breaking news
Jangaon
-
సోషల్ ఆడిట్లో రూ.85,688 రికవరీకి ఆదేశం
లింగాలఘణపురం: మండల కేంద్రంలో గతేడాది ఉపాధి హామీ పనులపై జరిగిన మండల స్థాయి సోషల్ ఆడిట్లో రూ.85,688 రికవరీకి ఏపీడీ నాగశేషాద్రి ఆదేశించారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సోషల్ ఆడిట్ ఓపెన్ ఫోరంలో కూలీల వేతనాలకు రూ.23,10,440 కాగా మెటీరియల్ పనులు రూ.1,02,75,597లకు గాను సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, పీఆర్ఏఈలతో ఏపీఓలకు సంబంధించి రూ.85,688ల రికవరీకి ఆదేశించారు. గ్రామ స్థాయి, మండల స్థాయి సోషల్ ఆడిట్లో పంచాయ తీ కార్యదర్శులు తప్పనిసరిగా హాజరు కావాలని, అదేవిధంగా టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తప్పిదాలను సరిచేసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ మేనేజర్ తిరుపతి, ఎంపీడీఓ శివశంకర్రెడ్డి, ఎంపీఓ సుమన్, అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ సంధ్య, జూనియర్ క్వాలిటీ కంట్రల్ ఆఫీసర్ రాజవర్థన్, ఏపీఓ సతీష్, ఆడిట్ సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళలకు స్పోకెన్ ఇంగ్లిష్లో ఉచిత శిక్షణ
జనగామ: జనగామ ఇంగ్లిష్ మిషన్ (జేఈఎం) ఆధ్వర్యంలో మహిళల కోసం ఉచి తంగా 30 రోజుల స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మిషన్ ప్రతినిధి కర్రె మల్లేశం తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. పెరియార్ ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో చేపడుతున్న ఈ కార్యక్రమం ఆగస్టు 1 నుంచి 30వ తేదీ వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 గంటల వరకు పట్టణంలోని కురుమవాడ కురుమ సంఘం భవనంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శిక్షణలో గృహిణులు, ఉద్యోగి నులు, యువతులు, తమ పిల్లలకు ఇంగ్లిష్ నేర్పించాలని, ఆసక్తి ఉన్న తల్లులకు రోజువారీ సంభాషణలు, సరైన ఉచ్ఛారణ, పదజాలం, ఆత్మవిశ్వాసంతో ఇంగ్లిష్ మాట్లాడే పద్ధతులు, పిల్లలతో ఆంగ్లంలో సంభాషించే విధానం, ఆధునిక సాంకేతికతలు, కృత్రిమ మేధస్సు వినియోగానికి అవసరమైన ప్రాథమిక ఇంగ్లిష్ నైపుణ్యాలను బోధిస్తామని తెలిపారు. ఆసక్తి గల మహిళలు ముందస్తుగా పేర్లు నమోదు చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నమోదు కోసం బాల్దె గణేష్ (9032808023), సంపత్ (9959591641), (9642819000) నంబర్లను సంప్రదించాలని సూచించారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్కు ఎంపికలింగాలఘణపురం: మండలంలోని వనపర్తి పీవీఆర్ పాఠశాలకు చెందిన 4వ తరగతి విద్యార్థిని దండిగ అక్షయ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ లాంగ్జంప్ పోటీలకు ఎంపికై నట్లు కరెస్పాండెంట్ వెంకట్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్లో అక్షయ లాంగ్జంప్లో ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు వివరించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ వెంకట్రెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు. చిన్నపెండ్యాల విద్యార్థి..చిల్పూరు: మండలంలోని చిన్నపెండ్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి ఆసర్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఆసర్ను హెచ్ఎం సంపత్కుమార్, వ్యాయామ ఉపాధ్యాయుడు రవీంద్రప్రసాద్, సర్పంచ్ తిరుపతమ్మ, ఉప సర్పంచ్ సంతోష్ తదితరులు అభినందించారు. ఏసీరెడ్డి స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలి ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు అబ్బాస్జనగామ రూరల్ : తెలంగాణ రైతాంగ సాయుధపోరాటంలో ముందుండి నడిపించిన మాజీ ఎమ్మెల్యే ఏసీరెడ్డి నర్సింహారెడ్డి స్ఫూర్తితో ప్ర జా ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్ పిలుపునిచ్చారు. ఏసీ రెడ్డి వర్ధంతి సందర్భంగా మంగళవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణ కేందంలోని జూబ్లీ ఫంక్షన్ హాల్ వరకు పార్టీ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాపర్తి రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అబ్బాస్ మాట్లాడారు.. ఏసీ రెడ్డి నర్సింహారెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యేక్షంగా పాల్గొని నైజాం సర్కార్కు, దొరలకు ఎదురొడ్డి పోరాటం చేసిన మ హోన్నత వ్యక్త అని ఆయన సేవలను కొనియాడారు. జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి, ఇర్రి అహల్య సాంబరాజు యాదగిరి, రాపర్తి సోమ య్య, సింగారపు రమేశ్, బొట్ల శేఖర్, బూడిద గోపి, జోగు ప్రకాశ్, సుంచు విజేందర్, పి.ఉపేందర్, మునిగెల రమేశ్, చిట్యాల సోమన్న, ఎండీ అజారుద్దీన్ పాల్గొన్నారు. ముద్రా, జ్వాలామాలినీ క్రమంలో భద్రకాళిహన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శాకంబరీ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం అమ్మవారికి ముద్రా, జ్వాలామాలినీ క్రమాల్లో పూజలు నిర్వహించారు. -
పైరవీ లేదు..పైసా లేదు
జనగామ: జిల్లాలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకంలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, పారదర్శకతకు పెద్దపీట వే స్తూ మెరిట్ ఆధారిత ఎంపికలను అమలు చేస్తున్నారు. గతంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగా ల భర్తీలో పైరవీలు, సిఫార్సులు, డబ్బు లావాదేవీలపై ఆరోపణలు వినిపించేవి. అయితే ప్రస్తుత కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగాలకు తప్పనిసరి గా రాత పరీక్ష నిర్వహిస్తూ, అందులో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులనే ఎంపిక చేయడం ద్వారా నియామక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా మార్చారు. పరీక్షతో భర్తీ జిల్లాలో ఇప్పటి వరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ, వైద్యారోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్, వైద్య, విద్యాశాఖ, భూ సేకరణ, డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం తదితర శాఖల్లో ఐదు నోటిఫికేషన్లు జారీ చేసి మొత్తం 45 మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించారు. ప్రతీ నోటిఫికేషన్కు రాత పరీక్ష నిర్వహించి, అదే రోజు జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలను వెబ్సైట్లో వెల్లడించడం ప్రత్యేకంగా నిలుస్తోంది. వారం రోజుల్లోనే నియామక ఉత్తర్వులు జారీ చేసి అభ్యర్థులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. జిల్లాలో ఎనిమిది ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా 564 మంది ఉద్యోగులు వివిధ ప్రభుత్వ శాఖల్లో సేవలందిస్తున్నారు. ఆయా ఏజెన్సీలు నిబంధనలకు అనుగుణంగా పని చేస్తున్నా యా, కార్యాలయాలు నిర్వహిస్తున్నాయా అనే అంశాలపై కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి కుమారస్వామి ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. ఒకటో తేదీనే వేతనాలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు ప్రతీ నెల ఒకటో తేదీన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏజెన్సీలు వేతనాలు చెల్లించడంలో జాప్యం చేస్తే, వాటి డిపాజిట్ నుంచి ఉద్యోగులకు జీతాలు చెల్లించే విధానాన్ని అమలు చేస్తున్నారు. అవసరమైతే సంబంధిత ఏజెన్సీలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా కలెక్టర్ సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు వ్యవసాయ శాఖలో ముగ్గురు వ్యవసాయ విస్తరణ అధికారులు, వైద్యారోగ్య శాఖలో ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, ఒక సూపర్వైజర్, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 18 మంది బోధనా సిబ్బంది, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో వంట మనుషులు, సహాయ వంట మనుషులు, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో చైన్మన్, స్వీపర్, అటెండర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితర పోస్టులను పూర్తిగా రాత పరీక్ష ద్వారా భర్తీ చేశారు. మెరిట్కే ఉద్యోగం, వారం రోజుల్లో నియామకం కలెక్టర్ చర్యలతో పారదర్శకంగా భర్తీ ఆదర్శంగా నిలుస్తున్న జిల్లా -
నయా పోలీస్!
రేపు, ఎల్లుండి ఉమ్మడి వరంగల్ పోలీస్ అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్ సమావేశాలు సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ పోలీసింగ్లో కొత్త విధానాలకు శ్రీకారం చుట్టే దిశగా రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ జిల్లాల పర్యటనలను ఉమ్మడి వరంగల్నుంచే ప్రారంభిస్తున్నారు. ప్రజలకు మరింత చేరువయ్యే పోలీసింగ్, సాంకేతికత ఆధారిత నేర నియంత్రణ, ప్రజా విశ్వాసాన్ని పెంపొందించే చర్యలపై జిల్లా పోలీస్ అధికారులతో నేరుగా చర్చించేందుకు రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా పోలీసింగ్ పరిస్థితి, శాంతిభద్రతలు, పెండింగ్ కేసులు, నేరాల నియంత్రణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, సిబ్బంది పనితీరుపై సమగ్ర సమీక్ష చేపట్టనున్నట్లు సమాచారం. వరంగల్ నుంచే శ్రీకారం.. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆనంద్ ఆకస్మిక తనిఖీలు, కార్యక్రమాల్లో భాగంగా పలు జిల్లాల్లో పర్యటించారు. జిల్లాల వారీగా సమీక్షలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలను వేదికగా ఎంచుకోవడం పోలీస్ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కమిషనరేట్లు, జిల్లాల ఎస్పీలతో ఇదే తరహా సమావేశాలు నిర్వహించే కార్యక్రమానికి ఇదే నాంది కానుందని తెలుస్తోంది. మూడు విడతల్లో సమావేశాలు.. ఈ నెల 30న వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి(వరంగల్, హనుమకొండ, జనగామ)లోని అధికారులతో డీజీపీ సమావేశమవుతారని విశ్వసనీయవర్గాల సమాచారం. 31న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లా పోలీస్ అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిసింది. గోప్యంగా ఏర్పాట్లు.. డీజీపీ పర్యటన షెడ్యూల్ను పోలీస్శాఖ అత్యంత గోప్యంగా ఉంచుతోంది. సమావేశాల్లో పాల్గొనే అధికారులకు మాత్రమే అంతర్గతంగా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. భద్రత, సమావేశాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సైతం పరిమిత స్థాయిలోనే చేపడుతున్నారు. ప్రజా సమస్యలపై వేగంగా స్పందించే పోలీసింగ్, ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, జవాబుదారీతనం పెంపు, సిబ్బంది సామర్థ్యాల అభివృద్ధి వంటి అంశాలపై డీజీపీ ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. జిల్లాల వారీగా ఎదురవుతున్న సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి తగిన కార్యాచరణ రూపొందించడమే ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. రికార్డులతో సిద్ధమవుతున్న అధికారులు.. డీజీపీ సమీక్ష నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్తోపాటు జిల్లాల వారీగా అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆయా జిల్లాల్లో గత ఏడాదినుంచి నమోదైన కేసులు, వాటి పరిష్కారం, పెండింగ్ దర్యాప్తులు, కోర్టు విచారణలు, శిక్షలశాతం, బైండోవర్ కేసులు, రౌడీషీటర్ల హిస్టరీ, మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు, శాంతిభద్రతల నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక నివేదికలను సిద్ధం చేస్తున్నారు. వీటిని డీజీపీ ఎదుట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేలా రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రజలకు చేరువయ్యే పోలీసింగ్పై దిశానిర్దేశానికి ప్రణాళిక వరంగల్ నుంచే డీజీపీ శ్రీకారం.. -
ఎస్ఐఆర్ను సద్వినియోగం చేసుకోండి
● మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్జనగామ: ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, కచ్చితంగా నవీకరించేందుకు చేపట్టిన ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)ను ప్రతీ ఓటరు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ కడకంటి బాలమణిశ్రీనివాస్ కోరారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా చూసుకోవాలని సూచించారు. పేరు లేకపోయినా, వివరాల్లో మార్పులు అవసరమైనా ఎన్నికల నిబంధనల ప్రకారం సంబంధిత దరఖాస్తు ఫారాలను సక్రమంగా నింపి, అవసరమైన ధ్రువపత్రాలు జత చేసి, తమ పరిధిలోని బీఎల్ఓకు నిర్ణీత గడువులోగా అందజేయాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ను సంప్రదించి అవసరమైన సమాచారాన్ని పొందవచ్చని తెలిపారు. -
జీపీల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసుకోవాలి
జనగామ రూరల్: జిల్లాలోని ప్రతీ గ్రామ పంచాయతీలో పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజల భద్రత, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, నేరాల నియంత్రణ, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం సీసీ కెమెరా వ్యవస్థ ఎంతో కీలకమని పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో డీఏఓ అంబికా సోనీ, మిషన్ భగీరథ ఈఈ శ్రీకాంత్, ఈడీఎం గౌతమ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పాల ఉత్పత్తి తగ్గకుండా చూడాలి.. పాల ఉత్పత్తి తగ్గకుండా శాసీ్త్రయ యాజమాన్య పద్ధతులు పాటించాలని పాడి పశువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని చాంబర్లో పశుసంపదపై ఎల్నినో ప్రభావ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..అధిక ఉష్ణోగ్రతల కారణంగా పశువుల్లో హీట్ స్ట్రెస్ పెరిగి, ఆహార గ్రహణం తగ్గడంతో పాల ఉత్పత్తి తగ్గే అవకాశముందని పేర్కొన్నారు. పచ్చిక కొరత వల్ల పోషకాహార లోపాలు ఏర్పడడంతో పాటు నీటి కొరత కారణంగా పశువుల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. డీవీహెచ్ఓ మురళీధర్ రావు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నాణ్యమైన బోధనతోనే ఉత్తమ ఫలితాలుపాలకుర్తి టౌన్ (దేవరుప్పుల): నాణ్యమైన బోధనతోనే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. దేవరుప్పల మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, యునిఫాం కుట్టుపనులు పరిశీలించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
రూ.3.5 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం
జనగామ: ప్రభుత్వ భూముల పరిరక్షణలో జిల్లా యంత్రాంగం మరో కీలక చర్య చేపట్టింది. జిల్లాలోని చిల్పూర్ మండల కేంద్రం పరిధి సర్వే నంబర్ 229లో ఉన్న ప్రభుత్వ సీలింగ్ భూముల్లో అక్రమణకు గురైన మూడు ఎకరాల 12 గుంటల భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి విలువ రూ.3.50 కోట్లకుపైగా ఉండడంతో ఈ చర్య జిల్లాలో ప్రాధాన్యం సంతరించుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వే నంబర్ 229లో మొత్తం 36 ఎకరాలకుపైగా ప్రభుత్వ సీలింగ్ భూమి ఉంది. గత రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 2019 నుంచి ఓ రెడీమిక్స్ ప్లాంట్ నిర్వహిస్తున్న సంస్థ మూడు ఎకరాల 12 గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించి వినియోగిస్తున్నట్లు విచారణలో తేలింది. భూమి ప్రభుత్వానికి చెందినదేనని పూర్తిస్థాయిలో నిర్ధారణకు వచ్చిన అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఈ నెల 20న ఆక్రమిత భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు చర్యలు చేపట్టి భూమిని స్వాధీనం చేసుకున్నారు. తరిగొప్పుల–చిన్న పెండ్యాల ప్రధాన రహదారికి ఆనుకుని ఉండటంతో ఈ భూమికి అధిక మార్కెట్ విలువ ఉందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో బచ్చన్నపేట, సాల్వాపూర్, పోచన్నపేట, బచ్చన్నపేట మండల కేంద్రం, నర్మెట, చిల్పూర్ తదితర ప్రాంతాల్లో గతంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను ఇప్పటికే స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారుల చర్యలు -
2వ తేదీన పరీక్ష
ఔట్సోర్సింగ్ రాత పరీక్షలను పర్యవేక్షిస్తున్న కలెక్టర్(ఫైల్)వచ్చే నెల 2వ తేదీన విద్యాశాఖలో మరో ఆరు ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు ఇద్దరు మహిళా ఏఎన్ఎంలు, ముగ్గురు మహిళా అకౌంటెంట్ పోస్టుల కోసం కలెక్టరేట్లో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్ష అనంత రం అదే రోజు ఫలితాలు ప్రకటించి, స్వల్ప వ్యవధిలోనే ఎంపికై న వారికి నియామక ఉత్తర్వులు అందజేయనున్నారు. ఔట్ సోర్సింగ్ నియామకాల్లో పైరవీలు, డబ్బు ప్రభా వానికి తావులేకుండా కేవలం అర్హత, ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు కల్పిస్తున్న ఈ విధానం జిల్లాలో నిరుద్యోగ యువతలో విశ్వాసాన్ని పెంచుతోంది. పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ యంత్రాంగం అమలు చేస్తున్న ఈ విధానం ఇతర జిల్లాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది.ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకంలో పూర్తిస్థాయి పారదర్శకత పాటిస్తున్నాం. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మార్గదర్శకత్వంలో నోటిఫికేషన్, రాత పరీక్ష, మెరిట్ జాబితా ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాం. ఎలాంటి పైరవీలు, సిఫార్సులు లేదా ఇతర జోక్యాలకు అవకాశం లేదు. ఆగస్టు 2న విద్యాశాఖలోని ఆరు పోస్టులకు కూడా ఇదే విధానంలో పరీక్ష నిర్వహించి, అర్హులైన వారిని మాత్రమే నియమిస్తాం. ఉద్యోగులకు ప్రతీ నెల ఒకటో తేదీన వేతనాలు పడేలా కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. ఆలస్యం చేస్తే చట్టపరమైన చర్యలకు సైతం ఆదేశాలు జారీ చేశారు. – ర్యాకం కుమారస్వామి, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి -
ఉపసర్పంచ్లకు గౌరవ వేతనం ఇవ్వాలి
జనగామ రూరల్: ఉపసర్పంచ్లకు 5 వేల గౌరవ వేతనంతో పాటు అన్ని కార్యక్రమాల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఉపసర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు పండుగ హరీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉప సర్పంచుల హక్కుల సాధన కోసం రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం పిలుపు మేరకు మంగళవారం ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉప సర్పంచులు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం ఏఓ రవికిరణ్కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ తీర్మానాలపై సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్కు కూడా సంతకం చేసే అధికారాన్ని కల్పించాలన్నారు. గ్రామపంచాయతీల్లో స్టాండింగ్ కమిటీ వైస్ చైర్మన్ గా ఉప సర్పంచ్ను ప్రకటించాలన్నారు. ఉప సర్పంచుల హక్కులు పూర్తిస్థాయిలో సాధించే వరకు ఉద్యమాన్ని నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర శంకర్ నాయక్, అఖిల వెంకటేష్, ప్రధాన కార్యదర్శులు కృష్ణారెడ్డి, నాగపురి కిషన్గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పిడుగు మహేష్, జిల్లా కన్వీనర్ కుంటి రాజు, ఉప సర్పంచులు సంపత్ రెడ్డి, కిరణ్ స్వామి, బక్క సరిత, మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు. హక్కుల సాధనకు ఉద్యమిస్తాం కలెక్టరేట్ ఎదుట ఆందోళన -
సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలి
● పోలీస్ కళాశాల ప్రిన్సిపాల్ కె.రమేశ్ ● కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం మామునూరు: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో పోలీస్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని, నూతన సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలని పీటీసీ ప్రిన్సిపాల్ కె.రమేశ్ తెలిపారు. సోమవారం మామునూరు పోలీస్ శిక్షణ కళాశాలలో పరిపాలన విభాగం అధికారుల ఆధ్వర్యంలో సీసీటీఎన్, సైబర్ నేరాల దర్యాప్తు పద్ధతులు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగం తదితర అంశాలపై సివిల్ కానిస్టేబుళ్లకు 5 రోజుల శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై శిక్షణను ప్రారంభించి మాట్లాడారు. నేరాల నియంత్రణ, దర్యాప్తు మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని, ఈశిక్షణ ద్వారా తమ విధుల్లో పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవాలని, నైపుణ్యాలను అబివృద్ధి చేసుకో వాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ విజయ్, సీఎల్ఐలు రాంమూర్తి, అశోక్, సత్యనారాయణ, నరేందర్, రాజ్యలక్ష్మి, నగేశ్, చంద్రశేఖర్, మహేశ్, దేవేందర్రెడ్డి, విద్యాసాగర్, సమ్మిరెడ్డి, షర్మిల, అరుణ, సీసీ రామాంజరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
మాత్రా, సర్వమంగళ క్రమాల్లో అమ్మవారు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో కొనసాగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా సోమవారం త్రయోదశి తిథి అనుసరించి అమ్మవారికి మాత్రా, సర్వమంగళ క్రమాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు నిత్యాహ్నిక పూజలు చతుస్థానార్చనలు జరిపారు. స్నపనమూర్తిని కాళీకల్పకం ప్రకారం.. మాత్రా అమ్మవారుగా బోగభేరాన్ని షోడశీక్రమంలో సర్వమంగళగా అలంకరించి చతుఃస్థానార్చన పూజలు, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. రేపు బుధవారం అమ్మవారిని మహాశాకంబరీగా అలంకరించనున్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు ఏర్పా టు చేశారు. భద్రతా, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను మల్వాడ సీఐ కరుణాకర్, పోలీస్ సిబ్బందితో కలిసి ఆలయ ఈఓ రామల సునీత పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి సునీత దంపతులు, హనుమకొండ ఆర్డీఓ వెంకన్న, టూరిజం అధికారి శివాజీ, తహసీల్దార్ రవీందర్, శ్రీనివాస మంగాపురం చిత్రం హీరో గట్టమనేని జైకృష్ణ, దర్శకుడు అజయ్ భూపతి, చిత్రం యూనిట్ అమ్మవారికి దర్శించుకున్నారు. మాత్రాక్రమం, సర్వమంగళ క్రమంలో అమ్మవారు -
గర్భంలోనే తుంచేస్తున్నారు..
