breaking news
Karimnagar
-
హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం
కరీంనగర్: మహిళలను వేధిస్తున్న కేన్సర్ను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్పీవీ) వ్యాక్సినేషన్ ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో ప్రారంభమైంది. ఆర్ఎంవో నవీన వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. కేన్సర్ను నిరోధించాలనే లక్ష్యంతో ప్ర భుత్వాలు యుక్త వయస్సు (14–15) గల బాలికలకు ఈ టీకాలు ఇవ్వడం జరుగుతోందన్నారు. జీజీహెచ్తో పాటు హుజూరాబాద్, జమ్మికుంట ఆస్పత్రుల్లో హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభించామని డీఎంహెచ్వో తెలిపారు. జీఐఎస్ ద్వారా విద్యుత్ సమస్యలు పరిష్కారం కొత్తపల్లి(కరీంనగర్): జీఐఎస్(జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం) ద్వారా విద్యుత్ సమస్యలు సత్వ రం పరిష్కరించనున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఇన్చార్జి ఎస్ఈ వడ్లకొండ గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు. జీఐఎస్ అసెట్ మ్యాపింగ్ అండ్ ట్రాకింగ్ ప్రక్రియలో అన్ని 33 కేవీ లైన్లలోని 90 ఫీడర్ల పనులు పూర్తిచేసినట్లు తెలిపా రు. 11 కేవీ లైన్లలోని 317 ఫీడర్లకు యూనిక్ పోల్నంబర్ పెయింటింగ్ చేపట్టామన్నారు. ఈ ప్రక్రియతో పోల్ల వారీగా పెట్రోలింగ్, నిర్వహణ పనులు సమర్థవంతంగా ట్రాక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే ఆ పోల్ నంబర్ ఆధారంగా లొకేషన్ మ్యాపింగ్ తెలుసుకొని పరిష్కరించవచ్చునన్నారు. త్వరితగతిన స్పందించడం ద్వారా విద్యుత్ అంతరాయాలు తగ్గించవచ్చన్నారు. వంటగ్యాస్ పెంపుపై నిరసన కరీంనగర్టౌన్: కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణచౌక్ వద్ద నిరసన చేపట్టారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగకుండానే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజలపై భారాలు మో పడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. గ్యాస్ ధర పెంపుతో జిల్లా ప్రజలపై నెలకు అదనంగా రూ.9 కోట్ల భారం పడుతోందన్నారు. 2014కు ముందు గ్యాస్ సిలిండర్ ధర రూ.500 లోపు ఉంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన 12ఏళ్ల కాలంలో వెయ్యికి చేరుకుందన్నారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి, గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు ఎడ్ల రమేశ్, డి.నరేశ్పటేల్, తిప్పారపు సురేశ్, గజ్జల శ్రీకాంత్, పుల్లెల మల్లయ్య, పున్నం రవి, రాయికంటి శ్రీనివాస్, రాజయ్య పాల్గొన్నారు. నల్లవెంకయ్యపల్లెలో ‘జల అర్బన్’ శంకరపట్నం: మండలంలోని నల్లవెంకయ్యపల్లె గ్రామంలో ఆదివారం జల అర్బన్ కార్యక్రమం నిర్వహించారు. మిషన్ భగీరథ నీటి ప్రాముఖ్యతపై గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. నూతన గ్రామంగా ఏర్పాటైన నల్ల వెంకయ్యపల్లెను ప్రభుత్వం జల అర్బన్ కార్యక్రమం కింద ఎంపిక చేశారు. మిషన్ భగీరథ రికార్డులను గ్రామపంచాయతీకి అందించారు. జలజీవన్ పథకంలో అందిస్తున్న మిషన్ భగీ రథ నీటిని వినియోగించాలని డీపీవో జగదీశ్వ ర్ సూచించారు. సర్పంచ్ నాగలక్ష్మి, ఎస్ఈ రాములు, ఎంపీడీవో కృష్ణప్రసాద్ ఉన్నారు. -
రాజకీయాలకతీతంగా అభివృద్ధి
కరీంనగర్ కార్పొరేషన్: రాజకీయాలకు అతీతంగా నగరాన్ని అభివృద్ధి చేస్తామని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం నగరంలోని 9,10,11 డివిజన్లలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 10వ డివిజన్ కట్టరాంపూర్లో గిద్దెపెరుమాండ్ల స్వామి ఆలయం మైదానం వద్ద కార్పొరేటర్ సౌగాని కొమురయ్యతో కలిసి రూ.5 లక్షలతో చేపట్టనున్న గేట్ నిర్మాణానికి, 9వ డివిజన్ కట్టరాంపూర్ శివారుకాలనీలో కార్పొరేటర్ పడిశెట్టి వసంతలక్ష్మితో కలిసి రూ.2.50 లక్షలతో డ్రైనేజీ కల్వర్టు నిర్మాణ పనులకు, ఉజ్వల పార్కు సమీపంలో ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ.5 లక్షలతో గంగపుత్ర సంఘం కమ్యూనిటి హాల్ నిర్మాణానికి శంకుస్థాపనచేశారు. 11 వ డివిజన్లో కార్పొరేటర్ ఆకుల నర్మదతో కలిసి న్యూ శ్రీనగర్కాలనీలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు, రూ.5 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. మేయర్ మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా నగరంలోని అన్ని డివిజన్లను సమాంతరంగా అభివృద్ధి చేస్తామన్నా రు. మేయర్ వెంట సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కార్పొరేరట్లు, అధికారులు పాల్గొన్నారు. -
బల్దియాలో స్క్రాప్ దందా!
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో స్క్రాప్ దందా వెలుగుచూసింది. లక్షల రూపాయల విలువైన స్క్రాప్ను వేలం వేసి నగరపాలకసంస్థకు ఆదాయం తీసుకురావాల్సి ఉండగా, అడ్డదారుల్లో ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తున్నాయి. కొంతమంది అధికారులు ప్రైవేట్వాళ్లతో కుమ్మక్కు కావడం వల్ల నే స్క్రాప్ దందా చోటుచేసుకొంటున్నట్లు ఆరోపణలున్నాయి. వేలం వేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలు సైతం బేఖాతరు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. నగరవ్యాప్తంగా సేకరించిన చెత్తాచెదారం, ఇతరత్రా స్క్రాప్ డంప్యార్డ్లోకి వస్తుండడం తెలిసిందే. ఇందులో ముందుగానే తడి, పొడి చెత్తను వేర్వేరుగా తీసుకొని, పొడి చెత్తను డీఆర్సీ సెంటర్కు, తడిచెత్తను కంపోస్ట్కు వినియోగిస్తారు. తద్వారా డంప్యార్డ్కు చెత్తను తగ్గించాలనేది అధికారుల ఆలోచన. అయితే పూర్తిస్థాయిలో తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించకపోవడం కారణంగా, డీఆర్సీ, కంపోస్ట్ల ద్వారా డంప్యార్డ్కు వెళ్లే చెత్త అనుకున్న మేర తగ్గడం లేదు. ఇదిలా ఉంటే రెండు రోజులుగా డంప్యార్డ్లో ఉన్న వివిధ మిషనరీల, వాహనాల స్క్రాప్ను హౌసింగ్బోర్డుకాలనీ సమీపంలో ఉన్న డీఆర్సీ సెంటర్కు తరలించడం పలు అనుమానాలకు తావిస్తోంది. నగరపాలకసంస్థకు సంబంధించిన స్క్రాప్ను నిబంధనల ప్రకారం వేలం వేయాల్సి ఉంటుంది. వేలం వేయడానికి బదులు డంప్యార్డ్ నుంచి ప్రైవేట్ ఏజెన్సీ చేతిలో ఉండే డీఆర్సీ సెంటర్కు తీసుకురావడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయల విలువైన ఈ స్క్రాప్ను వేలం ద్వారా విక్రయించాలని ఉన్నతాధికారులు ఓ వైపు ఆదేశించినా, కొంతమంది తమ చేతి వాటాన్ని ప్రదర్శించేందుకు ఇలా ప్రక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరపాలకసంస్థ అధికారులు మాత్రం స్క్రాప్ను వేలం వేస్తామని, ప్రైవేట్కు అప్పగించేది లేదని చెబుతున్నారు. -
ప్రతిభకు పట్టం కట్టేందుకే క్రీడా పోటీలు
కరీంనగర్స్పోర్ట్స్: ప్రతిభకు పట్టం, క్రీడాకారులకు సదుపాయాలు కల్పించడమే ఖేలో ఇండియా లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో మూడు రోజులుగా జరుగుతున్న పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. విజేతలకు బండి సంజయ్ బహుమతులు అందించారు. అనంతరం మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడలు అవసరం అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏటా ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. హెచ్సీఏలో పైరవీలు, పైసలే.. తెలంగాణలో ప్రతిభ ఉన్నా చాలా మంది క్రీడల్లో రాణించలేకపోతున్నారని, అందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిదర్శనమని, హెచ్సీఏలో ఎంపిక కావాలంటే పైరవీలు, డబ్బులు ముట్ట చెప్పాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. ఇలాంటి వ్యవహారానికి చరమగీతం పాడాలని సూచించారు. క్రీడాకారుల ప్రతిభను దెబ్బతీసే దుర్మార్గానికి స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిభ ఉండి క్రీడల్లో రాణించే పరిస్థితి నేడు రాష్ట్రంలో లేకపోవడం బాధాకరమన్నారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్రావు, గుజ్జ శ్రీనివాస్, మాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
కేంద్రం నిధుల నుంచే జీతాలు
కరీంనగర్రూరల్: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచే పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని 318 గ్రామపంచాయతీలకు రూ.12.92కోట్లు మంజూరయ్యాయి. చిన్న పంచాయతీలకు రూ.3లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.10లక్షలు కేటాయించారు. పంచాయతీలకు నిధులు వచ్చాయనే సంతోషపడుతున్న సర్పంచులకు తీర్చాల్సిన అప్పులు సైతం అంతకుమించి ఉండటంతో ఆందోళన కలిగిస్తోంది. ఈ నిధులను పాలకవర్గాలు లేనప్పుడు పంచాయ తీ కార్యదర్శులు ట్రాక్టర్ల నిర్వహణ, పారిశుధ్య, ఇతర పనులకు చేసిన ఖర్చులకు సర్దుబాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీలపై కార్మికుల వేతనాల భారం కేంద్ర నిధుల నుంచి పంచాయతీ కార్మికులకు నెల వేతనం రూ.9,500 చెల్లించాలంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. జిల్లాలోని 318 గ్రామపంచాయతీల పరిధిలో మొత్తం 1,297 మంది మల్టీపర్పస్ కార్మికులు పనిచేస్తున్నారు. గతేడాది డిసెంబరు నెల నుంచి పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించనున్నారు. నిబంధనల ప్రకారం నిధుల వినియోగం కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను టైడ్, అన్టైడ్ పేరిట విడుదల చేస్తోంది. టైడ్ నిధులు తాగునీరు, పైపులైన్ల మరమ్మతు, క్లోరినేషన్, బోరుమోటార్ల నిర్వహణ, పారిశుధ్యం పనులకు వినియోగించాల్సి ఉంటుంది. అన్టైడ్ నిధులు పంచాయతీ అభివృద్ధి పనులకు ఉపయోగించుకోవాలి. ప్రస్తుతం జమైన నిధుల నుంచే పాత బకాయిలను సర్దుబాటు చేయాలని మాజీ సర్పంచులు, కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం నిధులను వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు పంచాయతీ అధికారులు పేర్కొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు
కరీంనగర్టౌన్: పదోతరగతి పరీక్షలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 14 నుంచి వచ్చేనెల 13వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రశ్నాపత్రాలు జిల్లాకు చేరుకోగా, కలెక్టరేట్లోని ట్రెజరీ విభాగంలో భద్రపరిచారు. అన్నిశాఖల అధికారులతో పలు దఫా లుగా కలెక్టర్ సమావేశం నిర్వహించి, దిశనిర్దేశం చేశారు. విద్యార్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. హెడ్ మాస్టార్ల సంతకంతో పని లేకుండా డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్లతో పరీక్షకు హాజరు కావచ్చు. జిల్లాలో 73 పరీక్ష కేంద్రాలు పదో తరగతి పరీక్షలు ఈనెల 14 నుంచి వచ్చేనెల 13వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నా యి. జిల్లావ్యాప్తంగా 73 కేంద్రాల్లో రెగ్యులర్ వి ద్యార్థులు 1,3157 మంది, ప్రైవేట్గా ఏడుగురు పరీక్షలు రాయనున్నారు. 73మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 73 మంది డిపార్ట్మెంటల్ అధికా రులు, ఇద్దరు అదనపు డిపార్ట్మెంట్ అధికారులు, ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 695 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు. ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్ష హాలులో వెలుతురు, తాగునీటి వసతి, వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి రోజు పరీక్ష కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను ఆయా పోలీస్స్టేషన్ నుంచి పరీక్ష సమయాని కన్నా ముందుగా తీసుకువచ్చే విధంగా చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్మెంట్ అధికారులు (డీవో)లకు ఆదేశాలు జారీ చేశారు. సెంటర్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్ష పేపర్ల సీల్ ఓపెన్ చేసినప్పటి నుంచి పరీక్ష పూర్తయి వాటిని సీల్ చేసేంత వరకురికార్డు కానుంది. -
వంట.. యుద్ధం మంట!
కరీంనగర్ అర్బన్: పశ్చిమాసియాలో యుద్ధం.. వంటగ్యాస్పై ప్రభావం చూపుతోంది. ఇన్నాళ్లు గ్యాస్ బుక్ చేసిన రెండు రోజుల్లోనే సిలిండర్ సరఫరా కాగా, కొద్ది రోజులుగా జాప్యం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని చమురు సంస్థలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి వంటగ్యాస్ ధరలు పెంచిన విషయం విదితమే. మరోవైపు వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సరఫరాను నిలిపేశాయి. ఫలితంగా ఆహార పదార్థాల ధరలు పెరుగుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. సరఫరా సక్రమంగా లేక ఏజెన్సీల వద్ద గ్యాస్ నిల్వలు తరిగిపోతున్నాయి. తాజాగా వాణిజ్య సిలిండర్ల విక్రయాలను పూర్తిగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏజెన్సీలు కోత పెట్టినట్లు సమాచారం. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, పారిశ్రామిక అవసరాలకు గ్యాస్ కొరత ఏర్పడనుంది. వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలు జిల్లాలో పట్టణాల నుంచి పల్లెల వరకు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, టీ స్టాళ్లు, దాబాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద వారం రోజులకు మాత్రమే సరిపోయే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వారం తర్వాత గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడితే రెస్టారెంట్ల నుంచి చిన్న హోటళ్ల వరకు మూతపడే ప్రమాదముంది. గృహావసరాలు, ఆసుపత్రులు, ప్రభుత్వ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అన్నదాన సత్రాలు, విశ్వవిద్యాలయాలు, అత్యవసర సేవలకు మాత్రమే ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేయాలని గ్యాస్ డిస్ట్రిబ్యూటరీ సంఘం నుంచి ప్రకటన వెలువడటంతో జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. జిల్లాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు 1,500కి పైగా ఉన్నాయి. కొన్ని పెద్ద హోటళ్ల నిర్వాహకులు నేరుగా గ్యాస్ కంపెనీల నుంచే రోజూ ఆర్డర్లపై కమర్షియల్ సిలిండర్లు తెప్పిస్తుంటారు. నిల్వలు రెండు, మూడు రోజులకు సరిపోతాయని అంచనా. ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యి, వరిపొట్టు (ఊక), హైఓల్టేజీ విద్యుత్ పొయ్యిలు ఏర్పాటు చేయక తప్పదు. కొన్ని చిన్న హోటళ్లలో ఇప్పటికే కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటిపై వంట చేసే మాస్టర్స్ (చెఫ్స్) లభ్యత తక్కువగా ఉండటం సమస్యగా మారింది.జిల్లాలో గ్యాస్ వివరాలు డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు: 3,50,000పెరిగిన ధరతో నెలకు భారం: రూ.2.10కోట్లు కమర్షియల్ కనెక్షన్లు: 80,000పెరిగిన ధరతో నెలకు భారం: రూ.91.20లక్షలు వినియోగదారులూ పొదుపే మార్గం గ్యాస్ బుకింగ్, సరఫరాకు సంబంధించిన వెబ్సైట్లు శుక్రవారం అర్ధరాత్రి నుంచి డీలర్ల పరిధి నుంచి చమురు సంస్థల అజమాయిషీలోకి వెళ్లిపోయాయి. గృహ వినియోగదారులు సిలిండర్ బుక్ చేసేందుకు గడువును 21 నుంచి 25 రోజులకు పెంచారు. ఈ వ్యత్యాసం రానున్న రోజుల్లో 30 నుంచి 35 రోజులకు పెరిగే అవకాశముందని డీలర్ల అంచనా. బుక్ అయిన తర్వాత డెలివరీ చేసేందుకు వారం, పది రోజులు పట్టొచ్చు. ఈ లెక్కన గ్యాస్ను పొదుపుగా వాడాలి లేదా కట్టెల పొయ్యి, విద్యుత్తు స్టౌవ్లు వినియోగించాలి. లేకుంటే గ్యాస్ కొరత ఏర్పడి కటకట తప్పదని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటరీల సంఘం హెచ్చరిస్తోంది. దీంతో గృహ వినియోగదారులు పొదుపు పాటించి నెల రోజులు వాడాల్సిన సిలిండర్ను 45 నుంచి 50 రోజుల వరకు వాడుకోవటం మంచిది. జిల్లాపై రూ.3కోట్ల భారం ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా యుద్ధంతో జిల్లాపై రూ.3కోట్ల భారం పడింది. ఇప్పటివరకు గృహ వినియోగానికి 14.2కిలోల సిలిండర్ రూ.925 ఉండగా రూ.60 పెంపుతో రూ.985కు చేరింది. 19కిలోల కమర్షియల్ సిలిండర్ రూ.2,026 ఉండగా పెరిగిన ధరతో రూ.2,140కి చేరుకుంది. పెరిగిన ధరలు సామాన్య ప్రజలతో పాటు చిరు వ్యాపారులకూ భారంగా మారనున్నాయి. -
ఎస్సై గల్లా పట్టిన వ్యక్తిపై కేసు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: విధుల్లో ఉన్న ఎస్సై గల్లా పట్టి దాడి చేసిన ఘటనపై కరీంనగర్ పోలీసులు స్పందించారు. ఘటనపై ‘సాక్షి’లో శనివారం ‘ఖద్దర్నాక్’ శీర్షికన కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ వార్తపై డీజీపీ కార్యాలయం స్పందించింది. ఉన్నతాధికారులు శనివారం ఉదయమే సీపీ గౌస్ ఆలంతో ఆరా తీశారు. అనంతరం ఎల్ఎండీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై గల్లా పట్టుకుని చేతులతో దాడిచేస్తే, విధులకు ఆటంకం కలిగించాడని కేసు నమోదు చేయడం విడ్దూరం.‘ఖద్దర్నాక్’ఆ రోజు ఏం జరిగిందంటే?తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెంలో ఈ నెల 4వ తేదీన సాయంత్రం 6.50 గంటలకు జాతర సందర్భంగా విధుల్లో ఉన్న గన్నేరువరం ఎస్సై నరేందర్రెడ్డిపై చెన్నబోయిన రమేశ్ అనే వ్యక్తి గల్లా పట్టి దాడి చేశాడు. పోలీసులు అతడిని పోలీసు స్టేషన్కు తరలించారు. పరీక్షించగా.. తాగినట్లు గుర్తించారు. అదే సమయంలో అధికార పార్టీ నేతను స్టేషన్కు ఎలా తీసుకెళ్తారు? అంటూ రాజకీయ ఒత్తిడి మొదలైంది. దీంతో తిమ్మాపూర్ సర్కిల్, సీపీ కార్యాలయం ఉన్నతాధికారులు ఈ ఘటన విషయంలో చేతులెత్తేశారు. సాక్షాత్తూ సీసీ కెమెరా ఫుటేజీ ఉన్నా.. కేసు నమోదు చేయలేదు. సాక్షాత్తూ పోలీసులపై సామాన్యుడు దాడి చేసినా ప్రతిఘటించలేని స్థితికి చేరుకున్నామని వాపోయారు.దాడి చేస్తే.. విధులకు ఆటంకం కేసేంటి?ఘటనను సాక్షిలో శనివారం ‘ఖద్దర్’నాక్ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. కరీంనగర్ పోలీసులతో మాట్లాడారు. స్పందించిన సీపీ అదే సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేశారు. ఇది కేవలం తూతూ మంత్రపు కేసు కావడం మరో చర్చకు దారితీస్తోంది. ఎస్సై గల్లా పట్టుకుని, చేతులతో కొడితే.. ఆయనపై దాడి కేసు పెట్టకుండా కేవలం విధులకు ఆటంకం కలిగించాడని కేసు పెట్టడం.. ఉన్నతాధికారులు తలొగ్గిన తీరుకు నిదర్శనమని కిందిస్థాయి పోలీసులు విమర్శిస్తున్నారు. ఘటన జరిగినా ఉన్నతాధికారులు దాన్ని తొక్కిపెట్టడం, మీడియా ఎత్తిచూపితే తప్ప కేసు నమోదు చేసుకోలేని దయనీయ స్థితి ఎదురవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కూతురుంటే గర్వపడాలి
కరీంనగర్ అర్బన్: మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు మన ఆలోచనా ధోరణే కారణం. ఇందులో మొదటిది ఆడ, మగా అనే వివక్ష. కొడుకు, కూతురు మధ్య వివక్షత చూపొద్దు. చిన్నప్పటి నుంచే ఇద్దరూ సమానమేనని తెలిసేలా పెంచండి. పరిపాలనా పరంగా మహిళలకు అన్ని విషయాల్లో యంత్రాంగం తోడుంటుంది. మహిళలు, పిల్లల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తాం. సీ్త్ర, శిశుసంక్షేమ శాఖ ద్వారా చిన్నారుల శారీరక పటిష్టతకు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక చేయూత ద్వారా తోడ్పాటునిస్తాం. – చిత్రామిశ్రా, కలెక్టర్, కరీంనగర్ -
నాడు బీడీకార్మికురాలు.. నేడు అధ్యాపకురాలు
కరీంనగర్సిటీ: వారిది నిరుపేద చేనేత కుటుంబం.. తల్ల్లి బీడీ కార్మికురాలు.. తల్లికి చేదోడువాదోడుగా బీడీలు చేస్తూ తన విద్యాభ్యాసాన్ని కొనసాగించింది పెద్దపల్లి జిల్లా ఎలిగేడుకు చెందిన శ్రీవాణి. ఆమె చదువు ప్రభుత్వ విద్యాసంస్థల్లో ర్యాంకులు, బంగారు పతకాలతో సాగింది. ఎలిగేడు జెడ్పీ స్కూల్లో 10వ తరగతి ప్రథమ శ్రేణిలో, కరీంనగర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో అన్ని సబ్జెక్టుల్లో మొదటి ర్యాంకు సాధించింది. కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఏలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో 9వ ర్యాంకు, ఎంఏ ఎకనామిక్స్లో ఫస్ట్ ర్యాంకుతో 3 బంగారు పతకాలు సాధించింది. ఒకే ఏడాదిలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం శాతవాహన యూనివర్సిటీలో అర్థశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. శ్రీవాణి విద్యారంగంలో అత్యున్నతంగా రాణిస్తున్నందుకు అవార్డులు అందుకున్నారు. శ్రీవాణి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక కారణాలతో చాలామంది బయటకు రాలేకపోతున్నారన్నారు. అలాంటివారిని గుర్తించి తీర్చిదిద్దుతానని, శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు. -
‘సాక్షి’ చక్కటి అవకాశం కల్పించింది
డబుల్బెడ్రూమ్ కాలనీలో సమస్యలు తెలుసుకున్న. సాక్షి యాజమాన్యం నన్ను స్టార్ రిపోర్టర్గా ప్రజల మధ్యకు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. ఇక్కడి సమస్యలు తెలుసుకున్న. తాగునీరు, వైకుంఠధామాలు లేక ఇబ్బందులు పడుతుండ్రు. పార్కులు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం తదితర సమస్యలను ఎమ్మెల్యే కే.తారకరామారావు, కలెక్టర్ గరీమా అగ్రవాల్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా. మున్సిపల్ నుంచి ప్రత్యేక దృష్టి సారిస్తాం. మౌలిక వసతుల కల్పనకు పాలకవర్గం కృషి చేస్తుంది. – జిందం కళ, మున్సిపల్ చైర్పర్సన్, సిరిసిల్ల -
గుర్తు తెలియని మృతదేహం
కరీంనగర్క్రైం: కరీంనగర్ కలెక్టరేట్ రోడ్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి కిందపడిపోగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. ఈనెల 6వ తేదీన మధ్యాహ్నం కలెక్టరేట్ రోడ్లో ఓ వ్యక్తి కిందపడిపోగా అతడిని 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతిచెందాడు. మృతదేహం ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. వ్యక్తి వయసు సుమారు 55ఏళ్లకు పైగా ఉంటుందని, గుర్తు పట్టినవారు వన్టౌన్ పోలీసులను సంప్రదించాలని తెలిపారు. -
స్వయం కృషి.. ఆర్థిక స్వావలంబన
ధర్మపురి: కుటుంబ పోషణలో భర్తకు దీటుగా పని చేస్తూ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్న పలువురు మహిళలు మహారాణులుగా ఎదుగుతున్నారు. స్వయంకృషితో పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. ధర్మపురికి చెందిన కొల్లూరి లక్ష్మి, వీరబాబు దంపతులు చిన్నపాటి పూజాసామగ్రి దుకాణంతో కుటుంబాన్ని నడిపించారు. వీరికి కూతురు, కొడుకు బీటెక్, డిగ్రీ చదువుతున్నారు. ఖర్చులు పెరగడంతో ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. ఈనేపథ్యంలో లక్ష్మి ఆలోచనతో పట్టణంలోని గోదావరి ఒడ్డున అగరుబత్తీలు తయారు చేసే కుటీర పరిశ్రమను ప్రారంభించారు. ఇందుకు మహిళా సంఘం నుంచి రూ.2లక్షలు రుణం తీసుకున్నారు. పిల్లలు తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూనే చదువుకుంటున్నారు. రోజూ 2రకాలైన 10 కిలోల అగరుబత్తీలు తయారు చేసి దుకాణాల్లో విక్రయిస్తా రు. అగర్బత్తీల తయారీకి ఆలయంలో వాడిన పూలను తీసుకొచ్చి ఎండబెట్టి వాటి పౌడర్ను వినియోగిస్తారు. ప్రస్తుతం రెండు చిన్నపాటి మిషన్లతోపాటు ఒక పిండి గిర్నీ నడిపిస్తున్నారు. కుటుంబమంతా పని చేస్తూ రోజూ రూ.వెయ్యి వరకు సంపాదిస్తున్నారు. -
మసాలా సు‘చరిత’
● 2019లో ప్రారంభించి.. 15 మందికి ఉపాధి ● ఆదర్శంగా నిలుస్తున్న సుచరిత జమ్మికుంట(హుజూరాబాద్): స్వయంకృషితో చిరుపరిశ్రమ ప్రారంభించి పలువురు మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు జమ్మికుంట పట్టణానికి చెందిన సుచరిత. జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లికి చెందిన వర్మని సుచరిత, రమేశ్ దంపతులు. రమేశ్ ఎలక్టీషియన్. జీవనం కష్టంగా ఉన్న రోజుల్లో చిన్న ఆలోచనతో పెద్ద విజయం సొంతమైంది. కీర్తన మసాల తయారీ, రిటైల్ అండ్ హోల్సేల్ పరిశ్రమను 2019లో ప్రారంభించారు. మొదట ముగ్గురు కుటుంబ సభ్యులు, రూ.3వేల పెట్టుబడితో మసాల ప్యాకెట్లు తయారు చేసి జమ్మికుంట, హుజూరాబాద్ పట్టణాల్లోని కిరాణం షాపుల్లో హోల్సేల్గా విక్రయించారు. మెప్మా, నెహ్రూ గ్రూపుల సాయంతో 2022లో రూ.లక్ష రుణంతో వ్యాన్ కొనుగోలు చేశారు. పీఎంజీ ద్వారా రూ.5లక్షలు రుణంతో మిషన్ కొని మసాలాలు ప్యాకింగ్ చేసి వరంగల్, కరీంనగర్, జనగాం, పెద్దపల్లి, గోదావరిఖని తదితర పట్టణాల్లో హోల్సేల్గా విక్రయిస్తున్నారు. ఏడాదిలో రూ.లక్షల్లో టర్నోవర్ చేస్తూ 15 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. నెలకు రూ.50 వేల ఆదాయం మసాలా తయారీ, అమ్మకంతో నెలకు ఖర్చులు పో నూ రూ.50వేల వరకు ఆ దాయం వస్తుంది. మసాలా తయారీ, ప్యాకింగ్ కో సం 15 మంది మహిళలకు నెలకు రూ.6 వేల నుంచి రూ.10వేల వరకు జీతం ఇస్తూ ఉపాధి కల్పిస్తున్నాం. స్వయంకృషితో తమ కుటుంబంతో పాటు పలువురికి ఉపాధి కల్పించడం సంతోషంగా ఉంది. – సుచరిత, కీర్తన మసాలా చిరు పరిశ్రమ, జమ్మికుంట -
సిటీని ఆదర్శంగా మారుస్తాం
కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్రంలోనే కరీంనగర్ను ఆదర్శ నగరంగా మార్చేందుకు కృషి చేస్తామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన..ప్రగతి ప్రణాళికలో భాగంగా రెండవ రోజు శనివారం నగరపాలకసంస్థ పరిధిలోని 3,4,5,6,7 డివిజన్లలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 3వ డివిజన్ విద్యారణ్యపురిలో కార్పొరేటర్ సాదినేని లావణ్య మునీందర్తో కలిసి మేయర్ డివిజన్లో పారిశుధ్య పనులు నిర్వహించారు. రూ.5 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 4వ డివిజన్ దుర్శేడ్ లో కార్పొరేటర్ భూపతి రవీందర్తో కలిసి పారిశుధ్య పనులు చేపట్టారు. రూ.5 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. దుర్శేడ్ జెడ్పీ పాఠశాలలో వసతి సదుపాయాల కోసం రూ.10 లక్షలు కేటాయించారు. 5వ డివిజన్లో కార్పొరేటర్ గాదె రూపతో కలిసి రూ.5 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. 6వ డివిజన్ గుంటూరుపల్లిలో కార్పొరేటర్ మ్యాకల వెంకటేశ్తో కలిసి రూ.5 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 7వ డివిజన్ సదాశివపల్లిలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, స్థానిక కార్పొరేటర్ ఆకుల నందిని ఉదయ్తో కలిసి రూ.9 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్తాపన చేశారు. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సహాయ కమిషనర్ దిలీప్ కుమార్, ఎస్ఈ రాజ్ కుమార్, రైల్వే బోర్డు సభ్యుడు పాశం తిరుపతి, దాది సుధాకర్ పటేల్, పుట్టపాక శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
విశ్వఖ్యాతి
నారీశక్తి..ఆమెకు భయం ఎక్కువే.. కానీ భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుంది. ఆమెకు బాధా ఎక్కువే.. కానీ.. అన్ని బాధ్యతలు మోస్తుంది. కుటుంబానికి చేదోడుగా ఉంటూ.. ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన అతివలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. విద్యా, వ్యాపారం, ఉద్యోగం ఇలా.. ఏ రంగాన్ని ఎంచుకున్నా అగ్రపథాన నిలుస్తున్నారు. ఆనాడు అక్షరాలు అంటే తెలియని మహిళలు నేడు డిజిటల్ మార్కెటింగ్లో రికార్డు సృష్టిస్తున్నారు. కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకుని, పిల్లలను ఉన్నతంగా చవిదించి, జీవితంలో స్థిరపడేలా చేస్తున్నారు. ఒకప్పుడు పోలీసు అంటేనే భయపడేవారు.. ఇప్పుడు ఆ రంగంలో ఉత్సాహంగా రాణిస్తున్నారు. ఐపీఎస్ నుంచి కానిస్టేబుల్ వరకు బాధితులకు అండగా నిలుస్తున్నారు. బీడీలు చుట్టిన చేతులు పిల్లలకు ఓనమాలు నేర్పిస్తున్నాయి. పల్లెల్లో వ్యవసాయ పనుల్లో వినిపించిన గొంతులు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రపంచ గుర్తింపు పొందుతున్నాయి. పలువురు మహిళలు ఉమ్మడిగా ఏర్పడి ప్రారంభించిన హోంఫుడ్స్ ఖండాంతరాల్లో రుచులు పంచుతున్నాయి. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పలువురు ఆదర్శ మహిళలపై ప్రత్యేక కథనం..!! మహిళల భద్రతకు పెద్దపీట విద్య, వ్యాపారం, ఉద్యోగంలో అతివల ప్రతిభ కుటుంబ బాధ్యతలు మోస్తూ పిల్లలను తీర్చిదిద్దుతున్న వైనం ఖాకీ చొక్కా వేసుకుని బాధితులకు సత్వర న్యాయం పల్లెపాటల గొంతుకు ప్రపంచ గుర్తింపు అమ్మచేతి వంటకు విదేశాల్లో అభిమానులు ఆదర్శం.. ఉమ్మడి జిల్లాలోని పలువురు అబలలు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం -
క్యాష్లెస్ లావాదేవీల్లో ‘నిర్మల’
యైటింక్లయిన్కాలనీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు డిజిటల్ చెల్లింపులపై రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీ అల్లూరు గ్రామానికి చెందిన చిరు కిరాణా వ్యాపారి బాలసాని నిర్మల శ్రద్ధపెట్టారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించి, అత్యధికంగా రూ.5,340 క్యాష్ బ్యాక్ పొంది ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె దృఢసంకల్పానికి అబ్బురపడిన కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి 26 గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించింది. నిర్మల తన భర్త బాలసాని రవికుమార్ గౌడ్తో కలిసి ఢిల్లీలోని గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ చేతుల మీదుగా సత్కారం పొందారు. స్వనిధి రుణంతో నవచైతన్యం నిర్మల నవ చైతన్యం–2020లో సీఎం స్వనిధి పథకంలో తొలి విడతగా రూ.10వేలు రుణం పొంది ఇంట్లో కిరాణం ప్రారంభించారు. క్రమం తప్పకుండా రుణ వాయిదాలు డిజిటల్ రూపంలో చెల్లించడంతో ప్రభుత్వం రెండో విడతగా రూ.20 వేలు మంజూరు చేసింది. ఆ మొత్తంతో కిరాణంతో పాటు చీరల వ్యాపారం, కుట్టు మిషన్, మగ్గంవర్క్ ప్రారంభించి సక్సెస్ అయ్యారు. మూడోవిడత రూ.50వేలు రుణం పొంది ఆదర్శంగా నిలిచారు. -
ఊరూరా ఉప్పు అమ్మి.. ఉజ్వల భవితనిచ్చి
వీర్నపల్లి(సిరిసిల్ల): ఆమె చదువుకోలేదు. కానీ చదువు విలువ తెలుసు. ఆమెకు ఆస్తులు లేకున్నా పిల్లలే తన ఆస్తి అనుకుంది. ఉప్పు తట్ట మోసింది. ఎడ్ల బండిపై ఊరూరా తిరుగుతూ ఉప్పు అమ్మింది. భర్త దూరదేశం వెళ్లినా అధైర్యపడలేదు. కూరగాయలు అమ్మి బిడ్డలు సమాజంలో ఉన్నతస్థానాల్లో నిలబెట్టింది రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని భావుసింగ్నాయక్ తండాకు చెందిన బట్టు మంగవ్వ. నలుగురు సంతానం మంగవ్వ– హరిచంద్ దంపతులకు నలుగురు సంతానం. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో హరిచంద్ గల్ఫ్దేశాలకు వెళ్లాడు. కుటుంబ భారం మంగవ్వపైనే పడింది. తాను గంజినీళ్లు తాగినా పిల్లలకు మంచి చదువు చెప్పించింది. పెద్ద కొడుకు బట్టు విజయ్కుమార్ ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నాడు. నిర్మల్లోని మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా చేరి, ఆరు నెలల్లోనే అక్కడే ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వహించాడు. కూతురు సుజాత తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో మ్యూజిక్లో (ఎం.ఏ) పూర్తి చేసి, మణుగూరు ఏకలవ్య పాఠశాలలో సంగీత ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. మరో కొడుకు రాజేష్ ఎన్ఏసీలో ల్యాండ్ సర్వేయర్గా శిక్షణ పొంది, కరీంనగర్ కలెక్టరేట్లో సర్వేయర్గా సేవలందిస్తున్నారు. చిన్న కుమార్తె సరిత ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఒకప్పుడు ఉప్పు అమ్మితే కానీ పూట గడవని స్థితి నుంచి నేడు నలుగురు పిల్లలు ఉన్నత ఉద్యోగాల్లో ఉండటం చూసి తండావాసులు మంగవ్వను అభినందిస్తున్నారు. -
పెరిగిన అప్పులు.. బ్యాంకర్ల వేధింపులతో
కరీంనగర్ జిల్లా: వ్యాపారంలో నష్టం, పెరిగిన అప్పులు, బ్యాంకర్ల వేధింపులతో ఓ రైస్మిల్ యజమాని భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తణుకు సురేశ్, స్వప్న (42) దంపతులకు మండలంలోని మొలంగూర్ శివారులో రైస్మిల్లు ఉంది. 2021–2022లో కస్టం మిల్లింగ్ రైస్ కింద ప్రభుత్వం వీరి రైస్మిల్లుకు ధాన్యం కేటాయించింది. అయితే అకాల వర్షాలతో ధాన్యం తడిసి నష్టం వాటిల్లింది. అలాగే వ్యాపారం కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు పెరిగిపోయాయి. దీంతో బకాయిలు చెల్లించాలని వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో అప్పుల బాధతో మనస్తాపం చెందిన స్వప్న శుక్రవారం ఉదయం ఇంట్లో బాత్రూములోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుర్లుండగా పెద్దకూతురు వివాహం చేశారు. చిన్నకూతురు హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. సురేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. -
అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ అర్బన్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో 99 రోజులపాటు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామని వ్యవసాయ, సహకారశాఖ, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నిలుపుతామని పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం ఉమ్మడి జిల్లా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశం జరగగా మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పెద్దపల్లి ఎంపీ ఉమ్మడి జిల్లా పరిధిలోని కలెక్టర్లు, సీపీ, ఎస్పీలు అడిషనల్ కలెక్టర్లు అన్నిశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్లు చిత్రామిశ్రా, గరిమా అగర్వాల్, కోయ శ్రీహర్ష, సత్యప్రసాద్ ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై వివరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఇరిగేషన్, ఆర్అండ్బీకి సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రధాన సమస్యల పరిష్కారం, రెండున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. వ్యవసాయ రంగానికి రూ.లక్ష కోట్లు బడ్జెట్ కేటాయించిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు ముందుండి నడిపించాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ● రాజకీయాలకతీతంగా ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కరీంనగర్ జిల్లా ఆదర్శంగా నిలవాలన్నారు. సమర్థవంతంగా నిర్వహించేలా కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇండ్లలో శిథిలావస్థలో ఉన్న టీవీలు కంప్యూటర్లు ఇతర వస్తువులను ఈ వేస్ట్ విధానం ద్వారా సేకరించాలని సూచించారు. ‘సురక్షితంగా చేరుకోండి’ అనే నినాదంతో ఏప్రిల్ 13 నుంచి 18 వరకు హోంశాఖ, రవాణాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ● ఆరు గ్యారంటీల అమలు ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లాలో మానవ వనరుల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. తాగునీరు, డంప్ యార్డు సమస్యను పరిష్కరించాలని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ కోరారు. పలు పెండింగ్ పనులను ప్రస్తావించారు. ● ప్రజలకు నమ్మకాన్ని కల్పించడంలో ప్రభుత్వం సక్సెస్ సాధిస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. విద్యా విధానంలో వినూత్న మార్పులు, సంక్షేమ రంగంలో సత్ఫలితాలు సాధించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. 99 రోజులపాటు ప్రజల వద్దకే పాలన చేపట్టడం వల్ల ప్రజలకు మరింత భరోసా కల్పిస్తున్నామని అన్నారు. ● ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మంచి కార్యక్రమమని రామగుండం ఎమ్మెల్యే ఠాగూర్ మక్కాన్ సింగ్ పిలుపునిచ్చారు. రామగుండం సింగరేణి ప్రాంతం బొగ్గు గనులు, ఎన్టీపీసీకి దేశంలోనే ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. గోదావరిఖనిలో 500 మందికి ఇటీవల ఇండ్ల పట్టాలు అందించామని ఇందులో 50 మంది ట్రాన్స్జెండర్లకు అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదని పేర్కొన్నారు. ● 99 రోజులపాటు ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్లి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చేపట్టిన కార్యక్రమం అద్భుతమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభివృద్ధి లక్ష్యంగా పాటుపడుతోందన్నారు. ● వేలాది మంది రైతులకు కల్పతరువైన కల్వల ప్రాజెక్ట్ ఆధునీకరణకు మంత్రులు ప్రత్యేక చొరవ చూపాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. వీణవంకలో రహదారి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విన్నవించారు. ● కరీంనగర్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు. రహదారిపై సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న పనులన్నింటిపై ప్రత్యేక దృష్టి సారించి యుద్ధప్రాతిపదిగిన కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ● కోరుట్లలో మిగిలిపోయిన హాస్పిటల్, పాఠశాలల పనులు త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మంత్రులకు విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలు వంతెన నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయాలని విన్నవించారు. ● సైబర్ క్రైం మోసగాళ్ల ఆట కట్టించేందుకు పోలీస్ అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు కోరారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన నియంత్రణ పద్ధతులు అవలంబించాలని కోరారు. ● నారాయణపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు మంత్రులు ప్రత్యేక చొరవ చూపాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విజ్ఞప్తి చేశారు. నారాయణపూర్ రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువ పనులు పూర్తి చేసేందుకు రూ.20కోట్లు విడుదల చేయాలని కోరారు. గతంలో రూ.23కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కరీంనగర్– జగిత్యాల నేషనల్ హైవే రోడ్డు పనులు త్వరగా ప్రారంభించాలని కోరారు. చొప్పదండిలో సెంట్రల్ లైటింగ్ వర్క్ వేగవంతం చేయాలని కోరారు. కొండగట్టు అభివృద్ధికి నిధులు బడ్జెట్లో కేటాయించాలని, సాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా సత్యం కోరారు. -
‘ఖద్దర్ నాక్’!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో పోలీసులు, రాజకీయ పార్టీ నేతల మధ్య వైరం ముదురుతోంది. కొందరు స్థానిక ఎస్సై, సీఐలను ఇబ్బంది పెడుతుంటే.. మరికొందరు ఏకంగా సీపీని బహిరంగంగా దూషించి, విమర్శించిన సందర్భాలు మరిచిపోకముందే.. మరో ఘటన వెలుగుచూసింది. ఇంతకాలం పోలీసుల విషయంలో మాటల దాడులు, ఆరోపణల వరకే పరిమితమైన నాయకులు తాజాగా డ్యూటీలో ఉన్న ఎస్సై కాలర్ పట్టుకుని, తోసేసి, దాడిచేసిన ఘటన కలకలం రేపుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ ఘటనపై రాజకీయ ఒత్తిళ్లతో ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఘటనపై పోలీసు యంత్రాంగం తీవ్రంగా మండిపడుతుంది. ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా కొందరు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది.ఏం జరిగిందంటే?కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని ఓ సర్కిల్లో జాతర సాగుతోంది. అక్కడ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. కలిసి వేడుకలు నిర్వహించాల్సిన నేతలు విడిపోయి వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తమ ఊరి జాతర ప్రత్యేకతను తెలిపేందుకు బీఆర్ఎస్కు చెందిన ఓ నేత డ్రోన్తో వీడియో తీయించారు. దీనిపై గ్రామంలో అధికార పార్టీ నాయకులు అనుమతి లేకుండా తమ గ్రామంలో డ్రోన్ ఎగురవేశాడని, మహిళలు ఇబ్బంది పడ్డారని పోలీసులకు గ్రామస్తుడితో ఫిర్యాదు చేయించారు. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు. డ్రోన్ ఎగరకుండా నిలిపివేయిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ఎస్సై కాలర్ పట్టుకున్న నేత..ఇదే క్రమంలో పోలీసులు గ్రామానికి చేరుకుని గొడవ సద్దుమణిగేలా ఇరు పక్షాల నేతలతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన ఓ అధికార పార్టీ నేత ఏకంగా ఎస్సై కాలర్ పట్టుకున్నాడు. ఆయన్ను చేతులతో దాడి చేసి తోసివేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సదరు నేతను అక్కడ నుంచి దూరంగా తీసుకెళ్లారు. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న ఆలయ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతోపాటు స్థానికులు తమ ఫోన్లలోనూ వీడియో తీశారు. మరోవైపు పోలీసులు కూడా దీనిపై సీపీకి సమాచారం అందించారు.రంగంలోకి కీలక నేత.. ఆగిన కేసు..ఎస్సై కాలర్ పట్టుకున్న విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు వెంటనే చర్యలకు సిద్ధమయ్యారు. అయితే అధికార పార్టీకే చెందిన ఓ కీలక నేత రంగంలోకి దిగారు. తమ అనుచరులపై కేసు నమోదు చేయవద్దని వారిపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారని సమాచారం. దీంతో దాడిచేసిన నేతపై చర్యలు తీసుకోకుండా పోలీసులు మిన్నకుండిపోయారని తెలుస్తోంది. విధుల్లో ఉన్న ఎస్సై కాలర్ పట్టుకున్నా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. అధికార, విపక్షాలు అన్న తేడా లేకుండా.. నేతలంతా కలిసి తమ ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న తీరుపై పోలీసులు మండిపడుతున్నారు. ఇలాంటి చర్యలను ఎప్పటికపుడు ఎండగట్టకపోతే జిల్లాలో విధులు నిర్వహించడం రానురాను ఇబ్బందికరంగా మారుతుందని వాపోతున్నారు. ఈ విషయంపై సీపీ గౌస్ ఆలంను సాక్షి వివరణ కోరగా.. ఎస్సై కాలర్ పట్టుకున్న విష యం తమ దృష్టికి ఇంకా రాలేదని, ఘటనపై లోతుగా ఆరా తీస్తామని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం సీపీ కార్యాలయం ఘటనపై వివరాలు సేకరిస్తోంది. -
నమో నారసింహ
తిమ్మాపూర్: మండలం నల్లగొండలో లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు నేత్రపర్వంగా సాగింది. చుట్టు పక్కల గ్రామాల ప్రజలే కాకుండా కరీంనగర్తో పాటు చుట్టుపక్కల జిల్లాలు, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు. రథంపై లక్ష్మీసమేత నసింహస్వామిని దర్శించుకుని పులకించిపోయారు. సాయంత్రం స్వామివారిని రథం నుంచి గర్భగుడికి తీసుకొచ్చారు. భక్తులకు ఆసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ బండారు లక్ష్మణ్, ఈవో అనిల్ తెలిపారు. రథోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని దుకాణాలు భక్తులతో కిటకిటలాడాయి. -
ప్రారంభమైన ‘హెల్త్ మిషన్– 100’
● కొత్తపల్లి పీహెచ్సీలో వైద్య పరీక్షల శిబిరం ● జూన్ 12 వరకు కార్యక్రమాల నిర్వహణ కరీంనగర్: జిల్లావ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడం, వారి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ‘ప్రజాపాలన ప్రగ తి ప్రణాళిక’ హెల్త్ మిషన్–100 పేరుతో 99 రోజు ల ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు అన్ని వయసుల వారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. శుక్రవారం జిల్లాలోని కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించారు. గర్భిణులు, బాలురులు, వృద్ధులకు రక్తహీనత నిర్ధారణ పరీక్షలు, టీకాలు, కేన్సర్ నిర్ధారణ పరీక్షలు చేపట్టనున్నారు. 30 ఏళ్లు పైబడిన వారందరికీ బీపీ, షుగర్ లతో పాటు ఇతర దీర్ఘకాలిక రోగా ల నిర్ధారణ పరీక్షలు చేసి, అవసరమైన చికత్సలు, మందులు అందిస్తారు. సంక్రమణ వ్యాధులైన క్షయ, ఎయిడ్స్, నిర్ధారణ పరీక్షలు, వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు పీహెచ్సీల్లో హీట్ స్ట్రోక్ నిర్వహణ గదులు ఏర్పాటు చేయనున్నారు. నిపుణులైన వైద్యుల ద్వారా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి హెల్త్ మిషన్–100ను విజయవంతం చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. గైనిక్, పీడియాట్రిక్, అప్తామాలజీ, ఆర్థో, డెంటల్, జనరల్ మెడిసిన్ విభాగా ల నుంచి వైద్యలు హాజరై 30 రకాల పరీక్షలు నిర్వహించనున్నారు. కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేపట్టిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని డీఎంహెచ్వో వెంకటరమణ సందర్శించారు. ప్రజలు అందించే ఉచితంగా మందులు ఉపయోగించుకోవాలని, తమ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని కోరారు. పీవో డాక్టర్ సనజవేరియా, పీహెచ్సీ డాక్టర్ నజియా పాల్గొన్నారు. -
సెమినార్ కరపత్రం ఆవిష్కరణ
కరీంనగర్ సిటీ: కరీంనగర్లోని ఎస్సారార్ ప్ర భుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 30, 31 తేదీల్లో జాతీయస్థాయి సెమినార్ నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ రామకృష్ణ తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని కళాశాల ఆవరణలో, టీజీసీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి, సెమినార్ సమన్వయకర్త డాక్టర్ కిరణ్మయి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. వైస్ ప్రిన్సిపాల్ టి.రాజయ్య, పరీక్షల ని యంత్రణ అధికారి పి.శ్రీనివాస్, స్టాప్ క్లబ్ సెక్రటరీ ఎం.శ్రీనివాస్ రెడ్డి, జంతుశాస్త్ర అధ్యాపకుడు రవీందర్రావు, సమత పాల్గొన్నారు. క్వింటాల్ పత్తి రూ.7,450జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కె ట్లో క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.7,450 పలికింది. శుక్రవారం మార్కెట్కు 16 వాహనాల్లో 112 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,200, కనిష్ట ధర రూ.7,000కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. శని,ఆదివారాలు మార్కెట్కు సాధారణ సెలవు ఉంటుందని, సోమవారం యథావిధిగా క్రయ విక్రయాలు జరుగుతాయని ఇన్చార్జి కార్యదర్శి రాజా తెలిపారు. పవర్ కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనుల నేపథ్యంలో శనివా రం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 11 కె.వీ.రాంచంద్రాపూర్ ఫీడర్ పరిధిలోని సాయిబాబా ఆలయం, అంజనాద్రి గుట్ట, పొన్నం కనకయ్య టీ స్టాల్, రామచంద్రాపూర్, ఎర్రగుట్ట ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. వ్యాక్సినేషన్కు ఏర్పాట్లు హుజూరాబాద్: గర్భాశయ కేన్సర్ను నివారించేందుకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ను విజయవంతం చేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిని డాక్టర్ సాజిదా అన్సారి సూచించారు. హుజూ రాబాద్ ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం డిప్యూ టీ డీఎంహెచ్వో చందు, సూపరింటెండెంట్ నల్ల నారాయణరెడ్డితో కలిసి సన్నాహక సమావేశం నిర్వహించారు. హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి, జమ్మికుంటలో వాక్సినేషన్ కార్యక్రమం ఈనెల 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ 14ఏళ్లు నిండిన బాలికలకు మాత్రమే వేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 9,936 మంది 14ఏళ్లు నిండినవారు ఉన్నారని, వారిలో 2,313మంది కి వ్యాక్సిన్ వేస్తామన్నారు. వ్యాక్సినేషన్ కోసం వచ్చే బాలికలకు ఏరియా ఆస్పత్రిలోని మొదటి అంతస్తులో రెండు గదులు కేటాయించడం జరిగిందని అన్నారు. వైద్యులు తులసీ దాస్, పి.శ్రీకాంత్ రెడ్డి, సదానందం ఉన్నారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి
కరీంనగర్ కార్పొరేషన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేస్తామని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శుక్రవారం నగరంలోని చంద్రపురికాలనీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలు, పాలకవర్గ సభ్యుల సహకారంతో విజయంతం చేస్తామన్నారు. వేసవిలో తాగునీటికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇప్పటికే సమ్మర్యాక్షన్ప్లాన్ రూపొందించామన్నారు. అమృత్ 2 పథకం ద్వారా రూ.147 కోట్లతో విలీన గ్రామాల డివిజన్ల లో పైప్లైన్ పనులు కొనసాగుతున్నాయని, అవసరమైన చోట రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. డివిజన్ల పరిసరాలను, ఖాళీ స్థలాలను శుభ్రం చేయడంతో పాటు, డ్రైనేజీలోల సిల్టు తొలగించడం, శిధిలావస్థలో ఉన్న డ్రైనేజీ లను మరమ్మతులు చేయడం, అవసరమైన చోట కొత్త డ్రైనేజీ, రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ మాట్లాడుతూ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్ తయారు చేసి, అన్ని డివిజన్లను శుభ్రపరుస్తూ, సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సిల్ట్ తీశారు.. పనులు ప్రారంభించారు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు మేయర్,అధికారులు చంద్రపురికాలనీలో డ్రైనేజీల్లో సిల్ట్, పరిసరాల్లోని చెత్తాచెదారాన్ని తొలగించారు. రూ.10 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం, ఆర్డీఎంఏ షాహిద్ మసూద్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సహాయ కమిషనర్ దిలీప్ కుమార్, కార్పొరేటర్లు సాదినేని లావణ్య, బారి అపర్ణ పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2026
పోలీసులు అంటే కొందరు రాజకీయ నాయకులకు చులకనగా మారింది. అధికారంలో ఉన్నాం కదా.. ఏం చేసిన చల్తా అంటూ జులం చూపిస్తున్నారు. అధికార, ప్రతిపక్షం అనే భేదం లేకుండా ఖద్దర్ చొక్కా ఒంటిమీద ఉంటే చాలు నాలుగో సింహాన్ని చిన్నగా చూస్తున్నారు. ఇటీవల ఓ ప్రజాప్రతినిధి పోలీస్బాస్ను టార్గెట్ చేస్తూ ఆరోపణలకు దిగగా.. తాజాగా ఓ గ్రామస్థాయి లీడర్ ఎస్సై కాలర్ పట్టుకొని దాడి చేయడం కలకలం సృష్టించింది. ఇంత జరుగుతున్నా.. పాలకులు సైలెన్స్గా ఉండడంతో పోలీస్శాఖలో చర్చకు దారితీసింది. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో విధులు నిర్వహించడం కష్టమనే డిబేట్ మొదలైంది. -
ప్రారంభ దశలోనే..
