breaking news
Maharashtra
-
మూడు రోజులు ఫ్రీ ఫుడ్ : పోటెత్తిన జనం
బెంగళూరుకు చెందిన ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe) ముంబై నగరంలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన తొలి అవుట్లెట్ని ముంబైలోని ఈరోస్, చర్చ్గేట్లో మార్చి 2న ప్రారంభించింది ఈ సందర్భంగా ముంబై వాసుల కోసం కేఫ్ యాజమాన్యం ఒక అద్భుతమైన ఆఫర్ను ప్రకటించింది.రామేశ్వరం కేఫ్ పట్ల ఉన్న క్రేజ్తో ముంబై ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.ముంబైలో తన అరంగేట్రాన్ని పురస్కరించుకుని, రామేశ్వరం కేఫ్ నాలుగు రోజుల పాటు ఉచిత ఫుడ్ అంటూ ఇన్స్టాలో ప్రకటించింది. మార్చి 2 నుండి మార్చి 5వ తేదీవరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉచిత ఫుడ్ అందివ్వనున్నట్టు ప్రకటించారు. రుచికరమైన భోజనాన్ని ఉచితంగా ఆస్వాదించేందుకు వందలాదిమంది బారులు తీరారు. సూర్యాస్తమయం దాటిన తర్వాత కూడా ప్రజలు తమ వంతు కోసం ఓపికగా ఎదురుచూడటం విశేషం. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట సందడిగా మారాయి.ఇదీ చదవండి: కెనడాలో భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్య Hehe…for that 1 FREE dish 😄😄😄@RameshwaramCafe u really need this & those social influencers? Really? pic.twitter.com/ro6pquBCYU— Neeta Kolhatkar (@neetakolhatkar) March 3, 2026 రామేశ్వరం కేఫ్రామేశ్వరం కేఫ్ రామేశ్వరం కేఫ్ను 2021లో బెంగళూరులో భార్యాభర్తల ద్వయం రాఘవేంద్రరావు , దివ్య రాఘవేంద్రరావు స్థాపించారు. సాంప్రదాయ వంటకాలతో ప్రజాదరణ పొందింది. దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జన్మస్థలానికి నివాళిగా, దక్షిణ భారత రుచులను , వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ కేఫ్కు "రామేశ్వరం" అని పేరు పెట్టారు. View this post on Instagram A post shared by SANJAY | The Travel Freak 🇮🇳 (@sanjay_thetravelfreak) -
మూడేళ్లకు రూ. 74 లక్షలు : నటి లగ్జరీ ఫ్లాట్ డీల్ హాట్ టాపిక్
ముంబైలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో గోరేగావ్ ఒకటి. ఆధునిక హై-రైజ్అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువగా ఉండటంతో ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తలు ఇక్కడ నివసించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి సుష్మితా సేన్ (Sushmita Sen), ఆమె తల్లి సుబ్రా సేన్ ముంబైలో తమ అపార్ట్మెంట్ను అద్దెకు ఇవ్వడం వార్తల్లో నిలిచింది. దీని నెలవారీ అద్దె రూ. 1.95 లక్షలతో 36 నెలల (3 ఏళ్లు) లీజ్ కిచ్చారు. అంటే ఈ ప్రాపర్టీ ద్వారా మొత్తం మూడేళ్లకు గాను సుమారు 74 లక్షలు (73.76 లక్షలు) ఆదాయం సమకూరనుందిఈ లగ్జరీ ఫ్లాట్ గోరేగావ్లోని ప్రముఖ 'ఓబెరాయ్ ఎక్స్క్విజిట్' (Oberoi Exquisite) ప్రాజెక్ట్లో ఉంది. లీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) వెబ్సైట్లో స్క్వేర్ యార్డ్స్ సమీక్షించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం. ఈ ఒప్పందం అధికారికంగా ఫిబ్రవరి 2026లో నమోదు చేయబడింది. దీని ప్రకాం సెక్యూరిటీ డిపాజిట్ కింద 6 లక్షలు కాగా, స్టాంప్ డ్యూటీ కింద రూ.18,900, రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద 1,000 చెల్లించారు. ప్రతి ఏటా 5శాతం మేర అద్దె పెరుగుతుంది.ఈ ప్రాపర్టీ ప్రత్యేకతలు విషయానికి వస్తే కార్పెట్ ఏరియా 996 చదరపు అడుగులతో కలిపి మొత్తం ఏరియా 1,241 చదరపు అడుగులు. ఇందులో రెండు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: సీమంతం వేడుకలో భార్యకు సర్ప్రైజ్, వైరల్ వీడియోసుస్మితా సేన్ గుర్తించి సంక్షిప్తంగా1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా సుస్మితా సేన్ చరిత్ర సృష్టించారు. 'బీవీ నంబర్ 1', 'మై హూ నా' వంటి సినిమాలతో మెప్పించిన సుస్మితా సేన్ ఇటీవల 'ఆర్య', 'తాళి' వంటి వెబ్ సిరీస్లతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.(విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్) -
ముంబై మహానగరంలో ‘గరీబీ దర్శన్’
ముంబై: ముంబై మహానగరం.. ఎంతో మందికి కలల నగరం. ఆకాశన్నంటుకునే భవనాలున్నట్టే.. అత్యంత పేదరికంలోని మురికి వాడలూ ఉన్నాయి. అందులో అందరికీ తెలిసింది ధారావి. ఇక్కడి పేదరికమే అమ్మకపు సరుకు. దాన్ని డాలర్లకు అమ్ముతున్నారు స్తానికులు. మన దేశంలో మురికి వాడల పర్యాటకం ఎప్పటినుంచో ఉంది. కానీ ఇప్పుడు ధారావి ‘గరీబీ దర్శన్’కో (Gareebi darshan) ప్రత్యేకత ఉంది. అది ధనిక ముంబైకర్లకే కాదు.. పేద ధారావి వాసులకూ ఆదాయాన్ని తెచ్చి పెడుతోంది. ధారావి ఇరుకు గల్లీల్లో విదేశీయులను ఓ రెండు గంటలు తిప్పితే చాలు.. రూ.15 వేల రూపాయలు మీ చేతికొస్తాయి. అవును.. ఒకప్పుడు ఇలాంటి పర్యటనలను శిక్షణ పొందిన గైడ్లే నిర్వహించేవారు. అదంతా వ్యవస్థీకృతంగా ఉండేది. కానీ ఇప్పుడు గైడ్లు ధారావి నిర్వాసితులు. ఎందుకంటే కిలోమీటర్ల మేర, మూడు అడుగుల వెడెల్పు మాత్రమే ఉన్న ఇరుకైన గల్లీలలో చాలా సులభంగా తీసుకెళ్లగలిగేది, బయటికి తీసుకురాగలిగేది వారు మాత్రమే. అలా తీసుకెళ్లి, ధారావిని చూపించి, క్షేమంగా బయటపడేసినందుకు వారు చేసే ఛార్జ్ ఒక్కొక్కరికి రూ.15,000. ఒక్కోసారి బృందాలుంటాయి.ఐదుగురు సభ్యులున్న బృందం వస్తే.. రూ.75 వేల రూపాయలు చేతికొచ్చినట్టే. ఇదో కార్పొరేట్ ఉద్యోగి నెల జీతం. ఒకప్పుడు గైడ్లకే పరిమితమైన ఈ వ్యాపారాన్ని ధారావికర్లు (Dharavikars) స్వయంగా చేస్తున్నారు. అయితే ఇలా మురికివాడలను చూడటానికి కేవలం విదేశీయులే రావడం లేదు.. ఇలాంటి చోట్లకు ఎప్పుడూ వెళ్లని కొందరు ముంబై వాసులు.. దేశంలోని ఇతర ప్రాంతాల వాళ్లూ ఆసక్తి చూపుతున్నారు. అయితే అలాంటి పర్యటనకు మన దేశం వాళ్లు వెళ్లే మాత్రం రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది. ‘వాయూరిజం’ అని పిలిచే ఈ పర్యాటకం ధారావి వాసులకు ఆదాయ మార్గమైంది. తమ ఇంటిని చూపించే.. ఇల్లు గడుపుతున్నారు. అయితే అక్కడి పరిస్థితుల ఫొటోలు తీసుకోవాలంటే మాత్రం వారి అనుమతి తీసుకోవాలి. అయితే ప్రారంభంలో ధారావికి సందర్శకులను తీసుకెళ్లే ఆలోచనను చాలా మంది వ్యతిరేకించారు. ఇది పేదరిక పర్యాటకంలా అనిపించింది. ఒకరి ఆకలి, పేదరికం మరొకరికి దర్శనీయం కావడం ఇబ్బందిగా అనిపించింది. కానీ.. యూరోపియన్ సామాజిక కార్యకర్త క్రిస్ వే, కృష్ణ పూజారి 2005లో ప్రారంభించిన రియాలిటీ టూర్స్ ఆలోచనా తీరును మార్చింది. గైడ్స్గా స్థానిక విద్యార్థులుంటే.. వారికి చదువుకోసం డబ్బు వారే సంపాదించుకోవచ్చని కొత్త ఆలోచనతో ‘ధారావి’ నడక ప్రారంభించారు. అలా ధారావిలో మురికివాడల పర్యాటకం ఒక కుటీర పరిశ్రమగా మారింది. ఇప్పుడు పనికొచ్చే రెండు ఇంగ్లిష్ మాట్లాడగలిగేవాళ్లు.. గైడ్గా మారిపోవచ్చు. అయితే, ధారావి పునరాభివృద్ధి తరువాత ఈ పరిస్థితిపై అనిశ్చితి ఉంది. -
సిక్కులకు న్యాయం కోసం కృషి
నవీ ముంబై: సిక్కులకు గౌరవం, న్యాయం దక్కేలా కృషి చేసేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధాని మోదీ చెప్పారు. అందుకే, 1984లో ఇందిర మరణానంతరం సిక్కులపై జరిగిన దాడులపై ప్రత్యేక విచారణ జరిపేందుకు తమ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిందన్నారు. మూసివేసిన ఎన్నో కేసులను తిరిగి తెరిచి, విచారణ చేపట్టామని తెలిపారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందజేశామన్నారు. జాతీయ మైనారిటీ కమిషన్లో సిక్కులకు మరింత ప్రాముఖ్యతను కల్పించామన్నారు. గురు తేజ్ బహదూర్ అమరత్వం పొంది 350 ఏళ్లయిన సందర్భంగా ముంబైలోని ఖర్గార్లో ఆదివారం జరిగిన ‘హింద్–ది–చదర్’ను ఉద్దేశించి ప్రధాని వర్చువల్గా మాట్లాడారు. అఫ్గానిస్తాన్లో పవిత్ర గురుగ్రంథ్ సాహిబ్ ప్రతులు, సిక్కు కుటుంబాల భద్రత ప్రమాదంలో పడగా ప్రభుత్వం తక్షణమే స్పందించి సురక్షితంగా స్వదేశానికి తరలించిందని గుర్తు చేశారు. అఫ్గాన్లో యాతనలు పడిన సిక్కులకు సీఏఏ ద్వారా పౌరసత్వం కల్పించామని తెలిపారు. జమ్మూకశ్మీర్కు చెందిన సిక్కు కుటుంబాల పునరావాసానికి చర్యలు తీసుకున్నట్లు గుర్తు చేశారు. వేలాది మంది సిక్కుల పేర్లను బ్లాక్ లిస్టు నుంచి తొలగించడంతోపాటు వీసా నిబంధనలను సడలించినట్లు ప్రధాని వివరించారు. భవిష్యత్తుకు బాటలు పరిచేవి..హింద్–ది–చాదర్ వంటి కార్యక్రమాలు కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడానికి కాకుండా భవిష్యత్తుకు దారులు వేస్తాయన్నారు. ‘గురు తేజ్ బహదూర్ కాలంలో ధైర్యం, సత్యసంధతకు ఎంతటి ప్రాముఖ్యం ఉందో, నేటికీ అంతే సందర్భోచితంగా ఉంది. మన కొత్త తరం ఇటువంటి విలువలని అందిపుచ్చుకున్నప్పుడు, సంప్రదాయం అనేది కేవలం ఒక జ్ఞాపకంలా మిగిలిపోదు; అది భవిష్యత్తుకు మార్గదర్శకంగా మారుతుంది. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం కూడా ఇదే. మనం చరిత్రను కేవలం స్మరించుకోవడమే కాదు, దానిని మన జీవితాల్లోకి కూడా తెచ్చుకోవాలి’అని ప్రధాని మోదీ తన వర్చువల్ ప్రసంగంలో పేర్కొన్నారు.మన గురువుల త్యాగాలు..దేశ చరిత్ర పరాక్రమం, సమన్వయం మరియు సహకారంతో నిండి ఉందని ఆయన అన్నారు. గురువుల అత్యున్నత త్యాగం దేశ ఐక్యతను మరింత బలోపేతం చేసిందని ప్రధాని చెప్పారు. సమాజంలోని ప్రతి వర్గం వారి నుంచి స్ఫూర్తిని పొందిందని, అది సమాజం సత్య మార్గంలో ముందుకు స్థిరంగా సాగడానికి సాయపడిందని ప్రధాని తెలిపారు. ‘దేశానికి సామాజిక ఐక్యత ఎంతో అవసరమైన ఈ సమయంలో, మన గురువులు, సాధువుల ఆశీస్సులు మనకు ఉన్నాయనే నమ్మకాన్ని ఈ కార్యక్రమం కలిగిస్తోంది. ఈ ప్రయాణం గత ఏడాది నాగ్పూర్ నుంచి ప్రారంభమైంది, ఆ తర్వాత నాందేడ్ వరకు సాగింది. నేడు నవీ ముంబైలో ఈ ప్రయాణం ఒక ముఖ్యమైన దశకు చేరుకుంది’అని ప్రధాని అన్నారు. -
నాగ్పుర్లో భారీ పేలుడు.. 15 మంది మృతి
నాగ్పుర్: మహారాష్ట్రలోని నాగ్పుర్లో భారీ పేలుడు సంభవించింది. కటోల్లోని పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమ ఎస్బీఎల్ (SBL) కంపెనీలో ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నాగ్పూర్లోని ఆరెంజ్ సిటీ ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి సహాయక చర్యలు జరుగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాముందని అధికారులు భావిస్తున్నారు.ఈ పరిశ్రమలో డిటోనేటర్లతో పాటు భూకంప పేలుడు పదార్థాలు తయారు చేస్తారని స్థానికులు తెలిపారు. పేలుడు సంభవించిన సమయంలో, 30 మందికి పైగా పరిశ్రమలో పని చేస్తున్నారని తెలిపారు. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే జిల్లా అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ బృందాలు మంటలను అదుపు చేస్తున్నాయి. -
మహారాష్ట్రలో పేలుడు.. 15 మంది మృతి
ముంబై: మహారాష్ట్రలో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. నాగపూర్లోని పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమ ఎస్బీఎల్ (SBL) ఎనర్జీ లిమిటెడ్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా దాదాపు 15 మంది చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగపూర్లోని కటోల్లో ఎస్బీఎల్ (SBL) ఎనర్జీ లిమిటెడ్లో ఆదివారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు స్థానిక అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.అయితే, ప్రమాదం జరిగిన పరిశ్రమలో డిటోనేటర్లు, కాస్ట్ బూస్టర్లు, భూకంప పేలుడు పదార్థాలు తయారు చేస్తారని స్థానికులు వెల్లడించారు. ఉదయం ఇందులోని ఒక యూనిట్లో అకస్మాత్తుగా పేలుడు సంభవించిందని, ఆ సమయంలో, 30 మందికి పైగా ఉద్యోగులు వివిధ యూనిట్లలో పనిచేస్తున్నారని తెలిపారు. దీంతో, మరణాల సంఖ్యలో పెరిగే అవకాశం ఉంది. -
కూటమిలో మహా చిచ్చు
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే నెలల్లో జరగనున్న రాజ్య సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో విపక్ష కూటమైన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లో రాజకీయ చిచ్చు రేగుతోంది. విపక్ష కూటమికి దక్కే ఒకే ఒక్క సీటుపై అటు ఎన్సీపీ (శరద్ పవార్), ఇటు శివసేన (ఉధ్దవ్ బాల్ఠాక్రే) పార్టీలు పట్టుబడుతుండటంతో వివాదం ముదురుతోంది. అత్యధిక సీట్లున్న తమకే రాజ్యసభ సీటు దక్కాలని పవార్ వర్గం బలంగా డిమాండ్ చేస్తోంది. ఏదో ఒక నిర్ణయం చెప్పాల్సిన కూటమిలోని కాంగ్రెస్ మౌనంగా ఉండిపోవడం ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేస్తోంది. ఎవరికి వారే..: మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, 7 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఒక రాజ్యసభ సీటుకు 37 ఓట్లు అవసరం కాగా, ప్రస్తుతం 235 సీట్లున్న ఎన్డీయేకు 6 స్థానాలు దక్కడం ఖాయం. మిగతా ఒక్క స్థానం మాత్రమే విపక్షాలకు దక్కనుంది. విపక్ష కూటమి అయిన ఎంవీఏలో సేన యుబీటీకి 20, కాంగ్రెస్కు 16, శరద్ పవార్ వర్గానికి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న పవార్ వర్గానికి చెందిన ప్రియాంక చతుర్వేదిని తిరిగి కొనసాగించాలని ఆ పార్టీ మొదట డిమాండ్ చేసింది. అయితే గతంలో రాజ్యసభ ఎన్నికలకు మళ్లీ పోటీ చేయనని గతంలో ప్రకటించిన శరద్ పవార్, తాజా పరిణామాల నేపథ్యంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నా రు. ఎన్సీపీ నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మర ణం తర్వాత మనసు మార్చుకున్న శరద్ పవార్ రాజ్యసభ కు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పవా ర్ పార్టీ ఈ సీటు కోసం పట్టుబడుతోంది. దీనిపై పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే సైతం స్పందిస్తూ, ‘పవార్ రాజ్యసభకు వెళ్లాలన్నది పార్టీలో అందరి కోరిక’అని వ్యా ఖ్యానించారు. ఈ విషయమై ఆమె కాంగ్రెస అగ్రనేతలతో మంతనాలు సైతం ప్రారంభించారు. ఈ సమయంలోనే సేన యూబీటీ నేతలు పవార్ ఆరోగ్యాన్ని చర్చకు పెట్టారు. వృధ్ధాప్య సమస్యలతో తరుచూ ఆస్పత్రి పాలవుతున్న పవార్ నుంచి ప్రజా ప్రతినిధిగా ఏం ఆశించగలం అంటూ యూబీటీ నేతలు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు. యూబీటీ నేత ఆదిత్య ఠాక్రే సైతం ఈ సీటుపై తమకే మొదటి హక్కు ఉందంటున్నారు. కూటమిలో విభజన వచ్చేలా మాటల మంటలు రేగుతున్నా కాంగ్రెస్ మాత్రం మౌనంగానే ఉంది. అభ్యర్థిత్వంపై ఇప్పటివరకు స్పష్టమైన వైఖరి ప్రకటించలేదు. రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ మాట్లాడుతూ, కూటమి భాగస్వాములు కలిసి అభ్యర్థిని నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ పరిణా మాలతో శివసేన యుబీటీ, శరద్ పవార్ వర్గాల మధ్య సర్దుబాటు ఎలా కుదురుతుందో చూడాల్సి ఉంది. ఈ నిర్ణయం కూటమి భవిష్యత్తుపైనా ప్రభావం చూపే అవకాశం ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి. -
నిర్లక్ష్యం, కుట్రకోణంలోనూ దర్యాప్తు
పుణె/ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రాణాలను బలి తీసుకున్న బారామతి విమాన ప్రమాదం ఘటనలో ప్రధానంగా నిర్లక్ష్యం, కుట్ర కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు రాష్ట్ర నేర పరిశోధన విభాగం(సీఐడీ) గురువారం తెలిపింది. జనవరి 28న జరిగిన విమాన ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ తన వాంగ్మూలమిచ్చారు. ఆ ప్రమాదం జరిగిన పరిస్థితులను ఆయన మొదటి నుంచీ ప్రశి్నస్తున్నారు. వీఎస్ఆర్ సంస్థ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశం గురువారం రాష్ట్ర శాసన మండలిలోనూ ప్రస్తావనకు వచ్చింది. ప్రమాద ఘటనకు దారి తీసిన అన్ని అంశాలను సభ ముందుంచాలని ప్రభుత్వానికి కౌన్సిల్ చైర్మన్ సూచించారు. ఈ నేపథ్యంలో సీఐడీ అదనపు డీజీపీ సునీల్ రామానంద్ మీడియాతో మాట్లాడారు. బారామతి విషాద ఘటనపై శాస్త్రీయ పద్ధతిలో సవివరమైన దర్యాప్తు జరుగుతోందని వివరించారు. ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందా లేక నేరపూరిత నిర్లక్ష్యం దాగుందా అనేది తేలుస్తామని చెప్పారు. ఈ ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాసిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) ప్రాథమిక నివేదిక అందాక ఆ వివరాలను కూడా చేరుస్తామని వివరించారు. నేర పూరిత కోణం దాగుంటే కేసు నమోదు చేస్తామని కూడా ఆయన అన్నారు. ఇలా ఉండగా, అజిత్ పవార్ అన్న కుమారుడు రోహిత్ పవార్ గురువారం పుణెలో సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి అధికారులకు తన వాంగ్మూలం ఇచ్చారు. వీఎస్ఆర్ వెంచర్స్పై కేసు నమోదు చేయాలని సీబీఐ అధికారులను కోరినట్లు అనంతరం ఆయన మీడియాకు వెల్లడించారు. వీఎస్ఆర్ వెంచర్స్కు చెందిన విమానాలను నిలిపివేయాలంటూ మంగళవారం డీజీసీఏ ఆదేశాలిచ్చిన అంశంపై సీఐడీ మౌనంగా ఉండటంపై అనుమానం వ్యక్తం చేశారు. అజిత్ పవార్ తదితరుల మృతికి కారణమైన లేజర్జెట్ 45 విమానం వీఎస్ఆర్ వెంచర్స్ కంపెనీదేనని ఆయన చెప్పారు. ఈ కంపెనీకి ఆంధ్రప్రదేశ్లోని అధికార టీడీపీతో సంబంధాలున్నాయని ఆరోపించారు. ప్రమాదానికి బాధ్యత వహిస్తూ టీడీపీకే చెందిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. రోహిత్ పవార్, మరో నేత యోగేంద్ర పవార్తో కలిసి వీఎస్ఆర్ వెంచర్స్పై బారామతి తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీఎస్ఆర్ వెంచర్స్, ఆ సంస్థ డైరెక్టర్లపై బుధవారం ఆయన ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీస్స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు. -
పండ్లపై ఎలుకల మందు.. షాకవుతున్న జనం!
ముంబై: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పండ్ల వ్యాపారుల ఉదంతం వెలుగు చూపింది. అత్యంత ప్రమాదకరమైన ఎలుకల మందును పండ్లపై పూస్తున్న ఇద్దరు వ్యాపారులను ముంబైలోని మలాడ్ వెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో స్థానికంగా కలకలం రేపింది. మలాడ్ పశ్చిమ ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉన్న పండ్ల దుకాణం వద్ద ఒక వ్యాపారి అరటి పండ్లపై ‘రాటోల్’ అనే క్రీమ్ తరహా విషపూరిత పదార్థాన్ని రాస్తుందటం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది.ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వ్యాపించడంతో భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన మలాడ్ పోలీసులు సదరు పండ్ల దుకాణంపై దాడి చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా ఘటనా స్థలంలో ‘రాటోల్’ అనే ఎలుకల మందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మందులో ‘ఎల్లో ఫాస్ఫరస్’ వంటి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయని అధికారులు తెలిపారు. నిందితులను మలాడ్ వెస్ట్లోని రాజన్పాడకు చెందిన మనోజ్ సంగంలాల్ కేసర్వానీ (42), రాహుల్ సదన్ లాల్ కేసర్వానీ (25)గా గుర్తించి, వారిపై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. मालाडमध्ये परप्रांतीय फळ विक्रेताचा बेजबाबदारपणा शिखरावर! फळांवर Ratol सारखी क्रीम लावून थेट मुंबईकरांच्या जीवाशी खेळ. Ratol सारखे विषारी पदार्थ वापरल्याने उलटी, पोटदुखी, विषबाधा, लिव्हर नुकसान आणि जीवाला धोका निर्माण होऊ शकतो. या विक्रेत्यावर कार्यवाही झालीच पाहिजे.#MNS #mybmc pic.twitter.com/RFtulkwO4h— शेख जब्बार (राजसाहेबांचा जब्बार) | SHAIKH JABBAR (@jabbarsmns) February 24, 2026బుధవారం వీరిని బోరివలిలోని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఆ పండ్ల దుకాణాన్ని పోలీసులు సీజ్ చేశారు.పోలీసుల విచారణలో నిందితులు విస్తుపోయే వివరాలు వెల్లడించారు. రాత్రి వేళల్లో ఎలుకలు తమ పండ్ల స్టాక్ను పాడు చేయకుండా ఉండేందుకే తాము ఆ మందును పూస్తున్నామని, వినియోగదారులకు హాని చేయాలనే ఉద్దేశ్యం తమకు లేదని వారు అన్నారు. కాగా ఆహార పదార్థాలపై ఇటువంటి విషపూరిత రసాయనాలను వాడటం క్షమించరాని నేరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.ఎల్లో ఫాస్ఫరస్ వంటి రసాయనాలు శరీరంలోకి చేరితే వాంతులు, తీవ్రమైన కడుపునొప్పి, కాలేయ సంబంధిత వ్యాధులు సంభవించడమే కాకుండా, అవయవాలు వైఫల్యం చెంది ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని వారు వివరిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA), బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు నగరవ్యాప్తంగా పండ్ల దుకాణాలపై నిఘా ఉంచాలని, తనిఖీలను ముమ్మరం చేయాలని ముంబై వాసులు కోరుతున్నారు.ఇది కూడా చదవండి: మోదీ స్టైల్లో నెతన్యాహు.. అంతటా ఇదే చర్చ! -
ఎఫ్ఐఆర్ నమోదు చేయరేం!
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మ రణానికి కారణమైన విమాన ప్రమాద ఉదంతంపై అను మానాలు నానాటికీ బలపడుతున్నాయని ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ అన్నారు. ఆ దుర్ఘటనపై కేసు నమోదు చేయడానికి ముంబై పోలీసులు నిరాకరించడమే ఇందుకు తాజా నిదర్శనమని ఆయన చెప్పారు. ఈ ఉదంతా నికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, యంత్రాంగం ఎవరినో కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు బుధవారం ఎక్స్లో రోహిత్ పలు పోస్టులు పెట్టారు.‘‘అజిత్ ప్రయాణించిన లియర్జెట్ 45 (వీటీ–ఎస్ఎస్కే) విమానం సొంతదారైన వీఎస్ఆర్ వెంచర్స్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని డీజీసీఏ మంగళవారం తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. దాంతో ఈ ఉదంతంపై కేసు నమోదు చేసి ఎఫ్ఐ ఆర్ దాఖలు చేయాల్సిందిగా సహచర ఎమ్మెల్యేలు అమోత్ మిత్కరీ, సందీప్ క్షీర్సాగర్, నేను మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి డిమాండ్ చేశాం.కానీ ఎఫ్ ఐఆర్ నమోదుకు పోలీసులు నిరాకరించారు. లాంఛ నంగా మా ఫిర్యాదును స్వీకరించడంతో సరిపెట్టారు. విమా న ప్రమాదంపై మాకిప్పటికే ఉన్న అనుమానాలను పోలీ సుల తీరు మరింత బలపరుస్తోంది’’ అని పేర్కొన్నారు. అజి త్ విమాన ప్రమాదంపై ఎఫ్ఐఆర్ దాఖలుకు డిమాండ్ చేసే ందుకు గురువారం ఉదయం బారామతి పోలీస్ స్టేషన్ కు వెళ్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రోహిత్ ఫిర్యాదు ను దర్యాప్తు నిమిత్తం సీఐడీకి పంపినట్టు పోలీసులు తెలి పారు.వెనకేసుకొచ్చిన వైమానిక మంత్రివీఎస్ఆర్ వెంచర్స్కు క్లీన్చిట్ ఇచ్చేందుకు డీజీసీఏ తొలుత ప్రయత్నించిందంటూ రోహిత్ ఆగ్రహం వెలిబుచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా వీఎస్ఆర్ సంస్థను వెనకేసుకొచ్చారని ఆయన ఆరోపించారు. విమానంలో భద్రతా లోపాలేవీ లేవని, అన్ని పరీక్షల తర్వాత దానికి డీజీ సీఏ అనుమతులిచ్చిందని చెప్పారని గుర్తు చేశారు. ‘‘ఆ విమానంలో లోపాలున్నట్టు ఇప్పుడు డీజీసీఏ చెబుతోంది. అయినా అనుమతులిచ్చిందంటే ఇందులో ఆ సంస్థ తప్పు కూడా ఉన్నట్టే’’ అంటూ దుయ్యబట్టారు.వీఎస్ఆర్ సంస్థకు చెందిన నాలుగు విమాన సర్వీసులను తక్షణం నిలిపే యాలని డీజీసీఏ మంగళవారం ఆదేశించడం తెలిసిందే. ఇది తమ పోరాటానికి లభించిన పాక్షిక విజయమని రోహిత్ అన్నారు. ‘‘కానీ వీఎస్ఆర్ తప్పిదాలకు మా నాయకుడు బలయ్యారు. ఏదో ఒకనాటికి అజిత్ కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. వీఎస్ఆర్కు చెందిన ఇతర విమాన సర్వీసులను ఎందుకు కొనసాగి స్తున్నారని డీజీసీఏను ప్రశ్నించారు. వాటన్నింటినీ తక్షణం నిలిపేయాలని డిమాండ్ చేశారు.రామ్మోహన్ రాజీనామా చేయాల్సిందేవీఎస్ఆర్ వెంచర్స్కు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలతో సన్నిహిత వ్యాపార సంబంధాలున్నాయని రోహిత్ పవార్ ఆరోపించారు. వీటన్నింటిపైనా లోతుగా దర్యాప్తు జరగాలన్నారు. పౌర విమాన యాన మంత్రి రామ్మోహన్నాయుడుది కూడా అదే పార్టీ అని గుర్తు చేశారు. ఆయన రాజీనామా చేసి తీరాల్సిందేనని పునరుద్ఘాటించారు. అందుకోసం ఒత్తిడి తెస్తూనే ఉంటానని రోహిత్ స్పష్టం చేశారు.‘‘అంతేగాక వీఎస్ఆర్ వెంచర్స్ యజమానిపై తక్షణం కేసు నమోదు చేయాలి. డీజీసీఏలోని సంబంధిత అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలి. అజిత్ ప్రయాణించిన విమానం ఫిట్గా ఉందని మహా రాష్ట్రకు చెందిన వైమానిక సమన్వయ కంపెనీ ‘యారో’ తప్పుడు ధ్రువీకరణకు పాల్పడింది. అంతేగాక ప్రమాదం జరిగిన రోజు వాతావరణ పరిస్థితులు విమాన ప్రయాణానికి అనువుగా ఉన్నాయని కూడా పేర్కొంది. కనుక ఆ కంపెనీపైనా కేసు పెట్టాలి’’ అని డిమాండ్ చేశారు. -
అజిత్ కేసును నీరుగార్చేందుకే.. సీబీఐ దర్యాప్తు!
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతికి దారితీసిన విమాన ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు కోరాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) తీవ్రంగా తప్పు బట్టింది. దర్యాప్తును ఆలస్యం చేసి నీరుగార్చేందుకే ఫడ్నవీస్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందంటూ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ సోమవారం దుయ్యబ ట్టారు. సీబీఐ వద్ద ఇప్పటికే ఏకంగా 7 వేలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నట్టు ఆయన గుర్తు చేశారు. వాటిలో 2,500 కేసులకైతే ఏకంగా దశాబ్దానికి అతీగతీ లేదంటూ ఆక్షేపించారు. దర్యాప్తు పేరుతో కాలహరణం చేసే ఈ యత్నాలను తాము అంగీకరించే ప్రసక్తే లేదని రోహిత్ కుండబద్దలు కొట్టారు. విమాన ప్రమాదంపై సీఐడీతోనే దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దర్యాప్తులో ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన వివరాల్లో 30 శాతాన్ని మాత్రమే బయటపెట్టారని కూడా ఆయన ఆరోపించారు. ప్రమాదంలో బ్లాక్బాక్స్ కాలిపోయిందని చెప్పడంపై పలు అనుమానాలు వెలిబుచ్చారు. ‘‘బ్లాక్బాక్స్ను సురక్షితంగా వెలికితీశారు. దాన్ని అందరూ చూశారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా నా దగ్గరున్నాయి. ఇప్పుడు అది కాలిపోయిందని చెప్పడం వెనక మతలబు ఏమిటి?’’ అని ప్రశ్నించారు. దర్యాప్తులో ఏవైనా లోపాలు జరిగినట్టు తేలితే ఫడ్నవీస్ సర్కారు భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అంతకుముందు అసెంబ్లీలో అజిత్ పవార్కు రోహిత్ ఘనంగా నివాళులు అర్పించారు. ఆయనతో తన సాన్నిహిత్యాన్ని తలచుకుంటూ కంటతడి పెట్టారు.అజిత్ విమాన ప్రమాదం దర్యాప్తులో జరుగుతున్న జాప్యం పలు ప్రశ్నలకు తావిస్తోందని ఎన్సీపీ (ఎస్పీ)కి చెందిన మరో ఎమ్మెల్యే జితేంద్ర అవద్ కూడా పేర్కొన్నారు. ‘‘బ్లాక్బాక్స్ కాలిపోవడం ఏమిటి? ప్రపంచంలో ఇప్పటిదాకా ఎక్కడా అలా జరగలేదు. ప్రమాద కారణాలను తేల్చేందుకు జరుగుతున్న దర్యాప్తే మరిన్ని అనుమానాలకు దారితీస్తే ప్రజలిక దేన్ని నమ్మాలి?’’ అని ప్రశ్నించారు. ప్రమాదానికి గురైన విమానానికి భారత్లో నడిచేందుకు అనుమతే లేదని అవద్ ఆక్షేపించారు. ‘‘ఆ విమానాన్ని మొత్తం జీవితకాలంలో గరిష్టంగా 5,000 గంటలకు మించి నడపరాదు. కానీ అప్పటికే అది 8,000 గంటల పాటు నడిచింది. ఇవన్నీ మొత్తం ఉదంతంపై అనుమానాలను మరింత పెంచుతున్నాయి’’ అన్నారు. -
విషాదాన్ని నింపిన ట్రైనీ టెకీల బీచ్ ఔటింగ్
స్నేహితులతో బీచ్లో సరదాగా గడుపుదామని వెళ్లిన వారికి విధి తీవ్ర విషాదం మిగిల్చింది. శనివారం చెన్నైలో జరిగిన బీచ్ ప్రమాదంలో ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయింది. మరొకరు ఆచూకీ ఇంకా దొరకలేదు. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. మహారాష్ట్రకు చెందిన గోల్డెన్ బీచ్ వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సముద్రంలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వారిలో 22 ఏళ్ల మయూరి హరిశ్చంద్ర చౌదరిగా ప్రాణాలు కోల్పోయింది. 24 ఏళ్ల మరొకరు కనిపించకుండా పోయారు.మూడో వ్యక్తిని జాలర్లు రక్షించారు. ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ సిరుసేరి క్యాంపస్లో ఇంటర్న్షిప్ చేస్తున్న ట్రైనీలు 26 మంది శనివారం సెలవు కావడంతో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈస్ట్ కోస్ట్ రోడ్ (పుదుచ్చేరి రోడ్) వెంబడి ఉన్న బీచ్కు విహారయాత్రకు వెళ్లారు. అధిక ఆటుపోట్ల కారణంగా ప్రశాంతంగా ఉన్న సముద్రంలో దాదాపు 10 -15 అడుగుల ఎత్తులో అలలు రావడంతో ముగ్గురు కొట్టుకుపోయారు. వీరిలో ఒకరు చనిపోగా, మరొకరి ఆచూకీ తెలియరాలేదు. మహారాష్ట్రకు చెందిన పదిహేను మంది ఇంటర్న్షిప్ కోసం చేరిన వారిలో వీరు ముగ్గురు కూడా ఉన్నారు.మృతురాలిని భండారా జిల్లాలోని మోహది తాలూకాలోని వర్తి గ్రామానికి చెందిన మయూరి హరిశ్చంద్ర చౌదరిగా గుర్తించారు. జల్గావ్ జిల్లాలోని జామ్నేర్కు చెందిన జై పాటిల్ ఆచూకీ కనిపించడం లేదు. ఒడ్డుకు దూరంగా నిలబడి ఉన్న పూణేకు చెందిన రాజ్ కేదారి చెన్నైలో చికిత్స పొందుతున్నాడు. ఒక్కసారిగా అల విరుచుకుపడటంతో ముగ్గురం కొట్టుకు పోయామని, ఈత కొడుతూ మయూరిని బయటకు లాగగలిగాను కానీ జైని కనుగొనలేకపోయాను అని కేదారివిచారం వ్యక్తం చేశాడు. మయూరి చౌదరిని ఇంజంబక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని గుర్తుచేసుకున్నాడు.సంఘటన జరిగిన వెంటనే కనత్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిబ్బంది గాలింపు, రక్షణ చర్యను ప్రారంభించారు.జై పాటిల్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారని సీఎంవో ప్రకటనలో తెలిపింది. జై పాటిల్ బంధువులు ,మయూరి చౌదరి కుటుంబ సభ్యులు చెన్నై చేరుకున్నారు.चेन्नई (तामिळनाडू) येथील गोल्डन बीचवर फिरण्यासाठी गेलेल्या महाराष्ट्रातील विद्यार्थ्यांच्या गटासोबत पाण्यात उतरताना दुर्घटना घडली असून या घटनेत महाराष्ट्रातील काही विद्यार्थी अडकल्याची माहिती समोर आली आहे. या घटनेची माहिती मिळताच मुख्यमंत्री देवेंद्र फडणवीस यांनी तात्काळ…— CMO Maharashtra (@CMOMaharashtra) February 22, 2026 -
అజిత్ విమాన ప్రమాదం: ‘వారంతా కుమ్మక్కయ్యారు’
ఢిల్లీ: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు వెంటనే రాజీనామా చేయాలని ఎన్సీపీ (శరద్పవార్) ఎమ్మెల్యే రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అజిత్ పవార్కు మోదీ, అమిత్ షా న్యాయం చేయాలన్నారు. విమానంలో పెట్రోల్ క్యాన్లు ఉన్నట్లు మాకు తెలుస్తుంది. దీని వల్లే విమానం మంటల్లో చిక్కుకుందన్నారు.‘‘విమానంలో కావాల్సిన దానికంటే ఎక్కువ ఫ్యూయల్ నింపారు. కుట్రపూరితంగానే ఎక్కువ ఫ్యూయల్ నింపినట్లు మాకు అనుమానం. యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఒకటి కంటే ఎక్కువ పేలుళ్లు జరిగాయి. అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి’’ అని రోహిత్ పవార్ పేర్కొన్నారు.వీఎస్ఆర్ ట్రావెల్స్ వెనుక ఎవరున్నారో బయటకురావాలి. వీఎస్ఆర్ కంపెనీ మేనేజర్ వీకే సింగ్ను ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు?. పైలెట్ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్నట్లు మాకు తెలుస్తోంది. డీజీసీఏలోని కొంతమంది ఉన్నతాధికారులు వీఎస్ఆర్ ట్రావెల్స్తో కుమ్మక్కయ్యారు. బ్లాక్ బాక్స్ కాలిపోయిందని చెప్పడం కూడా పూర్తి అబద్ధం. రామ్మోహన్నాయుడు పదవిలో ఉంటే విచారణను ప్రభావితం చేస్తారు’’ అంటూ రోహిత్ పవార్ వ్యాఖ్యానించారు.‘‘అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక రాజకీయ, కమర్షియల్ కుట్ర ఉంది. వీఎస్ఆర్ కంపెనీ వెనుక డీజీ సీఏ పెద్ద అధికారి హస్తం ఉంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు వీఎస్ఆర్ కంపెనీతో సంబంధాలు ఉన్నాయి. వీఎస్ఆర్ కంపెనీను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడిని పదవి నుంచి తొలగించాలి. టీడీపీ మంత్రి నుంచి రాజీనామా తీసుకోవాలి. ఈ కేసులో నిజం బయట పెట్టేందుకు మోదీ, అమిత్ షా జోక్యం చేసుకోవాలి...అవసరానికి మించి ఇంధనం ఇందులో నింపారు. విమానంలో పెట్రోల్ క్యాన్స్ పెట్టారు. వీఎస్ఆర్ కంపెనీకి రామ్మోహన్నాయుడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కేసులో శ్వేత సింగ్ దర్యాప్తును తప్పు దోవ పట్టిస్తున్నారు. బ్లాక్ బాక్స్ సీవీఆర్ పూర్తిగా తగలబడిందని చెప్పడం అబద్ధం. రామ్మోహన్నాయుడు ఈ పదవిలో ఉంటే దర్యాప్తు నిష్పాక్షికంగా జరగదు. వీఎస్ఆర్ ఓనర్ వీకే సింగ్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?వీఎస్ఆర్ కంపెనీ నిర్వహణలో అనేక అవకతవకలు ఉన్నాయి. వీఎస్ఆర్ కంపెనీలో మహిళా పైలెట్లపై వేధింపులు జరిగాయి. అనేక అవకతవకలు జరుగుతున్నా డీజీసీఏ పట్టించుకోలేదు. ప్రమాదాలు, అవకతవకలు జరుగుతున్నా వీఎస్ఆర్ ఆపరేషన్స్ మాత్రం యథేచ్ఛగా జరుగుతున్నాయి. నిజాలను సమాధి చేసేందుకు బ్లాక్ బాక్స్ తగలబడిందని చెపుతున్నారు. 2016లో రూ.10 కోట్ల కంపెనీ.. 2025కు 500 కోట్లకు చేరింది. కంపెనీ డైరెక్టర్ రోహిత్ సింగ్ను పట్టుకోకుండా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. రోహిత్ సింగ్కు డీజీసీఏ ఎందుకు మద్దతు ఇస్తుంది’’ అంటూ రోహిత్ పవార్ నిలదీశారు. -
‘అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక టీడీపీ నేతల హస్తం’
ముంబై: అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక టీడీపీ నేతల హస్తం ఉందంటూ ఎన్సీపీ నేత రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. విమానయాన సంస్థ వీఎస్ఆర్ యజమాని రోహిత్ సింగ్కు టీడీపీ నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని.. విచారణను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. రామ్మోహన్ నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు.అజిత్ పవార్ది ప్రమాదం కాదు.. ప్రణాళిక ప్రకారం జరిగిన హత్య. రోహిత్సింగ్ను కాపాడే ప్రకటనలు చేస్తున్నారు. దర్యాప్తు నిష్ప్రక్షపాతంగా జరగాలంటే రామ్మోహన్నాయుడిని తప్పించాల్సిందేనని రోహిత్ పవార్ అన్నారు. ఈ కుట్రలో భారీ ఆర్థిక లావాదేవీల కోణం కూడా దాగి ఉందన్న రోహిత్.. రూ. 35 కోట్ల విలువచేసే విమానానికి రూ.210 కోట్లతో బీమా వెనుక మర్మమేంటి? అంటూ ప్రశ్నించారు.ప్రమాద సమయంలో ఫ్లైట్లోని ఇంధనాన్ని అక్రమంగా తరలించారని.. పైలట్ను బ్లాక్మెయిల్ చేసి ప్రమాదం చేయించి ఉండొచ్చు అంటూ రోహిత్ పవార్ ఆరోపించారు. విచారణ పూర్తికాకముందే రోహిత్ సింగ్ను దేశం విడిచి అమెరికా వెళ్లేందుకు ఎలా అనుమతిచ్చారు?. బ్లాక్ బాక్స్ సేఫ్గా ఉన్నా పాడైపోయిందని తప్పుడు ప్రచారం చేశారంటూ రోహిత్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అజిత్ పవార్కు రోహిత్ పవార్ మేనల్లుగు. గతంలో అజిత్ పవార్తో కలిసి పని చేశారు. -
మహారాష్ట్రలో ముస్లిం కోటా రద్దు
ముంబై: మహారాష్ట్రలో విద్య, ఉద్యోగా వకాశాల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వే షన్లను బీజేపీ సారథ్యంలోని మహాయుతి ప్రభుత్వం బుధవారం రద్దు చేసింది. 2014లో కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రిజర్వేషన్లు వాస్తవానికి ఎప్పుడూ అమలు కాలేదు. రాష్ట్రంలో ముస్లింలకు స్పెషల్ బ్లాక్వర్డ్ క్లాస్–ఏ (ఎస్బీసీ–ఏ) కేటగిరీ కింద ముస్లింలకు 5 శాతం రిజర్వేష న్లు కల్పిస్తూ నాటి ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. కానీ అది చట్టరూపం దాల్చలేదు. దాంతో ఆ రిజర్వేషన్లకు ఎప్పుడో కాలదోషం పట్టింది. అయినా వాటిని లాంఛనంగా రద్దు చేస్తూ ఫడ్నవీస్ సర్కారు నిర్ణయం తీసుకోవడం విశేషం. అంతేగాక ఎస్బీసీ–ఏ కేటగిరీ కింద రాష్ట్రంలో ముస్లింలకు కుల, నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్ల జారీని కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ముస్లిం రిజర్వేషన్ల అమలుపై 2014 నవంబర్లోనే బాంబే హైకోర్టు స్టే విధించింది. అయితే విద్యా సంస్థల్లో వాటిని అమలు చేసేందుకు మాత్రం అనుమతించింది. కానీ ఆ తర్వాత నెల రోజులకే ఆర్డినెన్స్ కాలపరిమితి ముగిసింది. దాంతో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కూడా అటకెక్కాయి. అయినా ఈ అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. కోర్టు కూడా ఆ రిజర్వేషన్లు చెల్లవని ప్రకటించింది.భగ్గుమన్న విపక్షాలుముస్లిం రిజర్వేషన్ల రద్దుపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఫడ్నవీస్ సర్కారు నిర్ణయం ముస్లింలను ప్రధాన స్రవంతికి దూరం చేస్తుందంటూ కాంగ్రెస్ ఆందోళన వెలిబుచ్చింది. ముస్లింలు అంటే బీజేపీకి ఏ మాత్రం విలువ లేదని ఎన్సీపీ (ఎస్పీ), సమాజ్వాదీ పార్టీ విమర్శించాయి. ముస్లిం యువత ఏ రంగంలోనూ ఎదగరాదన్నదే బీజేపీ ఉద్దేశమని మజ్లిస్, ఆరోపించింది. -
ఇండియాకు ఎప్పుడు వస్తానో చెప్పలేను: విజయ్ మాల్యా
ముంబై: భారత్కు కచ్చితంగా ఎప్పుడు తిరిగి వస్తానో చెప్పలేనని పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని బాంబే హైకోర్టుకు తెలియజేశారు. స్వదేశానికి రావడా నికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని తెలిపారు. భారత ప్రభుత్వం రద్దు చేసిన తన పాస్పోర్టును పునరుద్ధరించుకోవడంలో ఇబ్బందులు ఉన్నట్లు వెల్లడించారు.యునైటెడ్ కింగ్డమ్(యూకే) ను విడిచిపెట్టి వెళ్లిపోకుండా చట్టపరంగా నిషేధించారని, ఇంగ్లండ్, వేల్స్ కోర్టులు ఆదేశాలిచ్చాయని గుర్తుచేశారు. ఈ మేరకు విజయ్ మాల్యా స్టేట్మెంట్ను ఆయన తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ బాంబే హైకోర్టు నివేదించారు. విజయ్ మాల్యా 2016 నుంచి యూకేలోనే ఉంటున్నారు. తనను ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడి’గా గుర్తిస్తూ ఇచ్చిన ఉత్తర్వును, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ విజయ్ మాల్యా గతంలో బాంబే హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. భారత్కు కచ్చితంగా ఎప్పటిలోగా తిరిగి వస్తారో చెప్పాలని విజయ్ మాల్యాను ఆదేశించింది. స్వదేశానికి వచ్చి విచారణను ఎదుర్కొనే ఉద్దేశం ఉందా? లేదా? అని నిలదీసింది. లేకపోతే ఆయన పిటిషన్లను తిరస్కరిస్తామని తేల్చిచెప్పింది. దీనిపై విజయ్ మాల్యా తాజాగా స్పందించారు. స్వదేశానికి ఎప్పుడు వస్తానో చెప్పలేనన్నారు. భారతీయ బ్యాంకుల నుంచి రూ.వేల కోట్లు రుణంగా తీసుకొని తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టినట్లు విజయ్ మాల్యాపై అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. -
ఒక్కరోజే 75 ఫైల్స్ క్లియర్.. అజిత్ మృతి రోజున ఏం జరిగింది?
ముంబై: మహారాష్ట్రలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిన రోజున మహారాష్ట్ర మైనారిటీ శాఖ మైనారిటీ పాఠశాలలకు సంబంధించిన 75 ఫైళ్లను క్లియర్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, మైనార్టీ శాఖ అజిత్ పవార్ వద్దే ఉండటం గమనార్హం. దీంతో, ఈ వ్యవహారంలో మహారాష్ట్రలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకేరోజు ఇలా ఫైల్స్ క్లియర్ చేయడంపై అటు ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.కాగా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ జనవరి 28న విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, అదే రోజున మహారాష్ట్ర మైనారిటీ శాఖలో మైనారిటీ పాఠశాలలకు సంబంధించిన 75 ఫైళ్లను క్లియర్ అయ్యాయి. ఈ ఫైళ్లలో మైనారిటీ విద్యా సంస్థలకు గుర్తింపు, ఆమోదాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే, అజిత్ పవార్ వద్దే మైనార్టీ శాఖ ఉంది. ఆయన చార్జ్ తీసుకున్న తర్వాత దాదాపు రెండేళ్ల కాలంలో మైనార్టీ శాఖకు సంబంధించిన కొన్ని నిర్ణయాలను ఆయన పక్కన పెట్టినట్టు సమాచారం. ముఖ్యంగా మైనార్టీ విద్యా సంస్థలకు సంబంధించి సర్టిఫికెట్లు ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో, తాజాగా ఈ పరిణామం రాజకీయంగా, పరిపాలనా వర్గాల్లో తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది. ఒకే రోజులో ఇంత పెద్ద సంఖ్యలో ఫైళ్లను అకస్మాత్తుగా క్లియర్ చేయడంలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.రాష్ట్ర పరిపాలన అజిత్ పవార్ చుట్టూ ఉన్న బ్రేకింగ్ న్యూస్తో బిజీగా ఉన్న రోజున తక్కువ వ్యవధిలో 75 ఫైళ్లను ఎలా ప్రాసెస్ చేసి సంతకం చేశారని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించారు. మరోవైపు.. ఈ సమస్య పరిపాలనా చర్యకు కూడా దారితీసింది. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే మహారాష్ట్ర మైనారిటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ మిలింద్ షెనాయ్ను బదిలీ చేశారు. దీంతో, ఈ వ్యవహారంపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కాగా, ఒక ప్రముఖ రాజకీయ ఘటన(అజిత్ పవార్ మృతి) చర్చగా ఉన్న రోజున ఇంత పెద్ద పరిపాలనా కార్యక్రమం జరగడం సహజంగానే సందేహాన్ని రేకెత్తిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే, తుది నిర్ణయాలు ప్రభుత్వ విచారణ ఫలితంపై ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు. ఈ విషయం ఇప్పుడు మహారాష్ట్రలో రాజకీయ చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ విషయంపై ప్రభుత్వం విచారణ ప్రారంభించిందని, తదుపరి చర్యలు కూడా జరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇక, ప్రస్తుతం మైనార్టీ శాఖ ఆయన భార్య సునేత్రా పవార్ వద్ద ఉంది. ఆమె ఈ అనుమానాస్పద సర్టిఫికెట్లపై విచారణ ఆదేశించారు.ఇదిలా ఉండగా.. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కూలిపోవడంతో ప్రాణాలు విడిచారు.. అయితే, ఈ ప్రమాదంపై ఆది నుంచి ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఆ ప్రాణాంతక ప్రమాదానికి కారణం ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సునీల్ తత్కరే.. అజిత్ పవార్ మరణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనుక ఉన్న నిజాన్ని వెలికి తీయాల్సిన అవసరాన్ని ఇద్దరూ ప్రత్యేకంగా పేర్కొన్నారు. -
ద్వైపాక్షిక బంధం... గ్లోబల్ స్థాయికి!
ముంబై: భారత్, ఫ్రాన్స్ సంబంధాల్లో నూతన శకానికి తెర లేచింది. అంతర్జాతీయంగా తీవ్ర అస్థిర పరిస్థితుల నేపథ్యంలో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. వాటిని ‘ప్రత్యేక ప్రపంచ స్థాయి వ్యూహత్మక భాగస్వామ్యం’గా తీర్చిదిద్దుకోవాలని నిశ్చయించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రధాని నరేంద్ర మోదీ నడుమ జరిగిన చర్చల్లో ఈ మేరకు కీలక ఒప్పందం కుదిరింది. రక్షణ, వర్తకం మొదలుకుని అరుదైన ఖనిజాల దాకా అన్ని రంగాల్లోనూ పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని నేతలు నిర్ణయించారు.ఈ దిశగా రక్షణ, అత్యంత అధునాతన టెక్నాలజీ, సంప్రదాయేతర ఇంధన వనరులు, ఆరోగ్యం తదితరాలకు సంబంధించి ఇరు దేశాల నడుమ 21 కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్, ఫ్రెంచి రక్షణరంగ దిగ్గజం సఫ్రాన్ సంయుక్తంగా భారత్లో హమ్మర్ క్షిపణుల తయారీ, భారత, ఇరుదేశాల సైన్యంలో పరస్పరం అధికారుల నియామకం తదితరాలు వీటిలో ఉన్నాయి. మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచి్చన మాక్రాన్తో మంగళవారం సాయంత్రం మోదీ ముంబైలో సమావేశమయ్యారు. పలు అంశాలపై ఇరువురూ లోతుగా చర్చించారు. భారత్–ఫ్రాన్స్ ద్వైపాక్షిక బంధాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని తీర్మానించారు. అనంతరం మోదీ, మాక్రాన్ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కీలక భాగస్వామ్యం: మోదీ ప్రపంచం ప్రస్తుతం అత్యంత అస్థిర దశ గుండా సాగుతోందని మోదీ అభిప్రాయపడ్డారు.ఈ పరిస్థితుల్లో స్థిరత్వ స్థాపనలో భారత్, ఫ్రాన్స్ భాగస్వామ్యం కీలకపాత్ర పోషించగలదని విశ్వాసం వెలిబుచ్చారు. ఫ్రాన్స్ నైపుణ్యం, భారత వనరులు ఒక్కతాటిపైకి వస్తే అద్భుతాలు జరుగుతాయన్నారు. ఇరుదేశాలదీ ఎలాంటి హద్దులూ లేని ఆదర్శ భాగస్వామ్యం. ఇరు దేశాల మధ్య మొదటినుంచీ ప్రత్యేక సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాయి’’అని చెప్పారు.భారత్కు అత్యంత పురాతన వ్యూహాత్మక భాగస్వాముల్లో ఫ్రాన్స్ ఒకటని ఆయన గుర్తు చేశారు. ‘‘మాక్రాన్తో తాజా భేటీ ద్వారా ఈ బంధాన్ని ఎన్నడూ లేనంతగా ముందుకు తీసుకెళ్లాం. ఇరు దేశాలు పరస్పర విశ్వాసం, ఉమ్మడి విజన్తో కలసి సాగనున్నాయి. ఇది కేవలం వ్యూహాత్మక బంధం మాత్రమే కాదు. ప్రపంచ ప్రగతికి బాటలు పరిచే కీలక బంధం’’అని ప్రకటించారు. ఉగ్రవాదం కూడా మాక్రాన్తో చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచి్చనట్టు ప్రధాని తెలిపారు. దాన్ని అన్ని రూపాల్లోనూ తుదముట్టించేందుకు ఇరు దేశాలూ కృతనిశ్చయంతో ఉన్నట్టు చెప్పారు. సంస్కరణలతోనే సమాధానం ఉక్రెయిన్, పశి్చమాసియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు ఇతర చోట్ల యుద్ధ మేఘాలు ఇంకా తొలగలేదని మోదీ గుర్తు చేశారు. ‘‘ఈ కల్లోల పరిస్థితుల నుంచి గట్టెక్కించగలిగేది ప్రజాస్వామిక విలువలే అన్నదే భారత్, ఫ్రాన్స్ వైఖరి. ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థలను సమూలంగా సంస్కరించినప్పుడే ఈ అంతర్జాతీయ సవాళ్లకు సజావైన పరిష్కారాలు లభిస్తాయి ఆ ప్రయత్నాలకు భారత్, ఫ్రాన్స్ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాయి. ఎందుకంటే రెండు దేశాలూ బహుళ ధ్రువ ప్రపంచాన్నే కోరుతున్నాయి’’అని వివరించారు.యూరోపియన్ యూనియన్తో భారత్ ఇటీవలే తన చరిత్రలోనే అతి పెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుందని మోదీ గుర్తు చేశారు. అది భారత్, ఫ్రాన్స్ సంబంధాలకు కూడా ఎంతగానో ఊపునిచ్చే పరిణామమేనని ఆయన చెప్పారు. ‘‘ఇరు దేశాల ప్రజలు, కంపెనీలు ఇకపై రెండు పన్నులు కట్టాల్సిన దురవస్థ తప్పింది. పరస్పర వర్తకం, పెట్టుబడులు తదితరాలను నూతన శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలకు ఈ ఒప్పందాలు సరికొత్త రోడ్మ్యాప్గా నిలిచాయి’’అన్నారు. హెలికాప్టర్ నిర్మాణ కేంద్రం ప్రారంభం కర్నాటకలోని వెమగల్లో ఎయిర్బస్ హెచ్125 హెలికాప్టర్ల నిర్మాణ కేంద్రాన్ని ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వర్చువల్గా ప్రారంభించారు. ఇరుదేశాల మధ్య పరస్పరం నెలకొన్న లోతైన విశ్వాసానికి ఈ ప్లాంట్ ప్రారంభమే తాజా నిదర్శనమని మోదీ ఈ సందర్భంగా అన్నారు. ‘‘మౌంట్ ఎవరెస్టును మించిన ఎత్తుల్లో ఎగరగల సామర్థ్యమున్న ఏకైక హెలికాప్టర్ను ఇరుదేశాలూ కలిసి భారత్లో సంయుక్తంగా తయారు చేయనుండటం నిజంగా గర్వకారణం. వాటిని ప్రపంచమంతటికీ ఎగుమతి చేయనున్నాం’’అని ప్రకటించారు. ఈ హెలికాప్టర్ల తయారీ ప్లాంటు ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బస్, భారత్కు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ జాయింట్ వెంచర్భారత్ అత్యంత విశ్వసనీయ భాగస్వామి: మాక్రాన్ఫ్రాన్స్కు భారత్ అత్యంత విశ్వసనీయ భాగస్వామి అని మాక్రాన్ పేర్కొన్నారు. రఫేల్యుద్ధ విమానాలు మొదలుకుని జలాంతర్గాముల దాకా రక్షణ రంగంలో ఇరు దేశాల నడుమ పరస్పర సహకారం నానాటికీ పెంపొందుతోందని హర్షం వెలిబుచ్చారు. ఉగ్రవాదంపై పోరాటంలో కూడా భారత్, ఫ్రాన్స్ పరస్పరం మరింతగా సహకరించుకుంటాయని ప్రకటించారు. భారత్లో తనకు లభించిన అపూర్వ స్వాగతానికి కృతజ్ఞతలు తెలిపారు. మాక్రాన్కు భారత్లో ఇది నాలుగో అధికారిక పర్యటన.ఇన్నొవేషన్ల సారథి భారత్: మాక్రాన్ ‘‘గ్లోబల్ ఇన్నొవేషన్లో భారత్ కేవలం భాగస్వామి కాదు. సిలికాన్ వ్యాలీ మొదలుకుని టెక్నాలజీ, సంస్కృతి దాకా అన్ని రంగాల్లోనూ సారథి స్థానంలో రాణిస్తోంది’’ అంటూ మాక్రాన్ ప్రశంసించారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా మోదీతో కలిసి ‘ఇండియా–ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నొవేషన్’ను ఆయన ఆవిష్కరించారు. ఇరుదేశాల భాగస్వామ్యాన్ని ప్రజల భాగస్వామ్యంగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యమని నేతలు వివరించారు. ఇందులో భాగంగా పరిశ్రమలు, స్టార్టప్లు, చిన్న–మధ్య తరహా పరిశ్రమలు, విద్యార్థులు, రక్షణ రంగంలో పరిశోధనలు, స్వచ్ఛ ఇంధనం, అంతరిక్షం, నూతన టెక్నాలజీలు తదితర రంగాల్లో పరిశోధనలకు మరింత ఊపు లభిస్తుందని మోదీ అన్నారు. ఇన్నొవేషన్ ఇయర్లో భాగంగా ఆరోగ్యం, డిజిటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ఇండో–ఫ్రెంచ్ ఏఐ సెంటర్లను స్థాపించనున్నారు. ఫ్రాన్స్లో భారత్ త్వరలో స్వామి వివేకానంద కల్చరల్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది.మెరీన్ డ్రైవ్లో మాక్రాన్ జాగింగ్!ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మా క్రాన్ మంగళవారం ఉదయం బాంబేలోని మెరీన్ డ్రైవ్లో జాగింగ్ చేశారు. నీలిరంగు టీ షర్టు, నలుపు షార్ట్స్, రన్నింగ్ షూస్ ధరించిన ఆయన జాగింగ్ చేస్తున్న వారితో కలిసి పోటాపోటీగా పరుగు తీశారు. భద్రతా సిబ్బంది మారువేషాల్లో కాస్త వెనకగా ఆయనను అనుసరించారు. ఈ సందర్భంగా ముంబై పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మాక్రాన్ను గుర్తు పట్టిన పలువురు ఆయన్ను తమ స్మార్ట్ ఫోన్లలో బంధించారు. అవన్నీ వైరల్గా మారాయి. మాక్రాన్ విదేశీ పర్యటనల్లో కూడా జాగింగ్ కొనసాగిస్తుంటారు.బాలీవుడ్ తారలతో మాక్రాన్ దంపతుల భేటీఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత పర్యటనలో తారల తళుకులు చోటుచేసుకున్నాయి. పలువురు బాలీవుడ్ తారలతో మాక్రాన్, బ్రిగెటీ దంపతులు మంగళవారం భేటీ అయ్యారు. సినీ పరిశ్రమపరంగా భారత్, ఫ్రాన్స్ సంబంధాల బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు తదితరాలపై వారితో రెండు గంటలకు పైగా చర్చించారు. తాజ్మహల్ ప్యాలెస్ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో జోయా అక్తర్, షబానా అజ్మీ, మనోజ్ బాజ్పాయ్, అనిల్ కపూర్, కబీర్ ఖాన్, రిచా ఛద్దా తదితరులు పాల్గొన్నారు. 2008లో ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న స్లమ్డాగ్ మిలియనీర్ చిత్రమంటే తనకెంతో ఇష్టమని బ్రిగెటీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. -
ముంబై మేయర్గా రీతూ తావ్డే?
