన్నుపోటు, కూటమి నేతల అక్రమార్జనకు పండగే అని చెప్పొచ్చు. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మద్యం మత్తులో రెచ్చిపోయిన సీమరాజా.. పోలీసులకే హుకుం!!
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తెలుగు దేశం పార్టీ కోసం సోషల్ మీడియాలో అహర్నిశలు పని చేసే సీమరాజా.. ఇప్పుడు అధికారం అండతో రెచ్చిపోతున్నాడు. మద్యం మత్తులో రెచ్చిపోయి కొందరు అమాయకులపై దాడి చేశాడు. పైగా వాళ్ల మీదనే గంజాయి కేసు పెట్టాలంటూ ఏకంగా పోలీసులకే హుకుం జారీ చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. సీమరాజా మరికొందరు ఫుల్గా మద్యం సేవించి కారులో వెళ్తున్నారు. చిట్వేలి మండలం గొల్లపల్లిలో కారు హరన్ కొడుతున్నా తప్పుకోలేదని కోపంతో ఊగిపోతూ కొందరు యువకులపై అంతా కలిసి దాడికి దిగారు. ఆపై ఆ యువకులను నేరుగా పోలీస్ స్టేషన్కు లాక్కెల్లి వాళ్లపై గంజాయి కేసులు పెట్టాలంటూ పోలీసులకు హుకుం జారీ చేశాడు. తమ తప్పేం లేకున్నా తమపై దాడికి దిగారని, ఇష్టానుసారం చితకబాదారని బాధితులు వాపోతున్నారు.తాను వైఎస్సార్సీపీవాడినంటూ వెటకారపు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకున్నాడు సీమరాజా. నెమ్మదిగా ముసుగు తొలగించి తాను పని చేసేది టీడీపీ కోసమేనని తన వీడియోలతో క్లారిటీ ఇస్తూ వచ్చాడు. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చాక కూడా ఇష్టానుసారం రెచ్చిపోతున్నాడు. మరోవైపు సీమరాజాతో పాటు కిర్రాక్ ఆర్పీపైనా మాజీ మంత్రి అంబటి రాంబాబు మే మొదటి వారంలో పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు సైతం చేశారు. -
వంచనపై గర్జన
ఎన్నికల హామీలను గాలికొదిలి చంద్రబాబు సర్కారు చేస్తున్న మోసాలు, అరాచకాలపై జనాగ్రహం పెల్లుబికింది. వైఎస్సార్సీపీ పిలుపునిచ్చిన ‘వెన్నుపోటు దినం’కు అనూహ్య స్పందన వచ్చింది. మండుటెండను లెక్కచేయకుండా భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు కూటమి దగాపై కదం తొక్కారు. ర్యాలీలు, నిరసనలతో హోరెత్తించారు. ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతులు అందజేశారు.సాక్షి, భీమవరం: వెన్నుపోటు దినం వేదికగా కూటమి ఏడాది పాలనపై ప్రజల్లోని వ్యతిరేకత బుధవారం సుస్పష్టంగా కనిపించింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునందుకుని సూర్యప్రతాపం, ఉక్కపోతను ఖాతరు చేయకుండా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, పేదవర్గాలు జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలకు చేరుకుని తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కొట్టు సత్యనారాయణ, వెన్నుపొటు దినం ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ నవుడు వెంకటరమణ, పాలకొల్లు ఇన్చార్జి గుడాల గోపి, మహిళ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గూడూరి ఉమాబాల తదితరులు మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనపై జనాగ్రహానికి వెన్నుపోటు దినం ఘన విజయం సాధించడమే నిదర్శనమన్నారు. ఎన్నికల ముందు హామీలివ్వడం, అధికారంలోకి వచ్చాక వాటికి గాలికొదిలేసి మోసం చేయడం చంద్రబాబు నైజమని విమర్శించారు. ఇప్పుడు దానినే రిపీట్ చేశారన్నారు. చెప్పినవి చేయకపోగా ప్రజా సంక్షేమం కోసం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలుచేసిన పథకాలను నిలిపేసి రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు తదితర అన్ని వర్గాల వారిని ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ చార్జీలు, నిత్యావసరాల ధరలను పెంచేశారని, ఇంటింటికి రేషన్ రద్దు చేశారని, విపక్ష పార్టీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వంచనపై సమాధానం చెప్పాలి: ముదునూరి నరసాపురం: వైఎస్సార్సీపీ హయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పులు చేసి సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని అబద్ధపు ప్రచారాలు చేసిన కూటమి సర్కార్ ఇప్పుడు నెలనెలా అప్పులు చేస్తూ అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండింటిని పక్కన పెట్టి రాష్ట్ర ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారో సమాధానం చెప్పా లని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు డిమాండ్ చేశారు. నరసాపురంలో వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి పార్టీ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అనంతరం ముదునూరి మాట్లాడుతూ.. ‘పోలవరం ప్రాజెక్ట్ ఊసే లేకుండా చేశారు. జగనన్న కాలనీలో నిరుపేదకుల ఇళ్లస్థలాలు ఇస్తే, నేడు ఆ కాలనీల అభివృద్ధిని ఎండమావి చేశారు. నీకు 15వేలు, నీకు 15వేలు అంటూ ఊదరగొట్టి మహిళలను మోసం చేసిన కూటమి నేతలు నేడు మాట్లాడడం లేదు. మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తామని మోసం చేశారు. అమ్మఒడి పథకం ఎగ్గట్టారు. విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పి, ఏడాదిలోనే వేల కోట్ల భారం మోపారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు. అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన ఎగ్గొట్టారు. అక్రమ కేసులు పెడుతూ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.’ అని దుయ్యబట్టారు.చంద్రబాబుది వెన్నుపోటు రాజకీయం: కారుమూరి తణుకు అర్బన్: సంక్షేమం, అభివృద్ధి పథంలో ఏపీని నడిపిస్తానంటూ హామీలు గుప్పించిన చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో బుధవారం నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసనలో ఆయన మాట్లాడారు. జగన్ హయాంలో ముసలమ్మ బటన్ నొక్కుతుందని చంద్రబాబు హేళన చేశారని, కూటమి ప్రభుత్వం రాగానే ముసలోడు గట్టిగా నొక్కేస్తాడేమో అని ప్రజలు ఆశపడ్డారని కానీ అసెంబ్లీకి వెళ్లి ఇవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తుందని అనడం ఆయన చేతకానితనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబుకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య అని, రైతు భరోసా లేదు, ఫీజురీయింబర్స్మెంట్ లేదు, ధాన్యం డబ్బు వేయలేదు, బీమా లేదు, తల్లికి వందనం వేస్తానని, ఉచిత బస్సు ఇస్తానని చెప్పి ఏడాది గడిచినా ఇవ్వలేదు అని నిలదీశారు. ఎండీయూ ఆపరేటర్లకు వెన్నుపోటు పొడవలేదా అని ప్రశ్నించారు. తణుకు ఎమ్మెల్యే పశువధ శాలలో మూగజీవాలను బలి ఇస్తుంటే, స్థానికంగా ఉండలేకపోతున్నామని మహిళలు మొరపెట్టుకున్నా డబ్బుకోసం ఫ్యాక్టరీ యాజమాన్యానికి సహకరించడం వెన్నుపోటు కాదా అన్నారు. ఏ పనిచేయాలన్నా కమిషన్, తణుకులో ఆర్కే ట్యాక్స్ విచ్చలవిడిగా అమలవుతుందని చెప్పారు. తణుకులో ఏ పని జరగడం లేదని ప్రజానీకం అల్లాడుతున్నారని, టీడీపీ కార్యకర్తలు సైతం తిడుతున్నారని దుయ్యబట్టారు. నియోజకవర్గాల్లో నిరసన జ్వాలలు పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు ఆధ్వర్యంలో నరసాపురంలో వెన్నుపోటు దినం విజయవంతంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు రెండు కిలోమీటర్లు మేర భారీ నిరసన ప్రదర్శన సాగింది. వాగ్దానాల అమలుకు అధికారులకు వినతిపత్రం అందజేశారు. పార్టీ సీజీసీ సభ్యుడు పీడీ రాజు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కారుమూరి ఆధ్వర్యంలో తణుకు రాష్ట్రపతి రోడ్డులోని చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి నరేంద్ర సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేశారు. ధర్నా అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఎండీయూ వాహన ఆపరేటర్లు ర్యాలీకి మద్దతు పలికారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పార్టీ కార్యాలయం నుంచి హెడ్పోస్టాఫీస్ రోడ్డు, కేఎన్ రోడ్డు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ఫ్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి వైఫల్యాలపై ధర్నా చేసి అధికారులకు వినతిపత్రం అందజేశారు. మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో ఆచంట నియోజకవర్గం తూర్పుపాలెంలోని పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి ఆచంట వరకు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి వినతిపత్రం అందజేశారు. భీమవరంలో పట్టణంలోని ప్రకాశంచౌక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నవుడు వెంకటరమణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు, ఎంపీపీ పేరిచర్ల విజయనర్సింహరాజు, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాదయాత్ర చేసి వినతిపత్రం అందజేశారు. పాలకొల్లు ఇన్చార్జి గుడాల గోపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ మూడు కిలోమీటర్ల మేర భారీగా పాదయాత్ర చేశారు. సీనియర్ నాయకులు గుణ్ణం నాగబాబు, చెల్లెం ఆనంద ప్రకాష్ యడ్ల తాతాజీ తదితరులు పాల్గొన్నారు. ∙ఉండిలోని వెన్నుపోటు దినం నిరసనలో పార్టీ నరసాపురం పార్లమెంట్ అబ్జర్వర్ మురళీకృష్ణంరాజు, మహిళ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఉమాబాల, ఆకివీడు నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యా లయానికి చేరుకుని వినతిపత్రం అందజేశారు. -
టీడీపీ నేత హత్యకు టీడీపీ నేతల స్కెచ్!
