West Godavari
-
16న ఆనంద సీ్త్ర శక్తి పురస్కారాలు
భీమవరం (ప్రకాశంచౌక్): ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ అధ్వర్యంలో ఉద్దరాజు వెంకట లక్ష్మీ నరసయ్య 51వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 16న ఆనంద సీ్త్ర శక్తి పురస్కారాలు–2026 అందిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ ఉద్ధరాజు కాశీ విశ్వనాథ్ రాజు, కంతేటి వెంకటరాజు, దాయన చంద్రజీ తెలిపారు. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మంత్ర మహేశ్వరీ, శ్రీ శక్తీపీఠాదిశ్వరి (తిరుపతి) మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ వి ఉమ, రచయిత్రి పారిశ్రామికవేత్త మోహన ఇందుకూరి తదితరులకు ఆనంద సీ్త్ర శక్తి పురస్కారాలను అందిస్తున్నామన్నారు. అలాగే మున్సిపల్ మహిళా పారిశుద్ధ్య కార్మికులు 65 మందికి అభినందన సత్కారాలు చేస్తున్నామని తెలిపారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా సమగ్ర అభివృద్ధి, ఆర్థిక పురోగతిలో భాగంగా పారిశ్రామిక, విద్య, గృహ నిర్మాణ, స్వయం ఉపాధి రంగాలకు సంబంధించిన రుణాలను నిర్ణీత గడువులోగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బ్యాంకు అధికారులకు సూచించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (డీఎల్ఆర్సీ) సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు పురోగతిని జిల్లా కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో ఎంపీ పాకా వెంకట సత్యనారాయణ, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ ఎ.నాగేంద్ర ప్రసాద్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ హెడ్ వీరభద్రరావు, ఆర్బీఐ ఏజీఎం సీజీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం: నీట్ పేపర్ లీకేజీకి కేంద్ర ప్రభుత్వ అసమర్థతే కారణమంటూ మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రసాద్ మాట్లాడుతూ 720 మార్కులకు గానూ దాదాపు 600 మార్కుల ప్రశ్నలు లీక్ అయ్యాయంటే నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో? తెలుస్తుందన్నారు. ప్రతిష్టాత్మకమైన ప్రవేశ పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలకు కేంద్రప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మణ, సహాయ కార్యదర్శి బి.సింధు, కె.రోహిత్, పి.సాయికృష్ణ పాల్గొన్నారు. భీమవరం: వాకింగ్కు వెళ్లిన తన భార్య తిరిగిరాలేదని భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు భీమవరం టూటౌన్ ఎస్సై రహమాన్ మంగళవారం విలేకరులకు తెలిపారు. వివరాల ప్రకారం పట్టణంలోని చెట్టుకింద సాయిబాబా గుడి ప్రాంతంలో గొట్టుముక్కల లక్ష్మీపతిరాజు తన భార్య గోవిందమ్మతో కలసి జీవిస్తున్నారు. ఈ నెల 8న గోవిందమ్మ డీఎన్నార్ కళాశాల ఆవరణలోనికి వాకింగ్కు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో లక్ష్మీపతిరాజు పోలీసులను ఆశ్రయించాడు. భీమడోలు: ఉపాధి హామీ ఏదీ? అంటూ ఈనెల 10న సాక్షిలో ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. కూలీలకు పనులు కల్పించకుండా నిర్లక్ష్యం వహించిన ఫీల్డ్ అసిస్టెంట్కు మెమో జారీ చేసినట్లు భీమడోలు ఎంపీడీఓ సీహెచ్ పద్మావతిదేవి మంగళవారం రాత్రి తెలిపారు. అలాగే ఎట్టకేలకు గుండుగొలనులో ఉపాధి హామీ పనులను మొదలు పెట్టించారు. పంచాయతీ పరిఽధిలోని రంగన్న చెర్వు నుంచి కొరుకల్లు వైపు ఉన్న మైనర్ ఇరిగేషన్ డ్రైయిన్ను మంగళవారం ఉపాధి హామీ కార్మికులు 100 మంది పూడిక తీశారు. భీమడోలు ఏపీఓ నాగరాజు పర్యవేక్షణలో పనులు చేపట్టారు. అయితే గ్రామంలో సుమారు వెయ్యికి పైగా ఉపాధి కూలీలు ఉన్నారని, వారికి కూడా పనులు కల్పించాలని కోరారు. -
రేషన్ మాఫియాను అరికట్టాలి
ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లాలో అక్రమ రేషన్ మాఫియా పైన సొంత పార్టీ నేతలే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం చూస్తుంటే రాష్ట్రంలో పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వైఎస్సార్ సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సొంగ సందీప్ అన్నారు. స్థానిక కలెక్టరేట్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం రాష్ట్రాల నుంచి దేశాలకు తరలిస్తున్న మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు. కాకినాడలో సీజ్ ద షిప్ అన్న డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు నాయకులపై చర్యలు తీసుకునే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. రేషన్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి ఏలూరు (టూటౌన్): జిల్లాలోని చింతలపూడి, లింగపాలెం మండలాల కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్.లింగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. కొంతమంది అక్రమార్కులు పీడీఎస్ బియ్యాన్ని అక్రమ పద్ధతుల్లో సేకరించి రీసైక్లింగ్ చేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని విమర్వించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన అధికార పార్టీ నాయకులే రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని, పైగా ఆపార్టీ నాయకులే బయటపెడుతున్నారని, దీన్ని బట్టి రేషన్ బియ్యం అక్రమ రవాణా ఏ స్థాయిలో ఉందో తెలుస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికై నా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
భూసేకరణ ఆపాలని గిరిజనుల ధర్నా
బుట్టాయగూడెం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం బుట్టాయగూడెం, జీలుగుమిలి మండలాల్లో భూసేకరణను నిలుపుదల చేయాలని కోరుతూ ఆదివాసీ సేనా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజనులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ సేనా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మడకం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిర్వాసితులు కోసం బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో జరుగుతున్న భూసేకరణ భూటకపు భూసేకరణ అని విమర్శించారు. భూసేకరణలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గిరిజనులకు పట్టాలు ఉన్న భూములు, గిరిజనులు ఎన్నో ఏళ్లుగా సాగులో ఉన్న భూములను సేకరించి గిరిజనేతరుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారని ఆరోపించారు. భూసేకరణలో బ్రోకర్ల హావా నడుస్తుందని తీవ్రంగా విమర్శించారు. అనంతరం తహసీల్దార్ రాధాకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ రాధాకృష్ణ మాట్లాడుతూ భూసేకరణ ఎంతో పారదర్శకంగా చేసినట్లు, భూములకు సంబంధించి అన్ని రికార్డులు ఉన్న వారికి పూర్తి న్యాయం చేస్తున్నామని తెలిపారు. -
మద్దిలో పోటెత్తిన భక్తులు
జంగారెడ్డిగూడెం: హనుమద్ జయంతి మహా పర్వదిన సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో ఉన్న శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు 108 ప్రదక్షిణలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. సుమారు 30వేల మంది భక్తులు శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారని, సుమారు 10,500 మంది భక్తులకు శ్రీ స్వామి వారి నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఈఓ ఆర్వీ చందన తెలిపారు. ఆలయానికి వివిధ సేవల రూపేణా రూ.7,33,190లు ఆదాయం వచ్చిందన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా జంగారెడ్డిగూడెం సీఐ ఎంవీ సుభాష్ ఆధ్వర్యంలో లక్కవరం ఎస్సై షేక్ జబీర్, జంగారెడ్డిగూడెం ఎస్సై ఎన్వీ ప్రసాద్, జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్సై ఎం.కుటుంబరావు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మిల్లుల నుంచి కదలని బియ్యం
బుధవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2026భీమవరం: కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరణలో నూక శాతాన్ని తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలు మిల్లర్లకు గుదిబండగా మారాయి. గతంలో రైతులు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు నేరుగా కొనుగోలు చేసి ఎఫ్సీఐకి విక్రయించేవారు. అప్పట్లో మిల్లర్లు తేమ శాతం ఎక్కువని, ముక్కపాయ అని సాకులు చెబుతూ రైతులకు తక్కువ ధర చెల్లించి మోసం చేసేవారు. రైతులు, మిల్లర్లకు మధ్య దళారుల పెత్తనం ఎక్కువగా ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయే వారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసి, మర ఆడించడానికి మిల్లర్లకు ఇచ్చి వారికి మజూరీ చెల్లించే విధానాన్ని తెచ్చింది. రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేయడానికి రైతు భరోసా కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడేవి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కావడంతో, దళారుల బెడద లేకుండా కష్టానికి తగ్గ ఫలితం దక్కేది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అనుసరిస్తుండటంతో రైతులు నిశ్చింతగా ధాన్యాన్ని విక్రయించుకుంటున్నారు. అవసరమైన గోనె సంచుల సరఫరా లేకపోవడం, ధాన్యం తూకాల్లో జరుగుతున్న మోసాల వల్ల రైతులు కొంత మేర నష్టపోతున్నారు. 8 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యం జిల్లాలోని 20 మండలాల పరిధిలో 2.35 లక్షల ఎకరాల్లో దాళ్వా వరి సాగు చేయగా, వాతావరణం అనుకూలించి పంట ఏపుగా పెరిగింది. దీనివల్ల 9.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కొంతమంది రైతులు ఎకరాకు 60 బస్తాల వరకు దిగుబడి సాధించడంతో, ఈ అంచనా మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, రైస్ మిల్లుల సామర్థ్యాన్ని బట్టి ధాన్యాన్ని కేటాయించింది. ఇప్పటివరకు 7 వేల మంది రైతుల నుంచి దాదాపు 6.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులకు సుమారు రూ. 1,470 కోట్లు చెల్లించారు. కేంద్ర ప్రభుత్వం బియ్యంలో నూక శాతాన్ని మార్పు చేయడంతో సేకరణలో కొంత జాప్యం జరిగింది. గతంలో 15 శాతం నూక ఉన్నా సేకరించేవాళ్ళం. అయితే ప్రజలకు మరింత నాణ్యమైన బియ్యం అందించాలనే ఉద్దేశంతో నూక శాతాన్ని 10 శాతానికి తగ్గించారు. ప్రభుత్వ అనుమతులు రాగానే మిల్లర్ల నుంచి బియ్యాన్ని తీసుకుంటాం. – ఎండీ ఇబ్రహీం, సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్, భీమవరం మిల్లర్లు ధాన్యాన్ని మరపట్టించి బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం బియ్యంలో నూక శాతాన్ని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో సేకరణలో ఇబ్బందులు తలెత్తాయి. ఈ నిర్ణయం అమలులోకి రావడంలో జాప్యం జరగడంతో, మిల్లర్ల వద్దే బియ్యం, ధాన్యం బస్తాలు పేరుకుపోయాయి. వీటిని నిల్వ చేయడానికి స్థలం లేక మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వేసవిలో అకాల వర్షాలు కురుస్తుండటంతో బయట ఉన్న ధాన్యం బస్తాలు తడిసిపోతాయని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గోనె సంచుల కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే బియ్యాన్ని సేకరించకపోతే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని మిల్లర్లు వాపోతున్నారు. నూక శాతం మార్పుతో ఇబ్బందులు జిల్లాలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం ఇప్పటికే 6.20 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు ధాన్యం, బియ్యం నిల్వకు చోటు లేక మిల్లర్ల అవస్థలు -
ప్రశాంతంగా ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు
తాడేపల్లిగూడెం (టీఓసీ): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పరీక్ష కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెం శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం, సాయంత్రం రెండు పూటల పరీక్షలు జరిగాయి. ఉదయం జరిగిన పరీక్షకు 240 మందికి 231 మంది, సాయంత్రం జరిగిన పరీక్షకు 240 మందికి గానూ 230 మంది హాజరయ్యారు. ప్రిన్సిపాల్, చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాంబాబు, పరీక్ష కేంద్రం కోఆర్డినేటర్ నటరాజ్, సిస్టమ్ అడ్మిన్ కొల్లా సురేష్, టీసీఎస్ సంస్థ ప్రతినిధులు పరీక్షా నిర్వహణను పర్యవేక్షించారు. భీమవరంలో.. భీమవరం: ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. పట్టణంలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం, మధ్యాహ్నం రెండు షిప్టులలో జరిగిన ఈ పరీక్షకు 300 మందికిగాను 287 మంది విద్యార్థులు హాజరయ్యారు. విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో 220 మందికిగాను 216 మంది, డీఎన్నార్ అటానమస్ కళాశాలలో 200 మందికి 194 మంది హాజరయ్యారు. డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో 200 మందికిగాను ఆరుగురు గైర్హాజరయ్యారు. -
అదనపు రుసుం వసూలు చేయొద్దు
రద్దు చేసిన నీట్ పరీక్ష తిరిగి నిర్వహించే సమయంలో విద్యార్థుల నుంచి ఎలాంటి అదనపు రుసుం వసూలు చేయకూడదు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు లేదా స్థానిక పరీక్షా కేంద్రాలను కేటాయించాలి. ప్రతి ఏటా పేపర్ లీకేజీలు జరగకుండా శాశ్వత చట్టపరమైన పరిష్కారం చూపాలి. ప్రస్తుతం ఉన్న కేంద్రీకృత పరీక్షా విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. – పాతినవలస రాజేష్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దేశవ్యాప్తంగా జరిగిన నీట్ ప్రవేశ పరీక్షలలో 20 లక్షలకు పైగా విద్యార్థులు రాశారు. ఈ రోజు పేపర్ లీకుతో పరీక్ష రద్దు చేయడం విద్యార్థి లోకానికి తీవ్ర అన్యాయం. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి. చాలామంది విద్యార్థులు బాగా చదువుకొని నీట్ ప్రవేశ పరీక్షలో సీటు కొట్టాలన్న ఆశతో పరీక్ష రాస్తే పేపర్ లీకేజ్ చేయడంతో విద్యార్థుల జీవితాలు తీవ్రంగా నష్టపోతాయి. – డి.శివకుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు దేశంలో విద్యా మాఫియాను ఉక్కుపాదంతో అణచివేయాలి. పేపర్ లీకేజ్కు కారణమైన వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఇది కేవలం లీకేజీ ఘటన కాదు, నిజాయితీగా చదివే విద్యార్థుల ఆశలు, కలలను హత్య చేసే నేరం. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న అధికారులు, మధ్యవర్తులు, మాఫియా గ్యాంగులు, రాజకీయ సంబంధాలు ఉన్న వారందరినీ వెంటనే అరెస్ట్ చేసి దేశద్రోహం, క్రిమినల్ కుట్ర కేసులు నమోదు చేయాలి. – కాకి నాని, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు -
ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసుల జారీ
ఆగిరిపల్లి: మండలంలో ఇరువురు ఉపాధ్యాయులకు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈదర జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న గుజ్జా అమ్మాజీ, ఆగిరిపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న వేణుగోపాల్రావు ఆమెను వేరే చోటకి బదిలీ చేయిస్తానని చెప్పి 2024లో సుమారు రూ.3 లక్షలు తీసుకున్నాడు. డబ్బులు తీసుకుని సదరు ఉపాధ్యాయుడు తిరిగి ఆమెకు డబ్బులు చెల్లించకపోవడంతో ఈ సంవత్సరం జనవరిలో డీఈఓ వెంకట లక్ష్మమ్మకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై నూజివీడు విద్యాశాఖ అధికారి సుధాకర్ విచారణ చేపట్టి ఇద్దరి ఉపాధ్యాయులకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులపై ఇద్దరు ఉపాధ్యాయులు ఐదు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. గణపవరం: మండలంలోని అగ్రహార గోపవరం గ్రామానికి చెందిన కుంకట్ల రామాంజనేయులు తన భార్య ఏడుకొండలు (60) కనిపించడం లేదని పోలీసులను ఆశ్రయించాడు. ఎస్సై ఆకుల మణికుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఏడుకొండలు గత 20 ఏళ్లుగా మతిస్థిమితం లేక రాజమండ్రిలో వైద్యం పొందుతుందని, ఈ నెల 2న ఆమె భర్తతో కలిసి పిప్పరలోని కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న తర్వాత ఆమె కనిపించకుండా పోయింది. దీంతో ఆమె భర్త రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదుపై మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఏలూరు (టూటౌన్): రొయ్యల మేత ధర పెంపు దారుణమని, మేత ధరల పెంపును వెంటనే ఉపసరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు.మంగళవారం ఏలూరు అన్నే భవనంలో రొయ్యల మేత ధరల పెంపుపై ఆయన మాట్లాడారు.రొయ్యల మేత ధరల పెంపు వల్ల సాగు ఖర్చులు పెరిగి ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులు మరింత సంక్షోభంలోకి కూరుకుపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు సుంకాల వలన, రొయ్యలకు వచ్చిన వ్యాధుల వలన ఆక్వా రైతులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారని ఆయన గుర్తు చేశారు. రొయ్యల మేత తయారీ సంస్థలతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి మేత ధరల పెంపును నిలుపుదల చేయాలని కోరారు. -
ఆక్వా రైతు కన్నెర్ర
వీరవాసరంలో రొయ్యల మేత బస్తాల దహనం వీరవాసరం: గత రెండు నెలల కాలంలో రెండో రొయ్యల మేతల ధరలను కంపెనీలు పెంచడంతో ఆక్వా రైతులు భగ్గుమంటున్నారు. వీరవాసరంలో మంగళవారం రైతులు ఆందోళన నిర్వహించి, రొయ్యల మేతల బస్తాలను దహనం చేశారు. కంపెనీలు సిండికేట్గా మారి ధరలు పెంచేశారని ఆందోళన చేశారు. ఆక్వా రంగం తీవ్ర ఒడిదొడుకుల్లో ఉందని, రొయ్యల ధరలు పడిపోవడం.. మరోపక్క రొయ్యల మేతల కంపెనీలు ధరలు తరచూ పెంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము దేశానికి విదేశీ మారక ద్రవ్యం తీసుకొస్తున్నా.. తమకు సాగు మాత్రం లాభదాయంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలు చేసుకోక తప్పదని కొందరు రైతులు పేర్కొన్నారు. 2023 లో రొయ్యల మేత రేటు టన్నుకు రూ.75 వేలు ఉండగా ప్రస్తుతం రూ.1.10 లక్షలకు పైగా ఉందని, తాజా పెంపుతో ఫీడ్ రేట్ టన్నుకు రూ.1,22,000 పైగా పెరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రేట్లు తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివిధ కంపెనీల మేత బస్తాలను దగ్ధం చేశారు. ఆందోళనలో రొయ్యల రైతులు సమాఖ్య సంఘం భీమవరం ప్రాంత అధ్యక్షుడు మళ్ళ రాంబాబు (తులసి రాంబాబు), యరక రాజు హరిహర రాజు, యరకరాజు గోపాలకృష్ణరాజు, తోట విజయకుమార్, అడ్డాల శ్రీరామచంద్రమూర్తి, గుండా నరసింహ రావు, కోటిపల్లి బాబు, దాసరి మాణిక్యాలరావు, వేండ్ర లీల కృష్ణా, తదితరులు పాల్గొన్నారు. -
అసమర్థ పాలనతో ఆక్వాకు గండం
వైఎస్సార్సీపీ గూడెం కన్వీనర్ వడ్డి రఘురాం తాడేపల్లిగూడెం: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ అసమర్థ పాలన ఆక్వా రైతుల పాలిట గండంగా మారిందని వైఎస్సార్సీపీ తాడేపల్లిగూడెం కన్వీనర్ వడ్డి రఘురాం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఫీడ్ కంపెనీలు ఇచ్చే ముడుపులకు ఆశపడి, రైతుల ప్రయోజనాలను తుంగలో తొక్కి ప్రభుత్వం కంపెనీలకే వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. వైఎస్ జగన్ నాయకత్వంలో అప్సడా ఏర్పాటు చేసి ఆక్వా రైతులకు అండగా నిలిచామని, వేలాది విద్యుత్ కనెక్షన్లకు కోట్లాది రూపాయల రాయితీలు ఇచ్చామని గుర్తు చేశారు. అంతర్జాతీయంగా సుంకాల భారం తగ్గినా, ఆ మేరకు రాయితీలను రైతులకు ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. ఫీడ్ ధరలపై టన్నుకు రూ.25,000 తగ్గించాల్సి ఉండగా, కేవలం రూ.4,000 తగ్గించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఏకంగా కేజీకి రూ.15 పెంచి ఆక్వా రంగాన్ని కుదేలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ హయాంలో 50,800 ఆక్వా కనెక్షన్లకు ఐదేళ్లలో రూ.3,640 కోట్లు సబ్సిడీగా అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం కృత్రిమంగా డీజిల్ కొరతను సృష్టించి ధరలు పెంచేందుకు ప్రయత్నించిందని, వైఎస్సార్సీపీ ఆందోళనకు సిద్ధమవడంతో వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. ఫీడ్ ధరలు పెంచే ముందు ఆక్వా రైతులతో సమావేశం ఏర్పాటు చేసి, వారి ఆమోదం తీసుకోవాలనే గత ప్రభుత్వ నియమాన్ని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందని రఘురాం విమర్శించారు. -
పాఠశాలలకు పాఠ్యపుస్తకాల సరఫరా
భీమవరం: నూతన విద్యా సంవత్సరానికి అవసరమైన పాఠ్యపుస్తకాలను జిల్లాలోని అన్ని పాఠశాలలకు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా సమగ్రశిక్షా అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి శ్యామ్ సుందర్ చెప్పారు. మంగళవారం పుస్తకాల పంపిణీ తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని 20 మండలాలకుగాను ఇప్పటికే 17 మండలాలకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. మొత్తం టెక్ట్స్బుక్స్ సుమారు 4,75 లక్షల పుస్తకాలు అవసరం అవుతాయ న్నారు. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు అన్ని టెక్ట్స్ బుక్స్ మారాయన్నారు. జూన్ 12వ తేదీన స్కూల్స్ ప్రారంభం కానున్నందున సెమిస్టర్ వన్కు సంబంధించిన టెస్ట్స్ బుక్స్ అన్ని మండలాలకు ముందుగానే సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. నాన్ లాంగ్వేజెస్ సబ్జెక్టులన్నింటిలోనూ తెలుగు, ఇంగ్లిషు మీడియంలో ప్రచురించినట్లు చెప్పారు. కార్యక్రమంలో సీఎంఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు. భీమవరం: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 332 జీవోను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె నాగేశ్వరరావు, బి వాసుదేవరావు, ఉద్యోగుల యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె రాజా రామ్మోహన్రాయ్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సహకార సంఘ ఉద్యోగులు చేసిన ఆందోళన మేరకు వ్యవసాయశాఖా మంత్రి, కోఆపరేటివ్ అధికారులు ఆప్కాబ్ చైర్మన్ సమక్షంలో అనేక హామీలు ఇచ్చి జీవో విడుదలలో మాత్రం దీనికి విరుద్ధంగా చేయడాన్ని తప్పు పట్టారు. వెంటనే 332 జీవో రద్దుచేసి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, గతంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భీమవరం: డీఎన్నార్ కళాశాల యాజమాన్యం, వసుధ ఫౌండేషన్ సహకారంతో వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటుకు ఈనెల 14వ తేదీన క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవీ పవన్కుమార్రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఎన్నార్ కళాశాలలోని వాలీబాల్ క్రీడా ప్రాంగణంలో నెల రోజులపాటు రెసిడెన్సియల్ విధానంలో శిక్షణ ఇస్తామన్నారు. ఎంపికై న క్రీడాకారులకు ఉచిత భోజన, వసతి సదుపాయం కల్పిస్తామన్నారు. వివరాలకు సెల్: 99899 22122, 98669 22122, 63035 78996 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. భీమవరం: ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి బి శివన్నారాయణరెడ్డి చెప్పారు. భీమవరం కలెక్టరేట్లో మంగళవారం ఇంటర్మీడియెట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో 41 పరీక్షా కేంద్రాల్లో జనరల్, ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన 22,061 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావల్సి ఉందన్నారు. పరీక్షలు ఈనెల 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 7 నుంచి 11 వరకు జరుగుతాయన్నారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మాస్ కాపీయింగ్, ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి జి ప్రభాకరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఇ నారాయణ, కమిటీ సభ్యులు కేవీ రామారావు, వీకే మల్లేశ్వరరావు, బి నారాయణరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్పై అవగాహన
ఏలూరు (టూటౌన్): సేవల్లో లోపంపై శాశ్వత లోక్ అదాలత్ను ఆశ్రయించవచ్చునని ఛైర్ పర్సన్ మేరీ గ్రేస్ కుమారి తెలిపారు. మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో శాశ్వత లోక్ అదాలత్ పురోగతి, నిర్వహణపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేస్ కుమారి మాట్లాడుతూ రవాణా, పోస్టల్, విద్యుత్ సానిటేషన్, హాస్పిటల్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ఎన్ఆర్ఈజీఎస్, విద్య, హౌసింగ్, రియల్ ఎస్టేట్ విభాగాలలో సర్వీసు లోపంపై శాశ్వత లోక్ అదాలత్ను ఆశ్రయించవచ్చని సూచించారు. జంగారెడ్డిగూడెం: పారిజాతగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి కల్యాణోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. పొణంకి సత్యపవన్ ఆచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు, ఋషికేష్ ఆచార్యులు, కుమార్ ఆచార్యులు, రాఘవా చార్యులు ఉదయం నుంచి నిత్య హోమం తీర్థప్రసాద గోష్టి తదితర పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కల్యాణం మండపంలో లోక కల్యాణర్థం శ్రీ శ్రీదేవి భూదేవి సమెత శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవం వైఖానస ఆగమొక్తంగా నిర్వహించారు. సాయంత్రం చంద్రప్రభ వాహనం సేవ ఆలయ తిరువిధి ఉత్సవం నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ఆలయ కార్యనిర్వాహణాధికారి కలగర శ్రీనివాస్ పర్యవేక్షించారు. అలాగే బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి గరుడ వాహన సేవ జంగారెడ్డిగూడెం వీధుల్లో నిర్వహిస్తామని తెలిపారు. -
నీట్ రద్దుపై ఆగ్రహం
● ప్రశ్నార్థకంగా విద్యార్థుల భవిష్యత్ ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థి, యువజన సంఘాలు ఏలూరు (ఆర్ఆర్ పేట): కోటి ఆశలతో వైద్య విద్యలోకి ప్రవేశించాలనుకుంటున్న విద్యార్థులకు నీట్ రద్దుతో అశనిపాతంలాంటి దెబ్బ తగిలింది. సోమవారం ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో దేశవ్యాప్తంగా ఈ నెల 5న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేసినట్లు వార్తలు రావడంతో విద్యార్థుల్లో కలకలం రేగింది. తొలుత ఈ వార్తలు అవాస్తవమని భావించినా, పరీక్ష రద్దు విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ధ్రువీకరించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇంటర్ విద్య పూర్తి చేసుకుని వైద్య విద్యలోకి ప్రవేశించడం కోసం కోటి ఆశలతో ఎంతో పట్టుదలతో చదివి రాసిన నీట్ ప్రవేశ పరీక్షను రద్దు చేయడం విద్యార్థులకు తీరని అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఒకే సెంటర్లో పరీక్ష రాసిన విద్యార్థులకు జాతీయ స్థాయి ర్యాంకులు రావడంతో నీట్ పరీక్షల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దేశంలో రాజ్యమేలుతున్న అవినీతికి ఇది ముచ్చు తునక అంటూ అప్పట్లో విద్యారంగ నిపుణులు విమర్శలు గుప్పించారు. ఈ ఏడాది మరోసారి అలాంటి పరిస్థితులే పునరావృతం కావడం నీట్ పరీక్షల నిర్వహణలోని పారదర్శకతను ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రశ్నార్థకంగా 1880 మంది భవిష్యత్తు ఈ ఏడాది నీట్ పరీక్షలకు ఏలూరు జిల్లా వ్యాప్తంగా 1880 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 5న ఏలూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన పరీక్షలకు 1819 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల రద్దుతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పరీక్షలు రాసిన వారిలో ఈ ఏడాది ఇంటర్ రాసిన వారు అధిక సంఖ్యలో ఉండగా, ఎలాగైనా సరే వైద్య వృత్తిలో ప్రవేశించాలనే లక్ష్యంతో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని రాసిన విద్యార్థులూ కూడా ఉన్నారు. పరీక్ష విజయవంతంగా రాశామని సంతృప్తి చెందుతున్న తరుణంలో నీట్ పరీక్ష రద్దు ప్రకటన వారిని ఆందోళనకు గురిచేసింది. మరోసారి పరీక్ష రాయడం కత్తిమీద సాముగా వారు భావిస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు నీట్ పరీక్షను రద్దు చేయడంతో పలు విద్యార్థి, యువజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన నీట్ పరీక్షను అధికారుల ఉదాసీనతతో మరోసారి రద్దు చేయాల్సి రావడం దేశ విద్యా వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఘోర వైఫల్యం, వ్యవస్థాగత లోపాల కారణంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతోందని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ జిల్లా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం కూడా ఇదే తరహాలో హరియాణా, బిహార్ రాష్ట్రాల్లో నీట్ పరీక్ష పేపర్లు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అమ్ముడుపోయి లీకేజీ అయ్యాయని పేర్కొన్నారు. -
గోవు మృతిపై విచారణ
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో మృతి చెందిన గోవు విషయంలో మంగళవారం వెటర్నరీ అధికారులు విచారణ చేశారు. జనవరి 28న పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో పుంగనూరు జాతికి చెందిన గోవు మృతి చెందిన సంఘటన అందరికీ తెలిసిందే. నాడు గోవు చనిపోయిన తర్వాత ఎందుకు చనిపోయింది? ఎలా చనిపోయిందనే విచారణ లేకుండా వెటర్నరీ డాక్టర్తో పరీక్ష చేయించకుండా ఆలయ అధికారులు వెంటనే ఖననం చేయించేశారు. క్షీరారామంలో గోవు మృతి, హడావుడిగా అంతిమ సంస్కారాలు చేయడంపై భక్తుల ఆగ్రహం అంటూ నాడు సాక్షిలో కథనం వెలువడింది. ఈ కథనానికి స్పందించిన షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పెద్దిరెడ్డి ప్రసన్నకుమార్ గోవు ఎలా చనిపోయింది? చనిపోయిన గోవును పరీక్ష చేయకుండా వెటర్నరీ వైద్యులు డెత్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు అంటూ జిల్లా ఎండోమెంట్స్, జిల్లా పశుసంవర్థక శాక అధికారులకు ఆర్టీఐ ద్వారా సమాచారం కోరారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నిమిత్తం మంగళవారం జిల్లా పశుసంవర్థక శాఖ డిప్యూటి డైరెక్టర్ డాక్టర్ ఎల్.కె సుధాకర్ ఆలయంలో విచారణకు వచ్చారు. దీనిపై ఫిర్యాదుదారుడు ప్రసన్నకుమార్, గోవు మృతికి సర్టిఫికెట్ ఇచ్చిన రూరల్ వెటర్నరీ డాక్టర్ జి.వరప్రసాద్, ఆలయ ఈఓ ముచ్చర్ల శ్రీనివాసరావు తదితరులు విచారణలో పాల్గొన్నారు. దీనిపై తుది నివేదిక జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామని విచారణ అధికారి సుధాకర్ తెలిపారు. -
రొయ్యల ఫీడ్ ధరలు వెంటనే తగ్గించాలి
వీరవాసరం: రొయ్యల ఫీడ్ ధరలు వెంటనే తగ్గించాలని శాసనమండలి సభ్యులు, వైఎస్సార్ సీపీ శెట్టి బలిజ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు కవురు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వీరవాసరం మండలం నవుడూరు జంక్షన్లో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రొయ్యల సాగులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందన్నారు. రాష్ట్రంలో ఏటా 10 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతుందని, సగటున ప్రతి ఏడాది 15 లక్షల టన్నుల మేత వినియోగం జరుగుతుందని వివరించారు. ముడి సరుకుల రేటు పెరిగిందనే ఉద్దేశంతో ఫీడ్ కంపెనీలు ఇష్టానుసారం రేట్లను పెంచడం దారుణం అన్నారు. గతంలో ముడి సరుకుల రేట్లు తగ్గినప్పుడు కనీసం ఆ దిశగా తగ్గించిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీడ్ కంపెనీల్లో మెజార్టీ కంపెనీలన్నీ అధికార టీడీపీ నేతలకు చెందినవేనని గుర్తు చేశారు. ఫీడ్ కంపెనీలకు నష్టాలు వస్తున్నాయన్న కారణంతో ఫీడ్ ధరలు పెంచినప్పుడు, రొయ్యల రైతులకు సైతం నష్టాలు కలిగినప్పుడు రైతులు పండించిన రొయ్యల ధరలకు కూడా రేట్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఫీడ్ కంపెనీలు రేట్లు పెంచాలంటే రొయ్యల రైతులతో పాటు రైతు సంఘాల నేతలతో చర్చించి రేట్లు పెంచుకోవాలని నియమం ఉండేదన్నారు. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఫీడ్ కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి అప్సడా చట్టాన్ని నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. -
రేపటి నుంచి శుభకార్యాలకు బ్రేక్
● 36 రోజుల పాటు వివాహాలకు విరామం ● జూన్ 19 నుంచి మళ్లీ ముహూర్తాలు షురూ ద్వారకాతిరుమల: పెళ్లికి ముఖ్యమైంది ముహూర్తం. పెళ్లి పనులు ప్రారంభించడం దగ్గర నుంచి అన్ని పనులకు ముహూర్తాలు చూస్తాం. అలాంటి ముహూర్తాలకు 36 రోజుల పాటు బ్రేక్ పడనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వివాహాలు భారీగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా వేలాది జంటలు ఒక్కటయ్యాయి. ఈ నెల 18 నుంచి వచ్చేనెల జూన్ 18 వరకు అధిక జ్యేష్ఠ మాసం(మూఢమి) కావడంతో వివాహాలకు బ్రేక్ పడనుంది. ఈ క్రమంలో ఈనెలలో ఆఖరి ముహూర్తమైన 13న పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరగనున్నాయి. అందుకు ద్వారకాతిరుమల శ్రీవారి సన్నిధి వేదిక కానుంది. మళ్లీ జూన్ 19 నుంచి వివాహాధి శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి. 36 రోజులు ఖాళీ వివాహాది శుభకార్యాలపై ఆధారపడి జీవనోపాధి పొందే పురోహితులు, పచ్చిపూల మండపాలు నిర్మించే వారు, డెకరేషన్ చేసేవారు, షామియానా పందిళ్లు వేసేవారు, వాయిద్యకారులు, క్యాటరింగ్ వ్యాపారులు, లైటింగ్ ఏర్పాటు చేసే వారికి 36 రోజుల పాటు పనులు లేనట్టే. వీరంతా మళ్లీ జూన్ 19 నుంచి బిజీ కానున్నారు. ఈ ఏడాది ముహూర్తాలు ఇవే వివాహాలకు ఈ ఏడాది జూన్ 19, 20, 21, 24, 25, 26, 27, 28, జులై 1, 2, 3, 4, 5, 8, 9, ఆగస్టు 16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30, సెప్టెంబర్ 1, 3, 4, 5, అక్టోబర్ 11, 14, 29, 30, నవంబర్ 5, 11, 12, 13, 14, 15, 18, 19, 20, 21, 22, 24, 25, 26, డిసెంబర్ 2, 3, 4, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 22, 23, 27, 29, 30, 31 తేదీల్లో ముహూర్తాలున్నాయి. ఈ నెల 14 నుంచి శుభకార్యాలకు విరామం ఏర్పడనుంది. మే 18 నుంచి జూన్ 18 వరకు అధిక జ్యేష్ఠమాసం కారణంగా వివాహాలు, గృహ ప్రవేశాలు, ఆస్తుల కొనుగోళ్లు, వ్యాపారాలు ప్రారంభోత్సవాలు వంటి ఏవిధమైన శుభకార్యాలు జరపకూడదు. ఇప్పటికే వివాహాలు కుదుర్చుకున్న వారు ఈ 36 రోజులు ఆగాల్సిందే. – గోవింద వఝుల వెంకటరమణ మూర్తి శర్మ, పురోహితుడు, ద్వారకాతిరుమల. -
వ్యక్తిపై దాడి
దెందులూరు: మండలంలోని రామారావుగూడెంలో పాత గొడవల నేపథ్యంలో నర్సింగ్ చదువుతున్న విద్యార్థి దాసరి భరత్కుమార్ను కోడి కత్తితో తీవ్రంగా గాయపరిచారని దెందులూరు ఎస్సై రాచమల్లు శివాజీ తెలిపారు. వివరాల ప్రకారం దాసరి భరత్ కుమార్ వంగాయగూడెంలో నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గతంలో రామారావుగూడెం గ్రామంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఫ్లెక్సీ కట్టే విషయంలో గొడవ జరిగడంతో, ఆ కక్షతో ఆదివారం రాత్రి రామారావుగూడెం గ్రామం ఎన్టీఆర్ బొమ్మ ఖాళీ స్థలం వద్ద కూర్చుని ఉన్న భరత్కుమార్పై నేతల శ్యామ్ అనే వ్యక్తి ఒక్కసారిగా కోడి కత్తితో దాడి చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడిన దాసరి భరత్కుమార్ను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించగా ఐసీయూ చికిత్స పొందుతున్నాడు. బాధితుడు నేతల శ్యామ్, దవులూరి ఫణీంద్ర, కొడుదుల సతీష్, నంబూరి గుణ పృథ్వీలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. కలిదిండి(కై కలూరు): కుటుంబ కలహాలు, మానసిక సమస్యలతో మద్వానిగూడెం వద్ద ఉప్పుటేరు వంతెనపై నుంచి ఓ వ్యక్తి సోమవారం రాత్రి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కలిదిండి మండలం కొండంగి గ్రామానికి చెందిన కె.సత్యసాయి కుమార్ (35)కు వివాహం కాగా భార్య, కుమార్తె ఉన్నారు. ఇంటి వద్ద స్వల్ప వివాదం జరగడంతో క్షణాకావేశంలో చనిపోవాలని నిర్ణయం తీసుకుని వంతెనపై నుంచి దూకాడు. దీంతో అతడి బంధువులు కలిదిండి ఎస్సై ఎస్ఎస్ఎస్ పవన్కుమార్ విషయాన్ని తెలపగా ఆయన కై కలూరు అగ్నిమాపక అధికారులకు తెలిపారు. కై కలూరు నుంచి ఫైర్ ఆఫీసర్ కె.క్రాంతికుమార్ సిబ్బంది వచ్చి మంగళవారం ఉదయం నుంచి గాలించారు. ఎట్టకేలకు ఉప్పుటేరు వంతెన నుంచి కొంత దూరంలో గుర్రపుడెక్క కింద భాగంలో సత్యసాయి కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించామని పోలీసులు తెలిపారు. -
ఈవీఎం గోడౌన్ల తనిఖీ
వైభవంగా వెంకన్న కల్యాణోత్సవం పారిజాతగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కల్యాణోత్సవం మంగళవారం అత్యంతవైభవంగా నిర్వహించారు. 8లో uభీమవరం (ప్రకాశంచౌక్): పీపీ రోడ్డులోగల ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్లలో భద్రపరిచిన ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం తనిఖీ చేశారు. గోడౌన్లకు ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థ, సీసీ కెమెరాల పర్యవేక్షణను పరిశీలించారు. రెవెన్యూ క్లినిక్లు సద్వినియోగం చేసుకోవాలి భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. ఇప్పటివరకు మొత్తం 17 విడతలుగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 653 దరఖాస్తులు అందగా, 252 దరఖాస్తులను పరిష్కరించినట్లు చెప్పారు. 121 దరఖాస్తులను నిబంధనల ప్రకారం తిరస్కరించగా, ఇంకా 280 దరఖాస్తులు వివిధ దశలలో పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. స్కాలర్షిప్నకు దరఖాస్తుల ఆహ్వానం వెనుకబడిన వర్గాల విద్యా సాధికారత, సామాజిక– ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకంనకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. అర్హత గల విద్యార్థులు జూన్ 2వ తేదీలోగా ఎన్ఓఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
స్వార్థంతోనే పేదల ఇళ్ల కూల్చివేత
ఉండి: కొందరి స్వార్థం కోసం సుమారు 84 కుటుంబాలకు చెందిన ఇళ్లను కూల్చివేయడం ఎంత వరకు న్యాయం? అంటూ సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ అధికారులను ప్రశ్నించారు. గత కొద్దిరోజులుగా ఉణుదుర్రులో ఆలకోడు పక్కన నివాసముంటున్న నిరుపేదల ఇళ్లు కూల్చివేసేందుకు అధికారులు నోటీసులివ్వడంతో ఉద్రిక్తత తలెత్తింది. దీంతో సోమవారం రాత్రి బాధితులకు అండగా స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద గోపాలన్,ఽ జిల్లా నాయకుడు దనికొండ శ్రీనివాస్, కిలారి తవిటినాయుడు తదితరులు బాధితులతో కలసి నడిరోడ్డుపై నిద్రించారు. అలాగే మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా గోపాలన్ మాట్లాడుతూ ఉణుదుర్రు గ్రామంలో ఇరిగేషన్,డ్రైనేజ్ భూముల్లో నివాసంటున్న 84 నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే ఇంటి పట్టాలు మంజూరు చేసి వాటిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. గ్రామంలోని కొందరి కోసం నిరుపేదల ఇళ్లు కూల్చేస్తారా? అంటూ ప్రశ్నించారు. పెద్దల ఆక్రమణలో ఉన్న భూములపై అధికారులు చర్యలు తీసుకోకుండా పేదలపై మాత్రమే ఒత్తిడి తేవడం అన్యాయమని మండిపడ్డారు. కార్యక్రమంలో పెళ్ళూరి సుబ్రహ్మణ్యం, పలువురు బాధితులు పాల్గొన్నారు. -
అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. అధికారులు పారదర్శకంగా, జవాబుదారీతనంతో పనిచేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డ్వామా పీడీ అప్పారావు, జిల్లా రెవెన్యూ అధికారి శివన్నారాయణ, కలెక్టరేట్ పరిపాలన అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్.వెంకటేశ్వర్లు తదితర అధికారులు ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి సంతృప్తి కలిగే విధంగా శాశ్వత పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. కలెక్టర్ స్వయంగా అర్జీదారుల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని, సమస్య తీవ్రతను బట్టి సంబంధిత అధికారులకు తక్షణ చర్యల కోసం సూచనలు చేశారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 151 అర్జీలు, రెవెన్యూ క్లినిక్లో 42 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం అందించే సేవలపై సానుకూల స్పందన పెంపొందేలా అధికారులు శక్తివంచన లేకుండా పని చేసి, జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన మే 7, 8 తేదీల్లో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చర్చించిన అంశాలపై సోమవారం కలెక్టర్ శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేసవి తీవ్రత దృష్ట్యా జిల్లాలో ఎక్కడా మంచినీటి కొరత తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. పేదలకు మంజూరు చేసిన గృహాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. ఆచంటలో ఐటీఐ ఏర్పాటు కోసం అవసరమైన స్థల సేకరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. -
ఇంటర్ అడ్మిషన్ల పేరిట దోపిడీ
భీమవరం: జిల్లాలో నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే విద్యా వ్యాపారం జోరుగా సాగుతోంది. నూతన భవనాలు, ప్రభుత్వ అనుమతులు లేకుండానే అడ్మిషన్లు నిర్వహించడం విశేషం. ప్రధాన కూడళ్లు, రోడ్లపైన పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టి అడ్మిషన్లు చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, రెండు ఎయిడెడ్, రెండు సోషల్ వెల్ఫేర్, 82 ప్రైవేటు కళాశాలలున్నాయి. ప్రైవేటు కళాశాలల్లో తగిన సదుపాయాలు, ఆటస్థలాలు లేకపోయినా ఇబ్బడిముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం పీల్చేస్తున్నారు. గత ప్రభుత్వాల పాలకులు ప్రభుత్వ కళాశాలలను పట్టించుకోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు కళాశాలల పట్ల ఆసక్తి చూపించారు. దీంతో జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటు గ్రామాల్లో సైతం ప్రైవేటు కళాశాలలు పెద్ద సంఖ్యలో వెలిశాయి. రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేయడమే గాక బస్సు ఫీజులు, హాస్టల్ ఫీజులతో పాటు అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఎంసెట్, ఐఐటీ ప్రవేశ పరీక్షలకు శిక్షణ అంటూ మరికొంత గుంజుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా శ్రీమనబడి నాడు–నేడుశ్రీ పథకంలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను అభివృద్ధి చేశారు. అయినా విద్యార్థుల దృష్టి ప్రైవేటు విద్యాసంస్థలపైనే ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇబ్బడిముబ్బడిగా నూతన కళాశాలలు ఇప్పటికే ఉన్న ప్రైవేటు కళాశాలలతో పాటు జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు తదితర పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా ప్రస్తుత విద్యా సంవత్సరానికి నూతన కళాశాలలను ప్రారంభిస్తున్నారు. పెద్ద భవనాలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ల్యాబ్లు, ఏసీతో సహా అధునాతన సదుపాయాలతో తరగతి గదులు ఏర్పాటు చేస్తున్నామని, మీ పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమంటూ పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టి విద్యార్థులు, వారి తల్లిదండ్రులని ఆకర్షిస్తున్నారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న కళాశాలలకు ఇప్పటివరకు భవనాల నిర్మాణం పూర్తికాకపోయినా, ప్రభుత్వం నుంచి అనుమతులు లేకపోయినా దర్జాగా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారంటే వారి వెనుక బడా రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులకు తరగతులు నిర్వహించడానికి ఎలాంటి జాగా లేకపోయినా ఒక కళాశాల యాజమాన్యం మంచి రోజులంటూ మొండి గోడల మధ్యనే తరగతులు ప్రారంభించడం విశేషం. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్న కళాశాలల యాజమాన్యాలపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో నిర్మాణంలో ఉన్న భవనాల్లోనే తరగతులు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. ఫీజులు కూడా ఇంటర్లో అడ్వాన్స్డ్ గ్రూపునకు రూ. 95 వేల నుంచి రూ. 1.10 లక్షల వరకు, జేఈఈ మెయిన్స్కు రూ.75 వేల నుంచి రూ.90 వేల వరకు వసూలు చేస్తుండగా, విద్యార్థులు టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో సాధించిన మార్కులను బట్టి రూ. 35 వేల వరకు తగ్గింపు ఇస్తూ, మరికొంతమందికి 50 శాతం రాయితీ అంటూ విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కళాశాలలో విద్యార్థులను చేర్పించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుని మరీ అడ్మిషన్లు ఇస్తున్నారంటే విద్య వ్యాపారం ప్రాధాన్యత అవగతమవుతోంది. ప్రభుత్వ అనుమతులు, భవన నిర్మాణాలు లేకుండా అడ్మిషన్లు చేస్తున్న కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అనుమతులు, భవనాలు లేకుండానే తరగతులు ఫీజు రాయితీలంటూ మభ్యపెట్టే ప్రయత్నం అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్కు శిక్షణ అంటూ జోరుగా వ్యాపారం ప్రభుత్వ అనుమతులు, భవన నిర్మాణాలు పూర్తి చేయకుండా అడ్మిషన్లు నిర్వహించే జూనియర్ కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం. నిబంధనల ప్రకారం ప్రభుత్వ అనుమతి పొందిన తరువాతనే అడ్మిషన్లు చేయించాల్సి ఉంటుంది. అలా కాకుండా జాయినింగ్లు చేసుకుంటే చర్యలు తప్పవు. – జి.ప్రభాకరరావు, ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం: -
ఇంటి కోసం పోరాటం