మహాయుతి కూటమి ముంబై మేయర్ అభ్యర్థిపై సందిగ్దత వీడింది. మేయర్ పదవికి బీజేపీకి చెందిన రీతూ తావ్డే అభ్యర్థిగా నామినేషన్ వేసింది. డిప్యూటీ మేయర్ పదవికి శివసేన (శిండే) అభ్యర్థి సంజయ్ శంకర్ గాదీని నిలిపింది. వీరి ఎంపిక దాదాపు లాంఛనమే కానుంది. బీజేపీ 89 స్థానాల్లో విజయం సాధించగా, శివసేన శిండే 29 చోట్ల గెలుపొందింది. బృహత్ ముంబయిలో మెుత్తం 227 మున్సిపల్ కార్పోరేషన్ స్థానాలకు ఎన్నికలు జరిగగా మహాయుతీ కూటమి 118 స్థానాల్లో గెలుపొంది స్పష్టమైన మెజారిటీ సాధించింది. కాగా ఈ నెల 11న మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ప్రస్తుతం బీజేపీ మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసిన రీతూ తావ్డే 132 వార్డు అభ్యర్థిగా గెలుపొందారు. 2012లో కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. గత పాతికేళ్లుగా ముంబై పీఠం శివసేన చేతుల్లో ఉంది. ఈ సారి ఆ పార్టీ కేవలం 65 స్థానాలకే పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. బృహత్ ముంబై దేశంలోనే అతిపెద్ద కార్పోరేషన్ దీని గతేడాది బడ్జెట్ రూ.74,450 కోట్లుగా ఉంది. -
ఇండిగో విమానానికి... ల్యాండింగ్ గేర్ సమస్య
ముంబై: ఇండిగో విమానంలో తలెత్తిన ల్యాండింగ్ గేర్ లివర్ సమస్య కొద్దిసేపు అందరినీ కంగారు పెట్టింది. ఈ ఉదంతం శుక్రవారం ముంబై విమానాశ్రయంలో జరిగింది. 210 మందికి పైగా ప్రయాణికులతో కూడిన ఏ321 తరహా విమానం రన్వేపై దిగే సమయంలో ల్యాండిగ్ గేర్కు సంబంధించిన ఆటోమేటిక్ మోడ్ మొరాయించింది. దాంతో కాసేపు గందరగోళం తలెత్తింది. కొద్దిసేపటి ప్రయత్నం అనంతరం విమానం సురక్షితంగా దిగింది. ఆ వెంటనే నిపుణులు రంగంలోకి దిగి సమస్యను సరిదిద్దారు. కొద్దిపాటి ఆలస్యంతో విమానం యథావిధిగా కార్యకలాపాలు సాగించినట్టు ఇండిగో పేర్కొంది. తలెత్తింది చిన్న సాంకేతిక లోపం మాత్రమేనని చెప్పుకొచి్చంది. -
ఎనభై తొమ్మిది... అయితే ఏంటీ!
ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసులో ఎలా ఉంటారు? విశ్రాంతికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. దాదాపుగా ఇంటికే పరిమితం అవుతారు. ఎనభై తొమ్మిది సంవత్సరాల కమలాబెన్ మెహతా బామ్మ మాత్రం అలా కాదు. ఇప్పటికీ కష్టపడుతూనే ఉంది. ముంబైలోని రద్దీగా ఉండే స్థానిక రైళ్లలో చేతితో తయారుచేసిన పూసల బ్రేస్లెట్లను అమ్ముతుంటుంది.‘ఈ వయసులో ఈ కష్టం ఏమిటి బామ్మ!’ అని ఎవరైనా అడిగితే... ఆమె సమాధానం చెప్పకుండానే గలగలా నవ్వుతుంది. ఆ నవ్వులోనే ఎన్నో జవాబులు వెదుక్కోవచ్చు.‘కష్టానికి వయసుతో పని ఏమిటి!’; ‘ ఎంత కష్టపడితే అంత చురుగ్గా ఉంటాను!’... ఇలాంటి జవాబులు ఎన్ని అయినా ఉండవచ్చు. తాజా విషయానికి వస్తే... ఇన్స్టాగ్రామ్ యూజర్ తుషిత్ షా, కమలా బెన్ను పలకరించింది.‘ముంబైలోని లోకల్ రైలులో బ్రేస్లెట్లు అమ్ముతున్న ఎనభై తొమ్మిదేళ్ల బామ్మను కలిశాను’ అంటూ ఆమె గురించి పోస్ట్ పెట్టింది. ‘ఎందుకు ఇలా?’ అని అడిగితే... ‘నా కుటుంబ సభ్యులు నన్ను వారితో పాటు ఇంట్లో ఉండడానికి అనుమతించారు. వారికి భారంగా ఉండడం ఇష్టం లేదు. అందుకే నా వంతుగా ఎంతో కొంత ఖర్చులకు ఇవ్వడానికి ఇవి అమ్ముతున్నాను’ అని చెప్పింది. -
50వ పుట్టినరోజు: రూమర్స్కు చెక్ పెట్టిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్
ముంబై: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తన 50వ పుట్టినరోజును కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానుల ప్రేమాభిమానాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య, ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అభిషేక్ చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ ఐశ్వర్య, “Happy HAPPY 50th Birthday dearest Babyyy-Papa with lots of love, peace, happiness, contentment and best health. God Blesssss. Stay Golden… Shine on Love” అంటూ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్ట్కు అభిమానులు భారీ సంఖ్యలో లైకులు, కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) ఇదే సందర్భంగా సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్ ద్వారా స్పందించారు. “అభిషేక్కు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ఆశీస్సులు అతనికి మరింత ధైర్యం, శక్తి ఇస్తాయి” అని పేర్కొన్నారు.అభిషేక్ బచ్చన్కు సినీ ప్రముఖుల నుంచి కూడా శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. నటుడు జాకీ ష్రాఫ్ వీడియో సందేశం ద్వారా “Big Hugs” అంటూ అభినందనలు తెలిపారు. రితేష్ దేశ్ముఖ్, “నువ్వు నాకు అన్నయ్యలాంటివాడివి. నీకు ఎల్లప్పుడూ ఆనందం, ఆరోగ్యం కలగాలి” అంటూ భావోద్వేగ సందేశం పంపారు. అజయ్ దేవగన్ మాత్రం హాస్యంగా, “Happy Birthday Abbas Ali… I mean @bachchan” అంటూ శుభాకాంక్షలు తెలిపారు.ఇదిలా ఉండగా, తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వదంతులపై అభిషేక్ బచ్చన్ స్పందించారు. “మా వివాహంపై వస్తున్న రూమర్స్ అన్నీ పూర్తిగా అబద్ధాలు. వాటిని కావాలని కొందరు వ్యాప్తి చేస్తున్నారు. ఆమెకు నా గురించి తెలుసు, నాకు ఆమె గురించి తెలుసు. మేము ప్రేమతో, స్థిరమైన కుటుంబంగా ముందుకు సాగుతాం.. అదే ముఖ్యమైనది” అని స్పష్టం చేశారు. దీంతో వారి జంటపై వస్తున్న రూమర్స్కు వీరిద్దరూ మరోసారి చెక్ పెట్టారు.మొత్తంగా అభిషేక్ బచ్చన్ 50వ పుట్టినరోజు సందర్భంగా కుటుంబం, సినీ ప్రముఖులు, అభిమానులు అందించిన ప్రేమాభిమానాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి. -
అజిత్ పవార్ సతీమణి తొలిప్రసంగం.. ఏమన్నారంటే
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలలో ఇటీవల పెను విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దురదృష్టవశాత్తు విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన స్థానంలో ఆమె సతీమణి సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆమె తొలిప్రసంగం చేశారు.పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం సునేత్రా పవార్ మాట్లాడుతూ" దాదా అకాల మరణం నాకు వ్యక్తిగతంగా దుఃఖాన్ని కలిగించడమే కాకుండా మహారాష్ట్ర మెుత్తాన్ని శోకసంద్రంలో ముంచింది. ఆయన నాకిచ్చిన కర్తవ్యనిష్ఠ, పోరాటంలో బలం, ప్రజల పట్ల నిజాయితీగల నిబద్ధతే నాకు నిజమైన పునాదులు" అని ఆమె అన్నారు. తన దుఃఖాన్ని దిగమింగుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేయడమే తన లక్షంగా మార్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు.రైతులు, మహిళలు, యువత, కార్మికుల కోసం దాదా ఎంతో సేవ చేశారని తాను కూడా ఆ పరంపరను కొనసాగిస్తానని ఆమె తెలిపింది. ఇంతటి కష్ట సమయంలో మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన మద్దతు తన అసలైన బలం అని తెలిపింద ఛత్రపతి శివాజీ మహారాజ్, సాహూ మహారాజ్, మహాత్మా పూలే, అంబేద్కర్ భావజాలాల పట్ల విధేయతతో ఉంటానని సనేత్ర పవార్ తెలిపింది.అయితే ఇటీవల బారమతికి ఎన్నికల ప్రచారానికి వెళుతుండగా అజిత్ పవార్ పయణిస్తున్న విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్తో పాటు అందులో పయణిస్తున్న వారందరూ మృతిచెందారు. -
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగాసునేత్ర ప్రమాణం
ముంబై/బారామతి: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్(62) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని ముంబైలోని రాజ్భవన్లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమెతో ప్రమాణం చేయించారు. మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ రికార్డుకెక్కారు. అంతకుముందు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఉదయం నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(అజిత్ పవార్) శాసనసభాపక్షం సమావేశమైంది. సునేత్ర పవార్ను తమ నేతగా ఎన్నుకుంది. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి అజిత్ పవార్ జనవరి 28న విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భార్య సునేత్రను నూతన ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. సునేత్ర ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మరో ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కారే, ఛగన్ భుజబల్ తదితరులు హాజరయ్యారు. సునేత్ర చిన్నకుమారుడు జయ్ పవార్, ఆయన భార్య కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు ‘అజిత్ దాదా అమర్ రహే’అంటూ నినాదాలు చేశారు. సునేత్ర పవార్ ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. తన భర్త మరణంతో ఖాళీ అయిన బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఉప ఎన్నికలో ఆమె పోటీ చేయబోతున్నట్లు సమాచారం. మరోవైపు సునేత్ర పవార్కు ఎక్సైజ్, క్రీడలు, మైనార్టీల అభివృద్ధి శాఖలను కేటాయించారు. ఆమె భర్త నిర్వర్తించిన ఆర్థిక, ప్రణాళిక శాఖలను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తనవద్దే అట్టిపెట్టుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం సునేత్ర ‘ఎక్స్’లో పోస్టుచేశారు. తన భర్త ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తిస్తానని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఛత్రపతి శివాజీ, సాహూ, ఫూలే, అంబేడ్కర్ వంటి మహనీయుల ఆదర్శాలే తనకు స్ఫూర్తి అని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ అభినందనలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సునేత్ర పవార్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆమె నిరంతరం కృషి చేస్తారన్న విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఎక్స్లో పోస్టుచేశారు. దివంగత నేత అజిత్ పవార్ ఆశయాలను సునేత్ర నెరవేర్చాలని ఆకాంక్షించారు. ఆ సంగతి నాకు తెలియదు: శరద్ పవార్ సునేత్ర పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న సంగతి తనకు ముందుగా తెలియదని ఎన్సీపీ(శరద్ పవార్) అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. ప్రసార మాధ్యమాల ద్వారానే తనకు తెలిసిందని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం గురించి ఎవరూ తనతో చర్చించలేదని చెప్పారు. ఎన్సీపీ(అజిత్ పవార్)లో అంతర్గతంగా చర్చించుకొని నిర్ణయం తీసుకొని ఉంటారని అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం బారామతిలో మీడియాతో మాట్లాడారు. రెండు ఎన్సీపీలు విలీనం కావాలని అజిత్ పవార్ కోరుకున్నట్లు తెలిపారు. విలీనం గురించి ఫిబ్రవరి 12న ప్రకటించాలని అజిత్ పవార్ నిర్ణయించినట్లు వెల్లడించారు. రెండు పార్టీలు కలిసిపోవాలని ఆయన బలంగా కోరుకున్నారని స్పష్టంచేశారు. అది సాధ్యమవుతుందని తాను భావిస్తున్నట్లు శరద్ పవార్ వ్యాఖ్యానించారు. -
ఆ విషయం సునేత్ర కూడా చెప్పలేదు: శరద్ పవార్
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) నేత, దివంగత అజిత్ పవార్ సతీమణి సునేత్ర ప్రమాణం చేయబోతున్న విషయంపై ఎలాంటి సమాచారం లేదని అన్నారాయన. ఈ విషయం పేపర్లోనే చూసి తెలుసుకున్నానని.. ఆ కథనాల్లోనూ తనకు స్పష్టత కనిపించలేదని వ్యాఖ్యానించారు. ‘‘ఈ విషయంపై నాకు ఎలాంటి సమాచారం లేదు. పేపర్లో ఓ వార్త చూశా. అందులో ప్రఫుల్ పటేల్, సునీల్ టాటాకరే.. ఇలా ఇతరుల పేర్లే కనిపించాయి. ఆమె డిప్యూటీ సీఎం పగ్గాలు చేపడుతోందనే విషయం నాకు తెలియదు. ఆమె నాతో కూడా ఆ మాట చెప్పలేదు. బీజేపీ కూటమితోనే కొనసాగాలని ఆమె భావిస్తుందని మేం అనుకోలేదు. ఇది ఆశ్చర్యం కలిగించే అంశమే. దీనిపై నేను, మా వర్గం ఎలాంటి చర్చా జరపలేదు. బహుశా ఆమె పార్టీనే ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఆమె ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండొచ్చు.రెండు వర్గాల విలీనంపై స్పందిస్తూ.. గత నాలుగు నెలలుగా రెండు వర్గాల విలీనంపై చర్చలు నడుస్తున్నాయన్నారు. అజిత్ పవార్, శశికాంత్ షిండే, జయంత్ పాటిల్లు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు. జనవరి 17న విలీనంపై చర్చలు జరిగాయి. ఫిబ్రవరి 12న ముహూర్తం పెట్టుకున్నాం. విలీనం సమయంలోనే ఇది ఊహించని పరిణామం అని అజిత్ పవార్ మృతిని ఉద్దేశించి అన్నారు. అయితే.. ఆయన(అజిత్ పవార్) కోరిక నెరవేరాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు శరద్ పవార్ వ్యాఖ్యానించారు. 2023 జులైలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) వర్గం రెండుగా చీలింది. మొత్తం 54 మంది ఎమ్మెల్యేలలో.. 40 మందితో కలిసి బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వంలో అజిత్ పవార్ చేరారు. ఆ తర్వాత అజిత్ పవార్ వర్గానికే అసలైన ఎన్సీపీ గుర్తింపు దక్కింది. దీంతో శరద్ పవార్ తన వర్గానికి ఎన్సీపీ-శరద్చంద్ర పవార్ కూటమి అని పేరు పెట్టారు. 2024 చివర్లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికలో మహాయుతి కూటమి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంది. పవర్ షేరింగ్లో భాగంగా.. అజిత్ పవార్కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రిత్వ శాఖలను కేటాయించారు. అయితే.. జనవరి 28వ తేదీన తన నియోజకవర్గం బారామతిలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వెళ్తూ విమాన ప్రమాదంలో అజిత్ పవార్(66) మరణించారు. దీంతో ఈమధ్యలో జరిగిన ఎన్సీపీ వర్గ విలీన ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. అదే సమయంలో.. ఆయన వర్గం తీసుకునే ఎలాంటి నిర్ణయాన్నైనా తాము గౌరవిస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. ఎన్సీపీ వర్గం ఆమెను శనివారం లెజిస్టేచర్ నేతగా ఎన్నుకునే అవకాశం ఉంది. ఆపై ఇవాళ సాయంత్రం ఆమె మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసే చాన్స్ ఉంది. మరోవైపు.. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గోవింద్బాగ్లో పవార్ కుటుంబ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, అజిత్ పవార్ తనయుడు రోహిత్ పవార్ హాజరయ్యారు. అయితే ఇది కుటుంబ సంబంధిత కార్యక్రమానికి సంబంధించిన సమావేశం అనే ప్రచారం జరుగుతునప్పటికీ.. సునేత్ర ప్రమాణ స్వీకారం వేళే ఈ భేటీ జరగడం రాజకీయ చర్చా అనే అనుమానాలకు తావిస్తోంది. -
మహారాష్ట్ర రాజకీయం.. అజిత్ కుమారుడికి బంపరాఫర్!
ముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ అకాల మరణం తర్వాత మరాఠా రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించారు. నేడు ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు.. అజిత్ కుమారుడు పార్థ్ పవార్కు బంపరాఫర్ వస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అజిత్ పవార్ మరణం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల గురించి రోజుకో విషయం బయటకొస్తుంది. తాజాగా ఆయన పెద్ద కుమారుడు పార్థ్ పవార్ రాజ్యసభలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన తల్లి సునేత్రా పవర్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో ఆమె స్థానంలో రాజ్యసభకు వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, పార్థ్ పవార్.. 2019 లోక్సభ ఎన్నికల్లో మావల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.ఇదిలా ఉండగా.. అజిత్ పవార్ ఆకస్మిక మరణంతో ఆయన స్థానాన్ని సతీమణి సునేత్ర పవార్కు అప్పగించాలని కూటమి పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు ఇతర కూటమి నేతలు సునేత్ర పవార్తో చర్చలు జరిపారు. ఆ చర్చలు విజయవంతం కావడంతో ఆమె ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సునేత్ర పవార్ గతంలో బారామతి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ ఆమెకు స్థానికంగా మంచి పట్టుంది. అజిత్ పవార్ వర్గం ఆమెను ఉప ముఖ్యమంత్రిగా తీసుకురావడం ద్వారా మహిళా నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా, బారామతి ప్రాంతంలో తమ బలాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. ఇక, సునేత్రా నిర్ణయంతో అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్సీలోని రెండు వర్గాలు ఏకమవుతాయన్న ప్రచారానికి తెర పడినట్లయింది.సునేత్ర రికార్డుమహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక మహిళ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టటడం ఇదే తొలి సారి. 1978వ సంవత్సరంలో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ప్రారంభమైనప్పుడు ఈ పదవిని సృష్టించారు. అయితే ఇప్పటి వరకు ఏ మహిళా నాయకురాలు కూడా ఈ హోదాలో పని చేయలేదు. అజిత్ పవార్ మరణం తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేయాలని ఎన్సీపీ నాయకులు గట్టిగా కోరడంతో సునేత్రా పవార్ ఇందుకు అంగీకరించారు. శనివారం ఉదయం ముంబైలో జరిగే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆమెను ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం సాయంత్రం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. -
400 మీటర్లు.. 18,000 బిల్లు..
మనం ‘అతిథి దేవో భవ’ అంటాం.. కానీ ఆ ట్యాక్సీ డ్రైవర్ మాత్రం అతిథి ‘దోపిడీ’భవ అనుకున్నాడు. వేల మైళ్ల దూరం నుంచి వచ్చిన ఒక అతిథిని, అడుగు దూరంలో ఉన్న హోటల్కు చేర్చడానికి అక్షరాలా పద్దెనిమిది వేల రూపాయలు పిండేశాడు. అమెరికా నుంచి ముంబై ఎయిర్పోర్ట్లో దిగిన ఒక మహిళకు ఎదురైన చేదు అనుభవమిది. ఆ 20 నిమిషాల ఉత్కంఠ జనవరి 12 అర్ధరాత్రి సమయం.. అమెరికా నుంచి ముంబైలో అడుగుపెట్టిన ఆ మహిళ ఒక ట్యాక్సీ ఎక్కింది. ఆమె వెళ్లాల్సిన ఫైవ్ స్టార్ హోటల్ ఎయిర్పోర్ట్కు కేవలం 400 మీటర్ల దూరంలోనే ఉంది. కానీ, ట్యాక్సీ డ్రైవర్ దేశ్రాజ్ యాదవ్ కన్ను ఆమె పర్సుపై పడింది. నేరుగా హోటల్కు తీసుకెళ్లకుండా, ఆమెకు దారి తెలియదు కదా.. అని అంధేరీ వీధుల్లో 20 నిమిషాల పాటు ‘చక్రం’ తిప్పాడు. కారులో డ్రైవర్ పక్కన మరో అపరిచిత వ్యక్తి.. చుట్టూ చీకటి.. ఆమెకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు.. చెక్ ఇన్ అవ్వకముందే.. భారీ చెక్! చివరికి హోటల్ ముందు కారు ఆపిన ఆ డ్రైవర్, బాంబు పేల్చాడు. బిల్లు ఎంతో తెలుసా? అక్షరాలా 18,000 రూపాయలు! అంటే కిలోమీటర్కు కూడా సరిపోని దూరానికి దాదాపు 200 డాలర్లు వసూలు చేశాడు. కొత్త దేశం, ఒంటరి మహిళ.. వాళ్లతో వాదించలేక, భయంతో ఆ డబ్బు చెల్లించి హోటల్లోకి పరుగులు తీసింది.ట్విట్టర్లో పోస్టు.. ఖాకీల వేట అమెరికా చేరుకున్నాక ఆ బాధితురాలు జనవరి 26న ఎక్స్ వేదికగా తన గోడు వెళ్లగక్కింది. ఆమె కథనం ప్రకారం.. ట్యాక్సీ డ్రైవర్తో పాటు మరో వ్యక్తి బాధితురాలిని ఒక గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. డబ్బులు ఇవ్వాలని బెదిరించి, ఆ తర్వాతే హోటల్ దగ్గర వదిలిపెట్టారు. ఆ పోస్ట్ చూసి నెటిజన్లు రగిలిపోయారు. ముంబై పోలీసులు వెంటనే స్పందించారు. ఎఫ్ఐఆర్ నమోదైన కేవలం 3 గంటల్లోనే ఆ కేటుగాడిని పట్టుకుని బేడీలు వేశారు. డ్రైవర్ లైసెన్స్ను రద్దు చేయడమే కాకుండా, అతని ట్యాక్సీని కూడా సీజ్ చేశారు. ఎక్కడైనా, ఎప్పుడైనా ఇలాంటి మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 112 కి కాల్ చేయండని డీసీపీ మనీష్ కల్వానియా విజ్ఞప్తి చేశారు. డబ్బు మీద ఆశతో దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టిన ఆ మాయగాడికి, ముంబై పోలీసులు సరైన రీతిలో ‘మర్యాద’చేశారు! – సాక్షి, నేషనల్ డెస్క్. -
మహా ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్
ముంబై: మహారాష్ట్ర నూతన ఉప ముఖ్యమంత్రిగా దివంగత నేత అజిత్ పవార్ భార్య, రాజ్యసభ సభ్యురాలు సునేత్ర పవార్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆమె శనివారమే ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు ఎన్సీపీ(అజిత్ పవార్) వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ రికార్డు సృష్టించబోతున్నారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. భర్త స్థానంలో సునేత్ర పవార్ బాధ్యతలు స్వీకరించాలని పార్టీ వర్గాలు కోరడంతో ఆమె అంగీకరించినట్లు సమాచారం. శనివారం ఉదయం ముంబైలో తమ పార్టీ సమావేశం జరుగుతుందని, సునేత్ర పవార్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటామని ఎన్సీపీ(అజిత్ పవార్) వర్గాలు తెలియజేశాయి. సాయంత్రం డిప్యూటీ సీఎంగా ఆమె ప్రమాణం చేస్తారని పేర్కొన్నాయి. సునేత్ర పవార్కు రాజకీయాలతో అనుబంధం ఉంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి ఎన్సీపీ(అజిత్ పవార్) అభ్యరి్థగా పోటీ చేశారు. కానీ, ఎన్సీపీ(శరద్ పవార్) అభ్యర్థి సుప్రియా సూలే చేతిలో ఓడిపోయారు. అనంతరం సునేత్ర రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె మహారాష్ట్ర అసెంబ్లీలో సభ్యురాలు కాదు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడితే ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నికల కావాల్సి ఉంది. తన భర్త మరణంతో ఖాళీ అయిన బారామతి నుంచి ఆమె పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. మరోవైపు ఉభయ ఎన్సీపీలు ఏకం కాబోతున్నాయని, దీనిపై త్వరలో చర్చలు ప్రారంభమవుతాయని చెబుతున్నారు. -
మహారాష్ట్రలో ట్విస్ట్.. బీజేపీకి ఎన్సీపీ కొత్త డిమాండ్
ముంబై: భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్, దివంగత అజిత్ పవర్ భార్య సునేత్రకు తక్షణం మహారాష్ట్ర కేబినెట్లో ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని ఎన్సీపీ నేతలు డిమాండ్లు చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ సారథ్యంలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమి పార్టీలతో ఈ మేరకు ఎన్సీపీ ముఖ్యనేతలు సుదీర్ఘ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పార్టీ పగ్గాలు సైతం సునేత్రకు అప్పగించాలని ఆ పార్టీ ముఖ్యలు భావిస్తున్నారు. అజిత్ పవార్ మరణంతో ఖాళీ అయిన బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సునేత్రను పోటీకి నిలబెట్టాలని పార్టీ నేతలు యోచిస్తున్నారు.విలీనంపై మొదలైన గుసగుసలు బాబాయితో విబేధించి ఎన్సీపీని చీల్చి వేరు కుంపటి పెట్టుకున్న అజిత్ పవార్ లేకపోవడంతో ఇకపై పవార్ సారథ్యంలోని పార్టీని శరద్పవార్ నేతృత్వంలోని పాత పార్టీతో విలీనంచేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. అజిత్ వర్గం నేతలు ఇందుకు మొగ్గుచూపుతున్నారు. ‘‘ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సునేత్ర సారథ్యంలోనే ఇకపై పార్టీ ముందుక నడవాలని నేతలంతా భావిస్తున్నారు. ఆమెకు కేబినెట్ మంత్రి పదవి ఇవ్వాలి. వాస్తవానికి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(ఎస్పీ)తో మా పార్టీ ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో కలిసి పనిచేస్తోంది. ఇకమీదటా శాశ్వతంగా కలిసే ఉంటాయి’’ అని మహారాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ శాఖ మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నరహరి జిర్వాల్ అన్నారు.‘‘పవార్ల కుటుంబాలు ఒక్కటవ్వాలి. ఎన్సీపీ(ఎస్పీ), ఎన్సీపీలు కలిసిపోవడమే ఉత్తమం’’అని ఎన్సీపీ సీనియర్ నేతలు నవాబ్ మాలిక్, ప్రమోద్ హిందూరావ్ అభిప్రాయపడ్డారు. అయితే సునేత్రకు పార్టీ పట్టంకట్టే అంశం ఇంత త్వరగా చర్చించాల్సిన అవసరం లేదని ఎన్సీపీ నేత, ఆహార, పౌరసరఫరాల మంత్రి ఛగన్ భుజ్బల్ వ్యాఖ్యానించారు. శరద్ పవార్ సమ్మతితోనే పార్టీల విలీనం సాధ్యమని ఎన్సీపీ(ఎప్పీ) నేత ఏక్నాథ్ ఖడ్సే అన్నారు. -
పెద్దాయన చక్రం తిప్పుతారా?
విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైన ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు బారామతిలో గురువారం అధికార లాంఛనాలతో ముగిశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిందే, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, రితేశ్ దేశ్ముఖ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. కుటుంబ సభ్యులు, అభిమానులు సజల నయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. మరాఠా రాజకీయాల్లో అజిత్ పవార్ శకం శాశ్వతంగా ముగిసిసోయింది.విలీనానికి బ్రేక్అజిత్ పవార్ అకాల మరణంతో ఎన్సీపీలో రెండు గ్రూపుల పునరేకీకరణకు బ్రేక్ పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాబాయ్- అబ్బాయ్ వర్గాలు కలిసిపోతాయని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో భాగంగా పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ పోరుతో ఈ రెండు గ్రూపులు చేతులు కలిపాయి. ఈ విషయాన్ని అజిత్ పవార్ స్వయంగా ప్రకటించారు. తన నాయకత్వంలోని నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ (ఎస్పీ) కలిసికట్టుగా పోటీ చేస్తాయని ఎన్నికల ప్రచార సభలో చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ కుటుంబం మళ్లీ ఏకమైందని అన్నారు.పింప్రి- చించ్వాడ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. 84 స్థానాలు గెలిచి విజయదుందుభి మోగించింది. ఎన్సీపీ ద్యయం 37 స్థానాలకే పరిమితమైంది. శివసేన 7, ఇతరులు 5 చోట్ల గెలిచారు. గత ఎన్నికల్లో బీజేపీ 77, ఎన్సీపీ 35 స్థానాలు విజయం సాధించాయి. ఎన్సీపీలోని రెండు గ్రూపులు చేతులు కలిపినా పింప్రి- చించ్వాడ్లో కమలం పార్టీని ఓడించలేకపోయాయి. అయితే పవార్ కుటుంబం (Pawar Pariwar) మళ్లీ ఏకం కావడం ఎన్సీపీ మద్దతుదారుల్లో ఉత్సాహం నింపింది. మళ్లీ రెండు గ్రూపులు కలిసిపోతాయన్న ఆశాభావం వ్యక్తమైంది. అనూహ్యంగా అజిత్ పవార్ మరణించడంతో ప్రస్తుతానికి దీనికి బ్రేక్ పడిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.''ఎన్సీపీలోని రెండు గ్రూపుల పునరేకీకరణకు సంబంధించిన చర్చలు పవార్ కుటుంబ సభ్యులకే పరిమితం. ఇరు వర్గాల సీనియర్ నాయకులతో కలిసి పునరేకీకరణకు అవసరమైన ప్రణాళికను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. అజిత్ పవార్ అకాల మరణంతో పునరేకీకరణ ప్రక్రియ కొద్దిరోజులు ఆగిపోతుంది. ఎన్సీపీకి కొత్త అధినేత వచ్చాక మళ్లీ ఈ ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కే అవకాశముంద''ని అజిత్ పవార్ సన్నిహితుడొకరు 'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో అన్నారు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో అజిత్ సతీమణి సునేత్రకు (Sunetra Pawar) పార్టీ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం నడుస్తోంది.పట్టుసాధిస్తారా?రాజకీయాల్లో మరాఠా యోధుడిగా పేరుగాంచిన ఎన్సీపీ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ మళ్లీ మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అజిత్ పవార్ స్థానంలో ఎన్సీపీ పార్టీ అధినేత ఎంపికలో 'పెద్దాయన' కీలకపాత్ర పోషించే అవకాశముందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో ఆయన ఎవరివైపు మొగ్గు చూపుతారనే ఆసక్తి నెలకొంది. తన కుమార్తె సుప్రియ సూలేను (Supriya Sule) తెరపైకి తెస్తారనే ప్రచారం నడుస్తోంది. ఎందుకంటే ఎన్సీపీలో రెండు వర్గాలను ఏకం చేసేందుకు ఆమె చురుగ్గా పనిచేస్తున్నారు. అలాగే రెండు కుటుంబాల మధ్య గ్యాప్ను తగ్గించడంలో చురుకైన పాత్ర పోషించారు. బీజేపీ మాత్రం అజిత్ రాజకీయ వారసురాలిగా ఆయన సతీమణి సునేత్రను ఎంపిక చేయాలని భావిస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో పెద్దాయన మళ్లీ పార్టీపై పట్టుసాధిస్తారా, లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది.చదవండి: ఎన్సీపీకి కొత్త కష్టం.. పవార్ ఫ్యామిలీకి టెస్టింగ్ టైమ్! -
ఎన్సీపీకి కొత్త కష్టం.. పవార్ ఫ్యామిలీకి టెస్టింగ్ టైమ్!
మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇదే సమయంలో అజిత్ తర్వాత ఎన్సీపీ పగ్గాలు ఎవరికి?.. పార్టీని ఎవరు నడిపిస్తారు? అనే ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లోని రెండు వర్గాల మధ్య ఏకీకరణ గురించి చర్చలు జరుగుతున్న సమయంలో అజిత్ మరణంతో ఎన్సీపీ భవిష్యత్తు ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు.. అజిత్ వర్గం ఎన్సీపీ చీలకుండా.. బీజేపీ పక్కా వ్యూహం రచించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే, పార్టీపై పట్టు సాధించేందుకు అటు కుటుంబ సభ్యులతోపాటు.. ఇటు పార్టీలోని సీనియర్ నేతల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, పార్టీ బాధ్యతల విషయంలో అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ , కుమారుడు పార్థ్ పవార్ రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్సీపీ అధికార పగ్గాలు ఎవరికి దక్కుతాయి అనేది ఇప్పుడు సంచలనంగా మారింది.ఇక, మహారాష్ట్రలో జరిగిన కీలక పరిణామాలను పరిశీలిస్తే.. శరద్ పవార్ 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(NCP)ని స్థాపించారు. 2023లో అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్పై తిరుగుబాటు చేసి, పార్టీని చీల్చి సొంత పార్టీని పెట్టారు. ఎన్నికల సంఘం నుంచి ఆయన తన పార్టీకి ఎన్సీపీ పేరుని, చిహ్నాన్ని సొంతం చేసుకున్నారు. నిజానికి ముఖ్యమంత్రి కావాలనే రాజకీయ ఆకాంక్షల కారణంగా అజిత్ పవార్.. శరద్ పవార్ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. కానీ ఆయన ఆకాంక్ష నెరవేరలేదు. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో అజిత్ పవార్ వర్గానికి 40 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉండగా, శరద్ పవార్ వర్గానికి 13-14 మంది మాత్రమే ఉన్నారు. అయితే అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్తో సంబంధాలు ఇటీవల పెరిగాయి. రెండు పార్టీల ఏకీకరణ చర్చలు కూడా ఊపందుకున్నాయి.ఇటీవల మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనవరి 2026లో ఈ రెండు వర్గాలు పుణె, పింప్రి-చించ్వాడ్లో ఎన్నికల కోసం కూటమిగా ఏర్పడ్డాయి. శరత్ పవార్ ఆధ్వర్యంలో ఈ రెండు వర్గాల మధ్య ఐక్యతకు సిద్ధంగా ఉన్నాయని సూచిస్తున్నాయి. కాగా, రెండు వర్గాల మధ్య ఏకీకరణ జరిగితే శరద్ పవార్ వారసురాలిగా సుప్రియా సూలే ఉద్భవిస్తున్నారు. కానీ అజిత్ వర్గానికి వారసుడు ఎవరు అవుతారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సమాధానంగా పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో ముఖ్యంగా అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్, ఆయన కుమారుడు పార్థ్ పవార్ పేర్లు ఉండగా.. కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్, ఓబీసీ నాయకుడు ఛగన్ భుజ్బాల్, పార్టీ అధ్యక్షుడు సునీల్ తత్కరే, ధనంజయ్ ముండే వంటి బలమైన నాయకులు కూడా ఉన్నారు.అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్..ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో అతిజ్ పవార్ భార్య సునేత్రా పవర్ చురుగ్గా ఉన్నారు. ఆమె 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం రాజ్యసభ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. అజిత్ పవార్ వారసురాలిగా ఆమె బలమైన పోటీదారు. బారామతి ప్రాంతంలో మహిళా సంఘాలు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా మంచి పట్టు సాధించారు. అజిత్ పవార్ మద్దతుదారుల సానుభూతిని ఓట్లుగా మార్చుకునేందుకు సునేత్రా పవార్ ముందుంచే అవకాశం ఉంది.అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్అజిత్ పవార్ పెద్ద కుమారుడు పార్థ్ పవార్.. 2019లోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్గా లేనప్పటికీ.. అజిత్ పవార్ కుటుంబ వారసుడిగా పార్టీ కేడర్లో పార్థ్ పవార్కు మంచి గుర్తింపు ఉంది.ధనంజయ్ ముండేఅజిత్ పవార్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ధనంజయ్ ముండే.. బీడ్ జిల్లాలో బలమైన నేతగా ఉన్నారు. యూత్లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ.. వివాదాల కారణంగా నాయకత్వ రేసులో ధనంజయ్ ముండే వెనుకబడి ఉండవచ్చు.కేంద్రమంత్రి ప్రఫుల్ పటేల్ఎన్సీపీ వ్యవస్థాపక నేతల్లో ప్రఫుల్ పటేల్ కూడా ఒకరు. ఆయనకు ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి. దేశ రాజధానిలో ప్రముఖులతో కలిసి చక్రం తిప్పగలిగే సామర్థ్యం ఉంది. అజిత్ పవార్ చీలిక సమయంలో ఆయనకు ప్రఫుల్ పటేల్ వెన్నుదన్నుగా నిలిచారు. పరిపాలనా అనుభవం, జాతీయ రాజకీయాల్లో పరిచయాలు ఉండటంతో పార్టీని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రఫుల్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.బీజేపీ వ్యూహమేంటి?మరోవైపు.. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. మహారాష్ట్రపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. భవిష్యత్లో అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేల మధ్య చీలిక ఏర్పడే అవకాశం ఉందని.. వారిలో కొందరు శరద్ పవార్ వర్గంలోకి తిరిగి వెళ్ళవచ్చని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. దీనిని ఊహించిన బీజేపీ.. అజిత్ పవార్ కుటుంబం నుండి ఒకరికి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర అప్పగించాలని యోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ తిరిగి అసెంబ్లీలోకి తీసుకురావాలని బీజేపీ వ్యూహకర్తలు కోరుకుంటున్నారు. ఇది అజిత్ పవార్ మద్దతుదారులకు భావోద్వేగ సందేశాన్ని పంపడమే కాకుండా మహాకూటమి చెక్కుచెదరకుండా ఉండేలా కూడా చేస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా, క్యాబినెట్లోకి ఒక మహిళా మంత్రి ప్రవేశించడం రాజకీయంగా కూడా ముఖ్యమైనది. అయితే కీలక నిర్ణయాలు తీసుకునే ముందు బీజేపీ ఇప్పటికీ షిండే సేనతో సంప్రదించాల్సి ఉంటుంది. -
ఆడవాళ్లున్నారుగా ఆగు అన్నందుకే చంపేశాడు!
క్షణికావేశంతో తోటి ప్రయాణికుడు, కాలేజీ ప్రొఫెసర్ను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కదులుతున్న లోకల్ రైలు నుండి దిగుతున్నప్పుడు స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ముంబైలోని మలాడ్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చేసుకుంది. మలాడ్ రైల్వే స్టేషన్లో దిగేందుకు ప్రయాణికులు సిద్దమవుతున్నారు. ఫుట్బోర్డు దగ్గర ఇద్దరు మహిళలు నిలబడి ఉన్నారు. ఇంతలో వారిని తోసుకుంటూ ముందుకు రావడానికి ప్రయత్నించాడు. 27 ఏళ్ల షిండే. దీంతో ముందు మహిళలు ఉన్నారు కదా.. కనపించడం లేదా అని మందలించాడు వారి వెనుక ప్రొఫెసర్ అలోక్ కుమార్ సింగ్. చాలా సాధారణంగా చెప్పిన ఆ మాటలే తన పాలిట మరణ దండనగా మారిపోతాయని ఆయన అస్సలు ఊహించి ఉండడు. కోపోద్రిక్తుడైన షిండే స్టేషన్లో దిగగానే ఫ్లాట్ఫామ్మీదే సింగ్ను అతి దారుణంగా పొడిచాడు. దీంతో సింగ్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ఇది చూసి నిందితుడు షిండే అక్కడినుంచి పారిపోయాడు. సింగ్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు అతను మరణించినట్లు ప్రకటించారు. ఈయన విలే పార్లేలోని ఒక ప్రముఖ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. గత వారం ఈ సంఘటన జరిగింది.సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా షిండేను పోలీసులు అరెస్ట్ చేశారు. తాను ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా సింగ్ తనను నెట్టి, అవమానించాడని, ఆ మహిళలు వెనక్కి తిరిగి తన వైపు చూశారు. దీంతో అవమానానికి గురయ్యానని పోలీసులకు చెప్పాడు. అందుకే అతనికి బుద్ధి చెప్పాలని అనుకున్నానని, ఆయన చనిపోయిన విషయం తనకు తెలియదని విచారణలో వెల్లడించాడు. షిండేకు జనవరి 29 వరకు పోలీసు కస్టడీ విధించారు. పోలీసు వర్గాల ప్రకారం, షిండే తల్లిదండ్రులు, అన్నయ్యతో కలిసి మలాడ్లో నివసిస్తున్నాడు. తల్లి గృహిణి, తండ్రి గుండె జబ్బుతో బాధపడుతున్నారు. అతని సోదరుడు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నిందితుడు గ్రాంట్ రోడ్లో చిన్న నకిలీ ఆభరణాల దుకాణాన్ని నడుపుతున్నాడు. తన కొడుకుకు కోపాన్ని నియంత్రించుకోవడంలో ఇబ్బంది ఉందని షిండే తండ్రి పోలీసులకు తెలిపారు.ఇదీ చదవండి: 78 ఏళ్లకు లవ్ ప్రపోజల్..39 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి! -
అక్క కోసమని వెళ్లి.. అనంతలోకాలకు!
అమెరికా లాంటి కొన్ని దేశాల్లో.. పిల్లలను స్కూల్ బస్సులు ఎక్కించేటప్పుడు లేదంటే దింపేటప్పుడు రోడ్డుపై ట్రాఫిక్ దానంతట అదే ఆగిపోతుంది. పిల్లలు కొద్దిదూరం వెళ్లిన తర్వాతే వాహనాలు ముందుకు కదులుతాయి. అక్కడ ఎలాంటి ట్రాఫిక్ సిగ్నల్స్.. లేదంటే పోలీసు అవసరం ఉండదు. పిల్లల సేఫ్టీ అనేది అక్కడి ప్రజల జీవనశైలిలో ఇదొక భాగమైపోయింది. కానీ, మన దేశంలో.. !ముంబై నగరంలో అంతా చూస్తుండగానే ఘోరం జరిగింది. స్కూల్ బస్సు దిగిన ఓ చిన్నారిని ఆమె నాయనమ్మ రోడ్డు దాటిస్తున్న క్రమంలో.. బస్సు ముందుకు వచ్చింది. ఈ ప్రమాదంలో ఆ పెద్దావిడ చేతిలో ఉన్న ఏడాది పసికందు ప్రాణం విడిచింది. ఆమెకూ తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ఆ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది. మంగళవారం మధ్యాహ్నాం ఖేట్వాడీ ఏరియాలోని గిర్గావ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రకళ అనే పెద్దావిడ తన ఏడాది మనవడిని చంకలో వేసుకుని.. స్కూల్ నుంచి వచ్చే మనవరాలిని ఇంటికి తెచ్చేందుకు వెళ్లింది. అయితే ముగ్గురూ బస్సు ముందు నుంచి రోడ్డు దాటుతుండగా.. డ్రైవర్ అది గమనించకుండా ముందుకు పోనిచ్చాడు. బస్సు ఢీ కొట్టి ముగ్గురూ కింద పడిపోయారు. చిన్నారి పక్కకు పడిపోగా.. చంద్రకళ, ఆమె ఏడాది మనవడి మీదుగా బస్సు వెళ్లింది. వెంటనే డ్రైవర్ బ్రేకులు వేయగా.. స్థానికులు అప్రమత్తమై వాళ్లను బయటకు తీసే ప్రయత్నం చేశారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఏడాది చిన్నారి అప్పటికే మరణించగా.. గాయపడిన చంద్రకళను ఆస్పత్రికి తరలించారు. డీబీ మార్గ్ పోలీసులు స్కూల్బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన తాలుకా దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీల్లో నమోదు కాగా.. అవి ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయొచ్చు.मुंबई में स्कूली बस ने ही दो बच्चों और उनकीअभिभावक को कुचल दिया! एक बच्चे की मौत हो गई दूसरा घायल है। अभिभावक भी बस के नीचे आ गई और वो भी गंभीर रूप से घायल है। मैं जानता हूं कि ये भारत है अमेरिका नहीं लेकिन फिर भी ये लिख रहा हूं कि जब भी अमेरिका जाता हूं, देखता हूं और आप भी… pic.twitter.com/RHcmGOUmEp— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) January 28, 2026 -
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
ముంబై: ఎన్సీపీ నేత, దివంగత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్షా, బీజేపీ చీఫ్ నితిన్ నబీన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్నాథ్ షిండే, మహారాష్ట్రకు చెందిన నేతలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అజిత్ పవార్ మృతికి మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.అంతకు ముందు.. అజిత్ దాదా కడసారి చూపు కోసం రాజకీయ నేతలు, అభిమానులు బారామతిలోని ఆయన నివాసం వద్దకు క్యూ కట్టారు. ఆపై కటేవాడిలో కాసేపు అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. అక్కడి నుంచి అంతిమ యాత్ర నడిచింది. దారి పొడవునా అల్విదా అజిత్ దాదా నినాదాలు హోరెత్తాయి. హఠాన్మరణంమహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తన సొంత నియోజక వర్గం బారామతిలో జరగబోయే ప్రచార సభలకు బుధవారం ఉదయం అజిత్ పవార్ చార్టెడ్ ఫ్లైట్లో బయల్దేరారు. అయితే ల్యాండింగ్ చివరి నిమిషంలో విమానం అదుపు తప్పి సమీపంలోని గోజుబావి గ్రామ సమీంలోని గుట్టల్లో కూలిపోయింది.బండ రాయిని విమానం బలంగా ఢీ కొట్టి రెండు ముక్కులై.. పేలి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో అజిత్ పవార్తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది, పైలెట్లు, ఫ్లైట్ అటెండెంట్ మొత్తం ఐదుగురు మరణించారు. ప్రమాదం ధాటికి గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు కాలిపోయాయి. అయితే చేతి వాచీ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. అజిత్ పవార్తో పాటు ప్రమాదంలో మరణించిన మిగతా వాళ్ల మృతదేహాలకు ఈ ఉదయం పోస్టుమార్టం పూర్తైంది. దీంతో పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి బంధువులు మృతదేహాలను తమ స్వస్థలాలకు తరలించారు.ఈ ఘటనపై ఏఏఐబీ (Aircraft Accident Investigation Bureau.. విమాన ప్రమాదాల పరిశోధన బ్యూరో) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఘటనా స్థలం నుంచి పలు ఆధారాలు సేకరించింది. బ్లాక్ బాక్స్ను రికవరీ చేసుకుని డీ కోడింగ్ చేసుకునే పనిలో ఉంది. నిర్ణీత కాల వ్యవధిలో దర్యాప్తు జరుగుతుందని ఈ సందర్భంగా ఒక స్పష్టత ఇచ్చింది. -
అల్విదా..‘దాదా’
సాక్షి ముంబై: శరద్ పవార్ సోదరుడి కుమారుడిగా రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగిడిన అజిత్ పవార్ ఆయన అడుగుజాడల్లో నడుస్తూనే తనదైన ముద్ర వేసుకున్నారు. 1982లో కోఆపరేటీవ్ చక్కెర ఫ్యాక్టరీ బోర్డుతో కార్యదర్శిగా, కోఆపరేటివ్ బ్యాంకు అధ్యక్షునిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ఉపముఖ్యమంత్రిగా విధులు నిర్వహించారు. అలాగే మహావికాస్ ఆఘాడిలో ఉపముఖ్యమంత్రిగా కొనసాగిన అజిత్ 2023లో శరద్పవార్తో తెగదెంపులు చేసుకుని ఎన్సీపీ పార్టీ పగ్గాలు చేపట్టి బీజేపీ, శివసేన (శిందే)ల మహాయుతి కూటమిలో చేరారు. అయితే ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తీరకముందే బుధవారం తన స్వంత నియోజకవర్గం బారామతి వద్ద జరిగిన విమానప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన జీవితంలోని విశేషాల్లో కొన్ని ముఖ్యమైన ఘట్టాల వివరాలివీ.. బాల్యం.. రాష్ట్ర ప్రజలంతా దాదా (అన్నా)గా ముద్దుగా పిలుచుకునే అజిత్ పవార్ 1959, జులై 22న అహిల్యనగర్ (అహ్మద్నగర్) దేవలాలి ప్రవరాలో జని్మంచారు. ఎన్సీపీ (ఎస్పీ)అ«ధ్యక్షుడు శరద్ పవార్ అన్న, అజిత్ పవార్ తండ్రి అనంత్రావ్ పవార్ సినిమా రంగంలో పనిచేసేవారు. పవార్ తాత గోవింద్రావ్ పవార్ బారామతి సహకారి వ్యాపారం, ఆయన అమ్మమ్మ, తాతలు వ్యవసాయం చేసేవారు. ఇక అజిత్ పవార్ అన్న శ్రీనివాస్ పవార్ అగ్రికల్చర్, అటోమొబైల్ రంగంలో ఉన్నారు. పెరిగి పెద్దయ్యాక తాను తీసుకునే అనేక కీలక నిర్ణయాల్లో అన్న శ్రీనివాస్ సలహా తీసుకునేవారు అజిత్ పవార్. విద్యాభ్యాసం అజిత్ పవార్ బారామతిలోని మహారాష్ట్ర ఎడ్యుకేషన్ సోసైటీ హైసూ్కల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. అనంతరం కొల్హాపూర్లోని శివాజీ విద్యాపీఠం నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత మాజీ మంత్రి పద్మసింహ్ పాటిల్ చెల్లెలు సునేత్ర పవార్ను వివాహం చేసుకున్నారు. అజిత్ పవార్, సునేత్ర పవార్ దంపతులకు జయ్ పవార్, పార్థ్ పవార్ అనే ఇద్దరు కుమారులున్నారు. 1982లో రాజకీయ రంగ ప్రవేశం.. 1982లో సహకార చక్కె కర్మాగారం బోర్డు ఎన్నికల ద్వారా అజిత్ పవార్ రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే అంతకన్నా ముందు అజిత్ పవార్ తన బాబాయి శరద్ పవార్ వ్యక్తిగత కార్యదర్శిగా విధులు నిర్వహించినట్టు ఓ ఛానెల్ ఇంటర్యూలో ఆయన స్వయంగా పేర్కొన్నారు. సహకార చక్కెర కార్మగారం బోర్డు ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన 1991లో పుణే జిల్లా సహకారి బ్యాంకు (పిడిసి) అధ్యక్షునిగా సుమారు 16 సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించారు. 1991లో బారామతి ఎంపీగా ఎన్నిక.. 1991లో మొట్టమొదటిసారిగా ఆయన బారామతి నుంచి పోటీ చేసి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. అయితే తన బాబాయి శరద్ పవార్ కోసం అజిత్ పవార్ తన పార్లమెంటు నియోజకవర్గాన్ని త్యాగం చేశారు. దీంతో ఎంపీగా ఎన్నికైన శరద్ పవార్ దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ. నరసింహరావు ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అదే నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి... 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో అజిత్పవార్ బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆయన 1995, 1999, 2004, 2009, 2014, 2019, 2023 వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆరుసార్లు ఉపముఖ్యమంత్రిగా రికార్డు.. అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి పదవిని ఆరు సార్లు చేపట్టారు. ఇలా అత్యధికంగా ఉపముఖ్యమంత్రి చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. 2010 నవంబరు 11వ తేదీన మొదటిసారి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత 2012, సెపె్టంబరు 25న ఆ పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో పృ«థ్వీరాజ్ చవాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేవలం మూడు నెలల కాలవ్యవధిలోనే చవాన్ నేతృత్వంలో మళ్లీ 2012, డిసెంబరు ఏడో తేదీన రెండవసారి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి ప్రభుత్వం గడువు ముగిసేవరకు ఆయన పూర్తికాలం పదవిలో కొనసాగారు. అలాగే 2019 నవంబరు 23వ తేదీన మూడోసారి ఆయన చేసిన ప్రమాణ స్వీకారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో తెల్లవారు జామున గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ ప్రమాణ స్వీకారం మూడు రోజుల్లోనే బెడిసి కొట్టింది. ఆ తరువాత ఆయన మహావికాస్ ఆఘాడి ప్రభుత్వంలో 2019, డిసెంబరు 30న నాలుగోసారి ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఇక అయిదవ సారి 2023 జులైలో, ఆరవసారి 2024, డిసెంబరు అయిదవ తేదీన ఉపముఖ్యమంత్రి పదవులు స్వీకరించారు. పనితీరు..సమయ పాలనతో ప్రత్యేక గుర్తింపు అజిత్ పవార్ పనితీరు, సమయపాలనతోపాటు నిర్మొహమాట వైఖరి ఇతర రాజకీయ నేతలకు ఆయన్ను భిన్నంగా నిలిపింది. సాధారణ కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నేతల వరకూ అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడటం ఆయన ప్రత్యేకత. ఏ విషయంలోనైనా వేగంగా నిర్ణయం తీసుకోవడం, అది పూర్తయ్యే వరకూ విశ్రాంతి తీసుకోకపోవడం ఆయనకు అలవాటు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి మృతి చెందే రోజు వరకూ ఈ అలవాటును వీడలేదు అజిత్ పవార్. -
అజిత్ పవార్ మృతిపై అనుమానాలు! శరద్ పవార్ ఏమన్నారంటే..
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ హఠాన్మరణంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. విమాన ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా విపక్ష నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసింది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బాబాయ్ శరద్ పవార్ స్పందించారు. ఈ ఘటనను రాజకీయం చేయొద్దంటూ రాజకీయ శ్రేణులను కోరారాయన.అజిత్ మరణం తీవ్ర దుఃఖాన్ని మిగిల్చిందన్న శరద్ పవార్.. ఓ సమర్థుడైన నాయకుడిని మహారాష్ట్ర కోల్పోయిందన్నారు. జరిగిన నష్టాన్ని పూడ్చలేం.. కానీ, ప్రతిదీ మన చేతుల్లో లేదు. ఈ ఘటనను రాజకీయం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇందులోకి రాజకీయాలు తీసుకురావద్దు. ఇది పూర్తిగా ప్రమాదమే. ఈ ఘటన నాతోపాటు రాష్ట్రం మొత్తానికి తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. దయచేసి ఈ విషాదాన్ని రాజకీయం చేయొద్దు అని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. మరోవైపు..తన సోదరుడి అకాల మరణంతో తీవ్ర షాక్కు గురయ్యానని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎంపీ సుప్రియా సూలే భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే అజిత్ సతీమణి సునేత్ర, కుమారుడు పార్థ్తో కలిసి మృతదేహాన్ని తరలించిన బారామతి ఆసుపత్రికి సుప్రియ కూడా వెళ్లారు.చివరి ట్వీట్ చెబుతోందిగా..అధికార మహాయుతి కూటమిలో తన ఎన్సీపీ వర్గంలో భాగమైన అజిత్ పవార్.. డిప్యూటీ సీఎం హోదాలో పలు మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మారుతున్న రాజకీయ పరిణామాలతో తిరిగి చిన్నాన్న శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీలోకి వెళ్లే యోచనలో ఆయన ఉన్నాడని.. ఈ క్రమంలోనే విమాన ప్రమాదం పలు అనుమానాలు రేకెత్తిస్తోందని, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందేనని మమతా బెనర్జీ సహా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సమాజ్వాదీ పార్టీ సారథి అఖిలేశ్ యాదవ్ తదితరులు ప్రకటనలు చేశారు. అయితే..అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయిన వేళ చివరిసారిగా ఆయన చేసిన సోషల్ మీడియా పోస్టు వైరల్గా మారింది. మంత్రివర్గ సమావేశంలో భాగంగా ‘మీ విశ్వసనీయ ప్రభుత్వం’ తీసుకున్న పలు ముఖ్యమైన నిర్ణయాలు అని పేర్కొంటూ.. రాష్ట్రంలో వృత్తి శిక్షణా సంస్థలను ఏర్పాటుచేయడం, కాంట్రాక్టర్ల చెల్లింపు వ్యవస్థల్లో మార్పులు చేయడం, ప్రైవేటు కంపెనీలకు కేటాయించిన ప్రభుత్వ భూమి లీజు కాలాల పొడిగింపు వంటి విషయాలను వెల్లడించారు. దీంతో.. ఆ అనుమానాలకు చెక్ పడినట్లైంది. आपल्या विश्वासू राज्य सरकारनं आजच्या मंत्रिमंडळाच्या बैठकीत घेतलेले काही महत्त्वपूर्ण निर्णय :✅ औद्योगिक प्रशिक्षण संस्थामध्ये 'पीएम सेतू' योजना राबविण्यात येणार. होतकरू युवकांना दिलासा. पहिल्या टप्प्यात नागपूर, छत्रपती संभाजीनगर आणि पुणे जिल्ह्यातील औद्योगिक प्रशिक्षण…— Ajit Pawar (@AjitPawarSpeaks) January 27, 2026 -
నెరవేరని ‘సీఎం’ కల
అజిత్ పవార్. మహారాష్ట్ర రాజకీయాల్లో శిఖర సమానుడైన చిన్నాన్న శరద్ పవార్ నీడను దాటుకుని అంచెలంచెలుగా ఎదిగిన నేత. నాలుగు దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పు తూ వచ్చారు. ఆయన రాజకీయ అడుగు లన్నీ ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా సాగుతూ వచ్చాయి. కానీ రికార్డు స్థాయిలో ఏకంగా ఆరుసార్లు ఉప ముఖ్యమంత్రి కాగలిగినా, ‘సీఎం’ కల మాత్రం నెరవేరకుండానే విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన బారామతి గడ్డ మీదే తుది శ్వాస విడిచారు. కష్టించే స్వభావం అజిత్ సొంతం. ముఖ్యంగా సమయ పాలనకు పెట్టింది పేరు. ఆయన తండ్రి అనంత్రావ్ ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్కు అన్న. 22 ఏళ్ల వయసులో చక్కెర సహకార బోర్డు సభ్యునిగా 1982లో అజిత్ రాజకీయ అరంగేట్రం చేశారు. 1991లో బారామతి లోక్సభ స్థానం నుంచి విజయం సాధించారు. కొంతకాలానికే చిన్నాన్న శరద్ పవార్ కోసం ఆ స్థానాన్ని త్యాగం చేసి అసెంబ్లీకి వెళ్లారు. ఏకంగా 8సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. కాంగ్రెస్ను వీడి శరద్ పవార్ ఎన్సీపీని స్థాపించాక ఆ పార్టీలో అజిత్ కీలక నేతగా ఎదిగారు. సీఎం కావాలన్న తన అభిలాషను ఎప్పుడూ దాచు కోలేదు. పలుమార్లు ఎన్సీపీకి మెజార్టీ అసెంబ్లీ స్థానాలు దక్కినా కాంగ్రెస్కు సీఎం పదవి అప్పగించడాన్ని పలుమార్లు బాహాటంగానే వ్యతిరేకించారు. 2019లోనే చిన్నాన్నతో విభేదించి బీజేపీతో చేతులు కలిపినా ఫడ్నవీస్ సారథ్యంలో ఆ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొద్ది గంటల్లోనే కూలిపోవడంతో మళ్లీ సొంత గూటికి చేరారు. 2022లో మరోసారి శరద్ పవార్పై తిరగుబావుటా ఎగరేయడమే గాక ఎన్సీపీని రెండుగా చీల్చారు. బీజేపీతో చేతులు కలిపి అధికార మహాయుతి సంకీర్ణంలో భాగస్వామిగా కొనసాగుతున్నారు. -
విమాన ప్రమాదంలో కుట్ర? శరద్ పవార్ ఏమన్నారంటే
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈ రోజు (బుధవారం) ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంపై పలు రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేశాయి. ఇందులో కుట్రకోణం ఉందని ఆరోపించాయి. తాజాగా దీనిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ఈ ప్రమాద ఘటనపై ఎట్టి పరిస్థితుల్లో రాజకీయం చేయకూడదన్నారు.ఈ రోజు జరిగిన ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం మహాయుతి కూటమి నుండి అజిత్ పవార్ ని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. కనుక ఈ ప్రమాదంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ సైతం ఈ విమాన ప్రమాదంపై అనుమానం చేసింది. పారదర్శకమైన విచారణ చేపట్టాలని కాంగ్రెస్ నేత గౌరవ్ గోగోయ్ అన్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు.శరద్ పవార్ మాట్లాడుతూ.. "ఈ ప్రమాదంలో ఎటువంటి కుట్రలేదు. ఇదిపూర్తిగా ప్రమాదం అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్రకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక సమర్థుడైన నాయకుడు నేడు మనల్ని విడిచిపెట్టి వెళ్లారు. అంతా మనచేతుల్లో లేదు. నేను నిస్సహాయంగా భావిస్తున్నాను. కొన్ని సంఘటనల వెనుక రాజకీయాలుండవు." అని శరద్ పవార్ అన్నారు. కాగా 2023లో ఎన్సీపీ నుంచి బయిటకి వచ్చి బీజేపీతో చేతులు కలిపారు. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. -
సర్వస్వం త్యాగం : అజిత్ పవార్ చివరి పోస్ట్ వైరల్
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , ఎన్సీపీనేత అజిత్ పవార్ అకాలమరణం రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. బుధవారం తెల్లవారుజామున బారామతిలో విమానం ల్యాండింగ్ అవుతుండగా కుప్పకూలడంతో ఆయన ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. అయితే విమాన ప్రమాదానికి కొన్ని గంటల ముందు చేసిన దేశభక్తి, త్యాగం అంటూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ పలువురి చేత కంటతడి పెట్టిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది.విమాన ప్రమాదానికి కొన్ని గంటల ముందు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న అజిత్ పవార్ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. స్వాతంత్ర్య సమరయోధుడు లాలాలజపతి రాయ్ జయంతి సందర్భంగా తన చివరి ఫేస్బుక్ పోస్ట్లో ఆయనకు నివాళులు అర్పించారు. లజపత్ రాయ్ దేశ స్వాతంత్ర్యం కోసం సర్వస్వం త్యాగం చేశారని, ఆయన దేశభక్తి తరతరాలకు స్ఫూర్తి నిస్తుందని పవార్ రాశారు. అలాగే పవార్ మంగళవారం రాత్రి ఎక్స్ (గతంలో ట్విటర్)లో సీఎంఓ మహరాష్ట్ర ట్వీట్ను రీట్వీట్ చేశారు. ఒక ఫోటోతో పాటు క్యాబినెట్ సమావేశం, కీలక ప్రభుత్వ నిర్ణయాల గురించి చర్చించామని తన చివరి ట్వీట్లో పేర్కొన్నారు.🔸 CM Devendra Fadnavis chaired a meeting of the Cabinet Committee on Infrastructure. DCM Ajit Pawar, Minister Chandrashekhar Bawankule, and concerned officials were present. 🔸 मुख्यमंत्री देवेंद्र फडणवीस यांच्या अध्यक्षतेखाली मंत्रिमंडळ पायाभूत सुविधा समितीची बैठक. यावेळी… pic.twitter.com/WzYkVZocYf— CMO Maharashtra (@CMOMaharashtra) January 27, 2026 ;ఇదీ చదవండి: షాకింగ్ న్యూస్ : అమెజాన్లో వేలాది మంది ఉద్యోగులపై వేటుఅజిత్ పవార్ అస్తమయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆ రోజు రాష్ట్రానికి అత్యంత కష్టమైన రోజు అంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొప్ప స్నేహితుడ్ని కోల్పోయానని, పవార్ కుటుంబానికి ఇది తీరని లోటు అంటూ నివాళులర్పించారు. రాష్ట్రంలో మూడు రోజుల రాష్ట్ర సంతాప దినాలను బుధవారం సెలవు దినాన్ని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో కలిసి బారామతికి వెళ్లారు. అక్కడ పవార్ కుటుంబ సభ్యులతో సంప్రదించిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ను కలిసి తమ సంతాపాన్ని ప్రకటించారు. (Ajit Pawar jet crash : హాట్ టాపిక్గా ఆ ఇద్దరు పైలట్లు ) కాగా రాబోయే జిల్లాపరిషత్ ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనడానికి తన సొంత నియోజకవర్గమైన బారామతికి వెడుతుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకారం, బారామతిలో ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తుండగా, రన్వే సమీపంలో కూలిపోయి మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. Governor Acharya Devvrat, CM Devendra Fadnavis, Deputy CM Eknath Shinde, met Sunetra Pawar, wife of Maharashtra Deputy CM Ajit Pawar, in Baramati.Ajit Pawar died in a crash landing of a charter plane in Baramati this morning. pic.twitter.com/HEOwpsVfKr— ANI (@ANI) January 28, 2026ఇదీ చదవండి: నిజాయితీకి మూల్యం, అజిత్ పవార్ మృతిపై రాజ్ థాకరే వ్యాఖ్యలు -
నిజాయితీకి మూల్యం, అజిత్ పవార్ మృతిపై రాజ్ థాకరే వ్యాఖ్యలు
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాలమరణంపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. అధికారంలో ఉన్నవారికి అతీతంగా పనిచేయాల్సిన ఈ తరుణంలో ఈ విషాదం మహారాష్ట్రకు తీరని లోటని ఎక్స్లో నివాళి అర్పించారు. అజిత్ పవార్ చాలా నిష్కపటమైన వ్యక్తి అని, వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేయడం ఆయన నైజం కాదని థాకరే అన్నారు. అంతేకాదు రాజకీయాల్లో నిజాయితీగా ఉన్నందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ విషాద సమయంలో తన కుటుంబం, పవార్ కుటుంబం దుఃఖంలో పాలుపంచుకుటుందని మహారాష్ట్ర నవనిర్మాణ సేన తరపున అజిత్ పవార్కి హృదయపూర్వక నివాళులంటూ ట్వీట్ చేశారు. "నా స్నేహితుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కన్నుమూశారు. మహారాష్ట్ర రాజకీయాలు ఒక అద్భుతమైన నాయకుడిని కోల్పోయాయి. అజిత్ పవార్, నేను దాదాపు ఒకే సమయంలో రాజకీయాల్లోకి వచ్చాం, కానీ మా పరిచయం చాలాకాలం తర్వాత ఏర్పడింది. అపారమైన అభిరుచి, బలంతో, అజిత్ పవార్ మహారాష్ట్ర రాజకీయ రంగంలో గొప్ప పురోగతి సాధించారు. ఆయన పవార్ సాహెబ్ స్ఫూర్తితోఎదిగిన నాయకుడైనప్పటికీ, తనకంటూ ఒక గుర్తింపును సృష్టించుకుని,. మహారాష్ట్ర నలుమూలలా తనదైన ముద్ర వేసుకున్నారు’’ అని ట్వీట్ చేశారు."1990వ దశకంలో మహారాష్ట్రలో పట్టణీకరణ ఊపందుకుంది. గ్రామీణ ప్రాంతాలు పాక్షిక పట్టణీకరణ వైపు మొగ్గు చూపడం ప్రారంభించాయి, అయినప్పటికీ అక్కడి రాజకీయాల తీరు గ్రామీణంగానే ఉంది, అయితే వారి సమస్యల స్వభావం కొంతవరకు పట్టణంగా మారడం ప్రారంభమైంది. ఈ రకమైన రాజకీయాలపై అజిత్ పవార్కు పూర్తి అవగాహన, నేర్పుగా నిర్వహించే నైపుణ్యం కూడా ఉంది. దీనికి పింప్రి చించ్వాడ్ , బారామతి దానికి రెండు అద్భుతమైన ఉదాహరణలు. అది పింప్రి చించ్వాడ్ అయినా లేదా బారామతి అయినా, అజిత్ దాదా ఈ ప్రాంతాలను తన రాజకీయ ప్రత్యర్థులు కూడా అంగీకరించే విధంగా మార్చారు అంటూ థాకరే ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.ఇదీ చదవండి: అజిత్ పవార్ మరణంపై అనుమానాలు.. బెంగాల్ సీఎం సంచలన వ్యాఖ్యలుపరిపాలనపై అజిత్ పవార్కు కచ్చితమైన పట్టు ఉందని, నిలిచిపోయిన ఫైళ్లను ఎలా పరిష్కరించాలో ఆయనకు తెలుసని ఎంఎన్ఎస్ అధినేత అన్నారు. అధికారంలో ఉన్నవారికి అతీతంగా పనిచేయాల్సిన ఈ యుగంలో, మహారాష్ట్ర అటువంటి నాయకుడిని కోల్పోవడం అత్యంత విషాదకరం అని ఆయన నివాళి అర్పించారు. ఆయన కల్మషం లేని వ్యక్తి. ఆయనలో కుల పక్షపాతం ఏమాత్రం లేదు, ఆయన రాజకీయాల్లో కులానికి అస్సలు చోటు లేదు. నేటి రాజకీయాల్లో, కులంతో సంబంధం లేకుండా వ్యవహరించే ధైర్యం చూపే నాయకులు తగ్గిపోతున్న తరుణంలో నిస్సందేహంగా అజిత్ పవార్ వారిలో అగ్రగామిగా ఉన్నారు. రాజకీయాల్లో నిష్కపటత్వానికి, నిజాయితీకి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజకీయాల్లో విరోధం అనేది రాజకీయపరమైందే త ప్ప వ్యక్తిగతమైనది కాదు. అందుకే మహారాష్ట్రలో ఒకరిపై ఒకరు చేసుకునే తీవ్ర విమర్శలను వ్యక్తిగతంగా తీసుకోకూడదని గుర్తుంచుకునే నాయకులు తగ్గిపోతున్నారు. ఉదార స్వభావం గల ప్రత్యర్థులు రాజకీయాల నుండి వరుసగా వైదొలగడం మహారాష్ట్ర ఉన్నత రాజకీయ సంప్రదాయానికి తీరని లోటనిపేర్కొన్నారు.ఇదీ చదవండి: Ajit Pawar jet crash : హాట్ టాపిక్గా ఆ ఇద్దరు పైలట్లు78 ఏళ్లకు లవ్ ప్రపోజల్..39 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి! -
అజిత్ పవార్ విమాన ప్రమాదం.. సీసీ కెమెరాకు చిక్కిన దృశ్యాలు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. బారామతి రన్వేకు 100 అడుగుల దూరంలో కుప్పకూలి.. మంటల్లో చిక్కుకున్న దృశ్యాల వీడియో వెలుగులోకి వచ్చింది. ఇవాళ ఉదయం (బుధవారం, జనవరి 28) 8:46: గంటలకు ఈ ప్రమాదం జరిగింది. భారీ మంటలు,ఆపై దట్టమైన పొగ వెలువడటం వీడియోలో కనిపించింది.విఎస్ఆర్ (VSR) సంస్థకు చెందిన లియర్ జెట్ 45 (Learjet 45).. ఉదయం 8:10 గంటలకు ముంబై నుండి బయలుదేరింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ (66)తో పాటు విమానంలో ఉన్న మరో నలుగురు అక్కడికక్కడే మరణించారు. రాడార్ సమాచారం ప్రకారం.. విమానం ఉదయం 8:45 గంటలకు రాడార్ పరిధి నుంచి తప్పిపోయింది. విమానం కూలిపోయే ముందు రెండోసారి ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించింది. సంకేతాలు నిలిచిపోయే సమయానికి విమానం 1016 మీటర్ల (సుమారు ఒక కిలోమీటర్) ఎత్తులో, గంటకు 237 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. విమాన ప్రమాదంపై పౌర విమానయాన శాఖ కీలక ప్రకటనవిమాన ప్రమాదంపై పౌర విమానయాన శాఖ కీలక ప్రకటన చేసింది. పైలట్ నుంచి మేడే కాల్ రాలేదన్న ఆ శాఖ.. బారామతి ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చాకే ల్యాండింగ్కు యత్నించారని పేర్కొంది. రన్ వే నెంబర్ 11పై ల్యాండింగ్కు ఏటీసీ అనుమతి ఇచ్చిందని తెలిపింది. 8.44 గంటలకు పొగల, మంటల కనిపించాయని ఏటీసీ చెబుతోంది. రన్ వే గుర్తింపులో పైలట్లు ఇబ్బంది పడ్డారని.. తొలి ప్రయత్నంలో రన్ వే కనిపించకపోవడంతో కాసేపు గాల్లో విమానం చక్కర్లు కొట్టింది. రెండో ప్రయత్నంలో ల్యాండ్ అయ్యేందుకు యత్నించి విఫలయినట్లు ఏటీసీ తెలిపింది.ఇవాళ అజిత్ పవార్.. తన నియోజకవర్గం బారామతిలో జరగాల్సిన బహిరంగ సభకు హాజరు కావాల్సి ఉంది. అయితే మరికొద్ది క్షణాల్లో విమానం ల్యాండ్ కావాల్సి ఉండగా.. అనూహ్యంగా ప్రమాదానికి గురైంది. కూలిన వెంటనే విమానం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అందులో ఉన్నవాళ్లంతా సజీవ దహనం అయ్యారు. అజిత్ పవార్తో పాటు ముంబై పీఎస్వో విదీప్ జాదవ్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి, పైలట్లు కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శాంభవి పాఠక్ మరణించారు.CCTV footage of the collision impact of the chartered aircraft, carrying Maharashtra deputy CM Ajit Pawar and 4 others, which crash landed. pic.twitter.com/vf9X7TGffJ— Believer (@PredatorVolk) January 28, 2026 -
విమాన ప్రమాదం.. ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే..