చాలామంది శస్త్ర చికిత్స అంటే భయపడుతూ సాధారణ నొప్పులకు తీసుకోవాల్సిన చికిత్సను సైతం వాయిదా వేస్తున్నారు. దీంతో సమస్య మరింత తీవ్రమై నడవలేని స్థితికి చేరుకునే ప్రమాదముంది. మోకాళ్ల నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదిస్తే సరైన చికిత్సతో ఆరోగ్యంగా జీవించొచ్చు. మోకాళ్ల నొప్పి రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడక లేదా వ్యాయామం చేయాలి. సూర్యరశ్మిలో కొంతసేపు గడపడం, కాల్షియం, విటమిన్–డి ఉన్న ఆహారం తీసుకోవడం, బరువు నియంత్రణలో ఉంచుకోవడం, ఫాస్ట్ ఫుడ్ తగ్గించడం, ధూమపానం మానడం వంటివి చేయాలి. – డాక్టర్ రాకేశ్, ఆర్థోపెడిక్ సర్జన్ -
సమస్యలు పరిష్కరిస్తారు.. అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు..
సిటీలోని 1, 2 డివిజన్లలో నేడు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక ప్రారంభం కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి నగరంలో నిర్వహించనున్నారు. నగరపాలక సంస్థ 1, 2 డివిజన్ల పరిధిలోని హనుమాన్నగర్, చంద్రపురికాలనీల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా మొదటి పది రోజులపాటు పారిశుధ్య పనులు చేపట్టనున్నారు. ప్రతీరోజు ఆరు డివిజన్ల చొప్పున ఎంపిక చేసిన డివిజన్లలో పారిశుధ్యం మెరుగుపరుస్తారు. నగరపాలక సంస్థ కార్యాలయంతోపాటు కార్యాలయ ఆవరణలో పారిశుధ్య పనులు చేపడతారు. కార్యాలయంలోని అన్ని విభాగాల చాంబర్లు, పరిసర ప్రాంతాలను శుభ్రపరుస్తారు. అన్ని విభాగాల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరిస్తారు. అనంతరం డివిజన్లవారీగా ప్రజల సమస్యలు పరిష్కరించడంతోపాటు అభివృద్ధి పనులు చేపడతారు. సన్నాహక సమావేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమ సన్నాహక సమావేశం గురువారం నిర్వహించారు. ప్రజలు, కార్పొరేటర్ల భాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. 99 రోజుల కార్యక్రమం శుక్రవారం నుంచి జూన్ 12 వరకు కొనసాగుతుందని తెలిపారు. కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.. బర్త్, డెత్, ప్రాపర్టీ అసెస్మెంట్, ట్రేడ్ లైసెన్స్, ఇంటి అనుమతులు, నల్లా కనెక్షన్లు, మ్యుటేషన్ దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. -
మస్ట్ నీడ్.. ‘ఫస్ట్ ఎయిడ్’
వీణవంక మండలంలోని చల్లూరు–కోర్కల్ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై ఇటీవల ఓ ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. తల, కాళ్లకు గాయాలు కాగా.. రక్తస్రావమైంది. వాహనదారులు ప్రథమ చికిత్స చేద్దామంటే ఏ ఒక్క వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ లేదు. కనీసం రక్తస్రావం అరికట్టేందుకు కాటన్ కూడా లేదు. దీంతో 20 నిమిషాలపాటు రక్తస్రావం జరిగింది. ఆసుపత్రికి తరలించగా.. చికిత్స కోసం 20 రోజుల సమయం పట్టింది. అదే వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటే ఎంతో కొంత ప్రయోజనముండేదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇది ఈ ఒక్క బాధితుడి పరిస్థితి కాదు.. వాహనాలు, పాఠశాలలు, సినిమా హాళ్లతోపాటు తదితర ముఖ్యమైన చోట్ల ఎక్కడ కూడా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కనిపించడం లేదు. వీణవంక: ఫస్ట్ ఎయిడ్ బాక్స్(ప్రథమ చికిత్స) గురించి పాఠ్యాంశాల్లో చదివి ఉంటాం. ప్రథమ చికిత్స ప్రత్యేకత గురించి క్లుప్తంగా ప్రైమరీ పాఠ్యాంశాల్లో పొందుపర్చారు. అయితే దీని ఉపయోగం గురించి తెలియక చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వాహనాలు, పాఠశాలలు, హోటళ్లు, సినిమా హాళ్లు తదితర జన సమూహముండే చోట ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలనే నిబంధన ఉంది. ముఖ్యంగా వాహనాల్లో ఈ బాక్స్ ఉండాలి. కొందరు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏర్పాటు చేసుకోకపోవడంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రథమ చికిత్స అంటే.. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు తక్షణమే అందించాల్సిన వైద్యాన్ని ప్రథమ చికిత్స(ఫస్ట్ ఎయిడ్) అంటారు. ఎక్కడైనా ప్రమాదం జరిగితే వెంటనే అత్యవసర సేవ 108కి ఫోన్ చేయాలి. 108 సిబ్బంది వచ్చేలోగా రక్తస్రావాన్ని ఆపేందుకు గాయంపై కాటన్తో బలంగా అదిమి ఉంచాలి. చిన్న గాయాలైతే కొద్దిసేపటికే రక్తస్రావం ఆగిపోతుంది. చికిత్స చేసే ముందు చేతికి గ్లౌజ్ వేసుకొని గాయంపై మట్టి, మురికి పోయేందుకు నీటితో కడగాలి. అనంతరం యాంటీ సెప్టిక్ లోషన్తో శుభ్రం చేసి కాటన్తో కట్టాలి. ఎక్కువ రక్తస్రావమయ్యే గాయాలను ఎట్టి పరిస్థితుల్లో నీటితో కడగొద్దు. ఇవి చేయొద్దు.. ప్రమాదాలు రకరకాలుగా జరుగుతాయి. ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వెన్నుపూసకు బలమైన గాయమైతే ఆ వ్యక్తిని ప్రమాద స్థలంలో కదలించే ప్రయత్నం చేయొద్దు. కొందరు తెలియక కదలిస్తారు. దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. కాళ్లు, చేతులు, పక్కటెముకలు విరిగితే ఆ ప్రాంతంలో గట్టిగా అదిమి పట్టుకోవద్దు. వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యమందించాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్లో.. కిట్లో డ్రెస్సింగ్ కోసం ప్యాడ్లు, కత్తెర, బ్యాండేజీ, ఇన్ఫెక్షన్ సోకకుండా డెటాల్, హ్యాండ్ గ్లౌజులు, యాంటీసెప్టిక్ లోషన్ను ఏర్పాటు చేసుకోవాలి. ఎక్స్ఫైర్ తేదీలు చూసుకొని ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. ఇవి ప్రతీ వాహనంలో, పాఠశాలలో భద్రపర్చుకుంటే మంచిది. గ్రామాల్లో ఎక్కువగా పాముకాటుకు గురవుతుంటారు. ఈ సమయంలో రైతులు తక్షణ చర్యలు చేపట్టాలి. విష పురుగు కాటు వేసిన ఫైభాగంలో గుడ్డతో గట్టిగా కట్టు కట్టాలి. వేడి నీరు, సబ్బుతో కడిగి యాంటీబయటిక్ లోషన్ రాయాలి. ఆసుపత్రికి తరలించాలి. -
ప్రగతి ప్రణాళిక సక్సెస్ చేయాలి
కరీంనగర్ అర్బన్: ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు జిల్లాలో చేపట్టనున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణకు జిల్లాలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఐదు దశల్లో 99 రోజులపాటు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమ నిర్వహణకు వివిధ శాఖల అధికారులు సంసిద్ధం కావాలన్నారు. శాఖలవారీగా ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. ఏప్రిల్ 2న గ్రామస్థాయిలో గ్రామసభలు నిర్వహించాలని తెలిపారు. ఏప్రిల్ 16న మండలస్థాయి, మే 2న నియోజకవర్గస్థాయి, మే 22న జిల్లాస్థాయిలో కార్యక్రమాలుంటాయన్నారు. ఈ సభల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేకూరుస్తున్న లబ్ధి, వివిధ పథకాలపై వివరించాలని తెలిపారు. శాఖలవారీగా 10 వారాలపాటు అమలు చేసే ప్రత్యేక కార్యాచరణను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రణాళిక శాఖ నోడల్గా వ్యవహరిస్తుందని తెలిపారు. అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మికిరణ్, ఆర్డీవో మహేశ్వర్, ముఖ్య ప్రణాళిక అధికారి రాందత్తారెడ్డి, జెడ్పీ సీఈవో శ్రీనివాస్, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఫెవికాల్ విధులు.. స్పందించాలి మీరు!
కొత్త కలెక్టర్ చిత్రా మిశ్రాకు సమస్యల సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. పరిపాలనలో జవాబుదారితనం, పారదర్శకతే తన లక్ష్యమని సోమవారం జరిగిన ప్రజావాణిలో చెప్పకనే చెప్పారు. పాలనను గాడిన పెట్టడంతో పాటు పెండింగ్ పనులపై దృష్టిసారించాల్సిన అవసరముంది. పరిపాలన కేంద్రం కలెక్టరేట్తో పాటు కలెక్టర్ క్యాంపు కార్యాలయం, సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం పూర్తి, జాతీయ రహదారులకు భూ సేకరణ, రైల్వే ట్రాక్ వద్ద ఫ్లైఓవర్ పనులు, కార్యాలయాల్లో పౌరసేవల పట్టిక ప్రకారం పనులు వంటి తదితర సమస్యలపై యుద్ధప్రతిపాదికన చర్యలు అవసరమని ప్రజలు కోరుతున్నారు. కరీంనగర్ అర్బన్కలెక్టర్ క్యాంపు కార్యాలయం సిబ్బందిలో దశాబ్దానికి పైగా సేవలందిస్తున్నవారుండటం విశేషం. నాన్గెజిటెడ్ అధికారులుగా ఉన్న సమయంలో సీసీలుగా బాధ్యతలు చేపట్టగా గెజిటెడ్ అధికారులు అయినా అదే పోస్టుకు ప్రాధాన్యం ఇస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో గిర్దావర్, సీనియర్ అసిస్టెంట్స్థాయి అధికారులు సీసీలుగా వ్యవహరించేవారు. కలెక్టర్ బదిలీ కాగానే కొత్తగా వచ్చే కలెక్టర్ కొత్తవారిని నియమించేవారు. కలెక్టర్లు మారుతున్నా పాతవారే సీసీలుగా, కార్యాలయ అధికారులుగా, సిబ్బందిగా విధులు నిర్వహించడం ఆరోపణలకు తావిస్తోంది. కలెక్టరేట్లో ఫెవికాల్ విధులు ఉద్యోగ జీవితంలో బదిలీలు తప్పనిసరి. కలెక్టరేట్లో మాత్రం ఫెవికాల్ అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండటం విశేషం. కలెక్టరేట్ ప్రధాన విభాగంతో పాటు సివిల్ సప్లయ్, సంక్షేమశాఖల్లో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నవారున్నారు. ప్రధానంగా రెవెన్యూశాఖలో పదుల సంఖ్యలో ఉద్యోగులు, అధికారులు కలెక్టరేట్కే పరిమితమయ్యారు. బదిలీ జరిగినా పైరవీలతో కుర్చీ వీడడం లేదు. కారుణ్య పద్ధతిలో నియామకమై టైపిస్ట్/జూనియర్ అసిస్టెంట్గా ప్రస్థానం మొదలై తహసీల్దార్గా పదోన్నతి పొందినా కలెక్టరేట్ను వీడడం లేదు. తప్పనిసరైతే కలెక్టరేట్లోని వేరేశాఖలకు బదిలీ చేసుకోవడం పరిపాటిగా సాగుతోంది. కనిపించని సిటిజన్ చార్ట్ పదేళ్ల క్రితం వరకు దాదాపు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో పౌరసేవల పట్టిక దర్శనమిచ్చేది. ఒక్కో పనికి నిర్ణీత కాలవ్యవధి కనిపించేది. ప్రస్తుతం చాలా చోట్ల సదరు పట్టిక అటకెక్కించారు. భూ సమస్యలతో కలెక్టరేట్కు వస్తున్న రైతులకు అప్పటి సిబ్బంది చేసిన తప్పులే కారణం. ఇక కార్యాలయాల్లో దళారులే శాసించే పరిస్థితి పలు చోట్ల ఏర్పడింది. సా..గుతున్న సమీకృత కలెక్టరేట్ గత ప్రభుత్వం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం పేరుతో నూతన కలెక్టరేట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే. 2021లో అప్పటి బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రూ.51కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయగా పనులు నత్తను మరిపిస్తున్నాయి. వాస్తవానికి 2022 డిసెంబర్లోగా నిర్మాణ పనులు పూర్తవ్వాల్సి ఉండగా గుత్తేదారు నిర్లక్ష్యం అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి నూతన భవనం అందని ద్రాక్షగా మారింది. ఇలా చేస్తే ప్రయోజనం ఒక కార్యాలయంలో పనిచేసిన ఉద్యోగి, అధికారిని మళ్లీ సదరు కార్యాలయానికి బదిలీ చేయకూడదు. రెవెన్యూశాఖను గాడిన పెట్టేందుకు ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటు చేయాలి. అప్పట్లో జేసీగా పనిచేసిన అరుణ్కుమార్ కలెక్టరేట్లో ఫిర్యాదుల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ప్రజలు నేరుగా సదరు నంబర్కు ఫిర్యాదు చేయడం, సంబంధిత సిబ్బంది వివరాలను నమోదు చేసుకుని గోప్యంగా ఉంచి ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది. దీంతో సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకున్న ఘటనలున్నాయి. అతని బదిలీతో కేంద్రాన్ని ఎత్తివేశారు. గతంలో ప్రారంభించి వదిలేసినా ఈ–ఆఫీస్ సేవలను ముమ్మరం చేయాలి. రెవెన్యూ శాఖలోని ఉద్యోగులందరికీ విధులపై పునఃశ్చరణ తరగతులు నిర్వహించాలి. కుల, జనన, స్థానికత ధ్రువపత్రాలను జారీ చేసే బాధ్యతలను వీలైనంత వరకు తగ్గించాలి. -
కరీంనగర్
శుక్రవారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 20269ధర్మపురి నృసింహుని సన్నిధిలోని బ్రహ్మపుష్కరిణిలో గురువారం సాయంత్రం కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామికి తెప్పోత్సవం, డోలోత్సవం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. క్వింటాల్ పత్తి రూ.7,500జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో గురువారం క్వింటాల్ పత్తి రూ.7,500 పలికింది. క్రయ విక్రయాలను ఇన్చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.ఆకాశం నిర్మలంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుంది. ఉక్కపోస్తుంది. రాత్రి వేళలో చలి తగ్గి.. ఉక్కపోత ఉంటుంది.10లో -
మొండి బకాయిలకు రెడ్ నోటీసులు
కరీంనగర్ కార్పొరేషన్: ఆస్తిపన్ను మొండి బకాయిదారులపై అధికారులు చర్యలకు పూనుకున్నారు. ఆర్థిక సంవత్సరం ముగియనుండగా, నగరంలో ఆస్తిపన్నుల వసూళ్లను వేగవంతం చేయడం తెలిసిందే. వందశాతం పన్నులు వసూలు లక్ష్యానికి అడ్డుగా ఉన్న మొండిబకాయిదారులపై కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. గురువారం నగరంలో పన్నులు వసూలు కొనసాగించారు. గతంలో నోటీసు ఇచ్చి గడువు ముగిసినా చెల్లించని ఎనిమిది షాప్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ టాప్లో ఉన్న వందమంది మొండిబకాయిదారులకు రెడ్నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. గడువులోగా బకాయిలు చెల్లించని దుకాణాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులకు కూడా నోటీసులు ఇవ్వాలని అన్నారు. మొండిబకాయిదారులు లక్ష్యంగా అధికార బృందాలు పన్నులు వసూళ్లు చేయాలని సూ చించారు. -
ఎస్ఆర్ఆర్లో క్యాంపస్ డ్రైవ్
కరీంనగర్ సిటీ: శ్రీరాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాల రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గురువారం ప్రాంగణ ఎంపిక నిర్వహించారు. హైదరాబాద్లోని గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాల ఎంపిక కోసం టీఎస్కేసీ సహకారంతో క్యాంపస్ డ్రైవ్ చేపట్టారు. రసాయన శాస్త్ర విభాగాధిపతి మేజర్ రేల్ల సంజీవ్, టీఎస్కేసీ కోఆర్డినేటర్ డాక్టర్ సుధాకర్, డ్రగ్ ఇండస్ట్రీ అధికారులు మన్మధరెడ్డి, డీవీపీ రాజ్కుమార్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. ఔషధాల కంపెనీల్లో మంచి సదుపాయాలున్నాయన్నారు. విద్యార్థులకు రాత పరీక్ష, వివిధ దశల్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. 18 మంది ఎంపికై నట్లు తెలిపారు. రసాయన శాస్త్ర ఉపన్యాసకులు పి.రాజేశ్, ఎ.శంకరయ్య, డాక్టర్ కె.సునీత, ఐ.గోపి, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. భక్తుల ఇళ్లకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలుజగిత్యాలరూరల్: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో జరిగే శ్రీసీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకే నేరుగా పంపిణీ చేయనున్నట్లు కరీంనగర్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ శివాజీ తెలిపారు. ఈనెల 27న జరగనున్న స్వామివారి కల్యాణానికి సంబంధించిన తలంబ్రాలను దేవాదాయ శాఖ సహకారంతో పోస్టల్ శాఖ భక్తులకు అందిస్తోందన్నారు. భద్రాచలం వెళ్లి స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించలేని భక్తులు.. తమ ఇళ్ల వద్దనే ఉంటూ తలంబ్రాలు పొందేందుకు వీలుగా కరీంనగర్ డివిజన్లోని అన్ని పోస్టాఫీసులలో బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. రూ.450 చెల్లించి ప్యాకేజీ బుక్ చేసుకున్న వారికి తలంబ్రాలతోపాటు ముత్యం, కుంకుమపువ్వు, పటికబెల్లం, జీడిపప్పు ప్రసాదంగా అందిస్తామని, రూ.151 చెల్లిస్తే ముత్యాల తలంబ్రాలు మాత్రమే అందుతాయని పేర్కొన్నారు. ఈ సదుపాయాన్ని ఈనెల 20లోపు సమీపంలోని పోస్టాఫీస్లో సంప్రదించి బుక్ చేసుకోవాలని సూచించారు. శ్రీరాముడిభక్తులంతా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పర్మిట్ రూంలపై చర్యలు తీసుకోవాలికరీంనగర్క్రైం: నిబంధనలు ఉల్లంఘిస్తున్న పర్మిట్ రూంలపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ రెస్టారెంట్ అండ్ బార్స్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. వైన్స్ సమీపంలో నిర్ణీత దూరంలో నిలబడి మద్యం సేవించే అనుమతి ఉండగా కుర్చీలు వేసి బార్ల మాదిరిగా నడిపిస్తున్నారని, తద్వారా తాము నష్టపోతున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘం ప్రతినిధులు పొన్నాల తిరుపతి, మద్ది రమేశ్గౌడ్, గొట్టి ముక్కుల రవీందర్తోపాటు పలువురు పాల్గొన్నారు. -
సైబర్ నేరగాళ్లకు సహకరిస్తే చర్యలు
కరీంనగర్క్రైం: సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ విభాగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ క్రాక్డౌన్’లో భాగంగా కమిషనరేట్ పరిధిలో బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అప్పగించిన మ్యూల్ అకౌంట్ దారులను గుర్తించినట్లు తెలిపారు. కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్హాల్లో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్లోని నాలుగు ప్రధాన బ్యాంకుల్లో మొత్తం 34 మ్యూల్ ఖాతాలను గుర్తించామని, ఎన్సీఆర్పీ పోర్టల్ ద్వారా ఇప్పటికే 162 వరకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ ఖాతాల ద్వారా సైబర్ నేరగాళ్లు దాదాపు వెయ్యికి పైగా అక్రమ లావాదేవీలు చేసినట్లు తేలిందన్నారు. ఈ వ్యవహారంలో 20 కేసులు నమోదు చేయగా, నిందితులపై 112 బీఎన్ఎస్ ప్రకారం చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఏజెంట్లు ఆశజూపే కమీషన్ డబ్బుల కోసం బ్యాంకు ఖాతా వివరాలు, ఫోన్నంబర్లను అపరిచితులకు అందజేస్తున్నారన్నారు. తెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతాలను అద్దెకు ఇవ్వడం లేదా వివరాలు చెప్పడం నేరమని స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు, లేదా ఓటీపీ వివరాలు ఇతరులకు ఇవ్వవద్దని సూచించారు. అనుమానాస్పద లావాదేవీలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
మొరాయిస్తున్న మోకీళ్లు!
నడక లేక.. కారణాలేమిటి?ఒకప్పుడు మోకాళ్ల అరుగుదల అనేది 60 ఏళ్లు దాటిన వృద్ధుల్లో మాత్రమే కనిపించే సమస్యగా భావించేవారు. అయితే నేడు పరిస్థితి మారిపోయింది. జీవనశైలి మార్పులు, పాస్ట్ ఫుడ్ అంటూ తినే తిండి, మినరల్ వాటర్ పేరుతో తాగే నీరు సైతం కెమికల్మయం కావడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాలతో 40 ఏళ్లు దాటిన మధ్య వయసు వారిలోనే మోకాళ్ల అరుగుదల సమస్య వేగంగా పెరుగుతోంది. కుటుంబ బాధ్యతలు మోసే వయసులోనే మోకాళ్ల నొప్పితో నడవలేని స్థితికి చేరుకోవడం అనేక మందికి శారీరకంగా, ఆర్థికంగా భారమవుతోంది.మోకాళ్ల నొప్పిని చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే దీనివల్ల నడక తగ్గిపోతుంది. నడక లేకపోతే శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగదు. మెదడు చురుకుదనం తగ్గి గుండె పనితీరుపై ప్రభావితమవుతుంది. కదల్లేనివారు నీటిని కూడా తక్కువగా తీసుకోవడంతో కిడ్నీ సమస్యల బారినపడుతున్నారు. మోకాళ్ల సమస్యలకు ప్రస్తుతం అనేక ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ దశలో మందులు, ఫిజియోథెరపీ, ఇంజెక్షన్లు వంటి చికిత్సలతో నొప్పిని నియంత్రించొచ్చు. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్సను వైద్యులు సూచిస్తారు. ఇటీవల కాలంలో రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ విధానంలో శస్త్ర చికిత్స అత్యంత కచ్చితత్వంతో జరుగుతుంది. రక్తస్రావం తక్కువగా ఉండడం, నొప్పి తక్కువగా ఉండడం, త్వరగా కోలుకునే అవకాశముండడం ఈ సర్జరీల ప్రత్యేకతగా వైద్యులు చెబుతున్నారు.కరీంనగర్: ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో వందల సంఖ్యలో బాధితులు మోకాళ్ల నొప్పులతో ఆర్థోపెడిక్ వైద్యులను సంప్రదిస్తున్నారు. జిల్లాలో దాదాపు 150 మంది ఆర్థోపెడిక్ సర్జన్లు సేవలందిస్తుండగా.. ఒక్కో వైద్యుడి వద్ద రోజుకు సగటున 40–50 మంది మోకాళ్ల నొప్పి, ఎముకల అరుగుదల, జాయింట్ సమస్యలతో చికిత్స పొందుతున్నారు.మోకాళ్ల అరుగుదలకు పలు కారణాలున్నాయి. ముఖ్యంగా జీవన శైలిలో వచ్చిన మార్పులే ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు. ● ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు. వ్యాయామం లేకపోవడం. ● ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం. ఊబకాయం. ● సూర్యరశ్మి లోపంతో విటమిన్–డి కొరత. కాల్షియం లోపం. ● రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు. ● ఉద్యోగరీత్యా ఎక్కువ మంది రోజంతా ఏసీ గదుల్లోనే ఉండిపోతున్నారు. సూర్యరశ్మి శరీరానికి తక్కువగా అందడంతో విటమిన్–డి లోపం ఏర్పడి ఎముకల బలం తగ్గుతోంది. అదే సమయంలో వయస్సు పెరిగేకొద్దీ శరీరంలో కాల్షియం స్థాయి తగ్గిపోవడం కూడా మోకాళ్ల అరుగుదలకు దారి తీస్తోంది. -
సభ్యత్వమంటే సంఘానికి పునాది రాళ్లు
● టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి కరీంనగర్ అర్బన్: సభ్యత్వమంటే డబ్బులు కాదని, సంఘానికి పునాది రాళ్లని టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ ఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైద్యారోగ్య శాఖ, పశుసంవర్ధక, జిల్లా ట్రెజరీ శాఖల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించగా.. ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉద్యోగుల హక్కుల సాధనలో తెలంగాణ ఎన్జీవో సంఘం ఎప్పుడూ ముందుండి పోరాటం చేస్తుందన్నారు. ఉద్యోగులను సమీకరించడమంటే ప్రశ్నించే పోరాట యోధులను ఒకే వేదిక పైకి తీసుకురావడమని అన్నారు. ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఉద్యోగులందరూ ఐక్యంగా ఉంటేనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖ జేడీ నల్ల లింగారెడ్డి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, డీడీ నాగరాజు, టీఎన్జీవోల జిల్లా నాయకులు సంగెం లక్ష్మణరావు, ముప్పిడి కిరణ్కుమార్, సర్దార్ అరవింద్సింగ్, గూడ ప్రభాకర్రెడ్డి, రాజేశ్వరరావు, గిరిధర్రావు, కమలాకర్, గోవిందపతి శ్రీనివాస్, జీవన్రెడ్డి, ఉద్యోగులు రాజేశ్, హైమావతి, హరిప్రియ, జగన్గౌడ్, విజయలక్ష్మి, తోట రాజు తదితరులు పాల్గొన్నారు. -
విరిగిన చక్రం.. ఆగిన రైలు
జమ్మికుంట/కమలాపూర్: సికింద్రాబాద్ నుంచి హిస్సార్కు వెళ్తున్న హిస్సార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు (22737) ఇంజిన్ చక్రం హఠాత్తుగా విరిగిపోయింది. లోకో పైలట్ వెంటనే అప్రమత్తంగా వ్యవహరించి రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. బుధవారం అర్ధరాత్రి కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామ సమీపంలో జరిగిన ఈ సంఘటనపై స్థానికులు, రైల్వే అధికారులు తెలిపిన వివరాలివి. సికింద్రాబాద్ జంక్షన్లో బుధవారం రాత్రి బయల్దేరిన హిస్సార్ ఎక్స్ప్రెస్.. జమ్మికుంట, ఉప్పల్ రైల్వేస్టేషన్ల మధ్య గల జమ్మికుంట మండలం మడిపల్లి సమీపంలోని నంబరు 18 గేట్ వద్దకు చేరుకుంది.ఇక్కడ ఇటీవల నిర్మించిన మూడోలైన్లో రైలు వెళ్తోంది. వేకువజాము 2.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా రైలింజిన్ చక్రం విరిగినట్లు శబ్దం వచి్చంది. దీంతో వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ సడన్బ్రేక్ వేసి రైలు నిలిపి వేశారు. రైలు కుదుపునకు గురవడంతో ఏమైందో తెలియక ప్రయాణికులు కాస్త ఆందోళనకు గురయ్యారు. ఆ వెంటనే లోకోపైలట్ రైల్వే అధికారులకు సమాచారం అందించారు.వారు మరో రైలింజిన్లో అదేలైన్లో వచ్చి వెనకాల ఉన్న బోగీలను ఉప్పల్ రైల్వేస్టేషన్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇంజనీర్లు రైలింజిన్ చక్రానికి మరమ్మతులు చేసి జమ్మికుంట వైపు తీసుకెళ్లారు. ఈ సమయంలోనే వస్తున్న దక్షిణ్ ఎక్స్ప్రెస్ను ఉప్పల్ వద్ద నిలిపివేశారు. మరమ్మతుల అనంతరం గురువారం ఉదయం రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. కాగా వేకువజాము 2.30 గంటల నుంచి సుమారు 7 గంటల పాటు హిస్సార్ ఎక్స్ప్రెస్ రైలులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
వావివరసలు మరిచి.. చెల్లెపై కన్నేసి
జగిత్యాల జిల్లా: జులాయిగా తిరిగే ఓ యువకుడు వావివరుసలు మరిచి.. వరసకు చెల్లె అయిన బాలికపై కన్నేశాడు. ప్రేమ పేరిట వేధించి.. వెంటపడి.. ప్రేమ ఊబిలోకి దింపి శారీరకంగా లొంగదీసుకున్నాడు. విషయం ఎవరికైనా చెబితే బాలికతోపాటు ఆమె సోదరుడిని చంపేస్తానని బెదిరించాడు. మనస్తాపానికి గురైన ఆ బాలిక గత డిసెంబర్ 8న క్రిమిసంహారక మందు తాగింది. అప్పటినుంచి హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నర్సయ్యపల్లిలో విషాదం నింపింది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. నర్సయ్యపల్లెకి చెందిన దంపతులకు కూతురు, కు మారుడు సంతానం. తండ్రి బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లాడు. పిల్లలను చదివిస్తూ తల్లి ఇంటివద్దనే ఉంటోంది. కూతురు జగిత్యాలలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ ఇంటర్ చదువుతోంది. బాలికకు వరసకు సోదరుడైన కోల మహేశ్ జులాయిగా తిరుగుతూ.. ఆమెపై కన్నేశాడు. ప్రేమపేరుతో వేధించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే బాలికతోపాటు ఆమె సోదరుడిని చంపుతానని బెదిరించాడు. పెళ్లి చేసుకుందామని బాలిక కోరగా.. నిరాకరించిన మహేశ్ ‘చస్తే చావు..’ అని చెప్పడంతో మనస్తాపానికి గురైన బాలిక∙డిసెంబర్ 8న పురుగులమందు తాగింది. బంధువులు ఆమెను ముందుగా జగిత్యాలకు.. అక్కడినుంచి హైదరాబాద్ తరలించారు. తండ్రి నెల క్రితం దుబాయి నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. చికిత్స పొందుతున్న బాలిక మంగళవారం రాత్రి మృతి చెందింది.నిందితుడిపై పోక్సో, రేప్ కేసుబాలిక మరణానికి కారణమైన మహేశ్పై మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో, రేప్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
సోలార్ పవర్తో ఆదాయం
కరీంనగర్ అర్బన్/కొత్తపల్లి: ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో భాగంగా సోలార్ విద్యుత్ అవగాహన ప్రచార వాహనాన్ని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే కలెక్టరేట్లో బుధవారం ప్రారంభించారు. ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు వివిధ పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా టీఎస్ రెడ్ కో ఆధ్వర్యంలో జిల్లాలోని 16 మండలాల పరిధిలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం గురించి అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా గృహ విని యోగదారులు తమ ఇంటి డాబాపై సోలార్ ప్లాంటు ఏర్పాటు చేసుకొని ప్రతి నెలా 360 యూనిట్ల సోలార్ విద్యుత్ వరకు పొందవచ్చునన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీ కల్పించనుందని, మిగులు విద్యుత్ను గ్రిడ్కు ఇస్తూ అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చని సూచించారు. ఈ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. -
ఎఫ్ఆర్కేకు స్వస్తి
కరీంనగర్ అర్బన్: ఫోర్టిఫైడ్ కర్నెల్స్(ఎఫ్ఆర్కె) బియ్యం సరఫరా ఇక నిలిచిపోనుంది. ప్రభుత్వ అవసరాలతో పాటు రేషన్ కార్డుదారులకు అందిస్తున్న సదరు బియ్యాన్ని వెంటనే నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. ప్రభుత్వమిచ్చే బియ్యాన్ని మరాడించకుండానే మాయం చేసిన మిల్లర్లలో ఆందోళన నెలకొంది. మిల్లర్ల మెడలు వంచైనా బకాయిలు రాబట్టాలని మంగళవారం జరిగిన కలెక్టర్ల సమావేఽశంలో సీఎం స్పష్టం చేసిన విషయం తెలి సిందే. దీంతో మిల్లర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతుండగా కేంద్ర తాజా నిర్ణయంతో పచ్చి వెలక్కాయ పడ్డట్లుగా తయారైంది. మరింత నాణ్యంగా, సమర్థవంతంగా పోషకాలు అందించే విధానాన్ని గుర్తించే వరకు బ్రేక్ పడనున్నట్లు పౌరసరఫరాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనుకున్న స్థాయిలో ఫలితం లేకపోవడం ఎఫ్ఆర్కే బియ్యం ద్వారా లబ్ధిదారులకు పోషకాలను అందించాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. గతంలో అనీమియా, పోషక లోపాలు గల పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారని సర్వే ద్వారా గుర్తించింది. సదరు సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఫోర్టిఫైడ్ బియ్యాన్ని తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. బియ్యంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి–12 వంటి పోషకాలు కలిపి ఉంటాయి. ఫోర్టిఫైడ్ బియ్యం కలిసిన వాటిని రేషన్ దుకాణాల ద్వారా పేదలకు, మధ్యాహ్న భోజన పథకం, ప్రభు త్వ హాస్టళ్లకు అందిస్తున్నారు. ప్రస్తుతం సరఫరా అవుతున్న ఎఫ్ఆర్కే బియ్యం వల్ల అనుకున్న లక్ష్యాలు నెరవేరడం లేదని గుర్తించి నిలిపివేశారు. ఇక పాత పద్ధతిలోనే సేకరణ మిల్లర్లు ఇచ్చే బకాయి బియ్యంలో, కొత్తగా సేకరించే వాటిలో ఫోర్టిఫైడ్ బియ్యం కలపకుండానే తీసుకోవాలని నిర్ణయించారు. ఎవరి దగ్గర ఎంత ఫో ర్టిఫైడ్ బియ్యం నిల్వ ఉందో ఈనెల 30లోపు ప్రభుత్వానికి వివరాలు అందజేయాలి. ఆ తేదీ తరువాత ఎఫ్ఆర్కే బియ్యం కలపకుండా సరఫరా చేయాలి. ఇప్పటికిప్పుడు ప్రభుత్వ అవసరాలకు ఎఫ్ఆర్కే బియ్యం వాడుకోవచ్చు. అవకాశం ఉన్నవారు నాన్ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేసుకోవచ్చు. 2025–26 యాసంగి పంట నుంచి కేవలం నాన్ ఫోర్టిఫైడ్ బియ్యమే మిల్లర్లు ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త విధానం అమలులోకి వచ్చే లోగా ఫోర్టిఫైడ్ రహిత బియ్యం అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో డిఫాల్టర్లుగా మారిన మిల్లర్లు అంతర్మథనంలో పడ్డారు. ధాన్యాన్ని అమ్ముకుని ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టగా రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే బియ్యాన్నే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసి ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. అధికారుల సంపూర్ణ మద్దతు ఉండటంతో ఇదే దందా సాగింది. ఎఫ్ఆర్కే లేకుండా బియ్యం ఇవ్వాలంటే కష్టమే. రేషన్ మాఫియా వద్ద బియ్యం కొనుగోలు చేస్తే వారి వద్ద ఉండేది ఎఫ్ఆర్కే బియ్యమే. ఈ నెల 30లోగా తమ వద్ద ఎంతవరకు ఎఫ్ఆర్కే బియ్యం ఉందనే వివరాలను స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. -
సూరీడు.. సుర్రుబుర్రు!