పుట్టకముందే శిశువుకు తీర్పు..చివరికి తల్లిప్రాణం బలిజనగామ: ఆధునిక సమాజంలోనూ లింగవివక్ష రాక్షసత్వానికి కడుపులోని పసిమొగ్గలను గర్భంలోనే తుంచేస్తున్నారు. చట్టాలు ఎన్ని ఉన్నా.. అక్రమ స్కానింగ్ సెంటర్లు, దొంగ బాబాల అండతో కడుపులోనే నూరేళ్లు నింపేస్తున్నారు. పుట్టక ముందే ఒక శిశువు భవితవ్యంపై తీసుకున్న నిర్ణయం చివరకు ఓ తల్లి ప్రాణాన్ని బలితీసుకుంది. కుటుంబ ఆశలు, సామాజిక ఒత్తిళ్లు, చట్ట వ్యతిరేక చర్యలు, నిర్లక్ష్యపు వైఖరి కలిసి మరో ఇంటిని శోకసంద్రంలోకి నెట్టాయి. ఈ ఘటన ఒక కుటుంబానికే పరిమితం కాకుండా సమాజం ముందుంచిన బాధాకర ప్రశ్నగా మారింది. జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చిన అక్రమ గర్భస్రావం ఘటన లింగ నిర్ధారణ పరీక్షలు, అక్రమ అబార్షన్ల వ్యవహారంపై తీవ్ర చర్చకు దారి తీసింది. గర్భంలో ఆడశిశువు ఉందని చెప్పిన అనంతరం గర్భస్రావం నిర్వహించి మహిళ మృతి చెందిన ఘటనతో ఈ వ్యవహారం ఒక్కసారిగా బయటపడింది. అయితే ఇది ఒక్క కేసుకే పరిమితమా లేక దీని వెనుక పెద్ద నెట్వర్క్ పని చేస్తోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లింగ నిర్ధారణ నుంచి అబార్షన్ వరకు.. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆర్ఎంపీ, అక్రమంగా లింగ నిర్ధారణ చేసిన వ్యక్తి, గర్భస్రావం నిర్వహించిన ప్రైవేట్ వైద్య సిబ్బంది పాత్ర బయటపడింది. దీంతో లింగ నిర్ధారణ పరీక్షల నుంచి గర్భస్రావాల వరకు ఒక వ్యవస్థీకృత గొలుసు పని చేస్తోందా? అనే కోణంలో దర్యాప్తు అవసరమనే అభిప్రాయం వక్తమవుతోంది. ఈ కేసులో మరెవరైనా మధ్యవర్తులు ఉన్నారా అనే అంశం కూడా విచారణలో తేలాల్సి ఉంది. ఇద్దరు కుమార్తెలు ఉన్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి గర్భస్రావాలకు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణ ఎక్కడ? లింగనిర్ధారణ పరీక్షలు, ఆడశిశువు ఎంపిక గర్భస్రావాలు చట్టరీత్యా నిషేధం. అయినప్పటికీ ఈ ఘటన వెలుగులోకి రావడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప ర్యవేక్షణ, తనిఖీలు, అమలు వ్యవస్థ పని తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్రమ స్కానింగ్ కేంద్రాలు, అనుమానాస్పద క్లినిక్లపై ఎప్పటికప్పుడు త నిఖీలు జరిగాయా అనే అంశంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. దర్యాప్తులో తేలాల్సిన కీలక ప్రశ్నలు ఈ కేసులో గర్భస్రావానికి ఎంత మొత్తం వసూలు చేశారు, మధ్యవర్తులకు కమీషన్లు అందాయా, గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయా, ఇంకా ఎ న్ని అక్రమ స్కానింగ్ కేంద్రాలు, గర్భస్రావ కేంద్రాలు పని చేస్తున్నాయి అనే వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం వంటి ప్రశ్నలకు సమాధానాలు పోలీసుల దర్యాప్తు, సంబంధిత అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. సమగ్ర విచారణకు పెరుగుతున్న డిమాండ్ ఈ ఘటన నేపథ్యంలో జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలు, ప్రైవేట్ క్లినిక్లు, అనుమానాస్పద వైద్య కార్యకలాపాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ లింగ నిర్ధారణ, గర్భస్రావాలకు పాల్పడే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హనుమకొండలో స్కానింగ్.. జనగామలో గర్భస్రావం ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన కేసులో హనుమకొండలో అక్రమంగా లింగ నిర్ధారణ జరగగా, జనగామలోని సంజయ్నగర్ కాలనీకి చెందిన అనసూర్య అనే ప్రైవేట్ వైద్య సిబ్బంది ఇంట్లో గర్భస్రావం నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జిల్లాల మధ్య సమన్వయంతో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు అవసరమని భావిస్తున్నారు. పైగా సంజయ్నగర్లోని సంబంధిత ఇంటికి తరచూ గర్భిణులు వస్తుండేవారని, కొద్ది రోజుల వ్యవధిలో అనుమానాస్పద రాకపోకలు కనిపించేవని చెబుతున్నారు. ఆశల పేరుతో ఆరిపోయిన ఓ ఇంటి దీపం జనగామలో అక్రమ అబార్షన్ల గుట్టురట్టు..! వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణపై ప్రశ్నలు -
ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి
● పోలీస్ కమిషనర్ శ్వేత హసన్పర్తి: పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. హసన్పర్తి పోలీస్ స్టేషన్ను సోమవారం కమిషనర్ సందర్శించారు. ఈసందర్భంగా స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ మహేందర్ పుష్పగుచ్ఛంతో కమిషనర్కు స్వాగతం పలికారు. అనంతరం సీపీ పోలీస్స్టేషన్ పరిసరాలను పరిశీలించడంతో పాటు విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. స్టేషన్కు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. కమిషనర్ శ్వేత మాట్లాడుతూ ఫిర్యాదు చేసిన వారికి రసీదు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి, ఎస్సై దేవేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్లో ప్రవేశాలకు ఎంపికలు వరంగల్ స్పోర్ట్స్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో కొనసాగుతున్న రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్లో ప్రవేశాలకు సోమవారం ఎంపిక పోటీలు నిర్వహించారు. జేఎన్ స్టేడియంలో కొనసాగిన ఎంపికలకు వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు ఎంపికలు కొనసాగుతాయని హనుమకొండ డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ తెలిపారు. జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, రెజ్లింగ్, హ్యాండ్బాల్, స్విమ్మింగ్ క్రీడాంశాల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 250 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. ఈ ఎంపికల ప్రక్రియను సాట్ అబ్జర్వర్లు సతీశ్రెడ్డి, జిమ్నాస్టిక్స్ కోచ్ దీపక్ ప్రసాద్, హ్యాండ్బాల్ కోచ్ సుధాకర్ యాదవ్, రెజ్లింగ్ కోచ్ సంతోశ్చారి పర్యవేక్షించారు. కార్యక్రమంలో క్రీడా సంఘాల రాష్ట్ర కార్యదర్శులు, డీఎస్ఏ కోచ్లు, సిబ్బంది పాల్గొన్నారు. నేటి తరానికి ఏసిరెడ్డి నర్సింహారెడ్డి ఆదర్శం● సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అబ్బాస్ జనగామ రూరల్: ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు చేసిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధుడు, మాజీ ఎమ్మెల్యే ఏసిరెడ్డి నర్సింహారెడ్డి నేటి తరానికి ఆదర్శమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్ అన్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని ఏసిరెడ్డి నగర్లో పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ ఆధ్వర్యంలో ఏసి రెడ్డి నరసింహారెడ్డి వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడారు. యువత ఏసిరెడ్డి బాటలో నడవాలన్నారు. అనంతరం క్రీడల్లో, చదువులో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించి ప్రోత్సహించారు. జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, రాపర్తి రాజు, ఇర్రి అహల్య, కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి, ఎండీ దస్తగిరి, సుంచు విజేందర్, భూక్య చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు. కోటగుళ్లలో ప్రత్యేక పూజలు గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళా క్షేత్రం కోటగుళ్లలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో ఉదయం నుంచే గణపేశ్వరుడికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. -
ఒకే గది.. ఐదు తరగతులు
జఫర్గఢ్: గదుల కొరతతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేవు. మండలంలోని తిమ్మాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మొత్తం 41 మంది విద్యార్థులకు గాను ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో మొత్తం రెండు గదులు ఉండగా ఒక గదిలో అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తుండగా మరొక గదిలో పాఠశాల నిర్వహిస్తున్నారు. పాఠశాలకు ఒకే ఒక్క గది ఉండడంతో ఒకటో తరగతికి సంబంధించిన పిల్లలకు ఇదే గదిలో పాఠాలు బోధిస్తుండగా మిగతా తరగతులకు చెందిన విద్యార్థులకు గదులు లేకపోవడంతో పాఠశాల వరండాలో రెండు చోట్ల వేర్వేరుగా పాఠాలు బోధించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుత వర్షాకాలంలో కొద్దిపాటి చినుకులు పడితే పిల్లలందరూ ఒకే గదిలో కూర్చోవాల్సి వస్తుంది. పాఠశాలలో సరిపడా గదులు లేక పిల్లలందరికీ ఒకే చోట పాఠాలు చేప్తున్నారనే కారణంతో కొంత మంది తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. పాఠశాలకు అదనపు గదులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎవరు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికై నా పాఠశాలలో అదనపు గదులు నిర్మించి విద్యార్థుల ఇబ్బందులు తొలగించాలని వారు కోరుతున్నారు.పాఠశాలలో ఉన్న రెండు గదుల్లో ఒక గదిలో పాఠశాల మరొక గదిలో అంగన్వాడీ నిర్వహిస్తున్నారు. దీంతో పాఠశాల వరండాలోనే పిల్లలకు వేర్వేరుగా పాఠాలు చెబుతున్నారు. విద్యాబోధనకు ఇబ్బందికరంగా మారింది. గదుల కొరత విషయాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – పులి సమ్మయ్య, సర్పంచ్, తిమ్మాపూర్ ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు -
ఎల్నినో ‘షాక్’
హన్మకొండ: ఎల్నినో ప్రభావంతో ఒకవైపు వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో సాగునీటి అవసరాలకు రైతులు విద్యుత్ పంపులను విరివిగా నడుపుతున్నారు. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో గృహ అవసరాలకు అధికంగా విద్యుత్ వాడుతున్నారు. విద్యుత్ వినియోగంతోపాటు డిమాండ్ పెరుగుతోంది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిఽధిలో ఈ నెల 25న విద్యుత్ వినియోగం 80,6887 మిలియన్ యూనిట్లు జరగగా, డిమాండ్ 5,622 మెగావాట్లు నమోదైంది. అధిక వాడకం ఎందుకంటే..? ఎల్ నినో తీవ్ర ప్రభావంతో ఉమ్మడి వరంగల్జిల్లా అంతటా కరువుఛాయలు నెలకొంటున్నాయి. వర్షాకాలమైనా చినుకు జాడలేదు. ఇటీవల మోస్తరునుంచి తేలికపాటి కురిసిన వర్షాలు మినహా వరదలు పారే భారీ వర్షం ఇప్పటివరకు లేదు. ఫలితంగా జలవనరులు వెలవెలబోతున్నాయి. చెరువులు, కుంటల్లో నీరు లేక నెర్రలు వారుతున్నాయి. వర్షాలు కురుస్తాయనే ఆశతో వరినార్లు పోసుకున్న రైతులు అందుబాటులో ఉన్న భూగర్భజలాలతో పొలం దున్ని నాట్లు వేస్తుడడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. మరోవైపు మెట్ట పంటలు వాడిపోతుండడంతో వాటిని రక్షించేందుకు తడులు ఇస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ పంపుల వినియోగం పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు చేరుకోవడంతో గృహాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార వాణిజ్య సంస్థల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు విరివిగా వినియోగిస్తుండడంతో విద్యుత్కు డిమాండ్ నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఈ నెలలో 25,917 మిలియన్ యూనిట్ల వినియోగం జరగగా, 1,376 మెగావాట్ల డిమాండ్కు చేరుకుంది. అమాంతం పెరిగిన విద్యుత్ వాడకం, డిమాండ్ కనుమరుగైన వర్షాలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వ్యవసాయ మోటార్లు, గృహ అవసరాలకు విరివిగా విద్యుత్ వాడకం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెలలో 24,917 మిలియన్ యూనిట్ల వినియోగం 1376 మెగావాట్లకు పెరిగిన డిమాండ్ -
ప్రత్యామ్నాయ పంటల సాగు మేలు
జనగామ రూరల్: ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇంటిగ్రేటెడ్ వ్యవసాయంతో రైతులు అధిక ఆదాయం పొందాలని, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని ఓబుల్కేశవాపూర్ గ్రామంలోని రైతువేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రతీ ప్రాంతంలోని నేల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుంటే పెట్టుబడి తగ్గడంతో పాటు దిగుబడి, ఆదాయం కూడా మెరుగుపడుతుందన్నారు. ‘నాణ్యమైన విత్తనం–అధిక దిగుబడికి పునాది’ అనే లక్ష్యంతో రైతులకు అవసరమైన అన్ని రకాల ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను ఒకే వేదికపై ప్రభుత్వం అందుబాటులో ఉంచిందన్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉద్యానవన పంటలను సాగు చేస్తే ఆదాయం మరింత పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి మురళీధర్రావు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. స్మృతి వనం అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి పాలకుర్తిలోని బమ్మెర పోతన స్కృతి వనం అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. సోమవారం మినీ కాన్ఫరెన్స్ హాల్లో స్మృతి వనం సమగ్ర అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. బమ్మెర అభివృద్ధి పనులకు సంబంధించిన సవరించిన అంచనాలను త్వరగా ఖరారు చేసి, టెండర్ ప్రక్రియను ఆలస్యం లేకుండా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారావు, ఇరిగేషన్ శాఖ, పర్యాటక శాఖ, ఆర్ఆండ్బీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విత్తన మేళా ప్రారంభంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
సత్వరమే పరిష్కరించాలి
జనగామ రూరల్: జిల్లాలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన దరఖాస్తులను పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ తో కలిసి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 410 ధరఖాస్తులను స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను అధికారులు శాఖల వారీగా పరిశీలించి, సత్వరమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ సేవలను సమర్థవంతంగా అందించాలంటే వారికి జీతాలు సకాలంలో అందడం అత్యంత అవసరమన్నారు. ప్రతీ శాఖ అధికారి తమ పరిధిలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతన బిల్లులను నిర్ణీత గడువులోగా సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ భాస్కర్, హౌసింగ్ పీడీ మాతృ నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తులు ఇలా.. ● జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్నగర్కు చెందిన కె.రాజేశ్వరి తనకు ఇంటి స్థలం లేదని, కిరాయి ఇంటిలో ఉంటున్నానని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వినతి అందజేశారు. ● కొడకండ్ల మండలం, ఏడునూతుల గ్రామానికి చెందిన పల్లె రంగయ్య, తనకు మొత్తం 3.28 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, ఆ భూమిని వెంకటయ్య, రాములు, సోమన్న, వీరసోములు దొంగ కాగితాలు సృష్టించి పట్టా చేసుకొని, వేరే వారికి విక్రయించారని, విచారణ చేసి భూమిని తన పేరు మీదకు పట్టా చేయాలని కోరారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా ప్రజావాణిలో 410 దరఖాస్తులు -
పొగాకు ఉత్పత్తులు అమ్మొద్దు
జనగామ: జిల్లా కేంద్రంలోని విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో గుట్కాలు, పాన్ మసాలాలు, సిగరెట్లు విక్రయిస్తున్నారనే సమాచారంతో సోమవారం నార్కొటిక్ డ్రగ్స్ కంట్రోల్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. నార్కొటిక్ డ్రగ్స్ ఎస్సై సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లు రమేష్, సుధాకర్, సివిల్ కానిస్టేబుళ్లు శ్రీకాంత్, శ్యామ్తో కూడిన బృందం ప్రత్యేక పోలీసు జాగిలంతో కలిసి విద్యాసంస్థలకు సమీపంలో ఉన్న పాన్ షాపులు, కిరాణ దుకాణాలు, జనరల్ స్టోర్లు, టీ స్టాళ్లలో విస్తృత తనిఖీలు చేపట్టింది. పలుషాపుల్లో అంబర్, జోడబుల్తో పాటు ఇతర గుట్కా ఉత్పత్తులు, సిగరెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత దుకాణదారుల వివరాలను స్థానిక సివిల్ పోలీసులకు అందజేసి కేసు నమోదు చేయాలని నార్కొటిక్ బృందం ఆదేశించింది. ఈ సందర్భంగా ఎస్సై సమ్మిరెడ్డి మాట్లాడుతూ విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో ఉన్న ఏ దుకాణంలోనూ పొగాగు ఉత్పత్తుల అమ్మకం విక్రయించడం చట్టవి రుద్ధమని స్పష్టం చేశారు. జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకు ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు. నార్కొటిక్, డ్రగ్స్ బృందం మెరుపు దాడులు -
మూడోసారి కూడా ఆడబిడ్డేనని చెప్పడంతో..!