బారామతి: ఎన్సీపీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం బారామతి ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతూ కుప్పకూలిపోయింది. వెంటనే మంటలు వ్యాపించడంతో విమానంలో ఉన్న అజిత్ పవార్తో పాటు ఐదుగురు సజీవ దహనమయ్యారు. విమానం కూలిపోవడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఇది ఘోర ప్రమాదమని చెబుతున్నారు. విమానం కూలిన వెంటనే నాలుగైదు పేలుళ్లు సంభవించాయని వెల్లడించారు. భారీ ఎత్తున మంటలు వ్యాపించడంతో ఎవరినీ కాపాడలేకపోయినట్టు చెప్పారు. తమ కళ్లెదుటే అజిత్ పవార్ మంటల్లో కాలిపోవడం కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కళ్లెదుటే అజిత్ పవార్ సహా ఐదుగురు మంటల్లో కాలిపోవడం కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.''విమాన ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూశాను. చాలా బాధాకరమైన ఘటన. విమానం కిందకు దిగేటప్పుడు అది కూలిపోతున్నట్టుగా అనిపించింది. క్షణాల్లో నా కళ్లెదుటే అది కుప్ప కూలింది. వెంటనే మేమంతా అక్కడికి పరుగెత్తికెళ్లాం. విమానంలో మళ్లీ 4-5 పేలుళ్లు సంభవించాయి. దీంతో చాలా మంది అక్కడికి చేరుకున్నారు. విమానంలో ఉన్న వారికి కాపాడాలని అనుకున్నాం. కానీ భారీగా మంటలు వ్యాపించడంతో సహాయం చేయలేకపోయాం. అజిత్ పవార్ విమానంలోనే ఉన్నారని తెలిసి చాలా బాధపడ్డాం. ఈ వేదనను మాటల్లో వర్ణించలేన''ని ప్రత్యక్ష సాక్షి ఒకరు మీడియాతో చెప్పారు. విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అజిత్ పవార్ కుటుంబ సభ్యులు, మహారాష్ట్ర రాజకీయ నేతలు బారామతికి తరలివెళ్లారు. కాగా, అజిత్ పవార్ విమాన ప్రమాద దృశ్యాలు రికార్డైన సీసీ కెమెరా ఫుటేజి వైరల్గా మారింది. విమాన ప్రమాదం.. ఘటనా స్థలంలో పరిస్థితి ఇలా.. -
అజిత్ పవార్ మరణంపై అనుమానాలు.. బెంగాల్ సీఎం సంచలన వ్యాఖ్యలు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆకస్మిక మరణం యావత్ ప్రపంచం ఉలిక్కి పడేలా చేసింది. సహచరులతో కలిసి ప్రచారానికి బయలుదేరిన ఆయన బుదవారం ఉదయం బారామతి వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించారు. లియర్జెట్ 45 విమానం (రిజిస్ట్రేషన్ VT-SSK) బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ప్రయత్నించినప్పుడు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు.ఈ ఘోర విషాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ మహాయుతి నుండి దూరం జరిగేందుకు యోచిస్తున్నారని, శరద్పవార్తో కలవడానికి ప్రయత్నిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని ఈ నేపథ్యంలో ఆయన మరణం వెనుక కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. ఇక్కడ ప్రజలకు ఎలాంటి భద్రత లేదు. ఆయన బీజేపీతో ఉండగానే ఇలా జరిగిందని, ఇక ప్రతిపక్ష పార్టీల గతి ఏమిటో అర్థం కాదని ఆమె విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ కావాలని డిమాండ్ చేశారు. ఇతర ఏ ఏజెన్సీపైనా తమకు నమ్మకం లేదని మమత వ్యాఖ్యానించారు. Deeply shocked and stunned by the suddden demise of Ajit Pawar! The Deputy Chief Minister of Maharashtra and his co-passengers have died in a disastrous plane crash at Baramati today morning, and I am feeling a deep sense of loss.My condolences to his family including his uncle…— Mamata Banerjee (@MamataOfficial) January 28, 2026అజిత్ పవార్, మరో నలుగురు మృతి చెందిన విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలని మమతా డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని సీఎం మమతా బెనర్జీ బుధవారం డిమాండ్ చేశారు ఆయన మరణంపై సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్బంగా అజిత్ పవార్ మామ, శరద్ పవార్ సహా ఆయన కుటుంబానికి, పార్టీ శ్రేణులకు సంతాపాన్ని ప్రకటించారు. అజిత్ పవార్ మృతిపై కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి బాధాకరమన్న కాంగ్రెస్ గౌరవ్ గోగోయ్.. ఘటనపై అనుమానాలు నెలకొన్నాయని.. పారదర్శకమైన దర్యాప్తుతో వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మరోవైపు తెలంగాణ ఎమ్మెల్యే(గోషామహల్) రాజాసింగ్ సైతం అజిత్ పవార్ మరణంపై స్పందించారు. అజిత్ పవార్ చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి సడెన్ గా ప్రమాదంలో చనిపోవడం బాధాకరం. మహారాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తి ఆయన. కాబట్టి విమాన ప్రమాదం వెనక ఎమైనా కుట్ర ఉందా? అనే అనుమానాలు సహజం. గత కొంతకాలంగా ఆయన అధికార నుంచి బయటకు పోతారనే ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలోనే కుట్రలు కూడా జరుగు తున్నాయని ప్రచారం జరుగుతోంది. విమాన బ్లాక్ బాక్స్ను విశ్లేషిస్తే..కుట్ర ఉందా లేదా తేలొచ్చు అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. కాగా జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికలకు ముందు వరుస ప్రజా ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించ డానికి పవార్ ముంబై నుండి తన స్వస్థలమైన బారామతికి బయలుదేరారు. ఈ విమానం దిగుతున్న సమయంలో నియంత్రణ కోల్పోయి రన్వే థ్రెషోల్డ్ దగ్గర క్రాష్-ల్యాండ్ అయిందని డీజీసీఏ ప్రకటించింది. క్రాష్ ల్యాండింగ్ తర్వాత ఈ విమానం ముక్కలుగా విడిపోయింది. ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగడంతో అనేక పేలుళ్ల శబ్దాలు విన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి DGCA అధికారులు ప్రస్తుతం సంఘటనా స్థలానికి వెళుతున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, రాష్ట్రంలో మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించారు. పవార్ అస్తమయంపై పలువురు రాజకీయ ప్రముఖులు, ఇతరులు పలువురు తీవ్ర విచారం ప్రకటించారు. -
అజిత్ దాదా.. ఆనాడు మరణం గురించి సరదాగా..!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత (ఎన్సీపీ), మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతితో మహారాష్ట్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అజిత్ దాదా అని ముద్దుగా పిలుచుకునే కార్యకర్తలు, అభిమానులు ఇక ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటు నాలుగు దశాబ్దాలుగా ఆయనతో అనుబంధం ఉన్న నేతలు కూడా బోరున విలపిస్తున్న దృశ్యాలు నెట్టింట కనిపిస్తున్నాయి.అయితే గతంలోనూ అజిత్ పవార్కు ఓ ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయాన్ని చాలాకాలం ఆయన ఎవరికీ చెప్పలేదు. చివరకు తన సొంత నియోజకవర్గం బారామతిలో జరిగిన ఓ కార్యక్రమంలో స్వయంగా తెలియజేశారాయన. పైగా ఈ విషయాన్ని అప్పటిదాకా తన భార్య, తల్లికి కూడా ఆయన చెప్పలేదట. ముందే అందరికి చెప్పి ఉంటే మీడియాలో బ్రేకింగ్ న్యూస్ అయ్యేదంటూ చమత్కరించారు. పైగా ఆయన ఈ ఘటన గురించి సరదాగా చెబుతుంటే అక్కడున్నవాళ్లంతా పగలబడి నవ్వారు.అసలేం జరిగిందంటే.. ఓ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమం కోసం ఆయన వెళ్లారట. ఆ సమయంలో ఆయన ఎక్కిన లిఫ్ట్ 4వ అంతస్తు నుంచి పడిపోయింది. అదే లిఫ్ట్లో అజిత్ పవార్తోపాటు, ఓ డాక్టర్, ఇద్దరు నర్సులు కూడా ఉన్నారట. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం అదేసమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తర్వాత తేలింది. అదృష్టవశాత్తూ.. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ఘటనపై అజిత్ పవార్ మాట్లాడుతూ.. ‘ ఆసుపత్రి ప్రారంభ కార్యక్రమంలో భవనం లోని మూడో అంతస్తు నుంచి నాలుగో అంతస్తుకు మెట్ల ద్వారా వెళ్లేందుకు సిద్ధమయ్యాం. అయితే మాతో పాటు 90 ఏళ్ల డాక్టర్ ఉండడంతో మేం లిఫ్ట్ ఎక్కాం. నాల్గవ అంతస్తుకి లిఫ్ట్లో వెళుతుండగా అకస్మాత్తుగా కరెంటు పోయింది. చుట్టూ చిమ్మచీకటి. అదే సమయంలో నాల్గో అంతస్తు నుంచి లిఫ్ట్ హఠాత్తుగా నాలుగో అంతస్తునుంచి కిందకు పడిపోయింది. నాతో పాటు ఉన్న వ్యక్తి లిఫ్ట్ డోర్లను బలవంతంగా తెరిచి నన్ను బయటకు లాగాడు. ఆ తర్వాత డాక్టర్ను కాపాడాం. నాకు ఎలాంటి గాయాలు కాలేదు. డాక్టర్కు స్వల్ప గాయాలు అయ్యాయి.. .. ఇదేదో కథకాదు. నేను అబద్ధం చెప్పడం లేదు. మాకు ఏమైనా అయ్యింటే ఈ రోజిది శ్రద్ధాంజలి కార్యక్రమంగా అయుండేది. ఈ విషయం నేను దాచుకోలేకపోతున్నాను.. మీరు కూడా నా కుటుంబ సభ్యులే. అందుకే ఈ విషయం మీతో చెప్పాను’ అని అజిత్ పవార్ అన్నారు. 2023 జనవరి 16న మహారాష్ట్రలోని పూణెలో హార్దికర్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. -
విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం
ముంబై: మహారాష్ట్రలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్(66) విమానం ప్రమాదంలో కన్నుమూశారు. బారామతిలో ల్యాండింగ్ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలి పేలిపోయింది. ఈ ఘటనలో అజిత్ పవార్తో పాటు ఉన్న ఐదుగురూ మరణించినట్లు సివిల్ ఏవియేషన్ నియంత్రణ సంస్థ డీజీసీఏ అధికారికంగా ప్రకటించింది.బుధవారం ఉదయం తన నియోజకవర్గం బారామతిలో జరగాల్సిన బహిరంగ సభలో అజిత్ పవార్ హాజరు కావాల్సి ఉంది. అయితే మరికొద్ది క్షణాల్లో విమానం ల్యాండ్ కావాల్సి ఉండగా.. అనూహ్యంగా ప్రమాదానికి గురైంది. కూలిన వెంటనే విమానం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అందులో ఉన్నవాళ్లంతా సజీవ దహనం అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం ఇవాళ బారామతి రీజియన్లలో ఆయన నాలుగైదు సభల్లో పాల్గొనాల్సి ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఉదయం 8.45 గంటల సమయంలో విమాన ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అజిత్ పవార్తో పాటు ఆయన సిబ్బంది, విమాన సిబ్బంది ఉన్నారు. మృతులను డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ముంబై పీఎస్వో విదీప్ జాదవ్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి, పైలట్లు కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శాంభవి పాఠక్గా ప్రకటించారు. ప్రమాదానికి గురైన విమానం.. బంబార్డియర్ లీర్జెట్ 45(కెనడా) రకం విమానం. ప్రమాదంలో విమానం రెండు ముక్కలై.. పూర్తిగా కాలిపోలిపోయింది. #UPDATE | Five people on board the Mumbai to Baramati charter plane, which crash landed, have died: DGCA (Directorate General of Civil Aviation) pic.twitter.com/ftrUPnqjZT— ANI (@ANI) January 28, 2026ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అజిత్ పవార్ సహా అందరి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే అజిత్పవార్ భార్య సునేత్ర, సోదరి సుప్రియా సూలే హుటాహటిన బారామతికి బయల్దేరారు. అటు ఢిల్లీలో ఉన్న పవార్ కుటుంబ సభ్యులు మహారాష్ట్రకు చేరుకుంటున్నారు. అజిత్ పవార్ హఠాన్మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్నాథ్షిండే తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు స్పందిస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్కు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు.నాలుగున్నర దశాబ్దాల పాటు రాజకీయాల్లోఅజిత్ పవార్ (Ajit Pawar) పూర్తి పేరు అజిత్ అనంతరావ్ పవార్. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) వ్యవస్థాపకుడు శరద్ పవార్ సోదరుడి అనంతరావ్ కుమారుడే ఈయన. స్వగ్రామం పూణే జిల్లాలోని బారామతి తాలూకాలోని కతేవాడి. 1959 జులై 22న జన్మించారీయన. పుట్టింది మాత్రం అహ్మద్ నగర్ జిల్లాలోని రాహురి తాలూకాలోని తన తాత గ్రామం డియోలాలి (ప్రవర)లో. అజిత్ పవార్ కళాశాల విద్య కోసం ముంబైవచ్చారు. ఆ తరువాత బారామతికి వచ్చి అక్కడి సహకార సంఘాల నుండి సామాజిక, రాజకీయ కార్యక్రమాలను ప్రారంభించారు. శరద్ పవార్ అడుగుజాడల్లో పయనిస్తూ.. అజిత్ పవార్ 1982లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదే సంవత్సరంలో, అతను కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ల బోర్డుకు ఎన్నికయ్యాడు. 1991లో బారామతి నుంచి ఎంపీ నెగ్గిన అజిత్పవార్.. ఆ తర్వాత అదే అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. ఎన్సీపీ తరఫున ఎమ్మెల్యేగా, మహారాష్ట్రకు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. గత మహారాష్ట్ర ఎన్నికలకు ముందు శరద్ పవార్తో తెగదెంపులు చేసుకుని ఎన్సీపీ వేరు వర్గంతో మహాయుతి కూటమితో జత కట్టారు. అధికారంలోకి వచ్చాక మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా.. ఆర్థిక, ప్రణాళిక, క్రీడలు, మైనారిటీ అభివృద్ధి వంటి శాఖలను నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రకు అత్యధిక కాలం డిప్యూటీ సీఎంగా పని చేసిన ఘనత కూడా అజిత్ పవార్దే. -
రైల్వేస్టేషన్లో దారుణం.. ప్రొఫెసర్ దారుణ హత్య
ముంబై: ఒక చిన్న తగాదా ప్రాణం తీసింది. మలాడ్ రైల్వే స్టేషన్లో ఓ కళాశాల ప్రొఫెసర్ను ప్రయాణికుడు.. దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. లోకల్ ట్రైన్లో ప్రయాణించిన ప్రొఫెసర్, ఒక ప్రయాణికుడి మధ్య చిన్న వివాదం విషాదాన్ని మిగిల్చింది. ఆ రైలు స్టేషన్ చేరుకోగా దిగేటప్పుడు కూడా వారిద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికుడు ప్రొఫెసర్ను కత్తితో పొడిచి.. పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో ఆ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.ప్రొఫెసర్గా అలోక్ సింగ్.. విలే పార్లేలోని ప్రముఖ కాలేజీలో పని చేస్తున్నారు. శనివారం ఆయన లోకల్ ట్రైన్లో ప్రయాణించారు. రైలులో సీటు విషయంలో ఓ ప్రయాణికుడు, ప్రొఫెసర్ అలోక్ సింగ్ మధ్య వాగ్వాదం జరిగింది. ట్రైన్ మలాడ్ స్టేషన్ చేరగానే దిగే సమయంలో గేటు వద్ద రద్దీ కారణంగా తోపులాట జరిగింది. దీంతో వారి మధ్య గొడవ మరింత ముదిరింది. ఆ వ్యక్తి.. ప్రొఫెసర్ అలోక్ సింగ్ కడుపులో పలుమార్లు పొడిచి చంపేశాడు. అనంతరం స్టేషన్లోని జనం రద్దీలో కలిసిపోయి పరారయ్యాడు. దీంతో కత్తి పోట్లుతో అలోక్ సింగ్ కుప్పకూలి మరణించాడు.ఆయన మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు.. హత్య చేసిన వ్యక్తిని ఓంకార్ షిండే(27)గా పోలీసులు గుర్తించారు. దాడి చేసిన కొద్దిసేపటికే వైట్ షర్ట్, బ్లూ జీన్స్ ధరించిన ఓ వ్యక్తి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా పారిపోతుండటం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది.గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. షిండేను అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైలులో సీటు కోసం జరిగిన చిన్న గొడవకే ప్రొఫెసర్ను షిండే దారుణంగా కత్తితో పొడిచి చంపడం వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? వారి మధ్య గతంలో శత్రుత్వం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
హమ్మయ్యా.. సరిత వచ్చేసింది!
కనిపించకుండాపోయి.. టెన్షన్ పెట్టిన మహిళా కార్పొరేటర్ ఆచూకీ ఎట్టకేలకు లభించింది. ఆమె, ఆమె భర్త పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరగడంతో ముంబైలో నిన్నంతా హైడ్రామా నడిచింది. అయితే చివరకు ఆమె ఆచూకీ లభించడం.. స్పష్టమైన ప్రకటన చేయడంతో.. థాక్రే శివసేన ఊపిరి పీల్చుకుంది.ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే శివసేన తరఫున నెగ్గిన కార్పొరేటర్ సరితా మాస్కే హఠాత్తుగా కనిపించకుండా పోయారు. ఆమెతో పాటు ఆమె భర్త ఫోన్లు స్విచ్ఛాప్ రావడంతో ఏం జరగబోతోందా? అనే చర్చ నడిచింది. సరితకు షిండే వర్గంలోని ఎమ్మెల్యే దిలీప్ లాండేతో మంచి సంబధాలు ఉన్నాయి. దీంతో ఆమె షిండే గూటికి జంప్ అయ్యారనే భావించారంతా. ఈ తరుణంలో.. ఉద్దవ్ థాక్రే అనుచరుడు ఎమ్మెల్సీ మిలింద్ నర్వేకర్ రంగంలోకి దిగాడు. అర్ధరాత్రి ఆ జంట కోసం స్పెషల్ ఆపరేషన్ చేపట్టాడు. చివరకు వాళ్ల ఆచూకీ గుర్తించి.. తీసుకొచ్చి తన నివాసంలోనే రాత్రంతా ఆశ్రయం కల్పించారు. శుక్రవారం ఉదయం ఈ జంట మాత్రోశ్రీ(థాక్రే నివాసం)కి వెళ్లి ఉద్దవ్తో భేటీ కానున్నారు. ఆపై.. బేలాపూర్లోని కోంకణ్ భవన్లో మిగతా కార్పొరేటర్లను కలిసి అధికారిక నమోదు ప్రక్రియ(రికార్డుల్లోకి ఎక్కించడం.. దీని ద్వారా పార్టీ ఫిరాయించడానికి అవకాశం ఉండదు) పూర్తి చేయనున్నారు. అయితే.. సరితా మాస్కే చాందివాలి ప్రాంతం (వార్డు 157) నుంచి గెలిచారు. ఆమె BJP అభ్యర్థి ఆశా తాయడేను 14,749 ఓట్ల తేడాతో ఓడించారు. తాను పార్టీ మారతాననే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని.. ఎప్పుడూ ఉద్దవ్ థాక్రే వెంట ఉంటామని సరిత ఓ జాతీయ మీడియా వద్ద ప్రస్తావించారు. కనిపించకుండా పోయిన సరిత, ఆమె భర్త ఎక్కడ ఉన్నారన్నదానిపై మాత్రం మిస్టరీ కొనసాగుతోంది. కార్పొరేటర్గా నెగ్గిన తర్వాత ఉద్దవ్ కలిసిన సరిత, ఆమె భర్త దేశంలోనే రిచ్చెస్ట్ కార్పొరేషన్గా బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) పేరుంది. జనవరి 15న జరిగిన ఎన్నికల్లో.. బీజేపీ-షిండే శివసేన కూటమి (మహాయుతి) 227 స్థానాల్లో 118 కైవసం చేసుకుంది. తద్వారా.. 30 ఏళ్లుగా కొనసాగుతున్న థాక్రే కుటుంబ ఆధిపత్యానికి శుభం కార్డు వేసింది. ఇందులో బీజేపీ 89, షిండే శివసేన 29 స్థానాలు నెగ్గాయి. ఇక ఉద్ధవ్ శివసేన 65, రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ 6 స్థానాలు గెలిచాయి. అయితే.. మేయర్ ఎంపిక విషయంలో ఇంకా హైడ్రామానే కొనసాగుతోంది. షరతుల మీద మేయర్ పదవి తమకు అవకాశం ఇవ్వాలని షిండే సేన డిమాండ్ చేస్తుండడం.. ముంబై మేయర్ పదవి తమకూ దక్కే అవకాశాలు ఉన్నాయంటూ ఉద్దవ్ థాక్రే ప్రకటించడం అక్కడి రాజకీయాలను హీటెక్కింది. ఈ క్రమంలో ఏక్నాథ్ షిండే అప్రమత్తం అయ్యారు. తమ కార్పొరేటర్లు చేజారిపోకుండా.. బాంద్రాలోని ఓ హోటల్లో ఉంచారు. సాధారణంగా.. మేయర్ పదవి రోటేషన్ విధానంలో SC, ST, OBC, ఓపెన్ మరియు మహిళా వర్గాలకు కేటాయిస్తారు. అయితే 2026లో లాటరీ డ్రా ప్రకారం, ముంబై మేయర్ పదవి ఓపెన్ మహిళా వర్గానికి కేటాయించబడింది. దీంతో ఉత్కంఠ నెలకొంది. -
ముంబై మేయర్ ఎంపికలో బిగ్ ట్విస్ట్!
ముంబై: మహారాష్ట్రలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. ముంబై మేయర్ విషయంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ముంబై మేయర్ పోస్టును ఏ కేటగిరికి కేటాయించాలి? అనే అంశంపై లాటరీ తీశారు. ఫలితాల్లో ‘జనరల్ మహిళ’ కేటగిరీ ఎంపిక కావడంపై ఉద్దవ్ థాక్రే శివసేన వ్యతిరేకిస్తోంది. దీంతో, మేయర్ స్థానంపై ఉత్కంఠ నెలకొంది.వివరాల మేరకు.. ముంబై మహిళా మేయర్ రానున్నారు. అయితే, సదరు మహిళా మేయర్.. ఏ కేటగిరి నుంచి రావాలనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. దీంతో, ఈ పోస్ట్ను ఏ కేటగిరీకి కేటాయించాలనే దానిపై లాటరీ తీశారు. ఫలితాల్లో ‘జనరల్ మహిళ’ కేటగిరీ ఎంపికైంది. కాగా, ఈ లాటరీ ప్రక్రియ, ఫలితంపై ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇది గందరగోళ పరిస్థితులకు దారితీసింది. బీఎంసీని ఓబీసీ కేటగిరీ కింద ఎందుకు పరిగణించలేదని మాజీ మేయర్ కిశోరి ఫడ్నేకర్ ప్రశ్నించారు. గతంలో రెండు దఫాలు కూడా ఈ పోస్టు ఓపెన్ కేటగిరీలోనే ఉందని గుర్తుచేశారు. అనంతరం, సభ నుంచి ఉద్దవ్ వర్గం సభ్యులు బయటకు వెళ్లిపోయారు. దీంతో, మేయర్ స్థానంలో ఉత్కంఠ నెలకొంది.#WATCH | Mumbai | Following reservation lottery announcement for mayor post, Shiv Sena (UBT) leader & former mayor, Kishori Pednekar says," There are many areas where OBC community stays in Mumbai. No chit with names of their representatives was put in the lottery. This is wrong.… pic.twitter.com/HtBViPvsm2— ANI (@ANI) January 22, 2026మరోవైపు.. మేయర్ పదవి కోసం డ్రా పూర్తయిన తర్వాత బీఎంసీలోని అర్హులైన కార్పొరేటర్లు నామినేషన్లు వేసేందుకు వీలవుతుంది. ఈ లాటరీ ప్రక్రియ తర్వాత పుణె, ధూలే, బీఎంసీ, నాందేడ్, నవీ ముంబయి, మాలేగావ్, మీరా భయందర్, నాసిక్, నాగ్పుర్ మేయర్ పోస్టులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. అలాగే.. లాతూర్, జల్నా, థానే మూడు మున్సిపల్ కార్పొరేషన్లు షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ) రిజర్వ్ చేయబడ్డాయి. వీటిలో లాతూర్, జల్నా ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేయబడింది. మొత్తం ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లు ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) విభాగానికి రిజర్వ్ చేయబడ్డాయి. వీటిలో అకోలా, చంద్రపూర్, అహిల్యానగర్, జల్గావ్ ఓబీసీ మహిళలకు రిజర్వ్ చేయబడగా.. పన్వెల్, ఇచల్కరంజి, కొల్హాపూర్, ఉల్హాస్నగర్ ఓబీసీ అభ్యర్థులకు కేటాయించారు.Mumbai is set to have a woman mayor for the second term in a row after the BMC mayoral post was placed in the Open (Women) category during the reservation lottery. #MumbaiMayor #BMC #WomenLeadership #MaharashtraPolitics #CivicPolls #MayorReservation pic.twitter.com/RnNjhxIcT9— Mumbai Insights (@Mumbai_Insights) January 22, 2026 -
మహారాష్ట్రలో బిగ్ ట్విస్ట్.. బీజేపీ, ఉద్దవ్ సేనకు ఝలక్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్దవ్ థాక్రేకు తన సోదరుడు రాజ్థాక్రే ఊహించని షాకిచ్చారు. పదవుల కోసం మరోసారి శివసేనను రెండుగా చీల్చిన ఏక్నాథ్ షిండేతో రాజ్థాక్రే చేతులు కలిపారు. శివసేన (యూబీటీ) బద్ద శత్రువైన షిండేతో రాజ్ థాక్రే చేతులు కలపడం మహారాష్ట్ర పాలిటిక్స్లో సంచలనంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి సత్తా చాటింది. ఈ క్రమంలో కళ్యాణ్-డోంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ)లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) మద్దతు ఇచ్చింది. అయితే.. స్థానిక ఎంఎన్ఎస్ నాయకుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంఎన్ఎస్ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. కళ్యాణ్-డోంబివిలి ప్రాంతంలో అభివృద్ధి ప్రయోజనాల దృష్ట్యా షిండే నేతృత్వంలోని శివసేనకు మద్దతు ఇవ్వాలనే నిర్ణయం స్థానిక నాయకత్వం తీసుకుందని ఆ పార్టీ తెలిపింది. 122 మంది సభ్యులు ఉన్న కళ్యాణ్-డొంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి 50, షిండే సేనకు 53, ఎంఎన్ఎస్కు 05, ఉద్ధవ్ థాక్రే శివసేన యూబీటీ 11 స్థానాలను గెలుచుకుంది. కేడీఎంసీని దక్కించుకోవడానికి మ్యాజిక్ ఫిగర్ 62 కావాలి. ఈ నేపథ్యంలో బీజేపీకి మేయర్ పదవి దక్కకుండా రెండు పార్టీలు కలిసి అడ్డుకున్నాయి.Navi Mumbai, Maharashtra: Shiv Sena MP Shrikant Shinde says, "Shiv Sena is establishing its faction at Konkan Bhavan with its 53 corporators. Along with them, MNS has also come here with their city corporators..." pic.twitter.com/D1rsWck9Vh— IANS (@ians_india) January 21, 2026బీజేపీకి నో చాన్స్..అయితే, శివసేన-బీజేపీలు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భాగస్వాములు అయినప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం మేయర్ పదవుల్ని దక్కించుకోవడానికి పొరాడుతున్నాయి. బుధవారం కొంకణ్ భవన్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత, శివసేన ఎంపీ మరియు ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్, రాజ్థాక్రే పార్టీతో పొత్తును ధృవీకరించారు. ఇది వారి బలాన్ని 58కి పెంచుతుంది. ఉద్ధవ్ వర్గం నుంచి మరో నలుగురు కార్పొరేటర్లు ఈ కూటమిలో చేరవచ్చని శ్రీకాంత్ చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ అధికారాన్ని పంచుకునే పరిస్థితి లేకుండా చేసింది. మరోవైపు.. ఎంఎన్ఎస్ నిర్ణయంపై ఉద్ధవ్ థాక్రే ఏ విధంగా రియాక్ట్ అవుతారో తెలియాల్సి ఉంది. In a major political development in Kalyan-Dombivli Municipal Corporation (KDMC), the Maharashtra Navnirman Sena (MNS) has announced support for the Eknath Shinde-led Shiv Sena faction. The announcement was made after a meeting at Kokan Bhavan, attended by MP Dr. Shrikant Shinde… pic.twitter.com/vVvZsc8utY— Pune Mirror (@ThePuneMirror) January 21, 2026ఉద్దవ్ వర్గానికి ఎదురుదెబ్బ!ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో రాజకీయం ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలకు ముందు 20 ఏళ్ల ఈగోను పక్కన బెట్టి థాక్రే సోదరులు మళ్లీ ఒక్కటయ్యారు. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), రాజ్ థాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) పార్టీలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. థాక్రే బ్రదర్స్ రీయూనియన్ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. వీరి కలయిక మాత్రం రెండు పార్టీల కేడర్లో నూతనోత్తేజాన్ని నింపింది. కానీ, ఎన్నికలు ముగిసి పట్టుమని పది రోజులు కూడా కాకుండానే రాజ్థాక్రే ఇలా ట్విస్ట్ ఇవ్వడం ఉద్దవ్ వర్గానికి ఎదురుదెబ్బ అని విశ్లేషకులు చెబుతున్నారు. -
‘సారీ.. ఐ లవ్యూ అమ్మా నాన్న’
ముంబై: మహారాష్ట్రలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. దివ్యాంగురాలైన యువతి.. ఆత్మహత్య చేసుకుంది. తన చేతిపై అమ్మా నాన్న.. ఐ లవ్ యూ.. నన్ను క్షమించండి అని రాసి తనువు చాలించింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.గంగాపూర్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ మధుకర్ కడ్ వివరాల మేరకు.. ధ్రువ్ నగర్కు చెందిన దీక్షా త్రిభువన్(21) పుట్టుకపోతే దివ్యాంగురాలు. మాటలు కూడా సరిగా రావు. ఆదివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉన్న ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం, ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. తన చేతిపై క్షమించండి... అమ్మా నాన్న, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని రాసిపెట్టి ఉంది. ఆమె మృతిపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.మరోవైపు.. తన కూతురు మృతి ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. దీక్ష ఎప్పుడూ ధైర్యంగా, అందరితో ఎంతో సేహ్నంగా ఉండేది. ఆమెనే మా భవిష్యత్ అనుకున్నాం. ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని అసలు ఊహించలేదు అని కన్నీరు పెట్టుకున్నారు. అయితే, తాను దివ్యాంగురాలైన కారణంగానే మసస్థాపానికి గురై దీక్ష ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. -
కొత్త మలుపు తిరిగిన ‘ముంబై మేయర్’ పంచాయితీ
బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) మేయర్ పదవి ఎవరికి దక్కుతుందో ఇంకా తేలలేదు. ఒకవైపు మహాయుతి కూటమిలో ఏ పార్టీ తరపు ఎవరిని ఆ అదృష్టం వరిస్తుందో? అనే సస్పెన్స్ కొనసాగుతుండగా.. మరోవైపు ఏదైనా అద్భుతంగా జరిగి అనూహ్యంగా విపక్ష కూటమికి వెళ్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు అధికార కూటమిలో చర్చలు కొనసాగుతుండగానే.. ఈలోపు షిండే శివసేన హోటల్ రాజకీయాలకు తెర తీసింది.ఏకనాథ్ శిండే నేతృత్వంలోని శివసేన ఒకవైపు తమ కార్పొరేటర్లను చేజారిపోకుండా(హార్స్ ట్రేడింగ్కు దూరంగా) హోటల్లో దాచింది. పేపర్ వర్క్ ద్వారా అఫీషియల్ ఫార్మాలిటీస్ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తోంది. తద్వారా జంపింగ్లకు(ఫిరాయింపులకు) చెక్ పెట్టాలని చూస్తోంది. అదే సమయంలో.. 29 సీట్లతో మేయర్ పదవి కోసం మిత్రపక్షం బీజేపీతో చర్చలు జరుపుతూనే ఉంది.మొన్నటిదాకా పవర్ షేరింగ్ ఫార్ములాను ప్రస్తావిస్తూ చెరో రెండున్నరేళ్లు మేయర్ పదవి కోసం డిమాండ్ చేసిన షిండే సేన.. ఇప్పుడు స్వరం మార్చింది. మేయర్ పదవి మొదటి సంవత్సరం మాత్రం కచ్చితంగా తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 23న బాలాసాహెబ్ థాక్రే శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని షిండే సేన భావిస్తోంది. ఈ క్రమంలో కూటమి తరఫున తొలి ఏడాది మేయర్ పదవి దక్కించుకోవడం ద్వారా థాక్రేకు ఘనంగా నివాళి సమర్పించాలని బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేస్తోంది.ఇప్పటికే రేసులో యామిని జాధవ్, తృష్ణా విశ్వస్రావో, అమేయ్ ఘోలే వంటి యువ, అనుభవజ్ఞుల పేర్లను మేయర్ రేసు కోసం పరిశీలిస్తోంది. బీఎంసీలో దశాబ్దాలుగా శివసేన మేయర్ ఉన్నందున.. తమ వర్గమే అసలు శివసేన అని నిరూపించుకోవడానికి ఇదే మంచి ఛాన్స్ అని ఏక్నాథ్ షిండే భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే..ఇప్పటివరకు తమ పార్టీ తరఫున దేశ వాణిజ్య నగరానికి మేయర్ లేని కారణంగా.. రాజకీయంగా తమ ఆధిపత్యాన్ని చూపించడానికి దక్కిన అవకాశాన్ని(మేయర్ పదవి) చేజార్చుకోవాలని బీజేపీ అనుకోవడం లేదు. ఈ పాయింట్ మీద షిండే సేనపై ఒత్తిడి పెట్టాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయాలను ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో.. కార్పొరేటర్లు చేజారిపోకుండా వ్యూహాన్ని అమలు చేస్తోంది. మేయర్ ఎన్నికలు 8–10 రోజుల్లో జరిగే అవకాశం ఉండటంతో తమ కార్పొరేటర్లను నగరం వీడరాదని ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం అవసరమైతే ముందుగానే సమాచారం ఇవ్వాలని సూచింది.ఇక.. విపక్షం కూడా మేయర్ పదవి కోసం తన వంతు ప్రయత్నాల్ని ఉధృతం చేసింది. 277 సభ్యులున్న ముంబై కార్పొరేషన్లో మేయర్ పదవి కోసం కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 114. అధికార మహాయుతి కూటమిలో బీజేపీ, షిండే శివసేన కలయితోనే 118 అవుతుంది. అంటే నాలుగు సీట్లు ఎక్కువనే ఉన్నాయి. ఇక విపక్ష కూటమిలో.. ఉద్ధవ్ శివసేన, MNS, NCP (శరద్ పవార్), కాంగ్రెస్, AIMIM, SP కలయికతో మొత్తం కలిపినా 106 సీట్లు అవుతున్నాయి. అంటే మ్యాజిక్ ఫిగర్కు 8 తక్కువగా ఉంది. ఈ క్రమంలోనే షిండే వర్గానికి గాలం వేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.‘‘ఒకసారి పార్టీని వదిలిన వారు.. మళ్లీ హ్యాండ్ ఇవ్వొచ్చు’’ అంటూ ఉద్దవ్ శివసేన వర్గం అధినేత, మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే వ్యాఖ్యానించడం.. ‘‘ఎంత హోటల్లో దాచినా చేరాల్సిన సందేశాలు చేరాల్సిన వాళ్లకు టైంకి చేరతాయి. దేవుడు తల్చుకుంటే మేయర్ మనదే అవుతుంది’’ అంటూ ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.ముంబై ఎన్నికల ఫలితాలు:బీజేపీ - 89 సీట్లుషిండే శివసేన – 29 సీట్లుఉద్ధవ్ శివసేన(యూబీటీ) 65 + NCP (శరద్ పవార్)1+ఎంఎన్ఎస్ (MNS) 6 సీట్లు మొత్తం 72 సీట్లుకాంగ్రెస్ – 24, ఎంఐఎం – 8, సమాజ్వాదీ పార్టీ – 2మొత్తం హౌస్: 227 సభ్యులుమెజారిటీ మార్క్: 114బీజేపీ+షిండే సేన: 118 (మెజారిటీ కంటే 4 ఎక్కువ).. అజిత్ పవార్ NCP మద్దతు గనుక కలిపితే ముగ్గురు కార్పొరేటర్లు కలిస్తే సంఖ్య 121అయితే.. షిండే సేన వర్గం కార్పొరేటర్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడమంటూ చెబుతున్నారు. మేం ఎన్నికలు సక్రమంగా గెలిచాం. మాపై ఎవరూ ఒత్తిడి చేయకూడదు. ప్రలోభాలకు లొంగే ప్రసక్తే లేదు అంటూ రాజు వాఘ్మారే అనే కార్పొరేటర్ వ్యాఖ్యలు చేశారు. అయితే రకరకాల ఊహాగానాలు, ప్రచారాల వేళ.. మేయర్ పదవి కూటమిదేనని, అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, తాను, షిండే, ఇతరులు కూర్చుని నిర్ణయం తీసుకుంటామని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. -
రిసార్ట్లో ‘షిండే’ కార్పొరేటర్లు.. వీడని ‘మేయర్’ ఉత్కంఠ
ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)ఎన్నికల్లో బీజేపీ కూటమి స్పష్టమైన విజయం సాధించినప్పటికీ, ముంబై రాజకీయాల్లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల్లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, సొంతంగా మేజిక్ ఫిగర్ను దక్కించుకోలేదు. దీంతో పార్టీకి ఫిరాయింపుల భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మిత్రపక్షమైన బీజేపీ నుండే ఏవైనా ‘ఆపరేషన్లు’ జరుగుతాయేమోనన్న అనుమానంతో, కొత్తగా ఎన్నికైన తమ శివసేన కార్పొరేటర్లను బాంద్రాలోని ఓ రిసార్ట్కు తరలించారు. మేయర్ ఎన్నిక పూర్తయ్యే వరకు షిండే వర్గం ఈ ‘రిసార్ట్ పాలిటిక్స్’ వ్యూహాన్ని అమలు చేయనున్నదని తెలుస్తోంది.మ్యాజిక్ ఫిగర్కు అంచున ఎన్డీఏ కూటమిమొత్తం 227 స్థానాలున్న బీఎంసీలో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు 114 స్థానాల మద్దతు అవసరం. తాజా ఫలితాల్లో బీజేపీ 89 స్థానాలను గెలుచుకోగా, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 29 స్థానాల్లో విజయం సాధించింది. ఇవి రెండూ కలిపితే ఎన్డీఏ కూటమి బలం 118కి చేరింది. ఇది మ్యాజిక్ ఫిగర్ కంటే కేవలం నాలుగు సీట్లు మాత్రమే ఎక్కువ. ఈ స్వల్ప ఆధిక్యం కారణంగా, ఏ చిన్నపాటి చీలిక వచ్చినా మేయర్ పీఠం చేజారిపోయే ప్రమాదం ఉంది.శివసేన ఐక్యంగా ఉంటే..మరోవైపు శివసేన (యూబీటీ) 65 స్థానాలను గెలుచుకుంది. ఒకవేళ శివసేన ఐక్యంగా ఉండి ఉంటే, ఉద్ధవ్, షిండే వర్గాల సీట్లు కలిపి (65+29) 94 అయ్యేవని, అది బీజేపీ (89) కంటే ఎక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్తో పొత్తు ఉండి ఉంటే ఫలితాలు పూర్తిగా తారుమారయ్యేవని అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు. బీఎంసీపై పట్టు కోల్పోయినప్పటికీ, ముంబై మేయర్గా శివసేన (యూబీటీ) అభ్యర్థిని చూడాలన్న తన కల ఇంకా చెదరలేదని, దేవుడు అనుగ్రహిస్తే అది సాధ్యమేనని ఆయన వ్యాఖ్యానించారు.పార్టీలో అసంతృప్తి బీజేపీ అత్యధిక సీట్లు గెలిచినప్పటికీ, ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పార్టీలో అసంతృప్తి నెలకొంది. ఎన్నికలకు ముందు 155 పైగా స్థానాల్లో పోటీ చేసి, కనీసం 110-125 సీట్లు గెలవాలని బీజేపీ తన లక్ష్యంగా పెట్టుకుంది. కానీ షిండే వర్గం గట్టిగా పట్టుబట్టి 91 సీట్లు తీసుకోవడంతో, బీజేపీ 137 స్థానాల్లోనే పోటీ చేయాల్సి వచ్చింది. చివరకు 89 సీట్లతో సరిపెట్టుకోవాల్సి రావడంతో పార్టీ నాయకత్వం నిరాశలో ఉంది. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుండి చేర్చుకున్న 11 మంది సిట్టింగ్ కార్పొరేటర్లు కూడా ఓడిపోవడం గమనార్హం. ముంబై బీజేపీ యూనిట్లో సమన్వయ లోపం, అభ్యర్థుల ఎంపికలో పొరపాట్లు, రాజ్, ఉద్ధవ్ ఠాక్రేలు లేవనెత్తిన మరాఠీ ఆత్మగౌరవం నినాదాన్ని తిప్పికొట్టలేకపోవడమే ఈ ఫలితాలకు కారణమని బీజేపీ నేతలు అంటున్నారు.ఇది కూడా చదవండి: సిగరెట్ మాఫియా గుప్పిట్లోకి భారత్? -
ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిందీ చలన చిత్ర పరిశ్రమలో తనకు అవకాశాలు తగ్గడానికి మతం కూడా ఓ కారణం అయ్యి ఉండొచ్చని అన్నారాయన. దీనిపై బాలీవుడ్లో తీవ్ర చర్చ నడుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు రెహమాన్ కామెంట్లను ఖండిస్తున్నారు. ఈ క్రమంలో.. విశ్వహిందూ పరిషత్ ఓ అడుగు ముందుకేసి ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించింది. అవకాశాలు ఎందుకు దొరకడం లేదో రెహమాన్ ఆత్మపరిశీలన చేసుకోకుండా.. మొత్తం సినీ పరిశ్రమను నిందించడం సరికాదని వీహెచ్పీ జాతీయ ప్రతినిధి వినోద్ బన్సాల్ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు హిందువుగానే ఉన్న రెహమాన్ ఇలాంటి వ్యాఖ్యలతో ఏం నిరూపించాలనుకుంటున్నారు?" అని ఆయన ప్రశ్నించారు. బాలీవుడ్లో అవకాశాలు దక్కాలంటే ఘర్వాపసీ కావాలంటూ వ్యాఖ్యానించారు... హమీద్ అన్సారీ(మాజీ ఉపరాష్ట్రపతి)కి చెందిన వర్గానికే ఇప్పుడు రెహమాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడేమో. గతంలో అన్సారీ కూడా 10 ఏళ్ల పాటు రాజ్యాంగ బద్ధమైన వివిధ పదవులను అనుభవించారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన దేశాన్ని దెబ్బ తీశారు. ఒకప్పుడు అతను(రెహమాన్ను ఉద్దేశిస్తూ..)ను హిందువులతో సహా దేశం మొత్తం ఆరాధించింది. అలాంటి వ్యక్తి ఎందుకు మతం మారాడు?. బహుశా ఘర్వాపసీ అయితే మళ్లీ అవకాశాలు వస్తాయేమో అని బన్సాల్ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ నేతలకు సరిపోతాయని.. రెహమాన్లాంటి ఆర్టిస్టులకు కాదని చురక అంటించారు.ఓ ప్రముఖ మీడియా చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమలో తనకు అవకాశాలు తగ్గాయన్నారు. ఇండస్ట్రీలో మారిన 'పవర్ షిఫ్ట్' ఇందుకు ఒక కారణమైతే.. 'మతం' కూడా మరో కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయాలను తనకు పుకార్ల రూపంలోనే తెలిశాయని అన్నారు. అయితే.. అవుట్సైడర్లా తాను ఫీలైనప్పటికీ.. కొన్ని ప్రాజెక్టులు చేజారినప్పటికీ.. కుటుంబంతో గడిపే సమయం ఎక్కువగా దొరుకుతోందని అన్నారు. పని కోసం నేను వెతుక్కుంటూ వెళ్లడం కాదు.. నా నిజాయితీకి తగ్గట్లు పని వస్తే సంతోషిస్తానని చెప్పారు. మరోవైపు, రెహమాన్ వ్యాఖ్యలను సినీ పరిశ్రమలోని పెద్దలు విభేధిస్తున్నారు. ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ స్పందిస్తూ.. హిందీ పరిశ్రమలో మతపరమైన వివక్ష లేదని, దిలీప్ కుమార్ (యూసుఫ్ ఖాన్), షారుఖ్ ఖాన్ వంటి ఎందరో కళాకారులు అగ్రస్థానంలో కొనసాగారని గుర్తుచేశారు. మరో ఫిల్మ్మేకర్ రెహమాన్ వ్యాఖ్యలను చీప్ అని పేర్కొన్నారు. అయితే.. రెహమాన్ సంగీతంలో మునుపటి జోష్ కనిపించడం లేదని.. భారీగా రెమ్యునరేషన్ అడుగుతున్నారని.. వీటికి తోడు ఆలస్యంగా పాటలు ఇవ్వడం వల్లే అవకాశాల్లేకుండా పోయాయని పలు సినిమాల పేర్లను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. -
మహారాష్ట్రలో ఎంఐఎం జోరు.. ఒవైసీ ఖుష్
సాక్షి ముంబై: మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సత్తా చాటింది. ముంబైతోపాటు మరాఠ్వాడాలోని మున్సిపల్ కార్పొరేషన్లలో ఎంఐఎం పార్టీ తన ప్రభావం చూపింది. రాష్ట్రంలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 125 స్థానాలను దక్కించుకుని తన పట్టును పెంచుకుంది. రాష్ట్రంలోని ముస్లిం ఓటర్లు ఎంఐఎంకు పెద్దఎత్తున మద్దతు పలికినట్టు ఫలితాలను బట్టి తెలుస్తోంది. ముస్లిం ఓటర్లు కాంగ్రెస్, ఎన్సీపీలను తిరస్కరించి ఎంఐఎంవైపు మొగ్గుచూపారని తాజా ఎన్నికల ఫలితాలతో స్పష్టమైంది. ఛత్రపతి సంభాజీనగర్లో హవా ఛత్రపతి సంభాజీనగర్ (ఔరంగాబాద్) మున్సిపల్ కార్పొరేషన్లో గతంలోకంటే అధికంగా 33 స్థానాలు దక్కించుకుని రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక్కడ కాంగ్రెస్, ఇరు ఎన్సీపీలు, ఇరు శివసేనల కంటే అధిక స్థానాలు దక్కించుకోవడం విశేషం. ముఖ్యంగా ఎంఐఎం ఎంపీ సయ్యద్ ఇంతియాజ్ జలీల్ (Syed Imtiaz Jaleel) నేతృత్వంలో జరిగిన ఈ ఎన్నికల్లో మరోసారి ఆయన తన సత్తాను చాటుకున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఆయనపై దాడి జరిగింది. దీంతో ఇంతియాజ్ జలీల్ ఈ ఎన్నికలకు మరింత ప్రతిష్ఠాత్మంగా తీసుకుని ప్రచారం చేసి 33 స్థానాలను దక్కించుకున్నారు.అమరావతి, నాందేడ్లలో..మాలేగావ్, నాందేడ్, అమరావతి, ధులే, ముంబై, షోలాపూర్, నాగపూర్, థానే(ముంబ్రా) మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఎంఐఎం తన ప్రభావం చూపింది. ముఖ్యంగా మాలేగావ్లో 20 స్థానాలు దక్కించుకోగా నాందేడ్లో 15, అమరావతిలో 12, ధులేలో 10 చోట్ల విజయం సాధించింది. ముంబైలో 8, షోలాపూర్లో 8, నాగపూర్లో 6, థానేలో 5 స్థానాల్లో గెలిచింది. అకోలా (3), జాల్నా (2), అహ్మద్నగర్ (2) లలో ఉనికిని చాటుకుకుంది. చంద్రాపూర్లో మొట్టమొదటి సారిగా ఒక్కస్థానం దక్కించుకుని బోణి కొట్టింది.మహారాష్ట్ర ప్రజలకు ఒవైసీ ధన్యవాదాలుమహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో (Maharashtra civic polls 2026) తమ పార్టీకి చెందిన 125 మంది కార్పొరేటర్లు విజయం సాధించారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. తమ పార్టీకి ఓటు వేసిన మహారాష్ట్ర ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీ కార్పొరేటర్లు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని అన్నారు. ''మా కార్పొరేటర్లందరూ ప్రజల మధ్యే ఉండి, మీ వార్డులలో అభివృద్ధి పనులు చేపట్టాలని నేను గట్టిగా కోరుతున్నాన''ని ఎక్స్లో పేర్కొన్నారు.చదవండి: కాంగ్రెస్ ఘోర పరాభవానికి కారణాలు ఇవే -
ముంబై ఫలితాలు.. శివసేనపై కత్తి దూసిన కంగనా
ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ ఫలితాలపై హిమాచల్ ప్రదేశ్లోని మండి ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ తనదైన శైలిలో స్పందించారు. 2020లో అవిభక్త శివసేన అధికారంలో ఉన్నప్పుడు బాంద్రా వెస్ట్లోని తన బంగ్లాను బీఎంసీ అధికారులు పాక్షికంగా కూల్చివేసిన ఘటనను ఆమె ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. నాడు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన ‘మహిళా ద్వేషులు, రౌడీలు, నెపోటిజం మాఫియా’కు ప్రజలు ఓటు ద్వారా సరైన బుద్ధి చెప్పారని కంగనా వ్యాఖ్యానించారు.ముంబైలో శివసేన (ఠాక్రే వర్గం) ప్రాబల్యం తగ్గి, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడంపై కంగనా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనవిజయానికి కారకులైన ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్లకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘నన్ను దూషించి, నా ఇల్లు కూల్చివేసి, మహారాష్ట్ర విడిచి వెళ్లాలని బెదిరించిన వారిని రాష్ట్ర ప్రజలే బహిష్కరించారు. అహంకారులు, మహిళా వ్యతిరేకులకు ‘జనతా జనార్దనులే’ వారి స్థానం ఏమిటో చూపించారు’ అని కంగనా ఘాటుగా విమర్శించారు.గతంలో ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలోని కంగనా రనౌత్ కార్యాలయంలో కొంత భాగాన్ని నిబంధనల పేరుతో బీఎంసీ కూల్చివేసింది. దీనిపై కంగనా.. బాంబే హైకోర్టును ఆశ్రయించగా, నాడు న్యాయస్థానం బీఎంసీ చర్యను తప్పుబడుతూ, అది పూర్తిగా దురుద్దేశంతో కూడినదని స్పష్టం చేసింది. ముంబై పోలీసులపై, ప్రభుత్వంపై తాను చేసిన వ్యాఖ్యల కారణంగానే నాడు బీఎంసీ కక్షపూరితంగా వ్యవహరించిందని కంగనా ఆరోపించారు. నాటి అవమానానికి ఈనాటి ఎన్నికల ఫలితాలే సరైన సమాధానమని ఆమె అన్నారు.రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం, ఈ ఎన్నికల్లో బీజేపీ 11,79,273 ఓట్లతో (21.58 శాతం) ఏకంగా 89 స్థానాలను కైవసం చేసుకుని బీఎంసీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 25 చోట్ల విజయం సాధించింది. ముంబైతో పాటు పూణే, పింప్రి-చించ్వాడ్, థానే, నాసిక్, నవీ ముంబై వంటి కీలక నగరాల్లోనూ బీజేపీ విజయపతాకం ఎగురవేసింది. ఇది కూడా చదవండి:అమెరికా ‘కస్టడీ’లో ఇద్దరు భారత విద్యార్థులు -
కాంగ్రెస్ ఘోర పరాభవం వెనుక..
వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఇటీవలి కాలంలో జరిగిన ఎన్నికల్లో వరుస ఓటములను చవిచూస్తోంది. దీనికి నాయకత్వ లేమి ప్రధాన కారణమని కొందరు అంటుండగా, పార్టీలో ఐక్యత లోపించిందని మరికొందరు చెబుతారు. ఇప్పుడు మరోమారు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అత్యంత దారుణమైన పనితీరును కనబరిచింది. మొత్తం 227 సీట్లకు గాను కేవలం 22 సీట్లకే పరిమితమయ్యింది. దీంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది.సరైన వ్యూహం లేకుండా..బీఎంసీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి భారీ ర్యాలీలు, రోడ్షోలు గానీ, ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు గానీ నిర్వహించలేదు. కనీస ప్రణాళిక, సరైన వ్యూహం లేకుండానే బరిలోకి దిగినట్లు స్పష్టంగా కనిపించింది. 1885లో ఇదే నగరంలో పుట్టి, దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ, నేడు తన ఉనికిని కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ముంబై కాంగ్రెస్ అధ్యక్షురాలు వర్షా గైక్వాడ్ ఈ పరాజయానికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె నాయకత్వ సామర్థ్యంపై పలు ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.అంతకంతకూ దిగజారుతూ..గత మూడు పర్యాయాల బీఎంసీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, ముంబైలో పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తోంది. 2007లో 71 సీట్లు గెలుచుకున్న పార్టీ, 2012 నాటికి 51కి, 2017లో 31కి పడిపోయింది. ఒకప్పుడు 26 శాతానికి పైగా ఉన్న ఓటు బ్యాంకు, నేడు సింగిల్ డిజిట్కు పడిపోయే ప్రమాదం ఉంది. ఉత్తరాది ఓటర్లు, దక్షిణాది వారు, గుజరాత్, జైన్, మార్వాడీ వర్గాల మద్దతును తిరిగి పొందడంలో పార్టీ నాయకత్వం పూర్తిగా విఫలమైందని పార్టీ సీనియర్ నేతలే అంటున్నారు.పొత్తుల గందరగోళం ముస్లిం, దళిత ఓట్లను ఏకం చేయాలనే లక్ష్యంతో ప్రకాష్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడి (వీబీఏ), రాష్ట్రీయ సమాజ్ పక్ష (ఆర్ఎస్పీ)తదితర పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. అయితే ఈ కూటమి క్షేత్రస్థాయిలో కూడా సరైన ఫలితాలను ఇవ్వలేకపోయింది. ప్రచారంలో మిత్రపక్షాలను కలుపుకుపోవడంలో కాంగ్రెస్ విఫలమైందనే విమర్శలు వినిపించాయి. కేవలం తమ అభ్యర్థులకే ఓట్లు అడగడంపై వీబీఏ నాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు వర్షా గైక్వాడ్ కేవలం అమీన్ పటేల్, అస్లాం షేక్ వంటి ఇద్దరు ముగ్గురు నేతల మాటలకే ప్రాధాన్యతనిచ్చారని, ఇతర సీనియర్లను, క్షేత్రస్థాయి కార్యకర్తలను విస్మరించారని పార్టీలోని ఒక వర్గం ఆరోపిస్తూవస్తోంది. సమిష్టి నిర్ణయాలు లేకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.టికెట్ల పంపిణీలో పక్షపాతం టికెట్ల కేటాయింపు వ్యవహారం పార్టీలో తీవ్ర అసంతృప్తిని రగిలించింది. కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న నిజమైన కార్యకర్తలను పక్కనపెట్టి, ముఖ్య నేతల కుటుంబ సభ్యులకే టికెట్లు కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉదాహరణకు.. అంధేరీలో సీనియర్ నేత అస్లాం షేక్ తన కుమారుడు, సోదరి, అల్లుడికి టికెట్లు ఇప్పించుకున్నారు. ఇందుకోసం ఆయన గతంలో గెలిచిన మాజీ కార్పొరేటర్లను కూడా పక్కనపెట్టడంతో, వారు శివసేన (యూబీటీ) గూటికి చేరి, కాంగ్రెస్పైనే పోటీకి దిగారు. అలాగే వర్షా గైక్వాడ్ తన అనుచరుల కుటుంబాలకు టికెట్లు ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే అశోక్ జాదవ్ తదితరులు తమ వారసులకు టికెట్ దక్కలేదన్న కోపంతో పార్టీని వీడారు. ఇలాంటి స్వయంకృతాపరాధాలు, అవకాశవాద రాజకీయాలే ముంబైలో కాంగ్రెస్ పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: పుడుతూనే మధుమేహం.. -
ముంబైలో మళ్లీ పవర్ప్లే!
