breaking news
West Godavari
-
భవన నిర్మాణం భారం
భీమవరం(ప్రకాశం చౌక్): భవన నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ఇల్లు కట్టుకునే సామాన్యులపై అ‘ధన’పు భారం పడుతోంది. నెల రోజుల వ్యవధిలో ఐరన్, సిమెంట్, కంకర ధరలు పెరిగిపోయాయి. ప్రస్తుతం వేసవి సీజన్, వాతావారణం అనుకూలంగా ఉండటంతో ఎక్కువగా భవన నిర్మాణాలు చేపడతుంటారు. ఈ సమయంలో ధరల పెరుగుదలతో భవన యజమానులు సతమతమవుతున్నారు. నిర్మాణ దశలను అనుసరించి మెటీరియల్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో రోజురోజుకూ భారం పెరుగుతోంది. నెల రోజుల్లో ఐ‘రన్’ భవన నిర్మాణంలో ప్రధానమైన ఐరన్ ధరలు నెలనెలా పెరుగుతున్నాయి. నెల రోజుల క్రితం టన్ను ఐరన్ రూ.60 వేలు ఉండగా ప్రస్తుతం రూ.10 వేలు పెరిగి రూ.70 వేలకు చేరింది. రెండు సెంట్లలో ఇంటి నిర్మాణానికి ఐరన్ 3 నుంచి 3.50 టన్నులు అవసరమవుతుంది. ఈ మేరకు ఐరన్పై రూ.40 వేల వరకు అదనపు భారం అవుతోంది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇసుక ఇష్టానుసారం జిల్లా గోదావరికి చెంతనే ఉన్నా సులభంగా ఇసుక లభించే పరిస్థితి లేదు. దీంతో ఇసుక ధరలు పెంచుతున్నారు. భవన నిర్మాణంలో ఎక్కువగా వినియోగించే సామగ్రి ఇసుక కావడంతో దీనికి డిమాండ్ ఉంటుంది. ఇదే అదనుగా ఇసుక ధరలను పెంచి విక్రయిస్తున్నారు. సాధారణంగా ఇంటి నిర్మాణంలో 6 యూనిట్ల పై నుంచి ఇసుక అవసరమవుతుంది. రెండు నెలల క్రితం గోదావరి తీరం నుంచి భీమవరానికి 6 యూనిట్ల ఇసుక ధర రూ.10 వేలు ఉంటే ప్రస్తుతం రూ.13 వేల నుంచి రూ.15 వరకు ఉంది. ముఖ్యంగా కిరాయిలకు ఇసుకు తీసుకువచ్చే వ్యాపారాలు ధర పెంచుతున్నారు. దీంతో ఇసుక కొనుగోలు సామాన్యులకు భారంగా మారింది. అప్పులు చేసి నిర్మాణాలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లు మంజూరు చేశారు. అయితే రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన 20 నెలల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఇల్లు మంజూరు లేవు. దీంతో సొంతిల్లు లేని సామాన్యుడు గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలంలో అప్పులు చేసి ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో మెటీరియల్ ధరల పెరుగుదల భారంగా మారింది. ప్రభుత్వం నుంచి ఇంటి నిర్మాణానికి ఎలాంటి సాయం అందకపోవడం, ధరల పెరుగుదలతో అప్పులు చేసి అక్కడక్కడా కొందరు నిర్మాణాలు చేపడుతున్నారు. భీమవరంలో నిర్మాణంలో ఉన్న ఇల్లు ప్రభుత్వం గ్రామాలకు కొత్త ఇళ్లు మంజూరు చేయడం లేదు. భవన నిర్మాణం మెటీరియల్ ధరలు దారుణంగా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో సొంతంగా సామాన్యులు ఇల్లు కట్టుకోవడం కష్టంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చే యూనిట్ కాస్ట్ పెంచాలి. మెటీరియల్తో కలిపి రూ.3 లక్షల వరకూ సాయం అందించాలి. – బి.రాంబాబు, కొండేపూడి ఐరన్, సిమెంట్, కంకర తదితర మెటీరియల్ ధరలు రో జుల వ్యవధిలోనే పెరిగిపోతున్నాయి. నెల రోజుల్లో ఐరన్ టన్నుకు రూ.10 వేలు పెరిగింది. సిమెంట్, కంకరు ధరల పరిస్థితి అలాగే ఉంది. ఒకసారే మెటీరియల్ తెచ్చుకునే పరిస్థితి సామాన్యుల దగ్గర ఉండదు. దీంతో వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. – సాంబా, తాపీమేస్త్రి, బంటుమిల్లిఇల్లు కట్టేదెలా! భవన నిర్మాణ సామగ్రి ధరలకు రెక్కలు టన్ను ఐరన్కు రూ.10 వేలు పెంపు మెటల్, సిమెంట్ అదేబాటలో.. భవన యజమానులకు ఇక్కట్లు గ్రామాల్లో ఇళ్లు మంజూరు చేయని కూటమి ప్రభుత్వం మెటల్ (కంకర), సిమెంట్ ధరలకు కూడా రెక్కలు వచ్చా యి. కంకరు (త్రీఫోర్త్) మూడు యూనిట్లు ధర రూ.12 వేల నుంచి రూ.13,500కు చేరింది. మెటల్కు కృత్రిమ డిమాండ్ సృష్టించి ధరలు పెంచుతున్నట్టు సమాచారం. సిమెంట్ ధరలు కూడా బస్తాకు రూ.50 నుంచి రూ.100 వరకు పెరిగాయి. నిన్నమొన్నటి వరకూ బస్తా ఆయా గ్రేడ్లను బట్టి రూ.250 నుంచి రూ.300 వరకు ఉండగా ప్రస్తుతం రూ.300 నుంచి రూ.350 వరకు ఉంది. -
పురాతన రామాలయం వద్ద ఉద్రిక్తత
ఆకివీడు : శిథిలావస్థలో ఉన్న స్థానిక పెదపేటలోని పురాతన రామాలయం వద్ద ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడకు డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణరాజు రాగా స్థానిక క్రైస్తవులు, సంఘ పెద్దలు ఇది సత్రం భూమి అని తమకు చెందినదేనని ఇక్కడ రామాలయం కట్టడం వల్ల ఇబ్బంది ఏర్పడుతుందని అన్నారు. దీంతో నగర పంచాయతీ కమిషనర్ జి.కృష్ణమోహన్తో డిప్యూటీ స్పీకర్ మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక్కడ విగ్రహాలున్నాయి, ఇది రామాలయం ప్రాంగణమే గుడి కడతామని చెప్పారు. గొడవలు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. గొడవలొస్తే చూసుకుందాంలే అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుండగా ఇరువర్గాల నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాల్ని చెదరగొట్టారు. రాత్రి దళిత సంఘాల నాయకులు పోలీస్స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. తమపై పోలీసులు దాడులు చేశారని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, రూరల్ సీఐ కాళీచరణ్ ఇక్కడకు వచ్చి దళిత నాయకులతో చర్చించారు. -
‘బండ’ బాదుడుపై నిరసన
ఆకివీడు : గ్యాస్ ధరలు పెంచడం దారుణమని సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక శ్రీనగర్ కాలనీలో ఆదివారం కట్టెల పొయ్యిపై గ్యాస్ బండ ఉంచి నిరసన వ్యక్తం చేశారు. సీపీఎం నాయకుడు పెంకి అప్పారావు మాట్లాడుతూ యుద్ధం పేరుతో గ్యాస్ సిలిండర్ ధరను పెంచిన మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మహిళా దినోత్సవం రోజున మహిళలకు కానుకగా గ్యాస్ ధర పెంచడం విచారకరమన్నారు. అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్ని తీవ్రంగా ఖండించారు. పెంచిన గ్యాస్ ధరల్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల పెంపుతో ఆహార పదార్థాల ధరలు పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకు సీపీఎం నాయకురాలు దొడ్డి పద్మ అధ్యక్షత వహించారు. భీమవరం: భీమవరంలోని వోల్గా ఆర్చరీ అకా డమీలో ఆదివారం రాష్ట్రస్థాయి అండర్–15, 13, 10 ఆర్చరీ పోటీలకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్టు ఎంపికకు పోటీలు నిర్వహించారు. సుమారు 40 మంది బాలబాలికలు ఇండియన్ రౌండ్, కాంపౌండ్, రికవరీ కేటగిరీల్లో తలపడ్డారు. జిల్లా జట్లను ఎంపిక చేశారు. వీ రు ఈనెల 11 నుంచి 13 వరకు నూజివీడులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆ ర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్.జయ రాజు తెలిపారు. జిల్లా స్పోర్ట్స్ అధికారి మోహన్దాస్ క్రీడాకారులను అభినందించారు. కోచ్ లు ఈ.సాహిత్, కమల్ కిశోర్, జయలక్ష్మి పోటీలను పర్యవేక్షించారు. చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి తాడేపల్లిగూడెం రూరల్: మద్యం మత్తులో లిక్కర్లో గడ్డి మందు కలుపుకుని తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటనపై కేసు నమోదు చేసినట్టు రూరల్ పోలీసులు తెలిపారు. ఆదివారం వారు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన ఉండవల్లి నారాయణరావు (70) మద్యానికి బానిసై శనివారం ఆ మత్తులో మద్యంలో గడ్డి మందు కలిపి సేవించాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతి చెందాడు. మృతుని కుమార్తె రాయుడు రాజామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, రూరల్ ఏఎస్సై బి.గోపీనాథ్ దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువులో పడి యువకుడి మృతి
కాళ్ల: చెరువులో పడి యువకుడు మృతిచెందిన ఘటన ఆదివారం కాళ్లలో చోటుచేసుకుంది. ఎ స్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. దొ డ్డనపూడికి చెందిన గుండా సురేష్ (21) కొంతకాలంగా మానసికంగా బాధపడుతూ, తల్లిదండ్రులను హింస్తూ ఇంట్లో సామాన్లు నాశనం చే స్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద చెరువులో పడి మునిగిపోతుండగా అక్కడ క్రికెట్ ఆడుతున్నవారు కేకలు వేశారు. విషయం గమనించిన కొల్లి సాయిరాజేష్ మరికొందరు చెరువులో దూకి సురేష్ను బయటకు తీసుకురాగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి తండ్రి పెద్దిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. -
మహిళలపైనే దేశ పురోగతి
భీమవరం : మహిళలపైనే దేశ పురోగతి ఆధారప డి ఉందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. స్థానిక విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం మహిళా దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆయా పథకాల ద్వారా మహిళల జీవితాల్లో స్పష్టమైన, సానుకూల మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు స్వయం సహాయక సంఘాలు దోహదపడతాయన్నారు. భీమవరం ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతి షైనీ, ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత తదితరులు మాట్లాడారు. ముద్ర, పీఎంఈజీపీ, పీఎం ఎఫ్ఎంఈ, విశ్వకర్మ పథకాల కింద 62,833 మంది లబ్ధిదారులకు రుణాలు అందించారు. జిల్లాలో ఆర్థిక ప్రగతి సాధించిన పారిశ్రామికవేత్తలను కలెక్టర్ సత్కరించారు. విశేష ప్రతిభ కనబరిచిన ఉద్యోగినులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): వసతి గృహాల్లో చ దువుకుంటున్న విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యురాలు విజయ భారతి షైనీ ఆదేశించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం పట్టణంలోని పలు హాస్టళ్లను ఆమె తనిఖీ చేశారు. రైతు బజార్ స మీపంలోని హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. వసతులపై ఆరా తీశారు. విద్యార్థినుల తో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినులు సౌకర్యవంతంగా చ దువుకునేలా వాతావరణం కల్పించాల్సింది గా అధికారులకు సూచించారు. విద్యార్థినుల చదువుతోపాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్వీ అరుణ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఏవీ సూరిబాబు, వసతి గృహాల సంక్షేమ అధికారులు, భీమవరం డిప్యూటీ తహసిల్దార్ నాగార్జున ఉన్నారు. ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయ ఆవరణలో ఆదివారం రాత్రి ఓ భక్తురాలి బంగారపు ఉంగరాన్ని గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేశాడు. బాధితురాలి కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్ర బంజర్కు చెందిన అనంతోజ్ సౌమ్య కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి క్షేత్రానికి వచ్చారు. సాయంకాలార్చన అనంతరం రాత్రి 7 గంటల సమయంలో క్యూలైన్లోకి వెళ్లేటప్పుడు ఆమె చేతికున్న ఉంగం చోరీకి గురైంది. -
ప్రణాళికతో దశ మారే..
● జీవక్రియల యూనిట్ నుంచి అధిక ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ● అనువంశికత యూనిట్ నుంచి సులభంగా 10 మార్కులు సాధించవచ్చు. ● ఓజోన్ పొర క్షీణత, బయో డీగ్రేడబుల్, నాన్–బయో డీగ్రేడబుల్ అంశాలు కీలకం. ● మంచి మార్కుల కోసం చిత్రాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎం.కృష్ణమూర్తి, సోషల్ టీచర్, కేతవరం హైస్కూల్ ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యార్థి జీవితంలో కీలకమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు వస్తున్నాయంటే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకూ టెన్షనే.. ఈ గట్టు ఎక్కితే విద్యార్థి ఉన్నత విద్యకు చక్కని సోపానం ఏర్పడుతుంది. కనీసం ఉత్తీర్ణత సాధిస్తే చాలని కొందరు భావిస్తే, పదికి పది సాధించాలని మరికొందరు పట్టుదలతో ఉంటారు. అయితే పరీక్షలంటే ఎక్కడో చిన్న ఒత్తిడితో సాధించలేమేమోననే అనుమానం సహజం. అయితే ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా టెన్త్లో పదికి పది సాధించాలంటే ఇలా చేస్తే సులభమని నిపుణులైన సబ్జెక్టు టీచర్లు చెబుతున్నారు. ఇప్పటికే జరిగే ఎఫ్ఏ–1, 2, 3, స్లిప్ టెస్ట్లు, ప్రీ ఫైనల్, గ్రాండ్ టెస్ట్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం ద్వారా పూర్తి అవగాహన వస్తుందని సూచిస్తున్నారు. ఈనెల 16 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా 132 కేంద్రాల్లో 24,166 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జె.శ్రీను, బీఎస్ టీచర్, రాఘవాపురం హైస్కూల్ డి.వెంకటేశ్వరమ్మ, ఇంగ్లిష్ టీచర్, మాదేపల్లి హైస్కూల్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ పదాలను అర్థం చేసుకోవడం ద్వారా సమాధానాలు రాయవచ్చు. ప్రశ్నల క్రమం మిస్ కాకుండా జవాబులు రాయడం ద్వారా వాల్యూయేషన్ చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. గ్రామర్ అంశాలను క్షుణ్ణంగా ప్రాక్టీస్ చేయాలి. స్పెల్లింగ్ తప్పులు లేకుండా చూసుకోవాలి. క్రియేటివ్ రైటింగ్లో మంచి మార్కుల కోసం సమాధానం కనీసం రెండు పేజీలు రాయాలి. సెక్షన్–1, 2లో ప్రశ్నలపై పట్టు సాధించాలి. పలుమార్లు పునశ్చరణ చేయాలి గ్రాఫ్ ఆధారిత, పట నైపుణ్యాల ప్రశ్నలు తప్పులు లేకుండా రాసేలా సాధన చేయాలి సెక్షన్–4లో ఉండే 8 మార్కుల ప్రశ్నలకు ప్రణాళికాబద్ధంగా సమాధానాలు రాయాలి. పాఠ్యాంశాల వారీగా విశ్లేషణాత్మకంగా చదవాలి. వర్తమాన వ్యవహారాలపై అవగాహన కలిగి ఉండాలి. ‘టెన్’షన్ వద్దు ఒత్తిడిని అధిగమించాలి అన్ని సబ్జెక్టులపై పట్టు ముఖ్యం నిపుణులైన ఉపాధ్యాయుల సూచనలు 16 నుంచి పదో తరగతి పరీక్షలు ‘పశ్చిమ’లో 24,166 మంది విద్యార్థులుహెచ్.జానకి, హిందీ టీచర్, ఏలూరు కస్తూరిబా హైస్కూల్ గణితం.. సృజనాత్మక వ్యూహం బీఆర్వీ కుమార్, గణితం టీచర్, ఎం.నాగులపల్లి హైస్కూల్ గణితం ప్రశ్నాపత్రంలో సృజనాత్మకతకు ప్రాధాన్యమిస్తూ కొన్ని మార్పులు జరిగాయి. వెనుకబడిన విద్యార్థులు వాస్తవ సంఖ్యలు, బహుపదులు, రేఖీయ సమీకరణాల జత, నిరూపక రేఖాగణితం, సంఖ్యాక శాస్త్రం, సంభావ్యతపై దృష్టి సాధించడం ద్వారా 63 మార్కుల వరకు సాధించవచ్చు. ముఖ్యంగా 1, 3, 7, 13, 14 అధ్యాయాలు మిగతా వాటితో పోలిస్తే సులభంగా ఉండటమే కాకుండా, ఎక్కువ మార్కులను తెచ్చిపెడతాయి. ఎస్ఎస్ అహ్మద్, ఫిజికల్ సైన్స్ టీచర్, భీమడోలు జెడ్పీ హైస్కూల్ ముందుగా 8 మార్కులు, తర్వాత 4 మార్కులు, 2 మార్కులు, చివరిగా ఒక మార్పు ప్రశ్నలకు సమాధానాలు స్పష్టంగా రాయాలి. 8 మార్కుల ప్రశ్నల విభాగంలో పట్టు కోసం బ్లూప్రింట్ పాఠాలు చదవాలి. 4 మార్కుల ప్రశ్నల విభాగంలో ముఖ్యంగా చిత్రపటాలు, రేఖా చిత్రాల పాఠాలపై పట్టు సాధించాలి. 2, 1 మార్కుల ప్రశ్నల విభాగంలో ప్రశ్నలను క్షుణ్ణంగా సిద్ధం చేసుకోవాలి. ఎం.మంజుల, తెలుగు టీచర్, భీమడోలు హైస్కూల్ అవగాహన–ప్రతిస్పందన విభాగంలో సమాధానాలను పూర్తి వాక్యాలతో స్పష్టంగా రాయాలి. పద్య, గద్యభాగం, ఉపవాచకంపై ప్రశ్నల స్వభావాన్ని బట్టి పరిధి మేరకు సమాధానాలు రాయాలి. పాఠ్యపుస్తకంలో ప్రతి పాఠం చివర ఉండే అభ్యాసాలను క్షుణ్ణంగా చదవాలి. చక్కని దస్తూరి, విరామ చిహ్నాలను పాటిస్తూ అక్షర దోషాలు లేకుండా రాస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. ముఖ్య పదాలను ప్యాసేజ్లో వెతికితే సులభంగా సమాధానాలు రాయవచ్చు. కవి, రచయిత పరిచయాలు తప్పకుండా నేర్చుకోవాలి. పద్యభాగంలోని 4 దోహా లను కంఠస్థం చేయాలి. ఈద్గాహ్, లోక్ గీత్ పాఠాలపై పట్టు సాధించాలి. స్వరాజ్య కీ నీవ్, అంతర్జాతీయ స్టర్ పర్ హిందీ, పాఠాల నుంచి లఘు ప్రశ్నలు రావచ్చు. -
పరిశ్రమలపై వివక్ష
ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ తణుకు అర్బన్: పరిశ్రమలకు పూర్తి సహకారం అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం వివక్ష చూపుతోందని శాసనమండలిలో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ విమర్శించారు. గురువారం శాసనమండలిలో ఈ విషయాన్ని ఆయన లేవనెత్తారు. నైపుణ్యం లేని కార్మికులకు ఉపాధి కల్పించే పరిశ్రమ కాటన్ స్పిన్నింగ్ అని, ఆ పరిశ్రమను ప్రోత్సహించడంలో ఎలాంటి రాజకీయ వివక్ష చూడకూడదని చెప్పారు. పరిశ్రమలకు కేటాయించిన ప్రోత్సాహకాలు, రాయితీలు వైఎస్సార్సీపీకి సంబంధించిన సంస్థలకు నిలిపివేయడం మంచి పారిశ్రామిక విధానం కాదన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని రవళి స్పిన్నర్స్, ఎస్వీఆర్ స్పిన్నింగ్ మిల్లులకు చట్టబద్ధంగా విడుదల కావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. -
సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): మున్సిపల్ కార్మికులకు 17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం మొదటి రోజు రిలే దీక్ష చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ సీఓఎస్ రద్దు విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, రద్దు చేస్తే కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని, 12వ పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, 17 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మరణించిన, అనారోగ్యం పాలైన విశ్రాంతి సభ్యుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని, క్లాప్ డ్రైవర్లుకు 21 వేల జీతం చెల్లించాలని, పర్మినెంట్ కార్మికులకు డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట నాయకులు ధనాల వెంకట్రావు, జిల్లా కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోరికలు అమలు చేయకపోతే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామన్నారు. -
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
పెనుగొండ: నక్కల డ్రెయిన్లో అక్రమ తవ్వకాలు యథేచ్చగా నిర్వహిస్తున్నారు. ఆచంట వేమవరంలో నక్కల డ్రెయిన్ను ఆనుకొని లంక భూములు మట్టి మాఫియాకు వరంగా మారాయి. గురువారం నుంచి తవ్వకాలు జరుగుతున్నా.. అధికారులు ఆ ప్రాంతానికి దరిదాపుల్లోకి రాకపోవడం విశేషం. ఇటు రైతులనుంచి, అటు నాయకుల నుంచి వ్యతిరేకత ఎదురైనా తవ్వకాలు మాత్రం యథేచ్ఛగా కొనసాగిస్తుండడంతో వైఎస్సార్సీపీ నాయకులు తవ్వకాలకు అడ్డుతగిలారు. మట్టి తవ్వకానికి అనుమతులు ఉన్నాయంటూ బుకాయిస్తూ మరీ తవ్వకాలు జరుపుతుండడంతో తీవ్ర నిరసన వ్యక్తమైంది. చివరకు శుక్రవారం వైఎస్సార్సీపీ నాయకులు, ఆచంట వేమవరం సర్పంచ్ జక్కంశెట్టి చంటి తవ్వక ప్రాంతంలో నిరసన వ్యక్తం చేయడంతో కొద్దిపాటి వాగ్వాదం జరిగింది. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు దృష్టికి సమస్యను తీసుకు వెళ్లారు. దీంతో మట్టి తవ్వక ప్రాంతాలను పరిశీలించి, అక్రమ తవ్వకాలతో రైతులకు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. అధికారులు చోద్యం చూడడం దారుణమని విమర్శించారు. రైతులు, నాయకులకు డబ్బులు ఇచ్చాం మట్టి మాఫియా తమకు అడ్డు లేదంటూ తీవ్ర నిర్లక్ష్య ధోరణిలో వ్యహరించడం కొసమెరుపు, పరీవాహక ప్రాంత రైతులకు డబ్బులు ముట్టచెప్పామని చెబుతున్నారని పలువురు రైతులు ఆరోపించారు. డబ్బులతో కొనేసామని, రాజకీయ పలుకుబడి ఉందని తమకు ఎవరు ఎదురు చెబుతారంటూ విర్రవీగుతున్నారన్నారు. ముంపు ప్రమాదం నక్కల డ్రెయిన్ తవ్వకం వల్ల ఆచంట వేమవరం పరిసర ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే యలమంచిలి మండలంలో ఏటిగట్టు మరమ్మతుల పేరుతో 2025లో నక్కల డ్రెయిన్ గట్టును పూర్తిగా తవ్వేశారు. ఇదే ప్రాంతంలో మరోసారి తవ్వకాలు జరుపుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా నక్కల డ్రెయిన్ ఉధృతికి ఆచంట వేమవరం పరిసర ప్రాంతాల వరిచేలు ముంపునకు గురవుతున్నాయి. ఇప్పుడు మరింతగా తవ్వకాలు జరపడం వల్ల వేలాది ఎకరాలు ముంపు బారిన పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నక్కల డ్రెయిన్లో తవ్వతున్న మట్టిని పాలకొల్లు, భీమవరం పరిసర ప్రాంతాల్లోని లే అవుట్ల పూడికలకు తరలిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు రూ.20 లక్షల విలువ గల మట్టిని తరలించడానికి బేరసారాలు కుదుర్చుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నిరసనలు పెరగడంతో ఆచంట తహసీల్దారు డి.సోమేశ్వరరావు మట్టి తవ్వక ప్రాంతాలను పరిశీలించారు. అక్రమ తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. వాహనాలను తహసీల్దారు కార్యాలయానికి తరలించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. -
సర్కారుపై నిరసన స్వరం
నిరసన తెలుపుతున్న విలేజ్ సర్వేయర్లు సాక్షి, భీమవరం : మొన్న ఆశాలు.. నిన్న అంగన్వాడీలు.. నేడు సర్వేయర్లు.. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం చంద్రబాబు ప్రభుత్వంపై పోరుబాట సాగిస్తున్నారు. ఎన్నికల హామీలు అమలు చేయాలంటూ రోడ్డెక్కి నిరసన గళం వినిపిస్తున్నారు. నిత్యం ఎక్కడోచోట ఆయా వర్గాల వారి వరుస ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో జిల్లా వాతావరణం హీటెక్కుతోంది. గత ఎన్నికల్లో అధికారమే పరమావధిగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ తదితర కూటమి నేతలు ఎడాపెడా హామీలిచ్చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలను అమల్లోకి తెస్తామని చెప్పుకొచ్చారు. పాలన చేపట్టి నెలలు గడుస్తున్నా కూటమి ప్రభుత్వం వాటి ఊసెత్తకపోగా సర్వేల పేరుతో తీవ్ర పనిభారం మోపి ఇబ్బందులు పాల్జేస్తోంది. ప్రభుత్వ తీరుపై ఆయా వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు ఆత్మగౌరవ ఉద్యమం చేయగా, పీహెచ్సీ వైద్యులు రోజులు తరబడి సమ్మె చేశారు. కూటమి వచ్చాక ఈ 21 నెలల కాలంలో రాష్ట్ర కమిటీల పిలుపుపై ఉపాధ్యాయులు, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపాల్టీ, సహకార, విద్యుత్, తదితర శాఖలకు చెందిన రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎన్నికల వాగ్దానాలు, సమస్యల పరిష్కారం కోరుతూ దశల వారీగా ఉద్యమాలతో హోరెత్తించారు. తమ ఉపాధికి చేటు చేస్తున్న మద్యం బెల్టుషాపులను పూర్తిగా నిర్మూలించాలని కోరుతూ కల్లుగీత కార్మికులు ఆందోళన నిర్వహించగా, కౌలు గుర్తింపు కార్డులు మంజూరుచేయాలని, పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేస్తూ కౌలు రైతులు ఇటీవల రెండు రోజుల పాటు రిలే దీక్షలు చేశారు. ఉద్యమం తీవ్రతరం ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా గ్రాట్యుటీ ఇవ్వాలని, కనీస వేతనం పెంచాలని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, అలాగే కనీస వేతనం రూ. 26 వేలు చేయాలని కోరుతూ ఆశా వర్కర్లు గతంలో పలుమార్లు ఆందోళనలు చేశారు. స్పందన లేకపోవడంతో జిల్లా నుంచి రెండు వేల మందికి పైగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు జిల్లా నుంచి చలో విజయవాడ కార్యక్రమానికి తరలివెళ్లి దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వ హామీలు అమలుచేయకుంటే భవిష్యత్తులో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విలేజ్ సర్వేయర్ల నిరసన సర్వేయర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం విలేజ్ సర్వేయర్లు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. జనవరి 23న మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సహాయ నిరాకరణ చేపట్టి తమ సమస్యలపై ఉన్నతాధికారులకు వినతులు అందజేసినట్టు సంఘ నాయకులు తెలిపారు. కమిటీ ఏర్పాటుచేసి 15 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఫలితం లేకపోవడంతో ఈ నెల 5 నుంచి మళ్లీ నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ప్రమోషన్ స్కేలు పెంచాలని, కొందరు సర్వేయర్లుపై ఉన్న సస్పెన్షన్లు ఎత్తివేయాలని, సర్వేల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో విజయం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలకు ఈ ప్రభుత్వం అనేక హామీలిచ్చింది. ఇప్పటి వరకు వాటిని అమల్లోకి తీసుకురాలేదు. పెండింగ్ బకాయిలు విడుదల, సీపీఎస్ ఉద్యోగస్తులు ఓపీఎస్ గా మార్చడం తదితర హామీలు అమలుచేయాలి. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. – కేవీ రామచంద్రరావు, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శికనీస వేతనం పెంచుతామని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యూటీ చెల్లిస్తామని ఎన్నికల్లో కూటమి నేతలు హామీ ఇచ్చారు. తల్లికి వందనం పథకాన్ని అంగనన్వాడీలకు అమలు చేయాలి. మే నెలలో సెలవులు ఇవ్వాలి. వాటిని అమలుచేయకపోగా శాంతియుతంగా దీక్ష చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను అక్రమ అరెస్టులతో వేధించడం సరికాదు. – శ్యామల, అంగన్వాడీ వర్కర్స్ యూనియనన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు, పెంటపాడు సహకార సంఘ ఉద్యోగుల వయోపరిమితి 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని, 2019 తర్వాత జాయిన్ అయిన సిబ్బందిని కంటిన్యూ చేయాలన్న డిమాండ్లపై గతంలో ఆందోళన చేసినా స్పందన లేదు. ఇటీవల మరోమారు ధర్నాలు నిర్వహించాం. కమిటీ వేశామని, నివేదిక వచ్చాక పరిష్కరిస్తామంటూ తాత్సారం చేస్తున్నారు. – కోయ యేసుబాబు, ఎల్బీ చర్ల సొసైటీ సీఈఓ ఎన్నికల్లో కూటమి హామీ ఇచ్చినట్టుగా పెట్టుబడి సాయం కింద కౌలు రైతులకు రూ.20 వేలు అందజేయాలి. ఈ సీజన్కు సంబంధించి రెండు విడతల సొమ్ము జమచేయాలి. పంట నష్టపరిహారంతో పాటు, యజమానులకు సంబంధం లేకుండా ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీచేయాలి. – మామిడిశెట్టి రామాంజనేయులు, కౌలురైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయా వర్గాల వారి వరస ఆందోళనలు, నిరసనలతో జిల్లా హీటెక్కుతోంది. రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారు. జిల్లా కేంద్రం భీమవరంలోని కలెక్టరేట్, ప్రకాశంచౌక్ సెంటర్, అలాగే మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాలు, డివిజన్ పరిధిలోని ఆర్డీఓ కార్యాలయాలు వద్ద టెంట్లు ఏర్పాటుచేసి ధర్నాలు చేసి అధికారులకు వినతులు అందజేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న నినాదాలతో ఆయా ప్రాంతాలు మార్మోగుతున్నాయి. రెండ్రోజుల క్రితం చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై విజయవాడలో ప్రభుత్వం పోలీసు జులుం ప్రదర్శించి అక్రమ అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన చేశారు. -
శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ద్వారకాతిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాఽథ్ గురువారం రాత్రి సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు తొలుత దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖమండపంలో అర్చకులు, పండితులు న్యాయమూర్తికి శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలుకగా, దేవస్థానం ఈఓ యర్రంశెట్టి భద్రాజీ చినవెంకన్న చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. న్యాయమూర్తి వెంట భీమడోలు కోర్టు జడ్జి ఎస్.ప్రియదర్శిని నూతక్కి, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, ఆలయ ఏఈఓ ఎం.దుర్గారావు తదితరులున్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల పక్కన నిలిపి ఉంచిన పాత వాహనాలను తొలగించి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, ట్రాఫిక్ సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశాల ప్రకారం శుక్రవారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్, ట్రాఫిక్ శాఖలు టీంలుగా ఏర్పడి భీమవరం పట్టణంలోని జువ్వలపాలెం రోడ్డు, టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియా, టౌన్ హాల్ రోడ్డు, కూడలిలో రోడ్ల పక్కన దీర్ఘకాలికంగా నిరుపయోగంగా ట్రాఫిక్కు అవరోధంగా ఉన్న వివిధ రకముల 11 పాత వాహనాలు ఖాళీ ప్రదేశానికి తరలించారు. ట్రాఫిక్కు అంతరాయంగా ఉన్న 30 హోర్డింగ్లు తొలగించడం, ట్రాఫిక్ అంతరాయంగా ఉన్న ఆవులను తరలించామని మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి తెలిపారు. కలెక్టర్ ఆదేశాలు ప్రకారం రోడ్ల పక్కన పాత వాహనాలు వదిలే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భీమవరం: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం విద్యార్థులకు ప్రత్యేకంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో కార్యక్రమాన్ని జిల్లా ఆర్మర్డ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ ప్రారంభించి మాట్లాడుతూ భావి భారత పౌరులైన విద్యార్థులకు పోలీసు విధి నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణలో వినియోగించే అత్యాధునిక ఆయుధ సంపత్తి, రక్షణ సాంకేతికతపై ప్రత్యక్ష అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఓపెన్ హౌస్ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు చెప్పారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ చట్టాలు, వేధింపులకు వ్యతిరేకంగా తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలు, సామాజిక మాధ్యమాల్లో పొంచి ఉన్న ముప్పుపై సమగ్ర అవగాహన కల్పించారు. -
కులాల కుంపట్లు.. ప్రసాదాలపై దుష్ప్రచారం
సాక్షి, భీమవరం: కులాల కుంపట్లు పెట్టి ప్రజల్ని విడదీయడం, హిందూ దేవాలయాలు, ప్రసాదాలపై విషం చిమ్మి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం దుర్మార్గ పాలన సాగిస్తోందని వైఎస్సార్సీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. రాజకీయాల్లో ఉన్నవారు ప్రజలకు మేలు చేయాలని, లేదంటే రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చోవాలని సూచించారు. భీమవరంలోని పంచారామ క్షేత్రం సోమేశ్వరస్వామిని శుక్రవారం రోజా దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆమె మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించారు. అసెంబ్లీకి రావడం లేదంటూ ఆరోపిస్తున్న కూటమి నేతలు అసెంబ్లీ, మండలికి వైఎస్సార్సీ సభ్యులు హాజరైతే ఏవిధంగా వ్యవహరిస్తున్నారో అంతా చూస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడం లేదని చెప్పారు. వాగ్దానాలు, అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేకపోగా రాజకీయ స్వలాభం కోసం హిందూ ఆలయాలు, ప్రసాదాలపై దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఏ హిందువు కూడా స్వామివారిని, ప్రసాదాన్ని దిగజార్చే విధంగా రాజకీయాల్లోకి లాగి భక్తుల మనోభావాలను దెబ్బతీయరని చెప్పారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సీఎం, డిప్యూటీ సీఎంల తీరు చూస్తుంటే వారు హిందువులేనా అనే అనుమానం కలుగుతోందన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ సిట్ నివేదిక ద్వారా సుప్రీంకోర్టు నిర్ధారించి దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పినా సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి దిగజారి మాట్లాడుతున్నారని రోజా విమర్శించారు. శాసనమండలిలో చర్చను పక్కదారి పట్టించేందుకు చివరికి మండలి చైర్మన్ కులం, మతం గురించి ప్రస్తావన చేసే స్థాయికి దిగజారడం దురదృష్టకరమని రోజా అన్నారు. మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు పెద్ద మనసుతో క్షమించినా, రాష్ట్రంలోని దళితులు, క్రిస్టియన్లు, పేదలు కూటమి నేతలను క్షమించరన్నారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఆ పదవిని సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అనేది చూడాలి తప్ప కులాలు, మతాలను కాదన్నారు. మంత్రి స్థానంలో ఉన్న అచ్చెంనాయుడు గాడిద లాగా అడ్డంగా పెరిగారే గానీ ఏ రోజూ సక్రమంగా మాట్లాడింది లేదని మండిపడ్డారు. తప్పు చేయనప్పుడు చర్చకు రావాలేగానీ చైర్మన్ మత ప్రస్తావన ఎందుకు తేవాలని ప్రశ్నించారు. అభివృద్ధిని విస్మరించిన కూటమి చంద్రబాబు, పవన్కళ్యాణ్ తీరు చూస్తుంటే హిందువులేనా అనే అనుమానం కలుగుతోంది భీమవరంలో మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు -
కూటమి నేతలు దిగజారిపోయి మాట్లాడుతున్నారు: రోజా
సాక్షి, భీమవరం: తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు తెలిపిందని మాజీ మంత్రి రోజా అన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పిన తర్వాత కూడా సీఎం, డిప్యూటీ సీఎం, చివరికి హోం మంత్రి కూడా దిగజారి మాట్లాడుతున్నారని చెప్పారు. వారి తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.ఇవాళ భీమవరంలో రోజా మాట్లాడుతూ.. ‘శాసన మండలిలో కూడా చైర్పర్సన్ మోషన్రాజు కులం గురించి మాట్లాడే స్థాయికి దిగజారిపోయే పరిస్థితికి కూటమి ప్రభుత్వం వచ్చింది. అసెంబ్లీలో కూటమి నేతలు లేనిపోనివన్నీ మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మంత్రి స్థానంలో ఉన్న అచ్చెన్నాయుడు ఒక్కరోజు కూడా సక్రమంగా మాట్లాడారా?కూటమి నేతలు భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దు. లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేయడానికి కులాల ప్రస్థావన తీసుకురాకూడదు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూటమిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నారు.. ప్రజలకు మంచి చేయండి.. లేదా రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి’ అని అన్నారు. ఇదీ చదవండి: నేపాల్ ఎన్నికల ఫలితాలు భారత్కు ఎందుకింత కీలకం? -
ఇరాన్పై దాడులను ఖండించాలి
భీమవరం: ఇరాన్పై దాడిని, ఖమేనీ హత్యను భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఖండించకపోవడం మన దేశ ప్రతిష్టను మసకబారుస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. భీమవరం ప్యాడీ అండ్ రైస్ మర్చంట్స్ అసోసియేషన్ హాలులో గురువారం నిర్వహించిన సీపీఎం జిల్లా కమిటీ సదస్సులో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధోన్మాద దురాక్రమణ చర్యలు, మారణ కాండను అన్ని పార్టీలు, లౌకిక ప్రజాస్వామిక వాదులు, ప్రపంచ శాంతిని కోరుకునేవారంతా ఖండించాలని కోరారు. ఇరాన్పై అమెరికా దాడి ఆయిల్ వనరులను ఆక్రమించుకోవడానికేనని అన్నారు. ఇరాన్ అణుకేంద్రాల నిర్వహణను అణ్వాయుధాలు తయారు చేయడానికేనని తప్పుగా చిత్రీకరించి అమెరికా దుష్ప్రచారం చేస్తోంనద్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.బలరాం మాట్లాడుతూ అరబ్ దేశాల్లో ఉపాధి నిమిత్తం వెళ్లిన భారతీయుల రక్షణకు కేంద్రం అన్ని చర్యలూ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల మన దేశంలో ఆయిల్, గ్యాస్ సంక్షోభంతో దేశ ప్రజలపై భారం పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. సదస్సులో సీపీఎం నేతలు ఏవీ నాగేశ్వరరావు, మంతెన సీతారాం, ఎ.రవి, బి.వాసుదేవరావు పాల్గొన్నారు. -
11న వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్రస్థాయి సమావేశం
దెందులూరు: వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్రస్థాయి సమావేశం ఈనెల 11వ తేదీన కాకినాడలో జరుగుతుందని ఆ పార్టీ ఎస్సీ సెల్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్ తెలిపారు. గురువారం ఏలూరు రూరల్ మండలం మానూరులో ఆయన నివాసంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకరావు ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అన్ని నియోజకవర్గాల ఎస్సీ సెల్ అధ్యక్షులు విధిగా హాజరుకావాలన్నారు. పార్టీ బలోపేతం, సమస్యల పరిష్కారం, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో దిశానిర్ధేశం చేస్తారని ఆనంద్ తెలిపారు. తప్పిపోయిన చిన్నారి అప్పగింత భీమవరం: తప్పిపోయిన ఓ చిన్నారిని జిల్లా పోలీస్ యంత్రాంగం సురక్షితంగా తల్లికి అప్పగించిన ఘటన ఇది. వివరాల్లోకి వెళ్తే, గురువారం మధ్యాహ్నం సుమారు 3:45 గంటల సమయంలో భీమవరం మారుతి టాకీస్ సమీపంలోని గులాబీ సెంటర్ వద్ద ఒక ఏడేళ్ల చిన్నారి ఒంటరిగా ఏడుస్తున్నట్లు డయల్ 112 హెల్ప్లైన్ ద్వారా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే భీమవరం వన్టౌన్ సీఐ ఎం.నాగరాజు తన సిబ్బందితో కలిసి నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర భయాందోళనలో ఉన్న ఆ చిన్నారితో సీఐ నాగరాజు మాట్లాడి వివరాలు సేకరించారు. సమాంతరంగా జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించి, వారి పర్యవేక్షణలో చిన్నారికి రక్షణ కల్పించారు. ఆ పాప పట్టణంలోని సర్రాజు గారి వీధికి చెందిన సోడాదాసి మాధవి కుమార్తెగా గుర్తించారు. అనంతరం, చైల్డ్ ప్రొటెక్షన్ నిబంధనలను పాటిస్తూ, తగిన ఆధారాలను ఽధ్రువీకరించుకున్న తర్వాత చిన్నారిని తన తల్లికి క్షేమంగా అప్పగించారు. ఆపదలో ఉన్న తన బిడ్డను అత్యంత వేగంగా గుర్తించి అప్పగించిన పోలీసుల చొరవకు, సీఐ నాగరాజుకు ఆ తల్లి కృతజ్ఞతలు తెలియజేసింది. భీమవరం (ప్రకాశంచౌక్): అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పట్టిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈనెల 8వ తేదీన భీమవరం విష్ణు కాలేజీలో నిర్వహించనున్న జిల్లా స్థాయి కార్యక్రమం ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్లోని చాంబర్ నందు సీ్త్ర, శిశు సంక్షేమం, డీఆర్డీఏ, మెప్మా, విద్యాశాఖ, కార్మిక శాఖ తదితర శాఖల అధికారులతో జేసీ సమీక్షించారు. అన్ని నియోజకవర్గాల్లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక అధికారులు సమగ్ర ప్రణాళికతో ముందుకు రావాలన్నారు. జిల్లాలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన మహిళలను గుర్తించి సన్మానించాలని సూచించారు. దాళ్వా ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టాలి ఉగాది అనంతరం రైతుల నుంచి దాళ్వా సీజన్ ధాన్యం కొనుగోలుకు అధికారులు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ టి రాహుల్కుమార్రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార, రవాణా శాఖ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్తో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జేసీ సమీక్షించారు. ఏలూరు టౌన్: ఆపరేషన్ వజ్రపహార్లో భాగంగా ఏలూరు రూరల్ వైఎస్సార్ కాలనీలో భారీ కార్డన్ అండ్ సెర్చ్ను ఏలూరు పోలీస్, ఈగల్ టీమ్ సభ్యులు సంయుక్తంగా చేపట్టారు. ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో గురువారం తెల్లవారుజాము నుంచే వైఎస్సార్ కాలనీ, పోణంగి ప్రాంతాల్లో పోలీస్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పోలీస్, ఈగల్ టీమ్ పోలీసులు సుమారు 50 మందికిపైగా ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నారు. రెండు ప్రాంతాలను పూర్తిగా పోలీస్ అధికారులు, సిబ్బంది దిగ్బంధించారు. మరోవైపు డ్రోన్ కెమెరాలతో పూర్తిస్థాయిలో నిఘా ఉంచారు. ఈ ఆపరేషన్లో సుమారు 14 సరైన పత్రాలు లేని మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
పెచ్చుమీరిన మట్టి మాఫియా ఆగడాలు
● బొండాడ మేజర్ డ్రెయిన్ ఆక్రమించి వంతెన నిర్మాణం ● ముంపుబారిన వరిచేలు.. అధికారుల కుంటిసాకులు ఉండి: రైతులను ఆదుకోవాల్సిన అధికారులే కూటమి నేతలకు దాసోహం పలికి మట్టి మాఫియాకు అండగా నిలవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా మేజర్ డ్రెయిన్ ఆక్రమించుకుని అక్రమంగా పూడ్చివేసి మట్టి అక్రమ రవాణా కోసం వంతెన నిర్మించడంపై రైతులు మండిపడుతున్నారు. ముంపు బారిన వరిచేలు ఉండి మండలంలో ఆరేడు, పాందువ్వ, యండగండి, ఉప్పులూరు, కోలమూరు, ఉండి, ఎన్నార్పీ అగ్రహారం, చిలుకూరు, వెలివర్రు తదితర గ్రామాలతో పాటు ఆకివీడు, పాలకోడేరు మండలాల్లోని కొన్ని గ్రామాల్లో వరిపంట ఆకస్మికంగా ముంపు బారిన పడింది. దీంతో కొందరు రైతులు డ్రెయినేజీ అధికారులను సంప్రదించగా మాయమాటలతో కాలం గడిపేశారు. తీరా అసలు విషయం తెలిశాక రైతులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. విషయం ఏంటంటే.. రూ.కోట్ల విలువైన మట్టిని భారీ ఎత్తున అక్రమంగా తరలించేందుకు అనువుగా మట్టి మాఫియా ఉండి మండలం వాండ్రం శివారులో బొండాడ మేజర్ డ్రెయిన్ను ఆక్రమించి భారీ వంతెన నిర్మాణం చేపట్టారు. డ్రెయిన్ మూడొంతులు పూడ్చివేసి భారీ లారీలు వెళ్లేలా వంతెన నిర్మాణం చేశారు. దీంతో ప్రతి రోజు భారీగా వెళ్లే నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడటంతో డ్రెయిన్ నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. పైనుంచి వస్తున్న ప్రవాహంతో నీటిమట్టం రోజురోజుకు పెరిగి వరిపొలాలు ముంపుకు గురవుతున్నాయి. అంతే కాకుండా ప్రస్తుతం పొట్టదశలో వున్న వరిచేలు మునిగిపోవడంతో కుళ్లిపోతున్నాయి. డ్రెయిన్లలోని నీరు ఎగదన్నడంతో ఆక్వా వ్యర్థాలు వరిచేలల్లోకి చేరి చేలు ఎందుకు పనికాకుండా పోతు న్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. అధికారుల కుంటిసాకులు దీనిపై రైతులు అధికారులను ప్రశ్నించగా జువ్వలపాలెం రోడ్డులో కోపెల్ల వంతెన నిర్మాణం చేస్తుండడంతో నీటి ప్రవాహానికి ఇబ్బందిగా ఉందని ఒకసారి, మేజర్ డ్రెయిన్లో తూడు పెరిగిపోయిందని మరోసారి, ఉండి అక్విడెక్టు వద్ద తూడు మేటలు వేస్తుందంటూ ఇంకోసారి ఇలా రకరకాల సాకులు చెప్పి మోసగిస్తున్నారు. దీంతో విషయం అర్థమైన రైతులు గట్టిగా నిలదీయగా మట్టి మాఫియాను పట్టించుకోవద్దని కూటమి నేతల నుంచి ఫోన్లు వస్తున్నాయని, అందుకే ఏం చెయ్యలేకపోతున్నామంటూ ఓ అధికారి వాపోయారు. ఉండి నియోజకవర్గంలో మట్టి మాఫియా ఆగడాలు పెచ్చుమీరుతున్నా మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడంపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బొండాడ మేజర్ డ్రెయిన్పై అక్రమంగా వంతెన నిర్మించినట్లు నాకు తెలియదు. కొందరు ఫోన్ చేసి అడుగుతున్నారు. దీనిపై పరిశీలన చేసి ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకుంటాం. – రుద్రరాజు అప్పన్న, డ్రెయిన్స్ డీఈ, భీమవరం -
వసతులు మృగ్యం.. జీవనం భారం
రహదారులు అధ్వానం.. తాగునీటికి నిరంతరం తప్పని అవస్థలు.. డ్రెయినేజీ సౌకర్యం చెప్పే పనే లేదు. ఇదీ జిల్లా వ్యాప్తంగా హౌసింగ్ లేఅవుట్ల (జగనన్న కాలనీ) పరిస్థితి. 70 శాతం లేఅవుట్లలో కనీస సౌకర్యాలు లేవు. దీంతో లబ్ధిదారులు నిత్యం సమస్యలతో సహవాసం చేయాల్సిన దుస్థితి. వర్షాకాలంలో వీరి అవస్థలు వర్ణనాతీతం. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా హౌసింగ్ లేఅవుట్లలో కల్పించాల్సిన కనీస సౌకర్యాలపై శ్రద్ధ చూపడం లేదు. మేము మూడేళ్లుగా విస్సా కోడేరు లేఅవుట్లో నివాసం ఉంటున్నాము. కాలనీలో రోడ్డు దారుణంగా ఉన్నాయి. వర్షాకాలంలో రోడ్లు బురదమయంగా తయారవుతున్నాయి. నడవడానికి కూడా వీలు లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. కనీసం గ్రావెల్ రోడ్లు అయిన నిర్మించాలి. – ఎం.దుర్గ, విస్సాకోడేరు లేఅవుట్, భీమవరం మేము ఏడాదిగా నివాసం ఉంటున్నాము. ఇక్కడ మంచినీటికి పైపులైన్లు వేశారు కాని కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు. వారానికి ఒకసారి ట్యాంకర్ల ద్వారా మంచినీళ్లు సరఫరా చేస్తున్నారు. దీంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. రోడ్లు, మంచినీటి సమస్య పరిష్కరించాలి. – జి.లోయిస్, విస్సాకోడేరు లేఅవుట్, భీమవరం భీమవరం (ప్రకాశం చౌక్): పేదల సొంతింటి కల నెరవేర్చడానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జిల్లా వ్యాప్తంగా హౌసింగ్ (జగనన్న కాలనీ) లేఅవుట్లు ఏర్పాటు చేసింది. లబ్ధిదారులకు ఇంటి స్థలం మంజూరు చేసి ఇళ్లు నిర్మించి ఇచ్చారు. కరోనా విపత్తు దాటిన తర్వాత ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తయ్యాయి. దీంతో లబ్ధిదారులు గృహ ప్రవేశాలు సైతం చేశారు. హౌసింగ్ లేఅవుట్లలో మౌలిక సదుపాయాలను గత ప్రభుత్వం కొంతవరకు కల్పించింది. అనంతరం ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారిపోవడం జరిగిపోయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కాలనీల్లో మౌలిక సదుపాయాలపై పట్టించుకోవడం లేదు. కాలనీల్లో రోడ్లు, డ్రెయినేజీ, మంచినీటి పైపులైన్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల నిర్మాణం పూర్తి అయిన వాటికి గృహప్రవేశాలు చేసి చంద్రబాబు ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవడం తప్ప వారికి కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. దీంతో లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. కాలనీల్లోని సమస్యలపై మహిళలు పీజిఆర్ఎస్కు వచ్చి మొరపెట్టుకుంటున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. విస్సాకోడేరు లేఅవుట్లో సమస్యల వలయం జిల్లా కేంద్రమైన భీమవరం మున్సిపాలిటికి సంబంధించి ఉన్న విస్సాకోడేరు లేఅవుట్(జగనన్న కాలనీ) సమస్యల వలయంగా ఉంది. జిల్లాలోనే పెద్ద లేఅవుట్గా ఉన్న ఈ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి నుంచి లోపల అంతర్గత రోడ్లు వరకు అధ్వానమే. పైపులైన్లు వేసిన కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు. పైపులైను కట్ చేశారని కాలనీ వాసులు వాపోతున్నారు. మున్సిపాలిటీ నుంచి మంచినీళ్లు వారానికి ఒకసారి ట్యాంకుల ద్వారా సరఫరా చేయడంతో తాగునీరు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ప్రతి వేసవిలో వచ్చి ఇళ్ల నిర్మాణం వేగంగా జరగాలని మీటింగ్లు పెట్టడం తప్ప అక్కడ ఉన్న వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం లేదు. ఇళ్లు గృహప్రవేశాలు చేసిన వారు అక్కడ ఉన్న సమస్యలు తట్టుకోలేక ఇళ్లకు తాళాలు వేసి బయటకు అద్దెకు ఉంటున్నారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేస్తే ఆయా కాలనీల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుస్తాయని, ఇప్పటికై నా ప్రభుత్వం మౌలిక సదుపాయాల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. పలుచోట్ల తాగునీటికి సైతం కాలనీవాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని లేఅవుట్ల్లో పైపులైన్లు వేసినా.. కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు. కొన్ని లేఅవుట్ల్లో పైపులైన్లే వేయలేదు. దీంతో ఆయా కాలనీల్లోని ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయట నుంచి మంచినీటిని కొనుగోలు చేసి దాహం తీర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. హౌసింగ్ లేఅవుట్లలో కానరాని మౌలిక సదుపాయాలు రోడ్లు అధ్వానం.. తాగునీటికి అవస్థలు వర్షాకాలంలో మరిన్ని ఇబ్బందులు పట్టించుకోని చంద్రబాబు సర్కార్ జిల్లావ్యాప్తంగా 630 లేఅవుట్లు ఉండగా సుమారు 50 వేల ఇళ్లు మంజూరు చేశారు. గత ప్రభుత్వంలో 60 శాతం ఇళ్లు నిర్మాణం పూర్తి చేశారు. ఇందులో దాదాపు 70 శాతం లేవుట్ల్లో రోడ్లు నిర్మాణం జరగలేదు. దాంతో కాలనీల్లో ప్రధాన రహదారులు నుంచి వీధిరోడ్లు వరకు అధ్వానంగా ఉన్నాయి. వర్షాకాలంలో బురదలో నడిచి వెళ్లడానికి నరకం చూస్తున్నారు. చిన పిల్లలు స్కూల్కి, మహిళలు పనులకు బయటకు వెళ్లే సమయంలో అధ్వానంగా ఉన్న రోడ్లతో ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ను వాహనాల్లో తెచ్చుకొవడానికి కూడా వీలు లేని పరిస్థితి పలు లేఅవుట్లలో ఉంది. గోతులమయంగా ఉన్న రోడ్లలో వాహనాలు దిగబడి ముందుకుసాగే పరిస్థితి ఉండడం లేదు. -
పది పరీక్షలకు అంతా సిద్ధం
భీమవరం: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అంతా సిద్ధమైంది. ఈనెల 16వ తేదీన ప్రారంభం కానున్ను పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 132 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో మొత్తం 24,166 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది. టెన్త్ పరీక్షల్లో గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 81 శాతం ఉత్తీర్ణత సాధించగా ప్రస్తుత విద్యాసంవత్సరంలో 88 శాతం ఉత్తీర్ణత సాఽధించాలనే లక్ష్యంగా విద్యాశాఖ నిర్ణయించుకోంది. బాలురే అధికం : పబ్లిక్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల్లో బాలికల కంటే బాలురే అధికంగా ఉన్నారు. మొత్తం 24,166 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా వారిలో 12,270 మంది బాలురు, 11,406 మంది బాలికలు ఉన్నారు. వారిలో 22,752 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 1,414 మంది ఒన్ ఫెయిల్డ్ విద్యార్థులున్నారు. వెబ్సైట్లో హాల్టికెట్ : పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ల కోసం స్కూళ్లు చుట్టూ తిరగనవసరం లేకుండా వెబ్సైట్లో పొందుపర్చారు. విద్యార్థులు పరీక్షా హాల్టికెట్ను వెబ్సైట్లో నేరుగా పొందువచ్చు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం : పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు గతంలో మాదిరిగానే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించారు. బాలురు, బాలికలనే తేడా లేకుండా పరీక్ష సమయంలో విద్యార్థులు తమ గ్రామాల నుంచి పరీక్షా కేంద్రానికి ఆర్టీసీ బస్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పరీక్ష హాల్ టికెట్ను చూసిస్తే సరిపోతుంది.పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలోని 132 పరీక్షా కేంద్రాల్లో ఎక్కడా మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా చర్యలు చేపట్టాం. పరీక్షల నిర్వహణకు దాదాపు 1,800 మంది ఇన్విజిలేటర్లు, 22 మంది సిట్టింగ్ స్క్వాడ్, ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్స్, రాష్ట్ర, జిల్లాస్థాయి అబ్జర్వర్స్ పనిచేస్తున్నారు. – ఇ నారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం పరీక్షలు ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. 16వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లీష్, 23న మ్యాథ్స్, 25న ఫిజికల్ సైన్స్, 28న బయాజికల్ సైన్స్, 30న సోషల్ స్టడీ, 31న సెకండ్ లాంగ్వేజ్ పేపర్–2, ఏప్రిల్ 1వ తేదీన ఎస్ఎస్సీ ఆప్షనల్/ ఇతర సబ్జెక్టులు ఉంటాయి. -
గ్రామ సచివాలయానికి జనసేన సర్పంచ్ తాళం
నరసాపురం రూరల్: చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమంటూ జనసేన పార్టీ కి చెందిన సర్పంచ్ గ్రామ సచివాలయానికి తాళం వేసి నిరసన చేపట్టిన ఉదంతం సంచలనం కలిగించింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పసలదీవిలో గురువారం ఈ ఘటన జరిగింది. పసలదీవి సర్పంచ్ కొట్టు రామాంజనేయులు, పదిమంది వార్డుసభ్యులు, ఎంపీటీసీ సభ్యుడు జనసేన పార్టీ కే చెందినవారు. అయినప్పటికీ తమ గ్రామంలో అభివృద్ధి జరగడం లేదని, అభివృద్ధిలో వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ సర్పంచ్ రామాంజనేయులు సచివాలయానికి తాళం వేసి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్కు పంచాయతీరాజ్శాఖ కేటాయించడంతో తమ గ్రామం అభివృద్ధిలో ముందుంటుందని అప్పట్లో ఆశపడినట్లు సర్పంచ్ చెప్పారు. తమ పదవీకాలం పూర్తయిందిగానీ.. అభివృద్ధి మాత్రం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికితోడు సొంత నిధులతో గ్రామంలో కొన్ని అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. వీటికి బిల్లుల చెల్లింపులో గ్రామ కార్యదర్శి తనకు, పంచాయతీ పాలకవర్గానికి కనీస విలువ ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయానికి తాళం వేయడంతో కొంతమంది ఉన్నతాధికారులు తనతో మాట్లాడారని, త్వరలో సమస్య పరిష్కరిస్తామని చెప్పారని ఆయన తెలిపారు. ప్రభుత్వంలో భాగమైన జనసేన పార్టీ కి చెందిన సర్పంచ్ ఈ తీరుగా నిరసన చేపట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. జనసేన పార్టీ కి చెందిన ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ నరసాపురం ఎమ్మెల్యే కావడటంతో ఈ సంఘటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. -
చిన్నాన్న ఇంట్లో తమ్ముడు బందీ..?
