Karimnagar
-
ఇది.. మా అడ్డా
శనివారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2026కరీంనగర్ కలెక్టరేట్.. వివిధశాఖల ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, అర్జీదారులు, ప్రజలతో బిజీగా ఉంటుంది. వందల సంఖ్యలో ఉద్యోగులు, సందర్శకులు వస్తుంటారు. ప్రజలు, ఉద్యోగులే కాదు.. కలెక్టరేట్ కొద్దిరోజులుగా కుక్కలు, కోతులకు ఆవాసంగా మారుతోంది. కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద పదుల సంఖ్యలో కుక్కలు సేదతీరుతుండగా.. సమీపంలో వానర దండు తిష్ట వేసుకుని కూర్చుంటోంది. వాటిని చూసిన కలెక్టరేట్కు వచ్చే ఉద్యోగులు, ప్రజలు భయాందోళనకు గురవుతుండగా.. ‘ఏయ్ బిడ్డా.. ఇది మా అడ్డా..’ అన్నట్లు దారికి అడ్డంగా దర్జాగా సేదతీరుతున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
బ్యాంకు నుంచే చేయూత
కరీంనగర్ అర్బన్: చేయూత పింఛన్లు లబ్ధిదారుల కు చేరేలా ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుడుతోంది. బ్యాంకుల ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి అధికారులకు తదనుగుణ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో తపాలాశాఖ ద్వారా అందజేస్తున్నారు. గతానికి చెల్లుచీటి గతంలో లబ్ధిదారులకు బ్యాంకు ద్వారా చెల్లించేందుకు వ్యక్తిగత ఖాతాలు తెరిపించారు. పింఛన్ల పంపిణీ సమయంలో బ్యాంకుల్లో రద్దీతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వెనక్కి తగ్గారు. దీంతో నేటి వరకు తపాలాశాఖ ద్వారానే సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో బ్యాంకు ఖాతాలులేని వారికి మళ్లీ వ్యక్తిగత ఖాతాలు తెరిపించాల్సిన అవసరం ఏర్పడింది. బ్యాంకుల ద్వారా ఎలా అందజేస్తారన్న విషయమై ఇంకా స్పష్టత లేదు.జిల్లాలో చేయూత లబ్ధిదారులు: 1,23,041 వృద్ధాప్య: 48,918, వితంతు: 34,229 దివ్యాంగులు: 20,702 గీతకార్మికులు: 3,767 చేనేత కార్మికులు: 2,817 ఒంటరి మహిళలు: 3,271, బీడీ కార్మికులు: 9,937 -
పోలీసుల ముందు జాగ్రత్త..
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉండటంతో పోలీసులు తల పట్టుకుంటున్నారు. ఉభయవర్గాలను ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ వివాదం పెద్దది కాకుండా చూస్తున్నారు. శుక్రవారం ఉదయమే ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ నాయకుడు ముకేశ్ను అదుపులోకి తీసుకున్నారు. శనివారం చర్చకు సవాలు విసిరిన బీజేపీ నాయకులను కూడా హౌస్ అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ– కాంగ్రెస్ మధ్య పోరు.. ప్రెస్మీట్లు, ఆరోపణలు, పోస్టర్లకే పరిమితం కాకుండా సోషల్మీడియాకూ పాకింది. సోషల్మీడియాలో రెండు పార్టీల కార్యకర్తలు ఇష్టానుసారంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ పోస్టులపైనా ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్లు సమాచారం. మొత్తానికి ఎంపీ– ఎమ్మెల్యే వర్గీయుల మధ్య వర్గపోరు జగిత్యాల జిల్లా రాజకీయాలను అమాంతం వేడెక్కించాయి. -
బీఆర్ఎస్, బీజేపోళ్లకు ఏఎంసీ డైరెక్టర్ పదవులు
కరీంనగర్ కార్పొరేషన్: బీఆర్ఎస్, బీజేపీ వాళ్లకు కరీంనగర్ ఏఎంసీ డైరెక్టర్ పదవులు కట్టబెట్టారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుదగోని లక్ష్మీనారాయణగౌడ్ ఏఐసీసీ ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ను కలిసి ఫిర్యాదు చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని గాంధీభవన్కు కరీంనగర్, తిమ్మాపూర్ నాయకులతో కలిసిన వెళ్లిన ఆయన మీనాక్షి నటరాజన్ను కలిశారు. ఏఎంసీ చైర్మన్గా తనను నియమించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ప్రతిపాదించినా పట్టించుకోకుండా తనకు అన్యాయం చేశారని ఆమెకు వివరించారు. ఏఎంసీ నియామకాల్లో అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయాలని, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల నుంచి వెలిచాల రాజేందర్రావును తొలగించాలని కోరారు. -
సుభోద్సింగ్ కస్టడీకి కోర్టులో పిటిషన్
కరీంనగర్క్రైం: నగరంలోని పీఎంజే జువెల్లరీస్లో దోపిడీకి పాల్పడిన కేసులో సూత్రధారి అయిన సుభోద్సింగ్ కస్టడీకి పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. బిహార్ రాష్ట్రంలోని పూర్ణియా జైలు నుంచి పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. ఈ కేసుతో పాటు ఇతర కేసుల్లోనూ నిందితుడిగా ఉన్న సుభో ద్సింగ్ కస్టడీ కోసం ఆరు కోర్టుల్లో పీటీ వారెంట్లకు అనుమతులు పొందినట్లు పేర్కొన్నారు. సుభోద్సింగ్తో పాటు ప్రత్యేక పోలీసు బృందం గురువారం రాత్రి కరీంనగర్కు చేరుకుందని, అర్ధరాత్రి మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచినట్లు తెలిపారు. కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించామన్నారు. కేసును మరింత లో తుగా విచారించేందుకు నిందితుడిని వారం రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ కరీంనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. కస్టడీ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడినట్లు తెలిసింది. -
ఎంఆర్ఎఫ్ పనులపై విజి‘లెన్స్’
సాక్షిప్రతినిధి,కరీంనగర్: జిల్లా కేంద్రం పరిధిలోని మానేరు డ్యాం గేట్ల కింది భాగంలో మూడు కిలోమీటర్ల పొడవున ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన మానేరు రివర్ ఫ్రంట్ (ఎంఆర్ఎఫ్) అభివృద్ధి పనులపై రాష్ట్ర ఇంజినీరింగ్ విజిలెన్స్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. నిర్మాణాల నాణ్యత, సాంకేతిక ప్రమాణాలు, పనుల అమలు వంటి అంశాలపై దృష్టి సారించారు. సాంకేతిక అంశాలను పక్కనబెట్టి చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణం, గతంలో భారీ వర్షాలతో కొట్టుకుపోయిన చెక్ డ్యామ్ పరిస్థితులను పరిశీలించారు. కొట్టుకుపోయిన చెక్ డ్యామ్ వద్ద పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన అధికారులు, పనుల రూపకల్పన, అమలు విధానం, నాణ్యతా ప్రమాణాలపై ఆరా తీశారు. శాంపిల్స్ సేకరణ తనిఖీల్లో భాగంగా అధికారులు కాంక్రీట్, మట్టి, నిర్మాణ సామగ్రికి సంబంధించిన శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమి త్తం ప్రయోగశాలకు పంపించినట్లు తెలిసింది. ల్యాబ్ నివేదికలు వచ్చిన అనంతరం పనుల నాణ్యతపై పూర్తిస్థాయి నివేదిక ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలుస్తోంది. నిర్మాణాల్లో నాణ్యత లోపాలు లేదా సాంకేతిక ప్రమాణాల ఉల్లంఘనలు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఐకానిక్గా ఎంఆర్ఎఫ్... కరీంనగర్కు ఐకానిక్గా ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం రూ.615 కోట్ల వ్యయంతో ఎంఆర్ఎఫ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి పనులు ప్రారంభించింది. కరీంనగర్ నగర అభివృద్ధిలో కీలకంగా భావిస్తున్న నేపథ్యంలో పనుల నాణ్యతపై అనుమానాలు రెకెత్తుతున్నాయి. ఇటీవల చెక్ డ్యామ్ వరదనీటికి కొట్టుకుపోవడం, కొన్ని నిర్మాణాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ తనిఖీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అధికారులు సమగ్ర నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. -
బడిబాట సమర్థవంతంగా నిర్వహించాలి
కరీంనగర్ టౌన్: బడిబాట కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్లను పెంచాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు తదితర విభాగాల ఉన్నతాధికారులతో శుక్రవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 20 వరకు జిల్లావ్యాప్తంగా బడిబాట కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించి, అడ్మిషన్లు పెంచాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలల్లో చేరేలా చూడాలన్నారు. వర్షాకాలా న్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాల భవనాలకు అవసరమైన మరమ్మతు చేయించాలన్నారు. ఎక్కువ మంది విద్యార్థులుండే పాఠశాలలు, హాస్టళ్లలో సిబ్బంది, ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలన్నారు. కామన్ డైట్ మెనూకు అవసరమైన సరుకుల టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాల ని ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన యూనిఫాం, పుస్తకాలు సకాలంలో అందించా లన్నారు. ఎస్సీ సంక్షేమశాఖ డీడీ తిరుపతి రావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకా శ్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, ఆర్సీవో అంజలి, విద్యాశాఖ ఏడీ మాధవి, కోఆర్డి నేటర్లు అశోక్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎస్ఐఆర్తో అప్రమత్తంగా ఉండాలికరీంనగర్ కార్పొరేషన్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) విషయంలో అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పీసీసీ సమన్వయకర్త కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. సంఘటనా సృజన్ అభియాన్లో భాగంగా శుక్రవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో కరీంనగర్, చొప్పదండి ని యోజకవర్గాల ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఎస్ఐఆర్ విషయంలో ప్రతి బూత్ నుంచి కనీసం ఐదుగురు పార్టీ సభ్యులు బాధ్య త తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటర్లను కాపాడుకునే విధంగా ఓటర్ మ్యాపింగ్ గురించి అవగాహన కల్పించాలన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోనూ బీఎల్ఏలు ఎస్ఐఆర్ను పరిశీలించాలని సూచించారు. బీఆర్ఎస్ సోషల్మీడియా ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ కాంగ్రెస్పై విషప్రచారం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలే స్టార్ క్యాంపెనియర్లుగా పనిచేస్తూ వాస్తవాలు తెలియచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ తక్కువైందని, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొంటున్నారన్నారు. చిన్న చిన్న బేధాలు ఉంటే సరిదిద్దుకోవాలని, బీజేపీ, బీఆర్ఎస్లపై యుద్ధం చేయాలన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే కార్పొరేషన్ పరిధిలో బీఎల్ఏ– 2ల నియామకం పూర్తయిందని తెలిపారు. పీసీసీ ప్రతినిధి చంద్రశేఖర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్, ఏఎంసీ చైర్మన్ ఆకుల నర్సయ్య, కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి, ఎండీ. తాజ్, పులి ఆంజనేయులు గౌడ్, కర్ర సత్య ప్రసన్నరెడ్డి పాల్గొన్నారు.జమ్మికుంట: మండలంలోని బిజిగిరి షరీఫ్ దర్గాలో సంథల్ షరీఫ్ ఉత్సవాన్ని శుక్రవారం వేకువజామున ఘనంగా నిర్వహించారు. మొల్లపల్లి, పెద్ద బిజిగిరిషరీఫ్ గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు మేళతాళాల మధ్య సంథల్ షరీఫ్ను దర్గాకు తీసుకొచ్చి హజ్రత్ సయ్య ద్ ఇంకుషావలి రహమతుల్లా అలై, హజ్రత్ సయ్యద్ అజ్మత్షావలి రహమతుల్లా అలై, హజ్రత్ సయ్యద్ అక్బర్షావలి రహమతుల్లా అలై, హజ్రత్ సయ్యత్ ముర్తుజాషావలి సమాధులకు అలంకరింపజేశారు. ముస్లిం మత గురువు మౌలాన యాసీన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా ముజఫర్లు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన చాదర్లను సమాధులకు సమర్పించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి వొడితల ప్రణవ్ చాదర్లు సమర్పించారు. ఏసీపీ మాధవి, టౌన్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. దర్గా మతవల్లి మహమ్మత్ అక్బర్ అలీ, దర్గా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్ పాల్గొన్నారు. -
పోస్టర్ వార్!
పొలిటికల్తారాస్థాయికి ఎంపీ– ఎమ్మెల్యే వైరంసాక్షిప్రతినిధి, కరీంనగర్: జగిత్యాలలో ఎంపీ ధర్మపురి అరవింద్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ వర్గాల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. దీనికి కొనసాగింపుగా.. మాజీ మున్సిపల్ చైర్పర్సన్, బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే భోగ శ్రావణి వర్గం కూడా ఎమ్మెల్యేతో రాజకీయంగా తాడోపేడో తేల్చుకుంటామంటూ మాటల కత్తులు నూరుతున్నారు. ఇంతవరకూ మాటలకు, మైకులకే పరిమితమైన వీరి సవాళ్లు– ప్రతి సవాళ్లు పోస్టర్ల రూపంలో గోడల మీదకు ఎక్కాయి. బీజేపీ– కాంగ్రెస్ పార్టీలు ‘మీరు అవినీతి పరులంటే మీరే అవినీతి పరులు’ అంటూ పరస్పరం నిందించుకోవడం తీవ్రరూపం దాల్చింది. కేంద్రీయ విద్యాలయం భూకేటాయింపు విషయంలో మొదలైన విమర్శల పర్వం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. -
బావిలో పడి బాలుడు ..
బుగ్గారం: బావిలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన బుగ్గారం మ ండలం చిన్నాపూర్లో చోటుచేసుకుంది. పోలీ సుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన ఒర్సు శ్రీనివాస్ గొర్లను మేపుకుంటూ జీవిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం తన రెండో కుమారుడు శివకుమార్ (11)ను పరుమాల మహేశ్తో కలిపి గొర్రెల వద్దకు పంపించాడు. రెండు గంటల సమయంలో మహేశ్ ఫోన్ చేసి శివ కుమార్ కనిపించడం లేదని శ్రీనివాస్కు సమాచారం అందించాడు. శ్రీనివాస్ వెళ్లి వెదుకుతుండగా.. వ్యవసాయ బావి లో బాలుడి చెప్పులు కనిపించాయి. గ్రామస్తుల సహాయంతో బావిలో వెదకగా శవం కనిపించింది. బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయి ఉండవచ్చని మహేశ్ తెలిపాడు. తన కుమారుడి మృతిపై మహేశ్పై అనుమానం ఉందని శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్ తెలిపారు. మానసిక వికలాంగుడి మృతి జూలపల్లి: మండలంలోని తేలుకుంటలో ఓ మానసిక వికలాంగ బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. ఎస్సై సనత్కుమార్ వివరా లు.. తేలుకుంటకు చెందిన పంగ లక్ష్మీరాజంకు ముగ్గురు పిల్లలు. చిన్నవాడైన పంగ సాయికృష్ణ(8) మానసిక వికలాంగుడు. గురువారం ఉదయం ఇంటి సమీపంలో గల బావి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందాడు. సాయంత్రం వరకు కొడుకు ఇంటికి రాక పోవడంతో తెలిసిన వారి ఇళ్లలో వాకబు చేసి, అనుమానంతో బావిలో కొక్కెంతో వెతకగా బాలుడి మృతదేహం దొరికింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
బన్నీ వేసవి యాత్ర –20 ట్రాఫిక్ సిగ్నల్ అవగాహన
అంగడి(సంత) నుంచి వస్తూ రోడ్డు దాటలేక పిల్లలు అయోమయంగా నిలబడ్డారు. తాతయ్య: ‘ఏంట్రా ఆగిపోయారు?’ బన్నీ అన్నాడు.. ‘తాతయ్యా, కార్లు,బస్సులు ఆగకుండా వస్తున్నాయి. ఎలా దాటాలి?’ తాతయ్య సిగ్నల్ చూపిస్తూ ‘అదిగో, ఆ మూడు రంగుల లైట్లే మనకు దారి చూపిస్తాయి’ అన్నాడు. రామ్ అడిగాడు.. ‘ఎరుపు వెలిగితే ఏంటి తాతయ్యా?’ ‘ఎరుపు అంటే ఆగుము. వాహనాలు ఆగిపోతాయి. అప్పుడే మనం జీబ్రా క్రాసింగ్లో దాటాలి’ అన్నాడు తాతయ్య. చుక్క వెంటనే ‘మరి పసుపు రంగు?’ అని అడిగింది. ‘పసుపు అంటే తయారుగా ఉండు. నడవడానికి రెడీ అవ్వు, కానీ ఇంకా దాటొద్దు’ అని చెప్పాడు. స్వప్న ‘ఆకుపచ్చ వెలిగితే వాహనాలు వెళ్తాయి కదా? మనం ఆగాలి’ అంది. తాతయ్య మెచ్చుకుంటూ ‘భలే చెప్పావు. నియమం పాటిస్తే ప్రమాదం ఉండదు. ఎప్పుడూ సిగ్నల్ చూసే దాటండి’ అని అందరినీ రోడ్డు దాటించాడు. పిల్లలకి మాట : రోడ్డు నిబంధనలు పాటించాలి. సురక్షితంగా గమ్యాన్ని చేరాలి. డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, గ్రామం: కాకర్లపల్లి, మంథని, జిల్లా: పెద్దపల్లిసరైన ఆహారం, క్రమమైన వ్యాయామం, మంచి నిద్ర, సానుకూల ఆలోచనలు మనిషిని శారీరకంగా, మానసికంగా బలంగా ఉంచుతాయి. ఇలాంటి జీవనశైలి ఆత్మవిశ్వాసాన్ని పెంచి, భవిష్యత్కు సన్మార్గం వేస్తుంది. కానీ మత్తుపదార్థాల వైపు మొగ్గితే జీవితమే నాశనమవుతుంది. మత్తు తాత్కాలిక ఉపశమనం కల్పిస్తుందనిపించినా.. క్రమంగా ఆరోగ్యాన్ని, కుటుంబ సంబంధాలను, చదువును, కెరీర్ను నాశనం చేస్తుంది. మానసిక ఒత్తిడి, ఒంటరితనం వంటి కారణాలతో యువత మత్తుకు బానిసవుతున్నారు. ఒక్కసారి బానిసైతే బయటపడడం చాలా కష్టం. అందుకే ‘మత్తుకు నో.. జీవితానికి ఎస్’ అనే నినాదాన్ని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యమే నిజ మైన సంపద అని గ్రహించి, ప్రతి ఒక్కరూ ఆరో గ్యకరమైన జీవనాన్ని ఎంచుకోవాలి. అప్పుడే వ్యక్తిగతంగా, సామాజికంగా ఎదుగుతాం. పేరు : బైరి అభినయ్, 10వ తరగతి, సువిధ్య ఉన్నత పాఠశాల , కరీంనగర్ స్టాప్ డ్రగ్స్కోనరావుపేట(వేములవాడ): మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ కోనరావుపేటలోని సన్రైజ్ తైక్వాండో క్లబ్ ఆధ్వర్యంలో గురువారం వినూత్న ప్రచారం చేశారు. కోచ్ మంగళగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డ్రగ్స్, మత్తుపదార్థాలతో కలిగే అనర్థాలపై డ్రాయింగ్ వేసి.. తైక్వాండో స్టైల్లో బాలికలు పోస్టర్ పట్టుకొని ప్రచారం చేశారు. ‘డ్రగ్స్ వద్దని చెప్పు.. యువత మేలుకో డ్రగ్స్ను వదులుకో.. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం.. భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దాం.. పొగ తాగుట హానికరం..’ వంటి అర్థాలు వచ్చేలా చిత్రాలు గీశారు. -
పువ్వుల పేర్లతో పొడుపు కథలు
1. అమెరికాకు చెందిన పువ్వు విషపూరితమైన పువ్వు స్పాడిక్స్ ఉన్న పుష్పగుచ్ఛం ఆరేసి కుటుంబ పువ్వు 2. పువ్వులన్నీ సువాసన ఇస్తాయి కానీ ఈ పువ్వు వస్త్రాలనిస్తుంది 3. ఈ పువ్వు జడలో పెట్టుకోలేము ఈ పువ్వు కాశ్మీరులో ఉంటుంది ఈ పువ్వు తినడానికి వాడతాము 4. ఆకుల రంగులో ఉండే పువ్వు ఘాటైన సెంటు కొట్టుకునే పువ్వు 5. బురదలో ఉన్న స్వచ్ఛంగా ఉంటుంది గుండ్రని ఆకులతో నీటిలో ఉంటుంది నెలంబోనేసి కుటుంబంలో ఉంటుంది 6. భారతదేశంలోనే అరుదైన పుష్పం పుష్కరానికోసారి పూసే పువ్వు పశ్చిమ కనుమలలో పెరిగే పుష్పం 7. నైట్క్వీన్ బిరుదు కలిగిన పువ్వు ధనికమైనదని పేరు కలిగిన పువ్వు మెక్సికో దేశపు కాక్టస్ జాతి పువ్వు 8. లేత నారింజ రంగులో డిస్క్ పువ్వు వీల్పిన్ కుషన్ అనే పేరున్న పువ్వు అంతరించి పోతున్న దక్షిణాఫ్రికా పువ్వు 9. లిల్లీ పూలకు అక్కలు వసంతంలో పూచే పువ్వులు ఆకర్షణీయమైన రంగులు అత్యంత విలువైన పువ్వులు 10. ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం పోస్టల్స్టాంప్ ఉన్న పుష్పం ఆస్టరేసి కుటుంబ పుష్పం 11. టెన్నిస్ బంతుల్లాంటి పువ్వులు హరిప్రియ పేరు గల పువ్వులు సుగంధ ద్రవ్యాలలో వాడే పువ్వులు 12. భూమ్మీదే అరుదైన పువ్వు ప్రేమ అభిరుచి కలగలసిన పువ్వు యూకే, న్యూజిలాండ్ల్లోని పువ్వు 13. కరేబియాన్ దీవులు, దక్షిణ అమెరికా పువ్వు రేకులు ఔషధంగా ఉపయోగించే పువ్వు ఫాబేసి కుటుంబానికి చెందిన పువ్వు పగడపు రత్నం అనే బిరుదు గల పువ్వు 14. దుర్వాసన కలిగిన పువ్వు శవం పువ్వని పేరున్న పువ్వు మలేషియా, థాయ్లాండ్ల పువ్వు ప్రపంచంలోనే అతి పెద్ద పువ్వు 15. సుమత్రా ద్వీపానికి చెందిన పువ్వు కుళ్లిన చేప వాసన కలిగిన పువ్వు ఆరేసి కుటుంబానికి చెందిన పువ్వు 16. వుల్ఫియా గ్లోబోసా శాసీ్త్రయ నామం ప్రపంచంలోనే అత్యంత చిన్న పుష్పం ప్రాకాశవంతమైన ఆకుపచ్చ రంగు పుష్పం 17. పాముపడగ ఆకారంలో ఉండే పువ్వు పేరులో శాంతిని పెట్టుకున్న పువ్వు శ్రీస్పాతి ఫిలమ్శ్రీ పేరున్న శ్రీఆరేసిశ్రీ పువ్వు 18. తెల్లగా దెయ్యంలా ఉండే పువ్వు ఆకులు, కాండం లేకుండా ఉన్న పువ్వు అంతరించి పోతున్న ఆర్కిడెని పువ్వు 19. పుష్పించే అరుదైన పుదీనా జాతి పువ్వు తీవ్రమైన ప్రమాదంలో ఉన్న పువ్వు క్లేలెన్సులు అనే పేరు గల పువ్వు 20. మధ్య అమెరికాకు చెందిన పువ్వు అంతరించిపోయే దశలో ఉన్న పువ్వు గాలిమొక్కలుగా పేరు పొందిన పువ్వు బలం, అనుకూలతల మిళిత పువ్వు 21. పాపారేసి కుటుంబానికి చెందిన పువ్వు ఆసియన్ బ్లీడింగ్ హార్ట్ అని పేరున్న పువ్వు కొండల్లో రాతి పగుళ్లలో పెరిగే పువ్వు 22. హిమాలయ ప్రాంతపు అరుదైన పువ్వు మెకోనోప్సిన్ ఆక్యులేటా శాసీ్త్రయ నామం నీలపురంగు రెక్కలు పసుపు కేసరాల పుష్పం 23. ఆడపిల్లల చెప్పును పోలి ఉండే పువ్వు భారతీయపు అరుదైన సున్నితమైన పువ్వు అంతరిస్తున్న కారణంగా రక్షింపబడే పువ్వు 24. రసవంతమైన పుష్పించే మొక్క రంగులతో అలంకార మొక్క కళ్లు మిరుమిట్లు గొలిపే మొక్క 25. ఇంద్రధనస్సు వర్గాలతో పూలు ఎక్కువసేపు వాడిపోని పూలు రాముంటిక్ ఫ్లవరోగా పేరున్న పూలు అదృష్టం, సామరస్యాలకు చిహ్నాలు జావాబులు:1.ఆంధూరియా, 2.పత్తి పువ్వు, 3.కుంకుమ పువ్వు, 4.సంపెంగ పువ్వు, 5.తామర పువ్వు, 6.నీలకురించి, 7.కడుపుల్ పువ్వు, 8.కధారిన్ పువ్వు, 9.తులిప్ పూలు, 10. బ్రహ్మకమలం, 11.కదంబ పూలు, 12.మిడిల్ మిస్ట్ రెడ్ పువ్వు, 13.చిలక ముక్కు పువ్వు, 14.రఫ్లీషియా, 15.టైటాన్ ఆరమ్ కారియన్ పువ్వు (అమారో ఫాలాస్ టైటానియమ్), 16.వాటర్ మీల్ పువ్వు, 17.్చీపస్ లిల్లీ, 18.ఘోస్ట్ ఆర్కిడ్, 19.అకాంతోమింతాం ఇలిసిఫోలియా (శాన్ డియాగో ధోర్న్ మింట్), 20.టిల్లాడ్సియా, 21.లాంప్రో కాప్నోస్ పువ్వు, 22.హిమాలయన్ బ్లూపాపి, 23.లేడిస్ స్లిప్పర్ ఆర్కిడ్డాక్టర్ కందేపి రాణిప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్, సృజన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, సిరిసిల్ల -
రోజూ నేర్చుకుంటున్నాం
వేసవిలో ఇంటి వద్దే ఉంటూ ఉదయం, సాయంత్రం డ్యాన్స్ నేర్చుకుంటున్నాం. డ్యాన్స్ నేర్చుకోవడం ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. – పొందుర్తి భువన్ ఎండాకాలం సెలవుల్లో ఎండల్లో తిరగకుండా సరదాగా డ్యాన్స్ నేర్చుకుంటున్నాం. నిత్యం డ్యాన్స్లో శిక్షణ తీసుకోవడం సంతోషంగా ఉంది. – వర్షిణి సెలవుల్లో సెల్ఫోన్లు చూసేందుకు కూడా టైం దొరకడం లేదు. ఉదయం, సాయంత్రం డ్యాన్స్ నేర్చుకుంటున్నాం. ఇది మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా మంది మమ్మల్ని అభినందిస్తున్నారు . – నేహాశ్రీ -
కరీంనగర్కు సుభోద్సింగ్!
కరీంనగర్క్రైం: కరీంనగర్లోని పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసులో సూత్రధారి, అంతర్ రాష్ట్ర గ్యాంగ్ హ్యాండ్లర్, ‘ది గోల్డెన్ థీప్’ సుభోద్సింగ్ను కరీంనగ ర్ పోలీసులు గురువారం రాత్రి స్థానిక కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకొచ్చినట్లు సమాచారం. బిహార్ జైలులో ఖైదీగా ఉన్న సుభోద్సింగ్ను పీటీ వారెంట్పై కరీంనగర్ కోర్టుకు తరలించి, కస్టడీ తీసుకునేందుకు సిద్ధమైన్లు తెలిసింది. నగరంలోని పీఎంజే జువెల్లరీస్లో దోపిడీకీ మూడు నెలల నుంచి రెక్కీ నిర్వహించిన సుభోధ్సింగ్ ముఠాకు చెందిన నలుగురు సభ్యులు పక్కాగా ప్లాన్ వేసి ధర్మపురి లాడ్జీలో మకాం వేశారు. అంతకంటే ముందు మహరాష్ట్రలోని చంద్రాపూర్ నుంచి తుపాకులు తీసుకొచ్చి ధర్మపురిలో పెట్టుకున్నారు. అక్కడి నుండి వచ్చి కరీంనగర్లోని పీఎంజే జువెల్లరీస్లో ఈ నెల 3వ తేదీన ఉదయం 11 గంటలకు రూ.82.02 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీ చేశారు. జువెల్లరీస్ సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించగా తుపాకీతో కాల్పులు జరిపారు. అనంతరం బైక్లపై పలు గ్రామాల గుండా కాలువలు, గ్రామీణ రోడ్ల మీదుగా ధర్మపురికి చేరుకున్నారు. అక్కడి నుంచి గోదావరి నది దాటి మంచిర్యాల మీదుగా రైలులో పరారయ్యాయు. అక్కడి నుంచి పారిపోయి ముఠా సభ్యులకు బంగారం చేరవేశారు. వారు దానిని నేపాల్ తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. బృందాలుగా ఏర్పడిన కరీంనగర్ పోలీసులు బిహార్, పశ్చిమబెంగాల్తో పాటు వివిధ రాష్ట్రాల పోలీసు అధికారులు, సిబ్బంది సాయంతో నిందితులు బెంగాల్కు చెందిన రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జగిరాసింగ్, బిహార్కు చెందిన రావిష్కుమార్ అలియాస్ ప్రద్యుమన్, నిందితులకు సిమ్కార్డులు సరఫరా చేసిన బెంగాల్కు చెందిన మెహతాబ్ఖాన్ అలియాస్ మహబూబ్ఖాన్లను గుర్తించి ఈనెల 14న అరెస్టు చేసి కరీంనగర్ తీసుకొచ్చారు. ఈ దోపిడీ కేసులో కీలక సూత్రధారి అయిన సుభోద్సింగ్తో పాటు మిగితా నిందితులు పరారీలో ఉండగా, బిహార్ జైళ్లో ఉన్న సుభోద్సింగ్ను పీటీ వారెంట్పై కరీంనగర్ పోలీసులు తీసుకొచ్చినట్లు తెలిసింది. కోర్టు అనుమతిస్తే కస్టడీకీ తీసుకొని దోపిడీ సమాచారం రాబట్టాలని భావిస్తున్నారు. పీటీ వారెంట్పై బిహార్ జైలు నుంచి ‘పీఎంజే’ దోపిడీ సూత్రధారి తరలింపు -
వడదెబ్బతో వ్యక్తి..
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ పరిధి పాలకుర్తి మండలం ఎల్కలపల్లి గ్రామంలో అప్పల రాజయ్య(55) వడదెబ్బతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రాజయ్య బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి పొలం వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గ్రామ పరిసర ప్రాంతాల్లో వెతకగా గురువారం గుంటూరుపల్లి గ్రామ శివారులో పొలంలో వడదెబ్బతో మృతిచెందినట్లు గుర్తించారు. మృతుడి భార్య అప్పల కొమురమ్మ ఎల్కలపల్లి గ్రామ వార్డు సభ్యురాలు. కొడుకు అనిల్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్కిరణ్ తెలిపారు. జీడీనగర్లో వృద్ధుడు.. పాలకుర్తి(రామగుండం): మండలంలోని జీడీనగర్ గ్రామానికి చెందిన గండికోట మల్లయ్య(82) గురువారం వడదెబ్బతో మృతిచెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. తీవ్ర ఎండల ధాటికి అస్వస్థతకు గురైన మల్లయ్య అపస్మారక స్థితికి వెళ్లడంతో కుటుంబసభ్యులు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
అనుమానాస్పదంగా యువకుడు..
కరీంనగర్ క్రైం: నగరంలోని సప్తగిరికాలనీకి చెందిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని మృతి చెందాడు. కరీంనగర్ టూ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. సప్తగిరికాలనీకి చెందిన తులసి సురేశ్(36) మంకమ్మతోటలో పాత లేబర్ అడ్డా వద్ద ఆన్లైన్ సర్వీసెస్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం చేసి సెంటర్కు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో సురేశ్ తల్లి భాగ్యమ్మ పలుమార్లు ఫోన్ చేసింది. అతని బంధువులు, స్నేహితులకు కూడా ఫోన్ చేసినా సురేశ్ లిఫ్ట్ చేయలేదు. రాత్రంతా ఫోన్ తీయకపోవడంతో గురువారం వేకువజామున సురేశ్ సోదరి లక్ష్మి అతని స్నేహితుడికి ఫోన్ చేసి షాప్ వద్దకు వెళ్లి చూడమని చెప్పింది. అతను వెళ్లి స్థానికుల సాయంతో షట్టర్ తీసి చూడగా.. లోపల ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెంది ఉన్నాడు. వెంటనే అతని కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లగా, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సురేశ్ మృతిపై అనుమానం ఉందని తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. సురేశ్ మృతికి వ్యక్తిగత కారణాలు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ, ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. -
స్టెప్పేస్తే మాస్
● డ్యాన్స్లో శిక్షణ తీసుకుంటున్న చిన్నారులు ● రాచర్లబొప్పాపూర్లో సందడిగా వేసవి శిక్షణ శిబిరం ● జానపదం, కోలాటం, క్లాసికల్ డ్యాన్స్లో ట్రెయినింగ్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): విద్యార్థినులు స్టెప్పు వేస్తే ఓ స్టైల్.. అడుగు వేస్తే ఓ రిథమ్... మొత్తానికి వేసవి శిక్షణ శిబిరాలు నృత్యశిక్షణతో కళకళలాడుతున్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో గత 15 రోజులుగా కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరం చిన్నారులతో ఆకట్టుకుంటుంది. భువన ఆర్ట్స్ అకాడమీ డ్యాన్స్ మాస్టర్ పొందుర్తి ఉమేశ్ మార్గదర్శనంలో విద్యార్థినులు సెమీ క్లాసికల్, జానపదం, భక్తికోలాటం, జడకొప్పులు.. వెస్టర్న్ వంటి నృత్యాలు నేర్చుకుంటున్నారు. సరదాగా సెలవులు మండుతున్న వేసవిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నృత్య కళలో శిక్షణ పొందుతున్నారు. రాచర్లబొప్పాపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో గత పదిహేను రోజులుగా నిర్వహిస్తున్న ట్రెయినింగ్ క్యాంపునకు విద్యార్థులు భారీగా హాజరవుతున్నారు. డ్యాన్స్ నేర్చుకోవడం ద్వారా ఏకాగ్రత పెంపొందడంతోపాటు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉచితంగా శిక్షణ ఇస్తుండడంతో దాదాపు 150 మంది విద్యార్థులు భారీగా హాజరవుతున్నారు. వేసవి సెలవులు ముగిసే వరకు ఈ శిక్షణ శిబిరం కొనసాగనుంది. ఇటీవల సిరిసిల్లలో నిర్వహించిన కార్యక్రమంలో ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రతిభ చూపిన విద్యార్థులను కలెక్టర్ గరీమా అగ్రవాల్ ప్రశంసపత్రాలు అందించి, అభినందించారు. హ్యాండ్రైటింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఎంబ్రాయిడరీ, డ్యాన్స్ అంశాల్లో వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. నేను దాదాపు 26 ఏళ్లుగా పిల్లలకు నృత్య శిక్షణ ఇస్తున్నా. భువన ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో డ్యాన్స్ నేర్పిస్తున్నాను. పిల్లలు కూడా ఆసక్తి చూపుతున్నారు. మాలాంటి కళాకారులకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే మరింత మందిని కళాకారులుగా తీర్చిదిద్దేందుకు అవకాశం దక్కుతుంది. – పొందుర్తి ఉమేశ్, భువన ఆర్ట్స్ అకాడమీ, డ్యాన్స్ మాస్టర్ -
తాటిచెట్టు పైనుంచి పడి గీతకార్మికుడు మృతి
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మండలం కాట్నపల్లికి చెందిన గీతకార్మికుడు వీరగోని బక్కయ్య(49) గురువారం తాటిచెట్టు పైనుంచి ప డి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. బక్కయ్య రోజువారీ కార్యక్రమంలో భాగంగా తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు మోకు జారడంతో కిందపడ్డాడు. తీవ్రగాయాలు కాగా స్థానికులు 108లో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అ ప్పటికే మృతి చెందినట్లు తెలి పారు. మృతుడి భార్య ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బక్కయ్యకు కొడుకు, కూతురు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని సర్పంచ్ ఓగుల పూజ, గౌడ సంఘం అధ్యక్షుడు పోచమల్లు కోరారు. -
ఉపాధి కోర్సులు.. భవితకు వెలుగులు
కరీంనగర్సిటీ: ప్రస్తుత ఏఐ జనరేషన్లో విద్యార్థులు ఉపాధి లభించే కోర్సులనే ఎంపిక చేసుకుంటున్నారు. తక్కువ వ్యవధిలో జీవితంలో స్థిరపడేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టెక్నాలజీ అందిపుచ్చుకుంటున్న డిగ్రీ విద్యార్థులు చదువు పూర్తి కాగానే ఉద్యోగాలు సాధిస్తున్నారు. శాతవాహన యూనివర్సిటీ పరిధి లో 18 ప్రభుత్వ డిగ్రీ, పీజీ, 3 అటానమస్, 55 ప్రైవేటు కాలేజీలున్నాయి. పలు కళాశాలల్లో ఉపాధి కోర్సులు ప్రారంభమయ్యాయి. యువత త్వరగా ఉద్యోగాలు సాధించే విధంగా ఎస్సారార్, మహిళా డిగ్రీ కళాశాల, జగిత్యాలలోని మహిళా డిగ్రీ కళాశాలలో ఉపాధి కోర్సులు ప్రవేశపెట్టారు. ఇంటర్ ఫలితాలు వెలువడడంతో డిగ్రీ కళాశాలలో చేరిన మొదటి ఏడాది నుంచే ఉపాధి కల్పించే దిశగా ఏఈడీపీ (అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాం) అమలు చేస్తున్నారు. ఆయా కోర్సులకు సంబంధించి పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. -
శుక్రవారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2026
భక్తిశ్రద్ధలతో బక్రీద్కరీంనగర్కల్చరల్: త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ను జిల్లావ్యాప్తంగా ముస్లింలు గురువారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. రేకుర్తి సాలెహ్నగర్, కళాభారతి వద్ద, కొత్తపల్లి, చింతకుంట, బైపాస్రోడ్డులో ఉన్న ఈద్గాలు, గ్రామాల్లోని దర్గాల వద్ద సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. మత గురువులు సందేశమిచ్చారు. సాలెహ్నగర్ ఈద్గా వద్ద జరిగిన ప్రార్థనల్లో సీపీ గౌస్ ఆలం పాల్గొన్నారు. ఈద్గా వద్ద విధుల్లో ఉన్న ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రూరల్ ఏసీపీ విజయ్కుమార్, కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. పోలీసులు ఎస్సారార్ కళాశాల నుంచి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. నగరపాలక సంస్థ, విద్యుత్, వైద్యశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
నగరంపై పోలీసు నిఘా
కరీంనగర్క్రైం: నగరంపై పోలీసులు నిఘా పెంచారు. ఇటీవల జరిగిన పీఎంజే బంగారు దుకాణం చోరీ తరువాత మరింత అప్రమత్తం అయ్యారు. అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. నిరంతర నాకాబందీలు నిర్వహిస్తూ అనుమానితుల గురించి ఆరా తీస్తున్నారు. కరీంనగర్లో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే లక్ష్యంగా సీపీ గౌస్ ఆలం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల జరిగిన దోపిడీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే బంగారు దుకాణాలు, లాడ్జీలు, హోటళ్ల నిర్వాహకులతో సమావేశమై సలహాలు సూచనలు ఇచ్చారు. నేరుగా వ్యాపార సముదాయాలను తనిఖీ చేస్తూ వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, ఎమర్జెన్సీ సదుపాయాలపై నిర్వాహకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతీ సముదాయంలో సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని, విజువల్స్ స్పష్టంగా ఉండటంతో పాటు బ్యాకప్ నిల్వ ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. భద్రతా ప్రమాణాల్లో నిర్లక్ష్యం వహించే వ్యాపార సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. బంగారు దుకాణాలపై.. జిల్లావ్యాప్తంగా 50కి పైగా జువెల్లరీ షోరూంలు ఉన్నాయి. ఇటీవల జరిగిన పీఎంజే జువెల్లరీ దొంగతనం నేపథ్యంలో అన్ని జువెల్లరీస్ నిర్వాహకులను పోలీసులు అప్రమత్తం చేశారు. దుకాణాల్లో తప్పనిసరిగా అర్హత కలిగిన భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించారు. దుకాణం ప్రవేశ ద్వారాల వద్ద డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, వినియోగదారుల తనిఖీలకి హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు షోరూంల్లో ఎమర్జెన్సీ అలారం ఏర్పాటు చేసి, నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు జిల్లావ్యాప్తంగా 100 వరకు, కరీంనగర్ సిటీలో 50కి పైగా హోటళ్లు, లాడ్జీలు ఉన్నాయి. పీఎంజే దొంగలు లాడ్జీల్లో ఉంటూ రెక్కీ నిర్వహించిన నేపథ్యంలో ఇకపై ప్రతీ హోటల్, లాడ్జీపై పోలీసు నిఘా తప్పనిసరిగా ఉంటుందని సీపీ నిర్వాహకులను హెచ్చరించారు. ఇటీవల నగరంలోని హోటళ్లు, లాడ్జీల నిర్వాహకులతో సమావేశమై బసచేసే వారి వివరాల సేకరణలో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. గదులు అద్దెకు ఇచ్చే ముందు ఆధార్, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని, ఫోన్ నంబర్లు ధృవీకరించాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆదేశించారు. సీపీ స్వయంగా లాడ్జీలు తనిఖీ చేస్తూ రిజిష్టర్లు పరిశీలిస్తున్నారు. నిబంధనలు పాటించనివారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. పెరిగిన గస్తీ.. నాకాబందీ నగరంలో పోలీసులు గస్తీ పెంచారు. రాత్రి సమయంలో పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. అర్ధరాత్రి సైతం వాహన తనిఖీలు చేపడుతూ అనుమానితుల గురించి ఆరా తీస్తున్నారు. ప్రతీ పోలీసు స్టేషన్ పరిధిలో ఏకకాలంలో నాకాబందీ నిర్వహిస్తూ వాహన ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తున్నారు. నిబంధనలు పాటించనివారికి జరిమానాలు విధిస్తున్నారు. నేరాల్లో పాల్పడేవారు ఎక్కువ శాతం దొంగిలించిన, నంబర్ ప్లేట్ లేని వాహనాలు వాడుతున్న నేపథ్యంలో అలాంటి వాహనాలను స్టేషన్కు తరలించి, విచారణ చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాపై కొరడా ఝులిపిస్తున్నారు. కార్గో సెంటర్లు, ట్రాన్స్పోర్టు కార్యాలయాలు, పాన్షాపుల్లో, బస్టాండ్లో జాగిలాలతో తనిఖీలు చేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు నిర్వహించిన నాఖాబందీలో 1,479 వాహనాలు తనిఖీ చేశారు. 48 డ్రంకెన్డ్రైవ్ కేసులు నమోదు చేశారు. నంబర్ ప్లేట్ సరిగ్గా లేని 60 వాహనాలను గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన 115మందికి చలానా విధించారు. -
జనగణన.. బడిబాట
బాడిబాటలో ఉపాధ్యాయులుజనగణనలో ఉపాధ్యాయులుకరీంనగర్టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలనే లక్ష్యంతో ఓ వైపు బాడిబాట కార్యక్రమం.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జనగణన త్వరగా పూర్తిచేయాలనే లక్ష్యం మరోవైపు ప్రభుత్వ ఉపాధ్యాయులను అయోమయానికి గురి చేస్తోంది. బడిబాట, జనగణన, టీచర్ ట్రెనింగ్ షెడ్యూల్ నెలరోజుల్లోనే ఉండడంతో ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్న చందంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 14 నుంచి జూన్ 19 వరకు ‘బడిబాట’ నిర్వహించేలా విద్యాశాఖ ప్రణాళికలను రూపొందించింది. 95 శాతం మంది ఉపాధ్యాయులు జనగణన విధుల్లో నిమగ్నమై ఉండడంతో పాటు ఎండల తీవ్రతతో ‘బడిబాట’ తూతూమంత్రంగానే కొనసాగుతోంది. బడిబాట షెడ్యూల్ ఇదీ.. విద్యా వారోత్సవాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 651 ప్రభుత్వపాఠశాల్లో 5వేల మందికి తగ్గకుండా విద్యార్థులను చేర్పించాలనే లక్ష్యంతో ఈ నెల 14 నుంచి బడిబాట ప్రారంభమైంది. జూన్ 19 వరకు కొనసాగనుంది. ఇప్పటి వరకు వివిధ కార్యక్రమాలు కొనసాగగా.. ఈనెల 28న యువత, స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించారు. జూన్ 3న గ్రామసభ, 4న అవగాహన ర్యాలీ, 5న ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించాలి. 6న బడి బయట పిల్లలను గుర్తించాలి. 8 నుంచి 10 వరకు ఇంటింటి ప్రచారం, 12న వెల్కమ్డే (అమ్మ మాట పాఠశాల), 15న సామూహిక అక్షరాభ్యాసం, 16న ఎఫ్ఎల్ఎన్డే, 17న గర్ల్ చైల్డ్, ఇనూసీవ్ ఎడ్యుకేషన్ డే, 18న డిజిటల్ అవేర్నెస్ డే, 19న స్పోర్ట్స్డేతో బడిబాట ముగియనుంది.జిల్లాలోని ఉపాధ్యాయులు జూన్ 9వ తేదీ వరకు జనగణన విధులు నిర్వహించనున్నారు. ఈ సమయంలోనూ బడిబాట ఏర్పాటు చేయడంతో అయోమయం నెలకొంది. 95శాతం మంది జనగణన విధుల్లో పాల్గొంటుండగా, మిగిలిన 5శాతం మందిని అదనంగా అదే విధులకు కేటాయించారు. ఇటు జనగణన, అటు బడిబాటలో ఏకకాలంలో ఎలా పాల్గొనాలో అర్థంకాక ఉపాధ్యాయులు తల పట్టుకుంటున్నారు. ఒకే సమయంలో రెండు విధులు నిర్వహించమంటే ఉపాధ్యాయుల నుంచి ఎలాంటి ఆక్షేపణలు ఎదురవుతాయోనని హెడ్మాస్టర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో ఆదర్శంగా నిలవండి
కరీంనగర్ అర్బన్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని పౌరసరఫరాలశాఖ డైరెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం సాయంత్రం జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పురోగతి, రైతులకు చెల్లింపులు, మిల్లులకు ధాన్యం తరలింపుపై అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో కే.మహేశ్వర్, పౌరసరఫరాల శాఖ, రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే 115 కొనుగోలు కేంద్రాల్లో ప్రక్రియ పూర్తయ్యిందని, మిగతా కేంద్రాలోనూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కొనుగోళ్ల నిర్వహణలో జిల్లా రా ష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, సివిల్ సప్లై డీఎం రజనీకాంత్, జిల్లా సహకార అధికారి రామానుజాచార్యులు పాల్గొన్నారు. తడిసిన ధాన్యం కొంటాంకరీంనగర్ అర్బన్: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని కలెక్టర్ చిత్రామిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు స్వీకరించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సుమారు 600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించినట్లు వెల్లడించారు. కరీంనగర్ పాక్స్లో 600 క్వింటాళ్లు, గంగాధర పాక్స్లో 1200 క్వింటాళ్లు, లక్ష్మీదేవిపల్లిలో 400 క్వింటాళ్లు, చెర్లపల్లి(ఎన్)లో 400 క్వింటాళ్లు, ర్యాలపల్లిలో 320 క్వింటాళ్లు, కొండయ్యపల్లిలో 200 క్వింటాళ్లు, వెంకటాయిపల్లిలో 160 క్వింటాళ్లు, మంగపేటలో 120 క్వింటాళ్లు, మధురానగర్లో 40 క్వింటాళ్లు, నర్సింహులపల్లిలో 240 క్వింటాళ్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. చొప్పదండి పాక్స్లో 800 క్వింటాళ్లు, రామడుగు మండలంలోని తిర్మలాపూర్లో 1230 క్వింటాళ్లు, గన్నేరువరం మండలంలో 290 క్వింటాళ్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లాలో 2.67లక్షల మెట్రిక్ టన్నుల ధా న్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యాన్ని విక్రయించిన రైతులకు రూ.488.52 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. కలెక్టరేట్ ఏవోగా నరేందర్కరీంనగర్ అర్బన్: సాధారణ బదిలీల్లో భాగంగా పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ చిత్రామిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ ఈ.నరేందర్ను కలెక్టరేట్ ఆడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా నియమించారు. కలెక్టరేట్ ఏవోగా ఉన్న గడ్డం సుధాకర్ను జమ్మికుంట తహసీల్దార్గా బదిలీ చేశారు. సీ సూపరింటెండెంట్ ఎన్.రాజేశ్ను కరీంనగర్ అర్బన్ తహసీల్దార్గా, హెచ్ సూపరింటెండెంట్ టి.మాధవిని సీ సూపరింటెండెంట్గా నియమించారు. డిప్యూటేషన్పై విధులు నిర్వహిస్తున్న గందె లక్ష్మినర్సింహరావు కరీంనగర్ రూరల్కు కేటాయించారు. గంగాధర, గన్నేరు వరం తహసీల్దార్లు ఎ.రజిత, కోడం కనకయ్య లను అదేస్థానంలో నియమించారు. కరీంనగర్ ఆర్డీవో కార్యాలయ డీఏవో వి.రఘుపతిని అక్కడే రిటైయిన్ చేశారు. నేడో, రేపో మరిన్ని బదిలీలు ఉంటాయని సమాచారం. -
చిన్నారిపై కుక్కల దాడి
కోల్సిటీ: పెద్దపల్లి జిల్లా రామగుండం నగరంలో కుక్కల దాడులకు అడ్డుకట్ట పడడం లేదు. బుధవారం గోదావరిఖని లక్ష్మీనగర్లోని బోళ్ల బజార్లో బాలిక(8)పై కుక్కలు దాడి చేసి కరిచాయి. శునకాలు మీదపడి దాడిచేసి గాయపరుస్తుంటే, కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందని 51వ డివిజన్ కార్పొరేటర్ ఆకారపు రేఖా – మహేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాంగ్రెస్ కార్పొరేటర్ కుమారుడుపై కుక్కలు దాడి చేసిన ఘటన జరిగినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. వీధి కుక్కల బెడద నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని అధికారులను డిమాండ్ చేశారు. వడదెబ్బతో కూలి మృతివేములవాడరూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లికి చెందిన పాటి తిరుపతి(59) బుధవారం వడదెబ్బతో మృతిచెందినట్లు ఎస్ఐ వెంకట్రాజం తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్గా, ఇతర పనులు చేసుకుంటున్న తిరుపతి బుధవారం గ్రామంలో ఓ మహిళ మృతిచెందగా ట్రాక్టర్లో కట్టెలు తీసుకెళ్లి అంత్యక్రియలు ముగిసే వరకు అక్కడే ఉన్నాడు. అనంతరం ట్రాక్టర్లో ధాన్యాన్ని కేంద్రానికి తీసుకెళ్లి ఇంటికి వచ్చాడు. వచ్చిన వెంటనే తల తిప్పుతుందని కుటుంబసభ్యులకు చెప్పగానే వెంటనే ఆసుపత్రికి తరలించేలోపు మృతిచెందాడు. మృతుడి భార్య లలిత ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఒక కొడుకు ఉన్నాడు. -
అమ్మ కూచి పిల్లలం !