ఉండి మండలం ఉణుదుర్రులో ఇళ్ల కోసం బాధితులు పోరాటం సాగిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి తమ నిరసన తెలిపారు. 8లో uఆచంట నియోజకవర్గమంతా మట్టి మాఫియా, ఇసుక మాఫియాగా తయారైంది. అక్రమ తవ్వకాలను అడ్డుకున్న వారిపై అక్రమంగా కేసులు బనాయించి వేధిస్తున్నారు. అక్రమ కేసులకు ఎవరూ భయపడేది లేదు. రెడ్బుక్ పేరుతో భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారు. ఎంత మంది మీద అక్రమ కేసులు బనాయించినా వెనకడుగు వేసేది లేదు. అక్రమ మట్టి, ఇసుక తవ్వకాల మీద పోరాటం చేస్తాం. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తాం. – చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నియోజకవర్గ వైఎస్సార్సీపీ కన్వీనర్ ఆచంట నియోజకవర్గంలో రెడ్బుక్ రాజ్యాంగం మొదలైందని కూటమి నాయకులు సోషల్ మీడియాల్లో పోస్టులు పెడుతున్నారు. అక్రమ తవ్వకాలను అడ్డుకున్న సీనియర్ నేత సుంకర సీతారామ్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. లోకేష్ రెడ్ బుక్ పట్టుకున్న ఫొటోతో వాట్సప్లో పెట్టి మరి కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులను అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. కూటమి నాయకులు బెదిరింపులకు లొంగకుండా అక్రమ తవ్వకాలు, ఇసుక దందాలపై పోరాడతాం. – కె.వేణుబాబు, వైఎస్సార్సీపీ నేత -
సాయిప్రియను ఆదర్శంగా తీసుకోవాలి
ఆగిరిపల్లి: ఇరు రాష్ట్రాల్లో మానసిక ఆరోగ్య రంగంలో అందించిన సేవలకుగాను మండలంలోని కనసానపల్లికి చెందిన యువ సైకాలజిస్ట్ పేట సాయిప్రియకు హైదరాబాదులో సైకాలజిస్ట్ అసోసియేషన్ తరుఫున 2026 సంవత్సరానికి గాను ‘ఉమెన్ ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సైకాలజీ’ అవార్డును ప్రదానం చేశారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా సాయిప్రియకు ఈ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసులోనే మానసిక ఆరోగ్య రంగంలో సేవలందిస్తున్న సాయిప్రియను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, తెలంగాణ రాష్ట్ర మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, జాతీయ కమిషన్ మాజీ మహిళా సలహాదారురులు టి.వెంకటరత్నం, తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మోతుకూరి రామచందర్ పాల్గొన్నారు. వీరవాసరం: రైల్వేస్టేషన్ సమీపంలో మంటలు చెలరేగడం వీరవాసరంలో కలకలం రేపింది. వీరవాసరం రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే శాఖకు సంబంధించిన ఖాళీ స్థలం ఉంది. అక్కడ తాటి మట్టల మధ్య సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు రావడంతో రైల్వే స్టేషన్లోని ప్రయాణికులు కంగారు పడ్డారు. స్థానికులు స్పందించి మంటలను అదుపు చేశారు. ఇది ఆకతాయిల పనిగా స్థానికులు పేర్కొంటున్నారు. ఏలూరు (టూటౌన్) : ఏలూరులో ఒకటవ అడిషనల్ సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్)గా పనిచేస్తున్న వి.రఘునాఽథ్ని గుంటూరులో 3వ అడిషనల్ సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) కమ్ జేఎంఎఫ్సిగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో తిరుపతిలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) కమ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్గా పనిచేస్త్నున్న బి.వాణిశ్రీని నియమించారు. ముదినేపల్లి(కై కలూరు): సింగరాయపాలెం అమృతేశ్వరస్వామి ఆలయ హుండీ చోరీకి గురైంది. దీనితో పాటు ఆలయ ఆవరణలోని ద్విచక్ర వాహనాన్ని సైతం దొంగలు అపహరించారు. అర్చకుడు రుద్రపాక శివసత్య వరప్రసాద్ సోమవారం ఉదయం ఈ విషయాన్ని గమనించి దేవస్థాన ఈవో ఆకుల కొండలరావు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ముదినేపల్లి పోలీసు స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. హుండీల్లో సుమారు రూ.10వేలు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ముదినేపల్లి ఎస్సై వీరభ్రదరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడి దుర్మరణం ద్వారకాతిరుమల: సెల్ఫోన్లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ బైక్ నడుపుతున్న ఓ యువకుడు ఆ బైక్ అదుపు తప్పడంతో రోడ్డుపై పడి, తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ద్వారకాతిరుమలలోని వీఎస్ దర్బార్ దాబా వద్ద ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం. భీమవరంనకు చెందిన కుచర్లపాటి వర్మ(36) గత కొన్నేళ్లుగా తన భార్య, ఇద్దరు పిల్లలతో కలసి సత్తెన్నగూడెం రోడ్డులోని ఎస్ఎంఆర్ వెంచర్లో నివాసం ఉంటున్నాడు. సత్తెన్నగూడెంలో నాటుకోళ్ల ఫాంను నిర్వహిస్తున్నాడు. అలాగే గొల్లగూడెం సమీపంలోని ఓ కోడి పిల్లల హేచరీలో పనిచేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే హేచరీలో పనులు ముగించుకున్న వర్మ మండలంలోని తిమ్మాపురంలో నివాసం ఉంటున్న తన అన్నయ్య కుచర్లపాటి వెంకట నాగరాజు వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి బైక్పై రాత్రి 11.30 గంటల సమయంలో తన ఇంటికి బయల్దేరాడు. సెల్ఫోన్లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ బైక్ను వేగంగా నడిపాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడటంతో, తీవ్ర గాయాలపాలైన వర్మ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి అన్నయ్య వెంకట నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెడ్ కానిస్టేబుల్ జి.దుర్గారావు తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
జిల్లా డీఈవో నారాయణ గణపవరం: ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు, అర్హులైన ఉపాధ్యాయులు, ప్రణాళికాబద్ధమైన బోధనతో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించాలని పశ్చిమగోదావరి జిల్లా డీఈవో నారాయణ అన్నారు. సోమవారం గణపవరం మండలం పిప్పరలో బడి పిలుస్తుంది కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపేలా అంగీకరింప చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం జె.వెంకటేశ్వర్లు, ఎంఈవో–1 ప్రకాష్, విద్యా కమిటీ ఛైర్మన్ బాలాజీ, బుచ్చిమాస్టారు తదితరులు పాల్గొన్నారు. -
పరాకాష్టకు పచ్చ తెగింపు
చెరువుల జాతరకు అడ్డకట్ట పడదా...? ముదినేపల్లి మండలంలో చేపల చెరువుల జాతరకు అడ్డకట్ట పడటం లేదు. తవ్వకాలకు అనుమతులు ఉన్నాయంటూ ఎకరాలకు ఎకరాలు తవ్వేస్తున్నారు. 8లో uమంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2026సాక్షి, భీమవరం: ఆచంటలో కూటమి బరితెగింపు పరాకాష్టకు చేరింది. ఇసుక, మట్టి దోపిడీపై ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసిన ఎనిమిది మంది వైఎస్సార్సీపీ నేతల్లో దళిత మాజీ సర్పంచ్ను అక్రమంగా అరెస్టు చేశారు. మిగిలిన వారిపైనా కుట్రలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రెడ్ బుక్ ఓపెన్న్ (8–1 = 7) జస్ట్ వెయిట్ అంటూ కూటమి నేతలు సోషల్ మీడియాలో పోస్టు చేయడం కక్షసాధింపు చర్యలకు నిదర్శనమని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లాలో తీరప్రాంతానికి చేరువగా ఉన్న ఆచంట, పెనుగొండ, యలమంచిలి, నరసాపురం మండలాలను కోస్టల్ రెగ్యులేటరీ జోన్న్గా రెండేళ్ల క్రితం కేంద్రం ప్రకటించింది. ఈ ప్రాంతంలోని వశిష్ట గోదావరి తీరం వెంట సిద్దాంతం, కరుగోరుమిల్లి, కోడేరు, నడిపూడిలోని ఆరు ఓపెన్ రీచ్లు, నరసాపురంలోని ఐదు డిసిల్టేషన్ పాయింట్లు మూసివేశారు. ఇదే అదనుగా కూటమి నేతలు సీఆర్జెడ్ నిబంధనలు తుంగలో తొక్కి ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలకు తెరలేపారు. ఏటిగట్టు, లంక భూములు, నక్కల డ్రెయిన్లో కోట్లాది రూపాయల సహజ సంపదను కొల్లగొడుతున్నారు. అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు పోరాటం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేత, కొడమంచిలి మాజీ సర్పంచ్ సుంకర సీతారామ్ తదితరులు తవ్వకాలు జరుగుతున్న చోటకు వెళ్లి అడ్డుకుని అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఆచంట మండలంలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలుపై సీతారాంతో పాటు మరో ఏడుగురు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. తవ్వకాలకు వ్యతిరేకంగా న్యాయస్థానం నుంచి ఆదేశాలు తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఉపాధి పనుల్లో అవకతవకల పేరిట ఫీల్డ్ అసిస్టెంట్తో పాటు ముందెన్నడూ లేని విధంగా మాజీ సర్పంచ్ సీతారాంను ఇటీవల అక్రమంగా అరెస్టు చేయించడం తెలిసిందే. న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు కూటమి అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఆటోడ్రైవర్పై ఎమ్మెల్యే వీరంగం, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, అరెస్టులతో వేధింపులకు గురిచేసిన ఘటనలెన్నో. ఇదే క్రమంలో ఆచంటలో అక్రమ తవ్వకాలకు అడ్డు తగులుతున్న సీతారామ్పై అక్రమ కేసు బనాయించారు. మిగిలిన ఏడుగురిని లక్ష్యంగా చేసుకుని కుట్రలు చేస్తున్నారు. రెడ్ బుక్ ఓపెన్ (8–1 = 7) జస్ట్ వెయిట్ అంటూ కూటమికి చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లో ఆ పార్టీలకు చెందిన వారు పోస్టులు పెట్టడం గమనార్హం. అధికారాన్ని అడ్డంపెట్టుకుని కూటమి నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్న చెప్పేందుకు ఈ పోస్టు నిదర్శనమని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల పక్షాన తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు. ఇసుక, మట్టి సహజ సంపదను కొల్లగొడుతూ పర్యావరణానికి, ముంపు రూపంలో రైతులు, లోతట్టు ప్రాంతాల ప్రజలకు నష్టం కలిగిస్తుంటే ఉపేక్షించేది లేదంటున్నారు. ఆచంటలో అక్రమ మైనింగ్పై వైఎస్సార్సీపీ పోరుబాట సీఆర్జెడ్లో ఇసుక, మట్టి తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు వారిలో దళిత మాజీ సర్పంచ్ అక్రమ అరెస్టు రెడ్ బుక్ ఓపెన్ (8–1 =7) జస్ట్ వెయిట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు అక్రమాలపై పోరాటం ఆపేది లేదన్న వైఎస్సార్సీపీ -
డీఎస్పీ సారూ.. పీజీఆర్ఎస్కు హాజరుకారు
● జిల్లా స్థాయి పీజీఆర్ఎస్కు పోలీసు ఉన్నతాధికారులు హాజరుకాని వైనం ● పోలీసు కేసుల ఫిర్యాదుల పరిష్కారంపై అలసత్వం భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి పీజీఆర్ఎస్కు అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరవుతుంటే డివిజన్ స్థాయిలోని డీఎస్పీ మాత్రం హాజరు కావడం లేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా పోలీస్ కేసులకు సంబంధించి అనేక సమస్యలపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చూపుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా జిల్లా స్థాయి పీజీఆర్ఎస్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్తోపాటు డీఎస్పీ స్థాయి అధికారి పాల్గొనాలి. దీని ప్రకారం భీమవరం కలెక్టరేట్లో జరిగే పీజీఆర్ఎస్కు సమీపంగా ఉన్న భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు హాజరుకావాలి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భీమవరం డీఎస్పీలుగా పనిచేసిన అధికారులెవ్వరూ పీజీఆర్ఎస్కు రావడం లేదు. కనీసం సీఐలు కూడా హాజరుకాకపోవడం గమనార్హం. ఎస్సై లేదా ఏఎస్సై స్థాయి అధికారి మాత్రమే మొక్కబడిగా హాజరవుతున్నారు. దాంతో కలెక్టరేట్కు వచ్చే పోలీస్ సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఆయా స్టేషన్లకు బదిలీ జిల్లా పీజీఆర్ఎస్లో ప్రతి సోమవారం పది నుంచి 15 ఫిర్యాదులు పోలీసు కేసులకు సంబంధించి వస్తున్నాయి. మండల స్థాయిలో పోలీసులు పట్టించుకోవడం లేదని మహిళలు అనేక కేసుల విషయంపై కలెక్టరేట్కు జరిగే పీజీఆర్ఎస్కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఇక్కడ వాటిని పరిష్కరించే పోలీసు అధికారి లేకపోవడంతో ఆ ఫిర్యాదులను తిరిగి ఆయా స్టేషన్లకు బదిలీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో క్రమం తప్పకుండా హాజరు గత ప్రభుత్వంలో కలెక్టరేట్లో జరిగే స్పందన కార్యక్రమానికి భీమవరం డీఎస్పీ క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. పోలీసు కేసుకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించేశారు. పై అధికారి స్థాయిలో ఉన్న సమస్యలను ఎస్పీ స్పందనకు బదిలీ చేసేవారు. దాంతో జిల్లా నలుమలూల నుంచి వచ్చే ప్రజలకు సంబంధించిన పోలీసు కేసుల సమస్యలు పరిష్కారమయ్యేవి. ఇప్పటికై నా కలెక్టర్ నాగరాణి ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించి డీఎస్పీ స్థాయి అధికారిని పీజీఆర్ఎస్కు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
సాలిపేట కుర్రాడికి ‘బకింగ్హామ్’ ఆహ్వానం
కాళ్ల: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం సాలిపేటకు చెందిన వావిలాల శ్రీనివాసులు యూకేలో తన సామాజిక సేవలకు గుర్తింపుగా బకింగ్హామ్ ప్యాలెస్లో నిర్వహించిన ప్రతిష్టాత్మక కింగ్ గార్డెన్ పార్టీకి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. గత 20 ఏళ్లుగా యుకేలో ఉంటున్న ఆయన భారతీయ, స్థానిక సమాజాల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ఇది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు అని, బ్రిటిష్ రాజ కుటుంబం నుంచి వ్యక్తిగత ఆహ్వానం అందుకోవడం చాలా అరుదైన విషయం ఆనందం వ్యక్తం చేశారు. భిన్నాభిప్రాయాలు పెరుగుతున్న ఈ కాలంలో, మన సంస్కృతిని గౌరవిస్తూ సమాజానికి సేవ చేయడం ఎంతో ముఖ్యమని తాను నమ్ముతున్నానని తెలిపారు. -
ఇంటి కోసం పోరాటం
● ఉండి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ● తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్న ఉణుదుర్రు ఇళ్ల బాధితులు ఉండి: ఉణుదుర్రులో ఇళ్ల కోసం బాధితులు పోరాటం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి గ్రామ సచివాలయాన్ని ముట్టడించిన బాధితులు సోమవారం ఉండిలో తహసీల్దార్ కార్యాలయాన్ని సీపీఎం నాయకులతో సంయుక్తంగా ముట్టడించి తమ నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కే నాగార్జునకు వినతిపపత్రం అందించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. 70 ఏళ్లనుంచి ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉణుదుర్రులో ఆలకోడులో నివాసముంటున్నామని, ఇప్పుడు రాజకీయ నాయకుల ప్రేరేపణలతో తమను అన్యాయంగా అధికారులు ఖాళీ చేయిస్తున్నారని వాపోయారు. తమ ఇళ్లను కూల్చవద్దంటూ వేడుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉంటున్న తమను ఇప్పుడు వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్లాలని బోరున విలపించారు. ఇళ్లు ఖాళీ చేయట్లేదని మాకు వారంరోజులుగా మంచినీటి సరఫరాను నిలిపివేశారని బాధితులు ఆరోపించారు. ఎవరి సంతోషం కోసమో తమ జీవితాలు నాశనం చేయవద్దని మొర పెట్టుకున్నారు. ముందుగా మాకు నివాసయోగ్యమైన స్థలాలు చూపించాలని అక్కడ ఇళ్ళు కట్టుకునేందుకు సహకరించాలని బాధితులు కోరారు. -
లెజిస్లేటివ్ లీడర్షిప్ వర్క్షాపులో రవీంద్రనాథ్
తణుకు అర్బన్: బెంగళూరులో నిర్వహించిన జాతీయ స్థాయి స్టేట్ లెజిస్లేటివ్ లీడర్షిప్ వర్క్షాపులో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ పాల్గొన్నారు. అజీమ్ ప్రేమ్జీ యూనివర్శిటీలో పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగింది. 14 రాష్ట్రాల నుంచి దాదాపు 40 మంది హాజరైన ఈ సదస్సులో.. విద్యా విధానంలో మార్పులు, ప్రజా ఆరోగ్య వ్యవస్థలోని సమస్యలు, రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ నిర్వహణ వంటి కీలక అంశాలపై చర్చించినట్లు ఆయన వివరించారు. భీమవరం: ఎన్నికల హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, దీనిపై వైఎస్సార్సీపీ పోరాటాలు చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు పిలుపునిచ్చారు. సోమవారం భీమవరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1,800 నగదు, 50 ఏళ్లకే పెన్షన్లు వంటి వాగ్దానాలు నెరవేర్చలేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలులో సంచుల కొరతతో రైతులు, రక్షణ లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా పదవులు పొందిన నాయకులు నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలపై పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గాదిరాజు రామరాజు, చవాకులు సత్యనారాయణ, చిగురుపాటి సందీప్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం: పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల సమస్యల పట్ల స్పందించడంలో అలసత్వం ప్రదర్శించకూడదని, త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమ వారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడి, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. భీమవరం: విద్యార్థులు తమ జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. భీమవరం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు, మానవతా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య ద్వారానే ఆర్థిక ఇబ్బందులను అధిగమించి సమాజంలో మంచి గుర్తింపు పొందవచ్చన్నారు. సంస్థ నిర్వాహకుడు ఇందుకూరి ప్రసాదరాజు మాట్లాడుతూ.. 23 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు రూ.44 వేల నగదు పురస్కారాలు, జ్ఞాపికలు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, సంస్థ ప్రతినిధులు రామ్మోహనవర్మ, వెంకటపతిరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కాలు బెనకడంతో, భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఓపీ నమోదు చేయించుకుని ఆర్ధోపెడిక్ విభాగంలో వైద్య చికిత్స పొందారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలోని పలు విభాగాలను స్వయంగా పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, పరిశుభ్రత, వైద్య సిబ్బంది పనితీరు తదితర అంశాలపై రోగులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్య సేవల నాణ్యత, అవసరమైన మందులు అందుతున్నాయా, వైద్యులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తున్నారా, ఆసుపత్రి పరిసరాలు, వాష్రూమ్లు పరిశుభ్రంగా ఉన్నాయా, ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా వంటి పలు అంశాలపై రోగులను ప్రశ్నించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు జిల్లా యంత్రాంగం దశలవారీగా చర్యలు చేపట్టిందన్నారు. నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యశాఖ పనితీరును నిరంతరం సమీక్షిస్తున్నామని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. -
చెరువుల జాతరకు అడ్డ్డుకట్ట పడదా..?
సాక్షి టాస్క్ఫోర్స్: ధాన్యాగారంగా పేరుగడించిన ముదినేపల్లి మండలంలో చేపల చెరువుల జాతరకు అడ్డకట్ట పడటం లేదు. రెవెన్యూ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. తవ్వకాలకు అనుమతులు ఉన్నాయంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఎకరాలకు ఎకరాలు నిర్వాహకులు తవ్వేస్తున్నారు. అనమతులు మూరెడు.. తవ్వేది బారెడు అన్న చందంగా మారింది ముదినేపల్లి మండలంలో పరిస్థితి. పూర్వం కొల్లేరులో బడాబాబులు లీజులు పేరుతో విజయవాడ, హైదరాబాదు, విశాఖపట్నం నుంచి వచ్చి సాగు చేసేవారు. అదే పద్ధతి నేడు ఇక్కడ గ్రామాల్లో కనిపిస్తోంది. ఇతర ప్రాంతాల బడాబాబులు వచ్చి పచ్చని పొలాలను చేపల చెరువుల లీజుల పద్ధతుల్లో తవ్వుతున్నారు. ఉలిక్కిపడుతున్న ఊటుకూరు ప్రకృతితో కూడిన ప్రశాంతతకు నిలయంగా పేరు పొందిన ఊటుకూరులో ఇప్పుడు పొక్లెయిన్ల మోత వినిపిస్తోంది. ఇక్కడ ఓ వ్యక్తి చెరువు తవ్వకం చేస్తున్నారు. అనుమతులు 8 ఎకరాలకు ఉన్నాయని రెవెన్యూ సిబ్బందిలో ఒకరు చెబుతుంటే లేదు 20 ఎకరాల వరకు ఉందని మరొకరు చెబుతున్నారు. ప్రస్తుతం తవ్వుతున్న భూముల సమీపంలో మందబయిలు భూములు ఉన్నాయి. గ్రామ అవసరాలకు వీటిని ఉపయోగించుకోవచ్చు. ఈ భూముల విషయంపై ఇటీవల గ్రామంలో ఆందోళనలు సైతం జరిగాయి. రెవెన్యూ సర్వేయర్ హద్దులు కూడా నిర్ణయించకుండా తవ్వుతున్నారనే విమర్శలు వివిపిస్తున్నాయి. పైగా ఇక్కడ తవ్విన మట్టిని గట్లుకు ఉపయోగిస్తూ, కొన్ని ట్రాక్టర్లు గ్రామంలో భూములు పూడ్చడానికి వెళుతున్నాయని ఆరోపిస్తున్నారు. సర్వే చేయిస్తాం.. ఈ విషయంపై గ్రామ రెవెన్యూ అధికారి ఎంవీవీ సత్యంబాబును వివరణ కోరగా తవ్వకాలకు అనుమతులు ఉన్నాయన్నారు. మందబయిలు భూములు తవ్వితే అడ్డుకుంటామన్నారు. సర్వేయర్తో కలసి భూములను పరిశీలిస్తామన్నారు. నియోజకవర్గంలో చెరువుల తవ్వకాల విషయంలో మీడియా వెళుతోంటే ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్కు దృష్టికి తీసుకెళ్లామని నిర్వాహకులు ఘాటుగా సమాధానం చెబుతున్నారు. రెవెన్యూ అధికారుల పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. ముదినేపల్లి మండలాన్ని మొత్తాన్ని శాశించే ఓ నాయకుడు కనుసన్నల్లోనే ఏపనైనా జరగాలనే హుకుం ఇక్కడ కొనసాగుతోంది. అధికారులు సైతం ఆయన ఇంటికి వెళ్లి శాఖాపర విషయాలు చర్చిస్తున్నారు. కూటమి నాయకుల్లో సైతం అతని మాటకు ఎదురు చెప్పలేక మిన్నుకుంటున్నారు. జిల్లా స్థాయి అధికారులు ముదినేపల్లి మండలంలో ఆక్వా చెరువులకు ఎన్ని ఎకరాలకు అనుమతులు ఇచ్చారనే విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలని పలువురు కోరుతున్నారు. ఊటుకూరు చెరువు తవ్వకంపై వివాదం మందబయలు భూములు తేల్చకుండా తవ్వకం అనుమతులు ఉన్నాయంటున్నరెవెన్యూ సిబ్బంది ఎన్ని ఎకరాలనేది స్పష్టత కరవు -
భక్తులతో కిటకిటలాడిన త్రిలింగ క్షేత్రం
పెనుమంట్ర : త్రిలింగ క్షేత్రంగా పేరుగాంచిన నత్తరామేశ్వరం గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. వైశాఖ మాసం ఆఖరి సోమవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. వైశాఖ మాసంలో నెల రోజులు మాత్రమే దర్శనమిచ్చే గోస్తనీ నది గర్భాలయంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామిని, నదీ ఒడ్డున ఉన్న సీతారామ ప్రతిష్ట శ్రీ ఉమా రామేశ్వర స్వామిని, ఆవలి ఒడ్డున ఉన్న శ్రీ లక్ష్మణేశ్వర స్వామిని భక్తులు ఏకకాలంలో దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో చలువ పందిరులు, కరల్రతో కట్టిన బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ అంచనాలకు మించి భక్తులు హాజరు కావడంతో హనుమాన్ గుడి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వరకు రాజగోపురం ఎదురుగా ఉన్న సుమారు 20 మీటర్ల పొడవున్న క్యూలైన్లో భక్తులు మండు టెండలో ఇబ్బందులు పడుతూ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సమీపంలో ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేయకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారు. దాతల సహకారంతో రామలింగేశ్వరుని కలమండపంలో స్థానిక ఎంపీటీసీ సభ్యులు టి. ఎన్.సత్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన అన్నదానంలో సుమారు 6 వేలమందికి పైగా భక్తులు అన్న ప్రసాదం స్వీకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఆలయం వద్ద దాతల సహకారం ఉన్నప్పటికీ దేవదాయ శాఖ అధికారుల పనితీరు వల్ల భక్తులు ఇబ్బందులు పడవలసి వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. -
గోపాలరాజు సేవలు ఎనలేనివి
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రకృతి వైద్యుడు డాక్టర్ వేగిరాజు గోపాలరాజు సేవలు ఎనలేనివని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు అన్నారు. భీమవరం ప్రకృతి ఆశ్రమంలో సోమవారం డాక్టర్ వేగిరాజు గోపాలరాజు సంతాప సభ నిర్వహించారు. మోషేన్ రాజుతో పాటు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తాత, తల్లిందండ్రుల ఆశయాలు నిలబెడుతూ పేదలకు వైద్యం అందించిన ప్రకృతి వైద్యులు గోపాలరాజు అని అన్నారు. తానూ నమ్ముకున్న సిద్దాంతం కోసం గ్రామాన్ని వదలకుండా తాత, తండ్రి అందించిన ప్రకృతి ఆశ్రమంలోనే వైద్య సేవలు అందించిన గోపాలరాజు చిరస్మరణీయులన్నారు. కంతేటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి, వేగిరాజు రామకృష్ణంరాజు, వేగిరాజు శివవర్మ, మూర్తి తదితరులు పాల్గొని నివాళులర్పించారు. -
నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ప్రతిభ
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్న ఎస్.నిఖిలేశ్వరరావు, సాయి మణికంఠ ఈశ్వర్ జాతీయస్థాయిలో విశేష ప్రతిభ చూపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ శివలాల్ కేతావత్ మార్గదర్శకత్వంలో ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఆటో–అడ్జుడికేషన్ హ్యాకథాన్ షోకేస్ 2026 లో ‘డాక్యుమెంట్ ఫోర్జరీ/డీప్ ఫేక్ డిటెక్షన్’ విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచి రూ.3 లక్షల బహుమతిని కై వసం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థల నుంచి యువ ఆవిష్కర్తలు 3,500 మందికి పైగా పాల్గొన్న ఈ పోటీ ప్రతిష్టాత్మకంగా జరిగింది. తుది దశకు ఎంపికై న కొద్ది బృందాలలో నూజివీడు ట్రిపుల్ ఐటీ బృందం నిలిచి, తన వినూత్న ఆలోచనతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. టీమ్ రూపొందించిన ఫోరెన్సిక్ ఫ్రాడ్ డిటెక్షన్ సొల్యూషన్.. ఆరోగ్య బీమా క్లెయిమ్ల పరిశీలనలో ఉపయోగించే డాక్యుమెంట్లలో ఉండే ఫోర్జరీలు, మార్పులు, డీప్ఫేక్ ఆధారిత మోసాలను గుర్తించేందుకు సహాయ పడుతుంది. శ్రీఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన్ఙ పథకంలో క్లెయిమ్ల ఆటో అడ్జుడికేషన్ ప్రక్రియలో ఈ పరిష్కారం ఉపయోగపడుతుంది. తక్కువ కంప్యూటింగ్ వనరులతో అధిక ఖచ్చితత్వంతో మోసాలను గుర్తించే విధానాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. ఈ ఘనతకు గుర్తింపుగా టీంకు రూ.3 లక్షల నగదు బహుమతి అందజేశారు. విద్యార్థులు మాట్లాడుతూ.. ఆరోగ్య రంగంలో డిజిటల్ మోసాలను తగ్గించే దిశగా తమ పరిశోధన కొనసాగుతుందని, సమాజానికి ఉపయోగపడే సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మార్గదర్శకులైన అసిస్టెంట్ ప్రొఫెసర్ శివలాల్ కేతావత్ మాట్లాడుతూ విద్యార్థుల కృషి, పరిశోధనా పరమైన ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలే ఈ విజయానికి ప్రధాన కారణమని, పరిమిత వనరులతో కూడా నాణ్యమైన పరిశోధన చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని తెలిపారు. డీప్ ఫేక్ డిటెక్షన్ విభాగంలో రన్నరప్ -
గిన్నిస్ బుక్లోకి పోతునూరు చిన్నారులు
చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పోతునూరు గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. షేక్ మదర్ సాహెబ్, హుస్సేన్ బి దంపతుల కుమార్తెలు షేక్ రిబ్కా, షేక్ కేజీయలు తమ కీబోర్డ్ ప్లేయింగ్ నైపుణ్యంతో ఈ ఘనత సాధించారు. గత ఫిబ్రవరిలో గిన్నిస్ ప్రతినిధుల సమక్షంలో జరిగిన భారీ సామూహిక కీబోర్డ్ ప్లే కార్యక్రమంలో భారత్, అమెరికా, బ్రిటన్ సహా 22 దేశాల నుంచి సుమారు 2,000 మంది పాల్గొన్నారు. కఠినమైన నిబంధనల మధ్య జరిగిన ఈ పోటీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన 777 మంది విజేతలలో ఈ అక్కాచెల్లెళ్లు చోటు దక్కించుకున్నారు. చిన్నతనం నుంచే సంగీతంపై ఆసక్తితో క్రమశిక్షణగా శిక్షణ పొందిన వీరు, శుక్రవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ప్రశంసా పత్రాలను అందుకున్నారు. -
మండే ఎండల్లో అంగన్వాడీ కేంద్రాలు
● చిన్నారులు ఆపసోపాలు ● పౌష్టికాహారం ఇంటి వద్ద ఇవ్వాలని డిమాండ్ దెందులూరు: జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాలను మాత్రం చిన్నారుల వయసు ఎండలతో సంబంధం లేకుండా నిర్వహిస్తున్నారు. మండే ఎండల్లో కేంద్రాలు నిర్వహించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తున్న చిన్నారులు, సిబ్బంది నానా ఇక్కట్లు పడుతున్నారు. అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉన్న గర్భిణులు, బాలింతలకు ఐసీడీఎస్ సిబ్బంది పౌష్టికాహారాన్ని ఇంటికి తీసుకువెళ్లి ఇస్తారు. ఈ మాదిరిగానే ఎండలు మండుతున్న దృష్ట్యా అంగన్వాడీ సిబ్బంది పౌష్టికాహారాన్ని చిన్నారులకు ఇంటికి వెళ్లి అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎండల్లో అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించడంపై జిల్లా వ్యాప్తంగా చిన్నారుల తల్లిదండ్రులు బంధువులు కుటుంబ సభ్యులు స్వచ్ఛంద సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 8 గంటలకే ఎండ ప్రచండం మొదలవుతుంది. వీలైనంత త్వరగా పనులు ముగించుకుని ఇంటికి వెళ్ళాలని వ్యవసాయ కూలీలు, చిరు వ్యాపారులు, ప్రజలు ఉరుకులు పరుగులు మీద తమ పనులను చేసుకుంటున్నారు. జూన్ రెండో వారం వరకు ఇదే పరిస్దితి కొనసాగుతుందని ఇప్పటికే హెచ్చరిస్తుంటే, అంగన్వాడీ కేంద్రాల చిన్నారుల పరిస్ధితిపై అధికారులకు గానీ, ప్రజా ప్రతినిధులకు గానీ కనికరం లేకుండా పోయింది. వేసవిలో కేంద్రాలకు వెళ్ళే చిన్నారులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అంగన్వాడీ కేంద్రాల్లో మగ్గిపోతున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు మంజూరు చేయకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం సమయాల్లో మార్పు వేసవి వచ్చినప్పటికీ యథావిధిగా కేంద్రాలను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు సెలవులు మంజూరు చేసింది. వేసవికాలంలో ఎండ దెబ్బ తగలకుండా విద్యార్థులను సంరక్షించాలన్న ఉద్దేశ్యంతో సెలవులు ఇస్తారు. దీనికి విరుద్ధంగా మహిళా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ద్వారా నిర్వహించే అంగనన్వాడీ కేంద్రాలకు మాత్రం వేసవి వేడి తగలనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో మూడు సంవత్సరాల నుంచి 5 ఏళ్ల వయస్సు కలిగిన విద్యార్ధులకు విద్యా బుద్ధులు నేర్పుతుంటారు. మండుతున్న ఎండల దష్ట్యా అంగన్వాడీలకు ఇటు యూనియన్లు, చిన్నారుల తల్లిదండ్రులు అధికారులపై ఒత్తిడి తేస్తే, సమయాల్లో స్వల్ప మార్పులు చేశారు తప్ప పూర్తిగా సెలవలు ఇవ్వలేదు. ప్రభుత్వమే ఉదయం 10 గంటల తరువాత బయటకు రావద్దని హెచ్చరిస్తుంటే, చిన్నారులు మాత్రం ఎండల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పసివాళ్ల తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. అదికారులు ఇప్పటికై న స్పందించి అంగనన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించి మండుతున్న ఈ భారీ ఎండల నుంచి చిన్నారులను కాపాడాలని తల్తిదండ్రులు కోరుతున్నారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు – 2226 అంగన్వాడీ వర్కర్లు – 2101 హెల్పర్లు – 1827 మినీ వర్కర్లు – 66 3 నుంచి 6 ఏళ్ల లోపు చిన్నారులు – 24,483 7 నెలల చిన్నారులు – 42,529 అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని ఇంటికి వెళ్లి సిబ్బంది ఇస్తున్నారు. అలాగే చిన్నారులకు ఎండలు తగ్గేవరకు ఇంటికి వెళ్లి పోష్ఠికాహారాన్ని అందించాలి. మండుతున్న ఎండలు దృష్ట్యా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మండల సరస్వతి, జెడ్పీటీసీ, ఏలూరు ఉదయం అంగన్వాడీకి వెళ్లినప్పుడు బాగానే ఉంటారు. ఎండలో ఇంటికి వచ్చేటప్పటికీ అలసరిపోతున్నారు. ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు. ప్రభుత్వం స్పందించి ఎండల్లో అంగన్వాడీ కేంద్రాలు మూసివేయాలి. నిట్టా లీలానవకాంతం, జడ్పీటీసీ, దెందులూరు -
శ్రీవారి క్షేత్రం.. అభివృద్ధి ఘనం
● 9 ఏళ్లలో రూ.99 కోట్లతో అభివృద్ధి పనులు ● మండపాలు, క్యూ కాంప్లెక్స్ల నిర్మాణాలు ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్న తపన, తాపత్రయం క్షేత్రాన్ని అభివృద్ధిలో పరవళ్లు తొక్కిస్తోంది. గత 9 ఏళ్లలో శ్రీవారి కొండపై సుమారు రూ. 99 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. వాటి ద్వారా ప్రస్తుతం భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయి. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, ఈఓ వేండ్ర త్రినాథరావు, ఈఈ డీవీ భాస్కర్ క్షేత్రాభివృద్ధికి శ్రమిస్తున్నారు. మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా.. క్షేత్రంలో అభివృద్ధి పనులను మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా చేస్తున్నారు. అందులో భాగంగా శ్రీవారి కొండపై సుమారు రూ.70 కోట్లతో నిర్మించిన శ్రీ వకుళమాత అన్నప్రసాద భవనం, అనివేట్టి మండపం, స్వామివారి నిత్యకల్యాణ మండపం, కేశఖండనశాల, పలహారశాల, ప్రసాదాలు, టికెట్ కౌంటర్లు, రెండు ఘాట్రోడ్లు, మాధవ కల్యాణ మండపంలో నిర్మించిన వంటశాల, భోజన శాలలు, మాధవుని కుంట, పవర్హౌస్, సెంట్రల్ స్టోర్, శివాలయం–దొరసానిపాడు, పలు ఘాట్ రోడ్లను 2018లో ప్రారంభించారు. తాజాగా రూ. 29 కోట్లతో నిర్మించిన శాశ్వత క్యూకాంప్లెక్స్, విస్తరించిన అనివెట్టి మండపం, 5 అంతస్తుల శివాలయం రాజగోపురాన్ని ఈనెల 9న ప్రారంభించారు. అందుబాటులోకి మరో 40 మండపాలు సామాన్య భక్తులు వివాహాలు చేసుకోవడానికి అనివెట్టి మండపాలు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. పాత అనివెట్టి మండపంలోని 40 మండపాల్లో ప్రస్తుతం 32 మండపాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. కొత్త మండపం ప్రారంభం కావడంతో మరో 40 మండపాలు అందుబాటులోకి వచ్చాయి. అంటే అనివెట్టి మండపాల సంఖ్య 72కి చేరింది. కేవలం రూ. 2 వేలు నామమాత్రపు రుసుముకు వీటిని అద్దెకు ఇస్తున్నారు. ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు ఇక్కడ చెరగని ముద్ర వేశారు. చినవెంకన్న ఆలయానికి ఐదోసారి ఈఓగా పనిచేసే అవకాశం ఆయనకు లభించింది. ఛైర్మన్ మద్ధతు సంపూర్ణంగా ఉండటంతో చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమం సఫలీకృతం అవుతోంది. -
ఎ.గోకవరంలో యథేచ్ఛగా కంకర తవ్వకాలు
ఉంగుటూరు: ఎ.గోకవరం గ్రామ ఆయకట్టు పరిధిలో కంకర తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గతంలో గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో కొన్ని రోజులు నిలిచిన తవ్వకాలు, ఇప్పుడు తిరిగి ప్రారంభమయ్యాయి. స్థానిక అవసరాలకు కంకర లభించకుండా, నిబంధనలకు విరుద్ధంగా విచక్షణారహితంగా తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణం దెబ్బతినేలా అత్యంత లోతైన గోతులు తవ్వడం వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పొరపాటున పశువులైనా, రైతులైనా లేదా కూలీలైనా ఆ క్వారీ గోతులలో పడితే ప్రాణాపాయం తప్పదని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కూటమి నాయకుల అండదండలతోనే ఈ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని, దీనివల్ల అధికారులు సైతం మిన్నకుండిపోతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
అత్తపై అల్లుడి దాడి
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెంలో అత్తపై అల్లుడు కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రాజీవ్నగర్కు చెందిన ఎల్లా వేణుగోపాల్, ఎల్లా మంగ భార్యాభర్తలు. వీరికి ఆరుగురు సంతానం కాగా, వారిలో ముగ్గురు చనిపోయారు. భర్త వేణుగోపాల్ కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో, మిగిలిన ముగ్గురు పిల్లలను మంగ కష్టపడి పోషిస్తోంది. గంజాయి, మద్యానికి బానిసైన వేణుగోపాల్ తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఆదివారం ఉదయం వేణుగోపాల్ భార్యతో గొడవకు దిగాడు. పిల్లలు అమ్మమ్మ నాగుల రామలక్ష్మికి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న రామలక్ష్మి గొడవను అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆగ్రహానికి గురైన వేణుగోపాల్ చాకుతో ఆమైపె దాడి చేశాడు. ఈ దాడిలో రామలక్ష్మి మెడ, గొంతు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే మంగ స్థానికుల సాయంతో 108 వాహనంలో ఆమెను ఏరియా ఆసుపత్రికి తరలించింది. వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. ప్రస్తుతం రామలక్ష్మి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
భీమవరం: కేంద్ర ప్రభుత్వం విజయ గర్వంతో కార్మికులపై దాడిని ప్రారంభించిందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రాజారామ్మోహన్రాయ్ ధ్వజమెత్తారు. భీమవరంలో లేబర్ కోడ్స్ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సీఐటీయూ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. లేబర్ కోడ్స్ అమలు కోసం రూల్స్ను రూపొందించి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అమలు కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం దారుణమన్నారు. లేబర్ కోడ్స్ కారణంగా శ్రామికవర్గం తీవ్రంగా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారం కోసం అడ్డమైన దారులు తొక్కుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు తప్ప కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, పరిశ్రమల అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు శూన్యమన్నారు. వేతనాలు పడిపోయి ధరలు విపరీతంగా పెరిగి ఉపాధి తగ్గి వలసలు మరింత పెరిగి దేశంలో అశాంతి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటికీ కేంద్రం మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వాసుదేవరావు, ఎం.ఆంజనేయులు, ఎం.వైకుంఠరావు, సోమేశ్వరరావు, భూపతి సత్యనారాయణ, ఎం.శివ పాల్గొన్నారు. కదిరి అర్బన్: స్థానిక ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న 48వ రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ జూనియర్ బా లికలు, బాలుర చాంపియన్షిప్ పోటీల్లో బాలికల విభాగంలో పశ్చిమగోదావరి, బాలుర వి భాగంలో చిత్తూరు జట్లు విజేతలుగా నిలిచా యి. గెలుపొందిన జట్లకు చాంపియన్ ట్రోఫీని బహూకరించారు. కొయ్యలగూడెం : ఆపదలో ఉన్న బాలుడి ప్రాణాలను నిలబెట్టడానికి గ్రామ యు వత నడుం బిగించింది. ఇంటింటా విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టింది. ‘సాక్షి’లో ఆదివారం ప్రచురించిన ‘సాయం కోసం ఎదురుచూపులు’ కథనానికి స్పందించడంతో పాటు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బయ్యనగూడెంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న సింగంశెట్టి నాగమణికంఠ పరిస్థితి తెలుసుకున్న యువకులు తొలిరోజు రూ.1.50 లక్షలు విరాళాలు సేకరించి అందజేశారు. బాలుడి వైద్యానికి రూ.22 లక్షల వరకు ఖర్చవుతుందని, ఇకపై రోజూ సమీప గ్రామాల్లో తిరుగుతూ విరాళాలు సేకరిస్తామని యువకులు తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ బుల్డోజర్ సర్కార్గా మారి ప్రజలపై భారాలు వేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. దీనిపై జూన్, జూలై నెలల్లో ప్రజాపోరుకు సిద్ధమయ్యామన్నారు. స్థానిక ఉద్దరాజు రామం భవనంలో సీపీఎం జిల్లాస్థాయి విస్తృత సమావేశం ఆదివారం జిల్లా కార్యదర్శివర్గ స భ్యురాలు మొడియం నాగమణి అధ్యక్షతన ని ర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణల పేరుతో ప్రజలపై భారాలు వేస్తున్నారని, నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికులను బానిసలుగా మారుస్తున్నారన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేశారన్నారు. సర్ అనే పేరుతో ప్రజల ఓటు హక్కును సైతం భ్రష్టుపట్టించారన్నారు. ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ వంటి సంస్థలు ఆకివీడు, కడపలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, బి.బలరాం మాట్లాడుతూ ఆక్వా, మొక్కజొన్న రైతులు నష్టాల్లో ఉన్నారన్నారు. -
వరుస మోసాలు.. దోపిడీలు
తణుకు అర్బన్: తణుకు నియోజకవర్గంలో వరుస మోసాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల కాలంలో తణుకులో వెలుగులోకి వస్తున్న మోసాలతో ఎవరితో ఏం మాట్లాడితే ఏ మోసం చేస్తారోననే భయం వెంటాడుతోంది. తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం ఆరవల్లిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కోట్లు దోచేసిన కూటమి నేతల వ్యవహారం మరువక ముందే, తణుకు పట్టణంలో బంగారం బిస్కెట్ తక్కువ ధరకే ఇస్తామని, నగదుకు ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ అమాయక మహిళల నుంచి ఒక కిలాడీ జంట రూ. 25కోట్లకు టోకరా వేసింది. అంతకుముందు తణుకు పట్టణంలో ఒక బంగారం వ్యాపారి బంగారు ఆభరణాలు చేస్తానని నమ్మించి సుమారుగా 19 మంది బాధితుల నుంచి రూ.10 కోట్లకు పైగా దోచుకుని ఉడాయించాడు. ఇలా వరుస మోసాలు, దోపిడీలతో తణుకు ప్రజలు ఎవరిని నమ్మాలో తెలియక బెంబేలెత్తిపోతున్నారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉండే తణుకు ప్రాంతంలో గత ఏడాదిన్నరలో వెలుగుచూస్తున్న మోసాలు, దోపిడీలు చెడ్డ పేరు తీసుకువస్తున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆరవల్లి పరువు తీసిన కూటమి అత్తిలి మండలం ఆరవల్లిలో వెలుగులోకి వచ్చిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అమాయకులైన నిరుద్యోగులకు ఉద్యోగాల ఎరవేసి సుమారుగా 50 మంది నుంచి రూ.3 కోట్ల వరకు దోచేసిన వ్యవహారం బట్టబయలు కావడం, నిరుద్యోగులను నమ్మించేందుకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, జిల్లా కలెక్టర్తో పాటు ఐఏఎస్ అధికారుల సంతకాలతో ఉన్న సిఫార్సు లెటర్లు సృష్టించడం సంచలనంగా మారింది. ఇందులో కూటమి నేతలు ఉన్నారంటూ వివిధ పత్రికలు, ప్రసార సాధనాల్లో రావడంతో ముందుగా జనసేన నాయకులు, ఆ తరువాత టీడీపీ నాయకులు సైతం ఎవరికి వారు విడివిడిగా తణుకు, అత్తిలి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలోనే మోసం చేసిన వారున్నారనే ఆరోపణలు ఆరవల్లిలో తలెత్తడం విశేషం. ఇచ్చిన డబ్బులు రావనే ఉద్దేశంతో పాటు దోపిడీ దొంగల బెదిరింపులతో బాధిత నిరుద్యోగులు ఇప్పటివరకు బయటపడలేదు. ఉద్యోగాల ఆశతో అప్పులు చేసి డబ్బులు ఇచ్చామంటూ బాధితులు గ్రామంలోని పెద్దల వద్దకు పంచాయతీకి వస్తున్నారే కానీ, కూటమి నేతల భయంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాని దుస్థితి. అంతకుముందు ఆరవల్లి గ్రామం వైఎస్సార్ కాలనీలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని కాలనీ వాసుల నుంచి ఇంటికి రూ.1500 చొప్పున వసూలు చేయడాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా, వెంటనే టీడీపీ నాయకులు తిరిగి ఎవరి డబ్బులు వారికి ఇచ్చేయడం తెలిసిందే. ఈ వ్యవహారంలో విద్యుత్ శాఖకు ముట్టచెప్పాలని టీడీపీ నాయకులు వసూలు చేసినట్లుగా కాలనీ వాసులు చెబుతున్నారు. పోలీసుల ప్రేక్షక పాత్ర కిలాడీలు వరుసగా అమాయకులను మోసం చేసినా, ఆరవల్లిలో ఉద్యోగాల మోసంలో ఏకంగా పవన్ కల్యాణ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన సిఫార్సు లెటర్లు బయటపడినప్పటికీ తణుకు పట్టణ, అత్తిలి స్టేషన్ల పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ సిఫార్సు లెటర్ల వ్యవహారంలో కూడా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటం చూస్తుంటే ఏ రాజకీయ ఒత్తిడిలో ఉన్నారోనని తణుకు నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. మోసానికి పాల్పడిన కూటమి నాయకులు ఎవరనేది అందరికి తెలిసినప్పటికీ వారిని ఇప్పటికీ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో తమ వెంటే ఉంచుకుని పెద్దపీట వేయడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. తణుకు నియోజకవర్గంలో ఏడాదిన్నర కాలంలో రూ.40 కోట్ల దోపిడీ ఆరవల్లిలో ఘటన మరువక ముందే మరొకటి వెలుగులోకి పవన్ కల్యాణ్ సంతకం ఫోర్జరీ చేసినా పట్టించుకోని వైనం -
అప్పు కాదు.. ఆర్థికంగా ఆదుకోవాలి
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదంటి ఆడ్డబిడ్డ పెళ్లికి రూ.40 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఆర్థికంగా సాయం అందించి ఆదుకున్నారు. అప్పట్లో మూడు నెలలకోసారి కల్యాణమస్తు, షాదీతోఫా పథకం అమలు చేసేవారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడబిడ్డ వివాహానికి సాయం బదులు అప్పు ఇచ్చే వ్యాపార పథకం అమలు చేయడం సిగ్గుచేటు. రుణం ఇచ్చి వడ్డీతో సాయం చెల్లించాలనడం దారుణం. ప్రభుత్వం అరకొర పథకాలు ఇస్తూ సూపర్సిక్స్ ను అటకెక్కించింది. పేదలను ఆదుకునేలా పథకాలు ఇవ్వాలి. పెళ్లికానుకను ఉచితంగా అందించాలి. – గూడూరి ఉమాబాల, వైఎస్సార్సీపీ నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జి -
ఇళ్ల తొలగింపుపై ఆగ్రహం
ఉండి: ఎవరికీ అభ్యంతరం లేని ప్రాంతంలో ఉన్న పేదల ఇళ్లను తొలగించేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ విమర్శించారు. మండలంలోని ఉణుదుర్రులో ఆక్రమణల తొలగింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ఆక్రమణల తొలగింపుపై అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఆదివారం బాధితులు రోడ్డెక్కారు. నినాదాలు చేస్తూ గ్రామంలోని సచివాలయాన్ని చుట్టుముట్టారు. కూటమి ప్రభు త్వం హామీ మేరకు ప్రతి ఒక్కరికీ మూడు సెంట్ల నివాస యోగ్యమైన భూమి ఇచ్చి ఇంటి నిర్మాణానికి సహకారం అందించిన తర్వాతే తమ ఇళ్లు తొలగించాలంటూ బాధిత మహిళలు, సీపీఎం నాయకులు ధ్వజమెత్తారు. తమ ఇళ్లను తొలగించి బడాబాబులకు ఆ భూమిని అప్పగించాలని చూ స్తున్నారని విమర్శించారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనను పట్టించుకోకుండా ఆక్రమణల పేరుతో పేదల ఇళ్లు కూల్చడం ఘోరమన్నారు. నివాసయోగ్యం కాని ప్రాంతంలో సెంటున్నర చొప్పున ఇంటి స్థలాలు ఇచ్చేశాం.. అక్కడికి వెళ్లిపోండని అంటే పేదలు ఎలా బతుకుతారని గోపాలన్ ప్రశ్నించారు. ఉండి ఎస్సై ఎండీ నసీరుల్లా, గ్రామ ఇన్చార్జి కార్యదర్శి రామ్మోహన్రావు బాధితులతో చర్చించారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సీపీఎం నాయకులు హెచ్చరించారు. నాయకుడు ధనికొండ శ్రీనివాస్, బాధిత కుటుంబాలు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఏమార్చి.. ఎగ్గొట్టి!