పశ్చిమగోదావరి : ‘మా తమ్ముడిని నన్నూ కలపండి.. చిన్నాన్న ఇంటి వద్ద తమ్ముడు బందీగా ఉన్నాడు’ అంటూ పాలకొల్లులో మేనమామ వద్ద ఉంటున్న అన్న కోటి శ్రీహర్ష ఆవేదన చెందుతున్నాడు. మేనమామ నరేష్ బాధిత బాలుడు హర్ష తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన మర్రి నాగేంద్రబాబు, నాగమల్లేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కోటి శ్రీహర్ష 10వ తరగతి, చిన్న కుమారుడు తులసి విశ్వాంత్ 9వ తరగతి చదువుతున్నాడు. నాగేంద్రబాబు విద్యుత్ లైన్మెన్గా పనిచేశారు. 2023లో నాగమల్లేశ్వరి కేన్సర్తో, 2025లో నాగేంద్రబాబు అనారోగ్యంతో మరణించారు. దీంతో పాలకొల్లుకు చెందిన మేనమామ కొమిరిశెట్టి నరేష్ పిల్లలిద్దరినీ పాలకొల్లు తీసుకువచ్చి చదివిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో పిల్లల చిన్నాన్న రఘునాథ్ పాలకొల్లు వచ్చి నాగేంద్రబాబు కార్యక్రమం చేయాలని చెప్పి శ్రీహర్ష, విశ్వాంత్ను వినుకొండ తీసుకువెళ్లాడు. నెల రోజులు గడిచినా పిల్లలను పంపకపోవడంతో నరేష్ నిలదీశాడు. దీంతో రఘునాథ్ అసలు స్వరూపం బయటపడింది. పిల్లల తండ్రి నాగేంద్రబాబు చాలా అప్పులు చేశాడని, ఆ బాకీలు ఎవడు తీరుస్తాడని అంటూ.. పిల్లలు కావాలంటే రెండు చెక్కులు, రెండు నోట్లు ఇవ్వాలని అన్నాడు. తెలివితేటలు చూపిస్తే అంతుచూస్తానని బెదిరించాడు. దీంతో నరేష్ గత నెల 12న పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు రంగంలోకి దిగారు. పల్నాడు జిల్లా అధికారులకు సమాచారం అందించగా.. అక్కడి అధికారులు రఘునాథ్ ఇంటికి వెళ్లి విచారించి శ్రీహర్షను మాత్రమే విడిపించి పాలకొల్లు పంపించారు. విశ్వాంత్ను అక్కడే ఉంచడంపై చైల్డ్ వెల్ఫేర్ అధికారులను అడగ్గా.. బాబాయి ఇంటి వద్ద బాగానే ఉందని చెప్పాడని, దీంతో అక్కడే ఉంచేసినట్టు సమాచారం ఇచ్చారు. తాళం వేసి ఇంట్లో ఉంచేవారు తాను పాలకొల్లు వచ్చి పది రోజులు కావస్తుందని, తమ్ముడు ఒక్కసారి మాత్రమే ఫోన్ చేశాడని శ్రీహర్ష అన్నాడు. తమ్ముడు ఏమీ మాట్లాడలేకపోతున్నాడని, తనను పంపడం లేదని అన్నాడని కన్నీటి పర్యంతమయ్యాడు. మా నాన్న చేసిన అప్పుల కోసం మమ్మల్ని నిలదీస్తున్నారని, దయచేసి తమ్ముడినీ నన్నూ కలపండని వేడుకుంటున్నాడు. ఈనెల 16 నుంచి పదో తరగతి పరీక్షలు మొదలవుతున్నాయని, తమ్ముడిపై బెంగతో చదువుపై దృష్టి సారించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. వినుకొండలో తమను తాళం వేసి ఇంట్లోనే ఉంచేవారని, కనీసం టాయిలెట్కు వెళ్లాలన్నా వాళ్లకు చెప్పాల్సి వచ్చేదని అంటున్నాడు. ఇదిలా ఉండగా శ్రీహర్షను మాత్రమే విడిపించి విశ్వాంత్ను అక్కడే ఉంచిన చైల్డ్ వెల్ఫేర్ అధికారుల తీరుపై అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. -
దమనకాండ అన్యాయం
కూటమి నాయకులిచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలమయ్యారు. జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. అమలు కోసం విజయవాడలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్పై పోలీసులతో దమనకాండకు పాల్పడడం అన్యాయం. ఇప్పటికైనా జీతాలు పెంచకపోతే పోరు ఉధృతం చేస్తాం. – డి.కల్యాణి, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్చి 2న శాంతియుతంగా ధర్నా జరుగుతున్న సందర్భంలో మా రాష్ట్ర నాయకులను చర్చలకు పిలిచి వేతనాలు పెంచుతారని ఎదురు చూశాం. చీకటి పడుతున్నా చర్చలకు పిలవలేదు.శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీ మహిళలను అరెస్టు చేసి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి వదలడం చాలా బాధాకరంగా ఉంది. – కానూరి తులసి, పెనుగొండ అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేసి, ఒకసారిగా అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేశారు. పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. సహచర సిబ్బందికి గాయాలయ్యాయి. నాకు ఫోన్ రావడంతో నేను కూడా బంధువుల సాయంతో ఆ ప్రాంతానికి రాత్రి సమయంలో చేరుకున్నాను. అప్పటికే పోలీసులు మా వాళ్ళందరినీ తీసుకెళ్లిపోయారు. – గంగోలు పెద్దింట్లమ్మ, అంగన్వాడీ టీచర్, మొగల్తూరు కూటమి ప్రభుత్వం దుర్మార్గపు పాలన సాగిస్తోంది. న్యాయబద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయమని కోరిన అంగనన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై పోలీసులతో దౌర్జన్యం చేయడం దారుణం. నిద్రిస్తున్న సమయంలో అక్రమ అరెస్టులు చేసి వారి పట్ల నిర్దయగా ప్రవర్తించడం సరికాదు. – వాసుదేవరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి, భీమవరం -
ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలి
శాసనమండలిలో ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ తణుకు అర్బన్: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో అర్బన్ ఆరోగ్య కేంద్రం ప్రజలకు వినియోగంలో లేకుండా పోయిందని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ శాసనమండలి దృష్టికి తీసుకొచ్చారు. బుధవారం మండలిలో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. 2023లో గత ప్రభుత్వ హయాంలో పూర్తి సౌకర్యలతో నిర్మించారని, కేవలం కరెంట్ కనెక్షన్ లేకపోవడంతో ఈ ఆరోగ్య కేంద్రం ప్రజలకు వినియోగంలోకి రాలేదని అన్నారు. ఈ సెంటర్ చుట్టుపక్కల సుమారుగా 25 వేల జనాభా ఉన్న కారణంగా గత ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ప్రతిపాదించి పని కూడా పూర్తి చేసిందని అన్నారు. ఆరోగ్య కేంద్రానికి కేటాయించిన ఆరోగ్య సిబ్బంది కూడా ఉన్నప్పటికీ ప్రజలకు వినియోగంలోకి తీసుకురాకపోవడం అధికారుల అలస్వతానికి నిదర్శనమన్నారు. ఉండి: ఈ నెల 3, 4 తేదీల్లో సాక్షిలో ప్రచురితమైన వరుస కథనాలకు అధికారులు స్పందించారు. మండలంలో ప్రధానమైన బొండాడ మేజర్ డ్రెయిన్తో పాటు మీడియం, మైనర్ డ్రెయిన్లు గుర్రపు డెక్క, తూడు, చెత్తచెదారంతో నిండిపోయాయి. దీంతో మండలంలోని ఆరేడు, పాందువ్వ, కోలమూరు, యండగండి, చిలుకూరు, ఎన్నార్పీ అగ్రహారం, ఉండి, వెలివర్రు, మహదేవపట్నం తదితర గ్రామాల్లోని వరిపంటతో పాటు పాలకోడేరు, ఆకివీడు మండలాల్లోని పలు గ్రామాల్లో కూడా పంట ముంపునకు గురికావడంతో రైతులు లబోదిబోమన్నారు. సాక్షిలో వచ్చిన కథనాలకు అధికారులు బుధవారం స్పందించారు. పొక్లెయిన్ సాయంతో అక్విడెక్టు వద్ద మేటలు వేసిన డెక్క తూడును తొలగించి ట్రాక్టర్ల సహాయంతో ఇతర ప్రాంతాలకు దానిని తరలిస్తున్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): బుధవారం భీమవరం న్యూ బస్స్టేషన్లో పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా రవాణాధికారి ఎస్.గిరిధర్ కుమార్, అవుట్ సోర్సింగ్ డ్రైవర్స్, ఆన్కాల్ డ్రైవర్స్, హైర్ బస్సు డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. డీపీటీఓ మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్క డ్రైవర్ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. ఉదయం, సాయంత్రం బస్సుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సర్వీసులు జాగ్రత్తగా నడపాలన్నారు. భీమవరం: సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం పోలీసులతో దాడిచేయించి అక్రమ అరెస్టులు చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. బుధవారం భీమవరంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కనీస వేతన చట్టాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయిస్తుందని ధ్వజమెత్తారు. అంగన్వాడీలు న్యాయమైన కోర్కెలు తీర్చాలని విన్నవించుకోవడానికి విజయవాడ వస్తే పోలీసుల బలగాలను ఉపయోగించి లాఠీచార్జ్ చేయడం, ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని బెదిరింపులకు దిగడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శమన్నారు. స్కీమ్ వర్కర్స్కు ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించే అన్ని సౌకర్యాలు కల్పించి, కనీస వేతనాలు అమలు చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆక్వా రైతులకు మద్దతు ధర చెల్లించాలని ఫీడ్, సీడ్ ధరలు ప్రభుత్వ కంట్రోల్ ఉండాలన్నారు. -
20న శ్రీవారి క్షేత్రంలో ఉగాది వేడుకలు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఈనెల 20న శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను అట్టహాసంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ బుధవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ఉభయ దేవేరులతో శ్రీవారు ఆలయం నుంచి వెండి శేషవాహనంపై ఊరేగింపుగా ఉగాది మండపం వద్దకు తరలివెళ్తారు. అక్కడ మండపంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం అర్చకులు, పండితులు పంచాంగ శ్రవణం జరుపుతారు. శ్రీవారి సాయంకాలార్చన సమయంలో మార్పు ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 14 నుంచి స్వామి వారి సాయంకాలార్చన సమయాన్ని మార్పు చేస్తున్నట్టు ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం సాయంకాలార్చనను నిత్యం సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు నిర్వహిస్తున్నారు. సూర్యాస్తమయ మార్పునకు అనుగుణంగా ఈ నెల 14 నుంచి ఈ సాయంకాలార్చనను సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అర్చకులు నిర్వహిస్తారని ఈఓ తెలిపారు. అర్చన సమయంలో నిలిచిపోయిన శ్రీవారి దర్శనాన్ని తిరిగి రాత్రి 7 గంటల నుంచి భక్తులకు కల్పిస్తామని, ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు. -
బంగారు ఆభరణాల చోరీ కేసులో దొంగల అరెస్ట్
భీమవరం: ఆటోలో బంగారు నగలు చోరీ చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్చేసి వారి నుంచి రూ.3.60 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఎం.నాగరాజు చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం వన్టౌన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ వెల్లడించారు. పట్టణంలోని నరసయ్య అగ్రహారానికి చెందిన బొక్కా వీరవేణి గతనెల 27వ తేదీన ఆటోలో ప్రయాణిస్తుండగా సుమారు 59 గ్రాముల బంగారు ఆభరణాలను గుర్తు తెలి యని వ్యక్తులు దొంగిలించారు. బాధితురాలు ఈనెల 3వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలోని సీసీ కెమెరా ఫుటేజీలను నిశితంగా పరిశీలించి సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించినట్లు సీఐ తెలిపారు. చోరీకి పాల్పడిన నిందితులు తాడేపల్లిగూడెం మండలం యాగర్లపల్లి గ్రామానికి చెందిన పాట్నాల పోలమ్మ, పొరిపిరెడ్డి చాందినీలను పట్టణంలోని ప్రకాశంచౌక్ సెంటర్లో బుధవారం అరెస్ట్ చేసి వారి నుంచి చోరీ సొత్తు రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు సీఐ నాగరాజు చెప్పారు. -
వైఎస్సార్సీపీలోకి జనసేన కార్యకర్తలు
తాడేపల్లిగూడెం రూరల్: గ్రామ స్థాయిలో వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి చేయాలని వైఎస్సార్సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ వడ్డి రఘురాం నాయుడు అన్నారు. బుధవారం మండలంలోని పట్టెంపాలెంలో జనసేనకు చెందిన వంద మంది వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి వడ్డి రఘురాం పార్టీ కండువాలు వేసి స్వాగతించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. రాబోయే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలన్నారు. ఎంపీటీసీ జంపెల్లి సత్యవతి, సర్పంచ్ ఎలిపే గాంధీ, నాయకులు గొర్రెల శ్రీనివాస్, గంటి చిన సర్వేశ్వరరావు, సూర్పరాజు పాల్గొన్నారు. -
భగ్గుమన్న అంగన్వేడి
గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2026సాక్షి, భీమవరం: జిల్లాలో ఆయా(హెల్పర్లు)లతో నడిచే మినీ కేంద్రాలు 70, వర్కర్, హెల్పర్లతో నిర్వహించే కేంద్రాలు 1,556 ఉన్నాయి. వీటి పరిధిలో 7,936 మంది గర్భవతులు, 5,686 మంది బాలింతలు, ఏడు నెలల వయస్సు నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 40,706 మంది, మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు బాలలు 17,687 మంది ఉన్నారు. వీరికి జిల్లా వ్యాప్తంగా 3,050 మంది వరకు అంగనన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ద్వారా అవసరమైన సేవలందిస్తున్నారు. హామీ ఇచ్చి.. వంచించి 2024 ఎన్నికల ముందు వేతనాల పెంపు కోసం ఉద్యమించిన అంగనన్వాడీలను చంద్రబాబు కలిసి మద్దతు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రాట్యుటీ పెంపుపై సుప్రీంకోర్టు తీర్పు అమలుచేస్తామని, కనీస వేతనం పెంచుతామన్నారు. అధికారంలోకి వచ్చి 21 నెలలు అవుతున్నా ఎన్నికల హామీకి అతీగతీ లేదు. ఎన్నికల హామీ అమలు కోరుతూ ఇప్పటికే పలుమార్లు శాంతియుతంగా నిరసన తెలుపుతూ వచ్చారు. తాజాగా రాష్ట్ర సంఘం ఇచ్చిన చలో విజయవాడ పిలుపుతో జిల్లా నుంచి అధిక సంఖ్యలో అంగనన్వాడీ వర్కర్లు, హెల్పర్లు తరలివెళ్లారు. మంగళవారం తెల్లవారుజాము సమయంలో పోలీసులు శిబిరాన్ని నిర్బంధించి అక్రమ అరెస్టులు చేసి మారుమూల స్టేషన్లకు తరలించడంతో వీరు తీవ్ర అగచాట్లు పడాల్సి వచ్చింది. ప్రభుత్వ వంచనపై సీఐటీయూ, అనుబంధ సంఘాలు మండిపడుతున్నాయి. మహిళలన్న కనీస కనికరం లేకుండా దుర్మార్గంగా ప్రవర్తించారంటూ జిల్లాలోని ఆయా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల హామీలు అమలుచేసేంత వరకు ఉద్యమాన్ని అపేదిలేదని స్పష్టం చేస్తున్నారు. అంగన్్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యూటీ చెల్లిస్తాం ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి హామీ అంగన్వాడీలకు సుప్రీం తీర్పు అమలుచేస్తామన్న చంద్రబాబు గ్రాట్యూటీ, కనీస వేతనం పెంచుతామని ఎన్నికల్లో హామీ రెండేళ్లవుతున్నా అతీగతీ లేని వైనం అక్రమ అరెస్టులతో ఉద్యమం అణచివేసే కుట్ర జిల్లాలో 3182 మంది అంగన్వాడీ ఆయాలు, కార్యకర్తలు అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రాట్యూటీ చెల్లిస్తాం, కనీస వేతనం పెంచుతామని చంద్రబాబు, పవన్ కల్యాణ్, కూటమి నేతలు ఎన్నికల్లో ఊదరగొట్టారు. మరో రెండు నెలల్లో కూటమి రెండేళ్ల పాలన పూర్తవనుండగా ఎన్నికల హామీ అమలు కోరిన అంగన్వాడీలను చర్చల పేరిట పిలిచి అక్రమ అరెస్టులు చేయడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. -
అరెస్టులతో ఉద్యమం ఆపలేరు
వడ్డి రఘురాం, వైఎస్సార్సీపీ గూడెం కన్వీనర్ తాడేపల్లిగూడెం: అంగన్వాడీల పట్ల చంద్రబాబు తీరు మారలేదని మరోమారు స్పష్టం అయ్యిందని, అంగన్వాడీల అరెస్టులతో వారి ఉద్యమాన్ని ఆపలేరని నియోజకవర్గ వైఎస్సార్సీపీ కన్వీసర్ వడ్డి రఘురాం అన్నారు. ఆయన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రాట్యుటీ, కనీసం వేతనం పెంపు అమలు ఏమైందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైతం ఆందోళన చేస్తున్న వారిని గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుదన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు మాయమాటలు చెప్పారన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టులు చేయిస్తున్నారన్నారు. చర్చలంటూ కబురపెట్టి అక్రమ అరెస్టులు చేయడం నయవంచనే అన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అంగన్వాడీల జీతం 2019లో రూ.11,500కు పెంచారన్నారు. అంగన్వాడీ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామన్నారు. -
ఉపాధ్యాయులపై నిర్లక్ష్యం తగదు
ఏలూరు (టూటౌన్): ఉపాధ్యాయులపై ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదని, పెండింగ్ సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ధర్నా శిబిరాన్ని రాష్ట్ర కన్వీనర్ డా.గుగ్గులోతు కృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల కనీస హక్కులైన 12వ పీఆర్సీ ఏర్పాటు చేసి 30 శాతం ఐఆర్ ప్రకటించడం అత్యవసరం అన్నారు. పెండింగ్ డీఏలు, 11వ పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్స్ వెంటనే చెల్లించాలని, ఉపాధ్యాయులపై యాప్ల భారం, బోధనేతర పనుల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల సమస్యలు పరష్కరించని పక్షంలో ఏపీ జేఏసీ పక్షాన ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలిసి సంయుక్త కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఈ రామ్మోహన్, గౌరవ అధ్యక్షుడు గంధం రాంబాబు, ప్రధాన కార్యదర్శి జి.మోహన్, టి.రామారావు, పి.నాగరాజు, టి.రాహుల్, ఎం.కృష్ణమూర్తి, జి.రమేష్, ఆర్డీవీ ప్రసాద్, కె.రఘురామరాజు, సుధీర్ కుమార్, రామదాసు, ఏ కృష్ణమూర్తి, జే శ్రీను, గుంటూరు శ్రీనివాసరావు ఎస్వీ దుర్గారావు, వెంకటరమణ, సౌజన్య ఎం.రమేష్బాబు, బి నాగరాజు, డి శ్రీనివాసరావు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఎం.హరికష్ణ, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ హాజరై మద్దతు తెలిపారు. -
ఉపాధ్యాయుల రణభేరి 3.0కు కార్యాచరణ
ఏలూరు (ఆర్ఆర్పేట): కూటమి ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని ఉద్ధృతం చేస్తూ మార్చి, ఏప్రిల్ నెలల్లో రణభేరి 3.0 పోరాట కార్యక్రమాలు నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించినట్టు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ రుద్రాక్షి స్పష్టం చేశారు. మంగళవారం యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆ సంఘ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ ఉద్యమం కొనసాగింపుగా రణభేరి 3.0 నిర్వహించాలని రాష్ట్ర సంఘం పిలుపునిచ్చిందన్నారు. దీనిలో భాగంగా ఈనెల 24వ తేదీ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఒకరోజు నిరాహార దీక్ష, ఏప్రిల్ 1, 2 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో రెండు రోజుల నిరాహార దీక్షలు, ఏప్రిల్ 15 నుంచి 19 వరకు రాష్ట్రస్థాయిలో ఐదు రోజుల నిరాహార దీక్ష, ఏప్రిల్ 28న చలో సెక్రటేరియట్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో సంఘ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎంవీ శ్యాంబాబు, జిల్లా సహాధ్యక్షుడు ఎస్.సుధారాణి, జిల్లా కోశాధికారి జీవీ రంగమోహన్, జిల్లా కార్యదర్శులు ఏ.విక్టర్ తదితరులు పాల్గొన్నారు. -
అంతరిస్తున్న జీడి తోటలు
చింతలపూడి: గతంలో మెట్ట రైతులకు కోట్లాది రూపాయల రాబడిని ఆర్జించి పెట్టిన జీడి మామిడి తోటలు నానాటికి అంతరించిపోతున్నాయి. ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా ఒక ఏడాది లాభాలు వస్తే రెండేళ్లు నష్టాలను చవిచూస్తున్నారు మెట్ట రైతులు. దీంతో గత పదేళ్లుగా జీడి తోటలను తొలగించి ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారించారు. ముఖ్యంగా పామాయిల్, మొక్కజొన్న, వేరుశనగ, అరటి పంటలను ఎక్కువగా పండిస్తున్నారు. అదీగాక మెట్ట ప్రాంతంలో భూగర్భ జలాల వినియోగం పెరిగాక వాణిజ్య పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. చింతలపూడి సబ్ డివిజన్లో ఒకప్పుడు వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న జీడి తోటలు ప్రస్తుతం 2 వేల హెక్టార్లకు చేరుకున్నాయి. గతేడాది జీడి పిక్కల బస్తా(100 కేజీలు) రూ.12 వేల వరకు రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేశారు. జీడి తోటల పెంపకం వల్ల రైతులకు రకరకాలుగా ఆదాయం లభిస్తుంది. మన ప్రాంతంలో రైతులు జీడి పిక్కలను మాత్రమే సేకరిస్తారు. జీడి పండ్లను చెట్ల కిందే వదిలేస్తారు. అదే ఇతర రాష్ట్రాల్లో అయితే అక్కడి రైతులు పండ్లను కూడా సేకరించి ఆదాయం పొందుతున్నారు. వీటితో జామ్, పండ్ల రసాలు, తయారు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. విదేశీ ఎగుమతులపై ఇక్కడి రైతులకు దృష్టి లేదు. ఏటా ఇక్కడి నుంచి కమీషన్ దారులు లారీల్లో జీడి పిక్కలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం ఉన్న తోటలను కాపాడుకోవడంతో పాటు కొత్తగా తోటలు వేసుకునే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఏడాది మార్కెట్లో జీడి పిక్కల ధర ఆశాజనకంగానే ఉంటుందని భావిస్తున్నాం. గత రెండు నెలలుగా కురుస్తున్న విపరీతమైన మంచు కారణంగా పూత మాడిపోయే ప్రమాదం ఏర్పడింది. దిగుబడి కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది. దీంతో నష్టాలు తప్పేలా లేవు. – ఎస్కే అహ్మద్, కమలాపురం -
లాఠీచార్జీలు, అరెస్టులు దుర్మార్గం
తణుకు అర్బన్: జీతాలు పెంచమని చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లిన అంగన్వాడీలను కూటమి ప్రభుత్వం అర్ధరాత్రి సమయంలో నిర్బంధించడం, అరెస్టులు, లాఠీచార్జీ చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం నలుపు చీరలు, నలుపు రిబ్బన్లతో ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్ మాట్లాడుతూ చంద్రబాబు మారలేదని, గతంలో గుర్రాలతో తొక్కించిన మైండ్ నేటికీ ఆయనకు కొనసాగుతుందని విమర్శించారు. ఒకవైపు 99 పైసలకు కార్పొరేట్లకు వేలాది ఎకరాలు ఇచ్చేటప్పుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లక్షలాది రూపాయలు గిఫ్ట్ కూపన్లు ఇస్తున్నపుడు, అంగన్వాడీలకు వేతనాలు పెంచమంటే డబ్బులు లేవని చెప్పి ఎవరిని మోసం చేస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో మండలం కన్వీనర్ గుబ్బల గోపి, ఐలు జిల్లా కార్యదర్శి కామన మునిస్వామి, ప్రాజెక్ట్ అధ్యక్షులు బి.వసంత కుమారి, కోకన్వీనర్ ఎన్.ఆదినారాయణ బాబు, వి.ప్రమీల, డి.నళిని రాణి, జి.కనకదుర్గ, బి.నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నేరాలు.. ఖాకీలకు సవాల్
ప్రశాంతంగా ఉండే పశ్చిమగోదావరి జిల్లాలో ఇటీవల నేరాల తీవ్రత పెరుగుతోంది. రౌడీషీటర్లు కత్తులతో స్వైరవిహారం చేస్తున్నారు. అలాగే సైబర్ నేరాలు పెరగడంతో పాటు దోపిడీ కేసులు కూడా పెరిగాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రశాంత వాతావరణం కాస్తా ప్రజలు ఆందోళన చెందే పరిస్థితికి చేరింది. కొత్తగా ఏర్పడిన జిల్లా కావడంతో గతంతో పోల్చుకుంటే పోలీసుల సేవలు ప్రజలకు మరింతగా అందుబాటులోకి వచ్చినా జిల్లాలో నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలోని కొందరు రౌడీషీటర్లు పోలీసులు ఇస్తున్న కౌన్సెలింగ్, పీడి యాక్ట్ ప్రయోగాన్ని లెక్కచేయడం లేదు. జైలుకు వెళ్లినా పర్వాలేదన్నట్లుగా నేరాలకు పాల్పడుతున్నారు. కేసులు, జైలు శిక్షలకు భయపడడం లేదు. నేరాలే లక్ష్యం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. కొందరు ప్రతీకార దాడులకు పాల్పడుతున్నారు. కొందరు హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడుతుంటే.. మరికొందరు బెదిరింపులు, సెటిల్మెంట్ దందాలు చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం జిల్లా కేంద్రమైన భీమవరంలో కోర్టు సమీపంలో ఓ రౌడీ షీటర్ను మరో రౌడీషీటర్ గ్యాంగ్ కారుతో గుద్ది కత్తులతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ రోజు రౌడీషీటర్ల మధ్య గ్యాంగ్వార్ నడిచింది. కత్తులతో స్వైరవిహారం చేశారు. దాంతో భీమవరం ప్రజలు ఆందోళన చెందారు. పట్టపగలే జరిగిన ఈ సంఘటన చూస్తే పోలీసు కౌన్సెలింగ్ ఏ మాత్రం సరిపోవడం లేదని తెలుస్తోంది. తీరు మార్చుకోని రౌడీషీటర్లు విజయవాడ, విశాఖపట్నం తదితర నగరాల్లో గ్యాంగ్వార్లు, హత్యలు, హత్యాయత్నాలు చూస్తుంటాం. అలాంటిది ప్రశాంతంగా ఉండే భీమవరంలో గ్యాంగ్వార్ ఆందోళన రేకెత్తించింది. మొన్న తణకులో ఓ రౌడీషీటర్ దాడులు, బెదిరింపులకు పాల్పడడంతో పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించారు. ఆరు నెలల క్రితం ఉండి పరిసర ప్రాంతాల్లో హింసాత్మక దాడులు, బెదిరింపులు, హత్యాయత్నాలు చేస్తున్న ఇద్దరు రౌడీషీటర్లపై కూడా పీడి యాక్ట్ పెట్టి జైలుకు పంపారు. పల్లెల్లో కూడా రౌడీషీటర్ల దందాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. పోలీసులు కౌన్సెలింగ్ చేయడంతో పాటు అవసరమైతే అరెస్టులు చేస్తున్నా.. కొందరు రౌడీషీటర్లు వారి తీరు మార్చుకోవడం లేదు. కేసులు లెక్కచేయకపోవడం, రౌడీషీట్ ఉన్నా పోలీసులకే సవాలు విసురుతున్నట్లు ప్రవర్తిస్తున్నారు. భీమవరంలో రౌడీషీటర్ల గ్యాంగ్వార్ పట్టపగలే హత్యకు మరో గ్యాంగ్ ప్రయత్నం దోపిడీలు, సైబర్ నేరాలతో జిల్లా ప్రజల్లో ఆందోళన కొత్త జిల్లాగా ఏర్పడినా తగ్గని నేరాలు -
బాలలు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి
ఏలూరు (టూటౌన్): బాలలు మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ కోరారు. స్థానిక ఆదిత్య సెంట్రల్ నందు చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ – క్రాఫ్ ఆధ్వర్యంలో బాలలతో ముఖాముఖి కార్యక్రమంను బుధవారం నిర్వహించారు. క్రాఫ్ స్టేట్ మోనటరింగ్ కోఆర్డినేటర్ సీహెచ్ ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రత్నప్రసాద్ మాట్లాడారు. నేటి సమాజంలో బాలలపై అనేక రకాల వివక్ష, వేధింపులు, బాల్య వివాహాలు, బాలికల అక్రమ రవాణా జరుగుతున్నాయని, వీటి గురించి గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. బాలలు ఇబ్బందుల్లో ఉంటే హెల్ప్ లైన్ నెంబర్స్ 1098, 112, డయల్ పోలీస్ 100, మహిళ హెల్ప్ లైన్ నెంబర్ 181, న్యాయ సలహాల కోసం 15100 వంటి ఉచిత నెంబర్లకు ఫోన్ చేసి సలహాలు కోరవచ్చని బాలలకు సూచించారు. కార్యక్రమంలో ఏలూరు మహిళ పోలీస్ స్టేషన్ డీఎస్పీ యు రవిచంద్ర, ఉమెన్ పోలీస్ స్టేషన్ సీఐ ఎం.సుబ్బారావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ పి వెంకటేశ్వరరావు, ఐసీడీఎస్ నోడల్ అధికారి టి.తులసి తదితరులు పాల్గొన్నారు. ఆకివీడు: ఐజీ ఆదేశాల మేరకు ఆకివీడు రూరల్ సీఐ జగదీశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఎస్పీ నయీం అస్మీ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బాలికపై అత్యాచారయత్నం కేసులో ముద్దాయిపై సరైన చర్యలు తీసుకోలేదని, గతంలో అదే వ్యక్తి ఓ హత్యకు సంబంధించిన కేసులో బెయిల్పై రావడం వంటి ఘటనల్లో కూడా సీఐ జగదీశ్వరరావు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో సస్సెండ్ చేసినట్లు తెలిసింది. ఆయన స్థానంలో ఇన్చార్జిగా ఇంకా ఎవరినీ నియమించలేదు. భీమవరం: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీన భీమవరం డీఎన్నార్ కళాశాల ఆవరణలో జిల్లా స్థాయి టెన్నీస్, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎన్ మోహన్దాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్నీస్ పోటీలు 40 ఏళ్లు వయస్సు పైబడిన పురుషులు, మహిళలకు సింగిల్స్, డబుల్స్లోను, బ్యాడ్మింటన్లో 35 ఏళ్లు వయస్సు పైబడిన పురుషులు, మహిళలకు సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 22, 23 తేదీల్లో విజయనగరంలో నిర్వహించే రాష్ట్రస్థాయి టెన్నీస్, 14, 15 తేదీల్లో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నిర్వహించే బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తప్పనిసరిగా రాష్ట్ర క్రీడాప్రాధికర సంస్థ వెబ్సైట్లో నమోదుకావాలని స్పష్టం చేశారు. వివరాలకు 96405 03679లో సంప్రదించాలని సూచించారు. తాడేపల్లిగూడెం: కొత్త ఆవిష్కరణలు రావాల్సిన అవసరం ఉందని జియోస్పేషియల్ నిపుణుడు రామమూర్తి పిలుపునిచ్చారు. జాతీయ విజ్ఞాన దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం మెకానికల్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశాభివృద్ధిలో జియో స్పేషియల్ సాంకేతికత పాత్ర అంశంపై అవగాహన కార్య క్రమం జరిగింది. ప్రముఖ జియో స్పేషియల్, కార్డోగ్రఫీ నిపుణుడు డాక్టర్ విష్ణువర్జుల ఎస్వి.ఎస్.ఎస్. రామమూర్తి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికత రంగాల్లో యువ ఇంజనీర్లు , పరిశోధకులు కొత్త ఆవిష్కరణల రూపకల్పనకు కృషి చేయాలని కోరారు. వరదలు, తుపానులు, భూకంపాలు వంటి విపత్తుల సమయంలో ఉపగ్రహ డేటా వినియోగం ప్రాముఖ్యత ఉదాహరణలతో తెలిపారు. చంద్రయాన్–3 విజయాన్ని ప్రస్తావిస్తూ భారత అంతరిక్ష రంగంలో ప్రపంచ స్థాయిలో సాధించిన గౌరవాన్ని గుర్తు చేశారు. కో–ఆర్డినేటర్ డాక్టర్ కార్తికేయశర్మ, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ జి.సంతోష్ కుమార్, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
జనాభా లెక్కల సేకరణపై సమీక్ష
భీమవరం (ప్రకాశంచౌక్): 2027 జనాభా లెక్కల సేకరణలో విధివిధానాలపై అధికారులు సంపూర్ణ అవగాహనతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో మంగళవారం ఆర్డీవోలు, జిల్లా అధికారులు, తహసీల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల కోసం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణ మాదిరిగానే జనాభా లెక్కల సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని వివరించారు. -
అంగన్వాడీల ఆగ్రహజ్వాల
భీమవరం: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలను అక్రమంగా అరెస్ట్ చేయడంపై అంగన్వాడీలు భగ్గుమన్నారు. కూటమి ప్రభుత్వ దుశ్చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోపిమూర్తి మాట్లాడుతూ సమస్యల సాధన కోసం ఆందోళన చేస్తున్న మహిళలను తెల్లవారుజామున శిబిరంలో విద్యుత్ నిలుపుదల చేసి మరీ అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. వారందరినీ సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. చంద్రబాబు అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు జీతాలు పెంపుపై మాట్లాడకపోగా అంగన్వాడీలపై ఇలాంటి దశ్చర్యలకు పాల్పడడం దారుణమన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి వాసుదేవరావు, అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి డి కళ్యాణి మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డి పెద్దింట్లు, మాధవి రాజకుమారి, శాంత కుమారి తదితరులు పాల్గొన్నారు. -
హడలెత్తిస్తున్న సైబర్ నేరాలు
గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల జిల్లా ప్రజలను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుని దోపిడీ చేస్తున్నారు. జిల్లాలోని వృద్ధులు, విశ్రాంత ఉద్యోగులను టార్గెట్ చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. నాలుగు నెలల క్రితం భీమవరానికి చెందిన ఓ వృద్ధ దంపతులను లక్ష్యంగా చేసుకుని డిజటల్ అరెస్టు పేరిట రూ.99 లక్షలు మోసగించారు. ఆకివీడుకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయురాలిని ఆధార్ కార్డు దుర్వినియోగం జరిగిందని, ఉన్నత స్థాయి పోలీసు అధికారులమని చెప్పి ఆమె నుంచి రూ.93.25 లక్షలు కాజేశారు. జిల్లాలోని మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ను సైబర్ నేరస్తులు ముఠా ఏసీబీ అధికారులమని నమ్మించి భయపెట్టి సొమ్ము కాజేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇటీవల నేరాల తీవ్రత పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రశాంతమైన వాతావరణం కాపాడేలా ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణకు పశ్చిమ పోలీసులు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది. -
రెవెన్యూ క్లినిక్లను వినియోగించుకోవాలి
కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం (ప్రకాశంచౌక్): రెవెన్యూ క్లినిక్ల ద్వారా భూ సమస్యల పరిష్కారం వేగవంతంగా నిర్వహిస్తామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్ తో పాటు సమాంతరంగా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్లను నిర్వహిస్తామన్నారు. ఈ క్లినిక్ల ద్వారా జిల్లాలో మొత్తం 420 దరఖాస్తులు అందగా ఇప్పటి వరకు 97 దరఖాస్తులను పరిష్కరించామని 29 దరఖాస్తులను తిరస్కరించామని, ఇంకా 294 దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉందన్నారు. భీమవరం డివిజన్ ఏడు మండలాల్లో 168 దరఖాస్తులు అందగా వీటిలో 43 పరిష్కరించామని, 11 తిరస్కరించామని, ఇంకా 114 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉందన్నారు. నరసాపురం డివిజన్ ఎనిమిది మండలాల్లో 169 దరఖాస్తులు అందగా 43 దరఖాస్తులను పరిష్కరించామని, 11 దరఖాస్తులను తిరస్కరించామని, ఇంకా 115 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉందన్నారు. తాడేపల్లిగూడెం డివిజన్ లోని ఐదు మండలాల్లో 83 దరఖాస్తులు అందగా 11 దరఖాస్తుల పరిష్కరించామని, 7 దరఖాస్తును తిరస్కరించామని, 65 దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉందన్నారు. ఆరుగురికి గాయాలు ముసునూరు: మండలంలోని వలసపల్లి, చెక్కపల్లి గ్రామాల మధ్య ట్రాక్టర్, ఆటో ఎదురెదురుగా ఢీ కొనడంతో ఏడుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ వృద్ధురాలి చేయి పూర్తిగా తెగిపడిపోయింది. క్షతగాత్రులను 108లో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. చాట్రాయి మండలం తుమ్మగూడెం గ్రామానికి చెందిన కొందరు మంగళవారం సాయంత్రం వలసపల్లిలో మిర్చి కోత పని నుంచి తిరిగి వస్తుండగా, గుడిపాడు శివార్లలో ఎదురుగా ట్రాక్టర్ రావడంతో పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదంలో మొలుగుమాటి నాగమ్మ (60)చేయి పూర్తిగా తెగిపడిపోగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. -
ఐదో రోజుకు చేరిన ఆమరణదీక్ష
ఉండి: డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు తనకు చేసిన అన్యాయానికి తగిన న్యాయం చేయాలంటూ ఉండి మండలం వెలివర్రులో టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి(సస్పెండ్ చేశామని టీడీపీ నాయకులు చెబుతున్నారు) పొత్తూరి వెంకటేశ్వరరాజు(బుడ్డియ్యరాజు) చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష ఐదో రోజుకు చేరింది. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పేగులకు సబంధించిన ఆపరేషన్ చేయించుకున్న ఆయన నేరుగా వెలివర్రుకు చేరుకుని ఆమరణదీక్ష చేపట్టారు.నియోజకవర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ స్సీకర్ రఘురామకృష్ణంరాజు ప్రోద్భలంతోనే తన ఇల్లు, పార్టీ కార్యాలయాన్ని కూలగొట్టి తనను నడిరోడ్డుపైకి లాగారని తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు,మంత్రి లోకేష్ తనకు తగిన న్యాయం చేసే వరకు ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని వెంకటేశ్వరాజు చెబతున్నారు. ఆపరేషన్ చేయించుకున్న ఆయన ఆమరణదీక్ష చేపట్టడంతో పలువురు ఆయన అభిమానులు ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు మద్దత్తుగా పలు ప్రాంతాల నుండి బంధువులు,టీడీపీకి చెందిన కొందరు ఆయనను పరామర్శిస్తున్నారు. అయితే దీక్ష ప్రారంభించిన రోజే పోలీసులు, అధికారులు సంయుక్తంగా అతనిని బలవంతంగా భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడ రెండురోజులపాటు బంధించి రెండోరోజు సాయంత్రం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి విడిచిపెట్టి వెళ్లిపోవడంతో అక్కడి నుంచి స్థానికుల సహాయంతో తిరిగి వెలివర్రు చేరుకున్న వెంకటేశ్వరరాజు దీక్ష కొనసాగిస్తున్నారు. -
సిద్ధార్థనగర్లో భారీ ఎత్తున కోడిపందేలు
నూజివీడు: అధికార పార్టీ నాయకుడైతే చాలు...ఏమి చేసినా చట్టం చుట్టమవుతోంది. కోడిపందేలు ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడరు. నూజివీడు మండలం సిద్ధార్థనగర్లోని మామిడితోటలో మంగళవారం భారీ ఎత్తున కోడిపందేలు నిర్వహించారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఓ నాయకుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కోడిపందేలను పోలీసులు వస్తారనే భయం లేకుండా యథేఛ్చగా నిర్వహించారు. ఈ పందేలకు నూజివీడు మండలంతో పాటు ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం, విస్సన్నపేట తదితర ప్రాంతాల నుంచి సైతం పందెంరాయుళ్లు, జూదరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కోడిపందేలను సంక్రాంతి కోడి పందేలను తలపించేలా పెద్ద ఎత్తున నిర్వహించడం గమనర్హం. కోడిపందేలు నిర్వహిస్తున్న ప్రదేశానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే డీఎస్పీ కార్యాలయం ఉన్నప్పటికీ అత్యంత ధైర్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు యథేచ్ఛగా నిర్వహించారంటే టీడీపీ నాయకులు ఎలాంటి భరోసా ఉందో అర్థమవుతోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దాదాపు 15 పందేలు పైగా వేయగా ఒక్కో పందేనికి భారీగా డబ్బులు చేతులు మారినట్లు సమాచారం. నూజివీడు మండలంలోని అన్నిగ్రామాల నుంచి రెడ్డిగూడెం, రంగాపురం, నాగులూరు, అన్నేరావుపేట, కొత్తరెడ్డిగూడెం తదితర ప్రాంతాల నుంచి వందలాది ద్విచక్ర వాహనాలు వేసుకుని కోడిపందేలకు తరలివచ్చారు. లోనా బైట నిర్వహణ సిద్ధార్థనగర్ ప్రాంతంలో ఒక వైపు అటవీప్రాంతం, మరోవైపు మామిడి తోటలు ఉండటంతో ఈ ప్రాంతంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జూదాలు, కోడి పందేలు గుట్టుగా నిర్వహిస్తున్నారు. లోనా బైట(కోసు) అయితే యథేచ్ఛగా కొనసాగుతోందని ప్రచారం జరుగుతోంది. అయితే అసాంఘిక కార్య కలాపాలను నిలువరించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని విమర్శలు వస్తున్నాయి. పట్టించుకోని పోలీసులు -
15 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
ఏలూరు (ఆర్ఆర్పేట): జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక సుబ్బమ్మదేవి హై స్కూల్లో ఏలూరు జిల్లా బయాలజీ ఫోరం ఆధ్వర్యంలో జిల్లాలో ఉత్తమ సేవలందించిన 15 మంది జీవశాస్త్ర ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో సన్మానించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఉమ్మడి పబ్లిక్ పరీక్షల సంస్థ కార్యదర్శి ఎ.సర్వేశ్వరరావు పాల్గొని బయాలజీ ఫోరం విశిష్టతల గురించి వివరించారు. బయాలజీ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.గంగాధర్ జిల్లా ఫోరం ఆవిర్భావం, ఫోరం చేస్తున్న సేవలను వివరించారు. కార్యక్రమంలో ఫోరం అధ్యక్షుడు ధనుంజయ రావు, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ రెడ్డి రామారావు, జిల్లా సైన్స్ అధికారి ఎస్వీ సోమయాజులు, హెచ్ఎం కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. -
గట్టుపై గుట్టుగా తవ్వకాలు
● తాడిపూడి–పోలవరం కాలువల గట్టుపై మట్టి తవ్వకాలు ● పచ్చ నేతలే మట్టి దొంగలు ● పట్టించుకోని అధికారులు ద్వారకాతిరుమల: కాసుల కోసం కొందరు పచ్చనేతలు మట్టి దొంగలుగా మారారు. అందుకు కాలువ గట్లను ఆదాయ వనరుగా ఎంచుకుని, తమ దందాను దర్జాగా సాగిస్తున్నారు. మట్టి దొంగల చేతిలో పచ్చజెండాలు ఉండటంతో అధికార యంత్రాంగం చూసీ చూడనట్టు వ్యవహరిస్తుంది. దాంతో మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. వివరాల ప్రకారం మండలంలోని తక్కెళ్లపాడులో ఓ టీడీపీ నేత గత కొన్నాళ్లుగా సాగిస్తున్న మట్టి అక్రమ దందాకు అద్దూఅదుపు లేకుండా పోతుంది. గ్రామంలోని తాడిపూడి–పోలవరం కాలువల మధ్య ప్రాంతంలోని గట్టుపై సదరు నేత మట్టిని తవ్విస్తున్నాడు. అలా తవ్విన మట్టిని పగలంతా ట్రాక్టర్ల ద్వారా తరలించి, తన ఇంటి వద్ద ఖాళీ స్థలంలో డంప్ చేయిస్తున్నాడు. అదే మట్టిని రాత్రి వేళల్లో టిప్పర్ల ద్వారా భీమవరం, ఉండి, ఏలూరు తదితర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. 9 యూనిట్ల టిప్పర్ మట్టిని రూ. 15 నుంచి రూ.20 వేలకు విక్రయిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇదే నాయకుడు తాడిపూడి కాలువ గట్టుపై అక్రమంగా ఓ భవనాన్ని నిర్మించాడన్న ఆరోపణలున్నాయి. పథకం ప్రకరమే తవ్వకాలు సదరు టీడీపీ నాయకుడు ఓ పథకం ప్రకారం ఈ మట్టి దందాను సాగిస్తున్నాడు. పార్టీలోని కొందరు పెద్దల సహకారంతోనే ఇదంతా చేస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పగలంతా తవ్విన మట్టిని ట్రాక్టర్ల ద్వారా తన ఇంటి వద్దకు తరలిస్తున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే ఇళ్ల పునాదుల్లోకి, గ్రామ అభివృద్ధి పనులకు తీసుకెళ్తున్నామని చెప్పేందుకే ఇలా చేస్తున్నాడని కొందరు అంటున్నారు. ఇలా పథకం ప్రకారం నిత్యం మట్టిని అమ్ముకుని, సదరు నేత జేబులు నింపుకుంటున్నాడని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. పత్తాలేని అధికారులు ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ తెలియనట్టు నటిస్తున్నారు. దాంతో మట్టి మాఫియాకు అడ్డుకట్ట పడకపోవడంతో పచ్చ నేతలు రెచ్చిపోతున్నారు. మట్టి తవ్వకాలు, తరలింపులు జరుగుతున్న పరిసర ప్రాంతాల్లో రీ–సర్వే నిమిత్తం రెవెన్యూ అధికారులు తిరుగుతున్నప్పటికీ.. వారు ఏమీ పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ఈ అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. -
ఆయుధ డిపో ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలి
కొయ్యలగూడెం: నేవి ఆయుధ డిపో ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మంగపతిదేవిపేట, బోడిగూడెం, రేగులగుంట గ్రామపంచాయతీల రైతులు బర్కట్నగర్ వద్ద ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన నిర్వహించారు. సుమారు నెలరోజులుగా రైతులంతా ఆందోళన చేస్తున్నప్పటికీ ఆయుధడిపో నిర్మాణంపై ప్రభుత్వ అధికారులు పెదవి విప్పడం లేదని, కానీ ప్రజా ప్రతినిధులు మాత్రం పంతంతో అయినా సరే డిపో నిర్మిస్తామంటూ రైతులను రెచ్చగొడుతున్నారన్నారు. ఇప్పటికే కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లామని కానీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడం తమలో అనుమానాలను రేకెత్తిస్తోందన్నారు. రెవెన్యూ అధికారులకు కొందరు తొత్తులుగా వ్యవహరిస్తున్నట్లు రాత్రి వేళల్లో అధికారులను, దళారులు ఒకరికొకరు కలుసుకుని రహస్యమంతనాలు సాగిస్తున్నారని ఆరోపించారు. ఆయుధ డిపో నిర్మాణానికి రైతుల మధ్య చిచ్చుపెట్టే విధంగా కుయుక్తులు పన్నుతున్నారని కానీ తామంతా ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. -
స్టేట్గేమ్స్ మీట్ క్యారమ్స్ పోటీల్లో ప్రతిభ
భీమవరం: స్టేట్ గేమ్స్ మీట్ క్యారమ్ విభాగంలో పట్టణంలోని విష్ణు ఇంజనీరింగ్ కళాఽశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారని కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు చెప్పారు. మంగళవారం విజేతలైన క్రీడాకారులను కళాశాలలో అభినందించి, వివరాలను విలేకరులకు వెల్లడించారు. గత నెల 28న అమలాపురం మండలంలోని బట్లపాలెం బీవీసీ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో నిర్వహించిన స్టేట్ మీట్ పోటీలు నిర్వహించారన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ ఎం.వేణు, వైస్ ప్రిన్సిపల్ ఎం.శ్రీలక్ష్మి, శ్రీనివాసరావు క్రీడాకారులను అభినందించారు. పెనుగొండ: జాతీయ మానవ హక్కులు, యాంటీ క్రైం కౌన్సిల్ ఇండియా పశ్చిమ గోదావరి జిల్లా ప్రొటెక్షన్ చైర్మన్గా ఆచంటకు చెందిన పాస్టర్ గాదిరాజు తిమోతిరాజు నియమితులయ్యారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విజయవాడలో నిర్వహించి సమావేశంలో ఏపీ అధ్యక్షుడు ఆర్జే రాజు, జాతీయ ఉపాధ్యక్షుడు బిషప్ డాక్టర్ సీహెచ్ సాంసన్ పీటర్ తదితరుల చేతులమీదుగా నియామక పత్రం అందుకున్నట్లు వివరించారు. ముదినేపల్లి రూరల్: ఎదురుగా వస్తున్న మోటారుబైక్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టిన ప్రమాదంలో వ్యక్తి మరణించిన టన మండలంలోని పెయ్యేరు వైఎస్సార్కాలనీ వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం కృష్ణాజిల్లా పామర్రు మండలం రిమ్మనపూడికి చెందిన జువ్వనపూడి షడ్రక్(42) ద్విచక్ర వాహనంపై మండవల్లి మండలం కానుకొల్లు అత్తారింటికి వెళ్లి తిరిగి వస్తుండగా వైఎస్సార్ కాలనీ సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికుల సమాచారంతో 108 ఆంబులెన్సులో చికిత్స నిమిత్తం గుడివాడ తరలించగా మరింత మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మరణించినట్లు తెలిపారు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు హెడ్కానిస్టేబుల్ టి.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తణుకు అర్బన్: ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయం వెంటాడుతుంటే మన రాష్ట్రంలో మాత్రం రాజకీయాలు లడ్డూ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయని, వీటిని ఆపాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ కోరారు. తణుకు చిట్టూరి హెరిటేజ్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యుద్ధం కారణంగా లక్షల మంది తెలుగువారు ప్రాణ భయంతో కొట్టుమిట్టాడుతున్నారని, యుద్ధ ప్రభావం సౌదీ అరేబియా ఖతర్, దుబాయ్ తదితర గల్ఫ్ దేశాల్లో స్పష్టంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులలో విదేశాల్లో చిక్కుకుపోయిన తెలుగువారిని సురక్షితంగా తక్షణమే సొంత గడ్డకు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో వైఆర్వీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): చంద్రగ్రహణం నేపథ్యంలో మంగళవారం భీమవరం పట్టణ ఇలవేల్పు శ్రీమావుళ్లమ్మవారి దర్శనం నిలిపివేశారు. దేవస్థానంలో సంప్రదాయం ప్రకారం పౌర్ణమి నాడు నిర్వహించే చండీహోమాన్ని ఉదయం 6 గంటలకే నిర్వహించారు. అనంతరం శ్రీ అమ్మవారికి నిత్య కై ంకర్యాలు నిర్వహించి, మూలవిరాట్ దర్శనాన్ని నిలుపుదల చేశామని ప్రధాన అర్చకుడు మద్దిరాల మల్లిఖార్జున శర్మ తెలిపారు. బుధవారం సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం యథావిధిగా అమ్మవారి దర్శనం ఉదయం 8 గంటలకు పునః ప్రారంభిస్తామని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్దమహాలక్ష్మీ నగేష్, దేవస్థా నం చైర్మన్ బొండాడ నాగభూషణం తెలిపారు. -
దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా
యలమంచిలి: ఏనుగువానిలంకలో ప్రభుత్వ భూ ములను ఆక్రమించి ప్రహరీలు, భవనాలు నిర్మిస్తున్నారని, దీనిపై పీజీఆర్ఎస్లో నాలుగు సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామానికి చెందిన నారిన వెంకటేశ్వరరావు, ముచ్చర్ల ధర్మారాజు, దేవరపు నాగబాబు ఆరోపించారు. పంచాయతీ కార్యాలయం వెనుక నుంచి దళితపేట వరకు డ్రెయినేజీ ఆక్రమణలకు గురైందని, ఇదే అదనుగా కొందరు కూటమి నాయకులు కొత్తగా షాపు నిర్మాణాలు చేపట్టారన్నారు. అలాగే గ్రామ కంఠం భూమినీ ఆక్రమించి ప్రహరీలు నిర్మించారన్నారు. ప్రస్తుతం డ్రెయినేజీ నిర్మాణానికి ప్రహరీ అడ్డువస్తున్నా పట్టించుకోకుండా డ్రెయినేజీని వంపు తిప్పుతున్నారని ఆరోపించారు. ఆయా సమస్యలు పరిష్కరించాలని జిల్లాస్థాయి అధికారులు మండల అధికారులకు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవడం లేదన్నారు. పైగా సమస్య పరిష్కరించినట్టు జిల్లా అధికారులకు సమాచారం పంపారని, దీనిపై అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని విమర్శించారు. అలాగే గ్రామంలో పంచాయతీ అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణం, అనుతులు లేని లేఅవుట్లలో నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. -
పరిష్కార వేదికకు సమస్యల వెల్లువ
భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం కలెక్టరేట్లో సోమవారం జరిగిన జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు సమస్యలు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూల నుంచి పలువురు తరలివచ్చి అర్జీలు సమర్పించారు. కలెక్టర్ సీహెచ్ నాగరాణి అర్జీలను స్వీకరించి సత్వర పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. భూ సంబంధిత సమస్యలు, పెన్షన్లు, ఇళ్ల మంజూరు, ఆరోగ్య అంశాలకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వచ్చాయి. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, జిల్లా సచివాలయం అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, కలెక్టరేట్ ఏఓ ఎన్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని.. ● ఇరగవరం మండలం పేకేరుకు చెందిన దివ్యాంగురాలు బుద్దా విమల రూ.15 వేల పింఛన్ కోసం అర్జీ అందించారు. ● భీమవరం 10వ వార్డుకు చెందిన నున్న రాజశేఖర్ నడవ లేని స్థితిలో ఉన్నానని రూ.15 వేల పింఛన్, ట్రై సైకిల్ ఇప్పించాలని కోరారు. ● భీమవరం మండలం గుట్లపాడులో అనుమతులు లేకుండా పంచాయతీ చెరువు గట్టుపై ఆలయం నిర్మిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని కొందరు గ్రామస్తులు వినతిపత్రం అందించారు. ● తణుకు మండలం వేల్పూరుకి చెందిన ఇవ్వల సత్యనారాయణ గ్రామంలో తనకు 40 సెంట్ల వ్యవసాయ భూమి ఉందని, అడంగల్లో గడ్డి భూమిగా నమోదైందని, సరిచేసి పాస్బుక్ ఇప్పించాలని అభ్యర్థించారు. ● కాళ్ల మండలం పెదఅమిరం గ్రామానికి చెందిన సోడదాసి లీలమ్మ అర్జీ సమర్పిస్తూ రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరారు. పంచాయతీ కార్యాలయంలో సమాధానం చెప్పడం లేదని ఫిర్యాదు చేశారు. ● భీమవరం మండలం జొన్నలగరువుకి చెందిన గోరం చిన్న సామేలు (62) తనకు మూడేళ్ల క్రితం గుండె ఆపరేషన్ జరిగిందని, ఎలాంటి ఆదాయం లేదని వృద్ధాప్య పింఛన్ ఇప్పించాలని వినతిపత్రం సమర్పించారు. భీమవరం మండలం యనమదుర్రు పరిధిలోని డేగాపురంలో రొయ్యల వలుపు ఫ్యాక్టరీని నిలుపుదల చేయించాలని గ్రామానికి చెందిన మహిళలు కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఓ వ్యక్తి ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నించగా తాము అడ్డుకున్నామని, రాజకీయ పలుకుబడితో మరలా నిర్మాణ పనులు ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోమని దౌ ర్జన్యానికి దిగుతున్నాడని వాపోయారు. ఆ ఫ్యాక్టరీ వల్ల తాగు, సాగునీటి ఇబ్బందులతో పాటు వా యు కాలుష్యం తలెత్తుతుందని ఫిర్యాదు చేశారు. -
కేంద్రాలు ఇలా..