సాక్షి, అనంతపురం: అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వర్సెస్ సుధాకర్ నాయుడు వైరం ఊహించని మలుపు తిరిగింది. టీడీపీ నేత హత్యకు టీడీపీ నేతలే కుట్రపన్నడం తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో అధిష్టానం అప్రమత్తమైంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీలో విబేధాలు భగ్గుమన్నాయి. టీడీపీ నేత సుధాకర్ నాయుడి హత్యకు ఎమ్మెల్యే అనుచరులు స్కెచ్ వేయడం పోలీసుల నిఘాలో బయటపడింది. ఇంట్లోకి చొరబడి మరీ సుధాకర్ను హత్య చేసేందుకు ఎమ్మెల్యే అనుచరులు ప్లాన్ వేశారు. అయితే.. గత కొంతకాలంగా ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరులు చేస్తున్న దందాలు, దౌర్జన్యాలపై జిల్లా ఎస్పీ జగదీష్ దృష్టిసారించారు. ఈ క్రమంలోనే ఈ విషయం కూడా వెలుగు చూసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సుధాకర్ నాయుడు హత్య కుట్రను భగ్నం చేశారు. అధికార పార్టీకి సంబంధించిన వ్యవహారం కావడంతో ఎస్పీ అత్యంత గోప్యంగా విచారణ జరుపుతున్నారు. మరోవైపు.. ఈ ఎపిసోడ్తో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. ఇద్దరిని అమరావతికి పిలిపించుకుని రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తోంది. -
Vennupotu Dinam: పెల్లుబికిన ప్రజాగ్రహం
సరిగ్గా ఏడాది క్రితం అబద్ధపు హామీలతో అధికారాన్ని దొరకబుచ్చుకున్నారు. ప్రజల నుంచి ఓట్లు దండుకుని.. వారికే పంగనామాలు పెట్టారు. ఇచ్చిన హామీలు కాకుండా.. ఏడాది కాలంగా కొత్త కథలు చెబుతూ నమ్మి అధికారం కట్టబెట్టిన ప్రజలకే వెన్నుపోటు పొడిచారంటూ జనం రోడ్లపైకి వచ్చారు. వెన్నుపోటు సర్కారుపై నిరసన ప్రకటిస్తూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజావాహిని నిరసనల జోరుతో ఊరూవాడా దద్దరిల్లింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు బుధవారం వెన్నుపోటు దినం నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి.సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రోజిది. ఓట్లేసిన ప్రజలకే వెన్నుపోటు పొడిచిన రోజిది. అప్పుడు మామ ఎనీ్టఆర్కు వెన్నుపోటు పోడిచారనుకుంటే.. ఏడాది కాలంగా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు’ అంటూ వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి జిల్లా ప్రజలు గొంతెత్తారు. మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డెక్కారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత పాలనపై కదం తొక్కారు. కిలోమీటర్ల మేర పాదయాత్రగా ర్యాలీ చేశారు. నిరసన ర్యాలీలతో జిల్లా హోరెత్తిపోయింది. కూటమి ప్రభుత్వం అనేక ఆంక్షలు, అడ్డంకులు సృష్టించినా ఎక్కడా తగ్గలేదు. అన్నింటిని అధిగమించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. నిరసనపై ఉక్కుపాదం మోపేందుకు గత వారం రోజులుగా అనుమతుల విషయంలో కుట్ర పన్నినా పారలేదు. వైఎస్సార్సీపీ కేడర్తో పాటు సామాన్య జనం నిరసన ర్యాలీల్లో వేలాదిగా పాల్గొన్నారు. దీంతో పారీ్టలో నూతనోత్తేజం కనిపించింది. ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది.మహిళా ద్రోహి చంద్రబాబు ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పడం.. అధికారం చేపట్టాక మోసం చేయడం చంద్రబాబుకు అలవాటైపోయింది. చంద్రబాబు బూటకపు హామీలను నమ్మి మహిళలంతా ఓటేసి మోసపోయాం. సొంత మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి అమాయక ఆంధ్రా ప్రజలకు వెన్నుపోటు పొడవడం పెద్ద వింతకాదు. సూపర్సిక్స్ హామీలు అమలుచేయకుండా వెన్నుపోటు పొడిచారు. – బెండి పూర్ణ, పాత్రునివలస జగనన్న కాలనీ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ.. నమ్మిన ప్రజలను నట్టేట ముంచారని జిల్లా కేంద్రంలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చి నినదించారు. వేలాది మంది ఏడు రోడ్ల కూడలి నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. దీంతో ప్రధాన రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ర్యాలీ అనంతరం తహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు. నిరసన ప్రదర్శనలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎం.వి.పద్మావతి, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్, రాష్ట్ర తూర్పు కాపు విభాగం అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, రాష్ట్ర కళింగ వైశ్య విభాగం అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, చిట్టి జనార్ధన్ రావు, అంబటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇచ్ఛాపురంలో.. ఇచ్ఛాపురంలోని దాసన్నపేట జంక్షన్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు ఆధ్వర్యంలో వేలాది మందితో భారీ నిరసన ప్రదర్శన చేశారు. వేలాది మంది తరలిరావడంతో ఇచ్ఛాపురం కిటకిటలాడింది. హామీల అమలు చేసేదెప్పుడు? రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రతి విద్యార్థికి నీకు రూ.15వేలు.. నీకు రూ.15వేలు అని చెప్పారే తప్ప ఏడాదవుతున్నా ఇవ్వలేదు. మిగిలిన అన్ని వర్గాలను మోసం చేశారు. – పిరియా విజయ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పాతపట్నంలో.. పాతపట్నంలోని పాతబస్టాండ్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. కోర్టు కూడలి, వైఎస్సార్ విగ్రహం జంక్షన్ వద్ద నిరసన ప్రదర్శన చేసి, ప్రభుత్వం తీరును దుయ్యబట్టారు.. చంద్రబాబు మోసాలను ఎండగట్టారు. మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త రెడ్డి శాంతి నేతృత్వంలో జరిగిన నిరసన ప్రదర్శనలో ప్లకార్డులు పట్టుకుని కూటమి ప్రభుత్వం తీరుపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తహశీల్దార్కు వినతి పత్రం అందజేశారు. -
కుప్పం దొంగల ముఠా కేసులో కీలక పురోగతి
సాక్షి, చిత్తూరు: కుప్పంలో పోలీసుల మీదకే వాహనంతో దూసుకెళ్లిన దొంగల ముఠా కోసం గాలింపు కొనసాగుతోంది. ఆ ముఠాలో ఐదుగురు సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి పోలీసులు పురోగతి సాధించారు.కుప్పం రైల్వే స్టేషన్లో ముఠా సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం పుష్పుల్ రైలులో బెంగళూరు వెళ్లే ప్రయత్నంలో ఉండగా.. అదుపులోకి తీసుకున్నారు. అతని ద్వారా మిగిలిన ముఠా సభ్యుల ఆచూకీ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. కరుడుగట్టిన దొంగల ముఠా ఒకటి సరిహద్దు దాటుతున్నారనే సమాచారంతో కుప్పం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో కృష్ణగిరి-పలమనేరు జాతీయ రహదారిపై ఉన్న తంబిగానిపల్లె చెక్పోస్టు వద్ద పోలీసులను చూసి దుండగులు తమ కారుతో తొక్కించేందుకు విఫలయత్నం చేశారు. వెంటనే కానిస్టేబుళ్లు పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో తప్పించుకున్న వారిని నిలువరించేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కారు నడుపుతున్న డ్రైవర్ తొడకు బుల్లెట్ గాయమైంది. అయినా కూడా ఆ ముఠా తప్పించుకుంది. కొద్దిదూరం వెళ్లాక కారును వదిలేసి ఆ ముఠా సభ్యులు పరారైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కుప్పం డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ హత్యాయత్నం కింద దొంగలపై కేసు నమోదు చేశారు. పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి సమీప ప్రాంతాల్లో దొంగల కోసం జల్లెడ పడుతున్నారు. కుప్పం పరిధిలోని పలు గ్రామాల్లో డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్తో గాలింపు చేపట్టారు. ఆ ముఠాలో హర్యానా, రాజస్థాన్ ముఠా సభ్యులు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. హిందీలో మాట్లాడుతూ ఎవరైనా అనుమానాస్పద రీతిలో ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. -
నిరసన హోరెత్తి.. వెన్నుపోటుపై గళమెత్తి!
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజా వ్యతిరేకత మిన్నంటింది. సూపర్ సిక్స్ పేరిట అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు తీరుపై నిరసన హోరెత్తింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపులో భాగంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ ప్రభుత్వంపై ప్రజాగ్రహానికి అద్దం పట్టింది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్పంచుకోగా.. ప్రజలు, ముఖ్యంగా మహిళలు రోడ్డెక్కి మద్దతు పలికారు. ఎక్కడికక్కడ మోటార్ సైకిళ్లతో ర్యాలీలు నిర్వహిస్తూ.. సీఎం డౌన్డౌన్ ప్లకార్డులను ప్రదర్శించారు. ఆయా నియోజకవర్గాల్లో వలంటీర్లు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కర్నూలులో ఎండీయూ వాహన ఆపరేటర్లు తమ వాహనాలతో నిరసన ర్యాలీలో మద్దతు తెలిపారు. ఏడాదంతా రెడ్ బుక్ పాలనే.. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన తప్ప కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా వెన్నుపోటు నిరసన దినం చేపట్టారు. కర్నూలు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలోని ధర్నా చౌక్ నుంచి బుధవారపేట, కర్నూలు ప్రభుత్వాసుపత్రి, ఎనీ్టఆర్ సర్కిల్ మీదుగా కలెక్టరేట్కు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా గంగుల ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పాలన అట్టర్ఫ్లాప్ అయ్యిందన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో కూటమి నేతలు ఆచారణ సాధ్యం కాని హామీలు ఇచ్చారన్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును ఏ ఒక్కరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం గ్రామాల్లో మరింత వ్యతిరేకత ఉందని, కూటమి నేతలు ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదన్నారు. ఎక్కడికక్కడ తిరగబడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ర్యాలీ అనంతరం వైఎస్సార్సీపీ నేతలు కలెక్టరేట్లో డీఆర్ఓ వెంకట నారాయణమ్మకు వినతిపత్రం అందజేశారు.జిల్లా వ్యాప్తంగా నిరసనలు మంత్రాలయం: ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం చేరుకొని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అధికార ప్రతినిధి పురుషోత్తం రెడ్డి, ప్రదీప్కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలూరు: ఎమ్మెల్యే బి.విరూపాక్షి వెన్నుపోటు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దారు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పాణ్యం: కల్లూరులో నంద్యాల పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్యతో కలిసి వెన్నుపోటు నిరసన ర్యాలీ పెద్ద ఎత్తున చేపట్టారు. కల్లూరులోని తన స్వగృహం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి తహసీల్దారు కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదోని: పట్టణంలో వెన్నుపోటు నిరసన కార్యక్రమం ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. భారీగా వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ను వినతిపత్రం అందజేశారు. పత్తికొండ: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కోడుమూరు: నియోజకవర్గంలోని గూడురులో పార్టీ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సతీ‹Ùఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ కుడా చైర్మన్ కోట్ల హర్షవర్దన్ పాల్గొన్నారు. పాతబస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఎమ్మిగనూరు: పట్టణంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుకా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రకోట జగన్నోహాన్ రెడ్డి పాల్గొన్నారు.పోరాటాన్ని కొనసాగిస్తాం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేందుకు సూపర్ సిక్స్ పథకాల పేరిట ప్రజలను మోసం చేశాడు. రూ.1.60 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రంలో ఏ ఒక్కరికీ రూ.1000లు కూడా సంక్షేమ పథకాల కింద ఇవ్వలేకపోయాడు. మరి అంత డబ్బు ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏడాది గడిచినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్లే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు నిరసన దినం చేపట్టింది. నిరసనలను ఇంతటితో ఆపం.. ప్రజలతో కలిసి ఇక మీదట కూడా చంద్రబాబు మెడలు వంచేందుకు పోరాటాన్ని కొనసాగిస్తాం. – ఎస్వీ మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడుచంద్రబాబు నైజం ప్రజలకు తెలిసిపోయింది ఏడాది గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ చంద్రబాబు నెరవేర్చలేకపోయారు. తాము మోసపోయామనే విషయం ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. కూటమి నాయకులు ప్రజల వద్దకు వెళితే తిరగబడటం ఒక్కటే మిగిలింది. పోలీసులను అడ్డం పెట్టుకొని కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. – మధుసూదన్, ఎమ్మెల్సీ సంక్షేమ పథకాల కోసం ఎదురుచూసినట్లుంది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చెప్పింది చెప్పినట్లు చూసి చూపించారు. ఈ ప్రభుత్వం అంతకంటే గొప్పగా చేస్తామని చెప్పడంతో ఓట్లేశాం. ఇప్పుడు చూస్తే ఒక్కటంటే ఒక్క పథకం కూడా ప్రజలకు అందింది లేదు. సంవత్సరమైనా ఎదురుచూడటంతోనే సరిపోతుంది. సూపర్సిక్స్ పథకాలని చెప్పి ప్రజలందరినీ మోసం చేసినారు. ఈ నాయకులకు మళ్లీ మా దగ్గరికి రావాలంటే మొహం ఎలా వస్తుంది. బుద్ధి ఉంటే ఇంకోసారి నమ్ముతామా?. – దస్తగిరి, హాలహర్వి గ్రామం, నందవరం మండలం -
పోలీసు జులుం.. మాజీ మంత్రి అంబటిపై కేసు
లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్): మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా అంబటి రాంబాబు సిద్ధార్థ్నగర్లోని తన నివాసం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీగా కలెక్టరేట్కు బయల్దేరగా పోలీసులు అడుగడుగునా అడ్డుకోబోయారు. ర్యాలీ స్థంబాలగరువు, పట్టాభిపురం మీదుగా మూసేసిన జూట్ మిల్లు వద్దనున్న సబ్ స్టేషన్కు చేరుకోగా.. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ, సిబ్బంది అడ్డుకునే యత్నం చేశారు. దీంతో అంబటి రాంబాబు స్పందించారు.ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెళ్తుంటే అడ్డుకోవడం సరికాదని చెప్పారు. అంతమాత్రానికే సీఐ వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబుతో దురుసుగా ప్రవర్తించారు. ర్యాలీగా వెళ్లడానికి వీల్లేదని, ర్యాలీగా నువ్ ఎలా వెళ్తావో చూస్తా అంటూ మీదమీదకు వెళ్లి గట్టిగా మాట్లాడడం ప్రారంభించారు. ‘మర్యాదగా మాట్లాడు’ అని అంబటి సూచించగా.. ‘నువ్వు పళ్లు కొరుకుతున్నావ్’ అంటూ అంబటికి వేలు చూపించారు. ఏకవచనంతో వాగ్వాదానికి దిగారు. దీంతో సిబ్బంది కలుగజేసుకుని అంబటి, సీఐకి సర్దిచెప్పి పంపించారు. అనంతరం రాంబాబు పార్టీ నాయకులతో కలిసి కంకరగుంట ఓవర్ బ్రిడ్జి మీదుగా కలెక్టరేట్కు చేరుకుని వినతిపత్రం అందజేశారు. కాగా, మాజీ మంత్రి అంబటి పట్ల సీఐ వ్యవహరించిన తీరు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో స్పష్టంగా కనిపించింది. ఎల్లో మీడియాలో మాత్రం కలెక్టరేట్లోకి అనుమతించలేదని సీఐతో అంబటి దురుసుగా ప్రవర్తించారంటూ దుష్ప్రచారం చేశారు. ఘటన జరిగింది జూట్ మిల్లు వద్ద అయితే కలెక్టరేట్ ముందు అని బురదజల్లాలని చూశారు. చివరకు పోలీసు విధులకు ఆటంకం కలిగించారని, అనుమతి లేకుండా ర్యాలీ తీశారంటూ పలు సెక్షన్లతో అంబటిపై కేసు నమోదు చేయడం గమనార్హం. నిబంధనలను అతిక్రమించిన పోలీస్ అధికారిని వదిలేసి అంబటిపై కేసు పెట్టడాన్ని విశ్లేషకులు తప్పుపడుతున్నారు. -
ఏపీలో ఉన్న ఈ అందమైన అభయారణ్యం గురించి తెలుసా? (ఫొటోలు)
-
ఈవీఎంల ప్రభుత్వాన్ని గద్దె దించి తీరుతాం