భీమవరం(ప్రకాశం చౌక్) : పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సా యం అందించే పథకానికి కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. ఉచితంగా అందించాల్సిన సాయానికి బదులు అప్పు ఇచ్చే ‘వ్యాపార’ పథకాన్ని ప్రకటించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. డ్వాక్రా గ్రూపుల్లో ఉండే సభ్యుల ఇళ్లల్లో ఆడపిల్లల వివాహాలకు రూ.లక్ష సీ్త్ర నిధి నుంచి రుణంగా ఇప్పించి 48 వాయిదాల్లో తిరిగి చెల్లించేలా కల్యాణలక్ష్మి పేరుతో పథకాన్ని రూపొందించింది. సంక్షేమాన్ని విస్మరించి, పేదలను ఏమార్చేలా తీసుకువచ్చిన ఈ పథకంపై పేదలు పెదవి విరుస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీల్లోని భవన నిర్మాణ కార్మికుల ఇళ్లలో ఆడబిడ్డలు, దివ్యాంగుల వివాహాలకు రూ.40 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు సాయం అందించి ఆదుకున్నారని గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పటికే డ్వాక్రా రుణాలు చెల్లించేందుకు నానా అవస్థలు పడుతున్న పేద మహిళలు.. ఇప్పుడు కల్యాణలక్ష్మి అప్పు తీసుకుంటే ఎలా వాయిదాలు చెల్లించగలరని ప్రశ్నిస్తున్నారు. డ్వాక్రా గ్రూపుల్లో లేని సభ్యుల సంగతేంటని అంటున్నారు. వివాహాలకు ఆర్థిక సాయాన్ని పూర్తి ఉచితంగా అందించాలని కోరుతున్నారు. డ్వాక్రా మహిళల కుమార్తెలకు రూ.లక్ష వరకు రుణం 4 శాతం వడ్డీ 48 వాయిదాల్లో చెల్లింపు సాయం మానేసి అప్పు ఇస్తారట..కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లల్లో పెళ్లికానుక పథకాన్ని అమలు చేయలేదు. దీంతో జిల్లాలో సుమారు 6 వేల మంది వరకు ఆర్థికసాయం కోల్పోయారు. 2014లోనూ చంద్రబాబు పెళ్లికానుక ఇస్తానని చెప్పినా అప్పటి టీడీపీ ప్రభుత్వంలోనూ అమలు చేసిన దాఖలాలు లేవు. కనీసం కూటమి ప్రభుత్వంలో అయినా సాయం అందిస్తారని ఎదురుచూసిన ప్రజలకు నిరాశే ఎదురైంది. తాజాగా కల్యాణలక్ష్మి (అప్పు) పథకాన్ని ప్రకటించడంపై పేద లు నిట్టూరుస్తున్నారు. 2019–24లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కల్యాణమస్తు, షాదీతోఫా పేరుతో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజికవర్గాల వారీగా వివాహాలకు ఆర్థిక సాయం అందించారు. ప్రతి మూడు నెలలకోసారి లబ్ధిదారులను ఎంపిక చేసి పక్కాగా సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. ఇలా జిల్లాలో 2,368 మందికి రూ.16.40 కోట్ల సాయం అందించి ఆయా కుటుంబాలను ఆదుకున్నారు. కూటమి వంచన పేదింట వివాహాలకు ఉచిత సాయానికి మంగళం! కల్యాణలక్ష్మి పేరుతో కొత్త పథకం డ్వాక్రా మహిళలకు రూ.లక్ష రుణం వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సిందే.. గత ప్రభుత్వంలో కల్యాణమస్తు, షాదీతోఫాతో ఆర్థిక చేయూత జిల్లాలో 2,368 మందికి రూ.16.40 కోట్ల సాయం అందజేత కూటమి ‘వ్యాపార’ పథకంపై పేదల పెదవి విరుపు -
నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్
జంగారెడ్డిగూడెం: పర్సును పోగొట్టుకున్న వృద్ధురాలికి దానిని అందజేసి ఓ ఆటో డ్రైవర్ తన నిజాయతీని చాటుకున్నాడు. జంగారెడ్డిగూడెంకు చెందిన ఆటో డ్రైవర్ చిట్టిబోయిన ఆంజనేయులు (అంజి) స్థానిక బుట్టాయగూడెం రోడ్డులో వెళ్తుండగా అతనికి ఒక పర్సు దొరికింది. ఆ పర్సు తెరిచి చూడగా అందులో రూ. 2,000 నగదు, మందుల చీటీ, ఆధార్ కార్డు ఉన్నాయి. ఆధార్ కార్డు ఆధారంగా ఆ పర్సు చాగంటి చంద్రమ్మ అనే వృద్ధురాలిదని గుర్తించాడు. వెంటనే విచారణ చేసి ఆమెకు సమాచారం అందించాడు. అనంతరం జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఎస్సై ఎన్వీ ప్రసాద్ సమక్షంలో ఆ పర్సును వృద్ధురాలికి అందజేశాడు. ఈ సందర్భంగా వృద్ధురాలు అంజికి కృతజ్ఞతలు తెలపగా, అతని నిజాయతీని ఎస్సై, పలువురు అభినందించారు. కై కలూరు: అమ్మా పెద్దింట్లమ్మా.. నీ కరుణా కటాక్షాలు మాపై చూపవమ్మా.. అంటూ భక్తులు ఆర్తితో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. సెలవు రోజు కావడంతో సమీప జిల్లాల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ.. ఆదివారం ఒక్కరోజే ప్రత్యేక దర్శనాలు, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, తీర్థాలు, ప్రసాద విక్రయాలు, విరాళాలు మరియు వాహన పూజల ద్వారా మొత్తం రూ. 67,350 ఆదాయం వచ్చిందని తెలిపారు. జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటలకు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ట, కుంభస్థాపన, నిత్యహోమం తదితర పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయదారులుగా అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు పేరిచర్ల జగపతిరాజు – ఝాన్సీరాణి దంపతులు, గొట్టుముక్కల భాస్కరరాజు దంపతులు వ్యవహరించారు. కోనంగపల్లి సత్యపవన్ ఆచార్యుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, రుషికేష్ ఆచార్యులు, కుమారాచార్యులు, రాఘవాచార్యులు పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. సంతానం లేని భక్తులకు గరుడ ప్రసాదం అందజేశారు. జిల్లా ఎస్సీ, ఎస్టీ మేజిస్ట్రేట్ ఐ.శ్రీనివాస్శర్మ కుటుంబ సభ్యులు, జంగారెడ్డిగూడెం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కేఎస్ఆర్ తేజస్వి స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు చేశారు. సాయంత్రం స్వామివారికి శేషవాహనంపై తిరువీధి ఉత్సవం నిర్వహించారు. భీమడోలు: పొలసానిపల్లికి చెందిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. గ్రామానికి చెందిన బత్తిన దుర్గా శివ ప్రసాద్ ఐటీఐ చదువుకుని ముగ్గు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 9వ తేదీ శనివారం సాయంత్రం ఏలూరు వెళ్లి వస్తానని ఇంటిలో చెప్పి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో తండ్రి బత్తిన మాణిక్యాలరావు ఆదివారం భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దెందులూరు: వైఎస్సార్సీపీ జిల్లా కమిటీ సభ్యుడు, పెరుగ్గూడెం సర్పంచ్ యలమర్తి రేవతి భర్త యలమర్తి రామకృష్ణ (50) ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రామకృష్ణ ద్విచక్ర వాహనంపై పొరుగు గ్రామం నుంచి ఇంటికి వస్తుండగా పంగిడిగూడెం వద్ద కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. అంబులెన్స్లో ఏలూరులో ఆస్పత్రికి తీసుకువెళుతుండగా మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. -
మొగల్తూరు మామిడి.. ప్రాభవం కొరవడి
నరసాపురం: మొగల్తూరు మామిడి పూర్వ ప్రాభవం క్రమంగా కోల్పోతోంది. తీరంలో మామిడి తోటల విస్తీర్ణం రానురానూ తగ్గిపోతున్నాయి. తీర ప్రాంతంలోని ఇసుక నేల సారం ఆధారంగా అద్భుత రుచి మొగల్తూరు మామిడి ప్రత్యేకం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వారు దేశ, విదేశాల్లోని బంధువులు, స్నేహితులకు ఏటా వేసవి సీజన్లో వీటిని పంపిస్తుంటారు. దీంతో మొగల్తూరు మామిడికి దేశ, విదేశాల్లోనూ మంచి క్రేజ్. పెరుగుతున్న పట్టణీకరణ, లేఅవుట్లతో ఏటేటా తోటలు విస్తీర్ణం తగ్గుతోంది. దీనికితోడు తోటలు తెగుళ్ల బారిన పడుతుండటంతో కాపు తగ్గుతోంది. మొగల్తూరు మామిడా.. మజాకా మొగల్తూరు, పేరుపాలెం చుట్టుప్రకల ప్రాంతాల్లో దాదాపు 1,800 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నా యి. చెరుకురసం, చిన్నరసాలు, పెద్దరసాలు, కొ త్తపల్లి కొబ్బరి రకాలు ఇక్కడ ఫేమస్. మరీ ము ఖ్యంగా మొగల్తూరు బంగినపల్లికి మంచి పేరుంది. ఇక ఆవకాయ పచ్చళ్లకు సంబంధించి సువర్ణరేఖ, కలెక్టర్, హైజర్ రకాలు ప్రసిద్ధి. జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి పలువురు ఇక్కడకు వచ్చి మామిడిపండ్లు, పచ్చడి కాయలు కొనుగోలు చేస్తుంటారు. వేసవి సీజన్లో మొగల్తూరు మామిడి మార్కెట్ కిటకిటలాడుతుంది. తెగుళ్ల బారిన తోటలు మామిడి చెట్లకు మచ్చతెగులు, మంచు తెగులు వంటివి సోకుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడంతో ఇళ్ల స్థలాలకు లేఅవుట్స్ చేయడంతో తోటలు నరికేస్తున్నారు. దీంతో విస్తీర్ణం తగ్గిపోతుంది. ఒకప్పుడు మొగల్తూరు చుట్టుపక్క 5 వేల ఎకరాల్లో తోటలు ఉండగా ప్రస్తుతం 2 వేల ఎకరాలకు తగ్గిపోయాయి. ప్రస్తుతం తోటల రూపంలో కంటే ఇంటి పెరట్లలో వీటిని పెంచుతున్నారు. ఆదాయ మార్గం ఉండటంతో పెరట్లలో, ఖాళీ స్థలాల్లో వీటిని పెంచుతున్నారు. ఇక గాలి దుమారంతో పిందెలు, కాయలు రాలిపోవడం వంటి కారణాలతో కూడా కాపు తగ్గుతుంది. తోటల్లోనే పంట విక్రయం మొగల్తూరు మామిడి వ్యాపారం వేసవి సీజన్కు ముందే ప్రారంభమవుతుంది. శీతాకాలంలో పిందె దశలోనే రైతులు తోటల్లో పంటను విక్రయిస్తుంటా రు. ఒక్కో చెట్టూ రూ.20 వేల నుంచి రూ.30 వేల వ రకూ విక్రయిస్తుంటారు. చెట్లు కాపును బట్టి వ్యా పారులు కొనుగోలు చేసుకుని కాయలు తయారైన తర్వాత విక్రయిస్తుంటారు. దూరప్రాంతాలు, పక్క జిల్లాల నుంచి వచ్చి పలువురు చెట్లు వద్దే కొనుగోలు చేసి తీసుకెళ్లడం, బంధువులకు, స్నేహితులకు దేశ, విదేశాలకు పంపడం చేస్తుంటారు. ఆలస్యంగా మార్కెట్లోకి.. సాధారణంగా మార్చి, ఏప్రిల్ నుంచి మామిడి పండ్లు మార్కెట్కు వస్తుంటాయి. అయితే మొగల్తూరు ఆలస్యంగా కాపునకు వస్తుంది. మే ప్రారంభం నుంచి జూన్, జూలైలో కూడా మొగల్తూరు మామిడి పండ్లు దొరుకుతాయి. ఈ ఏడాదిలో ఇప్పుడిప్పుడే మొగల్తూరు మామిడిపండ్లు మార్కెట్కు వస్తున్నాయి. ప్రస్తుతం పరక రకాన్ని బట్టి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. బంగినిపల్లి రకం కాయ ఒక్కటి రూ.40 నుంచి రూ.80 వరకు అమ్ముతున్నారు. ఏటా తగ్గుతున్న విస్తీర్ణం పట్టణీకరణ, లేఅవుట్లతో తోటలు కనుమరుగు తెగుళ్లతో ఇక్కట్లు తగ్గుతున్న దిగుబడులు -
పూర్తి ఉచితంగా ఇవ్వాలి
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆడబిడ్డల వివాహాలకు గత ప్రభుత్వంలో జగన్మోహన్రెడ్డి ఆర్థికసాయం అందించారు. ఇది పేదలకు ఎంతో ఉపయోగపడింది. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి రెండేళ్లవుతున్నా పెళ్లిళ్లకు సంబంధించి ఎలాంటి సాయం అందించలేదు. ఇప్పుడు రూ.లక్ష అప్పు ఇస్తాం.. వడ్డీతో సహాయ తిరిగి చెల్లించాలంటూ కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తామంటున్నారు. ఇది ఎంత వరకు సబబు. ఆడ్డబిడ్డ పెళ్లి కి అప్పు కాకుండా ఉచితంగా ఆర్థిక సాయం అందించాలి. అలాగే గత ప్రభుత్వంలో మాదిరిగా బాలింతగా ఉన్నప్పుడే రూ.5 వేలు సాయం అందించాలి. అప్పుడే పేదలకు మేలు జరుగుతుంది. – పాలవెల్లి మంగ, భీమవరం -
గాలివాన బీభత్సం
భీమడోలు : ఈదురుగాలులు ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా బుట్టాయగూడెం మండలంలోని ఏజెన్సీ ప్రాంతంతో పాటు ఏలూరు, భీమడోలు, కామవరపుకోట, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. –సాక్షి నెట్వర్క్ -
రైలు ప్రయాణం.. నరకం
ఏలూరు జిల్లా: వేసవిలో రైలు ప్రయాణం నరక ప్రాయంగా మారింది. సెలవులకు వెళ్తున్న ప్రయాణికులకు రిజర్వేషన్లు లభించక జనరల్ బోగీల్లో ప్రయణించాల్సి వస్తోంది. ఇసకేస్తే రాలనంత జనంతో జనరల్ బోగీలు కిక్కిరిసిపోతున్నాయి. వృద్ధులు, చిన్నారులు ఉక్కపోతతో విలవిల్లాడుతున్నారు. జాగా కోసం ప్రయాణికుల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ బాధలు పడలేక తప్పని పరిస్థితుల్లో రిజర్వేషన్ల బోగిల్లో ప్రయాణిస్తే ఫైన్ల రూపంలో టిక్కెట్ కలెక్టర్లు వసూలు చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ వయా ఏలూరు – విశాఖపట్నం, నరసాపురం, విశాఖపట్నం వయా నరసాపురం, భీమవరం విజయవాడ రూట్లు కీలకమైనవి. ఏలూరు నుంచి కోణార్క్, యశ్వంత్పూర్, కోరమండల్, ఈస్ట్కోస్ట్, లింగంపల్లి – జన్మభూమి, బెంగుళూరు, ప్రశాంతి, సింహాద్రి, ఎల్టీటీ, రాయ్గఢ్, తిరుపతి ఇలా దాదాపు 18 ఎక్స్ప్రెస్ రైలు సరీ్వసులు రోజూ నడుస్తోన్నాయి. అదే విధంగా విజయవాడ వయా గుడివాడ, భీమవరం మీదుగా విశాఖ, చెన్నై, తిరుపతి, హైదరాబాదు, టాటానగర్, తిరుపతి, కాకినాడ పోర్టు వంటి దాదాపు 11 ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. రాత్రి ప్రయాణాల్లో రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. జనరల్ బోగీల పెంపు కలేనా? సుదూర ప్రాంతాలకు నడుస్తున్న ఎక్ర్ప్రెస్ రైళ్ళలో మూడు, కొన్నింటికి నాలుగు జనరల్ బోగీలు మాత్రమే ఉంటున్నాయి. ముందు భాగంలో కొన్ని, వెనుక మరికొన్ని ఉంటున్నాయి. ఒక్కో బోగిలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారు. మూత్ర విసర్జనకు సైతం వెళ్ళలేని పరిస్థితి జనరల్ బోగిల్లో కనిపిస్తోంది. కింద కూర్చునే విషయంలో ప్రయాణికుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మరుగుదొడ్ల దుర్వాసన భరించలేక అనేక మంది ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మౌలిక వసతుల కొరత ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అని గొప్పలు చెబుతున్న రైల్వే శాఖ క్షేత్ర స్థాయిలో వాటి అమలు బాధ్యత తీసుకోవడం లేదు. అనేక స్టేషన్లలో కుళాయిల్లో నీరు వస్తున్నా అవి తాగడానికి ఏ మాత్రం పనిచేయడం లేదు. పగటి పూట శివారు బోగీలకు మండుటెండలో నడిచి ఎక్కాల్సిన పరిస్థితి. ముఖ్యంగా మరుగుదొడ్ల గదులకు తాళాలు వేస్తున్నారు. అత్యవసరమైతే స్టేషన్ మాస్టార్ వద్ద తాళాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. రిజర్వేషన్లు, తత్కాల్ విషయానికి వస్తే “క్యూ’లైన్లలో నిలుచున్నా కొంత సమయానికి కోటా అయిపోయిందని సిబ్బంది చెబుతున్నారు. మౌలిక వసతులపై రైల్వే అధికారులు దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రయాణికులకు సౌకర్యాలు కలి్పంచండి రైలు ప్రయాణికులకు స్టేషన్లలో తాగునీరు, మరుగుదొడ్ల వంటి కనీస సౌకర్యాలు కలి్పంచాలి. కైకలూరు ప్రాంతంలో డబుల్ లైన్ ట్రాక్ వేసిన తర్వాత గూడ్సు రైళ్ళ సంఖ్య పెరిగింది. దీంతో క్రాసింగ్ గేట్ల వద్ద ఎక్కువ సమయం ప్రయాణికులు వేచి ఉంటున్నారు. బ్రిడ్జిలు, అండర్ గ్రౌండ్ వంతెనలు నిర్మించాలి. – కోమటి విష్ణువర్థనరావు, వైఎస్సార్సీపీ ముదిరాజుల విభాగ అధ్యక్షుడుజనరల్ బోగీల సంఖ్య పెంచాలి ప్రయాణికులకు తగ్గట్టుగా ఎక్స్ప్రెస్ రైళ్ళలో జనరల్ బోగీల సంఖ్య పెరగడం లేదు. దీంతో మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేశాఖకు బోగీల సంఖ్య పెంచాలని ప్రయాణికుల నుంచి వినతులు వెళుతున్నాయి. వేసవి సెలవులకు దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని బోగీల సంఖ్య పెంచాలి. – చావలి శంకరశాస్త్రి, న్యాయవాది, కైకలూరు -
కిలాడీ మహిళ వెనుక జనసేన నాయకుడు?
తణుకు అర్బన్: తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు, నగదుకు ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తణుకు సజ్జాపురానికి చెందిన స్నేహలత, దుర్గాప్రసాద్ల వ్యవహారం సంచలనం రేకెత్తిస్తోంది. సుమారుగా రూ.25 కోట్లు దోచుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చని ఆశపడిన మహిళలు మోసపోయామని తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 8వ తేదీన తణుకులో బాధిత మహిళలు తాము మోసపోయామంటూ మీడియా ముందు వాపోయారు. దీంతో కిలాడీ జంట వ్యవహారం తణుకులో చర్చనీయాంశంగా మారింది. తాజాగా మరికొంతమంది బాధితులు బయటకువస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానికంగా కొందరు బంగారం దుకాణదారులను సైతం ఈ జంట మోసం చేసినట్లు తెలుస్తోంది. కిలాడీ జంటకు తాము చేసిన బ్యాంకు లావాదేవీలు, ఫోన్పేల ద్వారా పంపించిన నగదు వివరాలతోపాటు మాట్లాడిన వీడియోలు తమ వద్ద ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. తమ డబ్బు, బంగారం తీసుకుని కిలాడి జంట మోసం చేశారంటూ మీడియా ముందు బాధితులు వెల్లడించడంతో వారి నుంచి బెదిరింపులు వస్తున్నాయని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. తమపై కేసులు నమోదు చేయిస్తామని, సోషల్ మీడియా ద్వారా అల్లరి చేస్తామంటూ బెదిరిస్తున్నారని చెబుతున్నారు. తణుకుకు చెందిన ఒక జనసేన నాయకుడు వారి వెనుక ఉండి నడిపిస్తున్నారని, ఆయన ఇస్తున్న ధైర్యంతోనే మమ్మల్ని బెదిరిస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలోనే పట్టణ పోలీసులను ఆశ్రయించామని.. అయితే న్యాయం జరగలేదని, తీరా తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ వాపోతున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏం జరగదని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేస్తారని కిలాడి జంట అంటున్నారని ఆందోళన చెందుతున్నారు.డబ్బులు వస్తాయనే ఉద్దేశ్యంతో అప్పులు చేసి మరీ డబ్బు ఇచ్చి మోసపోయామని ఈ వ్యవహారాన్ని పోలీసు ఉన్నతాధికారులు విచారించాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ఆందోళనతోపాటు నిరాహార దీక్షలకు దిగనున్నట్లుగా బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై తణుకు ఇన్చార్జి సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరా>వును వివరణ కోరగా బాధితులు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని, శనివారం కూడా ఎవరూ స్టేషన్కు రాలేదని తెలిపారు. -
2.5 కిలోల గంజాయి స్వాధీనం
ఉపాధి కూలీల ఆకలి కేకలు ఉపాధి హమీ పథకంలో పనులు చేస్తున్న కూలీలకు సక్రమంగా వేతనాలు అందడం లేదు. జిల్లాలో రూ.2 కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయి. 8లో uకామవరపుకోట: ఇద్దరు వ్యక్తులు గంజాయి తరలిస్తుండగా తడికలపూడి పోలీసులు పట్టుకుని వారి నుంచి 2.5 కిలోల గంజాయి స్వాధీనం చే సుకున్నారు. ఎస్సై వల్లీ పద్మ తెలిపిన వివరాల ప్ర కారం.. గంజాయి సరఫరా జరుగుతోందని ముందస్తు సమాచారం మేరకు కామవరపుకోట నుంచి ద్వారకాతిరుమల వెళ్లే రోడ్డులో తనిఖీలు చేపట్టామన్నారు. నారప్పగుంట, జగనన్న కాల నీ సమీపంలో తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు తారసపడ్డారన్నారు. వారిని అదుపులో తీసుకుని తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్టు గుర్తించామన్నారు. దీంతో తహసీల్దార్ ఎలీషా, వీఆర్వో బాబురావు ఆధ్వర్యంలో వారిని విచారించగా నిందితులు నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన పామర్తి రా జు రంపచోడవరం, అరకు ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి కామవరపుకోట మేరీల బజారుకు చెందిన వానరాసి మౌళి ద్వారా కామవరపుకోట చుట్టుపక్కల ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్టు చెప్పారు. నిందితుల వద్ద నుంచి 2 సెల్ఫోన్లు, రూ. 900, 2.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్సై వల్లీ పద్మ చెప్పారు. -
ఆనం.. ఇదేం దారుణం!
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల క్షేత్రంలో వేంకటేశ్వరస్వామిని శనివారం ఉదయం రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దర్శించిన వేళ భక్తులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. మంత్రి కోసం దాదాపు 40 నిమిషాల పాటు భక్తులకు స్వామి వారి దర్శనాన్ని నిలిపివేయడంతో క్యూలైన్లలో అవస్థలు పడ్డారు. ఉక్కపోతను తట్టుకోలేక సహనాన్ని కోల్పోయిన పలువురు భక్తులు క్యూలైన్ల గేట్లను పీకి పడేసేందుకు యత్నించారు. ఓ బాలిక అస్వస్థతకు గురయ్యింది. ఈ క్రమంలో మంత్రి ఆనం తీరుపై పలువురు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. శ్రీవారి క్షేత్రంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. వారు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేయించారు. క్యూలైన్లలో కిక్కిరిసి.. ఉత్తర రాజగోపురం వద్ద క్యూలైన్లలో కిక్కిరిసిన భక్తులు ఎండ వేడిమి, ఉక్కపోతకు గురయ్యారు. అదే సమయంలో ఓ బాలిక అస్వస్థతకు గురై కుప్పకూలింది. దీంతో ఆగ్రహానికి లోనైన పలువురు భక్తులు క్యూలైన్ గేట్లను పీకేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చి గొడవ చేయొద్దన్న ఓ హోంగార్డుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. క్యూలైన్ షెడ్లలో కనీసం ఫ్యాన్లు లేవని, ఊపిరాడక విలవిల్లాడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తాము చచ్చిపోతే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. మంత్రి కోసం ఇంతసేపు దర్శనాన్ని నిలిపివేస్తారా.. అని నిలదీశారు. ఇదిలా ఉంటే క్యూలైన్లలో కొందరు పిల్లలను భక్తులు గేట్లు పైనుంచి బయటకు పంపారు. అవే గేట్లు మధ్య ఉన్న ఖాళీ ల్లోంచి దూరి భక్తులు బయటకు వెళ్లి ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ఉత్తర ద్వారం వద్ద క్యూలైన్లలో కొందరు మహిళా భక్తులు పడిగాపులు పడ్డారు. అంతా గందరగోళం మంత్రి, ఎమ్మెల్యే ఆలయంలోకి వెళ్లే సమయంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు వారి వెంట వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఆలయ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. నాయకులతో పాటు బయట నిలిచిపోయిన వారిలో ఒకరిద్దరు దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా ఉన్నారు. అయితే మారంపల్లికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ట్రస్ట్బోర్డు సభ్యులను లోపలికి పంపరా అంటూ నానా హడావుడి చేశాడు. ఆ సమయంలో ఆ ప్రాంతం గందరగోళంగా మారింది. అయితే ట్రస్ట్బోర్డు సభ్యుడు యెలమాటి శ్రీనివాసరావు ఆ నాయకుడిని ఊరుకోమని బుజ్జగించారు. ఆలయంలో ఏకంగా 40 నిమిషాల పాటు మంత్రి కోసం పూజలు జరపడం వివాదాస్పదమైంది. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఇలాంటివి చేయడం ఎంతవరకు సమంజసమనేది మంత్రి, ఎమ్మెల్యేలే ఆలోచించుకోవాలని భక్తులు అంటున్నారు. మంత్రి రాకతో ద్వారకాతిరుమలలో భక్తులకు ఇక్కట్లు దాదాపు 40 నిమిషాల పాటు నిలిచిపోయిన స్వామి దర్శనం క్యూలైన్లలో ఉక్కపోతకు అవస్థలు అస్వస్థతకు గురైన బాలిక.. గేట్లు పీకేందుకు భక్తుల యత్నం -
టీడీపీలో తృప్తి చిచ్చు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు నగర మేయర్కు కోపం వచ్చింది. కార్పొరేషన్ సొమ్ముతో ఏర్పాటుచేసిన తృప్తి క్యాంటీన్ ప్రారంభంలో మేయర్ను పట్టించుకోలేదు. ఫ్లెక్సీలో మొక్కుబడిగా చిన్నఫొటో వేశారు.. ఎమ్మెల్యేది నిలువెత్తు కటౌట్ వేసి కుడి, ఎడమ వైపు షాడోల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. కనీసం మేయర్కి బొకేగాని, శాలువా కాని ఇవ్వలేదు. కారు దిగితే కనీసం పట్టించుకోకపోవడంతో కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఆమె వేగంగా కారు ఎక్కి వెళ్లిపోవడంతో ప్రొటోకాల్ తెలియదా అంటూ షాడో మేయర్ కేకలు వేయడం హాట్టాపిక్గా మారింది. మేయర్ సీటు కోసం అంతర్యుద్ధం రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్పొరేషన్లల్లో తృప్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుంది. మెప్మా నిధులతో డ్వాక్రా మహిళల సభ్యుల టీమ్తో క్యాంటీన్ను ఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయం కూడా మహిళా సంఘాలకే ఇచ్చేలా కొత్త కార్యక్రమం అంటూ విపరీతంగా పబ్లిసిటీ ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం మెప్మా డైరెక్టర్ ఏలూరు కమిషనర్కు లేఖ రాశారు. రద్దీ ప్రాంతంలో ఒక చోటు చూపించి దానిలో ఫుడ్ కంటైనర్ను ఏర్పాటుచేయాలని, అన్ని సౌకర్యాలు కల్పించాలని లేఖ సారాంశం. వెంటనే కమిషనర్ కృష్ణా కాల్వ గట్టుపై కొంత భూమిని చదును చేయించి మూడు రోజుల వ్యవధిలోనే ట్రక్కు, అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసి హడావుడిగా దానిని డ్వాక్రా సభ్యురాలు కోనే క్రాంతి పేరుతో కేటాయించారు. శనివారం ఎమ్మెల్యే, మేయర్తో ప్రారంభోత్సవానికి ఏర్పాటుచేశారు. ఇక్కడే కొత్త సమస్య మొదలైంది. కూటమిలో మేయర్ సీటు కోసం అంతర యుద్ధానికి తెరలేచింది. ప్రస్తుత మేయర్ పదవీకాలం కొద్ది నెలల్లో ముగియడం, ఆ తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఆధారంగా ప్రతి సామాజికవర్గం నుంచి ఎమ్మెల్యే టీమ్లో ఇద్దరు, ముగ్గురు ఆశావహుల పేర్లతో హడావుడి మొదలుపెట్టారు. మేయర్ దంపతులు మళ్లీ మూడోసారి అవకాశం కోసం టీడీపీలో లాబీయింగ్ మొదలుపెట్టారు. ఈ పరిణామాల క్రమంలో రెండు రోజుల నుంచి ఏలూరు టీడీపీలో పొలిటికల్ చర్చ కొనసాగుతోంది. ప్రాధాన్యమివ్వకపోవడంతో మేయర్కు ఆగ్రహం నిర్వాహకులపై ఎమ్మెల్యే మండిపాటు నిలిచిపోయిన తృప్తి క్యాంటీన్ ప్రారంభం అధికార పార్టీలో ఫ్లెక్సీ సాక్షిగా గ్రూపు వివాదం మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటైన తృప్తి క్యాంటీన్కు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫొటోతో పాటు మేయర్, ప్రొటోకాల్ పరిధిలోని వ్యక్తుల ఫొటోలు ఉండాలి. అయితే నగరపాలక సంస్థ అధికారులు మెప్మా సిబ్బంది అత్యుత్సాహంతో ఎమ్మెల్యేదే నిలువెత్తు కటౌట్ ఏర్పాటు చేసి కుడి, ఎడమ వైపు ఎమ్మెల్యే వ్యవహారాలన్నీ చక్కపెట్టే కంప్యూటర్ ప్రసాద్, బెల్లంకొండ కిషోర్ ఫొటోలు పెద్దవిగా ఏర్పాటుచేశారు. దీంతో ఎమ్మెల్యేతో ప్రారంభోత్సవానికి వచ్చిన మేయర్ ఫ్లెక్సీలు చూసి అసహనానికి గురికావడం, అలాగే నిర్వాహకులు మేయర్కు బొకే ఇచ్చి ఆహ్వానించకపోవడంతో అలిగి వెంటనే వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్యే నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసి క్యాంటీన్ ప్రారంభించకుండా వెళ్లిపోయారు. ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఎమ్మెల్యేల ఫోన్లకు మేయర్ దంపతులు స్పందించలేదని సమాచారం. -
శ్రీవారి కొండపై అభివృద్ధి పనులు ప్రారంభం
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపై శనివారం రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రూ.29 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. క్యూ కాంప్లెక్స్, అనివెట్టి మండపం, ఐదు అంతస్తుల శివాలయం రాజగోపురాలను ప్రారంభించారు. ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా త్వరితగతిన శ్రీవారి దర్శనం జరిగేలా చర్యలు తీసుకోవాలని, వేసవి దృష్ట్యా క్యూలైన్లలో భక్తులకు తాగునీరు, మజ్జిగ అందించాలని ఆదేశించారు. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలకు 12 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని 43 ఆలయాలను రూ.54.71 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో దేవాలయాలకు సంబంధించి ఎన్నికల్లో ఇచ్చిన 11 హామీలను నెరవేర్చామని మంత్రి అన్నారు. ద్వారకాతిరుమల, ఐఎస్ జగన్నాధపురం, పోలవరం ప్రాజెక్ట్ వరకు గల ఆలయాలు, పర్యాటక ప్రదేశాలను దర్శించేందుకు ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, జేసీ ఎంజే అభిషేక్ గౌడ, ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీల ఆకలి కేకలు
దెందులూరు: ఉపాధి హామీ పథకం పనులు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో విస్తృతంగా జరుగుతున్నాయి. మండుటెండలో రోజంతా కష్టపడినా సక్రమంగా వేతనాలు అందడం లేదు. చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాలో ఉపాధి వేతనదారులకు రెండు కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. వ్యవసాయ పనులు ముగియడంతో వేరే దారి లేక ఉపాధి పనులకు వెళ్లాల్సి వస్తోంది. ఫిబ్రవరి వరకు వేతనాలు చెల్లించారు. మార్చి ఏప్రిల్ నెలలకు వేతనాలు బకాయిలు చెల్లించలేదు. అప్పుడే మే నెల రెండో వారం నడుస్తోంది. రోజుకి లక్ష మంది పైగా హాజరు: జిల్లాలో ఆరు లక్షల 53 వేల 949 జాబ్ కార్డులు ఉన్నాయి. ఐదు లక్షల 932 జాబ్ కార్డులు యాక్టివ్గా ఉన్నాయి. లక్ష మంది పైగా ఉపాధి పనులకు హాజరవుతున్నారని రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఉపాధి పనులకు హాజరయ్యే వారికి రోజుకి రూ.300 వరకు వేతనం లభిస్తుంది. రెండు నెలలు పూర్తయినా వేతనం అందకపోవడంతో శ్రామికుల పరిస్థితి అత్యంత దైన్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని శ్రామికులు భానుడి మంటలు తట్టుకొని ఉపాధి పనులకు వస్తున్నారు. ఉపాధి వేతనాలు నెలలు తరబడి మంజూరు చేయకపోవడం బాధాకరమని విమర్శిస్తున్నారు. రెండు నెలలుగా అందని బకాయిలు మండుతున్న ఎండల్లో పనులు చేస్తున్న శ్రామికులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. మెడికల్ కిట్లు, టెంట్, మంచినీళ్లు వంటి కనీస అవసరాలు కల్పించాలి. – వి.రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శిఆన్లైన్ విధానంతో జిల్లాలో పని పూటలు తగ్గాయి. రెండు పూటలా పని విధానం రద్దు చేయాలి. జిల్లాలో ఉపాధి శ్రామికుల పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలి. ప్రభుత్వం మానవతా దృక్పథంతో రావాల్సిన బకాయి వేతనాలను బ్యాంకు ఖాతాలకు జమ చేయాలి. – మిడతా రమేష్, వైఎస్సార్సీపీ మండల నాయకుడు, కామవరపుకోట -
కక్ష సాధింపులతోనే అక్రమ కేసు
పెనుగొండ: కక్ష సాధింపుల్లో భాగంగానే అక్రమ కేసు బనాయించారని బెయిల్పై విడుదలైన వైస్సార్సీపీ నాయకుడు, కొడమంచిలి మాజీ సర్పంచ్ సుంకర సీతారామ్ ఆరోపించారు. శనివారం బెయిల్పై నరసాపురం సబ్ జైలు నుంచి ఆచంట చేరుకుని దివంగత సీఎం వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లేనిపోని ఆరోపణలతో తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తోందన్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకులను టార్గెట్ చేసి స్థానిక ఎమ్మెల్యే ఫ్యాక్షన్ రాజకీయాలు తెరలేపారని విమర్శించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు, కక్ష సాధింపులపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. మండల కన్వీనర్ జక్కంశెట్టి శ్రీరామ్, నాయకులు కోట వెంకటేశ్వరరావు, పాస్టర్ డేవిడ్ రాజు, జక్కంశెట్టి చంటి, పిల్లి రుద్రప్రసాద్, కేతా తాతారావు, కాండ్రేగుల కనకయ్య, పెచ్చెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భీమవరం: స్థానిక డీఎన్నార్ కళాశాలలో శనివారం పీజీ సెట్ ప్రశాంతంగా జరిగింది. డీఎన్నార్ అటానమస్ కళాశాల సెంటర్లో మూడు సెషన్స్లో 278 మంది విద్యార్థులకు 248 మంది హాజరయ్యారు. డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో 200 మంది 189 మంది హాజరయ్యారు. పెంటపాడు: బడిఈడు పిల్లలను బడిలో చేర్పించే ఎన్రోల్మెంట్లో పెంటపాడు మండలం జిల్లాలో ప్రథమస్థానం సాధించిందని ఎంఈఓలు ఎం.శ్రీనివాస్, టీవీ రామకృష్ణ తెలిపారు. ఐదేళ్లు పూర్తయిన వారిని బడిలో చేర్చే కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలం 55 శాతం పూర్తి చేయాలని డీఈఓ ఆఆదేశించారన్నారు. పెంటపాడు మండలంలో 59.84 శాతం ఎన్రోల్మెంట్ సాధించిందన్నారు. కె.పెంటపాడు, పెంటపాడు, పలు గ్రామాల్లో శనివారం కార్యక్రమం చేపట్టి మరో ఆరుగురు పిల్లలను బడిలో చేర్పించామని చెప్పారు. క్లస్టర్ హెచ్ఎం కృష్ణ, ఉపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఈపీఎఫ్ పెన్షన్ రూ. 7,500కు పెంచాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షనర్ల సంఘం ఏలూరు కమి టీ తెలిపింది. స్థానిక ఐఎఫ్టీయూ కార్యాలయంలో ధర్నా పోస్టర్ను శనివారం ఆవిష్కరించారు. ఐఎఫ్టీయూ నగర అధ్యక్షుడు బి. సో మయ్య మాట్లాడుతూ 30 ఏళ్లుగా ఈపీఎఫ్ పెన్షన్ పెంచలేదన్నారు. పార్లమెంటరీ కమిటీ పెన్షన్ రూ.7,500 పెంచాలని, కరువు భత్యం (డీఏ) లింకు చేయాలని, పెన్షన్దారులకు వైద్య సౌకర్యం కల్పించాలని సిఫార్సు చేసిందన్నారు. వీటిని వెంటనే కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురావాలని కోరారు. ధర్నాలో పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యు. వెంకటేశ్వరరావు, ఈపీఎఫ్ పెన్షన్దారుల సంఘ నాయకులు కోసూరి నూకరాజు, బుద్దా నాగేశ్వరరావు, కొంపంగి కృష్ణ పాల్గొన్నారు. నరసాపురం రూరల్: బాలికపై బంధువు అఘాయిత్యానికి పాల్పడగా పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మొగల్తూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక బంధువుల వద్ద ఉంటూ ఇంటర్మీడియెట్ చదువుతోంది. ఆమె బంధువయ్యే ఓ వివాహితుడు చనువుగా ఉంటూ మాటలతో నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మొగల్తూరు ఎస్సై కె.నాగేశ్వరరావు కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. -
గోడౌన్లకు గ్రహణం
ఆదివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2026భీమవరం: వ్యవసాయమే జీవనాధారమైన జిల్లాలో రైతులను ప్రభుత్వం పట్టించుకుంటున్న దాఖలాలు కన్పించడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని భద్రపర్చుకునే అవకాశం లేక రైతులు తల్లడిల్లుతున్నారు. జిల్లాలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతుల కోసం నిర్మాణాలు చేపట్టిన మల్టీపర్పస్ గోడౌన్లు ఇప్పటికీ పూర్తికాలేదు. దీంతో రైతులు ధాన్యం, ఇతర పంటలు నిల్వ చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. 20 మండలాలు.. 2.30 లక్షల ఎకరాలు జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 2.30 లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నారు. అలాగే పలువురు రైతులు కూరగాయలు, అరటి, కొబ్బరి వంటి పంటలతో పాటు ఆక్వా సాగు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులు పంటలను నిల్వ చేసుకుని గిట్టుబాటు ధర వచ్చినపుడు విక్రయించుకునేలా సహకార సంఘాల ఆధ్వర్యంలో మల్టీపర్పస్ గోడౌన్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 21 గోడౌన్ల నిర్మాణానికి స్థల సేకరణ, ఒక్కో నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో కొన్నిచోట్ల నిర్మాణాలు పూర్తికాలేదు. పంట కోసం పాట్లు : ప్రస్తుతం జిల్లాలో దాళ్వా వరి మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో ధాన్యం పట్టుబడికి గోనె సంచుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క వాతా వరణంలో మార్పులు కారణంగా అక్కడక్కడా భారీ వర్షాలు కురవడం, మబ్బులతో రైతులు కలవరపడుతున్నారు. ఇటువంటి తరుణంలో గోడౌన్లు అందుబాటులో ఉంటే ధాన్యం నిల్వ చేసుకుని సంచులు లభించినప్పుడు విక్రయించుకునే అవకాశం ఉంటుంది. పంట కూడా సురక్షితంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. ధాన్యం నిల్వ చేసుకునే జాగా లేకపోవడంతో వర్షానికి తడిచిపోతుందనే భయంతో తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో గత ప్రభుత్వంలో 21 గోడౌన్ల నిర్మాణాలకు నిధులు మంజూరు కాగా అప్పట్లోనే 14 నిర్మాణాలు పూర్తయ్యాయి. 1,000 టన్నుల సామర్థ్యం గల గోడౌన్, ధాన్యం ఆరబెట్టుకోవడానికి ప్లాట్ఫామ్స్ నిర్మాణాలకు రూ.75 లక్షలు, 500 టన్నుల సామర్థ్యం గల గోడౌన్లకు రూ.40 లక్షలు మంజూరు చేశారు. కొన్నిచోట్ల దాతలు స్థలాలను ఉచితంగా ఇవ్వగా మరికొన్ని చోట్ల ప్రభుత్వ స్థలాలను కేటాయించారు. గోడౌన్స్ను పూర్తిస్థాయిలో వినియోగంలోనికి తీసుకువచ్చి కూరగాయలు, ఆక్వా ఉత్పత్తులు నిల్వచేసుకోడానికి అవసరమైన కోల్డ్స్టోరేజ్లు కూడా ఏర్పాటు చేయాలని అప్పట్లో భావించారు. ఈ క్రమంలో జిల్లాలో కాళ్ల, కాళ్లకూరు, శృంగవృక్షం, ఉండి, కేశవరం, మత్స్యపురి, అలంపురం ప్రాంతాల్లో గోడౌన్ నిర్మాణాలు పునాది, గోడలు స్థాయికి వచ్చాయి. కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా వీటి పై దృష్టి సారించడం లేదు. అసంపూర్తి నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. వీటిని త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురా వాలని రైతులు కోరుతున్నారు. రైతులకు అక్కరకు రాని మల్టీపర్పస్ గోడౌన్లు గత ప్రభుత్వంలో 21 మంజూరు.. 14 పూర్తి రెండేళ్లుగా 7 గోడౌన్ల నిర్మాణాలపై కూటమి సర్కారు నిర్లక్ష్యం ధాన్యం, ఇతర పంటలు నిల్వ చేసేందుకు రైతుల అవస్థలు ధాన్యం ఆరబెట్టడానికి ప్లాట్ఫామ్స్ కరువు జిల్లాలో 21 గోడౌన్లు మంజూరు కాగా ఇప్పటివరకు 14 నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన ఏడు గోడౌన్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వాటి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకువస్తాం. – సంకు మురళీకృష్ణ, జిల్లా సహకారశాఖాధికారి, భీమవరం -
గుర్రపుడెక్క ఇలా.. నీరు పారేదెలా?