ఏలూరు జిల్లాలో.. బాణసంచా తయారీ కేంద్రాలు లేవు. మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రాలు 9 వరకు ఉన్నాయి. ఏలూరు జాతీయ రహదారిపై రత్నాస్ డాబా వద్ద ఒక నిల్వ కేంద్రం, నూజివీడులో రెండు, చింతలపూడిలో ఒకటి, భీమడోలులో మూడు, పల్లెర్లమూడిలో భారీ మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రం ఉంది. జంగారెడ్డిగూడెంలో బాణసంచా నిల్వ చేసే కేంద్రాలు ఉన్నాయి. ఇక పలువురు బాణసంచా విక్రయ కేంద్రాలు నిర్వహించే వ్యక్తులు నిల్వలను అక్రమంగా ఇళ్లల్లోనే గుట్టుచప్పుడు కాకుండా ఉంచినట్టు సమాచారం. పశ్చిమగోదావరి జిల్లాలో.. బాణసంచా విక్రయ కేంద్రాలు సుమారు 45 వరకు ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో నిల్వ కేంద్రాలు అధికారికంగా ఐదు, అనధికారికంగా 10కి పైగా ఉన్నాయి. బాణసంచా కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవటంతో పేలుడు సంభవిస్తే ప్రాణనష్టం తీవ్రంగా ఉంటుంది. భారీఎత్తున మందుగుండు సామగ్రి నిల్వ చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవటంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
చితికిపోతున్న బతుకులు.. కూలీలే సమిధలు
ఏలూరు టౌన్: ప్రస్తుతం సీజన్తో సంబంధం లే కుండా నిరంతరం బాణసంచా తయారీ, విక్రయా లు సాగుతున్నాయి. జాతరలు, ఊరేగింపులు, శుభకార్యాలకు బాణసంచా కాల్చడం పరిపాటిగా మారింది. దీంతో ఆయా కేంద్రాల్లో మందుగుండు సామగ్రి విక్రయిస్తున్నారు. అయితే బాణసంచా వెలుగులు వెనుక కూలీల చీకటి బతుకులు దాగు న్నాయి. మందుగుండు తయారీలో కీలకమైన కూలీల ప్రాణాలకు గ్యారంటీ ఉండటం లేదు. ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా, కుటుంబ జీవనానికి ఆధారం కావడంతో పనిచేయక తప్పడం లేదు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన భారీ విస్ఫోటనం ఉ మ్మడి జిల్లావాసులను ఉలికిపాటుకు గురిచేసింది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాల్లో ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలను గుర్తుచేసుకుంటున్నా రు. ఏటా బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాల్లో ప్ర మాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో కూలీల బతుకులే ఛిద్రమవుతున్నాయి. అక్రమ తయారీ, నిల్వలతో పాటు నిబంధనలు ఉల్లంఘించడం పలుచోట్ల ప్రమాదాలకు కారణమవుతోంది. వేట్లపాలెం ఘటనతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీసులు బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. జిల్లాలో అనధికారికంగా ఎవరైనా మందుగుండు సామగ్రి నిల్వలు ఉంచినా, తయారు చేసినా చర్యలు తప్పవు. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా విక్రయాలు చేపడితే ఉపేక్షించం. నిల్వ కేంద్రాల్లో విధిగా అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించాలి. ఇసుక బకెట్లు, తగినంత నీటి నిల్వలు ఉంచుకోవాలి. పరిమితికి మించి బాణసంచా నిల్వ చేయకూడదు, స్టాక్ రిజిస్టర్ పక్కగా ఉంచుకోవాలి. ఇళ్ల మధ్యలో ఎవరైనా మందుగుండు నిల్వలు ఉంచితే కఠిన చర్యలు తప్పవు. – డి.శ్రావణ్కుమార్, ఏలూరు డీఎస్పీ అగ్నికి ఆజ్యం బలిగోరుతున్న బాణసంచా అక్రమ తయారీ, నిల్వ కేంద్రాల్లో ప్రమాదాలు నిబంధనల ఉల్లంఘనలతో పేలుళ్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తనిఖీలు -
కాలుష్య నియంత్రణ అందరి బాధ్యత
భీమవరం (ప్రకాశంచౌక్): శబ్ధ, వాయు కాలుష్య నియంత్రణకు ప్రతిఒక్కరూ బాధ్యత వహించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో శబ్ధ, వాయు కాలుష్యం, ఏకీకృత కుటుంబ సర్వే, ఈకేవైసీ, ఈపీటీఎస్ ఫైల్స్ అప్లోడింగ్ త దితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. జా తరలు, ఆలయాలు, ఆస్పత్రుల వద్ద బాణసంచా కాల్చే విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దీపావళి మినహా ఎక్కడా బాణసంచా కాల్చకూడదన్నారు. అనుమతులు లేకుండా ఎక్కడైనా బాణ సంచా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని, జిల్లాలో బాణసంచా తయారీకి ఎవరికీ అనుమతులు లేవన్నారు. వేసవి దృష్ట్యా అగ్నిప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. లక్ష్యాల మేరకు ఏకీకృత సర్వే, ఈకేవైసీ పూర్తిచేయాలన్నారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి హరిసూర్యప్రకాష్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అక్షరాంధ్రపై.. జిల్లాలో అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల 4న జరిగే ప్రీ ఫైనల్, 15న జరిగే ఫైనల్ పరీక్షలకు రిజిస్టర్ అయిన వారంతా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో వెబ్ఎక్స్ ద్వారా ఆమె మాట్లాడారు. -
అర్జీలపై అలసత్వం వద్దు
భీమవరం: పోలీస్స్టేషన్కు వచ్చే ప్రజల సమస్యలపై అలసత్వం ప్రదర్శించరాదని, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చూడాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సూచించారు. సో మవారం స్థానిక వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ప్ర జా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి పో లీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. 14 అర్జీలు అందగా ప్రధానంగా కుటుంబ కలహాలు, అత్తింటి వేధింపులు, ఆస్తి తగాదాలు వంటి సివిల్ వివాదాలున్నాయి. డీఎస్పీ రఘువీర్ విష్ణు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు. భీమవరం: జిల్లాలోని మూడు కేంద్రాల్లో ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలు సోమవారం జరిగినట్టు డీఈఓ ఈ.నారాయణ ప్రకటనలో తెలిపారు. ఇంగ్లిష్ పరీక్షకు 289 మందికి 256 మంది హాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని చెప్పారు. భీమవరంలోని చినరంగనిపాలెం ఎంపీఎల్ హైస్కూల్లో పరీక్షా కేంద్రాన్ని జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి తనిఖీ చేశారు. మాస్ కాపీయింగ్ ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు పరీక్ష కేంద్రాల వద్ద తిరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ ఉన్నారు. ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో పోలీస్ సి బ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నా మని, సిబ్బంది కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ అ న్నారు. ఏలూరు జిల్లా హోంగార్డు యూనిట్కు సంబంధించి తణుకులో హోంగార్డుగా పనిచేస్తూ అనారోగ్యంతో మృతిచెందగా సో మవారం ఆమె కుమార్తె ఎన్.శైలజకు హోంగార్డుగా ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. అలాగే జిల్లా పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్ జి.రాంబాబు భార్య విజయలక్ష్మికి అదనపు కార్పస్ ఫండ్లో రూ.లక్ష చెక్కును అందించారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన రాయితీలను సకాలంలో అందించేలా ప్రత్యేక చర్యలు చేపడతామని అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, పోలీస్ అధికారులు ఉన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లాలో 56 కేంద్రాల్లో సోమవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ గణితం–1 పరీక్షకు 10,344 మంది వి ద్యార్థులు హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 8,417 మందికి గాను 8,259 మంది, 2,478 మంది ఒకేషనల్ విద్యార్థులకు 2,085 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరి గాయని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ తెలిపారు. దూరవిద్య పరీక్షలకు.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంగ్లిష్ పరీక్షలకు 575 మందికి 517 మంది విద్యార్థులు హాజయ్యారని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): పూర్వ పశ్చిమగోదావరి జిల్లాలోని ఉపాధ్యాయుల పదోన్నతి కోసం సా ధారణ సీనియార్జీ జాబితా రూపొందించినట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపా రు. జాబితాను డీఈఓ వెబ్సైట్, నోటీసు బో ర్డులో అందుబాటులో ఉంచామని, అభ్యంత రా లు ఉంటే ఈనెల 7లోపు తెలియజేయాలని సూచించారు. గడువు తర్వాత వచ్చిన వినతులు స్వీకరించబోమని స్పష్టం చేశారు. -
‘రాయుడు గారి తాలూకా’ సందడి
నరసాపురం రూరల్: శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా ఉలిశెట్టి మూవీస్ బ్యానర్పై తెరకెక్కిన చిత్రం శ్రీరాయుడు గారి తాలూకాశ్రీ. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక స్థానిక వైఎన్ కళాశాలలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్తో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. హీరో శ్రీనివాస్ మాట్లాడుతూ పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన కథ అన్నారు. ఈ ప్రాంతంలోనే పుట్టి పెరగడం వల్ల ఇక్కడి మనుషులు, వారి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలను కళ్ళకు కట్టినట్లు ఈ చిత్రంలో చూపించినట్లు తెలిపారు. ఈ సినిమాలో నరసాపురానికి చెందిన నటీనటులకు పెద్దపీట వేశామని చెప్పారు. ఈ సందర్బంగా యూనిట్ సభ్యులు అమ్మరాజు, ఉలిశెట్టి రాజు, శ్రీహరి, శివన్న, మమత, సజన, మణికంఠ, ఏకాంత్, గణపతి, సుబ్రహ్మణ్యం, రాఘవ, డైరెక్టర్ కొరప్రాటి నవీన్, తదితరులు పాల్గొని సినిమా గురించి విషయాలను అందరితో పంచుకున్నారు. మార్చి 6న సినిమా విడుదలవుతున్నట్లు చెప్పారు. -
వ్యాక్సిన్లు వేయించాలి
పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా మార్చి 16 నుంచి ఏప్రిల్ 14 వరకూ వ్యాక్సిన్ వేస్తున్నాం. రైతులు వారి పశువులకు శ్రద్ధ తీసుకుని వ్యాక్సిన్లు వేయించాలి. వీధి పశువులకు వ్యాక్సిన్ల విషయంలో ఎవరూ పట్టించుకునే పరిస్థితి ఉండదు. అందువల్ల మున్సిపల్ అధికారులు, ఎన్జీవో ఆర్గనైజేషన్ సహకారంతో వీధి పశువులకు వ్యాక్సిన్ వేస్తాం. ఈ వ్యాక్సిన్లు ఎనిమిదో రౌండ్ అమలు జరుగుతుంది. ప్రతి సంవత్సరం గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు మార్చి, సెప్టెంబర్ నెలల్లో రెండు డోసులు వేయించాలి. ముందస్తు చర్యలతో గాలికుంటును అడ్డుకోవచ్చు. –డాక్టర్ జి.సత్యనారాయణ, సహాయ సంచాలకుడు, ప్రాంతీయ పశువైద్యశాల, పాలకొల్లు -
14 కి.మీ. ప్రయాణం.. ప్రాణసంకటం
ద్వారకాతిరుమల: ఆ రహదారిపై ప్రయాణమంటే.. ఎవరైనా భయపడాల్సిందే. ఎందుకంటే పైకి లేచిన కంకర రాళ్ల మీద ప్రయాణం వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది. ద్వారకాతిరుమల క్షేత్రానికి పాదయాత్రగా వెళ్లే భక్తులకు నరకప్రాయమైంది. 108 ఇతర ఆంబులెన్స్లు సైతం ఆ రోడ్డుపై వెళ్లడం లేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది. వివరాల్లోకి వెళితే. ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లి నుంచి కొత్తగూడెం, రామసింగవరం మీదుగా తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్ల మండలం, పోతవరం గ్రామానికి వెళ్లే సుమారు 14 కిలో మీటర్ల మేర ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. ఈ రహదారిని చూస్తే అసలు రోడ్డు ఉందా.. అనే అనుమానం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రహదారులను నిర్మిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కూటమి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఈ రోడ్డును నిర్మించకపోవడం పట్ల ప్రయాణికులు, రైతులు, భక్తులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. నరకయాతన.. కొత్తగూడెం, రామసింగవరం ప్రజలు నిత్యం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోడ్డుపై ప్రయాణిస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు. రాళ్లు పరచినట్టుగా ఉన్న ఈ రోడ్డుపై వాహనాలు వెళ్లడం కష్టతరంగా మారింది. తరచూ ఎంతో మంది ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల భారిన పడుతున్నారు. కార్లు ఇతర వాహనదారులు సైతం తమ వాహనాలు పాడైపోతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. ఈ రెండు గ్రామాల ప్రజలకు వైద్య సేవలు సైతం దూరమయ్యాయంటే అందుకు ఈ రహదారే కారణం. అత్యవసర పరిస్థితుల్లో 108 ఇతర ఆంబులెన్స్లు కూడా ఆ గ్రామాలకు వెళ్లడం లేదు. ఎవరైనా ఫోన్ చేస్తే ఆ రోడ్డు మీదుగా రావాలంటే రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని ఆంబులెన్స్ సిబ్బంది చెబుతున్నారట. దాంతో చేసేదేమీ లేక రోగులను ద్విచక్ర వాహనాలపై ఆస్పత్రులకు తీసుకెళ్లాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. పోతిరెడ్డిపాలెం వద్ద రోడ్డు మార్జిన్లలోని చెత్తా, చెదారం తొలగింపు పనులు గురువారం ప్రారంభమయ్యాయి. అయితే తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని చాదరాసికుంట వరకే ఈ రోడ్డు పనులు జరుగుతాయని అందరూ అంటుంటే.. కొత్తగూడెం, రామసింగవరం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పటి నుంచో తమ రహదారిని నిర్మించాలని పాలకులను వేడుకుంటున్నామని పలువురు వాపోతున్నారు. వెంటనే రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ రహదారి నిర్మాణానికి సంబంధించి రూ.4 కోట్లు నిధులు మంజూరయ్యాయని, త్వరితగతిన రోడ్డు నిర్మాణ పనులు చేపడతామని ఎంపీడీవో పల్లగాని ప్రకాష్ తెలిపారు. అధ్వానంగా జి.కొత్తపల్లి–పోతవరం రోడ్డు రహదారిపై రాళ్లు పైకిలేచి నిత్యం ప్రమాదాలు పలు గ్రామాల ప్రజలకు తప్పని ఇక్కట్లు దశాబ్ధకాలం క్రితం నిర్మించిన ఈ రోడ్డు అప్పట్లో 6 నెలలకే పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఈసారైనా నాణ్యతగా నిర్మించాలి. రాళ్లు పైకిలేచిన ఈ రోడ్డుపై నిత్యం ప్రయాణం నరకంగా మారింది. బైక్లు, ఆటోలు, స్కూల్ బస్సులు, పొలాలకు వెళ్లే రైతులు ఈ రోడ్డుపై రాకపోకలు సాగించలేకపోతున్నారు. గ్రామంలోకి ఆంబులెన్స్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. – గంగుల రాంప్రసాద్, రామసింగవరం, గ్రామస్తుడుద్వారకాతిరుమల క్షేత్రానికి పాదయాత్రగా వెళ్లే భక్తులు ఈ రాళ్ల రోడ్డుపై అడుగుతీసి అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. అలాగే నిత్యం ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల భారిన పడుతున్నారు. ఇప్పటికై నా ఈ రోడ్డును పూర్తి స్థాయిలో నిర్మించాలి. – మిడతా సత్యన్నారాయణ, కొత్తగూడెం, గ్రామస్తుడు -
క్రీస్తు పట్ల విశ్వాసం ఉంచాలి
నూజివీడు: ఏసుక్రీస్తును విశ్వసించిన వారికి నాశనం లేదని, మనందరిని పాపాల నుంచి విముక్తులను చేసేందుకే క్రీస్తు ఈ లోకానికి వచ్చారన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని విజయవాడ మేత్రాసన పీఠాధిపతులు మహాఘన తెలగతోటి జోసెఫ్ రాజారావు అన్నారు. నూజివీడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శిలువగట్టు తిరునాళ్లు శనివారం రాత్రితో ముగిశాయి. ముగింపు మహోత్సవ వేడుకలకు విజయవాడ పీఠాధిపతులు ప్రధాన అతిథిగా విచ్చేసి పవిత్ర దివ్య బలిపూజను సమర్పించారు. అనంతరం భక్తులనుద్దేశించి పీఠాధిపతి మాట్లాడుతూ ప్రేమ స్వరూపి ఏసు కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. మరణాన్ని సైతం జయించి క్రీస్తు మనందరికీ ఆరాధ్యుడయ్యారని ఆయన వివరించారు. శిలువపై మృతిచెందిన ఏసుక్రీస్తు పట్ల ప్రతి ఒక్కరూ విశ్వాసాన్ని ఉంచాలని, అప్పుడే శిలువ ప్రతి క్రీస్తు సోదరుడికి బలాన్ని, రక్షణను, శక్తిని ఇస్తుందన్నారు. విద్వేషాలు, అసత్యం, అధర్మం, హింస వంటి వాటిని కలిగి ఉంటే క్రీస్తులో ఐక్యం కాలేరని, వాటన్నింటిని వదిలేస్తేనే క్రీస్తు మోక్షం లభిస్తుందన్నారు. పేదవారిపట్ల, బలహీనులపట్ల దయాగుణం కలిగి ఉండాలన్నారు. పుణ్యక్షేత్ర విశిష్టత శిలువగట్టు పుణ్యక్షేత్ర విశిష్టతను వివరిస్తూ.. ఈ కొండపై పవిత్ర శిలువను ప్రతిష్టించి, ఈ ప్రాంతాన్ని ఒక అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దిన ఫాదర్ జాన్ లియోంచని కృషిని పీఠాధిపతులు గుర్తుచేశారు. బైబిల్లోని అనేక పవిత్ర వాక్యాలను, అర్థవంతమైన ఉపమానాలను ఉదహరిస్తూ ఆయన ఇచ్చిన సందేశం క్రీస్తు సోదరుల హృదయాలను హత్తుకుంది. ఈ పవిత్ర బలిపూజ కార్యక్రమంలో పలువురు గురువులు, వేలాది మంది భక్తులు పాల్గొని పునీతులయ్యారు. తిరునాళ్ల ముగింపు సందర్భంగా శిలువగట్టు పరిసర ప్రాంతాలన్నీ భక్తుల జయ జయఽ ధ్వానాలతో మార్మోగాయి. మరియదళ సభ్యులు క్రైస్తవ గీతాలు ఆలపించారు. విజయవాడ పీఠాధిపతులు జోసెఫ్ రాజారావు -
పశువుల్లో గాలికుంటుతో అప్రమత్తం
పాలకొల్లు సెంట్రల్: పశువులకు వచ్చే గాలికుంటు వ్యాధి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా టీకాలు వేయించాలి. ఈ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా అశ్రద్ద వహిస్తే పశువుల ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించుకుపోయే ప్రమాదం ఉంటుందని పశు వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి వైరస్ ద్వారా వ్యాపిస్తోంది. చాలా వేగంగా సోకుతుంది. గాలి, నీరు, దాణా, మనుషుల ద్వారా కూడా వ్యాపించే గుణం ఉంటుంది. గాలి కుంటు వ్యాధి లక్షణాలు ఈ వ్యాధి సోకితే పశువులకు 103 నుంచి 106 జ్వరం వస్తుంది. నోటిలో, కాలి గిట్టల్లో పుండ్లు ఏర్పడతాయి. నోటి నుంచి చొంగ కారుతుంది. దానివల్ల పశువులు ఆహారాన్ని తినే పరిస్థితి ఉండదు. ఈ వ్యాధి పట్ల అశ్రద్ద వహిస్తే మరింత ముదిరిపోతుంది. వ్యాధి ముదిరితే పాల ఉత్పతత్తి తగ్గిపోతుంది. దీనిని అరికట్టడం కోసం సంవత్సరానికి రెండు సార్లు టీకాలు వేయించాలి. నివారణ చర్యలు సకాలంలో టీకాలు వేయించాలి. 3 నెలలు దాటిన అన్ని పశువులకు ఈ టీకాలు వేయొచ్చు. చూడితో ఉన్న పశువులకు సైతం ఈ టీకాలు వేయించవచ్చు. వ్యాధి సోకిన వెంటనే పెయిన్ కిల్లర్లు, బి కాంప్లెక్స్ ఇంజక్షన్లు ఇవ్వాలి. నోటిలో పుండ్లు ఏర్పడడం వల్ల దాణా తినలేక ఇబ్బందులు పడుతుంటాయి. అందువల్ల అంబలి, జొన్నలతో జావ లాంటివి పట్టించాలి. వ్యాధి సోకిన వాటిని పశువుల మంద నుంచి వేరుచేసి దూరంగా ఉంచాలి. వాటి పాల నుంచి దూడలను దూరంగా ఉంచాలి. అలాగే పసుపు, మంచి నూనె కలిపి ముద్దలుగా చేసి నోటిలో పుండ్లు ఏర్పడిన చోట రుద్దాలి. ఈ వ్యాధి వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వ్యాధి నివారణ పట్ల అప్రమత్తంగా ఉండాలి పశువైద్యులు సూచిస్తున్నారు. -
సేంద్రియ సాగుతో ఆరోగ్యానికి భరోసా
కొయ్యలగూడెం: మారుతున్న కాలంలో ప్రాణాంతక రోగాలకు ప్రధాన కారణాల్లో ఎరువులు, పురుగు మందులు వాడుతున్న ఆహారం ఒకటి. దీంతో ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతిపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సేంద్రియ వ్యవసాయ సాగు పద్ధతులపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్ఎఫ్) ఆధ్వర్యంలో బీఆర్పీ యజమానులకు (బయో రిసోర్స్ సెంటర్) యజమానులకు విడతల వారీగా శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని రైతు సాధికారిక సంస్థ చేపట్టింది. బయో ఇన్ఫుట్స్ తయారీపై శిక్షణ కార్యక్రమంలో భాగంగా కొయ్యలగూడెం మండలంలోని బయ్యన్నగూడెం సాయికృష్ణ గోసాల ప్రకృతి ఉత్పత్తుల శిక్షణ కేంద్రంలో బృందానికి 40 నుంచి 60 మంది చొప్పున ఇప్పటికీ మూడు దశలుగా శిక్షణ ఇచ్చారు. రాష్ట్రంలో ఇంతవరకు 17,400 మందికి శిక్షణ ఇచ్చినట్లు స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ మన్మోహన్ పేర్కొన్నారు. రసాయనిక ఎరువుల విషవలయం నుంచి భూ తల్లిని కాపాడుకుంటూ, పెట్టుబడి లేని సేద్యంతో అన్నదాతను ఆత్మగౌరవంతో నిలబెట్టడమే లక్ష్యంగా రైతు సాధికారిక సంస్థ అడుగులు వేస్తోంది. గోవును కేవలం పశువుగా కాకుండా, వ్యవసాయానికి ఊపిరిగా భావించాలి అనేది రైతు సాధికారిక సంస్థ ముఖ్య ఉద్దేశం. రైతు సాధికారిక సంస్థ (ఆర్వైఎస్ఎస్) ప్రధాన ఆశయాలు ● రైతును రాజును చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ సంస్థ, కేవలం ఆర్థిక సహకారానికే పరిమితం కాకుండా, సాగు పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ● ఖరీదైన రసాయనాలు, పురుగుమందులు కొనాల్సిన అవసరం లేకుండా, స్థానికంగా దొరికే వనరులతో సాగు చేసేలా రైతును సిద్ధం చేయడం. ● భూమిలో సారాన్ని పెంచి, జీవ వైవిధ్యాన్ని కాపాడటం. రసాయనాల వాడకం తగ్గించి భావి తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారాన్ని అందించడం. ● సాగు ఖర్చును గణనీయంగా తగ్గించి, నికర లాభాన్ని పెంచడం ● సమాజానికి విషరహితమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడం. ● ప్రకృతి వ్యవసాయ ప్రచారంలో మహిళలను భాగస్వాములను చేస్తూ, వారిని క్షేత్రస్థాయిలో కార్యోన్ముఖులను చేయడం. గో ఆధారిత సేంద్రియ ఎరువులు గోమాతను వ్యవసాయానికి కేంద్రబిందువుగా మార్చినప్పుడు సాగు ఖర్చు సున్నాకు చేరుతుంది. గో మూత్రం, పేడలో కోట్లాది సూక్ష్మజీవులు ఉంటాయని అవి పైరుకు మేలు చ్తేస్తాయంటున్నారు. సేంద్రీయ పద్ధతుల ద్వారా సాగు చేయడం వల్ల నేల భౌతిక స్థితి మారుతుంది. రసాయనాల వల్ల గట్టిపడిపోయిన భూమి, సేంద్రీయ ఎరువుల వాడకం వల్ల గుల్లబారి, గాలి ఆడేలా మారుతుంది. ఇది వేళ్ల వ్యవస్థ బలంగా పెరగడానికి దోహదపడుతుంది. గోమాతను నమ్ముకున్న రైతు ఎన్నడూ ఓడిపోడని ప్రకృతి ఒడిలో సాగు చేయడం వల్ల అటు భూమికి సారం, ఇటు రైతుకు లాభం, సమాజానికి ఆరోగ్యం దక్కుతాయని గోసాల ఉత్పత్తుల కేంద్ర నిర్వాహకుడు సుంకర సత్తిరాజు పేర్కొంటున్నారు. సత్ఫలితాలిస్తున్న ఏపీసీఎన్ఎఫ్ పథకం రైతు సాధికారిక సంస్థ చేస్తున్న ఈ ప్రయత్నం ఒక యజ్ఞం లాంటిది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో గోవు పాత్ర మరువలేనిది. ప్రతి రైతు తన పొలంలో ఒక మూల గోశాలను ఏర్పాటు చేసుకుని, సొంతంగా ఎరువులు తయారు చేసుకున్నప్పుడే అసలైన స్వయం సమృద్ధి సాధ్యమవుతుంది. –కందుకూరి మన్మోహన్, రైతు సాధికారిక సంస్థ ప్రాజెక్టు మేనేజర్ బీఆర్సీ సెంటర్ను ఏర్పాటు చేసుకుని ఓ వైపు సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తూనే, మరోవైపు కౌలు పొలం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను. భావితరాలలో సేంద్రీయ సాగు పద్ధతులు మరింత పెరుగుతాయి. –చిరుకూరి కృష్ణవేణి, కాండ్రేగుల, కాకినాడ జిల్లా -
ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. ఇద్దరిపై కేసు
భీమడోలు: డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోసగించిన ఇద్దరిపై భీమడోలు పోలీస్స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. పూళ్ల పంచాయతీ పరిధిలోని ఎంఎంపురంకు చెందిన వానపల్లి వినయ్కుమార్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చస్త్రశారు. వైజాగ్కు చెందిన యాండ్ర లక్ష్మీ, ఆమె కుమారుడు విక్కీ పరిచయమయ్యారు. లావోస్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి గతేడాది మేలో రూ.2.20 లక్షలు తీసుకున్నారు. వినయ్ను లావోస్కు పంపి వదిలేశారు. అక్కడ ఉద్యోగం లేకపోవడంతో వినయ్కుమార్ నానా అవస్థలు పడ్డాడు. ఇటీవల అతికష్టంపై ఇంటికి చేరుకున్న వినయ్ తల్లీ కొడుకులపై భీమడోలు పోలీస్స్టేషన్ కేసు పెట్టాడు. ఎస్సై ఎస్కే మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కై కలూరు: ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటనపై రూరల్ పోలీసు స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం పెంచికలమర్రుకు చెందిన జయమంగళ దావీదు(33) శనివారం రోడ్డు దాటుతుండగా కొల్లేటికోట నుంచి వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి రంగమ్మ ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ వి.రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
నరసాపురం రూరల్: మండలంలోని కంసాలిబేతపూడిలో తాళం వేసి ఉన్న ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. బీరువా పగులగొట్టి సుమారు 4.5 కాసుల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండి వస్తువులు అపహరించుకుపోయారు. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పాలి నాగేశ్వరరావు అనారోగ్యం కారణంగా చికిత్స నిమిత్తం తన భార్యతో కలిసి గత నెల 27న పాలకొల్లు వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం దగ్గులూరులోని కుమార్తె ఇంటికి వెళ్లారు. శనివారం ఉదయం తిరిగి ఇంటికి చేరుకునేసరికి, ఇంటి ప్రధాన ద్వారం తలుపులు పగులగొట్టి ఉండడాన్ని గమనించారు. లోపలికి వెళ్లి చూడగా, బీరువా, అల్మారాలు పగులగొట్టి సామాన్లు అస్తవ్యస్తంగా పడేశారు. బీరువాలో భద్రపరిచిన 36 గ్రాముల బంగారం వస్తువులు, 13 జతల వెండి పట్టీలు మాయమైనట్లు బాధితులు గుర్తించారు. బాధితుడు పాలి నాగేశ్వరరావు నరసాపురం రూరల్ పోలీస్ స్టేషనన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై టి.వెంకట సురేష్ తెలిపారు. ద్వారకాతిరుమల: చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లాలోని అన్ని ఆలయాలు మూతపడనున్నాయి. అందులో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ప్రధాన ఆలయంతో పాటు, ఉప, దత్తత ఆలయాలను సైతం ఉదయం 6.20 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు మూసివేస్తామని ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆ రోజు ఉదయం 6.20 గంటల లోపు అర్చకులు స్వామివారి ప్రాతః కాలార్చనాదికాలను ముగించి, ఆలయ ద్వారాలు మూసివేస్తారన్నారు. తిరిగి రాత్రి 7.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి, ఏకాంతంగా శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. 4న యథావిధిగా ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలు, దర్శనాలు జరుగుతాయని ఈఓ తెలిపారు. ముదినేపల్లి రూరల్ : ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భారీసంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ల శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామివారి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. అన్నదాన కార్యక్రమానికి భక్తలు పోటెత్తడంతో ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగాశ్రీదేవి ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. ద్వారకాతిరుమల: కోలాటం అంటే భక్తి, ఐక్యత, క్రమశిక్షణ, సమన్వయంతో కూడిన పవిత్ర కళారూపమని శ్రీవారి దేవస్థానం డిప్యుటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ టి.సూర్యనారాయణ అన్నారు. వట్లూరుకు చెందిన శ్రీ వెంకట లక్ష్మి నందన కోలాట భజన మండలి, శ్రీ వెంకట విజయ నందన కోలాట భజన మండలి సభ్యులు తమ తొలి ప్రదర్శనను శ్రీహరి కళాతోరణ వేదికపై ఆదివారం ప్రదర్శించారు. ఇది భక్తులను అలరించింది. నిడమర్రు: పెదనిండ్రకొలనులో శనివారం సాయంత్రం జరిగిన స్వయంభూ భీమేశ్వరస్వామి రథోత్సవంలో విషాదం నెలకొంది. రథ నియంత్రకుడిగా ఉన్న గంథం రామకృష్ణ (40) గుండెపోటుతో మృతి చెందాడు. రథం ముందుకు లాగుతున్నప్పుడు దాని వేగాన్ని నియంత్రించేందుకు చెక్కను బ్రేకులుగా ఉంచుతారు. శనివారం కూడా ఇదే విధంగా పనిలో ఉండగా.. ఒక్కసారిగా వాంతులతో కుప్పకూలిపోయాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. -
సాంకేతిక విస్తరణ బలోపేతం కావాలి
తాడేపల్లిగూడెం: గ్రామ స్ధాయిలో సాంకేతికత విస్తరణ బలోపేతం కావాలని వెంకట్రామన్నగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగిన శాసీ్త్రయ సలహా మండలిలో పలువురు శాస్త్రవేత్తలు మార్గదర్శనం చేశారు. ఉద్యాన వర్సిటీ ఉపకులపతి డాక్టర్ కె.ధనుంజయరావు మాట్లాడుతూ ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులు, సమస్యలను దృష్టిలో ఉంచుకొని శాస్త్రవేత్తలు ప్రణాళికలు రూపొందించాలన్నారు. వర్సిటీ విస్తరణ సంచాలకురాలు డాక్టర్ రూత్ మాట్లాడుతూ సమయానుకూలంగా రైతులకు శిక్షణ అందించాలన్నారు. కార్యక్రమంలో కేవీకే సమన్వయకర్త డాక్టర్ పి.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు సాహిత్యం అజరామరం
తాడేపల్లిగూడెం: తెలుగు సాహిత్యం అజరామరమని, కంప్యూటర్ యుగంలో కూడా తెలుగు సాహిత్యానికి చోటు ఉందని రచయిత మంత్రి రవి అన్నారు. శశి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న టెక్నో కల్చరల్ ఫెస్ట్లో భాగంగా రెండో అతిథిగా మంత్రి రవి హాజరయ్యారు. శశి విద్యాసంస్ధల వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ మాటామంతి కార్యక్రమం చేశారు. అమ్మ డైరీలో కొన్ని పేజీలు రాయాలనే ఆలోచన ఎలా వచ్చిందని అడిగారు. మంత్రి రవి స్పందిస్తూ ఐర్లాండ్లో ఉద్యోగం చేస్తున్న తరుణంలో ఒత్తిడి నుంచి బయటకు రావడానికి రచనకు ఉపక్రమించి వెబ్లో పోస్టు చేస్తుంటే వస్తున్న ఆదరణ చూసి తెలుగులో ఒక నవల రాయాలనే ఆలోచన వచ్చిందన్నారు. అమ్మ ప్రేమపై అభిప్రాయాలను సేకరించి వారి అనుభవాలతో నవల రాశానని, రెండు లక్షలకు పైగా ప్రతులు అమ్ముడు పోవడంతో, ఈ నవలను త్వరగా సినిమాగా రాబోతుందన్నారు. విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, సెక్రటరీ కరస్పాండెంట్ మేకా క్రాంతిసుధ, డైరెక్టర్ బూరుగుపల్లి రాధారాణి, ప్రిన్సిపాల్ మొహమ్మద్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి కొండపై అన్యమత ప్రచార ఆరోపణలు
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపై శనివారం ఓ మహిళ బైబిల్ చదవడం వివాదాస్పదమైంది. ఈ ఘటనలో సదరు మహిళతో పాటు, ఆటో డ్రైవర్, మరో వ్యక్తిని దేవస్థానం సెక్యురిటీ సిబ్బంది స్థానిక పోలీసు స్టేషన్లో అప్పగించారు. తూర్పుగోదావరి జిల్లా కడియపులంకకు చెందిన 8 మంది విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించి, అక్కడి నుంచి నేరుగా టాటా మ్యాజిక్ ఆటోలో సాయంత్రం ద్వారకాతిరుమల కొండపైకి చేరుకున్నారు. అందులో ఆరుగురు శ్రీవారి దర్శనం నిమిత్తం ఆలయంలోకి వెళ్లారు. అనంతరం డ్రైవర్ ఆటోను ప్రసాదాల కౌంటర్ల వద్ద పార్క్ చేశాడు. ఆటోలో ఓ మహిళ, మరో వ్యక్తి, ఆటో డ్రైవర్ ఉన్నారు. సదరు మహిళ ఆటోలో బైబిల్ చదవడాన్ని అక్కడున్న భక్తులు గమనించి, ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న దేవస్థానం సెక్యురిటీ సిబ్బంది ఆ మహిళను, మరో వ్యక్తిని, ఆటో డ్రైవర్ను పోలీసుస్టేషన్లో అప్పగించారు. ఆటోను సైతం పోలీస్టేషన్కు తరలించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. -
గోశాలలు ఏర్పాటు చేయాలి
ఆగిరిపల్లి: ప్రభుత్వమే అన్ని దేవాలయాల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని శ్రీశైలం శ్రీగిరి భువనేశ్వరి పీఠానికి చెందిన శ్రీశ్రీశ్రీ అభినవ కళ్యాణానంద భారతి స్వామి డిమాండ్ చేశారు. శనివారం ఆగిరిపల్లిలోని శోభనగిరి క్షేత్రం వద్దనున్న గీతా శతాక్షి గో లోకధామం గోశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గోశాలలోని ఆవుల పశుగ్రాసానికి ఐదు ఎకరాలు కేటాయించినందుకు కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. శోభనాచల క్షేత్రం స్వామికి వేల ఎకరాలు ఉన్న అభివృద్ధికి నోచుకోకపోవడం దురదృష్టకరమన్నారు. స్వామివారి కొండపై ఎలాంటి అనుమతులు లేకుండా చర్చిలు ఏర్పాటు చేసి అన్యమత ప్రచారం చేస్తుంటే ప్రభుత్వం, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం పదేపదే తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని అనడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ఆవును జాతీయ జంతువుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. -
నేటి నుంచి మరియ మాత ఉత్సవాలు ప్రారంభం
కలిదిండి(కై కలూరు): రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన కలిదిండి మరియమాత మహోత్సవాలు పునీత జోజప్ప దేవాలయంలో ఆదివారం నుంచి ప్రారంభమవుతున్నాయి. మార్చి 1 నుంచి 3 వరకు జరిగే ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్ష మంది భక్తులు వస్తారని అంచనా.. కలిదిండి – భీమవరం రహదారిలో చర్చి వద్ద మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. కై కలూరు రూరల్ సర్కిల్ సీఐ వి.రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మహోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు. మొదటి రోజు సమష్టి దివ్య పూజా బలి సమర్పణ, వాక్య పరిచర్య జరగనుంది. సాయంత్రం దివ్య పూజా బలి కార్యక్రమానికి విజయవాడ మేత్రాసన పీఠాధిపతులు తెలగతోటి జోసఫ్ రాజారావు విచ్చేయనున్నారు. 2వ తేదీన బలిపూజను గన్నవరం విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ పసల తోమస్ నిర్వహిస్తారు. 3వ తేదీన దివ్య బలి పూజను విజయవాడ మేత్రాసన జనరల్ సెయింట్ ఫాల్స్ కతెడ్రల్కు చెందిన రెవరెండ్ ఫాదర్ మువ్వల ప్రసాద్ జరుపుతారు. మేత్రాసన పవిత్రాత్మ, నూతనీకరణ బృందాలతో స్వస్థత ప్రార్థనలు జరుగుతాయి. కలిదిండి విచారణ 1961 అక్టోబరు 1న భైరవపట్నం విచారణ నుంచి ఏర్పడింది. రెవరెండ్ ఫాదర్ సేల్సు సమయంలో కలిదిండిలో పునీత జోజప్ప దేవాలయం, ఆస్పత్రి, కన్య సీ్త్రల వసతి గృహం, రెవరెండ్ ఫాదర్ జాన్ మాథ్యూ నిర్వహణలో కల్వరి కొండను నిర్మించారు. ఫాదర్ కొలకాని మరియన్న బాలుర వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. రెవరెండ్ ఫాదర్ ఫ్రాన్సిస్ విచారణ అభివృద్ధికి కృషి చేశారు. కలిదిండి విచారణ నుంచి కోరుకొల్లు, కై కలూరు, భాస్కరరావుపేట విచారణలు ఏర్పడ్డాయి. కలిదిండి విచారణ పరిధిలో మరియదళం, విన్సింట్ పౌల్ సొసైటీ, సెయింట్ జోసప్స్ యూత్, దోమినక్ సావియో వత్తాసు బాలల సంఘం, సెయింట్ మేరీస్ ఇంగ్లీషుం మీడియం స్కూల్, మిషనరీస్ ఆఫ్ మదర్ మేరీ కాన్పెంట్, మద్వానిగూడెంలో మేరీ కాన్వెంట్లు ఉన్నాయి. ఆకట్టుకోనున్న సాంస్కృతిక కార్యక్రమాలు మరియమాత ఉత్సవాల్లో భాగంగా మూడు రోజులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 1న రాత్రి కలిదిండి విచారణ గ్రామస్తులతో నృత్య ప్రదర్శన, 2న కలిదిండి ఆరోగ్యమాత ఆర్కేస్ట్రా మధుర గీతాలాపన, 3న విజయవాడ ఆంధ్ర క్రైస్తవ నాట్యమండలికి చెందిన గుమ్మడి జీవన్కుమార్ ఆధ్వర్యంలో ధనవంతుడు – పేదలాజరు బైబిల్ నాటకం ప్రదర్శించనున్నారు. మరియమాత చర్చి వద్ద కల్వది కొండ -
శ్రీవారి క్షేత్రంలో భక్తుల కోలాహలం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం శనివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆపదమొక్కుల వాడా.. వేంకటరమణ గోవిందా.. గోవింద అంటూ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదాలు, టికెట్ విక్రయాల కౌంటర్లు, కల్యాణకట్ట, అనివేటి మండపం, ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం పోటెత్తాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. ఏలూరు (టూటౌన్): ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకున్నవారు వచ్చే ఏప్రిల్ నెలాఖరుకు పూర్తిగా చెల్లిస్తే పూర్తి స్థాయిలో వడ్డీ మాఫీ చేస్తారని ఈడీ ఎం.ముక్కంటి తెలిపారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పూర్తి స్థాయిలో బకాయి చెల్లించిన లబ్ధిదారునికి క్లియరెన్స్ సర్టిఫికెట్ అందజేసి సత్కరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 465 మంది లబ్ధిదారులు రూ.13.55 కోట్లు చెల్లించాల్సి ఉండగా వీరికి రూ.1.66 కోట్లు మాఫీ అవుతుందన్నారు. ఆకివీడు: స్థానిక సమతానగర్కు చెందిన బాలికను అదే ప్రాంతానికి చెందిన బోనాల రాము పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన సంఘటనపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై హెచ్.నాగరాజు చెప్పారు. గత ఏడాది ఆగస్టు నుంచి ప్రేమిస్తున్నానని వెంటబడి మోసగించాడని ఆమె ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. భీమవరం (ప్రకాశంచౌక్): ఫిబ్రవరి 27న జేఎన్టీయు కాకినాడలో జరిగిన తైక్వాండో సెలక్షన్స్లో విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ విద్యార్థిని నగిరి నీతూ శ్రీసాయి విద్యార్థిని ఎంపికై ంది. మార్చ్ 16 నుంచి 20 వరకు ఒడిశాలో జరిగే సౌత్జోన్ పోటీలలో నీతూ పాల్గొంటున్నట్లు కళాశాల పీడీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా విజేతను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వేణు తదితరులు అభినందించారు. భీమవరం(ప్రకాశంచౌక్): ఈ నెల 3న చంద్రగ్రహణం కారణంగా ఉదయం 9 గంటలకు మావుళ్లమ్మ ఆలయాన్ని మూసి వేస్తున్నట్లు దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ తెలిపారు. విశేష చండీహోమం ఆ రోజు ఉదయం 6 గంటలకే మొదలుపెట్టి 9 గంటలు లోగా పూర్తి చేస్తామని తెలిపారు. బుధవారం అమ్మవారి ఆలయం ఉదయాన్నే తెరిచి శుద్ధిచేసి సంప్రోక్షణ కార్యక్రమాలు చేస్తారని మూల విరాట్ దర్శనం ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తారని తెలిపారు. పాలకొల్లు సెంట్రల్ : మండలంలోని పూలపల్లిలో ఓ రైస్మిల్లులో పనిచేస్తూ ప్రమాదవశాత్తూ బ్లోయర్ మోటర్పై పడిన కార్మికుడు కట్టా రామ్మోహనరావు (51) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసుల వివరాలు ప్రకారం మండలంలోని కాపవరం గ్రామానికి చెందిన రామ్మోహనరావు ఫిబ్రవరి 23న రైస్మిల్లులోని ఎలివేటర్లో ఉన్న ధాన్యం శుభ్రం చేస్తుండగా బ్లోయర్ మోటర్పై పడిపోయాడు. అతని ఎడమచేయి మణికట్టు వద్ద తెగి రక్తం కారడంతో పాటు వెన్నుపూస వద్ద బలమైన గాయమైంది. రామ్మోహనరావును హుటాహుటిన పట్టణంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కాకినాడకు తరలిస్తుండగా సీరియస్గా ఉండడంతో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై జీజె ప్రసాద్ తెలిపారు. -
భక్త జనారణ్యంగా కొల్లేటికోట
జాతరకు తరలివచ్చిన భక్తులు కైకలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవాలయం భక్తజన సంద్రంగా మారింది. జాతరలో ప్రధాన ఘట్టమైన శ్రీ జలదుర్గాగోకర్ణేశ్వరస్వామి కల్యాణాన్ని తిలకించడానికి దేశవిదేశాల నుంచి భక్తులు శనివారం తరలివచ్చారు. ఉదయం నుంచి భక్తుల రాక మొదలైంది. మహిళలు వేప మండలు పట్టుకుని తన్మయత్వంతో చిందులు తొక్కారు. దేవస్థాన సమీప కొల్లేరు గ్రామాల్లో పండగ వాతావరణం కనిపించింది. మహిళల బోనాల సమర్పణ, ప్రభల ఉరేగింపు, వివిధ సాంస్కృతిక కళారూపాల ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, వడ్డీ కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ చైర్మన్ జల్లూరి చిన వెంకన్న, ఈవో కూచిపూడి శ్రీనివాసు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ ఏడాది మొదటి సారిగా కల్యాణం అనంతరం పందిరిపల్లిగూడెంలో భారీ అన్నసమారాధన నిర్వహించనున్నారు. భక్తితో అమ్మకు బోనాలు తెలంగాణలో మాదిరిగా పెద్దింట్లమ్మకు బోనాల సమర్పణ 2020 నుంచి కొనసాగిస్తున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పలు నియోజకవర్గాల నుంచి మహిళలు 15,000 మంది పాల్గొన్నారని అంచనా. సమీప గ్రామాల నుంచి నడుచుకుంటూ మహిళలు బోనాలు సమర్పించారు. పందిరిపల్లిగూడెం నుంచి ప్రభల ఉరేగింపు ఆకట్టుకుంది. యువత నృత్యాలు, శక్తి వేషాల ప్రదర్శన అలరించాయి. భక్తులకు గ్రామస్తులు ఉచిత మజ్జిగ పంపిణి చేశారు. వైస్ ఎంపీపీ మంగినేని రామకృష్ణ, కొల్లేరు నాయకులు బలే ఏసురాజు, పూలా రాజీ, కొల్లి బాబీ, వీరమల్లు నరసింహారావు, చలపతి, సైదు సత్యనారాయణ, వివిధ కొల్లేరు గ్రామాల సర్పంచులు, పాలకవర్గ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఏలూరు లావణ్య ఈవెంట్స్ భక్తి సంగీత విభావరి ఆకట్టుకుంది. శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు జలదుర్గాగోకర్ణేశ్వరస్వామి కల్యాణం జరగనుంది. భారీ పోలీసు బందోబస్తు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలలో డీఎస్పీ డి.శ్రవణ్కుమార్, రూరల్ సర్కిల్, టౌన్ సీఐలు వి.రవికుమార్, ఏవీఎస్.రామకృష్ణ జాతరలో కల్యాణ ఘట్టానికి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పగలు, రాత్రి వేళల్లో వినియోగించే అత్యాధునిక డ్రోన్లను ఉపయోగించారు. ట్రాఫిక్ సమస్య రాకుండా పార్కింగ్ స్థలాలను ముందే కేటాయించారు. పెద్దింట్లమ్మ జాతరలో కల్యాణానికి పోటెత్తిన భక్తులు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి బోనాలు సమర్పణ నేడు పందిరిపల్లిగూడెంలో భారీ అన్నసమారాధన -
ఆశ.. నిరాశ!