అమ్మ కూచి పిల్లలం ఉమ్మకోరు మల్లెలం వెన్నతిన్న వారలం చిన్నగున్న పోరలం! వెచ్చనైన ఆ తల్లి ఒడి మచ్చికై న మా తొల్లి బడి ఆ తల్లి ఒడిలో శయనిస్తం మా తొల్లి బడిలో విహరిస్తం అమ్మ చంక నెక్కుతాం నాన్న చేతికి చిక్కుతాం అమ్మ ఇచ్చు ముద్దులు నాన్న చెప్పు సుద్దులు ! వెండి గిన్నె నాన్న తెచ్చు వండి బువ్వ అమ్మ ఇచ్చు తియ్యగా మేము తింటాం హాయిగా ఇక ఆడుకుంటాం ! క్రమశిక్షణతో పొందుగుంటం అక్షర శిక్షణను అందుకుంటం గుడి గంటను కుద్దుగా వింటాం బడిబాటను ముద్దుగా కంటాం ! – గుర్రాల లక్ష్మారెడ్డి, కవి రచయిత కల్వకుర్తి, నాగర్ కర్నూల్ జిల్లా -
బాల గేయం..!
ఉరుకుల పరుగుల ఓ ఉడుతా... ఊయల ఊపుత వచ్చి ఊగమ్మా..! గెంతులు గెంతే ఓ కోతి కొబ్బరి కుడకలు ఇస్తా కొరుక్కు తినవమ్మా..! భౌ భౌ అరుపుల ఓ బేబీ నీకు భోజనం పెడతా భోంచేయమ్మా..! మ్యావ్..మ్యావ్ మీసాల ఓ పిల్లి కూన తియ్యటి పాలు పోస్తా తాగి పోవమ్మా..! మే.. మే నెలల ఓ బుజ్జీ మేకా మా తోటకు పోదాం చక చక రారా...! కావ్..కావ్ కూతల ఓ నల్ల కాకీ కుండడు నీళ్లిస్త కూచోవమ్మా...! కూ.. కూ పాటల ఓ కోకిలమ్మా కొండపల్లి బొమ్మిస్తా ఆడుకోవమ్మా..! చిట్టి చిట్టి పలుకుల ఓ చిలకమ్మా నీకు జాంపండిస్తా మాటాడమ్మా..! ఆటల పాటల ఓ నేస్తాలూ అలుగక నాతో రావాలి కబుర్ల పండుగ చేయాలి..! చిలిపి చేష్టల ఓ చిన్నారి... చీకు చింతలూ వదలాలి చిందులు వేస్తూ నవ్వాలి..!! – డాక్టర్ కటుకోఝ్వల రమేశ్, కవి, రచయిత, ఖమ్మం జిల్లా -
ఎంఆర్ లినాక్తో కేన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు
కరీంనగర్: ఎంఆర్ లినాక్తో కేన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ భరత్ చంద్ర తెలిపారు. కరీంనగర్ యశోద మెడికల్ సెంటర్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో బ్రెస్ట్, ఊపిరితిత్తులు, నోటి, సర్వైకల్ కేన్సర్లు అధికంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కేన్సర్ చికిత్సలో రేడియోథెరపీ కీలక పాత్ర పోషిస్తోందని, ఇది ట్యూమర్ కణాలను నాశనం చేయడమే కాకుండా రోగుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందన్నారు. దేశంలో తొలిసారిగా యశోద హాస్పిటల్స్లో ఎలెక్టా సంస్థ రూపొందించిన అత్యాధునిక ఎంఆర్– లినాక్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఏఐ ఆధారిత అడాప్టివ్ ట్రీట్మెంట్ ప్లానింగ్, తక్కువ దుష్ప్రభావాలు, అధిక మోతాదులో రేడియేషన్ను సురక్షితంగా అందించే సామర్థ్యం ఈ సాంకేతికత ప్రత్యేకతలని తెలిపారు. ప్రోస్టేట్, సర్వైకల్, ప్యాంక్రియాటిక్, రెక్టల్ కేన్సర్లు, బ్రెయిన్ ట్యూమర్ల చికిత్సలో ఎంఆర్– లినాక్ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. యశోద రేడియేషన్ ఆంకాలజిస్ట్ భరత్ చంద్ర -
రోడ్డు ప్రమాదంలో ఉప సర్పంచ్ మృతి
సుల్తానాబాద్రూరల్/పెద్దపల్లి/ఓదెల: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోని రాజీవ్ రహదారిపై బుధవారం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టగా ఉప సర్పంచ్ కోట నిరంజన్రెడ్డి((39) మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కోట నిరంజన్రెడ్డి, నాంసానిపల్లెకు చెందిన పోతగంటి రాజు కలిసి ద్విచక్ర వాహనంపై కరీంనగర్కు పనినిమిత్తం వెళ్తున్నాడు. ఈక్రమంలో కాట్నపల్లి శివారులో వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ముందు టైర్ ఎక్కగా నిరంజన్రెడ్డి మృతి చెందాడు. రాజుకు తీవ్ర గాయాలు కావడంతో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పోలీసుల అదుపులో లారీ డ్రైవర్ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మృతుడి కుటుంబసభ్యులను విప్ విజయరమణరావు పరామర్శించారు. ఉప సర్పంచ్ మృతితో ఆయన స్వగ్రామం మడకలో విషాదం అలముకుంది. -
డేంజర్ హోర్డింగ్స్!
కరీంనగర్ కార్పొరేషన్: హోర్డింగ్లు.. బోర్డులు.. ఫ్లెక్సీల రూపంలో నగరంలో ప్రమాద ఘంటికలు మొగుతున్నాయి. వేసవి ముగింపు దశలో వచ్చే ఈదురుగాలులు, వర్షాలతో సిటీ ప్రజలకు భారీ ప్రమాదం పొంచి ఉంది. ముందస్తు హెచ్చరికగా ఒక్క గాలివానకే హోర్డింగ్లు.. సైన్బోర్డులు కూలిపోగా, అధికారులు మేల్కొనకపోతే రానున్న రోజులు నగరవాసులను కలవరపెట్టడం ఖాయం. ఇష్టారీతిన హోర్డింగ్స్... నగరం శరవేగంగా విస్తరిస్తోంది. సమీప పంచాయతీలు విలీనం కావడంతో విస్తీర్ణం పెరిగింది. వ్యాపార, వాణిజ్య పరంగా పురోగతి సాధిస్తోంది. ఇక్కడ విద్య, వైద్యం, వస్త్ర వ్యాపార రంగాలు అధికం. దీంతో సహజంగానే హోర్డింగ్స్, బోర్డులకు నగరంలో అధిక డిమాండ్ ఏర్పడింది. వ్యాపార ప్రకటనల కోసం హోర్డింగ్స్ను ఏర్పాటు చేసేందుకు స్థానికులతో పాటు, బహుళ సంస్థలు పోటీపడుతున్నాయి. హోర్డింగ్స్ ఏర్పాటులో కనీస నిబంధనలు పాటించడం లేదు. పాత భవనాలపైన, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఏర్పాటు చేస్తుండడం ఇప్పుడు సమస్యగా మారింది. పట్టని నిబంధనలు నగరపాలకసంస్థకు ఆదాయం పెంచే హోర్డింగ్స్ ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నా, నిబంధనలు పాటించకపోవడం సమస్యగా మారింది. నగరంలో భారీ హోర్డింగ్స్ చాలా ఉన్నా కొన్ని మాత్రమే నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి. తెలంగాణచౌక్, టవర్సర్కిల్, బస్స్టేషన్ తదితర వాణిజ్యప్రాంతా ల్లో పాత భవనాలపైనా భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. వర్షాకాలం ఈదురుగాలులు, భారీ వర్షాలకు ఆ భవనాలు తట్టుకోలేక హోర్డింగ్స్ కూలి పోయే అవకాశం ఉంది. కొన్ని హోర్డింగ్స్ మొదటి అంతస్తులో ఏర్పాటు చేస్తున్నారు. ఇవి మరింత ప్రమాదకరంగా ఉన్నాయి. గీతాభవన్ చౌరస్తాలోని పాత భవంతిపై ఉన్న హోర్డింగ్ ఒక్క గాలివానకే కూలిపోవడం తెలిసిందే. పార్క్లు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాల్లో ఏర్పాటు చేయొద్దని నిబంధనలు ఉన్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. అంటీ ముట్టనట్లుగా పట్టణ ప్రణాళిక హోర్డింగ్స్, యూనిపోల్స్, కాంటిలివర్స్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడంతో పాటు, పర్యవేక్షించాల్సిన పట్టణ ప్రణాళిక అధికారులు పట్టకుండా వ్యవహరిస్తున్నారు. సామర్థ్యం లేని పాత భవనాలు, పార్క్లు, పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. విమర్శలు పెరిగినప్పుడు కాలనీల్లో ఏర్పాటు చేసిన పోల్స్,హోర్డింగ్స్ తొలగించి చేతులు దులుపుకొంటున్నారు. ఇందులోనూ పెద్ద సంస్థల హోర్డింగ్స్ జోలికి వెళ్లరనే విమర్శలున్నాయి. వీటన్నింటికీ రూ.లక్షలు చేతులు మారడమే కారణమనే ఆరోపణలున్నాయి. ఫ్లెక్సీలతో ప్రమాదం వ్యాపార, ప్రచార, రాజకీయ ప్రకటనలకు ఉపయోగించే ఫ్లెక్సీలు నగరవాసుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. రహదారులతో పాటు, అంతర్గత రోడ్లు, చివరకు వీధుల్లోనూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. గాలివానకు ఫ్లెక్సీలు చిరిగిపోయి రోడ్లపై వెళ్తున్న వాహనాలపై, సమీప నివాసితులపై పడడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. భారీ హోర్డింగ్స్కు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు ఒక్క గాలివానకు చీలికలు, పేలికలుగా మారి కొట్టుకుపోవడం, సమీప రోడ్లు, ఇండ్లపై పడడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఎప్పటికప్పుడు తొలగించాల్సిన బల్దియా సిబ్బంది, కొన్ని మాత్రమే తొలగించడం, మరికొన్నింటిని రోజుల తరబడి వదిలివేస్తుండడం వివాదాస్పదంగా మారుతోంది. ముందస్తు హెచ్చరిక మంగళవారం రాత్రి కురిసిన గాలి వానకు గీతాభవన్ పక్క భవనంపై ఉన్న హోర్డింగ్ కూలిపోయింది. సిమెంట్ దిమ్మెలతో సహా లేచిపోయింది. సమీపంలో ఉన్న ఓ వైన్షాప్ భారీ నేమ్ బోర్డు పడిపోయింది. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో నగరవాసులు ఏ మేరకు ప్రమాదంలో ఉన్నారో చెప్పేందుకు ప్రకృతి చేసిన హెచ్చరికగా పలువురు అభివర్ణిస్తున్నారు. నగరపాలకసంస్థ అధికారులు మేల్కొని చర్యలు చేపడితేనే, నగరవాసులు వర్షాకాల ప్రమాదాలను తప్పించుకోగలుగుతారు.ముకరంపురలో విద్యుత్వైర్లను ఆనుకుని ఉన్న హోర్డింగ్ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద పాతభవనంపై హోర్డింగ్ఆర్టీసీ బస్టాండు వద్ద చిరిగిన ఫ్లెక్సీలతో హోర్డింగ్గీతభవన్ పక్కన కూలిన హోర్డింగ్బస్టాండు సమీపంలో...నగరంలో హోర్డింగ్స్ వివరాలు హోర్డింగ్స్ 239కాంటిలివర్స్ 133యూనిపోల్స్ 04అనుమతి లేక గతంలో తొలగింపు 230 -
శిక్షణతో ఆత్మవిశ్వాసం
ప్రతిరోజు వచ్చి గణితంలో చిట్కాలు నేర్చుకున్నా. కంప్యూటర్ పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. ఎలా రాస్తే హ్యాండ్రైటింగ్ బాగుంటుందో ఉపాధ్యాయులు నేర్పించారు. ఇలాంటి శిక్షణ ఇంకొద్ది రోజులు ఉంటే ఉంటే బాగుండేది. అరాధ్యాయా, 8వ తరగతి శిక్షణ ఎంతో ఉల్లాసంగా అనిపించింది. మళ్లీ వచ్చే వేసవిలో కూడా ఇలాగే శిక్షణ ఇవ్వాలి. చెస్, అబాకస్ నేర్చుకున్నాను. నా తోటి విద్యార్థులతో ఆడుతూపాడుతూ అన్ని అంశాల్లో శిక్షణ తీసుకోవడం బాగుంది. మంచిమంచి విషయాలు చెప్పారు. – సాయిహర్ష, ఆరో తరగతి ప్రతి వేసవిలో ఇలాంటి సమ్మర్క్యాంపులు నిర్వహిస్తే విద్యార్థులకు నైపుణ్యం పెరుగుతుంది. నేను తెలుగు హ్యాండ్రైటింగ్, కంప్యూటర్ విద్య, క్యారం, చెస్ మొదలైనవి నేర్చుకున్నాను. మంచిగా అనిపించింది. నాతోపాటు విద్యార్థులను తీసుకెళ్లా. – మండలోజి అనన్య, 9వ తరగతివేసవి కాలంలో వివిధ రకాల్లో శిక్షణ విద్యార్థులకు ఇవ్వడం వలన వారిలోని ప్రతిభను వెలికి తీయవచ్చు. ఈ శిక్షణతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. జ్ఞానం కూడా పెరుగుతుంది. స్కూల్ను ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉంది. – రాజన్న, పీఎంశ్రీ పాఠశాల హెచ్ఎంఇబ్రహీంపట్నం: పరీక్షలు ముగియగానే వేసవిలో ఎండలో తిరగకుండా.. చెరువులు, కుంటలు, కాలువల వైపు వెళ్లకుండా విద్యార్థులకు వేసవిశిక్షణ శిబిరాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నంలోని పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాలను ఎంపిక చేసి అందులోని 100 మంది ఆరో తరగతి నుంచి 9వ తరగతి పిల్లలకు ఈనెల 11 నుంచి 25 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల దాకా ప్రతిరోజు శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా వారికి ఉచితంగా అల్పాహారం అందించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా లైవ్ స్కిల్స్, ఇండోర్ గేమ్స్, స్టోరీ టెల్లింగ్, కుట్లు, అల్లికలు, భాష ఉత్సవాలు, క్విజ్ పోటీలు, స్థానిక సంప్రదాయ ఆటల పోటీలు, కంప్యూటర్ పరిజ్ఞానం, చెస్, క్యారంలో తర్ఫీదు ఇచ్చారు. పిల్లలు కూడా ఉల్లాసంగా గడిపారు. మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో ఇలాంటి శిక్షణ శిబిరాలు నిర్వహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
సమన్వయంతో అభివృద్ధి చేస్తాం
చొప్పదండి: కలిసి సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చొప్పదండి నియోజకవర్గంలో చూస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మండలంలోని ఆర్నకొండ నుంచి మల్యాల ఎక్స్ రోడ్డు వరకు రూ.50 కోట్ల సీఆర్ఎఫ్ నిధులతో నిర్మించనున్న తారురోడ్డు పనులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ త్వరలోనే కరీంనగర్–జగిత్యాల హైవే పనులు చేపడతామని తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గానికి రూ.20 వేల కోట్ల నిధులను తీసుకువచ్చామని, రూ.7 వేల కోట్లు రహదారులకే ఖర్చు చేస్తున్నామని, అందులో రూ.2,500 కోట్లు వరంగల్, జగిత్యాల రహదారికి వెచ్చిస్తున్నామని తెలిపారు. గన్నేరువరం నుంచి కరీంనగర్ రావడానికి రూ.79 కోట్లతో మానేరు డ్యాంపై వంతెన నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణంతో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు వెళ్లడానికి భక్తులకు సులభతరం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మున్సిపల్ చైర్పర్సన్ వడ్లూరి సరిత, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత కరీంనగర్రూరల్: గ్రామాలను రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. బుధవారం కరీంనగర్ మండలం ఇరుకుల్లలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో రూ.20లక్షలతో నిర్మించిన సీసీరోడ్డు ప్రారంభించారు. బీరప్పగుడి అభివృద్ధికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుర్ర రమేశ్గౌడ్, ఉపసర్పంచ్ కాశిపాక రాకేశ్, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై.సునీల్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు
కరీంనగర్అర్బన్/కరీంనగర్కల్చరల్/రామడుగు: జూన్ రెండో తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్నిశాఖల అధికారుల సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. పోలీస్ పరేడ్గ్రౌండ్లో నిర్వహించే వేడుకలకు ప్రొటోకాల్ పక్కాగా పాటించాలన్నారు. వేడుకల నిర్వహణపై కలెక్టరేట్లో బుఽ దవారం సమీక్షించారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆవిర్భావ వేడుకల్లో ప్రతి బింబించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. బక్రీద్ ప్రశాంతంగా జరుపుకోవాలి జిల్లాలో గురువారం బక్రీద్ను ప్రశాంత వాతా వరణంలో జరుపుకోవాలని కలెక్టర్ చిత్రామి శ్రా సూచించారు. స్లాటర్ హౌస్ల వద్ద అధికా రులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఆవులు, దూడల వధ నిషేధమని, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. బక్రీద్ సందర్భంగా ప్రత్యేక బందోబస్తు చేపట్టామని తెలిపారు. జాతీయ రహదారి నిర్మాణంపై సమీక్ష వరంగల్– కరీంనగర్ జాతీయ రహదారి 563 నిర్మాణంలో సమస్యలు పరిష్కరిస్తూ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను, ఆర్డీవోను ఆదేశించారు. ఈదులగట్టెపల్లి వద్ద సర్వీస్ రోడ్డు సాధ్యసాధ్యాలను పరిశీలించాలని, గట్టుదుద్దెనపల్లి వద్ద డ్రైనేజీ నిర్మాణం, భూ సేకరణ తదితర అంశాలపై చర్చించారు. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తూ ముందుకు వెళ్లాలన్నారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయండి తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో ఉన్న రాజీవ్ స్వగృహ అంగారిక టౌన్షిప్లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ పనులు వేగవంతం చేయాలన్నారు. రామడుగు మండలంలోని వన్నారం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి కరీంనగర్రూరల్: అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ మండలం నగునూరు, చేగుర్తి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం పరిశీలించారు. నగునూరులో ధాన్యం తీసుకొచ్చి నెలరోజులవున్నా కాంటా పెట్టడంలేదని పలువురు రైతులు ఎమ్మెల్యేకు తెలిపారు. సివిల్సప్లై అధికారులను అక్కడికి పిలిపించి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. చేగుర్తిలో రాత్రి వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అధికారులు, రైసుమిల్లర్లతో మాట్లాడి తడిసి ధాన్యం కాంటా పెట్టించి రైసుమిల్లుకు పంపించారు. కరీంనగర్, దుర్శేడ్ సొసైటీల చైర్మన్లు పి.శ్యాంసుందర్రెడ్డి, టి.తిరుపతి పాల్గొన్నారు. పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహించొద్దు కరీంనగర్ కార్పొరేషన్: పారిశుధ్యం పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దనిన నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ హెచ్చరించారు. బుధవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో పారిశుధ్య విభాగం సూపర్వైజర్లు,శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లతో సమీక్ష నిర్వహించారు. పారిశుధ్య పనులపై ఇన్స్పెక్టర్లు, జవాన్లు, సూపర్ వైజర్లు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. బక్రీద్ పండుగకు ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని, డ్రైనేజీలు పొంగకుండా, రోడ్లపై నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 105 ఇందిరమ్మ గృహ ప్రవేశాలు... నగరంలో 105 ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకొని, గృహప్రవేశాలు అయ్యాయని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. బుధవారం గృహనిర్మాణ శాఖ కార్యదర్శి గౌతం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కమిషనర్ పాల్గొన్నారు. నగరపాలక సంస్థ పరిదిలో మొత్తం 524 ఇందిరమ్మ ఇండ్లు స్లాబ్ పూర్తి చేస్కోని చివరి దశలో ఉన్నాయని తెలిపారు. -
కరెంట్ సరఫరాకు ప్రతిబంధకాలు
కొత్తపల్లి: బలమైన గాలుల ధాటికి హోర్డింగ్లు, చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడుతుండటంతో విద్యుత్ లైన్లు తెగిపడి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. రోడ్ల పక్కన ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్స్ గాలులకు ఊగిపడి విద్యుత్ తీగలపై పడటంతో షార్ట్సర్క్యూట్లు సంభవించడంతో పాటు విద్యుత్ తీగలు తెగుతున్నాయి. విద్యుత్ సిబ్బంది రాత్రింబవళ్లు మరమ్మతు పనులు చేపడుతున్నప్పటికీ వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కరీంనగర్లోని ప్రధాన రహదారుల వెంబడి హోర్డింగ్లతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో గాలిదుమారానికి హోర్డింగ్లు విద్యుత్ తీగలపై ఒరుగుతున్నాయి. విద్యుత్ తీగలపై పడ్డ ఫ్లెక్సీలను తొలగించడం విద్యుత్ సిబ్బందికి కష్టంగా మారుతోంది. -
సిటీలో ఫుట్ఓవర్ బ్రిడ్జిలు!
తెలంగాణ చౌరస్తానగరంలోని బస్టాండు చౌరస్తాకోర్టు చౌరస్తాసాక్షిప్రతినిధి, కరీంనగర్: నగరంలోని అత్యంత రద్దీ కూడళ్లలో మూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు(ఎఫ్వోబీ) నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నగరాన్ని ఆధునిక వసతులతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భారీస్థాయిలో నిధులు తీసుకొస్తున్నారు. ఇప్పుడు పాదచారుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టారు. నగరంలోని మూడు రద్దీ ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని బల్దియా అధికారులతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అత్యధిక రద్దీ ప్రాంతాల్లో కోర్టు, బస్టాండ్, తెలంగాణ చౌరస్తాలు నగరంలో రద్దీ కూడళ్లుగా మారాయి. రోజుకు వేల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు ఈ కూడళ్లు దాటుతున్నారు. పెరుగుతున్న వాహన రద్దీతో రోడ్లు దాటడం పాదాచారులకు ప్రమాదకరంగా మారుతోంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నప్పటికీ రద్దీ సమయాల్లో వాహనాల వేగం తగ్గకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూడు ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, ప్రాథమిక సర్వే చేపట్టాలని మంత్రి బండి సంజయ్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. స్మార్ట్సిటీలో ప్రతిపాదించినా కరీంనగర్కు స్మార్ట్సిటీ హోదా వచ్చినప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కైవాక్ నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ అమలుకు నోచుకోలేదు. నిధుల కొరత, స్థల సమస్యలు, సాంకేతిక అడ్డంకులతో ప్రతిపాదనలు ఫైళ్లకే పరిమితమయ్యాయి. ఈసారి కేంద్ర మంత్రి ప్రత్యేక ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు అమలవుతుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల నగరాభివృద్ధికి కేంద్రం నుంచి అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) కింద రూ.840 కోట్లు మంజూరు కాగా డ్రైనేజీ, రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి, వీధి దీపాలు, పార్కులు, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలపై కసరత్తు ప్రారంభమైంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంతో నగర రూపురేఖలను మార్చే ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ఆ మూడు ప్రాంతాలే కీలకం తెలంగాణ చౌరస్తా, కోర్టు చౌరస్తాలు రోజంతా ట్రాఫిక్తో కిక్కిరిసిపోతుంటాయి. బస్టాండ్ చౌరస్తా అయితే జిల్లా నలుమూలల నుంచి వచ్చే బస్సులు, ఆటోలు, ప్రైవేట్ వాహనాలతో కిక్కిరిసిపోతుంది. ఈ పరిస్థితుల్లో పాదాచారుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గడమే కాకుండా ట్రాఫిక్ సమస్య తప్పనుంది. అధికారులు ప్రతి పాదిస్తున్న నమూనాల్లో ఆధునిక డిజైన్తో పాటు ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేస్తే విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు భద్రంగా రోడ్లు దాటేందుకు ఉపయోగపడతాయని చెబుతున్నారు.నగర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం వందల కోట్ల నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. మెట్రో సిటీలకు ధీటుగా సదుపాయాల కల్పనకు మరిన్ని నిధులు కేంద్రం నుంచి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం కూడా నగరాభివృద్ధికి సహకరించాలని కోరుతున్నా. – బండి సంజయ్కుమార్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నగరాభివృద్ధే లక్ష్యం -
మద్యం తాగొచ్చి వేధింపులు..
రామడుగు: నిత్యం మద్యం తాగొచ్చి వేధిస్తున్నాడని భర్తను భార్య రోకలి బండతో మోది హత్య చేసింది. ఈ ఘటన రామడుగు మండలం కొక్కెరకుంట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కొక్కెరకుంట గ్రామానికి చెందిన వేముండ్ల రాజయ్య(70) కుటుంబ సభ్యులకు తెలియకుండా ఎకరం వ్యవసాయ భూమి విక్రయించాడు. వచ్చిన డబ్బులతో నిత్యం తాగివచ్చి భార్య వేముండ్ల కనుకమ్మ, కొడుకు శేఖర్తో గొడవ పడుతున్నాడు. మంగళవారం రాత్రి సైతం మద్యం తాగి వచ్చాడు. భార్యతో గొడవ పడి నిద్రపోయాడు. రాజయ్య పడుకున్న తరువాత కనుకమ్మ ఇంట్లో ఉన్న రోకలి బండతో తల, చాతి, మోకాళ్లపై మోది చంపేసింది. కూతురు నంగి సుజాత బుధవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని ఎస్సై రాజు తెలిపారు. భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య రామడుగు మండలం కొక్కెరకుంటలో ఘటన -
మేము గీసిన చిత్రం
సముద్రజీవుల పేర్లతో పొడుపు కథలు ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన జుట్టు హారిక (25) అనే వివాహిత భర్తతో గొడవపడి క్షణికావేశంలో మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. రంగసాయిపల్లి గ్రామానికి చెందిన హారికను రెండు సంవత్సరాల క్రితం మల్లాపూర్ గ్రామానికి చెందిన జుట్టు శరత్ రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె మానసికస్థితి సరిగా లేక తల్లిదండ్రులను తరచూ డబ్బులు ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేసేదని, భర్తతోనూ డబ్బుల విషయంపై గొడవపడేదని ఎస్సై పేర్కొన్నారు. ఈక్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుందని తండ్రి గుడ్ల రాజయ్య ఫిర్యాదు చేశాడు. మృత్యువే గెలిచిందిరూ.10లక్షలు వెచ్చించినా దక్కని ప్రాణం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నెల రోజులుగా చేస్తున్న జీవన్మరణ పోరాటంలో ఆ యువరైతు చివరికి ఓడిపోయాడు. రూ.10లక్షలు వెచ్చించి చికిత్స అందించినా ప్రాణాలు నిలువలేదు. కుటుంబానికి పెద్ద దికై ్కనా రైతు చనిపోవడంతో ఆ కుటుంబం రోడ్డునపడింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్కు చెందిన రైతు ముత్యాల బాపురెడ్డి(43) నెల రోజుల క్రితం పక్షవాతానికి గురయ్యాడు. మొదట కరీంనగర్లోని ఓ ప్రైవేట్కి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లాడు. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. మెదడులో రక్తం గడ్డ కట్టిందని వైద్యులు అన్ని పరీక్షలు చేసి ఆపరేషన్ చేశారు. మెదడుకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకొని కోమాలోనే 20 రోజులపాటు చికిత్స పొందుతున్న క్రమంలోనే పరిస్థితి విషమించి బుధవారం మరణించాడు. మృతునికి భార్య మానస, ఇద్దరు కుమారులు తరుణ్, వరుణ్ ఉన్నారు. -
గాలివాన బీభత్సం
కొత్తపల్లి(కరీంనగర్)/కరీంనగర్రూరల్/గన్నేరువరం: జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వేకువజామున వరకు గాలివాన బీభత్సం సృష్టించింది. వర్షానికి కల్లాల్లో పోసిన ధాన్యం తడిసిపోయింది. మానకొండూర్, గన్నేరువరం, గంగాధర, కరీంనగర్ రూరల్ మండలాల పరిధిలో తీవ్రనష్టం వాటిల్లింది. కరీంనగర్ పరిధిలోని బొమ్మకల్, గన్నేరువరం మండలం చీమలకుంటపల్లిలో ఇళ్లు కూలగా.. బాధితులు బోరున విలపించారు. మానకొండూర్ మండలం వెల్ది– లక్ష్మిపూర్ గ్రామాల మధ్య చెట్లు కూలాయి. విద్యుత్ తీగలు తెడిపడ్డాయి. గంగాధరలో ధాన్యం తడిచింది. అకాల వర్షంతో కరీంనగర్ సర్కిల్ పరిధిలో విద్యుత్ సంస్థకు సుమారు రూ.10 లక్షల నష్టం వాటిల్లినట్లు ఎస్ఈ ఆర్.రవీందర్ తెలిపారు. -
బన్నీ వేసవి యాత్ర –19 / సులువైన గణితం
సాయంత్రం తాతయ్య అరుగు మీద కూర్చుని ‘రండి పిల్లలూ, లెక్కలు చేద్దాం’ అని పిలిచాడు. బన్నీ దగ్గర 5 చింతగింజలు ఉన్నాయి. తాతయ్య ఇంకో 3 ఇచ్చాడు. తాతయ్య: ‘బన్నీ, ఇప్పుడు నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 5 + 3 = ?’ బన్నీ లెక్కపెట్టి ‘8 ఉన్నాయి తాతయ్యా’ అన్నాడు. “ Very good!’ అన్నాడు తాతయ్య. స్వప్న దగ్గర 10 బిస్కెట్లు ఉన్నాయి. రామ్కి 4 ఇచ్చింది. తాతయ్య: ‘స్వప్న, నీ దగ్గర ఇప్పుడు ఎన్ని మిగిలాయి? 10 – 4 = ?’ స్వప్న: ‘6 బిస్కెట్లు మిగిలాయి’ అంది. రామ్ దగ్గర 7 పెన్సిల్స్ ఉన్నాయి. చుక్కకి 2 ఇచ్చాడు. మళ్లీ తాతయ్య 5 ఇచ్చాడు. తాతయ్య: ‘రామ్, ఇప్పుడు లెక్క చెప్పు. 7 – 2 + 5 = ?’ రామ్ ఆలోచించి ‘10 పెన్సిల్స్’ అన్నాడు. తాతయ్య మెచ్చుకుని ‘లెక్కలు ఇలా రోజూ చేస్తే తేలిక’ అన్నాడు. పిల్లలకి మాట : చిన్న చిన్నగా లెక్కలు చేస్తూ ఉంటే జీవితంలో సమస్యలను పరిష్కరించడం తెలుస్తుంది. డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, గ్రామం: కాకర్లపల్లి, మంథని, జిల్లా: పెద్దపల్లి -
తెలంగాణలో ఈడీ అధికారుల దాడులు.. ఏకకాలంలో 8 చోట్ల..
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్, కరీంనగర్లో ఈడీ తనిఖీలు చేస్తోంది. ఇసుక, గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో ఎనిమిది చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి. జీఎస్టీ ఎగ్గొట్టి రూ.కోట్లు దారిమళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీ, ఏజెన్సీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల నకిలీ ఇన్ వాయిస్లతో గ్రానైట్ తరలించిన కేసులో తనఖీలు చేస్తున్నారు. ఇప్పటికే ఓ గ్రానైట్ వ్యాపారిని జీఎస్టీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జీఎస్టీ ఎగ్గొట్టేందుకు నకిలీ బిల్లులతో వంద కోట్ల రూపాయల విలువైన గ్రానైట్ తరలించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈడీ ఎంట్రీతో మరింత దుమారం రేగుతోంది. -
రైలు ఇంజిన్లో ఏసీలు బిగించాలి
రామగుండం: రైలింజన్లో ఏసీలు బిగించాలని కోరుతూ మంగళవారం రామగుండంలోని క్రూలాబీ ఎదుట లోకోపైలట్లు నిరసన వ్యక్తం చేశారు. అధిక ఉష్ణోగ్రతలతో రైలింజన్లో 55 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయని, ఏసీలు లేకుంటే పనిచేయలేమని, తమ వెంట తీసుకెళ్లిన ఆహారం చెడిపోతుందని, రైల్వే బోర్డు ఉత్తర్వుల ప్రకారం ఏసీలు బిగించాలని నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో లోకో రన్నింగ్ స్టాఫ్ రామగుండం బ్రాంచ్ సెక్రటరీ సీహెచ్.రవి, కమిటీ మెంబర్లు వేణుగోపాల్, సంజీవ్, సహాయ లోకో పైలట్లు వినోద్, శ్రీనివాస్, అనిష్ సూరజ్, గన్ శ్యాం, రవి, ప్రశాంత్తో పాటు లోకో పైలట్లు పాల్గొన్నారు. -
ఇటు ఎండ.. అటు జ్వరం!
‘కరీంనగర్కు చెందిన మహేశ్ ప్రైవేటు మార్కెటింగ్ ఉద్యోగి. ఉద్యోగరీత్యా నిత్యం 100 కిలోమీటర్లకు పైగా బైక్పై తిరగాల్సి ఉంటుంది. వారం రోజుల క్రితం ఎండ దెబ్బతో డీహైడ్రేషన్కు గురయ్యాడు. జ్వరంతో ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా..అడ్మిట్ చేసుకుని, నాలుగు రోజులు చికిత్స అందించారు. మహేశ్ కోలుకుని డిశ్చార్జి కాగా.. తనకు వచ్చే నెల జీతం కన్నా... ఆస్పత్రి ఫీజు తడిసి మోపెడయ్యింది’. కరీంనగర్ రూరల్ మండలానికి చెందిన హరీశ్ మార్కెట్లో హమాలీ కార్మికుడు. ఎండలో పనిచేయడం కారణంగా అస్వస్థతకు గురయ్యాడు. తల తిరగడం.. ఒళ్లు నొప్పులు, జ్వరం, చర్మ సమస్యలతో బాధ పడుతూ.. సమీపంలోని డాక్టర్ను సంప్రదించాడు. ఎండదెబ్బ తాకిందని, విశ్రాంతి తీసుకోవాలని చెప్పగా.. వారం రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
ఎడ్ల బండ్లే నయమిక..
కరీంనగర్ కార్పొరేషన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో ప్రయాణం చేసేందుకు ఎడ్ల బండ్లే దిక్కవుతున్నాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి విమర్శించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా మంగళవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మంకమ్మతోటలోని తన నివాసం నుంచి బస్స్టేషన్ ఎదురుగా ఉన్న సుడా కార్యాలయం వరకు ఎడ్ల బండిపై ప్రయాణించారు. ఈ సందర్భంగా నరేందర్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్లో పాయిజన్ ఇచ్చినట్టు రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, పర్వతం మల్లేశం, జగన్ రెడ్డి, నాయకులు గుండటి శ్రీనివాస్ రెడ్డి, పిట్టల రవీందర్, సుదర్శన్, శ్రీధర్ రెడ్డి, పటేల్ శ్రీనివాస్రెడ్డి, కాంపెల్లి కీర్తి కుమార్, గడమల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మాట నిలబెట్టుకున్నా..
కరీంనగర్ కార్పొరేషన్ : ‘నగర ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్నా.. వందరోజుల్లో రూ.840 కోట్లు తీసుకొచ్చా.. స్మార్ట్సిటీ నిధులు రూ.70 కోట్లు.. యూఐడీఎఫ్ నిధులు రూ.50 కోట్లు వచ్చాయి.. రూ.277 కోట్లతో అమృత్ పనులు సాగుతున్నా యి.. మరిన్ని నిధులు తెస్తా.. నగర రూపురేఖలు మారుస్తా.. రాష్ట్రంలోనే కరీంనగర్ను మోడల్ కార్పొరేషన్గా మారుస్తా’నంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. నగరపాలకసంస్థ కార్యాలయంలో రూ.1.39 కోట్లతో రెండోఅంతస్తులో భవన నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. వీటితోపాటు కార్మిక ఆరోగ్య సంక్షేమ భవన పునరుద్ధరణ, షెడ్ల మరమ్మ తు పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ పదవిని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తానంటూ ఇచ్చిన మాటను వంద రోజుల్లోనే నిలబెట్టుకున్నానని తెలిపారు. యూసీ ఎఫ్లో కరీంనగర్ కార్పొరేషన్కు రూ.840 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 17 ప్రాజెక్టులకే కేంద్రం ఆమోదం తెలి పిందని, అందులో కరీంనగర్ ఉండటం అందరికీ గర్వకారణమన్నారు. సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి పనిచేసిన కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, అధికారులను అభినందించారు. డంప్యార్డ్ కోసం రూ.80 కోట్లు కేటాయించామని, ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రం విఫలం ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. కొనుగోలు పైసలన్నీ కేంద్రమే ఇస్తున్నప్పటికీ, వడ్ల్లు కొనుగోలు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి చేతకావడం లేదని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న బాధలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకే రైతు గోస బీజేపీ భరోసా పేరుతో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో యాత్ర చేపట్టినట్లు తెలి పారు. ధాన్యం కొనుగోలు పైసలు కేంద్రానివా.. రాష్ట్రానివా.. సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేయర్ కొలగాని శ్రీని వాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, డిప్యూటీ మేయర్ సునీల్రావు పాల్గొన్నారు. -
ప్రజా పాలన అంటే ఇదేనా?
