Karimnagar
-
శాశ్వత నిషేధం జరగాలి
సమాజంలో ఆత్మహత్యల నివారణకు కేవలం నిషేధం సరిపోదు. అవగాహన పెంపు, రైతులకు ఆర్థిక భరోసా వంటి చర్యలు కొనసాగాలి. గ్రామీణ స్థాయిలో కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం, సంక్షోభ సమయంలో సహాయం అందించే వ్యవస్థలు బలోపేతం చేయడం అత్యవసరం. కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు బాధితులను గుర్తించి సహాయం అందించడంలో కీలక పాత్ర పోషించాలి. ఇప్పుడు తీసుకున్న ఈ తాత్కాలిక నిషేధం శాశ్వతంగా మారాలి. దేశవ్యాప్తంగా పారాక్వాట్పై పూర్తి నిషేధం అమలు చేస్తేనే దీని వల్ల జరిగే ప్రాణనష్టాలను పూర్తిగా అరికట్టవచ్చు. – డాక్టర్ బీఎన్ రావు, ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు -
నారీ.. మోగాలి విజయభేరి
● నారీ శక్తి వందన్ అదినియమ్పై మహిళామణుల హర్షం విద్యానగర్(కరీంనగర్): లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33శాతం సీట్ల రిజర్వేషన్ కోసం 2023లో నారీశక్తి వందన్ అదినియమ్ (మహిళా రిజర్వేషన్ బిల్లు 2023) బిల్లు తీసుకురాగా ఈ బిల్లును ఉభయ సభలతో పాటు, రాష్ట్రపతి అమోదించారు. బిల్లు రాబోయే డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) తర్వాత అమల్లోకి రానున్నది. 2029 లోక్సభ, శాసనసభల ఎన్నికలను మహిళా రిజర్వేషన్లతో నిర్వహించడానికి మహిళా రిజర్వేషన్ల చట్టంతో ముడిపడిన సవరణ బిల్లుపై ఈనెల 16 నుంచి మూడు రోజులపాటు పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం కానున్న నేపథ్యంలో బిల్లుపై పలువురు నారీమణుల అభిప్రాయాలు. దేశ జనాభాల్లో సగం ఉన్న మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ అన్న అంశం దశాబ్దాల కాలం నుంచి చర్చలకే పరిమితమైంది. రెండేళ్ల క్రితం 33శాతం మహిళ రిజర్వేషన్ చట్టం వచ్చినప్పటికి అమలులోకి రావడానికి సవరణ చట్టాన్ని తీసుకురావడంతో మహిళల రాజకీయ భాగస్వామ్యం పెరుగుతుంది. – బొమ్మ జయశ్రీ, ప్రకృతి పర్యావరణ సంస్థ, కరీంనగర్ -
వసూళ్లకు పాల్పడుతున్న రౌడీషీటర్ అరెస్ట్
కోరుట్ల: కోరుట్లలో కొంతకాలంగా వ్యాపారులను బెదిరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న రౌడీషీటర్ విత్తనాల నాగరాజును ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రాములు ఆదేశాలతో మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు సీఐ సురేష్ బాబు తెలిపారు. నాగరాజుపై గతంలో రెండు హత్యకేసులు, ఇతరత్రా కేసులు ఉన్నాయని, పీడీ యాక్ట్ కేసు కూడా నమోదు చేసి జైలుకు పంపించామని వివరించారు. వ్యాపారులను బెదిరించిన ఘటనలో నాగరాజుతోపాటు మరొకరు కూడా ఉన్నట్టు దర్యాప్తులో తేలిందని, సదరు వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలిపారు. వీరితోపాటు ఇంకెవరు ఉన్నా పట్టుకుంటామన్నారు. నాగరాజు, అతడి అనుచరులతో ఎవరైనా సంబంధాలు కలిగి ఉంటే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎవరైనా బలవంతపు వసూళ్లకు పాల్పడితే తమ దృష్టికి తేవాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని వివరించారు. కార్యక్రమంలో ఎస్సై చిరంజీవి పాల్గొన్నారు. -
ఇందిరమ్మకు దళితబంధు బ్రేక్
కరీంనగర్రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలోని నిబంధనలు నిరుపేదలకు శాపంగా మారాయి. స్వయం ఉపాధికోసం కొనుగోలు చేసిన కారు, జేసీబీ, ఫోర్ వీలర్లు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు అడ్డంకిగా మారాయి. కుటుంబానికి కారు ఉందనే కారణంతో లబ్ధిదారులకు మంజూరైన ఇళ్లను అధికారులు రద్దు చేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశామని గృహనిర్మాణ సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. కార్లు, ట్రాక్టర్లు, జేసీబీలు ఉన్నవారికి మంజూరైన ఇండ్లను హోల్డ్లో పెట్టినట్లు వివరించారు. దళితబంధు లబ్ధిదారులకు ఇళ్లు లేవు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు దళితబంధు పథకం అమలు చేసింది. కరీంనగర్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా తాహెర్కొండాపూర్, నల్లగుంటపల్లి గ్రామాలను ఎంపిక చేశారు. తాహెర్కొండాపూర్లో 29, నల్లగుంటపల్లిలో 37 యూనిట్లు మంజూరు చేసి, ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఆర్థికసాయం అందించారు. లబ్ధిదారులు స్వయం ఉపాధి కోసం కార్లు, జేసీబీలు, ట్రాక్టర్లు తదితర వాహనాలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం కొందరు లబ్ధిదారులు వాహనాలను విక్రయించగా, మరికొందరు వాటితో జీవనోపాధి పొందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది నుంచి అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల కోసం రెండు గ్రామాల్లోని దళితులు ప్రజాపాలన గ్రామసభల్లో దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో విచారించిన అధికారులు కుటుంబాల పేరిట కార్లు, ట్రాక్టర్లు, జేసీబీలుండటంతో మంజూరైన ఇళ్లను రద్దు చేశారు. దళితబంధు పథకంలో జీవనోపాధి కోసం వాహనాలు కొనుగోలు చేశామని, ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్తోపాటు పలువురు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. శిఽథిలావస్థకు చేరి, కూలిపోయిన ఇండ్లల్లో నివాసముంటున్నామని, ప్రభుత్వం నిబంధనలను సడలించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టాలని దళితబంధు లబ్ధిదారులు కోరుతున్నారు. -
ఆగుతూ.. సాగుతూ..
● ఆలస్యమవుతున్న అమృత్భారత్ పనులు ● పెద్దపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనుల్లో పెరగని వేగం ● ఇప్పుడిప్పుడే మొదలవుతున్న లిఫ్ట్, ఎస్కలేటర్ పనులు పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని రైల్వే జంక్షన్ను అన్నివిధాలా అభివృద్ధి చేసి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్భారత్ పథకం అమలు చేస్తోంది. కానీ, పనుల్లో వేగం లేక ఆగుతూ.. సాగుతున్నాయి. పెద్దపల్లి రైల్వేస్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణించాలనుకునే వారికి కష్టాలు తప్పడం లేదు. తాత్కాలిక షెడ్డులోనే టికెట్ కౌంటర్ తాత్కాలిక షెడ్డులో టికెట్ కౌంటర్ ఏర్పాటు చేశారు. పనుల్లో వేగం పెంచాలని డీఆర్యూసీసీ సభ్యుడు ఎన్డీ తివారీ స్థానిక నాయకులతో కలిసి రైల్వేశాఖకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారులు పరిశీలించి వెళ్తున్నా వేగం పుంజుకోవడం లేదు. రైల్వేస్టేషన్ ముఖద్వారం నిర్మాణం పురోగతిలో ఉంది. లిఫ్ట్ పనులు ఇప్పుడే మొదలవుతున్నాయి. ఎస్కలేటర్ నిర్మాణం ప్రారంభించాల్సి ఉంది. పురోగతిలో భారీషెడ్డు పెద్దపల్లి ప్రాంతంలోని గిడ్డంగుల్లో నిల్వకోసం, ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు బియ్యం, ఇతర సామగ్రి తరలించే సమయంలో ఎండ, వానలతో ఇబ్బంది లేకుండా భారీ షెడ్డు నిర్మాణం చేపట్టారు. దీనిపనులు పురోగతిలో ఉన్నాయి. భారీషెడ్ రైల్వేస్టేషన్కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోందని పలువురు పేర్కొంటున్నారు. అనుకూలంగా పెద్దపల్లి జిల్లా ప్రజానీకంతోపాటు పొరుగు జిల్లాలనుంచి బస్సు రూట్లలో వచ్చి రైళ్లలో ప్రయాణించే వారికి పెద్దపల్లి రైల్వేస్టేషన్ ఎంతో అనువుగా ఉంది. రైల్వేస్టేషన్కు సమీపంలోనే బస్స్టేషన్ ఉండడంతో ప్రయాణికులు రైలు ప్రయాణంవైపే మొగ్గు చూపుతున్నారు. పెద్దపల్లి–కరీంనగర్ మార్గం ద్వారా దూర, సుదూర ప్రాంతాలకు నడిచే రైళ్లకోసం బైపాస్ మార్గం అందుబాటులోకి రానుండడం, పెద్దపల్లి రైల్వేస్టేషన్ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లేందుకు అవసరమైన ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించే అవకాశాలున్నాయి. పెద్దపల్లి ప్రాంతంలో రైల్వే శాఖ చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. పెద్దపల్లి–కూనారం రైలువంతెన పనులు ఏళ్లకేళ్లుగా సాగుతుండడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. ఈ విషయాన్ని రైల్వేశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా. వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రయాణికులు, ప్రజల ఇబ్బందులను దూరం చేయాలి. – నారాయణ్దాస్ తివారీ, డీఆర్యూసీసీ సభ్యుడు, పెద్దపల్లి -
అటు చెట్లు.. ఇటు గుంతలు
మంథని: ఆర్ అండ్ బీ అధికారుల అలసత్వంతో పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన రహదారులపై ప్రమాదకర గుంతలను పూడ్చటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అంతేగాకుండా దారివెంట ఉన్న ప్రమాదకర చెట్లను తొలగించడంలోనూ అదేధోరణి అవలంబిస్తున్నారు. ఇందుకు పెద్దపల్లి జిల్లా మంథని–గోదావరిఖని రహదారిలోని మల్లేపల్లి శివారులో భారీ గుంత ఏర్పడి రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు. దారి మధ్యలో చాలాచోట్ల గుంతలు ఉన్నా పూడ్చకుండా నిర్లక్ష్యం వహించడం వాహనదారుల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. మల్లేపల్లి శివారులో ఏర్పడిన గుంతను గతంలో మంథని పోలీసులు మొరం పోయించి పూడ్చివేయించారు. ఈ మార్గంలో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో కొద్దిరోజులకే గుంత మళ్లీ పెద్దగా ఏర్పడింది. చాలా రోజులుగా దారి మధ్యలో గుంత ఉంటున్నా అధికారులు పూడ్చడం లేదు. ఆదమరిస్తే అంతే సంగతులు దారి మధ్యలోని గుంత వాహనదారులకు దగ్గరగా వచ్చేవరకూ కనిపించడం లేదు. రాత్రివేళలో గుంతలోపడి అనేక వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. గుంతలో పడిన వాహనాలు దెబ్బతింటున్నాయి. దారి వెంట వచ్చే వాహనదారులు ఆదమరిస్తే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే గోదావరిఖని–మంథని– కాటారం దారిలో పెద్దగుంతలు ఏర్పడుతున్నా సంబంధిత శాఖ పూడ్చడంతో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ప్రమాదకరంగా చెట్లు.. పెద్దపల్లి జిల్లాలోని అనేక రహదారులపై ప్రమాదకరంగా చెట్లు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కాటారం ప్రధాన రహదారిలో అడవిసోమన్పల్లిలో సమీపంలో రోడ్డుపై ఎండిపోయిన భారీ చెట్లు ప్రమదకరంగా ఉన్నాయి. చాలారోజులుగా ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహారిస్తున్నారు. ఏక్షణంలోనైనా చెట్లు పడిపోయే పరిస్థితి ఉంది. ప్రమాదం పొంచి ఉన్నా పట్టించుకోని అధికారుల తీరుపై వాహనదారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముత్తారం దారిలో సైతం చెట్టు ప్రమాదకర స్థితిలో చాలారోజుల నుంచి ఉన్నా తొలగించడం లేదు. ఇలా చాలాచోట్ల చెట్లు రోడ్డుపై ప్రమాదకంగా ఉన్నాయి. అధికారులు ఇప్పటికై నా స్పందించాలని వాహనదారులు కోరుతున్నారు. అడవిసోమన్పల్లి శివారులో ప్రమాదకరంగా ఉన్న చెట్టు గోదావరిఖని – మంఽథని మధ్య పెద్దగుంత ప్రమాదకరంగా రహదారులు పట్టించుకోని ఆర్అండ్బీ అధికారులు -
అంబేడ్కర్ ఆశయాలు స్ఫూర్తిదాయకం
జెండాలు చేత పట్టుకుని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు వెళ్లిన ఏబీవీపీ కార్యకర్తలను జయంతోత్సవ కమిటీ సభ్యులు, దళిత సంఘాల నేతలు అడ్డుకున్నారు. పార్టీలకతీతంగా జరుగుతున్న సభలో జెండాలు, కండువాలు వద్దని సూచించారు. ఏబీవీపీ నేతలు వినకపోవడంతో సీపీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో పోలీసులు వారికి కిందకు దింపారు. దీంతో అరగంట పాటు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. శాతవాహన యూనివర్సిటీలో దళిత ప్రొఫెసర్లపై, విద్యార్థులపై అర్బన్ నక్సలైట్లు అంటూ ప్రచారం చేస్తూ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతను వేధించడం తక్షణమే మానుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంజం వెంకటస్వామి డిమాండ్ చేశారు. దళిత నాయకులు కొరివి వేణుగోపాల్, సత్యరాజ్వర్మ, బొత్త వెంకటమల్లయ్య, సొల్లు అజయ్వర్మ తదితరులు పాల్గొన్నారు.కరీంనగర్టౌన్: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ఆశయ సాధనకు సమష్టిగా కృషి చేద్దామని చొప్పదండి ఎమ్మెల్యే, జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం పిలుపునిచ్చారు. మంగళవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, ఆర్టీఏ మెంబర్ రాహుల్, డీసీసీ అర్బన్ అధ్యక్షుడు అంజన్కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఆర్డీవో మహేశ్వర్, ఉన్నత అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎలుక ఆంజనేయులు, సుద్దాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పిల్లలను అంబేడ్కర్ మాదిరిగా ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. దళిత సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. అంబేడ్కర్ ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. అంబేడ్కర్ చెప్పిన మాటలు ఎడ్యుకేట్– ఆర్గనైజ్ నిరంతరం గుర్తుంచుకోవాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. బలహీనవర్గాల అభివృద్ధికి చదువే మూలమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, తదితరులు పేర్కొన్నారు. -
వృద్ధురాలి హత్య
సిరిసిల్లఅర్బన్: ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన సిరిసిల్ల మున్సిపల్ పరిధి 24వ వార్డు రాజీవ్నగర్లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వృద్ధురాలు కోన లక్ష్మి (75)కి ముగ్గురు కుమారులు ఉండగా ఒకరు చనిపోయారు. ఇద్దరిలో ఒకరు వేములవాడ, మరొకరు సిరిసిల్ల పట్టణంలోని సర్ధార్నగర్లో నివాసం ఉంటున్నారు. లక్ష్మి రాజీవ్నగర్లో ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో చిన్న కుమారుడు వెంకటేశ్ మంగళవారం సాయంత్రం తల్లి వద్దకు రాగా, అచేతనంగా పడి ఉంది. దగ్గరికి వెళ్లి చూడగా దుండగులు గొంతులో కత్తితో పొడవడంతో రక్తపు మడుగులో మృతిచెంది కనిపించింది. వెంటనే పోలీసులు సమాచారం అందించాడు. హత్య ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాణం తీసిన చేపలవేట జూలపల్లి: పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వ డ్కాపూర్ గ్రామంలో చేపలవేట నిండు ప్రాణం బలి గొంది. గ్రామానికి చెందిన సయ్యద్ ఖాసీం పాషా (31) తన మిత్రులు పాట కుల రాజమల్లు, గుండేటి స్వామితో కలిసి మంగళవారం మధ్యాహ్నం సమీపంలోని హుస్సేన్మియా వాగులో చేపల వేటకు వెళ్లారు. సమీపంలోని విద్యుత్ మో టారు నుంచి కనెక్షన్ తీసుకుని కరెంటుతో చేపలు పట్టేందుకు యత్నించారు. ఒక్కసారిగా కరెంటు షాక్ వచ్చి చేపలు పడుతున్న సయ్యద్ ఖాసీం పాషా కుప్పకూలి పోయాడు. గమనించిన మిత్రులు వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానాకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తల్లి ఆజీజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సనత్కుమార్ తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతికరీంనగర్క్రైం: నగరంలోని ఓ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతిచెందిందని మృతురాలి కుటుంబ సభ్యులు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా శాత్రాజుపల్లి గ్రామానికి చెందిన సాహెబ్ బి (62)ని ఈనెల 10న గుండె సంబంధిత వ్యాధి నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు పరీక్షలు చేిసిన వైద్యులు గుండెలో వాల్స్ బ్లాక్ అయ్యాయని, వెంటనే ఆపరేషన్ చేయాలని కుటుంబ సభ్యులకు సూచించారు. మంగళవారం ఆపరేషన్ చేసి బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఆమె మృతి చెందింది. మృతురాలి కుమారుడు ఎండీ గౌస్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మిస్సింగ్ కేసు నమోదుగన్నేరువరం: మండలంలోని జంగపల్లి గ్రామానికి చెందిన చెందిక ఖాత లక్ష్మయ్య కనబడటం లేదని అతని భార్య పద్మ మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై నరేందర్రెడ్డి తెలిపారు. ఈ నెల 8వ తేదీన ఇంట్లో గొడవ పెట్టుకుని వెళ్లిపోయాడని, అప్పటి నుంచి అతని ఆచూకీ లభించడం లేదని పేర్కొన్నట్లు వెల్లడించారు. -
అనారోగ్యంతో ఉన్న కోడెల పంపిణీ
కోనరావుపేట(వేములవాడ): అనారోగ్యంతో ఉన్న కోడెలను పంపిణీ చేశారని కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన బడే స్వామిదాస్ ఆరోపించారు. బాధితుడి కథనం ప్రకారం.. స్వామిదాస్ వేములవాడ రాజన్న కోడెల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మొదట క్రిస్టియన్ పేరు ఉన్నదని అధికారులు తిరస్కరించారు. తాను కోడెలను పోషించుకుంటానని అధికారులను వేడుకోవడంతో రెండు కోడెలను పంపిణీ చేశారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న కోడెలను అందించారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. స్థానిక పశువైద్యాధికారులను సంప్రదించగా వారు వచ్చి పరిశీలించి కోడెలకు వచ్చిన వ్యాధిని గుర్తించలేకపోతున్నారని పేర్కొన్నాడు. కోడెలకు వెనకాల చుక్కల మాదిరిగా పుండ్లు అవుతున్నాయని చికిత్స చేయించినా తగ్గడంలేదని వాపోయాడు. గతంలో కూడా అనారోగ్యంతో బాధపడుతున్న కోడెలను ఇవ్వగా వాటికి చికిత్స చేయించినా మృతి చెందాయని తెలిపాడు. -
వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం
రామడుగు: కరీంనగర్కు చెందిన ఓ వృద్ధురాలు రామడుగు మండలం వెదిర శివారులో ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. స్థానికుల వివరాల ప్రకారం కరీంనగర్కు చెందిన కానసగొట్టు భారతి(75) కరీంనగర్ నుంచి ఆటోలో వచ్చింది. రామడుగు మండలం వెదిర శివారులో దిగింది. తన వెంట తెచ్చుకున్న పెట్రోలు ఒంటిపై పోసుకుని నిప్పటించుకుంది. రోడ్డు వెంట వెళ్తున్నవారు గమనించి మంటలు ఆర్పివేశారు. వెదిర సర్పంచ్ శనిగరపు అంజన్కుమార్, ఎస్సై కె.రాజు ఆటోలో కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సమస్యతోనే ఆత్మహత్యకు యత్నించిందని, పరిస్థితి విషమంగానే ఉన్నట్లు ఎస్సై వివరించారు. -
ప్రైవేట్.. టార్గెట్
కరీంనగర్టౌన్: జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది మెడపై అడ్మిషన్ల కత్తి వేలాడుతోంది. 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు భారీగా చేయాలంటూ యాజమాన్యాలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నాయి. అడ్మిషన్ల సంఖ్యను బట్టే వచ్చే విద్యా సంవత్సరంలో జీతాల చెల్లింపు, ఇంక్రిమెంట్లు, ఉద్యోగభద్రత ఉంటుందనే యాజమాన్యాలు పెట్టే నిబంధనలతో సతమతమవుతున్నారు. టార్గెట్ కోసం ఉదయం, సాయంత్రం సమావేశాలు నిర్వహించి, వ్యక్తిగతంగా దురుసుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలల్లో 15 వేల మందికిపైగా బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తుండగా అందరిదీ అదే పరిస్థితి. టార్గెట్ 10 నుంచి 40 అడ్మిషన్లు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నిత్యం 5 నుంచి 10 అడ్మిషన్లు చేయాలి. కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలల్లో పనిచేసే వారు 20 నుంచి 40వరకు అడ్మిషన్లు చేయాల్సిందే. దీంతో ఎండను సైతం లెక్కచేయకుండా ఉద్యోగులు కరీంనగర్తో పాటు హుజూరాబాద్, మానకొండూర్, చొప్పదండి, తదితర మండలాల్లో ఇంటింటా తిరుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ విద్యార్థుల వేటలో పడ్డారు. ‘మీ ఇంట్లో పిల్లలు ఎంత మంది.. ఏం చదువుతున్నారు.. ఎక్కడ చదువుతున్నారు.. మా పాఠశాల/కళాశాలలో చేర్పించండి. నాణ్యమైన బోధన ఉంటుంది. ఫలితాలు చూడండంటూ’ పేప ర్లు చూపుతున్నారు. సీటు ఇప్పుడు కన్ఫార్మ్ చేసుకుంటే ఫీజులో రాయితీ కూడా ఇప్పిస్తామంటూ చెబుతున్నారు. తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు తీసుకుని రోజూ నాలుగైదు సార్లు ఫోన్లు చేస్తున్నారు. ఉద్యోగులతో వెట్టిచాకిరీ అడ్మిషన్ల టార్గెట్లు ఒక్కటే కాకుండా, యాజమాన్యాలు తమతో వెట్టిచాకిరీ చేయిస్తున్నాయని బోధన, బోధనేతర సిబ్బంది అవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ 10 నుంచి 12 గంటలు పని చేయాలని, శని, ఆదివారం, జాతీయ సెలవు దినాలు, పండుగ రోజుల్లోనూ స్కూళ్లు, కళాశాలలకు వెళ్లాల్సిందేనని వాపోతున్నారు. పనికి తగ్గ వేతనాలు ఇవ్వడం లేదంటున్నారు. టీటీటీ, బీఈడీ, పీజీ, ఎంబీఏ తదితర కోర్సులు చేసి ఉపాధి కోసం పని చేస్తున్నామని, ఇక్కడ ఉద్యోగ భద్రత లేకపోగా పని ఒత్తిడి చేస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల పేరుతో టీచర్లు, అధ్యాపకులను మానసికంగా వేధిస్తున్నారు. సెలవు దినాల్లోనూ పని చేయించుకుంటున్నారు. టీచర్లు, అధ్యాపకులను బోధనేతర పనులకు ఉపయోగించుకుంటున్నారు. వర్క్షాపుల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా చాలా విద్యాసంస్థల్లో జీతాలు కూడా సరిగా ఇవ్వడం లేదు. – బి. ధనుంజయ, ప్రైవేట్ టీచర్ -
రోడ్డు నిబంధనలు పాటించాలి
కరీంనగర్క్రైం/కొత్తపల్లి(కరీంనగర్): ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా పోలీస్, రెవెన్యూ, రవాణాశాఖల ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ కోర్టు చౌరస్తాలో ‘అరైవ్– అలైవ్’ రో డ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ఆలం రహదారి భద్రతపై ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ‘అరైవ్ అలైవ్’ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం కొత్తపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని రేకుర్తి చౌరస్తాలో ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు మానవ తప్పిదాలే ముఖ్య కారణం అన్నారు. హెల్మెట్, సీట్బెల్ట్ ధరించకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో గతేడాది 200 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని, అందులో ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ఉన్నారన్నారు. కొత్తపల్లి స్టేషన్ అధికారి, ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి, సీఐలు బిల్లా కోటేశ్వర్, సంజీవ్, కుమారస్వామి, సృజన్రెడ్డి పాల్గొన్నారు. డంపింగ్యార్డ్ విఘ్నాన్ని తొలగించు స్వామికరీంనగర్ కార్పొరేషన్: డంప్యార్డ్ తొలగించేలా చూడు స్వామి అంటూ బాధితులు విఘ్నేశ్వర దేవుడ్ని వేడుకొన్నారు. డంప్యార్డ్తో తాము పడుతున్న కష్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదని, దేవుడే కాపాడాలంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మంగళవారం నగరంలోని గిద్దెపెరుమాండ్ల స్వామి ఆలయంలో వినాయక విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. డంప్యార్డ్తో ఏర్పడుతున్న కాలుష్యంతో సమీప ప్రాంత వాసులు ఇబ్బంది పడుతున్నారని, చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన చెందారు. పడిశెట్టి భూమయ్య, దుంపేటి రాము, శ్రీనివాస్ పాల్గొన్నారు. మలయశ్రీ సాహిత్యం భావి తరాలకు మార్గదర్శకంకరీంనగర్కల్చరల్: మలయశ్రీ సాహిత్య సేవలు అపారమని, ఆయన రచనలు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని కసప శ్యామ్ సుందర్ అన్నారు. మంగళవారం నగరంలోని ఐఏంఏ హాల్లో వివిధ సాహితీసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రముఖ కవి మలయశ్రీ సంస్మరణ సభలో ఆయన చిత్రపటానికి నివాళి అర్పించి మాట్లాడారు. తాను నమ్మిన ఆశయం కోసం చివరి శ్వాస వరకు నిలపడిన ఆచరణ వాది అన్నారు. ఆయన జీవిత చరిత్రను తీసుకురావాల్సిన అవసరం ఉందని, విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సభలో పాల్గొన్న వక్తలు తెలియజేశారు. కవులు గండ్ర లక్ష్మణరావు, నలిమెల భాస్కర్, బీఎన్.రావు, గాజోజు నాగభూషణం, సేనాధిపతి, సూరేపల్లి సుజాత, సబ్బని లక్ష్మీనారాయణ, సంకేపల్లి నాగేంద్ర శర్మ, మాడిశెట్టి గోపాల్ పాల్గొన్నారు. కేసీఆర్ సభపై సన్నాహక సమావేశంమల్యాల: జగిత్యాలలో ఈ నెల 20న నిర్వహించనున్న కేసీఆర్ బహిరంగ సభకు గ్రామాల నుంచి వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు. మంగళవారం మల్యాలలో బీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు. కేసీఆర్ బహిరంగ సభకు జన సమీకరణపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జనగం శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ కొండపల్కల రాంమోహన్రావు, మాజీ ఎంపీపీ తైదల శ్రీలత, మాజీ సర్పంచ్ రౌతు రవి వర్మ, బద్దం తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. -
ఆర్ఎఫ్సీఎల్లో 8.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి
ఫెర్టిలైజర్సిటీ: పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేయాలని లక్ష్యం నిర్దేశించింది. ప్లాంట్ సామర్థ్యం రోజూ 3,850 మెట్రిక్ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా ఉత్పత్తి చేస్తుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 01 ఏప్రిల్ 2025 నుంచి 31 మార్చి 2026 వరకు 8,57,237.85 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసింది. ఇక్కడి యూరియా తెలంగాణతోపాటు 7 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. లక్ష్యానికి దూరంగా.. కర్మాగారంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో 12.7లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి సాధించాల్సి ఉండగా 8,57,237.85 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. కర్మాగారంలో నెలకొన్న సాంకేతిక సమస్యలతో తక్కువగా ఉత్పత్తి చేశారు. దీనితో ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. యుద్ధంతో గ్యాస్ కోత.. మరింత తగ్గిన ఉత్పత్తి పశ్చిమాసియాలో యుద్ధంతో గ్యాస్ సరఫరా తగ్గింది. కర్మాగారంలో 45 శాతం మేర యూరియా ఉత్పత్తి చేస్తున్నారు. ఆర్థిక సంవత్సరంలో సుమారు 78 రోజులపాటు కర్మాగారంలో వార్షిక మరమ్మతులు, సాంకేతిక సమస్యలతో షట్డౌన్ చేశారు. దీంతో కర్మాగారంపై ఆర్థిక భారం పడింది. సుమారు రూ.200 కోట్ల వరకు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. కర్మాగారంలోని హెచ్టీఆర్ మరమ్మతులు చేసేందుకు తరలించారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో గ్యాస్ కొరత, సాంకేతిక సమస్యలు అధిగమించి పూర్తిస్థాయిలో ఉత్పత్తి సాధించేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. వార్షిక మరమ్మతులతో తగ్గిన ఉత్పత్తి 2025–26లో యూరియా కేటాయింపు(మెట్రిక్ టన్నుల్లో) రాష్ట్రం కేటాయింపులు తెలంగాణ 381318.30 ఆంధ్రప్రదేశ్ 182146.86 కర్ణాటక 150629.76 మహారాష్ట్ర 27724.23 ఛత్తీస్గఢ్ 19196.82 తమిళనాడు 66843 మధ్యప్రదేశ్ 29378.88 -
అక్రమార్కులపై ఉక్కుపాదం
● గ్రానైట్, మట్టి, ఇసుక రవాణా, బెల్టుషాపులపై నిఘా ● దూకుడు పెంచిన ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి మండలంలో అక్రమ దందాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఓ వైపు గ్రానైట్, మట్టి, ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేస్తూనే బెల్టు షాపులపైనా ట్రైనీ ఐపీఎస్, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ సోహం సునీల్ ఉక్కుపాదం మోపుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లను పక్కకు పెడుతూ తనదైన శైలిలో నేరాల కట్టడికి కృషి చేస్తున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, ఆయన కదలికలు తెలియకుండా చేపడుతున్న ఈ తనిఖీల్లో గ్రానైట్, మట్టి, ఇసుక అక్రమ దందాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్తపల్లి మండలం ఎలగందుల, ఖాజీపూర్ మానేరు వాగు నుంచి రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు ప్రారంభమయ్యాయి. వాగు నుంచి తీసుకొచ్చి ఎలగందుల, ఖాజీపూర్ శివారులో డంప్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్ దాడులు నిర్వహించగా ఇసుక ట్రాక్టర్ పట్టుపడింది. కొత్తపల్లి, మల్కాపూర్, బావుపేట గ్రామాల్లోని బెల్టు దుకాణాల్లో తనిఖీలు చేపట్టి రూ.50,270 విలువ చేసే 88.270 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిపై కేసు నమోదు చేశారు. -
మా కూతురును మాకిప్పించండి
నాకు ఆగస్టు 9, 2015న గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో పాప జన్మించింది. కొన్ని రోజులకు నా భర్తకు రోడ్డు ప్రమాదంలో తలకు గాయం కాగా ప్రతిమ ఆస్పత్రిలో చికిత్స చేయించాం. నా భర్త బంధువు లత వచ్చి కూతురితో ఇబ్బంది ఉంటుంది. నేను చూసుకుంటా అని బలవంతంగా తీసుకెళ్లింది. 4నెలలకు వెళ్లి కలిస్తే పాప లేదని చెప్పారు. కరీంనగర్ త్రీటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పాపను బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. బాలల సంరక్షణ కేంద్రం వారు మా పాపను మాకు ఇవ్వడం లేదు. డీఎన్ఏ టెస్ట్ చేసుకోండని చెప్పినా వినడం లేదు. – స్రవంతి, గోదావరిఖని -
స్టేట్ లెవల్ మార్కులు వస్తాయి
పదో తరగతి పరీక్షలన్నీ బాగా రాశా. స్టేట్ లెవల్ మార్కులు అంటే సుమారు 580కి పైగా వస్తాయి. ప్రతీ పేపర్లో మంచి స్కోర్ చేస్తా. పరీక్షలు ఎలా రాస్తామో అన్న టెన్షన్ ఉండేది. ఇప్పుడు హ్యాపీగా ఉంది. – మురళి చందన పరీక్షల సమయంలో ప్రతీరోజు ఒక ఛాలెంజ్లా అనిపించింది. కానీ రోజూ రివిజన్ చేయడం వల్ల కాన్ఫిడెన్స్ పెరిగింది. కొన్నిపేపర్లు కాస్త కష్టంగా అనిపించినా, మొత్తం మీద బాగా రాశా. – రిశ్వంత్ పదో తరగతి పరీక్షలు నా జీవి తంలో ఒక ముఖ్యమైన దశ. ప్రతీ పరీక్షకు నేను ఎంతో శ్రమి ంచా. కొన్ని పేపర్లు కఠినంగా ఉన్నా, నేను నమ్మకంతో రాశా. స్పెషల్ క్లాసులు వల్ల నాకు చా లా క్లారిటీ వచ్చింది. టీచర్ల సపోర్ట్ చాలా గొప్పది. – విధాత్రి -
ఇక భవిష్యత్పైనే దృష్టి
స్పెషల్ క్లాసులు నాకు చాలా ఉపయోగపడ్డాయి. ప్రతీ టా పిక్ను క్లియర్గా అర్థం చేసుకునే అవకాశం వచ్చింది. డౌ ట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. అందుకే పరీక్షలు సులభంగా అనిపించాయి. 550కి పైగా మార్కులు వస్తాయి. – జి వైష్ణవి పది పరీక్షలు బాగా రాశా. పరీక్షల జర్నీ ఈసారి లాంగ్ అయినా ప్రిపరేషన్కు చాలా టైం దొరికింది. ప్రతీ సబ్జెక్టు మంచిగా రాశా. 580కి పైగా మార్కులు వస్తాయి. భవిష్యత్లో ఇంటర్ చదివి సాఫ్ట్వేర్ చేయాలని ఉంది. – కృశాంక్ -
డంప్యార్డ్ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి
కరీంనగర్ కార్పొరేషన్: డంప్ యార్డ్ సమస్య శాశ్వ త పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. సోమవారం డంప్యార్డ్ను సందర్శించారు. డంప్యార్డ్లో మంటలు, పొగను వాటర్ట్యాంకర్ల ద్వారా మూడు రోజుల్లో అదుపుచేయాలని అధికారులను ఆదేశించారు. బయోమైనింగ్ ప్రక్రియను పరిశీలించారు. పనుల్లో జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతి రోజు 150 నుంచి 180 మెట్రిక్ టన్నుల చెత్త చేరుతుండటంతో, పాత చెత్తను త్వరగా తొలగించాలని సూచించారు. డంప్ యార్డు ప్రక్షాలనకు 15 వ ఆర్థిక సంఘం, స్వచ్చ భారత్ మిషన్ నుండి మరిన్ని నిధులు విడుదల చేయాలని సీడీఎంకు లేఖ రాసినట్లు తెలిపారు. డ్యాంలో సరిపడా నీరు ఉండేలా చర్యలు ఎల్ఎండీలో నగర ప్రజల తాగునీటి సరఫరాకు సరిపడా నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ నీటిపారుదలశాఖ అధికారులను కోరారు. ఈ మేరకు నీటిపారుదలశాఖకు లేఖ రాసినట్లు వెల్లడించారు. సోమవారం నగరంలోని ఫిల్టర్ బెడ్ను సందర్శించారు. నీటి శుద్ధీకరణ కేంద్రంలో 34, 14 ఎంఎల్డీ నీటి సంపులు, ఫిల్టరేషన్ బెడ్లు, మోటారు పంపులను, ల్యాబ్ లో నీటి నాణ్యతను తనిఖీ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకం అమత్ కింద నగరంలో నూతనంగా నిర్మిస్తున్న వాటర్ సంపులు, రిజర్వాయర్ పనులను పరిశీలించారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్లు పడిశెట్టి వసంత లక్ష్మి, మాసం గణేశ్, చంద్ర, ఎస్ఈ రాజ్ కుమార్, డీఈ దేవేందర్, ఏఈ బీంవర్థన్రెడ్డి పాల్గొన్నారు. -
అంజన్న జయంతి ముడుపుల ఆదాయం రూ.1.69లక్షలు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి జయంతి ముడుపులను శ్రీలలిత సేవా ట్రస్టు సభ్యులు ఆలయ అధికారుల సమక్షంలో లెక్కించారు. హనుమాన్ చిన్న జయంతి పురస్కరించుకుని హనుమాన్ దీక్షాపరులు సమర్పించిన ముడుపుల ద్వారా రూ.1,69,069 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో అంజనారెడ్డి తెలిపారు. ఏఈఓ హరిహరనాథ్, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, స్థానాచార్యులు కపీందర్, పర్యవేక్షకులు సునీల్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. రెండు ఆలయాల్లో దొంగతనంకథలాపూర్: మండలంలోని భూషణరావుపేటలోగల రామాలయం, మల్లికార్జునస్వామి ఆలయాల్లో గుర్తు తెలియని దుండగులు చొరబడ్డారు. హుండీలను ధ్వంసం చేసి అందులోని డబ్బులు ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. హుండీల్లో సుమారు రూ.25 వేలు ఉంటాయని చెబుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఆలయాలను పరిశీలించి వివరాలు సేకరించారు. -
గిరిపుత్రిక ప్రతిభ అ‘ద్వితీయం’!
వీర్నపల్లి(సిరిసిల్ల): తల్లిదండ్రుల కష్టాలను కళ్లారా చూసింది. చదువు ఒక్కటే జీవితాన్ని బాగు చేస్తుందని నమ్మింది. కష్టపడింది.. రాష్ట్రస్థాయి రెండో ర్యాంక్ సాధించింది. ఈ విజయం వెనుక కష్టాలు కన్నీళ్లు ఉన్నాయి. గిరిజన ప్రాంతంలో పుట్టిన తేజస్వినీ తన ప్రతిభతో శభాష్ అనిపించుకుంది. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం భూక్యతండాకు చెందిన గిరిజన పుత్రిక లకావత్ తేజస్విని ఇంటర్ ఫలితాల్లో హెచ్ఈసీలో 1000 మార్కులకు 978 సాధించి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంక్ సొంతం చేసుకుంది. భూక్యతండాకు చెందిన లకావత్ రాజు, అనిత దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పేదరికంతో పిల్లల చదువుకు ఆటంకం కలగకూడదని తండ్రి రాజు అప్పులు చేసి ఉపాధి వెతక్కుంటూ దుబాయ్ వెళ్లాడు. తల్లి అనిత గ్రామంలోనే ఉంటూ ఉపాధిహామీ పనులు, ఇతర కూలి పనులు చేస్తోంది. వీరి కూతురు లకావత్ తేజస్విని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. హెచ్ఈసీలో 1000 మార్కులకు 978 సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకును కై వసం చేసుకుంది. గిరిజన బిడ్డ సాధించిన ఈ విజయంపై స్థానికులు, తండావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి చెందిన అమ్మాయి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపడం గర్వకారణమని గిరిజన సంఘాల నాయకులు కొనియాడారు. చదువుకోవాలనే కసి ఉండాలే గానీ పేదరికం అడ్డుకాదని తేజస్విని నిరూపించిందని గ్రామ సర్పంచ్ రామావత్ శ్రీకాంత్ అభినందించారు. మా నాన్న దుబాయ్లో, అమ్మ ఇక్కడ కూలి పనుల్లో పడుతున్న కష్టం నాకు తెలుసు. వారి కష్టాన్ని చూస్తూ పెరిగాను. ఎలాగైనా వారికి మంచి పేరు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల ప్రోత్సాహం, నా తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈ ర్యాంకు సాధించగలిగాను. – తేజస్విని, విద్యార్థిని తండ్రి దుబాయ్లో వలస కార్మికుడు.. తల్లి ఉపాధిహామీ కూలీ రాష్ట్రస్థాయిలో ప్రతిభచాటిన లకావత్ తేజస్విని -
ఎల్ఎండీకి 3 టీఎంసీలు విడుదల చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు మిడ్మానేరు నుంచి ఎల్ఎండీకి మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. ఎల్ఎండీలో నీటిమట్టం తగ్గడంతో ప్రస్తుతం రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నారని, సరిపడా నీరు ఉంచేలా చూడాలని కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కార్పొరేటర్ వైద్యుల అంజన్కుమార్ సోమవారం హైదరాబాద్లో మంత్రికి వినతిపత్రం అందజేశారు. స్పందించిన పొన్నం నీటిపారుదలశాఖ సెక్రటరీకి ఫోన్ చేసి ఎల్ఎండీలో తాగునీటి సరఫరాకు సరిపడా నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మిడ్మానేరు నుంచి ఎల్ఎండీకి మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి లేఖ రాశారు. పొన్నంను కలిసిన వారిలో అర్బన్ బ్యాంక్చైర్మన్ కర్ర రాజశేఖర్, హౌస్ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, వీర దేవేందర్ ఉన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తాంకొత్తపల్లి(కరీంనగర్): నిరంతర విద్యుత్ సరఫ రా లక్ష్యంగా సేవలు అందిస్తున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ ఆర్.రవీందర్ తె లిపారు. వేసవికాలంలో నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంతో 2025–26 సంవత్సరం పోల్చితే విద్యు త్ సరఫరా వ్యవస్థలో గణనీయమైన మెరుగుదల కనిపించిందన్నారు. 11 కేవీ బ్రేక్డౌన్స్ 41.4 శాతం తగ్గగా, ట్రిప్పింగ్స్ 4 శాతం తగ్గిందన్నారు. ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలు 23.2 శాతానికి తగ్గాయన్నారు. ఓవర్లోడ్ సమస్యలను నివారించేందుకు 352 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 14 పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో పాటు కొత్తగా 4 సబ్స్టేషన్లు ప్రారంభించామని, మరో 12 సబ్స్టేషన్లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. వినియోగదారులు తమ సమస్యలను టోల్ ఫ్రీ నంబర్ 1912 ద్వారా నమోదు చేయవచ్చన్నారు. కరీంనగర్రూరల్: సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన న్యాయం అందించాలనే లక్ష్యంతో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఙాన సదస్సులు నిర్వహిస్తున్న ట్లు సంస్ధ సభ్యులు, న్యాయవాదులు ఎ.కిరణ్ కుమార్, పెరుక రంగయ్య, చిట్టి చంద్రప్రకాశ్రెడ్డి తెలిపారు. సోమవారం కరీంనగర్ మండలం నగునూరులోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో న్యాయ విజ్ఙాన సదస్సు నిర్వహించారు. అంబేద్కర్ ఆశించిన సామాజిక న్యాయం సిద్ధించాలంటే విద్యార్థులు చట్టాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రిన్సిపాల్ మాలతి, సూపరింటెండెంట్ సురేశ్, న్యాయవాది ఆనందభాస్కర్, వసుమతి పాల్గొన్నారు. కరీంనగర్క్రైం: పోలీసు జీతాల కుంభకోణం కేసులో హెడ్కానిస్టేబుల్ రాంమోహన్ను సస్పెండ్ చేసినట్లు సమాచారం. నిందితుల కస్టడీకి వన్టౌన్ పోలీసులు పిటిషన్ వేసినట్లు తెలిసింది. కస్టడీకి తీసుకుని దర్యాప్తు చేస్తే ఇందులో ఇంకా ఎవరి సహకారం ఉంది, ఏఏ స్థాయి అధికారుల హస్తం ఉందనే విషయాలు వెల్లడవుతాయని పోలీసులు భావిస్తున్నారు. కరీంనగర్ ఘటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో జీతాలపై విచారణ కొనసాగుతోందని సమాచారం. కరీంనగర్ అర్బన్: వానాకాలం సీజన్ విత్తనాలపై ఈ నెల 15న కలెక్టరేట్ ఆడిటోరియంలో సమీక్షా సమావేశం జరగనుంది. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ సుంకెట అన్వేష్రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష జరగనుండగా ఉమ్మడి జిల్లా అధికారులు పాల్గొననున్నారు. -
అర్జీలను నిర్లక్ష్యం చేస్తే చర్యలు
కరీంనగర్ అర్బన్: ప్రజావాణికి వచ్చే ప్రతీ అర్జీపై నిశిత పరిశీలన చేసి పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, నివేసన స్థలాలు తతదితర అర్జీలు రాగా మొత్తంగా 229 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. అదనపు కలెక్టర్లు లక్ష్మికిరణ్, అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్బాబు, డీఆర్డీవో శ్రీధర్ పాల్గొన్నారు.మొత్తం అర్జీలు: 229 ఎక్కువగా కరీంనగర్ కార్పొరేషన్: 63 కరీంనగర్ రూరల్ తహసీల్దార్: 15 గంగాధర తహసీల్దార్: 13 కొత్తపల్లి తహసీల్దార్: 09 ఆర్డీవో, కరీంనగర్: 10 -
యూనిక్ టోకరా!
