ఒంటిమిట్ట: వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో బుధవారం సీతారామలక్ష్మణుల ఉత్సవ విగ్రహాలకు పారిశ్రామికవేత్త పుట్టంరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఆయన సతీమణి లక్ష్మీదేవి రూ.2.85 కోట్ల విలువైన 2.241 కిలోల స్వర్ణ కిరీటాలను సమర్పించారు.
దాతలకు ఆలయ అధికారులు లాంఛనాలతో స్వాగతం పలికి, స్వర్ణ కిరీటాలతో ఆలయ ప్రదక్షణ చేయించి, గర్భాలయంలోని మూల విరాట్ చెంత కిరీటాలను ఉంచి ప్రత్యేక పూజలను చేశారు. అనంతరం వారు తీసుకొచ్చిన స్వర్ణ కిరీటాలను ఆలయ ఇన్చార్జి డిప్యూటీ ఈవో ఎ.శివప్రసాద్కు అందజేశారు.