నిర్మానుష్యంగా మారిన కరీంనగర్లోని తెలంగాణచౌక్కరీంనగర్: మొన్నటి వరకు చలికి గజగజలాడిన ప్రజలు ఇప్పుడు భానుడి భగభగలు తట్టుకోలేకపోతున్నారు. వారం రోజుల నుంచి జిల్లాలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. మార్చి 4న ఏకంగా 37.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనాలు వేడితో ఇబ్బంది పడ్డారు. రాత్రి వేళలోనూ ఉక్కపోత ప్రారంభమైంది. మార్చి మొదటి వారంలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మార్చి చివరి వారం వరకు 42 డిగ్రీలు, ఏప్రిల్లో 44 డిగ్రీలు, మే నెలలో 46 డిగ్రీలపైనే నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఎండతో ఇబ్బంది పడుతున్నారు. పదోతరగతి పరీక్షలు ప్రారంభం నాటికి పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తమవుతోంది. తగ్గుతున్న తేమశాతం గాలితో తేమశాతం ఎక్కువగా ఉంటే వాతావరణం చల్లగా ఉంటుంది. గాలిలో తేమశాతం తగ్గే కొద్దీ వేడి, వడగాలుల తీవ్రత పెరుగుతుంది. ప్రస్తుతం గాలిలో ఉదయం పూట తేమ 50 శాతం వరకు ఉంటుండగా మధ్యాహ్నం 15–20 శాతానికి పడిపోతోంది. ఓ వైపు ఎండల తీవ్రత, మరోవైపు వడగా లులు పెరుగుతున్నాయి. ఏప్రిల్లో ఉదయం పూట తేమ 40 శాతంలోపునకు, మధ్యాహ్నం సమయంలో 10 శాతానికి పడిపోయే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అప్పుడే వడగాలులు వాహనాలతో వాయుకాలుష్యం ఏర్పడుతోంది. కార్బన్డైయాకై ్సన్ గాలిలో చేరుతుండడంతో వేడి పెరుగుతుంది. సాధారణంగా ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే వేడి గాలులు వీయడం ప్రారంభిస్తాయి. ప్రస్తుతం 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. అప్పుడే వడగాలులు మొదలు కావడం ఆందోళన కలిగించే విషయం. -
వందశాతం పన్ను వసూలు చేయాలి
● మేయర్ కొలగాని శ్రీనివాస్ కరీంనగర్కార్పొరేషన్: వందశాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆదేశించారు. కళాభారతిలో బుధవారం రెవెన్యూ, ఇంజినీరింగ్, టౌన్ప్లానింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2025 –26 ఆర్థిక సంవత్సరం ఈ నెలతో ముగియనున్నందున నిర్ణీత లక్ష్యం మేరకు ఆస్తి పన్ను వసూలు చేయాలన్నారు. మిగిలిన 26 రోజు ల్లో మరో రూ.30 కోట్లు వసూలు చేయాల్సి ఉన్నందున, ప్రణాళిక ప్రకారం లక్ష్యం చేరాలన్నారు. ప్రజలు చెల్లించే ఆస్తిపన్నుతో నగర అభివృద్ధి సాధ్యపడుతుందనేది అవగాహన కల్పించాలని సూచించారు. పన్నువసూళ్లలో సంబంధిత కార్పొరేటర్ల సహకారం తీసుకో వాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఆస్తి పన్ను డిమాండ్ నోటీసులు జారీ చేయాలని, ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ మొండిబకాయిదారులకు రెడ్నోటీసులు జారీ చేయాలన్నారు. చెల్లించని పక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, నల్లా, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తొలగించాలన్నారు. వ్యాపారులు పన్నులు చెల్లించకుంటే దుకాణాలను సీజ్ చేయాలన్నారు. ఈ నెల 15వ తేదీ నాటికే లక్ష్యం చేరుకొనేలా చర్యలు చేపట్టాలన్నారు. విలీన గ్రామల ప్రజలు కూడా డిమాండ్ ప్రకారం పన్నులు తప్పక చెల్లించాలన్నారు. డిప్యూటీ కమిషనర్లు వేణు మాధవ్, ఖాదర్ మొహియుద్దీన్, ఎస్ఈ రాజ్ కుమార్ పాల్గొన్నారు. -
విద్యార్థులకు గేట్ పరీక్ష!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణంతో నగరవాసులకు రోజురోజుకు సమస్యలు పెరుగుతున్నాయి. అంబులెన్స్లో రోగులతో పాటు, ఇంటర్ వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇంటర్ పరీక్షల వేళ కరీంనగర్– చొప్పదండి మార్గంలో తీగలగుట్టపల్లి రైల్వేగేట్ వద్దే విద్యార్థులకు తొలిపరీక్ష ఎదురువుతోంది. గేటు వద్ద ఇరుకై న రోడ్డుతో ట్రాఫిక్ జాం, గేటు పడితే కనీసం అరగంట వృథా అయ్యే సమయాన్ని దృష్టిలో ఉంచుకుని నిత్యం ఆందోళన చెందుతున్నారు. భూసేకరణ కారణంగా రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం ఏర్పడుతోందని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. భూసేకరణకు ప్రతిబంధకంగా ఉన్న జీవో స్థానంలో మరోటి రానుందని, అది రాగానే భూసేకరణకు విఘ్నాలు తొలగిపోతాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఎడతెగని జాప్యం కరోనాకు ముందు పెద్దపల్లి– కరీంనగర్– జగిత్యా ల రైల్వేమార్గంలో అంతగా రద్దీ ఉండేది కాదు. గతంలో రామగుండం మీదుగా బొగ్గు, ఇతర సరుకులతో నిజామాబాద్ వెళ్లేందుకు గూడ్సు రైళ్లు ఖాజీపేట మీదుగా 300 కిమీ ప్రయాణించాల్సి వచ్చేది. కరోనా సమయంలో జగిత్యాల నుంచి నిజామాబాద్ వరకు మార్గం అందుబాటులోకి వచ్చింది. దాదాపు 150 కిలోమీటర్ల దూరం తగ్గడంతో గూడ్సు రైళ్లను దక్షిణమధ్య రైల్వే అధికారులు ఈ మార్గంలో నడిపిస్తున్నారు. దీంతో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెరిగి.. తీగలగుట్టపల్లి వద్ద గంటకు ఒకసారి రైలుగేటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది నగరవాసులతో పాటు చొప్పదండి మార్గంలో ప్రయాణించేవారికి ఇబ్బందిగా మారింది. దీంతో ఆర్వోబీ నిర్మాణానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనతో సెంట్రల్ ఇన్ఫ్రాక్టర్ రోడ్ ఫండ్ (సీఐఆర్ఎఫ్) కింద రూ.154 కోట్లు వచ్చాయి. ఈ నిధులతో నాలుగు వరుసల్లో 750 మీటర్ల పొడవు, 21 మీటర్ల వెడల్పుతో వంతెన పనులు రహదారులు, భవనాలశాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. 2023 జూలై 13న అప్పటి మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్ పనులకు శంకుస్థాపన చేశారు. భూసేకరణ సమస్య కారణంగా ఇక్కడ పనులు మొదలై మూడేళ్లు అవుతున్నా.. ముందుకు సాగడం లేదు. రైలుగేటు పడిన ప్రతీసారీ.. ఇటు అపోలో ఆసుపత్రి వరకు, అటు తీగలగుట్టపల్లి వరకు ట్రాఫిక్ నిలిచిపోతోంది. గతంలో గేటు పడి పలువురు పేషెంట్ల ప్రాణాలు అంబులెన్సులోనే పోయిన సందర్భాలున్నాయి.రైల్వేగేటు వద్ద అనుకున్న విధంగా డిజైన్ రూపొందించలేదన్న విమర్శలు ఉన్నాయి. రోడ్డులో మధ్యలో కాకుండా ఒకవైపు పక్కకు జరిగి నిర్మాణం సాగుతోంది. దీంతో రోడ్డు రైల్వేగేటుకు రెండువైపులా మరింత ఇరుగ్గా మారింది. రైల్వేస్టేషన్కు వెళ్లే లారీలు, ఆర్వోబీ నిర్మాణ పనులు, సామగ్రి రోడ్డును మరింత ఇరుగ్గా మారుస్తున్నాయి. దీంతో ప్రతీరోజూ రోగులు, నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఇంటర్ విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు. వచ్చేవారం నుంచి పదో తరగతి విద్యార్థులకు కూడా ఈ టెన్షన్ తప్పేలా లేదు. దీనిపై ఆర్డీవో మహేశ్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ‘భూసేకరణలో చిక్కుల కారణంగా.. ఆర్వోబీ నిర్మాణంలో జాప్యం అవుతున్న మాట వాస్తవమే. అందుకే, రాష్ట్ర ప్రభుత్వం వచ్చేవారం భూసేకరణ చిక్కులు తొలగేలా ఉన్న జీవోను మార్చి కొత్త జీవో ఇస్తుంది. దీంతో చిక్కులు తొలగి.. ఆర్వోబీ నిర్మాణం వేగం పుంజుకుంటుంది’’ అని తెలిపారు.తీగలగుట్టపల్లి రైల్వే గేటు వద్దకు రాగానే ఇంటర్ పరీక్షలు రాసే తల్లిదండ్రుల్లో టెన్షన్ మొదలవుతోంది. వరుసగా వస్తున్న రైళ్ల కారణంగా ఒక్కోసారి అరగంట వరకు ఎదురుచూడాల్సి వస్తుంది. దీంతో విద్యార్థుల్లో ఆందోళన మరీ అధికమవుతోంది. త్వరలోనే పదో తరగతి పరీక్షలు మొదలవనున్నాయి. గేటు పడటం వల్ల ప్రతీరోజూ అంబులెన్స్ల్లో రోగులకు ప్రాణసంకటంగా మారింది. సమస్యను త్వరగా పరిష్కరించాలి. – వేల్పుల వెంకటేశ్, నగరవాసి -
‘నారోజు’కు మహిళా కీర్తిరత్న పురస్కారం
కరీంనగర్ కల్చరల్: అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవాసంస్థ శ్రీశ్రీ కళావేదిక, సవ్యసాచి గ్రూప్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో కరీంనగర్ చెందిన కవయిత్రి, గానకోకిల నారోజు వెంకటరమణకు ‘మహిళ కీర్తి రత్న’ పురస్కారం అందించారు. బుధవారం విజయవాడ బెంజ్ సర్కిల్లో గల సర్వోత్తమ గ్రంథాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముందస్తు వేడుకల్లో సంస్థ బాధ్యులు కత్తిమండ ప్రతాప్కుమార్, కత్తిమండ ప్రతాప్ కుమార్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఎల్ఎల్ఎం ఇంటర్నల్స్కు అనుమతి నిరాకరణకరీంనగర్ సిటీ: కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం ద్వితీయ ఇటర్నల్ పరీక్షకు విద్యార్థులను అనుమతించలేదు. హాజరుశాతం తక్కువ ఉందని రిజిస్ట్రార్ పి.సతీశ్కుమార్ నిరాకరించారు. సాయంత్రం వరకు బ్రతిమిలాడినా వినలేదని విద్యార్థులు చెబుతున్నారు. తాము ఎల్ఎల్బీలో ప్రాక్టీసు చేస్తూ ఎల్ఎల్ఎం తరగతులకు హాజరవుతున్నామని, 75శాతం హాజరు నిబంధన నుంచి వెసులుబాటు కల్పించాలని కోరారు. 17 మందిలో ఒకరిద్దరికి 60శాతం ఉందని, మిగతావారికి 30 నుంచి 40 శాతం హాజరు ఉందని, 75శాతం ఉంటేనే పరీక్షలకు అనుమతిస్తామని అధికారులు పేర్కొంటున్నారని విద్యార్థులు తెలిపారు. దీంతో అసలు పరీక్షలు ఉంటాయా? వాయిదా వేశారా అర్థం కాకుండా పోయిందని అనుమానం వ్యక్తం చేశారు. యూ నివర్సిటీ అధికారులు కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అడ్మిషన్ల సమయంలో వెలుసుబాటు కల్పించి, పరీక్షల సమయంలో ఇలా చేయడం సరికాదన్నారు. నిబంధనల మే రకు హాజరుశాతం ఉంటేనే అనుమతిస్తామని అధికారులు ఖరాకండిగా చెప్పడంతో విద్యార్థులు పరీక్షలు రాయకుండానే వెనుదిరిగారు. గతంలో పరీక్షలు వాయిదా పడినప్పుడు 60 శాతం పైగా తరగతులకు హజరవుతామని వి ద్యార్థులు హమీ ఇచ్చారని, అందుకే అను మతించలేదని వర్సిటీ అధికారులు తెలిపారు. 7న ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ జట్ల ఎంపికకరీంనగర్స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపల్లిలోని అకడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్లో ఉమ్మడి జిల్లాస్థాయి సీనియర్స్ మెన్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. రాణించిన క్రీడాకారులను ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 11 గంటలకు సంయుక్త కార్యదర్శి ప్రభాకర్కు రిపోర్ట్ చేయాలని, 9441925807 నంబర్ను సంప్రదించాలని నిర్వాహకులు వెల్లడించారు. 8న మహిళలకు ఆటల పోటీలుకరీంనగర్స్పోర్ట్స్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేరా యువభారత్, జిల్లా యువజన క్రీడాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రాంతీయ క్రీడా పాఠశాలలో బాలికలకు, మహిళలకు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు మై భారత్ జిల్లా అధికారి ఎం.వెంకట రాంబాబు తెలిపారు. 100, 200, 400 మీటర్ల రన్నింగ్ను అండర్–13, 18, 18 విభాగంలో పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు 8న ఉదయం 8 గంటలకు రిపోర్టు చేయాలని, వివరాలకు 89771 48872 నంబర్ను సంప్రదించాలని సూచించారు. క్వింటాల్ పత్తి రూ.7,550జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో బుధవారం క్వింటాల్ పత్తి రూ. 7,550 పలికింది. క్రయ విక్రయాలను ఇన్చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు. -
లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం
కరీంనగర్రూరల్: గోపాల్పూర్లోని తాపాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వార్షికోత్సవా న్ని పురస్కరించుకొని బుధవారం కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అర్చకుడు చిగురాల మధుసూదనాచార్యులు ఆధ్వర్యంలో ఫలపంచామృతాలతో అభిషేకం, కలశ స్థాపన, హోమం, ప్రత్యేక పూజలు, గాయత్రి మూల మంత్రం హోమం జరిపారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, కార్పొరేటర్లు భూపతి రవీందర్, సాధవేని లావణ్య, సోమిడి వేణు తదితరులు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మేయర్, కార్పొరేటర్లను సన్మానించారు. దేవాదాయ శాఖ నుంచి తాపాల లక్ష్మినర్సింహస్వామి ఆలయంలో ధూపదీప నైవైద్యాలకు మంజూరు ఉత్తర్వులను తీసుకొచ్చినట్లు మేయర్ తెలిపారు. -
హోలీ వేడుకలకు వెళ్లి తిరిగిరాని బాలుడు
● సారంగాపూర్ పోలీస్స్టేషన్లో అదృశ్యం కేసు నమోదు జగిత్యాలరూరల్: హోలీ సంబరాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఓ బాలుడు అదృశ్యమైన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన సిన్నోజు రమేశ్, జ్యోత్స్న దంపతుల కుమారుడు పవన్తేజ మంగళవారం హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కుటుంబసభ్యులు బుధవారం సారంగాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ● కెనాల్లో మునిగి యువకుడు మృతి రామడుగు: రామడుగు మండలం దేశరాజ్పల్లిలో పండుగవేళ విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన యువకులు బుధవారం హోలీ జరుపుకుని శివారులోని మోతె వద్ద కాకతీయ కాలువలో స్నానాలకు వెళ్లారు. గ్రామానికి చెందిన వరాల అంజలి– రవికుమార్ కొడుకు రాకేశ్(24) కాలుజారి నీట మునిగి చనిపోయాడు. అక్కడే ఉన్న కొందరు రైతులు రాకేశ్ మృతదేహన్ని బయటకు తీశారు. రామడుగు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
అయ్యో పాపం ‘సహస్ర’
సిరిసిల్లటౌన్: అమ్మ పొత్తిళ్లలో అడుకునే వయసులో ఓ చిన్నారి ప్రమాదకర వ్యాధితో పోరాడుతోంది. కాలేయం పాడవడంతో ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతోంది. ఖరీదైన వైద్యం చేయించే ఆర్థిక పరిస్థితి లేక ఆ తల్లిదండ్రుల పడుతున్న కష్టాలు చెప్పలేనివిగా ఉన్నాయి. దాతలు చేయి అందిస్తే తమ కూతురును కాపాడుకుంటామని వేడుకుంటున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన అంబటి వేణు నేతకార్మికుడు. భార్య వర్ష పెట్టికోట్స్ కుడుతుంటుంది. వీరికి ముగ్గురు సంతానం అమృత, సహస్ర, అన్విత్సాయి. ఐదేళ్ల క్రితం పెద్ద కూతురు అమృత లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చనిపోయింది. ఆ చిన్నారికి రూ.2లక్షలతో చికిత్స చేయించినా ప్రాణం దక్కలేదు. పదిహేను రోజుల క్రితం రెండో కూతురు సహస్రకు తీవ్ర జ్వరం రావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. నాలుగు రోజులు దాటినా తగ్గకపోవడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించగా.. పరీక్షించిన వైద్యులు లివర్ మార్పిడి చేయాలని చెప్పారు. ఇప్పటికే రూ.5లక్షలు ఖర్చు చేశామని ఇప్పుడు రూ.30లక్షల వరకు ఆపరేషన్కు ఖర్చు అవుతుందని తెలిపారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. దాతలు 99122 31674లో సంప్రదించాలని కోరుతున్నారు. చిన్నారికి ఎంత కష్టం లివర్ మార్పిడితో బతికే అవకాశం పేద బతుకులకు కావాలి ఆపన్నహస్తం -
ఎన్టీపీసీ సీఎండీ ఎంపిక కోసం ప్యానెల్
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) నియామకం కోసం కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ త్వరలోనే ఓ ప్యానెల్ను ఏర్పాటు చేయనుంది. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు(పీఈఎస్బీ) ప్రతినిధి బృందం సభ్యులు సరైన అభ్యర్థిని గుర్తించడంలో విఫలమైనందున ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ జనరేటర్.. ఎన్టీపీసీ సీఎండీని నియమించడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ ఒక సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉన్నత నిర్వహణ పదవులకు అభ్యర్థులను నియమించే బాధ్యత కలిగిన సిబ్బంది, శిక్షణ శాఖ కింద ఉన్న పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు.. ఎన్టీపీసీ సీఎండీ పదవి కోసం డజను మంది అభ్యర్థులను ఇటీవల ఇంటర్వ్యూ చేసింది. ప్రస్తుతం సీఎండీగా కొనసాగుతున్న గురుదీప్సింగ్ ఈఏడాది జూలై 31వ తేదీన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. కానీ సరైన అభ్యర్థి లేకపోవడంతో ఆయన సేవలను ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీవరకు పొడిగించారు. ఈలోగా విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్యానెల్ కమిటీ కొత్త సీఎండీని నియమించే దిశగా అడుగులు వేస్తుంది. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకమాన్పూర్(మంథని): పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం పేరపల్లి గ్రామానికి చెందిన చెప్పాల దేవేందర్(36) మంగళవారం రాత్రి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి నర్సమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. దేవేందర్ 15ఏళ్లక్రితం అదే గ్రామానికి చెందిన మల్లేశ్వరిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు ఆశీష్, కుమార్తె కీర్తన సంతానం ఉన్నారు. భార్యాభర్తల మధ్య ఇటీవల విభేదాలు తలెత్తాయి. దీంతో భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఈక్రమంలో మద్యానికి బానిసైన దేవేందర్.. మంగళవారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లి మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారి పక్కన పత్తి చేనులో క్రిమిసంహారక మంది తాగి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఇసుక ట్రాక్టర్ సీజ్ కరీంనగర్రూరల్: సుల్తానాబాద్ మండలం గొల్లపల్లికి చెందిన దాసరి సంపత్ మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను బుధవారం బొమ్మకల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద పట్టుకుని సీజ్ చేసినట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు వివరించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. -
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
కోనరావుపేట(వేములవాడ): ఉపాధిహామీ కూలీలపై తేనెటీగలు దాడిచేసిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్లో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. నిజామాబాద్లో బుధవారం కాలువ పనులను ఉపాధిహామీ కూలీలు చేస్తున్నారు. హఠాత్తుగా తేనెటీగలు దాడి చేయడంతో పులి పాలవ్వ, అంగూరి రాములు, సలీం, సింగం రాజమణి, జక్కుల భూమయ్య, కవ్వంపెల్లి నర్సవ్వ, తాళ్లపెల్లి నర్సయ్య, తాళ్లపెల్లి దేవవ్వ గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్లో సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో పాలవ్వ పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. గాయపడిన కూలీలను ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, మాజీ జెడ్పీటీసీ బండ నర్సయ్య, వైస్చైర్మన్ ప్రభాకర్, ఏపీవో శ్రీనివాస్, డీసీసీ మాజీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ పరామర్శించారు. 8 మందికి గాయాలు -
పైడిమడుగు పీఏసీఎస్కు జాతీయస్థాయి గుర్తింపు
కోరుట్లరూరల్: మండలంలోని పైడిమడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. 2024–25కు గాను నేషనల్ ఫెడరేషన్ కో–ఆపరేటివ్ బ్యాంకు ఆధ్వర్యంలో నేషనల్ బ్యాంకు ఆఫ్ అగ్రికల్చర్ ఆండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డు) సిఫారసుతో నిర్వహించిన సర్వేలో పైడిమడుగు పీఏసీఎస్ జాతీయస్థాయిలో మూడోస్థానంలో నిలిచి అవార్డు దక్కించుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పనితీరు, ఆర్థిక లావాదేవీల నిర్వహణలో పారదర్శకత, రైతులకు అందించిన రుణాలు, ఇతర సేవలను పరిశీలించగా పైడిమడుగు పీఏసీఎస్కు మూడో బహుమతి దక్కింది. ఈనెల 17న సిక్కింలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేయనున్నారని పీఏసీఎస్ సీఈఓ శ్యామ్సుందర్ తెలిపారు. అవార్డు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పాలక వర్గం, సిబ్బంది, రైతుల సమష్టి సహకారంతోనే అవార్డు సాధ్యమైందన్నారు. ఆర్థిక లావాదేవీలు, రైతు సేవలో దేశంలో మూడోస్థానం -
‘కళ’కు ఆదరణ కరువు
పెద్దపల్లిరూరల్: పౌరాణిక, నాటకరంగం, యక్షగానం, ఒగ్గుడోలు కళలకు ఆదరణ కరువైంది. తమకు వారసత్వంగా వచ్చిన కళలనే నమ్ముకున్న కళాకారులు ప్రస్తుతం నిరాదరణకు గురవుతున్నారు. పెద్దపల్లి మండలం హన్మంతునిపేటలో పౌరాణిక నాటక ప్రదర్శనలను బతికించేందుకు యువతకు శిక్షణ ఇస్తూ ఏటా చిడతల రామాయణం ప్రదర్శనలిస్తున్నారు. అలాగే రాఘవాపూర్ గ్రామానికి చెందిన ఒగ్గు, డోలు, చిందు కళాకారులు తెలంగాణలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో జరిగే వేడుకల్లోనూ ప్రదర్శనలిచ్చి ప్రముఖులతో మెప్పు పొందారు. సులువుగా అర్థమయ్యేలా ప్రచారం ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా కథలు, నాటకాల రూపంలో కళాకారులు అనేక ప్రదర్శనలిచ్చారు. అక్షరాస్యతతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూనే, ఎయిడ్స్ నిర్మూలన, మద్యం మహమ్మారితో కలిగే అనర్థాలను కళ్లకు కడుతున్నారు. సంక్షేమ పథకాల అమలుపై బృందాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా.. కళాకారుల పరిస్థితి దయనీయంగానే ఉంది. అధికారులు, పాలకులు ఎప్పుడోఓసారి ప్రదర్శనలు చేసే అవకాశం కల్పించి నామ్కేవాస్తేగా పారితోషికం అందించి చేతులు దులుపుకుంటున్నారని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక సాంకేతికతతోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతోనే కళలు, కళాకారులకు ఆదరణ తగ్గుతోందని కళాకారులు వాపోతున్నారు. సీరియళ్లు, సినిమాలు ఇంట్లోనే వీక్షించే అవకాశాలు అందుబాటులో ఉండడం కూడా మరోకారణమంటున్నారు. పౌరాణిక, నాటకరంగం కనుమరుగయ్యే ప్రమాదంలో ఉందని, పాలకులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి కళారంగాన్ని కాపాడాలని కోరుతున్నారు. పట్నాలు వేసినప్పుడే ఉపాధి ఏటా బీరన్న, మల్లన్న పట్నాలు వేసినప్పుడు నిర్వాహకులు ఇచ్చే కానుకలతోనే బతుకు వెళ్లదీయాల్సి వస్తోందని కళాకారులు తెలిపారు. గతంలో పల్లెల్లో.. అక్కడక్కడా పట్టణాల్లోనూ ఎవరైనా చనిపోతే కర్మకాండ నిర్వహించే రోజుల్లో రాత్రి నుంచి వేకువజాముదాకా ఒగ్గుకథ చెప్పించే వారని గుర్తు చేశారు. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉందని పేర్కొంటున్నారు. ఒగ్గుకథ చెప్పించే ఆనవాయితీ కనిపించడం లేదన్నారు. దయనీయ స్థితిలో ‘పౌరాణికం’ కుటుంబ పోషణకు కష్టాలు అర్హులకు పింఛన్ ఇవ్వాలని వేడుకోలు పింఛన్ ఇప్పించాలి ప్రభుత్వం అన్నివర్గాల్లోని అర్హులకు ఇస్తున్న మాదిరిగానే కళారంగంలో ప్రావీణ్యులైన వారిలో అర్హులను ఎంపిక చేసి పింఛన్ మంజూరు చేయాలని కోరుతున్నారు. జానపద, కళారంగాల కళాకారులతో పథకాలను ప్రచారం చేసేలా కార్యాచరణ రూపొందిస్తే తమకు ఉపాధి కల్పించినట్లవుతుందని పేర్కొంటున్నారు. పల్లె ప్రాంతాల్లో కళలనే నమ్ముకుని ఉన్నఎందరో కళాకారులు పొట్టకూటి కోసం, కుటుంబపోషణ భారం కావడంతో ఇతర పనుల వైపు దృష్టిసారించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనుమరుగయ్యే ప్రమాదంలో ఉన్న పౌరాణిక, నాటక, జానపద కళారంగాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఆధునిక పోకడలతో కళారంగానికి ఆదరణ కరువైంది. కళాకారులతో సంక్షేమ పథకాలు, మూఢనమ్మకాలనిర్మూలనతోపాటు డ్రగ్స్, గంజాయితో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించే అవకాశాలను కళాకారులకు ఇప్పించాలి. అర్హులకు పింఛన్ మంజూరుచేసి అండగా నిలవాలి. – కుంట సదయ్య, అధ్యక్షుడు, జిల్లా కళాకారుల సంఘం -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి శివారులో మంగళవారం బైక్, కారు ఢీకొన్న సంఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న రాగుల యాదగిరి బుధవారం మృతి చెందాడు. ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరాలు. కోనరావుపేట మండలం చిన్నబోనాలకు చెందిన రాగుల యాదగిరి–శంకరమ్మ దంపతులు టీవీఎస్ ఎక్సెల్పై ఎల్లారెడ్డిపేట దుమాలకు మంగళవారం వచ్చి తిరిగి వెళ్తుండగా కామారెడ్డి వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈప్రమాదంలో దంపతులు ఇద్దరు తీవ్రంగా గాయపడగా, ద్విచక్రవాహనం కాలిపోయింది. క్షతగాత్రులను 108 వాహనంలో సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే యాదగిరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స పొందుతూ మరణించాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్రెడ్డి తెలిపారు. బల్దియా.. ఇదేం‘దయ’ సిరిసిల్లఅర్బన్: పట్టణ పరిధిలోని పదోవార్డు చిన్నబోనాలకు చెందిన రేగుల యాదగిరి మృతదేహన్ని గురువారం స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. వైకుంఠ రథం కోసం సంబంధిత మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు సమాచారం ఇచ్చినా స్పందించకపోవడంతో మృతదేహాన్ని ట్రాక్టర్లో తీసుకెళ్లినట్లు స్థానిక కౌన్సిలర్ బొల్గం వైష్ణవి తెలిపారు. ఇప్పటికై నా విలీన గ్రామాల్లో ప్రత్యేక వైకుంఠరథం ఏర్పాటు చేయాలని, మున్సిపాలిటీకి పన్నులు చెల్లించినా విలీన గ్రామాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయలేకపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రూ.101కే దహన సంస్కారాలు నిర్వహించేలా మున్సిపల్ అధికారులు విలీన గ్రామాల్లోనూ వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
పాపయ్యపల్లిలో ఇద్దరు..
● స్నానాకి వెళ్లి.. నీటమునిగి.. తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పాపయ్యపల్లిలో జరిగిన హోలీ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొ మురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్కు చెందిన మోతి వాడ్ నాగార్జున(22), గుంటూరు జిల్లా గోగులపాడుకు చెందిన ముండ్ర రత్తయ్య(25) రైల్వేపనుల్లో కూలీలుగా ప నిచేస్తున్నారు. బుధవారం స్నేహితులతో కలిసి హోలీ వే డుకల్లో పాల్గొన్నారు. అనంతరం స్నానం చేసేందుకు స మీప చెరువు వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు అందులోనే మునిగి ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను బయటకుతీసి సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు నాగార్జన బంధువు మోతివాడ్ హరిదాస్ ఫిర్యాదుతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్రచారి తెలిపారు. -
యువకుడి అనుమానాస్పద మృతి
వేములవాడఅర్బన్/వీర్నపల్లి(సిరిసిల్ల): స్థానిక ఓ లాడ్జీలో బుధవారం ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపిన వివరాలు. వీర్నపల్లి మండలం లాల్సింగ్తండాకు చెందిన భూక్య మోహన్(26) ఓ యువతితో కలిసి వేములవాడలోని ఓ ప్రైవేట్ లాడ్జీలోని అద్దె గదిలో దిగాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానంతో నిర్వాహకులు గది తలుపులు తెరిచి చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు. మృతుని బంధువల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లాడ్జీలో సీసీ కెమెరాలు లేకపోవడంతో సమీప భవనంలోని సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. మోహన్తో కలిసి వచ్చిన యువతి తిరిగి బయటకు వెళ్లినట్లు సమీపంలోని సీసీ పుటేజీలలో లేదు. అయితే మోహన్ మృతిచెందిన విషయం తెలిసిన తర్వాత మరో జంట అక్కడి నుంచి బయటకు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. శతాధిక వృద్ధుడు..ఇబ్రహీంపట్నం: మండలకేంద్రానికి చెందిన కంతిల్యాడ లింగన్న (105) బుధవారం మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వృద్ధాప్యం పైబడడంతో తుది శ్వాస విడించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల వరకు ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తి..కరీంనగర్రూరల్: ఆరెపల్లి శివారులోని సత్తినేని తిరుపతి పత్తి చేనులో బుధవారం గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతిచెందాడని కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు.మృతుడి వయస్సు సుమారు 60 సంవత్సరాలు ఉంటుందని, తెల్లని గడ్డంతోపాటు తెల్లని బనియన్, ప్యాంటు ధరించి ఉన్నాడని వివరించారు. ఆచూకీ తెలిసినట్లయితే ఫోన్నంబరు 8712670764కు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు. బైక్ అదుపుతప్పి ఒకరు..మల్యాల: బైక్ అదుపు తప్పి ఒకరు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై నరేశ్కుమార్ కథనం ప్రకారం.. మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ముక్కెర నరేశ్(26) ఈనెల 3న తన ద్విచక్ర వాహనంపై కొడిమ్యాల మండలంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మల్యాల మండలం గొర్రెగుండం శివారులో బైక్ అదుపుతప్పి, కిందపడి మృతిచెందాడు. నరేశ్ తండ్రి చిన్నపోచయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
అబుదాబి విమానాశ్రయంపై ఇరాన్ దాడి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇజ్రాయెల్– ఇరాన్ దాడుల నేపథ్యంలో ఆదివారం అబుదాబి ఏయిర్పోర్ట్పై జరిగిన దాడిలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి వాసికి గాయాలైన ఘటన మంగళవారం వెలుగుచూసింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతిరెడ్డిపల్లికి చెందిన నందెల్లి రాజేశ్వర్రావు నాలుగేళ్లుగా బతుకు దెరువు కోసం అబుదాబిలోని ఏయిర్పోర్ట్లో క్లీనింగ్ సెక్షన్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఇరాన్ మిసైల్ దాడిలో ఏయిర్పోర్ట్ అద్దాలు పగిలి రాజేశ్వర్రావుకు గాజుపెంకులు చాతి, కుడి చేతి భాగాన కుచ్చుకుపోవడంతో హాస్పిటల్కు తరలించారు. చికిత్స తర్వాత తన గదికి పంపించినట్లు తన సోదరుడు రామారావుకు మెస్సేజ్ పంపించారు. అలాగే ఏయిర్పోర్ట్ సమీపంలో ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్కు చెందిన ముగ్గురు మృతిచెందినట్లు సమాచారం అందించినట్లు తెలిపారు. విమాన రాకపోకలు నిలిచిపోవడంతో స్వదేశానికి వచ్చే పరిస్థితులు లేవని, రెండుమూడు రోజుల్లో విమాన రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలిపినట్లు చెప్పారు. జరిగిన ఘటన తెలుసుకున్న రాజేశ్వర్రావు భార్య మీనా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఎలాగైనా స్వగ్రామానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని రాజేశ్వర్రావు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దాడుల నేపథ్యంలో అక్కడున్న తమ వారు ఎలా ఉంటారోనని ఆందోళన చెందుతున్నారు. రాజేశ్వర్రావుకు గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీటీ పర్యంతమయ్యారు. -
వెంటాడుతున్న విషాదం
గోదావరిఖని: ఆ కుటుంబాన్ని విషాదం వెంటాడుతూనే ఉంది . తండ్రితో మొదలైన మృత్యువు.. ఆ తర్వాత పెద్దకొడుకు.. ఇప్పుడు చిన్నకొడు కు భార్గవ్(28)నూ కబళించింది. గోదావరిఖని వన్టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎంకాలనీ టీటూ–236 క్వార్టర్లో నివాసం ఉంటూ ఆర్జీ–2 ఏరియా వకీల్పల్లిగనిలో పనిచేసిన మిగినబోయిన గణేశ్– స్వరూప దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. గణేశ్ సింగరేణిలో ఉద్యోగం చేసి గతంలోనే ఉద్యోగ విరమణ చేశాడు. తన స్థానంలో పెద్దకొడుకు అనిల్కుమార్కు ఉద్యోగం ఇప్పించాడు. కొంతకాలానికి అనారోగ్యంతో గణేశ్ చనిపోయాడు. కొంతకాలానికే అనూహ్యంగా జరిగిన గని ప్రమాదంలో అనిల్కుమార్ కూడా మృతి చెందాడు. దీంతో ఇతడి ఉద్యోగం చిన్నకుమారుడు భార్గవ్కు వ చ్చింది. భార్గవ్ కొద్దిరోజులుగా డ్యూటీకి సరిగా వె ళ్లక ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. రెండేళ్ల నుంచి అండర్గ్రౌండ్ డ్యూటీ చేయలేక ఇంటి వద్దే ఉంటున్నాడు. కుటుంబ పోషణకు అప్పు చేసి తీర్చలేక మనోవేదనక గురవుతున్నాడు. సోమవారం కుటుంబసభ్యులతో వేములవాడ, కొమురవెల్లి జాతరకూ వెళ్లి వచ్చాడు. తర్వాత తెల్లవారుమున ఇంటి వెనకాల షెడ్డు పైకప్పుకు ఉరేసుకుని మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ● మొన్న తండ్రి, పెద్ద కుమారుడు.. నిన్న చిన్నకుమారుడు మృతి ● ఉరివేసుకుని సింగరేణి కార్మికుడి ఆత్మహత్య ● ఒకేఇంట్లో ముగ్గురి మృతితో తీరని విషాదం -
చిప్పకుర్తిలో యువకుడి అదృశ్యం
రామడుగు: రామడుగు మ ండలం చిప్పకుర్తి గ్రామానికి చెందిన బుర్ర సునీల్ గౌడ్(21) మంగళవారం మ ధ్యాహ్నం నుంచి కనిపించడం లేదని గ్రామస్తులు తెలిపా రు. కుటుంబసభ్యులకు గ్రా విటీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంటాన ని చెప్పి ఇంట్లోంచి వెళ్లినట్లు తెలిపారు. సునీల్ గౌడ్ సెల్ఫోన్ కాలువ గట్టుపైన లభ్యమైంది. కాలువలో గ్రామస్తులు గాలించగా రాత్రి వరకు ఆచూకీ లభించలేదని గ్రామస్తుల తెలిపారు. మల్యాలలో యువతి..మల్యాల: మండలకేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న షేక్ శిరీన్(26) అదృశ్యమైంది. ఎస్సై నరేశ్కుమార్ కథనం ప్రకారం.. జగిత్యాలకు చెందిన షేక్ శిరీన్ ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఈనెల 2న స్కూల్కు వెళ్లేందుకు జగిత్యాల బస్టాండ్లో బస్సు ఎక్కింది. కానీ.. స్కూల్కు చేరలేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. ప్రమాదవశాత్తు వృద్ధుడు మృతిమానకొండూర్: మానకొండూర్ మండలం శంషాబాద్ గ్రామానికి చెందిన మెరుగు రాయమల్లు(75) బహిర్భూమికని వెళ్లి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మెరుగు రాయమల్లు మంగళవారం సాయంత్రం బహిర్భూమికని ఆరుబయటు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలుజారి వ్యవసాయబావిలో పడి మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్ట నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాయమల్లుకు ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. రాయికల్: మండలంలోని తాట్లవాయి అటవీ ప్రాంతంమీదుగా కలపను అక్రమంగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో వనసంరక్షణ సమితి చైర్మన్ ఆకుల శేఖర్, కొండవేని సంజనమధు, సర్పంచ్ ఆకుల మల్లేశం, కోసరి మహేశ్ కలిసి పట్టుకున్నారు. కలప తరలిస్తున్న వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. దుండగులు ఐదు దుంగలను వదిలి పారిపోయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని సర్పంచ్ జిల్లా అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమణారెడ్డిని వివరణ కోరగా.. అటవీ ప్రాంతంలోకి వెళ్లి కలపను స్వాధీనం చేసుకున్నామని, కొంత మంది అనుమానితులను గుర్తించామని, వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. -
‘కల్లు’ తేలేస్తున్నారు !
సిరిసిల్ల క్రైం: కార్మికక్షేత్రంలో కల్లు విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. సిరిసిల్ల పట్టణ పరిధితోపాటు చుట్టుపక్కల గ్రామాలలో పెద్దగా తాటి, ఈత వనాలు లేకపోయినా నిత్యం వేలాది లీటర్ల కల్లు మాత్రం విక్రయిస్తున్నారు. పొద్దంతా శ్రమించే నేతకార్మికులు, హమాలీలు, అడ్డాకూలీలు రాత్రి పూట శ్రమను మరిచిపోయేందుకు కల్లును ఆశ్రయిస్తున్నారు. తక్కువ డబ్బులు పెడితే ఒక లీటర్ కల్లు వస్తుందని కార్మికులు, కూలీలు డిపోల వద్దకు పోయి తాగుతుంటారు. వీరి అవసరాన్ని ఆసరాగా చేసుకున్న కల్లు వ్యాపారులు కల్తీకి తెరలేపారు. తీయదనం ఇచ్చే రసాయనంతోపాటు మత్తును ఇచ్చే క్లోరోఫామ్ కలిపి కల్లు తయారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సిరిసిల్ల డిపోలలో కల్లు తాగిన వారు ఇంటికి చేరుకునేలోపే మత్తు ఆవహించి రోడ్లపైనే నిద్రపోయే దృశ్యాలు రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిత్యం కనిపిస్తున్నాయి. ఇంతా జరుగుతున్నా ఎకై ్సజ్ అధికారులు మాత్రం తనిఖీలు చేస్తున్నామంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కల్లు దిగుమతి సిరిసిల్ల పట్టణానికి జగిత్యాల, పెద్దపల్లి, సుల్తానాబాద్, జమ్మికుంట ప్రాంతాల నుంచి మూడు రోజులకోసారి మినీ వ్యాన్లలో కల్లును తీసుకొస్తున్నారు. ఇలా మూడు రోజులకోసారి 800 లీటర్ల అసలు కల్లు వస్తున్నట్లు సమాచారం. ఈ కల్లులో నీరు, ఇతర రసాయనాలు కలిపి నిత్యం సుమారు వెయ్యి లీటర్ల వరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. అధికారికంగా 4 డిపోలే.. అనధికారికంగా డబుల్ సిరిసిల్లలో అధికారికంగా నాలుగు డిపోల ద్వారా కల్లు విక్రయిస్తున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎనిమిది డిపోలు ఉన్నట్లు సమాచారం. ఒక్కో డిపో కింద నాలుగు నుంచి ఐదు దుకాణాలు ఉన్నాయి. రోజుకు వంద లీటర్ల కల్లుమాత్రమే అమ్ముడుపోతున్నట్లు ఎకై ్సజ్ అధికారులు చెబుతుంటే.. వాస్తవానికి అంతకు ఐదింతలు విక్రయిస్తున్నట్లు సమాచారం. అధికారికంగానే సిరిసిల్లకు జగిత్యాల, పెద్దపల్లి ప్రాంతాల నుంచి కల్లు తీసుకొచ్చేందుకు అనుమతులు ఉన్నాయి. కానీ సుల్తానాబాద్, జమ్మికుంట ప్రాంతాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. అధికారుల నిర్లక్ష్యం ఎప్పటికప్పుడు కల్లు కల్తీ నివారణకు తనిఖీ చేయాల్సిన ఎకై ్సజ్ అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో కార్మిక క్షేత్రంలో కృత్రిమ కల్లు విచ్చలవిడిగా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుమతుల జారీతోపాటు పలు ఆరోపణల నేపథ్యంలో గతంలో ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్తోపాటు సీఐ స్థాయి అధికారి సస్పెన్షన్ గురైన విషయం తెలిసిందే. ఇప్పటికై నా కార్మిక క్షేత్రంలో కల్తీ కల్లు విక్రయాల నివారణపై అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. కల్తీ మత్తు.. జీవితాలు చిత్తు సిరిసిల్లలో కనిపించని ఈత, తాటివనాలు పట్టణంలో విచ్చలవిడిగా కల్లు విక్రయాలు కృత్రిమ కల్లు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఎకై ్సజ్ తనిఖీలపై అనుమానాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం సహజ సిద్ధంగా లభించే కల్లు తాగితే ఎలాంటి నష్టం ఉండదు. కానీ చక్రీన్, క్లోరోఫామ్ కలిపిన కల్లు తాగితే ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు. కల్లును ఎక్కువగా కూలీలు, కార్మికులే సేవిస్తుంటారు. ఈ కల్లు తాగిన వారిలో ఎక్కువగా కాలేయ సమస్యలు, కిడ్నీ వ్యాధులు, దృష్టి లోపాలు వంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సిరిసిల్లలో కూలీలు చాలా మంది ఇలాంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు పలువురు వైద్యుల ద్వారా తెలిసింది. నిబంధనల ప్రకారం ప్రతీ 15 రోజులకోసారి కల్లు డిపోలను నేనే స్వయంగా తనిఖీ చేస్తున్నాను. శాంపిల్స్ తీసి వరంగల్లో పరీక్షలు చేయిస్తున్నాం. ఇప్పటి వరకు కృత్రిమ రసాయనాలు వాడినట్లు తేల లేదు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తనిఖీలు సజావుగా సాగుతున్నాయి. మద్యం, కల్లు వ్యాపారం అంటేనే విమర్శలు ఉంటాయి. – శ్రీనివాస్, ఎకై ్సజ్ సీఐ, సిరిసిల్ల -
ముదిరిన భూవివాదం.. మహిళ ఆత్మహత్యాయత్నం
ముత్తారం(మంథని): పెద్దపల్లి జిల్లా ముత్తారంలోని కాసార్లగడ్డలో ఇటీవల రామాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ ప్రాంతంలో 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న కేతిరి లక్ష్మి, సారయ్య కుటుంబం స్థలాన్ని కబ్జా చేసిందని, వెంటనే ఖాళీ చేయాలని భూదాతలు, కొందరు పెద్దలు, ఓ సామాజిక వర్గం మధ్య నెలరోజులుగా వివాదం జరుగుతోంది. ఇదికాస్త ముదురి చివరికి దాడి చేసుకునే స్థాయికి చేరింది. సోమవారం రాత్రి ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఇందులో కేతిరి లక్ష్మి గాయాలయ్యాయి. అనేకఏళ్ల నుంచి నివాసం ఉంటున్న తమ ఇంటిని కూలగొట్టి, తమపై దాడి చేశారనే మనోవేదనతో ఆమె పురుగులమందు తాగింది. వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారు. ఆత్మహత్యాయత్ననికి కారకులపై ఆమె భర్త సారయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం నారాయణరెడ్డి, కుమార్, రాజయ్య, సతీశ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. మరోవైపు.. ఎరుకుల కుటుంబం దాడి చేసిన, లక్ష్మి ఆత్మహత్యాయత్ననికి కారుకులైన వారిపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేశ్, ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఆర్ల సందీప్, కేవీపీఎస్ ఉపాధ్యక్షుడు మంథని లింగయ్య డిమాండ్ చేశారు. నలుగురిపై కేసు నిందితులను అరెస్ట్ చేయాలి కార్మిక సంఘూల డిమాండ్ -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి శివారులో మంగళవారం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన యాదగిరి పరిస్థితి విషమంగా ఉంది. ద్విచక్రవాహనం పూర్తిగా దగ్ధమైంది. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీనివాస్గౌడ్, ఎస్సై రాహుల్రెడ్డి సందర్శించారు. వారు తెలిపిన వివరాలు.. కోనరావుపేట మండలం చిన్నబోనాలకు చెందిన రాగుల యాదగిరి– శంకరమ్మ దంపతులు టీవీఎస్ఎక్సెల్ ద్విచక్రవాహనంపై ఎల్లారెడ్డిపేట మండలం ధూమాలలో ఉంటున్న బంధువుల ఇంటికి ఉదయం వచ్చారు. బంధువులను కలిసి తిరిగి వెళ్తున్న క్రమంలో సిరిసిల్ల నుంచి కామారెడ్డి వైపు వస్తున్న కారు ద్విచక్రవాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంపై ప్రయాణిస్తున్న దంపతులు దూరంగా ఎగిరిపడ్డారు. ద్విచక్రవాహనం నుంచి పెట్రోల్ లీకయి మంటలు ఎగిసిపడి పూర్తిగా కాలిపోయింది. గాయపడిన దంపతులను పోలీసులు 108 వాహనంలో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదంలో గాయపడిన దంపతులు వృద్ధ దంపతులకు తీవ్రగాయాలు మంటల్లో కాలిపోయిన ద్విచక్రవాహనం -
ఆలయాల మూసివేత
ధర్మపురిలో శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని మూసివేస్తున్న అర్చకులు కొండగట్టు ఆలయాన్ని మూసివేస్తున్న అర్చకులు వేములవాడలో ఖాళీగా ఉన్న రాజన్న ఆలయ క్యూలైన్లు చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం వేములవాడ రాజన్న, భీమన్న, ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాలను అధికారులు మూసివేశారు. దీంతో ఆలయాల ఆవరణలు బోసిపోయి కనిపించాయి. సాయంత్రం ఆయా ఆలయాల్లో సంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల దర్శనాలకు అనుమతించారు. – వేములవాడ/ధర్మపురి/మల్యాల -
మృతదేహం కోసం రోడ్డెక్కిన బంధువులు
రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రానికి చెందిన వివాహిత బాధనవేణి కావ్య (30) ఫిబ్రవరి 19న ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమెదు చేశారు. స్థానికులు తెలిపిన వివరాలు.. కావ్య అత్తగారు, తల్లిగారు రుద్రంగి. ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట కెనాల్ వద్ద మృతదేహం లభించడంతో కావ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహంపై ఉన్న దుస్తుల ఆధారంగా కుటంబ సభ్యులు కావ్యగా గుర్తించారు. అయితే, కావ్య దుస్తులే చూపెట్టారని, మృతదేహాన్ని అప్పగించకుండా ఖననం చేశామని పోలీసులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. మంగళవారం రుద్రంగి మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ ఎదుట కోరుట్ల– వేములవాడ ప్రధాన రహదారిపె బైఠాయించారు. మృతదేహాన్ని అప్పగించాలని నిరసన వ్యక్తం చేశారు. కనీసం చివరిచూపు దక్కకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని అప్పగించాలని కావ్య తమ్ముడు, కొడుకులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు మొదటి నుంచి కేసును సరిగ్గా దర్యాప్తు చేయలేదని ఆరోపించారు. కనీసం మృతదేహాన్ని అప్పగించాలని సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామని రోదిస్తూ వేడుకున్నారు. కావ్య కొడుకులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. కాగా, చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు ఘటన స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో కావ్యగా నిర్ధారించలేమని, డీఎన్ఏ టెస్ట్ ఆధారంగా నిర్ధారణకు వస్తామని బాధితులను సముదాయించారు. -
కూలీ ముఖం ‘గుర్తించలేదు’
కరీంనగర్రూరల్: కేంద్ర ప్రభుత్వం వీబీ జీరామ్ జీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు ప్రవేశపెట్టి న ముఖ గుర్తింపు హాజరు విధానానికి ఆదిలోనే అడ్డంకులేర్పడ్డాయి. యాప్లో నెలకొన్న సాంకేతిక సమస్యలతో కూలీల ముఖ గుర్తింపు హాజరు నమో దు సాధ్యం కావడం లేదు. గతంలో కూలీల మస్టర్ విధానం అమలులో ఉండగా కేంద్ర ప్రభుత్వం ఈ నెల 2నుంచి ముఖ గుర్తింపు హాజరు ప్రవేశపెట్టింది. సోమవారం నుంచి అధికారులు జిల్లాలో ప్రా రంభించారు. ఫీల్డ్అసిస్టెంట్లు ఉదయం, మధ్యాహ్నం కూలీల హాజరును నమోదు చేయాల్సి ఉంటుంది. కొత్త విధానంపై ఫీల్డ్అసిస్టెంట్లు, మేట్లకు ఎలాంటి శిక్షణ ఇవ్వకపోవడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఏర్పడుతున్నాయి. యాప్లో సాంకేతిక సమస్యలు వీబీ జీ రామ్ జీ(ఉపాధిహామీ) పథకంలో కూలీల హాజరు పక్కగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ ఆధార్ హాజరు విధానంలో సాంకేతిక సమస్యలేర్పడ్డాయి. మంగళవారం జిల్లాలోని పలు గ్రామాల్లో పనులకు వచ్చిన కూలీల హాజరును నమోదు చేసేందుకు ఫీల్డ్అసిస్టెంట్లు ప్రయత్నించగా యాప్లో కూలీల వివరాలు లభించలేదు. కొన్ని గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు కొంతమంది కూలీల ఫొటోలు తీసుకోగా మరికొంతమంది కూలీల ఫొటోలు యాప్లో కన్పించకపోవడంతో ఫొటో తీయలేదు. మరి కొన్ని గ్రామాల్లో ఉదయం 8గంటలకు వచ్చిన కూలీలు గంటకుపైగా ఎదురుచూసినప్పటికీ యాప్ పనిచేయకపోవడంతో కూలీలు ఇంటికి వెనుతిరిగి వెళ్లిపోయారు. గతంలో కూలీల ఆధార్కార్డు నంబర్లను ఉపాధిహామీకి ఈ–కేవైసీ లింక్ చేసినప్పటికీ.. వివరాలు లభించకపోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఒక్కో కూలీ ముఖ హాజరు నమోదు చేసేందుకు సుమారు 5నిమిషాల వరకు పడుతుండటంతో హాజరుకే సమయం సరిపోతుందని ఫీల్డ్అసిస్టెంట్లు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజులో సుమారు 70నుంచి 80మంది కూలీ ల ముఖ హాజరును రెండు పర్యాయాలు ఎలా నమోదు చేయాలో తెలియడంలేదని వాపోతున్నా రు. మంగళవారం జిల్లావ్యాప్తంగా 855 పనులు నడుస్తుండగా సుమారు 7వేల మంది కూలీలు పనులకు వచ్చారు. కేవలం 3,838 కూలీల ముఖ హాజరును నమోదు చేశారు. ప్రధానంగా చిగురుమామిడి, చొప్పదండి, కరీంనగర్, కొత్తపల్లి మండలాల్లో సాంకేతిక సమస్యతో కూలీల హాజరు తక్కువగా నమోదైంది. కొత్తగా అమలు చేస్తున్న యాప్ లో కొన్ని సాంకేతిక సమస్యలతో కూలీల హాజరు పూర్తిస్థాయిలో కాలేదని అధికారులు పేర్కొంటున్నారు. రెండు,మూడు రోజుల్లో సాంకేతిక సమస్యలు పరిష్కరమయ్యే అవకాశముందన్నారు. -
ఉన్నట్టా.. లేనట్టా?