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: మొన్న సహారా, నిన్న మెటా ఫండ్, నేడు యూనిక్.. సంస్థల పేరు ఏదైనా అందరి లక్ష్యం ఒకటే.. ఏదో ఒకరకంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడం ఆపై మొహం చాటేయడం. తాజాగా యూనిక్ అనే ఉత్తారాదికి చెందిన సంస్థ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ స్కాంకు పాల్పడిందని ఖాతాదారులు, ఏజెంట్లు నెత్తీనోరు బాదుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఏకంగా రూ.500 కోట్ల వరకు ఖాతాదారుల నుంచి డబ్బులు సేకరించి ఇప్పుడు వారిని రేపు..మాపు.. అంటూ తిప్పుకుంటుందని బాధితులు వాపోతున్నారు. ఆరేళ్లలో డబ్బులు రెట్టింపు చేస్తామంటూ తీయని మాటలు చెప్పిన సంస్థ తీరా గడువు ముగిసి నాలుగేళ్లు గడుస్తున్నా ఎలాంటి డబ్బు చెల్లించకపోవడంతో బాధితులంతా ఏజెంట్ల ఇళ్ల మీదకు వస్తున్నారు. దీంతో ఏజెంట్లంతా కంగారుపడి యూనిక్ సంస్థపై న్యాయపోరాటం చేయాలని తీర్మానించుకున్నారు. వీరంతా కలిసి ఇటీవల కరీంనగర్లో సమావేశం పెట్టుకుని డిపాజిటర్ల డబ్బులు వెనక్కి తీసుకురావాలని నిర్ణయించారు. అసలేం జరిగింది? వాస్తవానికి ఇది ఫైనాన్స్ సంస్థ కాదు. దీని వ్యవహారం చూస్తుంటే మల్టీలెవల్ మార్కెటింగ్ను తలపిస్తోంది. పదకొండేళ్ల క్రితం అంటే 2015 నుంచి ఇది తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలు ప్రారంభించింది. కేవలం ఆరేళ్లలో మీ డబ్బులు రెట్టింపు చేస్తామంటూ కస్టమర్లకు ఎరవేసింది. తెలంగాణలో ఉమ్మడి వరంగల్, కరీంనగర్తోపాటు, నల్లగొండ జిల్లాలో భారీగా డిపాజిట్లు సేకరించింది. సంస్థ కార్యకలాపాలు, హామీలకు ఆకర్షితులైన పలువురు ఈ సంస్థలో ఏజెంట్లుగా చేరారు. సంస్థ లక్ష్యాలు సామాన్యులకు వివరించి.. కేవలం ఆరేళ్లలో డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మించారు. 24 గంటలు అదే పనిలో ఉండి డిపాజిటర్ల నుంచి భారీగా డబ్బులు కట్టించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో రూ.500 కోట్ల వరకు సేకరించినట్లు సమాచారం. కరోనా నాటికి డిపాజిటర్ల మెచ్యూరిటీ గడువు పూర్తయింది. అయినా యూనిక్ సంస్థ డబ్బులు చెల్లించకుండా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తోంది. దీంతో బాధితులు, ఏజెంట్లు అంతా కలిసి పోరాటానికి సిద్ధమవుతున్నారు. మెటాను మించిన యూనిక్.. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించిన సంస్థ ఇటీవలి కాలంలో మరోటి లేదంటే అతిశయోక్తి కాదు.. గతంలో కరీంనగర్ కేంద్రంగా వెలుగుచూసిన జీబీఆర్ క్రిప్టో కరెన్సీ రూ.100 కోట్ల వరకు కరీంనగర్ నుంచి వసూలు చేసింది. అనంతరం ఇదే కరీంనగర్ కేంద్రంగా ఓ మాజీ కార్పొరేటర్ ఏకంగా మెటాఫండ్ పేరుతో రూ.300 కోట్ల వరకు ప్రజల నుంచి సేకరించారు. ఈ డబ్బులు ఏకంగా దేశం దాటి పోయాయి. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు అందరినీ పోలీసులు అరెస్టు చేసినా.. డబ్బుల రికవరీలో మాత్రం ఎలాంటి పురోగతి లేదు. తాజాగా ‘యూనిక్’ కేసులో రూ.500 కోట్ల వరకు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండటం ఆసక్తి రేపుతోంది. ఈ విషయమై జిల్లాలో పలు స్టేషన్లలో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. కేసులు పెడితే.. డబ్బులు వెనక్కి రావంటూ నేటికీ యూనిక్ సంస్థ ప్రతినిధులు డిపాజిటర్లను మభ్యపెడుతున్నారు. -
‘ఇస్రో’ యువికకు ఎంపిక
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రాగినేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న శ్రీనిత్య భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ(ఇస్రో) నిర్వహిస్తున్న యువిక– 2026కు ఎంపికై ంది. రాష్ట్రవ్యాప్తంగా 10 మంది విద్యార్థులను ఎంపిక చేయగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పెద్దపల్లి మండలం రాగినేడుకు చెందిన శ్రీనిత్య ఒక్కరే ఎంపిక కావడం విశేషం. కాగా.. పెద్దపల్లి మండలం రాగినేడు జిల్లా పరిషత ఉన్నత పాఠశాల నుంచి మూడేళ్లుగా వరుసగా ఇస్రో యువికకు విద్యార్థులు ఎంపిక అవుతున్నారని హెచ్ఎం ఆగయ్య తెలిపారు. యువిక –2026కు ఎంపికై న శ్రీనిత్య హైదరాబాద్లో 15రోజుల పాటు జరిగే ఈ యంగ్ సైంటిస్టు వర్క్షాప్లో పాల్గొంటుందని పేర్కొన్నా రు. శ్రీనిత్య ఎంపికయ్యేందుకు కృషి చేసిన గైడ్ టీచర్ జగదీశ్వర్రెడ్డి, హెచ్ఎం ఆగయ్య, ఉపాధ్యాయులను సర్పంచ్ సోమకుమార్ అభినందించారు. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులు తక్కువేమీకాదని రాగినేడు విద్యార్థులు నిరూపించారని ప్రశంసించారు. కరీంనగర్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థిని చిలువేరి శ్రీనిత్య జాతీయ పరిశోధన సంస్థ ఇస్రో నిర్వహించిన క్విజ్ పోటీల్లో పాల్గొని యువిక కార్యక్రమానికి ఎంపికై ంది. దేశవ్యాప్తంగా 456 మందిలో తెలంగాణ నుంచి 15 మంది సెలెక్ట్ అయ్యారని, వారిలో శ్రీనిత్యం ఉండటం పాఠశాలకు గర్వకారణమని ప్రిన్సిపాల్ కృష్ణప్రసాద్ తెలిపారు. అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత, డీఈవో రాము శ్రీనిత్యను అభినందించి, శాలువాతో సన్మానించారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్కు ఎంపికై నట్లు ఇస్రో నుంచి సమాచారం అందడం చాలా సంతోషంగా ఉందని, మే 10న ఇస్రో టూర్ ఉంటుందని కాల్ లెటర్ అందుకున్న శ్రీనిత్య ఆనందం వ్యక్తం చేసింది. శ్రీనిత్యను అధ్యాపక బృందం, తల్లిదండ్రులు, గ్రామస్తులు, జిల్లా అధికారులు అభినందించారు. -
‘దోస్త్’ పిలుస్తోంది
కరీంనగర్ సిటీ: డిగ్రీలో ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి సోమవారం దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ ఒకటవ తేదీ వరకు ప్రక్రియ కొనసాగనుంది. దీంతో శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ కళాశాలలు విద్యార్థుల వేటలో పడ్డాయి. ఇంటర్ పూర్తయిన విద్యార్థుల సమాచారం సేకరించి, మా కాలేజీలో చేరండంటూ పీఆర్వోల ద్వారా ఫోన్లు చేస్తున్నారు. ప్రత్యేక రాయితీలు ఇస్తామంటూ ఆకర్షిస్తున్నారు. ఆయా కళాశాలల లెక్చరర్లకు టార్గెట్లు విధించి, ప్రత్యేక వాహనాలు కేటాయిస్తూ ఆడ్మిషన్ల కోసం క్యాంపెయినింగ్ చేయిస్తున్నారు. రంగంలోకి పీఆర్వోలు, లెక్చరర్లు ప్రతీ కళాశాల యాజమాన్యం విద్యార్థులను చేర్పించుకునేందుకు పీఆర్వోలను నియమించుకున్నాయి. వీరితో పాటు అధ్యాపకులు సైతం గ్రామాలు, మండలాలు, పట్టణాల వారీగా ఇంటర్ పూర్తిచేసిన వారి వివరాలు సేకరించి, అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులతో టచ్లోకి వెళ్తున్నారు. విద్యార్థులను చేర్పించినందుకు పీఆర్వోలకు, లెక్చరర్లకు ఒక్కో అడ్మిషన్కు రూ.6వేల నుంచి రూ.8 వేల వరకు చెల్లిస్తున్నారని సమాచారం. డిగ్రీ ప్రవేశాలు ఎంతో పారదర్శకంగా నిర్వహించాలనే లక్ష్యంతో దోస్త్ను తీసుకురాగా ఆ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ అడ్డదారిలో ప్రవేశాలు పొందడానికి పలు ప్రైవేట్ కళాశాలలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. విద్యా ప్రమాణాలే ముఖ్యం శాతవాహన యూనివర్సిటీ పరిధిలో మొత్తం 93 కాలేజీలున్నాయి. వీటితో ఉన్నత విద్యాప్రమాణాలు పాటించే కాలేజీలను ఎంచుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఆఫర్లకు ఆశపడి నాణ్యత పాటించని, వ్యాపార దృక్పథంతో నడిచే కాలేజీల్లో చేరి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు. కళాశాల గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని, ఒకసారి సందర్శించి, అక్కడున్న సౌకర్యాలు పరిశీలించిన తర్వాతనే చేరాలని చెబుతున్నారు. అందులో చదువుతున్న సీనియర్లను సంప్రందించి ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారో తెలుసుకోవాలని చెబుతున్నారు.నోటిఫికేషన్ జారీ ఏప్రిల్ 13 మొదటి దశ రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు (రిజిస్టేషన్ రుసుం రూ.200) వెబ్ ఆప్షన్ నమోదు ఏప్రిల్ 30 నుంచి మే 08 వరకు మే 14న సీట్ల కేటాయింపు విద్యార్థులు చేరు సమయం మే 15వ తేదీ నుంచి మే 25 వరకు మే 15 నుంచి మే 25 వరకు (రిజిస్ట్రేషన్ రుసుం రూ. 400) వెబ్ ఆప్షన్ నమోదు మే 15 నుంచి మే 26 వరకు మే 30న రెండో దశ సీట్ల కేటాయింపు విద్యార్థులు చేరు సమయం మే 31వ తేదీ నుంచి జూన్ 5 లోపు మే 31 నుంచి జూన్ 15 వరకు (రిజిస్ట్రేషన్ రుసుం రూ. 400) వెబ్ ఆప్షన్ నమోదు మే 31 నుంచి జూన్ 16 వరకు జూన్ 20న సీట్ల కేటాయింపు విద్యార్థులు చేరు సమయం జూన్ 20 నుంచి జూన్ 25లోపు మొదటి సెమిస్టర్ తరగతులు జూలై 1వ తేదీ నుంచి ప్రారంభం సోమవారం విడుదల చేసిన ఉన్నత విద్యామండలి డిగ్రీ ప్రవేశాలకు ఆహ్వానం విద్యార్థుల వేటలో ప్రైవేటు పీఆర్వోలు శాతవాహన యూనివర్సిటీ పరిధిలో కళాశాలలు ప్రభుత్వ 15 ఎయిడెడ్ 02 ప్రైవేట్ 76 మొత్తం 93 -
క్వింటాల్ పత్తి రూ.8,050
జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్లో క్వింటాల్ పత్తి రూ.8,050 పలికింది. సోమవారం మార్కెట్కు 58 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మంగళవారం అంబేద్కర్ జ యంతి సందర్భంగా సెలవు ఉంటుందని, బుధవారం యథావిధిగా కొనుగోళ్లు జరుగుతాయని మార్కెట్ చైర్ పర్సన్ పూల్లూరి స్వప్న, ఇన్చార్జి కార్యదర్శి రాజా తెలిపారు.కో ఆప్షన్కు ఒక దరఖాస్తుకరీంనగర్ కార్పొరేషన్: కో ఆప్షన్ ఎన్నికలకు తొలి దరఖాస్తు వచ్చింది. బీఆర్ఎస్కు చెందిన అజీమ్ మహమ్మద్ మైనార్టీ కోటాలో సోమవారం కో ఆప్షన్ పదవికి దరఖాస్తు ఇచ్చారు. కాగా మంగళవారం సెలవు రోజైనప్పటికి దరఖాస్తులు తీసుకుంటారని అధికారులు తెలిపారు. దరఖాస్తులకు 16వ తేదీ చివరి రోజు కావడంతో, ఆ రోజు దరఖాస్తులు అధికంగా వచ్చే అవకాశం ఉంది. -
గ్రానైట్ బ్లాక్ దందాపై కొరడా
సాక్షిప్రతినిధి,కరీంనగర్/కొత్తపల్లి: గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ పరిశ్రమల బ్లాక్ దందాపై ట్రైనీ ఐపీఎస్, కొత్తపల్లి స్టేషన్ హౌజ్ ఆఫీసర్ కొరడా ఝలిపిస్తున్నారు. ‘గ్రానైట్ బ్లాక్ దందా’ శీర్షికన ‘సాక్షి’లో ఈ నెల 3న ప్రచురితమైన కథనంతో ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్ ప్రత్యేక దృష్టి సారించారు. పదుల సంఖ్యలో వాహనాలు పట్టుబడటంతో జరిమానా నిమిత్తం మైనింగ్, రవాణాశాఖకు పంపించారు. మరికొన్ని వాహనాలు పోలీస్స్టేషన్ ఆవరణలోనే నిలిచి ఉన్నాయి. దీంతో వాహనాలను విడిపించుకునేందుకు గ్రానైట్ వ్యాపారులు కొత్తపల్లి పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కుతుండటంతో స్టేషన్ పరిసరాలు సందడిగా మారాయి. కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్, ఖాజీపూర్, ఎలగందుల, శ్రీరాములపల్లి, కమాన్పూర్, నాగులమల్యాల, బద్ధిపల్లితో పాటు గంగాధర మండలం ఒడ్యారం తదితర గ్రామాల్లోని గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ పరిశ్రమల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న గ్రానైట్ బ్లాక్ దందాను అడ్డుకునేందుకు ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారం రోజుల్లో 20కి పైగా వాహనాలు ఓవర్లోడ్, అనుమతుల్లేకుండా, జీఎస్టీ చెల్లించకుండా, తదితర కారణాలతో పట్టుబడుతుంటే అక్రమ దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. వ్యాపారులు గ్రానైట్ అక్రమ రవాణాలకు పాల్పడుతూ జీఎస్టీ ఎగవేస్తున్నారు. మార్కెటింగ్ ఎక్కువగా ఉన్న రాజస్థాన్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు గ్రానైట్ రవాణా విషయంలో బయ్యర్లతో ఒప్పందం కుదుర్చుకుంటూ జీఎస్టీ బిల్లుతో ఒక రేటు, బిల్లు లేకుండా మరో రేటు మాట్లాడుకుంటున్నారు. ఎక్కువ మొత్తంలో జీఎస్టీ లేకుండానే ఎగుమతులు జరుగుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. -
టెన్షన్ లేకుండా రాశా
పరీక్షలు నాకు చాలా ఈజీగా అనిపించాయి. ప్రిపరేషన్ బాగా ఉండటంతో టెన్షన్ లేకుండా రాశా. టైమ్ మేనేజ్మెంట్ కూడా బాగా చేసా. ఫలితాల కోసం ఆసక్తిగా ఉన్నాను. మంచి స్థానం వస్తుందని ఆశిస్తున్నా. – శ్రీచరణ్ 560 మార్కులు సాధిస్తా. ఇంటర్లో సైన్స్ సబ్జెక్ట్ తీసుకొని భవిష్యత్లో ఆర్కియాలజిస్ట్గా మారాలనేది నా లక్ష్యం. చరిత్ర, పురావస్తు శాస్త్రంపై ఆసక్తితో దేశ సంస్కతి, వారసత్వాన్ని తెలుసుకోవాలనుకొంటున్నాను. – పెండ్యాల సాయి నిత్యాంజలి ఇంజినీరింగ్ చేసి సాఫ్ట్వేర్ చేయాలనేది నా ఆశయం. పదో తరగతి పరీక్షలకు ముందుగానే బాగానే ప్రిపేర్ అయ్యా. సుమారు 580 మార్కులకు పైగా స్కోర్ చేస్తా. స్కూల్లో స్టడీ అవర్స్ బాగా కలిసొచ్చింది. – సాయిప్రియ -
ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికుడి మృతి
జ్యోతినగర్: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికుడు తాళ్లపల్లి యాదగిరి(52) తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. వివరాలు.. గోదావరిఖని ఐబీకాలనీకి చెందిన తాళ్లపల్లి యాదగిరి ఎన్టీపీసీ ప్రాజెక్టులోని గోరఖ్పూర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం షిప్టుకు హాజరయ్యాడు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఆర్ఎం డిపార్ట్మెంట్ సర్వీస్ బిల్డింగ్లో అకస్మాత్తుగా పడిపోయాడు. కార్మికులు స్థానిక ధన్వంతరి ఆస్పత్రిలో చేర్పించగా ప్రాథమిక పరీక్షల అనంతరం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య యాకమ్మతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు హెచ్ఆర్ విభాగానికి డిమాండ్ నోటీసు అందించారు. ఆన్ డ్యూటీలో మృతి చెందడంతో రూ.30 లక్షల ఎక్స్గ్రేసియా, కుటుంబంలో ఇద్దరికి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, దహన సంస్కారాలకు రూ.50 వేలు, రవాణా ఖర్చు చెల్లించాలని డిమాండ్ చేశారు. విషపురుగు కాటుకు కార్మికుడి మృతి కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పందిల్ల గ్రామానికి చెందిన పట్నం లెనిన్(32)అనే భవన నిర్మాణ రంగ కార్మికుడు విషపురుగు కాటు వేయడంతో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మేసీ్త్ర వద్దకు ఆదివారం కూలీపనికి వెళ్లిన లెనిన్.. పనులు ముగించుకుని ఇంటికి చేరాడు. నీళ్లు వేడిచేసుకునేందుకు వంటచెరుకు తీస్తుండగా విషపురుగు కాటు వేసింది. కాల్వశ్రీరాంపూర్లోని ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పెద్దపల్లికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. మృతుడికి భార్య వనిత, తల్లిదండ్రులు ఉన్నారు. చందాలతో అంత్యక్రియలు లేనిన్ కుటుంబం అత్యంత పేదరికంలో ఉంది. కనీసం అంత్యక్రియలు నిర్వహించే స్థితిలో కూడాలేదు. దీంతో గ్రామస్తులు తలాకొంత పోగుచేసి అంత్యక్రియలు నిర్వహించారు. లెనిన్ కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్యజగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన కూర్మాచలం ఆంజనేయులు (70) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంజనేయులు భార్య మూడేళ్ల క్రితం మృతిచెందింది. అప్పటి నుంచి మనస్తాపంతో ఉంటున్నాడు. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో భోజనం చేసి నిద్రించాడు. ఉదయం లేచి చూసే సరికి ఇంటి పక్కనున్న చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. ఆంజనేయులు కుమారుడు లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు. -
సురక్షిత ప్రయాణం.. సుఖమయ జీవనం
తిమ్మాపూర్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, రవాణా శాఖల సమన్వయంతో తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో సోమవారం ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజ రైన మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు పేద, ధనిక అనే తేడా లేకుండా అందరి ప్రాణాల నూ హరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దన్నారు. మద్యం సేవించి వాహనం నడపడమే అధిక ప్రమాదాలకు కారణమన్నారు. కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలతో ఛిన్నాభిన్నమైన కుటుంబాల గాథలు వింటే మనసు కలచివేస్తోందన్నారు. సర్పంచులు తమ గ్రామసభల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేకంగా చర్చించాలని, స్పీడ్ బ్రేకర్లు, రోడ్డు లైటింగ్ కల్పనపై శ్రద్ధ వహించాలని సూచించారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ, గతేడాది జిల్లాలో 200 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని, అందులో ద్విచక్ర వాహనదారులే అధికమని వెల్లడించారు. పోలీసుశాఖ చర్యలతో ప్రమాదాల రేటు 17 శాతం తగ్గిందన్నారు. అనంతరం ‘అరైవ్– అలైవ్’ కార్యక్రమ వాల్పోస్టర్ ఆవిష్కరించారు. సర్పంచ్ శ్వేత అధ్యక్షతన 10 మంది సభ్యులతో కూడిన రోడ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేశారు. పలువురికి హెల్మెట్లు అందజేశారు. డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. -
ఉమ్మడి కరీంనగర్.. వెలుగులోకి రూ.800కోట్ల కుంభకోణం
సాక్షి,కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. యూనిక్ మర్కంటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.800 కోట్లకు టోకరా వేసింది.మల్టినెట్ వర్కింగ్ సంస్థ యూనిక్ ఎస్ఎంసీఎస్ పేరుతో భారీ ఎత్తున జిల్లా వాసుల నుంచి డిపాజిట్లు, ప్రీమియం వసూళ్లు చేపట్టింది. పెట్టిన మొత్తం కంటే ఎక్కువ మొత్తంలో తిరిగి చెల్లిస్తామని ఆశ చూపించింది. అధిక లాభాలకు ఆశపడిన పెట్టుబడి దారులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. భారీ ఎత్తున వసూళ్ల అనంతరం బోర్డు తీప్పేసింది. సంస్థకు తాళాలు వేసి ఉండడంతో మోసపోయామని భావించిన బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
సత్తాచాటిన సర్కారు విద్యార్థులు
కరీంనగర్టౌన్/సప్తగిరికాలనీ(కరీంనగర్)/తిమ్మాపూర్: ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని మహాత్మ జ్యోతి బాపూలే కళాశాలల విద్యార్థులు సత్తా చాటారని ఆర్సీవో అంజలి కుమారి తెలిపారు. ఫస్టియర్లో 78.2శాతం, ద్వితీయ సంవత్సరంలో 88.4శాతం ఉత్తీర్ణత నమోదు చేసినట్లు వివరించారు. ఫస్టియర్ ఎంపీసీలో ఎల్ఎండీకాలనీ కళాశాలకు చెందిన సహస్ర 467 మార్కులు, బైపీసీలో త్రిప్తి 438, సీఈసీలో హుజూరాబాద్ కళాశాలకు చెందిన సాయివర్షిత 494 మార్కులతో సత్తా చాటినట్లు తెలిపారు. సెకండియర్ ఎంపీసీలో ఎల్ఎండీకాలనీ కళాశాలకు చెందిన హరిణి 992, కరీంనగర్ కళాశాలకు చెందిన అనుష్క 992, బైపీసీలో శ్రుతి 992, సీఈసీలో పెగడపల్లి కళాశాలకు చెందిన శ్రీజ 967 మార్కులు సాధించినట్లు తెలిపారు. సీవోఈ విద్యార్థుల ప్రతిభ అలుగునూర్లోని సీవోఈ నుంచి మొదటి సంవత్సరం ఎంపీసీలో కె.అక్షిత 468 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండోర్యాంకు సాధించింది. జి.నందిని, ఎల్.అక్షిత, ఎం.సుదీక్ష, ఎం.శైలజ, బీ.అవంతిక, కే.వినీల 467 మార్కులు, మరో 12 మంది 466మార్కులు, ఆరుగురు 465 మార్కులు సాధించారు. సెకండియర్ ఎంపీసీలో కే.సౌమ్య 994 మార్కులు, బి.అక్షిత 993మార్కులు సాధించారు. బైపీసీలో జే.ప్రసన్న 988మార్కులు సాధించింది. వీరిని జోనల్ అధికారి ప్రత్యూష, ప్రిన్సిపాల్ మాధవి, వైస్ ప్రిన్సిపాల్ ఆసియ సుల్తానా అభినందించారు. రాణించిన కేజీబీవీ విద్యార్థుల ఇంటర్ ఫలితాల్లో జిల్లాలోని కేజీబీవీ కళాశాలల విద్యార్థులు సత్తా చాటినట్లు జీసీడీవో కృపారాణి తెలిపారు. జిల్లాలోని 8 కళాశాలల నుంచి ఫస్టియర్లో 81 శాతం, సెకండియర్లో 83శాతం ఉత్తీర్ణత నమోదు చేసినట్లు తెలిపారు. కేజీబీవీ కళాశాలల పరిధిలో రాష్ట్రంలో ఏడో ర్యాంకు సాధించినట్లు తెలిపారు. శంకరపట్నం కళాశాలలో కె.శరణ్య బైపీసీ ద్వితీయ సంవత్సరంలో 971 మార్కులు, ఎంపీసీలో టి.స్వాతి 987, జమ్మికుంట కళాశాలలో ఎంపీసీ సెకండియర్లో చంద్రజ్యోతి 986 మార్కులు సాధించినట్లు తెలిపారు.చంద్రజ్యోతి శరణ్య స్వాతి -
సామూహిక మరుగుదొడ్లకు గ్రహణం
కరీంనగర్రూరల్: స్వచ్ఛభారత్లో భాగంగా ప్రతి మండల కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం సామూహి క మరుగుదొడ్లను నిర్మించాలనే కేంద్ర ప్రభుత్వ ఆశయం నీరుగారుతోంది. స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీన వైఖరితో మరుగుదొడ్ల నిర్మాణానికి గ్రహణం పట్టింది. స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో 15 సామూహిక మరుగుదొడ్లను నిర్మించేందుకు ప్రణాళికను రూపొందించారు. మార్చి 31వరకు నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అనేక మండల కేంద్రాల్లో ఇంకా పనులు ప్రారంభించకపోవడం గమనార్హం. ప్రభుత్వ స్థలాల కొరత, కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యంతో పనుల్లో జాప్యమేర్పడుతోందనే ఆరోపణలున్నాయి. ఒక్కో మరుగుదొడ్డికి రూ.3 లక్షలు ఆయా మండలకేంద్రాల్లో 15 సామూహిక మరుగుదొడ్ల సముదాయానికి మొత్తం రూ.45లక్షలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. రూ.3లక్షల వ్య యంతో ఒక్కో సామూహిక మరుగుదొడ్డి నిర్మిస్తా రు. దీనిలో ఎస్బీఎం రూ.2.10లక్షలు, గ్రామపంచాయతీ రూ.90వేలు చెల్లిస్తోంది. చిగురుమామిడి, ఇల్లంతకుంట, గంగాధర, వెంకపల్లి గ్రామాల్లో మాత్రమే సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. గన్నేరువరం, చీలాపూర్లో స్లాబ్లెవల్, మానకొండూరు, నాగంపేటలో రూఫ్లెవల్, వెదిరలో బేస్మెంట్లెవల్లో నిర్మాణంలో ఉన్నాయి. చామనపల్లి, కేశవపట్నం, ఎలగందల్లో స్థలాలు అందుబాటులో లేకపోవడంతో ఇంకా నిర్మాణాలు ప్రారంభించలేదు. కొన్ని మండలాల్లో మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభించామని, మరికొన్ని మండలాల్లో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకపోవడంతో నిర్మించలేదని డీఆర్డీవో తెలిపారు. -
భళా.. బాలిక
కరీంనగర్7సోమవారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026కరీంనగర్టౌన్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలు సత్తాచాటారు. ఈ ఏడాది కూడా భళా అనిపించుకున్నారు. ఫస్టియర్, సెకండియర్లో అన్ని కోర్సుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మెరిశారు. ప్రథమ సంవత్సరంలో 70.17, ద్వితీయ సంవత్సరంలో 80.04శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. వరుసగా రెండో ఏడాది రాష్ట్రస్థాయిలో జిల్లా ఏడోస్థానంలో నిలిచింది. ప్రభుత్వ క ళాశాలల విద్యార్థులు అత్యధిక మార్కులతో మెరి శారు. ప్రైవేటు కళాశాలల విద్యార్థులు సత్తా చాటా రు. ప్రథమ సంవత్సరంలో పలువురు విద్యార్థులు ఎంపీసీలో 470 మార్కులకు 469, బైపీసీలో 440కి 439 మార్కులు సాధించి శభాష్ అనిపించుకున్నారు. విద్యార్థులను ఆయా కళాశాలల అధ్యా పకులు అభినందించారు. జిల్లాకు ఏడోస్థానం 2024– 25 విద్యాసంవత్సరంలో రాష్ట్రస్థాయిలో ఇంటర్ ఫలితాల్లో జిల్లా ఏడోస్థానంలో నిలవగా.. 2025–26లోనూ ఏడోస్థానాన్ని దక్కించుకుంది. ఫస్టియర్లో 6వ ర్యాంకు దక్కింది. ఒకేషనల్ ద్వి తీయ సంవత్సరంలో జిల్లా 30 స్థానంలో, ఫస్టియర్ ఫలితాల్లో 24వ స్థానంలో నిలిచింది. 2025–26లో ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 14,943 మంది హాజరుకాగా 11,961 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరి లో 6,347మంది బాలికలు, 5,614 మంది బాలురున్నారు. ప్రథమ సంవత్సరంలో 16,726 మంది పరీక్షలకు హాజరుకాగా, 11,737 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 6,051 మంది బాలికలు, 5,686 మంది బాలురున్నారు. ఒకేషనల్ ప్రథమ సంవత్స రం పరీక్షలకు 1,449 మంది హాజరుకాగా 822మంది ఉత్తీర్ణులయ్యారు. 56.73 శాతం ఉత్తీర్ణతను సా ధించారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 1,320 మంది హాజరుకాగా 876 మంది విద్యార్థులు ఉత్తీ ర్ణులయ్యారు. 66.36శాతం ఉత్తీర్ణత సాధించారు. పెరిగిన ఉత్తీర్ణత శాతం గతేడాది ఫలితాలతో పోలిస్తే ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణతశాతం పెరిగింది. కరోనా అనంతరం నుంచి ఫలితాల్లో జిల్లా తొలిసారిగా 80శాతం మార్క్ను దాటింది. ఈసారి ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. గతంలో ఎన్నడూ లేనంతగా అత్యుత్తమ మార్కులు సాధించారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు మహాత్మ జ్యోతి బాపూలే, సాంఘీక సంక్షేమ, మోడల్ స్కూల్, కేజీబీవీ కళాశాలల విద్యార్థులు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా మార్కులు సొంతం చేసుకున్నారు. పలు ప్రైవేటు కళాశాలల విద్యార్థులు రాణించారు. ఫస్టియర్లో 99శాతం మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మెరిశారు.ఏడాది ఫస్టియర్ సెకండియర్ 2025-26 70.17 80.042024-25 69.84 732023-24 63.41 732022-23 69 702021-22 69 70 -
స్మోక్ సిటీ
కరీంనగర్ కార్పొరేషన్: స్మార్ట్సిటీగా గుర్తింపు పొందిన కరీంనగర్ ఇప్పుడు స్మోక్ సిటీగా మారుతోంది. డంప్యార్డ్ నుంచి వెలువడుతున్న పొగ సగం నగరాన్ని కమ్మేస్తోంది. వేసవి కావడంతో సమస్య తీవ్రమవుతోంది. రాత్రి వేళ పొగ రోడ్లు, వీధులు దాటి ఇండ్లల్లోకి చొచ్చుకొస్తోంది. ఫలితంగా ప్రజలు ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరవుతున్నారు. షరామామూలుగానే నగరపాలకసంస్థ అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఎండలు ముదురుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. డంప్యార్డ్ ఉన్న ఆటోనగర్తో పాటు, అలకాపురికాలనీ, కోతిరాంపూర్, పోచమ్మవాడ, లక్ష్మినగర్, హౌసింగ్బోర్డుకాలనీ, గాయత్రినగర్, షాషామహల్, మారుతినగర్, కాపువాడ, బోయవాడ, సిక్వాడీ, గణేశ్నగర్, హనుమాన్నగర్, తిరుమల్నగర్, కట్టరాంపూర్, రామచంద్రాపూర్కాలనీలతో పాటు ఒక్కోసారి భగత్నగర్, ముకరాంపుర, తెలంగాణచౌక్,టవర్సర్కిల్ వరకు పొగ వ్యాపిస్తోంది. గాలి నాణ్యతపై ఆందోళన డంప్యార్డ్ పొగతో నగరంలో గాలి నాణ్యత క్షీణిస్తుండడంపై నగరవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలి నాణ్యతను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ద్వారా నిర్ధారిస్తుంటారు. ఏక్యూఐ స్థాయి 100 దాటితే ప్రమాదం పొంచి ఉన్నట్లే. డంప్యార్డ్ సమీప ప్రాంతాల్లో శని,ఆదివారాల్లో ఏక్యూఐ స్థాయి 250 వరకు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. డంప్యార్డ్ ప్రాంతంలో ఏక్యూఐ 408గా చూపించినట్లుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో సిటీ ప్రజలు మరింతగా ఆందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళ ఇండ్లల్లోకి పొగ రావడంతో తెల్లవార్లు ఇబ్బంది పడుతున్నామంటున్నారు. చేతులెత్తేసిన అధికారులు డంప్యార్డ్ సమస్య శాశ్వత పరిష్కారంపై రాజకీయ రగడ కొనసాగుతున్న తరుణంలో, తాత్కాలిక ఉపశమనం చూపించాల్సిన నగరపాలకసంస్థ అధికారులు చెతులెత్తేశారు. మంటలు చెలరేగకుండా, పొగ వ్యాపించకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ దిశగా తీసుకున్న జాగ్రత్తలు కనిపించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. డంప్యార్డ్లో పొగతో ఇబ్బంది పడుతున్న తమ గురించి కనీసం ఆలోచించాలని బాధితులు ప్రజాప్రతినిధులను, ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. -
సనాతన ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత
కొత్తపల్లి: సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్క రు బాధ్యతగా వ్యవహరించాలని ఆర్ఎస్ఎస్ కరీంనగర్ విభాగ్ బౌద్ధి ప్రముఖ్ సామల కిరణ్ జి తెలిపారు. చింతకుంట ఉప మండలం (చింతకుంట, కమాన్ పూర్, మల్కాపూర్, లక్ష్మీపూర్, బద్దిపల్లి) హిందూ సమ్మేళనం శనివా రం రాత్రి ఘనంగా జరిగింది. ఈ సమ్మేళనాని కి ముఖ్య వక్తగా హాజరైన కిరణ్ జి మాట్లాడు తూ సమాజంలో కులాల పేరుతో విభజన పెరుగుతున్న నేపథ్యంలో హిందువులు ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందన్నా రు. హిందూ సమాజంలో ఐక్యతను బలోపే తం చేయడమే లక్ష్యంగా సమ్మేళనాలు నిర్వహించడం జ రుగుతుందని అన్నారు. సామాజిక సమరత, కుటుంబ ప్రబోధన్, సంస్కృతి సాంప్రదాయాలు, పౌర నియమావళి, పర్యావరణం లాంటి ఐదు అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతుందన్నా రు. సభ అధ్యక్షుడు న్యాలమడుగు శంకరయ్య, శ్రీ శ్రీ ముక్తానంద స్వామి జి, మంజుల పాల్గొనారు. -
ఎనిమిదేళ్ల బాలికపై లైంగికదాడికి యత్నం
● ఆలస్యంగా వెలుగులోకి.. ● పోలీసులు అదుపులో నిందితుడు ● పోక్సో కేసు నమోదురామగుండం: వరుసకు కోడలైన ఓ మైనర్ బాలిక(8)పై లైంగికదాడికి యత్నించిన ఘటన రెండు రోజులు ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం ఎస్సై బోయ వెంకటస్వామి తెలిపిన వివరాలు. అంతర్గాం మండల పరిధిలోని అక్బర్నగర్కు చెందిన ఇలియాజ్(50) శుక్రవారం మధ్యాహ్నం తన ఇంటి సమీపంలోని వరుసకు సోదరి అయిన మహిళకు ఫోన్చేసి కోడలు(మైనర్ బాలిక)ను తమ ఇంటికి పంపించమని.. తన కూతురుతో ఆడుకుంటుందని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన సదరు మహిళ బాలికను వాళ్లింటికి పంపించింది. ఇలియాజ్ ఒక్కడే ఉండగా మైనర్ బాలికను ఇంట్లోకి పిలిచి లైంగికదాడికి యత్నించడంతో భయాందోళనకు గురైన బాలిక వెంటనే తిరిగి ఇంటికెళ్లిపోయింది. అప్పటి నుంచి జ్వరంతో బాధపడుతూ భయం భయంగా ఉంటోంది. సదరు బాలిక తనకు జరిగిన ఘటన గురించి ఆదివారం తల్లికి చెప్పడంతో హతాశులయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు అంతర్గాం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిపై వివిధ రకాల ఆరోపణలు రావడంతో మరింత లోతైన విచారణ చేపడుతున్నారు. -
12 బృందాలు.. 250 ఫుటేజీలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని దుర్గమ్మ ఆలయం వద్ద గల ఏటీఎం సెంటర్లోని మిషిన్ను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటనను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుంచి వాళ్లు వెళ్లినట్లు అనుమానిస్తున్న మార్గాల్లోని దాదాపు 250 సీసీ పుటేజీలు సేకరించారు. 12 పోలీసు బృందాలను రంగంలోకి దింపి దొంగల కోసం గాలిస్తున్నారు. ఎస్సీ మహేశ్ బీ గీతే పర్యవేక్షణలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వెంకటేశ్ ఆధ్వర్యంలో ఐదుగురు ఎస్సైలు, 30 మంది పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న ఏటీఎం కేంద్రంలో చోరీ జరగడంతో పోలీసులు చాలెంజ్గా తీసుకున్నారు. ● 250 సీసీ ఫుటేజీల సేకరణ ఏటీఎం సెంటర్లోని మిషిన్ను శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తాళ్లు కట్టి బొలెరోతో లాగి.. ఎత్తుకెళ్లిన ఘటనతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం ఉలిక్కిపడింది. వేసవి మొదట్లోనే భారీ చోరీ జరగడం.. అది కూడా పోలీస్స్టేషన్కు అతి సమీపంలో ఉన్న ఏటీఎం సెంటర్లో దొంగతనం జరగడంతో స్థానికులు మరింత భయాందోళన చెందుతున్నారు. ● బొలెరోతో రెక్కీ ఏటీఎం మిషిన్ చోరీకి పాల్పడ్డ దుండగులు దాదాపు రెండు నుంచి మూడు గంటలపాటు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. బొలెరో వాహనంలో వచ్చిన దుండగులు ముందుగా స్థానిక సాయిబాబా ఆలయం సమీపంలో చాలా సేపు వేచి చూసినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి ఏటీఎం సెంటర్ వరకు వచ్చి యూటర్న్ తీసుకొని మళ్లీ గొల్లపల్లి వైపు వెళ్లినట్లు సీసీ పుటేజీల ద్వారా తెలుస్తోంది. బొలెరోతో రెక్కి నిర్వహిస్తున్న సమయంలోనే ఓ పోలీస్ జీపు సైతం వారి వాహనాన్ని దాటి వెళ్లడం స్పష్టంగా తెలుస్తోంది. పోలీసుల కదలికలను పసిగడుతూనే దొంగలు ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. సాకేతికతను వాడుకుని దొంగతనానికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ● ఎటు వైపు వెళ్లారు? ఏటీఎం మిషిన్ను ఎత్తుకెళ్లిన దొంగలు పోలీసుల దృష్టి మళ్లించేందుకు ఎల్లారెడ్డిపేట నుంచి రాగట్లపల్లి వైపు వెళ్లి అక్కడి నుంచి దుమాల మీదుగా అక్కపల్లి వరకు వెళ్లారు. అక్కడ మిషిన్ను పగులగొట్టి అందులోని నగదు తీసుకొని ఆ డబ్బాను అక్కడే పడేశారు. అక్కడి నుంచి శివంగాళపల్లి, కోనరావుపేట మీదుగా కరీంనగర్ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అక్కడి నుంచి ఎటు వైపు వెళ్లారనేది స్పష్టంగా తెలియడం లేదు. చోరీ జరిగి 24 గంటలు గడుస్తున్నా దొంగలు ఎటు నుంచి వచ్చారు, ఎటు వెళ్లారో తెలియడం లేదు. అయితే గతంలో పోలీసులు, పౌరసమాజం కలిసి ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలలో సగం కూడా పనిచేయడం లేదు. సీసీ కెమెరాలు పని చేసి ఉంటే దొంగల ఆచూకీ లభించే అవకాశం ఉండేదనే చర్చ సాగుతోంది. ● ఠాణాకు కూతవేటు దూరంలోనే.. చోరీ జరిగిన ఏటీఎం సెంటర్ ఎల్లారెడ్డిపేట పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఉంటుంది. పోలీస్స్టేషన్ పరిసరాల్లో నిల్చుంటే ఏటీఎం సెంటర్ వద్ద ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. గంటల కొద్ది బొలెరో వాహనం ప్రధాన రహదారిపైనే సంచరిస్తుంటే ఎవరికీ అనుమానం రాకపోవడం గమనార్హం. ● రంగంలోకి పోలీసులు ఏటీఎం చోరీ ఘటనను సీరియస్గా తీసుకున్న జిల్లా ఎస్పీ మహేశ్ బీ గీతే రంగంలోకి భారీ సంఖ్యలో పోలీసులను దించారు. 12 పోలీసు బృందాలు దొంగలను పట్టుకునేందుకు గాలింపు చేపడుతున్నాయి. ఈ క్రమంలో సేకరించిన 250 సీసీ పుటేజీలను 30 మంది పోలీసులు పరిశీలిస్తున్నారు. ● ఏడాదిలో రెండో సంఘటన ఎల్లారెడ్డిపేట మండలంలో ఏటీఎంలను దొంగలు టార్గెట్ చేయడం ఇది రెండో సంఘటన. గతేడాది క్రితం రాచర్లగొల్లపల్లిలోని ఏటీఎంను బద్దలు కొట్టి చోరీకి విఫలయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో వెనుదిరిగారు. ఏడాది తర్వాత మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంను టార్గెట్ చేసి ఏకంగా మిసిన్నే ఎత్తుకెళ్లడం చర్చనీయమైంది. ● నిఘా వైఫల్యం ఏటీఎం దగ్గర బ్యాంకు అధికారులు సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయకపోవడమే దొంగలకు అనుకూలంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటీఎంలలో లక్షల్లో డబ్బులు పెట్టి కనీసం భద్రత చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు దారితీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏటీఎంల దగ్గర చోరీలు జరుగుతున్నా ఇటు బ్యాంకు అధికారులు.. అటు పోలీసులు కనీస భద్రత చర్యలు చేపట్టడం లేదు. ఏటీఎం మెషిన్ను దొంగలు ఎత్తుకెళ్తున్న క్రమంలో బ్యాంకు మేనేజర్కు హెచ్చరక అలారం వెళ్లినా ఆయన సకాలంలో స్పందించకపోవడంతో దొంగలు సునాయాసంగా తమ పని కానిచ్చారని తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నా భద్రత చర్యలు చేపట్టడంలో అందరూ విఫలమవుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఏటీఎం చోరీపై పోలీసుల సీరియస్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు కరీంనగర్ వైపు వెళ్లినట్లు అనుమానాలు -
‘ఎస్వీజేసీ’ సత్తా
కరీంనగర్టౌన్/సప్తగిరికాలనీ(కరీంనగర్): ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్లోని ఎస్వీజేసీ విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు కై వసం చేసుకున్నారని కళాశాలల సెక్రటరీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రైవేట్ విద్యాసంస్థల అధ్యక్షుడు ఊట్కూరి మహేందర్రెడ్డి తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 994, 992 ,992 ,991, 991, మొదటి సంవత్సరం ఎంపీసీలో 468 ,467, 466, 465, 464, బైపీసీలో 435, 434, 432, సీఈసీలో 490 489, 486 మార్కులు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను ప్రిన్సిపాల్లు, డైరెక్టర్లు కాంతాల రాంరెడ్డి, మేడ వెంకటవరప్రసాద్, సింహాచల హరికృష్ణ, వంగల సంతోష్రెడ్డి అభినందించారు. -
‘కోట రేసోనెన్స్’ విజయ దుందుభి
కరీంనగర్టౌన్/సప్తగిరికాలనీ(కరీంనగర్): ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్లోని కోట రేసోనెన్స్ విద్యార్థులు విజయదుందుభి మోగించారని కళాశాల చైర్మన్ డి.అంజిరెడ్డి తెలిపారు. ఫస్టియర్ ఎంపీసీలో గాలి సౌమ్యశ్రీ 469, సాత్విక్, వేముల అఖిల, శ్రీ సహస్ర రెడ్డి 468 మార్కులు, బైపీసీలో పి.శరణ్య 438, ఎం.సిద్ధి 437 మార్కులు సాధించినట్లు తెలిపారు. సెకండియర్ ఎంపీసీలో సహనసిరి 995 మార్కులు, బైపీసీలో జి.రోషిని 993, ఎం.శ్రీష 992 మార్కులు సాధించారన్నారు. వీరిని అంజిరెడ్డి అభినందించారు. -
‘శ్రీచైతన్య’ జయకేతనం