సుమారు పాతికేళ్లపాటు కొనసాగిన థాక్రే ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ.. ముంబై మున్సిపల్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ. ఈ విజయంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కే సింహ భాగం కట్టబెడుతున్నారంతా. వాస్తవానికి గత ఎన్నికల్లోనే ముంబై మేయర్ పదవిని బీజేపీ తృటిలో చేజార్చుకుంది. ఆ టైంలో.. 82 స్థానాలు నెగ్గినప్పటికీ మిత్రపక్షంగా ఉన్న శివసేన కంటే కేవలం రెండే సీట్లు వెనకబడిపోయింది. అయితే.. ఈసారి మహాయుతికి స్పష్టమైన బలం ఉండడంతో ముంబై మేయర్ పీఠం బీజేపీదే అనుకుంటున్న టైంలో.. హైడ్రామా మొదలైంది. నిన్న బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల ఫలితాల్లో జోరు కొనసాగుతున్న టైంలోనే.. పదవిపై బీజేపీ, ఏకనాథ్ శిండే శివసేన మధ్య అంతర్గత చర్చలు ప్రారంభమయ్యాయి. మొత్తం 227 స్థానాలున్న బీఎంసీలో మ్యాజిక్ ఫిగర్ 114. బీజేపీ 89 వార్డుల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. శిండే శివసేన కేవలం 29 స్థానాలు సాధించింది. అజిత్ పవార్ ఎన్సీపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ లెక్క ప్రకారం బీజేపీకి మేయర్ పదవి దక్కాలంటే శిండే వర్గం మద్దతు తప్పనిసరి. దీంతో.. షిండే వర్గానికి కింగ్మేకర్ స్థానం దక్కినట్లయ్యింది. శిండే వర్గంలోని కీలక నేతలు ఇప్పటికే “ముంబై మేయర్ శివసేన వర్గానిదే కావాలి. ఇది బాలాసాహెబ్ థాక్రే వారసత్వం” అని ప్రకటనలు చేసుకుంటూ వస్తోంది. అయితే షిండే మాత్రం “మహాయుతి కూటమిగా పోరాడాం. ముంబై అభివృద్ధి కోసం కలిసి నిర్ణయం తీసుకుంటాం” అని ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఏం జరగొచ్చు!మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో 131 స్థానాలున్న థానేలో సీన్ రివర్స్గా ఉంది. అక్కడ షిండే శివసేన ఏకంగా 75 సీట్లు సాధించింది. బీజేపీ 28 స్థానాలు దక్కించుకుంది. దీంతో మిత్రపక్షం మద్దతు అవసరం లేకుండానే షిండే సేన మేయర్ పదవి దక్కించుకోబోతోంది. అయితే ముంబై విషయంలో అలా కాదు. అయితే మేయర్ పదవిని రెండు భాగాలుగా పంచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే, 2.5 సంవత్సరాలకుగానూ(పవర్షేరింగ్ ఫార్ములా) షిండే వర్గం, మిగతా కాలం బీజేపీకి దక్కేలా ఒప్పందం కుదిరే అవకాశముందని ప్రచారం నడుస్తోంది. అలాగే మేయర్ పదవిపై తుది నిర్ణయం తీసుకునే ముందు ఉపమేయర్, స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవులు, కీలక వార్డులపై గట్టి చర్చలు జరగడం ఖాయమనే చెప్పొచ్చు. అయితే అంత మెజారిటీ సాధించిన బీజేపీ.. మేయర్ సీటును త్యాగం చేస్తుందా? అనేదానిపై అనుమానాలు నెలకొన్నాయి. లేదంటే.. ఈ వంకతో బీఎంసీ ముఖ్య కమిటీలపై షిండే శివసేన ఆధిపత్యం సాధించే ప్రయత్నం చేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
మహా ధురంధర్ ఫడ్నవీస్
మహారాష్ట్ర పురపాలక ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘనవిజయం సాధించగా, ఈ విజయానికి ప్రధాన శక్తిగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ప్రతిధ్వనిస్తోంది. ఎన్నికల ముందు ఆయన చేసిన ప్రకటన “మా గత రికార్డులన్నింటినీ తిరగరాస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లను కైవసం చేసుకుంటాం” అనేది కేవలం నినాదంగా కాకుండా, ఫలితాల్లో నిజమైంది. ఈ విజయంతో ఆయనకు అట్టడుగు స్థాయి ప్రజల నుండి గట్టి ఆదరణ ఉందని స్పష్టమైంది.ముఖ్యంగా ముంబైలో తన పట్టును నిలుపుకోవడం ఫడ్నవీస్ కోసం కీలకంగా మారింది. ఠాక్రే సోదరులు ఉద్ధవ్, రాజ్ 20 ఏళ్ల వైరాన్ని పక్కన పెట్టి ఒకటయ్యే ప్రయత్నం చేసినా, ఫడ్నవీస్ వ్యూహాలు వారి ఆశలపై నీళ్లుజల్లాయి. ప్రచారంలో ఆయన స్వయంగా ముందుండి, ప్రతి కార్పొరేషన్లోనూ కలియదిరిగి ప్రజలతో మమేకమయ్యారు. వయోజన ఓటర్లతో పాటు యువత, ముఖ్యంగా జెన్ జెడ్ తరాన్ని తన సూటి.. ఆధునిక ప్రచార శైలితో ఆకట్టుకున్నారు.దక్షిణ భారతీయులను ముంబై నుంచి వెళ్లగొడతామన్న ఠాక్రేల హెచ్చరికల నడుమ, ఫడ్నవీస్ వారిని అక్కున చేర్చుకోవడం ఆయనకు అదనపు మద్దతు తెచ్చింది. నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న ఆ ప్రాంతీయులు ఆయనను తమవాడిగా భావించారు. అంతేకాకుండా, ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ అయిన ధారావీ అభివృద్ధి ప్రాజెక్టును ప్రకటించడం.. ముంబై వాసుల కోసం పలు పథకాలను ప్రవేశపెట్టడం ఆయనకు విశేష ఆదరణను తెచ్చింది.ఈ విజయంతో 54 ఏళ్ల ఫడ్నవీస్ మరాఠా రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించారని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన కేవలం ఒక నాయకుడిగానే కాకుండా, వ్యూహకర్తగా, ప్రజల మనసులను గెలుచుకున్న వ్యక్తిగా నిలిచారు. మహాయుతి కూటమి విజయాన్ని బ్లాక్బస్టర్గా మార్చిన హీరోగా ఆయన పేరు మరాఠా రాజకీయ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోనుంది. -
ముంబై కోటపై బీజేపీ జెండా!
ముంబై: మహారాష్ట్రలో పురపాలక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి కూటమి మెరిసింది. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైపై కాషాయ జెండా ఎగరేసింది. తద్వారా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)పై దాదాపు మూడు దశాబ్దాల శివసేన ఆధిపత్యానికి ఎట్టకేలకు తెర దించింది. దేశంలోనే గాక ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్న కార్పొరేషన్గా పేరొందిన బీఎంసీలో 227 కార్పొరేటర్ స్థానాలకు గాను అధికార మహాయుతి కూటమి భాగస్వాములు శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)తో కలిసి బీజేపీ ఇప్పటికే 116 సీట్లను కైవసం చేసుకుంది. తద్వారా 114 స్థానాల మెజారిటీ మార్కును దాటేసింది. కడపటి ఫలితాలు అందేసరికి కాషాయ పార్టీ సొంతంగానే 87 స్థానాలు సాధించింది. తద్వారా 2017లో 82 సీట్లు సాధించిన సొంత రికార్డును అధిగమించింది. ఇంకా పలుచోట్ల ముందంజలో ఉంది. శివసేన (షిండే) 27 స్థానాలను గెలుచుకుంది. మహాయుతి కూటమిలోని మరో పార్టీ ఎన్సీపీ (అజిత్) 2 సీట్లు గెలుచుకుంది. బీఎంసీపై పట్టును ఎలాగైనా నిలుపుకునేందుకు ఠాక్రే సోదరులు శివసేన (ఎంబీటీ) సారథి ఉద్ధవ్, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ పరస్పర వైరానికి స్వస్తి పలికి ఎన్నికల ముంగిట చేతులు కలిపినా లాభం లేకపోయింది. వారి ఆశలపై ముంబై ఓటర్లు నీళ్లు చల్లారు. ఉద్ధవ్ సేన 64 సీట్లకు పరిమితం కాగా ఎంఎన్ఎస్ 6 చోట్ల మాత్రం నెగ్గింది. ఉద్ధవ్ పార్టీ కనీసం మరో 5 చోట్ల ముందంజలో ఉంది. బీఎంసీ సహా రాష్ట్రంలో 29 మున్సిపల్ కార్పొరేషన్లలో గురువారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం చేపట్టిన ఓట్ల లెక్కింపులో మహాయుతి ఆరంభం నుంచే స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ముంబైతో పాటు అత్యధిక కార్పొరేషన్లను చేజిక్కించుకుంది. ఇక శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అన్నిచోట్లా ఘోర ఓటమే చవిచూసింది. భివండీ మినహా ఏ కార్పొరేషన్లోనూ కనీసం రెండంకెల స్కోరుకు కూడా చేరుకోలేక చతికిలపడింది. ముంబైలోనైతే ఒకే ఒక్క కార్పొరేటర్ స్థానానికి పరిమితమైంది! సొంత గడ్డ అయిన పుణెలో కూడా ఘోర పరాభవం పాలైంది. 165 స్థానాలకు గాను కేవలం నాలుగు సీట్లతో సరిపుచ్చుకుంది. అక్కడ బీజేపీ ఒంటరిగానే ఏకంగా 123 సీట్లు దక్కించుకుంది. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా అత్యధిక పురపాలికల్లో నేలచూపులే చూసింది. బీఎంసీలో హస్తం పార్టీకి కేవలం 24 స్థానాలు దక్కాయి. లాతూర్ కార్పొరేషన్లో సొంతంగా మెజారిటీ సాధించడం ఒక్కటే ఆ పార్టీకి ఊరటగా నిలిచింది. మొత్తం 29 కార్పొరేషన్లకు గాను మహాయుతి కూటమి 25 స్థానాలను చేజిక్కించుకోవడం ఇప్పటికే ఖాయమైంది. పురపాలికల ఫలితాల పట్ల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హర్షం వెలిబుచ్చారు. 54 శాతం పోలింగ్ మహారాష్ట్రలో అన్ని పురపాలికల గడువూ మూడు నుంచి ఐదేళ్ల క్రితమే ముగిసింది. నాటినుంచీ అధికారుల పాలనలో ఉన్న ఆ కార్పొరేషన్లకు గురువారం ఎన్నికలు జరిగాయి. మొత్తమ్మీద 54.77 శాతం పోలింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. కొత్తగా ఏర్పాటైన ఇచల్కరంజీ మున్సిపల్ కార్పొరేషన్లో అత్యధికంగా 69.76 శాతం ఓటింగ్ జరిగింది. 66.53 శాతంతో కొల్హాపూర్ రెండో స్థానంలో నిలిచింది. మీరా–భయందర్లో అత్యల్పంగా 48.64 శాతం నమోదైంది. ముంబైలో 52.94 శాతం పోలింగ్ జరిగింది. ప్రతిష్టాత్మకమైన పుణెతో పాటు పంప్రీ–చించ్వాడ్, నాసిక్, ఛత్రపతి శంభాజీనగర్... ఇలా మెజారిటీ కార్పొరేషన్లలో బీజేపీ కూటమి హవాయే కొనసాగింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయేసరికి మొత్తం 2,784 వార్డుల ఫలితాలు వెలువడగా వాటిలో బీజేపీ 1,372 చోట్ల గెలుపొందింది. లాతూర్ కార్పొరేషన్లో మాత్రం 70 స్థానాలకు గాను కాంగ్రెస్ 43 చోట్ల గెలిచింది. బీజేపీ 22 సీట్లకు పరిమితమైంది. చంద్రపూర్లో కూడా 66 స్థానాలకు గాను కాంగ్రెస్ 27 సీట్లు నెగ్గి ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. ఉద్ధవ్ శివసేనకు 6 స్థానాలు దక్కాయి. రెండు పార్టీలూ కలిసి మేయర్ పదవి దక్కించుకోవచ్చంటున్నారు. జనవికాస్ సేనకు 3 సీట్లు రాగా ఇద్దరు స్వతంత్రులు నెగ్గారు. వారి మద్దతూ తమకేనని కాంగ్రెస్ పేర్కొంది. బీజేపీ 23 సీట్లకు పరిమితం కాగా మజ్లిస్, బీఎస్పీలకు ఒక్కో స్థానం దక్కాయి. వసై–వీరార్ కార్పొరేషన్లో స్థానిక పార్టీ బహుజన్ వికాస్ అగాఢీ విజయం సాధించడం విశేషం. 115కు గాను ఆ పార్టీ ఏకంగా 71 స్థానాలను చేజిక్కించుకోగా బీజేపీ 43 సీట్లతో సరిపెట్టుకుంది. ఇక పర్బాణిలో 65 స్థానాలకు గాను శివసేన (యూబీటీ) 25, కాంగ్రెస్ 12 సీట్లలో నెగ్గాయి. బీజేపీకి 12, ఎన్సీపీ (అజిత్) వర్గానికి 11 సీట్లొచ్చాయి.అభివృద్ధికే ఓటేశారు: మోదీ న్యూఢిల్లీ: మహారాష్ట్ర మున్సిపల్ పోరులో బీజేపీ కూటమి విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. ఎన్డీఏ కూటమి సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారో చెప్పేందుకు ఈ విజయమే తార్కాణమని ఆయన అన్నారు. అత్యధిక కార్పొరేషన్లలో ఘనవిజయం కట్టబెట్టడం ద్వారా తమ పనితీరును వారు మరోసారి ఆశీర్వదించారన్నారు. ‘థాంక్యూ మహారాష్ట్ర!’ అంటూ ఎక్స్ పోస్టులో రాష్ట్ర ప్రజలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫలితాల నేపథ్యంలో వారితో ఎన్డీఏ బంధం మరింత బలపడిందని అభిప్రాయపడ్డారు. ‘‘ఎన్డీఏకు ఇంతటి ఘనవిజయం సాధించిపెట్టిన కూటమి కార్యకర్తలను చూసి గరి్వస్తున్నా. మీ అవిశ్రాంత శ్రమే ఇందుకు కారణం’’ అన్నారు.బీజేపీ ఓట్ల చోరీ: రాహుల్ న్యూఢిల్లీ: ఎప్పట్లాగే మహారాష్ట్ర పురపాలికల ఎన్నికల్లో కూడా అధికార బీజేపీ కండబలంతో ఓట్ల చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ ఆరోపించారు. ఓటర్ల వేలిపై గుర్తు పెట్టేందుకు వాడిన మార్కర్ పెన్నుల్లో ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగానే నాసిరకం ఇంకు వాడిందని మరోసారి ఆరోపించారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరపనున్నట్టు ముంబై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. రానున్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో మార్కర్ పెన్నులు వాడబోమని కూడా ఎస్ఈసీ దినేశ్ వాగ్మారే పేర్కొన్నారు. 2011 నుంచీ రాష్ట్రంలో అన్ని స్థానిక ఎన్నికల్లోనూ మార్కర్లనే వాడుతున్నట్టు ఆయన గుర్తు చేశారు.గౌరీ లంకేశ్ హత్య కేసునిందితుని గెలుపు జల్నా: జర్నలిస్టు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుడైన శ్రీకాంత్ పనగార్కర్ పురపాలిక ఎన్నికల్లో విజయం సాధించాడు. జల్నా కార్పొరేషన్లో స్వతంత్ర అభ్యరి్థగా బరిలో దిగిన అతడు 13వ వార్డు కార్పొరేటర్గా నెగ్గాడు. సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన రావ్సాహెబ్ ధోబ్లేపై స్వల్ప మెజారిటీతో గెలుపొందాడు. లంకేశ్ 2017లో దారుణ హత్యకు గురవడం తెలిసిందే. ఆమెను బెంగళూరు నివాసం బయటే దారుణంగా కాల్చి చంపారు. దీనిపై అప్పట్లో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శ్రీకాంత్ను 2018 ఆగస్టులో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అదుపులోకి తీసుకుంది. 2024లో అతను బెయిల్పై బయటికొచ్చాడు.మజ్లిస్కు 114 స్థానాలు మహారాష్ట్ర పుర పోరులో ఆలిండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) 114 కార్పొరేటర్ స్థానాలు గెలుచుకుంది. ఛత్రపతి శంభాజీనగర్లో అత్యధికంగా 33 సీట్లు నెగ్గడం విశేషం. మాలెగావ్ (21), అమరావతి (15), నాందేడ్ (13), ధులే (10) కార్పొరేషన్లలో పార్టీ రెండంకెల స్కోరు దాటింది. బీఎంసీలో కూడా ఖాతా తెరిచింది. 2017 నాటి కార్పొరేషన్ ఎన్నికల్లో మజ్లిస్ 80 స్థానాలు నెగ్గింది.చతికిలపడ్డ శివసేనశివసేన. మహారాష్ట్రలో ఈ పేరే ఓ సంచలనం. ముంబైలో శివసేన తిరుగులేని శక్తి. వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే రోజుల నుంచీ నగరంలో ఆ పార్టీ హవాయే సాగుతూ వచి్చంది. కొన్నేళ్లుగా కొడిగడుతూ వచి్చన ఆ ప్రభ తాజా బీఎంసీ ఎన్నికల ఫలితాలతో దాదాపుగా పరిసమా ప్తమైనట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు. మూడు దశాబ్దాల శివసేన ఆధిపత్యానికి ఇక తెర పడ్డట్టేనని చెబుతున్నారు. ఉద్ధవ్ ఠాక్రే అధికార యావే ఇందుకు కారణమని, ఆయన అత్యాశ కారణంగా చిట్టచివరి దుర్గమైన ముంబై కూడా శాశ్వతంగా పార్టీ చేజారిందని ఆయన వర్గీయులే వాపోతున్న పరిస్థితి. ముంబైపై పట్టును సవతి సోదరుడు రాజ్ ఠాక్రేతో ఉద్ధవ్ చేతులు కలిపినా లాభం లేకపోయింది. -
విరాట్ కోహ్లీ, అనుష్క ఫెస్టివ్ వైబ్ : రూ. 38 కోట్ల ఆస్తి కొనుగోలు
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కు సంబంధించిన ఒక శుభవార్త ప్రస్తుతం నెట్టింట సందడిగామారింది. అలీబాగ్లోని రాయ్గఢ్ జిల్లాలో ఐదు ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేశారు. సీఆర్ఈ (CRE) మ్యాట్రిక్స్ ఆస్తి పత్రాల ప్రకారం, దీని విలువ 37.86 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.మహరాష్ట్రలోని రాయ్గడ్ జిల్లా (402201)లోని అలీబాగ్లోని గాట్ నంబర్లు 157 158లోని విలేజ్ జిరాద్లో ఈ భూమి ఉంది. రిజిస్టర్డ్ సేల్ డీడ్ ప్రకారం, మొత్తం భూమి 21,010 చదరపు మీటర్లు లేదా దాదాపు 5.19 ఎకరాలు ఉంటుంది. ఈ లావాదేవీ జనవరి 13, 2026న రిజిస్టర్ చేశారు. సోనాలి అమిత్ రాజ్పుత్ నుంచి అనుష్క, విరాట్ దంపతులు ఈ భూమిని కొనుగోలు చేసినట్టు CRE మ్యాట్రిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అభిషేక్ కిరణ్ గుప్తా వెల్లడించారు. నిబంధనల ప్రకారం విరాట్, అనుష్క రూ.2.27 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30,000, డాక్యుమెంట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు రూ.1,000గా నమోదయ్యాయి. ఇదీ చదవండి: పండగవేళ విషాదం : చేపలకోసం ఎగబడ్డ జనంమరోవైపు సెలబ్రిటీ జంట విరుష్క అలీబాగ్లో ఇదే తొలి రియల్ ఎస్టేట్ పెట్టుబడి కాదు. 2022లో, ఈ జంట 2022లో అలీబాగ్లో 19.24 కోట్ల రూపాయలకు దాదాపు 8 ఎకరాలు కొనుగోలు చేశారు. తరువాత ఈ జంట సంపాదించిన ప్లాట్లలో ఒక విలాసవంతమైన వెకేషన్ హోమ్ను నిర్మించారు. ఇదే ప్రాంతంలో ల్యాండ్ను కొనుగోలు చేసినవారిలో ప్రముఖ కొనుగోలుదారులలో బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కూడా ఉన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 2025లో చాటౌ డి అలీబాగ్లో సుమారు రూ. 2 కోట్ల విలువైన 2,000 చదరపు అడుగుల ప్లాట్ను కొనుగోలు చేశారు. అలాగే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఈ ప్రాంతంలో భారీగా పెట్టుబడి పెట్టారు. 2024 ఏప్రిల్లో రూ. 10 కోట్లకు 10,000 చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేశారు, ఆ తర్వాత అక్టోబర్ 2025లో రూ. 6.6 కోట్లకు మొత్తం 9,557 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మూడు ఆనుకుని ఉన్న ప్లాట్లను కొనుగోలు చేశారు. షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కూడా అలీబాగ్లో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన ప్రముఖులలో ఉండటం విశేషం.ఇదీ చదవండి: కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచి -
BMC Election: 25 చోట్ల బీజేపీ ఆధిక్యం
ముంబై: మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు(శుక్రవారం) జరుగుతోంది. తొలి ట్రెండ్ల ప్రకారం బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ 68 స్థానాలతో ముందంజలో ఉండగా, శివసేన (యూబీటీ), ఎంఎన్ఎస్ కూటమి 42 స్థానాలతో, కాంగ్రెస్ 11 స్థానాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆర్థిక రాజధాని ముంబై (బీఎంసీ)తో పాటు పుణె, నాగ్పూర్ తదితర నగరాల్లో బీజేపీ ముందంజలో ఉంది. అయితే, సాంగ్లీ, కొల్హాపూర్, వసాయ్-విరార్, మాలెగావ్ వంటి నాలుగు కార్పొరేషన్లలో మాత్రం బీజేపీకి కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ ప్రాంతాల్లో బీజేపీ వెనుకంజలో ఉండగా, కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది.బీజేపీ ముందంజ: ముంబైలో 227 వార్డులకు గాను ఇప్పటివరకు 98 వార్డుల ట్రెండ్స్ వెలువడగా, బీజేపీ 42 వార్డుల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.సేన (UBT) గట్టి పోటీ: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT) 32 స్థానాల్లో ఆధిక్యంతో రెండో స్థానంలో ఉంది.షిండే వర్గం: ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం ప్రస్తుతం 15 వార్డుల్లో ముందంజలో ఉంది.ధారావిలో కాంగ్రెస్ బోణీ: ధారావిలోని 183వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఆశా కాలే ఘనవిజయం సాధించారు. ఆమె షిండే సేన అభ్యర్థి వైశాలి షెవాలే, MNS అభ్యర్థి పారుబాయి కట్కేలపై 1,450 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.మాజీ మేయర్ విజయం: వార్డు 182లో శివసేన (UBT) అభ్యర్థి, 7 సార్లు కార్పొరేటర్గా పనిచేసిన మాజీ మేయర్ మిలింద్ వైద్య విజయం సాధించారు.గోరేగావ్లో బీజేపీ సత్తా: గోరేగావ్లోని బంగూర్ నగర్ (వార్డు 50)లో బీజేపీ అభ్యర్థి తేజస్వి ఘోసల్కర్ విజయం సాధించారు. ఆమె సేన (UBT)కి చెందిన యువ అభ్యర్థి తన్వీ దినేష్ రావును ఓడించి బీజేపీకి కీలక విజయాన్ని అందించారు.మీరా-భయందర్లో క్లీన్ స్వీప్: మీరా-భయందర్ ప్రాంతంలో షిండే సేనతో జరిగిన పోరులో బీజేపీ ఇప్పటికే 8 స్థానాలను కైవసం చేసుకున్నట్లు సమాచారం.ముస్లిం ప్రాబల్య ప్రాంతంలో బీజేపీ జెండా: ముస్లింలు అధికంగా ఉండే మాన్ఖుర్డ్ (వార్డు 135)లో బీజేపీ అభ్యర్థి నవనాథ్ బాన్ విజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది. VIDEO | Maharashtra civic polls results: BJP candidate and Maharashtra BJP media in-charge Navnath Ban celebrates his victory in the BMC polls.In early trends, the BJP–Shiv Sena-led Mahayuti appears to be ahead across multiple municipal corporations.#BMCElections2026… pic.twitter.com/1fqyFYMSN3— Press Trust of India (@PTI_News) January 16, 2026 ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్.. అధికార మహాయుతి కూటమి ఘనవిజయం సాధించవచ్చనే అంచనా వేశాయి. అయితే.. విపక్ష కూటమి మాత్రం తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తోంది. మహారాష్టలోని ముంబై, పూణేలతో పాటు పింప్రి-చించ్వాడ్, కొల్హాపూర్, వసాయ్-విరార్, కళ్యాణ్-డోంబివిలి, నాగ్పూర్, సోలాపూర్, అమరావతి, థానే, పర్బానీ తదితర మున్సిపాలిటీలకు గురువారం ఎన్నికలు జరిగాయి. మొత్తం 893 వార్డుల్లోని 2,869 సీట్ల కోసం ఈ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల బరిలో మొత్తం 15,931 మంది అభ్యర్థులు నిలిచారు. వీరిలో ముంబై నుంచి 1,700 మంది, పూణే నుంచి 1,166 మంది అభ్యర్థులు ఉన్నారు. గురువారం జరిగిన పోలింగ్లో దాదాపు 1.03 కోట్ల మంది ఓటర్లు 1,700 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. దక్షిణ ముంబైలో ఓటింగ్ శాతం నిరాశాజనకంగా నమోదైంది. ముఖ్యంగా కులాబా ప్రాంతం (వార్డు 227)లో మధ్యాహ్నం 3.30 గంటల సమయానికి కేవలం 15.73 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఇది ముంబై సగటు పోలింగ్ శాతం 41.08 కన్నా చాలా తక్కువ. 2017 ఎన్నికల్లోనూ ఇక్కడ తక్కువ పోలింగ్ నమోదు కాగా, ఈసారి కూడా ఓటర్లు పోలింగ్ బూత్లకు రావడానికి ఆసక్తి చూపలేదు. హౌసింగ్ సొసైటీల్లోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని అధికారులు తెలిపారు.‘యాక్సిస్ మై ఇండియా’ అంచనాల ప్రకారం.. మొత్తం 227 వార్డులకు గాను బీజేపీ-శివసేన కూటమి 42 శాతం ఓటు షేర్తో 131 నుంచి 151 సీట్లు గెలుచుకుని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. మరోవైపు ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరేలు చేతులు కలిపినప్పటికీ, మహా వికాస్ అఘాడి (శివసేన యూబీటీ-ఎంఎన్ఎస్- ఎన్సీపీ(ఎస్పీ)కూటమి 58-68 సీట్లకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ కూటమి కేవలం 12-16 సీట్లతో సరిపెట్టుకోవాల్సి రావచ్చని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.బీఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు (జనవరి 16) ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 23 కౌంటింగ్ కేంద్రాల్లో దాదాపు 2,299 మంది అధికారులు తమ విధులను నిర్వహించనున్నారు. విక్రోలి, కాందివలిలోని స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. ఉదయం 11 గంటల కల్లా ఫలితాల సరళిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని, సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపారు.బీఎంసీలో మ్యాజిక్ ఫిగర్ 114 కాగా, ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం మహాయుతి ఈ మార్కును సులభంగా దాటేస్తుందని భావిస్తున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన చీలిన తర్వాత జరుగుతున్న తొలి బీఎంసీ ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ పోరులో ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ థాకరే వర్గాల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. తమ కూటమి 150 సీట్లకు పైగా గెలుచుకుంటుందని, మేయర్ పీఠంపై మరాఠీ హిందువే కూర్చుంటారని శివసేన నేత రాజు వాఘ్మారే ధీమా వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు మహారాష్ట్ర భవిష్యత్ రాజకీయ ముఖచిత్రంపై ప్రభావం చూపనున్నాయి. -
ముంబై ఎగ్జిట్పోల్స్ విడుదల.. ఆ పార్టీదే హవా..?
బృహత్ ముంబై మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. దేశ ఆర్థిక రాజధాని ఓటర్లంతా ఎవపరిని ఎన్నుకోవాలో నిర్ణయించుకున్నారు. అయితే ఎన్నికల అనంతరం సంప్రదాయంగా ప్రకటించే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. ఎగ్జిట్ పోల్ సంస్థలన్నీ మూకుమ్మడిగా బీజేపీ కూటమి అధికారం చేపట్టడం ఖాయమని తేల్చి చెబుతున్నాయి. ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మహారాష్ట్ర స్థానికులతో పాటు ముస్లిం ఓటర్లు శివసేన (యూబీటీ) వైపు నిలువగా, దక్షిణాది, ఉత్తరాది ప్రజలు యువత మహిళలు బీజేపీ వైపు నిలిచిట్లు ఎగ్జిట్ పోల్ట్ అంచనా వేశాయి. నాలుగు ప్రముఖ ఎగ్జిట్పోల్ సంస్థలు ఫలితాలు ప్రకటించాయి. వాటి వివరాలు.జన్మత్ : బీజేపీ కూటమికి -138 సీట్లు, శివసేన ( యూబీటీ) 62, కాంగ్రెస్ 20 ఇతరులు 7 అని అంచనా వేసింది.యాక్సిస్ మై ఇండియా: బీజేపీ కూటమి 131-151, శివసేన ( యూబీటీ) 58-68, కాంగ్రెస్ 12-16 ఇతరులు 6-12 స్థానాలు గెలవనున్నట్లు తెలిపింది.టైమ్స్ నౌ బీజేపీ కూటమి: 129-146, శివసేన యూబీటీ 54,64, కాంగ్రెస్ కూటమి ఇతరులు 6-9 స్థానాలు గెలవనున్నట్లు ప్రకటించింది.న్యూస్-18- బీజేపీ కూటమి: 119,శివసేన యూబీటీ 75, కాంగ్రెస్ కూటమి 20 ఇతరులు 14 స్థానాలు గెలుచుకోనున్నట్లు ప్రకటించింది. అయితే కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. -
మహారాష్ట్రలో సిరాకు బదులు మార్కర్.. థాక్రే ఆరోపణలు
Maharashtra Elections Updates..ఓటు వేసిన సీఎం ఫడ్నవీస్మున్సిపల్ ఎన్నికల్లో సీఎం ఫడ్నవీస్, ఆయన కుటుంబ సభ్యులు ఓటు వేశారు. ఇప్పటి వరకు 14 శాతం పోలింగ్ నమోదుప్రముఖులు తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.#WATCH | Nagpur: Maharashtra CM Devendra Fadnavis and his family show their inked fingers after casting their vote for the Maharashtra local body elections. pic.twitter.com/ExLnWCm3xR— ANI (@ANI) January 15, 2026 ఎన్నికల నిర్వహణపై రాజ్ థాక్రే ఆరోపణలు..ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే ఆరోపణలు.తీవ్రమైన అవకతవకలు జరిగాయని ఆరోపించారు.చెరగని సిరాకు బదులుగా మార్కర్ పెన్నులను ఉపయోగించడాన్ని తప్పుబట్టారు.పోలింగ్ ప్రక్రియను తారుమారు చేయడానికి చేసిన ప్రయత్నాలు అంటూ విమర్శించారు.ఇది ఆమోదయోగ్యం కాదు.ఇటువంటి మోసపూరిత ఎన్నికల వల్ల ప్రయోజనం లేదు.పౌరులు అప్రమత్తంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను Raj Thackeray on Voting Booth Issue : सॅनिटायझरने पुसलं तर मार्करची शाई जातेय : राज ठाकरे#RajThackeray #MNS #voting #abpmajha pic.twitter.com/zKkLAVwC1h— ABP माझा (@abpmajhatv) January 15, 2026ఓటు వేసిన నితిన్ గడ్కరీ, థాక్రేనాగపూర్లో ఓటు వేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే.ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్న రాజ్ థాక్రే. #WATCH | Maharashtra: MNS chief Raj Thackeray, along with his family, arrives at a polling station in Mumbai to cast his vote for the BMC elections. pic.twitter.com/jEPhUXUbjm— ANI (@ANI) January 15, 2026#WATCH | Union Minister Nitin Gadkari shows his inked finger after casting his vote at a polling station in Nagpur for Maharashtra local body polls. pic.twitter.com/F5IRM0qgFb— ANI (@ANI) January 15, 2026ఓటు వేసిన ప్రముఖులు.. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన సచిన్ముంబైలోని పోలింగ్ బూత్లో సచిన్ ఓటు వేశారు.సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. #WATCH | Mumbai: Legendary cricketer Sachin Tendulkar shows his inked finger after casting his vote for the BMC elections.He says, "This is a very important election. It gives us a chance where we can express our opinion through votes. Everyone should come out and cast their… https://t.co/a3GAx722A7 pic.twitter.com/dweQFzV796— ANI (@ANI) January 15, 2026 ఓటు వేసిన ప్రముఖులు వీరే.. #WATCH | Pune | After casting his vote in the 2026 Maharashtra municipal elections, Maharashtra Minister Chandrakant Patil says, "I exercised my right to vote... I fulfilled my duty this morning. I appeal to everyone to come out and vote... The BJP will bring development... and… pic.twitter.com/oq9JEKB8kA— ANI (@ANI) January 15, 2026 #WATCH | Mumbai: After casting his vote for the BMC elections, Musician Vishal Dadlani says, "...Hopefully, whoever wins will hold the elections on time. This is very important for the country, for democracy. But given the state of our city in the last few days, the hope is that… pic.twitter.com/v9vGyNuJ52— ANI (@ANI) January 15, 2026 ఓటు వేసిన మోహన్ భగవత్, అక్షయ్ కుమార్మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రముఖులు.నాగపూర్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ముంబైలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. #WATCH | Nagpur | RSS Chief Dr Mohan Bhagwat shows his inked finger after casting his vote for Maharashtra civic body elections pic.twitter.com/W3BZInWsDg— ANI (@ANI) January 15, 2026 మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం.. దశాబ్ద కాలం తర్వాత మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలు.బృహన్ ముంబై సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ ప్రారంభం.ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు.రేపు(శుక్రవారం) ఎన్నికలు ఫలితాలు.#WATCH | Mumbai: After casting his vote, Actor Akshay Kumar says, "Today, the voting for BMC is taking place. As Mumbaikars, we have the remote control with us today. I would request all the people of Mumbai to come out in large numbers and cast their votes. If we have to be the… https://t.co/AOlWRmnx1V pic.twitter.com/19RmBgMFB7— ANI (@ANI) January 15, 2026పోటీలో 1700 మంది అభ్యర్థులు.. మహారాష్ట్ర రాజధాని నగరం ముంబైలో 227 వార్డుల్లో ఓటింగ్ జరుగుతుంది.సుమారు 1,700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.బీఎంసీ ఎన్నికల్లో 1,03,44,315 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.వీరిలో 55 లక్షలకు పైగా పురుషులు, 48 లక్షలకు పైగా మహిళలు, ఇతర ఓటర్లు 1,099 మంది ఉన్నారు. -
గ్యాంగ్స్టర్ అబూ సలేంకు షాక్.. రెండు రోజులే పెరోల్
ముంబై: మహారాష్ట్రలోని ముంబై వరుస పేలుళ్ల కేసు(1993)లో దోషిగా తేలిన గ్యాంగ్స్టర్ అబూ సలేంను అంతర్జాతీయ నేరస్థునిగా మహారాష్ట్ర ప్రభుత్వం అభివర్ణించింది. తన సోదరుడి మరణానంతరం నిర్వహించే కార్యక్రమాలకు హాజరయ్యేందుకు అబూ సలేం 14 రోజుల పెరోల్ కోరగా, ప్రభుత్వం దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. అతను అత్యంత ప్రమాదకర వ్యక్తి అని, కేవలం రెండు రోజుల అత్యవసర పెరోల్ మాత్రమే మంజూరు చేయగలమని కోర్టు స్పష్టం చేసింది. అది కూడా పోలీసు బందోబస్తు మధ్యే సాధ్యమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మంఖువర్ దేశ్ముఖ్ బాంబే హైకోర్టుకు తెలిపారు.జైలు నిబంధనల ప్రకారం సలేంకు పోలీసు ఎస్కార్ట్తో కూడిన రెండు రోజుల పెరోల్ ఇచ్చేందుకు జైలు అధికారులు సుముఖత వ్యక్తం చేశారని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ భద్రతా ఏర్పాట్లకు అయ్యే ఖర్చును అబూ సలేం స్వయంగా భరించాలని షరతు విధించింది. దీనిపై సలేం తరపు న్యాయవాది ఫర్హానా షా స్పందిస్తూ, ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్కు వెళ్లి రావడానికి రెండు రోజులు సరిపోవని వాదించారు. అతను గత రెండు దశాబ్దాలుగా జైలులోనే ఉన్నాడని, అతను భారతీయ పౌరుడేనని పేర్కొంటూ, పోలీసు ఎస్కార్ట్ అవసరం లేదని ఫర్హానా షా కోర్టును కోరారు.ఈ వివాదంపై విచారణ చేపట్టిన జస్టిస్ అజయ్ గడ్కరీ, జస్టిస్ శ్యామ్ చందక్లతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అబూ సలేంకు 14 రోజుల పెరోల్ ఇవ్వడంలో ఉన్న అభ్యంతరాలు, భద్రతాపరమైన ఆందోళనలను వివరిస్తూ, అఫిడవిట్ దాఖలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. గతంలో తల్లి మరణించిన సమయంలో కూడా సలేంకు కొద్దిరోజుల పెరోల్ లభించిన విషయాన్ని ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది.అబూ సలేం సోదరుడు అబూ హకీం అన్సారీ 2025, నవంబర్లో మరణించారు. నాడు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సలేం 14 రోజుల పెరోల్ కోసం దరఖాస్తు చేసుకోగా, నవంబర్ 20న జైలు అధికారులు దానిని తిరస్కరించారు. కోర్టుకు క్రిస్మస్ సెలవులు ఉండటంతో తన పిటిషన్ ఆలస్యమైందని సలేం డిసెంబర్ 2025లో హైకోర్టును ఆశ్రయించారు. 2005లో అరెస్ట్ అయినప్పటి నుండి జైలులోనే ఉన్న తనకు, తన కుటుంబ సభ్యుల మరణానంతర కార్యక్రమాలకు హాజరయ్యే హక్కు ఉందని సలేం తన పిటిషన్లో పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రంలో బంగారు నిక్షేపాలు.. తవ్వాలంటే.. -
నవీ ముంబై ఎయిర్పోర్ట్కు డీబీ పాటిల్ పేరు
ముంబై: కొత్తగా నిర్మించిన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రజా నాయకుడు, దివంగత డీబీ పాటిల్ పేరు పెట్టనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐరోలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. “నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రజా నాయకుడు దివంగత డీబీ పాటిల్ పేరు పెడుతున్నాం” అని ప్రకటించారు.నవీ ముంబై.. ముంబైకి విస్తరణ మాత్రమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి తదుపరి ఇంజిన్గా మారబోతోందని ఫడ్నవీస్ తెలిపారు. ఈ విమానాశ్రయం ఫార్మాస్యూటికల్స్, ఇన్నోవేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, సేవలు, దిగుమతి–ఎగుమతి వంటి రంగాలకు మద్దతు అందిస్తూ నగర ఆర్థిక పునాదిని మరింత బలోపేతం చేస్తుందన్నారు.ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కలంబోలిలో కొత్త జంక్షన్, ఖార్ఘర్–తుర్భే సొరంగం వంటి కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని తెలిపారు. అలాగే నగరవ్యాప్తంగా కనెక్టివిటీని మెరుగుపరచేందుకు సిడ్కో ద్వారా మెట్రో నెట్వర్క్ అభివృద్ధి జరుగుతోందన్నారు.రాబోయే రోజుల్లో షిలార్, పోషిర్ ప్రాజెక్టుల ద్వారా నవీ ముంబై నివాసితుల తాగునీటి అవసరాలు పూర్తిగా తీరుతాయని సీఎం తెలిపారు. నవీ ముంబైలో ‘ఎడ్యుసిటీ’ అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలను ఆకర్షించి, స్థానిక విద్యార్థులకు విద్యా, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఘన్సోలి సింప్లెక్స్ వద్ద ఇళ్ల పునరాభివృద్ధి చేపడతామని, అదే ప్రాంతంలో ఏపీఎంసీ మార్కెట్ను కూడా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.బేలాపూర్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం టెండర్లు పిలిచామని, మన్పాడాలో సెంట్రల్ లైబ్రరీ పనులు ప్రారంభమయ్యాయని ఫడ్నవీస్ తెలిపారు. మత్స్యకార సమాజం, స్థానికుల కోసం ప్రత్యేక ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. జనవరి 15న జరిగే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. -
‘హిందీని రుద్దితే..’ రాజ్ ఠాక్రే తీవ్ర హెచ్చరిక
ముంబై: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చిరకాల ప్రత్యర్థులు, దాయాదులైన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం నాటి భారీ బహిరంగ సభలో చేతులు కలిపారు. మరాఠీ అస్తిత్వాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా వీరిద్దరూ గళమెత్తారు. జనవరి 15న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, మరాఠీ ఓటర్లను ఏకీకృతం చేసేందుకు ఈ ఉమ్మడి వేదికను ఉపయోగించుకున్నారు.ఈ బహిరంగ సభలో రాజ్ ఠాక్రే.. ఉత్తరప్రదేశ్, బీహార్ వలసదారులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘హిందీ మీ భాష కాదని యూపీ, బీహార్ ప్రజలు గుర్తించాలి. నాకు ఆ భాషపై ద్వేషం లేదు.. కానీ దానిని మాపై రుద్దాలని చూస్తే మాత్రం సహించేది లేదు’ తరిమికొడతాం’ అంటూ ఘాటుగా హెచ్చరించారు. మహారాష్ట్రకు దేశం నలుమూలల నుంచి వస్తున్న వారు స్థానికుల అవకాశాలను కొల్లగొడుతున్నారని, భాషా సంస్కృతులను కాపాడుకోకపోతే మరాఠీ ప్రజల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మరాఠీ మనుషుల ఉనికిని చాటుకునే చివరి ఎన్నికలని ఆయన అభివర్ణించారు.శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ముంబై నగరం ఎదుర్కొంటున్న ముప్పును గుర్తించి, తాము విభేదాలను పక్కన పెట్టి, ఏకమయ్యామని స్పష్టం చేశారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలు మహారాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆరోపించారు. బీజేపీది నకిలీ హిందుత్వమని, ఎన్నికల సమయంలో ప్రజలను విడదీయడమే వారి పని అని విమర్శించారు. ముంబైని మహారాష్ట్ర నుంచి వేరు చేసి అంతర్జాతీయ నగరంగా మార్చే కుట్ర జరుగుతున్నదని, ముంబైని గుజరాత్ ఆర్థిక పరిధిలోకి తీసుకువెళ్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆయన మండిపడ్డారు.ముంబై సంపదను బీజేపీ లూటీ చేస్తున్నదని ఠాక్రే సోదరులు సంయుక్తంగా ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అదానీ గ్రూపునకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని, వధవన్ పోర్టు వంటి ప్రాజెక్టుల ద్వారా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ను గుజరాత్తో అనుసంధానించాలని చూస్తున్నారని రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. బీఎంసీ తమ చేతుల్లో ఉంటేనే ముంబై భూములను అదానీకి బీజేపీ అమ్మకుండా అడ్డుకోగలమని ఓటర్లకు పిలుపునిచ్చారు. పోలింగ్ రోజున కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి, రిగ్గింగ్ను అడ్డుకోవాలని రాజ్ ఠాక్రే కోరారు.ఇది కూడా చదవండి: భారత్ చేరుకున్న జర్మనీ చాన్స్లర్.. ప్రధాని మోదీతో భేటీ -
ముంబై మేయర్ పీఠం.. ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ముంబై మేయర్ స్థానం కోసం అన్ని పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార మహాయుతి కూటమి నుంచే మేయర్ వస్తారని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మేయర్ ఎంపిక విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఓ జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ..దేశం ముందు అనే భావజాలాన్ని బీజేపీ అనుసరిస్తుంది. ముంబై మేయర్ సీటు మరాఠీ హిందువులకు రిజర్వ్ చేయబడింది. చెన్నైలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే అక్కడి ప్రజలు సహజంగానే మేయర్ తమిళుడు కావాలని చెబుతారు. అదేవిధంగా ముంబైలో కూడా మేయర్ మరాఠీ వ్యక్తే అవుతారు. మహాయతి కూటమి నుంచే ముంబై మేయర్ వస్తారని ధీమా వ్యక్తం చేశారు. తాను హిందువునని.. మరాఠీ వ్యక్తిగా గర్విస్తున్నానని.. మరాఠీల్లో ఎలాంటి వివక్ష లేదన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారంతా ముంబై వాసులేనని పేర్కొన్నారు. ఒక్క బంగ్లాదేశీయుడిని కూడా ఇక్కడ నివసించడానికి అంగీకరించబోమని తేల్చి చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.అయితే, అంతకముందు మహారాష్ట్రకు చెందిన ఎంఐఎం నాయకుడు వారిస్ పఠాన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ముంబై మేయర్ పీఠం ఎంఐఎం పార్టీదేనని అన్నారు. ముంబై మేయర్గా ముస్లిం వ్యక్తే ఉంటారని వ్యాఖ్యనించారు. ఈ నేపథ్యంలోనే ఫడ్నవీస్ ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఇదే సమయంలో ఢిల్లీ, ముంబై ట్రాఫిక్ విషయమై ఫడ్నవీస్ స్పందించారు. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ఢిల్లీ ట్రాఫిక్ కంటే ముంబై ట్రాఫిక్ చాలా బెటర్. ఇక్కడ ఎవరూ లైన్లను బ్రేక్ చేయరు. ముంబై ప్రజలు చాలా క్రమశిక్షణతో ఉంటారని.. ట్రాఫిక్ నియమాలు చాలా ఓపికగా పాటిస్తారని పేర్కొన్నారు. ఢిల్లీలో రోడ్లపై కార్లు నలిగిపోవడం, కొన్ని సార్లు పక్కకు నెట్టేస్తారని.. అలాంటి పరిస్థితి ముంబైలో ఎక్కడా కనిపించదన్నారు. సబర్బన్ రైల్వే నుంచి మెట్రో వరకు అన్ని వ్యవస్థలు మెరుగ్గా ఉన్నాయని స్పష్టం చేశారు. మొత్తం ప్రయాణాన్ని ఒకే యాప్లో ప్లాన్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఒకే టికెట్తో ఎవరైనా ఏదైనా ప్రజా రవాణాను ఉపయోగించుకోవచ్చని తెలిపారు.ఇదిలా ఉండగా.. ముంబైలో ఈనెల 15న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం జనవరి 16న విడుదల కానున్నాయి. ఎన్నికల కోసం థాక్రే సోదరులు బరిలోకి దిగగా… మహాయతి కూటమి బరిలో ఉంది. రెండు వర్గాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మేయర్ స్థానం ఎవరిదో అనే ఆసక్తి నెలకొంది. -
బీజేపీ నేత నవనీత్ కౌర్కు అసదుద్దీన్ కౌంటర్
ముంబై: బీజేపీ నేతలు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మధ్య మరోసారి మాటల యుద్ధం నడిచింది. ఇటీవల మహారాష్ట్ర బీజేపీ నేత నవనీత్ రాణా చేసిన వ్యాఖ్యలకు హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ కౌంటరిచ్చారు. కుటుంబంలో పిల్లల్ని కనడం అనే అంశంపై ఇరు నేతల మధ్య విమర్శలపర్వం కొనసాగింది. మీకు నచ్చిన విధంగా పిల్లల్ని కనండి. మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు అని ఒవైసీ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అంతకుముందు బీజేపీ నేత, మాజీ ఎంపీ నవనీత్ కౌర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కొంతమంది అధికంగా సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ హిందుస్థాన్ని పాకిస్థాన్లా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. దానిని అడ్డుకోవాలంటే హిందువులు సైతం తప్పనిసరిగా ముగ్గురు, నలుగురు పిల్లలని కనాలి. నేను అందరు హిందువులకు ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను. వీళ్లంతా నలుగురు భార్యలు,19 మంది పిల్లలు అని బహిరంగంగా చెప్పుకుంటారు. వారంతా మౌలానానా, మరోకరా అనేది నాకు తెలియదు. కానీ వారంతా అధికమంది పిల్లలను కనడం ద్వారా హిందుస్థాన్ని పాకిస్థాన్లా మార్చాలనుకుంటున్నారు. కనుక మనం కూడా ఒక్కరితో సంతృప్తి చెందకూడదు. తప్పనిసరిగా ఎక్కువ మంది పిల్లలని కనాలి" అని ఆమె అన్నారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తాజాగా ఆమె వ్యాఖ్యలపై ఎంపీ అసుదుద్దీన్ స్పందించారు. ఈ క్రమంలో అసద్ మాట్లాడుతూ.. ఆమె వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటరిస్తూ మాట్లాడారు. "మహారాష్ట్రలో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలుంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు. ఇదివరకూ ఈ నియమం తెలంగాణలో కూడా ఉండేది కాని ఇప్పుడు రద్దు చేశారు. నాకు ఇప్పుడు ఆరుగురు పిల్లలున్నారు. మీరు కూడా నలుగురిని కనండి మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు" అని వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఇరువురు నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. -
ఒక్క ఓటూ వేయకుండానే విజయం.. ‘మహాయతి’ సంబరాలు
ముంబై: మహారాష్ట్రలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్కు ముందే సంచలనం నమోదైంది. ఒక్క ఓటు కూడా వేయకముందే అధికార ‘మహాయుతి’ కూటమి ఘనవిజయం సాధించింది. నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారం ఆఖరి రోజు కావడంతో, వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో బీజేపీ-శివసేన (షిండే వర్గం) కూటమికి చెందిన 66 మంది అభ్యర్థులు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు..మొత్తంగా 68 మంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)పరిధిలోని అత్యంత కీలకమైన కళ్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్లో అధికార కూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఇక్కడ ఏకంగా 21 మంది మహాయుతి అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఇందులో 15 స్థానాలను బీజేపీ దక్కించుకుంది. ఆరు స్థానాల్లో శివసేన అభ్యర్థులు విజయం సాధించారు. ఉత్తర మహారాష్ట్రలోని జలగావ్, పన్వెల్, భివాండీ తదితర ప్రాంతాల్లో కూడా బీజేపీ తన పట్టును నిరూపించుకుంటూ, ఏకగ్రీవ విజయాలను నమోదు చేసింది.కాగా ఈ ఏకగ్రీవ విజయాలపై ప్రతిపక్ష పార్టీలైన శివసేన (యుబిటి), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్)తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికార పక్షం డబ్బు ఎరవేసి, బెదిరింపులకు గురిచేసి, తమ అభ్యర్థులతో బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేసిందని ఆయా పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ, ఈ ఉపసంహరణలు స్వచ్ఛందంగా జరిగాయా లేక ఒత్తిడి కారణంగా జరిగాయా అన్న కోణంలో విచారణకు ఆదేశించింది. ఈ మధ్యనే జరిగిన మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన మహాయుతికి, తాజా ఏకగ్రీవ ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఏకనాథ్ షిండే సొంత ఇలాకా అయిన థానేలో కూడా శివసేన ఆరు స్థానాలను కైవసం చేసుకోగా, అజిత్ పవార్ ఎన్సీపీ.. అహల్య నగర్లో రెండు చోట్ల విజయం సాధించింది. ఇది కూడా చదవండి: మాఘ మేళా షురూ.. కుంభమేళాను తలపిస్తున్న జనం -
ప్రియుడిని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి పిల్చి, ప్రైవేట్ పార్ట్స్పై దాడి
పెళ్లికి నిరాకరించిన ప్రేమికుడిపై దాడిచేసి ప్రైవేట్ భాగాలను నరికివేసింది.తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో ఇద్దరూ వివాహితులే. ముంబైలో ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్డీటీవీ కథనం ప్రకారం 25 ఏళ్ల ఒక మహిళ ఇద్దరు పిల్లల తల్లి. ఈమెకు 42 ఏళ్ల వివాహితుడితో దాదాపు ఏడు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది. భార్యకు విడాకులిచ్చి తనన పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోంది. దీంతో అసలు పెళ్లి ఊసు ఎత్తగానే సరైన సమాధానం చెప్పకుండా ముఖం చాటేసేవాడు. తన మాట వినడం లేదని, భార్యను విడిచిపెట్టడానికి నిరాకరించాడన్న కోపంతో ఆ మహిళ ఇంత దారుణానికి ఒడిగట్టింది.పెళ్లి చేసుకోవాలన్న ఒత్తిడి తీవ్రమవుతున్న నేపథ్యంలో గత ఏడాది నవంబరులో బిహార్కు వెళ్లి పోయాడు. భార్యాబిడ్డలు ముంబైలోని శాంటా క్రజ్లోని ఇంట్లో ఉంటున్నారు. గత 18 ఏళ్లుగా కుటుంబంతో కలిసి ఇక్కడే ఉంటున్నాడు. బాధితుడు. బిహార్కు వెళ్లిన తరువాత కూడా ఆమె ఫోన్ కాల్స్ ద్వారా పెళ్లి గురించి అడగడం, అతన్ని బెదిరించడం జరుగుతూనే ఉంది. అయితే 2026 కొత్త సంవత్సరం సందర్బంగా డిసెంబర్ 19న ముంబైకి తిరిగొచ్చాడు. ఇదే అదనుగా భావించిన ప్రేమికురాలు నూతన సంవత్సర వేడుకలకు ఇంటికి రావాల్సిందిగా బాధితుడిని ఆహ్వానించింది. గురువారం తెల్లవారుజామున మాటల్లో పెట్టి, సమయం చూసి పదునైన ఆయుధంతో అతని ప్రైవేట్ భాగాలపై దాడిచేసిందని ముంబై పోలీసు అధికారి తెలిపారు.ఇదీ చదవండి: ఐదు నెలల చిన్నారి ఉసురు తీసిన ‘పాలు’తీవ్ర గాయాలపాలై అధిక రక్తస్రావంతో బాధితుడు మొత్తం మీద బైటపడి, సోదరుడు, ఇతర బంధువుల సాయంతో బీఎన్ దేశాయ్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. గాయం చాలా లోతుగా ఉందని శస్త్రచికిత్స అవసరం కావచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఇద్దరికీ బంధుత్వం ఉన్నట్టు తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితురాలి కోసం వెతుకుతున్నారు. ఇదీ చదవండి: ఐఐటీ హైదరాబాద్ విద్యార్థికి ఏకంగా రూ. 2.5 కోట్ల ఆఫర్, రికార్డ్ -
సీఎంపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీజేపీ అభ్యర్థికి బిగ్ షాక్
ముంబై: మహారాష్ట్రలో పూణే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ మహిళా అభ్యర్థి గతంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, సీఎం భార్యపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, బీజేపీ హైకమాండ్ ఒత్తిడితో సదరు మహిళా అభ్యర్థి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారింది.వివరాల మేరకు.. పూణేలో మన్సిపల్ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కోటా కింద వార్డ్ నంబర్-2 నుంచి పూజా మోర్ జాదవ్ పోటీలో నిలిచారు. బీజేపీ మద్దతుతో ఆమెకు ఏబీ ఫారమ్ కేటాయించారు. దీంతో, ఆమె నామినేషన్ సైతం దాఖలు చేశారు. అయితే, రెండు రోజుల క్రితం అనూహ్యంగా ఆమెకు సంబంధించిన పలు పాత వీడియోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. గతంలో మరాఠా విషయంలో ఆందోళనల్లో ఆమె పాల్గొన్నారు. ఆ సమయంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, సీఎం భార్యపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సమయంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోలు తాజాగా వైరల్ కావడంతో స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. దీంతో, బీజేపీ హైకమాండ్ నిర్ణయం మేరకు ఆమె తన నామినేషన్ను వెనక్కి తీసుకున్నారు.BJP Order Forces Pooja More to Withdraw Candidature; Breaks Down in TearsAfter receiving the BJP’s directive to withdraw her candidature, young leader Pooja More became emotional and broke down, saying she had worked hard and proved her capability, but the party’s strategic… pic.twitter.com/oej13BLK8V— Pune Mirror (@ThePuneMirror) January 1, 2026అనంతరం, ఈ వివాదంపై ఆమె స్పందిస్తూ..‘కొందరు వ్యక్తులు నా గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు. నేను బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మను అని చిత్రీకరించడానికి ప్రయత్నించారు. బీజేపీ నేతల విమర్శల కారణంగా నా నామినేషన్ను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. వీడియోలలో కనిపించే వ్యాఖ్యలు నేను చేయలేదు. ఎవరో మహిళ చేసిన వ్యాఖ్యలను నాపై తప్పుగా ఆపాదించారు. నేను పోలీసుల లాఠీఛార్జీలు, క్రిమినల్ కేసులను కూడా ఎదుర్కొంటున్నాను. తరచుగా కోర్టుకు సైతం వెళ్లాల్సి వస్తోంది. చట్టపరమైన కేసులను ఎదుర్కోవడానికి నా దగ్గర డబ్బు కూడా లేని సందర్భాలు ఉన్నాయి. ఒక ప్రధాన రాజకీయ పార్టీ నుండి టికెట్ పొందడం నాలాంటి అట్టడుగు స్థాయి కార్యకర్తకు అరుదైన అవకాశం. కానీ, ఇలా జరగడం దురదృష్టకరం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జనవరి 15న జరగనున్నాయి. మరుసటి రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. She is "Pooja Jadhav" a BJP Candidate in PMCFor Her Terrorists Has No Religion & Now She Awarded BJP Ticket To Fight Municipal Election@BJP4India @BJP4Maharashtra Terrorist Has A Religion & Its IslamIslamic Terrorist Ki!!ed hindus In #PahalgamTerrorAttack#BJP #Congress pic.twitter.com/iTxvwJQUS1— 𝐃𝐢𝐠𝐯𝐢𝐣𝐚𝐲 𝐒𝐢𝐧𝐠𝐡 🇮🇳 (@Knight_riders18) January 1, 2026 -
డ్రంక్ & డ్రైవ్లో భర్త, భార్య ప్రెగ్నెంట్ : ఆ పోలీసు ఏం చేశాడంటే!
మద్యం మత్తులో ఉన్న వాహనదారుడిని నిలువరించిన పోలీసు ఆఫీసర్కు ఊహించని ఘటన ఎదురైంది. అయితే పరిస్థితిని అర్థం చేసుకుని, ఆయన చేసిన పని నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ పోలీసు అధికారి ప్రస్తుతం సోషల్మీడియాలో హీరోగా నిలిచారు.ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని తన విధుల్లో భాగంగా అడ్డుకున్నారో పోలీసు అధికారి. అయితే "నేను కొంచెం తాగి ఉన్నాను. నా భార్య గర్భవతి. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు రాత్రి 10:30 అయింది.. ఇంకో రెండు కి.మీ దూరంలోనే ఆసుపత్రి. సార్, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి " అని ఆ వ్యక్తి పోలీసు అధికారిని వేడుకున్నాడు. ఈ సమయంలో పోలీసు అధికారి స్పందించిన తీరు విశేషంగా నిలిచింది. కారులో ఉన్న మహిళ పరిస్థితిని గమనించి, భర్తను బయటకు రమ్మని చెప్పి, కారు స్టీరింగ్ను తన చేతుల్లోకి తీసుకున్నారు. భర్తను కారు వెనుక కూర్చోమని మర్యాదగా చెప్పారు. “మీ భద్రత కోసమే ఇక్కడ ఉన్నాము. మిమ్మల్ని ఆసుపత్రికి సురక్షితంగా తీసుకెళ్లడం మా విధి” అని గర్భిణీకి ధైర్యం చెప్పి ముంబై పోలీసు అధికారి డ్రైవర్ సీట్లో కూర్చున్నారు. అంతేకాదు ఈ దృశ్యాలను వీడియో తీస్తోంటే.. ఈ విధంగా కూడా పోలీసులు సహాయం చేస్తారని ప్రజలకు తెలియజేసేలా చిత్రీకరణ కొనసాగించమని కోరడం మరో విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.He creates such videos on Instagram, his video has gone viral before also. pic.twitter.com/rklSuh9iFk— Dinesh Choudhary (@DineshJaiHind7) January 1, 2026నెటిజన్లు ప్రశంసలుపోలీసు అధికారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. “బిగ్ సెల్యూట్” అంటూ కామెంట్ చేశారు. మరోవైపు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు, అందులోనూ ప్రసవానికి దగ్గరపడ్డపుడు తాగడం అవసరమా అని కొంత మంది ఆగ్రహించారు. కొన్ని మంచు ప్రాంతాల్లో పరిమితులతో, మద్యపానాన్ని శాశ్వతంగా నిషేధించాలి అంటూ వ్యాఖ్యానించారు. -
పుణే జర్మన్ బేకరీ కేసు నిందితుడి హతం
పుణే జర్మన్ బేకరీ పేలుడు కేసులో నిందితుడు(సహ) అస్లాం షబ్బీర్ షేక్(బంటి జాహగీర్దార్) హత్యకు గురయ్యాడు. బుధవారం మహారాష్ట్రలోని అహల్యానగర్లో బైక్పై వచ్చిన వ్యక్తులు అతన్ని కాల్చి చంపారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర పోలీస్ శాఖ ధృవీకరించింది.జర్మన్ బేకరీ పేలుడు కేసులో పాక్ ప్రేరేపిత ఉగ్రవాది హిమాయత్ బైగ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అస్లాం షబ్బీర్ షేక్ (బంటి జాహగీర్దార్) సహనిందితుడు. ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేయడంతో పాటు ఈ పేలుడుకు సహకరించాడనే అభియోగాలు అతనిపై ఉన్నాయి. ఈ కేసులో బంటి జహగీర్దార్ 2010లో అరెస్టయ్యాడు కూడా. అయితే.. 2013లో బాంబే హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయగా.. అప్పటి నుంచి బయటే ఉంటున్నాడు. German Bakery Blast co-accused Aslam Shabbir Sheikh or Bunty Haji Jahagirdar from Shrirampur Ahilya Nagar shot dead by gunmen.He was a supplier of weapons and aided the crime. He was a history sheeter and multiple times tadipaar.Bombay High Court Granted him bail in 2023. pic.twitter.com/2jaJlNj16O— शाश्वतक्षात्र⚔️ (@swadharmic) January 1, 2026బుధవారం శ్రీరాంపురంలో ఓ అంత్యక్రియల కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా.. బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు అతన్ని కాల్చి చంపారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిందితులను పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.జర్మన్ బేకరీ పేలుడు కేసు (2010) భారతదేశంలో జరిగిన ఒక ప్రధాన ఉగ్రదాడి. 2008 26/11 ముంబై దాడుల తర్వాత అంతటి దాడిగా పేరుగాంచింది. ఫిబ్రవరి 13వ తేదీన పుణే కోరేగావ్ పార్క్ సమీపంలోని జర్మన్ బేకరీ వద్ద పేలుడు జరిగింది. ఈ ఘటనలో 18 మంది(విదేశీయులు సహా) ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 60 మందికి పైగా గాయపడ్డారు. తొలుత ఇది సిలిండర్ బ్లాస్ట్గా భావించారు. అయితే.. ఫోరెన్సిక్ నివేదికలో ఆర్డీఎక్స్ వాడినట్లు తేలింది. దీంతో ఉగ్రదాడి అయి ఉంటుందని పుణే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈలోపు దాడికి తామే బాధ్యులమని లష్కరే తాయిబా, ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థలు ప్రకటించుకున్నాయి. కరాచీ ప్రాజెక్టులో భాగంగా.. డేవిడ్ హెడ్లీ నేతృత్వంలో ఈ దాడికి రూపకల్పన జరిగిందని భారత దర్యాప్తు సంస్థలు ఆ తర్వాత తేల్చాయి. -
బాలనటి ఇంట్లో తీరని విషాదం, కళ్లముందే..!