సమస్యల పరిష్కారం కోసం ఆశ వర్కర్లు గళమెత్తారు. ప్రభుత్వం చాలీచాలని జీతాలతో గొడ్డు చాకిరీ చేయించుకుంటోందని, కనీస వేతనం రూ.26 వేలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీతం రూ.10 వేలు రవాణా తదితర ఖర్చులకే సరిపోతుందని, కనీసం టీఏ, డీఏలు అయినా అందించాలని కోరుతున్నారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం వచ్చేనెల 5న విజయవాడలో ధర్నాకు సన్నద్ధమవుతున్నారు. ప్రధాన డిమాండ్లు ● కనీస వేతనం నెలకు రూ.26 వేలు చెల్లించాలి. ● కార్మికులుగా గుర్తించి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలి. ● ఖాళీ పోస్టులను తక్షణం భర్తీ చేయాలి. ● పనిభారం తగ్గించాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశ వర్కర్ల సంఖ్యను పెంచాలి. ● ఏఎన్ఎం, జీఎన్ఎం శిక్షణ పొందిన ఆశలకు పర్మినెంట్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యమివ్వాలి. ● అవమానకరమైన పనుల నుంచి మినహాయింపు నివ్వాలి. అదనపు పనులను అప్పగించరాదు. ఏలూరు (టూటౌన్): ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 3 వేల మంది ఆశ వర్కర్లు పనిచేస్తున్నారు. ఏలూరు జిల్లాలో 1,750 మంది వ రకు, పశ్చిమగోదావరి జిల్లాలో 1,250 మంది వ రకు ఉన్నారు. రోజురోజుకూ జనాభా పెరుగుతుండటంతో తమపై పనిభారం పెరుగుతోందని ఆశ వర్కర్లు గగ్గోలు పెడుతున్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో.. ఆశ కార్యకర్తలు నిత్యం ప్రజల సంరక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఫ్రంట్లైన్ వర్కర్లుగా వీరు సేవలందిస్తున్నారు. సర్వే, ఇతర కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఇంతలా సేవలందిస్తున్నా ప్రభుత్వం వీరికి రూ.10 వేలు మాత్రమే వేతనంగా అందిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనే నిబంధనను ప్రభుత్వం పక్కన పెట్టేసింది. అధికారుల దయాదాక్షిణ్యాలపైనే.. అత్యవసర పనుల నిమిత్తం సెలవు కావాలంటే అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోందని ఆశ వర్కర్లు ఆవేదన చెందుతున్నారు 20 ఏళ్లుగా ఆశ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లుగా పనిచేస్తున్న వారిని కార్మికులకు గుర్తించడం లేదని, దీంతో చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు కావడం లేదని చెబుతున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశ వర్కర్లను పెంచకుండా సుమారు 2 వేల నుంచి 5 వేల మంది జనాభాకు ఒక్కరే ఆశా వర్కర్తో చాకిరీ చేయిస్తున్నారని వాపోతున్నారు. ఆశ వర్కర్ల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, జీడీపీలో 6 శాతం నిధులు కేటాయించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. సంబంధం లేని పనులతో.. మాతాశిశు సంరక్షణ పేరుతో నియమించిన ఆశ వర్కర్లతో ప్రభుత్వం సంబంధం లేని పనులు చేయిస్తోంది. సర్వేల పేరుతో పనిభారం మోపింది. అలాగే పండుగలు, ఎన్నికలు, విపత్తుల వేళ కనీసం టీఏ, డీఏలు కూడా అందించడం లేదు. పీహెచ్సీ/యూపీహెచ్సీలు, వెల్నెస్ సెంటర్ల క్లీనింగ్, ఆయా కేంద్రాల పరిసరాలను పరిశుభ్రం చేయించడం, బాత్రూమ్ లు కడిగించడం వంటి పనులు కూడా చేయిస్తున్నారని ఆశ వర్కర్లు ఆవేద చెందుతున్నారు. పోరుబాట సమస్యలపై గళం కనీస వేతనాల కోసం పోరాటం ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలి 5న విజయవాడలో ధర్నాకు పిలుపు ఉమ్మడి జిల్లాలో 3 వేల మంది ఆశ వర్కర్లు -
బెదిరింపులతో ఉద్యమాన్ని ఆపలేరు
ఏలూరు (టూటౌన్): తమ హక్కుల సాధన కోసం ఉద్యమిస్తున్న అంగన్వాడీ వర్కర్లను బెదిరించి, నిర్బంధించి ఉద్యమాన్ని ఆపలేరని, వచ్చేనెల 2న చలో విజయవాడకు పిలుపునిస్తున్నట్టు సీఐటీయూ అనుబంధ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ అ న్నారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద నాలుగో రోజు శుక్రవారం అంగన్వాడీల రిలే దీక్షా శిబిరాన్ని ఆమె ప్రా రంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వికసిత భారత్లో అంగన్వాడీ వర్కర్లకు చోటులేదా అని ప్రశ్నించారు. కూటమి నేతలు చిరుద్యోగులపై నిర్లక్ష్య వైఖరి వీ డాలని కోరారు. అంగన్వాడీలకు ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం అందకుండా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. మార్చి 2న రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అంగన్వాడీలు విజయవాడ తరలిరానున్నారన్నారు. కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల ఆందోళనకు ఐఎఫ్టీయూ సంపూర్ణ మద్ద తు తెలుపుతున్నట్టు సంఘ జిల్లా అధ్యక్షుడు కేవీ రమణ చెప్పారు. ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ సుందరయ్య మాట్లాడుతూ కూ టమి నాయకులు ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీలు గత రెండేళ్లలో వేటిని అమలు చేశారనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్సులు పి.హైమావతి, ఎ.రాణి మద్దతు తెలిపారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్, నాయకులు ఎం.ఇస్సాక్, అమర్ కుమార్ పాల్గొన్నారు. -
ఆరోగ్యంపై శ్రద్ధ తప్పనిసరి
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రభుత్వ ఉద్యోగులు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభు త్వాస్పత్రుల్లో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాలను వీఆర్వో, వీఆర్ఏలు సద్వినియోగం చేసుకో వాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్య శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వాస్పత్రుల్లో ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, డీఆర్వో ఎం.శివన్నారాయణ రెడ్డి, ఆర్డీఓ కె.ప్రవీణ్కుమార్రెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు పాల్గొన్నారు. సహకార రంగంపై సమీక్ష సహకార రంగాన్ని బలోపేతం చేసే దిశగా విస్తృత చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో సహకార శాఖలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. అలాగే ఏకీకృత కుటుంబ సర్వే ప్రగతిపై గూగుల్ మీట్ ద్వారా మండలాల వారీగా సమీక్షించారు. భీమవరం (ప్రకాశంచౌక్): మోంథా తుపానుతో పడవలు, వలలు కోల్పోయిన జిల్లాలో మత్స్యకార కుటుంబాలకు ఊరట కలిగించేందుకు రామకృష్ణ మిషన్ నిధులతో తయారుచేసిన బోట్లను శనివారం పీఎం లంకలో జరిగే కార్యక్రమంలో అందించనున్నట్టు కలెక్టర్ నాగరాణి తెలిపారు. 300 మంది మత్స్యకారులకు రూ.2.10 కోట్ల విలువైన పడవలు, వలలను పంపిణీ చేయను న్నామన్నారు. తొలిదశలో 100 మంది లబ్ధిదారులకు సుమారు రూ.70 లక్షల విలువైన సా మగ్రిని అందించనున్నట్టు చెప్పారు. ఆహార తనిఖీలు చేపట్టాలి కల్తీకి కారణమైన ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో జిల్లా ఆహార భద్రత తనిఖీ అధికారి, పశుసంవర్ధక శాఖ అధికారులతో సమావేశమై రెండు రోజులుగా నిర్వహిస్తున్న సోదాలపై సమీక్షించారు. అనంతరం జిల్లా ఆహార భద్రత తనిఖీ అధికారి ఎ.సుందర్ రామిరెడ్డి భీమవరంలో పాల కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. శ్రీనివాస సెంటర్, డీఎన్ఆర్ కాలేజ్ రోడ్డులో కేంద్రాలను సోదాచేసి పాలు కల్తీ జరిగినట్టు గుర్తించి ల్యాబ్కు పంపించారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా వ్యాపారులపై చర్యలు తీసుకుంటామన్నారు. దేహశుద్ధి చేసిన పెళ్లి జనం ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల క్షేత్రంలో ని పలు లాడ్జీల యజమానులకు ఓ ఈవెంట్ మేనేజర్ షాకిచ్చాడు. 40 రూములు బుక్ చేసి అడ్వాన్స్ ఇచ్చిన ఈవెంట్ మేనేజర్, వివాహమైన తర్వాత అద్దె డబ్బులు ఇవ్వలేనని చేతులెత్తేశాడు. అలాగే సౌకర్యాలు సక్రమంగా కల్పించని కారణంగా పెళ్లివారి చేతిలో దెబ్బలు తి న్నాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్కు చెందిన వారు గురువారం రాత్రి క్షేత్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో వివాహం చేసుకున్నారు. పెళ్లి ఏర్పాట్లను వరంగల్కు చెందిన ఓ ఈవెంట్ మే నేజర్కు అప్పగించి రూ.14.50 లక్షలు ఇ చ్చారు. ఇదిలా ఉంటే ఆ ఈవెంట్ మేనేజర్ ద్వారకాతిరుమలలోని దాదాపు 7 ప్రైవేట్ లాడ్జీల్లో 40 రూములు, కొన్ని గెస్ట్హౌస్లను మూడు రోజులపాటు అద్దెకు తీసుకున్నాడు. అందరికీ కొంత అడ్వాన్స్ ఇచ్చి, వివాహమైన తర్వాత మిగిలిన సొమ్ము ఇస్తానన్నాడు. అయితే వివాహమైన తర్వాత తన వద్ద డబ్బులు లేవని చేతులెత్తేశాడు. దీంతో లాడ్జీల యజమానులు ఈవెంట్ మేనేజర్ వచ్చిన కారును స్వాధీనం చేసుకోవాలని భావించారు. అయితే అది ట్రా వెల్స్ కారు అని తెలిసి ఖంగుతిన్నారు. పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేద్దామనుకున్న సమ యంలో ఈవెంట్ మేనేజర్ కాళ్ల బేరానికి వచ్చి ప్రామిసరీ నోట్లు రాసిచ్చి, అక్కడి నుంచి జా రుకున్నాడు. పెళ్లి జనాల కోసం ఏర్పాటు చేసి న ట్రావెల్స్ బస్సులకు కూడా అద్దె చెల్లించకపోవడంతో పాటు సరైన సౌకర్యాలు కల్పించలేదు. దీంతో ఆగ్రహించిన పెళ్లివారు సదరు ఈవెంట్ మేనేజర్ను స్థానిక సొసైటీ పెట్రోల్ బంకు వద్ద చితకబాదారు. ఒక్క గెస్ట్ హౌస్లకే రూ.70 వేల వరకు చెల్లించాలని తెలిసింది. దీ నిని బట్టి అతడు ఎగవేసిన అద్దె సొమ్ము రూ.లక్షల్లో ఉంటుందని అంటున్నారు. చింతలపూడి: ఉపాధ్యాయులపై నిర్లక్ష్య వైఖరి వీడాలని, తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గళమెత్తారు. శుక్రవారం స్థానిక ఽఫైర్స్టేషన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ 12వ పీఆర్సీని తక్షణమే నియమించాలని, మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్ బకాయిలు వి డుదల చేయాలని, పనిభారం తగ్గించాలని, ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నిబంధనను రద్దు చేయాలని కోరారు. అనంతరం ప్రమద్వరకు వినతిపత్రం అందజేశారు. -
కారుతో ఢీకొట్టి.. కత్తులతో వీరంగం
● రౌడీషీటర్ రౌతుల రఘుపై హత్యాయత్నం ● భీమవరంలో కోర్టు వాయిదాకు హాజరైన సమయంలో ఘటన ● పోలీసుల అదుపులో నిందితులు ! భీమవరం (ప్రకాశంచౌక్): పాత కక్షల నేపథ్యంలో రౌడీషీటర్ రౌతుల రఘుపై ప్రత్యర్థులు కారుతో ఢీ కొట్టి కత్తులతో వీరంగం సృష్టించి హత్యాయత్నం చేయడం భీమవరంలో కలకలం రేపింది. పట్టపగలు కోర్టు సమీపంలో జరిగిన ఈ ఘటనతో పట్ట ణం ఉలిక్కిపడింది. డీఎన్నార్ కళాశాల రోడ్డులోని కోర్టు సమీపంలో స్థానికులు భయాందోళన చెందా రు. వివరాలిలా ఉన్నాయి.. 2017లో రఘుపై నమోదైన పోలీసు కేసుకు సంబంధించి రఘు అతడి గ్రూప్ సభ్యులు, అనుచరులు శుక్రవారం కోర్టు వా యిదాకు హాజరై తిరిగి కారులో వెళుతున్న నేపథ్యంలో ప్రత్యర్థులు రఘు కారును మరొక కారుతో ఢీకొట్టి కత్తులతో హతమార్చేందుకు యత్నించారు. రఘు వెంటనే కారుదిగి అక్కడి నుంచి పరారై తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. పోలీసులు వెంటనే స్పందించి రఘును గుర్తించి రక్షణగా నిలిచి టూటౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. పాత కక్షల నేపథ్యంలోనే మరో రౌడీషీటర్ గోవింద్, కొందరితో కలిసి రఘుపై హత్యాయత్నం చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి టూటౌన్ సీఐ కాళీచరణ్ చేరుకుని హత్యాయత్నం జరిగిన కార్లను పరిశీలించి స్వాధీనం చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితులను వేగంగా పట్టుకోవడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పక్కా స్కెచ్తో 2022 డిసెంబర్ 24న రఘు సోదరుడు యేసుపై ప్ర త్యర్థులు భీమవరం బీసీ కాలనీలో అర్ధరాత్రి దాడి చేసి హతమార్చారు. ఆ తర్వాత కాలంలో గొల్లవానితిప్ప రోడ్డు సమీపంలోని క్రిమినల్ కోర్టుకు సమీపంలో పంట కాలువ రోడ్డుపై విజయ్ అనే యువకుడు హత్య గావించబడ్డాడు. హంతకులు మరణాయుధాలు, కత్తులతో ఆనాడు దాడి చేశారు. యే సును హత్య చేసిన ముఠాలోని విజయ్పై ప్రతీకారంగా అతడి సోదరుడు రఘు కొందరితో కలిసి ఆ హత్య చేసినట్టు టూటౌన్ పోలీసులు అప్పట్లో సు మారు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఈ నేప థ్యంలో ప్రత్యర్థులు రఘుపై ప్రతీకారం తీర్చుకోవడానికి పక్కా స్కెచ్తో దాడికి పాల్పడ్డారు. ముందుగా కారుతో రఘు కారును ఢీకొట్టి అనంతరం కత్తులతో హతమార్చాలని ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. రఘు తప్పించుకున్న తర్వాత ప్రత్య ర్థులు అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కౌన్సెలింగ్ ఇచ్చినా మారని తీరు టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా ప్రతీకారమే ముఖ్యమన్నట్లు ఈ హత్యయత్నం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. -
ప్రైవేట్ ప్రవేషాలు
మీ బాబు.. మా బాధ్యత.. ఏమీ చదవడం లేదా ఫర్వాలేదు.. టాప్లోకి తీసుకువెళ్తాం.. ఎల్కేజీ నుంచే ఐఐటీ స్టాండర్డ్స్.. మీ అబ్బాయి, లేదా అమ్మాయి పదో తరగతి పూర్తి చేశారా మా కళాశాలలో చేర్పించండి.. ఇప్పుడు చేరితే రూ.5 వేలు డిస్కౌంట్.. లేటయితే పూర్తిగా చెల్లించాలి.. లేదంటే స్కాలర్షిప్ టెస్టులో మార్కులు వస్తే ఫీజు తగ్గిస్తాం.. ఇవి తెల్లవారక ముందే విద్యార్థుల తల్లిదండ్రుల ఇంటి ముందు ప్రత్యక్షమయ్యే కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల సిబ్బంది చెప్పే మాటలు.. అలాగే పదేపదే ఫోన్ కాల్స్, మెసేజ్లతో ప్రైవేట్ పాఠశాలల అడ్మిషన్ల గోలతో విద్యార్థుల తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. పెనుగొండ: ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం వేట మొదలుపెట్టాయి. పరీక్షల కాలం మొదలవడం, విద్యా సంవత్సరం ముగియనుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ‘వల’ వేస్తున్నాయి. గ్రామస్థాయి లోని చిన్నపాటి స్కూళ్ల నుంచి పట్టణాల్లోని కార్పొరేట్ విద్యాసంస్థల వరకూ ఇదే అడ్మిషన్ల గోల. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో 505 వరకూ ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయి. అనధికారికంగా వీటి సంఖ్య మరింత ఉంటుంది. ఏటా పుట్ట గొడుగుల్లా ప్రైవేట్ స్కూళ్లు పుట్టు కొస్తున్నాయి. దేశంలో పే రెన్నికగన్న విద్యాసంస్థల పేర్లుతో కలిసే విధంగా స్కూళ్లకు పేర్లు పెట్టి మరీ తల్లిదండ్రులను బురిడీ కొట్టించడానికి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ప్రచారంతో బోల్తా కొట్టిస్తూ.. జిల్లాలో ప్రాథమిక పాఠశాలల రిజిస్ట్రేషన్లతో హైస్కూ ళ్లను నిర్వహిస్తున్న విద్యాసంస్థలు ఉన్నాయి. దీనిపై అవగాహన లేని తల్లిదండ్రులు వారి ప్రచారానికి బోల్తా పడుతూ రూ.లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్తగా ప్రైవేట్ పాఠశాల ప్రా రంభించాలంటే ముందుగా ఓపెనింగ్ (ప్రారంభ) అనుమతి పొందాలి. అనంతరం విద్యార్థులను చే ర్చుకుని పూర్తిస్థాయి అనుమతులు పొందాలి. ప్రా థమిక స్థాయి పాఠశాలకు జిల్లా విద్యాశాఖాధికారి నుంచి, హైస్కూల్ కోసం విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ ద్వారా విద్యా కమిషనర్ అనుమతులు తప్పనిసరి. అదే సీబీఎస్ఈ సిలబస్ కోసం కేంద్ర విద్యామండలి నుంచి అనుమతులు పొందాలి. తల్లిదండ్రులూ అధ్యయనం చేయండి : తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యాసంస్థల్లో చేర్పించే ముందు ఆ పాఠశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చే యాలి. అనుమతులు, విద్యాసంస్థల బోర్డులు, ప్రకటనలను, వాటిపై రిజిష్టర్డ్ అని ఉందో లేదో పరిశీలించాలి. అనుమతులు లేకుండా స్కూళ్లను నిర్వహిస్తూ, గుర్తింపు పొందిన పాఠశాల నుంచి పరీక్షలు రాయించే విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని సంస్థలు బ్రాంచ్ల్లో విద్యార్థులను చేర్చుకుని మెయిన్ బ్రాంచ్ నుంచి పరీక్షలు రాయిస్తుంటాయి. అనుమతులు లేకపోతే చైల్డ్ ఇన్ఫో ఆధారంగా విడుదల చేసే ధ్రువీకరణ పత్రాలకు ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగం జారీ చేసిన పాఠశాల భవనం నాణ్యత, ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. పూర్తిస్థాయిలో మౌలిక వసతులు ఉండాలి. విద్యార్థుల మానసిక, శారీరక ఉల్లాసానికి క్రీడా ప్రాంగణం, క్రీడా ఉపాధ్యాయులు ఉండాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత స్ఠాయిలో 20 నుంచి 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరి. హైస్కూళ్లలో సబ్జెక్టుల వారీగా ఒకరు చొప్పున టీచర్ ఉండాలి. సురక్షిత రవాణా సదుపాయానికి బస్సులకు రవాణా శాఖ ఫిట్నెస్ సర్టిఫికెట్, అనుభవజ్ఞుడైన డ్రైవర్ ఉండాలి. భవనం పలు అంతస్తుల్లో ఉంటే అగ్నిమాపక పరికరాలు, మంటలు ఆర్పడానికి అవసరమైన సామగ్రి పూర్తిస్థాయిలో ఉండాలి. కార్పొరేట్ వల అడ్మిషన్ల కోసం ఇంటింటా ప్రచారం ఫోన్ కాల్స్, మెసేజ్లతో ఒత్తిడి స్కాలర్షిప్ టెస్టులు.. డిస్కౌంట్ ఆఫర్లు ప్రైవేట్ స్కూళ్ల సిబ్బంది హడావుడి తల్లిదండ్రులూ.. తస్మాత్ జాగ్రత్త ప్రచార ఆర్భాటాలకు మోసపోకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను గుర్తింపు ఉన్న పాఠ శాలల్లో చేర్పించాలి. ప్రైవేట్ పాఠశాలలపై నిత్యం పర్యవేక్షణ చేస్తున్నాం. గుర్తింపు లేని పాఠశాలల్లో అడ్మిషన్లు చేస్తే చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు చేర్పించే ముందు పాఠశాలకు గుర్తింపు, వాహనాల ఫిట్నెస్, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. – డి.శుభాకరరావు, ఎంఈఓ, పెనుగొండ -
పని భారం మోపుతూ..
రాష్ట్రవ్యాప్తంగా ఆశ వర్కర్ల న్యాయమైన డి మాండ్లను పరిష్కరించాలి. సర్వేలు, అదనపు పనుల పేరుతో పని భారాలను తగ్గించాలి. ఆశ కార్యకర్తలకు నాణ్యమైన సెల్ఫోన్లు అందించాలి. పర్మినెంట్ ఉద్యోగులుగా పనిచేయించుకుంటూ అతి తక్కువ వేతనాలు చెల్లించడం దారుణం. – పి.కమల, జిల్లా అధ్యక్షురాలు, ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్, ఏలూరు ఆశ వర్కర్లను కార్మికులుగా గుర్తించడం ద్వా రా చట్టబద్ధత కల్పించాలి. దీని ద్వారా బెని ఫిట్స్ అందుతాయి. శిక్షణ పొందిన ఆశలకు ఏఎన్ఎం, జీఎన్ఎం పోస్టుల భర్తీలో ప్రాధాన్యమివ్వాలి. ఈఎస్ ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలి. ఈ దిశగా ప్రభుత్వం చొరవ చూపాలి. – పి.కామేశ్వరి, జిల్లా ఉపాధ్యక్షురాలు, ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్, ఏలూరు ఆశ వర్కర్లకు ఇస్తున్న గౌరవ వేతనం రూ.10 వేలు ఏ మూలకూ సరిపోవడం లేదు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా కనీస వేతనం నెలకు రూ.26 వేలు చెల్లించాలి. వచ్చేనెల 5న విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి ఆందోళనకు ఆశ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలి. – కె.పోశమ్మ, జిల్లా కార్యదర్శి, ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్, ఏలూరు ఆశ వర్కర్లకు కూడా పర్మినెంట్ ఉద్యోగులు మాదిరిగా సెలవులు ఇవ్వాలి. ఇప్పుడు సెలవు కావాలంటే అధికారుల దయాదాక్షిణ్యాలపై తీసుకునే పరిస్థితి. ఆరోగ్యం బాగోకపోయినా, అత్యవసర పనుల మీద బయటకు వెళ్లాల్సి వచ్చినా సెలవు అనేది పెద్ద సమస్యగా మారింది. – ఎం.లోకేశ్వరి, జిల్లా కోశాధికారి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్, ఏలూరు -
నేత్రపర్వం ఏకాదశి ఉత్సవం
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రంలో శుక్రవారం రాత్రి శ్రీవారికి తిరువీధి సేవ నేత్రపర్వంగా జరిగింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, సుగంధ భరిత పుష్పమాలికలతో విశేషంగా అలంకరించారు. అనంతరం అర్చకులు పూజాధికాలను జరిపి, హారతులిచ్చారు. ఆ తరువాత స్వామివారి వాహనం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిటా భక్తులు స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. -
లక్ష్యాల వైపు సాగాలి
తాడేపల్లిగూడెం: విద్యార్థి దశలో ఉండగానే లక్ష్యాలను నిర్ధేశించుకొని వాటి సాధన దిశగా సాగాలని శశి ఇంజనీరింగ్ కళాశాల అన్వేషణలో పాల్గొన్న వక్తలు పిలుపునిచ్చారు. అన్వేషణ టెక్నో కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమం శనివారం తాడేపల్లిగూడెంలో జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న జేఎన్టీయు కాకినాడ వైస్ చాన్సలర్ సీఎస్ఆర్కె ప్రసాద్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్యాలు చేరుకోవాలంటే క్రమశిక్షణతో చదువుకోవాలన్నారు. సంస్థల వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత గుర్తించడానికి ఏటా తమ కళాశాలలో అన్వేషణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. లలిత జ్యూయలర్స్ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎక్కడ విజయం సాధించాలన్నా కష్టపడితేనే సాధ్యమవుతుందన్నారు. సినీ నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ తాను కళాశాలలో చదువుతున్నప్పుడు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించానన్నారు. సినిమాను లక్ష్యంగా ఎన్నుకొని కష్టపడి నటుడిగా నిలబడ్డానన్నారు. విద్యాసంస్థల డైరెక్టర్ బూరుగుపల్లి రాధారాణి, సెక్రటరీ, కరస్పాండెంట్ మేకా క్రాంతి సుధ, ప్రిన్సిపాల్ మొహ్మద్ ఇస్మాయిల్, కన్వీనర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం అర్బన్: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసినట్లు తాడేపల్లిగూడెం పట్టణ సీఐ బోణం ఆది ప్రసాద్ శుక్రవారం తెలిపారు. పట్టణ పోలీస్స్టేషన్లో శుక్రవారం మాట్లాడుతూ పిఅండ్టి కాలనీ సమీపంలో గంజాయిని విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్సై నాగరాజు, సిబ్బందితో కలిసి దెందుకూరి చిదంబర్ వెంకట రాజు అలియాస్ వంశిశీ షేక్ అక్బర్ను అదుపులోనికి తీసుకొని వారి కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులు అరకు నుంచి కొనుగోలు చేసి పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లో అధిక ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
డ్రెయినేజీలో వ్యక్తి మృతదేహం లభ్యం
తణుకు అర్బన్ : తణుకు బ్యాంకు కాలనీ డ్రెయినేజీలో శుక్రవారం ఉదయం వ్యక్తి మృతదేహం బయటపడ్డ ఘటన కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో పట్టణ పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసిన తరువాత బ్యాంక్ కాలనీ శివారు ప్రాంతమైన నాగేంద్రనగర్కు చెందిన గుడ్డాల నాగరాజు (40)గా గుర్తించారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్రంగి మేస్త్రిగా ఉన్న నాగరాజు మొదటి భార్య లక్ష్మి మృతి చెందడంతో రెండో భార్య సూర్యకళతో భీమవరంలో ఉంటున్నారు. తల్లి, పిల్లలను చూసేందుకు తరచూ నాగరాజు తణుకు వస్తుంటాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం తణుకు వచ్చిన నాగరాజు మద్యం తాగేందుకు ఇంటి నుంచి రైల్వేస్టేషనన్ రోడ్డుకు వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఉదయం నుంచి కుటుంబ సభ్యులు గాలించారు. డ్రెయినేజీలో మృతదేహం ఉందన్న వార్త విని కుటుంబసభ్యులు వచ్చి చూసి నాగరాజుగా నిర్ధారించారు. పట్టణ ఇన్చార్జ్ సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, ఎస్సైలు శ్రీనివాస్, జానా సతీష్ ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. నాగరాజు తరచూ మద్యం సేవించి ఇంటికి వస్తుంటారని, మద్యం మత్తులోనే డ్రెయినేజీలో పడి ఊపిరి ఆడక మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నాగరాజు కుమారుడు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉండి: ఈ నెల 25న ఉండి చిక్కాల వీరన్న నగర్లో జరిగిన గ్యాస్ లీకేజీ అగ్ని ప్రమాదంలో గాయపడిన నలుగురు వ్యక్తుల్లో ఒగ్గు సుబ్బాయమ్మ మృతి చెందగా.. మాసాబత్తుల లక్ష్మీ( 58) విజయవాడలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు బాధితులు తీవ్ర గాయాలతో విజయవాడలో చికిత్స పొందుతున్నారు. -
హలీం.. సలాం
● రంజాన్ మాసంలో ప్రత్యేక వంటకంగా హలీం ప్రసిద్ధి ● పుష్కలమైన పోషకాలతో తయారయ్యే ఆహారం కొయ్యలగూడెం : రంజాన్ అంటే ముస్లింలకు పవిత్ర మాసం. ఈ మాసంలో వారు దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలతో ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతారు. ఉపవాస దీక్షలు తీసుకున్న సమయంలో వారు నీరసించపోకుండా బలవర్థమైన ఆహారంగా హలీం ఎంతగానో దోహదపడుతుంది. మతాలకు అతీతంగా ఆహారప్రియులకు సైతం హలీం అత్యంత ఇష్టమైన వంటకంగా నిలుస్తోంది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ పౌష్టికాహారం క్రమేపీ గ్రామీణ ప్రాంతాల్లో సైతం విస్తరిస్తోంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే అత్యంత పౌష్టికాహారాన్ని పదార్థాలలో హలీం ఒకటి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు ఉండటం వలన పిల్లలకు సైతం మెరుగైనదిగా వైద్యులు ధ్రువీకరిరిస్తున్నారు. హలీం తయారీ ఇలా.. మాంసం, గోధుమలు, పప్పు దినుసులు, మసాలాలు కలిపి దాదాపు గంటసేపు ఉడికించి నీటిని అందులోనే ఇంకెలా మరిగించి.. అనంతరం దానిని గట్టి పాయసం మాదిరిగా కలిపి తయారుచేస్తారు. ఆ సమయంలోనే సరిపడా నెయ్యి, వేయించినటువంటి ఉల్లి, వెల్లుల్లి, కొత్తిమీర, లవంగాలు, యాలకులు మిశ్రమాలను సమపాళ్లలో కలిపి తయారు చేస్తారు. స్థోమత కలిగిన వారైతే జీడిపప్పు, బాదంపప్పు, ఇతర ఖరీదైనటువంటి డ్రైఫ్రూట్స్ మిశ్రమాన్ని లేదా పౌడర్లను హలీం వంటలలో కలుపుకోవచ్చు. -
చల్లని తల్లి.. కొల్లేటి పెద్దింట్లమ్మ
● నేడు కలువ బోనాల సమర్పణ ● లక్ష మంది విచ్చేస్తారని అంచనా ● ప్రధాన ఆకర్షణగా ప్రభల ఊరేగింపు కొల్లేరు దిబ్బపై పెద్దింట్లమ్మ జాతరను తిలకించడం ఓ మధురానుభూతి. కై కలూరు నుంచి భీమవరం వెళ్ళే రహదారిలో ఆలపాడు వద్ద బస్సు దిగి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దింట్లమ్మ దేవస్థానానికి చేరుకోవచ్చు. పెద్దింట్లమ్మ విగ్రహం చెంత జలదుర్గాదేవితో గోకర్ణేశ్వరస్వామికి జరిగే కల్యాణం అనంతరం ఆ తలంబ్రాలు చల్లుకుంటే ఎంతో పుణ్యం. – కూచిపూడి శ్రీనివాసు, ఆలయ కార్యనిర్వహణాధికారి, కొల్లేటికోట కై కలూరు : తెలంగాణ బోనాల సంప్రదాయాన్ని ఏలూరు జిల్లా కొల్లేరు ప్రజలు కొనసాగిస్తున్నారు. ఏలూరు జిల్లా కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర (తీర్థం) ఈ నెల 18 నుంచి మార్చి 3వ తేదీ వరకు జరుగుతోంది. జాతరలో ప్రధాన ఘట్టమైన శ్రీ జలదుర్గా గోకర్ణేశ్వరస్వామి కల్యాణం శనివారం (28వ తేదీ) రాత్రి జరగనుంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి వేలాదిగా కొల్లేరులంక గ్రామాల మహిళలు కలువ బోనాలు నెత్తిన పెట్టుకుని భక్తితో అమ్మకు సమర్పిస్తారు. ప్రభుత్వం నుంచి అమ్మకు పట్టువస్త్రాలు అందిస్తారు. అధిక సంఖ్యలో భక్తులు రానున్న దృష్ట్యా ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నీటి మధ్యలో ద్వీప కల్పం పద్మాసన భంగిమలో ఆశీనులైన పెద్దింట్లమ్మ తల్లి ఆలయం వేంగి రాజుల కాలంలో నిర్మించిన పురాతన దేవాలయం. కొల్లేటి గ్రామాల ప్రజలకు ఆరాధ్య దైవం. జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గాగోకర్ణేశ్వరస్వామి కల్యాణం రోజున ప్రభల ఊరేగింపు, బోనాల సమర్పణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రత్యేక ఆకర్షణగా బోనాలు భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. 2020 నుంచి కొల్లేటికోట పెద్దింట్లమ్మకు బోనాలు సమర్పిస్తున్నారు. మొదటి ఏడాది 60 మంది బోనాలు సమర్పిస్తే, రెండో ఏడాది ఆ సంఖ్య 200కు చేరింది. ప్రస్తుతం వేల సంఖ్యలో బోనాలతో మహిళలు మొక్కులు తీర్చుకుంటున్నారు. మహిళలు మూడు మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిలో తాటి కల్లు, పానకం, పిండి వంట, వడ పప్పు, చలివిడి నింపి చివరి కుండపై నెయ్యితో నిండిన 365 ఒత్తుల దీపాన్ని ఉంచుతారు. బోనాలకు ముందు వరుసలో 7 కావిళ్లలో పసుపు, కుంకుమ, నెయ్యి, వేప రొట్టెలు, నిమ్మ కాయలు, పానకం, కల్లు, అమ్మవారి ప్రతిరూపాలుగా భక్తులు మోసుకెళ్తారు. కొల్లేరు సరస్సులో ఫిబ్రవరి, మార్చిలో సహజసిద్ధంగా కలువ పువ్వులు లభిస్తాయి. కొల్లేరు ప్రజలు తమ ఇలవేల్పుగా భావించే అమ్మవారికి ప్రీతిపాత్రమైన కలువ పువ్వులను బోనాలకు కట్టుకుని సమర్పిస్తారు. బోనాల కోసం ప్రత్యేక కుండలకు రంగులు అద్ది అందంగా అలంకరిస్తారు. బోనాలలో పానకం, ఇతర పదార్థాలను అమ్మకు నైవేద్యంగా పెట్టిన తర్వాత చేపలు, రొయ్యల చెరువుల్లో కలపడం ఇక్కడి సంప్రదాయం. కొల్లేటికోట పెద్దింట్లమ్మ తల్లి గోకర్ణేశ్వరస్వామి -
కలుషిత నీటి వల్లే దద్దుర్లు
పాలకొల్లు సెంట్రల్: వాటర్ వల్ల వచ్చిన దద్దుర్లే తప్ప ఆటలమ్మ, పొంగు వంటి వ్యాధులేమీ కాదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని జిల్లా వైద్యశాఖాధికారి డా.గీతాబాయి అన్నారు. పాలకొల్లు మండలం రూరల్ పంచాయతీకి సంబంధించిన అచ్చుగట్లపాలెం చిత్రావిచెరువుగట్టు ప్రాంతానికి చెందిన ప్రజలకు అక్కడ పంచాయతీ వాటర్ వల్ల దద్దురు రావడంతో ప్రజలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం రాత్రి అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి మెడికల్ క్యాంపు ఏర్పాటుచేశారు. మెడికల్ క్యాంపులో పలువురికి పరీక్షలు చేసిన డా.గీతాబాయి మాట్లాడుతూ వాటర్ కలుషితం వల్ల దద్దురు వచ్చాయని నీళ్లలను పరీక్షలకు పంపామన్నారు. ఆయింట్మెంట్, ట్యాబ్లెట్లు అందించామన్నారు. ప్రతి నెలా ఈ ప్రాంతంలో సంచార వైద్య శిబిరం ఏర్పాటుచేయాలని వైద్యాధికారులకు సూచించారు. వాటర్ ట్యాంకు ప్రతి 15 రోజులకోసారి క్లోరినేషన్ టెస్టింగ్ చేయాలని తెలిపారు. కొయ్యలగూడెం: మట్టి అక్రమ తవ్వకాలకు అదుపు లేకుండా పోతోంది. శుక్రవారం మండలంలోని యర్రంపేట పులపాకుల చెరువు నుంచి జేసీబీలను ఏర్పాటుచేసి ట్రక్కులలో మట్టిని తరలించారు. అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా.. వాళ్ళు వచ్చేసరికి మట్టి ట్రక్కులు ఎక్కడికక్కడ సర్దుకున్నాయి. గత కొద్ది రోజులుగా రాత్రి వేళల్లో కొనసాగిన మట్టి తోలకాలు ఇప్పుడు పట్టపగలే కొనసాగుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. అధికారులకు సమాచారం వెళ్లిన అనంతరం వాళ్లు రావడంతో వాహనాలతో అక్రమార్కులు పలాయనం చిత్తగించారు. యర్రంపేట, రాజవరం, పొంగుటూరు, దిప్పకాయలపాడు, కన్నాపురం, సరిపల్లి గ్రామాలలోని సాగునీటి చెరువుల వెంట మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు ఏ విధమైన చర్యలు చేపట్టడం లేదని సాగునీటి చెరువుల ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): బస్లో బ్యాగ్ పోగొట్టుకున్న మహిళకు తిరిగి బ్యాగ్ భద్రంగా అప్పగించామని జిల్లా ప్రజా రవాణాధికారి ఎస్.గిరిధర్ కుమార్ తెలిపారు. ఈ నెల 25న ఆత్రేయపురానికి చెందిన ఎం.సూర్యకుమారి భీమవరం డిపోకు చెందిన విశాఖపట్నం బస్ సర్వీస్లో ప్రయాణించారన్నారు. ఆమె వెంట తెచ్చుకున్న బ్యాగ్ మర్చిపోవడంతో బ్యాగ్ను గుర్తించిన సర్వీసు డ్రైవర్ తీసుకువచ్చి డిపో ఎర్నింగ్ సెక్షన్కు అప్పగించారని తెలిపారు. ప్రయాణికురాలు ఆధార్ కార్డు ఆధారంగా సమాచారం అందించామన్నారు. -
గూడెంలో చెరవులు
తాడేపల్లిగూడెం (టీఓసీ): తాగునీటి వనరులను అందించడంతో పాటు భూగర్భ జలాల పరిరక్షణలో ప్రధాన భూమిక పోషించే చెరువులు ఆక్రమణల చెరలో చిక్కుకుని కుచించుకుపోతున్నాయి. తాడేపల్లిగూడెం పట్టణంలోని పలు చెరువులు కబ్జాలకు గురయ్యాయి. పట్టణంలో సుమారు 30 వరకు పెద్ద, చిన్న చెరువులు ఉండేవని పెద్దలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం చాలా వరకూ చెరువులు కనుమరుగయ్యాయి. కుళాయిలు లేని రోజుల్లో.. పట్టణంలోని ప్రజల దాహార్తిని తీర్చేందుకు కుళాయిలు లేని రోజుల్లో వన్టౌన్, టూటౌన్లోని పలు ప్రాంతాల్లో చెరువులు తవ్వించారు. అనంతర కా లంలో పాతూరు శివారులో పంపుల చెరువు రావడంతో ఇంటింటికీ కుళాయిలు వచ్చాయి. దీంతో పలు చెరువులు నిరుపయోగంగా మారాయి. కాలక్రమేణా అవి నిర్లక్ష్యానికి గురై గుర్రపుడెక్క, తూ డుతో నిండిపోయాయి. అనంతరం ఆక్రమణలకు గురయ్యాయి. అలాగే పట్టణంలో కొందరు లబ్ధి కోసం కొన్ని చెరువులను ఆలయాలుగా మార్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వన్టౌన్, టూటౌన్ ప్రాంతాల్లో.. పట్టణంలోని వన్టౌన్ పాతూరు ప్రాంతంలో తాడేపల్లిచెరువు, సంజీవనగర్ ఉన్నత పాఠశాల ఎదు రుగా చెరువు, మున్సిపల్ కార్యాలయం వద్ద అనంతమ్మ చెరువు, టీటీడీ కల్యాణ మండపం నుంచి మామిడితోట ఏరియాలో రెండు చెరువులు, గొల్లగూడెం చెరువు, సుబ్బారావుపేటలో డీఎస్ చెరువు, కొండాలమ్మ చెరువు, మామిడాల చెరువు, వానపల్లిగూడెం చెరువు, వీకర్స్ కాలనీలో పసర్లు చెరువు, కడకట్ల తోట సమీపంలో చెరువు, కడకట్లలో పలు చెరువులు, కొండయ్య చెరువు, గోగులమ్మ గుడి వద్ద చెరువు, హౌసింగ్ బోర్డు వద్ద చెరువు ఉండేవి. అలాగే టూటౌన్ ప్రాంతంలో జువ్వలపాలెంలో మూడు చెరువులు, పెద్ద శివాలయం సమీపంలో కృష్ణుడు చెరువు, భాగ్యలక్ష్మిపేటలోని ఆంజనేయస్వామి గుడి చెరువు, రామచంద్రరావు పేటలోని కృష్ణుడు చెరువు, యాగర్లపల్లి సమీపంలో చెరువులు, ముదునూరుపాడు బాల వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద చెరువు, అక్కడే మరికొన్ని చెరువులు, కేఎన్ రోడ్డుకు పక్కగా స్కూల్ వద్ద చెరువులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం కొన్ని కనుమరుగయ్యాయి. పరిరక్షణ ఊసేది? పట్టణంలో చెరువుల రూపురేఖలు మారిపోతున్నా వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ప్రజలు వాపోతున్నారు. చెరువుల వద్ద ఆక్రమణలను తొలగించాలని, చెరువుల్లో చేరిన వ్యర్థాలను తొలగించి, చెరువు గట్లను పెంచి, ఇన్లెట్, అవుట్లెట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అలాగే చెరువుల వద్ద వాకింగ్ ట్రాక్, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని అంటున్నా రు. చెరువుల వద్ద మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయవచ్చని పలు వురు చెబుతున్నారు. పట్టణంలో చెరువులు క్రమక్రమంగా కన్పించడం లేదు. ఇప్పటికే పలు చెరువులను పూర్తిగా పూడ్చివేశారు. రూపురేఖలు కూడా లేకుండా చేశారు. కనీసం ప్రస్తుతం ఉన్న చెరువులను అయినా అభివృద్ధి చేయాలి. అహ్లాదకరంగా మార్చడంతో పాటు బోటు క్లబ్లుగా రూపొందించాలి. అందరికీ ఉపయోగపడేలా చూడాలి. – ఎస్ఎం సుభానీ, తాడేపల్లిగూడెం దర్జాగా కబ్జా ఆక్రమణల్లో చెరువులు కొనసాగుతున్న పూడ్చివేత అపరిశుభ్రంగా మరికొన్ని.. చెరువుల ప్రక్షాళన ఊసెత్తని ప్రభుత్వం పట్టణంలో 30 చెరువులు వరకు ఉండగా చాలా చెరువులు కనుమరుగయ్యాయి. కొన్ని చెరువుల గట్టుల వద్ద గుడి నిర్మాణాలు చేపట్టారు. కొన్ని చెరువులను ఖాళీ స్థలాలుగా మార్చేశారు. మరికొన్ని చెరువులు వర్షం నీరు, డ్రెయినేజీ వ్యర్థాలతో మురుగుకూపాలుగా మారాయి. సుబ్బారావుపేటలోని డీఎస్ చెరువు తూడుతో అస్తవ్యస్తంగా మారింది. వీకర్స్కాలనీ పసర్లు చెరువు ఆక్రమణల బారిన పడింది. పాతూరు చెరువు డ్రెయినేజీ వ్యర్థాలతో నిండిపోయింది. కడకట్లలో కొండయ్య చెరువును అభివృద్ధి చేస్తామని గతంలో ప్రకటించినా ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు. పెద్ద శివాలయం వద్ద కృష్ణుడు చెరువు ఆక్రమణకు గురైంది. ప్రస్తుతం ఆ చెరువులోకి మురుగు నీరు చేరుతోంది. రైల్వే ట్రాక్ దగ్గరలో ఉండటం, ఆక్రమణలతో కనీసం చెరువును గుర్తించే పరిస్థితి కూడా లేదు. -
చందమామ కథలొద్దు బాబూ!