కరీంనగర్టౌన్/సప్తగిరికాలనీ(కరీంనగర్): ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్లోని శ్రీచైతన్య కళాశాల విద్యార్థులు జయకేతనం ఎగురవేసినట్లు విద్యాసంస్థల అధినేత ముద్దసాని రమేశ్రెడ్డి తెలిపారు. సెకండియర్ ఎంపీసీలో శశికుమార్, మైత్రి, చారుహాసిని 995 మార్కులు, సాత్విక, శ్రీనిత్య, ప్రవళ్లిక 994, బైపీసీలో లహరి, శ్రీనివాసన్, కార్తీక్ 994 మార్కులు, ఎంఈసీలో పల్లవి రాజయ్య 974, సీఈసీలో అంజలి 984 మార్కులు సాధించినట్లు తెలిపారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో ప్రశాంత్గౌడ్ 468, అక్షర, అక్షయ, గిఫ్టి, కల్యాణి 467, బైపీసీలో మేఘన, సిద్ధార్థ్ 438, మనోజ్ఞ 437 మార్కులు, ఎంఈసీలో లిఖిత గుప్త 494, సీఈసీలో శివాత్మికరెడ్డి 490 మార్కులు సాధించారని సంతోషం వ్యక్తం చేశారు. -
మెరిసిన ‘ఎస్ఆర్’ విద్యార్థులు
కరీంనగర్టౌన్, సప్తగిరికాలనీ(కరీంనగర్): ఇంట ర్ ఫలితాల్లో కరీంనగర్లోని ఎస్ఆర్ విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు కై వసం చేసుకున్నట్లు విద్యాసంస్థల అధినేత వరదారెడ్డి తెలిపారు. ప్రథ మ సంవత్సరం ఎంపీసీలో అమిరిశెట్టి శ్రీకృత 469, బైపీసీలో మహా 439, కె.నందిని 438 మా ర్కులు సాధించినట్లు పేర్కొన్నారు. సెకండియర్ ఎంపీసీలో టి.రశ్మిత, వి.ప్రణిత 995, బైపీసీలో డి.శివాని 991 మార్కులు సాధించినట్లు తెలిపా రు. ఎంపీసీలో 466 మార్కులకు పైగా 41 మంది, బైపీసీలో 436 మార్కులకు పైగా 15 మంది, ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 990 మార్కులకు పైగా 36 మంది, బైపీసీలో 990 మార్కులు ముగ్గురు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను విద్యాసంస్థల డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి, డీజీఎం వాసుదేవరెడ్డి, తిరుపతి అభినందించారు. -
మెరిసిన ‘అల్ఫోర్స్’ ఆణిముత్యాలు
కొత్తపల్లి(కరీంనగర్): ఇంటర్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు సత్తాచాటారు. కరీంనగర్లోని అల్ఫోర్స్ టైనీటాట్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వీఎన్ఆర్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులతో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు జయకేతనం ఎగురవేయడమే కాకుండా రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులను సాధించడం గర్వంగా ఉందన్నారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 1000 మార్కులకు కె.పల్లవి, జి.హైంథవి, డి.ప్రణవి, వై.శ్రీనిత్య 996 మార్కులు సాధించారన్నారు. సీనియర్ ఇంటర్ బైపీసీలో 1000 మార్కులకు ఆర్.వైష్ణవి 995, కె.హారిక, నభిలాతాహేన్, ఎస్.బ్రహ్మాణి, ఎస్.ఐశ్వర్య 995 మార్కులు సాధించారన్నారు. ఎంఈసీలో కె.మానస 988, సీఈసీలో పి.బావోజ్ఞ 987 మార్కులు సాధించారని తెలిపారు. ఫస్టియర్ ఎంపీసీలో డి.వినీష, జి.అక్షర 469, బైపీసీలో ఎస్.జాగృతి, ఏ.హస్విత, ఖాన్సా అలియా, జి.కావ్యశ్రీ 439 మార్కులు, ఎంఈసీలో ఎం.మహాలక్ష్మి 493, సీఈసీలో వి.దీక్షిత, అనామ్మహ్రూజ్ 494 మార్కులు సాధించారని తెలిపారు. -
మట్టి టిప్పర్ల అడ్డగింత.. అద్దాలు ధ్వంసం
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంటలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారంటూ సర్పంచ్ సహా పలువురు గ్రామస్తులు ఆదివారం టిప్పర్లను అడ్డుకుని అద్దాలు ధ్వంసం చేశారు. మట్టి రవాణాకు అనుమతి పొందిన దానికన్న ఎక్కువ మొత్తంలో మట్టి తరలిస్తున్నారని సర్పంచ్ గోగు రాజయ్య, పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గోరంత అనుమతులు పొంది కొండంత సహజసంపదను అక్రమంగా తరలించుకుపోతున్నారని తెలిపారు. ట్టి టిప్పర్లు అడ్డగించడంతో వివాదం జరుగుతుందనే సమాచారం మేరకు రూరల్ పోలీసులు రంగప్రవేశం చేసి సముదాయించారు. ఈ విషయమై సంబంధిత మైనింగ్ అధికారులకు సైతం సమాచారం అందించారు. జీపీఆర్ఎస్తో అనుసంధానం మట్టి టిప్పర్లను ఠాణాకు తరలించాలని మైనింగ్ అధికారులు సూచించగా అభ్యంతరం వ్యక్తం చేసినట్టు కాంట్రాక్టర్ రాంరెడ్డి తెలిపారు. మైనింగ్ అధికారుల సూచన మేరకు వాహనాలకు జీపీఆర్ఎస్ను అమర్చి వాటిని మైనింగ్ శాఖ అధికారులకు అనుసంధానం చేశానని, వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. సమ్మక్క జాతర సమయంలో తాను అభివృద్ధి పనులకు తనవంతు సహకారం అందించానని, అలా కాకుండా తమకే కొంతమొత్తాన్ని ఇవ్వాలని గ్రామ సర్పంచ్ డిమాండ్ చేస్తూ ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయమై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలన్నారు. గ్రామంలో సీసీకెమెరాలు, వాహనాలకు జీపీఆర్ఎస్ను పరిశీలించాలని ప్రతీ టిప్పుక వేబిల్లు తీసుకుంటున్నా ఇలాంటి ఇబ్బందులు సృష్టించి మనోవేదన కలిగించడం సరికాదన్నారు. టిప్పర్ల అద్దాలు ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రూరల్పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసినట్లు రాంరెడ్డి తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందిందని విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అక్రమంగా మట్టి తరలిస్తున్నారంటూ ఆరోపణ అక్రమం కాదు.. సక్రమమేనంటున్న కాంట్రాక్టర్ -
బస్సు, ఆటో ఢీ
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రం శివారులోని గాయత్రి డిగ్రీ కాలేజీ సమీపంలో ఆదివారం బస్సు, ఆటో ఢీకొని ముగ్గురికి గాయాలయ్యాయి. కామారెడ్డికి చెందిన రోహన్ అనే ఆటో డ్రైవర్ మద్యం మత్తులో, రాంగ్ రూట్లో వెళ్తూ బస్సు వైపు వెళ్లాడు. ఆటోను గమనించిన బస్సు డ్రైవర్ తప్పించే ప్రయత్నంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్తోపాటు బస్సులోని ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఉరివేసుకొని యువతి ఆత్మహత్యజమ్మికుంట: అనారోగ్య కారణాలతో యువతి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం పట్టణంలోని కృష్ణకాలనీకి చెందిన చిట్యాల ప్రణతి(24) మూడేళ్లుగా రక్తహీనత, అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రులు తిరిగిన నయం కాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందింది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి విజయ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. అత్తింటి వేధింపులతో వివాహిత..కరీంనగర్క్రైం: అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వన్టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్లోని గాయత్రినగర్కు చెందిన దేవరకొండ సురేశ్ కూతురు శ్వేతారాణి(24)ని జనగామకు చెందిన సల్ల సురేశ్కు ఇచ్చి 2020 ఏడాదిలో వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్ల లున్నారు. కొద్దిరోజులుగా అత్తింటివారు వేధిస్తున్నారు. ఈ నెల 7న శ్వేతారాణి చిన్న కొడుకు మొదటి పుట్టిన రోజు జనగామలో జరిగింది. ఫంక్షన్లో శ్వేతారాణికి భర్త సురేశ్, అతని తమ్ముడు సంతోష్, అతని భార్య, అత్తమామలు, అడపడుచులతో గొడవ జరిగింది. గొడవకు కారణం శ్వేతారాణి అని అత్తామామలు ఫంక్షన్హాల్ నుంచి వెళ్లగొట్టడంతో కరీంనగర్ వచ్చింది. ఆ గొడవపై జనగామ పోలీసులకు శ్వేతారాణి అత్తింటివారు ఫిర్యాదు చేశారు. పోలీసులు పిలవడంతో శనివారం శ్వేతారాణి, ఆమె తల్లిదండ్రులు జనగామా వెళ్లారు. అక్కడా భర్త, అత్తామామ, వారి కుటుంబసభ్యులు తీవ్రంగా దూషించడంతో కరీంనగర్కు వచ్చిన శ్వేతారాణి ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శ్వేతారాణి తండ్రి సురేశ్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్వేములవాడఅర్బన్: వేములవాడలోని సూపర్ మార్కెట్లను టార్గెట్ చేసుకొని బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ ఆదివారం తెలిపారు. చంద్రంపేటకు చెందిన గుడిసెల మహేశ్ జర్నలిస్టుగా వేములవాడలోని సూపర్ మార్కెట్ యజమాని పరిచయం చేసుకున్నాడని తెలిపారు. సూపర్ మార్కెట్లో అక్రమాలు జరుగుతున్నాయని వీటిని బయటపెడతానని, అధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఒకసారి రూ.30వేలు తీసుకోగా, మరోసారి రూ.12వేలు కూడా ఫోన్పే ద్వారా వసూలు చేసినట్లు వివరించారు. మరికొంత నగదు కావాలని బెదిరిస్తుండగా బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రిమాండ్ తరలించామని సీఐ తెలిపారు. -
నాడు తల్లి.. నేడు తండ్రి
● అనాథలైన చిన్నారులు ● చికిత్స పొందుతూ మృతిచెందిన హమాలీ అశోక్ కోరుట్లటౌన్: కోరుట్ల పట్టణానికి చెందిన బొగడమీది అశోక్ (36) మృతితో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు.. హమాలీ పని చేసే అశోక్ది పేద కుటుంబం. రెండేళ్ల క్రితం అనారోగ్యంతో భార్య చనిపోయింది. పదేళ్ల లోపు ఉన్న ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటూ హమాలీ పనులతో ఉపాధి పొందుతున్నాడు. ఈ నెల 2న సివిల్ సప్లై బియ్యం గోదాంలో లారీలో నుంచి బియ్యం అన్లోడ్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా బియ్యం బస్తాలు కిందపడడంతో బస్తాలతో సహా అశోక్ లారీ పైనుంచి కింద పడ్డాడు. తలకు తీవ్రగాయం కావడంతో వైద్యుల సూచన మేరకు కరీంనగర్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. 10 రోజులుగా చికిత్స పొందుతున్న అశోక్ ఆదివారం మృతిచెందాడు. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. అశోక్ అంత్యక్రియలకు హమాలీ సంఘం ప్రతినిధులు సాయిబాబా, పండితు ఇస్తారు, లాలయ్య, రమేశ్, మల్లేశ్, తిరుపతి, రాజు, సభ్యులు హాజరై సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుంటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అశోక్ పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని, రూ.10 లక్షల నష్టపరిహారం అందించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు డిమాండ్ చేశారు. -
‘ట్రినిటి’ ప్రభంజనం
కరీంనగర్టౌన్/సప్తగిరికాలనీ(కరీంనగర్): ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్లోని ట్రినిటీ కళాశాలల విద్యార్థులు ప్రభంజనం సృష్టించినట్లు కళాశాల వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో సహస్ర, వికిత, నేహ, శ్రీతులసి, మధురిమ, హారి క 995 మార్కులు సాధించారన్నారు. బైపీసీలో హసిబా ఉమామ, అయేషా ఫాతిమా, హాసిని 995 మార్కులతో సత్తా చాటినట్లు తెలిపారు. ఎంపీసీ ఫస్టియర్లో ప్రహలా ప్రాంసిక, లాస్య, శ్రీచరణి, లహరి, కీర్తన 468 మార్కులు, బైపీసీలో సోనియా బిస్తా, అఖిల, విష్ణుప్రియ, అక్షర, మనీష 438 మార్కులు సాధించినట్లు తెలిపారు. సెకండియర్లో 990 పైగా మార్కులు 71మంది, ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 465 మార్కులకు పైగా 41మంది, బైపీసీలో 435మార్కులకు పైగా 10మంది విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. వీరిని కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి, డైరెక్టర్ దాసరి మమతరెడ్డి అభినందించారు. -
చెరువుల సుందరీకరణ
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తి, తీగలగుట్టపల్లి, కొత్తపల్లిలోని చెరువుల సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈనెల నాల్గో వారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ ఆయా పనులు ప్రారంభించనున్నారు. ఆయా చెరువుల సుందరీకరణ, రక్షణ, నీటి నిర్వహణకు మొత్తం రూ.5.82 కోట్ల నిధులు విడుదలయ్యాయి. అమృత్ 2.0లో భాగంగా కేంద్రం ఈ నిధులు విడుదల చేసింది. టెండర్ ప్రక్రియ సైతం పూర్తి చేశారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్రావు ఆయా పనులు ప్రారంభించాలని కోరుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్కు విజ్ఞప్తి చేశారు. ఈనెల 16,17,18వ తేదీల్లో పార్లమెంట్ సమావేశాలున్నాయని, సమావేశాలు ముగిసిన తర్వాత చెరువుల సుందరీకరణ పనులు ప్రారంభించేందుకు వస్తానని తెలిపారు. ● కొత్తపల్లి ఊర చెరువు అభివృద్ధికి రూ.2.86 కోట్లు మంజూరయ్యాయి. ఆయా నిధులతో చెరువు కట్ట బలోపేతం, రక్షణ చర్యలు, అందంగా తీర్చిదిద్దే పనులతోపాటు కాలుష్య నివారణ చర్యలు చేపడతారు. ఈ పనుల కోసం సుమారు రూ.2.25 కోట్ల వ్యయం అంచనా వేయగా, అదనంగా పన్నులు, సెస్సులు, కన్సల్టెన్సీ, ఇతర ఖర్చులతో మొత్తం వ్యయం రూ.2.86 కోట్లకు చేరుకుంది. ● తీగలగుట్టపల్లి మాలకుంట చెరువుల పునరుద్ధరణ పనులకు రూ.1.10 కోట్లు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా చెరువుబండ్ను బలోపేతం చేయడం, స్టోన్ పిచింగ్, ఫిల్టర్ మీడియా, డ్రైనేజ్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు. అదనంగా బండ్పై ఎంఎస్ రెయిలింగ్, చెరువు పరిసరాల్లో చైన్లింక్ మెష్ ఏర్పాటు వంటి రక్షణ చర్యలు చేపడతారు. అలాగే చెరువు చుట్టూ పచ్చదనం పెంపు కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ పనులకు సుమారు రూ.85.35 లక్షలు కేటాయించారు. ఇక ఇతర ఖర్చుల కింద సీనరేజ్ చార్జీలు, జీఎస్టీ, కన్సల్టెన్సీ ఫీజులు, ప్లాంట్ల కొనుగోలు, కాలుష్య నివారణ చర్యలు, అనివార్య ఖర్చులు కలిపి మరో రూ.24.64 లక్షలు కేటాయించారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1.10 కోట్లుగా నిర్ణయించబడింది. పనులు పూర్తయిన తర్వాత చెరువు అందంగా మారడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం కూడా మెరుగుపడనుంది. ● రేకుర్తి పెంటకమ్మ చెరువు అభివృద్ధికి సైతం పై పనుల కోసం రూ.1.80 కోట్లు మంజూరయ్యాయి. అదనంగా చెరువు పరిసరాల్లో పచ్చదనం పెంపు చర్యలు తీసుకోనున్నారు. నీటి నిల్వను కాపాడేందుకు ఆర్సీసీ ఓపెన్ డ్రెయిన్ నిర్మాణం చేపడతారు. మొత్తం పనుల ఖర్చు సుమారు రూ.1.36 కోట్లు ఉండగా, సీనరేజ్, జీఎస్టీ, కన్సల్టెన్సీ చార్జీలు, ఇతర అనుబంధ వ్యయాలు కలిపి మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.1.80 కోట్లకు చేరింది. ఈ అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ఆయా చెరువులు అందంగా మారడంతో పాటు నీటి సంరక్షణకు కూడా ఉపయోగపడుతుందని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ పేర్కొన్నారు. -
బంగారం, వెండి పోగులతో చీర
సిరిసిల్ల: సిరిసిల్ల నేతకళాకారుడు నల్ల విజయ్ మరో అద్భుతాన్ని మగ్గంపై ఆవిష్కరించారు. రెండు గ్రాముల బంగారం, వెండి పోగులతో చీరను నేశారు. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త చెన్నారావు కోరిక మేరకు.. రెండు గ్రాముల బంగారం, మరో రెండు గ్రాముల వెండిని ఉపయోగించి బంగారు, వెండి పోగులతో ఆకర్షణీయమైన చీరను రూపొందించారు. సుమారు 25 రోజులపాటు శ్రమించి, ఐదున్నర మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో తీర్చిదిద్దారు. బంగారు, వెండి పోగు తీగలతో నేసిన ఈ చీరను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు హైదరాబాద్లో శనివారం ఆవిష్కరించారు. రూ.85వేల వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ చీర మంత్రముగ్ధులను చేస్తోందని, సిరిసిల్ల నేతన్నల నైపుణ్యం మరోసారి అంతర్జాతీయ స్థాయి గుర్తింపును పొందుతోందని కేటీఆర్ అభినందించారు. అగ్గిపెట్టెలో ఇమిడేచీరను నేసి ప్రపంచానికి సిరిసిల్ల చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన నల్ల పరంధాములు తనయుడే నల్ల విజయ్. తండ్రి చేనేత వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని కళాకండాలను ఆవిష్కరిస్తున్నారు. తాను నేసిన బంగారం, వెండిపోగుల చీరను కేటీఆర్ ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని నల్ల విజయ్ అన్నారు. భవిష్యత్లోనూ మరిన్ని వినూత్న ప్రయోగాలు చేస్తానని స్పష్టం చేశారు. సిరిసిల్ల నేతకళాకారుడి అద్భుత సృష్టి అభినందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
మూణ్నెళ్ల పరేషన్!
కరీంనగర్అర్బన్: రేషన్ మూవ్మెంట్ ప్రహాసనంగా మారింది. కరీంనగర్ ఎంఎల్ఎస్ పాయింట్లో అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. సంచి తరుగు కలిపి రవాణా చేయాల్సి ఉండగా సదరు విధానానికి స్వస్తి పలికి డీలర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు పుష్కలం. తనకు ఇక్కడ డ్యూటే ఇష్టం లేదంటూ మాటలు.. చేతల్లో మరో రకంగా వ్యవహరిస్తున్నాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా రేషన్ దుకాణాలు మూసివేసి ఉండగా కార్డుదారులకు ఇబ్బందిగా మారింది. నగరంలో 60 రేషన్ షాపులుండగా కరీంనగర్ ఎంఎల్ఎస్ పాయింట్ నుంచే అత్యధిక దుకాణాలకు సరఫరా చేయాల్సి ఉంది. కానీ, ‘నవ్విపోదురు గాక..‘ అన్నట్లుగా తయారైంది మూవ్మెంట్ దుస్థితి. మూవ్మెంట్ ఇంకెప్పుడో.. నిర్దిష్ట గడువులోగా మూవ్మెంట్ చేయాల్సి ఉండగా డీలర్లు, కార్డుదారులకు పడిగాపులు, నిరీక్షణే ఎదురవుతోంది. 3 నెలల బియ్యమని ప్రభుత్వం ప్రకటించినప్పుడే తదనుగుణంగా ప్రణాళికతో సాగాల్సి ఉండగా దిద్దుబాటు చర్యలు లేకపోవడం విడ్డూరం. నగరంలోని వావిలాలపల్లి, గణేశ్నగర్, రేకుర్తి, విద్యానగర్, మంకమ్మతోట, రాంనగర్, పద్మనగర్, కోతిరాంపూర్, ఆటోనగర్, హౌజింగ్బోర్డు కాలనీ, కిసాన్నగర్, భాగ్యనగర్, మారుతినగర్ తదితర ప్రాంతాల్లోని సగానికి పైగా రేషన్ దుకాణాల్లో బియ్యం లేక మూసి ఉండటం ఆందోళనకర పరిణామం. మండుటెండలో కార్డుదారులు రేషన్ దుకాణం వైపు వెళ్లడం, మూసివేతతో నిరాశగా వెనుదిరగడం తంతుగా సాగుతోంది. ప్రభుత్వం వేసవి దృష్ట్యా మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తుంటే ఎంఎల్ఎస్ పాయింట్ తీరు మాత్రం విరుద్ధం. 11 దాటినా బియ్యమేవీ? జిల్లాలో 3లక్షల కార్డుదారులుండగా 9లక్షలకు పైగా యూనిట్లున్నాయి. కరీంనగర్, హుజూరా బాద్, జమ్మికుంట, చొప్పదండి మండల స్థాయి నిల్వ కేంద్రాల ద్వారా రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తారు. అత్యధికంగా కరీంనగర్ పాయింట్ నుంచి 218 దుకాణాలుండగా మిగతావి హుజూ రాబాద్, జమ్మికుంట, చొప్పదండి పరిధిలో ఉన్నా యి. అయితే 250 పైగా దుకాణాలకు పూర్తిస్థాయిలో బియ్యం రాకపోవడం గమనార్హం. కరీంనగర్తో పాటు చొప్పదండి, రామడుగు, గంగాధర ప్రాంతాల్లోని అత్యధిక దుకాణాలు బియ్యం కోసం నిరీక్షిస్తున్నాయి. అయితే యూనిట్కు 6 కిలోలు.. 3 నెలలవి కావడంతో ఒక్కో యూనిట్కు 18కిలోలు పంపిణీ చేయనున్నారు. ఒక్కో లారీ సామర్థ్యాన్ని బట్టి 150 నుంచి 320 క్వింటాళ్ల వరకు సరఫరా చేస్తోంది. ప్రస్తుత లెక్క ప్రకారం యూనిట్కు 18కిలోలు కాగా ఒక్కో దుకాణానికి గరిష్ఠంగా 350క్వింటాళ్ల వరకు అవసరం. ఈ లెక్కన ఒక దుకాణానికి సరఫరా చేయాలంలే రెండుసార్లు లారీ వెళ్లాల్సిందే. వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా లారీలు అరకొర మాత్రమే ఉండటం శోచనీయం. ఇలాగైతే ఈ నెలలో పంపిణీ కావడం అనుమానమే. పాపం.. డీలర్లు, కార్డుదారులు రేషన్ దుకాణాలకు బియ్యం ఆలస్యంగా వస్తుండటంతో డీలర్ల బాధ వర్ణనాతీతం. పండుగ లేదు.. శుభకార్యాలు లేకుండా రేషన్ దుకాణంలోనే కాలం గడుపుతున్నారు. కొంత బియ్యం ఒకసారి మరికొంత బియ్యం మరోసారి పంపిస్తుండటంతో సాధ్యమైనంత వరకు పంపిణీ చేస్తున్నా పూర్తిస్థాయిలో పంపిణీ జరగడం లేదు. దీంతో కమీషన్తోనే బతుకు వెళ్లదీయాల్సిన డీలర్లు గిట్టుబాటు కాక ఉస్సూరుమంటున్నారు. ఇక కార్డుదారులు బియ్యం కోసం దుకాణాల చుట్టూ తిరగడం ఆందోళనకర పరిణామం.రేషన్ దుకాణంలో ఇచ్చేదే ఒక బియ్యం. ఆ బియ్యాన్ని తీసుకోవాలంటే రోజుల తరబడి దు కాణం చుట్టూ తిరుగుతున్న. మూవ్మెంట్ సమస్యని తిప్పుకుంటున్నారు. అధికారులు చొరవ చూపాలి. – రాకేశ్, కార్డుదారు, వావిలాలపల్లిరేషన్ దుకాణానికి సన్నబియ్యం రావడంతో తీసుకుందామని వెళ్తే మూసివేసి ఉంటుంది. ఇంకా బియ్యం రాలేదని చెబుతుర్రు. రోజూ పనులు మానుకుని బియ్యం కోసమే తిరుగుడైతుంది. – విజయ, కార్డుదారు, భగత్నగర్, కరీంనగర్‘ఈ ఫొటోలో ఉన్నది కోతిరాంపూర్లోని మరో రేషన్ దుకాణం. బియ్యం వచ్చాయో లేదో కార్డుదారులు బారులు తీరగా రెండ్రోజుల్లోనే పంపిణీ పూర్తయింది. దీంతో కార్డుదారులు నిరాశతో వెనుదిరిగారు’.గ్రామాలు: 318, మొత్తం జనాభా: 10,09,234 రేషన్ కార్డులు: 3,04,201, యూనిట్లు: 9,77,152 రేషన్ దుకాణాలు: 566 -
వృద్ధురాలి కళ్లలో కారం కొట్టి గొలుసు అపహరణ
వీర్నపల్లి(సిరిసిల్ల): వృద్ధురాలి కళ్లల్లో కారం చల్లి బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన వీర్నపల్లి మండలంలో శనివారం ఉదయం కలకలం రేపింది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బంజేరు గ్రామానికి చెందిన గుగులోతు హంసి శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో తన ఇంటి బయట పనులు చేస్తుంది. ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమైపె దాడి చేసి, కళ్లలో కారం చల్లి మెడలోని 2.5 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ హఠాత్పరినామంతో హంసి గగ్గోలు పెట్టడంతో వెంటనే కుటుంబ సభ్యులు బయటకు వచ్చినా దుండగులు కనిపించలేదు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై వేముల లక్ష్మణ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్టు ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలో గంజాయి రవాణా చేస్తున్న గాజానవేణి రాకేశ్, అంబాల తరుణ్ను అరెస్టు చేసినట్లు పొత్కపల్లి ఎస్సై రమేశ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, పెద్దపల్లి ఏసీపీ కృష్ణ ఆదేశాల మేరకు గుంపుల గ్రామంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో రాకేశ్, తరుణ్ బైక్పై అటుగా వస్తూ అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారిని ఆగాలని సూచించడంతో అంతలోనే పారిపోవడానికి యత్నించారు. పోలీసులు వారిని పట్టుకొని విచారించగా.. గంజాయి విక్రయించేందుకు అటుగా వచ్చినట్లు అంగీకరించారు. వారినుంచి గంజాయితో పాటు బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకొన్నారు. -
పదో తరగతి విద్యార్థులు
మార్కులు..ర్యాంకులే చదువుకు కొలమానం అనుకుంటున్న నేటితరం విద్యార్థులు ఒక్కక్షణం ఆగండి.. వీరి విజయగాథలు చదవండి. పదో తరగతిలో ఫెయిలైన వారు.. ఇంటర్లో అత్తెసరు మార్కులతో పాసైన వారు.. డిగ్రీ కూడా చదవని వారు.. అద్భుతాలు సృష్టించారు. వారు వేసిన మార్గంలోనే నేడు డిగ్రీ.. బీటెక్.. ఎంటెక్ విద్యార్థులు ముందుకెళ్తున్నారు. డిగ్రీ పూర్తి చేయని బిల్గేట్స్.. బోర్డు ఎగ్జామ్ రాయని సచిన్ టెండూల్కర్.. ఆటోడ్రైవర్గా జీవితాన్ని ఆరంభించిన సత్యశంకర్ విజయాలే మనకు మార్గంకావాలి. అంతెందుకు మన జిల్లా వాసి.. కొత్తగట్టుకు చెందిన కోరెం అశోక్రెడ్డి ఇంటర్ ఫెయిలయ్యానని కుంగిపోయి ఉంటే ఈరోజు ఐఏఎస్ అయ్యేవారే కాదు.. అందుకే ఒక్క క్షణం ఆలోచించండి.. పదో తరగతిలో తక్కువ మార్కులు వచ్చాయని.. ఇంటర్ ఫెయిల్ అయ్యామని కుంగిపోకండి. దీని తర్వాత జీవితం చాలా ఉంది. ధైర్యంతో ముందుకెళ్తే మీలో నుంచే ఓ బిల్గేట్స్.. సత్యశంకర్.. మనోజ్కుమార్శర్మ.. కోరెం అశోక్రెడ్డి వారసులు రావచ్చు. ఇంటర్ ఫలితాలు ఎలా ఉన్నా.. ధైర్యంగా ముందుకెళ్దాం.. – సప్తగిరికాలనీ(కరీంనగర్) – వివరాలు 8లో...36,4268,10618,2514,06018,175కరీంనగర్రాజన్నసిరిసిల్ల‘సత్యశంకర్.. ఓ పానీయం ఉత్పత్తి చేసే బిందు కంపెనీ యజమాని. ఆయన ఇంటర్ వరకు చదువుకుని ఆటో డ్రైవర్గా తన ప్రస్థానం మొదలుపెట్టారు. అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఇప్పుడు రూ.800 కోట్ల వ్యాపారానికి యజమాని అయ్యారు. ఆయనే వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు.’‘మనోజ్కుమార్శర్మ.. మధ్యప్రదేశ్లోని ఒక పేద కుటుంబంలో జన్మించాడు. 12వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు. కానీ నిరాశ చెందలేదు. ఐపీఎస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర పోలీస్లో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాలో పనిచేస్తున్నారు.’ -
‘అక్షర పౌర్ణమి’కి ఆఖరి వీడ్కోలు
మలయశ్రీ పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న సాహితీవేత్తలు మలయశ్రీ రచనలు విద్యానగర్(కరీంనగర్)/కరీంనగర్ కల్చరల్: శతాధిక గ్రంథకర్త, రంగస్థల నటులు, వేమన నాటక దర్శకులు మలయశ్రీ మృతి తీరని లోటని కవులు, సాహితీవేత్తలు అన్నారు. పద్యం, గద్యం, కథ నవల, బాల సాహిత్యం, సాహితీ విమర్శ, అనువాదాలు, నాటక ప్రక్రియలో రచనలు చేసి కరీంనగర్ జిల్లా సాహిత్య చరిత్రపై పరిశోధనాత్మక గ్రంథాన్ని అందించి సాహిత్య చరిత్రలో తన పత్య్రేకతను చాటుకుంటు తన పుట్టిన రోజు అయిన కార్తీక పున్నమి సందర్భంగా పత్రి పౌర్ణమి రోజు సాటి కవులు, సాహితీవేత్తలను సాదరంగా సత్కరించే కవి, రచయిత డా.మలయశ్రీ గురించి సాహితీవేత్తల మదిలోని భావాలు. ఏటా తన పుట్టిన రోజున.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామంలో 1940 సంవత్సరంలో కార్తీక పున్నమి రోజు జన్మించిన డా.మలయశ్రీ కరీంనగర్లోని రేకుర్తిలో స్థిరపడ్డారు. ఎంఏ(తెలుగు), ఎంఓఎల్, పీహెచ్డీ చదివిన ఆయన తెలుగు పండిత్ ఉపాధ్యాయునిగా, ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి విరమణ పొందారు. ఆయన రాసిన శాంతిపథం ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉపవాచకంగా ఉండేది. కరీంనగర్ వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. తన ఇద్దరు పిల్లలకు ఆదర్శ వివాహాలు చేశారు. ఏటా తన పుట్టినరోజు అయిన కార్తీక పున్నమి రోజు సాహితీవేత్తలను సత్కరించేవారు. 1960 నుంచి రచనలు ప్రారంభించి 4 భాషల్లో దాదాపు 136పైగా రచనలు చేసిన ఆయన అందుకోని అవా ర్డు, పొందని సత్కారం లేదంటే అతిశయోక్తి కాదు. అభ్యుదయవాదిగా, బౌద్ధేయవాదిగా నమ్మి న ఆశయాలు, సిద్ధాంతాలతో జీవితాన్ని చివరి వర కు సా గించిన ఆయన అనారోగ్యంతో శుక్రవారం కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో డాక్టర్ల సూచన మేరకు కు టుంబ సభ్యులు స్వగృహానికి తరలించగా శని వారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. రచయితలు వేణుశ్రీ, సరిపల్లి కృష్ణారెడ్డి, బాలసాని రాజ య్య, కూకట్ల తిరుపతి, లక్ష్మణబోధి, గండ్ర లక్ష్మణ రావు, బూర్ల వెంకటేశ్వర్లు, రంగినేని మోహనరావు, జూకంటి జగన్నాథం, కలవకుంట్ల రామకృష్ణ, సబ్బని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మలయశ్రీకి సాహితీవేత్తల కన్నీటి నివాళి -
గంజాయి విక్రేత అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ పోలీస్స్టేషన్ పరిధి లో గంజాయి విక్రయించేందుకు వస్తున్న వ్యక్తిని పట్టుకున్నట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన గౌస్ఖాన్ జగిత్యాలకు గంజాయి తీసుకొచ్చి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతడిని పట్టుకోగా 270 గ్రాముల గంజాయి లభించింది. నిందితుడిని అరెస్ట్ చేసి శనివారం రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిందితునిపై గతంలో జగిత్యాల టౌన్ పోలీస్స్టేషన్లో రెండు కేసులు, కోరుట్ల పోలీస్స్టేషన్లో ఒక కేసు నమోదైనట్లు వివరించారు. వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతికరీంనగర్క్రైం: కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఓ వ్యక్తి నగరంలోని ఓ ఆసుపత్రికి రాగా.. వైద్యుల నిర్లక్ష్యంతో మృతిచెందాడని మృతుడి భార్య కరీంనగర్ టూటౌన్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూర్కు చెందిన వేముల శ్రీనివాస్(55) కిడ్నీ సమస్యతో బాధపడుతూ నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి శుక్రవారం వచ్చాడు. పరీక్షలు చేసిన వైద్యులు కిడ్నీలో రాయి పెద్దగా ఉందని ఆపరేషన్ చేయాలని సూచించారు. వైద్యం చేసే క్రమంలో మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతో తన భర్త మృతిచెందాడని, ఆసుపత్రి వైద్యులు, యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య తిరుమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నా తొలి కవిత్వ పుస్తకాన్ని అందించాను
2007లో నా మొదటి కవిత్వ పుస్తకం వాకిలిని మలయశ్రీకి అందించాను. దాన్ని చదివిన తర్వాత ఆయన నాకు ఉత్తరం రాశారు. తెలంగాణ రచయితల వేదిక సభలలో, అనేక సమావేశాల్లో వారిని కలిసేవాళ్లం. వారి ఇంటికి వెళ్లి కలిసినప్పుడు వారు అనువాదం చేస్తున్న దమ్మపదం పద్యాలను చూపించారు. అనేకమార్లు భౌతికవాది పత్రికలను అందించారు. సాహిత్యంలో, జీవితంలోనూ నిర్మోహమాట భావ ప్రకటన, సూటిదనం ఉన్న వ్యక్తి. – బూర్ల వెంకటేశ్వర్లు, కవి, రచయిత, కరీంనగర్ విలక్షణ సాహితీవేత్త మలయశ్రీ బహు ప్రక్రియలలో రచనలు చేసి, బహు గ్రంథాలను వెలువరించిన అరుదైన, విలక్షణ సాహితీవేత్త. సామాజిక చైతన్యమే ధ్యేయంగా శాసీ్త్రయ దృక్పథంతో రచనలు చేసిన హేతువాది. తరతరాలుగా సమాజంలో నాటుకొని పోయిన మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలను తెగనాడుతూ రచనలు చేశారు. సమాజంలో సాహితీ కళారంగాల్లో ఆధిపత్య భావజాలాన్ని వ్యతిరేకించారు. మలయశ్రీ రచనలు మానవీయ సమాజాన్ని నిర్మాణం చేయడానికి దోహదం చేస్తాయి. – కూకట్ల తిరుపతి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలంగాణ రచయితల వేదిక కచ్చితత్వం ఆయన జీవన విధానం మలయశ్రీ కరీంనగర్ జిల్లా సాహిత్య ప్రపంచంలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఆయన రాసింది కేవలం కవిత్వమే కాదు.. ఆయన చేసిన విస్తృత సాహిత్య ప్రయాణంలో కరీంనగర్ చరిత్ర, భాష, సాహిత్య చరిత్ర, సామాజిక చైతన్యం అన్నీ కలగలిసిపోయాయి. నిర్మోహమాటం, సూటిదనం, కచ్చితత్వం ఆయన జీవన విధానం. అధ్యాపకుడిగా, గురువుగా ఉన్నారు కానీ సాహిత్య రంగంలో గురుస్థానాన్ని ఆశించలేదు. – వారాల ఆనంద్, సాహితీవేత్త, కరీంనగర్ గొప్ప రచయిత మలయశ్రీ విశిష్టమైన రచయిత, నవలాకారుడు, కవి, అనువాదకుడు. తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లో రచనలు చేసిన మహనీయుడు. శతాధిక గ్రంథకర్త జీవితమంతా సాహిత్యానికి ధారపోసిండు. బౌద్ధ తాత్వికత నాస్తిక హేతువాద ధృక్పథాన్ని జీవితంలో ఆచరించిన వ్యక్తి. ఆయనతో నాకు మూడు దశాబ్దాల అనుబంధం. ఆయన పేరున నెలకొల్పిన మలయశ్రీ అవార్డు 2006లో అందుకోవడం నాకు ఒక గొప్ప జ్ఞాపకం. – అన్నవరం దేవేందర్, కవి, రచయిత, రాష్ట్ర ప్రభుత్వ దాశరధి పురస్కార గ్రహీత -
మరణించి.. వెలుగులు నింపి
కోల్సిటీ(రామగుండం): వచ్చే నెలలో ఉద్యోగ విరమణ చేసే అతడొక సాధారణ వాచ్మన్.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినా మరొకరి జీవితంలో వెలుగులు నింపాడు. మానవత్వానికి అద్దం పట్టే ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో హృదయాలను కదిలించింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నైట్ వాచ్మన్ ఇందారపు రాయపోశం(60) కాకతీయ నగర్నివాసి. భార్య సమ్మక్క, ఇద్దరు కుమారులు ప్రశాంత్–పద్మ, కుమారస్వామి–జ్యోతి, కూతురు సత్యవతి–శ్రీనివాస్తోపాటు మనవలు, మనవరాళ్లు ఉన్నారు. ప్రమాదం.. విషాదాంతం.. ఈనెల 10న రాత్రి విధులకు హాజరైన రాయపోశం.. తోటిఉద్యోగితో కలిసి గోదావరిఖని బస్టాండ్ సమీపంలో టీ తాగి తాగడానికి బైక్పై వెళ్తుండగా టీ జంక్షన్ వద్ద కారు ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషాదంలోనూ మానవత్వం రాయపోశం చిన్నప్పుడే ఒకకంటి చూపు కోల్పోయాడు. అయినా విధి నిర్వహణలో ఆదర్శంగా నిలిచిన ఆయన జీవితం అందరికీ స్ఫూర్తి ఇచ్చింది. విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులు ఒక్కకన్ను కూడా దానం చేసి మరొకరికి చూపునివ్వాలని అంగీకరించారు. సదాశయ ఫౌండేషన్ ప్రతినిధుల సూచనతో, ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్నాయక్ సహకారంతో శనివారం కార్నియా సేకరించి హైదరాబాద్కు తరలించారు. నివాళి రాయపోశం పార్థివదేహానికి జీజీహెచ్ మార్చురీ వద్ద బల్దియా డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్, కార్మిక సంఘాల ప్రతినిధులు నివాళి అర్పించారు. దహన సంస్కారాల కోసం మున్సిపల్ అధికారులు రూ.20 వేలు అందించారు. మేయర్ అభినందన విషాదంలోనూ మానవత్వాన్ని చాటిన రాయపోశం కుటుంబాన్ని మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ, ఎసాబ్లిష్మ్మెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, సదాశయ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు అభినందించారు. ఆయన అకాల మరణంపై సంతాపం, సానుభూతి వ్యక్తం చేశారు. చనిపోయాక కూడా ఒంటికన్ను దానం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వాచ్మన్ కుటుంబ సభ్యుల దాతృత్వం -
తల్లిని హతమార్చిన తనయుడు
● మల్లాపూర్లో దారుణం ● కుటుంబ కలహాలే కారణంమల్లాపూర్ : కుటుంబ కలహాలతో కన్నతల్లినే కడతేర్చాడు కొడుకు. ఈ ఘటన మల్లాపూర్ మండలకేంద్రంలో శనివారం వెలుగుచూసింది. స్థానికులు, పోలీసుల ప్రకారం గ్రామానికి చెందిన కుడుదుల వెంకవ్వ (90)కు కుమారుడు నంబయ్య (73), కూతురు ఉన్నారు. భర్త చనిపోయినప్పటి నుంచి వెంకవ్వ కుమారుడితోనే ఉంటోంది. నంబయ్య భార్య లక్ష్మీతో తరచూ గొడవ పడుతుంటే వెంకవ్వ సర్దిచెప్పేది. శుక్రవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరగగా.. వెంకవ్వ అడ్డుకుంది. దీంతో నంబయ్య ఆమె ముఖంపై దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడిన వెంకవ్వ అక్కడికక్కడే మృతి చెందింది. మెట్పల్లి సీఐ అనిల్కుమార్, ఎస్సై అనిల్ ఘటనస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆర్ఐ అశోక్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. డిప్యూటేషన్పై పంపండి రాయికల్: మండలంలోని మైతాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థి దుగ్గిళ్ల అక్షయ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. దీనికి ప్రధానోపాధ్యాయుడి వేధింపులే కారణమని ఆయన బంధువులు ఆరోపిస్తూ ఆందోళన చేయడం సరికాదని, తాము పాఠశాలలో పనిచేయడానికి ఇబ్బంది పడుతున్నామని, ఈ క్రమంలో తమను మరో పాఠశాలకు డిప్యూటేషన్పై పంపించాలని ఏడుగురు ఉపాధ్యాయులు ఎంఈవో రాఘవులుకు వినతిపత్రం సమర్పించారు. విషయాన్ని డీఈవో దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. పాఠశాలలో ఉత్తీర్ణత కోసం కృషి చేస్తున్న ఉపాధ్యాయులపై ఆరోపణలు చేయడం సరికాదని, విద్యార్థుల భవిష్యత్ కోసమే ఉపాధ్యాయులు పాటుపడతారని, తల్లిదండ్రులు గమనించాలని కోరారు. ఉపాధ్యాయుల కౌన్సెలింగ్పై అపర్థం చేసుకోవద్దని, విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకే ఉపాధ్యాయులు పాటుపడతారని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గంగనర్సయ్య, ప్రధాన కార్యదర్శి మానుపాటి బన్న, హెచ్ఎంలు బోగ రమేశ్, ఉపాధ్యాయులు గుర్రం శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. మైతాపూర్లో డీఈవో విచారణ టెన్త్ విద్యార్థి అక్షయ్ ప్రధానోపాధ్యాయుడి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణల మేరకు శనివారం డీఈవో రాము పాఠశాలను సందర్శించారు. విచారణ చేపట్టారు. అనంతరం అక్షయ్ తల్లిదండ్రులను పరామర్శించారు. శరీరదానానికి రిటైర్డ్ హెచ్ఎం అంగీకారంకరీంనగర్/కరీంనగర్రూరల్: కరీంనగర్ మెహర్నగర్కు చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు సాగి రాంచందర్రావు దేహదానం చేసేందుకు ముందుకొచ్చారు. శనివారం సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి మెరుగు భీష్మాచారి ఆధ్వర్యంలో రాంచందర్రావు కరీంనగర్ మండలం నగునూరులోని ప్రతిమ మెడికల్ కళాశాలను సంప్రదించారు. సీఏవో రాంచందర్రావు సూచనల మేరకు శరీరదానానికి సంబంధించిన దరఖాస్తుఫాంలో వివరాలు నింపి ఎనాటమీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపాల్కు అందించారు. హెచ్ఎంగా ఉద్యోగ విరమణ అనంతరం సామాజిక సేవాకార్యక్రమాల్లో భాగస్వాములవుతూ ప్రస్తుతం మెడికల్ కళాశాలకు శరీరదానం చేసేందుకు రాంచందర్రావు ముందుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఫౌండేషన్ ప్రతినిధులు నేదునూరి కనుకయ్య, ఆడెపు రాజకనుకయ్య, శ్రీపతి ప్రభాకర్, మెరుగు దేవిక, ద్వారకామయి తదితరులు పాల్గొన్నారు. కాగా సమాజహితం కోసం శరీరదానానికి ముందుకొచ్చిన రాంచందర్రావుకు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, గౌరవ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, ముఖ్యసలహాదారు రమేశ్, ప్రచార కార్యదర్శి వాసు, చంద్రమౌళి తదితరులు అభినందనలు తెలిపారు. -
బతకాలి.. విజయాన్ని వెతకాలి..!