కూటమి ఏడాది వెన్నుపోటు పాలనపై సింహపురి.. జనభేరి మోగించింది. అసమర్థ ప్రభుత్వాన్ని దించే వరకు విశ్రమించబోమని రణన్నినాదం చేసింది. ఊరూవాడాల్లో పెల్లుబుకిన ప్రజాగ్రహం.. ఉద్యమ కెరటమై గర్జించింది. జిల్లా వ్యాప్తంగా బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో ప్రజలు మండుటెండను సైతం లెక్క చేయకుండా పాల్గొని అధికార పార్టీ వెన్నులో వణుకు పుట్టించారు. కొన్ని చోట్ల పోలీసులు ర్యాలీలకు ఆటంకాలు సృష్టించారు. సర్వేపల్లిలో అయితే ఏకంగా తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న ఎంపీలనే అడ్డుకున్నారు. ప్రచార రథం డ్రైవర్ను బెదిరించి ముందుకు కదలనీయకుండా ఆపేశారు. కోవూరు, నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో వినూత్నంగా నల్లబెలూన్లతో భారీ సంఖ్యలో ఎండీయూ వాహనాలు, కూటమి హామీల మోసాలపై ఫ్లకార్డుల బాక్స్లతో నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు. కోవూరు: ఈవీఎంలతో గద్దె ఎక్కిన చంద్రబాబు ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దె దించి తీరుతామని, ఏడాదిలోనే ప్రజల నుంచి వచ్చిన ఆగ్రహం ట్రైలర్ మాత్రమే అని రాష్ట్ర పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి హెచ్చరించారు. ఏడాది పాలన అంతా కుట్రలు, కుతంత్రాలతోనే పూర్తయిందని విమర్శించారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలు వెన్నుపోటు పొడిచిన కూట మి ఏడాది పాలనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం కోవూరులో ‘వెన్నుపోటు దినం’ దిక్కులు పిక్కటిల్లేలా నిర్వహించారు. అనంతరం మీడియాతో ప్రసన్న మాట్లాడారు. ఏడాది కాలంలో ఒక్క పథకం కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. సిగ్గులేని ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజు వస్తుందన్నారు. రెడ్బుక్ రాజ్యాంగంతో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. దళితులు, మహిళలు, ఆడబిడ్డలకు రక్షణ కరువైందన్నారు. ప్రతి హామీని నెరవేర్చేలా కూటమి ప్రభుత్వంపై వత్తిడి తెస్తామన్నారు. పవన్ కళ్యాణ్.. చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయ్ డీసీఎంగా పవన్కళ్యాణ్ ప్రజలకు చేసిందేమీ లేదని, గత ఎన్నికల ప్రచార సమయంలో 30 వేల మంది మహిళలను వలంటీర్లు కిడ్నాప్ చేశారని తప్పుడు ప్రచారం చేశారని, ఏడాదైనా వారిని తిరిగి రప్పించలేకపోయాడని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కాపు ఉద్యమ కారులపై అక్రమ కేసులు బనాయిస్తే ఆ సమస్యలపైన పోరాడాల్సింది పోయి కూటమి ప్రభుత్వానికి వంత పాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు వీరి చలపతిరావు, రాధాకృష్ణారెడ్డి, ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్కుమార్, అనూప్రెడ్డి, మల్లికార్జునరెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, శ్రీనివాసులురెడ్డి, నవీన్కుమార్రెడ్డి, శేషగిరిరావు, సతీష్రెడ్డి, షాహుల్, వైస్ ఎంపీపీ నరసింహులురెడ్డి, దినే‹Ùరెడ్డి, అహమ్మద్ తదితరులు ఉన్నారు. మోసం చేయడంలో దిట్ట ∙మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి ఆత్మకూరు: ప్రజలను మోసం చేయడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి అన్నారు. బుధవారం ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ వద్ద నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సూపర్సిక్స్ పథకాలకు మంగళం పాడుతూ ఏడాదిలోనే రూ.1.50 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత చంద్రబాబు దక్కించుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బాబు మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఏడాదిలోనే ఆయన నిజస్వరూపం తెలుసుకున్నారని, దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. వీటి గురించి ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్లు చేస్తున్నారని, ప్రజలు చంద్రబాబుకు త్వరలోనే సరైన బుద్ధి చెబుతారని అన్నారు.నమ్మించి నట్టేట ముంచాడు∙కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి కావలి (జలదంకి): ఏడాది కూటమి పాలన అడుగడుగునా కుట్రలు, కుతంత్రాలు, దగా, దౌర్జన్యాలతో సాగిందని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం కావలి పట్టణంలో వెన్నుపోటు దినం కార్యక్రమం జరిగింది. భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజల నిరసన నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. ఆయన నివాసం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందించారు. ప్రతాప్కుమార్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలను నమ్మించి నట్టేట ముంచిందన్నారు. బాబును నమ్మిన ప్రజలకు కన్నీటి కష్టాలే మిగిలాయన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ అరెస్ట్లు చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరిని కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తునే ఉంటుందని తెలిపారు.వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ బాబు∙బుర్రా మధుసూదన్యాదవ్ కందుకూరు: వెన్నుపోటుకు సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని వైఎస్సార్సీపీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకొని బుధవారం కందుకూరులో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో వివరించారు. ఎన్నికల్లో ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. నియోజకవర్గంలో ఏ పల్లెకు, గ్రామానికి, వార్డుకు వెళ్లినా చంద్రబాబునాయుడు నమ్మించి మోసం చేశారంటూ ప్రజలు చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో జరుగతున్న అరాచకపాలనపై ప్రశి్నస్తున్నందుకే వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్తులపై అక్రమ కేసులు ప్రభుత్వం పెడుతుందని బుర్రా అన్నారు. ఇటువంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదని, ఎంతో మంది నియంతలు సైతం కనుమరుగైన విషయాన్ని ప్రభుత్వం గుర్తించుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సూపర్సిక్స్ హామీలను అమలు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ సబ్కలెక్టర్ తిరుమాణి శ్రీపూజకు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్యాదవ్తో పాటు, ఇతర నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రజలకే పంగనామాలు∙ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి నెల్లూరు (అర్బన్): ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి.. ఆ ప్రజలకే వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కిందని నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం ‘వెన్నుపోటు దినం’ నిర్వహించారు. వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్లో ఏఓ విజయకుమార్కు వినతి పత్రం ఇచ్చారు. చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దొంగ హామీలు, అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందన్నారు. సంక్షేమ పథకాలను అటకెక్కించారన్నా రు. అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. నెల్లూరు పార్లమెంట్ వైఎస్సార్సీపీ పరిశీలకులు జంకె వెంకటరెడ్డి నేతలు ఖలీల్ అహ్మద్, అంజాహుస్సేని, మొయిళ్లగౌరి, సురేష్, సమీర్ఖాన్, అబ్దుల్ మస్తాన్, సిద్దిఖ్, నేతాజీ సుబ్బారెడ్డి, మజ్జిగ జయకృష్ణారెడ్డి, ఊటుకూరు నాగార్జున, అశ్రిత్రెడ్డి, చీదెళ్ల కిషన్, కొణిదెల సు«దీర్, కోటేశ్వరెడ్డి, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జిలు పాల్గొన్నారు. వంచన ఆయన నైజం ∙మేకపాటి రాజగోపాల్రెడ్డి ఉదయగిరి: బిడ్డనిచ్చిన సొంత మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రజలను మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం పెద్ద లెక్క కాదని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి అన్నారు. ఉదయగిరిలో బుధవారం పార్టీ జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీలతో జనాన్ని బోల్తా కొట్టించి అధికారంలోకి వచ్చారు. ఏడాది అయినా ఒక్క హామీ అమలు చేయలేదు. రెడ్బుక్ రాజ్యాంగంతో వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను హించిస్తూ తప్పడు కేసులు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పిందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. -
కూటమి ప్రభుత్వ పాలనపై వెల్లువెత్తిన నిరసన
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వ వెన్నుపోటుపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది.. ప్రభుత్వ మోసాలను ఎండగట్టింది.. భారీ స్థాయిలో రోడ్డుపైకి వచ్చింది.. ప్లకార్డులు, నిరసన ప్రదర్శనలతో కదం తొక్కింది. ఏడాది పాలనలో ఏం సాధించారు..? ఏం ఇచ్చారు..? అంటూ ప్రశ్నించింది.. ఏ వర్గం వారిలో సంతోషం లేదని ఆవేదన చెందింది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు చేసిన నయ వంచనను ఎత్తి చూపుతూ భారీ ర్యాలీలు చేపట్టింది.. కూటమి అరాచకాలను ప్రశ్నించింది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రజలకు చేసిన దగాపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ గ్రాండ్ సక్సెస్ అయింది. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్, నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల్లో బుధవారం నిరసన ప్రదర్శనలు, భారీ ర్యాలీలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతి పత్రాలు సమరి్పంచారు. రాజమహేంద్రవరం సిటీ: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిందేమీ లేదని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు చేసిన మోసం, సాగిస్తున్న అరాచకాలకు నిరసనగా జాంపేట ఆజాద్ చౌక్, జెండాపంజా రోడ్, సూర్య హోటల్, సబ్ కలెక్టరేట్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘బాబు ష్యూరిటీ మోసం, ఉచిత పంటల బీమాకు పంగనామాలు, నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తావ్ బాబూ’ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ప్ల కార్డులు, నల్లబెలూనుŠల్ చేతబట్టి, నల్ల కండువాలు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. పోలీసుల ఆంక్షలు నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ నేతలపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. బెలూన్లు, నల్ల కండువాలను లాక్కున్నారు. డీజేను సీజ్ చేశారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన తెలిపారు. పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడంతో పోలీసులు, నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు లాక్కెళ్లడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తొక్కిసలాట చోటు చేసుకుంది. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే, పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఎక్కడి న్యాయమని మాజీ ఎంపీ భరత్ నిలదీశారు. పార్టీ శ్రేణులను లాక్కెళ్లడాన్ని అడ్డుకున్నారు. ర్యాలీ అనంతరం వైఎస్సార్ సీపీ జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డితో కలిసి ఆర్డీఓ కృష్ణానాయక్కు వినతి పత్రం సమరి్పంచారు. అనపర్తినియోజకవర్గ కేంద్రమైన అనపర్తిలో వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ రైల్వే స్టేషన్ రోడ్ మెయిన్ రోడ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించారు. పార్టీ జెండాలు, ప్లకార్డులతో ర్యాలీ సాగింది. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం సమరి్పంచారు. -
పసర పాము అనుకునేరు జాగ్రత్త సుమా!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: భవిష్యత్లో అంతరించిపోయే జాతుల జాబితాలో ఉన్న స్పాట్–టెయిల్డ్ పిట్ వైపర్ జాతి పాము కాకినాడ సమీపాన గుర్తించారు. దేశంలోనే మూడో అతి పెద్ద కోరంగి అభయారణ్యంలో ఈ పాము తారసపడింది. దాదాపు 40 ఏళ్ల క్రితం జనవాసాల్లో కనిపించే ఈ అరుదైన జాతిపాము సమీప భవిష్యత్లో అంతరించిపోయే జాతుల్లో ఒకటిగా చేరింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1978 ప్రకారం ఈ పాము నాలుగో షెడ్యూల్లో ఉంది. అటువంటి ఈ జాతి పాము పరిరక్షణ కోసం తక్షణం ప్రయత్నించకుంటే అంతరించిపోతున్న జాతుల్లో చేరిపోతుందని వన్యప్రాణి సంరక్షణా విభాగం గుర్తించింది. ఈ నేపథ్యంలో స్పాట్–టెయిల్డ్ పిట్ వైపర్ పామును నాలుగో షెడ్యూల్ నుంచి ఒకటో షెడ్యూల్లోకి చేర్చారు. ఈ షెడ్యూల్ మార్పు ద్వారా అత్యంత జాగ్రత్తతో ఈ జాతి పామును రక్షించాలనే సందేశాన్ని ఇచ్చినట్టు వన్యప్రాణి విభాగం అధికారులు చెబుతున్నారు. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ముందుచూపుతోనే 2022లో షెడ్యూల్ మార్చారు. పొడ పాము సంతతికి చెందిన ఈ పాము పచ్చరంగులో ఉంటుంది. ఈ జాతిలో రెండు రకాలు బాంబోపిట్ వైపర్, స్పాట్ వైల్డ్ పిట్వైపర్ ఉన్నాయి. బాంబో పిట్ వైపర్ సాధారణంగా అటవీ ప్రాంతమైన రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి, వై.రామవరం, అడ్డతీగల తదితర ప్రాంతాల్లో ఉంటుంది. స్పాట్ వైల్డ్ పిట్ వైపర్ జాతి పాములు చిత్తడి నేలల్లో (మాంగ్రూవ్స్) మాత్రమే మనగలుగుతాయి. ఈ పాము మనిషిపై దాడి చేసినప్పుడు రక్తంలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయి. దీంతో బ్రెయిన్ డెడ్ కావడం, హార్ట్ అటాక్, కోమాలోకి వెళ్లడంతో ప్రాణానికే ప్రమాదం ఏర్పడతాయి. అయితే, ఇంతవరకూ ఈ జాతి పామువల్ల ఇలాంటి కేసులు ఎక్కడా నమోదు కాలేదు. ఈ పాములు పగలు నిద్రావస్థలో ఉండి, రాత్రి పూట మాత్రమే సంచరిస్తుండటంతో ప్రజల ప్రాణాలకు పెద్దగా ప్రమాదం ఎదురు కాలేదు. ఈ జాతి పాములు ఎక్కువగా దక్షిణ ఆసియా, మయన్మార్లలో మాత్రమే కనిపిస్తుంటాయి. దీనిని ఒక విషపూరితమైన పాము జాతిగా తేల్చారు. ఈ పాము విషం చాలా శక్తిమంతమైనదిగా నిర్ధారించారు. ఈ పాము కాటు వేసినప్పుడు సకాలంలో వైద్య అందకపోతే ప్రాణాంతకమే. ఆకుపచ్చ రంగులో ఉండి శరీరంపై చిన్న చిన్న ఎరుపు మచ్చలు కూడా కనిపిస్తుంటాయి. తల భాగం ఒకే రీతిలో చిలకాకుపచ్చ, వెనుక ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు కలిగి ఉంటుంది. పచ్చని చెట్లపై సంచరిస్తూండటంతో ఈ పామును స్థానికులు పసర పాముగా భావించి ఉదాసీనంగా ఉంటే ప్రాణాలకే ప్రమాదం. జీవ వైవిధ్యంలో విశేషతను సంతరించుకుందని వన్యప్రాణి విభాగ అధికారులు చెబుతున్నారు. ఈ పాముకు ఉప జాతులేమీ ఇంతవరకూ గుర్తించ లేదు. ఇటువంటి లక్షణాలున్న పాము కోరంగి అభయారణ్యంలో రికార్డు కావడంతో దీని పరిరక్షణ కోసం వన్యప్రాణి విభాగం ప్రజలకు అవగాహన కల్పించేందుకు సమాయత్తమవుతోంది. మగ పాము గరిష్టంగా 575 మిల్లీమీటర్లు (22.6 అంగుళాలు) పొడవున పెరుగుతాయని నిర్దారించారు. వీటి తోక పొడవు 120 మిల్లీమీటర్లు (4.7 అంగుళాలు) పైనే ఉంటుంది. ఆడ పాము అయితే గరిష్టంగా 1,045 మిల్లీమీటర్లు (41.1 అంగుళాలు) పొడవు, తోక చూస్తే 165 మిల్లీమీటర్లు (6.5అంగుళాలు) పొడవు ఉంటుంది. మగ పాము కంటే ఆడపాము పొడవు ఎక్కువగా ఉంటుంది.పర్యాటకులకు అవగాహన కల్పింస్తున్నాం మడ అడవులకు వచ్చే పర్యాటకులకు ఈ విషయంలో ముందు జాగ్రత్తలు చెబుతాం. చెట్లు ఎక్కవద్దు, లోపలకు వెళ్ళవద్దంటూ హెచ్చరించి పంపిస్తాం. ఒకవేళ ఈ పాము కాటు వేస్తే వెంటనే వైద్య సహాయం పొందాలి. ఈ పాము కరవగానే విరుగుడుకు ఇంజక్షన్ చేయించాలి. ఈ ఇంజక్షన్ కోరంగి అభయారణ్యం సమీపాన తాళ్లరేవు పీహెచ్సీ లేదా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో ఉంటుంది. కాలు మీద కాటేస్తే ఎక్కువగా నడవకూడదు. కట్టుకట్టకుండా ఆస్పత్రికి తరలించాలి. ఈ విషయాలపై ముందుగా అవగాహన కల్పిస్తున్నాం. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, అటవీ రేంజర్, వన్యప్రాణి విభాగం, కోరంగి అభయారణ్యం, కాకినాడ -
బిడ్డను చంపి.. తనువు చాలించి..