జనగామ: జనగామ జిల్లాలో అబార్షన్ (గర్భస్రావం) వికటించి ఓ గర్భిణి మృతి చెందిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనగామ సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రఘునాథపల్లి మండలం కన్నాయిపల్లికి చెందిన మల్కాపురం శ్రావణి(35)ని మండలానికే చెందిన అంబాల భాస్కర్ గౌడ్కు వివాహం చేశారు. వీరు హైదరాబాద్ ఫీర్జాదిగూడలో నివసిస్తుండగా, భాస్కర్ గౌడ్ ఆటో డ్రైవర్గా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడోసారి గర్భం దాల్చిన శ్రావణిని ఆమె అమ్మమ్మ ఊరైన దేవరుప్పుల మండలం కోలుకొండలో ఉంచారు. మరోసారి ఆడబిడ్డ పుడితే కుటుంబ పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయనే భావనతో శ్రావణి తల్లి శోభ, కోలుకొండకు చెందిన ఆర్ఎంపీ శ్రావణ్ను సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్ఎంపీ సూచన మేరకు ఈ నెల 20న హనుమకొండలో ఓ ఇంట్లో లింగనిర్ధారణ స్కానింగ్ నిర్వహిస్తున్న ప్రవీణ్ వద్దకు వెళ్లి పరీక్ష చేయించగా, గర్భంలో ఆడశిశువేనని చెప్పినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం ఆర్ఎంపీ సహకారంతో జనగామ పట్టణంలోని సంజయ్నగర్లో నివాసముంటున్న ప్రైవేట్ వైద్య సిబ్బంది అనసూర్య వద్దకు వెళ్లి డబ్బులు చెల్లించి అబార్షన్కు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 21న ఆమె ఇంట్లోనే గర్భస్రావం నిర్వహించినట్లు తెలిపారు. గర్భస్రావం అనంతరం ఇంటికి వెళ్లిన శ్రావణికి 23న తీవ్ర రక్తస్రావం ప్రారంభమైంది. తిరిగి అనసూర్యను సంప్రదించగా కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో 24న హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి అనంతరం అక్కడి నుంచి ఉప్పల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ 25వ తేదీన ఉదయం శ్రావణి మృతి చెందింది. ఆదివారం మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు శ్రావణి తల్లి శోభ, ఆర్ఎంపీ శ్రావణ్, నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ స్కానింగ్ చేసిన ప్రవీణ్, గర్భస్రావం నిర్వహించిన అనసూర్య నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఆర్ఎంపీ శ్రావణ్, ప్రైవేటు వైద్య సిబ్బంది అనసూర్యను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. -
ప్రీ–ప్రైమరీ నియామకాల జాబితా విడుదల
జనగామ: జిల్లాలో ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రీ–ప్రైమరీ విభాగాల ప్రారంభం, బలోపేతం కోసం జిల్లా విద్యాశాఖ తాత్కాలిక నియామక ప్రక్రి య చేపట్టింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి, సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు అధికారి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. 36 మంది ఇన్స్ట్రక్టర్లు, 37 మంది ఆయాలు.. జిల్లాలో మొత్తం 39 ప్రీ–ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లు, 39 మంది ఆయాలను ఎంపిక చేయాల్సి ఉండగా, ప్రస్తుతం 36 మంది ఇన్స్ట్రక్టర్లు, 37 మంది ఆయాల తాత్కాలిక ఎంపిక జాబితాను మాత్రమే విడుదల చేశారు. దీంతో 5 పోస్టులు ఖాళీగా ఉంచారు. వీటిలో 3 ఇన్స్ట్రక్టర్ పోస్టులు, 2 ఆయాల పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు ఖాళీగా ఉండడానికి కారణం రెండు కేటగిరీలకు చెందిన 12 మంది అభ్యర్థులకు ఒకే మార్కులు రావడం, దీంతో తుది ఎంపికలో స్పష్టత కోసం ఆ అభ్యర్థులకు ఈ నెల 28వ తేదీన మరోసారి పరీక్ష నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ నిర్ణయించింది. ఆ పరీక్షలో ప్రతిభ ఆధారంగా మిగిలిన 3 ఇన్స్ట్రక్టర్లు, 2 ఆయాల పోస్టులను భర్తీ చేయనున్నారు. మండలాల వారీగా ప్రస్తుతం ఎంపికైన అభ్యర్థులు మండలాల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వహించనున్నారు. ఎంపికై న ఇన్స్ట్రక్టర్లు, ఆయాలు తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయనుండగా, వారికి 2026–27 విద్యాసంవత్సరంలో గరిష్టంగా 10 నెలల పాటు గౌరవ వేత నం చెల్లించనున్నారు. సంబంధిత మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు ఎంపికై న వారిని వెంటనే విధుల్లో చేర్చి అమలు నివేదికను సమగ్ర శిక్ష కార్యాలయానికి పంపాలని డీఈఓ ఆదేశించారు. 28వ తేదీన నిర్వహించే పరీక్ష అనంతరం మిగిలిన ఐదు పోస్టులకు కూడా తుది ఎంపిక జాబితాను ప్రకటించనున్నట్లు విద్యాశాఖ ఏడీ శ్రీనివాస్ తెలిపారు. 36 మంది ఇన్స్ట్రక్టర్లు, 37 మంది ఆయాల ఎంపిక ఒకే మార్కులతో నిలిచిన 12 మంది అభ్యర్థులు 28వ తేదీన 5 పోస్టులకు మళ్లీ పరీక్ష -
9వసారి స్పందించడం మిరాకిల్..
పెద్ది సుదర్శన్రెడ్డిని ఆస్పత్రికి తీసు కొచ్చిన వెంటనే గంట పాటు సీపీఆర్ చేశా. ఎనిమిది సార్లు చేసినా గుండె లయ అందుకోలేదు. తొమ్మిదో సారికి లయ అందుకొని శ్వాస తీసుకుకున్నాడు.. ఇది మిరాకిల్. తర్వాత అంజియోగ్రామ్తో పాటు ఇతర పరీక్షలు నిర్వహించాం. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తం కరగడానికి ఇంజక్షన్ ఇచ్చాం. గుండె నుంచి ఊపిరితిత్తులకు వచ్చే రక్తనాళంలో గడ్డకట్టింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించాం. – మమత, కార్డియాలజిస్ట్ -
నాలుగున్నర గంటలు ఉత్కంఠ
హన్మకొండ: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్రెడ్డి ఆదివారం గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి నాలుగున్నర గంటల పాటు ఉత్కంఠ నెలకొంది. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. నిలకడగా ఆరోగ్యం హనుమకొండ హంటర్రోడ్డులోని తన నివాసంలో అస్వస్థతకు గురైన వెంటనే పెద్ది సుదర్శన్రెడ్డిని భార్య స్వప్న, అందుబాటులో ఉన్న కార్యకర్తలు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఉదయం 8 గంటలకు చేరుకున్న వెంటనే డాక్టర్ మమత చికిత్స ప్రారంభించారు. ఆస్పత్రి సిబ్బంది బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బీరవెల్లి భరత్ కుమార్రెడ్డికి సమాచారం అందించారు. ఆయన వెంటనే ఆస్పత్రికి చేరుకుని పెద్ది సుదర్శన్రెడ్డి భార్యతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ శాసన సభాపక్ష ఉపనేత హరీశ్రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఇతర నాయకులకు సమాచారం అందించారు. హనుమకొండలోనే ఉన్న మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, మార్తినేని ధర్మారావు, డాక్టర్ టి.రాజేశ్వర్రావు, నన్నపునేని నరేందర్, శంకర్నాయక్, అరూరి రమేశ్, సీనియర్ నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, మార్నేని రవీందర్రావు, ఈవీ శ్రీనివాస్రావు, ముద్దసాని సహోదర్రెడ్డి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అదే విధంగా కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, శంబీపూర్ రాజు, హైదరాబాద్ నుంచి పలువురు సీనియర్ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారు. భార్య పెద్ది స్వప్నతో మాట్లాడి సుదర్శన్రెడ్డి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని, మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలిస్తున్నట్లు వారు చెప్పారు. కాగా, సుదర్శన్రెడ్డి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరగడంతో వైద్యులు తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. డాక్టర్కు అభినందనల వెల్లువ కొద్దిరోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రాణాలను కార్డియాలజిస్ట్ మమత కాపాడారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను కాపాడిన ఆమెను పలువురు ప్రశంసలతో ముంచెత్తారు. గంటపాటు శ్రమించి పట్టువదలకుండా అంకితభావంతో సీపీఆర్ చేసి పెద్ది సుదర్శన్రెడ్డి ప్రాణాలు కాపాడిన మమతకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు ఎక్స్లో అభినందనలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికి గుండెపోటు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తీసుకెళ్లిన కుటుంబసభ్యులు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పరామర్శ -
ప్రత్యామ్నాయం వైపు అడుగులు
జనగామ రూరల్: ఎల్నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తూ ఆ దిశగా అడుగులు వేస్తోంది. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నేటి (సోమవారం) నుంచి 29 వరకు ఉదయం 10.00 గంటల నుంచి జిల్లాలోని ఎంపిక చేసిన రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహించనున్నారు. జిల్లాలో వరి పండించడానికి బదులుగా తక్కువ నీరు అవసరమయ్యే ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. విత్తన ఎంపిక సాగు పద్ధతులు వరి పంటకు బదులుగా సాగు చేయదగిన ప్రత్యామ్నాయ పంటలైన కంది, పెసర, మినుములు, నువ్వులు, జొన్న, మొక్కజొన్న, సజ్జలు, కొర్రలు, రాగులు తదితర పంటల నాణ్యమైన విత్తనాలు వివిధ విత్తన సంస్థలు, సహకార సంఘాలు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లలో రైతులకు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా రైతులకు పంటల ఎంపిక, విత్తనాల మోతాదు, సాగు యాజమాన్య పద్ధతులు, ప్రభుత్వ పథకాలపై వ్యవసాయ శాఖ అధికారులు సాంకేతిక సలహాలు అందించనున్నారు. ఏదైనా రైతు కోరుకున్న విత్తన రకం సంబంధిత రైతు వేదికలో అందుబాటులో లేకపోతే, వ్యవసాయ శాఖ ద్వారా ఇతర కేంద్రాల నుంచి ఆ విత్తనాన్ని సమకూర్చి రైతుకు అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. జిల్లాలోని రైతులు విత్తన మేళాను సద్వినియోగం చేసుకొని, ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకొని నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. నేటి నుంచి 29వరకు రైతు వేదికల్లో విత్తన మేళాలు రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన సందేహాల నివృత్తికి అందుబాటులో హెల్ప్లైన్ నంబర్లు బచ్చన్నపేట – బచ్చన్నపేట రైతు వేదిక చిల్పూర్ – మల్కాపూర్ రైతు వేదిక దేవరుప్పుల – దేవరుప్పుల రైతు వేదిక స్టేషన్ ఘన్పూర్ – స్టేషన్ ఘన్పూర్ రైతు వేదిక జనగామ – ఓబుల్కేశవాపూర్ రైతు వేదిక కొడకండ్ల – ఏడునూతుల రైతు వేదిక లింగాలఘనపురం – బండ్లగూడెం రైతు వేదిక నర్మెట – నర్మెట రైతు వేదిక పాలకుర్తి – పాలకుర్తి రైతు వేదిక రఘునాథపల్లి – రఘునాథపల్లి రైతు వేదిక జఫర్గఢ్ – జఫర్గఢ్ రైతు వేదిక తరిగొప్పుల – తరిగొప్పుల రైతు వేదికసాగు పరిస్థితులు ఆర్థం చేసుకొని రైతులు తమకు ఉన్న భూమిలో నీటి లభ్యతకు సరిపోను వరి సాగుతో పాటు ప్రత్యామ్నాయ పంటలు కంది, పెసర, మినుములు, కొర్రలు వంటి పంటల సాగుపై ఆసక్తి పెంచుకోవాలి. పంట మార్పిడి వల్ల దిగుబడితో పాటు ఆర్థిక వనరులు పెరుగుతాయి. రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి సాగు చేయాలి. హెల్ప్లైన్ 1950,1800 425 6605 నంబర్లలో సంప్రదిస్తే అధికారులు తగిన సూచనలు ఇస్తారు. – సందీప్ కుమార్ ఝా, కలెక్టర్ -
జలసిరి భాగ్యం
జనగామ: దేశంలో భూగర్భ జలాల మట్టాన్ని పెంపొందించడం, వర్షపు నీటిని సద్వినియోగం చేయడం, నీటి వనరులను స్థిరంగా సంరక్షించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘జలసిరి’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు, ఇంకుడు గుంతల వంటి చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో నీటి సంరక్షణపై అవగాహన కల్పించడం, ప్రతీ గ్రామంలో స్థానిక అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. భూగర్భజలాల వినియోగాన్ని శాసీ్త్రయంగా పర్యవేక్షిస్తూ నీటి వృథాను నివారించే చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో దీనిని సమర్థవంతంగా అమలు చేస్తూ, నీటి వనరుల సంరక్షణ ద్వారా సుస్థిర అభివృద్ధి సాధించడమే ప్రధాన లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం జలసిరి కార్యక్రమంలో భూగర్భ జలాల లభ్యత ఆధారంగా బావుల తవ్వకాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. సహజంగా పునరుద్ధరణ అయ్యే భూగర్భ జలాల కంటే అధికంగా నీటి వినియోగం జరుగుతున్న ప్రాంతాల్లో కొత్త బావుల తవ్వకాలకు అనుమతి లేదు. జిల్లాలోని 280 గ్రామపంచాయతీల్లో 76 గ్రామపంచాయతీలు ఈ పరిధి లోకి రావడంతో అక్కడ బావుల తవ్వకాలు చేపట్టరు. బచ్చన్నపేట–13, నర్మెట–3, తరిగొప్పుల–4, జనగామ–14, లింగాలఘణపురం –4, దేవరుప్పుల–6, పాలకుర్తి–7, కొడకండ్ల–6, స్టేషన్ ఘన్న్పూర్–3, రఘునాథపల్లి–6, జఫర్గఢ్–4, చిల్పూర్–3 గ్రామపంచాయతీలు ఇందులో ఉన్నాయి. మిగిలిన 104 గ్రామ పంచాయతీల్లో ఒక్కో మండలానికి ఐదు బావుల చొప్పున అనుమతి ఇవ్వగా, ఒక్కో బావికి రూ.3 లక్షల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రభుత్వ బంజరు, అసైన్డ్ భూములకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. ఐదు ఎకరాల్లోపు పాస్బుక్, గ్రామ పంచాయతీ తీర్మాణం, సన్న, చిన్నకారు రైతు ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు 2026–27 ఆర్థిక సంవత్సరానికి వీబీజీ రాంజీ(ఉపాధిహామీ) కార్యక్రమం అమలులో భాగంగా జిల్లాలోని అన్ని మండలాలకు భౌతిక లక్ష్యాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలతో అనుసంధానం, జిల్లా లక్ష్యాల సాధనకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని ఎంపీడీఓల మండల కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయడం, గ్రామ పంచాయతీలకు లక్ష్యాలను వెంటనే పంపిణీ చేయడం, నిరంతర ఉపాధి కల్పన, నిధుల వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షించడం, సాంకేతిక, పరిపాలనా అనుమతులు పూర్తి చేయడం, ఎంఐఎస్ ద్వారా రోజు వారీ పురోగతిని డీఆర్డీఏ ద్వారా కలెక్టర్కు సమర్పించడం వంటి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 2,340 హార్టికల్చర్ ఎకరాలు, 2 వేల లబ్ధిదారులు, 7,020 ఫార్మ్ పాండ్లు, 2,340 రీఛార్జ్ పిట్లు, 585 నాడెప్, వెర్మీ యూనిట్లు, 270 ఫిష్ ట్యాంక్ పనులు, 54వేల వ్యక్తిగత సోక్పిట్ పనులు, 270 కమ్యూనిటీ సోక్పిట్లు చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించారు. మండలాల వారీ లక్ష్యాలను కచ్చితంగా అమలు చేసి గ్రామీణ ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధి, శాశ్వత ఆస్తుల సృష్టిలో జిల్లా నిర్దేశిత లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించాలని కలెక్టర్ ఆదేశాల్లో పేర్కొన్నారు. మండలానికి 5 బావుల తవ్వకం ప్రభుత్వ, బంజరు భూములు, సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యం 76 జీపీలకు కొత్త బావులకు నో.. మిగిలిన చోట్ల గ్రీన్సిగ్నల్ 2026–27కు మండలాల వారీగా పనుల టార్గెట్ కలెక్టర్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనుల భారీ లక్ష్యాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలసిరి కార్యక్రమం ద్వారా భూగర్భ జలాల సంరక్షణకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ముందుకెళ్తున్నాం. అధిక నీటి వినియోగం ఉన్న గ్రామపంచాయతీల్లో కొత్త బావులకు అనుమతి ఉండదు. అర్హత ఉన్న ప్రాంతాల్లో ఒక్కో మండలానికి ఐదు బావులకు అవకాశం కల్పించాం. ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యమిస్తాం. మండలాల వారీగా లక్ష్యాలు నిర్ధేశించుకుని పనులు చేపడుతాం. – ఆర్.భాస్కర్, పీడీ, డీఆర్డీఓ -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగించే అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఆదివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యాధునిక సీసీ కెమెరాల నెట్వర్క్తో పాటు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నట్లు చెప్పారు. నేరాల నియంత్రణ కోసం గతంలో పని చేసిన పోలీస్ అధికారులు.. ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఇతర సంస్థల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని, వాటిని పునరుద్ధరించడంతో పాటు కొత్తగా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఆమె పేర్కొన్నారు శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు గంజాయి అక్రమ రవాణా, మాదకద్రవ్యాల విక్ర యం, రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని సీపీ వెల్లడించారు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి రవాణ అరికట్టేందుకు చర్యలు చేపడతామన్నారు. మరింత పటిష్టంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం పకడ్బందీ చర్యలు కొనసాగిస్తున్నామన్నారు. నేరాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు.. ప్రజల భద్రతకు భంగం కలిగించే ఏ చర్యనైనా సహించబోమని సీపీ శ్వేత స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడిన వారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు అవసరమైతే నిరోధక చర్యలను కూడా అమలు చేస్తామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో రౌడీషీటర్లను గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించి పోలీసు కట్టుబాట్లను సూచిస్తామని వివరించారు. సుమారు 700 మంది రౌడీషీటర్లు ఉన్నట్లు గుర్తించామని, త్వరలోనే అన్ని చర్యలు తీసుకుంటామని, పోలీస్ యాక్షన్ త్వరలోనే చూస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజాప్రతినిధులు, ప్రజలు, మీడియా కీలక భాగస్వాములని సీపీ శ్వేత అన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు, నేరాలకు సంబంధించిన సమాచారం వెంటనే పోలీసులకు అందిస్తే త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసులకు సమాచారం అందించే వారి సమాచారం గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రజల భద్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు మీడియా సమావేశంలో సీపీ ఎన్.శ్వేత -
ఉత్సాహంగా విజయ్ దివస్ 5కే రన్
జనగామ రూరల్: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా జనగామ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని బతుకమ్మకుంట వద్ద 5కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనగామ రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కసాబు రమేశ్ మాట్లాడుతూ.. వీర జవాన్ల త్యాగాన్ని ప్రతీ భారతీయుడు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రన్నర్స్ గౌరవ అధ్యక్షుడు పానుగంటి శ్రీని వాస్, పిట్టల సత్యం, మల్లికార్జునాచారి, అబ్బాస్, రాంచందర్, ఆంజనేయులు, శ్రీరాముల మల్లేష్, బాల్ని నాగరాజు, నల్ల మధు, అరవింద్, మురళీకృష్ణ, చంద్రశేఖర్, శాడ పోచయ్య, నవీన్, కుమారస్వామి, భాస్కర్, శ్రవణ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. మార్షల్ ఆర్ట్స్ అభివృద్ధికి కృషిచేయాలిజనగామ రూరల్: మార్షల్ ఆర్ట్స్ అభివృద్ధికి మాస్టర్లు సమష్టిగా కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు ఓరుగంటి సంతోష్ కుమార్ అన్నారు. ఆదివారం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ అధ్యక్షతన ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..జిల్లా వ్యాప్తంగా మార్షల్ ఆర్ట్స్ అభివృద్ధికి యువతలో ఆత్మరక్షణ నైపుణ్యాలు, క్రమశిక్షణ పెంపొందించేందుకు శిక్షణా కార్యక్రమాలు, సభ్య త్వ నమోదు, జిల్లా స్థాయి పోటీల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ మాస్టర్స్ అడ్వైజరీ కమిటీ మెంబర్ పెచ్చెట్టి త్రివిక్రమ్ రావ్, వైస్ ప్రెసిడెంట్ బానోత్ బాలు కుమార్, చెరుపల్లి అశోక్, అసోసియేషన్ సభ్యులు అశ్విని, ఎండీ పాషా తదితరులు పాల్గొన్నారు. రూ.2.50లక్షల ఎల్ఓసీ అందజేతచిల్పూరు: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బాధితురాలికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి భారీ ఎల్ఓసీ అందించారు. మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన కేశిరెడ్డి సునీత అనా రోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఎమ్మెల్యే కడి యం శ్రీహరి చొరవతో బాధితురాలి వైద్య ఖ ర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.2.50 లక్షల ఎల్ఓసీని ఆదివారం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ పేదల పాలిట సంజీవని అన్నారు. బలాకా, విజయా క్రమాల్లో భద్రకాళి అమ్మవారు హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శాకంబరీ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం అమ్మవారికి బలా కా, విజయా క్రమాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు నిత్యాహ్నికపూజలు చతుస్థానార్చనలు చేశారు. స్నపనమూర్తిని కాళీకల్పకం ప్రకారం బలాకా అమ్మవారుగా, బోగభేరాన్ని షోడశీక్రమంలో విజయా నిత్యగా అలంకరించారు. ప్రశాంతంగా ఉచిత కోచింగ్ అర్హత పరీక్ష కేయూ క్యాంపస్: ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా అభ్యర్థుల కోసం సివిల్ సర్వీసెస్లో ఉచిత శిక్షణ కోసం నిర్వహించిన అర్హత పరీక్ష ఆదివారం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రశాంతంగా ముగిసింది. కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి నిర్మల, ఎస్సీ స్టడీ సర్కిల్ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ జగన్మోహన్ పర్యవేక్షించారు. -
వైద్యరంగానికి భారీ ఊతం
సాక్షిప్రతినిధి, వరంగల్ : డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, హానరేరియం, ఎంటీఎస్ ఉద్యోగాల కొనసాగింపునకు రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాదిపాటు అనుమతి ఇచ్చింది. ఈ ఉద్యోగాలు 2027 మార్చి 31 వరకు లేదా రెగ్యులర్ నియామకాలు పూర్తయ్యే వరకు కొనసాగనున్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల వైద్యకళాశాలలు, బోధనాసుపత్రులకు వివిధ కేడర్లలో పోస్టులు మంజూరు చేసిన ప్రభుత్వం.. ఉమ్మడి వరంగల్కు పెద్దపీట వేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సిక్తా పట్నాయక్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. భారీగా పోస్టుల కేటాయింపు... ఉమ్మడి వరంగల్ జిల్లాల వైద్య కళాశాలలు, బోధనాసుపత్రులకు వివిధ కేటగిరీల్లో సుమారు 564 పోస్టులను మంజూరు చేశారు. ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లు, అనస్థీషియా టెక్నీషియన్లు, సాంకేతిక సిబ్బంది, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇచ్చారు. ● హనుమకొండకు 3 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 10 అసోసియేట్ ప్రొఫెసర్లు, వరంగల్ జిల్లా కింద 40 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 20 అసోసియేట్ ప్రొఫెసర్లు, అనస్థీషియా టెక్నీషియన్లు, ఇతర సాంకేతిక సిబ్బందిని కేటాయించారు. ● ఎంజీఎం/కాకతీయ మెడికల్ కాలేజీ పరిధిలో 145 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 15 ప్రొఫెసర్లు, ఏసీ మెకానిక్, ఆడియాలజిస్ట్ పోస్టులు ఇచ్చారు. ● మహబూబాబాద్కు 50 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 35 అసోసియేట్ ప్రొఫెసర్లు, అనస్థీషియా టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని కేటాయించారు. ● ములుగు జిల్లాకు 56 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 28 అసోసియేట్ ప్రొఫెసర్లు, 7 ట్యూటర్లు, అనస్థీషియా పోస్టులు ఇచ్చారు. ● జనగామకు15 మంది అసిస్టెంట్, 26 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, అనస్థీషియా టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని కేటాయించారు. ● జయశంకర్ భూపాలపల్లికి 53 అసిస్టెంట్, 22 అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇతర సాంకేతిక పోస్టులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. వేతనాలకూ భారీ వ్యయం.. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నెలకు రూ.1.25 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్లకు రూ.1.50 లక్షలు, ప్రొఫెసర్లకు రూ.1.90 లక్షలు, సీనియర్ రెసిడెంట్లకు రూ.1,06,461, ట్యూటర్లకు రూ.55 వేల వరకు పారితోషికం చెల్లించనున్నారు. ఇతర ఔట్సోర్సింగ్, సాంకేతిక సిబ్బందికి సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వేతనాలు అందజేయనున్నారు. ఈ ఉద్యోగుల వేతనాల కోసం బోధనాసుపత్రులు, మెడికల్ కాలేజీలు, రిమ్స్, నర్సింగ్ కాలేజీలకు సంబంధించిన బడ్జెట్ హెడ్ల నుంచి ఖర్చు చేయాలని కూడా ప్రభుత్వం ఆ ఉత్తర్వులో ఆదేశించింది. కాగా ఉమ్మడి జిల్లాలో కాకతీయ మెడికల్ కాలేజీ, ఎంజీఎం , కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ మెడికల్ కాలేజీల బోధన, వైద్య సేవలు కొనసాగేందుకు ఈ ఉత్తర్వులు మరింత కీలకంగా మారనున్నాయి. డీఎంఈ పరిధిలో పోస్టుల కొనసాగింపు..కొత్తగా కేటాయింపులు బోధనాసుపత్రులు, మెడికల్ కాలేజీలకు భరోసా -
డిజిటల్ తెరపై!
