Andhra Pradesh
-
తమిళనాడు సీఎం విజయ్కు వైఎస్ జగన్ ఫోన్
సాక్షి,గుంటూరు: తమిళనాడు సీఎం విజయ్కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ చేశారు.ఫోన్ సంభాషణలో సీఎం విజయ్తో.. తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. సమర్థవంతమైన, పారదర్శకమైన.. ప్రజాపాలన అందించాలి. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాలి. తమిళనాడు ప్రజలు మీ నాయకత్వంపై ఎంతో విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల ఆశయాలను నెరవేర్చాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి, సమగ్ర పాలన, ప్రజా సంక్షేమం దిశగా ముందుకు నడిపించాలి. మీ నాయకత్వంలో తమిళనాడు దేశ అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించాలి. భారత సమగ్ర ప్రగతికి బలమైన భాగస్వామిగా నిలవాలని కోరుకుంటున్నాని వైఎస్ జగన్ ఆకాంక్షించారు A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you. My sympathies are with Didi.…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 4, 2026 అంతకు ముందు మే4న తమిళనాడులో అనూహ్య ఫలితాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న సమయంలో విజయ్కు వైఎస్ జగన్ అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. సోదరుడు విజయ్కు అభినందనలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ప్రజా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న విజయ్కు మరింత మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. తాజాగా, ఇవాళ వైఎస్ జగన్ విజయ్కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. -
వైఎస్ జగన్ని కలిసిన పూడి శ్రీహరి
సాక్షి,తాడేపల్లి: ప్రజల పక్షాన, ప్రజల తరఫున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ, అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో వైఎస్ జగన్తో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి కలిశారు. అక్రమ కేసుల్లో పోలీసుల విచారణను ఎదుర్కొన్న శ్రీహరి, విచారణ పేరుతో పోలీసులు వ్యవహరించిన తీరు, తప్పుడు కేసుల వివరాలను వైఎస్ జగన్కు తెలియజేశారు.ఈ సందర్భంగా శ్రీహరికి అండగా నిలిచిన వైఎస్ జగన్.. తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. చట్టపరంగా వాటిని ఎదుర్కొందామని ఆయన స్పష్టం చేశారు. ప్రజల పక్షాన, ప్రజల తరఫున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని, ప్రజలకు అండగా నిలవాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. -
బాలు ఆత్మహత్యాయత్నం.. NHRCకి ఎంపీ గురుమూర్తి లేఖ
సాక్షి,తిరుపతి: కర్నూలు త్రీ టౌన్ పోలీసుల దారుణ వేధింపులు తాళలేక బాలు అనే యువకుడు ఆత్మహత్యా యత్నం చేశారని, ఈ ఘటనపై తక్షణమే జోక్యం చేసుకుని స్వతంత్య్ర విచారణ జరిపాలని వైఎస్సార్సీపీ ఎంపీ ఎం.గురుమూర్తి, జాతీయ మానవ హక్కుల సంఘాన్ని (ఎన్హెచ్ఆర్సీ) కోరారు. ఈ మేరకు ఎన్హెచ్ఆర్సీకి లేఖ రాసిన ఎంపీ గురుమూర్తి, రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘణ యథేచ్ఛగా సాగుతోందని వెల్లడించారు.ఎన్హెచ్ఆర్సీకి రాసిన లేఖలో ఎంపీ గురుమూర్తి ఇంకా ఏం ప్రస్తావించారంటే..బాలు ఏ నేరం చేయకపోయినా, ఆయనపై ఎలాంటి కేసు నమోదు కాకపోయినా, ఒక కేసులో విచారణ అంటూ ఆయన్ను పదే పదే స్టేషన్కు పిలిపించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు దారుణంగా వేధించారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన బాలు, చేయి కోసుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. అధికార పక్షానికి చెందిన కొందరు నాయకుల ఒత్తిడితోనే పోలీసులు ఆ విధంగా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా అక్రమంగా మద్యం, మాదకద్రవ్యాల కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడు బాలు తెలిపారు. తన నిర్దోషిత్వం గురించి, ఎంత చెప్పినా పట్టించుకోని పోలీసులు, ఆయన్ను మానసికంగానే కాకుండా, శారీరకంగా కూడా వేధించడంతో, అవమాన భారం తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించాడు.కర్నూలు త్రీ టౌన్ పోలీసుల తీరు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 కింద కల్పించిన సమానత్వ హక్కు, జీవన హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవప్రదమైన జీవన హక్కులకు పూర్తి విరుద్ధంగా ఉంది. అలాగే, మానవ హక్కుల పరిరక్షణ చట్టం–1993లోని సెక్షన్ 12(ఎ), 12(సి), 12(జె) ప్రకారం కూడా ఉల్లంఘనే. కాబట్టి దీనిపై విచారించే హక్కు ఎన్హెచ్ఆర్సీకి ఉంది.అందువల్ల కర్నూలు త్రీటౌన్ పోలీసుల చర్యలపై స్వతంత్ర, నిష్పక్షపాత విచారణకు ఆదేశాలు ఇవ్వాలని, జిల్లా పోలీసు అధికారుల నుంచి సమగ్ర నివేదిక కోరాలని, బాధితుడు బాలుతో పాటు, అతడి కుటుంబానికి రక్షణ కల్పించాలని వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి ఆ లేఖలో ఎన్హెచ్ఆర్సీకి విజ్ఞప్తి చేశారు. అలాగే, చట్ట విరుద్ధంగా వ్యవహరించి, అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై శాఖాపరంగా తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఎంపీ గురుమూర్తి కోరారు. -
ఆ లెక్కలు బయటపెట్టాలి: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దుబారా ఖర్చులతో రాష్ట్రం అతలాకుతలమవుతుందని.. దీనిపై చర్చించాలంటే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతిలో సాధారణ ప్రజలు నివసించే పరిస్థితి లేదన్నారు.‘‘పార్లమెంటు భవనం, తెలంగాణ సెక్రటేరియట్కు కూడా కాని ఖర్చు అమరావతిలో చేస్తున్నారు. అడుగుకు రూ.16 వేలు ఖర్చు చేయటం దుబారా కాదా?. రూ.20 కోట్లతో అయ్యే రోడ్డును వంద కోట్లకు చేయటం చంద్రబాబుకే చెల్లు. అమరావతిలో పెడుతున్న ఖర్చులు చూసి రాయలసీమ వాసులు ఆందోళన చెందుతున్నారు. అమరావతి అద్దాలకే రూ.2,700 కోట్లు ఖర్చు చేస్తారా?. నీళ్లు ఎత్తిపోయటానికే రూ.800 కోట్లు ఖర్చు చేస్తారా?. అమరావతిలో జరుగుతున్న అవినీతి, దుబారాని వెంటనే ఆపాలి..కేంద్ర సెక్రటేరియట్ నిర్మాణాన్ని కూడా తాత్కాలికంగా ఆపారు. అమరావతి నిర్మాణాలపై నిర్ణయం తీసుకోండి. ముందుగా మొక్కజొన్న రైతులకు ఆ డబ్బు చెల్లించండి. చంద్రబాబు తన దుబారా ఖర్చులను రైతులకు ఉపయోగించాలి. ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్ల ప్రయాణాన్ని ఆపాలి. అధికారులు, మంత్రులు కూడా దబారా ఖర్చులు తగ్గించాలి. రాజధాని పేరుతో వసూలు చేసిన బంగారం, డబ్బు లెక్కలు బయట పెట్టాలి. జనం నుండి వసూలు చేసిన ఆ డబ్బు, బంగారం ఎక్కడ ఉన్నాయి?’’ అంటూ శైలజానాథ్ నిలదీశారు.‘‘ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన సబ్సిడీలు కూడా వెంటనే ఇవ్వాలి. పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈవెంట్ లాగా చేస్తూ దుబారా ఖర్చులు పెడుతున్నారు. వైఎస్ జగన్ ప్రారంభించిన ప్రాజెక్టులను మళ్లీ మళ్లీ ప్రారంభించటం దుబారా కాదా?. ప్రధాని రెండు వాహనాల్లో వెళ్లినందున చంద్రబాబు ఒక్క ఆరులో వెళ్లి పబ్లిసిటీ చేసుకుంటారు. వర్క్ ఫ్రం హోమ్ అనేది కరోనా టైంలో వచ్చింది. చివరికి దాన్ని కూడా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం జిల్లాలో చెట్లు నాటించింది తానేనని చెప్పుకున్నారు. శ్రీకాకుళం నుండి రాయలసీమకు వర్షపు నీరు పంపుతారట. ఇలాంటి డైలాగులు, అబద్దపు ప్రచారాలు ఆపాలి’’ అని సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. -
ఆగని చంద్రబాబు దుబారా ఖర్చులు
సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబు దుబారా ఖర్చులు కొనసాగుతున్నాయి. సీఎం ఢిల్లీ ఇంటికి హంగులు కోసం రూ.67 లక్షల మంజూరుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మీటింగ్ హాల్, మైనర్ రిపేర్ల కోసం రూ.67 లక్షలు ఖర్చు పెట్టనుంది.గతంలో ఇదే ఢిల్లీ ఇంటికి సౌకర్యాలు, హంగులు కోసం 95 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేసింది. మళ్ళీ ఇప్పుడు రూ. 67 లక్షలు మంజూరు చేస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కలిపి.. సీఎం చంద్రబాబు ఢిల్లీ నివాసంలో విలాసవంతమైన సదుపాయలకు ఖర్చు 1.62 కోట్లకు చేరుకుంది.కాగా, అసెంబ్లీ నిర్మాణ వ్యయం చంద్రబాబు సర్కార్ పెంచేసిన విషయం తెలిసిందే. రూ. 798 కోట్లు అసెంబ్లీ పనుల కోసం ఖర్చు చేయాలని చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయించింది. పరిపాలనా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జ్ల నిర్మాణానికి నిధులు కేటాయించింది. దీంతో అసెంబ్లీ భవనాల నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది. ఇప్పటికే అత్యధిక ధరకు ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న సంగతి తెలిసిందే. -
నరేంద్ర.. రైతులపై దౌర్జన్యం చేస్తారా?: అంబటి ఫైర్
సాక్షి, గుంటూరు: ఏపీలో రైతులపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర దౌర్జన్యం చేస్తారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మామిళ్లపల్లి ఘటనపై సిగ్గుపడాలి అని ఘాటు విమర్శలు చేశారు. రైతుల కాలి ధూళికి ధూళిపాళ్ల ఓడిపోతారు. ప్రశ్నించే వారిపైనే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు.మొక్కజొన్న రైతులకు అండగా వైఎస్సార్సీపీ చలో మామిళ్లపల్లి పిలుపు నిలిచింది. మొక్కజొన్న రైతులపై దాడి, అక్రమ కేసులపై నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘ఎమ్మెల్యే ధూళిపాళ్ల రైతుల గోడౌన్లు, ఇళ్లపై దాడులు చేయిస్తున్నారు. రైతులు దాచుకున్న మొక్కజొన్న గోడౌన్పై ధూళ్ళిపాళ్ల అనుచరులు దాడిచేశారు. మామిళ్ళపల్లి దాడితో సిగ్గు పడాలి. ప్రశ్నించే వారే లేరని దాడులు చేస్తున్నారా?. మా కుటుంబంపై, మా కులంపై, మా పార్టీపై కక్ష కట్టారా?. ఎన్నాళ్ళు మీకు అధికారం ఉంటుంది. అంతకుముందు ఓడిపోలేదా?.మూడేళ్ళ ముందే చెబుతాను రాసుకోండి.. వచ్చే ఎన్నికల్లో ధూళ్ళిపాళ్ల నరేంద్ర ఓడిపోవడం ఖాయం. గోడౌన్లు, ఇళ్లు, కార్యాలయాలపై దాడి చేస్తున్నారు. గుంటూరు ఐజి త్రిపాఠీ ఖాకీ డ్రెస్స్ వేసుకోవడం లేదు. పచ్చ డ్రెస్స్ వేసుకుంటున్నాడు. లోకేష్, పెమ్మసాని ఏది చెబితే అది చేస్తున్నాడు. అదే చేస్తున్నాడు. మీరు భయపడితే వంగవీటి మోహన్ రంగాలా చంపేస్తారు. తప్పు చేస్తే ఎంత పెద్ద అధికారి అయినా చట్ట ప్రకారం బట్టలు ఊడదీస్తాం. త్రిపాఠికి చెబుతున్నా.. తప్పుడు కేసు తొలగించాలి. అరెస్ట్ చేస్తే జైలు కొచ్చి కూర్చొంటాం. గోడౌన్లో ఉన్న మొక్కజొన్న వెంటనే రిలీజ్ చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
భర్త ఫ్రెండ్తో వివాహేతర సంబంధం..!
నెల్లూరు జిల్లా: దగదర్తి మండలం సున్నపుబట్టి గ్రామంలో మైపాటి మాధవి అనే మహిళను హత్య చేసిన కేసులో ఆమె కోడలు పద్మశ్రీని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కావలి రూరల్ పోలీస్స్టేషన్లో డీఎస్పీ రమణకుమార్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పద్మశ్రీకి అదే గ్రామానికి చెందిన తన భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం ఉంది. దీంతో అత్త మాధవి ఇలాంటి పనులు మానుకోవాలని కోడలు పద్మశ్రీకి చెప్పింది.అయినా ఆమెలో మార్పు రాకపోవడంతో కులపెద్దల వద్ద పంచాయితీ జరిగింది. వారు కూడా ప్రవర్తన మార్చుకోవాలని తెలిపారు. ఈక్రమంలో కోపోద్రిక్తురాలైన పద్మశ్రీ తన అత్తను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. మే 8వ తేదీ తన తల్లి పుచ్చలపల్లి మాధవి సహాయంతో ఇంట్లో నిద్రిస్తున్న అత్తపై దిండుపెట్టి గొంతు నులిమి హత్య చేసింది. యూట్యూబ్లో సీరియల్స్ చూసి ప్రజలు పక్కదోవ పడుతున్నారని, నేరాలు చేసిన వారు తప్పించుకునే అవకాశం లేదన్నారు. చెడు వ్యసనాలకు బానిసలు కావొద్దన్నారు. రూరల్ సీఐ శివశంకర్, ఎస్సై జంపాని కుమార్, సిబ్బందికి ఉన్నతాధికారులు రివార్డులివ్వాలని ఉన్నతాధికారులకు సిఫార్స్ చేశారు. -
జగనే రైట్ అన్నది కూటమి కూడా గుర్తిస్తోంది!
ఎన్టీ రామారావు నటించిన ఓ సినిమాలో ‘‘కోర్టు కోర్టుకు ఒక తీర్పు...’’ అంటూ ఓ పాటుంది. అప్పట్లో సూపర్హిట్ ఈ పాట. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు గమనిస్తే... ఈ పాట మరోసారి గుర్తుకురాక మానదు. విద్యార్థులకు ఇంగ్లీష్ పరిజ్ఞానం అవసరం అంటూ ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించడం ఇందుకు కారణమవుతోంది. 2019-2024 మధ్యకాలంలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషును ప్రవేశపెట్టేందుకు అప్పటి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటే... తెలుగుదేశం, జనసేన, బీజేపీ తదితర పార్టీలు నానా యాగీ చేశాయి. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు. ఆంగ్ల మీడియం వల్లనే ఆంధ్ర పిల్లలకు ప్రయోజనం కలుగుతుందని చెబుతూనే వారికి కావాల్సిన మాధ్యమంలో చదువుకునే వెసలుబాటూ కల్పించారు. ఇందుకోసం ఆంగ్లం, తెలుగు భాషలు రెండింటిలోనూ పాఠాలు ముద్రించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. విపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియంను తీసుకురావడాన్ని ఎద్దేవ చేస్తూ శ్రీకాకుళంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వంటివారు తెలుగు భాషకు ఛాంపియన్ల మాదిరి వాదించారు. కాకినాడ జిల్లా బెండపూడికి చెందిన విద్యార్థులు ఇంగ్లీషు అద్భుతంగా మాట్లాడితే అవమానించిన టీడీపీ పెద్దలు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారు. అయితే ప్రజలలో మాత్రం ఆంగ్ల మీడియంపైనే ఆసక్తి ఉందన్న విషయం అనేక సర్వేలలో వెల్లడైంది. ప్రైవేటు స్కూళ్లలో ఆంగ్ల మీడియం ఉంటే అభ్యంతర పెట్టని ఈ నేతలు, ప్రభుత్వ స్కూళ్లలో చేరే పేద విద్యార్ధులకు ఇంగ్లీష్ వద్దని ఎలా అంటారో అర్థం అయ్యేది కాదు. చిత్రంగా తెలుగు మీడియం అంటూ గొంతు చించుకుని మాట్లాడే ప్రముఖులెవ్వరి పిల్లలు, లేదా మనుమళ్లు ఆ మీడియంలో చదవడం లేదు. అంతా పెద్దపెద్ద కార్పొరేట్ స్కూళ్లలోనే ఆంగ్లంలోనే విద్యనభ్యసిస్తుంటారు.ఈ విషయాలన్ని బహిరంగంగానే ప్రజలు మాట్లాడుకునేవారు. అయినా జగన్ ప్రభుత్వం ఆ సంస్కరణ తెచ్చిందన్న ఆక్రోశంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు దానిని వ్యతిరేకించారనిపిస్తుంది. రాజకీయ దురుద్దేశాలతో కొందరు ఆంగ్ల మీడియంకు వ్యతిరేకంగా కోర్టుకెక్కారు. అప్పట్లో విచారణ చేసిన హైకోర్టు కూడా ఆంగ్ల మీడియం వైపు మొగ్గు చూపలేదు. కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం కూడా ప్రజలలో చర్చనీయాంశమైంది. జగన్ ప్రభుత్వం తెచ్చిన జీవో లను రద్దు చేసింది. జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.అక్కడ వాదోపవాదాలు చాలాకాలం సాగాయి.అది ఎటూ తేలలేదు. ఈలోగా ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారింది.దాంతో దానికి ప్రాధాన్యత లేకుండా పోయింది. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం యధావిధిగా, ఆంగ్ల మీడియం విషయంలోను యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో బోధన భాషగా ఆంగ్లం ఉంటుందని గత నెల 16న ఒక ఆదేశం జారీ చేసింది. దీనిపై ఫ్రొఫెసర్ గుంటుపల్లి శ్రీనివాస్ అనే ఆయన హైకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేసిన ఛీప్ జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి నైనాల జయసూర్యల బెంచ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్ధులకు ఇంగ్లీష్ పరిజ్ఞానం తప్పనిసరి అని, లేకపోతే పిల్లలు ఆయా రంగాలలో రాణించే అవకాశాలు తక్కువగా ఉంటాయని అభిప్రాయపడింది. ఇంగ్లీష్ అందరిని ఏకం చేసే ఒక అంశమని కూడా వ్యాఖ్యానించింది. పిల్లలకు తెలుగుతో పాటు ఆంగ్లంలో చదువుకోవడానికి అవకాశం కల్పించడం ద్వారా వారు ఇంతర రంగాలలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది. మంచి పరిణామమంటూ వ్యాఖ్యానించింది. అయితే పిటిషనర్ తరపున న్యాయవాది మాట్లాడుతూ ఇదే అంశంపై గతంలో హైకోర్టు జీవోలను కొట్టివేసిందని గుర్తు చేశారు. అయినా ప్రస్తుత ప్రభుత్వం ఇంగ్లీష్ బోధన భాషగా ప్రొసీడింగ్స్ ఇచ్చిందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది వివరణ ఇచ్చారు. ఆంగ్లభాషను పొరపాటున బోధన భాషగా పేర్కొన్నామని, ఆ ప్రొసీడింగ్స్ను సవరించామని నివేదించారు. ప్రభుత్వ స్కూళ్లలో ద్విభాష విధానం అమలలో ఉంటుందని తెలిపారు. దాంతో హైకోర్టు ఈ వ్యాజ్యం నిరర్థకమని తేల్చేసింది. జగన్ ప్రభుత్వం ఇదే విధానం అమలు చేసినప్పుడు ఇదే హైకోర్టులో హోరాహోరీగా వాదోపవాదాలు జరిగాయి. ఆంగ్లంతో పాటు తెలుగు ఉంటుందని ఆనాటి ప్రభుత్వం తెలిపినా న్యాయ వ్యవస్థ కూడా పలు సందేహాలు వెలిబుచ్చింది. అంతేకాక సంబంధిత జీవోను కూడా కొట్టివేసింది. దాంతో అప్పటి ప్రభుత్వం సుప్రింకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసినా ద్విభాష విధానాన్నే ఇప్పుడు తెలుగు దేశం ప్రభుత్వం కూడా అమలు చేయక తప్పలేదు. అంటే దీని అర్థం చంద్రబాబు సర్కార్ ఇంగ్లీషులో చదువుకునే అవకాశం లేకుండా చేస్తోందని, తద్వారా పేద పిల్లలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్న అభిప్రాయం బలపడుతుండడంతో వెనక్కి తగ్గిందని అనుకోవాలి. అంతేకాక అప్పట్లో రాజకీయంగా వైఎస్సార్సీపీని ఆయా వ్యవస్థల ద్వారా ఇబ్బంది పెట్టడం, ప్రజలలో ఉన్న సానుకూల దృక్పథాన్ని దెబ్బతీయడం వంటి లక్ష్యాలతో టీడీపీ పనిచేసింది. అధికారంలోకి వచ్చాక జగన్ తీసుకువచ్చిన అనేక సంస్కరణలను, పాలన వ్యవస్థలను కొనసాగించాల్సిన అనివార్య పరిస్థితులు ఉన్నాయని కూటమి ప్రభుత్వం ఒప్పుకోక తప్పడంలేదు. జగన్ టైమ్ లో హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు, ఇప్పుడు కూటమి పాలనలో ఇదే అంశంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు ఉన్న తేడాను ప్రజలు గుర్తించకుండా ఉంటారా? జగన్ సీఎంగా ఉంటే ప్రతిదానిని రాజకీయం చేసి,ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని విషం చిమ్మిన సంగతి ఒకటికి ,పదిసార్లు నిర్ధారణ అవుతోంది. ఆంగ్ల భాషను మీడియం గా ఉంచడం ద్వారా జగన్ తన విజన్ ను చూపితే, అప్పట్లో చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ తదితరలు సంకుచితంగా వ్యవహరించారు.ఇప్పుడు జనాభిప్రాయానికి తలొగ్గక తప్పలేదనుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రేపటి నుంచి శుభకార్యాలకు బ్రేక్
పెళ్లికి ముఖ్యమైంది ముహూర్తం. పెళ్లి పనులు ప్రారంభించడం దగ్గర నుంచి అన్ని పనులకు ముహూర్తాలు చూస్తాం. అలాంటి ముహూర్తాలకు 36 రోజుల పాటు బ్రేక్ పడనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వివాహాలు భారీగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా వేలాది జంటలు ఒక్కటయ్యాయి. ఈ నెల 18 నుంచి వచ్చేనెల జూన్ 18 వరకు అధిక జ్యేష్ఠ మాసం(మూఢమి) కావడంతో వివాహాలకు బ్రేక్ పడనుంది. ఈ క్రమంలో ఈనెలలో ఆఖరి ముహూర్తమైన 13న పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరగనున్నాయి. అందుకు ద్వారకాతిరుమల శ్రీవారి సన్నిధి వేదిక కానుంది. మళ్లీ జూన్ 19 నుంచి వివాహాధి శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి. 36 రోజులు ఖాళీ వివాహాది శుభకార్యాలపై ఆధారపడి జీవనోపాధి పొందే పురోహితులు, పచ్చిపూల మండపాలు నిర్మించే వారు, డెకరేషన్ చేసేవారు, షామియానా పందిళ్లు వేసేవారు, వాయిద్యకారులు, క్యాటరింగ్ వ్యాపారులు, లైటింగ్ ఏర్పాటు చేసే వారికి 36 రోజుల పాటు పనులు లేనట్టే. వీరంతా మళ్లీ జూన్ 19 నుంచి బిజీ కానున్నారు. ఈ ఏడాది ముహూర్తాలు ఇవే వివాహాలకు ఈ ఏడాది జూన్ 19, 20, 21, 24, 25, 26, 27, 28, జులై 1, 2, 3, 4, 5, 8, 9, ఆగస్టు 16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30, సెపె్టంబర్ 1, 3, 4, 5, అక్టోబర్ 11, 14, 29, 30, నవంబర్ 5, 11, 12, 13, 14, 15, 18, 19, 20, 21, 22, 24, 25, 26, డిసెంబర్ 2, 3, 4, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 22, 23, 27, 29, 30, 31 తేదీల్లో ముహూర్తాలున్నాయి. ఈ మాసమంతా ఆగాల్సిందేఈ నెల 14 నుంచి శుభకార్యాలకు విరామం ఏర్పడనుంది. మే 18 నుంచి జూన్ 18 వరకు అధిక జ్యేష్ఠమాసం కారణంగా వివాహాలు, గృహ ప్రవేశాలు, ఆస్తుల కొనుగోళ్లు, వ్యాపారాలు ప్రారంభోత్సవాలు వంటి ఏవిధమైన శుభకార్యాలు జరపకూడదు. ఇప్పటికే వివాహాలు కుదుర్చుకున్న వారు ఈ 36 రోజులు ఆగాల్సిందే. – గోవింద వఝుల వెంకటరమణ మూర్తి శర్మ, పురోహితుడు, ద్వారకాతిరుమల -
శివ అంకుల్ నా చావుకు కారణం.. ఏటీఎంలా వాడుకున్నాడు..!
విజయనగరం జిల్లా: ‘శివ అంకుల్ నా చావుకు కారణం.. నన్ను ఒక ఏటీఎంలా వాడుకున్నారు.. తీయని మాటలతో నమ్మించి, హోటళ్లకు తీసుకెళ్లి సర్వస్వం దోచుకున్నారు.. 2019 నుంచి తన బాధ్యత, పిల్లల బాధ్యత చూస్తానని నమ్మించి భర్తలా కాపురం చేశాడు... ఆయన స్వార్థానికి నన్ను బలిచేశాడు.. ఆర్థికంగానూ దోచుకున్నాడు. నేను ఏ తప్పూచేయలేదు. నన్ను నీవు నమ్మితే చాలు అంటూ తన కుమారుడికి మెంటాడ మండలానికి చెందిన మహిళా నేత రాసిన సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన చివరి కోరికగా తన భర్తగా చలామణి అయిన శివకేశవనాయుడే తనకు తలకొరివి పెట్టాలని ఆ నోట్లో పేర్కొంది. విశాఖపట్నంలో మంగళవారం వేకువజామున పురుగులు మందు సేవించిన బాధితురాలు ప్రస్తుతం విశాఖపట్నం కేజీహెచ్లో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. మెంటాడకు చెందిన ‘పచ్చ’ పత్రిక విలేకరి శివకేశవనాయుడు తనను దోచుకున్న తీరు, మోసం చేసిన తీరును బాధితురాలు తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. అయితే, దీనిపై ఇప్పటివరకు స్థానికంగా ఎలాంటి కేసు నమోదుకాకపోవడం గమనార్హం. ఆ విలేకరి ఓ మంత్రికి అత్యంత ఆప్తుడు కావడమే దీనికి కారణమని స్థానికంగా చర్చ నడుస్తోంది. కేసు నమోదు విషయాన్ని మెంటాడ ఎస్ఐ కె.సీతారాము వద్ద ప్రస్తావించగా ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. విశాఖపట్నంలో జరిగిన ఘటనగా పేర్కొన్నారు. -
యువతితో ఎస్ఐ వివాహేతర సంబంధం..!
కర్నూలు: కర్నూలు నగరంలో ట్రాఫిక్ ఎస్ఐగా పని చేస్తున్న హరిప్రసాద్ను డిస్మిస్ చేస్తూ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఐకి వివాహమై పిల్లలు ఉన్నప్పటికీ మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. దీనిపై యువతి కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు హరిప్రసాద్ను విధుల నుంచి తొలగించారు. వైఎస్సార్ కడప జిల్లా రాజుపాలేనికి చెందిన హరిప్రసాద్ 2013లో ఎస్ఐగా పోలీసు శాఖలో చేరారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహించారు. పది రోజుల క్రితం నంద్యాల జిల్లా నుంచి కర్నూలు ట్రాఫిక్ విభాగానికి బదిలీపై వచ్చారు. హరిప్రసాద్కు యువతితో వివాహేతర సంబంధం విషయంలో రెండు నెలలుగా ఇరు కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతోంది. చివరకు యువతి కుటుంబ సభ్యులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అంతర్గత విచారణ జరిపించి డిస్మిస్ చేశారు.కాగా, హరిప్రసాద్ ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐగా పనిచేసే సమయంలో కూడా ఆయనపై అనేక ఆరోపణలు రావడంతో అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వ్యక్తి ట్రాక్టర్లో ఇసుక తరలిస్తుండగా చాగలమర్రి టోల్ప్లాజా వద్ద పట్టుకుని పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడంతో అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఎస్ఐ హరిప్రసాద్ను వీఆర్కు పంపారు. -
AP: కుమార్తెకు తండ్రి ఆస్తిలో సమానహక్కు
సాక్షి, అమరావతి: హిందూ వారసత్వ సవరణ చట్టం–2005 ప్రకారం కుమార్తె పుట్టుకతోనే కుమారుడితో సమానంగా ఆస్తి హక్కు కలిగి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. కుమార్తె ఈ సమాన వాటా పొందేందుకు 2005లో సవరణ చట్టం అమల్లోకి వచ్చేనాటికి తండ్రి జీవించి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఆస్తిలో సమాన హక్కు పొందేందుకు సవరణ చట్టం వచ్చిన 2005 సెప్టెంబర్ 9 నాటికి కుమార్తె జీవించి ఉంటే సరిపోతుందని చెప్పింది. విభజన దావా (పార్టిషన్ సూట్)లో ప్రాథమిక తీర్పు (ప్రిలిమినరీ డిక్రీ) ద్వారా వాటాల నిర్ణయం జరిగి, తుది తీర్పు (ఫైనల్ డిక్రీ) పెండింగ్ ఉంటే, ఆ తరువాతి కాలంలో చట్టపరమైన, వాస్తవిక మార్పులు జరిగితే కోర్టులు వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చని తెలిపింది. ‘విభజన దావాలో ఆస్తి వాటాలను నిర్ణయించిన తర్వాత, తుది తీర్పు రాకముందే కుటుంబంలో మార్పులు సంభవిస్తే వాటాలు మారతాయి. ఒక వాటాదారు మరణిస్తే, వారి వాటా మిగిలిన వారసులకు చెందుతుంది. దీనివల్ల ఇతరుల వాటా శాతం పెరుగుతుంది. కొత్తగా వారసుడు జన్మిస్తే, అతడికి/ఆమెకు కూడా వాటా ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల ఇతరుల వాటా తగ్గుతుంది. ఇటువంటి సందర్భాల్లో మారిన వాటాలను ఖరారు చేస్తూ కోర్టు మరో ప్రాథమిక తీర్పు ఇవ్వవచ్చు’ అని హైకోర్టు తేల్చి చెప్పింది. 2005 చట్ట సవరణ నేపథ్యంలో తుది తీర్పు వెలువడకముందటి ప్రాథమిక తీర్పును సవరించి కుమార్తెలకు సమానవాటా ఇవ్వవచ్చని పేర్కొంది. ఇందుకు అనుగుణంగా వీరమ్మ అనే మహిళకు తండ్రి మారెప్ప నుంచి సంక్రమించే ఆస్తి వాటాను హైకోర్టు సవరించింది. 2003లో వీరమ్మకు తండ్రి ఆస్తిలో 1/6 వాటా రాగా, 2005 సవరణ చట్టం నేపథ్యంలో మారెప్ప కుమారుడితో సమానంగా వీరమ్మ వాటాను సగానికి పెంచింది. సవరించిన వాటాను పరిగణనలోకి తీసుకుని వీలైనంత త్వరగా తుది తీర్పు వెలువరించాలని కింది కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ మెడమల్లి బాలాజీ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఆస్తిలో వాటా కోసం న్యాయ పోరాటం కర్నూలు జిల్లాకు చెందిన వి.మారెప్పకు భార్య నాగమ్మ, కుమార్తె వీరమ్మ, కుమారుడు బుసప్ప ఉన్నారు. మారెప్ప ఆస్తిలో వాటా కోసం వీరమ్మ 1988లో కోర్టులో దావా వేశారు. ఆ తరువాత ఈ వివాదం హైకోర్టుకు చేరింది. విచారణ జరిపిన హైకోర్టు.. మారెప్ప ఆస్తిలో భార్య నాగమ్మ, కుమార్తె వీరమ్మ, బుసప్పకు వాటానిస్తూ 2003లో తీర్పు ఇచ్చింది. 2005లో హిందూ వారసత్వ సవరణ చట్టం ప్రకారం తండ్రి ఆస్తిలో కుమార్తెకు సైతం సమాన హక్కు కల్పించడంతో వీరమ్మకు ఆస్తిలో సగం వాటా ఇవ్వాలని కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారంపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు ధర్మాస నం.. ఆమెకు తండ్రి ఆస్తిలో సగం ఆస్తిని వాటాగా ఇస్తూ తీర్పు వెలువరించింది. -
ఫెయిలైతే టీచర్ల బాధ్యత.. పాసైతే ప్రిన్సిపాల్స్ ఘనత..
సాక్షి, అమరావతి: విద్యార్థులకు మార్కులు తగ్గితే టీచర్లకు షోకాజ్ నోటీసులు.. అదే ఉత్తీర్ణత శాతం పెరిగితే ప్రిన్సిపాల్స్కు సత్కారాలు.. చంద్రబాబు సర్కారుకు ఇదేం ద్వంద్వనీతి అంటూ బీసీ గురుకులాల ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో బీసీ సంక్షేమశాఖ పరి«ధిలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల్లో ఉత్తీర్ణతలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులతోపాటు ప్రిన్సిపాల్స్ను మంగళవారం విజయవాడలో సత్కరించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి సత్కరించడం వరకు సరే.. ప్రిన్సిపాల్స్ను, జిల్లా బీసీ సంక్షేమ అధికారులను జ్ఞాపికలతో అభినందించడాన్ని బీసీ గురుకుల టీచర్లు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో పదోతరగతి, ఇంటర్ పరీక్షలకు ముందు ప్రభుత్వం చేసిన హడావుడిని వారు గుర్తుచేస్తున్నారు.బీసీ గురుకులాల్లో విద్యార్థులకు మార్కులు తగ్గితే సంబంధిత టీచర్లకు షోకాజ్ నోటీçసులు ఇస్తామని, ఉత్తీర్ణత శాతం తగ్గితే విధుల నుంచి తొలగిస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత నుంచి గురుకులాల కార్యదర్శి మాధవీలత వరకు సమీక్ష సమావేశాల్లో హెచ్చరించారు. పరీక్ష ఫలితాలు వచ్చాక ఉత్తీర్ణత తక్కువ నమోదైన గురుకులాల్లో సంబంధిత సబ్జెక్ట్ టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. తక్కువ ఉత్తీర్ణత ఉన్న గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీలను విధుల నుంచి తొలగించాలని అధికారులు ఆదేశించారు. ఉత్తీర్ణత బాగున్న గురుకులాల్లో మాత్రం సంబంధిత టీచర్లను గుర్తించి అభినందించకపోగా.. ఆ మొత్తం ఘనత ప్రిన్సిపాల్స్దే అన్నట్లు వారిని సత్కరించడాన్ని టీచర్లు తప్పుబడుతున్నారు.రాష్ట్రంలోని 105 బీసీ గురుకులాలకుగాను 32 గురుకులాల్లో మాత్రమే నూరుశాతం ఉత్తీర్ణత వచ్చింది. ఆ 32 గురుకులాల ప్రిన్సిపాల్స్ను పిలిచి అభినందించిన కార్యక్రమానికి తమను కూడా పిలిచి తమ కృషిని గుర్తించి ఉంటే బాగుండేదని టీచర్లు పేర్కొంటున్నారు. విద్యార్థులకు మార్కులు తగ్గినా, ఉత్తీర్ణత లేకపోయినా టీచర్ బాధ్యుడని, మంచి ఫలితాలు సాధిస్తే ప్రిన్సిపాల్ ఘనత అని ప్రభుత్వం ద్వంద్వనీతిని ప్రదర్శించడం సరికాదని గురుకులాల్లో పనిచేసే రెగ్యులర్, కాంట్రాక్ట్, గెస్ట్ ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. -
కొడుకు నిందితుడైతే..తండ్రిని హింసిస్తారా?
సాక్షి, అమరావతి : ఓ కేసులో కొడుకు నిందితుడిగా ఉంటే అతని తండ్రిని తీసుకెళ్లి పోలీసులు విచక్షణారహితంగా కొట్టిన ఘటనను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చెన్నూరు మండలం మంగళపూరు గ్రామానికి చెందిన రోజూవారి కూలీ గడుతోటి పోలయ్య కొడుకు ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే అతను అందుబాటులో లేకపోవడంతో పోలీసులు గత నెల 18న పోలయ్యను స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ హింసించి, తీవ్రంగా కొట్టి గాయపరిచారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ పోలయ్య హైకోర్టును ఆశ్రయించారు.పోలీసులు తన హక్కులను హరించారని, బాధ్యులైన వారిపై చర్యలకు ఆదేశించడంతో పాటు తనకు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు. పోలయ్య తరఫున న్యాయవాది వి.సురేంద్రరెడ్డి వాదనలు వినిపించారు. పోలీసుల దాడి వల్ల పోలయ్యకు అయిన గాయాల తాలుకా వైద్య రికార్డులను, ఘటనపై స్థానిక పత్రికల్లో వచి్చన కథనాలను కూడా కోర్టు ముందుంచారు. అలాగే వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 18న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీని భద్రపరచేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టుకు విన్నవించారు. పక్కా ఆధారాలు ఉన్నాయి.. పిటిషనర్ పోలయ్యను హింసించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని పోలీసుల దెబ్బల వల్ల తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరారని, ఇందుకు సంబంధించిన వైద్య నివేదికలు, ఫొటోలు ఆయనపై జరిగిన దాడిని ధ్రువీకరిస్తున్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ దాషీ్టకానికి పాల్పడి, పిటిషనర్ మానవ హక్కులను హరించినందుకు నెల్లూరు జిల్లా ఎస్పీ సహా, గూడూరు గ్రామీణ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు, ఎస్ఐ తిరుపతయ్య, కానిస్టేబుళ్లు దాస్, చిన్నా ఈ నెల 14న స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అవసరమైతే బాధ్యులైన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశిస్తూ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.పోలీసులకు చెంపపెట్టు లాంటిదిఅధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తే పోలీసులకు హైకోర్టు ఆదేశాలు చెంపపెట్టు. దళితులను, రైతులను అమానుషంగా స్టేషన్లో చిత్రహింసలకు గురిచేసే పోలీసులను న్యాయస్థానం మెట్లెక్కించే వరకు న్యాయపోరాటం చేస్తాం. జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఉదాసీనంగా ఉంటే వారు కూడా న్యాయస్థానం ముందు నిలబడాల్సి వస్తుంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడం. ప్రతి ఒక్కరిపై ప్రైవేట్ కేసులు వేసి న్యాయస్థానంలో నిలబెడతాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పచ్చచొక్కాలు తొడిగిన పోలీసులపై క్రిమినల్ చర్యలు తప్పవు. – కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీమంత్రి -
తిరువూరులో ఎనీ టైం కిక్కు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో మద్యం మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. గుడి, బడి..ప్రార్థనా మందిరాలు వంటి వాటి పక్కన పెట్టకూడదనే నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి బార్ అండ్ రెస్టారెంట్లు వెలిశాయి. దీంతోపాటు గ్రామాల్లో ప్రజలకు తాగునీరు దొరకడం లేదు కానీ మద్యం మాత్రం ఏరులై పారుతోంది. వీధికో బెల్ట్షాపు ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఎనీ టైం మద్యం మాత్రం లభిస్తోంది. ఎక్సైజ్ అధికారులు సైతం మామూళ్ల మత్తులో జోగుతూ, తూతూమంత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. దీంతో మద్యం మాఫియా బరితెగిస్తోంది. బెల్ట్షాపుల్లో నకిలీ కిక్కు గుప్పుమంటోంది.తిరువూరు నియోజకవర్గవ్యాప్తంగా 20 షాపులు ఉండగా, వీటికి అనుబంధంగా 640 బెల్ట్షాపులు నడుస్తున్నాయి. ఈ షాపుల నిర్వహణ వెనుక టీడీపీకి చెందిన పార్లమెంటు ముఖ్యనేత హస్తం ఉండడంతో, మద్యం మాఫియా మరింత రెచ్చిపోతోంది. సదరు నేతకు ప్రతి మద్యం షాపు నుంచి నెలకు రూ.లక్ష చొప్పున అంటే నెలకు రూ.20 లక్షలు చొప్పున ఏడాదికి రూ.2.40 కోట్లు దండుకుంటున్నారు. బెల్ట్ షాపు పెట్టుకునేందుకు మొదట్లో గుడ్విల్ కింద రూ.50 వేలు చొప్పున 640 బెల్ట్షాపులకు రూ.3.20 కోట్లు ముక్కు పిండి వసూలు చేశారు.దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం షాపులు, బెల్ట్షాపులు 24 గంటలు బార్లా తెరుచుకునే ఉంటున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు మద్యం బారిన పడి నాశనమవుతున్నాయి. పలు కుటుంబాలు చితికిపోయి వీధిన పడుతున్నాయి. సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే పెడుతున్న స్టేటస్లు చంద్రబాబు సర్కారులో మద్యం, పేకాట వంటి అవినీతి అక్రమాలకు అద్దం పడుతున్నాయి. పేకాట, క్యాసినోలు.. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా గంపలగూడెం మండలం ఊటుకూరు, విసన్నపేటలో పేకాట, క్యాసినో ఏర్పాటు చేశారు. ఆ మూడు రోజుల్లోనే ఏకంగా రూ.3 కోట్లకు పైగా దండుకున్నారని, దీని వెనుక పార్లమెంటు ముఖ్యనేత హస్తం ఉన్నట్లు టీడీపీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. గతంలోనూ కొలికపూడి ‘నువ్వు దేనికి అధ్యక్షుడివి.? పేకాట క్లబ్కా?, కొండ పర్వగట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్, పేకాట కోసం ఆఫీసు పెట్టావంటే.. నువ్వు నిజంగా రాయల్..’’ అంటూ స్టేటస్ పెట్టడంతో అప్పుడు కూడా సంచలనంగా మారింది.సంచలనంగా ఎమ్మెల్యే కొలికపూడి స్టేటస్..తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పెట్టిన స్టేటస్, అక్కడ మద్యం మాఫియా దందాకు అద్దం పడుతోంది. ‘‘తిరువూరులో అయ్యప్ప స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాలు, అంబేడ్కర్ గురుకులం ఎదురుగా బార్ అండ్ రెస్టారెంట్ పెట్టారు. తియ్యమని చెప్పాను. బేరం మొదలు పెట్టారు. నెలకి లక్షన్నర.. బహుశా కల్తీ మద్యం అమ్ముతున్నారేమో’’ అంటూ ఎమ్మెల్యే పెట్టిన స్టేటస్ సంచలనంగా మారింది. పార్లమెంటు ముఖ్యనేత ప్రోద్బలంతో ఎక్సైజ్ అధికారులు సైతం రూ.5.లక్షలు తీసుకుని, నిబంధనలను తుంగలో తొక్కి బార్కు లైసెన్సు ఇచ్చినట్లు అక్కడ చర్చ సాగుతోంది. గతంలో సైతం బస్టాండు సమీపంలో, దేవాలయాలకు దగ్గర మద్యం షాపులున్నాయని ఎమ్మెల్యే ధర్నా చేశారు. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా ఇష్టారీతిన మద్యం షాపులు పెట్టారనేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యే స్టేటస్లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. -
రైల్వే సిగ్నల్ వ్యవస్థను దెబ్బతీసే యత్నం
తెనాలిరూరల్/పొన్నూరు: రైల్వేసిగ్నల్ వ్యవస్థను దెబ్బతీసి రైలులో దోపిడీ చేసేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. దీన్ని గుర్తించిన రైల్వే పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. దీంతో వారిపై దుండగులు రాళ్లు రువ్వారు. పోలీసులు పది రౌండ్లు కాల్పులు జరపగా, దుండగులు పరారయ్యారు. సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించి గుంటూరు జీఆర్పీ డీఎస్పీ అక్కేశ్వరరావు మంగళవారం విలేకరులకు వివరించారు. నరసరావుపేట జీఆర్పీ ఎస్ఐ రాజమోహనరావు, కానిస్టేబుళ్లు సదా, ఆంజనేయులు సోమవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున సిగ్నల్ టాంపరింగ్కు పాల్పడుతున్న ఇద్దరు అనుమానితులు తారసపడ్డారు.వారిని ఆపి ప్రశ్నించే ప్రయత్నం చేయబోగా వారు రాళ్లు రువ్వారు. వెంటనే ఎస్ఐతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు కాల్పులు జరిపారు. వారు తప్పించుకొని సమీపంలోని పొలాల వైపు పారిపోయారు. ఘటన అనంతరం జీఆర్పీ, ఆర్పీఎఫ్ స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని డీఎస్పీ అక్కేశ్వరరావు, గుంటూరు ఎస్హెచ్ఓ అంజిబాబు, ఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు పరిశీలించారు. ఘటనా స్థలంలో అనుమానితులు వదిలివెళ్లిన వైర్ కట్టర్ (స్లీవ్ కట్టర్), టెస్టర్, జత గ్లౌజులు స్వా«దీనం చేసుకున్నారు.ఘటనపై తెనాలి రైల్వే పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. తమ సిబ్బందికి కనిపించిన ఇద్దరు దుండగులతోపాటు మరికొంత మంది ఉంటారని, అందరి ఆచూకీ గుర్తించేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు చెప్పారు. సిగ్నల్ టాంపర్ చేసి రైలు నిలిచిపోగానే దోపిడీకి పాల్పడాలన్నదే దుండగుల ముఖ్యోద్దేశంగా కనిపిస్తున్నట్లు చెప్పారు. కొద్ది రోజుల కిందట ఇక్కడే దొంగల బీభత్సం ఏప్రిల్ 19న బెంగళూరు–నరసాపురం(07154) స్పెషల్ ఎక్స్ప్రెస్ నాలుగు కోచ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ప్రయాణికుల నుంచి 11 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బాపట్ల–అప్పికట్ల మధ్య ఈ ఘటన జరిగింది. అప్పికట్లలో రైలు ఆపి వారు పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. -
జగనన్న హయాంలోనే ‘గండి’ అభివృద్ధి
చక్రాయపేట: వైఎస్ జగన్ హయాంలోనే గండి క్షేత్రం అభివృద్ధి చెందడం సంతోషకరమని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆలయ మహాకుంభాభిషేకం, హనుమజ్జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఆయన వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చారు. ఆలయ సంప్రదాయం ప్రకారం కార్యనిర్వహణాధికారి గురుప్రసాద్, చైర్మన్ వెంకటస్వామి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేకంగా పూజలు చేయించి తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వదించారు.అనంతరం కుంబాభిషేకంలో భాగంగా ఆలయ ఆవరణలో నిర్వహించే పలు పూజా కార్యక్రమాల్లో, గర్భాలయం పైభాగాన కలశ ప్రతిష్ట కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో రూ.28.5 కోట్లతో గండి ఆలయాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఆలయం రెండేళ్ల క్రితమే పూర్తయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రారంభోత్సవానికి నోచుకోలేదన్నారు. ఆలయంతో పాటు రాజగోపురాలు కూడా అత్యంత సుందరంగా తయారయ్యాయని చెప్పారు. పూర్ణాహుతి అనంతరం బుధవారం నుంచి భక్తులకు ఆంజనేయస్వామి మూలవిరాట్ దర్శనం ఉంటుందని చెప్పారు.ఈ సందర్భంగా గంగాధర్ అనే భక్తుడు తనకు అనుమతులు ఇప్పిస్తే గండిలో తన సొంత నిధులతో 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మిస్తానని కోరగా, దీనికి స్పందించిన ఆయన కలెక్టర్, కమిషనర్తో మాట్లాడతానని చెప్పారు. హనుమజ్జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి భక్తులందరికీ ఎంపీ శుభాకాంక్షలు తెలియజేశారు. చక్రాయపేటలోని శ్రీవేంకటేశ్వర రాచరాయస్వామి ఆలయాలకు అనుసంధానంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన టూరిజం భవనానికి మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేయగా, ఆయన సానుకూలంగా స్పందించారు. -
పోక్సో కేసులో మహిళా అధికారికి ఐదేళ్ల జైలు శిక్ష
ఒంగోలు: పోక్సో కేసులో ఓ మహిళా ప్రత్యేక అధికారికి ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు జిల్లా న్యాయమూర్తి కె.శైలజ మంగళవారం తీర్పునిచ్చారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు అందించిన వివరాల మేరకు.. 2018 జూన్ 26న ఓ విద్యార్థిని పట్ల అదే విద్యాలయంలో మహిళా ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తున్న మహిళ అసభ్యకరంగా ప్రవర్తించారు.ఈ ఘటనపై అప్పటి మర్రిపూడి ఎస్ఐ శ్రీహరి కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషిటు దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం మహిళా ప్రత్యేక అధికారికి 5 సంవత్సరాల జైలుశిక్ష, రూ.25 వేలు జరిమానా విధించారు. బాధిత విద్యార్థినికి రూ.22 వేలు పరిహారం అందించేందుకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చర్యలు చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. -
భారీగా తగ్గిన.. విమాన సర్వీసులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విమాన సర్వీసులు భారీగా తగ్గిపోయాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025–26లో రాష్ట్రంలో విమాన సర్వీసుల సంఖ్య 898 తగ్గినట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. 2024–25లో రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల నుంచి 63,775 సర్వీసులు నడవగా.. 2025–26లో 62,877కే పరిమితమైంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రాష్ట్రానికి చెందిన టీడీపీ నేత కె.రామ్మోహనాయుడు ఉన్నా.. విమాన సర్వీసులు తగ్గిపోవడం గమనార్హం. ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయ సర్వీసులు అత్యధికంగా నడిచే విశాఖ, విజయవాడల్లో సర్వీసులు తగ్గిపోయాయి.విశాఖలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ఏకంగా 931 నుంచి 772కు పడిపోగా.. మొత్తంగా 22,210 నుంచి 21,711కు తగ్గిపోయాయి. విజయవాడలో దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు సంఖ్య 18,558 నుంచి 17,112కు, రాజమండ్రిలో 8,441 నుంచి 8,047కు పడిపోయాయి. మరోవైపు ప్రయాణికుల సంఖ్యలో మాత్రం వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం రాష్ట్రం నుంచి 62.28 లక్షల మంది వివిధ ప్రాంతాలకు విమానాల్లో ప్రయాణించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 5.54 శాతం అధికం.ఈ వృద్ధి కోస్తాంధ్రలో తక్కువగా ఉంటే.. రాయలసీమలో ఎక్కువగా ఉంది. 2024–25లో కడప నుంచి 52,745 మంది ప్రయాణించగా.. ఆ సంఖ్య 2025–26లో 70,450కి పెరిగింది. అలాగే తిరుపతిలో ప్రయాణికుల సంఖ్య 9,95,640 నుంచి 11,96,176కు చేరింది. రాష్ట్రంలో ముఖ్యమైన విశాఖపట్నం విమానాశ్రయం వృద్ధి 0.4 శాతానికి పరిమితమయ్యింది. విశాఖ నుంచి ప్రయాణించిన వారి సంఖ్య 29.55 లక్షల నుంచి 29.67 లక్షలకు మాత్రమే పెరగ్గా, విజయవాడలో ప్రయాణికుల సంఖ్య 13.88 లక్షల నుంచి 14.11 లక్షలకు పెరిగింది. -
బిల్లులు చెల్లించకుంటే ఆత్మహత్యలే శరణ్యం
సాక్షి, అమరావతి/మంగళగిరి టౌన్: గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం(ఆర్డబ్ల్యూఎస్) పరిధిలో గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని చిన్న తరహా కాంట్రాక్టర్లు మంగళవారం విజయవాడ ధర్నా చౌక్లో ఆందోళన చేశారు. మొదట పనులు చేసిన వారికి మొదట బిల్లులు చెల్లించే విధానం అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. పనులు మొదలు పెట్టక ముందే బడా కార్పొరేట్ సంస్థలకు మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో దోచిపెడుతున్న సర్కారు తమకు మాత్రం పనులు పూర్తయినా బిల్లులు చెల్లించడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తక్షణం బిల్లులు చెల్లించకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.మార్చిలో ధర్నా చేస్తే ఏప్రిల్ పదికల్లా చెల్లిస్తామన్నారు..దాదాపు 750 మంది చిన్న తరహా కాంట్రాక్టర్లకు రూ.1,050 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉండగా సర్కారు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం విడుదల చేసిన రూ.707 కోట్లలో మొబిలైజేషన్ అడ్వాన్స్లతో కలిపి రూ. 562 కోట్లు కార్పొరేట్ సంస్థలకే ప్రభుత్వం చెల్లించిందని దుయ్యబట్టారు. చిన్న తరహా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిల్లో పది శాతం కూడా చెల్లించలేదన్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం తాము మార్చి 25 నుంచి 31 మధ్య ఆరు రోజుల పాటు ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టినప్పుడు ఏప్రిల్ 10 కల్లా డబ్బులు విడుదల చేయనున్నట్టు అధికారులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.బిల్లుల చెల్లింపు ఆలస్యంతో సమస్య జఠిలంబిల్లుల చెల్లింపులో సర్కారు ఆలస్యం చేయడంతో జలజీవన్ మిషన్ 2.0 మార్గదర్శకాలు మారిపోయి, తమ సమస్య మరింత జఠిలంగా మారిందని కాంట్రాక్టర్లు మండిపడ్డారు. జలజీవన్ మిషన్ తాజా మార్గదర్శకాల ప్రకారం బిల్లుల చెల్లింపులు జరగాలంటే.. పాత బిల్లులను మళ్లీ కొత్త పద్దతిలో అప్లోడ్ చేయాలంటున్నారని, దానికి సంబంధించిన విధివిధానాలూ తమకు తెలియదని అధికారులు సమాధానమిస్తున్నారని కాంట్రాక్టర్లు ఆవేదన చేశారు. తమ బిల్లుల చెల్లింపు పూర్తయ్యే వరకు కొత్త బిల్లులు ప్రాసెస్ వద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నాలో నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోనేరు శ్రీనివాస్ ప్రసాద్, అసోషియేషన్ అధ్యక్షులు రామలింగరాజు, ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు, కార్యదర్శులు శేషగిరిరావు, రాజు, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.జనసేన కార్యాలయం వద్ద కాంట్రాక్టర్ల ఆందోళన ’కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న జలజీవన్ మిషన్ (జేజేఎం) బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పలువురు అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఆస్తులు కుదవబెట్టి పనులు చేశామని, బిల్లులు రావడం లేదని ఆవేదన చెందారు. మంత్రి పవన్కళ్యాణ్ను కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. తక్షణం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 16న మంత్రి అందుబాటులోకి వస్తారని, అప్పుడు కలిసే అవకాశం కల్పిస్తామని పార్టీ ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు కాంట్రాక్టర్లు తెలిపారు. -
తెలంగాణకు 23 ఆంధ్రప్రదేశ్కు 10 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయంలో కనీస నిల్వమట్టానికి (ఎండీడీఎల్) ఎగువన మిగిలి ఉన్న 5.27 టీఎంసీల జలాలను పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. నాగార్జునసాగర్ జలాశయంలో ఎండీడీఎల్కి ఎగువన 28.21 టీఎంసీల నిల్వలు మిగిలి ఉండగా, ఏపీ తాగునీటి అవసరాలకు కుడి కాల్వ ద్వారా 10 టీఎంసీలను విడుదల చేయాలని నిర్ణయించింది. మిగిలిన 18.21 టీఎంసీలను సాగర్ ఎడమ కాల్వ ద్వారా తెలంగాణకు విడుదల చేయాలని నిర్ణయించింది. మొత్తంగా ఏపీకి 10 టీఎంసీలు, తెలంగాణకు 23.48 టీఎంసీల జలాలను త్రిసభ్య కమిటీ కేటాయించింది. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ కంబోజ్ అధ్యక్షతన మంగళవారం జలసౌధలో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. వేసవి తాగునీటి అసవరాల కోసం ఇరు రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తులపై ఈ భేటీలో చర్చించారు. వేసవి అవసరాలకు విన్నపాలు: మే 31 నాటికి ఉండనున్న తమ రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి కుడి కాల్వకు 10 టీఎంసీల జలాలను విడుదల చేయాలని గతంలో కృష్ణా బోర్డుకు ఏపీ విజ్ఞప్తి చేసింది. మరోవైపు మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు, హైదరాబాద్ నగరం, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి 13 టీఎంసీలు.. మొత్తంగా 18 టీఎంసీల జలాలను జూలై చివరి నాటికి వాడుకుంటామని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. కాగా ఏపీ విజ్ఞప్తిపై మంగళవారం నాటి భేటీలో తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో 1112.66 టీఎంసీల కృష్ణా జలాలు లభ్యతలోకి ఉండగా, ఏపీ ఇప్పటికే ఏకంగా 771.25 టీఎంసీలు (74.23శాతం) వాడుకుందని కమిటీ దృష్టికి తెచ్చింది. అయితే వేసవి దృష్ట్యా తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యతనిస్తూ పరస్పరం సహకరించుకోవాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సూచించడంతో ఈ మేరకు కేటాయింపులకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. -
పోలీసులు వేధింపులు తాళలేక వైఎస్సార్సీపీ నేత ఆత్మహత్యాయత్నం
కర్నూలు: పోలీసుల వేధింపులు తాళలేక వైఎస్సార్సీపీ యువజన విభాగం కర్నూలు నగర అధ్యక్షుడు బాలాంజనేయులు అలియాస్ బాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పాత ఆర్టీఓ కార్యాలయం పక్కనున్న కమలానగర్లో నివాసం ఉంటున్న బాలు ఇంటికి మంగళవారం మధ్యాహ్నం కర్నూలు మూడో పట్టణ క్రైం పార్టీ పోలీసులు వెళ్లి సీఐ పిలుస్తున్నాడు.. రావాలంటూ ఒత్తిడి చేశారు. దీంతో బాలాంజనేయులు ఇంట్లో ఉన్న కత్తితో చేయి కోసుకున్నాడు. భారీగా రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.గత ఎన్నికల సమయంలో జరిగిన గొడవల్లో ఈయనపై మూడో పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల ఓ చికెన్ సెంటర్ మహిళతో గొడవకు సంబంధించి పోలీసులు బాలును స్టేషన్కు రావాలంటూ బెదిరిస్తున్నారు. దీంతో తాను ఎలాంటి తప్పు చేయకపోయినా టీడీపీ నాయకుల ఒత్తిడితోనే వేధింపులకు గురిచేస్తున్నారని బాధితుడితో పాటు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అక్రమంగా సారా, డ్రగ్స్ కేసులు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ఎస్వీ మోహన్రెడ్డి పరామర్శ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి బాధితుడు బాలాంజనేయులును పరామర్శించారు. వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తనపై ఎలాంటి ఫిర్యాదు లేకపోయినప్పటికీ పోలీసులు వేధిస్తున్నారని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటనపై కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని, పోలీసుల వైఖరిని ఎండగడతామని ఎస్వీ మోహన్రెడ్డి వారికి హామీ ఇచ్చారు. -
భగ్గుమన్న ఆక్వా రైతులు
సాక్షి, అమరావతి/పాలకొల్లు సెంట్రల్/ఒంగోలు సబర్బన్: ఆక్వా ఫీడ్ కంపెనీలు భారీగా ధరలను పెంచడంపై ఆక్వా రైతులు భగ్గుమన్నారు. ధరల పెంపును అడ్డుకోవడంలో విఫలమైన ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఆందోళనలకు దిగారు. ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిరసన గళం విప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో మేత బస్తాలకు నిప్పుపెట్టారు. ధరల పెంపు అమల్లోకి వచ్చాక అడ్డుకుంటామన్న ప్రభుత్వ ప్రకటనపై మండిపడ్డారు. ప్రభుత్వానికి తెలియకుండా కంపెనీలు ఏకపక్షంగా ఫీడ్ ధరలు ఏ విధంగా పెంచుతాయని నిలదీశారు. మేత బస్తాలకు నిప్పుపెట్టి.. ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) అనుమతి లేకుండానే ఫీడ్ కంపెనీలు మేత ధరలను టన్నుకు రూ.8,420 నుంచి రూ,10,530 వరకు పెంచడాన్ని నిరసించారు. మూడు నెలల వ్యవధిలో రెండుసార్లు ఫీడ్ ధరలు పెంచిన కంపెనీల ఏకపక్ష ధోరణిపై కన్నెర్రజేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. పెంచిన ఫీడ్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవడంతో పాటు కనీస గిట్టుబాటు ధరలు కల్పించకపోతే సాగు సమ్మెకు దిగుతామని నరసాపురం, ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాలకు చెందిన రైతులు అల్టిమేటం ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. మేత బస్తాలకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా మత్స్యశాఖ కార్యాలయం ఎదుట రొయ్య రైతులు ధర్నా చేశారు. ఫీడ్ కంపెనీలకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫీడ్ తయారీలో వాడే ముడి పదార్థాల ధరలు పెరగలేదని.. సోయా మీల్ ధర కిలోకు రూ.100 నుంచి రూ.35కు తగ్గాయని చెప్పారు. వేట నిషేధ వేళలో ఏటా పెరిగే ఫిష్మీల్ ధరలను సాకుగా చూపి ధరలు పెంచడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఫీడ్ కంపెనీలన్నీ టీడీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయని, ప్రభుత్వానికి చెప్పకుండా, పెద్దల అనుమతి లేకుండా ఏ విధంగా ఫీడ్ ధరలు పెంచుతాయని సంఘం నేతలు ప్రశ్చించారు. తక్షణం పెంచిన ఫీడ్ ధరలను ఉపసంహరించుకోవాలని, అప్సడా అనుమతి లేకుండా ధరలు పెంచిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ఇలాగైతే క్రాప్ హాలిడే ప్రకటిస్తాం ఆక్వా ఫీడ్ ధరలను కంపెనీలు ఏకపక్షంగా పెంచడాన్ని నిరసిస్తూ ఆగస్టు 1 నుంచి సెపె్టంబర్ 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా క్రాప్ హాలిడే ప్రకటించాలని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం నిర్ణయించింది. మంగళవారం పాలకొల్లులో నిర్వహించిన అత్యవసర సమావేశంలో సంఘాధ్యక్షుడు గొట్టుముక్కల గాం«దీభగవాన్రాజు మాట్లాడుతూ.. వనామీ రొయ్య ఫీడ్పై కేజీకి రూ.8, టైగర్ రొయ్య ఫీడ్పై రూ.10 పెంచడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ముడిసరుకు ధరలు తగ్గినప్పుడు ధరలు తగ్గించని కంపెనీలకు, ఇప్పుడు పెంచాలనే ఆతృత ఎందుకని ప్రశ్చించారు. ప్రభుత్వం కూడా రైతుల కంటే కంపెనీలకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోందని విమర్శించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు కంపెనీలతోపాటు ప్రభుత్వంతోనూ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తొలుత ధరలు పెంచిన కంపెనీలను బహిష్కరించాలని, ఫ్యాక్టరీల వద్ద ధర్నాలు చేపట్టాలని రైతులకు పిలుపునిచ్చారు. బుధవారం రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆక్వా సంఘం కార్యదర్శి బోణం చినబాబు, రంగయ్య నాయుడు, జాన్రాజు పాల్గొన్నారు. నేడు ఆక్వా రైతులు, ఫీడ్ కంపెనీలతో భేటీ ఆక్వా రైతుల ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు స్పందించారు. ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సాగు వ్యయాలు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులపై ధరల పెంపు మరింత భారంగా మారుతుందన్నారు. అప్సడా చట్టం ప్రకారం రైతు సంఘాలతో చర్చించిన తర్వాత మాత్రమే ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా పెంచేశాయని ఆరోపించారు. పెంచిన ధరల అమలును తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ కమిషనర్ను ఆదేశించారు. ఈ అంశంపై రైతు సంఘాలు, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులతో బుధవారం సమావేశమై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మేత ధరల పెంపును అడ్డుకోవాలి మేత ధరల పెంపును అడ్డుకోవాలని ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. టైగర్ రొయ్యల మేతపై టన్నుకు రూ.10,530, వెనామీ రొయ్యల మేత ధర రూ.8,420 చొప్పున పెంచడంతో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతుందన్నారు. ఇప్పటికే వైరస్లతో దిగుబడులు రాక, కౌంట్ ధరలు పతనమై అల్లాడుతున్న ఆక్వా రైతులకు ఈ ధరల పెంపు అశనిపాతంగా మారిందన్నారు. తక్షణమే అప్సడా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మేత ధరలను పూర్తిస్థాయిలో ఉపసంహరింపజేయాలని డిమాండ్ చేశారు. కాగా.. ఆక్వా రైతులతో సంప్రదించకుండా మేత ధరలు పెంచడాన్ని ఏపీæ కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు బి.బలరామ్, కార్యదర్శి ఎం.హరిబాబు తప్పుబట్టారు. మూడు నెలల్లో రెండోసారి ధరలు పెంచడం సరికాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండేళ్లుగా రొయ్య రైతులు గిట్టుబాటు ధరలేక తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. పెంచిన ఫీడ్ ధరలతో పాటు ఫిబ్రవరిలో పెంచిన ధరలను కూడా పూర్తిగా ఉపసంహరింప చేయాలని డిమాండ్ చేశారు. ఏకపక్షంగా ధరలు పెంచిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
అభిమానం.. అనంతం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ కుమారుడు చైతన్యమిత్ర, అనంతపురం జిల్లా పామిడికి చెందిన వైఎస్సార్సీపీ నేత వీరాంజనేయులు కుమార్తె, ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్పర్సన్ లిఖితలకు ఇటీవల వివాహమైంది. మంగళవారం పామిడిలో నిర్వహించిన వీరి రిసెప్షన్కు పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచ్చేశారు. వధూవరులకు పుష్పగుచ్ఛం అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అక్కడికి భారీగా చేరుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. అంతకు ముందు వేదిక ప్రాంతానికి వస్తుండగా దారిపొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా నిల్చొని ‘జై జగన్’ అంటూ నినాదాలు చేశారు. వారందరికీ వైఎస్ జగన్ చిరునవ్వుతో అభివాదం చేశారు. యువతతో కరచాలనం చేస్తూ, చిన్నారులను ముద్దాడుతూ ముందుకు సాగారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డితో పాటు పార్టీ నేతలు పలువురు వధూవరులను ఆశీర్వదించారు. -
అమరావతిలో భూదందా
ఇల్లెందు: ‘ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగురుతుందన్నట్టు..’ గా అమరావతి రాజధాని నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం తీరు అలా ఉందని రైతు ఉద్యమనేత వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరుగుతున్న అఖిల భారత ఐక్య రైతు సంఘం (మాస్లైన్ అనుబంధం) జాతీయ మహాసభలు మంగళవారం రెండోరోజుకు చేరాయి. ఈ సభలకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే రాజధాని పేరిట ల్యాండ్ పూలింగ్లో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం వేలాది ఎకరాల భూమి సేకరించిందని తెలిపారు.ఆ భూమిలో రాజధాని నిర్మాణం చేపట్టకపోగా మరో 20 వేల ఎకరాలు ఇస్తే రాజధానిని నిర్మిస్తామని చెబుతుండడంపై ఎవరూ నమ్మలేని పరిస్థితి నెలకొందన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్పరం కాబోతోందన్నారు. దీన్ని కాపాడుతామని ఎన్నికల ముందు చెప్పిన నేతలు.. ఇప్పుడు మోదీ సర్కార్కు తలొగ్గి ఇష్టారాజ్యంగా కార్పొరేట్ సంస్ధలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. కాగా, అమరావతిలో మరోమారు భూములు తీసుకునేందుకు సాగుతున్న యత్నాలపై తమతోపాటు కలిసి వచ్చే శక్తులతో పోరాటం సాగించనున్నట్టు శోభనాద్రీశ్వరరావు తెలిపారు.తొలుత అఖిల భారత ఐక్య రైతు సంఘం సభల్లో ఆయన మాట్లాడుతూ దేశంలో మోదీ నేతృత్వాన ఫాసిస్టు పాలన సాగుతోందని, ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల్లోని కారి్మకుల మాదిరిగా రైతాంగం ఐక్యతను ప్రదర్శించకపోవడం వల్లే హక్కులు సాధించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. దేశంలోని రైతాంగాన్ని ఐక్యం చేసి బలమైన ఉద్యమాలు నిరి్మంచాలని ఆయన సూచించారు. -
ఆక్వా మేత ధరల వెనుక భారీ కుంభకోణం
సాక్షి, అమరావతి: ఆక్వారంగ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మేత ధరలు పెంచడం దారుణమని మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, కాకాణి గోవర్ధన్రెడ్డి, సీదిరి అప్పలరాజు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా ఫీడ్ ధరలను టన్నుకు రూ.10,530 వరకు పెంచడంతో ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్నారన్నారు. ఏకపక్షంగా ధరల పెంపు వెనుక భారీ కుంభకోణం ఉందని స్పష్టం చేశారు. ధరల పెంపును అడ్డుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని, అప్సడా చట్టానికి విరుద్ధంగా ధరలు పెంచుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా ముడుపులు అందుకుంటూ.. ‘ఫీడ్ కంపెనీలతో ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కయ్యారు. ఆక్వా రైతులను దోచుకుతింటున్నారు. ప్రతినెలా టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఫీడ్ కంపెనీల నుంచి ముడుపులు అందుతున్నాయి. అందుకే ధరలను ఏకపక్షంగా పెంచినా అడ్డుకోలేదు. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలు తగ్గించినా ధరలను ఆ మేరకు తగ్గించలేదు. కూటమి ప్రభుత్వం వచి్చన తర్వాత ఆక్వా ఫీడ్ ధరలను ఏకపక్షంగా పెంచారు. ముడిసరుకుల ధరలు తగ్గినా మేత ధరలు తగ్గించలేదు. ఆక్వా ఫీడ్ కంపెనీల మాఫియాకు ప్రభుత్వ పెద్దలు దన్నుగా నిలుస్తున్నారు. ప్రతినెలా టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముడుపులు అందుతున్నాయి. ఆక్వా రైతుల కష్టం టీడీపీ దోపిడీ పాలవుతోంది. ప్రభుత్వానికి తెలియకుండా ధరలు పెంచుతారా? వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు హాస్యాస్పదం. ఆక్వా రైతుల ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆక్వా సిండికేట్ ముడుపుల్లో మంత్రి అచ్చెన్నాయుడు వాటా ఎంతో చెప్పాలి. ఇప్పటికే కరెంట్ లేక, డీజిల్ ఇవ్వక ఆక్వా రైతులు కుదేలయ్యారు. వారిపై ఫీడ్ ధరల పెంపు మరో పిడుగుపాటుగా పరిణమించింది. ధరలను తక్షణం తగ్గించకపోతే ఆక్వా రైతుల తరఫున ఉద్యమిస్తాం’ అని కన్నబాబు, కాకాణి, అప్పలరాజు హెచ్చరించారు. -
రేపు ‘చలో మామిళ్లపల్లి’కి వైఎస్సార్సీపీ పిలుపు
సాక్షి, తాడేపల్లి: మొక్కజొన్న రైతులపై దాడి, అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ స్పందించింది. మొక్కజొన్న రైతులకు అండగా నిలిచేందుకు రేపు(మే 13, బుధవారం) చలో మామిళ్ళపల్లి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ.. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర దళారీలకే గ్యాంగ్స్టర్గా మారారంటూ మండిపడ్డారు.‘‘మొక్కజొన్న రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. పంటను దాచుకున్న రైతులపై దాడులు చేయించారు. మామిళ్ళపల్లిలో రైతుల గోదాముపై దాడి చేయటం దారుణం. మొక్కజొన్నకు కేంద్రం రూ.2,400 మద్దతు ధర ప్రకటిస్తే నరేంద్ర మాత్రం రూ.1,652కే కొనుగోలు చేస్తున్నారు. తన సంగం డెయిరీకి అనుబంధ సంస్థల కోసం అతి తక్కువకే కొంటూ రైతులను మోసం చేస్తున్నారు. తనకు మొక్కజొన్న అమ్మకపోతే దాడులు చేయిస్తారా?. టీడీపీ మండల స్థాయి నేతలే ఈ దాడుల్లో పాల్గొన్నారు. అది నా గోదామని ధూళిపాళ్ళ అబద్దాలు చెప్తే అధికారులే నమ్మలేదు. దాడులు చేసిన 31 మంది టీడీపీ నేతలపై కేసులు కూడా పెట్టారు. దీంతో ఎమ్మెల్యే నరేంద్ర మైండ్ బ్లాంక్ అయింది..అధికారుల మీద ఒత్తిడి చేసి ప్రతీకారంగా మా వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారు. మొక్కజొన్న దాచుకున్న ఐదుగురు రైతులు సహా మొత్తం 15 మంది రైతులపై కేసులు పెట్టించారు. కర్ణాటక, తెలంగాణలో మొక్కజొన్నకు రూ.2400 కొంటుంటే ఏపీలో ఎందుకు కొనటం లేదు?. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని తీసుకురావద్దు. అక్రమంగా నిల్వలు ఉంచిన ధూళిపాళ్ళపై డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు స్పందించడం లేదు?. అప్పట్లో సీజ్ ద షిప్ అన్నట్టుగా ఇప్పుడు సీజ్ ద సంగం డెయిరీ అని ఎందుకు అనటం లేదు?’’ అంటూ అంబటి మురళీకృష్ణ దుయ్యబట్టారు. -
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం
సాక్షి, అనంతపురం జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా పామిడిలో పర్యటించారు. ఏడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఎం.వీరాంజనేయులు కుమార్తె లిఖిత, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎ.మధుసూదన్ కుమారుడు చైతన్యమిత్రల వివాహం ఇటీవల జరిగింది.ఇవాళ (మంగళవారం) పామిడిలోని వీరాంజనేయులు నివాసంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్.. వారిని ఆశీర్వదించారు. -
మా నాన్న టీడీపీ ఎమ్మెల్యే.. నీ భర్తను నాకిచ్చేయ్!