అధ్వానంగా మురుగు డ్రెయిన్లు ఉంగుటూరు: డెల్టా ప్రాంతంలోని పంట భూముల్లో మురుగునీరు పారేందుకు ప్రధానమైన డ్రెయిన్లు పూర్తిగా గుర్రపుడెక్క, తూడుతో నిండిపోయాయి. ఏటా వర్షాకాలంతో వానలు, వరదలు వచ్చినప్పుడు చేలల్లో నీరు పారక రైతులు పంట నష్టపోతున్నారు. వేలాది ఎకరాల్లో వరి దెబ్బతింటోంది. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు మురుగు డ్రెయిన్ల నిర్వహణ అత్యంత ముఖ్యం. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో డ్రెయిన్లు తవ్వకం, గుర్రపుడెక్క, తూడు తొలగింపు వంటి పనులు చేపట్టాల్సి ఉంది. అయితే ఈ ఏడాది ఈ పనులను ఇప్పటివరకూ చేపట్టలేదు. పనులపై అనుమానాలు ఉంగుటూరు నియోజకవర్గంలో 35 వరకు మేజర్, మీడియం, మైనర్ డ్రెయిన్లు ఉన్నాయి. వీటిలో బొమ్మిడి నీటి సంఘం పరిధిలోని దొంతవరం డ్రెయిన్, రంగరావుకోడు, పొదకోడు వంటి మీడి యం డ్రెయిన్లు, ఉంగుటూరు నం.3 యూటీ తవ్వకాలకు రూ.40 లక్షలు మంజూరైనట్టు సమాచారం. అయితే పనులు మాత్రం చేపట్టలేదు. వేసవి పూర్తయ్యేలోపు పనులు మొదలు కావాల్సి ఉంది. చివరిలో పనులు మొదలుపెట్టి నామమాత్రంగా ముగిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రెయిన్లలో గుర్రపుడెక్కను పూర్తిస్థాయిలో తొలగించాల్సి ఉంది. ఉంగుటూరు మండలంలోని తోకలపల్లి మేజర్ కోడు, పందికోడు డ్రెయిన్తో పాటు పలు డ్రెయిన్లలో గుర్రపుడెక్క నిండి ఉంది. డ్రెయిన్లలోని గుర్రపుడెక్క, తూడును తొలగిస్తాం. బొమ్మిడి నీటి సంఘం పరిధిలో రంగరావుకోడు, పొదకోడు, దొంతవరం డ్రెయిన్, ఉంగుటూరులో నం.3 యూటీ డ్రెయిన్ తవ్వకాలకు అనుమతులు వచ్చాయి. ఆయా పనులు చేపడతాం. – వెంకటేశ్వరరావు, ఏఈ డ్రెయిన్స్, ఉంగుటూరు -
ఆయాలకు ఫుల్ టైం వేతనాలు ఇవ్వాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): మున్సిపల్ స్కూల్ ఆయాలకు జీఓ నెంబర్ 193 మేరకు ఫుల్ టైం వేతనాలు ఇవ్వాలని ఈఫ్టీయూ నాయకులు మామిడి దాన వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఆయాల జనరల్ బాడీ సమావేశం శనివారం ఫాతిమా మునీషా అధ్యక్షతన ఐఎఫ్టీయూ యూనియన్ కార్యాలయంలో జరిగింది. వేతనాలు ఇవ్వాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. దానవర ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్ ఆయాలు రోజుకు 8 నుంచి 10 గంటల వరకు పనిచేస్తున్నారని, కేవలం వీరి వేతనాలు రూ.4 వేలు అన్నారు. గత 15 సంవత్సరాలుగా స్కూల్ ఆయాలు ఫుల్ టైం చేస్తున్నప్పటికి చాలీ చాలనీ వేతనాలతో ఇల్లు గడవటమే కష్టసాధ్యంగా మారిందన్నారు. శ్రమకు తగిన విధంగా ఆదాయం రావడం లేదని వాపోయారు. కనీస వేతనం అమలు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ కల్పించాలని, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని పెదతాడేపల్లి గ్రామంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఎస్.రవికుమార్ శనివారం తెలిపారు. ఈ సంఘటన గత నెల 28న జరిగిందని, రెండు కాసుల బంగారం, అర కిలో వెండి మాయమైనట్లు బాధితుడు గోగులమూడి సురేష్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నామన్నారు. భీమవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు భీమవరం టూటౌన్ ఎస్సై రామారావు శనివారం చెప్పారు. అత్తిలి మండలం లక్ష్మీ నారాయణపురం గ్రామానికి చెందిన పొలమరశెట్టి సాంబశివ(41) ఈ నెల 8 న తన ఇంటి నుంచి మోటారు సైకిల్పై గొల్లవానితిప్ప వెళ్తుండగా పరమ్మగుడి వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. దీంతో తలకు తీవ్రగాయం కావడంతో మరణిండాడని అతని సోదరుడు బాపూజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పెదపాడు: అనుమానాస్పద రీతిలో బాలుడు మృతి చెందిన సంఘటన పెదపాడు మండంలోని నాయుడుగూడెంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండి రమేష్ కుమార్తె నీలిమ ప్రియాంకను నాయుడుగూడెం గ్రామానికి చెందిన పిట్టా వినోద్కు ఇచ్చి 12 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వారికి బాబు పుట్టిన తరువాత నీలిమ ప్రియాంకను అనుమానిస్తూ కాపురానికి తీసుకువెళ్లకుండా 9 ఏళ్లు కాలయాపన చేసాడు. దీంతో పుట్టింటిలోనే ఉంది. కుమారుడు రిషిబాబు(11) పెదపాడులోని శ్రీకృష్ణ గురుకులంలో చదువుకుంటున్నాడు. 2024లో పెద్దల సమక్షంలో భార్య, కుమారుడిని కాపురానికి తీసుకువెళ్లాడు. తరచూ అనుమానంతో పిల్లవాడిని నువ్వు నాకు పుట్టలేదంటూ వేధిస్తున్నట్లు నీలిమ ఐసీడీఎస్కి ఫిర్యాదు చేసింది. రిషిని ఓ గదిలో ఇనుపచైన్తో కట్టేసి కొట్టేవాడు. 9వ తేదీ ఉదయం 8.30 గంటల సమయంలో నాయుడుగూడెం ఇంటి చుట్టు పక్కల వారు రిషి తాతకు ఫోన్ చేసి మీ మనవడు చనిపోయాడని చెప్పడంతో ఇంటికి వెళ్లి చూసే సరికి బాలుడిని ఇంటిముందు మంచంపై పడుకోబెట్టారు. వీపు, చేతిపైన, కాళ్లపైన మెడపైన కమిలిన గాయాలు కనపడంతో తాత ఫిర్యాదు మేరకు పెదపాడు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కిలాడీ జంట మోసంపై ఫిర్యాదులు
● మహిళ వెనుక జనసేన నాయకుడు? ● పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని బాధితుల మొర తణుకు అర్బన్: తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు, నగదుకు ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తణుకు సజ్జాపురానికి చెందిన స్నేహలత, దుర్గాప్రసాద్ల వ్యవహారం సంచలనం రేకెత్తిస్తోంది. సుమారుగా రూ.25 కోట్లు దోచుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చని ఆశపడిన మహిళలు మోసపోయామని తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 8వ తేదీన తణుకులో బాధిత మహిళలు తాము మోసపోయామంటూ మీడియా ముందు వాపోయారు. దీంతో కిలాడీ జంట వ్యవహారం తణుకులో చర్చనీయాంశంగా మారింది. తాజాగా మరికొంతమంది బాధితులు బయటకువస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానికంగా కొందరు బంగారం దుకాణదారులను సైతం ఈ జంట మోసం చేసినట్లు తెలుస్తోంది. కిలాడీ జంటకు తాము చేసిన బ్యాంకు లావాదేవీలు, ఫోన్పేల ద్వారా పంపించిన నగదు వివరాలతోపాటు మాట్లాడిన వీడియోలు తమ వద్ద ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. తమ డబ్బు, బంగారం తీసుకుని కిలాడి జంట మోసం చేశారంటూ మీడియా ముందు బాధితులు వెల్లడించడంతో వారి నుంచి బెదిరింపులు వస్తున్నాయని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. తమపై కేసులు నమోదు చేయిస్తామని, సోషల్ మీడియా ద్వారా అల్లరి చేస్తామంటూ బెదిరిస్తున్నారని చెబుతున్నారు. తణుకుకు చెందిన ఒక జనసేన నాయకుడు వారి వెనుక ఉండి నడిపిస్తున్నారని, ఆయన ఇస్తున్న ధైర్యంతోనే మమ్మల్ని బెదిరిస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలోనే పట్టణ పోలీసులను ఆశ్రయించామని.. అయితే న్యాయం జరగలేదని, తీరా తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ వాపోతున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏం జరగదని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేస్తారని కిలాడి జంట అంటున్నారని ఆందోళన చెందుతున్నారు.డబ్బులు వస్తాయనే ఉద్దేశ్యంతో అప్పులు చేసి మరీ డబ్బు ఇచ్చి మోసపోయామని ఈ వ్యవహారాన్ని పోలీసు ఉన్నతాధికారులు విచారించాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ఆందోళనతోపాటు నిరాహార దీక్షలకు దిగనున్నట్లుగా బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై తణుకు ఇన్చార్జి సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరాావును వివరణ కోరగా బాధితులు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని, శనివారం కూడా ఎవరూ స్టేషన్కు రాలేదని తెలిపారు. -
రైతులను గాలికొదిలేసిన చంద్రబాబు
జంగారెడ్డిగూడెం: చంద్రబాబు సర్కారు రైతులను గాలికొదిలేసిందని వైఎస్సార్సీపీ ఏలూరు పార్ల మెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్ ధ్వజమెత్తారు. శనివారం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావు, నాయకులతో జంగారెడ్డిగూడెం మండలంలో మొక్కజొన్న రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో పలు హామీలిచ్చి అధికారం చేపట్టిన తర్వాత విస్మరించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టాలపాలవుతున్నారన్నారు. మొక్కజొన్న రైతులు ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెడితే మద్దతు ధర కూడా దక్కడం లేదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతులను అన్నివిధాలా ఆదుకున్నామని, అయితే చంద్రబాబు సర్కారు జేబులు నింపుకోవడానికే చూస్తోంది తప్ప రైతులను, ప్రజలకు గాలికి వదిలేసిందన్నారు. రైతులతో పాటు విద్యార్థులు, మహిళలు, పేదలు ఇలా అన్నివర్గాలు ఇ బ్బందులు పడుతున్నాయన్నారు. రైతుల కష్టాన్ని గుర్తించి వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రజలకు సక్రమంగా సంక్షేమ పథకాలు అందించాలని సునీల్కుమార్ డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధర కల్పించాలి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు మాట్లాడుతూ ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో ఎక్కువగా పొగాకు, మొక్కొజొన్న, ఆయిల్పామ్ వంటి పంట లు రైతులు పండిస్తున్నారని, సరైన గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్నారన్నారు. గత ప్రభుత్వంలో మొక్కజొన్నకు ప్రభుత్వం గిట్టుధర రూ.2,400 అందించగా.. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కనీసం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటుచేయలేదని విమర్శించారు. దీంతో రైతులు దళారులకు మొక్కజొన్న అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. గతేడాది మొక్కజొన్న క్వింటాల్ రూ.2,200కు విక్రయిస్తే ప్రస్తుతం రూ.1,500 నుంచి రూ.1,800 మాత్రమే ధర వస్తోందన్నారు. వర్జీనియా పొగాకు పరిస్థితీ దారుణంగా ఉందని కిలోకు రూ.300 ధర దాటడం లేదన్నారు. ఏటా సాగు ఖర్చులు పెరుగుతున్నాయని, గిట్టుబాటు ధరలు లేక రైతులు అప్పులు చేసి వర్జీనియా సాగు చేశారన్నారు. పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి నాగేంద్ర, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శులు కుక్కల ధర్మరాజు, గురజాల పార్థసారథి, ఇర్ల శ్రీనివాసరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ ముప్పిడి అంజి, నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ పార్లమెంట్ ఇన్చార్జి సునీల్ ధ్వజం -
మద్దిలో అభిషేక సేవ
జంగారెడ్డిగూడెం : గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో శనివారం సందర్భంగా ఆంజనేయస్వామికి అభిషేక సేవ నిర్వహించారు. ఆలయ ముఖ మండపంపై ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించారు. ఆలయానికి వివిధ సేవల రూపేణా రూ.1,81,683 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో సుమారు 1779 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఈవో తెలిపారు. నూజివీడు: గతంలో అనధికారికంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడి కేసుల్లో బుక్ అయిన నిందితులకు లోక్అదాలత్ ద్వారా తమ కేసులను పరిష్కరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఎకై ్సజ్ సీఐ ఏ మస్తానయ్య శనివారం పేర్కొన్నారు. స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ వద్ద అనధికారికంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడిన నిందితులతో సమావేశం నిర్వహించిన ఎకై ్సజ్ సీఐ మాట్లాడుతూ తమపై ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం జీవోను విడుదల చేసిందన్నారు. పట్టుబడిన మద్యం సీసాల విలువకు మూడు రెట్లు జరిమానాను ప్రభుత్వ ఖజానాకు చలానా రూపంలో చెల్లిస్తే అక్రమ మద్యం విక్రయదారులపై ఉన్న కేసులను లోక్అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని నిందితులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తణుకు అర్బన్: తణుకు ఆర్టీసీ డిపోలో రోజూవారీ వేతనంతో అవుట్సోర్సింగ్ విధానంలో డ్రైవర్స్ను తీసుకుంటున్నట్లు డిపో మేనేజరు ఏడీఎల్ సుధారాణి తెలిపారు. హెవీ డ్రైవింగ్ లైసెనన్స్ వచ్చి 18 నెలలు పూర్తికావాలని, గతంలో ఎలాంటి ప్రమాదాలకు పాల్పడలేదని మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్తో ధ్రువపత్రం, ఆధార్ కార్డు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని డిపోలో హాజరుకావాలని సూచించారు. రికార్డు పరిశీలన అనంతరం మెడికల్ పరీక్షలు చేయించి ట్రైనింగ్లో సెలెక్ట్ అయినవారిని తీసుకుంటామని చెప్పారు. దరఖాస్తులను డిపో అసిస్టెంట్ మేనేజరు కార్యాలయంలో అందచేయాలని, ఇతర వివరాలకు 7382903287, 7382908959 నంబర్లలో సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. -
రైలు ప్రయాణం.. నరకం
● జనరల్ బోగీల్లో చోటు లేక అవస్థలు ● రిజర్వేషన్లు లభించక ప్రయాణికుల పాట్లు ● రైల్వేస్టేషన్లలో తాగునీటికి కటకట, మరుగుదొడ్ల కొరత కై కలూరు: వేసవిలో రైలు ప్రయాణం నరక ప్రాయంగా మారింది. సెలవులకు వెళ్తున్న ప్రయాణికులకు రిజర్వేషన్లు లభించక జనరల్ బోగీల్లో ప్రయణించాల్సి వస్తోంది. ఇసకేస్తే రాలనంత జనంతో జనరల్ బోగీలు కిక్కిరిసిపోతున్నాయి. వృద్ధులు, చిన్నారులు ఉక్కపోతతో విలవిల్లాడుతున్నారు. జాగా కోసం ప్రయాణికుల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ బాధలు పడలేక తప్పని పరిస్థితుల్లో రిజర్వేషన్ల బోగిల్లో ప్రయాణిస్తే ఫైన్ల రూపంలో టిక్కెట్ కలెక్టర్లు వసూలు చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ వయా ఏలూరు – విశాఖపట్నం, నరసాపురం, విశాఖపట్నం వయా నరసాపురం, భీమవరం విజయవాడ రూట్లు కీలకమైనవి. ఏలూరు నుంచి కోణార్క్, యశ్వంత్పూర్, కోరమండల్, ఈస్ట్కోస్ట్, లింగంపల్లి – జన్మభూమి, బెంగుళూరు, ప్రశాంతి, సింహాద్రి, ఎల్టీటీ, రాయ్గఢ్, తిరుపతి ఇలా దాదాపు 18 ఎక్స్ప్రెస్ రైలు సర్వీసులు రోజూ నడుస్తోన్నాయి. అదే విధంగా విజయవాడ వయా గుడివాడ, భీమవరం మీదుగా విశాఖ, చైన్నె, తిరుపతి, హైదరాబాదు, టాటానగర్, తిరుపతి, కాకినాడ పోర్టు వంటి దాదాపు 11 ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. రాత్రి ప్రయాణాల్లో రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. జనరల్ బోగీల పెంపు కలేనా? సుదూర ప్రాంతాలకు నడుస్తున్న ఎక్ర్ప్రెస్ రైళ్ళలో మూడు, కొన్నింటికి నాలుగు జనరల్ బోగీలు మాత్రమే ఉంటున్నాయి. ముందు భాగంలో కొన్ని, వెనుక మరికొన్ని ఉంటున్నాయి. ఒక్కో బోగిలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారు. మూత్ర విసర్జనకు సైతం వెళ్ళలేని పరిస్థితి జనరల్ బోగిల్లో కనిపిస్తోంది. కింద కూర్చునే విషయంలో ప్రయాణికుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మరుగుదొడ్ల దుర్వాసన భరించలేక అనేక మంది ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మౌలిక వసతుల కొరత ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అని గొప్పలు చెబుతున్న రైల్వే శాఖ క్షేత్ర స్థాయిలో వాటి అమలు బాధ్యత తీసుకోవడం లేదు. అనేక స్టేషన్లలో కుళాయిల్లో నీరు వస్తున్నా అవి తాగడానికి ఏ మాత్రం పనిచేయడం లేదు. పగటి పూట శివారు బోగీలకు మండుటెండలో నడిచి ఎక్కాల్సిన పరిస్థితి. ముఖ్యంగా మరుగుదొడ్ల గదులకు తాళాలు వేస్తున్నారు. అత్యవసరమైతే స్టేషన్ మాస్టార్ వద్ద తాళాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. రిజర్వేషన్లు, తత్కాల్ విషయానికి వస్తే శ్రీక్యూశ్రీలైన్లలో నిలుచున్నా కొంత సమయానికి కోటా అయిపోయిందని సిబ్బంది చెబుతున్నారు. మౌలిక వసతులపై రైల్వే అధికారులు దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రయాణికులకు తగ్గట్టుగా ఎక్స్ప్రెస్ రైళ్ళలో జనరల్ బోగీల సంఖ్య పెరగడం లేదు. దీంతో మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేశాఖకు బోగీల సంఖ్య పెంచాలని ప్రయాణికుల నుంచి వినతులు వెళుతున్నాయి. వేసవి సెలవులకు దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని బోగీల సంఖ్య పెంచాలి. – చావలి శంకరశాస్త్రి, న్యాయవాది, కై కలూరురైలు ప్రయాణికులకు స్టేషన్లలో తాగునీరు, మరుగుదొడ్ల వంటి కనీస సౌకర్యాలు కల్పించాలి. కై కలూరు ప్రాంతంలో డబుల్ లైన్ ట్రాక్ వేసిన తర్వాత గూడ్సు రైళ్ళ సంఖ్య పెరిగింది. దీంతో క్రాసింగ్ గేట్ల వద్ద ఎక్కువ సమయం ప్రయాణికులు వేచి ఉంటున్నారు. బ్రిడ్జిలు, అండర్ గ్రౌండ్ వంతెనలు నిర్మించాలి. – కోమటి విష్ణువర్థనరావు, వైఎస్సార్సీపీ ముదిరాజుల విభాగ అధ్యక్షుడు -
పాస్టర్ ముసుగులో బాలికపై అఘాయిత్యం
● 3 నెలలుగా బాలికపై లైంగిక దాడి.. ● గర్భనిరోధక మాత్రలు వేయడంతో బాలికకు తీవ్ర అస్వస్థత ● కామవరపుకోట మండలంలో దారుణం కామవరపుకోట: పాస్టర్ ముసుగులో ఓ కామాంధుడు 14 ఏళ్ల బాలికను చెరబట్టాడు. భక్తి ముసుగులో పాస్టర్ అవతారమెత్తిన కీచకుడు బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల ప్రకారం కామవరపుకోట మండలంలోని ఓ గ్రామానికి చెందిన సీహెచ్ రాంబాబు అలియాస్ హోసన్న కూలీ పనులు చేసుకుంటూ, పాస్టర్నని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అతడి భార్య కొన్నేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో రాంబాబు కొంతకాలంగా ఓ కుటుంబానికి దగ్గరయ్యాడు. ఆ ఇంట్లోని బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. మూడు నెలలుగా తన ఇంటికి బాలికను రప్పించుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలిక గర్భం దాల్చిందనే అనుమానంతో ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా పాస్టర్ రాంబాబు మోతాదుకు మించి గర్భ నిరోధక మాత్రలు వేయడంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో బాలికను తల్లిదండ్రులు ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్య నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆస్పత్రి సిబ్బంది బాలికను ఆరా తీయడంతో పాస్టర్ రాంబాబు బండారం బయటపడింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఏలూరు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న బాలిక పరిస్థితి చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. నిందితుడు రాంబాబుకు కఠిన శిక్ష పడాలని పలువురు కోరుతున్నారు. -
చివరిలో కంగారు
ఆరుగాలం కష్టపడి పండించిన దాళ్వా పంట చేతికొచ్చింది. ఇప్పటికే 70 శాతం రైతులు మాసూళ్లు పూర్తి చేసి, ధాన్యం అమ్ముకోగా, మిగిలిన రైతులు వరికోతలు కోయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ దశలో వాతావరణ మార్పులు రైతుల గుండెల్లో గుబులు రేపుతుంది. గురువారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ఒకల్కసారిగా వాతావరణం మబ్బులతో నిండి వర్షం జల్లులు పడటంతో రైతులు ఆగమేఘాలపై ఽరాశులు చేసిన ధాన్యం, రోడ్లు, పుంతగట్లపై ఎండబెట్టిన ధాన్యం, ఎగుమతి చేయడానికి నెట్టుకట్టిన బస్తాలు వర్షం పాలు కాకుండా సంరక్షించుకోవడానికి నానా తంటాలు పడ్డారు. – గణపవరం -
గైర్హాజరే ప్రత్యేకం
భీమవరం: టెన్త్పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల్లో గైర్హజారే ప్రత్యేకంగా నిలుస్తుంది. గత వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఫెయిల్ అయిన విద్యార్థులకు రెండు పూటలా ప్రత్యేక తరగతులు నిర్వహించి వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేసేవారు. కానీ నేటి కూటమి ప్రభుత్వం ఒక్క పూట మాత్రమే తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకు భోజనాలు పెట్టకపోవడంతో ప్రత్యేక తరగతలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. జిల్లాలోని 20 మండలాల పరిధిలో మార్చిలో నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్కు చెందిన విద్యార్థులు 22,369 మంది పరీక్షలకు హాజరుకాగా వారిలో 19,141 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 275 ప్రభుత్వ పాఠశాలల నుంచి 12,387 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా వారిలో 9,567 మంది ఉత్తీర్ణత పొందారు. 269 ప్రభుత్వ హైస్కూల్స్లో ప్రత్యేక తరగతులు జిల్లాలోని 275 ప్రభుత్వం హైస్కూల్క్కు గానూ 6 పాఠశాలలోని విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించగా మిగిలిన 269 స్కూల్స్లోని 2,820 మంది ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆయా స్కూల్స్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మే 25 నుంచి జూన్ 4 వరకు నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడానికి ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సబ్జెట్స్ వారిగా ప్రత్యేక తరగతలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ప్రత్యేక తరగతులకు హాజరయ్యే ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సహం లేకపోగా ఫెయిల్ అయిన విద్యార్థులను తరగతులకు తీసుకువచ్చే బాధ్యత కూడా వారిపైనే పెట్టారు. ప్రతిరోజూ రెండు, మూడు సబ్జెక్ట్స్ను పూర్తిస్థాయిలో బోధించి విద్యార్థులు మొత్తం ఉత్తీర్ణత సాధించే విధంగా తీర్చిదిద్దాల్సి బాధ్యత ఉపాధ్యాయులదే. వేసవి సెలవుల్లో తప్పనిసరి పరిస్థితులో ఉపాధ్యాయులు పాఠశాలకు వస్తున్నా ఫెయిల్ అయిన విద్యార్థులు 40 శాతం కూడా హాజరుకాకపోవడంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి తరగతులకు పంపించాలని కోరుతున్నా ఫలితం కనిపించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు ప్రభుత్వ భోజనం, దాతల సహకారంతో స్నాక్స్ వంటివి ఏర్పాటు చేయడంతో పూర్తిస్థాయిలో హాజరుకాగా నేడు భోజనం లేకపోవడంతో దూరప్రాంతాల విద్యార్థులు ప్రత్యేక తరగతులకు హాజరుకావడం లేదని చెబుతున్నారు. దూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు హాస్టల్స్లో ఉండి పాఠశాలలో విద్యనభ్యసించగా నేడు హాస్టల్స్ వేసవి సెలవుల్లో మూసివేయడంతో విద్యార్థులు సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. అలాంటి వారు ఎక్కడి నుంచో తాను చదువుకున్న పాఠశాలకు ప్రత్యేక తరగతులకు హాజరుకావడం ఇబ్బందికరంగా ఉండడంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు గతంలో మాదిరిగా భోజనం సదుపాయం కల్పిస్తే విద్యార్థులు పూర్తిస్థాయిలో హాజరయ్యే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు పూర్తిస్థాయిలో విద్యార్థులు హాజరయ్యే విధంగా కృషి చేస్తున్నాం. దానికి గానూ ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ఫెయిల్ అయిన విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రతిరోజూ ఫోన్ చేసి స్కూల్కు పంపించాలని కోరుతున్నారు. –ఇ.నారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం పదో తరగతి ప్రత్యేక తరగతులకు స్పందన కరువు 40 శాతం హాజరు కూడా లేని వైనం భోజనం, స్నాక్స్ లేక విద్యార్థుల ఇబ్బందులు -
చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి
ఆగిరిపల్లి: మండలంలోని తోటపల్లికి చెందిన వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, దుగ్గిరాల బాల రావమ్మ తల్లి ఆలయ మాజీ చైర్మన్ వీరంకి వీరాంజనేయులు(55) ప్రమాదవశాత్తు మామిడి చెట్టుపై నుంచి కాలుజారి కింద పడి మృతి చెందాడు. గురువారం రాత్రి వీరాంజనేయులు తన మామిడితోటలో చెట్టు ఎక్కి మామిడికాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడిపోయాడు. తలకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. ఆయన మృతదేహానికి వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు బెజవాడ రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు పల్లగాని నరసింహారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు బెజవాడ శ్రీహర్ష, గ్రామ పార్టీ అధ్యక్షులు దాసరి శరత్, వీరాంజనేయులు పాల్గొన్నారు. కామవరపుకోట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి తడికలపూడిలో చోటు చేసుకుంది. తడికలపూడి ఎస్సై వల్లి పద్మ తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు శనివారపేటకు చెందిన బెల్లాని సతీష్ (34) గురువారం సొంత పని మీద శనివారపుపేట ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి జంగారెడ్డిగూడెం వెళ్లి అదే రోజు రాత్రి తిరిగి ప్రయాణమై ఇంటికి వస్తుండగా తడికలపూడి సెంటర్లోని ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వచ్చేసరికి గుర్తు తెలియని వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో సతీష్ తలకు తీవ్ర గాయాలై అక్కడే మృతి చెందాడు. మృతుడు సోదరుడు బెల్లాని రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వల్లి పద్మ తెలిపారు. జంగారెడ్డిగూడెం: ఎర్రకాలువ జలాశయం నుంచి మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్న రెండు మట్టి లారీలను సీజ్ చేసినట్లు ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. రాత్రి సమయాల్లో జలాశయం నుంచి మట్టిని తరలిస్తుండడంతో రెండు లారీల ను సీజ్ చేసి రెవెన్యూ శాఖకు తెలిపామన్నారు. తహసీల్దార్ కె.స్లీవజోజి ఒక్కొక్క లారీకి రూ. 10వేలు జరిమానా విధించినట్లు ఎస్సై చెప్పారు. ముదినేపల్లి(కై కలూరు): తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించడానికి గుడివాడ వెళ్లిన భార్య, కుమార్తె కనిపించడం లేదంటూ ఓ వ్యక్తి శుక్రవారం ముదినేపల్లి పోలీసులను ఆశ్రయించాడు. వారు తెలిపిన వివరాల ప్రకారం పెదపాలపర్రు గ్రామంలో చిట్టెం చౌదరీ, భార్య నాగరాణి(31), కుమార్తె యస్విక(5) నివసిస్తున్నారు. చౌదరీ సోదరుడు వివాహం శనివారం జరగనుంది. దీంతో గురువారం పొలంలో అమ్మిన మినుములు డబ్బులు రూ.50 వేలను భార్య నాగమణికి ఇచ్చి గుడివాడలో తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకుని రావడంతో పాటు కొత్త బట్టలు కొనుక్కోమని చెప్పాడు. దీంతో తల్లి, కూతురు గుడివాడ వెళ్లారు. సాయంత్రం 6 గంటల వరకు వారు తిరిగి రాకపోవడంతో గుడివాడలో బంగారు కొట్టు యజమానితో మాట్లాడితే భర్త పేరుతో తాకట్టు ఉందని, ఆయన రావాలని చెప్పడంతో నాగమణి వెళ్లిపోయినట్లు చెప్పారు. దీంతో గాలించిన భర్త ఇద్దరూ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాలకొల్లు సెంట్రల్: మండలంలోని కాపవరం గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గూడూరి వెంకరమణ వైద్య చికిత్స నిమిత్తం గత నెల 27 న హైదరాబాద్ వెళ్లి శుక్రవారం ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉండడాన్ని గమనించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న ఐదు కాసులు బంగారం, 400 గ్రాములు వెండి, కొంత నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై సురేంద్రకుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమడోలు: తన భర్త తనును శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఓ భార్య శుక్రవారం భీమడోలు పోలీసులను ఆశ్రయించింది. వారు తెలిపిన వివరాల ప్రకారం పూళ్ల పంచాయతీ పరిధిలోని ఎంఎం పురానికి చెందిన యాగంటి జ్యోతిర్మయి అనే మహిళ అదే గ్రామానికి చెందిన రొంటపల్లి ఏసుపాదాన్ని 2017లో రెండో పెళ్లి చేసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడాది క్రితం కతార్ నుంచి ఇంటికి వచ్చిన భర్త ఏసుపాదం భార్య యాగంటి జ్యోతిర్మయిని అదనపు కట్నం తేవాలని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. దీంతో విసుగు చెందిన ఆమె తన భర్తపై భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్సై ఎస్కే మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సారు.. చాలా బిజీ !
సాక్షి, భీమవరం: ఇసుక అమ్ముకోవచ్చు.. మట్టి అమ్ముకోవచ్చు.. రియల్ ఎస్టేట్లో.. బ్రాందీషాపుల్లో వాటాలు తీసుకోవచ్చు.. రిజిస్ట్రేషన్లలోనూ డ బ్బులు వసూలు చేయొచ్చు.. ‘అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంట్రాక్టర్ ఏ విధంగా డబ్బులు ఇస్తారు.. పోలీస్స్టేషన్ల సెటిల్మెంట్లలో నాయకుల కు డబ్బులు ఎలా వస్తాయో..’ ఇటీవల కూటమి ప్రజాప్రతినిధి ఒకరు చెప్పిన వీడియో వైరలైన విషయం తెలిసిందే. కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు గడిచిపోగా మూడేళ్లు మాత్రమే మిగిలింది. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకునే పనిలో కొందరు నేతలు తలమునకలైనట్టు తెలుస్తోంది. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు, ఆస్తి తగాదాలు, 22ఏ నిషేధిత భూవివాదాలు, కాంట్రాక్టులు, పేకాట క్లబ్బులు, రేషన్ బియ్యం అక్రమ రవాణా, పోలీస్స్టేషన్ సెటిల్మెంట్లు, ఇలా ప్రతి పనికీ రేటు పెట్టి పైసావసూల్ పనులకే ప్రాధాన్యమిస్తున్నట్టు సొంత క్యాడరే గుసగుసలాడుకుంటున్నారు. ఆయా వ్యవహారాలు చక్కబెట్టుకునే పనిలో తీరిక లేకుండా ఉంటున్నారని చెప్పుకుంటున్నారు. హామీలు గాలికి.. జిల్లాలోని పట్టణాలు, పల్లెలను డంపింగ్యార్డు స మస్య వేధిస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణ సరిగాలేక ప్రజలు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. శివారు ప్రాంతాలను తాగునీరు, రోడ్లు, డ్రైన్లు తదితర మౌ లిక వసతుల లేమి సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. పేదల పక్కా ఇళ్ల నిర్మాణం పడకేసింది. ఇదిలా ఉంటే తాము అధికారంలోకి వస్తే అవిచేస్తాం.. ఇవి చేస్తామంటూ ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చారు. పింఛన్ ఇప్పిస్తాం, ఇళ్ల స్థలం, ఇళ్లు మంజూరు చేయిస్తాం. మీ బిడ్డలకు ఉద్యోగమిప్పిస్తాం, మీకు ఉపాధి కల్పిస్తాం, మీ వీధికి రోడ్డు వేయిస్తాం, డ్రెయిన్ నిర్మిస్తాం, తాగునీరు అందిస్తాం, కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తాం.. అంటూ ఇంటింటా ప్రచారంలో చెప్పుకొచ్చారు. వాటి కోసం రోజుల తరబడి సదరు నేతల క్యాంపు కార్యాలయాలకు వెళుతున్న వారికి పడిగాపులే తప్ప పనులు కావడం లేదని, గంటల తరబడి నిరీక్షించినా వారి గోడు పట్టించుకునే వారుండటం లేదంటున్నారు. వచ్చిన వారు సామాన్యులైతే సారు చాలా బిజీగా ఉన్నారు.. ఇప్పుడు కలవడం కుదరదంటూ సిబ్బంది చెప్పి పంపించేస్తున్నారు. కలిసి వెళతామంటే మాత్రం గంటల తరబడి నిరీక్షించాల్సిందే. కావాల్సిన వారితో మంతనాలు పూర్తయ్యాక హడావుడిగా బయటకు వెళ్లే క్రమంలో అక్కడ వేచి ఉన్న వారికి చిన్న చిరునవ్వు విసిరి ఏమిటో చెప్పడంటూ కంగారు పెట్టడం, ఎదుటవారు చెప్పేది పూర్తిగా ఆలకించకుండానే ఇదేమిటో కాస్త చూడమంటూ కార్యాలయంలోని సిబ్బందికి పురమాయించి వెళ్లిపోవడం పలువురి నేతల కార్యాలయాల వద్ద జరుగుతున్న తంతుగా వినిపిస్తోంది. ఏంటండి.. ఏ టోకెన్తో వచ్చారు.. ఆర్డినరీయా.. స్పెషలా.. వెరీవెరీ స్పెషలా..మీకు అడ్డేమిటండి. మీరు రాగానే పంపమని సార్ చెప్పారు. డైరెక్టుగా లోపలికి వెళ్లిపోండి.. – ఇది ఒక నేత కార్యాలయానికి వచ్చిన బడాబాబుతో సదరు నేత పీఏ సరదా సంభాషణ తమ సమస్యలను పరిష్కరిస్తారన్న గంపెడాశతో సామాన్యులు గంటల కొద్ద్దీ నిరీక్షించినా నేతల దర్శన భాగ్యం దక్కదు. సెక్యూరిటీ సిబ్బంది కనీసం వారిని డోర్ వద్దకు కూడా వెళ్లనివ్వరు. వచ్చిన వారు బడా కాంట్రాక్టరో, వ్యాపారవేత్తో, సంపన్నుడో, పలుకుబడి ఉన్న వారో, సదరు నేత కుల సంఘం పెద్దో అయితే.. వెంటుండి మరీ నేరుగా నాయకుడి రూమ్లోకి సాగనంపుతుంటారు. – ఇది జిల్లాలోని పలువురు నేతల క్యాంపు కార్యాలయాల వద్ద పరిస్థితినేతలు సొంత వ్యవహరాల్లో మునిగిపోతుండటంతో వారి తనయులు, కుటుంబసభ్యులు, ముఖ్య అనుచరులు షాడోలుగా చలామణి అవు తున్నారు. నియోజకవర్గాల్లో పెత్తనమంతా వీరి దే. బదిలీలు, నియామకాలు, పాలన వ్యవహరాలు, పేకాట క్లబ్బులు, కోడిపందేల నిర్వహణ అన్నింటిలోనూ చక్రం తిప్పుతున్నారు. అధికారులు షాడోల అడుగులకు మడుగులొత్తుతున్నారన్న విమర్శలున్నాయి. తామేమీ తక్కువ కాద న్నట్టు కొందరు అధికారిక, వ్యక్తిగత సహాయకులతో పాటు గన్మెన్లు సైతం వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ వెనకేసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా కూటమిలోని మిగిలిన నేతలకు షాడోల వైఖరి మింగుడు పడటం లేదు. పార్టీ పిలుపు మేరకు కూటమి అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తే షాడోలతో తమకు సరైన గుర్తింపు లేక ఉనికిని కోల్పోతున్నామని సన్నిహితుల వద్ద వీరు వాపోతున్నారు. -
పార్టీ శ్రేణులకు అధిక ప్రాధాన్యం
మాజీ మంత్రి కారుమూరి తణుకు అర్బన్: జగన్ 2.0లో పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలు, నాయకులకు పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొండంత అండగా ఉంటారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులోని పార్టీ కా ర్యాలయంలో శుక్రవారం 34 వార్డుల పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కోసం ఐడీ కార్డు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే నేరుగా వస్తుందన్నారు. ప్రతి కార్యకర్త వివరాలు జగన్ పరిశీలనలోనే ఉంటాయని స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణమే ముఖ్య లక్ష్యంగా పార్టీ కార్యకర్తలంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. పట్టణ పరిధిలో వార్డు నాయకులు, పార్టీ వివిధ కమిటీల నాయకులు పార్టీ బలోపేతానికి తీవ్రంగా శ్రమించాలని కోరారు. భవిష్యత్తులో కార్యకర్తలకు మంచి ప్రయోజనాలు ఉంటాయని, దేశవ్యాప్తంగా కార్యకర్తలకు అండగా నిలబడింది వైఎస్సార్సీపీ ఒక్కటేననే గుర్తింపు వస్తుందని కారుమూరి అన్నారు. తణుకులో బలమైన నాయకత్వం తణుకులో వైఎస్సార్సీపీకి బలమైన నాయకత్వం ఉందని నియోజకవర్గ పరిశీలకుడు కొట్టు వెంకట నాగు అన్నారు. అధికార పార్టీ ఎన్ని ఒత్తిళ్లు తీసుకువచ్చినా ఇక్కడ క్యాడర్ ధైర్యంగా ఉందని, ఇందుకు మాజీ మంత్రి కారుమూరి కారణమన్నారు. రానున్న రోజుల్లో పార్టీ కోసం అధికంగా శ్రమించాల్సిన పరిస్థితులు రానున్నాయని అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని కోరారు. కూ టమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ చేసే క్రమంలో వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ రాష్ట్రంలోనే ఇక్కడ అధికంగా జరిగిందని, ఇదే స్ఫూర్తితో పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పంచాయితీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, నియోజకవర్గ మహిళాధ్యక్షురా లు మెహర్ అన్సారీ, డాక్టర్ దాట్ల సుందరరామరాజు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు కొత్తపల్లి చ రణ్, పట్టణ యూత్ అధ్యక్షుడు కలిశెట్టి ప్రకాష్, ని యోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు గెల్లా జగన్, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు పెనుమాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు
బుట్టాయగూడెం: గిరిజన ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా వైద్యాధికారి శోభారాణి తెలిపారు. మండలంలోని మారుమూల గామమైన దొరమామిడిలో ఆమె శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా పీహెచ్సీని సందర్శించారు. అక్కడ వైద్యం పొందుతున్న రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్వో మాట్లాడుతూ ఆసుపత్రిల్లో ప చేస్తున్న వైద్యులు అందుబాటులో ఉంటూ ఆసుపత్రికి వచ్చే వారికి సకాలంలో వైద్యం అందేలా కృషి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే అదే గ్రామంలో ఆర్ఎంపీ ఆసుపత్రి రూమ్, మెడికల్ షాపును సీజ్ చేశారు. ఇటివల కోర్సవారిగూడెం గ్రామానికి చెందిన ఒక చిన్నారి మృతి చెందిన నేపథ్యంలో ఆర్ఎంపీ షాపును సీజ్ చేశామని చెప్పారు. అయితే ఆర్ఎంపీ వ్యవహారంపై తెలుసుకునేందేకు వెళ్లిన డీఎంహెచ్వోకు గ్రామస్తులు అడ్డపడ్డారు. మాజీ సర్పంచ్ తెల్లం రాముడు ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎందుకు ఆర్ఎంపీపై చర్యలు తీసుకుటున్నారు? అని ప్రశ్నించారు. ఈ వ్యవహరంలో ఆర్ఎంపీకి గ్రామస్తులు అండగా నిలబడ్డారు. అతనికి నాయ్యం చేయకపోతే ఏలూరు జిల్లా కార్యాలయానికి వచ్చి అందోళనలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ జె.సురేష్, డాక్టర్ నందిని, డీఎంఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆహ్లాదం.. గోదావరి విహారం
● పాపికొండల యాత్రకు పర్యాటకుల తాకిడి ● వేసవి కావడంతో అధిక సంఖ్యలో రాక ● నదిపై బోటు ప్రయాణానికి ఆసక్తి పాపికొండల విహార యాత్రకు వెళుతున్న పర్యాటక బోట్లు బుట్టాయగూడెం: పాపికొండల మధ్య గోదావరి నదిపై లాంచీలో ప్రయాణం అద్భుతమైన అనుభూతి. వేసవిలో సైతం లాంచీలపై ప్రయాణం ఆహ్లాదా న్ని కలిగించడంతో ప్రస్తుతం పాపికొండలకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. సాధారణంగా ఆదివారం, సెలవు రోజుల్లో అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అయితే ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో పర్యాటకుల రద్దీ కనిపిస్తోంది. రెండు రోజులుగా పాపికొండల యాత్రకు తాకిడి ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గండిపోచమ్మ గుడి దగ్గర నుంచి పేరంటాలపల్లి వరకూ లాంచీల్లో ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పర్యాటకులు ఆహ్లాదంగా గడుపుతున్నారు. విహార యాత్రకు విశాఖ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, భద్రాచలం, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. సందర్శనా స్థలాలు పాపికొండల యాత్రలో భాగంగా పలు సందర్శనా స్థలాలను చూడవచ్చు. అల్లూరి జిల్లాలోని దేవీ పట్నం మండలంలోని గండిపోచమ్మ గుడి, బ్రిటిష్ కాలపు పోలీస్స్టేషన్, 11వ శతాబ్దం నాటి ఉమాచోడేశ్వర స్వామి ఆలయం, కొరుటూరులో అటవీశాఖ కాటేజీలు, పేరంటాలపల్లి ఆశ్రమాన్ని సందర్శించవచ్చు. గోదావరి తీరానికి ఇరువైపులా గట్లపై దర్శనమిచ్చే గిరిజన గ్రామాల్లోని ఇళ్లు కనువిందు చేస్తాయి. అలాగే పోలవరం ప్రాజెక్టు అందాలను తిలకించవచ్చు. గిరిజనుల ఆప్యాయత, ఆదరణ పేరంటాలపల్లి పర్యాటకులకు గిరిజనుల ఆప్యాయత, ఆదరణ నాగరిక సమాజానికే తలమానికం. అక్కడి కొండరెడ్డి గిరిజనులు పర్యాటకులకు వెదురుతో తయారు చేసిన కళాకృతులను విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటారు. అవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. యాత్రకు వెళ్లిన ప్రతిఒక్కరూ వాటిని తప్పనిసరిగా కొనుగోలు చేస్తుంటారు. గండిపోచమ్మ గుడి నుంచి ప్రశాంతమైన, సుందరమైన గోదావరి అలలపై సాగే యాత్ర సుమారు 5 గంటలకు పైగా ఉంటుంది. ఇదిలా ఉండగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం, అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో యాత్రికుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. -
గ్రంథాలయాల సెస్ చెల్లించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా గ్రంథాలయ సంస్థకు మున్సిపాలిటీలు, పంచాయతీలు ప్రతినెలా గ్రంథాలయ సెస్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి గ్రంథాలయ సెస్ చెల్లింపులు, వేసవి విజ్ఞాన శిబిరాల నిర్వహణ తదితర అంశాలపై డీపీఓ, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ ఎంపీడీఓలు, శాఖా గ్రంథాలయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వా రా సమీక్షించారు. మున్సిపాలిటీల వారీగా సెస్ బకాయిల వివరాలను తెలుసుకున్నారు. సెస్ వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీపీఓ వై.దోసిరెడ్డిని ఆదేశించారు. జిల్లాలోని 31 గ్రంథాలయాల్లో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాలపై పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే గ్రంథాలయాలకు పుస్తకాలను విరాళంగా అందజేసే దాతల పేర్లను ప్రత్యేక బోర్డుపై ప్రదర్శించాలని, దీని ద్వారా మరింత మంది ప్రేరణ పొందుతారన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శేఖర్బాబు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): బీఈడీ కోర్సులో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే ఎడ్సెట్ పరీక్షలు శుక్రవారం నగరంలోని 3 కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగాయి. సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో ఉదయం 170 మందికి 119 మంది, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 201 మందికి 166 మంది, మ ధ్యాహ్నం 199 మందికి 150 మంది, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 135 మందికి 106 మంది హాజరయ్యారు. -
తాగునీటిపై శ్రద్ధ చూపాలి
తణుకు అర్బన్: వేసవి దృష్ట్యా మున్సిపాలిటీల్లో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పురపరిపాలనా శాఖ ప్రాంతీ య సంచాలకుడు (ఆర్డీ) సీహెచ్ నాగనరసింహారావు సూచించారు. శుక్రవారం తణుకు మున్సిపల్ కార్యాలయంలో జిల్లాలోని మున్సి పల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఆస్తి పన్నుల వసూళ్లు, స్వచ్ఛ సర్వేక్షణ్ అమలు తీరు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, డ్రెయినేజీల పూడికతీత, వేసవిలో నీటి ఎద్దడి నివారణ చ ర్యలు, వీధి కుక్కల నియంత్రణలో భాగంగా ఆ పరేషన్లు చేపట్టే అంశాలపై సూచనలు చేశారు. ముందుగా పట్టణంలోని కంపోస్టు యార్డు, వీధి కుక్కల స్టెరిలైజేషన్ సెంటర్, పారిశుద్ధ్య నిర్వహణ, బాక్సు క్రికెట్ గ్రౌండ్ను పరిశీలించా రు. మున్సిపల్ కమిషనర్లు టి.రామ్కుమార్, కె. రామచంద్రారెడ్డి, ఎం.యేసుబాబు, ఆర్.వెంకటరామిరెడ్డి, బి.విజయసారథి, కృష్ణమోహన్, తణుకు మున్సిపల్ డీఈ కొవ్వూరి ఈశ్వరరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం: విద్య, పరిశోధనల్లో విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి డిజి టల్ లైబ్రరీ దోహదపడుతుందని తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్ ఇన్చార్జి డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు అన్నారు. ఏపీ నిట్లో గ్రంథాలయ చైర్మన్ కార్తికేయ శర్మ ఆధ్వర్యంలో ప్రాంగణంలోని బీఆర్ అంబేడ్కర్ సెంట్రల్ లై బ్రరీలో ఎక్కడైనా కూర్చుని డిజిటల్ కంటెంట్ను పొందేలా ల్యాప్టాప్లతో కూడిన అధు నాతన డిజిటల్ లైబ్రరీని, రెండు డిస్కషన్ రూమ్లను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రమణరావు మాట్లాడుతూ వేలాది పుస్తకాలు, పరిశోధనా పత్రాలు, ప్రశ్న పత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రిజిస్ట్రార్ పి.దినేష్ శంకరరెడ్డి, డీన్లు రవికిరణ్, సందీప్, ఎన్.జయరామ్, వీరేష్కుమార్, హిమబిందు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. పెనుగొండ: కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అరెస్ట్ అయిన ఆచంట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు సుంకర సీతారామ్, కోటే శశి మధులకు పాలకొల్లు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొడమంచిలి పంచాయతీ పరిఽధిలో ఉపాధి హామీ పథకంలో అక్రమ చెల్లింపులకు పాల్పడ్డారంటూ అప్పటి ఫీల్డ్ అసిస్టెంట్, వైఎస్సార్ సీపీ యువజన విభాగం మండల కన్వీనర్ కోటే శశి మధు, మాజీ సర్పంచ్ సుంకర సీతారామ్ను ఎంపీడీఓ బి.కృష్ణమోహన్ ఫిర్యాదు మేరకు బు ధవారం అరెస్ట్ చేసి కోర్టుకు హజరు పరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. కూటమి నాయకుల ఇసుక, మట్టి అక్రమ త వ్వకాలకు అడ్డు తగులుతుండటంతో అక్రమ అరెస్ట్కు పాల్పడ్డారంటూ వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపించి తీవ్ర నిరశన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ నాయకుల తరఫున మంగెన శ్రీనివాస మెహర్బాబా పాలకొ ల్లు కోర్టులో బెయిల్ కోసం వాదించగా, జూనియర్ సివిల్ జడ్జి, జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజి స్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. శుక్రవారం సాయంత్రం బెయిల్ మంజూరు కావడంతో, శనివారం ఉదయం సుంకర సీతారామ్, కోటే శశి మధు విడుదల కానున్నారు. భీమవరం: టెన్త్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న తరుణంలో వారికి మధ్యాహ్న భోజనం అందజేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. జిల్లా కార్యదర్శి టి.ప్రసాద్ శుక్రవారం డీఈఓ ఈ.నారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ప్రసాద్ మాట్లా డుతూ ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష రాయడానికి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అభినందనీయమని, అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే తరగతుల్లో భోజనం లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీరికి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం కొనసాగించాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, భీమవరం పట్టణ అధ్యక్షుడు సాయికృష్ణ ఉన్నారు. -
మద్యం మత్తులో కొడుకును చంపిన తండ్రి
అత్తిలి: మద్యం మత్తులో కన్న కొడుకునే కత్తెరతో పొడిచి చంపిన ఘటన శుక్రవారం సాయంత్రం అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో చోటు చేసుకుంది. స్ధానికుల కథనం ప్రకారం పాలకొల్లుకు చెందిన కొయ్యన గణేష్తో అత్తిలి మండలం ఈడూరు గ్రామానికి చెందిన శేషవేణితో వివాహమైంది. వివాహం అనంతరం గణేష్ అత్తవారింటికి వచ్చి ఇక్కడే జీవిస్తున్నాడు. ఇతనికి కుమారుడు శామ్యూల్రాజు, కుమార్తె జాహ్నవి ఉన్నారు. గణేష్ రొయ్యల చెరువుల్లో వాడే ఎయిరేటర్స్ మోటార్ల మరమ్మతులు చేస్తుంటాడు. కుమారుడు శామ్యూల్రాజు(21) ఐటీఐ చదివి తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. మద్యానికి బానిసైన గణేష్ నిత్యం భార్యతో గొడవపడుతూ, వేధిస్తుంటాడు. అయితే శుక్రవారం తండ్రీకొడుకులు ఇద్దరూ మోటార్ల మరమ్మతుల నిమిత్తం బయటకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి తిరిగివచ్చారు. మద్యం మత్తులో ఉన్న గణేష్, భార్యతో గొడవకు దిగాడు. తల్లిదండ్రుల గొడవ నేపథ్యంలో కుమారుడు సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. విచక్షణ కోల్పోయిన తండ్రి గణేష్ అకస్మాత్తుగా వచ్చి మంచంపై పడుకున్న కొడుకు శామ్యూల్రాజు ఛాతిపై పలుమార్లు విచక్షణారహితంగా కత్తెరతో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం 108లో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శామ్యూల్రాజు మృతి చెందాడు. సమాచారం అందుకున్న సంఘటనా ప్రదేశానికి అత్తిలి పోలీసులు చేరుకుని వివరాలను సేకరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
కవులు, రచయితలు ఏకతాటిపైకి రావాలి
భీమవరం: సాంస్కృతిక విప్లవం పునరేకీకరణ, సాంస్కృతిక వికాసం కోసం కవులు, రచయితలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర కార్యదర్శి బీఎన్ సాగర్ పిలుపునిచ్చారు. శుక్రవారం భీమవరంలో అరసం 14వ జిల్లా మహాసభలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. శ్రమ, స్వేదం సంపదను సృష్టిస్తున్న నాటి కాలంలో నిర్బంధ పెట్టుబడీదారి వ్యవస్థల కబంధహస్తాల నుంచి సృజనకారులు పుట్టుకొచ్చి భావప్రకటన స్వేచ్ఛకు పునాదులు వేశారన్నారు. ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు కోనాల భీమారావు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశం వందేళ్ల వెనక్కి వెళ్లిపోయిందని, ఫాసిస్టులు విజృంభిస్తున్న తరుణంలో అరసం ముఖ్య భూమిక పోషించాలన్నారు. అరసం అధ్యక్షుడు వేల్పుల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రచయితలు పంపన సాయిబాబా, కొత్తపల్లి త్రినాథరాజు, జవ్వాజి దాశరధి శ్రీనివాసరావు, గొన్నాబత్తల మల్లేశ్వరరావు, అల్లు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి క్షేత్రంలో భారీగా వివాహాలు
ద్వారకాతిరుమల: చినవెంకన్న క్షేత్రంలో శుక్రవారం రాత్రి వివాహాలు భారీగా జరిగాయి. దీంతో క్షేత్రంలో పెళ్లిసందడి నెలకొంది. సాయంత్రం నుంచే పెళ్లి జనాల వాహనాలు టోల్గేట్ మీదుగా శ్రీవారి కొండపైకి చేరుకున్నాయి. కొండపైన పార్కింగ్ ప్రదేశాలు, ఘాట్ రోడ్లు పెళ్లి జనాల వాహనాలతో రద్దీగా మారాయి. గుడి సెంటర్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్ సిబ్బంది, ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని అనివేటి మండపాల్లో, స్వామివారి పాదుకా మండపం వద్ద ఉన్న పాత కల్యాణ మండపంలో, కొండపైన, దిగువన కల్యా ణ మండపాల్లో పెద్ద ఎత్తున వివాహాలు జరిగాయి. దాదాపు అన్ని ప్రైవేట్ కల్యాణ మండపాల్లోనూ వివాహాలు జరిగాయి. నూతన వధూవరులు శనివారం వేకువజామున స్వామి, అమ్మవార్లను దర్శించుకోనున్నారు. -
నేలతల్లి ఆరోగ్యం.. రైతుకు సౌభాగ్యం
● భూసార పరీక్షలతోనే సాగులో సిరి సంపదలు ● మెట్ట ప్రాంతంలో మట్టి నమూనాల సేకరణ చింతలపూడి: ‘ఏరువాక సాగే ముందు.. నేల తల్లి నాడి చూడాలి’ అనే నినాదంతో వ్యవసాయ శాఖ అడుగులు వేస్తోంది. సాగు ఖర్చులు తగ్గించుకుంటూ, అధిక దిగుబడులు సాధించడమే లక్ష్యంగా భూసార పరీక్షలపై రైతులకు అవగాహన కల్పిస్తోంది. 2025–26 ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో చింతలపూడి సబ్ డివిజన్ పరిధిలోని రైతులు తమ పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి, పరీక్షలు చేయించుకోవడం ద్వారా లాభదాయక వ్యవసాయానికి బాటలు వేసుకుంటున్నారు. చింతలపూడి సబ్ డివిజన్ పరిధిలో చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, టి.నర్సాపురం మండలాల్లో గత ఏడాది ఖరీఫ్ సీజన్లో మొత్తం 5,680 మట్టి నమూనాలను సేకరించారు. ఈ ఏడాది రసాయన రహిత సాగు వైపు మళ్లుతున్న ప్రకృతి వ్యవసాయ రైతుల నుంచి కూడా 4,045 నమూనాలను సేకరించి భూసార పరీక్షలకు పంపారు. భూసార పరీక్షలతో ఎంతో మేలు మట్టి నమూనాల పరీక్ష ద్వారా రైతులకు అందే ‘భూసార ఆరోగ్య పత్రం’ సాగులో దిక్సూచిలా పని చేస్తుంది. భూమిలో ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయో? ఏవి ఎక్కువగా ఉన్నాయో?తెలుస్తుంది. దీనివల్ల అనవసరంగా ఎరువులు వాడి డబ్బు వృథా చేయాల్సిన పని ఉండదు. యూరియా,డీఏపీ వంటి ఎరువులను మోతాదుకు మించి వాడకుండా నిరోధించవచ్చు. ఫలితంగా పెట్టుబడి ఖర్చు 20 శాతం నుంచి 30 శాతం వరకు తగ్గుతుంది. మితిమీరిన రసాయనాల వినియోగం వల్ల చవుడు భూములుగా మారుతున్న నేలలను రక్షించుకోవచ్చు. భూమిలోని ఉదజని సూచిక లవణ సాంద్రతను బట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. పంటకు అవసరమైన సూక్ష్మ పోషకాలు (జింక్, బోరాన్, ఇనుము వంటివి) అందించడం వల్ల గింజ గట్టిపడి, దిగుబడి పెరుగుతుంది. పొలంలో మట్టి నమూనా తీసేటప్పుడు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పొలం మధ్యలో కాకుండా, పొలం అంతటా 15 నుండి 30 సెంటీమీటర్ల లోతు వరకు మట్టిని సేకరించాలి. చెట్ల కింద, గట్ల పక్కన, ఎరువులు వేసిన చోట మట్టిని సేకరించకూడదు. రైతులు గుడ్డిగా ఎరువులు వేసి నష్టపోకూడదనే ఉద్దేశంతో చింతలపూడి సబ్ డివిజన్ వ్యాప్తంగా నమూనాల సేకరణ చేపట్టాం. ఆరోగ్యకరమైన నేల నుంచే నాణ్యమైన ఆహారం లభిస్తుందని ప్రతి రైతు గుర్తించాలి. – వై.సుబ్బారావు, వ్యవసాయ శాఖ ఏడీ, చింతలపూడి సబ్ డివిజన్ -
ఇష్టారాజ్యంగా మట్టి అక్రమ రవాణా
పాలకోడేరు: నిబంధనలకు విరుద్ధంగా మండలంలో ఇష్టారాజ్యంగా మట్టి అక్రమ రవాణా సాగుతోంది. మోగల్లు, పాలకోడేరు, వేండ్ర, శృంగవృక్షం, గొల్లలకోడేరు, గరగపర్రు, విస్సాకోడేరు, పెన్నాడ, కోరుకొల్లు తదితర గ్రామాల్లో మట్టి లారీలు, ట్రాక్టర్లు వేగంగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దీనికితోడు రోడ్లపై మట్టి ముద్దలు పడడంతో రోడ్లు సైతం ధ్వంసం అవుతున్నాయి. రోడ్లపై పడిన మట్టి గడ్డల వల్ల వర్షం వస్తే చిత్తడిగా మారి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై తహసీల్దార్ పీవీఎన్ఎస్ఎస్ లక్ష్మిని వివరణ కోరగా ఇప్పటివరకు తమ దృష్టికి రాలేదని, వెంటనే చర్యలు చేపడతామని చెప్పారు. -
కూటమి బరితెగింపు
ఎన్నడూ లేనివిధంగా.. సాక్షి, భీమవరం/ పెనుగొండ: కూటమి నేతలు బరితెగించారు. వైఎస్సార్సీపీ నాయకులే లక్ష్యంగా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. తమ అక్రమాలకు అడ్డుతగులుతున్నారని తాజాగా ఆచంట మండలం కొడమంచిలికి చెందిన దళిత మాజీ సర్పంచ్ను అక్రమంగా అరెస్టు చేయించారు. మునుపెన్నడూలేని విధంగా ఉపాధి పనుల్లో అవకతవకల పేరిట మాజీ సర్పంచ్ను అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆచంట, పెనుగొండ, యలమంచిలి మండలాలు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సీఆర్జెడ్) పరిధిలోకి వెళ్లడంతో రెండేళ్లుగా ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. సిద్ధాంతం, కరుగోరుమిల్లి, కోడేరు, నడిపూడి ఓపెన్ ర్యాంపులు మూతపడ్డాయి. ఇదే అదునుగా కూటమి నేతలు ఇసుక అక్రమ తవ్వకాలకు తెరలేపారు. లంక భూములు, నక్కల డ్రెయిన్లో మట్టి తవ్వకాలు చేస్తున్నారు. సీఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయల సహజ సంపదను కొల్లగొడుతుంటే ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న ఒత్తిడితో అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారన్న విమర్శలున్నాయి. వైఎస్సార్సీపీ నేత, కొడమంచిలి మాజీ సర్పంచ్ సుంకర సీతారామ్ పార్టీ శ్రేణులతో కలిసి అక్రమ తవ్వకాలకు అడ్డుతగులుతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో పాటు హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్జెడ్ పరిధిలో తవ్వకాలకు వ్యతిరేకంగా న్యాయస్థానం నుంచి ఆదేశాలు తీసుకువచ్చారు. ఈ క్రమంలో కూటమి స్థానిక నాయకత్వం పంచాయతీ రికార్డుల్లో అవకతవకలు జరిగాయంటూ విచారణల పేరిట ఏడాదికాలంగా సీతారామ్ను వేధింపులకు గురిచేస్తున్నారు. సీతారామ్ వెనక్కి తగ్గకపోవడంతో రెడ్బుక్ను తెరపైకి తెచ్చారు. గ్రామస్థాయిలో చేపట్టిన ఉపాధి పనులపై ఏటా గ్రామ, మండల స్థాయిలో గ్రామ సభల రూపంలో సోషల్ ఆడిట్ నిర్వహిస్తారు. క్షేత్రస్థాయిలో పనులు సక్రమంగా జరిగిందీ లేనిది పరిశీలించి నిధులు దుర్వినియోగం జరిగి ఉంటే మేట్, ఫీల్డ్ అసిస్టెంట్, టీఏ, ఏపీఓ తదితర ఉద్యోగుల్లో బాధ్యులు ఎవరో గుర్తించి వారి నుంచి సొమ్ములు రికవరీ చేయడం, శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంటుంది. ఉపాధి పనులు మొదలై దాదాపు 18 ఏళ్లు కావస్తుండగా జిల్లాలోని 20 మండలాల పరిధిలో కోట్లాది రూపాయలు వెచ్చించి పనులు చేశారు. ఇప్పటివరకు 18 రౌండ్లు (ఆర్థిక సంవత్సరానికి ఒక్కసారి) జరిగిన సోషల్ ఆడిట్లో రూ.2.45 కోట్లు నిధులు దుర్వినియోగం అయినట్టు గుర్తించి బాధ్యుల నుంచి రూ. 2.04 కోట్లు రికవరీ చేశారు. 2025–26 సంవత్సరంలో జిల్లాలో జరిగిన సోషల్ ఆడిట్లో రూ.16.03 లక్షలు మేర వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించారు. గ్రామం నుంచి మండల స్థాయి వరకు వివిధ హోదాల్లో పనిచేసే ఉద్యోగులు 217 మంది బాధ్యులుగా తేల్చారు. కాగా ఇప్పటి వరకు ప్రజాప్రతినిధుల్ని బాధ్యుల్ని చేస్తూ కేసులు పెట్టిన దాఖలాలు లేవు. కాగా అక్రమ తవ్వకాలకు అడ్డుతగులుతున్నారనే కూటమి నేతలు సీతారామ్పై అక్రమంగా కేసు బనాయించి అరెస్టు చేయించారని వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. అధికారులు, పోలీసులు వత్తాసు పలుకుతున్నారని విమర్శిస్తున్నారు. బుధవారం అరెస్టు సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఆచంట పోలీస్ స్టేషన్ చేరుకుని నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ దళిత మాజీ సర్పంచ్పై అక్రమ కేసు ఉపాధి హామీ పనుల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ అరెస్టు మట్టి తవ్వకాలను అడ్డుకుంటున్నారనే కక్ష సాధింపులు ఆచంట చేరిన రెడ్బుక్ రాజ్యాంగం మాజీ సర్పంచ్ అక్రమ అరెస్టుపై వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం -
సమగ్ర శిక్షా.. మాపై ఎందుకీ కక్ష?