కాకినాడ క్రైం: కన్న పేగుని చిదిమేసి తానూ తనువు చాలించిన తల్లి హృదయ విదారక సంఘటన కాకినాడలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు, రాజమహేంద్రవరానికి చెందిన గుడేటి రమ్యదీప్తి(30)కి ఐదేళ్ల క్రితం కాకినాడ రేచర్లపేట దౌర్లవారి వీధికి చెందిన రాజాల శరత్తో వివాహమైంది. ఈ దంపతులు అబుదాబీలో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు కియాన్ ప్రశాంత్ ఉన్నాడు. రెండు నెలల క్రితం రమ్యదీప్తి అబుదాబి నుంచి తన కుమారుడితో కలిసి రాజమహేంద్రవరానికి వచ్చింది. అక్కడ ఒకటిన్నర నెలల పాటు ఉండి, సుమారు పది రోజుల క్రితం కాకినాడలోని అత్తయ్య ఇంటికి వచ్చి ఉంటోంది. ఏమైందో, ఏమో మంగళవారం రాత్రి నిద్రపోయేందుకు కుమారుడితో కలిసి తన గదిలోకి వెళ్లింది. ఉదయం ఎంతకూ తలుపు తీయకపోయేసరికి దీప్తి అత్తయ్య, ఆడపడుచు కిటికీ నుంచి గదిలోకి చూశారు. దీప్తి ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఆమె కుమారుడు మంచంపై నిర్జీవంగా పడి ఉన్నాడు. పొరుగు వారి సాయంతో తలుపులు తెరిచిచూడగా.. దీప్తి అప్పటికే చనిపోయి ఉంది. బాలుడు ప్రశాంత్కు ముక్కు, నోటికి ప్లాస్టర్లు వేసి ఉన్నాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. టూ టౌన్ ఇన్చార్జి సీఐ సత్యనారాయణ, ఎస్సై తులసీరామ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీప్తి ఆత్మహత్యకు పాల్పడిందని, అంతకు ముందు తన కుమారుడి ముక్కు, నోటికి ప్లాస్టర్లు వేసి, ఊపిరాడకుండా చేసి ఉంటుందని గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో దీప్తి ఈ ఘాతుకానికి పాల్పడిందని భావిస్తున్నామని, విచారణలో వాస్తవాలు తెలుస్తాయని సీఐ చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇలాఉంటే, అత్త, ఆడపడుచు, భర్త వేధింపులు తాళలేకున్నానని దీప్తి తమకు వాయిస్ మెజేస్లు పెట్టి ఈ ఘాతుకానికి పాల్పడిందని దీప్తి తల్లి అరుణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాకినాడ టూ టౌన్ పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. -
వెన్నుపోటుపై ప్రజాగ్రహం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలి.. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి.. అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ ‘వెన్నుపోటు దినం’పేరిట నిరసన తెలపాలని వైఎస్సార్ సీపీ ఇచ్చిన పిలుపునకు అన్ని వర్గాల నుంచి స్పందన లభించింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో తూర్పు, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. జెడ్పీ జంక్షన్ వద్ద ప్రారంభమైన వెన్నుపోటు నిరసన ర్యాలీ కలెక్టరేట్ వరకు సాగింది. ‘వెన్నుపోటు చంద్రబాబు.. మోసగాడు చంద్రబాబు’అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణే‹Ùకుమార్, విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, కోలా గురువులు, రవిరెడ్డి తదితరులు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేయడం తప్ప మరేమీ చేయలేదని, వారి వైఫల్యాలకు నిరసనగా చేపట్టిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం కూటమి ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతుందని నేతలు హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కె.సతీష్ పార్టీ కార్యాలయం పర్య వేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షుడు విజయచంద్ర, కార్పొరేటర్లు బానాల శ్రీనివాసరావు, అల్లు శంకరరావు, రెయ్యి వెంకటరమణ, కోరుకొండ వెంకట స్వాతి, కె.అనిల్ కుమార్రాజు, మొల్లి లక్ష్మి, మువ్వలలక్ష్మి, సాడి పద్మారెడ్డి, చెన్నా జానకీ రామ్, కోడిగుడ్ల పూర్ణిమ, వావిలపల్లి ప్రసాద్, శశికళ, ఉత్తరాంధ్ర యువజన విభాగం రీజనల్ ప్రెసిడెంట్ అంబటి శైలేష్, పార్టీ ముఖ్య నాయుకులు కోలా గురువులు, రొంగలి జగన్నాథం, ఎండీ ఫరూఖీ, వుడా రవి, గొలగాని శ్రీనివాస్, రవి రాజు, సతీష్ వర్మ, తాడి జగన్నాథ్రెడ్డి, శ్రీని వాసరెడ్డి, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు పేడాడ రమణి కుమారి, బోని శివరామకృష్ణ, సనపల రవీంద్ర భరత్, బర్కత్ అలీ, ఎస్.ప్రసాదరావు, రామిరెడ్డి, బొండా ఉమా మహేశ్వరరావు, దేవరకొండ మార్కండేయులు, కాళిదాస్ రెడ్డి, అల్లంపల్లి రాజాబాబు, రామన్నపాత్రుడు, కిరణ్ రాజు, పల్లా దుర్గారావు, డా.మంచా నాగ మల్లీశ్వరి, మనలత జాబ్దాస్(చిన్ని), నీలి రవి, కొట్యాడ సూర్య, మహేష్బాబు, వార్డు నాయకులు పాల్గొన్నారు. కొత్తగా ఒక్క పింఛన్ ఇచ్చిందా? తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు మాట్లాడుతూ.. ‘సూపర్ సిక్స్ సహా 143 హామీలిచ్చి అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు మోసం చేసినందుకే ఇది వెన్నుపోటు ప్రభుత్వం. మూడు లక్షల పింఛన్లు తొలగించి, కొత్తగా ఒక్క పింఛను అయినా ఇచ్చిందా? రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైన ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వ పతనానికి తొలి అడుగు’ అని అన్నారు.విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోమాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. గాజువాక పాత చెక్పోస్టు ప్రాంతం నుంచి ప్రారంభమై శాంతిగిరి కాలనీ, ములగాడ హౌసింగ్ కాలనీ మీదుగా ములగాడ తహసీల్దార్ కార్యాలయం వరకూ ఈ ర్యాలీ సాగింది. అక్కడ ఆర్ఐ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దొడ్డి కిరణ్, నియోజకవర్గ మహిళా విభాగం ఇన్చార్జి పేడాడ జ్యోత్స్న, జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ, ఎస్సీ సెల్ నాయకులు మల్లేశ్వరరావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి చుక్కా వరలక్ష్మి, కార్పొరేటర్లు పి.వి.సురేష్ బల్లా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.గాజువాక నియోజకవర్గంలో గాజువాక సమన్వయకర్త దేవన్రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పాతగాజువాక జంక్షన్ నుంచి నేషనల్ హైవే మీదుగా చినగంట్యాడ 100 అడుగుల రోడ్డులోని తహసీల్దార్ కార్యాలయం వరకూ ఈ ర్యాలీ సాగింది. తహసీల్దార్ తోట శ్రీవల్లికి వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉరుకూటి అప్పారావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉరుకూటి చందు, కార్పొరేటర్లు ఇమ్రాన్, భూపతిరాజు సుజాత తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.పెందుర్తి నియోజకవర్గంలో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్రాజ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాంపురం నుంచి పెందుర్తి జూనియర్ కళాశాల వరకూ బైక్లు, కార్లతో ర్యాలీగా తరలివచ్చారు. అక్కడ నుంచి వేంకటేశ్వరస్వామి ఆలయ రోడ్డు, బీఆర్టీఎస్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ గా సాగారు. ముఖ్య నేతలు బి.భగవాన్ జైరాం, పైలా శ్రీనివాసరావు, కొటాన రాము, జెడ్పీటీసీ సభ్యుడు పి.ఎస్.రాజు, ఎంపీపీలు. నేతలు హాజరయ్యారు.సంపద సృష్టి పేరుతో మోసంరాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. ‘వెన్నుపోటు దినం’.. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వా న్ని గద్దె దించేందుకు ఒక మలుపు అవుతుంది. కూటమి ఏడాది పాలనలో మోసాలు, దౌర్జన్యా లు, అవినీతి, దోపిడీలు తప్ప మరేమీ లేవు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకూ ప్రతిపక్షంగా పోరాడుతూనే ఉంటాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా చంద్రబాబు అమలుకాని హామీలిచ్చారు. సంపద సృష్టిస్తానంటూ ప్రజలను మోసం చేశారు’ అని విమర్శించారు. బాబూ మీ కుమారుడు లోకేష్కు సంపద సృష్టిస్తున్నావా? అని ప్రశ్నించారు. విశాఖ నగరంపై చిన్నచూపుపార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు మాట్లాడుతూ.. ‘అన్ని వర్గాలను దగా చేసిన చంద్రబాబు, మంత్రి లోకే‹Ù, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడేమి సమాధానం చెబుతారు. యువగళంలో లోకేష్ ఇచ్చిన యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయి. వెనుకబడిన ఉత్తరాంధ్రను కూటమి నేతలు దోచుకుంటున్నారు. విశాఖ నగరంపై చిన్నచూపు చూస్తున్నారు. అమరావతి భ్రమలో ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ప్రజలను వెన్నుపోటు పొడవడం పెద్ద లెక్క కాదు! గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతీ హామీని అమలు చేసింది. ఈ ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను నిరీ్వర్యం చేసింది. రైతులను అప్పుల పాల్జేసింది. వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి వచ్చిన స్పందన.. కూటమి ప్రభుత్వ పతనానికి నాందిగా మారుతుంది’ అని అన్నారు. చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు హయాంలో రాష్ట్ర జీడీపీ 3.8 శాతానికి పడిపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇది 8.9 శాతంగా ఉండేది. ఇది చాలదా చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎం అని చెప్పడానికి.? గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.2.75 లక్షల కోట్లను సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందించింది. ప్రస్తుతం చంద్రబాబు కూటమి నేతల జేబులు నింపుతున్నారు. పవన్ కల్యాణ్ సిని మా ప్రపంచం నుంచి ఇంకా బయటకు వచ్చినట్లు లేరు. ఏడాది పాలనలో మోసాలు, దౌర్జన్యాలు జరిగితే.. అట్టర్ ప్లాప్ సిని మా(ఏడాది పాలన)కు బాణసంచా కాల్చి పండగ చేసుకోవా లని పిలుపునివ్వడం ఆశ్చర్యంగా ఉంది’ అని ఎద్దేవా చేశారు. ప్రజలే చీపుర్లతో పండగ చేస్తారు పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురా లు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ.. ‘కూటమి ఏడాది పాలనలో మోసా లు, మహిళలపై దాడులు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో పండగలు నిర్వహిస్తారా? మ్యానిఫెస్టో పట్టుకుని ప్రజల ముందుకు వెళితే వారే చీపుర్లు, గరిటెలతో మీకు అన్ని పండగలు చేస్తారు. మహిళల భద్రతను గాలికొదిలేశారు. రైతులను అప్పుల ఊబిలోకి నెట్టారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు’ అని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సుపరిపాలన కాదని.. ప్రజలు తప్పుడు హామీలకు మోసపోయారని కల్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.భీమిలి నియోజకవర్గంలో భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. భీమిలి వుడా మినీ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పోలీస్స్టేషన్, మెయిన్ రోడ్డు, గంట స్తంభం మీదుగా నూకాలమ్మ ఆలయం వరకు ర్యాలీ సాగింది. అక్కడ వేదిక వద్ద శ్రీనివాసరావు ప్రసంగించారు. అనంతరం భీమిలిలోని ఆర్డీవో కార్యాలయంలో ఏవో మనోరంజినికి వినతిపత్రం సమర్పించారు. ఈ నిరసన ర్యాలీకి నియోజకవర్గం నలుమూలల నుంచి వందలాది ఆటోలు, 100 కార్లు, 1000 బైక్లతో భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చారు. జెడ్పీ వైస్ చైర్మన్ సుంకరి గిరిబాబు, ముఖ్య నేతలు దాట్ల పెదబాబు, చెన్నాదాస్, ఎంపీపీలు దంతులూరి వాసురాజు, కె.రాంబాబు, మజ్జి వెంకట్రావ్, పోతిన హనుమంతురావు, అక్కరమాని రామునాయుడు, గండిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
Vennupotu Dinam: నిరసన హోరు