‘‘మా నాన్న అధికార పార్టీ ఎమ్మెల్యే.. పోలీసులు నా మనషులే.. ఏమనుకుంటున్నావ్.. నేను తల్చుకుంటే నిన్ను, నీ భర్తను ఏమైనా చేయగలను’’ అంటూ అంటూ టీడీపీ మహిళా నేత ఒకరు బెదిరింపులకు దిగడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. అంతేకాదు.. తన కాపురం చెడగొట్టద్దని వేడుకంటే చంపేస్తానని బెదిరిస్తోందని వాపోతోందామె. సాక్షి, పల్నాడు జిల్లా: నరసరావుపేట పట్టణానికి చెందిన కర్లకుంట కృష్ణదీప్తి తాజాగా జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్ఎస్)ను ఆశ్రయించింది. టీడీపీకి చెందిన మల్లవరపు అభినయ సింధూర తన కాపురంలో నిప్పులు పోసిందని.. గట్టిగా నిలదీస్తే తెలుగు దేశం పెద్దలు పేర్లు చెబుతోందని చెబుతోంది. ‘‘నా భర్త కాళీ.. ముగ్గురు సంతానంతో సంతోషంగా ఉన్నాం. ఎమ్మెల్యేగారి కూతురునంటూ 10 నెలల కిందట మల్లవరపు అభినయ సింధూర నా భర్తకు పరిచయమైంది. అప్పటి నుంచి ఆమె మోజులో పడి నా భర్త ఇంటికి కూడా రాలేదు. ఆయన్ని వదిలేయాలని బతిమాలితే.. ‘నేను ఎమ్మెల్యే గారి అమ్మాయిని. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మా మావయ్య’ అని బెదిరిస్తోంది. నా భర్తకు విడాకులివ్వాలని నాపై ఒత్తిడి చేస్తోంది. మాట వినకపోతే నా భర్తను అక్రమ కేసుల్లో ఇరికిస్తానని బెదిరిస్తోంది. నన్ను, నా బిడ్డలను చంపేస్తానంటోంది.. .. హానీ ట్రాప్ లేడీలా వ్యవహరిస్తున్న సింధుర మీద టూటౌన్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. సీఐ ప్రభాకర్ కౌన్సెలింగ్ నిర్వహించి నా భర్తను కూడా మందలించారు. మనసు మార్చుకున్న నా భర్త.. మా కోసం దిగివచ్చాడు. దీంతో రేప్ కేసు పెడతానంటూ సింధూర నా భర్తపై బెదిరింపులకు దిగింది. నీ భార్యను వదిలి రాకపోతే ఆత్మహాత్య చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేస్తోంది. అయినా వినకుంటే నన్ను హత్య చేయిస్తానని నా భర్తకు నరకం చూపిస్తోంది. ఇప్పటికే మేం ఆర్థికంగా దెబ్బతిని.. అప్పులలో కూరుకుపోయామని ఉన్నాం. మా బతుకు మమ్మల్ని బతుకనీయండి అని వేడుకున్నా సింధూర కనికరించడం లేదు. అధికార పార్టీ నేతల అండ దండలు చూసి ఆమె రెచ్చిపోతోంది. ఆమె నుంచి మాకు ప్రాణహని ఉంది. మాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యం’’ అని ఎస్పీ కార్యాలయంలో చేసిన ఫిర్యాదులో బాధితురాలు కృష్ణదీప్తి పేర్కొంది. ఈ వ్యవహారంపై పోలీసులు స్పందించాల్సి ఉంది. -
బెంగళూరుకు క్యూ కడుతున్న ఏపీ ప్రజలు.. కారణం ఇదే
నంద్యాల జిల్లా: అధికారంలో ఉన్నామని, తాము ఏం చేసినా ఎవరూ ప్రశ్నించకూడదని టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. పేదలకు ఉపాధిహామీ పథకాన్ని దూరం చేస్తూ కరువు శాసనం రాశారు. తమ కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా మంది దూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వీరి వెంట చిన్నారులు, వృద్ధులు వస్తున్నారు. డోన్ మండలం జగదుర్తి గ్రామంలో ఈ దుస్థితి నెలకొంది. ఈ గ్రామంలో మొత్తం 1,200 మంది ఉండగా వీరిలో అత్యధికమంది పేదలు. వేసవి కాలంలో వీరికి గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు అండగా నిలిచాయి. ఈ పథకం లక్ష్యం నీరుగార్చేందుకు టీడీపీ నాయకులు ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. అక్రమార్జన కోసం మేటీ, ఫీల్డ్ అసిస్టెంట్ పదవుల కోసం పోట్లాడుతూ పేదలకు పనులు కల్పించకుండా అడ్డుకట్ట వేశారు. దీంతో జగదుర్తి గ్రామస్తులు చాలా మంది పనుల కోసం ఆదివారం గుంటూరు, బెంగళూరు ప్రాంతాలకు వెళ్తేందుకు డోన్ రైల్వేషన్కు వెళ్లారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని, దొంగ మస్టర్లతో కూలీల డబ్బులు కాజేస్తున్నారని ప్రజలు ఆరోపించారు. గ్రామస్తులు వలస వెళ్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఏపీఎం సుకూర్ను ప్రశ్నించగా జగదుర్తి పంచాయతీ పరిధిలో ఉపాధి హామీపనులు ఇంతవరకు జరగని మాట వాస్తవమని పేర్కొన్నారు. గ్రామ పెద్దలతో చర్చించి కూలీలు పనుల కోసం వలస వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. -
బాబూ.. అది పుష్పక విమానం కాదు..
విశాఖపట్నం: సాగర తీరంలో ఈ యువకుల ప్రయాణం చూస్తుంటే.. అది బైకులా కాకుండా అందరూ ఇట్టే ఇమిడిపోయే ‘పుష్పక విమానం’లా కనిపిస్తున్నట్టుంది. నిబంధనల ప్రకారం ఇద్దరికే చోటున్నా, ఏకంగా నలుగురు ఎక్కి ‘చతుర్ముఖ’ ప్రయాణంతో ట్రాఫిక్ రూల్స్ను నడిరోడ్డుపై గాలికొదిలేశారు. అటు హెల్మెట్ లేదు.. ఇటు భద్రతా లేదు.. కేవలం సరదా కోసం ప్రాణాలను పణంగా పెడుతూ చేస్తున్న ఈ సాహసం ఏ మాత్రం అదుపు తప్పినా తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తుంది. -
మద్యం మానిపిస్తే ఆత్మహత్య చేసుకుంటా..
విశాఖపట్నం జిల్లా: మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఓ వ్యక్తి, పునరావాస కేంద్రానికి తరలిస్తుండగా నడిరోడ్డుపై హల్చల్ చేశాడు. బలవంతంగా మద్యం మానిపిస్తే బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకుంటానని అలజడి సృష్టించాడు. రిహాబిలిటేషన్ కేంద్రానికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో ద్విచక్ర వాహనం పైనుంచి దిగిపోయి, ఆర్టీసీ బస్సు కింద పడుకుని నానా యాగీ చేశాడు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి అతడిని అదుపులోకి తీసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గోపాలపట్నం సమీపంలోని బాజీ జంక్షన్కు చెందిన భార్గవ్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో అతడికి మద్యం మానిపించేందుకు చినముషిడివాడలోని రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలిస్తున్నారు. అయితే సుజాతనగర్ బీఆర్టీఎస్ రహదారిపై ఒక్కసారిగా వాహనం దిగిపోయిన భార్గవ్.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఆపేశాడు. వెంటనే బస్సు కింద పడుకుని, తనను కేంద్రానికి తరలిస్తే ఆత్మహత్య చేసుకుంటానని భీష్మించాడు. దీంతో ప్రయాణికులు పెందుర్తి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని స్టేషన్కు తరలించారు. అనంతరం కౌన్సిలింగ్ నిర్వహించి, అతడికి మెరుగైన మానసిక చికిత్స అందించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. -
ఎదుటివారికి చెప్పేటందుకేనా ప్రధాని నీతులు!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికి అంతా ఊహిస్తున్న సందేశం ఇచ్చేశారు. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తర్వాత మోదీ కొన్ని చర్యలు చేపడతారని ,అవి ప్రజలపై భారం మోపేవిగా ఉండక తప్పదని భావించారు. హైదరాబాద్ లో జరిగిన భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలో ఆయన పలు అంశాలు ప్రస్తావించి అసలు సమస్య కూడా చెప్పేశారు. ఆయన చెప్పినవి సూచనలుగా తీసుకుంటారా? లేక జరగబోయే పరిణామాలుగా తీసుకుంటారా అన్నది ప్రజల ఇష్టం.ఒక ఏడాదిపాటు బంగారం కొనవద్దని చెప్పడం నిజంగా సంచలనమైన సంగతే. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని చెప్పడం అసాధారణమేమీ కాకపోయినా, భవిష్యత్తులో వీటి ధరలు పెంచుతారన్న సంకేతాలు ఇచ్చినట్లు అయ్యింది. విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని, యూరియా వాడకం నియంత్రించాలని ఇలా తొమ్మిది పాయింట్లపై ప్రజలకు సలహాలు ఇచ్చారు. విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేయడం కోసం ఈ చర్యలు చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.వీటన్నిటిని దేశ భక్తితో ముడిపెట్టడంపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. దేశం ఎదుర్కుంటున్న సమస్యలను ప్రజలకు వివరించడం తప్పు కాదు. కాని ఆయన కూడా సాధారణ రాజకీయ నేత మాదిరే వ్యవహరిస్తున్నారన్నదే బాధ. ఇంతకాలంగా ప్రధానమంత్రిగా ఉంటూ దేశ ప్రజల అభిమానం చూరగొంటున్న నేతగా ఆయన రాజనీతిజ్ఞుడుగా ఉంటే సంతోషంగా ఉంటుంది. కాని ఆలా చేయలేకపోతున్నారే అన్న భావన ఆయన అభిమానులలో ఏర్పడుతోంది.దాదాపు మూడు నెలలుగా గల్ఫ్ లో యుద్ద వాతావరణం నెలకొంది. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు, ఇరాన్ కు మద్య సాగుతున్న ఘర్షణల ప్రభావం ప్రపంచం అంతటా పడుతోంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని మూసివేయడం, ఇతరత్రా అంతర్జాయతీయ పరిణామాలు అందరిని కలవరపరుస్తున్నాయి. ఈ క్రమంలోనే కమర్షియల్ వంట గ్యాస్ ధరను అమాంతం పెంచాల్సి వచ్చింది. అప్పుడే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయని ఊహించారు.కాని శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులు ఆ ఊసు ఎత్తకుండా జాగ్రత్తపడ్డారు. కేంద్రం తరపున అధికారులు ఎప్పటికప్పుడు ఆయిల్ ధరలు పెరగవని చెబుతూ వచ్చారు. కానీ.. ఎన్నికలు పూర్తయి, ఫలితాలు వెల్లడైన వారం రోజులకే అసలు రంగు బయటపడింది. ప్రధాన మంత్రే ఆర్థిక సంక్షోభం గురించి స్వయంగా వివరించారు. సమీప భవిష్యత్తులో చమురు ధరలు పెరగవచ్చన్నది ఎక్కువ మంది అంచనాగా ఉంది.ఇక ఈ పొదుపు సూత్రాలు చెప్పడానికి ఆయన ఎంపిక చేసుకున్న వేదిక సరైనదేనా అన్న ప్రశ్న వస్తుంది. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన పార్టీ బహిరంగ సభలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. పెట్రోల్ ,డీజిల్ వాడకం తగ్గించుకోండని, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని చెప్పారు. సొంత వాహనాలను వదలి మెట్రో,బస్ లను వాడాలని చెప్పారు. ఆక్షేపణ లేదు. ఈ సమస్య గురించి ఆయనకు ముందుగానే తెలుసు కదా! అలాంటప్పుడు ఇంత భారీ సభను నిర్వహించడం ఎంతవరకు సరి? లక్షల మందిని సమీకరించి, వారందరిని వాహనాలలో తీసుకురావడానికి ఎంత పెట్రోల్, డీజిల్ అవసరం అవుతాయో ఆయనకు తెలియదా?ప్రజలకు పొదుపు మంత్రం చెప్పి, తామేమో ఇలా జనాన్ని పోగు చేయడానికి చమురును వాడవచ్చా! రెండున్నరేళ్ల తర్వాత జరిగే తెలంగాణ శాసనసభ ఎన్నికలకోసమో, లేక హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల కోసమో ఈ సభ పెట్టినట్లు లేదా? అలాగే తెలంగాణలో ఆయన పలు శంకుస్థాపనలు ,ప్రారంభోత్సవాలు చేశారు. అది కూడా హైదరాబాద్ నుంచి రిమోట్ ద్వారానే జరిపారు. ఆ పని ఢిల్లీ నుంచి కూడా చేసి ఉండవచ్చు కదా అన్న సందేహానికి అవకాశం ఇచ్చారు. దేశంలోని ఆయా నగరాలలో ప్రజా రవాణా అంత మెరుగ్గా లేదన్న సంగతి ఆయనకు తెలుసు కదా!ముందుగా దానిని మెరుగు చేయకుండా బస్సుల్లో వెళ్లండి అంటే అది ఎలా సాధ్యం అవుతుంది. మోదీ చెప్పిన సూత్రాలలో బంగారం కొనుగోలు చేయవద్దని చాలా ముఖ్యమైన ప్రకటనగా కనిపిస్తుంది. ఇది మహిళల సెంటిమెంట్కు వ్యతిరేకంగా ఉండవచ్చు. ప్రత్యేకించి హిందూమతం అంటూ నిత్యం జపం చేసే బీజేపీ ఈ ప్రతిపాదన చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. దీని ప్రభావం దేశ వ్యాప్తంగా బంగారం షాపులపై ఉంటుంది. నిజంగానే ప్రజలు బంగారం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం మానివేస్తే దాని విపరిణామాలు కూడా గణనీయంగానే ఉంటాయి. కొన్నివేల గోల్డ్ షాపులు దెబ్బతింటాయి.వేలాది మంది ఉద్యోగాలకు గండం ఏర్పడుతుంది. ఇన్నేళ్లుగా ఆత్మనిర్భర్ పేరుతో కేంద్రం అమలు చేస్తున్న విధానాలు పెద్దగా ఫలించడం లేదని ఆయన చెప్పినట్లుగా ఉంది. గోల్డ్ బాండ్ల పేరుతో ప్రజల నుంచి నిధుల సేకరణ కూడా ఫలితం ఇవ్వలేదన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. విదేశీ వస్తువుల వినియోగం తగ్గించాలని అన్నారు. బాగానే ఉంది. కాని తమ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అమరావతి పేరుతో ఎన్నివేల కోట్ల అప్పు చేస్తున్నది మోదీకి తెలియదా? అక్కడ నిర్మాణాల కోసం ఈ మధ్య కొన్ని కోట్ల లీటర్ల డీజిల్ ను మళ్లించే యత్నం చేయడంపై కేంద్రం అభ్యంతరం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవసరమైన నిర్మాణాలు చేపట్టి, పొదుపుగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెప్పి ఉంటే బాగుండేది కదా!హైదరాబాద్లో స్వయంగా చంద్రబాబు ఇంటికి ప్రధాని వెళ్లారు కదా! ఆ సందర్భంగా ఏపీలో జరుగుతున్న దుబారా గురించి కూడా సలహా ఇచ్చి ఉంటే బాగుండేదేమో! చదరపు అడుగుకు రూ.18 వేల వరకు ఖర్చు పెడుతున్న ప్రభుత్వంగా ఏపీ రికార్డు సాధిస్తోంది.ఈ నిర్మాణాలలో ఎన్ని రకాల సరుకులను విదేశాల నుంచి తెప్పిస్తోందో తెలియదు. ఒక్క అద్దాలకే రూ.2540 కోట్లు వెచ్చించబోతున్నారే. అవన్ని ఇండియాలో తయారయ్యేవా? లేక దిగుమతి చేసుకోవల్సి ఉంటుందా? వంట నూనెలు తగ్గించుకోవాలని కూడా మోడీ సలహా ఇచ్చారు.ఇన్నేళ్ల పాలనలో వంట నూనెల విషయంలో కూడా దేశం స్వయం సమృద్ధి సాధించలేకపోవడం అవమానమే. రైతులు యూరియా వాడకం తగ్గించాలని అన్నారు. ఉక్రెయిన్,రష్యా యుద్దం మూడేళ్లుగా జరుగుతోంది. త్వరలో ముగుస్తుందని చెబుతున్నారు. ఈ దశలో యూరియా గురించి మోడీ జాగ్రత్తలు చెబుతున్నారు. సేంద్రీయ ఎరువులు, ప్రత్యామ్నాయ ఎరువులు అందుబాటులో ఉంటే రైతులు తప్పనిసరిగా మార్చుతారు. అది చేయకుండా యూరియా వాడవద్దంటే, పంటలు సరిగా పండకపోతే రైతులకు కలిగే నష్టాన్ని ఎవరు భరిస్తారు? ప్రజలు విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలని ప్రధాని సలహా ఇచ్చారు. ఇదేదో ఏపీ ప్రభుత్వానికి ఇచ్చి ఉండాల్సింది. ఈ మధ్య కాలంలో చిత్రమైన శిక్షణల పేరుతో మంత్రులు, అధికారులను బృందాలుగా సింగపూర్ పంపుతున్నారు. దీనివల్ల ఏపీకి కలిసి వచ్చేది ఏమి ఉందో ఎవరికి తెలియడం లేదు.ప్రభుత్వ ఖజానా పై కోట్ల భారం పడుతోంది.వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ మీటింగుల గురించి కూడా ప్రధాని సూచన చేశారు. ఇప్పటికే అలాంటివి జరుగుతున్నాయి. కాని వాటివల్ల కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. మామూలు రోజుల్లో ప్రధాని ప్రజలకు ఇలాంటి సలహాలు ఇచ్చి ఉంటే తప్పక చిత్తశుద్ది అర్ధం అవుతుంది.కాని ఎన్నికల సమయంలో ఒక రకంగా ,ఆ తర్వాత మరో రకంగా వ్యవహరిస్తుండడమే విమర్శలకు దారి తీస్తుంది.గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు డాలర్తో రూపాయి విలువను పోల్చి విమర్శలు చేసిన మోడీ, అప్పటికన్నా విలువ దాదాపు రెండు రెట్లు తగ్గినా ఇంతవరకు మాట్లాడలేదు.ప్రధాని చెప్పిన నవ సూత్రాలపై లోక్ సభ లో విపక్ష నేత రాహోల్ గాంధీ ధ్వజమెత్తారు. ఇది మోదీ ప్రభుత్వ వైఫల్యం అని, ప్రధాని అయిన 12 ఏళ్లకు ఈ స్థితికి దేశాన్ని దిగజార్చారని వ్యాఖ్యానించారు. ఎప్పుడో 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నప్పుడు పాక్ యుద్దం, కరువు పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు వారానికి ఒక పూట ఉపవాసం చేయాలని విజ్ఞప్తి చేశారు. దానిని ఆయన తొలుత తన కుటుంబం నుంచే ఆచరించి చూపారు.తద్వారా దేశభక్తి అంటే ఏమిటో తెలియచేశారు. అలాగే ముందుగా మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నేతలు దేశభక్తిని నిజమైన రీతిలో ఆచరించి,అప్పుడు ప్రజలకు చెబితే ఆదర్శవంతంగా ఉంటుంది కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
గుంటూరు: నిడబ్రోలులో కాల్పుల కలకలం
సాక్షి, గుంటూరు: నిడబ్రోలులో కాల్పుల కలకలం రేగింది. రైల్వే సిగ్నల్ దగ్గర దుండగులు కాల్పులు జరిపారు. సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో జీఆర్పీఎఫ్ పోలీసులు 10 రౌండ్లు కాల్పులు జరిపారు. నిడుబ్రోలు సమీపంలో రైల్వే సిగ్నల్స్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను గస్తీ కాస్తున్న జిఆర్పీ పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తులు పోలీసులపై రాళ్లు రువ్వారు.ఈ క్రమంలో పోలీసులు.. పది రౌండ్లు కాల్పులు జరిపారు. సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్ పాల్పడితే కాల్పులు జరుపుతామని గతంలో జీఆర్పీఎఫ్ పోలీసులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇదే మార్గంలో నెల రోజుల క్రితం రైలు ఆపిన దొంగలు.. దోపిడీ చేసిన సంగతి తెలిసిందే. తాజా ఘటనతో జీఆర్పీఎఫ్ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. -
బీ‘టెక్’ చోరుడు!
చిత్తూరు అర్బన్: మహేష్ బాబు బీటెక్. వయసు 22. బెట్టింగుల వ్యసనం అతడిని చోర శిఖామణిగా మార్చేసింది. పగలంతా కళాశాలకు వెళ్లి చదువుకోవడం.. రాత్రివేళ చోరీలు చేయడం అలవాటుగా మార్చుకున్న అతగాడు చివరకు పోలీసులకు చిక్కాడు. చిత్తూరు ఎస్పీ తుషార్డూడీ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ఆర్ పురం మండలం కన్యకాపురానికి చెందిన మహేష్ బాబు తిరుపతిలో ఉంటూ అక్కడే ఓ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. క్రికెట్ బెట్టింగుల ఉచ్చులో చిక్కుకున్న అతడు తెలిసినవాళ్లు, స్నేహితుల నుంచి అప్పులు తీసుకుని మరీ రూ.లక్షలు పోగొట్టుకున్నాడు.అయినా ఆ వ్యసనం నుంచి బయటకు రాలేకపోయాడు. పందేలు కాయడానికి డబ్బులు లేకపోవడంతో చివరకు దొంగతనాలను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో చోరీలు చేస్తే పెద్దగా పట్టించుకునే వ్యవస్థ లేదని గ్రహించి.. గ్రామ, వార్డు సచివాలయాల్లో చోరీలకు పాల్పడటం అలవాటుగా మార్చుకున్నాడు. రాత్రివేళ సచివాలయాల్లోకి ప్రవేశించి ప్రింటర్లు, ఎల్రక్టానిక్ వస్తువులు చోరీ చేసేవాడు. ఇలా ఎస్ఆర్ పురంలో 5, వెదురుకుప్పంలో 3, గుడిపాలలో 2, జీడీ నెల్లూరులో 2, తిరుపతి జిల్లాలో 5, అన్నమయ్య జిల్లాలో ఒక కేసులో మొత్తం కలిపి 18 కేసుల్లో మహేష్ కుమార్ను నిందితుడిగా గుర్తించారు. చోరీ చేసిన వస్తువులను ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఓఎల్ఎక్స్లో తక్కువ ధరకు అమ్మేసేవాడు. వేలిముద్రలే పట్టించాయి చోరీలకు పాల్పడిన ప్రాంతాల్లో నిందితుడి వేలిముద్రలను సేకరించిన పోలీసులు ఆధార్ కార్డు నమోదైన వేలి ముద్రలతో సరిపోల్చి నిందితుడిని గుర్తించారు. సోమవారం చిత్తూరు–తిరుపతి జాతీయ రహదారిపై మఠం క్రాస్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళుతున్న మహేష్ బాబును అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.8.10 లక్షల విలువ చేసే ప్రింటర్లు, ద్విచక్ర వాహనం, ఇనుప తలుపులు కత్తిరించే భారీ కట్టర్, ల్యాప్టాప్లను స్వాదీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపించిన కార్వేటి నగరం సీఐ హనుమంతప్ప, ఎస్ఆర్ పురం ఎస్ఐ సుమన్, సిబ్బందికి ఎస్పీ నగదు రివార్డు అందచేశారు. ఎస్పీ వెంట ట్రైనీ ఐపీఎస్ తరుణ్ పహ్వా, ఏఎస్పీ రాజశేఖర్ రాజు, నగరి ఇన్చార్జి పోలీసు అధికారి రాంబాబు, ఎస్బీ సీఐ మురళి ఉన్నారు. -
రూ.10 కోట్లు విలువైన పార్క్ స్థలం కబ్జా..!
సాక్షి, టాస్క్ఫోర్స్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గుడి, బడి, ప్రభుత్వ స్థలాలు.. ఇలా దేన్నీ వదలకుండా ఆక్రమించేస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి రూరల్ మండలంలో కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు కబ్జాకు గురవుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల గ్రామ పంచాయతీకి కేటాయించిన రూ.10 కోట్ల విలువజేసే 1.57 ఎకరాల పార్క్ స్థలాన్ని ఓ టీడీపీ నాయకుడు ఆక్రమించి పట్టపగలే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. పార్క్ స్థలం కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టిస్తున్న వ్యక్తి స్థానిక ఎమ్మెల్యేకి సమీప బంధువునని చెబుతుండడం వల్ల సదరు ఎమ్మెల్యే స్పందించి నిర్మాణ పనులను నిలిపివేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పుదిపట్ల గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 558లో ఉన్న దరఖాస్తు పట్టా భూమిని గతంలో ఓ ప్రైవేట్ వెంచర్ సంస్థ అభివృద్ధి చేసి పార్క్కు కేటాయించినట్టు సమాచారం. ఆ స్థలంపై చాలాకాలం నుంచి కన్నేసిన స్థానిక టీడీపీ నేత ఇప్పుడు అధికార బలంతో స్వా«దీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై గతంలో స్థానికులు తిరుపతి కోర్టును ఆశ్రయించగా, అది పార్కు స్థలమేనని కోర్టు స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. అయినప్పటికీ కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా నిర్మాణాలు కొనసాగిస్తుండడంపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా రికార్డులు మార్చి ఆక్రమణదారులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని, ఆ స్థలంపై ఇప్పటికే హైకోర్టులో కేసు నడుస్తున్నందున కింది కోర్టు ఆదేశాలు ధిక్కరణ కింద చర్యలు కోరతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. -
ఈవీ.. రయ్ రయ్!
సాక్షి, అమరావతి: దేశంలో విద్యుత్ వాహనాల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. 2025లో వీటి అమ్మకాలు 23 లక్షలకు పైగా జరిగాయి. మొత్తం కొత్త వాహనాల విక్రయాల్లో ఇది సుమారు 8 శాతం. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, కాలుష్యంపై అవగాహన, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, కొత్త కంపెనీల ప్రవేశం వంటి కారణాలతో భారత ఈవీ రంగం భారీ మార్పు దిశగా సాగుతోంది. ప్రస్తుతం భారత ఆటోమొబైల్ రంగంలో ఈవీలకు ప్రత్యేక స్థానం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఆటోలు ఈ మార్కెట్ను ముందుకు నడిపిస్తున్నాయి. భారత్లో ఈవీ మార్కెట్కు ప్రధాన బలం ఎలక్ట్రిక్ టూ వీలర్లు. మొత్తం ఈవీ అమ్మకాల్లో సగానికి పైగా వాటా వీటిదే. తక్కువ నిర్వహణ ఖర్చు, ఇంధన వ్యయం తగ్గడం, నగర ప్రయాణాలకు అనుకూలత వల్ల ప్రజలు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలూ గణనీయంగా పెరిగాయి. కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. మధ్యతరగతి వినియోగదారులూ ఇప్పుడు ఈవీలపై ఆసక్తి చూపుతున్నారు. 2025లో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 70 శాతానికి పైగా పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. విదేశీ కంపెనీలు కూడా భారత్ మార్కెట్పై దృష్టి పెడుతున్నాయి. చార్జింగ్ స్టేషన్లే సమస్య విద్యుత్ వాహనాల విక్రయాలు జోరుగా సాగుతున్నా చార్జింగ్ స్టేషన్ల విషయంలో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రస్తుతం దేశంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలు మాత్రమే చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటులో ముందంజలో ఉండగా, ఏపీతో సహా మిగతా రాష్ట్రాల్లో చార్జింగ్ స్టేషన్ల కొరత వేధిస్తోంది. చైనా నుంచి దిగుమతయ్యే బ్యాటరీ ముడి పదార్థాలపై ఆధారపడటం కూడా పరిశ్రమకు పెద్ద సవాల్గా మారింది. 2030 నాటికి ద్విచక్ర వాహనాల్లో 80 శాతం, కార్లలో 30 శాతం, బస్సుల్లో 40 శాతం ఈవీలుంటాయని అంచనా. ప్రస్తుతం 10 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులుండగా, 2030 నాటికి భారత ఈవీ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని భావిస్తున్నారు. అలాగే 50 లక్షల వరకు కొత్త ఉద్యోగాలు వస్తాయని నివేదికల్లో వెల్లడైంది. -
బాబు బినామీలకు ‘ప్రైమ్ ప్లాట్లు’ రైతులకు పాట్లు: మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో సామాన్య రైతులకు ఒక నీతి.. చంద్రబాబు బినామీలకు మరో నీతి అమలు చేస్తూ వ్యవస్థీకృత వివక్షకు తెర తీశారని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ధ్వజమెత్తారు. అమరావతిలో భూములిచ్చిన సామాన్య రైతులకు వెస్ట్ బైపాస్ పక్కన ప్లాట్లు ఇస్తే.. చంద్రబాబు అనుచరులకు మాత్రం సచివాలయానికి, హైకోర్టుకు సమీపంలో భూములు కేటాయించారన్నారు. చంద్రబాబు తన ఇంటి పక్కన రైతులు ఎవరూ ఉండకూడదని 3,800 గజాల నివాస స్థలాన్ని రాత్రికి రాత్రే గ్రీన్ బెల్ట్గా మార్చేశారన్నారు.కోర్ క్యాపిటల్ పరిధిలో లక్షన్నర చదరపు అడుగుల వైశాల్యంతో తన ప్యాలెస్ను ఏడాదిలోనే పూర్తి చేసుకుంటున్న చంద్రబాబు రాజధానిలో అద్దాల పేరుతో దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించిన ఆచరణ సాధ్యమైన ‘మావిగన్’ ప్రతిపాదనను పక్కనపెట్టి చంద్రబాబు కేవలం క్విడ్ ప్రో కో కోసమే అమరావతి తంతు నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని మీడియాతో మాట్లాడారు.సామాన్యులకు ఒక నీతి... బాబుకు ఒక నీతి..‘సీఆర్డీఏ నిబంధనలు సామాన్య రైతులకు సంకెళ్లులా మారాయి. రైతులు తమ ప్లాట్లను వారసులకు ఇవ్వటానికి కూడా వీల్లేకుండా నిబంధనలు రాసిన చంద్రబాబు తన బినామీలకు మాత్రం అన్ని రూల్స్ పక్కనపెట్టి మేలు చేస్తున్నారు. అమరావతి పేరుతో ఏ స్థాయిలో చంద్రబాబు దోచుకుంటున్నారో చెప్పేందుకు ఆయన కడుతున్న ప్యాలెసే నిదర్శనం. నక్కపల్లిలో రూ. 600 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ పొందిన అట్లూరు శ్రీనివాసే చంద్రబాబు ఇల్లు కడుతున్నారు. ఇది క్విడ్ ప్రో కో కాదా? ఏడాదిలోనే బాబు ఇంటి సివిల్ పనులు పూర్తయ్యాయి కానీ రాజధాని భవనాలు మాత్రం అతీగతీ లేవు. ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎంను కలిసేందుకు ప్రధానమంత్రి పక్క రాష్ట్రంలో ఉన్న వారి ఇళ్లకు వెళ్లడం ఏపీ ప్రజల దౌర్భాగ్యం’ అని పేర్ని అన్నారు. రెండో విడత పూలింగ్కు వ్యతిరేకం..‘అమరావతి పేరుతో ఇప్పటికే రూ.50 వేల కోట్లు అప్పు చేశారు. 8 నుంచి 10 శాతం వడ్డీకి ఇంకా అప్పు తెస్తున్నారు. కేవలం అద్దాల కోసమే రూ.2,500 కోట్లు ఖర్చు చేయడం ఏ రకమైన అభివృద్ధి? అమరావతిని రాష్ట్రానికి ఒక గుదిబండలా తయారు చేస్తున్నారు. అమరావతిలో రెండో దశ భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రైతులు భయపడాల్సిన పనిలేదు. జగన్ మళ్లీ అధికారంలోకి రాగానే ఆ భూములను నిషే ధిత జాబితా నుంచి తొలగిస్తారు. కేంద్ర మంత్రి పెమ్మ సాని రైతులను గెటవుట్ అని అవమానించడం సిగ్గు చేటు. రూ.వందల కోట్లు పెట్టి మంత్రి పదవి తెచ్చు కున్నంత మాత్రాన రైతులను అవమానించే హక్కు లేదు. రైతుల కళ్లల్లో నీరు రాష్ట్రానికి అరిష్టం. రెండో దశ ల్యాండ్ పూలింగ్ పేరుతో వారిని వేధిస్తే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు’ అని పేర్ని స్పష్టం చేశారు. -
బలవర్ధక బియ్యం లేనట్టే
⇒ పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు గత ప్రభుత్వం విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, ఐరన్ కలిపిన బియ్యం పంపిణీ చేసింది. ⇒ ఇది క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలిచ్చింది. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల్లో రక్తహీనతను తగ్గించడంలో కీలక భూమిక పోషించింది. ⇒ తలసేమియా, సికిల్ సెల్, రక్తహీనత వంటి హిమోగ్లోబిన్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారితో సహా ప్రజలందరికీ ఈ బలవర్ధకమైన బియ్యం సురక్షితమని శాస్త్రీయ ఆధారాలతో నిరూపితమైంది. ⇒ ఫోలిక్ యాసిడ్ బాలింతల ఆరోగ్య రక్షణకు ఎంతగానో తోడ్పడింది. చిన్నారుల మెదడు, వెన్నెముక పెరుగుదలకు తోడ్పుతున్నట్టు తేలింది.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదలకు అందించే సబ్సిడీ రేషన్కు చంద్రబాబు సర్కార్ మంగళం పాడేస్తోంది. బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే సామాన్యులను ఆదుకోకుండా వేడుక చూస్తోంది. పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు మిల్లెట్లు పంపిణీ చేయాలని ఉచిత ఉపన్యాసాలు ఇచ్చే చంద్రబాబు.. తన జమానాలో చౌకదుకాణాల ద్వారా సరఫరా చేసే బలవర్ధక బియ్యాన్ని (ఫోర్టిఫైడ్ రైస్ను) నిలిపేస్తుండటం విస్తుగొలుపుతోంది. పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు గత ప్రభుత్వం విటమిన్లు, ఫోలిక్యాసిడ్, ఐరన్ కలిపిన బియ్యం పంపిణీ చేసింది.ఇది క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలిచ్చింది. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల్లో రక్తహీనతను తగ్గించడంలో కీలక భూమిక పోషించింది. అయితే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ను (పోషకాహార పదార్థాలతో చేసిన బియ్యం గింజలను) ఎక్కువకాలం నిల్వ ఉంచడం ద్వారా వాటిలోని పోషక ప్రయోజనాలు తగ్గిపోవడం, తయారీదారులు నిబంధనల్ని సక్రమంగా పాటించకపోవడంతో ఆ బియ్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంలేదు. దీనిని సాకుగా చూపి రబీ సీజన్ తర్వాత వచ్చే సీఎంఆర్లో సాధారణ బియ్యాన్నే పేదలకు పంపిణీ చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా రేషన్ అక్రమ రవాణాను మరింత సులభతరం చేసి తమ అనుయాయుకుల లబ్ధి చేకూర్చనుంది.సార్టెక్స్కు తోడు ఫోర్టిఫైడ్ వైఎస్ జగన్ ప్రజాపంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. పేదలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలనే సంకల్పంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, దేశం ఆశ్చర్యపోయేలా ‘సార్టెక్స్’ చేసిన బియ్యాన్ని ఎండీయూ వాహనాలు పెట్టి మరీ ఇంటింటికీ పంపిణీ చేశారు. అంతకుముందు చంద్రబాబు ఏలుబడిలో చౌకదుకాణాల్లో ఇచ్చే బియ్యం ముక్కిపోయి, పురుగుపట్టి, మట్టి, చెత్తాచెదారాలతో ఉండేవి. లబ్ధిదారులు వాటిని శుభ్రం చేసుకోవడానికి ఒకరోజు కేటాయించాల్సి వచ్చేది.ఆ దుస్థితి నుంచి పేదలకు ఊరటనిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని.. ఫోర్టిఫైడ్ కెర్నల్స్ కలిపి అందించడం ప్రారంభించింది. బియ్యం సార్టెక్స్కు కిలోకి రూపాయి వెచ్చించి మరీ పేదలకు నాణ్యమైన రేషన్ బియ్యాన్ని సరఫరా చేసింది. తద్వారా రేషన్ అక్రమ రవాణా చాలావరకు తగ్గిపోయి పేదలు నాణ్యమైన బియ్యాన్ని తినడం ప్రారంభించారు. కానీ ఇప్పుడు బాబు ప్రభుత్వంలో సార్టెక్స్ నాణ్యత దెబ్బతినడంతో పాటు ఫోర్టిఫైడ్ కలపడాన్ని నిలిపేసి పేదలకు సాధారణ బియ్యాన్ని ఇచ్చేస్తున్నారు. రేషన్ అక్రమ రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా లేకపోతే రేషన్ అక్రమ రవాణాకు అడ్డూఅదుపు ఉండదు. గతంలో సాధారణ బియ్యంలో ఫోర్టిఫైడ్ కెర్నల్స్ కలపడం ద్వారా సులభంగా రేషన్ బియ్యాన్ని గుర్తించేందుకు వీలుండేది. తద్వారా రేషన్ అక్రమార్కులు తాము సేకరించిన చౌక బియ్యంలోని ఫోర్టిఫైడ్ కెర్నల్స్ను తొలగించేందుకు అవస్థలు పడేవారు. ఇప్పుడు సాధారణ బియ్యాన్ని ఇస్తే అక్రమార్కుల దందాకు ఇబ్బందులు ఉండవు. సులభంగా బియ్యాన్ని పాలిష్ పట్టి ఫైన్ వెరైటీస్లో కలిపేసి మార్కెట్లో సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వమే అక్రమార్కులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.ప్రపంచం అనుసరిస్తున్న ఫోర్టిఫికేషన్..ప్రస్తుతం రాష్ట్రంలో 1.47 కోట్ల రైస్ కార్డులున్నాయి. ఏటా 25 లక్షల టన్నుల బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయాలి. ఇక్కడ కేంద్రం బియ్యాన్ని ఉచితంగా ఇస్తుండటంతో చంద్రబాబు సర్కార్ ఆ బియ్యాన్ని మాత్రమే ఇస్తోంది. గతంలో కిలో రూ.67కు అందించే కందిపప్పును నిర్దాక్షిణ్యంగా రద్దు చేసింది. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.150కి పైగా పలుకుతుంటే కళ్లప్పగించి చోద్యం చూస్తోంది. ఇక కిలో రూ.16కే ఫోర్టిఫైడ్ (విటమిన్లు కలిపిన) గోధుమ పిండిని అందిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కిలో రూ.20కి పెంచి అరకొరగా సాధారణ గో«ధుమ పిండి ఇస్తూ ప్రజలను నిలువునా ముంచేసింది. రాగులు, జొన్నల పంపిణీని పూర్తిగా అటకెక్కించి పౌష్టికాహారంపై ఉచిత ఉపన్యాసాలు ఇస్తూ కాలం గడుపుతోంది.ఇలా ఒక్కొక్కటిగా రేషన్ సబ్సిడీలను ఎత్తేసిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీకి మంగళం పాడేస్తోంది. అంటే నాణ్యత లేని సాధారణ బియ్యాన్ని మాత్రమే పేదలకు ఇవ్వనుంది. వాస్తవానికి బియ్యం ఫోర్టిíœకేషన్ విధానానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. గ్లోబల్ ఫోర్టిఫికేషన్ డేటా ఎక్సే్ఛంజ్ ప్రకారం 18 దేశాలు బియ్యం ఫోర్టిఫికేషన్ను అనుసరిస్తున్నాయి. 147 దేశాలు ఉప్పును ఫోర్టిఫికేషన్ చేస్తుండగా 105 దేశాలు గోధుమ పిండిని, 43 దేశాలు నూనెలను, 21 దేశాలు మొక్కజొన్న పిండిని ఫోర్టిఫికేషన్ చేస్తున్నాయి. -
ఆక్వా గొంతు నులి‘మేత’
సాక్షి, అమరావతి: టీడీపీ ‘మేత’ వన్నె పులులు ‘రొయ్య’ రైతులను దోచుకునేందుకు తెగబడ్డాయి. మీకింత మాకింత అనే ధోరణిలో ధరల పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచుకుంటున్నాయి. ఆక్వా గొంతు నులిమేస్తున్నాయి. ఆక్వా రంగ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫీడ్ ధరలను టన్నుకు రూ.10,530 వరకు పెంచడంతో ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఫీడ్ ధరల పెంపును అడ్డుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని మండిపడుతున్నారు. తక్షణమే పెంచిన ఫీడ్ ధరలు తగ్గించాలని, అప్సడా చట్టానికి విరుద్ధంగా ధరలు పెంచుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పెత్తనమంతా..‘టీడీపీ’ ఫీడ్ కంపెనీలదే రొయ్యల సాగులో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉంది. రాష్ట్రంలో ఏటా 10 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతుండగా, వెనామి రొయ్యల ఉత్పత్తికి టన్నుకు టన్నున్నర, టైగర్ రొయ్యలకు రెండున్నర చొప్పున సగటున ఏటా 15 లక్షల టన్నుల మేత వినియోగిస్తారు. ఈ లెక్కన ఏటా రూ.15వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. దీంట్లో 50 శాతానికి పైగా వాటా అవంతి ఫీడ్స్దే. ఆ తర్వాత 20 శాతం దేవీ ఫీడ్స్ది కాగా, మిగిలిన వాటా బీఎంఆర్ (టీడీపీ ఎంపీ బీద మస్తాన్రావు), సంధ్య, సీపీ, ఫెడోరో, ఫాల్కన్ వంటి ఇతర సంస్థలది. వీటిలో మెజార్టీ తయారీ సంస్థలన్నీ అధికార టీడీపీ నేతలకు చెందినవే. ఈ కారణంగా వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. పైగా మంత్రులతోపాటు ప్రభుత్వంలోని కీలక నేతలకు నెలవారీగా వాటాల మూటలు వెళ్తుండడంతో ప్రభుత్వంలో ఏ ఒక్కరూ నోరుమెదపలేని దుస్థితి నెలకొందని సమాచారం. రైతులతో చర్చించకుండానే ధరల పెంపు.. వాస్తవంగా వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ(అప్సడా) చట్టం ప్రకారం ఫీడ్, సీడ్ కంపెనీలే కాదు.. ఆక్వారంగంలో ఉన్నవారెవరైనా సరే ధరలు పెంచాలంటే అప్సడా అనుమతి తీసుకోవాలి. ధరల పెంపు అనివార్యమైనప్పుడు తొలుత అప్సడా స్టేక్ హోల్డర్స్ (ఆక్వా రైతులు, సంఘాల నేతలు)తో సమావేశమై, వారి అంగీకారంతోనే పెంచాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి అప్సడా చట్టాన్ని నిరీ్వర్యం చేసింది. దీంతో కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచేస్తున్నాయి. ఫీడ్ తయారీలో వాడే ముడి సరుకులపై దిగుమతి సుంకాన్ని గతేడాది కేంద్రం 30 శాతం నుంచి 5–15 శాతానికి తగ్గించగా, కొన్ని ఉత్పత్తులకు పూర్తిగా మినహాయించింది. ఈ లెక్కన ఫీడ్ ధరలు టన్నుకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు తగ్గించాలి. కానీ ఆ దిశగా కంపెనీలు ఆలోచన చేసిన పాపాన పోలేదు. ధరలు తగ్గించేలా ప్రభుత్వం ఒత్తిడి చేసిన దాఖలాలు లేవు. నాడు కంటి తుడుపు చర్యగా టన్నుకు ఎమ్మారీ్పపై రూ.4వేలు తగ్గించిన కంపెనీలు ఈ ఏడాది ఫిబ్రవరిలో చెప్పా పెట్టకుండా టన్నుకు మళ్లీ రూ.4వేల చొప్పున పెంచేశాయి. తాజాగా ముడిసరుకుల ధరలు పెరిగాయనే సాకుతో వెనామీ ఫీడ్పై రూ.12వేలు, టైగర్ ఫీడ్పై రూ.14వేలు పెంపునకు అనుమతినివ్వాలంటూ గతనెల 30న మత్స్యశాఖ కమిషనర్కు రొయ్య మేత తయారీ దారుల సంఘం లేఖ రాసింది. స్టేక్ హోల్డర్లతో సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకుందామని కమిషనర్ బదులిచ్చారు. కానీ స్టేక్ హోల్డర్లతో సమావేశం, చర్చలు జరపకుండానే ఏకపక్షంగా ధరలు పెంచాయి. మేత వ్యాపారంలో 50 శాతం వాటా కలిగిన అవంతి ఫీడ్స్ టన్నుకు వెనమి ఫీడ్పై రూ.8,420, టైగర్ ఫీడ్ పై రూ. 10,530 పెంచగా.. మిగిలిన కంపెనీలు వెనమి ఫీడ్పై రూ.8 వేలు, టైగర్ ఫీడ్పై రూ.10 వేలు చొప్పున పెంచాయి. పెట్టుబడిలో సగానికిపైగా మేతకే.. రాష్ట్రంలో 4.68 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా లీజు ధరలను బట్టి టన్ను ఉత్పత్తికి వెనామీ రొయ్యలకు రూ.2.60 లక్షలు, టైగర్ రొయ్యలకు రూ.3.50 లక్షలు, చేపలకు రూ.1.10 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. రొయ్యల సాగులో రూ.1.50 లక్షలు, చేపల సాగులో రూ.75 వేల వరకు మేతకే రైతులు ఖర్చు చేస్తుంటారు. 2023లో రొయ్యల మేత ధర టన్ను రూ.72వేలు ఉండగా, ప్రస్తుతం రూ.లక్షకు పైగా ఉంది. తాజా పెంపుతో మేతధ రలు పన్నులతో కలిపి రూ.1.15లక్షలకుపైగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో ఉత్పత్తి వ్యయం కాస్తా వెనామీ రొయ్యలపై రూ.2.75 లక్షలకు, టైగర్ రొయ్యలపై రూ.3.75 లక్షలకు చేరుతుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం 2019–24 మధ్యలో కంపెనీలు పెంచిన ఫీడ్ ధరలను మూడుసార్లు వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టింది. అలాగే ఇప్పుడు చంద్రబాబు సర్కారూ ధరల తగ్గింపునకు కృషి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సిండికేట్గా మారి దోచేస్తున్నారు. ఏపీ అప్సడా చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచడానికి లేదు. కంపెనీలన్నీ సిండికేట్గా మారి ధరలు ఒక్కసారిగా పెంచాయి. తక్షణమే ఈ పెంచిన ధరలను తగ్గించాలి. –దుగ్గినేని గోపినాథ్, అధ్యక్షుడు, రొయ్య రైతుల సంఘం ప్రకాశం జిల్లా కంపెనీలు ఏకపక్ష ధోరణి తగదు ఫీడ్ తయారీ కంపెనీలకు ఏటా లాభాలు పెరుగుతూనే ఉన్నాయి. ఏటా పెట్టుబడి ధరలు పెరుగుతున్నాయే తప్ప రైతులకు ఆదాయం మాత్రం పెరగడం లేదు. కేంద్రం ద్వారా వివిధ రకాల రాయితీలు పొందుతున్న కంపెనీలు ఇష్టమొచ్చినట్టుగా ఫీడ్ ధరలు పెంచేస్తూ రైతులను దోచుకుంటున్నాయి. ఇది తగదు. – టి.నాగభూషణం, అధ్యక్షుడు, కోనసీమ రొయ్య రైతుల సంఘం -
మంత్రుల సింగపూర్ పర్యటనకు రూ.95.19 లక్షలు
సాక్షి, అమరావతి: సింగపూర్ పాలన నమూనా, రాజకీయ జవాబుదారీతనం, దేశాధ్యక్ష నాయకత్వంపై శిక్షణ కోసం ఏడుగురు రాష్ట్ర మంత్రులు గతనెల 21 నుంచి 27 వరకు వారం రోజుల పాటు సింగపూర్లో పర్యటించిన విషయం తెలిసిందే. మంత్రుల సింగపూర్ పర్యటన కోసం రూ.95.19 లక్షల అదనపు బడ్జెట్ను విడుదల చేస్తూ ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రెజరీ నియంత్రణను సడలించి నిధులు మంజూరు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
‘శ్రీవాణి’ సొమ్ములు పచ్చముఠాల పాలు!