● సమగ్ర శిక్షాలో ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి, రెగ్యులర్ చేయాలి. ● హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. ● సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. ● కనీస వేతనం, ఇంటి అద్దె, కరవు భత్యం అమలు చేసి, వేతనాలు పెంచాలి. ● అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చాలి. ● రూ.10 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్, గ్రాడ్యుటీ కల్పించాలి. ● ఈపీఎస్, ఈఎస్ఐ అమలు, పదవి విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలి. ● మహిళలకు చైల్డ్ కేర్ సెలవులు మంజూరు చేయాలి. ● మరణించిన ఉద్యోగి కుటుంబాలకు చెల్లించే ఎక్స్గ్రేషియా రూ.20 లక్షలకు పెంచి, కారుణ్య నియమకాలు చేపట్టాలి. ● డీఎస్సీలో ప్రభుత్వ రెగ్యులర్ పోస్టుల నియామకాల్లో వెయిటేజ్ ఇవ్వాలి. కై కలూరు: సమగ్ర శిక్షాలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తాం.. సమాన పనికి సమాన వేతనం అందిస్తాం.. రానున్నది మంచి ప్రభుత్వం.. అంటూ సమ్మె చేస్తున్న సిబ్బందిని ఉద్దేశించి యువగళం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్న మాటలివీ. ఇప్పుడు సీన్ రివర్స్.. వేతనాల పెంపు కేంద్రం పరిధిలోనిది. అన్ని రాష్ట్రాలకంటే మెరుగైన వేతనాలు ఏపీలో ఇస్తున్నాం.. కేజీబీవీ టీచర్లు హైకోర్టు ద్వారా తెచ్చుకున్నా ఎంటీఎస్ అమలు తీర్పుపై చంద్రబాబు ప్రభుత్వం రివ్వూ పిటిషన్, పొమ్మనలేక పొగబెట్టే చర్యలు సిబ్బందిపై ప్రయోగం.. నేటి స్థితి ఇది.. ఏపీ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్(జేఏసీ) పిలుపుతో ఈనెల 15న కృష్ణా జిల్లా ప్రకాశం బ్యారేజీ కరకట్ట నుంచి విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇంటి వరకు శాంతియుత పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సర్వ శిక్షా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు 25 వేల మంది పాల్గొంటున్నారని అంచనా. ఏలూరు జిల్లా విద్యాశాఖ పరిధిలో పనిచేసే కేజీబీవీ, డీపీఓ, ఏపీసీ, ఎంఈవో, భవిత సెంటర్లులో పనిచేసే సీఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మెసేంజర్లు, ఐఈఆర్టీలు, టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్, ఆయాలు, ఫిజియోథెరపిస్టులు, మండల లెవెల్ అకౌంటెంట్లు ఇలా అందరూ కలపి మొత్తం 464 మంది పనిచేస్తున్నారు. వీరంతా కనీస వేతనాల కోసం పోరాడుతున్నారు. పని బారెడు.. జీతం మూరెడు సమగ్ర శిక్షాలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పొమ్మనలేక పొగపెట్టే కార్యక్రమం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఈవో కార్యాలయాల్లో మండల లెవిల్ అకౌంటెంట్లు (ఎంఎల్ఏ) అనేక కేంద్రాల్లో మూడు చోట్ల పనిచేస్తున్నారు. ఉదాహరణకు మండవల్లి మండలం మండవల్లిలో పనిచేసే అకౌంటెంటుకు నూజివీడు బాధ్యత అప్పగించారు. ట్రావెలింగ్ అలవెన్సు కూడా వీరికి ఉండదు. అదే విధంగా వర్క్ ఎడ్జస్ట్మెంటు కింద సీఆర్పీలకు కొన్ని చోట్ల 100 కిలోమీటర్ల దూరంలో విధులు కేటాయిస్తున్నారు. నిత్యవసర ధరలు పెరిగిన నేపథ్యంలో తమ జీతాలు ఏ మూలకు చాలటం లేదని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. కేంద్రంపై నెట్టేస్తే ఎలా..? సమగ్ర శిక్షా కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో నడిచే పథకం అయినా.. ప్రధాన యజమాని రాష్ట్ర ప్రభుత్వమే. బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అవసరాల మేరకు విడుదల చేస్తుంది. అయితే ఉద్యోగుల వేతనాలు పెంపు, సర్వీసు నిబంధనలు, క్రమబద్ధీకరణ, ఉద్యోగుల సంక్షేమ సౌకర్యాలు వంటి అంశాలు పూర్తిగా రాష్ట ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు రాష్ట్రాలకు చెప్పింది. ఇదే పథకం కేంద్ర వాటా 60 శాతం విధులతో పంజాబ్, హర్యానా, హిమాచల్ప్రదేశ్, మణిపూర్, సిక్కిం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రంపై నెట్టెస్తూ చేతులు దులుపేసుకుంటుంది. సమస్యల పరిష్కారం కోసం సిబ్బంది పోరుబాట డిమాండ్ల సాధనకు ఈ నెల 15న మంత్రి లోకేష్ ఇంటికి పాదయాత్ర ఎన్నికల ముందు చెప్పిందేమిటీ ? ఇప్పుడు చేస్తుందేమిటీ మెరుగైన జీతాలంటూ మంత్రి లోకేష్ మాటలపై మండిపాటు జిల్లాలో 464 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఇబ్బందులు న్యాయమైన కోర్కెల పరిష్కారం కోసం ఈ నెల 15న చేపట్టిన శాంతియుత పాదయాత్రను అందరూ జయప్రదం చేయాలి. ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఆర్టీ యాక్టుతో సెంట్రల్ హెచ్ఆర్ఎంటీని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు జీతభత్యాలు చెల్లిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికై నా న్యాయం చేయాలి. – కె.వినోద్కుమార్, ఏలూరు జిల్లా, జేఏసీ అధ్యక్షుడు పెరిగిన నిత్యవసర ధరలకు సరిపడా వేతనాలు మాకు లేవు. ముందు కనీస వేతనాలు అమలు చేయాలి. సమగ్ర శిక్షా సిబ్బంది జీతాలు ఏడు సంవత్సరాలుగా అలానే కొనసాగుతున్నాయి. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. పాదయాత్రకు కుటుంబ సమేతంగా పాల్గొనాలి. – బి.రాజ్యలక్ష్మి,ఏలూరు జిల్లా మహిళా జేఏసీ, జనరల్ సెక్రటరీ -
ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు
కొయ్యలగూడెం: దేవదాయ శాఖ ద్వారా పలు గ్రామాల్లో ధూప దీప నైవేద్యాలు (డీడీఎన్ పథకం) అందించే ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి కె.శ్రీనివాస్ పేర్కొన్నారు. కొయ్యలగూడెంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. అలాగే గ్రామ దేవత శ్రీ చింతాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద వివరాలు సేకరించారు. బుట్టాయిగూడెం మండలంలోని పులిరామన్నగూడెం రోడ్డులో ఉన్న సూదికొండ మావుళ్ళమ్మ ఆలయానికి కూడా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. ఎండోమెంట్ ఈవో శ్రీలక్ష్మి, ఏఈ భాను సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లా రెడ్క్రాస్కు అవార్డు
భీమవరం అర్బన్ : పశ్చిమగోదావరి జిల్లా రెడ్క్రాస్ శాఖ 2025–26లో నిర్వహించిన సేవా కార్యక్రమాలు, నిధుల సమీకరణలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా అవార్డు లభించింది. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఆంధ్రప్రదేశ్ లోక్ భవన్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జిల్లా రెడ్క్రాస్ చైర్మన్ డాక్టర్ ఎంఎస్వీఎస్ భద్రిరాజు అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవార్డు జిల్లా బృందం సమష్టి కృషికి ప్రతిఫలం అన్నారు. జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షురాలు, కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. భీమవరం: పట్టణంలోని ఏఎస్ఆర్ నగర్లో ఉన్న అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వద్ద గురువారం ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్, అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో అల్లూరి 102వ వర్థంతి సందర్భం నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్ రెడ్డి, అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహం వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అల్లూరి పోరాట స్ఫూర్తిని కొనియాడారు. అనంతరం ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు రూ.25 లక్షలతో వ్యయంతో నిర్మించిన డిజిటల్ స్క్రీన్, వాటర్ ప్లాంట్, వాటర్ మౌంటెన్స్ను ప్రారంభించారు. పాఠశాలల విద్యార్థులు అల్లూరి వేషధారణలో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహ కమిటీ అధ్యక్షుడు ఉద్దరాజు విశ్వనాథరాజు, కార్యదర్శి కంతేటి వెంకటరాజు, కోశాధికారి సీహెచ్ కృష్ణంరాజు, వైస్ ప్రెసిడెంట్ గాదిరాజు సుబ్బరాజు, ఆర్డీవో కే ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, డీఎస్పీ రఘువీర్ విష్ణు, తహసీల్దార్ రావి రాంబాబు, వైఎస్సార్ సీపీ ప్రతినిధి గూడూరి ఉమాబాల పాల్గొన్నారు. ఏలూరు(ఆర్ఆర్పేట): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నూతన కార్యదర్శిగా ఎన్.శ్రీలక్ష్మి గురు వారం బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా పనిచేసిన ఆమెను హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఏలూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా నియమించారు. ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన కె.రత్నప్రసాద్ మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా రాజమహేంద్రవరం బదిలీపై వెళ్లారు. భీమవరం (ప్రకాశంచౌక్): ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో నిర్వహించిన 7వ కలెక్టర్ల కాన్ఫెరెన్స్ తొలి రోజు సమావేశంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. జిల్లాలో అవసరమైన ప్రాజెక్టులకు స్థలాల అవసరతపై చర్చ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఆచంటలో ఐటీఐ సమర్థవంతంగా కొనసాగుతున్నప్పటికీ, స్థలం లేక సొంత భవనాల నిర్మాణం చేపట్టలేకపోతున్నామని ముఖ్యమంత్రికి వివరించారు. ఐటీఐ భవన నిర్మాణానికి కనీసం రెండు ఎకరాల స్థలం అవసరమని విన్నవించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి అవసరమైన ప్రతిపాదనలు వెంటనే పంపించాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోతే భూసేకరణ ద్వారా స్థలం సమకూర్చే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. -
అక్రమంగా అరెస్టు
కొడమంచిలి మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ కోటే శశిమధు, మాజీ సర్పంచ్ సీతారామ్ను బుధవారం ఆచంట పోలీసులు అరెస్టు చేసి పాలకొల్లు కోర్టులో హాజరుపర్చారు. 420, 409 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. గ్రామంలో జరిగిన ఉపాధి పనుల్లో రూ.4.09 లక్షల మేర అక్రమాలు జరిగినట్టు ఆచంట ఎంపీడీఓ బీఎన్ఎస్ఎస్ కృష్ణమోహన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ నిధులను అక్రమంగా మళ్లించినట్టు తమ దర్యాప్తులో తేలినట్టుగా పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోటే శశిమధు సుంకర సీతారామ్ -
బిల్లుల మంజూరులో జాప్యాన్ని నివారించండి
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయుల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల మంజూరులో జాప్యాన్ని తక్షణం నివారించాలని జిల్లా సర్వజన ఆసుపత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ అచ్యుత రామయ్యను పీఆర్టీయూ నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం ఆసుపత్రిలో ఆయన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కేన్సర్, గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించి పెట్టుకున్న వైద్య ఖర్చుల బిల్లులు సకాలంలో అందక ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కొందరికి సంబంధించి ఏడాది కాలం గడిచినా మంజూరుకు నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్లో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ ఫైళ్లన్నీ తక్షణం పర్యవేక్షించి వెంటనే మంజూరు చేసే విధంగా కృషి చేయాలని కోరారు. సూపరింటెండెంట్ను కలిసిన వారిలో పీఆర్టీయూ ఏలూరు జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు సీహెచ్ఎల్వీ చలం ఉన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ‘వన్ మంత్, వన్ విలేజ్, 4 విజిట్స్’ కార్యక్రమాన్ని ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టరు ఎంజే అభిషేక్ గౌడ కోరారు. గురువారం ఆయన అధ్యక్షతన స్థానిక శనివారపుపేట–1 స్వర్ణవార్డు సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. -
ఈదురుగాలుల బీభత్సం
రకీడాకారుల ఆకలి కేకలు జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ద్వారా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. క్రీడాకారులు పోషకాహారం కోసం ఎదురుచూస్తున్నారు. 8లో uద్వారకాతిరుమల: ఈదురు గాలులు గురువారం మధ్యాహ్నం బీభత్సాన్ని సృష్టించాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దాంతో పలు గ్రామాల్లోని మామిడి తోటలు అతలాకుతలం అయ్యాయి. కోతకొచ్చిన మామిడి కాయలు నేలరాలడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. రాళ్లకుంట, సత్తెన్నగూడెం గ్రామాల్లోని తోటల్లో పెద్ద ఎత్తున మామిడి కాయలు రాలిపోయాయి. వర్షం వెలసిన తరువాత తోటల్లోకి వెళ్లిన రైతులు నేలరాలిన కాయలను చూసి లబోదిబోమన్నారు. ఈదురు గాలులు, అకాల వర్షం కారణంగా చేతికొచ్చిన పంట నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే రాళ్లకుంటలో తన ఒక్క తోటలోనే చెరుకు రసాలు, బంగినపల్లి, చిన్న రసాల కాయలు 800కు పైగా రాలిపోయాయని కౌలు రైతు మారుబోయిన సత్యన్నారాయణకు తెలిపాడు. అకాల వర్షం తమను నట్టేట ముంచిందని ఆవేదన చెందారు. వర్షం రాకతో భక్తుల పరుగులు శ్రీవారి క్షేత్రంలో ఒక్కసారిగా వర్షం కురవడంతో భక్తులు ఆలయ గోపురాల్లోకి పరుగులు తీశారు. గత కొద్ది రోజులుగా వేసవి ఎండలు, ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరైన భక్తులు వర్షపు చల్లదనంతో సేదతీరారు. -
హనుమద్ జయంతి ఉత్సవాలు ప్రారంభం
పెదపాడు: అప్పనవీడులోని అభయాంజనేయస్వామి వారి ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవాలు గురువారం ఉదయం సుప్రభాత సేవ, అర్చనతో ప్రారంభమయ్యాయి. ఉదయం 6గంటలకు దాతల గోత్రనామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఏడు గంటలకు 1008 గులాబి పూలతో ప్రత్యేక పూజా కార్యక్రమం, ఉదయం 9 గంటలకు దాసాంజనేయ భజన సమాజం రేమల్లే వారితో 108సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. సాయంత్రం 4గంటలకు దాసాంజనేయ భజన సమాజంతో రేమల్లె వారితో 108 సార్లు హనుమాన్ చాలీసా పారారాయణ చేశారు. సాయంత్రం 6గంటలకు వెండి బంగారు పుష్పాలతో ప్రత్యేక పూజ నక్షత్రహారతి నిర్వహించారు. అనంతరం నీలకంఠేశ్వర నృత్య కళాక్షేత్రం వారితో ఆధ్వర్యంలో కూచిపూడి నృత్యప్రదర్శన నిర్వహించారు. రాత్రి 8 గంటలకు పూలరంగడు హాస్య నాటకం ప్రదర్శించారు. రాత్రి 9 గంటలకు పౌరాణిక నాటకాలు ప్రదర్శన చేశారు. -
అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనీ..
● ప్రియుడితో కలిసి సుపారీ గ్యాంగ్తో భర్తను హత్య చేయించిన భార్య ● ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏలూరు టౌన్: అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి సుపారీ గ్యాంగ్ సాయంతో ఓ భార్య హత్య చేయించింది. ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులను ఆగిరిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ వివరాలు వెల్లడించారు.ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామానికి చెందిన రెడ్డి సులోమన్రాజు అతని భార్య రెడ్డి దుర్గామణితో జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని సచివాలయంలో పని చేస్తున్న పలగాని వెంకన్నబాబుతో దుర్గామణి వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న సులోమన్రాజు భార్యను తరచూ కొడుతూ ఉండేవాడు. దీంతో దుర్గామణి తన బాధను పరిచయం ఉన్న వ్యక్తితో చెప్పుకుంది. తనకు చనిపోవాలని ఉందని చెప్పగా... నువ్వు చనిపోవడం కంటే నీ భర్తను తొలగిస్తే సమస్య ఉండదు కదా అంటూ సలహా ఇచ్చాడు. వెంటనే దుర్గామణి తన భర్తను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకుని ప్రియుడు వెంకన్నబాబుకు తెలిపింది. ఇదే అదనుగా వెంకన్నబాబు తన బంధువు ద్వారా కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బంగారుగూడెం గ్రామానికి చెందిన కలతోటి సాయి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం, భీమరాజుగుట్ట ప్రాంతానికి చెందిన మద్దాలి జస్వంత్రాయ్, బంగారుగూడెం గ్రామానికి చెందిన కలతోటి మణికంఠతో మాట్లాడి రూ.12 లక్షలు సుపారీ ఇచ్చి హత్యకు ప్లాన్ చేశారు. కారులో లిఫ్ట్ ఇచ్చి.. చార్జర్ వైర్తో గొంతు బిగించి.. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 17న నిందితులు సులోమన్రాజుకు తమ కారులో లిఫ్ట్ ఇచ్చారు. అనంతరం అందరూ కలిసి మద్యం సేవించారు. గన్నవరం మండలం కొండపావులూరు గ్రామంలో జగనన్న ఇళ్ల సముదాయం వద్ద ఎన్డీఆర్ఎఫ్ గేటు సమీపంలోకి వచ్చే సరికి వెనుక నుంచి చార్జర్ వైరుతో గొంతు బిగించి సులోమన్రాజును హత్య చేసి, ఏలూరు కాలువలో పడేశారు. ఈ సంఘటనపై ఆగిరిపల్లి పోలీసులు కేసు నమోదు చేయగా నూజివీడు రూరల్ సీఐ కె.రామకృష్ణ, ఆగిరిపల్లి ఎస్సై కె..శుభశేఖర్, చాట్రాయి ఎస్సై డి.రామకృష్ణ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. అనంతరం నిందితులను గుర్తించి గురువారం గన్నవరం ప్రాంతంలో అరెస్ట్ చేశారు. అలాగే సులోమన్రాజు భార్య దుర్గామణి, ప్రియుడు వెంకన్నబాబను కూడా అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి బాలెనో కారు, ఐదు సెల్ఫోన్లు, ఖాళీ బీరు సీసాలు ఐదు, సెల్ఫోన్ పవర్బ్యాంక్ చార్జింగ్ కేబుల్, రూ.75 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించటంలో ప్రతిభ చూపిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. -
జలాశయాలు వెలవెల
చింతలపూడి: మెట్ట ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల నీటి మట్టాలు తగ్గుముఖం పడుతున్నాయి. గతేడాది తొలకరిలో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. అయితే ఆ తర్వాత సరైన వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలమట్టం నానాటికి పడిపోతుంది. మే నెల ఎండలు వివపరీతంగా ఉండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. భూగర్భ జలాలపై ఆధారపడిన మెట్ట ప్రాంతంలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చెరువులు ఎండిపోవడంతో పశువులు కూడా తాగునీటికి తీవ్ర ఇబ్బందిపడే పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టుల్లో నీరు ఉంటే భూగర్భ జలాలు ఇంత దారుణంగా కిందికి పడిపోయే ప్రమాదం ఏర్పడేది కాదని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని జూన్లో తొలకరి వర్షాలు కురిసి ప్రాజెక్టుల్లోకి నీరు చేరితే పరిస్థితి చక్కబడుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మధ్యతరహా నీటి పారుదల కింద తమ్మిలేరు, ఎర్రకాలువ, విజయరాయి ఆయకట్టు ఉండగా చిన్న నీటి పారుదల కింద జల్లేరు జలాశయంతో పాటు 1,398 సాగునీటి చెరువులు ఉన్నాయి. వీటిలో తమ్మిలేరు, ఎర్రకాలువ, విజయరాయి ఆయకట్టు క్రింద సుమారు 43,500 ఎకరాలు సాగవుతుంది. ఎర్రకాలువ సుమారు 19 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న కొంగువారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ ప్రాజెక్టు జలాశయం నీటిమట్టం 83.5 మీటర్లు కాగ డెడ్ స్టోరేజ్కు చేరుకోవాలంటే 76 మీటర్లకు చేరుకోవాలి. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 79 మీటర్లకు చేరుకుంది. ప్రతిఏటా వర్షాకాలంలో వృధాగా థాపోతున్న వేల క్యూసెక్కుల ఎర్రకాలువ వరద నీటిని సాగునీటికి వినియోగించుకోవాన్న ఉద్దేశంతో పోలవరం నియోజకవర్గంలోని టి.నరసాపురం సమీపంలో నందమూరి విజయసాగర్ ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మించింది. అప్పటి నుంచి ప్రాజెక్టు కింద అధికారికంగా సుమారు 1,000 ఎకరాలు, అనధికారికంగా మరో 1,000 ఎకరాలు సాగవుతుంది. ఎర్రకాలువ వట్టిపోతే నందమూరి విజయసాగర్ ప్రాజెక్టు కూడా నిరుపయోగంగా మారే ప్రమాదం ఉంది. చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం సమీపంలో 3 టీఎంసీల సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టు కింద జిల్లాలో 9,169 ఎకరాలు సాగు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో నీరు ఉంటే చుట్టు పక్కల మండలాల్లో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 355 అడుగులు. ప్రస్తుతం ప్రాజెక్టులో 327 అడుగుల నీటిమట్టం ఉంది. దీంతో పలు గ్రామాల్లో భూగర్భ నీటిమట్టం తగ్గుముఖం పడుతుంది. దీంతో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే మెట్టకు సాగునీటి కష్టాలు తప్పుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా చింతలపూడి ఎత్తిపోతల పధకం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. మెట్ట ప్రాంతంలో సాగు, తాగు నీటికష్టాలు తొలగిపోవాలంటే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం ఒక్కటే మార్గం. గోదావరి జలాలను మళ్లిస్తే మెట్ట ప్రాంతంలోని ప్రాజెక్టులు, చెరువులు నింపుకోవచ్చు. వేసవి కాలంలో కూగా తాగు,సాగు నీటికి ఇబ్బందులు ఉండవు. ప్రభుత్వం వెంటనే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. – కంభం విజయరాజు, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, చింతలపూడి ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు తగ్గుదల 327 అడుగులకు తమ్మిలేరు జలాశయం 79 మీటర్లకు ఎర్రకాలువ ప్రాజెక్టు మూడొంతులు ఎండిపోయిన చెరువులు -
ట్రిపుల్ఐటీ విద్యార్థులకు ‘విశ్వం ఏఐ’ ఇంటర్న్షిప్
నూజివీడు : స్థానిక ట్రిపుల్ఐటీలో పీయూసీ విద్యార్థులు గురువారం విశ్వం ఏఐ ఇంటర్న్షిప్కు హాజరయ్యారు. దీనికి వెయ్యి మంది విద్యార్థులు రిజిస్టర్ కాగా, జూన్ 20వరకు ఇంటర్న్షిప్ ఆన్లైన్లో కొనసాగుతుంది. స్వేచ్ఛ సంస్థకు చెందిన రంజిత్ రాజ్ (ప్లాట్ఫామ్ ఇంజినీర్), పోనకాల రాజశేఖర్ (క్లౌడ్ ఇన్ఫ్రా ఇంజినీర్, విశ్వం ఏఐ), డాక్టర్ గొర్ల ప్రవీణ్ (విశ్వం ఏఐ ముఖ్య పరిశోధకులు) పాల్గొని విద్యార్థులకు ప్రోగ్రామింగ్ కు సంబంధించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు, డీన్ అకడమిక్స్ సాదు చిరంజీవి, తెలుగు శాఖాధిపతి ఝాన్సీ, తెలుగు అధ్యాపకులు విజయ భాను, సీఎస్ఈ ఫ్యాకల్టీ ఉదయ్ పాల్గొన్నారు. ఏలూరు రూరల్: ఏలూరు ఆశ్రం మెడికల్ కళాశాల క్రీడా మైదానంలో ఈ నెల 12న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సీనియర్ ఉమెన్, అండర్–23, అండర్–19, అండర్–15 బాలికల క్రికెట్ జట్లు ఎంపిక పోటీలు చేపట్టనున్నామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.ఆదిత్యవర్మ, కార్యదర్శి వివిఎస్ఎం శ్రీనివాసరాజు గురువారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. 01–09–2011 నుంచి 31–08–2014 మధ్య పుట్టిన వారు అండర్–15 బాలికల విభాగంలో పాల్గొనేందుకు అర్హులని వివరించారు. 01–09–2007 తర్వాత పుట్టిన వారు అండర్–19 విభాగంలో పోటీలకు అర్హులని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు పుట్టిన తేదీ ధ్రువీకరణ, ఆధార్ పత్రాలతో ఉదయం 8 గంటలకు హాజరుకావాలని సూచించారు. మరింత సమాచారం కోసం 83280 43304, 70750 33953 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. తాడేపల్లిగూడెం రూరల్: ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి చోరీకి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై రవికుమార్ తెలిపారు. గురువారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నవాబుపాలెం గ్రామానికి చెందిన బందాల సూరిబాబు ఈ నెల 1న ఓ ఫంక్షన్ నిమిత్తం వేరే ఊరు వెళ్లాడు. తిరిగి 2న ఇంటికి వచ్చి చూడగా తలుపుల తాళాలు పగులగొట్టి ఇంట్లోని ఇత్తడి సామగ్రి దొంగలించారని గుర్తించి, పోలీసులను ఆశ్రయించాడు. ఇత్తడి సామగ్రి విలువ రూ.20 వేలు ఉంటుంది. -
క్రీడాకారుల ఆకలి కేకలు
● వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో అలసిపోతున్న బాలలు ● పౌష్టికాహారం కోసం ఎదురుచూపులు ఏలూరు రూరల్ : ఆటలు అంటే మాకు చాలా ఇష్టం. ఎంతసేపైనా ఆడాలనిపిస్తోంది. కానీ ఆడి ఆడి అలిసిపోతున్నాం. శక్తి చాలడం లేదు. రోజూ గుడ్డు, పాలు తాగాలని కోచ్ చెబుతున్నాడు. ఇంట్లో గుడ్డు పాలు అడిగితే, ఆటలకు వెళ్లొద్దు అంటారు. అందుకే కడుపునిండా నీళ్లు తాగి, మళ్లీ, మళ్లీ ఆడుతున్నాం. ఇది ఏలూరు ఇండోర్ స్టేడియంలోని వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో హ్యాండ్బాల్ సాధన చేస్తున్న బాల బాలికల ఆవేదన. ఇక్కడే కాదు అల్లూరి సీతారామరాజు స్టేడియంతో పాటు జిల్లాలో 50కు పైగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని శిక్షణ శిబిరాల్లో క్రీడల సాధన చేస్తున్న బాలల దుథితి ఇలాగే ఉంది. జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ద్వారా జిల్లావ్యాప్తంగా 50కు పైగా శిబిరాల్లో సుమారు 1500 మంది పిల్లలకు శిక్షణ అందిస్తోంది. ఇందులో అత్యధికులు పేద, బడుగు వర్గాలకు చెందిన పిల్లలే ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాల నుంచి వస్తున్న ఈ పిల్లల సాధనకు సరిపడా ఆహారం అందడం లేదు. ఫలితంగా పిల్లలు ప్రతిరోజూ సాధన చేసి శారీరకంగా అలసిపోతున్నారు. మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది. క్రీడాధికారులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం అందిస్తున్న అరకొర సాయం కూడా క్షేత్రస్థాయిలో పిల్లలకు అందించలేకపోతున్నారు. కొన్ని శిబిరాల్లో తాగునీరు అందుబాటులో ఉంచడం లేదు. సాయం చేసే దాతల ఉన్నా, పిల్లల కోసం సాయం కోరే నాథుడే లేడు. మరోవైపు శిక్షణ శిబిరాల నిర్వహణ ఆటంకాల లేకుండా సాగుతున్నాయని, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని అధికారులు చెబుతున్నారు. డీఎస్డీఓ అజీజ్ ఏలూరులో సమ్మర్ క్యాంప్కు వస్తున్న పిల్లల కోసం చిక్కీలు ఇచ్చారు. సాధన చేస్తున్న పిల్లలకు ప్రతి రోజూ పంపిణీ చేయమన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పిల్లలు తొందరగా అలసిపోతున్నారు. కడుపు నిండా ఆహారం అందిస్తే, పిల్లలు మరింత ఉత్సాహంగా సాధన చేస్తారు. – ఆలీష, వ్యాయామ ఉపాధ్యాయుడువేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో పాల్గొన్న బాలబాలికలకు ప్రభుత్వం రోజుకు రూ.6 మంజూరు చేసింది. త్వరలోనే శిక్షణ శిబిరాల నిర్వాహకుల బ్యాంక్ ఖాతాలకు నగదు జమ చేస్తాం. ఇండోర్స్టేడియంలో దాతల సహకారంతో వాటర్ప్లాంట్ ఏర్పాటు చేసి పిల్లలకు తాగునీరు అందిస్తాం. –ఎస్ఏ అజీజ్, డీఎస్డీఓఏలూరు ఇండోర్స్టేడియంలో తాగునీరే దొరకడం లేదు. గతంలో దాతలు ఏర్పాటు చేసిన వాటర్ప్లాంట్ పాడైపోయింది. అప్పటి నుంచి స్టేడియంలో వాటర్ ప్లాంట్ బాగు చేయలేదు. ఇక్కడ పిల్లలు ఆడి ఆడి అలసిపోవడం తప్ప, నీళ్లు ఇచ్చే నాథుడే లేడు. అధికారులు స్పందించి నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. – అతీక్, సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారుడు ఇండోర్స్టేడియంలో సాధన చేస్తున్న క్రీడాకారులు, స్థానిక అన్న క్యాంటిన్ వద్ద ప్రతి రోజూ ఉదయం పడిగాపులు పడడం చూస్తున్నాను.. రూ.5తో టిఫిన్ కొని, ఆకలి తీర్చుకుంటున్నారు. కొన్నిసార్లు టిఫిన్ అయిపోవడంతో విచారంగా వెనుదిరుగుతున్నారు. వీళ్లను చూసి నాకు చాలా బాధ వేసింది. –ఎస్.సత్యనారాయణ, అడ్వకేట్ -
మట్టి అక్రమ దందా.. ఆపే దమ్ముందా?
ద్వారకాతిరుమల : మండలంలోని గుణ్ణంపల్లి పరిధిలో నిత్యం మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆ గ్రామ పరిధిలోని ఓ పచ్చ నాయకుడు సాగిస్తున్న ఈ దందా నిర్విరామంగా కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు పోలవరం, తాడిపూడి కాలువ గట్లను కొల్లగొట్టిన ఆ నాయకుడు ఇప్పుడు ఖాళీ స్థలాల మీద పడ్డాడు. ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రి, పగలు మట్టిని దోచేస్తున్నాడు. బహిరంగంగా జరుగుతున్న ఈ దోపిడీని అడ్డుకోవాల్సిన అధికారులు తమకేమీ తెలియనట్టు చోద్యం చూస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. మీ పని మీరు చేసుకోండని సమాధానం ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికార బలం ఉన్న నాయకుడితో మనకెందుకులే అని స్థానికులు సైతం గప్చుప్ అయిపోయారు. దాంతో సదరు పచ్చనాయకుడి అక్రమాలకు అద్దూఅదుపు లేకుండా పోతుంది. టిప్పర్ల ద్వారా తరలింపు ప్రస్తుతం ఆర్ఎస్ నెంబర్ 234లో ఈ మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. జేసీబీతో తవ్వకాలు జరిపి, టిప్పర్ల ద్వారా మట్టిని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్ మట్టి రూ.10 వేల నుంచి రూ. 15 వేలకు అమ్మి, ఆ నాయకుడు సొమ్ము చేసుకుంటున్నాడు. ఇప్పటికై నా అధికారులు మేల్కొని ఈ అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గుణ్ణంపల్లి పరిధిలో రెచ్చిపోతున్న పచ్చనేత -
ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడి
నూజివీడు : పట్టణంలోని బస్టాండు వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్పై ప్రయాణికుడు దాడి చేసిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం విజయవాడలోని గవర్నర్పేట–2డిపోకు చెందిన 308 సర్వీసు విస్సన్నపేట నుంచి విజయవాడ వెళ్తుండగా సాయంత్రం 3:45 గంటల సమయంలో నూజివీడు బస్టాండుకు వచ్చింది. బస్టాండులోని పాయింట్లో డ్రైవర్ మేకా దుర్గాప్రసాద్(58) బస్సును ఆపి ప్రయాణీకులను ఎక్కించుకొని బస్టాండు అవుట్ గేట్ వద్దకు రాగా కండక్టర్ ఎం.శ్రీనివాసరావు బస్సును ముందు ఆపుతాం..ఎక్కొద్దంటూ వారిస్తున్నా ఇద్దరు వ్యక్తుల్లో వికలాంగుడూ బస్సు ఎక్కుతూ కిందపడ్డాడు. దీంతో వికలాంగుడి సోదరుడు డ్రైవర్పై గొడవపడి చెంపపైన చేతితో కొట్టాడు. దీంతో డ్రైవర్కు నోట్లో నుంచి ముక్కులో నుంచి రక్తం కారింది. దీంతో స్థానికులు వెంటనే డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై డ్రైవర్ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
పాఠ్య పుస్తకాల పంపిణీ
తాడేపల్లిగూడెం (టీఓసీ): ప్రభుత్వ పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యాక్రమాన్ని తాడేపల్లిగూడెంలోని జిల్లా పాఠ్య పుస్తక కార్యాలయం నుంచి గురువారం ప్రారంభించారు. కార్యాలయ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మేనేజర్ పీవీ సుధాకర్ పర్యవేక్షించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 2 లక్షల విద్యార్థులకు గానూ 202627కి సుమారు 13 లక్షల పుస్తకాలు అవసరం కాగా ప్రభుత్వ పుస్తక విక్రయ కేంద్రానికి 10 లక్షల 03 వేల పుస్తకాలు వచ్చాయి. ఈ పుస్తకాలలో 58 వేల పుస్తకాలను ఏలూరు రూరల్, అర్బన్ పరిధిలోని మండల పాయింట్లుకు పంపారు. మొదటి సెమిస్టర్కు గానూ ఒకటో తరగతికి అన్ని టైటిల్స్ రాగా, 2వ తరగతికి మూడు టైటిల్స్, 3, 4, 5 తరగతులకు అన్ని టైటిల్స్, 6వ తరగతికి ఒక టైటిల్, 7వ తరగతికి మూడు టైటిల్స్, 8వ తరగతికి ఒక టైటిల్, 9,10వ తరగతులకు అన్ని టైటిల్స్ వచ్చాయి. శుక్రవారం తాడేపల్లిగూడెం, పెంటపాడు, ఆచంట, పోడూరులకు పుస్తకాలను ఆర్టీసీ బస్సుల ద్వారా అందజేయనున్నారు. ఆర్టీసీ డీఎం పి.దానమ్మ, కార్గో మేనేజర్ జి.మాధవరావుతో ఇరు కార్యాలయాల సిబ్బంది హాజరయ్యారు. -
ప్రియుడి మోజులో పడి.. రూ.12 లక్షలు ఇచ్చి..