ఇంటర్ పాఠాలు..జనగామ రూరల్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యాబోధనలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బోర్డులపై పాఠాలు బోధించే పద్ధతికి స్వస్తి పలికారు. పాఠశాలల్లో అమలవుతున్న డిజిటల్ తరగతుల తరహాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ డిజి టల్ తెరలపై అధ్యాపకులు పాఠాలు బోధించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 28 డిజిటల్ స్క్రీన్లు.. ఇంటర్ విద్య కమిషనర్ ఎస్.కృష్ణఆదిత్య వినూత్న ఆలోచనలతో కార్పొరేట్ కళాశాలల్లో కూడా లేని విధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పేద విద్యార్థుకుల ఉత్తమ భోధన అందించాలనే ఉద్దేశ్యంతో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ ఇంటరాక్టివ్ ప్యానెల్స్ (ఐడీపీ)ను జిల్లాలోని 7 కళాశాలలకు నాలుగు చొప్పున మొత్తం 28 అందించారు. డిజిటల్ స్క్రీన్ల ద్వారా పాఠ్యాంశాలను వీడియోలు, యానిమేషన్లు, గ్రాఫిక్స్ రూపంలో చూపించడంతో విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమవుతాయి. గణితం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం వంటి క్లిష్టమైన సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాలను విజువల్ పద్ధతిలో నేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. వీటిని ఉపయోగించుకోవడానికి విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలు పొందాలని ఈనెల 31 వర కు అవకాశం ఉందని డీఐఈఓ జితేందర్రెడ్డి తెలి పారు. అలాగే రానున్న రోజుల్లో మధ్యాహ్న భోజనం కూడా అమలు కానుండడంతో విద్యార్థులకు మంచి అవకాశమే. ఆన్లైన్ శిక్షణకు కీలకం.. ఈ ప్యానెల్స్ ద్వారా బోధనతోపాటు వివిధ పోటీపరీక్షలకు సంబంధించిన శిక్షణను సద్వినియోగం చేసుకో వచ్చు. విద్యార్థులను ఐఐటీ, నీట్లాంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధం చేసేందుకు ఆన్లైన్ శిక్షణను ఉపయోగించుకునే వీలుంది. ఖాన్ అకాడమీ, ఫిజిక్స్వాలా వంటి శిక్షణ సంస్థల నుంచి విద్యార్థులు శిక్షణ పొందేందుకు ఎంతో కీలకంగా పనిచేయనున్నాయి. విద్యుత్, ఇంటర్నెట్.. ఒక్కో కళాశాలకు రూ.6లక్షలకు పైగా వెచ్చిస్తున్నారు. అధ్యాపకుడి కేంద్రంగా ఇంటరాక్టివ్ బోధన కోసం రెండు ఐఎఫ్బీ స్క్రీన్లు, విద్యార్థుల విజువల్ లెర్నింగ్ ఉపయోగపడేలా మరో రెండు ఐడీపీ మొత్తం నాలుగు స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం అవసరమైన విద్యుత్, ఇంటర్నెట్, సౌండ్ సిస్టమ్ వంటి వసతులను అప్గ్రేడ్ చేయనున్నారు. బోధనలో సౌలభ్యం.. ఎస్ఈడీ వినియోగంతో అధ్యాపకులకు బోధన మరింత సులభంగా మారనుంది. డిజిటల్ కంటెంట్, ప్రజెంటేషన్లు, ఆన్లైన్ విద్యావనరులను నేరుగా తరగతిగదిలో ఉపయోగించవచ్చు. ఒకే పాఠాన్ని అన్ని తరగతుల విద్యార్థులకు ఒకేలా బోధించే అవకాశం ఉండటం, నాణ్యత పెరగడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు సైతం కార్పొరేట్ స్థాయి బోధన అందడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది. ఇప్పటికే ఎల్ఈడీలు, పరికరాలు అమరిక రానున్న రోజుల్లో మధ్యాహ్న భోజనం అమలు ఈనెల 31 వరకు అడ్మిషన్లకు అవకాశంప్రభుత్వ కళాశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. అందులో భాగంగా ప్రభుత్వం మౌలిక వసతులతో పాటు డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. పోటీ పరీక్షల్లో సైతం విజయాలు సాధించేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ అధ్యాపకులు ఉన్నారు.. విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలి. -
‘ఏకాదశి’ శోభ
ఆలయాలకు జనగామ: తొలి ఏకాదశి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వైష్ణవ, శైవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక దర్శనాలు, అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు నిర్వహించారు. పట్టణంలోని బాణాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి, గుండ్లగడ్డ శ్రీ ఉమామహేశ్వరస్వామి, శ్రీ సంతోషిమాత, ఉప్పలమ్మ సహిత శ్రీ ఆంజనేయ స్వామి, గణేష్ స్ట్రీట్ ఆంజనేయస్వామి, మహంకాళమ్మ, పోచమ్మ, బతుకమ్మ కుంట శ్రీ విజయ దుర్గామాత, సాయిబాబా, శ్రీ కన్యకాపరమేశ్వరి, శ్రీ చెన్నకేశస్వామి, మూలబావి శ్రీ హనుమత్ రామచంద్రస్వామి, హనుమాన్ ఆల యాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. గుండ్లగడ్డ ఉమామహేశ్వరస్వామి ఆలయం, శ్రీ సంతోషిమాత ఆలయాల్లో ఘటాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. డీసీపీ రాజమహేంద్ర నాయక్ పాల్గొని ఘటాభిషేకం నిర్వహించారు. మంచి వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ అన్ని ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. -
వినియోగదారులకు నాణ్యమైన సేవలు
స్టేషన్ఘన్పూర్: విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు వినియోగదారులకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్స్) టి.మధుసూదన్ అన్నారు. జనగామ సర్కిల్లోని స్టేషన్ఘన్పూర్ డివిజన్లో ఘన్పూర్ సెక్షన్, సబ్ డివిజన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మొబైల్ ట్రాలీ డీటీఆర్ వాహనాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ..డీటీఆర్ దెబ్బతిన్న సందర్భాల్లో ఈ మొబైల్ ట్రాలీ వాహనం ద్వారా ట్రాన్స్ఫార్మర్లను సులభంగా తరలించి తక్షణమే ప్రత్యామ్నాయ డీటీఆర్ను ఏర్పాటు చేయడం ద్వా రా విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు పట్టే సమయం గణనీయంగా తగ్గుతుందన్నారు. ఎస్ఈ చెరుకు సంపత్రెడ్డి, ఏడీఈలు రణధీర్రెడ్డి, స్వామిరెడ్డి, ఏఈలు శివకుమార్, శంకర్ పాల్గొన్నారు. 33 కేవీ ఇంటర్ లింక్ లైన్ ప్రారంభం రఘునాథపల్లి: మౌలిక సదుపాయాల బలోపేతంలో భాగంగా 33 కేవీ జనగామ ఫీడర్ ట్యాపింగ్ పాయింట్ నుంచి 33/11 కేవీ నిడిగొండ సబ్స్టేషన్ వరకు నిర్మించిన 33 కేవీ ఇంటర్ లింక్ లైన్ను నిడిగొండ సబ్స్టేషన్లో టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్స్) టి.మధుసూదన్ ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు ప్రత్యామ్నాయ మార్గంలో విద్యుత్ సరఫరా కొనసాగించగలిగే సామర్థ్యం ఈ ఇంటర్లింక్ లైన్ ద్వారా ఉంటుందన్నారు. సూపరింటెండెంట్ ఇంజనీర్ సంపత్రెడ్డి, ఏడీఈ(కన్స్ట్రక్షన్) స్వామిరెడ్డి, రఘునాథపల్లి ఆపరేషన్ ఏడీఈ సుధాకర్, కన్స్ట్రక్షన్ ఏఈ రమేశ్, అపరేషన్ ఏఈ రాహుల్ పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్ -
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి
జనగామ: మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి యువత తమ నైపుణ్యాలను సమాజాభివృద్ధికి ఉపయోగించాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్, నార్కోటిక్ విభాగం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్, పిలుపునిచ్చారు. శనివారం మాదకద్రవ్యాలను నిర్మూలించి వికసిత్ భారత్ నిర్మాణంలో యువత పాత్రను పెంచేందుకు యువజన కార్యక్రమాలు, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో యశ్వంతపూర్లోని క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో నషా ముక్త్ ఫర్ వికసిత్ భారత్లో భాగంగా మైభారత్ జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ విద్యార్థులతో మాదకద్రవ్య వ్యతిరేక ప్రమాణం చేయించారు. మాదకద్రవ్యాల నిర్మూలన అంశంపై సీజేఐటీ విద్యార్థిని అలేఖ్య చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఆమెను డీసీపీ బంగారు పతకంతో సత్కరించి ధైర్యశాలి అని అభినందించారు. ఇందులో డిగ్రీ, ఫార్మసీ, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు హాజ రయ్యారు. కార్యక్రమ నిర్వాహకుడు నవీన్, కళా శాల ప్రిన్సిపాల్ ఎస్.చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీజేఐటీ సదస్సులో డీసీపీ రాజమహేంద్ర నాయక్ -
ప్రత్యామ్నాయమే ప్రయోజనకారి
జనగామ: ఎల్నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావం నెలకొందని, జిల్లా కూడా దుర్భర పరిస్థి తులను ఎదుర్కొంటోందని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, జనగామ కో ఆర్డినేటర్ డాక్టర్ వి.రమ్య తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ ఎల్నినో నేపథ్యంలో జిల్లా రైతులకు పలు సూచనలు, సలహాలు అందించారు. రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండి శాసీ్త్రయ యాజమాన్య పద్ధతులు పాటించాలని ఆమె సూచించారు. జూన్ 1 నుంచి జూలై 22 వరకు జిల్లాలో సాధారణంగా 261.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 143.8 మిల్లీమీటర్లు మాత్రమే నమోదై 44.9 శాతం వర్షపాతం లోటు ఏ ర్పడిందన్నారు. జిల్లాలో మొత్తం 3,59, 281 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణానికి గాను ఇప్పటివరకు 2,41,193 ఎకరాల్లో (67.13 శాతం) మాత్రమే సాగు పూర్తయిందన్నారు. ప్రధాన పంటల్లో పత్తి 1,38,325 ఎకరాల్లో సాగై సాధారణ విస్తీర్ణాన్ని అధిగమించి 100.86 శాతం నమోదు చేయగా, వరి 95,653 ఎకరాల్లో (45.81 శాతం), మొక్కజొన్న 25.37 శాతం, పెసర 2,305 ఎకరాల్లో (33.61శాతం), మినుము 562 ఎకరాల్లో (67.22 శాతం) సాగైనట్లు వెల్లడించారు. యాజమాన్య పద్ధతులను అనుసరించాలి పొలాల్లో అంతరకృషి చేసి కలుపు మొక్కలను పూర్తిగా తొలగించాలని, రిడ్జ్ అండ్ ఫరో లేదా బోదెలు, చాళ్ల పద్ధతి ద్వారా వర్షపు నీటిని పొలంలోనే నిల్వ చేసి నేల తేమను కాపాడాలని సూచించారు. నత్రజని ఎరువులు (యూరియా) నేలలో తగిన తేమ ఉన్నప్పుడే వేయాలని, అందుబాటులో ఉన్న నీటిని రక్షణాత్మక సాగు నీటికి మాత్రమే వినియోగించాలని పేర్కొన్నారు. రైతులు తమ పొలాలను తరచూ పరిశీ లి స్తూ చీడపీడలను ప్రారంభ దశలోనే గుర్తించాలని, ఆర్థిక నష్టం స్థాయికి చేరినప్పుడు మాత్రమే నిపుణుల సలహాతో నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పత్తి పంట.. పొడి వాతావరణం కొనసాగితే రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగే అవకాశముందని శాస్త్రవేత్త రమ్య పేర్కొన్నారు. ప్రారంభ దశలో వేపనూనె 1,500 పీపీఎం ఎకరానికి 1 లీటరు పిచికారీ చేయాలని సూచించారు. ఉధృతి తీవ్రంగా ఉంటే లీటరు నీటికి 2 మిల్లీ లీటర్లు ఫిప్రోనిల్ లేదా 0.3 గ్రాములు ఫ్లోనికామిడ్ పిచికారీ చేయాలని తెలిపారు. రసాయన రహిత నియంత్రణ కోసం ఎకరానికి 10–15 పసుపు లేదా నీలం రంగు స్టిక్కీ ట్రాప్స్, అలాగే 1–2 సోలార్ లైట్ ట్రాప్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. వరి పంట.. వరి పంటలో కాండం తొలిచే పురుగు ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున నివారణకు కార్బోఫ్యూరాన్ 3ఎ గుళికలు ఎకరానికి 10 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4ఎ గుళికలు ఎకరానికి 8 కిలోలు సమానంగా వెదజల్లి, అనంతరం పొలంలో స్వల్పంగా నీరు నిల్వ ఉండేలా చూడాలని సూచించారు. ఆలస్యంగా నాటిన వరి పొలాల్లో ఈ పురుగు ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తత పాటించాలని హెచ్చరించారు. మొక్కజొన్న.. మొక్కజొన్నలో కత్తెర పురుగు ఉధృతి తీవ్రంగా ఉంటే లీటరు నీటికి 0.3 గ్రాములు ఎమామెక్టిన్ బెంజోయేట్ లేదా 0.4 మిల్లీ లీటర్లు క్లోరాంట్రాని లిప్రోల్ పిచికారీ చేయాలని సూచించారు. వర్షాలు మరింత ఆలస్యమైతే నీటి అవసరం తక్కువగా ఉండే పెసర, మినుము, నువ్వులు, జొన్న, సజ్జలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని ఆమె సూచించారు. మార్కెట్ సౌకర్యం, నాటే మొక్కల లభ్యత ఉన్న ప్రాంతాల్లో లెమన్ గ్రాస్ వంటి సుగంధ పంటలను కూడా ప్రత్యామ్నాయంగా సాగు చేయవచ్చని తెలిపారు. వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నందున రైతులు ప్రతిరోజూ వాతావరణ సూచనలను గమనిస్తూ, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసే తాజా వ్యవసాయ సలహాలను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో నేల తేమ సంరక్షణ, పంట రక్షణ, శాసీ్త్రయ యాజమాన్య చర్యలే దిగుబడిని కాపాడే ప్రధాన మార్గాలని పేర్కొన్నారు. వర్షాలు మరింత ఆలస్యమైతే నీటి అవసరం తక్కువగా ఉండే పెసర, మినుము, నువ్వులు, జొన్న, సజ్జలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని ఆమె సూచించారు. మార్కెట్ సౌకర్యం, నాటే మొక్కల లభ్యత ఉన్న ప్రాంతాల్లో లెమన్ గ్రాస్ వంటి సుగంధ పంటలను కూడా ప్రత్యామ్నాయంగా సాగు చేయవచ్చని తెలిపారు. వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నందున రైతులు ప్రతిరోజూ వాతావరణ సూచనలను గమనిస్తూ, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసే తాజా వ్యవసాయ సలహాలను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో నేల తేమ సంరక్షణ, పంట రక్షణ, శాసీ్త్రయ యాజమాన్య చర్యలే దిగుబడిని కాపాడే ప్రధాన మార్గాలని పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితులపై రైతుల అప్రమత్తత అవసరం తక్కువ నీరు అవసరముండే పంటలే వేయాలి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రమ్య -
విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమాడొద్దు
జనగామ రూరల్: నీట్ పేపర్ లీకేజీ ఘటనలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం కాంగ్రెస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెహ్రూ పార్కు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతీ లక్ష్మీనారాయణ నాయక్ పాల్గొని విద్యార్థుల పోరా టానికి సంఘీభావం ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడే విధానాలను సహించబోమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొమ్మూరి మాట్లాడుతూ..మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేసి రాహుల్ గాంధీకి అప్పగించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి, జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్చంద్రారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మారజోడు రాంబాబు, నామాల బుచ్చయ్య, మున్సిపల్ చైర్పర్సన్ వినయ్ కుమార్, కౌన్సిలర్లు దిలీప్ కుమార్ రెడ్డి, వేముల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, చింతకింది మల్లేశం పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ -
డిల్లెం బల్లెం.. బీరన్నకు బోనం
జనగామ: ఆషాఢ మాసం తొలి ఏకాదశి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో కురుమ కులస్తులు బీరప్ప, కామరాజు దేవతామూర్తులకు ఘనంగా శనివారం బోనాలు సమర్పించారు. వేలాదిగా కురుమలు హాజరై ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని చాటిచెప్పారు. కురుమ కులపెద్దలు పట్టు వస్త్రాలు ధరించి సంప్రదాయ పద్ధతిలో ముందుగా ఊరేగింపును ప్రారంభించారు. మహిళలు తలపై బోనాలు మోసుకుంటూ భారీ ర్యాలీగా బొడ్రాయి వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్రగా బీరప్ప ఆలయానికి చేరుకుని దేవతామూర్తులకు బోనాలు సమర్పించారు. అమ్మవార్ల వేషధారణలు, ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
భవన నిర్మాణ నిబంధనలు పాటించాలి
జనగామ: మున్సిపాలిటీ పరిధిలో భవన నిర్మాణ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో బిల్డర్లు, ప్లానర్లు, వెల్డర్లు, మేసీ్త్రలు తదితరులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిర్మాణ అనుమతులు, భద్రతా ప్రమాణాలు, వ్యర్థాల నిర్వహణ, అక్రమ నిర్మాణాల నియంత్రణపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతీ భవన నిర్మాణం తప్పనిసరిగా మంజూరైన నమూనా ప్రణాళికకు అనుగుణంగానే చేపట్టాలని సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని, అలాంటి ని ర్మాణాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘డ్రైడే..ఫ్రైడే’ను విజయవంతం చేయాలి డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు ప్రతీ శుక్రవారం నిర్వహిస్తున్న ‘డ్రై డే ఫ్రైడే’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ పరిధిలో ప్రతీ శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారానికి ఒకసారి నీటి నిల్వ పాత్రలను పూర్తిగా ఖాళీ చేసి శుభ్రం చేయాలన్నారు. పరిశుభ్రమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన పట్టణ నిర్మాణం కోసం ప్రతీ పౌరుడు ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలని కోరుతూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు బిల్డర్లు, ప్లానర్లు, వెల్డర్లు, మేసీ్త్రలతో మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి -
ఏ అధికారి ఎప్పుడొస్తారో?