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి సొమ్ముతో అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది. శ్రీవాణి ట్రస్టుకు చెందిన దాదాపు రూ.750 కోట్ల నిధులతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించ తలపెట్టిన 5,000 ఆలయాలు, భజన మందిరాల పనులను టెండర్తో సంబంధం లేకుండా టీడీపీ నేతలకు పంచి పెట్టాలని నిర్ణయించారు. ఈమేరకు ఏప్రిల్ 16న దేవదాయ శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఐదు వేల ఆలయాలు, భజన మందిరాల నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం రూ.5 లక్షలకు పైబడిన ప్రతి పనిని టెండరు విధానంలో చేపట్టాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు గ్రామాల్లో సర్పంచుల పదవీ కాలం నెల రోజుల క్రితమే ముగిసిన నేపథ్యంలో పంచాయతీల్లో ప్రత్యేక అధికార పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. టీడీపీ నేతల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టడమంటే అధికార యంత్రాంగాన్ని ప్రేక్షక పాత్రకు పరిమితం చేయడమేనని దేవదాయ శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గత ప్రభుత్వం ఆమోదించిన ఆలయాల నిర్మాణాలను రద్దు చేసి.. శ్రీవాణి ట్రస్టు నిధులతో మత్య్సకార, బలహీన వర్గాల కాలనీల్లో పెద్ద ఎత్తున ఆలయాల నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 4,111 ఆలయాల నిర్మాణాలకు పారదర్శకంగా టెండర్లు పిలిచి అనుమతులు మంజూరు చేయగా 622 గుడుల నిర్మాణం అప్పట్లోనే పూర్తయింది. 1,765 ఆలయాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి మిగిలిన 1,724 ఆలయాల పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. నిర్మాణాలు మొదలు కాని అన్ని ఆలయాల అనుమతులు రద్దు చేయాలని 2024 ఆగస్టు 27న దేవదాయశాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈమేరకు 2024 సెపె్టంబరులో దేవదాయ శాఖ అన్ని జిల్లాలకు సమాచారం ఇచ్చింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత శ్రీవాణి నిధులతో ఆలయాల నిర్మాణానికి టీటీడీ పాలక మండలి బోర్డు ఇటీవల ఆమోదం తెలుపగా టెండర్ల విధానంలో కాకుండా అధికార పార్టీ నేతలకు కట్టబెట్టాలన్న నిర్ణయంపై దేవదాయ శాఖ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆలయాల నిర్మాణాలకు సంబంధించి ఒక్కో గుడికి వేర్వేరుగా టెండర్లు పిలిచి పూర్తి పారదర్శకంగా అర్హులకు పనులను అప్పగించిందని గుర్తు చేస్తున్నారు.చందాలు పక్కదారి పట్టే ప్రమాదం.. ఆలయాల నిర్మాణ పనులకు స్థానిక అధికార పార్టీ నేతలకు అప్పగించడం అక్రమాలకు దారి తీస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణానికి పెద్ద మొత్తంలో చందాలు ఇచ్చేందుకు భక్తులు, స్థానికులు ముందుకు వస్తుంటారు. అధికార పార్టీ నేతల పర్యవేక్షణలో పనులు చేపడితే చందాలు పక్కదారి పట్టే ప్రమాదం ఉందనే చర్చ జరుగుతోంది. -
అనంత రైతన్న ఆక్రందన
అనంతపురం: తీవ్ర కరువుబారిన పడిన రైతాంగాన్ని ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని అనంతపురం జిల్లా రైతులు పోరుబాట పట్టారు. వరి, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటు చీనీ పంటకు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో రైతులు సోమవారం అనంతపురం కలెక్టరేట్ను దిగ్బంధించారు. మొక్కజొన్న, వరి పంటలను, ఎండిన చీనీ చెట్లను తోపుడు బండ్లపై పెట్టుకుని నిరసన తెలిపారు.రైతులను ఆదుకోవాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాకే శైలజానాథ్ మాట్లాడుతూ రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఎండిపోయిన చీనీ చెట్లే నిదర్శనమని చెప్పారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్నా చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. కనీసం క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని మండిపడ్డారు. రైతులను ఆదుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
కాలేయం కొవ్వెక్కుతోంది
సాక్షి, అమరావతి: మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆహార అలవాట్లు, జీవనశైలి వంటి కారణాలతో కాలేయ సంబంధిత వ్యాధుల వ్యాప్తి పెరుగుతోంది. మద్యపానం చేసే వారితోపాటు ఆ అలవాటు లేని వారిలోనూ ఫ్యాటీ లివర్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మూడు దశాబ్దాల్లో ఫ్యాటీ లివర్/మెటబాలిక్ డిస్ఫంక్షన్–అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (ఎంఏఎస్ఎల్డీ) బాధితుల సంఖ్య 143 శాతం పెరగడమే దీనికి నిదర్శనం. గ్యాస్ట్రో ఎంట్రాలజీ, హెపటాలజీపై ఇటీవల ‘ది లాన్సెట్’ ప్రచురించిన అధ్యయనం బీపీ, షుగర్, ఊబకాయం వంటి సమస్యలతో ఫ్యాటీ లివర్ సమస్యలు పెరుగుతున్నట్టు వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం భారత్లో 1990లో సగటున లక్ష మందిలో ఫ్యాటీ లివర్ కేసులు 10,191 ఉండగా.. 2023 నాటికి ఆ సంఖ్య 12,555కు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 1990 నుంచి 2023 మధ్య ఫ్యాటీ లివర్ బాధితుల సంఖ్య 143 శాతం పెరిగినట్టు స్పష్టమైంది. దాదాపు ప్రతి ఆరుగురిలో ఒకరు ఫ్యాటీ లివర్ సమస్యతో సతమతమవుతున్నట్టు తేల్చారు. జీవనశైలి జబ్బులే ప్రధాన కారణం భారత్లో ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతుండడానికి బీపీ, షుగర్, ఊబకాయం వంటి జీవనశైలి జబ్బులే ప్రధాన కారణమని అధ్యయనం వెల్లడించింది. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పట్టణీకరణ పెరిగి, శారీరక శ్రమలేని జీవనశైలి, జంక్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం అధికమవడంతో పట్టణాల్లో 32 శాతానికిపైగా ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు నిపుణులు అభిప్రాయడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి అత్యంత వేగంగా పెరుగుతుండటంతో 2050 నాటికి దాదాపు 200 కోట్ల మంది బాధితులు ఉంటారని అంచనా వేశారు.1990–2023 మధ్య 30 ఏళ్లలో చోటుచేసుకున్న వృద్ధి కంటే రెట్టింపు ఉండవచ్చని తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ అంచనాల ప్రకారం దేశంలో 11 శాతానికిపైగా జనాభా షుగర్, 35 శాతం బీపీ సమస్యతో బాధపడుతున్నారు. రాష్ట్ర వైద్య శాఖ ఎన్సీడీ సర్వేలో గుర్తించిన బీపీ, షుగర్ బాధితులు 60 లక్షల మందికి పైగానే ఉంటున్నారు. ఫ్యాటీ లివర్ సమస్య ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలను చూపదని.. ఈ దృష్ట్యా బీపీ, షుగర్, ఊబకాయ బాధితులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆహారమే ఔషధందేశంలోని పెద్దల్లో 40 శాతం మంది, ఊబకాయం గల పిల్లల్లో 60 శాతం మందికి ఫ్యాటీ లివర్ ఉందని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. క్రమరహిత ఆహార అలవాట్లు, నిద్ర, శారీరక శ్రమ లేమి వంటి కారణాలు మద్యపానం అలవాటు లేని వారిలోనూ ఫ్యాటీ లివర్కు దారితీస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ జీవనశైలి, ఆహార అలవాట్ల మీద శ్రద్ధ పెట్టాలి. ఆహారాన్ని ఔషధంగా చూడాలి. తినే ఆహారంపై నియంత్రణ ఉంటే జబ్బుల బారినపడే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ప్రాసెస్డ్, జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ను పూర్తిగా విడనాడాలి. మనిషి కి రోజుకు 1,600–1,800 క్యాలరీలు అవసరం. అంతకంటే ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. వారానికి 150–180 నిమిషాలు శారీరక శ్రమ చేయాలి. రన్నింగ్, వాకింగ్, యోగా, జిమ్లో వ్యాయామం ఇలా ఏదో ఒక శారీరక శ్రమను జీవనశైలిలో భాగం చేసుకోవాలి. – డాక్టర్ కె.జగదీశ్వర్రెడ్డి, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, ఒంగోలు -
నేడు అనంతపురం జిల్లా పామిడికి వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా పామిడిలో పర్యటించనున్నారు. ఏడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఎం.వీరాంజనేయులు కుమార్తె లిఖిత, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎ.మధుసూదన్ కుమారుడు చైతన్యమిత్రల వివాహం ఇటీవల జరిగింది. మంగళవారం ఉదయం 11 గంటలకు పామిడిలోని వీరాంజనేయులు నివాసంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్లో వైఎస్ జగన్ పాల్గొననున్నారు. -
ఎమ్మెల్యే బూచేపల్లిపై రెడ్బుక్ కుట్రలు
సాక్షి టాస్క్ ఫోర్స్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బందులు పెట్టేలా చంద్రబాబు ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. వైఎస్సార్సీపీ దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డికి చెందిన గ్రానైట్ క్వారీలపై మైన్స్ అధికారులతో ఆకస్మిక దాడులకు పూనుకుంది. సోమవారం మైన్స్ డీడీ రాజశేఖర్ ఆధ్వర్యంలో అధికారులు రెండు బృందాలుగా చీమకుర్తి మండలం రామతీర్థం పరిధిలో ఉన్న సూర్య గ్రానైట్స్ క్వారీల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. హైటెక్ సర్వే కెమెరాలను తీసుకొచ్చి క్వారీల్లోని నలుమూలల కొలతలు సేకరించారు.అమ్మకాలు ఎంత? ఉత్పత్తి ఎంత? అంటూ అక్కడి కార్యాలయంలోని రికార్డుల్లో వివరాలను మైన్స్ అధికారులు సేకరించారు. రామతీర్థం కేంద్రంగా వైఎస్సార్సీపీతో పాటు టీడీపీకి చెందిన వారికి, ఆ పార్టీ సానుభూతిపరులుగా ఉన్న పలువురికి గ్రానైట్ క్వారీలున్నాయి. చీమకుర్తి పరిసరాల్లో ఉన్న వందలాది క్వారీల వైపు ఏనాడూ తొంగి చూడని మైన్స్ అధికారులు కేవలం బూచేపల్లికి చెందిన సూర్య గ్రానైట్స్పై మాత్రమే దాడులు నిర్వహించటం వెనుక ప్రభుత్వం కుట్ర ఉందని వైఎస్సార్సీపీ వర్గాలు మండిపడుతున్నాయి. 2014–19లో కూడా అప్పటి అధికార టీడీపీకి అనుకూలంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డిని మలచుకునేందుకు ఎన్నో ఒత్తిళ్లు చేశారు. సూర్య గ్రానైట్ క్వారీని రెండేళ్లు మూసేసి ఆర్థికంగా దెబ్బతీశారు. -
టీడీపీలో అసంతృప్తి జ్వాలలు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల నియామకంపై ఆ పార్టీలో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ధనబలం ఉన్న నేతలు, లాబీయిస్టులకే పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోందని నేతలు ఆవేదన చెందుతున్నారు. తన తనయుడు లోకేశ్కి అనుకూలంగా పార్టీ యంత్రాంగాలను చంద్రబాబు రూపొందించినట్లు తెలుస్తోంది. సీనియర్లను కొనసాగించినా వారి ప్రాధాన్యతను మాత్రం తగ్గించేశారు. గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కళా వెంకట్రావుకు అవమానకరంగా రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు.గతంలో పొలిట్బ్యూరో సభ్యులుగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, బొండా ఉమామహేశ్వరరావులను పక్కకు తప్పించారు. సోమిరెడ్డిని అధికార ప్రతినిధిగా, బొండా ఉమాను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. రాజ్యసభ స్థానం అడుగుతున్న సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు అది ఇవ్వకపోగా అవమానిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పొలిట్బ్యూరోలో ఆయన్ని కొనసాగించి పార్టీలో పదవే తప్ప ఇతర కీలక పదవులు ఇవ్వబోమని తేల్పిచెప్పారు. ఈసారైనా తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్న సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పితాని సత్యనారాయణలకు అనూహ్యంగా పొలిట్బ్యూరోలో చోటిచ్చి సరిపెట్టారు. బుచ్చయ్య తాను ఎమ్మెల్యే కావడం ఇదే చివరిసారి కాబట్టి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. జ్యోతుల నెహ్రూ ఒక్కసారైనా తనకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పితాని సత్యనారాయణ తనకు బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. కానీ వారిని పొలిట్బ్యూరో సభ్యులుగా నియమించారంటే ఇక మంత్రి పదవులు లేవని చెప్పినట్లేనని చర్చ జరుగుతోంది. జిల్లాల్లో మారిన టీడీపీ నాయకత్వంపలు జిల్లాల్లోనూ ప్రాధాన్యతలు మారిపోయినట్లు టీడీపీ కమిటీల కూర్పును బట్టి అర్థమవుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఎప్పుడూ పొలిట్బ్యూరో సభ్యుడిగా ఉండేవారు. బీద రవిచంద్ర, పొంగూరు నారాయణ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించేవారు. ఇప్పుడు వీరందరినీ పక్కనపెట్టి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిని పొలిట్బ్యూరోకి తీసుకున్నారు. సోమిరెడ్డిని పొలిట్బ్యూరో నుంచి తప్పించి ప్రాధాన్యత తగ్గించి అధికార ప్రతినిధిగా నియమించారు. బీద, నారాయణలకైతే ఏ కమిటీలోను స్థానమే లేకుండాపోయింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో గంటా శ్రీనివాసరావు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్, బండారు సత్యనారాయణమూర్తి వంటి వారికి ప్రాధాన్యత తగ్గించారు.పల్లా శ్రీనివాసరావును మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించారు. వంగలపూడి అనితకు పొలిట్బ్యూరో సభ్యురాలిగా అవకాశం ఇచ్చి సీనియర్లయిన గంటా శ్రీనివాసరావు వంటి నేతలను పక్కనపెట్టారు. విజయనగరంలో అశోక్గజపతిరాజు కుటుంబానికి ప్రాధాన్యత లేకుండానే కమిటీల నియామకం జరిగింది. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కళా వెంకట్రావు ప్రాధాన్యత తగ్గించారు. ఉమ్మడి పశ్చిమగోదావరిలో మాగంటి బాబు, తోట సీతారామలక్ష్మి, చింతమనేని ప్రభాకర్ వంటి వారిని పక్కనపెట్టి నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజులను అందలం ఎక్కించారు. ఉమ్మడి కృష్ణాలో దేవినేని ఉమ, గద్దె రామ్మోహన్ల స్థానాన్ని కొల్లు రవీంద్ర సొంతం చేసుకున్నారు.ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, ధూళిపాళ్ల నరేంద్ర వంటి సీనియర్ల కంటే గళ్లా మాధవి, అనగాని సత్యప్రసాద్కి పెద్దపీట వేశారు. ఉమ్మడి అనంతపురంలో జేసీ, పరిటాల కుటుంబాల స్థానంలో బీసీ జనార్ధన్రెడ్డి, కాల్వ శ్రీనివాసులుకు ప్రాధాన్యత పెంచారు. కర్నూలు జిల్లాలో కేఈ, కోట్ల కుటుంబాలను పక్కనపెట్టి కొత్తవారికి అవకాశం కల్పించారు. గత ఎన్నికలకు ముందు 175 నియోజకవర్గాలకు 175 మంది పరిశీలకులను నియమించి 2024 ఎన్నికల విన్నింగ్ టీమ్గా వారితో పనిచేయించారు. వారిలో 150 మందికి ఈ కమిటీల్లో అవకాశం ఇవ్వలేదు. మరోవైపు తమకు అనుంగు అనుచరులుగా ఉన్న కిలారు రాజేష్, సానా సతీష్ వంటి పార్టీకి సంబంధం లేనివారిని అందలం ఎక్కించారు. మొత్తం మీద ఈ కమిటీలు పార్టీలో అసంతృప్తిని, అసమ్మతిని రగిలించాయి. -
సచివాలయాలు, అంగన్వాడీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామ, వార్డు సచివాలయాలతోపాటు అంగన్వాడీ కేంద్రాల్లో ఈ నెల 12–15 తేదీ మధ్య ఒక విడత, 19–25 తేదీల మధ్య మరో విడత ప్రత్యేక ఆధార్ క్యాంపుల నిర్వహణకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆదేశాలు జారీ చేసింది.రాష్ట్రంలో 15–17 ఏళ్ల మధ్య వయసు ఉండే 11.98 లక్షల మంది తమ ఆధార్లో యూఐడీఏఐ నిబంధనల ప్రకారం బయో మెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉందని, ఈ నేపథ్యంలో ప్రత్యేకించి ఆయా వయసు విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకునేలా ప్రాధాన్యత ఇస్తూ, కొత్తగా ఆధార్ నమోదుకు వీలు కలి్పస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ
సాక్షి, అమరావతి: జూలై వరకు రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ మంగళవారం హైదరాబాద్లో సమావేశం కానుంది. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల ఈఎన్సీలు పాల్గొననున్నారు. నాగార్జునసాగర్ కుడి కాలువకు తాగునీటి అవసరాల కోసం మే 31 వరకు 10 టీఎంసీలు విడుదల చేయాలని ఏప్రిల్ 29న ఏపీ ఈఎన్సీ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు.తాగునీటి అవసరాల కోసం శ్రీశైలంలో 5 టీఎంసీలు, సాగర్లో 13 టీఎంసీలు కేటాయించాలని మే 2న కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు. రెండు రాష్ట్రాల నీటి అవసరాలపై చర్చించి... శ్రీశైలం, సాగర్లో నీటి లభ్యత ఆధారంగా కేటాయింపులు చేయడంపై కృష్ణా బోర్డుకు త్రిసభ్య కమిటీ ప్రతిపాదన చేయనుంది. దీని ఆధారంగా కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు చేయనుంది. కాగా, కృష్ణా బోర్డు 21వ సర్వ సభ్య సమావేశం ఈ నెల 14న హైదరాబాద్లో జరగనుంది. -
మహాటీవీకి చంద్రబాబు ప్రభుత్వం భారీగా లబ్ధి
సాక్షి,విజయవాడ: మహాటీవీకి చంద్రబాబు ప్రభుత్వం రూ.56.64లక్షలు లబ్ధి పొందేలా నిర్ణయం తీసుకుంది. పబ్లిసిటీ వీడియోలను రూపొందించినందుకు నిధులను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్, దీపం, ఉచిత ఇసుక పథకం వంటి కార్యక్రమాల ప్రచారం కోసం రూ.56.64లక్షల నిధుల్ని కేటాయించారు. తద్వారా చంద్రబాబు తన అనుకూల మీడియాకు భారీగా లబ్ధి చేకూరుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘ఏపీలో అద్దాలు.. అబద్ధాల కథే నడుపుతున్నారు’
కాకినాడ: చంద్రబాబు మాయ మాటలు నమ్మిన ప్రజలు.. దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తురన్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ప్రస్తుతం కూటమి పాలనలో ఏ ఒక్క వర్గానికి మేలు చేసే పరిస్థితి కనిపించడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వారి సొంత ఎజెండా తప్పా మరొకటి లేదని మండిపడ్డారు. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలకు,ప్రాధమిక హక్కులకు భంగం కలిగించేలా ఈ ప్రభుత్వం పని చేస్తుంది. భావ వ్యక్తీకరణ స్వేచ్చ ఈ రాష్ట్రంలో లేదు. అభిప్రాయాలు చెబితే వారి మీద కేసులు పెడుతున్నారు.మెయిన్ స్ట్రీమ్ మీడియాను వారి ఆధీనంలో పెట్టుకుంది. సోషల్ మీడియా ను కంట్రోల్ చేస్తున్నారు. వ్యక్తిత్వ హననం చేయ్యడానికి ఒక గ్రూప్ పని చేస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియా ను ప్రభావితం చెయ్యడానికి పోలీసులతో ఒక అడుగు ముందు వెయ్యడానికి ప్రభుత్వం పని చేస్తోంది. ఆయా ఖాతాలను సస్పెండ్ చెయ్యడానికి పోలీసులు పని చేస్తున్నారు. అధికార పార్టీ కి పోలీసులు పూర్తిగా సరెండర్ అయిపోయారు. భాధితులను కాపాడాల్సిన పోలీసులు. .వారిని హింసిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే సోషల్ మీడియా ఖాతాలను సస్పెండ్ చెయిస్తున్నారు. మాజీ సిఎం జగన్ పిఆర్వో శ్రీహరి పై రెండు కేసులు పెట్టి..హైకోర్టు లో బెయిల్ రాకుండా ప్రయత్నించారు. వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను విచారణ నిమిత్తం పిలిచారు. టీడీపీ హ్యాండిల్ నుండి వైఎస్సార్సీపీ బృందంపై బురద చల్లుతారు. ఆర్టికల్ 19 1a క్రింద ప్రశ్నించే హక్కు ఉంది. అమరావతి లో అవినీతిని ప్రశ్నించారని ఎక్స్ ట్వీటర్కు ఫిర్యాదు చేసి ఆ వీడియోను తీయించేశారు. శ్రీకాళహస్తి లో సౌకర్యాలు లేవని ఒక మహిళ మాట్లాడిన వీడియోను జగనన్న కనెక్ట్స్ నుండి తీయించమని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అమరావతి లో అవినీతిని ప్రజలు ఎత్తి చూపితే సహించలేకపోతున్నారు. రాష్ట్రంలో అద్దాలు..అబద్దాలే కధ జరుగుతున్నాయి. అమరావతి లో భవనాలకు అద్దాలు బిగించడానికి రూ.2,500 కోట్లు.కేంద్ర గ్రాంట్ కోసం ఒక విభాగాన్ని ఎందుకు పెట్టలేదు. కేంద్రం ఇచ్చిన గ్రాంట్ ను ఎందుకు వాడుకోవడం లేదు.మేము వీటి కోసం అడిగితే...మీరు నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ్టీకీ ఆరోగ్యశ్రీ లో వైద్యం అందడం లేదు.. ప్రభుత్వ ఆసుపత్రిలలో మందులు లేవు. ఈ రోజుకు పండిన ధాన్యం కొనలేని పరిస్థితి లో ఉన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయాన్ని గాలికి వదిలేశారు. ప్రజా గ్రహం ఉవ్వెత్తున లేస్తూవుంటే...దానిని అగణతొక్కుతున్నారు.ఎంతకాలం గ్లోబెల్స్ ప్రచారంలా తప్పుడు ప్రచారాలు చేస్తారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధిన ఒక్కోక్క వాస్తవం బయటపడుతుంది. వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఒక్కరికి సహయం చెయ్యడం లేదు’ అని మండిపడ్డారు. -
అమరావతిలో ఏబీఎన్ రాధాకృష్ణ పిల్లలకు ఫ్లాట్లు ఎలా ఇస్తారు?
సాక్షి,తాడేపల్లి: రాజధాని పేరుతో అమరావతిలో ఆర్గనైజ్ కరప్షన్ కొనసాగుతోందని మాజీ మంత్రి పేర్నినాని వ్యాఖ్యానించారు. అమరావతి రాష్ట్రానికి గుదిబండగా మారిందన్న పేర్ని నాని మావిగన్ అభివృద్ధి చేస్తే రాష్ట్రంపై ఎలాంటి భారం పడదని అన్నారు. సోమవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఇంటి సమీపంలో రైతుల ఫ్లాట్లు ఉండొద్దా? రాధాకృష్ణ పిల్లలకు మాత్రం ప్లాట్లు ఇస్తారు. మిగితా వారికి అభివృద్ధి జగరని ప్రాంతంలో ప్లాట్లు ఎందుకు ఇస్తారు. చంద్రబాబు బినామీలకు న్యాయం జరుగుతోంది. కళ్లముందే భారీ దోపిడీ జరుగుతోంది. చంద్రబాబు కలలు కనే రాజధాని ఎప్పటికి అవుతుందో ఎవరికీ అంతుపట్టటం లేదు. ఐదు లక్షల మందిని సర్వనాశనం చేసే బదులు మావిగన్ రాజధానే బెటర్. మావిగన్ రాజధానికి సిరులు కల్పిస్తుంది. దీనిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే చంద్రబాబు సమాధానం చెప్పలేదు. పైగా తన మంత్రులతో వైఎస్ జగన్ని దూషిస్తున్నారు.అమరావతిలో వ్యవస్థీకృత అవినీతి జరుగుతోంది. అవినీతికి మారుపేరుగా అమరావతిని తయారు చేశారు.అవినీతే కాదు, వ్యవస్థీకృత వివక్ష కూడా జరుగుతోంది. సీఆర్డీఏ చట్టంలోని ఏ రూలు కూడా చంద్రబాబు, ఆయన మనుషులకు వర్తించవు. ఆ రూల్స్ అన్నీ సామాన్య ప్రజలు, రైతులకే చంద్రబాబు ఇల్లు ఈ6 రోడ్డులో కడుతున్నారు.ఆ స్థలం ఇచ్చిన రైతు కంచర్ల కుటుంబానికి అక్కడే ఎందుకు స్థలం ఇచ్చారు?.2024లో వారికి ప్లాటు కేటాయించటం, 2025లో చంద్రబాబు కొనుక్కున్నారు. ఐదు ఎకరాల్లో చంద్రబాబు కడుతున్న ఇంటిని ఏం ప్యాలెస్ అనాలి?.సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు మధ్యలోనే చంద్రబాబుకు ప్లాటు ఎలా వచ్చింది?.సాధారణ రైతులకు ఇలాంటి ప్రాంతాల్లో ఎందుకు ప్లాట్లు ఇవ్వరు?. చంద్రబాబు కడుతున్న ఇంటి పక్కన ఎవరూ ఉండటానికి వీల్లేదన్నట్టుగా గ్రీన్ బెల్ట్ గా ప్రకటించారు.మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకు ఇంకా ప్లాట్లు ఇవ్వలేదు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు వెస్ట్ బైపాస్ పక్కన ప్లాట్లు ఎలా ఇచ్చారు?.బెజవాడ రమేష్కు నాలుగు ప్రధాన రోడ్ల మధ్యలో ఎలా ఇచ్చారు?.చంద్రబాబు మనుషుల్లోని కమ్మవారికే రాజధానిలో న్యాయం చేస్తున్నారు.మిగతా కమ్మ వారికి ఎందుకు న్యాయం చేయటం లేదు?. సుబ్బారావు అనే టీడీపీ నేతకు కూడా హైకోర్టు పక్కనే ఇచ్చారు. కేంద్ర మంత్రి పెమ్మసాని రైతులను గెటవుట్ అంటూ అవమాన పరుస్తున్నారు. ఆయన ఎదుట సెల్ఫోన్ లో కూడా మాట్లాడటానికి వీల్లేదు. మంత్రి చేష్టలకు రాజధాని రైతులు తీవ్రంగా అవమాన పడుతున్నారు. జూన్ లో వర్షాలు పడితే అమరావతిలో మళ్ళీ నీళ్లు నిలపడతాయిపనులన్నీ ఆగిపోతాయి, మరి రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు?. ఇక ప్రభుత్వానికి మిగిలింది కేవలం రెండు ఆరు నెలలు మాత్రమే. ఏడ్చి ఏడ్చి రైతుల కన్నీళ్లు కూడా ఇంకి పోయాయి. రెండో విడత భూములు ఇవ్వని రైతుల భూములను నిషేధిత జాబితాలో పెడుతున్నారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్కు వైఎస్సార్సీపీ నిషేధం. ఒకవేళ ప్రభుత్వం తీసుకుంటే మా ప్రభుత్వం వచ్చాక తిరిగి ఇచ్చేస్తాం. లక్షన్నర చదరపు అడుగులతో చంద్రబాబు ఇల్లు కడుతున్నారుసంవత్సరానికే చంద్రబాబు ఇల్లు దాదాపుగా పూర్తి కావచ్చింది. కానీ అమరావతి నిర్మాణం మాత్రం ఇంకా ఎక్కడిదక్కడే ఉంది. నగరాలు, రాజధానులను ప్రభుత్వం కట్టిన సందర్భాలు లేవు.అమరావతిలో అద్దాలకు రూ.2,500 కోట్లా?. ఇంత దోపిడీ ఎక్కడా జరగలేదు. రైతులు కన్నీరు పెట్టిన ఏ రాజ్యం బాగు పడలేదు. జనాన్ని కార్లలో తిరగవద్దంటున్న ప్రధాని మోదీ కూడా రైళ్లలో తిరిగితే బాగుంటుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురూ కలిసి ఒకే కారులో తిరిగితే మంచిది. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంల ఇళ్లు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నాయి.అక్కడికి ప్రధాని మోదీ వెళ్లటం ఏపీ ప్రజల ఖర్మ. రాజధానిలో కట్టే ప్రతి ప్రభుత్వ బిల్డింగ్ సీఆర్డీఏకు అద్దె కట్టాలి ఇది అత్యంత దురదృష్టకరం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘అమరావతిలో అద్దాలకు పెట్టే ఖర్చుతో మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవి’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. మెడికల్ కాలేజీలను తన బినామీలకు దోచి పెడుతున్నారు. పీపీపీ పద్దతిలో ప్రైవేటుపరం చేయటం అభివృద్ధా? అని ప్రశ్నించారు. అమరావతిలో అద్దాలకు పెట్టే ఖర్చుతో మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవి అని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మంత్రి కొల్లు రవీంద్ర పచ్చ కళ్ళజోడు తీసి చూస్తే వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కనపడుతుంది. చంద్రబాబులాగా అబద్దపు హామీలు జగన్ ఇవ్వలేదు. మేనిఫెస్టో పూర్తిగా అమలు చేసిన ఏకైక నేత జగన్. చంద్రబాబు అధికారంలోకి రాగానే మేనిఫెస్టో అమలు చేయలేక చేతులెత్తేశారు. రాష్ట్రాన్ని అమ్మితే తప్ప హామీలు అమలు చేయలేమంటూ ఇప్పుడు కబుర్లు చెబుతున్నారు. వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. ఎన్టీఆర్ నుండి రాష్ట్ర ప్రజల వరకు అందరికీ వెన్నుపోటు పొడిచారు.రాష్ట్ర అభివృద్ధి అంటే జగన్ హయాంలోనే జరిగింది. జగన్ తెచ్చిన పది హార్బర్లు, మూడు పోర్టులు, 17 మెడికల్ కాలేజీలు అభివృద్ధి కాదా?. మెడికల్ కాలేజీలను తన బినామీలకు దోచి పెడుతున్నారు. పీపీపీ పద్దతిలో ప్రైవేటుపరం చేయటం అభివృద్ధా?. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందటం ఇష్టం లేదా?. విజయవాడ సిద్దార్థ కాలేజీకి కూడా లీజు పద్ధతిలో భూములు ఇచ్చారు. అక్కడ పేద విద్యార్థులకు సీటు కూడా దొరకదు. అమరావతిలో అద్దాలకు పెట్టే ఖర్చుతో మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవి. డిజైన్ల పేరుతో వందల కోట్లు వృథాగా ఖర్చు చేస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రైలు ప్రయాణం.. నరకం
ఏలూరు జిల్లా: వేసవిలో రైలు ప్రయాణం నరక ప్రాయంగా మారింది. సెలవులకు వెళ్తున్న ప్రయాణికులకు రిజర్వేషన్లు లభించక జనరల్ బోగీల్లో ప్రయణించాల్సి వస్తోంది. ఇసకేస్తే రాలనంత జనంతో జనరల్ బోగీలు కిక్కిరిసిపోతున్నాయి. వృద్ధులు, చిన్నారులు ఉక్కపోతతో విలవిల్లాడుతున్నారు. జాగా కోసం ప్రయాణికుల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ బాధలు పడలేక తప్పని పరిస్థితుల్లో రిజర్వేషన్ల బోగిల్లో ప్రయాణిస్తే ఫైన్ల రూపంలో టిక్కెట్ కలెక్టర్లు వసూలు చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ వయా ఏలూరు – విశాఖపట్నం, నరసాపురం, విశాఖపట్నం వయా నరసాపురం, భీమవరం విజయవాడ రూట్లు కీలకమైనవి. ఏలూరు నుంచి కోణార్క్, యశ్వంత్పూర్, కోరమండల్, ఈస్ట్కోస్ట్, లింగంపల్లి – జన్మభూమి, బెంగుళూరు, ప్రశాంతి, సింహాద్రి, ఎల్టీటీ, రాయ్గఢ్, తిరుపతి ఇలా దాదాపు 18 ఎక్స్ప్రెస్ రైలు సరీ్వసులు రోజూ నడుస్తోన్నాయి. అదే విధంగా విజయవాడ వయా గుడివాడ, భీమవరం మీదుగా విశాఖ, చెన్నై, తిరుపతి, హైదరాబాదు, టాటానగర్, తిరుపతి, కాకినాడ పోర్టు వంటి దాదాపు 11 ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. రాత్రి ప్రయాణాల్లో రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. జనరల్ బోగీల పెంపు కలేనా? సుదూర ప్రాంతాలకు నడుస్తున్న ఎక్ర్ప్రెస్ రైళ్ళలో మూడు, కొన్నింటికి నాలుగు జనరల్ బోగీలు మాత్రమే ఉంటున్నాయి. ముందు భాగంలో కొన్ని, వెనుక మరికొన్ని ఉంటున్నాయి. ఒక్కో బోగిలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారు. మూత్ర విసర్జనకు సైతం వెళ్ళలేని పరిస్థితి జనరల్ బోగిల్లో కనిపిస్తోంది. కింద కూర్చునే విషయంలో ప్రయాణికుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మరుగుదొడ్ల దుర్వాసన భరించలేక అనేక మంది ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మౌలిక వసతుల కొరత ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అని గొప్పలు చెబుతున్న రైల్వే శాఖ క్షేత్ర స్థాయిలో వాటి అమలు బాధ్యత తీసుకోవడం లేదు. అనేక స్టేషన్లలో కుళాయిల్లో నీరు వస్తున్నా అవి తాగడానికి ఏ మాత్రం పనిచేయడం లేదు. పగటి పూట శివారు బోగీలకు మండుటెండలో నడిచి ఎక్కాల్సిన పరిస్థితి. ముఖ్యంగా మరుగుదొడ్ల గదులకు తాళాలు వేస్తున్నారు. అత్యవసరమైతే స్టేషన్ మాస్టార్ వద్ద తాళాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. రిజర్వేషన్లు, తత్కాల్ విషయానికి వస్తే “క్యూ’లైన్లలో నిలుచున్నా కొంత సమయానికి కోటా అయిపోయిందని సిబ్బంది చెబుతున్నారు. మౌలిక వసతులపై రైల్వే అధికారులు దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రయాణికులకు సౌకర్యాలు కలి్పంచండి రైలు ప్రయాణికులకు స్టేషన్లలో తాగునీరు, మరుగుదొడ్ల వంటి కనీస సౌకర్యాలు కలి్పంచాలి. కైకలూరు ప్రాంతంలో డబుల్ లైన్ ట్రాక్ వేసిన తర్వాత గూడ్సు రైళ్ళ సంఖ్య పెరిగింది. దీంతో క్రాసింగ్ గేట్ల వద్ద ఎక్కువ సమయం ప్రయాణికులు వేచి ఉంటున్నారు. బ్రిడ్జిలు, అండర్ గ్రౌండ్ వంతెనలు నిర్మించాలి. – కోమటి విష్ణువర్థనరావు, వైఎస్సార్సీపీ ముదిరాజుల విభాగ అధ్యక్షుడుజనరల్ బోగీల సంఖ్య పెంచాలి ప్రయాణికులకు తగ్గట్టుగా ఎక్స్ప్రెస్ రైళ్ళలో జనరల్ బోగీల సంఖ్య పెరగడం లేదు. దీంతో మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేశాఖకు బోగీల సంఖ్య పెంచాలని ప్రయాణికుల నుంచి వినతులు వెళుతున్నాయి. వేసవి సెలవులకు దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని బోగీల సంఖ్య పెంచాలి. – చావలి శంకరశాస్త్రి, న్యాయవాది, కైకలూరు -
కిలాడీ మహిళ వెనుక జనసేన నాయకుడు?
తణుకు అర్బన్: తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు, నగదుకు ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తణుకు సజ్జాపురానికి చెందిన స్నేహలత, దుర్గాప్రసాద్ల వ్యవహారం సంచలనం రేకెత్తిస్తోంది. సుమారుగా రూ.25 కోట్లు దోచుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చని ఆశపడిన మహిళలు మోసపోయామని తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 8వ తేదీన తణుకులో బాధిత మహిళలు తాము మోసపోయామంటూ మీడియా ముందు వాపోయారు. దీంతో కిలాడీ జంట వ్యవహారం తణుకులో చర్చనీయాంశంగా మారింది. తాజాగా మరికొంతమంది బాధితులు బయటకువస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానికంగా కొందరు బంగారం దుకాణదారులను సైతం ఈ జంట మోసం చేసినట్లు తెలుస్తోంది. కిలాడీ జంటకు తాము చేసిన బ్యాంకు లావాదేవీలు, ఫోన్పేల ద్వారా పంపించిన నగదు వివరాలతోపాటు మాట్లాడిన వీడియోలు తమ వద్ద ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. తమ డబ్బు, బంగారం తీసుకుని కిలాడి జంట మోసం చేశారంటూ మీడియా ముందు బాధితులు వెల్లడించడంతో వారి నుంచి బెదిరింపులు వస్తున్నాయని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. తమపై కేసులు నమోదు చేయిస్తామని, సోషల్ మీడియా ద్వారా అల్లరి చేస్తామంటూ బెదిరిస్తున్నారని చెబుతున్నారు. తణుకుకు చెందిన ఒక జనసేన నాయకుడు వారి వెనుక ఉండి నడిపిస్తున్నారని, ఆయన ఇస్తున్న ధైర్యంతోనే మమ్మల్ని బెదిరిస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలోనే పట్టణ పోలీసులను ఆశ్రయించామని.. అయితే న్యాయం జరగలేదని, తీరా తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ వాపోతున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏం జరగదని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేస్తారని కిలాడి జంట అంటున్నారని ఆందోళన చెందుతున్నారు.డబ్బులు వస్తాయనే ఉద్దేశ్యంతో అప్పులు చేసి మరీ డబ్బు ఇచ్చి మోసపోయామని ఈ వ్యవహారాన్ని పోలీసు ఉన్నతాధికారులు విచారించాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ఆందోళనతోపాటు నిరాహార దీక్షలకు దిగనున్నట్లుగా బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై తణుకు ఇన్చార్జి సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరా>వును వివరణ కోరగా బాధితులు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని, శనివారం కూడా ఎవరూ స్టేషన్కు రాలేదని తెలిపారు. -
డీఎస్పీని భిక్షమడిగారని స్టేషన్కు తరలించారు!
లేపాక్షి: శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షిలోని వీరభద్రస్వామి దేవాలయం పరిసరాల్లో భిక్షాటన చేసి జీవనం సాగించే వృద్ధ మహిళలను స్థానిక పోలీసుస్టేషన్ వద్ద గంటల తరబడి ఉంచడం చర్చనీయాంశమైంది. భిక్షం అడిగినందుకే తమను పోలీసుస్టేషన్కు పిలిపించారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం లేపాక్షి ఆలయ సందర్శనకు హిందూపురం డీఎస్పీ మహేష్ రాగా, ఆయన్ను కొందరు వృద్ధ మహిళలు భిక్షమడిగారు. ఆయనకు అసౌకర్యం కలిగించారనే కారణంతో వారిని స్థానిక పోలీసుస్టేషన్కు పిలిపించారు. స్టేషన్ ప్రాంగణంలో గంటల తరబడి కూర్చోబెట్టారు. తాము పేదరికం కారణంగా భిక్షాటన చేస్తున్నామని, తమను ఇలా స్టేషన్కు పిలిపించి ఇబ్బంది పెట్టడం బాధాకరమని బాధితులు వాపోయారు. ఈ విషయంపై ఎస్ఐ నరేంద్రను వివరణ కోరగా.. భిక్షాటన చేసే వారికి ఎవరూ దిక్కులేకుంటే అనాథాశ్రమంలో చేర్పిస్తామని, బంధువులుంటే వారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు. -
కాకినాడలో కానిస్టేబుల్ దారుణ హత్య
సాక్షి, కాకినాడ: కాకినాడలో సంచలన ఘటన వెలుగు చూసింది. కానిస్టేబుల్ నాగేశ్వర రావు హత్య స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కాగా, సదరు కానిస్టేబుల్ కొంత కాలంగా సస్పెన్షన్లో ఉన్నారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడలోని గాంధీనగర్ రెడ్ క్రాస్ సమీపంలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి.నాగేశ్వరరావు (46) సోమవారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తి దాడిలో హత్యకు గురైనట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
తిరుపతిలో భూ వివాదం
సాక్షి టాస్క్ ఫోర్స్: తిరుపతి నగర నడిబొడ్డులోని ఎర్రమిట్టలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత కొన్నేళ్లుగా వివాదంలో ఉన్న భూమిలోకి టీడీపీ గూండాలు ప్రవేశించారు. దౌర్జన్యంగా జేసీబీలతో చదును చేసి గందరగోళం సృష్టించారు. మహిళలు, స్థానికుల కథనం మేరకు.. తిరుపతి అర్బన్ మండలం, అక్కారంపల్లి సర్వే నం.101/3లో రూ.కోట్ల విలువచేసే 1.05 ఎకరరాల భూమి ఉంది. ఈ భూమి తమదేనని వృద్ధురాలు తులశమ్మ, మరి కొందరు కొంత కాలంగా న్యాయపోరాటం చేస్తున్నారు. ఇదే భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఏడాది క్రితం కొందరు యత్నించి విఫలమయ్యారు. అసలే ఆదివారం, కోర్టులకూ సెలవులు ఉండడంతో పథకం ప్రకారం ఆ భూమిలో ఉదయం రెండు జేసీబీలు ప్రత్యక్షమయ్యాయి. అక్కడ వృద్ధురాలు తులశమ్మ నిరి్మంచుకున్న రేకుల షెడ్డును, దాని చుట్టూ ఉన్న చెట్లను తొలగించడం ప్రారంభించారు. దీంతో తులశమ్మ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంత సమయానికి మరికొందరు మహిళలు అక్కడికి చేరుకుని జేసీబీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముందస్తు పథకం ప్రకారం అక్కడే ఉన్న టీడీపీ గూండాలు మహిళలను అడ్డుకోవడం ఇబ్బంది అవుతుందని భావించి.. టీడీపీ సానుభూతి పరులైన కొందరు మహిళలను పిలిపించారు. ఎంతకూ పనులు ఆపకపోవడంతో బాధిత మహిళలు రోడ్డుపై బైఠాయించారు. మరి కొందరు జేసీబీలకు అడ్డుపడ్డారు. తిరుపతి ఎర్రమిట్టలో టీడీపీ దౌర్జన్యంపై వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి తీవ్రంగా స్పందించారు. జర్నలిస్టుల ముసుగులో టీడీపీ చేస్తున్న భూ కబ్జా అని మండిపడ్డారు. తిరుపతి నగరంలో భూ ఆక్రమణలు పెరిగిపోయాయని బాధితులతో కలిసి సీపీఐ నేతలు గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. పేదల భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారని ధ్వజమెత్తారు. -
వైద్య శాఖలో లీకువీరులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ ఎంఎస్ఐడీసీ)లో లీకువీరులు అధికమయ్యారు. ఏపీ ఎంఎస్ఐడీలో కమీషన్లకు కక్కుర్తిపడే వారిని ఎంపిక చేసుకున్న ఢిల్లీకి చెందిన ఓ సంస్థ వైద్య శాఖలో పరికరాలు, ఇతర కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను ముందే తెలుసుకుంటూ వైద్యశాఖలోని టెండర్ల వ్యవహారాల్లో చక్రం తిప్పుతోంది. భారీ మొత్తంలో ముడుపులు ఆఫర్ చేస్తూ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు, వైద్య శాఖ ఉన్నతాధికారికి సదరు సంస్థ నిర్వాహకులు దగ్గరైనట్టు సమాచారం. ఏపీఎంఎస్ఐడీసీలో తామేది చెబితే అదే జరుగుతుందంటూ ఫార్మా రంగంలో హల్చల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. టెండర్లు పిలవడానికి ముందే ఎంఎస్ఐడీసీ నుంచి కీలక సమాచారం ఢిల్లీ సంస్థకు లీక్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కంపెనీలతో మంతనాలతో బట్టబయలు రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులకు మందులు, సర్జికల్స్ సరఫరా కోసం రెండు, మూడేళ్లకు రేట్ కాంట్రాక్ట్(ఆర్సీ)ల కోసం టెండర్లు పిలుస్తుంటారు. ఈ క్రమంలో గతంలో ఖరారు చేసిన ఆర్సీల పరిమితి ముగుస్తుండటంతో సర్జికల్స్కు కొత్త ఆర్సీల కోసం టెండర్లు పిలవడానికి ఎంఎస్ఐడీసీలో కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. టెండర్ నోటిఫికేషన్ వెలువడక ముందే ఎస్ఎంఐడీసీలోని లీకువీరులు 100 రకాలకుపైగా వస్తువుల పేర్లు, వాటి స్పెసిఫికేషన్లు, ఇతర వివరాలు ఢిల్లీ సంస్థకు లీక్ చేశారు. దీంతో సదరు సంస్థ నిర్వాహకులు నేరుగా ఫార్మా కంపెనీలతో మంతనాలు చేయడం మొదలు పెట్టారు. దేశీ, విదేశీ సర్జికల్ సామగ్రి తయారీ కంపెనీలను సంప్రదించి ‘ఏపీ టెండర్లు మాకే వస్తాయి. ఎంఎస్ఐడీసీ మా గుప్పిట్లోనే ఉంది. మా ద్వారా వస్తేనే మీ కంపెనీలకు ఆర్డర్లు దక్కుతాయి’ అంటూ ఆయా కంపెనీలతో బేరసారాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. టెండర్ నిబంధనలు సైతం తమకు అనుకూలమైన కంపెనీలు మాత్రమే పాల్గొనేలా ఉంటాయని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ విషయాన్ని ఆయా కంపెనీలు ఇప్పటికే తమకు డిస్ట్రి్టబ్యూటర్లుగా వ్యవహరిస్తున్న సంస్థలతో పంచుకోగా మొత్తం వ్యవహారం బట్టబయలైంది. చంద్రబాబు సర్కారు వచి్చనప్పటినుంచి వైద్య శాఖలో ఢిల్లీ సంస్థ హవా పెరిగిపోయింది. ఈ సంస్థ సరఫరా చేసే పరికరాలు నాణ్యమైనవి కాదని గతంలో అనేకమార్లు తిరస్కరణకు గురయ్యాయి. అయినా ఇప్పుడీ సంస్థ సరఫరా చేసే పరికరాలనే కొనుగోలు చేయించేలా వ్యవహారాలు నడుస్తున్నాయి.వైద్యుల మెడపై కత్తిపెట్టి రీ–డెమో ఢిల్లీ సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టడం కోసం కొద్ది నెలలుగా వెంటిలేటర్లు, అనస్థీషియా వర్క్స్టేషన్స్, ఆపరేషన్ థియేటర్(ఓటీ) లైట్స్ టెండర్ను ప్రభుత్వం సాగదీస్తోందనే ఆరోపణలున్నాయి. బోధనాస్పత్రులకు వీడియో రికార్డింగ్ సౌకర్యం ఉన్న ఆధునిక ఓటీ లైట్స్ కొనుగోలు చేసేలా నిబంధనలు రూపొందించడంతో గత ప్రభుత్వంలో రెండు పర్యాయాలు ఢిల్లీ సంస్థకు అర్హత దక్కలేదు. దీంతో ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలు లేకుండా సాధారణ ఓటీ లైట్స్ కొనుగోలుకు నిబంధనల్లో మార్పులు తెచ్చారు. గత నెలలో వెంటిలేటర్ల పనితీరుపై డెమోలు నిర్వహించగా ఢిల్లీ సంస్థ పరికరాలను వైద్యులు తిరస్కరించారు.ఈ క్రమంలో సాక్షాత్తు వైద్య శాఖ ఉన్నతాధికారి నిబంధనలకు వ్యతిరేకంగా రీ–డెమో నిర్వహించారు. అంతేకాకుండా వైద్యుల మెడపై కత్తి పెట్టినట్టుగా బెదిరించి మరీ సదరు సంస్థ పరికరాలకు అర్హత కల్పించినట్టు వైద్యవర్గాల్లో చర్చ నడుస్తోంది. అనస్థీíÙయా వర్క్ స్టేషన్కు సంబంధించిన టెండర్లో ఢిల్లీ సంస్థ ఆథరైజేషన్ లెటర్ లేకుండానే బిడ్ వేసింది. మరోవైపు టెండర్ నిబంధనల ప్రకారం వర్క్స్టేషన్, మానిటర్ రెండు ఒకే కంపెనీవి అయి ఉండాలి. అయితే వేర్వేరు కంపెనీల పరికరాలను సరఫరా చేసేలా బిడ్లో కోట్ చేసింది. వాస్తవానికి ఈ బిడ్ పరిశీలన దశలోనే తిరస్కరించాల్సి ఉండగా ఆ పని చేయలేదు. డెమోకు కూడా ఆహ్వానించారు. పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో రూ.93 లక్షలకు కొనుగోలు చేసిన మామోగ్రఫీ పరికరాన్ని మన దగ్గర ఢిల్లీ సంస్థ ద్వారా రూ.1.71 కోట్లకు కొనుగోలు చేసేలా గతేడాది కాంట్రాక్ట్ ఇచ్చేశారు. -
రెచ్చిపోయిన జనసేన ఎమ్మెల్యే మేనల్లుడు
సాక్షి టాస్క్ఫోర్స్: అనకాపల్లిలో జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మేనల్లుడి అనుచరులు ఓ కాలనీ గోడను కూల్చివేయడమే కాకుండా ఇదేమని ప్రశ్నించిన కాలనీవాసులపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మేనల్లుడు దాడి నానితోపాటు ఎమ్మెల్యే బంధువైన కొణతాల బాల సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. అనకాపల్లిలో విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) అనుమతి పొందిన లేఅవుట్లో కాలనీ వాసులు నిర్మించుకున్న గోడను జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మేనల్లుడు దాడి నాని, ఎమ్మెల్యే బంధువు కొణతాల బాల, విల్లూరి గణేష్, ఆడారి శంకరరావు, శరగడం రమేష్, బుద్ద మురళీ తాతారావు తదితరులు ఈ ఏడాది ఫిబ్రవరి 18న అర్ధరాత్రి పొక్లెయిన్ సాయంతో కూల్చివేశారు.కాలనీ వాసులు తమ రక్షణ కోసం చాలాకాలం క్రితం ఆ గోడను నిర్మించుకోగా.. ఆ గోడ అవతల ఉన్న స్థలంపై జనసేన పార్టీకి చెందిన వ్యక్తులు కన్నేశారు. కాలనీ వాసులు అడ్డు చెప్పేలోపే పాత గోడను తొలగించి.. పక్కన మరో గోడ నిర్మించారు. గోడ తొలగించిన స్థలంలో అది తమ స్థలమేనంటూ బోర్డులు పెట్టారు. గోడ కూల్చివేత, స్థలాన్ని ఆక్రమించడంతోపాటు పక్కనే అక్రమ కట్టడం నిర్మించడంపై కాలనీవాసులు అప్పట్లోనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే, పోలీసులు స్పందించడానికి చాలా సమయం తీసుకున్నారు.ఎమ్మెల్యే బంధువు ఈ వ్యవహారంలో ఉండటంతో కేసు నమోదులో జాప్యం జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఎట్టకేలకు శనివారం (ఈ నెల 9న) బాధితులలో ఒకరైన కాండ్రేగుల బాల వెంకట పరమేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యే మేనల్లుడు, బంధువుపై ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసి ఎమ్మెల్యే మేనల్లుడు తదితరులు కాలనీవాసులపై శనివారం రాత్రి దౌర్జన్యానికి దిగటం కలకలం రేపింది. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు షార్ట్ ఫిల్మ్ యాక్టర్ల మృతి
ఇబ్రహీంపట్నం రూరల్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు షార్ట్ ఫిల్మ్ యాక్టర్లు మృతిచెందారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వేదాయపాలేనికి చెందిన కత్తి భరత్కాంత్(31), గూడ సాయి త్రిలోక్(31) అనే ఇద్దరు షార్ట్ ఫిల్మ్ యాక్టర్లు శనివారం సాయంత్రం నెల్లూరు నుంచి కారులో హైదరాబాద్కు బయలుదేరారు. ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ వైపు వస్తుండగా బొంగ్లూర్ ఎగ్జిట్–12 సమీపంలో కారు డ్రైవర్ అతివేగంగా వెళ్లడంతో అదుపుతప్పి ఎదురెదురుగా వెళ్తున్న కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న కత్తి భరత్కాంత్, గూడ సాయి త్రిలోక్కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆదివారం తెల్లవారుజామున 3.20గంటల సమయంలో ఓఆర్ఆర్ పెట్రోలింగ్ అధికారి శ్రీకాంత్ ఇచి్చన సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
సమీకరణకు భూములివ్వం
తాడేపల్లి రూరల్ : చంద్రబాబు ప్రభుత్వం తమకు తీరని ద్రోహం చేస్తోందని రాజధాని ప్రాంత రైతులు మండిపడ్డారు. రెండో విడత భూ సమీకరణ కోసం రైతుల మధ్య చిచ్చు పెడుతోందని, వర్గాలుగా విడదీసి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరితో తొలుత భూములు తీసుకుని, అందరూ ఇవ్వాల్సిందేనని దౌర్జన్యం చేస్తోందని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తీరు ఎంత మాత్రం సబబు కాదని, అందుకే తామంతా ఒకతాటిపైకి వచ్చి భూ సమీకరణను వ్యతిరేకిస్తున్నామని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో అందరం కలిసికట్టుగా భూసమీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.ప్రభుత్వం బలవంతపు భూ సమీకరణ చేస్తున్న క్రమంలో ఆదివారం రాజధాని ప్రాంత రైతులు ఉండవల్లిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు ఈశ్వరరెడ్డి, జొన్నా శ్రీనివాసరావు, గంటు బాలాజీ, పెద్దిశెట్టి వీరస్వామి, శ్రీనివాసరావు, అంజిరెడ్డి, శ్రీధర్రెడ్డి, నాగరాజు, శివకోటేశ్వరరావు, అశోక్రెడ్డి తదితరులు మాట్లాడారు. ‘మా తాత ముత్తాతల నుంచి ఈ భూములను నమ్ముకుని జీవనం సాగిస్తున్నాం. ప్రస్తుత ప్రభుత్వం రైతులను వర్గాల వారీగా విడదీసి, తన స్వార్థ ప్రయోజనాల కోసం మన మధ్య విభేదాలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా రైతు రైతే. రైతుకు నష్టం జరిగే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తే పోరాటం చేసి సాధించుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇదే ప్రాంతంలో 2015–2019 మధ్య రైతులకు ఇబ్బందులు ఎదురైనప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించి విజయం సాధించాం’ అన్నారు. అవసరానికి మించి భూమి ఎందుకు?మరోసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం అవసరాలకు మించి భూమిని రైతుల దగ్గర నుండి తీసుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు ముమ్మరం చేసిందని రైతులు తెలిపారు. ఇందులో భాగంగా విడతల వారీగా భూ సమీకరణకు నోటీసులు ఇస్తోందన్నారు. అన్ని ప్రాంతాల్లో ఒకేసారి ఈ ప్రక్రియ ప్రారంభిస్తే ఇబ్బంది అని, విడతల వారీగా ఈ ప్రక్రియ చేపట్టిందన్నారు. ‘రాజధానికి రైతులు ఎవరూ వ్యతిరేకం కాదు. అవసరమైన మేర భూములు తీసుకుంటే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. రాజకీయ నాయకులు కాంట్రాక్టర్ల పేరుతో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. వారు దోపిడీ చేసిన దాంట్లో పాతిక వంతు ఖర్చు పెట్టినా ప్రభుత్వ అవసరాలను అవసరమైన భూమిని రైతుల దగ్గర నుండి నేరుగా కొనుగోలు చేయొచ్చు.కనీసం సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఆ ప్రయత్నాలు చేయలేదు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలోనూ వైఫల్యం చెందింది. ఇలాంటప్పుడు రైతులు ప్రభుత్వాన్ని ఎలా నమ్మాలో ఆలోచించాలి. ఇప్పటికే ఈ ప్రాంతంలో పలువురు రైతులు తమ భూములను వారి ఆడపిల్లకు కట్నాలుగా ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీరుతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకోసమైనా మనం స్పందించాలి. ఈ నెల 20వ తేదీన ఉండవల్లిలో నిర్వహించే సభకు ప్రతి ఒక్కరు హాజరై భూ సమీకరణకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను చెప్పాలి. ఆ తర్వాత ఆ అభిప్రాయాలను అర్జీల రూపంలో అధికారులకు, ప్రభుత్వానికి అందజేద్దాం’ అని రైతులు తీర్మానించారు. తమ పోరాటానికి సీపీఎం, వైఎస్సార్సీపీ, ఇతర పార్టీల మద్దతు కోరుతూ ముందుకు వెళదామని రైతులు నిర్ణయించారు. -
సీఎం సన్నిహితులకేనా జాక్పాట్?