● ఫెయిల్ అయ్యామని మనోధైర్యం కోల్పోవద్దు ● ముందుంది ఉజ్వల భవిష్యత్ ● మార్కులు..ర్యాంకులే కాదు కొలమానంసప్తగిరికాలనీ(కరీంనగర్): ఫస్ట్ ర్యాంక్.. ఫస్ట్ ర్యాంక్.. ఫస్ట్ ర్యాంక్.. నేటి విద్యార్థులు ఇదేదో జీవితలక్ష్యం అనుకుంటున్నారు. ఇక్కడే వారు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. చదువు అంటే ర్యాంకులు.. మార్కులు అనే కోణంలోనే చూస్తున్నారు. చదువు అంటే ఏం నేర్చుకున్నాం.. ఎంత నేర్చుకున్నాం.. మన జీవితానికి ఎంత ఉపయోగపడుతుందనే ఆలోచన లేకుండా పోయింది. తక్కువ మార్కులు వచ్చిన తమ స్కూల్ సీనియర్ విద్యార్థులు జీవితాల్లో ఉన్నతంగా తమ కళ్లముందే ఎదుగుతున్నా వారిని స్ఫూర్తిగా తీసుకోవడం లేదు. మార్కులు వస్తేనే సక్సెస్... లేకుంటే జీవితమే లేదు అన్న ఆలోచనలో పడిపోయారు. అయితే ఇక్కడే ఒక్క క్షణం ఆలోచించాల్సిన తరుణం వచ్చింది. నేడు ఇంటర్ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలోనే మార్కులే జీవితం కాదనే సత్యాన్ని నేటి విద్యార్థులు గుర్తించాలి. రిజల్ట్స్ అనేవి ఒక దశ మాత్రమేనని.. అంతిమ గమ్యం కాదని విద్యానిపుణులు చెబుతున్నారు. ఒక వేళ ఫెయిల్ అయితే మళ్లీ ప్రయత్నించే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం సక్సెస్ అయిన బిజినెస్మెన్లు.. విద్యావేత్తలు.. క్రీడాకారులు.. తమ జీవితాల్లో ఆటుపోట్లను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన వారేనని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. మార్కులు తక్కువగా వచ్చాయనే.. ఫెయిల్ అయ్యామనో అఘాయిత్యాలకు పాల్పడవద్దని కోరుతున్నారు. ఫలితాలు ఎలా ఉన్నా మనోధైర్యంగా ముందుకెళ్తే విజయతీరాలను అందుకుంటామనే ఆలోచనతో ఉండాలని సూచిస్తున్నారు.నిలిచి గెలిచిన హీరోలు ప్రస్తుతం మన కళ్లెదుట రాణిస్తున్న వారు, ఒకప్పుడు ప్రతిభ చాటిన ప్రముఖులు పడిలేచిన కెరటాలు. నేటి ఓటమి రేపటి గెలుపునకు పునాదిని వేసుకొని గెలిచారు. మార్కులు, ర్యాంకులు జీవితం కాదని గ్రహించారు. ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చిన వాళ్లే భవిష్యతులో గొప్పవాళ్లు కావచ్చుననే లక్ష్యంతో ముందుకుసాగారు. ఒక్కసారి ఆలోచించండి ఎవరి కుటుంబం వారికి ఓ అందమైన లోకం. అమ్మానాన్నలతో కలిసి ఆనందంగా గడిపిన క్షణలను గుర్తు చేసుకోండి. ఫెయిల్ అయ్యామని కుంగిపోకుండా సప్లిమెంటరీలో మంచిగా ప్రయత్నిస్తే విజయం మనదేనని గుర్తుంచుకోవాలి. మార్కులు తక్కువగా వచ్చాయని ఆత్మహత్య చేసుకుంటే.. ఆ తర్వాత ఇంకేమి మిగిలి ఉండదనే విషయాన్ని గుర్తుంచుకుంటే అందమైన జీవితం మన సొంతమవుతుందనే ఆలోచన తెచ్చుకోవాలి. విద్యార్థులు ఫలితాల గురించి తల్లిదండ్రులకు.. తోటి స్నేహితులతో పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు సైతం తమ కాలేజీలో చదువుకున్న విద్యార్థులతో ఒకసారి మాట్లాడి మనోధైర్యం కల్పించాలని పలువురు విద్యావేత్తలు కోరుతున్నారు. ఇదే సమయంలో తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి పెంచొద్దని సూచిస్తున్నారు. -
డ్రగ్స్ నివారణలో కెమిస్ట్ల పాత్ర కీలకం
కరీంనగర్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కెమిస్ట్స్– డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం సే నో టు డ్రగ్స్ నినాదంతో కోర్టు ప్రాంగణం నుంచి కెమిస్ట్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కెమిస్ట్ భవన్లో జరిగిన కార్యక్రమంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నరసయ్య మాట్లాడారు. మాదకద్రవ్యాల వాడకంతో కలిగే నష్టాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. డ్రగ్స్ దుష్ప్రభావాలు, వాటి నివారణలో కెమిస్ట్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. డీఎస్పీ ఉపేందర్, ఈగిల్ ఫోర్స్, నార్కోటిక్ సీఐ రఫిక్ఖాన్, డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ, అసోసియేషన్ అధ్యక్షుడు కంటాల రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి మునీందర్, కోశాధికారి కొంజర్ల మహేశ్, గౌరవాధ్యక్షుడు ఎం.రమేశ్ తదితరులు పాల్గొన్నారు. క్షేత్ర పర్యటనతో విజ్ఞానంకరీంనగర్సిటీ: క్షేత్ర పర్యటనతో విద్యార్థుల్లో విజ్ఞానం పెరుగుతుందని ఎస్సారార్ కాలేజీ వృక్షశాస్త్ర విభాగాధిపతి ఆచార్య తిరుకోవెల శ్రీనివాస్ అన్నారు. వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శనివారం ములుగు జిల్లా పాలంపేట చెరువు, పాకాల చెరువు, రామప్ప ఆలయం, తాడ్వాయి అభయారణ్యాన్ని సందర్శించారు. వివిధ జాతుల వృక్షాలను అధ్యయనం చేశా రు. ఆకురాల్చే అడవులు, తదితర అంశాలపై డాక్టర్ రౌతు రాధాకృష్ణ, డాక్టర్ మహమ్మద్ తాహిర్హుస్సేన్ విద్యార్థులకు వివరించారు. సమర్థవంతంగా వ్యసనాల నివారణకరీంనగర్: మాదక ద్రవ్యాలు, మద్యపాన వ్యసనాల నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను మరింత విస్తరించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంటకరమణ అన్నారు. ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా శనివారం కరీంనగర్లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, అశోకనగర్లోని డి అడిక్షన్ సెంటర్లను సందర్శించి మాట్లాడారు. బాధితులకు అందిస్తున్న వైద్య సేవలు, చికిత్స విధానం, సదుపాయాల్లో ఎలాంటి లోపాలు ఉండకుండా చూడాలన్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎండీ తాఖియొద్దీన్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి, ఆర్ఎంవో డాక్టర్ నవీన తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్: పార్లమెంట్, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం సీట్లను రిజర్వ్ చేస్తూ, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే చారిత్రక చట్టం అమలుకు కౌంట్ డౌన్ మొదలైందని, ఈనెల 16న చట్టం అమలు కాబోతున్న సందర్భంగా బీజేపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం కావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దశాబ్దాల పాటు నిలిచిపోయిన మహిళల హక్కు ఇప్పుడు సాకారమవుతుందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మహిళలకు ప్రాతినిధ్యం వహించే హక్కు లభిస్తుందన్నారు. రాజకీయాల్లో మహిళలకు న్యాయమైన వాటా కల్పించిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. మహిళలు ఈ సంబరాల్లో అధిక సంఖ్యలో పాల్గొనేలా కృషిచేసి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేయాలన్నారు. అలాగే ఈనెల 14 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, మాడ వెంకటరెడ్డి, రాష్ట్ర నాయకులు ఇనుకొండ నాగేశ్వర్రెడ్డి, గుజ్జ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సా యిని మల్లేశం, మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, కార్పొరేటర్లు, మండల, జోన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
భరోసా కల్పించాలి
పిల్లల ఫలితాల కంటే వారి ఆరోగ్యం, ఆనందమే ముఖ్యమని తల్లిదండ్రులు భావించాలి. వారు ఎంత కష్టపడ్డారో గుర్తించాలి. ఫలితాలు ఎలా వచ్చినా మేము అండగా ఉంటామన్న భరోసాను కల్పించాలి. పిల్లలు ఒత్తిడికి గురికాకుండా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ప్రేమ, నమ్మకం ఇవ్వడం చాలా అవసరం. – కె.సత్యనారాయణ, పేరెంట్ పరీక్షలు ఒక భాగం మాత్రమే పరీక్షలు చదువులో ఒక భాగం మాత్రమేనని విద్యార్థులు గ్రహించాలి. మార్కులు తక్కువ వచ్చినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. లోపాలను గుర్తించి మళ్లీ ప్రయత్నిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఉపాధ్యాయులు ఎప్పుడూ విద్యార్థులకు అండగా ఉంటారు. కష్టపడితే విజయం తప్పక దక్కుతుంది. – ఎ.నిర్మల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, కరీంనగర్ -
చోరీ కేసులో పాత నేరస్తుడి అరెస్టు
● బంగారం, వెండితోపాటు బైక్లు స్వాధీనం ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని వివిధ ఆలయాలు, ద్విచక్ర వాహనాలు, ఆరుబయట నిద్రిస్తున్న వారి వస్తువులు చోరీచేసిన ఘటనల్లో శానగొండ గ్రామానికి చెందిన పాత నేరస్తుడు గుంటి శ్రావణ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. పోలీసు సిబ్బందితో కలిసి ఎస్సై శానగొండ గ్రామంలో శనివారం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అటుగా బైక్పై వచ్చిన వ్యక్తి వాహన ధ్రువీకరణ పత్రాల గురించి ఆరా తీశారు. వివరాలు చెప్పకపోవడంతో వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తాను జీలకుంట, గుండ్లపల్లి, బాయమ్మపల్లె, పొత్కపల్లి ఆలయాల్లో చోరీలతోపాటు ద్విచక్రవాహనాలు అపహరించినట్లు ఒప్పుకున్నాడు. ఇతడు పాతనేరస్తుడని పోలీసులు వివరించారు. నిందితుడి నుంచి 5గ్రాముల బంగారం, 4తులాల వెండి రింగులు, 10 తులాల రా ముక్కలు, మూడు బైక్లు స్వాధీనం చేసుకొన్నారు. ఈమేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై వివరించారు. -
ఇంటర్లో ఫెయిలైనా.. ఐఏఎస్
శంకరపట్నం: సక్సెస్కు మార్కులే కొలమానం కాదని నిరూపించారు ప్రస్తుత హైదరాబాద్ మెట్రోవాటర్బోర్డు ఎండీ కోరెం అశోక్రెడ్డి. ఇంటర్ ఫెయిలైన అశోక్రెడ్డి.. తర్వాత పట్టవదలని విక్రమార్కుడిలా పుస్తకాలతో కుస్తీ పట్టి గ్రూప్–1 సాధించారు. ప్రస్తుత కన్ఫార్మ్డ్ ఐఏఎస్ అధికారి హోదాలో సేవలందిస్తున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టుకు చెందిన కోరెం అశోక్రెడ్డి మొలంగూర్ జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. హుజూరాబాద్ జూనియర్ కాలేజీ ఇంటర్ చదివారు. సెకండియర్లో ఫెయిల్ అయినా సప్లిమెంటరీలో ఉత్తీర్ణులయ్యారు. జమ్మికుంటలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసి గ్రూప్–1 ఉద్యోగానికి ఎంపికయ్యారు. సీ్త్రశిశుసంక్షేమశాఖ పీడీగా ఉద్యోగంలో చేరి, కన్ఫార్మ్డ్ ఐఏఎస్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోవాటర్ బోర్డు ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు. మార్కులు, ర్యాంకులు కొలమానం కాదని పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని అశోక్రెడ్డి అంటున్నారు. -
హౌస్ లిస్టింగ్ పకడ్బందీగా నిర్వహించాలి
కరీంనగర్ అర్బన్: జనగణనలో భాగంగా చేపట్టనున్న హౌస్ లిస్టింగ్, విలేజ్ మ్యాప్స్ ఫైనలైజేషన్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో హౌస్ లిస్టింగ్ ప్రక్రియపై ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. 150– 200 ఇండ్ల వరకు ఒక ఎన్యుమరేటర్ను నియమించాలని, 800 ఇండ్లకు ఒక బ్లాక్గా విభజించాలన్నారు. సదరు ప్రక్రియపై ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు తగిన శిక్షణ అందించాలన్నారు. హౌస్ లిస్టింగ్ ప్రక్రియ మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు సాగుతుందన్నారు. సెన్సెస్ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ సుబ్బరాజు, అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిరణ్, ఆర్డీవోలు కే.మహేశ్వర్, రమేశ్ బాబు పాల్గొన్నారు. నిబంధనలు పాటించాల్సిందే ప్రభుత్వం నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలించి, లే అవుట్లకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో పంచాయతీరాజ్, విద్యుత్శాఖ, టౌన్ ప్లానింగ్, ల్యాండ్స్ అండ్ సర్వే, నీటిపారుదల శాఖ తదితర శాఖల అధికారులతో లేఅవుట్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో లే అవుట్ అనుమతి కోసం వచ్చిన దరఖాస్తులను 21 రోజుల్లోగా పరిష్కరించాలన్నారు. పది ఎకరాల లే అవుట్కు కలెక్టరే అనుమతులు మంజూరు చేస్తారని.. అంతకు మించి పెరిగితే టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ హైదరాబాద్ అనుమతులు జారీ చేస్తారని అధికారులు వివరించారు. సకల వర్గాలకు సముచిత స్థానం సకల వర్గాలకు సముచిత స్థానమిస్తూ బ్యాంకు మరింత పురోగతి సాధించాలని కేడీసీసీబీ పర్సన్ ఇన్చార్జి, కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. శుక్రవారం స్థానిక కేడీసీసీ బ్యాంకును సందర్శించారు. 2025– 26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఉద్యోగుల కృషిని ప్రశంసించి, ఆర్థిక ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు నిర్ణయించిన రూ.10వేల కోట్ల వ్యాపార లక్ష్యాన్ని సాధించేందుకు సంఘటితంగా సాగాలని అన్నారు. కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావు, జనరల్ మేనేజర్లు శ్రీధర్, రియాజోద్దీన్ పాల్గొన్నారు. -
నర్సింగ్ ఆఫీసర్ ఫలితాల్లో ప్రతిభ
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన ఎంఏ జాన్ నర్సింగ్ ఆఫీసర్ ఫలితాల్లో సత్తాచాటాడు. బీసీ– సీ కేటగిరీలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్, జనరల్ కేటగిరీలో రాష్ట్రస్థాయిలో 239వ ర్యాంక్ సాధించాడు. జాన్ ప్రస్తుతం కథలాపూర్ మండలం తక్కళ్లపెల్లిలో ఎంఎల్హెచ్పీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మిట్టపెల్లి కిషన్– దివ్య దంపతుల చిన్న కుమారుడు జాన్ పదో తరగతి వరకు కథలాపూర్ మోడల్స్కూల్లో చదివాడు. హైదరాబాద్లో ఇంటర్, సికింద్రాబాద్లో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి గోల్డ్మెడల్ సాధించాడు. హైదరాబాద్లోని ఎంఎన్జే కేన్సర్ ఆసుపత్రిలో నర్సింగ్ ఆఫీసర్గా ఎంపికయ్యాడు. అదనపు జిల్లా జడ్జీల బదిలీ జగిత్యాలజోన్/కరీంనగర్క్రైం: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు కోర్టుల్లో పనిచేస్తున్న అదనపు జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ రెండో అదనపు జిల్లా జడ్జి డి.సాధనను రంగారెడ్డి జిల్లా 8వ అదనపు జిల్లా జడ్జిగా, జగిత్యాల మొదటి అదనపు జిల్లా జడ్జి సుగళి నారాయణను నిజామాబాద్ రెండో అదనపు జిల్లా జడ్జిగా, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని అదనపు జిల్లా జడ్జి డాక్టర్ తట్ట శ్రీనివాస్రావును హనుమకొండ ఇండస్ట్రీయల్ అండ్ లేబర్ కోర్టు జడ్జిగా బదిలీ చేశారు. అలాగే, సంగారెడ్డి మూడో అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న జి.సునీత రవీందర్రెడ్డిని జగిత్యాల మొదటి అదనపు జిల్లా జడ్జిగా, సంగారెడ్డి నాలుగవ అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న కోట్ల లావణ్య బాల్రెడ్డిని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని అదనపు జిల్లా జడ్జిగా, రంగారెడ్డి జిల్లా కూకట్పల్లి ఆరవ అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న సి.పావనిని కరీంనగర్ రెండో అదనపు జిల్లా జడ్జిగా, హైదరాబాద్ ఎల్బీ నగర్ కమర్షియల్ కోర్టు స్పెషల్ జడ్జిగా పనిచేస్తున్న నామ సంతోష్కుమార్ను కరీంనగర్ ఆరవ అదనపు జిల్లా జడ్జిగా నియమించారు. హత్యకేసులో జీవితఖైదు జూలపల్లి: పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్లో అల్లుడిని బండిరాయితో మోది హత్య చేసిన కేసులో జడి కానుకయ్యకు జీవితఖైదు విధిస్తూ పెద్దపల్లి ప్రిన్సిపల్ జడ్జి కె.సునీత శుక్రవారం తీర్పు వెలువరించారు. వివరాలు.. కాచాపూర్ గ్రామానికి చెందిన జాడి కనుకయ్య – శంకరవ్వ భార్యాభర్తలు. వీరి అల్లుడు జేజేల చెత్తయ్య(అశోక్)కు శంకరవ్వతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానాలు ఉన్నాయి. ఈక్రమంలో జాడి కనుకయ్య ఒంటరిగానే ఉంటున్నాడు. ఈక్రమంలో 18 ఫిబ్రవరి 2024న చెత్తయ్య ఇంటికి వెళ్లిన జాడి కనుకయ్య.. తన భార్య శంకరవ్వ విషయంలో పథకం ప్రకారం గొడవపడ్డాడు. ఆ వెంటనే బండరాయి, రాడ్డుతో తలపై కొట్టగా తీవ్ర రక్తస్రావమై చెత్తయ్య మృతి చెందాడు. ఈ మేరకు సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అప్పటి ఎస్సై శ్రీధర్ కేసు నమోదు చేశారు. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న జడ్జి.. జాడి కనుకయ్య నేరం చేసినట్లు రుజువు కావడంతో జీవితఖైదు శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధించారు. శిక్ష పడడంలో పీపీ డొంకెన రవి, పెద్దపల్లి డీసీపీ బి.రాంరెడ్డి, ఏసీప కృష్ణ, సాక్షులను ప్రవేశ పెట్టడంలో సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై సనత్కుమార్, కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్ కీలకంగా వ్యవహరించారు. -
● మంత్రి అడ్లూరికి శాతవాహన విద్యార్థుల ఫిర్యాదు ● విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణాకు ఫోన్ ● మొత్తం వివాదంపై విచారణ చేపట్టాలని కోరిన మంత్రి ● ఘటనపై పోలీసులకు ప్రొఫెసర్ సుజాత ఫిర్యాదు ● అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కంప్లైంట్
సాక్షిప్రతినిధి,కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ వివాదం రోజురోజుకు ముదిరి పతాకస్థాయికి చేరుకుంది. ఇంతకాలం కరీంనగర్కే పరిమితమైన ఈ వ్యవహారం తాజాగా రాజధానికి చేరుకుంది. తమను అర్బన్ నక్సలైట్లంటూ వేధిస్తున్నారంటూ ఎస్సీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్కి శాతవాహన విద్యార్థులు ఫిర్యాదు చేశారు. శుక్రవారం శాతవాహన యూనివర్సిటీ జాక్ విద్యార్థులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను ధర్మారంలో కలిశారు. అక్కడ వీసీ ఉమేశ్ కుమార్, బాటనీ పార్ట్టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ పెంచాల శ్రీనివాస్ తమను అర్బన్ నక్సలైట్లంటూ వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి లక్ష్మణ్ అక్కడ నుంచే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణాకు ఫోన్ చేశారు. అసలు యూనివర్సిటీలో ఏం జరగుతుందో? తెలుసుకోవాలని కోరారు. వెంటనే ఈ వ్యవహారంలో నిజనిజాలు నిర్ధారించేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. దీనికి యోగితా రాణా సానుకూలంగా స్పందించడంతో విద్యార్థులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.‘శాతవాహన యూనివర్సిటీలో దళిత ప్రొఫెసర్లు, విద్యార్థులను అర్బన్ నక్సలైట్లంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో ప్రొఫెసర్ సుజాత, ఇతర దళిత విద్యార్థులకు ఎమ్మార్పీఎస్ అండగా నిలుస్తుంది. ఈ విషయంలో న్యాయం జరిగే వరకు త్వరలోనే ఎమ్మార్పీఎస్ పక్షాన ఉద్యమిస్తాం’ అని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ మాదిగ, ఉపాధ్యక్షుడు కనకం అంజిబాబు, సీనియర్ నాయకుడు పొత్తూరి రాజన్న, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చెంచాల నవీన్ మాదిగ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కరీంనగర్ పోలీసులు నిస్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. వీసీ ఉమేశ్కుమార్ తనను వ్యక్తిగతంగా వేధిస్తుండగా.. బాటనీ విభాగం పార్ట్టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ పెంచాల శ్రీనివాస్ తనను అర్బన్ నక్సలైటంటూ ప్రచారం చేస్తున్నారంటూ తెలంగాణ విద్యా కమిషన్ అడ్వైజరీ మెంబర్, సోషియాలజీ విభాగాధిపతి డాక్టర్ సూరేపల్లి సుజాత కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో వారిపై వేసిన విచారణ కమిటీ రిపోర్టు కాపీలను కూడా పోలీసులను అందజేశారు. దీంతోపాటు కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు, రాష్ట్రవ్యాప్తంగా వివిధ వాట్సప్ గ్రూపుల్లో శాతవాహన వర్సిటీలో తనను అర్బన్ నక్సలైట్గా చిత్రీకరిస్తూ.. చేసిన పోస్టుల స్క్రీన్షాట్లు, వారి ఫోన్ నంబర్లు ఫిర్యాదుకు జతచేశారు. కొన్నిరోజులుగా దళిత మహిళా ప్రొఫెసర్నైన తనను అసభ్యపదజాలంతో సోషల్ మీడియాలో వేధిస్తోన్న వారిపైన కూడా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆమె ఫిర్యాదులో కోరారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనను పోలీసులు గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ వ్యవహారం జరుగుతున్న తీరు, సోషల్ మీడియాలో జరుగుతున్న యుద్ధంపై ఇంటెలిజెన్స్ పోలీసులు వివరాలు సేకరించి నివేదిక ఇచ్చారు. -
ఒక ప్రమాదం తప్పింది.. మరో ప్రమాదం మింగేసింది
జ్యోతినగర్: ‘బిడ్డా వెంకటేశ్.. నేను వస్తున్నా.. ఎవుసం పనులు ఎట్లున్నయ్’ అని ఫోన్లో మాట్లాడి ఇంటినుంచి బయలు దేరిన కాసేపటికే సింగరేణి రిటైర్డ్ కార్మికుడు మహంకాళి ఉరఫ్ గంగారపు కిష్టయ్య(71) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రమేశ్నగర్ కు చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు కిష్టయ్య తన భార్య లక్ష్మితో కలిసి శుక్రవారం తన స్వగ్రామం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఎన్టీపీసీ సమీ ప మల్యాలపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి మూలమలుపు వద్దకు వెళ్లగానే బైక్ అదుపు తప్పి పోయాడు. తలకు హెల్మెట్ ఉడడంతో ఎవరికీ గాయాలు కాలేదు. ఇంతలో అదేమార్గంలో వస్తున్న మోహన్ అనే వ్యక్తి.. తన వాహనం ఆపి కిందపడిన కిష్టయ్యను రోడ్డుపక్కకు తీసుకెళ్తున్నాడు. ఈక్రమంలో అదేమార్గంలో వస్తున్న కారు, పాలవ్యాన్ డ్రైవర్లు వీరిని చూసి ఆగారు. కానీ, వాటివెనకాలే అతివేగంగా వస్తున్న ట్యాంకర్ కారును ఢీకొంది. ఆ వెంటనే కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అంతటితో ఆగని ట్యాంకర్ పాలవ్యాన్తోపాటు కిష్టయ్య, మోహన్ను ఢీకొంది. ఈ ఘటనలో కిష్టయ్య కాలు నుజ్జునుజ్జు అయి దుర్మరణం చెందాడు. మోహన్కు స్వల్ప గాయాలయ్యాయి. ఒక ప్రమాదం నుంచి తప్పించుకున్న కిష్టయ్య అదేస్థలంలో ట్యాంకర్ రూపంలో మృతి చెందడం విషాదం నింపింది. స్వగ్రామానికి వస్తానని చెప్పిన తండ్రి కొద్దిసేపటికే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుమారుడు వెంకటేశ్తోపాటు కుటుంబసభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఎన్టీపీసీ ఎస్సై–2 లచ్చన్న, ఏఎస్సై బుచ్చిన్నాయుడు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. అదుపుతప్పి రోడ్డుపై పడిపోయిన రిటైర్డ్కార్మికుడు హెల్మెట్ ధరించడంతో సురక్షితంగా బయటపడిన వైనం రోడ్డు పక్కకు వెళ్తుండగా వేగంగా వచ్చిఢీకొన్న ట్యాంకర్ దుర్మరణం చెందిన కిష్టయ్య, గాయాలపాలైన మరో వ్యక్తి -
అదుర్స్.. పేదల షాపింగ్మాల్స్ !
డ్రెస్సులు కొనుగోలు చేస్తున్న ఇతను సోమిడి నగేశ్(45). జిల్లా కేంద్రంలోని బీ.వై.నగర్కు చెందిన నగేశ్ పెయింటర్గా పనిచేస్తారు. నిత్యం పనిలో బట్టలపై రంగులు పడడంతో పాడవుతుంటాయి. అందుకే పాత డ్రెస్సులను కొనుగోలు చేసి పనిలో వాడుతుంటారు. డ్రెస్సులు బాగుంటే.. ఫంక్షన్లకు కూడా వినియోగిస్తారు. నగేశ్ తనకు కావాల్సిన డ్రెస్సులను ఏళ్లుగా ఇక్కడే కొనుగోలు చేయడం విశేషం.సిరిసిల్ల పట్టణంలోని గాంధీచౌక్లో డ్రెస్సులు కొనుగోలు చేస్తున్న ఇతను నాగిండ్ల నర్సయ్య(40). కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన నర్సయ్య సిరిసిల్ల లేబర్ అడ్డాపై కూలీ పని కోసం వస్తారు. సిరిసిల్లలో ప్రతీ ఆదివారం పాతబట్టలు(డ్రెస్లు) అమ్మకాలు సాగుతుంటే తక్కువ ధరకే లభించడంతో పనిలో అక్కరకు వస్తాయని తనకు అవసమైనవి ఇలా కొనుగోలు చేస్తూ ఉంటాడు. -
పోలీసుశాఖలో దొంగలు పడ్డారు
కరీంనగర్క్రైం: అవును కరీంనగర్ పోలీసుశాఖలో దొంగలు పడ్డారు. కంచే చేను మేసినట్లు చనిపోయి న తోటి ఉద్యోగుల జీతాలు స్వాహా చేశారు. ప్రజ లను రక్షించాల్సిన వారు భక్షక భటులుగా మారి అక్రమార్జనకు తెగపడ్డారు. సొంతశాఖకే కన్నం వేస్తూ.. ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టారు. చనిపోయిన వారిస్థానంలో ఇతరులకు నెలనెలా జీతాలు ముట్టజెప్పుతూ రూ.కోట్లు గడించారు. బండారం బయటపడి కటకటాల్లోకి వెళ్లారు. ప్రజలకు న్యా యం చేయాల్సిన పోలీసులే దొంగలుగా మారి సొంతశాఖకే కన్నం వేయడం చర్చనీయాంశమైంది. రూ.1,40,18,308 కోట్లు స్వాహా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన జీతాల కుంభకోణం కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చూపారు. పోలీస్శాఖలో గతంలో మరణించిన ఉద్యోగుల స్థానంలో ఇతరుల పేరిట నకిలీ అకౌంట్లు తీసి, రూ.1,40,18,308 దుర్వినియోగం చేసినట్లు తేల్చారు. టాస్క్ఫోర్స్ ఏసీపీ వాసాల సతీశ్ ఫిర్యాదుతో కరీంనగర్ వన్టౌన్లో కేసు నమోదుకాగా, ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. ప్రైవేటు వ్యక్తుల పేరిట ప్రస్తుతం చిగురుమామిడిలో పనిచేస్తున్న హెడ్కాని స్టేబుల్ నీలం రామ్మోహన్(52) గతంలో కమిషనరేట్ సీపీవో కార్యాలయంలోని పే సెక్షన్లో విధులు నిర్వహించాడు. ఆ సమయంలో మరణించిన కాని స్టేబుళ్లు సీహెచ్.రవీందర్, కె.గంగస్వామి, కె.రవి ఎంప్లాయీ ఐడీలు సేకరించాడు. సదరు ఉద్యోగుల పోర్టల్లో నగరానికి చెందిన ప్రైవేటు వ్యక్తులైన లావుడ్య రవి(42), చుక్క గంగరాజు(33), శంకర్ నామతాబాబ్(44) పేర్లు నమోదు చేసి, కరీంనగర్లోని భగత్నగర్, బొమ్మకల్ హెచ్డీఎఫ్సీబ్యాంక్లో ఖాతాలు తీశాడు. ఈ ఖాతాలకు తన సొంత ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ లింక్ చేశాడు. జూన్ 2022 నుంచి మార్చి 2026 వరకు ప్రతినెలా కానిస్టేబుళ్ల జీతాలు ఆయా ఖాతాల్లో జమయ్యేలా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయా ఖాతాలపై బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నాడు. ఇందుకు రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వైవీ.ముని రామయ్య(61) సహకారం తీసుకున్నాడు. ఆ సొమ్మును తన వ్యక్తిగత ఖాతాకు మళ్లించుకుని, సొంతానికి వాడుకుంటూ ఈఎంఐలు సైతం చెల్లించాడు. జీతాలపై సీపీ ఫోకస్తో.. ఇటీవల జీతాల చెల్లింపుల్లో అనుమానాస్పద లావాదేవీలను గమనించిన సీపీ గౌస్ ఆలం సమగ్ర విచారణ చేపట్టాలని టాస్క్ఫోర్స్ ఏసీపీ వాసాల సతీశ్ను ఆదేశించారు. విచారణలో రికార్డులు తారుమారు చేసి, ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం చేకూర్చినట్లు ఆధారాలు లభించాయి. దీంతో ప్రధాన సూత్రధారి హెడ్ కానిస్టేబుల్ నీలం రామ్మోహన్, రిటైర్డ్ ఏవో వైవీ.మునిరామయ్య, లావుడ్య రవి, చుక్కా గంగరాజు, శంకర్ నామతాబాబ్పై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశామని సీపీ తెలిపారు. ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. -
కల్వచర్లలో కోళ్ల మృతి కలకలం
రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలోని గోకుల్నగర్లో కోళ్లు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గ్రామంలోని ఏరవేని శ్రీకాంత్కు చెందిన నాటుకోళ్లు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడడం ఆందోళనకు గురిచేసింది. స్థానికుల కథనం ప్రకారం.. శ్రీకాంత్ తన ఇంటివద్ద పెంచుకుంటున్న నాటుకోళ్లు ఒక్కసారిగా చనిపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు విషపూరిత మందు కలిపిన ఆహారం ఇచ్చి చంపినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ ఘటన వెనుక వ్యక్తిగత వైరం లేదా ఇతర కారణాలు ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. విచారణ జరపాలని గ్రామపెద్దలు అధికారులను కోరారు. డి అడిక్షన్ సెంటర్కు తరలింపు ఇబ్రహీంపట్నం(కోరుట్ల): ఇబ్రహీంపట్నం మండలకేంద్రానికి చెందిన పిట్ట సాయి ఓ ఇంట్లో చొరబడి కొట్టిన కేసులో అతడిని శుక్రవారం పట్టుకోగా మత్తులో ఉన్నట్లు గుర్తించామని ఎస్సై నవీన్కుమార్ తెలిపారు. అతడికి ఆధునిక సాంకేతిక విధానంలో పరీక్షలు చేయగా గంజాయి సేవించినట్లు తేలింది. అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు అతడిని కరీంనగర్లో డి అడిక్షన్ సెంటర్కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. సైబర్ వలలో చిక్కిన మహిళజమ్మికుంట: పార్ట్టైం ఉద్యోగం పేరిట సైబర్ క్రైం వలలో చిక్కి ఓ మహిళ రూ.60వేలు పోగొట్టుకుంది. టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. మండలంలోని కోరపల్లి గ్రామపంచాయితీ పరిధిలోని కాపులపల్లి గ్రామానికి చెందిన పల్లె అంజలి మార్చి 10వ తేదీన ఇన్స్ట్రాగామ్లో పార్ట్టైమ్ జాబ్ కోసం వెతికింది. జాబ్టాస్క్లు ఇచ్చి రివ్యూస్ ఎంటర్ చేసి పోస్టు చేయమని సైబర్ నేరగాళ్లు తెలపగా, మొదట రూ.200, మరోసారి రూ.20వేలు, చివరగా రూ.40వేలు ఫోన్ పే ద్వారా పంపించింది. మళ్లి డబ్బులు ఇవ్వాలని అడగగా మోసపోయినట్లు తెలుసుకొని, సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. గంజాయి విక్రేత అరెస్ట్ జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలో శుక్రవారం గంజాయి విక్రయించేందుకు యత్నిస్తున్న వ్యక్తిని పట్టణ ఎస్సై సదాకర్ పట్టుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన గౌస్ఖాన్ జగిత్యాల విద్యానగర్ బైపాస్రోడ్లో గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా ఎస్సై పట్టుకున్నారు. అతడి వద్ద 270 గ్రాముల గంజాయి లభ్యమైంది. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
గంజాయి సేవిస్తున్న ముగ్గురి అరెస్ట్
సిరిసిల్ల క్రైం: గంజాయి సేవిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి డీ–ఆడిక్షన్ సెంటర్కు తరలించినట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్కు చెందిన మహ్మద్ సద్దాం(32), పాత బస్టాండ్కు చెందిన ఎంబేరి ఆకాశ్(26), రాజీవ్నగర్కు చెందిన మరో బాలుడు కలిసి మహారాష్ట్ర నాందేడ్ నుంచి గంజాయి తెచ్చి, సేవిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తనిఖీలు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని పరీక్షించగా గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయింది. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, గంజాయి అలవాటు నుంచి బయటపడేందుకు స్వచ్ఛందంగా ముందుకురావడంతో న్యాయస్థానం అనుమతితో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని డీ–ఆడిక్షన్ సెంటర్కు తరలించారు. సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. డీ ఆడిక్షన్ సెంటర్కు తరలింపు -
రోడ్డు ప్రమాదంలో కార్మికుడి మృతి
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మున్సిపల్ ఆఫీస్ ఎదుట కారు ఢీకొన్న ప్రమాదంలో ఇందారపు రాయపోశం(60) అనే మున్సిపల్ పర్మినెంట్ కార్మికుడు మృతి చెందాడు. వన్టౌన్ ఎస్సై మనోహర్ కథనం ప్రకారం.. కాకతీయనగర్లోని తన ఇంటినుంచి నైట్ డ్యూటీ కోసం మున్సిపల్ ఆఫీస్కు వచ్చాడు. అనంతరం ఎలక్ట్రీషియన్ చిన్నయ్యతో కలిసి టీ తాగేందుకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాయపోశంతో ఉన్న చిన్నయ్య స్వల్పగాయాల పాలయ్యాడు. రాయపోశం వచ్చేనెలలో ఉద్యోగ విరమణ చేయనున్నాడు. అనూహ్యంగా ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు
రామగుండం: అంతర్రాష్ట్ర గంజాయి సరఫరా ముఠాను పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. రామగుండం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విపిన్కుమార్, వికాస్కుమార్, దీపక్తోపాటు మరోబాలుడు ముఠాగా ఏర్పడ్డారు. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో వీరికి గుర్తుతెలియని వ్యక్తి 20 కేజీల డ్రైగంజాయి అప్పగించాడు. అక్కడి నుంచి తిరునవంతపురం–కోర్భా ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణించి రామగుండం రైల్వేస్టేషన్లో దిగారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఎస్సై సంధ్యారాణి తన సిబ్బందితో తనిఖీలు చేశారు. బ్యాగులు పట్టుకున్న నలుగురు యువకులను ప్రశ్నించి సోదా చేశారు. ఇందులో డ్రై గంజాయి కనిపించగా అదుపులోకి తీసుకొన్నారు. గంజాయి స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. గంజాయి విలువ సుమారు రూ.పది లక్షలు ఉంటుందని అంచనా వేశారు. శనివారం ఇందితులను కోర్టులో హాజరుపరచనున్నారు. స్థానికంగా వీరికి ఉన్న నెట్వర్క్పై నిఘా పెట్టామని అన్నారు. ఈ సమావేశంలో ఏసీపీ రమేశ్, ఎస్సై సంధ్యారాణి, పోలీసు సిబ్బంది ఉన్నారు. రూ.10లక్షల విలువైన 20 కేజీల గంజాయి స్వాధీనం వివరాలు వెల్లడించిన పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి -
హెల్త్ క్యాంప్నకు స్పందన
కరీంనగర్: ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం కరీంనగర్లోని రాంనగర్ ఆయుష్ హాస్పిటల్లో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్కు విశేష స్పందన లభించింది. హెల్త్క్యాంపును డీఎంహెచ్వో వెంకటరమణ, అడిషనల్ డీఎంహెచ్వో సుధా ప్రారంభించారు. మెడికల్ ఆఫీసర్లు యశ్రబ్ సుల్తానా, శేఖర్, సదానందం, ప్రవీణ్ పాల్గొన్నారు. రామయ్య హుండీ లెక్కింపు ఇల్లందకుంట: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల హుండీని ఎండోమెంట్ కరీంనగర్ డివిజన్ పరిశీలకుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం లెక్కించారు. రూ.20,39,551లక్షల ఆదాయం వచ్చిందని ఇన్చార్జి ఈవో కందుల సుధాకర్ తెలిపారు. ఆరు గ్రాముల మిశ్రమ బంగారం, 225 గ్రాముల వెండి వచ్చినట్లు సుధాకర్ తెలి పారు. అర్చకుడు శేషం వంశీధరచార్యులు, నవీన్ కుమార్ శర్మ, మోహన్, మల్లారెడ్డి, సు రేందర్రావు, రమేశ్, ప్రవీణ్ పాల్గొన్నారు. పత్తి మార్కెట్కు సెలవు జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కె ట్లో పత్తి ధర స్వల్పంగా తగ్గింది. గురువారం రూ.8000 పలికిన ధర శుక్రవారం రూ.100 తగ్గి క్వింటాల్కు రూ.7,900 పలికింది. మార్కెట్కు ఆరు వాహనాల్లో 69 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. శని, ఆదివా రాలు సాధారణ సెలవులు ఉంటాయని సోమవారం యథావిధిగా కొనుగోళ్లు జరుగుతాయని ఇన్చార్జి కార్యదర్శి రాజా తెలిపారు. 16న జాబ్మేళావిద్యానగర్(కరీంనగర్): జిల్లాలోని నిరుద్యోగ యువతకు కరీంనగర్లోని టాటా మోటార్స్, ధని టెక్నాలజీ సొల్యూషన్లో ఉద్యోగాలు కల్పించడానికి ఈనెల 16న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతి రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ చదివిన ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలు, సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. వివరాలకు 9908530384 నంబర్లో సంప్రదించాలని అన్నారు. విదేశాల్లో ఉద్యోగావకాశాలువిద్యానగర్(కరీంనగర్): భవన నిర్మాణ కార్మి కులకు, వారి పిల్లల్లో అర్హులైన వారికి విదేశాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా ఉప కార్మిక కమిషనర్ కోల ప్రసాద్ తెలిపారు. నమోదైన నిర్మాణ కార్మికుల పిల్లల్లో 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండి 8వ తరగతి విద్యార్హత ఉన్న వారికి విదేశీ భాష, సాఫ్ట్స్కిల్స్ శిక్షణ అందించి, ఉద్యోగాలకు అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపా రు. ఆసక్తి ఉన్నవారు ఆధార్, లేబర్ కార్డుతో సంప్రదించాలని సూచించారు. కొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపుతో పాటు నిర్వహణ పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11 కె.వీ.కమాన్ ఫీడర్ పరిధిలోని కోతిరాంపూర్, లక్ష్మీనగర్, అమీర్నగర్, గాయత్రీనగర్, పోచమ్మ ఆల యం, పార్వతినగర్, వరసిద్ధినగర్, అన్నమనేని గార్డెన్, సెయింట్ మేర్రీస్కూల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1 ఏడిఈ పంజాల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బొమ్మకల్, కొత్తపల్లి, రేకుర్తిలో విద్యుత్ సబ్స్టేషన్ల నిర్వహణలో భాగంగా శనివారం ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు 33/11 కె.వీ.బొమ్మకల్ సబ్స్టేషన్ పరిధిలోని శ్రీపురం కాలనీ, రజ్వీచమన్, సిటిజన్కాలనీ, ప్రియదర్శినికాలనీ, క్రిష్ణనగర్, ఆటోనగర్, ధర్మనగర్, బైపాస్ రోడ్, బొమ్మకల్, గుంటూర్పల్లి, దుర్శేడ్, గోపాల్పూర్, నల్లగుంటపల్లి, మరియాపూర్, సలాపినగర్ ప్రాంతాలతో పాటు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొత్తపల్లి, రేకుర్తి సబ్స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు పేర్కొన్నారు. -
14 ఏళ్లకు పట్టుబడిన నిందితుడు
సిరిసిల్ల క్రైం: పద్నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న భార్య, ఇద్దరు చిన్నారుల మృతికి కారణమైన నిందితుడిని సిరిసిల్ల పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లికి చెందిన బోయిని ఆంజనేయులు 2007లో భాగ్యలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు శ్రీనిధి(5), నైపున్య(2). 2012లో భాగ్యలక్ష్మి మూడోసారి గర్భవతిగా ఉన్న సమయంలో మళ్లీ అమ్మాయి పుడుతుందని అనుమానంతో భర్త, అత్తమామలు ఆమెను వేధింపులకు గురిచేశారు. వేధింపులను తట్టుకోలేక భాగ్యలక్ష్మి తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై అదే ఏడాది కేసు నమోదు కాగా.. అప్పటి నుంచి ఆంజనేయులు పరారీలో ఉన్నాడు. న్యాయస్థానం అతనిపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. బాధితురాలి తల్లి ఎల్లవ్వ ఈనెల 6న ఎస్పీకి ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన పోలీసులు ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలతో హైదరాబాద్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ చేశారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన టాస్క్ఫోర్స్ సీఐ నటేశ్, ముస్తాబాద్ ఎస్సై గణేశ్లను అభినందించారు. భార్యాపిల్లల మృతికి కారణం తప్పించుకుని తిరుగుతున్న తీరు ఎట్టకేలకు ఛేదించిన సిరిసిల్ల పోలీసులు -
మున్సిపల్ లో కో ఆప్షన్ హీట్
కరీంనగర్ కార్పొరేషన్: కో ఆప్షన్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో నగరపాలకసంస్థ పరిధిలోని రాజకీయ పార్టీల్లో వేడి రాజుకొంటోంది. ఐదు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలకు ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉండడంతో, ఆ లోగా అభ్యర్థుల ఎంపికపై అధికార బీజేపీ కసరత్తు చేస్తోంది. ఐదింటిలో ప్రతిపక్షాలకు ఒకటి ఇచ్చి ఏకగ్రీవ ఎన్నిక ద్వారా కొత్త సాంప్రదాయానికి బాటలు వేయాలని కాంగ్రెస్ ప్రతిపాదిస్తోంది. పార్టీ పరంగా బీఆర్ఎస్ నిర్ణయం తీసుకొనప్పటికీ వ్యక్తిగతంగా పోటీచేసేందుకు ఆ పార్టీ మాజీ కార్పొరేటర్లు సమాయత్తమవుతున్నారు. పోటీ నెలకొంటేనే తమకు గుర్తింపు ఏర్పడే అవకాశం ఉండడంతో ఇతర కార్పొరేటర్లు ఎన్నికలపై ఆసక్తితో ఉన్నారు. బీజేపీ దరఖాస్తుల స్వీకరణ కో ఆప్షన్ పదవులు ఆశిస్తున్న వారి నుంచి బీజేపీ దరఖాస్తుల స్వీకరణ చేపడుతోంది. వచ్చిన దరఖాస్తుల నుంచి ఐదుగురిని ఎంపిక చేసేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు తదితరులతో పార్టీ కమిటీ ఏర్పాటు చేసింది. మొన్నటి ఎన్నికల్లో ఓటమిపాలైన మాజీ కార్పొరేటర్లు పలువురు తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని పార్టీకి శుక్రవారం దరఖాస్తు చేసుకొన్నారు. ప్రతిపక్షాలకు ఒకటివ్వాలి కో ఆప్షన్ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టుగా ఏకగ్రీవం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తోంది. ఐదు కో ఆప్షన్ సభ్యులకు గాను ఒక స్థానం ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చి, ఎన్నికను ఏకగ్రీవం చేద్దామని అధికార బీజేపీని కోరింది. దీని ద్వారా నగరపాలకసంస్థలో మంచి సంప్రదాయానికి బాటలు వేయాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతిపాదన అమలుకు నోచుకోవడం అంత సులువుగా కనిపించడం లేదు. నగరపాలకసంస్థలో అధికార బీజేపీ ఐదు స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉండగా, ప్రతిపక్ష పార్టీలకు ఒక స్థానం ఇవ్వడానికి ఆ పార్టీ పెద్దలు అంగీకరిస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మొత్తం 69 ఓట్లకు గాను బీజేపీ ఓట్లు 34, బీజేపీయేతర ఓట్లు 35 ఉండడాన్ని కాంగ్రెస్ చూపుతోంది. పోటీలో బీఆర్ఎస్ మాజీలు కో ఆప్షన్ ఎన్నికల్లో పార్టీ పరంగా బీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికి, ఆ పార్టీకి చెందిన పలువురు మాజీ కార్పొరేటర్లు పోటీచేసేందుకు సిద్దపడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపొందిన మాజీ కార్పొరేటర్లు ఐదు సంవత్సరాల పాటు మరోరూపంలో బల్దియాలో ఉండే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే పనిలోపడ్డారు. ఇప్పటికే వివిధ పార్టీల కార్పొరేటర్లతో చర్చలు జరుపుతున్నారు. పోటీ ఉంటేనే గుర్తింపు ఐదు కోఆప్షన్ సీట్లపై అన్ని పార్టీల కార్పొరేటర్లు ఆసక్తితో ఉన్నారు. అధికార బీజేపీకి నగరపాలకసంస్థలో అధిక బలం ఉండడంతో, ఎన్నిక ఏకపక్షం, ఏకగ్రీవమే అని బీజేపీ చెబుతోంది. ఏకగ్రీవం కా కుండా పోటీ ఏర్పడితేనే తమకు గుర్తింపు లభి స్తుందని కార్పొరేటర్లు భావిస్తున్నారు. ఎక్స్అఫిషి యో సభ్యులతో సహా బీజేపీ ఓట్ల కన్నా బీజేపీయేతర ఓట్లు అధికంగా ఉండడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనా కో ఆప్షన్ ఎన్నికలు రావడంతో ఆయా పార్టీల్లో సందడి మొదలైంది. -
పోలీసు పహారాలో హైవే పనులు
మానకొండూర్: సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసే వరకు నేషనల్ హైవే పనులు సాగనివ్వమని గ్రామస్తులు ఏడాదిగా అడ్డుకోగా.. అధికారులు అర్ధరాత్రి పోలీసు పహారాలో రోడ్డు పనులు పూర్తి చేశారు. మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి స్టేజీ వద్ద 563 నేషనల్ హైవేలో భాగంగా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని, పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్కు సమస్యను విన్నవించారు. ఇటీవలే కలెక్టర్ నిలిచిపోయిన పనులు పరిశీలించి, సమస్యను తెలుసుకున్నారు. సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్లు కనిపించడంతో గ్రామస్తుల్లో ఆశలు చిగురించాయి. గురువారం అర్ధరాత్రి ఈదులగట్టెపల్లి స్టేజీవద్ద భారీ బలగాలతో జిల్లా ఉన్నతాధికారులు, రెవెన్యూ యంత్రాంగం రోడ్డు పనులు కొనసాగించి, తెల్లవారుజామున వరకు పూర్తిచేశారు. దీంతో గ్రామస్తులు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. -
బట్టలు అమ్మితేనే బతుకుదెరువు
ప్రతీ ఆదివారం సిరిసిల్లకు వస్తాం. బట్టలు అమ్మితేనే బతుకుదెరువు. అప్పుడప్పుడు పెద్దగా గిరాకీ ఉండదు. రోజుకో ఊరికి వెళ్తాం కాబట్టి బట్టకు, పొట్టకు తిప్పలు లేకుండా బతుకుతున్నాం. నేను చిన్నప్పటి నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నాం. నచ్చినవి ఏరుకుని కొంటారు. చిన్న దందా అయినా పాత బట్టలే మాకు బువ్వ పెడుతున్నాయి. – ఈ.శ్రీకాంత్, పాత బట్టల వ్యాపారీ ఏం చదువుకోలేదు నేను ఏం చదువుకోలేదు. మా అమ్మానాన్నల ఇదే చేశారు. నేను కూడా ఈ పనిలోనే ఉన్నా. సిరిసిల్లలో మంచిగా గిరాకీ అవుతుంది. ప్రతీ ఆదివారం రూ.1000 నుంచి రూ.1500 వస్తాయి. అప్పుడప్పుడు ఎక్కువనే వస్తాయి. పొద్దంతా ఇక్కడ ఉండి అమ్ముకుని వెళ్తాం. డ్రెస్లు మంచివి ఉంటేనే కొంటారు. లేకుంటే కొనరు. – బొర్రత్ అర్జున్, బట్టల వ్యాపారీ 40 ఏళ్లుగా ఇదే దందా మా పూర్వీకులు కూడా ఇదే దందా చేశారు. నాకు తెలిసి 40 ఏళ్లుగా ఇదే వ్యాపారం సాగుతోంది. సిరిసిల్ల, సిద్దిపేట, వేములవాడ, చేర్యాల, దుబ్బాక, హుస్నాబాద్ ఇలా రోజుకో ఊరుకు పోతాం. గిరాకీ అయినా కాకున్నా మా బతుకుదెరువు ఇదే. తక్కువ ధరకే డ్రెస్లు రావడంతో మంచివి ఏరుకుని కొంటారు. – ఇగ్గెవి రాజేశ్, సిద్దిపేట -
డంప్యార్డ్ తొలగించాలని మోకాళ్లపై నిరసన
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని డంప్యార్డ్ను తొలగించాలంటూ శుక్రవారం నగరపాలకసంస్థ కార్యాలయం ఎదుట డంప్యార్డ్ బాధితులు మోకాళ్లపై కూర్చొని ప్లకార్డులు పట్టుకొని ధర్నా చేశారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. డంప్యార్డ్ నుంచి వెలువడుతున్న దుర్వాసనలు, హానికరవాయువులు, పొగ వల్ల సమీప ప్రాంత డివిజన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చెత్త గుట్టలు,, దోమలతో డెంగీ, మలేరియా వ్యాధుల ముప్పు పెరిగిపోతుందన్నారు. డంప్యార్డ్ను నగరానికి దూరంగా, ప్రజల నివాస ప్రాంతాలకు హాని కలగని ప్రదేశానికి తరలించాలని కోరారు. -
విద్యుత్ కార్యాలయంలో సీసీ కెమెరాల కనెక్షన్ తొలగింపు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ‘సెస్’ సంస్థను ఎన్పీడీసీఎల్ స్వాధీనం చేసుకున్న తర్వాత తంగళ్లపల్లి మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలోని సీసీ కెమెరాల కనెక్షన్ను తొలగించారు. గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కనెక్షన్ను ఎన్పీడీసీఎల్ విజిలెన్స్ అధికారులు తొలగించడం చర్చకు దారితీసింది. సాధారణంగా సీసీ కెమెరాలు లేని ప్రాంతంలో కొత్తవాటిని బిగించి రక్షణ కల్పించాల్సి ఉండగా ఉన్నవాటిని తొలగించడం ఏంటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. యువకుడి ఆత్మహత్యాయత్నం పాలకుర్తి: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఈసాలతక్కళ్లపల్లి గ్రామానికి చెందిన కడారి మహేశ్(28) శుక్రవారం క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామంలో ట్రాక్టర్ నడుపుతూ జీవించే మహేశ్.. మద్యంలో పురుగులమందు కలుపుకుని తాగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న మహేశ్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. -
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
కరీంనగర్క్రైం: రోడ్డు ప్రమాదాల రహిత సమాజమే లక్ష్యంగా ‘అరైవ్–అలైవ్’ రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని సీపీ గౌస్ఆలం తెలిపారు. శుక్రవారం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 13న ప్రతీ గ్రామంలో రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేసి, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 14న వాహనదారులు, విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా సామూహిక ప్రమాణ స్వీకార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 15న బ్లాక్ స్పాట్లు గుర్తించి, అక్కడ హెచ్చరిక బోర్డులు, జీబ్రా క్రాసింగ్స్, రోడ్ మార్కింగ్లు పునరుద్ధరించాలన్నారు. 16న పాఠశాలల వద్ద ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ క్రమశిక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. వాహనదారులకు హెల్మెట్, సీట్బెల్ట్ ప్రాముఖ్యతను వివరించాలన్నారు. 17న గోల్డెన్ అవర్లో బాధితులకు అందించాల్సిన ప్రాథమిక చికిత్స, సాయం గురించి వివరించాలన్నారు. 18న వారంలో ఒక రోజు ట్రాఫిక్ ఉల్లంఘనలపై జరిమానాలు విధించకుండా, కౌన్సెలింగ్ ద్వారా వాహనదారుల్లో మార్పు తీసుకురావాలన్నారు. అడిషినల్ డీసీపీ వెంకటరమణ పాల్గొన్నారు. -
అవగాహన ర్యాలీ
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం వైద్యశాఖ ఆధ్వర్యంలో నగరంలో గురువారం ఎయిడ్స్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మైత్రి క్లినిక్లో ట్రాన్స్జెండర్లకు ఆరోగ్య అవగాహన కార్యక్రమం, హెల్త్ స్క్రీనింగ్ క్యాంపు ఏర్పాటు చేశారు. హెచ్ఐవీ, సిఫిలిస్, హెపటైటిస్–బీ, హెపటైటిస్–సి వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు చేశారు. డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ, అదనపు డీఎంహెచ్వో డాక్టర్ సుధా రాజేంద్ర, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి పాల్గొన్నారు. – కరీంనగర్ -
కరీంనగర్
శుక్రవారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 20267సెలవులో కమిషనర్కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ సెలవుపై వెళ్లారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఆయన 10, 13వ తేదీల్లో సెలవు పెట్టారు.క్వింటాల్ పత్తి రూ.8,000జమ్మికుంట: స్థానిక మార్కెట్లో క్వింటాల్ పత్తి రూ.8,000 పలికింది. గురువారం మార్కెట్కు 58 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. ఇన్చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు. -
‘పది’ ఫలితాల్లో రికార్డు సృష్టించాలి
చిగురుమామిడి: పదోతరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి, రికార్డు సృష్టించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ ఆదర్శపాఠశాల, చిగురుమామిడి ప్రాథమిక పాఠశాలను గురువారం సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, రోగులతో మాట్లాడారు. పల్లెదవాఖానాను సందర్శించారు. తమ గ్రామానికి రెండు వీవో భవనాలు మంజూరయ్యాయని, గ్రామంలోని కొందరు నాయకులు స్థలాన్ని రద్దు చేయిస్తున్నారని చిన్న ముల్కనూరు సర్పంచ్ సాంబారి భారతమ్మ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆర్డీవో మహేశ్వర్, డీపీవో జగదీశ్వర్, చిగురుమామిడి తహసీల్దార్ ముద్దసాని రమేశ్, మెడికల్ ఆఫీసర్ సందీప్రెడ్డి పాల్గొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సిద్ధం చేయండి కొత్తపల్లి(కరీంనగర్): చింతకుంటలోని డబుల్ బెడ్రూం ఇండ్లను సిద్ధం చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా సూచించారు. ఇండ్ల సముదాయాలను గురువారం పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇండ్లను సంసిద్ధం చేసేందుకు ఆర్అండ్బీ అధికారులు దృష్టి సారించాలన్నారు. -