ఆకివీడు: ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు చందమామ కథల్ని తలపిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యలు పట్టించుకోని ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా జిల్లాలో పాదయాత్ర ప్రారంభించామన్నా రు. కుప్పనపూడి గ్రామ శివారు తాళ్లకోడులోని జగనన్న కాలనీలో పాదయాత్రను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యల్ని చర్చించాల్సిన అసెంబ్లీలో లడ్డూపై చర్చించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలను కులం, మతం, ప్రాంతం పేరుతో విభజిస్తున్నారని మండిపడ్డారు. తాజాగా డీఎస్సీ అంటూ తెరపైకి వచ్చారని, ఏజెన్సీలో డీఎస్సీ ఏమైందని ప్రశ్నించారు. అభివృద్ధికి దూరంగా టిడ్కో ఇళ్లు, పేదల కాలనీలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు 2, 3 సెంట్ల ఇళ్ల స్థలాల హామీని గాలికి వదిలేశారని విమర్శించారు. ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతున్న ఎమ్మెల్యే పేదల ఇళ్లు పీకించడం అభివృద్ధా అని ప్రశ్నించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.బలరామ్ మాట్లాడుతూ జిల్లాల్లో ఉన్న పరిశ్రమలు మూతపడుతుంటే ఆపలేని చంద్రబాబు సింగపూర్ వెళ్లి పరిశ్రమలు తెస్తారంటా అని ఎద్దేవా చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు మంతెన సీతారాం, సీనియర్ నేత కె.రాజారామ్మోహన్రాయ్, కార్యదర్శివర్గ స భ్యులు కేతా గోపాలన్, బి.వాసుదేవరావు, పీవీ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు -
ఇరగవరం వైస్ ఎంపీపీగా మంగెన
పట్టు నిలుపుకున్న వైఎస్సార్సీపీ ఇరగవరం: ఇరగవరం మండల వైస్ ఎంపీపీ పదవికి గురువారం ఎన్నికలు నిర్వహించగా వైఎస్సార్సీపీ ఇరగవరం ఎంపీటీసీ–2 మంగెన వెంకట రామానాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఎన్నికల సంఘ ఆదేశాలతో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ప్రిసైడింగ్ అధికారి, తాడేపల్లిగూడెం డివిజనల్ అభివృద్ధి అధికారి అధ్యక్షతన ఇరగవరం మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించారు. ప్రత్యేక సమావేశానికి 19 ఎంపీటీసీ సభ్యులకు 15 మంది హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో వెంకట రామానాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన ప్రమాణ స్వీకా రం చేశారు. ఎంపీపీ కొప్పిశెట్టి అలివేలు మంగ తాయారు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యుడు పంపన అంజిబాబు, కో–ఆప్షన్ సభ్యులు షేక్ మాబ్ తదితరులు పాల్గొన్నారు. -
మావుళ్లమ్మ హుండీ ఆదాయం రూ.51.52 లక్షలు
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం మావుళ్లమ్మవారి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. 28 రోజులకు రూ. 51,52,032 నగదు, బంగారం 33.240 గ్రా ములు, వెండి 189 గ్రాములు, విదేశీ కరెన్సీ లభించినట్టు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు. కృష్ణా జిల్లా సింగరాయపాలెం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ జి.గంగా శ్రీదేవి పర్యవేక్షించారు. ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు, భీమవరం ఎండోమెంట్ తనిఖీదారు వి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యంభీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నామని, దీనిలో భాగంగా వీఆర్వో, వీఆర్ఏలకు ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటుచేసినట్టు జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పరీక్షా శిబిరాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. ఉద్యోగుల ఆరోగ్యం బా గుంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చన్నారు. సాధారణ వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు, బీపీ, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించారు. వైద్య సేవలను జేసీ పరిశీలించారు. డీ ఆర్వో ఎం.శివన్నారాయణ రెడ్డి, ఆర్డీఓ కె. ప్రవీణ్కుమార్రెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు, వైద్యాధికారులు పాల్గొన్నారు.‘ఆధార్’ సవరణకు అవకాశంభీమవరం (ప్రకాశంచౌక్): టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులు ఆధార్ వివరాలను సవరించుకోవడానికి ఈనెల 28 వరకు అవకాశం కల్పించినట్టు డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, లింగం, ఆధార్ నంబర్లను సవరించుకోవచ్చని సూచించారు.ఉద్యాన వర్సిటీలో ఏఎంఎస్ వ్యవస్థతాడేపల్లిగూడెం (టీఓసీ): వెంకట్రామన్నగూ డెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో అకడమిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఏఎంఎస్)ని ప్రవేశపెడుతున్నట్టు, ఈ మేరకు వీసీ డాక్టర్ కె.ధనుంజయరావు నిర్ణయించారని వర్సిటీ డీన్ ప్రసన్నకుమార్ గురువారం తెలి పారు. ఏఎంఎస్లో కళాశాల విద్యార్థులు, పాఠ్య ప్రణాళిక, విద్యార్థుల నమోదు, గ్రేడ్ నిర్వహణ, అధ్యాపక షెడ్యూల్, సహా విద్యా కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, కేంద్రీకృత, డిజిటల్ ప్లాట్ఫామ్ తదితర విషయాలు ఉంటాయన్నా రు. ఈ వ్యవస్థతో అధ్యాపకులపై పాలన భా రాలు తగ్గి, బోధనపై దృష్టి పెట్టడానికి వీలు కలుగుతుందన్నారు. వర్సిటీ భవనంలో జరిగిన కార్యక్రమంలో ఐఐఎస్ఆర్ (న్యూఢిల్లీ) ఏఎంఎస్ నిపుణులు డాక్టర్ మనీష్ చౌహాన్ బృందం, యూనియన్ బ్యాంక్ ఉన్నతాధికారులు, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఎం. మాధవి, విస్తర సంచాలకులు సీహెచ్ రూత్, పరిశోధన సంచాలకుడు జి.రామానందం పాల్గొన్నారు.ఫ్యామిలీ సర్వే వేగిరపర్చాలిపాలకోడేరు: యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ఈకేవైసీ నెలాఖరులోపు నూరుశాతం పూర్తిచేయా లని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉండి, పాలకోడేరు మండలాల్లో సర్వే మందకొడిగా సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయాల జిల్లా అధికారి వై.దోసిరెడ్డి, ఎంపీడీఓ వీరమల్లు రెడ్డియ్య, తహసీల్దార్ ఎంవీఎస్ లక్ష్మి తదితరులు ఉన్నారు. -
కూటమిపై నెటిజనం నిలదీత
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి మరో మూడు నెలల్లో రెండేళ్లు పూర్తి కానుంది. చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మూడో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కొన్నింటికి కోతపెట్టి అరకొర కేటాయింపులు చేయగా, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి తదితర వాటి ఊసే లేకుండా చేసింది. కూటమి చేసిన వంచనతో పేదవర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రధాన హామీలను పట్టాలెక్కించకపోవడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు నిలదీస్తున్నారు.సాక్షి, భీమవరం: సార్వత్రిక ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి తదితర సూపర్ సిక్స్ పథకాలు, వలంటీర్లకు రూ. 10 వేలు జీతం, జాబ్ క్యాలెండర్ తదితర హామీలపై కళాకారులతో ప్రత్యేకంగా యాడ్లు చేయించి కూటమి నేతలు తమ అనుకూల ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీ డి యాల ద్వారా ప్రజల్లోకి వదిలారు. రాష్ట్ర బడ్జెట్ గు రించి క్షుణ్ణంగా తెలిసిన విజనరీ అన్నారు. సంపద సృష్టి తెలిసిన అనుభవశాలి అన్నారు. అధికారంలో కి వచ్చిన వెంటనే హామీలన్నీ అమలు చేస్తామంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలు, సంత కాలతో బాండ్ పేపర్లు పంచి జనాన్ని నమ్మించారు.నిలదీస్తూ.. ఎండగడుతూ..శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలను సీబీఐ కొట్టిపారేయడం, మాజీ సీఎం దివంగత వైఎస్సార్పైనా నిందలు మోపడాన్ని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సమర్థవంతంగా తిప్పికొట్టడం, సార్వత్రిక ఎన్నికల్లో రాత్రి ఎ నిమిది గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు లక్షల సంఖ్యలో ఓట్లు నమోదైనట్టు తాజాగా తెరపైకి రావడం తదితర కూటమి వంచన, వైఫల్యాలు, సమకాలిన ఆయా అంశాల్ని సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఎండగడుతున్నారు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటున్నారు.మిలియన్ల కొద్దీ వ్యూస్తిరుమల ఏడు కొండలు వేంకటేశ్వరస్వామివేనని, హిందూ ఆలయాల్లో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ 2007లో నాటి సీఎం వైఎస్సార్ ఇచ్చిన జీ ఓలు, టీడీపీ అధికారంలోకి వస్తే ఆ జీఓలను రద్దు చేస్తామన్న చంద్రబాబు వ్యాఖ్యలు, అలాగే వేంకటేశ్వస్వామి కోసం వైఎస్సార్ భక్తి ఛానల్ను ప్రారంభిస్తే అసెంబ్లీలో చంద్రబాబు దానిని వ్యతిరేకించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అన్ని తప్పులూ మీరు చేసి వైఎస్సార్సీపీ పై బురద జల్లుతున్నారంటూ దుమ్మెత్తి పోస్తున్నా రు. ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ తదితర సా మాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూటమి సర్కారు వైఫల్యాలు, వంచనపైనే రీల్స్ ట్రెండింగ్లో ఉన్నాయని చెప్పవచ్చు. సామాన్య ప్ర జానీకం వాటికి మద్దతుగా కామెంట్లు పెడుతూ నిరసన తెలుపుతుండటంతో మిలియన్ల కొద్దీ వ్యూస్, లైక్స్, షేర్స్తో షేక్ చేస్తున్నాయి.బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ హామీ ఇస్తూ కూటమి ప్రచారం చేసుకున్న యాడ్పై సైటెరికల్ రీల్ ఇది..సీన్ ఓపెన్ చేస్తే.. కల్లు కాంపౌండ్. అక్కడొక వ్యక్తి మాటల సందర్భంలో నీకు పింఛన్ వస్తుంది కదాని కల్లుగీత కార్మికుడిని ప్రశ్నిస్తాడు. పింఛన్ 60 ఏళ్లకు కదా? నాకు ఇప్పుడు 50 ఏళ్లని బదులిస్తాడు గీత కార్మికుడు. ఇంతలో అక్కడికి వచ్చిన గీత కార్మికుడి మనువడి దృష్టి కింద పడి ఉన్న ఒక పేపర్లోని యాడ్పై పడుతుంది. తన తాతయ్యకు ఆ యాడ్ చూపించి చదవమంటాడు మనువడు. నాకు చదవురాదు కదరా నువ్వే చదవమని చెప్పడంతో.. ‘50 ఏళ్లకే బీసీలకు పెన్షన్. నెలకు రూ.4 వేలు. చంద్రబాబు గారు గెలిస్తే తాతయ్యా’ అనడంతో... అక్కడున్న వారంతా మళ్లీ చదువంటూ ఎంతో ఆసక్తిగా అడుగుతారు. మళ్లీ మళ్లీ బాలుడితో ఆ హామీని ఆలకిస్తారు. ఇంకేం మనువడా ఆయన్నే గెలిపించుకుంటామంటూ అంతా ఆనందంతో మైమరిచిపోయి చప్పట్లు కొట్టడంతో యాడ్ ముగుస్తుంది.రీల్స్తో ఎండగడుతూ..సూపర్ సిక్స్ చూస్తే భయమేస్తోందంటూ చంద్రబాబు, ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రం అమ్మాలంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు, కల్తీ నెయ్యి వ్యవహరంపై పవన్కళ్యాణ్ పూటకోమాట.. ఇలా కూటమి నేతల ఊసరవెల్లి రాజకీయాలు, ఓట్లు కోసం ఎన్నికల ముందు వారు చేసిన విన్యాసాలు, నాటి పలుకులకు సంబంధించిన వీడియోలకు నెటిజన్లు తమ సృజనాత్మకత జోడిస్తున్నారు. సినిమాల్లోని హాస్య సన్నివేశాలకు సీఎం చంద్రబాబు, పవన్కల్యాణ్, లోకేష్ తదితర మంత్రులు, ఇతర నాయకులు చెప్పిన మాటలను వాయిస్ ఓవర్ జత చేస్తున్నారు. పోయాం.. మోసపోయాం, బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతీ ఏవంటూ క్యాప్షన్లతో వినూత్న రీతిలో రీల్స్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. -
కేసుల రాజీకి కృషి చేయాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జాతీయ లోక్అదాలత్లో కేసుల రాజీకి పోలీసులు కృషిచేయాలని మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్, పోక్సో కోర్టు ప్రత్యేక జడ్జి బి.లక్ష్మీనారాయణ అన్నారు. వచ్చేనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్పై గురువారం పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకున్నారు. ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడాలన్నారు. సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) ఎం.సుధారాణి, 1వ అదనపు జుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ పి.హనీష, 2వ అదనపు జుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ ఎన్.జ్యోతి, బెంచ్ కోర్టు మేజిస్ట్రేట్ నాగరాజు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మేకా శివ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
ఆహార పదార్థాల కల్తీని ఉపేక్షించం
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో కల్తీ ఆహార పదార్థాలను గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సీహెచ్ నాగరాణి హెచ్చరించారు. రెండు రోజులుగా కల్తీ పాలు, నెయ్యిలపై వస్తున్న వార్తల దృష్ట్యా జిల్లా విస్తృత తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లావ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లు,సిబ్బంది, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. భీమవరంలో మున్సిపల్ కమిషనర్, ఆహార భద్రత అధికారులు పాలు, నెయ్యి దుకాణాలను తనిఖీ చేశారు. పోలీస్ బొమ్మ సెంటర్లోని రిలయన్స్ షాపింగ్ మాల్ పక్క సందులోని నెయ్యి షాపులో నెయ్యి కల్తీ జరిగినట్టు భావించి వెన్న, నెయ్యి శాంపిల్స్ను ల్యాబ్కు పంపించారు. అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన వెన్నను సీజ్ చేశారు. వ్యాపారులు తప్పనిసరిగా మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్ పొందాలని కలెక్టర్ ఆదేశించారు. సోదాల్లో పట్టుబడిన వెన్నను పో లి ఉన్న పదార్థం మూటలను మున్సిపల్ కార్యాలయానికి తరలించగా కలెక్టర్ పరిశీలించారు. మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి, ఆర్డీఓ కె.ప్రవీణ్కుమార్రెడ్డి, కమిషనర్ కె.రామచంద్ర రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఎ.రాంబాబు, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి సుందర రామిరెడ్డి తదితరులు ఉన్నారు. -
భాషను గుర్తించేదే ఎల్ఎల్ఎం
నూజివీడు: లార్జ్ లాంగ్వేజ్ మోడల్(ఎల్ఎల్ఎం) అనేది ఒక అధునాతన కృత్రిమ మేధస్సు ప్రోగ్రామ్ అని, దీనివల్ల అనేక ఉపయోగాలున్నాయని గ్నోరెక్స్ లాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రహిమునిద్దీన్ పేర్కొన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో తెలుగుశాఖ ఆధ్వర్యంలో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనే అంశంపై నిర్వహిస్తున్న వర్క్షాప్ రెండో రోజైన గురువారం కొనసాగింది. దీనిలో పాల్గొన్న రహిమునిద్దీన్ మాట్లాడుతూ ఇది భాషలోని నమూనాలను గుర్తించి, సహజమైన వాక్యాలను రూపొందించే విధానాన్ని, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, వ్యాసాలు రాయడం, అనువాదం చేయడం, సారాంశం తయారు చేయడం వంటి పనులను ఎల్ఎల్ఎం చేస్తుందన్నారు. ఇవి విస్తృతశ్రేణి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని, వ్యాసాలు, ఇమెయిల్లు, కోడ్, సృజనాత్మక కథలు, పద్యాలు తదితరమైనవి రాస్తాయన్నారు. అంతేగాకుండా శిక్షణ పొందిన డేటా ఆధారంగా సమాచారాన్ని అందించడం, వచనాన్ని ఒక భాష నుంచి మరొక భాషలోకి మార్చడం, పొడవైన పత్రాలు లేదా కథనాలను చిన్న సారాంశాలుగా కుదించడం చేస్తాయన్నారు. ఈ పద్ధతిలోని డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్ సాంకేతికతలు విద్య, వైద్యం, వ్యాపారం, ప్రభుత్వ సేవలు వంటి అనేక రంగాల్లో ఉపయోగపడుతున్నాయన్నారు. అనంతరం ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎర్రా చిరంజీవి వర్చువల్గా స్పీచ్ టూ స్పీచ్ మెషీన్ ట్రాన్స్లేషన్ అనే అంశంపై మాట్లాడుతూ సాంకేతికత ద్వారా ఒక భాషలో మాట్లాడిన మాటలను మరో భాషలోకి మాటల రూపంలోనే మార్చవచ్చన్నారు. ఈ ప్రక్రియలో ఇది ముందుగా మాటను టెక్ట్స్గా మార్చి తరువాత అనువదించి మళ్లీ శబ్ధంగా మారుస్తుందన్నారు. దీనివల్ల ప్రయాణాలు, సమావేశాలు, అంతర్జాతీయ సంభాషణల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ముగింపు సందర్భంగా అతిథులను ట్రిపుల్ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ సన్మానించారు. ట్రిపుల్ ఐటీలో ముగిసిన వర్క్షాప్ -
ఆగి ఉన్న లారీని ఢీకొని పురోహితుడు మృతి
కై కలూరు, ఆకివీడు: రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని ఢీకొని పురోహితుడు మృతి చెందిన ఘటన ఆలపాడు కో–ఆపరేటీవ్ సమీపంలో గురువారం జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన గొర్తి శ్రీనివాసరావు(53) పౌరోహిత్యం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అతనికి భార్య, ఇరువురు కుమార్తెలు సంతానం. కై కలూరు మండలం గోపవరంలో ఓ గృహప్రవేశ కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి ఆకివీడు వెళుతుండగా ప్రమాదం జరిగింది. భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ శ్రీనివాసరావు మరణించాడు. భార్య దుర్గా విజయలక్ష్మి ఫిర్యాదుపై రూరల్ ఎస్సై వి.రాంబాబు కేసు నమోదు చేశారు. ఆయన మృతి పట్ల బ్రాహ్మణ సంఘం, స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు. ఏలూరు టౌన్: నకిలీ వైర్లు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు నగరంలోని ఓ ఎలక్ట్రికల్ దుకాణంపై దాడులు నిర్వహించి షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పవర్పేటలోని మహావీర్ ఎలక్ట్రికల్స్ పేరుతో విద్యుత్ సామగ్రి దుకాణాన్ని కుమార్జైన్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. ఈ షాపులో హావెల్స్ కంపెనీకి చెందిన వైర్లు నకిలీవి విక్రయిస్తున్నాడనే సమాచారంతో గురువారం ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్, సిబ్బందితో దుకాణంపై దాడి చేసి తనిఖీలు నిర్వహించారు. భారీగా హావెల్స్ కంపెనీ నకిలీ వైర్ల కట్టలను గుర్తించి షాపు యజమాని కుమార్జైన్ను అదుపులోకి తీసుకున్నారు. కామవరపుకోట : స్థానిక పోస్టాఫీస్ కార్యాలయంలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు పోస్టాఫీస్ తాళాలు పగలగొట్టి కార్యాలయంలో ఉన్న రికార్డులను చిందర వందర చేశారు. అంతేగాకుండా బీరువాలో ఉన్న ఖాళీ పాస్పుస్తకాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై గురువారం ఉదయం పోస్ట్ మాస్టర్ ఎం.మనోజ్ తడికలపూడి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై చెన్నారావు ఘటనా స్థలాన్ని పరిశలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
డయాలసిస్తో సతమతం
● జిల్లాలో పెరుగుతున్న కిడ్నీ వ్యాఽధిగ్రస్తులు ● చాలీచాలని డయాలసిస్ సెంటర్లు ఆకివీడు: మారిన జీవన శైలి, పాలు, నీళ్లు, ఆహార పదార్థాల్లో కల్లీ కారణంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు రోజురోజుకు పెరుగుతున్నారు. వారు నిరంతరం డయాలసిస్ చేయించుకుంటూ జీవనం గడపాల్సిన పరిస్థితి. డయాలసిస్ అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఇటు ఆరోగ్యంతోపాటు అటు ఆర్థిక ఇబ్బందులతో రోగుల కుటుంబాలు సతమతవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏడు ప్రభుత్వ డయాలసిస్ సెంటర్లు మూత్రపిండాలు సక్రమంగా పనిచేయనప్పుడు రక్తం నుంచి అదనపు ద్రవాలు, మలినాలు తొలగించేందుకు కృత్రిమంగా రక్తశుద్ధి చేసే ప్రకియే డయాలసిస్. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వ్యాధిగ్రస్తులు సుమారు 2 వేల మంది ఉంటే కేవలం ఏడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే డయాలసిస్ కేంద్రాలున్నాయి. ఏలూరు, కొవ్వలి, బుట్టాయిగూడెంతో పాటు ఆకివీడు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు ఏరియా ఆసుపత్రిలతో పాటు ప్రైవేటుగా మరో మూడు, నాలుగు డయాలసిస్ కేంద్రాలున్నాయి. వీటిలో సుమారుగా 60 డయాలసిస్ మిషన్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో మరో 40కి పైగా ఉన్నాయి. వీటితో పాటు విజయవాడ, గుంటూరు, అమరావతి, రాజమండ్రి, వైజాగ్ తదితర పెద్ద పట్టణాలకు వెళ్లి డయాలసిస్లు చేయించుకుంటున్నారు. కిడ్నీ మార్పిళ్లు కూడా చేయించుకుంటున్నారు. భయపెడుతున్న రాజమండ్రి కిడ్నీ కల్లోలం గత నాలుగు రోజులుగా రాజమండ్రిలో కిడ్నీ బాధితులు తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయిన ఘటనలు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. కల్తీ ఆహారం, పాలు, నీళ్లు, వాయు కాలుష్యాలతో ప్రజలు సతమతమవుతున్నా ప్రభుత్వం పట్టించుకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కిడ్నీ వ్యాఽధిగ్రస్తులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. పాలు, నీళ్లు వాయు కాలుష్యంతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. తనిఖీలు లేవు. డయాలసిస్ రోగులకు పూర్తి వైద్యం, మందులు ఉచితంగా అందజేయాలి. కిడ్నీ వ్యాధికి కారణాల్ని అన్వేషించి, నివారణ చర్యలు చేపట్టాలి. ఇటీవల రాజమండ్రిలో పాల కల్తీతో నలుగురు చనిపోయినా ప్రభుత్వం చలించలేదు. – బీ.బలరామ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, భీమవరం కిడ్నీ వ్యాఽధిగ్రస్తులకు ప్రభుత్వమే పూర్తి ఉచిత వైద్యం అందజేయాలి. ఆరోగ్య శ్రీ ద్వారా కిడ్నీ వ్యాధి గ్రస్తులకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి. డయాలసిస్ రోగుల కుటుంబ పోషణకు ఆర్థికంగా సహాయం అందజేయాలి. ప్రభుత్వం ఫించన్ను రూ.20 వేలకు పెంచాలి. ఆహారాల్లో కల్తీ అరికట్టాలి. కల్తీపై నిరంతరం తనిఖీలు నిర్వహించాలి. – పీవీఎల్ నర్శింహరాజు, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, ఉండి నా పేరు కింజరాపు శంకర్రావు. నా వయస్సు 36 సంవత్సరాలు. నాకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రెండు కిడ్నీలూ పాడైపోయాయన్నారు. ఒకటి మార్చాల్సి ఉందని, అప్పటి వరకూ డయాలసిస్ చేయించుకోమన్నారు. మూడేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటూనే ఉన్నాను. నా భార్యకు వచ్చే జీతంలో కొంత ఖర్చుచేస్తూ మందులు, ఫిల్టర్లు, బ్లడ్ కొనుగోలు చేస్తున్నాం. ప్రభుత్వం రూ. 10వేలు పింఛన్ ఇస్తుంది. భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నాను. ప్రయాణఖర్చులు, ఇతర ఖర్చులతో నెలకు రూ.20 వేల నుంచి 30 వేల వరకూ ఖర్చు అవుతుంది. తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బంబదులతో జీవనం గడుపుతున్నాను. కిడ్నీ రోగులకు ప్రభుత్వం రూ.20 వేలు ఫించన్ మంజూరు చేయాలి. అన్ని మందులు, డయాలసిస్ ఉచితంగా చేయించాలి. -
సొంత గూటికి ఎంపీటీసీ సత్యవతి
తాడేపల్లిగూడెం రూరల్ : మండలంలోని వీరంపాలెం, పట్టెంపాలెం గ్రామాల ఎంపీటీసీ సభ్యురాలు జంపెల్లి సత్యవతి గురువారం వైఎస్సార్సీపీలో చేరారు. పట్టెంపాలెంలో పెనుమత్స సూర్పరాజు నివాసంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వడ్డి రఘురాం ఆమెతో పాటు కుమారుడు అశోక్కు పార్టీ కండువా వేసి, స్వాగతించారు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన సత్యవతి గతంలో జనసేనలో చేరారు. అయితే, తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సత్యవతి మాట్లాడుతూ పార్టీపై ఉన్న విశ్వాసం, రఘురాం నాయకత్వంపై నమ్మకంతో తిరిగి పార్టీలోకి వచ్చినట్లు వివరించారు. పార్టీకి విధేయురాలిగా ఉంటూ ప్రజల సమస్యలు, గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తానన్నారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగురవేయడానికి కృషి చేస్తానన్నారు. ఆయా గ్రామాల పార్టీ కార్యకర్తలు మాకరాజు సతీష్, గంటి చిన సర్వేశ్వరరావు, పెనుమత్స సూర్పరాజు, ముప్పిడి రమేష్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అడపా వాసు తదితరులు పాల్గొన్నారు. వడ్డి రఘురాం ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరిక -
శ్రీవారి కొండపై రోడ్డు ప్రమాదం
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన జంటగోపురాల ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం. కాళ్ల మండలం వేంపాడు గ్రామానికి చెందిన అమిరపు సురేష్(46) కొందరు గ్రామస్తులతో కలసి మినీ ట్రావెల్ బస్సులో బుధవారం రాత్రి 8 గంటలకు వివాహ వేడుక నిమిత్తం క్షేత్రానికి విచ్చేశాడు. వివాహానంతరం గురువారం తెల్లవారుజాము 2.45 గంటలకు ఉండి మండలం చిలుకూరి గ్రామానికి చెందిన డ్రైవర్ గోడి ఏలియ బస్సును ఘటనా స్థలంలోని డౌన్లో పెట్టి, ఇంజన్ స్టార్ట్ చేసి, బస్సు దిగాడు. ఆ తరువాత బస్సు ముందు ఉన్న సురేష్తో మాట్లాడుతున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా బస్సు ముందుకు దూసుకొచ్చి, ముందు చక్రం సురేష్ మీద నుంచి వెళ్లింది. అనంతరం సెక్యురిటీ ఉండే మూవింగ్ క్యూలైన్ను ఢీకొట్టి బస్సు నిలిచిపోయింది. అయితే బస్సు కింద పడి తీవ్ర గాయాలు పాలైన సురేష్ను హుటాహుటీన స్థానికులు 108 ఆంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 15 మంది మహిళలు ఉన్నారు. బస్సు మూవింగ్ క్యూలైన్ను ఢీకొట్టి నిలవకపోయి ఉంటే, కొండ కిందకు దూసుకెళ్లి పెనుప్రమాదం జరిగేది. ఈ ఘటనపై మృతుడి తండ్రి సత్యన్నారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. బస్సు ఢీకొని వ్యక్తి మృతి -
పుష్కర ఏర్పాట్లపై దృష్టి పెట్టాలి
నరసాపురం: 2027 ఆగస్టులో జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి నరసాపురంలో చేయాల్సిన ఏర్పాట్లు, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్కుమార్రెడ్డి సూచించారు. పుష్కర ఏర్పాట్లకు సంబందించి బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాలు, పట్టణంలోని వశిష్ట గోదావరి వలంధర్రేవు ఘాట్ను గురువారం జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో సమీక్షించారు. గోదావరి పుష్కరాలకు రికార్డు స్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం నరసాపురంలో ఏర్పాట్లు, అభివృద్ధిపై దృష్టి పెట్టిందని చెప్పారు. పుష్కర ఘాట్లు ఎంతమేర అభివృద్ధి చేయాలి, కొత్తగా ఎన్నిచోట్ల రోడ్డు నిర్మాణాలు చేయాలన్న అంశాలపై నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట నరసాపురం ఆర్డీవో దాసి రాజు, మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి తదితరులు ఉన్నారు. తణుకు అర్బన్: తణుకు పట్టణ పోలీస్ స్టేషన్లో విధుల్లో ఉన్న ఇద్దరు ఏఎస్సైలను బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఏఎస్సై ఎం.రాజ్యలక్ష్మిని భీమవరం వన్టౌన్ పోలీస్స్టేషన్కు, ఏఎస్సై పి.సత్యనారాయణను మొగల్తూరు పోలీస్ స్టేషన్కు పంపించారు. ఇటీవల తణుకు పట్టణ పోలీస్స్టేషన్లో నిర్వహించిన ఏసీబీ దాడుల అనంతరం దిద్దుబాటు చర్యల్లో భాగంగా చాలా కాలంగా ఒకే ప్రాంతంలో ఉంటున్న వారిపై ఉన్నతాధికారులు దృష్టిసారించి బదిలీ వేటు వేస్తున్నట్లుగా పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. తణుకు అర్బన్ : తణుకు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న వల్లూరి పండుబాబు అలియాస్ పండు అనే రౌడీషీటర్పై పీడీ యాక్ట్ ప్రయోగించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు తణుకు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు తెలిపారు. సత్ప్రవర్తనతో మెలగాలని పోలీసు అధికారులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ పండు తన నేర ప్రవృత్తిని కొనసాగిస్తూ పోలీసు ఆదేశాలను ధిక్కరిస్తూ గత కొంతకాలంగా హింసాత్మక దాడులు, బెదిరింపులు, దోపిడీలు, సెటిల్మెంట్లు, హత్యాయత్నాలు వటి పలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. దీంతో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాలతో ముందస్తు నేర నియంత్రణలో భాగంగా అతడిని నిర్భంధించి పీడీ యాక్ట్ పెట్టినట్లు వివరించారు. పెంటసాడు: వివాహిత ఆత్మహత్య కేసులో భర్త, అత్తమామలను పోలీసులు అరెస్ట్ చేశారు. మండలంలోని కొండేపాడుకు చెందిన బిట్రా పోశిరత్నం (21) ఇటీవల ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతికి అత్తివారింటి సభ్యులే కారకులుగా పేర్కొంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం పోశిరత్నం భర్త బిట్రా వినేష్తో పాటు, మావ బిట్రా శ్రీను, అత్త లక్ష్మిలను డీఎస్పీ విశ్వనాథ్ సమక్షంలో అరెస్ట్ చేసి కోర్టుకు పంపగా కోర్టు రిమాండ్ విధించినట్లు ఎస్సై చినస్వామి తెలిపారు. నిందితులను తణుకు సబ్జైలుకు తరలించినట్లు ఎస్సై చెప్పారు. పెంటపాడు: ఓ వ్యక్తిని కులంపేరుతో దూషించారన్న ఫిర్యాదు మేరకు నలుగురిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై స్వామి తెలిపారు. అలంపురం గ్రామంలోని ఎస్సీపేటలో గంజి అనిల్కుమార్ అనే వ్యక్తిని నూనె సుగుణ, గుణ్ణం సుందరి, పుట్టా వరలక్ష్మి, పుట్టా హరిశ్ఛంద్రరావు అనే వ్యక్తులు కులంపేరుతో దుర్భాషలాడి దూషించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
చోరీ కేసుల్లో ఆరుగురి అరెస్ట్
● నిందితుల్లో ముగ్గురు మైనర్లు ● చోరీ సొత్తు స్వాధీనం జంగారెడ్డిగూడెం : మూడు వేర్వేరు చోరీ కేసులకు సంబంధించి నిందితులు ఆరుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో ఏఎస్పీ సుస్మిత రామనాథన్ వివరాలు వెల్లడించారు. ఈనెల 21న ముగ్గురు వ్యక్తులు ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నక్కల వెంకటేశ్వర్లును బుట్టాయగూడెం రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతానికి రప్పించి అతని వద్ద ఉన్న బంగారు ఉంగరాలు, బ్రాస్లెట్లు లాక్కొని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై ఎన్వీ ప్రసాద్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులు ఉండి మండలం చెరుకువాడకు చెందిన ఈడ వెంకటపవన్సాయి, మరో ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి చోరీ సొత్తుతోపాటు నేరానికి వినియోగించిన మోటార్సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తు విలువ రూ. 3.50 లక్షలు ఉంటుందని ఏఎస్పీ తెలిపారు. నిందితుల్లో ఈడ వెంకట్పవన్సాయిని న్యాయస్థానంలో, ఇద్దరు మైనర్లను జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరచనున్నట్లు ఏఎస్పీ చెప్పారు. మరో రెండు కేసుల్లో... ఈనెల 23న అర్ధరాత్రి సీతానగరం ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రం తాళాలు పగుగొట్టి అందులోని ఎల్ఈడీ టీవీ చోరీ చేశారు. అలాగే ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి పట్టణంలోని శాలిపేట సెంటర్లో ఒక దుకాణం షట్టర్ తాళాలు పగులగొట్టి, షాపులోని రూ.18వేలు నగదు చోరీ చేసి, దుకాణంలో ఉన్న సీసీ కెమేరాను ధ్వంసం చేశారు. ఈ రెండు కేసుల్లో నిందితులుగా జంగారెడ్డిగూడెం డాంగేనగర్కు చెందిన తాడేపల్లి చిట్టిబాబు, బుట్టాయగూడెం రోడ్ విరోధుల వారి వీధికి చెందిన షేక్ శంకర్, మైనర్ బాలుడిని గుర్తించి స్థానిక మార్కెట్యార్డు సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చోరీ సొత్తు రూ. 16,500, ఎల్ఈడీ టీవీని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇద్దరిని కోర్టులో హాజరుపరచగా, మైనర్ను జువైనెల్ జస్టీస్ బోర్డు ముందు హాజరు పరుస్తామని ఏఎస్పీ తెలిపారు. కాగా, ఈ కేసును చేధించిన ఏఎస్సై ఎన్వీ సంపత్కుమార్, పీసీలు ఎన్.రమేస్, షేక్ షాన్బాబులను ఏఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై ఎన్వీప్రసాద్ పాల్గొన్నారు. -
ప్రగడవరం అమ్మాయి.. జర్మనీ అబ్బాయి
ఏలూరు జిల్లా: ప్రేమకు భాషా భేదం, ఖండాంతరాలు అడ్డుకాదని నిరూపించింది ఈ ప్రేమజంట. ప్రగడవరం అమ్మాయి, జర్మనీ అబ్బాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన జల్లిపల్లి సత్యనారాయణ, కృష్ణకుమారి దంపతుల కుమార్తె ప్రవల్లిక జర్మనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. అక్కడ బుక్స్బాక్ నగరానికి చెందిన థామస్ ఛాకర్ట్, యుట్టా చాకర్ట్ కుమారుడు యల్మర్తో ప్రేమలో పడ్డారు. ఇరువురి తల్లిదండ్రుల అంగీకారంతో తెలుగు సంప్రదాయం ప్రకారం మంగళగిరిలో బుధవారం వీరి వివాహం జరిగింది. జర్మనీ నుంచి వచ్చిన యల్మర్ బంధువులు మన దేశ ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలను చూసి ముగ్ధులయ్యారు. వివాహానికి వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి, మండల అధ్యక్షుడు ఎస్.రమేష్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. -
భాషాశాస్త్రంపై వర్క్షాప్ ప్రారంభం
నూజివీడు : ట్రిపుల్ఐటీలో తెలుగుశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల వర్క్షాప్ బుధవారం ప్రారంభమైంది. ‘లింగ్విస్టిక్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్’ అనే అంశంపై నిర్వహించిన వర్క్షాప్లో పలు అంశాలపై సమగ్రంగా చర్చ నిర్వహించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ తెలుగుశాఖ ఆచార్యులు దేవారెడ్డి విజయలక్ష్మి మాట్లాడుతూ భాషాశాస్త్రాన్ని పరిచయం చేశారు. హెడెల్బర్గ్ విశ్వవిద్యాలయ ఆచార్యులు తొట్టెంపూడి గణేష్ ఆన్లైన్ ద్వారా మాట్లాడుతూ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి పెద్ద పరిమాణంలో పాఠ్య డేటాతో శిక్షణ పొందిన ఆధునిక కృత్రిమ మేధస్సు మోడళ్లని, ఇవి మనుషుల భాషను అర్థం చేసుకుని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, కథలు రాయడం, అనువాదం చేయడం వంటి పనులు చేయగలవని వివరించారు. సామాజిక మేలుకోసం ఈ టెక్నాలజీని విద్య, ఆరోగ్య సమాచారం, రైతులకు సూచనలు, ప్రభుత్వ సేవలలో ఉపయోగించవచ్చన్నారు. ఈ రంగంలో నైపుణ్యం సాధించిన వారికి డేటా సైంటిస్ట్, ఏఐ ఇంజనీర్, ఎన్ఎల్పీ (నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్) స్పెషలిస్ట్, మెషిన్ లెర్నింగ్ డెవలపర్ వంటి విభాగాల్లో దేశీయంగా, అంతర్జాతీయంగా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. వర్క్షాప్ కన్వీనర్, తెలుగు శాఖాధిపతి ఉడుము ఝాన్సీ సదస్సు లక్ష్యాలను, ఉద్దేశాలను, ఉపయోగాలను తెలిపారు. అకడమిక్ డీన్ సాదు చిరంజీవి, వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా..