సాక్షి, అమరావతి: రాజధానికి భూ సమీకరణ కింద భూమి ఇచ్చిన తనకు అభివృద్ధి చేసిన నివాస స్థలం (రెసిడెన్షియల్ ప్లాటు), వాణిజ్య స్థలం (కమర్షియల్ ప్లాటు) ఇస్తామని చెప్పి.. చెరువులో పల్లపు ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్లాటు ఇచ్చారని.. మరో చోట తనకు ప్లాటు కేటాయించాలని పదే పదే కోరుతున్నా సీఆర్డీఏ స్పందించడం లేదని 2025 డిసెంబర్ 26న మందడంలో నిర్వహించిన సమావేశంలో దొండపాటి రామారావు అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ కుప్పకూలి కన్నుమూశారు. రాజధానికి భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన అనేక మంది రైతులు ఇలానే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ.. సీఎం చంద్రబాబు కోటరీలోని ముఖ్యులకు, టీడీపీ ప్రజా ప్రతినిధుల సన్నిహితులకు రోడ్ల పక్కనే అత్యంత ప్రధానమైన ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయిస్తున్నారంటూ రాజధాని రైతులు మండిపడుతున్నారు. ఇందుకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుమారుడు వేమూరి ఆదిత్య, కూతురు వేమూరి అనూషకు వెస్ట్ బైపాస్ పక్కనే నివాస, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎదురుగా ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో వాణిజ్య ప్లాట్లు కేటాయించడాన్ని ఎత్తిచూపుతున్నారు. లాటరీలో రాధాకృష్ణ కుమారుడు, కుమార్తెకే జాక్పాట్ తగిలిందా.. మాకు తగలదా.. అంటూ ప్రశ్నిస్తున్నారు. రాజధాని కోసం భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు పదేళ్లపాటు కౌలుతోపాటు.. అభివృద్ధి చేసిన లే అవుట్లలో ఎకరానికి జరీబు భూమైతే 1,000 గజాల నివాస, 450 గజాల వాణిజ్య ప్లాటు.. మెట్ట భూమైతే 1,000 గజాల నివాస, 250 గజాల వాణిజ్య ప్లాటు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ కింద లే అవుట్లలో సీఆర్డీఏ అధికారులు లాటరీ ద్వారా రైతులకు ప్లాట్లను కేటాయించి, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. బెజవాడ రమేషా.. మజాకా! తుళ్లూరు మండలం మందడంకు చెందిన బెజవాడ రమేష్ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు. మందడంలో సర్వే నెంబరు 496/4, 387/2, 143, 22/2, 40, 21/1, 88, 2బీ/4, 139/ఏ, 512/2, 3బీ–0, 6బీ, 455/1ఏ, 131/1, 272బీ, 54బీ/4, 59/ఏ, 57/బీ, 73/2, 29/1, 59/బీ, 136, 135/2, 33/4లలో బెజవాడ రమేష్, బెజవాడ సుప్రియ, బెజవాడ మధు, బెజవాడ బ్రాహ్మణి, బెజవాడ సాంబశివరావుల కుటుంబం 31.245 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏకు ఇచ్చింది. ఇందుకుగానూ ఏటా వారి కుటుంబ సభ్యులకు సీఆర్డీఏ కౌలు చెల్లిస్తోంది. కోర్ క్యాపిటల్ ఏరియా(ప్ర«దాన రాజధాని ప్రాంతం)లో సచివాలయానికి ఎదురుగా నాలుగు రోడ్ల జంక్షన్ (కూడలి)లో బెజవాడ రమేష్, మధులకు లాటరీ ద్వారా 2,500 గజాల వాణిజ్య ప్లాటును సీఆర్డీఏ కేటాయించింది. ప్రస్తుతం దాంట్లో బీఎస్సార్ ప్రాపర్టీస్ పేరుతో భవనం నిర్మించారు. దాన్ని ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీస్ అథారిటీకి అద్దెకు ఇచ్చారు.బెజవాడ రమేష్, మధుకు కేటాయించిన 2500 గజాల వాణిజ్య ప్లాట్లు బిట్స్ పిలానీ విద్యా సంస్థకు కేటాయించిన భూమికి సమీపంలో రోడ్డు పక్కనే 13,500 గజాల ఇంటి స్థలం బెజవాడ రమేష్ కుటుంబ సభ్యులకు లాటరీ ద్వారా సీఆర్డీఏ కేటాయించింది. సచివాలయానికి కూతవేటు దూరంలో 25 మీటర్లు, 17 మీటర్ల రెండు రోడ్ల కూడలిలలో 4,500 గజాల నివాస ప్లాటును బెజవాడ రమేష్కు లాటరీ ద్వారా ఇచ్చింది. ఎన్–6 ప్రధాన రహదారికి ఆనుకుని 5,940 గజాల చొప్పున పక్కపక్కనే రెండు వాణిజ్య ప్లాట్లను, సచివాలయం పక్కనే రెండు రోడ్ల కూడలిలో 4,860 గజాల పరిమాణం కలిగిన నివాస ప్లాటును, సచివాలయం పక్కనే ప్రధాన రహదారికి ఆనుకుని 2,400 గజాల నివాస ప్లాటును బెజవాడ రమేష్ కుటుంబానికి కేటాయించింది. బెజవాడ రమేష్ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టే లాటరీలో ఇలా జాక్పాట్ తగిలిందని.. అదే తమకు ఎందుకు తగలలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.కీలక ప్రాంతాల్లో రాధాకృష్ణ కొడుకు, కూతురుకు ఆరు ప్లాట్లు రాధాకృష్ణ కుమారుడు, కుమార్తెలు మంగళగిరి మండలం కురగల్లు రెవెన్యూ గ్రామం పరిధిలోని నీరుకొండలో సర్వే నెంబరు 71, 72, 73లో 5.39 ఎకరాలు కొనుగోలు చేసి.. 2016 అక్టోబర్ 30న రిజి్రస్టేషన్ చేయించుకుని.. భూ సమీకరణ కింద సీఆర్డీఏకు అప్పగించారు. ఇందుకుగాను ఇతర రైతులలానే వారికి సీఆర్డీఏ ఏటా కౌలు చెల్లిస్తోంది. రాధాకృష్ణ కొడుకు ఆదిత్యకు వెస్ట్ బైపాస్కు పక్కనే 1,500 గజాలు, 1,000 గజాలు ఉన్న రెండు నివాస ప్లాట్లు.. కూతురు అనూషకూ అక్కడే 1,500 గజాలు, 1,000 గజాలు ఉన్న రెండు నివాస ప్లాట్లు దక్కాయి. ఇక ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో ఇద్దరికీ 660 గజాల చొప్పున వాణిజ్య ప్లాట్లు వచ్చాయి. ఈ ఆరు ప్లాట్లు లాటరీ ద్వారానే వారికి దక్కడం గమనార్హం. కోరుకున్న చోట ధనేకులకు ప్లాట్లుధనేకుల సుబ్బారావు తుళ్లూరు మండల టీడీపీ అధ్యక్షుడు. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. సుబ్బారావు కుటుంబ సభ్యులు కొండమరాజుపాలెంలో సర్వే నెంబరు 66/1ఏలో 0.47, నేలపాడులో సర్వే నెంబరు 95/ఏలో 0.50, 9/ఏలో 0.86, 93/1సీలో ఎకరం, 66/2లో 0.53, 93/1ఏలో 5.53, 93/1బీ 0.60, 98లో 0.10 వెరసి 9.59 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏకు ఇచ్చారు. ఈయన కుటుంబ సభ్యులు కూడా భారీగానే భూములు ఇచ్చారు. ఇందుకుగాను వారికి సీఆర్డీఏ కౌలు చెల్లిస్తోంది. అయితే అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించడంలో మాయాజాలం చోటుచేసుకుంది. «కొత్తగా నిర్మింస్తున్న శాశ్వత హైకోర్టుకు అత్యంత సమీపంలో డైమండ్ సర్కిల్ దగ్గర ఎన్10 రోడ్డు పక్కనే 24,500 గజాల నివాస ప్లాటు, ఈ ప్లాటు పక్కనే 11,820 గజాల నివాస ప్లాటు, సీఎం చంద్రబాబు కొత్తగా నిర్మింస్తున్న ప్యాలెస్కు సమీపంలో ఎన్11 ప్రధాన రహదారికి ఆనుకుని 2,520 గజాల వాణిజ్య ప్లాటును, హైకోర్టుకు కూతవేటు దూరంలో ఎన్9 రోడ్డు పక్కనే 8,820 గజాల మరో వాణిజ్య ప్లాటును ధనేకుల సుబ్బారావు కుటుంబ సభ్యులకు సీఆర్డీఏ లాటరీ ద్వారా కేటాయించింది. ఇదిగో ప్లాట్ల మాయాజాలం! రైతుల్లో ఆగ్రహం ఉమ్మడి గుంటూరు జిల్లాలో తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో 53,748 ఎకరాల(217 చదరపు కిలోమీటర్లు)ను రాజధాని ప్రాంతంగా 2015లో చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. ఇందులో 34,823.12 ఎకరాలను 29,442 మంది రైతుల నుంచి భూ సమీకరణ కింద సమీకరించింది. వారికి అభివృద్ధి చేసిన లేఅవుట్లలో నివాస, వాణిజ్య ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయిస్తోంది. రోడ్లకు పక్కన, సమీపంలో.. నాలుగు రోడ్ల కూడలి.. ప్రధాన ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లు సీఎం చంద్రబాబు సన్నిహితులు, టీడీపీ ప్రజా ప్రతినిధుల మద్దతు ఉన్న వారికే దక్కుతున్నాయని.. తమకు పల్లపు ప్రాంతం, చెరువులు, వాగుల్లో వస్తున్నాయంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొడుకు, కూతురుతోపాటు బెజవాడ రమేష్, ధనేకుల సుబ్బారావు వంటి సీఎం చంద్రబాబుకు సన్నిహితులైన టీడీపీ నేతల కుటుంబ సభ్యులకు అత్యంత ప్రధానమైన ప్రాంతాల్లో వేలంలో దక్కిన ప్లాట్లను వారు ఎత్తిచూపుతున్నారు. -
ఐఐటీ భువనేశ్వర్లో ఏపీ విద్యార్థి మృతి
భువనేశ్వర్: ఐఐటీ భువనేశ్వర్ క్యాంపస్లో ప్రమాదవశాత్తు బాల్కనీ నుంచి జారి పడి పీహెచ్డీ విద్యార్థి మృతి చెందాడు. ఈ దుర్ఘటనతో క్యాంపస్లో విషాదం అలముకుంది. మృతుడు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన తనికొండ నిశాంత్ కుమార్గా గుర్తించారు. ఈయన ఆంధ్రప్రదేశ్లోని గూడూరు ప్రాంతానికి చెందిన వాడు. నిశాంత్ హాస్టల్ బ్రహ్మపుత్ర హాల్ ఏ బ్లాక్ 6వ అంతస్తు బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ గార్డు గమనించి అధికారులకు తెలియజేయడంతో తక్షణమే క్యాంపస్లోని సంజీవన్ ఆస్పత్రికి తరలించారు.అత్యవసర వైద్యం చేసి ఉన్నత చికిత్స కోసం ఐఐటీ అంబులెన్స్ ద్వారా మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్య బృందం పరీక్షించి విద్యార్థి అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించింది. క్యాంపస్ అధికార వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు జట్నీ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి కుటుంబీకులకు సమాచారం అందజేశారు. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత పంచనామా ప్రక్రియ చేపట్టనున్నట్లు వివరించారు. -
హిందూ మహాసముద్రంలో తిరుగులేని శక్తిగా భారత్!
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళ సామర్థ్యాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే దిశలో వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా సముద్రం మధ్యలో యుద్ధనౌకలకు అవసరమైన ఇంధనం, నీరు, మందుగుండు, ఇతర సామగ్రి, రేషన్ను ఎప్పటికప్పుడు అందించే అత్యాధునిక ఐదు భారీ ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ (ఎఫ్ఎస్ఎస్) నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా పూర్తిగా స్వదేశీ డిజైన్, పరికరాలతో రూ.19,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా తాజాగా హిందుస్థాన్ షిప్యార్డు లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్)లో ఐదవ, చివరి ఫ్లీట్ సపోర్ట్ షిప్ స్టీల్ కటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.ఈ ఐదవ నౌక నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమానికి ఇండియన్ నేవీ యుద్ధనౌకల నిర్మాణ, నియంత్రణాధికారి వైస్ అడ్మిరల్ సంజయ్సాధు, షిప్యార్డు సీఎండీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ప్రాజెక్టు ద్వారా భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త శిఖరాలను అధిరోహించడమే కాకుండా, విదేశాలపై ఆధారపడకుండా సొంతంగా భారీ నౌకలను నిర్మించుకునే సత్తాను చాటిచెబుతోంది. భారత నౌకాదళం హిందూ మహాసముద్రంలో తిరుగులేని శక్తిగా ఎదగడానికి ఈ నౌకలు కీలకంగా మారనున్నాయి. కొన్ని ముఖ్యాంశాలు..⇒ కొచ్చికి చెందిన ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ స్మార్ట్ ఇంజనీరింగ్ అండ్ డిజైన్ సొల్యూషన్స్ (ఎస్ఈడీఎస్) రూపకల్పనతో జరుగుతున్న ఈ ప్రాజెక్టులో హిందుస్థాన్ షిప్యార్డు, ఎల్అండ్టీ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి.⇒ ప్రాజెక్టులో రెండు నౌకలు కట్టుపల్లిలో, మిగిలిన మూడు విశాఖపట్నంలో నిర్మీతమవుతున్నాయి. ⇒ కేవలం యుద్ధ అవసరాలకే కాకుండా, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు చేపట్టడానికి, విదేశాల్లో చిక్కుకున్న పౌరులను రక్షించడానికి ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. ⇒ తమను తాము రక్షించుకోవడానికి, శత్రువులను ఎదుర్కోవడానికి అవసరమైన క్షిపణి వ్యవస్థలు, జలాంతర్గామి వ్యతిరేక ఆయుధాలు, సమీప శ్రేణి రక్షణ వ్యవస్థలను సైతం ఈ నౌకలు కలిగి ఉంటాయి. వీటిలో అమర్చిన ఇంజన్లు, విద్యుత్ ఉత్పత్తి పరికరాలు అత్యంత సమర్థవంతంగా, సురక్షితంగా పనిచేస్తాయి.⇒ ప్రతి ఎఫ్ఎస్ఎస్లో ఒక ధ్రువ్ హెలికాప్టర్ నిలిపేందుకు హ్యాంగర్ సదుపాయం ఉంది. ⇒ మొదటి నౌకను 2027 జూన్లో అప్పగించాలని భావిస్తుండగా, ఆ తర్వాత ప్రతి 10 నుంచి 12 నెలలకోసారి ఒక్కో ఎఫ్ఎస్ఎస్ చొప్పున మూడేళ్లలో 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ని జలప్రవేశం చేసేలా వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించారు. -
చంద్రబాబు 30వ సారి హస్తినబాట
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సోమవారం మరోసారి ఢిల్లీకి రానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఆయన హస్తినబాట పట్టడం ఇది 30వ సారి. చంద్రబాబు సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి రానున్నారు. ఆయన తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ కానున్నారు. అనంతరం జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ను కలవనున్నారు. ఆ తర్వాత కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సమ్మిట్కు హాజరుకానున్నారు. అయితే, సీఎం తరచూ ఢిల్లీ పర్యటనకు వచ్చి కేంద్ర మంత్రులను కలుస్తున్నా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సాధించింది శూన్యమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు పరపతితో తెచ్చిందేమీ లేదు! చంద్రబాబు 2024లో సీఎం అయిన తర్వాత ఢిల్లీకి వచ్చి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం ఇది 13వ సారి. ఆయన ఢిల్లీకి వచి్చన ప్రతిసారి ‘రాష్ట్రం కోసం అది తెస్తాం.. ఇది తెస్తాం’ అని లీకులు ఇవ్వడం, పెద్ద ఎత్తున ప్రచారం చేయడం... కేంద్ర మంత్రులతో భేటీ ముగిశాక మాత్రం ‘కేంద్రం సహకరిస్తోంది. లేఖలు ఇచ్చాం’ అనే పాత పాటే పాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేసే సాధారణ స్కీములు మినహా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా చంద్రబాబు తెచ్చిందేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.కేంద్రం ఇచ్చే నిధులే తప్ప, తనకున్న పరపతితో రాష్ట్రానికి అదనపు బడ్జెట్ కేటాయింపులు సాధించడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుకు ఇప్పటికీ నిధుల కేటాయింపులు, సాంకేతిక అనుమతుల విషయంలో జాప్యం జరుగుతుండటం దీనికి నిదర్శనమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘అయినను పోయిరావలె హస్తినకు‘ అన్న చందంగా చంద్రబాబు 30వ సారి ఢిల్లీ పర్యటనకు వస్తున్నారు. ఈసారి అయినా రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తారా? లేక రాజకీయ అవసరాలే అజెండాగా ఈ పర్యటన ఉంటుందా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
ప్రజారోగ్యంపై బాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యంపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులతో పరుగులు పెట్టిన వైద్య శాఖను ప్రస్తుతం ఐఏఎస్ల కొరత వేధిస్తోంది. ఇప్పుడీ శాఖను కేవలం నలుగురు ఐఏఎస్లతోనే పరిమితం చేశారు. నలుగురిలో ఒకరైన జాయింట్ సెక్రటరీ రోణంకి గోపాలకృష్ణ సోమవారం నుంచి జూన్ 6 వరకు లాల్బహుదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో శిక్షణకు వెళ్తున్నారు. దీంతో ఆయన నిర్వర్తిస్తున్న ఆయుష్ కమిషనర్, ఏపీ శ్యాక్స్ పీడీ బాధ్యతలను ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వీరపాండియన్కు ఎఫ్ఏసీ ఇస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.ఇప్పటికే ఆరోగ్య శాఖ కమిషనర్, ఐపీఎం కమిషనర్, డైరెక్టర్, ఎన్హెచ్ఎం డైరెక్టర్ బాధ్యతలను వీరపాండియన్ నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు అదనంగా మరో రెండు శాఖలను కేటాయించారు. మరోవైపు ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ, ఆరోగ్యశ్రీ, ఔషధ నియంత్రణ డీజీ స్థానాల్లో పూర్తి స్థాయి అధికారులు లేరు. గత కొద్ది నెలలుగా ఇన్చార్జులే దిక్కయ్యారు. ఉన్న కొందరు ఐఏఎస్లకే రెండు, మూడు విభాగాల బాధ్యతలు ఇవ్వడంతో పర్యవేక్షణ లోపించి గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. -
అమలాపురంలో కోర్టులు ప్రారంభం
అమలాపురం టౌన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కొత్తగా ఏర్పాటైన 14వ అదనపు జిల్లా కోర్టు, 2వ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టు కం మేజిస్ట్రేట్ కోర్టుల ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ఈ కోర్టులను తూర్పుగోదావరి జిల్లా పాలన జడ్జీ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.రఘునందన్రావు, జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి, జస్టిస్ న్యాపతి విజయ్ ప్రారంభించారు.అనంతరం అమలాపురం కోర్టుల ప్రాంగణంలో తూర్పుగోదావరి జిల్లా జడ్జి గంధం సునీత అధ్యక్షతన జరిగిన సభకు హైకోర్టు న్యాయమూర్తులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. న్యాయ వ్యవస్థ, బార్ అసోసియేషన్ సమన్వయంతో ఒక మదర్ శాఖలా వ్యవహరిస్తూ ప్రతి ఒక్కరూ తమ విధులను సక్రమంగా నిర్వర్తించి వ్యవస్థను ముందుకు నడిపించాలని వారు ఆకాంక్షించారు. అమలాపురం 14వ అదనపు జిల్లా కోర్టు జడ్జి గంటా ప్రియదర్శిని, 2వ అదనపు జిల్లా కోర్టు జడ్జి గుబ్బల చంద్ర మౌళీశ్వరి, అమలాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాశి శేషారావు, తదితరులు పాల్గొన్నారు. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 10-17)
-
‘బైక్ కావాలి’ అంటూ భార్యను వేధించిన ఇంజినీర్ భర్త!
శ్రీకాకుళం క్రైమ్/గార : వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైపోయింది. ఉరేసుకుని చనిపోయిందని భర్త చెబుతుండగా.. అల్లుడే తమ కుమార్తెను చంపేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గార మండలం శిమ్మపేటకు చెందిన శిమ్మ లక్ష్మీ నారాయణ, శారద దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి కుమారుడు గౌతమ్, డిగ్రీ బీఎస్సీ చదివిన కుమార్తె తేజశ్రీ(22) ఉన్నారు. తేజశ్రీకి శ్రీకాకుళం మండలం రాగోలు సమీప గూడెంకు చెందిన రుప్ప మల్లేషు కుమారుడు సోమేష్తో ఈ ఏడాది మార్చి 6న వివాహం జరిగింది. కట్నం కింద రూ. 20 లక్షల నగదు, 20 తులాల బంగారం చెల్లించారు. మొదటి రోజు నుంచే వేధింపులు.. విశాఖపట్నం ఎల్అండ్టీ కంపెనీలో ఇంజినీర్గా ఉన్న సోమేష్ నావల్ డాక్యార్డ్లో ప్రాజెక్టు డిజైనర్గా పనిచేస్తున్నాడు. విశాఖ రామా టాకీస్ సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇటీవల ఓ యువతిని సోమేష్ ఇంటికి తేవడంతో తేజశ్రీ భర్తను నిలదీసింది. అది సహించని సోమేష్ రూ.3 లక్షల విలువైన బైక్ కావాలని వేధించడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులకు తేజశ్రీ విషయం చెప్పడంతో నాలుగైదు రోజుల్లోనే బండి కొనిచ్చేశారు. వారం రోజుల తర్వాత పది సెంట్లు భూమి రాయాలని, తులం నల్లపూసలు చేయించాలని మళ్లీ వేధించడంతో పాటు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. పెళ్లి ఆల్బమ్లో సగం మొత్తం రూ. 1.50 లక్షలు అడగడంతో రూ.50 వేలు సైతం ఇచ్చారు. గొడవవుతుందని.. ఈనెల 7వ తేదీన ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య సోమేష్, తేజశ్రీల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ తమకు ఫోన్ చేశారని, గొడవ మామూలేనని తేజశ్రీ తమతో చెప్పిందని, ఆ తర్వాత పలు దఫాలు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. 9.30 గంటలకు ఉరివేసుకుని మీ పాప చనిపోయిందని తన ఫ్రెండ్తో సోమేష్ ఫోన్ చేయించడంతో ఒక్కసారి హతాశులయ్యామని, వెంటనే విశాఖ బయల్దేరి వెళ్లామని పేర్కొన్నారు. అక్కడికి వెళ్లి చూసేసరికి కుమార్తె బెడ్ మీద విగతజీవిగా ఉందని, మెడ, కాళ్లపై వాతలున్నాయని, సోమేష్ స్నేహితులు ముగ్గురు అక్కడే ఉండటంతో ఆమెను చంపేసి వుంటారని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే విషయమై విశాఖ పట్నం త్రీటౌన్లో కేసు పెట్టామని, సోమేష్ను అదే రోజు పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. తమ కుమార్తెకు తీరని అన్యాయం జరిగిందని.. అదనపు వరకట్నం కోసం వేధించడమే కాక హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని తల్లిదండ్రులు వాపోయారు. -
31 మంది టీడీపీ నాయకులపై కేసు
పొన్నూరు: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లి గ్రామంలోని రైతుల గొడౌన్పై జరిగిన దాడి ఘటనలో 31 మంది టీడీపీ నేతలపై శనివారం కేసు నమోదు చేశారు. రబీలో మొక్కజొన్న సాగు చేసి మద్దతు ధర లేక... ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అనుచరులైన దళారుల దోపిడీతో నష్టపోతున్న రైతులకు వైఎస్సార్సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అండగా నిలిచారు. రైతులకు ఎమ్మెల్యే చేస్తున్న అన్యాయాన్ని నిలదీస్తూ, మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఇటీవల కలెక్టర్ కార్యాలయం వద్ద దీక్ష చేశారు. మురళీకృష్ణపై బురద జల్లాలనే తలంపుతో రైతులు మొక్కజొన్న నిల్వ చేసుకున్న గోదామును మురళీకృష్ణకు చెందినదిగా చిత్రీకరించేందుకు టీడీపీ నాయకులు ప్రయతి్నంచారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే నరేంద్ర ప్రోత్సాహంతో నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు ఈ నెల 5వ తేదీన పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో మొక్కజొన్న బస్తాలు నిల్వ చేసుకున్న రైతు సుదా సముద్రయ్య, త్రివేణికి చెందిన గొడౌన్పై దాడి చేశారు. షట్టరు పగలగొట్టి అడ్డు వచి్చన రైతులపై విరుచుకుపడ్డారు. సముద్రయ్యపై దాడి చేసి గాయపరిచారు.అధికారులకు సమాచారమిచ్చి అక్రమ నిల్వలని తేల్చాలని ఒత్తిడి చేశారు. గొడౌన్ను సీజ్ చేయించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. జరిగిన నష్టం, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దారు, రూరల్ పోలీసు స్టేషన్లో రైతు సముద్రయ్య ఫిర్యాదు చేయడంతో... టీడీపీ పొన్నూరు, పెదకాకాని, చేబ్రోలు మండలాల అధ్యక్షులు బండ్లమూడి బాబూరావు, వలివేటి మురళీకృష్ణ, మైలా వెంకటరాజుతోపాటు ముఖ్య నాయకులు మాదాల వెంకటేశ్వరరావు, బొర్రు రామారావు, ఆరె వరప్రసాద్, షేక్.బాజి సాహెబ్, పఠాన్ ఫిరోజ్ ఖాన్, ఫైజుల్లా ఖాన్, బోయపాటి రామ్మోహన్, దర్శి భాస్కరరావుతోపాటు మరో 22 మందిపై రూరల్ ఎస్సై శ్రీహరి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
జనసేన నేతలపై తిరుగుబాటు బావుటా!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జనసేన నాయకులపై ఆ పార్టీ కార్యకర్తలు తిరుగుబాటు చేశారు. ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షులు మాకొద్దంటూ డిమాండ్ చేశారు. నాయకులు సొంత వ్యాపారాలు, పనుల్లో బిజీగా ఉంటూ.. కార్యకర్తలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు. అటువంటి నాయకులు తమకు వద్దంటూ సీనియర్ నాయకుల సమక్షంలోనే నిరసన తెలిపారు. దీంతో జిల్లా అధ్యక్షుల వర్గీయులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకున్నాయి. తిరుపతిలో శనివారం స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తంపై ఆ పార్టీ ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి జనసేన నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మరి కొందరు ముఖ్య నాయకులు హాజరయ్యారు. కొద్ది సేపటికి జిల్లా అధ్యక్షుల నియామకంపై చర్చ ప్రారంభమైంది. వెంటనే వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడికి వ్యతిరేకంగా జనసేన శ్రేణులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తాము ఫోన్చేసినా, ఏదైనా చెప్పుకునేందుకు వెళ్లినా స్పందించరని మండిపడ్డారు. ఆ వెంటనే ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ నాయకత్వం పైనా నాయకులు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు అందుబాటులో లేని నాయకులు, స్పందించని జిల్లా అధ్యక్షులు ఎందుకని ప్రశ్నించారు. ప్రతిపాదిత పేర్లపైనా అభ్యంతరం ప్రస్తుతం సూచించిన జిల్లా అధ్యక్షుల పేర్లలో డాక్టర్ హరిప్రసాద్, కిరణ్రాయల్, విజయ్ పేర్లు ప్రస్తావించడంతో కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, విజయ్కి వ్యతిరేకంగా కార్యకర్తలు నిరసన తెలిపారు. దీంతో జిల్లా అధ్యక్షుల వర్గీయులు, కార్యకర్తలు ఒకానొక సమయంలో కొట్టుకునే స్థాయికి వెళ్లారు. జిల్లా అధ్యక్షుల ఎంపిక వాయిదా కార్యకర్తలంతా లేచి.. జిల్లా అధ్యక్షుల ఎంపికపై అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ అభిప్రాయాలను అధిష్టానానికి తెలియజేస్తామని తేల్చిచెప్పారు. అప్పటి వరకు జిల్లా అధ్యక్షుల ఎంపిక జరగటానికి వీల్లేదని పట్టబట్టారు. దీంతో జిల్లా అధ్యక్షుల ఎంపిక వాయిదా వేయాల్సి వచ్చింది. -
రూ.100 కోట్ల భూమిపై మంత్రి సవిత అనుచరుల కన్ను
సాక్షి, పుట్టపర్తి: అధికారాన్ని అడ్డు పెట్టుకుని రాష్ట్ర మంత్రి సవిత అనుచరులు రూ.100 కోట్లు విలువ చేసే భూమిని కాజేసేందుకు పన్నాగం పన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గౌనివారిపల్లి సర్వే నంబరు 409లోని 97.5 ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా లాక్కుని పంజాబ్కు చెందిన వారికి అమ్మి, ఆ తర్వాత ఓ ప్రైవేటు కాలేజీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బాధిత రైతులు ఆ భూమి తమదేనని కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయట పడింది. దీంతో ఫిర్యాదు చేసిన రైతులను మంత్రి అనుచరులు బెదిరించినట్లు తెలిసింది. మంత్రి అండదండలు ఉండటంతో కబ్జాదారుల ఆగడాలను అధికారులు పట్టించుకోవడం లేదు. ఆన్లైన్లో తొలగించి.. ఆ తర్వాత బెదిరించి.. సర్వే నంబరు 409లోని 97.5 ఎకరాల భూమి కరణం రామప్పగారి కొండప్ప, కరణం నానెప్ప గారి వెంకటరామప్ప అనే ఇద్దరికి సంబంధించినది. 1987లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం (17–1406, 18–4106) ఆ భూమిని 39 మంది పేద రైతులకు పంచి పెట్టారు. నిబంధనల ప్రకారం ల్యాండ్ సీలింగ్లో ఉన్న భూమిని ఎవరూ కొనకూడదు, అమ్మకూడదు. కానీ, మంత్రి సవిత అనుచరులు ఈ భూమిని రైతుల నుంచి కాజేసి ఓ ప్రైవేటు కాలేజీకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొందరికి కొంత మొత్తం ముట్టజెప్పి పంజాబ్ కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు.అమ్మడానికి ముందుకు రాని రైతులను బెదిరించారు. ఆ రైతుల భూముల వివరాలను ఆన్లైన్లో తొలగించారు. ఇప్పటికే కొన్ని మ్యుటేషన్లు కూడా పూర్తి చేసినట్లు తెలిసింది. ‘తిరిగి భూమి పొందే అవకాశం లేదు. ఇచి్చనంత తీసుకుని సంతకాలు పెట్టాలి’ అంటూ కొందరు టీడీపీ నేతలు రైతులను బెదిరించినట్లు తెలిసింది. దీంతో దిక్కుతోచని స్థితిలో బాధిత రైతులు కలెక్టర్ను ఆశ్రయించారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి ఫలితమూ లేదు.కాలేజీకి అమ్మి కమీషన్ తీసుకోవాలనిల్యాండ్ సీలింగ్లో ఉన్న 97.5 ఎకరాలను పంజాబ్ కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్ చేసి.. ఆ తర్వాత వారి నుంచి పక్కనే ఉన్న ఓ ప్రైవేటు కాలేజీకి అమ్మి రూ.కోట్లలో కమీషన్ తీసుకోవాలని టీడీపీ నాయకులు ఈ భూ దందాకు తెరలేపారు. మంత్రి సవిత అండ చూసుకుని అధికారులపై కూడా పెత్తనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ల్యాండ్ సీలింగ్ భూమిని విక్రయించకూడదు. అయినా ఈ భూమిని కొనడమే కాకుండా, కొంత భూమిని రిజిస్ట్రేషన్ కూడా చేశారు. ఎవరి ప్రోద్బలంతో అధికారులు రిజిస్ట్రేషన్ చేశారనేది సస్పెన్స్గా మారింది. -
సీనియర్లకు మొండిచేయి.. జూనియర్లకే అందలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యాశాఖలో పాలన గాడి తప్పింది. చట్టాలు చిత్తు కాగితాల్లా మారాయి. అర్హతలున్న సీనియర్లను పక్కనబెట్టి అత్యంత జూనియర్లను ఉన్నత స్థాయి పోస్టుల్లో నియమించడం చంద్రబాబు ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా పేరున్న నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖలో సర్వసాధారణమైంది. సర్వీస్ రూల్స్ను పట్టించుకోకుండా గతేడాది డిసెంబర్లో అనర్హులకు పదోన్నతులు కల్పించి డీఈవోలుగా నియమించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు జిల్లాలకు తప్ప.. మిగిలిన 23 జిల్లాలకు అసిస్టెంట్ డైరెక్టర్లు, (ఏడీ), ఈ కేడర్లో జూనియర్లు డీఈవోలుగా చలామణి అవుతున్నారు.కనీస అర్హత బీఈడీ లేనివారు సైతం డీఈవో బాధ్యతల్లో ఉన్నారు. ఈ అంశంపై రాష్ట్రాధికారులకు, మంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు అందినా పట్టించుకోలేదు. ఈ నెల 5వ తేదీలోగా అన్ని శాఖల్లో పదోన్నతులు పూర్తి చేయాలని జీఏడీ స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా ఇప్పటి వరకు విద్యాశాఖలో చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సీనియారిటీకి, అర్హతలకు తిలోదకాలు సర్వీస్ రూల్స్ ప్రకారం రెగ్యులర్ పోస్టుకు ఏ అర్హతలు ఉండాలో పూర్తి అదనపు బాధ్యతలు ఇవ్వాలన్నా అవే అర్హతలు ఉండాలి. కానీ ఈ ప్రభుత్వంలో నిబంధనలకు తిలోదకాలిచ్చి కరెన్సీకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం 13 జిల్లాల డీఈవోలను బదిలీలు చేసింది. అంతకు ముందు మరికొందరిని సర్దుబాటు పేరుతో జిల్లాలకు నియిమించింది. అయితే ఈ ప్రక్రియలో ఎక్కడా సీనియారిటీని పట్టించుకోలేదు. డీఈవోల నియామకంలో తొలుత డిప్యూటీ డైరెక్టర్లకు అవకాశం కల్పించాలి. కానీ వారిని ప్రాధాన్యం లేని శాఖల్లో సర్దుబాటు చేశారు. ఇక గతేడాది పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ సుమారు 100 మంది అసిస్టెంట్ డైరెక్టర్ల సీనియారిటీ లిస్టును విడుదల చేసింది.ఇందులో అత్యంత జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్లను 23 జిల్లాలకు డీఈవోలుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే, 78 డీవైఈవో పోస్టుల్లో అసిస్టెంట్ డైరెక్టర్లను నియమించాల్సి ఉన్నా, పూర్తిగా టీచర్లను అదనపు బాధ్యతల్లో నియమించారు. ఈ పోస్టుల్లో ఖచ్చితంగా బీఈడీ అర్హత ఉండాలి, కానీ ఫిజికల్ డైరెక్టర్లను డీవైఈవో పోస్టుల్లో నియమించడం ఈ ప్రభుత్వంలోనే చెల్లింది. సమగ్ర శిక్షలో కీలకమైన అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ల పోస్టుల్లో విద్యాశాఖ అధికారులనే నియమించాలి. కానీ రెవెన్యూ శాఖలోని ఆర్డీవోలు, లెక్చరర్లను నియమించారు.సాధారణంగా డైట్లో పనిచేసే లెక్చరర్కు ఎంఈడీ అర్హతతోపాటు 55 శాతం మార్కులు తప్పనిసరి. అలాగే డైట్లో ప్రిన్సిపాల్గా నియమించాలంటే ఎంఈడీ, 55 శాతం మార్కులతోపాటు టీచింగ్ అనుభవం తప్పనిసరి. ఈ నిబంధనలను తుంగలోకి తొక్కి ఎంఈడీ అర్హత లేనివారిని డైట్ ప్రిన్సిపాళ్లుగా నియమించారు. రెండు మూడురోజుల్లో డీఈవో బదిలీలు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. ఇందులోనూ పాత విధానమే అనుసరించినట్టు చర్చ జరుగుతోంది. ఇంత జరుగుతున్నా మంత్రి లోకేశ్ కనీస చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే ఈ వ్యవహారమంతా ఆయనకు తెలిసే జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.విద్యాశాఖను పట్టించుకోని మంత్రి లోకేశ్ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఒక్క పాఠశాల విద్యాశాఖలోనే సుమారు 1.85 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. కమిషనరేట్లో అడ్మిని్రస్టేషన్ విభాగం డైరెక్టర్, అదనపు డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, వారి కింద జూనియర్ సహాయకులు, సమగ్ర శిక్ష, డీఈవో కార్యాలయాలు, ఆర్జేడీ, ఎస్సీఈఆర్టీ, బాల భవన్, వయోజన విద్య, ఐటీ, మోడల్ స్కూల్స్, ఎస్సెస్సీ బోర్డు, ఓపెన్ స్కూల్ తదితర కార్యాలయాల్లో మరో 7 వేల మంది అధికారులు, ఇతర సిబ్బంది ఉన్నారు. ఇవిగాక ఇంటర్ విద్య, ఉన్నత విద్య అంతా కలిసి 2.50 లక్షల మందికి పైగా సిబ్బంది పని చేస్తున్నారు. కానీ, రెండేళ్లలో మంత్రి లోకేశ్ కలిసింది కేవలం ఆయా శాఖల్లోని కమిషనర్లను మాత్రమే. దీంతో ఉన్నతాధికారులు చేసిందే సర్వీసుగా, వారు నియమించిన వారే అధికారిగా తయారైంది. -
మీ వంటింట్లోని ప్లాస్టిక్ ప్రాణాంతకమా
మనం రోజూ వాడే వాటర్ బాటిల్స్ నుంచి లంచ్ బాక్సుల వరకు ప్రతి ప్లాస్టిక్ వస్తువు అడుగున ఒక చిన్న త్రిభుజం.. అందులో ఒక నంబర్ ఉండటం మీరెప్పుడైనా గమనించారా? అసలు ఆ నంబర్లు దేనిని సూచిస్తాయి? అవి మన ఆరోగ్యానికి ఎంతవరకు సురక్షితం? ఎంత వరకు ప్రమాదకరం? ఈ ఆసక్తికర వివరాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్లాస్టిక్ వర్గీకరణ.. సొసైటీ ఆఫ్ ది ప్లాస్టిక్స్ ఇండస్ట్రీ (ఎస్పీఐ) అనే సంస్థ 1988లో ప్లాస్టిక్ను ఏడు రకాలుగా వర్గీకరించింది. ఈ వర్గీకరణ వ్యవస్థను రెసిన్ ఐడెంటిఫికేషన్ కోడ్ (ఆర్ఐసీ) అని పిలుస్తారు. ప్లాస్టిక్ రకాలను గుర్తించి వాటికున్న రీసైక్లింగ్ సామర్థాన్ని బట్టి వాటికి 1 నుంచి 7 నంబర్లను కేటాయించారు.1 పీఈటీ: సాఫ్ట్ డ్రింక్ సీసాలు, వాటర్ బాటిళ్ల తయారీకి ఈ రకం ప్లాస్టిక్ని వాడతారు. వాటిని పదేపదే ఉపయోగిస్తే యాంటిమోనీ అనే హానికర రసాయనాలు వెలువడవచ్చు. అత్యధికంగా రీసైకిల్ అవుతున్న ప్లాస్టిక్ ఇది. 2హెచ్డీపీఈ: పాల డబ్బాలు, షాంపూ బాటిళ్లు, డిటర్జెంట్ డబ్బాలకు ఉపయోగిస్తారు. ఇది అత్యంత సురక్షితమైన ప్లాస్టిక్. రసాయనాల విడుదల తక్కువ. సులభంగా రీసైకిల్ చేయవచ్చు. 3 పీవీసీ (వినైల్): పైపులు, పిల్లల బొమ్మలు, క్లింగ్ ఫిల్ములు (గాలి చొరబడకుండా గిన్నెలపై మూతలుగా వాడే ప్లాస్టిక్ షీట్స్) తయారు చేసేందుకు వాడతారు. అయితే దీన్ని ‘పాయిజన్ ప్లాస్టిక్’అంటారు. ఇందులో కేన్సర్ కారక డయాక్సిన్లు, థాలేట్లు ఉంటాయి. వాటిని రీసైక్లింగ్ చేయడం చాలా కష్టం. 4 ఎల్డీపీఈ: ప్లాస్టిక్ కవర్లు, బ్రెడ్ ప్యాకెట్లకు వాడతారు. ఇది కూడా కొంతవరకు సురక్షితమైనదే. కొన్ని అవసరాలకు మాత్రమే రీసైకిల్ చేస్తారు. 5 పీపీ: పెరుగు కప్పులు, సిరప్ బాటిళ్లు, వేడి ఆహార కంటెయినర్లకు వాడతారు. వేడిని తట్టుకుంటుంది. దీనిని కూడా సురక్షితమైన రకంగానే పరిగణిస్తారు. రీసైక్లింగ్ సాధ్యమే. 6 పీఎస్ (పాలీస్టెరీన్): ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు, టీ–కప్పులు, ప్యాకింగ్ మెటీరియల్, ఎగ్ కార్టన్స్, ధర్మోకోల్ తయారీకి వాడతారు. వేడి తగిలితే స్టెరీన్ అనే విష పదార్థం విడుదల అవుతుంది. మెదడుపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా దీనిని రీసైకిల్ చేయరు. చేయడం కూడా కష్టం. 7 ఇతర ప్లాస్టిక్లు: నైలాన్, సన్ గ్లాసెస్, బేబీ బాటిల్స్ (కొన్ని రకాలు) తయారు చేస్తారు. ఇది మిశ్రమ ప్లాస్టిక్. రీసైక్లింగ్ దాదాపు అసాధ్యం.పర్యావరణ నిపుణుల సూచనల ప్రకారం 2, 4, 5 నంబర్లు ఉన్న ప్లాస్టిక్ వస్తువులను వాడటం కొంత వరకు సురక్షితం. కానీ 3, 6, 7 నంబర్లు ఉన్న ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచిది. ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువుల్లో ఆహారాన్ని ఓవెన్లో వేడి చేయడం లేదా వేడి పదార్థాలను ఉంచడం మానుకోవాలి. ఈసారి మీరు కొనే ప్లాస్టిక్ బాటిల్ అడుగున నంబర్ చూడటం మర్చిపోకండి! -
2025–26 బాబు సర్కార్ బడ్జెట్ను కడిగేసిన కాగ్
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేయడంలో చూపించే ఉత్సాహం.. ఆస్తుల కల్పనలో, రాష్ట్రాభివృద్ధిలో చూపించడం లేదు. 2025–26 బడ్జెట్కు సంబంధించి కాగ్ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా ఇలాంటి రాష్ట్ర ఆర్థిక ప్రతికూల ముఖచిత్రాన్నే కాగ్ గణాంకాలు చూపించాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అమలు సూచికలపై కాగ్ శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాలను మించి రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు పెరిగిపోయాయి. బడ్జెట్ అంచనాల మేరకు ఆస్తుల కల్పన వ్యయం భారీగా తగ్గిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేయడంపై చూపిస్తున్న శ్రద్ధ రెవెన్యూ రాబడులు పెంచడం ద్వారా సంపద సృష్టిపై చూపెట్టడం లేదు. అమ్మకం పన్నుతో పాటు ఇతర పన్నులు, డ్యూటీలు రాబడుల్లో తిరోగమనంలో ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో నిధులు రాబట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. -
నిధుల వినియోగంలో ఘోర వైఫల్యం
సాక్షి, అమరావతి: కేంద్ర నిధుల వినియోగంలో చంద్రబాబు సర్కారు వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఘోర వైఫల్యం చెందింది. దీంతో రెండు (2024–25, 2025–26) ఆర్థిక సంవత్సరాల్లో కేంద్ర ప్రయోజిత పథకాల నిధులు రూ.10,721 కోట్లు మురిగిపోయాయి. 2025–26లోనే కేంద్రం నిధులు రూ.5,321 కోట్లు మురిగిపోవడం గమనార్హం. గడచిన ఆర్థిక సంవత్సరం వివిధ విభాగాలకు కేంద్రం రూ.15,096 కోట్లు కేటాయించగా, అందులో రూ.9,775 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇంత భారీ స్థాయిలో కేంద్రం నిధులను సకాలంలో వ్యయం చేయకపోవడంలో బాబు సర్కార్ వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.నిజానికి కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ బాబు ప్రభుత్వం భారీ ఎత్తున కేంద్ర నిధులను రాబట్టుకోవడంలో విఫలమవుతోంది. వచ్చిన నిధులనూ సరిగా వినియోగించడంలోనూ చేతులెత్తేయడం విచారకరమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిజానికి ఒక రాష్ట్రం నిధుల వినియోగం ఆధారంగానే తదుపరి వాయిదాలను కేంద్రం విడుదల చేస్తుంది.ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేటాయించిన నిధులను సకాలంలో వ్యయం చేసి అదనపు నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించి మంజూరు చేయించుకుంటుంది. చంద్రబాబు సర్కారు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడంతో రాష్ట్రం ఆర్థికంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు గృహ నిర్మాణం, వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ, సెకండరీ విద్య, గిరిజన సంక్షేమ శాఖల నిధులు భారీగా మురిగిపోయాయి. -
మంత్రిగారి వియ్యంకుడి దందా.. ధాన్యం దోపిడీకి ‘పట్టాభి’షేకం
‘‘గుంటూరు జిల్లాలో వ్యవసాయాధికారుల అంచనాల ప్రకారం ఖరీఫ్లో 4 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ఇప్పటికే 21 మిల్లులకు సీఎంఆర్ ఇచ్చాం. ఇందులో తొమ్మిది మిల్లులు బ్యాంకు గ్యారంటీలు కట్టలేదు. అందుకే, ధాన్యం కొనుగోళ్లలో స్థానిక మిల్లుల సామర్థ్యం సరిపోదు. పెద్దాపురానికి చెందిన పట్టాభి ఆగ్రోస్ ఇండస్ట్రీస్ బల్్కగా సీఎంఆర్ ధాన్యాన్ని తరలించేందుకు విజ్ఞప్తి చేసింది.ఇందులో 50శాతం రవాణా ఖర్చులు ఆ సంస్థే భరిస్తుంది’’ అంటూ గుంటూరు పౌరసరఫరాల సంస్థ అధికారి జిల్లా జేసీని తప్పుడు లెక్కలతో మోసగిస్తూ ఇచ్చిన నివేదిక ఇది. దీనిని నమ్మిన జేసీ ధాన్యం అంతర్జిల్లా రవాణాకు అనుమతించారు. విచిత్రం ఏమంటే.. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్లో కొనుగోలు చేసింది కేవలం 91వేల టన్నులు మాత్రమే! ఇందులో పట్టాభి మిల్లులకు తరలించింది దాదాపు 22వేల టన్నులు. ఇక్కడ పథకం ప్రకారమే అంతరజిల్లా రవాణాకు అనుమతిచ్చి పట్టాభిని రంగంలోకి దింపి ధాన్యం కొనుగోళ్లలో దోచిపెట్టారనేది స్పష్టంగా తెలుస్తోంది.సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ధాన్యం కొనుగోళ్లలో భారీగా మద్దతు ధర దోపిడీ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరలను అమలు చేయడంలో చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫలమైంది. కూటమి అనుకూల మిల్లర్లు, దళారుల సిండికేట్ చేతిలో ధాన్యాన్ని పెట్టి రైతుల నోటిలో మట్టికొడుతున్నారు. సీజన్లతో సంబంధం లేకుండా సిండికేట్ చెప్పిన ధరకే రైతులు ధాన్యాన్ని తెగనమ్ముకోవాల్సిన దుస్థితి. కాదంటే.. రైతుకు ధాన్యం పట్టుబడికి గోనె సంచులు అందవు.. రవాణాకు వాహనాలు రావు.. అసలు ప్రభుత్వ సిబ్బంది అటువైపు కన్నెత్తి చూడరు. అదే దళారీ చెప్పిన రేటుకు ఓకే అంటే మాత్రం క్షణాల్లో ధాన్యం మిల్లుకు చేరిపోతుంది. గడిచిన ఖరీఫ్లోనూ.. ప్రస్తుత రబీలోనే ఇదే సీన్ రిపీట్ అవుతోంది.ఇక్కడ 75కిలోల బస్తా ధాన్యం ఏ–గ్రేడ్కు రూ.1791, సాధారణ రకానికి రూ.1,777 చెల్లించాల్సిన ప్రభుత్వం.. రైతులను గాలికొదిలేయడంతో దళారులకు బస్తా రూ.1,100 నుంచి రూ.1,300కు విక్రయించుకోక తప్పనిస్థితి రైతులది. ఈ లెక్కన చూస్తే ఒక టన్నుకు ఏకంగా రూ.6,500 నుంచి రూ.9,300 వరకు నష్టపోతున్నారు. ఇక్కడ విచిత్రం ఏమంటే.. రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసిన దళారులు, సిండికేట్ మిల్లర్లు.. అదే ధాన్యాన్ని రైతు పేరుతో పూర్తి మద్దతు ధరకు ప్రభుత్వానికి విక్రయించి సొమ్ము చేసుకోవడం విస్తుగొలుపుతోంది. గడిచిన ఖరీఫ్లో ప్రభుత్వం రూ.11వేల కోట్ల విలువైన 49లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. ఇందులో మొత్తం దళారులే రాజ్యమేలడంతో దాదాపు రూ.3,100 కోట్ల నుంచి రూ.4,500 కోట్ల మద్దతు ధరను కొట్టేసినట్టు స్పష్టమవుతోంది. పట్టాభికే ‘పట్టం’!ఓ మంత్రి వియ్యంకుడికి చెందిన పెద్దాపురంలోని పట్టాభి ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కేంద్రంగా ధాన్యం సిండికేట్ దందా నడుస్తోంది. ప్రభుత్వంలోని కీలక పదవిలో ఉన్న మంత్రికి వియ్యంకుడు కావడం, పౌరసరఫరాల శాఖ మంత్రి సొంత సామాజికవర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు ఉండటంతో పట్టాభి ఇండస్ట్రీస్ గడిచిన ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో ఏకఛత్రాధిపత్యం సాగించింది. ఎన్నడూ సీఎంఆర్ వైపు కన్నెత్తి చూడని పట్టాభి ఇండస్ట్రీస్ ఖరీఫ్లో మాత్రం ధాన్యం సేకరించింది. దీనివెనుక భారీ దోపిడీ జరిగినట్టు స్పష్టమవుతోంది.పెద్దాపురంలో ఉన్న పట్టాభి ఇండస్ట్రీస్కు అనుబంధ సిండికేట్గా ఏర్పడిన ఐదారు మిల్లులు ఏకంగా 300 కిలోమీటర్లు దాటి బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఏకంగా రూ.230 కోట్ల విలువైన లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైల్వే వేగన్ల ద్వారా తరలించడం గమనార్హం. స్థానికంగా మిల్లర్లకు సామర్థ్యం లేదనే సాకుతో అంతర్జిల్లా ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల సంస్థ తెరదీసింది.పైగా పట్టాభి ఆగ్రో ఇండస్ట్రీస్ స్వయంగా వచ్చి తాము సీఎంఆర్ ఇస్తే ధాన్యాన్ని సొంత ఖర్చులతో అంతర్ జిల్లాకు తరలిస్తామని లేఖ ఇచ్చిన వెంటనే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం కొసమెరుపు. వాస్తవానికి స్థానికంగా మిల్లులు లేని ఏజెన్సీ ప్రాంతాల నుంచి/విపత్కర పరిస్థితుల్లో ధాన్యం వేగంగా తరలించేందుకు మాత్రమే అంతర్జిల్లా రవాణా చేస్తారు. ఇలా ఏటా ఖరీఫ్లో 60వేల టన్నుల వరకు మాత్రమే అంతర్ జిల్లా రవాణా ఉంటే.. గడిచిన ఖరీఫ్లో మాత్రం ఏకంగా 2 లక్షల టన్నులు తరలిపోవడం గమనార్హం. రబీలో సంచులు ఎందుకు లేవు?ఖరీఫ్ గాయం మానకముందే రబీ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అవస్థలు తప్పడం లేదు. చంద్రబాబు హయాంలో సంపూర్ణ మద్దతు ధర చూడలేమన్న నైరాశ్యానికి వచ్చేశారు. పంట కోసి 20 రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో ఆవేదనతో రైతులు రోడ్లపైకి వస్తున్న దుస్థితి. పంట ఒబ్బిడి చేసుకునేందుకు కనీసం ప్రభుత్వం గోనె సంచులు కూడా అందించట్లేదు. దళారుల మాట కాదని రైతు సేవా కేంద్రాల సిబ్బంది ముందుకు వెళ్లలేని పరిస్థితి. గత్యంతరం లేక కోసిన పంటను కోసినట్టు రూ.1,100తో అమ్ముకుని రైతుల నష్టాలపాలవుతున్నారు. పైగా ఇటీవల అకాల వర్షాలకు పంట తడవడంతో ముక్క విరుగుడు సమస్య రైతులను నిలువునా ముంచేస్తోంది. పట్టాభి సిండికేట్ మిల్లులకు లక్ష టన్నులు!చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం గడిచిన ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో అంతర్జిల్లా రవాణా పేరిట భారీ దోపిడీకి తెరదీసింది. ముందస్తు ప్రణాళిలో భాగంగా పట్టాభి సిండికేట్ రైతుల నుంచి ధాన్యాన్ని కారుచౌకగా కొట్టేసింది. మొత్తం 213 మిల్లులకు రూ.468 కోట్ల విలువైన రెండు లక్షల టన్నుల అంతర్జిల్లా ధాన్యం తరలిస్తే అందులో ఒక్క పట్టాభి అనుబంధ సిండికేట్ ఐదారు మిల్లులకే ఏకంగా లక్ష టన్నుల ధాన్యం చేరడం విస్తుగొలుపుతోంది. మద్దతు ధర 75కిలోల బస్తాకు రూ.1,777 ఉంటే రైతుల చేతిలో రూ.1,100 పెట్టి ధాన్యం దోచేసింది.ఇలా కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఏకంగా లక్ష టన్నులపైగా ధాన్యాన్ని సేకరించి ఆ తర్వాత పథకం ప్రకారం స్థానిక మిల్లులకు ఎక్కువ సీఎంఆర్ సామర్థ్యం లేదనే సాకుతో పెద్దాపురం మిల్లులకు తరలించింది. ఇది మిల్లర్ల అసోసియేషన్లో భారీ గందరగోళానికి తెరదీయడం గమనార్హం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పట్టాభి సిండికేట్కు లబ్ధి చేకూర్చేందుకు కుయుక్తులు పన్నింది.ఇందులో భాగంగానే బియ్యం అక్రమ రవాణా పేరుతో కాకినాడ పోర్టులో హడావుడి చేసి బొక్కబోర్లా పడింది. పైగా ఎక్స్పోర్ట్స్ వ్యాపారాన్ని సీజ్ ద షిప్ పేరుతో తీవ్రంగా దెబ్బతీసింది. ఫలితంగా చాలా మంది బియ్యం వ్యాపారులు బహిరంగ మార్కెట్లో ధాన్యం కొనడం మానేశారు. ఇదే అదునుగా పట్టాభి భారీ సిండికేట్ అవతారమెత్తి మొత్తం ధాన్యాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని స్థానిక మార్కెట్ను కబ్జా చేసింది. పైగా ఎక్స్పోర్ట్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సీఎంఆర్ ద్వారా రెట్టింపు చేసుకోవటం గమనార్హం. -
కడపలో ఇరువర్గాల ఘర్షణ
సాక్షి ప్రతినిధి, కడప: కడప నగరం అల్మాస్పేటలో ఓ ఘటన ఇరువర్గాల మధ్య చిచ్చు రేపింది. ఒకరిపై మరొకరు రాళ్ల దాడులకు దిగారు. ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నంలో సీఐ నరసింహరాజు, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, మరో ఇద్దరు పోలీసులు గాయాలపాలయ్యారు. శనివారం మధ్యా హ్నం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. అల్మాస్పేట సర్కిల్లో ఓ వర్గం బ్యానర్లు ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. బ్యానర్ల ఏర్పాటుపై అభ్యంతరం చెబుతూ మరోవర్గం నిరసనకు దిగింది. ఇందుకు అనుగుణంగా అప్పటికప్పుడు బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు.దీంతో ఇరువర్గాలూ బ్యానర్లు తీసేసి, శాంతియుత వాతా వరణం కల్పించేందుకు సహకరించాలని పోలీసు లు అనేకమార్లు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ వినిపించుకోకుండా ఇరువర్గాలు రాళ్ల దాడులకు పాల్పడ్డాయి. ఈ క్రమంలో పోలీసులూ గాయాలపాలవడంతో ఇరు వర్గాలపై లాఠీ ఝుళిపించారు. అల్లరి మూకలను అక్కడి నుంచి చెదరగొట్టారు. పరస్పర కవ్వింపు చర్యలకు పాల్పడడంతోనే ఘర్షణ ఉత్ప న్నమైందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. -
సర్దుబాటు చేస్తారా? చేతులెత్తేస్తారా?