కరీంనగర్ టౌన్: ధాన్యం కొనుగోళ్లపై ప్రశ్నించిన ఆర్టీసీ హైర్బస్ డ్రైవర్ అశోక్ను విధుల నుంచి తొలగించడాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే గుంగుల కమలాకర్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జీవన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. డ్రైవర్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆర్ఎం రాజుకు వినతిపత్రం ఇచ్చారు. ధాన్యం కొనుగోలు అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన డ్రైవర్ను విధుల్లోకి తీసుకోవాలని లేకుంటే ఆర్ఎం ఆఫీస్ను ముట్టడిస్తామన్నారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా తప్పించుకు తిరుగుతోందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి, పార్టీ సభ్యత్వ నమోదు కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కొండూరి రవీందర్రావు అన్నారు. మంగళవారం కరీంనగర్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
98వేల ఇళ్లలో జనగణన పూర్తి
కొత్తపల్లి(కరీంనగర్): వినియోగదారులకు హెచ్టీ 11 కేవీ, 33 కేవీ ఆపై వోల్టేజ్ విద్యుత్ సర్వీసుల మంజూరును వేగవంతం చేసేందుకు ‘సింగిల్ విండో’ వ్యవస్థ దోహదపడుతుందని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్.రవీందర్ తెలిపారు. హెచ్టీ సర్వీసుల ప్రక్రియను సరళీకృతం చేయడంలో భాగంగా కార్పొరేట్, సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ‘హెచ్టీ మానిటర్ సెల్’ ఏర్పాటు చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ విధానంలో దరఖాస్తుల పర్యవేక్షణ బాధ్యతలను అధికారులకు విభజించినట్లు పేర్కొన్నారు. సర్కిల్ కార్యాలయంలోని ఏడీఈ (కమర్షియల్) అధికారి 11 కేవీ వోల్టేజ్ దరఖాస్తులను, కార్పొరేట్ కార్యాలయంలోని ఏడీఈ (కమర్షియల్) అధికారి 33 కేవీ, ఆపై వోల్టేజ్ దరఖాస్తులను పర్యవేక్షిస్తారన్నారు. టీజీ ఐపాస్ పరిధిలోకి రాని హెచ్టీ దరఖాస్తుదారులు మొదట టీజీఎన్పీడీసీఎల్ అధికారిక పోర్టల్లో అవసరమైన పత్రాలతో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు పూర్తికాగానే ఒక ప్రత్యేక అప్లికేషన్ నంబర్ కేటాయించబడుతుందని, వెంటనే సంబంధిత సర్కిల్ కార్యాలయాల డాష్బోర్డ్లోని వెళ్లగానే, సంబంధిత అధికారి పర్యవేక్షించి వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన, ఎస్టిమేట్లకు పంపించడం జరుగుతుందన్నారు. 11 కే..వీ., 33 కె.వీ.వోల్టేజ్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, ఫీజిబిలిటీ ఉన్న పక్షంలో రెండు రోజుల్లోనే పోర్టల్లో అప్లోడ్ చేస్తారన్నారు. ఒకవేళ సాంకేతిక లేదా ఇతర కారణాల వల్ల సాధ్యపడకపోతే, ఆ వివరాలను దరఖాస్తుదారుడికి ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నారు. -
అదనపు కమిషనర్ను సస్పెండ్ చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: అదనపు కమిషనర్ సువార్తను సస్పెండ్ చేయాలని కార్మికులు బల్దియా ఎదుట ధర్నా చేపట్టారు. బీఆర్టీయూ, సీఐటీయూఽ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్రెడ్డి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేశ్ మాట్లాడుతూ శానిటేషన్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న అదనపు కమిషనర్ సువార్త నిబంధనలకు విరుద్ధంగా కార్మికులతో తన ఇంట్లో పనులు చేయించుకొంటోందని ఆరోపించారు. కార్మికులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తోందని, దొంగతనం నెపం మోపి పోలీసులకి అప్పగించి థర్డ్ డిగ్రీ పెట్టించిన సువార్తను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ ఇండ్లల్లో కార్మికులతో పనులు చేయించుకొనే విధానానికి ముగింపు పలకాలన్నారు. అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్కు వినతిపత్రం ఇచ్చారు. నాయకులు గడ్డం సంపత్, జనగాం రాజమల్లు, పొన్నం లింగయ్య, కవ్వంపెల్లి రవి, పారునంది ఎల్లయ్య, మాతంగి లక్ష్మణ్, దాంపెల్లి రాయమల్లు, మాతంగి స్వామి, మాతంగి లక్ష్మణ్, భద్ర కంటి రవి పాల్గొన్నారు. -
అతనికింత పురుగుల మందు పోసి.. నేనింతా తాగుతా
చందుర్తి(వేములవాడ): బిల్లుల చెల్లింపులో ఉపాధి హామీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ట్రాక్టర్ యజమాని మంగళవారం పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగాడు. బాధితుడి కథనం ప్రకారం.. మండలంలోని లింగంపేటకు చెందిన లాండే సంతోష్ ఉపాధి పథకంలో భాగంగా 2025 ఏప్రిల్లో గ్రామ శివారులో చేపట్టిన పనులకు తన ట్రాక్టర్తో సుమారు 200 ట్రిప్పుల మట్టిని తరలించాడు. సదరు డబ్బులను ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ నాగరాజు ఇస్తానని చెబితే ట్రాక్టర్ నడిపించానని వాపోయాడు. ఏడాదిగా బిల్లులు చెల్లించుకుండా ‘నీ ట్రాక్టర్తో మట్టి తరలించినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా’.. అంటూ టెక్నికల్ అసిస్టెంట్ దురుసుగా మాట్లాడారని తెలిపాడు. ఉపాధి హామీ అధికారుల నిర్లక్ష్యంతో విసిగిపోయిన సంతోష్ ఉదయం 11 గంటలకు పురుగుల మందు డబ్బాతో మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నాడు. టెక్నికల్ అసిస్టెంట్ నాగరాజు ఎక్కడున్నడంటూ ఆవేశంతో ఊగిపోతూ ‘అతనికింత పురుగుల మందు పోసి.. నేనింతా తాగుతా’ అంటూ ఉపాధి హామీ కార్యాలయంలో అటూ ఇటూ తిరగుతుండగా, పోలీసులు అక్కడికి చేరుకుని పురుగులమందు డబ్బా తీసుకునేందుకు యత్నించారు. అధికారులందరూ రావాలంటూ, తన బిల్లు డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలంటూ బాధితుడు పట్టుబట్టాడు. ఎంపీడీవో రాధ అక్కడికి చేరుకుని కార్యాలయానికి వస్తే మాట్లాడి బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రేపు బిల్లు ఇవ్వకుంటే టెక్నికల్ అసిస్టెంట్కు పురుగుల మందు తాగించి, తాను తాగి చనిపోతానంటూ అక్కడి నుంచి వెనుదిరిగారు. చేసిన పనికి బిల్లులు చెల్లించడం లేదని.. పురుగులమందు డబ్బాతో ట్రాక్టర్ యజమాని ఆందోళన -
లిఫ్ట్లో ఇరుక్కున్నడీఆర్డీఏ ఏపీడీ
సిరిసిల్లఅర్బన్: రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో మంగళవారం విధులకు హాజరయ్యేందుకు డీఆర్డీఏ ఏపీడీ నర్సింహులు కలెక్టరేట్లోని లిఫ్ట్ ఎక్కారు. పై అంతస్తులో ఉన్న తమ కార్యాలయానికి వెళ్లేందుకు లిఫ్ట్లోని బటన్ నొక్కగా మధ్యలోకి వెళ్లిన తర్వాత సాంకేతిక కారాణాల వల్ల లిఫ్ట్ ఆగిపోయింది. ఆయన తన తోటి ఉద్యోగులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఉద్యోగులు వెంటనే లిప్ట్ ఆఫరేటర్లకు సమాచారం అందించగా వారు వచ్చి లిఫ్ట్ నుంచి బయటకు తీశారు. అప్పటికే గంటన్నర అవుతుందని ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బంది పడ్డానని నర్సింహులు లిఫ్ట్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వడదెబ్బకు ఇద్దరు మృతిహుజూరాబాద్రూరల్/గంగాధర: హుజూరాబాద్ మండలం సింగాపూర్ గ్రామ ంలో నీరటి రమేశ్ వడదెబ్బతో మృతిచెందాడు. రెండు రోజులుగా పనుల నిమిత్తం ఎండలో బాగా తిరగడం వల్ల మంగళవారం అస్వస్థకు గురై మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. అలాగే గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లి గ్రామానికి చెందిన అర్కుల నర్సయ్య (58) వడదెబ్బతో మంగళవారం మృతి చెందాడు. నర్సయ్య మండలంలోని గర్శకుర్తిలో బంధువు చనిపోగా సోమవారం దహన సంస్కారాలకు వెళ్లి వచ్చాడు. సాయంత్రం వాంతులు, విరేచనాలు అయ్యాయి. మంగళవారం ఉదయం అపస్మారక స్థితిలోకి వెళ్లగా కుటుంబ సభ్యులు అంబులెన్సులో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఆర్టీసీ కండక్టర్పై పోక్సో కేసుకోరుట్లరూరల్: పట్టణానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ శేఖర్పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. ఆయన కథనం ప్రకారం చందుర్తి మండలకేంద్రానికి చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానని 2016నుంచి సఖ్యతగా ఉంటున్నాడు. తాజాగా పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలు వారం క్రితం వేములవాడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. శేఖర్ కోరుట్లకు చెందిన వ్యక్తి కావడంతో కేసును కోరుట్ల పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ఇక్కడి పోలీసులు విచారణ జరిపి శేఖర్ను మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి.. రిమాండ్కు తరలించినట్టు ఎస్సై తెలిపారు. గంటన్నర తర్వాత బయటకు.. -
దారికాచి కత్తితో దాడి!
ఇల్లందకుంట: దారి విషయంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో తండ్రి దారుణ హత్యకు గురికాగా... కొడుకుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి గ్రామంలో నందికొండ రాజు, చల్లూరి చంటి వరుసకు బావ, బావమర్దులు. వీరి మధ్య కొన్ని రోజులుగా ఇంటికి వెళ్లే దారి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం నందికొండ రాజు కొడుకు నిశాంత్ను తీసుకొని ట్రాక్టర్ నడుపుకుంటూ పొలం వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడ కాపుకాసిన చల్లూరి చంటి ట్రాక్టర్పై వస్తున్న నందికొండ రాజు (40), అతని కొడుకు (16) నిశాంత్పై కత్తితో విచక్షణ రహితంగా దాడిచేశాడు. దీంతో రాజు అక్కడికక్కడే మృతి చెందగా, నిశాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన చుట్టుపక్కల వారు నిశాంత్ను జమ్మికుంటలోని ఓ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన జమ్మికుంట రూరల్ సీఐ వెంకట్, ఎస్సై క్రాంతికుమార్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు చంటిని అదుపులోకి తీసుకున్నారు. అయితే చంటి తలపై కూడా గాయాలు ఉండడంతో ఆయనను వరంగల్ ఎంజీఎంకు తరలించినట్లు తెలిసింది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తండ్రి మృతి.. కొడుక్కు తీవ్రగాయాలు పాతర్లపల్లిలో ఉద్రిక్తత -
బన్నీ వేసవి యాత్ర –18 విజ్ఞాన ప్రశ్నలు – తాతయ్య సమాధానాలు
బన్నీ: తాతయ్యా, ఆకాశం నీలంగా ఎందుకు కనిపిస్తుంది? తాతయ్య: సూర్యకాంతిలో నీలం రంగు ఎక్కువగా చెదిరిపోతుంది బాబూ. అందుకే ఆకాశం నీలంగా కనిపిస్తుంది. రామ్: తాతయ్యా, వాన ఎలా వస్తుంది? తాతయ్య: సముద్రంలో నీరు ఆవిరై మేఘమవుతుంది. ఆ మేఘాలు చల్లబడితే వానగా కురుస్తుంది. చుక్క : తాతయ్యా, చెట్లు మనకు ఎందుకు ఉపయోగం? తాతయ్య: చెట్లు మనకు గాలి ఇస్తాయి, నీడ ఇస్తాయి, పండ్లు ఇస్తాయి. అవి భూమికి ఊపిరితిత్తుల లాంటివి. స్వప్న: తాతయ్యా, చంద్రుడి మీద మనిషి నడిచాడా? తాతయ్య: నడిచాడమ్మా. 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొదట చంద్రుడి మీద కాలు పెట్టాడు. బన్నీ: తాతయ్యా, రాత్రిపూట నక్షత్రాలు ఎందుకు మెరుస్తాయి? తాతయ్య: అవి చాలా దూరంలో ఉన్న సూర్యుళ్ల లాంటివి. వాటి కాంతి మన దగ్గరకు వచ్చేటప్పటికి మెరుస్తున్నట్టు అనిపిస్తుంది. రామ్: తాతయ్యా, మన గుండె ఎందుకు కొట్టుకుంటుంది? తాతయ్య: గుండె రక్తాన్ని శరీరం అంతా పంపుతుంది. అది ఆగకుండా పని చేస్తేనే మనం బతుకుతాం. చుక్క: తాతయ్యా, విమానం గాల్లో ఎలా ఎగురుతుంది? తాతయ్య: విమానం రెక్కల నిర్మాణం , ఇంజన్ స్పీడ్ వల్ల గాలి దాన్ని పైకి లేపుతుంది తల్లీ. స్వప్న: తాతయ్యా, భూమి గుండ్రంగా ఉందని ఎలా తెలుసు? తాతయ్య: ఓడ దూరంగా వెళ్తే ముందు పై భాగం కనిపించకుండా పోతుంది. అలాగే ఉపగ్రహ ఫోటోల్లో కూడా గుండ్రంగా కనిపిస్తుంది. బన్నీ: తాతయ్యా, సబ్బుతో కడిగితే మురికి ఎలా పోతుంది? తాతయ్య: సబ్బు నూనె, మురికిని నీటిలో కరిగేలా చేస్తుంది. అందుకే నీళ్లతో కడిగితే పోతుంది. అందరూ: తాతయ్యా, మీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు? తాతయ్య: పుస్తకాలు చదివితే, పెద్దవాళ్ళు చెబితే, ప్రశ్నలు అడిగితే అన్నీ తెలుస్తాయి. మీరు కూడా అడగడం మానకండి! పిల్లలకి మాట: ప్రశ్నతో మేధో వికాసం పెంపొందుతుంది. ప్రశ్న, సమాధానాలతోనే సమూల మార్పులు జరుగుతాయి. డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు గ్రామం: కాకర్లపల్లి, మంథని, జిల్లా: పెద్దపల్లి -
చిన్ని పాపలు
చిన్ని పాపల మది దేవుడు ఉండే గుడి చిట్టి పాపల పలుకు అమృతపు చినుకు బుడిబుడి అడుగులు వేశారంటే భూమాత పులకించేను ముద్దు ముద్దుగా పలికారంటే అమ్మనాన్న మురిసేను మల్లెపువ్వులా నవ్వారంటే రాతి గుండెలే కరిగేను చందమామలా చుశారంటే మదిలో వెన్నెల కురిసేను కల్లాకపటం ఎరుగనివారు ఎవ్వరినైనా మురిపిస్తారు కులమతాలు తెలియనివారు అందరి మనసులు దోచేస్తారు బూర దేవానందం కవి, రచయిత సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా -
ట్రాలీపూల్
గంభీరావుపేట(సిరిసిల్ల): అవసరాలే మనిషిని అన్వేషణ వైపు మళ్లిస్తాయి అంటారు. ఈ రైతును చూస్తే నిజమే అనిపిస్తుంది. అసలే ఎండాకాలం.. విద్యాసంస్థలకు సెలవులు ఉండడంతో పిల్లలు ఈత కోసం వాగులు, వంకలకు పోవడం ఇష్టం లేక ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. తన ట్రాక్టర్ ట్రాలీని స్విమ్మింగ్పూల్గా మార్చేశాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరింటాలకు చెందిన రైతు తిరుపతిరెడ్డి తన ట్రాక్టర్ ట్రాలీని ఈతకొట్టేందుకు అనువుగా మార్చాడు. ట్రాలీలో ప్లాస్టిక్ కవర్ వేసి వ్యవసాయ పంపు ద్వారా నీళ్లు నింపాడు. ఇప్పుడు అది ట్రాలీ స్విమ్మింగ్ పూల్ అంటూ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. -
గోదావరి పుష్కరాలకు సమాయత్తం
కాళేశ్వరం: వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 6 వరకు జరగనున్న గోదావరి నది పుష్కరాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సమాయత్తం అవుతోందని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని మేఘా విశ్రాంతి భవనంలో మంగళవారం ఆయన.. భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ సరస్వతి ఆది, అంత్య పుష్కరాల సందర్భంగా భక్తులకు కల్పించిన సౌకర్యాలను పీపీటీ ద్వారా వివరించారు. అనంతరం కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం సుమారు రూ.1000 కోట్ల నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా ఎదురైన లోటుపాట్లను గుర్తించి, గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్యం, తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్, విద్యుత్ సరఫరా, వీఐపీ, వీవీఐపీల పర్యటనల ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లాల వారీగా ఇప్పటినుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ములుగు, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల కలెక్టర్లు బొర్కడే హేమంత్ సహదేవరావు, కుమార్ దీపక్, సత్య ప్రసాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల అదనపు కలెక్టర్లు బుజంగరావు, వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కాటారం ఆర్డిఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు కాళేశ్వరంలో గోదావరి పుష్కరాలపై పరీవాహక ప్రాంతాల కలెక్టర్లతో సమీక్ష -
ఆరోగ్యానికి వాలీబాల్
● పెరుగుతున్న ఆదరణ ● 1920లో దేశంలో పరిచయం ● 1964లో ఒలింపిక్స్లో చోటుకరీంనగర్స్పోర్ట్స్: వాలీబాల్ ఆరోగ్యానికి మానసికోల్లాసాన్ని ఇస్తుంది. వాలీబాల్ ఆడడం వల్ల శరీరానికి కావాల్సిన వ్యాయామంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. దినదినాభివృద్ధి చెందిన ఈ క్రీడ ఒలింపిక్స్లో చోటు సంపాదించింది. అమెరికాలో పుట్టి.. వాలీబాల్ అమెరికాలోని హాల్యోకిలో పుట్టింది. వాలీబాల్ను గతంలో మింటోనెట్టి అని పిలిచేవారు. 1947లో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఈ ఆటను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. 1964 పారీస్ఒలింపిక్లో క్రీడను చేర్చారు. మన దేశంలో 1920లో వాలీబాల్ను పరిచయం చేశారు. జట్టు వివరాలు ఒక్కో జట్టుకు ఆరుగురు క్రీడాకారులు ఉంటారు. ఇరు జట్లు కలిపి 12 మంది ఆడుతారు. జట్టు సభ్యుల్లో ఒక్కరి డ్రెస్ కోడ్వేరుగా ఉంటుంది. ఆ సభ్యుడు లిబిరోగా వ్యవహరిస్తారు. ఆటాడే సమయంలో బాల్డెడ్ అయినప్పుడు, లిబిరో ఆటలోకి రావచ్చు, తిరిగి వెళ్లవచ్చు. లిబిరో స్ట్రైకింగ్ చేయరాదు. ఆట పద్ధతి ఒక బుస్టర్, ఐదుగురు స్ట్రైకర్లు అంటే 1:5 పద్ధతి, ఇద్దరు బూస్టర్లు, నలుగురు స్ట్రైకర్లు అంటే 2:4 పద్ధతి, ఒక స్ట్రైకర్, ఒక ఆల్రౌండర్, నలుగురు స్ట్రైకర్లు, ఒక లిబిరో ఉంటారు. పాయింట్లు, రౌండ్ల వివరాలు... జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఐదు రౌండ్లు ఆడాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్కి 25 పాయింట్లు ఉంటాయి. ఒక రౌండ్లో గేమ్ ముగియాలంటే ఇరు జట్ల మధ్య రెండు పాయింట్ల వ్యత్యాసం ఉండాలి. చివరి రౌండ్లో ఒక పాయింట్ తేడాతో విజేతలను ప్రకటిస్తారు. ఆట సమయంలో క్రీడాకారులు క్లాక్ వైజ్ రోటేషన్ పద్థతిలో ఆడాల్సి ఉంటుంది. ఇంకా వీటిలో జంప్ సర్వీస్, పుల్వాలీ, స్పిన్, టెన్నిస్, డబుల్ హ్యాండ్ బ్లాక్, షూటింగ్, స్మాసింగ్, ఫ్లెసింగ్ ఉంటాయి. కోర్టు వివరాలు కోర్టు పొడవు 18 మీటర్లు, వెడల్పు 9 మీటర్లు. అటాక్లైన్ 3 మీటర్లు, సర్వీస్ లైన్లు రెండు వైపుల 15 సెం.మీ, పోల్ ఎత్తు 2.5 మీటర్లు, పోల్కి పోల్కి మధ్య వ్యత్యాసం 11 మీటర్లు, నెట్పొడవు 9 మీటర్లు, నెట్ ఎత్తు పురుషుల విభాగా నికి 2.40 మీటర్లు, చతురస్రారం 10 సెంటీమీటర్లు, బాల్ బరువు 270 గ్రాములు. -
ఈతకు వెళ్లి ఇద్దరి దుర్మరణం
ధర్మపురి: వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ యువకుడు ఈతకు వెళ్లి వ్యవసాయ బావిలో మునిగి చనిపోయిన ఘటన మండలంలోని కొరండ్లపల్లెలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మండలంలోని తిమ్మాపూర్కు చెందిన లింగం గౌరయ్య, లక్ష్మి దంపతుల కొడుకు అక్షయ్(22) వారం క్రితం కొరండ్లపల్లెలో ఉంటున్న తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం ఓ వ్యవసాయ బావిలో ఈత కొట్టేందుకు స్నేహితులతో కలిసి వెళ్లాడు. బావిలోకి దిగిన అక్షయ్కు అదే సమయంలో ఫిట్స్ రావడంతో నీటిలోనే మునిగిపోయాడు. సాయంత్రం శవమై తేలాడు. అక్షయ్ మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు, బంధువుల రోధనలు మిన్నంటాయి. ఎస్సై మహేశ్ ఆధ్వర్యంలో పోలీసుల సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈత నేర్చుకునేందుకు వెళ్లి .. చందుర్తి(వేములవాడ): ఈతకు వెళ్లిన చోటు నుంచి బహిర్భూమికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన యువకుడు బావి పడి మృతిచెందిన సంఘటన చందుర్తి మండలం మల్యాలలో ఆదివారం తీరని విషాదం నింపింది. మల్యాలకు చెందిన మల్యా ల లక్ష్మి–శ్రీనివాస్ దంపతుల మూడో కొడుకు అజయ్(21) హైదరాబాద్లో బీటేక్ సెకండియర్ పూర్తి చేశాడు. వేసవి సెలవుల్లో ఇంటికొచ్చాడు. స్నేహితులతో కలిసి బావిలో ఈత నేర్చుకునేందుకు వెళ్లాడు. ఇదే సమయంలో బహిర్భూమికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. గంట గడిచినా రాకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు చుట్టుపక్కల గాలించారు. సమీపంలోని వ్యవసాయబావి వద్ద అజయ్ ఈత నేర్చుకునేందుకు వీపునకు కట్టుకున్న క్యాన్(డబ్బా) ఒడ్డుపై పడి ఉండడంతో ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి ఉంటాడని అనుమానించారు. ఈ విషయాన్ని అజయ్ కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు తెలపడంతో భారీ సంఖ్యలో గ్రామస్తులు చేరుకున్నారు. గత ఈతగాళ్లను పిలిపించి దాదాపు నాలుగు గంటలు గాలించడంతో మృతదేహం లభించింది. మృతుని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుని తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. -
తరతరాలు?
తరతరాలుగా సాగుతున్న మాయాజాలం ఆ జాదుగర్ ఎవరో గాని విద్యార్థుల ప్రతిభను బాగానే మాయంజేత్తండు. అప్పట్లో దోతిపంచ ఈడీ, అంగి ప్యాంటు ఏత్తేసాలు సర్కార్ కొలువు అచ్చేది, కానీ..! ఈయ్యాల సర్కార్ కొలువు కావాలంటే మన ముందు తరాలలో అంగి ప్యాంట్ తొడిగిన వాళ్లుంటే సాలు. అక్షరాలతో పనక్కర్లే, వేలిముద్రైన పర్లే, అన్నట్టుగా మాయం జేత్తండు ఆ జాధుగర్ ఎవరో గాని? – కొలిపాక ప్రతిభ, ఎంఏ (తెలుగు) గ్రామం: అన్నారం కరీంనగర్ (జిల్లా) -
ఆధునిక సాంకేతికతతో ఆర్థోస్కోపీ
కరీంనగర్: వైద్యరంగంలో అత్యాధునిక సాంకేతికతతో నిర్వహించే ఆర్థోపెడిక్ ఆర్థోస్కోపిక్ కీ హోల్ సర్జరీ ప్రదర్శనకు కరీంనగర్ వేదికై ంది. ఇండియన్ ఆర్థోస్కోపిక్ సొసైటీ జాయింట్ ప్రెజర్వేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఆదివారం ఓ హోటల్లో సదస్సు నిర్వహించారు. రెనె ఆస్పత్రి లైవ్ శస్త్ర చికిత్సకు వేదికైంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్థోపెడిక్ నిపుణులు లైవ్ శస్త్రచికిత్సల్లో పాలుపంచుకున్నారు. శస్త్రచికిత్సలను సీఎంఈ ప్రోగ్రాం ద్వారా లైవ్టెలికాస్ట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్స్, పీజీ వైద్య విద్యార్థులు హాజరయ్యారు. వైద్యులు సాయి వీర్ల, నితిన్కుమార్ బెజ్జంకి, పూర్ణచంద్ర తేజస్వి, రమాకాంత్ రాజగోపాల్ కృష్ణన్, సుఖేష్ రావు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆర్గనైజింగ్ చైర్మన్ బంగారు స్వామి మాట్లాడుతూ.. గతంలో ఇలాంటి శస్త్రచికిత్సలు ఢిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి నగరాల్లో మాత్రమే జరిగేవని, నేటి వైద్య విద్యార్థులకు కరీంనగర్ వంటి కేంద్రాల్లో కూడా అంతర్జాతీయ స్థాయి వైద్యసదస్సులు నిర్వహించడం ద్వారా మంచి జ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశం దొరికిందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామ్ కుమార్రెడ్డి, సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి, ఆర్థోస్కోపిక్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ జైప్రసాద్ పెద్ది, శ్రీధర్ గంగవరపు, మునీష్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మైదానంలో చిరుతలు
● ఆటల్లో శిక్షణ.. భవితకు రక్షణ ● ఉత్సాహంగా వేసవి శిబిరాలు ● కరాటే, కబడ్డీ, క్రికెట్లో ట్రెయినింగ్ జిల్లాలో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలు సందడిగా మారాయి. భవిష్యత్లో క్రీడాకారులుగా తయారయ్యేందుకు ఇది చక్కటి అవకాశం. శిక్షణ సమయంలో విద్యార్థులకు క్రీడలపై పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఒక్కో విభాగంలో 30 నుంచి 40 మంది పిల్లలు శిక్షణ పొందుతున్నారు. ఈ శిబిరాలు జూన్ 6 వరకు కొనసాగుతాయి. – ఎ.రాందాస్, జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి ప్రతీ రోజు స్టేడియానికి వెళ్తున్నాను. వాలీబాల్ ఇష్టం. కోచ్లు మంచి మెలకువలు నేర్పుతున్నారు. – తులసీకృష్ణ, సిరిసిల్ల కరాటే అంటే ఇష్టం. గత మూడేళ్లుగా కరాటేలో శిక్షణ తీసుకుంటున్నాను. వేసవి సెలవుల్లో ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా కరాటేలో మరిన్ని మెలకువలు నేర్చుకుంటున్నాను. – లాస్యప్రియ, రాజీవ్నగర్ నాకు కబడ్డీ ఇష్టం. మినీస్టేడియంలో ఉంటూ మెలకువలు నేర్చుకుంటున్నాను. కోచ్లు మంచిగా శిక్షణ ఇస్తున్నారు. నేను ముస్తాబాద్ గురుకులంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాను. – రాంచరణ్, ఇల్లంతకుంట క్రికెట్ అంటే చాలా ఇష్టం. కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాను. క్రీడల్లో రాణిస్తే భవిష్యత్లో ఉపాధి అవకాశాలు ఉంటాయని కోచ్లు తెలిపారు. అందుకే ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. – బన్నీ, కొండాపూర్ -
భర్త వెంటే భార్య..
● మరణంలో వీడని బంధం ● కలిసి నడిచారు.. కలిసేపోయారు ధర్మపురి: వారు కలిసి జీవితం పంచుకున్నారు. చివరకు కలిసే ఈ లోకా న్ని వీడారు. భర్త మరణించిన రోజే భార్య కూడా మృతిచెందిన ఘటన ధర్మపురి మండలం దోనూర్లో విషాదం నింపింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జంగం రాజయ్య, సాయ మ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, కూతురు సంతానం. రాజయ్య వ్యవసాయం చేస్తుండేవాడు. వృద్ధాప్యం దరి చేరడం.. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంటివద్దనే ఉంటున్నాడు. పెద్ద కుమారుడు ముంబయిలో ఉంటున్నాడు. ప్రస్తుతం దంపతులిద్దరూ చిన్న కుమారుడి వద్ద ఉంటున్నారు. శనివారం ఉదయం వరకు బాగానే ఉన్న రాజయ్య (83) శనివారం ఎండవేడి తట్టుకోలేక అస్వస్థతకు గురై మృతి చెందాడు. బంధువులు, కుటుంబ సభ్యులు రాజయ్యకు అంత్యక్రియలు పూర్తి చేసి బంధువులందరూ ఎక్కడివారక్కడ వెళ్లిపోయారు. ఈ క్రమంలో సాయమ్మ (80) రాత్రి భోజనం చేసిన అనంతరం ఛాతిలో నొప్పి వస్తోందంటూ కుప్పకూలిపోయింది. ఆదివారం ఉదయం బంధువులందరూ వచ్చి రాజయ్య చితిపక్కనే సాయమ్మకు అంత్యక్రియలు పూర్తిచేశారు. కలకాలం కలిసి ఉంటామని బాస చేసిన ఆ దంపతులు చివరకు కలిసే కానరాని లోకాలకు వెళ్లడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. -
హత్యా.. ఆత్మహత్యా?
కరీంనగర్, మానకొండూర్: డబ్బు తీసుకొని వెళ్లిన యువకుడు విగతజీవిగా కనిపించిన ఘటన తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ శివారులోని మానేరు డ్యాం సమీపంలో జరిగింది. పోలీసులు, మృతుడి తల్లి కథనం ప్రకారం.. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధి సదాశివపల్లికి చెందిన జార్తి కనకలక్ష్మి భర్త సంపత్ గతంలో చనిపోయాడు.కనకలక్ష్మి వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కొడుకు శ్రీనిధ్, కూతురును చదివిస్తోంది. శ్రీనిధ్ ఇటీవలే ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. శనివారం ఉదయం 11 గంటలకు ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత ఇంట్లో దాచిన రూ.48,000 కనిపించలేదు.అలాగే తన తల్లి మొబైల్ నుంచి శ్రీనిధ్ తన అకౌంట్కు రూ.33 వేలు బదిలీ చేసుకున్నట్లు తెలిసింది. మధ్యాహ్నం నుంచి ఫోన్ చేసినా ఎత్తలేదు. సాయంత్రం స్విచ్చాఫ్ అయింది. రాత్రి 10.30 గంటలకు శ్రీనిధ్ స్నేహితుడు వికాస్ ఫోన్ చేసి అతని గురించి అడిగాడు. స్నేహితులను విచారించగా వారు కూడా చూడలేదని చెప్పారు.ఆదివారం శవమై..ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో శ్రీనిధ్ స్నేహితులు వీక్, ప్రణయ్ ఇంటికి వచ్చి అతని గురించి అడిగి వెళ్లారు. ఉదయం 7 గంటల సమయంలో బంధువు కౌటం సంపత్, కనకలక్ష్మికి ఫోన్ చేసి రామకృష్ణకాలనీ శివారులో శ్రీనిధ్ ఉరేసుకున్నట్లు ఉందని తెలిపా డు.బంధువులు ఘటన స్థలానికి చేరుకున్నారు. శ్రీనిధ్ చేతులు అదే తాడుతో కట్టి ఉన్నాయి. ఇది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఉరివేసి ఉంటారని తల్లి అనుమానం వ్యక్తం చేసింది. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ఎండీ పోలీసులు తెలిపారు. -
ఉత్తమ శిక్షణ.. ప్రతిభకు పదును
కరీంనగర్స్పోర్ట్స్: గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల నైపుణ్యాలను వెలికితీసి, వారికి అంతర్జాతీయ స్థాయి వేదికను కల్పించడమే ధ్వేయంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఖేలో ఇండియా సెంటర్లు ఏర్పాటు చేసింది. ప్రతిభ ఉండి సరైన వనరులు లేక ఆగిపోయే క్రీడాకారుల కలలకు ప్రాణం పోయడమే లక్ష్యంగా ఏర్పాటైన ఖేలో ఇండియా క్రీడా కేంద్రాలు ఉమ్మడి జిల్లాలో ఉత్సాహంగా నడుస్తున్నాయి. క్రీడాకారుల కలలకు రెక్కలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఖేలో ఇండియా సెంటర్లు గ్రామీణ ప్రాంత క్రీడాకారుల కలలకు రెక్కలు తొడుగుతూ సరికొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. కరీంనగర్లో జూడో, సిరిసిల్లలో కబడ్డీ, జగిత్యాలలో బాక్సింగ్, సుల్తానాబాద్లో ఖోఖో క్రీడల్లో అత్యున్నత స్థాయి శిక్షణను అందిస్తూ ప్రతిభకు పదును పెడుతున్నాయి. రోజూ ఉదయం, సాయంత్రం వేళ నిష్ణాతులైన శిక్షకుల పర్యవేక్షణలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇస్తున్నారు. క్రీడలపై ఆసక్తి ఉన్నవారు సంబంధిత సెంటర్లను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. లక్ష్యం.. ఒలింపిక్ పతకం ఈ కేంద్రాల అంతిమ లక్ష్యం దేశాన్ని ఒలింపిక్ మెడల్స్ పట్టికలో అగ్రస్థానంలో నిలపడం. కింది స్థాయి నుంచే పటిష్టమైన క్రీడా వ్యవస్థను నిర్మించడం ద్వారా, భవిష్యత్తులో స్థిరమైన విజయాలను సాధించేలా ప్రణాళికలు రూపొందించారు. ఆడుదాం.. గెలుద్దాం అనే నినాదంతో యువతను క్రీడల వైపు మళ్లించి, వారిని ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణ కలిగిన పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. మట్టిలో మాణిక్యాలకు వేదికలుగా ఖేలో ఇండియా కేంద్రాలు అంతర్జాతీయ ప్రమాణాలు, సౌకర్యాలతో తర్ఫీదు ఉమ్మడి జిల్లాలో నాలుగు సెంటర్లు ఉమ్మడి జిల్లాలో సెంటర్లు ఇలా.. కరీంనగర్ క్రీడ: జూడో వేదిక: ప్రాంతీయ క్రీడా పాఠశాల, కరీంనగర్ కోచ్: కె.శ్యామ్ సెల్: 99084 02447 –––––––––––––––––––––––– జగిత్యాల క్రీడ: బాక్సింగ్ వేదిక: వివేకానంద మినీ స్టేడియం, జగిత్యాల కోచ్: నల్ల నవీన్ సెల్: 81792 68462 –––––––––––––––––––––––– సిరిసిల్ల క్రీడ: కబడ్డీ వేదిక: చెన్నమనేని వెంకటరావు సర్దేశాయి మినీ స్టేడియం, సిరిసిల్ల కోచ్: నగర్ల ప్రశాంత్ సెల్: 99595 56017 –––––––––––––––––––––––– పెద్దపల్లి క్రీడ: ఖోఖో వేదిక: ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, సుల్తానాబాద్ కోచ్: గెల్లు మధుకర్ సెల్: 79950 78488 -
చార్ధామ్ యాత్రలో వేములవాడ వాసి మృతి
వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన ఆకుల నరేశ్ ఉరఫ్ దుబాయ్ నరేశ్(56) చార్ధామ్ యాత్రలో అస్వస్థతకు గురై ఆదివారం మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. వేములవాడలోని చెక్కపల్లిరోడ్డుకు చెందిన ఆకుల నరేశ్ కొన్నేళ్లుగా హైదరాబాద్లోని ముషీరాబాద్లో భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉంటున్నారు. ఇటీవల పెద్ద కూతురు పెళ్లి చేశారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఆయన భార్య ఇటీవల స్వదేశం రావడంతో కుటుంబంతో కలిసి నాలుగు రోజుల క్రితం చార్ధామ్ యాత్రకు వెళ్లారు. ఆదివారం ఉదయం కేదారినాథ్ సమీపంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో అత్యవసర చికిత్స నిమిత్తం ఛాపర్ అంబులెన్స్లో తరలించే లోపే మరణించారు. నరేశ్ మృతదేహాన్ని హైదరాబాద్కు తీసుకురానున్నారు. పట్టణంలోని ఆయన ఇంటిలో విషాద చాయలు అలుముకున్నాయి. -
జూడోపై ఆసక్తి
కరీంనగర్ సెంటర్లో జూడో శిక్షణ పొందుతున్న క్రీడాకారుల్లో అద్భుతమైన టాలెంట్ ఉంది. ఉచిత శిక్షణ, నాణ్యమైన వసతులు ఉండటంతో ఆర్థికంగా వెనుకబడిన వారు కూడా ఎలాంటి భయం లేకుండా క్రీడల్లోకి వస్తున్నారు. గతేడాది చాలా మంది క్రీడాకారులు జాతీయ పోటీల్లో సత్తా చాటారు. సీఎం కప్ పోటీల్లో కూడా పతకాలు సాధించారు. – కె.శ్యామ్, జూడో కోచ్ కరీంనగర్ ఖేలో ఇండియా సెంటర్లో మ్యాట్పై కబడ్డీ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్రీడాకారులు ఫిట్నెస్ మాత్రమే కాకుండా, టీమ్ వర్క్, వ్యూహాలను నేర్చుకుంటున్నారు. భవిష్యత్తులో ప్రో కబడ్డీ వంటి పెద్ద వేదికలపై మెరుస్తారనే నమ్మకం ఉంది. – నగర్ల ప్రశాంత్, కబడ్డీ కోచ్, సిరిసిల్ల -
ఇంటి వెలుగులు
చిన్నారి పాపలం చిరునవ్వు దివ్వెలం ఇంటిలో వెలుగులం కంటిలో పాపలం అమ్మ ఒడి మాకుగుడి నాన్న మది మా ప్రేమనిధి ఇద్దరి మాటలు వింటాము చక్కగ బడికి వెళతాము బడిలో పాఠం నేర్చుకొని బంగరు బాటన పయనిస్తాము పెద్దల దీవెన లందుకొని విద్యలో విజయం సాధిస్తాము – బూర దేవానందం, సిరిసిల్లటౌన్ -
బన్నీ వేసవి యాత్ర –16 గుడ్ టచ్ బ్యాడ్ టచ్
సాయంత్రం బన్నీ, స్వప్న, రామ్, చుక్క తాతయ్య దగ్గర కూర్చున్నారు. తాతయ్య అన్నాడు: ‘మీ శరీరం మీది. మీ అనుమతి లేకుండా ఎవరూ ముట్టుకోకూడదు.’ ‘అమ్మ కౌగిలి , నాన్న ముద్దు, స్నేహితుల కరచాలనం – ఇవి గుడ్ టచ్. మనకు సంతోషంగా ఉంటుంది’ అని చెప్పాడు. ‘బ్యాడ్ టచ్ అంటే? మనకు భయం, బాధ, సిగ్గు కలిగితే అది బ్యాడ్ టచ్’ అని వివరించాడు. రామ్ అడిగాడు: ‘అలా జరిగితే ఏం చేయాలి తాతయ్యా?’ తాతయ్య 3 టిప్స్ చెప్పాడు: 1. గట్టిగా ‘వద్దు’ అని అరవాలి. 2. అక్కడి నుంచి పరిగెత్తాలి. 3. వెంటనే నమ్మకమైన పెద్దవాళ్లకు చెప్పాలి. చుక్క: అమ్మకు చెప్తాను. టీచర్కి చెప్తాను. స్వప్న అడిగింది: ‘తెలిసిన వాళ్లయితే?’ తాతయ్య అన్నాడు: ‘ఎవరైనా సరే, నీకు నచ్చకపోతే వద్దు అనే.’ చెప్పాలి. తాతయ్య గట్టిగా చెప్పాడు: ‘తప్పు మీది కాదు. ధైర్యంగా చెప్తేనే మనం జాగ్రత్తగా ఉంటాము.’ బన్నీ అందరికీ చెప్పాడు: ‘మన శరీరం. మన నియంత్రణ. గుడ్ టచ్ పర్వాలేదు. బ్యాడ్ టచ్ చేయనివ్వకూడదు.’ పిల్లలకి మాట: భయం వద్దు. మౌనం వద్దు. ‘వద్దు’ అని గట్టిగా చెప్పాలి. విషయం అమ్మకు, టీచర్కు చెప్పడమే అసలైన ధైర్యం. కోట లక్ష్మణ్, ఎస్జీటీ ఎంపీపీఎస్, కాకర్లపల్లి మండలం : మంథని జిల్లా : పెద్దపల్లి -
మేము గీసిన బొమ్మలు
నైలా ఖలీల్ 6వ తరగతి అల్ఫోన్స్ హైస్కూల్ నల్గొండ నాగప్రతిజ్ఞ 6వ తరగతి మహాత్మాజ్యోతిబాపూలే రాంపూర్ హుజూరాబాద్ కరీంనగర్ (జిల్లా) తంగళ్లపల్లి రుత్విక్ 7వ తరగతి ప్రగతి విద్యాలయం హైస్కూల్ కోరుట్ల జగిత్యాల (జిల్లా) జే.శెశ్వితశ్రీ 2వ తరగతి నడ్డివారి గూడెం నల్గొండ జోయా నాజ్ కాకతీయ హైస్కూల్ కరీంనగర్ జక్కం తనుశ్రీ 4వ తరగతి సూర్య ఆక్స్ఫర్డ్ స్కూల్ గణేశ్నగర్ సిరిసిల్ల -
కొండలతో ఊరి పేర్ల పొడుపు కథలు
1. రామ భక్తుడు కొండ ఎక్కింది ఎక్కడ? 2. ఏం చెప్పినా ఆలకించే కొండ.. ఎక్కడ ఉంది? 3. ఈ కొండకు గట్టు కట్టారు.. ఎక్కడో చెప్పండి? 4. ఈ మహాకొండ.. రాయల వారి రాజధాని కూడా? 5. ఈ కొండలో పల్లెటూరుంది.. బొమ్మలకు ప్రసిద్ధి కూడా? 6. ఇక్కడ ఏడు కొండలుంటాయి. శ్రీహరి నివాసమది. ఎక్కడ? 7. భువనానికి కొండ తోడయితే వచ్చే ఊరు పేరు? 8. శ్రీకృష్ణుడు చిటికెన వేలుతో పైకెత్తిన కొండ పేరు? 9. హైదరాబాద్లో ప్రసిద్ధి చెందిన కోటపేరు? 10. ప్రభలతో తిరునాళ్లకు ప్రఖ్యాతి చెందిన కొండ ఎక్కడ? 11. రెడ్డి రాజులు కట్టించిన కోట? 12. మన రక్తం తాగి జబ్బుల్నిచ్చే జీవితో వచ్చే కొండ? 13. ఈ కొండకు గుత్తి ఉంది. అదెక్కడ? 14. ఏం మరిచినా శ్రీయాద్శ్రీ చేసే కొండ ఎక్కడ ఉంది? డాక్టర్ కందేపి రాణిప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్, సృజన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, సిరిసిల్ల జవాబులు: 1.హనుమకొండ, 2. వినుకొండ, 3. కొండగట్టు, 4. పెనుగొండ, 5. కొండపల్లి, 6. తిరుపతి, 7. భువనగిరి, 8. గోవర్ధనగిరి, 9. గోల్కొండ, 10.కోటప్పకొండ, 11. కొండ వీడు, 12. దోమకొండ, 13. గుత్తికొండ, 14. యాదగిరి. -
రైస్మిల్లర్ల మాయాజాలం
రైస్మిల్లర్లు తప్ప, తాలు పేరిట కోతలు విధిస్తున్నారు. 40 కిలోల బస్తాకు 2–5 కిలోల వరకు కట్ చేస్తున్నారు. మిల్లుకు వెళ్లిన లారీని దించుకోకపోవడం, తప్ప, తాలు ఉందని వెనక్కి పంపిస్తున్నామని బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మిల్లర్తో ఏదో మాట్లాడుకోమని రైతులకు ఉచిత సలహా ఇస్తున్నారు. చేసేదేమి లేక రైతులు మిల్లర్లను బతిమిలాడి వారు చెప్పినంత ధాన్యం కటింగ్కు ఒప్పుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా రైతులు మిల్లర్లపై ఫిర్యాదు చేయలేదు. ఒక వేళ చేసినా పట్టించుకునే అధికారులు లేరు. -
అష్టకష్టాలు!