ముంబైలో జరిగిన ఒక ఘోర బస్సు ప్రమాదం ఒక బాలనటి కుటుంబంలోనూ, ఆ చిన్నారి జీవితంలో మర్చిపోలేని విషాదాన్ని నింపింది. ఒక మూవీ ఆడిషన్కోసం వెళ్లిన 13 ఏళ్ల మరాఠీ బాలనటి చాలా ఉత్సాహంగా తిరిగి ఇంటికి బయలుదేరింది. కానీ అదే తన జీవితంలో అంతులేని శోకాన్ని మిగులుస్తుందని ఊహించలేదు. కళ్లముందే కన్న తల్లి ప్రాణాలు పోతోంటే.. ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఉండిపోయింది. పదే పదే ఆ దృశ్యాల్ని తలుచుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.పోలీసులు అందించిన వివరాల ప్రకారం ముంబైలోని భాండుప్లో బెస్ట్ రూట్ 606లో ఒక ఎలక్ట్రిక్ ఏసీ బస్సు అదుపు తప్పి బస్టాప్లో నిల్చున్న ప్రయాణికులపై దూసుకెళ్లింది. 35 ఏళ్ల ప్రణీత సందీప్ రసం, తన కుమార్తెను ఆడిషన్ కోసం దాదార్ వెళ్లి తిరిగి వస్తూ, భాండుప్ రైల్వే స్టేషన్ సమీపంలో దిగి బస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంతలో బస్సు అదుపు తప్పిన బెస్ట్ ఎలక్ట్రిక్ బస్ తమవైపు దూసుకు రావడాన్ని గ్రహించిన తల్లి ప్రణిత, కుమార్తెను శక్తి కొలదీ పక్కకు తోసేసింది.క్షణాల్లో అంతా జరిగిపోయింది.తల్లి పక్కకు నెట్టివేయడంతో బాలనటి ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో తృటిలో తప్పించుకుంది. కానీ ప్రణీత మాత్రం బస్సు చక్రాల కింద నలిగి పోయింది. తన కళ్లముందు తల్లి విగతజీవిగా మారిపోవడం ఆమెను తీవ్ర దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది. ఎలాగోలా తేరుకుని, వేరే వారి ఫోన్ ద్వారా తండ్రి సందీప్కు ఫోన్ చేసింది. ఆయన సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ప్రణీత గాయాలతో మరణించింది. తల్లి తనను కాపాడుతూ చనిపోయిందంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బాలనటిని ఓదార్చడం ఎవ్వరి తరం కాలేదు. చికిత్స , కౌన్సెలింగ్ కోసం ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.ప్రణీత కుమార్తె మరాఠీ టీవీ సీరియల్స్లో చిన్న సహాయక పాత్రల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. హోంవర్క్, షూటింగ్లను మేనేజ్ చేస్తూ నటించి పేరు తెచ్చుకున్న ఆమె ప్రతిభ వెనుక ప్రణిత కృషిచాలా ఉందని పొరుగు వారు గుర్తు చేసుకున్నారు. పాపను ఆడిషన్స్, సెట్స్కు తీసుకెళుతూ ఇంటిని చక్కబెట్టుకొనేదని చెప్పారు. కాగా ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రణీతతోపాటు, మాన్సి మేఘశ్యాం గురవ్, 49, వర్ష సావంత్, 25, మరియు ప్రశాంత్ దత్తు షిండే, 45. మరో పదకొండు మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్, 52 ఏళ్ల సంతోష్ రమేష్ సావంత్ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.చదవండి: 2025లో తరలిపోయిన మహిళా దిగ్గజాలురూ. 5 లక్షల ఎక్స్గ్రేషియాఈ ప్రమాదంలో చిక్కుకున్న వాహనం విఖ్రోలి డిపోకు అనుబంధంగా ఉన్న రూట్ A-606 (సీనియర్ 34)లో నడుస్తున్న వెట్-లీజ్ ఒలెక్ట్రా బస్సు. సంఘటన జరిగిన సమయంలో డ్రైవర్ సంతోష్ రమేష్ సావంత్ (52), కండక్టర్ భగవాన్ భావు ఘరే (47) విధుల్లో ఉన్నారని, ఇద్దరూ బెస్ట్ సిబ్బంది గా భావిస్తున్నారు. మరోవైపుమృతుల కుటుంబాలకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇదీ చదవండి: లిఫ్ట్ ఇస్తామని, వ్యాన్లో మహిళపై సామూహిక అత్యాచారం -
‘మహా’ రాజకీయాలు.. పవార్ ఇకపై ‘పరివార్’
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. త్వరలో జరగబోయే పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ అంశం కీలకంగా మారనుంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీసీ) ఆయన బాబాయి శరద్ పవార్ సారధ్యంలోని ఎన్సీపీ (ఎస్పీ )వర్గం పొత్తు కుదుర్చుకున్నాయి. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) స్వయంగా ప్రకటించారు.‘రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం’ఆదివారం పింప్రి-చించ్వాడ్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అజిత్ పవార్ ఈ విషయాన్ని వెల్లడించారు. రెండు వర్గాల మధ్య ఐక్యతను ఆయన తెలియజేస్తూ.. ‘కుటుంబం (పరివార్) మళ్లీ ఒక్కటైంది’ అని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే సమయంలో, కలిసి పోటీ చేయాలని రెండు వర్గాలు నిర్ణయించుకున్నాయని అజిత్ పవార్ తెలిపారు. మహారాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, అయితే ఫలితం ఎలా ఉంటుందనే దానిపై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయని, ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.అభివృద్ధిని గుర్తుచేస్తూ..స్థానిక నేతలతో ఈ పొత్తు, సీట్ల పంపకాలపై చర్చలు జరిగాయని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుందని అజిత్ పవార్ తెలిపారు. పింప్రి-చించ్వాడ్లో జరిగిన అభివృద్ధి పనుల గురించి ఆయన ప్రస్తావిస్తూ, తాము తెచ్చిన అభివృద్ధిపై ఇక్కడి ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని అన్నారు. ముఖ్యంగా హింజేవాడిలో నిర్మించిన ఐటీ హబ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని గుర్తు ఆయన చేశారు. 1992 నుండి 2017 మధ్యకాలంలో కార్పొరేషన్లో తన పదవీ కాలంలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని అజిత్ పవార్ పేర్కొన్నారు.‘వారు కలవడం కొత్తేమీ కాదు’పవార్ కుటుంబం తిరిగి ఏకమవడంపై పలువురు నేతలు స్పందించారు. వారిలో కొందరు శరద్ పవార్ (Shaead Pawar) త్వరలోనే ఎన్డీఏ కూటమిలో చేరతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘అజిత్ పవార్.. శరద్ పవార్ ఆదేశాల మేరకే బీజేపీలో చేరారు. వారు తిరిగి కలవడం కొత్తేమీ కాదు. వారు ఏకం కావడం మాకు సంతోషంగా ఉంది. శరద్ పవార్ కూడా త్వరలోనే ఎన్డీఏ కూటమిలో చేరతారని ఆశిస్తున్నాను’ అని బీజేపీ మహిళా నేత నవనీత్ రాణా అన్నారు. ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత జీషన్ సిద్ధిఖీ కూడా ఈ కలయికను స్వాగతిస్తూ ‘రెండు కుటుంబాలు కలవడం మంచి విషయమే. దీనివల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుంది. మేము దీనిని స్వాగతిస్తున్నాం. ఇకపై రెండు పార్టీలు కలిసి పోరాడతాయి’ అని అన్నారు.‘ఇంటి పేరు ఇక్కడ పనిచేయదు’అయితే ఏక్నాథ్ షిండే శివసేన వర్గం.. పవార్ల పొత్తును విమర్శిస్తూ.. ‘వారు కలిసిపోవచ్చు, కానీ ప్రజలు ఇంటి పేరును చూసి ఓట్లు వేయరు. మహారాష్ట్రలో ఇంటి పేరు రాజకీయాలు పనిచేయవు," అని పేర్కొంది. శివసేన మహిళా నేత షైనా ఎన్సీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘ఏ అన్నదమ్ములైనా కలిసిపోవచ్చు. ఇంటి పేరు రాజకీయాలు ఇక్కడ పనిచేయవు. వారు అధికారం కోసమే కలిసి వస్తున్నారు. అయితే ప్రజలు కేవలం పనిని మాత్రమే చూస్తారు. పేరును కాదు. పవార్లు కలిసి వస్తున్నారని అంతా చర్చించుకోవచ్చు. దీనివల్ల వారికి ఓట్లు రావు. ప్రజలు పేరు ఆధారంగా ఓట్లు వేయరు’ అని ఆమె అన్నారు.29 మున్సిపల్ కార్పొరేషన్లకు..పింప్రి-చించ్వాడ్, పుణె సహా మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. మర్నాడు జనవరి 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నామినేషన్ల దాఖలుకు డిసెంబర్ 30 చివరి తేదీగా నిర్ణయించారు. 2023లో ఎన్సీపీ చీలిక తర్వాత, అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గం రాష్ట్ర స్థాయిలో బీజేపీ, ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో కలిసి ‘మహాయుతి’ కూటమిలో భాగస్వామిగా చేరింది. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల కోసం తిరిగి ఇరు పార్టీలు జట్టు కట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: యమ డేంజర్లో ఢిల్లీ.. ఊపిరి ఇక కష్టమే! -
గ్యాంగ్స్టర్ నామినేషన్.. వీడియో వైరల్
ముంబై: మహారాష్ట్రలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ.. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి రావడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇవ్వడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల మేరకు.. మహారాష్ట్రలో పుణె మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మరో 28 సంస్థలకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. స్థానిక గ్యాంగ్స్టర్, మనవడి హత్య కేసులో ప్రధాన నిందితుడైన బందు అందేకర్ శనివారం నామినేషన్ దాఖలు చేశాడు. ప్రస్తుతం ఎరవాడ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అతడు భారీ పోలీసు భద్రత నడుమ ప్రభుత్వ కార్యాలయానికి చేరుకున్నాడు. పోలీసు వ్యాన్లో వచ్చిన బందు అందేకర్ చేతులకు తాళ్లు కట్టి ఉండగా, ముఖానికి నల్లటి గుడ్డ కప్పి ఉండటం గమనార్హం.Notorious Andekar Gang Leader Bandu Andekar was brought from Yerwada Jail under police escort to Bhawani Peth Regional Office to file his application for the Municipal Corporation elections in Dec 27. Express Video By Pavan Khengre. pic.twitter.com/o7gyBWnFG4— Express Pune Resident Editor (@ExpressPune) December 27, 2025అనంతరం, భవానీ పేటలోని నామినేషన్ కేంద్రానికి తీసుకురాగానే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ లోపలికి వెళ్లాడు. ఈ క్రమంలో నామినేషన్ దాఖలు చేసి మళ్లీ జైలుకు వెళ్లిపోయాడు. కాగా, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అందేకర్కు ప్రత్యేక కోర్టు అనుమతి ఇవ్వడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాడు. అందేకర్ మాత్రమే కాకుండా, ఇదే కేసులో నిందితులుగా ఉన్న అతడి సోదరుడి భార్య లక్ష్మి అందేకర్, కోడలు సోనాలి అందేకర్ కూడా కోర్టు అనుమతితో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.ఇదిలా ఉండగా.. మాజీ కార్పొరేటర్, బందు అందేకర్ కుమారుడు వనరాజ్ అందేకర్ గతంలో హత్యకు గురయ్యాడు. దీనికి ప్రతీకారంగానే మనవడు ఆయుష్ కోమ్కర్ను సెప్టెంబర్ 5న కాల్చి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దారుణ హత్య వెనుక అందేకర్ గ్యాంగ్ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్య కేసులో అందేకర్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఇక, అందేకర్ నామినేషన్కు సంబంధించిన వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. आंदेकर कुटुंब निवडणुकीच्या रिंगणात, फॉर्म भरताना काय घडलं? #Pune #Andekar #Crime pic.twitter.com/2CVYyxrlma— Mumbai Tak (@mumbaitak) December 27, 2025 -
57 ‘ఇండిగో’లు రద్దు
ముంబై: దేశవ్యాప్తంగా వివిధ విమానా శ్రయాల్లో అననుకూల వాతావరణం కారణంగా శనివారం 57 విమానాలను రద్దు చేసినట్లు దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తెలిపింది. అదేవిధంగా, ఆదివారం నడిపే మరో 13 విమానాలను సైతం రద్దు చేసింది. వీటిలో రెండు నిర్వహణ పరమైన కారణాలు, మిగతావి ప్రతికూల వాతావరణం నెలకొనవచ్చనే అంచనాతో రద్దు చేశామని వెల్లడించింది. ఈ నెలారంభంలో నిర్వహణ పరమైన కారణాలు చూపుతూ వేలాదిగా విమానాలను ఇండిగో రద్దు చేయడంతో తీవ్ర సంక్షోభం తలెత్తడం తెల్సిందే. అదేవిధంగా, గత వారం, పది రోజులుగా ఈ సంస్థ వాతావరణం సరిగా లేదనే కారణంతో పదుల సంఖ్యలో విమాన సర్వీసులను రద్దు చేస్తోంది. శనివారం రద్దయిన వాటిలో చండీగఢ్, అహ్మదాబాద్, హైదరాబాద్, అమృత్సర్, బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, పుణె మొదలైన చోట్ల నుంచి రాకపోకలు సాగించాల్సినవి ఉన్నాయి. -
మహారాష్ట్రలో పొలిటికల్ ట్విస్ట్..
ముంబై: మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల(బీఎంసీ) వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నాయకుడు శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య ఎన్నికల చర్చలు విఫలమైనట్టు సమాచారం. పుణే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీపై వీరి మధ్య జరిగినట్టు తెలిసింది. దీంతో, మహారాష్ట్ర రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.వివరాల మేరకు.. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ అంశంపై సీట్ల పంపకాలపై శుక్రవారం పూణేలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శరద్ పవార్ వర్గానికి కేవలం 35 స్థానాలను మాత్రమే ఇస్తానని, అది కూడా గడియారం గుర్తుపై పోటీ చేయాలని అడిగారు. అయితే, ఈ ప్రతిపాదనను శరద్ పవార్ తిరస్కరించారు. దీంతో చర్చలు విఫలమయ్యాయి. చర్చల అనంతరం శరద్ పవార్ ముభావంగా అక్కడి నుంచి వెనుదిరిగినట్టు తెలిసింది. అజిత్తో చర్చలు విఫలమైన తర్వాత శరద్ పవార్.. సీట్ల పంపకాలపై చర్చల కోసం మహా వికాస్ అఘాడి (ఎంవీఎ) వద్దకు తిరిగి వెళ్లారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే శివసేన, కాంగ్రెస్తో ముమ్మర చర్చలు జరిపినట్టు సమాచారం. పూణేలోని ఒక హోటల్లో జరిగిన ఎంవీఏ సమావేశంలో శరద్ పవార్ ఎన్సీపీ వర్గం నుండి బాపుసాహెబ్ పఠారే, అంకుష్ కాకడే.. కాంగ్రెస్ నుండి అరవింద్ షిండే, రమేష్ బాగ్వే.. అలాగే, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన వసంత్ మోరే చర్చల్లో పాల్గొన్నారు. మహాయుతి దూకుడు..మరోవైపు.. బీఎంసీ (BMC) పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార ‘మహాయుతి’ కూటమి వ్యూహాలకు పదును పెట్టింది. సీట్ల పంపకాలపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య ఒప్పందం ఖరారైంది. మహాయుతి వర్గాల ప్రకారం మొత్తం 227 సీట్లలో బీజేపీ 140 స్థానాల్లో పోటీ చేయనుంది. శివసేన (షిండే వర్గం) 87 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనుంది. ఇప్పటికే 210 సీట్లపై స్పష్టత రాగా, మిగిలిన స్థానాలపై తుది చర్చలు జరుగుతున్నాయి. అసంతృప్తి వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలుగజేసుకుని కూటమి ధర్మాన్ని పాటించాలని, మిత్రపక్షంపై విమర్శలు చేయవద్దని బీజేపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇక, బీఎంసీ ఎన్నికలకు జనవరి 15, 2026న పోలింగ్ జరగనుంది. -
పావురాలకు ఆహారం పెట్టినందుకు.. రూ.5 వేల జరిమానా
ముంబై: బహిరంగ ప్రదేశంలో పావురాలకు ఆహారం (తిండి గింజలు) చల్లిన వ్యాపారవేత్తకు ముంబై కోర్టు రూ.5 వేల జరిమానా విధించింది. ప్రమాదకరమైన వ్యాధులు వ్యాప్తి చెందడానికి కారణమవుతున్నారని కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. ముంబై నగరంలో పలు ప్రాంతాల్లో పావురాలకు గింజలు చల్లడంపై నిషేధం అమలులో ఉంది.నగరంలోని మహిమ్ ప్రాంతంలో ఈ ఏడాది ఆగస్టు 1న దాదర్ నివాసి నితిన్ సేథ్.. పావురాలకు తిండి గింజలు వేశారు. ఆయనపై కేసు నమోదైంది. పావురానికి ఆహారం ఇచ్చే విషయం కోర్టుకు చేరుకుంది. డిసెంబర్ 22వ తేదీన ఆ కేసులో కోర్టు తీర్పునిచ్చింది. అదనపు చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ వీయూ మిసాల్ ఆ వ్యాపారవేత్తను దోషిగా తేల్చారు. అయితే క్షమాపణ కోరడంతో అతనికి కోర్టు రూ.5 వేల జరిమానా విధించింది.బహిరంగంగా పావురాలకు ఫీడింగ్ చేయడం వల్ల ప్రజలకు ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 223 ఉల్లంఘించినట్లు మెజిస్ట్రేట్ తెలిపారు. ఆయనపై బీఎన్ఎస్లోని సెక్షన్ 271 కింద కూడా కేసు నమోదు చేశారు. -
బహుళ అంతస్తుల భవనంలో మంటలు
ముంబై: ముంబై మహానగరం అంధేరి వెస్ట్లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. వీర దేశాయ్ రోడ్డులో ఉన్న 23 అంతస్తుల సొర్రెంటో టవర్లో ఉదయం 10 గంటల సమయంలో మంటలు మొదల య్యాయి. దీంతో, 16వ అంతస్తులో చిక్కు కున్న 30 నుంచి 40 మందిని మెట్ల మార్గం ద్వారా రక్షించినట్లు ఓ అధికారి చెప్పారు. ఒక మహిళ సహా ముగ్గురిని 15వ ఫ్లోర్లోని ఓ ఫ్లాట్ నుంచి సురక్షితంగా కిందికి దించామని చెప్పారు. మంటల కారణంగా 10, 21వ అంతస్తుల మధ్యలోని విద్యుత్ వ్యవస్థ మొత్తం దెబ్బతింది. 12, 13, 14వ అంతస్తులు పూర్తిగా కాలిపోయాయి. 14వ అంతస్తులో ఉంటున్న ప్రముఖ సినీ నిర్మాత సందీప్ సింగ్ నివాసం కూడా దెబ్బతింది. ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చిన ఆయన ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు. ఫైర్ సిబ్బంది ఆయన్ను రక్షించారు. అనంతరం సందీప్ సింగ్ను నటి అంకిత లొఖాండే, ఆమె భర్త వికీ జైన్ తమ ఇంటికి తీసుకెళ్లారు. -
కలిసి వస్తున్నాం.. కాస్కోండి!
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మరాఠా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు దశాబ్దాలుగా ఎడమొహం, పెడమొహంగా ఉన్న ఠాక్రే సోదరులు చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. కలిసికట్టుగా ముంబై ఎన్నికల బరిలోనే నిలిచేందుకు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ముందడుగు పడిందని, ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే మున్ముందు ముంబై రాజకీయాలు మరింత రసవత్తరంగా ఉంటాయి.ముంబై రాజకీయాలు అనగానే ముందుగానే ఠాక్రే కుటుంబం గుర్తుకు వస్తుంది. మరాఠా పులిగా పేరొందిన బాల్ ఠాక్రే (Bal Thackeray) మహారాష్ట్రలో రాజకీయాలను శాసించారు. ఆయన తర్వాత శివసేన పార్టీ చాలా అటుపోట్లు ఎదుర్కొంది. ప్రస్తుతం రెండు పార్టీలుగా కొనసాగుతోంది. శివసేన పార్టీని ఏక్నాథ్ షిండే దక్కించుకోవడంతో బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే.. శివసేన(యూబీటీ) పేరుతో పార్టీని నడుపుతున్నారు. శివసేను చీల్చి బీజేపీతో ఏక్నాథ్ షిండే చేతులు కలపడంతో మహారాష్ట్ర రాజకీయాలు ఎన్నో మలుపు తిరిగాయి. ఈ క్రమంతో ఉద్ధవ్ ఠాక్రేపై సానుభూతి పెరిగింది. రెండు దశాబ్దాల వైరాన్ని వీడి రాజ్ఠాక్రే తన సోదరుడి చెంతకు వచ్చారు. కష్టకాలంలో సోదరుడికి అండగా నిలిచారు.ముంబై సహా 29 కార్పొరేషన్లకు జనవరి 15న జరగనున్న ఎన్నికల్లో కలిసికట్టుగా బరిలోకి దిగాలని ఠాక్రే సోదరులు నిర్ణయించారు. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు కూడా జరిపాయి. చర్చలు ఫలించాయని, సీట్ల పంపిణీపై స్పష్టత వచ్చిందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో.. శరద్పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్తో సంబంధం లేకుండా తమ రెండు పార్టీల అభ్యర్థులనే పోటీకి దించాలని ఉద్ధవ్, రాజ్ ఠాక్రే నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తియిందని, అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని తెలుస్తోంది.బీఎంసీలో మొత్తం 227 వార్డులుండగా.. శివసేన (యూబీటీ) 157, మహారాష్ట్ర నవనిర్మాణ సేన 70 స్థానాల్లో పోటీకి చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ శరద్ పవార్ (Sharad Pawar) పార్టీకి ఇవ్వాల్సివస్తే ఉద్ధవ్ పార్టీ నుంచి 15 సీట్లు కేటాయిస్తారని చెబుతున్నారు. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన (యూబీటీ), ఎమ్మెన్నెస్ కలిసి పోటీ చేస్తే.. రెండు దశాబ్దాలలో ఠాక్రే వారసులు ప్రత్యర్థులుగా కాకుండా మిత్రులుగా పోటీ చేయడం ఇదే మొదటిసారి అవుతుంది.కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?మహా వికాస్ అఘాడీలో శివసేన(యూబీటీ), శరద్ పవార్ ఎన్సీపీతో కలిసి కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా ఉంది. అయితే బీఎంసీ ఎన్నికల్లో ఠాక్రే సోదరులు చేతులు కలపడంతో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హస్తం పార్టీని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదనట్టుగా శివసేన నాయకులు మాట్లాడుతున్నారు. ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి ఆనంద్ దూబే చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ వరుసగా ఓడిపోతూనే ఉందని, అలాంటి పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. తమకు, ఇతర పార్టీలకు సైద్ధాంతిక విభేదాలు ఉన్నందున ఈమేరకు ఆలోచిస్తున్నామని కాంగ్రెస్ నాయకుడు సచిన్ సావంత్ వెల్లడించారు.చదవండి: కాంగ్రెస్లో చీలికలేంటి?కలిసి సాధిస్తారా?గత కొంత కాలంగా ఉద్ధవ్ ఠాక్రేకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. 288 మున్సిపల్ కౌన్సిళ్లు, నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి (Mahayuti) ప్రభుత్వం విజయదుందుభి మోగించింది. 207 చోట్ల గెలుపు సాధించి సత్తా చాటింది. విపక్ష మహా వికాస్ అఘాడీ 44 స్థానాలకే పరిమితమైంది. శివసేన(యూబీటీ)కి కేవలం 9 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలంటే బీఎంసీ ఎన్నికల్లో నిరూపించుకోవడం చాలా అవసరం. తమ కుటుంబానికి కంచుకోట అయిన మహారాష్ట్ర రాజధానిలో కలిసికట్టుగా బరిలోకి దిగుతున్న ఠాక్రే సోదరులు ఈసారి ఎలాంటి ఫలితాలు రాబడతారో చూడాలి. -
మహారాష్ట్ర ఎన్నికలు.. బీజేపీ జోరు
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ పార్టీ సంచలన విజయం సాధించింది. 288 పంచాయతీ పరిషత్ స్థానాలకు గానూ 120 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి ఈ ఎన్నికలలో పెద్దగా ప్రభావితం చూపలేకపోయింది. ఈ విజయంపై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆనందం వ్యక్తం చేశారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాషాయ పార్టీ జోరు నడుస్తో్ంది. దేశవ్యాప్తంగా ఏ ఎన్నిక జరిగినా బీజేపీ అధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. మెున్నటికి మెున్న కేరళ కమ్యూనిస్టుల కోటైన తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ స్థానాన్ని కైవసం చేసుకోగా, తాజాగా మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలలోనూ ఆ పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఈ విజయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఫడ్నవీస్ మాట్లాడుతూ "ఎన్నికల ప్రచారంలో నేను ఏ పార్టీని, నాయకుడిని విమర్శించలేదు. నా ప్రణాళికలను వివరించాను. ప్రజలు దానిని అంగీకరించారు. అని ఫడ్నవీస్ అన్నారు. ఈ విజయం పట్ల ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే స్పందించారు. మహాయుతి కూటమి లోక్సభ, అసెంబ్లీ, మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిందని దానికి మద్ధతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలని తెలిపారు.మున్సిపల్ ఎన్నికల్లో బిీజేపీ 120 సీట్లు సాధించగా, శిండే శివసేన 57 స్థానాలు, అజిత్ ఎన్సీపీ 37 సీట్లు గెలిచుకుంది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి కేవలం 51 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఇందులో కాంగ్రెస్ 31, ఉద్దవ్ శివసేన 10, శరద్ పవార్ ఎన్సీపీ 10 సీట్లు గెలిచాయి. మహారాష్ట్రలో 288 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 246 మున్సిపల్ కౌన్సిళ్లు, 46 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ సమరంలో ప్రభావం చూపే అవకాశం ఉంది. ముంబైతో పాటు మరో 29 మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలకు వచ్చే నెల ఎన్నికలు జరగనున్నాయి. -
ఊరు మూరెడు.. పురుళ్లు బారెడు
అది ఒక చిన్న గ్రామం.. జనాభా కేవలం 1500. కానీ, మూడు నెలలుగా అక్కడ పుట్టిన పిల్లల సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాలా 27,397..! వినడానికి విడ్డూరంగా ఉన్నా, ఇది మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో వెలుగుచూసిన ఒక భారీ కుంభకోణం. ఈ లెక్కలు చూసి సాక్షాత్తూ అధికారులే కంగుతిన్నారు. ఈ ’జనన ధ్రువపత్రాల’ మాయాజాలం వెనుక ఉన్న అసలు కథేంటి?సర్వేలో సైబర్ నేరం బట్టబయలు యావత్మాల్ జిల్లా ఆర్నీ తహసీల్లోని షెందురుసాని గ్రామ పంచాయతీలో.. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి నవంబర్ నెలల మధ్య జనన, మరణ ధ్రువపత్రాల తనిఖీ కోసం అధికారులు ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అప్పుడే అసలు బండారం బయటపడింది. జనాభా 1500 దాటని గ్రామంలో, వేల సంఖ్యలో పుట్టినట్లు నమోదైన గణాంకాలను చూసి ఉన్నతాధికారులకు దిమ్మ తిరిగింది. ఇది కేవలం పొరపాటు కాదు.. ఒక వ్యవస్థీకృత సైబర్ నేరమని అర్థమైంది.కుంభకోణంలోని ప్రధానాంశాలు అన్నీ బయటి పేర్లే: ఈ 27,397 మందిలో 99 శాతం పేర్లు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవని బీజేపీ నేత కిరిత్ సోమయ్య వెల్లడించారు. ఐడీ దురి్వనియోగం: గ్రామం పరిధితో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల పేర్లతో జనన ధ్రువపత్రాలు జారీ అయ్యాయి. భారీ నెట్వర్క్: ప్రభుత్వ పథకాల లబ్ధి కోసమో లేదా నకిలీ గుర్తింపు కార్డుల సృష్టి కోసమో ఈ భారీ స్కామ్ జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.దర్యాప్తు ముమ్మరం ప్రస్తుతం భారతీయ న్యాయ సంహిత, ఐటీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఒక చిన్న గ్రామం కేంద్రంగా జరిగిన ఈ భారీ సైబర్ నేరం వెనుక ఎవరున్నారు? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్ర కోణం ఏంటి? అనే దిశగా దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ఎంత వేగంగా పెరుగుతుందో, దాన్ని అడ్డు పెట్టుకుని జరిగే మోసాలు కూడా అంతే విస్మయం కలిగిస్తున్నాయి. షెందురుసాని గ్రామంలో వెలుగు చూసిన ఈ ’జననాల పెంపు’ కుంభకోణం ఇప్పుడు మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది.ముంబై నుంచి నియంత్రణప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. గ్రామ పంచాయతీకి చెందిన సీఆర్ఎస్ (సివిల్ రిజి్రస్టేషన్ సిస్టమ్) లాగిన్ ఐడీని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ ఐడీని ముంబై నుంచి నియంత్రిస్తున్నట్లు గుర్తించారు. గ్రామానికి సంబంధం లేని వ్యక్తుల పేర్లతో ఈ ధ్రువ పత్రాలను సృష్టించారు.రంగంలోకి ఉన్నతాధికారులుఈ ఘటనపై జిల్లా పరిషత్ సీఈవో మందార్ పట్కీ ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా ఆరోగ్య అధికారి ఫిర్యాదుతో యావత్మాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో మాట్లాడినట్లు, ఈ నకిలీ రిజిస్ట్రేషన్లన్నింటినీ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసినట్లు బీజేపీ నేత కిరిత్ సోమయ్య తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మహా పొలిటికల్ డ్రామా.. ‘రమ్మీ మంత్రి’ రాజీనామా!
మహారాష్ట్రలో రాజకీయాల్లో మరోసారి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్సీపీ సీనియర్ నేత మాణిక్రావ్ కోకాటే.. క్రీడా శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సభలోనే ఆన్లైన్ రమ్మీ ఆడి.. రమ్మీ మినిస్టర్గా ఈయన పేరు పొందిన సంగతి తెలిసే ఉంటుంది. ఆ సమయంలో కోకాటేను వ్యవసాయ శాఖ నుంచి తప్పించి క్రీడా శాఖకు మార్చడమూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. మూడు దశాబ్దాల నాటి హౌసింగ్ స్కాం కేసులో నాసిక్ సెషన్స్ కోర్టు బుధవారం మాణిక్రావ్ కొకాటే(Manikrao Kokate)ను దోషిగా తేల్చి.. శిక్షను ఖరారు చేసింది. దీంతో.. ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం, మంత్రి పదవి రద్దయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల నడుమ ముందుగానే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే.. కోకాటే రాజీనామా లేఖ ఇంకా సీఎం పేషీకి చేరలేదు. దీంతో.. ప్రస్తుతానికి ఆయన పోర్ట్ఫోలియో లేని మంత్రిగా ఉన్నారు.కేసు ఏంటంటే.. 1995లో హౌజింగ్ సొసైటీలకు సంబంధించి ఆర్థిక బలహీన వర్గాల (EWS) కోసం కేటాయించిన 10% కోటాను దుర్వినియోగం చేశారని మాణిక్రావ్, ఆయన సోదరుడు విజయ్పై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో.. ఛీటింగ్, ఫోర్జరీలకు పాల్పడడ్డారని తేలడంతో ఇద్దరికీ రెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది. తీర్పు ఇచ్చిన వెంటనే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రజాప్రతినిధుల చట్టం, 1951 సెక్షన్ 8 ప్రకారం.. క్రిమినల్ కేసుల్లో ప్రజాప్రతినిధులకు(ఎమ్మెల్యే/ఎంపీ) రెండేళ్లు.. అంత కంటే ఎక్కువ శిక్ష పడితే తక్షణమే సభ్యత్వం రద్దు అవుతుంది. ఒకవేళ పైకోర్టులు వాటిపై స్టే విధిస్తే వాళ్లకు ఊరట దక్కుతుంది. దీంతో.. బుధవారం నాడే బాంబే హైకోర్టులో నాసిక్ కోర్టు తీర్పును కోకాటే బ్రదర్స్ సవాల్ చేశారు. అత్యవసర విచారణను శుక్రవారం జరుపుతామని కోర్టు తేల్చి చెప్పింది. ఈలోపు అనారోగ్యం పేరిట ముంబైలోని లీలావతి కొకాటే చేరడంతో అరెస్ట్ తాత్కాలికంగా వాయిదా పడింది. అత్యవసర భేటీ, ఆపై.. కోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్పీపీ చీఫ్ అజిత్ పవార్.. సీఎం దేవేంద్ర ఫడ్నవిస్తో భేటీ అయ్యారు. శివసేన, బీజేపీ ఒత్తిళ్ల మేరకు కొకాటేను తొలగించాల్సిందేనని ఫడ్నవిస్ పవార్కు స్పష్టం చేశారు. దీంతో ఎన్సీపీ అత్యవసర సమావేశం నిర్వహించి కీలక నేతలతో అజిత్ పవార్ చర్చలు జరిపారు. అనంతరం.. కొకాటే తన రాజీనామా ప్రకటన చేశారు. కొకాటే రాజీనామాతో క్రీడా శాఖ బాధ్యతలు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వద్దకు వెళ్లింది.మరోవైపు.. ఈ పరిణామంపై కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ వర్గం భగ్గుమంటోంది. మహారాష్ట్ర మహాయుతి ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆరోపిస్తున్నారు. గతంలో.. రాహుల్ గాంధీ, సునీల్ కేదార్(మహారాష్ట్ర మాజీ మంత్రి) కేసుల్లో తీర్పు వెలువడిన వెంటనే డిస్క్వాలిఫికేషన్ జరిగిందని, కోకాటే విషయంలో ఆలస్యం ఎందుకు? అని ప్రశ్నించారు..అటు హస్తినలో.. కొకాడే రాజీనామా వ్యవహారం అటు ఢిల్లీలోనూ హాట్ టాపిక్గా మారింది. అదే సమయంలో ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత ధనంజయ్ ముండే ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. తనది రాజకీయ భేటీ కాదని ముండే ఆ తర్వాత మీడియాకు స్పష్టత ఇచ్చారు. ఐదుసార్లు ఎమ్మెల్యే..ఈ ఏడాది జులైలో. అసెంబ్లీలో రమ్మీ ఆడుతూ మాణిక్రావ్ కోకాటేపై కెమెరా కంటికి చిక్కారు. దీంతో.. రైతుల ఆత్మహత్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే తాను ఫోన్ ఆపరేట్ చేస్తుండగా పాపప్ నోటిఫికేషన్ వచ్చిందని, ఉద్దేశపూర్వకంగా తాను దానిని తెరవలేదని కోకటే వివరణ ఇచ్చుకున్నారు. అయినప్పటికీ ఆయన్ని వ్యవసాయ శాఖ నుంచి తొలగించి.. క్రీడా మంత్రిత్వ శాఖతో పాటు యువజన సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖలను కేటాయించింది ఫడ్నవిస్ ప్రభుత్వం. సిన్నార్ ఎమ్మెల్యే అయిన కోకటే.. ఇప్పటి దాకా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. “#जंगली_रमी_पे_आओ_ना_महाराज…!”सत्तेतल्या राष्ट्रवादी गटाला भाजपला विचारल्याशिवाय काहीच करता येत नाही म्हणूनच शेतीचे असंख्य प्रश्न प्रलंबित असताना, राज्यात रोज ८ शेतकरी आत्महत्या करत असताना सुद्धा काही कामच नसल्याने कृषिमंत्र्यांवर रमी खेळण्याची वेळ येत असावी.रस्ता भरकटलेल्या… pic.twitter.com/52jz7eTAtq— Rohit Pawar (@RRPSpeaks) July 20, 2025 -
గిరిజన గళానికి గిన్నిస్ కిరీటం!
పుణే: భారతదేశం మరోసారి విశ్వ వేదికపై మెరిసింది. ఈసారి ఒక సాంస్కృతిక ఘనతతో, పుణే నగరం ’అత్యధిక పోస్టర్ల ప్రదర్శన’లో గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. దేశంలోనే అతిపెద్ద పుస్తక మహోత్సవంలో భాగంగా ఈ చారిత్రక రికార్డు నెలకొల్పింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ న్యాయనిర్ణేత స్వప్నిల్ దంగ్రీకర్ శనివారం ఈ రికార్డును ధ్రువీకరించారు. అత్యధిక పోస్టర్ల ప్రదర్శన రికార్డులో అమెరికాను వెనక్కి నెట్టి, ఈ ఘనతను భారత్ సొంతం చేసుకుందని ప్రకటించారు. బిర్సా ముండాకు అంకితం ప్రపంచ రికార్డు సృష్టి వెనుక ఒక విశిష్ట లక్ష్యం ఉంది. ఈ రికార్డును గిరిజన నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండాకు నివాళిగా అంకితం చేశారు. పుస్తక మహోత్సవ కనీ్వనర్ రాజేష్ పాండే మాట్లాడుతూ, గిరిజన సమాజం, భారత స్వాతంత్య్ర ఉద్యమానికి బిర్సా ముండా చేసిన సేవలను గౌరవించేందుకు ఒక ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గిరిజన పదజాలంతో కూడిన పోస్టర్ల ప్రదర్శనతో గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించడం ఈ కార్యక్రమం ఉద్దేశమని స్పష్టం చేశారు. 1,678 పోస్టర్లతో భారతీయ అస్తిత్వం ఫెర్గుసన్ కళాశాలలో జరుగుతున్న పుణే పుస్తక మహోత్సవంలో ఈ రికార్డును నెలకొల్పారు. నిర్వాహకుల సమాచారం ప్రకారం, గిరిజన పదాలను ప్రదర్శిస్తూ ఏకంగా 1,678 పోస్టర్లను ప్రదర్శించారు. గతంలో అమెరికాలో ఫిబ్రవరి 2025లో 1,365 పోస్టర్లతో నెలకొలి్పన రికార్డును ఈ ప్రదర్శన బద్దలు కొట్టింది. డిసెంబర్ 12న పుణే బుక్ ఫెస్టివల్, యశ్వంత్రావ్ చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ, రైజ్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ రికార్డును సాధించినట్లు గిన్నిస్ ధ్రువపత్రంలో పేర్కొన్నారు. అంతరిస్తున్న భాషల పరిరక్షణ సామాజిక కార్యకర్త గిరీష్ ప్రభూణే మాట్లాడుతూ, బిర్సా ముండా కృషి బహుముఖమైనదని కొనియాడారు. ‘అంతరించిపోతున్న మాండలికాలను పరిరక్షించడం అత్యవసరం. వాటిని దేవనాగరి లిపిలో నమోదు చేస్తే.. గిరిజన భాషలలో నిక్షిప్తమైన జ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వీలవుతుంది’.. అని ఆయన అభిప్రాయపడ్డారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిసెంబర్ 13 నుంచి 21 వరకు జరుగుతున్న ఈ పుణే పుస్తక మహోత్సవం, పుస్తక ప్రదర్శన మాత్రమే కాదు, గిరిజన సంస్కృతి, భాషా పరిరక్షణకు ఒక శక్తివంతమైన వేదికగా నిలిచింది. ఈ రికార్డు విజయంతో, పుణే నగరం పుస్తకాల పండుగను కేవలం వినోద కార్యక్రమంగా కాకుండా, సామాజిక చైతన్యం, సాంస్కృతిక గౌరవానికి చిహ్నంగా మార్చింది. -
18 ఏళ్ల వేట
కాలం మారినా.. చట్టం మాత్రం నిద్రపోలేదు. తన వేటను ఆపలేదు. సరిగ్గా పద్దెనిమిదేళ్ల క్రితం.. అంటే 2007లో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి, అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారైన నిందితుడి కోసం పోలీసులు సాగించిన సుదీర్ఘ వేట ఎట్టకేలకు ముగిసింది. చిన్నారిపై ‘హత్యాచారం’ తరువాత, నిందితుడు సరిహద్దులు దాటి అదృశ్యమయ్యాడు. పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. నేపాల్ అడవుల్లోని అజ్ఞాతం.. యూపీలోని ఇటుక బట్టీలో దాక్కున్న రహస్యం.. ఇవేవీ చట్టం కళ్లుగప్పలేకపోయాయి. ఎట్టకేలకు మీరా భయందర్–వసాయ్ విరార్ (ఎంబీవీవీ) పోలీసులకు కీచకుడు పట్టుబడ్డాడు. క్రైమ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మదన్ బల్లాల్ తెలిపిన వివరాలివి. అది కాళరాత్రి మాణిక్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ అమానుష ఘటన. 2007 మార్చి 31 రాత్రి, 22 ఏళ్ల నంద్లాల్ అలియాస్ నందు రాందాస్ విశ్వకర్మ అనే యువకుడు ఒక చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి లోబరుచుకున్నాడు. మర్నాడు తెల్లవారుజామున బాలిక ఉసురు తీశాడు. అత్యాచారం, హింసతో పాటు, చివరకు ఉరితాడు బిగించి ఆమెను హత్య చేశాడు. నేపాల్కు పరారైన హంతకుడు నేరం చేసిన వెంటనే, నందు విశ్వకర్మ అంతర్జాతీయ సరిహద్దులు దాటి నేపాల్ పారిపోయాడు. అతను చాలా ఏళ్లు అక్కడే అజ్ఞాతంలో గడిపాడు. ఆ కేసు ఫైల్ మాణిక్పూర్ పోలీసుల దగ్గర దుమ్ము పట్టి ఉన్నా, దర్యాప్తు అధికారులు మాత్రం వదిలేయలేదు. అతి ముఖ్యమైన క్లూ.. వేట మొదలు అయితే.. ఇటీవల కేసును మళ్లీ తిరగదోడిన క్రైమ్ డిటెక్షన్ సెల్–2, వసాయ్ బృందానికి ఊహించని క్లూ దొరికింది. నిందితుడు పాత జీవితాన్ని వదిలి, యూపీకి తిరిగి వచి్చ, సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని స్వగ్రామం ఖర్దౌరీలో ఇటుక బట్టీలో కూలీగా దాక్కుని ఉన్నాడని తెలిసింది. దీంతో ఏసీపీ మదన్ బల్లాల్ నాయకత్వంలో, సీనియర్ ఇన్స్పెక్టర్ అవిరాజ్ కుర్హాడే బృందం తక్షణమే కదిలింది. పట్టుబడిన క్షణం నిందితుడి ఆచూకీ పక్కాగా ధ్రువీకరించుకున్నాక.. డిసెంబర్ 10న యూపీలోని ఖర్దౌరీకి చేరుకున్న పోలీసు బృందం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. 18 ఏళ్లుగా స్వేచ్ఛా జీవితం గడిపిన విశ్వకర్మ, తన చుట్టూ ఉచ్చు బిగుస్తోందని ఊహించలేకపోయాడు. చివరకు నంద్లాల్ అలియాస్ నందు రాందాస్ విశ్వకర్మను డిసెంబర్ 10న అతని స్వగ్రామం ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని ఖర్దౌరీలో అరెస్టు చేసి మహారాష్ట్రకు తరలించారు. నిజం నిప్పులాంటిది ఎంతకాలం దాచినా, పాపం పండక తప్పదు. న్యాయం ఆలస్యమై ఉండవచ్చు.. కానీ జరిగి తీరుతుంది. చాక్లెట్ ఆశ చూపించి చిన్నారిని చిదిమేసిన హంతకుడికి పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ అజ్ఞాతం తరువాత సంకెళ్లు పడటమే దీనికి నిదర్శనం. చట్టంపై విశ్వాసాన్ని నిలబెడుతూ పోలీసులు సాగించిన వేట నేటితో ముగిసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పెద్దవారికీ కావాలి జి.పి.ఎస్.
మతిమరుపు, అలై్జమర్స్, మనస్తాపం, ప్రమాదాలు... ఇంట్లో పెద్దవాళ్లు కనపడకుండా పోవడానికి ఎన్నో కారణాలు. వారిని పట్టుకోవడం ఎలా? రెండు రోజుల క్రితం ముంబైలో 79 ఏళ్ల వృద్ధురాలు కనపడకుండా పోతే మనవడు ఆమె మెడ గొలుసులో బిగించిన జి.పి.ఎస్.ను యాక్టివేట్ చేసి ఆమెఆ దాపున ఉన్న ఆస్పత్రిలో స్పృహ లేకుండా పడి ఉందని తెలుసుకున్నాడు. వయో వృద్ధులు తప్పి పోతే వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి మార్కెట్లో జి.పి.ఎస్. ట్రాకర్లు ఉన్నాయి. రోజులు బాగలేని ఈ కాలంలో వీటి అవసరం ఎక్కువగా ఉంది.ముంబయికి చెందిన 79 ఏళ్ల సైరాబీ ఇటీవల ఒకరోజు ఈవెనింగ్ వాక్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అలా వెళ్లిన మనిషి తిరిగి రాలేదు. ఏమయ్యారో తెలీదు. చుట్టుపక్కలప్రాంతాలు వెతికినా కనిపించలేదు. సైరాబీని ఓ బైక్ గుద్దేయడంతో ఆమెను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఒంటరిగా బయటకు వచ్చిన ఆమె వివరాలు అక్కడున్న ఎవరికీ తెలియలేదు. అయితే ఆమె ఆచూకీ ఎక్కుడుందో ఇంటి వారిని పట్టిచ్చింది ఆమె మెడలో ధరించిన నెక్లెస్లోని జీపీఎస్.మనవడి ముందు చూపువయసులో పెద్దవారు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోతే ఆందోళనగానే ఉంటుంది. మార్గమధ్యంలో వారికేమైందని కలవరం మొదలవుతుంది. సైరాబీ ఇంట్లో అదే పరిస్థితి నెలకొంది. అయితే ఆమె మనవడు మహమ్మద్ వసీం ఆమె వేసుకున్న నెక్లెస్లో రహస్యంగా జీపీఎస్ ట్రాకర్ ఇన్ స్టాల్ చేశాడన్న విషయం ఎవరికీ తెలియదు. వృద్ధులు రకరకాల కారణాల వల్ల ఇల్లు విడిచి పెట్టి వెళుతుంటారు. లేదా దారి తప్పుతుంటారు. అందుకే మనవడు ముందు చూపుతో ట్రాకర్ అమర్చాడు. ఆ పని మేలు చేసింది. మనవడు వెంటనే ట్రాకర్ స్విచ్ ఆన్ చేయగా, వారింటికి 5 కి.మీల దూరంలో ఉన్న కేఈఎమ్ ఆసుపత్రిని చూపించింది. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆమె తలకు గాయమైందని, ఆరోగ్యం కుదురుగా ఉందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇలా నిత్యం అనేకమంది వృద్ధులు తప్పిపోయి ఆచూకీకి దూరమవుతున్నారు. అటువంటి వారికి జీపీఎస్ ట్రాకర్ మేలు చేస్తోంది.నెక్లెస్ జీపీఎస్ ట్రాకర్‘నెక్లెస్ జీపీఎస్ ట్రాకర్’ ఇటీవల కాలంలో అనేకమందికి చేరువైంది. నగలకుండే లాకెట్ల లోపల ఇమడ్చగలిగే ఈ చిన్న పరికరం మనం ఎక్కడున్నది, ఎక్కడికి వెళ్తున్నది స్మార్ట్ ఫోన్ ద్వారా ట్రాక్ చేస్తుంది. పైకి మామూలు నగలలాగే కనిపిస్తూ ఉండటం వల్ల అలంకరణకూ లోటూ ఉండదు. ఒంటరిగా బయటకు వెళ్లే మహిళలు, చిన్నారులు, వృద్ధులు, మతిమరుపు కలిగినవారు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్న వారికి ఇది చాలా ఉపకరించే పరికరం. వాళ్లు ఎక్కడైనా తప్పిపోయినా, జరగరానిది జరిగినా, అపహరణకు గురైనా వెంటనే ఆచూకీ తెలుసుకోవచ్చు. ఒంటరిగా దూరప్రయాణాలు చేసేవారు, అడవి, కొండలు, ఎడారులు వంటి దూర ప్రాంతాలకు వెళ్లేవారు తప్పిపోకుండా వీటిని వినియోగించొచ్చు. ఏదైనా నేరాలు జరిగినా, అనుకోని ఘటనలు జరిగినప్పుడు సాక్ష్యాలుగా ఇవి పోలీసుశాఖకు మేలు చేయనున్నాయి. ధరలు అందుబాటులోనే..జీపీఎస్ ట్రాకర్ నెక్లెస్ ధరలు అందుబాటులోనే ఉంటాయి. బేసిక్ ట్రాకింగ్ నెక్లెస్ కనీస ధర రూ.3 వేల నుంచి రూ.4 వేల దాకా ఉంటుంది. మధ్యస్థ స్థాయిలో రూ.6 వేల నుంచి రూ.10 వేల దాకా ఉంటుంది. ఎక్కువ ఆప్షన్ ్స ఉన్న హైఎండ్ ట్రాకర్ కావాలంటే రూ.10 వేల నుంచి రూ.15 వేల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
ఇండిగో సీఈవోపై ప్రశ్నల వర్షం
ముంబై/న్యూఢిల్లీ: ఇండిగో విమానాల రద్దు తో తలెత్తిన సంక్షోభంపై సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ విచారణ కొనసాగుతోంది. డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అధికారులు శుక్రవారం వరుసగా రెండో రోజూ పీటర్ ఎల్బర్స్ను దాదాపు ఏడుగంటలపాటు ప్రశ్నించారు. ఇండిగో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఇసిడ్రోను కూడా ఐదుగంటలపాటు విచారణ జరిపారు. అదేవిధంగా, విమానాల రాకపో కలను పర్యవేక్షించడంలో లోపాలను గుర్తించిన డీజీసీఏ అధికారులు అందుకు బాధ్యులైన నలుగురు ఫ్లయిట్ ఆప రేషన్స్ ఇన్స్పెక్టర్లను తొలగించారు. ప్రయా ణికులకు పరిహారంగా రూ.10వేల చొప్పున ట్రావెల్ వోచర్లు ఇస్తే, సంస్థపై రూ.500 కోట్ల వరకు భారం పడుతుందని ఇండిగో శుక్రవా రం తెలిపింది. అంతేకాదు, విమాన రాకపో కల్లో మూల కారణాన్ని తెలుసుకునేందుకు వైమానిక రంగ నిపుణుడిని నియమిస్తున్నట్లు తెలిపింది. రివైజ్డు తగ్గింపు షెడ్యూల్ ప్రకారం శుక్రవారం 2 వేలకు పైగా విమానాలను నడిపినట్లు తెలిపింది. -
శివరాజ్ పాటిల్ ఇక లేరు
విలువలతో కూడిన రాజకీయాలు ఈ రోజుల్లో అత్యంత అరుదు. అందునా.. నైతిక బాధ్యత అనే పదం వినిపించడం లేదు. అయితే 26/11 (2008లో..) ఉగ్రదాడికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి పదవిని వదులుకున్నారు శివరాజ్ పాటిల్. అలాంటి నిబద్ధత కలిగిన దిగ్గజ నేత ఇక లేరు. కాంగ్రెస్ దిగ్గజ నేత శివరాజ్ పాటిల్(90) ఇక లేరు. అనారోగ్యంతో మహారాష్ట్ర లాతూర్లోని తన నివాసంలో శుక్రవారం ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. మహారాష్ట్ర ఎమ్మెల్యేగా.. కేంద్ర మంత్రిగా, లోక్సభ స్పీకర్గా, గవర్నర్గానూ ఆయన సేవలందించారు. శివరాజ్ పాటిల్ 1935 అక్టోబర్ 12న లాతూర్లో జన్మించారు. 1966–1970 మధ్య లాతూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. మహారాష్ట్ర అసెంబ్లీకి 1972లో తొలిసారి ఎమ్మెల్యేగా వెళ్లారు. 1977–1979 మధ్య డిప్యూటీ స్పీకర్, స్పీకర్గా సేవలందించారు. 1980లో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి, లాతూర్ నియోజకవర్గం నుండి వరుసగా 7 సార్లు ఎంపీగా గెలిచారు. లోక్సభకు 10వ స్పీకర్గా(1991–1996) పనిచేశారు.2004లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో హోం మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే.. 26/11 (2008లో..) ఉగ్రదాడికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాస్త గ్యాప్తో 2010–2015లో పంజాబ్ గవర్నర్గా, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేశారు. మొత్తంగా పార్లమెంటులో, ప్రభుత్వంలో నాలుగు దశాబ్దాలకుపైగా సేవలు అందించారు. సుదీర్ఘకాలంపాటు కాంగ్రెస్లో కొనసాగిన ఆయన్ని.. రాజకీయాల్లో శాంత స్వభావుడిగా, క్రమశిక్షణ.. నిబద్ధత కలిగిన నేతగా అభివర్ణిస్తుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన నిరంతర సేవలు అందించారు, పార్టీ నిర్ణయాలను గౌరవిస్తూ పనిచేశారు. పార్లమెంటరీ సంప్రదాయాలను కాపాడిన స్పీకర్గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. శివరాజ్ పాటిల్ భార్య పేరు విజయా పాటిల్. కుమారుడు శైలేష్ పాటిల్, కోడలు అర్చన (బీజేపీ నాయకురాలు), ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. శివరాజ్ పాటిల్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.కోమటి రెడ్డి సంతాపంహైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివరాజ్ పాటిల్ మరణం పట్ల తెలంగాణ రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. 1972లో రాజకీయాల్లోకి వచ్చిన శివరాజ్ పాటిల్ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు ఎంపీగా గెలుపొందారనీ,ఇందిరా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు,మన్మోహన్ సింగ్ కేబినెట్లో రక్షణ (Defence), సైన్స్ & టెక్నాలజీ, మరియు హోం మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారనీ గుర్తు చేశారు. 10వ లోక్సభ స్పీకర్గా, పంజాబ్ గవర్నర్గా కూడా ఆయన సేవలందించారన్నారు. సీనియర్ నాయకులు శివరాజ్ పాటిల్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని చెబుతూ.. వారి కుటుంబ సభ్యులకు,ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
ఇండిగోపై దూకుడు పెంచిన డీజీసీఏ
న్యూఢిల్లీ/ముంబై: వేలాదిగా విమాన సర్వీసు లను రద్దు చేసి, తీవ్ర సంక్షోభానికి తెరలేపిన ఇండిగోపై అధికారులు సమీక్ష పెంచారు. ఇండిగో ప్రధాన కార్యాలయానికి చేరుకున్న అధికారులు ఆ సంస్థ కార్యకలాపాలను స్వయంగా పరిశీలించారు. ప్రయాణికులకు టిక్కెట్ల రుసుమును వాపసు చేయడంపైనా సమీక్ష జరిపారు. అదేవిధంగా, ఈ శీతాకాల సీజన్లో ఇండిగో నడపాల్సిన 2,300 విమానాల్లో 10 శాతం మేర కోత విధిస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. ఇలా ఉండగా, విమానాల రద్దుతో ఇబ్బందులు పడిన ప్రయాణికులకు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు పరిహారాన్ని ట్రావెల్ వోచర్ల రూపంలో అందజేస్తామని ఇండిగో గురువారం ప్రకటించింది. వీటిని ఏడాదిలోగా వాడుకోవచ్చంది. అయితే, ఈ వెసులుబాటును ఎందరికి ఇస్తున్నదీ వివరించలేదు. అదేసమయంలో, ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల నుంచి టేకాఫ్ తీసుకోవాల్సిన 200కు పైగా విమాన సర్వీసులను గురువారం రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. తాము సుమారు 3 లక్షల ప్రయాణికుల కోసం 1,950 విమానాలను నడపగలమని పేర్కొంది. సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ను డీజీసీఏ ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ గురువారం ప్రశ్నించింది. శుక్రవారం కూడా విచారణకు రావాలని ఆదేశించింది. భారీ సంఖ్యలో విమానాల రద్దుకు దారితీసిన వాస్తవ పరిస్థితులపై మరింత లోతుగా ఈ కమిటీ దర్యాప్తు చేపట్టింది. ఇండిగోలో పైలట్ల షెడ్యూల్ నిర్ణయం, రోస్టర్ విధానంలో లోపాలు, పైలట్ల కోసం కేంద్రం జారీ చేసిన నిబంధనల అమలుకు ఇండిగో చేపట్టిన సన్నద్ధతా చర్యల వంటి వాటిపై కమిటీ క్షుణ్నంగా పరిశీలన జరపనుంది. -
జస్ట్ టిప్ మనీతోనే రూ. 10 లక్షల కారు కొన్నాడు
సాక్షి, ముంబై: రెస్టారెంట్లు, కేఫ్లు, హోటల్ కెళ్లినపుడో విహార యాత్రకెళ్లినపుడో, మనకు సర్వీసు అందించిన ఉద్యోగులకు,టాక్సీ డ్రైవర్లు టూర్ గైడ్లకు కొద్దో గొప్పో టిప్ ఇవ్వడం చాలా సాధారణం.,అలా టిప్పుల ద్వారా వచ్చిన సొమ్ముతో ఖరీదైన కారు కొన్నాడు. తన విజయంతో పొదుపు గొప్పతనాన్ని, తాను ఆచరించిన ఆర్థిక క్రమ శిక్షణ విశిష్టత గురించి చెప్పకనే చెప్పాడు.ఇటాలియన్ క్రూయిజ్ షిప్లో బట్లర్గా పనిచేస్తున్నాడు మహారాష్ట్రలోని మాథెరన్కు చెందిన ప్రవీణ్ జోషిల్కర్. ఇండియాలోని ముంబైకి చెందిన క్రూయిజ్ షిప్ ఉద్యోగి ప్రవీణ్ కేవలం టిప్స్తోనే రూ. 10 లక్షల విలువైన కారు కొన్నాడు: "జీతం పొదుపు కోసమే" అంటూ తన ఆర్థిక వ్యూహాన్ని వివరించాడు. అలాగే ఈ టిప్స్ తన జీవన ఖర్చులు కొనుగోళ్లను కవర్ చేస్తాయని చెప్పుకొచ్చాడు.యూరోపియన్, అమెరికన్ అతిథుల నుండి అందుకున్న నగదు ద్వారానే ఈ కారును కొనుగోలు చేశానని పేర్కొన్నాడు. క్రూయిజ్ షిప్లో తన జీవితాన్ని డాక్యుమెంట్ చేసే కంటెంట్ సృష్టికర్తగా కూడా ఉన్నాడు. కొత్త కారుతో పోజులిచ్చిన ఫోటోతో తన విజయాన్ని ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఏంతో ఉదారంగా టిప్స్ ఇచ్చిన అతిథులకు కృతజ్ఞతలు తెలిపాడు.క్రూయిజ్ షిప్లో పనిచేసేటప్పుడు టిప్స్తో ఏదైనా కొనుక్కోవచ్చు. జీతం భవిష్యత్ పొదుపు కోసం బ్రో," అనే క్యాప్షన్తో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. దీనిపై స్పందించిన నెటిజన్లు అతనికి విషెస్ అందించారు. క్రూయిజ్ పరిశ్రమలో కెరీర్ అవకాశాల గురించి అడిగిన అనేక మంది ఆరా తీయగా, అభినందనలు బ్రో అని చాలామంది వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Pravin joshilkar (@pravinjoshilkar_cruisevlogger)"> జోషిల్కర్ ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ గ్రాడ్యుయేట్. మహారాష్ట్రలోని మాథెరన్లో నివసిస్తున్న ప్రవీన్ పగటిపూట, అతను ఇటాలియన్ క్రూయిజ్ కంపెనీలో బట్లర్గా పనిచేస్తాడు . రాత్రిపూట, అతను క్రూయిజ్ షిప్లో తన అనుభవాలతో కంటెంట్ క్రియేటర్ అవతారమెత్తుతాడు. ఇదీ చదవండి: Indigo Crisis హర్ష్ గోయెంకా నో డిలే, నో డైవర్షన్ వైరల్ వీడియో -
‘రయ్’లు
గుజరాత్ నుంచి సాక్షి ప్రతినిధి: అహ్మదాబాద్–ముంబై మధ్య భారతదేశంలో మొదటి హై స్పీడ్ రైల్ (బుల్లెట్ ట్రైన్) ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల మధ్య 508 కిలోమీటర్ల (మహారాష్ట్రలో 156 కి.మీ, గుజరాత్లో 352 కి.మీ) దూరాన్ని కేవలం 2 గంటల్లో పూర్తిచేయడానికి ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2027 ఆగస్టులో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ – బిలిమోరా మధ్య సుమారు 50 కి.మీ దూరంలో ఈ రైలుకు ట్రయల్ రన్ చేపట్టనున్నట్టు నేషనల్ హై–స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అహ్మదాబాద్ ప్రిన్సిపల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ రాజేష్ అగర్వాల్ సోమవారం ‘సాక్షి’కి వివరించారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 2017 సెపె్టంబర్ 14న ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబేలు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.1.08 లక్షల కోట్లు. డిజైన్ స్పీడ్ గంటకు 350 కి.మీ కాగా ఆపరేటింగ్ స్పీడ్ గంటకు 320 కి.మీ ఉంటుంది. ఆధునిక డిజైన్, మల్టి–మోడల్ ఇంటిగ్రేషన్ (మెట్రో, బస్సు, రైలు, బుల్లెట్ రైలు ప్రయాణాలను అనుసంధానించే) అధునాతన వసతులతో 12 స్టేషన్లు నిర్మీస్తున్నారు. సబర్మతిలో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్ను భారీ ఎత్తున నిర్మీంచారు.వచ్చే ఏడాది ఇక్కడ వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి. తొమ్మిది అంతస్తుల్లో నిర్మీంచిన ఈ హబ్లో షాపింగ్ కాంప్లెక్స్, వివిధ ఆఫీసులతో ప్రయాణికులకు విందు, వినోదాలకు సకల వసతులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ హబ్ నిర్మాణం పూర్తయింది. హెరిటేజ్ సిటీ అహ్మదాబాద్ సంస్కృతి, దేశ చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేలా హబ్ను డిజైన్ చేశారు. -
మహారాష్ట్రలో మరో చీలిక?