⇒ ఇతని పేరు జర్సింగి పొట్టన్న(43). అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల గిరిజన బాలుర గురుకులంలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా సుదీర్ఘకాలం పనిచేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న విధినిర్వహణలో ఉండగానే బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయాడు. సుమారు 17 ఏళ్లు అవుట్ సోర్సింగ్ టీచర్గా సేవలు అందించిన అతనికి ఉద్యోగ భద్రత లేకపోగా.. అతని కుటుంబానికి ప్రభుత్వం ఆసరా కల్పించలేదు. ⇒ ఇతని పేరు బి.చంద్రబాబు నాయక్. వైఎస్సార్ జిల్లా కడప గిరిజన బాలుర గురుకులంలో ఏడేళ్లు పీఈటీగా సేవలు అందించారు. ఈ ఏడాది మార్చి 10న బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందారు.సాక్షి, అమరావతి: వీరేకాదు.. ఇంకా పీలేరు గురుకులంలో ఇంగ్లిష్ టీచర్గా ఏడేళ్లు సేవలు అందించిన ప్రకాశ్బాబు అనారోగ్యంతో మృతి చెందాడు. మారేడుమిల్లి గురుకులంలో పదేళ్లుగా సేవలు అందిస్తున్న చెక్క అబ్బాయిరెడ్డి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు. ఇలా గడిచిన నాలుగు నెలల్లో దాదాపు ఆరుగురికిపైగా గిరిజన అవుట్ సోర్సింగ్ టీచర్లు మృత్యువాత పడటంతో వారి కుటుంబాలు ఆధారం కోల్పోయాయి. అనారోగ్యం తదితర కారణాలతో అవుట్ సోర్సింగ్ టీచర్ల బతుకులు తెల్లారిపోతున్నా.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కనీస కనికరం చూపడంలేదు.మృతి చెందిన వారికి ఇస్తామన్న రూ.15వేలు మట్టి ఖర్చులు కూడా విదల్చలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మట్టి ఖర్చులతోపాటు మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు ఇచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవత్వం చాటుకున్నారని గిరిజన అవుట్ సోర్సింగ్ టీచర్లు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికే అవుట్ సోర్సింగ్ టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయడంతో దాదాపు 8 నుంచి 15ఏళ్లుగా సేవలు అందిస్తున్నవారి జీవితాలు గాలిలో దీపంలా మారాయి. ఎన్నికల హామీని పూర్తిగా పక్కనపెట్టి.. రాష్ట్రంలోని 191 గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో మొత్తం 1,659 మంది అవుట్ సోర్సింగ్ టీచర్లు పనిచేసేవారు. ప్రభుత్వం ఇచ్చే జీతాలు చాలక, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి కారణాలతో వారిలో కొందరు ఉద్యోగాలు మానేయడంతో ప్రస్తుతం 1,143 మంది పని చేస్తున్నారు. వారి పోస్టులను ఇటీవల డీఎస్సీ ద్వారా భర్తీ చేశారు. ఆ పోస్టుల్లో 1,118 మంది రెగ్యులర్ టీచర్లు విధుల్లోకి చేరడంతో, అవుట్ సోర్సింగ్ టీచర్లు ఉద్యోగం కో ల్పోయి రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. వీరి లో ప్రధానంగా జోన్–1లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన అవుట్సోర్సింగ్ టీచర్లే ఎక్కువమంది ఉండడం గమనార్హం.ఏప్రిల్ 24తో ముగిసిన కొలువు.. అవుట్సోర్సింగ్ టీచర్లను కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఎక్కడో ఒకచోట సర్దుబాటు చేస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో వీరికి హామీ ఇచ్చారు. ఇదే విషయమై అనేక పర్యాయాలు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, అధికారులతో అవుట్ సోర్సింగ్ టీచర్ల యూనియన్ నేతలు చర్చలు జరిపినా కనీస కనికరం చూపడంలేదు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ 2024 నవంబర్ నుంచి దాదాపు 45 రోజులపాటు శాంతియుతంగా పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు.డీఎస్సీలో రెగ్యులర్ పోస్టులు భర్తీ చేసినా మీకు ఇబ్బంది లేకుండా చూస్తామని, ఎక్కడో ఒక చోట సర్దుబాటు చేస్తామని, ఉద్యోగ భద్రత కలి్పస్తామని మరోమారు ప్రభుత్వ పెద్దలు చర్చల సందర్భంగా మాట ఇవ్వడంతో ఆందోళన విరమించి విధుల్లోకి చేరారు. తీరా.. ప్రభుత్వం నమ్మించి దగా చేసిందని, హామీలు గాలికి వదిలేసి తమను రోడ్డుపైకి పడేసిందని వాపోతున్నారు. నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో అవస్థలు పడుతున్న వారిని కాంట్రాక్ట్ పద్దతిలోకి మార్చి ఉద్యోగ భద్రత కల్పించాలని, పనికి తగిన వేతనం ఇవ్వాలని జాతీయ ఎస్టీ కమిషన్ సూచించినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు.గిరిజన గురుకులాల్లో దాదాపు 10 నుంచి 18 ఏళ్లుగా అడవి బిడ్డలకు అక్షర జ్ఞానం అందించిన వారికి ఏప్రిల్ 24వ తేదీతో కొలువు ముగిసింది. వేసవి సెలవులు ముగిసిన అనంతరం జూన్లో వారిని రెన్యూవల్ చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొనసాగించే విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. -
ముద్ర రుణాల్లో వెనుకంజలో తెలుగు రాష్ట్రాలు
సాక్షి, హైదరాబాద్: ముద్ర రుణాల మంజూరులో తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోంది. జనాభా ప్రాతిపదికన జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మంజూరైన ముద్ర ఖాతాల సంఖ్య దాదాపు సగమే. దీంతో రుణాలు అందక ఔత్సాహిక యువత ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారు. చిరు వ్యాపారులు తదుపరి వ్యాపార విస్తరణ చేపట్టలేక పోతున్నారు. 100 మందికి 21 ఖాతాలు.. ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) పథకం ద్వారా చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా విస్తరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి తనఖా లేకుండా రుణాలను అందిస్తోంది. 2015 ఏప్రిల్ 8 నుంచి 2026 జనవరి 2 మధ్య 56.31 కోట్ల ఖాతాలకుగాను రూ.37.31 లక్షల కోట్ల రుణాలు మంజూరు అయ్యాయి. 70% మంది లబ్ధిదారులు మహిళలు కావడం విశేషం. మొత్తం జనాభా ప్రాతిపదికన చూస్తే దేశవ్యాప్తంగా ముద్ర ఖాతాల సంఖ్య 39.88 శాతం ఉంది. అంటే 100 మందికి దాదాపు 40 లోన్లు జారీ అయినట్టు.వాస్తవానికి ఇదొక రికార్డు. అయితే, తెలంగాణలో 21.44 శాతం, ఆంధ్రప్రదేశ్లో 21.04శాతం.. అంటే ఒక్కో రాష్ట్రంలో 100 మందికిగాను 21 లోన్లే అందాయంటే మన తెలుగు రాష్ట్రాలు ఏ స్థాయిలో వెనుకంజలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అదే పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక, ఒడిశాలు జనాభా ప్రాతిపదికన అత్యధిక ఖాతాలతో టాప్–3లో ఉండడం గమనార్హం. టాప్–10 జాబితాలోనూ తెలుగు రాష్ట్రాలకు చోటు దక్కలేదు. పీఎంఎంవై ప్రారంభం నుంచే.. ముద్ర రుణాలు విరివిగా లభిస్తే డెయిలీ, నకిలీ ఫైనాన్స్లకు అడ్డుకట్ట పడుతుందన్నది జనం మాట. కనీసం ఐదు ముద్ర ఖాతాలు లేని గ్రామాలు వేలాదిగా ఉన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ నిర్దేశించిన లక్ష్యాల మేరకే రుణాలు మంజూరు చేస్తున్నట్టు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో బ్యాంకుల ఉన్నతాధికారులు తేల్చి చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు ముద్ర రుణాలు తక్కువగా మంజూరు అవుతున్నాయని పలు సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు సమర్పించినా ఫలితం లేకపోయింది. పీఎంఎంవై ప్రారంభం నుంచే తెలంగాణ, ఏపీకి తక్కువ కేటాయింపులు జరగడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు ఉన్నాయి. -
ఎండుతున్న పంటలు.. మాడుతున్న తోటలు
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి చెందిన ఈయన పేరు తలారి ఓబులేసు. 3.5 ఎకరాల్లో బత్తాయి (చీనీ) సాగు చేస్తున్నాడు. ఐదు బోర్లు వేసినా నీళ్లు పడలేదు. బోర్లకే రూ.4.50 లక్షలు ఖర్చు చేశాడు. ఎండిపోతున్న చీనీ తోటలను కాపాడుకునేందుకు రోజూ ఐదు ట్యాంకర్లతో తోటకు నీరు పెడుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు నీటి కొనుగోలుకే రూ.2.70 లక్షల ఖర్చు చేశాడు. బోర్లకు నీటి కొనుగోలుకు కలిపి రూ.7.30 లక్షలు ఖర్చు అయ్యాయి. కొద్దిపాటి పంటను అమ్మగా రూ.2.10 లక్షలు వచి్చంది. మిగిలిన పంట నీరులేక ఎండిపోతోంది. తోటలో ఆరు వేలకు పైగా చీనీ చెట్లుండగా, 100కు పైగా చెట్లు ఇప్పటికే చచి్చపోయాయి. మిగిలిన చెట్లు కూడా ఎండిపోతున్నాయి. ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నాడు.సాక్షి, అమరావతి: ఏళ్ల తరబడి కంటికిరెప్పలా పెంచుకున్న చెట్లు కళ్లెదుటే మాడిపోతుంటే రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం పత్తా లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే పలు చోట్ల 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వ్యవసాయ బోర్లలో నీరు రావడంలేదు. కొత్తగా బోర్లు వేసినా చుక్కనీరు పడే పరిస్థితి లేదు. దీనికి తోడు లోఓల్టేజ్ సమస్య వేధిస్తోంది. పంటలకు నీరందని పరిస్థితి రబీలో బోర్ల కింద సాగు చేసిన పంటలకు నీరందక ఎండిపోతున్నాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పెద్ద ఎత్తున పంటలు ఎండిపోతున్నాయి. వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న, వేరుశనగతోపాటు చీనీ, దానిమ్మ, అరటి, మిరప వంటి వాణిజ్య పంటలు సాగవుతున్నాయి. గతేడాది కన్నా దాదాపు 3–5 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోవడంతో నీరందక పంటలు ఎండిపోతున్నాయి. బోర్లలో మరింత లోతుకు అదనంగా పైపులు దించినా, ఆశించిన స్థాయిలో నీరందడం లేదు. నేలలో తేమ పూర్తిగా ఆరిపోయి పంటలకు ఎక్కువ తడువు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీరందించేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. అనంతపురం జిల్లాలో వందలాది ఎకరాల్లో చీనీ తోటలైతే గతంలో ఎన్నడూ లేనంతగా దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. గార్లదిన్నె మండలం మర్తాడు, కోటంక గ్రామాల పరిధిలో సాగునీరు లేక చీనీ తోటలు నిట్ట నిలువునా ఎండిపోతున్నాయి. ఒక్కో ట్యాంకర్కు రూ.1000 ఖర్చు రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఎకరాల్లో చీనీ పంట సాగవుతుండగా, ఒక్క అనంతపురం జిల్లాలోనే 91వేల ఎకరాల్లో చీనీ తోటలున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో అవసరమైన నీరందక 5–7 ఏళ్ల వయస్సున్న చీనీ తోటలు నిట్ట నిలువునా ఎండిపోతున్నాయి. ఒక రైతు రూ.5 లక్షలు ఖర్చు పెట్టి ఆరు బోర్లువేసినా నీళ్లు పడలేదు. ఎండిపోతున్న తోటలను కాపాడుకునేందుకు రైతులు రేయింబవళ్లు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. ట్యాంకర్లతో నీళ్లు తోలేందుకు రోజుకు ఎకరాకు రూ.1,000 వరకు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్థికంగా దెబ్బతిన్న రైతులకు ఇది మరింత భారంగా మారింది. ఎండిపోతున్న చీనీ తోటల రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తక్షణమే వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి, ఎండిపోతున్న చీనీ తోటలను కాపాడేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలుతీసుకోవాలని కోరుతున్నారు.దిగుబడులు తగ్గుతాయి నాకు ఆరు ఎకరాల్లో చీనీతోట ఉంది. ఎకరాకు 12 టన్నుల దిగుబడులు రావాల్సి ఉండగా, ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వలన 5–6 టన్నులకు మించి వచ్చే పరిస్థితి లేదు. ఒక్కో ట్యాంకర్కు రూ.800–1,000 చొప్పున చెల్లిస్తూ నీటిని పెట్టుకుంటున్నాం. అయినా పూర్తి స్థాయిలో నీరందే పరిస్థితి లేదు. తోటలు ఎండిపోతున్నాయి. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – గందివీటి ప్రకాష్ రెడ్డి, కోటంక, అనంతపురం జిల్లా ఎకరాకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. అడుగంటిన భూగర్భ జలాల కారణంగా ఏళ్లతరబడి పెంచుకున్న చెట్లు కళ్లెదుటే ఎండిపోతున్నాయి. తోటలను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని తోలేందుకు రైతులు అప్పులపాలవుతున్నారు. ఎండిపోతున్న తోటలను కాపాడేందుకు నీళ్ల సరఫరా బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి. ఇప్పటికే నీటి సరఫరా కోసం రైతులు పెట్టిన ఖర్చులను ప్రభుత్వం తిరిగి చెల్లించాలి. నీళ్లులేక ఎండిన తోటలకు ఎకరాకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. – వి.కృష్ణయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం -
‘చంద్రబాబు బడాయి మాటలు తప్పితే చేసిందేమీ లేదు’
తాడేపల్లి : ఈ రెండున్నరేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బడాయి మాటలు చెబుతూ మాత్రమే ప్రభుత్వాన్ని నడిపించారని, ప్రజలకు చేసేంది మాత్రం ఏమీ లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రజలకు ఏమీ చేయకపోవడంతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. ఈరోజు(శనివారం, మే 9వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి రాంబాబు.. ‘ఒక్కో కాన్ఫరెన్స్ లో ఒక్కో అంశంపై బడాయి మాటలు చెప్పారు. కానీ ఈ ఏడు సమావేశాల్లో చెప్పిన ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. మోదీ కన్నా చంద్రబాబు పరిపాలనాదక్షుడు అని గొప్పలు చెప్పుకోవడం తప్ప చంద్రబాబు ఇంకేం చేశారు?, ప్రపంచానికి పాఠాలు చెప్తాననే చంద్రబాబు మంత్రులు బృందాన్ని సింగపూర్ ఎందుకు పంపారు?, సింగపూర్లో స్టడీ చేసి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారా?, ఇప్పుడు ఆ హామీలన్నీ ఎగ్గొట్టి సింగపూర్ లో ఏం చేశారు?, ఎన్నికలకు ముందు చూపించిన మేనిఫెస్టో ఇప్పుడు ఎక్కడుంది?, ఈ రెండేళ్లలో ఒక్క పేదోడికీ గజం స్థలం కూడా ఇవ్వలేదు. వార్డు, గ్రామ సచివాలయాలను సర్వ నాశనం చేశారు. ఏ పంటకీ గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడి పోతున్నారు. ఆరోగ్యశ్రీ, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఏమయ్యాయి?, సింగపూర్ పర్యటన కేవలం షికారు కోసమే. ఆర్భాటం తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏ ఒక్కటీ చేయలేదు. ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇది. జగన్ హయాంలో జరిగినంత వేగంగా పనులు జరగటం లేదు. ఇచ్చిన డబ్బులు కూడా ఎందుకు ఖర్చు చేయలేదని కేంద్రమే ప్రశ్నించింది. రాయలసీమ లిఫ్టును రేవంత్రెడ్డికి గిఫ్టుగా ఇచ్చారు. సోషల్ మీడియా పోస్టులపై మళ్ళీ అక్రమ కేసులు పెట్టటం దుష్ట సంప్రదాయం. ఎంతమందిని అరెస్టు చేసినా వెనక్కు తగ్గేదే లేదు. క్రిమినల్స్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసుల్ని సోషల్ మీడియా వాళ్ల మీద ప్రయోగిస్తారా?, వెలిగొండలో మంత్రి రామానాయుడు చాలా డ్రామాలు చేస్తున్నారు. ఫోటోలకు స్టిల్ ఇవ్వటం తప్ప ప్రాజెక్టుకు ఎప్పుడు నీరు ఇస్తారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
‘రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడే పరిస్థితి’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను నిలువునా మోసం చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ధ్వజమెత్తారు. రెండేళ్లలో రైతులకు చెప్పుకోదగ్గ ఒక్క మేలు చేయలేదని మండిపడ్డారు. రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు.ఈరోజు(శనివారం, మే 9 వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన కైలే అనిల్ కుమార్.. ‘ మోంథా తుపానుకు నష్టపోయిన రైతులకు ఇంతవరకూ నష్టపరిహారం ఇవ్వలేదు. రైతులు కష్టాల్లో ఉంటే వ్యవసాయశాఖ మంత్రి సింగపూర్లో విహరిస్తున్నారు. రైతులను మోసం చేసిన ఈ ప్రభుత్వంపై ఎన్ని కేసులు పెట్టాలి?, ఒక్క పంటకూ గిట్టుబాటు ధరలు లేవు. ఇన్పుట్ సబ్సిడీలు లేవు. పంటల బీమా లేదు. చంద్రబాబు ఏడుసార్లు ఇప్పటివరకు కలెక్టర్ల కాన్ఫరెన్స్లు పెట్టి ఏం సాధించారు?, ఒక్క సమావేశంలోనైనా రైతుల గురించి చర్చించారా?, జగన్ తెచ్చిన వ్యవస్థల పేర్లు మార్పు కోసమే సమావేశాలు పెడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే కౌలు రైతులను కూడా ఆదుకోవాలి. రైతుల సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించకుంటే ఉద్యమిస్తాం.’ అని హెచ్చరించారు. -
గొంతులో కత్తి దిగబడితే 3 రోజులకు తీస్తామన్నారు
కర్నూలు(హాస్పిటల్): వ్యాపారంలో వచ్చిన విభేదాల కారణంగా ప్రత్యర్థులు అతని గొంతులో కత్తి(సర్జికల్ బ్లేడ్)తో బలంగా పొడిచారు. పెనుగులాటలో సర్జికల్ బ్లేడ్ కాస్తా విరిగి అతని గొంతులో సగం ఇరుక్కుపోయింది. రక్తం కారుతున్న అతన్ని కుటుంబసభ్యులు మోసుకుని పెద్దాసుపత్రికి వెళితే వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. బ్లేడ్ తీసేందుకు మూడు రోజులు పడుతుందన్నారు. ప్రాణభీతితో అతన్ని కుటుంబసభ్యులు డబ్బులు ఖర్చు చేసి ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించి బతికించుకున్నారు. ఈ విషాద ఘటన మూడు రోజుల క్రితం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన ఉప్పరి అశోక్(29) వ్యాపారం రీత్యా కర్నూలు నగరంలో నివాసం ఉంటున్నాడు.అతను వివాహ వేడుకలకు ఉపయోగించే రథాలను తయారు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ వ్యాపారంలో ప్రత్యర్థులతో అతనికి విభేదాలు రావడంతో ఈ నెల 5న మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంటి వద్ద అతనిపై దాడి చేశారు. వెంట తెచ్చుకున్న సర్జికల్ బ్లేడ్తో గొంతు కోసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో అతని గొంతులోకి సర్జికల్ బ్లేడ్ దిగబడింది. పెనుగులాటలో ఆ బ్లేడ్ సగం విరిగిపోయి గొంతులోనే ఇరుక్కుపోయింది. వెంటనే కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. రాత్రి పది గంటలైనా సరైన వైద్యం అందించకపోగా ఆపరేషన్ చేయడానికి, ఇరుక్కుపోయిన బ్లేడ్ తీయడానికి మూడు రోజుల సమయం పడుతుందని కుటుంబ సభ్యులకు క్యాజువాలిటీలోని వైద్యులు తెలిపారు. దీంతో ఎలాగైనా అశోక్ ప్రాణాలు దక్కించుకోవాలన్న ఉద్దేశంతో అదే రోజు రాత్రి 10 గంటలకు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి వెంటనే ఆపరేషన్ చేసి బ్లేడ్ తీయడమే కాకుండా దెబ్బతిన్న శరీర భాగాలను సరిచేయడంతో అతని ప్రాణాలు దక్కాయి. ప్రాణాలు పోస్తారని పెద్దాసుపత్రికి వెళితే కనీసం పట్టించుకోలేదని, ప్రాణం పోయే పరిస్థితి ఉన్నా ఆపరేషన్ చేయడానికి మూడు రోజులు పడుతుందని చెప్పడం పట్ల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
విజయ్కు సీఎం చాన్స్ ఇవ్వాల్సిందే: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: ఏమాత్రం మంచి చేయని కూటమి నేతలు ప్రజల వద్దకు వెళ్లేందుకు ఇప్పుడు భయపడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. శనివారం తాతయ్య గుంట గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భగా తాజా తమిళ రాజకీయ సంక్షోభంపైనా ఆమె స్పందించారు. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. కాబట్టి విజయ్కు సీఎంగా ప్రమాణం చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ అవకాశం ఇవ్వాలి. తద్వారా తమిళ ప్రజల నిర్ణయాన్ని ఆయన ఆమోదించాలి అని రోజా అన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డికి, విజయ్కు దగ్గర పోలికలు ఉన్నాయని అన్నారామె. ‘‘జగనన్నకు, విజయ్కు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఇద్దరూ సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు. అలాగే హామీల అమలు విషయంలోనూ ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తున్నారు’’ అని అన్నారామె. జగనన్న పాలనలో తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించారని.. సీఎం హోదాలో తొలిసారిగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని గుర్తు చేశారు. ఈవీఎంల మోసంతో కూటమి ప్రభుత్వం ధికారంలోకి వచ్చిందని.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ల బండారం బయటపడుతుందని ఆర్కే రోజా అన్నారు. -
అల్లుడు గారు.. ఈ పెళ్లి మా అమ్మాయికి ఇష్టం లేదు..!
తిరుపతి జిల్లా: పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడిని నమ్మించి...అవసరాల నిమిత్తం అతని రూ.11లక్షల 38వేలు తీసుకుని, తీరా పెళ్లి కోసం నిలదీస్తే ఇష్టం లేదని మోసం చేసిన ఓ కుటుంబంపై బాధితుడు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదైంది. బాపట్ల జిల్లా గూడపల్లి గ్రామానికి చెందిన సుజేంద్ర(35) ఏర్పేడు మండలం చింతలపాళెం డీఆర్డీవో ప్రాంగణంలో ఎస్ఎస్సీ ప్రాజెక్టు కింద డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్. సుజేంద్ర పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నిస్తుండగా, తొట్టంబేడు మండలం తాటిపర్తికి చెందిన కమలాకర్, తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని నమ్మించి అతడి నుంచి పలుమార్లు రూ.11,38,756 నగదును ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా తీసుకున్నారు. అలాగే, రూ.2లక్షలు విలువైన రెండు ఐఫోన్లు కూడా తీసుకున్నారు. మార్చి 6న యువతితో సుజేంద్రకు నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 22న పెళ్లి జరిగే విధంగా లగ్న పత్రిక రాసుకున్నారు. అప్పటినుంచి పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు. గట్టిగా నిలదీయడంతో యువతికి పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో తాను ఇచ్చిన నగదు, రెండు ఐఫోన్లు తిరిగి ఇచ్చేయాలని బాధితుడు డిమాండ్ చేశారు. నగదు తిరిగి ఇవ్వలేమని వారు ప్లేటు ఫిరాయించారు. తనను ఉద్దేశపూర్వకంగా పెళ్లి పేరుతో నమ్మించి అధిక మొత్తంలో నగదు తీసుకుని పక్కా ప్లాన్తో మోసగించారని బాధితుడు ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో యువతి, ఆమె తల్లిదండ్రులు, సోదరునిపై ఏర్పేడు ఎస్ఐ రవికుమార్ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
జనసేన Vs టీడీపీ.. ఫ్లెక్సీలో ఫొటోపై రచ్చ..
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో టీడీపీ, జనసేనలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. విశాఖ సౌత్ నియోజకవర్గంలో తాజాగా టీడీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆధిపత్యం కోసం ఇరు వర్గాల నేతలు మాటల దాడి చేస్తున్నారు. దీంతో, ఈ వ్యవహారంలో చర్చనీయాంశంగా మారింది.విశాఖ సౌత్ నియోజకవర్గంలో కనకమహాలక్ష్మి ఆలయ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, ఫ్లెక్సీలో టీడీపీ ఇన్చార్జ్ సీతంరాజు సుధాకర్ ఫొటోలు కనిపించలేదు. జనసేన నేతలు టీడీపీ నాయకుడి ఫొటోలను పెట్టలేదు. దీంతో, రాజకీయ దుమారం రేగింది. జనసేన నేతల వైఖరిపై సుధాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అయితే, విశాఖ సౌత్లో గత కొంతకాలంగా జనసేన ఎమ్మెల్యే వంశీ, సీతంరాజు సుధాకర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో జనసేన నేతల తీరుపై టీడీపీ అధిష్టానానికి సుధాకర్ ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా టీడీపీ నేతలు.. జనసేన కేడర్పై మండిపడుతున్నారు. జనసేన నాయకులు పొత్తు ధర్మం పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. . -
చంద్రబాబు దుర్మార్గ పాలనకు బలం మీడియానే: పొన్నవోలు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో దుర్మార్గమైన పరిస్థితి రాజ్యమేలుతోందని వైఎస్సార్సీపీ లీగల్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి, మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి అన్నారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై శనివారం గుంటూరు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొన్నవోలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. పోలీస్ రాజ్ మాత్రమే నడుస్తోంది. కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది. అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారు. సామాన్యులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి చంద్రబాబు నియంత పాలన చేస్తున్నారు. చంద్రబాబు బలం మీడియానే. మీడియాను అడ్డుపెట్టుకుని అరాచక పాలన కొనసాగిస్తున్నారు అని పొన్నవోలు మండిపడ్డారు. -
సినిమా సూపిత్త మామా..
కాకినాడ జిల్లా: పిఠాపురం ఎమ్మెల్యే పవన్కల్యాణ్ నటుడు. మేకప్.. పేకప్ ఆయనకు బాగా పరిచయమైన పదాలు. అందుకేనేమో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో అధికార యంత్రాంగం కూడా పైపై మేకప్పులకే పరిమితమై పట్టణ సుందరీకరణకు పేకప్ చెప్పడానికి సిద్ధమైంది! స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర పేరుతో పిఠాపురం పట్టణ సుందరీకరణ పనులు ప్రారంభించారు. గోడలపై చిత్రాలు వేయడం, ప్రభుత్వ భవనాలకు రంగులు వేసి సుందరంగా అలంకరించడం వంటి పనులను మున్సిపల్ అధికారులు చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా కాలం చెల్లిన భవనాలకు సైతం మాం...చి మేకప్ వేసి జనాలకు సినిమా చూపించాలనుకుంటున్నారు. మున్సిపల్ పార్కులో ఉన్న మస్తరు కార్యాలయం పూర్తిగా శిథిలమై తుప్పలు, డొంకలతో ప్రమాద స్థితిలో ఉంది. రేపో మాపో కూలి పోయే ఆ భవనానికి మరమ్మతులు చేయకుండా పగిలిపోయిన గోడలకే రంగులు వేసి బొమ్మ చూపిస్తున్నారు. ఇది చూసిన జనం ‘ఇదేనా సుందరీకరణ అంటే’ అని ముక్కున వేలేసుకుంటున్నారు! -
సర్పవరం పోలీసు స్టేషన్ ఎస్ఐ పోస్టుకు రూ.30 లక్షలు?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సర్పవరం పోలీసు స్టేషన్లో ఇన్స్పెక్టర్ పోస్టుకు మాం...చి డిమాండ్ ఉంది! పాడి ఆవు లాంటి ఈ పోస్టును వేలం పాడి మరీ దక్కించుకోవాలని పలువురు ఉవ్విళ్లూరుతున్నారు. ఇది ఇటీవలే ఖాళీ అయ్యింది. ఇక్కడి ఇన్స్పెక్టర్ బొక్కా పెద్దిరాజును కారణాంతరాలతో వేకెన్సీ రిజర్వు(వీఆర్)కు పంపించారు. పెద్దిరాజు సర్పవరం ఇన్స్పెక్టర్గా సుమారు 16 నెలలు పనిచేశారు. వాస్తవానికి రెండేళ్ల వరకు ఇదే స్టేషన్లో ఉంటాననే నమ్మకంతో పెద్దిరాజు ఇక్కడ జాయిన్ అయ్యారు. కానీ పరిస్థితులు మారి ఆయనను వీఆర్లో పెట్టారు. ఖాళీగా ఉన్న ఆ పోస్టుకు మహిళా పోలీసు స్టేషన్లో పనిచేస్తోన్న ఇనస్పెక్టర్ రవికుమార్ ఇన్చార్జిగా వచ్చారు. సర్పవరంలో బాధ్యతలు తీసుకున్నప్పటికీ మూడు రోజులు కూడా గడవకుండానే ఆయనను వీఆర్కు పంపించేశారు. ప్రస్తుతం కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ శాంతిభద్రతల బాధ్యతను తాత్కాలికంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్పవరం సీఐ పోస్టు హాట్ సీట్గా మారిందనే చర్చ పోలీసు సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. అందరి కళ్లూ దానిపైనే.. కాకినాడ రూరల్ మండలం పరిధిలో కాకినాడ రూరల్, సర్పవరం రెండు పోలీసు సర్కిల్స్ ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో అత్యధిక డిమాండ్ ఉన్న ఈ రెండు సర్కిళ్లలో సర్పవరం సర్కిల్ ఖాళీగా ఉండటంతో అందరి కళ్లూ దానిపైనే పడ్డాయి. ఇక్కడి పోస్టింగ్ కోసం కాకినాడ రూరల్లోని అధికార భాగస్వామ్య పార్టీ ముఖ్యనేత కనుసన్నల్లో అనుచర వర్గం బేరసారాలకు తెరలేపారని చెప్పుకుంటున్నారు. ఏడాదిన్నర క్రితం ఈ సర్కిల్లో పోస్టింగ్ కోసం సొమ్ముతో త్రీ స్టార్స్ క్యూ కట్టారని జిల్లా అంతటా విస్తృతమైన చర్చ నడిచింది. నాడు నలుగురైదుగురు పోటీ పడగా అధికార పార్టీ నేతకు అత్యధికంగా రూ.30 లక్షలు ముట్టచెప్పాకనే ఖాయం చేశారని వినికిడి. ఇప్పుడూ డిమాండే అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఇక్కడి పోస్టింగ్ కోసం ముఖ్య నేత, వారి అనుచరులను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ జిల్లాల త్రీస్టార్స్.. తెలిసిన నాయకుల ద్వారా నానా తంటాలు పడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నలుగురు ఇనస్పెక్టర్లు ఈ పోస్టింగ్ కోసం పోటీపడుతున్నారు. ఇందులో ఒక సీఐకు పిఠాపురానికి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ముఖ్యనేతకు సిఫారసు చేశారని విశ్వసనీయ సమాచారం. మరొక త్రీ స్టార్ ముఖ్యనేత బంధువుల ఆశీస్సులతో గడచిన వారం రోజులుగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గిట్టుబాటు ఖాయం! కాకినాడ రూరల్ మండలంలో ఉన్న రెండు ఇన్స్పెక్టర్ పోస్టులకు ఒకే తరహా డిమాండ్ ఉండటం విశేషం. ఈ రెండు కొలువు తెచ్చుకోవాలే కాని పెట్టిన పెట్టుబడికి తగ్గట్టు ఆదాయానికి లోటు ఉండదంటుంటారు. ఇందులో రూరల్ సర్కిల్ పరిధిలో అత్యధికంగా ఆరు (ఇంద్రపాలెం, తిమ్మాపురం, పెదపూడి, కోరంగి, గొల్లపాలెం, కరప) పోలీసు స్టేషన్లు ఉండటం కూడా ఇంతటి డిమాండ్కు కారణంగా పేర్కొంటున్నారు. సర్పవరం ఇన్స్పెక్టర్ పరిధిలో వాకలపూడి, రమణయ్యపేట, సర్పవరం, ఆటోనగర్ వంటి ఇండస్ట్రియల్ ఏరియాలలో పెద్ద పెద్ద కర్మాగారాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు కోకొల్లలు. అందుకే ఇక్కడి ఇనస్పెక్టర్æ పరిధిలో రాబడి దండిగా వస్తుందనే దూరదృష్టితో రూ.లక్షలు ముట్టచెప్పడానికి వెనుకాడటం లేదంటున్నారు. ఎవరు ఎంత ఎక్కువ ఇస్తారో, సిఫారసు లేఖ ఎవరికి దక్కుతుందో అనే చర్చ పోలీసుల్లో సాగుతోంది. -
పెళ్లి భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..!
అనంతపురం జిల్లా: తల్లిదండ్రులు పెళ్లి ప్రయత్నం చేస్తుండడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన రాజేశ్వరి, రామాంజనేయుల దంపతుల కుమార్తె రూపకీర్తన(17) అనంతపురంలోని వివేకానంద జూనియర్ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల రాసిన పరీక్షల్లో ఆమె ఉత్తీర్ణత సాధించింది. వేసవి సెలవులు కావడంతో ఇంటి పట్టునే ఉంటోంది. ఈ నేపథ్యంలో మంచి సంబంధం వస్తే పెళ్లి చేసేద్దామని తల్లిదండ్రులు మాట్లాడుకుంటుండగా విన్న ఆమె అందుకు అభ్యంతరం తెలిపింది. తాను చదువుకుంటానని, ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలిపింది. దీంతో తల్లిదండ్రులు సర్ది చెప్పి ఇప్పట్లో పెళ్లి చేయబోమని, మంచి సంబంధాలు ఏమైనా ఉన్నాయోనని మాట్లాడుకుంటున్నట్లు తెలిపారు.అయినా తనకు పెళ్లి చేస్తారేమోననే భయంతో బాలిక ఈ నెల 6న ఇంట్లోనే గడ్డి నివారణకు ఉపయోగించే మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అనంతపురంలోని ఓప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం బాలిక మృతి చెందింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు గార్లదిన్నె పోలీసులు తెలిపారు. -
53 ఏళ్ల రాధ వివాహేతర సంబంధం.. షాకింగ్ నిజాలు!
రాప్తాడు రూరల్: ఓ హత్య కేసు దర్యాప్తులో అంతకు ముందు చేసిన హత్య బయటపడడంతో పోలీసులు అవాక్కయ్యారు. వివరాలను రాప్తాడు సీఐ వెంకటేశులు శుక్రవారం వెల్లడించారు. అనంతపురం రూరల్ మండలం సిండికేట్నగర్లో నివాసం ఉంటున్న రాధ (53), చెరుకూరి ఆదినారాయణ కొంతకాలంగా సహజీవనం సాగిస్తున్నారు. రాధ కుమారుడు సందీప్కుమార్ చౌదరి తన భార్యతో కలిసి బెంగళూరులో నివాసముంటున్నాడు. అలాగే కుమార్తె కూడా భర్తతో కలసి హైదరాబాద్లో ఉంటున్నారు. ఇటీవల రాధ, ఆదినారాయణ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో గత నెల 16న ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఆదినారాయణ టవల్ తీసుకుని రాధ మెడకు బిగించి హతమార్చాడు. అనంతరం ఆమె మొబైల్ తీసుకుని ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. మరుసటి రోజు బెంగళూరులో ఉన్న రాధ కోడలికి, హైదరాబాద్లో ఉంటున్న కుమార్తెకు ఫోన్ చేసి రాధ మృతి చెందినట్లుగా తెలపడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఆ సమయంలో కుమారుడు సందీప్కుమార్ చౌదరి ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆదినారాయణ కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం సిండికేట్ నగర్లో తచ్చాడుతుండగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అసలు కథ వెలుగులోకి ఆదినారాయణను విచారణ చేయడంతో సంచనాలు వెలుగు చూశాయి. వివాహేతర సంబంధం రాధ భర్త రవిచంద్రనాయుడు పసిగట్టి ఇద్దరినీ మందలించడంతో ఆదినారాయణ, రాధ ఇద్దరూ కలిసి 2025 మే 20న రాత్రి రవిచంద్రనాయుడిని హతమార్చారు. నిద్రలో ఉన్న సమయంలో ముఖంపై దిండు అదిమి ఊపిరాడకుండా చేసి చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. హత్య అనంతరం అనారోగ్యంతో మృతి చెందినట్లుగా పిల్లలను నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసేశారు. అప్పటి నుంచి రవిచంద్రనాయుడు హత్య ఉదంతం వెలుగు చూడలేదు. తాజా దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆదినారాయణపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. రూరల్ తహసీల్దార్, వైద్యులు, అసిస్టెంట్ సైంటిఫిక్ టీం సమక్షంలో శుక్రవారం రవిచంద్రనాయుడు మృతదేహాన్ని వెలికితీయించి పంచనామా నిర్వహించారు. ఫోరెన్సిక్ పరీక్షల కోసం అస్థికలను సేకరించి ల్యాబ్కు పంపారు. -
ఆమె దిగే వరకూ బస్సు ముందుకు పోదు!
అనంతపురం జిల్లా: కిక్కిరిసిన బస్సులో ఎక్కిన ప్రయాణికురాలు కిందకు దిగే వరకూ ముందుకు పోనంటూ ఆర్టీసీ డ్రైవర్, కండెక్టర్ భీష్మచుకోవడంతో దాదాపు అరగంట పాటు ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరిలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) ప్రవేశ పరీక్ష రాసేందుకు వెళుతున్న అభ్యర్థులూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే... తాడిపత్రి నుంచి అనంతపురానికి శుక్రవారం ఉదయం కిక్కిరిసిన ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు బయలుదేరింది. రెడ్డిపల్లి వద్దకు చేరుకోగానే ఒకరిద్దరు కిందకు దిగడంతో అక్కడ మరో ప్రయాణికురాలు ఎక్కింది. ఆ సమయంలో బస్సు డోరు వేయడం ఇబ్బందిగా మారడంతో ఆమెను కిందకు దిగి మరో బస్సులో రావాలని కండెక్టర్, డ్రైవర్ సూచించారు. దీంతో ఆమె వాగ్వాదానికి దిగింది. బస్సు డోరు కూడా సక్రమంగా పడడం లేదని ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే తన కుటుంబం అన్యాయమవుతుందని డ్రైవర్ ఆందోళన వ్యక్తం చేస్తూ బస్సును ముందుకు పోనిచ్చేది లేదంటూ భీషి్మంచాడు. ప్రయాణికులు సర్దిచెప్పబోతే వారితో కూడా ఆమె వాగ్వాదానికి దిగింది. దీంతో ఎంసీఏ పరీక్షలకు వెళుతున్న అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. అనంతపురం నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు సైతం తమకు ఉదయం 8.30 గంటలకు రైలు ఉందని, మరో 15 నిమిషాల్లో రైల్వే స్టేషన్కు చేరుకోకపోతే రైలు వెళ్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంసీఏ అభ్యర్థులు కల్పించుకుని తమ భవిష్యత్తు ఈ పరీక్షతో ముడిపడిఉందని, సహకరించాలని అభ్యరి్థంచడంతో ఆమె శాపనార్థాలు పెడుతూ బస్సు దిగింది. అనంతరం నిర్ణీత సమయానికి కంటే ఆలస్యంగా అనంతపురానికి బస్సు చేరుకోవడంతో బెంగళూరు ప్రయాణికులు గత్యంతరం లేక మరో బస్సు ఎక్కాల్సి వచ్చింది. -
నువ్వు నా దగ్గరకు రా... నేను చూసుకుంటాను..
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘‘నిజాంపట్నం టీడీపీ జెడ్పీటీసీ నర్రా వెంకటసుబ్బయ్య తరచూ ఫోన్లు చేసి నా దగ్గరకు రా.. నేను ఉన్నాను.. చూసుకుంటాను.. అసలు నువ్వు నా మాట ఏదీ వినడం లేదు ఎందుకు? నీ కళ్లకు నేను కనపడడం లేదా? నువ్వు వస్తావా రావా ? అంటూ వేధిస్తున్నాడు. అతని ఫోన్ తీయడం లేదని వేరే వాళ్ల ఫోన్లతో కాల్స్ చేస్తున్నాడు. అతని వద్ద ఉండే గంగరాజు ఫోను నుంచి చేస్తున్నాడు. లేకపోతే గంగరాజుతో ఫోన్ చేయించి అమ్మాయి వస్తుందో లేదో కనుక్కో? అమ్మాయికి ఎంతకావాలో నా దగ్గరకు రావాలంటే అంటూ మాట్లాడుతున్నాడు.. ఈ వేధింపులు తట్టుకోలేకే పురుగుమందు తాగాను’’ అంటూ నిజాంపట్నంకు చెందిన ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని మీడియా ముందు కన్నీటి పర్యంతమైంది. నిజాంపట్నంలోని ఓ మండల అధికారి కారణంగా తన భర్త దూరమయ్యాడని, ఆ అధికారి తనను నమ్మించి చర్చిలో పెళ్లి చేసుకుని.. ఇప్పుడు జెడ్పీటీసీ నర్రా వెంకటసుబ్బయ్యతో కలిసి తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నంలో గురువారం అర్ధరాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.చెరుకుపల్లి ప్రైవేటు వైద్యశాలలో వైద్యం చేసి అనంతరం మెరుగైన చికిత్స కోసం తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సొంత నియోజకవర్గంలో ఆయన అనుచరులే వేధింపులకు పాల్పడడాన్ని బాధితురాలి బంధువులు తప్పు పడుతున్నారు. నర్రా వెంకటసుబ్బయ్యపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
జీవో పక్కనపెట్టు.. అనుమతికి డబ్బులు కట్టు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. నాలుగు దశాబ్దాల ఉన్నత విద్యామండలి సేవలను నిర్లజ్జగా పాతరేసిన చంద్రబాబు సర్కార్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఉన్నతవిద్య కమిషనరేట్ వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న ప్రైవేటు అన్ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు అనుమతి పొడిగింపు (ఈవోపీ)నకు కోసం దరఖాస్తు చేసుకోవాలని జీవో 36కు విరుద్ధంగా నోటిఫికేషన్లు జారీచేయడం విద్యా వేత్తలను కలవరపెడుతోంది. పైగా అద్దె భవనాల్లోని కళాశాలలను మరోచోటుకు మార్చడానికి, యాజమాన్య బదిలీకి కూడా అనుమతులు ఇస్తుండటం విద్యారంగంలో అనిశి్చతిని పెంచనుంది. జీవోలో లేని ఈవోపీకి రూ.30 వేలా? ప్రస్తుతం అద్దె/లీజు భవనాల్లో నడుస్తున్న ప్రైవేటు అన్ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు ఈవోపీ కోసం రూ.30 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దరఖాస్తు ఆలస్యం అయితే ఏకంగా రూ.10 వేల జరిమానా విధిస్తోంది. రాష్ట్రంలో 600కు పైగా డిగ్రీ కాలేజీలు అద్దె భవనాల్లో లీజు ప్రాతిపదికనే నడుస్తున్నాయి. ఉన్నత విద్యాశాఖ జీవో 36 (15–7–2021) ప్రకారం అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రైవేటు కళాశాలలు తాత్కాలికంగా ఐదేళ్లు అనుమతి పొందవచ్చు. ప్రత్యేక సందర్భాల్లో దీన్ని పదేళ్ల వరకు పొడిగించుకోవచ్చు. పదేళ్లు దాటితే సొంత భవనంలోనే కళాశాల నిర్వహించాలి.లేకపోతే ప్రభుత్వం ఈవోపీ ఇవ్వకుండా కళాశాలను మూసేస్తుంది. అయితే గత ప్రభుత్వం ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం లీజు గడువును 30 ఏళ్లకు ప్రతిపాదించింది. ఎన్నికలు రావడంతో జీవో సవరణ ఆలస్యమైంది. చంద్రబాబు ప్రభుత్వం రాగానే జీవో నంబర్ 36ను సవరిస్తూ 2024 జూలై 10న జీవో 20 జారీచేసింది. అందులో జీవో 36లోని ఈవోపీ నిబంధనల్లో ఐదేళ్ల తర్వాత అనుమతి పునరుద్ధరణ, గరిష్టం పదేళ్లు మాత్రమే అద్దె భవనాల్లో కళాశాలల నిర్వహణ అంశాలను తొలగించింది. విద్యాసొసైటీలు 30 ఏళ్ల వరకు లీజు భవనంలో ఉంటే దాన్ని సొంత భవనంగానే పరిగణించాలని సవరణ చేసింది.అంటే జీవో 36లో సవరణ తర్వాత కేవలం లీజు ప్రాతిపదికన ప్రైవేటు కళాశాలలు 30 ఏళ్ల వరకు ఈవోపీ అవసరం లేకుండానే నిర్వహించుకోవచ్చని స్పష్టంగా ఉంది. ఒకవేళ కళాశాలలకు దీర్ఘకాలిక లీజు పత్రం ఇచ్చేందుకు వాస్తవ యజమానులు అంగీకరించకపోతే ఐదారుసార్లు లీజు గడువు పొడిగించుకునే వెసులుబాటు ఉంటుంది. అంతేగానీ జీవో 36ను కేవలం సొసైటీలకు పరిమితం చేసి మిగిలిన వాటిల్లో పదేళ్లులోపు లీజు భవనాల్లో కొనసాగుతున్న కళాశాలలు రూ.30 వేలు చెల్లించి ఈవోపీ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వసూళ్ల కోసం నిబంధనలకు పాతర చంద్రబాబు పాలనలో ఉన్నత విద్యాశాఖ అనుమతుల పేరుతో ప్రైవేటు విద్యాసంస్థల నుంచి వసూళ్ల పర్వం సాగిస్తోంది. కాసులే పరమావధిగా విచ్చలవిడిగా అనుమతులు మంజూరు చేస్తోంది. తాజాగా లీజు భవనాల్లో నడుస్తున్న ప్రైవేటు అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలకు పదేళ్లు దాటని వాటికి రూ.20 వేలు ఫీజు కడితే యాజమాన్య బదిలీకి అనుమతి ఇచ్చేస్తోంది. అంటే ప్రభుత్వమే జీవో 36కు విరుద్ధంగా పదేళ్లలోపు అద్దె భవనాల్లో నడుస్తున్న కళాశాలలు ఈవోపీ తీసుకోవాలని చెబుతూనే.. పదేళ్లలోపు వాటికి యాజమాన్య హక్కుల బదిలీకి అవకాశం ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది.ఉదాహరణకు ఒక కాలేజీ తొమ్మిదేళ్లుగా లీజు భవనంలో ఒకరి ఆధ్వర్యంలో కొనసాగుతున్నప్పుడు చివరి ఏడాది యాజమాన్యం మారితే.. మరో పదేళ్ల వరకు అద్దె భవనంలోనే కొనసాగేలా వెసులుబాటును కల్పిస్తున్నట్లేనని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. ఇక్కడ జీవో 36 సవరణను గాలికొదిలేసిన ప్రభుత్వం.. పదేళ్ల లీజు అంశంపై తమ అనుకూల కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందిపడకూడదని వారికి మేలు చేసేందుకు యాజమాన్య బదిలీని తెరపైకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే లీజులో కొనసాగుతున్న కళాశాలలను అదే మండల పరిధిలోని వేరే ప్రాంతానికి తరలించడానికి సైతం రూ.30 వేలు చెల్లిస్తే రూట్ క్లియర్ చేస్తోంది. అంటే ఒక మండలంలోని కళాశాలలన్నీ ఒకేచోటుకు చేరితే విద్యాసంస్థల మధ్య ఆరోగ్యకర పోటీ సన్నగిల్లుతుందని మేధావి వర్గం ఆందోళన చెందుతోంది. ఏటా రూ.కోట్ల దందా చంద్రబాబు సర్కార్ ఫీజు బకాయిలతో ఉన్నత విద్యారంగం ఆర్థికంగా దెబ్బతింది. ఒకవైపు ప్రైవేటు కళాశాలలను అప్పుల ఊబిలోకి నెడుతూనే మరోవైపు అనుమతుల పేరుతో ఏటా రూ.కోట్లు దండుకునే ప్రణాళిక వేసింది. ఫీజులు పెంచాలని ప్రైవేటు యాజమాన్యాలు ఎంత మొత్తుకున్నా పట్టించుకోని ప్రభుత్వం.. అనుమతులు పొందేందుకు షెడ్యూల్స్ ఇచ్చి మరీ హుకుం జారీచేస్తోంది. ఆలస్యమైతే ఏకంగా రూ.10 వేల జరిమానా వసూలు చేస్తోంది.ఈవోపీకే మే 15 వరకు గడువు తీసుకుంటే అఫ్లియేషన్లు, ప్రవేశాలు ఎప్పుడు నిర్వహిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు ఉన్నతవిద్యలో ప్రవేశాలకు సంబంధించి సాంకేతిక సేవలకు ఏజెన్సీనే ఎంపిక చేయలేదంటే.. ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరి స్పష్టమవుతోంది. కాగా, లీజు భవనాల్లో నిర్వహిస్తున్న కళాశాలలను యాజమాన్యాల కోరిక మేరు వేరొక ప్రాంతానికి తరలించడం హైకోర్టు తీర్పునకు విరుద్ధమని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. -
ఏపీలో దిక్కుమాలిన మంత్రులు, ఎమ్మెల్యేలు
సాక్షి, అమరావతి: టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఎన్బీ సుధాకర్రెడ్డి విరుచుకుపడ్డారు. దిక్కుమాలిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతిపరులైతే తాము ఏం చేయాలని అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఎల్లో మీడియాకు చెందిన ఒక టీవీ చానల్ చర్చలోనే ఆయన సొంత పార్టీ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొందరు ఎమ్మెల్యేల అవినీతి పెరిగిపోయిందని చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు ఇసుక అమ్ముదామా? ఎర్రమట్టి అమ్ముదామా? గ్రానైట్ అమ్ముదామా? అని ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. ఎర్రచందనం అమ్మడం కుదరక ఊరుకున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి ఎమ్మెల్యేలు, మంత్రుల్ని తయారు చేశారని మండిపడ్డారు.కొంతమంది మంత్రులు సరదాగా తిరుగుతున్నారని, కొందరు మంత్రులు వారికి సంబంధించిన అంశాలనూ పరిష్కరించలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. దున్నపోతు మీద వానపడినట్టు ఉంటున్నా రని విమర్శించారు. ఎన్నికల్లో కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టామని, మళ్లీ అదే పని చేసి గెలుస్తామని చెబుతున్నారని ధ్వజమెత్తారు. కానీ వాళ్లు తమిళనాడు ఎన్నికల్లో ఏం జరిగిందో చూడాలని సూచించారు. టీవీకే జీరో బడ్జెట్ పాలిటిక్స్తో గెలిచిందన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఎమ్మెల్యేలు, మంత్రులు ఓడిపోవడం ఒక్కటే కాదని, పార్టీ కూడా పోతుందని చెప్పారు. అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిని అధిష్టానం కట్టడి చేయాలన్నారు. కొందరు ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు, అమ్మాయిలతో సంబంధాలు బయటకు వచ్చాయని విమర్శించారు. చంద్రబాబుకు ముందే చెప్పా ఎన్నికల్లో మళ్లీ గెలవాలంటే ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలని చంద్రబాబుకు ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పానని సుధాకర్రెడ్డి తెలిపారు. ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఓడిపోయాయని, చంద్రబాబూ గతంలో మూడుసార్లు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. ప్రజల అంచనాలు ఎక్కువగా ఉంటాయని, సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేసినా అవినీతి ఎమ్మెల్యేల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. జిల్లాల్లో ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందని, తమ కడుపు చించుకుంటే కాళ్లపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ సుధాకర్రెడ్డి ఫైర్ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తిరుపతికి వచ్చి విలాసాలు, జల్సాలు చేస్తున్నారని సుధాకర్రెడ్డి గతంలోనే బాంబు పేల్చారు. ఆ మంత్రి వ్యవహారాలు బయటపెట్టడంతో అప్పట్లో టీడీపీ అధిష్టానం ఆయనపై కన్నెర్ర చేసింది. పార్టీ క్రమశిక్షణ సంఘం నోటీసులు ఇచ్చి వివరణ కోరగా ఆయన సమాధానం ఇచ్చారు. తాజాగా మళ్లీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతిపై అధికార పార్టీ అనుకూల మీడియా చానల్లో జరిగిన చర్చలోనే సుధాకర్రెడ్డి మండిపడడం గమనార్హం. -