ఆర్టిజన్ల నిరసన
విద్యుత్ సంస్థలోని ఉద్యోగులతో సమానంగా ఆర్టిజన్ కార్మికులకు సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ రెండోరోజు గురువారం తెలంగాణ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగింది. కరీంనగర్లోని విద్యుత్ భవన్ ఎదుట, హుజూరాబాద్లో నిరసన కొనసాగించారు. ఒకే సంస్థలో రెండు విధాల సర్వీస్ రూల్స్ అమలు చేస్తూ సుమారు 19వేల మంది ఆర్టిజన్లను ఇబ్బందులకు గురిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ సంస్థ తక్షణమే సమస్య పరిష్కరించాలని కోరారు. – కొత్తపల్లి(కరీంనగర్)/హుజూరాబాద్ -
కో ఆప్షన్పై కన్ను
కరీంనగర్ కార్పొరేషన్: విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రం రోల్మోడల్గా నిలవబోతుందని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఎన్ఎస్యూఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం నగరంలో వేడుకలు నిర్వహించారు. డీసీసీ కార్యాలయంలో ఎన్ఎస్యూఐ జెండా ఎగురవేసి, కేక్ కట్ చేశారు. ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు ఎండీ.ఇమ్రాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా ఎన్ఎస్యూఐ తొలి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ను సన్మానించారు. కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, వుట్కూరి నరేందర్రెడ్డి, ఎండీ.తాజ్ పాల్గొన్నారు. అంగన్వాడీలకు సెల్ఫోన్లు కరీంనగర్టౌన్: అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం స్మార్ట్ఫోన్లు అందజేసి పారదర్శకమైన సేవలకు నాంది పలికిందని, లబ్ధిదారులు అంగన్వాడీసేవలను సద్వినియోగం చేసుకోవాల ని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూ చించారు. గురువారం టీఎన్జీవో భవన్లో కరీంనగర్ అర్బన్ ప్రాజెక్ట్ అంగన్వాడీ టీచర్లకు మే యర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ నరేందర్రెడ్డితో కలిసి కొత్త ఫోన్లు, 17 మంది దివ్యాంగులకు మోటార్ సైకిళ్లు పంపిణీ చేశారు. డీడబ్ల్యూవో సరస్వతి, సీడీపీవో సబిత, జిల్లా వైద్యాధికారి వెంకట రమణ పాల్గొన్నారు. జాబ్మేళాకు స్పందనకరీంనగర్ సిటీ: విద్యార్థులు జాబ్మేళాను సద్వినియోగం చేసుకుని, ఉద్యోగాలు సాధించాలని ఎస్సారార్ వైస్ ప్రిన్సిపాల్ నితిన్ పాఠక్ తెలిపారు. కళాశాలలో టీఎస్కేసీ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో గురువారం జాబ్మేళా నిర్వహించారు. సుమారు 460 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 40 మంది ఎంపికై నట్లు అధికారులు తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ నితిన్ పాఠక్, అకడమిక్ కో– ఆర్డినేటర్ తాళ్లపల్లి రాజయ్య, ఐక్యూఏసీ కో– ఆర్డినేటర్ డాక్టర్ హరిజోత్ కౌర్, టీఎస్కేసీ కోఆర్డినేటర్ డాక్టర్ పి.సతీశ్ కుమార్, కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్మెంట్ సెల్ కో– ఆర్డినేటర్ కె.సుధాకర్ పాల్గొన్నారు. జైలులో వైద్య శిబిరంకరీంనగర్క్రైం: జిల్లా జైలులో డీఎంహెచ్వో వెంకటరమణ ఆధ్వర్యంలో గురువారం వైద్యశిబిరం నిర్వహించారు. ఖైదీలకు కంటి, దంత, అర్థోపెడిక్, చర్మ, ఈఎన్టీతో పాటు అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు. వెద్యశాఖ అధికారులు సుధా రాజేంద్ర, నవీన, జైలు అధికారులు విజయదేని, జైలు వైద్యాధికారి కె.వేణుగోపాల్ పాల్గొన్నారు.కరీంనగర్అర్బన్: మోసం.. బహిరంగ మార్కెట్లో స్వైరవిహారం చేస్తోంది. తూకంలో మోసం వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తోంది. ఏటా తనిఖీలు చేసి స్టాంపింగ్ వేయాల్సిన తూనికలు, కొలతల శాఖ మామూళ్లకే పెద్దపీట వేస్తోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారులు కిలోకు 15 గ్రాముల నుంచి 130 గ్రాముల వరకు దండుకుంటున్నారు. గ్యాస్, కూరగాయల నుంచి కార్పొరేట్ మార్కెట్ల వరకు తూకంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ‘సాక్షి’ పరిశీలనలో తూకంలో డొల్లతనం బయటపడగా ఉన్నతాధికారుల పర్యవేక్షణను ప్రశ్నిస్తోంది. నగరంలోని ప్రకాశం గంజ్, పండ్ల మార్కెట్, శనివారం అంగడి, కశ్మీర్గడ్డలో గల రైతుబజార్, చేపల మార్కెట్, ప్రముఖ సూపర్ మార్కెట్లలో పలు వస్తువులను కొనుగోలు చేసి తూకం వేయగా వ్యత్యాసమేర్పడటం విమర్శలకు తావిస్తోంది. బహిరంగ మార్కె ట్లో, రేషన్ దుకాణాల్లో వినియోగదారులు మోసపోయిన సందర్భాలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నా యి. ఎరువులు, రైసు మిల్లులు, పెట్రోలు బంకులు, ఇతర ఉత్పత్తి కేంద్రాలు తూనికలు, కొలతలకు ఆస్కారమున్న ప్రతిచోట వినియోగదారులను ఏదో ఒక రకంగా మోసగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తనిఖీల్లేవు.. స్టాంపింగ్ లేదు తూనికలు కొలతలశాఖలో ఖాళీలు వెక్కిరిస్తుండగా ఉన్న అధికారులైనా విరివిగా తనిఖీలు నిర్వహిస్తున్నారా.. అంటే అదీ లేదు. మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించడం తప్ప కేసుల ప్రగతి అంతంతే. రాజకీయ ఒత్తిడులు ఉన్నాయంటూ వ్యాపారులతో ఉన్న అనుబంధంతో ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో అధిక ధరలకు విక్రయిస్తూనే తూకంలోనూ దోచుకుంటున్నారు. మేళాలతోనే ఫలితం తూకానికి వినియోగించే సామగ్రికి అర్ధ సంవత్సరం, సంవత్సరానికి సంబంధిత శాఖ నుంచి ధ్రువీకరణ పొందాలి. కాగా, క్షేత్రస్థాయిలో అలాంటివేమీ కనిపించడం లేదు. కాలంచెల్లిన తూకం సామగ్రిని వాడుతూ వినియోగదారులను మోసగిస్తున్నారు. ముద్రల ద్వారా జిల్లాలో రూ.40 లక్షల వరకు ఆదాయం సమకూరే వీలుంది. ఇక లీటర్ల కొద్ది విక్రయించే వాటిలోనూ మోసాలే. ప్యాకెట్లలో ద్రవ పదార్థ రూపంలో మార్కెట్లో లభించేవన్నీ దాదాపు అక్రమ విక్రయాలే. ప్రభుత్వ గుర్తింపు పొందినవి కొన్నే ఉంటాయి. తూకం సామగ్రికి ముద్రలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం మేళాలు నిర్వహిస్తే ఆదాయాన్ని పెంచుకునే వీలుంది. తద్వారా సర్కారుకు ఆదాయంతో పాటు వినియోగదారులకు తూకంలో మోసపోయే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. వినియోగదారులకు సూచనలు ● వినియోగదారులు కళ్లారా చూసిన మోసాలను సంబంధిత శాఖ దృష్టికి తీసుకెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. తద్వారా తదుపరి చర్యలకు ఆస్కారముంటుంది. ● కొనుగోలు చేసిన కేంద్రంలో తూకం, కొలతల ను గమనించాలి. తేడాలుంటే ప్రశ్నించాలి. కొన్న ప్రతి వస్తువుకు బిల్లు పొందడం ఉత్తమం. ● తూనికలు, కొలతల శాఖ నుంచి పొందిన ధ్రువీకరణ పత్రాన్ని దుకాణాల్లో అందుబాటులో ఉంచాలి. ● ఎలక్ట్రానిక్ తూకాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పెట్రోల్ బంకుల్లో కొలతలను సరిచూశాకే వాహనంలో ఇంధనం పోయించుకోవాలి.కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఐదు పదవులకు శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 16వ తేదీ వరకు ప్రక్రి య కొనసాగుతుంది. కో ఆప్షన్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో ఆశావహుల్లో సందడి నెలకొంది. అధికార బీజేపీకి పూర్తిస్థాయిలో బలం ఉన్నప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్కు చెందిన మాజీలు కూడా ఆసక్తి చూపుతున్నారు. 16వ తేదీ వరకు దరఖాస్తులు కో ఆప్షన్ ఎన్నికలకు శుక్రవారం నుంచి నగరపాలకసంస్థ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటలతో దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది. 16వ తేదీ తరువాత రెండు,మూడు రోజుల్లో నగరపాలకసంస్థ సర్వసభ్య ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నా రు. ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పాలనలో ప్రత్యేక పరిజ్ఞానం కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు ఐదు స్థానాలకు గాను రెండు మైనార్టీలకు అందులో ఒకటి మహిళకు కేటా యించారు. ముస్లిం, క్రిస్టియన్లు, సిక్కులు, పార్శీలు మైనార్టీ కేటగిరీలోకి వస్తారు. మిగతా ముగ్గురిలో ఒకరు మహిళ ఉండాలి. పోటీచేసే అభ్యర్థులు విధి గా నగరపాలకసంస్థ ఓటరు జాబితాలో ఓటరుగా నమోదై ఉండాలి. మాజీ మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ పరిధిలో ఉన్న రెవెన్యూ మండల పరిధిలోని గ్రామపంచాయతీలకు సంబంధించి మాజీ సర్పంచ్, మాజీ వార్డు సభ్యులు కో ఆప్షన్ పదవులకు పోటీపడేందుకు అర్హులు. వీరంతా కూడా మొత్తంగా ఐదు సంవత్సరాల పదవీ కాలం చేసి ఉండాలి. వీరితో పాటు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా మూడు సంవత్సరాల సర్వీసు చేసిన అనుభవం ఉన్న వాళ్లు,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థల్లో గెజిటెడ్ పోస్టు హోదాలో పనిచేసి పదవీవిరమణ పొందిన అధికారులు అర్హులు. పోటీకి మాజీలు సై ఐదు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో ఆ శావహుల్లో సందడి నెలకొంది. ముఖ్యంగా ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి చెందిన మాజీ కార్పొరేటర్లు పలువురు కో ఆప్షన్పై కన్నేశారు. నగరపాలకసంస్థలో 66 మంది కార్పొరేటర్లు ఉండగా, కో ఆప్షన్ గెలవడానికి 34 మంది అవసరం. ఈ లెక్కన నగరపాలకసంస్థలో అధికార బీజేపీకే ఐదు స్థానాలు దక్కే అవకాశం ఉంది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ 30 స్థానాలను గెలుచుకోగా, మేయర్ఎన్నిక సందర్భంగా ముగ్గురు స్వతంత్రులు బీజేపీలో చేరారు. ఆ తరువాత మరో స్వతంత్ర కార్పొరేటర్ చేరడంతో బీజేపీ బలం 34కు చేరుకొంది. దీనితో ఐదు కో ఆప్షన్ పదవులను గెలుచుకోవడం బీజేపీకి సులువుగానే ఉంది. అయినప్పటికి, బీజేపీయేతర కార్పొరేటర్లు 32 మంది ఉండడం, క్రాస్ ఓటింగ్పై ఆశలతో ఇతర పార్టీల నుంచి కూడా పోటీపడేందుకు మాజీలు సిద్ధమవుతున్నారు. పార్టీల బలాబలాలు, కార్పొరేటర్లలో తమకున్న అనుకూలత, ఆర్థిక వ్యవహారాల లెక్కలతో తలమునకలవుతున్నారు.కరీంనగర్క్రైం: ప్రజల రక్షణ కోసం పనిచేస్తున్న పోలీసుల జీతాలకు రక్షణ లేకుండా పోయింది. సొంతశాఖలోని తోటి సిబ్బంది జీతాలు కాజేసిన ఘటన కలకలం రేపింది. మరణించిన సిబ్బంది పేర్లతో జీతాలు డ్రా చేస్తూ ప్రభుత్వ ధనాన్ని కాజేసిన భారీ కుంభకోణం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బట్టబయలైంది. సుమారు రూ.1,40,18,308 వరకు నిధుల దుర్వినియోగం జరిగినట్లు టాస్క్ఫోర్స్ విచారణలో తేలింది. గతంలో పే సెక్షన్లో పనిచేసిన ఓ పోలీసు ఉద్యోగి మరణించిన ముగ్గురు కానిస్టేబుళ్ల ఎంప్లాయీ ఐడీలను ఉపయోగించి, ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో ఇతరుల పేర్లను చేర్చాడు. ప్రైవేట్ బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు తెరిచి, తన వ్యక్తిగత మొబైల్ నంబర్లను అనుసంధానం చేశాడు. తద్వారా 2022 నుంచి 2026 వరకు సదరు ఉద్యోగుల జీతాలు అక్రమంగా పొందినట్లు తెలిసింది. ఈ ఘటనపై సీపీ ఆదేశాల మేరకు సదరు ఉద్యోగిపై కరీంనగర్ వన్టౌన్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ రాంచందర్రావు తెలిపారు. ఈ కుంభకోణంలో ఇంకా ఎవరెవరికి సంబంధాలున్నాయి? ఏఏ స్థాయివారు భాగస్వాములై ఉన్నారు? ఉన్నతాధికారులకు సంబంధాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. నగరంలోని మంకమ్మతోటలో గల సూపర్మార్కెట్లో కిలో శనగపప్పు కొనుగోలు చేయగా మళ్లీ తూకం వేస్తే 985 గ్రాములు వచ్చింది. 15 గ్రాములు తక్కువ వచ్చింది. -
ఎండ.. అప్రమత్తతే అండ
కరీంనగర్: ఏప్రిల్లోనే ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు భానుడు ప్రతా పం చూపుతున్నాడు. గతేడాది కన్నా ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సీయస్ వరకు పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. రాబోయే రోజుల్లో వేడి గాలులతో పాటు ఉక్కపోత పెరగనుంది. మే తొలివారంలో పెరగాల్సిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్ తొలివారం నుంచే దడదడలాడిస్తున్నాయి. కొద్ది రోజులుగా జిల్లాలో 35 నుంచి 39 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వేసవిలో వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి వైద్య సేవలు పొందాలి? తదితర అంశాలను గురించి డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ గురువారం ‘సాక్షి’కి వెల్లడించారు.వడదెబ్బ తగిలితే శరీర ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోవడం, చెమటపట్టకపోవడం, వణుకు, పాక్షికంగా ఫిట్స్ రావడం, అపస్మారక స్థితికి చేరుకోవడం జరుగుతుంది. మగత నిద్ర, కలవరింతలు, పెదవులు తడారిపోవడం వంటివి కనిపిస్తాయి. వడదెబ్బ తగిలిన వ్యక్తికి వీలైనంత త్వరగా ప్రాథమిక చికిత్స అందించాలి. వెంటనే నీడ ఉన్నప్రదేశానికి చేర్చి గాలి తగిలేలా చూడాలి. శరీరం సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చే వరకు తడి వస్త్రంతో తుడవాలి. ఉప్పు కలిపి మజ్జిగ లేదా ఓఆర్ఎస్ తాగించాలి. అపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు తాగించరాదు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి.ఎండ ఎక్కువగా ఉండే ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సమయంలో బయటికి వెళ్లకుండా ఉండడం మంచింది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తలకు టోపీ లేదా రుమాలు, తెల్లని దుస్తులు ధరించాలి. ఎండలో వెళ్లినప్పుడు గొడుగు వాడితే మంచిది. ఎండలో తిరిగితే వృద్ధులు, చిన్నారులు, మహిళలు, గర్భిణులు, రోగులు, శ్రమజీవులు, బీపీ, షుగర్, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంది.ఎండాకాలంలో నీటిలోపంతో డీహైడ్రేషన్ అవుతుంది. దీంతో శరీరంలో శక్తి తగ్గి అలసట ఏర్పడుతుంది. ప్రతి గంటలకు ఒక గ్లాసు నీటి చొప్పున రోజు 10– 12 గ్లాసుల నీరు తాగాలి. ముఖ్యంగా, ప్రయాణం లేదా బయట పనులున్నప్పుడు నీరు తాగడం మరిచిపోవద్దు. వేసవిలో ప్రతి రోజు తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్స్, బిర్యానీలు, మసాలాలతో తయారు చేసే ఆహారాన్ని పూర్తిగా తగ్గించాలి. మజ్జిగ, ఓఆర్ఎస్, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలి.శరీరంలో టెంపరేచర్ పెరగకూడదంటే కూలీలు వారు చేసే పనుల షిఫ్టులను మార్చుకోవాలి. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు పనులు చేసుకోవాలి. మిట్ట మధ్యాహ్నం నీడపట్టున ఉండాలి. గర్భిణీ సీ్త్రలు, పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు హైరిస్క్ గ్రూపులో ఉంటారు. ఇలాంటి వారు ఎండలో ఎక్కువ సమయం ఉండకూడదు.జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు, మందులు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం. ముఖ్యంగా డీహైడ్రేషన్ జరగకుండా ఉండేందుకు అన్ని పీహెచ్సీలలో ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాం. ఆస్పత్రులతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లోనూ, ఉపాధిహామీ కూలీలకు పనిస్థలాల్లోనూ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎవరైనా పీహెచ్సీకి వెళ్లి తీసుకొని వాడుకోవచ్చు.గ్లోబల్ వార్మింగ్తో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏసీలు, ఫ్రిడ్జ్లు వాడకం పెరిగి ప్రకృతి దెబ్బతినడంతో ఓజోన్ పొర తగ్గి ఎండల తీవ్రత పెరుగుతోంది. చెట్లను పెంచడం, నీటి వనరులను కాపాడుకోవడం ద్వారా వాతావరణం సమతుల్యంగా ఉంటుంది. ప్రకృతిని కాపాడుకుంటేనే మనిషికి మనుగడ ఉంటుంది. -
పోలీస్ శాఖలో భారీగా జీతాల కుంభకోణం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సంచలనాత్మకంగా వెలుగులోకి వచ్చిన జీతాల కుంభకోణం కలకలం రేపుతోంది. మరణించిన సిబ్బంది పేర్లతో జీతాలు డ్రా చేస్తూ ప్రభుత్వ నిధులను అక్రమంగా వాడుకున్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు రూ.1 కోటి 40 లక్షల రూపాయల మేర నిధులు కాజేయబడినట్లు టాస్క్ ఫోర్స్ దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో ఒక పోలీసు ఉద్యోగిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో పోలీస్ శాఖలో ఆర్థిక వ్యవహారాలపై పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
కరీంనగర్క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని, మార్చిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 120 కేసులు నమోదు చేశామన్నారు. 139 వాహనాలు స్వాధీనం చేసుకుని, 161 మంది నిందితులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా కారణంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరుగుతోందన్నారు. రోడ్డు భద్రత, పర్యావరణ సమతుల్యత, శాంతి భద్రతలపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. 2026లో మార్చి వరకు కమిషనరేట్ పరిధిలో మొత్తం 245 ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా, 357 వాహనాలు స్వాధీనం చేసుకుని, 422 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలుకరీంనగర్: స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ అన్నారు. బుధవారం డీఎంహెచ్వో కార్యాలయంలో గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలుపై జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలు తీరును సమీక్షించారు. చట్టాన్ని ఉల్లంఘించిన మూడు స్కానింగ్ సెంటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. లింగ నిర్ధారణ చట్టం పోస్టర్ను ఆవిష్కరించారు. లింగ నిర్ధారణ చట్టాన్ని అతిక్రమించినట్లయితే టోల్ఫ్రీ నంబర్ 9849902501 ద్వారా లేదా నేరుగా కార్యాలయానికి తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్: డంప్యార్డ్పై బీజేపీ, బీఆర్ఎస్ చెత్త రాజకీయాలు చేస్తున్నాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ధ్వజమెత్తారు. డంప్యార్డ్ సమస్యపై ఒక్కో చోట ఒక్కో రకంగా వ్యవహరిస్తూ రెండు నాలుకల ధోరణితో కరీంనగర్, హుజూరాబాద్లో నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. బుధవారం నగరంలోని ఆర్ఆండ్బీ అతిథిగృహంలో మాట్లాడుతూ కరీంనగర్లో డంప్యార్డ్ పాపం బీఆర్ఎస్, బీజేపీలదేనన్నారు. బీఆర్ఎస్ అసమర్థ పాలనతోనే డంప్యార్డ్లో చెత్త గుట్టలుగా పేరుకుపోయిందన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ పేరిట వాగు వెంట తిరిగిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు అక్కడే ఉన్న చెత్త గుట్టలు కనిపించలేదా అన్నారు. డంప్యార్డ్ సమస్యను పరిష్కరిస్తామంటూ కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ను కరీంనగర్కు తీసుకువచ్చి హడావుడి చేసిన బండి సంజయ్, సమస్యను ఎందుకు పరిష్కరించలేదో చెప్పాలన్నారు. హుజురా బాద్ లో బీఆర్ఎస్, బీజేపీ నేతలు దీక్షల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. కరీంనగర్లోని డంప్యార్డులో చెత్తను శాసీ్త్రయ పద్ధతిలో తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. చాడగొండ బుచ్చి రెడ్డి, సరిళ్ల ప్రసాద్, ఎండీ.తాజొద్దీన్, పిట్టల రవీందర్, వరాల నర్సింగం, పర్వతం మల్లేశం, కాంతాల జగన్ రెడ్డి, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, ఇక్రమ్ సికిందర్, కొట్టె ప్రభాకర్, ఖలీల్, దేవేందర్ పటేల్, హనీఫ్ పాల్గొన్నారు. ఆర్టిజన్ కార్మికుల సమ్మెకరీంనగర్: ఆర్టిజన్ కార్మికులు బుధవారం ఉదయం 9 గంటల నుంచి విధులు బహిష్కరించి సర్కిల్ కార్యాలయాల ఎదుట నిరవధిక సమ్మె చేపట్టారు. ఇటీవల వరంగల్ ఎన్నపీడీసీఎల్ కార్యాలయం ఎదుట సుమారు 15వేల మంది కార్మికులతో మహాధర్నా చేపట్టగా.. స్పందన లేకపోవడంతో ఆందోళనను ఉధృతం చేశారు. ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ కల్పించడం, ఒకేసంస్థలో ఒకే రూల్స్ అమలు చేయడం, అన్మ్యాన్ వర్కర్లను ఆర్టిజన్లుగా గుర్తించడం, పీస్రేట్, బిల్ కలెక్టర్లకు వేతనాలు చెల్లించాలని కోరారు. డీఆర్డీవోగా గీతకరీంనగర్ అర్బన్: జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి(డీఆర్డీవో)గా మచ్చ గీతను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ డీఆర్డీవో ఉప్పుల శ్రీధర్ను రాజన్న సిరిసిల్లకు బదిలీ చేశారు. గత నెల 17న సీఈవోలుగా పదోన్నతులు పొందగా స్థానచలనం కల్పించారు. -
స్తంభించిన రెవెన్యూ సేవలు
బోసిపోయి కనిపిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ కుర్చీ ఖాళీగా ఉన్న తహసీల్దార్ కుర్చీ జ్యోతినగర్: పెద్దపల్లి జిల్లా రామగుండం తహసీల్దార్ కార్యాలయం పక్షంరోజులుగా అధికారులు లేక బోసిపోయి కనిపిస్తోంది. మొన్నటివరకు పనిచేసిన ఇన్చార్జి తహసీల్దార్ శ్రీపాద ఈశ్వర్తోపాటు డిప్యూటీ తహసీల్దార్ ఇటీవల బదిలీపై వెళ్లారు. ఆర్ఐలు సెలవులో ఉన్నారు. ఇందుకు కారణాలపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లా? కార్యాలయంలో చోటుచేసుకుంటున్న మానసిక పరిస్థితుల ప్రభావమా? అనేది తెలియడం లేదని అర్బన్ మండలవాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడకు బదిలీపై వచ్చేందుకు పలువురు తహసీల్దార్లు జంకుతున్నారని తెలిసింది. జీపీవోలు, కంప్యూటర్ ఆపరేటర్లు, సిబ్బంది మినహా కీలకమైన కులం, ఆదాయం, నివాసం తదితర ధ్రువీకరణపత్రాల జారీకోసం సంతకం చేసే అధికారులు లేక వందలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లను తక్షణమే నియమించేలా కలెక్టర్ చొరవ తీసుకోవాలని నేషనల్ యూత్ ప్రాజెక్టు రాష్ట్ర అధ్యక్షుడు కె.యాదవరాజు కోరారు. అధికారులు లేక ఖాళీగా తహసీల్దార్ కార్యాలయం -
విద్య, క్రీడలు, క్రమశిక్షణలో అగ్రగామిగా వాగేశ్వరి
కరీంనగర్ సిటీ: ప్రతీ విద్యార్థి తమ జీవితంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్ణయించుకొని వాటి సాధనకు కృషి చేయాలని శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్కుమార్ తెలిపారు. వాగేశ్వరి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో విద్యార్థుల ప్రతిభను గుర్తిస్తూ బుధవారం ఘనంగా అకాడమిక్ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉమేశ్కుమార్ హాజరై మా ట్లాడారు. వాగేశ్వరి విద్యాసంస్థల పనితీరును ప్రశంసించారు. కళాశాల విశ్వవిద్యాలయం పరిధిలో ఫలి తాలు, అడ్మిషన్లు, క్రీడలతోపాటు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తోందన్నారు. వాగేశ్వరి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల చైర్మన్ బి.వి. ఆర్.గోపాల్రెడ్డి మాట్లాడుతూ.. వాగేశ్వరి విద్యాసంస్థలు విద్య, క్రమశిక్షణ అన్ని కార్యకలాపాల్లో అగ్రస్థానంలో నిలుస్తున్నాయన్నారు. పలు పరీక్షలు, విద్య, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వీసీ మెమెంటోలు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహం నింపాయి. సాహితీ గ్రూప్ ఆఫ్ కాలేజీ అధినేత ప్రభాకర్గౌడ్, నిగమా ఇంజినీరింగ్ కాలేజ్ జాయింట్ సెక్రటరీ రత్న గోపాల్రెడ్డి, వాగేశ్వరి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లు వెంకట్రెడ్డి, సతీశ్, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ లింగమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ రమణ, సిబ్బంది పాల్గొన్నారు. శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఉమేశ్కుమార్ -
10 మంది బైండోవర్
కరీంనగర్రూరల్: ఇసుక అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన 10మంది ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లను బుధవారం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. మానకొండూరు మండలం వెల్దికి చెందిన తాళ్లపల్లి అజయ్, అనిల్, వల్లంపహాడ్కు చెందిన సంకూరి అనిల్కుమార్, శ్రావణ్, బొజ్జం కుమార్, సుల్తానా బాద్ మండలం గట్టెపల్లికి చెందిన మహ్మద్ ఇలియాస్, గొల్లపల్లికి చెందిన కొయ్యడ రాజశేఖర్, మహేశ్, మల్లేశ్, సిలివేరి శ్రీకాంత్పై కేసులు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు వివరించారు. 10మందిని తహసీల్దార్ ఎదుట రూ.లక్ష పూచీకత్తుపై బైండోవర్ చేసినట్లు తెలిపారు. చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ మృతిమల్యాల: మండలంలోని రాజారం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ అబ్దుల్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మంగళవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న సంఘటనలో అబ్దుల్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్కు తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై నరేశ్కుమార్ తెలిపారు. విద్యుత్ వైర్లు చోరీఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్ గ్రామ శివారులో విద్యుత్ మోటార్లకు బిగించిన తీగలను గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం ఎత్తుకెళ్లారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రాచర్లబొప్పాపూర్కు చెందిన రైతులు పద్మారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, బాపురెడ్డి, రాజయ్య, రాజిరెడ్డి, సంతోష్రెడ్డిలకు చెందిన వ్యవసాయమోటార్లకు సంబంధించిన విద్యుత్ తీగలను ఎత్తుకెళ్లారు. వీటి విలువ దాదాపు రూ.50వేల వరకు ఉంటుందని బాధిత రైతులు తెలిపారు. ఈమేరకు మండల పోలీసులకు ఫిర్యాదు చేశారు.చొప్పదండి: మండలంలోని కోనేరుపల్లి గ్రామం క్రీడామిత్ర పంచాయతీ ప్రణాళికలో భాగంగా మా ర్చి నెలలో నిర్వహించిన ఆన్లైన్ పోటీలో జాతీయస్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. గ్రామాల్లోని యువతను క్రీడలవైపు మళ్లించేందుకు, భారత గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడానికి దేశంలోని లక్షన్నరకు పైగా ఉన్న గ్రామ సర్పంచులను ఒకే వేదిక పైకి తెచ్చేందుకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందించిన సర్పంచ్ సంవాద్ యాప్ను కోనేరుపల్లి గ్రామ సర్పంచ్ కాసు వేణుగోపాల్ రాజు సద్వినియోగం చేశారు. యువతకు క్రీడలు నిర్వహించి ఆన్లైన్ యాప్లో అప్లోడ్ చేశారు. దీంతో మొదటి స్థానంలో నిలిపినందుకు రూ. 35వేల నగదు బహుమతి సర్పంచ్ గెలుచుకున్నారు. స్పోర్ట్స్ ఫ్రెండ్లీ విలేజ్ పోటీలో తెలంగాణ నుంచి కోనేరుపల్లి సర్పంచ్ రాజు మొదటిస్థానం సాధించగా, రెండోస్థానంలో మహారాష్ట్ర నుండి వైశాలి సందీప్ రాథోడ్ అనే మహిళా సర్పంచ్, మూడోస్థానంలో పంజాబ్ నుంచి గంగదీప్సింగ్ గెలిచారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్రెడ్డి సహకారంతో జాతీయస్థాయిలో బహుమతి సాధించినట్లు సర్పంచ్ రాజు తెలిపారు. -
మీ కడుపు సల్లంకుండ!
కరీంనగర్కల్చరల్: ఎండలు మొదలయ్యాయంటే ఒకప్పుడు ప్రతి ఇంట్లో కొత్త కుండలు తప్పనిసరి. పేదోడి ఫ్రిజ్గా పేరుగాంచిన మట్టి కుండలు, కూజలు మళ్లీ ప్రాచుర్యం పొందుతున్నాయి. ఆధునికకాలంలో ఫ్రిజ్లు వచ్చిన తర్వాత కొంతకాలం కుండల వినియోగం తగ్గినా, ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో ప్రజలు మళ్లీ సహజ మార్గాల వైపు అడుగులు వేస్తున్నారు. ఫ్రిజ్లోని చల్లని నీరు తాగడం వల్ల జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచించడంతో, అన్ని వర్గాల ప్రజలు కుండనీళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో మార్కెట్లో మట్టి కుండలు, కూజలకు మంచి డిమాండ్ ఏర్పడింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక కుండలు రాజస్థాన్, నాగపూర్, ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి వ్యాపారులు వివిధ ఆకృతుల్లో కుండలు, కూజలను తెచ్చి విక్రయిస్తున్నారు. చిన్న, పెద్ద సైజుల్లో లభిస్తున్న ఈ కుండల ధరలు రూ.150, 200, 250 నుంచి రూ.500 వరకు ఉన్నాయి. రాజస్థాన్ నుంచి తెచ్చిన మట్టి వాటర్ బాటిల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా రూ.180కి విక్రయిస్తున్నారు.గతంలో కన్నా నేటి మార్కెట్లో వివిధ రకాల ఆకృతుల్లో తయారైన కుండలు, కుజల కొనుగోళ్లు జరుగుతున్నాయి. కొత్త కుండలకు మంచి గిరాకీ కనిపిస్తోంది. ప్రజల నుంచి స్పందన ఉంది. అమ్మకాలు బాగున్నాయి. – మహమ్మద్ అబ్దుల్ అలీమ్కుండలో నీరు ఆరోగ్యానికి మంచిది. ఎండకాలంలో కుండలోని నీరు తాగడం ద్వారా దాహం తీరుతుంది. చిన్నప్పుటి నుంచి కుండ నీటినే తాగుతున్నా. ఏ విధమైన ఆరోగ్య సమస్యలు రావు. ఫ్రిజ్ నీరు కన్నా కుండ నీరే మంచిది. – కరుణాకర్, కిసాన్నగర్ -
అమ్మా నేను వెళ్లిపోతున్నా.. క్షమించు
ముస్తాబాద్: అమ్మా నేను వెళ్లిపోతున్న.. ఈ అప్పులు భరించలేను. బాపు చనిపోయాక నిన్ను ఇలా ఒంటరిని చేసి వెళ్లిపోతున్న.. నన్ను క్షమించు అమ్మ.. అంటూ ఓ కొడుకు లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన పాకదాని నర్సింలు(35) ఇంట్లో ఉరేసుకొని బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్లో కారు డ్రైవర్గా పనిచేస్తున్న నర్సింలు తండ్రి చంద్రయ్య 2020లో కరోనాతో మృతి చెందగా, అప్పటి నుంచి తల్లి ఎల్లవ్వను పోషిస్తున్నాడు. ఇంకా పెళ్లికాని నర్సింలు స్వగ్రా మం పోతుగల్కు ఒక్కడే వచ్చి ఇంట్లో ఉరేసుకొని మృతి చెందాడు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. నర్సింలు తన ఆత్మహత్యకు అప్పులే కారణమని లేఖలో రాశాడు. అమ్మను ఎవరు ఏమీ అనవద్దని, స్నేహితులు ఆమెను చూసుకోవాలని కోరాడు. కొడుకు మృతితో తల్లి ఎల్లవ్వ ఒంటరి అయింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. అమ్మను బాగా చూసుకోవాలి కారు డ్రైవర్ ఆత్మహత్య -
బైక్ దొంగలించిన వ్యక్తి అరెస్ట్
చందుర్తి(వేములవాడ): భార్య పిల్లలతో కలిసి వేములవాడకు వెళ్తుండగా సమీపంలో బైక్లో పెట్రోల్ లేక ఆగిపోయిందన్న మాయమాటలు చెప్పి ఏడు నెలల క్రితం ద్విచక్రవాహనం చోరీ చేసిన కేసును బుధవారం చందుర్తి పోలీసులు చేధించారు. చందుర్తి ఎస్సై జిల్లెల్ల రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. చందుర్తి మండలం మల్యాలకు చెందిన పీసరి నాగరాజు వద్దకు 2025 సెప్టెంబర్ 19న గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తమ మోటార్ సైకిల్లో పెట్రోల్ లేక ఆగిపోయిందని, బైక్పై తమ భార్య, చిన్న పిల్లలున్నారని, మీ బైక్ ఇస్తే పెట్రోల్ తెచ్చుకుంటానని చెప్పి బైక్ను తీసుకెళ్లాడు. ఇదే అదునుగా భావించి మోటారు సైకిల్తో పారిపోవడంతో బాధితుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసును చేధించారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బుగ్గారం తండాకు చెందిన కృష్ణ రాథోడ్ ఊరఫ్ భూక్యా కృష్ణ రాథోడ్గా గుర్తించి ఎత్తు కెళ్లిన మోటారు సైకిల్ను బుధవారం స్వాధీనం చేసుకున్నారు. బైక్ను సీజ్ చేసి దొంగతనానికి పాల్పడిన కృష్ణ రాథోడ్ను రిమాండ్కు తరలించినట్లు ఎస్సై రమేశ్ వివరించారు. గొర్రెలు, కోళ్ల దొంగల..సుల్తానాబాద్రూరల్: జల్సాలకు అలవాటుపడి గొర్రెలు, కోళ్లను చోరీ చేస్తున్న నలుగురు యువకులను అరెస్టు చేసినట్లు ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. సుల్తానాబాద్ పోలీస్స్టేషన్లో బుధవారం వివరాలను ఎస్సై వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన నలుగురు సిరిపురం రాకేశ్, నూనే అభిలాష్, గరిగంటి రాజ్కుమార్తోపాటు ఓ మైనర్ గతనెల 31న సుద్దాల గ్రామంలో ఒజ్జ రాములుకు చెందిన 5 గొర్రెలు, ఈనెల 6న చిన్నబొంకూర్ గ్రామంలో కల్వల లక్ష్మారెడ్డితోపాటు మరో ముగ్గురు రైతులకు సంబంధించిన దాదాపు 20 కోళ్లను దొంగతనం చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుండగా.. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులు దొరికారన్నారు. వారిని అరెస్టు చేయడంతోపాటు దొంగతనానికి ఉపయోగించిన కారును సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. యువతిని వేధించిన వ్యక్తి..సిరిసిల్ల క్రైం: ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని వేధించిన సింగారపు గణేశ్ అనే వ్యక్తిని బుధవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. సిరిసిల్లకు చెందిన యువతిని రుద్రంగి మండలానికి చెందిన గణేశ్ పరిచయం చేసుకొని ప్రేమిస్తున్నాని చెప్పి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చి వేధిస్తున్నట్లు బాధితురాలు సిరిసిల్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిందన్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. అమ్మాయిలను వేధించడం, ప్రేమ పేరుతో వెంటపడడం, సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కోతల వెంటే కొనుగోళ్లు
కరీంనగర్ అర్బన్: ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేపట్టింది. గతంలో కొనుగోళ్లలో ఉన్న లోపాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. రికార్డులో ఉన్న విస్తీర్ణం ప్రకారమే ధ్రువీకరించనుండగా తదనుగుణంగా రైతుల ఖాతాకు నగదు చేరనుంది. వ్యవసాయ మార్కెట్లకు ఈ సారి కొనుగోలు బాధ్యతలు అప్పగించనుండగా కేంద్రాల సంఖ్యకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, పౌరసరఫరాల సంస్థ డీఎం ఎం.రజనీకాంత్, వ్యవసాయశాఖ, ఐకేపీ, మార్కెటింగ్ అధికారులతో సమీక్షించారు. ఐకేపీ, ప్రాథమిక సహకార సంఘాలు, డీసీఎంఎస్, మెప్మా, వ్యవసాయ మార్కెటింగ్లు కొనుగోళ్లలో భాగస్వామ్యమవనున్నాయి. గతంలో మాదిరిగానే కీలక బాధ్యతలు వ్యవసాయ విస్తరణ అధికారులకు అప్పగించారు. యాసంగి ధాన్యం సేకరణకు గానూ 318 కొనుగోలు కేంద్రాలు అవసరమని ప్రతిపాదించారు. ఈ నెల మూడోవారంలో పంట కోతలు ప్రారంభం కానుండగా కోతల వెంటే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఏఈవోలకే బాధ్యత ఏఈవోల ధ్రువీకరణ ఆధారంగా ధాన్యం కొనుగోలు చేయనున్నారు. జీపీవోల సేవలను వినియోగించనున్నారు. రైతులకు సంబంధించిన భూ భారతి వెబ్సైట్ను సహకార సంఘాలకు అనుసంధానం చేశారు. వీఆర్వో వ్యవస్థ రద్దుతో ఏఈవోలే సేవలందిస్తున్నారు. ఇప్పటికే ఆన్లైన్లో సర్వే నంబర్ వారీగా పంటల సాగు వివరాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. కొనుగోలు చేసేవి ఈ సంఘాలే కావడంతో వారు ఏ రైతుకు ఎంత భూమి ఉందనే విషయం ఖరారు చేసుకుంటుంది. దానికనుగుణంగా సంబంధిత ఖాతాకు పంట అమ్మితే వచ్చిన నగదు బదలాయిస్తుంది. గన్నీ సంచులు, రవాణే సమస్య జిల్లాలో 318 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా గతంలో రైతుల ఎదుర్కొన్న సమస్యలను దూరం చేయాల్సిన అవసరం ఉంది. గన్నీ సంచుల కొరత, రవాణాలో ఆలస్యం చాలా కేంద్రాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. మిల్లర్ల దోపిడీ నిత్యకృత్యంగా సాగింది. ఈ నేపథ్యంలో సదరు సమస్యల్లేకుండా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు. ఇదిలాఉంటే పదెకరాలున్న రైతుకు పట్టాదారు పాసుపుస్తకంలోనూ రికార్డుల్లోనూ తప్పుగా ఆరెకరాలే అచ్చయించదనుకో.. మిగతా నాలుగు ఎకరాల పంట అమ్ముకోవాలంటే ఇబ్బందులే. అన్నదాతకు అకాల భయం ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే నెలలో అకాల వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలకు నష్టం వాటిల్లుతోంది. నెలల తరబడి పంటను కాపాడుకునేందు కు శ్రమించిన రైతులకు వడగళ్ల వాన గంటలోనే తు డిచేస్తోంది. గత సంవత్సరం వరి, మామిడి, మొక్కజొన్న సాగు చేసిన రైతులు నష్టపోయారు. ధాన్యం రంగు మారడం తేమ సాకుతో కళ్లాల వద్దే వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రెండు నెలలు గడుస్తాయోనన్న భయం వెంటాడుతోంది. సన్నాల మాటేమిటి దొడ్డు రకం ధాన్యం క్వింటాలు ఏ గ్రేడుకు రూ.2389, సాధారణ రకం రూ.2369 మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం సన్నరకాలకు ఇంకా వెల్లడించలేదు. సన్నరకం పండించాలని ప్రభుత్వం సూచించడంతో రైతులు చాలామంది వాటినే ఎంచుకున్నారు. సుమారు 20 వేల ఎకరాల్లో సన్నరకం వరి సాగు చేసినట్లు అధికారుల అంచనా. 6లక్షల క్వింటాళ్ల సన్నరకం ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది.జిల్లాలో సాగు విస్తీర్ణం: 3,36,761 జిల్లాలో సాగైన వరి: 2,75,716 ఎకరాలు రానున్న దిగుబడి: 4.90లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం మద్దతు ధర: ఏ గ్రేడ్: రూ.2,389, సాధారణ రకం: రూ.2,369కొనుగోలు కేంద్రాలు: 318 ఐకేపీ: 91, పీఏసీఎస్: 182 డీసీఎంఎస్: 37, హాకా: 08జిల్లాలో రైస్ మిల్లులు: 169 రా రైస్ మిల్లులు: 82 బాయిల్డ్ రైస్మిల్లులు: 87 -
మాతా శిశు కేంద్రాన్ని తీర్చిదిద్దండి
కరీంనగర్: కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మహత్తరంగా తీర్చేదిద్దాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో బుధవారం నిర్వహించిన సేఫ్ మదర్స్ డే కార్యక్రమానికి హాజరయ్యారు. మాతా శిశు కేంద్రంలో అన్ని విభాగాలను సందర్శించారు. గైనకాలజిస్టులు, పిల్లల వైద్య నిపుణులు, రేడియాలజిస్టులతో చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా వైద్యులు పనిచేయాలని సూచించారు. జిల్లా ఆస్పత్రిలో సేఫ్ మదర్ డేకు సంబంధించిన ఐఈసీ మెటీరియల్, పోస్టర్లు ఆవిష్కరించారు. డీఎంహెచ్వో వెంకటరమణ, డీసీహెచ్ఎస్ కృష్ణ ప్రసాద్, సూపరింటెండెంట్ జి.వీరారెడ్డి, ఆర్ఎంవో నవీనా, సుధాకర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఉదయ్ ఆదిత్య పాల్గొన్నారు. ఆయుష్ ఆధ్వర్యంలో యోగా, వైద్య శిబిరం ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 10న ఆయుష్ కరీంనగర్శాఖ ఆధ్వర్యంలో యోగా, మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆయుష్ జిల్లా ఇన్చార్జి డాక్టర్ యశ్రబ్ సుల్తానా తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ చిత్ర మిశ్రా చేతుల మీదుగా కలెక్టరేట్లో పోస్టర్ ఆవిష్కరించారు. హోమియోపతి వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ హానిమాస్ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్లు శేఖర్, సదానందం, డీపీఎం ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. యువతలో స్కిల్స్ పెంచేలా జిల్లాలోని పరిశ్రమలు, ఆసుపత్రులు తదితర సేవా రంగ సంస్థల్లో యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రైవేట్ పరిశ్రమలు, కంపెనీల ప్రతినిధులు, ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ రుచిగుప్తాతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న ఉద్యోగాల కోసం అవసరమైన స్కిల్స్ యువత పెంచుకునేలా చూడాలన్నారు. తమ పరిశ్రమలు, కంపెనీల్లో పనిచేసేందుకు అవసరమైన స్కిల్స్ కలిగిన అభ్యర్థుల కోసం జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారిని సంప్రదించాలని ప్రైవేటు పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు. -
ఐదు రోజుల పసికందు మృతి
వేములవాడఅర్బన్: వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఐదు రోజుల పసికందు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కోనరావుపేట మండలం పల్లిమక్తకు చెందిన అనూష ఐదు రోజుల క్రితం డెలివరీ కోసం ఏరియా ఆసుపత్రికి రాగా వైద్యులు కాన్పు చేయడంతో బాబు జన్మించాడు. ఐదు రోజుల తర్వాత బాబు మృతి చెందడంతో వైద్యుల నిర్లక్ష్యంతో బాబు మృతి చెందాడంటూ అనూష కుటుంబసభ్యులు బుధవారం ఆసుపత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రసూతి కోసం ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా వైద్య అధికారులు డెలివరీ చేసినప్పటి నుంచి సరైన వైద్య సేవలు అందించలేదని, వైద్యుల నిర్లక్ష్య కారణంగానే తమ బాబు మృతి చెందాడన్నారు. మెరుగైన వైద్యం అందించాం వేములవాడ ఏరియా ఆసుపత్రి పిడియాట్రిక్ ఇన్చార్జి డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ బాబు జన్మించిన నాటి నుంచి బాగానే ఉన్నాడని, మెరుగైన వైద్యం అందించామని, అయితే అకస్మాత్తుగా వచ్చిన ఇన్ఫాంట్ సిండ్రోమ్ వల్ల ఇలా జరిగి ఉండవచ్చునని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని, పోస్ట్ మార్టం చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఏమి లేదన్నారు. వివాదాల్లో ఏరియా ఆసుపత్రి వేములవాడ ఏరియా ఆసుపత్రి రోజుకో వివాదంలో చిక్కుకుంటున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో సైతం డెలివరీ కోసం ఓ మహిళ ఏరియా ఆసుపత్రికి రాగా వైద్యులు లేరంటూ వెనక్కి పంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలా జరగడంతో ఆసుపత్రి సేవలపై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే అంటూ కుటుంబ సభ్యుల అందోళన -
అవినీతికి అడ్డాగా మున్సిపల్ కార్పొరేషన్
● మాజీ మేయర్ రవీందర్సింగ్కరీంనగర్టౌన్: కరీంనగర్ కార్పొరేషన్ అవినీతికి అడ్డాగా మారిందని మాజీ మేయర్ రవీందర్సింగ్ ఆరోపించారు. బుధవారం తారక హోటల్లో మాట్లాడుతూ ఇటీవల జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాల్లో బయటపడిన అవినీతి మాదిరిగానే, కరీంనగర్ మున్సిపల్లోనూ భారీ అక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం అవినీతికి నిలయంగా మారిందన్నారు. చింతకుంటలోని సర్వే నంబర్ 439లో ఉన్న 2 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఓ బీజేపీ నాయకుడు ప్లాట్లు చేసి బహిరంగంగా మార్కెట్లో అమ్ముకుంటున్నాడని స్వయంగా ఆధారాలను బయటపెట్టారు. అల్గునూరులో ప్రభుత్వ భూములను అక్రమార్కులు ఎటువంటి అనుమతులు లేకుండానే టౌన్ ప్లానింగ్ అధికారులతో కుమ్మకై ్క ఓపెన్ ప్లాట్లుగా మార్చి, అమ్ముకుంటున్నారని అన్నారు. అవినీతిపై కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మీర్జంపేటలో తల్లీకూతుళ్ల అదృశ్యం
కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు రామిడి లక్ష్మి(48), శ్వేత(28) అదృశ్యమయ్యారు. ఈనెల 7వ తేదీన ఇంట్లోనుంచి బయటకు వెళ్లిన తల్లీకూతుళ్లు ఎంతకీ తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు తమకు తెలిసిన వారు, బంధువుల ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. ఆందోళనకు గురైన లక్ష్మి భర్త వెంకట్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై వెంకటేశ్ మాట్లాడుతూ కేసు నమోదు చేసుకున్నామన్నారు. అదృశ్యమైన వారు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కనిపించినట్లు సమాచారం ఉందని, కానిస్టేబుళ్లను బుధవారం హైదరాబాద్ పంపించామని తెలిపారు. పూర్తిసమాచారం తెలిస్తే.. ఎస్సై 87126 56512, సుల్తానాబాద్ సీఐ 87126 56510 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.వృద్ధుడి ఆత్మహత్యమల్యాల: మండలంలోని గొల్లపల్లెకు చెందిన ఎల్కపల్లి రాయమల్లు(85) ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై నరేశ్కుమార్ కథనం ప్రకారం.. రాయమల్లు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈనెల 7న రాత్రి తన ఇంట్లోనే ఎలుకల మందు తాగాడు. సమీప బంధువులు గమనించి ఆయన కుమారుడు గంగమల్లయ్యకు సమాచారం అందించారు. 108 వాహనంలో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. గంగమల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. బావిలో దూకి మహిళ..పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం పాలితం గ్రామానికి చెందిన బట్ల స్వరూప(34) బుధవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్వరూప మూడేళ్లుగా మానసికంగా బాధపడుతోంది. గతంలోనూ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడింది. ఈ మేరకు మృతురాలి తండ్రి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పెద్దపల్లిరూరల్ ఎస్సై మల్లేశ్ తెలిపారు. ఉరేసుకుని వివాహిత..జమ్మికుంట: దంపతుల మధ్య గొడవతో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జమ్మికుంట టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం బిహార్ రాష్ట్రం నల్లంద జిల్లా బద్రు బీహార్ గ్రామానికి చెందిన రాహుల్కుమార్కు పూజాకుమారితో 2018లో వివాహం జరిగింది. బతుకుదెరువు కోసం జమ్మికుంటలోని కోరపల్లి రోడ్డులో ఉన్న ఓ రైస్ మిల్లులో కూలీకి చేరారు. రెండు రోజుల క్రితం భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. బుధవారం భర్త పనికి వెళ్లిన తరువాత పూజాకుమారి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రాహుల్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ తెలిపారు. మద్యానికి బానిసై వ్యక్తి..శంకరపట్నం: మండలంలోని మెట్పల్లి గ్రామానికి చెందిన ఇజ్జిగిరి ఐలయ్య (50) మద్యానికి బానిసై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపా రు. ఐలయ్య మద్యం మానలేక జీవితంపై విరక్తి చెంది మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐలయ్య కుమారుడు విజయ్కుమార్ బుధవారం ఇ చ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై శేఖర్రెడ్డి తెలిపారు. -
మద్యంపై పోరుబాట
కోనరావుపేట(వేములవాడ): పల్లెల్లో మద్యం మహమ్మారిని పారదోలేందుకు ప్రజలంతా ఒక్కటవుతున్నారు. మద్యం పెడుతున్న చిచ్చును ఆర్పేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నారు. మద్య నిషేధం అమలు చేయాలంటూ తీర్మానాలు చేస్తున్నారు. కోనరావుపేట మండలం మల్కపేట, గోవిందరావుపేట, నిజామాబాద్ గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహించరాదని తీర్మానించారు. గ్రామంలో మద్యం అమ్మినా, కొనుగోలు చేసినా జరిమానా విధించాలని నిర్ణయించారు. ఒకప్పుడు ఎర్రజెండా భావాలతో చైతన్యానికి మారుపేరుగా నిలిచిన కోనరావుపేట మండలం ఇప్పుడు మద్య నిషేధం అమలు చేస్తూ అవే పల్లెలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. బెల్ట్షాపులతో అనర్థాలు గ్రామాల్లో కొన్నేళ్లుగా బెల్ట్ దుకాణాలు కొనసాగుతున్నాయి. హమాలీలు, వ్యవసాయ కూలీలు పొద్దంతా కష్టపడి సంపాదించిన డబ్బును రాత్రయితే తాగుడుకు ఖర్చు చేస్తున్నారు. దీంతో పలు కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. మద్యంబాబులు అనారోగ్యం పాలవుతున్నారు. కదిలిన మహిళా లోకం కుటుంబ పెద్ద మద్యానికి బానిసైతే.. ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. దీంతో మహిళలు తాము అనుభవిస్తున్న మానసిక క్షోభను దూరం చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామాల్లో మద్యం విక్రయాలు నిషేధానికి గ్రామస్తులను ఒప్పించాలని మహిళా సంఘాల్లో నిర్ణయించుకున్నారు. మహిళా సంఘాల ప్రతినిధులు ఆయా గ్రామాల సర్పంచులను కలిసి తమ సమస్యను వివరించారు. సర్పంచులు సైతం మద్దతు తెలపడంతో గ్రామంలో పంచాయతీ పాలకవర్గం సభ్యులు, మహిళా సంఘాలు సమావేశమై మద్యనిషేధానికి పూనుకున్నాయి. పంచాయతీ సాక్షిగా తమ గ్రామంలో మద్యం విక్రయాలు జరుపనివ్వబోమంటూ ప్రమాణం చేశారు. జిల్లాలోనే ఆదర్శం గ్రామాల్లో మద్యం దుకాణాలను రద్దు చేస్తూ మల్క పేట, నిజామాబాద్, గోవిందరావుపేట గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం జిల్లాలోనే ఆదర్శమైంది. గ్రామంలో ఎవరూ మద్యం విక్రయించినా రూ.50వేలు జరిమానా, పట్టించిన వారికి నజరానా అందించాలని తీర్మానించాయి. పల్లెల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం కోనరావుపేట మండలంలో మూడు గ్రామాలలో అమలు మరికొన్ని గ్రామాలు అదే బాటలో.. హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు -
బెదిరించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి
వేములవాడ: వేములవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పిట్టల భూమేశ్ను చంపుతానని బెదిరించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాదులు బుధవారం ఆందోళన చేపట్టారు. విధులు బహిష్కరించి, కోర్టు ప్రధాన ద్వారం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పిట్టల మనోహర్ మాట్లాడుతూ ధర్మపురికి చెందిన రౌడీషీటర్ గంగాధర్ పిట్టల భూమేశ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ప్రాణహాని కలిగించేలా బెదిరింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శంకర్, ప్రధాన కార్యదర్శి భానుకృష్ణ, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి జెట్టి శేఖర్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
కో ఆప్షన్కు వేళాయె!