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో చీలిక రానుందా?.. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అక్కడ సంచలనంగా మారాయి. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండే వర్గం త్వరలో చీలిపోయే అవకాశం ఉందని తెలిపారు. మహాయుతి మిత్రపక్షంలో 22 మంది ఎమ్మెల్యేలు జంపు జిలానీకి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.21వ శతాబ్ధపు భారత రాజకీయాల్లో మహారాష్ట్ర రాజకీయాలు గుర్తుండిపోతాయి. ఎత్తులకు పైఎత్తులు, పార్టీల జంప్, ప్రభుత్వాలని కూలగొట్టడం లాంటివి అక్కడ ప్రస్తుతం కామన్గా మారాయి. 2022లో శివసేన పార్టీని చీల్చి 40 మంది ఏమ్మెల్యేలతో ఆపార్టీ మాజీ నేత ఏకనాథ్ షిండే ప్రభుత్వాన్ని కూల్చారు. బీజేపీతో చేతులు కలిపి సీఎంగా మారారు. దాని అనంతరం అజిత్ పవార్ సైతం ఎన్సీపీలో చీలిక తెచ్చి 41 మంది ఎమ్మెల్యేలతో బయిటకి వచ్చారు. తర్వాత బీజేపీ ప్రభుత్వంలో కలిశారు. దీంతో మరాఠా రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో ఎవరికి అర్థం కాకుండా మారింది.ఈ నేపథ్యంలో శివసేన (UBT) నేత ఆదిత్య ఠాక్రే సంచలన ప్రకటన చేశారు. మహయుతి మిత్రపక్షానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ఆరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు చాలా దగ్గరగా ఉన్నారని.. త్వరలో వాళ్లు ఆయనతో కలిసే అవకాశాలున్నాయని తెలిపారు. అలా పరోక్షంగా శిండే వర్గాన్ని హెచ్చరించారు. అంతే కాకుండా వర్లీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 22 మంది వైస్ కెప్టెన్ అంటారని పరోక్షంగా మంత్రి ఉదయ్ సమంత్ ను ఉద్దేశించి మాట్లాడారు.అయితే గతంలోనూ అజిత్ పవార్, శిందేలతో పాటు ఉదయ్ సమంత్ కూడా సీఎం రేసులో ఉండడం తెలిసిందే. కిందటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన (శిందే), ఎన్సీపీ (అజిత్ పవార్) మహాయుతిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. -
ఆరో రోజు 650 విమానాలు
ముంబై: ఇండిగో సంక్షోభం ఆరో రోజు సైతం కొనసాగింది. ఆదివారం ఒక్కరోజే మరో 650 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీలో 118, ముంబైలో 121 విమానాలు రద్దయ్యాయి. శుక్రవారం, శనివారంతో పోలిస్తే పరిస్థితి చాలావరకు అదుపులోకి వచ్చినట్లు ఇండిగో వర్గాలు వెల్లడించాయి. అయితే ఆరో రోజు ప్రయాణికులకు కొంత ఊరట లభించింది. విమానాల సంక్షోభం క్రమంగా కుదుటపడుతున్న సంకేతాలు కనిపించాయి. దేశీయ, అంతర్జాతీయ సర్వీసులకు సంబంధించి మొత్తం 2,300 విమానాలకుగాను ఆదివారం 1,650 విమానాలు రాకపోకలు సాగించాయి. ఈ నెల 10వ తేదీ కల్లా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, విమానాలు యథాతథంగా రాకపోకలు సాగిస్తాయని, ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశాయి. ప్రయాణికులతోపాటు ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడంతో ఇండిగో యాజమాన్యం నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. పరిస్థితిని చక్కదిద్దడానికి నడుం బిగించింది. ఇండిగో సిబ్బందిని ఉద్దేశించి సంస్థ సీఈఓ పీటర్ ఎల్బెర్స్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఒక్కో అడుగు వేసుకుంటూ సాధారణ స్థితికి చేరుకుంటున్నామని తెలిపారు. ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్(సీఎంజీ)ను ఏర్పాటు చేసింది. ఇండిగో విమానాల రాకపోకలకు సంబంధించి తాజా పరిణామాలను ఈ గ్రూప్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. త్వరలో పార్లమెంటరీ కమిటీ విచారణ! ఇండిగో సంక్షోభంపై ఆ సంస్థ ప్రతినిధులతోపాటు డీజీసీఏ అధికారులను, విమానయాన శాఖ అధికారులను పిలిపించి విచారించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం నిర్ణయించింది. త్వరలో వారికి సమన్లు జారీ చేయబోతున్నట్లు సమాచారం. పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు కావడం, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని పట్ల సంజయ్ ఝా నేతృత్వంలో రవాణా, పర్యాటకం, సంస్కృతిపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆయా అధికారులను పిలిపించి ప్రశ్నించడంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి సమస్య తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సంక్షోభానికి మూల కారణాలపై విశ్లేషణ ప్రారంభించినట్లు ఇండిగో వర్గాలు పేర్కొన్నాయి. రాజస్తాన్ పర్యాటకానికి ఎదురుదెబ్బ రాజస్తాన్కు ప్రతిఏటా డిసెంబర్లో పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు. ఇండిగో సంక్షోభం వల్ల గత ఆరు రోజులుగా ప్రముఖ పర్యాటక ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. విమానాలు అందుబాటులో లేక పర్యాటకులు రావడం లేదు. చాలామంది తమ పర్యటనలు రద్దు చేసుకున్నారు. కొందరు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, పర్యాటకులు రాకపోవడంతో చాలా నష్టపోతున్నాయని రాజస్తాన్లోని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లు, దుకాణాలు, రవాణా రంగాల్లో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. వీరందరికీ దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులే జీవనాధారం. ఇండిగో విమానంలో పావురం కలకలం ఇండిగో విమానం టేకాఫ్కు సిద్ధమవుతున్న సమయంలో అందులో పావురం కనిపించడం తీవ్ర కలకలం సృష్టించింది. బెంగళూరు నుంచి వడోదరకు బయలుదేరిన విమానంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తాజాగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సరిగ్గా టేకాఫ్కు ముందు పావురం విమానంలో ఎగరడం చూసి ప్రయాణికులు, సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. దాన్ని పట్టుకోవడానికి ప్రయతి్నంచారు. వారి చేతికి చిక్కకుండా చాలాసేపు అటుఇటూ ఎగురుతూ కనిపించింది. బయటపడేందుకు ప్రయత్నించింది. ప్రయాణికుల్లో ఒకరు ఈ దృశ్యాన్ని చిత్రీకరించి, ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. దీనిపై నెటిజట్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇండిగోకు బ్యాడ్టైమ్ కొనసాగుతోందని కొందరు పేర్కొన్నారు. పావురానికి ‘బర్డింగ్ పాసు’ ఉంది కాబోలు, అందుకే లోపలికి వచ్చిందని ఒకరు చమత్కరించారు. ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ రద్దయిన, ఆలస్యంగా నడిచిన విమానాలకు సంబంధించి ప్రయాణికులకు ఇండిగో యాజమాన్యం శనివారం నాటికి రూ.610 కోట్లు రీఫండ్ చేసినట్లు విమానయాన శాఖ ఆదివారం వెల్లడించింది. అలాగే బ్యాగేజీని కూడా వెనక్కి ఇచ్చినట్లు తెలిపింది. ప్రయాణికులకు టిక్కెట్ల సొమ్మును ఆదివారం రాత్రి 8 గంటలకల్లా పూర్తిగా చెల్లించాలని ఇండిగోను కేంద్ర ప్రభుత్వం ఆదేశించి సంగతి తెలిసిందే. అలాగే బ్యాగేజీని 48 గంటల్లోగా అందజేయాలని పేర్కొంది. సంక్షోభంపై వివరణ ఇవ్వడానికి ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బెర్స్, అకౌంటబుల్ మేనేజర్ ఇసిడ్రో పోర్కిరస్కు మరికొంత సమయం ఇవ్వాలని డీజీసీఏ ఆదివారం నిర్ణయించింది. సోమవారం సాయంత్రంకల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. -
ఎల్గార్ పరిషత్ కేసులో ప్రొఫెసర్ హనీబాబుకు బెయిల్
ముంబై: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీబాబుకు బెయిల్ మంజూరు అయ్యింది. ఎల్గార్ పరిషత్ కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ అసోసియేట్ ప్రొఫెసర్ హనీ బాబు.. విచారణ లేకుండానే ఐదేళ్లకు పైగా జెలు శిక్ష అనుభవించారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలో ఈ కేసులో విచారణ పూర్తి చేసిన జస్టి‹స్ ఎ.ఎస్.గడ్కరీ, ఆర్.ఆర్.¿ోంస్లేలతో కూడిన డివిజన్ బెంచ్, ఆయనను విడుదల చేయాలని, లక్ష రూపాయల వ్యక్తిగత బాండ్ను సమరి్పంచాలని ఆదేశించింది. సుప్రీంకోర్టులో అప్పీలు చేయడానికి ఈ ఉత్తర్వును నిలిపివేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) హైకోర్టును కోరింది. బాబు ఇప్పటికే విచారణలేకుండానే సుదీర్ఘ కాలం జైలులో ఉన్నారని, విచారణ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేనందున ఎన్ఐఏ అప్పీలును తిరస్కరించింది. ఆయన పూర్తి పేరు హనీబాబు ముసలియారీ్వట్టిల్ తరయిల్. యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్కు చెందిన వ్యక్తి. 2017 డిసెంబర్ 31న పూణేలోని శనివార్వాడలో కబీర్కళా మంచ్ నిర్వహించిన ఎల్గార్ పరిషత్ కార్యక్రమంలో ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై 2020 జూలైలో ఎన్ఐఏ అరెస్టు చేసింది. నిషేధిత సీపీఐ(ఎంఎల్) నాయకుల సూచనల మేరకు మావోయిస్టు కార్యకలాపాలు, భావజాలాన్ని హనీబాబు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. 59 ఏళ్ల హనీ బాబు అప్పటి నుంచి తలోజా జైలులో ఉన్నారు. -
ఐఐటీ బాంబే విద్యార్థిని వీడియో వైరల్, అంతగానూ ఏముంది?
హర్యానాకు చెందిన ఐఐటీ బాంబే విద్యార్థిని షేర్ చేసిన వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది. క్యాంపస్ మెస్ ఫుడ్ ఎలా ఉంది అనే విషయాలతో తన అనుభవాన్ని పంచుకుంది.భారతదేశంలోని అగ్రశ్రేణి సంస్థలలో ఒకటైన ఐఐటీ బాంబే మెస్ గురించి అక్కడ చదువుకుంటున్న గరిమా తన యూ ట్యూబ్లో ఒక చిన్న వీడియో పోస్ట్ చేసింది. ఇక్కడ మెస్ చాలా హైజీనిక్గా ఉంటుందని,ఫుడ్ కూడా చాలా బావుంటుందని వివరించింది. అంతే ఈ చిన్న యూట్యూబ్ వీడియో వైరల్ అయింది. "నేను హర్యానా నుండి వచ్చాను, నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఇతర రాష్ట్రాల ఆహార సంస్కృతిని ఇంత దగ్గరగా చూడలేదు, కానీ ఐఐటీ బాంబే నాకు ప్రతిదీ పరిచయం చేస్తోంది."అని పేర్కొంది. ఇది 12 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించింది. 4 లక్షలకు పైగా కామెంట్లువెల్లువెత్తాయి. 2024లో పోస్ట్ చేసిన ఈ వీడియో మళ్లీ ఇపుడు వైరలవుతోంది. 1300 కమెంట్స్ రావడంతో నెట్టింట ఇంట్రస్టింగ్గా మారింది.కాగా గరిమా @garimabagar పేరుతో యూట్యూబ్ ఛానెల్ను నిర్వహిస్తోంది. IIT బాంబే మెస్ టూర్లో ప్రతి పండుగ మెస్లో మా ప్లేట్లో కనిపిస్తుంది." అంటూ అక్కడ వడ్డించే ఆహారం గురించి మాట్లాడుతుంది.పొంగల్ సమయంలో, అరటి ఆకుల్లో భోజనాన్ని వడ్డించడం,విద్యార్థులు నేలపై కూర్చుని తినడం గురించి గర్వంగా చెప్పుకొచ్చింది. పొంగల్ రోజున, క్యాంటీన్ లోపల రంగోలి సాంప్రదాయ లేఅవుట్లో భోజనం వడ్డించారు. బియ్యం, సాంబార్, చట్నీ . స్వీట్లు వంటి వంటకాలను అరటి ఆకులపై వడ్డించాన్ని ఈ వీడియో చూడవచ్చు.అంతేకాదు ఈ సంప్రదాయంలో భాగంగా విద్యార్థులు నేలపై కూర్చుని తినడానికి ,,చెప్పులు తీసేసారని, తొలిసారి, సాంప్రదాయ దక్షిణ భారత పండుగ భోజనాన్ని ఆస్వాదిస్తున్నామని నిజంగా ఇది భిన్నమైన అనుభవం అని ఈ వీడియోలో వివరించింది. మరికొన్ని రోజుల్లో పొంగల్ సందడి రానున్న సందర్భంగా మళ్లీ ఇపుడు ఈ వీడియో నెటిజన్లును ఆకట్టుకుంటోంది. -
పోలీసులే అన్నను ఎగదోశారు
నాందేడ్: వేరే కులం అనే కారణంగా యువకుడిని యువతి కుటుంబసభ్యులు దారుణంగా హత్యచేసిన ఘటనలో పోలీసుల పాత్ర కూడా ఉందని ఆ యువతి తాజాగా ఆరోపించింది. దీంతో పోలీసుల పాత్రపై అదనపు ఎస్పీ ర్యాంక్ అధికారి నేతృత్వంలో దర్యాప్తు మొదలెడతామని ఎస్పీ అబినాశ్ కుమార్ సోమవారం ప్రకటించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఆన్చల్ మమిద్వార్ అనే యువతిని సక్షమ్ తాటే అనే వేరే కులం అబ్బాయి ప్రేమించడం, ఇది నచ్చని ఆమె తండ్రి, సోదరులు యువకుడిని సోమవారం చంపేయడం తెల్సిందే. సక్షమ్ అంత్యక్రియలు జరుగుతుండగా అక్కడికొచ్చిన ఆన్చల్ అతడి మృతదేహంతోనే వివాహమాడిన విషయం విదితమే. ఈ హత్యోదంతంపై ఆన్చల్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘సోమవారం సక్షమ్ను చంపేయడానికి ముందే నన్ను నా సోదరుడు హిమేశ్ స్థానిక ఇటా్వరా పోలీస్స్టేషన్కు తీసుకెళ్లాడు. సక్షమ్పై తప్పుడు ఫిర్యాదుచేయాలన్నాడు. అందుకు నేను ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో కోపంతో అక్కడి ఇద్దరు పోలీసులు హిమేశ్ను హత్య కు పురిగొల్పారు. వాళ్లతో వీళ్లతో గొడవపడే బదులు నేరుగా వెళ్లి సక్షమ్ను చంపేసెయ్ అని హిమేశ్ను ఉసిగొల్పారు. అప్పుటికే హిమేశ్ పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. సక్షమ్ను చంపేశాక పోలీస్స్టేషన్కు వస్తా అనుకుంటూ వెళ్లిపోయాడు. అనుకున్నట్లే సక్షమ్ను చంపేశాడు. దమ్ముంటే నువ్వు పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చెయ్ అని నాతో సవాల్ చేశాడు’’అని మహిళ రోదిస్తూ చెప్పింది. ‘‘నా డిమాండ్ ఒక్కటే. సక్షమ్ను చంపేసిన నా తండ్రి, సోదరులు సైతం అదే రీతిలో శిక్షను అమలుచేయాలి. హత్యతో సంబంధం ఉన్న వాళ్లందరీన ఉరితీయాలి. ప్రాణాలు వదిలినా సరే సక్షమే నా భర్త. ఇకపై అతని కుటుంబంతోనే అతని ఇంట్లోనే ఉంటా. సక్షమ్ తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటా’’అని ఆమె తెలిపింది. ఆన్చల్ ఆరోపణలపై ఎస్పీ స్పందించారు. ‘‘హత్యోదంతంలో పోలీసుల పాత్ర ఉందనేది తీవ్రమైన ఆరోపణ. ఈ విషయంపై దర్యాప్తు చేస్తాం. వాస్తవానికి మృతుడు సక్షమ్, నిందితుడు హిమేశ్ ఇద్దరికీ నేరచరిత్ర ఉంది. గతంలో ఇద్దరూ మంచి మిత్రులు. హత్య, దాడిసహా భారతీయ న్యాయసంహిత, ఎస్సీ/ఎస్టీ(వేధింపుల నిరోధక)చట్టం, భారతీయ న్యాయ సంహిత, ఆయుధాల చట్టాల కింద ఆరుగురిపై కేసు నమోదుచేశాం’’అని ఎస్పీ చెప్పారు. అరెస్టయిన వారిని మూడ్రోజులపాటు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. -
‘రక్త’ సిందూరం!
కులం సాకుతో కూతురి ప్రేమను కాదన్నారు. ఖాతరు చేయలేదన్న కసితో కన్నతండ్రి, తోబుట్టువులే ఆమె ప్రేమికుడి పాలిట కాలయముళ్లయ్యారు. నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశారు. మనసారా ప్రేమించినవాడు నడిరోడ్డుపై రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంటే.. ఆమె గుండె పగిలింది. నిప్పుల కొలిమి అయ్యింది. చట్టాన్ని ధిక్కరించిన పగలకు, కులాన్ని అడ్డుపెట్టిన క్రూరత్వానికి బదులివ్వడానికి ఆమె అప్పటికప్పుడే ఎంచుకున్న మార్గం... చరిత్రలో విలక్షణ అధ్యాయమై నిలిచింది. మట్టిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రియుడి దేహాన్నే వివాహం చేసుకుంది. అమరం.. అఖిలం మా ప్రేమ.. అంటూ యావత్ ప్రపంచానికి చాటిచెప్పింది. ఆమె ధిక్కార ప్రకటన.. మహారాష్ట్రలోని నాందేడ్లో కన్నీటి కెరటమై ఎగసిపడింది.మూడేళ్ల ప్రేమకు నూరేళ్లు ఆంచల్ మమిద్వార్ (21), సక్షం టేట్ (20)లది మూడేళ్ల గాఢమైన ప్రేమ బంధం. వాస్తవానికి ఆంచల్ సోదరుల ద్వారానే ఆమె కుటుంబానికి సక్షం పరిచయమయ్యాడు. తరచూ వారింటికి సక్షం రావడంతో.. వీరిద్దరి ప్రేమ బంధం బలపడింది. అయితే, వారిద్దరి కులాలు వేరు కావడంతో.. ఆంచల్ కుటుంబం ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్ని బెదిరింపులు వచ్చినా ఆంచల్, సక్షం తమ ప్రేమ బంధాన్ని వదులుకోలేదు. సక్షం, ఆంచల్ పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం ఆంచల్ తండ్రి గజానన్ మమిద్వార్ (45)కు, సోదరులు హేమేశ్, సాహిల్ (25)లకు తెలిసిపోయింది. అంతే.. పరువు హత్యకు పథకం సిద్ధమైపోయింది.తుపాకీతో కాల్చి.. రాయితో కొట్టి.. గురువారం సాయంత్రం, నాందేడ్లోని పాతగంజ్ ప్రాంతంలో సక్షం తన స్నేహితులతో నిలబడి ఉండగా.. ఆంచల్ సోదరుడు హేమేశ్ మామిద్వార్ అక్కడికి చేరాడు. అతనికి.. సక్షం మధ్య గొడవ మొదలైంది. కోపంతో ఊగిపోయిన హేమేశ్, సక్షంపైకి తుపాకితో కాల్పులు జరిపాడు. ఆ గుండు సక్షం పక్కటెముకల్లోకి దూసుకుపోయింది. అంతటితో ఆగకుండా, హేమేశ్ ఒక రాతి పెంకుతో సక్షం తలపై బలంగా కొట్టాడు. దీంతో సక్షం అక్కడికక్కడే మరణించాడు. మా ప్రేమకు చావు లేదు.. సక్షం హత్య తర్వాత రోజు, శుక్రవారం సాయంత్రం.. అతని అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పుడే అక్కడికి ఆంచల్ చేరుకుంది. సక్షం నిర్జీవ దేహం పక్కన మోకరిల్లింది. కళ్ల నుండి దుఃఖం ధారాపాతమై ప్రవహిస్తుండగా.. ఆమె సక్షం శరీరానికి పసుపు పూసింది. తన నుదుట సిందూరం ధరించింది. ప్రియుడి భౌతిక కాయంతోనే పెళ్లి చేసుకుంది. తమ ప్రేమకు అమరత్వం కలి్పంచడానికి ఈ పని చేస్తున్నానని ఆంచల్ చెబుతుంటే.. అక్కడున్నవారంతా కంటతడి పెట్టారు. ఈ హృదయవిదారక దృశ్యం వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.వారిని ఉరి తీయండి.. ప్రియుడి శవంతో వివాహం అనంతరం ఆంచల్ విలేకరులతో మాట్లాడుతూ.. కన్నతండ్రి, సోదరులు చేసిన ఈ ఘాతుకానికి వారికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. ‘కులం సాకుతో నా తండ్రి మా ప్రేమను వ్యతిరేకించాడు. నా కుటుంబం చాలాసార్లు సక్షంను చంపుతామని బెదిరించింది. ఇప్పుడదే చేసింది. నాకు న్యాయం కావాలి. ఈ ముగ్గురిని ఉరి తీయాలి’.. అని కోరింది. అంతేకాకుండా, ఆమె ఆ క్షణం నుంచే సక్షం ఇంట్లోనే కోడలిగా మిగిలిన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంది. ‘సక్షం మరణంలోనూ మా ప్రేమ గెలిచింది, నా తండ్రి, సోదరులు ఓడిపోయారు’.. అని ఆమె ప్రకటించింది. ఈ హత్యలో ఆంచల్ తండ్రి గజానన్, సోదరులు హేమేశ్, సాహిల్ పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించి, వెంటనే వారిని అరెస్టు చేశారు. మొత్తం ఆరుగురిపై భారతీయ న్యాయ సంహిత, ఎస్సీ/ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం, ఆయుధ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులకు మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించారు. ఆంచల్ ధైర్యం, ఆవేదనతో కూడిన ప్రేమకథ.. కులాల మధ్య ప్రేమ మనుగడ సాగించాలంటే ఎంతటి తీవ్ర పోరాటం చేయాలో, ఎన్ని ప్రాణాలు బలివ్వాలో మరోసారి రుజువు చేసింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
నకిలీ పత్రాలతో ఎస్బీఐ కార్ల లోన్ల మోసం : పలు లగ్జరీ కార్లు సీజ్
సాక్షి, ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కార్ లోన్ మోసం కేసు విచారణలో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ (ED)పలు లగ్జరీ కార్లను సీజ్ చేసింది.ముంబై జోనల్ ఆఫీసులోని, నవంబర్ 25-26 తేదీలలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 నిబంధనల కింద ఈడీ ఈ సోదాలు నిర్వహించింది.ఎస్బీఐలో వెలుగు చూసిన వాహన రుణ మోసంపై ఈడీ కఠిన చర్యలకు దిగింది. ఇందులో భాగంగా , పూణేలోని రుణగ్రహీతలు , కార్ డీలర్లకు చెందిన 12 నివాస ,కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేసింది. అప్పటి బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ అమర్ కులకర్ణిపై కూడా సోదాలు జరిగాయి. ఈ సోదాల సందర్భంగా PMLA, 2002 సెక్షన్ 17 ప్రకారం. రుణగ్రహీతలు కొనుగోలు చేసిన వివిధ స్థిరాస్తుల గుర్తింపు BMWలు, వోల్వో, మెర్సిడెస్, ల్యాండ్ రోవర్లు స్వాధీనం చేసుకుంది. అలు పలు నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారి ఒకరు తెలిపారు.ED, Mumbai Zonal Office has conducted search operations on 25-26 November, 2025 under the provisions of Prevention of Money Laundering Act (PMLA), 2002 at Pune at 12 residential and office premises of loan borrowers, car dealers as well as the then branch manager of SBI in… pic.twitter.com/swQYRBL2U4— ED (@dir_ed) November 28, 2025 నిందిత రుణగ్రహీతలు నకిలీ పత్రాల ఆధారంగా మోసపూరితంగా అధిక విలువ గల కారు రుణాలను పొందారని మరియు తద్వారా బ్యాంకును మోసం చేశారని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. 2017-2019 మధ్య కాలంలో, పూణేలోని యూనివర్సిటీ రోడ్ బ్రాంచ్లోని SBIలో చీఫ్ మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు, కులకర్ణి తన అధికారిక పదవిని దుర్వినియోగం చేశాడని, కొంతమంది రుణగ్రహీతలతో కలిసి SBIలో ఆటో లోన్ కౌన్సెలర్ ఆదిత్య సేథియాతో కలిసి లగ్జరీ కార్ల రుణాలను మోసపూరితంగా ప్రాసెస్ చేసాడు. నకిలీ పత్రాల ద్వారా SBI బ్రాంచ్ మేనేజర్తో కుమ్మక్కై BMW, వోల్వో, మెర్సిడెస్ , ల్యాండ్ రోవర్తో సహా వివిధ అధిక విలువ గల కార్లను కొనుగోలు చేశారని తేలింది. ఇలాంటి తప్పుడు సిఫార్సుల ద్వారా SBIని మోసం చేయడానికి నేరపూరిత కుట్ర పన్నాడని ఆరోపణలు నమోదైనాయి.సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ACB, పూణే ,శివాజీనగర్ పోలీస్ స్టేషన్, పూణేలో నమోదైన కేసుల ఆధారంగా, ఐపీసీ 1860, అవినీతి నిరోధక చట్టం, 1988లోని వివిధ సెక్షన్ల కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఇదీ చదవండి: స్మృతి-పలాష్ పెళ్లిలో మరో ట్విస్ట్ : ఇన్స్టాలో అప్డేట్ చూశారా? -
‘మారుతి’ కార్లు అంటేనే ఇక్కడ అపశకునమట!
దేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో నమ్మకం ఆచారాలు ఉంటాయి. కానీ మారుతీ కార్లను బ్యాన్ చేసిన గ్రామం గురించి తెలుసా? మహారాష్ట్రలోనే ఈ ప్రత్యేకమైన గ్రామం ఉంది. ఇక్కడ మారుతి కార్లపై నిషేధం ఎందుకు? ఆ కార్ల నాణ్యత నచ్చలేదా? లేక ధరలు ఎక్కువని భావించారా? పదండి తెలుసుకుందాం. మనీ కంట్రోల్ కథనం ప్రకారం రాష్ట్రంలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఆ గ్రామం సాధారణ భారతీయ గ్రామం కాదు. ఆధునిక జీవితం పురాతన నమ్మకాలతో మిళితమైన గ్రామం అని చెప్పవచ్చు. ఈ నిషేధం వెనుక కారణం కారు నాణ్యత కారు, అధిక ధరలూ కాదు. స్థానిక పురాణాల గాథ ప్రకారం సంరక్షక దేవత నింబ దైత్య పట్ల భక్తితో లోతుగా ముడిపడి ఉంది.ధైర్యాన్నిచ్చి, కష్టాలను తొలగించి, కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడని భక్తులు బాగా విశ్వసించే శ్రీరాముడికి గొప్ప సేవకుడు భక్తుడు హనుమంతుడి దేవాలయాలు ఉండవు. మారుతిని ఇక్కడ పూజించరు. ముంబైకి 350 కిలోమీటర్ల దూరంలో ఉందీ గ్రామం. ఇక్కడ రాక్షస రాజైన నింబ దైత్యుడిని పూజిస్తారు. ఇక్కడి ప్రజలు దైత్య నింబ రాక్షసుడుని తమ మూలపురుషుడిగా భావిస్తారు. చిన్నా పెద్దా అందరికీ నింబ దైత్య అంటే బలమైన నమ్మకం. తరతరాలుగా చెప్పుకుంటున్న స్థానిక పురాణం ప్రకారం, హనుమంతుడు , నింబ దైత్య మధ్య ఒకప్పుడు వివాదం జరిగింది. చివరికి రాముడు స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటన తర్వాత, రాముడు నింబ దైత్యుడికి ఈ గ్రామానికి ఏకైక దైవ సంరక్షకుడిగా ఉండే హక్కును ఇచ్చాడని నమ్ముతారు, హనుమంతుడిని ఈ పాత్ర నుండి తప్పుకోవాలని కోరాడట శ్రీరాముడు. దీని కారణంగా, హనుమంతుడి ఉనికి ఏ రూపంలోనైనా ఉండటం గ్రామానికి దురదృష్టాన్ని తెస్తుందనే నమ్మకం పెరిగింది. ఈ నమ్మకం దేవాలయాలు, పేర్లకు కూడా విస్తరించింది. అలా "మారుతి" అనేది హనుమంతుడికి మరొక పేరు కాబట్టి, ఈ బ్రాండ్ కార్లను అపశకునంగా భావిస్తారట. ఇక్కడ మారుతి కారు బిగ్గరగా హారన్ వినడం కూడా చెడ్డ శకునంగా భావిస్తారు. మూఢనమ్మకం అని అందరూ పిలుస్తున్నప్పటికీ, శతాబ్దాలుగా తమను రక్షిస్తున్న పవిత్ర సంప్రదాయం అంటారు ఈ గ్రామ ప్రజలు. ఇదీ చదవండి: స్మృతి మంధాన పెళ్లి వాయిదా : మరో వార్త వైరల్గ్రామంలోని ప్రజలు తరచుగా పంచుకునే ఒక ప్రసిద్ధ కథ ఉంది. సంవత్సరాల క్రితం, ఒక స్థానిక వైద్యుడు మారుతి 800 కారును కొన్నాడట. ఆ తరువాత క్లినిక్కు వచ్చే రోగుల సంఖ్య అకస్మాత్తుగా తగ్గిపోయింది. దీంతో ఆందోళన పడిన అతగాడు,మారుతి కారుని విక్రయించి, దానిని వేరే బ్రాండ్, టాటా సుమోతో భర్తీ చేశాడు. మారిన తర్వాత, అతని ప్రాక్టీస్ సాధారణ స్థితికి వచ్చిందట. (రూ. 80 లక్షల తల్లి పెన్షన్ కోసం ఏ కొడుకూ చేయని పని!) -
షేర్ మార్కెట్ దందా : రూ. 35 కోట్లు ముంచేశారు!
సాక్షి, ముంబై: షేర్ మార్కెట్లో ట్రేడింగ్ పేరుతో ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్త భారీగా మోసపోయిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ.35 కోట్లు మోసపోయిన దిగ్భ్రాంతికర వార్త కలకలం రేపుతోందితన భార్య పేరుతో ఉన్న డీమ్యాట్ ఖాతాను ఒక బ్రోకరేజ్ సంస్థ అన్యాయంగా వాడి మోసం చేసిందని 72 ఏళ్ల వ్యాపారవేత్త వాపోతున్నారు. గత నాలుగేళ్లుగా ఈ మోసానికి తెగబడిందని మతుంగా వెస్ట్ నివాసి భరత్ హరక్చంద్ షా అనే బ్రోకరేజ్ సంస్థ గ్లోబ్ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్పై ఆరోపణలు గుప్పించారు.అసలేమైంది అంటే.పరేల్లో క్యాన్సర్ రోగుల కోసం తక్కువ అద్దెకు గెస్ట్ హౌస్ నడుపుతున్న షా, తన భార్యతో పాటు, 1984లో తన తండ్రి మరణించిన తర్వాత ఆయన షేర్ పోర్ట్ఫోలియోను వారసత్వంగా పొందారు. కానీ ఆ జంటకు స్టాక్ మార్కెట్పై ఎలాంటి పరి జ్ఞానం లేదు. ఎపుడూ ట్రేడింగ్ చేసిన అనుభవమూ లేదు. దీంతో స్నేహితుడి సలహా మేరకు షా తనకు , తన భార్యకు గ్లోబ్ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్లో డీమ్యాట్ , ట్రేడింగ్ ఖాతాను తెరిచి, వారి వారసత్వంగా వచ్చిన షేర్లను కంపెనీకి బదిలీ చేశాడు. అక్షయ్ బరియా ,కరణ్ సిరోయా అనే ఇద్దరు ఉద్యోగులకు వీరి పోర్ట్ఫోలియోను "నిర్వహించే" బాధ్యతను అప్పగించారు. ఇక అక్కడినుంచి వీరి మోసానికి తెరలేచింది. వారి ఖాతాలకు పూర్తిగా నియంత్రణలోకి తీసుకొన్నారు. మొదట్లో కొద్దో గొప్పో సమాచారం ఇచ్చినప్పటికీ, ఆ తరువాత అసలు వీళ్లని సంప్రదించేవారు కాదు. అయితే మార్చి 2020 -జూన్ 2024 మధ్య, లాభాలు, క్లీన్ స్టేట్మెంట్ రావడంతో ఎలాంటి అనుమానం రాలేదు. తన ఖాతాల ద్వారా విస్తృతమైన వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్నాయని షాకు తెలియదు. ఇదీ చదవండి: డీకేకి చాన్స్ ఇస్తే.. సిద్ధరామయ్య ప్లాన్ ఏంటి?మోసం ఎలా బైట పడింది?జూలై 2024లో షాకు గ్లోబ్ క్యాపిటల్ రిస్క్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుండి అకస్మాత్తుగా కాల్ వచ్చింది. దాని సారాంశం ఏమిటయ్యా అంటే.. మీ భార్యాభర్తలఖాతాల్లో రూ. 35 కోట్ల డెబిట్ ఉంది. వెంటనే దాన్ని చెల్లించాలి, లేకపోతే మీ షేర్లన్నీ అమ్మేస్తాం’’ అని చెప్పడంతో నిర్ఘాంత పోవడం షా వంతైంది. కంపెనీని సందర్శించినప్పుడు, భారీ, అనధికార వ్యాపారం జరిగిందని అతనికి సమాచారం అందింది.జరిగిన మోసాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: వేధింపులపై మహిళలకు కీలక సందేశం : ఐశ్వర్యారాయ్ వీడియో వైరల్ -
దేశంలో తొలి ఆధార్ కార్డు ఎవరిదో తెలుసా?
భారతదేశంలో మొట్టమొదటి ఆధార్ కార్డు హోల్డర్ ఎవరు. ఆమె వంట గ్యాస్, టాయిలెట్ లేదా విద్యుత్ సౌకర్యాలు కూడా లేకుండా జీవిస్తుండటం ఆసక్తికరం. పదండి మరి ఆమె ఎవరో? ఎక్కిడి వారో వివరాలు తెలుసుకుందాం.భారతదేశంలో తొలి ఆధార్ కార్డు పొందిన వ్యక్తి మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలోని టెంబ్లి గ్రామ నివాసి. ఆధార్ కార్డు మహిళగా ప్రసిద్ధి చెందిన రంజనా సోనావానే. 2010న సెప్టెంబర్ 29,అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ హాజరైన ఆధార్ కార్యక్రమం జాతీయ ప్రారంభోత్సవంలో ఈ కార్డు జారీ చేశారు. ఆధార్ ప్రాజెక్ట్ను ప్రారంభించడానికి ఈ గ్రామాన్ని ఎంచుకున్నారు.చదవండి: డీకేకి చాన్స్ ఇస్తే.. సిద్ధరామయ్య ప్లాన్ ఏంటి?ఎవరీ రంజన సోనావానే?మహారాష్ట్రలోని మారుమూల గ్రామంలో ఒక పూరిగుడిసెలో నివసించే మహిళ రంజనా. ఆమె భర్త సదాశివ్ దినసరి కూలీ.వీరికి ముగ్గురు పిల్లలు. ప్రత్యేక గుర్తింపు కార్డు పొందిన తొలి వ్యక్తి అయినప్పటికీ, వంట గ్యాస్, టాయిలెట్, విద్యుత్తు లాంటి కనీస సౌకర్యాలేవీ లేవు. అందుకే తొలి ఆధార్ కార్డు పొండదంలో గొప్ప ఏముంది? ఇదో గొప్ప విజయమా. లాటరీ గెలిచనట్టుగా కాదు కదా అని అప్పట్లోనే తన నిర్లిప్తతతను ప్రకటించింది. తమలాంటి పేదవాళ్లు, గిరిజనుల కోసం ఏ మీ చేయాలేదు, ఓట్లు మాత్రం అడుగుతారు అంటూ అప్పటి మంత్రులపై నిరసనను సోనావానే ఒక ఇంటర్వ్యూలో ప్రకటించింది. ఇదీ చదవండి: ఆధార్ ఉన్నంత మాత్రాన ఓటు హక్కు ఇవ్వాలా ? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుప్రభుత్వ సబ్సిడీలు, సంక్షేమ పథకాలకు ప్రాప్యతకు అంత్యంత కీలకమైన ఈ కార్డు ద్వారా తనకు ఒరిగిందేమీ లేదని ఒక సందర్భంలో వాపోయింది. ఆధార్ కార్డు తనకు ఉద్యోగం పొందడానికి సహాయ పడుతుందని మొదట్లో భావించానని, కానీ తర్వాత తాను పొరబడ్డానని గ్రహించానని కూడా చెప్పింది. ఆధార్ కార్డు పొందిన తొలి భారతీయురాలిగా పదిహేను సంవత్సరాలు గడిచినా, 54 ఏళ్ల రంజనా సోనావానే తనకు ప్రభుత్వపరంగా ఉద్దేశించిన ప్రాథమిక సంక్షేమ ఫలాలేవీ అందలేదని తెలిపింది. ఇదీ చదవండి : స్మృతి మంధాన పెళ్లి వాయిదా : మరో వార్త వైరల్ -
నావికా దళంలోకి ‘ఐఎన్ఎస్ మాహె’
ముంబై: భారత సముద్ర తీర ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. దాదాపు 80 శాతం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ‘ఐఎన్ఎస్ మాహె’ నౌక భారత నావికా దళంలో చేరింది. సైలెంట్ హంటర్గా పిలిచే ఈ నౌక సముద్ర అంతర్భాగంలో శత్రుదేశాల జలాంతర్గాములను నిశ్శబ్దంగా వేటాడగలదు. తీర ప్రాంతంలో గస్తీతోపాటు సముద్రం లోపల సహాయక చర్యల్లోనూ పాల్గొంటుంది. ఇది మొట్టమొదటి మాహె–క్లాస్ యాంటీ–సబ్మెరైన్ వార్ఫేర్ షాలో–వాటర్ క్రాఫ్ట్. కేరళలోని కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఈ అధునాతన నౌకకు మలబార్ తీరంలోని మాహె నగరం పేరుపెట్టారు. సోమవారం ముంబై తీరంలోని నావల్ డాక్యార్డ్లో జరిగిన కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఐఎన్ఎస్ మాహెను నావికాదళానికి లాంఛనంగా అప్పగించారు. నావల్ షిప్ను నౌకా దళంలో ప్రవేశపెట్టే కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం విశేషం. నౌక డిజైన్, నిర్మాణంలో పాలుపంచుకున్న సిబ్బందిని ఉపేంద్ర ద్వివేది సత్కరించారు. ఐఎన్ఎస్ మాహె నౌక ఇకపై వెస్ట్రన్ సీ బోర్డు ఆధ్వర్యంలో విధులు నిర్వర్తించనుంది. → ఐఎన్ఎస్ మాహెలో అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు పొందుపర్చారు. సముద్రం ఉపరితలంపై, లోపల ముప్పును అత్యంత కచ్చితత్వంతో గుర్తించి, అంతం చేయగలదు. → ఇందులో టార్పెడోలు, యాంటీ–సబ్మెరైన్ రాకెట్లు ఉన్నాయి. సముద్రం లోపల శత్రుదేశాల జలాంతర్గాములను తుత్తునియలు చేస్తుంది. → యుద్ధనౌకల డిజైన్, నిర్మాణంలో మన ఆత్మనిర్భరతకు ఐఎన్ఎస్ మాహె ఒక ప్రతీక అని భారత నావికాదళం అభివరి్ణంచింది. నౌక పైభాగంలె ‘ఉరుమి’ అనే ఖడ్గాన్ని అమర్చారు. ఇది కేరళ ప్రాచీన యుద్ధక్రీడ అయిన కలరిపయట్టులో ఉపయోగించే ఆయుధం. → నౌక మస్కట్(చిహ్నం) చిరుతపులి. నౌక నుంచి చాలా తక్కువ శబ్దం వెలువడుతుంది. అందుకే శత్రువులు సులువుగా గుర్తించలేరు. → పొడవు 78 మీటర్లు. గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. సముద్రంలో సహాయక చర్యల్లో క్రియాశీలకంగా పనిచేస్తుంది. -
ట్రాఫిక్ బంధనం నుంచి బయటపడేలా అదిరిపోయే ప్లాన్!
జనాభా అవసరాలకు అనుగుణంగా సొంత వాహనాలు పెరిగే కొద్దీ.. నగరాల్లో ట్రాఫిక్ రద్దీ అంత కంతకూ పెరిగిపోతోంది. అయితే.. ముంబై వీధుల్లో ఆ గందరగోళం ఇక పాతాళంలోకి కరిగిపోనుంది. భూమి క్రింద మరో కొత్త లోకం తెరుచుకోబోతోంది. అవును..ముంబై ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వినూత్న ప్రణాళికను ప్రకటించారు. “పాతాళ్ లోక్”(Paatal Lok) పేరుతో భూగర్భ టన్నెల్ నెట్వర్క్ను నిర్మించి నగర రోడ్లపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించనున్నట్లు సోమవారం ఆయన తెలిపారు. ఈ టన్నెల్లు పైభాగంలోని రహదారులకు సమాంతరంగా ఉంటూ.. మెట్రో మార్గాలతో కలుపుతూ.. ముంబైకి కొత్త రవాణా రూపకల్పనను అందించబోతునున్నట్లు తెలిపారాయన. ఎలా సహాయపడుతుందంటే.. ముంబైలోని దీర్ఘకాలిక ట్రాఫిక్ సమస్యను తగ్గించడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, కనెక్టివిటీ మెరుగుపరచడం.. పాతాళ్ లోక్ ముఖ్య ఉద్దేశం. భూమి క్రింద రోడ్లకు సమాంతరంగా పెద్ద టన్నెల్ వ్యవస్థ నిర్మిస్తారు. ఇది భూమి క్రింద సమాంతర రహదారి వ్యవస్థగా పనిచేస్తుంది. అంటే పైభాగంలోని ప్రధాన రహదారులకు “షాడో నెట్వర్క్”లా ఉంటుందన్నమాట. డీకన్జెషన్తో పైభాగంలోని రోడ్లపై వాహనాల ఒత్తిడి తగ్గి.. ట్రాఫిక్ సాఫీగా కదులుతుంది. తద్వారా ప్రయాణికులకు ‘గంటల తరబడి’ అనే నరకయాతన తప్పనుంది. అలాగే.. రవాణా సౌకర్యం మెరుగుపడటంతో వ్యాపారాలు, లాజిస్టిక్స్ వేగవంతం కానుంది. అదే సమయంలో వాహనాలు ఎక్కువసేపు నిలిచిపోకుండా కదలడం వల్ల ఇంధన వినియోగం తగ్గడంతో పాటు కాలుష్యమూ తగ్గుతుంది.ముంబై నగరం కోసం ఫడ్నవీస్ సర్కార్ అమలు చేయబోతున్న ప్రణాళికలో.. బోరివలి–గోరేగావ్ మధ్య సమాంతర రహదారి, వర్లీ–శివడి కనెక్టర్ (తదుపరి సంవత్సరం పూర్తి), బాంద్రా–BKC టన్నెల్ ( దీని ద్వారా ఎయిర్పోర్ట్ యాక్సెస్ మెరుగుపరుస్తుంది). దక్షిణ ముంబై నుంచి భయందర్ వరకు విస్తరించే కోస్టల్ రోడ్ కూడా ఈ ప్రణాళికలో భాగం. అలాగే.. ఈ టన్నెల్ ప్రాజెక్ట్కి తోడ్పాటుగా మెట్రో విస్తరణ కూడా జరగనుంది. -
నాది కాదు.. బ్లాక్ చేయండి : హీరోయిన్ రకుల్ ట్వీట్ వైరల్
సైబర్ నేరాలు, డేటా చోరీలు ఇంటర్నెట్ వినియోగదారులను వణికిస్తున్నాయి. కొంతమంది నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి, వారి పేరుతో సన్నిహితులు, స్నేహితుల వద్ద భారీగా డబ్బు దండుకున్నారు. డిజిటల్ అరెస్ట్ అంటూ అమాయకులను బెదిరించి కోట్ల రూపాయలను దండుకున్నారు సైబర్ నేరగాళ్లు. మరోవైపు సోషల్ నకిలీ ఐడీలు, నకిలీ ఖాతాలతో వారి ఫాలోయర్లను దారుణంగా మోసగిస్తున్నారు మరి కొంతమంది. దీనికి సంబంధించిన నటి రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్గా మారింది. తన వాట్సాప్ నంబరు అంటూ నకిలీ నెంబరుతో చాట్ చేస్తున్నారని స్పందించ వద్ద అంటూ హీరోయిన్ రకుల్ ఎక్స్లో ఒక ట్వీట్ చేసింది. ‘‘హాయ్ గైస్... ఎవరో వాట్సాప్లో నాపేరుతో జనంతో చాట్ చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. దయచేసి ఇది నా నంబర్ కాదని గమనించండి . వారితో మాట్లాడకండి దయచేసి బ్లాక్ చేయండి’’ అనేది ఈ ట్వీట్ సారాంశం.Hi guys... it's come to my notice that someone is impersonating on WhatsApp as me and chatting with people. Please notice this isn't my number and do not engage in any randomconversations. Kindly block. pic.twitter.com/nrDcmpsQz8— Rakul Singh (@Rakulpreet) November 24, 2025కాగా గత వారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 350 కోట్లకు పైగా వాట్సాప్ యూజర్ల వ్యక్తిగత వివరాలు లీక్ వార్త సంచలనం రేపిన సంగతి విదితమే. -
ముంబై-వారణాశి చిన్నారి ఆరోహి : సెలబ్రిటీలనుంచి నెటిజన్లు దాకా కళ్లు చెమర్చే కథ
ఒడిలో ఆదమర్చి నిద్రపోతున్న బిడ్డ అకస్మాత్తుగా మాయమైపోతే.. ఆ తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి బాధ వర్ణనాతీతం. ఎవరెత్తుకుపోయారో.. ఏం చేశారో, ఏమైపోయిందో.. అసలు బతికి ఉందో లేదో తెలియక ప్రతీక్షణం నరకయాతన తప్పదు. ఆరు నెలలు పాటు మానసిక క్షోభను అనుభవించారో తల్లితండ్రులు.కానీ ఆ బిడ్డ ఆచూకీ దొరికేదాకా పోలీసులు కూడా అదే ఆవేదనను అనుభవించడమే ఈ వార్తలోని ప్రత్యేకత. చిన్నారి దొరికేదాకా వారికి ఊపిరి ఆడలేదు. సొంత బిడ్డ పోయినట్టుగా విలవిల్లాడి పోయారు. రాత్రింబవళ్లు కష్టపడ్డారు. చివరికి ఆరు నెలలకు వారి కష్టం ఫలించింది. అలా ఈ ఏడాది నవంబర్ 14న బాలల దినోత్సవం అనుకోకుండా అటు తల్లి దండ్రుల జీవితాల్లోనూ, ఇటు పోలీసు అధికారుల జీవితాల్లోనూ ఒక మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది.అసలు కథ ఏంటంటే..అది మే 20, (2025) రాత్రి, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్. షోలాపూర్కు చెందిన ఒక సాధారణ జంట. తమ కలల పంట అయిన నాలుగేళ్ల ఆరోహిని వెంట బెట్టుకొని ఈ దంపతులు, తన తండ్రి చికిత్స కోసం ముంబైకి వచ్చారు. ప్రయాణంలో అలసిపోయారు. కాసేపు సేద దీరుతామని అలా కూర్చున్నారు. ఇంతలో తల్లిగా మాగన్నుగా నిద్ర పట్టింది. ఉన్నట్టుండి ఒడిలో ఉన్న బిడ్డ మాయమైపోయింది. కళ్లు మూసి తెరిచేలోపే అంతా జరిగిపోయింది. దీంతో కంటిధారగా విలపించిన వారు పోలీసులను ఆశ్రయించారు. అనేక సార్లు అధికారులను వేడుకున్నారు. బిడ్డ ఫోటోను రైళ్లలో, మురికివాడల్లో, అనాథాశ్రమాలలో అపరిచితులకు చూపించారు. అలా ఆరు నెలలు తిండీ తిప్పలు లేకుండా గడిపారు. కళ్లుమూసినా, తెరిచినా ‘‘ఆరోహి…ఆరోహి’’ ఒకటే ఒకటే ధ్యాస. బిడ్డ ఏమైపోయిందీ అనీ. మాయ దారి నిద్ర బిడ్డను దూరం చేసిందనే బాధతో నిద్రకే దూరమయ్యారు.అటు ముంబై పోలీసులుకూడా ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఆరోహి పోస్టర్లను ముద్రించారు, లోకమాన్య తిలక్ టెర్మినస్ నుండి భూసావల్ నుండి వారణాసి కాంట్ వరకు ప్రతి ప్లాట్ఫామ్పైనా అతికించారు. పేపర్లలలో ప్రకటనలు ఇచ్చారు. మరో విధంగా చెప్పాలంటే చేయని ప్రయత్నం లేదు. చివరికి జర్నలిస్టులను సంప్రదించారు. కొంతమంది అధికారులైతే చిన్నారిని తమ సొంత బిడ్డలా భావించి ఫోటోను తమ చొక్కా జేబుల్లో పెట్టుకొని మరీ ఆచూకీ కోసం ప్రయత్నించారు.ఆనందం వెల్లివిరిసిన క్షణాలునవంబర్ 13న, వారణాసిలోని ఒక స్థానిక రిపోర్టర్ ఆరోహి పోస్టర్ చూశాడు. అంతే అతడి బుర్రలో ఏదో క్లిక్ అయింది. నిద్రలో మరాఠీ పదాలు మాట్లాడే ఒక అమ్మాయిని గురించి తెలుసుకొని వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. మరుసటి రోజు ఉదయం, ముంబై పోలీస్ ఇన్స్పెక్టర్ వారణాసిలో ల్యాప్టాప్ ముందు కూర్చుని వీడియో కాల్చేవాడు. అపుడు స్క్రీన్పై ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. పింక్ ఫ్రాక్లో తన పాప. అదృశ్యమైన రోజుధరించింది అదే రంగుగౌను. ముంబైలో అధికారి వెనుక నిలబడి ఉన్న తల్లి తన కూతుర్ని తల్లికి నోట మాట రాలేదు. తండ్రి మాత్రం కళ్లనీళ్లతో సంతోషంగా "అది నా ఆరోహి... అది నా బిడ్డ..." అని అరవడం మొదలు పెట్టాడు.అంతే వేగంగా స్పందించిన పోలీసులు విమానంలో పాపను తీసుకొచ్చారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ మొత్తం అక్కడ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. కొత్త బెలూన్లు , నీలి రంగు కొత్త ఫ్రాక్. కానీ చిన్నారి బయటకు వచ్చి ఖాకీ యూనిఫాంల సముద్రాన్ని చూసి తొలుత నివ్వెర పోయింది. మరుక్షణం పరుగెత్తుకుంటూ వచ్చి చేతులు చాచి, ఆమె సమీపంలోని అధికారిని మెడ చుట్టూ చేతులు వేసి చుట్టేసింది. ఆరు నెలలు మాయమైపోయిన అందమైన చిరునవ్వుతో, స్వచ్ఛంగా, నోరారా విరబూసిన నవ్వులు చూసిన ప్రతీ హృదయం ఆనందంతో ఒప్పొంగి పోయింది. తల్లిదండ్రులైతే నిశ్చేష్టులైపోయారు. గొంతు పూడుకుపోయింది. అడుగు ముందుకు పడలేదు. దీంతో పోలీసులే ఆమెను కన్నవారి వద్దకు తీసుకెళ్లారు. తల్లి బిడ్డను తడిమితడిమి చూసుకుంది. ఆరు నెలలపాటు దూరమైన తన బంగారాన్ని ఆత్రంగా నిమురుకుంది. తండ్రి అయితే ఆ చిన్ని పాదాలపై మోకరిల్లిపోయాడు. ఇది నిజమేనా అనుకుంటూ బిడ్డ, భగవంతుడా నా బిడ్డను నాకు తిరికి నాకిచ్చావు అంటూ ఆ తల్లిదండ్రులు ఒకర్నొకరు తడిమి తడిమి చూసుకున్నారు. ఒకరి కన్నీరు ఒకరు తుడుచుకున్నారు. ఆరు నెలల ఆవేదన, చీకటి వారి కౌగిలింతలు, ముద్దుల్లో దూదిపింజలా తేలిపోయింది.ఇంతకీ పాప ఎక్కడెళ్లిపోయిందిరైల్వే స్టేషన్లో మాయమైన పాప, వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న వారణాసి(varanasi)లో తేలింది. ఆమెను ఎత్తుకు పోయిన కిడ్నాపర్ చెరనుంచి తప్పించుకుందో, లేదంటే వాళ్లే వదిలివేశారో తెలియదు కానీ, జూన్లో రైల్వే పట్టాల దగ్గర ఏడుస్తూ, చెప్పులు లేకుండా, బిక్కు బిక్కు మంటూ కనిపించడంతో, అనాథాశ్రమం అక్కున చేర్చుకుంది. నీడనిచ్చి కొత్త పేరు కూడా ఇచ్చింది. తన అసలు పేరు గుర్తులేని ఆ చిన్నారి “కాశీ”గా మారిపోయింది. కానీ రాత్రిళ్లు మాత్రం దుప్పటి అంచుని పట్టుకుని "ఆయ్" (మరాఠీలో అమ్మ) అని మౌనంగా రోదించేది. ఆ జ్ఞాపకమే ఆమెను కన్నతల్లి ఒడికి తిరిగి తీసుకెళ్లింది.కిడ్నాపర్ మాత్రం ఎవరు?ఏంటి అనేది మాత్రం తెలియదు. కానీ ముంబైలో తప్పిపోయి, కాశీలో తేలి, తిరిగి తల్లి ఒడికి చేరింది. ఇలాంటి తప్పిపోయిన పిల్లలను తిరిగి కన్న ఒడికి చేర్చే ఇలా కన్నీటి గాథలు విన్నపుడు ఖాకీలు కూడా మనుషులే. వారిలోనూ మానవత్వం ఉంది అన్న మాటలు అక్షర సత్యాలు అనిపించకమానదు. హ్యాట్సాఫ్..!ఆనంద్ మహీంద్ర పొగడ్తలు మోహిని మహేశ్వరి అనే ట్విటర్ హ్యాండిల్లో షేర్ అయిన ఈ ఘనటపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఎక్స్లో స్పందించారు. ముంబై పోలీసులను ప్రశంసించారు. మీరు ఆశను, ఆనందాన్ని గొప్ప బహుమతిగా ఇచ్చారు. ఈ ఒక్క కారణంతోనే మీరు మీరు ప్రపంచంలోని అత్యుత్తమ దళాలలో ఒకరు అంటూ కొనియాడటం విశేషం. ఈ కథనం నెట్టింట వైరల్గా మారింది.ముంబై పోలీసులపై చిన్మయి శ్రీపాద, ఇతర సెలబ్రిటీలనుంచి నెటిజన్లు దాకా అభినందనలు వెల్లువెత్తాయి On the night of May 20, 2025, a little girl in a faded pink frock fell asleep on her mother’s lap at Chhatrapati Shivaji Maharaj Terminus. Her parents, simple people from Solapur, had come to Mumbai for her father’s treatment. They were exhausted. Just for a moment, the mother… pic.twitter.com/Cc2u5gv1lU— Mohini Maheshwari (@MohiniWealth) November 23, 2025A 4-year-old girl missing for six months was located at an orphanage in Varanasi through the efforts of @MraMargPS .Following a complaint from her parents reporting her kidnapping from Mumbai CST, the investigation uncovered that the accused had taken her by train from Lokmanya… pic.twitter.com/IAe6iM0Dyl— मुंबई पोलीस - Mumbai Police (@MumbaiPolice) November 15, 2025 -
పెళ్లయ్యి ఏడాది కాలేదు, డెంటిస్ట్ అత్మహత్య : మంత్రి సన్నిహితుడు అరెస్ట్
Dentist Suicide case ముంబై: హత్యారోపణల కింద మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే (Pankaja Munde) ముఖ్య సన్నిహితుడిని పోలీసలు అరెస్టు చేయడం కలకలం రేపింది. పంకజ ముండే వ్యక్తిగత సహాయకుడు అనంత్ గార్జేని ముంబైలోని వర్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన భార్య గౌరీ గార్జే ఆత్మహత్య కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది. అనంత్ భార్య గౌరీ శనివారం సాయంత్రం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే భర్త ఆమెపై వేధింపులకు పాల్పడి, తీవ్రంగా హింసించాడని, అవి భరించలేకే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందన్న గౌరీ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. గార్జేకు వివాహేతర సంబంధం ఉందని మరొక మహిళతో మొబైల్ ఫోన్లో చాట్ చేస్తుండగా పట్టుబట్టాడని, దీంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయని ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇన్-కెమెరా పోస్ట్మార్టం ,సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ద్వారా కేసు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చసిన పోలీసులు సోమవారం తెల్లవారు జామున వర్లీ పోలీసులు గార్జేను అరెస్టు చేసి, కోర్టులో హాజరపర్చారు.గౌరీ ప్రభుత్వ కెఇఎం ఆసుపత్రిలో దంత వైద్యురాలిగా పని చేస్తున్నారు. అనంత్, గౌరీ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరి 7న జరింది. ఈ వేడుకకు రాష్ట్ర మంత్రి పంకజ ముండే, మాజీ ఎంపీ ప్రీతమ్ ముండే సహా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అయితే పెళ్లి అయ్యి ఇంకా ఏడాది కూడా నిండకుండానే ఆమె బలవన్మరణానికి పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదీ చదవండి: బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి తీవ్ర అస్వస్థత, ఐసీయూలో చికిత్స -
మహారాష్ట్ర పాలి‘ట్రిక్స్’.. అజిత్ పవార్ వివాదాస్పద వ్యాఖ్యలు
పుణె: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అభ్యర్థులను ఎన్నుకుంటే నిధుల కొరత అనేదే లేకుండా చేస్తాం, ఓటేయకుంటే మాత్రం, తామూ పట్టించుకోమంటూ వారిని హెచ్చరించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. శుక్రవారం బారామతి జిల్లా మాలెగావ్ నగర పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ–ఎన్సీపీ–శివసేన సంకీర్ణ ప్రభుత్వంలో అజిత్ పవార్ ఆర్థిక మంత్రిగా ఉండటం గమనార్హం. ‘మా ఎన్సీపీ అభ్యర్థులు 18 మందిని ఎన్నుకుంటే నిధుల కొరత అనేదే ఉండదు. మొత్తం పద్దెనిమిది మందినీ ఎన్నుకుంటే, నేను ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తా. మా అభ్యర్థులను తిరస్కరించిన పక్షంలో నిధులివ్వను. మీ వద్ద ఓట్లుంటే, నా దగ్గర నిధులున్నాయి’అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. Baramati, Maharashtra: Deputy CM Ajit Pawar says, "Give me victory for all 18 Mahayuti candidates in the Malegaon Nagar Panchayat, and I will fulfill every promise and demand I have made to you. But if you cut votes, then I will also cut. You have the votes, and I have the funds,… pic.twitter.com/AiFyTgc0A6— IANS (@ians_india) November 22, 2025మరోవైపు.. అజిత్ పవార్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. ఆయనపై ఎన్నికల కమిషన్ ఎందుకు ఎటువంటి చర్య తీసుకోలేదని ప్రశ్నించాయి. ఈ నేపథ్యంలో శివసేన (ఉద్ధవ్ బాలషేబ్ బిటి) నాయకుడు అంబదాస్ దన్వే స్పందిస్తూ..‘నిధులు అజిత్ పవార్ ఇంటి నుండి కాకుండా సామాన్య ప్రజలు చెల్లించే పన్నుల నుండి ఇవ్వబడతాయి. పవార్ వంటి నాయకుడు ఓటర్లను బెదిరిస్తుంటే, ఎన్నికల కమిషన్ ఏమి చేస్తోంది? అని ప్రశ్నలు సంధించారు. ఇక, మహారాష్ట్రలో నగర పంచాయతీలకు ఎన్నికలు డిసెంబర్ 2న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పవర్ ఇలా కామెంట్స్ చేయడం గమనార్హం. -
రెండు రోజుల్లో ఇద్దరు.. మరో విద్యార్థిని ఆత్మహత్య
ముంబై: ఢిల్లీలో విద్యార్థి శౌర్య పాటిల్ మృతి ఘటన మరువక ముందే మహారాష్ట్రలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలో ఎనిమిదో తరగతి విద్యార్థిని(13) పాఠశాల భవనంలోని మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఉపాధ్యాయుల వేధింపుల కారణంగానే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై సీఐ సందీప్ భారతీ తెలిపిన వివరాల ప్రకారం.. జల్నా నగరంలోని CTMK గుజరాతీ విద్యాలయంలో ఆరోహి దీపక్ బిట్లాన్(13) ఎనిమిదో తరగతి చదువుతోంది. ప్రతీరోజు మాదిరిగానే ఆమె.. శుక్రవారం పాఠశాలకు వచ్చింది. అనంతరం, ఉదయం 7:30 గంటల ప్రాంతంలో పాఠశాల భవనంలోని మూడవ అంతస్తు నుంచి దూకింది. దీంతో, వెంటనే ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి తర్వాత.. సివిల్ ఆసుపత్రికి తరలించారు. పాఠశాల యాజమాన్యం ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. కానీ, అప్పటికే బాధితురాలు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. పాఠశాలలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదన్నారు.మరోవైపు, బాధితురాలు తల్లిదండ్రులు తమ బిడ్డ మరణంపై మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల నిరంతర వేధింపులు, చిత్రహింసల కారణంగానే మా కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. చాలా రోజులుగా ఆమె ఆవేదనతో ఉంది. కానీ, తను ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించలేదు. మాకు న్యాయం కావాలి. మా బిడ్డను వేధించిన పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. ఇక, విద్యార్థిని మృతిపై పాఠశాల ప్రిన్సిపాల్ స్పందిస్తూ.. ఆమె మృతి విషాదకరమని అన్నారు. దీనిపై దర్యాప్తునకు పూర్తిగా సహకరించనున్నట్టు తెలిపారు. పోలీసులు తమ విచారణను పూర్తి చేసిన తర్వాతే వాస్తవాలు స్పష్టంగా తెలుస్తాయని అన్నారు.#WATCH | Jalna, Maharashtra: Sadar Police Inspector Sandeep Bharti says, "This morning, around 7:30-8 o'clock, information was received about a 13-year-old schoolgirl jumping from the school roof and committing suicide. Investigation is underway. Preliminary investigation is… pic.twitter.com/TqNohmAL0R— ANI (@ANI) November 21, 2025 -
వీడియో: డ్రైవర్కు గుండెపోటు.. వాహనాలపైకి దూసుకెళ్లిన కారు
ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కారు నడుపుతున్న డ్రైవర్కు గుండెపోటు రావడంతో అదుపుతప్పిన పలు వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.ఈ ఘటనపై అంబర్నాథ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) శైలేష్ కాలే తెలిపిన వివరాల ప్రకారం..‘థానే జిల్లాలోని అంబర్నాథ్లో శుక్రవారం రాత్రి ఒక కారు అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. కారు నడుపుతున్న డ్రైవర్కు గుండెపోటు వచ్చిన కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాలపైకి కారు దూసుకెళ్లడంతో డ్రైవర్ సహా నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా పలు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయని తెలిపారు. మృతుల గుర్తింపును నిర్ధారించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం పరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపినట్లు పోలీసులు తెలిపారు.Horrible accident in Maharashtra's Thane caught on camera. A Nexon car lost control and rammed into multiple approaching vehicles. Four people, including the driver of the car, lost their lives in the accident. pic.twitter.com/9rd4UKkuVg— Vani Mehrotra (@vani_mehrotra) November 22, 2025 -
అవమానాన్ని తట్టుకోలేక ఉరేసుకున్నాడు..!
మనుషులు ఇలా కూడా ఉంటారా.. ఇలానే ఉంటారు అనేది కొన్ని సందర్భాల్లో మనకు బోధపడుతూ ఉంటుంది. అవతల వ్యక్తులను బాధపెట్టి, వారు అమితానందాన్ని పొందడం కొంతమందికి అలవాటు. ఒక మనిషిని చచ్చిపోయేంతగా ప్రేరేపించడం అంటే అది మన నైతిక విలువను కోల్పోవడమే. అది ఎంతటి వివాదామైన కావొచ్చు.. మనిషి ఊపిరి తీసుకునేలా ప్రేరేపించడం విలువలు కోల్పోతున్న సమాజానికి నిదర్శనం.మనిషికి ఒక భాష రాకపోతే చచ్చేలా కొట్టి,.. చివరకు చచ్చిపోయేలా ప్రేరేపించిన ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది. హిందీ వర్సెస్ మరాఠీ వివాదం ఎంతో కెరీర్ ఉన్న విద్యార్థి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. అర్నవ్ ఖారే.. వయసు 19 ఏళ్లు. థానేలో ఉంటాడు. ఫస్ట్ ఇయర్ డిగ్రీ సైన్స్ స్టూడెంట్. ప్రతీరోజూ ముంబైలోని ములంద్ ప్రాంతానికి కాలేజ్కి వెళ్తూ వస్తున్నాడు. కాలేజ్కి వెళ్తున్నాడు.. కానీ క్లాస్లకు రెగ్యులర్గా హాజరు కావడం లేదు. ఏదో తెలియని అభద్రతా భావం అతనిలో . అందుకే కాలేజ్లకు డుమ్మూ కొడుతూ వస్తున్నాడు. దీనికి కారణం అవమానం అనే ‘మహమ్మారి. కాలేజ్తో పాటు, తాను రోజూ ప్రయాణించే ట్రైన్లో సైతం అవమానాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాడు. తనకు మరాఠీ రాదనే తోటి, సాటి వారు రోజూ ఎగతాళి చేయడం, టార్చర్ పెట్టడం భరించలేకపోతున్నాడు. ఒక రోజైతే ఆ విద్యార్థిని ట్రైన్లో కొట్టారు,. ‘వీడికి మరాఠీ రాదు’ అంటూ చివరికి చేయి కూడా చేసుకున్నారు పలువురు ప్రబుద్ధులు. దాంతో ములంద్ వెళ్లాల్సిన ఆ యువకుడు నెక్స్ట్ స్టేషన్లో దిగిపోయాడు. అదే విషయాన్ని తండ్రికి ఫోన్లో చెప్పాడు. ఆపై ఇంటికి వచ్చేసి ఉరేసుకున్నాడు. తండ్రి తన డ్యూటీ ముగించకుని వచ్చేసరికి విగతా జీవిలా ఇంట్లో ఉరేసుకుని కనిపించాడు. ఇది తండ్రి జిజేంద్ర ఖైరేకు మనోవేదనను తీసుకొచ్చింది. భాష మాట్లాడలేదని తన కుమారుడిని కొట్టారని, భాష రాకపోవడంతో కాలేజ్లోనే కాకుండా ట్రైన్లోనే అవమానిస్తూ వచ్చారన్నాడు. ఇదే విషయాన్ని తనకు ఫోన్ చేసి చెప్పాడని, ఇంటికొచ్చి ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని రోదిస్తున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఎవర్నీ అరెస్ట్ చేయలేదు. మహారాష్ట్రలో హిందీ–మరాఠీ భాషా వివాదం కొత్తది కాదు. ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్య. అయితే, 2025 ఏప్రిల్ నుండి ప్రభుత్వం పాఠశాలల్లో మరాఠీని రాష్ట్ర భాషగా తప్పనిసరి చేసి, హిందీని మూడో భాషగా పెట్టిన నిర్ణయం తర్వాత వివాదం మళ్లీ తీవ్రరూపం దాల్చిందిమరాఠీ వర్సెస్ హిందీ వివాదంపై తాజాగా చోటు చేసుకున్న హింసాత్మక సంఘటన ఇది. గత నెలలో విమానంలో ముంబైకి వెళ్తున్న ఒక ప్రయాణికుడు.. మరొక ప్రయాణికుడ్ని మరాఠీలో మాట్లాడమని బలవంతం చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. -
మారువేషాల్లో తనిఖీలు.. దురుసు డ్రైవర్లకు చెక్
దాదర్: ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తూ ఇష్టరాజ్యమేలుతున్న ట్యాక్సీ డ్రైవర్లపై ముంబై ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ) అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో నియమాలు ఉల్లంఘించిన 3,176 మంది ట్యాక్సీ డ్రైవర్ల నుంచి రూ.51.24 లక్షల జరిమానా వసూలు చేశారు. ప్రయాణికుల నుంచి ఆర్టీవో హెల్ప్లైన్కు (Helpline) వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ డ్రైవ్ చేపట్టినట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ఎక్కువ చార్జీల వసూలు.. దురుసు ప్రవర్తన దేశ వాణిజ్య రాజధాని ముంబైలో సుమారు 30–35 వేల ట్యాక్సీలున్నాయి. ఇందులో కొన్ని సొంతంగా యజమానులే నడిపేవి కాగా మరికొందరు డ్రైవర్లకు బాధ్యతలు అప్పగిస్తారు. అయితే అనేక మంది డ్రైవర్లు సమీప దూరాలకు కిరాయి నిరాకరిస్తారు. మరికొందరు తమకు అనుకూలంగా, గిట్టుబాటు అయ్యే విధంగా ఉన్న కిరాయిలను మాత్రమే స్వీకరిస్తారు. ఇలాంటి డ్రైవర్ల వల్ల సామాన్యులు, వృద్ధులు, ఆస్పత్రులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురతున్నారు.ఉదయం విధులకు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు ట్యాక్సీలు దొరక్క సతమతమవుతున్నారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో కూడా ఇదే పరిస్ధితి. సమీప కిరాయి అనే సరికి ట్యాక్సీ డ్రైవర్లు (Taxi Drivers) నిరాకరిస్తున్నారు. కొందరైతే ఆగకుండా దూసుకెళుతున్నారు. ఇలాంటి ట్యాక్సీ డ్రైవర్లకు ముకుతాడు వేయాలని 2022లో ఆర్టీఓ వివిధ ప్రదేశాలు, రైల్వే స్టేషన్ల బయట ట్యాక్సీ స్టాండ్లు ఏర్పాటు చేసింది. అక్కడ ఒక ఆర్టీవో అధికారి, సిపాయి నియమించడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. అయితే రోడ్లపై నిలబడి ట్యాక్సీల కోసం ఎదురుచూసే సామాన్యప్రజల వెతలు వర్ణనాతీతంగా ఉన్నాయి.మారువేషాల్లో తనిఖీలుఅత్యవసర సమయంలో ట్యాక్సీలు దొరకడం లేదు. ఒకవేళ దొరికినా సమీప కిరాయి అంటే కనీసం వాహనం ఆపకుండానే ముందుకు వెళుతున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు ఆర్టీవో ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. అధికారులు బృందాలుగా ఏర్పడి మారువేషాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీరు సాధారణ ప్రయాణికుల్లాగా వ్యవహరిస్తూ కిరాయి నిరాకరించిన డ్రైవర్లను పట్టుకుంటున్నారు. అంతేగాకుండా ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ట్యాక్సీ డ్రైవర్ల దూకుడు తగ్గడం లేదు.చదవండి: కూతురి కలను నిజం చేసిన నాన్న!దీంతో ఇలాంటి వారికి ముకుతాడు వేసేందుకు అదనంగా ప్రత్యేక బలగాలను, ప్లయింగ్ స్కాడ్లను మోహరించాలని ఆర్టీవో నిర్ణయించింది. తనిఖీలతోపాటు ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదులను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ట్యాక్సీ డ్రైవర్ల ఆగడాలకు బ్రేక్ వేయాలంటే బాధితులు కచ్చితంగా ఫిర్యాదు చేయాలని ఆర్టీవో అధికారులు సూచించారు. లేదా తమ అసౌకర్యం గురించి వివరిస్తూ మొబైల్ ఫోన్లో ట్యాక్సీ, డ్రైవర్ ఫోటో తీసి ఆర్టీవో వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచిస్తున్నారు. -
ఆలస్యంగా వచ్చినందుకు గుంజీలు.. ప్రాణాలు కోల్పోయిన బాలిక
పాల్ఘార్: స్కూలుకు ఆలస్యంగా వచ్చిందనే కారణంతో టీచర్లు ఆరో తరగతి బాలికతో వంద గుంజిళ్లు తీయించారు. తీవ్ర అనారోగ్యానికి గురైన బాలిక వారం తర్వాత చనిపోయింది. మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. వసాయ్ ప్రాంతంలోని సతివలికి చెందిన అన్షిక గౌడ్, మరో నలుగురు ఈ నెల 8న స్కూలుకు ఆలస్యంగా వెళ్లారు.ఇందుకు శిక్షగా స్కూల్ టీచర్, బ్యాగు సహా తలా 100 గుంజీలు తీయించింది. తీవ్ర అనారోగ్యానికి గురైన అన్షిక ముంబైలోని ఓ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచింది. టీచర్ విధించిన అమానవీయ శక్షే తన బిడ్డ ప్రాణాలు తీసిందని ఆమె తల్లి ఆరోపించింది. తీవ్రమైన మెడ, వీపు నొప్పితో ఆమె అల్లాడిందని ఆవేదన చెందింది. ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. టీచర్ విధించిన శిక్ష బాలిక ప్రాణాలు తీసిందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టామని, బాధ్యులని తేలితే చర్యలు తీప్పవని బీడీవో పాండురంగ్ తెలిపారు. -
ఈ బడి నిండా బోసినవ్వుల అవ్వలే!