అన్నదాతరైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. విత్తనం వేసినప్పటి నుంచి పంటను మార్కెట్కు తరలించే వరకు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. వ్యాపారులు, దళారులు అన్నదాతను దగా చేస్తూనే ఉన్నారు. పంట పండించడం ఒక ఎత్తయితే ఆ పంటను మార్కెట్లో అమ్ముకోవడం మరింత కష్టంగా మారింది. యేటా పెరుగుతున్న పెట్టుబడి వ్యయంతో పంటల సాగులోకి వచ్చేందుకు రైతులు జంకుతున్నారు. అన్నదాతలు ఎదుర్కొంటున్న అష్టకష్టాలపై ప్రత్యేక కథనం. –కరీంనగర్ అర్బన్/జగిత్యాలఅగ్రికల్చర్1,61,0322,10,9042,05,0001,18,000పెద్దపల్లికరీంనగర్జగిత్యాలరాజన్న సిరిసిల్ల -
వలస కార్మికులపై నిఘా
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో నివసిస్తున్న ఇతర రాష్ట్రాలవారిపై పోలీసులు దృష్టి సారించారు. ఇక్కడ జీవనోపాధి పొందుతున్న వలస కార్మికుల వివరాలు సేకరిస్తున్నారు. సీపీ గౌస్ఆలం ఆదేశాలతో కొత్తపల్లి పోలీసులు మండలంలోని గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాలు సేకరించే ప్రక్రియకు శనివారం శ్రీకారం చుట్టారు. కరీంనగర్లో ఇటీవల జరిగిన పీఎంజే జువెల్లరీ దొంగతనం, హైదరాబాద్లో నేపాల్ గ్యాంగ్ చేసిన హత్యలు, దొంగతనాల నేపథ్యంలో గ్రానైట్ క్వారీలు, కటింగ్, పాలీషింగ్ యూనిట్లు, అనుబంధ వ్యాపారాలు, హోటళ్లు, లాడ్జీలు తదితర రంగాల్లో పనిచేస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో వేలాది మంది కార్మికులు కొత్తపల్లి మండలంలోని పారిశ్రామిక ప్రాంతమైన ఆసిఫ్నగర్, ఖాజీపూర్, ఎలగందుల, నాగులమల్యాల, కమాన్పూర్, బద్దిపల్లి ప్రాంతాల్లోని గ్రానైట్ పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నా రు. ఈ పారిశ్రామిక ప్రాంతంలో రాజస్థాన్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, చత్తీస్గఢ్, మహారాష్ట్ర, బిహార్, అసోం, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు నేపాల్కు చెందిన కార్మికులు ఉపాధి పొందుతున్నారు. అయితే ఎవ రు వస్తున్నారో..ఎవరు నివసిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. పోలీసుల వద్ద ఎలాంటి సమాచారం లేకపోవడంతో నేర పరిశోధన చేపట్టలేకపోతున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కార్మి కుల జాబితా తయారు చేయాలని నిర్ణయించారు. వేగవంతమైన నేర పరిశోధనకు శాంతిభద్రతల పరిరక్షణకు ఇతర రాష్ట్రాల కార్మి కుల వివరాల నమోదు ప్రక్రియ చేపట్టాం. నేరాల నియంత్రణ, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందనకు దోహదంగా ఉంటుంది. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇతర రాష్ట్రాల కార్మికుల వ్యక్తిగత వివరాలు, నివాస చిరునామాలు, ఉపాధి వివరాలను సేకరించి ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. – సోహం సునీల్, ట్రైనీ ఐపీఎస్ -
బక్రీద్కు పకడ్బందీ ఏర్పాట్లు
కొత్తపల్లి(కరీంనగర్): బక్రీద్ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ చిత్రా మి శ్రా తెలిపారు. రేకుర్తి ఈద్గా వద్ద బక్రీద్ ఏర్పాట్లును సీపీ గౌస్ ఆలంతో కలిసి శనివారం సా యంత్రం పరిశీలించారు. ప్రత్యేక ప్రార్థనలకు ఎంత మంది హాజరవుతారు.. సౌకర్యాల కల్ప నపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ బక్రీద్ సందర్భంగా ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మైనార్టీ సంక్షేమశాఖ, మున్సిపల్ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ముస్లిం మత పెద్దలు పలు అంశాలను జిల్లా కలెక్టర్, సీపీ దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎండాకా లం దృష్ట్యా పెద్ద మొత్తంలో కూలర్లు , లైటింగ్తో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఆర్డీవో కుందారపు మహేశ్వర్, తహసీల్దార్ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలికరీంనగర్: పదో తరగతిలో సాధించిన విజ యంతో ఆగిపోకుండా విద్యార్థులు ఉన్నత శిఖ రాలను అధిరోహించాలని హైదరాబాద్ ఈగల్ ఎస్పీ ఆర్.గిరిధర్ పిలుపునిచ్చారు. కరీంనగర్లోని వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివా రం నిర్వహించిన ‘గంప వజ్రమ్మ విద్యా పురస్కారం’ ‘వై రఘునాథం ఎక్స్లెన్సీ అవార్డు’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రతిభ కనబర్చిన విద్యార్థులు పురస్కారాలు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ‘వై రఘునాథం ఎక్స్లెన్సీ’ అవా ర్డును లయన్ కొండా వేణుమూర్తికి అందించారు. ఐఆర్ఎస్ ఎస్.మురళీమోహన్, సీవీ. రావు, వి.పూజ విద్యార్థులకు దిశానిర్దేశం వెంకట్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న బాల గోకులం అనాథ శరణాలయ విద్యార్థులకు ఆన్లైన్లో కంప్యూటర్ కోడింగ్, ఆంగ్ల భాషలో శిక్షణ అందించిన హైకోర్టు న్యాయమూర్తి ఈవీ.వేణుగో పాల్ సంతానం ఈవీ.రిషిత, ఈవీ.ఆర్యన్సాయికి ప్రత్యేక సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. 185 మంది విద్యార్థులకు గోల్డ్మెడల్స్, ప్రధానోపాధ్యాయులకు పురస్కారాలు అందజేశారు. విధుల్లో ప్రమాణాలు పాటించాలికరీంనగర్క్రైం: ప్రజా ప్రతినిధులు, వీఐపీ భద్రతతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో పీఎస్వోలు, బాంబ్ డిస్పోజల్ , డాగ్స్క్వాడ్ సిబ్బంది అత్యంత అప్రమత్తత, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేయాలని ఏఆర్ ఏసీపీ ప్రతాప్ ఆదేశించారు. శనివారం కమిషనరేట్కేంద్రంలోని తన కార్యాలయంలో ఏఆర్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రతాప్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రామాణిక విధానాలు పాటించాలని స్పష్టం చేశారు. వీఐపీల భద్రతే ప్రథమ కర్తవ్యంగా భావించాలన్నారు. ఆయుధాల నిర్వహణ, రూట్ చెకింగ్, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. వీఐపీల ప్రయాణ ప్రణాళికల గోప్యతను పాటించాలన్నారు. హ్యాండ్లర్లు తమ శునకాలతో ప్రేమ, ఓపికతో వ్యవహరిస్తూ వాటి ఆరోగ్యం, ఫిట్నెస్పై దృష్టి పెట్టాలని సూచించారు. ఆర్ఐ(అడ్మిన్) రజినీకాంత్, ఆర్ఎస్సైలు నీలవేణి రాజు, కార్తీక్ పాల్గొన్నారు. రేషన్ డీలర్ల ఎంపిక పూర్తికరీంనగర్ అర్బన్: ఎట్టకేలకు రేషన్ డీలర్ల నియామక ప్రకియ పూర్తయింది. శనివారం ఫలితాలు ప్రకటించగా 55మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కరీంనగర్ ఆర్డీవో కుందారపు మహేశ్వర్ ప్రకటించారు. మార్చి 28, 2025న నోటిఫికేషన్ జారీ చేయగా 55 చౌకధరల దుకాణాలకు గానూ 391 అభ్యర్థులు పరీక్షకు హాజరవగా 1:5 నిష్పత్తిలో 218 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూకు నిర్వహించారు. రాత పరీక్ష, ఇంటర్వూలో సాధించిన మార్కుల క్రమంలో మెరిట్ సాధించిన 55 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఆర్డీవో వెల్లడించారు. -
పెన్షన్దారుల లైవ్ కష్టాలు!
ఎండలు మండుతున్నాయి..పగటిపూట బయటకు రావొద్దంటూ ఓ వైపు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుండగా, మరో వైపు అదే సమయంలో.. మీరు బతికున్నట్లు నిర్ధారించుకొనేందుకు రోడ్లపైకి రండి. గంటల తరబడి ఎండలో వేచి ఉండైనా లైవ్ అథెంటికేషన్ చేసుకొని వెళ్లండి.. అంటూ నగరపాలకసంస్థ అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది. ‘నగరంలోని 56వ డివిజన్ పరిధిలో శనివారం ఉదయం ఆసరా పింఛన్దారులు లైవ్ అథెంటికేషన్ చేయించుకునేందుకు బోయవాడలోని ఫార్ూచ్యన్ మాల్కు చేరుకున్నారు. ఉదయం 10.30 గంటల వరకు సంబంధిత వార్డు అధికారి అక్కడకు రాలేదు. వచ్చాక నెట్వర్క్ పనిచేయడం లేదంటూ గుర్తింపు తీసుకోకపోవడంతో గంటల తరబడి వేచి ఉన్న దాదాపు 60 మంది వృద్ధులు ఊసురుమంటూ ఇంటి దారిపట్టారు’. ‘కిసాన్నగర్లో ఓ దివ్యాంగ మహిళ తన గుర్తింపు కోసం నగరపాలకసంస్థ నిర్వహించిన శిబిరానికి వచ్చింది. పింఛన్ జాబితాలో పేరే లేదని, సామాజిక తనిఖీలో పోయి ఉంటుందని సంబంధిత అధికారి చెప్పడంతో ఆ మహిళ ఖంగుతింది. ఆందోళనకు గురై డీఆర్డీవో కార్యాలయానికి వెళ్లగా, ఆమె పింఛన్ను ఎవరూ తొలగించలేదని తేలింది. చివరకు నగరపాలకసంస్థ కార్యాలయంలో గుర్తింపు వివరాలు నమోదుచేసుకుంది.’‘చేయూత పెన్షన్ లబ్ధిదారులకు ముఖ్యమనవి. మీ ఆధార్ కార్డు తీసుకొని వెళ్లి, వేలిముద్రలు, కళ్లు, ముఖకవళికలు అప్డేట్ చేసుకోండి. సమయం ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు.’ – ఇది నగరంలోని వార్డు అధికారులు చేపడుతున్న లైవ్ అథెంటికేషన్కు సంబంధించిన సందేశం.‘మీ ప్రాంతంలో తీవ్ర ఎండలున్నాయి. వేడిగాలులు వీచే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దు. ఇండ్లల్లోనే ఉండండి.’ – ఇది కరీంనగర్ నివాసితుల మొబైల్స్కు వేసవి తీవ్రత దృష్ట్యా టీజీఐసీసీసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం శనివారం చేసిన హెచ్చరికల సందేశం. కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ పరిధిలో చేయూత పింఛన్దారుల లైవ్ అథెంటికేషన్ ప్రహసనంగా సాగుతోంది. వివరాలు నమోదు చేసే బాధ్యతను ఆయా డివిజన్ల వార్డు అధికారులకు అప్పగించారు. సదరు పింఛన్దారు ఆధార్కార్డుతో పాటు, వేలిముద్రలు, ముఖకవళికలు నమోదు చేసి లైవ్ అథెంటికేషన్ను పూర్తి చేస్తున్నారు. ఎక్కువ డివిజన్లలో ఎప్పుడు, ఎక్కడ గుర్తింపు నమోదు చేసుకుంటారనే అంశాలపై స్పష్టత లేకుండా పోయింది. కొన్ని డివిజన్లలో రోజుకో చోటికి శిబిరాలను మా ర్చుతుండడంతో, వృద్ధులు, వికలాంగులు నాయకుల ఇండ్ల చుట్టూ తిరుగుతున్నారు. మరికొన్ని చోట్ల కార్పొరేటర్ల ఇండ్లు, కార్యాలయాల్లో శిబిరాలు ఏర్పాటు చేయడం రాజకీయ విమర్శలకు దారితీస్తోంది. కార్పొరేటర్ల ఇండ్లకు అందరూ వెళ్లలేరని, అధికారులు ఎలా నిర్వహిస్తారంటూ ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని చోట్ల రాజకీయ కారణాలతో పింఛన్లు తొలగించేందుకు ఈ గుర్తింపును వినియోగించుకుంటున్నట్లు మాజీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి నిర్ణీత సమయవేళలు, వేదికలను పాటిస్తూ ప్రణాళికాబద్ధంగా చేయూత పింఛన్ దారుల లైవ్ అథెంటిఫికేషన్ను పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
వడదెబ్బతో 11 మంది మృతి
గోదావరిఖని/పెద్దపల్లి/పెద్దపల్లి రూరల్/కొత్తపల్లి/ఓదెల/రా మగిరి/సిరిసిల్లటౌన్/యైటింక్లయిన్కాలనీ: ఉమ్మడి జిల్లాలో శనివారం వడదెబ్బతో 11 మంది మృతిచెందారు. పెద్దపల్లి పట్ట ణంలోని ముత్యాల పోచమ్మవా డకు చెందిన దినసరి కూలీ ఫయాజ్ (52), సుల్తానాబాద్ పట్టణం సుభాష్నగర్కు చెందిన న్యాతరి మొండయ్య (76), ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన గీట్ల మధుసూదన్రెడ్డి (53), రామగిరి మండలం ఆదివారంపేట గ్రామానికి చెందిన బుడిగె కమల(65), యైటింక్లయిన్కాలనీ వెంకట్రావుపల్లి కేకేనగర్కు చెందిన కనుకుట్ల ఐలమ్మ(73), గోదావరిఖని పరుశరాంనగర్కు చెందిన ఎం.శంకర్(45), గోదావరిఖనిలోని మధుప్రియ హోటల్లో పనిచేస్తున్న వెల్దండి మహేశ్(52), ఎన్టీఆర్నగర్కు చెందిన మున్సిపల్ కాంట్రాక్టు కార్మికురాలు గజనవేని మల్లమ్మ(56), రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్కు చెందిన మంచాల నరసయ్య(75), శాంతినగర్కు చెందిన మిట్టపల్లి శంకర్(48), కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన ఆటో డ్రైవర్ దామెరశెట్టి మల్లేశం (52) వడదెబ్బతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపారు. -
మరో నాలుగు రోజులు వడగాలులే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సూరీడు నిప్పులు కక్కుతున్నాడు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా రెడ్ జోన్లోకి చేరగా శనివారం ఎన్నడూ లేని విధంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్ జిల్లాలో రెండు మండలాలు, పెద్దపల్లి జిల్లాలో ఏడు మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవగా వడగాలుల ప్రభావం అధికంగా ఉందని ప్రణాళిక విభాగం అధికారులు ప్రకటించారు. కాగా ఉదయం 8గంటలకే వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేయగా సాయంత్రం 6దాటినా దారులపై వడగాలులే. మరో నాలుగు రోజుల పాటు వడగాలులుంటాయని వాతావరణ శాఖ ప్రకటించగా ప్రజలంతా జాగ్రత్త ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వీలైతే పనులను వాయిదా వేసుకోవడమే ఉత్తమమని స్పష్టం చేస్తున్నారు.కరీంనగర్(గంగాధర) 46.4 పెద్దపల్లి (ఎలిగేడు) 46.4 జగిత్యాల (కోరుట్ల, అయిలాపూర్) 46.4 రాజన్న సిరిసిల్ల (పెద్దూరు) 46.4 -
కోత పెట్టే మిల్లర్లపై చర్యలు
కరీంనగర్ అర్బన్: ధా న్యం కొనుగోలులో తరు గు పేరిట మిల్లర్లు, కేంద్రాల్లో కోత పెడితే కఠి నంగా వ్యవహరిస్తామని జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ మంగళారపు రజనీకాంత్ స్పష్టం చేశా రు. జిల్లాలో 317 కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతుండగా, ఐకేపీ 91, ప్యాక్స్ 178, డీసీఎంఎస్ 39, హాకా 09 కేంద్రాలను నిర్వహిస్తోందని వెల్లడించారు. రైతులను ఇబ్బంది పెడితే టోల్ ఫ్రీ నంబర్ 9154249727కు ఫిర్యాదు చేయాలని, తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రాల్లో సౌకర్యాలు, మద్దతు ధర, దళారుల దోపిడీకి అడ్డుకట్ట వంటి అంశాలపై శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లా అంతటా కొనుగోళ్లు ఈ సీజన్లో వరి కోతలు కొంత ఆలస్యమయ్యాయి. 5.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 1.90లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. పక్కా కార్యాచరణతో.. కొనుగోలు కేంద్రంలో తాగునీరు, టెంట్, కూలీల కోసం షెడ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించాం. అవసరానికి సరిపడా గన్నీ సంచులు ఉన్నాయి. రోజూ లక్ష నుంచి రెండు లక్షల వరకు సంచుల్లో ధాన్యం నింపుతున్నారు. టార్పారిన్లు, ధాన్యం రవాణాకు లారీలు అందుబాటులో ఉన్నాయి. కేంద్రాల నుంచి తీసుకెళ్లిన ధాన్యాన్ని 24 గంటల్లో దించాలని మిల్లర్లకు సూచించాం. నిబంధనల ప్రకారమే తూకం ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం తూకం వేయాలని నిర్వాహకులకు, మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశాం. తాలు లేకుండా శుభ్రమైన ధాన్యం తీసుకువచ్చి రైతులు సహకరించాలి. తేమ 17 శాతం మించరాదు. గన్నీ సంచిలో 40.580 కిలోలు తూకం వేయాలి. తరుగు పేరుతో అదనంగా తూకం వేయరాదు. ఎప్పటికప్పుడు నగదు జమ రైతులకు నిర్దేశిత సమయంలో నగదు జమయ్యేలా చర్యలు చేపడుతున్నాం. ట్యాబ్ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా కేంద్రాల్లో సిబ్బందిని నియమించాం. వానాకాలం సీజన్లో 72 గంటల్లో ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సారి వీలైనంత త్వరగా నగదు చేరుతోంది. ఇప్పటివరకు రూ.250 కోట్లు రైతుల ఖాతాకు చేరింది. ధాన్యం వెంటవెంటనే దింపుకోవాలని మిల్లర్లను ఆదేశించాం. తరుగు పేరిట కోత విధిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించాం. బ్యాంక్ గ్యారంటీలు అందజేసిన మిల్లులకే ధాన్యం కేటాయించాం.జిల్లాలో సాగు విస్తీర్ణం: 2,73,397 రానున్న దిగుబడి: 5.66లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రాలకు వచ్చిన ధాన్యం: 3,20,143 మె.ట కొనుగోలు చేసిన ధాన్యం: 1,90,350 మె.ట మిల్లులకు తరలించిన ధాన్యం: 1,73,210 మొత్తం కొనుగోలు కేంద్రాలు: 317 ధాన్యం విక్రయించిన రైతుల సంఖ్య: 32,951 -
పీఎంజే దర్యాప్తు ముమ్మరం!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసులో పోలీసుల దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నిందితుల గుర్తింపు పరేడ్ ముగిసింది. ఈనెల 3న జ్యోతినగర్లోని పీఎంజే జువెల్లరీస్లో దోపిడీ చేసిన ఐదుగురు దుండగులు అడ్డు వచ్చిన నలుగురి సిబ్బందిపై కాల్పులు జరిపి పారిపోవడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దోపిడీకి పాల్పడింది.. సుబోధ్ సింగ్ గ్యాంగ్గా తేల్చారు. ఈ ఘటనలో పాల్గొన్న రఘునాథ్ కర్మాకర్, రావిశ్ కుమార్, వారికి సిమ్కార్డులు అందించిన మెహతాబ్ ఖాన్ను బిహార్లో అరెస్టు చేసి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కరీంనగర్ జైల్లో రిమాండ్లో ఉన్న నిందితులను గుర్తించేందుకు పోలీసులు టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ (టీఐపీ) నిర్వహించారు. బుల్లెట్ గాయాలతో ప్రాణాపాయం తప్పిన నలుగురు, మే 3న విధుల్లో ఉన్న ఇతర పీఎంజే సిబ్బంది, పెద్దపల్లి లాడ్జి నిర్వాహకులను పోలీసులు పరేడ్ కోసం కరీంనగర్ జైలుకు రప్పించారు. జడ్జి సమక్షంలో జరిగిన గుర్తింపు ప్రక్రియలో దోపిడీలో పాల్గొన్న ఇద్దరు దొంగలు రఘునాథ్ కర్మాకర్, రావిశ్ కుమార్లను గుర్తుపట్టారు. పీటీ వారంట్ కోసం చర్యలు.. దోపిడీకి పథకం పన్నిన గ్యాంగ్ లీడర్ సుబోధ్ సింగ్ను కరీంనగర్కు తీసుకువచ్చేందుకు కావాల్సిన న్యాయప్రక్రియ ప్రారంభించారు. ప్రస్తుతం బిహార్ జైలులో ఖైదీగా ఉన్న సుబోధ్ని ప్రిజనర్ ట్రాన్సిట్ (పీటీ) వారంట్ ద్వారా కరీంనగర్కు తరలించేందుకు సిద్ధమయ్యారు. దర్యాప్తులో లభ్యమైన కీలక సమాచారం, డేటా, ఆధారాల ద్వారా అతన్ని పీటీ వారంట్ ద్వారా తీసుకొచ్చి విచారిస్తే.. కేసు కొలిక్కి వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఆయుధాలు తీసుకొచ్చిన వాహనం గుర్తింపు దోపిడీకి దుండగులు వాడిన ఆయుధాలు ఎలా వచ్చాయన్న ప్రశ్నకు పోలీసులకు సమాధానం దొరి కింది. సుబోధ్ ముఠా దోపిడీకి ముందు కరీంనగర్, సిద్దిపేట, మంచిర్యాల, పెద్దపల్లి పట్టణాల్లో రెక్కీ చేసింది. పీఎంజేను టార్గెట్గా ఎన్నుకున్న వీరికి దోపిడీకి ముందురోజు ఆయుధాలు అందాయి. మహారాష్ట్ర మీదుగా తెలంగాణలోకి ఒక వాహనంలో ఆయుధాలు చేరినట్లు గుర్తించారు. సదరు వా హనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్, నార్నూర్, ఇందనపల్లి చెక్పోస్టుల వద్ద సీసీ కెమెరాలకు చిక్కిన ఫుటేజీని పోలీసులు సంపాదించా రు. దీని ద్వారా దర్యాప్తును వేగవంతం చేశారు. బాధితులకు ఏదీ ఆర్థిక సాయం..? దుండగుల కాల్పుల్లో ముస్తాక్, రాజేశ్, కమలాసన్, మధుకర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరికి శస్త్రచికిత్సలు చేసిన వైద్యులు ప్రాణాపాయం నుంచి తప్పించగలిగారు. ఇటీవల డిశ్చార్జి అయి ఇంటికి చేరిన బాధితులు కోలుకుంటున్నారు. వీరికి ఆసుపత్రి ఖర్చు మొత్తం పీఎంజే జువెల్లరీస్ యాజమాన్యమే భరించినట్లు సమాచారం. బాధితులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందకపోవడం గమనార్హం. కనీసం ఆ సమయంలో ఆర్థిక సాయం చేస్తామన్న ప్రతిపక్షాలు కూడా చిల్లిగవ్వ ఇవ్వలేదని బాధితుల సన్నిహితులు వాపోతున్నారు. తమ వారు ఆసుపత్రిలో ఉంటే మీడియాకు పోజులు ఇచ్చిన నాయకులు ఇప్పుడు కన్నెత్తి ఇటువైపు చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రావిశ్ కుమార్రఘునాథ్ కర్మాకర్ -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
కరీంనగర్ అర్బన్: అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యమని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. జిల్లాలో ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి అధికారులు భవిష్యత్తు ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కలెక్టరేట్లో జిల్లాస్థాయి సభ శుక్రవారం జరగగా మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సీపీ గౌస్ ఆలం హాజరయ్యా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 99 రో జుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా 10 అంశాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అధికారులు ప్రతి గ్రామం పర్యటించి ప్రజలతో మమేకమయ్యారని, సమస్యలు తెలుసుకున్నారని పేర్కొన్నారు. చివరి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు చేరేవరకు చర్యలు తీసుకుంటామన్నారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సి పాలిటీలో కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ ప్రజా పాలనా ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించామని అన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ మాట్లాడుతూ 66 డివిజన్లలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం ద్వారా సానిటేషన్ని మెరుగుపరిచామని తెలిపారు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాసరెడ్డి, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్బాబు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి హెల్ప్ డెస్క్ గ్రామాల్లో సర్పంచుల సమస్యల పరిష్కారానికి హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ డీపీవోను ఆదేశించారు. హెల్ప్ డెస్క్ నిర్వహణకు నంబర్లు కేటాయించి సర్పంచులకు తెలియజేయాలన్నారు. పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం అన్ని గ్రామ పంచాయతీల జమా ఖర్చులను పర్యవేక్షించాలని, తద్వారా సిబ్బంది వేతనాలు, గ్రామపంచాయతీ విద్యుత్ బిల్లులు వంటివి సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలని అన్నారు. -
యూసీఎఫ్ ఎవరి ఖాతాలో?
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో మరో అభివృద్ధి జాతరకు బీజం పడింది. స్మార్ట్సిటీ ప్రాజెక్ట్ అనంతరం ఆ స్థాయిలో వచ్చిన అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) పథకం నగర స్వరూపాన్ని సమూలంగా మార్చేయనుంది. రూ.840 కోట్లతో నగరంలో అభివృద్ధి పనుల జాతర సాగనుండడంతో, ఆ క్రెడిట్ను సొంతం చేసుకొనేందుకు కేంద్రంలో అధి కార బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్లు పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి. యూసీఎఫ్లో కరీంనగర్ చేరడంపై వేర్వేరుగా సంబరాలు నిర్వహించాయి. తెచ్చిందే మేము.. అర్బన్ చాలెంజ్ ఫండ్ పథకం కింద రూ.840 కోట్ల భారీ నిధులు నగరానికి రానుండడంతో బీజేపీ సంబరాలు చేపట్టింది. తెలంగాణచౌక్లో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, కార్పొరేటర్లు ప్రధాని మోదీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చిత్రపటాలను పాలతో అభిషేకించారు. ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ పట్టుబట్టి కరీంనగర్ నగరపాలకసంస్థను యూసీఎఫ్ జాబితాలో చేర్పించారని మేయర్, డిప్యూటీ మేయర్లు వెల్లడించారు. ఇచ్చేదే మేము... నగర స్వరూపాన్ని మార్చే రూ.840 కోట్ల యూసీ ఎఫ్ పథకంలో రూ.630 కోట్లు భరించేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతోనే యూసీఎఫ్ పథకంలో కరీంనగర్ చేరిందంటున్నారు. నగరపాలకసంస్థ కార్యాలయం ఎదుట సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, చాడగొండ బుచ్చిరెడ్డి, పడిశెట్టి భూమయ్య, పడాల అజయ్, ఆకుల ఉదయ్, మడుపు మోహన్, మహమ్మద్ అమీర్, అబ్దుల్రెహమాన్ క్షీరాభిషేకం చేశారు. రూ.840 కోట్లలో కేంద్ర ప్రభుత్వ వాటా కేవలం రూ.210 కోట్లు అని, మిగిలిన రూ.630 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందన్నారు. రాష్ట్రవాటా 25 శాతం రూ.210 కోట్లతో పాటు, హడ్కో రుణం రూ.420 కోట్లు భరించేది రాష్ట్ర ప్రభుత్వమేనని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత అంటున్నారు. సరైన మార్గంలో వెచ్చిస్తేనే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రూ.840 కోట్ల నిధులు నగరాభివృద్ధికి వెచ్చించనుండడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా నిధులను ‘సరైన మార్గం’లో వెచ్చి స్తే మోడల్ సిటీగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా యూసీఎఫ్ పథకం మంజూరు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, అమలులో మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంది. మార్గదర్శకాల ఆధారంగా రూ.840 కోట్ల పనులకు సంబంధించిన డీపీఆర్ రూపొందించే పనిని ప్రైవేట్ ఏజెన్సీకి నగరపాలకసంస్థ అప్పగించనుంది. ఆ తరువాత యూసీఎఫ్ స్కీంపై మరింత స్పష్టత రానుంది.సీఎం రేవంత్, మంత్రి పొన్నం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న అంజన్కుమార్, నాయకులుప్రధాని మోదీ, మంత్రి సంజయ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న మేయర్ శ్రీనివాస్, నాయకులు -
ఏబీసీ సెంటర్తో వీధికుక్కల సమస్యకు పరిష్కారం
కరీంనగర్ కార్పొరేషన్: కుక్కల బెడదను తగ్గించేందుకు ఏబీసీ సెంటర్ దోహదం చేస్తుందని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. నగరపాలకసంస్థ పరిధిలోని 6వ డివిజన్ బొమ్మకల్లో రూ.43 లక్షలతో నిర్మించిన జనన నియంత్రణ కేంద్రం (ఏబీసీ సెంటర్) భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. భవనంలో 20 ప్రీ ఆపరేటివ్ కెనల్స్, 18 పోస్టు ఆపరేటివ్ కెనల్స్, ఆపరేషన్ థియేటర్, సర్జికల్ పరికరాలు, షాడోలెస్ ల్యాంప్, ఎలక్ట్రోకాటరీ యంత్రం, సర్జికల్ కేబు ల్స్, వ్యాక్సిన్ రీఫ్రిజిరేటర్ ఉన్నాయన్నారు. అదనంగా మరో 62 కెనల్స్, ప్రహరీ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ ద్వారా ఆరేళ్లలో 5,015 కుక్కలకు జనన ని యంత్రణ ఆపరేషన్ చేయడం జరిగిందని తెలిపారు. కమిషనర్ ప్రఫుల్దేశాయ్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు, కార్పొరేటర్లు వెంకటేశ్, వేణు, రవీందర్ పాల్గొన్నారు. కరీంనగర్ టౌన్: నగరంలోని కోతిరాంపూర్లో ఉన్న డంపింగ్ యార్డుతో ప్రజలకు ప్రాణహాని ఉందని, యార్డు తరలింపునకు శాశ్వత పరి ష్కారం చూపని పాలకులపై ఉద్యమాలు చేస్తామని సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, బీఆర్ఎ స్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీల నాయకులు అన్నారు. శుక్రవారం బద్ధం ఎల్లారెడ్డి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీజేపీకి నగరంలో అధికారం అప్పగిస్తే నెల రోజుల్లో డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరిస్తామని ప్రగల్బాలు పలికి, సమస్యను గాలికి వదిలేశారన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రజల ఆరోగ్య పరిస్థితులను పట్టించుకోవడం లేదన్నారు. డంప్యార్డు పొగతో కోతిరాంపూర్, అల్కాపురికాలనీ, లక్ష్మీనగర్, కట్టరాంపూర్, హనుమాన్నగర్, గణేశ్నగర్, హౌసింగ్బోర్డ్ కాలనీ ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. సీపీఐ, సీపీఎం నగర కార్యదర్శులు కసిరెడ్డి సురేందర్రెడ్డి, గుడికందుల సత్యం, బీఆర్ఎస్ నాయకుడు జంగిలి ఐలేందర్ యాదవ్, సీపీఐఎంఎల్ నాయకులు జిందం ప్రసాద్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నగర అధ్యక్షుడు కొక్కిరాల సత్యారావు పాల్గొన్నారు. కరీంనగర్ అర్బన్: గిరిజన కులాల ఉప ప్రణా ళికలో భాగంగా శుక్రవారం వ్యవసాయ ఉత్పాదకాలను పంపిణీ చేశారు. అఖిల భారత మొక్కజొన్న పరిశోధన కేంద్రం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా మొక్కజొన్న సాగులో మేలైన యాజమాన్య పద్ధతులపై శిక్షణ, వ్యవసాయ ఉత్పాదకాల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహించారు. హెడ్ డీన్ డా.బి.రాంప్రసాద్ మొక్కజొన్నలో వచ్చే చీడపీడలు, యాజమాన్యం గురించి వివరించారు. శాస్త్రవేత్తలు డా.ఉమారాణి, రజినీకాంత్, ఎ.ఉషారాణి, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఅర్డినేటర్ బి.హరిక్రిష్ణ, మదన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొనగా ఎర్రబెల్లి గ్రామానికి చెందిన 52మంది గిరిజన రైతులకు సింగిల్ సీడర్ పంపిణీ చేశారు. జమ్మికుంట: ట్రక్షీట్ ఇచ్చి మూడు రోజులు అవుతున్నా ధాన్యం దిగుమతి చేసుకోవడం లేదని కొత్తపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి దిగువన భూపాలపల్లి జిల్లా రైతులు ఆందోళనకు దిగారు. మొగుళ్లపల్లి, చిట్యాల, రేగొండ, టేకుమట్ల మండలాలకు చెందిన మొక్కజొన్న, ధాన్యం రైతులు అక్కడ కొనుగోలు కేంద్రాల నుంచి ట్రక్షీట్ల అనుమతితో పంటను జమ్మికుంట లోని పలు మిల్లులకు తెచ్చారు. మూడు రోజులుగా మిల్లర్లు పంటను దిగుమతి చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎండ.. ప్రచండ!
శుక్రవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు (డిగ్రీల సెల్సియస్లో)ఉమ్మడి జిల్లాలో ఆల్టైం రికార్డు ఉష్ణోగ్రతలు ● ఉదయం ఏడుగంటల నుంచే సూర్యుడి ప్రతాపం రాత్రి ఏడు గంటల వరకూ వేడిగాలులు ● అత్యవసరమైతే తప్ప.. బయటకు వెళ్లొద్దని అధికారుల సూచనసాక్షి పెద్దపల్లి: ఉమ్మడి జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. భాను డి ప్రతాపంతో శుక్రవారం ఆల్టైం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండవేడిమి, వడగాల్పులతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం ఏడు గంటలకే ఇంటినుంచి బయటకు రాలేకపోతున్నా రు. రాత్రి ఏడుగంటల వరకూ వడగాలులు తగ్గడం లేదు. ప్రజలు ఇళ్లకే పరిమితమవుతుండగా, చిరువ్యాపారులు మధ్యాహ్నం వేళ బ్రేక్ ఇస్తున్నారు. ఎండ నేపథ్యంలో రోజువారీగా రద్దీగా కనిపించే ప్రధా న కూడళ్లు, మార్కెట్ ప్రాంతాలు, బస్టాండ్లు జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. రెడ్జోన్లో ఉమ్మడి జిల్లా వాతవరణశాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లాను రెడ్జోన్గా ప్రకటించింది. 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మించి నమోదైతే రెడ్జోన్గా ప్రకటిస్తారు. వారం రోలుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సగటున 45 డిగ్రీల సెల్సియస్పైనే ఉష్ణోగత్రలు నమోదువుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత దంచి కొడతాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కార్మికులు వేడికి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగినా వేడినుంచి ఉపశమనం లభించడం లేదని వాపోతున్నారు. ఇళ్లనుంచి బయటకు రావొద్దు ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, డాక్టర్లు చెబుతున్నారు. అవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు. తగినంత నీరు తాగుతూ జాగ్రత్తలు పాటించాలంటున్నారు. పండ్లరసాలు, మజ్జిగ వంటిని తాగాలని సూచనలు ఇస్తున్నారు. ఈనెల 25న రోహిణి కార్తె ప్రారంభం కానుండటంతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వడ దెబ్బ లక్షణాలు మగత లేదా మూర్ఛ, వికారం లేదా వాంతులు, తలనొప్పి, విపరీతమైన దాహం, అసాధారణంగా ముదురు పసుపు రంగులో తక్కువ పరిమాణంలో మూత్రవిసర్జన, వేగవంతమైన శ్వాస, హృదయ స్పందన వంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే చల్లని ప్రదేశానికి వెళ్లి ద్రవపదార్థాలు తాగాలి. ఆ వెంటనే వైద్య సాయం పొందాలి. వడదెబ్బతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి తారసపడితే దుస్తులు తొలగించి చల్లని నీటితో లేదా తడిబట్టతో తుడవాలి. ఽజైన, ధర్మపురి 46.4 గంగాధర 46.4 కమాన్పూర్ 46.4 మర్తన్నపేట 46.4 -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
కొత్తపల్లి: కొత్తపల్లి మండలం చింతకుంట శాంతినగర్ వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పూల వ్యాపారి ఎండీ మోయినుద్దీన్(28) దుర్మరణం చెందాడు. శాంతినగర్లో కుటుంబంతో నివాసం ఉంటూ కరీంనగర్లో పూల వ్యాపారం చేసుకుంటున్న మొయినుద్దీన్ పని ముగించుకుని రాత్రి 12:30 గంటలకు తన ద్విచక్రవాహనంపై శాంతినగర్ వెళ్తున్నాడు. చింతకుంట సమీపంలో కొత్తపల్లి పోలీసులు గ్రానైట్ లారీలను తనిఖీ చేస్తుండగా, బైక్ ముందు వెళ్తున్న లారీని హఠాత్తుగా డ్రైవర్ ఆపాడు. ఆ లారీని వెనుక నుంచి ఎండీ మోయినుద్దీన్ ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని కొత్తపల్లి పోలీసులు తెలిపారు. అప్పుల బాధతో రియల్టర్ ఆత్మహత్యకరీంనగర్రూరల్: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోయి, అప్పులపాలైన ఓ రియల్టర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి కథనం ప్రకారం. నగరంలోని ఆదర్శనగర్కు చెందిన గంగిశెట్టి లక్ష్మణ్(60) రియల్ ఎస్టేట్ వ్యాపారంతోపాటు ప్రైవేట్గా చిట్టీలు నిర్వహించేవాడు. వ్యాపారంలో నష్టపోయి, అప్పు ఇచ్చిన వాళ్లు డబ్బులు అడుగుతుండటంతో గురువారం సాయంత్రం ఇంటినుంచి వెళ్లిపోయాడు. రాత్రివరకు భార్య వినోదకు ఓ వ్యక్తి ఫోన్ చేసి తీగలగుట్టపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని చెట్టుకు లక్ష్మణ్ ఉరివేసుకున్నట్లు తెలిపాడు. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు లక్ష్మణ్ మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తన భర్త లక్ష్మణ్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని భార్య వినోద శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. -
బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి
సిరిసిల్ల అర్బన్: రెండు రోజుల్లో బహ్రెయిన్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న నక్క పర్శరాములు శుక్రవారం జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దబోనాలకు చెందిన నక్క పర్శరాములు(41) కొంతకాలంగా ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి, వస్తున్నాడు. నెల రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన పర్శరాములు శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లోని తన బంధువుల ఇంటికి పండుగకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యాడు. ఈక్రమంలోనే అపెరల్పార్క్ వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డు కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పర్శరాములును ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. సోమవారం నాడు బహ్రెయిన్ వెళ్లేందుకు టికెట్ సైతం బుక్ చేసుకున్నాడు. మృతునికి భార్య వాణి అలియాస్ కవిత, కొడుకులు రిషిత్, నిహాల్ ఉన్నారు. -
మెడికల్ కాలేజీకి పార్థీవదేహం అప్పగింత
కరీంనగర్: కరీంనగర్ మాణికేశ్వర్నగర్కు చెందిన చర్లపల్లి భారతి చివరి కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఆమె నేత్రాలు, పార్థీవదేహాన్ని దానం చేశారు. అనారోగ్యంతో హైదరాబాద్ ఆస్పత్రిలో గురువారం కన్నుమూసిన భారతి కళ్లను అమ్మ ఐ ఆర్గాన్ బాడీ ప్రమోటర్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు గంజి ఈశ్వర్ లింగం ఆధ్వర్యంలో, వాసన్ ఐ బ్యాంక్ సహకారంతో సేకరించారు. సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి ఆధ్వర్యంలో శుక్రవారం భారతి పార్థివ దేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు దానం చేశారు. కుటుంబ సభ్యులు చర్లపల్లి కుమారస్వామి– వనజ, శ్రీధర్– నాగరాణి, విజయలక్ష్మి– రాజయ్య, అరుణ– శ్రీనివాస్ సేవాభావాన్ని ప్రముఖులు అభినందించారు. ప్రముఖ కవులు నలిమెల భాస్కర్, అన్నవరం దేవేందర్, ఉపాధ్యాయ సంఘం నాయకులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు భారతి పార్థివ దేహానికి నివాళి అర్పించారు. -
ఈ దొంగ... ‘బంగారు’ కొండ!
కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీస్ షోరూంలో ఈ నెల మొదటి వారంలో భారీ దోపిడీకి ఒడిగట్టిన ముఠా నాయకుడు సుబోధ్ సింగ్ అలియాస్ బబువా సామాన్యుడు కాదు. గోల్డెన్ థీఫ్గా పేరున్న ఇతగాడు ఇప్పటి వరకు ఏడు రాష్ట్రాల్లో జరిగిన 400 కేజీల బంగారం చోరీ, దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. బీహార్లోని జైలు నుంచే పీఎంజే జ్యువెలర్స్లో దోపిడీకి స్కెచ్ చేసి, కథ నడిపంచాడు. ఈ గ్యాంగ్ను పట్టుకున్న కరీంనగర్ పోలీసులు ప్రస్తుతం సుబోధ్ను పీటీ వారెంట్పై తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. పదేళ్లల్లో ఏడు రాష్ట్రాల్లో పంజా విసిరిన ఈ సుబోధ్ సింగ్ పూర్వాపరాలు ఇవి...బీహార్లోని నాలంద జిల్లాలో ఉన్న చండి పోలీసుస్టేషన్ పరిధిలోని చిస్టిపూర్కు చెందిన ఈశ్వర్ ప్రసాద్ కుర్మి కుమారుడే సుబోధ్ సింగ్ (42). ఇతడిపై దేశంలోని ఏడు రాష్ట్రాల్లో దోపిడీ, హత్య, బందిపోటు దొంగతనం, దాడుల వంటి కేసులు నమోదయ్యాయి. పీఎంజే కేసుతో కలిపితే ఇతడిపై ఉన్న వాటి సంఖ్య 43కు చేరింది. ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా సంప్రదింపులు జరుపుతూ... గూగుల్ మ్యాప్స్, ప్రత్యేక యాప్స్ వంటి అత్యాధునిక విధానాలను వినియోగిస్తూ పంజా విసిరే, విసిరించే సుబోధ్ చదివి కేవలం 12వ తరగతి.1996 వరకు ఇతగాడు బీహార్లోని వైశాలి జిల్లాకు చెందిన చిన్నచిన్న దొంగలతో కలిసి నేరాలు చేశాడు. 1999 నాటికి బీహార్ పోలీసులకు ఇన్ఫార్మర్గా మారాడు. ఆ సమయంలో ఇతడు బీహార్ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులతో పాటు ఉన్నతాధికారులతో కూడా సంబంధాలు పెంచుకున్నాడు. 2007 వరకు తన ఇన్ఫార్మర్ పనిని కొనసాగించాడు. ఇలా సుబోధ్కు పోలీసుల పని తీరు, వ్యూహం, కదలికలు పూర్తిగా అవగతం అయ్యాయి. ఓపక్క ఇన్ఫార్మర్గా పనిచేస్తూనే... మరోపక్క తన నేర నెట్వర్క్ను పెంచుకుంటూ పోయాడు.తనకు ప్రత్యర్థులు, పోటీదారులుగా ఉన్న దొంగలు, ముఠాల సమాచారాన్ని బీహార్ పోలీసులకు అందించిన అతడు.. వాళ్లు జైలుకు వెళ్లేలా చేసి తన ‘లైన్’ క్లియర్ చేసుకున్నాడు. 2008లో ఇతగాడు కోల్కతాలోని ఎస్బీఐ బ్యాంకులో దోపిడీ చేశాడు. ఇదే ఇతడి తొలి భారీ నేరం. ఆ తర్వాత రాయపూర్లోని ఒక బ్యాంకులో కూడా పంజా విసిరాడు. ఈ కేసుల్లో మొదట కోల్కతా పోలీసులు, తరువాత రాయపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2015 వరకు రాయపూర్ జైలులోనే ఉన్నాడు. బెయిల్పై విడుదలైన తర్వాత ముత్తూట్, మణప్పురం మరియు పెద్ద జువెలర్లను లక్ష్యంగా చేసుకుని సొంత గ్యాంగ్తో పంజా విసిరాడుసుభోద్ నేరచరిత్ర తొలిసారిగా 2018లో బీహార్ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసుల దృష్టిలోకి వచ్చింది. ప్రతి నేరాన్నీ పక్కా పథకం ప్రకారం, రెక్కీ తర్వాత చేయిస్తున్నట్లు గుర్తించారు. ప్రతి నేరంలోనూ కొత్త అనుచరుల్ని ఏర్పాటు చేసుకుని వారికి ప్రత్యేక పేర్లు, పాత్రలు కేటాయించేవాడు. ప్రతి దోపిడీలో ఈ గ్యాంగ్ 5 నుంచి 20 కిలోలకు వరకు పసిడిని కొల్లగొట్టేది. 2018 నాటికి రాజస్థాన్లోని జైపూర్, మహారాష్ట్రలోని పుణే, నాగ్పూర్, పశ్చిమ బెంగాల్లోని బరాక్పూర్లలో భారీ బంగారం దోపిడీలు చేశాడు. బీహార్లోని అనేక నగరాల్లో కూడా నేరాలు చేశాడు.2018 జనవరిలో బీహార్ స్పెషల్ టాస్క్ఫోర్స్ సుబోధ్ను అక్కడి వైశాలి జిల్లా దానాపూర్లో అరెస్ట్ చేసింది. తన ప్రేయసిని కలవడానికి వచ్చిన సమయంలో పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి ఏకంగా 16.5 కిలోల బంగారం, ఒక పిస్టల్, దేశీయ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అతడిని పాట్నాలోని బేయూర్ జైలుకు తరలించారు. చాలా కాలం ఆ జైలులోనే ఉన్నాడు. అక్కడి నుంచే తన గ్యాంగ్ సహాయంతో వరుసగా బంగారం దోపిడీలకు పథకాలు వేస్తూ, అమలు చేస్తూపోయాడు.తాను జైలులో ఉన్నప్పటికీ గ్యాంగ్ను విస్తరించాడు. సుబోధ్ సింగ్ జైలులో నుంచే కొత్త వ్యక్తులను తన గ్యాంగ్లోకి చేర్చడం ప్రారంభించాడు. స్నాచింగ్స్, దొంగతనం కేసుల్లో ఎవరైనా జైలుకు వచ్చిన వాళ్లను సుబోధ్ సింగ్ టార్గెట్ చేసుకుంటాడు. ఇలాంటి వాళ్లను అతడితో పాటు అతడి అనుచరులు బెయిల్, డబ్బు ఆశ చూపి తమవైపు తిప్పుకుంటారు ఆ వ్యక్తి అంగీకరిస్తే జైలులో నుంచే వారి బెయిల్ ఏర్పాట్లు చేయిస్తాడు. వారు బయటకు వచ్చిన తరువాత అప్పటి బయట ఉన్న తన గ్యాంగ్ సభ్యులతో వారికి శిక్షణ ఇప్పించి, బంగారం ఎక్కడ ఎలా దోచుకోవాలో నేర్పిస్తాడు.సుబోధ్ గ్యాంగ్ దోచుకున్న బంగారాన్ని నేపాల్ మరియు పశ్చిమ బెంగాల్కు తీసుకెళ్తుంది. అక్కడ దానిని కరిగించి విక్రయిస్తారు. దేశంలో జరిగిన మొత్తం బంగారం దోపిడీల్లో 70 శాతం తమ గ్యాంగ్ దేనని సుబోధ్ పోలీసులకు చెప్తూ ఉంటాడు. జైలులో ఉన్నప్పటికీ వివిధ రాష్ట్రాల్లో నేరాలకు సుబోధ్ సింగ్ పథకాలు రచిస్తాడు. అతడు పాట్నాలోని బేయూర్ జైలులో సెక్టార్–3లోని 21, 22 బ్యారక్ల్లో ఉంటాడు. అక్కడ అతడికి వీఐపీ ట్రీట్మెంట్తో పాటు అన్ని సౌకర్యాలు ఉంటాయని సమాచారం. ఈ రెండు బ్యారక్ల్లో సుబోధ్ సింగ్ గ్యాంగ్ సభ్యులు, అతడి పరిచయస్తులే ఉంటారట.2025 మార్చిలో ఒడిశాలో జరిగిన బంగారం దోపిడీ కేసులో విచారణ కోసం ఒడిశా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై ఈ ఏడాది ప్రథమార్థలో రాజస్థాన్కు చెందిన కంకరోలి పోలీసులు ఇతడిని ఒడిశా నుంచి పీటీ వారెంట్పై తీసకువెళ్లారు. బేయూర్ జైలులో ఉన్న సుబోధ్ రాజస్థాన్కు చెందిన సైబర్ నేరగాడు కునాల్ను బెదిరించి రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. ఆ మొత్తం చెల్లించడానికి అతడు అంగీకరించకపోవడంతో కునాల్పై హత్యాయత్నం చేయించాలని భావించాడు. కునాల్ను పోలీసులు సియాల్దా కోర్టులో హాజరు పరిచిన సమయంలో అతడిపై కాల్పులు జరిపించాలని భావించాడు. తన అనుచరులకు ఆదేశాలు ఇవ్వడం ద్బారా కునాల్పై ఉపాసన ఎక్స్ప్రెస్ రైలులో ఎస్కార్ట్ పోలీసు సమక్షంలోనే కాల్పులు జరిపించాడు. అతడు ప్రాణాలతో బయటపడగా... గార్డు గాయపడ్డాడు.2023 ఆగస్టు 23న కంకరోలిలోని భగవందాస్ మార్కెట్ ఎదురుగా ఉన్న రూపం గోల్డ్ జువెలర్స్లో దోపిడీ జరిగింది. ఉదయం 10:30 గంటలకు నాలుగు బైక్లపై వచ్చిన నేరస్తులు వ్యాపారి మరియు ఉద్యోగులను తుపాకీతో బెదిరించి బందీలుగా మార్చి సుమారు మూడు కిలోల బంగారం, రూ.18 లక్షల రూపాయల నగదు దోచుకెళ్లారు. దోపిడీదారులు ఉపయోగించిన బైక్లలో ఒకదాన్ని భిల్వారా రైల్వే స్టేషన్ సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. ఆ బైక్ బీహార్ నుంచి దొంగిలించబడినదిగా తేలింది. నిందితులు రైలులో బీహార్కు పారిపోయినట్లు విచారణలో నిర్ధారణ అయింది. ఈ కేసులో సుబోధ్ను పీటీ వారెంట్పై అరెస్టు చేశారు.ఇంతకుముందు ఇదే గ్యాంగ్ 2022 ఆగస్టు 29న ఉదయపూర్లోని సుందర్వాస్లో ఉన్న మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచ్లో జరిగిన భారీ దోపిడీలో కూడా పాల్గొన్నట్లు తేలింది. ఈ కేసులో సుబోధ్తో పాటు ముగ్గురు నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సుబోధ్ బీహార్లోని పూర్నియా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.– శ్రీరంగం కామేష్, క్రైమ్ రిపోర్టర్, హైదరాబాద్. -
నేడు ఏబీసీ భవనం ప్రారంభం
● మేయర్ శ్రీనివాస్ ఆదేశాలు ● గంటల్లోనే భవనానికి విద్యుత్ కనెక్షన్ కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థ నిర్మించిన యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ)సెంటర్ భవనం ఎట్టకేలకు ప్రారంభానికి నోచుకొంటోంది. ‘అరుస్తూ.. కరుస్తూ’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మేయర్ కొలగాని శ్రీనివాస్ స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గంటల్లోనే భవనానికి విద్యుత్ సరఫరా చేశారు. దీంతో బొమ్మకల్లో రూ.35 లక్షలతో నిర్మించిన నూతన భవనాన్ని శుక్రవారం మేయర్ ప్రారంభించనున్నారు. ఇకనుంచి ఈ నూతన భవనంలో కుక్కలకు శస్త్ర చికిత్సలు చేయనున్నారు. మాస్టర్ ప్లాన్ వేగవంతం చేయాలికరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనను వేగవంతం చేయాలని అర్బన్ డెవలప్మెంట్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని సుడా కార్యక్రమాలను సమీక్షించారు. కరీంనగర్ నుంచి కలెక్టర్ చిత్రామిశ్రా, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, వైస్చైర్మన్, నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ పాల్గొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ మాస్టర్ప్లాన్ను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నగరాన్ని అభివృద్ధి చేయడానికి ల్యాండ్ పూలింగ్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలన్నారు. గెజిటెడ్ హెచ్ఎంల సంఘం ఏకగ్రీవంకరీంనగర్ టౌన్: కరీంనగర్లోని వాగేశ్వరి కళా శాలలో గురువారం 2026– 27 ఏడాదికి తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు పరంకుశం రాజభాను చంద్రప్రకాశ్ అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పి.లక్ష్మణ్ రావు, ప్రధాన కార్యదర్శిగా ఎం.మధుసూదనాచారి, అసోసియేట్ అధ్యక్షులుగా ఎస్.చంద్రకళ, చీటి లక్ష్మణ్ రావు, కరుణ, టి. ఆనందం, రంగనాథ్శర్మ, హెడ్క్వార్టర్స్ సెక్రట రీగా ఆంజనేయులు, జాయింట్ సెక్రటరీలుగా హేమలత, రవీందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ లుగా అర్షద్, ఆర్.రాజయ్య, ఎస్.దామోదర్, రాష్ట్ర కౌన్సిలర్లుగా జయప్రద, కృష్ణ గోపాల్, అనితారాణి, రామయ్య ఎన్నికయ్యారు. చంద్రప్రకాశ్ మాట్లాడుతూ తెలంగాణలో విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు హర్షించదగ్గవని, ప్రధానోపాధ్యాయులు ఈ సంస్కరణల ఫలాలకు దూరంగానే ఉన్నారని పేర్కొన్నారు. కొత్తపల్లి(కరీంనగర్): ‘ఒక్క నిమిషం ఆలోచన– జీవితాంతం భద్రత’ అనే సందేశంతో ‘వన్ మినిట్ రూల్’ను టీజీఎన్పీడీసీఎల్లో సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు ఎస్ఈ ఆర్.రవీందర్ తెలిపారు. కరీంనగర్ సర్కిల్ పరిధిలో విధులు నిర్వహించే సిబ్బంది క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించే ముందు ఒక నిమి షం సమయం తీసుకుని భద్రతా ప్రమాణా లను సమగ్రంగా పరిశీలించడం ఈ విధానంలోని ప్రధాన ఉద్దేశమన్నారు. విద్యుత్ ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం, సిబ్బంది ప్రాణాలను రక్షించడం, విద్యుత్ సరఫరా వ్యవస్థను సురక్షితంగా నిర్వహించడం లక్ష్యంగా సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ఈ విధానాన్ని తీసుకువచ్చారన్నారు. వన్ మినిట్ రూల్లో భాగంగా లైన్ క్లియర్ (ఎల్సీ) పొందిన విషయాన్ని నిర్ధారించుకోవడం ఇండక్షన్ టెస్టర్తో లైన్లో విద్యుత్ సరఫరా లేదని పరీక్షించడం, వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) సరిగా ధరించడం, ఎర్తింగ్ వ్య వస్థ సక్రమంగా ఏర్పాటు చేయడం, పని ప్రదేశంలో ప్రమాదాల అవకాశాలు ఉన్నాయా అని పరిశీలించడం, డబుల్ ఫీడింగ్ జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవడం, టీమ్ సభ్యులందరూ అప్రమత్తంగా ఉన్నారో లేదో నిర్ధారించుకోవడం వంటి అంశాలు పాటించేలా అవగాహన కల్పిస్తామన్నారు.పి.లక్ష్మణ్ రావు, అధ్యక్షుడుమధుసూదనాచారి, ప్రధాన కార్యదర్శి -
రైతుల పడిగాపులు.. ట్రేడర్లకు మద్దతు
జమ్మికుంట: మొక్కజొన్న రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తుండగా, అడ్తిదారులు అడ్డదారిలో తక్కువ ధరకు మక్కలు కొనుగోలు చేసి ప్రభుత్వ మద్దతు ధరకు బినామీ పేర్లతో విక్రయిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు. జమ్మికుంట మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పార్టీ పట్టణాధ్యక్షుడు కొలకాని రాజుతో కలిసి సందర్శించారు. మార్కెట్ అధికారులు, ట్రేడర్లు కుమ్మకై రైతుల నుంచి రూ.1600 నుంచి రూ.1800కు కొనుగోలు చేసి, ఇతరుల పేరుతో పంటను అమ్ముకుంటున్నారని అన్నారు. అనంతరం తాహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చారు. పార్టీ మండల అధ్యక్షుడు రమేశ్, నాయకులు పు ప్పాల రఘు, కనుమల్ల గణపతి పాల్గొన్నారు. -
పోక్సో కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
కరీంనగర్ క్రైం: పోక్సో కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని సీపీ గౌస్ ఆలం సిబ్బందిని ఆదేశించారు. కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ 2024 వరకు పెండింగ్లో ఉన్న కేసులు, ఈ ఏడాది నమోదైన తీవ్రమైన నేరాల స్థితిగతులపై ఆరా తీశారు. వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల కదలికలపై నిఘా పెంచాలన్నారు. ఇటీవల జరిగిన నేపాలీ ముఠాల ఘటనలను దృష్టిలో ఉంచుకుని కమిషనరేట్వ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న నేపాలీల వివరాలను పోలీస్స్టేషన్ల వారీగా నమోదు చేయాలన్నారు. బ్యాంకులు, జువెల్లరీ వ్యాపార సంస్థల్లో సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించి, భద్రతా ప్రమాణాలపై తగు సూచనలు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రంకెన్ డ్రైవ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలపై ‘నాకాబందీ’ నిర్వహించాలన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణా జరగకుండా చూడాలన్నారు. శిక్షణ ఐపీఎస్ సోహం సునీల్, అదనపు డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు శ్రీనివాస్, వేణుగోపాల్, శ్రీనివాస్ జి, విజయ్కుమార్, వెంకటస్వామి, మాధవి, సతీశ్, ప్రతాప్, సీఐలు, ఎస్సై పాల్గొన్నారు. -
కుప్ప చూపరు.. లెక్కల్లో ఉంటారు!
జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్ యార్డులో బినామీ దందా సాగుతోంది. వచ్చిన పంట కన్నా, నమోదవుతున్న రైతుల సంఖ్య రెట్టింపుగా కనిపిస్తోంది. ఈ విషయమై పాలకవర్గం, సెంటర్ ఇన్చార్జి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. కలెక్టర్కు పరస్పర ఫిర్యాదులు అందాయి. జమ్మికుంట మార్కెట్ యార్డుకు వారం రోజులుగా పెద్ద ఎత్తున మొక్కజొన్న పంటను రైతులు తీసుకొస్తున్నారు. రెండు రోజుల వరకు పాలకవర్గం గన్నీ సంచులు, మక్కల తరలింపుపై దృష్టి సారించింది. గురువారం సాయంత్రం గన్నీ సంచులు పంపిణీ చేసే క్రమంలో మక్కల కుప్పలు చూపకండా రిజిష్టర్లో బినామీ పేర్లు నమోదు చేయడాన్ని పాలకవర్గం గుర్తించింది. 14న 126 మంది పేర్లు నమోదు కాగా 63మంది యార్డులో మక్కలు పోశారు. 15న 97మంది పేర్లు నమోదు కాగా 47 మంది మాత్రమే మక్కలు పోసినట్లు పాలకవర్గం సభ్యులు గుర్తించారు. ఈ విషయమై సెంటర్ ఇన్చార్జిని పాలకవర్గం సభ్యులు ప్రశ్నించగా.. ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. రైతుల అవసరాలను అసరా చేసుకుని, ట్రేడర్లతో చేతులు కలిపి గన్నీ సంచులు ఇచ్చి, మార్క్ఫైడ్ ద్వారా ప్రభుత్వ మద్దతు ధర పొందేందుకు లారీలు పెట్టి విక్రయిస్తున్నట్లు ఆరోపించారు. ఈ విషయమై మార్కెట్ చైర్ పర్సన్ పూల్లూరి స్వప్నసదానందం కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
జిల్లా జైలులో న్యాయసలహా కేంద్రం ప్రారంభం
కరీంనగర్క్రైం: జిల్లా జైలులో నూతనంగా ఏర్పాటు చేసిన న్యాయ సలహా కేంద్రాన్ని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి, న్యాయమూర్తి టి.రాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖైదీలతో పాటు వారి సంబంధీకులకు న్యాయసాయం కోసం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఖైదీల విభాగాలను పరిశీలించి, స దుపాయాలు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు లాయర్ను పెట్టుకునే స్థోమత లేని వారికి ఉచితంగా న్యాయసాయం అందిస్తామన్నా రు. జైలు సూపరింటెండెంట్ విజయదేని, జైలర్లు పి.శ్రీనివాస్, బి.రమేశ్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్ పాల్గొన్నారు. -
మక్కల పైసలు పడ్తలెవ్!
ఈ రైతు పేరు బొందల రాకేశ్. ఈ నెల 4న కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో 60 క్వింటాళ్ల మక్కలు విక్రయించాడు. రూ.1.44 లక్షలు రావాల్సి ఉంది. 17 రోజులైనా డబ్బులు రాకపోగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. మరోవారం రోజులైతే వానాకాలం సాగుకు సిద్ధం కావాల్సి ఉంటుందని, ఎన్ని సార్లు తిరిగితే డబ్బులొస్తాయని రాకేశ్ వాపోతున్నాడు. రాకేశ్ ఒక్కడే కాదు.. జిల్లావ్యాప్తంగా వేలమంది రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఇదే.–––––––––––––––––––––––––– కరీంనగర్ అర్బన్: పంట పండించడం ఒక ఎత్తయి తే విక్రయించడం సాహసంలా మారింది. రైతులను పట్టించుకునే నాథుడే కరవవడంతో యార్డులు, కార్యాలయాల చుట్టూ తిరగడం వారి వంతవుతోంది. పంట కొనుగోలు చేసిన 48గంటల్లోనే రైతు ఖాతాకు నగదు జమ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేస్తుండగా, ఆచరణ శూన్యంగా మారింది. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోళ్లు జరుగుతుండగా అదనపు విధుల పేరుతో నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సౌకర్యాల కల్పన, రవాణా, ఇతర వ్యవహారాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాగైతే ఎలా జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు మక్కలు విక్రయించగా వారి ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. దీంతో వానాకాలం సీజన్ పంటల సాగుకు పొలాలను సిద్ధం చేసుకునేందుకు అవసరమైన పెట్టుబడికి ఇబ్బందులు తప్పేలా లేవు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించగా దళా రులకే కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు పుష్కలం. దళారులు క్వింటాల్కు రూ.1700 నుంచి రూ.1800 కు కొనుగోలు చేస్తుండగా మద్దతు ధర రూ.2400. క్వింటాల్కు రూ.600 రైతులు నష్టపోతున్నారు. నిబంధన కొర్రీ ఆన్లైన్లో నమోదు చేసుకున్న రైతులే, ఎకరాకు 25 క్వింటాళ్ల వరకే విక్రయించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి ఈ సారి గుంటకు క్వింటాల్ చొప్పున దిగుబడి రాగా ఎకరాన 40క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ లెక్కన మిగతా 15 క్వింటాళ్లు విక్రయించడమెలా అన్నది అంతుచిక్కని ప్రశ్న. కేంద్రాల నిర్వాహకులు కొన్న పంటను ఉన్నతాధికారులు సూచించిన గోదాంలకు లారీల్లో తరలించారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయడానికి ఆధార్, బ్యాంకు ఖాతా నంబరు తదితర వివరాలను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నకలు ప్రతుల రూపంలో తీసుకోగా నేటికి డబ్బులు జమకాకపోవడం ఆందోళనకర పరిణామం. ఏడు కేంద్రాల్లో కొనుగోళ్లు కరీంనగర్, చొప్పదండి, గన్నేరువరం, చిగురుమామిడి, మల్లాపూర్(తిమ్మాపూర్), సైదాపూర్, జమ్మికుంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏప్రిల్ నాలుగో వారం నుంచి కేంద్రాలు ప్రారంభించగా రైతులు మక్కలు విక్రయించడం ప్రారంభించారు. 1,78,850 క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేయగా 4,720 మంది రైతులు విక్రయించారు. ఈ లెక్కన రూ.42.92కోట్లు రైతుల ఖాతాలో చేరాల్సి ఉండగా ఒక్కరికీ డబ్బులు జమకాకపోవడం విడ్డూరం. కాగా మక్కల కొనుగోళ్లపై ప్రభుత్వానికి నివేదించామని, డబ్బులు రాగానే రైతుల ఖాతాకు జమవుతాయని మార్క్ఫెడ్ డీఎం వివరించారు.జిల్లాలో కొనుగోలు కేంద్రాలు: 07 కొనుగోలు చేసిన మక్కలు: 1,78,850 క్వింటాళ్లు విక్రయించిన రైతులు: 4,720 రైతుల ఖాతాకు రావాల్సిన నగదు: రూ.42.92కోట్లు ఇప్పటివరకు రైతు ఖాతాకు చేరిన నగదు: సున్నా -
ఇక పనుల జాతర!
నిధుల వరదసాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు నిధుల వరద రానుంది. అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) స్కీం కింద రూ.840 కోట్ల విలువైన పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకే కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి హీరాలాల్ మిశ్రా నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందింది. ఈ నిధులతో కరీంనగర్లో స్కైవాక్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, మోడల్ రోడ్లను నిర్మించనున్నారు. డ్రైయిన్లను పునరుద్ధరించనున్నారు. వరద నీటి నివారణ చర్యలు చేపట్టనున్నారు. ఈ నిధులు సద్వినియోగమైతే నగర రూపురేఖలే మారనున్నాయి. హైదరాబాద్ తర్వాత అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఏ పనులకు ఎంత? పట్టణ రవాణా మెరుగుదలకు మోడల్ రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి, స్కైవాక్లు, నాన్–మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ సదుపాయాలతో పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, అభివృద్ధి కోసం రూ. 630 కోట్ల పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. డ్రెయిన్ల పునరుద్ధరణ, వరద నివారణ చర్యల కోసం రూ.130 కోట్లు, సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణకు రూ.80 కోట్లకు ఆమోదం లభించింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు చెందిన అపెక్స్ కమిటీ ఈనెల 11న ఢిల్లీలో సమావేశమై ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. కమిటీ ఆదేశాల మేరకు గత శనివారం కేంద్ర అధికారుల బృందం నగరంలో పర్యటించింది. తాజాగా ఆయా ప్రతిపాదనలకు కేంద్రం తుది ఆమోదం తెలిపింది. మేయర్, డిప్యూటీ మేయర్ హర్షం... అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) స్కీంలో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.840 కోట్ల నిధుల మంజూరు కావడంపట్ల మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ లకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కృషి మర్చిపోలేనిదని అన్నారు.తొలుత వరంగల్ కార్పొరేషన్ ప్రతిపాదనలను మాత్రమే యూసీఎఫ్ స్కీంలో చేర్చారు. ఖమ్మం–వరంగల్–కరీంనగర్ కారిడార్ ను కూడా ఈ స్కీంలో చేర్చారు. ఆయా ప్రతిపాదనలకు సంబంధించి డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను కూడా కేంద్రానికి పంపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన యూసీఎఫ్ ప్రతిపాదనల జాబితాలో కరీంనగర్ లేదు. విషయం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను సైతం యూసీఎఫ్ జాబితాలో చేర్చాలని పట్టుపట్టారు. కరీంనగర్ అభివృద్ధి, ఆధునీకరణ కోసం ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి పంపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్లను కలిసి ప్రతిపాదనలను ఆమోదించాలని కోరారు. దీంతో తెలంగాణ నుంచి వచ్చిన మూడు ప్రతిపాదనలకు యూసీఎఫ్ నేషనల్ అపెక్స్ కమిటీ ఆమోదం తెలిపింది. -
ఎండకు జీవాల విలవిల
శుక్రవారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2026ఎండల తీవ్రతకు జిల్లా రెడ్జోన్లో కొనసాగుతుండగా.. వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గురువారం 46 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. నగర శివారులోని డీర్పార్క్లో జంతువులు, పక్షుల పరిస్థితి వర్ణనాతీతం. ఎండల తీవ్రతతో నెమళ్లు, జింకలు, నిలుగాయి తదితర పక్షులకు ఉపశమన చర్యలు చేపట్టారు. వడగాలులకు తట్టుకోలేక నెమళ్లు సొమ్మసిల్లిపోతుండగా.. రేకులపై తుంగ కప్పి నీటిని జలకరిస్తున్నారు. కొలనుల్లో మూడు పూటల నీటిని మార్చుతుండడంతో జలకాలాటతో సేదదీరుతున్నాయి. జింకలకు స్నోపాల్స్ షెడ్డు ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం వేళలో చల్లటి నీటిని అందిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్నీటి తడితో ఉపశమనం పొందుతున్న కుందేలు పిల్లలునీటి జల్లుల మధ్య, షెడ్డు నీడన సేద తీరుతున్న నెమలిపార్కులో పక్షికి నీరు పడుతున్న సహాయకుడు -
జీవన శైలి కరువు.. మాతృత్వం బరువు
కరీంనగర్: ఒకప్పుడు పెళ్లయిన కొద్ది కాలానికే సహజంగా గర్భం దాల్చేవారు. ఇప్పుడు మారిన జీవనశైలి, ఉద్యోగ ఒత్తిళ్లు, ఆలస్య వివాహాలు, ఫాస్ట్ఫుడ్ అలవాట్లు, నిద్రలేమితో మాతృత్వం చాలా మందికి సవాలుగా మారుతోంది. కొద్దిరోజులు వేచిచూసి చాలా మంది ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో గతంలో హైదరాబాద్కే పరిమితమైన ఫెర్టిలిటీ చికిత్సలు ఇప్పుడు జిల్లాకేంద్రానికే చేరాయి. ఐవీఎఫ్, ఐయూఐ, టెస్ట్ట్యూబ్ బేబీ చికిత్సలకు నగరంలో ప్రత్యేక కేంద్రాలు వెలుస్తున్నాయి. ఇప్పటికే పది వరకు సంతాన సాఫల్య కేంద్రాలు ఉన్నాయి. ఐవీఎఫ్ నడుస్తున్నప్పటికీ సరోగసీ అనుమతులు ఎవరికీ లేదు. సరోగసీ నిబంధనలు కఠినంగా ఉండడంతో వైద్యులు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. ఐవీఎఫ్పై పెరుగుతున్న ఆసక్తి సహజ గర్భధారణ కష్టమవుతున్న కొందరు దంపతుల్లో ఐవీఎఫ్పై ఆసక్తి పెరుగుతోంది. పెళ్లయిన రెండు, మూడేళ్లలో సహజంగా గర్భం రాలేదంటే ఐవీఎఫ్ను ఎంచుకుంటున్నారు. ఐవీఎఫ్ చికిత్స పొందుతున్న అందరికీ సత్ఫలితాలు ఇస్తుందా అంటే అది వారి శరీర తత్వంపై ఆధారపడి ఉంటుందని, కొందరికి ఏడాదిలో సక్సెస్ అయితే మరికొందరికి రెండు మూడేళ్లు పడుతుందని వైద్యులు చె బుతున్నారు. కరీంనగర్లో మధ్యతరగతి, ఉద్యోగ దంపతుల్లో ఫెర్టిలిటీ సేవలపై డిమాండ్ పెరుగుతోందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఒక్క ఐవీఎఫ్ సైకిల్కే రూ.లక్షల్లో ఖర్చవుతుండటంతో ‘ మాతృత్వం’ ఇప్పుడు ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. ఒక్కో సెంటర్లో ఐవీఎఫ్కు రూ.లక్షన్నర నుంచి రూ.రెండున్నర లక్షలు, ఐయూఐకు రూ.రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఐవీ ఎఫ్కు డిమాండ్ పెరగడంతో మోసాలూ పెరుగుతున్నాయి. తెలంగాణలో ఐవీఎఫ్ కేంద్రాల పర్యవేక్షణను ప్రభుత్వం కట్టుదిట్టం చేస్తోంది. ఇటీవల ఫెర్టిలిటీ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ప్రారంభమైంది. ప్రభుత్వ ఫెర్టిలిటీ సెంటర్పై ఆశ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో ఉచిత ఐవీఎఫ్ కేంద్రాన్ని ప్రారంభించింది. జిల్లాస్థాయిలోనూ ఫెర్టిలిటీ సేవలు విస్తరించాలన్న ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, కరీంనగర్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రత్యేక ఫెర్టిలిటీ సెంటర్ ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉన్నట్లు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. -
జిల్లాసభను విజయవంతం చేయండి
కరీంనగర్ అర్బన్: ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ నెల 22న శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించే జిల్లాస్థాయి సభను విజయవంతం చే యాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. జిల్లాస్థాయి సభ నిర్వహణపై వివిధశాఖల జిల్లా అధికా రులతో కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన– ప్రగ తి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం నుంచి జిల్లాస్థాయిలో వివిధశాఖల ద్వారా అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని, వాటన్నింటినీ డాక్యుమెంటరీ రూపంలో ప్రదర్శించాలన్నారు. ప్రతీశాఖకు సంబంధించిన ప్రగతిపై పది నిమిషాల సమాచారం సిద్ధం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు సబ్సిడీ గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి, సన్న రకం వరికి బో నస్, కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల వివరాలు సభలో వివరించాలని తెలిపారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో సభను విజయవంతం చేయాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్దేశాయ్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
రంగుల మాలలు
తామర పూలను తెస్తాం తనివితీరా మాల కడతాం తల్లిదండ్రుల మెడలో వేస్తాం ! గులాబీ పూలను తెస్తాం గుత్తులు గుత్తుల మాల కడతాం గురువు గారి మెడలో వేస్తాం ! చామంతి పూలను తెస్తాం చకచకా మాల కడతాం చదువులమ్మ మెడలో వేస్తాం ! మందార పూలను తెస్తాం మెలికలేసి మాల కడతాం మహనీయుల మెడలో వేస్తాం ! బంతిపూలను తెస్తాం బొద్దుబొద్దుగా మాల కడతాం భరతమాత మెడలో వేస్తాం ! నందివర్ధన పూలను తెస్తాం నిగనిగలాడే మాల కడతాం నింగి నేలకు చుట్టేస్తాం !!! బోనగిరి పాండురంగ తొర్రూరు టౌన్, జిల్లా: మహబూబాబాద్ -
గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026
ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు ఆందోళనకరస్థాయికి చేరాయి. ఫ్యాన్లు, కూలర్లు గిర్రున తిరుగుతున్నా తట్టుకోలేని వేడి మనిషిని ఆగం చేస్తోంది. జిల్లా ఆసుపత్రిలోని బర్నింగ్ విభాగంలో కాలిన గాయాలతో అడ్మిట్ అయినవారికి చికిత్స అందిస్తుండగా సదరు విభాగంలో ఏసీ తప్పనిసరి. ఉన్న ఒక్క ఏసీ అలంకారప్రాయంగా మారగా బాధితులు అటు ఎండవేడి ఇటు కాలిన గాయాలతో ఏర్పడే మంటకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏసీ స్థానంలో కూలర్ ఏర్పాటు చేయగా గాలి ఒత్తిడికి కాలిన గాయాలు మరింత మండుతున్నాయని రోగుల బంధువులు చెబుతున్నారు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే.. ప్రభుత్వ ఆస్పత్రిలోని రెండో అంతస్తులో ఉన్న డ్రగ్స్, ఆల్కహాల్, మాదకద్రవ్యాల వల్ల తీవ్రమైన మత్తుకు గురైన వారికి అత్యవసర వైద్య సాయం అందించే ప్రత్యేక విభాగం ఒక్క పేషెంటు లేక ఖాళీగా ఉంది. అయినప్పటికీ ఆ వార్డులో అన్ని లైట్లు వేసి ఉండగా వార్డు దగదగలాడుతోంది. ఫలితంగా సర్కారుకు విద్యుత్ ఖర్చు వృథా అవుతోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
తోటకు నీరుపెట్టేందుకు వెళ్లి..
● విద్యుత్ వైరు తగిలి రైతు మృతి ధర్మపురి: తోట రక్షణగా ఏర్పాటు చేసిన కరెంట్ వైరే రైతు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన ధర్మపురి సమీపంలోని కొరండ్లపల్లెలో విషాదం నింపింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ధర్మపురికి చెందిన కటుకం శంకర్ (54) తనుకున్న భూమిలో పెసర, బీర, మిరప సాగు చేస్తున్నాడు. పందులు, ఇతర వన్యప్రాణులు రాకుండా రక్షణగా కంచె ఏర్పాటు చేశాడు. బుధవారం మధ్యాహ్నం తోటకు నీరు పెట్టడానికి వెళ్లాడు. కంచెకు 11 కేవీ మెయిన్ వైరు తగులుకుని ఉంది. దీనిని గమనించని శంకర్ నీరు పారిస్తుండగా.. కంచెకున్న విద్యుత్ వైరు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. శంకర్ సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తోటవద్దకెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. ఎస్సై మహేశ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. శంకర్ వ్యవసాయపనులతోపాటు బీడీ కంపెనీలో పనిచేస్తున్నాడు. గ్రామంలో బీజేపీ నాయకుడిగా కొనసాగుతున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కొడిమ్యాల: మండలంలోని నల్లగొండ గ్రామానికి చెందిన కొలపూరి సురేశ్ (39) గుండెపోటుతోనే చనిపోయినట్లు పోస్టుమార్టంలో తేలింది. సురేశ్ తండ్రి రాజయ్య, ఎస్సై సందీప్ కథనం ప్రకారం.. రాజయ్య పెద్ద కుమారుడు సురేష్ మంగళవారం సాయంత్రం పొలం వద్ద కొంతసేపు ఉంటానని, ఆవు పాలు పితికి తీసుకొస్తానని తండ్రికి చెప్పాడు. సురేశ్ అదే గ్రామంలో అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. రాత్రి ఇంటికి చేరుకున్నాడని తండ్రి భావించాడు. బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్లగా సురేష్ విగతజీవిగా కనిపించాడు. నుదిటిపై, కుడి కాలి వేళ్ల వద్ద గాయాలు కనిపించడంతో కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. మృతదేహాన్ని జగిత్యాల ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. ఇందులో అక్కడి వైద్యులు గుండెపోటు కారణంగానే సురేశ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రైలు ఢీకొని వ్యక్తి .. రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్లో బుధవారం రైలు ఢీకొని వ్యక్తి(55) మృతి చెందాడు. ఒకటో నంబరు ప్లాట్ఫారం దిగి రెండోనంబరు ప్లాట్ఫారంపైకి పట్టాలపైనుంచి వెళ్తుండగా రప్తిసాగర్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొంది. వ్యక్తి శరీరం రెండు ముక్కలైంది. నల్లనిప్యాంట్, తెల్లని బనియన్ ధరించి ఉన్నాడు. ఈనెల 18న తీసుకున్న ఝార్సీగూడ–సికింద్రాబాద్ రైలు టికెట్ లభ్యమైంది. ఇతర ఆధారాలేమీ లభ్యం కాలేదు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచామని జీఆర్పీ ఔట్పోస్టు ఇన్చార్జి తిరుపతి తెలిపారు. మృతుడి బంధువులు 99493 04574, 87126 58604 నంబర్లకు సమాచారం అందించాలని ఆయన కోరారు. -
పుష్కర స్నానం.. పుణ్యక్షేత్రాల దర్శనం
మంథని: త్రివేణి సంగమ క్షేత్రంలో గురువారం నుంచి 12 రోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణం విలసిల్లనుంది. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణాహిత నదులు కలుస్తుండంతో ఇక్కడ అంతర్వాహిణిగా ప్రవహించే సరస్వతీ నదికి గతేడాది ఆదిపుష్కరాలు నిర్వహించారు. నేటినుంచి జరిగే అంత్యపుష్కరాలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఈమేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పుష్కరస్నానం తర్వాత కాళేశ్వరముక్తీశ్వర స్వామి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పుణ్యక్షేత్రాలు భక్తులతో కళకళలాడనున్నాయి. మంత్రి దంపతులతో తొలుత అంత్యపుష్కర స్నానం కాళేశ్వరంలో గురువారం ఉదయం 5.43 గంటలకు అంత్యపుష్కర స్నానాలకు పండితులు ముహూర్తం నిర్ణయించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యార్ దంపతులతో అంత్యపుష్కరాలను వేదపండితుల ప్రత్యేక పూజల నడుమ ప్రారంభించనున్నారు. గవర్నర్ శివప్రతాప్ సుక్లా, కంచి ఫిఠాధిపతులు శ్రీవిజయోద్రసరస్వతీతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖులు హాజరుకానున్నారు. టెంపుల్ టౌన్గా మంత్రపురి ప్రాచీన చరిత్రకు నిలువుటద్దంగా నిలిచిన మంత్రపురి వేదాలకు పుట్టినిల్లు. వేయి సంవత్సరాలకుపైగా మహోన్నత చరిత్ర కలిగిన మంథని ఆలయాలకు నిలయమై టెంపుల్ టౌన్గా ప్రసిద్ధి కెక్కింది. ఉత్తర తెలంగాణలో ఎక్కడా లేనివిధంగా అష్టభుజ, సిద్ధి, బుద్ధి సహిత వినాయకుని గుడిఉత్తర ముఖంలో ఉంది. దక్షిణ భారతదేశంలో ఏకై క పశ్చిమ ముఖశివలింగం ఇక్కడే దర్శనమిస్తుది. 13 హనుమాన్ దేవాలయాలతో పాటు మంథనిలో అన్నిదేవతల దేవాలయాలు పురాణకాలంలోనే నిర్మించారు. నూతనంగా అయ్యప్ప దేవాలయం, అందులో సరస్వతీ, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాలనూ నిర్మించారు. గోదావరి తీరంలో వెలసిన గౌతమేశ్వర దేవాలయం నుంచి సోమసూత్రం ప్రకారం ప్రమిదగణాలు.. పట్టణ ప్రారంభంలో కాలభైరవుడితో మరో దేవతామూర్తిని ఏర్పాటు చేశారు. సూర్య, చంద్రలతోపాటు పది చేతులతో కూడిన భగీరథ అమ్మవారు, కాసికాదేవి.. ఇలా పట్టణం నలుదిక్కులా వాస్తుతో నిర్మిత మైంది. వీటితోపాటు కనకాపరమేశ్వరి, షిరిడీసాయి, అయ్యప్ప, రేణుకా ఎల్లమ్మ, భలవీర హనుమాన్, నాగదేవత, కాళీకాదేవి, గంగాదేవి, బద్దిపోచమ్మ ఆలయాలు ఉన్నాయి. ప్రాచీన చరిత్ర కలిగిన మంథనిలో ప్రజలు అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తారని అనడానికి పట్టణంలోని ఆలయాలే ప్రత్యక్ష సాక్ష్యాలు. ప్రాచీన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కాళేశ్వర– ముక్తీశ్వరస్వామి ఆలయంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఒకేపీఠంపై రెండు శివలింగాలు(శివుడు, యముడు) కొలువై ఉన్నాడు. ఒకే పానవట్టంపై రెండువేర్వేరు శివలింగాలు ఉన్న ఏకై క దేవాలయం ఇదే. భక్తులు సంప్రదాయకంగా ముక్తీశ్వర(శివ) లింగం ఆశీర్వాదం కోరడానికి ముందు కాళేశ్వర(యమ) లింగానికి ప్రార్థనలు సమర్పిస్తారు. ముక్తీశ్వర లింగానికి రెండు నాసికరంద్రాలు ఉంటాయి. స్వామివార్లకు అభిషేకం సమయంలో పోసిననీరు ఈ రంధ్రాల్లోకి ఇంకి సంగమంలోని భూగర్భ నదులలోకి రహస్యంగా ప్రవహిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడి క్షేత్రంలో పార్వతీదేవీ, సరస్వతీ ఆలయంతోపాటు మరిన్ని మహిమగల ఆలయాలు కొలువై ఉన్నాయి. కాళేశ్వరంలో నేటినుంచి జూన్ ఒకటి వరకు అంత్యపుష్కరాలు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు మంత్రి శ్రీధర్బాబు దంపతులతో ప్రారంభం -
తల్లడిల్లిన కన్నపేగు
జగిత్యాలక్రైం/మేడిపల్లి: ఒకే ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతిచెందడంతో కన్నపేగులు తల్లడిల్లాయి. దేవునికి మొక్కులు చెల్లించేందుకు వెళ్లిన రెండు కుటుంబాల్లోని చిన్నారులు కోనేరులో మునిగి చనిపోవడం విషాదం నింపింది. మృతదేహాలను జగిత్యాల ఆస్పత్రికి తీసుకురాగా.. అక్కడికి బంధువులు వందలాదిగా తరలివచ్చారు. అయ్యో బిడ్డలారా.. అప్పుడే మీకు నూరేళ్లు నిండాయా.. అంటూ రోదించడంతో ఆస్పత్రి ఆవరణ కన్నీటి సంద్రమైంది. మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన వడ్లకొండ శేఖర్, భార్గవి దంపతులు. శేఖర్ డిష్ కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. వారికి షార్వింద్ (6) కుమారుడు. భార్గవి మళ్లీ గర్భం దాల్చడంతో శివారులోని శివగంగ వద్ద మొక్కులు చెల్లించేందుకు వెళ్లారు. కార్యక్రమానికి రావాలని జగిత్యాలలోని చిలుకవాడకు చెందిన భార్గవి అక్క భారతి, బావ భూషణంను కూడా ఆహ్వానించారు. దీంతో వారు కుమారుడు మన్విత్, కూతురు మనస్వినితో కలిసి శివగంగ వద్దకు చేరుకున్నారు. పెద్దలందరూ మొక్కులు చెల్లించి వంట చేసే ప్రయత్నంలో ఉండగా.. ముగ్గురు చిన్నారులు కోనేరు వద్ద ఆడుకుంటూ నీటిలో మునిగిపోయారు. పిల్లలు కనిపించకపోవడంతో కోనేరు వద్దకు వెళ్లి చూడగా.. అప్పటికే అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. వారిని బయటకు తీసి జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ముగ్గురు చిన్నారులు మృతిచెందారన్న విషయం తెలుసుకున్న బంధువులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. పిల్లల మృతదేహాల వద్ద రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. బిడ్డలారా.. అప్పుడే నూరేళ్లు నిండాయా.. బంధువుల రోదనలతో దద్దరిల్లిన ఆస్పత్రి అప్పటి దాకా కళ్లముందే ఆటలు కోనేరులో మునిగి ముగ్గురి మృతి రెండు కుటుంబాల్లో తీరని విషాదం -
గిరిజన యువతి ఆత్మహత్య
ధర్మపురి: జీవితంపై విరక్తితో గిరిజన యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బోదరనక్కలచెరువు గూడెంలో చోటుచేసుకుంది. ఎస్సై మహేశ్ కథనం ప్రకారం.. గూడెంకు చెందిన మారినేని లచ్చయ్యకు ముగ్గురు కూతుళ్లు. రెండో కూతురు రమ్య(21) ఇంటర్ మధ్యలో ఆపేసి ఇంటివద్దనే ఉంటోంది. మనస్తాపంతో బుధవారం ఎవరూ లేని సమయంలో ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరేసుకుంది. లచ్చన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మాయమాటలు చెప్పి.. పింఛన్ కాజేసి..జమ్మికుంట: మాయమాటలు చెప్పి వృద్ధురాలి పింఛన్ డబ్బులను ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు. బాధితురాలి వివరాల ప్రకారం.. ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన రామంచ అయిలమ్మ అనే వృద్ధురాలు బుధవారం జమ్మికుంట పట్టణంలోని ఓ బ్యాంక్కు పింఛన్ డబ్బులు విడిపించుకునేందుకు వచ్చింది. 2 నెలల పింఛన్ రూ.4వేలు విడిపించుకొని బయటకు రాగా.. అక్కడే ఉన్న ఓ గుర్తుతెలియని దుండగుడు పింఛన్ రూ.6వేలు రావాల్సింది, బ్యాంక్వాళ్లు తక్కువ ఇచ్చారంటూ మాయమాటలతో బురడి కొట్టించాడు. 2 నెలల పింఛన్ డబ్బులు తీసుకొని బ్యాంక్ వద్దకు తీసుకొచ్చి పాస్బుక్ జిరాక్స్ తీసుకురమ్మని చెప్పి రూ.4వేలతో ఉడాయించాడు. మోసపోయానని తెలుసుకున్న అయిలమ్మ బోరున విలపించింది. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది. -
బన్నీ వేసవి యాత్ర –13 పరమపద సోపానం – తాతయ్య పాఠం
బయట వర్షం. ఆటలు బంద్. రామ్, బన్నీ బోర్ అని చెప్పారు. తాతయ్య పాత పెట్టెలోంచి పరమపద సోపానం బోర్డు తీశాడు. ‘ఇది పాము నిచ్చెన ఆటరా. కానీ దీంట్లో లెక్కలు కూడా ఉన్నాయి’ అన్నాడు తాతయ్య. పాచిక వేసి వచ్చిన నంబర్ను పాత గడితో కూడిక చేయమన్నాడు. బన్నీ 5 వేశాడు. 10వ గడిలో ఉన్నాడు. ‘10 + 5 ఎంత?’ అడిగాడు తాత. బన్నీ వేళ్లతో లెక్కపెట్టి ‘15’ అని చెప్పాడు. సరైన గడికి వెళ్లాడు. రామ్ 6 వేశాడు. 22వ గడి. పాము నోట్లో పడ్డాడు. 22 + 6 = 28. కిందకు జారాడు. చుక్క నిచ్చెన ఎక్కింది. ‘నిచ్చెన మంచి పని, పాము తప్పు పని రా’ అని తాత చెప్పాడు. ఆట అయ్యేసరికి బన్నీకి 2 అంకెల కూడికలు వచ్చేశాయి. స్వప్న ఫస్ట్ వచ్చింది. తాతయ్య నవ్వాడు: ‘చూశారా, ఆటలోనే లెక్కలు నేర్చుకున్నారు. ఇదే మన పాత స్కూల్.’ పిల్లలకి మాట: ఆడుతూ నేర్చుకుంటే పాఠం త్వరగా బుర్రకెక్కుతుంది. డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రాథమిక పాఠశాల, కాకర్లపల్లి, మండలం: మంథని, పెద్దపల్లి జిల్లా -
అరుస్తూ.. కరుస్తూ..