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో కో– ఆప్షన్ పదవుల ఎన్నికకు రంగం సిద్ధమైంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఐదు కో ఆప్షన్ పదవుల కోసం గురువారం నోటిఫికేషన్ జారీ కానుంది. కొత్త పాలకవర్గం కొలువుతీరిన తరువాత కో– ఆప్షన్ పదవులకు ఎన్నిక జరగాల్సి ఉంది. కో ఆప్షన్ పదవులు బీజేపీ ఖాతాలో పడనుండగా, ఆ పార్టీలో పోటీ నెలకొంది. నేడు నోటిఫికేషన్ ఆశావహులు ఎంతగానో ఎదురుచూస్తున్న నగరపాలకసంస్థ కో– ఆప్షన్ పదవుల ఎన్నికలకు నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు నగరపాలకసంస్థలోని ఐదు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలకు కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. నోటిఫికేషన్ జారీ అయిన నాటి నుంచి ఏడు రోజుల పాటు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏడు రోజుల తరువాత దరఖాస్తుల పరిశీలన చేపడుతారు. ఐదు పదవులకు ఐదు దరఖాస్తులు వస్తే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. అలాకాకుండా పోటీ ఏర్పడితే, స్క్రూటినీ అనంతరం మూడు రోజులు గడువు ఇచ్చి, కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి నోటీసు ఇస్తారు. ఆ ప్రత్యేక సమావేశంలో ఐదుగురు కో ఆప్షన్ సభ్యులను కార్పొరేటర్లు ఎన్నుకుంటారు. మైనార్టీలకు రెండు ఐదు కో ఆప్షన్ పదవుల్లో మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ను పాటించాల్సి ఉంటుంది. ఐదింటిలో రెండు మైనార్టీలకు కేటాయిస్తారు. అందులో ఒకరు విధిగా మహిళ ఉండాలి. మిగిలిన మూడింటిలో ఒకటి ఎస్సీలకు, మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. మైనార్టీలకు ప్రత్యేక అర్హతలు అవసరం లేదు. మిగతా సభ్యులకు మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ సర్పంచ్లు, మాజీ వార్డు సభ్యులు, రిటైర్డ్ అయిన గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే అర్హులు. ఆయా రిజర్వేషన్ కేటగిరీల వారిగా అభ్యర్థులు పోటీ చేయాల్సి ఉంటుంది. బీజేపీ ఖాతాలోకే ప్రస్తుత పాలకవర్గం బలాబలాల ప్రకారం నగరపాలకసంస్థలో పూర్తిస్థాయిలో మెజార్టీ ఉన్న బీజేపీ ఖాతాలోనే ఈ ఐదు కో ఆప్షన్ పదవులు పడనున్నాయి. బల్దియాలో ప్రస్తుతం అంతగా బలం లేని బీఆర్ఎస్, కాంగ్రెస్లు కో ఆప్షన్పై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఎక్కడైనా క్రాస్ ఓటింగ్కు అవకాశం ఏర్పడే పరిస్థితి కోసం ఆ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఇక ఐదు కో ఆప్షన్ పదవుల కోసం ఆయా కేటగిరీల వారిగా అర్హతలు ఉన్న వాళ్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆశీస్సుల కోసం తమకున్న మార్గాల ద్వారా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. -
‘తమిళనాడు’ తీర్పుతో నేరెళ్ల బాధితులకు కొత్త ఆశలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తెలంగాణలో సంచలనం సృష్టించిన నేరెళ్ల ఘటన బాధితులకు తమిళనాడులోని ఒక కోర్టు తీర్పు కొత్త ఆశలను చిగురింపజేసింది. పదేళ్ల క్రితం జరిగిన నేరెళ్ల ఘటనలో పోలీసుల థర్డ్ డిగ్రీ చిత్రహింసలకు గురైన బాధితుడు కోల హరీశ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేస్తూ తన ఆవేదన, ఆశను పంచుకున్నారు. తమిళనాడులో తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో తొమ్మిది మంది పోలీసులకు కోర్టు మరణశిక్ష విధించడాన్ని హరీశ్ స్వాగతించారు. ‘తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా చట్టం ముందు సమానమే అని ఈ తీర్పు నిరూపించింది. ఇది మాలాంటి బాధితులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తోంది’ అని పేర్కొన్నారు. అప్పటి ఐపీఎస్ అధికారి విశ్వజిత్ కంపటి, ఎస్సై రవీందర్ తోపాటు సుమారు 25 మంది పోలీసులు తమను అక్రమంగా నిర్బంధించి, కరెంట్ షాక్ ఇవ్వడం, రోకలి బండలతో కొట్టడం వంటి అమానుష చర్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గాయాలు, మానసిక క్షోభ నుంచి తాము ఇప్పటికీ కోలుకోలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించాలి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని హరీశ్ కోరారు. నేరెళ్ల బాధితులకు అండగా ఉంటామని, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తామని సీఎం హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ వీడియోను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ ప్రజలను కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోల హరీశ్ డిమాండ్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ వైరల్ -
జీఎస్టీ ఇన్ స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపిక
శంకరపట్నం: గద్దపాక గ్రామానికి చెందిన భూమ అరవింద్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల్లో జీఎస్టీ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ముదిరాజ్ కుటుంబానికి చెందిన గద్దపాక మాజీ ఎంపీటీసీ భూమ సంపత్–వసంత కుమారుడు అరవింద్ ఎస్సెస్సీ వరకు వీణవంక, ఇంటర్ అల్గునూర్ ఎస్ఆర్ కాలేజీలో చదువుకున్నాడు. వరంగల్ కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశాడు. ఈ ఏడాది జనవరి 18, 19ల్లో కేంద్ర ప్రభుత్వం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రాడ్యూయేషన్ లెవల్ ఫైనల్ పరీక్షలు నిర్వహించింది. బుధవారం ఫలితాలు విడుదల చేయగా.. దేశవ్యాప్తంగా 1,024 ర్యాంక్ సాధించిన అరవింద్ జీఎస్టీ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, పలువురు మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు అభినందనలు తెలిపారు. -
గ్రానైట్ రాజ్యం.. రాతిగా అధికారగణం!
సాక్షిప్రతినిధి,కరీంనగర్/కొత్తపల్లి●: కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్, బద్ధిపల్లి, ఎలగందుల, శ్రీరాములపల్లి, ఖాజీపూర్, కమాన్పూర్, నాగులమల్యాల, గంగాధర మండలం ఒద్యారంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రానై ట్ కటింగ్, పాలీషింగ్ పరిశ్రమలు అనేకం అనుమతుల్లేకుండా నడుస్తున్నాయి. పంచాయతీరాజ్ చట్టం 2018 నియమ నిబంధనలకు పాతరేస్తూ..అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగడమే కాకుండా పర్యావరణం ధ్వంసమై స్థానికులకు తీవ్ర హాని కలుగుతోంది. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి గ్రానైట్ అక్రమ దందాలను నిగ్గు తేల్చుతామని ప్రకటించినా..ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా గ్రానై ట్ రాజ్యమేలుతున్నా, అధికారులు మాత్రం రాతిగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. విచ్చలవిడిగా ప్రకృతి విధ్వంసం జరుగుతు న్నా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పల్లె ప్రజ లు విస్మయానికి లోనవుతున్నారు. ఇక సీఎం ప్రకటనకే విలువ లేకుండా పోతుంటే.. తమకేం న్యా యం జరుగుతుందంటూ మదనపడుతున్నారు. అక్రమాల నిగ్గు తేల్చడంలో విఫలం గ్రానైట్ కట్టింగ్, పాలీిషింగ్ పరిశ్రమలు నిబంధనలు పాటించకుండా అక్రమార్జనే ధ్యేయంగా ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదు. పంచాయతీరాజ్ చట్టం– 2018కు లోబడి అనుమతులు పొందకుండా.. నిర్మాణ ఫీజు, బెట్టర్మెంట్ చార్జ్, డెవలప్మెంట్ చార్జీలు చెల్లించకుండా, ఆస్తి, టేడ్ర్ లైసెన్స్ పన్నులు ఎగవేస్తూ.. అక్రమ దందా సాగిస్తూ.. దుమ్ము, ధూళిని వెదజల్లుతూ.. శబ్ద, వాయు, జల కాలుష్యాన్ని నాశనం చేస్తూ.. మొక్కలు, చెట్లు నాటకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. రోడ్లను ధ్వంసం చేస్తూ..ప్రభుత్వ భూములను ఆక్రమించడంతో పాటు గ్రానైట్ చూర్ణాన్ని డంప్ చేస్తూ..ఇలా అక్రమ దందా కొనసాగిస్తూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా వ్యవహరిస్తున్న గ్రానైట్ పరిశ్రమల నిగ్గు తేల్చాల్సిన సంబంధిత అధికారులు మామూలుగా తీసుకుంటుండంపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ పంచాయతీలకు మాత్రం పన్నులు చెల్లించకుండా నష్టం కలిగిస్తున్న గ్రానైట్ పరిశ్రమలపై విచారణ చేపడితేగాని నిజం నిగ్గుతేలనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారుల తీరుపై అసంతృప్తి గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ పరిశ్రమల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ.. వాటిని అడ్డుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గ్రానైట్ పరిశ్రమల అక్రమాలు నిస్సిగ్గుగా కొనసాగుతున్నా.. నిగ్గు తేల్చడంలో అధికారులు విఫలమవుతున్నారన్న ఆరోపణలను మూటగట్టుకుంటున్నారు. అనేక పరిశ్రమలు సరైన లైసెన్సులు లేకుండా రాళ్ల రాజ్యం కొనసాగిస్తుంటే.. అధికారగణం మాత్రం రాతిగా వ్యవహరిస్తున్నారన్న అపవాదునెదుర్కొంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం మూలంగా గ్రానైట్ అక్రమ దందా అడ్డూఅదుపులేకుండా కొనసాగుతోంది. అధికారులకు అడ్డుపడేదెవరు? గ్రానైట్ పరిశ్రమల అక్రమ సామ్రాజ్యాన్ని కూల్చ కుండా అధికారులను అడ్డుకుంటున్నదెవరన్నది చర్చనీయాంశంగా మారింది. గతంలో అడ్డూఅ దుపులేకుండా పోయిన పరిశ్రమల ఆగడాలు ఇప్పుడైనా ఆగుతాయని భావించిన ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. అక్రమ దందాకు అండగా నిలుస్తున్న ఆ బడానేత ఎవరన్నది పల్లెల్లో చర్చ సాగుతుండగా.. కేవలం బదనాం చేసేందుకే అక్రమార్కులు ప్రచారం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పల్లెల్లో పెద్ద ఎత్తున్న గ్రానైట్ విధ్వంసం జరుగుతుంటే అధికారులు పట్టించుకోకపోగా..మళ్లీ అక్రమార్కులకే అండగా నిలుస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్ఎఫ్సీఎల్ మాజీ కాంట్రాక్టర్ ఇంటి ఎదుట నిరసన
ఫెర్టిలైజర్సిటీ: పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంలో కాంట్రాక్ట్ ఉద్యోగాల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. కాంట్రాక్ట్ ఉద్యోగాల పేరిట నగదు తీసుకుని నేటికీ తిరిగి చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని మధ్యవర్తి సిలివేరి రవి ఆవేదన చెందాడు. ఈమేరకు మంగళవారం గౌతమినగర్లోని మాజీ సబ్ కాంట్రాక్టర్ గోపగాని మోహన్గౌడ్ ఇంటిఎదుట కుటుంబ సభ్యులతో నిరసనకు దిగాడు. రవి మాట్లాడుతూ, ఆర్ఎఫ్సీఎల్ కాంట్రాక్టు ఉద్యోగాల పేరుతో రూ.కోటి 30 లక్షలను మోహన్గౌడ్ తీసుకొని తిరిగి చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించాడు. మధ్యవర్తిత్వం వహించినందుకు బాధితులకు తన సొంత స్థలం అమ్మి డబ్బులు చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేశాడు. తీసుకున్న డబ్బులు చెల్లించాలని ఎన్నిసార్లు అడిగినా వాయిదాల పేరుతో దాటేస్తున్నాడని ఆరోపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సిలివేరి రవిని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్కు తరలించారు. -
నాపై కోపముంటే ఉరి తీయండి
హుజూరాబాద్: ‘నాపై ప్రభుత్వానికి కోపం ఉంటే అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉరి తీయండి. కానీ, ప్ర జల ప్రాణాలకు, పంటలకు ముప్పు వాటిల్లే డంప్ యార్డ్ను రద్దు చేయాలి’ అని హుజూరాబాద్ ఎ మ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద డంపింగ్యార్డ్ వ్యతి రేక అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిబిరంలో మంగళవారం ఎమ్మెల్యే 24 గంటల దీక్షకు పూనుకున్నారు. మొదట నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి, తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, డంప్యార్డు ఏర్పాటు వల్ల ప్రజలకు నష్టమే ఎక్కువ అవుతుందని, ప్రభుత్వం పునరాలోచన చేసి ఏర్పాటును మానుకోవాలన్నారు. ప్రజల ప్రాణాలు, పర్యావరణానికి హాని చేసే డంపింగ్యార్డ్ రద్దు కోసం రాజకీయాలకతీతంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. శాంతియుత నిరసనలకు ప్రభుత్వం దిగి రాకుంటే ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తుందన్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, పలకల ఈశ్వర్రెడ్డి, ఎడవెల్లి కొండాల్రెడ్డి, రవీందర్రావు, గందె రాధిక, రత్నం తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాదుల సహకారంతోనే కేసుల సత్వర పరిష్కారం
కరీంనగర్క్రైం: న్యాయవాదులు, న్యాయమూర్తుల మధ్య సమన్వయంతో ముందుకు వెళ్తామని, న్యాయవాదుల సహకారంతో కే సుల సత్వర పరిష్కారానికి తమవంతు సహకారం అందించాలని జిల్లా జడ్జి ఎస్.శివకుమార్ అన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షు డు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి సీహెచ్ కిరణ్కుమార్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులతో అసోసియేషన్ నూతన కార్యవర్గం పరిచ య కార్యక్రమాన్ని మంగళవారం అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేశారు. కార్యక్రమాని కి హాజరైన జిల్లా జడ్జితో పాటు ఇతర న్యా యమూర్తులను నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులు పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ, న్యాయమూర్తులకు బార్ అసోసియేషన్ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. కరీంనగర్: నగరపాలక సంస్థ 2026–27 ఆర్థిక సంవత్సరానికి అందిస్తున్న 5శాతం ముందస్తు రాయితీని సద్వినియోగం చేసుకోవాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి పౌర సేవా కేంద్రంతో పాటు అదనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పన్నుల చెల్లింపు కౌంటర్లను తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో ప్రభుత్వం అందిస్తున్న ఎర్లీ బర్డ్ ముందస్తు రాయితీపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రజలు కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, రద్దీని బట్టి మరిన్ని అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. వార్డు ఆఫీసర్లు పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇంటింటికీ వెళ్లి 5శాతం రాయితీ గురించి వివరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సైబర్ నేరగాళ్ల మ్యూల్ ఖాతాలపై ఉక్కుపాదం
కరీంనగర్క్రైం: సైబర్ నేరగాళ్ల మ్యూల్ ఖాతాలపై ఉక్కుపాదం మోపాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. మంగళవారం కమిషనరేట్ కార్యాలయంలో జిల్లాలోని అన్ని బ్యాంకుల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆపరేషన్ క్రాక్డౌన్ 1.0లో ఇటీవల నిర్వహించిన ఈ ఆపరేషన్లో 4 బ్యాంకు శాఖల్లో మొత్తం 34 మ్యూల్ ఖాతాలను గుర్తించి 20 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, 26 మంది నిందితులను అరెస్ట్ చేశామని, ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0లో ఇప్పటికే 34 ఖాతాలను గుర్తించినట్లు తెలిపారు. నిందితులు సేవింగ్స్, కరెంట్ ఖాతాలను సులభంగా తెరుస్తున్నారని, ఇకపై ఖాతా ప్రారంభించే సమయంలో బ్యాంకర్లు కఠినంగా స్క్రూటినీ చేయాలని ఆదేశించారు. ఎవరైనా అధికారులు లేదా సిబ్బంది నిందితులతో కుమ్మక్కై తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఏటీఎం కేంద్రాల్లో సీసీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షించాలని, సైబర్ నేరగాళ్లు ప్రజల సొమ్మును దారి మళ్లించకుండా బ్యాంకర్లు సాంకేతిక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేర రహిత కరీంనగర్ను రూపొందించేందుకు పోలీసులు, బ్యాంకింగ్ వ్యవస్థ సంయుక్తంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అడిషనల్ డీసీపీ వెంటరమణ, ఏసీపీలు, సీఐలు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. -
పాతిపెడతాం!
భూమిలోకి వస్తే..సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: వారంతా చూసేందుకు సాధారణ వ్యక్తులు. సమాజంలో వృత్తిపరంగా ఒకరు మహిళా టైలర్, మరొకరు న్యాయవాది, కూలీ, రైతు, యువత విద్యార్థిగా ఉన్నారు. కానీ.. ప్రవృత్తి భూములు కబ్జా చేయడం. కరీంనగర్లో సంచలనం రేపిన చింతకుంట సర్వే నంబరు 212, 214లలో వెలుగుచూసిన భూకబ్జాల పర్వంలో నిందితుల గురించి రిమాండ్లో పోలీసులు పలు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కేసులో పోలీసులు దాదాపు పదిమందికిపైగా నిందితులుగా చేర్చారు. వారిలో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా.. నలుగురు పరారీలో ఉన్నారు. చూసేందుకు సాధారణంగా కనిపించే వీరు కరీంనగర్ శివారులోని చింతకుంటలో రూ.కోట్లాది విలువైన భూములకు నకిలీ పత్రాలు సృష్టించి తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్న తీరును చూసి పోలీసులే విస్తుపోతున్నారు. అసలు వీరు చేస్తున్న వృత్తులకు, వీరు సంపాదించిన రూ.కోట్ల విలువైన భూముల ఆస్తుల విలువకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో ఈ కేసులో బయటికి రాని వ్యక్తులు ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికితోడు భూ యజమాని షేక్ అహ్మద్ మనుషులను భూమిలోకి అడుగుపెడితే అక్కడే చంపి పాతిపెడతామంటూ బెదిరింపులకు దిగడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నిందితుల వృత్తులు ఎ–1 కిన్నెర మల్లవ్వ (టైలరింగ్), ఎ–3 బామండ్ల రవీందర్ (రైతు), ఎ–5 లోకిని పోచయ్య (కూలీ), ఎ–7 అనుమ బాలయ్య (కూలీ), ఎ–8 లోకిని ఆ దిత్య (విద్యార్థి), ఎ–9 లోకిని రాజవ్వ (బల్దియా కాంట్రాక్ట్ లేబర్) ఈ ఆరుగురిని పోలీసులు రిమాండ్ తరలించారు. ఇక ఎ–2 మర్రి వెంకటస్వామి (లాయర్), ఎ–4 మాడిశెట్టి భాగ్యలక్ష్మి, ఎ–6 మారేడుగొండ తిరుపతి, ఎ–10 బ్యాంకు అధికారులు పరారీలో ఉన్నారు. మాస్టర్ మైండ్ లాయరేనా? ఈ భూదందా కేసులో ఏ–2గా ఉన్న మర్రి వెంకట స్వామి వృత్తిరీత్యా లాయరు. మార్చి వరకు ఒక జా తీయ పార్టీలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఈ ముఠాలో సగానికిపైగా సభ్యులంతా అదే పా ర్టీలో ఆయన అనుచరులుగా వివిధ హోదాలో పదవులు కూడా నిర్వహించారు. పార్టీ వీరిని ఇటీవల బ హిష్కరించినట్లు సమాచారం. వాస్తవానికి ఎ–1 మ ల్లవ్వను పోలీసులు చూపిస్తున్నారు. ఈ భూ కబ్జాలో డాక్యుమెంట్లలో ఆమె పాత్ర ఆధారంగా పోలీసులు ఎ–1గా చూపించారు. కానీ, ఈ భూదందా వెన క అసలు సూత్రధారి మర్రి వెంకటస్వామి అయి ఉంటాడని టూటౌన్ పోలీసులు అనుమానిస్తున్నా రు. ప్రస్తుతం అతను, మరో నిందితుడు పరారీలో ఉండగా ఈ కేసు విషయంలో హైకోర్టును ఆశ్రయించారని సమాచారం. ఈ కేసులో వీరి పాత్ర ఆధారంగా పోలీసులు కౌంటర్ దాఖలు చేసేందు కు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ కేసులో పది మంది వరకు నిందితులు ఉండగా.. నకిలీ పత్రాలతో కబ్జా చేసిన భూములను రిజిస్ట్రేషన్ చేసుకుని, వీరిలో వీరికి విక్రయిస్తారు. ఆ సమయంలో ఇదే స భ్యులు సాక్షులుగా వ్యవహరిస్తారు. ఇలా నలుగురైదురికి విక్రయించి లింక్ డాక్యుమెంట్లు సృష్టించి అ మాయకులకు విక్రయించారు. కొన్ని ప్లాట్ల విషయంలో బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు పొందినట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. -
ఆరోగ్య మహిళను సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ చిత్రా మిశ్రా కరీంనగర్: ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. మంగళవారం నగరంలోని మోతాజ్ఖానా అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్వో వెంకటరమణతో కలిసి సందర్శించారు. అవుట్పేషెంట్, ఫార్మసీ స్టోర్స్ను తనిఖీ చేశారు. ఈ సందరం్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 18 ఏళ్లు పైబడిన మహిళలకు నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయం ముఖద్వార క్యాన్సర్ తదితర వ్యాధులకు ఉచిత సేవలు పకడ్బందీగా అందించాలని సూచించారు. వ్యాధిగ్రస్తులు ప్రభుత్వం సరఫరా చేసే మందులనే వాడేలా ప్రోత్సహించాలన్నారు. పీవో ఎంహెచ్ఎన్ డాక్టర్ సన జవేరియా, వైద్యాధికారి ఇమ్రాన్ఖాన్, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య అవగాహన ర్యాలీని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ప్రారంభించారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ సిబ్బందికి వైద్య పరీక్షలు, మహిళా సిబ్బందికి ఆరోగ్య మహిళ క్లినిక్ నిర్వహించి పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో వెంకటరమణ మాట్లాడుతూ, సీ్త్ర సురక్షిత గర్భధారణ, నాణ్యమైన ప్రసూతి పొందడం ప్రతీ సీ్త్ర ప్రాథమిక మానవ హక్కు అని, ఆరోగ్యంగా ఉన్న సీ్త్ర ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిస్తుందని తెలిపారు. తల్లీబిడ్డల ఆరోగ్యం సరిగా లేకుంటే బిడ్డ పుట్టిన తర్వాత, జీవితంలో చాలాకాలం వరకు ప్రభావితం చూపుతుందన్నారు. అత్యున్నత ఆరోగ్య వైద్య సేవలు అందరికీ అందుబాటులో ఉంచితే మాతాశిశు మరణాల రేటు గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. అడిషనల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధా, డాక్టర్లు ఉమాశ్రీ, సాజిదా, డిప్యూటీ డిఎంహెచ్వో రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. విద్యానగర్(కరీంనగర్): ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ ట్రావెల్స్లలో ట్యాక్సీ కార్లు ఉపయోగించాలని మంగళవారం నగరంలోని తెలంగాణ చౌక్లో పబ్లిక్ ప్రైవేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి, యూనియన్ అధ్యక్షుడు పున్నం రవి మాట్లాడుతూ, జిల్లాలో కరీంనగర్ టు హైదరాబాద్, వరంగల్ నిజామాబాద్, ఇతర జిల్లాలకు, యాత్రలకు వైట్ ప్లేట్ కార్ల ద్వారా కిరాయిలు తిప్పడంతో ట్యాక్సీ క్యాబ్ ఓనర్స్, డ్రైవర్స్ తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైట్ప్లేట్ కార్ల అడ్డాలు తొలగించాలని, ప్రభుత్వ శాఖల్లో బినామీ డ్రైవర్ల పేర్లతో వైట్ ప్లేట్ కార్లు తిప్పుతున్నరని ఇలాంటి కార్లపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నాయకులు వంగల లక్ష్మారెడ్డి, ఎల్దండి చందు, గుంటుకు శ్రావణ్కుమార్, నూనిగంటి రాజు, వీణవంక వరుణ్, మాతంగి రమేశ్, మేకల శివకృష్ణ, వంగల యాదిరెడ్డి, నాచారం భాస్కర్, అజయ్, గసికంటి అనిల్ తదితరులు పాల్గొన్నారు. సజావుగా రేషన్ పంపిణీకరీంనగర్అర్బన్: రేషన్ బియ్యం పంపిణీ సక్రమంగా జరుగుతోందని, కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యం ఒకేసారి ఇవ్వడం జరుగుతుందని, ఇప్పటికే జిల్లాలోని 566 రేషన్ దుకాణాలకు మూవ్మెంట్ ప్రక్రియ కూడా జరిగిందని వివరించారు. మూడు నెలల బియ్యం పంపిణీ జరుగుతున్నందున ఈ నెల 30వరకు పంపిణీ ఉంటుందని, కార్డుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. -
‘ఇందిరమ్మ’ నిబంధనలు సడలింపు
కరీంనగర్రూరల్: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రభుత్వం నిబంధనలను సడలించింది. ఇప్పటివరకు లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు విధానంలో ఉన్న నిబంధనలను మార్పులు చేసింది. గతంలో ఇంటి నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులకు మాత్రమే చివరి బిల్లు మంజూరు చేశారు. ఇక నుంచి నివాసం ఉండేందుకు ఇల్లు అనుకూలంగా ఉంటే నిర్మాణం పూర్తయినట్లుగా అధికారులు పరిగణనలోకి తీసుకుని బిల్లు మంజూరు చేస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటివరకు స్లాబ్ దశ పూర్తయి, తుది దశలో ఉన్న ఇళ్ల లబ్ధిదారులకు చివరి బిల్లు మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి నాలుగు విడతల్లో రూ. 5లక్షలను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. కరీంనగర్ మండలంలో మొదటి విడతలో 1,156 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. మొత్తం 629 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించగా 162 మాత్రమే పూర్తయ్యాయి. మిగతా 467 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. మరికొందరు ప్రస్తుతం మంచిరోజులు కావడంతో కొత్తగా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభిస్తున్నారు. గతంలో నిబంధనలు గతంలో ఇంటి ఫ్లోరింగ్, ప్లాస్టరింగ్, పూర్తిస్థాయిలో ఎలక్ట్రికల్ వైరింగ్ తదితర పనులు పూర్తయిన ఫొటోలను యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉండేది. అనంతరం చివరి బిల్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యేది. చిన్న చిన్న పనులతో సకాలంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో లబ్ధిదారులు బిల్లులు అందక ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యారు. ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ఆ నిబంధనలను సడలించింది. కొత్త నిబంధనల ప్రకారం ప్రస్తుతం సవరించిన నిబంధనల ప్రకారం ముందుగా లబ్ధిదారులు ఇంటి బయట గోడలకు ప్లాస్టరింగ్ చేసుకున్న అనంతరం లోపలి గోడలకు అవసరాన్ని బట్టి చేసుకునే అవకాశముంది. ఇంటికి పూర్తిస్థాయిలో రంగులు వేయకున్నప్పటికీ, గదుల్లో ఫ్లోరింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్, ఫ్లంబింగ్ పనులు పూర్తికాకపోయినా, ప్రధాన ద్వారానికి తలుపు బిగించి, లోపలిగదుల్లో తలుపులు పెట్టకున్నా లబ్ధిదారులకు చివరి బిల్లు తీసుకునే అవకాశముంది. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ దుర్మరణం
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ ఎండీ ఇస్మయిల్(50)దుర్మరణం చెందాడు. గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీకళాశాల సమీపంలోని రాజీవ్ రహదారిపై వెళ్తున్న ఆటోను వెనకాల వస్తున్న కారు బలంగా ఢీకొట్టడంతో ఆటోడ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీస్ల కథనం ప్రకారం.. రామగుండం ముబారక్నగర్కు చెందిన ఎండీ ఇస్మాయిల్ మంగళవారం వేకువజామున తన ఆటోలో ఎన్టీపీసీ నుంచి గోదావరిఖని బస్టాండ్ వైపు బిజిలీ రాధ అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని ఎక్కించుకుని వస్తున్నాడు. హైదరాబాద్ నుంచి వెనకాలే వచ్చిన షిఫ్ట్కారు బలంగా ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆటో తలకిందులు కాగా బిజిలీ రాధ తలకు గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కారు కూడా తలకిందులైంది. స్థానిక కల్యాణ్నగర్కు చెందిన బొంకూరి పవన్కుమార్ తనమిత్రులు చిరంజీవి, రాజేశ్తో కలిసి హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్న పవన్కుమార్, చిరంజీవి, రాజేశ్కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇస్మాయిల్ మృతి చెందారు. మృతుడి సోదరుడు ఇబ్రహీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ ఇంద్రసేనారెడ్డి కేసునమోదు చేసుకున్నారు. కళ్లెదుటే ఉంటానన్నాడు.. కనిపించకుండా పోయాడు రామగుండం: ‘కళ్లెదుటే ఉంటానన్నాడు.. కనిపించకుండా పోయాడు.. హెవీలైసెన్స్ ఉంది.. డ్రైవింగ్లో నిష్ణాతుడు.. దూర ప్రాంతాలకు వెళ్తే కుటుంబసభ్యులకు రోజుల తరబడి దూరంగా ఉండాల్సి వస్తుందన్నాడు.. నేషనల్ హైవేలపై అనూహ్య ఘటనలు జరిగితే భార్యాపిల్లల భవితవ్యం ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన చెందాడు.. అందుకే మూడేళ్లక్రితం ఆటో కొనుగోలు చేశాడు.. స్థానికంగానే ఆటో నడుపుతూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకున్నాడు. లారీ డ్రైవర్ పని వద్దనుకున్నా మృత్యుడు మాత్రం వెంటాడింది’ అని మృతుడి భార్య నసీమా, కూతుళ్లు తహసీన్, తన్వీర్ రోదిస్తున్న తీరు ప్రతీఒక్కరిని కంటతడి పెట్టించింది. వివరాలు.. పెద్దపల్లి జిల్లా రామగుండం ముబారక్నగర్లో నివాసం ఉంటున్న ఇస్మాయిల్(36)తోపాటు తండ్రి, నలుగురు కుమారులు డ్రైవర్లుగానే పనిచేస్తున్నారు. ఇస్మాయిల్కు 17ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. అయోధ్యనగర్లో భార్యాపిల్లలతో వేరేకాపురం పెట్టాడు. లారీలు రోడ్డు ప్రమాదాలకు గురై డ్రైవర్లు మృత్యువాత పడుతుండడంతో భార్య నసీమా.. భారీ వాహనాల డ్రైవింగ్ వద్దని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో మూడేళ్లక్రితం ఆటో కొనుగోలు చేసి స్థానికంగానే నడుపుతున్నాడు. పెద్ద కూతురు తహసీన్ ఇంటర్మీడియట్, చిన్న కూతురు తన్వీర్ పదో తరగతి చదువుతోంది. మరోమూడు రోజుల్లో ఈమే చివరి పరీక్ష రాయాల్సి ఉంది. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలనే లక్ష్యంతో భార్య కుట్టుమిషన్తో వచ్చే సంపాదన ఇంటి ఖర్చులకు ఆసరాగా నిలుస్తోంది. ఎంతోహాయిగా సాగిపోయే కుటుంబంలో గోదావరిఖనిలో మంగళవారం కారు, ఆటో ఢీకొన్ని ప్రమాదంలో ఇస్మాయిల్ దుర్మరణం చెందడం తీవ్ర విషాన్ని నింపింది. ముబారక్నగర్, అయోధ్యనగర్ కాలనీవాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. గోదావరిఖనిలో కారు, ఆటోఢీ దుర్మరణం చెందిన ఆటోడ్రైవర్ ఆటోను వెనకాల ఢీకొన్న కారు రాజీవ్ రహదారిపై ఘటన -
‘కవల’లకు పిట్టకు పెడితే భైరవులొచ్చారు
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం జూబ్లీనగర్లో ఈ నెల 3న తండ్రి కచ్చు శ్రీశైలం చేతిలో హత్యకు గురైన కవల పిల్లలు గీతాన్శ్రీ, గీతాన్వికలకు మంగళవారం పిట్టకు పెట్టగా ఎక్కడి నుంచో రెండు నల్లకుక్కలు వచ్చి ఆహారం తినడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ఎవరైనా చనిపోతే మూడు, ఐదు రోజుల్లో కుటుంబసభ్యులు పిట్టకు పెట్టే సంప్రదాయం ఉంది. చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన ఆహారం తయారు చేసి పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో కవలలు మృతిచెంది మంగళవారం ఐదవ రోజు కావడంతో తల్లి మౌనికతో పాటు బంధువులు పొలంలో పూడ్చిపెట్టిన బొందల వద్దకు వచ్చారు. పిల్లలకు ఇష్టమైన ఆహారం, చాక్లెట్లు, బిస్కెట్లు ఇతర ఆహార పదార్థాలను విస్తారాకుల్లో పెట్టి సమాధిపై పెట్టారు. పిట్ట కోసం ఎదురుచూస్తుండగా ఒకే రకం రెండు నల్లకుక్కలు వచ్చి ఆహారాన్ని తినడం ప్రారంభించాయి. కాగా, తన ఇద్దరు బిడ్డలు నల్లకుక్కల రూపంలో వచ్చారంటూ తల్లి మౌనిక రోదించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కంటతడి పెట్టారు. బతికున్నప్పుడు పిల్లలను ఒక్కరోజైనా సరిగా చూసుకోని తండ్రి శ్రీశైలంపై శాపనార్థాలు పెట్టారు. -
చికిత్స పొందుతూ రైతు మృతి
● అవయవాలు దానం చేసిన కుటుంబ సభ్యులు కరీంనగర్: ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన మాసిపెద్ది నారాయణరావు పొలానికి నీరు పెట్టేందుకు ఈనెల 2న బైక్పై వెళ్తుండగా.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన ఓ కుటుంబం కారులో ధర్మపురి నుంచి కరీంనగర్కు వెళ్తూ అంబరిపేట స్టేజీ వద్ద ఢీకొంది. ఈ ఘటనలో నారాయణరావు తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం బ్రెయిన్డెడ్ అయ్యాడు. విషయాన్ని వైద్యులు వారి కుటుంబసభ్యులకు తెలియజేయగా భార్య రాణి, కుమారులు రఘుపతిరావు, రాకేశ్రావు నారాయణ రావు అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. జీవన్దాన్ సంస్థకు సమాచారం అందించారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి రెండు కిడ్నీలు, లివర్ ఇచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తమ తండ్రి అవయవాలు మరొకరికి జీవితాన్ని ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ముత్తారంలో మహిళ.. ముత్తారం: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఇప్పలపల్లి(రామకృష్ణాపూర్) గ్రామానికి చెందిన తుండ్ల సుమతి(50) పురుగుల మందు తాగిన మైకంలో కాలుజారీ వ్యవసాయ బావిలోపడగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఈనెల 4న ఆర్థిక ఇబ్బందులతో పురుగులమందు తాగిన సుమతి.. తనఇంటి సమీపంలోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడగా చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. భర్త రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. -
భక్తుడి బ్రాస్లెట్ అప్పగించిన వ్యాపారి
వేములవాడఅర్బన్: భీమేశ్వరస్వామి దర్శనానికి మంగళవారం వచ్చిన ఓ భక్తుడు పోగొట్టుకున్న బంగారు బ్రాస్లెట్ను వ్యాపారి తిరిగి అప్పగించారు. నర్సంపేటకు చెందిన ప్రణయ్ స్వామివారి దర్శనం అనంతరం బయటకు వెళ్తుండగా బంగారు బ్రాస్లెట్ ఆలయం పరిసరాల్లో పడిపోయింది. అక్కడే ప్యాలాలు విక్రయించుకునే వారికి దొరకడంతో తమదంటే తమదని వాదనకు దిగారు. వేములవాడలోని గాంధీనగర్లో పదేళ్లుగా సోడాబండి వ్యాపారం చేస్తున్న కొంపల్లి రమేశ్ ఆ బ్రాస్లెట్ను తీసుకొని ఆలయంలోని ఎస్పీఎఫ్ హోంగార్డులకు అందజేశారు. ఈ విషయాన్ని ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్శర్మకు తెలియడంతో భక్తుడు ప్రణయ్కు ఈవో అంజనారెడ్డి చేతుల మీదుగా అప్పజెప్పారు. నిజాయితీగా వ్యవహరించిన కొంపల్లి రమేశ్ను ఈవో అభినందించారు. -
ఆటోమేషన్ .. మానవరహితం
పెద్దపల్లిరూరల్: వినియోగదారులకు మెరుగైన నా ణ్యమైన విద్యుత్ సేవలు నిరంతరం అందించేందు కు ట్రాన్స్కో ఆధునిక సాంకేతికతతో ముందుకు సా గుతోంది. ఇప్పటికే నిరంతరాయంగా విద్యుత్ సేవలను ఆందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న అధికారులు.. తాజాగా ‘ఆటోమేషన్’ పద్ధతిన సబ్స్టేషన్లను నిర్వహించేందుకు శ్రీకా రం చుడుతున్నారు. ఇది అమల్లోకి వస్తే సబ్స్టేషన్ల నిర్వహణ కోసం ఉద్యోగ, సిబ్బంది అవసరమే ఉండ దు. మానవరహిత సబ్స్టేషన్లుగా మారనున్నా యి. ఇందుకోసం జిల్లాలో ప్రయోగాత్మకంగా రామగుండం నియోజకవర్గంలోని గౌతమినగర్, రాంమందిర్ఏరియా సబ్స్టేషన్లలో ఈనెల నుంచి అమలు చే సేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. తొలివిడతలో 28 సబ్స్టేషన్లలో.. జిల్లాలో 69 విద్యుత్ సబ్స్టేషన్లు ఉన్నాయి. అందులో ఆటోమేషన్ పద్ధతిని అమలు చేసేందుకు వీలుగా తొలివిడతలో 28 విద్యుత్ సబ్స్టేషన్లలో ఆటోమేషన్ పద్ధతికి శ్రీకారం చుడుతున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. మలివిడతలో మరో 8 విద్యుత్ సబ్స్టేషన్లలో ఈ పద్ధతి అమలు కానుందని పేర్కొన్నాయి. ఆధునికీకరించేందుకు రూ.30 లక్షల ఖర్చు విద్యుత్ సబ్స్టేషన్ల నిర్వహణ, సరఫరా విషయంలో తలెత్తే సాంకేతిక సమస్యలను సులువుగా గుర్తించడమే కాకుండా నేరుగా వరంగల్ సర్కిల్లోని ఉన్నతాధికారులకు చేరవేసేలా ఆటోమేషన్ పద్ధతి(స్కాడర్ కంట్రోల్రూం) ద్వారా అనుసంధానిస్తారు. ఇందుకోసం ఒక్కోవిద్యుత్ సబ్స్టేషన్లో రూ.27 లక్షల నుంచి రూ.30 లక్షల దాకా ఖర్చుచేయనున్నట్టు సమాచారం. ఇందుకోసం జిల్లాకు ఇప్పటికే రూ.17కోట్లు కేటాయించినట్టు తెలిసింది. ఆటోమేషన్ పద్ధతి అమల్లోకి వస్తే సమస్యలను గుర్తించడం చాలా తేలిక అవుతుంది. దీంతో సమయం ఎంతగానో ఆదా అవుతుంది. ఉద్యోగ, సిబ్బంది లేకుండానే ఆటోమేషన్ పద్ధతి అమల్లోకి వస్తే సాంకేతికతతోనే సమస్యలను గుర్తించి అందుబాటులో ఉన్న సిబ్బందిని వరంగల్ కంట్రోల్రూం నుంచి అప్రమత్తం చేసి నేరుగా సమస్య ఉన్న చోటికే వెళ్లి తక్కువ సమయంలోనే పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటారు. ఇందుకోసం ఇప్పటికే అవసరమైన వాహనాలు, ఇతర సదుపాయాలను సైతం సమకూర్చుకున్నారు. ఆటోమేషన్ సిస్టం అమలైతే విద్యుత్ సబ్స్టేషన్లు మానవరహిత సబ్స్టేషన్లుగా మారడం ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సబ్స్టేషన్ల నుంచి నిరంతరం విద్యుత్ సరఫరా ఆధునిక సాంకేతితతో నాణ్యమైన విద్యుత్ సరఫరా ప్రయోగాత్మకంగ జిల్లాలో రెండు సబ్స్టేషన్లలో అమలు విద్యుత్ వినియోగదారుల కు నిరంతరాయంగా మెరుగైన విద్యుత్ సేవలను అందించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నాం. సబ్స్టేషన్లలో లేదా ఇతర లైన్లలో తలెత్తే అంతరాయాలను ఆటోమేషన్ గుర్తించి వరంగల్ కంట్రోల్రూంకు, సమీప అధికారులకు వాట్సాప్ ద్వార సమాచారం అందిస్తుంది. అక్కడి నుంచి అధికారులు పర్యవేక్షించి సమీప అధికారులు, సిబ్బందికి సూచనలిచ్చి సమస్యకు పరిష్కారం చూపుతారు. – గంగాధర్, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్ -
చలించి.. కుటుంబాన్ని ఏకం చేసి..