స్టేషన్ఘన్పూర్: మున్సిపాలిటీకి ప్రస్తుత కమిషనర్ రాధాకృష్ణ మినహా ప్రధాన శాఖల అధికారులు అందరూ ఇన్చార్జులే ఉన్నారు. రెవెన్యూ డివిజన్, నియోజకవర్గ కేంద్రమైన స్టేషన్ఘన్పూర్.. మున్సిపాలిటీగా మారి ఏడాదిన్నర గడుస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే నెలకొని ఉన్నాయి. ఎమ్మెల్యే కడియం శ్రీహరి చొరవతో 2025లో స్టేషన్ఘన్పూర్, శివునిపల్లి జంటపట్టణాలు, ఛాగల్లు గ్రామాలను కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. ఇక పారిశుద్ధ్యం, వీధిదీపాలు, తాగునీరు తదితర సమస్యలు ఉండబోవని, ఒకవేళ ఉన్నా ఎప్పటికప్పుడు పరిష్కారం అవుతాయని ప్రజలు సంబరపడ్డారు. అయితే ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ఠవేయగా ఘన్పూర్ పేరుకే మున్సిపాలిటీ అన్నట్లుగా ఉంది. 18వార్డులకు ఒక్కరే.. మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులకు గాను 18 మంది వార్డు ఆఫీసర్లు ఉండాల్సి ఉండగా కేవలం ఒకే ఒక్క వార్డు ఆఫీసర్ ఉన్నారు. నలుగురు జూనియర్ అసిస్టెంట్లకు ఒక్కొక్కరికి మూడు, నాలుగు వార్డుల చొప్పున ఇన్చార్జ్లుగా నియమించారు. ప్రధానశాఖ అయిన టీపీఓ లేకపోవడంతో టీపీడీఓ డిప్యుటేషన్పై ఇక్కడ ఇన్చార్జ్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన వారానికి కేవలం రెండు రోజులే వస్తుండగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు తీసుకునేందుకు ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. మున్సిపల్ ఏఈ సైతం రెగ్యులర్గా లేకపోవడంతో ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న అధికారి వారానికి మూడు, నాలుగు రోజులు మాత్రమే వస్తున్నారు. పారిశుద్ధ్య సమస్యను పర్యవేక్షించే శానిటరీ ఇన్స్పెక్టర్ సైతం లేకపోవడంతో జూనియర్ అసిస్టెంట్ను ఇన్చార్జ్గా ఉంచి నామమాత్రంగా నడిపిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మహిళా సంఘాల వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను అందించేలా పనిచేసే మెప్మాకు చెందిన టీఎంసీ సైతం రెగ్యులర్గా లేరు. ఇన్చార్జ్ టీఎంసీ ఉన్నారని, మెప్మాలో ఉండాల్సిన సీఓ(కమ్యూనిటీ ఆర్గనైజర్), డీఈఓ(డాటా ఎంట్రీ ఆపరేటర్) సైతం లేరు. మున్సిపాలిటీ ఆదాయాన్ని మానిటరింగ్ చేసే ఆర్ఓ రెగ్యులర్గా ఉండగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇన్చార్జ్గా ఉన్నారు. మున్సిపాలిటీలో కమిషనర్ మినహా ప్రధాన శాఖల అధికారులందరూ ఇన్చార్జ్లు కావడం, వారానికి రెండు, మూడు రోజులు వస్తుండగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వివిధ పనులపై మున్సిపాలిటీకి వచ్చే ప్రజలు అధికారులు అందుబాటులో లేక వెనుదిరగాల్సి వస్తోంది. ఏఅధికారి ఎప్పుడు వస్తారో తెలియని అయోమయస్థితిలో మున్సిపాలిటీ ఉంది. ప్రతీ వార్డులో సమస్యలు మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత సరిపడా సిబ్బందిని నియమించకపోవడంతో గతంలో పనిచేసిన పారిశుధ్య సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది కొరతతో ఏ వార్డులో చూసినా డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా ఉండి కాలనీలు కంపుకొడుతున్నాయి. రోడ్లపై మురుగునీరు పారుతుండగా దుర్వాసనతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. పలు కాలనీలు సీసీ రోడ్లకు నోచుకోక మట్టిరోడ్లకే పరిమితమయ్యాయి. రోడ్లపై చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో కాలనీలు అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాయి. ఇప్పటిౖకైనా కలెక్టర్, ఎమ్మెల్యే స్పందించి స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీకి రెగ్యులర్ అధికారులను నియమించి సమస్యల్ని పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.డ్రెయినేజీలు సరిగ్గా లేక జనవాసాల మధ్య నిలిచిన మురుగునీరు డిప్యుటేషన్పై విధులు.. అందుబాటులో రెండు, మూడు రోజులే పేరుకే మున్సిపాలిటీగా స్టేషన్ఘన్పూర్ ప్రతి వార్డులోనూ సమస్యలతో ప్రజల ఇబ్బందులు -
గణితంలో ఎవరూ ఫెయిల్ కావొద్దు
లింగాలఘణపురం: గణితం ప్రత్యేకమైన సబ్జెక్ట్ అని అందులో రాబోయే పదో తరగతిలో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కావొద్దని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. మండలంలోని నెల్లుట్ల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు జరుగుతున్న సమగ్ర ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గణితంలోని ప్రతీ అంశాన్ని సూత్రాలకే పరిమితం కాకుండా సులభంగా అర్థం చేసుకొనే విధంగా దృశ్యీకరణ పద్ధతిలో బోధించాలని సూచించారు. ఉపాధ్యాయులు గణితం అంటే భయం కాకుండా ఆసక్తిని పెంచే విధంగా బోఽధించాలని అన్నారు. ప్రతీ రోజు ఫాస్ట్ మ్యాథ్స్ అంశంపై తప్పనిసరిగా చెప్పాలన్నారు. ఆల్జీబ్రా, లాగరిథమ్స్, పాలినామియల్, ఈక్వేషన్స్ వంటి సమస్యలను ఇచ్చి పరిష్కార విధానాన్ని వివరించాలని ఉపాధ్యాయులకు చెప్పారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా -
ఐదేళ్ల వారసత్వం.. పనుల్లో అలసత్వం..!
రామప్పకు యునెస్కో గుర్తింపు (వారసత్వ హోదా) వచ్చినా మారని రూపురేఖలుములుగు: రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు వచ్చి నేటి (శనివారం)కి ఐదేళ్లు పూర్తయినా ఏ మార్పూ కనిపించ డం లేదు. ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని పాలంపేట పరిధిలో 1213లో కాకతీయులు నిర్మించిన రామప్ప దేవాలయానికి వారసత్వ సంపదగా యునెస్కో హోదా కల్పిస్తున్నట్లు 2021, జూలై 25న వరల్డ్ హెరిటేజ్ కమిటీ ప్రకటించడంతో ఉమ్మడి వరంగల్ ప్రజలు, పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని స్థానికులు సంబురపడ్డారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు సైతం ఆలయాన్ని సందర్శించి ఆలయ రూపురేఖలు మార్చేస్తామని, ప్రభుత్వాలనుంచి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వినియోగంలోకి రాని ఉప ఆలయాలు రామప్ప ఆలయం ముందు ఉన్న గొల్లాల గుడికి మరమ్మతులు చేపట్టినప్పటికీ పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురాలేదు. మరో శివాలయాన్ని అభివృద్ధి చేయాల్సి ఉండగా కూలిపోతోందని దానికి సపోర్టుగా ఇనుపపైపులను అమర్చి చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఇటీవల ఆ ఆలయాన్ని జాతీయ ప్రాముఖ్యత స్మారక చిహ్నంగా కేంద్రం గుర్తించింది. మరికొన్ని ఉప ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ ఇప్పటివరకు వాటి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ప్రారంభమెప్పుడో.. దేవాలయానికి వచ్చే దేశ, విదేశీ పర్యాటకులకు వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ ప్రాజెక్టు కింద రూ.61.99 కోట్ల నిధులను కేటాయించింది. మొదటి విడతగా రూ.42.14 కోట్ల నిధులు మంజూరు చేసి సుమారు 10 ఎకరాల్లో ఇంటర్ ప్రిటేషన్ సెంటర్ను నిర్మించారు. కానీ, కాంట్రాక్టర్కు బిల్లు రాలేదనే నెపంతో సెంటర్ను ప్రారంభించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రామప్ప ఆలయ ఆవరణలోని కామేశ్వరాలయాన్ని పునర్నిర్మాణం పేరుతో 2011లో పురావస్తుశాఖ అధికారులు తొలగించారు. 2022 డిసెంబర్లోగా ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని హెరిటేజ్ కమిటీ షరతు విధించినప్పటికీ ఇప్పటివరకు పునాదులకే పరిమితమైంది. రామప్ప సరస్సులోని ఐలాండ్లో 5 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. సాస్కి పథకం కింద మంజూరైన రూ.13 కోట్లతో ఐలాండ్లో భారీ శివుడి విగ్రహం, రెస్టారెంట్, కెఫిటేరియా, చిల్డ్రన్స్పార్కు, బటర్ ఫ్లై గార్డెన్ నిర్మిస్తుండగా పనులు వేగవంతంగా కొనసాగడం లేదనే విమర్శలున్నాయి. గత ఏడాది నవంబర్లో పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు పనుల పురోగతిలో ఎలాంటి అభివృద్ధి కనిపించట్లేదు. పునాదుల్లోనే కామేశ్వరాలయం.. ముందుకు సాగని ఐలాండ్ పనులు నిర్మాణం పూర్తయినా ప్రారంభం కాని ఇంటర్ప్రిటేషన్ సెంటర్ పనులు పూర్తయితే మరింత సుందరంగా ఆలయ పరిసరాలు -
పోలీస్ ప్రెస్మీట్లపై పునరాలోచన..?
సాక్షి, వరంగల్: ఏదైన కేసులో అరెస్టు చేసిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి ప్రెస్మీట్లు నిర్వహించడం పోలీస్శాఖలో చాలాకాలంగా కొనసాగుతున్న పద్ధతి. ఇటీవలి కాలంలో ఈ విధానంపై న్యాయపరంగా పలు ప్రశ్నలు తలెత్తుతున్నా యి. ముఖ్యంగా గుర్తింపు సాక్ష్యం (ఐడెంటిఫికేషన్ ఎవిడెన్స్), నిందితుల హక్కులు, నిష్పాక్షిక విచారణ వంటి అంశాలు కోర్టుల్లో తరచూ చర్చకు వస్తుండటంతో దర్యాప్తు సంస్థలు కూడా మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో భాగంగానే వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ప్రెస్నోట్లకే పరిమితం కావాలనే చర్చ అంతర్గతంగా సాగుతోంది. కాగా, ప్రెస్మీట్ల నిర్వహణలో మార్పులపై ఎటువంటి అధికారిక ఉత్తర్వులు రాలేదు. గుర్తింపు సాక్ష్యమే ప్రధాన అంశం.. హత్యలు, దోపిడీలు, చోరీలు వంటి కేసుల్లో బాధితులు లేదా ప్రత్యక్ష సాక్షులు నిందితులను గుర్తించడం కీలకమైన అంశం. ఇందుకోసం టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ నిర్వహిస్తారు. దీని ఉద్దేశం బాధితుడు లేదా సాక్షి, సంఘటన సమయంలో చూసిన వ్యక్తినే గుర్తిస్తున్నాడా లేదా అన్నది నిర్ధారించడం. నిందితుల ఫొటోలు, వీడియోలు ముందుగానే పత్రికలు, టెలివిజన్, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వస్తే, అనంతరం జరిగే గుర్తింపు ప్రక్రియ విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పైకోర్టుల్లో వస్తున్న వాదనలు.. న్యాయవర్గాల సమాచారం ప్రకారం.. కొన్ని క్రిమి నల్ అప్పీళ్లు, లీవ్ పిటిషన్లలో శిక్షపడిన ఖైదీలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. సాక్షులు సంఘటన స్థలంలో చూసి కాదు.. మీడియా ద్వారా ప్రచారంలోకి వచ్చిన ఫొటోలు చూసి గుర్తించారు అనే వాదనలు వినిపిస్తున్న సందర్భాలున్నాయని పేర్కొంటున్నారు. చార్జ్షీట్ దాఖలయ్యే వరకు, కోర్టు దోషిగా నిర్ధారించే వరకు ప్రతి వ్యక్తి చట్టపరంగా నిందితుడే తప్ప దోషి కాదనే సూత్రాన్ని సుప్రీంకోర్టు పలుమార్లు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అరెస్టు చేసిన వ్యక్తులను మీడియా ముందు ప్రదర్శించడంపై గతంలోనూ మానవ హక్కుల సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అధికారికంగా స్పష్టత లేదు.. ఈ అంశంపై పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. ఈ విషయమై పోలీసు కమిషనర్ శ్వేతను ఫోన్లో సంప్రదించగా ‘కిందిస్థాయిలో జరిగే చర్చలపై అధికారికంగా స్పందించడం సాధ్యం కాదు’ అని బదులిచ్చారు. ఈ నేపథ్యంలో నిందితులను మీడియా ముందు ప్రదర్శించాల్సిన అవసరం ఎంత? కేసు వివరాలను ప్రెస్నోట్ల ద్వారా తెలియజేస్తే సరిపోదా? అనే చర్చ పోలీసు వర్గాలు, న్యాయవర్గాల్లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ప్రజలకు సమాచారం చేరాలి. మరోవైపు దర్యాప్తు, గుర్తింపు ప్రక్రియ, నిందితుడికి లభించే న్యాయపరమైన హక్కులు కూడా పరిరక్షించాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా ఉండాలన్నదే ప్రధాన చర్చగా మారింది.వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ప్రెస్నోట్లకే పరిమితం కావాలనే చర్చ న్యాయపరమైన చిక్కులు, గుర్తింపు సాక్ష్యంపై కొనసాగుతున్న వాదనలు టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్కు ముందే మీడియాలో నిందితుల ఫొటోలపై చర్చ ప్రెస్మీట్ల నిర్వహణలో మార్పులపై లేని అధికారిక ఉత్తర్వులు -
నీట్ లీకేజీపై కేంద్రం బాధ్యత వహించాలి
జనగామ: నీట్తో పాటు సీబీఎస్ఈ, ఇతర జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో జరిగిన పేపర్ లీకేజీలకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, నైతిక బాధ్యత స్వీకరిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జిల్లా నుంచి భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేపర్ లీకేజీలపై స్వతంత్ర విచారణ కమిటీని ఏర్పాటు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి -
తొలి ఏకాదశి వేడుకలకు సిద్ధం
జనగామ: శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశించే పవిత్ర దినంగా పరిగణించే తొలి ఏకాదశి సందర్భంగా జిల్లా అంతటా శివ, విష్ణు ఆలయాలు సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. ఏకాదశి ప్రారంభం నుంచి నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యంగా పరిగణిస్తారు. ఈ కాలంలో భక్తులు నియమనిష్టలతో వ్రతాలు, జపాలు చేస్తారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్ధేశ్వరస్వామి, చిల్పూరు బుగులోని శ్రీ వెంకటేశ్వరస్వామి, పాలకుర్తి శ్రీ సోమేశ్వరస్వామి, బాణాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి, పాత బీట్ శ్రీరామలింగేశ్వర స్వామి, శ్రీ సంతోషీమాత ఆలయాలతో పాటు అనేక గ్రామీణ దేవాలయాల్లో విద్యుద్దీపాలంకరణ, పుష్పాలంకరణలు పూర్తి చేశారు. కాగా జనగామ పట్టణంలో కురుమ కులస్థులు సంప్రదాయ బోనాల ఉత్సవాలను నిర్వహించనున్నారు. జనగామ: జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో డీసీపీ రాజమహేంద్ర నాయక్ శుక్రవారం వార్షిక తనిఖీ నిర్వహించారు. ఇన్చార్జి ఏసీపీ భీమ్శర్మతో కలిసి స్టేషన్ను సందర్శించిన డీసీపీ పోలీసు స్టేషన్లోని వివిధ విభాగాలను పరిశీలించారు. తనిఖీలో భాగంగా కొత్తగా వచ్చిన, పెండింగ్లో ఉన్న పిటిషన్లు, వాటి పరిష్కార స్థితిని సమీక్షించారు. అనంతరం జనరల్ డైరీ, ఎఫ్ఐఆర్లు, వివిధ రిజిస్టర్లు, పెండింగ్ కేసుల ఫైళ్లు, ఇతర అధికారిక రికార్డులను పరిశీలించారు. పరేడ్, లాఠీ డ్రిల్, బీట్ పోలీసింగ్, పెట్రోలింగ్, పెట్రోకార్ నిర్వహణ, స్టేషన్ పరిశుభ్రత, ఆయుధాల నిర్వహణ, రిజిస్టర్లు, పోలీసింగ్ సేవల అమలును సమీక్షించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన పోలీసింగ్ సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తనిఖీలో సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐలు భరత్, రతీష్, చిన్నకేశవులు, నర్సయ్య, సిబ్బంది ఉన్నారు. పంట మార్పిడిపై అవగాహన కల్పించాలిరఘునాథపల్లి: ఎల్నినో ప్రభావంతో ఏర్పడే వర్షాబావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు నష్టపోకుండా పంట మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసా య అధికారి అంబికాసోని అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులకు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పంటల ప్రణాళిక, వీబీజీ రామ్ జీకార్యక్రమం అమలుపై నిర్వహించిన శిక్షణ, సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.. తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు రైతులను మళ్లించేలా సలహాలు అందించాలని పేర్కొన్నారు. జనగామ, స్టేషన్ఘన్పూర్ ఏడీఏలు వసంత సుగుణ, అపర్ణ, అయిల్ఫెడ్ జిల్లా మేనేజర్ దయాకర్, పలు మండలాల ఏఓలు, హెచ్ఓ, ఏఈఓలు, హెచ్ఈఓలు పాల్గొన్నారు. వేయిస్తంభాల ఆలయంలో వరుణ జపం హన్మకొండ కల్చరల్: దేవాదాయశాఖ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవా దాయశాఖ కమిషనర్ హనుమంతరావు ఆదేశాల మేరకు వేయిస్తంభాల ఆలయంలో మూ డు రోజుల పాటు నిర్వహించనున్న వరుణ పూజలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు జరిగాయి. వరుణ పూజల్లో భాగంగా మొదటి ఆలయ నాట్య మండపంలో వేద పండితులు మణికంఠశర్మ, సాయి తేజ, శ్రీవాస్తవ, అర్చకులు ప్రణవ్, కాశిలింగాచారి సకాలంలో వర్షాలు పడాలని వరుణ జపం, ఋశ్యశృంగ పారాయణం నిర్వహించారు. -
‘ఎస్ఐఆర్’ గడువులోగా పూర్తిచేయాలి
జనగామ: ఎస్ఐఆర్ ప్రక్రియ అత్యంత కీలకమని, మండల అధ్యక్షులు, కోఆర్డినేటర్లు సమన్వయంతో పనిచేస్తూ గడువులోగా వంద శాతం పూర్తి చేయాలని కాంగ్రెస్ జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి సూచించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఎస్ ఐఆర్ సమీక్ష సమావేశంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ వైస్ చైర్మన్ భాస్కర్ యాదవ్తో కలిసి కొమ్మూరి మాట్లాడారు.. నియోజకవర్గంలోని 8 మండలాల్లో ఇప్పటి వరకు ఓవరాల్గా 80శాతంకు పైగా నమోదు పూర్తయిందని తెలిపారు. నీట్ పరీక్షల వ్యవహారంలో ఢిల్లీలో నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జి చేయడాన్ని ఖండించారు. కార్యక్రమంలో మండలాల అధ్యక్షులు ఎండీ మసూద్, మంజె మల్లేశం, మహదేవుని శ్రీనివాస్, శ్రీకాంత్, భాస్కర్రెడ్డి, శ్రీను నాయక్, యాదగిరి, భిక్షపతి, నాయకులు, కౌన్సిలర్లు మేడ శ్రీనివాస్, చెంచారపు కరుణాకర్రెడ్డి, మల్లారెడ్డి, కొత్త కరుణాకర్రెడ్డి, గనిపాక మహేందర్, కడారు ప్రవీణ్, దత్రపు నరేష్, దిడిగ రమేష్, మధు, వెంకటరమణ పాల్గొన్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి -
సమస్యల్లో వేదికలు
జనగామ రూరల్: నిధుల కొరతతో రైతు వేదికల నిర్వహణ భారంగా మారి అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల మధ్య వారధిగా రైతుల అభివృద్ధి లక్ష్యంతో నిర్మించిన ఈ భవనాలు నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఇబ్బందిగా మారాయి. ప్రతీ మంగళవారం రైతునేస్తం పేరుతో సమావేశాలు నిర్వహిస్తుండటంతో వీటి కోసం అధికారులే సొంతంగా డబ్బులు వెచ్చిస్తున్నట్లు సమాచారం. జిల్లావ్యాప్తంగా ఉన్న రైతు వేదికలు కొన్ని ఉపయోగంలోలేక నిర్వహణ భారం పెరిగి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపురం గ్రామంలో రెండు సంవత్సరాల క్రితం వచ్చిన గాలివానకు రేకులు లేచిపోయాయి. డోర్లు , కిటికీలు లేక అధ్వానంగా మారిన పట్టించుకొనే వారు లేరు. పెరుగుతున్న ఖర్చులు ఒక్కో రైతు వేదిక నిర్వహణకు ప్రతీ నెల సుమారు రూ.9 వేల వరకు ఖర్చు అవుతోంది. ఇందులో విద్యుత్ బిల్లులు, శుభ్రత నిర్వహణ, స్వీపర్ వేత నం, తాగునీటి ఖర్చులు ప్రధానంగా ఉంటాయి. నిధులు అందకపోవడంతో కొన్ని చోట్ల విద్యుత్ బిల్లుల బకాయిలు పేరుకుపోయాయి. మరికొన్ని చోట్ల నిర్వహణ పూర్తిగా నిలిచిపోయింది. ఉన్న రైతు వేదికలల్లో తలుపులు, కిటికీలు, మరమ్మతులు లేక ఇబ్బందికరంగా ఉన్నాయి. మరికొన్ని వాడుకంలో లేక పిచ్చిమొక్కలతో నిండి ఉన్నాయి. జిల్లాలో 62 క్లస్టర్లు జిల్లాలో మొత్తం 62 రైతువేదికలు ఉన్నాయి. ఒక్కో భవనాన్ని సుమారు రూ.22 లక్షల వ్యయంతో నిర్మించారు. రూ.కోట్లలో ప్రజాధనం వెచ్చించి రైతు వేదికలను నిర్మించారు. ఈ భవనాల్లో రైతు శిక్షణ తరగతులు, వీడియో కాన్ఫరెన్స్లు, అవగాహన సదస్సులు, రైతు సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే 2021 వరకు రైతువేదికల నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు విడుదలయ్యేవి. ఐదేళ్ల నుంచి నిధులు విడుదల చేయకపోవడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. భారంగా రైతు వేదికల నిర్వహణ నిధులు లేక ఐదేళ్లుగా వెలవెల అధ్వానంగా ఉన్న పట్టించుకునేవారే కరువు -