నెల 2023–24 2024–25 2025–26 ఏప్రిల్ 192 205 315 మే 114 207 316 జూన్ 154 232 238 జూలై 194 196 361 ఆగస్టు 158 192 252 సెప్టెంబర్ 164 175 307 అక్టోబర్ 175 221 481 నవంబర్ 210 233 1,295 డిసెంబర్ 193 221 585 జనవరి 229 250 467 ఫిబ్రవరి 165 217 475 మార్చి 265 263 473 మొత్తం 2,213 2,612 5,565కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థ పరిధిలో ని 66 డివిజన్లలో వీధి కుక్కల బెడద తీవ్ర రూపం దాల్చింది. వాకింగ్కు వెళ్లే వృద్ధులు, మహిళలు, బస్స్టాండ్, పార్క్లు, వీధుల్లో తిరిగే చిన్నారులపై ఎప్పుడు ఏ వైపు నుంచి కుక్కలు దాడి చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ముకరాంపుర, విద్యానగర్, జ్యోతినగర్, భగత్ నగర్, కాశ్మీర్ గడ్డ, హౌ సింగ్బోర్డుకాలనీ, మారుతినగర్, లక్ష్మినగర్, రేకుర్తి, తీగలగుట్టపల్లి, హనుమాన్నగర్, వికలాంగుల కాలనీ తదితర ప్రాంతాల్లో గుంపులుగా తిరుగుతూ కాలనీవాసులను హడలెత్తిస్తున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా బైక్లపై వెళ్లే వారి వెంటపడుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. నిలిచిన స్టెరిలైజేషన్ కుక్కల సంతానోత్పత్తిని నివారించేందుకు గతంలో నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహం సమీపంలోని వెటర్నరీ ఆస్పత్రిలో ఏబీసీ నిర్వహించారు. కుక్కలకు ఇక్కడే శస్త్ర చికిత్స చేసేవాళ్లు. ఏబీసీలో వసతులు లేవని, జంతుప్రేమికులు కోర్టును ఆశ్రయించడంతో కుక్కల శస్త్రచికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆరు నెలలుగా నగరంలో కుక్కలకు స్టెరిలైజ్ చేయడం లేదు. దీనితో మరింత రెచ్చిపోతున్నాయి. నగరంలో కుక్క కాటు బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో కుక్కల సంతానోత్పత్తి నివారించి, తీవ్రత తగ్గించేందుకు స్టెరిలైజేషన్ చేపడుతుంటారు. ఏయే ప్రాంతంలో కుక్కలను తీసుకొచ్చి స్టెరిలైజ్ చేస్తారో తిరిగి అదే ప్రాంతంలో వదిలిపెడుతుంటారు. హాస్పిటల్స్, పాఠశాలలు, కళాశాలలు, బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్ల వద్ద పట్టుకున్న కుక్కలకు స్టెరిలైజ్ చేసిన అనంతరం ఏబీసీ సెంటర్లోనే ఉంచాలని, వాటిని వదిలిపెట్టొద్దని గతంలో కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై జంతుప్రేమికులు కోర్టును ఆశ్రయించగా, కుక్కల విషయంలో కరుణ కాదు.. అవసరమైతే కారుణ్య మరణాలు చేయాలని సుప్రీం తాజాగా ఆదేశించింది. నగరంలో పిచ్చికుక్కలను గుర్తిస్తే వైద్యుల నిర్ధారణ తరువాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చంపాల్సి ఉంటుంది. కుక్కలను నియంత్రించాలి నగరంలో కుక్కల బెడద తీవ్రమవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటి నుంచి కాలుబయట పెడితే చాలు కుక్క లు వెంటపడుతుండడం తంతుగా మారింది. త్వరగా ఏబీసీ భవనంలో కార్యకలాపాలు ప్రారంభించి, కుక్కల బెడదను తగ్గించాలని నగరవాసులు కోరుతున్నారు. కరెంట్ లేక.. ప్రారంభానికి నోచుకోక నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బొమ్మకల్లో ఏబీసీ సెంటర్ భవన నిర్మాణాన్ని చేపట్టారు. రూ.35 లక్షల వ్యయంతో చేపట్టిన భవన నిర్మాణం పూర్తయింది. భవనంలో 38 కెనెల్స్ నిర్మించగా (కుక్కలను నిలిపే), మరో 62 కెనెల్స్ నిర్మించాలని ఇటీవల కౌన్సిల్ తీర్మానించింది. అయితే భవనానికి విద్యుత్కనెక్షన్ లేకపోవడంతో ప్రారంభానికి నోచుకోవడం లేదు. -
బంగారం దుకాణాల్లో పోలీసుల తనిఖీలు
కరీంనగర్ క్రైం: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా బుధవారం సీపీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో పలు బంగారు ఆభరణాల దుకాణాలు, లాడ్జీలు, బస చేసే హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బంగారం దుకాణాల్లో అర్హత గల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ ద్వారాల వద్ద డోర్ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్, లోపలికి వచ్చే వారిని తనిఖీ చేయడానికి హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్లను ఉపయోగించాలన్నారు. పలుచోట్ల ఎమర్జెన్సీ అలారమ్స్ అమర్చాలని, వాటిని నొక్కిన వెంటనే పోలీసులకు సమాచారం అందేలా అనుసంధానం చేయాలన్నారు. హోటళ్లలో రూంలు అద్దెకు ఇచ్చే సమయంలో కస్టమర్ల నుంచి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు సేకరించాలన్నారు. వారిచ్చే ఫోన్ నంబర్లను సరి చూసుకోవాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. భద్రతా ప్రమాణాల్లో అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు వెంకటస్వామి, వేణుగోపాల్, వాసాల సతీశ్, సీఐ రాంచందర్రావు పాల్గొన్నారు. అర్హులైన బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయాలికరీంనగర్: 14 ఏళ్లు నిండిన బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయాలని డీఎంహెచ్వో వెంకటరమణ సూచించారు. విద్యానగర్ అర్బన్ హెల్త్ సెంటర్, కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలు, రికా ర్డుల నిర్వహణ, హాజరు రిజిస్టరు, ఎన్సీడీ రిజిస్టర్, ఫార్మసీ స్టోర్, ఓపీ రిజిస్టర్, సిబ్బంది పనితీరును పరిశీలించారు. డాక్టర్లు సనా జవేరియా, నాజియా ఫాతిమా, సాహితీ పాల్గొన్నారు. రూ.50 కోట్ల పనుల్లో కదలికకరీంనగర్ కార్పొరేషన్: ఇటీవల చర్చనీయాంశంగా మారిన రూ.50 కోట్ల అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (యూఐఎఫ్డీ) నిధులతో చేపడుతున్న పనులకు మోక్షం లభిస్తోంది. 87 పనులకు సంబంధించిన ఆన్లైన్ టెండర్ ప్రక్రియ ను అధికారులు చేపట్టగా, 86 పనులకు కాంట్రాక్టర్లు బిడ్ దాఖలు చేశారు. ఒక పనికి ఎవ రూ ముందుకురాలేదు. గత సంవత్సరం ప్రత్యేక అధికారి పాలనలో నగరపాలకసంస్థకు వచ్చిన రూ.50 కోట్ల నిధులతో పనులు చేపట్టేందుకు అధికారులు నిర్ణయించడం, టెండర్ దశకు చేరడం తెలిసిందే. ఆ తరువాత కొత్త పాలకవర్గం ఏర్పడడంతో రూ.50 కోట్ల టెండర్ ప్రక్రియను నిలిపివేసి, నగరవ్యాప్తంగా పనులను విభజించి మళ్లీ కొత్తగా ప్రతిపాదనలు పంపించారు. కౌన్సిల్ ప్రతిపాదనలకు సీడీఎంఏ అంగీకరించడంతో, టెండర్ ప్రక్రియను నిర్వహించారు. ఆన్లైన్ టెండర్లో బిడ్ దాఖ లు గడువు బుధవారంతో ముగిసింది. మొత్తం 87 పనుల్లో 86 పనులకు బిడ్స్ దాఖలైనట్లు సమాచారం. ఇందులో 18 పనులకు తీవ్రమైన పోటీ ఏర్పడిందని తెలిసింది. కాగా వారం రోజుల్లో మిగతా ప్రక్రియ పూర్తి చేస్తామని, ఆ తరువాత డివిజన్లలో అభివృద్ధి పనులు మొదలవుతాయని అధికారులు తెలిపారు. -
సెలవు రోజు
ఆ రోజు సెలవు ముందు రోజు అమ్మ నాన్న తాతయ్య నానమ్మ అందరం కలిసి ఎక్కడికన్నా వెళ్దామని అనుకున్నాం. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కో చోటికి వెళ్దామని చెప్పారు. అప్పుడు నేను, మా చెల్లి, మా తమ్ముళ్లు జూ పార్క్కు వెళ్దామన్నాం. అప్పుడు మా నాన్న జూపార్క్ కన్నా సినిమాకు పోదాం అన్నారు. మా తాతయ్య బాగోతానికి వెళ్దామాన్నారు. మా నాయనమ్మ అందరం కలిసి దేవాలయానికి వెళ్దామన్నారు. అప్పుడు మా నాన్న.. సరే మీరు అన్నట్లు సెలవు రోజు అంటే రేపు అందరం జూపార్క్, సినిమాకు వెళ్దాం. వచ్చే వారం బాగోతానికి వెళ్దామన్నారు. మరుసటి రోజు తెల్లవారుజామునే లేచి జూపార్కు, సినిమాకు రెడీ అయ్యాం. ఇంకా వారం రోజులైతే నాకు, మా చెల్లికి పదో తరగతి పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే.. మన ఊరి గ్రామస్తుడు ముద్దసాని మోహన్రెడ్డి మొదటి మరియు రెండో వ్యక్తికి రూ.20వేలు ప్రోత్సాహకంగా ఇస్తాడు అని నాన్న అన్నారు. ఈసారి పరీక్షల్లో మీరు ఉత్తీర్ణులైతే అందరం కలిసి కొత్త స్థలానికి వెళ్దామన్నారు. జూ పార్కు మరియు సినిమాకు వెళ్లి వచ్చాము వచ్చిన తర్వాత ఇక వారం రోజులు పరీక్షలకు విలువి ఉన్నాయని చదివాము మొదటిరోజు తెలుగు రెండవ రోజు హిందీ మూడవరోజు ఆంగ్లం నాలుగో రోజు గణితం ఐదవ రోజు భౌతిక శాస్త్రం ఆరవ రోజు జీవశాస్త్రం ఏడవ రోజు సోషల్ పరీక్షలు జరుగుతాయి మేము నేను మా చెల్లి ఇద్దరం ఈసారి ఉత్తీర్ణులమవుదామని అనుకున్నాం. ఉత్తీర్ణులమైతే ఈసారి మా అమ్మ, నాన్న పేరు, మా ఊరి పేరు దక్కించిన వాళ్లమవుతామని ఆశతో చాలా కష్టపడి చదివాను. మాది చాలా నిరుపేద కుటుంబం. మా నాన్న, అమ్మ కష్టపడితే కానీ మేము తినలేము. ఈ ఉన్న వారం రోజుల్లో మేము బాగా చదివినాము. పరీక్షలు రాసినాము. తర్వాత చాలా భయపడ్డాం. పదో తరగతిలో పాస్ అవుతామో.. లేదోనని ఆందోళన ఉంది. అటు తల్లిదండ్రుల కష్టం.. ఇటు ఉపాధ్యాయులు నాపట్ల ఇచ్చే చదువు ఈ రెండింటిని ఆలోచించుకుంటే నాకు చాలా ఆందోళన వేసింది. కొన్ని రోజులకు రిజల్ట్ ప్రకటించారు. నేను, మా చెల్లి ఇద్దరం అత్యున్నత మార్కులతో నిలిచాం. నేను మొదటి స్థానం, మా చెల్లి రెండో స్థానంలో నిలిచింది. మా గ్రామస్తుడు, దాత మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రోత్సాహక డబ్బులు, ప్రశంసలు పొందాం. మా గ్రామస్తులు అభినందించారు. మా అమ్మ, నాన్న, ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే జిల్లా మొత్తంలో మా ఊరి బడే ప్రథమ స్థానంలో నిలిచింది. అందరం కలిసి గోల్కొండ కోటకి వెళ్లాం. మాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ ఎవరు చూసినా కరీంనగర్లో పదో తరగతిలో ఉత్తీర్ణత మార్కులు వచ్చిన వారు మీరే కదా అన్నారు. అప్పుడు మాకు చాలా సంతోషంగా అనిపించింది. నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పాను. వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించారా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సప్ నెం: 8500786474 ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు..పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా... – ఎన్.శ్రీకర్, గ్రామం: ఊటూరు మండలం: మానకొండూర్ -
పాముకాటుతో మహిళ మృతి
కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మడంలం వెన్నంపల్లికి చెందిన పూసాల వజ్రమ్మ(69) సోమవారం పాముకాటుకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వజ్రమ్మ తన ఇంట్లో పనులు చేస్తుండగా పాముకాటు వేసింది. పాము కరిచినచోట పసుపు రాసుకుంది. ఈవిషయాన్ని పక్కింటి వారికి చెప్పగా పెద్దపల్లిలో వడ్రంగి పనిచేస్తున్న ఆమె కుమారుడు రమణాచారికి సమాచారం అందించారు. చికిత్స కోసం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. వడ దెబ్బతో రైతు..సిరిసిల్లఅర్బన్: సిరిసిల్ల పట్టణ పరిధిలోని 8వ వార్డు పెద్దూరుకు చెందిన రైతు రాచర్ల రవి (49) వడదెబ్బతో మృతిచెందాడు. కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు.. రవి తనకున్న రెండెకరాల్లో వరి సాగుచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పి ఒక్కసారిగా ఇంట్లో పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య రాజేశ్వరి, కుమారుడు, కూతురు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కౌన్సిలర్లు, గ్రామస్తులు కోరారు. చేపలు పట్టేందుకు వెళ్లి విద్యుత్ షాక్తో.. కోరుట్లరూరల్: కరెంట్ పెట్టి.. చేపలు పట్టేందుకు వెళ్లి ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన మండలంలోని కల్లూర్ శివారు చెరువు మత్తడి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మాదాపూర్ గ్రామానికి చెందిన గాండ్ల మోహన్ (48) మంగళవారం సాయంత్రం విద్యుత్ తీగను చెరువులో వేసి చేపలు పడుతున్నాడు. విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మోహన్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. షార్ట్సర్క్యూట్తో లారీ దగ్ధంజగిత్యాలరూరల్: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ బైపాస్రోడ్ నర్సింగాపూర్ వద్ద షార్ట్సర్క్యూట్తో లారీ దగ్ధమైంది. టీఆర్నగర్ గ్రామానికి చెందిన సంపంగి రవీందర్కు చెందిన లారీ జగిత్యాల నుంచి టీఆర్నగర్కు వెళ్తుండగా.. నర్సింగాపూర్ శివారులో షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు చేరుకుని మంటలు ఆర్పేశారు. సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణకాంత్ తెలిపారు. మొగ్ధుంపూర్లో అగ్నిప్రమాదంకరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్లో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో ధాన్యం ట్రాక్టర్కు తృటిలో ముప్పు తప్పింది. పోచమ్మగుడి ప్రాంతంలోని వరికొయ్యలకు మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తి నిప్పంటించా డు. మంటలు పుట్నాల మిల్లు, రైసుమిల్లు ప్రాంతాలకు విస్తరించాయి. పుట్నాల మిల్లు ఆవరణలోని కొబ్బరి, మామిడిచెట్లు కాలిపోగా మంటలు సమీపంలోని రైసుమిల్లు వద్ద నిలిపిన ధాన్యం ట్రాక్టర్ల వద్దకు వ్యాపించాయి. అప్రమత్తమైన రైసుమిల్లు యజమాని వెంకటేశ్వర్లు హమాలీలతో నీళ్లు పోయించి, మంటలు ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్లో ఫైరింజన్ అందుబాటులో లేకపోవడంతో చొప్పదండి నుంచి వచ్చిన ఫైరింజన్తో పొలాల్లో వ్యాపించిన మంటలను ఆర్పివేశారు. రైతులకు చెందిన విద్యుత్మోటార్లు, వైర్లు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. -
ధర్మపురిలో విజయలక్ష్మి లాడ్జి సీజ్
ధర్మపురి: నిబంధనలు పాటించనందుకు ధర్మపురిలోని విజయలక్ష్మి లాడ్జిని సీజ్ చేసినట్లు సీఐ రాంనర్సింహారెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని పీఎంజే జువెల్లరీ షాపులో ఇటీవల ఆరుగురు వ్యక్తులు చొరబడి బంగారం దోచుకెళ్లిన విషయం తెలిసిందే. నిందితులు ఈ లాడ్జిలోనే బస చేసి రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో స్థానిక ఎస్సై మహేశ్ విజయలక్ష్మి లాడ్జిలో తనిఖీలు చేపట్టారు. యజమాని గుండయ్యను విచారించారు. రికార్డులు, రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. సరైన అనుమతులు, నిబంధనలు లేకపోవడంతో ఎస్పీ ఆదేశాలతో.. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి సూచనలతో లాడ్జిని సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. ట్రేడ్లైసెన్స్ లేకుండా గెస్ట్హౌజ్లు నిర్వహించడం.. గదుల కోసం వచ్చిన వారి నుంచి ఆధార్కార్డులు, వివరాలు సక్రమంగా నమోదు చేయకపోవడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం వంటివి గుర్తించామన్నారు. నిబంధనలు పాటించని లాడ్జిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డికి సూచించామన్నారు. వాణిజ్య అవసరాలకు గృహ వినియోగ మీటర్లను ఉపయోగిస్తుండడంతో చర్యలు తీసుకోవాలని ఏఈకి సూచించామన్నారు. మున్సిపల్ మేనేజర్ గంగాధర్, శానిటరీ ఇన్స్పెక్టర్ గంగాధర్, పోలీస్ సిబ్బంది తదితరులున్నారు. -
అద్దెకారులో తిరుగుతూ చోరీలు
పెద్దపల్లిరూరల్: కారుడ్రైవర్గా పనిచేస్తే వచ్చే వేతనం ఎటూ సరిపోవడం లేదు. తక్కువ సమయంలోనే ఆర్థికంగా ఎదగాలన్న దురాశతో ఓ కారును అద్దెకు తీసుకుని తాళం వేసి ఉన్న ఇళ్లు లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడ్డ ఊరడి జనార్దన్ను పెద్దపల్లిరూరల్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సీఐ ప్రవీణ్కుమార్, పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేశ్తో కలిసి విలేకరులకు వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లా పెద్దఅడిశర్ల మండలం రంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఊరడి జనార్దన్ కారుడ్రైవర్గా పనిచేస్తున్నాడు. వచ్చే జీతం సరిపోవడం లేదని, తక్కువ సమయంలో ఎక్కువమొత్తంలో సంపాదించేందుకు దొంగతనాలు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకు తన స్నేహితుడు ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా ముప్పాల మండలం మాదారం గ్రామానికి చెందిన తమ్మిశెట్టి వెంకటేశ్తో జతకట్టాడు. ఇందరూ కలిసి అపహరించిన సొత్తును పంచుకున్నారు. వీరితో వెంకటేశ్ సోదరుడు తమ్మిశెట్టి మణికంఠ కూడా చేతులు కలపడంతో ముగ్గురు కలిసి పొద్దంతా కారులో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రి తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడ్డారు. 2025 సెప్టెంబర్లో నల్గొండలో ఓ కారు అద్దెకు తీసుకుని వరంగల్, కరీంనగర్ మీదుగా పెద్దపల్లికి చేరుకున్నారు. సుల్తానాబాద్ శివారులో ఓ ఇంటి ముందు ఉంచిన స్కూటీని అపహరించి పెద్దపల్లి మండలం నిమ్మనపల్లికి చేరుకున్నారు. సెప్టెంబర్ 15న రాత్రి ఇంటికి వేసిన తాళాలను పగులగొట్టి బీరువాలోని బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అనంతరం గుంటూరు మీదుగా గోవాకు పారిపోయారు. అక్కడ కొంత బంగారాన్ని గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మి వచ్చిన డబ్బుతో జల్సా చేశారు. రెండు తులాల బంగారు గొలుసును తమ వద్దనే ఉంచుకున్నారు. మరోసారి పెద్దపల్లి ప్రాంతంలోనే దొంగతనం చేయాలనే ఆలోచనతో ఊరడి జనార్దన్ వచ్చి.. కూనారం రైల్వేగేటు సమీపంలో అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాలకు పాల్పడ్డట్టు తేలింది. నిందితుడి నుంచి రెడ్కలర్ బలెనో కారు, 20గ్రాముల బంగారుగొలుసు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జిల్లా దొంగను పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని రామగుండం సీపీ, పెద్దపల్లి డీసీపీ, ఏసీపీలు అభినందించారు. తాళం వేసిన ఇళ్లు టార్గెట్ అనుమానంతో అదుపులోకి దొంగతనాలు చేసినట్లు విచారణలో వెలుగులోకి నిందితుడి వివరాలు వెల్లడించిన సీఐ ప్రవీణ్కుమార్ -
14మంది కోడి పందెం రాయుళ్ల అరెస్ట్
సుల్తానాబాద్రూరల్: కోడి పందెం ఆడుతున్న 14మందిని అరెస్టు చేశామని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి తెలిపారు. సుల్తానాబాద్ పోలీస్స్టేషన్లో మంగళవారం ఏసీపీ గజ్జి కృష్ణతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. ఎలిగేడు మండలం శివపల్లి శివారుల్లోని బోడగుట్ట వద్ద రాహస్యంగా కోడి పందేలు ఆడుతున్నట్లు అందిన సమాచారంతో దాడులు చేశారు. దుగ్యాల కార్తీక్రావు(శివపల్లి), గడ్డం రాజేశ్(ఇందారం), ఒజ్జ శంకర్(శివపల్లి), బత్తుల రాజు(పెద్దపల్లి), సల్లూరి పవన్(మందమర్రి), పొట్లపల్లి మనోహర్, ఎండీ.రహీం(గోదావరిఖని), వెన్న రవీందర్(ఇందారం), వెల్పుల సతీశ్(ఇందారం), పులి నాగరాజు(పెద్దపల్లి), కొల్లూరి మహేశ్(రామగిరి), ఎండీ సమాద్(జైపూర్), సింగరపు అఖిల్వర్మ(పెద్దపల్లి)ను అరెస్టు చేసి 6 పందెం కోళ్లు, 6 కత్తులు, 13 సెల్ఫోన్లు, 7 ద్విచక్ర వాహనాలు, కారు రూ.40వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పెటీ, అర్గనైజిడ్ క్రైం, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టూ యానిమల్స్ యాక్ట్ 1960, తెలంగాణ గేమింగ్ యాక్ట్ 1974 కింద కేసు నమోదు చేశారు. పందెం రాయుళ్లను చాకచక్యంగా పట్టుకున్న సీఐలు రంజిత్రావు, ప్రవీణ్, ఎస్సైలు చంద్రకుమార్, సనత్రెడ్డి, శ్రీధర్, నరేశ్, పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు. -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో.. బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ.
● కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేస్తాం‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గం.ల నుంచి మధ్యాహ్నం 01గం.వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు: ఐబ్రోస్(త్రేడింగ్), వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచ్,స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఫేస్ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), హెయిర్ మసాజ్, హెయిర్ కట్స్, కమ్యూనికేషన్ అండ్ సెల్ఫ్ గ్రూమింగ్, శారీ డ్రాపింగ్. -
బుధవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2026
కరీంనగర్: ఊపిరాడనివ్వని ఉక్కపోత.. మాడు పగిలేలా దంచి కొడుతున్న ఎండలు.. చెవుల్లో నిప్పులు పోసినట్లు వీచే వేడిగాలులు.. ఉదయం.. మధ్యాహ్నం.. రాత్రి తేడా లేకుండా కొద్దిరోజులుగా వేడెక్కుతున్న వాతావరణం ప్రతీ వ్యక్తిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉదయం పది గంటలకే ఎండ దంచి కొడుతుండగా.. మధ్యాహ్నం అప్రకటిత కర్ఫ్యూను తలపిస్తోంది. సాయంత్రం వేడిగాలులు వీస్తుండగా.. పగలూ రాత్రి లేకుండా కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఎండలకు బేజారు అవుతున్నారు. ఉదయం, సాయత్రం పనులు పూర్తిచేసుకుని, మధ్యాహ్నం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల కింద సేదతీరుతున్నారు.విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్– 2 డిపో నుంచి ఈనెల 30న మైసూర్, ఊటీ విహారయాత్రకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశామ ని డిపో మేనేజర్ ఎం. శ్రీనివాస్ తెలిపారు. 30న మధ్యాహ్నం 3గంటలకు కరీంనగర్ బస్స్టేషన్ నుంచి రాజధాని ఏసీ బస్సు బయల్దేరుతుందన్నారు. 31న మైసూర్ చేరుకుంటుందన్నారు. మైసూర్ ప్యా లెస్, చాముండే ఆలయం, బృందావన్ గార్డెన్ సందర్శన తువాత రాత్రి బస అక్కడే ఉంటుందన్నారు. 1న ఉదయం 4గంటలకు మైసూర్ నుంచి బస్సు బయల్దేరి ఊటీ చేరుకుంటుందన్నారు. ఊటీలోని వివిధ ప్రదేశాల సందర్శన అనంతరం 3వ తేదీన ఊటీ నుంచి బయల్దేరి బెంగళూరు చేరుకుంటుందన్నారు. అక్కడ బొటానికల్ గార్డెన్, ఇస్కాన్ టెంపుల్, బెంగళూరు ప్యాలెస్ సందర్శన అనంతరం అక్కడి నుంచి బయల్దేరి 4వ తేదీన కరీంనగర్ చేరుకుంటుందని వివరించారు. ఈ విహారయాత్రకు పెద్దలకు రూ.8వేలు, పిల్లలకు రూ.6వేలు టికెట్ చార్జి ఉంటుందని, ప్రయాణంలో భోజనం, దర్శనాల టికెట్ ఖర్చులు ప్రయాణికులే భరించాలని సూచించారు. వివరాలకు 7382847727, 7382850708, 8978383084 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.చిన్న పిల్లలతో భిక్షాటన చేయించొద్దువిద్యానగర్(కరీంనగర్): కరీంనగర్ బస్టాండ్ పరిసరాల్లో చిన్న పిల్లలతో భిక్షాటన చేస్తున్నారనే సమాచారంతో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చైల్డ్ హెల్ప్లైన్ 1098 బృందం మంగళవారం తనిఖీలు నిర్వహించారు. బస్సుల్లో చైల్డ్ హెల్ప్లైన్ 1098 స్టిక్కర్లు అతికించి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. చైల్డ్ హెల్ప్లైన్ 1098 జిల్లా కోఆర్డి నేటర్ ఆవుల సంపత్ మాట్లాడుతూ బస్టాండ్ పరిసరాల్లో చిన్న పిల్లలతో భిక్షాటన చేస్తున్న వారి గురించి విచారించినట్లు తెలిపారు. చిన్న పిల్లలతో భిక్షాటన చేయించడం, తప్పిపోయిన పిల్లలు కనిపించడం, ఇంటి నుండి పారిపోయిన పిల్లలు లేదా ప్రేమపేరుతో ఇంటి నుంచి వచ్చి ఒంటరిగా ఉన్న పిల్లలు కనిపిస్తే చైల్డ్ హె ల్ప్లైన్ 1098కు సమాచారం ఇవ్వాలన్నారు. చైల్డ్ హెల్ప్లైన్ బృంద సభ్యులు సుందరగిరి సాయికిరణ్ గౌడ్, ఎడ్ల ప్రియాంక పాల్గొన్నారు. పెట్రో ధరలు తగ్గించాలి కరీంనగర్ కార్పొరేషన్: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్తో కలిసి మాట్లాడారు. నాలుగు రోజుల్లో లీటరు పెటోల్, డీజిల్పై రూ.4 చొప్పున భారం వేసి కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరిచిందని విమర్శించారు. ఒక్కసారి పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, విడతల వారీగా పెంచుతూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం నీట్ పరీక్ష సక్రమంగా నిర్వహించే సత్తా కేంద్రానికి లేదన్నారు. ధరలు పెరిగాయంటూ భవిష్యత్లో ప్రజలను గంజినీళ్లు తాగుమని ప్రధాని చెబుతారంటూ ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో నాయకులు తాజొద్దీన్, పిట్టల రవీందర్, మల్లికార్జున రాజేందర్, చాడగొండ బుచ్చిరెడ్డి, సరిళ్ల ప్రసాద్, పడిశెట్టి భూమయ్య, వరాల నర్సింగం పాల్గొన్నారు. రేపటి నుంచి ఇంటర్ మూల్యాంకనంసప్తగిరికాలనీ(కరీంనగర్): ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం ఈ నెల 21 నుంచి ప్రారంభం అవుతుందని డీఐఈవో వి.ఆంజనేయరావు తెలిపారు. కరీంనగర్లోని డాక్టర్స్ స్ట్రీట్లోని బాలికల జూనియర్ కళాశాలలో తొలి సెషన్లో భాగంగా ఇంగ్లిష్, తెలుగు, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులలో మూల్యాంకనం జరుగుతుందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఉత్తర్వులు అందిన అధ్యాపకులను స్పాట్ కోసం సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్ రిలీవ్ చేయాలని సూచించారు.మధ్యాహ్నం వేళ నిర్మానుష్యంగా తెలంగాణచౌక్ ప్రాంతంఉక్కపోత..ఉక్కిరిబిక్కిరికరీంనగర్లోనే అత్యధికంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పోలిస్తే కరీంనగర్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండకు తోడు వడగాలుల ప్రభావం ఉండడంతో ప్రజలు ఉష్ణతాపాన్ని భరించలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. జిల్లాకు వాతావారణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే 44 డిగ్రీల సెల్సియస్కు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా, అవి రానున్న మూడు నాలుగు రోజుల్లో 45 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. ఇప్పటికే ఎండలకు తాళలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండడంతో ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నెల 25 వరకు జిల్లాలో 45 డిగ్రీల కన్నా ఎక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది. మరో నాలుగు రోజుల పాటు రెడ్ అలర్ట్ కొనసాగనుంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జిల్లా అంతటా 43 డిగ్రీలపైనే కరీంనగర్ సిటీతో పాటు హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూర్లో గరిష్టంగా 43 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం కరీంనగర్లో గరిష్టంగా 44 డిగ్రీలు, హుజూరాబాద్లో 43.5 డిగ్రీలు, చొప్పదండిలో 43 డిగ్రీలు, మానకొండూర్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్లో రోజంతా రద్దీగా ఉండే తెలంగాణచౌక్, టవర్సర్కిల్, బస్టాండ్ ఏరియా, కమాన్రోడ్ ప్రాంతాలు మధ్యాహ్నం నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఇళ్లకే పరిమితమవుతున్న జనం భానుడి తాపంతో జనాలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉద్యోగులు మినహాయించి బయట పనులకు వెళ్లినవారు 11 గంటలలోపు ఇళ్లకు చేరుకుంటున్నారు. గతంలో కన్నా ఈసారి ఎండల తీవ్రత పెరగడం, గాలిలో తేమశాతం తగ్గడంతో ఉక్కపోతతో ప్రజలు ఆల్లాడిపోతున్నారు. ఇంట్లోనూ వేడిని తాళలేక ఏసీలు, కూలర్లు పెట్టుకుంటున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. రాబోయే 4 రోజుల్లో 45 డిగ్రీలకు దాటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అప్రమత్తం చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. జనగణనకు ‘సన్’స్ట్రోక్కరీంనగర్రూరల్: జనగణనకు వేసవికాలం ఎండలు అడ్డంకిగా మారాయి. ఎండ తీవ్రతకు ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు ఆందోళన చెందుతున్నారు. ఉదయం 10గంటల్లోపే గృహాల వివరాలను మొబైల్యాప్లో నమోదు చేస్తున్నారు. ఎండ వేడికి నెమ్మదిగా పనిచేయాల్సిన పరిస్ధితి నెలకొంది. ఈ నెల 15నుంచి ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన బ్లాకుల్లోని ఇంటింటికి తిరుగుతూ 33 అంశాలకు సంబంధించిన వివరాలను ప్రత్యేక మొబైల్ యాప్లో నమోదు చేస్తున్నారు. రెండు రోజుల నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు ఆందోళనచెందుతున్నారు. ప్రతి రోజు ఉదయం 7గంటల నుంచి 10గంటలవరకు మాత్రమే తమ బ్లాక్లోని ఇళ్ల వివరాలు యాప్లో నమోదు చేస్తున్నారు. పురుష ఎన్యుమరేటర్లు ఉదయం, సాయంత్రం వేళల్లో వివరాలను నమోదు చేస్తున్నప్పటికీ మహిళలు ఉదయంపూట మాత్రమే పనిచేస్తున్నారు. ఎండప్రభావంతో కేవలం రోజుకు 20 గృహాల నుంచి 25 గృహాల వివరాలను యాప్లో నమోదు చేయాల్సి వస్తోందని ఎన్యుమరేటర్లు పేర్కొంటున్నారు. కరీంనగర్ అర్బన్: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడంలో బ్యాంకు అనుసంధాన రుణాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇకపై రుణాల మంజూరులో సభ్యుల పనితీరును ప్రామాణికంగా భావించా లని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం మహిళా సంఘాల పనితీరు ఆధారంగా మార్కులు కేటా యించే పద్ధతిని తీసుకువచ్చింది. క్రమం తప్పకుండా సమావేశాల నిర్వహణ, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడం తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకోనున్నారు. అందుకోసం సెర్ఫ్ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. గతానికి భిన్నంగా మార్కుల కేటాయింపు స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు గతాని కి భిన్నంగా మార్కులు కేటాయిస్తున్నారు. ఒక ఇంట్లో ఇద్దరు సభ్యులు ఉంటే సమావేశానికి ఒకరు హాజరై ఇద్దరి సంతకాలు చేసేవారు. ప్రస్తుతం అలా కుదరదు. పొదుపు సంఘాల సమావేశాల నిర్వహణ, అప్పులు వసూలు, రుణాల చెల్లింపులు తదితర సనులన్నీ పారదర్శకంగా జరగనున్నాయి. సమావేశ చిత్రాలను ప్రత్యేక పోర్టల్లో ఆప్లోడ్ చేయాలి. దీంతో సంఘంలో ఏం జరుగుతుందో ప్రతి సభ్యురాలు తెలుసుకునేందుకు వీలుంటుంది. జిల్లాలో 74.7 శాతం సంఘాలు మిగిలిన సంఘాలు కూడా పనితీరును మెరుగుపరుచుకొని ‘ఏ’ గ్రేడు సాధించేలా సీసీలు, మండల సమాఖ్య అధికారులు చొరవ చూపుతున్నారు. జిల్లాలో అత్యధిక సంఘాలు ‘ఏ’ గేడులో ఉన్నాయని, మిగితావాటిని మొదటి గ్రేడు కు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు వివరించారు. కొలమానం ఇలా జిల్లాలో స్వయం సహాయక సంఘాలు 12,468 ఉండగా 1,36,536 మంది సభ్యులున్నారు. గ్రేడింగ్ విధానంలో మహిళా సంఘాలకు ఎనిమిది అంశాల ఆధారంగా ఏ, బీ, సీ, డీ గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఒక్కో సంఘం 75శాతానికి పైగా లక్ష్యాలు సాధిస్తే ‘ఏ’ గ్రేడ్, 70–75కు ‘బీ’, 60–70కు ‘సీ’, 60శాతం కన్నా తక్కువ సాధిస్తే ‘డీ’, అంతకంటే దయనీయంగా ఉంటే ‘ఈ’ గ్రేడ్గా నిర్ణయిస్తారు. ఇప్పటివరకు గ్రామైఖ్య సంఘాలకు మాత్రమే గ్రేడింగ్ విధానం అమల్లో ఉంది. ఏ, బీ, సీ గ్రేడింగ్లో ఉన్న గ్రామైఖ్య సంఘాలకే సీ్త్ర నిధి రుణాలు కేటాయిస్తున్నారు. గ్రేడింగ్లో వెనకబడితే బ్యాంకు, సీ్త్ర నిధి రుణాలు పొందడం కష్టంగా మారనుంది. పెరగనున్న అధికారుల పర్యవేక్షణ గ్రేడింగ్ విధానం అమలులోకి రావడంతో మహిళా సంఘాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెరగనుంది. ఇప్పటికే సమావేశాలకు సంబంధించి ఆక్షాంశ, రేఖాంశాలతో కూడిన లైవ్ ఫోటో తప్పనిసరి చేశారు. రుణ వాయిదాల రికవరీపై ప్రత్యేక దృిష్టి సారిస్తున్నారు. తరచూ సమావేశాల నిర్వహణతో రుణాల చెల్లింపులో వెనుకబడిన సంఘాల సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రేడింగ్లో ఎప్పుడు ముందుండేలా సంఘాల వారీగా అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని సమీక్షలు నిర్వహించి కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.జూలైలో ఉపాధ్యాయ బదిలీలుకరీంనగర్ టౌన్: ఉపాధ్యాయులకు జూలైలో పదోన్నతితో కూడిన బదిలీలు ఉంటాయని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు ఐలేని కరుణాకర్రెడ్డి అధ్యక్షతన పదోతరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించిన 139 ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, 70 మంది మండల టాపర్లను మంగళవారం సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఏకీకృత సర్వీస్ రూల్స్ ఇప్పించే బాధ్యత తనదన్నారు. ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్లుగా, ఎంఈవోలుగా పదోన్నతులు రానున్నాయని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి జైపాల్రెడ్డి, అబ్దుల్ జమీల్, శ్రీకాంత్రావు, లక్ష్మీనారాయణ, జాలి మహేందర్రెడ్డి, జాలి రాఘవరెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు తిరుపతిరెడ్డి, బాల్రెడ్డి పాల్గొన్నారు.44 డిగ్రీలు 43 డిగ్రీలుచొప్పదండి :ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు, గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 11 గంటల్లోగా పనులు చూసుకోవాలి. బయటకు వెళ్లాలంటే గొడుగులు, టోపీలు, తెల్లని వదులైన దుస్తులు ధరించాలి. ఎండలో తిరగడం వల్ల వడదెబ్బ తగిలి ప్రాణాపాయం వచ్చే అవకాశం ఉంది. వడదెబ్బ వస్తే సమీప వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి, కరీంనగర్ -
సలుపుతున్న రాచపుండు!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ శివారులోని సదాశివపల్లిలో రెండు దశాబ్దాలుగా కేన్సర్ భయాందోళనకు గురిచేస్తోంది. పదేళ్ల వ్యవధిలో గ్రామంలో 25 మందికిపైగా కేన్సర్తో మృతి చెందిన ఘటనలు ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. రైస్ మిల్లుల కారణంగా గాలి, భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు రోగాలతో ఇబ్బంది పడుతున్నారు. అంతుచిక్కని మరణాలపై ‘సాక్షి’లో ‘సదాశివపల్లికి ఏమైంది?’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనానికి వైద్యారోగ్యశాఖ స్పందించింది. డీఎంహెచ్వో వెంకటరమణ హుటాహుటిన వైద్యశిభిరం ఏర్పాట్లు చేశారు. అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హౌజింగ్బోర్డు పరిధిలోని సదాశివపల్లిలో కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ప్రారంభ దశలోనే కేన్సర్ను గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని, అందుకే స్క్రీనింగ్ పరీక్షలు ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని డీఎంహెచ్వో సూచించారు. సలుపుతున్న రాచపుండు సదాశివపల్లిని కేన్సర్ రూపంలో రాచపుండు సలుపుతోంది. ఇప్పటికే 25 మంది వరకు మృత్యువాతపడగా, వైద్యశిబిరంలో మరో రెండు కేసులు బయటపడ్డాయి. పరీక్షల్లో 27 మందికి బీపీ, 14 మందికి షుగర్ లక్షణాలు ఉన్నట్లు తేలింది. గ్రామ ప్రజలందరికీ సమగ్ర పరీక్షలు నిర్వహిస్తే మరిన్ని కేసులు బయటపడే అవకాశముందని వైద్యవర్గాలు భావిస్తున్నాయి. 14ఏళ్లు నిండిన బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ అందించారు. కేన్సర్ నివారణ చర్యలు, జీవనశైలి మార్పులు, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. డాక్టర్లు ఉమాశ్రీ, విప్లవశ్రీ, రాజ్కుమార్, పోచయ్య, జీవన్రెడ్డి పాల్గొన్నారు. అనుమానితులందరికీ వైద్య పరీక్షలు సదాశివపల్లిలో అనుమానితులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కార్యాచరణ చేపట్టాం. మంగళవారం నిర్వహించిన వైద్య శిభిరంలో ఇద్దరికి కేన్సర్ నిర్ధారణ అయింది. పరీక్షలు రెగ్యులర్గా నిర్వహించి ఇంకా ఎవరికై నా వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స అందిస్తాం. గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి వైద్య సేవలు చేపడతాం. – డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్వో -
హోటళ్లు, లాడ్జీలపై నిఘా పెంచాం
కరీంనగర్క్రైం: నగరంలో ఇటీవల జరిగిన పీఎంజే జువెల్లరీ దోపిడీని దృష్టిలో పెట్టుకొని కమిషనరేట్ పరిధిలోని హోటళ్లు, లాడ్జీల యజమానులు, నిర్వాహకులతో మంగళవారం సీపీ గౌస్ ఆలం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయుధాలతో కూడిన ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠా నకిలీ ఆధార్ కార్డులు, తప్పుడు ఫోన్ నంబర్లు, తప్పుడు చిరునామాలు ఇచ్చి నగరంలోని పలు హోటళ్లలో దాదాపు రెండు నెలల పాటు బస చేసినట్లు విచారణలో తేలిందన్నారు. హోటల్, లాడ్జీల్లో రూంలు కేటాయించే ముందు ప్రభుత్వ గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. కస్టమర్లు ఇచ్చే మొబైల్ నంబర్ పనిచేస్తుందో లేదో క్రాస్ చెక్ చేసుకోవాలన్నారు. భారీ నగదు లావాదేవీలు చేసే వారి వివరాలను పోలీసులకు చేరవేయాలన్నారు. ప్రతీ లాడ్జీ, హోటల్పై నిఘా పెంచామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీఐలు రాంచందర్రావు, సృజన్రెడ్డి, తిరుమల్ పాల్గొన్నారు. చెక్పోస్టుల తనిఖీ బక్రీద్ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణాను అరి కట్టేందుకు ఏర్పాటు చేసిన చెక్పోస్టులను సీపీ గౌస్ ఆలం మంగళవారం తనిఖీ చేశారు. కొత్తపల్లి మండలం చింతకుంట, గంగాధర మండలం తుర్కాసినగర్, చొప్పదండి మండలంలోని ఆర్నకొండ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులను సందర్శించి, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. తనిఖీ రిజిష్టర్లను పరిశీలించి, ప్రతీ వాహనం వివరాలను నమోదు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల పనితీరును గమనించారు. శిక్షణ ఐపీఎస్ సోహం సునీల్, రూరల్ ఏసీపీ విజయకుమార్, సీఐలు బిల్లా కోటేశ్వర్, ప్రదీప్ కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు. సీపీకి అభినందనలు పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసును 11 రోజుల్లో ఛేదించిన సీపీ గౌస్ ఆలం, పోలీసు బృందానికి జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, తాడిజెర్రి సర్పంచ్ రామిడి రాజిరెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు. -
లింగనిర్ధారణ చట్టరీత్యా నేరం
కరీంనగర్/కరీంనగర్ అర్బన్: లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ చాంబర్లో జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ సమావేశం చైర్మన్, కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ చిత్రామిశ్రా మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వైద్య బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, అవసరమైతే పోలీసుశాఖ సహకారం తీసుకోవాలన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ మాట్లాడుతూ భ్రూణహత్యలను పూర్తిగా నివారించడంతో పాటు ఆడపిల్లల విషయంలో వివక్షను తగ్గించి, మహిళల హక్కులను పరిరక్షించే దిశగా అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. పీసీపీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మూడు నుంచి ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. డీసీపీ వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, పీసీపీఎన్డీటీ ప్రోగ్రాం ఆఫీసర్ సనా, ప్రకృతి, ప్రశాంతి, భువన పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తరలించిన ధాన్యం మిల్లుల్లో సత్వరమే అన్లోడింగ్ చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో కె.మహేశ్వర్, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, పౌరసరఫరాల డీఎం రజనీకాంత్, సహకార అధికారి రామానుజచార్యులు, డీఆర్డీవో గీత పాల్గొన్నారు. -
తెలుసుకునేలోపే అయిపోయింది
మా అమ్మ సుశీల గృహిణి. వ్యవసాయం, ఇల్లు తప్ప మరే వ్యాపకాలు లేవు. ఇటీవల అకస్మాత్తుగా అమ్మ అనారోగ్యం పాలయ్యారు. వైద్యపరీక్షల్లో ఆమెకు కేన్సర్ అని తెలుసుకుని అవాక్కయ్యాం. అది కూడా ఫోర్త్ స్టేజ్ కావడంతో ఏమీ చేయలేకపోయాం. తక్కువ వ్యవధిలోనే అమ్మను కోల్పోయాం. మా అమ్మకు కేన్సర్ ఎలా సోకింది? అన్నది ఇప్పటికీ మిస్టరీనే. – నల్ల శ్రవణ్రెడ్డి మా నాన్న ప్రతాపరెడ్డి. స్థానిక మిల్లులో ఆపరేటర్గా పనిచేసేవారు. ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. కనీసం కల్లు కూడా తాగే వారు కాదు. మంచి ఆరోగ్యంగా ఉండేవారు. కానీ, అకస్మాత్తుగా ఆయనకు కేన్సర్ అని తెలిసి ఆశ్చర్యపోయాం. చికిత్స జరుగతుండగానే ఆయన మరణించారు. స్థానికంగా కాలుష్యం వల్ల కూడా ఆయనకు కేన్సర్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నాం. – అన్నాడి కృష్ణారెడ్డి -
అమ్మా.. ఆవేదన ఆలకించరూ..