భీమడోలు: దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ వృద్ధుడిని వ్యాన్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ దుర్ఘటన బుధవారం జాతీయ రహదారి భీమడోలు వద్ద చోటు చేసుకుంది. భీమడోలు పంచాయతీ పరిధిలోని సూర్యారావుపేటకు చెందిన యర్రంశెట్టి నాగేశ్వరరావు(65) ఎంఎంపురం గ్రామంలో శ్రీపాండురంగ స్వామి వార్ల ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవానికి బుధవారం ఉదయం వెళ్లాడు. అక్కడ స్వామి వార్లను దర్శించుకుని తిరుగుపయనంలో పూళ్లలో బస్ ఎక్కి భీమడోలు వద్ద దిగాడు. రోడ్డు దాటుతుండగా తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వైపుగా వెళ్తున్న వ్యాన్ అతివేగంగా వచ్చి ఆతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమారుడు యర్రంశెట్టి నాగశ్రీనివాస్ ఫిర్యాదు మేరకు భీమడోలు ఎస్సై ఎస్కే మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెద మందు పిచికారీ చేస్తూ ప్రమాదం
నరసాపురం రూరల్: ఇంటికి రంగులు వేసే క్రమంలో జరిగిన ఒక దురదృష్టకర ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మొగల్తూరు పంచాయతీ పరిధిలోని కుక్కలవారి తోటలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన వనం రాజేష్ తన ఇంటికి రంగులు వేయిస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న చెద పురుగుల నివారణ కోసం చెదమందు (క్రిమి సంహారక మందు) తో పాటు టర్పంటైన్ ఆయిల్ను కలిపి ఒక ప్లాస్టిక్ క్యాన్ ద్వారా పిచికారీ చేస్తున్నారు. ఆ సమయంలో ఊహించని విధంగా స్ప్రేయర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి మంటలు చెలరేగి వనం రాజేష్తో పాటు అతనికి వరుసకు సోదరుడైన వనం సత్యనారాయణరావులకు శరీరమంతా తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెనువెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను వెంటనే నరసాపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే గాయాలు బలంగా ఉండటంతో, మెరుగైన చికిత్స నిమిత్తం వారిని భీమవరంలోని మరొక ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం బాధితులు అక్కడ చికిత్స పొందుతున్నారు. -
మత్స్య సాగులో.. మరణ మృదంగం
● ఆక్వా చెరువులపై పాటించని జాగ్రత్తలు ● విద్యుత్ తీగలు, మోటార్లు, గన్పౌడర్ పేలి ప్రమాదాలు ● పిట్టల్లా రాలిపోతున్న కూలీలు కై కలూరు: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఆక్వారంగం రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలుస్తోంది. కాసుల సంపాదనలో అక్షయపాత్రగా పేరొందిన ఈ రంగాన్ని నమ్ముకుని లక్షలాది మంది జీవిస్తున్నారు. పొట్టకూటి కోసం పలు రాష్ట్రాల నుంచి వలస కూలీలు చేపల, రొయ్యల చెరువులపై కుటుంబాలతో సహా నివసిస్తున్నారు. యజమానుల నిర్లక్ష్యం, కూలీల అవగాహన లోపంతో విద్యుత్ తీగలు తగలి కొందరు, మోటర్లలో చిక్కుకుని మరికొందరూ, చెరువులపై వాలే పిట్టలను నాటు తుపాకితో బెదిరించే క్రమంలో గన్పౌడర్ పేలి ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇటువంటి మరణాలు ఇటీవల పెరిగాయి. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా సాగు 5.75 లక్షల ఎకరాల్లో ఉంది. ఇందులో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో చేపల సాగు 1.80 లక్షలు, రొయ్యల సాగు 1.10 లక్షలు వెరసి 2.90 లక్షల ఎకరాల్లో సాగువుతోంది. ఇక ఆక్వా విద్యుత్ సర్వీసులు విషయానికి వస్తే ఏలూరు జిల్లాలో 4,759, పశ్చిమగోదావరిలో 16,374 వెరసి 17,124 ఉన్నాయి. ఆక్వా చెరువు గట్లపై విద్యుత్ తీగలను మోటర్లకు అమర్చడానికి కింద అమర్చుతున్నారు. గట్టుపై గడ్డి కోసే క్రమంలో కొడవళ్లకు తీగలు తగిలి, కూలీలు, ప్రజలు మరణిస్తున్నారు. ఇటీవల మహాశివరాత్రి రోజున కలిదిండి మండలం పడమటిపాలెంలో రొయ్యల సాగు ఫ్యాన్ సెట్ రాడ్లో చిక్కుకుని తల్లీకూతురు అక్కడికక్కడే మరణించడం కలిచివేసింది. కూలీలు పిట్టల్లా రాలిపోతున్నారు కొల్లేరు సమీప గ్రామాల్లో చేపల, రొయ్యల చెరువులపై రోజువారీ పనిచేయడానికి స్థానిక కూలీల కొరత ఉంది. పైగా అధిక అడ్వాన్సులు చెల్లించాల్సి వస్తోంది. ఇటువంటి తరుణంలో ఒడిశా, ఆసోం, గుజరాత్, వెస్ట్ బెంగాళ్, నేపాల్ నుంచి ఆక్వా చెరువులపై పనిచేయడానికి వలస కూలీలు వస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం వీరి సంఖ్య 30 వేల పైనే ఉంటుందని అంచనా. చెరువుపై నివాసం ఉండే వ్యక్తికి నెలకు రూ.15 వేలు, అదే కుటుంబానికి రూ.20 వేలు అందించి గృహవసతితో పాటు సమస్తం చెరువు యజమాని భరిస్తున్నాడు. కొత్తగా వచ్చిన కూలీలకు అవగాహన లేక యంత్రాలు, విద్యుత్ తీగలు తగలి మరణిస్తున్నారు. కొల్లేరుకు గన్పౌడర్ తయారీ కల్చర్ ఆక్వా సాగు చెరువుల్లో చిన్న చేపలను కొల్లేరు పక్షులు తినేస్తాయి. దీనిని నివారించడానికి నెల్లూరు, తమిళనాడుల నుంచి నొక్కలొళ్లు అనే తెగకు చెందిన కుటుంబాలు కొల్లేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరి వద్ద పిట్టలను బెదిరించడానికి నాటు తుపాకీలు ఉంటాయి. గన్పౌడర్ తయారు చేసే క్రమంలో అవి పేలి అనేక మంది చేపల చెరువు గట్లుపై మృత్యువాత పడుతున్నారు. గతేడాది ఏకంగా భైరవపట్నం గుడారాల్లో గన్పౌడర్ పేలి అనేక మంది మృత్యువాతపడ్డారు. విద్యుత్ తీగలు, మోటర్లు, గన్పౌడర్ తయారీ క్రమంలో మరణించిన ఘటనలు అనేకం పోలీసు స్టేషన్లకు చేరడం లేదు. యజమానులు ప్రాణాలకు ఖరీదు కట్టి సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఆక్వా సాగు కొందరికి కాసులు కురిపిస్తుంటే.. ఈ రంగాన్ని నమ్ముకుని ఉపాఽధి కోసం వచ్చిన కూలీలు మాత్రం ప్రమాదవశాత్తూ మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. ఆక్వా చెరువులపై కనీస జాగ్రత్తలు పాటించకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలకు అవగాహన లేకపోవడంతో మత్స్యసాగు మరణ మృదంగం మోగిస్తోంది. -
యాజమాన్య పద్ధతులతో మామిడిలో అధిక దిగుబడులు
నూజివీడు: రైతులు యాజమాన్య పద్ధతులను అవలంభించడం ద్వారానే మామిడిలో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించొచ్చని మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్త కే రాధారాణి పేర్కొన్నారు. మండలంలోని సుంకొల్లు, సిద్ధార్ధనగర్లలోని మామిడి తోటలను ఉద్యాన అధికారి ఆర్ హేమతో కలిసి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రాధారాణి మాట్లాడుతూ మామిడి పూత పిందె కట్టి నిలవడానికి, పిందెలు బఠానీ సైజు ఉన్నప్పుడు 15 నుంచి 20 రోజుల వ్యవధిలో నీటి తడులు ఇవ్వాలన్నారు. కాయ పెరిగే దశలో 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. పిందే రాలడాన్ని నివారించడానికి నాఫ్తలిన్ ఎసిటిక్ యాసిడ్ 20 పీపీఎం 20 మిల్లీ గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. తేనెమంచు పురుగు నివారణ ఇలా.. అజాడిరిక్టన్ 3000 పీపీఎం రెండు మిల్లీలీటర్ నీటికి, బుప్రోపెజన్ 25ఎస్సీ ఒక ఎంఎల్ లీటరు నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్ఎల్ 0.3 మిలీ లేదా థయామిథాగ్జామ్ 25 శాతం డబ్ల్యూజీ 0.3 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. తామర పురుగుల నివారణకు.. నీలిరంగు జిగురు అట్టలు 40 నుంచి 50 చొప్పున తోటల్లో ఏర్పాటు చేసుకోవాలి. వేప నూనె మూడు వేల పీపీఎం 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొంగామియ సోప్ 7.5 గ్రా, లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎసిఫేట్ 75 ఎస్పీ 1.5 గ్రా లేదా పిప్రోనిల్ 5ఎస్సీ 2 మి లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు నివారణకు.. నీటిలో కరిగే గంధకం మూడు గ్రాములు లేదా హెక్సాకోనజోల్ 2 మి లీ లేదా అజాక్సిస్ట్రోబిన్ 1 మిల్లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి పక్షి కన్ను తెగులు నివారణకు.. 3 గ్రా కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా కార్బన్డిజం 1 గ్రా+ మాంకోజెబ్ 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మసి మంగు నివారణకు ఎమామెట్టిన్ బెంజయెట్ 0.4 గ్రా లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకులపై మసిని తొలగించుటకు రెండు కిలోల గంజిపొడిని గోరువెచ్చని నీటిలో మూడు లేదా నాలుగు లీటర్లు కలిపి ఉడికించి తరువాత మిగతా నీరు పోసి వంద లీటర్ల గంజి ద్రావణం తయారుచేసి తెగులు కనిపించిన భాగాలపై ఎండ బాగా ఉన్న రోజుల్లో పిచికారీ చేయాలి. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి ఆర్ హేమ, రైతులు, రైతు సేవా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. -
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి
నరసాపురం రూరల్ : చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు ప్రమాదవశాత్తూ నీటిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. మండలంలోని వెస్ట్కుక్కిలేరులో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వేములదీవి పడమర గ్రామానికి చెందిన బొమ్మిడి యేసుబాబు (53) మత్స్యకారుడు. బుధవారం ఉదయం యథావిధిగా వెస్ట్కుక్కిలేరులో చేపల వేట కోసం వెళ్లిన అతడు ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న తహసీల్దార్ ఐతం వీరవెంకట సత్యనారాయణ, ఆర్ఐ సురేఖ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నరసాపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ముదినేపల్లి రూరల్: ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తూ చెరువులో పడిన బాలుడు మునిగిపోయి మృతి చెందిన ఘటన మండలంలోని గురజలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గురజకు చెందిన దినేష్ కృష్ణవేణి తమిళనాడుకు చెందిన దినేష్ బాలన్తో నాలుగేళ్ల కిందట వివాహం కాగా వీరికి దినేష్ నితీష్ అనే రెండున్నర సంవత్సరాల వయస్సున్న కుమారుడున్నాడు. కృష్ణవేణి కుమారుడిని చిన్నప్పటి నుంచి గురజలోని తల్లి లుక్కా వీరమ్మ వద్దనే ఉంచింది. నితీష్ చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరగడంతో స్థానిక పిల్లలతో మమేకమై ఆడుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఉదయం ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తూ పక్కనే ఉన్న చెరువులో పడి మునిగి మృతి చెందాడు. తల్లి కృష్ణవేణి ఫిర్యాదు మేరకు హెడ్కానిస్టేబుల్ పి ప్రదీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బుట్టాయగూడెం : మండలంలోని దొరమామిడి సమీపంలో ఉన్న గుబ్బల మంగమ్మతల్లి జల్లేరు జలాశయం, చింతలగూడెం సమీపంలో ఉన్న పోగొండ రిజర్వాయర్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి బి.రాజ్కుమార్ మాట్లాడుతూ జల్లేరు జలాశయంలో 48 వేలు, పోగొండ రిజర్వాయర్లో లక్షా 20 వేల చేప పిల్లలను విడుదల చేశామన్నారు. ఎంపీపీ తెల్లం రమణ, ఏఎంసీ వైస్ చైర్మన్ కొండేపాటి రామకృష్ణ, అలివేరు సర్పంచ్ కారం లక్ష్మి, మంగయ్యపాలెం సర్పంచ్ మాల్చి వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
పెనుగొండ ఎంపీడీవో పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి
పెనుగొండ: పెనుగొండ ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి పనితీరుపై కలెక్టర్ చదలవాడ నాగరాణి అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల వ్యాప్తంగా జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పురోగతిపై సమీక్షించారు. సర్వే నత్త నడకన సాగడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం జేశారు. రెండు రోజుల్లో టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తణుకులో నూతనంగా ఏర్పాటు చేయబోతున్న వన్స్టాప్ సెంటర్ లో కాంట్రాక్ట్ పద్దతిపై పని చేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మహిళా,శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి డి.శ్రీలక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ –1, కేసు వర్కర్ – 2, పారా లీగల్ పర్సనల్/లాయర్ –1, పారా మెడికల్ పర్సనల్ – 1, సైకో సోషల్ కౌన్సెలర్–1, కంప్యూటరు పరిజ్ఞానం ఉన్న ఆఫీసు అసిస్టెంట్–1, మల్టీ పర్పస్ స్టాఫ్/కుక్ – 3, సెక్యూరిటీ గార్డ్/ నైట్ గార్డ్ –3 పోస్టులు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులు జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి కార్యాలయంలో మార్చి 7న సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలని కోరారు. బుట్టాయగూడెం: బుట్టాయగూడెం తహసీల్దార్ పీవీ చలపతిపై వీఆర్వోలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమను కులం పేరుతో దూషిస్తున్నారని, అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని అంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీఆర్వోలు మాట్లాడుతూ మహిళా వీఆర్వోలు సంతకాల కోసం తహసీల్దార్ రూంకు వెళ్తే గంటల తరబడి నిలబెట్టి సంతకం పెట్టకుండా అసభ్యకర పదజాలంతో తిడుతున్నారని తెలిపారు. కోయ వాళ్లకు ఏం పని రాదు వీళ్లను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలంటూ కులం పేరుతో తిడుతూ అవమానిస్తున్నారని చెప్పారు. తహసీల్దార్పై చర్యలు తీసుకుని నాయ్యం చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు (ఆర్ఆర్పేట): త్వరలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా తెరపైకి తీసుకువచ్చిన ఇన్విజిలేషన్ ఆటోమేషన్ విధానాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని ఏపీటీఎఫ్ 1938 జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యర్శులు ఈ. రామ్మోహన్, జీ. మోహన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇన్విజిలేషన్ ఆటోమేషన్ కారణంగా పరీక్షల నిర్వహణలో అధిక పరిపాలన కేంద్రీకరణ చోటుచేసుకుని, అనవసర గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఇది ఉపాధ్యాయుల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, తల్లిదండ్రులలో పరీక్షల నిర్వహణపై అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు. ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో సిగరెట్ మాఫియా యథేచ్ఛగా పేట్రేగిపోతుందని ఈ మాఫియాను తక్షణం ప్రభుత్వం అరికట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ ముందు నుంచి కృత్రిమ కొరత సృష్టించి, అధిక రేట్లకు విక్రయిస్తూ వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతున్నారని విమర్శించారు. రూ.170 ఉన్న పెట్టె రూ.250 అమ్ముతూ రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతున్న మాఫియాను అరికట్టాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
కూటమి కనికుట్టు
మహిళల స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా కుట్టుమెషీన్లు అందించనున్నట్టు గతంలో ప్రచారం చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ఈ పథకం కింద శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలు వాటి కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. కుట్టుమెషీన్లు ఎప్పుడు వస్తాయంటూ..? కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షి, భీమవరం: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పన పేరిట కూటమి ప్రభుత్వం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గతేడాది ఉచిత కుట్టుశిక్షణ కార్యక్రమం చేపట్టిన విషయం విదితమే. శిక్షణ అనంతరం మహిళలకు కుట్టుమెషీన్లు అందజేస్తామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి 3,486, ఏలూరు నుంచి 3,259 మంది కలిపి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6,745 మందిని ఎంపిక చేశారు. వీరిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలు 4,516 మంది, బ్రాహ్మణ సామాజిక వర్గం 28 మంది, కమ్మ 211, కాపు 1,711, రెడ్డి 86, ఆర్యవైశ్య 87, క్షత్రియ 50, ఈబీసీ 56 మంది మహిళలు ఉన్నారు. మెషీన్లు కోసం ఎదురుచూపులు శిక్షణ పొందిన వారికి కుట్టుమెషీన్లు అందజేయాల్సి ఉంది. ఆరు నెలలు కావస్తున్నా కుట్టుమెషీన్లు పంపిణీ చేయలేదు. వ్యయ ప్రయాసల కోర్చి కేంద్రాలకు చేరుకుని శిక్షణ పొందిన మహిళలు ఇళ్ల వద్ద ఖాళీగా ఎదురు చూడాల్సి వస్తోంది. కుట్టుమెషీన్లు ఎప్పుడు వస్తాయంటూ కొందరు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా మరికొందరు కలెక్టరేట్ల వద్ద జరిగే పీజీఆర్ఎస్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఎన్నో కష్టాల నష్టాల కోర్చి కేంద్రాలకు చేరుకుని శిక్షణ తీసుకున్నామని, నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు కుట్టు మెషీన్లు అందజేయలేదని మహిళలు చెబుతున్నారు. కాగా శిక్షణ పూర్తయ్యిందని, ఏజెన్సీల నుంచి కుట్టుమెషీన్లు వచ్చాక మెషీన్లు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. శిక్షణ నిమిత్తం ఒక్కొక్కరికి రూ.15,599 చొప్పున రూ.10.52 కోట్లు, కుట్టుమెషీన్కు రూ.6,199లు చొప్పున రూ.4.18 కోట్లు లెక్కలు కట్టారు. మొత్తంగా ఒక్కొక్కరికి రూ.21,798లు చొప్పున రూ.14.7 కోట్లు వ్యయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. శిక్షణ నుంచి మెషీన్లు పంపిణీ వరకు మొత్తం కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం మూడు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. కేంద్రానికి 144 మంది చొప్పున భీమవరం, ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం తదితర ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 50 వరకు కేంద్రాలను ఏర్పాటుచేశారు. రోజుకు రెండు బ్యాచ్లుగా మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చారు. గత మే నెల నుంచి సెప్టెంబరు వరకు విడతలుగా శిక్షణ కార్యక్రమం సాగింది. మహిళలకు సంబంధించిన జాకెట్లు, చిన్నపిల్లల గౌన్స్, జుబ్బాలు తదితర వాటిలో శిక్షణ ఇచ్చారు. అందుకు అవసరమైన దారాలు, క్లాత్, ఇతర మెటీరియల్ బాద్యత మహిళలదే. నిర్వాహకులు కేవలం శిక్షణ మాత్రమే ఇస్తారు. శిక్షణ నిమిత్తం బయట రూ.7 వేల నుంచి రూ.10 వేలలోపు ఉంటే ఏజెన్సీలకు భారీ మొత్తంలో కట్టబెట్టారన్న విమర్శలున్నాయి. ‘బాబు’ గారడీ జాడలేని కుట్టుమెషీన్లు శిక్షణ పూర్తయి ఆరు నెలలు ఇప్పటికీ అందజేయని మెషీన్లు ఉమ్మడి జిల్లాలో 6,745 మంది ఎంపిక కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు -
రైల్వే ప్రాజెక్టులకు మొండిచేయి
● ముందుకు సాగని కోటిపల్లి–నరసాపురం లైన్ పనులు ● నరసాపురం–మచిలీపట్నం కొత్త లైన్ కల నెరవేరేనా ? నరసాపురం: జిల్లాకు సంబంధిచి నరసాపురం–కోటిపల్లి రైల్వే లైన్, నరసాపురం–మచిలీపట్నం కొత్త రైల్వే లైన్ నిర్మాణం ప్రాజెక్ట్లకు ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో మొండి చేయి మిలిగింది. బడ్టెట్ ప్రవేశపెట్టి దాదాపు నెలరోజులు కావస్తున్నా.. అసలు జిల్లాలో రైల్వే ప్రాజెక్ట్లకు కేటాయింపులు ఏమైనా చేశారా? అన్న అంశంపై రైల్వే శాఖ నుంచి ఇంతవరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నరసాపురం రైల్వే ప్రాజెక్ట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని ఎదురు చూస్తున్నారు. నరసాపురం కోడలు నిర్మలాసీతారామన్ కీలక రైల్వే ప్రాజెక్ట్ల విషయంలో కరుణ చూపించకపోవడంతో నిరాశ చెందుతున్నారు. సాగని నరసాపురం–కోటిపల్లి పనులు కీలకమైన నరసాపురం–కోటిపల్లి రైల్వే లైన్ పనులు ముందుకు సాగడం లేదు. ప్రతీ బడ్జెట్లో కొంత మేర నిధులు కేటాయిస్తున్నప్పటికీ పెద్దగా కదలిక లేదు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేయడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటా సొమ్ములు విడుదల కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. స్థల సేకరణ పూర్తి కాలేదు. గోదావరిపై మూడుచోట్ల వంతెన పనులు మొదలు కావడం ఒక్కటే పురోగతి. ఈ రైల్వేలైన్ కోసం దాదాపు 200 ఎకరాల భూమి సేకరించాలి. తొలి దశలో 158.55 ఎకరాలు సేకరించారు. తూర్పుగోదావరి జిల్లాలో భట్లపాలెం, కామనగరువు ప్రాంతాలు అమలాపురం మండలంలో భట్నవిల్లి, రోళ్లపాలెం, భట్లపాలెం, పేరూరు పరిధిలో ప్రాంతాల్లో 60 శాతం స్థల సేకరణ జరిగింది. ఈ ప్రాంతాల్లో మిగిలిన 40 శాతంతో పాటు పశ్చిమగోదావరి జిల్లాలోని యలమంచిలి, నరసాపురం ప్రాంతాల్లో భూసేకరణ ఇంకా పూర్తి కాలేదు. ఇంతవరకూ సేకరించిన భూమిలో బాధితులకు పూర్తిస్థాయిలో ఇంకా నష్టపరిహారం చెల్లించలేదు. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఎంపీల కృషితో కేంద్రం ప్రతి బడ్జెట్లో నిధులు కేటాయించింది. ఈ బడ్జెట్లో కేటాయింపులు లేవు. రూ.2,800 కోట్ల అంచనాతో ఈ భారీ ప్రాజెక్ట్కు సంబంధించి గోదావరిపై మూడు పాయల వద్ద వంతెన నిర్మాణం జరుగుతోంది. వంతెన నిర్మాణాలకు రూ.700 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి టెండర్లు పిలిచి మూడేళ్ల్ల క్రితం ప్రారంభించారు. ఇంతవరకూ నిధుల్లో ఎక్కువ మొత్తం వంతెనలకే సరిపోయింది. 2001లో రూ.800 కోట్ల అంచనాతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ వ్యయం ప్రస్తుతం రూ.2,800 కోట్లకు చేరింది. బ్రిటిష్ హయాం నుంచి నరసాపురం నుంచి ట్రాక్ను మచిలీపట్నం వరకూ పొడిగించాలని ప్రతిపాదన ఉంది. నరసాపురం, మచిలీపట్నం సముద్ర తీర పట్టణాలు కావడం, జలరవాణా ప్రధానంగా ఉండే ఆ రోజుల్లో వీటిని కలపాలని భావించారు. అయితే రెండేళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడంలేదు. కోటిపల్లి టు నరసాపురం రైల్వేలైన్ నిర్మాణం పూర్తయితే అటు కోనసీమ నుంచి ఇటు కోస్తాకు రైల్వే ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. మరోవైపు నరసాపురం–మచిలీపట్నం రైల్వే లైన్ నిర్మాణం కూడా సాగితే మొత్తం గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు జిల్లాలకు అనుసంధానంగా నాలుగు వైపుల నుంచి అతిపెద్ద రైల్వే రవాణా వ్యవస్థ ఏర్పడుతుంది. సముద్ర తీర ప్రాంతాలకు అనుసంధానంగా రైల్వే వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఇంత ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాజెక్టుల జాప్యంతో గోదావరి జిల్లాలో అన్ని పార్లమెంట్ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమి ఎంపీలు నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
స్వర్ణకారుల ఆకలి కేకలు
● కార్పొరేట్ దుకాణాలతో తగ్గిన గిరాకీ ● బంగారం ధరలు పెరగడంతో పూర్తిగా దిగజారిన ఉపాధి ● ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న స్వర్ణకారులు ఏలూరు (ఆర్ఆర్పేట): ఒకప్పుడు తాళిబొట్టు చేయాలంటే విశ్వకర్మ వంశస్థుల దగ్గరికి వెళ్ళేవారు. వారు వధూవరుల నక్షత్రాలు చూసి వారికి సరిపడే తారాబలం చూసి ముహూర్తం పెట్టి మంగళ సూత్రాలు చేసేవాళ్ళు. ఇప్పుడు కార్పొరేట్ బంగారు దుకాణాలకు వెళ్లి కొంటున్నారు. పెద్ద కంపెనీల బంగారు దుకాణాలకు జనాభా క్యూ కడుతున్నారు. రెడీమేడ్గా యంత్రాలతో తయారైన ఆభరణాలు ఆకర్షణీయంగా ఉండడంతో ప్రజలు వాటిపట్ల ఆకర్షితులవుతున్నారని స్వర్ణకారులు చెబుతున్నారు. కార్పొరేట్ దుకాణాల ప్రాబల్యం పెరగడంతో స్వర్ణకారుల జీవితాలు ఒడిదుడుకులకు లోనయ్యాయని అంటున్నారు. పూర్తిగా తగ్గిన ఉపాధి : ప్రస్తుత మార్కెట్లో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం కాసు ధర రూ. 1.15 లక్షలు పలుకుతోంది. ఏడాది క్రితం వరకూ బంగారం ధరలు పెరిగినా వారానికో 15 రోజులకో రూ.100 నుంచి రూ. 200 మధ్యలో పెరిగేది. ఇప్పుడు రోజూ రూ.1000 వరకూ పెరుగుతుండడంతో సామాన్యులు బంగారం వైపు కన్నెత్తి చూసే ఆలోచన కూడా చేయలేకపోతున్నారు. దీంతో ఆభరణాలు చేయించుకోలేక మిన్నకుండిపోతున్నారు. ఈ కారణంగా స్వర్ణకార వృత్తిలో ఉన్న వారికి చేతి నిండా పనే లేకుండా పోయింది. ఆభరణాల తయారీ మాత్రమే తెలిసిన స్వర్ణకారులు వేరే వృత్తిలోకి వెళ్ళలేక పోతున్నారు. దీంతో వారి కుటుంబాల్లో ఆకలి కేకలు వేయక తప్పడం లేదు. కుటుంబ పోషణ నిమిత్తం కొంతమంది స్వర్ణకారులు ఏదో ఒక దుకాణంలో సహాయకుడిగా పని చేస్తున్నారు. మరికొంత మంది బ్యాంకుల్లో అప్రైజర్లుగా పని చేసుకుంటున్నారు. గతంలో బ్యాంకు అప్రైజర్లకు వయో పరిమితి ఉండేది కాదు. ప్రస్తుతం బ్యాంకుల్లో అప్రైజర్లుగా పని చేసే వారికి సైతం 60 ఏళ్ళకే పదవీ విరమణ నిబంధన అమలు చేస్తూ ఉండడంతో వారికీ ఆదాయ మార్గాలు మూసుకుపోతున్నాయి. గతంలో 1500 స్వర్ణకారుల కుటుంబాలు గతంలో జిల్లాలో స్వర్ణకార వృత్తిలో దాదాపు 1500 కుటుంబాల ఉండేవి. ఆభరణాలు తయారు చేయడంలో నైపుణ్యం కలిగిన ఆ కుటుంబాలకు మారిన పరిస్థితుల కారణంగా, కార్పొరేట్ దుకాణాల వల్ల వృత్తిని వదిలి వెళ్ళక తప్పడంలేదు. ఈ మేరకు నిపుణులైన ఎంతో మంది స్వర్ణకారులు ఇప్పటికే వృత్తికి దూరమయ్యారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కేవలం 150 –200 మధ్య మాత్రమే వృత్తి కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. భవిష్యత్లో బంగారు ఆభరణాలు స్థానికంగా తయారు చేసే వారే కరువైపోతారనడంలో సందేహమే లేదని, అదే పరిస్థితి వస్తే కార్పొరేట్ వ్యాపారులదే రాజ్యంగా ఉంటుందంటున్నారు. బంగార ఆభరణాల ధరలకు రెక్కలు రావడంతో పాటు నాణ్యత కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందంటున్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి ఒకటికి బదులుగా ఒకరోజు ముందుగానే ఫిబ్రవరి 28న పింఛన్లను అందజేస్తామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మార్చి 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 26 నుంచి వీఆర్వోలకు ఆరోగ్య పరీక్షలు భీమవరం (ప్రకాశంచౌక్): ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి తణుకుతో పాటు తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, భీమవరం ఏరియా ఆస్పత్రుల్లో ఫిబ్రవరి 26 నుంచి మార్చి 25 వరకు షెడ్యూల్ ప్రకారం వీఆర్వోలు, వీఆర్ఏలకు నిర్వహించనున్న ఆరోగ్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకు తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల వారికి తాడేపల్లిగూడెం హాస్పటల్లో, తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాలకు తణుకు ప్రభుత్వ జిల్లా హాస్పటల్లో, ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు నరసాపురం, మొగల్తూరు, యలమంచిలి మండలాలకు సంబంధించి నరసాపురం ప్రభుత్వ ఏరియా హాస్పటల్లో, పెనుగొండ, పెనుమంట్ర, ఆచంట, పోడూరు, పాలకొల్లు మండలాలకు సంబంధించి పాలకొల్లు ఏరియా ఆస్పత్రిలో పరీక్షలు చేస్తారన్నారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 25 వరకు భీమవరం, పాలకోడేరు, వీరవాసరం, ఆకివీడు, కాళ్ల, ఉండి, గణపవరం మండలాలకు సంబంధించి భీమవరం ఏరియా హాస్పిటల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. బంగారం ధరలు విపరీతంగా పెరగడం, కార్పొరేట్ దుకాణాల తాకిడి కారణంగా స్వర్ణకారులు ఉపాధికి దూరమైపోయారు. చేనేత కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను స్వర్ణకారులకూ అమలు చేయాలి. స్వర్ణకార దుకాణాలకు పూర్తి ఉచిత కరెంటు ఇవ్వాలి. స్వర్ణకార కుటుంబంలో ఆడపిల్ల వివాహానికి రూ.2 లక్షలు ఆర్థిక సహాయం చేయాలి. 50 సంవత్సరాలు నిండిన స్వర్ణకారుడికి రూ.6 వేలు పెన్షన్ ఇవ్వాలి. – లక్కోజు రాజగోపాలాచారి, కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా స్వర్ణకార సంఘం స్వర్ణకారులకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేయాలి. ప్రతి జిల్లా కేంద్రంలో స్వర్ణకార క్లస్టర్స్ ఏర్పాటు చేయాలి. ప్రతి మున్సిపల్ పట్టణంలో మున్సిపాల్టీకి సంబంధించిన షాపుల్లో స్వర్ణకారులకి షాపులు కేటాయించాలి. స్వర్ణకారులకు పోలీస్ వేధింపులు లేకుండా ఓల్డ్ జీవో మార్పు చేసి అమలు చేయాలి. హెచ్యూడీ హాల్ మార్క్ సింగిల్ నగలకే పర్మిషన్ స్వర్ణకాడికి ఇవ్వాలి. బ్యాంకు అప్రైజర్ ఉద్యోగాలు విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులకే కేటాయించాలి. – బొద్దూరి నాగభూషణం, అధ్యక్షుడు, ఏలూరు నగర స్వర్ణకార సంఘం -
ఆందోళన కలిగిస్తున్న గర్భస్రావాలు
మండలిలో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ తణుకు అర్బన్: ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రభుత్వా సుపత్రుల్లో జరుగుతున్న గర్భస్రావాలు ఆందోళన రేపుతున్నాయని, వాటిపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. బుధవారం శాసనమండలిలో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. 5 మండలాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత 9 నెలల కాలంలో 281 గర్భస్రావాలు జరిగాయని ఇది చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి నిజంగా అబార్షన్ జరిగిందా లేదా.. ప్రభుత్వం ఇస్తున్న లక్ష్యాలను పూర్తి చేయలేక ఫాల్స్ అబార్షన్ రికార్డ్ చేస్తున్నారా అనే విషయాన్ని పరిశోధించాలని కోరారు. నిజంగా అబార్షన్లు జరిగితే అందుకు కారణాలను గుర్తించి గర్భిణి మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, పోషక ఆహారం, సప్లిమెంటరీ మందులు సకాలంలో అందించాలని విజ్ఞప్తి చేశారు. బుట్టాయ గూడెం, పోలవరం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఎంఎస్ఎంఈ విభాగంలో ఎస్సీ వర్గాలకు గత ఏడాది ఇన్సెంటివ్స్ సక్రమ విధానంలో ఇవ్వలేదని, అనుకూల వర్గాలకు మాత్రమే ఇన్సెంటివ్స్ ఇచ్చారని, షెడ్యూల్డు కులాలు, చిన్న పరిశ్రమలు పెట్టుకున్నవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. -
టీడీపీ నేతలకు చేదు అనుభవం
కొయ్యలగూడెం: నేవీ ఆయుధ డిపో నిర్మాణంపై చర్చల కోసం వచ్చిన టీడీపీ నేతలకు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గ టీడీపీ నేతలు బోడిగూడెం, మంగపతిదేవిపేట గ్రామాలకు వెళ్లగా నేతలు వస్తున్న సమాచారంతో గ్రామస్తులు రోడ్డుపైకి చేరుకొని వారి వాహనాలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో నాయకులు తమ వాహనాలు దిగి గ్రామస్తులను సర్ది చెప్పడానికి ప్రయత్నించగా మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటూ తమ నోటి దగ్గర జీవనాధారం లాక్కోవాలని చూస్తే ప్రాణత్యాగానికై నా వెనుకాడమని హెచ్చరించారు. తమని విభజించి లోబరుచుకోవడానికి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలని లేని పక్షంలో మున్ముందు నాయకులను ఏ కారణం చేత కూడా గ్రామాలలో తిరగనివ్వమని పేర్కొన్నారు. కూటమి నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఇప్పటికే 60 శాతానికి పైగా రైతులు నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి సముఖత వ్యక్తం చేస్తూ ఆమోద పత్రాలు అందజేశారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సైతం అధికార పార్టీ కోసం రైతులను పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. దీంతో నాయకులు చర్చలు నిర్వహించకుండానే వెనుదిరిగారు. -
కౌలుకోలేని దెబ్బతీశారు
అసలు రైతుల మాదిరి కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 20 వేలు పెట్టుబడి సాయం, ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తాం, పంట రుణాలు, ఇతర సదుపాయాలు వర్తింపచేస్తామంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటి ఊసే మరిచింది. హామీలకు ఎగనామం పెట్టి వారి నడ్డి విరిచింది. దగాపడ్డ కౌలు రైతులు ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. జిల్లా కేంద్రం భీమవరంలో రెండు రోజుల పాటు నిరసన దీక్షలు నిర్వహించారు. కౌలు రైతు పోరుబాట అధికారంలోకి వస్తే కౌలు రైతులను అన్ని విధాల ఆదుకుంటామని ఎన్నికల్లో చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు కౌలు రైతులకు చేసిందేమీ లేదు. ప్రభుత్వ సాయం అందక కౌలు రైతులు రుణ ఊబిలో కూరుకుపోతున్నారు. అవి చేస్తాం, ఇవి చేస్తామని చెప్పి కౌలు రైతులను వంచించారు. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు తక్షణం ఆర్ధికసాయం అందించి ఆదుకోవాలి. – ఉందుర్తి శ్రీనివాసరావు, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను ఏవిధంగానూ ఆదుకోవడం లేదు. తక్షణం పెట్టుబడి సాయం కింద కౌలు రైతులకు రూ.20 వేలు అందజేయాలి. ఈ సీజన్కు సంబంధించి రెండు విడతల సొమ్ము జమచేయాలి. పంట నష్టపరిహారంతో పాటు, యజమానులకు సంబంధం లేకుండా ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీచేయాలి. – రామాంజనేయులు, కౌలురైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సాక్షి, భీమవరం: జిల్లాలో వరి పండించే రైతులు 3.5 లక్షల వరకు ఉండగా 1.5 లక్షల మంది వరకు కౌలు రైతులు ఉంటారని అంచనా. సాగులో కష్టం వస్తే మొదటిగా కుదేలయ్యేది కౌలు రైతులే. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టడం, వచ్చిన దానిలో పొలం యజమానికి మిగతా చెల్లించగా వారికి మిగిలేది అంతంతమాత్రమే. పంట తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాలు పంటకు నష్టం కలిగిస్తే అప్పుల ఊబిలో కూరుకుపోయేది కౌలు రైతులే. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం కౌలు రైతులకు గుర్తింపు కార్డుల జారీని తగ్గించేశారు. జిల్లాలో 1.05 లక్షల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా కేవలం 72,259 మందికి మాత్రమే జారీచేశారు. కూటమి దగా కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ సాయం, ఇన్ఫుట్ సబ్సిడీ అందిస్తామంటూ ఎన్నికల్లో పదేపదే చెప్పిన కూటమి అధికారంలోకి వచ్చాక అన్నదాత సుఖీభవ పథకం పోర్టల్లో కౌలు రైతులు దరఖాస్తు చేసుకునే ఆప్షన్ లేకుండా చేసింది. గుర్తింపు కార్డులు పొందిన వారికి రెండో దఫాలో సాయం అందిస్తారని కూటమి నేతలు చెప్పుకొచ్చారు. మొదటి దఫాతో కలిపి ఒక్కో కౌలు రైతుకు రూ.10 వేల చొప్పున సాయం అందాల్సి ఉంది. రెండో విడతలోనూ చంద్రబాబు సర్కారు కౌలురైతులకు ఎగనామం పెట్టి వారి ఆశలపై నీళ్లు చల్లింది. మరోపక్క తొలకరిలో వచ్చిన మోంథా తుఫానుతో జిల్లాలోని 9201 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. వీరిలో 70 శాతానికి పైగా కౌలు రైతులే ఉంటారని అంచనా. కౌలు రైతులకు జగన్ సర్కారు కొండంత అండగా నిలిచింది. అసలు రైతుల మాదిరి రైతు భరోసా, పంటల బీమా పరిహారం, తదితర అన్ని ప్రయోజనాలను అందించింది. భూ యజమానుల్లో అపోహలు తొలగించి కౌలు రైతు గుర్తింపు కార్డులను గణనీయంగా పెంచింది. 2023–24 సీజన్లో జిల్లాలో 84,185 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ లక్ష్యానికి గాను 89,589 కార్డులు జారీచేశారు. జగన్ పాలనలో లక్ష్యానికి మించి కార్డులు జారీ చేస్తే కూటమి పాలనలో కార్డుల సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. పెట్టుబడి సాయానికి ఎగనామం కూటమి మోసంపై కౌలు రైతుల మండిపాటు పెట్టుబడి సాయం, పంట నష్ట పరిహారం అందించాలని డిమాండ్ జిల్లా కేంద్రంలో రెండు రోజులు నిరసన దీక్ష జిల్లాలో 72,259 మంది కౌలురైతులు చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ కౌలు రైతులు పోరుబాట పట్టారు. పెట్టుబడి సాయం విడుదల చేయాలని, పంట నష్టపరిహారం ఇవ్వాలని, భూ యజమానులతో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీచేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీటి సాధన కోసం ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో రెండు రోజుల పాటు నిరసన దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు భీమవరంలోని ప్రకాశం చౌక్ సెంటర్ వద్ద సోమ, మంగళవారాల్లో రెండు రోజులు పాటు రిలే దీక్షలు నిర్వహించారు. వీరి దీక్షలకు ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, అంబేడ్కర్ ఆశయ సాధన కమిటీ, తదితర సంఘాల నేతలు కౌలు రైతులకు మద్దతు తెలిపారు. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీచేయాలని ఆయా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం రిలే దీక్షల ముగింపు అనంతరం కలెక్టరేట్కు చేరుకుని అధికారులకు వినతిపత్రం అందజేశారు. -
జోరుగా క్రికెట్ బెట్టింగ్లు
● చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు ● లాడ్జిలు, ప్రత్యేక భవనాల్లో గుట్టుగా నిర్వహిస్తున్న వైనం తణుకు అర్బన్: టీ 20 వరల్డ్ కప్ క్రికెట్ ఫీవర్ క్రీడాభిమానులను ఉత్సాహపరుస్తుంటే.. క్రికెట్ బెట్టింగ్ బుకీలకు మాత్రం రూ.కోట్లు తెచ్చిపెడుతోంది. తణుకుకు పట్టణానికి చెందిన ఒక రాజకీయ నేత కుమారుడు క్రికెట్ బెట్టింగ్లో నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తణుకులో అప్పటిటలో సంచలనం రేకెత్తించింది. పైడిపర్రు గ్రామానికి చెందిన ఒక ఏసీ మెకానిక్ సైతం బెట్టింగ్ల మత్తులో అప్పుల పాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రకమైన బెట్టింగ్ ఇబ్బందులు కొన్ని మాత్రమే వెలుగులోకి రాగా మరెన్నో వ్యవహారాలు బయటకు రావడం లేదు. పందెంరాయుళ్లు అమాయకులను బెట్టింగ్ రొంపిలోకి దింపి రూ.కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. బంతి బంతికి బెట్టింగ్ చేస్తూ యువతను బెట్టింగ్లోకి దింపి వారి జీవితాలను నాశనం చేసేస్తున్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు వినియోగిస్తూ బుకీలు ఆన్లైన్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. సిక్స్ కొడితే ఇంత, ఫోర్ కొడితే ఇంత, వికెట్ పడితే ఇంత అంటూ ఫిక్స్ చేసి నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నా పోలీసు అధికారులు పట్టించుకోకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం టీ 20 వరల్డ్కప్ జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం జోరుగా నడుస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు ప్రాంతాల్లో లాడ్జిలు, ప్రత్యేక భవనాల్లో క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న బుకీల దందాలో అగ్రశ్రేణి జట్లు ఆడుతున్న రోజుల్లో సుమారుగా రూ.6 కోట్లకుపైగా చేతులు మారుతున్నాయని తెలుస్తోంది. బుకీలు యువతను రెచ్చగొడుతూ వారి మానసిక గమనాన్ని సైతం పక్కదారి పట్టిస్తూ కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. జిల్లాలోని అన్ని పట్టణాల్లో ప్రస్తుతం క్రికెట్ ఫీవర్తో బెట్టింగ్లు నడుస్తుండగా తణుకు పట్టణంతోపాటు పైడిపర్రు కేంద్రంగా ఈ బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయని గ్రామస్తులే చెబుతున్నారు. ఇళ్లు గుల్ల : బెట్టింగ్ వ్యవహారంలో కొడుకు చదువులు, కుమార్తెల వివాహాల కోసం కూడబెట్టిన సొమ్మును సైతం క్రికెట్ బెట్టింగ్లోకి తరలించే పరిస్థితులు నెలకొన్నాయి. యువత చెడు మార్గంలోకి వెళ్లి తమ ఇళ్లు గుల్ల చేసుకోవడంతో మహిళల పుస్తెలు కూడా పందేల్లో ఫణంగా పెడుతున్న తీరు కలచివేస్తోంది. ముఖ్యంగా ఈజీ మనీకి అలవాటుపడిన యువత క్రికెట్ బుకీల వలలో పడి తమ ఇళ్లు, వాకిలి అమ్మినా తీరని అప్పుల్లో కుటుంబాన్ని ముంచేస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చివరకు ఆత్మహత్యల బారిన పడుతున్నారు. క్రికెట్ బుకీల వ్యవహారంపై పోలీసు అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వేతనాలు పెంచే వరకు ఉద్యమం ఆగదు
భీమవరం (ప్రకాశంచౌక్): వేతనాలు పెంచే వరకు ఉద్యమం ఆగదు అని ప్రాజెక్టు కార్యాలయాల వద్ద అంగన్వాడీ హెల్పర్లు ఆందోళన చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అంగన్వాడీ హెల్పర్లు ఆందోళనలో పాల్గొన్నారు. కేవలం రూ.7 వేలతో కుటుంబాలను ఎట్లా నెట్టుకొచ్చేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా నాయకుడు ఎం. ఆంజనేయులు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు వికసిత ఆంధ్రప్రదేశ్కు చాలా దూరంలో ఉన్నాయని అన్నారు. అధికారం కోసం వాగ్దానాలు చేసిన కూటమి ప్రభుత్వం కేంద్ర పాలకులు, పెట్టుబడిదారుల అడుగులకు మడుగులొత్తుతున్నారని అన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే మరింత ఉధృతంగా పోరాటం కొనసాగుతుందని అన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నుంచి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జి.ప్రకాశం మాట్లాడుతూ పాఠశాల విద్యారంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష తప్పనిసరి అనే నిబంధన సరికాదన్నారు. రెండు సంవత్సరాల లోపు పాస్ కానిచో ఉపాధ్యాయ ఉద్యోగ అర్హత కోల్పోతారని, పదోన్నతి రాదని వారిని ఇబ్బందులు గురి చేయడం వారి అనుభవానికి ఇబ్బందిగా ఉందన్నారు. సదరు ఉపాధ్యాయుల సీనియార్టీని, అనుభవాన్ని పరిగణలో తీసుకుని టెట్ నోటిఫికేషన్కి ముందు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని, పార్లమెంటులో చట్ట సవరణ చేయాలని ఎంపీని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ సీహెచ్ సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు కండిపోయిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తణుకు అర్బన్: రాష్ట్రంలో 12 డిపోల ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ బాధ్యతలు పినాకిల్ సంస్థకు అప్పగించడం, 4 డిపోల షెడ్యూల్స్తో పాటు సిబ్బందిని వేరే డిపోలకు బదిలీ చేసే కార్యక్రమం మొదలు పెట్టిన విధానాన్ని నేషనల్ మజ్దూర్ యూనిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం తణుకు డిపోలోని యూనిటీ సభ్యులు మొదటి సర్వీస్ నుంచి ఎరుపు రంగు బ్యాడ్జీలు ధరించి, గేట్ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో యూనిటీ కార్యదర్శి బయ్య వెంకట సుబ్బారావు, అధ్యక్షులు సరిదే ఏసుబాబు, పాల్గొన్నారు. తణుకు అర్బన్: సమస్యల పరిష్కారం నిమిత్తం గత 9 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న సహకార ఉద్యోగులను పట్టించుకోపోవడం సిగ్గు చేటని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ.ప్రతాప్, సహకార ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు సీహెచ్ వెంకటేశ్వరరావు విమర్శించారు. మంగళవారం స్థానిక కోర్టు వద్ద 9వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా రోడ్డు మీద పడుకొని దండం పెడుతూ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ప్రతాప్, వెంకటేశ్వరరావు, ఐలు జిల్లా కార్యదర్శి కామన మునిస్వామి మాట్లాడుతూ సహకార సంఘ సమస్యలు పరిష్కారం వల్ల ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడదని స్పష్టం చేశారు. తక్షణమే సమస్యలపై చర్చలు జరపాలని లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. -
నేర నియంత్రణే లక్ష్యం
ఎస్పీ అద్నాన్ నయీం అస్మి భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే ధ్యేయంగా పనిచేయాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయం నుంచి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా స్థాయి నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించాలని, సిబ్బంది కేటాయింపులు కార్యాలయ నిర్వహణలో పారదర్శకత ఉండాలని ఆదేశించారు. అత్యవసర సేవా స్పందన సమయాన్ని మరింత తగ్గించాలని, కేసుల దర్యాప్తులో సాక్ష్యాధారాల సేకరణ, సమన్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో గోప్యతను కాపాడటంతో పాటు, మార్చి 14న జరగనున్న లోక్ అదాలత్ ద్వారా గరిష్ట స్థాయిలో కేసులను పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు రఘువీర్ విష్ణు, డి.విశ్వనాథ్, జి.శ్రీ వేద పాల్గొన్నారు. -
మేకా శేషుబాబుపై సస్పెన్షన్ ఎత్తివేత
పాలకొల్లు సెంట్రల్: మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబుపై వైఎస్సార్సీపీ సస్పెన్షన్ ఎత్తివేసింది. గతంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబుపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ప్రకటించింది. పాలకోడేరు: శృంగవృక్షం హైస్కూల్లో 7 వ తరగతి చదువుతున్న తన కుమార్తె పట్ల లైబ్రరీ టీచర్ డేవిడ్ రాజు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్కూల్ ప్రధానోపాధ్యాయుడికి, విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె స్కూల్కు వెళ్ళటానికి భయపడుతుంటే గట్టిగా అడిగామని, డేవిడ్ రాజు సెల్ ఫోన్లో అసభ్యకర వీడియోలు చూపిస్తూ లైంగికంగా వేధిస్తున్నాడని తమ కూతురు తెలిపిందన్నారు. ఈ విషయం ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకు వెళ్ళినా ఎలాంటి చర్య తీసుకోకుండా, టీచర్కు సపోర్ట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. -
డాలర్ల పంట.. కలతే రైతు కంట
డాలర్ల పంటగా రైతుల ఇంట సిరులు కురిపించిన ఆక్వా సాగు సంక్షోభంలో చిక్కుకుంది. ప్రభుత్వం నుంచి కరువైన ప్రోత్సాహం, వైరస్ల దాడి, సీడ్, ఫీడ్ ధరలకు రెక్కలు వెరసి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడంతో పాటు ‘పశి్చమ’కు పెట్టింది పేరైన ఆక్వా పంట నిండా ఒడిదుడుకులతో సాగుతోంది. సమస్యల పరిష్కారం కోసం రైతులు ఉద్యమ బాట పట్టినా, పంట విరామం ప్రకటించినా కూటమి ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.భీమవరం (ప్రకాశం చౌక్): పశ్చిమగోదావరి జిల్లాలో 2.30 లక్షల ఎకరాల్లో దాదాపు 10 వేల మంది రైతులు వనామీ రొయ్య సాగు చేస్తున్నారు. ఎకరాకు పంటకు సుమారు రూ.4.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. నాసిరకం సీడ్తో దిగుబడి తగ్గడం, మార్కెట్లో మే తలు, మందుల ధరలు పెరగడం, ప్రభుత్వం నుంచి విద్యుత్ సబ్సిడీ అందకపోవడంతో కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. కొన్నిసార్లు రైతులు అప్పులపాలవుతున్న దుస్థితి. విద్యుత్ సబ్సిడీపై నిర్లక్ష్యం ఆక్వా రైతులకు చంద్రబాబు ప్రభుత్వం కనీసం విద్యుత్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. ఎన్నికల్లో అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా కనీసం విద్యుత్ సబ్సిడీ ఊసెత్తడం లేదు. దీనికితోడు సర్చార్జీల పేరుతో మరింత భారం మోపింది. ఉదాహరణకు.. ఆక్వా చెరువుకు 40 హెచ్పీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉంటే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు బిల్లు రాగా.. ప్రస్తుతం విద్యుత్ సబ్సిడీ లేకపోవడంతో చార్జీలు పెరిగి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు బిల్లులు వస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్యుత్ యూనిట్ను రూ.1.50కు అందించేవారని, చంద్రబాబు ప్రభుత్వం అలానే సరఫరా చేయాలని మొరపెట్టుకుంటున్నారు. ధరల మోత ఆక్వా మేతల తయారీకి సంబంధించి ముడి సరుకుల ధరలు తగ్గినా మేత ధరలను మాత్రం కంపెనీలు తగ్గించడం లేదు. దీనికి తోడు టన్నుకు రూ.4 వేల వరకు ధరలు పెంచి విక్రయిస్తున్నారు. ధ రలను నియంత్రించాల్సిన కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కలెక్టర్కు మొర ఏడాదిలో రెండుసార్లు ఆక్వా రైతులు తమ సమస్యలపై కలెక్టర్ను కలిసి మొరపెట్టుకున్నారు. గతంలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వినతిపత్రం అందజేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇటీవల మరోసారి జిల్లాలోని రై తులంతా భారీ ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకుని విన తిపత్రం అందించారు. ఇప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోతే నెల రోజుల్లో తమ కార్యాచరణ రూ పొందించుకుని సమస్యలపై పోరాటానికి దిగు తామని ఆక్వా సంఘ నాయకులు తెలిపారు.ఎన్నడూ లేని సంక్షోభం నేను 11 ఎకరాల్లో ఆక్వా సా గు చేస్తున్నాను. ఇటువంటి ఆక్వా సంక్షోభం ఎన్నడూ చూడలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం కనీ సం విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం లేదు. ఇది ఇస్తే కొంతైనా కో లుకుంటాం. ఫీడ్ ధరల తగ్గించాలి గతంలో ముడిసరుకుల ధరలు తగ్గినా కిలోకు రూ.20 తగ్గించాల్సి ఉన్నా తగ్గించలేదు. ప్రస్తుతం ఫిష్ మీల్ ధర పెరిగిన నేపథ్యంలో మళ్లీ ధరలు పెంచడం అన్యాయం. –తంగెళ్లబాబు, ఆక్వా రైతు నాసిరకం సీడ్తో నష్టం నాణ్యత లేని సీడ్ వల్ల ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం ఈహెచ్పీ ఉన్న తల్లి రొయ్యల నుంచి సీడ్ దిగుమతి కావడంతో ఎక్కువ నష్టం జరుగుతోంది. సీఏఏ అధికారి ద్వారా సరైన పర్యవేక్షణ లేకపోవడం కారణంగా కనిపిస్తోంది. ఆక్వా సాగు బాగుండాలంటే మంచి సీడ్ లభించాలి. ఆక్వా రైతులు సమస్యలపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని సాగుకు అన్నిరకాలుగా ప్రోత్సాహం అందించాలి. –మరిడి వెంకటేశ్వరరావు, ఆక్వా రైతురైతుల డిమాండ్లు ⇒ ఆక్వా జోన్, నా–ఆక్వా జోన్ అనే భేదం లేకుండా అందరికీ షరతులు లేకుండా యూనిట్ వి ద్యుత్ను రూ.1.50కే సబ్సిడీపై అందించాలి. ⇒ ఆక్వా ఫీడ్ ధరలను కంపెనీలు ఈనెల 4న టన్నుకు రూ.4 వేల మేరకు పెంచాయి. గతంలో ముడి సరుకుల ధరలు తగ్గినా మేత ధరలు కిలోకు రూ.20 తగ్గించలేదు. దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ⇒ అమెరికా సుంకాల పేరుతో రొయ్యల ధరలను కిలోకు రూ.70 వరకు తగ్గించారు. ఆ తర్వాత సుంకం తగ్గినా రొయ్యల ధరలను మాత్రం పెంచలేదు. ⇒ ఫీడ్ ప్లాంట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు కలిసి సిండికేట్గా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. ⇒ దేశంలో రొయ్యల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. దేశీయ మార్కెట్ బలోపేతం చేయాలి. ⇒ ప్రస్తుతం ఈహెచ్పీ ఉన్న తల్లి రొయ్యల నుంచి సీడ్ దిగుమతి కావడంతో రైతులు నష్టపోతున్నారు. సీఏఏ అధికారి ద్వారా సరైన పర్యవేక్షణ లేకపోవడం సమస్యను పెంచుతోంది. చెన్నై నుంచి రాష్ట్రానికి వచ్చే సీడ్పై కఠిన నియంత్రణ విధించాలి. ⇒ రైతులు, ఫీడ్ ప్లాంట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, హేచరీ యజమానులు అందరూ ప్రభుత్వ చట్టాలకు లోబడి పనిచేయాలి. ఈ మేరకు ప్రభుత్వం పారదర్శక వ్యవస్థను తీసుకురావాలి. -
మామిడిపై నల్ల తామర దాడి
● ప్రతికూల వాతావరణంతో నష్టం ● మాడిపోయిన మామిడి పూత నూజివీడు: ఈ ఏడాది మామిడి తోటల్లో 90 శాతం తోటలు పూతతో కళకళలాడాయి. దీంతో దిగుబడి బాగుంటుందని, కష్టాలు తీరతాయని మామిడి రైతులు భావించారు. ఇంతలోనే నల్ల తామరకు, ప్రతికూల వాతావరణం తోడవడంతో వచ్చిన పూతంతా మాడిపోయింది. దీంతో మామిడిపై పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలైనట్లేనని రైతన్నలు లబోదిబోమంటున్నారు. నూజివీడు డివిజన్లో ప్రధాన వాణిజ్య పంటగా మామిడి దశాబ్దాలుగా సాగు చేస్తున్నారు. నూజివీడు రసాలన్నా.. సువర్ణరేఖ.. బంగినపల్లి అన్నా దేశ విదేశాల్లో ఎంతో ప్రసిద్ధి. అలాంటి మామిడి పరిస్థితి రానురాను దయనీయంగా తయారవుతోంది. గత రెండేళ్లుగా కాపు లేకపోవడం.. ఈ ఏడాది పూత పెద్ద ఎత్తున రావడంతో మామిడి ఆదుకుంటుందనే గంపెడాశతో ఉన్న రైతులను నల్లతామర, ప్రతికూల వాతావరణం నట్టేట ముంచింది. నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, చింతలపూడి, లింగపాలెం మండలాల్లో దాదాపు 40 వేల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ఈ మామిడి తోటల్లో డిసెంబరు నుంచి పూతలు ప్రారంభమై, జనవరిలో గణనీయంగా రావడంతో రైతులు ఆనందపడ్డారు. బంగినపల్లి, తోతాపురి, రసాలు, సువర్ణరేఖ, తియ్యమామిడి తదితర అన్ని రకాల్లో పూతలు ముమ్మరంగా వచ్చాయి. ఫిబ్రవరి 2 నుంచి మామిడి తోటలపై తామర పురుగు దాడి చేయడం, ఉదయం 9 గంటల వరకు మంచు పడటంతో వచ్చిన పూతలో దాదాపు 70 శాతం పూత నిలువునా మాడిపోయింది. ఒక్కొక్క రైతు పూత వచ్చిన దగ్గర నుంచి పూత నిలుపుకోవడం కోసం 10 నుంచి 12 సార్లు రసాయన మందులు పిచికారీ చేసినప్పటికీ చివరలో తామర పురుగు ఆశించడంతో చేసిన ప్రయత్నమంతా వృథా అయింది. రైతుల ఆశలు అడియాశలయ్యాయి. కనిపించని పిందె కట్టు డివిజన్లోని మొత్తం విస్తీర్ణంలో 90 శాతం తోటల్లో ఈ ఏడాది పూతలు వచ్చాయి. మామిడి అనేది ఒక ఏడాది కాస్తే, మరో ఏడాది కాపు తక్కువగా ఉంటుంది. తామర పురుగు ఆశించడం, ప్రతికూల వాతావరణంతో పూత కాడలకు, పూమొగ్గలకు ఆశించి అందులోని రసాన్నంతా పీల్చేయడంతో పూతంతా మాడిపోయింది. ఎన్నిసార్లు రసాయన మందులు పిచికారీ చేసినా వాటిని నియంత్రించడం సాధ్యపడలేదు. దీంతో లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయి ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో విలవిల్లాడుతున్నారు. వరుసగా మూడేళ్లు మామిడి తోటల వల్ల దెబ్బతినిపోయామని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మామిడి పరిస్థితి దారుణంగా తయారైంది. పూతలు బాగా వచ్చినప్పటికీ తామర పురుగు వల్ల పూతంతా మాడిపోయింది. రెండేళ్లుగా నష్టాలే మిగులుతుండగా, ఈ ఏడాది కూడా నష్టాలు తప్పేలా లేవు. రెండెకరాల్లో ఉన్న చిన్న రసాల చెట్లకు 6 సార్లు మందులు పిచికారీ చేశా. రూ.30 వేలు పెట్టుబడి కాగా పెట్టుబడి వచ్చే పరిస్థితి కనబడటం లేదు. వికృతి రాంబాబు, కొత్త ఈదర, ఆగిరిపల్లి మండలం నల్ల తామర పురుగుల నివారణకు తోటల్లో జిగురు అట్టలు కాని, పాతచీరలను ఆముదంలో ముంచి గాలివాటంకు అనుగుణంగా తోటలలో కట్టాలి. దీంతో చీరకు అంటుకున్న నల్ల తామర పురుగులు అతుక్కుపోయి ఎగరలేవు. గతేడాది ఉన్నంత ఉధృతంగా అయితే ఈ ఏడాది లేవు. మంచు వల్ల కూడా నష్టం జరిగింది. ఆర్.హేమ, ఉద్యాన అధికారి, నూజివీడు 4 ఎకరాల్లో మామిడి తోట ఉండగా బంగినపల్లి, చిన్నరసాలు, సువర్ణ రేఖ రకాల చెట్లు ఉన్నాయి. ఈ ఏడాది పూత బాగా వచ్చింది. పూతను కాపాడుకునేందుకు 4 సార్లు మందులు పిచికారీ చేశాను. దీనికి రూ.60 వేలు పెట్టుబడి అయింది. అనుకోకుండా ఫిబ్రవరిలో నల్ల తామర ఆశించడంతో పూతంతా మాడిపోయింది. తోటలోకి వెళ్లాలని అనిపించడం లేదు. వెలివల శివరామకృష్ణ, సుంకొల్లు, నూజివీడు మండలం -
అంతరాలయ దర్శనం.. కట్టుదిట్టం
ద్వారకాతిరుమల: చినవెంకన్న అంతరాలయ దర్శ నం టికెట్ల రీప్రింట్ దందాకు పూర్తిస్థాయిలో చెక్ పడింది. దీంతో స్వామివారి ఆదాయం గణనీయంగా పెరిగింది. గత శనివారంతో పోలిస్తే ఈ వారం 151 అంతరాలయ దర్శనం టికెట్లు అధికంగా అ మ్ముడయ్యాయి. ఈనెల 15న ‘సాక్షి’లో ‘దొడ్డిదారిన శ్రీవారి దర్శనాలు’ శీర్షికన ప్రచురించిన కథనంతో టికెట్ల రీప్రింట్ వ్యవహారం బయటపడింది. దీ నిపై స్పందించిన దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావు, ఈవో వై.భద్రాజీ చర్యలు తీసుకు న్నారు. పలువురు అధికారుల విధులను మార్పు చేశారు. అలాగే ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు వీఐపీల పేరుతో వచ్చేవారి వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత అంతరాలయ దర్శనానికి అ నుమతిస్తున్నారు. అయితే దర్శనం టికెట్లను మాత్రం తప్పనిసరిగా కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అధికారుల చర్యలతో అంతరాలయ దర్శనం టికెట్ల విక్రయాలు అధికంగా పెరిగాయి. ఈనెల వరుసగా మూడు శనివారాల్లో విక్రయించిన అంతరాలయ దర్శనం టికెట్ల సంఖ్యను పరిశీలిస్తే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈనెల 7న 476, 14న 670, 21న 821 టికెట్లను విక్రయించారు. టికెట్ల రీప్రింట్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత తొలి శనివారం 821 టికెట్లు విక్రయించడం విశేషం. గత వారంతో పోలిస్తే 151 టికెట్లు అదనంగా విక్రయించగా దేవస్థానానికి అ దనంగా రూ.75,500 ఆదాయం సమకూరింది. ఆ దివారం సాయంత్రం 6 గంటల వరకు 527 అంతరాలయ దర్శనం టికెట్లను విక్రయించారు. టికెట్ల రీప్రింట్ దందాకు చెక్ -
దళారులు చెప్పిందే ధర!