అక్కడి బడిలో చదివేది అంతా 60 నుంచి 90 ఏళ్ల వయసు మధ్య ఉన్న అవ్వలే. అందరూ గులాబీ రంగు చీరలు యూనిఫామ్లా ధరించి.. స్కూల్ బ్యాగులతో హుషారుగా క్లాసులకు హాజరవుతుంటారు. పాఠాలు వింటూనే మధ్య మధ్యలో తమకు వచ్చిన.. నచ్చిన పాటలు పాడుకుంటూ, డ్యాన్సులు వేసుకుంటూ హుషారుగా గడుపుతుంటారు. అందుకే ఈ అవ్వల బడి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తమ చిన్నతనంలో చదువుకోలేకపోయామే అన్న బాధలో ఉన్న అవ్వలే వీళ్లంతా. అలాంటి వాళ్లు తమ కలను నెరవేర్చుకునేందుకు వీలుగా యోగేంద్ర బంగార్ అనే వ్యక్తిని ఈ బడిని స్థాపించారు. నిత్య విద్యార్థి అనే మాటకు వందకు వంద శాతం న్యాయం చేసేందుకు వాళ్లంతా బడి బాట పట్టి ఓనమాలు దిద్దుతున్నారు. మహారాష్ట్రలోని ముర్బాద్ సమీపంలోని ఫాంగ్నే గ్రామంలో ఉంది ఈ అవ్వల బడి. ఇక్కడ ప్రతి శనివారం, ఆదివారం ఈ దృశ్యం కనిపిస్తుంది. చేతిలో స్కూల్ బ్యాగులు పట్టుకుని నవ్వుతూ క్లాసులకు హాజరవుతుంటారు వాళ్లంతా. అజ్జిబాయ్ చీ శాలా(Aajibai Chi Shala)గా పేరున్న ఈ బడిని.. ఉచితంగా ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. విద్యకు వయస్సు అడ్డుకాదు అనే ఫిలాసఫీని యోగేంద్ర ఇక్కడ అన్వయింపజేశారు. ఈ బడి నిండా బోసినవ్వులు అవ్వలు.. చదువు పట్ల తపనతో నేర్చుకోవడం అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. ఏ వయస్సులోనైనా కొత్తగా నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులో ఉండాలి అనే సందేశంతో ఈ అద్భుత దృశ్యాలను చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.“आजीबाईची शाळा” (Aajibai chi shala) या वाक्प्रचाराचा अर्थ आहे ‘आजीबाईंसाठीची शाळा’. याचा उपयोग अशा एका उपक्रमासाठी केला जातो, जिथे ६० ते ९० वयोगटातील महिलांना शिकण्याची संधी मिळते, ज्यामुळे त्यांची दीर्घकाळापासूनची शिक्षणाची स्वप्ने पूर्ण होऊ शकतात.📍 मुरबाड, महाराष्ट्र… pic.twitter.com/ieKteWnz9r— बृहन्महाराष्ट्र मराठी मंडळ (@RetweetMarathi) November 12, 2025ఈ వీడియోపై నెటిజన్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.‘‘ సోషల్ మీడియాలో నేను చూసిన అత్యుత్తమ దృశ్యం అని ఒకరు కామెంట్ చేయగా.. ఇది చూసినప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోయింది అని మరొకరు.. దేవుడా.. చాలా ఆనందంగా ఉంది’’ అని మరొకరు కామెంట్లు చేశారు. -
నెట్టింట భయానక వీడియో.. అధికారుల వార్నింగ్
భవిష్యత్తు సాధనంగా భావించే కృత్రిమ మేధస్సు (AI).. నాణేనికి రెండోవైపులా భయానక పరిస్థితులను కూడా సృష్టిస్తోంది. ప్రధానంగా అశ్లీలతను పెంపొందించే కంటెంట్ సృష్టిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. దీనికి తోడు తప్పుడు ప్రచారాలతో జనాలను తప్పుదోవ పట్టించడంలో ముందు ఉంటోంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఆ జాబితాలోనిదే.. ఏఐ ఆధారిత వీడియోలు, ఫోటోలు, వాయిస్లు.. ఇప్పుడు ఇవన్నీ నిజాన్ని వక్రీకరించే సాధనాలుగా మారుతున్నాయి. ఈ దెబ్బకు ఏది నిజమో.. ఏది అబద్ధమో గుర్తు పట్టలేని స్థితికి మనిషి చేరుకుంటున్నాడు. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేలా, సమాజాన్ని గందరగోళంలోకి నెట్టేలా ఏఐ వినియోగం పెరుగుతోంది. ఇటీవల మహారాష్ట్ర చందద్రాపూర్ జిల్లాలోని బ్రహ్మపురిలో జరిగిన ఓ ఘటన తాలుకా వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వైరల్ వీడియో సారాంశం ఏంటంటే.. అక్టోబర్ 31వ తేదీన.. అటవీశాఖకు చెందిన అతిథి గృహం బయట ఓ వ్యక్తి కాపలాగా ఉన్నాడు. ఆ సమయంలో ఓ పెద్దపులి వచ్చి అతనిపై దాడి చేసి నోట కరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే.. వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఆ వీడియో ఒరిజినల్ది కాదని అధికారులు స్పష్టం చేశారు. అది అసలైన వీడియో కాదు, AI ద్వారా రూపొందించబడినదని, ఆ ప్రచారాన్ని నమ్మొద్దంటూ స్పష్టం చేశారు. ఈ వీడియోను క్రియేట్ చేసిన వాళ్లతో పాటు సర్క్యులేట్ చేసిన వాళ్లపైనా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.ఈ ఘటన ఏఐ వినియోగం ఎంత ప్రమాదకరంగా మారిందో చాటిచెప్పింది. ఇలాంటి సాంకేతికతలు సాధనంగా ఉండాలే తప్ప సాధనంగా మారకూడదని, ప్రజల భద్రత, నైతికత, నిజాయితీకి భంగం కలిగించేలా ఏఐ వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందనే అభిపప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.सीसीटीवी रिकॉर्डिंग at ब्राह्मपुरी फारेस्ट गेस्ट हाउस. (चंद्रपुर डिस्ट्रिक)👇👇👇 pic.twitter.com/d4SGS2Fu6N— Himmu (@Himmu86407253) November 7, 2025AI వల్ల కలిగే ప్రమాదాలు:• నకిలీ వీడియోలు: నిజమైనవిగా ప్రచారం చేయడం ద్వారా భయాన్ని, అవమానాన్ని, రాజకీయ అస్థిరతను కలిగించే అవకాశం• డీప్ఫేక్ టెక్నాలజీ: ప్రముఖుల ముఖాలు, వాయిస్లు మార్చి తప్పుడు సమాచారం సృష్టించడం• సామాజిక గందరగోళం: ప్రజలు నమ్మకాన్ని కోల్పోవడం, అధికారిక ప్రకటనలపై అనుమానం కలగడం ప్రజలకు సూచనలు:• ధృవీకరించని వీడియోలు, ఫోటోలు షేర్ చేయవద్దు• అధికారిక వనరుల ద్వారా సమాచారం ధృవీకరించుకోవాలి -
కుమారుడిపై కుంభకోణం కేసు.. అజిత్ పవార్ రియాక్షన్
ముంబై: ప్రభుత్వ భూమిని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కుమారుడి సంస్థకు కట్టబెట్టడం వివాదాస్పదం కావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే సంబంధిత తహశీల్దార్పై సస్పెండ్ వేటు వేసిన ప్రభుత్వం, తాజాగా రూ.300 కోట్ల విలువైన ఆ భూ విక్రయ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ విషయాన్ని అజిత్ పవార్ శుక్రవారం మీడియాకు తెలిపారు.అంతకుముందు, ఆయన సీఎం ఫడ్నవీస్తో అజిత్ పవార్ సమావేశమయ్యారు. ‘పుణె నగరంలోని మౌజె ముంధ్వా ప్రాంతంలో ఉన్న ఆ 40 ఎకరాల భూమి ప్రభుత్వ ఆస్తి. దానిని విక్రయించరాదు. ఈ విషయం తన కుమారుడు పార్థ పవార్కు, అతడి వ్యాపార భాగస్వామి దిగ్విజయ్ పాటిల్కు తెలియదు. భూ విక్రయం, రిజిస్ట్రేషన్ వెనుక ఎవరున్నారనేది దర్యాప్తులోనే తేలుతుంది. ఆ భూమిని పార్థకు చెందిన సంస్థకు విక్రయించాలంటూ ప్రభుత్వం ఒత్తిడి చేయలేదు’అని అజిత్ పవార్ వివరించారు. భూ రిజిస్ట్షేషన్ కోసం రిజిస్టార్ ఆఫీసుకు వెళ్లిన ముగ్గురిలో తన కుమారుడు లేడన్నారు.Modi has surrounded himself with masters of corruption and nepotism.Modi survives by Vote Chori and thrives by the loot it gives in power. https://t.co/nw6KTwpWXW pic.twitter.com/qsOTmjS0o5— Srivatsa (@srivatsayb) November 7, 2025కేవలం భూ ఒప్పందం మాత్రమే జరిగిందని చెప్పిన ఆయన.. భూ బదిలీ, చెల్లింపులు చేయలేదని చెప్పారు. ఈ సేల్డీల్ను రద్దు చేయాలంటూ సంబంధిత అధికారులకు తిరిగి పత్రాలను పంపించారని చెప్పారు. ఈ విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ప్రభుత్వ భూమిని అనధికారికంగా రిజిస్ట్రేషన్ చేసిన ఈ మొత్తం వ్యవహారంపై అదనపు ప్రధాన కార్యదర్శి వికాస్ ఖర్గే సారథ్యంలోని బృందం దర్యాప్తు చేపట్టనుందని డిప్యూటీ సీఎం తెలిపారు.ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టాన్ని కూడా ఈ బృందం అంచనా వేసి నెలరోజుల్లో నివేదిక అందిస్తుందని పేర్కొన్నారు. అయితే, ఈ భూమి మార్కెట్ విలువ రూ.1,800 కోట్ల వరకు ఉంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దళితులకు కేటాయించిన ఆ భూమిని ప్రభుత్వం కొట్టేసిందని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. కాగా, ఈ మొత్తం వ్యవహారం డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కనుసన్నల్లోనే జరిగిందని ఉద్యమ కారుడు అన్నా హజారే తప్పుబట్టారు. మరోవైపు.. పూణే భూ ఒప్పందంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘పార్టీల మధ్య ఒప్పందం జరిగింది. కానీ డబ్బు మార్పిడి ఇంకా పెండింగ్లో ఉంది. అయితే, రిజిస్ట్రేషన్ ఇప్పటికే పూర్తయింది. రెండు పార్టీలు ఇప్పుడు రిజిస్ట్రీని రద్దు చేయాలని దరఖాస్తు దాఖలు చేశాయి. అయితే, రిజిస్ట్రేషన్ రద్దు చేయడానికి వారు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. తదనుగుణంగా వారికి నోటీసు జారీ చేయబడింది. ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటారు. అవకతవకలపై దర్యాప్తు జరుగుతోంది. బాధ్యులపై చర్చలు కచ్చితంగా ఉంటాయి. మొత్తం విచారణ ఒక నెలలోపు పూర్తవుతుంది. దీనిలో ప్రమేయం ఉన్న వారందరినీ గుర్తించి దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.Nagpur | On the Pune land deal involving the son of Maharashtra Deputy CM Ajit Pawar, Maharashtra CM Devendra Fadnavis says, "There was an agreement between the parties, but the exchange of money was still pending. However, the registry had already been completed. Both parties… pic.twitter.com/JMggDoKP5Y— ANI (@ANI) November 7, 2025ఇది కూడా చదవండి: రూ.1800 కోట్ల భూమి 300 కోట్లకే : భగ్గుమన్న భూ కుంభకోణం ఆరోపణలు -
‘నేను బిహార్లో ఓటేశా.. ఇక మీ వంతు..!’
పట్నా: ఆమెది పుణె. కాకపోతే బిహార్లో ఓటు వేసినట్లు ఆమెనే చెబుతోంది., మీరు కూడా బిహార్ వెళ్లి ఓటు వేయండి అని కూడా స్పష్టం చేసింది. ఆమె పేరు ఊర్మి. ఆమె ఒక న్యాయవాది. కాకపోతే బిహార్ తొలిదశ ఎన్నిక తర్వాత ఆమె షేర్ చేసిన ఫోటోపై రాజకీయ దుమారం రేగుతోంది. ‘ఎక్స్’ వేదికగా ఆమె పోస్ట్ చేసిన ఫోటో అనేక ప్రశ్నలకు తావినిస్తోంది. నిజంగానే బిహార్లో ఆమె ఓటు వేసిందా?.. లేక ఇది డ్రామానా? అనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తే కానీ తెలియదు.దీనిపై కాంగ్రెస్ మండిపడుతోంది. మల్లీ స్టేట్ వోటింగ్ అనేది బీజేపీకి న్యూ స్టార్టప్నే కాదు.. కొత్త పెట్టుబడి దారు కూడా అంటూ ఆ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ రేష్మ అలమ్ విమర్శించారు. లోక్సభ ఎన్నికలకు మహారాష్ట్రలో ఓటు వేసిన ఆమె.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల కోసం బిహార్లో ఓటు వేసిందని, ఇది ఓట్ చోరీ కాక మరేమిటని మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అతుల్ లోందే పాటిల్ ద్వజమెత్తారు. Voted for a Modi-fied India! 🇮🇳Jaai ke Vote daali, Bihar! pic.twitter.com/kkWMwShqSh— Urrmi (@Urrmi_) November 6, 2025 ఈ ఫోటోపై ఓటరు గుర్తింపు, నివాస ప్రమాణాలు, ఎన్నికల నిబంధనలు ప్రకారం విచారణ జరగవలసిన అవసరం ఉంది. దీనిపై ఎన్నికల సంఘం స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. ఇటీవల ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బ్రెజిలియన్ మోడల్ ఫోటోతో హర్యానాలో పలు ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. ఇప్పుడు బిహార్ ఎన్నికకు సంబంధించి తాజా ఫోటో వైరల్ కావడంతో ఎన్నికల పారదర్శకతకు సంబంధించి అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.लोकसभा में महाराष्ट्र में वोट करूंगी विधानसभा में बिहार में वोट करूंगी मोदी के लिए वोट चोरी करूंगी 🧐🧐 pic.twitter.com/xDrrLoXMbj— Atul Londhe Patil (INDIA Ka Parivar)🇮🇳 (@atullondhe) November 6, 2025ఇవీ కూడా చదవండి: ‘పిచ్చి పని’.. కంగుతిన్న మోడల్ఈసీపై రాహుల్ హైడ్రోజన్ బాంబు -
రూ.1800 కోట్ల భూమి 300 కోట్లకే : భగ్గుమన్న భూ కుంభకోణం ఆరోపణలు
పుణే: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్థ పవార్ కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడ్డాడంటూ ఆరోపణము భగ్గుమన్నాయి. ఈ కుంభకోణంలో అజిత్ పవార్ కుమారుడి హస్త ఉందన్న ఆరోపణల నేపత్యంలమహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభించింది.1800 క కోట్ల రూపాయల విలువైన భూమిని రూ.300 కోట్లకే విక్రయించారన్న కేసులో ఒక రెవెన్యూ అధికారిని మహారాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. విచారణ కమిటీకి అదనపు చీఫ్ సెక్రటరీ (రెవెన్యూ) వికాస్ ఖర్గే సారథ్యం వహించనున్నా రు. కమిటీ తుది నివేదిక ఎనిమిది రోజుల్లోగా వచ్చే అవకాశం ఉంది.ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) రూ.1,800 కోట్ల ఆస్తి లావాదేవీలో తీవ్రమైన అవకతవకలను వివరిస్తూ మధ్యంతర నివేదికను సమర్పించిన తర్వాత, పార్థ్ పవార్ పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూ కుంభకోణంపై మహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఇది చాలా తీవ్రమైన విషయమని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పుణేకు చెందిన తహసీల్దార్ సూర్యకాంత్ యెవా లెను సస్పెండ్ చేశారు. బీజేపీ, అజిత్ పవార్కు చెందిన ఎన్సీపీ, ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేతో కూడిన సంకీర్ణ ప్రభుత్వంపై ప్రతిపక్ష మహాయుతి తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పుణేలోని ముంధ్వారాలో ఉన్న 40 ఎకరాల ప్రభు త్వ భూమిని రూ.300 కోట్ల కు పార్థసారథి భాగ స్వామిగా ఉన్న ఓ ప్రైవేట్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా అమ్మేశారన్నది ప్రధాన ఆరోపణ. అలాగే రూ. 21 కోట్ల స్టాంప్ డ్యూటీని కేవలం రూ. 500 కు తగ్గించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ డీల్ విలువ రూ. 300 కోట్లు అయినప్పటికీ, పన్నులతో సహా మొత్తం చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ దాదాపు రూ. 21 కోట్లు ఉండాలని అదికారులు తెలిపారు. -
కలిసి కనిపించారు.. ఇక అంతే!
బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్, మహారాష్ట్రకు చెందిన యువ రాజకీయ నేత ఆదిత్య ఉద్ధవ్ ఠాక్రే ఓ రెస్టారెంట్లో కలిసి కనిపించారు. ఇంకేముంది వారిద్దరూ కలిసివున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral) అయ్యాయి. వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందన్న గుసగుసలు మొదలైపోయాయి. జనాలు ఊహించినట్టుగా వారిద్దరి మధ్య ఏం లేదని తెలుస్తోంది.మంగళవారం సాయంత్రం ముంబైలోని బాంద్రాలోని ఒక రెస్టారెంట్లో భూమి పడ్నేకర్, ఆదిత్య ఠాక్రే (Aditya Thackeray) కలిసి కనిపించారు. వీరిద్దరితో పాటు మరికొందరు సన్నిహితులు కూడా ఉన్నారు. కాబట్టి వారిద్దరూ డేట్కి వెళ్లలేదని క్లియర్గా అర్థమవుతుంది. వీళ్లంతా ఎందుకు రెస్టారెంట్లో కలిశారనే ప్రశ్నకు సమాధానం కూడా ఉంది.యంగ్ గ్లోబల్ లీడర్స్ (YGL) సభ్యుల కోసం భూమి పడ్నేకరే (Bhumi Pednekar) ఈ విందు ఏర్పాటు చేసిందట. ఆదిత్య ఠాక్రే, క్రిస్టర్ క్జోస్లతో పాటు పలువురు ఈ విందులో పాల్గొన్నారు. పార్టీ ముగిసిన తర్వాత బయటకు వస్తున్న క్రమంలో మీడియా ప్రతినిధులు వీరి వెంటపడ్డారు. ఇదీ అసలు విషయం. భూమి, ఆదిత్యను ఒకే చోట చూసి జనాలు మాత్రం ఏదేదో ఊహించేసుకుంటున్నారు.మొదటి భారతీయ నటిభూమి పడ్నేకర్ గురించి చెప్పాలంటే ఆమె నటకు మాత్రమే పరిమితం కాలేదు. వాతావరణ పరిరక్షణకు తన వంతు పాటుపడుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) యంగ్ గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీలో సభ్యురాలిగా కూడా ఉంది. ఈ సంవత్సరం సెప్టెంబర్లో, జెనీవాలో జరిగిన యంగ్ గ్లోబల్ లీడర్స్ సమ్మిట్లో పాల్గొంది. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ నటిగా ఆమె నిలిచింది.చూడండి: 'ది ఫ్యామిలీ మ్యాన్-3' యాక్షన్ ట్రైలర్ఇమ్రాన్ ఖాన్తో మూవీఇక సినిమాల విషయానికొస్తే.. ఇమ్రాన్ ఖాన్తో కలిసి ఒక మూవీ చేస్తోంది. ఈ సినిమా 2026 ప్రారంభంలో నెట్ఫ్లిక్స్లో ప్రీమియర్ అవుతుందని సమాచారం. పదేళ్లకు పైగా నటనకు దూరంగా ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మళ్లీ ఈ చిత్రంతో పునరాగమనం చేస్తున్నాడు. 2015లో విడుదలైన 'కట్టి బట్టి' తర్వాత చేస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. భూమి పడ్నేకర్ నటించిన 'మేరే హస్బెండ్ కీ బీవీ' ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. Hello gorgeous 😍 Bhumi Pednekar looks stunning in an all black loook@bhumipednekar Video #PallavPaliwal #bhumipednekar #bollywood #styleicon #allblacklook #celebritystyle #fashiongoals #bollywoodbeauty #paps #bollywoodfashion #stunning pic.twitter.com/FLfbE7hFlG— HT City (@htcity) November 5, 2025 -
సంజయ్ రౌత్కు ఏమైంది?
ముంబై: శివసేన (UBT) సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో తన అభిమానులకు, మద్దతుదారులకు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మరోవైపు.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.అంతకుముందు, ఎంపీ సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా..‘అకస్మాత్తుగా తన ఆరోగ్యం క్షీణించిందని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో త్వరలోనే కోలుకుంటాననే గట్టి నమ్మకం తనకు ఉందని చెప్పారు. తన పట్ల చూపిస్తున్న ప్రేమ, నమ్మకానికి కృతజ్ఞతలు చెప్పారు. కొత్త సంవత్సరంలో అందరినీ తప్పక కలుసుకుంటాను’ అని చెప్పుకొచ్చారు. అయితే, కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని, పర్యటనలకు దూరంగా ఉండాలని వైద్యులు సంజయ్ రౌత్కు సూచించినట్టు సమాచారం.మరోవైపు.. సంజయ్ రౌత్ పోస్టుపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా మోదీ.. ఆయన త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. దీనిపై సంజయ్ రౌత్ స్పందిస్తూ.. గౌరవనీయులైన ప్రధానమంత్రి జీకి ధన్యవాదాలు!. నా కుటుంబం నుంచి మీకు కృతజ్ఞతలు! జై హింద్! జై మహారాష్ట్ర! అని బదులిచ్చారు.ఇదిలా ఉండగా.. సంజయ్ రౌత్ ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు తెలిసింది. కాగా, ఆయన అస్వస్థతకు కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. అయితే గతంలో ఆయన గొంతు సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. धन्यवाद! https://t.co/jQOqgw2foc— Sanjay Raut (@rautsanjay61) October 31, 2025 -
ప్రపంచానికి దారిదీపం భారత్
ముంబై: అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు, వాణిజ్యంలో అంతరాయాలు, సరకు రవాణా గొలుసుల్లో విపరీత మార్పుల వంటి ప్రతికూల పరిణామాల నేపథ్యంలో ప్రపంచానికి భారత్ ఒక స్థిరమైన దారిదీపంగా నిలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, శాంతి, సమగ్రాభివృద్ధికి భారత్ ఒక ప్రతీకగా మారిందని హర్షం వ్యక్తంచేశారు. బుధవారం ముంబైలో ఇండియా మారిటైమ్ వీక్–2025 సందర్భంగా మారిటైమ్ లీడర్స్ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. మహోన్నతమైన రాజ్యాంగం, విశ్వసనీయత అనేవి మన దేశాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని స్పష్టంచేశారు. నేటి అంతర్జాతీయ ఒడిదొడుకుల పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఒక దారిదీపం కోసం ఎదురు చూస్తున్నాయని, తెలిపారు. గొప్ప బలంతో మన దేశం ఆ దారిదీపం పాత్రను పోషిస్తోందని వివరించారు. భారత సముద్రయాన రంగం అత్యధిక వేగం, శక్తితో ముందుకు దూసుకెళ్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో మన ఓడరేవులు గొప్ప సామర్థ్యం కలిగినవిగా గుర్తింపు పొందాయని వెల్లడించారు. మన సముద్రయానం, వాణిజ్య కార్యక్రమాలు విస్తృతమైన దార్శనికతలో భాగమని చెప్పారు. భవిష్యత్తులో నూతన వాణిజ్య మార్గాలకు ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్ ఒక ఉదాహరణ అని స్పష్టంచేశారు. రాబోయే 25 ఏళ్లు అత్యంత కీలకం బ్రిటిష్ కాలం నాటి నౌకాయాన చట్టాలను రద్దు చేశామని, 21వ శతాబ్దానికి అవసరమైన నూతన చట్టాలను ప్రవేశపెట్టామని ప్రధాని మోదీ గుర్తుచేశారు. దీంతో స్టేట్ మారిటైమ్ బోర్డులు మరింత బలోపేతం అయ్యాయని, పోర్ట్ మేనేజ్మెంట్లో డిజిటల్ టెక్నాలజీకి ప్రాధాన్యం లభిస్తోందని తెలియజేశారు. మారిటైమ్ ఇండియా విజన్లో భాగంగా 150 ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. దీనివల్ల సముద్రయాన రంగంలో గణనీయమైన పురోగతి సాధ్యమవుతోందని వెల్లడించారు. మనదేశంలోని ప్రధానమైన ఓడరేవుల సామర్థ్యం రెండు రెట్లు పెరిగిందన్నారు. క్రూయిజ్ టూరిజం గొప్పగా వృద్ధి చెందుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఓడల్లో సరుకు రవాణా 700 శాతానికిపైగా పెరిగిందన్నారు. ప్రధానమైన జల రవాణా మార్గాల సంఖ్య 32కు చేరిందన్నారు. భారతదేశ అభివృద్ధికి మారిటైమ్ రంగం ప్రధాన చోదక శక్తిగా మారిందని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. 21వ శతాబ్దంలో త్రైమాసికం ముగిసిందని, రాబోయే 25 ఏళ్లు అత్యంత కీలకమని సూచించారు. సముద్ర వనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ, సుస్థిర తీర ప్రాంత అభివృద్ధిపై మరింతగా దృష్టి కేంద్రీకరించాలని స్పష్టంచేశారు. -
శివసేన నేతతో నటి ఎంగేజ్మెంట్ : ఫోటోలు వైరల్
ఇటీవలి కాలంలో సెలబ్రిటీల వెడ్డింగ్ బెల్స్ జోరుగా మోగుతున్నాయి. రానున్న వెడ్డింగ్ సీజన్కు తగ్గట్టుగా అందరూ మూడుముళ్ల వేడుకకు రెడి అవుతున్నారు. తాజాగా మరాఠీ నటి తేజస్విని లోనారి , శివసేన నేత సమాధన్ సరవంకర్ నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని వారు స్వయంగా సోషల్మీడియాలో పంచుకోవడంతో నెట్టింట సందడి నెలకొంది.శివసేన పార్టీ యువతనేత సమాధన్ సరవంకర్ సీనియర్ నేత సదా సర్వాంకర్ పెద్ద కుమారుడు. తేజస్విని లోనారి -సమాధన్ సరవంకర్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. కుటుంబం సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సోమవారం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్గా మారాయి. అటు పార్టీ అభిమానులు, ఇటు ఫ్యాన్స్ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. చక్కటి జంట అంటూ వీరికి అభినందనలు వెల్లువెత్తాయి.తేజస్విని ఎంబ్రాయిడరీ ,జరీ వర్క్తో కలగలిసిన అందమైన ఎరుపు సాంప్రదాయ చీరలో అందంగా మెరిసింది. దీనికి తగ్గట్టు ఆభరణాలు, చేతినిండా గోరింటాకుతో పెళకళతో ఉట్టిపడేలా కనిపించింది. అటు ఎంబ్రాయిడరీ , సీక్విన్ వర్క్తో తయారు చేసిన వైట్ షార్ట్ షేర్వానీలో సమాధన్ శరవంకర్ అందంగా కనిపించాడు.మరాఠీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి తేజస్విని. అనేక టీవీ మరాఠీ సీరియల్స్లో నటించి తనదైన ముద్ర వేసింది. మరోవైపు, సమాధాన్ సారవంకర్ శివసేనకు చెందిన చురుకైన యువ నాయకుడు. ముంబై రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సమధాన్ తండ్రిసదా శరవంకర్ మహీం నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ప్రస్తుతం షిండే గ్రూపురాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. -
వైద్యురాలి మృతి కేసులో మరో ట్విస్ట్.. దీపాలీ రిపోర్టు నిజమేనా?
ముంబై: మహారాష్ట్ర వైద్యురాలి ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైద్యురాలు మృతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా వైద్యురాలి కేసు మరో మలుపు తిరిగింది. తన కుమార్తె మరణానికి సంబంధించి వైద్యురాలు తప్పుడు నివేదిక ఇచ్చిందని సతారా జిల్లాకు చెందిన ఒక మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. చనిపోయిన వైద్యురాలు.. దీపాలీ మారుతీ అనే మహిళ పోస్ట్మార్టం రిపోర్ట్పై దర్యాప్తు చేయాలని ఆమె తల్లి భాగ్యశ్రీ డిమాండ్ చేశారు.కాగా, మహారాష్ట్ర ఓ వైద్యురాలు.. ఎస్ఐ గోపాల్ బడ్నే, ఇంటి యజమాని కుమారుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రశాంత్ బంకర్ తనపై లైంగిక దాడి చేశారని.. మానసిక, శారీరక వేధింపులు కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి వైద్యురాలు ప్రాణాలు తీసుకుంది. అలాగే, తప్పుడు వైద్య నివేదికలు ఇచ్చేలా ఉన్నతాధికారులు, పోలీసులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. రాజకీయ నాయకులు వైద్య నివేదికలు మార్చాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఈ విషయంలో పై అధికారులకు తెలియజేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయింది. దీంతో, ఆమె ఇచ్చిన రిపోర్టులకు సంబంధించి.. పాత కేసుల దర్యాప్తు విషయంలో సందేహాలు ఉన్నట్టు తాజాగా ఓ మహిళ అనుమానాలు వ్యక్తం చేశారు.తాజాగా సతారాకు చెందిన భాగ్యశ్రీ పచాంగ్నే.. తన కుమార్తె దీపాలీ మారుతీ మరణంపై తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపించారు. పోస్టుమార్టం రిపోర్టు మార్చాలని ఒత్తిడి తీసుకురావడంతో వైద్యురాలే రిపోర్ట్ మార్చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, భాగ్యశ్రీ పచాంగ్నే కుమార్తె దీపాలి మారుతిని సైన్యంలో పని చేస్తున్న అజింక్య హన్మంత్ నింబాల్కర్కు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లైన నాటి నుంచి అత్త గారింట్లో దీపాలి.. తీవ్ర మానసిక క్షోభకు గురైంది. అనంతరం, ఆగస్టు 19న దీపాలి మారుతి చనిపోయింది. అల్లుడు ఫోన్ చేసి దీపాలి పరిస్థితి విషమంగా ఉందని బాధితురాలి తల్లికి తెలియజేశాడు. గర్భవతి కాబట్టి మూర్ఛపోయి ఉంటుందని తల్లి భాగ్యశ్రీ భావించింది. కానీ, ఆసుపత్రికి వెళ్లి చూసే సమయానికి దీపాలి చనిపోయి ఉండటం చూసి ఆవేదనకు గురైంది.అయితే, దీపాలి ఆత్మహత్య చేసుకుందని బంధువు ఒకరు తల్లికి తెలిపారు. కానీ, భాగ్యశ్రీ మాత్రం దీపాలి మృతిపై అనుమానం వ్యక్తం చేసింది. మరోవైపు.. దీపాలి మరణం తర్వాత పోస్ట్మార్టం జరిగి ఐదు రోజులైనా నివేదిక ఇవ్వలేదు. నెల రోజుల తర్వాత నివేదిక వచ్చింది. తీరా ఆ నివేదికలో సహజ మరణం అని రావడంతో భాగ్యశ్రీ ఖంగుతిన్నది. ఆ నివేదికపై తల్లి స్పందిస్తూ.. తన కుమార్తె ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదు. దీపాలిని భర్త, అత్తమామలు చంపేశారని నమ్ముతున్నాను. ఆమె ఆరు నెలల గర్భవతి. ఏడాదిన్నర కుమార్తె కూడా ఉంది. నా కుమార్తె ఆత్మహత్య చేసుకోదు అని తెలిపారు. అనంతరం, దీపాలి మృతిపై మళ్లీ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం రిపోర్టుపై అనుమానం వ్యక్తం చేశారు. -
బాలీవుడ్ నటుడు సతీశ్ షా కన్నుమూత
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు, టీవీ కళాకారుడు సతీశ్ షా అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 74 ఏళ్లు. చాలారోజులుగా మూత్ర పిండాల వైఫల్యంతో బాధపడుతున్నారు. ముంబై బాంద్రా ఈస్ట్లోని స్వగృహంలో ఉండగా హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో హిందూజా ఆసుపత్రికి తరలించామని సతీశ్ షా మిత్రుడు అశోక్ పండిట్ చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం సతీశ్ షా తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించారు. సతీశ్ షాను బతికించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని హిందూజా హాస్పిటల్ వర్గాలు తెలియజేశాయి. ఆయనను మూడు నెలల క్రితం మూత్ర పిండాల మారి్పడి శస్త్రచికిత్స జరిగినట్లు మిత్రుడొకరు చెప్పారు. ఆదివారం సతీశ్ షా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మృతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాజోల్, ఫరా ఖాన్, కరణ్ జోహార్, ఆర్.మాధవన్ తదితరులు సతీశ్ షాతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. హాస్యనటుడిగా విశేషమైన గుర్తింపు సతీశ్ షా 1951 జూన్ 25న జని్మంచారు. డిజైనర్ మధు షాను వివాహం చేసుకున్నారు. నటనపై ఆసక్తితో ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్టీఐఐ) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 1978లో అరవింద్ దేశాయ్ కీ అజీబ్ దస్తాన్, 1979లో గామన్, 1981లో ఉమ్రావ్ జాన్ చిత్రాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించారు. 1983లో విడుదలైన జానే భీ దో యారో చిత్రంతో ఆయన పేరు అందరికీ తెలిసింది. అవినీతిపరుడైన మున్సిపల్ కమిషనర్గా ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. టీవీ సీరియళ్లలోనూ సత్తా చాటారు. 1984లో ప్రసారమైన యే జో హై జిందగీలో 55 ఎపిసోడ్లలో 55 భిన్నమైన పాత్రలు పోషించారు. 2000 సంవత్సరంలో ప్రసారమైన సారాభాయ్ వర్సెస్ సారాభాయి సీరియల్ సతీశ్ షాకు విశేషమైన పేరు ప్రఖ్యాతలు తెచి్చపెట్టింది. ఇదే సీరియల్ 2017లో పునఃప్రసారమైంది. పలు బాలీవుడ్ బ్లాక్బస్టర్ చిత్రాల్లో సతీశ్ షా నటించారు. కబీ హా కబీ న, దిల్వాలే దుల్హానియా లే జాయేంగే, మై హూ నా, కల్ హో న హో, ఓం శాంతి ఓం, ఫనా, అఖేలే హమ్ అఖేలే తుమ్, హమ్ ఆప్కే హై కౌన్, ముజ్సే షాదీ కరోగీ, సాతియా, కహో నా ప్యార్ హై, జుడ్వా వంటి చిత్రాల్లో హాస్యరసం పండించి ప్రేక్షకులను అలరించారు. -
‘ ఏ ఒక్కరూ నా కూతుర్ని కాపాడలేకపోయారు’
సతారా: మహారాష్ట్రలోని సతారాలో చోటు చేసుకున్న యువ వైద్యురాలి ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. తన కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం, చేతిపైనే సూసైడ్ నోట్ రాసుకుని బలవన్మరణానికి పాల్పడటంతో ఆమె తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన కూతురు ఎలా చనిపోయిందో అదే తరహాలో నిందితులిద్దరికీ శిక్ష పడాలని వేడుకుంటున్నాడు. ఈ మేరకు మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్కు తన కన్నీటి వ్యథను మీడియా ద్వారా తీసుకెళ్లారు. ‘ నా కూతురు ఎలా అయితే చనిపోయిందో అదే రకంగా వారికి ఉరిశిక్ష పడేలా చేయండి సీఎం సార్, అంతకు మించి నాకు ఇక వేరే న్యాయం ఏమీ అక్కర్లేదు. ఇదే నా డిమాండ్’ అంటూ గద్దగద స్వరంతో విన్నవించాడు‘ నా కూతుర్ని కాపాడటానికి ఎవరూ రాలేదు. అన్యాయం జరుగుతుంటే, అందరూ నిలబడి చూస్తున్నారు. అక్కడ దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఉన్నారు, కానీ ఒక్క కృష్ణుడు కూడా నా కూతురికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. కాబట్టి, భవిష్యత్తులో కూతుళ్ల కోసం, కనీసం ఒక కృష్ణుడు ముందుకు వచ్చి ‘ఆమె’ గౌరవాన్ని కాపాడాలి’ అని కన్నీటి పర్యంతమయ్యాడు. కాగా, మహారాష్ట్రలో ఓ సన్ఇన్స్పెక్టర్ లైంగిక వేధింపులకు ఒక యువ వైద్యురాలు బలైంది. తన ఆవేదనను ఉన్నతాధికారులకు చెప్పుకుందామనుకున్నా ఎవరూ వినిపించుకునే పరిస్థితి లేకపోవటంతో ఉరివేసుకుని తనువు చాలించింది. సతారా జిల్లాలోని ఫాల్హన్ తహసీల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న 28 ఏళ్ల వైద్యురాలు గురువారం రాత్రి ఓ హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడింది. ఈ కఠిన నిర్ణయానికి గల కారణాలను ఆమె తన అరచేయిపై వివరంగా రాసింది. సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బదానే గత ఐదు నెలల్లో తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారని, మానసికంగా వేధిస్తున్నాడని తెలిపింది. తాను నివాసం ఉం టున్న భవనం యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్ కూడా తనను లైంగికంగా, మానసికంగా వేధించాడని సూసైడ్ నోట్లో రాసింది. వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులు ఇద్దరిపై అత్యాచా రం, ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అరచేతిపై సూసైడ్ నోట్ రాసి.. వైద్యురాలి బలవన్మరణం -
అవినీతిలో మహారాష్ట్ర టాప్.. తర్వాత స్టేట్..?
దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే అవినీతిలో మహారాష్ట్ర అగ్రస్ధానంలో ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,875 అవినీతి కేసులు నమోదు కాగా ఒక్క మహారాష్ట్రలోనే ఏకంగా 795 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఈ ఏడాది అక్టోబరు రెండో తేదీ వరకు 530 అవినీతి కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో 785 ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీన్ని బట్టి మహారాష్ట్రలో 28 శాతం అవినీతి కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ వివరాలు నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన జాబితా ద్వారా వెల్లడయ్యాయి. టీఎంసీ డీసీ అవినీతి కేసు సంచలనం థానే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) డిప్యూటీ కమిషనర్ శంకర్ పాటోలేను ఇటీవల అవినీతి కేసులో అరెస్టు చేశారు. ఈ ఘటన థానే, ముంబై సహా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఎన్సీఆర్బీ విడుదల చేసిన అవినీతిపరుల జాబితా మరింత సంచలనం రేపింది. దీంతో విధినిర్వహణలో ఉన్న అధికారులు, మాజీ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు మహారాష్ట్రపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తరువాత స్ధానాల్లో రాజస్ధాన్, కర్ణాటక, గుజరాత్ సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ముడుపులు చెల్లించనిదే సామాన్యుల పనులు జరగవనేది జగమెరిగిన సత్యం. దీంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల గోడలపై అంచం తీసుకోవడం నేరం– ఇవ్వడం కూడా నేరమే అవుతుందని పెద్దపెద్ద అక్షరాలతో రాసిన దృశ్యాలు కనిపిస్తాయి. ఈ విషయం అందరికి తెలిసినా పనుల కోసం లంచం చెల్లించడం పరిపాటిగా మారింది. మరికొందరు అడిగినంత ఆమ్యామ్యా ఇవ్వలేక, అవినీతిని ప్రొత్సహించలేక అవినీతి నిరోదక శాఖ (ఏసీబీ) అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.వారు పథకం ప్రకారం కాపు కాస్తారు. ఆ తరువాత లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కేసులు నమోదు చేస్తారు. ఆ తరువాత వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెడతారు. ఇలా దేశవ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలను ఏసీబీ అధికారులు ఎన్సీఆర్బీకి నివేదిస్తారు. రాష్ట్రాల వారీగా అవినీతి కేసుల సంఖ్యను విడివిడిగా తెలియజేస్తారు. ఇందులో భాగంగా ఇటీవల ఎన్సీఆర్బీ విడుదల చేసిన అవినీతి, లంచం కేసులకు సంబంధించి దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర (Maharashtra) అగ్రస్ధానంలో ఉంది.ఈ నివేదిక ప్రకారం ఈ ఏడాది మహారాష్ట్రలో 795 కేసులు నమోదుకాగా ఆ తరువాత స్ధానంలో రాజస్ధాన్ (284), మూడో స్ధానంలో కర్ణాటక (245), నాలుగో స్ధానంలో గుజరాత్ (183) ఉన్నాయి. అయితే మహారాష్ట్రలోని వివిధ నగరాలు, జిల్లాల వారీగా పరిశీలిస్తే ముంబై, థానే సహా నాసిక్, పుణే, ఛత్రపతి సంభాజీనగర్ అవినీతిలో టాప్లో ఉన్నాయి. అక్కడ ఒక్క అవినీతి కేసు లేదు!ఈశాన్య భారతంలో ఉన్న ఎనిమిది రాష్ట్రాలలో అస్సాం, సిక్కిం (Sikkim) మినహా అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, త్రిపుర, నాగాలాండ్లలో ఒక్క అవినీతి కేసు నమోదు కాలేదు. కాగా అస్సాంలో 91, సిక్కింలో కేవలం ఒక్కటే అవినీతి కేసు నమోదైనట్లు ఎన్సీఆర్బీ నివేదిక (NCRB Report) వెల్లడించింది.చదవండి: ఇదేం విచిత్రం.. చెట్లకు సెల్ఫోన్లు ఎందుకు? -
Maharashtra: ‘పలుమార్లు ఎస్ఐ అఘాయిత్యం’.. వైద్యురాలి సూసైడ్ నోట్లో ‘దారుణాలు’
ఫల్టన్: మహారాష్ట్రలోని ఫల్టన్కు చెందిన మహిళా వైద్యురాలి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆత్మహత్యకు ముందుకు ఆమె రాసిన లేఖ అందరినీ కదిలింపజేస్తోంది. తనపై ఎస్సై గోపాల్ బాద్నే నాలుగుసార్లు అత్యాచారం చేశాడని మృతురాలు లేఖలో పేర్కొంది. నాలుగు పేజీల సూసైడ్ లేఖలో..మహారాష్ట్రలో చోటుచేసుకున్న యువ మహిళా డాక్టర్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.ఈ ఘటనపై ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. చనిపోయేముందు ఆమె తన అరచేతిపై సూసైడ్ లేఖ రాసుకున్నారు. అలాగే అంతకుముందు రాసిన నాలుగు పేజీల ఆత్మహత్య లేఖ బయటపడటంతో మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి. ఆ లేఖలో ఆమె తనపై ఎస్ఐ గోపాల్ బాద్నే ఐదు నెలల్లో నాలుగు సార్లు అత్యాచారం చేశాడని ఆరోపించారు.ఎంపీతోపాటు అతని పీఏల ప్రమేయం?అలాగే ఆ లేఖలో ఆమె ఓ ఎంపీతోపాటు అతని పీఏలపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. వారు తనను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా హింసించినట్లు పేర్కొన్నారు. పోలీసు కేసుల్లోని పలువురు నిందితులకు నకిలీ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని పోలీసులతో పాటు ఒక ఎంపీ, అతని సహాయకులు తనపై ఒత్తిడి తీసుకువచ్చారని వైద్యురాలు ఆరోపించారు. అందుకే తాను తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వైద్యురాలు ఆ లేఖలో పేర్కొన్నారు. ఫల్టాన్ రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బాద్నే తనపై నాలుగుసార్లు అత్యాచారం చేశాడని.. 5 నెలలకు పైగా శారీరక, మానసిక వేధింపులకు గురి చేశాడని ఆమె ఆ లేఖలో వివరించారు. ఇక దీనిపై ఫల్టాన్ సబ్ డివిజనల్ ఆఫీస్ డీఎస్పీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసినా పట్టించుకోలేదని ఆరోపించారు. పోలీసు అధికారి సస్పెండ్బాధిత వైద్యురాలు గత 23 నెలలుగా ఇదే ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు. నెల రోజుల తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని అభ్యసించాలని ఆమె భావించారు. అయితే ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. కాగా వైద్యురాలు ఆ లేఖలో తన ఇంటి యజమాని ప్రశాంత్ బంకర్పై కూడా పలు ఆరోపణలు చేశారు. ఈ ఘటనలో పోలీసులు.. ఎస్సై గోపాల్ బాద్నే, ఇంటి యజమాని బంకర్పై కేసు నమోదు చేశారు. ఎస్సై గోపాల్ బాద్నేను సస్పెండ్ చేశారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాల మేరకు దర్యాప్తు చేస్తున్నామని, ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారిని సస్పెండ్ చేశామని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కొల్హాపూర్ డివిజన్) సునీల్ ఫులారి చెప్పినట్లు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు.పోలీసులను కాపాడుతున్న ‘మహాయతి’: కాంగ్రెస్ఈ కేసు రాజకీయంగా దుమారం రేపుతోంది. రాష్ట్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. బీజేపీ నేతలంతా పోలీసులను కాపాడుతున్నారని ఆరోపించింది.‘రక్షకుడే వేటగానిగా మారినప్పుడు.. న్యాయం ఎలా జరుగుతుంది? బాధిత వైద్యురాలు గతంలో ఫిర్యాదు చేసినా, ఈ కేసులో ఎందుకు చర్యలు తీసుకోలేదు? మహాయుతి ప్రభుత్వం పోలీసులను కాపాడుతోంది. ఫలితంగా పోలీసుల దురాగతాలు పెరుగుతున్నాయి’ అంటూ కాంగ్రెస్ నేత విజయ్ నామ్దేవ్రావ్ వాడేట్టివార్ ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు.‘క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తాం’‘ఈ సంఘటన దురదృష్టకరం, నేను సతారా పోలీసు సూపరింటెండెంట్తో మాట్లాడాను. వైద్యురాలు ఫిర్యాదు చేశారని, అయితే ఎటువంటి చర్య తీసుకోలేదని మా దృష్టికి వచ్చింది. కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తాం. మహిళలు ఇటువంటి ఫిర్యాదులను నమోదు చేయడానికి 112 హెల్ప్లైన్ను ఉపయోగించాలి. వెంటనే చర్యలు తీసుకుంటాం’ అని బీజేపీ మహిళా నేత చిత్ర వాఘ్ పేర్కొన్నారు. -
అరచేతిపై సూసైడ్ నోట్ రాసి... వైద్యురాలు బలవన్మరణం
సతారా: మహారాష్ట్రలో ఓ సబ్ఇన్స్పెక్టర్ లైంగిక వేధింపులకు ఒక యువ వైద్యురాలు బలైంది. తన ఆవేదనను ఉన్నతాధికారులకు చెప్పుకుందామనుకున్నా ఎవరూ వినిపించుకునే పరిస్థితి లేకపోవటంతో ఉరివేసుకుని తనువు చాలించింది. సతారా జిల్లాలోని ఫాల్తన్ తహసీల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న 28 ఏళ్ల వైద్యురాలు గురువారం రాత్రి ఓ హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కఠిన నిర్ణయానికి గల కారణాలను ఆమె తన అరచేయిపై వివరంగా రాసింది. సబ్ఇన్స్పెక్టర్ గోపాల్ బదానే గత ఐదు నెలల్లో తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని, మానసికంగా వేధిస్తున్నాడని తెలిపింది. తాను నివాసం ఉంటున్న భవనం యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్ కూడా తనను లైంగికంగా, మానసికంగా వేధించాడని సూసైడ్ నోట్లో రాసింది. వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులు ఇద్దరిపై అత్యాచారం, ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. రాజకీయ దుమారం డాక్టర్ ఆత్మహత్య ఘటన మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపుతోంది. హోంశాఖను కూడా చూస్తున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. సతారా ఎస్పీ తుషార్ దోషీకి ఫోన్చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎస్ఐని విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. నిందితులు ఇద్దరు పరారీలో ఉండటంతో వారికోసం గాలిస్తున్నట్లు తుషార్ దోషీ తెలిపారు. డాక్టర్ ఆత్మహత్య ఘటన చాలా తీవ్రమైన అంశమని మహారాష్ట్ర శాసనమండలిలో డిప్యూటీ చైర్పర్సన్ నీలమ్గోర్హే అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఫడ్నవీస్ను కోరినట్లు తెలిపారు. సతారా సివిల్ సర్జన్తో తాను మాట్లాడానని, వేధింపుల గురించి మృతురాలు తమకేమీ ఫిర్యాదు చేయలేదని సర్జన్ చెప్పినట్లు రాష్ట ఆరోగ్యశాఖ సహాయమంత్రి మేఘన బోర్డికర్ చెప్పారు. సతారా ఘటనపై సతారా పోలీసుల నుంచి నివేదిక కోరినట్టు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రూపాలీ చకంకర్ వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై మీడియా న్యాయ విచారణ జరపటం మానుకోవాలని మరో మంత్రి పంకజ ముండే ఆగ్రహం వ్యక్తంచేశారు. ఘటనపై ప్రతిపక్ష పార్టీలు ఫడ్నవీస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఫడ్నవీస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ ఆరోపించారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపేందుకు సిట్ను ఏర్పాటుచేయాలని శివసేన యూబీటీ నేత సుష్మఅంధరే డిమాండ్ చేశారు. తీవ్రంగా వేధించారు మృతురాలిని ఆమె ఉన్నతాధికారులతోపాటు నిందితులు తీవ్ర వేధింపులకు గురిచేశారని డాక్టర్ బంధువు ప్రయాగ ముండే ఆరోపించారు. ‘ఆమె ఎంతో తెలివైంది. గొప్ప ఆశయాలు కలిగిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి ఆమెను మేమే పెంచి, చదివించాం. విధి నిర్వహణలో ఆమె తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొంది. తప్పుడు పోస్ట్మార్టం నివేదికలు ఇవ్వాలని ఆమెపై ఉన్నతాధికారులు ఒత్తిడి చేశారు. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుంది. నిందితులు కఠినంగా శిక్షించాలి’అని డిమాండ్ చేశారు. పనిచేసే చోట సీనియర్లు వేధిస్తున్నారని రెండురోజుల క్రితమే మృతురాలు తమకు తెలిపిందని మరో బంధువు వెల్లడించారు. నిందితుడికి చివరి ఫోన్కాల్ ఆత్మహత్య చేసుకోవటానికి ముందు వైద్యురాలి నిందితుల్లో ఒకడైన ప్రశాంత్ బంకర్కు ఫోన్చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇద్దరూ ఫోన్లో చాటింగ్ చేశారని వెల్లడించారు. అయితే, ఆ సందేశాల్లో ఏముంది అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. -
అడ్వర్టైజింగ్ దిగ్గజం పీయూష్ కన్నుమూత
ప్రచార రంగ దిగ్గజం పీయూష్ పాండే(70) ఇక లేరు. అనారోగ్యంతో శుక్రవారం ఆయన ముంబైలో కన్నుమూశారు. ప్రకటనల రంగంలో నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించిన పాండే ‘ఫెవికాల్, క్యాడ్బెరీ, ఆసియన్ పెయింట్స్..’ ఇలా ఎన్నో ప్రముఖ బ్రాండ్లకు, పలు ప్రభుత్వ కార్యక్రమాల క్యాంపెయిన్లకు ప్రచార స్లోగన్స్ రూపొందించారీయన. భారతీయ ప్రకటనల రంగాన్ని మలుపు తిప్పిన వ్యక్తిగా పీయూష్ పాండేకి గుర్తింపు ఉంది. పీయూష్ 1955లో జైపూర్(రాజస్థాన్)లో జన్మించారు. ఆ కుటుంబంలో తొమ్మిది మంది సంతానం. ఆయన సోదరుడు ప్రసూన్ పాండే ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్. సోదరి ఇలా అరుణ గాయని-నటి. క్రికెట్లో రంజీ ట్రోఫీకి ప్రాతినిధ్యం వహించిన పీయూష్ పాండే.. కన్స్ట్రక్షన్ రంగంలో కొంతకాలం పనిచేశారు. అక్కడి నుంచి అడ్వర్టైజింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. 1982లో ఒగిల్వీ ఇండియా Ogilvy Indiaలో చేరి.. మొదట క్లయింట్ సర్వీసింగ్ విభాగంలో పని చేశారు. ఆ తర్వాత క్రియేటివ్ విభాగంలోకి మారిపోయి.. అంచెలంచెలుగా ఎదిగి కీలక పదవులను చేపట్టారు. ఆయన సారథ్యంలో.. భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూనే బావోద్వేగాలకు ముడిపెట్టి ఎన్నో ప్రకటనలు రూపొందించారు. పాక్-భారత్ బార్డర్ బ్యాక్డ్రాప్తో ఫెవికిక్ ‘తోడో నహీ జోడో’ యాడ్, క్యాడ్బెరీ డెయిలీ మిల్క్ “कुछ खास है” యాడ్, వోడాఫోన్ హచ్ డాగ్ వినూత్న ప్రచారాలు ఆకట్టుకున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి కోసం అబ్కీ బార్ మోదీ సర్కార్ అనే ప్రచార స్లోగన్ను రూపొందించింది ఈయనే కావడం గమనార్హం. అంతేకాదు.. బిగ్బీ అమితాబ్ బచ్చన్ ‘పల్స్పోలియో’ యాడ్ను స్వయంగా తీర్చిద్దిద్దారు. అడ్వైర్టైజింగ్ రంగంలో ఈయన అందించిన సేవలకుగానూ 2016లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. 2024లో ఎల్ఐఏ లెజెండ్ అవార్డు ఆయన్ని వరించింది.పీయూష్ పాండే మృతిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ‘‘పీయూష్ పాండే భారతీయ ప్రకటనల రంగాన్ని కొత్త దిశలో నడిపించిన సృజనాత్మక మేధావి. ఆయన రూపొందించిన ప్రకటనలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి. ఆయన మృతి భారతీయ క్రియేటివ్ ప్రపంచానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, Ogilvy India టీమ్కు నా ప్రగాఢ సానుభూతి’’ అని తెలిపారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు స్మృతి ఇరానీ, ఆనంద్ మహీంద్రా, ఉదయ్ కోటక్ లాంటి వ్యాపారవేత్తలూ ఆయన మృతిపై సంతాపం తెలియజేశారు.వైఎస్ జగన్ దిగ్ర్భాంతివైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. దేశానికి కనెక్టయ్యేలా ఆయన సృజనాత్మక ప్రకటనలు ఉంటాయి.అలాంటి పద్మశ్రీ పాండేని కోల్పోవటం విచారకరం. పాండే కుటుంబ సభ్యులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. సాక్షి, భారతి సిమెంట్స్ ప్రారంభ సమయంలో ఆయన చేసిన సృజనాత్మక కృషి ఎప్పటికీ గుర్తుండి పోతుంది’అని పేర్కొన్నారు. Truly at a loss for words to express my sadness at the demise of Padma Shri Piyush Pandey.A phenomenon in the world of advertising, his creative genius redefined storytelling, giving us unforgettable and timeless narratives.To me, he was a friend whose brilliance shone… pic.twitter.com/t6ZDSViCrS— Piyush Goyal (@PiyushGoyal) October 24, 2025 -
మహారాష్ట్రలో కోటి బోగస్ ఓట్లు
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఓటర్ల జాబితాలో కనీసం కోటి బోగస్ ఓట్లున్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈ ఓట్లను ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేస్తూ నవంబర్ ఒకటో తేదీన ముంబైలో ఉమ్మడిగా ర్యాలీ చేపడతామని ప్రకటించాయి.ఆదివారం మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్)నేత బాల నంద్గావోంకర్, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్, కాంగ్రెస్ నేత సచిన్ సావంత్, ఎన్సీపీ(ఎస్పీ)నేత జయంత్ పాటిల్లు మీడియాకు ఈ విషయం తెలిపారు. త్వరలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను నకిలీ ఓటర్లను తొలగించాకే నిర్వహించాలని వారు ఈసీని కోరారు. అంతకుముందు, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ..స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే 96 లక్షల ఫేక్ ఓటర్లను జాబితాల్లో చేర్చారని ఆరోపించారు. ఒక్క ముంబైలోనే సుమారు 10 లక్షల నకిలీ ఓట్లున్నాయన్నారు. నకిలీ ఓట్లతో ఎన్నికలు జరపడం ఓటర్లను అవమానించడమేనన్నారు. -
చెట్టుకు వేలాడదీసిన మంచంపై కూర్చుని నిరాహారదీక్ష
జల్నా/థానే: తమ హక్కులు సాధించుకునేందుకు శాంతియుత మార్గంలో చేపట్టే నిరసనల్లో ప్రధానమైనది నిరాహారదీక్ష. సాధారణంగా ఓ ప్రాంతంలో టెంటు వేసుకొని నిరాహారదీక్షలు చేయటం మనం చూస్తుంటాం. కానీ, మహారాష్ట్రలో ఓ వ్యక్తి ఒక చెట్టుకు నులక మంచాన్ని వేలాడదీసి, అందులో కూర్చొని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. మహారాష్ట్రలో బంజారాలను ఎస్టీలుగా పరిగణించరు. వారిని విముక్త, సంచార జాతుల (వీజేఎన్టీ) జాబితాలో చేర్చారు. అయితే, హైదరాబాద్ గెజిట్ ప్రకారం తమను ఎస్టీల్లో చేర్చాలని వారు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ సాధనకోసం మహారాష్ట్రలోని జల్నా పట్టణానికి సమీపంలో ఉన్న అంబద్ చౌఫుల్లీ ప్రాంతంలో విజయ్ చవాన్ అనే వ్యక్తి ఇలా మంచాన్ని చెట్టుకు వేలాడదీసి శనివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. పూర్వపు హైదరాబాద్ స్టేట్లో తమ జాతిని ఎస్టీల్లో చేర్చి రిజర్వేషన్లు ఇచ్చారని, మండల్ కమిషన్ సమయంలో మహారాష్ట్రలోని బంజారాలను వీజేఎనీ్టలుగా వర్గీకరించటంతో ఆ హోదా కోల్పోయామని ఆగ్రహం వ్యక్తంచేశాడు. తిరిగి ఎస్టీ హోదా సాధనకోసమే తీను నిరాహార దీక్షకు పూనుకున్నట్లు వెల్లడించాడు. నిజానికి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్దే దీక్షకు ప్రయత్నించినప్పటికీ అధికారులు అనుమతి ఇవ్వలేదని తెలిపాడు. ఎస్టీ హోదా కోసం మహారాష్ట్రలో బంజారాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల మరాఠాలను ఓబీసీల్లో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించటంతో ఇతర వర్గాలు కూడా తమ రిజర్వేషన్ల సాధన కోసం పోరాటాలు ఉధృతం చేశాయి. ఎస్టీ హోదా కోసం నవంబర్ 9న ముంబైలోని శివాజీ పార్కులో నిరసన చేపట్టనున్నట్లు మాజీ ఎంపీ హరిభావ్ రాథోడ్ ప్రకటించారు. -
48 ఏళ్ల తర్వాత చిక్కిన ప్రేమ పావురం
ఏదో చిన్నచితకా కేసు కాదు.. ఏకంగా తన ప్రేయసిని కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించిన కేసు! మన హీరో చంద్రశేఖర్ మధుకర్ కాలేకర్.. ఈ సాహసం చేసింది 1977లో. అప్పుడు ఆయ న వయసు కేవలం 23 ఏళ్లే. రక్తంలో ప్రేమ, అపనమ్మకం, యవ్వనం.. అన్నీ ఉప్పొంగుతున్న సమయం. ఈ లవర్ బాయ్కి.. తన లవర్ క్యారెక్టర్పై తెగ అనుమానం వచ్చేసింది. అంతే.. కోపంతో ఊగిపోయాడు.. ముంబైలోని కొలాబాలో ప్రియురాలిపై కత్తి దూశాడు. పాపం ఆ రోజుల్లోనే ఇంత కసితో ప్రేమించిన మొనగాడున్నాడంటే.. మామూ లు విషయం కాదు!. కుర్రాడిని ఎలాగోలా పోలీసులు పట్టేసుకున్నారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. అంతే! ఆ బెయిల్ పత్రాన్ని అందుకున్నారో లేదో, మన కాలేకర్ గారు ‘ట్రయల్ బై ఎస్కేప్’ అనే కొత్త రూల్ కనిపెట్టి, మాయమైపోయారు. దాదాపు ఐదు దశాబ్దాలు (48 ఏళ్లు) ఎక్కడా కనిపించకుండా, దొరక్కుండా, సన్యాసిలా జీవితం గడిపారు! కోర్టు విచారణ లేకుండా 48 ఏళ్లు బతికారంటే.. తన జీవితంపై ఆయనకు ఎంత నమ్మకమో కదా!. ముంబై పోలీసులు పాపం చాలా వెతికారు. అడ్రస్ మారడం, ఆ నివసించిన భవనం కూల్చేయడం... ఇలా సకల కారణాల వల్ల అతన్ని పట్టుకోలేకపోయారు. కోర్టు నాన్ – బెయిలబుల్ వారెంట్ ఇచ్చి చేతులు దులిపేసుకుంది. ఇక కేసు మూలనపడింది అనుకుంటున్న టైమ్లో.. మిరాకిల్!దొరికిపోయాడోచ్.. తాజాగా దర్యాప్తు మొదలుపెట్టిన కొలాబా పోలీసులు, ఈ పాత కేసు ఫైల్ని దుమ్ము దులుపుతుండగా.. ఓ చిన్న క్లూ దొరికింది. అదేంటంటే.. 2015లో రత్నగిరి జిల్లాలోని దాపోలి పోలీస్ స్టేషన్లో ఓ ప్రమాదం కేసులో కాలేకర్ పేరు నమోదైంది! అంటే, పారిపోయి ప్రశాంతంగా ఉన్నా, ప్రమాదం రూపంలో కర్మ ఆయనను వెతుక్కుంటూ వచ్చింది! ఆ దెబ్బతో, పోలీసులు వెతికి పట్టుకున్నారు. పోలీసు అంకుల్స్కి హ్యాట్సాఫ్!.48 ఏళ్ల క్రితం 23 ఏళ్ల యువకుడిని.. ఇప్పుడు గుర్తు పట్టడం అంటే మాటలా? అంతా సవాలే. కానీ పాత ఫొటోలు చూసి, ఇంటరాగేషన్ చేయగా.. మన 81 ఏళ్ల తాతగారు తప్పనిసరి పరిస్థితుల్లో తన తప్పును ఒప్పుకున్నారు! ఇంతకాలం గుర్తు పెట్టుకుని ఉండాలంటే.. ఎంత ఘోరమైన అటాక్ అయి ఉంటుందో!.ఇప్పటికింకా ఈయన వయసు నిండా 81 ఏళ్లే..కోర్టులో అడ్వకేట్ సునీల్ పాండే ఆయన తరపున వాదించారు. ‘సార్! నా క్లయింట్ వయసు 81 ఏళ్లు, బోలెడన్ని వ్యాధులు ఉన్నాయి. అసలు చార్జిషీట్ ఫైల్ చేశాక నోటీస్ ఇవ్వలేదు! 2010లో ఆయన గుడిసె పడిపోయింది, ఆ తర్వాత ఆసుపత్రిలో చేరారు.. అందుకే కోర్టుకు రాలేకపో యారు’.. అంటూ 48 ఏళ్ల తప్పిదానికి సరదాగా కవర్ డ్రైవ్ ఇచ్చారు!జాలి పడ్డ జడ్జి గారు!ప్రభుత్వ తరపు న్యాయవాది ఆనంద్ సుఖదేవే గారు మాత్రం ‘అయ్యో! ఇదో పెద్ద నేరం, 48 ఏళ్లు ట్రయల్ని ఆలస్యం చేసింది ఈయనే! మళ్లీ పారిపోవచ్చు!’ అని గట్టిగా అభ్యంతరం చెప్పారు. కానీ, న్యాయమూర్తి అవినాష్ పి.కులకర్ణి గారు.. మన తాతగారి వయసు, ఆయన ‘కచ్చితంగా కోర్టుకు వస్తాను’ అని ఇచ్చిన హామీని చూసి జాలి పడ్డారు. చివరికి, బెయిల్ మంజూరు చేసేశారు! తాతగారు హ్యాపీస్..ప్రేమించి, పొడిచి, పారిపో యి... వయసు మీరి పట్టుబడిన చంద్రశేఖర్ మధుకర్ కాలేకర్ గారు, ఇప్పుడు బెయిల్పై దర్జాగా ఉన్నారు. 48 ఏళ్ల తర్వాత.. ఇన్నాళ్లకు ఇప్పుడు ఆయనపై విచారణ మొదలవుతుంది! ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికి ఆ రోజుల నాటి పోలీసులు, సాక్షులు ఎవరైనా బతికి ఉన్నారో లేదో?, అసలు ఆ ప్రేయసి ఏమైందో.. దేవుడికే తెలియాలి! ఇంతకాలం ఈ కేసును ఫైల్లోంచి తీయకుండా ఉంచిన ఆ న్యాయస్థానం సిబ్బందికి మాత్రం భారత న్యాయవ్యవస్థ చరిత్రలో మంచి స్థానం దక్కుతుంది! మరి, ఈ ట్రయల్ ఇంకో 48 ఏళ్లు సాగకుండా ఉంటుందా? మీరేమంటారు?– సాక్షి, నేషనల్ డెస్క్ -
బీసీసీఐ, కేంద్రం.. ఆప్ఘన్ను చూసైనా సిగ్గుపడాలి: ప్రియాంక చతుర్వేది
ముంబై: పాకిస్తాన్ సైన్యం వైమానిక దాడుల కారణంగా ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్లు మృతిచెందారు. దీంతో వచ్చే నెలలో పాకిస్తాన్, శ్రీలంక జట్లతో తలపడబోయే ముక్కోణపు సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏసీబీ నిర్ణయంపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందించారు. ఏసీబీని చూసి బీసీసీఐ, భారత ప్రభుత్వం నేర్చుకోవాలి అని ఘాటు విమర్శలు చేశారు.శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘పాకిస్తాన్ వ్యవస్థలో అమాయక బాధితుల రక్తం తాగే కొందరు వ్యక్తులు సరిహద్దుల్లో ఉన్నారు. వారంతా సిగ్గుపడాలి. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్తో తమ సిరీస్ మ్యాచ్లను రద్దు చేసుకోవడం సరైన చర్య. బహుశా బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వం క్రీడల కంటే దేశానికి ఎలా ప్రాధాన్యత ఇవ్వాలో ఆప్ఘన్ నుంచి నేర్చుకోవాలంటూ విమర్శలు చేశారు. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు సంఘీభావంగా శ్రీలంక జట్టు కూడా సిరీస్ నుండి కూడా వైదొలగాలని ఆశిస్తున్నాను. 2009లో పాకిస్తాన్ పర్యటనలో ఉన్నప్పుడు వారి జట్టుపై కూడా ఉగ్రవాదులు దాడి చేశారని మర్చిపోకూడదు. బీసీసీఐ లాగా కాకుండా పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇతర ఆసియా జట్లు సంఘీభావంగా నిలుస్తాయని ఆశిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు.Pakistan establishment is made up of a bunch of cowards who thrive on the blood of their innocent victims and get thrashed at the borders. Shame on them. Good to see Afghanistan Cricket Board call off their series matches with Pakistan, maybe BCCI and GoI can take tips on how to… https://t.co/VzAvFcUOwi— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) October 18, 2025రాజకీయాలకు క్రీడలను దూరంగా ఉంచాలి. ఇక్కడ పోరాటం కేవలం రాజకీయల గురించి మాత్రమే కాదు. దుష్ట దేశం పాకిస్తాన్ గురించి. పాక్ ఉగ్రవాదం కారణంగా ఇప్పటికే పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబాలు ప్రభావితమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ ప్రభావితమైంది. దేశం అంతా బాధపడుతోంది. కాబట్టి ఇది రాజకీయాలను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవాలి’ అంటూ హితవు పలికారు. ఇక, అంతుకుముందు కూడాప్రియాంక బీసీసీఐ, కేంద్రం తీరును తప్పుబట్టారు. ఆసియా కప్లో పాకిస్తాన్తో భారత జట్టు మ్యాచ్లు ఆడటమేంటని ప్రశ్నించారు. Keep Politics out of sports is something that gets thrown around so easily by apologists of the government and the BCCI. This isn’t politics but about terrorism. Lives are lost, families are impacted, economy is affected, country suffers all of it because of one rogue nation. So…— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) October 18, 2025ఇదిలా ఉండగా.. క్రికెటర్ల మరణంపై ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘అత్యంత విషాదకరమైన ఘటన. అనైతికం, అనాగరిక చర్య. పాకిస్తాన్ వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన పౌరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. విషాద ఘటనలో మహిళలు, పిల్లలు, క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. జాతీయజట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కంటోన్న యువ ప్లేయర్ల లక్ష్యం నెరవేరకుండానే జీవితం ముగిసింది. పౌరులపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. మానవ హక్కులకు తీవ్ర విఘాతం కలిగించిన దాడిని ప్రతిఒక్కరూ ఖండించాలని కోరుతున్నా. పాక్తో తలపడబోయే ట్రై సిరీస్ నుంచి వైదొలుగుతున్నామని మా క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం సరైందే. క్లిష్ట సమయాల్లో ప్రజలకు అండగా నిలుస్తాం. మాకు దేశ సమగ్రత అత్యంత ముఖ్యమైన అంశం’ అని పేర్కొన్నాడు. -
అలుపెరగని సహకారం
నాసిక్: హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) దేశ రక్షణ రంగానికి వెన్నెముకగా మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ అభివర్ణించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశంలో వివిధ వైమానిక స్థావరాల్లో ఉన్న యుద్ధ విమానాలకు అవసరమైన తోడ్పాటును నిర్విరామంగా అందించిందని ప్రశంసించారు. ఫలితంగా ఫైటర్ జెట్లు, హెలికాప్టర్ల సమర్థవంతమైన నిర్వహణ, సన్నద్ధత సాధ్యమైందన్నారు. నాసిక్లోని హెచ్ఏఎల్ కేంద్రంలో మంత్రి రాజ్నాథ్ శుక్రవారం తేజస్ తేలికపాటి యుద్ధ విమానం(ఎల్సీఏ)ఎంకే1ఏ తయారీ విభాగాన్ని, శిక్షణ విమానం హెచ్టీటీ–40 ప్రత్యేక తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. నాసిక్ విభాగంలో తయారైన తేజస్ ఎల్సీఏ ఎంకే1ఏ మొట్టమొదటిసారిగా రివ్వున ఆకాశంలోకి దూసుకెళ్లడాన్ని మంత్రి వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. సుఖోయ్–30 ఎంకేఐ జెట్ విమానాలకు బ్రహ్మోస్ క్షిపణుల అనుసంధానంలో హెచ్ఏఎల్ నాసిక్ విభాగం కృషి మరువలేమన్నారు. తేజస్ ఎంకే1ఏ తయారీ కేంద్రంలో ఇకపై ఏటా కనీసం 24 ఎల్సీఏలు తయారవుతాయని వివరించారు. మిగ్–21, మిగ్–27 వంటి ఫైటర్ జెట్ల నుంచి సుఖోయ్–30 ఎంకేల వరకు తయారు చేస్తూ నాసిక్ కేంద్రం ఉత్పత్తి హబ్గా మారిందని చెప్పారు. -
రైల్వేప్లాట్ఫాం పైనే మహిళకు పురుడు పోసిన యువకుడు
ముంబై: ఆ మధ్య వచ్చిన త్రీ ఇడియట్స్ సినిమాలో అత్యవసర సమయంలో ఓ డాక్టర్ వీడియోకాల్లో సూచనలు ఇస్తుండగా ఓ మహిళకు హీరో పురుడు పోసే సన్నివేశం ఉంటుంది. అచ్చం అలాంటి ఘటనే నిజజీవితంలో ముంబైలో జరిగింది. గత మంగళవారం రాత్రి ముంబై లోకల్ రైళ్లో వికాస్ బిద్రే అనే వీడియో కెమెరామెన్ ప్రయాణిస్తుండగా అదే రైళ్లో 24 ఏళ్ల అంబికా ఝా పురుటి నొప్పులతో బాధపడటం గమనించాడు. చుట్టూ మరికొందరు ఉన్నా వికాస్ మెరుపులా స్పందించి అత్యవసర స్విచ్ నొక్కి రైలును రామ్మందిర్ స్టేషన్లో ఆపేశాడు. అప్పటికే అంబికాకు ప్రసవం కావటం ప్రారంభమైంది. శిశువు సగంవరకు బయటకు వచి్చంది. దీంతో ప్లాట్ఫాంపై ఉన్న దుకాణాల వద్దకు పరుగెత్తి పరుపుల్లాంటివి పట్టుకొచ్చి ఆమెను పడుకోబెట్టారు. వికాస్ వెంటనే తన స్నేహితురాలైన దేవిక అనే డాక్టర్కు ఫోన్చేసి విషయం చెప్పాడు. ఆమె వీడియోకాల్ చేసి సూచనలు ఇస్తుండగా అంబికకు వికాస్ డెలివరీ చేశాడు. అంతకుముందు ప్లాట్ఫాం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లినా పరిస్థితి తీవ్రతను గుర్తించి డెలివరీ చేసేందుకు వారు ముందుకు రాలేదు. దీంతో ఆమె బంధువులు మళ్లీ ప్లాట్ఫాం వద్దకు తీసుకురావటంతో వికాస్ ధైర్యం చేసి తన స్నేహితురాలి సహకారంతో పురుడు పోశాడు. అనంతరం తల్లి, బిడ్డను ప్రైవేటు అంబులెన్స్లో కూపర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మంజీత్ థిల్లాన్ అనే వ్యక్తి ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేయటంతో వికాస్పై ప్రశంసలు కురుస్తున్నాయి. కజ్రత్ జమ్ఖేడ్ ఎమ్మెల్యే రోహిత్ పవార్ కూడా ఈ ఘటనపై స్పందించారు. వికాస్ చేసిన పని మహారాష్ట్రకు గర్వకారణమని పేర్కొన్నారు. దేవిక సూచనలతోనే తాను పురుడు పోయగలిగానని వికాస్ తెలిపాడు. -
హైవేపై ట్రాఫిక్ జామ్.. 500 మంది విద్యార్థులకు 12 గంటల నరకం..