కరీంనగర్ అర్బన్: ‘ప్రతీ సోమవారం కలెక్టరేట్కు వస్తున్నాం.. పోతున్నాం.. సమస్యలు మాత్రమే అలాగే ఉంటున్నయ్.. మండుటెండలో మాకిదేం బాధమ్మా’.. అంటూ వృద్ధులు, అర్జీదారులు వాపోయారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ చిత్రా మిశ్రాతో గోడు వెల్లబోసుకున్నారు. తమ పిల్లలు పట్టించుకోవడం లేదని నాలుగువారాలుగా ప్రజావాణికి వస్తున్నామని, అయినా సాంత్వన కరవైందని వృద్ధ దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. ఒక్కొక్కరిది ఒక్కో గాథ కాగా కలెక్టర్కు వివరిస్తూ పరిష్కరించాలని వేడుకున్నారు. ప్రధానంగా భూ సమస్యలు, కుమారుల నిరాదరణ, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లకు సంబంధించిన అర్జీలు రాగా కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో మహేశ్వర్, కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ అర్జీలను స్వీకరించారు. ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను నిర్లక్ష్యం చేస్తే సహించేదిలేదని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. ఈ సందర్బంగా పలువురు ‘సాక్షి’తో తమ ఆవేదన వ్యక్తం చేశారు. వారి మాటల్లోనే..జవాబుదారిగా ఉండాల్సిన సర్పంచ్ అసభ్యకరంగా మాట్లాడుతోంది. గ్రామంలో జరిగిన అక్రమాలపై పలువురు ఫిర్యాదు చేస్తే ఇటీవల జరిగిన సమావేశఽంలో తీవ్ర పరుష పదజాలంతో దూషించింది. దళిత సర్పంచినంటూ ఇబ్బందికరంగా మాట్లాడుతుండగా పరిపాలన ఇబ్బందిగా మారింది. ఎవరూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా చెప్పుతో కొడతానంటున్నారు. ఇదేం పద్ధతి. – చింతల శ్రీధర్రెడ్డి, ఉపసర్పంచ్, లింగాపూర్, శంకరపట్నంమరిది కొడుకు వెంకటేశ్కు ఇంట్లో ఆశ్రయమిచ్చాను. నా భర్త చనిపోయాక అతని పేరున ఉన్న డబ్బులు తీసుకునేందుకు నామిని సంతకం కావాలని చెప్పి నాతో బాండ్ పేపర్పై వేలిముద్రలు తీసుకున్నాడు. తీరా అది వేరేవారితో చదివిస్తే దత్తత అని రాయించుకున్నట్లు తెలిసింది. ఉన్న ఆస్తిని తన పేరున రాయాలని ఒత్తిడి చేస్తూ, మానసిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నాడు. నాతో పాటు నా భూమి కొనుగోలు చేసిన ముస్కు లక్ష్మి, వేల్పుల శ్రీనివాస్ కుటుంబాలకు కూడా ప్రాణహాని ఉంది. పోలీసు రక్షణ కల్పించి అతడిని వెంటనే నా ఇంటి నుంచి ఖాళీ చేయించండి. – వేల్పుల రాధమ్మ, ఉప్పరమల్యాల, గంగాధర రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు మావి. రోజువారీగా లేబర్ అడ్డాకు వెళ్లి పనులు వెతుక్కుంటాం. ఉండటానికి ఇల్లు లేదు. కిరాయి ఇళ్లలో ఉంటున్నాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేస్తే మాకు ఇదివరకే బంగ్లా, కార్లు ఉన్నాయని ఆన్లైన్లో చూపిస్తుందట. ఇదెక్కడి అన్యాయం. అన్ని ఉన్నాయని నమోదు చేసిన అధికారులెవరూ.? అవెక్కడున్నాయో అధికారులే చూపించాలి. – రాజమణి, పద్మ, చల్లా పద్మ, చింతకుంట, కొత్తపల్లి ఎస్సారెస్పీ కాలువలో పోయిన భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. సర్వే నంబర్ 543/ఎ లోని భూమిలో రైస్మిల్లు నిర్మించారు. ఉన్న కొద్దిపాటి భూమికి మరింత భూమిని కలిపి రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ చేశారు. అంతా తెలిసి కూడా రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు.? అక్రమ నిర్మాణాలు జరిగినా మిన్నకుండటమేంటీ.? – రాజిరెడ్డి, ముగ్ధంపూర్, కరీంనగర్రూరల్జీవో 81ను అమలు చేయకుండా నాన్చడం తగదు. 61 ఏళ్లు నిండినవారి వారసులకు కారుణ్య నియామకాలు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదు. గత ప్రభుత్వం 81,85 జీవోలను జారీ చేయగా తహసీల్దార్ కార్యాలయాల నుంచి వివరాలు సేకరించారు. కానీ నేటికి నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. ప్రభుత్వం తక్షణమే చొరవ చూపి న్యాయం చేయాలి. – తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా జేఏసీ -
బది‘లీలలు’..పైరవీలు
కరీంనగర్ అర్బన్: ఉద్యోగుల సాధారణ బదిలీల్లో అనేక అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు శాఖల్లో ఇష్టారీతిగా వసూళ్ల దందా సాగుతోందని, ఇందులో ద్వితీయ శ్రేణి నేతలు రంగప్రవేశం చేశారని సమాచారం. ఇటీవల సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో పలువురు అధికారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. జిల్లా, మల్టీజోన్ పరిధిలో బదిలీలు జరుగుతున్న నేపథ్యంలో ఎవరికివారు పైరవీలకు తెరలేపారు. కొందరు మంత్రుల సహకారం కోరుతున్నారు. మరికొందరు అధికారులను ప్రసన్నం చేసుకుంటున్నారు. కాగా, ఎక్కడైనా పని చేస్తామనుకునేవారు వీరి నిర్వాకాన్ని చూసి నిర్ఘాంతపోతున్నారు. ఈ నెల 1నుంచి 7 వరకు ఉద్యోగులు/ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు, సీనియారిటీ జాబితా, ఖాళీల ప్రదర్శన, బదిలీ అయ్యే ఉద్యోగుల జాబితాను రూపొందించారు. ఈ నెల 15వరకు ఉద్యోగుల ఆప్షన్లతో కూడిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. కదపకుంటే కాసులే కాసులు కలెక్టరేట్లో అక్కడక్కడే పనిచేసే ఉద్యోగులతోపాటు అధికారులూ ఉన్నారు. వారిలో సింహభా గం ఇక్కడి నుంచి వెళ్లేందుకు విముఖత చూపుతున్నారు. అదే క్రమంలో తమకున్న పలుకుబడిని విని యోగిస్తున్నారు. బదిలీల నిబంధనల్లో 40శాతం మించకుండా ఉండరాదన్న కారణాన్ని బూచిగా చూపి సీటు కదలకుండా పావులు కదుపుతున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ట్రెజరీ, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలో ఎక్కువగా పైరవీలు సాగుతున్నట్లు తెలుస్తోంది. బదిలీ తప్పనిసరి అయ్యే ఉద్యోగుల జాబితా నుంచి వెసులుబాటు కల్పించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనుకూల పోస్టుకు పైరవీలు విద్య, పోలీస్, వాణిజ్య పన్నులు, ఎకై ్సజ్, రవాణా, అటవీశాఖ ఉద్యోగులు మినహా మిగిలిన 40కి పైగా ప్రభుత్వ శాఖల్లో బదిలీల సందడి నెలకొంది. ఈ క్రమంలో అనుకూల ప్రాంతంలో పోస్టింగ్ కోసం పలుకుబడి, రాజకీయ నేపథ్యం, మంత్రులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, రాజకీయ నేతలను కలుస్తూ ఎవరికి వారుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కీలక స్థానాల్లోనే ఉండేలా కసరత్తు చేస్తున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏఈలు, ఏవోలు, ఏపీవోలతోపాటు ఇరిగేషన్, తదితర శాఖల అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మూడేళ్లు ఒకేచోట పనిచేసి ఉంటే బదిలీకి అర్హులు. నాలుగేళ్లు ఒకేచోట పనిచేసిన ఉద్యోగికి బదిలీ తప్పనిసరి. 2027 మే 31కి ముందుగా రిటైర్డ్ అయ్యేవారికి బదిలీ ఉండదు. ఎక్కువమంది ఒకే చోట కోరితే స్పౌజ్ కేటగిరితో పాటు 70శాతం వైకల్యం ఉన్న ఉద్యోగులు, మానసిక వైకల్యంతో కూడిన పిల్లలున్న ఉద్యోగులు, వితంతువులు, మెడికల్ గ్రౌండ్స్ ఉన్న ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కేడర్ వారీగా బదిలీల బాధ్యతలు బదిలీలను రాష్ట్రస్థాయి, మల్టీజోన్, జోనల్, జిల్లా కేడర్గా విభజించారు. ఆయా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసి బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. రాష్ట్రస్థాయిలో పోస్టులకు శాఖకు సంబంధించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి చైర్మన్గా వ్యవహరించనున్నారు. హెచ్వోడీ కన్వీనర్గా, అదనపు, సంయుక్త, ఉప కార్యదర్శులు సభ్యులుగా ఉండనున్నారు. అలాగే మల్టీజోనల్, జోనల్ స్థాయి పోస్టుల బదిలీలకు హెచ్వోడీ చైర్మన్గా, కార్యదర్శి సూచించినవారు సభ్యులుగా, హెచ్వోడీ సూచించినవారు కన్వీసర్గా వ్యవహరించనున్నారు. జిల్లా కేడర్ పోస్టులకు కలెక్టర్ చైర్మన్గా, అదనపు కలెక్టర్, డీఆర్వో సభ్యులుగా.. శాఖకు సంబంధించిన జిల్లా అధికారి కన్వీనర్గా వ్యవహరించనున్నారు. -
బండి భగీరథ్పై కఠిన చర్యలు తీసుకోవాలి
కరీంనగర్టౌన్: మైనర్ బాలిక విషయంలో అరెస్ట్ అయిన బండి భగీరథ్పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సోమవారం తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. కేంద్ర మంత్రి, ఆయన కుమారుడి ఫ్లెక్సీ దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ, బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. మాజీ మేయర్ సర్దార్ రవీందర్సింగ్, నారదాసు లక్ష్మణ్రావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, పొన్నం అనిల్కుమార్, రవీందర్రెడ్డి, అశోక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఏమైంది..?
సదాశివపల్లికిసాక్షి ప్రతినిధి, కరీంనగర్: అది దాదాపు రెండువేల జనాభా గల కరీంనగర్ శివారులోని చిన్న గ్రామం. తీగల వంతెనను ఆనుకుని చూసేందుకు అందంగా కనిపిస్తుంది ఈ గ్రామం. ఇటీవలే దీన్ని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేశారు. ప్రస్తుతం గ్రామంలో అంతుచిక్కని మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దశాబ్దకాలంలో సుమారు 25 మంది వరకు అనారోగ్య కారణాలతో సంభవించిన మరణాలపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. వారంతా అకాల మరణం చెందారని, ఇందుకు కేన్సరే కారణమన్నది మిగిలిన గ్రామస్తుల్లో కలవరపాటుకు కారణమవుతోంది. ఆకస్మిక మరణాలకు కేన్సర్ కారణమని తెలిసినప్పటి నుంచి గ్రామంలో విద్యావంతులు, కాస్త స్థితిమంతులు ముందు జాగ్రత్తగా స్క్రీనింగ్ పరీక్షలకు సిద్ధమవుతుండడం గమనార్హం. అసలేం జరుగుతోంది? సదాశివపల్లి కరీంనగర్ నగరాన్ని ఆనుకుని ఉన్న గ్రామం. ఈ ఊరు ఇటు మానకొండూరుకు చెరువుకు, అటు కరీంనగర్ను ఆనుకుని ప్రవహిస్తున్న మానేరువాగుకు మధ్యలో ఉంటుంది. ఈ అనుకూలత కారణంగా దశాబ్దాల క్రితం ఇక్కడ అనేక రైస్మిల్లులు స్థాపించారు. రైస్మిల్లుల కారణంగా ఇక్కడ గాలి, భూగర్భజలాలు కలుషితమై ప్రజలు ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పంట కోతలు పూర్తయి.. వరి మిల్లుల్లో ఆడించే సమయంలో వరి పొట్టు, బూడిద, ఇతర దుర్వాసనలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వేసవిలో పారా బాయిల్డ్ రైస్ మిల్లలు నుంచి వచ్చే దుర్వాసన భరించలేకపోతున్నామని వాపోతున్నారు. ఇదే క్రమంలో కొన్నేళ్లుగా గ్రామంలో అనారోగ్యంతో చనిపోతున్న పలువురు వ్యక్తుల మరణాలపై తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. వీరంతా కేన్సర్లతో మరణిస్తున్నారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. అయితే, ఒకే గ్రామంలో 25 మంది వరకు కేన్సర్తో మరణించడం, మరో 20 మంది వరకు కేన్సర్ లక్షణాలతో చికిత్స పొందుతున్నారన్న వార్త కలవరపాటుకు గురిచేస్తుంది. శాసీ్త్రయత ఎక్కడ? చిన్న గ్రామంలో ఇంత మంది కేన్సర్బారిన పడ్డారన్న విషయం ఆందోళనకరం. కానీ, మరణించిన వారికి కేన్సర్ ఎందుకు వచ్చింది? మిగిలిన వారికి ఎలా సోకింది? అన్న విషయం వీరెవరికీ అంతు చిక్కడం లేదు. కేన్సర్ మహమ్మారి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. దానికి స్థానికంగా కాలుష్యం ఒక కారణం మాత్రమే. ఆ కాలుష్యమే బాధితులకు కేన్సర్ రావడానికి కారణంగా నిలిచిందా? అన్న ప్రశ్నకు వైద్యారోగ్య శాఖ అధికారులే సమాధానం చెప్పాలి. దీనికి శాసీ్త్రయంగా వైద్య పరీక్షలు జరిపితే గానీ, అసలు లోపం ఎక్కడుంది? ఏ కారణం వల్ల ప్రజలు జబ్బు పడుతున్నారన్న విషయంపై స్పష్టత రాదు. దీనిపై డీఎంహెచ్వో వెంకటరమణను వివరణ కోరగా.. త్వరలో వైద్యపరీక్షల ద్వారా స్క్రీనింగ్ చేసి వాస్తవాలు తెలుసుకుంటామని వెల్లడించారు. -
బలహీనవర్గాల సంక్షేమానికి కృషి
కరీంనగర్కార్పొరేషన్: బలహీనవర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం నగరంలోని ఇందిరాభవన్లో రాష్ట్ర మున్నూరుకాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి అభినందన సభకు హాజరై మాట్లాడారు. కులం, మతం కన్నా విద్యతోనే పురోగతి ఉంటుందని, అందుకే ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. కుల సంఘాలకు హైదరాబాద్లో కేటాయించిన స్థలాల్లో త్వరలోనే మహాత్మా జ్యోతి బాపూలే ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ, మున్నూరుకాపుల సంక్షేమానికి ఎంతగానో పాటుపడిన బొమ్మ వెంకటేశ్వర్ కుమారుడికి పదవి రావడం సంతోషకరమన్నారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణనలో కులం కాలమ్ను చేర్చాలన్నారు. చైర్మన్గా నియమితులైన అనంతరం మొదటిసారి జిల్లాకు వచ్చిన శ్రీరాంకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. త్వరలోనే బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. క్రియాశీలకంగా వ్యవహరించండి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కాంగ్రెస్ శ్రేణులు క్రియాశీలకంగా వ్యవహరించాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలన్నారు. సగం ధాన్యం కొనుగోళ్లు పూర్తి కరీంనగర్అర్బన్: జిల్లాలో 50 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వరి, మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టరేట్లో సమీక్షించారు. ఈ సీజన్లో 3.61 టన్నుల ధాన్యం కేంద్రాలకు వస్తుందని అంచనా వేశామన్నారు. కలెక్టర్ చిత్రామిశ్రా మాట్లాడుతూ, 50శాతం కొనుగోళ్లు చేసి రాష్ట్రస్థాయిలో ముందున్నామన్నారు. పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్, సీపీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్బాబు తదితరులు పాల్గొన్నారు. -
పెట్రో ధరలు తగ్గించాలి
కరీంనగర్కార్పొరేషన్: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సోమవారం మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలోని డీసీసీ కార్యాలయం నుంచి పద్మనగర్ డెయిరీ పెట్రోల్ బంక్ వరకు ప్రదర్శనగా వచ్చి నిరసన తెలిపారు. సామాన్య ప్రజలపై కేంద్రం భారం మోపిందని జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి అన్నారు. గాజుల సుకన్య, వంగల కల్యాణి, రజితా రెడ్డి, కవ్వ పద్మ పాల్గొన్నారు. పీఆర్సీ ప్రకటించాలి కరీంనగర్టౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు 50శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాదవ్ వెంకటరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని సుభాష్నగర్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగ, ఉపాధ్యాయులను తప్పుదోవ పట్టిస్తున్నదని, పీఆర్సీ కోసం మరో పోరాటం చేయక తప్పదని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఉమ్మడి జిల్లా నాయకులు భూక్య రాజేశ్నాయక్, క్రాంతికుమార్, ధర్మాజీ, చాందిని, గుండారపు పోతన్న, గంగన్న, సాయన్న తదితరులు పాల్గొన్నారు. 20న మెడికల్ షాపులు బంద్కరీంనగర్: ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ–ఫార్మసీ విధానాలు, తదితర అంశాలపై నిరసనగా ఈనెల 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ చేయనున్నట్లు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి మునీందర్ తెలిపారు. సోమవారం నగరంలో ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. ఈ–ఫార్మసీలకు సంబంధించిన నోటిఫికేషన్ వల్ల చిన్న మెడికల్ షాపులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. కరోనా సమయంలో తీసుకొచ్చిన నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మెడికల్ షాప్ల యజమానులు పాల్గొన్నారు. కళాకారులకు సంక్షేమ పథకాలు అందించాలి కరీంనగర్టౌన్: రాష్ట్రంలోని అన్నిరంగాల కళాకారులను గుర్తించి సంక్షేమ పథకాలను అందించడంతో పాటు, పెన్షన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు వరుకోలు సదానందం కోరారు. సోమవారం బద్దం ఎల్లారెడ్డి భవన్లో తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర 4వ మహాసభల పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజానాట్య మండలి మహాసభలు ఈనెల 25,26వ తేదీల్లో హైదారాబాద్లో జరుగుతాయని, కళాకారులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, ఉపాధ్యక్షురాలు కోమల, సహాయ కార్యదర్శులు మంజుల, సదానందం, కోశాధికారి రాజమౌళి, జిల్లా కార్యవర్గ సభ్యులు రవి, సముద్రాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు డ్రైవ్ ప్రారంభంకరీంనగర్: రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ప్రత్యేక డ్రైవ్ను కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు చిత్రా మిశ్రా సోమవారం ప్రారంభించారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు (క్రిమినల్ కేసులు లేనివారు) రెడ్ క్రాస్ సభ్యత్వం పొందవచ్చని తెలిపారు. సభ్యత్వం కోసం దరఖాస్తు ఫాం, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డు ప్రతిని సమర్పించి రూ.1,100 శాశ్వత సభ్యత్వ ఫీజు చెల్లించాలని సూచించారు. ఈనెల 15 నుంచి జూన్ 15 వరకు రోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు (ఆదివారం మినహా) రెడ్ క్రాస్ కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని చైర్మన్ పి.కేశవరెడ్డి తెలిపారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో ఉపాధిహామీ కూలీ మృతి
ఇబ్రహీంపట్నం: మండలంలోని వేములకుర్తిలో సోమవారం గుండెపోటుతో ఉపాధి కూలీ అంకతి మల్లవ్వ (56) మృతి చెందారు. గ్రామశివారులో కొత్త రాముని గుండ్లవద్ద కంటూరు కందకాలు తవ్వేందుకు వెళ్లిన ఆమె పనులు చేస్తుండగానే చాతిలో నొప్పి వస్తోందంటూ కుప్పకూలిపోయింది. తోటి కూలీలు మెట్పల్లి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి సుల్తానాబాద్రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారు రాజీవ్ రహదారిపై సోమవారం ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొని జుపక రాహుల్(27)అనే సెంట్రింగ్ వర్కర్ మృతి చెందాడు. ఎస్సై వేణుగోపాల్ కథనం ప్రకారం.. సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన రాహుల్ కాట్నపల్లిలోని అత్తగాంటికి వెళ్లి తిరిగి సుద్దాలకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య ప్రవళిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. మృతుడికి బాబు(1) ఉన్నాడు. -
చెట్టమ్మ
పచ్చని తల్లిరా మన చెట్టు మూగజీవాలకు నీడపట్టు పక్షి పిల్లలకు గూడుకట్టు స్వచ్ఛమైన గాలిని వీచిపెట్టు బాటసారులకు విశ్రాంతి గట్టు ! ఆరోగ్యానికి పండ్లు కోసిపెట్టు అనారోగ్యానికి మందు రాసిపెట్టు విస్తారమైన వర్షాలను రాబట్టు కరువు కాటకాలను పోగొట్టు గొడ్డలితో నరికితే పగబట్టు ! ప్రేమతో సాకితే ప్రాణభిక్ష పెట్టు మొక్కలు నాటుటకు నడుంకట్టు హరిత సేవకు శ్రీకారం చుట్టు ప్రకృతి సంపదకు హారతి పట్టు చెట్టమ్మకు చెయ్యెత్తి జైకొట్టు !!! బోనగిరి. పాండురంగ తొర్రూరు టౌన్ జిల్లా: మహబూబాబాద్ -
ఎండాకాలం.. బండి పైలం
Heat Waveకరీంనగర్/జ్యోతినగర్: రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలకే కాకుండా వాహనాల భద్రతకూ సవాలుగా మారుతున్నాయి. మనిషి ఎండ నుంచి రక్షణ పొందేందుకు ఎంత జాగ్రత్త తీసుకుంటారో, వాహనాలు, ఎలక్ట్ట్రానిక్ పరికరాలను కాపాడుకునేందుకు అంతే జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరముంది. వాహనాలను ఎండలో గంటల తరబడి పార్కింగ్ చేయడం వల్ల పెట్రోల్ ఆవిరైపోవడం, ఇంజిన్ వేడెక్కడం, టైర్లలో ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని మెకానికల్ ఇంజినీరింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే వాహనాల్లో మంటలు చెలరేగే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ● వాహనాలను ఎక్కువసేపు ఎండలో పార్క్ చేయొద్దు. సాధ్యమైనంత వరకు చెట్ల నీడ లేదా షెడ్లలో నిలపాలి. వాహన రేడియేటర్లో నీటి స్థాయిని తరచూ పరిశీలించాలి. టైర్లలో గాలి ఒత్తిడి సరిగా ఉందో లేదో చెక్ చేయాలి. ఇంజిన్ ఆయిల్, కూలెంట్ స్థాయిలను నిరంతరం పరిశీలించాలి. ప్రయాణానికి ముందు బ్రేకులు, బ్యాటరీ పరిస్థితిని తనిఖీ చేయాలి. పెట్రోల్, డీజిల్ను కాకుండా రాత్రి, సాయంత్రం సమయాల్లో నింపడం మంచిది. ● గ్యాస్ కిట్లతో నడిచే వాహనాలను మరింత జాగ్రత్తగా ఉపయోగించాలి. అధిక వేడి సమయంలో దీర్ఘకాల ప్రయాణాలు తగ్గించడం మంచిది. వాహనాల్లో ఏసీ నిల్వ ఉండేందుకు అద్దాలకు క్లాత్ మ్యాట్స్ ఉపయోగించడం ప్రయోజనకరం. ● వేసవిలో మొబైల్ ఫోన్లు త్వరగా వేడెక్కే అవకాశం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల బ్యాటరీ పనితీరు తగ్గిపోవడం, పేలుడు ప్రమాదం కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫోన్లను ఎండలో ఉంచొద్దు. చార్జింగ్ సమయంలో ఫోన్ను ఉపయోగించకూడదు. లోకేషన్, బ్లూటూత్, హాట్స్పాట్ వంటి అవసరం లేని ఫీచర్లను ఆఫ్ చేయాలి. నకిలీ చార్జర్లు, లోకల్ బ్యాటరీలను ఉపయోగించొద్దు. ● ల్యాప్టాప్లు ఎక్కువ వేడితో స్లో కావడం, హ్యాంగ్ అవ్వడం, బ్యాటరీ దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ల్యాప్టాప్ను బెడ్, దుప్పట్లపై కాకుండా గాలి వెళ్లే స్థలంలో ఉపయోగించాలి. కూలింగ్ ప్యాడ్ ఉపయోగించడం మంచిది. ఎక్కువసేపు చార్జింగ్లో ఉంచకుండా జాగ్రత్తపడాలి. ● పవర్ బ్యాంకులు, బ్లూటూత్ ఇయర్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు వంటి పరికరాలను అధిక వేడి నుంచి దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండలో పార్కింగ్తో అగ్ని ప్రమాదాల భయం పెట్రోల్ ఆవిరి, ఇంజిన్ వేడి, టైర్ల పేలుళ్లకు అవకాశం అధిక వేడితో ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లకు ముప్పు జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు వేసవిలో వాహనాలను నీడలో ఉంచాలి. ఇంజిన్ ఆయిల్ మార్పిడి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దూరప్రయాణాలు చేయాల్సి వస్తే మార్గమధ్యలో బండికి కాస్త విరామం ఇవ్వాలి. ద్విచక్రవాహనంలో పెట్రోలు ట్యాంకు ఫుల్గా ఉంచరాదు. – సత్యం, బైక్ మెకానిక్, ఎఫ్సీఐ క్రాస్ రోడ్, ఎన్టీపీసీ ల్యాప్ట్యాపులకు కూలింగ్ ప్యాడ్లను ఉపయోగించాలి. చల్లని ప్రదేశంలో వాడాలి. ఎక్కువ సమయం చార్జింగ్లో ఉండకుండా జాగ్రత్త పడాలి. డేటాను ప్యాకప్ చేసుకోవాలి. – కూర మహేశ్వర్రెడ్డి, విజన్ టెక్నాలజి, ఎన్టీపీసీ -
ఆరోగ్య రక్షణకు హెల్త్ ఇన్సూరెన్స్ అండ
కరీంనగర్: మనిషి ఒక్కసారి తీవ్ర అనారోగ్యం పాలైతే అప్పటి వరకు దాచుకున్న డబ్బంతా వైద్యానికే ఖర్చవుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మానసిక ప్రశాంతతతో జీవించవచ్చని కరీంనగర్ మెడికవర్ వైద్యులు తెలిపారు. సోమవారం నగరంలోని ఓ హోటల్లో హెల్త్ సెక్టార్ ఉద్యోగులు, ప్రజలకు హెల్త్టాక్, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రోగి ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అతనికి అవసరమైన వైద్యాన్ని సమయానికి అందించేందుకు ఇన్సూరెన్స్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆరోగ్య సమస్య వచ్చిన తర్వాత ఆందోళన చెందడం కంటే ముందుగానే ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ఉత్తమమని సూచించారు. ఈ సందర్భంగా సుమారు 150 మందికి వైద పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, వైద్యులు రవికుమార్, లోకేశ్, రాకేశ్, ఉపేందర్రెడ్డి, తాహా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు కుమార్ గోపు, కడార్ల శ్రీనివాస్, మాదాసు సాగర్, హరీశ్, మెడికవర్ మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, దాసరి చంద్రశేఖర్, రఘు తదితరులు పాల్గొన్నారు. -
సముద్రజీవుల పొడుపు కథలు
6. స్వాతి చినుకులై నోరు తెరిచి ఎదురుచూసే సముద్ర జీవి ముత్యమంటి బిడ్డను కని కడుపులోనే దాచుకునే జీవి 4. నీలంగా ఉంటాను నీళ్లల్లో ఉంటాను కెల్లా పెద్ద జంతువును నేనెవరో చెప్పండి? 1. పేరు గుర్రమే కానీ పరుగెత్తలేదు ఉండేది సముద్రమే కానీ చేపకాదు 2. మెదడు లేదు కళ్లు లేవు కానీ ఐదు చేతులుంటాయి నీటిలో మెరిసే నక్షత్రం 5. ఎనిమిది కాళ్లుంటాయి కానీ సాలీడు కాదు నీళ్లలో నివాసముంటుంది కానీ చేప కాదు జవాబులు: 1.సీహార్స్, 2.స్టార్ఫిష్, 3.మొసలి, 4.నీలి తిమింగలం 5. ఆక్టోపస్, 6. ఆల్చిప్ప 3. నీళ్లలో ఉంటే ఏనుగునైనా పట్టేస్తుంది ఒడ్డున పడేస్తే విలవిలలాడుతుంది రంపం లాంటి పళ్లు నోట్లో ఉంటాయి డాక్టర్ కందేపి రాణిప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్, సృజన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, సిరిసిల్ల -
ఇసుక ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి
కరీంనగర్రూరల్: పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఇసుక ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతిచెందడం వివాదాస్పదంగా మారింది. కరీంనగర్రూరల్ ఎస్సై నరేశ్ ఆధ్వర్యంలో ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో గోపాల్పూర్ చౌరస్తా వద్ద పోలీసులు వాహన తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్తూరి చందు ఇసుక ట్రాక్టర్ను పోలీసులు పట్టుకుని పంచనామా చేస్తుండగా, సుల్తానాబాద్ మండలం గొల్ల పల్లికి చెందిన గున్నాల హరీశ్(31) ఇసుక ట్రాక్టర్ను యూటర్న్ చేసుకుని దుర్శేడ్ మీదుగా తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ట్రాక్టర్ హెడ్లైట్లను ఆర్పేసి వేగంగా పోతున్న క్రమంలో దుర్శేడ్ శివారులో నేషనల్ హైవే బ్రిడ్జి వద్ద అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. డ్రైవర్ ఎగిరి కిందపడటంతో తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు వెంటనే హరీశ్ను అంబులెన్స్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రేమ వివాహం చేసుకున్న హరీశ్కు ఇద్దరు చిన్న పిల్లలున్నారు. న్యాయం చేయాలంటూ రాస్తారోకో హరీశ్ మృతిచెందాడనే సమాచారంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసులతో చర్చలు విఫలం కావడంతో న్యాయం చేయాలంటూ మంచిర్యాల చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి మృతుడి కుటుంబీకులను పరామర్శించారు. హరీశ్ మృతికి కారణమైన ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా హరీశ్ ట్రా క్టర్పై ఇప్పటికే రెండు కేసులున్నాయని, మరోసారి పోలీసులు పట్టుకుంటే సీజ్ చేస్తారనే భయంతో తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదం జరిగిందని సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
బీ కేర్ఫుల్
కరీంనగర్స్పోర్ట్స్: వేసవి సెలవుల నేపథ్యంలో మైదానాల్లో చిన్నారుల సందడి నెలకొంది. ఈనెల 1 నుంచి కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. కాగా, ఈ ఏడాది భానుడు భగ్గుమంటున్నాడు. శిక్షణ శిబిరాల్లో చిన్నారులు ఎండదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముందని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. శిక్షణకు ముందే తగినంత నీరు తాగాలి. పుచ్చకాయ, దోసకాయ వంటి నీటి శాతం ఉన్న పండ్లు తినాలి. ప్రాక్టీస్ మధ్యలో ఎలక్ట్రోలైట్ పౌడర్ వాడాలి. ఖాళీ కడుపుతో ఎండలో క్రీడలు ఆడకూడదు. రోజూ ఆకుకూరలు, కూరగాయలు, మజ్జిగ తీసుకోవాలి. నీటిశాతం ఎక్కువగా ఉన్న పండ్ల రసాలు తాగాలి. లేత రంగు దుస్తులు ధరించాలి. తలకు క్యాప్ ధరించడం మర్చిపోవద్దు. శిక్షణ తర్వాత వెంటనే చన్నీళ్లతో స్నానం చేయొద్దు. ఉదయం 9 గంటలలోపు శిక్షణ కార్యక్రమాలు ముగించాలి. సాయంత్రం 5 గంటల తర్వాతే మైదానంలో దిగాలి. నీడ ఉన్న ప్రదేశాల్లో వార్మప్ చేయాలి. శిక్షణ మధ్యలో విరామ సమయాన్ని పెంచాలి. ఎండ ఎక్కువగా ఉంటే ఇండోర్ గేమ్స్పై దృష్టి పెట్టాలి. గాలి సరిగ్గా ఆడని ప్రదేశాల్లో సాధన చేయొవద్దు. శరీరం అలసిపోయినట్లు అనిపిస్తే వెంటనే శిక్షణ ఆపేయాలి.కోచ్ సూచనలు తప్పకుండా పాటించాలి. కంటినిండా నిద్ర (కనీసం 8 గంటలు) ఉండాలి. ● భగ్గుమంటున్న ఎండలు ● క్రీడా శిక్షణ శిబిరాల్లో జాగ్రత్తలు తప్పనిసరి ● కోచ్లు, డాక్టర్ల సలహాలు పాటించాలంటున్న నిపుణులు ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. శిక్షణ శిబిరాల్లో పాల్గొనే విద్యార్థులు, క్రీడాకారులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. తరచూ నీరు, ఓఆర్ఎస్, ఎలక్ట్రోలైట్ పానీయాలు తీసుకోవాలి. అధిక ఎండలో ఎక్కువసేపు సాధన చేయడం వల్ల డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మూత్రం ముదురురంగులో వస్తుంటే మీ శరీరంలో నీరు తగ్గిందని అర్థం. వెంటనే విశ్రాంతి తీసుకోవాలి. – డాక్టర్ వివేక్రావు, పిల్లల వైద్య నిపుణుడు మైదానంలో ఎంత కష్టపడతారో దానికి తగ్గట్టుగా శరీరానికి ఇంధనం అందించాలి. వేసవిలో జంక్ ఫుడ్, నూనె పదార్థాలు తింటే త్వరగా అలసిపోతారు. ప్రతి క్రీడాకారుడు తమ వెంట వాటర్ బాటిల్తో పాటు నిమ్మరసం లేదా గ్లూకోజ్ నీటిని తప్పనిసరిగా ఉంచుకోవాలి. శిక్షణకు ముందు, మధ్యలోతర్వాత కూడా నీరు తాగుతూ ఉండాలి. – వేల్పుల సురేందర్, ఫిజికల్ డైరెక్టర్ -
అకాడమ్మీల దోపిడీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాడమీల పేరుతో ఇంటర్ చదువును వ్యాపారంగా మార్చుతున్నారు. ఎడ్యుకేషన్ సొసైటీలు, కోచింగ్ సెంటర్ల పేరిట విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇంటర్ బోర్డు, విద్యాశాఖ అనుమతి లేకుండా ఐఐటీ, జేఈఈ, నీట్ అకాడమీ అంటూ రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నారు. భారీ హోర్డింగులతో ప్రచారం చేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. కరీంనగర్ జిల్లాకేంద్రంగా నిర్వహిస్తున్న బన్సాల్ క్లాసెస్, ఆకాశ్ ఇనిస్టిట్యూట్కు అనుమతి లేదని, ఐఐటీ, నీట్, ఎప్సెట్ అకాడమీలు ఇంటర్ బోర్డు పరిధిలోకి రావని, వాటిలో విద్యార్థులు ప్రవేశాలు పొంది మోసపోవద్దని, తల్లిదండ్రులు జాగ్రత్తగా పరిశీలించి అనుమతి ఉన్న కళాశాలల్లో చేర్పించాలని డీఐఈవో ఆంజనేయరావు ఇటీవల ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. -
రవాణాపై భారం
ఇప్పటికే రవాణా రంగం కుదేలవుతోంది. గిట్టుబాటు కాకున్నా ఈఎంఐలు కట్టేందుకై నా ట్రాక్టర్ నడపాల్సి వస్తోంది. ప్రస్తుతం పెరిగిన డీజిల్ ధరతో రవాణా ఖర్చు మరింత పెంచాల్సి వస్తోంది. రైతుల ధాన్యం, మక్కలను మార్కెట్కు తరలించాలంటే ఇంతకుముందు దూరాన్ని బట్టి రూ.1500 తీసుకునేది. ఇప్పుడు రూ.1700 తీసుకోవాల్సి వస్తోంది. – రాజు, ట్రాక్టర్ యజమాని ధరల స్థిరీకరణ ఉండాలి ధరల స్థిరీకరణ ఉండేలా ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగగానే ఇతర రంగాలపై పెను భారం పడుతోంది. సదరు రంగాలపై పక్కాగా పర్యవేక్షణ చేసి ఽవినియోగదారులకు ప్రయోజనం కలిగేలా చూడాలి. ధరలు పెంచడం కాకుండా ప్రభుత్వాలు తీసుకునే ట్యాక్స్లు తగ్గించుకుంటే మంచిది. – పత్తెం శ్రీనివాస్, ఉపాధ్యాయుడు -
యూసీఎఫ్ ప్రతిపాదనలు తనిఖీ
కరీంనగర్ కార్పొరేషన్: అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్)లో కరీంనగర్ నగరపాలకసంస్థను చేర్చే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వ అధికారి చేపట్టిన నగర పర్యటన ఆదివారంతో ముగిసింది. శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు నగరంలోని యూసీఎఫ్ ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. నగరపాలకసంస్థ సర్వసభ్యసమావేశం రూపొందించిన మూడుప్రాజెక్ట్లకు సంబంధించిన రూ.895 కోట్ల ప్రతిపాదనలను స్వయంగా పరిశీలించారు. వీటిపై కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖకు నివేదిక అందించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా యూసీఎఫ్లో కరీంనగర్ను చేర్చే అంశాన్ని మంత్రిత్వశాఖ వెల్లడించనుంది. రెండో రోజు పర్యటన యూసీఎఫ్ ప్రతిపాదనలను ఫీల్డ్ లెవెల్లో పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారి దీపు టాం కరీంనగర్కు వచ్చారు. శనివారం రాత్రి నగరానికి వచ్చిన ఆయనకు మేయర్ కొలగాని శ్రీనివాస్, కమిషనర్ ప్రపుల్దేశాయ్ స్వాగతం పలికారు. మొదటి రోజు డంప్యర్డ్తో పాటు, అధికారులతో చర్చించి, ఆదివారం రేకుర్తి, తీగులగుట్టపల్లి, ఆరెపల్లి, సీతారాంపూర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. డంప్యార్డ్తో పాటు, బల్దియా కౌన్సిల్ ప్రతిపాదించిన మూడు ప్రాజెక్ట్ల ప్రతిపాదనల వివరాలు తెలుసుకున్నారు. రోడ్లు, నాలాలను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు ఆరా తీశారు. స్కైవాక్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, మోడల్ రోడ్స్, మోడల్ జంక్షన్ తదితర ప్రతిపాదిత సైట్లు తనిఖీ చేసి తిరిగి ఢిల్లీకి వెళ్లారు. వారం లోగా స్పష్టత దేశవ్యాప్తంగా నగరాల్లో అమలు చేయనున్న అర్బన్ చాలెంజ్ ఫండ్ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లు కేటాయించింది. పథకంలో చేరిన నగరాలకు నేరుగా 25శాతం వాటాను విడుదల చేస్తుంది. మిగతా 25శాతం రాష్ట్ర ప్రభుత్వం, నగరపాలకసంస్థ భరించాల్సి ఉంటుంది. 50 శాతం బ్యాంక్ రుణాలు, బాండ్ల విక్రయం, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం తదితర మార్గాల ద్వారా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ పథకంలో నగరపాలక సంస్థ అధిక భారాన్ని మోయాల్సి ఉన్నప్పటికీ పథకంలో ఎంపికై తే నగరం రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయి. ఇప్పటికే కేంద్ర హోం శాఖసహాయ మంత్రి బండి సంజయ్ యూసీఎఫ్ స్కీంలో కరీంనగర్ను చేర్చేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ను యూసీఎఫ్లో చేర్చేందుకు సూత్రప్రాయ ఆమోదం లభించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ అధికారి రెండు రోజుల పాటు నగరంలో క్షేత్రస్థాయి తనిఖీచేసి వెళ్లారు. ప్రక్రియ పూర్తయినందున మరోవారం రోజుల్లో యూసీఎఫ్ పథకంలో కరీంనగర్ను చేర్చడంపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఒకవేళ స్కీంలో కరీంనగర్ను ఎంపిక చేస్తే స్మార్ట్సిటీ ప్రాజెక్ట్ తరువాత ఆ స్థాయిలో నిధులతో నగరం స్వరూపం మారనుంది. -
టీచర్ పాత్ర అనిర్వచనీయం
కరీంనగర్ టౌన్: విద్యార్థుల విజయాల్లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర అనిర్వచనీ యమని అదనపు కలెక్టర్, డీఈవో అశ్వినీ తా నాజీ వాకడే అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యా వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివా రం విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వ హించారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచినవారిని ప్రశంసాపత్రాలు, నగదు బహుమతితో సన్మానించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అశ్వినీ తావాజీ వాకడే మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో తల్లిదండ్రుల తర్వాత గురువుస్థానం గొప్పదన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ఇదే స్ఫూర్తితో ఉన్నత విద్యను అభ్యసించి ఆదర్శప్రాయులుగా ఎదగాలని ఆకాంక్షించారు. డిప్యూటీ మేయర్ వై.సునీల్ రావు మాట్లాడు తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని, విద్యార్థులకు సదుపాయాలు, నాణ్యమైన బోధన అందుబాటులోకి వచ్చిందన్నారు. ఆర్డీవో మహేశ్వర్, డీఐఈవో వి.ఆంజనేయరావు, విద్యాశాఖ ఏడీ మాధవి, సెక్టోరల్ అధికారులు మిల్కురి శ్రీనివాస్, అశోక్రెడ్డి, దాసి శ్రీనివాస్, ఉమారాణి, మహేందర్, రవీందర్, డీసీఈబీ కార్యదర్శి భగవంతయ్య పాల్గొన్నారు. ఫాల్కన్ అథ్లెట్ల ఆత్మీయ సమ్మేళనం కరీంనగర్స్పోర్ట్స్: ఫాల్కన్ అథ్లెటిక్స్ క్లబ్ క్రీడాకారుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉత్సాహంగా సాగింది. 40ఏళ్ల క్రితం అథ్లెటిక్స్ కోచ్ స్వర్గీయ కిషోర్కుమార్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన క్రీడాకారులు ఏర్పాటు చేసుకున్న ఈ క్లబ్ సభ్యులంతా ఒకచోట కలుసుకుని, ఆనందంగా గడిపారు. జిల్లాకేంద్రంలోని వీ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో క్లబ్ సభ్యులు 60మంది పాల్గొన్నారు. మొదట క్లబ్ సభ్యులుగా ఉండి మరణించిన క్రీడాకారులకు సంతాపం తెలిపారు. పలువురిని సత్కరించా రు. సభ్యులందరూ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అథ్లెటిక్స్ పోటీల్లో రాష్ట్ర,జాతీయస్థాయిలో ప్రతిభ చాటే వారికి ప్రోత్సాహకాన్ని అందించాలని తీర్మానించారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సా రంగపాణి, జిల్లా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, సుమన్ కల్యాణ్, రిటైర్డ్ ఎస్పీ మురళి, వరంగల్ రేంజ్ ఏసీపీ నరేందర్, పెద్దపల్లి సీఐ ప్రవీణ్, రిటైర్డ్ ఎస్సై నందెల్లి శేఖర్, కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, సర్పంచ్ కర్పూజ తిరుపతి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు బాబు శ్రీనివాస్, టీజీపెట రాష్ట్ర కార్యదర్శి నాగరాజుగౌడ్ పాల్గొన్నారు. ఉన్నతస్థాయికి చేరుకోవాలి కరీంనగర్ సిటీ: విద్యార్థులు తమ ప్రతిభను అ భివద్ధి చేసుకొని ఉన్నతస్థాయికి చేరుకోవాలని మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వరలక్ష్మి తెలి పారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన విద్యా వారోత్సవాలు ఆదివారం ముగిశాయి. వివిధ కార్యక్రమాలపై నివేదికను కామర్స్ విభాగ అధ్యాపకురాలు, కమిటీ సభ్యురాలు జె.స్వప్న సమర్పించారు. సిటీలో పవర్కట్ కొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులతో పాటు ఏబీ స్విచ్ల మరమ్మతు పనులు చేపడుతున్నందున సోమవారం ఉదయం 7.30 నుంచి 10.30 గంటల వరకు 11 కె.వీ.రాంచంద్రాపూర్కాలనీ, ఉజ్వల పార్కు ఫీడర్ల పరిధిలోని సప్తగిరి కాలనీ, కొత్త పీహెచ్సీ సెంటర్, ప్రభుత్వ హైస్కూల్ లైన్ నుంచి బైపాస్ రోడ్, సప్తగిరిహిల్స్ రోడ్డు నంబర్ 3,4,5, జానకీ వీధి రోడ్ నంబర్ 1,2,3, ఏవోస్ కాలనీ రోడ్ నంబర్ 1,2,3,4, రామచంద్రాపూర్కాలనీ రోడ్ నంబర్10.13.16.18,20, బైపాస్ రోడ్ హెచ్పీ గ్యాస్ గోదాం, వెంకటాద్రికాలనీ, శ్రద్ధ ఇన్ హోటల్, ఎన్టీఆర్ విగ్రహం, డిమార్ట్, బైపాస్, పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం. లావణ్య తెలిపారు. -
● బస్తాలు తరలించరు.. గన్నీలు ఇవ్వరు ● మక్కల కొనుగోళ్లలో ఇదేం నిర్లక్ష్యం?