స్పెషల్ డీఎస్సీపై సర్కారు మౌనం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆటిజం, బుద్ధిమాంద్యం వంటి ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల కోసం స్పెషల్ టీచర్లను నియమించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఏడాది గడిచినా కార్యరూపం దాల్చలేదు. అత్యున్నత న్యాయస్థా నం ఇచ్చిన నిర్దేశాలకు అనుగుణంగా ప్రభుత్వం కొత్త పోస్టులు సృష్టించాల్సింది పోయి, ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖలోని రెగ్యులర్ టీచర్ పోస్టు ల్లో 2,260 పోస్టులను సర్ప్లస్(మిగులు)గా చూపి వాటిని స్పెషల్ టీచర్ పోస్టులుగా (1,136 స్పెష ల్ ఎస్జీటీలు, 1,124 స్పెషల్ స్కూల్ అసిస్టెంట్) మార్పు చేసింది. ఈ మేరకు గతేడాది ఏప్రిల్లో ప్రభుత్వం జీఓనెం.13ను విడుదల చేసింది. అనంతరం ఆర్థిక ఆమోదం తెలపడంతోపాటు గత మేలో ఈ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. మెగా డీఎస్సీ–2025 నోటిఫికేషన్ ప్రక టన సమయంలో సహా పలు సందర్భాల్లో ప్రభు త్వం స్పెషల్ టీచర్ పోస్టుల (డీఎస్సీ) భర్తీకి చర్య లు చేపడుతున్నట్టు ప్రకటించి అభ్యర్థుల్లో ఆశలు పెంచింది. వాస్తవంలో మాత్రం ఏడాది కాలంగా నోటిఫికేషన్ జారీ చేయకపోవడంతో స్పెషల్ బీఈడీ, డీఎడ్ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోందన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. 5 వేల వరకూ ఖాళీలు.. స్పెషల్ టీచర్ల నియామకానికి సంబంధించి విద్యాశాఖ 13 ఉమ్మడి జిల్లాల్లోనూ గుర్తించిన ఖాళీలు ఒక్క పాఠశాల విద్యాశాఖలోని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ స్కూళ్లకు సంబంధించినవి మాత్రమే కావడం మరో విశేషం. మిగిలిన ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, మహాత్మ జ్యోతిబాపూలే, జువైనల్, మోడల్ స్కూల్స్ తదితర శాఖలు ఇప్పటికీ ఆయా స్కూళ్లల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ప్రకటించలేదు. పైగా ఈ ఖాళీలపై ఇప్పటి వరకు ప్రభుత్వం వద్ద స్పష్టత కూడా లేదు. అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని ఖాళీలు కలిపి మొత్తం 5 వేల వరకు ఉంటాయని అంచనా. దివ్యాంగ విద్యార్థుల వికాసమే లక్ష్యంగా... ⇒ ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 10 మంది విద్యార్థులకు ఒకరు, ఉన్నత పాఠశాలల్లో ప్రతి 15 మందికి ఒక స్పెషల్ టీచర్ ఉండాలని ఆర్టీఈ–2009 చట్టంలో 2022 సవరణ చెబుతోంది. ⇒ దివ్యాంగ విద్యార్థులకు సమాన విద్యావకాశాలు కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ⇒ స్పెషల్ టీచర్లను నియమించాలని ప్రభుత్వాలకు గతేడాది మార్చిలో విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది. విద్యకు దూరమవుతున్న స్పెషల్ విద్యార్థులు రాష్ట్రంలో సమగ్ర శిక్ష కింద 679 భవిత కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల్లో 9 వేల మంది ఆటిజం, బుద్ధిమాంద్యం పిల్లలు చదువుకుంటున్నారు. ఇక భవిత కేంద్రాల పరిధిలో దాదాపు 80 వేల మంది స్పెషల్ విద్యార్థులున్నారు. వీరిలో 1–5 తరగతుల వయసు వారు 17 వేల మంది భవిత కేంద్రాల్లో ఉన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యాబుద్ధులు నేరి్పంచేందుకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ (ఐఈఆర్టీ) 1,286 మంది కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారు. వీరంతా స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినవారే. మిగిలిన 63 వేల మంది విద్యార్థులు స్థానిక ప్రాథమిక, యూపీ, ఉన్నత పాఠశాలల్లో చేరినా స్పెషల్ టీచర్లు లేక విద్యకు దూరమవుతున్నారు. ప్రస్తుతమున్న 6 స్పెషల్ స్కూళ్లల్లోనూ ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ‘భవిత’ స్పెషల్ టీచర్ల ఆందోళన భవిత సెంటర్లలో 10 ఏళ్లుగా పనిచేస్తున్న వారి సర్వీసును రెగ్యులర్ చేయాలని లేదా రెగ్యులర్ టీచర్లతో సమానంగా వేతనాలు చెల్లించాలని గతేడాది సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ప్రభుత్వం హడావుడిగా వీరి అర్హతలను నిర్ధారించేందుకు కమిటీని నియమించింది. కానీ ఇంత వరకు దీనిపై ఎటూ తేల్చలేదు. సుప్రీం తీర్పు నేపథ్యంలో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న వారంతా తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం మభ్యపెట్టే ధోరణి అవలంభించడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. -
స్థానిక సంస్థల సొమ్ముతో సర్కారు షో
సాక్షి, అమరావతి: గ్రామీణ స్థానిక సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,026 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకుంటోంది. నిధులు వచ్చి మూడున్నర నెలలైనా స్థానిక సంస్థలకు ఇవ్వకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తోంది. కేంద్రం నిధులు విడుదల చేసిన తర్వాత గరిష్టంగా పది పనిరోజుల్లో ఆయా గ్రామీణ స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయాలన్న నిబంధనను పట్టించుకోవడం లేదు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం జనవరి 29న రూ.410 కోట్లు, ఫిబ్రవరిలో మరో రూ.616 కోట్లు విడుదల చేసింది.ఈ నిధులను 70 శాతం గ్రామ పంచాయతీలకు, 20 శాతం మండల పరిషత్లకు, పది శాతం జిల్లా పరిషత్లకు ఇవ్వాల్సి ఉంది. 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి కూడా మార్చి నెలాఖరుతో ముగిసింది. ఏప్రిల్ 2వ తేదీతో గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీకాలం పూర్తవడంతో ప్రత్యేకాధికారుల పాలన మొదలైంది. అయినప్పటికీ ఆ నిధులు నేటికీ స్థానిక సంస్థలకు ఇవ్వలేదు. రెండేళ్లుగా ఇదే తీరు.. ⇒ చంద్రబాబు ప్రభుత్వం ఇంతకు ముందు వచ్చిన ఆర్థిక సంఘం నిధులను కూడా నెలల తరబడి స్థానిక సంస్థలకు జమ చేయలేదు. 2025–26 సంవత్సరానికి సంబంధించి మొదటి విడత రూ.1,026 కోట్లను గత అక్టోబర్లో కేంద్రం విడుదల చేసింది. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం మూడున్నర నెలల అనంతరం ఈ ఏడాది జనవరి 18న స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసింది. ⇒ 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నిధులు రూ.988.76 కోట్లను కేంద్రం 2024 సెపె్టంబర్లో విడుదల చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండు నెలల తర్వాత నవంబర్లో ఆ నిధులను స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసింది. ⇒ 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడత నిధులు రూ.1,121 కోట్లను 2024 డిసెంబర్లో కేంద్రం విడుదల చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది నెలల తర్వాత 2025 సెపె్టంబర్లో స్థానిక సంస్థలకు ఇచ్చింది. ⇒ 2023–24 ఆర్థిక సంవత్సరానికి రెండో విడత నిధులు రూ.998 కోట్లను కేంద్రం 2024 మార్చి నెలాఖరులో విడుదల చేసింది. అప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ నిధులను స్థానిక సంస్థలకు జమ చేయలేదు. ఎన్నికల అనంతరం చంద్రబాబు ప్రభుత్వం 2024 జూన్ 12వ తేదీనే బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆ సంవత్సరం ఆగస్టు వరకు ఆ నిధులను స్థానిక సంస్థలకు విడుదల చేయలేదు. -
ఏపీ సెంట్రల్ జైళ్లలో కిక్కిరిసిన ఖైదీలు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా–2024’ నివేదిక ఆంధ్రప్రదేశ్ జైళ్ల పరిస్థితిపై పలు ఆందోళనకర అంశాలను వెల్లడించింది. రాష్ట్ర జైళ్ల సగటు ఆక్యుపెన్సీ రేటు సామర్థ్యానికి లోపే ఉన్నప్పటికీ.. కీలకమైన సెంట్రల్ జైళ్లు మాత్రం ఖైదీలతో కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు తీవ్ర సిబ్బంది కొరత వేధిస్తోంది. మంజూరైన పోస్టుల్లో 30 శాతం ఖాళీగానే ఉండటం, ఖైదీల ప్రవర్తనలో మార్పులు తెచ్చే ‘కరెక్షనల్’ సిబ్బంది రాష్ట్రంలో ఒక్కరు కూడా లేకపోవడం, యువ నేరస్థులను మంచి మార్గంలోపెట్టే ’బోస్టల్ స్కూల్స్’ లేమి ఏపీ జైళ్ల శాఖలోని డొల్లతనానికి అద్దం పడుతున్నాయి. ఎన్సీఆర్బీ గణాంకాల్లో ‘ఏపీ’ ముఖ్యాంశాలు...⇒ ఏపీ జైళ్ల శాఖలో 2,637 పోస్టులు మంజూరు కాగా.. 1,840 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఏకంగా 797 పోస్టులు (దాదాపు 30 శాతం) ఖాళీగా ఉన్నాయి. ⇒ జైలు శిక్ష అనుభవిస్తున్న వారిలో పరివర్తన తీసుకువచ్చే కరెక్షనల్ సిబ్బంది (ప్రొబేషన్ లేదా వెల్ఫేర్ ఆఫీసర్లు, సైకాలజిస్టులు తదితరులు) ఏపీ జైళ్లలో ఒక్కరు కూడా లేకపోవడం తీవ్ర ప్రతికూల అంశం. ⇒ యువ నేరస్థులను సన్మార్గంలో పెట్టే ‘బోస్టల్ స్కూల్స్’, ‘స్పెషల్ జైళ్లు’ రాష్ట్రంలో ఒక్కటి కూడా లేవు. ⇒ రాష్ట్రంలో 260 మంది ఖైదీలు (156 మంది శిక్ష పడినవారు, 103 మంది విచారణ ఖైదీలు, ఒక డిటెన్యూ) మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ⇒ జైళ్లలో ఉన్న మొత్తం 7,861 మందిలో అత్యధికులు విచారణ ఖైదీలే (అండర్ట్రయల్స్) కావడం మరో ఆందోళనకర అంశం. ⇒ ఏకంగా 5,705 మంది (72.5 శాతం) కోర్టు తీర్పుల కోసం ఎదురుచూస్తున్నారు. ⇒ విచారణ నిమిత్తం 2024లో ఖైదీలను 81,205 సార్లు కోర్టులకు తరలించారు. వైద్య సహాయం కోసం 10,191 సార్లు ఆస్పత్రులకు తీసుకెళ్లారు.⇒ జైళ్ల బడ్జెట్ వినియోగానికి సంబంధించి రాష్ట్రాల జాబితాలో (లక్షదీ్వప్ మినహాయించి) ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. -
చేనేతలకు కరెంట్ షాక్
సాక్షి, అమరావతి: వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు... చేనేతలకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెబుతున్న దానికీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితికి పొంతన కుదరడం లేదు. ఆయన చెప్పిన దానికి... చేసే దానికి సంబంధం ఉండదనేది ఇప్పటికే అనేక అంశాల్లో రుజువు కావడమే ఇందుకు కారణం. కనీసం ఇప్పుడైనా ఇచ్చిన మాటను సక్రమంగా అమలు చేస్తారేమోనని అనుకుంటే ఎప్పటిలాగే వెన్నుపోటు ప్లాన్ వేసుకున్నాకే పథకం అమలు ప్రకటన చేశారనే సందేహం కలుగుతోంది. ఆదిలోనే హంసపాదు అన్నట్లు పథకం అమలులో కుట్ర దాగుందని... అర్హులను తగ్గించే ప్రక్రియ మొదలైందనే అనుమానాలు కలుగుతున్నాయి. మగ్గాల నిర్వహణ, అల్లిక, డైయింగ్ వంటి పనుల కోసం ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు వెన్నుదన్నుగా నిలుస్తుందనుకున్న నేతన్నలకు చివరికి వెన్నుపోటే మిగులుతోంది. గొప్పలు సరే.. చిత్తశుద్ధి ఏదీచేనేతలకు ‘పవర్’ గిఫ్ట్ అంటూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు వరకూ విద్యుత్ ఉచితంగా ఇస్తామంటూ ప్రభుత్వం ఏప్రిల్ 1న ప్రకటించింది. తద్వారా 1,04,488 చేనేత కుటుంబాల కోసం ఏడాదికి రూ.150 కోట్లు ఖర్చు చేస్తామని గొప్పలు చెప్పుకుంది. ఒక్కో చేనేత కార్మీకుని కుటుంబానికి ఏటా రూ.8,640, పవర్ లూమ్ యూనిట్లకు ఏడాదికి రూ.21,600 వరకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందంటూ లెక్కలు వేసింది.ఉచిత విద్యుత్ పథకం అమలుతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 93,000 మగ్గాలున్న కుటుంబాలు, 11,488 పవర్ లూమ్ కుటుంబాలు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతామని సంబరపడ్డాయి. చంద్రబాబు చెప్పిందంతా నిజమని కాసేపు భ్రమించారు. కానీ ఇంతలోనే ఇదంతా కేవలం ప్రచార ఆర్భాటమేనని తేలిపోయింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని చెప్పుకోవడానికి మినహా నిజంగా చేనేతలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి చంద్రబాబు ప్రభుత్వానికి లేదని తేలిపోయింది. ఆలస్యం చేసి... అనర్హులుగా మార్చాలనే కుట్ర..! విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రతి నెలా 1, 2 తేదీల్లోనే విద్యుత్ మీటర్ల నుంచి రీడింగ్ నమోదు చేసి, వినియోగం ఆధారంగా బిల్లులు ఇస్తుంటాయి. కానీ ఈ నెలలో మాత్రం అలా జరగలేదు. ముఖ్యంగా అనేక చోట్ల చేనేత సర్వీసులకు రీడింగ్ తీయనేలేదు. ఈ నెలలో అప్పుడే 8వ తేదీ కూడా దాటిపోయింది. ఏ రోజుకారోజు విద్యుత్ వినియోగం యూనిట్లు పెరిగిపోతుంటాయి. మీటర్ రీడింగ్ తీయడంలో వారానికిపైగా ఆలస్యం కావడం వల్ల స్లాబులు కూడా మారిపోతాయి. ప్రధానంగా 200 యూనిట్ల లోపు వారికే పథకం వర్తిస్తుందంటున్నారు.కానీ రీడింగ్ ఆలస్యం కావడం వల్ల ఇప్పుడు ఆ పరిమితి ఉండదు. అంటే 200 యూనిట్లకు పైగా రీడింగ్ నమోదవుతుంది. ఆ సర్వీసులు ఆటోమేటిక్గా ఉచిత విద్యుత్ పథకానికి అనర్హత జాబితాలోకి చేరిపోతాయి. దీంతో ఈ నెల కూడా చేనేతలు విద్యుత్ బిల్లులు పూర్తిగా చెల్లించాల్సి వస్తుంది. ఓ వైపు ఉచిత విద్యుత్ ఇస్తామంటూనే ఇలా రీడింగ్ ఆలస్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆలస్యంగా రీడింగ్ తీసి, బిల్లు కట్టాలని చెబితే చేనేత విద్యుత్ వినియోగదారులు తమపై దాడి చేస్తారేమోననే ఆందోళన మీటర్ స్పాట్ బిల్లింగ్ రీడర్ల నుంచి వ్యక్తమవుతోంది. -
మరో సీజన్ ముగిసినా అందని మోంథా పరిహారం
సాక్షి, అమరావతి: ఆరు నెలల కిందట మోంథా తుపాను అన్నదాత ఆశలను చిదిమేసింది. ఆరుగాలం కష్టపడి, కంటికి రెప్పలా కాపాడుకున్న పంట చేతికొచ్చే సమయంలో పగబట్టినట్టు విరుచుకుపడిన తుపాన్ దెబ్బకు తుడిచిపెట్టుకుపోయింది. ప్రకృతి విపత్తుతో కుదేలైన రైతులను ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆరునెలలు గడిచినా పైసా పరిహారం అందకపోవడంతో బాధిత రైతులు విలవిల్లాడిపోతున్నారు. గతేడాది అక్టోబర్లో విరుచుకుపడిన మోంథా తుపాను దెబ్బకు అన్నదాతలు కకావికలమయ్యారు. తుపాను తరువాత ఎటుచూసినా బురదమయమైన పొలాలు, నేలకొరిగిన పైరే కనిపించాయి.వరితో మొదలు జొన్న వరకు అన్ని పంటలు దెబ్బతిన్నాయి. రైతుల ఆశలు నేలరాలిపోగా అప్పుల కుప్పలు మిగిలాయి. తుపాను చేసిన గాయం కంటే చంద్రబాబు సర్కార్ చేసిన మోసానికి అన్నదాతలు గుండెలవిసేలా విలపిస్తున్నారు. మోంథా తర్వాత దిత్వా తుపాను కూడా దెబ్బతీసింది. కానీ మోంథా తుపాను సాయం మాత్రం రైతుల చేతికందలేదు. మోంథా తుపాను 24 జిల్లాల్లో 15 లక్షల ఎకరాలకుపైగా పంటలపై ప్రభావం చూపిందని తొలుత ప్రభుత్వమే ప్రకటించింది. 4.40 లక్షల ఎకరాల్లో ప్రాథమిక నష్టం జరిగిందని ప్రకటించిన అధికార యంత్రాంగం.. తరువాత ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి 3.45 లక్షల ఎకరాల్లోనే నష్టమని చెప్పింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతులను ఓదార్చారు. ఇలాంటి విపత్కర సమయాల్లో రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం పంటనష్టం అంచనాలను ఎలా తగ్గించి చూపిస్తుందంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. తొలుత పంటనష్టం రూ.869 కోట్లని చెప్పి... రైతుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో చివరకు 4.27 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టుగా లెక్కతేల్చారు. తొలుత ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.869 కోట్ల వరకు ఇన్పుట్ సబ్సిడీ (పెట్టుబడి రాయితీ) చెల్లించాల్సి ఉంటుందంటూ కేంద్రానికి నివేదించిన చంద్రబాబు ప్రభుత్వం తుది నివేదికలో ఇన్పుట్ సబ్సిడీని సగానికి పైగా కోసేసింది. చివరికి వచ్చేసరికి 3.23 లక్షల మంది రైతులకు రూ.390.03 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే సరిపోతుందని తేల్చింది. పంట నష్టపరిహారం క్షణాల్లో చేతుల్లో పెట్టేస్తామన్నట్టుగా తుపాను వేళ నానా హంగామా చేసిన ప్రభుత్వం.. పంటనష్టం తుది అంచనాలకు 24 గంటల గడువునిచ్చి పారదర్శకతకు పాతరేసింది. అధికారులు కనీసం క్షేత్రస్థాయి పరిశీలన జరపకుండా టీడీపీ నేతల సిఫార్సులు, కనుసన్నల్లోనే గాలిలెక్కలతో తుది జాబితాలను రూపొందించారు. ఆర్బీకేల్లో ఆ జాబితాల ప్రదర్శన, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారాన్ని మొక్కుబడి తంతుగా మార్చేశారు.అడ్డగోలు కోతలఅనంతరం తయారుచేసిన తుది అంచనాల మేరకు ఇన్పుట్ సబ్సిడీని అన్నదాత సుఖీభవ రెండోవిడత సాయంతో కలిపి జమచేస్తామని ప్రకటించారు. పంట నష్టపరిహారం చేతికొస్తే కనీసం రబీలో పెట్టుబడికి కాస్త అక్కరకొస్తుందని రైతులంతా ఆశపడ్డారు. కానీ వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. చివరికి అప్పులతోనే సాగుచేసిన రబీ సీజన్ కూడా దాదాపు చివరిదశకు చేరుకుంది. పీఎం కిసాన్తో కలిపి గతనెలలో మూడోవిడత పెట్టుబడి సాయంతో మమా అనిపించారు. అయినా మోంథా పరిహారం ఊసెత్తలేదు. గత 23 నెలల్లో దాదాపు 16 విపత్తులు విరుచుకుపడ్డాయి. కరువు సాయం బకాయిలు కలిపి రూ.1,100 కోట్లకు పైగా రైతులకు జమ చేయాల్సి ఉంది. రెండు వ్యవసాయ సీజన్లు ముగిసినా పరిహారం ఎప్పుడు చెల్లిస్తామన్నది కూడా చెప్పలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. నాడు సీజన్ ముగిసేలోగానే పరిహారం విపత్తుల వేళ దెబ్బతిన్న రైతులకు వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచేది. వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వైఎస్ జగన్ ప్రత్యేకంగా రూ.2 వేలకోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు చేశారు. విపత్తులు సంభవించినప్పుడు ఆర్బీకే సిబ్బంది ద్వారా ఈ–క్రాప్ ప్రామాణికంగా అర్హులను గుర్తించేవారు. అర్హుల జాబితాలను సోషల్ ఆడిట్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శించేవారు. ఈ జాబితాల్లో తమ పేర్లు లేవని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే పునఃపరిశీలించి వారి పేర్లను జాబితాలో చేర్చేవారు.వారి మొబైల్ ఫోన్లకు నేరుగా మెసేజ్లు కూడా పంపేవారు. పైగా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏ సీజన్లో పంటనష్టం జరిగితే పరిహారాన్ని అదే సీజన్ ముగిసేలోగా అణా పైసలతో సహా లెక్కగట్టి మరీ నేరుగా రైతుల ఖాతాలో జమచేశారు. ఇలా ఐదేళ్లలో 34.41 లక్షలమంది రైతులకు రూ.3,261.60 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. పైసా భారం పడకుండా అమలుచేసిన ఉచిత పంటల బీమా ద్వారా ఐదేళ్లలో 54.48 లక్షలమంది రైతులకు రూ.7,802.05 కోట్ల పరిహారాన్ని అందజేసి అండగా నిలిచారు. ఈయన పేరు వి.వెంకటేశ్వరరెడ్డి. గుంటూరు జిల్లా తెనాలి మండలం ఐతానగరానికి చెందిన ఈయనకు సెంటు భూమి కూడా లేదు. వ్యవసాయంపై మక్కువతో 40 ఎకరాలు కౌలుకు తీసుకుని ఖరీఫ్లో వరి, రబీలో జొన్న పంట సాగు చేశారు. గతేడాది అక్టోబర్లో విరుచుకుపడిన మోంథా తుపాను దెబ్బకు మూడొంతుల వరిపంట పోయింది. ఎకరాకు రూ.15 వేల వరకు నష్టపోయారు. అధికారులు వచ్చి చూసి వెళ్లారు. ఆరునెలలు గడిచినా పైసా పరిహారం రాలేదు. రైతుల పరిస్థితి దారుణంగా ఉందంటూ వెంకటేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగం... రాజకీయ ఆయుధంలా పోలీసులను వాడుకుంటున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం మొత్తాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటుండడంతో వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. అసమ్మతిని అణచి వేయడానికి, ప్రశ్నించే గొంతులను నొక్కడానికి పోలీసులను రాజకీయ ఏజెంట్లుగా వాడుకుంటూ ప్రజల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను చంద్రబాబు హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హలో ఇండియా..!’ ఏపీలో పోలీసు వ్యవస్థను చంద్రబాబు వాడుకుంటున్న తీరును చూడాలంటూ శుక్రవారం ఆయన తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగంప్రజాస్వామ్య వ్యవస్థలోని మూల స్తంభాల్లో ఒకటైన వాక్ స్వాతంత్య్రాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్–19లో పొందుపరిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం వాటిల్లే పరిస్థితి వచ్చింది. ఇంకా చెప్పాలంటే.. రాజ్యాంగ స్ఫూర్తి ప్రమాదంలో పడుతోంది. ఆ స్థాయిలో విమర్శకులను భయపెట్టడానికి, ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టే వారిని బెదిరించడానికి మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ఒక రాజకీయ ఆయుధంలా వాడుతున్నారు.టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, మోసం, అవినీతి, దగా, ప్రజా వ్యతిరేక పాలనను నిలదీస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్సార్సీపీ మద్దతుదారులు, పాత్రికేయులతో పాటు సాధారణ పౌరులపైనా రాజకీయ కక్ష సాధింపులు, నిరంకుశ వైఖరి, బెదిరింపులు కొనసాగుతున్నాయి. తీవ్ర అధికార దుర్వినియోగంతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. Hello India !!!!!AP CM N. Chandrababu Naidu has been using the police department as his political agents to curb dissent, suppress opposition voices, and systematically curtail Freedom of Speech in Andhra Pradesh.Article 19 of the Indian Constitution guarantees Freedom of… pic.twitter.com/bZKo2kFCW3— YS Jagan Mohan Reddy (@ysjagan) May 8, 2026టీడీపీ కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగంప్రభుత్వ బరితెగింపు ఇప్పుడు మరింత ఎక్కువై పరిధి దాటుతోంది. వారి ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలను నిలదీస్తూ అందుకు బాధ్యులైన అధికార పార్టీ నాయకులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, అలాంటి వాటిని ఫార్వర్డ్ చేసినా ఏమాత్రం సహించలేకపోతున్నారు. వెంటనే వారి పార్టీ నాయకులు, మద్దతుదారులతో ఫిర్యాదు చేయిస్తున్నారు. ఆ ఫిర్యాదులు రావడమే ఆలస్యం అన్నట్లుగా పోలీసులు శరవేగంగా స్పందిస్తున్నారు. కోర్టులు అనేక సందర్భాల్లో తప్పుబట్టినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తి ఏకపక్షంగా కక్ష సాధింపుతో చట్ట విరుద్ధంగా పలు సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతూ తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ బాధ్యత మర్చిపోయిఅధికార టీడీపీ తమ సామాజిక మాధ్యమ వేదికల ద్వారా రోజూ వైఎస్సార్సీపీ నేతలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలపై విషం చిమ్ముతూ, విష ప్రచారం చేస్తూ దూషణలతో కూడిన దారుణ పోస్టులు పెడుతోంది. నిత్యం వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తోంది. వాటిపై విపక్ష వైఎస్సార్సీపీ ఎన్ని ఫిర్యాదులు చేసినా, పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సాక్ష్యాధారాలు చూపినా కనీసం కేసు నమోదు చేయడం లేదు. ఎఫ్ఐఆర్ల ఊసే లేదు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ బాధ్యత మర్చిపోయి ద్వంద్వ ప్రమాణాలతో హేయంగా వ్యవహరిస్తోంది. ఇది కచ్చితంగా ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగించడమే కాకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తిపైనే దాడిగా భావించాల్సి వస్తోంది.స్వేచ్ఛ స్థానంలో భయం.. జవాబుదారీతనం స్థానంలో బెదిరింపులు.. పోలీసు యంత్రాంగం, వ్యవస్థ రాజకీయ ఆయుధంగా మారడం.. ఒక విమర్శను నేరంగా పరిగణించే పరిస్థితి ఉన్న రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికిపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ కష్టం. హేయమైన చర్యలు, అణచివేత ధోరణి, రాజకీయ కక్ష సాధింపులు.. వెరసి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికార దుర్వినియోగానికి పాల్పడటం.. పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఆ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పేలా వ్యవహరించడం.. ప్రతిపక్షం గొంతు నొక్కడమే లక్ష్యంగా పని చేయడం.. సోషల్ మీడియాపై నియంత్రణ.. అసమ్మతిని అణచి వేయడం లాంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తున్నాం.సోషల్ మీడియాపై సెన్సార్షిప్టీడీపీ కూటమి ప్రభుత్వ అధికార దుర్వినియోగం అంతటితో ఆగిపోవడం లేదు. వారి పార్టీ నాయకులను ప్రశ్నిస్తూ, వారి తప్పులను ఎండగడుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన అంశాలను (కంటెంట్) తొలగించాలని, వారి ఖాతాలను బ్లాక్ చేయడం లేదా సస్పెండ్ చేయాలని ఆదేశిస్తున్నారు. ఆ మేరకు పోలీసు శాఖ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు నోటీసులు పంపిస్తోంది.ఆ విధంగా వ్యవస్థీకృతంగా సోషల్ మీడియాపై సెన్సార్షిప్ విధిస్తూ.. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ప్రజల్లో చర్చ జరగకుండా చూడడం.. ఎక్కడా అసమ్మతి గళం వినిపించకుండా ప్రయత్నించడం.. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే దిశలో టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని ఏ స్థాయిలో వాడుకుంటుందో చెప్పడానికి ఇవన్నీ నిదర్శనం. బాధ్యత, జవాబుదారీతనం లేకపోవడం, విమర్శలను సహించలేకపోవడం, పారదర్శకత లోపించడం వల్ల ఏర్పడిన అభద్రతా భావంతో పెల్లుబుకుతున్న అసహనం.. దానివల్ల కక్షపూరిత, నిరంకుశ విధానాలను ప్రభుత్వ చర్యలు తేటతెల్లం చేస్తున్నాయి. -
పోలీసుల అరాచకాలకు ఆ హోటల్ అడ్డా!
సాక్షి, అమరావతి: విజయవాడ పటమట పోలీసులు.. పోలీస్స్టేషన్ సమీపంలోని ప్రైవేట్ హోటల్ ‘కార్తికేయ ప్రైడ్’ను అడ్డాగా చేసుకుని దందాలు చేస్తున్నారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ 70 ఏళ్ల వృద్ధుడు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. అనధికారికంగా హోటల్ను పోలీస్ స్టేషన్గా ఉపయోగిస్తూ వ్యక్తులను ఆ హోటల్కి తీసుకెళ్లి నిర్బంధించడం, కొట్టడం, బెదిరించి ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు తీసుకోవడం.. సివిల్, ఆస్తి వివాదాల బలవంతపు రాజీలు చేస్తుండటం, చట్ట విరుద్ధంగా కాల్ డీటెయిల్ రికార్డులు సేకరించడం.. అనుమతి లేకుండా డిజిటల్ సర్వైలెన్స్ చేస్తుండటం వంటి పిటిషన్లోని ఆరోపణలు తీవ్రమైనవని హైకోర్టు స్పష్టం చేసింది. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు పోలీస్స్టేషన్, ఆ హోటల్ సీసీటీవీ ఫుటేజీల మొత్తాన్ని భద్రపరచాలని పటమట పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ అధికారుల ప్రమేయం పల్నాడు జిల్లా, అందుకూరు గ్రామానికి చెందిన కర్నాటి వీరభద్రరావు హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీజే జస్టిస్ లీసా గిల్ ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నేకంటి మల్లికార్జునరావు వాదనలు వినిపిస్తూ కార్తికేయ ప్రైడ్ హోటల్లో పోలీసుల సెటిల్మెంట్లన్నీ కూడా విజయవాడ అదనపు డిప్యూటీ కమిషనర్ ఎన్బీఎం మురళీకృష్ణ, పటమట సీఐ పవన్ల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు. పిటిషనర్ వీరభద్రరావును సైతం పోలీసులు ఇదే రీతిలో కార్తికేయ ప్రైడ్ హోటల్లో నిర్బంధించి, కొట్టి, తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని తెలిపారు.వాస్తవాలు తెలియాలంటే పటమట పోలీస్స్టేషన్తో పాటు హోటల్ సీసీటీవీ ఫుటేజీని భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) తిరుమాను విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ, ఈ పిల్కు విచారణార్హత లేదన్నారు. ఇవే అభ్యర్థనలతో పిటిషనర్ ఇప్పటికే ఓ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు.పటమట పోలీసులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ పోలీసు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చారని, వాటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పిటిషనర్ ఆరోపణలపై పూర్తి వివరాలు తెప్పించుకుని కోర్టు ముందుంచుతామని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, పిటిషనర్ మేజి్రస్టేట్ ముందు కూడా ఇవే విషయాలను చెప్పారని గుర్తు చేస్తూ.. వాస్తవాలను నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉందని స్పష్టంచేసింది. -
‘మీరు చేసిన తప్పలకు శిక్ష అనుభవించాల్సిందే’
తిరుపతి: ఏపీలో రెడ్బుక్ పాలన కొనసాగుతూనే ఉందని మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. మంత్రి రాంప్రసాద్రెడ్డి రాజకీయం పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేత దశరథరామిరెడ్డిపై రాంప్రసాద్రెడ్డి వర్గీయులు దాడి చేయడం అత్యంత హేయమన్నారు. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో టీడీపీ గుండాలు దాడిలో గాయపడిన రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ రామి రెడ్డిను పరామర్శించిన మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు.రౌడీయిజం చేస్తారు అనే రామ్ ప్రసాద్ రెడ్డికు మంత్రి పదవి ఇచ్చారు, రాయచోటిలో మంత్రి రాంప్రసాద్రెడ్డి భూ దందాలు, రౌడీ ఇజం, గంజాయి అక్రమాలు పెరిగిపోయాయి. ఖచ్చితంగా మీరు చేసిన శిక్షకు తగిన మూల్యం చెల్లించుకుంటారు. దశరథ రామిరెడ్డి వైఎస్సార్సీపీలో ఉన్నారనీ మీరు దాడి చేశారు, దీనికి శిక్ష అనుభవించక తప్పదు. అన్యాయంగా మనుషుల్ని వేటాడి, కొట్టి, హత్య చేసేందుకు కుట్ర చేశారు. రామ్ప్రసాద్రెడ్డి రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోరు. కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా దాడి చేశారు. ఎస్పీ ఎందుకు చర్యలు తీసుకోలేదు, లా అండ్ ఆర్డర్ పూర్తి గా ఫెయిల్యూర్ అయ్యింది’ అని విమర్శించారు. -
పోలీసుల ఏకపక్ష వైఖరిపై వైఎస్ జగన్ ఆగ్రహం
తాడేపల్లి : పోలీసుల ఏకపక్ష వైఖరి, సోషల్ మీడియా గొంతు నులుమే ప్రయత్నాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారని, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు హలో ఇండియా.. ఏపీలోని పోలీస్ వ్యవస్థ పనితీరును చూడమంటూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్. ‘రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. అసమ్మతిని అణిచి వేయడానికి, ప్రశ్నించే గొంతులు నొక్కడానికి పోలీసులను రాజకీయ ఏజెంట్లుగా వాడుకుంటూ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను క్రమంగా హరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోని మూల స్తంభాల్లో ఒకటి వాక్ స్వాతంత్య్రం. దాన్ని మన రాజ్యాంగంలో ఆర్టికల్–19 లో పొందుపర్చారు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల, ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం వాటిల్లే పరిస్థితి వచ్చింది. ఇంకా చెప్పాలంటే భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రమాదంలో పడుతోంది. ఆ స్థాయిలో విమర్శకులను భయపెట్టడానికి, ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపించే వారిని బెదిరించడానికి మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు.టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, మోసం, అవినీతి, దగా ఇంకా ప్రజా వ్యతిరేక పాలనను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలు, వైయస్సార్సీపీ మద్దతుదారులు, పాత్రికేయులతో పాటు, సాధారణ పౌరులపైనా రాజకీయ కక్ష సాధింపు, నిరంకుశ వైఖరి, బెదిరింపులు కొనసాగుతున్నాయి.Hello India !!!!!AP CM N. Chandrababu Naidu has been using the police department as his political agents to curb dissent, suppress opposition voices, and systematically curtail Freedom of Speech in Andhra Pradesh.Article 19 of the Indian Constitution guarantees Freedom of… pic.twitter.com/bZKo2kFCW3— YS Jagan Mohan Reddy (@ysjagan) May 8, 2026 తీవ్ర అధికార దుర్వినియోగంతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఆ బరితెగింపు ఇప్పుడు మరింత ఎక్కువై పరిధి దాటుతోంది. తమ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలు ఎత్తి చూపుతూ, అందుకు బాధ్యులైన తమ పార్టీ నాయకులపై సోషల్ మీడియలో పోస్టులు పెట్టినా, అలాంటి వాటిని ఫార్వర్డ్ చేసినా ఏ మాత్రం సహించలేకపోతున్నారు. వెంటనే తమ పార్టీ నాయకులు, మద్దతుదారులతో ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేయిస్తున్నారు. ఆ ఫిర్యాదులు రావడమే ఆలస్యం అన్నట్లుగా పోలీసులు శరవేగంగా స్పందిస్తున్నారు. చట్ట విరుద్ధంగా, కోర్టులు అనేక సందర్భాల్లో తప్పు పట్టినా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా, పూర్తి ఏకపక్షంగా, కక్ష సాధింపుతో పలు సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నారు.అలా తప్పుడు కేసులు పెడుతూ, తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ అధికార దుర్వినియోగం అంతటితో ఆగిపోవడం లేదు. తమ పార్టీ నాయకులను ప్రశ్నిస్తూ, వారి తప్పులు ఎత్తిచూపుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన అంశాలను (కంటెంట్) తొలగించాలని, వారి ఖాతాలను బ్లాక్ చేయడం లేదా సస్పెండ్ చేయాలని ఆదేశిస్తున్నారు. ఆ మేరకు పోలీసు శాఖ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు నోటీసులు ఇస్తుంది. ఆ విధంగా ఒక వ్యవస్థీకృతంగా సోషల్ మీడియాపై సెన్సార్షిప్ విధిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ప్రజల్లో చర్చ జరగకుండా చూడడం, ఎక్కడా అసమ్మతి గళం వినిపించకుండా ప్రయత్నించడం, ఆ విధంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే దిశలో టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని ఏ స్థాయిలో వాడుకుంటుందో అని చెప్పడానికి ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.బాధ్యత, జవాబుదారీతనం లేకపోవడం, విమర్శలు సహించకపోవడం, పారదర్శకత లోపించడం వల్ల ఏర్పడిన అభద్రతా భావం వల్ల పెల్లుబికుతున్న అసహనం. దాని వల్ల కక్షపూరిత, నిరంకుశ విధానాలు. ఆ దిశలో ప్రభుత్వ చర్యలు తేటతెల్లం అవుతున్నాయి. అదే అధికార టీడీపీ తమ సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ప్రతిరోజూ వైయస్సార్సీపీ నేతలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలపై విషం చిమ్ముతూ, విష ప్రచారం చేస్తూ దూషణలతో కూడిన దారుణ పోస్టులు పెడుతోంది.ఆ విధంగా నిత్యం వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తోంది.వాటిపై విపక్ష వైఎస్సార్సీపీ ఎన్ని ఫిర్యాదులు చేసినా, పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సాక్ష్యాధారాలు చూపినా కనీసం కేసు నమోదు చేయడం లేదు. ఎఫ్ఐఆర్ల ఊసే లేదు.ఆ విధంగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ బాధ్యత మర్చిపోయి ద్వంద్వ ప్రమాణాలతో హేయంగా వ్యవహరిస్తోంది. ఇది కచ్చితంగా ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగించడమే కాకుండా, ప్రజాస్వామ్య స్ఫూర్తిపైనే దాడిగా భావించాల్సి వస్తోంది.స్వేచ్ఛ స్థానంలో భయం, జవాబుదారీతనం స్థానంలో బెదిరింపులు, పోలీసు యంత్రాంగం, వ్యవస్థ రాజకీయ ఆయుధంగా మారడం, ఒక విమర్శను నేరంగా పరిగణించే పరిస్థితి ఉన్న రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికిపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ కష్టం. అందుకే హేయమైన చర్యలు, అణిచివేత ధోరణి, రాజకీయ కక్ష సాధింపులు.. వెరసి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికార దుర్వినియోగానికి పాల్పడడం, పోలీస్లను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ, ఆ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పేలా వ్యవహరించడం, ప్రతిపక్ష గొంతు నొక్కడమే లక్ష్యంగా పని చేయడం, సోషల్ మీడియాపై నియంత్రణ.. మొత్తంగా అసమ్మతిని అణచి వేయడం వంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలి’ అని డిమాండ్ చేశారు. -
‘విభజన హామీల సాధనలో టీడీపీ విఫలం’
సాక్షి, విశాఖపట్నం: విభజన హామీలు అమలు చేయమని వైఎస్సార్సీపీ అనేక పోరాటాలు చేసిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రత్యేక హోదా రైల్వే జోన్ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని... ఎన్డీఏ టీడీపీ ప్రభుత్వం విభజన హామీలు గాలికి వదిలేశారన్నారు. చంద్రబాబు తన ప్యాకేజీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. వైఎస్ జగన్ ఆదేశాలు మేరకు 2016లో ఆమరణ నిరాహార దీక్ష చేశాను’’ అని ఆయన గుర్తు చేశారు.‘‘నా మీద అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆత్మహత్యా యత్నం కేసు నమోదు చేయించింది. ఆ కేసులో 6 నెలల జైలు శిక్ష, ఐదు వేలు జరిమానా విధించింది. ఆ కేసు కొట్టివేయాలని చేయాలని హయ్యర్ కోర్టులో అప్పీల్ చేశాము.. వాల్తేర్ డివిజన్తో కూడిన విశాఖ రైల్వే స్టేషన్ కావాలి. ఆదాయం వచ్చే కేకే లైన్ ఒడిశాకు అప్పగించారు. రాష్ట్ర నాయకుల చేతగానితనం వలన కేకే లైన్ ఒడిశాకు పోయింది. విశాఖ వచ్చిన రైల్వే శాఖ మంత్రిని కేకే లైన్ గురించి ఎందుకు అడగలేదు.?. రైల్వే జోన్ గురించి ఎంపీ భరత్కు ఏం తెలుసు? విశాఖ రైల్వే జోన్కు ఆదాయం లేకపోయినా పర్వాలేదని ఎలా మాట్లాడతారు?’’ అంటూ అమర్నాథ్ నిలదీశారు. -
కలగర రైతు భరోసా కేంద్రం వద్ద ఉద్రిక్తత
కలగర(ఎన్టీఆర్ జిల్లా): రైతుల కష్టాన్ని ఎంపీ కేశినేని చిన్ని అనుచరులు దోచుకుంటున్నారని ఆరోపిస్తూ రైతులు ఎదురుతిరిగారు. విస్సన్నపేడ మండలం కలగరలో రైతు భరోసా కేంద్రంగా చిన్ని వర్గీయులు దందా నడిపిస్తున్నారని రైతులు ఆందోళన బాట పట్టారు. దళారుల పేరుతో దోచుకుంటున్నారని రైతులు ఎదురుతిరిగారు. అక్కడ రైతులు ఆందోళనకు దిగడంతో కలగర రైతు భరోసా కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో ఎంపీ చిన్నిపై గుర్రుగా ఉన్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అక్కడకు చేరుకున్నారు. ఎంపీ వర్గం దోపిడీపై కొలికపూడి మండిపడ్డారు. ఎంపీ వర్గం వ్యక్తులకు సహకరిస్తున్న ఎమ్మార్వోపై ధ్వజమెత్తారు. దళారులకు ఎమ్మార్వో కొమ్ము కాస్తున్నారంటూ విమర్శించారు. ఉదయం నుంచి రైతుల ఆందోళన చేస్తుంటే మీకు పట్టదా అంటూ ఎమ్మార్వో తీరును తప్పుబట్టారు. ఎమ్మార్వోతో పాటు ఎంపీ వర్గంపై కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు పెద్ద రైతులత కోసం చిన్న రైతుల పొట్టకొడుతున్నారని ఆరోపించారు. ఎమ్మార్వోతో పాటు ఓ నలుగురు రైతులు దోచుకుంటున్నారని, దొంగలను ఎమ్మార్వో కాపాడుతున్నారన్నారు. ఎమ్మార్వోను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు కొలికపూడి. -
ఏపీకి అలర్ట్.. రాగల మూడు గంటల్లో..
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో రాగల మూడు గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో అనకాపల్లి, అల్లూరి, పోలవరం, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ రోజు, రేపు(శుక్ర,శని) వానలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మరో వైపు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుండగా... ఇటు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అధిక వేడి, ఉక్కపోతకు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో బయటికి రావాలంటేనే జంకుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో డీ హైడ్రేషన్ నుంచి కాపాడుకునేందుకు కొబ్బరినీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు డీ హైడ్రేషన్ నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుందన్నారు. వీటితో పాటు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవడం ఉత్తమం. బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీతో పాటు కళ్లజోడు తప్పనిసరిగా పెట్టుకోవాలి. మహిళలు గొడుగులు తప్పనిసరిగా ఉపయోగించాలి. కాటన్ దుస్తులు ధరించడం శ్రేయస్కరమని వైద్యులు తెలిపారు. -
ఏపీలో ఉన్న శ్రీ లలితా దేవి ఆలయం గురించి మీకు తెలుసా? (ఫొటోలు)
-
బాబు గారి కళ్లలో తృప్తి కోసం...
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్లింది? మొదట చేసిన ఆరోపణ ఏమిటి? ఆ తర్వాత వేసిన కుప్పిగంతులు ఎన్ని? సీబీఐ విచారణలో నిందితులుగా గుర్తించని వారిపై సైతం కేసులు పెట్టాలని ఎల్లో మీడియా ఎందుకు గొడవ చేస్తోంది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతకాలం క్రితం తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతుకొవ్వు, బాత్రూమ్ కెమికల్స్ కలిశాయని ఆరోపణలు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఏదో జరిగిపోయినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నానా హడావుడి చేశారు. దుర్గగుడి మెట్లు కడిగారు. తిరుపతిలో సభ పెట్టి సనాతన హిందువునని ప్రకటించుకున్నారు కూడా. ఆ తరువాతేమైంది? తమ చెప్పుచేతల్లో ఉండే అధికారులతో వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబు అండ్ కో నానా ప్రయత్నాలూ చేసింది. అయితే టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అయితే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలో తన ప్రభుత్వ పోలీసు అధికారులు ఇద్దరు ఉండేలా మాత్రం చేసుకోగలిగారు. అయినప్పటికీ జంతుకొవ్వు కలవలేదని సీబీఐ సిట్ నివేదిక స్పష్టం చేసింది. ఫలితంగా కూటమి ప్రభుత్వ పరువు పోయింది. రాజకీయం కోసం నీచమైన ఆరోపణలు చేశారన్న భావన ప్రజలలో ఏర్పడింది. అయితే నెయ్యిలో పామాయిల్ వంటివి కల్తీ అయి ఉండవచ్చని సీబీఐ అభిప్రాయపడి కొందరు డెయిరీ యజమానులపై, టీటీడీ అధికారులపై కేసులు పెట్టింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం శాంతించలేకపోయింది. ఎలాగైనా నెపం వైఎస్సార్సీపీ వారిపై నెట్టాలని మరో కమిషన్ ఏర్పాటు చేసింది. సీబీఐ నివేదికలోని అంశాల ఆధారంగా తదుపరి చర్యలపై నివేదిక కోరింది. మొత్తమ్మీద అందులో ఏదో రకంగా అప్పటి ఈఓ ధర్మారెడ్డి పేరు ప్రస్తావించడం ఎల్లో మీడియాకు సంతోషం కలిగించింది. చంద్రబాబు సంతృప్తి చెందారో లేదో తెలియాల్సి ఉంది. చంద్రబాబుకు ఒక లక్షణం ఉంది. అధికారులు తన మనసులోని మాటను కనిపెట్టి నిర్ణయాలు చేసేవరకు మీటింగుల పేరుతో తిప్పుతుంటారని చెబుతుండేవారు. పూర్వం ఆయా ఆరోపణలపై తాము కోరుకున్న నివేదికలు ఇచ్చే విధంగా కొందరు రిటైర్డ్ న్యాయమూర్తులకు బాధ్యత అప్పగిస్తుంటారన్న ప్రచారం ఉంది. ఇప్పటికీ అదే తరహాలో వ్యవహరిస్తున్నారేమో తెలియదు.అదే మాదిరి తాను ఆశించిన రీతిలో నివేదిక కోసం మరో రిటైర్డ్ ఐఎఎస్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ నియమించారన్న భావన అధికారవర్గాలలో ఉంది. ఆ కమిషన్ పరిశీలన చేసి ఇచ్చిన నివేదికలోని అంశాలు ఎల్లో మీడియాకే లీక్ చేసినట్లుగా ఉంది. వారు టీడీపీకి ఉపయోగపడే అంశాలనే ప్రచారం చేస్తారన్న సంగతి తెలిసిందే. ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో కీలకమైన పలు అంశాలు మిస్ అయినట్లు అనిపిస్తుంది. 2019-2024 వరకు వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీకి సరఫరా అయిన నెయ్యి మీద మాత్రమే ఎందుకు రిపోర్టు ఇచ్చారు? అంతకుముందు 2014-2019 మధ్య టీడీపీ పాలనలో సరఫరా అయిన నెయ్యి గురించి ఎందుకు నివేదికలో ప్రస్తావించలేదు? టీడీపీ పాలనలో నెయ్యి సరఫరా చేసిన సంస్థలే వైఎస్సార్సీపీ హయాంలోనూ నెయ్యి ఇచ్చాయి కదా! తప్పు జరిగితే అప్పుడు కూడా జరిగి ఉండాలి కదా?తక్కువ రేటుకు ఇస్తే కల్తీ జరిగినట్లు అన్న నిర్ధారణకు వస్తే, 2014 టర్మ్లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కూడా జరిగినట్లే అవుతుంది కదా?అప్పుడు కూడా కిలో నెయ్యి ధర రూ.400 లోపే ఉంది కదా! నాణ్యత లేని నెయ్యిని అనుమతించింది, లడ్డూ తయారీలో వాడింది చంద్రబాబు హయాంలోనే అని సీబీఐ నివేదికను ఉటుంకిస్తూ కొద్దికాలం క్రితం మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యకు ఇంతవరకు చంద్రబాబు ఎందుకు జవాబు ఇవ్వలేకపోయారు? మరో విశేషం ఏమిటంటే దినేష్ కుమార్ కమిషన్ చాలా విచిత్రమైన ప్రతిపాదన చేసింది. నెయ్యి సరఫరా కాంట్రాక్టులో తక్కువ ధర ఆధారంగా నిర్ణయం చేసే టెండర్ విధానం వద్దని ఈ కమిషన్ సిఫారస్ చేసిందని ఎల్లో మీడియా రాసింది. ఇలా ఎందుకు చేశారు? అంటే 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం తక్కువ రేట్లకే నెయ్యి కొనుగోలు చేసినా, ఆ తర్వాత తమకు కావల్సిన ఒక సంస్థ ద్వారా అధిక రేటుకు కిలో సుమారు రూ.650లకు కొనుగోలు చేయడాన్ని సమర్థించుకోవడానికి జరిగిన ప్రయత్నం కాదా? పైగా ఇదే పద్దతి అన్ని చోట్ల అమలు చేస్తే, ఎవరు ఎక్కువ రేటు వేస్తే వారికి టెండర్ వస్తుంది కదా! ప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందా?అమరావతి నిర్మాణ పనుల్లో జరుగుతున్న దోపిడీకి రాజముద్ర వేయడానికి ఏమైనా ఈ సిఫారస్ ఉపయోగపడుతుందా అన్న చర్చ కూడా ఉంది. కూటమి ప్రభుత్వ హయాంలో టీటీడీ వారు ఇందాపూర్ డెయిరీకి అధిక ధరకు నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారన్న ఆరోపణపై, దానికి హెరిటేజ్ సంస్థకు మధ్య ఉన్న సంబంధం మొదలైన అంశాలపై కూడా దినేష్ కుమార్ కమిషన్ పరిశీలన చేసి, వాస్తవాలు నిగ్గు తేల్చాలి కదా! మరో చిత్రమేమిటంటే టీటీడీ మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి నెయ్యి నాణ్యతపై పరిశీలన చేయాలని ఆదేశాలు ఇచ్చారు కాని, ఆ తర్వాత పట్టించుకోలేదట. అందువల్ల ఆయనను బాధ్యుడిని చేయాలని ఈనాడు మీడియా అడ్డగోలు రాతలు రాస్తోంది. అదే ధీరి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఇతర ప్రభుత్వ పెద్దలకు వర్తింప చేయాలని ఈ మీడియా చెబుతుందా? అధికారిక హోదాలో చంద్రబాబు పలు ఆదేశాలు ఇస్తుంటారు. వాటి ఆయనే చూడాలని, లేకుంటే బాధ్యత వహించాలని ఈ మీడియా ఒప్పుకుంటుందా? అప్పుడేమో అధికారులది తప్పని వీరు చెబుతారు. టీటీడీ విషయానికి వస్తే ఛైర్మన్ ది తప్పంటారన్నమాట. అర్థంపర్థం లేకుండా ఎల్లో మీడియా వార్తలు ఇస్తున్నదనడానికి ఇదే నిదర్శనం. అవన్ని ఎందుకు స్కిల్ స్కామ్లో వందల కోట్ల స్కామ్ జరిగిందని, సంబంధిత ఫైల్ పై చంద్రబాబే అప్పట్లో సంతకాలు చేశారని, ఆయన ఆదేశాల మేరకే నిధుల విడుదల జరిగిందని, టీడీపీ ఆఫీస్ ఖాతాలోకి కూడా నిధులు వెళ్లాయని గతంలో సీఐడీ ఆరోపణ చేస్తే, ఇదే ఈనాడు మీడియా ఏమి రాసింది? అబ్బే చంద్రబాబుకు దీనిని ఎలా రుద్దుతారని ప్రచారం చేసిందా?లేదా? అమ్మో చంద్రబాబుపై ఆరోపణ చేస్తారా? అని గగ్గోలు పెట్టిందా? లేదా? వైవి సుబ్బారెడ్డిపై మాత్రం అర్జెంట్ గా చర్య తీసుకోవాలని ఈ ఎల్లో మీడియా ఎందుకు ఏడుపు లంకించుకుందో తెలియదా! అలాగే మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలకు కూడా నెయ్యి టెండర్ల నిబంధనల మార్పుతో సంబంధం ఉందని ఈ కమిషన్ అభిప్రాయపడిందట. అయినా వారిపై చర్యకు సిఫారస్ చేయకపోవడం ఏమిటని ఎల్లో మీడియా బాధట. ఎవరు తప్పు చేసినా చర్య తీసుకోవాలని కోరవచ్చు. నెయ్యిలో ఎప్పుడు కల్తీ జరిగినా అరికట్టవలసిందే. కూటమి హయాంలో కల్తీ జరిగితే సమర్ధించడం, అప్పుడు తక్కువ ధరకు నెయ్యి సరఫరా అయినా కల్తీ లేనట్లు, ఆ తర్వాత అయితే ఉన్నట్లు సూత్రికరించడం, అలాగే చంద్రబాబు టైమ్ లో వచ్చిన కంపెనీ అయితే దానిని వదలివేయడం, అదే కంపెనీ జగన్ టైమ్లో కొనసాగితే అందుకు ఏకంగా సి.ఎమ్.నే బాద్యుడిని చేయడం..ఇలా ఉంది దిక్కుమాలిన లాజిక్కుల ప్రచారం.దీనివ్లలే వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేస్తోందన్న అభిప్రాయం కలుగుతుంది.కొందరు అధికారుల మీద చర్య తీసుకోవాలని దినేష్ కుమార్ కమిషన్ సిఫారస్ చేసినా ఎల్లో మీడియా సంతృప్తి చెందినట్లు కనిపించడం లేదు.మరి చంద్రబాబు ఏలా స్పందిస్తారో తెలియదు.ఏది ఏమైనా న్యాయం, ధర్మం అందరికి ఓకే మాదిరి కాకుండా టిడిపి హయాంలో స్కామ్ లు జరిగితే వాటిని సమర్ధించడం, వైరిపక్షం పాలనలో స్కామ్ జరిగినా, జరగకపోయినా, అబాంఢాలు వేసి రాజకీయ లబ్ది కోసం ప్రచారం చేయడం వల్ల ఏపీ ప్రతిష్ట,అందులోను తిరుమల ,తిరుపతి దేవస్థానం పరువును కూటమి నేతలు, ఎల్లోమీడియా దెబ్బతీస్తున్నారని చెప్పక తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కూటమికి షాక్.. బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విశాఖ: అమరావతిలో నిర్మాణాలపై జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో పర్యావరణ విధ్వంసం జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతి, పర్యావరణం విషయంలో కూటమి నేతలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరికలు జారీ చేశారు.జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘అమరావతిలో పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. అమరావతిలో నిర్మాణాలు నిబంధనలకు లోబడి నిర్మించాలి. రాజధాని నిర్మాణంలో 84 శాతం సాగు, పర్యావరణ భూములు ఉన్నాయి. అమరావతి పరిధిలో ఉన్న నదులు, కాలువలు, వాగులను పరిరక్షించాలి. అవినీతి, పర్యావరణంపై రాజీలేని పోరాటం చేస్తాను. ఈ విషయంలో కూటమి నేతలను కూడా వదిలిపెట్టను. రాజకీయ పార్టీలపై నమ్మకం పోయింది. ఈ సమాజాన్ని మీడియా కాపాడాలి’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, అది మనందరి ప్రాథమిక కర్తవ్యం. ప్రభుత్వాలు పారిశ్రామిక వృద్ధి లేదా ఇతర ప్రాజెక్టుల పేరుతో పర్యావరణ నియమాలను విస్మరించినప్పుడు, యువత మరియు పౌర సమాజం ఒక బలమైన నిఘా శక్తిగా (Watchdog) మారడం అత్యవసరం. కేంద్ర సాధికార కమిటీ (CEC) వెల్లడించిన అంశాలు క్షేత్రస్థాయిలో ఉన్న భయంకరమైన వాస్తవాలను ప్రతిబింబిస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు. -
కట్టెయ్యాల్సిందే!