సాక్షి, ఏలూరు: జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడి కోసం సుపారీ ఇచ్చిన భార్య.. భర్తను హత్య చేయించింది. గత నెల 17న హత్యకు గురైన ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామానికి చెందిన రెడ్డి సులేమాన్ రాజు హత్య కేసును పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో భార్యే అసలు సూత్రధారిగా పోలీసులు గుర్తించారు.వడ్లమాను సచివాలయంలో పనిచేస్తున్న వెంకన్నబాబుతో సులేమాన్ రాజు భార్య దుర్గామణి అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం తెలియడంతో దుర్గారాణిని సులేమాన్ రాజు తరచూ వేధించేవాడు. భర్త పెట్టే బాధలు పడలేక చనిపోవాలనుందంటూ దుర్గామణి ప్రియుడికి చెప్పింది. సులేమాన్ రాజు అడ్డు తప్పించాలని దుర్గామణి ప్లాన్ వేసింది.తన బంధువుల సాయంతో సులేమాన్ రాజు హత్యకు వెంకన్నబాబు సుపారీ ఇచ్చారు. రూ.12 లక్షలు ఇచ్చిన దుర్గామణి, వెంకన్నబాబు.. సులేమాన్ రాజు అడ్డు తొలగించుకున్నారు. సెల్ఫోన్ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ కేబుల్తో సులేమాన్ రాజును నిందితులు హత్య చేశారు. హత్య అనంతరం ఉప్పులూరు రైవస్ కాలువలో సులేమాన్ రాజు మృతదేహాన్ని పడేశారు. సులేమాన్ రాజు భార్య దుర్గామణి, వెంకన్నబాబు, మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సెల్ ఫోన్ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ కేబుల్, కారు, ఐదు సెల్ ఫోన్లు, ఐదు ఖాళీ బీరు సీసాలు, రూ. 75 వేలు నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
గురువుల ఔదార్యం
గణపవరం: వేసవి సెలవుల్లో తోటి స్నేహితులతో సరదాగా ఆటలు ఆడుకుంటూ ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన ఓ బాలుడికి గురువులు అండగా నిలబడి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. గణపవరం మండలం చిలకంపాడు గ్రామానికి చెందిన దువ్వారపు అభిషేక్ అనే బాలుడు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులలో అమ్మమ్మగారి ఊరైన కృష్ణా జిల్లా కానుకొల్లు గ్రామం వెళ్లాడు. అక్కడ స్నేహితులతో ఆడుకుంటూ గోడమీదకి ఎక్కి ప్రమాదవశాత్తూ కాలుజారి పక్కన నిర్మాణంలో ఉన్న ఇంటి పునాదులపై పడిపోగా, పిల్లర్లకోసం వేసిన ఇనుప ఊచ మెడభాగంలో దవడలో దిగబడి బయటకు వచ్చింది. ఊచనుకోసి వెంటనే విజయవాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి బాలుడ్ని తరలించారు. అక్కవ రూ.3 లక్షల ఖర్చుతో వైద్యులు ఆపరేషన్ చేసి ఇనుప ఊచను తొలగించడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది. ఉపాధ్యాయుల ఆర్థిక సహాయం విషయం తెలిసిన బాలుడు చదువుతున్న చిలకంపాడు హైస్కూలు ఉపాధ్యాయిని దుర్గాభవాని, తోటి ఉపాధ్యాయులు హెల్పింగ్ హేండ్స్ అనే ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసి విరాళాలు సేకరించారు. రూ.1,20,000 అభిషేక్ తల్లిదండ్రులకు అందించి అండగా నిలిచారు. కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం బి.సుధారాణి, ఉపాధ్యాయులు చల్లా కృష్ణ, గండ్రోతుల నాగేశ్వరరావు, విశ్రాంత ఉపాధ్యాయుడు పమ్మి బుచ్చిమాస్టారు, బి.రమేష్, ఎం.పెద్దిరాజు, బీఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
సైనిక సేవల్లో తొలిమెట్టు
● ఉత్తమ పౌరులను అందించడంలో ఎన్సీసీ కీలకపాత్ర ● ఏలూరులో 650 మంది ఎన్సీసీ క్యాడెట్లకు శిక్షణ ఏలూరు (ఆర్ఆర్పేట) : దేశభక్తికి ప్రేరణగా నిలుస్తూ సమాజానికి ఉత్తమ పౌరులను అందించడంలో ఆర్మీలో రెండవ సైనిక శిక్షణ సంస్థగా గుర్తింపు పొందిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) కీలక పాత్ర పోషిస్తోంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ వింగ్లతో కూడిన ట్రై సర్వీసెస్ ఆర్గనైజర్ స్వచ్ఛందంగా పాఠశాల, కళాశాల శిక్షణ కోసం ఎన్సీసీని ఏర్పాటు చేశారు. విద్యార్థులను మానసికంగా, శారీరకంగా ధ్రుడమైన పౌరులుగా మార్చి త్రివిధ దళాల్లో చేరేలా ప్రోత్సహిస్తూ శిక్షణనిస్తోంది. అనుకోని విపత్తులు సంభవించినప్పుడు సహాయ, సహకారాలు అందించడానికి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ సభ్యులు ముందుంటారు. మొత్తం 15 లక్షల మంది ఎన్సీసీ క్యాడెట్లుగా శిక్షణ పొందుతున్నారు. దేశవ్యాప్తంగా పీఎంశ్రీ పథకం కింద ఎంపికై న పాఠశాలల్లో, మోడల్ స్కూళ్లలో ఎన్సీసీ శిక్షణ తప్పక నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 650 మందికి శిక్షణ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాతిపదికన ఏలూరులో గత నెల 28వ తేదీన ఎన్సీసీ ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నెల 7వ తేదీ వరకూ ఈ శిబిరం కొనసాగుతోంది. ఈ శిక్షణలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 650 మంది విద్యార్థులు ఎన్సీసీ క్యాడెట్లుగా శిక్షణ పొందుతున్నారు. సైనిక సేవల్లో ఎన్సీసీ శిక్షణను తొలిమెట్టుగా గుర్తిస్తారు. ఇక్కడ ఇచ్చే శిక్షణతో యువతలో క్రమశిక్షణాయుత జీవితం అలవడుతుంది.ఎన్సీసీ సర్టిఫికెట్ ద్వారా వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంటుంది. ట్రిపుల్ ఐటీ, ఎంబీబీఎస్, ఇంజినీరింగ్, డైట్, బీఈడీ వంటి వివిధ కోర్సుల్లో ప్రవేశంతో పాటు ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ ఉంటుంది. ఎన్సీసీ సర్టిఫికెట్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో హోంగార్డు సెలెక్షన్లో అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లలో వీరికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎన్సీసీ శిక్షణ పొంది అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో, త్రివిధ దళాల్లో ఉద్యోగాలు సాధించినవారు ఎందరో ఉన్నారు. కొందరు క్లిష్టమైన పర్వతాలు అధిరోహించి, అంతర్జాతీయ పర్వతారోహకులుగా ఖ్యాతి గడించారు. -
పాలిసెట్లో సెంట్ ఆన్స్ ప్రతిభ
తాడేపల్లిగూడెం: పట్టణంలోని సెంట్ ఆన్స్ విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు పాలిసెట్లో రాష్ట్ర ర్యాంకులు సాధించినట్టు ఆ విద్యాసంస్థ చైర్మన్ అద్దంకి విజయకుమార్ తెలిపారు. బి.సిద్ధాంత్ స్టేట్ 114వ ర్యాంకు, ఎం.ఆల్ప్రెడ్ బెన్నీ 406వ ర్యాంకు, జి.యశ్వంత్ 593వ ర్యాంకు సాధించారన్నారు. ఈ సంరద్భంగా విద్యార్థులను ఆయన అభినందించారు. ఏలూరు టౌన్: విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటిని సాధించేందుకు క్రమశిక్షణతో కష్టపడాలని ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అన్నారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ చాటిన ఏలూరు సురేష్చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్యార్థులకు బుధవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ బహుమతులు, పురస్కారాలు అందజేశారు. విద్యార్థులు జే.లేఖశ్రీవల్లీకి రూ.25వేలు, బీ.జ్యోతిక గణేశ్వరికి రూ.15 వేలు, కే.హర్షవర్థినికి రూ.10వేలు నగదు బహుమతులు అందజేశారు. అలాగే మరికొందరు విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.5 వేల చొప్పున నగదు బహుమతులు అందజేశారు. ఆర్ఐ సతీష్కుమార్, స్కూల్ ప్రధానోపాధ్యాయులు స్రవంతి, ఆర్ఎస్ఐ నరేంద్ర, ప్రసాద్ నాయక్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. -
యమునా పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
తణుకు అర్బన్: యమునా నది పుష్కరాలకు తణుకు ఆర్టీసీ బస్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజరు ఆలపాటి ధనలక్ష్మి సుధారాణి బుధవారం విలేకరులకు తెలిపారు. వచ్చేనెల 3వ తేదీన సాయంత్రం 4 గంటలకు తణుకు బస్టాండ్ నుంచి బస్సులు బయలుదేరుతాయన్నారు. 11 రోజుల యాత్రలో 13 పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం ఉంటుందన్నారు. యాత్రలో యాదగిరిగుట్ట, ఆగ్రా, మధురలో పుష్కర స్నానం, బృందావనం, అయోధ్య, కాశి, ప్రయాగరాజ్, గయా, బుద్ధగయ, జాబపూర్, పూరి, కోణార్క్, భువనేశ్వర్ క్షేత్రాలను దర్శించుకోవచ్చని స్పష్టం చేశారు. బస్సుల రిజర్వేషన్ కోసం 94404 19144, ఇతర వివరాలకు 99592 25484, 73829 03287, 98491 69396 నంబర్లలో సంప్రదించాలని కోరారు. అనంతరం యాత్ర పోస్టర్లు ఆవిష్కరించారు. అలాగే వేసవి సెలవుల నేపథ్యంలో విశాఖ విహార యాత్ర, మారేడుమిల్లి స్పెషల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్ గొల్లపల్లి మురళి తదితరులు పాల్గొన్నారు. ఉండి: ఎన్నార్పీ అగ్రహారంలో ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఐటీఐ విద్యార్థులకు అప్రెంటీస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ ఎం.వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25లో ఐటీఐ పూర్తి చేసి అప్రెంటీస్ పూర్తిచేయని విద్యార్థులకు ఇది సదావకాశమని తెలిపారు. వివరాలకు 96183 82542, 96406 30969 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
వృద్ధాప్యంలో పర్వతారోహణ భేష్
భీమవరం (ప్రకాశంచౌక్): నేపాల్ ఎవరెస్టు బేస్ క్యాంప్లో 6 వేల మీటర్ల పర్వతారోహణ చేసి భీమవరం విచ్చేసిన గొట్టుముక్కల వాణికి బుధవారం శ్రీ విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో యూత్ హాస్టల్స్ అసోసియేషన్ సభ్యులు స్వాగతం పలికారు. పర్వతారోహణ చేయటం చాలా సాహసకృత్యమని, ఈ విధమైన కార్యక్రమం చేయడం మహిళాలోకానికే గర్వకారణమని యూత్ హాస్టల్స్ అసోసియేషన్ చెరుకువాడ రంగసాయి, కటికిరెడ్డి వెంకటరత్నం, నందమూరి రాజేష్ అన్నారు. గొట్టుముక్కల వాణి 64 ఏళ్ల వయస్సులో ఈ సాహస యాత్ర చేయటం గొప్పవిశేషమన్నారు. వాణి 15 రోజులపాటు మైనస్ డిగ్రీ వాతావణంలో నేపాల్ దేశంలో ఎవరెస్టు బేస్ క్యాంప్ ప్రారంభించి పర్వతాన్ని అధిరోహించి నేడు స్వదేశానికి రావటం గొప్పవిశేషమన్నారు. కామవరపుకోట: సాంకేతిక లోపంతో కారు ఇంజన్లో నుంచి మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానిక బంగ్లా నుంచి చెక్ పోస్ట్ వైపు వెళ్తున్న కారు కొత్తూరు బస్టాండ్ వద్ద ఆగిపోయి ఇంజన్లో నుంచి మంటలు వచ్చాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై స్థానికుల సహాయంతో మంటలు అదుపు చేశాడు. కారులోని బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కావటంతో మంటలు చెల్లరేగినట్లు డ్రైవర్ తెలిపాడు. తాడేపల్లిగూడెం: స్థిరమైన వ్యవసాయానికి మూల స్తంభం సమతుల్య ఎరువుల వినియోగమేనని సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్.కిరణ్కుమార్ తెలిపారు. బుధవారం వెంకట్రామన్నగూడెం కేవీకేలో సమతుల్య ఎరువుల వినియోగంపై నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు జరిపించాలన్నారు. ఖరీఫ్లో దిగుబడులు సాధించడానికి శాస్త్రవేత్తల సూచనలు పాటించాలన్నారు. ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ రేఖ మాట్లాడుతూ కూరగాయలు, పండ్లు, మసాలా పంటల్లో ఎరువుల వినియోగం ఎలా ఉండాలో వివరించారు. వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ కె.అర్చన పచ్చిరొట్ట ప్రాముఖ్యత, నేల సారాన్ని మెరుగుపర్చడానికి కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. జీవ ఇన్పుట్ల ప్రాముఖ్యత, వాటి వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనం గురించి మత్స్య పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ.దేవీవరప్రసాదరెడ్డి వివరించారు. పలు విషయాల గురించి శిక్షకులు అడిగిన ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సమాధానమిచ్చారు. వీరవాసరం: కారు ఢీకొన్న ఘటనలో సైకిల్పై వెళుతున్న వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల ప్రకారం.. వీరవాసరం మండలం తోకలపూడి గ్రామానికి చెందిన గంధం సత్యనారాయణ (70) సైకిల్పై పొలం పనుల నిమిత్తం వెళుతుండగా స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదురుగా కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు సత్యనారాయణను పెనుమంట్రకు చెందిన 108లో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
అడుగంటిన భూగర్భ జలాలు
జిల్లాలో ప్రమాదం అంచున మూడు మండలాలు దెందులూరు : పూర్తిగా వ్యవసాయధారిత ప్రాంతమైన ఏలూరు జిల్లాలో భూగర్భ జలాలు క్షీణిస్తుండడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ నిధులు, సిబ్బంది ఉన్నా.. పటిష్టమైన ప్రణాళిక లేకపోవడం, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం ఈ దుస్థితికి కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని 194 గ్రామాల్లో 20 మీటర్ల లోతులో.. 200 గ్రామాల్లో 20 మీటర్ల పైబడి భూగర్భ జలాలు ఉండగా కొయ్యలగూడెం ద్వారకాతిరుమల, ముసునూరు వంటి మండలాల్లో మాత్రం ప్రమాదకర స్థితిలో 80 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. దీంతో భూగర్భ జలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వాల్టా చట్టం.. అపహాస్యం భూగర్భ జలాలు దుర్వినియోగం కాకుండా ఏర్పాటు చేసిన వాల్టా చట్టం అపహాస్యానికి గురవుతోంది. మండలాల్లో తహసీల్దార్ చైర్మన్గా విద్యుత్, ఇరిగేషన్, వ్యవసాయం, మైన్స్ శాఖల అధికారులతో పాటు గ్రామస్థాయి ఉద్యోగుల పరిశీలన సిఫార్సుతో నూతన బోరు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ జిల్లాలో వాల్టా చట్టాలకు అనుగుణంగా ఏ ప్రాంతంలోనూ బోర్ల నిర్మాణం జరగటం లేదు. నిబంధనలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావడం లేదు. పొలాల్లో బోర్లు పక్కన బోర్లు నిర్మాణం జరగటం, భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణంగా భూగర్భ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఆక్రమణల చెరలో చెరువులు జిల్లాలో 1513 మైనర్ ఇరిగేషన్ చెరువులు, 69 వేలకు పైగా బోర్లు, 3 లక్షల కుళాయిలు ఉన్నాయి. ఇందులో దాదాపు 30 నుంచి 35 శాతం చెరువులు ఆక్రమణ చెరలో మగ్గుతున్నాయి. దీనికి ఎన్నో ఒత్తిడులు, కోర్టు వివాదాల నిర్లక్ష్యం కారణమని చెబుతున్నారు. దీంతో ఆయా చెరువుల్లో నీటి నిల్వ ప్రశ్నార్థకమే. రెవెన్యూ పంచాయతీ పోలీస్ శాఖల అధికారులు పటిష్టంగా సమన్వయంతో విధులు నిర్వహించి మైనర్ ఇరిగేషన్ చెరువుల ఆక్రమణ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటి ప్రమాదం అంచున ఉన్న మూడు మండలాలపై ప్రభు త్వం ప్రత్యేక దృష్టి సారించాలి. పైలెట్ ప్రాజెక్టుగా పనులు చేపట్టాలి. నీటి సామర్థ్యం నిల్వలు సాధారణ స్థితికి తీసుకురావాలి. – డాక్టర్ ప్రతాప్, జెడ్పీటీసీ, ముసునూరుసాగునీటి సరఫరాకు అడ్డంకిగా తరాల నుంచి ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలి. రైతు ప్రయోజనాల పరిరక్షణే ప్రధాన్య ధ్యేయంగా శాశ్వత విధానం రూపొందించాలి. – రమేష్, జడ్పీటీసీ, కామవరపుకోటజిల్లాలోని మైనర్, ఇరిగేషన్ చెరువులన్నిటిని వినియోగంలోకి తీసుకురావాలి. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో అధికారులు చిత్తశుద్ధితో సేవలు అందించాలి. రైతులకు సాగునీటి భరోసా భద్రత కల్పించాలి. – కొఠారు అబ్బయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే, దెందులూరు కొయ్యలగూడెం, ద్వారకాతిరుమల, ముసునూరు మండలాల్లో భూగర్భ జలాలకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితి ఉన్నమాట వాస్తవమే. జిల్లాలో నీటి నిల్వలు పెంచేందుకు జలధర.. జల హారతి కార్యక్రమాలు చేపట్టాం. నీటిని రీఛార్జ్ చేసేందుకు చెరువుల తవ్వకానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. – కోదండరావు, డిప్యూటీ డైరెక్టర్, భూగర్భ గనుల శాఖ, ఏలూరు -
బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్
గురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2026సాక్షి, భీమవరం: సైబర్ మోసాలు ఒక ఎత్తయితే, వాటిలో చిక్కుకున్న బ్యాంకు అకౌంట్లతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ లావాదేవీలు జరిపిన వారి ఖాతాలకు కష్టకాలం ఏర్పడింది. శాలరీ అకౌంట్లు, సేవింగ్ ఖాతాలు, బిజినెస్ కరెంటు అకౌంట్లు స్తంభిస్తే వారి జీవనం స్తంభించినట్లే. అవి తిరిగి పొందాలన్నా, అనన్ఫ్రీజ్ చేయించుకోవాలన్నా సవాలక్ష ఆంక్షలు ఉండడంతో నిట్టూరుస్తున్నారు. ప్రధానంగా ఆన్లైన్ బెట్టింగ్, ట్రేడింగ్ యాప్ల్లో ఎవరికీ తెలియకుండా తమ ఖాతాలో సొమ్ములు జమైపోతున్నాయనుకుంటే పొరబాటేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని ఉపయోగించడం ద్వారా బెట్టింగ్ రాయుళ్లు ఉచ్చులో ఇరుక్కుంటున్నారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాలు చిక్కినప్పుడు వారి వద్ద ఉన్న సమాచారం ఆధారంగా బుకీతో లావాదేవీలు జరిపిన ఖాతాలను స్తంభింపచేస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్ల ఖాతాల గురించి తెలీక రెండు మూడు సందర్భాల్లో లావాదేవీలు జరిపిన వారి అకౌంట్లు ఫ్రీజవుతున్న పరిస్థితి. ఇదిలాఉంటే ఆనన్లైన్న ట్రేడింగ్ పేరుతో బురిడి కొట్టిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ క్రమంలో మోసపోయిన వ్యక్తి కేసు పెడితే ట్రేడింగ్ జరిపిన అమాయకుల ఖాతాలు సైతం మాస్ ఫ్రీజ్ అవుతున్నాయి. ఏటీఎంల వద్ద బహుపరాక్ నగదు విత్డ్రా చేసేందుకు ఏటీఎం సెంటర్ల వద్దకు వెళ్లిన సందర్భంలో అపరిచిత వ్యక్తులు నగదు ఇచ్చి తమకు కావాల్సిన అకౌంట్కు ఫోన్పే చేయమని కోరడం చూస్తుంటాం. వెయిటింగ్ లేకుండా వెంటనే నగదు చేతికొస్తుందన్న ఉద్దేశ్యంతో కొందరు ఆ నగదు తీసుకుని ఆ మొత్తానికి వారు చెప్పిన అకౌంట్కు ఆన్లైన్ చెల్లింపులు చేస్తుంటారు. ఈ లావాదేవీలు ఏమాత్రం సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవతలి వ్యక్తి ఆ నగదు ఎలా పొందాడు? ఎవరి అకౌంట్కు పంపుతున్నాడనేది చేసే వారికి తెలీదు. సైబర్ క్రైమ్, బెట్టింగ్ యాప్లతో సంబంధం ఉన్న అకౌంట్లు అయితే పేమెంట్ చేసిన వారి ఖాతా కథ ముగిసినట్టేనంటున్నారు. సైబర్ మోసాల్లో నగదుపోయిన వారి కంటే ఖాతాలు స్తంభించిన వారి బాధలు వర్ణనాతీతం. మాస్ ఫ్రీజ్ ఏఐ అల్గారిథమ్ ద్వారా జరుగుతుందని, తామేమి చేయలేమని బ్యాంకు సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. కేసు మూలాలు ఇతర రాష్ట్రాల్లో ఉండడం, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ)లకు తిరగలేక కొందరు అకౌంట్లలోని సొమ్మును వదిలేసుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సెల్ఫోన్ ట్రాకింగ్ వంటి విధానంలో ఇతర రాష్ట్రాల్లోని ఫోన్లను రికవరీ చేసినట్లు పోలీసు అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించాలని కోరుతున్నారు. భీమవరానికి చెందిన యువకుడు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ట్రేడింగ్లో ఆసక్తి ఉండటంతో ఆన్లైన్ యాప్లోని గ్రూప్లో చేరి ట్రేడింగ్ ప్రారంభించాడు. ఇంట్లో అవసరం వచ్చి బంగారం కుదవపెట్టి రూ.20 వేల నగదు బ్యాంక్ అకౌంట్లో జమ చేయించుకున్నాడు. తర్వాతి రోజు నగదు కోసం బ్యాంక్కు వెళితే అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందని సిబ్బంది చెప్పడంతో ఖంగు తిన్నాడు. ఆరా తీస్తే ఒక ఫ్రాడ్ ట్రేడింగ్ అకౌంట్ నుంచి రూ.1200 నగదు అకౌంట్లో జమయ్యిందని తెలిపారు. రాజస్థాన్లో కేసు నమోదు అయ్యిందని అక్కడి పోలీస్ స్టేషనన్ నుంచి ఎన్ఓసీ తీసుకువస్తే అకౌంట్ అనన్ ఫ్రీజ్ చేస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. చేసేదేమి లేక రూ.20 వేల నగదు వదులుకున్నాడు. తణుకుకు చెందిన ఒక మొబైల్ షాప్ యాజమాని తన కరెంటు అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందని బ్యాంకులో ఆరా తీస్తే సైబర్ క్రైమ్లో నమోదు అయిన వ్యక్తి షాపులో ఫోన్ కొనుగోలు చేసి డెబిట్ కార్డు ద్వారా నగదు చెల్లించాడని తెలిపారు. వ్యక్తి ఎలాంటి సొమ్ము చెల్లిస్తున్నాడో మాకు ఎలా తెలుస్తుందని యజమాని ప్రశ్నించినా ఫలితం లేక పోవడంతో హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ సెల్లో తెలిసిన వ్యక్తి ద్వారా సంప్రదిస్తే అకౌంట్ అన్ ఫ్రీజ్ చేయడానికి ఖర్చవుతుందని చెప్పారు. బిజినెస్ అకౌంట్ కావడంతో చేసేదిలేది లేక అడిగినంత ఇచ్చి అకౌంట్ను తిరిగి యాక్టివేట్ చేయించుకున్నారు. బ్యాంకు అకౌంట్ల లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తెలియని ఖాతాలకు నగదు పంపడం, తీసుకోవడం చేయకూడదు. అకౌంట్ ఫ్రీజ్ అయినప్పుడు సమీప పోలీస్ స్టేషన్ను ఆశ్రయిస్తే ఖాతా లావాదేవీలు పరిశీలించి, విచారణ చేసి ఎన్ఓసి ఇప్పించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కేసులు నమోదు అయిన సందర్భాల్లో ఆయా రాష్ట్రాల పోలీస్ సిబ్బందిని సంప్రదించి అన్ఫ్రీజ్ చేసేందుకు అవసరమైన సహకారం అందిస్తున్నాం. ఎం.నాగరాజు, సీఐ, భీమవరం వన్టౌన్ అనుమానాస్పద లావాదేవీలంటూ సమాధానం తెలియకుండానే బెట్టింగ్, ఆన్లైన్ట్రేడింగ్ కేసుల్లో ఇరుక్కుంటున్న వైనం కేసు మూలాలు ఇతర రాష్ట్రాల్లో ఉండడంతో వెతలు -
మట్టి దోపిడీని సహించేది లేదు
చెరువులో అక్రమాలపై గుడాల గోపికి వివరిస్తున్న ప్రజలు, పాత గట్టును తవ్వేసిన దృశ్యం పాలకొల్లు సెంట్రల్: గ్రామాభివృద్ధి ముసుగులో చెరువు మట్టిని అమ్ముకుంటే సహించేది లేదని వైఎస్సార్ సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల గోపి హెచ్చరించారు. పాలకొల్లు మండలం వెలివెల గ్రామంలోని పశువుల చెరువు గట్లు బలహీనంగా ఉన్నాయని, వాటిని ఆధునికీకరిస్తున్నామని మాయమాటలు చెప్పి అధికార పార్టీ నాయకులు మట్టిని విక్రయించి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. అక్రమాలను అడ్డుకున్న మీడియా ప్రతినిధులపై అధికార పార్టీ నాయకులు దుర్భాషలాడటం, వారి కుటుంబ సభ్యులను విమర్శించడం అత్యంత దారుణమని ఆయన మండిపడ్డారు. సుమారు 5.22 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువును సర్వే చేసి, అన్యాక్రాంతమైన గట్టు భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు ఐక్యంగా పోరాడి కోర్టును ఆశ్రయించడంతోనే ఈ మట్టి దందాకు బ్రేక్ పడిందని గోపి తెలిపారు. కోర్టు ఉత్తర్వులు వచ్చేలోపే చెరువు చుట్టూ ఉన్న సుమారు 150 కొబ్బరి చెట్లను తొలగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి ఆదాయం వచ్చే చెట్లను ఎలా నరికేస్తారని అధికారులను ప్రశ్నించారు. ఈ అక్రమ తవ్వకాలు జరుగుతున్నంత సేపు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి, కోర్టు ఆదేశాలు వచ్చాక స్పందించడం విచారకరమన్నారు. చెరువు మట్టిని తీయాల్సి వస్తే ఆ మట్టిని గ్రామాభివృద్ధి పనులకై నా వాడాలని లేదా బహిరంగ వేలం వేసి గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూర్చాలని డిమాండ్ చేశారు. వేసవిలో మూగజీవాలకు తాగునీరు అందించాల్సిన చెరువును ఎండగట్టి, స్వలాభం కోసం మట్టిని అమ్ముకోవాలని చూస్తే సహించేది లేదని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు యడ్ల తాతాజీ, రవి, నరసింహరావు, సరిళ్ల రామారావు, తోకల సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు.గుడాల గోపి -
చిన వెంకన్న హుండీ ఆదాయం రూ.2.20 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల నగదు లెక్కింపు బుధవారం స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో, ఏలూరు జిల్లా దేవాదాయ శాఖ అధికారి కె.శ్రీనివాసు పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ లెక్కింపులో స్వామివారికి విశేష ఆదాయం సమకూరింది. గడచిన 20 రోజులకు నగదు రూపేణా స్వామికి రూ.2,20,68,980 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 141 గ్రాముల బంగారం, 3.111 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ. 2,000, రూ. 1,000, రూ. 500 నోట్ల ద్వారా రూ.25,500 లభించినట్టు చెప్పారు. ఇదిలా ఉంటే హుండీల ఆదాయాన్ని పరిశీలిస్తే సగటున రోజుకు శ్రీవారికి రూ.11,03,449 ఆదాయం వచ్చినట్టు ఈఓ పేర్కొన్నారు. ఈ లెక్కింపులో శ్రీవారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవాదళం సభ్యులు పాల్గొన్నారు. భీమవరం: విద్యారంగంలో పాఠశాలల్లో ఉన్న లోపాలను సవరించి మెరుగైన సౌకర్యాలు ఉపాధ్యాయులకు కల్పించాలని, గత ప్రభుత్వం నాడు– నేడు కార్యక్రమంలో చేపట్టిన పాఠశాలల అదనపు గదుల నిర్మాణం 80–90 శాతం పూర్తకాగా మిగిలిప పనులకు నిధులను కేటాయించి వెంటనే నిర్మించాలని శాసనమండలి దృష్టికి తీసుకొచ్చినట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి తెలిపారు. స్థానిక యూటీఎఫ్ భవనంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిధులు, పర్యవేక్షణ లేక మూలనపడ్డ ఆర్వో ప్లాంట్లను త క్షణం వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని పలు సమస్యలపై పోరాటం చేస్తున్న తనను వచ్చే ఏడాదిలో జరిగే ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరిగి గెలిపించాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీఎస్ విజయరామరాజు, పోలిశెట్టి క్రాంతికుమార్ మాట్లాడారు. భీమవరం (ప్రకాశంచౌక్): నిషేధిత భూముల జాబితా 22ఎ కేసుల పరిష్కారానికి రైతులు తమ భూములకు సంబంధించి పూర్తి ఆధారాలతో విచారణకు హాజరు కావాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. కలెక్టర్ కార్యాలయంలోని చాంబర్లో బుధవారం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్స్ కార్యక్రమాల్లో అందిన భూ వివాదాల పరిష్కారంపై ప్రత్యేక విచారణ నిర్వహించారు. ఈ విచారణను కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా నిర్వహించారు. సంబంధిత మండల తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొని కేసులను పరిశీలించారు. మొత్తం 15 (22–ఏ) కేసులను పరిశీలించగా, అందులో 7 కేసులు పూర్తిగా పరిష్కరించారు. కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, అర్జీదారులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం: సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పెదవేగి డీపీటీసీ చీఫ్ లా ఇన్స్ట్రక్టర్ ఆకుల రఘు కోరారు. ఏపీ నిట్లో బుధవారం సైబర్ జాగరూక్త దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. సెల్ఫోన్లకు వచ్చే లింకులను క్లిక్ చేయవద్దన్నారు. పొరపాటున చేస్తే బ్యాంకు ఖాతాలలో సొమ్ములు, విలువైన డేటాను చోరీ చేస్తున్నారన్నారు. మోసాలకు అవకాశం ఇవ్వకుండా ఎవ్వరికి వారే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కంప్యూటర్ పాస్వర్డ్లు క్రమం తప్పకుండా మార్చుకోవాలన్నారు. -
ఉచిత విద్యపై తగ్గుతున్న మోజు
● ప్రైవేటు స్కూళ్లలో 1,047 సీట్లు కేటాయింపు ● తల్లికి వందనం కంటే తక్కువ మొత్తం చెల్లింపుతో నిరాసక్తత భీమవరం: పేద విద్యార్థులకు సైతం కార్పొరేట్ విద్యను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్యకు ఆదరణ తగ్గుతోంది. తల్లికి వందనం పథకంలో ఇచ్చే సొమ్ము కంటే ప్రైవేట్ స్కూల్స్కు చెల్లించే మొత్తం తక్కువగా ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఉచిత విద్య పట్ల ఆసక్తి చూపించడం లేదు. గత ప్రభుత్వం మన బడి నాడు–నేడు పథకంలో ప్రభుత్వ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా అన్ని రకాల వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టి చాలా వరకు పూర్తి చేసింది. అయినప్పటికీ అనేకమంది పేద విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో చదవాలనే ఆసక్తిని గ్రహించి, అన్ని ప్రైవేటు స్కూళ్లలోని విద్యార్థుల సంఖ్యను బట్టి 25 శాతం ఉచితంగా సీట్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్లో ఖచ్చితంగా ఉచిత విద్యను అందించేలా ఏర్పాట్లు చేశారు. అప్పట్లో అనేకమంది ఉచిత విద్య పట్ల ఆసక్తి చూపించారు. ఒకటి నుంచి 10వ తరగతి వరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వారికి దగ్గరలోని పాఠశాలలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. జిల్లాలో 563 ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 563 ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ఉండగా, వీటిలో 1,047 సీట్లను పేద విద్యార్థుల ఉచిత విద్యకు ప్రభుత్వం కేటాయించింది. వాటిలో ఇప్పటి వరకు 787 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 25 శాతం నిబంధన మేరకు ఇంకా ఎక్కువ సంఖ్యలో సీట్లు కేటాయించాల్సి ఉంది. తల్లికి వందనం పథకంలో ఎక్కువ నిధులు ఇస్తున్న ప్రభుత్వం, ప్రైవేటు ఉచిత విద్యకు తక్కువ మొత్తంలో కేటాయించడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఉచిత విద్య పథకానికి మక్కువ చూపడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం ఉచిత విద్యకు ఇచ్చే మొత్తాన్ని పెంచితే వాటిలో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, తద్వారా పేదలు ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్లో చదవాలనే ఆకాంక్ష నెరవేరుతుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రైవేటు స్కూళ్లలో పేదలకు ఉచిత విద్య పథకం మంచిదే అయినప్పటికీ విద్యాశాఖ బలవంతంగా పిల్లలను ప్రవేటు స్కూళ్లలో చేర్చడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థల సంఖ్య తగ్గుతోంది. జిల్లాలోని 1,047 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులను ఉచిత విద్య పథకంలో ప్రవేటు స్కూళ్ళలో చేర్పించడంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. గత ప్రభుత్వం నాడు–నేడు పథకంలో చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులను పూర్తిచేసి అన్ని వసతులు కల్పిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో మరిన్ని మంచి ఫలితాలు సాధించవచ్చు. – బొర్రా గోపీమూర్తి, ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించినా, విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.13 వేలు మాత్రమే జమ చేస్తోంది. అయితే ఉచిత విద్యనందించే పాఠశాలలకు రూరల్, అర్బన్ ఏరియాలను పరిగణనలోకి తీసుకుని రూ. 6 వేల నుంచి రూ.11 వేల వరకు మాత్రమే ఇస్తున్నారు. ఉచిత విద్య పథకంలో సీటు పొందిన విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తించకపోవడంతో, విద్యార్థుల తల్లిదండ్రులు తల్లికి వందనం పథకం పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. -
ఆవకాయకు ధరల ఘాటు
● మండుతున్న పచ్చడి ముడిసరుకుల ధరలు ● కొనేవారు లేక మామిడి కాయ ధరలు ఢీలా ● లబోదిబోమంటున్న మామిడి రైతులు ఈ ఏడు మామిడి పంట దిగుబడి బాగా తక్కువ వచ్చింది. దాంతో పచ్చడి మామిడి కాయలకు మంచి ధర వస్తుందని ఆశించాం. ప్రస్తుతం కాయలు కొనేవారు లేరు. దాంతో తక్కువ ధరలకు కాయలను అమ్మాల్సి వస్తోంది. గతంతో పోలిస్తే పచ్చడి మామిడి కాయల విక్రయాలు బాగా తగ్గాయి. –బడే చెన్నారావు,మామిడి కౌలు రైతు, ద్వారకాతిరుమల పచ్చడి తయారీకి వినియోగించే ముడి సరుకుల ధరలు నింగినంటాయి. దాంతో వ్యయ ప్రయాసలు పడి పచ్చళ్లు పట్టడం ఎందుకని మానేశాం. ప్రజలకు రోజురోజుకు అనారోగ్య సమస్యలు పెరుగుతుండటం, మార్కెట్లో పలు రకాల పచ్చళ్లు దొరుకుతుండటం కూడా ఆవకాయ పచ్చడి పట్టేవారి సంఖ్య తగ్గడానికి ఒక కారణం. – బండి శివ పార్వతి, రాళ్లకుంట, ద్వారకాతిరుమల మండలం ద్వారకాతిరుమల: పచ్చళ్లు.. ఈ పేరు చెబితేనే నోరూరుతుంది. ముఖ్యంగా ఆవకాయ పేరు వినగానే ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి అన్నట్టు మనసు జివ్వున లాగేస్తుంది. తాతల కాలం నుంచి ప్రతి ఇంట్లో పచ్చడి తయారు చేసుకోవడం.. దాన్ని జాడీల్లో నిల్వ ఉంచుకుని ఏడాది పాటు వినియోగించుకోవడం మనందరికీ తెలిసిందే. నోరూరించే పసందైన పచ్చళ్లకు వేసవి పెట్టింది పేరు. ఈ సీజన్లో లభించే పచ్చడి మామిడి కాయలకు భలే డిమాండ్ ఉంటుంది. అయితే ఈ ఏడు మామిడి రైతులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పూత దశలో మంచు ఎక్కువగా కురవడంతో ఈసారి మామిడి కాపు బాగా తగ్గింది. చేతికందొచ్చిన పంటకై నా మంచి ధర లభిస్తుందని ఆశించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. కొనేవారు లేక పచ్చడి మామిడి కాయల ధరలు డీలా పడ్డాయి. పచ్చళ్లు తయారీకి వినియోగించే ముడి సరుకుల ధరలు మాత్రం నింగినంటాయి. పెరిగిన ధరలు భారంగా మారడంతో నిరుపేద ప్రజలు పచ్చళ్లు పట్టుకోవడం మానేస్తున్నారు. మధ్యతరగతి వారు గతంతో పోలిస్తే సగానికి సగం పైగా తగ్గించేస్తున్నారు. దాంతో పచ్చడి మామిడి కాయలు కొనేవారు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎగుమతులు తగ్గడంతో.. ఏలూరు జిల్లాలో సుమారు 39 వేల ఎకరాల్లో మామిడి పంట సాగవుతోంది. అత్యధికంగా ఆగిరిపల్లి మండలంలో 15,500, నూజివీడు మండలంలో 13 వేల ఎకరాల్లో సాగవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు తగ్గాయని, మామిడి కాయల ధరలు తగ్గుదలకు ఇది కూడా ఒక కారణమని రైతులు చెబుతున్నారు. ఏ కాయ ధర ఎంతంటే తోటల్లో రైతుల వద్ద చిన్న రసం కాయ రూ.8 నుంచి రూ.10, కొత్తపల్లి కొబ్బరి రకం రూ.20 నుంచి రూ.30, పెద్ద రసం కాయ రూ.20, దేశవాళి కాయ రూ.5 నుంచి రూ.10, హైదర్ సాహెబ్ కాయ ధర రూ.15 పలుకుతోంది. ఆవకాయ పచ్చళ్ల తయారీకి ఈ కాయలనే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. పెరిగిన ముడి సరుకుల ధరల కారణంగా ఇప్పుడు పేద, మధ్య తరగతి ప్రజలకు పచ్చడి పట్టడం భారంగా మారింది. దాంతో వారికి ఆవకాయ అందనంత దూరంలో ఉంది. అందుకే ప్రస్తుత సీజన్లో పచ్చళ్ల హడావుడి ఎక్కడా కనబడటం లేదు. రిటైల్ మార్కెట్లో.. రకం ప్రస్తుత ధర గతేడాది ధర (కిలో రూ.ల్లో) (కిలో రూ.ల్లో)పప్పు నూనె 400 360 (గానుగ వద్ద) వేరుశనగ నూనె 300 250 (గానుగ వద్ద) ఎండుమిర్చి 500–600 250–300 ఆవాలు 120 120 మెంతులు 120 120 వెల్లుల్లిపాయలు 120 200 ఉప్పు 20 20 -
సత్వర న్యాయం అందరి బాధ్యత
అడుగంటిన భూగర్భ జలాలు భూగర్భ జలాలు క్షీణిస్తుండడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని రైతులు గగ్గోలు పెడుతున్నారు. 8లో uకై కలూరు: న్యాయవాదులు కక్షిదారులకు సత్వర న్యాయం అందిస్తూ న్యాయస్థానాల గౌరవాన్ని మరింత ఇనుమడింప చేయాలని హైకోర్టు న్యాయమూర్తి, కృష్ణా జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ చెప్పారు. కై కలూరులో 1వ అదనపు సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్), జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆయన బుధవారం ప్రారంభించారు. ముందుగా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ పోలీసు గౌరవవందనాన్ని స్వీకరించారు. అనంతరం కై కలూరులోని హోటల్లో బార్ అసోషియేషన్ అధ్యక్షుడు గురజాడ ఉదయశంకర్ ఆధ్వర్యంలో న్యాయవాదులతో సమావేశంలో పాల్గొన్నారు. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ మాట్లాడుతూ యువ న్యాయవాదులు మరింత నైపుణ్యాన్ని పెంపొదించుకోవాలన్నారు. రాష్ట్రంలో నూతన కోర్టులు మొత్తం 94 మంజూరవగా కృష్ణా జిల్లాకు 10 కేటాయించారన్నారు. వీటిలో ఇప్పటికి 7 కోర్టులను ప్రారంభించామన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ వేణుతిరుమల్లి గోపాలకృష్ణారావు, జస్టిస్ మండవ కిరణ్మయి న్యాయవాదులకు పలు విషయాలను వివరించారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ జడ్జి గుట్టల గోపి, గుడివాడ న్యాయస్థానాల న్యాయమూర్తులు వాసుదేవరావు, గాయత్రీ, అరుంధతి, కుముదిని, కై కలూరు సీనియర్, జూనియర్ జడ్జిలు వీవీఎన్వీ.లక్ష్మీ, ఎం.శివకిరణ్ పాల్గొన్నారు. -
సింగిల్గా ఆడేసుకుంటున్నారు
బుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026సాక్షి, భీమవరం: తమిళనాడు ఎన్నికల ఫలితాలు జనసేనకు సెగ పుట్టిస్తున్నాయి. సినీ హీరో విజయ్ తమిళగ వెట్రి కళగం(టీవీకే) స్థాపించిన రెండేళ్లకే భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం హాట్ టాఫిక్గా మారింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పొత్తుల తీరు, టీవీకే అధ్యక్షుడు విజయ్ ఒంటరి పోరు గురించి చర్చ నడుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా జతకట్టడం తెలిసిందే. రాష్ట్రంలో కేవలం 21 సీట్లకు పరిమితమైన ఆ పార్టీ తమకు పట్టుందని చెప్పుకునే జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు మూడింట మాత్రమే పోటీ చేసింది. పేరుకు భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురంలలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా టీడీపీ నేతల హవానే నడుస్తోందన్న అసంతృప్తి కేడర్లో ఉంది. ఆయా నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలకు పోటీగా టీడీపీ నేతలు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీతో పాటు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే తాడేపల్లిగూడెంలో జనసేన, టీడీపీ మధ్య వివాదాలు రచ్చకెక్కాయి. మరోపక్క టీడీపీ ఎమ్మెల్యేలు గెలుపొందిన పాలకొల్లు, తణుకు, ఆచంట, ఉండిలో తమకు తగిన ప్రాధాన్యం లేదన్న నైరాశ్యంలో జనసేన శ్రేణులు ఉన్నారు. తాము జెండాలు మోస్తే గెలుపొందిన వారు తమను పరిగణనలోకి తీసుకోవడం లేదన్న ఆవేదనతో కేడర్ చాలావరకు సైలెంటైపోయారు. టీడీపీతో పొత్తుపై లోలోపలే అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ తరుణంలో తమిళనాడు ఎన్నికల ఫలితాలు వారిని ఆలోచనలో పడేస్తాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. విజయ్ ఒంటరిగా బరిలోకి దిగి రెండు జాతీయ పార్టీలు ఢీకొట్టిన వైనాన్ని తమ అధినేత పవన్తో బేరీజు వేసుకుంటున్నారు. నెట్టింట ట్రోల్స్ తమిళనాడు ఎన్నికల్లో సినీ హీరో విజయ్ ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీచేసి గెలుపొందడాన్ని నెటిజన్లు పవన్తో పోలుస్తున్నారు. రెండేళ్ల పసికూన సింగిల్గా సత్తా చాటితే జనసేన పార్టీ పెట్టి 12 ఏళ్లయినా ఇంకా పొత్తుల కోసం పాకులాడుతోందంటున్నారు. ‘ఇంకో పార్టీ జెండాలు మీతో మోయించను, మీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయనంటూ’ విజయ్ తన అభిమానులు, పార్టీ కేడర్లో ధైర్యాన్ని నింపి విజయం సాధిస్తే.. మరో 15 ఏళ్లు కూటమి పొత్తు సాగుతుందంటూ పవన్ పదే పదే ప్రకటనలు చేస్తున్నారంటూ నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘సింహం సింగిలైనా కింగ్ ఆఫ్ జంగిల్ ’ అంటూ విజయ్ చెప్పిన మాటలు.. సింహం ముసలిదయ్యాక సింగిల్గా తిరుగుతుందన్న పవన్ పలుకులకు తమ సృజనాత్మకను జోడిస్తున్నారు. సినిమాల్లోని హాస్య సన్నివేశాలను జోడిస్తున్నారు. హీరో ఎవరు? జీరో ఎవరంటూ రకరకాల క్యాప్సన్లు జతచేస్తున్నారు. సింహాలు సింగిల్గా వస్తాయంటూ మాజీ సీఎం వైస్ జగన్మోహన్రెడ్డి, విజయ్ కలిసి ఉన్న చిత్రాలు, ఎన్నికల ప్రచారంలో అభిమాని ఇచ్చిన జగన్, విజయ్ల చిత్రపటాన్ని విజయ్ చూపిస్తున్న వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ తదితర సామాజిక మాద్యమాల్లో తమిళనాడు ఫలితాలు పవన్ పొత్తుల పాకులాటపై రీల్స్ ట్రెండింగ్లో ఉన్నాయని చెప్పవచ్చు. వీటికి అధిక సంఖ్యలో లైక్లు, షేర్లు, వ్యూస్, కామెంట్లు వస్తుండటం గమనార్హం. ఇదిలా ఉండగా తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకేలకు మద్దతుగా చంద్రబాబు ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఎన్డీఏ అభ్యర్థులు పరాజయం పాలవ్వడంతో ట్రోల్స్ సెగ చంద్రబాబును తాకుతోంది. ప్రచారంలో భాగంగా తమిళంలో ఆయన ప్రసంగాల తాలుకూ వీడియోలకు ఫన్నీ సన్నివేశాలను జోడించి ‘మీరు ప్రచారం చేసిన చోట్ల ఓడిపోవడమేమిటి’ బాబుగారు అంటూ క్యాప్సన్లు జోడించిన రీల్స్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. విజయ్ ప్రచారంలో వైఎస్ జగన్తో ఉన్న ఫొటో చూపిస్తున్న దృశ్యంఅధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వడదెబ్బతో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండలు ఆక్వా సాగుపై కూడా ప్రభావం చూపుతున్నాయి. జనసేనకు తమిళనాడు ఎన్నికల సెగ విజయ్ ఒంటరి పోరును పవన్తో పోలుస్తున్న నెటిజన్స్ హీరో ఎవరంటూ సైటెర్లు పవన్ పాత పలుకులకు సినీ డైలాగ్స్ జోడించి రీల్స్ చంద్రబాబును వదలని ట్రోలర్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో వీడియోలు -
వడదెబ్బతో ప్రాణాలకు ముప్పు
● నానాటికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ● హీట్స్ట్రోక్తో ప్రజల అవస్థలు ● ఆక్వాకు పొంచి ఉన్న ప్రమాదం వడదెబ్బ తగిలితే ఈ ఐదు పనులు చేయాల్సిందే ● ఆ వ్యక్తిని ఏదైనా చల్లని ప్రాంతం, నీడలో పడుకో పెట్టాలి. ● చల్లని నీటితో చర్మాన్ని తుడిచి, బట్టలను తడపాలి. ● ఆ వ్యక్తికి గాలి తగిలేలా చూసి, చల్లని తాగునీటిని అందించాలి. ● ఐస్ పెట్టడం కానీ కోల్డ్ కంప్రెషన్ ఇవ్వాలి. కై కలూరు: ఉమ్మడి జిల్లాలో ఇటీవల కాలంలో ఉష్ణోగత్రలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. మహాత్మా గాంధీ ఉపాధి హామీ కూలీలపై భానుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. చిరు వ్యాపారులు ఎండ తీవ్రత తట్టుకోలేక దుకాణాలను మూసేస్తోన్నారు. ఉమ్మడి జిల్లాలో ఆక్వా సాగు మొత్తం 2.90 లక్షల ఎకరాల్లో సాగు చేస్తుండగా, కై కలూరు నియోజకవర్గంలో 84,852 ఎకరాల్లో సాగు జరుగుతుంది. సాధారణంగా చేపలు 20 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేట్ ఉష్ణోగ్రతనే తట్టుకుంటాయి. అలాంటిది అంతకు మిచి ఉష్ణోగ్రతలు ప్రతిరోజూ నమోదు అవుతుండడంతో చేపలు, రొయ్యలు సాగుపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో అధిక ఎండల నుంచి రక్షణకు ఆక్వా రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. వడదెబ్బ అంటే ఏంటీ? ఎండ తీవ్రతతో శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగి మెదడు మీద చూపుతుంది. దీని వల్ల మెదడులోని ఉష్ణోగ్రత నియంత్రించే కేంద్రం (హైపో థాలామస్) దెబ్బతిని వడదెబ్బకు గురి అవుతారు దీనినే ‘హీట్స్ట్రోక్’ లేదా ‘సన్ స్ట్రోక్’ అంటారు. ఇది ప్రాణాంతకంగా మారుతోంది. లక్షణాలు విషయానికి వస్తే తీవ్రవైన జ్వరం, తలనొప్పి, మానసిక ఒత్తిడి పెరగడం, నీరసం, కళ్లు తిరగడం, వాంతులు, విరోచనాలు, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, శరీరంపై ఎర్రని పొక్కులు రావడం, అపస్మారక స్థితి కనిపిస్తాయి. వేసవిలో నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి ఉప్పు కలిపిన పానీయాలు ఎక్కువగా తాగాలి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. లేత సుతిమెత్తని వదులు కాటన్ దుస్తులు ధరించాలి. ప్రతి ఇంటిలోనూ ఓఆర్ఎస్ ద్రావణం ఉంచుకోవాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. వడదెబ్బ తగిలితే వైద్యులను సంప్రదించండి. – డాక్టర్ అల్లాడ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్, సీహెచ్సీ, కై కలూరు కై కలూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన జంగం వెంకటేశ్వరమ్మ(50) గురువారం మధ్యాహ్నం ఎండలో ఆరుబయట అంట్లు తోముతూ అపస్మరక స్థితిలోకి వెళ్లిపోయింది. కుమార్తె కై కలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగానే అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. బుట్టయగూడెంలో ఓ వ్యక్తి ఉదయం ఎండలో వస్తూ వాహనంతో గోడను ఢీకొట్టాడు. వడదెబ్బ ప్రభావంతోనే ఇది జరిగింది.. ఇలా అనేక ఘటనలు జిల్లాలో ఎండల తీవ్రతకు అద్దం పడుతున్నాయి. -
12వ పీఆర్సీ వెంటనే ప్రకటించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్సీ నాయకులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఎనిమిదేళ్లుగా పీఆర్సీ అమలు చేయకపోవడం వల్ల సుమారు 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మే నెలాఖరులోపు ఉద్యోగులకు రావాల్సిన రూ. 30 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అమరావతిలో సచివాలయ హంగుల కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తూ, ఉద్యోగుల సమస్యలను విస్మరించడం సరికాదని విమర్శించారు. ప్రజా సేవలో నిరంతరం కష్టపడి పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాయలసీమ జిల్లాల్లో, ఉత్తరాంధ్ర ప్రజలు అమరావతిని ఇష్టపడటం లేదని తెలిపారు. అమరావతి చంద్రావతిగా మారిందని ఎద్దేవా చేశారు. అప్పులు తెచ్చి రాజధాని కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని, ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ధర్నా అనంతరం కలెక్టరేట్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అలగా రవికుమార్, పెద్దిరాజు, తోట రాజు తదితరులు పాల్గొన్నారు. -
స్వర్ణాంధ్రలో ‘ప్రాజెక్ట్ ఎక్స్పో’