కరీంనగర్ అర్బన్: ఆరుగాలం కష్టించిన అన్నదాత కు మార్కెట్లోనూ నిత్య రణరంగమే అవుతోంది. పంట పండించడం ఒక ఎత్తయితే పంటను విక్రయించడం మరో ఎత్తవుతోంది. అధికారుల ప్రణా ళిక లేమి.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో పక్షం రోజులుగా పంటను విక్రయించేందుకు పడిగాపులు కాస్తుండటం అన్నదాత వంతవుతోంది. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో డీసీఎంఎస్ మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా తీవ్ర నిర్లక్ష్యం చేస్తుండటం కలవరానికి గురి చేస్తోంది. ఎటూ చూసిన మక్కల కుప్పలే మార్క్ఫెడ్ మక్కల కొనుగోళ్లను పర్యవేక్షిస్తుండగా అధికారులు నిర్వహణను గాలికొదిలేశారు. మక్కల కుప్పలతో మార్కెట్ నిండిపోగా గన్నీలు ఇచ్చింది లేదు.. కాంటా పెట్టింది లేదు. పెడితే తరలించేదే ఉండదు. కరీంనగర్ రూరల్ మండలంతో పాటు తిమ్మాపూర్, కొత్తపల్లి మండలాల రైతులు మక్కలను ఎక్కువ మొత్తంలో తీసుకురాగా కొనుగోళ్లు జాప్యం అవుతున్నాయి. ఇవేం నిబంధనలు మక్కల కొనుగోళ్లలో ఎన్నడూ లేని విధంగా నిబంధనలు విధించడం రైతులకు తీవ్ర ఇబ్బందిగా మా రింది. ఎకరానికి 40క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా కేవలం 25 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించడం విడ్డూరంగా మారింది. ఇక విక్రయించే వారిలో కౌలు రైతులుండగా అసలు రైతులు హైదరాబాద్, ఇతర పట్టణాల్లో ఉంటుండగా వేలిముద్ర వేసేందుకు రావడం కష్టమే. పలువురి వేలిముద్రలు రాకపోగా ఐరిస్ వంటి ఆప్షన్ లేదు. ఇక ప్రధానంగా పంటల వివరాల నమోదులో అప్పటి ఏఈవోలు సరిగా వివరాలు నమోదు చేయలేదని స్పష్టమవుతోంది. ఇదిలాఉండగా మక్కల కొనుగోళ్లు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటామని కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆకుల నర్సన్న స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, కొనుగోలు చేసిన పంటను తక్షణమే తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. -
ఇంధన భారం రూ.8.60కోట్లు
కరీంనగర్ అర్బన్: గ్యాస్ ధర గుదిబండగా మారగా, పెట్రోల్, డీజిల్ ధరలు గుబులు రేపుతున్నా యి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో కేంద్రం ధరలు పెంచడంతో సామాన్యుడి బడ్జెట్ అందనంత ఎత్తుకు చేరుతోంది. పెరిగిన ఇంధన ధరలతో జిల్లా వినియోగదారులపై నెలకు రూ.8.60కోట్ల భారం పడుతోంది. వాహనమెక్కాలంటే తడుముకోవాల్సిందే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వినియోగదారుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. పెట్రోల్ లీటరుకు రూ.107.55 ఉండగా శుక్రవారం పెరిగిన ధరతో 110.97కు చేరింది. డీజిల్ లీటరు ధర రూ.95.78 నుంచి రూ.99.06కు చేరింది. దీంతో లక్షల వాహనాలకు ఇంధన భారం తడిసిమోపెడవుతోంది. ఎనిమిదేళ్ల క్రితం లీటరు పెట్రోల్ ధర రూ.55 ఉండగా ఏటేటా పెరుగుతుండటం ఆందోళనకర పరిణామం. నెలకు రూ.8.60 కోట్ల భారం పెట్రోల్, డీజిల్ ధరల మోతతో జిల్లాపై నెలకు రూ.8.60కోట్ల భారం పడుతోంది. జిల్లాలో 83 పెట్రోల్ బంకులుండగా 5లక్షల ద్విచక్ర వాహనాలు, 2లక్షల మూడు, నాలుగు చక్రాల వాహనాలున్నాయని సమాచారం. రోజుకు 3.60లక్షల లీటర్లు పెట్రోల్ వినియోగమవుతుండగా నిత్యం రూ.10.80లక్షల భారం పడుతుండగా నెలకు రూ.3.24కోట్ల భారం పడుతోంది. నిత్యం డీజిల్ వినియోగం 6లక్షల లీటర్లు కాగా రూ.18లక్షల భారం పడుతుండగా నెలకు రూ.5.40కోట్ల భారం పడుతోంది. రెండూ కలిపి నెలకు మొత్తంగా రూ.8.60 కోట్ల భారం పడుతోంది. అన్ని వర్గాలపై ప్రభావం జిల్లాలో వరి కోతలు సాగుతుండగా ఽట్రాక్టర్లు, లారీల ద్వారా ధాన్యం రవాణా చేస్తుండగా రైతులకు అదనపు భారం పడుతోంది. కూరగాయలతో పాటు వాణిజ్యరంగాలపై భారమే. మరో పక్షం రోజులైతే వానాకాలం సాగు ప్రారంభం కానుండగా దుక్కులు దున్నడం, నారుమళ్లు దున్నడం, ఎరువు రవాణా వంటి వాటిపై అదనపు వ్యయం తప్పదంటున్నారు అన్నదాతలు. ఇప్పటికే పప్పులు, నూనెల ధరలు పెరగగా మరింత పెరిగే అవకాశఽముందని వ్యాపారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పెట్రోల్ బంకులు: 83ద్విచక్ర వాహనాలు: 5లక్షలు మూడు, నాలుగు చక్రాల వాహనాలు: 2లక్షలు రోజుకు పెట్రోల్ వినియోగం: 3.60లక్షల లీటర్లు డీజిల్ వాడకం: 6లక్షల లీటర్లు పెరిగిన ధరతో లీటర్ పెట్రోల్ రూ.110.97డీజిల్ రూ.99.06జిల్లాలో ఇంధన విక్రయాలు -
రండి.. నేర్చుకుందాం
సప్తగిరికాలనీ(కరీంనగర్): శోధిస్తే సాధించనిది అంటూ ఏమీ ఉండదని పెద్దలు చెబుతుంటారు. ఏదో ఒక నైపుణ్య సాధనకు అభ్యాసమే మందు. పది, ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ఫలితాలు వచ్చాయి. ఈ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటే చక్కటి భవిత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిభ, నైపుణ్యాలకు పదును పెట్టుకుంటే ఉపయోగకరం ఉంటుందంటున్నారు. పోటీ ప్రపంచంలో నెగ్గుకురాగలుగుతారని, బహుళ నైపుణ్యాలు ఎప్పుడైనా పనికొస్తాయని సలహాలిస్తున్నారు. వేసవి సెలవులను వినోదానికే పరిమితం చేయకుండా, భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేలా ప్రణాళికలు వేసుకోవాలంటున్నారు. ● పదోతగతి తర్వాత ప్రతిభ ఆధారంగా తీసుకునే కోర్సులు, ఇంటర్ తర్వాత తీసుకోవాల్సిన స్టెప్పై కసరత్తు చేయాలి. ఉపాధి చూపే కోర్సులు, పలువురి అభిప్రాయాలు తీసుకొని ముందడుగు వేయాలి. ● నైపుణ్యాలు పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. సెలవు రోజుల్లో ప్రధాన పట్టణాల్లో నైపుణ్యాభివృద్ధికి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారు. అకడమిక్ చదువులే కాకుండా నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, క్రీడలు, డిజిటల్ స్కిల్స్పై దృష్టి పెట్టాలి. ● ఎంఎస్ ఆఫీస్, జావా, పైథాన్, సీప్లస్ వంటి కంప్యూటర్ ఆధారిత కోర్సులు నేటితరానికి ఎంతో ఉపయోగం. వీటిలో రాణిస్తే ఉపాధికి కొదువ ఉండదు. సెలవులు ముగిసేలోగా పట్టు సాధిస్తే భవిష్యత్లో ఉపాధికి డోకా ఉండదు. ● విద్యార్హత, మార్కులకు తోడు ఉద్యోగ ఇంటర్వ్యూల్లో భావ వ్యక్తీకరణ అంశాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు. తెలిసిన అంశాన్ని, చేసిన ప్రయోగాన్ని స్పష్టంగా చెప్పగలగడం, భాషా నైపుణ్యంతో వివరించగలగడం, అవతలి వ్యక్తులను ఆకట్టుకుంటాయి. వీటిని నేర్పడానికి సెలవుల్లో శిక్షణ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తుంటారు. వాటిలో చేరి సాధన చేయవచ్చు. ● నిర్మాణరంగం శరవేగంగా అభివద్ధి చెందుతోంది. ఎలక్ట్రికల్ పనులకు డిమాండ్ ఉంటోంది. ఇవి నేర్చుకుంటే కొత్తగా నిర్మిస్తున్న భవనాలకు వైరింగ్, స్విచ్ బోర్డులు, ఎలక్ట్రిక్ ఉపకరణాల బిగింపు పనులు దొరుకుతాయి. ● మహిళలు మెహందీ డిజైన్, వంటలతో వ్యాపారం, అల్లికలు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వంటి కోర్సులు ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. ఒక లక్ష్యంతో నేర్చుకుంటే ఆర్థికంగా ఎదిగేందుకు వీలుంటుంది. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు వచ్చినా గట్టెక్కొచ్చు. ● సమయం విలువను గుర్తిస్తే ఇంజినీరింగ్, మెడిసిన్లో సీటు సాధించే అవకాశముంటుంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసినవారు ఆ దిశగా కసరత్తు ప్రారంభించాలి. ఈ కోర్సులకు ప్రభుత్వపరంగా శిక్షణ కేంద్రాలు గురుకులాల్లో, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో వెసులుబాటు ఉంటుంది. ● పరీక్షలు ముగిశాక పుస్తకాలతో పనేమీ లేదని సెల్ఫోన్లో చిట్చాట్లు, టీవీతో ఎంజాయ్ చేద్దామనుకుంటే భవితను నాశనం చేసుకున్నట్లే. వేళాపాళా లేకుండా ఫోన్తో కాలక్షేపం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలా కాకుండా ఫోన్లో విద్యాసంబంధ అంశాలు ఉచిత పుస్తకాలు, పాఠాలు అందుబాటులో ఉంటాయి. వినియోగించుకోవాలి. విద్యార్థులు సెలవులను సరిగ్గా వినియోగించుకోవాలి. అకాడమిక్ చదువులతో పాటు నైపుణ్యాలపై దృష్టి పెడితే భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే సరైన కోర్సు ఎంపిక చాలా ముఖ్యం. ఉన్నత విద్యకు ఇప్పటి నుంచే సరైన ప్రణాళిక అవసరం. డిగ్రీలో చేరాలనే వారికి ఎస్సారార్లో ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ కలువకుంట్ల రామకృష్ణ, ప్రిన్సిపాల్, ఎస్సారార్ ప్రభుత్వ కళాశాల, కరీంనగర్ 03. లోపలికి ఎవరడుగు పెట్టినా కొరుకుతాయి చీల్చుతాయి కుక్కలు మాత్రం కాదు ముప్పై రెండు ఉంటాయి ముళ్లు మాత్రం కాదు 04. ప్రాణవాయువును పీల్చుకుంటుంది వాసనలను చక్కగా చెపుతుంది దుమ్ము ధూళిని అడ్డుకుంటుంది 05. మాటలైతే మాట్లాడుతుంది గానీ తిండి మాత్రం తనంత తాను తినదు కలిపి ముద్దలు పెడితేనే తింటుంది ఇంత గారాబమైతే ఎలాగమ్మా! 01. ఇదో మెత్తని మాంసం ముద్ద తీపి కారమంటూ రుచులను విడమరిచి మరీ చెప్తుంది 32 రౌడీల మధ్య నివసిస్తుంది 02. ఎంతసేపూ మనం మాట్లాడితే వినటమే గానీ తాను నోరిప్పి ఒక్కమాట మాట్లాడదు అంతేగాదు ఒట్టి నగల పిచ్చిది కూడా రింగులు, కమ్మలు అంటూ రకరకాలు సింగారించుకుంటుంది. జవాబులు 01. నాలుక 02. చెవి 03. పళ్లు 04. ముక్కు 05. నోరుపొడుపు కథలుడాక్టర్ కందేపి రాణీప్రసాద్ – రచయిత్రి, పిల్లల వైద్యనిపుణులు – సిరిసిల్ల, రాజన్నసిరిసిల్ల పిల్లలు మీరూ పంపండి...వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించారా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సప్ నెం: 8500786474 ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు..పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా... వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని నిపుణుల సలహా అదనపు కోర్సులపై ఇంటర్, టెన్త్ విద్యార్థులు దృష్టి పెట్టాలని సూచన ఉన్నత లక్ష్యాలకు మార్గాలను అన్వేషించాలని పిలుపు నేటి ప్రపంచంలో నైపుణ్యాలే విజయానికి కీలకం. కేవలం మార్కులు కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ రెండింటితో పాటు విద్యార్థులు బహుముఖ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్ బలంగా ఉంటుంది. ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించాలి. లైబ్రరీలో వార్తాపత్రికలు, పుస్తకాలు, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలపై అధ్యయనం చేయాలి. – వి.అంజనేయరావు, ఇంటర్ విద్యాధికారి, కరీంనగర్ పరీక్షల తర్వాత సమయం వృథా చేయకూడదు. చిన్న చిన్న నైపుణ్యాలు భవిష్యత్తులో పెద్ద అవకాశాలుగా మారుతాయి. విద్యార్థులు తమ ఆసక్తులను గుర్తించాలి. గురువుల సలహాలు తీసుకోవడం మంచిది. లక్ష్యంతో ముందుకు సాగితే ఫలితం ఖాయం. పాలిటెక్నిక్లో ఎన్నో కోర్సులు భవిష్యత్కు దిక్చూసిగా ఉన్నాయి. – డి.శోభారాణి, ప్రిన్సిపాల్, పాలిటెక్నిక్ మహిళా కళాశాల, కరీంనగర్ పిల్లలు సెలవులను సృజనా త్మకంగా వినియోగించాలి. ఫోన్, టీవీకి పరిమితం కా కుండా కొత్త విషయాలు నే ర్చుకోవాలి. నైపుణ్యాలు పెంపొందించుకోవడం అవసరం. భవిష్యత్కు ఉపయోగపడే కోర్సులు ఎంచుకోవాలి. తల్లిదండ్రులుగా మేము కూడా మార్గదర్శకత్వం ఇస్తాం. – మట్ట అంజిరెడ్డి, పేరెంట్ ఇంటర్ పూర్తయ్యాక నా లక్ష్యంపై మరింత స్పష్టత వ చ్చింది. పోటీ పరీక్షలకు సిద్ధం కావడం ప్రారంభించా ను. ఇటీవలే నీట్ రాశాను. ఇప్పుడు అదనంగా కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవాలనుకొంటున్నాను. భ విష్యత్తులో మంచి స్థానం సంపాదించాలనుకుంటున్నాను. – సిరి కార్తీక పరీక్షలు పూర్తయ్యాయి. రిజల్ట్స్ వచ్చాయి. 562 మార్కులు సాధించాను. ప్రస్తుతం రిలాక్స్ అవుతున్నాను. కానీ భవిష్యత్ కోసం ఇప్పటినుంచే ఆలోచిస్తున్నాను. ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుంటాను. సెలవుల్లో కొత్త నైపుణ్యాలు నేర్చుకోని ముందుకు వెళ్లాలనేది నా లక్ష్యం. – ఎల్.హన్సినిరెడ్డి, విద్యార్థిని -
అంత్య పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
విద్యానగర్(కరీంనగర్): సరస్వతి నది అంత్య పుష్కరాలకు భక్తులకు ఇబ్బందులు ఏర్పడకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు సూచించారు. శనివారం కరీంనగర్ బస్స్టేషన్ ఆవరణలోని సమావేశ మందిరంలో రీజియన్ పరిధిలోని డిపో మేనేజర్లతో సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ మాసానికి సంబంధించి అన్ని డిపోల పనితీరు, ఆర్థిక పరిస్థితిపై సమీక్షించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్ని బస్స్టేషన్లలో తాగునీటి వసతి కల్పించాలన్నారు. డిప్యూటీ రీజినల్ మేనేజర్లు ఎస్.భూపతిరెడ్డి, పి.మల్లేశం, డిపో మేనేజర్లు ఎం.శ్రీనివాస్, ఐ.మిజయమాధురి, ఎం.నాగభూషణం, ఎన్.వెంకన్న, వి.రవీంద్రనాఽఽథ్, వి.శ్రవణ్కుమార్, కె.కల్పన, ఎన్.మనోహర్, ఎం.సరస్వతి, ఎ.ప్రకాశ్రావు, బి.శ్రీనివాస్, రీజినల్ మేనేజర్ కార్యాలయం సూపర్వైజర్లు ఎం.స్రవంతి, ఎన్.జ్యోత్స్న పాల్గొన్నారు. -
నేటి నుంచి ధర్మవరం – నాందేడ్ రైలు
రామగుండం: ధర్మవరం–నాందేడ్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును ఆదివారం నుంచి క్రమబద్ధీకరిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీచేసింది. నాందేడ్ – ధర్మవరం(17635) ప్రతీ శుక్రవారం రాత్రి 10.00గంటలకు పెద్దపల్లికి చేరుకుని 20 నిమిషాలపాటు ఆగుతుంది. ధర్మవరం–నాందేడ్(17636) పెద్దపల్లికి ప్రతీ ఆదివారం అర్ధరాత్రి 11.55 గంటలకు చేరుకుంటుంది. ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంటలో హాల్టింగ్ కల్పించారు. ఆంధ్రప్రదేశ్లోని కదిరి లక్ష్మీనర్సింహస్వామి, తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి, విజయవాడ కనకదుర్గమ్మ, వరంగల్ భద్రకాళి, బాసర శ్రీజ్ఞాన సరస్వతీ పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ఈరైలు సౌకర్యవంతంగా ఉంటుంది. -
వసూళ్ల గ్యాంగ్ అరెస్ట్
కరీంనగర్ రూరల్: జల్సాలకు అలవాటు పడి, గ్యాంగ్గా ఏర్పడి చంపుతామంటూ బెదిరిస్తూ డబ్బులు వసూళ్లు చేస్తున్న ముగ్గురిని కరీంనగర్రూరల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సీఐ నిరంజన్రెడ్డి కథనం మేరకు.. వావిలాలపల్లికి చెందిన పుతుంపరంబిల్ రోహన్(19) ఈ నెల 13న తీగలగుట్టపల్లిలో బాక్స్ క్రికెట్ ఆడేందుకు స్నేహితులతో కలిసి వెళ్లాడు. కిరాణం వద్ద నిల్చున్న రోహన్ వద్దకు కరీంనగర్లోని దుర్గమ్మగడ్డకు చెందిన దావ దర్శన్, గాంధీనగర్కు చెందిన కాసారపు రోహిత్కుమార్ అలియాస్ రిషి వచ్చి కొంతదూరం తీసుకెళ్లారు. అతనిపై దాడి చేసి డబ్బులు ఇవ్వాలంటూ బెదిరిస్తున్న క్రమంలో మరో వ్యక్తి కొనగాని మధు వచ్చి బావిలో తోసి చంపేస్తామంటూ బెదిరించాడు. రోహన్ తన వద్ద ఉన్న ఐఫోన్ ఇవ్వడంతో విడిచిపెట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం బొమ్మకల్ బైపాస్రోడ్డులో నిందితులను అరెస్టు చేశారు. వారినుంచి స్విఫ్ట్ డిజైర్ కారు, ఐఫోన్తో పాటు మూడు సెల్ఫోన్లు, రూ.5వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. దావ దర్శన్పై కరీంనగర్ త్రీటౌన్లో మూడు కేసులు, రోహిత్కుమార్పై కరీంనగర్ టూ టౌన్లో పోక్సో కేసు, మధుపై 1టౌన్లో గంజాయి కేసు ఇప్పటికే ఉందని సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు వివరించారు. -
శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు
భీమన్న ఆలయంలోని శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు నగరేశ్వరస్వామి ఆలయంలో చండీ హోమం నిర్వహిస్తున్న అర్చకులు, హాజరైన భక్తులు వేములవాడ: శని అమావాస్య, శని జయంతి సందర్భంగా శనివారం వేములవాడలోని వివిధ ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. శనేశ్వర స్వామికి తైలాభిషేకం చేశారు. నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి, అంజన్నను దర్శించుకున్నారు. అనంతరం భీమేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. శనివారం అమావాస్య ప్రభావంతో భీమన్న దర్శనాలకు భక్తులు పెద్దగా రాలేదు. నిత్య చండీ హోమం నగరేశ్వరస్వామి ఆలయంలో నిత్య చండీ హోమాలు నిర్వహిస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. ప్రతి రోజు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు హోమాలు నిర్వహిస్తారని, ఈ హోమానికి రూ.1516గా టికెట్ నిర్ణయించినట్లు తెలిపారు. ఒక టికెట్పై ఇద్దరిని కూర్చోబెడతారని పేర్కొన్నారు. -
బన్నీ వేసవి యాత్ర–9
మధ్యాహ్నం అయ్యింది. ఆకాశంలో నల్ల మబ్బులు. గాలి వీచింది. ‘టప టప’ వాన మొదలైంది. వెంటనే ‘టప్’ అని కరెంట్ పోయింది. ఇల్లంతా చీకటి. బన్నీకి భయం. ‘ఇప్పుడు ఏం చేద్దాం?’ అన్నాడు. తాతయ్య నవ్వాడు. ‘ఆట ఆడదాం.’ నానమ్మ లాంతరు వెలిగించింది. చిన్న వెలుగు వచ్చింది. అందరూ లాంతరు చుట్టూ కూర్చున్నారు. తాతయ్య నేల మీద గుంటలు చేశాడు. చిన్న చిన్న గుంటలు. ఒక పెద్ద డబ్బాలో చింత గింజలు తెచ్చాడు. ‘ఇవి వామన గుంటలు’ అన్నాడు తాతయ్య. ‘మన తాతల ఆట. ఫోన్ లేదు, బ్యాటరీ లేదు.’ రామ్, చుక్క, స్వప్న, బన్నీ కూర్చున్నారు. తాతయ్య ఆట నేర్పాడు. గింజలు ఏరుకోవాలి. లెక్క పెట్టాలి. బన్నీ మొదటి సారి ఆడాడు. ఓడిపోయాడు. తాతయ్య అన్నాడు, ‘ఓడితే శిక్ష ఉంది.’ బన్నీకి భయం. తాతయ్య నవ్వాడు. ‘శిక్ష ఏంటంటే... ఒక పొడుపు కథ చెప్పాలి.’ తాతయ్య అడిగాడు, ‘అరచేతిలో వైకుంఠం ఏమిటి?’ బన్నీ ఆలోచించాడు. తెలియలేదు. చుక్క చెవిలో చెప్పింది, ‘దీపం!’ బన్నీ ‘దీపం!’ అన్నాడు. అందరూ నవ్వారు. చప్పట్లు కొట్టారు. బయట వాన. లోపల నవ్వు. పిల్లలకి మాట: ఓడిపోతే ఏడవకూడదు. గెలిస్తే పొగరు వద్దు. ఆడితే సంతోషం వెలగాలి. డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రాథమిక పాఠశాల,కాకర్లపల్లి, మండలం: మంథని, పెద్దపల్లి జిల్లా -
విద్యుత్ పొదుపుగా వాడాలి
కొత్తపల్లి: వినియోగదారులు విద్యుత్ను పొదుపుగా వాడి ఆర్థికంగా బలపడవచ్చు. రోజూ ఒక్క యూనిట్ ఆదా చేస్తే జీవితకాలంలో రూ.లక్ష పొదుపు చేసినవారమవుతాం. విద్యుత్ ఆదాకు నాణ్యమైన ఐఎస్ఐ మార్కుగల, స్టార్ రేటేడ్ పరికరాలను ఉపయోగించాలి. విద్యుత్ కుక్కర్లకు బదులు ప్రెషర్ కుక్కర్లు వినియోగించాలి. వేసవికాలంలో ఏసీల వినియోగం పెరిగింది. 25 డిగ్రీల సెంటిగ్రేడ్కు అమర్చుకొని అరగంట తర్వాత ఆఫ్ చేయడం, ఏసీ ఫిల్టర్లను నెలకోసారి శుభ్రం చేసుకోవాలి. – కె.ఉపేందర్, డీఈ (టెక్నికల్), కరీంనగర్ సర్కిల్ -
నా విహార యాత్ర
నా పేరు సాత్విక్. నేను సచ్ దేవా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఇటీవల నేను వైజాగ్, అరకు లోయలను సందర్శించాను. ఈ యాత్ర నాకు ఎంతో ఆనందం, కొత్త అనుభవాలను ఇచ్చింది. మొదట మేము ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వెళ్లాం. అక్కడ సముద్రపు అలలు, కెరటాలు ఎంతో ఆకట్టుకున్నాయి. సముద్ర తీరంలో నీళ్లలో ఆడుతూ చాలా సరదాగా గడిపాను. అక్కడి ప్రకృతి అందాలు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. తర్వాత మేము అరకు లోయను సందర్శించాం. అరకు లోయలోని పచ్చని కొండలు, చల్లని వాతావరణం ఎంతో అద్భుతంగా అనిపించాయి. ముఖ్యంగా కొండలపైకి వెళ్లి కిందికి చూస్తే మేఘాలు ఆకాశం నుంచి కిందికి దిగివచ్చినట్టుగా కనిపించాయి. ఆ దృశ్యం నా మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాగే గిరిజన గ్రామదర్శిని ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. అక్కడి గిరిజనుల సంప్రదాయ వస్త్రధారణ చాలా ఆకట్టుకుంది. నేను కూడా వారిలా అలంకరించుకొని ఫొటోలు దిగాను. ఆ అనుభవం చాలా కొత్తగా, ఆనందంగా అనిపించింది. మేము ట్రైబల్ మ్యూజియం, చాపరాయి, చాక్లెట్ ఫ్యాక్టరీ, ఉడెన్ బ్రిడ్జ్, బొర్రా గుహలు వంటి అనేక పర్యాటక ప్రదేశాలను సందర్శించాం. ఈ పర్యటన ద్వారా నాకు ప్రకృతి అందాలు, గిరిజన సంస్కృతి, కొత్త ప్రాంతాల విశేషాలు తెలుసుకున్నాను. ఈ యాత్ర నాకు జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది. –పేరు: కె. సాత్విక్ పాఠశాల: సచిదేవా స్కూల్. ఊరు: గోదావరిఖని , జిల్లా: పెద్దపల్లి -
చెరువులో స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి
రాయికల్(జగిత్యాల): రాయికల్ పట్టణం ఇందిరానగర్కు చెందిన హమలీ కార్మికుడు సందెళ్ల శేఖర్ (27) చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి ఊపిరాడక మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. శేఖర్ తోటి హమాలీలతో కలిసి శుక్రవారం రాయికల్ పెద్ద చెరువు వద్ద విందు ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం స్నానం చేసేందుకు శేఖర్ మద్యం మత్తులో చెరువులోకి వెళ్లగా ఈత వచ్చినప్పటికీ ఊపిరాడక మృతిచెందాడు. మృతుడికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై దేవేందర్నాయక్ తెలిపారు. -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో.. బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ.
● కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేస్తాం‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గం.ల నుంచి మధ్యాహ్నం 01గం.వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు: ఐబ్రోస్(త్రేడింగ్), వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచ్,స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఫేస్ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), హెయిర్ మసాజ్, హెయిర్ కట్స్, కమ్యూనికేషన్ అండ్ సెల్ఫ్ గ్రూమింగ్, శారీ డ్రాపింగ్. -
చివరి ఉత్తరం
● రాజమహేంద్రవరం గోదావరి గట్టుమీద పాత పోస్టాఫీసు ఉంది. అక్కడ రామయ్య తాత 40 ఏళ్లు పోస్ట్మ్యాన్గా పనిచేశాడు. రిటైర్ అయ్యాక కూడా ప్రతీ రోజు ఉదయం ఆ పోస్టాఫీసు మెట్ల మీద కూర్చుని గోదావరి చూసేవాడు. ● ఒకరోజు ఉదయం తాత చేతిలో పసుపు పచ్చని పాత కవరు పడింది. చిరునామా మసకబారింది. ‘కమల, శారద నిలయం, రాజమహేంద్రవరం’ అని మాత్రమే కనిపించింది. పంపిన వాడి పేరు ‘మోహన్, ముంబాయి’. తేదీ 1987. ● తాతకు గుర్తు వచ్చింది. మోహన్, కమల కాలేజీ ప్రేమ. మోహన్ ముంబాయి ఉద్యోగానికి వెళ్లాడు. కమల తండ్రి పెళ్లి కుదిర్చేశాడు. ఆ తర్వాత వాళ్లు కనిపించలేదు. ● తాత వెంటనే శారద నిలయం వెతుక్కుంటూ వెళ్లాడు. అక్కడ 70 ఏళ్ల కమల అమ్మమ్మ ఒంటరిగా ఉంది. తాత ఆ కవరు చేతిలో పెట్టాడు. ఆమె చేతులు వణికాయి. ● ‘ఇది మోహన్ చివరి ఉత్తరం. నా పెళ్లి తర్వాత నేను తిరిగి రాయలేదు. వాడు ఇంకో పెళ్లి చేసుకోలేదట. రెండేళ్ల క్రితం పోయాడని తెలిసింది’ అని కళ్లు తుడుచుకుంది. ● కవరు తెరిచింది. లోపల చిన్న కాగితం. ‘కమల, నీకు కోపమొచ్చినా నేను వేచి ఉంటా. గోదావరి ఆగుతుందా? నా ప్రేమ కూడా ఆగదు. – మోహన్’ ● కమల అమ్మమ్మ ఆ ఉత్తరం గుండెలకు హత్తుకుంది. 37 ఏళ్ల తర్వాత చేరిన మాటలు, గోదావరి గాలి మోసుకొచ్చిన జ్ఞాపకం. ● ఆ రోజు తాత ఇంటికి నడుస్తూ అనుకున్నాడు, ‘ఒక ఉత్తరం ఆలస్యమైనా, ప్రేమ ఆలస్యం కాదు’. నీతి: మాటలు, భావాలు సమయానికి చేరకపోయినా వాటి విలువ తగ్గదు. నీతి కథఎన్. శ్రీకర్ గ్రామం: ఊటురు మండలం: మానకొండూర్ జిల్లా: కరీంనగర్ -
గంజాయి రవాణా కేసులో ఐదుగురి అరెస్టు
జ్యోతినగర్: గంజాయిని రవాణా చేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ రాంరెడ్డి తెలిపారు. శుక్రవారం ఎన్టీపీసీ పోలీస్స్టేషన్లో గోదావరిఖని ఏసీపీ రమేశ్, రామగుండం సీఐ కృష్ణకుమార్, ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్కిరణ్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తేన్నారనే సమాచారంతో ఎస్సై ఆధ్వర్వంలో ఎన్టీపీసీ ప్రాజెక్టు లేబర్ గేట్ రాజీవ్ రహదారిపై తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానస్పదంగా వస్తున్న కారును ఆపి తనిఖీ చేయగాఅం గంజాయి ప్యాకెట్లు లభించాయి. ఒడిశాలోని చిత్రగొండలో కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయించేందుకు తీసుకెళ్తున్నారని విచారణలో తేలింది. ఈమేరకు మల్కాన్గిరి జిల్లాకు చెందిన రాజేశ్కుమార్ నాయక్, ఎస్.బషీర్, చైతన్య మాడి, గౌతమ్ రాయ్, సిద్ధార్థ రంజన్ దాస్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 12 కేజీల గంజాయితో పాటు కారు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాదారులను చాకచక్యంతో పట్టుకున్న పోలీసు సిబ్బందికి రివార్డులు అందజేయనున్నారు. 12 కేజీల గంజాయి, కారు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి -
క్రికెట్ కిట్ కొన్నాను
సమ్మర్ హాలీడేస్ అంటే నాకు చాలా ఇష్టం. ఈసారి నేను క్రికెట్ బ్యాట్, బాల్, కిట్ కొన్నాను. మా ఫ్రెండ్స్తో ప్రతి రోజు ఆడుకుంటున్నాను. టీవీ, మొబైల్ కంటే గ్రౌండ్లో ఆడటం బాగుంటుంది. ఈవినింగ్ క్రికెట్లో కోచింగ్ కూడా తీసుకుంటున్నాను. – హర్ష నాకు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. ఈ సమ్మర్లో పేరెంట్స్ కొత్త రాకెట్ కొనిపెట్టారు. మా కాలనీలో ఫ్రెండ్స్తో కలిసి ఆడుతున్నాం. ఇలా ఆడడం ద్వారా చాలా యాక్టివ్గా ఉంటున్నాను. స్కూల్ మొదలయ్యాక కూడా ఈవినింగ్ ఆడుతాం. – ఆవంతిక -
అమ్మకాలు పెరిగాయి
ఈ సమ్మర్లో స్పోర్ట్స్ సామగ్రి అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా క్రికెట్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ కిట్స్కు డిమాండ్ ఉంది. చిన్నారులు ఎక్కువగా తక్కువ ధరలో ఉండే కిట్స్ కొంటున్నారు. ప్రతీ రోజు షాపులో రద్దీ కనిపిస్తోంది. గతేడాది కంటే ఈసారి వ్యాపారం బాగుంది. – నాగిరెడ్డి సిధారెడ్డి, స్పోర్ట్స్ సెంటర్ నిర్వాహకుడు సమ్మర్ క్యాంప్స్తో అమ్మకాలు పెరిగాయి. క్యాంప్కు వచ్చే పిల్ల లు కిట్ కొంటున్నారు. స్విమ్మింగ్, క్యారమ్, చెస్, కరాటే స్పోర్ట్స్ కిట్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. తల్లిదండ్రులు కూడా క్వాలిటీ వస్తువులే కొంటున్నారు. ఈ సీజన్ బిజినెస్ బిజీగా ఉంటుంది. – బుర్ర పవన్, స్పోర్ట్స్ సెంటర్ నిర్వాహకుడు -
పొడుపు కథలు
01. వీరు అవిభక్త కవలలు గాలి ప్రాణస్నేహితురాలు స్నేహితురాలు దగ్గరగా వచ్చిందా ఉబ్బితబ్బిబ్బవుతారు కాస్త దూరంగా జరిగిందా చప్పగా చప్పబడిపోతారు కాసేపు కనిపించనేలేదనుకో ప్రాణాలే విడుస్తారు 02. చిక్కుడు గింజలాంటి ఆకారం చెట్టు మీద కాదు శరీరంలో వడపొయ్యటమే పని తేనీటిని కాదు.. రక్తాన్ని మలినాలను బయట పారేస్తుంది ఇంటి నుంచి కాదు వంటి నుంచి జవాబులు: 01. ఊపిరితిత్తులు 02. కిడ్ని 03. లివర్03. అత్యంత పెద్ద గ్రంథి ఆహార ధాన్యాల గిడ్డంగి రసాయన ప్రయోగశాల ఎవరో చెప్పుకోండి! డాక్టర్ కందేపి రాణీప్రసాద్, రచయిత్రి, సిరిసిల్ల -
బన్నీ వేసవి యాత్ర–8
పాలు తాగాక తాతయ్య బయటకు వెళ్లి, ‘బన్నీ రారా’ అని పిలిచాడు. బన్నీ వెళ్లాడు. చుక్క, రామ్ కూడా వచ్చారు. పొలం గట్టు. కింద నీళ్లు. నీళ్లలో బురద. పచ్చగా వరి నాట్లు. తాతయ్య చెప్పాడు, ‘ఇదే మన పొలం. ఇక్కడే అన్నం పుడుతుంది.’ బన్నీకి ఆశ్చర్యం. ‘బియ్యం షాప్ నుండి తెస్తారు కదా తాతయ్యా?’ తాతయ్య నవ్వాడు. ‘లేదు రా. మొదట ఇక్కడే. ఈ బురదలో వంగి పని చేస్తేనే, మనం తలెత్తుకు తినగలం.’ బన్నీకి వివరంగా తాతయ్య చెప్పాడు. బన్నీ గట్టు మీద నడుస్తున్నాడు. అడుగు జారింది. ‘భళ్లున’ బురదలో పడ్డాడు. కాలు మోకాలు వరకు దిగింది. బన్నీకి భయం వేసింది . ‘అమ్మా !’ అని అరిచాడు. చుక్క పరిగెత్తుకు వచ్చింది. ‘భయం వద్దు బన్నీ’ అంది. చెయ్యి ఇచ్చింది. బన్నీ చుక్క చెయ్యి పట్టుకున్నాడు. చుక్క గట్టిగా లాగింది. రామ్ కూడా సాయం చేశాడు. బన్నీ బయటికి వచ్చాడు. కాలు అంతా బురద. కానీ మనసులో నవ్వు. చుక్క అంది, ‘చూశావా? ఆపదలో ఉన్నవాడికి చెయ్యి అందించడమే స్నేహం.’ తాతయ్య బన్నీ తల నిమిరాడు. ‘ఇప్పుడు తెలిసిందా? అన్నం విలువ.’ కష్టపడితేనే పంటలు పండుతాయి. ఆ పంట నుండే తిండి గింజలు వస్తాయి. పిల్లలకి మాట: కష్టం తెలిస్తేనే అన్నం విలువ తెలుస్తుంది. స్నేహం అంటే కష్టంలో చెయ్యి అందించడం. డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రాథమిక పాఠశాల,కాకర్లపల్లి, మండలం: మంథని, పెద్దపల్లి జిల్లా -
జాతీయ క్రీడల్లో ‘ఖాకీ’ సత్తా
హుజూరాబాద్: అఖిల భారత పోలీస్ క్రీడాపోటీల్లో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని హుజూరాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి సత్తాచాటారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈనెల 9 నుంచి 13 వరకు జరిగిన పోటీల్లో టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో నాలుగు పతకాలు సాధించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన పోలీస్ క్రీడాకారులతో జరిగిన హోరాహోరీ పోటీల్లో ఏసీపీ మాధవి తన నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ఆకట్టుకున్నారు. విధుల్లో తీరికలేని అధికారిణిగా సేవలందిస్తూనే క్రీడల్లోనూ రాణించడం విశేషంగా మారింది. టేబుల్ టెన్నిస్ జీవో 50ప్లస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రజత పతకం, జీవో 40ప్లస్ మిక్స్డ్ డబుల్స్లో కాంస్య పతకం సాధించారు. ఎన్జీవో మిక్స్డ్ డబుల్స్లో కాంస్యం కై వసం చేసుకున్నారు. బ్యాడ్మింటన్ జీవో 50ప్లస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించారు. ఒకే జాతీయ పోటీల్లో రెండు విభిన్న క్రీడల్లో పతకాలు సాధించడం అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు. పతకాలు సాధించిన ఏసీపీ మాధవిని సీపీ గౌస్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. సహచర అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. -
యూసీఎఫ్కు ఓకే!
కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్: నగరపాలకసంస్థను అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) పథకంలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. గతంలో స్మార్ట్సిటీ కింద ఎంపికై న కరీంనగర్ వందల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చెందడం తెలిసిందే. మరోసారి అదే స్థాయిలో యూసీఎఫ్ కింద నిధులు వరద రానుంది. ఈ పథకంలో ఎంపిక కోసం ఇటీవల కౌన్సిల్ తీర్మాణం చేసి పంపించగా, క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు శనివారం కేంద్ర అధికారుల బృందం నగరానికి రానుంది. నేడు కేంద్ర అధికారుల బృందం రాక.. యూసీఎఫ్ కింద ప్రతిపాదించిన రూ.895 కోట్ల మూడు ప్రాజెక్ట్లకు కేంద్ర ప్రభుత్వం దాదాపుగా అంగీకరించినట్లు సమాచారం. మూడు ప్రాజెక్ట్ల్లో పట్టణ రవాణా మెరుగుదలకు మోడల్ రోడ్లు, జంక్షన్లు, స్కైవాక్లు, నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ సదుపాయాలతోపాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం కోసం రూ.700 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. వర్షపు నీటి కాలువల నిర్మాణం, పునరావాసం, వరద నివారణ చర్యల కోసం రూ.130 కోట్లు, సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణకు రూ.65 కోట్లు ఉన్నాయి. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కు చెందిన అపెక్స్ కమిటీ ఇటీవల ఢిల్లీలో సమావేశమై ఈ ప్రతిపాదనలపై చర్చించి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అందులో భాగంగా కమిటీ ఆదేశాల మేరకు శనివారం కేంద్ర అధికారుల బృందం కరీంనగర్ కు రానుంది. నగరంలో పర్యటించడంతోపాటు స్థానిక అధికారులతో సమావేశం కానున్నారు. ఫలిస్తున్న ‘బండి’ కృషి యూసీఎఫ్ పథకంలో కరీంనగర్ను చేర్చడంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కృషి ఫలిస్తోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మేయర్ పదవిని బీజేపీకి అప్పగిస్తే నిధులు వరద పారిస్తానంటూ బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే బీజేపీ పాలకవర్గం ఏర్పడ్డాక యూసీఎఫ్ స్కీంలో కరీంనగర్ ను చేర్చాలని విజ్ఞప్తి చేశారు.