దివ్యాంగుల పార్కుపై సందిగ్ధంసాక్షి ప్రతినిధి, కరీంనగర్: నగరంలో దివ్యాంగుల కోసం నిర్మించతలపెట్టిన పార్కు సాధ్యం కాదనుకున్న అధికారులు ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నారు. పార్కు నిర్మాణం సాధ్యం కాదని తేల్చిన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీకే) ఆ నిధులను మరో ప్రాజెక్టుకు మళ్లించే యత్నం చేసింది. ఈ విషయమై నగరవాసులు కోర్ట్ ఆఫ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ (సీసీపీడీ), న్యూఢిల్లీకి ఫిర్యాదులు చేశారు. విచారణ చేపట్టిన సీసీపీడీ ప్రాజెక్టు ప్రస్తుత స్థితిని గురించి 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో బల్దియా అధికారులు తాము చేసిన పొరపాటును సరిచేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అసలేం జరిగింది? 2021లో బల్దియాలో 10వ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల మీటింగ్ జరిగింది. ఆ సమావేశంలో రూ.4 కోట్లతో కరీంనగర్లో స్పెషల్లీ ఏబుల్డ్ పార్క్ నిర్మించేందుకు పరిపాలన అనుమతులు జారీచేసి, టెండర్లను ఆహ్వానించారు. ఈ పనులను ఎస్ఆర్వీఎస్ ఇండస్ట్రీస్ అనే సంస్థ దక్కించుకుంది. అనంతరం ఎస్ఆర్వీఎస్ ఇండస్ట్రీస్ తన యంత్రాలు, లేబర్లను సైట్ మీదకు పంపారు. కేటాయించిన భూమిలో వివాదం తలెత్తడంతో టెండరు పొందిన ఏజెన్సీ కొన్ని నెలల పాటు పనులు చేపట్టలేకపోయింది. 14వ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల మీటింగ్ (తేదీ: 03.01.2023 రోజున)లో స్పెషల్లీ ఏబుల్డ్ పార్క్ ప్రాజెక్ట్ను జాబితా నుంచి తొలగించారు. ఆ పార్కు కోసం కేటాయించిన నిధులను స్మార్ట్సిటీ ఫేస్–2 రోడ్లు, బుల్ సెమెన్ సెంటర్లో సమీకృత మార్కెట్ నిర్మించేందుకు బోర్డు ఆఫ్ డైరెక్టర్ల మీటింగ్లో ఆమోదించారు. సీసీపీడీకి ఫిర్యాదు బల్దియా అధికారుల తీరు సరికాదని పలువురు సామాజిక కార్యకర్తలు తప్పుబట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం సదుపాయాలు కల్పిస్తుంటే.. కరీంనగర్ స్మార్ట్సిటీలో భాగంగా స్పెషల్లీ ఏబుల్డ్ పార్క్ నిర్మాణం కోసం కేటాయించిన నిధులు మళ్లించడం దివ్యాంగుల హక్కుల చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని కోర్ట్ ఆఫ్ చీఫ్ కమిషనర్ పర్సన్ విత్ డిజేబిలిటీస్, న్యూఢిల్లీ(సీసీపీడీ)కి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన కోర్టు 12.09.2025 రోజున వీడియొ కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ చేపట్టింది. డ్రాప్ చేశారట.. క్యాన్సిల్ కాదట విచారణలో భాగంగా తాము డిజేబిలిటీ పార్క్ ప్రాజెక్ట్ను డ్రాప్ చేశాం కానీ క్యాన్సిల్ చేయలేదని కొత్త స్థలం కోసం అన్వేషిస్తున్నాం అంటూ సమాధానమిచ్చారు. బల్దియా అధికారుల వివరణపై సంతృప్తి చెందని సీసీపీడీ 15 రోజుల్లో డిజేబిలిటీ పార్క్ ప్రాజెక్ట్ ప్రస్తుత స్థితిని తమకు తెలియచేయాల్సిందిగా ప్రభుత్వాన్ని, స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్లను గత ఫిబ్రవరి 25వ తేదీన ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికారులు సీసీపీడీకి ఏం సమాధానం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. -
ప్రగతి ప్రణాళికలో కలెక్టర్
కరీంనగర్ అర్బన్: ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమ అమలులో భాగంగా జిల్లా కలెక్టర్ చిత్రామిశ్రా సీఎం సదస్సుకు హాజరయ్యారు. మంగళవారం హైదరాబాద్ సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.కరీంనగర్ కార్పొరేషన్: ఆడపిల్ల పుట్టిన కుటుంబానికి తనవంతుగా భరోసా ఇచ్చారు మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన డివిజన్లో ఆడపిల్ల పుడితే ఆ కుటుంబానికి రూ.10 వేలు, ఆడపిల్ల పెళ్లికి రూ.25 వేలు అందజేస్తానని రవీందర్ సింగ్ వాగ్ధానం చేశారు. కార్పొరేటర్గా విజయం సాధించిన అనంతరం ఆడపిల్ల పెళ్లికి రూ.25 వేలు అందచేశారు. ఈ క్రమంలోనే తన డివిజన్లోని జనగామ రాజేశ్వరి దత్తాత్రేయకు మనుమరాలు పుట్టిన విషయం తెలుసుకొన్న రవీందర్ సింగ్ ఆ కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం చేశారు. మంగళవారం మాజీ కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ సోహాన్ సింగ్ ఆ కుటుంబానికి రూ.10వేలు నగదు అందజేశారు. కొత్తపల్లి (కరీంనగర్): అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడంలో ఎన్పీడీసీఎల్ కీలక పాత్ర పోషిస్తోందని కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ వి.గంగాధర్ తె లిపారు. కరీంనగర్ సర్కిల్ పరిధిలో ఇప్పటివరకు విద్యుత్ కనెక్షన్ లేని అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా కనెక్షన్లు అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 105 కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేని కేంద్రాలను గుర్తించి కనెక్షన్లు మంజూరు చేస్తున్నామన్నారు. చిన్నారుల కోసం నిర్వహించే ప్రీ–స్కూల్ కార్యకలాపాలు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య సేవలు సజావుగా సాగేందుకు దోహదపడుతుందని తెలిపారు. విద్యుత్ వెలుగులతో అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి మోటార్లు సక్రమంగా పనిచేయడంతో పిల్లలు సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యను అభ్యసించగలుగుతున్నారని పేర్కొన్నారు. -
అమ్మా.. ఆలకించండి
కరీంనగర్అర్బన్: ప్రజావాణికి బాధితుల తాకిడి ఎక్కువైంది. వచ్చిన అర్జీలే మళ్లీ మళ్లీ రాగా తమ సమస్యలకు విముక్తి కల్పించాలని కలెక్టర్ చిత్రామిశ్రాను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమానికి ఫిర్యాదుదారులు బారులు తీరగా ప్రధానంగా భూ సమస్యలే అధికం. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ‘రిక్వెస్ట్ చేసి చెబుతున్నా.. ప్రజలు ఎంతో ఆశతో ప్రజావాణికి వస్తుంటారు. పరిష్కారమయ్యే ఫిర్యాదులను పరిష్కరించాల్సిందే. పరిష్కారం కాని అర్జీకి ఇది కాదని చెప్పండి’ అంటూ అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీవాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్ అర్జీలు స్వీకరించారు. మొత్తం 345 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. ఈ సందర్భంగా పలువురిని ‘సాక్షి’ పలకరించగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వారి మాటల్లోనే..జిల్లాస్థాయిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ, జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీల గడువు ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటగా కమిటీల ఊసే లేదు. తక్షణమే కమిటీలను ఏర్పాటు చేయండి. – తెలంగాణ జిల్లాల మాదిగ అభివృద్ధి సంఘం ప్రతినిధులుమేము ఇద్దరం దివ్యాంగులం. మాకు భూమిజాగాలు లేవు. నగరంలో కిరాయికి ఉంటూ వచ్చే పింఛన్తో బతుకీడుస్తున్నాం. మా కూతురు డిగ్రీ చదివి ఖాళీగా ఉంటోంది. ఏదైనా ఉపాధి కల్పిస్తే మాకు ఆసరాగా ఉంటుంది. వారధిలో దరఖాస్తు చేస్తే ఎలాంటి సమాచారం లేదు. – మేకల చలం, విద్యానగర్, కరీంనగర్ -
సీపీ వర్సెస్ పాడి!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ పోలీసులు లక్ష్యంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మరోసారి వాగ్బాణాలు సంధించడం రాష్ట్రవ్యాప్త చర్చకు దారితీస్తోంది. ఇటీవల పోలీసు కమిషనర్ గౌస్ ఆలం లక్ష్యంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పాడి ఆ తరువాత తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాజాగా ఆయనే మరోసారి సీపీ, ఇతర పోలీసులు లక్ష్యంగా అవినీతి ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా ఓ షాపింగ్ విషయంలో పోలీసులు భారీగా ముడుపులు స్వీకరించారని, ఏసీపీ విజయ్కుమార్, మరో ఇన్స్పెక్టర్ సృజన్రెడ్డి లక్ష్యంగా బలవంతంగా డబ్బులు వసూలు చేశారని హైదరాబాద్లో పాడి పెట్టిన ప్రెస్మీట్తో కరీంనగర్ ఉలిక్కిపడింది. తన వద్ద వారి అవినీతి, అక్రమాలకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, కుటుంబ సభ్యుల కోసం పోలీసు వాహనాలను దుర్వినియోగం చేస్తున్నారని, సీఎం రేవంత్కే ఆ ఆధారాలు చూపిస్తానని, అవసరమైతే అసెంబ్లీ వేదికగా బయటపెడతానని హెచ్చరించారు. డిపార్ట్మెంట్లో ఈ వివాదం చర్చానీయాంశంగా మారింది. తమపై ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పోలీసులు మండిపడుతుంటే.. పాడి వర్గీయులు మాత్రం తమ నేత వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని పునరుద్ఘాటిస్తున్నారు. డిపార్ట్మెంట్ ఏమంటోందంటే? పాడి కౌశిక్ డిపార్ట్మెంట్పై కావాలనే కక్ష గట్టారని సీనియర్ ఆఫీసర్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల సమ్మక్క జాతర రోజు సీఐ సృజన్, సీపీ గౌస్ ఆలంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడమే ఇందుకు నిదర్శనమని గుర్తుచేస్తున్నారు. ఆరోజు ఆయన్ను నిలువరించడం, కేసులు నమోదు చేయడాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారన్నారు. కుటుంబ సభ్యులను వివాదంలోకి తీసుకురావడం తగదని హితవుపలుకుతున్నారు. వాస్తవానికి తామెవరికీ అనుకూలంగా వ్యవహరించమని, మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ సేవలందించింది తామేనని మర్చిపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను వారికి సంబంధం లేని విషయంలో ఎమ్మెల్యే ఆరోపణలు చేయడాన్ని పోలీసు సంక్షేమ సంఘం నాయకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. వెంటనే వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పాడిపై మరో కేసు! మరోవైపు సమ్మక్క జాతర సమయంలో పాడిపై కేసు నమోదు చేసిన పోలీసులు మరోసారి ఆయన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నారు. తొలుత లీగల్ ఒపినీయన్ తీసుకుని, దాని ఆధారంగా ముందుకు వెళ్లనున్నారు. పాడి వ్యాఖ్యలపై ఐపీఎస్ అధికారుల సంఘం కూడా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. గతంలో సీపీపై అభ్యంతరకర వ్యాఖ్యల సమయంలోనూ ఐపీఎస్ల సంఘం క్షమాపణకు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాడి చేసిన వ్యాఖ్యలపై త్వరలో కేసు నమోదు అయ్యే అవకాశం ఉందని ఓ సీనియర్ పోలీసు అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి అసెంబ్లీలో బయటపెడతారన్న వీడియోల్లో ఏమి ఉండి ఉంటుంది? అన్న విషయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పాడివర్గం మాత్రం పోలీసుల అక్రమాలకు సంబంధించి తమ ఎమ్మెల్యే వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. తమ నేత ఇచ్చిన గడువులోగా సీపీపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే.. అందుకు సంబంధించిన ఆధారాలు తప్పకుండా బయటపెడతారని చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీఎం రేవంత్, సీఎస్, డీజీపీల స్పందన కోసం వేచి చూస్తున్నామని, వారి స్పందన ఆధారంగా తమ నాయకుడి ప్రతిస్పందన ఉంటుందని వివరించారు. -
ఇప్పటిదాకా ఒక లెక్క... ఇకపై మరో లెక్క..
కరీంనగర్/కరీంనగర్కార్పొరేషన్: బీజేపీకి ఒక్క చా న్సిస్తే మార్పు చూపిస్తానంటూ.. మున్సిపల్ ఎన్నికల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తికి కరీంనగర్ ప్రజలు ఆ పార్టీకి మేయర్ పీఠాన్ని కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో సంజయ్ ఇచ్చిన మాటకు కట్టుబడి కరీంనగర్ కార్పొరేషన్లో ప్రక్షాళనకు నడుం బిగించారు. అలాగే ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ప్ర‘గతి’ త ప్పిన పట్టణ ప్లానింగ్’ కథనంపై స్పందించారు. మే యర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్రావుతో కలిసి సోమవారం టౌన్ప్లానింగ్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ, ఇప్పటిదాకా ఒక లెక్క. ఇకపై మరో లెక్క అని, ఇళ్ల పర్మిషన్కు డబ్బులు అడిగి బాధితులను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. పూర్తి పారదర్శకతతో పనిచేయాలని సూచించారు. పాలకవర్గం మార్పు చూపించాలి నెలరోజుల్లో మార్పు తీసుకువచ్చి కొత్త పాలకవర్గం మార్క్ చూపాల్సిందేనని సంజయ్ తెలిపారు. అనుమతి లేని నిర్మాణాలను ఆరంభంలోనే ఆపాలన్నారు. ఇంటి ముందు ఇసుక, కంకర కన్పిస్తే ఒకవైపు కార్పొరేటర్లు, ఇంకోవైపు టౌన్ ప్లానింగ్ అధికారులు వాలిపోయి బెదిరించి వసూళ్లు చేసేవారని, బీజేపీ కార్పొరేటర్లు అలాంటి వాటి జోలికి పోరని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున సీఎస్సార్ ఫండ్స్ తీసుకొచ్చి ‘అటల్ క్యాంటీన్’లను ఏర్పాటు చేసి ఆసుపత్రులు, మార్కెట్ కూడళ్లలో పేదలకు పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని కడుపునిండా పెట్టేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. -
ఇక్కడ అభయం!
అక్కడ యుద్ధం..సాక్షిప్రతినిధి,కరీంనగర్: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. అవసరమైతే ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి రప్పించే చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ స్పష్టం చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు కార్మికులు, టెక్నీషియన్లు, నర్సులు పశ్చిమాసియా దేశాల్లో పనిచేస్తుండగా, అక్కడి యుద్ధ వాతావరణం కారణంగా వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికుల కుటుంబ సభ్యులు ప్రతీరోజు ఫోన్ కాల్స్ ద్వారా పరిస్థితిని తెలుసుకుంటున్నారు. వివిధ రంగాల్లో ఉమ్మడి జిల్లావాసులు ఇజ్రాయెల్– ఇరాన్ సరిహద్దు ఉద్రిక్తతలు, అలాగే కొన్ని గల్ఫ్ దేశాల్లో భద్రతా హెచ్చరికలు జారీ కావడంతో అక్కడి పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఉమ్మడి జిల్లా నుంచి వెళ్లిన కొందరు యువకులు నిర్మాణ రంగంలో, మరికొందరు ఆసుపత్రుల్లో, వివిధ కంపెనీలతో పాటు గృహాల్లో సేవలందిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎవరికీ ప్రాణాపాయం లేదని, అందరూ సురక్షితంగానే ఉన్నారని కుటుంబ సభ్యులకు సమాచారం అందినట్లు తెలిసింది. ఏఐ వీడియోలపై అప్రమత్తత సోషల్ మీడియాలో యుద్ధానికి సంబంధించిన పేరుతో కొన్ని ఏఐ రూపొందించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఏఐ వీడియోలను చూసి గల్ఫ్దేశాల్లో ఉండే కార్మికుల, ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. అయితే ఏఐ వీడియోలను నమ్మి భయపడవద్దని అధికారులు సూచిస్తున్నారు. అధికారిక సమాచారం కోసం భారత రాయబార కార్యాలయాలు, విదేశాంగ శాఖ విడుదల చేసే ప్రకటనలనే అనుసరించాలని సూచించారు. కాగా గల్ఫ్లో ఉన్న వారు సైతం సోషల్ వదంతులు నమ్మవద్దని తాము క్షేమంగానే ఉన్నామంటూ వీడియోలు పోస్టుచేస్తుండడం కుటుంబ సభ్యులకు కొంత ఉపశమనం కలుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో ఇప్పటికే నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. అవసరమైన సమన్వయం, సహాయం అందించేందుకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది. అమెరికా–ఇజ్రాయిల్–ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులను ఇండియాకు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దుబాయి, ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియాలో నివసిస్తున్న వారు రోడ్డు మార్గం ద్వారా మస్కట్ చేరి అక్కడి నుంచి భారత్కు తిరిగి రావచ్చు. ఒమన్ ప్రవేశానికి ముందస్తు విజిట్/ఈ–వీసా తప్పనిసరి. అమెరికా, యూకే, కెనడా, జపాన్ లేదా షెంగెన్ వీసా ఉన్నవారికి ఆన్–అరైవల్ వీసా సదుపాయం ఉంది. పాస్పోర్ట్ కనీసం ఆరునెలలు చెల్లుబాటు కావాలి. సమాచారం కోసం మస్కట్లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలి. – బండి సంజయ్కుమార్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి వందన బరువా: +91 9871999044, సీహెచ్ చక్రవర్తి: +91 9958322143జావేద్ హుస్సేన్: +91 9910014749, రక్షిత్ నాయక్: +91 9643723157 -
మాజీ స్పీకర్కు నివాళి
కరీంనగర్అర్బన్/కరీంనగర్క్రైం: మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు జయంతిని సోమవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో శ్రీపాదరావు చిత్రపటానికి కలెక్టర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్దేశాయ్, పలువురు అధికారులు నివాళి అర్పించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శ్రీపాదరావు చిత్రపటానికి సీపీ గౌస్ ఆలం పూలమాల వేసి నివాళి అర్పించారు. ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.హోలీ శాంతియుతంగా జరుపుకోవాలికరీంనగర్క్రైం: రంగుల పండుగ హోలీ సోదరభావానికి ప్రతీక అని, ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సీపీ గౌస్ ఆలం విజ్ఞప్తి చేశారు. సహజసిద్ధమైన రంగులు వాడాలని, ఇతరుల అనుమతి లేకుండా వారిపై రంగులు చల్లడం నేరమన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం పూర్తిగా నిషేధమని, ట్రిపుల్ రైడింగ్, అతి వేగం, స్టంట్లు చేసేవారి వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. హోలీ సాకుతో ఈవ్జింగ్ లేదా మహిళలను వేధించే వారిపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని, అనుమతి లేకుండా డీజే సౌండ్ సిస్టమ్స్ వాడకూడదన్నారు. సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసినా, మతపరమైన ఉద్రిక్తతలు పెంచే పోస్టులు పెట్టినా చట్ట ప్రకారం కఠిన శిక్షలు తప్పవని స్పష్టం చేశారు. నేడు ఆలయాల మూసివేతకరీంనగర్కల్చరల్: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉమ్మడి కరీంనగర్లోని దేవాదాయ, ధర్మాదాయశాఖ పరిధిలోని పలు ఆలయాలను మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు మూసివేయనున్నట్లు ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ సుప్రియ తెలిపారు. సాయంత్రం 7 గంటల తర్వాత ఆలయాల సంప్రోక్షణ తర్వాత పూజలు జరుగుతాయని, బుధవారం నుంచి భక్తుల ధర్శనాలకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. పత్తి మార్కెట్కు సెలవుజమ్మికుంట: జమ్మికుంట మార్కెట్లో సోమవారం క్వింటాల్ పత్తి గరిష్ట ధర రూ.7,600 పలికింది. కాగా మంగళవారం హోలీ పండుగ సందర్భంగా మార్కెట్కు సెలవు ఉంటుందని, బుధవారం క్రయవిక్రయాలు జరుగుతాయని మార్కెట్ చైర్పర్సన్ పూల్లూరి స్వప్నసదానందం, ఇన్చార్జి కార్యదర్శి రాజా తెలిపారు. విద్యుత్ వ్యవస్థ రక్షణకు ‘లైట్నింగ్ అరెస్టర్’ కొత్తపల్లి(కరీంనగర్): వర్షాకాలంలో మెరుపులు, పిడుగుల కారణంగా విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లకు నష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ ఎస్ఈ గంగాధర్ తెలిపారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను రక్షించేందుకు కీలక ప్రాంతాల్లో లైట్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 133 చోట్ల లైట్నింగ్ అరెస్టర్లు పెట్టామని, లైట్నింగ్ అరెస్టర్ అనేది మెరుపు, పిడుగు వల్ల ఉత్పన్నమయ్యే అధిక వోల్టేజ్ను భూమిలోకి సురక్షితంగా మళ్లించే రక్షణ పరికరం అని వివరించారు. మెరుపు కారణంగా కలిగే బ్రేక్డౌన్లు తగ్గే అవకాశం ఉందన్నారు. వినియోగదారులు వర్షాకాలంలో ఇంటి విద్యుత్ పరికరాలకు సర్జ్ ప్రొటెక్టర్లు వినియోగించడం, అనవసరంగా విద్యుత్ పరికరాలను తాకకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
ఇప్పుడే పెళ్లొద్దమ్మా.. నేను ఇంకా చదువుకుంటా
జగిత్యాలక్రైం: పెళ్లి ఇష్టంలేక మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల పట్టణంలోని పోచమ్మవాడలో చోటుచేసుకుంది. స్థానికుల కథ నం ప్రకారం.. పోచమ్మవాడకు చెందిన ములస్తం గణేశ్, పుష్పలత దంపతులకు కూతురు, ఇద్దరు కుమారులున్నారు. కూతురు ప్రణవి (25) వరంగల్లో గతేడాది ఇంజినీరింగ్ పూర్తిచేసింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. కానీ.. కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈనెల 5న పెళ్లిచూపులు ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు గోదావరిలో స్నానానికని సోమవారం ధర్మపురి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ప్రణవి తన స్టడీ రూమ్లో ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. కుటుంబసభ్యులు కొనఊపిరితో ఉన్న ఆమెను కిందకు దింపారు. 108కు సమాచారం అందించగా.. వారు స్పందించలేదు. కారులో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి సిబ్బంది స్ట్రెచర్ తీసుకురావడంలో ఆలస్యం చేశారు. బంధువులే ఆమెను చేతులపై ఎత్తుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే పరిస్థితి విషమించి మృతిచెందింది. 108 సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే ప్రణవి మృతిచెందిందని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతురాలి తండ్రి గణేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సదాకర్ తెలిపారు. -
సీపీ వర్సెస్ పాడి!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ పోలీసులు లక్ష్యంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మరోసారి వాగ్బాణాలు సంధించడం రాష్ట్రవ్యాప్త చర్చకు దారితీస్తోంది. ఇటీవల పోలీసు కమిషనర్ గౌస్ ఆలం లక్ష్యంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పాడి ఆ తరువాత తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాజాగా ఆయనే మరోసారి సీపీ, ఇతర పోలీసులు లక్ష్యంగా అవినీతి ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా ఓ షాపింగ్ విషయంలో పోలీసులు భారీగా ముడుపులు స్వీకరించారని, ఏసీపీ విజయ్కుమార్, మరో ఇన్స్పెక్టర్ సృజన్రెడ్డి లక్ష్యంగా బలవంతంగా డబ్బులు వసూలు చేశారని హైదరాబాద్లో పాడి పెట్టిన ప్రెస్మీట్తో కరీంనగర్ ఉలిక్కిపడింది. తన వద్ద వారి అవినీతి, అక్రమాలకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, కుటుంబ సభ్యుల కోసం పోలీసు వాహనాలను దుర్వినియోగం చేస్తున్నారని, సీఎం రేవంత్కే ఆ ఆధారాలు చూపిస్తానని, అవసరమైతే అసెంబ్లీ వేదికగా బయటపెడతానని హెచ్చరించారు. డిపార్ట్మెంట్లో ఈ వివాదం చర్చానీయాంశంగా మారింది. తమపై ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పోలీసులు మండిపడుతుంటే.. పాడి వర్గీయులు మాత్రం తమ నేత వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని పునరుద్ఘాటిస్తున్నారు.డిపార్ట్మెంట్ ఏమంటోందంటే?పాడి కౌశిక్ డిపార్ట్మెంట్పై కావాలనే కక్ష గట్టారని సీనియర్ ఆఫీసర్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల సమ్మక్క జాతర రోజు సీఐ సృజన్, సీపీ గౌస్ ఆలంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడమే ఇందుకు నిదర్శనమని గుర్తుచేస్తున్నారు. ఆరోజు ఆయన్ను నిలువరించడం, కేసులు నమోదు చేయడాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారన్నారు. కుటుంబ సభ్యులను వివాదంలోకి తీసుకురావడం తగదని హితవుపలుకుతున్నారు. వాస్తవానికి తామెవరికీ అనుకూలంగా వ్యవహరించమని, మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ సేవలందించింది తామేనని మర్చిపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను వారికి సంబంధం లేని విషయంలో ఎమ్మెల్యే ఆరోపణలు చేయడాన్ని పోలీసు సంక్షేమ సంఘం నాయకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. వెంటనే వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.పాడిపై మరో కేసు!మరోవైపు సమ్మక్క జాతర సమయంలో పాడిపై కేసు నమోదు చేసిన పోలీసులు మరోసారి ఆయన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నారు. తొలుత లీగల్ ఒపినీయన్ తీసుకుని, దాని ఆధారంగా ముందుకు వెళ్లనున్నారు. పాడి వ్యాఖ్యలపై ఐపీఎస్ అధికారుల సంఘం కూడా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. గతంలో సీపీపై అభ్యంతరకర వ్యాఖ్యల సమయంలోనూ ఐపీఎస్ల సంఘం క్షమాపణకు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాడి చేసిన వ్యాఖ్యలపై త్వరలో కేసు నమోదు అయ్యే అవకాశం ఉందని ఓ సీనియర్ పోలీసు అధికారి ‘సాక్షి’కి తెలిపారు. వీడియోల్లో ఏముంది?ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి అసెంబ్లీలో బయటపెడతారన్న వీడియోల్లో ఏమి ఉండి ఉంటుంది? అన్న విషయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పాడివర్గం మాత్రం పోలీసుల అక్రమాలకు సంబంధించి తమ ఎమ్మెల్యే వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. తమ నేత ఇచ్చిన గడువులోగా సీపీపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే.. అందుకు సంబంధించిన ఆధారాలు తప్పకుండా బయటపెడతారని చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీఎం రేవంత్, సీఎస్, డీజీపీల స్పందన కోసం వేచి చూస్తున్నామని, వారి స్పందన ఆధారంగా తమ నాయకుడి ప్రతిస్పందన ఉంటుందని వివరించారు. -
హుజూరాబాద్ కుర్రాడు.. ఇక వెండితెర హీరో
హుజూరాబాద్: చిన్నప్పటి నుంచి వెండితెరపై మెరవాలన్నది ఆ యువకుడి కల. సినిమా రంగంపై ఉన్న మక్కువ, పట్టుదలతో శ్రమించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు హుజూరాబాద్ పట్టణం విద్యానగర్కు చెందిన రాధారపు ప్రశాంత్. తాజాగా ఆయన హీరోగా నటించిన రవం చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో విడుదలకు సిద్ధమైంది. సైదాపూర్ మండలం జాగిరిపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ చిన్నతనం నుంచే సినిమాలపై ఎంతో ఆసక్తిని కనబరిచేవాడు. ఎలాగైనా నటుడిగా రాణించాలనే దృఢ సంక ల్పంతో ప్రయత్నాలు మొదలెట్టి చివరకు పాడాల తారక రామారావు నిర్మిస్తున్న రవం చిత్రంలో హీరోగా అవకాశం దక్కించుకున్నాడు. రామ్ మన్నార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా ప్రశాంత్ తన నటనా ప్రతిభను చాటుకోనున్నాడు. సంబరాలు.. ఈనెల 6న రవం చిత్రం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో.. హుజూరాబాద్లో పండుగ వాతావరణం నెలకొంది. తమ ప్రాంతానికి చెందిన యువకుడు హీరోగా పరిచయమవుతుండడంతో.. ప్రశాంత్ స్నేహితులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన కందునూ రి రాజకుమార్(32) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. కొంతకాలంగా భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురై మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో ఆదివారం రాత్రి మద్యం తాగి వచ్చి ఇంట్లోకి వెళ్లాడు. తల్లి మల్లీ శ్వరి సోమవారం చూసేసరికి ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని చనిపోయి కనిపించాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. చెంజర్లలో యువకుడు..మానకొండూర్: చెంజర్లలో ఓ కంపెనీలో పని చేస్తున్న బిహార్ రాష్ట్రానికి చెందిన వలస కా ర్మికుడు రవీంద్రకుమార్ ఆత్మహత్య చేసుకున్న ట్లు ఎస్సై సాయికృష్ణ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. రవీంద్రకుమార్(30) ఇటీవల బిహార్లో పెళ్లయింది. అప్పులయ్యాయి. అప్పు తీర్చేందుకు కొద్ది రోజులుగా చెంజర్లలోని నేషనల్ హైవే కంపెనీలో పని చేస్తున్నాడు. ఇంటికొస్తానని కుటుంబ సభ్యులకు తెలపగా.. అప్పులు బాగా ఉన్నాయి.. కొద్ది రోజులు పని చేసిన తర్వాత రావాలని కుటుంబ సభ్యులన్నారు. దీంతో మనస్తాపానికి గురై చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆస్పత్రికి వచ్చి బస్టాండ్లో గుండెపోటుతో మృతిజగిత్యాలక్రైం: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్య క్తి ఆస్పత్రిలో చికిత్స చే యించుకుని ఇంటికెళ్లే క్ర మంలో ఆర్టీసీ బస్టాండ్లో నే గుండెపోటుతో మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన కాశవత్తుల గంగారాం (58) సోమవారం ఉద యం తన భార్యతో కలిసి వైద్య పరీక్షల కోసం జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చాడు. చికిత్స పూర్తయిన తర్వాత ఇంటికెళ్లేందుకు తి రిగి బస్టాండ్కు చేరుకున్నాడు. బస్సు కోసం వేచి చూస్తూనే గుండెపోటుకు గురయ్యాడు. అతని భార్య గమనించి ఆర్టీసీ సిబ్బందికి చెప్పడంతో వారు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. 108 సిబ్బంది చేరుకుని మృతిచెందినట్లు నిర్ధారించారు. కళ్లముందే భర్త మృతిచెందడంతో అతని భార్య రోధించిన తీరు ప్రయాణికులను కలిచివేసింది. గంగారాం మృతదేహాన్ని మల్లాపూర్కు తరలించారు. కాలువలో మహిళ శవంజూలపల్లి(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని శ్రీరాంసాగర్ డీ–83 కాకతీయ ప్రధాన కాలువలో సోమవారం మహిళ శవం కొట్టుకు వచ్చింది. ఎస్సై సనత్కుమార్ కథనం ప్రకారం.. కుమ్మరికుంట సమీప డీ–83 ప్రధా న కాలువలో 9వ మైల్ వద్ద గలజల విద్యుత్కేంద్రం సమీపంలో మహిళశవం కనిపించిందని పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై.. మృతురాలి వయసు దాదాపు 38ఏళ్ల వరకు ఉంటుందని, ఒంటిపై ఎరుపు రంగు జాకెట్ ఉందని, కాళ్లకు పట్టీలు ధరించి ఉన్నాయని వివరించారు. బంధువులు ఎవరైనా ఉంటే పోలీస్స్టేషన్లో సంప్రదించాలని ఎస్సై సూచించారు. -
బ్రహ్మపుష్కరిణికి ఉత్సవ శోభ
ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మపుష్కరిణి బ్రహ్మోత్సవాల శోభ సంతరించుకుంది. స్వామివారి తెప్పోత్సవం, డోలోత్సవం కార్యక్రమాలను మూడురోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం కోనేరును ఫైరింజన్ సాయంతో శుభ్రం చేసి ఉత్సవాలకు సిద్ధం చేశారు. చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 6 నుంచి 7గంటల వరకు మాత్రమే డోలోత్సవం నిర్వహిస్తారు. అనంతరం ఆలయాలను మూసివేస్తారు. 4న సాయంత్రం 5 గంటల నుంచి ఉగ్ర నృసింహస్వామికి, 5న శ్రీవేంకటేశ్వరస్వామికి తెప్పొత్సవం, డోలోత్సవం నిర్వహిస్తారు. తెప్పోత్సవం సందర్భంగా బ్రహ్మపుష్కరిణిలో స్వామివారిని హంస వాహనంపై ఊరేగిస్తారు. డోలోత్సవంలో భాగంగా స్వామివారిని బోయలతో కోనేరు మధ్యలో ఉన్న భోగమండపంలోకి తీసుకెళ్లి ఊయలపై ఆశీనుల చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. -
టేకు దుంగల పట్టివేత
కొడిమ్యాల: కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ పరిధిలో టేకు చెట్లను నరికి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఒడ్యాడ్ ఫారెస్ట్ బీట్లో ఇద్దరు వ్యక్తులు రెండు బైక్లపై వచ్చి టేకు చెట్లను నరికి 8 దుంగలను తరలించేందుకు సిద్ధమయ్యారు. ఫారెస్ట్ అధికారులు తనిఖీలు చేస్తుండగా తారసపడ్డారు. స్వామి అనే వ్యక్తిని పట్టుకున్నాడు. మరో వ్యక్తి పరారయ్యాడు. రెండు బైక్లు, టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సోమవారం కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. నిందితుల తరఫున స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా పెద్ద మొత్తంలో బేరసారాలు జరిగినట్లు సమాచారం. కుదరకపోవడంతోనే కేసు నమోదు చేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఎఫ్ఆర్వోను వివరణ కోరగా చట్టప్రకారం చర్యలు తీసుకున్నామని తెలిపారు. -
సూరమ్మ ప్రాజెక్టు ప్రాంతంలో పులి సంచారం
కథలాపూర్: కథలాపూర్ మండలం కలిగోట శివారు సూరమ్మ ప్రాజెక్టు సమీపంలో పులి సంచరించినట్లు పాదముద్రలు కనిపించా యని మెట్పల్లి ఎఫ్ఆర్వో పద్మారావు తెలి పారు. పులి సంచరించినట్లు రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా సో మవారం ఆయా ప్రాంతాల్లో అధికారులు ప రిశీలించారు. పాదముద్రల ఆధారంగా పులేనని నిర్ధారించారు. పశువుల కాపరులు అట వీ ప్రాంతాలకు పశువులను తీసుకెళ్లవద్దన్నారు. రాత్రివేళల్లో ప్రజలు ఒంటరిగా అటవీప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. ఎఫ్ఆర్వో వెంట డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సురేశ్కుమార్, సెక్షన్ ఆఫీసర్ ముస్తాక్ ఆలీ ఉన్నారు. పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు -
ఒలింపిక్ కలలకు పునాది..
సీఎం కప్ వంటి పోటీలు ఒలింపిక్ కలలకు పునాది వేస్తాయి. గ్రామీణ స్థాయి నుంచి ఒలింపిక్ లక్ష్యాల దిశగా క్రీడాకారులను ముందుకు నడిపించే గొప్ప వేదిక. ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాకారుల ప్రతిభ రాష్ట్రస్థాయిలో మెరవడం అభినందనీయం. – గసిరెడ్డి జనార్దన్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి వుషు క్రీడలో రజత పతకం సాధించా. త్రుటిలో బంగారు పతకం చేజారింది. పోయినసారి కూడా పాల్గొన్నా. కాని పతకం సాధించలేదు. ఈసారి సిల్వర్ సాధించా. వచ్చే సీఎం కప్లో గోల్డ్ కొడతా. పతకం సాధించేలా తీర్చిదిద్దిన కోచ్లకు కృతజ్ఞతలు. – ప్రణయ్, రజత పతక విజేత -
గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నవారిని వెనక్కి రప్పించండి
కరీంనగర్టౌన్: గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడికి సందర్శన నిమిత్తం వెళ్లి చిక్కుకున్నవారిని స్వదేశానికి రప్పించేందుకు చొరవచూపాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ని సోమవారం పీఆర్టీయూ నాయకులు కోరారు. జిల్లాకు చెందిన ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు, సాధారణ ప్రజలను సైతం వెనక్కి రప్పించడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అలాగే 2010 సంవత్సరం కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు లభించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రిని కలిసిన వారిలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కేతిరి తిరుపతిరెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చొల్లేటి శ్రీనివాస్, జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నరకుల్ల శ్రీధర్ తదితరులు ఉన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కి పీఆర్టీయూ వినతి -
మద్యపానంపై మొట్లపల్లివాసుల సమరం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మహాత్మాగాంధీ స్ఫూర్తితో మద్యం విక్రయాలపై మొట్లపల్లి గ్రామస్తులు నిషేధం విధించారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్, పాలకవర్గం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. తొలుత బెల్ట్షాపులు నిర్వహించవద్దని సర్పంచ్ తులా మనోహర్రావు అధ్యక్షతన ఈనెల ఒకటో తేదీన పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటైన సమావేశంలో పాలకవర్టం నిర్ణయించింది. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతూ, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని, అరాచకాలు, ఘర్షణలకు దారితీస్తోందని, పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని సమావేశం అభిప్రాయపడింది. ముఖ్యంగా కాలేయం, ఊపిరితిత్తులు చెడిపోయి అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నారని, ఆర్థికంగా చితికిపోతున్నారని పేర్కొంది. -
పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: పెళ్లి ఇష్టంలేక మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల పట్టణంలోని పోచమ్మవాడలో చోటుచేసుకుంది. స్థానికుల కథ నం ప్రకారం.. పోచమ్మవాడకు చెందిన ములస్తం గణేశ్, పుష్పలత దంపతులకు కూతురు, ఇద్దరు కుమారులున్నారు. కూతురు ప్రణవి (25) వరంగల్లో గతేడాది ఇంజినీరింగ్ పూర్తిచేసింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. కానీ.. కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈనెల 5న పెళ్లిచూపులు ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు గోదావరిలో స్నానానికని సోమవారం ధర్మపురి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ప్రణవి తన స్టడీ రూమ్లో ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. కుటుంబసభ్యులు కొనఊపిరితో ఉన్న ఆమెను కిందకు దింపారు. 108కు సమాచారం అందించగా.. వారు స్పందించలేదు. కారులో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి సిబ్బంది స్ట్రెచర్ తీసుకురావడంలో ఆలస్యం చేశారు. బంధువులే ఆమెను చేతులపై ఎత్తుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే పరిస్థితి విషమించి మృతిచెందింది. 108 సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే ప్రణవి మృతిచెందిందని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతురాలి తండ్రి గణేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సదాకర్ తెలిపారు. జగిత్యాల పోచమ్మవాడలో విషాదం ఆస్పత్రిలో సిబ్బంది పనితీరుపై ఆగ్రహం -
సీఎం కప్లో ఉమ్మడి జిల్లా సత్తా
కరీంనగర్స్పోర్ట్స్: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన సీఎం కప్ క్రీడాపోటీలు రాష్ట్రవ్యాప్తంగా క్రీడాస్ఫూర్తిని రగిలించాయి. యువతలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన ఈ పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన వేలాది మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో పాల్గొని తమ ప్రతిభ చాటుకున్నారు. అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, జూడో, వుషూ, స్విమ్మింగ్, కిక్ బాక్సింగ్, తైక్వాండో, కరాటే తదితర క్రీడల్లో యువ క్రీడాకారులు పతకాలు సాధించి ఆయా జిల్లాలకు గౌరవం తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు పట్టుదలతో పోటీ పడుతూ బంగారు, రజత, కాంస్య పతకాలను కై వసం చేసుకున్నారు. సరైన శిక్షణ, అవకాశాలు లభిస్తే గ్రామీణ యువత కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని ఈ విజయాలు నిరూపించాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సాధించిన పతకాలు కేవలం విజయాల సంఖ్య కాదు.. అది గ్రామీణ యువత సంకల్పానికి ప్రతీక. సీఎం కప్ వేదికగా వెలుగులోకి వచ్చిన ఈ ప్రతిభ రాబోయే రోజుల్లో రాష్ట్రానికి, దేశానికి మరింత కీర్తి తేవాలని ఆశిద్దాం. ఈ సందర్బంగా సాక్షి ప్రత్యేక కథనం. జిమ్నాస్టిక్స్ రాష్ట్ర పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు పతకాలు ప్రదానం సీఎం కప్ పోటీల్లో భాగంగా కరీంనగర్ జిల్లా రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలకు ఆతిథ్యమిచ్చి ఇతర జిల్లాలకు స్ఫూర్తిగా నిలిచింది. తొలి సీఎం కప్లో జూడో పోటీలను అట్టహాసంగా నిర్వహించిన జిల్లా క్రీడాశాఖ సెకండ్ ఎడిషనలో జిమ్నాస్టిక్స్ పోటీలను ఘనంగా నిర్వహించి శభాష్ అనిపించుకుంది. ఈ పోటీలకు 18 జిల్లాల నుంచి సుమారు 250 మంది క్రీడాకారులు హాజరు కాగా.. సుమారు 70కి పైగా పతకాల పోరు సాగింది. పసిడి పతకాలతో మెరిసిన క్రీడాకారులు 53 పతకాలతో కరీంనగర్ హవా మెరుగైన పతకాలు సాధించిన పెద్దపల్లి, జగిత్యాల 2 పతకాలతో సరిపెట్టుకున్న రాజన్న సిరిసిల్ల -
ప్రతిభకు వేదిక
సీఎం కప్ పోటీలు గ్రామీణ ప్రతిభకు అద్భుత వేదికగా నిలిచాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన క్రీడాకారులు కష్టపడి సాధించిన పతకాలు జిల్లా క్రీడా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. భవిష్యత్తులో మరింత మెరుగైన శిక్షణా సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తాం. – వి.శ్రీనివాస్గౌడ్, డీవైఎస్వో, కరీంనగర్ సీఎం కప్ ద్వారా ప్రతిభను గుర్తించి ముందుకు తీసుకురావడం మా ప్రధాన లక్ష్యం. జిల్లా సాధించిన పతకాలు ఇతర జిల్లాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. భవిష్యత్తులో జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తాం. క్రీడాకారుల క్రమశిక్షణ, పట్టుదల, తల్లిదండ్రుల సహకారం కలిసి ఈ ఫలితాలు అందించాయి. – రవికుమార్, డీవైఎస్వో, జగిత్యాల గ్రామీణ యువతలో అపారమైన ప్రతిభ ఉంది. సరైన ప్రోత్సాహం లభిస్తే వారు అద్భుతాలు చేయగలరని సీఎం కప్ పోటీలు మరోసారి నిరూపించాయి. ఈ విజయాలను నిలబెట్టుకునేలా నిరంతర ప్రోత్సాహం అందిస్తాం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు రాష్ట్ర స్థాయిలో మెరవడం గర్వకారణం. – ఎ.సురేశ్కుమార్, డీవైఎస్వో, పెద్దపల్లి పతకం సాధించడం ఆనందంగా ఉంది. సీఎం కప్ పోటీలు మంచి అనుభవాన్నిచ్చాయి. ప్రతిసారి సాధనలో మరింత మెరుగుపడాలని నేర్చుకున్నా. ఇకపై జాతీయ స్థాయిలో రాణించడం లక్ష్యం. ఇదే స్ఫూర్తితో జాతీయ పోటీల్లో బంగారు పతకం సాధిస్తా. – డి.వైష్ణవి, బంగారు పతక విజేత -
అక్కడ దాడులు.. ఇక్కడ గుబులు
జగిత్యాలక్రైం: గల్ఫ్ దేశాలైన ఖతర్, బహ్రెయిన్, దుబాయ్, అబుదాబిలోని అమెరికా సైనిక స్థావరా లే టార్గెట్గా ఇరాన్ శనివారం మిసైల్ రాకెట్లతో మెరుపుదాడులు చేస్తున్న విషయం తెల్సిందే. దీంతో ఉమ్మడి కరీంనగర్ నుంచి వలసవెళ్లిన సుమారు రెండులక్షల మంది భయం గుప్పిట్లో వణుకుతున్నారు. అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తమై కార్మి కులను క్యాంప్ కార్యాలయాలకు తరలించాయి. ఖతర్లో 15 నిమిషాలకోసారి బాంబుల వర్షం కురుస్తున్నట్లు అక్కడి నుంచి కార్మికులు చెబుతున్నారు. బహ్రెయిన్లోనూ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి దాడులు జరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రజలను అప్రమత్తం చేసి పనులు నిలిపివేసి కార్మికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దుబాయ్లోని మరీన వద్ద మిసైల్ దా డిని అక్కడి ప్రభుత్వం అడ్డుకుని గాలిలోనే పేల్చేసింది. పొట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వలసవెళ్లిన వారి ఇక్కడి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. దాడుల నేపథ్యంలో ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. విమానాశ్రయాల మూసివేతఇరాన్ దాడుల నేపథ్యంలో గల్ఫ్దేశాలు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం నుంచే విమానాశ్రయాలు మూసివేశాయి. ఖతర్, బహ్రెయిన్లోని ప్రధాన ఎయిర్పోర్టులను మూసివేయడంతోపాటు, విమాన రాకపోకలను రద్దు చేశారు.మెరుపుదాడులు చేస్తున్నారుదోహఖతర్లో వైమానిక స్థా వరాలను టార్గెట్గా చేసుకు ని ఇరాన్ శనివారం మధ్యాహ్నం నుంచి మెరుపుదాడులు చేస్తున్నారు. ఇక్కడి ప్రభుత్వం అప్రమత్తమై కార్మికులందరినీ పనులు రద్దు చేసి క్యాంప్లకు తరలించింది. మెరుపుదాడులతో తెలంగాణ కార్మికులంతా భయంభయంగా గడుపుతున్నాం. – జీవన్రెడ్డి, దోహఖతర్విమానాశ్రయాలు మూసివేశారుదుబాయ్లో ఇరాన్ దాడులు చేస్తుండటంతో ఇక్కడి ప్రభుత్వం కొన్ని క్షిపణిలను గాలిలోనే పేల్చివేసింది. మరికొన్ని క్షిపణిలు పేలడంతో ప్రజలంతా భయాందోళన చెందుతున్నారు. దుబాయ్లోని ప్రధాన విమానాశ్రయాలను ప్రభుత్వం ముందస్తుగా మూసివేసింది. – ముకేశ్, దుబాయ్కార్మికుల్లో ఆందోళనదాడులు జరుగుతుండడంతో తెలంగాణ కార్మికులమంతా ఆందోళన చెందుతున్నాం. ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తుండటంతో ఇక్కడి ప్రభుత్వం ధీటుగా క్షిపణులను గాలిలో పేల్చేస్తూ ప్రమాదం జరగకుండా చర్యలు చేపడుతోంది. – గంగాధర్, దుబాయ్ -
సూర్యుడు సుర్రు..