ఆక్వా రంగంలో దళారులు, వ్యాపారులదే రాజ్యం. వారు నిర్ణయించిందే ధర. రైతుల డిమాండ్కు ఏమాత్రం ప్రాధాన్యత లేదు. ప్రభుత్వం కనీస మద్దతు ధరలు నిర్ణయించినా అమలుకు నోచుకోవడం లేదు. నేను 20 ఎకరాల్లో రూప్చంద్ సాగు చేస్తున్నాను. 50 శాతం చెరువుల్లో చేపలు పట్టుబడికి సిద్ధంగా ఉన్నాయి. ధర రూ.85కు పడిపోవడంతో ఈ ధరకు అమ్మితే పెట్టిన పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదు. – సంకు శ్రీనివాసరావు, రూప్చంద్ రైతు ఏడాది కాలంగా చేపల సాగు నష్టాలతోనే నడుస్తోంది. వ్యాపారులు చేప ధర తగ్గించేయడం, కంపెనీలు మేత ధర పెంచేయడంతో మేం నలిగిపోతున్నాం. 20 ఎకరాల్లో వేసిన రూప్చంద్ పట్టుబడి దశకు చేరింది. ధర పడిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. విద్యుత్ బిల్లులు సైతం తలకుమించి భారంగా మారాయి. ప్రభుత్వం ఆక్వా రైతుల సమస్యలపై దృష్టి సారించి న్యాయం చేయకపోతే ఈ సాగుకు మనుగడ ఉండదు. – రమేష్రాజు, ఆక్వా రైతు, గణపవరం -
జాడలేని ఓడరేవు
హార్బర్ లేకపోవడంతో వశిష్ట గోదావరి గట్టున నిలిపి ఉంచుతున్న వేటబోట్లు నరసాపురం: నరసాపురం తీర ప్రాంతంలో దశాబ్దాల కలగా ఉన్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని చంద్రబాబు ప్రభుత్వం విజయవంతంగా అటకెక్కించింది. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసిన ప్రాజెక్ట్పై నిండా నిర్లక్ష్యం చూపుతోంది. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో ప్రాజెక్ట్ ఊసెత్తకపోవడమే ఇందుకు నిదర్శనం. గత ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నరసాపురం మండలం బియ్యపుతిప్ప వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2022 మే నెలలో ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్లు పిలవగా, విశ్వసముద్ర సంస్థ పనులు దక్కించుకుంది. పర్యావరణ, ఇ తర సాంకేతిక అనుమతులు కూడా వచ్చాయి. 600 ఎకరాల విస్తీర్ణంలో రూ.429.43 కోట్ల ని ర్మాణ వ్యయంతో 2023 ఫిబ్రవరిలో ప్రాథమికంగా పనులు కూడా ప్రారంభించారు. నిర్మాణం.. ప్రశ్నార్థకం 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వంలో ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కాంట్రాక్ట్ సంస్థ ఎన్నికల ముందు ప్రాథమిక సర్వే వంటి పనులు చేపట్టగా.. ఈ ప్రభుత్వంలో వెనుకడు గు వేసింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఫిషింగ్ హార్బర్ నిర్మించి తీరుతామని హామీలు గుప్పించిన కూటమి నేతలు ప్రస్తుతం దీనిపై ఏమీ మాట్లాడటం లేదు. మత్స్య ఎగుమతులకు ఊతం మత్స్య సంపద, ఆక్వా ఎగుమతుల్లో ఉమ్మడి పశ్చిమకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ నుంచి దేశ, విదేశాలకు ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అ వుతాయి. ఏటా రూ.కోట్ల విదేశీ మారకద్రవ్యం కూడా వస్తుంది. తీరప్రాంతంలో సముద్ర మ త్స్య సంపద ద్వారా కూడా భారీగా ఆదాయం సమకూరుతుంది. ఏటా నరసాపురం తీరంలో రూ.300 కోట్ల విలువచేసే మత్స్య ఎగుమతులు ఉంటాయి. హార్బర్ వంటి మౌలిక వసతులు ఉంటే మరో 40 శాతం ఎగుమతులు పెరిగే అ వకాశం ఉంది. ఈ కారణంతోనే గత ప్రభుత్వం హార్బర్ నిర్మాణానికి పూనుకుంది. బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ దశాబ్దాలుగా మత్స్యకారుల కల. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ఖర్చు భరించేలా హార్బర్ నిర్మాణానికి గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ నిర్ణయం చేశారు. అన్ని అనుమతుల కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అప్పట్లో టెండర్లు కూడా పిలిచి, పనులను కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పనులు ఎందుకు మొదలుపెట్టడం లేదనేది అర్థం కావడం లేదు. హార్బర్ను నిర్మించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. వెంటనే పనులు ప్రారంభించాలి. – ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ‘వల’విల బియ్యపుతిప్ప హార్బర్ నిర్మాణంపై నిర్లక్ష్యం రాష్ట్ర బడ్జెట్లో ఊసెత్తని వైనం ప్రాజెక్టును అటకెక్కించిన చంద్రబాబు ప్రభుత్వం గత ప్రభుత్వంలో హార్బర్ నిర్మాణానికి శ్రీకారం -
స్పందన
కొయ్యలగూడెం: అక్రమ క లప ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నట్టు కన్నాపురం అటవీశాఖ రేంజర్ భానుప్రకాష్ ఆదివారం తెలిపారు.. కుంకాల నుంచి అక్రమంగా కలపను ట్రాక్టర్పై తరలిస్తున్న సమాచారంతో ఎఫ్ఎస్ఓ మణికుమారి సిబ్బందితో కలిసి దాడులు చేశారన్నారు. ట్రాక్టర్ గుర్తించి రేంజ్ కార్యాల యానికి తరలించి కేసు నమోదు చేశామన్నారు. కలప అక్రమ రవాణాపై ఈనెల 8న, గత డిసెంబర్ 13న ‘సాక్షి’లో వచ్చిన కథనాలకు అటవీ శాఖ స్పందించింది. నెల రోజుల్లో పది కేసుల వరకు నమోదు చేయడం విశేషం. భీమవరం(ప్రకాశంచౌక్): జిల్లా కలెక్టరేట్తో పా టు మండల, మున్సిపల్ కార్యాలయాల్లో సో మవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించను న్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ఉ దయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా అదనపు ఎస్పీ వి.భీమారావును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడలో డీఎస్పీగా పనిచేస్తున్న సమయంలో ఆయన ఓ యువకుడి హత్య కేసులో పర్యవేక్షణ లోపాల కు బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేశారు. తనఖా పెట్టిన బంగారం మాయం జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం ఐఐఎఫ్ఎల్ బ్యాంకులో ఓ మహిళ కుదవపెట్టిన బంగారాన్ని బ్రాంచ్ మేనేజర్ మాయం చేశాడు. ఎ స్సై ఎన్వీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పాత బస్టాండ్ ప్రాంతానికి చెందిన ఎన్.ధనలక్ష్మి ఐఐఎఫ్ఎల్ బ్యాంకులో 270 గ్రాము ల బంగారు ఆభరణాలను 2023లో తనఖా పె ట్టి రుణం తీసుకున్నారు. బ్రాంచ్ మేనేజర్ ఉ ద్దగిరి చైతన్య రాము రుణంపై వడ్డీ కట్టాలంటూ ఫోన్ చేసేవాడు. ధనలక్ష్మి వడ్డీ కట్టలేకపో వడంతో రుణాన్ని అప్డేట్ చేస్తానని, ధనలక్ష్మి ఫోన్కు ఓటీపీ వచ్చిందని చెప్పమని అడిగేవా డు. అలా పలుమార్లు ఓటీపీ తెలుసుకున్నాడు. గత డిసెంబర్ 20న ధనలక్ష్మి బంగారాన్ని విడిపించేందుకు బ్యాంకుకు వెళ్లగా ధనలక్ష్మి పేరు న అసలు బంగారం తనఖా లేదని తెలిసింది. చైతన్య రాము ఎప్పుడో మానివేశారని బ్యాంకు సిబ్బంది చెప్పారు. చైతన్య రాము ఆ బంగారా న్ని విడిపించి వేరే వ్యక్తుల పేరున పెట్టినట్టు తె లుస్తోంది. ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసు లు కేసు నమోదు చేశారు.బాధితులు ఇంకా చా లా మంది ఉన్నట్టు ధనలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. జంగారెడ్డిగూడెం: వైద్య పీజీ సీట్లు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడేనికి చెందిన ఎస్కే షంషీర్ అహ్మద్ రాఘవాపురం పీహెచ్సీలో హెల్త్ అసిస్టెంట్గా పనిచేస్తున్నా రు. ఆయన పెద్ద కుమార్తె, మేనల్లుడు ఎంబీబీఎస్ పూర్తిచేశారు. విదేశాల్లో పీజీ చదువు కో సం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అ హ్మద్కు తెలంగాణలోని మహబూబ్నగర్ జి ల్లా మరికల్ గ్రామానికి చెందిన గుండా రా ఘవ పరిచయమయ్యాడు. తాను విదేశాల్లో పీజీ సీటు ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో దఫదఫాలుగా షంషీర్ అహ్మద్ ఫోన్పే, ఆన్లైన్ ద్వారా రూ.19.50 లక్షలు రాఘవకు బదిలీ చేశారు. అనంతరం రాఘవకు ఫోన్ చేసినా సమాధానం చెప్పకపోవడం, సీటు ఇప్పించకుండా తప్పించుకుని తిరుగుతూ మాయమాటలు చెప్పుకొచ్చాడు. దీంతో అహ్మద్ తాను మోసపోయానని గ్రహించి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. పెదవేగి: వారం రోజుల్లోగా కోకో గింజల ధర ల పాలసీ ప్రకటించి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధర నిర్ణయించకపోతే కోకో రైతుల పోరాటం తప్పదని ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర స మావేశం హెచ్చరించింది. విజయరాయిలో ఆ దివారం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అ ధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజల ధరను కి లోకు రూ.350కు తగ్గించడం దారుణమన్నా రు. ఆయిల్పామ్ మాదిరిగా ఫార్ములాతో కో కో గింజల ధర నిర్ణయించాలని కోరారు. -
ఎన్నడూ లేని సంక్షోభం
నేను 11 ఎకరాల్లో ఆక్వా సా గు చేస్తున్నాను. ఇటువంటి ఆక్వా సంక్షోభం ఎన్నడూ చూడలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం కనీ సం విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం లేదు. ఇది ఇస్తే కొంతైనా కో లుకుంటాం. ఫీడ్ ధరల తగ్గించాలి గతంలో ముడిసరుకుల ధరలు తగ్గినా కిలోకు రూ.20 తగ్గించాల్సి ఉన్నా తగ్గించలేదు. ప్రస్తుతం ఫిష్ మీల్ ధర పెరిగిన నేపథ్యంలో మళ్లీ ధరలు పెంచడం అన్యాయం. –తంగెళ్లబాబు, ఆక్వా రైతు నాణ్యత లేని సీడ్ వల్ల ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం ఈహెచ్పీ ఉన్న తల్లి రొయ్యల నుంచి సీడ్ దిగుమతి కావడంతో ఎక్కువ నష్టం జరుగుతోంది. సీఏఏ అధికారి ద్వారా సరైన పర్యవేక్షణ లేకపోవడం కారణంగా కనిపిస్తోంది. ఆక్వా సాగు బాగుండాలంటే మంచి సీడ్ లభించాలి. ఆక్వా రైతులు సమస్యలపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని సాగుకు అన్నిరకాలుగా ప్రోత్సాహం అందించాలి. –మరిడి వెంకటేశ్వరరావు, ఆక్వా రైతు -
విజయీభవ
ఏలూరు (ఆర్ఆర్పేట) : ఉమ్మడి జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ థియరీ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. సో మవారం నుంచి ప్రథమ సంవత్సరం, మంగళవారం నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేయడంతో పాటు హాల్టికెట్లు కూడా వెబ్సైట్, వాట్సాప్లలో అందుబాటులో ఉంచింది. ఇక విద్యార్థులు తాము చదివిన చదవునంతా జవాబుపత్రాలపై పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు తొలి మెట్టు అయిన ఈ పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగానే వారు భవిష్యత్లో తమ లక్ష్యాలను చేరుకోవడానికి సోపానం ఏర్పడుతుంది. వచ్చేనెల 24 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 109 పరీక్షా కేంద్రాలు ఏలూరు జిల్లాలో ప్రథమ సంవత్సరం పరీక్షలకు 17,556 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 17,059 మంది మొత్తంగా 34,615 మంది హాజరుకానున్నారు. ఈ మేరకు ఏలూరు జిల్లాలో 56 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా పత్రాలను పంపిణీకి 21 స్టోరేజ్ పాయింట్లను సిద్ధం చేశారు. ఆయా రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రథమ సంవత్సరం 19,662 మంది, ద్వితీయ సంవత్సరం 17,888 మొత్తంగా 37,550 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా 53 కేంద్రాలను ఏర్పాటుచేశారు. 800 మంది ఇన్విజిలేటర్లు పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు పూర్తి చేశారు. ఏలూరు జిల్లాలో పరీక్షల నిర్వహణ కోసం మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు, రెండు సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. పరీక్షా కేంద్రాల్లో 1,006 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. 800 మంది ఇన్విజిలేటర్లు పరీక్షల విధుల్లో పాల్గొంటారు. జిల్లా కేంద్రం ఏలూరులో 17 సెంటర్లు ఉన్నాయి. ఆరు సెంటర్లలో ప్రహరీ గోడలు లేకపోవడంతో అక్కడ మ రింత పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడానికి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ ఇంటర్ పరీక్షలకు ఎంసెట్, నీట్ మాదిరిగా ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. కాగా ఉదయం 8.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి కేంద్రాల్లో చేస్తున్న ఏర్పాట్లను ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ పర్యవేక్షించి అధికారులకు సూచనలు జారీ చేశారు. ద్వితీయ సంవ్సతరం 24న.. సెకండ్ లాంగ్వేజ్–2 26న.. ఇంగిష్–2 28న.. బోటనీ, హిస్టరీ–2 మార్చి 4న.. లెక్కలు–2ఏ, సివిక్స్–2 మార్చి 6న.. జువాలజీ, ఎకనామిక్స్–2 మార్చి 9న.. లెక్కలు–2బీ మార్చి 11న.. కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్–2 మార్చి 13న.. ఫిజిక్స్–2 మార్చి 16న.. మోడరన్ లాంగ్వేజ్–2, జియోగ్రఫీ–2 మార్చి 18న.. కెమిస్ట్రీ–2 మార్చి 23న.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్–2 ఆల్ ద బెస్ట్ నేటి నుంచి ఇంటర్ పరీక్షలు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి వచ్చేనెల 24 వరకు నిర్వహణ ఉమ్మడి జిల్లాలో 72,165 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం 23న.. తెలుగు, సంస్కృతం, ఉర్దూ, హిందీ 25న.. ఇంగ్లిష్–1 27న.. హిస్టరీ, బోటనీ–1, మార్చి 2న.. లెక్కలు–1 మార్చి 5న.. బయోలజీ–1, జువాలజీ–1 మార్చి 7న.. ఎకనామిక్స్–1 మార్చి 10న.. ఫిజిక్స్–1 మార్చి 12న.. కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్–1 మార్చి 14న.. సివిక్స్–1 మార్చి 17న.. కెమిస్ట్రీ–1 మార్చి 21న.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్–1 మార్చి 24న.. మోడల్ లాంగ్వేజ్, జాగ్రఫీ–1 -
పెద్దింట్లమ్మ జాతరకు భక్తుల తాకిడి
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరలో ఆదివారం భక్తులు కిటకిటలాడారు. సమీప జిల్లాల నుంచి వేలాది మంది మొక్కులు సమర్పించుకున్నారు. పెద్దింట్లమ్మకు విశేషార్చన, నూతన వస్త్ర అలంకరణ, పుష్పాలంకరణ, పంచమావరణ కలశార్చన, ద్రవ్యోపచారాలతో అర్చన, ధూపసేవ, బాలభోగం, నీరాజన మంత్ర పుష్పార్చన జరిగింది. అమ్మవార్లకు వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ఉచిత ప్రసాద వితరణ దాతగా విజయవాడకు చెందిన కొయ వేంకటేశ్వరరావు దంపతులు వ్యవహరించారు. జాతరకు వచ్చిన భక్తులకు ఉచిత ప్రసాదం, మజ్జిగను ఆలయ ధర్మకర్త కొల్లి రాంబాబు అందించారు. భక్తులకు వాటర్ ప్యాకెట్లను విజయవాడకు చెందిన బండారు కృష్ణ ప్రసాద్ పంపిణీ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వాహనాలతో వచ్చిన భక్తులు కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మకు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు వంటలు చేసుకోడానికి దేవస్థానం ఉచిత పందిర్లను కేటాయించింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కూరెళ్ల లక్ష్మీజ్యోతి బృందం ప్రదర్శించిన కూచిపూడి భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఈ నెల 28న జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గాగోకర్ణేశ్వస్వామి కల్యాణం జరుగుతుందన్నారు. అమ్మవారికి రూ.2,29,565 ఆదాయం వచ్చిందని ఈవో శ్రీనివాసు చెప్పారు. 28న జలదుర్గా గోకర్ణేశ్వర కల్యాణం -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు–నరసాపురం రోడ్డులో పెదగరువు వెళ్లే రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భవిరిశెట్టి ప్రభు కుమార్ (32) అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి ద్విచక్ర వాహనంపై తన సోదరి ఇంటికి పాలకొల్లు వస్తున్న ప్రభు కుమార్ పెదగరువు రోడ్డు వద్దకు వచ్చే సరికి లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రభు కుమార్ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పృథ్వీ తెలిపారు. కై కలూరు: ద్విచక్రవాహనంపై ఆగివున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆలపాడు జాతీయ రహదారి ఆదర్శ స్కూల్ వద్ద ఆదివారం జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పంచాయతీ బొమ్ములూరుకు చెందిన చిన్నపరుపు నాగశ్రీను(49) బడ్డీ కొట్టు నిర్వహిస్తున్నాడు. కై కలూరులో బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళ్తుండగా.. ఆదర్శ స్కూల్ వద్ద పక్కకు ఆపి నిలబడ్డాడు. ఇంతలో కై కలూరు నుంచి ఆకివీడు వెళ్తున్న కారు గట్టిగా ఢీకొట్టడంతో నాగశ్రీను మరణించాడు. కుమారుడు భానుప్రసాద్ ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై వి.రాంబాబు కేసు నమోదు చేశారు. -
పాతాళానికి రూప్చంద్ ధర
● ఏడాదిలో కిలో రూ.125 నుంచి రూ.82కు పడిపోయిన ధర ● మేతల ధర పెంపుతో తీవ్ర ప్రభావం గణపవరం: రూప్చంద్ చేపల సాగు చేపట్టిన ఆక్వా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏడాది క్రితం వరకూ ధర బాగానే.. ప్రస్తుతం ధర పాతాళానికి పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పది నెలల్లో కిలోకు ఏకంగా రూ.40 వరకూ ధర తగ్గింది. దీంతో రూప్చంద్ సాగుచేసే రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితి గతేడాది జనవరిలో రూప్చంద్ కిలో ధర రూ.125 వరకు పలికింది. రొయ్యల సాగులో తీవ్ర నష్టాల్లో ఉన్న రైతులు రూప్చంద్ సాగు చేపట్టారు. మంచి ధర ఉండడంతో రైతులు ఆనందపడ్డారు. అయితే క్రమంగా ధర తగ్గిపోవడంతో రైతు ఢీలపడ్డాడు. గత జూలై వరకు రూ.112 – రూ.115 వరకూ పలికిన ధర, క్రమంగా తగ్గుముఖం పడుతూ ప్రస్తుతం రూ.82కి చేరింది. గత మూడు, నాలుగు నెలలుగా రూ.80 నుంచి రూ.85 మధ్యే ఉంది. దీంతో రైతులు చేపలను అమ్ముకోలేక, చెరువుల్లో ఉంచి మేపలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో ఆక్వాసాగు మొదలైన తర్వాత ఇంతటి గడ్డు పరిస్థితి ఎప్పుడూ చూడలేదని రైతులంటున్నారు. సరిగా పట్టుబడి సమయానికి ధర తగ్గిపోవడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండేళ్ల క్రితం కూడా రూప్చంద్ ధర కిలో రూ.60కు పడిపోయి రైతులు దారుణంగా నష్టపోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 2.35 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా.. అందులో 1.5 లక్షల ఎకరాల్లో చేపల సాగు చేస్తున్నారు. ఇందులో అధిక శాతం అంటే 70 నుంచి 80 వేల ఎకరాల్లో రూప్చంద్ సాగు చేస్తున్నారు. ప్రస్తుత ధర కిలో రూ.85 చొప్పున అమ్మితే వచ్చే సొమ్ము కేవలం మేతలు, మందులకే సరిపోతుంది. చెరువు లీజులు, సీడ్, విద్యుత్ బిల్లులు, కాపలాదారుల జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులు చూసుకుంటే ఎకరాకు కనీసం లక్ష రూపాయల నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు మేత కంపెనీలు కిలోకు రూ.4 చొప్పున ధరలు పెంచడంతో మరింత నష్టం తప్పడం లేదు. కొంతకాలం వేచిచూస్తే చేప ధర పెరుగుతుందన్న ఆశతో రోజుల తరబడి చేపలను చెరువులో ఉంచి మేపడం వల్ల మరింత నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు -
సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ళ శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. అన్నదాన కార్యక్రమానికి భక్తలు పోటెత్తడంతో ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగా శ్రీదేవి ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీప్రాంతంలో కొలువైన గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అధికంగా తరలివచ్చిన భక్తుల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీతోపాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు. నరసాపురం రూరల్: సెలవు దినం కావడంతో సముద్ర తీరం పర్యాటకుల రాకతో కళకళలాడింది. మొగల్తూరు మండలంలోని కేపీ పాలెం, పేరుపాలెం గ్రామాలతో పాటు నరసాపురం మండలంలోని పెదమైనవానిలంక, చినమైనవానిలంక గ్రామాల పొడవునా విస్తరించి ఉన్న బీచ్ ప్రాంతం ఆదివారం ఉదయం నుంచే సందర్శకులతో కిక్కిరిసిపోయింది. ప్రకృతి ప్రేమికులు, యువత ప్రత్యేక వాహనాలు, ద్విచక్ర వాహనాలపై భారీ సంఖ్యలో తరలిరావడంతో తీరమంతా కోలాహలం నెలకొంది. ఉదయాన్నే బీచ్కు చేరుకున్న పర్యాటకులు ఉత్సాహంగా సముద్ర కెరటాలలో స్నానాలు చేస్తూ సేదతీరారు. ఒడ్డుకు కొట్టుకువస్తున్న కెరటాల మధ్య ఇసుక తిన్నెలపై చిన్నారులు ఆటలాడుకుంటూ సందడి చేశారు. తీరానికి సమీపంలో ఉన్న ఆలయాలను పర్యాటకులు దర్శించుకున్నారు. అనంతరం అక్కడి సర్వే తోటలు, కొబ్బరి తోటల నీడన ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా గడిపారు. తీరం వెంబడి వాహనాల రద్దీ పెరగడంతో పాటు, స్థానిక వ్యాపారాలు కూడా పుంజుకోవడంతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం కనిపించింది. -
Rajahmundry: కలకలం.. కల్తీపాలు తాగి ఇద్దరు మృతి
తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి లాలా చెరువు ప్రాంతంలో కల్తీ పాలు కలకలం సృష్టించాయి. కల్తీపాలు తాగి ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తుంది. ముృతులు కృష్ణవేణి (85,కనకరత్నం(70)గా పోలీసులు చెబుతున్నారు. మరణాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసుల వివరాల మేరకు.. చౌడేశ్వరి నగర్లో పాలు తాగిన చిన్నారులు,వృద్ధులు అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్యానికి గురైన బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు రాజమండ్రిలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, వీరిలో పలువురికి కిడ్నీలు పాడైనట్లు తెలుస్తోంది.ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు కల్తీపాలే కారణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో బాధితులకు పాలు పోసిన వ్యక్తి గణేష్ను అదుపులోకి తీసుకున్నారు. -
కోతకు గురవుతున్న ఆలయం
పోలవరం రూరల్: అఖండ గోదావరి నది మధ్య పోలవరం ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రసిద్ధి చెందిన మహానందీశ్వరస్వామి ఆలయానికి ఒక వైపు వరదల ప్రభావంతో కోతకు గురవుతోంది. గత కొన్నేళ్ళుగా స్పిల్వే దిగువ నుంచి వరద ప్రవాహం ఉండటంతో ఆలయం చుట్టూ ఉన్న గట్టు మరింతగా కోతకు గురైంది. లంక ఒడ్డు పూర్తిగా కోతకు గురికావడంతో, దిగువన నిర్మించిన అన్నదాన శిబిరం భవిష్యత్తు ప్రశార్థకంగా మారింది. మళ్లీ వరద సమయానికి ఇది మరింత పెరిగితే అన్నదాన శిబిరం గోదావరిలో కలిసిపోయే పరిస్థితి ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి దాతల సహకారంతో మోటార్లు ఏర్పాటు చేసి మంచినీటి వసతి, మరుగుదొడ్లు, నిర్వాహకులు ఉండేందుకు వీలుగా గదుల నిర్మాణాలు జరిగాయి. సెలవు దినాల్లో వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. నందీశ్వరస్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పోలీస్ చెక్పోస్టు ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్టు దాటి వెళ్లడానికి అందరికీ అనుమతులు లేవు. మహాశివరాత్రి ఉత్సవాల సమయంలో ఈ క్షేత్రానికి భక్తులు వెళ్ళేందుకు అనుమతులు రావడంతో సుమారు 10 వేల మంది వరకు దర్శించుకున్నారు. -
కాపు సంక్షేమంపై తీవ్ర నిర్లక్ష్యం
ఎన్నికల సమయంలో కాపులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కాపుల సంక్షేమం విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ముచ్చటగా మూడోసారి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ ఏడాది బడ్జెట్లో కూడా కాపు కార్పొరేషన్కు ఎలాంటి నిధులూ కేటాయించలేదు. కాపు కార్పొరేషన్ అలంకారప్రాయంగా మారింది. కూటమి ప్రభుత్వంపై కాపులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. – కొత్తపల్లి రమేష్నాయుడు, జాతీయ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు/నరసాపురం -
సహకార సంఘ ఉద్యోగుల ధర్నా
అత్తిలి: సహకార సంఘ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ జిల్లా సెక్రటరీ పి.కృష్ణశాస్త్రి డిమాండ్ చేశారు. డీసీసీబీ అత్తిలి బ్రాంచ్ వద్ద సహకార సంఘాల సీఈఓలు, సిబ్బంది చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం 6వ రోజుకు చేరింది. ఈసందర్భంగా యూనియన్ జిల్లా సెక్రటరీ పి.కృష్ణశాస్త్రి మాట్లాడుతూ సహకార సంఘ ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. జీఓ నెం.36 వెంటనే అమలు చేసి, 2019, 2024 సంవత్సరాలలో పెండింగ్లో ఉన్న వేతన సవరణ చేపట్టాలని, అంతవరకు మధ్యంతర భృతి ఇవ్వాలని చెప్పారు. గ్రాట్యూటీ సీలింగ్ రూ.2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారని, గ్రాట్యూటీ చట్టాన్ని అమలు పరిచి చట్ట ప్రకారం గ్రాట్యూటీ చెల్లింపు చేయాలని కోరారు. రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, 2019 తరువాత సహకార సంఘాలలో చేరిన ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేసి, వారికి కూడా జీఓ నెం 36 అమలు చేయాలని డిమాండ్ చేసారు. ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా కల్పించాలని, ఉద్యోగి సర్వీస్లో మరణిస్తే ఆ కుటుంబానికి ఆధారం లేకుండా పోతుందని, అందువల్ల ప్రతి ఉద్యోగికి రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి కుటుంబాలకు భరోసా కల్పించాలని అన్నారు. సహకార సంఘాల ఉద్యోగుల చేపట్టిన సమ్మెకు మాజీ డీసీఎంఎస్ చైర్మన్, ఎస్.ఇల్లిందలపర్రు పీఏసీఎస్ చైర్మన్ నడింపల్లి సత్యనారాయణరాజు సంఘీభావం తెలిపారు. వీరి న్యాయబద్ధమైన డిమాండ్లను సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా యూనియన్ ఉపాధ్యక్షులు బలుసు శ్రీనివాసులు, 14 సహకార సంఘాల సీఈఓలు, సిబ్బంది పాల్గొన్నారు. -
పంచాయతీల నిర్వహణపై శిక్షణ
ఏలూరు(మెట్రో) : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 10 మండలాలకు చెందిన గ్రేడ్ 4, గ్రేడ్ 5 పంచాయతీ డెవలప్మెంట్ అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. జెడ్పీ సీఈవో, జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ప్రిన్సిపాల్ ఎం.శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్షేత్ర స్థాయి పాలనను పటిష్టం చేయడం, గ్రామ పంచాయతీల్లో సర్వీస్ డెలివరీ మెరుగుపరచడం, రికార్డుల సక్రమ నిర్వహణ, పంచాయతీ ఆస్తుల పరిరక్షణ, మంచినీటి సంరక్షణ పద్ధతులు, ఘన ద్రవ, మల వ్యర్ధాల నిర్వహణ, సొంత వనరుల పెంపుదల, 100 శాతం పన్నులు, పన్నేతర ఆదాయాల వసూళ్లు అనే లక్ష్యాల సాధనలో పంచాయతీ అధికారుల పాత్ర అత్యంత ప్రాధాన్యమని శ్రీహరి తెలిపారు. పంచాయతీ సొంతఆదాయ వనరుతో పాటు ఇంటి పన్ను మదింపు, వసూళ్ల ప్రక్రియపై అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం జిల్లా కో–ఆర్డినేటర్ ప్రసంగ రాజు, మాస్టర్ ట్రైనర్స్ జీడీ శ్రీనివాస్, సూర్య కుమార్, విజయ భాస్కర్, వెంకటేష్ పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం కార్మికులకు రాయితీలు ప్రకటించినా.. ఇంతవరకు దానికి సంబంధించిన జీవో విడుదల చేయలేదని ఏపీ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్లు శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంఘ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. కార్మికుల పిల్లల వివాహా లకు రూ.40 వేలు, కార్మికుడి భార్య లేదా కూతురి డెలివరీకి రూ.30 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, మట్టి ఖర్చులకు రూ.20 వేల చొప్పున ఇచ్చేలా చూస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అయినా ఇంత వరకు వీటికి సంబంధించిన జీవో విడుదల చేయలే దన్నారు. కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్ విధానాన్ని అమలు చేసే విధంగా తగు చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశం అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఏ.రాణికి అందజేశారు. జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెంకు చెందిన రిటైర్డ్ హవాల్దార్ (ఆర్మీ) దంగల గోపాలకృష్ణ కేఎం కరియప్ప స్మారక పురస్కారం అందుకున్నారు. ఇటీవల విజయవాడలో హోం మినిస్టర్ అనిత చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఇండియన్ ఆర్మీలో అందించిన సేవలకు గుర్తింపుగా తనకు ఈ పురస్కారాన్ని అందచేసినట్లు తెలిపారు. -
●కవలలు.. కనువిందు
జాతీయ కవలల దినోత్సవాన్ని తణుకు మాంటిస్సోరీ స్కూలులో శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో ఉన్న 30 మంది కవలలతోపాటు రెండు కవల త్రయం జంటలను డైరెక్టర్ అనపర్తి ప్రకాశరావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రకాశరావు మాట్లాడుతూ ఇంత మంది కవలలు తమ పాఠశాలలోనే ఉండడం ఆనందంగా ఉందని, కవలలంతా మంచి విద్యాబుద్ధులతో ఉన్నతస్థాయికి చేరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్కూలు హెడ్మిస్ట్రస్ ఎం.లక్ష్మి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.జ్ఞానమంజరి, కాలేజ్ ఎకడమిక్ డైరెక్టర్ పి.కిషోర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. – తణుకు అర్బన్ -
30 దాటినా .. ఒంటరే!
●పెళ్లికాని ప్రసాద్లకు కొత్త తంటా ●మ్యారేజ్ బ్యూరోల్లో పేరుకుపోతున్న బయోడేటాలు తాడేపల్లిగూడెం: ఆరంకెల జీతం, ఆస్తిపాస్తులు ఉన్నా.. పెళ్లి మాత్రం కావడం లేదు. సమాజంలో పెళ్లి కాని ప్రసాద్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ముప్పై ఏళ్లు దాటుతున్నా పెళ్లి పీటలు ఎక్కే భాగ్యం దక్కడం లేదు. ఒకప్పుడు అమ్మాయిల తల్లిదండ్రులు పెళ్లికొడుక్కి కట్నకానుకల కోసం ఇబ్బంది పడేవారు. ఇప్పుడు పిల్ల దొరికితే చాలు.. కట్నం అక్కర్లేదు, అని అబ్బాయిల తల్లిదండ్రులు అనే పరిస్థితి ఏర్పడింది. చాంతాడులా వధువుల డిమాండ్లు మారుతున్న కాలంతో పాటు అమ్మాయిల ఆలోచనా తీరు మారింది. ఒకప్పుడు పెళ్లిచూపుల్లో అబ్బాయిలు ప్రశ్నలు వేసేవారు, ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిల అర్హతలను పరీక్షిస్తున్నారు. వాళ్ల లిస్టు వింటుంటే అబ్బాయిలు పెళ్లిళ్లపై ఆశలు వదులేసుకుంటున్నారు. సాఫ్ట్వేర్ జాబ్, చిన్న కుటుంబం, ఆస్తిపాస్తులు ఇవన్నీ చూస్తుండడంతో పెళ్లి కాని అబ్బాయిల సంఖ్య పెరిగిపోతోంది. గత పదేళ్లలో అమ్మాయిలు ఉన్నత విద్య అభ్యసించడం సర్వసాధారణంగా మారింది. దీంతో తమకంటే ఎక్కువ చదువుకున్న అబ్బాయి, ఎక్కవ జీతం వచ్చే అబ్బాయి కావాలంటున్నారు. ఇంజినీరింగ్ కోర్సులు చేసిన అమ్మాయిలు.. డిగ్రీ చదివిన అబ్బాయిలను వద్దంటున్నారు. మ్యారేజ్ బ్యూరోల్లో వెయిటింగ్ మ్యారేజ్ బ్యూరోలకు వస్తున్న వారిలో 30 ఏళ్లకు పైబడిన వారే అధికంగా ఉంటున్నారు. అమ్మాయికి తగ్గ అబ్బాయి దొరకడం లేదని కొందరు అంటుంటే, అసలు అమ్మాయిలే దొరకడం లేదని అబ్బాయిల తరపు వారు బాధపడుతున్నారు అని పురోహితులు, మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు చెబుతున్నారు. లెక్కల్లో తేడా ఉమ్మడి పశ్చిమలో 2011 జనాభా లెక్కల ప్రకారం 39,36,966 జనాభా ఉండగా.. 19,72,048 మంది పురుషులు, 19,64,918 మంది మహిళలు ఉన్నారు. కొత్త పశ్చిమ జనాభా లెక్కల ప్రకారం 18 లక్షల మంది జనాభాలో పురుషులు 8,89,252 మంది, మహిళలు 8,90,683 మంది ఉన్నారు. ప్రతి 1004 మంది మహిళలకు, 1000 మంది పురుషులు ఉన్నారు. వెయ్యి మంది బాలురకు, 964 మంది బాలికలు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. 2011 లెక్కల ప్రకారం బాలికల నిష్పత్తి తక్కువగా ఉండడం పెళ్లిళ్లపై ప్రభావం చూపిందంటున్నారు. మా అమ్మాయిలకు సంబంధాలు చూడమని గతంలో మ్యారేజ్ బ్యూరోలకు బయోడేటాలు వచ్చేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. వయసు ముదిరిన యువకులకు సంబంధాలు చూడమనే వారు అధికం అయ్యారు. అయినా వివాహాలు కుదరడం లేదు. – నాయుడు, మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ నాయకుడు -
అక్రమ కలప స్వాధీనం
కొయ్యలగూడెం: అక్రమంగా నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకున్నట్లు కన్నాపురం ఫారెస్ట్ రేంజర్ భాను ప్రకాష్ శనివారం తెలిపారు. రాజవరం సమీపంలో రహస్య ప్రదేశంలో అక్రమ కలపను నిల్వ ఉంచారన్న సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. ఈ నేపథ్యంలో సుమారు రూ. లక్ష విలువైన 20 టేకు దిమ్మలు గుర్తించి కన్నాపురం రేంజ్ కార్యాలయానికి తరలించామన్నారు. ఉండి: తేనెటీగల పెంపకంపై ఔత్సాహిక రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తేనెకు మంచి మద్దతు ధరను ప్రకటించాలని బాపట్ల కీటక శాస్త్ర ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ కోటేశ్వరరావు కోరారు. ఎన్నార్పీ అగ్రహారంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కొద్దిరోజులుగా జరుగుతున్న శాసీ్త్రయ తేనెటీగల పెంపకం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తేనె వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం తేనెలో కల్తీని ఏవిధంగా గుర్తించగలమో వివరించారు. పోలవరం రూరల్: పోలవరం మండలం పట్టిసం శివక్షేత్రం రేవులో నిత్యం తిరుగుతున్న ఫెర్రీ లాంచీ నిబంధనలకు విరుద్ధగా తిరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సాయంత్రం 6 గంటలకే బోట్లు నిలిపివేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ ఏడు గంటల వరకు యథేచ్ఛగా తిరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. దీనిపై శనివారం సాయంత్రం రేవులో విలేకరులు లాంచీ ఆలస్యంగా తిరగడంపై ప్రశ్నించగా, స్థానిక కూటమి భాగస్వామ్యంలోని పార్టీ నాయకులు దురుసుగా ప్రవర్తించడం కలకలం రేపింది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నా అధికారులు మౌనం వహించడంపై పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
గుట్కా.. వ్యాపారం జోరుగా..
మత్తు.. జీవితాలు చిత్తు ● జిల్లాలో యథేచ్ఛగా గుట్కా, ఖైనీ అమ్మకాలు ● నిఘా నామమాత్రం.. దాడులు తూతూమంత్రం ● గతేడాదిగా ఒక్క కేసూ లేదు భీమవరానికి చెందిన ఓ కార్మికుడు ఖైనీ తినడంతో గొంతు క్యాన్సర్ వచ్చింది. ప్రాణాపాయ స్థితిలో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో మూడు నెలలపాటు చికిత్స పొంది కొద్దిరోజులుగా కోలుకుంటున్నాడు. రూ.3 లక్షల వరకూ ఆస్పత్రి ఖర్చులయ్యాయి. భీమవరం (ప్రకాశంచౌక్): క్యాన్సర్ కారకాలైన గుట్కా, ఖైనీ అమ్మకాలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. మద్యం దుకాణాలు, బెల్టుషాపులు, పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లో విక్రయిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా విక్రయాలు జరుగుతున్నాయి. గతంలో గుట్టుచప్పుడుగా చేసే ఈ వ్యాపారం ఇటీవల బహిరంగంగానే సాగుతోంది. ప్రధానంగా రహదారులను ఆనుకునే ఉండే మద్యం, పాన్ షాపుల్లో ఏ సమయంలో అయినా గుట్కా, ఖైనీ దొరుకుతోంది. యువత బా‘నిషా’ ఖైనీ, గుట్కాకు యువత బానిసలవుతున్నారు. మద్యం సేవించిన తర్వాత మరింత మత్తు కోసం వీటిని తింటున్నారు. 20 నుంచి 30 ఏళ్ల యువతే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మద్యం లభించని, మద్యం కొనుగోలుకు డబ్బులు లేని సమయాల్లో తక్కువ ధరకు ఖైనీ, గుట్కాలు నములుతూ మత్తులో తూలుతున్నారు. వీటికి విపరీతంగా అలవాటు పడినవారు క్యాన్సర్ వంటి రోగాల బారినపడుతున్నారు. దాడులు మరిచిన అధికారులు జిల్లావ్యాప్తంగా గుట్కా, ఖైనీ ప్యాకెట్ల అమ్మకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం పోలీసు దాడులు కూడా జరగడం లేదు. గ తంలో అప్పుడప్పుడు దాడులు చేసి ఖైనీ, గుట్కా ప్యాకెట్లను పట్టుకుని, విక్రయించే వారిపై కేసులు న మోదు చేసేవారు. అయితే ఏడాదిగా జిల్లాలో ఒక్క దాడి జరగలేదు. కనీసం దుకాణదారులకు పోలీ సులు హెచ్చరికలు కూడా జారీ చేయడం లేదు. దీంతో వీటి అమ్మకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. నిషేధిత పదార్థాలను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యమే కారణమనే విమర్శలు ఉన్నాయి. ఖైనీ, గుట్కా తీసుకోవడం వల్ల గొంతు, నోరు, ఆహార నాళిక, పేగు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ప్రాణాలు పోయే అవకాశం ఉంది. చిన్నపాటి మచ్చ పడినా కూడా అవయవం తొలగించాల్సి వస్తుంది. నోటి క్యాన్సర్ సోకితే ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది పడి క్రమేపి బలహీన పడి ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు పోతాయి. ఖైనీ, గుట్కా వల్ల జరిగే అనర్థాలపై క్యాన్సర్ దినోత్సవం నాడు అవగాహన కార్యక్రమాలు ని ర్వహిస్తున్నాం. అలవాటు ఉన్నవారు ఇప్పటికై నా మానుకోవడం ఉత్తమం. – డాక్టర్ ఎన్.హరిశ్చంద్ర ప్రసాద్, జనరల్ మెడిసిన్ -
నేరాల నియంత్రణపై దృష్టి
ఐజీ అశోక్కుమార్ పెనుగొండ: ఏలూరు పోలీస్ రేంజ్ పరిధిలో నేరాల నియంత్రణలో పోలీసులు చురుగ్గా పనిచేస్తున్నారని రేంజ్ ఐజీ అశోక్కుమార్ అన్నారు. శనివారం ఆచంట పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా రు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కేసుల వివరాలు, క్రైం రేటు, నమోదులపై ఆరా తీశారు. గంజాయి అక్రమ రవాణా నివారణ, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్టు ఆయన చెప్పారు. రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా లో జాతీయ రహదారిలో ప్రమాదాలకు అవకాశం ఉన్న 23 బ్లాక్ స్పాట్లను గుర్తించామన్నారు. నరసాపురం పట్టణం, పెంటపాడు, తణుకు, తాడేపల్లిగూడెంలో బ్లాక్ స్పాట్లు ఉన్నాయన్నారు. హైవే అధికారులతో చర్చించి ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని ఐజీ అశోక్కుమార్ తెలిపారు. అలాగే తణుకు, భీమవరం స్టేషన్లను మోడల్ పోలీస్స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఏఎస్పీ భీమారావు, నరసాపురం డీఎస్పీ డాక్టర్ శ్రీవేద, సీఐ రాయుడు విజయకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
కేంద్ర పథకాల నిధులు వినియోగించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాకు కేటాయించిన కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను నూరు శాతం వినియోగించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం సర్వే, వైద్యం, వ్యవసాయం, విద్య, పంచాయ తీరాజ్, ఐసీడీఎస్, ఉద్యాన శాఖల అధికారులతో ఆమె సమావేశమయ్యారు. జిల్లాకు కేటాయించిన కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంపై సమీక్షించారు. శాఖల వారీగా నిధుల మంజూరు, ఖర్చు, పనుల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నిధుల వినియోగానికి నెల మాత్రమే గడువు ఉందని, ఈలోపు నూరు శాతం సద్వినియోగం చేయాలన్నారు. ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. కేంద్రం నుంచి 60:40, 90:10 నిష్పత్తులో నిధులు మంజూరు చేస్తారన్నారు. సమగ్ర శిక్ష ఏపీసీ పి.శ్యాం సుందర్, డీఎంహెచ్ఓ జి.గీతాబాయి, జిల్లా సర్వే అధికారి జాషువా, పంచాయతీరాజు ఎస్ఈ శ్రీనివాసరావు, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారి రాజేష్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎం.హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం(ప్రకాశంచౌక్): నరసాపురం పార్లమెంట్ పరిధిలోని జాతీయ రహదారులు, ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధిపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తన క్యాంపు కార్యా లయంలో శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రవాణా, ఆర్ అండ్బీ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విజయవాడ రీజనల్ ఆఫీసర్ హరికృష్ణ, కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్కుమార్రెడ్డి, ఆర్అండ్ బీ ఎస్ఈ విజయరత్న తదితరులు హాజర య్యారు. నరసాపురం బైపాస్ రోడ్డు నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిన నేపథ్యంలో త్వరగా పనులు చేపట్టాలన్నారు. ద్వారకాతిరుమల: గోవిందా హరి గోవిందా.. అంటూ వేలాది మంది భక్తులు చిన వెంకన్నను దర్శించుకున్నారు. శనివారం వేకువజాము నుంచి భక్తుల రాక మొదలైంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, కల్యాణకట్ట, ప్రసాదాలు, టికెట్ విక్రయాల కౌంటర్లు, ఇతర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. వే లాది మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనివేటి మండపంలో కోలాట భజన మండలి సభ్యుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనివేటి మండపాలు, ఆలయ పరిసరాల్లో వివాహాలు జోరుగా జరిగాయి. అలాగే పలు ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న కొత్త జంటలు, వారి కుటుంబసభ్యులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం వరకూ రద్దీ కొనసాగింది. ఏలూరు (టూటౌన్): స్థానిక ఉమా కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ వేదికగా మూడు రోజులుగా జరుగుతున్న స్టేట్ లెవల్ కంటిన్యూ రిహాబిలిటేషన్ ఎడ్యుకేషన్ (సీఆర్ఈ) శిక్షణా కార్యక్రమం శనివారం ముగిసింది. ముఖ్య అతిథులుగా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ సహాయ సంచాలకుడు బి.రామ్కుమార్, సర్వ శిక్ష అభియాన్ ఏపీసీ కె.పంకజ్కుమార్ హాజరయ్యారు. పంకజ్కుమార్ మాట్లాడుతూ ఆధునిక పద్ధతులు ఉపయోగించి దైనందిన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసుకోవాలనే విషయాలను వివరించారు. రామ్కుమార్ మాట్లా డుతూ స్మార్ట్ హియరింగ్ ఎయిడ్స్, స్పీచ్–టు–టెక్ట్స్ సాఫ్ట్వేర్లు, ఏఐ యాప్ల ద్వారా దివ్యాంగులు స్వయంగా పనులు చేసుకునేలా తీర్చిదిద్దవచ్చన్నారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.పెద్దిరెడ్డి మాట్లాడుతూ స్పెషల్ ఎడ్యుకేటర్లు కేవలం సంప్రదాయ పద్ధతులకే పరిమి తం కాకుండా విజువల్ లెర్నింగ్ టూల్స్, ఇంటరాక్టివ్ సాఫ్ట్వేర్లను బోధనలో భాగం చే యాలని సూచించారు. అనంతరం శిక్షణలో పా ల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందించారు. -
బిల్లు.. కాంట్రాక్టర్లు ఘొల్లు
తణుకు మున్సిపాలిటీలో రూ.10 కోట్ల బిల్లుల పెండింగ్తణుకు అర్బన్: తణుకు మున్సిపాలిటీలో బిల్లులు పెండింగ్ పడటంతో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. టెండర్ అగ్రిమెంట్ ప్రకారం గడువులోపు పనులు పూర్తిచేసినా బిల్లులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సర్కారులో 20 నెలల్లో 100కు పైగా పనులు చేశామని, రూ.10 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ లో ఉన్నట్టు చెబుతున్నారు. పనులు చేయించుకుంటున్నారే తప్ప బిల్లుల వరకూ వచ్చేసరికి అధికారులు అదిగోఇదిగో అంటూ కాలం గడిపేస్తున్నారని, పాలకుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ నిధులతో పాటు జనరల్ ఫండ్స్, ఇతర ఫండ్స్తో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఎంబుక్ల రూపంలో బీరువాల్లో మూలుగుతున్నాయని అంటున్నారు. దీంతో కొత్త పనులకు టెండర్లలో కూడా పాల్గొనడం లేదని చెబుతున్నారు. అప్పులు చేసి మరీ పనులు అప్పులు చేసి పనులు చేస్తున్నామని బిల్లులు ఇవ్వకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నట్టు క్లాస్–1 నుంచి క్లాస్–5 వరకు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత మొదటి ఏడాది రెండు నెలల కాలంలో కొంత బిల్లులు ఇచ్చారని, ఆ త ర్వాత పనులు చేయించుకోవడమే తప్ప బిల్లుల ఊసే లేదన్నారు. కాంట్రాక్టర్లలో ఎక్కువ మంది చిన్నతరహా వారే కావడంతో బిల్లుల కోసం కార్యాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు. గ్రంథాలయ భవనం అందుబాటులోకి వచ్చినా.. తణుకు బ్యాంక్ కాలనీలో గత వైఎస్సార్సీపీ ప్రభు త్వ హయాంలో రూ.1.03 కోట్ల నిధులతో గ్రంథాలయ భవన నిర్మాణం మొదలుపెట్టగా చంద్రబా బు సర్కారులో ప్రారంభోత్సవం జరిగింది. ఈ భవనం అందుబాటులోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా కాంట్రాక్టరుకు ఇవ్వాల్సిన బిల్లు ఒక్క రూ పాయి కూడా విడుదల చేయని దుస్థితి తణుకు మున్సిపాలిటీలో నెలకొంది. -
ఉగాదికైనా..అనుగృహం కలిగేనా?