నరసాపురం రూరల్: స్థానిక స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) విభాగం ఆధ్వర్యంలో ‘ప్రాజెక్ట్ ఎక్స్పో’ మంగళవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల చైర్మన్ కొండవీటి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్డీఓ దాసి రాజు విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల సాంకేతిక ప్రాజెక్టులను ఆయన స్వయంగా పరిశీలించి, వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సురేష్ కుమార్ పాలకవర్గ సభ్యుడు అడ్డాల శ్రీహరి, ట్రెజరర్ కొండవీటి స్వామి, వైస్ ప్రిన్సిపాల్ గోపిచంద్ పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ పూర్తి చేసుకున్న దివ్యాంగుడు ఏడీవీ సత్యనారాయణ, తన తల్లిదండ్రులతో కలిసి భీమవరం కలెక్టరేట్లో మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిశారు. పెంటపాడు గవర్నమెంట్ పోస్ట్ బేసిక్ స్కూల్లో పదో తరగతి పూర్తి చేసిన డఫ్ అండ్ డంబ్ విద్యార్థి ఏడీవీ సత్యనారాయణ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించడం గర్వకారణమన్నారు. అనంతరం సత్యనారాయణను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యాంసుందర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ పాల్గొన్నారు. గణపవరం: గణపవరం బస్టాండు ప్రాంతంలో సంచరిస్తున్న చుక్కల దుప్పి ఎట్టకేలకు అటవీప్రాంతానికి తరలించారు. రెండు రోజుల క్రితం బస్టాండు ప్రాంతంలో వెంకయ్యకాల్వ గట్టున తిరుగుతున్న చుక్కలదుప్పిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు దానిని స్వాధీనం చేసుకుని సురక్షిత ప్రదేశంలో ఉంచారు. జిల్లా అటవీ అధికారి డిఏ కిరణ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కరుణాకర్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్ల పరిధిలో సహజ ఆవాస ప్రాంతానికి ఈచుక్కల దుప్పిని తరలించారు. గణపవరం ఎస్సై మణికుమార్, పశుసంవర్థక శాఖ ఏడీ నాయక్, ఫారెస్ట్ బీట్ అధికారులు రాంప్రసాద్, రాజేష్ పాల్గొన్నారు. ఉంగుటూరు: ఉంగుటూరు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న వన్య ప్రాణులు నీరు లేక విలవిల్లాడుతున్నాయి. వారం రోజుల క్రితం ఒక దుప్పి చనిపోయింది. అటవిలో పని చేసే ఉపాధి కూలీలు దుప్పి చనిపోయిన ఘటనను ఆలస్యంగా వెలుగులోకి తీసుకువచ్చారు. అయితే చనిపోయిన ఆ దుప్పిను అటవీ అధికారులు ఏం చేశారో? వారికే తెలియాల్సి ఉంది. ఉంగుటూరు మెట్ట ప్రాంతంలో 3200 ఎకరాలు అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఏ–బ్లాకు ఫారెస్టు ఉంగుటూరు, నారాయణపురం, గోపినాథపట్నం, గ్లొలగూడెం గ్రామాలను ఆనుకుని ఉంది. బి–బ్లాకు ఫారస్టు గుళ్లపాడు, నీలాద్రిపురం, ఆవుపాడు, ప్రకాశరావుపాలెం, వెంకట్రామన్నగూడెం, వెల్లమిల్లి గ్రామాలను ఆనుకుని ఉంది. అయితే ఈ ప్రాంతంలో సహజ సిద్ధంగా ఉండే కుంటల్లో నీరు లేకపోవడంతో వన్య ప్రాణులు ఇబ్బందులు పడుతున్నాయి. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 8న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పీవీ రమేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ జాబ్ మేళాలో రాయల్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ పేటీఎం కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. 20 నుండి 35 సంవత్సరాల లోపు ఉన్న పదో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హత ఉన్న యువతను సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టీం లీడర్ పోస్టులకు ఎంపిక చేస్తారని వివరించారు. అభ్యర్థులు ఫార్మల్ డ్రెస్ కోడ్లో హాజరుకావాలని, అవసరమైన డాక్యుమెంట్స్, రెజ్యూమ్ తీసుకురావాలని సూచించారు. మరిన్ని 88868 82032, 74161 18388 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. -
కల్పతరువు.. ఇప్ప పువ్వు
బుట్టాయగూడెం : గిరిజనుల పాలిట కల్పతరువు ఇప్ప పువ్వు. వేసవి మూడు నెలల పాటు అడవి బిడ్డలకు ప్రధాన జీవనోపాధిగా నిలుస్తోంది. అడవిపైనే ఆధారపడి బతుకుతున్న ఆదివాసీలకు పోడు వ్యవసాయం తర్వాత అటవీ ఉత్పత్తుల సేకరణే ముఖ్యం. ముఖ్యంగా వేసవి కాలంలో లభించే ఇప్పపువ్వు గిరిజనుల ఆర్థిక అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తెల్లవారుజామునే అడవిలోకి వెళ్లి, చెట్లపై నుంచి రాలిన పువ్వులను సేకరించి, వాటిని మధ్యాహ్నం వరకు ఇంటికి చేర్చి ఎండబెట్టడం వీరి దైనందిన ఉపాధిలో భాగం. మూడు నెలల పాటు ఉపాధి మన్యం ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు ఇప్పచెట్ల ద్వారా సుమారు మూడు నెలల పాటు పని దొరుకుతుంది. ఖరీఫ్, రబీ వ్యవసాయ పనులు ముగిసే సమయానికి ఇప్పచెట్లు విరగబూస్తాయి. గాలికి నేలరాలే ఈ పువ్వులను గిరిజనులు అత్యంత శ్రద్ధతో సేకరిస్తారు. వీటితో పాటు మొర్రి పండ్లను కూడా సేకరించి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో విక్రయించడం ద్వారా తమ జీవనోపాధిని సాగిస్తుంటారు. ఇప్పపువ్వుతో ఔషధాల తయారీ గిరిజనులు సేకరించిన ఇప్ప పువ్వులో ఎన్నెన్నో ఔషధ గుణాలు, పోషక విలువలు ఉన్నాయి. దీని నుంచి తీసిన తైలాన్ని పక్షవాతం వంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. ఇప్పపువ్వుతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దగ్గు, దంత సంబంధిత వ్యాధులు నయమవుతాయని నమ్ముతారు. ప్రధానంగా స్వచ్ఛమైన ఇప్పపువ్వుతో తయారు చేసిన సారాను సేవిస్తే వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉంటాయని గిరిజనుల ప్రగాఢ విశ్వాసం. ఆయుర్వేదంలో దీనిని మధుక వృక్షం అని పిలుస్తారు. వైద్యశాస్త్రంలోనూ దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గిరిజన ప్రాంత ప్రజలు ఈ చెట్లను మాతృమూర్తిగా భావిస్తారు. ఇప్పపువ్వులో ఎన్నెన్నో పోషకాలు ఇప్ప గింజల నుంచి తీసిన నూనెలో పుష్కలమైన పోషక విలువలు ఉన్నట్లు శాసీ్త్రయంగా నిరూపితమైంది. భారత శాసీ్త్రయ సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1999లో నిర్వహించిన పరిశోధనల ప్రకారం, ఎండిన ఇప్పపువ్వుల నుంచి పంచదారను తయారు చేయవచ్చు. దీనితో జామ్, కేక్లు, చాక్లెట్లు తయారు చేసే విధానాన్ని కూడా కనిపెట్టారు. ఇప్పపువ్వు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ఎండిన వేప ఆకులను కలిపే సంప్రదాయ పద్ధతిని వీరు పాటిస్తారు. చాలామంది గిరిజనులు దీనిని నేరుగా ఆహారంగా కూడా తీసుకుంటారు. ధర లేక తగ్గుతున్న సేకరణ ఆసక్తి పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంతో పాటు పాపికొండల అభయారణ్యంలో సుమారు 10 వేలకు పైగా ఇప్ప చెట్లు ఉన్నట్లు అంచనా. బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఇవి అధికంగా ఉన్నాయి. అటవీ శాఖ కూడా ఖాళీ ప్రదేశాల్లో వేల సంఖ్యలో ఈ చెట్లను పెంచుతోంది. గిరిజనులు సేకరించిన పువ్వులను జీసీసీ అధికారులతో పాటు ఇతర ప్రాంతాల వ్యాపారులు కూడా కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం సరైన మద్దతు ధర లభించకపోవడంతో గిరిజనులు వీటి సేకరణపై ఆసక్తి తగ్గించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్ప చెట్ల నరికివేత కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పచెట్టు వేసవి మూడు నెలల పాటు అడవి బిడ్డలకు ఉపాధి గిటుబాటు ధరలేక తగ్గుతున్న పువ్వుల సేకరణ జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలని కోరుతున్న గిరిపుత్రులు -
ఏపీటీఎఫ్ (1938) నూతన కార్యవర్గం ఎన్నిక
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లా ఏపీటీఎఫ్ (1938) నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. స్థానిక పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ భవనంలో మంగళవారం నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఈ ఎంపిక నిర్వహించారు. ఈ ఎన్నికలకు ఈ.రామ్మోహన్ అధ్యక్షత వహించగా, కె.శేషగిరి, బి.లంకేశ్వరరావు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. సంఘ నూతన జిల్లా అధ్యక్షుడిగా పీ శ్రీనివాస్ (పోలవరం), ప్రధాన కార్యదర్శిగా జీ మోహన్ (ఏలూరు), గౌరవాధ్యక్షుడిగా గంధం రాంబాబు (చింతలపూడి) ఎన్నికయ్యారు. అలాగే అసోసియేట్ అధ్యక్షుడిగా ఈ. రామ్మోహన్, ఉపాధ్యక్షులుగా ఆర్డీవీ ప్రసాద్, ఎస్వీ దుర్గారావు, డీ. శ్రీనివాసరావు, జీ రమేష్ బాబు బాధ్యతలు చేపట్టారు. అదనపు కార్యదర్శులుగా పీ నాగరాజు, జీ రాజు, ఎం కృష్ణమూర్తి, జీ శ్రీనివాసరావు కార్యదర్శులుగా జీ వెంకటరమణ, రాహుల్, కే శ్రీనివాసరావు, కే రఘురామరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం, విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని ప్రకటించారు. రాజీలేని పోరాటాల ద్వారా ఉపాధ్యాయులకు న్యాయం చేకూరుస్తామని, సంఘాన్ని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అకాడమిక్ కమిటీ కన్వీనర్ జి. కృష్ణతో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. -
మండుటెండలో గ్యాస్ తంటాలు
కైకలూరు: మండలంలో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు యుద్ధం చేయాల్సి వస్తుంది. మే నెలలో 39 డిగ్రీల సెంటీగ్రేట్ ఉష్ణోగ్రతలు మద్య మలమల మాడుతూ సిలిండర్ల కోసం ఏజెన్సీల వద్ద ప్రజలు పడిగాపులు పడుతున్నారు. కై కలూరులో మంత్రి పార్థసారథికి చెందిన సారథి గ్యాస్ ఏజెన్సీ వద్ద ఓటీపీలు పనిచేయకపోవడంలో సహనం కోల్పోయిన వినియోదారులు మంగళవారం కార్యాలయంలోకి దూసుకుపోయారు. నియోజకవర్గంలో కై కలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో కలిపి మొత్తం 77,501 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరికి గ్యాస్ సరఫరా చేయడానికి నాలుగు మండలాల్లో భారత్, ఇండియన్, హెచ్పీ కంపెనీలకు చెందిన 6 ఏజెన్సీలు ఉన్నాయి. కొన్ని ఏజెన్సీలు డోర్ డెలవరీని యుద్ధం వంకతో ఆపేశాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలందరూ ఏజెన్సీ కార్యాలయాలకు ఉదయం 5 గంటలకే ఖాళీ సిలిండర్లతో లైన్లో వేచి ఉంటున్నారు. మరికొందరు ఏకంగా రాత్రి ఏజెన్సీల వద్దే పడుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా వ్యవస్థను గాడిలో పెట్టడానికి అధికారులు ప్రయత్నిచండం లేదు. మంత్రి సారథి ఏజెన్సీ వద్ద మాడుతున్న ప్రజలు.. కై కలూరులో గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథికి చెందిన సారథి గ్యాస్ ఏజెన్సీ ఉంది. అత్యధికంగా వినియోగదారలు ఈ ఏజెన్సీ కిందే ఉన్నారు. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది గ్యాస్ సిలిండర్లలో వేచి ఉన్నారు. మండుటెండలో రోడ్డుపై నిలబడ్డారు. ఉదయం 10:30కి ఓటీపీలు పనిచేయడం లేదని సిబ్బంది చెప్పడంతో వేచి ఉన్న అందరూ అసహానాకి గురయ్యారు. అనేక మంది కార్యాలయంలో సిబ్బందితో గొడవకు దిగారు. తహసీల్దారు రామకృష్ణ, పోలీసులతో వచ్చి సమన్యను పరిష్కరించారు. ఇక్కడ వినియోగదారులు పడుతున్నా ఇబ్బందులపై మంత్రి సారథి దృష్టి సారించాలని కోరుతున్నారు. మిగిలిన ఏజెన్సీలు డోర్ డెలివరీ చేస్తోన్నాయని, ఈ ఏజెన్సీలో కూడా డోర్ డెలివరీని పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. డోర్ డెలివరీని నిలిపేసిన మంత్రి ఏజెన్సీ నేను ఉదయం 6.30 గంటలకు భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్దకు వచ్చాను. అప్పటికే అనేక మంది సిలిండర్లను లైన్లో పెట్టారు. వృద్ధులు, మహిళలు అందరం ఎండలో మలమల మాడిపోయాం. గతంలో మా గ్రామాలకు గ్యాస్ సిలిండర్ల బండి వచ్చేది. ఎదో యుద్ధం పేరు చెప్పి అందరినీ ఇబ్బంది పెడుతోన్నారు. – వి.విష్ణురెడ్డి, అయోధ్యపట్నం, వినియోగదారుడు సిలిండర్ల లోడ్లు తగినంతగా రాకపోవడంతో సమస్య మొదలైంది ఇదే కాకుండా ఓటీపీ సిస్టంలో సాంకేతిక సమస్య వస్తుంది. దీనిని పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నాం. వాణిజ్య అవసరాలకు గృహ వినియోగ సిలిండర్లు వినియోగించేవారిపై ఇప్పటికే కేసులు నమోదు చేశాం. – కె.వెంకటరమణ, డిప్యూటీ తహసీల్దార్, పీడీఎస్, కై కలూరు -
ప్రయాణికులకు సంకటంగా సంబరాలు
భీమవరం: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కూటమి నాయకులు భీమవరంలో నిర్వహించిన భారీ ర్యాలీతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. పట్టణంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడి.. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడం ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. భీమవరం పట్టణంలో ఇరుకు రోడ్లతో ప్రయాణికులు, ప్రజలు నిత్యం నరకం చూస్తుంటారు. రోడ్లపైనే పార్కింగ్లు, చిరువ్యాపారుల దుకాణాలతో వాహనాలు వెళ్లాలంటే ఇబ్బంది తయారైంది. విద్యాసంస్థల బస్సులు పెద్దసంఖ్యలో రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు అన్నీ ఇన్నా కావు. మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ ప్రయాణికులు, ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. పట్టణంలోని నరసయ్య అగ్రహారంలోని బీజేపీ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ, రైల్వే ఓవర్ బ్రిడ్జి, కొత్తబ స్టాండ్ సెంటర్, పోలీసు బొమ్మ సెంటర్, అంబేడ్కర్ సెంటర్, జువ్వలపాలెం రోడ్డు మీదుగా అడ్డ వంతెన వరకు సాగింది. ర్యాలీలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే అంజిబాబుతో సహా పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీంతో దాదాపు మూడు కిలోమీటర్ల పొడవునా ర్యాలీలో వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నడిరోడ్డుపై ఎంతతీవ్రత ఒకవైపు, వాహనాలు ముందుకు కదలక సుమారు మూడు గంటల పాటు నరకయాతన అనుభవించారు. ర్యాలీలు, ధర్నాలు ప్రధాన రోడ్లుపై నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ట్రాఫిక్ నిలిచిపోయి ఇబ్బందులు -
కాంట్రాక్టర్ల వివరాలు అందించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో జీఎస్టీ వసూళ్లకు గాను వివిధ ప్రభత్వ శాఖల ద్వారా నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు, తదితరుల వివరాలు వెంటనే వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అందించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి జిల్లా అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల కాంట్రాక్టర్ల నుంచి జిఎస్టీ వసూళ్లపై వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమీషనర్ నాగార్జునరావు తో కలిసి జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో మంగళవారం కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిలాల్లో సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతునులు, వసతిగృహాలకు వివిధ సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లు, అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్ల నుండి టీడీఎస్ వసూలు చేసి సంబంధిత వివరాలను వాణిజ్య పన్నుల శాఖాధికారులకు అందించాలని కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, వాణిజ్యపన్నుల శాఖ జాయింట్ కమిషనర్ నాగార్జునరావు పాల్గొన్నారు. -
మత్స్య శిక్షణకు అభ్యర్థులు కరువు
ఉంగుటూరు: మండలంలోని బాదంపూడి మత్స్య శిక్షణ కేంద్రంలో శిక్షణకు యువకులు కరువయ్యారు. ఔత్సాహికులైన అభ్యర్థులకు ఇక్కడ మత్స్య శిక్షణ ఇస్తారు. ఇది ప్రభుత్వ మత్స్య శాఖ ద్వారా నడుస్తోంది. ఈ శిక్షణ కేంద్రంలో స్టైఫండులో 20 మందికి, నాన్ స్టైఫండుతో 20 మందికి శిక్షణ ఇచ్చేవారు. మూడు నెలలు శిక్షణ కోర్సులో శిక్షణ పాందేందుకు గతంలో యువకులు పోటీ పడేవారు. అయితే మత్స్య శిక్షణ పొందేందుకు అభ్యర్థులు కరువు అయ్యారు. కనీసం 20 మంది కూడా రావడం లేదు. ఇన్ ల్యాండు ఫిషరీస్ ట్రైనింగ్ పొందిన వారికి మూడునెలలు సర్టిఫికెటు ఇస్తారు. ఈ సర్టిఫికెటుతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఫీల్డ్ మెన్ ఉద్యోగాలు వచ్చేవి అయితే ఇటీవల కాలంలో ఈ శిక్షణకు ఆదరణ తక్కువైంది. ప్రభుత్వం కూడా శిక్షణ గురించి యువతకు అవగాహన కల్పించడం లేదు. దీంతో ఎంతో ప్రాచుర్యం ఉన్న మత్స్య శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారుతుంది. -
ఎరువులు అందుబాటులో ఉండాలి
ఏలూరు(ఆర్ఆర్పేట): జిల్లాలో ఖరీఫ్– 2026 సీజన్కు రైతులకు అవసరమైన ఎరువులు, ముఖ్యంగా యూరియా, డీఏపీ సమృద్ధిగా ఉండేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఢిల్లీకి చెందిన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ రవీంద్ర యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బృందంతో కలిసి ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు, చింతలపూడి, ఏలూరు మండలాల్లో పర్యటించారు, ఎరువుల రిటైల్ డీలర్ల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రవీంద్ర యాదవ్ మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో యూరియా, డీఏపీ ఎరువుల అమ్మకాలు అధికంగా నమోదైన నేపథ్యంలో, ఆ పెరుగుదలకు కారణాలను సమగ్రంగా పరిశీలిస్తున్నామన్నారు. డీలర్ల వద్ద ఉన్న స్టాక్ వివరాలు, విక్రయ రికార్డులు, బిల్లులు, రైతులకు సరఫరా విధానం వంటి అంశాలను పరిశీలించి, సరైన మార్గదర్శకాలు అందించారు. అధికారులు ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉంచాలని, అధిక ధరలకు అమ్మకాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఎరువులు సరైన సమయంలో, సరైన మోతాదులో అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. యూరియా అధికంగా వాడొద్దు చింతలపూడి: రైతులు పంట సాగులో యూరియాను మోతాదుకు మించి వాడకూడదని, అధిక వాడకం వల్ల పంటలకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని రవీంద్ర యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం చింతలపూడి సబ్ డివిజనన్లో కేంద్ర బృందం పర్యటించింది. ఈ సందర్భంగా స్థానిక ఎరువుల దుకాణాలను, డీసీఎంఎస్ గొడౌన్న్ను వారు తనిఖీ చేశారు. గొడౌన్న్లో ఎరువుల ధరలు, ఈ–పాస్ ద్వారా జరుగుతున్న విక్రయాలు, స్టాక్ రిజిస్టర్లు, ప్రస్తుత నిల్వలను బృందం సభ్యులు పరిశీలించారు. గత మూడేళ్ల యూరియా, డీఏపీ విక్రయాల నివేదికలను సేకరించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత ఉండాలని ఆదేశించారు. -
ముగిసిన అండర్–11 చదరంగం పోటీలు
జంగారెడ్డిగూడెం: చెస్ డెవలప్మెంట్ అండ్ ప్లేయర్స్ అసోసియేషన్ ఆఫ్ ఏలూరు జిల్లా ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలోని ఇండియన్ డిజిటల్ స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్–11 ఓపెన్ బాలబాలికల చదరంగ పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఈ పోటీల ద్వారా ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 9, 10 తేదీలలో విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్ర స్థాయి అండర్–11 ఛాంపియన్షిప్లో ఏలూరు జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బాలుర విభాగంలో జ్యోతి స్వరూప్ మొదటి స్థానం, హరి విహాన్ రెండో స్థానం సాధించగా, బాలికల విభాగంలో ధరణి మొదటి స్థానం, బిస్మి యాస్మిన్ జారా రెండవ స్థానం సాధించారు అని టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ పాలూరి కిరణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్ మహేష్, ఏలూరు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ పాలూరి, కార్యదర్శి కన్నా సూర్య నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
కుంగుతున్న గోదావరి గట్టు రోడ్డు
నరసాపురం: పట్టణంలోని గోదావరి గట్టు రోడ్డు ధ్వంసమవుతోంది. పడవల రేవు నుంచి కొండాలమ్మ గుడి వరకు రోడ్డుకు పలు చోట్ల గోతులు పడ్డాయి. రోడ్డు చాలాచోట్ల కుంగిపోయింది. దీంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఈ రోడ్డులో నిత్యం వేలాదిమంది ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా మార్నింగ్ వాక్ చేసేవారు, ప్రస్తుత వేసవిలో సాయంత్రం వేళలో గోదావరి తీరానికి విహారానికి పెద్ద సంఖ్యలో జనం వస్తుంటారు. రోడ్డు సవ్యంగా లేకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు రోడ్డు మరమ్మతులపై దృష్టి పెట్టడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు. భీమవరం: పాలిసెట్ పరీక్షా ఫలితాల్లో జిల్లాలో 92 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత నెలలో నిర్వహించిన పరీక్షకు 8,153 మంది హాజరుకాగా వారిలో 7,501 మంది ఉత్తీర్ణత సాధించారు. 4,650 మంది బాలురకు 4,213 మంది, 3,503 మంది బాలికలకు 3,288 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో టి.సాయి విష్ణుతేజ రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ సాఽధించగా, తోట మానస 4వ ర్యాంక్, పిండి జగన్ నర్సింహస్వామి 5వ ర్యాంక్, ముల్లు రోహిత్ 6వ ర్యాంక్, కొప్పర్తి శేషసాయి వెంకటకృష్ణ చైతన్య 7వ ర్యాంక్, టీబీ దివ్య 11వ ర్యాంక్, రెడ్డి వరుణ్కుమార్ 14వ ర్యాంక్, బీవీవీ యశ్వంత్ 15వ ర్యాంక్, సంగినీడి జయరామ్ 16వ ర్యాంక్ సాధించారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో 1,98,999 మంది విద్యార్థులకు 2026–27 విద్యా సంవత్సరానికి సుమారు 13 లక్షల పుస్తకాలు అవసరం కాగా నేడు ప్రభుత్వ పుస్తక విక్రయ కేంద్రానికి 10,03,000 పుస్తకాలు వచ్చాయని జిల్లా మేనేజర్ పీవీ సుధాకర్ వెల్లడించారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అన్ని సబ్జెక్టుల టైటిల్స్ మారినట్లు తెలిపారు. మరిన్ని పుస్తకాలు రావాల్సి ఉందని వెల్లడించారు. మరో రెండు రోజులలో ఆర్టీసీ బస్సుల్లో పూర్వపు జిల్లా పరిధిలో 48 మండలాలకు అవసరమైన అన్ని టెక్స్ట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు. అత్తిలి: దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న గృహ గణన కార్యక్రమంలో భాగంగా అత్తిలిలో నిర్వహిస్తున్న గృహ గణనను జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి సేకరిస్తున్న సమాచారాన్ని పరిశీలించారు. ఇంటింటికి వెళ్లినప్పుడు 33 ప్రశ్నలకు సంబంధించిన సమాచారం అత్యంత పారదర్శకంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అత్తిలి తహసీల్దార్ దశిక వంశీ పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): రెవెన్యూ క్లినిక్స్ కార్యక్రమం జిల్లాలో మంచి ఫలితాలను అందిస్తోందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)తో పాటు సమాంతరంగా రెవెన్యూ క్లినిక్స్ నిర్వహించడం ద్వారా భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. 2025 డిసెంబర్ 29న ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా 2026 మే 4 వరకు మొత్తం 16 విడతల్లో క్లినిక్స్ నిర్వహించామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 632 దరఖాస్తులు అందగా, వాటిలో 235 దరఖాస్తులకు పరిష్కారం చూపించామని, 114 దరఖాస్తులను తిరస్కరించామని, ఇంకా 283 దరఖాస్తులు వివిధ దశల్లో పరిష్కారానికి పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న అన్ని దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజలకు త్వరితగతిన, పారదర్శకంగా భూ సమస్యల పరిష్కారం లభిస్తోందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి
గణపవరం: జిల్లాలో రబీ ధాన్యం సేకరణ వేగవంతం చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్కుమార్రెడ్డి ఆదేశించారు. మంగళవారం గణపవరం తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే పి.ధర్మరాజుతో కలిసి ఆయన వివిధ శాఖల జిల్లా ఉన్నతాఽధికారులు, రైస్మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గోనెసంచుల కొరత లేకుండా తక్షణం 2..5 లక్షల గోనెసంచులు బుధవారం నాటికి అందుబాటులో ఉంచాలని రైస్మిల్లర్లను ఆదేశించారు. గణపవరం మండలంలోని మొయ్యేరు, పిప్పర, ముప్పర్తిపాడు తదితర గ్రామాలలో కొందరు రైతులు పీఆర్ 126 రకం వరిసాగుచేశారని, ఆ ధాన్యం కొనడానికి రైస్మిల్లర్లు నిరాకరిస్తున్నట్లు రైతులనుంచి తమకు ఫిర్యాదులు అందాయని జేసీ రాహుల్కుమార్, ఎంఎల్ఏ ధర్మరాజు అన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ రకం ధాన్యం కూడా తప్పనిసరిగా కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ జేడీ జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా సహకార అధికారి సంకు మురళీకృష్ణ పాల్గొన్నారు. -
జనన, మరణ రికార్డుల తనిఖీ
తాడేపల్లిగూడెం (టీఓసీ): రీజనల్ డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసస్ జోన్ 2, డిప్యూటీ డైరెక్టర్, వైటల్ స్టాటిస్టిక్స్ కె.శ్రీనివాసరావు (రాజమండ్రి), స్టాటిస్టికల్ అధికారి ఎంవీ ప్రసాద్ (భీమవరం) ఆ ధ్వర్యంలో సోమవారం స్థానిక ము న్సిపల్ కార్యాలయంలోని జనన, మరణ విభాగంలో రికార్డులను తనిఖీ చేశారు. సీఆర్ఎస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్లను, ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి వచ్చే జనన, మరణ నమోదులను, పాత రికార్డులను పరిశీలించారు. హెల్త్ అసిస్టెంట్లకు సమావేశం నిర్వహించి రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చెప్పారు. నమోదుల్లో జాప్యం ఉండకూడదన్నారు. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇన్చార్జి ఎన్.రజనీ, హెల్త్ అసిస్టెంట్లు హాజరయ్యారు. -
మావుళ్లమ్మ నిత్యాన్నదానానికి..
భీమవరం (ప్రకాశంచౌక్): మావుళ్లమ్మవారి నిత్యాన్నదానానికి చినఅమిరానికి చెందిన కోరాడ శ్రీనివాస్, కీర్తి దంపతులు రూ.1,00,116 విరాళంగా అందజేశారు. సంచుల కోసం చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఆర్ఎస్కేల్లో దళారులు, పెద్ద రైతులు తమ పలుకుబడితో సంచులు తీసుకెళ్లిపోతున్నారు. సామాన్య, కౌలు రైతులను మాత్రం తేమ పేరు చెప్పి రోజులు తరబడి తిప్పించుకుంటున్నారు. సంచులు, పట్టుబడి, రవాణా సమస్యలు పరిష్కరించాలి. – బి.శ్రీనివాస్, కౌలురైతు, ఆలమూరు మూడున్నర ఎకరాల్లో సాగు చేశాను. మొన్న సోమవారం పంట కోస్తే శనివారం సంచులు ఇచ్చారు. పట్టుబడి చేద్దామంటే జట్టు రావడం లేదంటున్నారు. వాతావరణం చూస్తుంటే భయమేస్తోంది. ఆదివారం వర్షం నుంచి పంటను కాపాడుకునేందుకు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. – నారాయణ, రైతు, కోమటి చెరువు -
ప్రశాంతంగా లాసెట్
ఏలూరు (ఆర్ఆర్పేట): లా కోర్సుల్లో ప్రవేశాల కోసం సోమవారం నగరంలో నిర్వహించిన లాసెట్కు 518 మంది విద్యార్థులు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో ఉదయం170 మందికి 134 మంది, మధ్యాహ్నం 171 మందికి 152 మంది, సీఆర్ఆర్ కళాశాలలో ఉదయం 200 మందికి 158 మంది, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో 92 మందికి 74 మంది హాజరయ్యారు.భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని స్కూల్, కాలేజీ బ స్సులకు ఫిట్నెస్ పరీక్షలు తప్పక చేయించాలని జిల్లా రవాణా శాఖ అధికారి కృష్ణారావు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 5 తనిఖీ బృందాలు ఏర్పాటు చేశామని, కళాశాల, పాఠశాలలకు వెళ్లి బస్సులను తనిఖీ చేస్తామన్నారు. ఫిట్నెస్ లేని బస్సులకు నోటీసులు జారీ చేస్తామని, అవసరమైతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. భీమడోలు: బహిర్భూమికి వెళ్లిన మతిస్థిమితం లేని వ్యక్తిని సోమవారం వేకువజామున పాతూరు రైల్వేగేటు వద్ద రైలు ఢీకొట్టింది. దీంతో గుండుగొలను సమీపంలోని కొత్తగూడేనికి చెందిన నారాయణపురపు దుర్గారావు (43) మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఏలూ రు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సర్కారు నిండా ముంచేను
అన్నదాన భవనానికి విరాళం కాళ్ల: కాళ్లకూరులో వేంకటేశ్వరస్వామి దేవస్థానం అన్నదాన భవనానికి వేగేశ్న వీఎస్ రాజు, కుమార్తెలు శ్రీఅంజలి, సంజన రూ.3 లక్షలు విరాళంగా అందించారు. దళారులదే హవా మంగళవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2026సాక్షి, భీమవరం: సంచులకు కొరత లేదని అధికారులు చెబుతుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితికి అందుకు భిన్నంగా ఉంది. ధాన్యంలో తేమ పేరిట ఆర్ఎస్కేల్లో సంచుల కోసం షరతులు పెడుతూ కాలయాపన చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. సకాలంలో సంచులు అందక.. సంచులు దొరికితే పట్టుబడి పట్టేందుకు జట్టు రాక.. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియక.. పంటను కాపాడుకునేందుకు కర్షకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పంటను కాపాడుకునేందుకు పడిగాపులు డీజిల్ కొరతతో మొదట్లో వరికోతలు ఆలస్యమయినా కొద్దిరోజులుగా పనులు పుంజుకున్నాయి. దాదాపు 70 శాతం విస్తీర్ణంలో వరికోతలు పూర్తయ్యాయి. కొద్దిరోజుల క్రితం వరకు సంచులకు కొరత లేకపోయినా ప్రస్తుతం పనులు ముమ్మరం కావడంతో సంచులకు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. పంట కోసి సంచుల కోసం ఆర్ఎస్కేల వద్దకు వెళుతుంటే తగినంత తేమశాతం వచ్చాక ఇస్తామని తిప్పించుకుంటున్నారని వాపోతున్నారు. వారం క్రితం కోతలు కోసి ధాన్యం ఆరబెట్టుకున్న రైతులు, సకాలంలో సంచులు అందక, పట్టుబడికి జట్టు దొరక్క రోడ్లు పక్కన, కళ్లాల్లోను రాశులు పోసి ఉంచుతున్నారు. మార్టేరు నుంచి పెనుమంట్ర వరకు రోడ్డు పక్కన ధాన్యం నిల్వ చేసిన పలువురు రైతులను సోమవారం ‘సాక్షి’ సంప్రదించగా ఈ సమస్యను వివరించారు. నాలుగైదు రోజులు పోయాక సంచులు దొరికాయని సంబరపడితే పట్టుబడి కోసం జట్టు కార్మికులు రాక ధాన్యాన్ని రోడ్డుపక్కన ఉంచి పడిగాపులు కాయాల్సి వస్తోందని వాపోయారు. ఆదివారం కురిసిన వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు కూలీలు తడిసి మోపెడవుతున్నాయన్నారు. సకాలంలో సంచులు అందజేసి ఉంటే ఈ దుస్థితి వచ్చి ఉండేదికాదని ఈపాటికే ఒబ్బిడి చేసుకునే వాళ్లమని వివరించారు. గత మూడు సీజన్లుగా ఇదే పరిస్థితి ఎదురవుతోందని, వచ్చిన సంచులు చాలా వరకు పాడైపోయి ఉంటున్నాయని తెలిపారు. రైతు సేవా కేంద్రాల్లో సరిపడ తేమశాతం ఉందని చెబుతుంటే మిల్లులు వద్ద తేమ ఉందని చెప్పి ధాన్యం తీసుకునేందుకు నిరాకరిస్తుండటంతో గిట్టుబాటు ధరకు కాకుండా వారు చెప్పిన ధరకే అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. మాసూళ్లు ముమ్మరంగా జ రుగుతున్న పెనుమంట్ర, పాలకొల్లు, పెనుగొండ, పోడూరు, వీరవాసరం, ఆచంట తదితర ప్రాంతాల్లో సమస్య ఉన్నట్టు రైతులు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపఽథ్యంలో సంచు లు, పట్టుబడి, రవాణ సమస్యల పరిష్కారానికి చ ర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. సమస్యలపై సివిల్ సప్లయీస్ డీఎం ఇబ్రిహీంను సంప్రదించగా.. జిల్లాలో సంచుల కొరత లేదని, 2 కోట్ల సంచులు అవసరం కాగా ఇప్పటికే 1.70 కోట్ల సంచులు అందించామని, వాటిలో కోటి సంచులు ప్రొక్యూర్ చేయగా మిగిలినవి ఆర్ఎస్కేలోనే ఉన్నాయని తెలిపారు. కష్టాల సాగు ధాన్యం పట్టుబడులకు సంచుల కొరత ఆర్ఎస్కేల చుట్టూ రైతుల ప్రదక్షిణలు పట్టుబడుల కోసం జట్లు దొరక్క ఇక్కట్లు ఆందోళన కలిగిస్తున్న వాతావరణం జిల్లాలో 2.31 లక్షల ఎకరాల్లో రబీసాగు 70 శాతం పూర్తయిన వరికోతలు 9.5 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా కూటమి ప్రభుత్వం వచ్చాక ధాన్యం సేకరణ ప్రక్రియలో కమీషన్ వ్యాపారుల హవానే నడుస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు చెప్పిన వారికే ఆర్ఎస్కేల నుంచి సంచులు సరఫరా చేస్తున్నారని, సన్న చిన్నకారు, కౌలు రైతులను తేమశాతం పేరి ట రోజుల తరబడి తిప్పించుకుంటున్నారని అంటున్నారు. పట్టుబడి కోసం జట్టు సరఫరా, మిల్లులకు ధాన్యం రవాణ అంతా వారి కనుసన్నల్లోనే జరుగుతుందంటున్నారు. ప్రస్తుత దుస్థితికి దళారులే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. -
చిరు వ్యాపారులకు గుదిబండ
● వాణిజ్య సిలిండర్పై ఒక్కసారిగా రూ.993 పెంపు ● హోటల్స్, స్వీట్ షాపులు, చిరు వ్యాపారులకు అదనపు భారం ● టిఫిన్స్, భోజనం రేట్లు పెరిగే అవకాశం పెనుభారమే.. ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి సబ్బిశెట్టి భద్రం. భీమవరంలో చాలా కాలంగా తోపుడు బండిపై బజ్జీల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇప్పుడు వాణిజ్య గ్యాస్ ధర భారీగా పెంచడంతో ఆయన వ్యాపారానికి భారంగా మారింది. చిరు వ్యాపారులకు సబ్సిడీపై గ్యాస్ అందించేలా ప్రభుత్వం చర్యలు కోరుతున్నారు. కమర్షియల్ గ్యాస్తో బజ్జీల వ్యాపారం చేస్తున్న చిరువ్యాపారి (ఫైల్) భీమవరం: గోరుచుట్టుపై రోకలి పోటులా వాణిజ్య గ్యాస్ ధరల పెంపుతో చిరువ్యాపారులు కుదేలవుతున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.993 పెంచి హోటల్స్, చి న్న బడ్డ్డీ కొట్లు నడుపుతున్న వారి పొట్టకొట్టింది. యుద్ధం పుణ్యమా అంటూ గ్యాస్ సక్రమంగా లభించక గత నెలలో చాలామంది తమ వ్యాపారాన్ని మూసివేయగా ఇప్పుడిప్పుడే తిరిగి తెరుచుకునే ప్రయత్నంలో ప డ్డారు. వాణిజ్య గ్యాస్ సక్రమంగా లభించకపోవడంతో కొంత మంది బ్లాక్లో పెద్ద మొత్తం చెల్లించి సిలిండర్స్ కొన్నారు. మరి కొందరు పుల్లల పొయ్యిలపై వంటలు ప్రా రంభించారు. అరకొరగా లభిస్తున్న వాణిజ్య గ్యాస్తో హోటల్స్, స్వీట్స్ షాపులు వంటివి నడుస్తుంటే గ్యాస్ ధర పెంచడంతో ఈ వ్యాపారుల పరిస్థితీ అగమ్యగోచరంగా తయారైంది. అల్పాహారం, భోజనం ధరలకు రెక్కలు జిల్లాలో సుమారు 50 వరకు హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ గ్యాస్ ఏజెన్సీలుండగా వాటి ద్వారా దాదాపు 7 లక్షల వరకు కమర్షియల్, డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్స్ సరఫరా జరుగుతోంది. వాటిలో 6.21 లక్ష ల గృహావసరాల గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి. కమర్షి యల్ గ్యాస్ సిలిండర్ ధర గతంలో రూ.1,800 మా త్రమే ఉండగా అమెరికా–ఇరాన్ యుద్ధం కారణంగా మార్చిలో గ్యాస్ ధర రూ.2,177కు పెంచారు. కనీసం రెండు నెలలు కూడా గడవకముందే కమర్షియల్ గ్యాస్ ధరను రూ.993కు పెంచడంతో ప్రస్తుతం వినియోగదారులు రూ.3,170 చెల్లించాల్సి వస్తుంది. పెరిగిన గ్యాస్ ధరలతో హోటల్స్, బజ్జీ కొట్లు, స్వీట్స్ షాపుల యజమానులు ఆహార పదార్థాల ధరలను పెంచే ప్రమాదముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ అక్రమ వాడకం పెరిగే అవకాశం వాణిజ్య గ్యాస్ ధరలను ప్రభుత్వం పెంచడంతో గృహావసరాల గ్యాస్ సిలిండర్స్ అక్రమ వాడకం పెరిగి గృహ వినియోగదారులకు మరిన్ని ఇబ్బందులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో వాటిని ఉపయోగించే వ్యాపారులు అక్రమంగా డొమెస్టిక్ గ్యాస్ వాడకం పెరుగుతుందని దాంతో బ్లాక్ మార్కెట్ పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఒక పక్క వాణిజ్య గ్యాస్ సిలిండర్లు దొరక్క రోడ్డు పక్క వ్యాపారాలు, హోటల్స్ మూతపడుతున్నాయి. మరోవైపు రేట్లు పెంచేస్తున్నారు. ఇప్పుడు తాజాగా కేంద్రం ప్రభుత్వం సిలిండర్పై దాదాపు వెయ్యి రూపాయలు పెంచి అదనపు భారం మోపింది.
కమర్షియల్ గ్యాస్ ధర ఒక్కసారిగా రూ. 993 పెంచడం దారుణం. ఇప్పటికే గ్యాస్ సక్రమంగా సరఫరా గాక ఇబ్బందులు పడుతుండడంతో గతంలో రోజుకు నాలుగు సిలిండర్స్ వాడగా ప్రస్తుతం రెండు సిలిండర్స్తోనే సరిపెడుతున్నాం. ఫుడ్ ధరలు పెంచక తప్పకపోవచ్చు. – చంద్రిక మూర్తి, చంద్రిక రెస్టారెంట్, భీమవరం కమర్షియల్ గ్యాస్ ధరలు ఇంత భారీగా గతంలో ఎన్నడూ పెరిగిన దాఖలాలు లేవు. పోటీ ప్రపంచంలో అంతంత మా త్రంగానే వ్యాపారంతో నెట్టుకొస్తుంటే గ్యాస్ ధర జీవనానికి గుదిబండగా మారుతోంది. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించి ఆదుకోవాలి. – కనమర్లపూడి రాము, వ్యాపారి, భీమవరం -
సత్వర పరిష్కారం చూపాలి
భీమవరం: స్థానిక పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి నిర్వహించారు. 16 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలపై త్వరితగతిన స్పందించి నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఫోన్లో ఆదేశించారు. మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ యు.రవిచంద్ర, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు. యలమంచిలి: కొంతేరులో పులపర్తి వీరాస్వామి యూత్ క్లబ్ కళామందిర్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన 44వ అఖిల భారత స్థాయి నాటిక పోటీల్లో గోవాడ క్రియేషన్స్ (హైదరాబాద్) వారి అమ్మ చెక్కిన బొమ్మ ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. అభినయ ఆర్ట్స్ (గుంటూరు) వారి అమ్మ చెక్కిన బొమ్మ, తృతీయ ప్రదర్శనగా చైతన్య కళా స్రవంతి (విశాఖ) వారి అగ్నిసాక్షి నాటికలు నిలిచాయి. యూత్ కమిటీ అధ్యక్షుడు అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో పాలకొల్లు చాంబర్స్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ చేగొండి సత్యనారాయణమూర్తి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఉన్నమట్ల కబర్థి, కళాకారుడు మానాపురం సత్యనారాయణ చేతుల మీదుగా నగదుతో పాటు షీల్డ్లు అందజేశారు. యూత్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు పులపర్తి రాజగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజల నుంచి పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ల ద్వారా అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి పీజీఆర్ఎస్లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్లో 81, రెవెన్యూ క్లినిక్లో 40 అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీపై సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎన్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
క్రీడాకారులకు ప్రోత్సాహం అందించాలి
పెనుమంట్ర: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలుగు రాష్ట్రాల క్రీడాకారులకు ఆధునిక పరిపాలన అందుబాటులో తెచ్చి శిక్షణతో పాటు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఒలింపిక్ క్రీడాకారిణి సత్తి గీతారెడ్డి అన్నారు. మార్టేరులో జరిగిన ఉమ్మడి రాష్ట్ర రీజనల్ స్పోర్ట్స్ హాస్టలర్స్ రీ యూనియన్ సర్వసభ్య సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లోని క్రీడాకారులకు ఆధునిక శిక్షణతో పాటు తగిన ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గతంలో క్రీడల్లో రాణించి ప్రస్తుతం ఉన్నత పదవుల్లో ఉన్న పాత తరం క్రీడాకారులు అందిస్తున్న సహకారం సరిపోదని, మరిన్ని స్పోర్ట్స్ స్కూళ్లు, అకాడమీలను అందుబాటులోకి తేవాలని సూచించారు. అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పి. వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, క్రీడలకు పూర్వవైభవం రావాలంటే స్పోర్ట్స్ హాస్టళ్లను పునరుద్ధరించాలని, కోచ్లను క్రమబద్ధీకరించాలని కోరారు. క్రీడాకారులకు బీమా సౌకర్యం కల్పించి, ఉద్యోగ అవకాశాలు పెంచడంతో పాటు క్రీడా గ్రామాల ఏర్పాటుకు ప్రభుత్వాలు భూమి కేటాయించాలని అభ్యర్థించారు. వచ్చే ఏడాది ఈ సమావేశాన్ని తెలంగాణలోని పెద్దపల్లిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. యూనియన్ కార్యదర్శి ఎన్. రామిరెడ్డి మాట్లాడుతూ, రాజధానుల్లో మెయిన్ హాస్టళ్లు, జిల్లాల్లో రీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని, మౌలిక సదుపాయాల కోసం తగిన బడ్జెట్ కేటాయించాలని కోరారు. అడిషనల్ ఎస్పీ కోటీశ్వరరావు క్రీడాకారులకు ఆరోగ్య భీమా కల్పించవలసిన అవసరాన్ని వివరించారు. ఈ సమావేశంలోని పలు సూచనలను త్వరలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు వెంకట్ నారాయణ, అరుణ, రమేష్, అనిత, సురేంద్ర సింగ్ తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి పి.హరికృష్ణ ప్రసాద్, కార్యక్రమ నిర్వాహకుడు సీనియర్ క్రీడాకారులు టి.ఈశ్వర్ రెడ్డి, కర్రి కృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, వెలగల సత్తిరెడ్డి, మల్లెల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఒలింపిక్ క్రీడాకారిణి సత్తి గీతారెడ్డి -
కలగా ఫిషింగ్ హార్బర్
నరసాపురం: సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న నరసాపురంలో దశాబ్దాల కలగా ఉన్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా కూటమి ప్రభుత్వం కీలకమైన ఈ ప్రాజెక్టుపై ఉలుకూ పలుకూ లేకుండా ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసిన ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చూపించడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మొత్తం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధికి సంబంధించిన ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించకపోవడానికి కారణాలు ఏమిటో ప్రభుత్వం చెప్పాలనే డిమాండ్లు ప్రజల నుంచి వస్తున్నాయి. ఈ ఏడాది బడ్జెట్లో ప్రాజెక్టు ఊసే లేకపోవడంతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కలేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో నరసాపురం మండలం బియ్యపుతిప్ప వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి పూనుకున్నారు. 2024 ఎన్నికలకు ముందే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ఉమ్మడి పశ్చిమ జిల్లా అభివృద్ధిలో గీటురాయిగా, మొత్తం గోదావరి జిల్లాలకు మణిహారంగా నరసాపురంలో మేజర్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టింది. బియ్యపుతిప్పలో మేజర్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి 2022 మే నెలలో ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్లు పిలవగా, విశ్వసముద్ర సంస్థ పనులు దక్కించుకుంది. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ చూపించడంతో ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులతో పాటు ఇతర సాంకేతిక అనుమతులు కూడా వెంటనే తెప్పించారు. రూ. 429.43 కోట్ల వ్యయంతో నిర్మించే హార్బర్కు సంబంధించిన ప్రాథమిక పనులు 2023 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి. మత్స్యకారులను నమ్మించి మోసం అయితే చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హార్బర్ అంశం మూలనపడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు పనులను పట్టాలెక్కించడంలో కూటమి సర్కార్ నిర్లక్ష్యానికి కారణాలు ఏమిటనే అంశం ఎవరికీ అర్థంకాకుండా ఉండటం గమనార్హం. పనులు దక్కించుకున్న విశ్వసముద్ర సంస్థ ఎన్నికలకు ముందు ప్రాథమిక సర్వే వంటి పనులు చేసింది. చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత సదరు సంస్థ పనులు చేపట్టేందుకు వెనకడుగు వేసింది. 19 కిలోమీటర్ల సముద్ర తీరప్రాంతం ఉన్న నరసాపురంలో బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ నిర్మించాలనే డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న మత్స్యకారుల ఓట్లు దండుకోవడానికి ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఫిషింగ్ హార్బర్ నిర్మించి తీరుతామని ఎన్నో ప్రకటనలు గుప్పించారు. నిర్మాణానికి అన్నీ గత ప్రభుత్వం సిద్ధం చేసినా కూడా ప్రస్తుత చంద్రబాబు సర్కార్ పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని దశాబ్దాలుగా మత్స్యకారులు కోరుతున్నారు. నరసాపురంలో హార్బర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ఖర్చు భరించేలా మా హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం చేశారు. పర్యావరణ అనుమతులతో పాటు ఇతర అన్ని సాంకేతిక అనుమతులు వచ్చేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. టెండర్లు పిలిచి, పనులు విశ్వసముద్ర సంస్థకు అప్పగించాం. పనులు ప్రాథమికంగా ప్రారంభమయ్యాయి కూడా. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పనులు ఎందుకు మొదలు పెట్టించడంలేదనేది అర్థం కావడం లేదు. –ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్య సంపద, ఆక్వా ఎగుమతుల్లో ఉమ్మడి పశ్చిమ జిల్లాకు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ నుంచి దేశ, విదేశాలకు భారీగా ఆక్వా ఎగుమతులు జరుగుతుంటాయి. రొయ్యలు, చేపల సాగు పెరగడంతో ఆక్వా రంగం గడిచిన మూడు దశాబ్దాల కాలంలో బాగా పుంజుకుంది. ఏటా కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆక్వా ద్వారా జిల్లా నుంచి ప్రభుత్వానికి వస్తోంది. మరోవైపు తీరప్రాంతంలో సముద్ర మత్స్య సంపద ద్వారా కూడా భారీగా ఆదాయం సమకూరుతుంది. ఏటా నరసాపురం తీరంలో రూ. 300 కోట్ల విలువ చేసే మత్స్య ఎగుమతులు సాగుతాయి. కానీ హార్బర్ లాంటి మౌలిక వసతులు ఉంటే మరో 40 శాతం ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంతోనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హార్బర్ నిర్మాణానికి పూనుకుంది. బియ్యపుతిప్ప వద్ద ఫిషింగ్ హార్బర్ను 600 ఎకరాల విస్తీర్ణంలో రూ. 429.43 కోట్ల భారీ వ్యయంతో నిర్మించ తలపెట్టి పనులు మొదలుపెట్టింది. హార్బర్కు సమీపంలోని 216 జాతీయ రహదారిని అనుసంధానం చేయడం, మరోవైపు పక్కనే ఉన్న మచిలీపట్నంలో కూడా హార్బర్ పనులు చేపట్టడం గత ప్రభుత్వం చేసింది. ఇంత ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికై నా రాష్ట్ర సర్కార్ స్పందించాలనే డిమాండ్లు జిల్లా వాసుల నుంచి వస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిర్మాణానికి గ్రహణం రూ 429.43 కోట్లతో నిర్మాణానికి శ్రీకారం చుట్టిన జగన్ సర్కార్ టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసిన గత ప్రభుత్వం -
ఆంధ్రా కాల్వను బాగు చేయాలి
చింతలపూడి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రా కాల్వ మరమ్మతు పనులకు నిధులు కేటాయించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాల్వపై ఆధారపడి ఉన్న పంట కాల్వలను కూడ మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాకాలానికి ముందే పూడిక తీసి బాగు చేసుకుంటే సాగు నీరు చివరి పొలాలకు కూడ చేరడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. చింతలపూడి మండలం రాఘవాపురం ఇరిగేషన్ సెక్షన్ పరిధిలో ఉన్న ఆంధ్రా కాల్వ పూడుకుపోయి దశాబ్దాలు దాటింది. అనేక చోట్ల గండ్లు పడ్డాయి. అవి పూడ్చమని ఆయకట్టు రైతులు సంవత్సరాలుగా మొర పెట్టుకుంటున్నా పూడ్చడం లేదు. దీంతో ఏటా వరద నీరు పంటపొలాలపై నుంచి ప్రవహించి వృథాగా పోతూంది. 1967లో ఏలూరు జిల్లాలోని మెట్ట ప్రాంతంలో 21 చెరువులకు సాగు నీరు అందించడానికి ఖమ్మం జిల్లా ,తుమ్మూరు వద్ద ఆనకట్ట నిర్మించారు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లోని చింతలపూడి మండలంలో 18 కిలోమీటర్ల పొడవున కాల్వ నిర్మాణం చేపట్టి వరద నీటిని సాగునీటి చెరువులకు మళ్ళిస్తున్నారు. మండలంలో దాదాపు 11 వేల ఎకరాలకు అధికారికంగాను, అనధికారికంగా మరో 10 వేల ఎకరాలకు ఏటా సాగునీరు అందుతోంది. దీంతో పాటు జిల్లాలోని చింతలపూడి మండలం, నాగిరెడ్డిగూడెం వద్ద నిర్మించిన తమ్మిలేరు ప్రాజెక్టు సైతం ఆంధ్రా కాల్వ ద్వార వచ్చే వరద నీటిపై ఆధారపడి ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2023లో అప్పటి ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్బాబు ఆంధ్రా కాల్వ మరతుత్తులకు తన పార్లమెంట్ నిధుల నుంచి 30 లక్షలు కేటాయించారు. దీంతో కొంత మేర మరమ్మతు పనులను పూర్తి చేశారు. మిగిలిన నిధులు మంజూరు చేసి కాల్వను మరమ్మతు చేయాల్సి ఉంది. -