వేసవి బిజినెస్ షురూ..వేసవికాలం ప్రారంభం అవుతోంది. ఎండలు ముదురుతున్నాయి. దీంతో వ్యాపారులు సీజనల్ వ్యాపారం కోసం ముందుచూపుతో ఆలోచిస్తున్నారు. వేసవిలో ఎక్కువగా అమ్ముడుపోయే కొబ్బరి బొండాలు, ఖర్బూజా, పుచ్చకాలు దిగుమతి చేసుకుంటున్నారు. ఇతర రా ష్ట్రాల నుంచి లారీల్లో స్టాక్ వస్తుండగా.. గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. ఈ సారి ఎండలు ఎక్కువ ఉండే అవకాశం ఉండడంతో వ్యాపారం బాగా జరుగుతుందని ఆ శాభావం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని టవర్సర్కిల్, తెలంగాణ చౌక్, మంకమ్మతోట, ఎస్సారార్ కళాశాలతో పాటు ప్రధాన కూడళ్లలో విక్రయించేందుకు వ్యాపారులు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
దేవుడా.. మేమేం పాపం చేశాం..
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఆ దంపతులకు ముగ్గురు కుమారులు. వారిని చూసి తమకు కొండంత అండగా ఉంటారని మురిసిపోయారు. కానీ.. వారి కుటుంబాన్ని విధి వెక్కిరించింది. చేతికందిన ఇద్దరు కొడుకులు ఇరవై ఏళ్ల క్రితం వేర్వేరు కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆ తల్లిదండ్రులు ధైర్యం కోల్పోయారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకును కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. విధి మరోసారి ఆ కుటుంబాన్ని వెక్కిరించింది. ఉన్న ఆ ఒక్కగానొక్క కొడుకు కూడా గడ్డిమందు తాగి చనిపోవడంతో ‘దేవుడా మేమేం పాపం చేశాం.. మాకే ఎందుకీ పుత్రశోకం’ అంటూ గండెలవిసేలా రోదిస్తున్నారు. గ్రామస్తులు, పోలీసుల వివరాలు.. కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామ పంచాయతీ పరిధి జగ్గయ్యపల్లె గ్రామానికి చెందిన రెడ్డి రాంరెడ్డి, సుశీల దంపతులకు ముగ్గురు కుమారులు మహేందర్రెడ్డి, మధుకర్రెడ్డి, మధుసూదన్రెడ్డి(39). ఇటీవల ట్రాక్టర్ కొనివ్వాలని తండ్రిని మధుసూదన్రెడ్డి అడిగాడు. ఇంటికోసం చేసిన అప్పులు తీరలేదు. ఇప్పుడే ట్రాక్టర్ వద్దని తండ్రి వారించాడు. మనస్తాపానికి గురైన మధుసూదన్రెడ్డి గత నెల 25న గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతుడికి భార్య పావని, కూతురు, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్ పేర్కొన్నారు. తల్లిదండ్రులకు పుత్రశోకం వరంగల్ జిల్లా పరకాల సమీపంలోని కంఠాత్మకూర్ నుంచి రాంరెడ్డి చాలా ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం ఆదిలాబాద్ జిల్లా కౌటాలకు వలస వెళ్లాడు. అక్కడ భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. సుమారు ఇరవై ఏళ్ల క్రితం ఇంటర్ ఫెయిల్ అయినందుకు పెద్ద కుమారుడు మహేందర్రెడ్డి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత రెండో కుమారుడు మధుకర్రెడ్డి ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లి క్యాన్సిల్ కావడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. రెండు ఘటనలతో మనస్తాపానికి గురైన రాంరెడ్డి దంపతులు చిన్న కుమారుడు మధుసూదన్రెడ్డి అత్తగారిల్లయిన జగ్గయ్యపల్లెకు వచ్చారు. ఈనేపథ్యంలో తమకు ఆసరా ఉన్నాడని కొండంత ధైర్యంతో ఉన్న రాంరెడ్డి దంపతులకు చిన్న కొడుకు ఆత్మహత్యతో వారి రోదనలు మిన్నంటాయి. ‘ఈ పుత్ర శోకం మాకెందుకు ఇచ్చావు దేవుడా’ అంటూ ఆ వృద్ధ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. పోస్టుమార్టం అనంతరం ఆదివారం సాయంత్రం మధుసూదన్రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. ట్రాక్టర్ కొనొద్దని తండ్రి వారించినందుకు.. గడ్డిమందు తాగి అఘాయిత్యం కన్నవారికి కడుపు కోత.. భార్యాపిల్లలకు తీరని వ్యథ ఆ ఇంట్లో ముగ్గురూ బలవన్మరణం -
గొర్రెలకు సీసీ కెమెరా కాపలా
● దొంగల బెడదకు చెక్ ● వలసబాటలో ప్రయోగాలు సిరిసిల్ల: గొర్రెల మందలను దొంగల నుంచి రక్షించుకునేందుకు కాపరులు టెక్నాలజీని ఆశ్రయించారు. అనుభవాలే అన్ని నేర్పిస్తాయనేందుకు వీరే చక్కటి నిదర్శనం. పొద్దాంత మంద వద్ద ఉండే కాపరులకు రాత్రి వేళ వాటిని కాపాడుకోవడం సవాల్గా మారింది. రాత్రయితే పొలాల వద్ద మంద పెట్టే కాపరులకు దొంగల బెడద ప్రధాన సమస్యగా మారింది. ఒకప్పుడు పొలాల వద్ద మందపెట్టి ఇంటి వద్ద నిశ్చింతగా నిద్రపోయేవారు. కానీ ఇటీవల రాజన్నసిరిసిల్ల జిల్లాలో దొంగల బెడద తీవ్రం కావడంతో సీసీ కెమెరాలతో రక్షణను ఏర్పాటు చేస్తున్నారు. పెద్దగా చదువు రాకపోయినా రక్షణగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వలసబాటలో రక్షణ ఏర్పాట్లు కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన సందల్ల దేవయ్య, బీరయ్య, రాజయ్య సోదరులు చందుర్తి మండలం ఎన్గల్ శివారు పత్తిచేనుల్లో గొర్రెలను మేపేందుకు రెండు నెలల కిందట వలస వచ్చారు. మరో నెల రోజులపాటు ఎన్గల్ శివారులోనే గొర్రెలను మేపాల్సి ఉంటుంది. నిమ్మపల్లి శివారులో గొర్రెలకు మేత లేక వలస వచ్చారు. చందుర్తి, బోయినపల్లి, కోనరావుపేట మండలాల్లో గొర్రెల మందల వద్ద దొంగలు ఆటోల్లో వచ్చి గొర్రెలను ఎత్తుకెళ్లారు. ఇలాంటి ఘటనలతో గొర్రెలకాపరులకు రూ.లక్షల్లో నష్టం వాటిల్లుతుంది. దీంతో గొర్రెల మందకు రక్షణగా రూ.10వేలు వెచ్చించి సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. రాత్రి వేళలోనూ సెల్ఫోన్లో స్పష్టంగా కనిపించడంతో గొర్రెలకాపరులు భరోసాతో ఉంటున్నారు. సీసీ కెమెరా సొలార్ ప్యానల్ ఉండడంతో ఎండకు చార్జి అవుతూ.. రాత్రి పనిచేస్తున్నాయి. రెండు నెలలుగా సీసీ కెమెరాల రక్షణలో గొర్రెలకాపరులు నిశ్చింతగా నిద్రిస్తున్నారు. గతంలో రాత్రి పూట గొర్రెల మంద వద్దకు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి 25 గొర్రెలు ఎత్తుకెళ్లారు. మాకు రూ.2.50 లక్షల నష్టం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా దొంగలు దొరకలేదు. దీంతో సీసీ కెమెరాను కొన్నాం. మా ముగ్గురి వద్ద సెల్ఫోన్కు అనుసంధానించాం. రాత్రి పూట కూడా మంద బాగా కనిపిస్తుంది. మేము కూడా ఇప్పుడు నిశ్చింతగా నిద్రపోతున్నాం. పెద్దగా ఖర్చు కూడా ఏమీ లేదు. సీసీ కెమెరాలతో రక్షణ బాగుంది. – దేవయ్య, బీరయ్య, రాజయ్య, గొర్రెలకాపరులు, నిమ్మపల్లి -
గోవా టూర్కు సూపర్ లగ్జరీ సర్వీసు
కరీంనగర్టౌన్: కరీంనగర్–2 డిపో నుంచి గోవా టూర్కు సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ఎం.శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకట నలో తెలిపారు. మార్చి 6వ తేదీన శుక్రవారం సా యంత్రం 4గంటలకు కరీంనగర్ నుంచి బయల్దేరుతుందన్నారు. 7వ తేదీ శనివారం ఉడిపి(కర్ణాటక) వెళ్లి ముఖంబికా అమ్మవారి దర్శనం, మృడేశ్వర్, గోకర్ణ టెంపుల్స్ చూసుకొని గోవా చేరుకుంటుందన్నారు. 8వ తేదీన గోవా బీచ్లు, ముఖ్య ప్రదేశాలు సందర్శించి అక్కడే బస చేసి 9వ తేదీన సా యంత్రం 4గంటలకు గోవా నుంచి తిరిగి బయల్దేరి, 10వ తేదీన కరీంనగర్ చేరుకుంటుందని వివరించారు. టికెట్ ధర పెద్దలకు రూ. 5,500, పిల్లలకు రూ.4,150 గా నిర్ణయించినట్లు తెలిపారు. ప్ర యాణికులు 93986 58062, 73828 50708, 89783 83084 ఫోన్ నంబర్లను సంప్రదించి టికెట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. -
రాజగోపురం ప్రారంభం
తిమ్మాపూర్: మండలంలోని నల్లగొండ శ్రీ సీ తారామ లక్ష్మీనరసింహాస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆదివారం సందర్శించా రు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, నూతనంగా నిర్మించిన రాజగోపురం ప్రారంభించా రు. భక్తులకు ప్రవచనాలు వినిపించారు. ఆల య కమిటీ చైర్మన్, ఈవో పాల్గొన్నారు. ఆరోగ్యంపై చైతన్య ర్యాలీకరీంనగర్: ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం పెంపొందించేందుకు ప్రభుత్వ మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఆది వారం ‘ఈరోజు పరుగు.. రేపటి ఆరోగ్యానికి భరోసా– పరిగెత్తడం మొదలుపెట్టు.. జబ్బులను వదిలేయ్’ అనే నినాదంతో హెల్త్ రన్ నిర్వహించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ప్రాంగణం నుంచి గీతాభవన్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. 235 మంది వైద్య విద్యార్థులు, 42 మంది వైద్యులు పాల్గొన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి, ఆర్ఎంవో డాక్టర్ నవీన ఆధ్వర్యంలో గీతాభవన్ సర్కిల్ వద్ద వైద్య విద్యార్థులు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ నాటిక ప్రదర్శించారు. మెడికల్ ఆంకాలజిస్ట్ వంశీ చేతన కేన్సర్ నిర్ధారణ, జీవనశైలి మార్పుల ప్రాముఖ్యతపై సూ చనలు చేశారు. డాక్టర్లు శిరీష, హరికృష్ణరెడ్డి, నరేందర్, ప్రసాద్ స్వామి, రవి ప్రవీణ్రెడ్డి, రణధీర్, సతీశ్, మ హేందర్, సుహేళ, గంగాధర్, జాదవ్ పాల్గొన్నారు. విద్యా కమిషన్ సిఫారసు వెనక్కి తీసుకోవాలి కరీంనగర్టౌన్: రాష్ట్ర విద్యా కమిషన్ సిఫారసు ను ఉపాధ్యాయ సంఘం నేతలు ఖండించారు. కమిషన్ సూచించిన సిఫారసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జరిగిన ఉమ్మడి సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. జాతీయ విద్యా విధానం 2020ని లోతుగా అధ్యయనం చేసి విద్యారంగం, ఉపాధ్యాయ విద్యార్థుల విషయంలో సానుకూల దృక్పథం ఏర్పరచుకొని భవిష్యత్తుకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలన్నారు. టీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు చందూరి రాజిరెడ్డి, తపస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అన్నమనేని తిరుపతిరావు, కట్ట వేణుగోపాల్, ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తిరుపతిరావు, శ్యాంకుమార్, దాసరి శ్రీధర్, ఎస్జీటీయూ జిల్లా అధ్యక్షుడు యు.విజయేందర్రెడ్డి, టీటీ యూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ ఉన్నారు. ప్రవేశ పరీక్షకు 311 మంది హాజరు కరీంనగర్టౌన్/విద్యానగర్: కరీంనగర్ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ కోసం ఆదివారం వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 311 మంది హాజరయ్యా రని జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం.నాగైలేశ్వర్ తెలిపారు. ఫలితాలను డైరెక్టర్ హైదరాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ ద్వారా తెలియజేస్తామని, ఎంపికై న అభ్యర్థులకు ఫోన్ ద్వారా సమాచారం అందుతుందని అన్నారు. ఇతర వివరాల కోసం కరీంనగర్ జిల్లాకేంద్రం డైరెక్టర్ బండ శ్రీనివాస్ 98852 18053ను సంప్రదించవచ్చని సూచించారు. -
ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో హోంగార్డ్ వాహనం ధ్వంసం
గోదావరిఖని: ట్రాఫిక్పోలీస్స్టేషన్ ఆవరణలో హోంగార్డ్ ద్విచక్రవాహనం ధ్వంసమైంది. వివరాలు.. గోదావరిఖని సంజయ్గాంధీనగర్లో ఉంటూ పెద్దపల్లి ఇంటెలిజెన్స్ ఆఫీస్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న దేవరకొండ బ్రహ్మచారి రోజూ బైక్పై వచ్చి బస్టాండ్ ముందున్న ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో వాహనాన్ని పార్కింగ్ చేసి బస్సులో పెద్దపల్లికి వెళ్లి వస్తుంటాడు. అయితే శనివారం బైక్ ముందుభాగం ధ్వంసమై ఉంది. తన వాహనం ద్వంసం చేసిన వారిపై చర్య తీసుకోవాలని ట్రాఫిక్ ఏసీపీ, సీఐకి బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్రావును వివరణ కోరగా, వాహనం రివర్స్ తీస్తున్న క్రమంలో ద్విచక్రవాహనానికి తాకిందన్నారు. బైక్ డ్యామేజీ అయిందని, దీనిపై విచారణ చేపట్టామన్నారు. -
పలకరిస్తూ.. ఆరా తీస్తూ
అక్కడో చింత, వేప చెట్టుండే..! ఇంటి నుంచి రోడ్డుపైకి వచ్చిన వేణుగోపాల్రావు అటు, ఇటు కలియతిరిగారు. తనను కలిసేందుకు వచ్చిన కాలనీవాసులతో అక్కడ ఓ చింత చెట్టు.. ఇక్కడో వేప చెట్టు ఉండే.. రోజు పొద్దున్నే చెట్టు కిందున్న బండపై కూర్చునేదని పాతజ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు కాలానికి తగ్గట్టు అంతా మారిపోయాయని పలువురు కాలనీవాసులు పేర్కొన్నారు. శాంతమ్మ నన్ను బడికి తీసుకుపోయేది మల్లోజుల వేణు ఇంటికి చేరాడనే సమాచారం తెలుసుకున్న పలువురు అతడిని కలుసుకున్నారు. కొందరి పేర్లను గుర్తుంచుకుని పలకరించిన వేణు ఇంకొందరిని పరిచయం చేసుకుని వారితో పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. చిన్నప్పుడు శాంతమ్మ తనను సీతారామస్వామి గుడి దగ్గర ఉన్న బడికి తీసుకపోయేది అంటూ గుర్తు చేసుకున్నారు. తన చిన్ననాటి స్నేహితుల్లో కొందరు చనిపోయారని తెలుసుకుని బాధపడ్డారు. పోలీసు బృందం పర్యవేక్షణలో.. ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ, ఎనిమిది మంది పోలీసు అధికారుల బృందంతో వేణుగోపాల్రా వు దంపతులు పెద్దపల్లిలోని ఇంటికి చేరుకున్నారు. స మాచారం అందుకున్న పాత్రికేయులు ఫొటో, వీడియోలు తీసేందుకు యత్నించగా పోలీసు అధికారులు వద్దని వారించారు. వారి సూచన మేరకు వేణుగోపాల్రావు కూడా ‘ఇప్పుడేమీ వద్దు.. కేవలం కుటుంబసభ్యులను మాత్రమే క లిసేందుకు వచ్చా..మళ్లీ వచ్చేనెలలో వస్తా.. అప్పు డు అన్ని విషయాలు మాట్లాకుందాం’..అని పేర్కొన్నారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ స్థానికులతో మాట్లాడుతున్న వేణుగోపాల్రావు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్న మావోయిస్టు మాజీ అగ్రనేత ‘మల్లోజుల’ 45 ఏళ్ల తర్వాత సొంతింటికి వేణుగోపాల్రావుపెద్దపల్లిరూరల్/పెద్దపల్లి: ‘అరెయ్.. భాస్కర్ ఎలా ఉన్నావ్.. మనోళ్లంత ఎక్కడెక్కడున్నారు.. ఎలా ఉన్నారు.. భగవాన్సింగ్ బాగున్నవా’.. అంటూ మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్రావు తన చిన్ననాటి మిత్రులను ఆలింగనం చేసుకుని ఆత్మీయత పంచుకున్నారు. కాలనీవాసులను కలుసుకుని భావోద్వేగానికి లోనై తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన 27వ ఏట రాడికల్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై ఇల్లు విడిచి వెళ్లిన వేణుగోపాల్రావు మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీలో కీలక పదవుల్లో కొనసాగిన విషయం విదితమే. ఇటీవల మహారాష్ట్ర సీఎం ఎదుట తన భార్య తారతో లొంగిపోయిన వేణుగోపాల్రావు దంపతులు 45 ఏళ్ల తర్వాత సొంతింటికి చేరుకున్నాడు. పెద్దన్న ఆంజనేయులు ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసి.. కుటుంబీకులు, బంధువులతో ముచ్చటించారు. -
ప్రగతి తప్పిన ప్లానింగ్
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ పట్టణ ప్రణాళిక గతి తప్పుతోంది. కొంతమంది అధికా రుల కుమ్మక్కు ఫలితంగా నగరంలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. వారి జేబులు నింపుకునేందుకు నగరపాలకసంస్థ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. ఇప్పటివరకు అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులు సైతం దృష్టి పెట్టకపోవడంతో, కిందిస్థాయి అధికారుల అక్రమాల బాగోతానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వందలాది నిర్మాణాలు నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో భవన నిర్మాణాలు ఊపందుకున్నాయి. ప్రతి డివిజన్లో భవన, బహుళ అంతస్తుల, వాణిజ్య సముదాయాల నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో అనుమతులకు భిన్నంగా, అసలు అనుమతులే లేకుండా కొనసాగుతున్న భవన నిర్మాణాలే ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా ప్రత్యేక అధికారి పాలన సాగిన గతేడాది కాలంలో ఈ అక్రమ నిర్మాణాలు వందల సంఖ్యలో ఉన్నట్లు అంచనా. ప్రతి డివిజన్కు కనీసం ఐదు నుంచి పది నూతన, ఆధునీకరణ, పైఅంతస్తుల నిర్మాణాలు సాగాయి. వీటిలో చాలా వరకు అనుమతులు లేకుండానే నిర్మిస్తుండడంతో, నగరపాలకసంస్థ కనీసం రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లు అనధికారికంగా అంచనా. అంతస్తుకో రేటు భవన నిర్మాణాలకు కొంతమంది పట్టణ ప్రణాళిక అధికారులు రేటు నిర్ణయించుకొని వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. సాధారణ గృహాలు, బహుళ అంతస్తులు, అపార్ట్మెంట్లు.. ఇలా కేటగిరీల వారిగా వసూలు చేస్తుండడం ఇక్కడ బహిరంగ రహస్యమే. సాధారణంగా బహుళ అంతస్తులు, అపార్ట్మెంట్ల నిర్మాణంలో నగరపాలకసంస్థకు మాటిగేజ్ చేయాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తయ్యాక, అన్ని నిబంధనల ప్రకారం ఉంటే మాటిగేజ్ను రిలీజ్ చేస్తారు. కాని మాటిగేజ్ లేకుండా నిర్మాణాలు పూర్తి చేసేందుకు, మాటిగేజ్ రిలీజ్ చేసేందుకు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయనే విమర్శలున్నాయి. అపార్ట్మెంట్ల మాటిగేజ్ రిలీజ్ కావాలంటే కనీసం రూ.5 లక్షలు ఇవ్వాలనేది చాలా సాధారణ విషయమని ఓ బిల్డర్ వెల్ల డించారు. నగరపాలకసంస్థ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న ఈ అక్రమ భవన నిర్మాణాలపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. అనుమతి లేని నిర్మాణాలను గుర్తించి, ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది.నగరంలోని 52వ డివిజన్ క్రిస్టియన్కాలనీలో నిర్మిస్తున్న ఈ బహుళ అంతస్తుల భవనంలో నిబంధనలు పాటించడం లేదు. భవనానికి అనుమతి తీసుకున్నా నిబంధనలు మీరి నిర్మాణం కొనసాగుతోంది. అనుమతులు లేకున్నా, సెల్లార్, పెంట్హౌస్ నిర్మాణాలు చేపట్టారు. ఫలితంగా నగరపాలకసంస్థ రూ.లక్షల్లో ఆదాయం కోల్పోయింది.నగరంలోని 44వ డివిజన్ పరిధిలో ఉన్న శ్రీనగర్కాలనీలో నిర్మిస్తున్న ఈ భవనానికి నగరపాలకసంస్థ నుంచి అనుమతులు లేవు. అయినప్పటికి ఈ భవన నిర్మాణం నిరాటంకంగా కొనసాగుతోంది. అనుమతి లేని భవన నిర్మాణంపై చర్యలు తీసుకుని, ఫీజు వసూలు చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఇ లాంటి అనుమతి లేని భవనాలు నగరంలో వందల సంఖ్యలో ఉన్నాయి.01కెఎన్టీ51:01కెఎన్టీ52: -
సీఎం పేషీకి ‘ఇల్లీగల్’ వ్యవహారం
కరీంనగర్ అర్బన్: తూనికలు, కొలతలశాఖలో మాజీ అసిస్టెంట్ కంట్రోలర్ విజయసారథి రూ. వంద కోట్ల వరకు కూడబెట్టారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అతని అవినీతి వ్యవహారం తాజాగా సీఎం పేషీకి చేరింది. పదోన్నతి వ్యవహారం, ఇల్లీగల్ వసూళ్లు, కోర్టు జడ్జిమెంట్ను తిరస్కరించడం, నియామకాల్లో వసూళ్లు, రిపేరర్లను బెదిరించి లక్షల వసూళ్లు, వర్కింగ్ స్టాండర్డ్స్ డిజిట ల్ బ్యాలెన్స్ మిషన్ మాయం, అడ్వాన్ డేట్, ఎక్స్టెన్షన్కు ఒత్తిడి, వలంటరీ నియామకం కోసం డబ్బు వసూలు, కోర్టు జడ్జిమెంట్నే తిరస్కరించడం, శుభకార్యానికి వసూళ్లు, వస్తువుల తరలింపు, ఏసీబీ కేసులున్నా అక్రమ పదోన్నతులు కల్పించడంపై సీఎం పేషీ ఆరా తీస్తోంది. కుప్పలు తెప్పలుగా అక్రమాలు విజయసారథి కోర్టు తీర్పును పక్కనబెట్టి ఓ ఉద్యోగిని కొనసాగించడం విడ్డూరం. మహిళా కోటాలో పురుషున్ని నియమించగా కోర్టు టర్నినేట్ చేయాలని ఆదేశించింది. అయినా సదరు వ్యక్తే ఉద్యోగం చేస్తుండడం గమనార్హం. ఇంధన తరలింపులో నిర్ణీత గడువు దాటితే మళ్లీ స్టాంపింగ్ వేయాల్సి ఉంటుంది. పెద్దపల్లి జిల్లాలో ఎక్స్టెన్షన్ రాయడం, దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తినా ఏసీ అక్రమానికే అండగా ఉన్నారని తెలుస్తోంది. అడ్వాన్స్ డేట్ వేసి పెట్రోల్ బంకుల వద్ద పెద్ద మొత్తంలో వసూళ్లు చేయగా కరీంనగర్ జిల్లాలో ఇప్పటికి 80శాతం వ్యాపార ప్రాంతాలు, రేషన్ దుకాణాలు, మొత్తంగా తూకం వాడే చిన్న మిషన్ నుంచి వేబ్రిడ్జి వరకు స్టాంపింగ్లు లేకుండా నడుస్తున్నాయని తెలుస్తోంది. ఇతనింట్లో ఽశుభకార్యానికి ఆహార వస్తువులను హైదరాబాద్కు తరలించేలా కిందిస్థాయి సిబ్బందిని తీవ్ర ఒత్తిడి చేయగా, అప్పు చేసి అతని కోరికలు తీర్చారు. ఈ విషయ మై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని తెలుస్తోంది. ఫిర్యాదులొస్తుంటే.. ఏసీ విజయసారథిపై పదేళ్ల క్రితమే రాష్ట్రస్థాయిలో ఫిర్యాదులు వెళ్లగా చర్యలు తీసుకోకపోవడమే ఈ స్థాయి అవినీతికి కారణమని తెలుస్తోంది. 2022లో స్టాండర్డ్స్ మిషన్ లేదని, అడ్వాన్స్ డేట్తో పెట్రోల్ బంకుల వద్ద వసూలు చేయాల్సిన డబ్బుకు గండి కొట్టారని ఏసీ వ్యవహారంపై జిల్లా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ ఫిర్యాదు చేసినా చలనం లేకపోవడం ఆరోపణలకు తావిస్తోంది. 24.01.2022న కరీంనగర్ టూటౌన్ పోలీస్స్టేషన్లో విజయసారథిపై 420 కేసు నమోదైనా చర్యల్లేవు. టెక్నికల్ అసిస్టెంట్ లక్ష్మి మరో పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినా చర్యలు లేకపోవడం అతనిపై శాఖలో ఉన్న పరపతిని చాటుతోంది. ఇంత జరుగుతుండగా మా సార్ మంచోడంటూ అసిస్టెంట్ కంట్రోలర్ పరిధిలోని పలువురు ఉద్యోగులు లేఖలు రాయడం తీవ్ర చర్యలకు దారి తీస్తున్నట్లు తెలుస్తోంది. ఏసీ వసూళ్లలో కీలక పాత్ర పోషించే వాచ్మెన్ తను లేఖ రాయడంతో పాటు ఇతర అటెండర్లు, వాచ్మెన్లు లెటర్లు రాసేలా ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సదరు లేఖలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇందులో వాచ్మెన్ చెప్పడం వల్లే రాశామని, ఇష్టంతో రాసిన లేఖ కాదని చెప్పినట్లు సమాచారం. -
పిచ్చి కుక్క దాడిలో ముగ్గురికి గాయాలు
బోయినపల్లి(చొప్పదండి): సెలవు రోజు ఇంటి పరిసరాల్లో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులతోపాటు, ఒక వ్యక్తిపై పిచ్చి కుక్క దాడి చేసి గాయపర్చిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట్రావుపల్లిలో చిన్నారులు నక్క కావ్య, పిల్లి అపర్ణికలు ఇంటి పరిసరాల్లో ఆడుకుంటుండగా ఓ పిచ్చి కుక్క దాడి చేసి గాయపర్చింది. కావ్య చేతి విరగగా, కన్ను కింద, పెదిమకు గాయమైంది. అపర్ణిక భుజం కింద గాయపర్చింది. అదేదారిలో ఉన్న తీర్థాల కనకయ్య అనే వ్యక్తిపై సైతం దాడి చేయడంతో కాలుకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గ్రామ సర్పంచ్ ఇరువాలా సంధ్య మహేందర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు కుక్కను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.గాయపడ్డ అపర్ణిక, కావ్య -
నోరూరించే రంజాన్ రుచులు
చికెన్, మటన్ హలీంవిక్రయానికి సిద్ధంగా ఉన్న వివిధ రకాల చికెన్ వంటకాలుడబుల్ కా మీటాఘుమఘమలాడుతున్న గులాబ్ జామ్నగర ప్రజలను రంజాన్ రుచులు నోరూరిస్తున్నాయి. రంజాన్ మాసం వచ్చిందంటే ప్రధాన వీధుల్లో, కూడళ్లలో ఎక్కడ చూసినా వివిధ రకాల వంటకాలతో స్టాల్స్ సందడిగా మారుతున్నాయి. సాయంత్రం అయిదంటే చాలు వివిధ రకాల వంటకాల ఘుమఘుమలు సిటీ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. రంజాన్ మాసం ప్రారంభం కావడంతో నగరంలోని మంకమ్మతోట, రాజీవ్చౌక్, నాకా చౌరస్తాతో పాటు పలు చోట్ల స్టాల్స్ ఏర్పాటు చేశారు. హలీం, చికెన్, మటన్ వంటకాలతో పాటు వివిధ రకాల స్వీట్లు అందుబాటులో ఉంచారు. కేవలం రంజాన్ మాసంలోనే దొరికే ఈ రుచుల కోసం నగర ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు అమ్మకాలు కొనసాగుతుండగా ఆయా వంటకాలను రుచిచూసేందుకు అన్ని వర్గాల ప్రజలు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా చికెన్ మటన్ హలీం.. చికెన్ వంటకాలను ఎక్కువగా ఆస్వాదిస్తుండగా.. గతేడాది కన్నా ఈసారి ధరలు కాస్త పెరగగా.. అమ్మకాలు బాగున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
బంగారం.. దొంగల విహారం
కరీంనగర్క్రైం: బంగారం ధర ఆకాశాన్ని అంటుతోంది. ఇదే సమయంలో సామాన్యులకు నిద్ర లేకుండా చేస్తోంది. బంగారం విలువ పెరిగిన కొద్దీ దొంగతనాలు పెరుగుతున్నాయి. నగరం, గ్రామం అనే తేడా లేకుండా చోరీలు జరుగుతున్నాయి. తా ళం వేసి ఉన్న నివాసాలు, ఆలయాలు, మహిళలు, వృద్ధులే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోతున్నారు. పొ ద్దంతా పట్టణాలు, గ్రామాల్లో తిరుగుతూ మాయ మాటలు చెప్పి నిలువునా దోచేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా బంగారంతో ఉడాయిస్తున్నారు. మరికొందరు పొద్దంతా రెక్కీ చేస్తూ.. తాళం వేసిఉన్న నివాసాల్లో రాత్రిళ్లు చోరీకి పాల్పడుతున్నారు. నిఘా పెరగడంతో రూటుమార్చి బంగారం చోరీలపై పోలీసులు నిఘా పెంచుతుండగా దొంగలు రూటు మార్చుతున్నారు. టెక్నాలజీ, మానవ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని చోరీలకు దిగుతున్నారు. ద్విచక్ర వాహనాలపై వచ్చి మహిళల మెడలోంచి బంగారు గొలుసులను క్షణాల్లో తెంపుకుని మాయమవుతున్నారు. పాలిష్ పేరుతో నగలు శుభ్రపరుస్తామని మహిళలను నమ్మించి చోరీలకు దిగుతున్నారు. నగరంలోని కట్టరాంపూర్, తిమ్మాపూర్, రామడుగు, మానకొండూర్, గన్నేరువరం, జమ్మికుంటతో పాటు వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో పగటిపూట రెక్కి చేసి, రాత్రి దొంగతనాలు చేసిన ఘటనలపై కేసులు నమోదు అయ్యాయి.ఫిబ్రవరి 24న కరీంనగర్ పరిధిలోని రేకుర్తిలో ఒంటరిగా ఉన్న ఓ మహిళ వద్దకు ఇద్దరు మహిళలు వెళ్లారు. తాము అమ్మవారి భక్తులమని, విజయవాడ కనకదుర్గమ్మకు ఆభరణాలు చేయిస్తామని, తమవంతు సాయం చేయాలని కోరారు. ఇంట్లోకి వెళ్లిన సదరు మహిళ కొంత నగదు తెచ్చి ఇచ్చింది. ‘నీకు నరదిష్టి ఉంది’ అని ఆమెను మాటల్లోకి దింపి మత్తు కలిపిన బొట్టు పెట్టారు. స్పృహ కోల్పోగానే ఇంట్లోకి వెళ్లి ఐదు తులాల బంగారం, రూ.30వేలు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. తేరుకున్న సదరు మహిళ లబోదిబోమంటూ కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.సంవత్సరం కేసులు 2024 158 2025 184నగర పరిధిలోని శివనగర్లో ఉన్న విజేత మనోహర హెవెన్స్ అపార్ట్మెంట్లోని రెండు ఫ్లాట్లలో సుమారు రూ.35 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. బోయవాడలో బంగారు నగలకు పాలిష్ వేస్తామంటూ ఓ మహిళను మాటల్లో పెట్టి, ఇంట్లోకి వెళ్లి నగలు పట్టుకొని పరారవగా వన్టౌన్లో కేసు నమోదైంది. -
రేపు కొండగట్టు ఆలయం మూసివేత
మల్యాల: రాహుగ్రస్త చంద్ర గ్రహణం సందర్భంగా కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయాన్ని ఈ నెల 3న ఉదయం 7.30గంటలకు స్వామివారి నివేదన అనంతరం మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. చంద్రగ్రహణం అనంతరం మంగళవారం రాత్రి ఏడు గంటలకు పుణ్యహచనం, సంప్రోక్షణ, తిరుమంజనం, ఆరాధన నిర్వహించి స్వామివారి సర్వదర్శనం, ఆర్జిత సేవలు యథావిధిగా ప్రారంభిస్తామని వివరించారు. బైక్పై నుంచి పడి రైతు మృతికథలాపూర్(వేములవాడ): మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన రైతు పోకతోట భూమయ్య(65 ) ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి పడి మృతిచెందిన ట్లు ఎస్సై రవికిరణ్ తెలిపా రు. పోలీసుల కథనం ప్రకారం.. భూమయ్య శనివారం సాయంత్రం చేను వద్దకు బైక్పై వెళ్లి తిరిగి వస్తున్నాడు. గ్రామశివారులో బైక్ అదుపుతప్పి కిందపడిపోవడంతో తలకు గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు అతడిని కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడ ు. భూమయ్యకు భార్య ఎంకవ్వ, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఎంకవ్వ ఫిర్యాదు మేర కు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కుంటలో పడి రైతు..వీణవంక: మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన గాజుల రాజేశ్(35) ప్రమాదవశాత్తు కుంటలో పడి చనిపోయాడు. తనకున్న 30గుంటల భూమిలో వరి వేశాడు. పొలానికి నీళ్లు పెట్టడానికి గత నెల 28న సాయంత్రం వెళ్లాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా కుంటలో శవమై కనిపించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. పొలం పనులు చూసుకొని వస్తుండగా కుంట వద్దకు రాగానే కాలుజారి పడిపోవడంతో మృతి చెందినట్లు మృతిడి భార్య రజిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. సర్పంచ్ మండల కుమార్, ఉపసర్పంచ్ రవీందర్ రూ.5వేల చొప్పున అందించారు. ఉరేసుకొని వృద్ధుడి ఆత్మహత్యవేములవాడరూరల్: వేములవాడరూరల్ మండలం నమిలిగుండుపల్లికి చెందిన సిందం రాజయ్య (60) చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజయ్యకు 2023లో గుండె సంబంధిత సర్జరీ కాగా, అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతుండే వాడు. మనస్తాపానికి గురై జీవితంపై విరక్తిచెంది ఆదివారం తన ఇంటి వెనుక ఉన్న మామిడి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ రూరల్ ఎస్సై వెంకట్రాజం తెలిపారు. అడవిపందిని వేటాడిన వ్యక్తి అరెస్ట్కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మండలంలోని పెద్దరాతుపల్లి గ్రామంలో విద్యుత్ వైర్లు అమర్చి అడవిపందిని చంపిన పల్లపు నర్సయ్యను అదుపులోకి తీసుకున్నటు్ల్ ఎస్సై వెంకటేశ్ తెలిపారు. ఆదివారం ఉదయం వెంకటయ్య ద్విచక్రవాహనంపై అడవిపంది కళేబరాన్ని తరలిస్తుండగా, పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యల కోసం అటవీ శాఖాధికారులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు వీర్నపల్లి: మండలంలోని సీతారాంనాయక్ తండా పంచాయతీ పరిధిలోని పొలాల్లోకి పశువుల కాపరి గేదెలను మేతకు తీసుకెళ్లాడు. అడవిపందుల కోసం దుండగులు అమర్చిన నాటు బాంబును ఆహారంగా భావించి గేదె నోట్లో పెట్టుకోగా ఒక్కసారిగా భారీ శబ్దంతో బాంబు పేలడంతో సమీపంలోని రైతులు, గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఎస్సై వేముల లక్ష్మణ్ సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. వన్యప్రాణుల వేట కోసం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ నాటు బాంబులను అమర్చినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఆరోపణలు అవాస్తవం● ఎస్.ఎన్ మాల్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీధర్రెడ్డి కరీంనగర్క్రైం: కరీంనగర్ పోలీసులు, ఎస్.ఎన్. మాల్ సంస్థపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని, ఏమాత్రం నిజం లేదని ఎస్.ఎన్ మాల్, శ్రీ ఇన్ఫ్రా డెవలపర్స్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీధర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎస్.ఎన్ మాల్ అనుమతి ఎన్వోసీ కోసం కరీంనగర్ సీపీ రూ.25 లక్షలు వసూలు చేశారన్న మాట్లల్లో వాస్తవం లేదన్నారు. పోలీసులకు ఒక్కరూపాయి ఇవ్వలేదన్నారు. ప్రబుత్వ నిబంధనల ప్రకారం అనుమతి తీసుకున్న తరువాతే మాల్ ప్రారంభమైందని పేర్కొన్నారు. ఎస్ఎన్ మాల్ త్రీటౌన్ పరిధిలో ఉందని అప్పుడు సీఐ జాన్రెడ్డి ఉన్నారని, ఈ విషయంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్కుమార్, సీఐ సృజన్రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థపై, ఏళ్ల తరబడి వ్యాపారరంగంలో ఉన్న తమలాంటి సంస్థలపై ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. -
నమో నారసింహాయా
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో మూడోరోజైన ఆదివారం ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ముందుగా గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించారు. గోదావరిలో ఇసుక దిబ్బలపై గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు. భక్తులకు స్థానిక ఓల్డ్ టీటీడీ కల్యాణ మండపంలో రైస్మిల్లర్లు, ఆర్యవైశ్యులు, ఇతర దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. చైర్మన్ జక్కు రవీందర్ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
సమ్మె బాటలో ఆర్టిజన్లు
● జోరుగా సంతకాల సేకరణ ● ఈనెల 10న హైదరాబాద్ మింట్ కంపౌండ్ ఎదుట భారీ ధర్నా ● అదే రోజు సమ్మె నోటీసు అందించనున్న ఆర్టిజన్లు రామగుండం: ఎనిమిదేళ్ల క్రితం అప్పటి సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 19వేల మందిని ఆర్టిజన్లుగా గుర్తించారు. వివిధ కేటగిరీలలో ఉన్న వారందరినీ రెగ్యులర్ ఉద్యోగుల జాబితాలో చేర్చుతూ 2019 అక్టోబర్ నుంచి రెగ్యులర్ పే స్కేల్స్, పే స్లిప్స్, పెయిడ్ హాలిడేస్ తదితర బెనిఫిట్స్ అమలు చేసినా వీరిని ప్రత్యేక కేటగిరీగానే పరిగణిస్తున్నారు. ఫలితంగా రెగ్యులర్ ఉద్యోగులతో పోల్చితే వీరికి చెల్లించే జీతభత్యాల్లో భారీ వ్యత్యాసం ఉంది. దీంతో తమ సమస్యల పరిష్కారానికి ఆర్టిజన్లు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఆర్టిజన్ల విధులు విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ, ఫ్యూజ్ ఆఫ్ కాల్ అటెండ్ చేయడం, కొత్త విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు, మీటర్ల ఇన్స్టాలేషన్, రీడింగ్ నమోదు చేయడం, బ్రేక్డౌన్ సమయంలో పునరుద్ధరణ తదితర పనులు చేయడం. వీరికి ప్రారంభ వేతనం రూ.15 వేల నుంచి గరిష్టంగా రూ.25వేల వరకు ఉంది. ఇందులో టీజీ ట్రాన్స్కో 3,769, జెన్కో 3,583, ఎస్సీడీసీఎల్ 8,244, ఎన్పీడీసీఎల్ 3,465 మొత్తం 19,061 మంది ఆర్టిజన్లు ఉన్నారు. ఎనిమిదేళ్లుగా తమ డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వాలను కోరుతున్నా స్పందన కరువైంది. ఈనెల 10న హైదరాబాద్ మింట్ కంపౌండ్లోని టీఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట తొమ్మిది సంఘాలతో కూడిన తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ అసోసియేషన్ జేఏసీ పేరుతో ధర్నా నిర్వహించి సమ్మె నోటీసు అందజేస్తాం. – తూళ్ళ నాగరాజు, జేఏసీ చైర్మన్, ఉమ్మడి కరీంనగర్ ఆర్టిజన్ కార్మికులకు వెంటనే కన్వర్షన్ ఇవ్వాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటి బోర్డు (ఏపీఎస్ఈబీ) సర్వీసు రూల్స్ అమలు చేయాలి. 2016కు ముందు అన్ని అర్హతలు ఉండి ఆర్టిజన్లుగా గుర్తించని వారందరినీ ఆర్టిజన్లుగా గుర్తించాలి. టీజీ ఎస్పీడీసీఎల్/ఎన్పీడీసీఎల్ కంపెనీల పరిధిలో పని చేస్తున్న అన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలి. విద్యుత్ సంస్థల్లో మీటర్ రీడర్లు, ఎస్పీఎం, పీఏఏ, గార్డెనర్, సెక్యూరిటీ, ఏపీటీఎస్ విజిలెన్స్ తదితర విభాగాల్లో పని చేస్తున్న వారందరికీ జీవో నం.11 ప్రకారం కనీస వేతన చట్టం అమలు చేయాలి. ఈపీఎఫ్, ఈఎస్ఐ, 30 రోజుల పని విధానాన్ని వర్తింపజేయాలి. -
గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులకు శుభవార్త
కరీంనగర్: ఇజ్రాయెల్– ఇరాన్ యుద్ధ నేపథ్యంలో దుబాయ్, ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా దేశాల్లోని ప్రవాస భారతీయులకు శుభవార్త. ఇకపై వారు ఆందోళన చెందనక్కర్లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ తెలిపారు. వారంతా స్వదేశానికి తిరిగి రావడానికి కేంద్రం చేసిన ప్రయత్నాలు ఫలించాయని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులు రోడ్డు మార్గం ద్వారా ఒమన్లోకి ప్రవేశించి అక్కడి నుంచి భారత్కు వచ్చేందుకు వెసులుబాటు కలి్పంచినట్టు తెలిపారు. ఈ మేరకు మస్కట్లోని భారతీయ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసినట్టు తెలిపారు. ఈ లెక్కన దుబాయి నుంచి మస్కట్ ఎయిర్ పోర్టు వరకు రావాలంటే రోడ్డు మార్గాన 450 కి.మీ.లు ప్రయాణించాలి.ఇతర గల్ఫ్ దేశాల నుంచి మస్కట్కు రోడ్డు మార్గాన రావాలంటే దాదాపు వెయ్యి కి.మీ.ల వరకు ప్రయాణం చేయాలి. అలా చేరుకున్న వారంతా ఒమన్లోకి ప్రవేశించడానికి ముందుగానే విజిట్/టూరిస్ట్ వీసా పొందడం తప్పనిసరి. ప్రయాణికులు ‘రాయల్ ఒమన్ పోలీస్ వెబ్సైట్’ద్వారా అనుమతించిన ట్రావెల్ ఏజెంట్ల ద్వారా ముందుగా ఈ–వీసాకు దరఖాస్తు చేయాలి. అమెరికా, యూకే, కెనడా, జపాన్ లేదా షెంగెన్ దేశాల చెల్లుబాటు అయ్యే వీసా లేదా నివాస అనుమతి ఉన్న భారత పాస్పోర్ట్ దారులకు ‘ఆన్–అరైవల్ వీసా’సదుపాయం ఉంది. వారు రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్, ఆరోగ్య బీమా ఉన్నట్టయితే ముందస్తు వీసా లేకుండా గరిష్టంగా 14 రోజుల వరకు ఒమన్లో ప్రవేశించొచ్చు.గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలో నివసిస్తూ చెల్లుబాటు అయ్యే రెసిడెంట్ కార్డు కలిగిన భారత పౌరులకు కూడా ఆన్–అరైవల్ వీసా అందుబాటులో ఉంటుంది. వీసాకు దరఖాస్తు చేసే సమయంలో పాస్పోర్ట్ కనీసం 6 నెలలపాటు చెల్లుబాటు అయ్యేలా ఉండాలి. భారత్కు తిరిగి రావాలనుకునే గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులంతా ఏదైనా సమాచారం కావాలంటే ఒమన్లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని బండి సంజయ్ తెలిపారు. దుబాయ్లో చిక్కుకున్న మేడ్చల్ వాసి మేడ్చల్రూరల్: టూర్కు వెళ్లిన మేడ్చల్ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధంతో దుబాయ్లో చిక్కుకున్నాడు. వివరాల్లోకి వెళితే పూడూర్ గ్రా>మానికి చెందిన కిరణ్కుమార్ మేడ్చల్ ఐఐఎఫ్ఎల్ గోల్డ్లోన్ బ్రాంచ్ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆ సంస్థ తమ ఉద్యోగులను గత నెల 26వ తేదీన దుబాయ్ టూర్కు తీసుకెళ్లింది. విహారయాత్రలో భాగంగా దుబాయ్, అబుదాబిలో పర్యటించిన కిరణ్ ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణం చేయాల్సి ఉండగా యుద్ధం కారణంగా విమానాలు రద్దు కావడంతో అక్కడే చిక్కుకుపోయాడు. ఆదివారం ఉదయం కుటుంబీకులకు ఫోన్ చేసిన కిరణ్ తాను క్షేమంగా ఉన్నానని, విమానాల రద్దు కారణంగా దుబాయ్లోని హోటల్లోనే ఉన్నట్టు తెలిపారు. తెలంగాణ నుంచి 800 ఐఐఎఫ్ఎల్ ఉద్యోగులు దుబాయ్ టూర్కు వెళ్లారు. సోమవారం రావాల్సి ఉండగా విమానాలు రద్దు కావడంతో అక్కడే హోటల్లో వారు క్షేమంగా ఉన్నారు. -
చట్టాలపై అవగాహన ఉండాలి
ఇల్లందకుంట: విద్యార్థులు చట్టాలపై అవగా హన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి కిరణ్కుమార్ సూచించారు. శనివారం మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలను తిలకించి, అభినందించారు. ఈ సందర్భంగా కిరణ్కుమార్ మాట్లాడుతూ బాలికలు, మహిళలపై లైంగిక వేధింపులకు పా ల్పడితే పొక్సో చట్టం ద్వారా శిక్షించబడతారని, పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులు చట్టపరమైన అంశాలను తెలుసుకోవాలన్నారు. సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె.వీణప్రణతి, ఎస్సై క్రాంతికుమార్, తహసీల్దార్ బి.భాస్కర్, సర్పంచ్ దార సురేశ్, ప్రధానోపాధ్యాయురాలు తస్మిన్ నజ్మీన్ పాల్గొన్నారు. కరీంనగర్: జూట్ ఉత్పత్తుల ప్రోత్సాహం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభి స్తుందని జిల్లా పరిషత్ సీఈవో శ్రీనివాస్ పేర్కొన్నారు. భారత ప్రభుత్వ టెక్స్టైల్స్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ జూట్ బోర్డు ప్రారంభించిన జూట్ మార్క్ ఇండియా (జెఎంఐ) పథకంపై అవగాహన కల్పించేందుకు టెక్స్టైల్ కమిటీ నిర్వహణలో శనివారం కరీంనగర్లోని మైత్రి హోటల్లో వర్క్షాప్ నిర్వహించారు. జెడ్పీ సీఈవో మాట్లాడుతూ జూట్ ఫైబ ర్ ప్రాముఖ్యతను, జనపనార సాంప్రదాయ, విభిన్న ఉత్పత్తుల ప్రోత్సాహాన్ని దృష్టిలో ఉంచుకుని జూట్ మార్క్ ఇండియా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అదనపు డీఆర్డీవో రవి కుమార్, డీపీఎం వేణుగోపాల్, మహిళా ప్రాంగణం డీఎం సుధా రాణి, టెక్స్టైల్స్ కమిటీ జాయింట్ డైరెక్టర్ కె.ఎస్.మురళీధర్, డిప్యూటీ డైరెక్టర్ బిస్వనాథ్బన్సాలీ, కె.శిరీష, సి. సతీష్ కుమార్ పాల్గొన్నారు. కరీంనగర్: వైద్యులు ఉన్నది ప్రాణాలు కాపాడేందుకేనని, ప్రాణాలు తీయాలని ఏ వైద్యుడికి ఉండదని కరీంనగర్ ఐఎంఏ, తానా వైద్యులు అన్నారు. వైద్య వృత్తిపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ కరీంనగర్లోని ఐఎంఏ హాల్లో శనివారం నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ ఆవరణలో సీనియర్ పీడియాట్రీషియన్పై దాడి జరిగిన ఘటనను హేయమైన చర్యగా అభివర్ణిస్తూ, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సీపీ గౌస్ ఆలంకు వినతిపత్రం అందజేశారు. తానా రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కఠారి, ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు ఆకుల శైలజ, ఎనమల నరేశ్, ఎన్.మహేష్ బాబు, నీ లిమ కాసం, విజయేంద్రరెడ్డి, బీఎన్.రావు, సు రేశ్కుమార్, రాజకుమార్, స్రవంతి, స్వప్న, రామ్మోహన్, రఘునాథ్, శ్రీలత పాల్గొన్నారు. కొత్తపల్లి: విద్యుత్ లైన్ల పనులు నేపథ్యంలో ఆదివారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 11 కె.వీ.గంజ్ ఫీడర్ పరిధిలోని మార్కెట్, సిక్వాడీ, కల్పన హోట ల్, బోయవాడ, గంజ్ ప్రాంతాలు, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కె.వీ.వావిలాలపల్లి ఫీడర్ పరిధిలోని వావిలాలపల్లి ప్రాంతాలతో పాటు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.గీతాభవన్ ఫీడర్ పరిధిలోని రాజీవ్పార్కు, మంకమ్మతోట, మార్క్ఫెడ్ ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈలు తెలిపారు. -
గర్భిణికి పునర్జన్మ.. చిన్నారికి ఊపిరి
కరీంనగర్: జన్యుపరమైన గుండెజబ్బు, తీవ్రమైన పల్మనరీ హైపర్టెన్షన్తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళకు హైదరాబాద్ మలక్పేట యశోద హాస్పిటల్ వైద్యులు సురక్షితంగా పురుడు పోశారు. కరీంనగర్లో శనివారం యశోద హాస్పిటల్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ సత్యప్రియసాహూ, గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియాన్షి మాట్లాడుతూ కరీంనగర్కు చెందిన 21 ఏళ్ల గర్భిణి తీవ్రమైన పల్మనరీ ఆర్టీరియల్ హైపర్టెన్షన్ (పీఏహెచ్), రైట్ వెంట్రిక్యులర్ డిస్ఫంక్షన్తో ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. గతంలో ఆమెకు వీఎస్డీ శస్త్రచికిత్స జరిగిన నేపథ్యం ఉండటంతో, గర్భధారణ సమయంలో కుడి గుండె వైఫల్యం చెంది ప్రాణాపాయం కలిగే ముప్పు పొంచి ఉందన్నారు. వైద్య నిపుణుల బృందం అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించి, 29 వారాల సమయంలోనే అత్యవసర సిజేరియన్ (ఎల్ఎస్సీఎస్) నిర్వహించినట్లు పేర్కొన్నారు. కేవలం 1.1 కిలోల బరువుతో జన్మించిన ఆడ శిశువుకు శ్వాసకోశ ఇబ్బందులు (ఆర్డీఎస్), సెప్సిస్ వంటి సమస్యలు తలెత్తాయన్నారు. వెంటనే చిన్నారిని అధునాతన ఎన్ఐసీయూలో ఉంచి ‘ఇన్సూర్’ పద్ధతిలో చికిత్స అందించామన్నారు. శిశువు గుండెలో ఉన్న రంధ్రాన్ని (పీడీఏ) డివైస్ క్లోజర్ ద్వారా విజయవంతంగా మూసివేసినట్లు తెలిపారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్ చేసినట్లు చేప్పారు. తీవ్రమైన గుండె జబ్బు ఉన్న మహిళల్లో ప్రసవం అత్యంత క్లిష్టమైనదని, మల్టీడిసిప్లినరీ వైద్య బృంద సమన్వయంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. హై–రిస్క్ కేసులను ఎదుర్కోవడంలో యశోద ఆసుపత్రిలోని అత్యాధునిక వసతులు కీలక పాత్ర పోషించాయని వివరించారు. ఈ సమావేశంలో యూనిట్ హెడ్ కె.శ్రీనివాసరెడ్డి, ఏవీపీ శ్రీనివాస్ చిదుర పాల్గొన్నారు. యశోదలో గుండెజబ్బు మహిళకు సురక్షిత ప్రసవం -
మొండి బకాయిదారులపై చర్యలు
కరీంనగర్ కార్పొరేషన్: ఆస్తి పన్ను చెల్లించని మొండి బకాయిదారులపై మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ హెచ్చరించారు. శనివారం నగరంలోని రాంనగర్, కోతిరాంపూర్, రేకుర్తి, కాపువాడ, అలుగునూరులో చేపట్టిన ఆస్తి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ పన్నుల వసూళ్లలను పరిశీలించారు. స్వయంగా షాప్లను సందర్శించి ట్రేడ్లైసెన్స్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరవాసులు తమ ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ పన్ను, నల్లా పన్నులు సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలన్నారు. 2025–2026 ఆర్థిక సంవత్సరం మార్చి 31 తో ముగుస్తున్నందున ఆ లోగా తమ ఇంటి పన్నులను చెల్లించాలన్నారు. వార్డు అధికారులు డివిజన్ల వారిగా క్షేత్రస్థాయిలో తిరిగి ఇంటి పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా మొండి బకాయిదారుల నుంచి పన్నులు కట్టించేలా రెవెన్యూ విభాగం అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్న వారికి రెడ్ నోటీసులు జారీ చేయాలన్నారు. నోటీసు గడువు ముగిసిన తరువాత కూడా చెల్లించని బకాయిదారులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియొద్దీన్, ఆర్వో శివానందం పాల్గొన్నారు. -
జనగణనకు కసరత్తు
కరీంనగర్ అర్బన్: జనగణనకు కసరత్తు వేగవంతమవుతోంది. కరోనాకాలం నుంచి ఆగుతూ సాగిన సదరు ప్రక్రియకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఏప్రిల్ 1 నుంచి జనగణన జరగనుండగా ఏర్పా ట్లు చేస్తున్నారు. ఎన్యుమరేటర్లుగా ఉపాధ్యాయులను నియమించనుండగా మాస్టర్ ట్రైనర్లుగా 34 మంది ప్రొఫెసర్లను ఎంపిక చేశారు. వారికి మార్చి 5 నుంచి హైదరాబాద్లో శిక్షణ జరగనుంది. సదరు ట్రైనర్లతో జిల్లాలో ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణనివ్వనున్నారు. ఫీల్డ్ ట్రైనర్లుగా జూనియర్ లెక్చరర్లను ఎంపిక చేశారు. ఇప్పటికే బ్లాకులుగా విభజించిన అధికారులు ఇళ్లు, కట్టడాల వివరాలతో పాటు సౌకర్యాల వివరాలను నమోదు చేయనున్నారు. ఇక సదరు ప్రక్రియ అంతా స్మార్ట్ఫోన్లోనే జరగనుండగా ఇంటర్నెట్ లేకున్నా యాప్ పని చేయనుంది. మున్సిపాలిటీల్లో పెరిగిన బ్లాకులు జనగణనలో నివాసాల సంఖ్యను బట్టి ఎన్యుమరేటర్ బ్లాక్ను నిర్ణయిస్తారు. 120– 150 నివాసాలను ఒక బ్లాక్గా విభజించగా సదరు బ్లాక్కు ఒక ఎన్యుమరేటర్ను నియమిస్తారు. ఈ క్రమంలో బ్లాకుల సంఖ్య మున్సిపాలిటీల్లో పెరగగా పలు మండలాల్లో సంఖ్య తగ్గింది. కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో గ్రామాలను విలీనం చేయగా రూరల్ మండలాల్లో గ్రామాల సంఖ్య తగ్గింది. దీంతో పట్టణాల్లో బ్లాకుల సంఖ్య పెరగగా మండలాల్లో తగ్గింది. అత్యధికంగా కరీంనగర్లో బ్లాక్ల సంఖ్య ఉంది. గత జనగణనలో 388 బ్లాకులుగా లెక్కించగా ఈ సారి 808కి చేరింది. అంటే 420 బ్లాక్లు పెరిగాయన్న మాట. జమ్మికుంటలో గతంలో 139 బ్లాక్ల్లో గణన జరగగా ఈ సారి 83కు పరిమితమైంది. అలాగే హుజూరాబాద్ రూరల్లో 124 బ్లాక్లు కాగా 79కు చేరింది. రెండేసి సార్లు పరిశీలన స్మార్ట్ఫోన్లో జనగణన యాప్ డౌన్లోడ్ చేసుకుని వివరాలను నమోదు చేయనున్నారు. యాప్ను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఇంటర్నెట్ ఉండాలి. ఇంటింటికి వెళ్లి వివరాలను నమోదు చేసే సమయంలో అవసరం లేదు. వివరాలన్నీ ఆన్లైన్లోనే నమోదు చేయాలి. వాటిని అప్లోడ్ చేసే సమయంలో మళ్లీ ఇంటర్నెట్ అవసరం ఉండనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యలు ఎదురవుతుండటంతోనే ఆఫ్లైన్ వివరాల నమోదుకు అవకాశం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో జనగణన కార్యక్రమం చేపట్టనుండగా ఎన్యుమరేటర్లకు జనవరి, ఆ తదుపరి రెండు దశల్లో శిక్షణనిస్తారు. ఎన్యుమరేటర్ తనకు కేటాయించిన ప్రాంతంలోని ఇళ్లకు రెండు దశల్లో వెళ్లి వివరాలు నమోదు చేయాలి. వచ్చే ఏప్రిల్ నుంచి సెప్టెంబరులోగా మొదటి దశ కింద ప్రతి ఇల్లు, కట్టడం వివరాలన్నీ సేకరించనుండగా రెండో దశలో వ్యక్తిగత వివరాల సేకరణ కార్యక్రమం 2027 ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు. జిల్లాలో 316 గ్రామ పంచాయతీలు, 4 మునిసిపాలిటీలుండగా 2.62లక్షల నివాసాలున్నాయి. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో నిర్మాణమైన కొత్త భవనాలను పరిగణలోకి తీసుకున్నారు. ఎన్యుమరేటర్లుగా ఉపాధ్యాయులను తీసుకోనున్నారు. ఆరుగురు ఎన్యుమరేటర్లకు ఒక పర్యవేక్షకుడిని నియమించనుండగా పర్యవేక్షకులుగా స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం, యంఆర్సీలను నియమించనున్నారు. -
ఎద్దులపై పెద్దపులి దాడి
మేడిపల్లి: భీమారం మండలం మోత్కురావుపేటతోపాటు చుట్టుపక్కల ప్రజలకు పెద్దపులి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఐదు రోజులుగా మోత్కురావుపేట పరిసరాల్లో సంచరిస్తూ.. మూగజీవలపై దాడి చేస్తోంది. శనివారం గ్రామానికి చెందిన ఎనుగుల గంగారాం మూడు ఎద్దులపై దాడికి పాల్పడింది. ఆ ప్రాంతంలో చాలా మూగజీవాలు ఉండడం.. అవి గట్టిగా అరవంతో పులి పారిపోయిన ఆనవాళ్లు ఉన్నాయని గంగారాం తెలిపారు. ఘటన స్థలాన్ని పశువైద్యులు వెన్నెల, శ్రీనివాస్ పరిశీలించి గాయపడిన మూగజీవాలకు చికిత్స అందించారు. అటవీశాఖ అధికారులు ఘటన స్థలాన్ని సందర్శించారు. పాదముద్రలు, ఎద్దులపై ఉన్న గాయాలు పరిశీలించి పెద్దపులిగా నిర్ధారించారు. కొడిమ్యాల ఎఫ్ఆర్వో మోయినొద్దీన్, మెట్పల్లి ఎఫ్ఆర్వో పద్మారావు, గోవిందారం ఎఫ్ఎస్వో సుబ్బారావు, బీట్ ఆఫీసర్లు ఫిరోజ్, రాజేశం, టైగర్ మానిటరింగ్ టీం సభ్యులు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. -
కుట్ర కేసు!