● తండ్రిని కొడుకుల చెంతకు చేర్చిన ప్రధాన న్యాయమూర్తి ● కోర్టు ఆవరణలోనే ప్రత్యేక కార్యక్రమం.. ● కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ జగిత్యాలజోన్: ఇటీవల జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఇందులో కొడుకులు ఉన్నప్పటికీ ఓ తండ్రి అనాథగా ఆశ్రమంలో ఉన్నాడు. మరో చోట తల్లిదండ్రులు మరణించడంతో ముగ్గురు పిల్లలు భిక్షాటన చేస్తూ కనిపించారు. ఈ రెండు ఘటనలు ఆమెను కలచివేశాయి. ప్రత్యేకంగా చొరవ తీసుకున్న ఆమె అనాథ ఆశ్రమంలో ఉన్న మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన గంగారాం కొడుకులు గణేష్, గంగాధర్కు జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా నోటీసులు పంపించారు. ఆ ఇద్దరూ కోర్టుకు రావడంతో చిన్నతనంలో తండ్రి పెంచిన మమకారం, ఆయన పడిన కష్టాన్ని కళ్లకు కట్టినట్టు జడ్జి వారికి వివరించారు. దీంతో తమ తప్పును తెలుసుకున్న ఆ కుమారులు గంగారాంను ఇంటికి తీసుకెళ్లేందుకు ఒప్పుకోవడంతో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి అప్పగించారు. అలాగే తల్లిదండ్రులు కోల్పోయి భిక్షాటన చేస్తున్న ముగ్గురు చిన్నారులను జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా చేరదీసి జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన వసతితో కూడిన విద్యాభోదన అందించేలా ఏర్పాట్లు చేశారు. చిన్నారులను కూడా ప్రత్యేక కార్యక్రమానికి పిలిచి, బాగా చదువుకుని ఉన్నతులుగా ఎదగాలని, ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని జడ్జి వారికి సూచించారు. అనుబంధాలను మించిన సంపద లేదని, ఆస్తులు పంచుకోవడమే కాకుండా వృద్ధాప్యంలో తల్లిదండ్రులను సరిగా చూసుకోవాలన్నారు. లోక్ అదాలత్ విజయవంతం జిల్లా వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన లోక్ అదాలత్లో 3,034 కేసులు పరిష్కారంలో చొరవ చూపిన జడ్జిలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీసు అధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి మంగళవారం ప్రశంసపత్రాలు అందించారు. అత్యధిక కేసులు పరిష్కరించి మొదటిస్థానంలో నిలిచిన జగిత్యాల పోలీస్స్టేషన్, రెండోస్థానంలో నిలిచిన మెట్పల్లి, మూడోస్థానంలో నిలిచిన రాయికల్ పోలీస్స్టేషన్ల ఎస్సైలు, కోర్టు కానిస్టేబుళ్లను జడ్జిలు సన్మానించారు. పిటీ కేసుల్లో మొదటి, రెండు, మూడుస్థానాల్లో నిలిచిన జగిత్యాల, వెల్గటూర్, గొల్లపల్లి పోలీస్స్టేషన్ అధికారులను సన్మానించారు. ఎస్పీ అశోక్కుమార్, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి సుగళి నారాయణ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, రెండో అదనపు జుడిషియల్ మేజిస్ట్రేట్ నిఖిషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రాజేష్, ప్రణయ్, మాజీ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, సిబ్బంది షఫీ, శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, వెంకన్న పాల్గొన్నారు. చిన్నారులను అభినందిస్తున్న జడ్జి, ఎస్పీ తండ్రి కాళ్లు మొక్కి ఇంటికి తీసుకెళ్తున్న కొడుకులు -
ఎట్లున్నవ్ రాజన్నా..
● స్వగ్రామానికి మావోయిస్ట్ మల్లా రాజిరెడ్డి ● ఆప్యాయతతో పలకరించిన శాస్త్రుల్లపల్లి గ్రామస్తులు మంథనిరూరల్: ‘ఎన్నాళయ్యింది చూసి.. ఎట్లున్నవ్ రాజన్నా’ అని మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ను శాస్త్రులపల్లి గ్రామస్తులు పలకరించారు. మావోయిస్టు పార్టీని వీడి ఇటీవల జనజీవనంలోకి వచ్చిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి తన స్వగ్రామమైన పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని శాస్త్రులపల్లికి మంగళవారం వచ్చారు. మావోయిస్టు పార్టీని వీడిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. ఎప్పుడు తమ గ్రామానికి వస్తాడా.. ఎప్పుడు ఆయనను చూస్తామా.. అని ఎదురు చూస్తున్న క్రమంలో మంగళవారం వచ్చిన ఆయనను గ్రామస్తులు ఆప్యాయతతో పలకరించారు. చిన్నాపెద్దా, తేడా లేకుండా ఆయనను పలకరిస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. రాజిరెడ్డి ఉద్యమంలో వెళ్లిన స మయంలో యువకులుగా ఉన్నవాళ్లంతా ఆయనను కలుసుకుని కాసేపు ముచ్చటించారు. అయితే తన ఆరోగ్య సమస్యలతో అజ్ఞాత జీవితాన్ని వీడి బయటకు వచ్చినట్లు మీడియాకు తెలిపారు. మల్లాను కలిసిన మాజీ ఎమ్మెల్యే మల్లా రాజిరెడ్డి ఉరఫ్ సంగ్రామ్ 40ఏళ్ల తర్వాత తొలిసారి తన స్వగ్రామమైన మంథని మండలం ఎగ్లాస్పూర్ గ్రామ పంచాయతీ పరిధి శాస్త్రులపల్లికి రాగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆయనను కలిసి మాట్లాడారు. మావోయిస్టు ఉద్యమంలో అనుభవాలు, ఎదురైన సంఘటనలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. నాయకులు తగరం శంకర్లాల్, లొడారి రాములు తదితరులు ఉన్నారు. -
వ్యాధులు రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి
కరీంనగర్: వ్యాధి వచ్చిన తర్వాత బాధపడేకంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలని మన ఆరోగ్యం– మన బాధ్యత అనే భావనతో జీవనశైలిని మార్చుకోవాలని మెడికవర్ వైద్యులు వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో నిర్వహించిన ఆరోగ్య అవగహన కార్యక్రమంలో మాట్లాడారు. షుగర్, బీపీ, గుండె, కిడ్నీ సమస్యలు వంటి వ్యాధులు వచ్చినప్పుడు సోషల్ మీడియాపై ఆధారపడి స్వయంగా మందులు వాడడం ప్రమాదకరమని హెచ్చరించారు. వైద్యుల సూచనల మేరకు చికిత్స పొందడం అవసరమన్నారు. మద్యం, పొగ తాగడం, డ్రగ్స్ వినియోగం, జంక్ ఫుడ్ తీసుకోవడం వంటి అలవాట్లను మానుకోవాలని సూచించారు. పోషకాహారం తీసుకోవడం, శారీరక వ్యాయామం చేయడం, పనిలో ఒత్తిడిని తగ్గించుకోవడం, మంచి నిద్ర ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని తెలిపారు. ప్రస్తుతం 100 మందిని పరీక్షిస్తే 80 మందికి కొలెస్ట్రాల్ సమస్య ఉంటుందని, వారు రెగ్యులర్గా చికిత్స పొందకుండా నిర్లక్ష్యం చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని వెల్లడించారు. ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకుంటేనే మంచి భవిష్యత్తు సాధ్యమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సెంటర్హెడ్ గుర్రం కిరణ్, కార్డియాలజిస్టు అనీష్ పబ్బ, జనరల్ ఫిజీషియన్లు నాగరాజు, లోకేష్, క్రిటికల్కేర్ డాక్టర్ ఉపేందర్రెడ్డి, జనరల్ సర్జన్ తాహా, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, దాసరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్ఐసీ ఏజెంట్ హఠాన్మరణం
కోల్సిటీ: గోదావరిఖని జీఎంకాలనీకి చెందిన ఇరుగురాళ్ల శ్రీనివాస్ (50) అనే ఎల్ఐసీ ఏజెంట్ మంగళవారం అకస్మాత్తుగా మృతి చెందాడు. ఇంట్లో అస్వస్థతకు గురైన శ్రీనివాస్ను జీజీహెచ్కు తరలించారు. చికిత్స ప్రారంభించేలోగా మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుకి సన్స్ట్రోక్ లక్షణాలే అయి ఉంటాయని కుటుంబ సభ్యులు, ఏజెంట్లు తెలిపారు. అంత్యక్రియల కోసం వారి స్వగ్రామమైన ధూళికట్ట గ్రామానికి తరలించారు. కాగా, శ్రీనివాస్ పార్థివదేహానికి ఏజెంట్ల సంఘం అధ్యక్షుడు జనగామ సదయ్య, ప్రధాన కార్యదర్శి కటకం సతీశ్, కోశాధికారి అంబాల బాబు, జోనల్ నాయకులు బుర్ర దామోదర్తోపాటు ఎంప్లాయ్ అసోసియేషన్ నాయకులు, ఏజెంట్లు నివాళి అర్పించారు. మహిళ ఆత్మహత్య పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామానికి చెందిన యాదగిరి భాగ్యలక్ష్మి(45) కడుపునొప్పి బాధ భరించలేక మంగళవారం క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబీకులు వెంటనే పెద్దపల్లి ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. మృతురాలి భర్త కనకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై మల్లేశ్ తెలిపారు. కాలువలో వ్యక్తి మృతి ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి–ఓదెల గ్రామాల మధ్య ఎస్సారెస్పీ డీ–86కాలువలో గోదావరిఖనికి చెందిన బండారి రామరాజు(58) పడి మృతిచెందాడు. మంగళవారం ఉదయం కాలువలో రామరాజు మృతదేహం కొట్టుకురాగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బంధువులకు సమాచారం ఇచ్చారు. గోదావరిఖనికి చెందిన రామరాజు ఎలిగేడు మండలం శివపల్లికి తన స్నేహితుడి వద్దకు వచ్చినట్లు సమాచారం. అయితే, ప్రమాదవశాత్తు జారిపడ్డడా, లేదా ఇతరత్రా కారణాలు ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. విద్యార్థిపై కోతుల దాడిముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని పోతుగల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులపై కోతులు దాడులు చేశాయి. పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న ఐదుగురిపై దాడి చేయడంతో వారు భయాందోళనకు గురయ్యారు. ఐదో తరగతి చదువుతున్న మాచర్ల లక్కిపై కోతులు దాడి చేశాయి. అదే సమయంలో అటుగా వచ్చిన ఒకరు కోతులను వెళ్లగొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న లక్కి తండ్రి మాచర్ల భూపతి వెంటనే చిన్నారిని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిరుత దాడిలో దూడ మృతిసిరిసిల్ల అర్బన్: సిరిసిల్ల పట్టణ పరిధిలోని 10వ వార్డు చిన్నబోనాలలో దూడపై చిరుతదాడి చేసింది. బాధితుడు బోనాల ముత్యం రాజు తెలిపిన వివరాలు. తనకున్న పొలం వద్ద నిర్మించిన పశువుల పాకలో సోమవారం రాత్రి పశువులను కట్టేసి ఇంటికెళ్లాడు. మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా దూడె మృతిచెంది ఉంది. రైతు మాట్లాడుతూ రూ.30వేలు విలువ చేసే దూడెను చిరుత చంపివేసిందని రోదించాడు. అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని చిరుత పాదముద్రలను గుర్తించారు. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక కౌన్సిలర్ బొల్గం వైష్ణవినాగరాజు కోరారు. పాఠశాలలో గ్యాస్ సిలిండర్లు, వంట సామగ్రి చోరీ శంకరపట్నం: కొత్తగట్టు ప్రాథమిక పాఠశాలలో గ్యాస్ సిలిండర్లు, వంట సామగ్రి చోరీకి గురైనట్లు ఉపాధ్యాయులు తెలిపారు. సోమవారం విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వండిన నిర్వాహకులు వంట పాత్రలు శుభ్రం చేసి వంట గదిలో పాత్రలు భద్రపర్చి తాళం వేసి ఇంటికెళ్లారు. మంగళవారం పాఠశాలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు రాగా.. వంట గదికి వేసిన తాళం పగలగొట్టి ఉంది. దొంగలు 2 గ్యాస్ సిలిండర్లు, వంట పాత్రలు చోరీ చేశారు. ఓ పాత్రను పాఠశాల ఆవరణలో వదిలి వెళ్లారు. కేశవపట్నం పోలీసులు వివరాలు సేకరించారు. హైదరాబాద్కు తరలిరండి పెద్దపల్లి: హైదరాబాద్లో ఈనెల 14న నిర్వహించే పీడీఎస్యూ నేత జార్జిరెడ్డి వర్ధంతి స భను విజయవంతం చేయాలని ఆ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కూతటి రాణాప్రతాప్ కోరారు. జార్జిరెడ్డి వర్ధంతి సభ ప్రచార పోస్టర్ను స్థానిక నాయకులతో కలిసి జిల్లా కేంద్రంలో మంగళవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థి ఉద్యమాలకు మార్గదర్శకుడు జార్జిరెడ్డి అన్నారు. పీడీఎస్యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు లోకిని రమేశ్, ప్రతినిధులు సుమన్, చందు, నవీన్, శ్యామ్, సంధ్య, శ్రావణి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యం.. ఆనందం
కరీంనగర్: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యంగా లేకుంటే కొట్లాది రూపాయలు ఉన్నా సుఖం లేనట్లే. ప్రస్తుత జీవనశైలితో ప్రపంచ ఆరోగ్యం తిరోగమన బాటపడుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రోగాలు పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధపెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948లోనే గుర్తించింది. తొలిసారిగా వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఏర్పాటు చేసింది. ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించాలని ఈ అసెంబ్లీ 1950లో తీర్మానించింది. దీర్ఘకాలిక వ్యాధులపై దృష్టి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై దృష్టిపెట్టింది. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించేందుకు కొంతకాలంగా ఎన్సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజ్) పేరుతో స్క్రీనింగ్ పరీక్షలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తున్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్తో పాటు పలు రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే వైద్యం అందించేందుకు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. 2 లక్షల మందికి స్క్రీనింగ్ జిల్లాలో 10.5 లక్షల జనాభా ఉండగా, ఎన్సీడీ ప్రో గ్రాం కింద 5.2 లక్షల పరీక్షలు లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటి వరకు 2 లక్షల పైచిలుకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో బీపీ, షుగర్, క్యాన్సర్ బాధితులు ఉన్నట్లు గుర్తించి అందరికీ వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్యం కోసం జాగ్రత్తలు – 6 నెలలకు ఒకసారి హెల్త్ చెక్అప్ తప్పనిసరి. సిగరేట్, మద్యపానం, గుట్కా, గంజాయి, డ్రగ్స్కు దూరంగా ఉండాలి. – నిత్యం వ్యాయామం, అరగంటపాటు వాకింగ్ చేయాలి. జంక్ఫుడ్, హోటల్ ఫుడ్కు దూరంగా ఉండాలి. ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. – వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్, హార్ట్ సమస్యలకు చికిత్స తీసుకోవాలి. బీపీ, షుగర్, క్యాన్సర్ ఉంటే మరింత జాగ్రత్తలు పాటించాలి. ఒత్తిడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జిల్లాలో పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 35 నుంచి 50 ఏళ్ల లోపు వారే అధికం ఎన్సీడీ ప్రోగ్రాంతో బయటపడుతున్న రోగులు జీవన విధానం, ఆహారంలో మార్పులే కారణం నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జిల్లాలో.. బీపీ బాధితులు : 68 వేలు షుగర్ బాధితులు : 39 వేలు చేసిన పరీక్షలు : 2 లక్షలు పరీక్షల లక్ష్యం : 5.2 లక్షలు ––––––––––––––– కేన్సర్ కేసులు బ్రెస్ట్ క్యాన్సర్ : 60 ఓరల్ క్యాన్సర్ : 10 సర్వైకల్ క్యాన్సర్ : 20 ఇతర క్యాన్సర్ కేసులు : 08 -
సిద్ధాంతమే బీజేపీ బలం
గన్నేరువరం(మానకొండూర్): బీజేపీ ఎంచుకున్న సిద్ధాంతం, భావజాలంతోనే ఈ స్థాయికి వచ్చిందని, ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు కల్గిన పార్టీగా అవతరించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం గుండ్లపల్లి స్టేజీలో జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఇద్దరు ఎంపీలతో ప్రారంభమైన బీజేపీ నేడు దేశాన్ని ఎలుతోందని, వరుసగా 3 సార్లు కేంద్రంలో అధికారం చేపట్టి దేశంలో తిరుగులేని శక్తిగా అవతరించిందన్నారు. బీజేపీ అంత్యోదయ సిద్ధాంతం ఎంతో గొప్పదని, పార్టీ సిద్ధాంతకర్త పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ ఆకాంక్షించినట్లు పేదలందరికీ సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందించాలనే సంకల్పంతో మోదీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. దేశ ప్రజలాంత బీజేపీపై ఎనలేని విశ్వాసంతో ఉన్నారని, అందుకే మూడుసార్లు కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాడానికి కృషి చేయాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు వినుగొండ నాగేశ్వర్రెడ్డి, కరివేద మహిపాల్రెడ్డి, పుల్లెల పవన్, సర్పంచులు సొల్లు అజయ్వర్మ, రాజిరెడ్డి, రాజేందర్రెడ్డి, సా యికృష్ణ, జగన్, పిస్క కిట్టు, రాము, సోమరాజురెడ్డి, రామచంద్రం, మహేందర్, సురేందర్రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ -
ఉపాధిహామీ కూలీ మృతి
కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్తనపేటలో ఉపాధిహామీ పనుల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొత్తకొండ దేవవ్వ(53) అనే ఒంటరి మహిళ సోమవారం ఉపాధిహామీ పని చేస్తుండగా అకస్మాత్తుగా స్పృహ తప్పి కుప్పకూలింది. సహచర కార్మికులు గమనించి వెంటనే సిరిసిల్లలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దేవవ్వను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. ఒంటరి మహిళ దేవవ్వ ఉపాధిహామీ పనులు చేస్తూ కాలం వెల్లదీస్తుంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఏపీడీ నర్సింహులు, ఏపీవో శ్రీనివాస్ పరామర్శించి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనుమానాస్పదంగా వృద్ధురాలు..సైదాపూర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎలబోతారంలో నూనె వెంకటమ్మ(75) అనే వృద్ధురాలు ఆదివారం వ్యవసాయబావిలో పడి అనుమానాస్పదంగా మృతిచెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. వెంకటమ్మ కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతోంది. నడవలేని స్థితిలో ఉన్న వెంకటమ్మ గ్రామ సమీపంలోని వ్యవసాయబావిలో మృతిచెంది ఉంది. ఇంట్లో కనిపించడం లేదని బంధువులు, గ్రామస్తులు పలువురి వ్యవసాయ బావుల్లో గాలించారు. ఆచూకీ లభించలేదు. అనుమానంతో ఒక వ్యవసాయ బావిలోని నీటిని మోటార్ ద్వారా తోడించారు. ఇంతలో దగ్గరలో ఉన్న వ్యవసాయ బావిలో వృద్ధురాలు శవం లభించింది. నడవలేని స్థిలో ఉన్న వెంకటమ్మ బావి వద్దకు ఎలా వెళ్లిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్సై స్వాతి పరిశీలించారు. మృతురాలి భర్త గతంలోనే మృతిచెందగా, ఒక కూతురు, నలుగురు కుమారులు ఉన్నారు. రైలు ఢీకొని వలసకూలీ ..ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ రైల్వేస్టేషన్లో ఆదివారం రాత్రి రైలు ఢీకొని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భార్వని జిల్లా బాల్ఖడ్ఘూటి గ్రామానికి చెందిన రాహుల్(23) మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా రామగుండం జీఆర్పీఎఫ్ హెడ్కానిస్టేబుల్ తిరుపతి కథనం ప్రకారం.. కాంట్రాక్టు కూలీగా పనిచేయడం కోసం తల్లి సూలిబాయితో కలిసి రాహుల్ ఇటీవల కొలనూర్కు వచ్చాడు. రైల్వేస్టేషన్ సమీపంలో గుడిసేలో నివసిస్తున్నాడు. ఆదివారం తన తల్లివద్ద రూ.500 తీసుకున్నాడు. అనంతరం మద్యం మత్తులో ప్లాట్ఫామ్ దాటుతుండగా గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో తల పగిలి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొన్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. మెట్ల పైనుంచి పడి వ్యక్తి ..ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం నాంసానిపల్లె గ్రామానికి చెందిన పెనుకుల కొమురయ్య(54) మెట్ల పైనుంచిపడి మృతి చెందాడు. పొత్కపల్లి ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. కొమురయ్య మెట్ల పైనుంచి కిందకు దిగుతుండగా ప్రమాదవశాత్తు కిందపడగా తలకు గాయమైంది. వెంటనే పెద్దపల్లి ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడు. మృతుడి భార్య భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసున మోదు చేసుకొన్నట్లు ఎస్సై వివరించారు. గుండెపోటుతో బాలుడు..జగిత్యాలక్రైం: జగిత్యాల మండలం పొరండ్ల గ్రామానికి చెందిన తోపారపు నిషాంత్ (9) గుండెపోటుతో సోమవారం మృతిచెందాడు. చంద్రశేఖర్, నవిత దంపతుల కుమారుడు నిషాంత్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. వారి వ్యవసాయ పొలం వద్దనున్న శివాలయంలో అన్నదానం చేస్తుండగా నిషాంత్కు ఫిట్స్ వచ్చింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో గుండెపోటు రావడంతో మృతిచెందాడు. కర్ణాటక వాటర్ ఫాల్స్లో యువకుడు..కోరుట్ల: కర్ణాటకలోని అంకోలా పోలీస్ స్టేషన్ పరిధిలో విభూత వాటర్ ఫాల్స్లో ప్రమాదవశాత్తు పడి కోరుట్ల మున్సిపల్ వీలిన గ్రామం ఎఖీన్పూర్కు చెందిన శీలం అజయ్గౌడ్(25) మృతిచెందాడు. వివరాలు.. ఎఖీన్పూర్కు చెందిన శీలం వెంకటేశ్–లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు అజయ్గౌడ్ 15 రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చాడు. ఆదివారం సరదాగా హైదరాబాద్లో ఉండే ఇద్దరు స్నేహితులతో కలిసి కర్ణాటక టూర్ వెళ్లాడు. సోమవారం ఉదయం అంకోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని విభూత వాటర్ ఫాల్స్లో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు నీటిలో ఉన్న రాయి తాకి శ్వాస ఆడక మృతిచెందినట్లు సమాచారం. ఆయన వెంట ఉన్న స్నేహితులు ఆజయ్గౌడ్కు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. సోమవారం సాయంత్రం కర్ణాటక వెళ్లారు. అంకోలా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. -
మీడియాపై వీసీ చిందులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో అర్బన్ నక్సలైట్లు ఉన్నారంటూ రేగిన చిచ్చు ఇప్పట్లో ఆరేలా లేదు. ఒకవైపు పోలీసులు అలాంటి వ్యక్తులు ఎవరూ లేరని ప్రకటనలు జారీ చేస్తున్నా.. కొందరు మాత్రం ఈ ప్రచారాన్ని ఆపడం లేదు. ప్రొఫెసర్ సుజాత, వైస్ చాన్స్లర్ వర్గాల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇందులో భాగంగా సోమవారం వర్సిటీలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. యూనివర్సిటీపై వస్తున్న ఆరోపణలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై వీసీ చిందులు తొక్కడం, పోలీసులతో బెదిరించేందుకు యత్నించడం, విద్యార్థులపై కేసులు పెడతా అంటూ హెచ్చరిస్తున్నట్లుగా ఉన్న వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వర్సిటీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. సాయంత్రానికి యూనివర్సిటీ విద్యార్థులు సీపీ గౌస్ ఆలం చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం విశేషం. మీడియాతో వీసీ వాగ్వాదం శాతవాహన గాథల పేరుతో ఔట్సోర్సింగ్ పోస్టులను అమ్ముకుంటున్నారంటూ ‘కొలువులమ్మా.. కొలువులు’ అన్న శీర్షికన సాక్షి దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనానికి స్పందన వచ్చింది. అర్బన్ నక్సలైట్లు, కొలువుల విక్రయాలపై వార్తలను కవర్ చేసేందుకు సోమవారం సాక్షి టీవీతోపాటు, ఇతర ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు శాతవాహన వర్సిటీకి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న వైస్ చాన్స్లర్ ఉమేశ్కుమార్ వారిపై చిందులు తొక్కారు. అసలు మీరెవరు? మిమ్మల్ని ఎవరు లోనికి రానిచ్చారు? ఎవరి అనుమతి తీసుకున్నారు? అని వాగ్వాదానికి దిగారు. దీనికి మీడియా ప్రతినిధులు దీటుగానే స్పందించారు. యూనివర్సిటీ పౌరుల ఆస్తి అని, ఇక్కడకు వచ్చేందుకు తాము ఎవరినీ అనుమతి కోరనవసరం లేదని బదులిచ్చారు. ఈ లోపు వీసీ ఎప్పటిలాగే కొత్తపల్లి పోలీసులను క్యాంపస్లోకి దింపి మీడియాను నియంత్రించేందుకు విఫలయత్నం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ సీసీ కెమెరాల ద్వారా క్యాంపస్ను పర్యవేక్షిస్తూ.. తనకు అనుమానం వచ్చిన ప్రతీ విద్యార్థిని తన ఛాంబర్కి పిలిపించుకుని కేసులు పెడతామంటూ వీసీ హెచ్చరించే వారని విద్యార్థులు తొలి నుంచి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా వీసీ ఉమేశ్కుమార్ పలువురు విద్యార్థులను తన ఛాంబర్కి పిలిపించి కేసులు పెట్టి లోపలేస్తానంటూ మాట్లాడిన వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇవే ఆడియోలు, వీడియోలను త్వరలోనే రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్కు కూడా వర్సిటీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సమర్పించనున్నారు. అదే విధంగా బాధితులు తమను అర్బన్ నక్సలైట్లంటూ చిత్రీకరిస్తున్న వారిపై జాతీయ మహిళా కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్కు కూడా ఫిర్యాదు చేయనున్నారు. శాతవాహన వర్సిటీలో ఎలాంటి అర్బన్ నక్సలైట్లు లేరని స్పష్టం చేస్తూ ప్రకటన జారీచేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం చిత్రపటానికి విద్యార్థులు వర్సిటీ ప్రధానద్వారం ఎదుట క్షీరాభిషేకం చేయడం విశేషం. కరీంనగర్సిటీ: తమపై తప్పుడు ప్రచారం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శాతవాహన విద్యార్థులు డిమాండ్ చేశారు. సోమవారం సీపీ గౌస్ఆలం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. 10 రోజుల నుంచి విద్యార్థులు, పలువురు ప్రొఫెసర్లపై వస్తున్న ఆరోపణలపై సీపీ స్పందించి వర్సిటీలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగడం లేదని తెలుపడంతో తమ ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. పోలీస్శాఖ ఇప్పటికే విచారణ చేసి విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. అశోక్, రోహిత్, మహేశ్, లక్ష్మణ్సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
‘గ్రానైట్’ ఆగడాలకు అడ్డేది..?
సాక్షిప్రతినిధి,కరీంనగర్/కొత్తపల్లి: గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ ఇండస్ట్రీస్ యూనిట్ల ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోయింది. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులే పరిశ్రమలపై ‘ప్రేమ’ ఒలకబోస్తుండడం విస్మయానికి గురిచేస్తోంది. అధికారుల కనుసన్నల్లోనే అన్నీ జరుగుతున్నా అటువైపు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సామాన్యుడిపై విరుచుపడే అధికారగణం బడాబాబుల ఆగడాలను అడ్డుకోలేకపోతోంది. పల్లె ప్రజలు అవస్థలు పడుతుంటే.. కనీస బాధ్యత మరిచిన పరిశ్రమలు మాత్రం తమ అవినీతి సామ్రాజ్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. అధికారుల అలసత్వం.. రాజకీయ అండదండలతో అవినీతి సామ్రాజ్యాన్ని విస్తురించుకుంటున్నారు. గ్రానైట్ పరిశ్రమల అక్రమ లీలలన్నింటినీ చూసుకుంటానన్న ‘ఆయన’ ఎవరూ.. ఆ బడా నేతను బదనాం చేస్తున్న బాద్షా ఎవరనే అంశం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. 350 పైగా గ్రానైట్ పరిశ్రమలు కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్, బద్ధిపల్లి, ఖాజీపూర్, ఎలగందుల, శ్రీరాములపల్లి, కమాన్పూర్, నాగులమల్యాల, గంగాధర మండలం ఒద్యారంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రానైట్ కటింగ్ పరిశ్రమలు నడుస్తున్నాయి. సుమారు 350 పైగా గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీలు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే పరిశ్రమల వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. పరిశ్రమల వ్యర్థాల మూలంగా పల్లెల్లో పర్యావరణం దెబ్బతింటోంది. ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. అయినా అధికారులు అటువైపు చూడకపోగా..గ్రానైట్ పరిశ్రమల యజమానులు మాత్రం కనీస బాధ్యత మరచి వ్యవహరిస్తున్నారు. దుమ్ము, ధూళితో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా పట్టించుకున్న పాపాన పోవడంలేదు. గ్రానైట్ స్లర్రీ మూలంగా కలుషితమవుతున్న భూగర్భ జలాల వల్ల స్థానికులు అనారోగ్యాల బారిన పడకుండా శుద్ధమైన నీటిని అందించే ప్రయత్నాలు చేయాల్సి ఉండగా అవేవీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. రోడ్లపై దుమ్ము లేవకుండా నీటిని చల్లాలి. కానీ, ఇవేవీ ఈ పారిశ్రామిక ప్రాంతంలో అమలు కావడంలేదు. స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేసినప్పుడు మాత్రమే మొక్కుబడిగా నివారణ చర్యలు చేపడుతున్నట్లు నటిస్తూ వదిలేస్తున్నారు. గ్రానైట్ పరిశ్రమల వల్ల కలుగుతున్న అనర్థాలను అధికారులకు ప్రజలు విన్నవిస్తున్నా వాటిని బుట్టదాఖలు చేస్తున్నారు. గ్రానైట్ ఆగడాలకు అడ్డుకట్ట వేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులకెందుకంత ‘ప్రేమ’ గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ పరిశ్రమలు నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా అధికారులెందుకు ‘ప్రేమ’ ఒలకబోస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అనుమతుల్లేకున్నా, పన్నులు కట్టకున్నా గ్రామ పంచాయతీ పట్టించుకోదు. గ్రానైట్ బ్లాక్ దందా, అక్రమ రవాణాపై కమర్షియల్ టాక్స్, రవాణా శాఖ, గ్రానైట్ వ్యర్థాల (స్లర్రీ) నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ చూసుకోవాల్సిన కాలుష్య నియంత్రణ మండలి, నీటి కలుషితమవుతుంటే భూగర్భ జలశాఖ, కార్మికుల బాగోగులు చూడాల్సిన కార్మిక శాఖ, ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను ఆక్రమిస్తే చర్యలు చేపట్టాల్సిన రెవెన్యూ శాఖలు కన్నెత్తి చూడకపోగా..ఇక గ్రానైట్ పరిశ్రమల ఆగడాలెలా ఆగతాయన్న ప్రశ్న తలెత్తకమానదు. ఇంతా జరుగుతున్నా జిల్లా యంత్రాంగం గమ్మునుండటం ప్రజలకు మింగుడుపడడం లేదు. ఇక ఎవరికి చెప్పుకోవాలన్న ఆత్మపరిశీలనలో పడ్డారు. జిల్లా కలెక్టర్ స్పందించి గ్రానైట్ అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు. చూసుకుంటానన్న ‘ఆయనెవరు’.. గ్రానైట్ పరిశ్రమలతో స్థానిక ప్రజలు నరకాన్ని చూస్తుంటే, కనీస నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న మాఫియా పరిశ్రమల ఆగడాలను ‘ఆయనే’ చూసుకుంటారంటూ పరిశ్రమ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పరిశ్రమలపై ఈగ వాలినా ఆ బడా నేత ఊరుకోరంటూ బదనాం చేస్తున్న బాద్షా ఎవరనేది ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో గ్రానైట్ పరిశ్రమల ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. మానవత్వం మరిచి పల్లెల్లో విధ్వంసం సృష్టిస్తూ ఆధిపత్యం కొనసాగిస్తున్న పరిశ్రమలపై ఆ బడా నేత స్పందనపై ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఆ బడా నేత చూపు ప్రజలవైపా..అక్రమార్కుల వైపా అన్న సందేహాలు నెలకొంటున్నాయి. గ్రానైట్ పరిశ్రమలు విచ్చలవిడిగా కాలుష్యాన్ని చిమ్ముతుంటే అధికారులెవ్వరూ స్ప ందించడం లేదు. అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లే దు. గ్రానైట్ పరిశ్రమలు ఉన్న ఖాజీపూర్కు స్లర్రీ రవాణా వాహనాలకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. గ్రానైట్ అసోసియేషన్ చెప్పిందే నడవాల్సి న దుస్థితి నెలకొంది. అధికారులు స్పందించి గ్రా నైట్ పరిశ్రమల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి. – సోమినేని తిరుపతి, ఖాజీపూర్ -
ప్రమాదాల ఘాట్ రోడ్డు..