తుని/రాయవరం: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన అనంతరం పెట్రోలు, డీజిల్ ధరలను పెంచే యోచనేదీ లేదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచేసింది. ఇప్పటికే సిలిండర్ల కొరతతో సతమతమవుతున్న హోటల్ రంగంపై ధరల పెంపు తీవ్ర ప్రభావం చూపుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యాపారం మూసేసుకోవాల్సిందేనని హోటళ్ల యజమానులు వాపోతున్నారు. మొన్నటి వరకూ రూ.2,350గా ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం ఒకేసారి రూ.993 మేర పెంచేసింది. దీంతో, 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారిగా రూ.3,343కు పెరిగింది.వాస్తవానికి జనవరి నుంచి కమర్షియల్ గ్యాస్ ధరను కేంద్రం పెంచుతూనే ఉంది. జనవరి 1న రూ.111, ఫిబ్రవరి 1న రూ.50, మార్చి 1న రూ.31, మార్చి 7న రూ.115, ఏప్రిల్ 1న రూ.218 చొప్పున పెంచగా.. ఈ నెల 1న ఏకంగా రూ.993 మేర బాదేసింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,518 పెరగడంతో చిరు వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. యుద్ధ ప్రభావంతో ధరలు పెరుగుతాయనే అంచనాలున్నా.. ఇంత భారీగా పెంచేస్తారని ఊహించలేదని అంటున్నారు. ఇప్పటికే సిలిండర్ల కొరతతో నెట్టుకొస్తున్న తమపై పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర మరింత భారంగా మారిందని ఆవేదన చెందుతున్నారు.మూసివేత దిశగా..పట్టణాలు, నగరాల్లో టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, బడ్డీలు, ధాబాలు, స్వీట్ షాపులు, చాట్ సెంటర్లు, చిన్న చిన్న బిర్యానీ, భోజన హోటళ్లు, బేకరీల్లో వివిధ వంటకాలు, ఆహార పదార్థాల తయారీకి వంట గ్యాస్ తప్పనిసరి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 200 గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లున్నాయి. కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 5 వేలు, కాకినాడ జిల్లాలో 20 వేలు, కోనసీమ జిల్లాలో 1,400 వరకూ ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లో రోజుకు దాదాపు 10 వేల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల వినియోగం ఉండేది.కమర్షియల్ గ్యాస్ ధరను ప్రభుత్వం పెంచేయడంతో ఆయా ఏజెన్సీల్లో వీటి బుకింగ్లు గణనీయంగా పడిపోయాయని నిర్వాహకులు చెబుతున్నారు. తుని నియోజకవర్గంలోని తుని పట్టణం, తుని, తొండంగి, కోటనందూరు మండలాల్లో 7 గ్యాస్ ఏజెన్సీలున్నాయి. వీటిలో డొమెస్టిక్ 1.30 లక్షలు, కమర్షియల్ 931 కనెక్షన్లు ఉన్నాయి. ఇక్కడ కూడా కమర్షియల్ సిలిండర్ల బుకింగ్లది అదే పరిస్థితి.కట్టెలకూ ధరల మంటకొంత మంది చిన్న, మధ్యతరహా హోటళ్ల యజమానులు గ్యాస్కు ప్రత్యామ్నాయంగా కట్టెలు వాడుతున్నారు. దీంతో, వాటి ధరలకు కూడా రెక్కలొచ్చాయి. గతంలో 25 కేజీల వంట చెరకు ధర రూ.170 ఉండగా, గ్యాస్ కొరత ప్రారంభమైన తర్వాత అది రూ.225కు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.ప్రజల పైనే భారంకమర్షియల్ గ్యాస్ ధర పెంపు ప్రభావం నేరుగా హోటళ్లపై పడినప్పటికీ.. పరోక్షంగా ఆ భారాన్ని ప్రజలే భరించాల్సి వస్తోంది. ఇప్పటికే హోటళ్లలో టిఫిన్ల రేట్లు పెంచేశారు. నాలుగు ఇడ్లీల ధర గతంలో రూ.20 ఉంటే ప్రస్తుతం ఆ రేటుకు 3 ఇడ్లీలే ఇస్తున్నారు. ఇంకా, పూరీ, బజ్జీ, దోశ వంటి అన్ని రకాల టిఫిన్ల రేట్లు దాదాపు రెట్టింపయ్యాయి. ఇది కూడా గిట్టుబాటు కావడం లేదని, గ్యాస్ ధర భారం మోయలేక వ్యాపారాలు నిర్వహించలేకపోతున్నామని, ఇలాగైతే కొట్టు కట్టేయాల్సిందేనని వ్యాపారులు వాపోతున్నారు. డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తే పౌర సరఫరాల శాఖ అధికారులు కేసులు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే కొన్ని టిఫిన్ సెంటర్లు, ధాబాలను మూసివేశారు. మరికొన్ని అదే బాటలో పయనిస్తున్నాయి. ఫలితంగా వాటిల్లో పని చేస్తున్న కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. పెద్ద హోటళ్ల యజమానులు సైతం గ్యాస్ ధర పెంపుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టిఫిన్ల ధర పెంపుతో ఆన్లైన్ ఆర్డర్లు కూడా తగ్గుతున్నాయని చెబుతున్నారు.గిట్టుబాటు కావడం లేదు ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం హోటల్ నిర్వహిస్తున్నాను. గ్యాస్ ధర పెరగడంతో ఉదయం టిఫిన్లు ఆపేశాను. టిఫిన్ రేట్లు పెంచితే కస్టమర్లు దూరమవుతున్నారు. పెంచకపోతే నిర్వహణ కష్టమవుతోంది. భోజనం ధరలు పెంచాల్సి వచ్చింది. – అనపర్తి జయకృష్ణ, రెస్టారెంట్ యజమాని, రాయవరంకట్టెల పొయ్యిలే దిక్కు గ్యాస్ ధర పెంపు, కొరత కారణంగా ప్రస్తుతం కట్టెల పొయ్యిల పైనే వంట చేయాల్సి వస్తోంది. స్వల్పంగా ధరలు పెంచి, అతి కష్టం మీద నిర్వహిస్తున్నాం.– వి.రాజేష్, హోటల్ నిర్వాహకుడు, రాయవరందాబా మూసేశాంమార్కెట్లో పోటీ ఎక్కువగా ఉంది. ధాబాలు, హోటళ్లలో టిఫిన్లు, ఆహార పదార్థాల ధరలు పెంచితే కస్టమర్లు రావడం లేదు. వ్యాపారం అంతంత మాత్రంగానే ఉన్న ఈ సమయంలో గ్యాస్ ధర రెట్టింపు పెరగడంతో దాబాను మూసేశాం. నలుగురు కార్మీకులు పని చేసేవారు. వారు ఉపాధి కోల్పోయారు.– నాగేశ్వరరావు, ధాబా యజమాని, తుని -
ఇక్కడ ‘సెట్’ అవడం లేదు బ్రో!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యావిధానంపై విద్యార్థుల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్లక్ష్యపూరిత, అనాలోచిత నిర్ణయాలు విద్యార్థుల భవితవ్యాన్ని గందరగోళంలో పడేస్తున్నాయి. కష్టపడి చదివి ప్రవేశ పరీక్ష(ఎంట్రన్స్ టెస్ట్)ల్లో విజయం సాధించి ఏపీలోని ఏదైనా వర్సిటీ, వర్సిటీ పరిధిలోని కళాశాలలో సీటు సంపాదించినా ప్రశాంతంగా చదువుకోలేమనే భావన విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. ఫలితంగా రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ‘మేమిక్కడ చదవలేం’ అంటూ పొరుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలను ఎంపిక చేసుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ముఖ్యంగా ఏటా వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ‘సెట్స్’కు 2026–27లో దరఖాస్తులు భారీగా క్షీణించడం చూస్తుంటే ఉన్నత విద్యలో తిరోగమనం స్పష్టంగా కనిపిస్తోంది. ఈఏపీ సెట్లోనూ తగ్గుదలే! రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశాలకు నిర్దేశించిన ఈఏపీసెట్లో ఈ ఏడాది దరఖాస్తులు క్షీణించడం ఆందోళనకు గురి చేస్తోంది. ఏటా 1.20 లక్షలకుపైగా కనీ్వనర్ కోటాలో ఇంజినీరింగ్ ప్రవేశాలు పొందే విద్యార్థులు ఈఏపీసెట్ను పోటీపడి రాస్తారు. కానీ, ఏపీలో ఇంజినీరింగ్ కళాశాలల్లో నెలకొన్న అనిశి్చతి, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు నిలిచిపోవడంతో విద్యా నాణ్యత తీవ్రంగా దెబ్బతింది. దీనికి తోడు విద్యార్థి చదువుకంటే నిత్యం ఫీజుల చెల్లింపులపై కళాశాలలు ప్రశి్నస్తుండటం మానసికంగా కుంగదీస్తోంది.పోనీ, చివరికైనా ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుందా? అంటే గ్యారంటీ ఉండట్లేదు. విద్యార్థుల తల్లిదండ్రులే అప్పులు చేసి ఫీజులు కడుతున్నారు. ఇక్కడ ఉచిత విద్య మిథ్యగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో ఏపీలో చదివే బదులు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు వర్సిటీలు, కళాశాలల వైపు విద్యార్థులు చూస్తున్నారు. ఏపీలోని కొన్ని ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీల్లోనూ చేరికలకు ప్రయతి్నస్తున్నారు. ఫార్మసీ, అగ్రి విభాగాల్లోనూ ఇదే తంతు నడుస్తోంది. దీని ఫలితంగానే ఈ ఏడాది ఈఏపీ సెట్ దరఖాస్తుల్లో 7వేలకు పైగా తగ్గాయి. ఎంబీఏ, ఎంసీఏ కల్లే! ఏపీ విద్యారంగం గడచిన రెండేళ్లుగా తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతోంది. ముఖ్యంగా ఎంబీఏ, ఎంసీఏ విద్యలో చేరికలు గణనీయంగా పడిపోతున్నాయి. ప్రైవేటు పీజీ విద్యకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని హామీ ఇచ్చి ఎగ్గొట్టిన చంద్రబాబు కుతంత్రానికి ఎంబీఏ, ఎంసీఏ విద్య బలైపోతోంది. రెండేళ్ల కింద ఐసెట్కు 48,828 దరఖాస్తులు వస్తే ఈ ఏడాది ఆ సంఖ్య 26,219 దరఖాస్తులకు పడిపోవడం గమనార్హం. యూనివర్సిటీల్లో ఎంబీఏ, ఎంసీఏలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఉండగా అక్కడ విద్య నాణ్యత దెబ్బతినడంతో చేరికలు క్షీణించాయి. ఇదే తరహాలో సంప్రదాయ పీజీ కోర్సులైన ఎంకామ్, ఎంఏ, ఎమెస్సీ వంటి కోర్సులు నిరీ్వర్యం అయిపోతున్నాయి. పీజీ సెట్లో ఒకప్పుడు 34వేలకుపైగా దరఖాస్తులు వస్తే.. ఇప్పుడు 18 వేలకు పడిపోయాయి. చివరికి ఈసెట్ (ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం) పరిస్థితి కూడా ఇలానే తయారైంది. ఎడ్ సెట్, లాసెట్లో పెరుగుదల? చంద్రబాబు ఏలుబడిలో ఉన్నత విద్య ఎంతలా దిగజారిందో ఎడ్ సెట్, లాసెట్ దరఖాస్తులు చూస్తే అర్థమవుతుంది. బీఈడీ, న్యాయ విద్యను వ్యాపారం చేస్తూ టీడీపీ అనుకూల కళాశాలలు రెచి్చపోతున్నాయి. 450కిపైగా బీఈడీ కళాశాలల్లో కనీసం అధ్యాపకులు లేకుండా, విద్యార్థులు కళాశాలలకు రాకపోయినా రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేసి సరి్టఫికెట్లు అంగడి సరుకులుగా అమ్మేస్తుండటం నిత్యకృత్యంగా మారింది. దీనిపై ప్రభుత్వానికి ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవట్లేదు. న్యాయ విద్యను సైతం వ్యాపారంగానే మార్చేసింది. తరగతులు, హాజరుతో పని లేనప్పుడు సరి్టఫికెట్లు మాత్రమే కోరుకునేలా విద్యార్థులను దారి మళ్లించి రూ.కోట్లు గడిస్తున్నాయి. ఈ ఏడాది ఎడ్సెట్కు, లాసెట్కు భారీగా దరఖాస్తులు పెరగడం విద్యావేత్తలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. -
బాబ్బాబు.. మాకు రివర్షన్ ఇవ్వండి
సాక్షి, అమరావతి: ఏ ఉద్యోగి అయినా పదోన్నతి ఎప్పుడు వస్తుందా..? అని ఎదురు చూస్తుంటాడు. అయితే రాష్ట్రంలో పదోన్నతి పొందిన పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి మరోలా ఉంది. ‘ఈ ప్రమోషన్ మాకొద్దు బాబోయ్... రివర్షన్ ఇచ్చేయండి’ అని వారు ప్రభుత్వానికి వినతులు సమర్పించే పరిస్థితి చంద్రబాబు సర్కార్లో దాపురించింది. సర్వేలుసహా పలు రకాల విధులను ప్రభుత్వం ఉద్యోగులకు అప్పగిస్తోంది. ఈ అసమంజసమైన విధులను తాము నిర్వర్తించలేకపోతున్నామని పదోన్నతి పొందిన పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. అనంతపురం జిల్లాలోని గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లు (గ్రేడ్ –6)గా పని చేస్తూ చిన్న గ్రామ పంచాయతీల్లో గ్రేడ్ –5 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి పొందిన 16 మంది.. ఆ పదోన్నతి వద్దంటూ ఉన్నతాధికారులకు అర్జీలు పెట్టుకున్నారు. ఆయా ఉద్యోగులే స్వచ్ఛందంగా పదోన్నతులు వదులుకునేందుకు ముందుకు రావడంతో ఇచ్చిన పదోన్నతులను రద్దు చేసి, వారిని పాత క్యాడర్లోనే నియమిస్తూ జిల్లా అధికారులు గత నెల 30న ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇలాంటి ఇంకా పరిశీలనలో ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.పదోన్నతులే వద్దనుకునే పనులు..⇒ ఎప్పటికప్పుడు రకరకాల సర్వేలకు తోడు ఐవీఆర్ఎస్ కాల్స్ అభిప్రాయ సేకరణ పేరిట సంబంధం లేని అంశాల్లోనూ పంచాయతీ కార్యదర్శులను బాధ్యులను చేస్తున్నారు. ⇒ పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి రోజు ఆరు గంటలకల్లా ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో విధులకు హాజరు కావడంతో పాటు అందుకు సంబంధించిన ఫోటోను ప్రత్యేక యాప్ నమోదు చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శులు రోజు తెల్లవారుతూనే విధుల్లో పాల్గొనాల్సిన పరిస్థితి వస్తోంది. చలి, వర్షం, చీకటితో సంబంధం లేకుండా ఉదయం ఆరు గంటలకల్లా విధుల్లో పాల్గొనేందుకు వెళుతూ పలుచోట్ల ఉద్యోగులు ప్రమాదాల బారిన పడాల్సి వస్తోంది. ⇒ సర్వేలు , ఇతరేతర పనుల పేరిట పంచాయతీ కార్యదర్శులు ప్రతి రోజూ 12 గంటలు పనిచేయాల్సి వచ్చినా.. అవసరమైనప్పుడు సెలవులు కూడా తీసుకునే పరిస్థితి ఉండడం లేదు. ⇒ ఇటీవల గ్రామాల్లో ఇంటి పన్నులు వసూళ్ల ప్రక్రియలో రోజుకు రూ. 20 కోట్లు పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఈ టార్గెట్లనూ జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులకే అప్పగిస్తున్నారు. టార్గెట్లను చేరకుంటే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో పలుచోట్ల కొన్ని రోజులు పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బునూ వెచ్చించినట్లు ఉద్యోగ సంఘల నేతలు పేర్కొంటున్నారు. -
ఎనర్జీ అసిస్టెంట్లకు బాబు మార్కు వెన్నుపోటు
సాక్షి, అమరావతి: పదోన్నతులు వస్తున్నాయన్న సంతోషం గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఎనర్జీ అసిస్టెంట్లకు మూడురోజులు కూడా మిగల్లేదు. అందరికీ పదోన్నతులు వస్తాయని ఆనందిస్తున్న వారు.. కొందరికే పదోన్నతులుంటాయని తెలియడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఒకేసారి ఉద్యోగంలో చేరి, అందరూ ఒకేసారి పదోన్నతికి అర్హత సాధించి, ఐదేళ్లు పూర్తిచేసుకున్నప్పటికీ పదోన్నతుల వద్దకు వచ్చేసరికి నామమాత్రంగా కొందరికే ఇస్తున్న చంద్రబాబు సర్కారు ఎక్కువమందికి వెన్నుపోటు పొడుస్తోందని ఆవేదన చెందుతున్నారు.ఇప్పటికే ఎనర్జీ అసిస్టెంట్ల సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లో సర్వేలు, డేటా సేకరణ వంటి ఇతర పనుల కోసం వినియోగిస్తున్నారు. దీనివల్ల విద్యుత్ సేవల్లో అంతరాయం కలిగి ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే ఎనర్జీ అసిస్టెంట్ల సేవలను ఇకపై విద్యుత్ శాఖకు సంబంధించిన పనులకే పరిమితం చేయాలని సంబంధిత శాఖలను ప్రభుత్వం గత నెల 28న ఆదేశించింది. అది నిజమనుకుని ఎనర్జీ అసిస్టెంట్లు సంతోíÙంచారు. కానీ ఇదంతా నాటకమని తేలిపోయింది. ఎనర్జీ అసిస్టెంట్లకు చంద్రబాబు సర్కారు యథావిధిగా వెన్నుపోటు పొడిచింది. వైఎస్సార్సీపీ పాలనలో 7 వేలమంది నియామకం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి 7 వేలమందిని శాశ్వత ఉద్యోగులుగా చేసి విద్యుత్శాఖ ఆధ్వర్యంలో విధులు కేటాయించారు. జూనియర్ లైన్మెన్ గ్రేడ్–2గా పిలుస్తున్న వీరిలో కనీసం ఐదేళ్లు నిరంతరసేవ పూర్తిచేసిన వారికి జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం)గా పదోన్నతి కల్పించాల్సి ఉంది. దీనికి సంబంధించి గత ఏడాది అక్టోబర్ 24న మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం డిసెంబర్ 10న ఉత్తర్వులు కూడా జారీచేసింది.ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పదోన్నతుల ప్రక్రియకు బ్రేక్పడింది. ఆ పిటిషన్ను హైకోర్టు గత నెల 8వ తేదీ కొట్టేయడంతో.. ఎనర్జీ అసిస్టెంట్లకు పదోన్నతుల ప్రక్రియకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్కో) చర్యలు చేపట్టింది. దీంతో తమకు పదోన్నతి వస్తుందని, ఇప్పుడున్న వేతనం రూ.22,460 కాస్తా రూ.30,800కు పెరుగుతుందని ఎనర్జీ అసిస్టెంట్లు సంబరపడ్డారు. కానీ ఆ ఆనందం ఎన్నోరోజులు నిలవలేదు. ఖాళీల వరకే పదోన్నతులు అర్హత గల జేఎల్ఎం గ్రేడ్–2 ఉద్యోగులకు ఖాళీగా ఉన్న జేఎల్ఎం పోస్టుల పరిమితిలోనే మూడురోజుల్లోగా పదోన్నతి కల్పించాలంటూ డిస్కంల సీఎండీలు ఆపరేషన్ సర్కిళ్లలోని సూపరింటెండింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు జారీ చేసిన ఆదేశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అంటే ప్రస్తుతం విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న జేఎల్ఎం పోస్టులనే ఎనర్జీ అసిస్టెంట్లకు పదోన్నతితో భర్తీచేస్తారు. అంటే మొత్తం ఏడువేల మందికి పదోన్నతులు రావు. ప్రభుత్వానికి నివేదిస్తామని, ప్రభుత్వం కొత్త పోస్టులు మంజూరు చేస్తే వాటిలో మిగిలినవారిని భర్తీచేస్తామని విద్యుత్ సంస్థలు చెబుతున్నా.. అది ఎప్పటికవుతుందో తెలియదు. అప్పటివరకు మిగిలినవారి పదోన్నతుల అంశం గాలిలో ఉన్నట్లేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
గ్రామీణ రోడ్ల నిర్మాణానికి కేంద్ర నిధుల్లో కోత
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై) కింద రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులు తగ్గడంతో కేంద్రం ఈ పథకంలో రాష్ట్రానికి నిధుల కేటాయింపును తగ్గించింది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో కేంద్రం పీఎంజీఎస్వై పథకానికి రూ.17,191 కోట్లు కేటాయించగా.. రాష్ట్రానికి కేవలం రూ.250 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ పథకానికి కేంద్రం కేటాయించే నిధుల్లో 60 శాతం కేంద్రం గ్రాంట్ కాగా, రాష్ట్రం వాటాగా 40 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది.ఈ పథకానికి దేశం మొత్తానికి కేంద్రం చేసిన కేటాయింపుల్లో ఒకటిన్నర శాతం నిధులను కూడా రాష్ట్రానికి కేటాయించలేదు. మార్చి నెలాఖరుతో ముగిసిన గత 2025–26 ఆర్థిక సంవత్సరంలో నిర్ణీత లక్ష్యం మేరకు రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం పూర్తి చేయలేదని కేంద్రం ఈ ఏడాది నిధుల కేటాయింపులు తగ్గించినట్టు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు పీఎంజీఎస్వై ద్వారా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం సగటు గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంతో పోల్చితే చంద్రబాబు ప్రభుత్వ కాలంలో సగానికి సగం తగ్గిపోయింది.వైఎస్ జగన్ పాలనలో పీఎంజీఎస్వై ద్వారా సగటున ఏడాదికి 900 కిలో మీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణం జరగగా... చంద్రబాబు పాలనలో సగటున ఏడాదికి 435 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం మాత్రమే పూర్తి చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక గణాంకాల ప్రకారమే... 2019–24 మధ్య కరోనా విపత్తు సమయం మినహా 2021 మార్చి నుంచి 2024 మార్చి వరకు మూడేళ్లలో 2,701 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం పూర్తయింది. అదే చంద్రబాబు హయాంలో గత రెండేళ్లలో (2024–25, 2025–26) కేవలం 871 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది.కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక వెబ్సైట్ వివరాల ప్రకారం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో 1,282 కి.మీ కొత్త రోడ్ల నిర్మాణం కొనసాగగా, 2022–23లో 1,050 కి.మీ రోడ్ల నిర్మాణం జరిగింది. 2023–24 ఏడాదిలో 369 కిలో మీటర్ల మేర రోడ్ల నిర్మాణం పూర్తయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2024–25లో 387 కిలో మీటర్ల మేర రోడ్ల నిర్మాణం పూర్తవగా, గత 2025–26 ఏడాదిలో 484 కిలో మీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయింది.పీఎం – జన్మన్లో మరో రూ.140 కోట్లు కేటాయింపు పీఎం– జన్మన్ కార్యక్రమంలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి మరో రూ.140 కోట్లు, ఆర్సీపీఎల్డబ్ల్యూఈఏ కార్యక్రమం కింద నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో కొత్త రోడ్ల నిర్మాణానికి రూ.90 కోట్లు కేంద్రం కేటాయించింది. ఈ పథకాల ద్వారా చేపట్టే రోడ్ల నిర్మాణానికి కేంద్ర వాటాగా 60 శాతం, రాష్ట్ర వాటాగా 40 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
రూ.1,071.84 కోట్ల ట్రూడౌన్
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు రూ.1,071.84 కోట్ల ఆదాయం రాగా.. అందులో వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనం లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్కో)కు రూ.1,071.84 కోట్ల మిగులు వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) తేల్చింది. ట్రాన్స్కో తొలుత రూ.931.11 కోట్ల ట్రూడౌన్ను మాత్రమే ప్రతిపాదించగా, కమిషన్ సమగ్ర పరిశీలన అనంతరం ఆ మొత్తాన్ని పెంచింది. 2024–25 ఆరి్థక సంవత్సరానికి సంబంధించిన వ్యాపార పనితీరు సమీక్ష, ట్రూడౌన్పై దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన ఏపీఈఆర్సీ ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.కమిషన్ ఆమోదించిన మొత్తం వ్యయం రూ.3,370.26 కోట్లు కాగా, వాస్తవ ఖర్చు రూ.2,801.96 కోట్లకే పరిమితమైంది. మరోవైపు ట్రాన్స్కోకు మొత్తం ఆదాయం రూ.3,873.80 కోట్లుగా నమోదైంది. ఆ విధంగా ఏర్పడిన మిగులు రూ.503.54 కోట్లకు తోడు ఇతర టారిఫ్, నాన్ టారిఫ్ ఆదాయాలు, అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీలు వంటివి కలిపి మొత్తంగా రూ.1,071.84 కోట్ల మిగులు ఉన్నట్లు కమిషన్ పేర్కొంది. ఈ ట్రూడౌన్ మొత్తంలో ఇప్పటికే రూ.892.09 కోట్లు డిస్కంల ట్రాన్స్మిషన్ చార్జీలకు సర్దుబాటు చేసినట్లు తెలిపింది. మిగిలిన రూ.179.75 కోట్లను విద్యుత్ పంపిణీ సంస్థలకు వాటి విద్యుత్ వినియోగ నిష్పత్తి ప్రకారం చెల్లించాలని ఏపీ ట్రాన్స్కోను ఆదేశించింది.పూర్తికాని ప్రాజెక్టులు2024–25 సంవత్సరానికి రిసోర్స్ ప్లాన్లో రూ.2,665.72 కోట్ల పెట్టుబడులు ప్రతిపాదించగా, వాస్తవంగా రూ.1,005.11 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు ఏపీ ట్రాన్స్కో పిటిషన్లో వెల్లడైంది. అనేక సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్ల పనులు ఇంకా పూర్తి కాలేదని ప్రజాభిప్రాయ సేకరణలో తెలిసినట్లు ఏపీఈఆర్సీ తెలిపింది. ప్రాజెక్టుల ఆలస్యానికి భూసేకరణ సమస్యలు, రైట్ ఆఫ్ వే ఇబ్బందులు, తుపాన్లు, కోర్టు కేసులు, ట్రాన్స్ఫార్మర్ సరఫరా ఆలస్యం వంటి కారణాలను ఏపీ ట్రాన్స్కో తన వివరణలో తెలిపినట్లు చెప్పింది. ట్రాన్స్మిషన్ నష్టాలు 2.6 శాతానికి తగ్గినట్లు కమిషన్ వెల్లడించింది. ట్రూడౌన్ ద్వారా వచ్చిన లాభాన్ని నేరుగా వినియోగదారుల బిల్లుల్లో చూపాల్సిన అవసరం లేదని కమిషన్ స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని ఇప్పటికే 2026–27 విద్యుత్ టారిఫ్ లెక్కల్లో పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. -
పేదల సొంతింటి కలపై నీళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం ఇవ్వడంతోపాటు పక్కా ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా పేదలకు గజం స్థలం, ఒక్క పక్కా ఇల్లు కూడా మంజూరు చేయలేదు. అంతటితో ఆగకుండా గత వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన ఇళ్లను పూర్తి చేయకుండా కుట్రలు పన్నుతోంది. కనీసం కేంద్రం ఇచ్చిన నిధులు కూడా లబ్ధిదారులకు చెల్లించడానికి బాబు సర్కారుకు మనసొప్పడం లేదు. ఫలితంగా రూ.200 కోట్ల మేర నిధులు మురిగిపోయే పరిస్థితి వచ్చింది.వాటిని తిరిగి కేంద్రానికే అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అధికారుల ప్రణాళికకు అడ్డుపుల్ల! కేంద్రం పేదల ఇళ్ల కోసం విడుదల చేసిన రూ.200 కోట్ల నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో రిజర్వ్ చేసి, ఇళ్ల నిర్మాణంలో నిర్దేశించిన దశలు పూర్తయ్యాక విడుదల చేసేలా గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ప్రణాళిక రూపొందించారు. 2025–26 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపినట్టు తెలిసింది. దీనివల్ల నిధులు రాష్ట్రంలోనే ఉండటంతోపాటు పేదల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక తోడ్పాటు లభించేది. కానీ, ఈ నిర్మాణాత్మక ప్రతిపాదనను చంద్రబాబు ప్రభుత్వం కావాలనే అడ్డుకున్నట్లు తెలుస్తోంది. బాబు హయాంలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకపోవడంతో అధికారులు పంపిన ప్రతిపాదనలను కీలక ప్రజాప్రతినిధి తిరస్కరించినట్టు తెలుస్తోంది. బిల్లులు చెల్లించకుండా నిధులు వెనక్కుఇప్పటికే ఇళ్ల నిర్మాణానికి ఆన్లైన్లో పొందుపర్చిన బిల్లులు రూ.30 కోట్ల నుంచి రూ. 50 కోట్ల మేర ఉన్నట్లు తెలుస్తోంది. నిధులు తిరిగి కేంద్రానికి వెనక్కి పంపకుండా బిల్లులు విడుదల చేస్తే పేదలకు మేలు జరుగుతుంది. అయితే ఇందుకు కీలక ప్రజాప్రతినిధి అడ్డు తగులుతున్నారని సమాచారం. పెండింగ్ బిల్లులు కూడా చెల్లించడానికి వీల్లేకుండా గృహ నిర్మాణ సంస్థలోని కీలక అధికారిని ప్రజాప్రతినిధి సెలవుపై పంపేశారని విమర్శలు వస్తున్నాయి. పెండింగ్ బిల్లులు ఇప్పుడు చెల్లిస్తే తమకు క్రెడిట్ దక్కదనే దురాలోచనతో ఈ కుట్రకు తెరలేపినట్టు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల వినియోగాన్ని సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్ఎన్ఏ) విధానం నుంచి స్పర్శ్లోకి మార్చి రూ.200 కోట్లు తిరిగి కేంద్రానికి అప్పగించడానికే బాబు సర్కారు సిద్ధమైనట్టు సమాచారం. -
బలుసుకు మరో రూ.98.1 కోట్లు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో బలుసు శ్రీనివాసరావుకు చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్కు మరో రూ.98.1 కోట్ల మేర ప్రయోజనాన్ని చంద్రబాబు ప్రభుత్వం చేకూర్చింది. 220 కేవీ విద్యుత్ లైన్ మార్పు పనుల అంచనా వ్యయాన్ని రూ.1,082.44 కోట్ల నుంచి రూ.1,180.54 కోట్లకు పెంచేస్తూ ఈనెల 1న ఉత్తర్వులు జారీ చేసింది. సింగపూర్ సంస్థ సుర్బానా–జురాంగ్ రూపొందించిన రాజధాని మాస్టర్ ప్లాన్లో లోపాల వల్ల ఎన్ 10–ఈ1 జంక్షన్ నుంచి ఎన్ 13–ఈ1 జంక్షన్ వరకు 220 కేవీ ఈహెచ్వీ(ఎక్స్ట్రా హైవోల్టేజ్) లైన్ను మార్చాల్సి వచ్చింది. ఈ లైన్ అండర్ గ్రౌండ్ కేబుల్ విధానంలో ఏర్పాటు పనులకు రూ.993.25 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి గతేడాది సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. 8.98 శాతం అధిక ధరకు కోట్ చేసిన బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్ ఎల్–1గా నిలిచింది. 2004 నవంబర్ 20న జారీ చేసిన జీవో 133 ప్రకారం కాంట్రాక్టు విలువ కంటే 5 శాతానికి మించి అధిక ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్ ఎల్–1గా నిలిస్తే ఆ టెండర్ను రద్దు చేసి మళ్లీ పిలవాలి.కానీ.. బలుసు శ్రీనివాసరావు ముఖ్యనేతకు సన్నిహితుడు కావడం, ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్లు రావడంతో నిబంధనలను తుంగలో తొక్కి ఆ టెండర్ను ఆమోదించారు. ఈ పనులను రూ.1,082.44 కోట్లకు బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్కు అప్పగిస్తూ 2025 మార్చి 19న సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ఖజానాపై రూ.89.19 కోట్ల భారం పడింది. ఆ మేరకు బలుసుకు ప్రయోజనం చేకూరింది. ఆర్సీసీ పవర్ డక్ట్ నిర్మించాలంటూ.. చంద్రబాబు సర్కారు అంతటితో ఆగలేదు సరి కదా.. బలుసుకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు తాజాగా మరో అడుగు ముందుకేసింది. 220 కేవీ ఈహెచ్వీ లైన్ ఏర్పాటుకు ఆర్సీసీ పవర్ డక్ట్› నిర్మించాల్సి వచ్చిందని.. ఆ మేరకు అంచనా వ్యయాన్ని రూ.1,180.54 కోట్లకు సవరించాలంటూ సీఆర్డీఏ అధికారులు ప్రతిపాదించారు. దీన్ని గత నెల 23న జరిగిన సీఆర్డీఏ అథారిటీ 60వ సమావేశం ఆమోదించింది. సీఆర్డీఏ అథారిటీ ఆమోదించిన ప్రతిపాదనను అమలు చేయాలంటూ గత నెల 24న సీఆర్డీఏ కమిషనర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు.దాని ఆధారంగా 220 కేవీ ఈహెచ్వీ లైన్ మార్పు పనుల వ్యయాన్ని రూ.1,180.54 కోట్లకు పెంచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్కు అదనంగా మరో రూ.98.1 కోట్ల మేర ప్రయోజనం చేకూరిందని విద్యుత్రంగ నిపుణులు చెబుతున్నారు. మొత్తమ్మీద ఈ విద్యుత్ లైన్ మారి్పడి పనుల్లోనే బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్కు రూ.187.29 కోట్ల ప్రయోజనం చేకూరిందని.. ముఖ్యనేతకు బలుసు సన్నిహితుడు కావడం వల్లే ఇది సాధ్యమైందని చెబుతున్నారు. ప్రభుత్వ ఖజానాపై తీవ్ర భారం మోపుతూ సన్నిహితులకు ముఖ్యనేత లబ్ధి చేకూర్చుతున్నారంటూ విద్యుత్ రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు 32 లక్షలే
సాక్షి, అమరావతి: ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 32లక్షల మందే విద్యను అభ్యసిస్తున్నట్టు పాఠశాల, ఉన్నత విద్య కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ 9,620 మోడల్ ప్రైమరీ స్కూళ్లలో కనీసం 60 మంది విద్యార్థులు చొప్పున ఉండేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఉన్నత విద్యలో డిసెంబర్ నాటికి 1,500 పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. -
ఫీజులు కడితేనే ‘పరీక్ష’.. చదువులు చతికిల!
‘‘ఫైనలియర్ పరీక్ష దరఖాస్తు నింపాలంటే ఫీజు బకాయిలు మొత్తం కట్టాల్సిందే. ప్రభుత్వం ఇచ్చేవరకూ మేం ఎదురు చూడలేం. ఫీజు కడితేనే చివరి ఏడాది పరీక్షలు, ప్రాజెక్టు సబ్మిషన్కు వెళ్లనిస్తాం..!’’ విశాఖలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఓ ప్రముఖ ప్రైవేటు కాలేజీ యాజమాన్యం అల్టిమేటం ఇదీ! పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తమకు ప్రభుత్వం చెల్లిస్తుందని.. విద్యార్థులు కట్టాల్సింది ‘సున్నా’ అని అడ్మిషన్ సీటు అలాట్మెంట్ లెటర్లో చూపించిన కాలేజీ యాజమాన్యం.. ప్రస్తుతం ఫైనలియర్ విద్యార్థులు రూ.50 వేల చొప్పున బకాయిలు కట్టాలని తీవ్ర ఒత్తిడి చేస్తోంది. ఒక్క విశాఖే కాదు.. ఫీజు రీయింబర్స్మెంట్ను చంద్రబాబు సర్కారు అటకెక్కించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలల్లో నెలకొన్న పరిస్థితి ఇదే! చరిత్రలో ఎన్నడూ లేనంత బకాయిలు పేరుకుపో వడం కూటమి పాలనలో దిగజారిన విద్యారంగం పరిస్థితికి నిదర్శనం. సాక్షి, అమరావతి: విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు సర్కారు ఉన్నత విద్యను మిథ్యగా మార్చేసింది. కొండలా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో విద్యా నాణ్యత పూర్తిగా దిగజారింది. పిల్లల చదువులు ఆగిపోతుండగా.. కాలేజీలు దివాళా తీసే దుస్థితి దాపురించింది. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తుండటంతో పేద కుటుంబాలు ఆర్థిక భారంతో చితికిపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో అనిశ్చితి నెలకొంది. ఇటు ప్రభుత్వం ఫీజులు చెల్లించడం లేదు. అటు కళాశాలలు పరీక్షలు రాయనివ్వడం లేదు. ఒకవేళ ఎలాగోలా రాసినా సర్టిఫికెట్లు విడుదల చేయట్లేదు. దీంతో విద్యార్థుల చదువులు చెదిరిపోతున్నాయి. దీనంతటికీ కారణం.. చంద్రబాబు ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఫీజు బకాయిలు పెట్టడమే. రాష్ట్రంలో గత రెండేళ్లలో ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఒక్కో క్వార్టర్కు రూ.700 కోట్ల చొప్పున మొత్తంగా 9 క్వార్టర్లకు రూ.6,300 కోట్లు ఫీజుల బకాయిలతోపాటు రెండేళ్లుగా వసతి దీవెన బకాయిలు రూ.2,200 కోట్లు కలిపి మొత్తంగా రూ.8,500 కోట్లు చెల్లించాల్సి ఉంటే ప్రభుత్వం అరకొరగా విదిలిస్తోంది. ఫీజులు, వసతి దీవెన కింద చంద్రబాబు సర్కార్ ఇప్పటికే రూ.6,100 కోట్లు బకాయిలు పెట్టింది. ఇక దీనికి అదనంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో చివరి క్వార్టర్ కింద రూ.700 కోట్లు చెల్లించాల్సి ఉంది. అంతేకాదు.. రానున్న విద్యా సంవత్సరంలో పిల్లల ఫీజులు, వసతి దీవెన కోసం రూ.3,900 కోట్లు అవసరం. అంటే పాత బకాయిలతో కలిపి మొత్తం రూ.10,700 కోట్లు అవసరం కాగా ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.2,766 కోట్లు! నమ్మించి నయ వంచన..ఒకవైపు ఫీజులను తొక్కిపెట్టిన చంద్రబాబు సర్కారు మరోవైపు కనికట్టు చేసింది. రూ.1,200 కోట్లు విడుదల చేస్తున్నట్టు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వోలు) ఇచ్చి మొత్తం అప్పులు తీర్చేసినట్లు ప్రచారం చేసుకుంది. విద్యాశాఖ మంత్రి లోకేశ్ ‘ఎక్స్’ ఖాతాలో గొప్పలు చెప్పుకున్నారు. నెలలు గడిచినా కళాశాలల ఖాతాల్లో రూపాయి పడలేదు. ఇదేమిటని అడిగితే చావుకబురు చల్లగా చెప్పింది. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి 7.55 శాతం వడ్డీ రేటుతో అప్పు తెచ్చి, ఆ డబ్బులిస్తామని.. అయితే ముందుగానే వడ్డీ మినహాయించుకుంటామని మెలిక పెట్టింది. దీనిపై వైఎస్సార్సీపీ పోరాటానికి పిలుపు ఇవ్వడం.. కళాశాలల యాజమాన్యాలు ఒప్పందాలకు నిరాకరించడంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఎట్టకేలకు రెండు విడతల్లో రూ.600 కోట్లు మాత్రమే ఇచ్చింది. మిగతాది ఆర్థిక సంవత్సరం ముగిసిపోయినా ఇప్పటికీ ఇవ్వలేదు. పూర్తి ఫీజురీయింబర్స్మెంట్ పథకాన్ని ఎగ్గొట్టే ఎత్తుగడలో భాగంగానే కాలేజీలకు చెల్లింపులు నిలిపివేస్తున్నట్లు సమాచారం అందడంతో యాజమాన్యాలు విద్యార్థులను వేధించి వసూలు చేస్తున్నాయి.వర్సిటీల నిధులు దారి మళ్లింపుప్రభుత్వ వర్సిటీలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోగా నిధులను దారి మళ్లించిన బాబు సర్కారు వాటి మనుగడపై కోలుకోలేని దెబ్బకొట్టింది. ఉన్నత విద్యా మండలితో పాటు వర్సిటీల నుంచి ఏకంగా రూ.1,200 కోట్ల వరకు నిధులు పక్కదారి పట్టించింది. తాజాగా మరో రూ.300 కోట్లు కూడా లాగేసుకుంది. మొత్తం రూ.1,500 కోట్లను వర్సిటీల నుంచి ప్రభుత్వం తన సొంత అవసరాల నిమిత్తం లాగేసుకుంది. దీంతోపాటు ఉన్నత విద్యా మండలి నిధులు రూ.10 కోట్ల వరకు ప్రభుత్వం వాడేçÜుకోవడం గమనార్హం. ముఖ్యంగా చినబాబు ఆస్రే్టలియా పర్యటన సందర్భంగా ఏకంగా రూ.3.60 కోట్లు ఎకనావిుక్ డెవలప్మెంట్ బోర్డుకు దారి మళ్లించేశారు.ఉన్నత విద్యపై వైఎస్ జగన్ హయాంలో రూ.18,663.44 కోట్లు వ్యయంవైఎస్సార్సీపీ హయాంలో కరోనా విలయ తాండవం చేసినా ఐదేళ్లూ ఫీజుల పథకాన్ని సజావుగా కొనసాగించారు. అత్యంత పారదర్శకంగా తల్లుల ఖాతాల్లో ఫీజుల డబ్బులు జమ చేశారు. విద్యార్థుల శ్రేయస్సును కాంక్షిస్తూ గత ప్రభుత్వం వసతి దీవెన పథకాన్ని ప్రవేశపెట్టింది. హాస్టల్ మెయింటెనెన్స్ కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని క్రమం తప్పకుండా జమ చేసింది. వైఎస్సార్సీపీ పాలనలో ఉన్నత విద్యపై ఏకంగా రూ.18,663.44 కోట్లు ఖర్చు చేసింది. గతంలో చంద్రబాబు బకాయి పెట్టిన రూ.1,778 కోట్లను కూడా చెల్లించి చిత్తశుద్ధిని చాటుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీజులను పెండింగ్లో పెట్టడంతోపాటు ప్రైవేటు కళాశాలల్లో పీజీ చేసే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామన్న హామీని చంద్రబాబు గాలికి వదిలేశారు. -
బినామీలకు ‘పర్యాటకం’!
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ కుటుంబానికి, బంధుగణానికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా చేసుకున్న ప్రభుత్వ పెద్దలు బరి తెగించి వ్యవహరిస్తున్నారు. పర్యాటక అభివృద్ధి ముసుగులో ప్రభుత్వ భూములను బినావీులకు విచ్చలవిడిగా దోచిపెడుతున్నారు. ఆర్థికంగా దివాళా తీసిన వ్యక్తులను సైతం భారీ పెట్టుబడిదారులుగా చిత్రీకరిస్తూ వారికి ప్రాజెక్టులు, స్థలాలు కట్టబెట్టి ప్రజలను మోసగిస్తున్నారు. రాజధాని పరిసరాల్లో విలువైన ప్రభుత్వ ఆస్తులను సంరక్షించాల్సినవారే పప్పు బెల్లాల మాదిరిగా పంచిపెడుతున్న తీరు ఇలా ఉంది..!విశాఖలో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు..విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్ ప్రైవేటు లిమిటెడ్ 2023లో విశాఖ పోర్టు అథారిటీకి చెందిన స్టేడియాన్ని లీజుకు తీసుకుని రెండున్నరేళ్లకు పైగా రెంట్ చెల్లించకుండా ఎగ్గొట్టింది. నిబంధనలకు విరుద్ధంగా, భద్రత లేకుండా స్పోర్ట్స్ యాక్టివిటీస్ నిర్వహించడంతో ఓ చిన్నారి స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందింది. దీనిపై పోర్టు యాజమాన్యం థర్డ్ పార్టీతో విచారణ జరిపించగా, నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నట్లు తేలింది. లీజు చెల్లించకపోవడం, నిబంధనలు పాటించకపోవడం, స్థలాలను అన్యాక్రాంతం చేయడంతో 12 నోటీసులు జారీ చేసిన పోర్టు యాజమాన్యం లీజును రద్దు చేసింది. విశ్వనాథ్ కంపెనీ ఇచ్చిన బ్యాంకు గ్యారంటీలను సైతం నగదుగా మార్చుకోవడం గమనార్హం. దీంతో విశ్వనాథ్ కంపెనీ ఆర్థికంగా దివాళా తీసిన దశకు చేరుకుని పోర్టు స్థలాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు విశాఖ తీరంలో ఏపీటీడీసీకి చెందిన ‘బీచ్ షాక్స్’ (తాత్కాలిక నిర్మాణాలు) నిర్వహణ నుంచి సైతం విశ్వనాథ్కు చెందిన కంపెనీని తొలగించారు. ఇక్కడ విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు వినియోగించినట్లు తేలడంతో ఆ లీజును రద్దు చేశారు. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అలాంటి సంస్థకు చంద్రబాబు సర్కార్ రూ.వేల కోట్ల విలువైన భవాని ద్వీపాన్ని దోచిపెడుతోంది. గతంలోనూ కుట్రలు..గతంలో కూడా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష అసోసియేట్స్ ఫిషింగ్ లిమిటెడ్ సంస్థకు భవానీ ద్వీపాన్ని 55 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు విఫలయత్నం జరిగింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజాపోరు దెబ్బకు ప్రభుత్వం దిగి వచ్చింది. మళ్లీ పుష్కరకాలం తర్వాత మంత్రి నారాయణ, ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు ద్వారా టీడీపీ పెద్దలు కథ నడిపిస్తుండటం గమనార్హం. గంటా శ్రీనివాసరావు బినామీగా బహిరంగంగానే గుర్తింపు పొందిన కాశీ విశ్వనాథ్ను రంగంలోకి తెచ్చారు. ఆర్థికంగా దివాళా తీసి, గతంలో లీజులు రద్దు అయిన కంపెనీకి భవాని ద్వీపాన్ని కట్టబెట్టే స్కెచ్ వేశారు. రెండేళ్లుగా భవాని ద్వీపాన్ని అభివృద్ధి చేయకుండా గాలికొదిలేశారు. ఫలితంగా ద్వీపం అస్తవ్యస్తంగా తయారైంది. సామాన్యులకు ప్రవేశం దుర్లభం!భవానిద్విపం కాశీ విశ్వనాథ్ కంపెనీ చేతుల్లోకి వెళితే సామాన్యులకు ప్రవేశం కలగానే మిగలనుంది. బోటు ఎక్కి ద్వీపంలో దిగి, హాయిగా విహరించే పరిస్థితి ఉండదు. ఇందుకు విశాఖ పోర్టు అథారిటీ స్టేడియమే పెద్ద ఉదాహరణ. అక్కడ విశ్వనాథ్ కంపెనీ అడుగు పెట్టకముందు విశాఖ ప్రజలు పెద్ద ఎత్తున పోర్టు మైదానంలో రోజూ వాకింగ్, వ్యాయామాలు చేసుకునేవారు. పోర్టు అథారిటీ ఆ స్థలాన్ని విశ్వనాథ్ కంపెనీకి లీజుకు ఇవ్వడంతో మైదానాలకు వెళ్లే మార్గాలను మూసివేశారు. స్టేడియంలో అనధికారిక నిర్మాణాలు చేపట్టారు. ఏటా రూ.కోట్లలో ఆదాయాన్ని గడించి రెండున్నరేళ్లకుపైగా లీజు చెల్లించకుండా ఎగ్గొట్టేశారు. పోర్టును తమ సొంత జాగీరులా వాడుకుని సామాన్యులకు ప్రవేశాన్ని నిలిపివేశారు.పోర్టు అథారిటీ మెడపట్టి గెంటేసిందిబాబు సర్కార్ రమ్మని పిలుస్తోంది..విజయవాడలో దుర్గమ్మ చెంతన ఉన్న భవానీ ద్వీపం ప్రకృతి రమణీయతతో అలరారుతూ ఇంద్రకీలాద్రికి మణిహారంలా భాసిల్లుతోంది. దాదాపు 230 ఎకరాల్లో విస్తరించిన భవానీ ద్వీపం విలువ సుమారు రూ.4,600 కోట్లు..! అలాంటి భవానీ ద్వీపాన్ని చంద్రబాబు సర్కారు ప్రైవేట్ పరం చేస్తోంది. విశాఖలోని కాశీ విశ్వనాథ్కు చెందిన విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్ ప్రైవేటు లిమిటెడ్, విశ్వనాథ్ అవెన్యూస్(ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ సంస్థలకు ‘అడ్వెంచర్ థ్రిల్ సిటీ’ పేరుతో కట్టబెడుతోంది. ఇప్పటికే తొలిదశలో పది ఎకరాలు కేటాయించింది. రూ.51.48 కోట్ల పెట్టుబడితో 250 మందికి ఉపాధి లభిస్తుందంటూ మభ్యపుచ్చింది. ఇదే విశ్వనాథ్ కంపెనీని విశాఖ పోర్టు అథారిటీ లీజు రద్దు చేసి మెడపట్టి బయటకు గెంటేయడం గమనార్హం. -
నా మాజీ డ్రైవర్ను లొంగదీసుకోవాలని చూశారు
తిరుపతి కల్చరల్: తన మాజీ డ్రైవర్ను నయానోభయానో అనుకూలంగా మలుచుకుని, తనపై దు్రష్పచారం చేయించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఆయన సంస్థ టీవీ5 ప్రతినిధులు ప్రయత్నించారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. దీనిని నీతిమాలిన సిగ్గుచేటు చర్యగా అభివర్ణించారు. భూమన గురువారం మీడియాతో మాట్లాడుతూ, ‘ప్రపంచ ప్రసిద్ధ ధార్మిక క్షేత్రమైన టీటీడీ ధార్మిక సంస్థకు ప్రథమ వ్యక్తిగా, చైర్మన్గా అత్యంత వినయ సంపన్నునిగా, శీలవంతునిగా ఉండాల్సిన నాయుడు అత్యంత నీచాతినీచమైన కార్యక్రమాలకు పాల్పడడం సిగ్గుచేటు.నా వద్ద పనిచేసిన మాజీ డ్రైవర్కు టీవీ 5 ప్రతినిధులు కొందరు ఫోన్ చేసి తాము చెప్పినట్లు టీవీ 5లో మాట్లాడాలని సూచించినట్లు తెలిసింది. డ్రైవర్ను వారికి అనుకూలంగా మలుచుకునే క్రమంలో ఆయనను ప్రలోభపెట్టారని, భయపెట్టారని తెలిసింది. ఇలాంటి చర్యలకు నేను అదిరేది బెదిరేది లేదు. బీఆర్ నాయుడు చేస్తున్న అనైతిక, అరాచకాలను ప్రశ్నించే వైఎస్సార్సీపీ పైనా, వ్యక్తిగతంగా నాపైన అసత్య ప్రచారాలకు పూనుకుంటూ, కుట్రలకు పాల్పడడం దిగజారుడుతనానికి నిదర్శనం. బీఆర్ నాయుడు తరహాలో పైరవీలు చేసి పైకి వచ్చిన వ్యక్తిని కాదు. జీవితం అంతా ఉద్యమాలు, పోరాటాలు చేసిన వాడిని. అనైతిక కార్యక్రమాలు చేసేవాడిని కాదు. బీఆర్ నాయుడు అనైతిక ప్రవర్తనను లోకమంతా చూశారు. ఒక ధార్మిక సంస్థకు చైర్మన్గా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేయడం ఘోరాతి ఘోరం’ అని విమర్శించారు. బీఆర్ నాయుడు అనైతిక, అరాచక చర్యలపై నిరంతరం ఉద్యమం కొనసాగిస్తామని భూమన ఉద్ఘాటించారు. -
వెంకటరామిరెడ్డిని ఎందుకు డిస్మిస్ చేశారు?
సాక్షి, అమరావతి: తనను సర్వీసు నుంచి డిస్మిస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 20న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అసిస్టెంట్ సెక్రటరీ కాకర్ల వెంకటరామిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. వెంకటరామిరెడ్డి డిస్మిస్ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ కమ్ విచారణాధికారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేష్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డిస్మిస్ ఉత్తర్వుల రద్దుకు పిటిషన్... తనను డిస్మిస్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేయడంతో పాటు తక్షణం వాటి అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ వెంకటరామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా వెంకట రామిరెడ్డి తరఫున న్యాయవాది వేలూరు మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘సర్వీసు నిబంధనలను ఉల్లంఘించి అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలతో వెంకటరామిరెడ్డిని ప్రస్తుత ప్రభుత్వం సర్వీసు నుంచి డిస్మిస్ చేసింది.పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషనర్పై అభియోగాలు మోపారు. పిటిషనర్ ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ నమోదైన నాలుగు కేసులను కూడా తన డిస్మిస్ ఉత్తర్వులకు కారణంగా ప్రభుత్వం చూపింది. ఆ ఆరోపణలన్నింటిపై పిటిషనర్ ఇచ్చిన వివరణలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. విచారణాధికారి నిబంధనలు నిర్దేశించిన మేర విచారణ జరపలేదు. అభియోగాలను నిరూపించేందుకు సాక్షులను సైతం విచారించలేదు. ఆధారాలు లేకుండా విచారణాధికారి సమర్పించిన నివేదిక ఆధారంగా, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం పిటిషనర్ను సర్వీసు నుంచి డిస్మిస్ చేసింది’’ అని వివరించారు. -
అన్నదాతలకు విత్తన కష్టం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్నదాతలకు విత్తన భరోసా కరువైంది. నాన్ సబ్సిడీ విత్తన పంపిణీకి తొలి ఏడాదిలోనే మంగళం పాడేసిన చంద్రబాబు సర్కారు సబ్సిడీ విత్తన పంపిణీలోనూ చేతులెత్తేస్తోంది. సబ్సిడీలో అడ్డగోలుగా కోతలుపెడుతున్న ప్రభుత్వం అదునుకు విత్తన సరఫరా చేయకుండా రైతులను ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించేలా చేస్తోంది. ఫలితంగా నాసిరకం విత్తనాల బారినపడి రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.మరోవైపు విత్తన సరఫరాదారులకు రెండేళ్లుగా బకాయిలు చెల్లించకపోవడం, గ్రామీణ విత్తనోత్పత్తి పథకాన్ని మొక్కుబడి తంతుగా మార్చడంతో సబ్సిడీ విత్తన పంపిణీ అగమ్యగోచరంగా తయారైంది. సబ్సిడీ విత్తన సరఫరా బాధ్యత నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుటిల యత్నాలకు ఒడిగడుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీలో అడ్డగోలు కోత ముందస్తు ఖరీఫ్కు వెళ్తేనే.. పంటల్ని వైపరీత్యాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని అధికారులు చెబుతుండగా.. ప్రభుత్వం అదునులో విత్తనం సరఫరా చేయలేకపోతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో 2024–25 ఖరీఫ్లో 6.63 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని అందుబాటులో ఉంచగా.. రూ.268 కోట్ల సబ్సిడీతో 5.94 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని పంపిణీ చేసింది. రబీ 2023–24 సీజన్లో జగన్ సర్కారు రూ.131.36 కోట్ల సబ్సిడీతో 3.27 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సరఫరా చేస్తే రబీ 2024–25 సీజన్లో చంద్రబాబు సర్కార్ కేవలం రూ.51.92 కోట్ల సబ్సిడీతో 1.94 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని మాత్రమే సరఫరా చేసింది.ఖరీఫ్–2025లో 6.32 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరమని అంచనా వేయగా.. కేవలం రూ.163 కోట్ల సబ్సిడీతో 4.23 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సరఫరా చేయగలిగారు. రబీ–2025–26 సీజన్లో సబ్సిడీలో మరింత కోత పెట్టడంతో కేవలం రూ.40 కోట్ల సబ్సిడీతో 1.35 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సరఫరా చేశారు. అదునుకు అందని విత్తనం రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 77.87 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 87 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రధానంగా 39 లక్షల ఎకరాల్లో వరి, 14 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 9.50 లక్షల ఎకరాల్లో అపరాలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏటా మార్చిలో పంటల వారీగా నిర్దేశించిన సాగు లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాల వారీగా విత్తనాల కోసం ఇండెంట్ సేకరిస్తారు. గ్రామీణ విత్తనోత్పత్తి పథకంలో ఉత్పత్తయ్యే విత్తనాన్ని దృష్టిలో పెట్టుకుని మిగిలిన విత్తనాలకు టెండర్లు పిలుస్తారు. సేకరించిన విత్తనాలను తొలుత ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్లలో సర్టీఫై చేసి సీజన్కు ముందుగానే రైతు సేవా కేంద్రా(పూర్వపు ఆర్బీకే)ల్లో అందుబాటులో ఉంచేవారు.ఏటా ఏప్రిల్లో పచ్చి రొట్ట విత్తనాలు, మే 15న వేరుశనగ, జూన్ 1 నుంచి వరి, జూన్ 15 నుంచి ఇతర విత్తనాలు పంపిణీ చేపడతారు. కానీ.. గడిచిన రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం సకాలంలో టెండర్లు ఖరారు చేయకపోవడం, అదునుకు విత్తనాలను అందుబాటులో ఉంచలేకపోవడం వంటి కారణాలలో రైతుల్లో అత్యధికులు ప్రైవేటు విత్తన వ్యాపారులను ఆశ్రయించి అధిక ధరలకు కొనుగోలు చేశారు. అవి నాసిరకం కావడంతో పంటలు దెబ్బతిని, ఆశించిన దిగుబడులు రాక నష్టపోయారు. ఖరీఫ్లో పచ్చిరొట్ట, వేరుశనగ, రబీలో పప్పు శనగ విత్తనాలు దొరక్క రైతులు పడరాని పాట్లు పడ్డారు. ఖరారు కాని వేరుశనగ టెండర్లు రానున్న ఖరీఫ్–2026 సీజన్లో విత్తన సబ్సిడీని రూ.179 కోట్లకు పరిమితం చేయడంతో 4.82 లక్షల క్వింటాళ్ల విత్తనం అందుబాటులో ఉంచాలని యోచిస్తున్నారు. ఆరి్థక శాఖ విత్తనాలకు సబ్సిడీ అవసరమా అనే ధోరణితో ఉండటంతో అధికారులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఖరీఫ్లో ఏటా దాదాపు లక్ష క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉంచగా.. 2019–24 మధ్య ఐదేళ్లలో ఏటా సగటున 80 వేల క్వింటాళ్లకు తక్కువ కాకుండా రైతులకు సరఫరా చేశారు. అలాంటిది ఖరీఫ్–2025లో అతికష్టంపై 58 వేల క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేశారు.ప్రస్తుత ఖరీఫ్–2026లో 90 వేల టన్నులు అవసరమని జిల్లాల నుంచి ఇండెంట్ రాగా, అందులో కనీసం 50% కూడా పచ్చిరొట్ట విత్తనాలను సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. దాదాపు నెల రోజులు ఆలస్యంగా టెండర్లు ఖరారైనప్పటికీ నేటికీ పూర్తిస్థాయిలో ఆర్ఎస్కేల్లో పచ్చి రొట్ట విత్తనాలు అందుబాటులో లేవు. ఈ సీజన్లో ఏటా 3.80 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు సరఫరా చేయగా.. ఇప్పుడు అడ్డగోలు కోతలతో విత్తన సరఫరాను కుదించేస్తున్నారు. ఖరీఫ్–2025లో అతికష్టంపై 1.93 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని సరఫరా చేయగా.. ఈ ఏడాది 2.40 లక్షల క్వింటాళ్ల విత్తనం కోసం టెండర్లు పిలిచారు.సీమలో వేరుశనగ కనుమరుగువేరుశనగ విత్తన సరఫరాలో ప్రభుత్వం కోత పెట్టడం రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో వేరుశనగ అధికంగా సాగవుతుంది. వైఎస్సార్సీపీ హయాంలో ఏటా సగటున 16 లక్షల నుంచి 18.50 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగయ్యేది. గడచిన రెండేళ్లలో సాధారణ సాగులో 50 శాతం కూడా దాటని పరిస్థితి నెలకొంది. 2024 ఖరీఫ్లో 14.80 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించగా.. 6.25 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఖరీఫ్–2025లో కేవలం 4 లక్షల ఎకరాల్లోనే సాగైంది. వర్షాభావ పరిస్థితులకు తోడు చంద్రబాబు సర్కారు నిర్వాకమే సాగు తగ్గిపోవడానికి కారణమని రైతులు చెబుతున్నారు. సకాలంలో విత్తనాల సరఫరా లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయలేక, వాతావరణం అనుకూలించక వేరుశనగ సాగుకు సీమ రైతులు దూరమయ్యారు. -
‘ఇంగ్లిష్ మీడియం వద్దన్న వాళ్లంతా ఇప్పుడేమంటారు?’
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే మాతృభాషకు ద్రోహం చేస్తున్నారని విమర్శించిన కూటమి నాయకులు, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం తప్పక ఉండాలని హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఖండించే దమ్ముందా? అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు.నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాలన్న ఆకాంక్షతో ప్రభుత్వ బడుల్లో ఐబీ, సీబీఎస్ఈ ప్రవేశపెడితే.. అధికారంలోకి వచ్చాక కేసులు వేస్తామని హెచ్చరించారని గుర్తుచేసుకున్నారు. తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తున్న కూటమి నాయకులు పేదల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుతుంటే ఓర్వలేక కళ్లల్లో నిప్పులు పోసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారా లోకేష్ విద్యారంగాన్ని సర్వనాశనం చేశాడని, పదో తరగతిలో వచ్చిన ఉత్తమ ఫలితాలకు వైయస్ జగన్ ఐదేళ్ల పాలనలో వేసిన ఫౌండేషన్ కారణమని చెప్పారు. కోట్ల రూపాయల పత్రికా ప్రకటనలిచ్చి క్రెడిట్ చోరీకి పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. జీతాలు తగ్గిస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్న ప్రభుత్వ బెదిరింపులకు భయపడకుండా తమకు రావాల్సిన బకాయిలపై ఉద్యోగులంతా సంఘటితమై పోరాడాలని పిలుపునిచ్చారు.పీఆర్సీ, డీఏ, ఐఆర్లపై ప్రశ్నించకుండా జీతాలు తగ్గిస్తామని ఉద్యోగులను ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తుందని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో జరగాల్సిన మహానాడు కార్యక్రమాన్ని ఉన్నట్టుండి నెల్లూరు జిల్లాకు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చారని జగన్పై విషం చిమ్మారు2019-24 మధ్య తన ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే దిక్సూచిలా నిలిచాయి. ప్రధానంగా నాడు- నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కి దీటుగా అభివృద్ధి చేయడంతోపాటు ఇంగ్లిష్ మీడియం బోధన ద్వారా పేద విద్యార్థులకు ఖరీదైన చదువులను ఉచితంగా అందించారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా ఎంతోమంది కూటమి నాయకులు వైఎస్ జగన్ మీద విష ప్రచారం చేశారు.ఇంగ్లిష్ మీడియం తీసుకొస్తే తెలుగుభాషకు అన్యాయం జరుగుతుందంటూ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించారు. కూటమి అధికారంలోకి వస్తే సర్కారు బడుల్లో ఆనాడు అమలవుతున్న ఐబీ, టోఫెల్ విధానాలపై కేసులు వేస్తామని హెచ్చరించారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పిన చంద్రబాబు మనకి ముఖ్యమంత్రిగా ఉండటం దౌర్భాగ్యం. అమ్మ భాషను వైఎస్సార్సీపీ నుంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.వైఎస్సార్సీపీ మాతృ భాషకి వ్యతిరేకి అని మండలి బుద్ధ ప్రసాద్ వంటి వారు ప్రచారం చేశారు. తెలుగుభాషను విచ్చిన్నం చేస్తున్నామని అన్నారు. మాతృభాషకు ముప్పు ఉందని, మాతృ భాషలోనే బోధన కొనసాగాలని సుప్రీం మాజీ సీజేఐ ఎన్వీ రమణ చెప్పుకొచ్చారు. ఇంగ్లిష్ మీడియం లేకుండా చేయడానికి చివరికి కోర్టులను కూడా ఆశ్రయించారు. దాదాపు 95 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకే జగన్ ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చింది. కానీ పేద బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం చదువులు అందుతుంటే చూసి ఓర్వలేని కూటమి నాయకులు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చేయని కుట్రలు లేవు.ఆనాడు కళ్లల్లో నిప్పులు పోసుకున్నారుపేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం చదువులు అందించాలని ముందుచూపుతో వ్యవహరించి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని నేడు హైకోర్టు ధర్మాసనం కూడా సమర్థించింది. ఉన్నతంగా ఎదగాలంటే, నేటి సమాజంలో రాణించాలంటే ఇంగ్లిష్ ఎంతో ముఖ్యమని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం అమలు చేసింది. తెలుగు సబ్జెక్టును తప్పనిచేస్తూ 202-21లో ఆరో తరగతి వరకు మాత్రమే మొదటిసారి ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చారు.ఆ తర్వాత ఒక్కో ఏడాది పదో తరగతి వరకు పెంచుకుంటూ పోయారు. ఆరోజు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను వ్యతిరేకించిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సహా కూటమి నాయకులంతా వారి పిల్లలను మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తున్నారు. పేదల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుతుంటే ఆనాడు కళ్లల్లో నిప్పులు పోసుకున్నవాళ్లంతా ఇప్పుడు తమ అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. హైకోర్టు తీర్పుతోనైనా కళ్లు తెరవాలి.జగన్ పాలనలో విద్యారంగంలో సంస్కరణలుపదో తరగతి పరీక్షా ఫలితాలు వెలువడిన వెంటనే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో సర్కారు బడుల్లో వచ్చిన మార్కులతో ప్రభుత్వం భారీగా ఖర్చు చేసి మొదటి పేజీ ప్రకటనలు ఇచ్చింది. ఈ పిల్లలు ఇంతటి విజయాలు సాధించడానికి వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన కష్టానికి ఫలితమేనని కూటమి నాయకులు ఒప్పుకుని తీరాలి. నాడు -నేడు ద్వారా 38 వేల ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కి దీటుగా తీర్చిదిద్దారు.తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితుల్లో ఉన్న పాఠశాలల్లో ఆర్వీ వాటర్ ప్లాంట్లు, డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక వాటి నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. ఒక్కో ఐఎఫ్బీ ప్యానల్ బోర్డును లక్ష రూపాయలతో కొనుగోలు చేసి 62 వేల బోర్డులను ప్రతి క్లాసులోనూ ఏర్పాటు చేయడం జరిగింది.ప్రాథమిక స్థాయి పాఠశాలల్లో 33,590 స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు. పిల్లలకు లెక్కలు బాగా రావాలని పాల్ ల్యాబ్స్ను తీసుకొచ్చారు. సీబీఎస్ఈ, ఐబీ సిలబస్ను ప్రవేశ పెట్టడంతోపాటు 8వ తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్లతో పాఠాలు చెప్పించారు. జగనన్న విద్యాకానుక ద్వారా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, యూనిఫాం, సాక్సులు, షూ, నోట్ బుక్కులు అందించే కార్యక్రమానికి వైయస్ జగన్ గారు శ్రీకారం చుట్టారు. 8 వేల మంది టీచర్లకు స్కూల్ అసిస్టెంట్ లుగా ప్రమోషన్ ఇచ్చి మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచింగ్ మొదలు పెట్టిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది.కార్పొరేట్ స్కూళ్లకు చంద్రబాబు దాసోహంకూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్వో ప్లాంట్ల నిర్వహణ గాలికొదిలేశారు. ట్యాబ్లు పాడైనా పట్టించుకోలేదు. ఆఖరుకి టాయ్లెట్ల నిర్వహణ సరిగా లేదు. గోరుముద్ద పథకం ద్వారా నాణ్యమైన పౌష్టికాహారంతో కూడిన మెనూతో పిల్లలకు భోజనం పెడితే ఇప్పుడు దానికీ దిక్కులేదు. ప్రభుత్వ స్కూల్స్, విద్యారంగం గురించి కూటమి ప్రభుత్వంలో ఒక్క గొప్ప నిర్ణయం తీసుకున్న పాపానపోలేదు. ఇవేమీ చేయకుండానే కోట్ల రూపాయలు వెచ్చించి పత్రికా ప్రకటనలు ఇచ్చుకోవడం సిగ్గుచేటు.వైఎస్ జగన్ అమ్మ ఒడి పేరుతో అమలు చేసిన పథకానికి తల్లికి వందనంగా పేరు మార్చి లోకేష్ మదిలో నుంచి వచ్చిన ఆలోచన అని తండ్రికొడుకులు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. ఫీజురీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. వైయస్సార్సీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే దాన్ని ప్రైవేటీకరించాలని చూస్తున్న చంద్రబాబుకి విద్యారంగం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దాసోహమై వారి కోసం పనిచేస్తున్నాడే కానీ ప్రభుత్వ బడులను తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం లేదు.హామీలపై ప్రశ్నిస్తే ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేస్తున్నారుఅధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు వేధిస్తున్నాడు. ఉద్యోగులను కూటమి ప్రభుత్వం తీవ్రంగా వంచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం డీఏలు ఇచ్చినా చంద్రబాబు మాత్రం 4 డీఏలు పెండింగ్లో పెట్టాడు. ఇంతవరకు పీఆర్సీ ఊసే లేదు. కనీసం పీఆర్సీ కమిషనర్ని కూడా లేకుండా చేశారు. ఐఆర్ గురించి కూడా ఆలోచన చేయడం లేదు. దీన్ని నిరసిస్తూ ఉపాధ్యాయులంతా విజయవాడలో ధర్నా చేశారు. ఉద్యోగులంతా ప్రభుత్వంపై యుద్ధం చేస్తే తప్ప వారికిచ్చిన హామీలు ఈ ప్రభుత్వం నెరవేర్చే పరిస్థితి కనిపించడం లేదు.పీఆర్సీ, ఐఆర్, డీఏలపై ఉద్యోగులు ఒత్తిడి చేయడంతో శాలరీ కోతలంటూ కూటమి బ్లాక్మెయిలింగ్కి పాల్పడుతోంది. ఏపీ హెచ్పీ అంటూ హిమాచల్ ప్రదేశ్లో మాదిరిగా ఉద్యోగాల జీతాలకు కోతలు విధిస్తామన్న హెచ్చరికలకు ప్రభుత్వ ఉద్యోగులు భయపడాల్సిన పనిలేదు. అందరూ సంఘటితపై ప్రభుత్వంపై పోరాడి హక్కులను సాధించుకోవాలి. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉద్యోగులను వైయస్సార్సీపీ ఆదుకుంటుంది. కూటమి పాలనపై సర్వేలు చేయించుకున్న చంద్రబాబు నెల్లూరులో ఒక్క సీటూ గెలిచే పరిస్థితి లేదని తెలిసి షాకయ్యాడు. అందుకే శ్రీకాకుళం జిల్లాలో పెట్టాల్సిన మహానాడును నెల్లూరు జిల్లాకు చంద్రబాబు మార్చేశాడని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. -
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వైఎస్సార్సీపీ లేఖలు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పలు అంశాలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి లేఖలు రాశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బూత్ లెవల్ ఆఫీసర్ల జాబితాను రాజకీయ పార్టీలకు అందించాలని లేఖ రాశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ కోసం ఉపయోగించే ఓటరు జాబితాను డిజిటల్ ఫార్మాట్లో అందించాలని మరొక లేఖ రాశారు.ఎస్ఐఆర్ ప్రక్రియపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మరో లేఖలో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ తరఫున బీఎల్ఎ ల నియామకానికి సంబంధించిన ఫారాలను ఈఆర్వోలు స్వీకరించేలా ఆదేశాలు ఇవ్వాలని లేళ్ల అప్పిరెడ్డి కోరారు. -
ప్రియుడి మోజులో పడి.. రూ.12 లక్షలు ఇచ్చి..