తెరపైకి మావోలసాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆపరేషన్ కగార్తో దేశంలో మావోయిస్టు ఉద్యమం దాదాపుగా ముగిసింది. మావోయిస్టు అగ్రనేత, మాస్టర్మైండ్ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి మినహా పార్టీ కీలక నేతలంతా డీజీపీ శివధర్రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఒకప్పుడు తుపాకీ తూటాతోనే సమసమాజం వస్తుందని, దాడులతో ప్రభుత్వాన్ని కూలదోయవచ్చన్న ఆలోచనతో దేశవ్యాప్తంగా అనేకమంది ప్రజాప్రతినిధులను, పోలీసులను గెరిల్లా దాడులతో మట్టుబెట్టిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలపై 2008లో కరీంనగర్లో రాజద్రోహం కేసు నమోదైంది. మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్య కేసు దర్యాప్తులో భాగంగా మల్లా రాజిరెడ్డిని పట్టుకున్న పోలీసులకు దేశవ్యాప్తంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న అనేక దాడులకు సంబంధించిన కుట్ర విధానం తెలిసింది. దీంతో కరీంనగర్ పోలీసులు మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతితో సహా 32 మందిపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ– 28గా ఉన్న అమిత్బక్షీకి తాజాగా బెయిల్ రావడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. నేరాంగీకార పత్రంలో ఏముంది? మల్లా రాజిరెడ్డి కరీంనగర్ పోలీసులకు ఇచ్చిన నేరాంగీకార పత్రంలో తాము తుపాకీ తూటాలతో హింసామార్గంలో రాజాన్ని ఎలా కూలదోయాలనుకుంటున్న విషయాన్ని వెల్లడించాడు. ఆ సమయంలో మల్లా రాజిరెడ్డి మావోయిస్టు పార్టీలో సెంట్రల్ కమిటీ సభ్యుడు, పొలిట్బ్యూరో మెంబర్తోపాటు దేశంలోని నైరుతీ ప్రాంతానికి (మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్)లకు కార్యదర్శిగా ఉన్నాడు. అందులో భాగంగానే తాము అప్పటి మాజీమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి, మాజీస్పీకర్ శ్రీపాదరావు, ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, ఐపీఎస్ ఆఫీసర్లు ఉమేశ్ చంద్ర, పరదేశీ నాయుడులను కాల్చిచంపినట్లు తెలిపాడు. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మంత్రి రాజ్యలక్ష్మీ కాన్వాయ్లపై దాడులు అందులో భాగమేనని వివరించాడు. ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, ఒడిశాలలోని పోలీసుస్టేషన్లపై దాడులు చేసి వందలాది ఆయుధాలు తస్కరించిన విధానాన్ని పేర్కొన్నాడు.అప్పట్లో పోలీసులు సెక్షన్ 120, 121, 121 (ఏ) ఐపీసీలతోపాటు 25, 27, 35 ఆర్మ్స్ యాక్ట్, ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్సెస్ యాక్ట్ సెక్షన్ 3, 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో ముప్పాల లక్ష్మణ్ రావు, మల్లోజుల కోటేశ్వర్ రావు, ప్రమోద్ మిశ్రా, కటకం సుదర్శన్, అక్కిరాజు హరగోపాల్, చెరుకూరి రాజ్కుమార్, నంబాల కేశవరావు, మల్లోజుల వేణుగోపాల్, కోబాడ్ గాంధీ, ప్రశాంత్ బోస్, రాజేష్, జనార్ధన్, తిప్పిరి తిరుపతి, చంద్రయ్య యాదవ్, రంజిత్ బోస్, సుమిత్, గజానంద్, లంక పాపి రెడ్డి, జినుగు నర్సింహరెడ్డి, జంతు ముఖర్జీ, జస్పాల్ సింగ్, వారణాసి సుబ్రహ్మణ్యం, రోహిత్, ఆశుతోష్ కుమార్ సింగ్, భాస్కర్, కృష్ణన్ శ్రీనివాస్, సుమనంద్ సింగ్, కుప్పు దేవరాజు, మోహన్, అఖిలేష్ జాదవ్, దేవ్ కుమార్ సింగ్, జనార్దన్ను నిందితులుగా పేర్కొన్నారు. -
వికసిత్ భారత్లో యువత కీలకం
సప్తగిరికాలనీ(కరీంనగర్): వికసిత్ భారత్– 2047 ద్వారా అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చెందడంలో యువత కీలకపాత్ర పోషిస్తుందని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. శనివారం ఎస్సారార్ కళాశాలలో ‘50ఏళ్ల అత్యవసర పరిస్థితి నేర్చుకోవలసిన పాఠాలు’ అంశంపై వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 జిల్లాస్థాయి ఉపన్యాస పోటీలను ప్రారంభించి మాట్లాడారు. భారతదేశం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని, త్వరలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కలువకుంట్ల రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి నైపుణ్యమే వికసిత్ భారత్ లక్ష్యమని దానికి అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవాలన్నారు. ఎన్వైకే కో ఆర్టినేటర్ వెంకట రాంబాబు, వైస్ ప్రిన్సిపాల్స్ నితిన్పాఠక్ , టి.రాజయ్య, కడారు సురేందర్రెడ్డి, వికసిత్ భారత్ నోడల్ జిల్లా అధికారి ఎలిజబెత్ రాణి, పరీక్షల నియంత్రణాధికారి టి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ప్రమాదమా..హత్యా ?
ముస్తాబాద్(సిరిసిల్ల): అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన సంఘటనపై పలు అనుమానాలు కలుగుతున్నయి. ప్రమాదమా లేక ప్రణాళిక ప్రకారమే హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. యువకుడి మృతికి కారకులను పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్కు చెందిన బొమ్మెన చందు(22) ఫిబ్రవరి 22న అర్ధరాత్రి గూడెంలో జరిగిన పెండ్లి బబరాత్కు వెళ్లాడు. బైక్పై తిరిగి ఇంటికెళ్తుండగా చందును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. గమనించిన స్థానికులు అంబులెన్స్లో సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే చందు మృతిచెందాడు. ఈ సంఘటనపై పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు తెలిసినట్లు సమాచారం. సీఐ మొగిలి ఆధ్వర్యంలో చేపట్టిన విచారణలో ముస్తాబాద్కు చెందిన ఆటో చందును ఢీకొట్టినట్లు గుర్తించారు. బైక్పై ఉన్న చందును ప్రమాదవశాత్తు ఢీకొట్టిన అనంతరం.. మరోసారి చందును ఆటోతో ఢీకొట్టినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆటోలో ఉన్న నిందితులకు ఇప్పటికే పలు నేరాలతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ కోణంలో కూపీ లాగుతున్నట్లు సమాచారం. ఒక్కాగానొక్క కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఎల్లం, అనితలు కొడుకు చందు జ్ఞాపకాలతో తల్లడిల్లుతున్నారు. ఈ విషయంపై సీఐ మొగిలి మాట్లాడుతూ విచారణ కొనసాగుతోందని త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతిపై పోలీసుల ఆరా పోలీసుల అదుపులో నిందితులు? -
రోడ్డు కబ్జా వివాదం
రామచంద్రాపూర్కాలనీలో వివాదాస్పద స్థలంఆధారాలు చూపుతున్న మాజీ కార్పొరేటర్ రమణకరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని రామచంద్రాపూర్ కాలనీలో రోడ్డు కబ్జా వివాదం కలకలం సృష్టిస్తోంది. కాలనీలో రోడ్డును కార్పొరేటర్ భర్త కబ్జా చేశారని, మాజీ కార్పొరేటర్ ఆరోపిస్తుండగా, అది తాము కొనుగోలు చేసిన స్థలమని కార్పొరేటర్ భర్త అంటున్నారు. నగరపాలకసంస్థ 12వ డివిజన్ రామచంద్రాపూర్కాలనీలోని సర్వే నెంబర్ 961/ ఏలో 188 గజాల స్థలాన్ని స్థానిక కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ భర్త, బీజేపీ నాయకుడు చొప్పరి వేణు కబ్జా చేశాడని, మాజీ కార్పొరేటర్, బీఆర్ఎస్ నాయకుడు ఎ.వి.రమణ ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేశాడు. ఈ స్థలంలో డెడ్ ఎండ్ రోడ్డు ఉండగా, ఆ రోడ్డును ఆక్రమించి ఇల్లు నిర్మించుకొన్నారని ఆరోపిస్తున్నాడు. కొంతమంది నగరపాలకసంస్థ అధికారులతో కుమ్మకై ్క అక్రమ నిర్మాణానికి ఇంటినంబర్ 8–3–286/ఏ తీసుకున్నాడంటున్నాడు. ఆ ఇంటి నంబర్ ఆధారంగా డాక్యుమెంట్ నం.243/2018 సృష్టించుకొని రూ.15 లక్షల రుణం పొందారని, చర్యలు తీసుకోవాలంటున్నాడు. బండి సంజయ్ చర్యలు తీసుకోవాలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ముందుగా తన చుట్టు ఉన్న అక్రమార్కులపై చర్యలు చేపట్టాలని ఎ.వి.రమణ డిమాండ్ చేశాడు. శనివారం నగరంలో మాట్లాడుతూ రామచంద్రాపూర్ కాలనీలో రోడ్డును కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ భర్త చొప్పరి వేణు కబ్జాచేశాడని ఆరోపించాడు. రోడ్డు కబ్జా చేసిన కార్పొరేటర్తో రాజీనా మా చేయించి, పార్టీ నుంచి బర్త్రఫ్ చేసి నిజాయితీ నిరూపించుకోవాలని కోరారు. రోడ్డు కాదు...కొనుగోలు చేసిన స్థలమే... రామచంద్రాపూర్కాలనీలోని స్థలం మేం గతంలో కొనుగోలు చేసిందే. అది రోడ్డు కాదు. పట్టేదారు నుంచి గతంలోనే మేం ఆ స్థలాన్ని కొనుగోలు చేశాం. రోడ్డును కబ్జా చేశామనడం సరికాదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. – కార్పొరేటర్ భర్త చొప్పరి వేణు -
మెరుపుదాడులు చేస్తున్నారు
దోహఖతర్లో వైమానిక స్థా వరాలను టార్గెట్గా చేసుకు ని ఇరాన్ శనివారం మధ్యాహ్నం నుంచి మెరుపుదాడులు చేస్తున్నారు. ఇక్కడి ప్రభుత్వం అప్రమత్తమై కార్మికులందరినీ పనులు రద్దు చేసి క్యాంప్లకు తరలించింది. మెరుపుదాడులతో తెలంగాణ కార్మికులంతా భయంభయంగా గడుపుతున్నాం. – జీవన్రెడ్డి, దోహఖతర్ దుబాయ్లో ఇరాన్ దాడులు చేస్తుండటంతో ఇక్కడి ప్రభుత్వం కొన్ని క్షిపణిలను గాలిలోనే పేల్చివేసింది. మరికొన్ని క్షిపణిలు పేలడంతో ప్రజలంతా భయాందోళన చెందుతున్నారు. దుబాయ్లోని ప్రధాన విమానాశ్రయాలను ప్రభుత్వం ముందస్తుగా మూసివేసింది. – ముకేశ్, దుబాయ్ దాడులు జరుగుతుండడంతో తెలంగాణ కార్మికులమంతా ఆందోళన చెందుతున్నాం. ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తుండటంతో ఇక్కడి ప్రభుత్వం ధీటుగా క్షిపణులను గాలిలో పేల్చేస్తూ ప్రమాదం జరగకుండా చర్యలు చేపడుతోంది. – గంగాధర్, దుబాయ్ -
కోల్బెడ్ మిథేన్పై సింగరేణి నజర్!
● 19 బిలియన్ క్యూబిక్ మీటర్ల మిథేన్ గ్యాస్ ● అన్వేషణకు వేలంలో పాల్గొనాలని కేంద్రం సూచన ● నాలుగు ఏరియాల్లో గ్యాస్ లభ్యతపై దృష్టి ● వేలం ద్వారా దక్కించుకునేందుకు కసరత్తు ● సింగరేణి సీఎండీతో ఏడీజీ భేటీగోదావరిఖని(రామగుండం): బొగ్గు అన్వేషణలో 13 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణి సంస్థకు బొగ్గు పొరలలో ఉన్న మిథేన్ గ్యాస్ వనరుల అన్వేషణకు అవకాశం లభించనుంది. కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల మంత్రిత్వ శాఖ సింగరేణి ప్రాంతంలో గుర్తించిన మూడు ప్రధాన బ్లాక్ల అన్వేషణలో పాల్గొనాల్సిందిగా ఆ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సింగరేణిని కోరారు. దేశవ్యాప్తంగా ఈ వాయువును ఉత్పత్తి చేయడానికి పలు రాష్ట్రాల్లో బ్లాక్లను గుర్తించారని, దీనిలో ప్రాణహిత–గోదావరి లోయ ప్రాంతం కూడా ఉందని, దీనికి సంబంధించి ముందుగా అన్వేషణ జరపడానికి త్వరలో కేంద్ర పెట్రోలియం శాఖ వేలం నిర్వహించబోతోంది. సింగరేణి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సింగరేణి ప్రాంతంలోని మంచిర్యాల, పెద్దపల్లి, కొమరమ్భీమ్ ఒక బ్లాక్, భద్రాద్రి కొత్తగూడెంలో ఒక బ్లాక్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు కలిపి ఒక బ్లాక్గా గుర్తించారు. ఆయా బ్లాక్లలో దాదాపు 19 బిలియన్ క్యూబిక్ మీటర్ల మిథేన్ గ్యాస్ వనరుల లభ్యత ఉన్నట్లు ప్రాథమిక అంచనా వేశారు. వికసిత్ భారత్– 2047లో భాగంగా చమురు, ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధిని సాధించడంలో అంతర్భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కోల్ బెడ్ మీథేన్ (సీబీఎం) బొగ్గు పొరల్లో సహజంగా ఉండే మీథేన్ గ్యాస్. భద్రతా కారణాల వల్ల ఇప్పటివరకు ప్రమాదకరంగా భావించిన ఈ గ్యాస్ను, సాంకేతిక పరిజ్ఞానంతో వాణిజ్యపరంగా ఉపయోగించుకునే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. గోదావరిలోయలో నిల్వలు సింగరేణి కార్యకలాపాలు ప్రధానంగా గోదావరిలోయ బొగ్గు క్షేత్రాల్లో సాగుతున్నాయి. భూగర్భ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం లోతైన బొగ్గు పొరలున్న ప్రాంతాల్లో మీథేన్ నిల్వలు ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మీథేన్ గ్యాస్ ప్రాధాన్యం? శుభ్రమైన ఇంధనం బొగ్గుతో పోలిస్తే తక్కువ కాలుష్యం ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తారు. పరిశ్రమలకు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగ పడుతుంది. సీఎన్జీ తరహా ఇంధనంగా వాడే అవకాశముంది. అండర్గ్రౌండ్ గనుల్లో ప్రమాదాలను తగ్గించే భద్రతాపరంగా ప్రయోజనం ఉంటుంది. ఇప్పటి వరకు గనుల్లో మీథేన్ ప్రమాదకర గ్యాస్గా భావించబడింది. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఇదే గ్యాస్ను శక్తి వనరుగా ఉపయోగిస్తున్నారు. సింగరేణి సంస్థకు సానుకూల అంశంగా మారే అవకాశాలున్నాయి. సాంకేతిక– పరిపాలనా సవాళ్లు మిథేన్ గ్యాస్ వెలికితీతకు సింగరేణి సంస్థకు ప్రత్యేక డ్రిల్లింగ్ సాంకేతికత అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ, పర్యావరణ అనుమతులు, భారీ పెట్టుబడులు అవసరం ఉంటాయి. గ్యాస్ నిల్వల కచ్చిత అంచనా కోసం జియోలాజికల్ సర్వేలుంటాయి. తెలంగాణకు లాభాలేమిటి? రాష్ట్రానికి కొత్త ఆదాయ వనరుగా ఉపయోగపడనుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. పరిశ్రమలకు తక్కువ ధరకు ఇంధనం లభించే అవకాశం ఉంది. శక్తి స్వావలంబనలో ఒక ముందడుగు పడనుంది. మిథేన్గ్యాస్ అన్వేషణతో కొత్తశకం.. సింగరేణి సంస్థ ఇప్పటికే బొగ్గు ఉత్పత్తితో పాటు సోలార్, థర్మల్ విద్యుత్ రంగాల్లో ముందుకు సాగుతోంది. అంతేకాకుండా హైడల్, హైడ్రో విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందిస్తోంది. సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తే, బొగ్గు ఆధారిత సంస్థ నుంచి బహుళశక్తి వనరుల సంస్థగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. సింగరేణిలో మిథేన్గ్యాస్ వెలికితీత ఒక సాంకేతిక సవాలు అయినా, సమర్థవంతమైన ప్రణాళికతో అమలు చేస్తే తెలంగాణకు ఇది శక్తి విప్లవానికి నాందికానుంది. తెలంగాణలో గుర్తించిన మిథేన్గ్యాస్ 19బిలియన్ క్యూబిక్మీటర్లు మంచిర్యాల, పెద్దపల్లి, కొమరమ్భీం జిల్లాల్లో: 5 బిలియన్ క్యూబిక్ మీటర్లు భద్రాద్రి కొత్తగూడెంలో ఒక బ్లాక్ : 2 బిలియన్ క్యూబిక్ మీటర్లు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు కలిపి ఒక బ్లాక్: 12 బిలియన్ క్యూబిక్ మీటర్లు మణుగూరు– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోతైన బొగ్గు పొరలు, అధిక వాయు విడుదల చరిత్ర ఉన్న ప్రాంతం. అండర్గ్రౌండ్ గనుల్లో గ్యాస్ సాంద్రత ఎక్కువగా నమోదైన సందర్భాలు ఉన్నాయి. కొత్తగూడెం బెల్ట్ పాత గనుల్లో గ్యాస్ నిల్వలు ఉండే అవకాశం. డీ–గ్యాసిఫికేషన్ ద్వారా గ్యాస్ను సురక్షితంగా వెలికితీయవచ్చు. గోదావరిఖని– రామగుండం (పెద్దపల్లి జిల్లా) లోతైన బొగ్గుగని నిర్మాణం, పెద్ద స్థాయి గనులు ఉండటంతో ప్రాజెక్టులకు అనుకూల వాతావరణం. బెల్లంపల్లి– మంచిర్యాల ప్రాంతం చారిత్రాత్మకంగా గ్యాస్ విడుదల ఎక్కువగా నమోదైన గనులు. అన్వేషణ జరిపితే వాణిజ్యపరంగా ఉపయోగకరమైన నిల్వలు బయటపడే అవకాశం ఉంది. -
పరిశోధనాత్మక ఆలోచనలు ఉండాలి
కరీంనగర్ టౌన్: విద్యార్థులు పరిశోధనాత్మక ఆలో చనలతో ముందుకు సాగాలని అదనపు కలెక్టర్, డీఈవో అశ్విని తానాజీ వాకడే పిలుపునిచ్చారు. శని వారం సైన్స్ మ్యూజియంలో సీవీ రామన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి రోజువారీ జీవితంలో విజ్ఞానశాస్త్రం ఉపయోగాలను అవగాహ న చేసుకోవాలని సూచించారు. సర్ సీవీరామన్ కనుగొన్న రామన్ ప్రభావం గురించి వివరించి, దానికి గానూ ఆయన నోబెల్ బహుమతి అందుకున్నారని తెలియజేశారు. జిల్లా సైన్స్ అధికారి జయపాల్ రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి భగవంతయ్య, ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. దన్గర్వాడి స్కూల్ సందర్శన పీఎంశ్రీ దన్గర్వాడీ పాఠశాలను అడిషనల్ కలెక్టర్, డీఈవో అశ్వినీ తానాజీ వాకడే ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల, విద్యార్థులకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థుల అభ్యసనస్థాయిని పరీక్షించారు. ఏఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారనే విషయం తెలుసుకున్నారు. పలు వురు విద్యార్థులకు ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయని సిబ్బందిని తీవ్రంగా మందలించారు. -
నాటుబాంబు పేలి గేదెకు తీవ్ర గాయాలు
వీర్నపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లిలో శనివారం ఓ పొలంలో నాటుబాంబు పేలి పాడిగేదె తీవ్రంగా గాయపడింది. అడవి జంతువుల వేటకోసమే గుర్తుతెలియని వ్యక్తులు పొలంలో అమర్చి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు. మండలంలోని సీతారాంనాయక్ తండాకు చెందిన శ్రీనివాస్ పాడిగేదె శనివారం మేత కోసం పొలానికి వెళ్లింది. ఈక్రమంలోనే ఆ పొలంలో అడవి జంతువుల కోసం అమర్చిన నాటుబాంబును నోటితో కొరకడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. ఈ పేలుడు ధాటికి గేదె నోటి భాగం ఛిద్రమై తీవ్ర రక్తస్రావమైంది. భారీ శబ్దం రావడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. -
నకిలీ నోట్ల చెలామణి ముఠా అరెస్టు
లక్సెట్టిపేట: నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను లక్సెట్టిపేట పోలీసులు అరెస్టు చేశారు. 12మందిని అదుపులోకి తీసుకుని, రూ.5,98,500, మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. శనివారం స్థానిక పోలీసుస్టేషన్లో మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, సీఐ రమణామూర్తి వివరాలు వెల్లడించారు. ఇటిక్యాలకు చెందిన కానిగంటి క్రాంతి, గడికొప్పుల రవీందర్, శ్రీరాంపూర్కు చెందిన తాండ్ర ప్రకాశ్, వెంకట్రావుపేటకు చెందిన కోన మధుకర్, గోదావరిఖనికి చెందిన సుంక సురేశ్, సుల్తానాబాద్కు చెందిన కమాని అనిల్, రంగపేటకు చెందిన బండారి సత్యనారాయణ, లక్సెట్టిపేటకు చెందిన రామునాయక్, జెండావెంకటాపూర్కు చెందిన కందిమల్ల తిరుపతి, ధర్మారం మండలం పెరికపల్లికి చెందిన కుమారస్వామి, పట్టణంలోని మోదెల రోడ్కు చెందిన నగునూరి రాము, సిద్దిపేట జిల్లా బెజ్జంకికి చెందిన దేవనబోయిన సంపత్కుమార్ ముఠాగా ఏర్పడ్డారు. కాకినాడకు చెందిన రాము, రవి నుంచి నకిలీ నోట్లు తీసుకొచ్చి మండలంలోని పలు ప్రదేశాల్లో చెలామణి చేస్తున్నారు. ఫిబ్రవరి 25న ఇటిక్యాల వద్ద ఉన్న పెట్రోల్బంక్కు కొందరు కారులో వచ్చి రూ.1500 ఇచ్చి పెట్రోల్ పోయించుకుని వెళ్లారు. నకిలీ నోట్లుగా గుర్తించిన పెట్రోల్బంక్ సిబ్బంది పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. శనివారం ఇటిక్యాల గ్రామ స్టేజీ వద్ద వాహన తనిఖీలు చేపట్టి కారులో వెళ్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా 12మందిని అరెస్టు చేసి నగదు, కార్లు, 12 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. రాము, రవి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు ఛేదించిన స్థానిక ఎస్సై గోపతి సురేశ్, కానిస్టేబుళ్లను అభినందించారు. రూ.5,98,500, మూడు కార్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ -
భయం గుప్పిట్లో మనోళ్లు
ఆర్మూర్ /మోర్తాడ్ (బాల్కొండ)/ కొత్తపల్లి (కరీంనగర్): ఇరాన్పై యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్, బహ్రెయిన్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లలో ఉన్న తెలంగాణ వలస కార్మికులు, విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇజ్రాయెల్లో బాంబుల దాడులు సాధారణమే కానీ ఈసారి పరిస్థితి తీవ్రంగా ఉందని వలస కార్మికులు వెల్లడించారు. కాగా, యూఏఈ, ఖతర్, ఇతర గల్ఫ్ దేశాల్లో మాత్రం చాలా కాలం తరువాత తొలిసారి దాడులు జరుగుతుండటంతో వలస కార్మికులు తమ ప్రాణాలకు, ఉపాధికి ఎలాంటి ఇబ్బంది ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు దాడి చేయగా, ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్, బహ్రెయిన్, ఖతర్, యూఏఈలలో తెలంగాణ వలస కార్మికుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. టామ్కామ్తో పాటు ప్రైవేటు ఎజెన్సీల ద్వారా అనేక మంది వలస కార్మికులు ఇజ్రాయెల్కు వెళ్లి అక్కడ పనిచేస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో వలస కార్మికులు బంకర్లకు చేరుకున్నారని ఇజ్రాయెల్లోని పలువురు తెలంగాణ వాసులు వెల్లడించారు. కాగా, బహ్రెయిన్లో సురక్షిత ప్రాంతాల జాబితాను అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. జుబేర్ ప్రాంతంలో ఉన్న అమెరికన్ స్థావరాలపై శనివారం ఇరాన్ బాంబుల దాడి చేయడంతో పౌర నివాసాలపై కూడా ఆ ప్రభావం కనిపించింది. అక్కడి ప్రజలతో పాటు తెలంగాణ వలస కార్మికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులెత్తారు. ఖతర్, యూఏఈ, కువైట్లలోను భారత విదేశాంగ శాఖ వలస కార్మికుల రక్షణకు సూచనలు చేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల్లో ఉన్న తమ వారిని రక్షించాలని కార్మికుల కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భయం భయంగా దుబాయ్లో యుద్ధం నేపథ్యంలో దుబాయ్లోని తెలుగు విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. దుబాయ్, అబుదాబి, కువైట్, బహ్రెయిన్, ఖతార్లపై క్షిపణి దాడులు జరుగుతున్నట్లు వార్తలు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దుబాయ్లో ఉన్న తెలుగువారిని వాకబు చేస్తూ తమ పిల్లల క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇంజనీరింగ్ చదివేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది విద్యార్థులు బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్కు వెళ్లారు. శనివారం మధ్యాహ్నం వరకు పరిస్థితులు బాగానే ఉండగా సాయంత్రం నుంచి కొంత ఆందోళనకరంగా మారిందని చెపుతున్నారు. కాగా, యుద్ధ ప్రాంతాల్లోని భారతీయులను రక్షించేందుకు తగిన చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. -
భార్య ఉండగా మరో పెళ్లి చేసుకున్న అనిల్..!
జగిత్యాలక్రైం: భార్య, మూడేళ్ల కూతురు ఉండగా విడాకులు తీసుకోకుండానే మరో యువతిని ప్రేమ పేరుతో వివాహం చేసుకున్న వ్యక్తిపై ఆమె కుటుంబ సభ్యులు దాడిచేసిన ఘటన శుక్రవారం రాత్రి జగిత్యాల పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీలో సఖీ కేంద్రం వద్ద జరిగింది. వివరాలు.. మల్యాల మండలం లంబాడిపలి్లకి చెందిన అనిల్, ఇదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకోగా, వీరికి మూడేళ్ల కూతురు ఉంది. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుండగా, అనిల్ కరీంనగర్ మండలానికి చెందిన యువతిని ప్రేమపేరుతో వంచించి ఈనెల 21న పెళ్లి చేసుకున్నాడు. విషయం ఆమె కుటుంబసభ్యులకు తెలియడంతో మల్యాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అనిల్ను, పెళ్లి చేసుకున్న యువతిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. కాగా, అనిల్కు భార్య, కూతురు ఉందని తెలియడంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని పోలీసులు జగిత్యాల సఖీ కేంద్రానికి తరలించారు. శుక్రవారం సాయంత్రం సఖీ కేంద్రానికి యువతి కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకోగా కేంద్రం నిర్వాహకులు ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా అనిల్ వెళ్లి గొడవకు పాల్పడ్డాడు. దీంతో అక్కడే ఉన్న యువతి కుటుంబ సభ్యులు, బంధువులు అనిల్పై దాడి చేశారు. పట్టణ సీఐ కరుణాకర్, ఎస్సై సదాకర్, కుమారస్వామి ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన అనిల్ను జగిత్యాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తరలించారు. అనిల్ తల్లి దేవమ్మ ఫిర్యాదు మేరకు ఆరుగురితో పాటు, మరికొంత మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పట్టణసీఐ తెలిపారు. కాగా, కులాంతర వివాహం చేసుకోవడం వల్లే దాడి జరిగిందని వదంతులు రావడంతో పోలీసులు అప్రమత్తమై లోతైన విచారణ చేపట్టగా అసలు విషయాలు వెలుగుచూశాయి. అనిల్కు భార్య, కూతురు ఉండగా ప్రేమ వివాహం చేసుకోవడం చట్టరీత్య నేరం కావడంతో యువతికి సఖీ కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. -
మావోయిస్టు గణపతి!