మల్యాల: కొండగట్టు ఘాట్రోడ్డు.. ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. రోడ్డు వెంట ప్రమాదకర గుంతలు, లోయలు ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూలమలుపుల వద్ద కనీసం రేలింగ్ ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భక్తులు చెబుతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందిస్తున్నారని, అనంతరం చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో రేలింగ్ ఏర్పాటు చేసి ప్రయాణ భద్రత కల్పించాల్సిన ఆవశ్యకత ఉందంటున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆ మేరకు సౌకర్యాల కల్పనలో అధికారులు చొరవ చూపడం లేదనే విమర్శలున్నాయి. ఘాట్రోడ్డు వెంట పలుచోట్ల ఇరువైపులా భారీ గుంతలతోపాటు, రేలింగ్ లేకపోవడం ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ప్రమాదం జరిగినప్పుడే.. స్వామివారి ఆలయానికి వెళ్లే ఘాట్రోడ్డు వెంట ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ప్రమాదాలు జరిగినప్పుడే రక్షణ చర్యలు చేపట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన తర్వాత అధికారులు స్పందించారు. ప్రమాదం జరిగిన చోట మూలమలుపు వద్ద భారీగోడ నిర్మాణం చేపట్టారు. పలుచోట్ల రేలింగ్ నిర్మాణం చేపట్టినప్పటికి పూర్తిస్థాయిలో లేదు. దీంతో ప్రయాణం ప్రమాకరంగా మారింది. గతంలో వైజంక్షన్ నుంచి ఘాట్రోడ్డు వెంట వెళ్తున్న లారీకి బ్రేకులు ఫెయిలై మూలమలుపు వద్ద మెట్లదారిపై పడిపోయింది. ఆ సమయంలో బండరాళ్లతో గోడ నిర్మించారు. ఇంకా చాలాచోట్ల గుంతలు బండరాళ్లు ఉన్నాయి. వైజంక్షన్ దిగువన ఉనన్నో భారీ గుంత వద్ద వాహనదారులు అదుపు తప్పే అవకాశం ఉంది. ఈ క్రమంలో రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని భక్తులు, వాహనదారులు కోరుతున్నారు. భారీ గుంతలతో ఆందోళనలో భక్తులు వాహనాలు అదుపు తప్పితే ఇక అంతే.. పూర్తిస్థాయి రేలింగ్ ఏర్పాటుతోనే రక్షణఘాట్రోడ్డు వెంట పూర్తిస్థాయిలో రేలింగ్ ఏర్పాటు చేయాలి. రాత్రివేళల్లో భక్తుల వాహనాలు అదుపు తప్పితే నేరుగా భారీ గుంతలు, లోయలోకి దుసుకెళ్లి ప్రమాదం ఉంది. అధికారులు స్పందించి రేలింగ్ నిర్మాణం చేపట్టి, భక్తులకు రక్షణ కల్పించాలి. ముత్యం శంకర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చే భక్తుల ప్ర యాణానికి పూర్తి రక్షణ కల్పి స్తాం. ఇప్పటికే ఘాట్రోడ్డు వెంట పలుచోట్ల రేలింగ్ ఏ ర్పాటు చేశాం. ప్రమాదకర స్థ లాలు గుర్తించి ఆయా ప్రాంతాల్లో రేలింగ్ ఏర్పాటు చేస్తాం. భక్తుల రక్షణ కోసం కృషి చేస్తున్నాం. – అంజనా రెడ్డి, ఆలయ ఈవో -
హత్య చేసి.. ఆపై పారిపోయి
వేములవాడ: 2011లో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడు కొండపల్లి బుచ్చయ్యను ఆదివారం రిమాండ్కు తరలించినట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. 2011లో వేములవాడలో కొండపల్లి జమున, ఆమె భర్త కొండపల్లి బుచ్చయ్యహత్యకు సంబంధించి కేసు నమోదైందన్నారు. విచారణ పూర్తయి నిందితుడికి శిక్ష విధించినప్పటికీ కొండపల్లి బుచ్చయ్య తప్పించుకొని తిరుగుతున్నాడని తెలిపారు. ఈక్రమంలో కోర్టు అతనిపై నాన్–బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని వివరించార. ఎస్సై రామ్మోహన్, కానిస్టేబుళ్లు గోపాల్, ఇమ్రాన్ ప్రజ్ఞాపూర్ వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కోర్టులో హాజరుపరిచి, రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఎస్సై రామ్మోహన్, కానిస్టేబుళ్లు గోపాల్, ఇమ్రాన్లను సీఐ అనందించారు. 15 ఏళ్లకు దొరికిన నిందితుడు -
రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వాలి
● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్/కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్ కల్చరల్: బల్ది యా నూతన పాలకవర్గం నగరాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. డంప్యార్డ్ సమస్య పరిష్కారానికి, పెండింగ్ పనుల పూర్తికి అవసరమైన నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే ఈ సమస్యల పరిష్కారంతో పాటు నగరాభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. ఈ మేరకు నగరంలోని తీగలగుట్టపల్లిలో ఏర్పాటు చేసిన మేయర్ కొలగాని శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. ప్రజలకు, పాలకవర్గ సభ్యులకు అందుబాటులో ఉండేందుకు క్యాంపు కార్యాలయం ఉపయోగపడుతుందన్నారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మంచిర్యాల చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తన నివాసంపై పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రముఖ కవి డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ రచించిన చారుధాం యాత్ర చారిత్రక కథనాల గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఇంజినీర్, కోల అన్నారెడ్డి, సంకేపల్లి నాగేంద్రశర్మ, ఉప్పల రామేశం, వి. జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మానేరు కెనాల్లో కారు బోల్తా
ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్–గూడెం మధ్యమానేరు కెనాల్లో ఓ కారు బోల్తాపడింది. ఆదివారం తెల్లవారుజామున దుబ్బాకకు చెందిన కారు సిరిసిల్ల వైపు వెళ్తుండగా అదుపుతప్పి కెనాల్లో బోల్తాపడినట్లు ఏఎస్సై అబ్దుల్ ఘనీ తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు తెలిసిందన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆవునూర్ నుంచి ముస్తాబాద్ వరకు ఉన్న రహదారిలో మూలమలుపులు ప్రమాదకరంగా ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానేరు కెనాల్తోపాటు రామ్రెడ్డిపల్లి వై జంక్షన్ వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికై నా ఆర్అండ్బీ అధికారులు స్పందించి హెచ్చరికబోర్డులతోపాటు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరారు. -
పుట్టుకొస్తున్న పాసుపుస్తకాలు
చందుర్తి(వేములవాడ): భూముల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో కబ్జాదారుల కన్ను ప్రభుత్వ భూములపై పడింది. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగా రు. డబ్బుకు లోకం దాసోహం అని తెలుసుకొని కాసులు ముట్టజెప్పి ఓ ముఠాతో చేతులు కలిపారు. పట్టేదారు పాసుపుస్తకాలు పొందారు. ఈ విషయం నకిలీ పాసుపుస్తకాల ముఠా బాధితుడి ఫి ర్యాదుతో బయటకు పొక్కుతున్నాయి. నకిలీ పాసుపుస్తకాలు పుట్టుకొస్తున్న వైనంపై ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ. ఇలా అక్రమదందాకు తెర రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లెకు చెందిన బొల్లు శ్రీనివాస్ ఎన్గల్కు చెందిన గుంటి మల్లేశం మధ్యవర్తిత్వంతో జోగాపూర్ శివారులోని ఎకరం భూమిని రెండేళ్ల క్రితం రూ.12లక్షలకు కొనుగోలు చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అందులో అసైన్డ్ సమస్య ఉందని చెబితే రూ.లక్ష ఇస్తే అన్ని చూసుకుంటానని నమ్మించాడని బాధితుడు బొల్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. కానీ ఇక్కడే అసలు తిరకాసు ఉంది. గుంటి రాజయ్య భూమిని బొల్లు శ్రీనివాస్ 1995 మే 10నలో కొనుగోలు చేసినట్లు రెవెన్యూ అధికారుల పేరిట సృష్టించిన 13(సీ) నమూన ధ్రువీకరణపత్రంలో నమోదు చేశారు. బాధితుడి ఫిర్యాదుకు, పట్టేదారు పాసుపుస్తకం జారీచేసిన సమయం, 13(సీ)లో నమోదు చేసిన ట్రెజరీ పైకం జమకట్టిన తేదీ 2011 డిసెంబర్ 25. కానీ 13(సీ)జారీ చేసిన సమయం డిసెంబర్ 10 ఉండడంతో నకిలీ పత్రాలుగా స్పష్టమవుతున్నాయి. పోలీసులు విచారణ చేస్తే ముఠా గుట్టు రట్టు డబ్బులు తీసుకుని బుకాయిస్తున్నాడని ఫిర్యాదు చేసిన బాధితుడితోపాటు డబ్బులు తీసుకున్న ఇద్దరిని పోలీసులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడితే అసలు విషయాలు బయట పడతాయని చర్చ సాగుతోంది. తిమ్మాపూర్ శివారులోని బొజ్జ మల్లయ్య పేరిట ప్రభుత్వ పరంపోగు రెండు ఎకరాల భూమి నకిలీపత్రాలతో చదును చేసేందకు వెళ్లారు. అయితే అక్కడ గతంలో నుంచి సాగు చేసుకుంటున్న వారు అడ్డుకున్నారు. దీంతో బొల్లు శ్రీనివాస్ ఎన్గల్కు చెందిన గుంటి మల్లేశంతో డబ్బులు తిరిగివ్వాలని పట్టుబడుతున్నాడు. అయితే వీరి పేరిట తెచ్చిన పాత పట్టేదారు పుస్తకాలు ఎక్కడివి? 13(సీ) నమూన ధ్రువీకరణపత్రాలు ఎక్కడ సృష్టించారు? తహసీల్దార్ సంతకాలు ఫోర్జరీ చేశారా? వాటిపై స్టాంపులు ఎక్కడివి అన్న కోణంతో విచారణ జరిపితే ముఠా గుట్టరట్టు కానుందని స్థానికంగా చర్చ సాగుతోంది. తప్పడు పత్రాలతో పట్టాలు ఇచ్చిన తహసీల్దార్లపై కేసులు గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన సమయంలో తప్పుడు పత్రాలతో పట్టాలు జారీ చేసిన చందుర్తి తహసీల్దర్లు ముగ్గురిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ఇందులో ఓ డిప్యూటీ తహసీల్దార్, వీఆర్వోలు సైతం ఉన్నారు. అయినా ఇంకా భయం లేకుండా కొందరు అక్రమార్కులు డబ్బులకు ఆశపడి తప్పులు చేస్తూనే ఉన్నారని చెప్పడానికి ఇటీవల లభించిన పాత పట్టేదారు పుస్తకాలు నిదర్శనం. చందుర్తి మండలం మల్యాల, ఎన్గల్ గ్రామాల్లో నకిలీ పత్రాల సృస్టించే ముఠా సభ్యులు ఉన్నారని ప్రచారంలో ఉంది. గతంలో రెవెన్యూ అధికారులు ప్రొసీడింగ్ పత్రాలు ఇవ్వకపోవడంతో బ్యాంకు రుణాలకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ప్రొసీడింగ్ కాగితాలకు దరఖాస్తు చేసుకున్నా అందుబాటులో లేవన్న సమాధానం వస్తున్నట్లు అన్నదాతలు వాపోతున్నారు. పోలీసులకు సహకరించని రెవెన్యూ అధికారులు భూములు దున్నుకోనివ్వకుండా రైతులు అడ్డుకుంటున్న సంఘటనల్లో విచారణకు వెళ్తున్న పోలీసులకు రెవెన్యూ అధికారులు సహకరించడం లేదని సమాచారం. ఫిర్యాదుకు సంబంధించి ఏదైనా సమాచారం అడిగితే రెవెన్యూ అధికారుల నుంచి సరైన సమాధానం రావడం లేదని విశ్వసనీయంగా తెలిసింది. ఏమైనా సమస్యలు ఉంటే రైతులు కోర్టులో చూసుకుంటారని చెబుతున్నట్లు తెలిసింది. బాధితుడు శ్రీనివాస్ పోలీసులకు చేసిన ఫిర్యాదు ఆన్లైన్ కాపీఆశిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన బొజ్జ మల్లయ్య పేరిట సృష్టించిన 13 సీ పత్రం పాత పుస్తకాలతో నయా దందా బయటపడ్డ నకిలీముఠా లీలలు ఒక్కోటి వెలుగుచూస్తున్న అక్రమాలు ఇప్పటికే రెవెన్యూ అధికారులపై కేసులు అయినా ఆగని అక్రమ దందా ఆశిరెడ్డిపల్లెకు చెందిన బొల్లు శ్రీనివాస్ ఫిర్యాదుతో ఎన్గల్కు చెందిన గుంటి మల్లేశంపై కేసు నమోదు చేశాం. ఇతర పనుల కారణంతో పూర్తి స్థాయిలో విచారణను ఇంకా మొదలు పెట్టలేదు. రెండు రోజుల్లో విచారణను పూర్తి చేసి వివరాలు వెల్లడిస్తాం. మరికొన్ని కేసుల్లో రెవెన్యూ అధికారులను వివరాలు అడిగితే ఫైల్స్ అందుబాటులో లేవని చెబుతున్నారు. – రమేశ్, ఎస్సై, చందుర్తి రైతుల భూముల విషయంలో వస్తున్న సమస్యలతో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కానీ పోలీసులు అడిగే వివరాలను వారికిచ్చే అవసరం లేదు. సివిల్ కేసులైనా, క్రిమినల్ కేసులైనా కోర్టులో ఉంటే కేసులు వేసుకున్న రైతులు ఇద్దరు తహసీల్దార్కు అర్జీలు పెట్టుకుంటారు. ఆ అర్జీల ఆధారంగా ఫైల్స్ కార్యాలయంలో అందుబాటులో ఉంటే ఇస్తాం. లేకుంటే లేవనే చెబుతాం. వాటి ఆధారంగా కోర్టులు తీర్పులు ఇస్తాయి. – భూపతి, తహసీల్దార్, చందుర్తి -
నృసింహుని సన్నిధిలో న్యాయమూర్తుల పూజలు
భీమన్నా కరుణించుస్వామివేములవాడ: రాజన్న సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన 40 వేల మంది భక్తులు రాజన్న, భీమన్నలను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు భక్తుల ఏర్పాట్లను పరిశీలించారు. భీమేశ్వర స్వామిని టీజీఎన్పీజీలీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్రెడ్డి దర్శించుకున్నారు. ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామిని ఆదివారం సిద్దిపేట జిల్లా న్యాయమూర్తి సాయిరామ దేవి దంపతులు, జిల్లా అడిషనల్, సెషన్స్ న్యాయమూర్తి జయప్రసాద్ దంపతులు దర్శించుకున్నారు. ముందుగా దేవస్థానం పక్షాన సంప్రదాయ రీతిలో మేళతాళాలతో ఆహ్వానం పలికారు. ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రం ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ కిరణ్కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాలు శ్రీనివాస్, ఆలయ సిబ్బంది తదితరులున్నారు. -
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
ఎస్యూ వీసీ ఉమేశ్ కుమార్ ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం, ఉద్యోగాల నియామకం, అభివృద్ధి పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారు. కొలువుల ఆశ చూపించి పేదల వద్ద రూ.లక్షలు వసూలు చేయడం హేయం. ఆయన వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఫుల్ టైం ఈసీ లేకుండా ప్రొఫెసర్లు నియమించడంపైనా విచారణ జరిపించాలి. – మణికంఠ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అవన్నీ నిరాధార ఆరోపణలు శాతవాహన వర్సిటీలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతోంది. నేను వచ్చాక వర్సిటీలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాను. లా, ఇంజినీరింగ్ కాలేజీలు వచ్చాయి. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. క్యాంపస్లో ఔట్సోర్సింగ్ పోస్టులు అమ్ముకుంటున్నారన్నది కేవలం నిరాధార ఆరోపణలు. అందులో ఎలాంటి వాస్తవమూ లేదు. – ఉమేశ్కుమార్, వైస్ చాన్స్లర్ -
వృద్ధుడి ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం: మండలంలోని యామపూర్కు చెందిన జంబుక ఆశన్న(78) జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నవీన్కుమార్ తెలిపారు. ఆశన్న భార్య 20ఏళ్ల క్రితం మృతి చెందింది. ముగ్గురు కుమారులు ఉన్నా.. ఒంటరిగా ఉంటున్నాడు. ఆదివారం వేకువజామున ఉరేసుకున్నాడు. ఆశన్న చిన్నకోడలు మమత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి ఇల్లంతకుంట(మానకొండూర్): గడ్డి మందు తాగి చికిత్స పొందుతున్న కడాలి సుబ్రహ్మణ్యం(43) శనివారం మరణించారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణ్యం కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసేవాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యం 15 ఏళ్లుగా ఇల్లంతకుంటలోనే ఉంటున్నాడు. గత సోమవారం గడ్డిమందు తాగగా బంధువులు హైదరాబాద్కు తరలించారు. వెంటిలేటర్పై ఉన్న అతడిని స్వగ్రామానికి తరలించగా ప్రాణాలు వదిలాడు. చికిత్స పొందుతూ యువకుడు మృతిజగిత్యాలక్రైం: తాను ప్రేమిస్తున్న ఓ అమ్మాయి తన ప్రేమను నిరాకరించిందని పేర్కొంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. రూరల్ ఎస్సై ఉమాసాగర్ కథనం ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన పొద్దుటూరి అజిత్ (23) కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి అతడి ప్రేమను అగీకరించడంలేదన్న మనస్తాపంతో గత నెల17న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. అజిత్ తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. విద్యుత్ షాక్తో రైతు మృతిసుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మున్సిపల్ పరిధి సుగ్లాంపల్లికి చెందిన రైతు చల్ల కనుకయ్య(48) ఆదివారం విద్యుత్ షాక్తో మృతిచెందాడు. ఎస్సై చంద్రకుమార్ తెలిపిన వివరాలు.. కనుకయ్య తన ఇంటి సమీపాన ఉన్న వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి మోటార్ ఆన్ చేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కులం పేరుతో దూషించిన వ్యక్తులపై కేసుబుగ్గారం: మండల కేంద్రానికి చెందిన దూడ కిరణ్ను కులం పేరుతో దూషించిన ఘటనలో అదే గ్రామానికి చెందిన నగునూరి రాజశేఖర్, మట్టి అమర్నాథ్, గర్వందుల రోహన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్ తెలిపారు. గ్రామపంచాయతీలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న కిరణ్.. రాజశేఖర్కు చెందిన ఫ్లెక్సీని తీసివేశాడనే కారణంతో మిత్రులతో కలిసి కిరణ్పై దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
గంగారంలో క్షుద్రపూజల కలకలం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మండలంలోని గంగారం గ్రామంలో ఆదివారం ఉదయం క్షుద్రపూజల ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామ శివారులోని హుస్సేన్మియా వాగు వంతెన కింద ఇద్దరు వ్యక్తులు క్షుద్రపూజలు చేస్తుండగా గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పూజలు నిర్వహిస్తున్న అప్పన్నపేట గ్రామానికి చెందిన మోటం సమ్మయ్య, రేవెల్లి సంపత్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్షుద్రపూజల పేరిట అమాయకులను మోసం చేస్తున్నారని అలాంటివారిని నమ్మవద్దని ఎస్సై సూచించారు. కాగా, గతంలో ఇదే వంతెన కింద ఒకరిని పూజల పేరిట బలి ఇచ్చిన ఘటన ఇక్కడి ప్రజలు మరిచి పోలేదు. మండలంలోని మంథని క్రాస్రోడ్డు, పొత్కపల్లి క్రాస్ రోడ్డు వద్ద పందిని బలి ఇచ్చిన ఘటనలూ ఉన్నాయి. -
కొలువులమ్మా.. కొలువులు!
శాతవాహన గాథలు–3సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అర్బన్ నక్సలైట్లు, విద్యార్థుల ఆందోళనలు, దళితులపై వివక్ష తదితర వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న శాతవాహన యూనివర్సిటీలో మరో దుమారం చెలరేగుతోంది. యూనివర్సిటీలో అంతా తానై షాడో వీసీలా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి ఔట్ సోర్సింగ్ నియామకాల్లో చక్రం తిప్పుతున్నాడన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పోస్టుకు ఇంత రేటు అంటూ ఫిక్స్ చేసి మరీ నియామకాల్లో అంతా తానై వ్యవహరిస్తున్నాడంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అర్బన్ నక్సలైట్లు, దళితులపై వివక్ష అన్న ఆరోపణలపై యూనివర్సిటీ మొత్తం రాజకీయ రణంగంగా మారింది. ప్రొఫెసర్ సుజాత వైపు కొందరు.. వీసీ ఉమేశ్ వైపు మరికొందరు చేరి ఎవరికి వారు మద్దతుగా ప్రకటనలు జారీ చేస్తున్నారు. సంతోషంగా విక్రయం.. అతను రాజకీయ పలుకుబడితో వర్సిటీలో చేరా డు. ఒక రకంగా అతనే షాడో వీసీ అన్న పేరుంది. అందుకే శాతవాహన యూనివర్సిటీలో ఎంత సీని యర్ ప్రొఫెసర్ అయినా సరే అతని జోలికి వెళ్లరు. అతను ఏం చెప్పినా.. స్థాయి మరిచి తూ.చా తప్పకుండా పాటిస్తారు. చిన్నస్థాయి ఉద్యోగుల విష యం చెప్పనక్కర్లేదు. పొరపాటున అతనికి వ్యతిరేకంగా స్వరం పెంచితే ఇక అంతే.. మరో విభాగాని కి బదిలీ చేసి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. అతని వ్యవహారం, పలుకుబడి తెలిశాక.. అతనితో అంతా అనివార్యంగా సఖ్యతగా ఉండాల్సి వస్తోంది. అలాంటి వ్యక్తి కొంతకాలంగా ఔట్సోర్సింగ్ కొలువుల భర్తీని సొమ్ము చేసుకుంటున్నాడు. వాస్తవానికి ఇవేమీ పర్మినెంట్ పోస్టులు కావు. కాకపోతే నెల తిరిగే నాటికి జీతం ఠంఛన్గా వస్తుందన్న భరోసా ఉంది. అందుకే ఈ పోస్టులకు ఉన్న డిమాండ్తో పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల వరకు తీసుకుని కొలువులు పెట్టిస్తున్నాడు. ఇప్పటి వరకూ దాదాపు 15కుపైగా పోస్టులు ఇలా తన పరపతితో సంతోషంగా అమ్ముకున్నాడన్న విమర్శలున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–4 ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసింది. అయినా కీలక పోస్టుల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఉంచడంతో అక్రమాలు జరుగుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కీలక పోస్టుల్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.నేటి నుంచి ఎస్సీ, ఎస్టీ కమిషన్ విచారణ మరోవైపు తనపై వ్యక్తిగత కక్షలతో అర్బన్ నక్సల్ అంటూ వేధించడం, వరుసగా పదవుల నుంచి తప్పించడంపై కలత చెందిన సోషియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత ఇటీవల ఎస్సీ కమిషన్ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆదివారం వరకు వరుస సెలవుల నేపథ్యంలో ఈ విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. సోమవారం నుంచి ఈ ఫిర్యాదుపై ఎస్సీ కమిషన్ విచారణ జరిపి, చర్యలు చేపట్టనుంది. తొలుత కరీంనగర్ కలెక్టర్, సీపీకి నోటీసులు జారీ చేయనున్నామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పీఏ శ్రీధర్ ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం యూనివర్సిటీలో నెలకొన్న ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలో అవసరమైతే ఈ వారంలో ఎస్సీ కమిషన్ సభ్యులు యూనివర్సిటీని సందర్శించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. -
జగ్జీవన్రామ్ ఆశయ సాధనకు కృషి
కరీంనగర్టౌన్: దేశ స్వాతంత్య్రం, సమసమాజ స్థాపనకు పోరాటం చేసిన త్యాగధనుల స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని బాబు జగ్జీవన్రామ్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పిలుపునిచ్చారు. జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ఆదివారం నగరంలోని మంచిర్యాల చౌరస్తా వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ 40ఏళ్ల పాటు ప్రజాప్రతినిధిగా, వ్యవసాయ, రక్షణశాఖలతో పాటు దేశ ఉప ప్రధానిగా సేవలందించిన జగ్జీవన్రామ్ను స్మరించుకోవడం మన కర్తవ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇందిరమ్మ ఇల్లు, అసైన్డ్ భూములు ఇచ్చినట్లు తెలి పారు. కలెక్టర్ చిత్రామిశ్రా మాట్లాడుతూ ఎస్సీ సంక్షేమశాఖ, ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా అందించే సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ కేసుల విచారణ, పరిహారం అందించే విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ దేశ అభివృద్ధికి, బలహీన వర్గాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. నగరపాలక కమిషనర్ ప్రఫుల్దేశాయ్ మాట్లాడుతూ జగ్జీవన్రామ్ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సీనియర్ నాయకుడు సముద్రాల అజయ్ మాట్లాడుతూ శాతవాహన యూనివర్శిటీలో అర్బన్ నక్సల్స్ అంటూ విద్యార్థుల మధ్య విభేదాలు సృష్టిస్తున్న వారిని గుర్తించాలని సీపీ, కలెక్టర్ను కోరారు. అనంతరం కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రోత్సాహకాలు అందజేశారు. జయంతి ఉత్సవ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గంటల రేణుక, క్యాదాసి ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల (రెవెన్యూ) కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్టీవో మహేశ్వర్, దళిత సంఘాల నాయకులు బెజ్జంకి అనిల్, కన్నం అంజయ్య, మేడి అంజయ్య, రొంటాల స్వప్న, కొరివి వేణుగోపాల్, లక్ష్మణ్, మేడి మహేశ్ తదితరులు పాల్గొన్నారు. నిరసనలు, నిలదీతలు ఆలిండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి మేడి మహేశ్ ఆధ్వర్యంలో దళితులను చిన్నచూపు చూస్తున్నారని, జయంతి కమిటీలో చోటు కల్పించలేదని నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సత్యం జోక్యం చేసుకొని వేదికపైకి పిలిచి మాట్లాడించగా, వర్గీకరణ రద్దు చేయాలని, 15శాతం రిజర్వేషన్ 25 శాతానికి పెంచాలని మహేశ్ మాట్లాడడంతో ఎమ్మార్పీఎస్ నాయకులు నినాదాలు చేస్తూ దూసుకురావడంతో గందరగోళం నెలకొంది. -
సెలవుపై రాజన్న ఆలయ ఈవో
– ఇన్చార్జి ఈవోగా అంజనారెడ్డి బాధ్యతలు స్వీకారం వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయ ఈవో రమాదేవి 13 రోజుల సెలవుపై వెళ్లడంతో కొండగట్టు అంజన్న ఆలయ ఈవో అంజనారెడ్డిని ఇన్చార్జిగా నియమిస్తూ దేవాదాయశాఖ కమిషనర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు ఆయన వేములవాడకు చేరుకుని భీమన్నను దర్శించుకున్న అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఏఈవో జి.శ్రావణ్కుమార్, జయకుమారి, డీఈ రఘునందన్ ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఇసుక తవ్వకాలు అడ్డగింతచిగురుమామిడి: చిగురుమామిడి మండలం రామంచ మోయతుమ్మెద వాగులో ఇసుక తవ్వకాలను సర్పంచ్ వంటకాల కిషన్రెడ్డి ఆధ్వర్యంలో రైతులు అడ్డుకున్నారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారు దాటి రామంచ శివారులోని వాగులో రెండు జేసీబీలు ఇసుకను తోడేస్తుండగా అడ్డుకుని కాంట్రాక్టర్ను నిలదీశారు. ఎల్ఎండీలో పూడికతీతలో భాగంగా ఇసుకను తోడాలి కానీ.. తమ గ్రామ పరిధిలో పూడికతీయడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంపై ఇరిగేషన్ ఈఈకి ఫోన్చేసినా స్పందనలేదని సర్పంచ్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం గుంటూరుపల్లి రాజీవ్ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తీవ్రంగా గాయపడి హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి కథనం మేరకు మానకొండూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన పోతర్ల అశోక్(31) సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం వ్యక్తిగత పనినిమిత్తం పల్సర్ బైక్పై ఇరుకుల్లకు వచ్చాడు. రాత్రి 9గంటలకు కరీంనగర్కు బైక్పై వెళ్తుండగా గుంటూరుపల్లి రైల్వే అండర్బ్రిడ్జి సమీపంలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చల్మెడ ఆనందరావు ఆస్పత్రికి తరలించగా వైద్యుల సలహామేరకు హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించడంతో శనివారం మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్ట్మార్టం నిర్వహించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు లారీడ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. గీతకార్మికుడికి గాయాలు పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం మూలసాల గ్రామంలో తాటిచెట్టు పైకి ఎక్కి కల్లుగీస్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడడంతో బాలసాని రాజయ్య గాయాలపాలయ్యా డు. వెంటనే గమనించిన స్థానికులు పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిరుపేద అయిన రాజయ్యకు ప్రభుత్వపరంగా సాయమందించాలని సర్పంచ్ జూపాక శ్వేత, గీతకార్మికసంఘ నాయకులు కోరారు. కిరీటం, నగలు మాయంకోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్లలోని శివసాయి ఆలయంలో సాయిబాబా కిరీటం, ఉత్సవ విగ్రహాల పుస్తెలు కని పించడం లేదు. భక్తులు సమర్పించిన ఈ కానుకలు కనిపించకపోవడంపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయంలోని నగలు అపహరణకు గురయ్యాయా, లేక ఎవరైనా భద్రపరిచారా అన్న విషయాలు తెలియాలని నవచైతన్య యూత్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.25 ఏళ్లుగా రోడ్లపైనే తిరిగి..● కలెక్టర్ చొరవతో కుటుంబం చెంతకు.. కామారెడ్డిఅర్బన్: కామారెడ్డి పట్టణంలో రోడ్ల వెంట తిరుగుతున్న మానసిక వైకల్యం గల వ్యక్తి 25 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి (50) మానసిక వైకల్యంతో రోడ్ల వెంబడి తిరుగుతున్న విషయం ఇటీవల కలెక్టర్ ఆశిష్సంగ్వాన్ దృష్టికి వచ్చింది. వెంటనే ఆయన స్పందించి జిల్లా సంక్షేమాధికారులను ఆదేశించడంతో శనివారం అతన్ని వృద్ధాశ్రమానికి తరలించి వైద్యసేవలు, ఆహారం అందించారు. తాను జగిత్యాల జిల్లాకు చెందిన వాడినని చెప్పడంతో అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యులు కామారెడ్డికి రాగా, అధికారులు అతడిని అప్పగించారు. 25ఏళ్ల తర్వాత తమ కుటుంబ సభ్యుడిని కలుసుకోవడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. కలెక్టర్, జిల్లా సంక్షేమాధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా కలెక్టర్ ఆదేశం ప్రకారం మానసిక వైలక్యం వ్యక్తి వివరాలు, కుటుంబసభ్యుల వివరాలు గోప్యంగా ఉంచారు. వాకిలి శుద్ధి చేస్తుండగా బావిలో పడ్డ మహిళ ముత్తారం: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఇప్పలపల్లి(రామకృష్ణాపూర్)కు చెందిన తూండ్ల సుమతి శనివారం ఉదయన వాకిలి శుద్ధి చేసే క్రమంలో కాలు జారి వ్యవసాయ బావిలో పడి తీవ్రగాయాలపాలైంది. బాధితురాలి కేకలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే బయటకు తీశారు. 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా టెక్నీషియన్ నిమ్మతి శ్రీనివాస్, ఫైలెట్ హబీబ్ ప్రఽథమ చికిత్స అందించారు. ఆ తర్వాత మంథని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అంజన్న హుండీ ఆదాయం రూ.1.66 కోట్లు
మల్యాల(చొప్పదండి): కొండగట్టు అంజన్న ఆలయంలో ఈనెల 1 నుంచి 3 వరకు నిర్వహించిన హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాల ద్వారా రూ.1.66కోట్ల ఆదాయం సమకూరినట్లు ఈవో అంజనారెడ్డి తెలిపారు. కేశ ఖండన ద్వారా రూ.11,48,000, లడ్డూ ప్రసాదం రూ.81,62,100, పులిహోర రూ.15,42,320, దీక్ష విమరణ రూ.39,77,500, శీఘ్ర దర్శనం ద్వారా రూ.18,58,400 మూడురోజుల ఉత్సవాల్లో మొత్తం రూ.1,66,88,320 ఆదాయం సమకూరిందని ఈవో పేర్కొన్నారు. గంజాయి విక్రేతల అరెస్ట్జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణం మోతెరోడ్లో శనివారం ఉదయం గంజాయి విక్రయించేందుకు వచ్చిన ఇద్దరిని పట్టణ ఎస్సై సుప్రియ పట్టుకున్నారు. వారి నుంచి 250 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కొప్పెర్ల గ్రామానికి చెందిన కొత్తూరి అఖిల్, దర్శనాల అభిలాష్ ఆదిలాబాద్ రైల్వేస్టేషన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేసి కొండగట్టులో విక్రయించేందుకు వచ్చారు. కొండగట్టులో ఎవరూ కొనకపోవడంతో జగిత్యాలలోని మోతెరోడ్లో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా ఎస్సై పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బద్దెనపల్లిలో వ్యక్తిపై దాడి● అట్రాసిటీ కేసు విచారణ చేపట్టిన డీఎస్పీ తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించి నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై సిరిసిల్ల డీఎస్పీ కె.నాగేంద్రచారి శనివారం విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన కోదాడి మల్లేశ్బాబుపై అదే గ్రామానికి చెందిన అభినయ్ దూషించి, భౌతిక దాడికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా డీఎస్పీ కె.నాగేంద్రచారి శనివారం బద్దెనపల్లిలో విచారణ చేపట్టారు. వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్న డీఎస్పీ కేసులో పారదర్శకమైన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
అప్పుల బాధతో ఆటోడ్రైవర్ ఆత్మహత్య
ముస్తాబాద్(సిరిసిల్ల): ఆర్థిక ఇబ్బందులు తాళలేని ఓ ఆటో డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ టో నడవక సరైన ఉపాధి లేక కటుంబాన్ని పోషించేందుకు అప్పులు చేసిన ఆటోడ్రైవర్ తీర్చే మార్గం లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండ ల కేంద్రానికి చెందిన మారెల్లి శ్రీనివాస్(52) అద్దె ఇంట్లో ఉరివేసుకుని శనివారం ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. కొన్నెళ్లుగా ఆటో నడుపుతున్న శ్రీనివాస్ ఏడాది క్రితమే కూతురు వివాహనికి అప్పులు చేశాడు. ఆటోకు సరైన గిరాకీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. అప్పులు తీరేమార్గం కనిపించక, ఆటో నడిపిన సరైన గిరాకీలు లేవని తీవ్ర మనోవేదనకు గురైన శ్రీనివాస్ జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాస్ మృతితో భార్య స్వరూప, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అద్దె ఇంట్లో ఉంటూ ఆటో నడుపుతున్న శ్రీనివాస్ చివరికి ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబం వీధిన పడింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అతివేగం.. అదుపుతప్పిన కారు
గోదావరిఖని: అతి వేగం.. లిప్తపాటులో జరిగిన ప్రమాదంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శుక్రవారం అర్ధరాత్రి ఘటన జరిగింది. గోదావరిఖని వన్టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. ఓ వేడుకకు హాజరై చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం వైపు నలుగురు కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో రాజేశ్ టాకీష్ సమీపంలో కారు అదుపుతప్పింది. ఎడమవైపు ఉన్న ఓ షాపుతోపాటు, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈప్రమాదంలో జీడీకే–11గనిలో అసిస్టెంట్చైన్మెన్గా పనిచేస్తున్న ఏల్పుల శ్రీధర్(39) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో లక్ష్మణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరందరినీ స్థానిక సింగరేణి ఏరియా లాస్పత్రికి తరలించిచారు. ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్ రెఫర్ చేశారు. ఈసంఘటనలో జీడీకే–1వగనిలో జనరల్అసిస్టెంట్గా పనిచేస్తున్న తడకల మహేందర్, నామిని లక్ష్మణ్, మాలోతు శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు వన్టౌన్ ఎస్ఐ రమేశ్ కేసు నమోదు చేసుకున్నారు. ఏల్పుల శ్రీధర్ మార్కండేయకాలనీలో నివాసముంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు సింగరేణి కార్మికుడు మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు -
చెట్టును ఢీకొని వ్యక్తి మృతి
రాయికల్(జగిత్యాల): మండలంలోని అల్లీపూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్సై సుధీర్రావు తెలిపిన వివరాలు.. జగిత్యాల మండలం లింగంపేట గ్రామానికి చెందిన సిరికొండ చంద్రశేఖర్ (25) శుక్రవారం ద్విచక్రవాహనంపై తన తల్లి గంగుతో కలిసి రాయికల్ మండలం తాట్లవాయి గ్రామంలోని సీతారాముల జాతరకు వెళ్లాడు. తర్వాత తల్లిని లింగంపేటలో దింపాడు. అనంతరం తన స్నేహితులు ఫోన్ చేయడంతో చంద్రశేఖర్ మళ్లీ వారితో కలిసి జాతరలో పాల్గొన్నాడు. రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా అల్లీపూర్ శివారులో వేగంగా చెట్టును ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు..జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామానికి చెందిన బొల్లారం రాజం (67) చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. ఎస్సై ఉమాసాగర్ తెలిపిన వివరాలు.. రాజం కొంతకాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో మనస్తాపం చెంది గత నెల 30న సాయంత్రం పొలం వద్ద పురుగులమందు తాగగా కుటుంబ సభ్యులు గమనించి కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మళ్లీ జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తి..కరీంనగర్క్రైం: నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పోలీస్ అవుట్ పోస్టు వెనకాల శనివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిపారు. సుమారుగా వయసు 40 ఏళ్ల వయసు ఉంటుందని, బిచ్చగాడిగా ఆస్పత్రి పరిసరాల్లో తిరుగుతూ ఉండేవాడని తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదిలో భద్రపరిచినట్లు తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే టూటౌన్ పోలీసులను సంప్రదించాలని సూచించారు. వ్యక్తి అనుమానాస్పద..కరీంనగర్క్రైం: ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు కరీంనగర్ టూటౌన్ పోలీసులు తెలిపారు. రామడుగు మండలం గోపాలరావుపేటకు చెందిన అలువాల రవి(48)కి 27 ఏళ్ల క్రితం లలితతో వివాహమైంది. ఇద్దరు కుమారులున్నారు. రెండేళ్ల క్రితం లలితతో గొడవపడి కరీంనగర్లోని రాంనగర్లో అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటూ ఉల్లిగడ్డల వ్యాపారం చేస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి భార్యకు ఫోన్ చేసి మాట్లాడాడు. శనివారం అతని భార్య ఫోన్ చేయగా, రూం పక్కన అద్దెకు ఉండే ఓ మహిళ ఎత్తింది. ఎంతపిలిచినా రవి కదలడం లేదని చెప్పింది. వెంటనే 108కు ఫోన్చేయగా వారు వచ్చి పరీక్షించి, మృతిచెందినట్లు తెలిపారు. శరీరంపై రక్తపు మరకలున్నాయని, రవి మృతిపై అనుమానం ఉందని లలిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. -
ధాన్యం పక్కదారి
● రైస్మిల్లు యజమానిపై కేసు తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రభుత్వానికి అప్పగించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) విషయంలో భారీ అవకతవకలకు పాల్పడిన మానేర్ రైస్ మిల్లు యజమానిపై తంగళ్లపల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఖరీఫ్ 2024–2025 సీజన్కు సంబంధించి చీర్లవంచలోని మానేర్ రైస్ మిల్లుకు ప్రభుత్వం 2,964.480 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించింది. నిబంధనల ప్రకారం మిల్లు యజమాని 1984.192 టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా, కేవలం 515.375 టన్నులు మాత్రమే ఇచ్చారు. మిగిలిన నిల్వలపై సివిల్ సప్లయ్ అధికారులు తనిఖీ చేయగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మిల్లులో ఉండాల్సిన బియ్యం నిల్వలు ఏమీ లేవు. బకాయి ఉన్న బియ్యానికి సమానమైన ధాన్యం (2,192.263 టన్నులు) ఉండాలి, కానీ కేవలం 718.760 టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. దాదాపు 1,473.503 టన్నుల ప్రభుత్వ ధాన్యం మిల్లులో తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దుర్వినియోగం చేసిన ఈ ధాన్యం విలువ జరిమానాతో కలిపి సుమారు రూ.3,41,85,270 ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ప్రభుత్వ ధాన్యాన్ని సొంతానికి వాడుకున్నందుకు సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ నరసింహ ఫిర్యాదుతో మిల్లు యజమాని దుండ్రుపల్లి జమునపై కేసు నమోదు చేశారు. సిరిసిల్ల డీఎస్పీ కె.నాగేంద్రచారి సంఘటన స్థలాన్ని శనివారం సందర్శించి విచారణ చేపట్టారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. -
నోరూరేనంట.. యాదమ్మ వంట
విద్యానగర్(కరీంనగర్): యాదమ్మది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి. చిగురుమామిడి మండలం కొండాపూర్కు చెందిన చంద్రయ్యతో పదిహేనేళ్ల వయసులోనే వివాహమైంది. కొడుకు పుట్టిన మూడు నెలలకే చంద్రయ్య ఓ ప్రమాదంలో మరణించాడు. దీంతో కొడుకును తీసుకుని కరీంనగర్కు వలసొచ్చారు. కొన్ని రోజులు స్కూల్లో ఆయాగా పని చేశారు. తరువాత మంకమ్మతోటకు చెందిన వెంకన్న వద్ద వంటపనిలో హెల్పర్గా చేరారు. అందుకు రోజూ రూ.15 కూలీ తీసుకునేవారు. కాలక్రమేణ చిన్నచిన్న ఫంక్షన్లలో వంటచేస్తూ మన్ననలు పొందారు. క్రమేనా పెద్దపెద్ద ఫంక్షన్లకు క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు 50 వేల మందికై నా ఒంటిచేత్తో వంటచేసేలా ప్రావీణ్యం సంపాదించారు. 2022లో హైదరాబాద్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీతో పాటు పాల్గొన్న వందలాది మంది ప్రముఖులకు యాదమ్మ తన చేతి వంటలు రుచి చూపించి శభాష్ అనిపించుకున్నారు. హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ వంటలు రుచిచూసిన ప్రధాని యాదమ్మను ప్రత్యేకంగా అభినందించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పలుమార్లు యాదమ్మ వంటలను మెచ్చుకున్నారు. కేటీఆర్ నిర్వహించిన మూడు బహిరంగసభలు, వేములవాడ శివరాత్రి ఉత్సవాలు, కొండగట్టు హనుమాన్ జయంతి, గోదావరి పుష్కరాల్లో వేలాది మందికి వంటలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు పెళ్లిలో 30వేల మందికి, కరీంనగర్ తీగల వంతెన ప్రారంభం అప్పుడు 20వేల మందికి వంటలు చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసాల్లో జరిగిన ఫంక్షన్లకూ యాదమ్మ క్యాటరింగ్ చేశారు. గతనెల 27న కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో 25వేల మందికి రుచికరమైన వంటకాలు చేసిపెట్టారు. కిరాయి పెంకుటిళ్లు నుంచి ఇప్పుడు సప్తగిరికాలనీలో తనకంటూ ఒక మంచి సొంతిళ్లు నిర్మించుకుని దుర్గా నిలయంగా పేరు పెట్టుకున్నారు. ఒక్కగానొక్క కొడుకును చదివించి రూ.12 లక్షలు ఖర్చు చేసి అమెరికా పంపింపారు. అక్కడి వాతావరణం పడక అనారోగ్యం పాలు కావడంతో స్వదేశానికి వచ్చి అతనూ క్యాటరింగ్ చేస్తున్నాడు. యాదమ్మ వద్ద దాదాపు 200 మంది వంటలు నేర్చుకుని సొంతంగా క్యాటరింగ్లు నిర్వహిస్తున్నారు. మీర్జాపూర్కు చెందిన 20 మంది మహిళలు వంటలు నేర్చుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు. సీజన్లో 200మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మిగతా రోజుల్లో నిత్యం 10 నుంచి 20 మంది యాదమ్మ వంటకు సాయంగా ఉంటారు. కరీంనగర్లోని మారుమూల పల్లెలో పుట్టిన నేను ఈ దేశ ప్రధానికి నా చేతి వంట రుచి చూపిస్తానని కలలో కూడ అనుకోలేదు. శాకాహారమే కాకుండా నాన్ వెజ్ వంటకాలు కూడా బాగా చేస్తాను. గంగుల కమలాకర్, బండి సంజయ్లు నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు. వారి ఇంట్లో, రాజకీయ పార్టీలకు, కాలేజీ ఫంక్షన్లకు, రాజకీయ సభలకు దాదాపు 20 నుంచి 30వేల మందికి వంట చేయగలను. నా వద్ద ప్రస్తుతం 40మంది వరకు పని చేస్తారు. నా దగ్గర పని నేర్చుకున్న వారు స్వయంగా క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. వారి పిల్లలను అమెరికా సైతం పంపించారు. – గూళ్ల యాదమ్మ -
నిరంతర నిఘా!
శాతవాహన గాథలు–2సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో దళితులపై అర్బన్ నక్సలైట్లంటూ జరుగుతున్న దుమారం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఈ విషయంలో వైస్ చాన్స్లర్ వర్గం, సోషియాలజీ విభాగాధిపతి సూరేపల్లి సుజాతల వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. వైస్ చాన్స్లర్కు అనుకూలంగా కొందరు పీహెచ్డీ స్కాలర్స్ ముందుకు వస్తుండగా.. ఫ్రొఫెసర్ సుజాతకు దళిత సంఘాలు, మేధావులు, విద్యార్థి నాయకులు అండగా నిలుస్తున్నారు. కొంతకాలంగా యూనివర్సిటీలో వీసీ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై చర్చ జరగాలంటూ, అవసరమైతే జరుగుతున్న పరిణామాలు, వస్తున్న అవినీతి, అక్రమాల ఆరోపణలపై విచారణ జరిపించాలంటూ విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. వింత నిర్ణయాలపై విస్మయం క్యాంపస్లోని కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలపై ఇటు సిబ్బంది, అటు విద్యార్థులు మండిపడుతున్నారు. సీసీ టీవీల్లో పరిశీలిస్తూ వీసీ పలువురు విద్యార్థులు, సిబ్బందిని నేరుగా తన చాంబర్కు పిలిపిస్తూ నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారని విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు. క్యాంపస్లో 800మంది విద్యార్థులు ఉంటే దాదాపు 200కుపై సీసీ కెమెరాలు ఉన్నాయని అంటున్నారు. చివరికి క్యాంటీన్లోనూ ఆడియో రికార్డ్ చేసే కెమెరాలు పెట్టారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. డిసెంబరు మొదటివారంలో హాజరుశాతం, లైబ్రరీ పనివేళలపై ఆంక్షలపై క్యాంపస్లో వందలాది విద్యార్థులు నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. పదే పదే పోలీసులను క్యాంపస్లోకి తీసుకువచ్చి తమలో భయానక వాతావరణ సృష్టిస్తున్నారని విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో వీసీ ఉమేశ్కుమార్ను వివరణ కోరగా.. ‘క్యాంపస్లో సీసీ కెమెరాలు కేవలం విద్యార్థుల భద్రత కోసమే ఏర్పాటు చేశాం. వర్సిటీలో వేధింపులు, అక్రమాలు అంటూ కొందరు చేస్తున్న ప్రచారం కేవలం నిరాధారం’ అని ఖండించారు. -
రమణీయం.. రామయ్య రథోత్సవం
ఇల్లందకుంట: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన చంద్రరథం (పెద్దరథం) శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు వైభవంగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహం మధ్య రాములోరి రథోత్సవ వేడుక రమణీయంగా ముగిసింది. రామయ్య రథాన్ని వందలాది మంది తాళ్లతో లాగుతూ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్బాబు, యుప్టీవీ అధినేత పాడి ఉదయ్నందన్రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. వేడుకలో సుమారు 70వేల మంది పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శేషం వంశీధరచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, ఇన్చార్జి ఈవో కందుల సుధాకర్, చైర్మన్ రామారావు పర్యవేక్షించారు. ఏసీపీ మాధవి, సీఐలు రామకృష్ణగౌడ్, లక్ష్మీనారాయణ, ఎస్సైలు క్రాంతికుమార్, ఆవుల తిరుపతి బందోబస్తు నిర్వహించారు. -
వర్సిటీ ప్రతిష్టకు విఘాతం
పోలీస్ ఉన్నతాధికారులు కరీంనగర్లో అర్బన్ నక్సలైట్లు లేరని చెప్తుంటే.. విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తూ యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులపై యూనివర్సిటీ ఆఫీసర్లు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. వర్సిటీలో ఇష్టానుసార నియామకాలు, కొత్త నిర్మాణాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి అవకతవకలను ప్రశ్నిస్తే ఇలా అర్బన్ నక్సలైట్లు ఉన్నారంటూ ప్రకటనలు చేయడం వల్ల యూనివర్సిటీ ప్రతిష్ట దిగజారే ప్రమాదం ఉంది. – మణికంఠరెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు -
లీగల్ నోటీసులు పంపుతున్నాం
కొందరు పనిగట్టుకుని వర్సిటీలో దళిత సిబ్బంది, విద్యార్థులపై అర్బన్ నక్సలైట్లంటూ విషప్రచారం చేస్తున్నారు. అందుకే, ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశాను. ఈ దుష్ప్రచారానికి కారకులను గుర్తించి లీగల్ నోటీసులు పంపుతున్నాం. సివిల్, క్రిమినల్ చర్యలకూ వెనకాడేది లేదు. ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, వ్యక్తిత్వ హననంపై వెనక్కి తగ్గేది లేదు. వర్సిటీలో దళితులపై జరుగుతున్న అకృత్యాలపై సోమవారం పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తాం. – ప్రొఫెసర్ సుజాత, సోషియాలజీ విభాగాధిపతి -
సామాన్యుల రాజ్యం వచ్చింది
● ఆర్యవైశ్య కార్పొరేటర్ల సన్మాన కార్యక్రమంలో కేంద్ర మంత్రి సంజయ్ కరీంనగర్: ‘నేనింతే. ఎంత ఎదిగినా ఒదిగే ఉంటా. కష్టపడి పైకి వచ్చిన. నా దగ్గరకు పనుల కోసం వచ్చే ఏ ఒక్కరి దగ్గర పైసలు ఆశించను. వాళ్లకు సేవ చేయడంలోనే నాకు తృప్తి ఉంది. భవిష్యత్తులోనూ ఇట్లానే ఉంటా’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇకపై ఆర్యవైశ్యులతోపాటు వ్యాపారాలు చేసుకునే వారెవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. కరీంనగర్లో సామాన్యు ల రాజ్యం వచ్చిందని, ఇకపై వ్యాపారులను ఎవరూ బెదిరించరన్నారు. నగరంలోని గాంధీరోడ్డులో ఉన్న వైశ్యభవన్లో శనివారం రాత్రి జరిగిన ఆర్యవైశ్య కార్పొరేటర్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న అమిత్ షా, పీయూష్ గోయల్ వంటి టైగర్లు వైశ్యులేనన్నా రు. కరీంనగర్లో ఇద్దరు వైశ్యులు కార్పొరేటర్లేనని తెలిపారు. కరీంనగర్లో కన్యకా పరమేశ్వ రి ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని అన్నారు. పారదర్శకంగా ఆర్యవైశ్య సంఘ ఎన్నికలు జరిపి కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని అన్నారు. డంపింగ్ యార్డ్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలిహుజూరాబాద్: హుజూరాబాద్లో డంపింగ్ యార్డ్ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. హుజూరాబాద్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటును నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు శనివారం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత దుర్మార్గపు ఆలోచనతో ముందుకెళ్తోందని మండిపడ్డారు. హుజూరా బాద్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల లక్షలాది మంది ప్రజల జీవితాలు నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. చెత్త నుంచి కరెంట్ తీస్తామనే మాటలు నమ్మశక్యం కాదని, దీనివల్ల విపరీతమైన శబ్ద కాలుష్యం ఏర్పడుతుందన్నారు. హుజూరాబాద్ ప్రజలు ఆదేశిస్తే డంపింగ్ యార్డ్ ఏర్పాటు కాకుండా, ముందుండి పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ టౌన్: రాష్ట్రంలో నడుస్తోంది ప్రజా పాలన కాదని పాపాల పాలన అని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆన్నారు. శనివారం కరీంనగర్లో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, జిల్లా బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడుతూ క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్, సీపీఐ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చైర్పర్సన్ పీఠం గెలుచుకోకుండా అధికార పార్టీ కుట్రలు చేసిందని విమర్శించారు. అధికారులు కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం మానేసి, క్యాతనపల్లి అభివృద్ధికి సహకరించాలని కోరారు. బాల్క సుమన్ మాట్లాడుతూ చరిత్రలోనే స్పష్టమైన తీర్పు ప్రజలు ఇచ్చినప్పటికీ క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్, జిల్లా మంత్రి వివేక్ కుట్రలు చేశారన్నారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, సర్దార్ రవీందర్ సింగ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, ఏనుగు రవీందర్రెడ్డి పాల్గొన్నారు. విద్యానగర్(కరీంనగర్): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అడ్వాన్స్ టెక్నాలోజీ సెంటర్ కరీంనగర్ ఆధ్వర్యంలో 15 రోజుల స్వల్పకాలిక టెక్నికల్ కోర్సుల్లో యువతకు శిక్షణ ఇస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ కే.అశోక్కుమార్ తెలిపారు. అవెర్నెస్ కోర్స్ ఆన్ ప్రాసెస్ కంట్రోల్, ఆటోమేషన్, బేసిక్ కోర్స్ ఆన్ ఎలక్ట్రికల్ వెహికిల్, జూనియర్ ప్రోడక్ట్ డిజైనర్ యూజింగ్ కాడ్ 2డీ, 3డీ కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి, 18 సంవత్సరాలు నిండిన యువత ఎస్సెస్సీ మెమో, కుల ధ్రువీకరణ, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 8500461506 నంబర్లో సంప్రదించాలన్నారు.