గుబ్బల మంగమ్మ తల్లి గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అధికంగా తరలివచ్చిన భక్తుల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారితోపాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు. కుక్కునూరు: మండలంలోని వేలేరు గ్రామ సమీపంలో ఆదివారం రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం గుండాలపాడు గ్రామానికి చెందిన మడకం కన్నారావు (28) తన బైక్పై వేలేరు మీదుగా భద్రాచలం వెళ్తుండగా, ఎదురుగా మరో బైక్పై వచ్చిన వెంకటాపురం గ్రామానికి చెందిన కొండ చిట్టిబాబు ఆటోను ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో కన్నారావు బైక్ను ఢీకొట్టాడు. దీంతో రోడ్డుపై పడిపోయిన కన్నారావు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలోని గుబ్బల మంగమ్మ తల్లి గుడి సమీపంలో కింగ్ కోబ్రా (గిరినాగు) సంచరిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు కోర్స రాంబాబు, కోర్స గంగరాజులు తెలిపారు. ఆదివారం సాయంత్రం వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట మండలం కావిడగుండ్ల, ఏపీలోని బుట్టాయగూడెం మండలం సరిహద్దు అటవీ ప్రాంతంలో, గుడికి అత్యంత సమీపంలో నీటి కుంట వద్దకు ఈ పాము వచ్చి నీరు తాగి వెళ్తుండగా కొందరు యువకులు చూసినట్లు తెలిపారు. ఆ యువకులు తమ సెల్ఫోన్లో వీడియో కూడా తీశారు. సుమారు 18 అడుగుల పొడవు ఉన్న ఈ గిరినాగు జంతువుల రక్తం వాసనకు గుడి పరిసర ప్రాంతాల్లో తిరిగే అవకాశం ఉన్నందున, భక్తులతో పాటు పరిసర ప్రాంత ప్రజలు అడవిలోకి వెళ్లవద్దని సూచించారు. అటవీ శాఖ అధికారులు కూడా ప్రజలను హెచ్చరిస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతం నుంచి పెద్ద పులి బుట్టాయగూడెం మండలంలోకి ప్రవేశించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. చాట్రాయి: భూ సమస్య పరిష్కరించాలంటూ బాధితుడు వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. బాధితుడి వాంగ్మూలం ప్రకారం.. మర్లపాలెం గ్రామానికి చెందిన వాసం సత్యం 40 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన వెల్ది నాభూషణం, భూషయ్యల దగ్గర 6 సెంట్లు భూమి కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ భూమిలోనే 40 ఏళ్లుగా సత్యం కొడుకు వాసం రమేష్ కుటుంబం నివాసం ఉంటున్నారు. ఆదివారం భూమి అమ్మిన వారి వారసులు వేగుంట రామకృష్ణ, వంశీకృష్ణలు తమ ఇంటిని ఆక్రమించుకోవడానికి పోలీసులు, రెవెన్యూ సిబ్బందిని తీసుకుని కొలతలు కొలుస్తుండగా తట్టుకోలేక, రమేష్ తన పిల్లలతో కలిసి వాటర్ ట్యాంకు ఎక్కాడు. సమస్య పరిష్కరించకపోతే దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఎస్ఐ డి. రామకృష్ణ ఇరువర్గాల వద్ద ఉన్న డాక్యుమెంట్లు తీసుకుని, సోమవారం నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు కిందకు దిగారు. -
అలరించిన నాటికలు
యలమంచిలి: కొంతేరు గ్రామంలోని శ్రీ పులపర్తి వీరాస్వామి యూత్ క్లబ్ కళామందిర్ ఆధ్వర్యంలో జరుగుతున్న 44వ అఖిల భారత స్థాయి నాటిక పోటీల ముగింపు రోజైన ఆదివారం రెండు నాటికలు ప్రదర్శించారు. మొదటి నాటిక మనిషి వ్యక్తిత్వం గురించి, రెండవ నాటిక వివాహ బంధం ప్రాశస్త్యం గురించి సాగి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మూడో రోజు నాటక ప్రాంగణానికి భీమవరం పట్టణానికి చెందిన దివంగత తిరుమల కామేశ్వరరావు పేరును నామకరణం చేశారు. ప్రతి మనిషి జీవితంలో ఒక లక్ష్యం ఏర్పరచుకుని, దాని సాధనకు రాజీ పడకుండా ఎలా కృషి చేయాలో గుంటూరు అభినయ ఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘ఇది అతని సంతకం’ నాటికలో అద్భుతంగా చూపారు. ఈ నాటిక దర్శకుడు ఎన్. రవీంద్రరెడ్డి కథానాయకుడు కృష్ణమూర్తి పాత్రలో నటిస్తూ, జీవిత చరమాంకంలో భార్యాభర్తలు ఎలా ప్రణాళికాబద్ధంగా జీవించాలో చూపించారు. మరో నాటికగా విశాఖపట్నం చైతన్య కళా స్రవంతి వారిచే ‘అగ్ని సాక్షి’ ప్రదర్శితమైంది. వివాహ బంధం పవిత్రమైనదని, అందులో ప్రణయం ఉండాలి తప్ప తప్పుడు అడుగులు వేస్తే ప్రళయం తప్పదని రచయిత మాడభూషి దివాకర్బాబు, దర్శకుడు పి. బాలాజీ నాయక్ కళ్లకు కట్టినట్లు చూపారు. ఈ పోటీల నిర్వహణలో యూత్ క్లబ్ కార్యవర్గ సభ్యులు అంబటి మురళీకృష్ణ, గంటా ముత్యాలరావు, బోణం రవిబాబు, జక్కంశెట్టి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
పెద్దింట్లమ్మా.. వరాలివ్వమ్మా
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ.. నీ చల్లని దీవెనలందించమ్మా. అంటూ భక్తులు ఆర్తితో వేడుకున్నారు. సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆదివారం పెద్దింట్లమ్మను దర్శించుకున్నారు. పవిత్ర కోనేరులో స్నానాలాచరించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈఓ కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ.. ఒక్క ఆదివారమే ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి ఫొటోల అమ్మకం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ. 62,445 ఆదాయం వచ్చిందని చెప్పారు. భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. గణపవరం: గణపవరం బస్టాండు ఏరియాలో శనివారం రాత్రి ఓ చుక్కల దుప్పి ప్రత్యక్షమైంది. దీనిని గుర్తించిన స్థానికులు గణపవరం పోలీసులకు సమాచారం అందించారు. అటవీ ప్రాంతం నుంచి తప్పిపోయి జనావాసాల్లోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. బస్టాండు వద్ద నుంచి వెంకయ్య కాల్వ గట్టు వెంబడి చెట్ల మధ్యలో ఈ జింక సంచరిస్తూ కనిపించింది. దీనిని గమనించిన స్థానిక యువకులు సలాది అజయ్, చిలకా రమేష్లు చాకచక్యంగా దానిని బంధించారు. గణపవరం ఎస్ఐ మణికుమార్ తన సిబ్బందితో ఆ ప్రాంతానికి వచ్చి, దుప్పిని బస్టాండు వద్దనున్న శివాలయం ఆవరణలో సురక్షితంగా ఉంచారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం ఉదయం గణపవరం వచ్చిన భీమవరం రేంజ్ ఫారెస్ట్ అధికారి ఎం.కరుణాకర్ సదరు చుక్కల దుప్పిని పరీక్షించి ఆరోగ్యంగానే ఉన్నట్లు నిర్ధారించారు. దీనిని నిర్దేశిత పద్ధతుల ద్వారా తరలిస్తామన్నారు. సహజంగా ఇది చాలా బెదురు జంతువని, ఎక్కువ భయానికి లోనైతే శ్రీక్యాప్చర్ మయోపతిశ్రీకి గురై చనిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. రాజమండ్రి ప్రాంతీయ వన్యప్రాణి సంరక్షణ మరియు చికిత్స కేంద్రం సిబ్బంది వచ్చి దీనికి మత్తు ఇచ్చి, సోమవారం ఉదయమే అటవీ ప్రాంతానికి తరలిస్తామని ఆయన తెలిపారు. జనసంచారం, కేకల వల్ల జంతువు భయపడే ప్రమాదం ఉందన్న అటవీ అధికారుల సూచనతో ఎస్సై మణికుమార్ ఆ ప్రాంతంలో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. -
అటకెక్కిన పేదల బీమా పథకం
భీమవరం (ప్రకాశం చౌక్): పేద, మధ్యతరగతి కుటుంబానికి చెందిన యజమాని చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి అమలు చేసే బీమా పథకాన్ని ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల బీమా పథకం గురించి ఊసే ఎత్తడం లేదు. గత రెండేళ్లుగా బీమా క్లయిమ్స్పై పైసా ఖర్చు చేయలేదు. దాంతో కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోయిన కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పేదవాడి కుటుంబానికి బీమా చెల్లించడానికి నిధులు లేవని సాకు చూపిస్తున్న చంద్రబాబు, యోగా కోసం ఒక రోజుకు రూ.300 కోట్లు ఖర్చు చేశారు. ప్రమాదవశాత్తు చనిపోతే రూ.5 లక్షల బీమాను నామినీగా ఉన్న లబ్ధిదారులకు అందించాల్సి ఉంది. పోస్టుమార్టం రిపోర్ట్, పోలీసు నివేదికలు ఇలా అన్ని అర్హత పత్రాలు సిద్ధంగా ఉన్నప్పటికీ, అర్హులైన వారికి బీమా అందడం లేదు. శ్రీచంద్రన్న బీమాశ్రీగా పేరు మార్చి, ప్రమాదవశాత్తూ మరణించిన వారికి ఇచ్చే సాయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకూ ఆ పథకం ఊసే ఎత్తడం లేదు. పేదలను ఆదుకునే బీమా పథకాన్ని నిలిపివేయడం దారుణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1500 మంది వరకు.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో ప్రమాదవశాత్తు, సహజంగా మరణించి బీమా పథకానికి అర్హులైన వారు ఉమ్మడి జిల్లాలో సుమారు 1500 మంది వరకు ఉన్నారు. వీరిలో ప్రమాదవశాత్తు చనిపోయిన వారు 600 మంది ఉండగా, సహజ మరణం పొందిన వారు మరో 600 మంది ఉన్నారు. అలాగే ప్రమాదాల్లో శాశ్వత లేదా పాక్షిక అంగవైకల్యం పొందిన వారు 300 మంది వరకు ఉన్నారు. వీరంతా బీమా పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బీమా కోసం ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి కూడా అవకాశం లేకపోవడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గత ప్రభుత్వంలో.. రూ. 5 లక్షల బీమా చెల్లింపు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీవైఎస్సార్ బీమాశ్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసింది. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల లోపు వారు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షలు, 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు వారు సహజ మరణం పొందితే రూ.లక్ష అందించేవారు. అలాగే శాశ్వత అంగవైకల్యానికి రూ.5 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.2.50 లక్షల బీమా సొమ్మును చెల్లించేవారు. దీంతో బాధిత కుటుంబాల బతుకుదెరువు సాఫీగా సాగేది. ఎవరైనా వ్యక్తి చనిపోయారని తెలిసిన వెంటనే సచివాలయ సిబ్బంది బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి వెంటనే బీమా క్లయిమ్ కోసం ఆన్లైన్ చేసేవారు. దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే నామినీ బ్యాంకు ఖాతాలో బీమా సొమ్ము జమ అయ్యేది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఏడాదికి సగటున రూ. 10 కోట్లు బీమా కోసం ప్రభుత్వం ఖర్చు చేసేది. కూటమి ప్రభుత్వంలో నిలిచిపోయిన చెల్లింపులు రెండేళ్లుగా పైసా చెల్లింపు చేయని వైనం ఉమ్మడి జిల్లాలో రెండేళ్లలో ప్రమాదాల్లో చనిపోయిన వారు 600 మంది సహజ మరణం పొంది అర్హత కలిగిన వారు 600 మంది బీమా కోసం ఎదురుచూపులు గత ప్రభుత్వంలో (2023–24) బీమా చెల్లింపులు: పశ్చిమగోదావరి జిల్లా వివిధ ప్రమాదాల్లో మరణించిన వారు 50 మంది కాగా, వారికి రూ. 2.50 కోట్ల బీమా చెల్లింపు.. అర్హత కలిగి సహజ మరణం పొందిన 300 మందికి రూ.3 కోట్ల ఆర్థిక సాయం ఏలూరు జిల్లా ప్రమాదవశాత్తూ మరణించిన వారు 45 మందికి రూ.2.25 కోట్లు సహజ మరణం పొందిన 381 మందికి రూ.3.81 కోట్ల బీమా సొమ్ము చెల్లింపు కూటమి ప్రభుత్వంలో రెండేళ్ల బీమా చెల్లింపులు: ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ప్రమాదవశాత్తు చనిపోయిన 600 మందికి, సహజ మరణం పొందిన 600 మందికి బీమా చెల్లింపులు సున్నా -
అల్లూరులో ఆరకమణల జోరు
● దేవస్థానం, ఆర్అండ్బీ భూముల్లో పాగా ● కూటమి నేత అండతో రెచ్చిపోతున్న అక్రమార్కులు సాక్షి టాస్క్ఫోర్స్: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో దేవస్థాన భూములకు రక్షణ కరువయ్యింది. అలాగే ఆర్అండ్బీ రోడ్డు పక్కనే అక్రమార్కులు పాగా వేస్తున్నారు. పబ్లిక్గా పరజాలు అడ్డుపెట్టి మరీ అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నా ప్రభుత్వాధికారులు పట్టించుకోవడం లేదు. కై కలూరు నియోజకవర్గంలో ఇప్పటికే అర్అండ్బీ, ఇరిగేషన్, దేవస్థాన భూములను పలువురు కబ్జాలు చేసి షాపింగ్ కాంప్లెక్సులు కట్టేశారు. ఈ తంతూ నియోజకవర్గం మొత్తం పాకింది. పురాతన దేవస్థానం భూముల్లో.. ముదినేపల్లి మండలం అల్లూరులో పురాతన పార్వతీ సమేత సోమేశ్వరస్వామి దేవస్థానం ఉంది. దేవస్థానానికి పూర్వం దాతలు 3.79 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. దేవస్థానం నుంచి ఆర్అండ్బీ రోడ్డు వరకు, రోడ్డు దాటిన తర్వాత పొలాలు దేవస్థానం భూములుగా ఉన్నాయి. చాలా ఏళ్ల క్రితం రోడ్డుకు కుడివైపున దేవస్థాన భూమిలో కొందరు నివాసాలు, దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. దేవదాయశాఖ కోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు ప్రకారం నెలకు రూ.1,000 చొప్పున అద్దెను ఆక్రమణదారులు దేవస్థానానికి చెల్లిస్తున్నారు. వీటిని ఎప్పటికై నా తొలగించే అవకాశం ఉంది. పరదాలు కట్టి మరీ.. రోడ్డుకు ఎడమ వైపున బస్టాండ్, ఆంజనేయస్వామి ఆలయం ఉంది. దీని వెనుక దేవస్థానం పంట భూములు ఉన్నాయి. ఓ వ్యక్తి దేవస్థాన భూమిలో ఏకంగా ఇంటి నిర్మాణానికి ప్రయత్నిస్తే రెండు రోజుల క్రితం ఆలయ ఈఓ శింగనపల్లి శ్రీనివాసరావు, రెవెన్యూ, పోలీసు అధికారులతో వెళ్లి వాటిని తొలగించారు. అలాగే చాలా మంది ఆర్అండ్బీ రోడ్డు సమీపంలో పరదాలు కట్టుకుని మరీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వాస్తవానికి ఆక్రమణదారులు పంట బోదెను సైతం పూడ్చివేశారు. ఇదే రోడ్డుకు చివరన కూటమి నేత అండతో కబ్జా చేయడానికి ప్రయత్నించి మీడియాలో అల్లరవ్వడంతో ఆ ప్రాంతంలో దేవస్థానం పేరుతో చలివేంద్రం ఏర్పాటుచేశారు. ఇటు ఆర్అండ్బీ దాని సమీపంలో దేవస్థాన భూమిని కొట్టేయడానికి శతవిధాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోడ్డు సమీపంలో ప్రైవేట్ భూములు సెంటు రూ.80 వేలు ధర పలుకుతోందని అంచనా. ఆక్రమించుకోండి.. అండగా ఉంటాను అక్రమార్కులకు గ్రామంలో ఓ కూటమి నేత అండగా ఉన్నాడు. దేవస్థానం భూములు ఆక్రమించుకున్న జాబితాలో అతడి బంధువులు ఉన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే మరింత చెలరేగి పోయి ఆక్రమణలకు ఆజ్యం పోస్తున్నాడు. గ్రామంలో వర్గాలుగా విభజించి పెత్తనం చెలాయిస్తున్నాడు. అధికారపక్ష నేతలతో అంటకాగడంతో అధికారులు సైతం అతడికి అడ్డు చెప్పలేకపోతు న్నారు. ఏకంగా దేవస్థాన భూమిలో సైతం సంక్రాంతికి పేకాట, కోడిపందాలు జరుగుతుంటే ఏం చేయలేని పరిస్థితిలో అధికారులు చూస్తున్నారు. అల్లూరు దేవస్థానం భూమి కోర్టులో ఉండగా ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి ప్రయత్నించాడు. రెవెన్యూ, పోలీసు సహకారంతో తొలగింపజేశాం. పంట బోదె, డ్రెయిన్లనూ ఆక్రమిస్తున్నారు. రెవెన్యూ అధికారులకు ఈ విషయంపై దేవస్థానం తరఫున ఫిర్యాదు చేస్తాం. – శింగనపల్లి శ్రీనివాసరావు, సోమేశ్వర దేవస్థానం ఈఓ, అల్లూరు -
వేడుకగా వసంతోత్సవం
ద్వారకాతిరుమల: శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఉదయం స్వామి, అమ్మవార్లకు వసంతాలను సమర్పించి, చూర్ణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారిని కీర్తిస్తూ అర్చకులు, మహిళా భక్తులు వడ్లు దంచారు. ఆ తరువాత రాజాధిరాజ వాహనంపై శ్రీవారికి తిరువీధి సేవను నిర్వహించి, భక్తులకు వసంతాలను అందజేశారు. రాత్రి ఆలయంలో స్వామి వారికి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగోత్సవాన్ని అర్చకులు, పండితులు వైభవోపేతంగా నిర్వహించారు. ద్వాదశ కోవెల ప్రదక్షిణలు ఉభయ దేవేరులతో శ్రీవారికి రాత్రి ఆలయంలో 12 ప్రదక్షిణలు, 12 సేవా కాలాలు, 12 రకాల పిండి వంటలతో నివేదనలు జరిపారు. అందులో అర్చకులు, పండితులు, భక్తులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో సేవాకాలాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీపుష్ప యాగోత్సవాన్ని వైభవోపేతంగా జరిపారు. ఆలయ ముఖ మండపంలో శయన మహావిష్ణువు అలంకారంలో ఉన్న స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించారు. అలాగే శ్రీహరి కళాతోరణ వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నేటి నుంచి ఆర్జిత సేవలు శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో రద్దు చేసిన నిత్యార్జిత కల్యా ణాలు, ఆర్జిత సేవలను సోమవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. భీమవరం: ఆకివీడులో దళితులపై అక్రమ కేసు లు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులకు అండగా నిలవడానికి వెళుతున్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ను భీమవరంలో శనివారం అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పుష్ప రాజ్ మాట్లాడుతూ కులమతాలను రెచ్చగొట్టేలా ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు చేస్తున్న అరాచకాలను తక్షణం ఆపాలన్నారు. రఘురామ వ్యవహారంపై ప్రభుత్వం కలుగజేసుకుని చట్టం అందరికీ ఒకేలా వర్తించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆకివీడులో నిజనిర్ధారణ, పీస్ కమిటీలు ఏర్పాటుచేసి శాంతియుత వాతావరణానికి కృషి చేయాలన్నారు. లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన వారిలో రాష్ట్ర కార్యదర్శి నేతల సువర్ణరాజు, జిల్లా అధ్యక్షుడు ఇంటి సుందరకుమార్, తోర్లపాటి భాగ్యరాజ్, దాసరి చిరంజీవి తదితరులు ఉన్నారు. భీమవరం: జిల్లాలో రాబోయే రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశమున్నందున రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని పౌరసరఫరాలశాఖ డీఎం ఎం.ఇబ్రహీమ్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని, పంటను గట్టుకు చేర్చి భద్రపరుచుకోవాలన్నారు. తేమ శాతం పెరగకముందే కోత యంత్రాలతో మాసూళ్లుకు సిద్ధం కావాలన్నారు. ధాన్యం విక్రయాల్లో ఇబ్బందులుంటూ కంట్రోల్ రూమ్ 81216 76653 నంబర్లో సంప్రదించాలని కోరారు. వీరవాసరం: మానసిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు ఏ ఎస్సై వీరభద్రరావు తెలిపారు. ఆయన తెలిపి న వివరాల ప్రకారం.. పాలకోడేరు మండలం కొండేపూడికి చెందిన కడలి శ్రీనివాస్ (40) కొన్నేళ్లుగా భార్యతో వేరుగా ఉంటున్నాడు. నెలమూరులో సైకిల్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 2న శ్రీనివాస్ ఉత్తరపాలెం వెళ్లాడు. మానసికంగా కుంగిపోయిన శ్రీనివాస్ ఉత్తరపాలెంలోని బీఎస్ఎన్ఎల్ టవర్ వద్ద ఉరి వేసుకుని మృతిచెందాడు. కుటుంబసభ్యులు రత్నకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై చెప్పారు. -
ప్రశాంతంగా నీట్
భీమవరం: స్థానిక డీఎన్నార్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు ఉదయం నుంచే అభ్యర్థులు రావడం మొదలైంది. డీఎన్నార్లోని రెండు పరీక్షా కేంద్రాల్లో 1,154 మంది విద్యార్థులకు 1,109 మంది హాజరయ్యారు. నిబంధనలు కఠినంగా అమలు నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హైరానా పడ్డారు. ప్రత్యేకమైన దుస్తులు ధరించడంతో పాటు కాళ్లకు పట్టీలు, చెవులకు రింగులు, చేతికి తాళ్లు, మెడలో ఆభరణాలు వంటివి ధరించకూడదనే నిబంధనతో కేంద్రం బయట వాటిని తొలగించేందుకు తల్లిదండ్రులు సహాయం చేశారు. తల్లిదండ్రుల పడిగాపులు : పరీక్షకు హాజరైన వారిలో ఎక్కువ మంది విద్యార్థినులే ఉన్నారు. వారు పరీక్ష రాసి వచ్చేవరకూ తల్లిదండ్రులు కేంద్రం చుట్టుపక్కలే వేచి ఉన్నారు. ఉదయం ఆకాశం మబ్బులతో ఉన్నా ఉక్కపోతతో తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు. కేంద్రం వద్ద తనిఖీలు, చెవిదిద్దులు తీస్తూ.. -
పడకేసిన వైద్యం
ప్రజారోగ్యానికి కూటమి సర్కారు నిర్లక్ష్య రోగం పట్టింది. అరకొర మందులు, వైద్య సిబ్బంది కొరత, వైద్యులు సకాలంలో రాక రోగుల పడిగాపులు, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక దుర్గంధం వెదజల్లుతున్న వార్డులు, టాయిలెట్స్, సౌకర్యాల లేమి.. రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఓపీ వద్ద నుంచే రోగులకు అవస్థలు మొదలవుతున్నాయి. అడుగడుగునా సమస్యలతో అత్యవసర వైద్యం గగనమవుతుంది. జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో ఎన్నో సమస్యలు వెలుగుచూశాయి. సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026సాక్షి, భీమవరం: జిల్లాలో ఒక జిల్లా ఆరోగ్య కేంద్రం, నాలుగు ఏరియా ఆస్పత్రులు, మూడు సీహెచ్సీలకు గాను 19 మంది వైద్యుల పోస్టులు ఖాళీ ఉన్నాయి. 34 పీహెచ్సీలు, 18 యూపీహెచ్సీల్లో 68 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా 56 మంది, ల్యాబ్ టెక్నీషియన్స్ 34 మందికి 24 మంది, ఫార్మాసిస్టులు 34 మందికి 21 మంది, క్లాస్–4 సిబ్బంది 34 మందికి 17 మంది, ఎస్ఏడబ్ల్యూ సిబ్బంది 34 మందికి 15 మంది మాత్రమే ఉన్నారు. ● భీమవరం ఏరియా ఆస్పత్రిలో ముగ్గురు వైద్యులు, ఎక్స్రే విభాగంలో టెక్నీషియన్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 15 మంది పారిశుద్ధ్య కార్మికులు అవసరం కాగా తొమ్మిది మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఎముకలు, కంటి వైద్యానికి సంబంధించి సరైన సదుపాయాలు లేవు. బీపీ ముందులు, కాల్షియం, దగ్గు మందులు కొరతతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగాలేక టాయిలెట్స్, పాత ఆస్పత్రి భవనంలో వార్డులు దు ర్వాసన వెదజలుతున్నాయి. ల్యాబ్లో ఎంఆర్ఐ, సి టీ స్కానింగ్, థైరాయిడ్ పరీక్ష సౌకర్యం లేదు. కుటుంబ నియంత్రణలకు సంబంధించి ప్రత్యేక విభాగం లేక ఆపరేషన్లు జరగడం లేదు. ● మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లులోని ఏరియా ఆస్పత్రి కోసం గత వైఎస్సార్ ప్రభుత్వం రూ.12.60 కోట్లతో నిర్మించిన భవనం ఇంకా ప్రారంభానికి నోచుకోక పాత భవనంలోనే ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. మహిళల వార్డులో ఫ్యాన్లు తిరగక బాలింతలు, గర్భిణు లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎండ వేడికి తాళలేక ఇళ్ల వద్ద నుంచి టేబుల్ ఫ్యాన్లు తెచ్చుకుని తమ బెడ్లు వద్ద ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి కనిపించింది. రోగులకు అందించే ఆహారం నాణ్యత ఉండటం లేదని, ఉదయం టిఫిన్ 9.30 గంటల తర్వాత, మధ్యాహ్నం భోజనం 1.30 తర్వాత అందజేస్తున్నారని రోగుల బంధువులు తెలిపారు. అన్నం గడ్డలు కట్టి ఉండటంతో బయటి నుంచి భోజనం తెచ్చుకుంటున్నామని చెప్పారు. ఆస్పత్రి పరిసరాలు సరిగా లేక ఇన్పేషెంట్లు ఇబ్బంది పడాల్సి వస్తోంది. అంబులెన్స్ ఉన్నా పర్మినెంట్ డ్రైవర్ లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఎవరినో ఒకరిని ఏర్పాటు చేసి పంపిస్తున్నారు. ● తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో వై ద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఆస్పత్రి విస్తీర్ణంతో పాటు బెడ్స్కు తగ్గట్టు శానిటరీ వర్కర్స్ లేక పారిశుద్ధ్య నిర్వహణ లోపిస్తోంది. పూర్తిస్థాయి రేడియాలజిస్ట్లు అందుబాటులో లేకపోవడంతో గర్భిణులు మినహా ఇతరులు ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయించాల్సి వస్తుంది. మత్తు వైద్యుడు ఒక్కరే ఉండడంతో రాత్రి సమయాల్లోను, ఆదివారం రోజుల్లో ప్రైవేటు మత్తు వైద్యుడిని తీసుకురావాల్సి వస్తుంది. సేవలు నిమిత్తం కిందిస్థాయి సిబ్బంది రూ.100 నుంచి రూ.200 వరకు తీసుకుంటున్నట్టు రోగుల బంధువులు చెబుతున్నారు. ● పెనుగొండలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ లేక గర్భిణులు వైద్యం కోసం పాలకొల్లు, తణుకు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో పేద మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యమైన ఆర్థోపెడిక్, గైనకాలజిస్ట్ డాక్టర్లు లేరు. జనరల్ డ్యూటీ అటెండర్లు కేవలం ముగ్గురే ఉండడంతో రోగులకు సదుపాయాలు అందించేవారు కరువయ్యారు. చాలీచాలని బెడ్లతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. బెడ్ ఖాళీ లేని సమయంలో తణుకు, పాలకొల్లులోని ప్రభుత్వ ఆస్పత్రులకు సిఫార్సు చేస్తున్నారు. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ తణుకు, పెనుగొండలకు ఒకరే సిబ్బంది కావడంతో వారు వచ్చే వరకూ వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ● నరసాపురంలోని ఏరియా ఆస్పత్రిలో సకాలంలో వైద్యులు విధులకు హాజరుకాక రోగులు పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఓపీ రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన కౌంటర్లు ఏర్పాటుచేయక రోగులు గంటలు తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. ఎక్స్రే యూనిట్ సరిగా పనిచేయక రోగులను ప్రైవేట్ ల్యాబ్లకు పంపిస్తున్నారు. పవర్కట్ల సమయంలో ఆస్పత్రిలోని జనరేటర్ను కేవలం ఆపరేషన్ థియేటర్ కోసం మాత్రమే వినియోగిస్తుండటంతో రోగులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ● తాడేపల్లిగూడెంలోని ఏరియా ఆస్పత్రిలో నా లుగు వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్నెట్ పనిచేయక ఓపీ రిజిస్ట్రేషన్ ఆరుబయట ఏర్పాటుచేయడంతో రోగులు ఎండలో నిల్చోవాల్సి వస్తుంది. బలం కోసం ఇచ్చే టానిక్లు, కొన్ని రకాల మందులను బయట కొనుక్కోమని చెబుతున్నారని రోగులు అంటున్నారు. వార్డుల్లోని బెడ్లు సరిగా లేక రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ● ఆకివీడులోని సీహెచ్సీలో జనరల్ సర్జన్ పోస్టు ఖాళీగా ఉండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో మాదిరి వైద్యసేవలు అందడం లేదని ఆస్పత్రికి వచ్చిన వారు చెబుతున్నారు. గతంలో సదరం క్యాప్ ఆకివీడు సీహెచ్సీలో జరిగేది. ప్రస్తుతం సదరం క్యాంపులు నిర్వహించడం లేదు. తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రి బయట ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్ భీమవరం ఏరియా ఆస్పత్రిలో జనరల్ వార్డు జిల్లా ఆస్పత్రి తణుకు ఏరియా ఆస్పత్రులు భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం సీహెచ్సీలు ఆకివీడు, ఆచంట, పెనుగొండ పీహెచ్సీలు 34 యూపీహెచ్సీలు 18 రోజువారీ ఓపీ 15,500 ప్రభుత్వాస్పత్రులకు సుస్తీ ప్రజారోగ్యంపై కూటమి నిర్లక్ష్యం మందుల కోత, అధ్వానంగా పారిశుద్ధ్య నిర్వహణ భర్తీకి నోచుకోని పోస్టులు మందులు, రక్త పరీక్షల కోసం బయటకు సిఫార్సులు దుర్గంధం వెదజల్లుతున్న వార్డులు ఓపీ నమోదుకు తప్పని తిప్పలు -
ఉపాధ్యాయ సమస్యలపై వైఎస్సార్టీఏ పోరు
తణుకు అర్బన్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కా రం కోసం వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ (వైఎస్సార్టీఏ) నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వైఎస్సార్టీఏ ఆధ్వర్యంలో ఈనెల 6న ఉదయం 10 గంటలకు విజయవాడ ధర్నాచౌక్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు సంబంధించి పోస్టర్ను ఆదివారం ఆయన తణుకులో పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్షుడు మురాల సుధాకర్ మాట్లాడుతూ మహాధర్నా రూపంలో చేస్తున్న ఉపాధ్యాయుల ఆత్మగౌరవ పోరాటానికి ప్రతిఒక్కరూ కలిసిరావాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఉపా ధ్యాయులకు ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీని నియమించాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న 4 డీఏలను వెంటనే మంజూరు చేయాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని, సీపీఎస్ రద్దుచేయాలని, ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధనకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులను, గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలనే ప్రధాన డిమాండ్లతో మహాధర్నా చేపట్టామన్నారు. వైఎస్సార్సీపీ టీచర్స్ వింగ్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్వీ జాకబ్బాబు, జిల్లా కోశాధికారి టి.పల్లయ్య, ఇరగవరం మండల శాఖ బాధ్యులు పాల స్మిత్, కొల్లి జయబాబు, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
కార్మికుల హక్కుల పరిరక్షణకు న్యాయస్థానాలు
భీమవరం: కార్మికుల హక్కుల పరిరక్షణకు న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, మండల న్యాయసేవా సంస్ధ కట్టుబడి ఉంటాయని, ఈ–శ్రమ్, ఇన్సూరెన్సు, పింఛన్ వంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ బి.లక్ష్మీనారాయణ అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా శనివారం సంస్థ ఆధ్వర్యంలో భీమవరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కార్మికులకు ఎలాంటి న్యాయపరమైన సమస్యలున్నా సంస్థను సంప్రదించాలని, కార్మికులు తమ సమస్యలను తీర్చగలిగే సరైన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. కార్మికులకు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఎ.శ్రీలక్ష్మి వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జి.సురేష్ బాబు, ఒకటో అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పి.హనీష, 2వ అదనపు జ్యుడిషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ ఎన్.జ్యోతి, అసిస్టెంట్ మునిసిపల్ కమిషనర్ ఎ.రాంబాబు, వన్టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
భానుడి భగభగలు
● ఉమ్మడి పశ్చిమలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ● ఉక్కబోతతో జనం విలవిల నరసాపురం: ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే ఎండలు అదరగొడుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత వారం రోజుల నుంచి 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 10 రోజుల్లో జిల్లాల్లో అత్యధికంగా పలు ప్రాంతాల్లో 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెలలో ఎండలు మరింత ప్రతాపం చూపిస్తున్నాయి. రాబోయో రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో? అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గాలిలో తేమ శాతంలో భారీ హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. దీంతో రాత్రి పూట కూడా ఉక్కబోత ఇబ్బంది పెడుతుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతతో గాలిలో తేమ శాతంలో మార్పులు ఎక్కువగా ఉంటున్నాయి. పగటిపూట 40 నుంచి 50 శాతం, తెల్లవారుజాము సమయంలో 85 నుంచి 90 శాతం తేమ నమోదవుతుంది. మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. గత 10 రోజుల నుంచి ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పగటిపూట అత్యధికంగా 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడే ఇలా ఉంటే, మే నెలలో మిగతా రోజులు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఏడాది కూల్ సమ్మర్ : ఉమ్మడి పశ్చిమలో గత ఏడాది వేసవి మొత్తం చాలా కూల్గా గడిచింది. మే నెలలో తుఫాన్ పట్టడంతో కొన్ని రోజులు ఎండ వేడిమి అసలు తెలియలేదు. మే నెల మొత్తం ఊహించిన దానికంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత ఐదేళ్ల పరిస్థితి పరిశీలిస్తే గత ఏడాది వేసవి చల్లగా సాగింది. ఈ సంవత్సరం పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో భానుడు ఉగ్రరూపం దాల్చే అవకాశాలు కనిసిస్తున్నాయి. జాగ్రత్తలు అవసరం: వైద్యులు అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి ధీర్ఘకాల రోగులు, చిన్నపిల్లలు మారిన వాతావరణ పరిస్థితులతో ఇబ్బందులు పడుతుంటారు. ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పిలల్లను ఎండలో బయట తిరగకుండా చూడాలని, వృద్ధుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
రఘురామ కృష్ణరాజుపై మందకృష్ణ మాదిగ ఫైర్
భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. దళితులను రఘురామకృష్ణ రాజు అవమానపరుస్తున్నారని,. అగౌరవ పరుస్తున్నారని మండిపడ్డారు. దీని పై తాను చంద్రబాబు నాయుడుని కలుస్తానని, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూస్తామన్నారు. రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి, కూటమికి నష్టంగా నేను భావిస్తున్నానన్నారు. ‘రఘురామకృష్ణం రాజు దళితులను, క్రైస్తవులను అవమానిస్తున్నారు. రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలు ఒక తెలుగు నేలపైనే కాదు దేశం చుట్టూ తిరుగుతున్నాయి. ఆకివీడులో మాల మాదిగల మీద అక్రమ కేసులు పెట్టారు. దళిత వర్గాలకు సంబంధించిన వాళ్లను ఏరకంగా ఇబ్బంది పెట్టినా వారు ఏ స్థాయిలో ఉన్నా ఊరుకునేది లేదు. 67 మందిని జైలుకు పంపడం దళిత వర్గాలను రెచ్చగొట్టడమే. దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్న ఈ అంశాలను ఉమ్మడిగా ఎదుర్కొంటాం’ అని హెచ్చరించారు. -
నాణేలతో శ్రీవారి విగ్రహం
ద్వారకాతిరుమల: కొందరు భక్తులు వినూత్నంగా చిల్లర నాణేలతో శ్రీవారి విగ్రహాన్ని తయారు చేయించి తమ భక్తిని చాటారు. విగ్రహ తయారీకి రూ.1.65 లక్షలు ఖర్చు చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడికి చెందిన కొందరు భక్తులు చిల్లర నాణేలతో అదే గ్రామానికి చెందిన యర్రంశెట్టి రామకృష్ణతో శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ విగ్రహ తయారీకి రూ.10, రూ.5, రూ.2, రూ.1 చిల్లర నాణేలను వినియోగించారు. వెండితో తయారు చేసిన యజ్ఞోపవీతం, నామం, కళ్లు, ముక్కు, నోరు, గెడ్డం విగ్రహానికి అమర్చారు. విగ్రహాన్ని శుక్రవారం క్షేత్రానికి ఊరేగింపుగా తీసుకొచ్చి, కల్యాణకట్ట వద్ద ఏర్పాటుచేశారు. ఏలూరు (ఆర్ఆర్పేట): క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకూ ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో బౌద్ధమతానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయని పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కే.తిమ్మరాజు తెలిపారు. బుద్ధ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర పురావస్తు, ప్రదర్శన శాలల శాఖ ఏలూరు మ్యూజియం, బుద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా, గుత్తా చిత్తరంజన్ దాస్, శ్రీకృష్ణ భారతీమణి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరు పురావస్తు ప్రదర్శన శాలలో శుక్రవారం విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. బుద్ధుడి జీవిత విశేషాలు, బోధనలను నేటి తరం విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్ధేశంతో ఈ పోటీలు నిర్వహించామని తెలిపారు. బుద్ధిస్ట్ స్కాలర్ పీ భారతి, బుద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా ఏలూరు మాజీ అధ్యక్షురాలు ఆర్.మణి సుందర్ సింగ్, భారతీమణి ట్రస్ట్ ప్రెసిడెంట్ కే.అమరవాణి తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్సులో గురువారం ప్రయాణిస్తూ మహిళా ప్రయాణికురాలు పర్సు పోగొట్టుకుంది. పర్సును గుర్తించిన సర్వీసు కండక్టర్ పీఎస్ నారాయణ భద్రంగా తీసుకొచ్చి భీమవరం డిపో ఎర్నింగ్ సెక్షన్లో అప్పగించారు. ప్రయాణికురాలు పల్లేటి మార్త ఆధార్ కార్డు ఆధ్వారంగా ఏరియా తహసీల్దార్తో మాట్లాడి భర్త పల్లేటి ఏసును భీమవరం డిపోకు రప్పించి జిల్లా ప్రజా రవాణాధికారి ఎస్.గిరిధర్ కుమార్ సమక్షంలో అప్పగించారు. పర్సులో నగదుతో పాటు బంగారు, వెండి నగలు వస్తువులున్నాయి. భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం జువ్వలపాలెం రోడ్డులోని కేఎఫ్సీలో శుక్రవారం ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఆర్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. నఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేఎఫ్సీలో ఆయిల్తో తయారు చేసిన ఆహార పదార్థాలు తింటే అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. కేసు నమోదు చేసి ఆ ఆయిల్ ఉపయోగించిన చికెన్ ఫ్రై ఐటెంలను ఆహార పరీక్షల కోసం శాంపుల్స్ తీసుకుని స్టేట్ ఫుట్ ల్యాబ్కు పంపిచామన్నారు. చికెన్, ఇతర ఆహార పదార్థాలు నిలువఉంచే డీప్ ఫ్రిడ్జ్ ప్రాంతంలో అపరిశుభ్ర వాతావరణం ఉందని తెలిపారు. చాట్రాయి: మహిళపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఇన్చార్జి ఎస్సై ఎం.చిరంజీవి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మండలంలోని సి.గుడిపాడు గ్రామానికి చెందిన నక్కా శ్రీనివాస్ ఏప్రిల్ 29న ఓ మహిళపై దాడి చేసి తప్పించుకున్నాడని ఆయన చెప్పాడు. విస్సన్నపేట బస్టాండ్ వద్ద తిరుగుతుండగా పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించడంతో అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. -
కార్మికుల సంక్షేమం వైఎస్సార్సీపీ లక్ష్యం
ఏలూరు టౌన్: కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పేద, మద్యతరగతి వర్గాలకు మేలు చేయటమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ పనిచేస్తోందని ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. ఏలూరులోని పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం వైఎస్సార్టీయూ నగర అధ్యక్షుడు గంటా రాజేశ్వరరావు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ని ర్వహించారు. డీఎన్నార్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్తో కలిసి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పథకాలు అందించారని గుర్తుచేశారు. దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర మరువలేమన్నారు. తమ పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షపాతిగా ఉంటుందనీ, రాబోయే కాలంలో అధికారంలోకి వచ్చిన అనంతరం సమాజంలోని అన్నివర్గాలకు మేలు చేసేలా పథకాలు అందిస్తామని చెప్పారు. అనంతరం చల్లటి మజ్జిగ, తాగునీరు పంపిణీ చేశారు. నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, కై కలూరు నియోజకవర్గ పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్బాబు, చింతలపూడి నియోజకవర్గ పరిశీలకుడు దాసరి రమేష్, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, వైఎస్సార్టీయూ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, నాయకులు కిలాడి దుర్గారావు, భోగిశెట్టి పార్వతి, స్టాన్లీబాబు, షేక్ బాజీ, భాస్కర్ల బాచి, లూటుకుర్తి సుభాష్, జిజ్జువరపు విజయనిర్మల, ఇనపనూరి జగదీష్,మేతర సురేష్, ఉమామహేశ్వరరావు, లక్కాబత్తుల ఏసుపాదం, కొల్లిపాక సురేష్, సాసుపల్లి యుగంధర్ప్రసాద్, కంచుమర్తి తులసీ, బండ్లమూడి సునీల్ తదితరులు పాల్గొన్నారు.ఏలూరు జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ -
ప్లేస్మెంట్స్లో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ప్రతిభ
నూజివీడు: 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం విద్యార్థులు ప్రతిభ చూపి అత్యధికంగా ప్లేస్మెంట్లు సాధించినట్లు డైరెక్టర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో క్యాంపస్ ప్లేస్మెంట్లలో 80 శాతం మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారని, మొత్తం 661 మంది విద్యార్థుల్లో 540 మంది ప్రతిష్టాత్మక సంస్థల్లో నియామకాలు పొందినట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం విద్యార్థులకు లభించిన గరిష్ట వేతనం రూ.27 లక్షలు కాగా, సగటు వేతనం రూ.6 లక్షలుగా నమోదైంది. కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జికల్ – మెటీరియల్స్ ఇంజినీరింగ్ (ఎం.ఎం.ఈ), మెకానికల్ విభాగాల విద్యార్థులకు వంద శాతం ప్లేస్మెంట్లు లభించాయి. పలు ప్రముఖ సంస్థలు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా చేపట్టిన ఈ నియామకాల్లో విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చి ఉద్యోగాలు సాధించడం గర్వకారణమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను డైరెక్టర్తో పాటు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, పరిపాలనాధికారి బి. లక్ష్మణరావు, డీన్ అకడమిక్స్ సాదు చిరంజీవి, ప్లేస్మెంట్ ఆఫీసర్ రుద్రం చింతయ్య నాయుడు, ఈ.ఐ.టి.పి డీన్ శ్యామ్, వివిధ విభాగాల శాఖాధిపతులు, అధ్యాపకులు అభినందించారు. -
కోళ్ల ఎరువుతో అధిక లాభాలు
చింతలపూడి: అధిక దిగుబడుల కోసం రైతులు విచక్షణారహితంగా రసాయన మందులు, పురుగు మందులు వాడటంతో భూములు నిర్జీవంగా మారుతున్నాయి. సూక్ష్మ జీవులు నశించడం వల్ల వాటి ద్వారా లభించే సేంద్రియ పదార్థాలు, సూక్ష్మ పోషక పదార్థాలు నేలలో అదృశ్య మవుతున్నాయి. దీని వల్ల మొక్కల్లో పెరుగుదల నశిస్తుంది. ఉద్యాన పంటల్లో సమగ్ర పోషక యాజమాన్యాన్ని రైతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. ముఖ్యంగా ఉద్యాన పంటల్లో 50 శాతం సేంద్రియ ఎరువులు, 50 శాతం రసాయన ఎరువులు వాడితే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చనని ఉద్యానశాఖ అధికారిణి ఎండీ షాఫియా ఫర్హీన్ సూచిస్తున్నారు. సేంద్రియ ఎరువులంటే.. సేంద్రియ ఎరువుల్లో పశువుల ఎరువు, మేకలు, గొర్రెల ఎరువు, వర్మి కంపోస్ట్తో పాటు కోళ్ళ పెంట ప్రముఖమైనవి. వీటిల్లో మొక్కలకు కావాల్సిన అన్నిరకాల ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలైన జింక్ మెగ్నీషియం, మాంగనీస్, బోరాన్ తదితర పోషకాలు దొరుకుతాయి. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు లభించే ఏకై క సేంద్రియ ఎరువు కోళ్ల ఎరువు మాత్రమే. కోళ్ల ఎరువులో ఎక్కువ మొత్తంలో నత్రజని 3 శాతం, భాస్వరం 2.5 శాతం, పొటాష్ 1.2 శాతం ఉంటాయి. ఉద్యాన పంటలైన కూరగాయల పంటలకు ఎకరానికి 500 కేజీల కోళ్ల ఎరువు సరిపోతుంది. ఈ ఎరువును రసాయన ఎరువుతో కలిపి వాడితే 20 నుండి 25 శాతం నత్రజని ఆదా చేయవచ్చు. కోళ్ళ ఎరువును వివిధ ఉద్యాన పంటల్లో ఈ మోతాదులో వినియోగిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. పచ్చి కోళ్ల ఎరువు వద్దు పచ్చి కోళ్ల ఎరువును ఎట్టి పరిస్ధితుల్లోను మొక్కలకు వేయకూడదు. దానిలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల వేరు వ్యవస్థ మాడిపోయి మొక్కలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకే కోళ్ళ ఎరువును సేకరించాక బాగా మాగిన తరువాత మొక్కలకు వేసుకోవాలి. టన్ను కోళ్ల ఎరువుకు 15 కేజీల సూపర్ ఫాస్ఫేట్ కలిపితే తొందరగా కుళ్ళిపోతుంది. కోళ్ళ ఎరువును సాధారణంగా మొక్కలు నాటడానికి 20 రోజుల ముందుగా వేయాలి. పామాయిల్ తోటలకు – 6 ఏళ్ల వయస్సున్న చెట్టుకు 50 కేజీలు కొబ్బరి – 8 సంవత్సరాల వయస్సున్న కాపుకాసే చెట్టుకు 30 నుంచి 50 కేజీలు అరటి – ఎకరానికి 5 టన్నులు మామిడి – 10 ఏళ్ళ కాపు కాసే చెట్టుకు 50 నుంచి 70 కేజీలు జీడి మామిడి – 7 ఏళ్ల వయసున్న కాపు కాసే చెట్టుకు 40 కేజీలు నిమ్మ, బత్తాయి – 6 ఏళ్ల వయసున్న కాపు కాసే చెట్లకు 30 కేజీలు బొప్పాయి – ఎకరానికి 3 నుంచి 5 టన్నులు మిరప – ఎకరానికి 3 టన్నులు పూల తోటలకు – ఎకరానికి 2 టన్నులు -
ఘనంగా యూత్ క్లబ్ నాటక పోటీలు
పాలకొల్లు సెంట్రల్: యూత్క్లబ్ నాటక పరిషత్ 44వ వార్షికోత్సవం సందర్భంగా నాటక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. యలమంచిలి మండలం కొంతేరులో పులపర్తి వీరాస్వామి యూత్ క్లబ్ కళామందిర్, కొంతేరు ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు నాటక పోటీలు ప్రారంభించారు. శుక్రవారం బీవీకె క్రియేషన్స్ కాకినాడ వారి తితిక్ష నాటిక ప్రదర్శించారు. శ్రీ కరణం సురేష్ మోమోరియల్ ధియేటర్ గుంటూరు వారి తరమెల్లిపోతుంది నాటిక అలరించింది. నూజివీడు: స్థానిక ట్రిపుల్ ఐటీలో ఈ నెల 2న శ్రీబిల్డ్ విత్ ఏఐశ్రీ అనే అంశంపై వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమం క్యాంపస్లోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. గూగుల్ డెవలపర్ గ్రూప్ (విజయవాడ) సహకారంతో దీనిని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్, ఆర్జీయూకేటీ చాన్సలర్ ఆచార్య కొత్తా మధుమూర్తి హాజరవుతారు. ఆర్జీయూకేటీ ఉపకులపతి ఆచార్య విజయ్ కుమార్, నూజివీడు డైరెక్టర్ ఆచార్య గోపాలరాజు ప్యాట్రన్లుగా పాల్గొంటారు. ఈ వర్క్షాప్లో ప్రముఖ ఏఐ నిపుణులు మధు వడ్లమాని, ప్రదీప్ వడ్లమూరి, జగదీష్ బాబు కొర్ల ముఖ్య వక్తలుగా పాల్గొని తమ అనుభవాలను పంచుకోనున్నారు. గణపవరం : గణపవరం మండలం మొయ్యేరు గ్రామానికి చెందిన కానుమిల్లి వెంకట శ్రీహరి అప్పుల బాధతో కలుపు మందు తాగి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. గణపవరం ఎస్సై ఆకుల మణికుమార్ తెలిపిన వివరాల ప్రకారం శ్రీహరి అప్పులు పెరిగిపోవడం, బాకీదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీహరి తల్లి గంగారత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
శోభాయమానంగా కాళ్లకూరు వెంకన్న రథయాత్ర
కాళ్ల: ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా.. గోవిందా.. అంటూ గోవింద నామస్మరణతో కాళ్లకూరు మార్మోగింది. మండలంలోని కాళ్లకూరులో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వరస్వామి తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రథయాత్ర వైభవంగా జరిగింది. వేద మంత్రాల నడుమ, వివిధ మేళతాళాలతో సుందరంగా అలంకరించిన రథంపై స్వామివారు ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని రథాన్ని లాగారు. బుట్ట బొమ్మలు, శక్తి వేషాలు, తీన్మార్ డప్పులు, డీజే ఆకర్షణగా నిలిచాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో పురవీధులన్నీ కిక్కిరిసిపోయాయి. వైశాఖ పూర్ణిమ సందర్భంగా స్వామి, అమ్మవార్లను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈఓ ఎం. అరుణ్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
బుద్ధుడి బోధనలు ఆదర్శనీయం
శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు భీమవరం: ప్రపంచ మానవాళికి చక్కటి జీవన విధానాన్ని అందించిన గౌతమబుద్ధుడు గొప్ప దార్శనీయుడని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు అన్నారు. శుక్రవారం భీమవరం అంబేడ్కర్ భవనంలోని బుద్ధుని విగ్రహం వద్ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బుద్ధ పూర్ణిమ (బుద్ధ జయంతి) నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. గౌతమి బుద్ధుని బోధనలు ప్రపంచ మొత్తానికి ఆదర్శనీయమని అన్నారు. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కోనా జోసెఫ్, జిల్లా అధ్యక్షుడు ఈది రవికుమార్ మా ట్లాడుతూ బుద్ధుడు చూపిన అహింసా మార్గం ఆధునిక ప్రపంచంలో ఒత్తిడితో కూడిన జీవితానికి అనుసరణీయమన్నారు. వన్టౌన్ ఎస్సై కృష్ణాజీ, గౌరవాధ్యక్షుడు కేసీ రాజు, గంటా సుందరకుమార్, బోకూరి విజయరాజు, డీకేవీ ప్రకాష్, జి.గాంధీ తదితరులు పాల్గొన్నారు. -
చూసిన కనులదే భాగ్యం
ముదినేపల్లి(కై కలూరు): చూసిన కనులదే భాగ్యం అన్న రీతిలో సాగింది చినపూరిగా పేరొందిన వడాలి శ్రీ జగన్నాథస్వామి రథోత్సవం. ఏప్రిల్ 29 నుంచి వడాలిలో శ్రీ సుభద్ర బలరామ సహిత శ్రీ జగన్నాథస్వామి వార్షిక కల్యాణోత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఉదయం నిత్యోపాసన, బలిహరణ అర్చకులు చేశారు. ఒడిశా రాష్ట్రం పూరి తరహాలోనే ఇక్కడ దేవాలయంలోనూ స్వామి కై ంకర్యాలు చేస్తారు. ఆలయ ఈవో శింగనపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 4 కల్యాణోత్సవాలు ముగింపు సందర్భంగా భారీ అన్నసమారాధన జరుగుతుందన్నారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్పర్సన్ వీరమల్లు రత్నకుమారి, ధర్మకర్తలు చిలకలపల్లి నాగరాజు, పరసా గంగాధరరావు, గూడవల్లి పద్మావతి, అనగాని వెంకట నర్సమ్మ, రాజులపాటి వెంకటేశ్వరమ్మ, కల్లూరి సుబ్రహ్మణ్యం, గుర్ర పు రజనీ, నక్క వెంకట నాగలక్ష్మీ పాల్గొన్నారు.