జిల్లాలో వెన్నుపోటు దినాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసనలతో బుధవారం జిల్లా , నియోజకవర్గ కేంద్రాల్లో కదం తొక్కారు. పోలీసుల బెదిరింపులు, హెచ్చరికలు, నిషేధాలు పక్కనపెట్టి హామీలు అమలు చేయాలని కార్యకర్తలు గర్జించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో వైఎస్సార్సీపీ శ్రేణులు జెండాలతో దండులా కదిలివచ్చింది. ఎక్కడికక్కడ బారికేడ్లను ఛేదించుకొని నిరసనలకు కదిలివచ్చారు. ఉవ్వెత్తున కార్యకర్తలు తరలిరావడంతో ఆయా ప్రాంతాల్లో నిరసన హోరుతో దద్దరిల్లింది.చిత్తూరు అర్బన్ : హామీల పేరిట ప్రజలను దగా చేసి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టేలా వెన్నుపోటు దినం నిర్వహించారు. మండు టెండను లెక్కచేయని జగనన్న సైన్యం రోడ్డెక్కి కూటమి సర్కారు మోసాన్ని ఎండగట్టింది. వేల మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వెన్నుపోటు దినంతో ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేసి హామీల అమలుపై ప్రభుత్వ తీరును తూర్పారబట్టింది. ∙చిత్తూరులో జరిగిన నిరసనలో సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. అమూల్ డెయిరీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీసుల ఆంక్షలను ఏమాత్రం లెక్కచేయలేదు. పార్లమెంటు పరిశీలకులు చువ్వా రాజశేఖర్రెడ్డితో కలిసి కలెక్టర్ సుమిత్కుమార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, నాయకులు కెపి.శ్రీధర్, జగదీ‹Ù, గాయత్రీదేవి, లీనారెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి, విజయసింహారెడ్డి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ∙పుంగనూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక శాసన సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా హాజరు కావడంతో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు వెన్నుపోటు దినంలో కదంతొక్కారు. పాత బస్టాండు, పోలీస్ స్టేషన్, గోకుల్ సర్కిల్, అంబేడ్కర్ కూడలి వరకు నిరసన కార్యక్రమం నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, నాయకులు పెద్దిరెడ్డి, ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి , అనూషారెడ్డి, పోకల అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. నగరిలో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే గంగాధర నెల్లూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులకు నిరసనకు దిగారు.ఈకార్యక్రమంలో సమన్వయకర్త కృపాలక్షి్మ, మండల కనీ్వనర్లు పాల్గొన్నారు. అలాగే కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో వెన్నుపాటు నిరసనలకు కదం తొక్కారు. ఇక పలమనేరులో సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ , జెడ్పీ చైర్పర్సన్ శ్రీనివాసులుతో కలిసి పలమనేరు సెంటర్లో వెన్నుపోటు నిరసన కార్యక్రమం హోరెత్తించారు. రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి, మండల కన్వీనర్లు పాల్గొన్నారు. పూతలపట్టులో మాజీ ఎమ్మెల్యే డా.సునీల్కుమార్ ఆధ్వర్యంలో బంగారుపాళ్యం తహసీల్దార్ కార్యాలయం వద్ద వెన్నుపోటు దినం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, పార్టీ నేతలు కుమార్రాజా, ధనంజయరెడ్డి, బుజ్జిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోసమే బాబు నైజం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు హామీలివ్వడం, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మోసగించడం చంద్రబాబు నైజం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగభృతి, ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏడాది అవుతున్నా ఇచ్చిన దాఖలాలు లేవు. – రాజశేఖర్రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ పరిశీలకులు ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కూటమి ప్రభుత్వం సిగ్గులేకుండా ఏడాది పండుగ నిర్వహిస్తోంది. ప్రజల్లో ఏడాది తిరగకుండానే తిరుగుబాటు మొదలయింది. నాణ్యమైన మద్యం, తక్కువ ధరలకు అందిస్తామని ఎరగా చూపి చంద్రబాబు ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు అంతా మద్యం కుంభకోణమే నడుస్తోంది. కూటమి పాలనకు తెరపడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. – నారాయణస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రజలు నిలదీసే రోజులు వస్తాయి 30 యాక్టు అమల్లో ఉందని, కేసులు పెడతామనే బెదిరింపులు, పోలీసుల హెచ్చరికలను కార్యకర్తలు లెక్కచేయలేదు. కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయాలి. హామీల నుంచి పాలకులు తప్పించుకోలేరు. ప్రజలే నిలదీసే రోజులు త్వరలో వస్తాయి. – భరత్ , ఎమ్మెల్సీ, కుప్పం అప్పులు తీసుకురావడమే సంపద సృష్టా? సంపద సృష్టించడమంటే ప్రతి మంగళవారం అప్పు లు తీసుకురావడమేనా..? పోలీసులు 110 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినా ..వేల సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. గతంలో గగ్గోలు పెట్టిన పెద్దలు ఇప్పుడు అప్పులు చేయడం దేనికో ప్రజలకు చెప్పాలి. ఏడాదిలో ఒక్క హామీ అమలు చేయలేదు. – వెంకటేగౌడ, మాజీ ఎమ్మెల్యే పలమనేరు -
వంచనపై గర్జన
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, మైదుకూరు, కమలాపురం, బద్వేల్, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో “వెన్నుపోటు దినం’ కార్యక్రమం బుధవారం భారీ ఎత్తున నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ఆందోళనకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినా దాలు చేశారు. సీఎం చంద్రబాబు వ్యవహారశైలిపై వైఎస్సార్సీపీ నేతలు నిప్పులు చెరిగారు. ఆన్గోయింగ్ ప్రాజెక్టులను కూడా కొనసాగించకుండా దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఒరిగింది శూన్యమని చంద్రబాబు ఏడాదికే విఫలమయ్యారని ఆరోపించారు. అనంతరం ఆయా ప్రాంతాల్లోని అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. వైఎస్సార్ కడప జిల్లా కేంద్రమైన కడపలో జిల్లా పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈర్యాలీ కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ కూడలి, ఏడురోడ్ల కూడలి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరింది. ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో ఏఓ శంకరయ్యకు వినతి పత్రం సమరి్పంచారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాకా సురేష్ పాల్గొన్నారు. పులివెందుల పట్టణంలో ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి జనం పోటెత్తారు. కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీ‹Ùరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాత ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మెయిన్ రోడ్డు మీదుగా పాత ఆర్టీసీ బస్టాండు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకూ చేరింది. అనంతరం ఆర్డీఓ వెంకటేశంకు వినతి పత్రం సమరి్పంచారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో అతిపెద్ద ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తి సర్కిల్ నుంచి మొదలైన ఈ ర్యాలీ శ్రీరాములుపేట మీదుగా మున్సిపల్ కార్యాలయానికి చేరింది. అనంతరం కమిషనర్ మల్లికార్జునకు వినతి పత్రం సమర్పించారు. మున్సిపల్ ఛైర్పర్సన్ లక్షి్మదేవి, మాజీ ఆప్కాబ్ ఛైర్పర్సన్ మల్లేల ఝాన్సీ, పార్టీ నేతలు పోరెడ్డి నరసింహారెడ్డి, కల్లూరు నాగేంద్రారెడ్డి, కోనేటి సునంద తదితరులు పాల్గొన్నారు. మైదుకూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోరుమామిళ్ల రోడ్డు నుంచి ప్రారంభమైన ర్యాలీ అంకాలమ్మ దేవాలయం మీదుగా ఎంపీడీఓ కార్యాలయం వరకూ సాగింది. అక్కడ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మెన్ రామగోవిందరెడ్డి, మాజీ ప్రభుత్వ సలహాదారు ఇరగంరెడ్డి తిరుపాల్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. బద్వేల్ పట్టణంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్జీవో కాలనీలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నాలుగురోడ్ల కూడలి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకూ సాగింది. అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఏఓ ఉదయభారతికి వినతి పత్రం సమరి్పంచారు. విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యరెడ్డి, మున్సిపల్ ఛైర్మెన్ రాజగోపాల్రెడ్డి, కుడా మాజీ ఛైర్మెన్ గురుమోహన్ తదితరులు పాల్గొన్నారు. జమ్మలమడుగు పట్టణంలో ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పోచంరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం నుంచి మొదలైన ఈ ర్యాలీ నారాపురం దేవాలయం, తేరు రోడ్డు, పెద్ద పసుపుల మోటు, సంజామల మోటు, ఎస్బీఐ, పాతబస్టాండు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకూ సాగింది. అక్కడ ఆర్డీఓ సాయిశ్రీ కి వినతి పత్రం సమరి్పంచారు. అలాగే యర్రగుంట్లలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సు«దీర్రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం సమరి్పంచారు. ఆయా పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల నేతలు హృషికేశవరెడ్డి, రఘునాథరెడ్డి, లక్ష్మయ్య పాల్గొన్నారు. కమలాపురం పట్టణంలోని ఖాజీపేట రోడ్డులో ఉన్న గయాజ్ ఫిల్టింగ్ స్టేషన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ వైఎస్సార్సీపీ కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి పోచంరెడ్డి నరేన్ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శివరామిరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ ఛైర్మెన్ బాలయ్య, మండల పార్టీ అధ్యక్షులు ఉత్తమారెడ్డి, వీరారెడ్డి, జీఎన్ భాస్కర్రెడ్డి, రమణారెడ్డి, ప్రభాకర్రెడ్డి, రఘునాథరెడ్డి, మాజీ ప్రభుత్వ సలహాదారు సంబటూరు ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోసం గ్యారంటీ అని రుజువు చేశారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కటీ అమలు చేయలేదు. సూపర్సిక్స్ పేరుతో ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోనికి వచ్చాక వాటి అమలు మరచిపోయారు. బాబు ష్యూరిటీ– భవిష్యత్తుకు గ్యారంటి అని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ అంటూ రుజువు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్షా 75 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అమరావతి అభివృద్ధి అంటూ టెండర్లు ప్రక్రియ ప్రారంభించి కమీషన్ రూపంలో కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. ఎంత మంది పిల్లలు చదివితే అందరికీ తల్లికి వందనం అన్నారు. ఇప్పటి వరకు వేయకుండా తల్లులకు వెన్నుపోటు పొడిచారు. ఆడబిడ్డ పథకం ఊసేలేదు. , రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ. 20 వేలు ఇస్తామన్నారు. అదీ లేదు. నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేలు అన్నారు. వాలంటీర్లకు నెలకు పదివేల ఇస్తామన్నారు. ఇంత వరకు ఈ పథకాలను అమలు చేయకుండా ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచారు. మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ప్రజలందరికీ వెన్నుపోటు పొడవడం నైజంగా మారింది. పథకాలు అమలు చేయలేక కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. – పి.రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రైతులను నిండా ముంచారు.. రైతులు పంటలకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సు ఇవ్వలేదు. చంద్రబాబు , పవన్ కల్యాణ్, బీజేపీ కూటమి ఇచ్చిన హామీలను మరచిపోయారు. జమ్మలమడుగు లో దాలి్మయా పరిశ్రమ వల్ల మూడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి ఆ గ్రామాల ప్రజలకు న్యాయంజరిగిన తర్వాతే దాలి్మయా రెండోప్లాంట్ ప్రారంభం అవుతుందని ప్రజాభిప్రాయ సేకరణకు ముందు గ్రామాల్లో తిరిగి చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణలో మాట మార్చి సిమెంట్ పరిశ్రమకు మద్దతు పలికి గ్రామ ప్రజలను మోసం చేశారు. కూటమి నేతలు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోనికి రాగానే వాటిని తుంగలోతొక్కారు. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజల తరపున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. – రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీవెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు సూపర్ సిక్స్ హామీలతోపాటు 143 హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, ప్రజలను వెన్నుపోటు పొడవటం పెద్ద లెక్కకాదు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు. ముస్లిం మైనారీ్టలకు అన్యాయం చేసే వక్ఫ్ బిల్లుకు బాబు మద్దతిచ్చి మోసం చేశారు. హామీలు పక్కనబెట్టి అక్రమ కేసులు బనాయిస్తూ.. అరాచక పాలన చేస్తున్నారు. చిన్నారులపై , మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. అభివృద్ధిని పక్కనబెట్టి రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. కచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. – అంజద్బాషా, మాజీ డిప్యూటీ సీఎం ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టారు గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజలకు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టారు. ఏడాది పాలన నుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికే కడపలో మహానాడు నిర్వహించారు. మహానాడు సందర్భంగానైనా ఈ జిల్లాకు ఏం చేస్తారో చెప్పలేదు. బిర్యానీ ప్యాకెట్లు, మద్యం, నగదు ఇచ్చి జనాన్ని మహానాడుకు తరలించారు. మేము నిర్వహిస్తున్న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కనపెట్టి కూటమి నేతలు అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారు. – సురేష్ బాబు, కడప మేయర్ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలేదీ.. ? కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రూ.3 వేలు హామీల సంగతి ఏమైంది. ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లకు బకాయి ఉన్న 4 డీఏలను విడుదల చేసి పీఆర్సీ వేసి, ఐఆర్ ఇవ్వాలి. గత ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ పంపిణీ చేయగా, ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి మళ్లీ ప్రజలను క్యూ లైన్లలో నిలబెడుతూ ఇబ్బందులు పెడుతోంది. – ఎంవీ రామచంద్రారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ -
పెల్లుబికిన ప్రజా వ్యతిరేకత
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏడాదిగా టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను నిలదీస్తూ బుధవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో నిర్వహించిన నిరసన ర్యాలీలకు ప్రజలు ఉప్పెనలా కదలివచ్చి, కదంతొక్కి విజయవంతం చేయడంపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నిరసన ర్యాలీలను విజయవంతం చేసిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను అభినందిస్తూ.. కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘సరిగ్గా ఏడాది క్రితం, జూన్ 4న చంద్రబాబు నాయుడు గొప్ప వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారు. కానీ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా తనను నమ్మిన ప్రజలకే ద్రోహం చేశారు. మోసపు హామీలు, ఆయన తప్పుడు ప్రకటనలతో ప్రజలకు వెన్నుపోటు పొడవడం ద్వారా రాష్ట్రాన్ని నిరాశ, నిస్పృహల్లోకి నెట్టారు. అందుకే జూన్ 4ను మనం వెన్నుపోటు దినంగా పాటించాలని పిలుపునిచ్చాం. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ర్యాలీల్లో అన్ని వర్గాల ప్రజలు ఉప్పెనలా కదలివచ్చి.. తమ వేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది కేవలం నిరసన కాదు. అబద్ధాలు చెప్పి మోసం చేస్తే మౌనంగా ఉండబోమంటూ శక్తివంతమైన సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ నిరసన ద్వారా చాటిచెప్పారు. మోసపోయిన ప్రజల బాధ, నిరాశ, ఆగ్రహం, పెల్లుబుకుతున్న వ్యతిరేకతను ఈ ర్యాలీలు ప్రతిబింబించాయి. ప్రజల హక్కులు, న్యాయం, గౌరవం కోసం వైఎస్సార్సీపీ ఎప్పుడూ జనంతో కలిసి పోరాడుతూనే ఉంటుంది. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజల తరఫున నిలదీస్తూ నిరసన ర్యాలీలను విజయవంతం చేసిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు నేను హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు. -
బాబు 'సూపర్ 6' వెన్నుపోటుపై తిరుగుబాటు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో సూపర్ సిక్స్ సహా 143 వాగ్దానాలతో నమ్మించి, ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నేతృత్వంలో ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. కూటమి ప్రభుత్వం కుట్రలు.. పోలీసుల ఆంక్షలను ఛేదించుకుని ఉప్పెనలా కదలివచ్చి బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’లో కదంతొక్కారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ.. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు.. అంటూ ప్లకార్డులు చేతబూని.. తక్షణమే హామీలు అమలు చేయాలని.. లేదా మోసం చేసిన సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీల్లో నినదించారు. అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించి.. తక్షణమే హామీలు అమలు చేయాలని కోరుతూ అధికారులకు వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ పత్రాలను అందజేశారు. ‘సూపర్ సిక్స్ పేరుతో మహిళలు, రైతులు, నిరుద్యోగులు.. ఇలా ప్రతి ఒక్కరికీ వెన్నుపోటు పొడిచావు. నువ్వు మోసం చేయని వర్గం అంటూ ఉందా బాబూ? వైఎస్ జగన్ ఇస్తున్న పథకాలన్నింటినీ ఎత్తేశావు.. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు.. శాంతి భద్రతలను నిర్వీర్యం చేశావు. ప్రశ్నించే గొంతులను నొక్కేయడానికి రెడ్బుక్తో టెర్రర్ సృష్టిస్తున్నావు.. ఇక చాలు మీ నిర్వాకం. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో తమ వాహనాలతో కూటమి ప్రభుత్వంపై నిరసన తెలుపుతున్న రేషన్ వాహనాల డ్రైవర్లు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలి’ అని ఊరూరా ప్రజలు డిమాండ్ చేశారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా నిరసన ర్యాలీలకు తండోప తండాలుగా జనం కదలి రావడమే కూటమి ప్రభుత్వంపై ఏడాదిలోనే పెల్లుబుకుతున్న ప్రజావ్యతిరేకతకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేíÙస్తున్నారు. శ్రీకాకుళం నుంచి శ్రీసత్యసాయి జిల్లా వరకూ 26 జిల్లాల్లోనూ వెన్నుపోటు దినం, నిరసన ర్యాలీలు గ్రాండ్ సక్సెస్ కావడంతో వైఎస్సార్సీపీ కదనోత్సాహాన్ని మరింతగా రగిల్చింది. ఆ పిలుపే ప్రభంజనమై.. సూపర్ సిక్స్ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి.. ఓట్లేయించుకుని చంద్రబాబు కూటమి విజయం సాధించి బుధవారం (జూన్ 4)తో సరిగ్గా ఏడాది పూర్తయింది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ప్రభుత్వం ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డ జూన్ 4ను వెన్నుపోటు దినంగా పాటించాలని.. కూటమి ప్రభుత్వ మోసాలను నిలదీస్తూ అన్ని నియోజకవర్గాల్లో నిరసన తెలుపుతూ ర్యాలీలు నిర్వహించి, తక్షణమే హామీలు అమలు చేయాలని అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన పథకాల బోర్డులను ప్రదర్శిస్తూ నెల్లూరు సిటీలో నిరసన తెలుపుతున్న ప్రజలు అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. జగన్ పిలుపు ప్రభంజనమై.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కడానికి సిద్ధమవుతున్నారని గ్రహించిన కూటమి ప్రభుత్వం దాన్ని విఫలం చేయడానికి కుట్రలు చేసింది. వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం–నిరసన ర్యాలీలను అడ్డుకోవడానికి యధావిధిగా రెడ్ బుక్తో భయానక వాతావరణం సృష్టించేందుకు విఫలయత్నం చేసింది. గుంతకల్లు ప్రశ్నించే గొంతును నొక్కేయడానికి పోలీసులను ఉసిగొల్పింది. బుధవారం ఉదయమే అనేక ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతల ఇళ్ల వద్దకు చేరుకున్న పోలీసులు వారిని హౌస్ అరెస్టు చేశారు. మాచర్లలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని దిగ్బంధించిన పోలీసులు.. బయటకు వస్తే కేసులు పెడతామని నాయకులు, కార్యకర్తలను తీవ్ర స్థాయిలో బెదిరించారు. గుంటూరులో నిరసన ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు దౌర్జన్యం చేశారు. కూటమి కుట్రలు.. పోలీసుల ఆంక్షలను చిత్తు చేస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జనం కదం తొక్కారు. -
భద్రతకు ‘డ్యామే’జ్
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందని సాగు నీటిరంగ నిపుణులు, అధికారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రాజెక్టు భద్రతకు తక్షణం చేపట్టాల్సిన చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీఅథారిటీ(ఎన్డీఎస్ఏ) సిఫార్సులను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ప్లంజ్పూల్(భారీ గొయ్యి) స్పిల్ వైపు విస్తరించకుండా ఏప్రాన్కు చివరన వేసిన కాంక్రీట్ సిలిండర్లు వరద ఉద్ధృతికి ధ్వంసమయ్యాయి. వరద వచ్చేలోగా వాటిని పునరుద్ధరించాలని ఎన్డీఎస్ఏ పదేపదే సూచించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. స్పిల్ వే గ్యాలరీల్లో లీకేజీలకు అడ్డుకట్టవేయడానికి గ్రౌటింగ్ చేయాలన్న సూచననూ బుట్టదాఖలు చేసింది. ఇక ప్రాజెక్టుకు శాశ్వత భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై తీవ్ర జాప్యం చేస్తూ వస్తోంది. ఎన్డీఎస్ఏ చైర్మన్ అసహనం ప్రాజెక్టు భద్రతపై ఈ ఏడాదిమార్చి 6న ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్.. మే 31లోగా ప్లంజ్ పూల్, స్పిల్ వేకు మరమ్మతులు చేయాలని ఏపీ జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. గత నెల 28–29న శ్రీశైలం ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అనిల్ జైన్ తక్షణం చేపట్టాల్సిన మరమ్మతులు చేయకపోవడాన్ని ఆక్షేపించారు. వరద వచ్చేలోగా ఏప్రాన్కు చివరన ధ్వంసమైన కాంక్రీట్ సిలిండర్లను పునరుద్ధరించాలని.. స్పిల్ వే గ్యాలరీల్లో లీకేజీలను అడ్డకట్ట వేయడానికి గ్రౌటింగ్ చేయాలని ఆదేశించారు. ప్లంజ్ పూల్ను శాశ్వతంగా పూడ్చడానికి.. ప్రాజెక్టుకు శాశ్వతంగా మరమ్మతులు చేయడానికి చేయాల్సిన అధ్యయనాలపై సూచనలు చేశారు. కానీ.. ప్రభుత్వం ఆ పనులను చేపట్టలేదు. వర్షాకాలం ముంచుకొస్తున్న నేపథ్యంలో స్పిల్ వే దిగువన రోడ్డు, కుడి గట్టు పనులకు రూ.25 కోట్లు.. కుడి వైపు, ఎడమ వైపు కొండవాలు జారకుండా షార్ట్ క్రీటింగ్ చేయడానికి రూ.5.90 కోట్లు వెరసి రూ.31.40 కోట్లు మంజూరు చేస్తూ గురువారం సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పనులకు టెండర్లు పిలవాలని కర్నూల్ సీఈని ఆదేశించడం గమనార్హం. 2009 వరదకు భారీ నష్టం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం 1963లో ప్రారంభమై 1984లో పూర్తయింది. 1975–76లో ప్రాజెక్టు స్పిల్ వే దిగువన గేట్ల నుంచి వరద ప్రవాహం పడే(బకెట్) ప్రాంతం కోతకు గురై భారీ గుంత(ప్లంజ్ పూల్) ఏర్పడినట్లు అప్పట్లో నిపుణుల కమిటీ గుర్తించింది. ఆ కమటీ సూచన మేరకు ఎప్రాన్ను నిర్మించినా ఫలితం కనిపించలేదు. మళ్లీ ఆ కమిటీ సూచన మేరకు 1984–85లో ఎప్రాన్కు రక్షణగా కాంక్రీట్ సిలిండర్లతో కటాప్ వేశారు. అది కూడా వరద ఉద్ధృతికి కోతకు గురైంది. కృష్ణా నదికి 19 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించారు. కానీ.. 2009, అక్టోబర్ 2న ఏకంగా 25.5 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 271.8 మీటర్లు కాగా, వరదల సమయంలో 273.25 మీరట్లకు పెరిగిపోవడంతో స్పిల్ వే గేట్లపైన వరద ప్రవాహం ప్రవహించింది. ఈ బీకర వరద 78 గంటలపాటు పోటెత్తడంతో ప్లంజ్ పూల్ మరింత పెద్దగా మారింది. ప్రాజెక్టు స్పిల్వే దిగువన ఏప్రాన్ నుంచి 50 మీటర్ల నుంచి 220 మీటర్ల దూరంలో 120 మీటర్ల లోతుతో ప్లంజ్ పూల్ విస్తరించింది. ఈ భారీ ప్లంజ్ పూల్ స్పిల్వే పునాది దిగువకు విస్తరిస్తోందేమోనని ఎన్డీఎస్ఏ కమిటీ అనుమానం వ్యక్తం చేసింది. -
హృదయం అద్దమనీ.. పగిలితే అతకదనీ..