రేపు జస్టిస్ విజయసేనారెడ్డి రాక
వరంగల్ లీగల్ : హైకోర్టు న్యాయమూర్తి, ఉ భయ జిల్లాల పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేనారెడ్డి ఈనెల 25న (శనివారం) హనుమకొండ జిల్లా కోర్టుకు రానున్నారు. హనుమకొండ జిల్లాకు నూతనంగా మంజూరైన అదనపు జిల్లా కోర్టు, రెండు జూనియర్ సివిల్ కోర్టులను ప్రారంభించనున్నారు. శనివా రం ఉదయం 10 గంటలకు అయన జిల్లా కోర్టు ప్రాంగణంలోని 10 కోర్టుల భవనంలో ఈ ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. వైభవంగా ముగిసిన పుష్కర మహోత్సవాలుజనగామ: పట్టణంలోని బాణాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన తృతీయ పుష్కర మహోత్సవాలు గురువారం మహా పూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. ఐదో రోజు కార్యక్రమాల్లో భాగంగా త్రిదండి చినజీయర్ స్వామి భక్తులకు తీర్థగోష్టి నిర్వహించారు. సుమారు 250 మందికి పైగా దంపతులు వెంకటేశ హోమంలో పాల్గొనగా, 3 వేల మందికిపైగా భక్తులు శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవాన్ని తిలకించారు. అనంతరం 10 వేల మందికిపైగా భక్తులకు తదియారాధన ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా మహాకుంభ సంప్రోక్షణ, మహా పూర్ణాహుతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. చినజీయర్ స్వామి భక్తులకు మంగళాశాసనాలు అందిస్తూ ఇలాంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు నిరంతరం జరగాలని ఆకాంక్షించారు. భక్తులు, వికాస తరంగిణి సభ్యులు, దేవాలయ సేవా బృందానికి అభినందనలు తెలిపారు. నషాముక్త్ భారత్ పోస్టర్ ఆవిష్కరణజనగామ రూరల్: మేరా యువభారత్ ఆధ్వర్యంలో నషాముక్త్ ఫర్ వికసిత్ భారత్ పోస్టర్ను డీసీపీ రాజమహేంద్ర నాయక్ తన కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ నెల 25న మండలంలోని యశ్వాంతపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించే డ్రగ్ ఫ్రీ కార్యక్రమంలో ఫోక్ యువత అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. ఫోక్ సాంగ్స్, డ్యాన్స్, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు ఉంటాయన్నారు. విజేతలకు సర్టిఫికెట్లు అందజేసి, రాష్ట్రస్థాయి కార్యక్రమానికి పంపించడం జరుగుతుందని ప్రోగ్రాం కోఆర్డినేటర్ నవీన్ యాదవ్ ఈసందర్భంగా తెలిపారు. ప్రపంచంలోనే ఎత్తయిన రహదారిపై జిల్లా యువకుడుజనగామ రూరల్: పట్టణానికి చెందిన యువకుడు పంతం సాయిప్రసాద్ అరుదైన రికార్డు సాధించారు. సాహస యాత్రపై ఉన్న అభిరుచితో తన సొంత వాహనంలో జనగామ నుంచి బయలుదేరి, దేశ రాజధాని ఢిల్లీ, లడఖ్, ప్రసిద్ధ పాంగాంగ్ సరస్సు మీదుగా ప్రయాణించి ప్రపంచంలోనే అతి ఎత్తైన రహదారిగా గుర్తింపు పొందిన ‘ఉంలింగ్ లా పాస్’ను విజ యవంతంగా చేరుకున్నారు. సముద్ర మట్టాని కి ఏకంగా 19,024 అడుగుల అసాధారణ ఎత్తులో ఉండే ఈ ఉంలింగ్ లా పాస్ భారత్ – చైనా సరిహద్దు ప్రాంతంలో ఉంది. ప్రమాదకరమైన వాతావరణం, అత్యంత తక్కువ ఆక్సిజన్ స్థాయిలు ఉండే ఈ ప్రాంతానికి తన వాహనంపై చేరుకుని సాయి ప్రసాద్ యువతకు ఆదర్శంగా నిలిచారు. జనగామ పేరును జాతీయస్థాయిలో సగర్వంగా నిలిపిన సాయి ప్రసాద్ను స్థానికులు అభినందించారు. -
మామునూరు ఎయిర్పోర్టు పనుల్లో కదలిక
సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయ నిర్మాణ పనులకు కీలక అడుగు పడింది. ఇప్పటికే రూ.203.49 కోట్లతో టెండర్ పిలిచిన ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు గురువారం మామునూరు విమానాశ్రయ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అనంతరం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో ప్రీ–బిడ్ సమావేశం నిర్వహించారు. ఇందులో 6గురు బిడ్డర్లు పాల్గొన్నారు. విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలను అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఒకేసారి 820మంది ప్రయాణికులకు సేవలందించే ఆధునిక టెర్మినల్ భవనం, రన్వే పునర్నిర్మాణం, గ్రౌండ్ సపోర్ట్ ఎక్విప్మెంట్ (జీఎస్ఈ) ఏరియా, మూడు ఆప్రాన్, లింక్ ట్యాక్సీవేలు, ఐసోలేషన్ బే, పెరీమీటర్ రోడ్డు, ఎమర్జెన్సీ యాక్సెస్ రోడ్డు తదితర పనుల రూపకల్పన, నాణ్యత ప్రమాణాలు, అమలు విధానాన్ని వివరించినట్లు తెలిసింది. ఈనెల29 నుంచి ఆగస్టు 12 వరకు బిడ్ దాఖలుకు అవకాశం ఉంటుందని, ఆగస్టు 18న బిడ్ ఓపెన్, సెప్టెంబర్ 7న ఫైనాన్సియల్ బిడ్ తెరుస్తారని వివరించారు. ఇప్పటికే ఖరారైన పెరీమీటర్ వాల్ టెండర్ ఇప్పటికే విమానాశ్రయ భద్రత దృష్ట్యా రూ.21 కోట్లతో పెరీమీటర్ వాల్ నిర్మాణానికి టెండర్ ఖరా రైంది. అవసరమైన ప్రక్రియలు పూర్తికాగానే ఈ పనులు ప్రారంభం కానున్నాయి. భూమి రక్షణ, భద్రతా ప్రమాణాల పరిరక్షణలో ఈ పనులు కీలకంగా మారనున్నాయి. రూ.270 కోట్ల వ్యయంతో మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్మాల్, ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్, డ్రెయినేజీ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, యుటిలిటీ నెట్వర్క్లు, ఇతర పనులకు మరో టెండర్ త్వరలోనే పిలవనున్నారు. రూ.203.49 కోట్ల పనులపై ఏఏ అధికారుల ప్రజెంటేషన్ తొలుత మామునూరు ఎయిర్పోర్టు స్థల సందర్శన హనుమకొండలో ప్రీబిడ్ మీటింగ్ -
మిషన్ శిఖరం
విజయ లక్ష్యం..జనగామ: రాష్ట్రంలో విద్యా ప్రమాణాల్లో ఇప్పటికే అగ్రస్థానంలో నిలిచిన జిల్లా ఇప్పుడు దేశంలోనే అత్యుత్తమంగా నిలవాలనే లక్ష్యంతో ‘మిషన్ శిఖరం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రూపొందించిన 48 స్లైడ్ల రిఫరెనన్స్ డెక్ (పవర్ ప్రజెంటేషన్)ప్రకారం, ప్రస్తుతం పీజీఐ–డీ (పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్– డిస్ట్రిక్ట్)– 2.0లో 600 మార్కులకు 383 స్కోరు సాధించి ఉత్తమ్–3 గ్రేడ్లో ఉన్న జిల్లా, వచ్చే మూడేళ్లలో 486 ప్లస్ స్కోరుతో ఉత్తమ్–1 స్థాయికి చేరుకోవడమే లక్ష్యంగా సమగ్ర కార్యాచరణ రూపొందించింది. ఈ లక్ష్య సాధన కోసం ప్రత్యేక కమాండ్ ఆర్కిటెక్చర్ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ మిషన్ చైర్గా ప్రతీ నెల సమీక్ష నిర్వహించడంతో పాటు నెలకు రెండుసార్లు ఆకస్మికంగా పాఠశాలలను సందర్శిస్తారు. జిల్లా విద్యాశాఖ అధికారి కన్వీనర్గా, డైట్ అకడమిక్ యాంకర్గా వ్యవహరిస్తారు. అదనపు కలెక్టర్ నిధుల సమీకరణ బాధ్యతలు నిర్వహిస్తారు. 11 డొమైన్ ఓనర్లు, 70 సూచికలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించగా, ప్రతీ శుక్రవారం ‘వార్ రూం–ఎంఐఎస్’ ద్వారా పురోగతిని సమీక్షించనున్నారు. ఇప్పటికే జూలై 20 నుంచి సెప్టెంబర్ 20 వరకు 60 రోజుల ప్రత్యేక బ్లిట్జ్ కార్యక్రమం ప్రారంభించారు. తెలంగాణలోని 27 జిల్లాలు ప్రచేష్ట–1 బ్యాండ్లో ఉండగా, జనగామ ఒక్కటే ఉత్తమ్–3 గ్రేడ్లో నిలవడం విశేషం. ఇప్పుడు ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా దేశ వ్యాప్తంగా ఆదర్శ జిల్లాగా నిలవాలనే సంకల్పంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం ‘మిషన్ శిఖరం’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్నారు.పీజీఐ–డీ 2.0లో రాష్ట్రంలో తొలి స్థానం, జాతీయ స్థాయిలో 64వ ర్యాంకు సాధించిన జిల్లా విద్యారంగాన్ని దేశంలోనే నంబర్–1గా తీర్చిదిద్దేందుకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ కొనసాగుతోంది. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ లెర్నింగ్, పాఠశాల భద్రత, యూడైస్ 100 శాతం నమోదు, గ్రంథాలయాలు, ఐసీటీ సదుపాయాల కల్పనపై దృష్టి సారించారు. జిల్లాలోని 479 ప్రభుత్వ పాఠశాలలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు అందించి కట్టెల పొయ్యిల వినియోగానికి స్వస్తి పలికారు. ఉపాధి హామీ నిధులతో 150 పాఠశాలలకు ప్రహరీ, 31 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నారు. టీ–ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం, 27 గురుకులాల్లో టేబుల్ టెన్నిస్ కోర్టులు, పోటీ పరీక్షలకు ప్రత్యేక అకాడమీ, వి లువైన మ్యాగజైన్లు, 50 పాఠశాలల్లో విద్యా మ్యాప్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. కాగా, ఇటీవల హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీఐలో జరిగిన శిక్షణలో జిల్లా అధికారులు విద్యా విజయాలను ప్రదర్శించారు. జిల్లా బృందంలోని శ్రీనివాస్, గౌసియా, శ్రీకాంత్రెడ్డి, నర్సయ్య, భానుప్రకాష్, యాకస్వామి బృందాన్ని ఉన్నత అధికారులు సత్కరించడం విశేషం.విద్యా ఫలితాల్లో జిల్లా ముఖ్యంగా విద్యార్థుల అభ్యాస ఫలితాల విభాగంలో 188/290 మార్కులతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అయితే స్కూల్ సేఫ్టీ, డిజిటల్ లెర్నింగ్, గవర్నెన్స్ వంటి పరిపాలనా అంశాల్లో లోటుపాట్లు ఉండటంతో మొత్తం స్కోరులో కొంతమేర తగ్గింది. ఈ మూడు విభాగాల్లోనే సుమారు 21 పాయింట్ల లోటు ఉందని అధికారులు గుర్తించారు. వీటిని జిల్లా స్థాయిలోనే సరిదిద్దే అవకాశం ఉండటంతో ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో మూడేళ్ల సమగ్ర కార్యాచరణ 383 నుంచి 486 స్కోరుకు రూట్ మ్యాప్ బడి భద్రత, డిజిటల్ విద్య, పాలనపై ఫోకస్ అంశం ప్రస్తుత పరిస్థితి లక్ష్యం మొత్తం స్కోరు 383/600 2026–27 నాటికి 426 ప్లస్ 2027–28 నాటికి 486 ప్లస్ గ్రేడ్ ఉత్తమ్–3 ఉత్తమ్–2 , ఉత్తమ్–1 రాష్ట్రంలో స్థానం 1వ స్థానం అగ్రస్థానం నిలబెట్టుకోవడం -
సౌకర్యాలు కల్పించాలి
మూడు గ్రామాలకు కలిపి ఒక రైతు వేదిక ఉంది. మరిగడికి చౌడారంలో ఉండగా రైతులు వెళ్లడం లేదు. తాగునీరు, కరెంట్, అవగాహన కల్పించడానికి నెట్ టీవీలు లేవు. రైతు వేదికల్లో సౌకర్యాలు కల్పించి రైతులకు ఉపయోగపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. –కాసాని మల్లేష్, రైతు మరిగడి గత ప్రభుత్వం రైతుల కోసం కట్టిన రైతు వేదికలు నిర్వహణలో లేవు. అక్కడి పోయేది లేదు చెప్పేది లేదు. అధికారులు తండాకు వచ్చి పోతారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నా అందరికీ తెలియదు. నిరుపయోగంగా ఉన్న రైతు వేదికలను వాడుకలోకి తేవాలి. –భూక్య మోతీలాల్, రైతు, పెద్ద తండా(ఎం) -
‘సర్’ను విజయవంతం చేయాలి
పాలకుర్తి టౌన్: ‘సర్’ ప్రక్రియను క్షేత్రస్థాయిలో విజయవంతం చేయాలని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమంపై గురువారం మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆధ్వర్యంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ బూత్ స్ధాయిలో సర్ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని బీఎల్ఏలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. నిర్దేశిత లక్ష్యాన్ని సకాలం పూర్తి చేయాలని ఆమె చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్నాయక్, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు డైరెక్టర్ లకావత్ లక్ష్మీనారాయణనాయక్, నియోజవర్గ కోఆర్డినేటర్ ప్రమోదర్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
ఆసరా పింఛన్లపై సోషల్ ఆడిట్
లింగాలఘణపురం: ఆసరా ఫించన్లపై రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా సోషల్ ఆడిట్ నిర్వహిస్తోంది. పింఛన్లు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏనాడూ ఈ విధమైన సోషల్ ఆడిట్ నిర్వహించకపోవడంతో లబ్ధిదారుల్లో టెన్షన్ మొదలైంది. ఈ నెల 17 నుంచి గ్రామాల్లో జరుగుతున్న వీబీజీ రామ్జీ పనులతో పాటు ఇంటింటికీ వెళ్లి ఆసరా పింఛన్లకు సంబంధించిన దివ్యాంగులైతే సదరం క్యాంపు సర్టిఫికెట్, ఒంటరి మహిళలైతే విడాకుల పత్రాలు లేదా ప్రస్తుతం ఒంటరిగానే ఉంటుందా.. అనే వివరాలను తెలుసుకుంటున్నారు. అదేవిధంగా వృద్ధులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, చనిపోయినప్పటికీ పింఛన్లు వస్తున్న వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఈ నెల 28న మండల స్థాయిలో జరగనున్న సోషల్ ఆడిట్ వరకు అన్నీ గ్రామాల్లో పూర్తి చేసి నివేదిక సిద్ధం చేయనున్నారు. దీంతో తమ పింఛన్లు ఉంటాయో లేదోనని పింఛన్ దారులు ఆందోళన చెందుతున్నారు. అనర్హులు లబ్ధిపొందితే తొలగిస్తారా ఎందుకు సోషల్ ఆడిట్ చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు. ఈ విషయంపై ఎంపీడీఓ శివశంకర్రెడ్డిని వివరణ కోరగా వీబీజీ రామ్జీ పనులతో పాటు ఆసరా పింఛన్లపై కూడా సోషల్ ఆడిట్ జరుగుతోందని.. తొలగిస్తారా లేదా అనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదని వివరించారు. లబ్ధిదారుల్లో టెన్ష్న్.. టెన్షన్ -
ఆహార సంస్థలు నిబంధనలు పాటించాలి
జనగామ: జిల్లా కేంద్రంలో హోటళ్లు, ఫాస్ట్ఫుడ్, ఇతర ఆహార భద్రతకు సంబంధించి వాటి పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ వినీల్ తెలిపారు. ‘డేంజర్ ఫుడ్’ శీర్షికన ఈ నెల 20వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఫుడ్సేఫ్టీ అధికారులు స్పందించారు. తనిఖీల సందర్భంగా ఆహార వ్యాపార నిర్వాహకులు తప్పనిసరిగా హెయిర్ నెట్లు, అప్రాన్న్లు, గ్లోవ్స్ ధరించాలని ఆదేశించారు. వంట నూనెను పదేపదే వినియోగించరాదని హెచ్చరించడంతో పాటు, సంబంధిత అనుమతులు, లైసెన్సులను కూడా పరిశీలించినట్లు పేర్కొన్నారు. నిబంధనలు పాటించని ఆహార వ్యాపార సంస్థలపై చర్యలు తప్పవన్నారు. ఆహార భద్రతపై అవగాహన పెంచేందుకు జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ శిక్షణ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ప్రణాళిక రూ పొందించినట్లు ఆహార భద్రత అధికారి నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రతిని కలెక్టర్కు కూడా పంపించినట్లు తెలిపారు. సాక్షి ‘డేంజర్ ఫుడ్’ కథనంపై స్పందించిన ఆహార భద్రత శాఖ -
విజయవంతంగా విద్యుత్ లింక్ లైన్ చార్జింగ్
నర్మెట: విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత విశ్వసనీయంగా, అంతరాయాలు లేకుండా తీర్చిదిద్దే దిశగా జనగామ పరిధిలోని హన్మంతాపురం–మేకలగట్టు సబ్స్టేషన్ల మధ్య 3.5కి.మీ 33 కేవీ లింక్లైన్ను గురువారం విజయవంతంగా చార్జ్ చేశామని ఎస్ఈ చెరుకు సంపత్ రెడ్డి తెలిపారు. నర్మెట సబ్స్టేషన్లో అంతరాయాలు ఏర్పడినపుడు రఘునాథపల్లి నుంచి హన్మంతాపూర్కు విద్యుత్ సరఫరా అందించేందుకు అవకాశం కలుగుతుందని, నర్మెట సబ్స్టేషన్ నుంచి రఘునాథపల్లి, మండలగూడెం, ఖిలాషపూర్ సబ్స్టేషన్లకు కూడా అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా విస్తరించే అవకాశం ఏర్పడిందన్నారు. డీఈ విజయ్కుమార్, ఏడీఈలు స్వామి రెడ్డి, సుధాకర్, ఏఈ రామ్ పాల్గొన్నారు. -
అభివృద్ధిలో భాగస్వాములు కండి
నర్మెట: గ్రామాల అభివృద్ధిలో అధికారులు, సర్పంచ్లు భాగస్వాములు కావాలని అదనపు డీఆర్డీఓ నాగ శేషాద్రిసూరి అన్నారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఎంపీడీఓ కావ్య శ్రీనివాసన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో అయన మాట్లాడారు.. స్వచ్ఛ భారత్ నిధులను సద్వినియోగం చేసి వ్యక్తిగత, సాధారణ, సామాజిక, వీఓ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. మురుగు కాల్వల చివరన సామాజిక ఇంకుడు గుంతల నిర్మాణం, వర్షపు నీటి నిలువ (చిన్న) గుంతల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో డీఈ హౌసింగ్ భజరంగ్లాల్, తహసీల్దార్ కలకుంట్ల రామానుజాచార్యులు, ఎంఓ డా.సుకన్య, ఏపీఓ బిరుకూరి రమాదేవి, ఏఓ బుర్రా మమత, ఏఈలు ప్రజ్వల్, శ్రీనివాస్, సోహెల్, సోమేత్ర శుక్లా, సర్పంచ్లు పాల్గొన్నారు. -
భూముల రీసర్వే వేగవంతమవ్వాలి
జనగామ రూరల్: భూముల రీసర్వేతో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం మండలంలోని మరిగడి గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్బంగా ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు సర్వే చేశారు? ఇంకా ఎంత చేయాలి? అని రెవెన్యూ, ల్యాండ్ అండ్ సర్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యలకు శాశ్వత పరి ష్కారం చూపించాలన్న లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూముల రీసర్వే ప్రక్రియను ప్రారంభించిందన్నారు. రైతులు వరి పంటపైనే ఆధారపడకూడదన్నారు. కోతుల సమస్య లేకుండా ఉండాలంటే కంది లాంటి పంటలు వేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరామ్, తహసీల్దార్, మహిపాల్రెడ్డి, సర్పంచ్ కర్రె పర్శరాములు, ల్యాండ్ సర్వే ఏడీ పాల్గొన్నారు. పోర్టల్లోనే ఇసుక, మొరం అనుమతులు ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఇసుక, మొరం అనుమతులు తప్పనిసరిగా ఈ–సాండ్ పోర్టల్ ద్వారానే పొందాలని టోకెన్ విధానం, క్యూఆర్ కోడ్ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టరేట్లో డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి మైనింగ్, రవాణా, నీటి పారుదల, శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..ఈ–సాండ్ పోర్ట ల్ అమలులో రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఇసుక రీచ్ల వద్ద పోలీసు, రెవెన్యూ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, అక్రమ కార్యకలాపాలను అరికట్టాలని ఆదేశించారు. సమీక్షలో ఏడీ మైన్స్ విజయ భారతి, డీపీఓ వెంకట్ రెడ్డి, ఆర్టీఓ శిల్ప, నీటిపారుదల శాఖ అధికారి ప్రవీణ్, ఏసీపీలు భీంశర్మ, నర్సయ్య, భూ గర్భ జలశాఖ, భగీరథ అధికారులు పాల్గొన్నారు. ఆరుతడి పంటలను వేయండి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
టునా కేజీ @ 600
జనగామ: పట్టణంలోని కలెక్టరేట్ భవన సముదాయం ఎదురుగా బుధవారం అరుదైన టునా చేప విక్రయం స్థానికుల దృష్టిని ఆకర్షించింది. యానాం ప్రాంతం నుంచి తీసుకొచ్చినట్లు విక్రయదారులు తెలిపిన ఈ చేప సుమారు 50 కిలోల బరువు ఉండగా, కిలోను రూ.600 చొప్పున విక్రయించారు. కొత్త రకం సముద్ర చేప కావడంతో దాని రుచి, నాణ్యత గురించి తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపగా, భారీగా కొనుగోలు చేశారు. టునా చేప సముద్ర జాతికి చెందిన అధిక పోషక విలువలున్న చేపగా గుర్తింపు పొందింది. దేశీయంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా టునా చేపకు మంచి డిమాండ్ ఉంది. -