సమస్యలు పరిష్కరించాలి సమస్యల పరిష్కారం కోసం సహకార పరపతి సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఆందోళన ఆరో రోజుకు చేరింది. 8లో uజిల్లాలో పక్కా ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఉగాది నాటికి 9,135 ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా ఇప్పటివరకు కేవలం 200 మాత్రమే పూర్తయ్యాయి. నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోవడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సాయం సరిపోక ఇళ్ల నిర్మాణానికి పేద వర్గాలు వెనకడుగు వేస్తున్నాయి. ప్రభుత్వం అందించే సాయం పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఆదివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026పేదల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో మునుపెన్నడూ లేనివిధంగా జిల్లాలో పక్కా ఇళ్ల నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. 626 లేఅవుట్లలో 47,362 మందికి ఇళ్ల స్థలాలు అందజేశారు. సొంతంగా స్థలం ఉన్న పేదలు 22,757 మందితో మొత్తం 70,119 మందికి ఇళ్లను గత ప్ర భుత్వం మంజూరు చేసింది. రూ.1.80 లక్షలు గృహనిర్మాణ సాయంతో పాటు ఇంటి నిర్మాణంలో వారికి అడుగడుగునా అండగా నిలిచింది. సబ్సిడీపై ఐరన్, సిమెంట్, ఇసుకను ఉచితంగా అందజేసింది. లబ్ధిదారులపై రవాణా చార్జీల భారం పడకుండా లేఅవుట్ల సమీపంలోనే వీటి స్టాక్ పాయింట్లను ఏర్పాటుచేశారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న లబ్ధిదారులకు అదనంగా రూ.35,000 రుణసదుపా యం కల్పించారు. పనుల వేగవంతానికి కో ట్లాది రూపాయలు వెచ్చించి జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేశారు. పదేళ్ల తర్వాత ఇంటిపై సర్వహక్కులు ఉండేలా లబ్ధిదారుల పేరిట స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి కన్వెన్షన్ డీడ్ అందజేసే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో దాదాపు 28 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. సాక్షి, భీమవరం: ఇళ్లు లేని పేదలకు మూడు సెంట్లు స్థలం ఇస్తామంటూ ఎన్నికల్లో చెప్పుకొచ్చిన చంద్రబాబు ఇప్పటివరకు సెంటు స్థలం కూడా పంపిణీ చేయలేదు. ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు సాయం అందిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రకటించినా ఇప్పుడు ఆ ఊసేలేదు. గత ప్రభుత్వంలో మంజూరు చేసి నిర్మాణంలో ఉన్న వాటినే పూర్తిచేసి తమ ఖాతాలో వేసుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగా గత మే నెలాఖరు నాటికి జిల్లాలో పునాది, లింటల్ దశల్లోని 9,107 ఇళ్లను పూర్తిచేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గృహ నిర్మాణ సాయం రూ.1.80 లక్షలు కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు అదనంగా రూ.50 వేల సాయాన్ని ప్రకటించింది. ని ర్మాణ వ్యయం భారీగా పెరగడంతో ఇది ఏమాత్రం సరిపోక లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. నిర్మాణం.. బహుభారంరానున్న ఉగాది నాటికి జిల్లాలో 9,135 ఇళ్లను పూర్తిచేయాలని నవంబరు 15న లక్ష్యంగా నిర్ణయించా రు. కాగా సిమెంట్, ఐరన్, ఇటుక తదితర నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడంతో రూ.6 లక్షలు ఉంటేనే గాని ఇంటి నిర్మాణం పూర్తికాని పరిస్థితి. ప్రభుత్వ సాయం చాలడం లేదని లబ్ధిదారులు అంటున్నారు. మరో పక్క సంక్షేమ పథకాల అమలు నిలిచిపోవడంతో పేదలు దగ్గర డబ్బులు లేక ఇ బ్బంది పడుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ సాయం పెంచాలని కోరు తున్నారు. త్వరితగతిన ఇళ్లను నిర్మించుకోవాలని హౌసింగ్ అధికారులు ఒత్తిడి తెస్తున్నా ఆర్థిక పరమైన ఇబ్బందులతో చాలా మంది లబ్ధిదారులు ముందుకురాక గత మూడు నెలల కాలంలో కేవలం 200 ఇళ్లు మాత్రమే పూర్తికావడం గమనార్హం. ఉగాదికి మరో మూడు వారాలు గడువు మాత్రమే ఉండటంతో లక్ష్యం చేరుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గూడు.. గోడు పెరిగిన వ్యయం.. చాలని సాయం ముందుకు సాగని గృహ నిర్మాణ పనులు ఉగాది నాటికి 9,135 ఇళ్లు పూర్తిచేయాలని టార్గెట్ ఇప్పటికి పూర్తయినవి కేవలం 200 గృహాలే గత ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో స్థలాల పంపిణీ జిల్లాలో ఇళ్ల నిర్మాణం కోసం ఎదురుచూస్తున్న పేదలు ఎందరో ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి మరో మూడు నెలల్లో రెండేళ్లు పూర్తికానుంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఒక్క ఇళ్లు మంజూరు చేయకపోవడం గమనార్హం. పీఎం ఆవాస్ యోజన కింద ఇటీవల పట్టణ ప్రాంతాలో 595 ఇళ్లను మంజూరు చేశారు. ఆవాస్ ప్లస్లో భాగంగా జిల్లాలో 16,773 ఇళ్లను సర్వే చేసిన అధికారులు 10,789 మంది అర్హులుగా గుర్తించారు. వీరంతా కొత్త మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. -
ఉండి టీడీపీలో వర్గపోరు.. వెంకటేశ్వర రాజు ఇల్లు, ఆఫీసు కూల్చివేత
సాక్షి, పశ్చిమ గోదావరి: ఏపీలోని ఉండి నియోజకవర్గం టీడీపీలో వర్గపోరు పరాకాష్టకు చేరుకుంది. ఉపసభాపతి, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు దౌర్జన్య కాండపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తురి వెంకటేశ్వర రాజు (బొడ్డియ్య రాజు) ఆవేదన వ్యక్తం చేశారు.వివరాల మేరకు.. ఉండి మండలం వెలిపర్రు గ్రామంలో వెంకటేశ్వర రాజు పార్టీ ఆఫీసు, ఇంటిని సర్వే చేసి కూల్చేస్తామంటూ నిన్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయమే ఆయన ఇల్లు, టీడీపీ పార్టీ కార్యాలయాన్ని పోలీసులతో మొహరించి జేసీబీలతో అధికారులు కూల్చేశారు. అయితే, పొత్తూరి వెంకటేశ్వర రాజుకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో భీమవరం నీలాద్రి ఆస్పత్రిలో చేరారు. దీంతో, పోలీసులు ఆసుపత్రికి వద్దకు చేరుకున్నారు. -
అక్రమాలకు ఆరోగ్యసిరి
తణుకుకు చెందిన ఓ మహిళ ప్రమాదవశాత్తూ పడిపోవడంతో కాలు విరిగింది. కుటుంబసభ్యులు ఆమెను స్థానికంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కార్డు చూపించి వైద్యం చేయాలని కోరారు. అప్రూవల్ వచ్చే వరకూ ఖర్చులు భరించాలంటూ, ఎక్స్రే, రక్త పరీక్షలంటూ ఆస్పత్రి సిబ్బంది రూ.6,700 వరకు కట్టించుకున్నారు. రూమ్లో అడ్మిట్, వైద్యం నిమిత్తం మరో రూ.15,000 కట్టాలన్నారు. తాము చెల్లించలేమని కుటుంబ సభ్యులు ఆమెను నెట్వర్క్ పరిధిలోని మరో ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ ఉచితంగా పరీక్షలు, శస్త్రచికిత్స చేశారు. గతంలో పారదర్శకంగా.. ఎన్టీఆర్ వైద్య సేవల్లో డబ్బులు తీసుకున్నట్టు నిర్ధారణయితే పెద్ద మొత్తంలో పెనాల్టీతో పాటు రిజిస్ట్రేషన్ రద్దు నిమిత్తం సిఫార్సు చేసేందుకు కూడా వెనుకాడేది లేదు. – కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఎన్టీఆర్ వైద్య సేవలపై సెప్టెంబరులో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ నాగరాణి ఆస్పత్రి యాజమన్యాలను ఇలా హెచ్చరించారు. ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత సేవలు అందిస్తుందని, ఎక్కడైనా డబ్బులు వసూలు చేస్తే సహించమన్నారు. కొన్ని ఆస్పత్రులపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని, వాస్తవం అని తేలితే పెద్ద మొత్తంలో పెనాల్టీతో పాటు, రిజిస్ట్రేషన్ రద్దు నిమిత్తం సిఫార్సుకు వెనుకాడేది లేదన్నారు. 16 నెట్వర్క్ ఆస్పత్రులపై ఆరోపణలు రాగా వాటిలో రెండింటిపై రుజువు కావడంతో అప్పట్లో జరిమానాలు విధించారు. సాక్షి, భీమవరం: కూటమి ప్రభుత్వం వైఫల్యాన్ని ఆసరాగా చేసుకుని ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) సేవలను కొన్ని ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. అధికారుల హెచ్చరికలను బేఖాతరు చే స్తూ ఉచిత వైద్య సేవలకు రోగుల నుంచి సొ మ్ములు వసూలు చేస్తున్నాయి. జిల్లాలో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు అందించే ప్రభుత్వ ఆస్పత్రులు 42 ఉండగా ప్రైవేట్ ఆస్పత్రులు 30 వరకు ఉన్నాయి. ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో 22 మల్టీ స్పెషాలిటీ, ఎనిమిది డెంటల్ ఆస్పత్రులు ఉన్నాయి. ఈ పథకం కింద వైద్యసేవ పొందే రోగికి ఉచిత అడ్మిషన్, అవసరమైన వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలతో పాటు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకూ మందులు, రూమ్ సదుపాయం, అల్పాహారం, రెండు పూటలా భోజనం, వైద్యసేవలు అందించాలి. డిశ్చార్జి సమయంలో రోగికి సరిపడా మందులు ఇచ్చి పంపాలి. కాగా మత్తు ఇచ్చేందుకనో, వైద్యానికి అప్రూవల్ రావడానికి ఆలస్యమవుతుందనో, కొన్ని వైద్య పరీక్షలు బయట చేయించాలనో, మందులు కోసమనో.. రకరకాల కారణాలు చెప్పి రోగుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. ఎందుకొచ్చిన గొడవన్నట్టు చాలామంది రోగులు ఆస్పత్రి యాజమాన్యాలు అడిగినంత సొమ్ములు చెల్లించి అక్కడితో వదిలేస్తున్నారు. కొందరు బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ముగ్గురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై తణుకులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి రూ.3.02 లక్షలు, భీమవరంలోని మరో ఆస్పత్రికి రూ.68 వేలు జురిమానాలు విధించారు. కొద్దినెలల క్రితం 16 ఆస్పత్రులపై ఫిర్యాదులు రాగా వీటిలో రెండింటిపై ఆరోపణలు నిర్ధారణ కావడంతో వాటికి ఫెనాల్టీలు వేశారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిల్లుల విడుదల చేయకపోవడం, అజమాయిషీ కొరవడటంతో నెట్వర్క్ ఆస్పత్రుల ఇష్టారాజ్యంగా మారిందంటున్నారు. అనధికార వసూళ్లకు పాల్పడుతూ పేద రోగుల జేబులను ఖాళీ చేస్తున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయడం ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వైద్య సేవ.. అందని తోవ ఆపదలో ఆరోగ్యశ్రీ కూటమి పాలనలో కొరవడిన అజమాయిషీ నెట్వర్క్ ఆస్పత్రుల చేతివాటం ఉచిత సేవలకు రోగుల నుంచి డబ్బుల వసూళ్లు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా పథకం అమలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలుచేసింది. క్యాన్సర్ తదితర ఖరీదైన జబ్బుల చికిత్సకు పరిమితి లేకుండా సాయం అందించింది. 1,059 చికిత్సల సంఖ్య (ప్రొసీజర్ల)ను 3,257కి పెంచడంతో పాటు కు టుంబానికి రూ.5 లక్షలు ఉన్న వ్యయ పరి మితిని రూ.25 లక్షలకు పెంచడం ద్వారా పేదల ఆరోగ్యానికి మరింత భరోసా కల్పించారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. వైద్య సేవలకు ఆటంకం రాకుండా నిరంతరం అందిస్తూ వచ్చారు. రోగి కోలుకునే వరకు కుటుంబ పోషణకు ఆరోగ్య ఆసరా పథకం కింద అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించేవారు. అక్రమాలకు తావులేకుండా 14400 టోల్ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసే వీలు కల్పించారు. ఇలా ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారు. -
స్తంభించిన సహకారం
● సొసైటీ ఉద్యోగుల సమ్మెబాట ● సహకార సంఘాల్లో అందని సేవలు ● జిల్లాలో 122 సొసైటీల్లో 415 మంది ఉద్యోగులు ● జీఓ 36ను అమలు చేసి ఉద్యోగులందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చి జీతభత్యాలు చెల్లించాలి. ● సహకార ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచాలి. ● ప్రతి ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణ చేయాల్సి ఉంది. అయితే 2019, 2024లో చేయనందున రెండు వేతన సవరణలతోపాటు అప్పటివరకు మధ్యంతర భృతి చెల్లించాలి. ● 2019 తరువాత సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలి. ● సహకార ఉద్యోగులకు ఆరోగ్య బీమా రూ.5 లక్షలు కల్పించడంతో పాటు టర్మ్ ఇన్సూరెన్స్ రూ.20 లక్షలకు కల్పించాలి. ● ఉద్యోగులు మరణిస్తే కారుణ్య నియామకం కింద వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి సొసైటీల్లో ఉద్యోగం ఇవ్వాలి. ఆకివీడు: తమ సమస్యల పరిష్కారం, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సహకార సంఘాల ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఈనెల 16 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లడంతో జిల్లాలోని 122 సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్లు) మూతపడ్డాయి. సొసైటీల కార్యకలాపాలు స్తంభించడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. డిసెంబరు మొదటి వారం నుంచి జనవరిలో సంక్రాంతి వరకు దశల వారీగా పోరాటాలు చేసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం చర్చలకు కూడా పిలవలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. జిల్లాలో 415 మంది ఉద్యోగులు జిల్లాలోని 122 సొసైటీల్లో 415 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా సమ్మెలోకి వెళ్లారు. సహకార ఉద్యోగులకు ప్రభుత్వ గుర్తింపు లేదని, పింఛన్, గ్రాట్యూటీ, బీమా సౌకర్యాలు లేవని వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు సంఘాల్లో ఉద్యోగుల జీతభత్యాలు ఇప్పటికీ డ్యూటీ పద్దుల ద్వారానే డ్రా చేస్తున్నారు. సొసైటీల పాలకవర్గం నిర్ణయం మేరకే జీతభత్యాలు ఇవ్వడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వమే నడపాలి : పాలకవర్గాల ద్వారా నడుస్తూ ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న సొసైటీలను ప్రభు త్వమే నడపాలని రైతులు, ఉద్యోగులు కోరుతున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన రీతిలోనే సంఘాలను విలీనం చేయాలని అంటున్నారు. దీనిద్వారా రుణాల పంపిణీకి, వడ్డీ రాయితీలు, ఫిక్స్డ్ డిపాజిట్ల భద్రత, ఇతర బ్యాంకింగ్ సేవల్లో పారదర్శకత ఏర్పడుతుందని అంటున్నారు. సహకార వ్యవస్థలో పారదర్శకత, నిజాయతీ, నిబ ద్ధత, నమ్మకం ఏర్పడటానికి ప్రభుత్వం వాటిని విలీనం చేయాలి. రైతులను భాగస్వామ్యం చేయాలి. ఆర్టీసీ ఉద్యోగుల మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగులుగా వీరిని గుర్తించాలి. ఈ మేరకు ప్రభుత్వాలు కమిటీని వేసి నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. – బొబ్బిలి బంగారయ్య, కో–ఆపరేటివ్ ఎంప్లాయీస్ సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఆకివీడు -
కక్ష సాధింపు చర్యలు ప్రారంభమైనట్టేనా?
ఉండి: ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు ఇంటిని, ఆయన కార్యాలయాన్ని కూలగొట్టేందుకు అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయంటూ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎప్పుడూ లేనిది ఎమ్మెల్యేపై వ్యాఖ్యలు చేసిన అనంతరం ఇరిగేషన్ అధికారులు, డీసీ సంఘ నాయకులకు అప్పుడే వెలివర్రు పంటబోదె గుర్తు కొచ్చినట్టుగా సర్వేయర్, వీఆర్వో, డీసీ సంఘ చైర్మన్ తోట ఫణి, వైస్ చైర్మన్ మంతెన సాయిలచ్చిరాజు, ఇరిగేషన్ ఏఈ ఫణిశంకర్ ఆధ్వర్యంలో పలువురు వెలివర్రులో పంట బోదె కొలతలు కొలిచారు. ఇది మా ఆస్తి అంటూ డీసీ చై ర్మన్ వ్యాఖ్యలు చేసినట్టుగా వీడియోలు వెలువడ్డాయి. అక్రమాలను బయటపెట్టాననే.. దీనిపై వెంకటేశ్వరరాజు స్పందిస్తూ తన ఇంటిని, టీడీపీ కార్యాలయాన్ని కక్ష గట్టి కూలగొట్టినా పందిరి వేసుకుని డిప్యూటీ స్పీకర్ అక్రమాలు, అన్యాయాలను నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తానని తేల్చిచెప్పారు. రఘురామకృష్ణరాజు అక్రమాలను బయటపెడుతున్నాననే ఉద్దేశంతోనే తనపై కక్ష గట్టారన్నారు. శనివారం వాటిని కూలగొట్టేందుకు వస్తామని తనకు హెచ్చరికలు జారీ చేశారని తెలిపారు. తన ఇల్లు, కార్యాలయం పోయినా ఫరవాలేదు గానీ ఎమ్మెల్యే అక్రమాలను అరికట్టాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి అచ్చెన్నాయుడు, మరో మంత్రి నిమ్మల రామానాయుడులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు వీడియోలో మాట్లాడారు. బాధితులంతా తరలిరండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అక్రమాలను అరికట్టకపోతే ఉండి నియోజకవర్గంలో టీడీపీ వినాశనం తథ్యమని వెంకటేశ్వరరాజు అన్నారు. నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులు, ఎమ్మెల్యే చేతిలో ఇళ్లు కోల్పోయినవారంతా వచ్చి తనతో కలవాలని ఆయన కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు క్రమశిక్షణతో ఉండాలని చెప్పగా.. తాను విమర్శలు మానుకున్నానని తెలిపారు. డీసీ చైర్మన్ తోట ఫణి తన ఇల్లు, కార్యాలయం పడగొడతానని హెచ్చరించగా.. డీసీ వైస్ చైర్మన్ సాయిలచ్చిరాజు ఇరిగేషన్కు సంబంధించి కాదని, ఇది ఇరిగేషన్ జాబితాలో లేదని కొట్టించమంటున్నారు కాబట్టే కొట్టిస్తున్నామని అంటున్నారని వెంకటేశ్వరరాజు వివరించారు. నియోజకవర్గంలో ఇళ్లు, చర్చిలు, మసీదులు, ఆలయాలు కోల్పోయిన వారంతా శనివారం ఉదయం 10 గంటలకు వెలివర్రు రావాలని, ఇక్కడి నుంచే అమరావతికి పాదయాత్రగా వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబా బు, మంత్రి లోకేష్లను కలిసి వివరిద్దామని వెంకటేశ్వరరాజు తీవ్ర ఆవేశంతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియోల్లో మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్పై టీడీపీ నేత తిరుగుబాటు వ్యాఖ్యలు ఆయన ఇంటికి వెళ్లి కొలతలు వేసిన అధికారులు కూలగొట్టేందుకే అంటూ సోషల్ మీడియాలో వీడియోలు హల్చల్ -
నిధుల దుర్వినియోగంపై విచారణ చేయాలి
చింతలపూడి: చింతలపూడి మహిళా మార్ట్లో నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని సీఐటీయూ, ఏపీ వెలుగు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వీఓఏలు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. వెలుగు వీఓఏలు, మెప్మా ఆర్పీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాషిణి మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం సుమారు రూ.48 లక్షల పెట్టుబడితో ప్రారంభించిన మహిళా మార్ట్ అవినీతి, నిర్లక్ష్యం, అక్రమాల కేంద్రంగా మారిందని ఆరోపించారు. ప్రస్తుతం మార్ట్లో రూ.4 లక్షల విలువైన సరుకులు మాత్రమే ఉండటం అనుమానాస్పదంగా ఉందన్నారు. మిగిలిన రూ.44 లక్షల విలువైన సరుకులు ఎక్కడికి వెళ్లాయో అంతుచిక్కడం లేదన్నారు. మహిళలకు లాభాలు ఇస్తామని హామీ ఇచ్చి, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. అలాగే గణిజర్లకి చెందిన వీఓఏ ఈదర సరితను రాజకీయ ఒత్తిళ్లతో అక్రమంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్ డీఎల్ ప్రమద్వరకు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్వీఎస్ఎన్ నారాయణ, మెప్మా ఆర్పీల సంఘ అధ్యక్షురాలు ఝాన్సీ, కార్యదర్శి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్లో జనగణన
భీమవరం (ప్రకాశంచౌక్): 2027 జనాభా లెక్కల సేకరణకు ప్రత్యేకత ఉందని, డిజిటల్ రూపంలో వివరాలు సేకరించడంతో పాటు వెబ్ పోర్టల్ ద్వారా ప్రజలు వ్యక్తిగతంగా సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకునే వీలుంటుందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. జనాభా లెక్కల సేకరణపై ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులు కలెక్టర్లతో రాష్ట్రస్థాయి సమావేశాన్ని అమరావతిలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నాగరాణి సమా వేశానికి హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జనగణనకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): సేవాభావంతో విభి న్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి సూచించారు. కలెక్టరేట్లో తొలిసారిగా శుక్రవారం విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఆరోగ్య సమస్యలు, వై ద్యం, ఉపాధి, రూ.15 వేల పింఛన్, బ్యాంకు రుణాల కోసం పలువురు అర్జీలు అందించారు. మొత్తంగా 40 అర్జీలను స్వీకరించారు. నలుగురు శారీరక దివ్యాంగులకు జేసీ స్మార్ట్ఫోన్లు అందించారు. విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు బి.రామ్కుమార్, డీఎంహెచ్ఓ జి.గీతాబాయి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరుపై జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించినట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. జిల్లాలోని 916 మంది అధికారులు బుధవారం 20 మండలాల్లో పాఠశాలలను తనిఖీ చేసి పథకం అమలును పరిశీలించినట్టు చెప్పారు. 916 పాఠశాలల్లో 61,573 మంది విద్యార్థులకు 52,171 మంది హాజరుకాగా 50,033 మంది మధ్యాహ్న భోజనాన్ని భుజించారన్నారు. పథకాన్ని పటిష్టంగా అమ లు చేయాలని, ఆహార పదార్థాల నాణ్యతలో రాజీ పడబోమని అన్నారు. పెదవేగి : పెదవేగి మండల కేంద్రంలో 140 ఏళ్ల వయసున్న తురాయి చెట్టును కూలగొట్టడం చర్చనీయాంశంగా మారింది. చెట్టు ఉన్న ప్రాంతం తు రాయి చెట్టు సెంటర్గా పేర్గాంచింది. పంచాయతీ అధికారులకు తెలియకుండా శివరాత్రి రోజున ఈ చెట్టును కొందరు కూలగొట్టారు. దీనిపై సమాధానం చెప్పే నాథుడే కరువయ్యాడు. ఇదిలా ఉండ గా చెట్టు తొలగింపు తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ సీపీల మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఇక్కడ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఉండటంతో అదే ప్రాంతంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని భావించి చెట్టును తొలగించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహాన్ని వైఎస్సార్సీపీ నాయకులు ఏర్పాటుచేశారు. అయితే ఇది ప్రభుత్వ స్థలం అని పోలీసులు జోక్యం చేసుకుని ఆంజనేయస్వామి విగ్రహాన్ని తొలగించారు. విగ్ర హం ఏర్పాటుచేసిన వారికి నోటీసులు ఇచ్చారు. ఏలూరు(మెట్రో): ప్రభుత్వ ఉద్యోగుల స మస్యల పరిష్కారానికి ప్రతినెలా మూడో శుక్రవారం ఎంప్లాయిస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్టు డీఆర్వో వి.విశ్వేశ్వరరావు తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నట్టు ఆయన చెప్పారు. 46 మంది ఉద్యోగులు అర్జీలు సమర్పించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్.దేవకీదేవి, హౌసింగ్ డీడీ జి.సత్యనారాయణ, డీపీఓ కె.అనురాధ, ఏపీఎస్జీఓ జిల్లా ప్రెసిడెంట్ చోడగిరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
దాళ్వా వరిలో జింక్ లోపం
అత్తిలి: జిల్లాలో సాగులో ఉన్న దాళ్వా వరి పంటకు పలు ప్రాంతాల్లో జింక్లోపం, సల్పైడ్ విష ప్రభావం ఆశించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. రైతులు ఎర్ర తెగులుగా పొరబడే ఈ లోపాన్ని త్వరగా గుర్తించి, నివారణా చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. సార్వా కంటే దాళ్వా వరిలో నారు నాటిన 2 నుంచి 4 వారాల్లో జింక్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. మెరక తీసిన పొలాల్లో జింక్ లోపం ఆశిస్తుంది. సేంద్రియ పదార్ధం వేసిన పొలాల్లో నారుమడిలో నారు తీసేసిన తరువాత నాట్లు వేసిన పంట చేలల్లో చలి, మంచు అధికంగా ఉండే ప్రాంతాలు, చౌడు ఉప్పు నేలల్లో భాస్వరం ఎరువు సిఫార్సుకు మించి ఎక్కువ మోతాదులో వేసిన చేలల్లో జింక్లోపం కనిపిస్తుంది. లక్షణాలు.. జింక్ లోపించినప్పుడు మొక్కల పెరుగుదల కుంటుపడి, ఆకులు సన్నగా వచ్చి కొన్నిసార్లు నత్రజని లోపాన్ని పోలి ఉంటాయి. ప్రధానంగా మొక్క పైనుంచి 3 లేదా 4 ఆకు మధ్య ఈనె తెల్లగాపాలిపోతుంది. మధ్య ఈనె ముందుగా ఆకుపచ్చ నుంచి పసుపు రంగుకు తరువాత తెలుపు రంగుకు మారుతుంది. తరవాత దశల్లో ముదురు ఆకు చివరలో మధ్య ఈనెకు ఇరుపక్కలా తుప్పు రంగు లేదా ముదురు ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. ప్రతి 3 రుతువులకు ఒక సారి, అదే కొత్తగా వరి సాగుచేసే నేలలు లేదా చౌడు నేలల్లో రుతువులకు ఒకసారి ఎకరాకు 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ వేయాలి. దాళ్వా వేసే ప్రాంతాల్లో ప్రతి రబీలో జింక్ సల్ఫేట్ వేయాలి. ఎట్టి పరిస్థితుల్లో భాస్వరం సంబంధిత ఎరువుల్లో జింక్ సల్ఫేట్ కలిపి వేయరాదు. కనీసం 2 – 3 రోజుల వ్యవధి ఉండాలి. భూసార పరీక్షల్లో జింక్ స్థాయి 0.65 ఎర్ర నేలల్లో, నల్ల నేలల్లో 0.7 పీపీఎం కంటే తక్కువగా ఉన్నప్పుడు ముందుగా నివారణ చర్యలు చేపట్టాలి. సల్ఫైడ్ లక్షణాలు, నివారణ చర్యలు ఈ సమస్య ప్రధానంగా మురుగు నీటి సౌకర్యం లేక నీరు నిలిచిపోయే పల్లపు భూముల్లో, వేర్లకు గాలి సరిగా తగలని పరిస్థితుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నేల నుంచి కుళ్లిన కోడిగుడ్ల వాసనలా ఉండే హైడ్రోజన్ సల్ఫైడ్ దుర్వాసన అకస్మాత్తుగా వెలువడుతుంది. ప్రభావిత మొక్కలను వేర్లతో బయటకు తీసి పరిశీలించినప్పుడు, వేర్లపై నలుపురంగు మచ్చలు కనిపిస్తాయి. అవి గాలికి తగిలిన కొన్ని సార్లు ఏవిధమైన లక్షణాలు కనిపించకుండా వెంటనే ఎరుపులేక గోధుమరంగుకు మారుతాయి. నత్రజని, భాస్వరం ఎరువులు వేసినప్పటికీ పైరు వేసిన 2 – 5 వారాల మధ్య పైరు మీద లోప ఏపుగా ఎదగదు. నీటిని మురుగు నీటి కాలువల ద్వారా బయటకు పంపి, చేలను ఎండగట్టడం ద్వారా వేర్లకు గాలి ప్రసరణ మెరుగుపడి, సల్ఫైడ్ వల్ల కలిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు అని మండల వ్యవసాయశాఖ అధికారి టీకే రాజేష్ చెప్పారు. పాడి–పంట -
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సమావేశం
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన మాధవ కల్యాణ మండపంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ (హెచ్డీపీటీ) ఆధ్వర్యంలో గురువారం రాత్రి అర్చకులు, ట్రస్ట్ జిల్లా కో–ఆర్డినేటర్లతో విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ట్రస్ట్ ఛైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీవారి దేవస్థానం ఏఈఓ పి.నటరాజారావు, రాష్ట్ర కో–ఆర్డినేటర్ కోట సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అర్చకులు తమ జీవనోపాధి, గౌరవ వేతనాల పెంపు, పెండింగ్ బకాయిలు విడుదల, చిన్న దేవాలయాల అభివృద్ధి, దేవాలయ ఆస్తుల రక్షణ, హుండీ లెక్కల పారదర్శకత, గోశాలల పరిరక్షణ, అర్చకుల వైద్య–పింఛన్ భద్రత తదితర అంశాలపై విస్తృతంగా విన్నపాలు చేశారు. వీటిపై శ్రీనివాసులు స్పందిస్తూ అర్చకుల అభ్యర్థనలను పూర్తిగా అర్థం చేసుకున్నానని తెలిపారు. వీటిని సమగ్రంగా సంకలనం చేసి ప్రభుత్వం, దేవాదాయ శాఖ అధికారులతో చర్చించి ప్రతిపాదనల రూపంలో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పెదవేగి: ప్రమాదవశాత్తు కాలు జారి పడడంతో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పెదవేగి పోలీసులు కేసు నమోదు చేశారు. పెదవేగి ఎస్సై ఎం.హరిగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. పెదవేగి మండలం విజయరాయిలోని నూజివీడు సీడ్స్ ఫ్యాక్టరీలో బిహర్కు చెందిన దుర్గేష్ గత 5 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. దుర్గేష్ తమ్ముడైన చోటు కుమార్సాహ్ కూడా ఆరు నెలల క్రితం అన్న పనిచేస్తున్న ఫ్యాక్టరీలోనే చేరాడు. ఈ నెల 19న అన్నదమ్ములు ఓవర్ డ్యూటీ చేసే ప్రక్రియలో ఫ్యాక్టరీలో పైకి ఎక్కి పనిచేస్తుండగా, ప్రమాదవశాత్తు దుర్గేష్కు కాలు జారి కింద పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలైన అతడిని హుటాహుటిన ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 20న దుర్గేష్(32) మృతిచెందినట్లు ఆసుపత్రి సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. ద్వారకాతిరుమల: మండలంలోని గొల్లగూడెంలో ఓ వ్యభిచార గృహంపై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. నిర్వాహకురాలిని అరెస్టు చేసి, ఇద్దరు విటులను, బాధితురాలిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గొల్లగూడెం గ్రామానికి చెందిన పంచవ నాగమణి ఇంటికి విటులను రప్పించి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు భీమడోలు సీఐ యుజే విల్సన్, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్లకు సమాచారం అందింది. దాంతో వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేసేందుకు సిబ్బందితో కలసి మెరుపుదాడి చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరు విటులను, బాధితురాలిని అదుపులోకి తీసుకున్నారు. నాగమణిని అరెస్టు చేసి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్సై సుధీర్ తెలిపారు. -
లడక్లో పర్వతారోహణ శిక్షణకు ఎంపిక
పెంటపాడు: పెంటపాడు ప్రభుత్వ పోస్టు బేసిక్ పాఠశాలలో చదువుతున్న దివ్యాంగ విద్యార్థి అన్నంనీడి సత్యనారాయణ లడక్లో పర్వతారోహణ శిక్షణకు ఎంపికయ్యాడు. ఎంఈవో ఎం.శ్రీనివాస్ విద్యార్థిని అభినందించారు. సత్యనారాయణ ఉపాధ్యాయిని సాయి స్వరూప శిక్షణలో పర్వతారోహణపై ఆశక్తి పెంచుకున్నాడు. ఎవరెస్టు అధిరోహణకు రాష్ట్ర స్థాయిలో ఎంపికయ్యాడు. జాతీయ స్థాయిలో హిమాలయ పర్వత శ్రేణుల వద్ద లడక్లో జరగనున్న హై ఆల్టిట్యూడ్ శిక్షణకు ఎంపికై నట్లు తెలిపారు. ఉపాధ్యాయిని సాయి స్వరూప మాట్లాడుతూ గండికోట అడ్వెంచర్స్ స్పోర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు శిక్షణ పొందాడన్నారు. రాష్ట్రానికి చెందిన 25 మంది దివ్యాంగ విద్యార్థులతో పోటీపడి ఉన్నతశిక్షణకు ఎంపికై న సత్యనారాయణకు ఫిబ్రవరి 23 నుంచి 12 రోజులపాటు శిక్షణ ఉంటుందన్నారు. -
నానో టెక్నాలజీపై విస్తృత పరిశోధనలు
తాడేపల్లిగూడెం: నానో టెక్నాలజీపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిఽశోధనలు సాగుతున్నాయని దక్షిణ కొరియాలోని చుంగ్–ఆంగ్ విశ్వవిద్యాలయ బ్రెయిన్ పూల్ సైంటిస్టు డాక్టర్ గెడ్డా గంగరాజు తెలిపారు. ఏపీ నిట్లో కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం గ్రీన్ సింథసిస్ ఆఫ్ నానో మెటీరియల్స్ ఆఫ్ నానో మెటీరియల్స్ ఫర్ బయోమెడికల్ అండ్ ఎన్విరాన్మెంట్ అప్లికేషన్ అంశంపై విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. పర్యావరణానికి హాని కలుగకుండా సహజ వనరులను ఉపయోగించి నానో పదార్తాలను తయారుచేసే విధానాన్నే గ్రీన్ సింథసిస్ అంటారన్నారు. ఈ గ్రీన్ సింథసిస్ పద్ధతి పర్యావరణ పరిరక్షణతో పాటు సమర్ధవంతమైన జీవవైద్య పరిష్కారాలను చూపించే భవిష్యత్ సాంకేతికతగా గుర్తింపు పొందుతుందన్నారు. కెమికల్ ఇంజనీరింగ్ విభాగాఽధిపతి డాక్టర్ వినోద్కుమార్ రాజా, ఆచార్యులు కుల్దీప్ రాయ్, సుశాంత్ బెహరా తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): యూనియన్ బ్యాంకులో ప్రవేశపెట్టిన కొత్త డిపాజిట్ పథకంపై ఖాతాదారులకు అవగాహన కల్పించేందుకు బ్యాంకు సిబ్బంది శుక్రవారం బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం వీరమ్మ పార్కు వద్ద ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ కెఎంఎస్ ఉదయగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 444 రోజులకు సాధారణ ప్రజలకు 6.6% వడ్డీ లభిస్తుందని, సీనియర్ సిటిజన్స్కు 7.10 శాతం, సూపర్ సీనియర్లకు 7.35 శాతం వడ్డీ లభిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ హెడ్ వెంకన్న బాబు, సత్యనారాయణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగేంద్ర ప్రసాద్, సీనియర్ మేనేజర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కలిదిండి(కై కలూరు): బహిర్భూమికి వెళ్ళిన వ్యక్తి కాల్వలో పడి ఊపిరాడక మరణించిన ఘటన కలిదిండి మండలం కోరుకొల్లు పెద్ద కాల్వ వద్ద శుక్రవారం జరిగింది. కలిదిండి పోలీసుల వివరాల ప్రకారం కోరుకొల్లుకు చెందిన వీరవల్లి ప్రసాద్(28) ఉదయం 10 గంటల ప్రాంతంలో కాల్వలో కొట్టుకుపోతున్న ప్రసాద్ను స్థానికులు రక్షించి కోరుకొల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్ళారు. డాక్టర్ పరీక్షించి అప్పటికే మరణించాడని ధ్రువీకరించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తూకం.. నిలువునా మోసం
తణుకు అర్బన్ : చేపలు, మాంసం, ఇతర సరుకులు కొనుగోలు చేస్తున్నారా.. అయితే దుకాణాల్లో కాటాలను జాగ్రత్తగా గమనించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తూకాల్లో ఏకంగా కిలోకు 150 గ్రాములపైనే తేడాలు వస్తున్నాయి. తూనికలు, కొలతల అధికారులు తణుకులో ఈనెల 17వ తేదీన నిర్వహించిన దాడుల్లో ఈ విషయం బయటపడింది. తనిఖీల్లో భాగంగా వెళ్లిన ప్రతి దుకాణంలోను తూకంలో భారీ వ్యత్యాసాలు వచ్చాయి. ఎలక్ట్రానిక్ తూకాలను సైతం తూకం ఎక్కువగా చూపే విధంగా సెట్టింగ్ చేసుకున్న తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. తక్కెడలు, ఇనుప కాటాలు వినియోగంలో ఉన్న సమయంలో అధికంగా మోసం జరిగేదని, ఎలక్ట్రానిక్ కాటాలు కదా అటువంటి మోసం జరగదనుకుంటున్న ప్రజానీకానికి షాకిచ్చే విధంగా తూకాన్ని వారికి అనుకూలంగా మార్చేస్తున్నారు. తణుకులో తూనికలు, కొలతల విభాగానికి చెందిన అధికారులు తూకాలు చెక్ చేస్తున్నారనే విషయం తెలుసుకున్న కొందరు మాంసం, చేపల దుకాణాల యజమానులు తూకాలను దాచడం, దుకాణాలు మూసేయడం వంటివి లీగల్ మెట్రాలజీ అధికారుల దాడుల్లో బట్టబయలైంది. తూకంలో వ్యత్యాసం తెలుసుకున్న ప్రజానీకం మార్కెట్లో తూకంతో ఈ విధంగా మోసం చేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిలోకి 150 గ్రాములు తగ్గించేస్తున్నారు.. తణుకు మార్కెట్లో ఒక చికెన్ దుకాణంలో అరకిలో చికెన్ కొనుగోలు చేస్తే 400 గ్రాములు మాత్రమే వచ్చిందనే ఫిర్యాదుతో తణుకులో లీగల్ మెట్రాలజీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా తణుకు ఉండ్రాజవరం రోడ్డులోని చేపల దుకాణంలో రెండు కాటాలు కూడా 5 కిలోల రాయి పెట్టిన సందర్భంగా 5 కిలోల 725 గ్రాములు చూపించడం ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే కిలో చేపకు 150 గ్రాములు తక్కువ తూకం వస్తుందని అధికారులు చెబుతున్నారు. అలాగే తణుకు మునిసిపాలిటీ పరిధిలోని మరికొన్ని దుకాణాల్లో సైతం నిర్వహించిన తనిఖీల్లో కిలోకి 100 నుంచి 150 గ్రాముల వరకు అధికంగా బరువు చూపుతుందని నిర్ధారణ అయ్యింది. తనిఖీలు చేసిన మూడు దుకాణాల్లో మూడు కూడా తూకం వ్యత్యాసం రావడం చూస్తుంటే మార్కెట్లో చేపలు, మాంసం దుకాణాలతోపాటు ఇతర దుకాణాల్లో తూకాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కక్కుర్తి కాటా తణుకు మార్కెట్లో చేపలు, మాంసం దుకాణాల్లో తూకంలో వ్యత్యాసాలు లీగల్ మెట్రాలజీ దాడుల్లో బట్టబయలైన వైనం ఆందోళనలో ప్రజానీకం.. కఠిన చర్యలు తప్పవంటున్న అధికారులు మార్కెట్లోని దుకాణాల్లో ఉన్న తూకాలు నిబంధనల ప్రకారం సక్రమంగా లేదని నిర్ధారణ అయితే కాటాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు కేసులు నమోదుచేస్తాం. చాలా దుకాణాల్లో లీగల్ మెట్రాలజీ విభాగంచే కాటాలను సీలు వేయించుకోకుండా వినియోగిస్తున్నారు.. వారిపై కేసులు నమోదుచేస్తాం. ఎలక్ట్రానిక్ కాటాలను ఎక్కువ బరువు చూపించేలా సెట్ చేస్తే చర్యలు తీసుకుంటాం. – టి.రాంబాబు, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ -
వీల్ చైర్ క్రికెట్ కెప్టెన్గా రాజశేఖర్
పాలకొల్లు సెంట్రల్: ఏపీ వీల్ చైర్ క్రికెట్ కెప్టెన్గా పాలకొల్లు పట్టణానికి చెందిన మురపాక నళిని రాజశేఖర్ ఎంపికయ్యాడు. క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఫిబ్రవరి 23 నుంచి 28 వరకూ నిర్వహించనున్న జాతీయ వీల్ చైర్ క్రికెట్ పోటీలకు రాజశేఖర్ను కెప్టెన్గా నియమిస్తూ ఏసీఏ శుక్రవారం ప్రకటించింది. కైకలూరు : అమ్మా.. పెద్దింట్లమ్మ.. నీ భక్తులను రక్షించమ్మా.. అంటూ భక్తులు కొల్లేటికోట పెద్దింట్లమ్మను ఆర్తితో వేడుకున్నారు. అమ్మవారి జాతర(తీర్థం) శుక్రవారానికి 3వ రోజుకు చేరుకుంది. ఉదయం జలదుర్గా పెద్దింట్లమ్మకు నూతన వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి ఖడ్గనామార్చన, ధూపసేవ, బాలభోగం, అష్టోత్తరం, పాత్రసాధన, పంచహారతులు, నైవేద్యం, నీరాజన మంత్రపుష్పాల పూజలు జరిగాయి. భుజబలపట్నం గ్రామానికి చెందిన సయ్యపురాజు గుర్రాజు, శృంగవరప్పాడుకు చెందిన బలే గణేష్ దంపతులు అమ్మవారికి వస్త్రాలంకరణ, ఉచిత ప్రసాద దాతలుగా వ్యవహరించారు. రాత్రి నంది అవార్డు గ్రహీత మెజీషియన్ రఘు ప్రదర్శించిన మ్యాజిక్ షో అందరినీ ఆకట్టుకుంది. -
రైతులను నిండాముంచిన చంద్రబాబు
చంద్రబాబు రైతులను నిండా ముంచాడు. రైతుభరోసా సక్రమంగా ఇవ్వకపోవడం, యూరియా కొరత తీర్చకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.పది వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. బడ్జెట్లో తప్పడు లెక్కలు చెబుతూ అన్నదాతలను మళ్లీ భయపెట్టే యత్నం చేశారు. చంద్రబాబు చెబుతున్న రైతన్నలకు నిజాలు తెలిసిపోయాయి. చంద్రబాబు ఇక నీ అబద్ధాల్ని కట్టిపెట్టు. – మంద జయలక్ష్మి, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి, ఉంగుటూరు -
మోసం చేయడం చంద్రబాబు నైజం
హామీలు ఇచ్చి మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం. చంద్రబాబు అధికారం చేపట్టిన ప్రతిసారీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. ఇది చరిత్ర చెప్పే నిజం. ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని నమ్మబలికారు. మేనిఫెస్టోలో ఊదర గొట్టారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఆ పథకం అమలు దరిదాపుల్లోకి రాలేదు. మూడోసారి బడ్జెట్లో అయినా సూపర్ సిక్స్ పథకాల కోసం కేటాయింపులు ఉంటాయని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆశగా ఎదురు చూశారు. ఒక్క పైసా నిధులు కూడా కేటాయించలేదు. – కుక్కల కిరణ్కుమార్, బీసీ సంఘ నాయకుడు, పెనుగొండ -
బాబు మోసాన్ని ప్రజలు పసిగట్టారు
పెనుగొండ: ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న జిమ్మిక్కులు, మోసాలను, దుష్ప్రచారాలను ప్రజ లు పసిగట్టారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ అ డ్వయిజరీ కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. గురువారం తూర్పుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ యన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అప్పు లు, పథకాలపై దుష్ప్రచారం చేశారన్నారు. తాజా గా తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని సైతం దుష్ప్రచారానికి వాడుకుని చివరకు బోర్లా పడ్డారన్నారు. తిరిగి చంద్రబాబు కుటుంబం పైకే లడ్డూ వ్యవహరం వెళ్లిందన్నారు. ఇప్పుడు ప్రజల దృష్టి మరల్చేందుకు దాడులు, కక్ష సాధింపులకు పాల్పడుతు న్నారని విమర్శించారు. పార్టీ పటిష్టత కోసం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు అనుబంధ కమిటీల నియామకాలు పూర్తి చేయాలని సూచించారు. గ్రామస్థాయి వరకూ కమిటీలు విస్తరించాలని, ప్రతిఒక్కరినీ భాగస్వామ్యం చేయాలన్నారు. కార్యకర్తలకు పూర్తిస్థాయి గుర్తింపు ఉంటుందని, రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని అన్నారు. ఎంపీపీ పూతినీడి వెంకటేశ్వరరావు (పెద్ద), రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మేడపాటి సాయి చంద్ర మౌళీశ్వర రెడ్డి, మండల కన్వీనర్ నల్లిమిల్లి వెణుప్రతాపరెడ్డి (బాబీ), ఎస్సీ సెల్ మండల కన్వీనర్ పలివెల శ్రీను, పంచాయతీ సభ్యులు ఆదిరెడ్డి సన్యాసిరావు, వెలగల శ్రీనివాస రెడ్డి, పెనుగొండ పట్టణ అధ్యక్షుడు ఆసు నగరి, నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు -
ఉండిలో రగులుతున్న దేశం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, శాసనమండలి డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజుపై నియోజకవర్గంలో ధిక్కారస్వరం మొదలైంది. ఇప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలుగుతమ్ముళ్ల అసమ్మతి ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటేశ్వరరాజు విలేకరుల సమావేశం నిర్వహించి మరీ ఎమ్మెల్యే రఘురామ అరాచకాలకు పాల్పడుతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం జిల్లా రాజకీయాల్లో హాట్టాఫిక్గా మారింది. ఎమ్మెల్యే వర్సెస్ తెలుగు తమ్ముళ్లు ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ తెలుగు తమ్ముళ్ల వ్యవహారం హాట్హాట్గా మారింది. దశాబ్దాలుగా టీడీపీలో పనిచేస్తున్న కేడర్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు ప్రజాప్రతినిధి దగ్గరకు కూడా రానివ్వడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తరచూ ఏదోక వివాదాస్పద చర్యలతో హాట్టాఫిక్గా నిలిచే ఎమ్మెల్యే వ్యవహారం మరో సారి జిల్లాలోని చర్చగా మారింది. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో అందరి వద్ద భారీగా డబ్బులు దండుకుని ఎమ్మెల్యే దోపిడీకి తెరతీశారని, రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మెల్యేగా గెలిచాక కోడిపందాలు, జూదం విచ్చలవిడిగా సాగుతున్నాయని, ఆక్వా రైతులను భయాభ్రాంతులకు గురిచేసి వసూళ్లకు పాల్పడుతున్నారని ఇటీవల టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు (బుడ్డియ్యరాజు) విలేకరుల సమావేశంలో ఆరోపించారు. తనకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని, నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసే అరాచకాలను త్వరలోనే ముఖ్యమంత్రికి, లోకేష్ను కలిసి ఫిర్యా దు చేస్తానని తెలిపారు. అనధికారిక మట్టి మాఫి యాను అధికారికం చేశారని, ఏ అధికారి కూడా అడ్డుకునే పరిస్థితి లేకుండా చేసి భారీగా దోచుకుంటున్నారని, జిల్లా ఉన్నతాధికారులు కూడా రఘురామకృష్ణరాజుకు మద్దతుగా ఉండి అరాచకాలపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకపోగా ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కార్యాలయం వద్ద గొడవలు చేయాలని రఘురామకృష్ణరాజు ఆదేశిస్తూ తాను వెళ్లి తనకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ శివరామరాజు కార్యాలయం వద్ద రచ్చ చేశానని అన్నారు. తనతో సహా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కలవడానికి ఎవరు వెళ్లినా చేతులు కట్టుకుని నుంచోవాలని, కొత్తపల్లి నాగరాజు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా మారి అక్రమాలు, దందాలు చేస్తున్నారని పొత్తూరి ఆరోపించారు. తాజా పరి ణామాల నేపథ్యంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీరుపై ఫిర్యాదులకు పార్టీ నేతలే సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. ఉండి టీడీపీలో మాజీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజుకు బలమైన వర్గం ఉంది. రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రామరాజు వర్గాన్ని దూరంగా పెట్టారు. ఎన్నికల సమయంలో టికెట్ సర్దుబాటుకు అవకాశం లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రా మరాజు టికెట్ను రఘురామకృష్ణరాజుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కేటాయించింది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇబ్బంది ఉండదని మంతెన రామరాజుకు భరోసా ఇచ్చారు. కట్చేస్తే.. రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో మంతెన పాత్రను పూర్తిగా నిర్వీర్యం చేశారు. కనీసం చిన్నపాటి బదిలీ మొదలు కేడర్కు పోస్టింగ్లు వేయించడం వరకు కూడా ఏ అంశంలోనూ మంతెన పాత్ర లేకుండా చేశారు. ఈ క్రమంలో ప్రస్తుత పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రామరాజు ఉండి రాజకీయాలు, నియోజకవర్గ పరిస్థితులపై టీడీపీ అధిష్టానానికి వివరించినట్లు సమాచారం. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో వెంకటేశ్వరరాజు ఆరోపణలను నియోజకవర్గంలోని మూడు మండలాల టీడీపీ అధ్యక్షులు విలేకరుల సమావేశం పెట్టి ఖండించారు. ఈ క్రమంలో జిల్లా అధ్యక్షుడి హోదాలో మంతెన రామరాజు క్రమశిక్షణ తప్పితే చర్యలుంటాయని, ఎవరూ మాట్లాడవద్దంటూ ఏకవాక్యంలో ముగించడం విశేషం. డిప్యూటీ స్పీకర్పై ధిక్కార స్వరం టీడీపీ కేడర్ తిరుగుబాటు రఘురామపై తారాస్థాయిలో అసమ్మతి తీవ్రంగా వేధిస్తున్నారంటూ రాష్ట్ర కార్యదర్శి ధ్వజం అభివృద్ధి పేరుతో దోపిడీకి తెరతీశారంటూ విమర్శలు నివురుగప్పిన నిప్పులా అసమ్మతి నేతలు