సాక్షి, ఏలూరు: జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడి కోసం సుపారీ ఇచ్చిన భార్య.. భర్తను హత్య చేయించింది. గత నెల 17న హత్యకు గురైన ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామానికి చెందిన రెడ్డి సులేమాన్ రాజు హత్య కేసును పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో భార్యే అసలు సూత్రధారిగా పోలీసులు గుర్తించారు.వడ్లమాను సచివాలయంలో పనిచేస్తున్న వెంకన్నబాబుతో సులేమాన్ రాజు భార్య దుర్గామణి అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం తెలియడంతో దుర్గారాణిని సులేమాన్ రాజు తరచూ వేధించేవాడు. భర్త పెట్టే బాధలు పడలేక చనిపోవాలనుందంటూ దుర్గామణి ప్రియుడికి చెప్పింది. సులేమాన్ రాజు అడ్డు తప్పించాలని దుర్గామణి ప్లాన్ వేసింది.తన బంధువుల సాయంతో సులేమాన్ రాజు హత్యకు వెంకన్నబాబు సుపారీ ఇచ్చారు. రూ.12 లక్షలు ఇచ్చిన దుర్గామణి, వెంకన్నబాబు.. సులేమాన్ రాజు అడ్డు తొలగించుకున్నారు. సెల్ఫోన్ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ కేబుల్తో సులేమాన్ రాజును నిందితులు హత్య చేశారు. హత్య అనంతరం ఉప్పులూరు రైవస్ కాలువలో సులేమాన్ రాజు మృతదేహాన్ని పడేశారు. సులేమాన్ రాజు భార్య దుర్గామణి, వెంకన్నబాబు, మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సెల్ ఫోన్ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ కేబుల్, కారు, ఐదు సెల్ ఫోన్లు, ఐదు ఖాళీ బీరు సీసాలు, రూ. 75 వేలు నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
చంద్రబాబు చెప్పేవి సొల్లు కబుర్లు: జోగి రమేశ్
తాడేపల్లి: ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నా ఏపీ సర్కారు పట్టించుకోవడం లేదు. దీనిపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ గురువారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు వరుసబెట్టి కలెక్టర్లతో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారని, కాన్ఫరెన్సుల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప చేతలు శూన్యమని విమర్శించారు.‘‘రైతులు ధాన్యం కొనాలని మొత్తుకుంటుంటే గోనె సంచులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. రైతులను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు చెప్పేవి సొల్లు కబుర్లు. అకాల వర్షాలు పడుతుంటే కలెక్టర్లను రైతులను అండగా పంపాలి. కానీ విజయవాడ పిలిచి కాన్ఫరెన్స్ ల పేరుతో సొల్లు మాటలు చెప్తున్నారు. ఏడుసార్లు కలెక్టర్ల సమావేశాలు పెట్టి రైతులకు ఏం న్యాయం చేశారు? గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతుంటే పట్టించుకోవటం లేదు. మార్కెట్ యార్డుల్లో రైతుల కష్టాలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. కలెక్టర్లతో రైతుల కష్టాలు చూడామని చంద్రబాబు చెప్పాలి. కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని కొనాలి. రైతులు కష్టాలు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి సింగపూర్ లో తిరుగుతున్నారు. చేసిన లక్షల కోట్లు అప్పులు ఏమయ్యాయి? రైతులకు గానీ, ఇతర ఏ వర్గానికైనా మేలు చేశారా? కనీసం ఆరోగ్యశ్రీ బకాయిలయినా తీర్చారా? సినిమా డైలాగులు చెప్పటం తప్ప చంద్రబాబు ఇంకేం చేస్తున్నారు? సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండానే సూపర్ సక్సెస్ అని ఎలా అంటారు? సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్. రైతులు అల్లాడి పోతుంటే కాన్ఫరెన్స్ లో సొల్లు కబుర్లు ఎందుకు? అకాల వర్షాలతో రైతులు కష్టపడుతుంటే కలెక్టర్లను విజయవాడ పిలిచి మీటింగులు ఎందుకు? ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజా సమస్యలను గాలికొదిలేసి దోపిడీ పనిలో ఉన్నారు’’ అని ప్రశ్నించారు. -
‘జావా డిస్కవర్’ పరువు పాయే.. ఆ డాక్యుమెంటరీ తొలగింపు
సాక్షి, తాడేపల్లి: తప్పుడు కథనం ప్రసారం చేసి పరువు పోగొట్టుకున్న జావా డిస్కవర్.. వెనక్కి తగ్గింది. ఆ ఛానల్.. ఎర్రచందనంపై డాక్యుమెంటరీని తొలగించింది. డాక్యుమెంటరీలో జగన్ ఫోటోని ఆ ఛానల్ తప్పుగా చూపించగా.. దీనిపై అభ్యంతరం తెలుపుతూ వైఎస్సార్సీపీ నోటీసులు పంపింది. సీనియర్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి రచించిన బ్లడ్ శాండల్స్ పుస్తకం ఆధారంగా డాక్యుమెంటరీ రూపొందించారు. అయితే, జర్నలిస్ట్ సుధాకర్రెడ్డి రాయని అంశాన్ని జావా డిస్కవర్ ఛానల్ ప్రస్తావించింది. ఆ తప్పుడు కథనాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ విష ప్రచారం మొదలుపెట్టింది. దీనిపై తీవ్రంగా స్పందించిన సుధాకర్రెడ్డి.. లీగల్ చర్యలకు దిగారు. తప్పు తెలుసుకున్న ఆ ఛానల్ డాక్యుమెంటరీని తొలగించింది. వైఎస్ జగన్ పై తప్పుడు ట్రోల్స్ చేసి టీడీపీ అభాసుపాలైంది.ఎర్రచందనం డాక్యుమెంటరీలో వైఎస్ జగన్ను ఇరికించేందుకు పచ్చ పార్టీ కుట్రలు పారలేదు. తప్పుడు కథనాలు చేసిన జావా డిస్కవర్ ఛానల్.. ‘ప్లానెట్ కిల్లర్స్’ డాక్యుమెంటరీని మార్చడంతో పాటు వక్రీకరించింది. 2021లో ‘బ్లడ్ శాండర్స్’ పేరుతో ఉడుముల సుధాకర్ రెడ్డి పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని 2023లో ‘ప్లానెట్ కిల్లర్స్’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించారు. అయితే తాను చెప్పని.. పుస్తకంలో లేని అంశాలను జావా డిస్కవరీ ప్రస్తావించడంపై ఉడుముల సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రవీంద్రనాథ్ ఠాగూర్కు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘దేశ స్వాతంత్ర్య పోరాటంలో జన గణ మనతో జాతీయ స్ఫూర్తిని రగిలించిన విశ్వకవి, భారత దేశం నుంచి నోబెల్ బహుమతిని అందుకున్న తొలి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. తన సాహిత్యం, మానవతా విలువలతో భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు ఆయన. నేడు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆ మహాకవికి నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.దేశ స్వాతంత్ర్య పోరాటంలో జన గణ మనతో జాతీయ స్ఫూర్తిని రగిలించిన విశ్వకవి, భారత దేశం నుంచి నోబెల్ బహుమతిని అందుకున్న తొలి వ్యక్తి రవీంద్ర నాథ్ ఠాగూర్ గారు. తన సాహిత్యం, మానవతా విలువలతో భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు ఆయన. నేడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2026 -
పవన్ కళ్యాణ్ శాఖకి చిట్ట చివరి ర్యాంక్
సాక్షి, విజయవాడ: పనీతీరు ర్యాంకుల్లో పవన్ కల్యాణ్ వెనుకబడ్డారు. ఆయన శాఖకి చిట్ట చివరి ర్యాంక్ లభించింది. కలెక్టర్ల సదస్సులో ప్రకటించిన ర్యాంక్లలో అటవీ, పర్యావరణ శాఖ చివరి స్థానానికి పడిపోయింది. శాఖల వారీగా ర్యాంకులను ప్రకటించగా... కీ పెర్ఫార్మెన్స్ ఇండికెటర్ ఆధారంగా ర్యాంకులు కేటాయించారు.ఏబీసీడీగా ర్యాంకులను వర్గీకరించారు. 100 పాయింట్లతో బీసీ సంక్షేమ శాఖకి ప్రథమ స్థానం లభించింది. 67 పాయింట్లతో చివరి స్థానంలో అటవీ, పర్యావరణ శాఖ నిలిచింది. 90 శాతం పైగా పాయింట్లతో 18 శాఖలు నిలిచాయి. -
తెలంగాణలో ఇలా... ఆంధ్రప్రదేశ్లో అలా!
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిష్ట తెస్తుందా? లేక ఇందులో ఏమైనా రిస్క్ ను ఫేస్ చేయవలసి ఉంటుందా? రేవంత్ గురువుగా భావించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేమో గత సీఎం జగన్ ప్రభుత్వ రంగంలో తీసుకువచ్చిన కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో ప్రైవేటు పరం చేయడానికి యత్నిస్తున్నారు. రేవంత్ మాత్రం ప్రైవేటు రంగంలో ఉన్న మెట్రో రైల్ను రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తూ ప్రభుత్వ పరిధిలోకి తీసుకు వస్తున్నారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కేవలం రూ.ఐదు వేల కోట్లతో కోట్లాది ప్రజలకు మంచి చేయగల వైద్య కళాశాలల ప్రారంభానికి వెనుకాడుతోంది. ఈ మధ్యకాలంలో ప్రైవేటు సంస్థ నుంచి ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సందర్భం ఇదే కావచ్చు. దీనిని బట్టి ప్రైవేటు సంస్థలు ప్రభుత్వాల కన్నా బాగా పని చేస్తాయన్నది ఒక అపోహ మాత్రమే అన్నది స్పష్టమవుతోంది. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎల్ అండ్ టీకి మేలు చేస్తోందన్న భావన కలిగినా, మెట్రో రైలు ఆస్తులు అన్ని ప్రభుత్వపరం అవుతాయి కనుక భవిష్యత్తులో వాటికి మంచి విలువ రావచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం అంతగా స్వాగతించడం లేదన్న వార్తలు కూడా వస్తున్నాయి. మెట్రో రైలు స్వాధీనం చేసుకోవడం కన్నా, ప్రత్యామ్నాయ మోడల్లో రాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ను అమలు చేయవచ్చని కేంద్రం సూచిస్తోందంటూ ఒక ఆంగ్ల పత్రిక కథనాన్ని ఇచ్చింది. బహుశా ఇది భవిష్యత్తులో రాజకీయ వివాదంగా మారొచ్చు. మెట్రో రైల్ నష్టాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఎల్ అండ్ టీ రెండో దశ విస్తరణకు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కారు చర్చోపచర్చల తరువాత ప్రాజెక్టును తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. నష్టాల నుంచి గట్టెక్కడానికి ఇది మేలైన మార్గం కావడంతో ఎల్ అండ్ టీ కూడా అంగీకరించింది. ఇందుకోసం సుమారు రూ. 1461 కోట్ల విలువైన షేర్లను రాష్ట్ర ప్రభుత్వం బదలాయించుకుంటుంది. దాంతోపాటు ఈ ప్రాజెక్టుకు ఉన్న సుమారు రూ.13538 కోట్ల మొత్తాన్ని రీఫైనాన్స్ కు అంగీకారం కుదిరింది. అంటే ఈ అప్పు భారం అంతా తెలంగాణ ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న రూ.ఎనిమిది లక్షల కోట్ల అప్పుకు ఇది అదనమన్నమాట. అయితే ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలేవీ పెద్దగా విమర్శలు చేయకపోవడం గమనార్హం. అయితే... ప్రముఖ ఆంగ్ల పత్రిక హిందూకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు చూస్తే తెలంగాణ నిర్ణయం భవిష్యత్తులో వివాదమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రం మెట్రో రైల్ ఫేజ్ 2, ఫేజ్ 2ఎ మ కింద సుమారు 162 కిలో మీటర్ల దూరం వరకు విస్తరించడానికి రాపిడ్ ట్రాన్సిట్ మోడల్ మంచిదని రాష్ట్రానికి సూచించిందట. దీనికి మెట్రో మోడల్ కన్నా తక్కువ వ్యయం అవుతుందని చెబతున్నారు. పటాన్ చెరు,ఆరామ్ఘఘర్, కోకాపేట, హయత్ నగర్, చాంద్రాయణగుట్ట, ఫ్యూచర్ సిటీ, రాజివ్ గాంధీ విమానాశ్రయం, మేడ్చల్, షామీర్ పేట ప్రాంతాలకు మెట్రో విస్తరించాలని తలపెట్టారు. ప్రస్తుతం భరిస్తున్న రుణంతో కలిపి ఈ రెండో దశకు 58 వేల కోట్ల రూపాయలు వ్యయం అవతుందని అంచనా వేస్తున్నారు.అదే కేంద్రం ప్రతిపాదిస్తున్న రాపిడ్ ట్రాన్సిట్ రైల్ వల్ల రూ.48 వేల కోట్లే ఖర్చు అవుతుందట.ఢిల్లీ-మీరట్ రూట్ లో ఈ తరహా విధానం అమలులో ఉందని చెబుతున్నారు.ఆరున్నర కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ రైల్ వస్తుందని అధికారులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం తన ఒరిజినల్ స్కీమ్ కే కట్టుబడి ఉంటే బీజేపీ, బీఆర్ఎస్లు అదనపు భారంపై విమర్శలు చేయవచ్చు. కొత్త ప్రాజెక్టుపై అధిక వ్యయం చేయబోతున్నారని ఆరోపణలు గుప్పించవచ్చు. అలాగని ఇంత జరిగాక మెట్రో రైల్ మోడల్ కాకుండా రాపిడ్ రైల్ కు వెళ్లడం కూడా కష్టం కావచ్చు. ఏపీలో ప్రభుత్వం మెడికల్ కాలేజీలను సొంతంగా నడపలేదని, అవసరమైన పెట్టుబడులు పెట్టలేదని చంద్రబాబు సర్కార్ చెబుతోంది.ఒక పక్క అమరావతి పేరుతో వేల కోట్ల అప్పులు చేసి భారీ వ్యయం చేస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికి ఉపయోగపడే మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.చంద్రబాబు ఎంతసేపు ప్రైవేటువారికి సంపద కట్టబెట్టాలని చూస్తారన్న విమర్శలను విపక్షం చేస్తోంది.అయినా ఆ ప్రైవేటు సంస్థలు ఎంతవరకు బాధ్యత తీసుకుని ఆ మెడికల్ కాలేజీలను సమర్ధంగా నిర్వహిస్తాయో చెప్పలేం.దానివల్ల ప్రజలపై అదనపు భారం పడదన్న గ్యారంటీ లేదు.తెలంగాణలో మాత్రం ప్రజల ప్రయోజనాల కోసమే ప్రైవేటు కంపెనీని తప్పించి ప్రభుత్వమే మెట్రోని చేపడుతోందని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. రేవంత్ సర్కార్ నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సంపద సమకూరవచ్చు.ఎందుకంటే ఇప్పటికే నిర్మాణం అయిన మెట్రోలో రియల్ ఎస్టేట్ మోడల్, మాల్స్ వంటివాటికి ఏర్పాట్లు, ప్రచార ప్రకటనల ద్వారా ఆదాయ ఆర్జన వంటివి ఉన్నాయి. ఇప్పటికైతే అవన్ని లాభసాటిగా ఉన్నాయని చెప్పలేం కాని, హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ది చెందినందున ఫ్యూచర్ లో ఇది మెరుగైన ఫలితాలు ఇవ్వవచ్చేమో!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పిఠాపురం వర్మకు బాబు వెన్నుపోటు
సాక్షి, విజయవాడ: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మకి తెలుగు దేశం పార్టీ అధిష్టానం షాకిచ్చింది. ఆయన్ని టీడీపీ ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఎంత విధేయంగా ఉన్నా వర్మ తీరుపై చంద్రబాబు ఎందుకనో తీవ్ర అసహనంతో ఉన్న సంగతి తెలిసిందే. పిఠాపురంలో అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి టీడీపీ-జనసేన మధ్య విబేధాలు ఉన్నాయి. సీట్ల పంపకాల టైంలో అది తారాస్థాయికి చేరింది. వర్మకు కాకుండా పొత్తు ధర్మంలో భాగమంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్కు పిఠాపురం సీటును అప్పగించారు చంద్రబాబు. ఈ విషయంలో అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా అధినేత మాటకు లోబడి ఎస్వీఎస్ఎన్ వర్మ సైలెంట్గా ఉండిపోయారు. పవన్ తరఫున ప్రచారం చేయించి మరీ గెలిపించారు. అయితే గెలిచాక కూడా ఇరు పార్టీల మధ్య వర్గ పోరు కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా ఫ్లెక్సీ వార్ ఆ గొడవను తారాస్థాయికి చేరింది. ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటో లేకపోవడంతో హర్టైన వర్మ.. జనసేన వర్గీయులతో వాగ్వాదానికి దిగారు. ఇది దాదాపుగా ఆయనపై దాడి చేసేంత దాకా వెళ్లింది. ఆ టైంలో.. చంద్రబాబు మాట మీద తాము మౌనంగా ఉన్నామని.. ఇక మీదట పరిస్థితి మరోలా ఉంటుందంటూ ఆయన ఆవేశంగా మాట్లాడారు. ఇది చంద్రబాబుకి ఎందుకనో సహించలేదు. పార్టీ మీటింగ్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ పరోక్షంగా వర్మను మందలించారు కూడా. అయితే.. మొన్నీమధ్యే జనసేన అధినేత పవన్ కల్యాణ్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో వర్మ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. వర్మ భావోద్వేగంఈ నిర్ణయం వెలువడ్డాక వర్మ పిఠాపురం టీడీపీ ఆఫీస్కు వచ్చారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘పార్టీ తీసుకున్న ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. పార్టీ బలోపేతానికి కృషి చేస్తా. పార్టీ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తా’’ అంటూ మాట్లాడారాయన.పిఠాపురంలో వర్మ పదే పదే రచ్చ చేస్తున్నారని పవన్ ఫిర్యాదు చేయడంతో.. ఇప్పుడు ఆయన్ని ఇంచార్జ్ బాధత్యల నుంచి తప్పించాలని చంద్రబాబు నిర్ణయించారు. నియోజక వర్గంలో వ్యవహారాలను చూసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ పరిణామంపై వర్మ అనుచరులు రగిలిపోతున్నారు. అధినేత కోసం వర్మ అంతలా ఆరాటపడితే.. పవన్ చెప్పుడు మాటలు విని ఇలా చేయడం ఏంటని బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్మ నిర్ణయం ఎలా ఉండబోతోందా? అనే ఉత్కంఠ పిఠాపురంలో నెలకొంది. -
అల్లూరి సీతారామరాజుకు వైఎస్ జగన్ నివాళి
తాడేపల్లి : విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకు వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. గిరిజనుల హక్కులు, వారి ఆత్మగౌరవం కోసం ప్రాణాలొడ్డి, బ్రిటీష్ పాలకులను ఎదురించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. స్వరాజ్య సాధన కోసం ఆ సమరయోధుడు సాగించిన పోరాటాన్ని స్మరించుకుంటూ మన్యం జిల్లాకు ఆయన పేరు పెట్టి గౌరవించుకున్నామని గుర్తుచేశారు. నేడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు.గిరిజనులను సంఘటితం చేసి..అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారుడు. ఆయన 1897, జూలై 4 న ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో జన్మించారు. విశాఖపట్నం, గోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతంలో (మన్యం) గిరిజనులను సంఘటితం చేసి, వారి హక్కుల కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1922లో ‘రంపా తిరుగుబాటు’ చేపట్టారు. చింతపల్లి తదితర పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి, ఆయుధాలను చేజిక్కించుకున్నారు. మన్య ప్రజలు ఆయనను ‘మన్యం వీరుడు’ అని ప్రేమగా పిలుచుకుంటారు. బ్రిటీషర్లు ఆయనను పట్టుకోవడానికి పదివేల రూపాయల బహుమానం ప్రకటించారు. చివరకు 1924, మే 7న చింతపల్లి అడవుల్లో ఆంగ్లేయులు ఆయనను చెట్టుకు కట్టి కాల్చి చంపారు. గిరిజనుల హక్కులు, వారి ఆత్మగౌరవం కోసం ప్రాణాలొడ్డి, బ్రిటీష్ పాలకులను ఎదురించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. స్వరాజ్య సాధన కోసం ఆ సమరయోధుడు సాగించిన పోరాటాన్ని స్మరించుకుంటూ మన్యం జిల్లాకు ఆయన పేరు పెట్టి గౌరవించుకున్నాం. నేడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా… pic.twitter.com/ZQazhf2l37— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2026 -
విజయ్పై కుట్ర: పోసాని సంచలన వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి, టీవీకే అధినేత దళపతి విజయ్పై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ది పాకులాడే మనస్థత్వం కాదన్నారు. టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా కుట్రలు చేస్తున్నారని పోసాని ఆరోపించారు. దళపతి విజయ్ని అభిమన్యుడిని చేశారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.తమిళనాడు తాజాగా రాజకీయ పరిణామాలపై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి స్పందించారు. ఈ సందర్బంగా పోసాని మాట్లాడుతూ..‘దళపతి విజయ్ నాకు 1996 నుంచి నాకు తెలుసు. వాళ్ల నాన్నతో కూడా నాకు పరిచయం ఉంది. విజయ్ది పాకులాడే మనస్థత్వం కాదు. అతని చుట్టూ ఎన్ని గొడవలు వున్నా కూడా ఎంతో సంయమనంతో ఉన్నాడు. దళపతి విజయ్ని అభిమన్యుడిని చేశారు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కుట్ర పన్నారు. గవర్నర్ కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా గవర్నర్ని విజయ్ అసలు విమర్శించలేదు’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఆమె ఎలా చనిపోయింది..?
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా క్రోసూరు పోలీసుస్టేషన్కు విచారణ నిమిత్తం వచ్చిన ఒక మహిళ తీవ్ర గాయాలపాలై మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందడం తీవ్ర చర్చకు దారితీసింది. సంబంధిత వర్గాల కథనం ప్రకారం... విడాకుల విషయంలో బాపట్ల కోర్టుకు తిరుగుతున్న క్రమంలో చీరాలకు చెందిన పల్లపు రేణుక (39)కు వెంకటేశ్వరరెడ్డి అనే కోర్టు కానిస్టేబుల్ పరిచయమయ్యాడు. మొదటి భర్త విడాకుల అనంతరం వెంకటేశ్వరరెడ్డితో రేణుక కొంతకాలం సహజీవనం చేసింది. అప్పటికే రేణుకకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేణుకకు పిల్లలు పుట్టరనే నెపంతో కానిస్టేబుల్ వెంకటేశ్వరెడ్డి మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీంతో నాలుగేళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు, కేసుల దాకా వెళ్లింది. పొన్నూరులో పనిచేస్తున్న సమయంలో ఇదే వివాదంపై సస్పెండ్ అయిన వెంకటేశ్వరరెడ్డి ప్రస్తుతం గురజాలలో విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం నమోదైన కేసులో శాఖాపరమైన విచారణ నిమిత్తం మంగళవారం సాయంత్రం క్రోసూరు సీఐ సురేష్ ముందు ఇద్దరు హాజరయ్యారు. సాయంత్రం 6 గంటల సమయంలో అల్పాహారం తిన్న తరువాత రేణుకకు ఫిట్స్ రావడంతో మొదటి అంతస్తు నుంచి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. వెంటనే మంగళగిరి ఎయిమ్స్కు తరలించారు. చికిత్సపొందుతూ బుధవారం మృతి చెందింది. ఎయిమ్స్ వద్ద బంధువుల ఆందోళన రేణుక మృతిపై ఆమె బంధువులు మంగళగిరి ఎయిమ్స్ మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. రేణుకను పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్ వెంకటేశ్వరరెడ్డి కొట్టడంతోనే మరణించిందని ఆరోపించారు. రేణుక కింద పడిన వెంటనే ఎందుకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని, మంగళగిరికి ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. కానిస్టేబుల్పై హత్య కేసు నమోదు చేసి శిక్షపడేలా చేయాలని డిమాండ్ చేశారు. సీఐల చర్చలతో మారిన సీన్ ఈ క్రమంలో బంధువులు, కులసంఘం నేతలతో పెదకూరపాడు, అచ్చంపేట సీఐలు చర్చించారు. మంగళగిరి ఎయిమ్స్ వేదికగా హైడ్రామా నడిచిన అనంతరం సాయంత్రానికి పోలీసులు మృతురాలి తల్లిదండ్రులు మాట్లాడుతున్న ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. ‘రేణుకకు ఫిట్స్ ఉన్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఏం తినకపోవడం వల్ల కళ్లు తిరిగి కిందపడిపోయింది. మా బిడ్డ మృతిపై అనవసర రాద్దాంతం చేయొద్దు’ అని మృతురాలి తండ్రి చంద్రబాబు వీడియోలో పేర్కొన్నారు. ఈ మేరకు మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకూరపాడు పోలీసులు మీడియాకు సమాచారమిచ్చారు. -
పరిహారానికి పదేళ్లా?
తాడికొండ: ‘రాజధాని కోసం నేను రెండో విడతలో 13 ఎకరాల భూమి పూలింగ్కు ఇచ్చాను. అందులో రెండు ఎకరాల్లో కోళ్ల ఫారాలున్నాయి. వాటికి పరిహారం అడిగితే పదేళ్లు పడుతుందని సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ తేజ చెబుతున్నారు. నా జీవనాధారాన్ని పోగొట్టుకుని ఎలా బతకాలి? ఇలాగైతే ఎలా?’ అని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వడ్డమానుకు చెందిన రైతు చుండు నర్సిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని పూలింగ్ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందన్నారు. అధికారులు రైతుల గోడు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇటీవల రెండో విడత ప్రారంభించిన పూలింగ్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వంపై నమ్మకంతో తాను 13 ఎకరాలు ఇచ్చానన్నారు. ఇందులో సర్వే నెంబర్ 230/బీ, ఏ లలో 2.02 ఎకరాలలో కోళ్ల ఫారాలు ఉన్నాయని, వాటికి తొలి విడత పూలింగ్లో రైతులకు ఇచ్చినట్లే తనకు పరిహారం ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతుంటే పట్టించుకోవడం లేదన్నారు. అడిషనల్ కమిషనర్, ఇతర అధికారులు చెప్పిన మాటలు వింటుంటే బాధగా ఉందని కన్నీటి పర్యంతమయ్యారు. కోళ్ల ఫారం నిర్మాణం కోసం అప్పట్లో చాలా ఖర్చు చేశానని.. ల్యాండ్ కన్వర్షన్, ఇతర ఫీజులు చెల్లించానని చెప్పారు. అప్పట్లో మరో రెండెకరాల భూమి కొనుగోలు చేసేంత ఖర్చు చేశానన్నారు. కానీ ఇప్పుడు అధికారులు పరిహారం అడిగితే పదేళ్లు పడుతుందని చెప్పడం దారుణం అని అన్నారు. అయ్యా.. నా భూమి నాకిచ్చేయండి తన భూమి తనకు తిరిగిస్తే 10 సంవత్సరాల తర్వాతే పూలింగ్కు ఇస్తానని రైతు చుండు నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు. ల్యాండ్ పూలింగ్ను తాను వ్యతిరేకిస్తున్నానని, కోళ్ల ఫారాలను ఏసీ ఫారాలుగా మార్చుకొంటే తనకు నెలకు రూ.5–6 లక్షల ఆదాయం వస్తుందని చెప్పారు. తన భూమి తనకు ఇప్పించాలన్నారు. దీనిపై తాను జిల్లా కలెక్టర్ను కలసి అర్జీ ఇచ్చానని తెలిపారు. ప్రభుత్వాన్ని నమ్మి పొలం ఇస్తే ఇలా నట్టేట ముంచుతారనుకోలేదని మండిపడ్డారు. రాజధానిలో ఈనాం భూములు, నిషేధిత భూములను ఆన్లైన్లో తొలగించి, ఇతర రైతులను పూలింగ్కు ఒప్పించడం కోసం భయభ్రాంతులకు గురిచేస్తున్నారని.. ఆ జాబితాలో తాను ఉన్నానని చెప్పారు. 22ఎ/1సీలో తనకు ఈనాం భూమి ఉందని, తమకు కనీస సమాచారం ఇవ్వకుండా సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులు ఆ భూమిని ఆన్లైన్లో కనిపించకుండా చేశారని, అడిగితే తమకు సంబంధం లేదని, సీసీఎల్ఏ అధికారులు చేశారని సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులకు సంబంధం లేకుండా వీరి లాగిన్లో వారు ఎలా వచ్చి ట్యాంపరింగ్ చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం తన భూమిని తనకిస్తే వ్యాపారమో, వ్యవసాయమో చేసుకుంటానని లేదా ల్యాండ్ కన్వర్షన్ చేసిన రెండెకరాల భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
పని చెయ్.. పైసలు అడక్కు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లపై బాబు ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. ఓ పక్క ‘నో వర్క్.. నో పే’ అంటూనే 12 నెలలు పని చేయాలంటోంది. మే నెలకు మాత్రం ఉచితంగా పనిచేయాలని లేకుంటే జూన్ నుంచి ప్రారంభమయ్యే వచ్చే విద్యా సంవత్సరానికి సర్వీసును పునరుద్ధరించేది లేదని బెదిరిస్తోంది. మే నెలలో అడ్మిషన్లు, ఫెయిలైన విద్యార్థులకు అదనపు తరగతుల నిర్వహణ చూడాలని ఆదేశించిన అధికారులు.. అందుకు వేతనం మాత్రం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఇంటర్ విద్యలో 3,618 మంది, పాలిటెక్నిక్లో 303 మంది కాంట్రాక్టు లెక్చరర్లు (మొత్తం 3,921 మంది) తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాలిటెక్నిక్లో పరిస్థితి మరీ ఘోరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న 303 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్కు గతేడాది నుంచి 11 నెలల జీతమే ఇస్తున్నారు. మే నెలకు ‘నో వర్క్.. నో పే’ విధానం అమలు చేస్తున్నారు. అయితే, వీరితో పనిచేయించుకోకున్నా.. మే నెలలో పరీక్ష పత్రాల వేల్యుయేషన్ చేసేందుకు గతేడాది అవకాశం కల్పించారు. ఒక్క పేపర్ దిద్దినందుకు రూ.18 రెమ్యూనరేషన్ ఇస్తారు. రోజుకి ఒక లెక్చరర్ 80 పేపర్స్ వేల్యూ చేయాలి, అంటే రోజుకు రూ.1,440 సంపాదించుకునే వీలుంది. కానీ, ఈ ఏడాది ప్రభుత్వం ఆ అవకాశాన్ని కూడా ఆపేయడంతో నెలరోజుల పాటు తాము ఎలా బతకాలని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే కాంట్రాక్ట్ అధ్యాపకులను కాదని ప్రభుత్వం ప్రైవేటు పాలిటెక్నిక్ లెక్చరర్లకు వేల్యుయేషన్ అవకాశం ఇవ్వడం గమనార్హం. ‘మే నెలకు జీతం ఎలాగూ లేదు.. కనీసం పేపర్ దిద్దితే వచ్చే కూలీతోనైనా కుటుంబ పోషణ చేసుకోవచ్చని భావించాం. కానీ దానికీ తమను అనుమతించడం లేదు’ అని ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్లు వాపోతున్నారు. -
ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలకు ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి అని, లేకపోతే పిల్లలు ఆయా రంగాల్లో రాణించే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిపింది. ఇంగ్లిష్ అనేది అందరినీ ఏకం చేసే ఒక అంశమని కోర్టు అభిప్రాయపడింది. పిల్లలకు తెలుగుతో పాటు ఇంగ్లిష్ మీడియంలో కూడా చదువుకునే అవకాశం కల్పించడం ద్వారా వారు ఇతర రంగాలలోకి విస్తరించడానికి మెరుగైన అవకాశాలు లభిస్తాయని చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన ద్వారా పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అది మంచి పరిణామమేనంది. ప్రస్తుత కాలంలో ఇంగ్లిష్ పరిజ్ఞానం లేకుంటే విద్యార్థులకు తగిన అవకాశాలు దొరక్క పోవచ్చని తెలిపింది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవమని స్పష్టం చేసింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బోధన భాషగా ఇంగ్లిష్ ఉంటుందంటూ గత నెల 16న విద్యా శాఖ ప్రొసీడింగ్స్ జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ప్రొఫెసర్ గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది గడిపూడి వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ను బోధన భాషగా చేస్తూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని ఇదే హైకోర్టు కొట్టేసిందన్నారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం కూడా ఇంగ్లిష్ను బోధనా భాషగా చేస్తూ గత నెల 16న ప్రొసీడింగ్స్ జారీ చేసిందని వివరించారు.పొరపాటు జరిగింది.. సవరించాంవిద్యాశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది (జీపీ) గుర్రం రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. బోధన భాషగా ఇంగ్లిష్ను పొరపాటున పేర్కొన్నామని, అందువల్ల ఆ ప్రొసీడింగ్స్ను సవరించామని కోర్టుకు నివేదించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ద్విభాషా విధానం (తెలుగు, ఇంగ్లిష్) అమల్లో ఉంటుందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇక ఈ వ్యాజ్యం నిరర్థకమని, ఇందులో విచారించేందుకు ఏమీ లేదని స్పష్టం చేసింది. -
అనగనగా మరో బరితెగింపు! రూ.1,100 కోట్ల భూమి.. 20 కోట్లకే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి ముసుగులో సర్కారు పెద్దలు భూములను కొల్లగొడుతున్నారు. కాగితాలపై ప్రైవేటు కంపెనీల పెట్టుబడులను చూపించి రూ.కోట్లు విలువైన ప్రభుత్వ భూములను కారుచౌకగా కాజేస్తున్నారు. ఆతిథ్య రంగంలో అనుభవం లేని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎకరాలకు ఎకరాలు భూ పందేరం చేస్తూ మీకింత–మాకింత అంటూ దండుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ముఖ్య నేతకు అత్యంత సన్నిహితుడు, ఓ బినామీ మంత్రికి లబ్ధి చేకూర్చేందుకు ‘తిరుపతి వన్’ ప్రాజెక్టు పేరుతో రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు ఏకంగా రూ.వెయ్యి కోట్లకుపైగా విలువైన 22 ఎకరాలను ఎకరం కేవలం రూ.90 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కట్టబెడుతోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నిర్ణయించిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రేటు ప్రకారం భూమిని ఫ్రీ హోల్డ్ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేయడం విస్తుగొలుపుతోంది. ‘తిరుపతి వన్’లో భూ ‘మంత్రి’! చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 25న ‘తిరుపతి వన్’ ప్రాజెక్టు పేరుతో కలియుగ దైవం పాదాల చెంత హైదరాబాద్, బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలు దివ్యశ్రీ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ సిటీ బిల్డర్స్–డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియంకు రూ.1,100 కోట్లకుపైగా విలువైన 22 ఎకరాల భూమిని కేటాయించింది. వాస్తవానికి సదరు కంపెనీలకు ఎక్కడా ఆతిథ్య రంగంలో అనుభవం లేదు. అయినప్పటికీ, తిరుపతి జిల్లా వ్యవహారాలు చూసే ఓ మంత్రి తిరుపతి వన్ ప్రాజెక్టులో కీలకంగా చక్రం తిప్పి భూ కేటాయింపులు చేపట్టారు. పైగా సదరు మంత్రికి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఉంది. తిరుపతిపై తొలి నుంచి కన్నేసిన ఆ మంత్రి.. పర్యాటకం ముసుగులో ఓ ప్రాజెక్టును తీసుకొచ్చారు. రెండు రియల్ ఎస్టేట్ సంస్థలను అడ్డుపెట్టి భూములు కొట్టేసే ఎత్తుగడ వేశారు. వాస్తవానికి తిరుపతి వన్ ప్రాజెక్టు విలువ రూ.1,200 కోట్లు అయితే.. ప్రభుత్వం భూమితో పాటు ప్రోత్సాహకాల కింద రూ.1,400 కోట్ల మేర లబ్ధి చేకూరుస్తుండటం గమనార్హం. సాధారణంగా విలువైన ప్రాంతాల్లో భూములను ప్రైవేట్ సంస్థలకు వేలం ద్వారా విక్రయించాలి. ఇతర రాష్ట్రాల్లో ఇలానే చేస్తున్నారు. లేదా తక్కువ వ్యవధికి లీజుకు ఇవ్వాలి. ఈ సంప్రదాయాలన్నింటినీ తుంగలో తొక్కుతూ సదరు మంత్రి ఒత్తిడి మేరకు నామ మాత్రపు రేటుకు ఎకరం రూ.90 లక్షలకే రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్మేస్తుండడం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రూ.1,100 కోట్ల విలువైన భూమిని రూ.19.80 కోట్లకు ధారాదత్తం చేస్తోంది. దీంతో పాటు 15 ఏళ్ల పాటు ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్, భూమి కొనుగోలు స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ రీయింబర్స్, ఐదేళ్లు పరిశ్రమ రేట్లకే విద్యుత్, ఐదేళ్లు విద్యుత్ సుంకం రీయింబర్స్మెంట్ కల్పిస్తుండటం గమనార్హం. రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎకరం కేవలం రూ.90 లక్షల చొప్పున కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో ‘నోవేషన్ క్లాజ్’ ఎత్తివేత చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో ప్రభుత్వ భూములను పక్కా ప్రణాళిక ప్రకారం కూటమి నేతకు దోచిపెడుతోంది. ఏకంగా ఎస్ఆర్వో రేటుకే కారుచౌకగా అమ్మేస్తోంది. ఇదే కొనసాగితే ప్రభుత్వ భూమి తరిగిపోయి ప్రైవేటు వ్యక్తుల ఆదాయం పెరిగిపోతుంది. ఇక్కడ ప్రాజెక్టుల పేరుతో భూములు తీసుకుంటున్న సంస్థలు ఆ తర్వాత ఆ భూమిని ఏమాత్రం నిర్దిష్ట ప్రాజెక్టులకు వాడతారనే గ్యారంటీ లేదు. ప్రభుత్వం దగ్గర కారు చౌకగా భూమిని తీసుకుని భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు గడించే ఎత్తుగడలో సదరు మంత్రి పథకం వేశారు. అందుకే భూ బదలాయింపుల్లో ‘నోవేషన్ క్లాజ్’ను సైతం లేకుండా చేశారు. నోవేషన్ క్లాజ్ ఉంటే, ఒక ప్రాజెక్టు (భూమి) చేతులు మారినప్పుడల్లా పాత ఒప్పందంలోని పక్షాలు.. అంటే ప్రభుత్వ సమ్మతి కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా భూ బదలాయింపులు చేసిన ప్రతిసారీ ప్రభుత్వం దృష్టికి వస్తుంది. అంటే, ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది సాగదు. కేవలం ఏ ప్రాజెక్టుకైతే భూమి ఇచ్చారో దానికే వినియోగించాల్సి ఉంటుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ అనుమతితో బదలాయింపు చేస్తే కచ్చితంగా వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి నిర్దిష్ట వాటా ఉంటుంది. ఇలా ఎన్నిసార్లు బదలాయింపు చేసినా ప్రభుత్వానికి లాభాల్లో వాటాలు ఇవ్వాల్సిందే.దీంతో ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు ఏకంగా నోవేషన్ క్లాజ్ను ఎత్తేశారు. లీజు కాదు.. శాశ్వతంగా అమ్మకంతిరుపతి రూరల్ మండలంలోని దామినీడులో జాతీయ రహదారి వెంబడి భూములకు మంచి డిమాండ్ ఉంది. పైగా ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి ఇప్పుడు దామినీడు మణిహారంగా మారుతోంది. అక్కడ ఎకరం భూమి బహిరంగ మార్కెట్లో రూ.50 కోట్లకుపైగా పలుకుతోంది. కానీ, చంద్రబాబు సర్కార్ మాత్రం కారుచౌకగా ఎకరం రూ.90 లక్షలకే అమ్మేస్తుండటం భూ దోపిడీకి అద్దం పడుతోంది. పైగా తిరుపతి వన్లో రూ.1,226.32 కోట్ల మొత్తం ప్రాజెక్టులో ఫేజ్–1, ఫేజ్–2 కింద రూ.400 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్టు.. ఇందులో ఫేజ్–1.. 2029 మార్చి–ఏప్రిల్ నాటికి, ఫేజ్–2 మార్చి/ఏప్రిల్ 2031 నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పడం చూస్తుంటే రియల్ ఎస్టేట్ దందా స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి దివ్యశ్రీ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ సిటీ బిల్డర్స్–డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు రెండూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాయి. ఈ సంస్థలు ‘తిరుపతి వన్’ ప్రాజెక్టులో భాగంగా ఇంటిగ్రేటెడ్ కల్చరల్, ఎంఐసీఈ (సమావేశాలు, ఇన్సెంటీవ్స్, సదస్సులు, ప్రదర్శనలు) డెస్టినేషన్ సెంటర్ను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. రూ.1,226.32 కోట్లు పెట్టుబడితో 1,500 మందికి ఉపాధి కల్పిస్తామని ఇందుకు 22 ఎకరాల భూమిని కోరాయి. ఈ భూమిని లీజుగా కాకుండా శాశ్వతంగా విక్రయించాలని కోరగా అందుకు ప్రభుత్వం అంగీకరించి అమ్మేస్తోంది. -
ఎస్ఐఆర్పై అలర్ట్గా ఉండాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కీలక నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ(మే 6, బుధవారం) జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యకులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో-ఆర్డినేషన్), రాష్ట్ర కార్యదర్శులు (కో-ఆర్డినేషన్) మెంబర్లతో ఆయన సమావేశమయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా సవరణ)పై మరింత అప్రమత్తంగా ఉండాలని.. 175 అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు దీనిపై మరింత అవగాహన పెంచుకోవాలి. అందుకు అవసరమైన టెక్నికల్ నాలెడ్జ్ను పెంచుకోవాలని సూచించారు. ‘‘ఎస్ఐఆర్ పేరుతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్కో రాష్ట్రంలో 90 లక్షలకు పైగా(బెంగాల్, తమిళనాడు)లో తొలగించడం జరిగింది. మనం వైఎస్సార్సీపీ ఓటర్లు, సానుభూతిపరుల ఓట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. ఒకసారి ఓటు తొలగిస్తే తిరిగి చేర్చడం ఇబ్బందికరం’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘వైఎస్సార్సీపీ ఓటర్లపై చంద్రబాబు, ఆయన టీమ్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. బీఎల్ఓలపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. కావున మన తరుపున ఉండే బీఎల్ఏలు కూడా సమర్థుడై, బీఎల్వోతో సమన్వయం చేసుకోవాలి. మనం ఎస్ఐఆర్ను అవకాశంగా తీసుకుని మన ఓటర్లను కాపాడుకోవాలి. బీఎల్ఓలు ఇప్పటికే మ్యాపింగ్ చేశారు.. కావున మనం ఏర్పాటుచేసుకున్న బీఎల్ఏలు కూడా అందుకు సన్నద్దంగా ఉండాలి. ఎస్ఐఆర్ మొదలయ్యోలోగా మనం అందుకు అవసరమైన విధంగా సిద్దంగా ఉండాలి. బీఎల్ఏలు సాంకేతికపరంగా ఎక్స్పర్ట్ అయి ఉండి అందరితో సమన్వయం చేసుకోవాలి. పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ సిద్దంగా ఉంటుంది. బీఎల్ఏలకు అవసరమైన ఓరియెంటేషన్ కూడా ఇద్దాం. మనం నిరంతరం దీనిపై దృష్టిపెడితే సార్వత్రిక ఎన్నికలను సులువుగా గెలవచ్చు. అంతేకాక స్ధానిక సంస్ధల ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనం విజయం సాధించవచ్చు. ఎస్ఐఆర్ పై చర్చ అనంతరం రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఈ వారంలో వచ్చేవారం ఆసుపత్రుల సందర్శన, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం వంటి కార్యక్రమాలను మనం షెడ్యూల్ చేసుకున్నాం. అందరితో సమన్వయం చేసుకుని ముందుకెళ్ళాలి.కమిటీల వెరిఫికేషన్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నడుస్తోంది, మీరు మరింత వేగవంతం చేయాలి. అందుకు అవసరమైన సపోర్టింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాలి. మనకు సంబంధించి ప్రతి కార్యక్రమం కూడా మీడియాలో, సోషల్ మీడియాలో హైలెట్ చేసుకోవాలి. మన ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మంచి, కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజల్లో ఎండగట్టాలి. చంద్రబాబు ప్రభుత్వ దోపిడీ, ఉన్మాదం, అవినీతి, రెడ్ బుక్ పాలనపై కూడా నియోజకవర్గాల్లో మీరు కార్యక్రమాల ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈ విషయంలో జిల్లా అధ్యక్షులు ప్రత్యేక దృష్టి పెట్టాలి.ఈ సమావేశంలో మాట్లాడిన కన్నబాబు, లేళ్ళ అప్పిరెడ్డి, వరికూటి అశోక్ బాబు, అబ్బయ్య చౌదరి, కొరుముట్ల శ్రీనివాసులు, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మల్లాది విష్ణు ఎస్ఐఆర్పై తమకు ఉన్న అవగాహన, అనుమానాలపై చర్చించి పార్టీ క్యాడర్ అంతా అప్రమత్తంగా ఉండాలని, ఎస్ఐఆర్ పూర్తయ్యేవరకు ఏ మాత్రం అజాగ్రత్త లేకుండా ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. -
యువ లాయర్పై హైకోర్టు జడ్జి ఆగ్రహం.. వీడియో వైరల్
ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఓ యువ న్యాయవాదిపై జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి తర్లాడ రాజశేఖర్రావు.. ఓ యువ న్యాయవాది చేసిన చిన్నపాటి తప్పిదం కారణంగా పోలీసు కస్టడీకి పంపాలంటూ ఆదేశించిన ఘటనపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.ఈ విషయంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ బీసీఐ.. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్కు లేఖ రాసినట్లు బార్ అండ్ బెంచ్ పేర్కొంది. ఆ యువ న్యాయవాది చేతులు జోడించి సారీ.. క్షమించాలంటూ వేడుకుంటుండగా.. న్యాయమూర్తి ఆగ్రహంతో పోలీసులను చర్య తీసుకోవాలని ఆదేశిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.. ఆ కస్టడీ ఉత్తర్వు అమలులోకి రాకముందే బార్ అసోసియేషన్ జోక్యంతో దానిని ఉపసంహరించుకున్నారు.Bar Council of India writes to CJI against over Andhra Pradesh High Court judge who sent lawyer to police custody pic.twitter.com/OVS9uPhVuU— Bar and Bench (@barandbench) May 6, 2026ఇది యువ న్యాయవాదులపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా అన్నారు. చివరికి బార్ అసోసియేషన్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది.What on earth is this?!! Is there something we are missing, that this lawyer could actually be arrested?? The Bar is due a fuller report. To start with. https://t.co/GU7N5Xur0t— Karuna Nundy (@karunanundy) May 6, 2026 -
శృంగారంలో అపశృతి.. నాలుక కొరికిన మహిళ..!
వైఎస్ఆర్(కడప)జిల్లా : ఒంటిమిట్ట మండలంలో ఓ దినపత్రిక (సాక్షి కాదు) విలేకరి రవిబాబు(పుచ్చకాయల వ్యాపారి) నాలుకను ఓ మహిళ కొరికి వేసిన సంఘటన ఒంటిమిట్ట హరిత హోటల్లో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై స్థానిక పోలీసులు విచారణ చేశారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే వివరాలు ఏమీ వెల్లడించలేదు. స్థానికుల సమాచారం మేరకు వివరాల్లోకి వెళితే.. కర్బూజ కాయల వ్యాపార క్రమంలో విలేకరి, ఆటో యజమానిలకు ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. విలేకరి రవి, ఆటో యజమాని ఒకరు ఆ మహిళతో కలిసి హరిత హోటల్కు చేరుకున్నారు. ఈ క్రమంలో అనుమతి లేకుండా, గది అద్దె తీసుకోకుండానే అక్రమంగా ప్రవేశించడానికి వీల్లేదని హరిత హోటల్ సిబ్బంది అడ్డుకున్నారు. అయితే విలేకరి పరపతితో ఎట్టకేలకు గదిలోకి ముగ్గురు వెళ్లారు. ముగ్గురూ మద్యం తాగారు. ఈ క్రమంలో శృంగార కార్యక్రమం నేపథ్యంలో విలేకరి నాలుకను మహిళ కొరికివేసింది. అయితే ఆ మహిళ ఇద్దరి చేతిలో జరుగుతున్న అఘాయత్యం నుంచి తప్పించుకునేందుకు ఉద్దేశ పూర్వకంగా కొరికి వేసిందా, కామక్రోధంతోనా అనే అనుమానాలు సర్వత్రా రేకెత్తుతున్నాయి. ఆ ప్రాంతం కొంత రక్తమయం అయింది. తీవ్ర భయాందోళనకు గురైన రవి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నారు. అక్కడికి వైద్యులు 108 ద్వారా కడప రిమ్స్కు రెఫర్ చేశారు. ఆటో డ్రైవర్ హరి ఆ తర్వాత మహిళతో శృంగారం పూర్తి అయిన తర్వాత ఆమెను ఒంటిమిట్ట రైల్వేస్టేషన్లో విడిచిపెట్టారు. ఇక ఆ మహిళ కనిపించకుండా పోయింది. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో ఒంటిమిట్టలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఆటో డ్రైవర్ హరిని అదుపులో తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఆటో డ్రైవరు హరి సంఘటన తర్వాత ఒంటిమిట్ట రైల్వేస్టేషన్లో విడిచిపెట్టిన మహిళ కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. ఆ మహిళ ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చారన్నది తెలియాల్సి ఉంది.వరుస వివాదాల్లో హరిత హోటల్ఒంటిమిట్ట హరిత హోటల్ వరుస వివాదాలయమంగా మారింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలోని హరిత హోటల్ భక్తులు, యాత్రీకులు సేద తీరేందుకు ఏర్పాటు చేస్తే, ఆ క్రమం ఇప్పుడు దారి తప్పింది. వరుస ఘటనలతో రచ్చకెక్కుతోంది. గత ఏడాది అధికార పారీ్టకి చెందిన కొందరు అక్రమ మట్టి తవ్వకాల కోసం దాడులు, ప్రతిదాడులు చేసుకున్న సంగతి తెలిసిందే. మందుబాబులకు నిలయంగా మారిన క్రమంలో మద్యం మత్తులో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అలాగే హరిత హోటల్లో పని చేస్తున్న దళిత యువకుడిపై, హోటల్ పక్కన కొంత మంది అగ్రవర్ణాలకు చెందిన యువకులు దాడి చేసిన సంగతి విదితమే.డివిజనల్ మేనేజరు ఏమంటున్నారంటే..ఇన్చార్జి మేనేజరు రాజశేఖర్రెడ్డిని జరిగిన సంఘటనపై డివిజనల్ మేనేజరు మల్లికార్జున గౌడ్ విచారణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనేజరుకు మోమో ఇచ్చామన్నారు. సిబ్బంది పాత్రపై ఆరా తీశామన్నారు. విచారణలో అలాంటిది ఏమీ లేదన్నారు. స్థానికంగా ఉన్న వారిని దరిచేయనీయవద్దని హెచ్చరించారు. -
వికటించిన పచ్చపార్టీ కుట్రలు
సాక్షి,విజయవాడ: పచ్చపార్టీ కుట్రలు విఫలమయ్యాయి. ఎర్రచందనం డాక్యుమెంటరీలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇరికించేందుకు చేసిన ప్రయత్నాలు బట్టబయలయ్యాయి. జావా డిస్కవర్ ఛానల్లో తప్పుడు కథనాలు ప్రసారమయ్యాయి. ‘ప్లానెట్ కిల్లర్స్’ డాక్యుమెంటరీని మార్చి, వక్రీకరించి జావా డిస్కవరీ ప్రసారం చేసింది.2021లో ‘బ్లడ్ శాండర్స్’ పేరుతో ప్రముఖ సీనియర్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని 2023లో ‘ప్లానెట్ కిల్లర్స్’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించబడింది. అయితే తాను చెప్పని, పుస్తకంలో లేని అంశాలను జావా డిస్కవరీ ప్రస్తావించడంపై ఉడుముల సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంస్థపై లీగల్ చర్యలు తీసుకుంటానని ఆయన ట్వీట్ చేశారు.‘ప్లానెట్ కిల్లర్స్’ డాక్యుమెంటరీ వెనుక ఎల్లో బ్యాచ్ ఉన్నట్లు బయటపడింది. అసలు రచయితే డాక్యుమెంటరీపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో టీడీపీ కుట్రలు వెలుగులోకి వచ్చాయి. Misleading Pictures and false linkage used in ‘tweaked’ edition of Planet Killers documentaryI want to clarify a few important points regarding the planet killers documentary which extensively used the contents in my book ‘Blood Sanders’.First English documentary version…— Sudhakar Udumula (@sudhakarudumula) May 6, 2026 -
‘అమరావతి పేరుతో చంద్రబాబు తప్పులపై తప్పులు’
సాక్షి, కాకినాడ జిల్లా: కలెక్టరేట్ వద్ద మాజీ ఎంపీ చింతా మోహన్ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిని ఎంత మంది ప్రజలు కోరుకుంటున్నారని చంద్రబాబును అడుగుతున్నా? అంటూ నిలదీశారు. కాసేపు అమరావతి దేవతల రాజధాని అంటాడు. మరికాసేపు మనుషుల రాజధాని అంటాడు. రేపు ఏ రాజధాని అంటాడో తెలియదు’’ అంటూ చింతా మోహన్ మండిపడ్డారు.రాజధాని ప్రాంతంలో కర్ర తుమ్మలు కొట్టడానికే రూ.40-50 కోట్లు ఖర్చు చేశారు. సచివాలయం భవనాలకు అద్దాలను బిగించేందుకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేయడం అవసరమా చంద్రబాబు?. రాష్ట్రం అప్పల్లో ఉంది.. చంద్రబాబు చాలా తప్పులు చేస్తున్నాడు. సచివాలయానికి రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఒంగోలు నుండి కూడా ఒక్కరు రావడం లేదు. రాజధానిని చంద్రబాబు తన సొంత ఆలోచనతో చేసుకుంటున్నాడు’’ అంటూ చింతా మోహన్ ధ్వజమెత్తారు. -
మూడు పార్టీలు కలిసి ఏమి ప్రయోజనం?
విశాఖపట్నం: సామాన్య ప్రజలకు మేలు జరగలేనప్పుడు, ఒక పార్టీని ఓడించేందుకు మూడు పార్టీలు కలిసి రావడంలో ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తూ నగరంలో ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి.‘సంఘమిత్ర సోషల్ సర్వీసెస్’ పేరిట జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన పార్టీలే చేతులు కలపడం ఎందుకని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశాన్ని ప్రభావితం చేస్తున్న 11 ప్రధాన సమస్యలను కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఈ మూడు పార్టీలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనీసం ఒక్కో పార్టీ ఒక్క సమస్యనైనా పరిష్కరించి చూపించాలని ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. -
‘చెప్పు’కోదగ్గ వ్యక్తి
కర్నూలు జిల్లా: చెప్పుల్లేకుండా ఎండలో నడుస్తున్న ఈయన పేరు బోయ బెనకప్ప. హొళగుంద మండలం సమ్మతగేరి గ్రామానికి చెందిన ఈయనకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు ఉంది. పొలానికి వెళ్లినా, వివిధ పనులకు వేరే ప్రాంతానికి వెళ్లాలన్నా 65 ఏళ్ల వయస్సులోనూ ఇలాగే చేస్తున్నారు. సోమవారం చెప్పులు లేకుండా కాలినడకన తన గ్రామం నుంచి 6 కి.మీ. దూరంలో ఉండే హొళగుంద వచ్చారు. గతంలో ఉగాది పండుగను పురస్కరించుకుని శ్రీశైల మల్లన్న దర్శనానికి హొళగుంద నుంచి 200 కి.మీ. వరకు ఇలాగే కాలినడకన వెళ్లారు. కాళ్లకు బొబ్బలు అయినా బెదర లేదు. ఎండాకాలంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలో చెప్పుల్లేకుండా నడుస్తున్న ఇతనని చూసిన వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. -
భార్య వివాహేతర సంబంధం.. కిరాతకంగా హత్య చేసిన భర్త!
కృష్ణా జిల్లా: భార్య మరొకరితో సహజీవనం చేస్తోందని తెలుసుకుని ఆమెను అతి కిరాతకంగా ఇనుప రాడ్డుతో మోది హతమార్చిన ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నామని గుడివాడ డీఎస్సీ పి.శ్రీనివాస్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం డీఎస్పీ నిందితుల వివరాలను వెల్లడించారు. దిమ్మిటి ప్రసన్నకుమారి(30) తన భర్త మురళీ కృష్ణతో వివాదాల కారణంగా భర్తను వదిలేసి మరో వ్యక్తితో పామర్రులో సహజీవనం చేస్తోంది. తనతో కాపురం చేయకుండా కుటుంబ పరువు తీస్తున్నట్లుగా భావించిన మురళీకృష్ణ తన అన్నదమ్ములను వెంట బెట్టుకుని ఈనెల 4వ తేదీ ఉదయం రెండు బైక్లపై పామర్రు వచ్చాడు. ప్రసన్నకుమారి ఉంటున్న ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి ఆమెను ఇనుప రాడ్డుతో మోది చంపాడు.అనంతరం నిందితులు అక్కడ నుంచి పారిపోతూ దుస్తులు, ఆమెను చంపడానికి ఉపయోగించిన ఇనుపరాడ్డును గుడివాడ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన పోదలలో పడవేసి వెళ్లి పోయారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి గోళ్ల రాజారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లక్ష్మీప్రసన్న కుమారిని తన అల్లుడు మురళీ కృష్ణ, అన్నయ్య రాంబాబు, మరో తమ్ముడు నాగేశ్వరరావు అలియాస్ చంటి తన అన్నయ్య రాంబాబు కుమారుడు మైనర్ అయిన మరో వ్యక్తితో కలిసి తన కుమార్తెను ఇనుప రాడ్డుతో కొట్టి చంపినట్లుగా ఆ రిపోర్టులో పేర్కొన్నారు.దీనిపై అప్పటి పామర్రు ఇన్ఛార్జి గుడివాడ టూ టౌన్ సీఐ హనీష్ కొంది మంది సాక్షులను విచారించగా తదుపరి పామర్రు సీఐగా బాధ్యతలు స్వీకరించిన సీహెచ్ నాగ ప్రసాద్ విచారణను కొనసాగిస్తూ మరి కొందరు సాక్షులను విచారించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పామర్రు నుంచి గుడివాడ వెళ్లే రోడ్డులో కొత్తూరు దాటిన తర్వాత కొడాలి రామేశ్వరరావు మునగతోట పక్కన నిందితులు వారు దాచిన ఇనుప రాడ్డు బట్టలు వెతుకుతుండగా, పామర్రు సీఐ సీహెచ్ నాగప్రసాద్, ఎస్ఐ కె.శ్రీనివాస్ సిబ్బందితో వెళ్లి నిందితులను పట్టుకున్నారు. ఇనుపరాడ్డు, దుస్తులు, వారు వాడిన ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. నిందితులను తదుపరి విచారణ కోసం కోర్టులో హాజరు పరుస్తామన్నారు. నిందితులపై రౌడీ షీట్ తెరుస్తామని డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పామర్రు సీఐ, ఎస్ఐలను ఆయన అభినందించారు.


