‘రాయుడు గారి తాలూకా’ సందడి
నరసాపురం రూరల్: శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా ఉలిశెట్టి మూవీస్ బ్యానర్పై తెరకెక్కిన చిత్రం శ్రీరాయుడు గారి తాలూకాశ్రీ. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక స్థానిక వైఎన్ కళాశాలలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్తో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. హీరో శ్రీనివాస్ మాట్లాడుతూ పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన కథ అన్నారు. ఈ ప్రాంతంలోనే పుట్టి పెరగడం వల్ల ఇక్కడి మనుషులు, వారి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలను కళ్ళకు కట్టినట్లు ఈ చిత్రంలో చూపించినట్లు తెలిపారు. ఈ సినిమాలో నరసాపురానికి చెందిన నటీనటులకు పెద్దపీట వేశామని చెప్పారు. ఈ సందర్బంగా యూనిట్ సభ్యులు అమ్మరాజు, ఉలిశెట్టి రాజు, శ్రీహరి, శివన్న, మమత, సజన, మణికంఠ, ఏకాంత్, గణపతి, సుబ్రహ్మణ్యం, రాఘవ, డైరెక్టర్ కొరప్రాటి నవీన్, తదితరులు పాల్గొని సినిమా గురించి విషయాలను అందరితో పంచుకున్నారు. మార్చి 6న సినిమా విడుదలవుతున్నట్లు చెప్పారు.