ఇష్టమైన వ్యక్తి చనిపోతే చూసి తట్టుకోలేక గుండె పట్టుకొని కూలిపోవడం వంటి దృశ్యాలు సినిమాల్లో చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటి ఘటనలు నిజ జీవితంలో జరిగేవే అంటున్నారు వైద్య నిపుణులు. నిజ జీవితంలోనూ ప్రియమైన వ్యక్తుల అకాల మరణం, అనారోగ్యం పాలైన విషయం తెలుసుకున్న సందర్భాల్లో తీవ్ర ఒత్తిడి, దుఃఖం, ఆవేదన వెంటాడతాయని, ఇలాంటి ప్రతికూల భావోద్వేగాలు గుండె పనితీరుపై ప్రభావం చూపుతాయి. ఈ పరిస్థితినే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అని పిలుస్తారని వారంటున్నారు. ఇంతకీ బ్రోకెన్ హార్ట్ అంటే ఏంటి? దాని పరిణామాలు మనిషి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? - సాక్షి, అమరావతిటకోట్సుబో కార్డియో మయోపతి.. బ్రోకెన్ హార్ట్ ను వైద్య పరిభాషలో టకోట్సుబో కార్డియో మయోపతిగా పేర్కొంటారు. సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య అధికం. అయితే మరణాల విషయంలో మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే రెట్టింపు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయమై ఇటీవల అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఓ జర్నల్ను ప్రచురించింది. 1.99 లక్షల మంది రోగులపై అధ్యయనం 2016–2020 మధ్యలో అమెరికాలో 1,99,890 బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ మరణాలు సంభవించాయి. వీటిపై పరిశోధకులు సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఈ క్రమంలో పురుషుల్లో మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. మొత్తం మరణాల రేటు 6.5 శాతంగా నమోదుకాగా, పురుషుల్లో 11.2, మహిళల్లో 5.5 శాతం మరణాలు సంభవించాయని అధ్యయనంలో వెల్లడించారు. ఆ వయస్కులవారికే అధికం సాధారణంగా బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ ప్రభావం 61 ఏళ్లు పైబడినవారిపైనే అధికం. 31–45 సంవత్సరాల వయసు గల వారితో పోలిస్తే 46–60 సంవత్సరాల వారిలో సమస్య 2.6 నుంచి 3.25 రెట్లు ఎక్కువ. టకోట్సుబో కార్డియో మయోపతి అనేది ప్రతికూల భావోద్వేగం, తీవ్రఒత్తిడితో కూడిన గుండె జబ్బు అని పరిశోధకులు వెల్లడించారు. సమస్య తలెత్తితే.. బ్రోకెన్ హార్ట్ కారణంగా..గుండెలో కొంత భాగం తాత్కాలికంగా పెద్దదిగా మారుతుంది. రక్త ప్రసరణ నిలిచిపోతుంది. గుండె దడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కనిపిస్తాయి.భావోద్వేగ మద్దతు అవసరం కావాల్సినవాళ్లు, అత్యంత ఆప్తులు దూరమైన సందర్భాల్లో కొందరు తీవ్ర భావోద్వేగానికి గురవుతుంటారు. అలాంటి సందర్భాల్లో కొన్ని సార్లు గుండెపోటు సంభవిస్తుంది. ఇలాంటివారికి భావోద్వేగపరమైన మద్దతు అందించాలి. ఒత్తిడి నుంచి బయటపడేలా సహకారం అందించాలి. – డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సల నిపుణుడు, జీజీహెచ్, కర్నూలు -
విదేశాల్లోనూ వెన్నుపోటు దినం విజయవంతం
సాక్షి, అమరావతి/జి.కొండూరు: ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వంపై తొలి ఏడాదిలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకత వచ్చిందని, వైఎస్సార్సీపీ పిలుపునిచ్చిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో ఇది సుస్పష్టంగా కనిపించిందని ఆ పార్టీ యూకే కమిటీ కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింతా తెలిపారు. 30 ఏళ్లుగా చంద్రబాబు ఇలాగే ఎన్నికల సమయంలో మోసపు మాటలతో అమాయక తెలుగు ప్రజలను వంచిస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు విదేశాల్లోనూ వెన్నుపొటు దినం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ యూకే కమిటీ ఆధ్వ ర్యంలో బుధవారం లండన్లో డా.ప్రదీప్ చింతా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అభిమానులు కదంతొక్కారు. లెస్టర్లో వైఎ స్సార్సీపీ యూకే కమిటీ కో కన్వీనర్ చలపతి సర్ప ఆధ్వ ర్యంలో.. నల్ల చొక్కాలు ధరించి, ప్లకార్డులతో నిరసన తెలిపారు.ఈస్ట్ లండన్లో వైఎస్సార్సీపీ యూకే కమిటీ కో కన్వీనర్ మలిరెడ్డి కిషోర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి ఎన్ఆర్ఐల నుంచి విశేష స్పందన లభించింది. ‘‘నీకు రూ.15 వేలు నీకు రూ.15 వేలు ఏదీ’’, ‘‘ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు ఎక్కడ?’’, ‘‘50 ఏళ్లకు పెన్షన్ ఏది బాబూ?’’ ‘‘రెడ్బుక్ రాజ్యంగంతో అంబేడ్కర్ రాజ్యాంగానికి తూట్లు’’, ‘‘ఉచిత బస్సు తుస్సు, ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 అన్నావ్.. ఆడపడుచులనూ మోసం చేశావ్..’’ అంటూ ప్లకార్డులతో నినాదాలుచేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున తరలివచ్చి విజయంతం చేశారు. జేబులు నింపుకోవడమే కూటమి కార్యక్రమంకూటమి ప్రభుత్వం గద్దెనెక్కి సంవత్సరం పూర్తి అయినా ఏ ఒక్క హామీని కూడా అమలుచేయకుండా కూటమి నేతల జేబులు నింపుకొనే కార్యక్రమం చేపట్టిందని ప్రదీప్ చింతా దుయ్యబట్టారు. వికలాంగుల పింఛను నుంచి రైతన్నలకు అందించే సాయం వరకు, మహిళలకు ఫ్రీ బస్సు నుంచి తల్లికి వందనం వరకు ఏ ఒక్క హామీని నెరవేర్చక కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మలిరెడ్డి కిషోర్రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తర్వాత పథకాలను అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వమేనన్నారు.ఎన్నికల ప్రచార సభల్లో ఒకరికి ముగ్గురు చొప్పున బాబు, పవన్, పురందరేశ్వరి చెప్పిన అబద్ధాన్ని పదేపదే చెప్పి ప్రజలను మోసం చేసి అధికారాన్ని చేపట్టి హామీలను నెరవేర్చకుండా ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతున్నారని చలపతి సర్ప విమర్శించారు. కార్యక్రమంలో చల్లా మధు సూదన్ యాదవ్, ప్రణయ్ గడిమే, ఆనంద్ అక్కి దాసు, రామిరెడ్డి జయచంద్రారెడ్డి, చలపతి గుర్ర, యశ్వంత్ గరికపాటి, సాయి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. అట్లాంటాలో వెన్నుపోటు దినంసీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలికి వదిలేసిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐలు, వైఎస్సార్ అభిమానులు, వైఎస్ జగన్ అభిమానులు అమెరికాలోని అట్లాంటాలో బుధవారం వెన్నుపోటు దినం నిరసనను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ ‘‘2019–24 మధ్య ఏ రంగంలోనైనా సమస్య ఏర్పడినప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం తక్షణం స్పందించింది. నిరంతరం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి చురుగ్గా నడిపించారు. సమస్యలను పరిష్కరించే దాక విశ్రమించలేదు. కూటమి ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచనే చేయడం లేదు. ఎక్కడా ప్రజా సమస్యల గురించి మాట్లాడటం, వాటి పరిష్కారాన్ని చూపే ప్రయత్న చేయడం లేదు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు’’ అని విమర్శించారు. కార్యక్రమంలో వెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, బలరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్సీ అభ్యర్థులకు గడువు గుబులు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో ఊరించి ప్రకటించిన డీఎస్సీ పరీక్షలు ఉపాధ్యాయ అభ్యర్థులను కలవరపెడుతున్నాయి. నోటిఫికేషన్ తర్వాత పరీక్షలకు సిద్ధమయ్యేందుకు 90 రోజుల గడువు ఇస్తామని చెప్పిన పాలకులు కేవలం 45 రోజుల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సిలబస్ పూర్తిగాక పరీక్షార్థులు ఆందోళనకు గురవుతున్నారు. గతంలోనూ గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేస్తామని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇది నమ్మి ఊపిరి పీల్చుకున్న అభ్యర్థులను షాక్కు గురిచేస్తూ మరుసటి రోజే మెయిన్స్ నిర్వహించారు. దీంతో వేల మంది అభ్యర్థులు నష్టపోయారు. ఇదే ఫార్ములాను ఇప్పుడు కూటమి సర్కారు డీఎస్సీ పరీక్షలకూ అనుసరించింది. దీంతో పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 3,35,401 మంది సిలబస్ పూర్తిగాక, గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 2024 ఫిబ్రవరిలో ఇచ్చిన 6100 పోస్టుల నోటిఫికేషన్ను రద్దు చేసి, మెగా డీఎస్సీ ఇస్తున్నామని కూటమి ప్రభుత్వం అభ్యర్థులకు హామీ ఇచ్చింది. అలాగే సీఎంగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకాన్ని 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఫైల్పై చేశారు. అంతేగాక, వెంటనే నోటిఫకేషన్ ఇచ్చి డిసెంబర్లో పోస్టింగ్స్ కూడా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఆ తర్వాత పలు రూపాల్లో వాయిదాలపై వాయిదాలతో సుమారు ఏడాదిదాకా సాగదీశారు. అంధకారంలోకి అభ్యర్థుల జీవితాలు ఇంతగా కాలయాపన చేసిన కూటమి ప్రభుత్వం ఏప్రిల్ 20న నోటిఫికేషన్ ఇచ్చి అనేక మెలికలు పెట్టింది. ప్రధానంగా 50 శాతం అర్హత మార్కుల నిబంధన విధించి 3 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అర్హతను నిర్దయగా కోల్పోయేలా చేసింది. 50 శాతం మార్కుల అర్హత పై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం కంటితుడుపు చర్యలు చేపట్టింది. ఎస్జీటీ నుంచి పీజీటీ పోస్టుల వరకు రిజర్వుడు కేటగిరీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థుల అర్హత మార్కులను 45 శాతం నుంచి 40 శాతానికి తగ్గించారు.టెట్ అర్హత మార్కుల ప్రకారం ఈ మార్పు చేసినట్టు చెప్పుకొచ్చారు. అయితే, ఇదే వరుసలో ఉన్న జనరల్ అభ్యర్థుల అర్హత కనీసం మార్కులను మాత్రం 50 శాతం అలాగే ఉంచారు. వాస్తవానికి టెట్కు జనరల్ అభ్యర్థుల అర్హత మార్కులు 45 శాతం ఉన్నా ఆమేరకు మార్పు చేయలేదు. దీంతో ఏళ్ల తరబడి డీఎస్సీ కోసం కసరత్తు చేస్తున్న అభ్యర్థుల భవిష్యత్ను, ఆశలను అంధకారంలోకి ప్రభుత్వం నెట్టేసింది.