అలసిన దళపతి.. సాక్షి,కరీంనగర్ డెస్క్: మావేయిస్టు నేత.. లక్ష్మణ్రావు 1949 జూన్ 16న బీర్పూర్లో జన్మించారు. 5వ తరగతి వరకు బీర్పూర్, 7వ తరగతి వరకు అదే జిల్లాలోని తుంగూర్లో చదువుకున్నారు. పీయూసీ జగిత్యాలలో, కరీంనగర్లో డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొలువు రావడంతో మొదట ప్రస్తుత పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో పనిచేశారు. సైన్స్, లెక్కలు, ఇంగ్లిష్ సబ్జెక్టులు బోధించారు. ఎలగందుల, మేడిపల్లి మండలం గోవిందారంలో విధులు నిర్వహించారు. ఇదే సమయంలో పెద్దపల్లి మండలం రాగినేడుకు చెందిన సరస్వతిని పెళ్లి చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు జన్మించాడు. 1972–73లో బీఈడీ ట్రైనింగ్ కోసం వరంగల్ వెళ్లి అక్కడి నుంచి అటే అజ్ఞాతబాట పటారు. ఉపాధ్యాయుడిగా పిల్ల లకు చదువు నేర్పిన గణపతి.. ఉద్యమంలో విప్లవపాఠాలు నేర్పారు.ముప్పాళ్ల లక్ష్మణ్రావు టీచర్గా పనిచేసిన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు ప్రభుత్వ పాఠశాలఉపాధ్యాయుడిగా గణపతి తీసుకున్న జీతం.. రిజిష్టర్లో ఆయన సంతకంబీర్పూర్లో మావోయిస్టులు నిర్మించిన అమరవీరుల స్తూపంటీవీలో చూసి.. 2004లో దేశంలో అనేక రాష్ట్రాలలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు విస్తరింపజేశారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆయనపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రివార్డులు ప్రకటించాయి. జగిత్యాల జైత్రయాత్రలో పాల్గొన్న లక్ష్మణ్రావు ఉరఫ్ గణపతి పీపుల్స్వార్లో కొండపల్లి, కేజీ సత్యమూర్తి, కిషన్జీ తర్వాతి స్థానంలో ఉండేవారు. వ్యూహాలు.. ప్రతి వ్యూహాలు రచించడంలో ముందుండే ఆయనను అగ్రనేతగా కొనసాగాలని కోరడంతో పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్నారు. అందరికంటే ఎక్కువ కాలం 25 ఏళ్లపాటు కేంద్ర కమిటీ కార్యదర్శిగా గణపతి పనిచేయడం విశేషం. మావోయిస్టు గణపతి 2010లో నక్సల్స్ దళాలను ఉద్దేశించి ప్రసగించిన వీడియో అప్పట్లో కొన్ని టీవీ చానళ్లలో ప్రసారమైంది. గణపతి ఇలా ఉంటారా? అంటూ బీర్పూర్ పరిసర గ్రామాల ప్రజలు ఆసక్తిగా చూశారు. అప్పటి వీడియో, ఫొటోలే ఇప్పడు మీడియాలో వస్తున్నాయి. జగిత్యాల జైత్రయాత్రతో.. జగిత్యాల పట్టణంలో 1978 సెప్టెంబర్ 9వ తేదీన జగిత్యాల జైత్రయాత్ర చేపట్టారు. జైత్రయాత్ర తర్వాతే రైతుకూలి సంఘం కొండపెల్లి సీతారామయ్య నేతృత్వంలో పీపుల్స్వార్గా ఆవిర్భవించింది. ఇదే ప్రయోగశాలగా మారి దేశంలో 17 రా ష్ట్రాల్లో ఉద్యమ వ్యాప్తికి దోహదపడింది. అప్పుడు ఈ యాత్రలో దాదాపు 3.50 లక్షల మంది పాల్గొన్నారు. ‘దున్నేవాడికే భూమి’ అంటూ జగిత్యాల పుర వీధుల గుండా భారీ ఊరేగింపు నిర్వహించి స్థానిక ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్లో బహిరంగసభ నిర్వహించారు. మావోయిస్టు అధినేత ముప్పాళ్ల లక్ష్మణ్రావు ఉరఫ్ గణపతి, మల్ల్లోజుల కోటేశ్వర్రావు, మాదాసు వేణుగోపాల్రావు, నల్లా ఆదిరెడ్డి, శీలం నరేశ్, ముంజీం రత్నయ్య, భైరి గంగారాం, అంగె ఓదెలు తదితర నేతలు పాల్గొన్నారు. బహిరంగసభలో ప్రజాయుద్ద నౌక గద్దర్ గజ్జెకట్టి ఆడిపాడారు. అలా.. మొదలైన తిరుగుబావుట దండకారణ్యంలోని జనతన సర్కార్ నిర్మాణం వరకు కొనసాగింది. 1992 వరకు కొండపల్లి సీతారామయ్య నడిపించిన పీపుల్స్వార్ పార్టీకి గణపతి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికై 2004లో బిహార్ మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ వరకు సాగింది. సీపీఐ మావోయిస్టుగా ఏర్పడ్డ తర్వాత కూడా గణపతి దళపతిగా కొనసాగారు.ఆపరేషన్ కగార్తో ఫినిషింగ్ టచ్ఐదు దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉంటున్న బడి పంతులు ఇప్పుడు అనారోగ్యంతో అలిసిపోయారు. పాతికేళ్లుగా మావోయిస్టు పార్టీకి కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసిన గణపతి.. వయోభారంతో నడవలేని స్థితిలో సతమతమవతున్నట్లు తెలిసింది. చూపు మందగించి.. జ్ఞాపకశక్తి సరిగాలేదని తెలుస్తోంది. అయితే ఆపరేషన్ కగార్ ఫినిషింగ్ టచ్ గణపతితో పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ గణపతి లొంగిపోయినా.. అరెస్టు అయినా ఓ సంచలనమే.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమే.!1977లోనే తొలి పోలీసు కేసు.. పీపుల్స్వార్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య ఆధ్వర్యంలో 1975–76లో ఇప్పటి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్లోని భూస్వామి పితంబర్రావుతోపాటు కుటుంబ సభ్యులను నక్సల్స్ హతమార్చారు. ఈ ఘటనలో అదే జిల్లా కలమడుగు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ హత్యతో ప్రమేయం ఉందని అప్పట్లో పోలీసులు 16 మందిపై కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో ఏ–1గా కొండపల్లి సీతారామయ్యను, ఏ–8గా ముప్పాల లక్ష్మణ్రావును పేర్కొన్నారు. 1977లో గణపతిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిజామాబాద్ జైలులో శిక్ష అనుభవించిన గణపతి మూడు నెలల తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ లేదు. -
పశువులకు గ్రాసం కరువు
మంథనిరూరల్: వర్షాకాలంలో సాగు చేసిన వరి.. కోసిన తర్వాత వచ్చేగడ్డినే పశువులు ఎక్కువగా ఇస్టపడతాయి. ఒకప్పుడు కూలీలతో పైరు కోస్తే పొలంలో ఉండే గడ్డి మోపులుగా కట్టేందుకు వీలుండేది. ఇలాంటి గడ్డిని ఇంటికి తీసుకొచ్చి వాముగా పేర్చేవారు. ఏడాదంతా పశువులకు మేతగా వేసేవారు. కాలక్రమేణా హార్వేస్టర్లతో కోతలు మొదలు పెట్టడంతో గడ్డిసేకరణ తగ్గిపోయింది. వానాకాలంలో చైన్ హార్వేస్టర్లతో కోతలు చేపట్టడంతో వరిగడ్డి పూర్తిగా పనికిరాకుండా పోతోంది. ఈసారి కూడా పశువులకు సరిపడా వరిగడ్డి లభించేలా లేదని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు.. వరదలు మొన్నటి వానాలంలో భారీ వర్షాలతో వరిపంట పెద్దఎత్తున దెబ్బతిన్నది. పొట్ట, కోత సమయంలో తుపాన్ ప్రభావంతో వేల ఎకరాల్లో పంట నేలవాలింది. వందల ఎకరాల్లో పైరు నీటిలోనే పడిపోయింది. పైరు నీటిలో నాని అక్కరకు రాకుండాపోయిందని రైతులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఏటా వరి మాత్రమే సాగు చేయడం, ఇతర పంటలపై మొగ్గు చూపకపోవడం కూడా పశుగ్రాసం కొరతకు కారణమవుతుందని అంటున్నారు. చైన్ హార్వెస్టర్లో తుక్కుతుక్కు సాధారణ హార్వెస్టర్తో వరిపైరు కోస్తే వరిగడ్డి మామూలుగా వస్తుంది. కానీ చైన్హార్వెస్టర్తో కోస్తే పూర్తిగా తుక్కుతుక్కు అవుతుందని రైతులు చెబుతున్నారు. ఈసారి కోత సమయంలో పొలాల్లో నీరు, బురద ఉండడంతో అత్యధిక శాతం మంది రైతులు చైన్ హార్వెస్టర్లతోనే కోతలు కోయించారు, దీంతో వరిగడ్డి కొరత ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఊళ్లలో కనిపించని గడ్డివాములు పెద్దపల్లి జిల్లాలోని అనేక గ్రామాల్లో పశువులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. వ్యవసాయం ఎక్కువగా చేసే గ్రామాల్లో పశువులను పెంచుకోవడం అలవాటుగా ఉంటుంది. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా బర్రెలు, ఎద్దులు, ఆవులు అధికంగానే ఉన్నాయి. ఈ క్రమంలో పశువుల మేత కోసం కోతలు ముగిశాక ఎడ్లబండ్లలో గడ్డిని ఇంటికి తరలించి వాములు ఏర్పాటు చేసుకునేవారు. ప్రతీరైతు పెరట్లో గడ్డివాము దర్శనమిచ్చేది. ఈసారి ఏ రైతు ఇంట్లో గడ్డివాము కనిపించడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తామనుకున్నా అక్కడ సైతం కొరత ఉందని రైతులు చెబుతున్నారు. వర్షాలు, వరదలతో దెబ్బతిన్న వరి చైన్ హార్వేస్టర్లతోనే కోతలు అక్కరకు రాకుండాపోతున్న గడ్డి గ్రామాల్లో కనుమరుగవుతున్న వాములు ఆందోళన వ్యక్తం చేస్తున్న పశుపోషకులు -
గడ్డి మందు.. పల్లెల్లో బంద్
జగిత్యాలఅగ్రికల్చర్: పొలాల్లో కలుపు మొక్కలను చంపేందుకు వాడుతున్న గడ్డి మందు ఇప్పుడు మ నుషులు చావడానికి కారణమవుతోంది. రైతు కు టుంబాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా గడ్డి మందే వా రికి పరామన్నంగా మారుతోంది. చాలా కుటుంబా లను ఆర్థికంగా, సామాజికంగా చిన్నాభిన్నం చేస్తుంది. ఇటీవల కాలంలో గడ్డిమందును నిషేధించాలని ఒకవైపు వైద్యులు, మేధావులు కోరుతుంటే, మరో వైపు తమ గ్రామాల్లో గడ్డిమందును నిషేధిస్తున్నమంటూ స్వచ్ఛందంగా గ్రామపంచాయతీ కమిటీలు తీర్మానాలు చేయడం శుభపరిణామంగా మారింది. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్తోపాటు పలు గ్రామాల్లో గడ్డిమందును నిషేధిస్తూ తీర్మానాలు చేశారు. 60 శాతం గడ్డిమందుతోనే.. జగిత్యాల జిల్లాలో గతేడాది దాదాపు 340 మంది వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకోగా, అందులో 204 మంది (60 శాతం) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం బాధాకర విషయం. ఇందులో రైతు కుటుంబాలకు చెందినవారే 100కు పైగా మృత్యువాతపడ్డారు. కూలీల సమస్యతో పంట పొలాల్లో పెరిగిన కలుపు మొక్కలను తొలగించేందుకు గడ్డిమందును రైతులు వాడటం పరిపాటిగా మారింది. పంటలకు వాడిన తర్వాత అందులో కొంత మిగిలితే ఇంటికి తెచ్చి దాన్ని దాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగినా, పిల్లలను మందలించినా, ఆర్థిక పరిస్థితులతో క్షణికావేశంలో ఇంట్లో దాచిన గడ్డిమందే ఆత్మహత్య చేసుకునేందుకు ఆయుధంగా మార్చుకుని తనువు చాలిస్తున్నారు. బతకడం కష్టమే.. గడ్డి మందు అనేది కలుపు మొక్కలను ఎదగకుండా చేయడమే కాకుండా వాటి వేర్లతో సహా నాశనం చేస్తుంది. ఒక సెకనులో తీసుకున్న నిర్ణయం చివరకు జీవితాలను లేకుండా చేస్తుంది. చాలా కేసుల్లో గడ్డిమందు తాగినవారు హాయిగా ప్రాణం పోతుందనుకుంటారు. కానీ, గడ్డిమందు మనిషి శరీరంలోకి పోగానే రకరకాల రుగ్మతలకు లోనవుతారు. దీంతో ఆ బాధ భరించలేక గడ్డి మందు తాగామని, తమ కుటుంబీకులకు ఫోన్ల ద్వారా సమాచారం అందిస్తున్నారు. ఈక్రమంలో గ్రామాల నుంచి ఆసుపత్రులకు తరలించేసరికి అత్యంత ప్రభావంతమైన మందు శరీరంలో కలిసిపోతుంది. దీంతో స్పాంజ్ పద్ధతిలో ఉండే ఊపిరితిత్తులు గట్టిగా అవుతాయి. మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వైద్యులు ఎన్నిరకాల చికిత్స చేసినా ఆరోగ్యం సహకరించక అసువులు బాస్తున్నారు. గడ్డిమందు తాగేవారిలో దాదాపు 98 శాతం మృత్యువాత పడుతున్నారని వైద్యులు చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. అంతేకాకుండా చివరకు గడ్డిమందు పిచికారీ చేసిన పంటలను తిన్న పశువులు సైతం మృత్యువాత పడుతున్నాయి. ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాలు గడ్డిమందు తాగిన వ్యక్తులను ఎలాగైనా బతికించాలనే ఉద్దేశంతో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇటీవల కాలంలో కుటుంబసభ్యులను భయపెట్టడానికి కొంతమంది ఇతర క్రిమిసంహారక మందులు తాగుతున్నారు. ఆ మందు డబ్బాను వైద్యుడికి చూపించగానే, దాని నివారణ మందులను అందించి రోగి ప్రాణాలు కాపాడుతున్నారు. కానీ,, గడ్డిమందు తాగితే నివారణ మందులు పెద్దగా లేవు. ఒకట్రెండు రోజులు బతికినా ఆశలు పెద్దగా పెట్టుకోవద్దని వైద్యులు, కుటుంబసభ్యులకు ముఖం మీదే చెబుతున్నారు. కార్పొరేట్ వైద్యానికి రూ.లక్షలు ఖర్చు పెడుతున్నారు. అయితే, ఇటు మనిషి బతుకక, అటు డబ్బులు ఖర్చయిపోవడంతో కుటుంబాలు ఆర్థికంగా దిగజారుతున్నాయి. గ్రామాల్లో స్వచ్ఛందంగా నిషేధిస్తూ తీర్మానాలు 60 శాతం ఆత్మహత్యలు గడ్డిమందుతోనే.. రైతు కుటుంబాలవారే ఎక్కువ మంది మృత్యువాత -
ఆర్టీసీ బస్సు, కారు ఢీ
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని గూడెం శివారులోని మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు, కారు ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. కరీంనగర్కు చెందిన లక్కిరెడ్డి విజయ, తాటిపల్లి లహరిక కారులో ముస్తాబాద్కు వచ్చి శుక్రవారం తిరిగి వెళ్తున్నారు. గూడెం పెట్రోల్బంకు మూలమలుపు వద్దకు వెళ్లగానే ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈసంఘటనలో రిటైర్డు టీచర్ విజయ, లహరిక, కారు డ్రైవర్ సంతోష్ స్వల్పంగా గాయపడ్డారు. ఏఎస్సై అశోక్కుమార్ పరిశీలించి, ఇరువర్గాల ఫిర్యాదుతో కేసు విచారణ చేపట్టారు. అన్నదమ్ముల మధ్య గొడవ.. ఇద్దరిపై కేసువేములవాడరూరల్: తమ్ముడిపై అన్న దాడిచేసిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై మజీద్ తెలిపారు. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు. వేములవాడ రూరల్ మండలం బాలరాజుపల్లికి చెందిన నాగుల లక్ష్మణ్ ఆయన కుమారుడు రమేశ్ కలిసి తమ్ముడు నాగుల లక్ష్మణ్ను కొట్టారు. లక్ష్మణ్ ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య మేడిపల్లి: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు భరించలేక వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన భీమారం మండలం కమ్మరిపేట గ్రామంలో జరిగింది. ఎస్త్సె శ్రీధర్రెడ్డి తెలిపిన వివరాలు.. కమ్మరిపేటకు చెందిన గీతకార్మికుడు కోటగిరి రాజేందర్ గౌడ వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పొషించుకుంటున్నాడు. పదేళ్ల నుంచి కడుపునొప్పితో పాటు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దానికి తోడు ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో జీవితంపై విరక్తితో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్త్సె తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి మల్యాల: ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఆటోడ్రైవర్ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. నూకపల్లి డబుల్బెడ్రూంకు చెందిన గోనెపల్లి గంగాధర్(36) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం వేకువజామున ఆటో నడుపుకుంటూ జగిత్యాల వైపు వెళ్తుండగా, మల్యాల మండలం రాజారం శివారులో జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్కుమార్ తెలిపారు. మృతదేహాన్ని అనుమతించని ఇంటి యజమాని గోదావరిఖని: ద్వారకానగర్లో అద్దెఇంట్లో ఉంటున్న బాబుగౌడ్ తల్లి పద్మ గుండెపోటు తో శుక్రవారం రాత్రి మృతి చెందింది. అయి తే శవాన్ని ఇంట్లోకి తీసుకు వెళ్లగా.. యాజ మాని అంగీకరించలేదు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. -
కేంద్ర మంత్రి పూజలు
మల్యాల(చొప్పదండి): మండలంలోని లంబాడిపల్లిలో శ్రీపద్మావతి సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శనివారం స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపకుడు మరాటి సత్తయ్య తెలిపారు. సర్పంచ్ మరాటి సంధ్యరాణి, నాయకులు పాల్గొన్నారు. ‘మదర్ కంగారు’లో అసౌకర్యాలు కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లోని మదర్ కంగారు విభాగంలో ఏర్పాటు చేసిన ఫీడింగ్ రూమ్ నిర్లక్ష్యానికి గురవుతోంది. నవజాత శిశువుల సంరక్షణలో అత్యంత కీలకమైన ఎస్ఎన్సీయూ ఏర్పాటు చేసిన ఈ గదిలో మంచాలపై పరుపులు లేవు. బాలింతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సీలింగ్ ఫ్యాన్లు ఉండగా, ఒకటి అసలే పనిచేయడం లేదు. వాష్ బేసిన్ ట్యాప్ నుంచి నీళ్లు రావడం లేదు. పరి శుభ్రత లోపిస్తోంది. అసౌకర్యాలు వెంటాడుతు న్నాయి. గంటల తరబడి అక్కడ గడపాల్సి వస్తున్న బాలింతలు.. అసౌకర్యంతో వేదన చెందుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికై నా కనీస సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు. -
పొలాలకు పోయి తెచ్చుకుంటం
నాకు నాలుగు ఆవులు, నాలుగు బర్రెలు ఉన్నయ్. కోతలు పూర్తయినంక పొలాల్లోకి వెళ్లి ఎండుగడ్డి తెచ్చుకుంటం. ఊర్లలో రైతులను అడిగితే తీసుకోమంటరు. ఈసారి ఆ పరిస్థితి లేదు. చైన్ హర్వెస్టర్లతో కోసిన వరిగడ్డి చేతికి రాదు. తుక్కు అవుతుంది. పశువులకు వరిగడ్డి కష్టమయ్యేలా ఉంది. – అయిలి రాజమల్లు, ఖానాపూర్ ఎండుగడ్డి దొరికేలా లేదు పది పశువులకు ఎండుగడ్డే వేస్త. వర్షాలు, వరదలు ముంచేయడంతో పంటంతా దెబ్బతిన్నది. చైన్ హార్వెస్టర్లతో కోస్తే గడ్డిపనికి రాకుండా పోతుంది. రైతులు పొలాల్లోనే కాల్చివేస్తాండ్లు. పశువులు ఉన్నోళ్లు అక్కడక్కడా గడ్డి ఏరుకుని రావాలే. ఈసారి ఎండుగడ్డి దొరికేలా లేదు. – గుంజే ఓదెలు, ఖానాపూర్ -
మా ఊర్లో నిషేధించాం
గడ్డిమందును ఎవరూ అమ్మవద్దని, కొనవద్దని మా గ్రామంలో నిషేధించాం. ఆ మందు తాగితే ఎంత ప్రమాదకరమో వైద్యుల చేత అవగాహన కల్పించాం. గడ్డి మందును ఇళ్లలో నిల్వ చేసుకోవద్దని రైతులకు సూచించాం. – ఎడ్మల మల్లారెడ్డి, సామాజిక పర్యావరణ కార్యకర్త, లక్ష్మీపూర్ వేగంగా వ్యాపిస్తుంది గడ్డిమందు తాగినవారి శరీర అవయవాలకు వేగంగా చేరుకుని, తీవ్రంగా నష్టం కలిగిస్తుంది. ఈ మందు తాగగానే నోటిలో, గొంతులో వెంటనే మంటను కలిగిస్తుంది. తక్కువ వ్యవధిలో ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, గుండెకు చేరుకుని తీవ్ర నష్టం చేస్తుంది. – డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, జగిత్యాల -
టవర్ ఏర్పాటు వివాదాస్పదం
● వద్దన్నందుకు గ్రామస్తులపై ఫిర్యాదు ● ఠాణా మెట్లెక్కిన మహిళలుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇళ్ల సమీపంలో టవర్ ఏర్పాటు చేయొద్దన్నందుకు ఎయిర్టెల్ సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు గ్రామస్తులను శుక్రవారం ఠాణాకు పిలిపించడంతో వివాదాస్పదంగా మారింది. గ్రామస్తులు మాట్లాడుతూ మండలంలోని అల్మాస్పూర్లో కొత్తగా ఎయిర్టెల్ టవర్ నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. ఇళ్ల మధ్యలోనే టవర్ ఏర్పాటు చేస్తుండడంతో దాని ప్రభావంతో వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వద్దన్నారు. దీంతో ఆ సంస్థ నిర్వాహకులు టవర్ ఏర్పాటును అడ్డుకుంటున్నారని గ్రామస్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీంతో గ్రామస్తులం ఠాణాకు వచ్చినట్లు చెప్పారు. ఈ సంఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని ఎస్సై రాహుల్రెడ్డి తెలిపారు. -
భరోసా.. నిరాశ!
కరీంనగర్ అర్బన్: యాసంగి సీజన్ మొదలై రెండు నెలలు అవుతున్నా.. రైతులకు ‘రైతు భరోసా’ అందడం లేదు. మున్సిపల్ ఎన్నికలు ముగియగానే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు రైతు భరోసా జమ కాలేదు. అప్పోసప్పో చేసి వరి నాట్లు పూర్తి చేసిన రైతులు.. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం కోసం చూస్తున్నారు. జిల్లాలో పంట సాగు వివరాలు జిల్లాలో యాసంగి సీజన్లో 2,65,389 ఎకరాల్లో వరి పంటను, 30వేల ఎకరాల్లో మక్కను సాగు చేయగా ఇతర పంటలు 5వేల ఎకరాల్లో సాగు చేశారు. రైతులు ఎరువుల కొనుగోలు, విత్తనాల కొనుగోళ్లు, ట్రాక్టర్తో దున్నకాలకు, వ్యవసాయ కూలీల కై కిళ్లు ఇలా ఎకరానికి సగటున రూ.15వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ప్రభుత్వం ఎకరానికి రూ.6 వేలు అందిస్తుండగా.. ఈ సొమ్ము ఉపయోపడుతుంది. ప్రభుత్వం ఇచ్చే ‘రైతు భరోసా’ కోసం రైతులు రెండు నెలలుగా నిరీక్షిస్తున్నారు. శాటిలైట్ సర్వేల ఆధారంగా సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సాటిలైట్ సర్వేలు చేసింది. సర్వే నంబర్ల వారీగా రైతుల వివరాలను నమోదు చేస్తూ అక్షాంశ, రేశాంశాల ఆధారంగా సర్వేలు పూర్తి చేశారు. సాగు చేసిన భూముల వివరాలను వ్యవసాయశాఖ ఆన్లైన్లో నమోదు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగు చేయని, పడావులుగా ఉన్న, బీడు భూములకు కూడా రైతుబంధు సాయంగా ఎకరానికి ఏటా రూ.10వేలు ఇచ్చి ప్రజాధనాన్ని వృథా చేసిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంటూ ఈ సర్వేలు చేయించారు. రబీ సీజన్ మొదలై రెండు నెలలు పూర్తి అవుతున్నా.. రైతు భరోసా జాడ లేదు. హామీ.. నెరవేరదేమీ..! కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ‘రైతు భరోసా’ పథకంలో ఏటా ఎకరానికి రూ.15వేలు ఇస్తామని ఆరు గ్యారంటీల్లో హామీ ఇచ్చారు. కానీ అది అమలు కావడంలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా రూ.10వేలు పంట కాలానికి అనుగుణంగా పసల్కు ఎకరాకు రూ.5వేల చొప్పున అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీని అమలు చేయకుండా.. ఏటా ఎకరానికి రూ.12వేలు ఇస్తోంది. అది కూడా ఈ రబీ సీజన్లో ఆలస్యం అయింది. ఈ సీజన్కు ఎకరానికి రైతు భరోసాగా వచ్చే రూ.6వేల కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. వెంటనే ప్రభుత్వం రైతు భరోసా అందించాలని జిల్లా రైతులు కోరుతున్నారు.భరోసాపై సీఎంకు కేంద్రమంత్రి లేఖ రైతు భరోసాపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ శుక్రవారం ముఖ్య మంత్రి రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. యాసంగి సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటినా రైతు భరోసా విడుదల చేయకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, తరువాత మాట తప్పడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షల మందికి పైగా రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం తప్పదని స్పష్టం చేశారు. -
చిత్రా మిశ్రా బాధ్యతల స్వీకరణ
కరీంనగర్ అర్బన్: కలెక్టర్గా చిత్రా మిశ్రా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఉద యం 10.30గంటలకు కలెక్టరేట్కు చేరుకోగా పరిసర ప్రాంతాలను పరిశీలించారు. నేరుగా కార్యాలయంలోకి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, ఆర్డీవో మహేశ్వర్ లు స్వాగతం పలకగా కలెక్టరేట్ ప్రధాన కా ర్యాలయ సూపరింటెండెంట్లను పరిచయం చేశారు. కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్, వివి ధశాఖల జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి పొన్నం ప్ర భాకర్ను కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశా రు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్, సీపీ గౌస్ ఆలంలను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు. శుభాకాంక్షల వెల్లువ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన చిత్రా మిశ్రాకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. శుక్రవారం కలెక్టరేట్లోని కలెక్టర్ కార్యాలయంలో ఆయా శాఖల జిల్లా అధికారులతో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళిచరణ్, కార్యదర్శి డా.అడ్ల.అరవింద్ రెడ్డి, కోశాధికారి నాగరాజు, జాయింట్ సెక్రటరీ సుధాకర్, సాంస్కృతిక కార్యదర్శి రాజు నాయక్, క్రీడా కార్యదర్శి కొండల్ రెడ్డి తదితరులు పాల్గొనగా జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డా.లింగారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, సీపీవో వి.రాందత్తా రెడ్డి, డీఎస్వో నర్సింగరావు, ఎన్ఐసీ విభాగ అధికారులు శ్రీనివాస్రెడ్డి, వెంకటరాజన్న కలిసిన వారిలో ఉన్నారు. -
ఆదర్శంగా నగరం
కరీంనగర్/కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్టౌన్:కరీంనగర్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం నగరంలోని 51వ డివిజన్ వావిలాలపల్లిలో రూ.16 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. డివిజన్ నుంచి బండారి వేణును భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నగరాన్ని అభివృద్ధి పరుస్తామని వెల్లడించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు, కార్పొరేటర్ వంగల పవన్, వొంటెల సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వాస్పత్రికి కేంద్రం నిధులే ఊపిరి జిల్లా ప్రభుత్వాసుపత్రికి కేంద్ర నిధులే ఊపిరిగా నిలుస్తున్నాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన ఆధునిక వైద్య పరికరాలను ప్రారంభించారు. తాను ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఏడాదికి సగటున రూ.50 నుంచి 70 కోట్ల వరకు కేంద్ర నిధులు ఈ ఆ సుపత్రికి అందుతున్నాయన్నారు. సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంవో డాక్టర్ నవీన పాల్గొన్నారు. బంజారాల అభ్యున్నతికి కృషి శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ అన్ని తరాలకు ఆదర్శనీయుడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం కరీంనగర్లో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. బంజారా సమాజం జాగృతం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఆర్డీవో మహేశ్వర్, గుగులోతు తిరుపతి నాయక్, భూక్య తిరుపతి నాయక్, రాజు నాయక్, రాందాస్ నాయక్, భీమా సాహెబ్, లావుడ్య కిషన్నాయక్, రాజు నాయక్, శ్రావణ్ నాయక్, ధరావత్ పాల్గొన్నారు. -
సామాజిక సేవకు లయన్స్ క్లబ్ నిదర్శనం
● మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్తపల్లి(కరీంనగర్): సామాజిక సేవా కార్యక్రమాలకు లయన్స్ క్లబ్ నిదర్శనమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ శివారు రేకుర్తిలోని డాక్టర్ మాడేకర్ లయన్స్ క్లబ్ ఉదార కంటి ఆస్పత్రిలో నూతనంగా నిర్మించిన బొమ్మ వెంకటేశ్వర్లు బ్లాక్ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం మా ట్లాడుతూ దూరదృష్టితో ఆలోచించిన బొమ్మ వెంకన్న ఆనాడు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేకుర్తిలో కంటి ఆస్పత్రి ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆసుపత్రిలో ఇప్పటి వరకు 8.52 లక్షల మందికి ఓపీ చికిత్స, 1,21,000 మందికి ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరి గిందన్నారు. లయన్స్ క్లబ్కు రాష్ట్ర ప్రభుత్వం తరుపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హౌజ్ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, కార్పొరేటర్లు పర్వతం మల్లేశం, గంట శ్రీనివాస్, వరా ల నర్సింగం, మల్లికార్జున రాజేందర్, గుమ్మడి రాజ్కుమార్, నలువాల రవీందర్, కంటి ఆసుపత్రి చైర్మన్ కె.వేణుమూర్తి, ప్రతినిధులు కోదండరాం, భద్రేశం, చంద్రప్రకాశ్, సురేశ్, ప్రకాశ్ హొల్లా, బొమ్మ పవన్కుమార్, కోల అన్నారెడ్డి, టి.మురళీధర్రావు, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.పద్మాకర్ రెడ్డి, సత్యంగౌడ్ పాల్గొన్నారు. విద్యానగర్(కరీంనగర్): శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలను ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా భక్తులకు ఇంటివద్దకే అందించనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రచార పో స్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. తలంబ్రాలు కావాల్సిన భక్తులు ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంట ర్లలో రూ.151 చెల్లించి మార్చి 31లోగా బుక్ చేసుకోవాలని సూచించారు. వివరాలకు కరీంనగర్ 9154298561, 9154298581, హుజూ రాబాద్, హుస్నాబాద్ 9154298559, సిరిసిల్ల, వేములవాడ 9154298576, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి 7780250439, గోదావరిఖని, పెద్దపల్లి, మంథని 9949407275 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కొత్తపల్లి(కరీంనగర్): వేసవికాలంలో విద్యుత్ సమస్యల్లేకుండా చర్యలు తీసుకోవాలని టీజీఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) టి.మధుసూదన్ సూచించారు. కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ చాంబర్లో శుక్రవారం ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో అధికారులతో సమీక్షించారు. వేసవి ప్రణాళిక సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమున్న చోట పవర్ ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీ పెంపు, అదనపు ట్రాన్స్ఫార్మర్లు, లైన్లలో ఓవర్ లోడ్ గుర్తించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 33 కె.వీ, 11 కె.వీ లైన్లు ఓవర్ లోడ్ అయ్యే అవకాశం ఉన్నచోట కొత్త లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. మంగళవారం, గురువారం, శనివారం ప్రజాబాట నిర్వహించి అదేరోజు సమస్యలు పరిష్కరించాలన్నారు. ఆపరేషన్స్ సీఈ బి.అశోక్, ట్రాన్స్కో సీఈ విజయ్ కుమార్ పాపారావు, ఎస్ఈ వి.గంగాధర్, ట్రాన్స్కో ఎస్ఈ ఎన్.శ్రీనివాస్, డీఈలు ఉపేందర్, రాజం, లక్ష్మారెడ్డి, ఎం.తిరుపతి, ఎస్ఏవో రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
అలసిన దళపతి.. మావోయిస్టు గణపతి!
● వయోభారం.. అనారోగ్యం ● ఆపరేషన్ కగార్ ఫినిషింగ్ టచ్ ‘లక్ష్మణుడే’? ● ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఉత్కంఠఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుత జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన గణపతి మొదటి నుంచి తిరుగుబాటు స్వభావం గల వ్యక్తి. కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్ ఈ ఏడాది మార్చితో ముగుస్తుండడంతో లక్షణ్రావు పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు ఎన్కౌంటర్ అయ్యారు. పలువురు లొంగిపోయారు కూడా.. ఆపరేషన్ కగార్ గడువు దగ్గరపడుతుండడంతో పెద్దన్నపైనే ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా చర్చ జరుగుతోంది. – సాక్షి,కరీంనగర్ డెస్క్ – వివరాలు 8లో అణగారిన వర్గాల బతుకుల బాగు కోసం ఆరాటపడ్డాడు.. బానిస బతుకులను చూసి కలతచెందాడు.. ఐదు దశాబ్దాల క్రితమే బందూకు పట్టి బరిగీసి నిల్చున్నాడు. భూస్వాముల పాలిట తిరుగుబాటుదారుడయ్యాడు.. బహుజనుల జీవితాల్లో ఆరాధ్యుడయ్యాడు. అజ్ఞాత దళాలకు అగ్రనేతయ్యాడు. బలహీన వర్గాలకు పెద్దన్నగా నిలిచాడు.. ఆయనే ముప్పాల లక్ష్మణ్రావు ఉరఫ్ గణపతి.గణపతికి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు, ఇద్దరు అక్కాచెల్లెళ్లు. తల్లిదండ్రులు, ఓ సోదరుడు, సోదరి గతంలో మృతిచెందారు. భార్య విజయ, కుమారుడు శ్రీనివాస్ హైదరాబాద్, అమెరికాలో జీవిస్తున్నారు. స్వగ్రామం బీర్పూర్లో ఆయన రక్త సంబంధికులు ఎవరూ లేరు. ఇల్లు మొత్తం కూలిపోయింది. కనీసం ఆనవాళ్లు కూడా లేకుండా అడుగుజాగే మిగిలింది. -
హెచ్పీవీ వ్యాక్సిన్కు శ్రీకారం
కరీంనగర్: దేశంలో మహిళలను వేధిస్తున్న గర్భాశయ ముఖద్వార కేన్సర్ (సర్వికల్ క్యాన్సర్) సహా పలు కేన్సర్లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేన్సర్ను తరిమేందుకు హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) నిరోధక టీకాను దేశవ్యాప్తంగా అందుబాటలోకి తేవాలని నిర్ణయించగా.. శనివారం నుంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. 14–15 ఏళ్ల వయసు గల బాలికలకు ఈ టీకాను అందించనున్నారు. హెచ్పీవీ టీకా గురించి తల్లిదండ్రుల్లో అవగాహన పెంపొందించడం అత్యంత అవసరం. హెచ్పీవీ టీకా ప్రయోజనాలు హెచ్పీవీ వైరస్తో గర్భాశయ ముఖద్వార కేన్సర్ ఎక్కువగా వస్తుంది. ప్రారంభ దశలో లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల ఆలస్యంగా గు ర్తించే అవకాశాలు ఉంటాయి. టీకా ద్వారా వైరస్ సంక్రమణ ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. వైద్య నిపుణుల వివరాల ప్రకారం 9– 14 ఏళ్ల మధ్య వయస్సులో టీకా వేయడం వల్ల అత్యంత ప్రభావవంతంగా పనిచేయనుంది. ఈ టీకాను కేంద్ర ప్రభుత్వం జాతీ య టీకా కార్యక్రమంలో దశలవారీగా చేర్చుతోంది. ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల ద్వారా బాలికలకు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసి అమలు విధానాన్ని ఖరారు చేస్తోంది. జిల్లాలో ఖరారు కాని కార్యాచరణ జిల్లాలో హెచ్పీవీ టీకా కార్యక్రమంపై ఇంకా స్పష్టమైన కార్యాచరణ రూపొందలేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. టీకాల సరఫరా ఇంకా జరగలేదు. సరఫరా తేదీలపై కూడా ఇప్పటి వరకు స్పష్టం లేదు. ఇప్పటి వరకు 11 వేల మంది బాలికల జాబితా తయారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. పాఠశాలల సమన్వయం వంటి అంశాలపై త్వరలో మార్గదర్శకాలు అందుతాయని తెలిపారు. జిల్లాలో కార్యక్రమం ప్రారంభ తేదీపై త్వరలో స్పష్టత రానుంది. -
ఆపరేషన్ కగార్ ఫినిషింగ్ టచ్ ‘లక్ష్మణుడే’?
అణగారిన వర్గాల బతుకుల బాగు కోసం ఆరాటపడ్డాడు.. బానిస బతుకులను చూసి కలతచెందాడు.. ఐదు దశాబ్దాల క్రితమే బందూకు పట్టి బరిగీసి నిల్చున్నాడు. భూస్వాముల పాలిట తిరుగుబాటుదారుడయ్యాడు.. బహుజనుల జీవితాల్లో ఆరాధ్యుడయ్యాడు. అజ్ఞాత దళాలకు అగ్రనేతయ్యాడు. బలహీన వర్గాలకు పెద్దన్నగా నిలిచాడు.. ఆయనే ముప్పాళ్ల లక్ష్మణ్రావు ఉరఫ్ గణపతి.గణపతికి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు, ఇద్దరు అక్కాచెల్లెళ్లు. తల్లిదండ్రులు, ఓ సోదరుడు, సోదరి గతంలో మృతిచెందారు. భార్య విజయ, కుమారుడు శ్రీనివాస్ హైదరాబాద్, అమెరికాలో జీవిస్తున్నారు. స్వగ్రామం బీర్పూర్లో ఆయన రక్త సంబంధికులు ఎవరూ లేరు. ఇల్లు మొత్తం కూలిపోయింది. కనీసం ఆనవాళ్లు కూడా లేకుండా అడుగుజాగే మిగిలింది.ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుత జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన గణపతి మొదటి నుంచి తిరుగుబాటు స్వభావం గల వ్యక్తి. కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్ ఈ ఏడాది మార్చితో ముగుస్తుండడంతో లక్షణ్రావు పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు ఎన్కౌంటర్ అయ్యారు. పలువురు లొంగిపోయారు కూడా.. కగార్ గడువు దగ్గరపడుతుండడంతో పెద్దన్నపైనే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చ జరుగుతోంది.సాక్షి,కరీంనగర్ డెస్క్: మావేయిస్టు నేత.. లక్ష్మణ్రావు 1949 జూన్ 16న బీర్పూర్లో జన్మించారు. 5వ తరగతి వరకు బీర్పూర్, 7వ తరగతి వరకు అదే జిల్లాలోని తుంగూర్లో చదువుకున్నారు. పీయూసీ జగిత్యాలలో, కరీంనగర్లో డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొలువు రావడంతో మొదట ప్రస్తుత పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో పనిచేశారు. సైన్స్, లెక్కలు, ఇంగ్లిష్ సబ్జెక్టులు బోధించారు. ఎలగందుల, మేడిపల్లి మండలం గోవిందారంలో విధులు నిర్వహించారు. ఇదే సమయంలో పెద్దపల్లి మండలం రాగినేడుకు చెందిన సరస్వతిని పెళ్లి చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు జన్మించాడు. 1972–73లో బీఈడీ ట్రైనింగ్ కోసం వరంగల్ వెళ్లి అక్కడి నుంచి అటే అజ్ఞాతబాట పటారు. ఉపాధ్యాయుడిగా పిల్ల లకు చదువు నేర్పిన గణపతి.. ఉద్యమంలో విప్లవపాఠాలు నేర్పారు.జగిత్యాల జైత్రయాత్రతో..జగిత్యాల పట్టణంలో 1978 సెప్టెంబర్ 9వ తేదీన జగిత్యాల జైత్రయాత్ర చేపట్టారు. జైత్రయాత్ర తర్వాతే రైతుకూలి సంఘం కొండపెల్లి సీతారామయ్య నేతృత్వంలో పీపుల్స్వార్గా ఆవిర్భవించింది. ఇదే ప్రయోగశాలగా మారి దేశంలో 17 రా ష్ట్రాల్లో ఉద్యమ వ్యాప్తికి దోహదపడింది. అప్పుడు ఈ యాత్రలో దాదాపు 3.50 లక్షల మంది పాల్గొన్నారు. ‘దున్నేవాడికే భూమి’ అంటూ జగిత్యాల పుర వీధుల గుండా భారీ ఊరేగింపు నిర్వహించి స్థానిక ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్లో బహిరంగసభ నిర్వహించారు. మావోయిస్టు అధినేత ముప్పాళ్ల లక్ష్మణ్రావు ఉరఫ్ గణపతి, మల్లో్లజుల కోటేశ్వర్రావు, మాదాసు వేణుగోపాల్రావు, నల్లా ఆదిరెడ్డి, శీలం నరేశ్, ముంజీం రత్నయ్య, భైరి గంగారాం, అంగె ఓదెలు తదితర నేతలు పాల్గొన్నారు. బహిరంగసభలో ప్రజాయుద్ద నౌక గద్దర్ గజ్జెకట్టి ఆడిపాడారు. అలా.. మొదలైన తిరుగుబావుట దండకారణ్యంలోని జనతన సర్కార్ నిర్మాణం వరకు కొనసాగింది. 1992 వరకు కొండపల్లి సీతారామయ్య నడిపించిన పీపుల్స్వార్ పార్టీకి గణపతి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికై 2004లో బిహార్ మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ వరకు సాగింది. సీపీఐ మావోయిస్టుగా ఏర్పడ్డ తర్వాత కూడా గణపతి దళపతిగా కొనసాగారు.1977లోనే తొలి పోలీసు కేసు..పీపుల్స్వార్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య ఆధ్వర్యంలో 1975–76లో ఇప్పటి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్లోని భూస్వామి పితంబర్రావుతోపాటు కుటుంబ సభ్యులను నక్సల్స్ హతమార్చారు. ఈ ఘటనలో అదే జిల్లా కలమడుగు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ హత్యతో ప్రమేయం ఉందని అప్పట్లో పోలీసులు 16 మందిపై కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో ఏ–1గా కొండపల్లి సీతారామయ్యను, ఏ–8గా ముప్పాల లక్ష్మణ్రావును పేర్కొన్నారు. 1977లో గణపతిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిజామాబాద్ జైలులో శిక్ష అనుభవించిన గణపతి మూడు నెలల తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ లేదు.టీవీలో చూసి..2004లో దేశంలో అనేక రాష్ట్రాలలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు విస్తరింపజేశారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆయనపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రివార్డులు ప్రకటించాయి. జగిత్యాల జైత్రయాత్రలో పాల్గొన్న లక్ష్మణ్రావు ఉరఫ్ గణపతి పీపుల్స్వార్లో కొండపల్లి, కేజీ సత్యమూర్తి, కిషన్జీ తర్వాతి స్థానంలో ఉండేవారు. వ్యూహాలు.. ప్రతి వ్యూహాలు రచించడంలో ముందుండే ఆయనను అగ్రనేతగా కొనసాగాలని కోరడంతో పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్నారు. అందరికంటే ఎక్కువ కాలం 25 ఏళ్లపాటు కేంద్ర కమిటీ కార్యదర్శిగా గణపతి పనిచేయడం విశేషం. మావోయిస్టు గణపతి 2010లో నక్సల్స్ దళాలను ఉద్దేశించి ప్రసగించిన వీడియో అప్పట్లో కొన్ని టీవీ చానళ్లలో ప్రసారమైంది. గణపతి ఇలా ఉంటారా? అంటూ బీర్పూర్ పరిసర గ్రామాల ప్రజలు ఆసక్తిగా చూశారు. అప్పటి వీడియో, ఫొటోలే ఇప్పడు మీడియాలో వస్తున్నాయి.ఆపరేషన్ కగార్తో ఫినిషింగ్ టచ్ఐదు దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉంటున్న బడి పంతులు ఇప్పుడు అనారోగ్యంతో అలిసిపోయారు. పాతికేళ్లుగా మావోయిస్టు పార్టీకి కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసిన గణపతి.. వయోభారంతో నడవలేని స్థితిలో సతమతమవతున్నట్లు తెలిసింది. చూపు మందగించి.. జ్ఞాపకశక్తి సరిగాలేదని తెలుస్తోంది. అయితే ఆపరేషన్ కగార్ ఫినిషింగ్ టచ్ గణపతితో పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ గణపతి లొంగిపోయినా.. అరెస్టు అయినా ఓ సంచలనమే.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమే.! -
కాంగ్రెస్ అంటేనే కూల్చివేతలు.. బీజేపీ ఉద్యమమే: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్ నేతలకు రైతుభరోసా గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కూల్చివేతలు అంటూ హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటే... ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.కరీంనగర్లో కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ..‘రైతులకు రైతు భరోసా ఇస్తానన్న మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్చిపోయారు. ముఖ్యమంత్రి నోటి నుండి వచ్చే మాటలు శాసనంలా ఉండాలి. బీఆర్ఎస్ ఏ విధంగా విమర్శలు, గూడు పుటానీలు చేసారో.. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా అదే చేస్తున్నారు. రైతు భరోసా మొదటి విడత డబ్బులు ఎగ్గొట్టారు. ఎన్నికలు వచ్చినప్పుడే రైతు భరోసా గుర్తుకు వస్తుందా?. రైతు భరోసా ఇవ్వకపోతే రైతులే వాతలు పెడుతారు. కేబినెట్ మీటింగ్లో రైతు భరోసా గురించి ఎందుకు చర్చించలేదు. మూడు విడతలు కలిపి 27000 కోట్లు ఇవ్వాల్సిందే. రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా రైతు భరోసా ఇవ్వాలని ఉత్తరం రాశాను. రైతు భరోసా ఇవ్వకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదు’ అని హెచ్చరించారు.అలాగే, ఖమ్మంలో కూల్చివేతల ఘటనపై స్పందిస్తూ..‘కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కూల్చివేతలు. కూల్చడానికి గల కారణాలు ఏంటి?. మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కలిసి అ స్థలాన్ని ఆక్రమించుకోవాలని చుస్తున్నారు. హైడ్రా.. కూల్చివేతలతో ఆగమాగం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం ఇండ్లు కట్టడానికి పోటీ పడుతుంటే.. ఈ ప్రభుత్వం కూల్చివేయడానికి పోటీ పడుతుంది. ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడా లేరు అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..‘కాంగ్రెస్, ఎంఐఎంలు ఒక్కటే.. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈరోజు 80% ముస్లిం మహిళలు బీజేపీకి ఓటేసే పరిస్థితి వచ్చింది. నిన్నటి దాక దోస్తీగా ఉన్నా కాంగ్రెస్, ఎంఐఎంలకు ఎక్కడ చెడిందో తెలియదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో కవిత వ్యవహారంపై ప్రశ్నించగా.. తెలుసుకుని మాట్లాడతాను అని వ్యాఖ్యలు చేశారు. -
రేషన్ బియ్యం పట్టివేత
కరీంనగర్రూరల్: అక్రమ రేషన్ బియ్యం దందాపై టాస్క్ఫోర్స్, కరీంనగర్రూరల్పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో నిల్వ చేసిన 70క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఐదుగురిపై కేసు నమోదు చేశారు. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి కథనం మేరకు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో గురువారం కరీంనగర్రూరల్, టాస్క్ఫోర్స్ పోలీసులు బొమ్మకల్ ఫ్లైఓవర్ బ్రిడ్జివద్ద నిఘాపెట్టారు. కిసాన్నగర్కు చెందిన గంట మల్లేశ్, లక్ష్మణ్ ట్రాలీఆటోలో సుమారు 12క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆరెపల్లిలోని రాజరాజేశ్వర కాలనీలోని రేకులషెడ్లో రేకుర్తికి చెందిన పత్తి స్వామి అక్రమంగా నిల్వ చేసిన 20క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. బొమ్మకల్ కృష్ణానగర్లోని గోదాంలో శివనాధుని సత్యనారాయణ, పుల్గం సత్తయ్యలు అక్రమంగా నిల్వ చేసిన 39క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. ఎస్సైలు లక్ష్మారెడ్డి, నరేశ్లతో పాటు టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో మొత్తం 70క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకుని ఐదుగురిపై కేసు నమోదు చేశామని సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ సన్నబియ్యాన్ని దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. తదుపరి చర్యల నిమిత్తం పట్టుకున్న రేషన్ బియ్యాన్ని సివిల్సప్లై విజిలెన్స్ అధికారులకు అప్పగించామని వివరించారు. 70 క్వింటాళ్లు స్వాధీనం ఐదుగురిపై కేసు నమోదు -
హైరిస్క్ ఆపరేషన్ సక్సెస్
పెద్దపల్లి/ముత్తారం: పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం మండలానికి చెందిన రామిని రాజేశ్వరి(45) తీవ్రమైన కడుపునొప్పితోపాటు రక్తస్రావంతో బాధపడుతూ పెద్దపల్లి మాతాశిశు ఆస్పత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు పలు పరీక్షలు చేసి గర్భకోశంలో సమస్య ఉందని గుర్తించారు. ఆమె బరువు 103 కిలోలు ఉండడంతో ఆపరేషన్ కష్టతరమవుతుందని భావించి.. అత్యంత నైపుణ్యం, అనుభవం కలిగిన డాక్టర్ బి.శ్రీనివాస్ను హైదరాబాద్ నుంచి రప్పించారు. ఆయన ఆధ్వర్యంలో సదరు మహిళకు గురువారం శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వ హించామని డీసీహెచ్ శ్రీధర్ తెలిపారు. హైరిస్క్ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించిన వైద్యు లు, ఆస్పత్రి సూపరింటెడెంట్ను కలెక్టర్ శ్రీహర్ష అభినందించారు. నిపుణులైన వైద్యులతో ఆపరేషన్ చేయించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు రాజేశ్వరి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 115 పద్యాలు పాడిన విద్యార్థినిఇల్లంతకుంట(మానకొండూర్): రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన పద్యాల పోటీల్లో కందికట్కూర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థిని నక్క ఆరుష్య 115 పద్యాలు పాడి ప్రథమ స్థానంలో నిలిచింది. ఆరుష్యను మండల విద్యాధికారి శ్రీనివాస్గౌడ్ అభినందించారు. గతేడాది ఆరుష్య సోదరి శాన్విక 117 పద్యాలు పాడి ప్రథమస్థానంలో నిలిచింది. -
డిజిటల్ క్రాప్ సర్వేకు సిద్ధం
కరీంనగర్ జిల్లాలో గ్రామాలు: 318 రెవెన్యూ గ్రామాలు: 210 సాగు విస్తీర్ణం: 3.37లక్షల ఎకరాలు సర్వే నంబర్లు: 351545 మొత్తం రైతులు: 210904 వలంటీర్లు: 210 కరీంనగర్ అర్బన్: డిజిటల్ క్రాప్ బుకింగ్కు వ్యవసాయశాఖ సన్నద్ధమవుతోంది. నేడో, రేపో క్షేత్రస్థాయిలో పంటల బుకింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. పంటల వివరాలను నమోదు చేసేందుకు వలంటీర్లను నియమించారు. జిల్లావ్యాప్తంగా 210 రెవెన్యూ గ్రామాలుండగా సదరు సంఖ్య క్రమంలో నియామకం చేపట్టారు. పంటల వివరాలు పక్కాగా ఉండేలా శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా డిజిటల్ సర్వే చేపట్టనున్నారు. గతంలో ఏఈవోల ద్వారా సర్వే నిర్వహించగా రైతులు, సర్వే నంబర్లవారీగా సర్వే చేయడానికి ఇప్పుడున్న ఏఈవోలతో అసాధ్యం. దీంతో సర్వేను వేగంగా పూర్తి చేసేందుకు వలంటీర్ల నియామకాన్ని చేపట్టారు. ఇటీవల వీరందరికి శిక్షణ ఇవ్వగా క్షేత్రస్థాయిలో పంటల ఫొటోలు తీసి డిజిటల్ పద్ధతిలో నమోదు చేస్తారు. నిరుద్యోగ యువతకు ఉపాధి తాత్కాలిక వలంటీర్లుగా గ్రామాల్లోని నిరుద్యోగ యువతకు అవకాశాన్ని కల్పించారు. అండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కలిగి ఉండి, పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారికి అవకాశం కల్పించారు. గ్రామంలోని భూములు, సాంకేతికతపై అవగాహన గల వారికి, వ్యవసాయ డిప్లొమో చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం కల్పించారు. ఒక్క ఫొటోకు రూ.7 చొప్పున పారితోషికాన్ని అందించనుండగా ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్ను నియమించారు. వ్యవసాయక్షేత్రాలకు వెళ్లి పంటల ఫొటోలు తీసి ప్రభుత్వ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, దీనివల్ల ప్రభుత్వానికి పంట దిగుబడిపై కచ్చితమైన అంచనా రావడమే కాకుండా రైతులకు సకాలంలో పథకాలు అందనున్నాయి. 45 రోజుల్లో డిజిటల్ క్రాప్ సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది. రైతుల కమతాల వద్దకు వెళ్లి సర్వే నంబర్, రైతుల వారీగా పంట ఫొటో తీసి వివరాలు నమోదు చేయనున్నారు. లక్షల్లో సర్వే నంబర్లు.. 210 వలంటీర్లు కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి అత్యధిక విస్తీర్ణంలో సాగవుతోంది. మొక్కజొన్న, ఆరుతడి పంటలు తక్కువ విస్తీర్ణంలో సాగవడం పరిపాటి. ఈ క్రమంలో జిల్లాలో 318 గ్రామాలుండగా 3.51లక్షల సర్వే నంబర్లు ఉండగా వాటన్నింటిని యాప్లో నమోదు చేయనున్నారు. శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియ గతంలోనే పూర్తవగా డిజిటల్ పద్ధతిలో పంటలను నమోదు చేస్తారు. శాటిలైట్ మ్యాపింగ్ లేని గ్రామాల్లో వ్యవసాయ విస్తరణాధికారులు పంటలు నమోదు చేస్తారు. యాసంగిలో సాగు చేసిన పంటలను వేగంగా డిజిటల్ సర్వే చేసేందుకు వలంటీర్ల నియామకాన్ని చేపట్టామని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి వివరించారు. వీలైనంత త్వరగా సర్వే ప్రారంభిస్తామని చెబుతున్నారు. 208 మంది వలంటీర్ల నియామకం రెవెన్యూ గ్రామాల వారీగా నియామకం 45 రోజుల్లో ప్రక్రియ పూర్తి -
బాధితుల వద్దకే పోలీసులు
వీర్నపల్లి(సిరిసిల్ల): పోలీసింగ్ విధానంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతూ.. బాధితుల కేంద్రంగా సాగే విక్టిమ్ సెంట్రిక్ అప్రోచ్ అమలులో వీర్నపల్లి పోలీసులు ఆదర్శంగా నిలిచారు. బాధితులు పోలీస్స్టేషన్కు రాలేని పరిస్థితుల్లో ఉండడంతో నేరుగా పోలీసులే వారి వద్దకు వెళ్లి కేసు నమోదు చేశారు. వీర్నపల్లి మండలం బావుసింగ్నాయక్తండాలో భూక్య రాజు, అతని బాబాయి లింగం మధ్య కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతోంది. ఈక్రమంలో గురువారం ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్సై వేముల లక్ష్మణ్ తన సిబ్బందితో కలిసి తండాకు చేరుకొని ఫిర్యాదు స్వీకరించారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బావుసింగ్నాయక్ తండాలో కేసు నమోదు -
సీఎంవో అధికారి అంటూ బెదిరింపులు
బోయినపల్లి(చొప్పదండి): సీఎంవో అధికారినని చెప్పి మిడ్మానేరు డీఈఈ రఘుపతికి ఫోన్చేసి డబ్బులు డిమాండ్ చేసిన రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం కుంట్లూర్ ప్రాంతానికి చెందిన రాయబండి సూర్యప్రకాశ్ను రాజన్నసిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వేములవాడ ఏఎస్పీ రుత్విక్సాయి గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సూర్యప్రకాశ్ మొదట రామోజీ ఫిలిమ్ సిటీ సమీపంలోని ప్రైవేట్ సంస్థల్లో ఆఫీస్ బాయ్గా పనిచేసేవాడు. మలక్పేట్ ప్రాంతంలో గుర్రపు పందేలపై బెట్టింగ్ అలవాటు ఉండడంతో ఆఫిస్ బాయ్గా చేస్తే వచ్చే డబ్బులు సరిపోలేదు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో హయత్నగర్ పరిధిలో మూడు మోటార్ సైకిళ్లను దొంగలించగా.. పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి వచ్చిన తర్వాత సీఎంవోలో పనిచేస్తానంటూ ప్రభుత్వ అధికారుకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసేవాడు. కొందరు భయపడి అడిగినంత ముట్టజెప్పారు. ఆ డబ్బులను గుర్రపు పందేల బెట్టింగ్లో ఖర్చు చేశాడు. ఇలా సూర్యప్రకాశ్పై హైదరాబాద్లోని సీసీఎస్ పోలీస్స్టేషన్లో రెండు కేసులు, హైదరాబాద్లోని సనత్నగర్ పోలీస్స్టేషన్లో ఒకటి, సిసద్దిపేట పోలీస్స్టేషన్లో రెండు, జగిత్యాలలో ఒక కేసులో అరెస్ట్ కావడంతో జైలుకి వెళ్లాడు. మిడ్మానేరు డీఈఈకి బెదిరింపులు ఈనెల 23న సూర్యప్రకాశ్ మిడ్మానేరు ప్రాజెక్టు డీఈఈ రఘుపతికి కాల్చేసి తాను సీఎంవో ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానని డబ్బు డిమాండ్ చేశాడు. రఘుపతి ఎలాంటి డబ్బు ముట్టజెప్పకపోగా.. బోయినపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో సూర్యప్రకాశ్పై కేసు నమోదు చేసిన ఎస్సై రమాకాంత్ దర్యాప్తు ప్రారంభించారు. రఘుపతి నుంచి నేరుగా డబ్బులు తీసుకునేందుకు సూర్యప్రకాశ్ కొదురుపాకకు వస్తుండగా అరెస్ట్ చేశారు. అతని నుంచి ఒక మొబైల్ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. సూర్యప్రకాశ్ను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్, బోయినపల్లి ఎస్సై రమాకాంత్, కానిస్టేబుల్ కోటి, అచ్యుత్, వెంకటేశ్, తేజలను ఏఎస్పీ అభినందించారు. మిడ్మానేరు డీఈఈకి బెదిరింపులు సమాచారం ఇవ్వడంతో పట్టుకున్న పోలీసులు నిందితునిపై పలు జిల్లాల్లో 10కి పైగా కేసులు వేములవాడ ఏఎస్పీ రుత్విక్సాయి -
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం లక్ష్మీపూర్లో గర్వందుల మహేశ్(37) అనే వ్యక్తి బుధవారం రాత్రి ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహేశ్ కొన్నేళ్లుగా అప్పులు చేసి ఫాస్ట్ఫుడ్ సెంటర్, మరో మూడు చోట్ల వ్యాపారాలు ప్రారంభించాడు. వ్యాపారం కోసం చేసిన అప్పులు ఎలా కట్టాలో బాధపడుతూ మనస్తాపానికి గురై బుధవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి గ్రామశివారులోని రైతు వేదిక వద్ద ఇనుప పైపునకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య జమున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. కాగా, మృతుడు ఆన్లైన్ గేమింగ్లు ఆడి ఆర్థికంగా అప్పుల పాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. స్కూల్ బస్సును ఢీకొని వ్యక్తి మృతిరాయికల్: రాయికల్ మండలం రామాజీపేట గ్రామశివారులో గురువారం స్కూల్ వ్యాన్ను ఢీకొని ఉల్లూరి మధు(35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్సై సుధీర్రావు తెలిపారు. మల్లాపూర్ మండలం గుండంపల్లికి చెందిన ఉల్లూరి మధు భూపతిపూర్లో తన బంధువుల ఇంటి వద్ద శుభకార్యానికి హాజరై తిరిగి ఇంటికి ద్విచక్రవాహనంపై అతివేగంగా వెళ్తుండగా రాయికల్ నుంచి ఓ ప్రైవేటు స్కూల్కు చెందిన బస్సు రామాజీపేట వైపు వెళ్తుండగా ఢీకొనడంతో తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్కూల్ బస్సు డ్రైవర్ ప్రకాశ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కేసీ కెనాల్లో మృతదేహం లభ్యంహుజూరాబాద్: పట్టణ శివారులోని కాకతీయ కెనాల్లో గురువారం మృతదేహం లభ్యమైనది. మృతదేహం నీటిలో కొట్టుకుపోతుండగా గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు నీటి ప్రవాహాన్ని తగ్గించగా మృతదేహం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులో లభ్యమైంది. మృతుడు మండలంలోని పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన పల్లకొండ గణేశ్గా గుర్తించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధ భరించలేక వ్యక్తి బలవన్మరణంమెట్పల్లి: పట్టణంలోని హన్మాన్నగర్కు చెందిన సాంబారి నరేశ్(42) అనే వ్యక్తి అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. మక్క గుడాల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న నరేశ్ కొంతకాలంగా వ్యాపారం ఆశించిన మేరకు నడవక అప్పులపాలయ్యాడన్నారు. వాటి వడ్డీలు పెరుగుతుండటంతో మానసికంగా కృంగి ఈనెల 24న పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించగా కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారని, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్కు తీసుకెళ్లినట్లు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
‘మావో’ళ్ల జాడేది !