ముంబై: మహారాష్ట్రలోని ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై దాదాపు 12 గంటల పాటు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో, దాదాపు 500 మంది విద్యార్థులు హైవేపై ట్రాఫిక్లో చిక్కుకుని అల్లాడిపోయారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుమజాము వరకు ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అయితే, థానేలోని ఘోడ్బందర్ హైవేలో జరుగుతున్న మరమ్మతు పనుల కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.వివరాల ప్రకారం.. పాల్ఘర్ జిల్లాలోని ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం నుంచి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అదే సమయంలో పాఠశాలల నుంచి కూడా విద్యార్థులు తమ ఇళ్లకు బయలుదేరారు. దీంతో, 5-10 తరగతులు విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు ట్రాఫిక్లో చిక్కుకున్నారు. థానే, ముంబై వైపు నుంచి వస్తున్న వాహనాల రద్దీ కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విద్యార్థులంతా ట్రాఫిక్లోనే చిక్కుకుపోయారు.I challenge the gov. of Maharashtra Ministers to make a travel from Bhiwandi to Wada. The Mumbai Ahmedabad highway for all the reasons is always with hours of traffic snarls. Should even Industries function in Maharashtra any more? @AjitPawarSpeaks @mieknathshinde @Dev_Fadnavis pic.twitter.com/xSyeAoarJi— Vedang Dongre (@VedangDongre) October 14, 2025మంగళవారం సాయంత్రం నుంచి దాదాపు 12 గంటల పాటు ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో విద్యార్థులంతా ట్రాఫిక్లోనే ఉన్నారు. దీంతో, స్థానికులు వారికి ఆహారం అందించారు. చాలా మందికి ఆహారం, నీరు అందకపోవడంతో ఆవేదన చెందారు. విద్యార్థులంతా బిక్కుబిక్కుమంటూ రాత్రంతా రోడ్డుమీదే ఉన్నారు. ఈ కారణంగా వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ట్రాఫిక్లో చిక్కుకున్న విద్యార్థుల చివరి బస్సు బుధవారం ఉదయం బయటకు వచ్చినట్టు పిల్లల పేరెంట్ ఒకరు చెప్పుకొచ్చారు.वसई, मुंबई: मुंबई-अहमदाबाद महामार्ग पर, घोड़बंदर से लेकर वसई फाटा तक, आज भारी ट्रैफिक जाम की स्थिति देखी गई। मार्ग पर वाहनों की लंबी कतारें लगी हुई हैं, जिससे यात्रियों को भारी असुविधा का सामना करना पड़ रहा है। pic.twitter.com/a0mRI6VxFr— मुकेश त्रिपाठी- Mukesh Tripathi/✍️ (@mukesht37) October 13, 2025వాహనాల రద్దీ కారణంగా పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అయితే, థానేలోని ఘోడ్బందర్ హైవేలో జరుగుతున్న మరమ్మతు పనుల కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. భారీ వాహనాలను మళ్లించడం వల్ల ఈ జామ్ ఏర్పడిందని.. దీని ఫలితంగా ముంబై-అహ్మదాబాద్ మార్గంలో అధిక ట్రాఫిక్ భారం ఏర్పడిందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. NH46, NH30, NH19, NH49...Every day you wake up, a new NH is in the news for construction quality issues, and that too usually within months of being built. Shri @nitin_gadkari, please give petrol a break from ethanol and sort out your dept first. pic.twitter.com/hvZMGHM4sy— THE SKIN DOCTOR (@theskindoctor13) October 14, 2025 -
ఆయుధం వీడిన మల్లోజుల.. ఆరు కోట్ల రివార్డు అందించిన సీఎం
ముంబై: మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ (Mallojula Venugopal) అలియాస్ అభయ్ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. మహారాష్ట్ర పోలీసుల ఎదుట మల్లోజుల మంగళవారం లొంగిపోయారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీవీస్(Devendra Fadnavis) సమక్షంలో మల్లోజుల సహా మావోయిస్టులు తమ ఆయుధాలు సరెండర్ చేశారు.బుధవారం ఉదయం మల్లోజులతో పాటు మరో 61 మంది మావోయిస్టులు(maoists) ఆయుధాలను విడిచిపెట్టారు. ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో తమ ఆయుధాలను పోలీసులకు అందించారు. ఇక, మల్లోజులపై దాదారు ఆరు కోట్ల రివార్డు ఉండటంతో(ఆరు రాష్ట్రాల్లో కోటి చొప్పున) ముఖ్యమంత్రి ఫడ్నవీస్.. రివార్డును ఆయనకు అప్పగించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాలో మోస్ట్వాంటెడ్గా మల్లోజులు ఉన్నారు. ఈ సందర్భంగా మల్లోజులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ..‘మల్లోజుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దేశంలో మావోయిజానికి చోటులేదు. నక్సల్ ఫ్రీ భారత్ నిర్మిస్తాం’ అని చెప్పుకొచ్చారు. #WATCH | Gadchiroli, Maharashtra: Naxal Commander Mallojula Venugopal Rao alias Bhupati, surrenders in front of CM Devendra Fadnavis at the Gadchiroli Police Police Headquarters. Around 60 Naxalites surrendered today.Naxal Commander Mallojula Venugopal Rao alias Bhupati gave a… pic.twitter.com/stBiJWEJvd— ANI (@ANI) October 15, 2025అయితే, మావోయిస్టు పార్టీ వైఖరి సరిగా లేదంటూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీలో దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే కారణమని పేర్కొంటూ అత్యున్నత నిర్ణాయక కమిటీ పొలిట్బ్యూరో నుంచి వైదొలిగారు. తాజాగా ఉద్యమాన్ని పూర్తిగా వదిలిపెట్టి అజ్ఞాతం వీడారు. మల్లోజులపై వందకు పైగా కేసులు ఉన్నాయి.#WATCH | Gadchiroli, Maharashtra: Naxalites surrender in front of CM Devendra Fadnavis at the Gadchiroli Police Police Headquarters. Around 60 surrendered today, including Naxal Commander Mallojula Venugopal Rao alias Bhupati surrendered today. pic.twitter.com/DoZucnsWGH— ANI (@ANI) October 15, 2025 -
లొంగిపోయిన మల్లోజుల..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ సాక్షి, పెద్దపల్లి: తొలితరం మావోయిస్టు అగ్రనేత, పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను మహారాష్ట్ర పోలీసులకు లొంగిపోయారు. ఆయన తలపై రూ.6 కోట్ల వరకు రివార్డు ఉంది. 60 మంది అనుచరులతో కలిసి ఆయన గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వేణుగోపాల్తోపాటు లొంగిపోయిన మావోయిస్టులందరినీ సోమవారం రాత్రి 10 గంటల సమయంలో హోద్రి గ్రామం నుంచి పోలీస్ వాహనాల్లోనే గడ్చిరోలి పోలీస్ హెడ్క్వార్టర్స్కు తరలించినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. లొంగిపోయినవారిలో ముగ్గురు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్జెడ్సీ) సభ్యులు, పదిమంది డివిజినల్ కమిటీ సభ్యులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, మల్లోజుల లొంగుబాటును మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ నెల 16న మీడియా సమావేశంలో అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించనున్నారని సమాచారం. మల్లోజుల భార్య, గడ్చిరోలి దళ సభ్యురాలు తారక్క 2024 డిసెంబర్ 31న లొంగిపోయారు. ఆపరేషన్ కగార్ వల్ల పార్టీ ఆనవాళ్లు లేకుండా తుడిచిపెట్టుకుపోవడంతో ఇక పోరాడలేమని గ్రహించి మావోయిస్టు పార్టీలో కొందరు లొంగుబాట పట్టారు. మల్లోజుల కూడా సాయుధ పోరాట పంథాను వీడుతున్నట్లు ఇటీవలే లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ చరిత్రలో మల్లోజుల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన సోదరుడు మల్లోజుల కోటేశ్వర్రావు అలియాస్ కిషన్ జీ కూడా పార్టీలో అగ్రనేతే. ఆయన 2011లో పశ్చిమబెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. కిషన్జీ భార్య పోతుల కల్పన గతేడాది తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగుబాటుకు కారణాలివే.. వేణుగోపాల్కు ప్రస్తుతం 70 ఏళ్లు. ఆయనపై 100కుపైగా కేసులున్నాయి. అనారోగ్య, వ్యక్తిగత కారణాలతోపాటు మారుతున్న రాజకీయ పరిస్థితులు కూడా ఆయన లొంగుబాటుకు కారణమని చెబుతున్నారు. ప్రజల నుంచి రోజురోజుకూ ఆదరణ తగ్గుతుండటం, అడవులపై బలగాల పట్టు పెరిగిన కొద్దీ.. వాటిని వదిలి కొత్త ప్రాంతాలకు వెళ్లడంపై వేణుగోపాల్ విభేదిస్తూ వస్తున్నారు. సాయుధ పోరు వదిలి రాజకీయ వేదికగా ఉద్యమించాలని కొంతకాలంగా చెబుతున్నారు. ఈ విషయంపై ఆగస్టు 15న ‘టెంపరరీ ఆర్మ్డ్ స్ట్రగుల్ అబాండెన్’పేరిట విడుదల చేసిన లేఖ సెపె్టంబర్ 17న వెలుగుచూడటం పార్టీలో కలకలం రేపింది. పార్టీలో తీవ్ర చర్చకు దారితీయడంతో ఆయుధాలు సరెండర్ చేయాలని పార్టీ ఆదేశించింది. వేణుగోపాల్ లొంగుబాటును మహారాష్ట్ర గడ్చిరోలి, ఉత్తర బస్తర్, దండకారణ్యంలోని మెజారిటీ మావోయిస్టు అనుచరగణం సమర్థిస్తోంది. కానీ, మావోయిస్టు అగ్రనేతలు పుల్లూరి ప్రసాద్, పార్టీ తెలంగాణ కమిటీ, సెంట్రల్ కమిటీ నేతలు ఆయన నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. తండ్రి బాటలో పోరాట మార్గం.. మల్లోజుల వేణుగోపాల్ది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి (ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా కేంద్రం). బ్రాహ్మణ కుటుంబంలో 1956లో ఆయన జన్మించారు. తండ్రి మల్లోజుల వెంకటయ్య స్వాతంత్య్ర సమరయోధుడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా తామ్రపత్రం అందుకున్నారు. ఆయన వెంకటయ్య 1997లో మరణించారు. తల్లి మధురమ్మ గతేడాది కాలం చేశారు. మరో సోదరుడు ఆంజనేయులు కేడీసీసీ బ్యాంకులో పనిచేసి రిటైరయ్యారు. తండ్రి బాటలోనే పేద ప్రజల హక్కుల కోసం మల్లోజుల కోటేశ్వర్రావు, వేణుగోపాల్ ఉద్యమించారు. జగిత్యాల జైత్రయాత్ర అనంతరం 1978లో అజ్ఞాతంలోకి వెళ్లారు. 1980లో పీపుల్స్వార్ ఆవిర్భావ సభ్యులుగా వ్యవహరించారు. 1986లో పెద్దపల్లిలో డీఎస్పీ బుచ్చిరెడ్డిని అప్పటి పీపుల్స్వార్ నక్సల్స్ కాల్చి చంపారు. ఆగ్రహించిన పోలీసులు వెంకటయ్య – మధురమ్మ ఇంటిని కూల్చివేశారు. దీంతో కొంతకాలం వారు గుడిసెలో తలదాచుకున్నారు. వేణుగోపాల్ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి అధినేతగా పనిచేశారు. మహారాష్ట్ర, ఏపీ, గోవాతోపాటు పశ్చిమ కనుమల్లో పార్టీ కార్యకలాపాలు విస్తరించారు. 2010లో పార్టీ అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్కుమార్ అలియాస్ ఆజాద్ మరణం తరువాత ఆయన స్థానాన్ని భర్తీ చేశారు. 2010లో గడ్చిరోలిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ఊచకోతలో ఇతనే మాస్టర్ మైండ్ అని పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. 2011లో పశ్చిమబెంగాల్ పోలీసుల ఎన్కౌంటర్లో ఆయన సోదరుడు మల్లోజుల కోటేశ్వర్రావు మరణించారు. ఆ తరువాత సెంట్రల్ ఇండియా అడవుల్లో పార్టీని బలోపేతం చేయడంలో వేణుగోపాల్ వ్యూహాలు రచించారు. ఆయన గడ్చిరోలి జిల్లాలో పనిచేసే సమయంలో తారక్కను వివాహమాడారు. 2018లో ఆమె మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. 44 ఏళ్లపాటు అజ్ఞాతంలోనే ఉన్న ఆయన పార్టీ విధానాలతో విబేధించి జనజీవన శ్రవంతిలో కలిశారు. వేణుగోపాల్ తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కోయ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరని చెబుతారు. ‘సాధన’అనే కలం పేరుతో గోండుల జీవితాలకు అక్షరరూపం ఇచ్చారు. సరిహద్దు, రాగో అనే నవలు రాశారు. అడవి నుంచి అమ్మకు లేఖ తన తల్లి మధురమ్మ అంత్యక్రియలకు రాలేకపోయిన వేణుగోపాల్.. మీడియాలో కథనాలు చూసి ‘అమ్మా.. నన్ను మన్నించు’అని లేఖ రాశారు. ‘నీకు, అమరుడైన నా సోదరునికి.. మన కుటుంబానికి ఏ కలంకం రాకుండా, జనానికి దూరం కాకుండా తుదివరకూ నమ్మిన ఆశయాల కోసం నిలబడతానని మరోసారి హామీ ఇస్తున్నా.. అమ్మా’అంటూ లేఖ విడుదల చేశారు. దానికి విరుద్ధంగా వేణుగోపాల్ లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. నానమ్మ ఉంటే సంతోషించేది మా బాబాయ్ జనజీవన స్రవంతిలోకి రావడం సంతోషంగా ఉంది. కుటుంబం, దోస్తుల ప్రేమను దూరం చేసుకుని నమ్మిన సిద్ధాంతాలు, ఆశయాల కోసం ఇన్నేళ్లు నిస్వార్థంగా పనిచేశారు. మా నానమ్మ (మధురమ్మ) కొడుకును చివరిచూపు చూడాలని తపించింది. రెండేళ్ల క్రితం చనిపోయింది. ఇప్పుడు ఉంటే కొడుకుని చూసుకుని సంతోషపడేది. –దిలీప్శర్మ, వేణుగోపాల్ అన్న కూమరుడు వారిచేతుల్లోనే ఎదిగిన నాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు వేణువాళ్ల ఇంట్లోనే తిరుగుతుండేవాడిని. కోటన్న, వేణన్న నన్ను ఎత్తుకుని ఆడించేవారు. విప్లవబాట పట్టాక మధురమ్మ ద్వారా వారి గురించి తెలుసుకున్నా. వెంకటయ్య తాత, కిషన్ అన్న, మధురమ్మ చనిపోయినప్పుడు కూడా వాళ్లు రాలేదు. ఇప్పుడు లొంగిపోయారు. ఇక్కడకు వస్తే ఒక్కసారి చూడాలని ఉంది. – ఠాకూర్ విజయ్సింగ్, పొరుగింటి వ్యక్తి -
చెట్లకు సెల్ఫోన్లు కడుతున్నారు.. ఎందుకంటే?
ఆ ఊర్లో చెట్లకు సెల్ఫోన్లు కాస్తాయి.. ఏంటి వింతగా అనిపించిందా! ఇందులో కొంచెం చేంజ్.. ఆ ఊర్లో చెట్లకు సెల్ఫోన్లు కడతారు. ఇలా ఎందుకు చేస్తారని ఆశ్చర్యపోతున్నారా? ఓటీపీ కోసం అని చెబితే నమ్ముతారా? అవును ఇది అక్షరాలా నిజం. ఓటీపీ కోసం ఆ ఊరి ప్రజలు పడుతున్న బాధలు వర్ణణాతీతం. అంతగా ఎందుకు కష్టపడుతున్నారంటే ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం కోసం. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందో తెలుసుకుందాం పదండి.అరగంట నడిచి కొండపైకి ఎక్కుతారు. తర్వాత సెల్ఫోన్లను చెట్లకు కట్టేసి దానికి వచ్చే ఓటీపీ కోసం ఎండలో ఎదురు చూస్తుంటారు. మహారాష్ట్రలోని ధడ్గావ్ తాలూకా ఖార్డే ఖుర్ద్ గ్రామంలోని (Kharde Khurd village) మహిళలకు ఈ తంతు నిత్యకృత్యంగా మారింది. సెల్ఫోన్లో వచ్చే ఒకే ఒక సిగ్నల్ బార్ కోసం మరాఠా మహిళలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మహారాష్ట్రలోని చాలా గిరిజన ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోందని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పేర్కొంది.లడ్కీ బహిన్ యోజన కింద అర్హులైన మహిళలకు నెలకు రూ. 1,500 ఇస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. లబ్ధిదారులు రెండు నెలల్లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలని గడువు విధించింది. దీంతో మహిళలు కేవైసీ పూర్తి చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సెల్ఫోన్ సిగ్నల్ (Cell Phone Signal) లేక కష్టాలు పడాల్సివస్తోంది. రోజంతా కష్టపడినా వంద మందిలో నలుగురైదురికి మాత్రమే కేవైసీ పూర్తవుతోంది.మహిళల అవస్థలుఖార్డే ఖుర్ద్ గ్రామ మహిళలకు ఉల్గులన్ ఫౌండేషన్ అనే ఎన్జీవో సహాయం చేస్తోంది. దగ్గరలోని కొండగుట్టపై శిబిరం ఏర్పాటు చేసి కేవైసీ చేయిస్తోంది. "మేము ఇక్కడ ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశాం. మొబైల్ డేటాను పట్టుకునే ఏకైక ప్రదేశం ఇదే" అని ఉల్గులన్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు రాకేష్ పవారా అన్నారు. అలాగే కొండపైకి చేరుకోవడానికి మహిళలు అవస్థలు పడాల్సి వస్తోందని తెలిపారు. మరోవైపు కేవైసీ పూర్తి చేసిన అర్హులైన మహిళలకు మాత్రమే లడ్కీ బహిన్ యోజన (Ladki Bahin Yojana) ఆర్థిక సహాయం అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఇబ్బందులు ఉన్నాయి.. కానీఈ-కేవైసీ పూర్తి చేయాల్సిందేనని, ఇందులో మరో మాటకు తావులేదని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) అన్నారు. పుణేలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. "ధృవీకరించబడిన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. కేవైసీ నమోదులో ఇబ్బందులు ఉన్నాయని నాకు తెలుసు, కానీ ప్రత్యామ్నాయం లేదు. అవసరమైతే గడువును పొడిగించవచ్చు, కానీ పూర్తి చేయడం తప్పనిసర''ని పేర్కొన్నారు.బలహీనంగా కనెక్టివిటీప్రభుత్వం విధించిన గడువు నవంబర్ 15తో ముగుస్తుంది. అయితే ఇంటర్నెట్ నెట్వర్క్ సమస్య కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కేవైసీ పూర్తిచేయడం అనేది పెద్ద సమస్యగా మారింది. ధడ్గావ్ తాలూకా తహసీల్దార్ జ్ఞానేశ్వర్ సప్కలే కూడా దీన్ని ఒప్పుకున్నారు. "మొబైల్ టవర్లు నాలుగైదు నెలల క్రితం వచ్చాయి. కానీ కనెక్టివిటీ ఇప్పటికీ బలహీనంగా ఉంది. సమస్యను పరిష్కరించమని ఆపరేటర్లను కోరాము. సాధారణ సేవా కేంద్రాలు, ఆధార్ ఆపరేటర్ల ద్వారా మహిళలకు సహాయం చేస్తున్నాము" అని ఆయన అన్నారు.చదవండి: ఖరీదైన స్టంట్.. ట్విస్ట్ అదిరింది! సమస్యను పరిష్కారిస్తాంలడ్కీ బహిన్ యోజన కింద మహిళలకు సెప్టెంబర్లో ఆర్థిక సహాయం చేశామని, లబ్ధిదారులు మరో రెండు నెలల్లోపు ఈ- కేవైసీ పూర్తి చేయాలని మహారాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రి అదితి తత్కరే (Aditi Tatkare) ఇటీవల ప్రకటించారు. ఇంటెర్నెట్, ఆధార్ సమస్యలతో కేవైసీ ఆలస్యమవుతోందని మహిళలు వాపోతున్నారు. సేవా కేంద్రాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటీపీ, డేటా సమస్యలను పరిష్కరించడానికి తన విభాగం కృషి చేస్తోందని తత్కరే హామీ ఇచ్చారు. లడ్కి బహిన్ యోజన కింద 2.5 కోట్లకు పైగా మహిళలు నమోదు చేసుకున్నారని తెలిపారు. -
ఉపాధికి వరం ‘మహీంద్రా ఐటీఐ’.. ప్రారంభించిన ప్రధాని మోదీ
ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మహీంద్రా ట్రాక్టర్స్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని వర్చువల్గా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కేంద్రం గ్రామీణ యువతకు పరిశ్రమ సంబంధిత నైపుణ్యాలలో శిక్షణ అందించడం, వారి నూతన అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. మహీంద్రా ట్రాక్టర్స్ వృత్తి విద్య, శిక్షణ విభాగం (డీవీఈటీ).. మహారాష్ట్ర రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంఘం (ఎంఎస్ఎస్డీఎస్) భాగస్వామ్యంతో గడ్చిరోలిలోని ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్సిట్యూట్ (ఐటీఐ) కళాశాలలో ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పింది.గడ్చిరోలిలో ఏర్పాటు చేసిన ఈ ట్రాక్టర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా మహీంద్రా సంస్థ ట్రాక్టర్, తరహా వ్యవసాయ యంత్రాల వినియోగంలో యువతకు నైపుణ్యాన్ని అందిస్తుంది. ఇందుకోసం అత్యుత్తమ నిపుణుల సేవలను వినియోగించుకోనుంది. ఈ కేంద్రం బహుళ కెరీర్ అవకాశాలకు మార్గం సుగమం చేస్తుంది. ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, ఫార్మ్ ఎక్విప్మెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా మీడియాతో మాట్లాడుతూ ‘గడ్చిరోలిలో మహీంద్రా ట్రాక్టర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించినందుకు ఎంతో సంతోషిస్తున్నాం. మహారాష్ట్ర కేవలం ఒక ప్రముఖ పారిశ్రామిక కేంద్రం మాత్రమే కాదు.. వ్యవసాయ రంగానికి కూడా ప్రాధాన్యత కలిగిన రాష్ట్రం. గ్రామీణ యువత భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసుకోవడం మాకు గర్వకారణం’ అని అన్నారు.1963లో స్థాపితమైన మహీంద్రా ట్రాక్టర్స్ నాలుగు దశాబ్దాలుగా భారతదేశంలో నంబర్ వన్ ట్రాక్టర్ బ్రాండ్గా నిలిచింది. ఇటీవల 50కిపైగా దేశాలలో నాలుగు మిలియన్ ట్రాక్టర్లను విక్రయించి, మరో మైలురాయిని దాటింది. మహీంద్రా ట్రాక్టర్స్ మన్నిక, పనితీరు, విశ్వసనీయతకు పేరొందింది. ఈ ట్రాక్టర్లు వ్యవసాయ పనులకు అత్యుత్తమంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దారు. నాణ్యత, తయారీ ప్రమాణాలలో అత్యుత్తమ ప్రతిభకు డెమింగ్ అవార్డును మహీంద్రా ట్రాక్టర్స్ అందుకుంది. 300కు మించిన ట్రాక్టర్ మోడళ్లతో, స్థిరమైన అమ్మకాలు కలిగి, అంతర్జాతీయంగానూ మహీంద్రా ట్రాక్టర్స్ పేరుగాంచింది. -
‘అమెరికా’ ఒత్తిళ్లకు తలొగ్గామని మీరే అన్నారు కదా? ప్రధాని మోదీ ధ్వజం
నవీ ముంబై: 2008 ముంబైలో జరిగిన విధ్వంసకర ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై యుద్ధానికి దిగాలనే ఆలోచన ఉన్నప్పటికీ, అమెరికా ఒత్తిడి వల్ల దాన్ని విరమించుకున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి పాకిస్తాన్పై యుద్ధాన్ని విరమించుకున్నది మీరు కాదా? అంటూ చిదంబరం చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు మోదీ. నవీ ముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి బుదవారం(అక్టోబర్ 8) హాజరైన ప్రధాని మోదీ.. కాంగ్రెస్పై మండిపడ్డారు. ఇక్కడ ఎవరి పేరు ప్రస్తావన తేకుండానే కాంగ్రెస్ తీరును తూర్పారబట్టారు. ‘ 2008లో దేశ వాణిజ్య రాజధాని ముంబైపై ఉగ్రవాదులు భీకర దాడికి దిగితే కాంగ్రెస్ ఏం చేసింది?. వారి బలహీనతను నిరూపించుకుంది. టెర్రరిజం ముందు మోకరిల్లింది’ ఇదే విషయాన్ని ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడే చెప్పారు’ అంటూ విమర్శలు గుప్పించారు, ‘26/11 అనేది దేశంపై జరిగిన అత్యంత జుగుప్సాకరమైన ఉగ్రదాడి. ఈ దాడి ప్రతీ ఒక్కరికీ తెలుసు. అయినా ఆ దాడికి పాల్పడిన వారిపై ప్రతీకారం తీర్చుకోలేదు. ఆ సమయంలో హోంమంత్రిగా ఉన్న ఓ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఈ విషయాన్ని చెప్పారు. మన దేశానికి మరొక దేశం యుద్ధం వద్దని హితబోధ చేయడంతో పాక్తో యుద్ధానికి బలగాల్ని పంపలేదంట. ఇది కదా వేరే దేశ ఒత్తిడికి లొంగడమంటే?’ అని మోదీ ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈ ఏడాది జూలై నెలలో చిదంబరం మాట్లాడుతూ.. 2008లో అంతటి ఉగ్రదాడి జరిగిన దానికి కారణమైన పాకిస్తాన్తో యుద్ధాన్ని ఎందుకు వద్దనుకున్నారో చెప్పారు. తాను హోంమంత్రిగా ఉన్న ఆ సమయంలో అమెరికా ఒత్తిడి కారణంగానే దేశంలో అంతటి విధ్వంసాన్ని ఉగ్రవాదులు సృష్టించినా పాక్పై యుద్ధాన్ని వద్దనుకున్నామన్నారు ఓ కాంగ్రెస్ నేత. ఇది ఇప్పుడు బీజేపీకి ఆయుధంగా మారింది. చిదంబరం చేసిన వ్యాఖ్యలను సమయం వచ్చినప్పుడల్లా బీజేపీ ఎండగడుతూనే ఉంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరించదనేది చిదంబరం వ్యాఖ్యలతో నిరూపితమైందని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం.. మూడు నెలల క్రితం చిదంబరం వ్యాఖ్యలను లేవనెత్తుతూ కాంగ్రెస్ వైఖరిపై ధ్వజమెత్తారు. ఇదీ చదవండి:నవీ ముంబై విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకతలివే.. -
నవీ ముంబై విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకతలివే..
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మహారాష్ట్రలోని నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అనంతరం ఈ నూతన ఎయిర్పోర్టును పరిశీలించారు. అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) కింద ఈ భారీ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ను నిర్మించారు. ఈ విమానాశ్రయం ఈ ఏడాది డిసెంబర్లో దేశీయ, అంతర్జాతీయ వాణిజ్య విమానాల రాకపోకలకు అందుబాటులోకి రానుంది. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (ఎన్ఎంఐఏ) మొదటి దశను రూ. 19,650 కోట్ల వ్యయంతో నిర్మించారు. భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్ట్ ఇదే. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (సీఎస్ఎంఐఏ)కు అనుసంధానంగా ఇది పనిచేస్తుంది. సీఎస్ఎంఐఏలో ఏర్పడే రద్దీని తగ్గిస్తుంది.ఇప్పుడు బహుళ విమానాశ్రయాలు కలిగిన ప్రపంచ నగరాల్లో ముంబైకి ప్రత్యేక స్థానం దక్కింది. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం 1,160 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఈ విమానయాన సౌకర్యం పూర్తిగా అందుబాటులోకి వచ్చాక ఏడాదికి తొమ్మిది కోట్ల మంది ప్రయాణికుల సామర్ధ్యాన్ని కలిగివుంటుంది. 3.25 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను రవాణా చేస్తుంది. విమానాశ్రయ కార్యకలాపాల ప్రారంభ దశలో ఏడాదికి రెండు కోట్ల మంది ప్రయాణీకులకు సేవలందించనుంది.నవీ ముంబైలోని కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ప్రాంతపు సామర్థ్య పరిమితులను అధిగమిస్తుందని, కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను అందిస్తుందని అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (ఐఏటీఏ)పేర్కొంది. కాగా విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) గత సెప్టెంబర్ 30న విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ను మంజూరు చేసింది. టెర్మినల్లో 66 చెక్-ఇన్ పాయింట్లు, 22 స్వీయ-సేవ సామాను డ్రాప్ స్టేషన్లు, 29 ప్రయాణీకుల బోర్డింగ్ వంతెనలు, బస్సు బోర్డింగ్ కోసం 10 గేట్లు తదితర సౌకర్యాలు ఉన్నాయి.ఈ విమానాశ్రయ కార్యకలాపాలు సాంకేతికంగా అధునాతనంగా ఉంటాయి. 5జీ నెట్వర్క్లు, పర్యవేక్షణ కోసం అధునాతన సెన్సార్లు, ఆటోమేటెడ్ లగేజ్ సిస్టమ్లు, మెరుగైన సౌలభ్యం కోసం డీజీ యాత్ర ద్వారా కాంటాక్ట్లెస్ ప్రాసెసింగ్ అందుబాటులో ఉంటుంది. ఈ కార్గో సౌకర్యం పూర్తి ఆటోమేషన్తో పనిచేస్తుంది. డిజిటల్ కన్సైన్మెంట్ ట్రాకింగ్, డిజిటల్ లావాదేవీలు, మందులు , పాడైపోయే వస్తువుల కోసం ప్రత్యేక నియంత్రిత విభాగాలు అందుబాటులో ఉంటాయి. -
లండన్-ముంబై ఫ్లైట్.. కాక్పిట్లో ప్రత్యక్షమైన ప్రధాని
బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్(Keir Starmer In India) భారత్కు చేరుకున్నారు. ముంబైలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అయితే ఈ పర్యటనకు బయల్దేరిన సమయంలో విమానం కాక్పిట్లో ప్రత్యక్షమై.. కాసేపు ఆయన సందడి చేశారు. ‘‘నేను మీ ప్రధానిని..’’ అంటూ ఇంటర్కామ్ ద్వారా ప్రయాణికులను ఉత్సాహంగా పలకరించారాయన. లండన్ హీత్రూ ఎయిర్పోర్టులో బయల్దేరే ముందు.. ‘‘కాక్పిట్ ఉంది మీ ప్రధాని. మీ అందరిని ఈ ప్రయాణంలో కలవడం నిజంగా అద్భుతంగా ఉంది. ఇది బ్రిటన్ నుంచి భారత్కు పంపిన అతిపెద్ద వాణిజ్య మిషన్. కొత్త ఫ్రీ ట్రేడ్ ఒప్పందంలో ఉన్న అన్ని అవకాశాలను అన్వేషించేందుక ప్రయత్నిస్తాం. మీతో కలిసి ప్రయాణిస్తున్నందుకు సంతోషంగా ఉంది. విమానం దిగాక మరిన్ని అప్డేట్స్ అందిస్తా’’ అంటూ నవ్వుతూ ఆయన అన్నారు. ఈ వీడియోను స్వయంగా ఆయనే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు(UK PM In Cockpit Video). View this post on Instagram A post shared by Keir Starmer (@keirstarmer)ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రెండ్రోజులపాటు భారత్లో పర్యటించనున్నారు. విజన్ 2035-Vision 2035 పేరిట ఇరు దేశాల భారత్–యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించనున్నారు. తన పర్యటనలో స్టార్మర్.. 125 మందికి పైగా వ్యాపార నాయకులు, సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సంబంధాలు సహా ద్వైపాక్షిక భాగస్వామ్యంపై రెండు దేశాల నడుమ పూర్తిస్థాయిలో చర్చలు జరిగే అవకాశముంది. ముంబైలో జరిగే గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. అయితే ఈ రెండు దేశాల మధ్య జూలైలోనే కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని యూకే పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. ఇదే జరిగితే 90 శాతం వరకు వస్తువులపై టారిఫ్లు రద్దవుతాయి. స్టార్మర్ వెంట వ్యాపారవేత్తలు, యూనివర్సిటీ వైస్ చాన్స్లర్లు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులతో కూడిన 100 మందితో కూడిన బృందం రానుంది. దాదాపు 9 ఏళ్ల అనంతరం ప్రధాని ప్రతినిధి బృందంలో భారత్కు వస్తున్నందుకు ఎంతో ఆసక్తితో ఉన్నామని ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ)యూకే చైర్మన్ లార్డ్ కరణ్ బిలిమోరియా పేర్కొన్నారు. కాగా, రెండు దేశాల నడుమ ప్రస్తుతం 44.1 బిలియన్ పౌండ్ల మేర వాణిజ్యం జరుగుతోంది. జూలైలో కుదిరిన వాణిజ్య ఒప్పందం ఫలితంగా 2030 కల్లా ఇది రెట్టింపవుతుందని అంచనాలున్నాయి. ఇదీ చదవండి: నాలుగు రోజులుగా ట్రాఫిక్లోనే నరకం -
200 మంది ప్రయాణికులు, 75 వాహనాలతో సముద్రంలోనే నిలిచిపోయిన ఫెర్రీ
పాల్ఘార్: మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో సఫాలె–విరార్ల మధ్య రాకపోకలు సాగించే రో–రో ఫెర్రీ ఆదివారం సాయంత్రం సముద్రం మధ్యలోనే మొరాయించింది. ఆ సమయంలో ఫెర్రీలో 200 మంది ప్రయాణికుల, 75 వరకు వాహనాలున్నాయి. సామర్థ్యానికి మించి లోడు వేయడంతో సాంకేతిక లోపం ఏర్పడిందని అధికారులు తెలిపారు. హైడ్రాలిక్ ర్యాంప్ నిలిచిపోవడంతో ఎంహరంబల్పడ వద్ద సముద్రంలో కదలకుండా నిలిచిపోయిందని పేర్కొన్నారు. తక్కువ ఎత్తులో అలలు కూడా మరో కారణమని వివరించారు. దీంతో, కొన్ని గంటలపాటు ప్రయాణికులు ఫెర్రీపైనే ఉండిపోవాల్సి వచ్చింది. విషయం తెలియడంతో పోలీసులు, మెరైన్ అధికారులు అక్కడికి చేరుకుని సమస్యను సరిచేశారు. -
స్ఫూర్తిదాయక సురేఖ!
ముంబై: ఆసియాలోనే మొదటి మహిళా లోకో పైలట్గా, 36 ఏళ్లకు పైగా తన వృత్తి జీవితంలో దేశంలోని ఎన్నో ప్రతిష్టాత్మక రైళ్లను నడిపిన సురేఖ యాదవ్ (Surekha Yadav) మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. ఆమె ధైర్యసాహసాలు, స్ఫూర్తిదాయకమైన వారసత్వాన్ని వదిలి వెళ్లారని సెంట్రల్ రైల్వే కొనియాడింది. ఈ ’మార్గదర్శి అద్భుత ప్రయాణం’రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పేర్కొంది. పురుషాధిక్య ప్రపంచంలో మెరిసి.. యాదవ్ 1989లో భారతీయ రైల్వేలో చేరారు. పురుషాధిక్యం ఉన్న రైల్వే రంగంలో అడ్డంకులను ఛేదించారు. ఆమె 1990లో అసిస్టెంట్ డ్రైవర్గా మారారు, తద్వారా ఆసియా ఖండంలోనే మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్గా (woman loco pilot) గుర్తింపు పొందారు. క్లిష్టమైన మార్గాల్లో రైళ్లు నడిపి ముంబై సబర్బన్ లోకల్ రైళ్లతో పాటు, భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన కొండ మార్గాల గుండా సురేఖ యాదవ్ గూడ్స్ రైళ్లను నడిపారు. వందేభారత్ నుండి రాజధాని ఎక్స్ప్రెస్ వరకు.. దేశంలోని కొన్ని అత్యంత ప్రతిష్టాత్మక రైళ్లను కూడా ఆమె నడపడం విశేషం. రైతు కుటుంబంలో పుట్టి.. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ఒక రైతు కుటుంబంలో సెపె్టంబర్ 2, 1965న జన్మించిన యాదవ్, రైల్వే ఉద్యోగంలో చేరడానికి ముందు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేశారు. ఆమె క్రమంగా ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. 1996లో మొదటి గూడ్స్ రైలును నడిపారు, ఆపై 2000 సంవత్సరంలో మోటార్ ఉమన్గా పదోన్నతి పొందారు. 2010లో, ఆమె ఘాట్ డ్రైవర్గా అర్హత సాధించారు. ఆ తర్వాత వివిధ మార్గాల్లో సుదూర మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లకు సారథ్యం వహించారు. వందేభారత్కు సారథ్యం ఆమె వృత్తి జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా 2023 మార్చి 13వ తేదీ నిలిచిపోతుంది. సోలాపూర్, ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మధ్య తొలిసారిగా నడిపిన వందే భారత్ ఎక్స్ప్రెస్కు ఆమె సారథ్యం వహించారు. ఉద్యోగ విరమణకు కొన్ని రోజుల ముందు, చివరి బాధ్యతగా, ఇగత్పురి సీఎస్ఎంటీ మధ్య హజ్రత్ నిజాముద్దీన్–సీఎస్ఎంటీ మార్గంలో ప్రతిష్టాత్మక రాజధాని ఎక్స్ప్రెస్ను నడిపే అవకాశం ఆమెకు లభించింది. యాదవ్ తన చివరి రోజు ఉద్యోగ విరమణకు సంబంధించిన అన్ని లాంఛనాలను పూర్తి చేశారు. సంప్రదాయం ప్రకారం, ఆమె సహోద్యోగులు కొద్ది రోజుల క్రితం ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు.మార్గదర్శికి వీడ్కోలు ఒక మార్గదర్శికి వీడ్కోలు. ఆసియా తొలి మహిళా రైలు డ్రైవర్ సురేఖ యాదవ్.. 36 ఏళ్ల అద్భుతమైన సేవల తర్వాత నేడు సెలవు తీసుకుంటున్నారు. ఆమె అద్భుత ప్రయాణం.. రాబోయే తరాల రైల్వే మహిళలు, పురుషులకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. – ‘ఎక్స్’లో సెంట్రల్ రైల్వే పోస్టు -
నీట్లో 99.99 పర్సంటైల్.. డాక్టర్ కావాలనుకోలేదు
ఈ ఫొటోలోని కుర్రాడు పేరు అనురాగ్ అనిల్ బోర్కర్. నీట్ యూజీ 2025 పరీక్షలో 99.99 పర్సంటైల్తో OBC విభాగంలో 1475 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. కానీ విచిత్రం ఏమిటంటే ఈ కుర్రాడు డాక్టర్ కావాలనుకోలేదు. అందుకే మెడిసిన్లో చేరడానికి ముందే ప్రాణాలు తీసుకున్నాడు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు 19 ఏళ్ల అనురాగ్ ఇష్టం లేని చదువు కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులకు తీరని వేదన మిగిల్చాడు.సిందేవాహి తాలూకాలోని నవర్గావ్ ప్రాంతంలో అనురాగ్ కుటుంబం నివసిస్తోంది. ఇటీవల జరిగిన నీట్ యూజీ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించడంతో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ మెడికల్ కాలేజీలో అతడికి సీటు వచ్చింది. MBBS కోర్సులో చేరడానికి గోరఖ్పూర్ వెళ్లడానికి సిద్ధమవుతున్న క్రమంలో అనురాగ్ అనూహ్యంగా తనువు చాలించాడు. ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు.ఘటనా స్థలం నుంచి పోలీసులు అనురాగ్ రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ లేఖను మీడియాకు చూపించలేదు. డాక్టర్ కావడం ఇష్టం లేకనే అతడు ప్రాణాలు తీసుకున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. నవర్గావ్ పోలీసులు (Navargaon Police) దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనురాగ్ మరణంతో అతడి తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. అనురాగ్ తెలివైన విద్యార్థి అని పొరుగువారు తెలిపారు. అతడి చెల్లి గత సంవత్సరం 12వ తరగతి పరీక్షల్లో జిల్లా టాపర్గా నిలిచిందని వెల్లడించారు.ఒత్తిడి నుంచి బయటపడండిచదువుల విషయంలో చాలా మంది టీనేజర్లు ఒత్తిడికి గురవుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. తల్లిదండ్రుల ఇష్టాలను కాదనలేక, తమకు ఇష్టంలేని చదువు చదవలేక నలిగిపోతున్నారు. చదువు కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జీవితంలో అది ఒక భాగం మాత్రమేనని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఒత్తిడికి గురైతే తమ సమస్య గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవాలి. ఒంటరితనం నుంచి బయటపడటానికి మార్గాలు వెతకాలి. మీకు దగ్గరలోని మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి. ప్రభుత్వం, స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో నడిచే హెల్ప్లైన్ నంబర్లలోనూ సంప్రదించి సహాయం పొందవచ్చు.మహారాష్ట్రలో హెల్ప్లైన్లువాండ్రేవాలా ఫౌండేషన్ ఫర్ మెంటల్ హెల్త్ 9999666555 లేదా help@vandrevalafoundation.comTISS iCall 022-25521111 (సోమవారం- శనివారం: ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు)BMC మానసిక ఆరోగ్య హెల్ప్లైన్: 022-24131212 (24x7) -
‘మహా’ రాజకీయం.. ఉద్దవ్, రాజ్ థాక్రే మధ్య కీలక అంగీకారం
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో తమకు గట్టి పట్టున్న సీట్లను సమానంగా పంచుకోవాలని శివసేన(యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) నిర్ణయించాయి. మిగతా మున్సిపాలిటీల్లో 60:40 సూత్రాన్ని అనుసరించాలని తీర్మానించాయి. సీట్ల పంపకంపై దీపావళి వరకు స్పష్టత వచ్చే అవకాశముంది.బీఎంసీ పరిధిలోని ప్రాబల్యం కలిగిన స్థానాలను ముందుగా గుర్తించాలని కూడా అంగీకారానికి వచ్చాయి. ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన(యూబీటీ), ఎంఎన్ఎస్ సారథి రాజ్ ఠాక్రే వరుసకు సోదరులవుతారు. ఈ రెండు పార్టీల కూటమి ఏర్పాటు ప్రకటన కేవలం లాంఛనప్రాయమేనని ఇరుపార్టీల నేతలు అంటున్నారు. ముంబైతోపాటు థానె, నాసిక్, కల్యాణ్–డొంబివిలి ప్రాంతాల్లో రెండు పార్టీలకు గట్టి పట్టుంది. 2026 జనవరి 31వ తేదీలోగా మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు గట్టి ఆదేశాలివ్వడం తెల్సిందే. 2025–26లో వార్షిక బడ్జెట్ రూ.74 వేల కోట్లు కలిగిన బీఎంసీ దేశంలోనే అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్. బీఎంసీలో 227 వార్డులున్నాయి.ఇదిలా ఉండగా ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో ఉద్దవ్, రాజ్ థాక్రే ఒకే వేదికపై మళ్లీ కలిశారు. 2005లో రాజ్ థాక్రే శివసేన పార్టీని వీడారు. పార్టీ వీడడానికి ఉద్ధవ్ కారణమని విమర్శించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీలు ఘోర పరాజయం పాలయ్యాయి. దాంతో ఇద్దరు సోదరులు మళ్లీ కలిసిపోయారు. -
సుప్రీంకోర్టులో వరవరరావుకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: విరసం నేత వరవరరావు(84)కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. చికిత్స విషయంలో ఆయన వేసిన ఓ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. భీమా కోరేగావ్ కేసులో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అరెస్టైన ఆయన.. కోర్టు షరతులతో ముంబైలో ఉండిపోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే..వయోభారం, అనారోగ్య కారణాల నేపథ్యంలో హైదరాబాద్లో చికిత్స తీసుకునేందుకు అనుమతి కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ముంబైలో చికిత్సకు అధిక ఖర్చు అవుతోందని.. హైదరాబాదులో తమ బంధువులు డాక్టర్లైన నేపథ్యంలో అక్కడ చికిత్స పొందేందుకు అనుమతించాలని ఆయన పిటిషన్లో అభ్యర్థించారు. కానీ కోర్టు ఆ అభ్యర్థను తిరస్కరిస్తూ పిటిషన్ కొట్టేసింది. భీమా కోరేగావ్ హింస కేసులో పూణే పోలీసులు వరవరరావును ఉపా చట్టం కింద 2018 ఆగస్టు 28వ తేదీన అరెస్ట్ చేసి తలోజా జైలు(మహారాష్ట్ర)కు తరలించారు. ఆపై నెలలోపే సుప్రీం కోర్టు ఆదేశాలతో హైదరాబాద్లోని నివాసానికి తరలించి గృహనిర్బంధం చేశారు. మరో రెండు నెలల తర్వాత కోర్టు అనుమతితో తిరిగి తలోజా జైలుకు తరలించారు. అయితే..2020 జులైలో ఆయనకు జైలు కరోనా సోకడంతో వరవరరావుకు ఆరోగ్య సమస్యలు తీవ్రతరం అయ్యాయి. ఈ తరుణంలో.. మహారాష్ట్ర హైకోర్టు 2021 ఫ్రిబవరిలో మెడికల్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో షరతుల మీద ఆయన ముంబైలో అద్దె నివాసంలో ఉన్నారు. అటుపై 2022లో సుప్రీం కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ.. ముంబై విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. -
Anjana Krishna: ఈ ధైర్యం అక్కడి నుంచి వచ్చిందే!
నీకు ఎంత ధైర్యం? అంటూ.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) ఓ ఐపీఎస్ అధికారిణితో వాగ్వాదం సందర్భంగా ప్రశ్నించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే.. ఈ వ్యవహారంలో పవార్ ప్రవర్తనపై నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆ డేరింగ్ యంగ్ ఆఫీసర్ గురించి ఆరా తీస్తున్నారు. 2022–23 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అంజనా కృష్ణ(26) స్వస్థలం కేరళ. ఆమె తండ్రి ఓ చిన్నబట్టల దుకాణం నడిపిస్తున్నారు. తల్లి కోర్టు టైపిస్ట్గా పని చేస్తోంది. పూజప్పురాలోని సెయింట్ మేరీస్ సెంట్రల్ స్కూల్లో చదువుకుంది. చిన్నప్పటి నుంచే అంజనాకు ఐపీఎస్ కావాలనే కల. తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో గణితంలో డిగ్రీ పూర్తి చేసింది. ఆవెంటనే UPSC పరీక్షకు సిద్ధమైంది. అదే సమయంలో అంజనా ఓ ప్రముఖ మలయాళ దినపత్రికలో ఇంటర్న్గా పనిచేసింది కూడా. మలయాళ సాహిత్యాన్ని ఐచ్ఛిక విషయంగా ఎంచుకుని, ఆంగ్ల మాధ్యమంలో యూపీఎస్సీ పరీక్ష రాసింది. అలా.. 2022 UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో అంజనా ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 355 సాధించింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా కర్మాలా ప్రాంతంలో DSP (Deputy Superintendent of Police)గా విధులు నిర్వహిస్తున్నారు. నిజాయితీతో పాటు ఉత్సాహం, పరిపాలనా నైపుణ్యం, దూకుడు వల్ల ఆమెకు స్థానికంగా మంచి పేరు దక్కింది. View this post on Instagram A post shared by Fortune IAS Academy (@fortune_ias_academy)అసలేం జరిగిందంటే.. రోడ్డు నిర్మాణం కోసం కర్మలా తాలూకాలోని కుద్దు గ్రామంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు సబ్-డివిజనల్ పోలీసు అధికారిణి అంజనా కృష్ణకు ఫిర్యాదులు అందాయి. దీనిపై చర్యలు తీసుకునేందుకు బుధవారం ఆమె ఆ గ్రామానికి వెళ్లారు. ఈక్రమంలో కొందరు గ్రామస్థులు, స్థానిక ఎన్సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని అధికారులతో ఘర్షణకు దిగారు. అయితే.. వాళ్లలో ఒకరు డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు ఫోన్ చేసి ఇచ్చారు. ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం ఆపాలని పవార్ ఆమెను ఆదేశించారు. ఈ క్రమంలో.. పవార్: నేను ఉపముఖ్యమంత్రిని మాట్లాడుతున్నా. మీ చర్యలను వెంటనే ఆపేయండి.అంజనా: మీరు చెబుతున్నది నాకు అర్థమవుతోంది. కానీ, ఫోన్లో నేను మాట్లాడుతోంది నిజంగా డిప్యూటీ సీఎంతోనేనా? కాదా? అనే విషయం తెలియాలి. నా నంబర్కు ఒకసారి వీడియో కాల్ చేస్తారా?పవార్: నీకు ఎంత ధైర్యం?. నేను మీపై చర్యలు తీసుకుంటా. నన్నే వీడియో కాల్ చేయమంటారా?నన్ను చూడాలనుకుంటున్నారుగా.. నాకు వీడియో కాల్ చేయండి.अजित पवार- "इतना आपको डेयरिंग हुआ है क्या?"जब DSP अंजना कृष्णा ने अजीत पवार से कहा, "मैं कैसे मान लूं कि आप डिप्टी चीफ मिनिस्टर हो, वीडियो कॉल करो" #Maharashtra #AjitPawar #MaharashtraPolice #AnjanaKrishna #NCP pic.twitter.com/WUnEtWlfRm— India TV (@indiatvnews) September 5, 2025దీంతో పవార్కు ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ వీడియో కాల్ చేశారు. ఈ సందర్భంగా తక్షణమే చర్యలు ఆపేయాలంటూ పవార్ ఆదేశించారు. ఈ సంభాషణను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అలా ఆ వీడియో వైరల్ అయ్యింది. పవార్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియోపై పవార్ వర్గ నేత సునీల్ తట్కరే స్పందించారు. కార్యకర్తలను శాంతింపజేసేందుకు ఐపీఎస్ అధికారిణిని అజిత్ మందలించి ఉండవచ్చన్నారు. ఆమె విధులను పూర్తిగా అడ్డుకోవాలనేది ఆయన ఉద్దేశం కాదన్నారు. ఇక ఈ ఘటనపై అంజనా కృష్ణ స్పందించాల్సి ఉంది. అయితే పవార్ స్వరం గుర్తించలేకపోయినందున నిర్ధారణ కోసమే కాల్ చేయాలని ఆమె కోరినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎంతో ‘నేరుగా కాల్ చేయండి’ అనే మాట ఆమె ధైర్యాన్ని ప్రతిబింబించే సంకేతంగా మారింది. సోషల్ మీడియాలో ఆమె ధైర్యం, నిబద్ధతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