గతంలో జరిగిన డీఎస్సీ పరీక్షలకు ఇలాంటి నిబంధనలు లేవు. కేవలం కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసిన డీఎస్సీ–2025లోనే ఈ పరిస్థితి తీసుకురావడం ఉద్దేశపుర్వకంగానే చేశారని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. టెట్ రాసేటప్పుడే ఈ నిబంధన విధించి ఉంటే సమస్య ఉండేది కాదని, కూటమి ప్రభుత్వం తమ భవిష్యత్ను నాశనం చేసిందని వాపోతున్నారు. ప్రణాళికాబద్ధంగా మోసంప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులనూ భర్తీ చేస్తామని, 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఆరు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గతేడాది జూన్ నెలలో ప్రకటించింది. అనంతరం అదే సమయంలో డీఎడ్, బీఎడ్ పూర్తిచేసిన అభ్యర్థుల కోసం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలని జూలై నెలలో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి డీఎస్సీ నిర్వహిస్తామని ప్రచారం చేశారు. దీనిప్రకారం ఆగస్టులో డీఎస్సీ నోటిఫికేషన్ రావాలి. తర్వాత టెట్కు, డీఎస్సీకి మధ్య 3 నెలల వ్యవధి ఉండాలని పేర్కొంది. దీని ప్రకారం సెప్టెంబర్లో నిర్వహించాల్సిన టెట్ ను అక్టోబరులో జరిపిన ఫలితాలను ప్రకటించారు. టెట్ పూర్తయ్యాక డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి మూడు నెలల్లో పరీక్షలు పెట్టాలి. కానీ తొలుత నవంబర్ 3న డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. తర్వాత 6వ తేదీన నోటిఫికేషన్ అన్నారు. ఆరు నెలలుగా డీఎస్సీ నోటిఫికేషన్పై ప్రకటనలు చేసూ్తనే ఉన్నారు. నోటిఫికేషన్ ప్రకటించే ఒక్కరోజు ముందు పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది. ఎస్సీ వర్గీకరణతో ముడిపెట్టి నివేదిక వచ్చాక నోటిఫికేషన్ ఇస్తామన్నారు. -
ప్రైవేటుకు పాలధార
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి పాలనలో పాడి రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. పశుపోషణ భారంగా మారడం, పాల సేకరణ ధరలు తగ్గించడంతో నష్టాల్లో కూరుకుపోతున్నారు. వెన్న శాతం ఎంత ఉన్నా.. ప్రైవేటు డెయిరీలు నిర్దేశించిన ధరను మాత్రమే చెల్లిస్తూ అందినకాడికి దోచుకుంటున్నాయి. ఏడాదిగా గిట్టుబాటు ధరలేక, ప్రైవేట్ డెయిరీల ఆగడాలు తాళలేక జీవనాధారమైన పశు సంపదను అమ్ముకుని పాడి రైతులు ప్రత్యామ్నాయ వృత్తుల వైపు మళ్లుతున్నారు.అమూల్ను తరిమేసి.. ప్రైవేటుకు పట్టంప్రభుత్వ ఒత్తిళ్లు తట్టుకోలేక అమూల్ పాల సేకరణ నుంచి తప్పుకుంది. ఇప్పటికే 15 జిల్లాల్లో పాల సేకరణను నిలిపివేసింది. మిగిలిన జిల్లాల్లోనూ నామమాత్రపు పాత్రకే పరిమితమైంది. గతంలో అమూల్ సంస్థ రోజుకు 4 లక్షల లీటర్ల పాల సేకరణ చేయగా.. ప్రస్తుతం 40 వేల లీటర్లకు మించి జరగడం లేదు. గతంలో లీటర్కు సగటున గేదె పాలకు రూ.89, ఆవు పాలకు రూ.42 చొప్పున ధర లభించేది. ప్రస్తుతం ప్రైవేటు డెయిరీలు గేదె పాలకు లీటరుపై రూ.50 నుంచి రూ.60 మాత్రమే ఇస్తుండగా.. ఆవు పాలకు రూ.28 నుంచి రూ.32 చొప్పున మాత్రమే చెల్లిస్తున్నాయి.ప్రతి రైతుకు రూ.7,500 నుంచి రూ.15 వేల నష్టంఅనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ప్రతి పాడి రైతుకు సగటున 4 ఆవులుంటాయి. రోజుకు 40 నుంచి 80 లీటర్ల పాలను అక్కడి రైతులు సేకరణ కేంద్రాలకు పోస్తుంటారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం లీటర్కు రూ.6 నుంచి 10 మేర రోజుకు రూ.250 నుంచి రూ.500 చొప్పున నష్టపోతున్నారు. తద్వారా ప్రతి రైతుకు నెలకు రూ.7,500 నుంచి రూ.15,000 వరకు నష్టం వాటిల్లుతోంది. కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాడి రైతుకు సగటున 2నుంచి 5 వరకు గేదెలుంటాయి. సగటున ఒక్కో గేదె 8 లీటర్ల చొప్పున పాల దిగుబడి వస్తుంది. గతంతో పోలిస్తే లీటర్కు రూ.30 నుంచి రూ.40 చొప్పున రోజుకు ఒక్కో రైతుకు రూ.250 నుంచి రూ.350కు పైగా నష్టపోతున్నారు. నాడు క్షీర విప్లవంవైఎస్ జగన్ ప్రభుత్వం పాడి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలన్న సంకల్పంతో జగనన్న పాల వెల్లువ కేంద్రాలను 2020 అక్టోబర్లో ప్రారంభించింది. 19 జిల్లాలో 4,798 గ్రామాల నుంచి పాల సేకరణ జరిగేది. 4.75 లక్షల మంది నుంచి రోజుకు సగటున అమూల్ సంస్థ 3.95 లక్షల లీటర్ల పాలను సేకరించేది. అప్పట్లో ప్రైవేటు డెయిరీలు 10 శాతం వెన్న ఉండే లీటర్ ఆవు పాలకు రూ.25 నుంచి రూ.28, గేదె పాలకు రూ.56 నుంచి రూ.60 చొప్పున చెల్లించేవి. అమూల్ ప్రారంభంలోనే గేదె పాలకు (11 శాతం వెన్న, 9 శాతం ఎస్ఎన్ఎఫ్) లీటర్కు రూ.71. 47, ఆవు పాలకు (5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్ఎన్ఎఫ్) రూ.34.20 చొప్పున చెల్లించింది. ఆ తర్వాత వరుసగా 8 పర్యాయాలు ధరలు పెంచడంతో గతేడాది మే నాటికి గేదె పాలకు రూ.89.76, ఆవు పాలకు రూ.43.69 చొప్పున సగటు ధర చెల్లించేది. ఇలా 40 నెలల్లో గేదె పాలకు లీటర్పై రూ.18.29, ఆవు పాలపై రూ.9.49 చొప్పున పెంచడంతో లీటర్కు గేదె పాలపై రూ.15 నుంచి రూ.20, ఆవు పాలపై రూ.10నుంచి రూ.15 వరకు రైతుకు అదనంగా లబ్ధి చేకూరేది.మరోవైపు వెన్న, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని లెక్కగట్టి 10 రోజులకు ఒకసారి నేరుగా వారి ఖాతాలకు అదనంగా నగదు జమ చేసేవారు. ఫలితంగా గేదె పాలకు లీటర్కు రూ.112, ఆవు పాలకు లీటర్కు రూ.53.86 చొప్పున గరిష్ట ధర లభించింది. దీంతో ప్రైవేట్ డెయిరీలు అమూల్ పోటీని తట్టుకోలేక గేదె పాలపై లీటర్కు రూ.14, ఆవు పాలపై రూ.7 వరకు సేకరణ ధర పెంచక తప్పలేదు. ప్రైవేట్ డెయిరీల దోపిడీ హద్దుమీరిందికూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమూల్ ప్రాజెక్టు అటకెక్కింది. ప్రైవేట్ డెయిరీల దోపిడీకి తెరలేచింది. ఒక్కొక్కటి రూ.లక్షకు పైగా వెచ్చించి కొనుగోలు చేసిన పశువులను రూ.50నుంచి రూ.60 వేలకు అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం నెలకు రూ.15 వేలు మిగలడం గగనంగా మారింది. – ఎన్.మురళీమోహన్రెడ్డి, మరిమిరెడ్డివారిపల్లె, అన్నమయ్య జిల్లా ప్రభుత్వం పట్టించుకోవడం లేదుమాకు మూడు పాలిచ్చే ఆవులున్నాయి. రెండు పూటలు కలిపి 20 లీటర్ల వరకు డెయిరీకి పాలు పోస్తున్నాం. గతంలో లీటర్కు రూ.35 నుంచి రూ.42 వరకు వచ్చేది. కానీ.. ఇప్పుడు లీటర్కు రూ.30 నుంచి రూ.33 ఇస్తున్నారు. ఈ నెల నుంచి మరో రూ.2 తగ్గుతుందంటున్నారు. పరిస్థితులు ఇలా ఉంటే పశుపోషణ ఏ విధంగా చేయగలం. డెయిరీలు రైతులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. పాల సేకరణ ధరలు తగ్గడమే తప్ప పెరగడం లేదు. ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. – భాస్కర్ నాయుడు, అనంతపురం, చిత్తూరు మండలం పాడిని వదులుకోవడం తప్ప మరో మార్గం లేదుమాకు మొత్తం ఐదు ఆవులుంటే.. ఇందులో పాలిచ్చేవి రెండున్నాయి. ఇవి రోజుకు 20లీటర్ల పాలు ఇస్తే.. డెయిరీకి పోస్తున్నాం. గతంలో డెయిరీలు లీటర్కు రూ.35 నుంచి రూ.40వరకు ఇచ్చేవి. 15 రోజులకు ఒకసారి బిల్లు చెల్లించేవారు. నెలకు రూ.30వేలకు పైగా ఆదాయం వచ్చేది. కానీ గతేడాది నుంచి పాల సేకరణ ధర తగ్గించేస్తూ వచ్చారు. ప్రస్తుతం లీటర్ పాల ధర రూ.22–30 మధ్య వస్తుంది. ఈ లెక్కన నెలకు రూ.15వేలకు మించి రావడం లేదు. దాణా ఖర్చులు పోనూ పెద్దగా మిగలడం లేదు. ఈ స్థాయిలో ధరలు తగ్గిస్తే పశు పోషణ ఎలా సాధ్యం? – ఎం వెంకటేశ్, తయ్యూరు, ఎస్ఆర్పురం మండలం, చిత్తూరు జిల్లా -
కన్నూమిన్నూకాన‘కొండ’..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తెలుగు తమ్ముళ్ల కన్నుపడితే కొండలు కూడా పిండైపోతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఆ పార్టీ నేతలు బరి తెగిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న 2014–19 మధ్య ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పెద్దాపురం సమీపాన ఏడీబీ రోడ్డులోని రామేశంమెట్ట కొండను తెలుగుతమ్ముళ్లు గుల్లచేసేశారు. నాడు దాదాపు మూడున్నరేళ్లు ఏకబిగిన రాత్రి, పగలు తేడా లేకుండా గ్రావెల్ మాఫియా రాజ్యమేలింది. రూ.కోట్లు కొల్లగొట్టింది. ఇంకా మిగిలి ఉన్న కొండను ఇప్పుడు టీడీపీ నేతలు, వారి అనుచరులు తవ్వేస్తున్నారు. మీకు సగం, నాకు సగం అంటూ పంపకాలు వేసుకుని మరీ సొమ్ము చేసుకుంటున్నారు.టీడీపీ, జనసేన కుమ్మక్కై..రామేశంమెట్టలో సర్వే నంబర్ 1 నుంచి 90 వరకూ 823 ఎకరాల్లో కొండలు ఉన్నాయి. 800 మంది నిరుపేద దళితుల స్వయం ఉపాధి కోసం 1975లో అప్పటి ప్రభుత్వం రామేశంమెట్టను కేటాయించింది. 2014–19 మధ్య ఈ కొండలపై టీడీపీ నేతల కళ్లు పడ్డాయి. అంతే పది పదిహేను అడుగుల లోతున తవ్వేసి దోచుకున్నారు. అప్పట్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి అప్పటి కేబినెట్లో ప్రాతినిధ్యం వహించిన కీలక మంత్రి కనుసన్నల్లో ఆయన బంధుగణం రామేశంమెట్ట కొండను గుల్ల చేసేసింది. రూ.కోట్లు కొల్లగొట్టింది. నిత్యం వందలాది టిప్పర్లు, లారీల్లో వేల టన్నుల గ్రావెల్ను జిల్లా సరిహద్దులు దాటించేయడం అప్పట్లో రాష్ట్ర స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. 2019లో అధికారం కోల్పోవడంతో ఆ తర్వాత ఐదేళ్ల పాటు ఆ మెట్టపై పెద్దగా కార్యకలాపాలు జరగలేదు. 2024లో మళ్లీ కూటమికి అధికారం దక్కడంతో ఇప్పుడు టీడీపీ, జనసేన నేతలు కుమ్మక్కై వాటాలు వేసుకుని మరీ మిగిలిన కొండను కొల్లగొడుతున్నారు.రోజుకు రూ.15 లక్షల వరకూ దోపిడీ..! కాకినాడ జిల్లా జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల సరిహద్దులో రామేశంమెట్ట ఉంది. ఈ రెండు నియోజకవర్గాలకు టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రామేశంమెట్ట కొండను పెద్దాపురం నియోజకవర్గం వైపు 2014–19 మధ్య అడ్డంగా తవ్వేశారు. మిగిలిన కొండను ఇప్పుడు తవ్వేస్తున్నారు. కొండకు రెండోవైపు ప్రాంతం జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోకి రావడంతో అక్కడ స్థానిక సంస్థలకు చెందిన ఒక ప్రజాప్రతినిధి గ్రావెల్ దందా నడిపిస్తున్నాడు. మెట్ట ప్రాంతంలోని ఒక ప్రజాప్రతినిధితో ఉన్న బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని రాత్రి, పగలు పదుల సంఖ్యలో టిప్పర్లతో గ్రావెల్ను తరలించేసి రామేశంమెట్ట కొండను గుల్ల చేసేస్తున్నారు. టిప్పర్లలో గ్రావెల్ తరలించేసి రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ తెలుగు తమ్ముళ్లు దోచుకుంటున్నట్టు సమాచారం.