సిరిసిల్ల: నాలుగు దశాబ్దాల క్రితం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మావోయిస్టు ఉద్యమానికి పెట్టని కోట. ఏ పల్లెకు పోయిన ఎర్రజెండా పాటల హోరు.. గోడలపై ‘దున్నే వాడిదే భూమి..’ అంటూ రాతలు ఆనాటి పల్లె జనాన్ని చైతన్యవంతులను చేసేవి. ఆనాటి పరిస్థితుల్లో మార్పు తెచ్చి సమసమాజ స్థాపన కోసం ఆయుధాలు పట్టి అజ్ఞాతంలోకి వెళ్లిన వారు ప్రతీ పల్లెలో కనిపిస్తారు. అడవిలో అన్నలుగా పోరు బాటపట్టిన వారు ఎందరో. ఇదే కోవలో రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన అనేక మంది ఆయుధాలు పట్టుకొని సాయుధపోరాట దారుల్లో వెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో మరో ముగ్గురు అజ్ఞాతంలోనే ఉన్నారు. మావోయిస్టు నక్సలైట్ల సామూహిక లొంగుబాటు నేపథ్యంలో ఆ ముగ్గురి ఆచూకీ దొరకడం లేదు. అజ్ఞాతంలోనే అదృశ్యమైన ఆ ముగ్గురు మావోయిస్టుల కోసం వారి కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు. ‘మావో’ళ్లు ఇంటికి వస్తారా.. అని ఆలోచిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో అడవిబాట పట్టి అదృశ్యమైన వారి ఆచూకీని అటు పోలీసులు.. ఇటు అజ్ఞాతం వీడిన మావోయిస్టులు కూడా చెప్పడం లేదు. ఆ మూడు కుటుంబాలకు చెందిన వారు మావోళ్లు ఎక్కడున్నారో.. ఎలా ఉన్నారోనని ఆందోళనకు గురవుతున్నారు. 28 ఏళ్ల కిందట అడవిబాట రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన తుమ్మల శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్ సిద్దిపేటలో డిగ్రీ చదువుతూ 1998లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. 28 ఏళ్లుగా శ్రీనివాస్ జాడతెలియక అతని కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. అతని తల్లిదండ్రులు తుమ్మల(మ్యాదరి) నారాయణ గతేడాది మరణించగా.. తల్లి భూదమ్మ తొమ్మిదేళ్ల కిందట మరణించింది. తల్లిదండ్రులు మరణించినా కడసారి చూపు కోసం సైతం శ్రీనివాస్ రాకపోవడం విషాదం. నాలుగు దశాబ్దాలుగా ఉద్యమంలోనే.. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన బండి చంద్రయ్య అలియాస్ మహేశ్ నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తున్నారు. పదో తరగతి వరకు ధర్మారంలోనే చదువుకున్న చంద్రయ్య 1985లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతని తల్లిదండ్రులు ఎల్లవ్వ, లింగయ్యలకు ముగ్గురు కొడుకులు నాంపల్లి, శంకరయ్య, చంద్రయ్య, ఒక్క కూతురు శాంతమ్మ. చిన్నోడు చంద్రయ్య అడవిబాట పట్టారు. తల్లిదండ్రులు చిన్న కొడుకు తలంపులో అనారోగ్యంతో మరణించారు. మరో సోదరుడు శంకరయ్య పదేళ్ల కిందట మృతిచెందాడు. తల్లిదండ్రులు మరణించినా, సొదరుడు మరణించినా.. చంద్రయ్య ఇంటిముఖం చూడలేదు. ప్రస్తుతం పెద్దన్న నాంపల్లి, వదిన దేవవ్వ ధర్మారంలో ఉన్నారు. 40 ఏళ్లుగా మహేశ్ పేరుతో చంద్రయ్య మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తున్నాడు. చందుర్తి నుంచి దండకారణ్యం వరకు.. చందుర్తి మండల కేంద్రానికి చెందిన బత్తుల కాంతారావు అలియాస్ నవీన్ 30 ఏళ్ల కిందట అజ్ఞాతంలోకి వెళ్లాడు. చాలా కాలం మావోయిస్టు పార్టీలో కొరియర్గా పనిచేసిన నవీన్ దండకారణ్యంలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే దండకారణ్యంలో నక్సలైట్లు ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. కాంతారావు అలియాస్ నవీన్ ఐదేళ్ల కిందట ఒడిశాకు వెళ్లినట్లు సమాచారం. కాంతారావు ఆచూకీ 30 ఏళ్లుగా లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులు అయోమయానికి గురవుతున్నారు. బండి నాంపల్లి, సోదరుడు, ధర్మారం అజ్ఞాతంలోకి వెళ్లిన తుమ్మల శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్(ఫైల్) అడవిబాటలో అదృశ్యం ఆ ముగ్గురు ‘అన్న’లేరి? కుటుంబ సభ్యుల్లో ఆందోళన మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రతినిధుల లొంగుబాటు నేపథ్యంలో అయోమయం పోలీస్ రికార్డుల్లో కనిపించని ఆ మూడు పేర్లు రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు ఇటీవల అజ్ఞాతంలో ఉన్న వారి పేర్లను ప్రకటించారు. కానీ రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన ముగ్గురు అజ్ఞాతవాసుల పేర్లు ఆ జాబితాలో లేవు. జిల్లాకు చెందిన విశ్వనాథ్(శ్రీనివాస్), బండి చంద్రయ్య(మహేశ్), బత్తుల కాంతయ్య(నవీన్) పేర్లు లేవు. దీంతో ఆ ముగ్గురి గురించి వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికై నా మావోయిస్టు నాయకత్వం, లేదా పోలీస్ యంత్రాంగం అజ్ఞాతంలో అదృశ్యమైన ఆ ముగ్గురి గురించి పూర్తి సమాచారం వెల్లడించాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
యాప్ ఒక్కటే.. సేవలు అనేకం
రామగుండం: ప్రయాణికులకు మరిన్ని నాణ్యమైన సేవలను సత్వరమే అందించేందుకు రైల్వేశాఖ ఆధనిక సాంకేతికతతో కూడిన యాప్ను అందుబాటులోకి తీసుకొస్తోంది. దీనిద్వారా అన్నిసేవలు సులభంగా ఒకేయాప్ద్వారా అందుతాయి. ఇప్పటివరకు వివిధ రకాల(సాధారణ, రిజర్వేషన్, తత్కాల్)టికెట్ల జారీకి వినియోగిస్తున్న అన్రిజర్వుడ్ టికెట్ ఇష్యూయింగ్ సిస్టం (యూటీఎస్)ను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. అదేస్థానంలో ఒకేయాప్ను మార్చి ఒకటో తేదీనుంచి అమలులోకి తీసుకొన్నట్లు వెల్లడించింది. ఆండ్రాయిడ్ ఫోన్ఉన్న ప్రతీ ప్రయాణికుడు సత్వరమే రేల్వన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. ● రిజర్వుడ్, అన్ రిజర్వుడ్, ప్లాట్ఫామ్ టికెట్లు ● డిజిటల్ పేమెంట్ల ద్వారా అన్ రిజర్వుడ్ టికెట్లపై 3శాతం డిస్కౌంట్ ● లైవ్ ట్రైన్ ట్రాకింగ్ సిస్టంతో రైలు ప్రస్తుత స్థానం, చేరుకునే ప్లాట్ఫామ్ నంబరు, జాప్యం, కోచ్ పొజిషన్, రియల్ టైమ్ అప్డేట్ ● పీఎన్ఆర్ స్టేటస్ చెక్ విధానం ద్వారా టికెట్ కన్ఫర్మేషన్, బుకింగ్ ● టికెట్లను రద్దు చేసుకోవడం ద్వారా డబ్బులు తిరిగి పొందే వీలు ● రాబోయే స్టేషన్లో నేరుగా సీటు వద్దకు భోజనం తెప్పించుకునేలా ఆర్డర్ చేసుకునే సౌకర్యం ● ప్రయాణికులు ఎదుర్కొనే సమస్యలపై ఇదేయాప్ ద్వారా ఫిర్యాదు చేసేవీలుంది. ఒకటి నుంచి రేల్వన్ యాప్ సేవలు -
● బోగస్ పంచనామా.. మామూళ్లే లక్ష్యం ● వసూళ్లలో ‘విజయ’సారఽథి.. పెట్రోల్ బంకే వేదిక ● ఎక్కడికెళ్లినా అమ్యామ్యాలే ● ఇప్పటికే సదరు అధికారిపై వేటు వేసిన ప్రభుత్వం ● అక్రమాలపై మరింత తీగ లాగుతున్న యంత్రాంగం
కరీంనగర్ అర్బన్: అతను కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, అసిఫాబాబాద్ కొమురంభీం, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు అధికారి. కరీంనగర్లో కార్యాలయం. ఎవరైనా కార్యాలయానికి వెళ్తే హిత వచనాలు.. అవినీతి అనకొండ మోసాలు. బోగస్ పంచనామాలు, నకిలీ వోచర్లతో తనశాఖకే కన్నం వేయగా, లీగల్ మెట్రాలజీలో అన్నీ ఇల్లీగల్ దందాలే అని స్పష్టమవుతోంది. బడా రాజకీయ నేతలు తన చెప్పుచేతల్లో ఉంటారని చెప్పుకుంటూ కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులను వేధించడం వెన్నతో పెట్టిన విద్య. ఎస్ఆర్లో విద్యార్హత వివరాల ఎంట్రీకి టెక్నికల్ అసిస్టెంట్ నుంచి రూ.లక్ష డిమాండ్ చేయగా తృటిలో ఏసీబీ నుంచి తప్పించుకోగా పౌరసరఫరాలశాఖ కమిషనర్ శాఖాపర విచారణలో నిజమని తేలడంతో లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ విజయసారథిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ క్రమంలో శాఖాపర విచారణలో అతని లీలలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. పంచనామాతోశాఖకే పంగనామం తూనికలు, కొలతలశాఖ పేరుకు చిన్న శాఖే అయినా విధులు సక్రమంగా నిర్వహిస్తే ప్రతీ సామాన్యుడికి నాణ్యమైన సేవలందుతాయి. సదరుశాఖ కొన్నేళ్లుగా అవినీతికి నిలయంగా మారింది. ఇటీవల సస్పెండ్ అయిన లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ విజయసారథి తనిఖీల సమయంలో బోగస్ పంచనామా కాపీలను వెంట తీసుకెళ్లడం, కేసు నమోదు చేస్తున్నట్లు హైరానా చేయడం, రెండు లక్షలు డిమాండ్ చేయడం, కనీసం రూ.50వేల నుంచి రూ.లక్ష వసూలు చేయకుండా వెళ్లడన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సొంతంగా ముద్రించిన బోగస్ పంచనామా బుక్తో విధులు నిర్వహించడం ఇతనికే చెల్లుతుండగా.. షాపింగ్ మాళ్లు, సూపర్మార్కెట్లు, రేషన్ దుకాణాలు, గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకులు, చిరుతిళ్ల తయారీ కేంద్రాలు తదితర వ్యాపారవర్గాలు ఎవరైనా తనకు మామూళ్లు ఇవ్వాల్సిందే. పెట్రోల్ బంకులే అడ్డా మామూళ్లకు రుచిమరిగిన సదరు అధికారి పెట్రోల్ బంకులనే అడ్డాగా చేసుకునేవాడని తెలుస్తోంది. పొద్దంతా తనిఖీ చేయడం.. సాయంత్రం పెట్రోల్ బంకు వద్ద ఉండటం అక్కడి నుంచి మామూళ్లు తీసుకెళ్లడం చేస్తుంటారు. పెట్రోల్ బంకుకు సంబంధించిన నంబర్కు ఫోన్పే, గూగుల్ పే చేయాలని చెబుతుండగా వ్యాపారులు డబ్బులు పంపించడం అక్కడి నుంచి నగదు రూపంలో తీసుకెళ్తుంటారని సొంత శాఖే చర్చించుకుంటోంది. వాచ్మెన్, డ్రైవర్ ద్వారా మామూళ్లు వసూలు చేయడం, అడిగినంత ఇవ్వకపోతే తనిఖీల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తుంటారని వ్యాపారులు వాపోయారు. తన వసూళ్లకు సహకరించేందుకు నిర్మల్ జిల్లాలో ఉన్న వాచ్మెన్ను కరీంనగర్కు డిప్యూటేషన్పై నియమించుకున్నాడని సమాచారం. సదరు విషయాలపై ఏసీబీ పూర్తిస్థాయిలో కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది.తన కింది స్థాయి ఉద్యోగి సర్వీస్ బుక్లో విద్యార్హత వివరాలను ఎంట్రీ చేయడంలోనూ హస్తలాఘవాన్ని చాటారు. టెక్నికల్ అసిస్టెంట్ నవీన్ 2023లో ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ద్వారా డిగ్రీ పాసై పట్టా సమర్పించగా ఆ వివరాలు ఎంట్రీ చేసేందుకు రూ.లక్ష డిమాండ్ చేశారు. అలాగే రెండేళ్లుగా వార్షిక ఇంక్రిమెంట్లు నిలిపివేశారు. దీంతో నవీన్ ఏసీబీని ఆశ్రయించగా పసిగట్టిన అసిస్టెంట్ కంట్రోలర్ విజయసారథి తృటిలో తప్పించుకున్నారు. దీంతో గత డిసెంబర్లో పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు ఫిర్యాదు చేయగా శాఖాపర విచారణలో నిజనిజాలు నిగ్గు తేలగా సస్పెన్షన్ వేటు వేశారు. గతంలోనూ టెక్నికల్ అసిస్టెంట్ నవీన్కుమార్ ఐటీ పరిధిలోకి రానప్పటికి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదని 2020లో కరోనా సమయంలో డ్రాయింగ్ ఆఫీసర్గా ఉన్న విజయసారథి 8 నెలల జీతాన్ని నిలిపేశారని తెలుస్తోంది. ఓ మహిళా అధికారిని కూడ తీవ్రంగా వేధించగా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పక్కా సమాచారం. కశ్మీర్గడ్డలోని రైతుబజార్లో టెక్నికల్ అసిస్టెంట్ లక్ష్మి తనిఖీలు చేపట్టగా లోపాలు బయటపడగా తానెక్కడ ఇరుక్కపోతానోనని చౌకీదారుగా డిమోషన్ కల్పిస్తానని, ఎస్ఆర్లో ఓ పేజీనే తొలగించి నానాభయభ్రాంతులకు గురి చేశారు. శాఖాపరంగా ఎదుర్కోవడంతో తీరా ఎస్ఆర్లో పదోన్నతికి సంబంధించి జిరాక్స్ ప్రతిని చేర్చారు. -
యూరియా బ్లాక్ దందా
ద్విచక్రవాహనంపై యూరియా బస్తాలు తీసుకెళ్తున్న ఈ రైతుది మానకొండూరు మండలం గంగిపల్లి. గురువారం మొబైల్లో ఫర్టిలైజర్ యాప్లో సహకార సంఘాల విక్రయ కేంద్రాల్లో యూరియా స్టాక్ లేకపోవడంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఎరువుల దుకాణంలో మూడు బస్తాలు బుక్ చేసి తీసుకునేందుకు వచ్చాడు. దుకాణ యజమాని బస్తాకు రూ.300 చెప్పడంతో మూడు బస్తాలకు రూ.900 చెల్లించాడు. దుకాణ యజమాని మాత్రం ఒక్కో బస్తాకు రూ.266 చొప్పున రశీదు ఇవ్వడం గమనార్హం. ఆన్లైన్లో యూరియా బస్తాకు రూ.300 అనుకుని చెల్లించానని, రశీదులో మాత్రం రూ.266 బిల్లును దుకాణయజమాని ఇచ్చాడని సదరు రైతు తెలిపాడు. ఈ పరిస్థితి ఒక్కరైతుది మాత్రమే కాదు.. ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో యూరియా బస్తాలను కొనుగోలు చేస్తున్న రైతులందరు వ్యాపారుల దోపిడీకి బలవుతున్నారు. -
కొండగట్టు!
మారనున్నసాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇంతకాలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా బొగ్గు, గ్రానైట్, ఇసుక లాంటి మైనింగ్ల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సింగరేణి బొగ్గు దేశీయంగా, గ్రానైట్ ఉత్పత్తులు అంతర్జాతీయంగా కరీంనగర్ ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేస్తోంది. తాజాగా ఈ జాబితాలో మరికొన్ని మూలకాలు చేరనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లభించే అరుదైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (ఆర్ఈఈ) కావడంతో జాతీయస్థాయిలో పలు మైనింగ్ కంపెనీల కన్ను జిల్లాపై పడింది. రాష్ట్రంలో అరుదైన మూలకాల అన్వేషణకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (ఆర్ఈఈ) మైనింగ్ కోసం దేశవ్యాప్తంగా 11 బ్లాకులను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించింది. అందులో తెలంగాణలోని రెండు బ్లాకుల్లో ఒకటి కొండగట్టు సమీపంలో ఉండటం స్థానికంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మూలకాలను తవ్వి తీసుకునేందుకు కావాల్సిన ఎక్స్ ప్లోరేషన్ సర్టిఫికెట్ కోసం కేంద్రం ఇటీవల ఫిబ్రవరి 17న ప్రారంభించిన ఈ బిడ్డింగ్లో ఏప్రిల్ 10 వరకు పాల్గొనేందుకు పలు మైనింగ్ కంపెనీలకు కేంద్ర గనుల మంత్రిత్వశాఖ అవకాశం కల్పించింది. ఇక్కడ మైనింగ్ మొదలైతే కొండగట్టే కాదు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్వరూపమే మారిపోనుంది. టైటానియం, వనాడియం బ్లాకులు ప్రపంచవ్యాప్తంగా రక్షణ, ఆరోగ్య, మెడికల్, ఐటీ తదితర రంగాల్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మార్కెట్కు మంచి డిమాండ్ ఉంది. ఈ రంగంలో చైనా, అమెరికా ప్రపంచ విపణిలో అగ్రగామిగా ఉన్నాయి. భారత్ కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (ఆర్ఈఈ) అన్వేషణకు రంగం సిద్ధం చేసుకుంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఆధ్వర్యంలో సిరిసిల్ల– జగిత్యాల జిల్లాల సరిహద్దులోని కొండగట్టు సమీపంలో టైటానియం, వనాడియం బ్లాకును గుర్తించింది. ఇది 202.29 చదరపు కి.మీ మేర విస్తరించి ఉంది. ప్రస్తుతం ఎక్స్ప్లోరేషన్ సర్టిఫికెట్ పొందిన మైనింగ్ సంస్థలు ఇక మైనింగ్ ప్రారంభించనున్నాయి. టైటానియం చాలా బలమైనలోహం. దీని మిశ్రమలోహాలు తేలికై నవి, పలు రకాలుగా వినియోగించుకునే వీలున్నవి. వీటితో తయారయ్యే ఉపకరణాలను వైమానిక, రక్షణ, పెట్రోకెమికల్స్, మెడికల్, ఆటోమోటివ్, క్రీడా, జెవెల్లరీ, పారిశ్రామిక రంగాల్లో వినియోగిస్తుంటారు. ఇక వెనీడియం అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో డిమాండ్ కలిగి ఉంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో వనాడియం కీలకం. ఇది స్థానిక పారిశ్రామిక రంగం అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. న్లూక్లియర్ పరిశోధనలకు, రక్షణ, గ్లాసు, స్టీలు ఉత్పత్తి, జీవశాస్త్ర పరిశోధనల్లోనూ దీనికి ప్రాధాన్యం ఉంది. -
వికసిత్ భారత్ పోస్టర్ ఆవిష్కరణ
కరీంనగర్స్పోర్ట్స్: వికసిత్ భారత్ జిల్లాస్థాయి యూత్ పార్లమెంట్–2026 పోటీల వాల్పోస్టర్ను గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నగరంలో ఆవిష్కరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించి, ఎమర్జెన్సీపై తమ అభిప్రాయాలు, ఆలోచనలను వ్యక్తపరచాలన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలను 18 నుంచి 25ఏళ్ల వయసు గల యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం స్పోర్ట్స్ అకాడమీ క్రీడాజెర్సీలు ఆవిష్కరించారు. ఎన్వైకే కో ఆర్డినేటర్ రాంబాబు, ఎస్సారార్ కళాశాల ప్రి న్సిపాల్ కలువకుంట్ల రామకృష్ణ, మేయర్ కొలగాని శ్రీనివాస్, సురేందర్రెడ్డి పాల్గొన్నారు. ఇంటర్ పరీక్ష రాసి.. తండ్రి చితికి నిప్పుపెట్టికరీంనగర్టౌన్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గొల్లపల్లికి చెందిన బండమీది అభి నగరంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ద్వితీ య సంవత్సరం చదువుతున్నాడు. అభి తండ్రి లక్ష్మయ్య గురువారం వేకువజామున గుండెపోటుతో చనిపోయాడు. తండ్రి మరణించిన దుఃఖాన్ని గుండెల్లో దాచుకున్న అభి ఇంటర్ పరీక్షలు రాసేందుకు వచ్చాడు. నగరంలోని శ్రేయ ఒకేషనల్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసి.. తిరిగి వెళ్లి మధ్యాహ్నం తండ్రి చితికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. ‘సాక్షి’ స్టడీ మెటీరియల్ అందజేతచిగురుమామిడి: పదో తరగతి విద్యార్థులకు ‘సాక్షి’ అందిస్తున్న స్టడీ మెటీరియల్ ఎంతగా నో ఉపయోగపడుతుందని బొమ్మనపల్లి సర్పంచ్ కొంకట మౌనిక అన్నారు. గురువారం బొమ్మనపల్లి జిల్లాపరిషత్ పాఠశాలలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో పదోతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను హెచ్ఎం లక్ష్మణ్రావుతో కలిసి పంపిణీ చేశారు. సాక్షి సిబ్బంది కత్తుల మొండయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 28న పౌరహక్కుల దినోత్సవంకరీంనగర్టౌన్: ఈ నెల 28న జిల్లావ్యాప్తంగా నిర్వహించే పౌరహక్కుల దినోత్సవంలో ప్రజ లు పాల్గొని జయప్రదం చేయాలని ఎస్సీ సంక్షేమశాఖ జిల్లా అధికారి నాగైలేశ్వర్ ఒక ప్రకటనలో కోరారు. కొత్తపల్లి మండలం బద్దిపల్లి, కరీంనగర్రూరల్లో చామనపల్లి, మానకొండూర్లో బంజేరుపల్లి, తిమ్మాపూర్లో వచ్చునూర్, గన్నేరువరంలో మైలారం, గంగాధర, రామడుగులో దేశ్రాజ్పల్లి, చొప్పదండిలో సాంబయ్యపల్లి, చిగురుమామిడిలో గాగిరెడ్డిపల్లి, వీణవంకలో మల్లారెడ్డిపల్లి, సైదాపూర్లో గర్రెపల్లి, శంకరపట్నంలో అంబేద్కర్నగర్, జూరాబాద్లో రాంపూర్, జమ్మికుంటలో సైదా బాద్, ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామాల్లో జరిగే పౌరహక్కులు దినోత్సవంలో రెవెన్యూ, పోలీసు, సంక్షేమశాఖ అధికారులు పాల్గొంటారని వెల్లడించారు. 6,7న పీహెచ్డీ ప్రవేశ మౌఖిక పరీక్షలుసప్తగిరికాలనీ(కరీంనగర్): ఎస్యూ పరిధి లోని తెలుగు విభాగంలో మార్చి 6, 7న పీహెచ్డీ ప్రవేశ మౌఖిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ సంచాలకుడు మహమ్మద్ జాఫర్ తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి విభాగాధిపతి కార్యాలయంలో మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. -
కలెక్టర్గా చిత్ర మిశ్రా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జిల్లా కలెక్టర్గా చిత్ర మిశ్రాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 45మంది ఐఏ ఎస్లు బదిలీ కాగా జిల్లా కలెక్టర్గా వ్యవహరించిన పమేలా సత్పతిని కార్మికశాఖ కమిషనర్గా స్థాన చలనం కల్పించారు. నూతన కలెక్టర్ చిత్ర మిశ్రా 2019 బ్యాచ్ కాగా తెలంగాణ క్యాడర్ కావ డం ఆహ్వానించదగ్గ పరిణామం. సంగారెడ్డి స్వస్థలం కాగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో 2018 లో ఆల్ ఇండియాలో 20వ ర్యాంక్ సాధించారు. తొలుత నాగర్ కర్నూలు ట్రైనీ కలెక్టర్గా పని చేశారు. తరువాత నిజామాబాద్ అదనపు కలెక్టర్గా, అక్కడే మున్సిపల్ కమిషనర్గా వ్యవహరించారు. ఇప్పటి వరకు ఏటూరునాగారం ఐటీడీఏ పీవోగా విధులు నిర్వహించగా.. తాజాగా కరీంనగర్ కలెక్టర్గా నియామకం అయ్యారు. పరిపాలనలో పమేలా తనదైన ముద్ర 2023 అక్టోబర్ 30న కలెక్టర్గా పమేలా సత్పతి బాధ్యతలు చేపట్టి పరిపాలనలో తనదైన ముద్ర వేశారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం ప్రశంసలు పొందారు. అంగన్వాడీలో శుక్రవారం సభ నిర్వహించి ప్రత్యేక మన్ననలు పొందారు. ఇటుక బట్టిల వద్ద విద్యనందించేలా కృషి చేశారు. పిల్లల భవితను కొనియాడుతూ ‘ఓ చిన్ని పిచ్చుక’ అంటూ స్వయంగా ఆలపించిన గీతం ప్రత్యేకంగా నిలిచారు. అలాగే ‘ఆరాటం ముందు ఆటంకం ఎంత’ అంటూ బధిరుల కోసం పాడిన పాట ఎంతగానో ఆకట్టుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని ఆదర్శంగా నిలిచింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున సైన్ లాంగ్వేజ్లో ప్రదర్శన ఇచ్చారు.పమేలా సత్పతిచిత్ర మిశ్రాషరా ‘మామూలే’.. -
● రోడ్డుపైనే వ్యాపారాలు ● ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు
అమరవీరుల స్తూపం ఎదుట ఆక్రమణలతో ఇరుకుగా రోడ్డుకరీంనగర్ కార్పొరేషన్: రోడ్డు ఆక్రమణల తొలగింపు మున్నాళ్ల ముచ్చటగా మారింది. నగరంలో ట్రాఫిక్కు తీవ్ర ఆటంకం కలిగిస్తున్న రోడ్డు, ఫుట్పాత్ల ఆక్రమణలపై బల్దియా అధికారులు చర్యలకు పూనుకుంటున్నా, కొద్ది రోజుల్లోనే పరిస్థితి మళ్లీ మొదటికొస్తోంది. ఫలితంగా ఆక్రమణల తొలగింపు నగరంలో ప్రహసనంగా మారింది. నగరం విస్తరిస్తుండగా, ట్రాఫిక్ సమస్యలు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. ఫుట్పాత్లు, రోడ్లు ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తుండడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. ముఖ్యంగా టవర్సర్కిల్, రాజీవ్చౌక్, తెలంగాణచౌక్ తదితర రద్దీ ప్రాంతాల్లో ఆక్రమణలు అధికంగా ఉంటున్నాయి. నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ గతంలో ఫుట్పాత్, రోడ్ల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రోడ్లు, ఫుట్పాత్లపై ఆక్రమణలను తొలగించారు. ఆ తరువాత కొద్దిరోజులకే మళ్లీ ఆక్రమణలు ప్రత్యక్షమవుతుండడంతో, స్పెషల్ డ్రైవ్ను నిరంతర ప్రక్రియగా మార్చారు. ఇటీవల బల్దియా ఎన్నికల నేపథ్యంలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఆక్రమణల తొలగింపుపై దృష్టిపెట్టలేకపోయారు. ఇదే అదనుగా నగరంలో మళ్లీ ఫుట్పాత్, రోడ్డు ఆక్రమణలు భారీగా పెరిగిపోయాయి. ఆక్రమణల తొలగింపు వివాదం నగరంలోని ఐడీఎస్ఎంటీ భవనం (పాత మున్సిపల్ గెస్ట్హౌస్) వద్ద రోడ్డు, పుట్పాత్లు ఆక్రమించి దుకాణాలు వెలుస్తుండడం తీవ్ర ఇబ్బందిగా మారింది. వాణిజ్య ప్రాంతం కావడంతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంపై రోడ్డుపైకి చొచ్చుకొని వచ్చి దుకాణాలు ఏర్పాటు చేసుకొంటున్నారు. దీంతో ఈ రోడ్డు గుండా వెళ్లేందుకు కార్లను పక్కనపెడితే, నడవడానికి ఇబ్బందికరంగా మారింది. గురువారం నగరపాలకసంస్థ డీఆర్ఎఫ్ సిబ్బంది ఆక్రమణల తొలగించడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా డీఆర్ఎఫ్ సిబ్బంది ఆక్రమణలు తొలగించకుండానే వెనుదిరిగినట్లు, సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అయ్యాయి. కొత్త పాలకవర్గం కొలువుతీరిన కొద్దిరోజుల్లోనే ఫుట్పాత్, రోడ్ల ఆక్రమణల తొలగింపుపై రాజకీయ దుమారం చెలరేగడం బీజేపీ పాలకవర్గానికి సవాల్గా మారింది. నగరంలో ట్రాఫిక్కు సంబంధించి ప్రధాన సమస్యగా మారిన ఫుట్పాత్, రోడ్ల ఆక్రమణలపై నగరపాలకసంస్థ ప్రత్యేక దృష్టిపెట్టాలని నగరవాసులు కోరుతున్నారు.సార్ రూటే.. ఇల్లీగల్! -
అసహనం..ఆగ్రహం!
ఇటీవలి కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ వారి నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలను గెలిపించుకున్నారు. ప్రతిష్టాత్మక కరీంనగర్లో పార్టీ పరంగా ఎలాంటి వ్యూహం లేకుండా పోయింది. పేరుకు టికెట్ల కేటాయింపు అసెంబ్లీ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావుకు ఇచ్చినా.. దాదాపు డజను మంది నేతలు ఎవరికి వారు పైరవీలు, ఒత్తిళ్లు చేసి తమవారికి టికెట్లు ఇప్పించుకున్నారు. పంతాలకు పోయి సర్వేలు, సామాజికవర్గాల సమీకరణాలను పక్కనబెట్టారు. ఇలా టికెట్లు పొందిన వారిలో దాదాపు 12మంది వరకు ఓడిపోయారని పార్టీనేతలు మొత్తుకుంటున్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి పలువురు ఆశావహులను పార్టీ ఆహ్వానించింది. ఇక్కడే సీనియర్ నేతలు, వారి కుటుంబ సభ్యులు ఎంటరయ్యారు. ఆశావహులకు ఫోన్లు చేసి దమ్కీలు ఇచ్చారు. మహిళలన్న కనికరం లేకుండా దాడులు చేస్తామని బెదిరించారు. దీంతో అలాంటి వారంతా ఇతర పార్టీల్లో చేరి విజయం సాధించారు. వారిని బెదిరించిన ఆడియోలిప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.సాక్షిప్రతినిధి,కరీంనగర్: ‘కరీంనగర్లో అసలేం జరుగుతోంది? అసెంబ్లీ గెలవలేదు, పార్లమెంటు సీటు గెలవలేదు, ఎమ్మెల్సీ పోగొట్టుకున్నాం. అర్బన్ బ్యాంకు పోగొట్టుకున్నాం.. కనీసం కార్పొరేషన్ అయినా దక్కించుకుంటారు అంటే అక్కడా అభాసుపాలయ్యారు. ఇదేం పద్ధతి.. పార్టీ ప్రతిష్టను రోజురోజుకు దిగజార్చుతున్నారు. ఈ పద్ధతేం బాగాలేదు.. పరిస్థితి ఇలాగే కొనసాగితే మీపై చర్యలు తీసుకుంటా..? అవసరమైతే వేటు వేస్తా’?.. ఇవీ.. సాక్షాత్తూ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కరీంనగర్ సీనియర్ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఇటీవల ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు. పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కూడా కాస్త అటూ ఇటుగా ఇవే అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల విషయంలో కాంగ్రెస్లో లుకలుకలు, క్షేత్రస్థాయిలో సమన్వయలోపం, అంతర్గత కలహాలు వెరసి ఇక్కడ పార్టీకి మేయర్ పీఠం దక్కకుండా చేసిన విషయం తెలిసిందే. ఇవే అంశాలపై నివేదిక తెప్పించుకున్న పార్టీ ఢిల్లీ పెద్దలు జిల్లానేతలకు అక్షింతలు వేసినట్లు సమాచారం.ఇటీవలి కార్పొరేషన్ ఎన్నికల్లో రాజకీయంగా కాంగ్రెస్– బీజే పీ మధ్యే పోటీ జరిగింది. నువ్వా– నేనా అన్నట్లుగా సాగిన ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నీతానై వ్యవహరించి 30మందిని గెలిపించుకోవడంలో సఫలీకృతుడయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక నుంచి టికెట్ల ఖరారు వరకు పలువురు జోక్యం చేసుకోవడం, క్షేత్రస్థాయిలో పనిచేయకపోవడం వల్ల పార్టీ 14 సీట్లకు పరిమితమైంది. బీజేపీకి ముగ్గురు స్వతంత్రులు, ఒక ఎంపీ సీటు బలం ఉండగా.. కాంగ్రెస్ ఇతర పార్టీ నేతలను కలుపుకుని మేజిక్ ఫిగర్ సాధించినా.. చివరి వరకు ఆ ఐక్యతను నిలబెట్టుకోలేక కాంగ్రెస్ చతికిలబడి పోయింది. మిగిలిన మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ మద్దతుతో అనేక మున్సిపాలిటీలు దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో బీజేపీని నిలువరించడంలో పూర్తిగా విఫలమైందని కరీంనగర్ నేతలపై ఢిల్లీ పెద్దలు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారని పేరు తెలిపేందుకు ఇష్టపడని ఓ పార్టీ నాయకుడు ‘సాక్షి’కి వెల్లడించారు. -
అందుబాటులోకి ట్రాఫిక్ గ్రీవెన్స్ సెల్
కరీంనగర్క్రైం: కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్, గ్రీవెన్స్ సెల్ను సీపీ గౌస్ ఆలం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగాచసీపీ మాట్లాడుతూ.. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ప్రజలు తమ ఫిర్యాదులను నేరుగా విన్నవించుకునేందుకు గ్రీవెన్స్ సెల్ దోహదపడుతుందని పేర్కొన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు, వేధింపులు లేదా ఇతర ఇబ్బందులపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రజలు సలహాలను, సూచనలు అందించవచ్చన్నారు. బాధితుల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును రికార్డు చేసి, నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చలాన్ల వివరాలు, రోడ్డు భద్రతా నియమాల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, భీంరావు, ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి, సీఐ కరీముల్లాఖాన్ పాల్గొన్నారు. -
ఎలుకా.. ఎలుకా ఎక్కడున్నావ్
కరీంనగర్రూరల్: తెలంగాణ రైతులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్న ఎలుకలు ఆంధ్రా కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాయి. పంట పొలాల్లో ఎలుకలు చేస్తున్న విధ్వంసంతో జిల్లాలోని రైతులు తీవ్రంగా నష్టపోతుండగా, వలస కూలీలకు ఆర్థిక భరోసా లభిస్తోంది. పొలాల్లో ఎలుకల బెడదను నియంత్రించేందుకు పలువురు రైతులు ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. ఎలుకలు పట్టేందుకు ఎకరానికి కొంతమొత్తంలో వసూలు చేయడం ద్వారా జీవనోపాధిపొందుతున్నారు. కత్తిమీద సాములా.. కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పంట పొలాల్లో ఎలుకలు వరిగింజలను కొరికేయడంతో పంట తాలుగా మారి దిగుబడి తగ్గిపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. కొందరు రైతులు ఎలుకలను చంపేందుకు విషపూరితమైన మందును పెట్టడం, బోను అమర్చినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. విచ్చలవిడిగా పెరిగిపోతున్న ఎలుకలను నిర్మూలించేందుకు ప్రత్యామ్నాయ దిశగా ఆలోచించిన కొందరు రైతులు ఆంధ్రప్రదేశ్లో ఎలుకల నిర్మూలనకు అవలంబిస్తున్న సాంప్రదాయ విధానాలను తెలుసుకుని సంప్రదించారు. బాపట్ల జిల్లా మేదరిమెట్లకు చెందిన మల్ల కొండయ్య సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన మందును నూకలతో కలిపి పొలాల్లో ఎలుకలు తిరిగే ప్రాంతాల్లో వేస్తూ ఎలుకలను నిర్మూలిస్తున్నాడు. పలువురు కూలీలకు ఉపాధి కల్పిస్తూ కొన్నేళ్లుగా ఇదే వృత్తిగా జీవనం సాగిస్తున్నాడు. స్థానికంగానే కూలీల నివాసం రైతులు ఎలుకల నిర్మూలనకు కొండయ్యను సంప్రదించిన వెంటనే గ్రామాలకు కూలీలను పంపిస్తాడు. ఎకరానికి రూ.200 చొప్పున రైతుల నుంచి వసూలు చేస్తాడు. పంట పొట్టదశ నుంచి కోతపూర్తయ్యే వరకు కూలీలు ఆయా గ్రామాల్లోనే నివాసముంటారు. మహిళలు నూకలతో కలిపి ఎలుకల మందును తయారు చేస్తుండగా పురుషులు పొలాల్లో మందు వేసే పనులు చేస్తారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్, ఖమ్మం తదితర జిల్లాలకు సుమారు 200 మంది కూలీలు ప్రస్తుత యాసంగి సీజన్కు ఎలుకలను నిర్మూలించేందుకు వచ్చారు. పొలాల్లో ఎలుకల నిర్మూలనకు మూడు దశల్లో నూకల్లో కలిపిన మందును వినియోగిస్తారు. ముందుగా ఎలుకలున్న ప్రాంతాలను గుర్తించి నూకలను వేయడంతో తిని చనిపోతాయి. పంట కోత పూర్తయిన తర్వాత ఎకరానికి రూ.200చొప్పున రైతులు చెల్లిస్తారు. మా తాత ముత్తాతల నుంచి పంట పొలాల్లో ఎలుకలను నిర్మూలించే పని చేస్తున్నాం. మేదరిమెట్లలోని మెజార్టీ కుటుంబాలన్ని ఇదేవృత్తిలో జీవనం కొనసాగిస్తున్నాయి. వేసవికాలంలో పొలాల్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉండటంతో ఆంధ్రా నుంచి ఉపాధికోసం తెలంగాణకు వస్తున్నాం. మాకు నెలకు రూ.6వేల చొప్పున ఇస్తారు. భోజనంతో పాటు వసతి కల్పిస్తారు. – ఆవుల రమేశ్, మేదరిమెట్ల, ఆంధ్రప్రదేశ్