సెల్లార్ల సీజ్ కొనసాగింపు
జనగామ: పట్టణంలో భవన నిర్మాణ అనుమతుల ప్రకారం వాహనాల పార్కింగ్ కోసం కేటాయించిన సెల్లార్లను ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న భవనాలపై పురపాలక సంఘం ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ప్రమాదకరంగా మారిన సెల్లార్లపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు ప్రచురితం చేయగా, అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, స్పెషల్ టీం అధికారులు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన భవనాల సెల్లార్లను గుర్తించి భవన యజమానులకు నోటీసులు జారీ చేసి 14 సెల్లార్లను సీజ్ చేశారు. ఇప్పటి వరకు 22 సెల్లార్లు సీజ్ చేయగా, మరో 8 వరకు మిగిలి ఉన్నాయని, వాటిని కూడా మూసివేయిస్తామని కమిషనర్ తెలిపారు. భవన యజమానులు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించి సెల్లార్లను పార్కింగ్కే వినియోగించాలన్నారు. తనిఖీల్లో కమిషనర్తో పా టు అగ్నిమాపక శాఖ ఇన్చార్జ్ ఫైర్ ఆఫీసర్ బి.జగదీశ్వర్, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారి పవన్ కుమార్, ఆర్ఐలు, వార్డు అధికారులు పాల్గొన్నారు. భవన పన్ను ఎగవేతపై చర్యలు పట్టణంలోని బాలాజీనగర్ ప్రాంతంలో కెనరా బ్యాంకు, డీసీసీ బ్యాంకు, కార్పొరేట్ కళాశాల హాస్టల్కు అద్దెకు ఇచ్చిన భవనానికి సంబంధించిన నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు. పురపాలక కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా భవనానికి వా ర్షికంగా సుమారు రూ.1.20 లక్షల ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉండగా, రూ.40 వేల మాత్రమే చెల్లిస్తున్నట్లు గుర్తించడం జరిగిందని కమిషనర్ రాజశేఖర్రెడ్డి తెలిపారు. విచారణ అనంతరం పన్ను రీ–అసెస్మెంట్తో పాటు జరిమానా కలిపి మొత్తం రూ.6.36 లక్షలు చెల్లించాల్సి ఉందని తేలింది. భవన యజమాని రామ్మోహన్రెడ్డి నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఇప్పటివరకు 22 సీజ్ పార్కింగ్ స్థలాలను వాణిజ్య అవసరాలకు వాడొద్దు : కమిషనర్ -
హోరెత్తిన నిరసన
జనగామ: నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు రాస్తారోకో, నిరసన కార్యక్రమం చేపట్టారు. ఢిల్లీలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం నిరసనలో పాల్గొన్న నాయకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో ఏఎంసీ చైర్మన్ శివరాజ్ యాదవ్ను పోలీసులు ఎత్తుకుని తీసుకెళ్లారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మేడ శ్రీనివాస్, దేవస్థాన కమిటీ చైర్మన్లు గంగం నరసింహారెడ్డి, ఈదులకంటి వెంకటరెడ్డి, యాదగిరి, భిక్షపతి, మసూద్, వంగల కళ్యాణి, వేమల్ల సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ కాంగ్రెస్ శ్రేణుల రాస్తారోకో -
నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం
హన్మకొండ: ప్రజలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో టీజీ ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో రూ.56కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజుతో కలిసి ఆయన బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సంస్థ అమలు చేస్తున్న కార్యక్రమాలు, ఆధునిక సాంకేతిక వినియోగం, భద్రతా చర్యలు, తదితర అంశాలను వివరించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగానికి ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతను జోడించి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. ప్రజలు అధికారుల వద్దకు రావడం కాదు.. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లాలనే ఆలోచనతో ‘ప్రజాబాట – పొలంబాట’ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నేరుగా అధికారులు వినియోగదారుల ముంగిటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారన్నారు. అహర్నిశలు శ్రమిస్తున్న విద్యుత్ జీవితాల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. ప్రమాదవశాత్తు ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రూ.కోటి నుంచి రూ.1.20 కోట్ల వరకు బీమా సౌకర్యాన్ని కల్పించామన్నారు. అదేవిధంగా లైన్మన్లకు అవసరమైన సేఫ్టీ కిట్లు, యూనిఫాం, ఆధునిక పరికరాలను అందజేశామన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ వినతి మేరకు 132/33 కేవీ సబ్స్టేషన్ మంజూరు చేస్తున్నామని, స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్ను ఆదేశించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ సోలార్తోపాటు, విండ్ పవర్ ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించారు. సాంకేతికత వినియోగం వల్ల ఉద్యోగులకు రిస్క్ తగ్గడంతోపాటు సమయం, డబ్బు ఆదా అవుతున్నాయని, వినియోగదారులు, రైతులకు తక్షణ సేవలు అందుతున్నాయని తెలిపారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు దేవాదాయశాఖ పరిధిలోని భూములు కేటాయించడానికి తమ శాఖ సిద్ధంగా ఉందన్నారు. దీనివల్ల ఆక్రమణలు అరికట్టడంతోపాటు దేవాలయాలకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, సమీకృత కలెక్టరేట్ భవనాలపై సోలార్ పలకలు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమం చివరలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద, సీపీ శ్వేత, జిల్లా అటవీ శాఖాధికారి నిఖిత, టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వి.మోహన్రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, అధికారులు పాల్గొన్నారు. ప్రజాబాట, పొలంబాట ద్వారా నేరుగా వినియోగదారుల ముంగిటికి ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క టీజీ ఎన్పీడీసీఎల్ చేపట్టిన రూ.56 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పాల్గొన్న మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు -
చట్టాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలి
జనగామ రూరల్: చట్టాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె.సందీప అన్నారు. బుధవారం జిల్లా న్యాయసేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా యాంటీ ర్యాగింగ్, చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ 2012, డ్రగ్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుపైనే ఎక్కువ శ్రద్ధ చూపాలని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం.రవీంద్ర, సోషల్ వేల్ఫేర్ పాఠశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్రావు, పి.జితేంద్ర, పారాలీగల్ వలంటీర్లు శేఖర్, రవికిరణ్ పాల్గొన్నారు. సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా శ్రీధర్గౌడ్నర్మెట: సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా నర్మెట సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా హైదరాబాద్లోని పంచాయత్రాజ్ చాంబర్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ.. తన పై నమ్మకంతో అప్పగించిన పదవికి న్యాయం చేస్తానన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ, రాష్ట్ర కార్యదర్శులు సంపత్ నాయక్, వెంకట్, సర్పంచ్లు బానోత్ మహేందర్, కొర్ర రాజేందర్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ–కేవైసీ తప్పనిసరిజనగామ రూరల్: రేషన్ కార్డుదారులందరికీ ఈ–కేవైసీ తప్పనిసరి అని, రేషన్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండటానికి వెంటనే పూర్తి చేసుకోవాలని బుధవారం కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఒక ప్రకటనలో సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జాతీయ ఆహార భద్రతా చట్టం, రాష్ట్ర ఆహార భద్రతా కార్డుల కింద నమోదైన లబ్ధిదారులకు ఈ–కేవైసీ సరిచూడటం తప్పనిసరి చేసినట్టు తెలి పారు. లబ్ధిదారులు తమ సమీపంలోని చౌకధరల దుకాణానికి వెళ్లి ఈ–కేవైసీ చేసుకోవాలని, ఏ విధమైన రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. లబ్ధిదారులు వ్యక్తిగతంగా తమ వేలిముద్రలను వేయాలని ఈనెల 31 లోగా ఈ–కేవైసీ పూర్తి చేయకపోతే వారి యూనిట్ తొలగించబడుతుందన్నారు. మల్లన్నగండిలో మొసళ్లునర్మెట: మల్లన్నగండి రిజర్వాయర్.. గోదావరి జలాలతో రెండు గుట్టల నడుమ పచ్చనిచెట్లు, జలపాతం, ఘాట్రోడ్డుతో మనసు దోచే అహ్లాదకరమైన ప్రదేశం. నర్మెట, తరిగొప్పుల, చిల్పూర్, స్టేషన్ ఘన్పూర్ మండలాలతో పాటు జిల్లా కేంద్రం వాసులకు పర్యాటక ప్రదేశంగా రోజరోజుకూ పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. పది రోజులుగా ధర్మసాగర్ నుంచి మోటార్ల ద్వారా నీరు చేరుతుండటంతో నిండుకుండలా మారుతోంది. కాగా, గోదావరి జలా లతో పాటు రిజర్వాయర్లోకి వచ్చిన మొసలి పిల్లలు పెద్దవి అయ్యాయి. ఈక్రమంలో ఇవి రిజర్వాయర్ ఒడ్డుకు వస్తున్నాయి. పర్యాటకులు నీటి అంచుల వరకు వెళ్లి విందులు, వినోదాల్లో మునిగిపోతున్నారు. ఈనేపథ్యంలో ప్రమాదం పొంచి ఉన్నందున అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. శివునిపల్లి ఆగ్రోస్ సెంటర్కు స్టాప్సేల్ నోటీసు స్టేషన్ఘన్పూర్: మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి ఆగ్రోస్ సేవా కేంద్రానికి స్టాప్ సేల్(అమ్మకాల నిలిపివేత) నోటీసును జారీ చేసినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్.కరుణాకర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. శివునిపల్లి ఆగ్రోస్ సెంటర్ నిర్వాహకుడు రైతులకు పారదర్శకంగా ఎరువులను పంపిణీ చేయకుండా అతడికి అనువుగా ఉండేవారికే ఎరువులను అందిస్తున్నాడని తమ విచా రణలో తేలిందన్నారు. దీంతో స్టాప్ సేల్ నోటీ సు జారీ చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. -
జీపీలకు జోష్!
‘స్వచ్ఛ జనగామ’ వినూత్న కార్యక్రమానికి కలెక్టర్ శ్రీకారం ఎస్జే స్కోర్..జనగామ: గ్రామీణ పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా, జవాబుదారీతనంతో అమలు చేయాలనే లక్ష్యంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్జే–స్కోర్(స్వచ్ఛ జనగామ స్కోర్) పేరుతో రూపొందించిన ప్రత్యేక మూల్యాంకన విధానం ద్వారా ప్రతీ గ్రామపంచాయతీ(జీపీ) పని తీరును నెలనెలా 100 మార్కుల ప్రాతిపదికన అంచనా వేయనున్నారు. పారిశుద్ధ్యం, తాగునీటి భద్రత, వ్యర్థాల నిర్వహణ, ప్రజారోగ్య ప్రమాణాలు, నిధుల విని యోగం వంటి అంశాలను శాసీ్త్రయంగా పరిశీలించి గ్రేడింగ్ ఇవ్వనున్నారు. ఆకస్మిక తనిఖీలు, డిజిటల్ ఆధారాలతో ధ్రువీకరణ, ఉత్తమ పనితీరుకు ప్రోత్సాహం, నిర్లక్ష్యంపై కఠిన చర్యలతో గ్రామాల్లో స్వచ్ఛతను శాశ్వత సంస్కృతిగా మార్చడమే ఈ నూతన విధానం ప్రధాన ఉద్దేశంగా అధికారులు పేర్కొంటున్నారు. గ్రామ పంచాయతీ మాత్రమే కాకుండా పంచాయతీ కార్యదర్శి, పారిశుద్ధ్య కార్మికుడు, బిల్ కలెక్టర్ పనితీరును కూడా వేర్వేరు స్కోర్ కార్డుల ద్వారా అంచనా వేయనున్నారు. ప్రతీ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల మొదటి తేదీ మధ్య మండల శానిటేషన్ టాస్క్ఫోర్స్ గ్రామ పంచాయతీలను ముందస్తు సమాచారం లేకుండా తనిఖీ చేస్తుంది. తనిఖీల సమయంలో ఫొటోలు, వీడియోలు, రిజిస్టర్లు, ప్రజల అభిప్రాయాలు, నీటి పరీక్షలు వంటి ఆధారాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. ప్రతీ మార్కుకు సంబంధించి ఆధారం ఉండాల్సిందేనని, వ్యక్తిగత అభిప్రాయాలకు అవకాశం లేకుండా ఫార్ములా ఆధారిత మూల్యాంకనం అమలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తనిఖీ బృందంలో ఎంపీడీఓ మెంబర్ కన్వీనర్గా, ఎంఎస్ఓ, ఎంపీఓ సభ్యులుగా ఉంటారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త కాల్చడం, తాగునీటి వనరుల్లో మురుగు కలవడం, మానవ మలాన్ని చేతులతో తొలగించడం, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాల బకాయిలు, క్లోరినేషన్లో నిర్లక్ష్యం, చనిపోయిన జంతువులను తొలగించకపోవడం, బహిరంగ మలవిసర్జన, దోమల లార్వా అధికంగా ఉండటం వంటి పది తీవ్ర ఉల్లంఘనలను ‘రెడ్ ఫ్లాగ్’గా గుర్తించారు. వీటిలో ఒక్కటి నమోదైనా ఆ గ్రామ పంచాయతీకి ఆ నెలలో నేరుగా డీ గ్రేడ్ ఇవ్వడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన గ్రామ పంచాయతీలకు ప్రశంసపత్రాలు, ప్రత్యేక గుర్తింపు, పురస్కారాలు లభించనున్నాయి. వరుసగా తక్కువ గ్రేడ్లు వస్తే షోకాజ్ నోటీసులు, శాఖాపరమైన చర్యలు, సేవా నియమాల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 280 గ్రామపంచాయతీల్లో ప్రతీ రోజు ప్రతీ ఇంటి నుంచి సగటున 250 గ్రాముల తడి, పొడి చెత్త సేకరణ జరుగుతోంది. ఈ వ్యర్థాలను శాసీ్త్రయంగా నిర్వహిస్తూ గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రవేశపెట్టిన ఎస్జే–స్కోర్ విధానాన్ని విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం కార్యాచరణను వేగవంతం చేసింది. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను ఒకరోజు కార్యక్రమంగా కాకుండా నిరంతర ప్రక్రియగా మార్చాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. పరిశుభ్ర గ్రామాల జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఎస్జే– స్కోర్ కీలకంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. పాలన, నిధుల వినియోగం దోమల నియంత్రణ, ప్రజారోగ్యంఘన వ్యర్థాల నిర్వహణఓడీఎఫ్ స్థిరత్వండ్రెయినేజీలు, ద్రవ వ్యర్థాల నిర్వహణ తాగునీటి భద్రత జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణకు మార్కులు.. గ్రామపంచాయతీల పనితీరుకు నెలనెలా గ్రేడింగ్ ఏడు విభాగాల్లో 100 మార్కులు రెడ్ఫ్లాగ్ వస్తే కఠిన చర్యలు.. ఉత్తమ పంచాయతీలకు ప్రశంసలు, ప్రోత్సాహకాలు ఏడు విభాగాలు.. 100 మార్కులు 12 10301018 -
మల్బరీ సాగు..ప్రోత్సాహం మస్తు
జనగామ రూరల్: వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా స్థిరమైన ఆదాయం అందించే పంటల వైపు రైతులను ప్రోత్సహించేందుకు జిల్లాలో మల్బ రీ సాగు విస్తరణకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 100 ఎకరాల మల్బరీ సాగు లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన నేపథ్యంలో అర్హులైన, ఆసక్తి గల రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దిగుబడి..ఆదాయం మల్బరీ ఒక బహువార్షిక పంట కావడం దీని ప్రధాన ప్రత్యేకత. ఒకసారి తోటను ఏర్పాటు చేస్తే సుమారు 15 నుంచి 20 సంవత్సరాల వరకు దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ఏడాదికి కనీసం 8 నుంచి 10 సార్లు ఆకుల కోత తీసుకునే వీలుండటంతో, నేల స్వభావం, నిర్వహణను బట్టి రైతులు సంవత్సరానికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు నికర ఆదాయం పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. భారీ సబ్సిడీలు.. మల్బరీ సాగు విస్తరణకు ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర పథకాల ద్వారా భారీ సబ్సిడీలు అందిస్తున్నాయి. జనరల్ కేటగిరీ రైతులకు మల్బరీ మొక్కల సరఫరా, నాటడానికి సెంట్రల్ సిల్క్ బోర్డు (సీఎస్బీ) ద్వారా 50 శాతం సబ్సిడీగా గరిష్టంగా రూ.60,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో 25 శాతం వాటాగా రూ.30,000 అంద జేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు సీఎస్బీ ద్వారా 65 శాతం సబ్సిడీగా గరిష్టంగా రూ.78,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనంగా 25 శాతం వాటాగా రూ.30,000 మంజూరు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుపురుగుల పెంపకానికి అవసరమైన మల్బరీ రేరింగ్ షెడ్ నిర్మాణానికి కూడా ప్రత్యేక ప్రోత్సాహం కల్పిస్తున్నారు. జనరల్ కేటగిరీ రైతులకు సీఎస్బీ ద్వారా 50 శాతం సబ్సిడీగా గరిష్టంగా రూ.2,25,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.1,12,500 అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు సీఎస్బీ ద్వారా 65 శాతం సబ్సిడీగా గరిష్టంగా రూ.2,92,500, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.1,12,500 మంజూరు చేయను న్నారు. అదనంగా షూట్ ఫీడింగ్ స్టాండ్స్ నిర్మాణానికి జనరల్ కేట గిరీ రైతులకు రూ.10,890, ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.22,140 సబ్సిడీ లభిస్తుంది. అలాగే పట్టుపురుగుల పెంపకానికి అవసరమైన రూ.75,000 విలు వైన 300 చంద్రికలు, 10 ప్లాస్టిక్ ట్రేలను ఉచితంగా అందజేయనున్నారు. సబ్సిడీకి దరఖాస్తు చేసుకునే రైతులు రెండు ఫొటోలు, రెండు ఎకరాల భూమికి సంబంధించిన పట్టాదార్ పాస్బుక్ (1–బీ), కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ ప్రతులను సమర్పించాలని సూచించారు.కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమల అధికారి కె.అంబికా సోని, పట్టుపరిశ్రమల అధికారి నవీన్పాల్రెడ్డి, ఉద్యాన అధికారులు సందీప్, సంతోషిరాణి, రఘునాథపల్లి తహసీల్దార్ రాజేష్రెడ్డి, ఆర్ఐ అన్వేష్తో కూడిన బృందం బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఇప్పటికే మల్బరీ సాగు చేస్తున్న రైతుల తోటలను సందర్శించి సాగు విధానం, పనుల పురోగతిని పరిశీలించి రైతులకు అవసరమైన సూచనలు అందించింది. పంట వేసే రైతులకు భారీ సబ్సిడీలు ప్రత్యామ్నాయ, స్థిరమైన ఆదాయంతో లబ్ధి 100 ఎకరాల లక్ష్యంతో అధికారుల చర్యలు -
ఆసక్తి పెంచేలా బోధించాలి
లింగాలఘణపురం: విద్యార్థుల్లో నేర్చుకోవాలనే ఆసక్తి పెంచే విధంగా ఉపాధ్యాయుల బోధన తీరు ఉండాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. బుధవారం మండలంలోని నెల్లుట్ల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న సమగ్ర ఉపాధ్యాయ శిక్షణ శిబిరంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు..ప్రతీ ఉన్నత పాఠశాలలో ప్రపంచ పటం, దేశ భౌతిక, రాజకీయ పటాలతో పాటు రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలు ఆర్టికల్స్ను ప్రదర్శించే సమాచార పట్టికలు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ప్రపంచ పటంలో వివిధ దేశాల స్థానాలు, భౌగోళిక అంశాలపై ఉపాధ్యాయులను ప్రశ్నించి వారి పరిజ్ఞానాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు సులభ పద్ధతిలో గణితం బోధించి వారిలో ఆసక్తిని పెంచారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా -
ఎమ్మెల్యేలు ఏమన్నారంటే..
● వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్లో మిషన్ భగీరథ పైప్లైన్ల లీకేజీలతో తాగునీటి సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. తక్షణం సరిచేయాలని కోరారు. ● స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు తాగునీరు, సాగునీటికి దేవాదుల ప్రాజెక్టే ప్రధాన ఆధారమని అన్నారు. మూడు దశల్లోని 10 మోటార్లను కనీసం 100 రోజులపాటు నిరంతరాయంగా నడిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక లోపాలు తలెత్తితే 48 గంటల్లోపు మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. ● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ హసన్పర్తి మండలంతోపాటు విలీన గ్రామాల్లో తాగునీటి సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు. వర్ధన్నపేటలో అమృత్ పథకం పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ● భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ తక్కువ నీటితో అధిక ఆదాయం వచ్చే వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. దేవాదుల ప్రాజెక్టు, భీమ్ఘనపూర్, చలివాగు తదితర నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ ఎరువుల సరఫరాపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ● మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ పట్టణంలో తాగునీటి పంపిణీలో ఇబ్బందులు ఉన్నాయని, ముఖ్యంగా మెడికల్ కాలేజీకి ప్రత్యామ్నాయ వనరుల ద్వారా నీరు అందించాలని కోరారు. డ్రిప్ ఇరిగేషన్పై రైతులకు అవగాహన కల్పించి కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. సమీక్షలో పాల్గొన్న ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, నాగరాజు, మురళీనాయక్ -
త్వరగా ప్రాజెక్టు పూర్తికి చర్యలు.. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి ఉమ్మడి జిల్లాలో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అంతా సిద్ధం
హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎల్నినోతో నెలకొన్న కరువు పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలు, రైతుల ప్రయోజనాలు, సాగు, తాగునీటి లభ్యత, పశుసంపద రక్షణ తదితర అంశాలపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెకర్లు, అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. జిల్లాల వారీగా ప్రస్తుత పంటల పరిస్థితులపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఎమ్మెల్యేలు స్థానిక పరిస్థితులను వివరించారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్ అధికారి శ్రీదేవసేనను నియమించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఎల్నినో ప్రభావం, వర్షాభావం, వివిధ శాఖల సంసిద్ధతపై సుదీర్ఘ సమీక్ష హాజరైన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు దేవాదుల పూర్తికి ప్రభుత్వం చర్యలు : మంత్రి పొంగులేటి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సాగు, తాగునీటికి ప్రధాన ఆధారమైన దేవాదుల ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పంపింగ్ వ్యవస్థలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. తాగు, సాగునీరు, పశువులకు మేత, ఉపాధి హామీ పనులు, రైతులకు అవసరమైన విత్తనాల సరఫరాపై సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. లెమన్ గ్రాస్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై వచ్చిన సూచనలు పరిశీలిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలిస్తే ప్రభుత్వం స్వాగతిస్తుందని, అవసరమైతే దేవాదులపై ప్రత్యేకంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రైతులకు శాసీ్త్రయ అవగాహన కల్పించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులపై శాస్త్రవేత్తల అంచనాలను గ్రామస్థాయికి తీసుకెళ్లి రైతులకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమన్నారు. ఈ సీజన్లో తీసుకునే నిర్ణయాలు వచ్చే ఏడాది జూన్ వరకు ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. కలెక్టర్ల నేతృత్వంలో ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో రైతులకు శాసీ్త్రయ ఆధారాలతో అవగాహన కల్పించాలని, కరపత్రాలు, ఇతర ప్రచార సాధనాల ద్వారా ప్రత్యామ్నాయ పంటలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. -
ఓవైపు వర్షాభావం..
మరోవైపు ఎరువుభారం!జనగామ రూరల్: వానాకాలం సీజన్ ప్రారంభమై యాభై రోజులు దాటినా సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఈనేపథ్యంలో కనీసం తమకున్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుందామంటే ఎరువుల ధరలు భారీగా పెరగడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. యూరియా మినహా మిగతా ఎరువులకు కేంద్రం ఇచ్చే రాయితీ స్థిరంగా ఉంటుంది. ఉత్పత్తి, ఖర్చుల ఆధారంగా ఆయా కంపెనీలు రైతులకు విక్రయించే ఎరువుల ధరలను పెంచుకునేలా కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ముడిసరకులు, దిగుమతి ఖర్చుల పేరిట కంపెనీలు పదేపదే ఎరువుల ధరలు పెంచుతున్నాయి. ప్రభుత్వం రాయితీతో అందజేసే డీఏపీ రూ.1,350, యూరియా రూ.266 ధరలు మినహా మిగతా ఎరువుల ధరలు అన్నింటినీ పెంచారు. ఆర్థిక భారం జిల్లాకు 70,900 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరమవుతాయి. వీటిలో ప్రతీ ఎరువు 50 కిలోల సంచికి రూ.300–400లకు పైగా ధరలు పెరిగాయి. దీంతో పెట్టుబడిలో ఒక్కో రైతు రూ.4వేల వరకు అదనంగా భారం మోయాల్సిన పరిిస్థితి నెలకొంది. డీఏపీ వాడకాన్ని తగ్గించేందుకు రెండు, మూడు డీఏపీ సంచులు తీసుకునే రైతులకు నానో డీఏపీ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే రైతులు నానో డీఏపీ తీసుకోవడానికి మొగ్గు చూపడం లేదు. డీఏపీ బస్తా ధర రూ.1,350లు కాగా.. నానో డీఏపీ బాటిల్ ధర రూ.560లు ఉంది. అయినా కూడా పంట దిగుబడి సరిగ్గా వస్తుందో లేదోనని రైతులు భయపడి నానో డీఏపీ వాడడానికి వెనకంజ వేస్తున్నారు. ధరలు తగ్గించాలి ఎరువుల ధరలు భారీగా పెరగడంతో రైతులు పెట్టుబడి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎల్నిలో ప్రభావంతో పంట సాగు అంతంత మాత్రమే ఉండగా ప్రత్యామ్నాయ పంట లపై అవగాహన కల్పించడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం ఎరువు భారం తగ్గించాలి. – చందూ నాయక్, జిల్లా కార్యదర్శి, రైతు సంఘం సాగు అంతంత మాత్రమే..ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో వరి సాగు అంతంత మాత్రంగానే ఉంది. మద్దతు ధర నామమాత్రంగా పెంచి ఎరువుల ధరలు మాత్రం భారీగా పెంచారు. ఆరుతడి పంటలను సాగుచేయాలని చెబుతున్నా ప్రభుత్వం విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయాలి. ఎరువుల ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలి. – ఎడ్ల శ్రీనివాస్, మరిగడి యూరియా డీఏపీ ఎన్పీకే ఎంఓిపీ ఎస్ఎస్పీదిక్కుతోచని స్థితిలో అన్నదాతలు సాగు చేద్దామంటే వానలు లేవు.. వేసిన పంటను దక్కించుకుందామంటే కొండెక్కిన ఎరువులు నానో డీఏపీ తీసుకోవాలంటున్న అధికారులు దిగుబడిపై అనుమానంతో మొగ్గుచూపని రైతులుజిల్లాకు అవసరమయ్యే కాంప్లెక్స్ ఎరువులు (మెట్రిక్ టన్నుల్లో) -
ట్రేడ్ లైసెన్స్లు తప్పనిసరిగా తీసుకోవాలి
స్టేషన్ఘన్పూర్: మున్సిపాలిటీ పరిధిలో వాణిజ్య, వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు తమ సముదాయాలకు విధిగా ట్రేడ్ లైసెన్స్లు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది పట్టణ కేంద్రంలోని వైన్స్షాపులతో పాటు పలు వ్యాపార సముదాయాలను మంగళవారం తనిఖీ చేశారు. ట్రేడ్ లైసెన్స్లు తీసుకున్నారా? లేదా? అంటూ పరిశీలించారు. ఈ మేరకు కమిషనర్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఆదాయం కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనిచేస్తున్నామన్నారు. వ్యాపారులు నిబంధనల మేరకు లైసెన్స్ ఫీజులు చెల్లించని పక్షంలో మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో మేనేజర్ సత్యనారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్ మధు, ఆర్ఐ శ్రీను, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుత్రంగ అభివృద్ధికి సహకారం అందిస్తా..
స్టేషన్ఘన్పూర్: నియోజకవర్గంలో విద్యుత్ పరమైన అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. డివిజన్ పరిధిలోని విద్యుత్శాఖ అధికారులు స్టేషన్ఘన్పూర్ డీఈ బి.సారయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మంగళవారం హనుమకొండ ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. డివిజన్ పరిధిలో ఇటీవల జరిగిన పలు విద్యుత్ అభివృద్ది కార్యక్రమాలతో పాటు వినియోగదారులకు అందించాల్సిన పలు విద్యుత్ సౌకర్యాలపై ఎమ్మెల్యేతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేలా విద్యుత్ అధికారులతో పాటు సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏడీఈ రణధీర్రెడ్డి, జఫర్గఢ్ ఏఏఈ ఎం.కరుణాకర్ పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంజనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు సంబంధిత పీజీ కోర్సుల్లో 55 శాతం మార్కులతో పాసై ఉండాలని (ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం), నెట్,సెట్, పీహెచ్డీ ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 24వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 25వ తేదీ ఉద యం 11:00గంటలకు కళాశాలలో ఇంటర్వ్యూ ఉంటుందని, మరిన్ని వివరాలకు 99591 51051ఫోన్నంబర్లో సంప్రదించాలన్నారు. బీఎఫ్సీ,–1.కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్– 2, ఇంగ్లిష్–2, హెల్త్ కేర్–1 హిస్టరీ–1, పొలిటికల్ సైనన్స్ 1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్–1,తెలుగు–1 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. గ్రామాలాభివృద్ధే ధ్యేయంబచ్చన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, గోపాల్నగర్లో, బచ్చన్నపేటలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతీ ఓటరు తమ వివరాలను ఎన్యుమరేషన్ ఫారంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. నూతనంగా ఎన్నికై న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహమ్మద్ మసూద్ను సన్మానించారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ వెంకట్రెడ్డి, సర్పంచ్లు అల్వాల నర్సింగారావు, ఇజ్జగిరి రాములు, బళ్ల రవీంద్రనాథ్, నాయకులు పిన్నింటి కావ్యశ్రీ, జంగిటి విద్యానాథ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్గాంధీ అరెస్ట్ను ఖండిస్తున్నాంజనగామ: న్యూఢిల్లీలో విద్యార్థుల హక్కుల పరిరక్షణతో పాటు నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తున్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఇతర నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ జిల్లా కమిటీ అధ్యక్షురాలు ధన్వంతిలక్ష్మీనారాయణ తీవ్రంగా ఖండించారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఆమె మాట్లాడుతూ.. దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బ తీసిన నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్య తగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధా న్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, ఇతర నాయకుల అరెస్ట్ను వెంటనే ఉపసంహరించుకోవాలని, విద్యార్థుల ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం గౌరవించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. -
లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025–26 కింద లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టి ఈ నెల 24 లోపు పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో యాక్షన్ ప్లాన్ అమలుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను ఎస్సీ జనాభా ప్రాతిపదికగా మూడు కేటగిరీల వారీగా మండలాలు, మున్సిపాలిటీలకు కేటాయించినట్లు తెలిపారు. రుణాల మంజూరు, బ్యాంకు ఖాతాలు, డాక్యుమెంటేషన్, ఇతర బ్యాంకింగ్ సేవలకు సంబంధించి లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసి ప్రభుత్వ లక్ష్యాల సాధనకు పూర్తి సహకారం అందించాలని బ్యాంకర్లకు సూచించారు. సమావేశంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల శాఖ అధికారులు, కార్యనిర్వాహక సంచాలకులు, ఎంపీడీఓలు, మున్సిపాలిటీల కమిషనర్లు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి● రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్ జనగామ రూరల్: రహదారులపై ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి అదనపు కార్యదర్శితో కలిసి రవాణా, ఆర్ అండ్బీ, కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించారు. దీనికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్ మాట్లాడుతూ..జిల్లాస్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశాలు ప్రతినెలా నిర్వహించాలని తెలిపారు. టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని, రహదారులపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ లను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, రహదారి భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. వాహనదారులు తప్పకుండా సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రామానుజుల బోధనలు నేటికీ ఆచరణీయం ● త్రిదండి చినజీయర్ స్వామి జనగామ: వెయ్యి సంవత్సరాల క్రితం సమతామూర్తి భగవత్ రామానుజాచార్యులు బోధించిన విలువలు నేటికీ, భవిష్యత్తులోనూ ఆచరణీయమేనని త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి అన్నారు. పట్టణంలోని బాణాపురం శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న తృతీయ పుష్కర వేడుకల సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.. రామానుజుల వారి జీవితం, బోధనలను కవితా రూపంలో ప్రజలకు చేరవేస్తున్న కవులను అభినందించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, కవులు, కళాకారులను స్వామిజీ సత్కరించారు. ఉదయం శ్రీ సుదర్శన యాగం చినజీయర్ స్వామి సమక్షంలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా నిర్వహించారు. వేడుకల సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చిన జీయర్ స్వామి వస్త్రాలను అందించారు. -
సంస్కృతి, సంప్రదాయాలను పాటించండి
జనగామ: సంస్కృతి, సంప్రదాయాలను పాటించడం ప్రతి ఒక్కరికీ శ్రీరామ రక్ష అని త్రిదండి చిన్న జీయర్ స్వామి అన్నారు. పట్టణంలోని బాణాపురం వెంకటేశ్వరస్వామి సన్నిధిలో జరుగుతున్న తృతీయ పుష్కర మహోత్సవాలు, మహా సుదర్శన యాగంలో భాగంగా సోమవారం విశేష సహస్రనా మార్చన, సుదర్శన హవనం, దంపతీ పూజలు, ఉగ్రరథ, భీమరథ, సహస్ర చంద్రదర్శన హవనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ.. నక్షత్రాలు, తిథులు, కాలం అనుకూలంగా ఉండాలంటే పూర్వీకులు అందించిన సంప్రదాయాలను ఆచరించాలని సూచించారు. అనంతరం స్థానిక కవుల ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. రేపు బండగుట్టకు చిన్న జీయర్స్వామి లింగాలఘణపురం: మండలంలోని బండగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి ఈ నెల 22న చిన్నజియర్స్వామి రానున్నారు. 32 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహంతో పాటు శంఖు చక్ర నామాలను ఆవిష్కరించనున్నారని ఉత్సవ నిర్వాహుకులు వంచ మహేశ్వర్రెడ్డి, లింగాల దీపక్రెడ్డి, వంచ రాంరెడ్డి తెలిపారు. జ్యూడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్నిక జనగామ రూరల్: డిస్ట్రిక్ట్ జ్యూడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిభ, నూతన అధ్యక్షుడిగా టి. రాజేందర్ సింగ్, జనరల్ సెక్రటరీగా జి.మహేందర్, వైస్ ప్రెసిడెంట్గా బి.పూల్చంద్, అసోసియేట్ ప్రెసిడెంట్గా ఐశ్వర్య, ట్రెజరీగా సంపత్, జాయింట్ సెక్రటరీగా ఎస్.కీర్తన జ్యోతి, స్పోర్ట్స్ సెక్రటరీగా ఎం. రామును ఎన్నుకున్నారు. శ్రీవెంకటేశ్వర కళాపరిషత్ ఆవిర్భావంజనగామ: జిల్లాలో రంగస్థల కళల అభివృద్ధి, కళాకారుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని శ్రీ వెంకటేశ్వర కళాపరిషత్ జనగామ పేరుతో సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేశారు. ఆదివారం పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో నిర్వహించిన తొలి సర్వసభ్య సమావేశంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల రంగస్థల కళా కారులు, నాటక రంగ ప్రముఖులు పాల్గొని సంస్థ ఏర్పాటుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సమావేశంలో శ్రీ వీరాంజనేయ నాట్యమండలి వ్యవస్థాపకుడు మేళ్లచెరువు వెంకట అప్పయ్య శాస్త్రి, కొండ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కొండ శ్రీనివాస్, స్టేషన్ఘన్పూర్కు చెందిన సింధూరి కొండలరావు (సురభి), నంచర్ల వైకుంఠం, ఈరవెన్ను నాటకరంగ కళాకారులతో పాటు పట్టణా నికి చెందిన ఔత్సాహిక కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాత్కాలిక కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా మోతే సురేందర్రెడ్డి, అధ్యక్షుడిగా మేళ్లచెరువు వెంకట అప్పయ్యశాస్త్రి, ముఖ్య సలహాదారుగా నంచర్ల వైకుంఠం, ఉపాధ్యక్షులుగా మేకల రమణారెడ్డి, పన్నీరు రాజు, ప్రధాన కార్యదర్శిగా గంగు నాగరాజు శర్మ, సహాయ కార్యదర్శిగా ఆంజనేయ శర్మ, కోశాధికారిగా చల్లా రాజనరసింహారెడ్డి, ప్రచార కార్యదర్శిగా కొండ శ్రీనివాస్, సంగీత దర్శకులుగా కొండలరావును నియమించారు. సభ్యులుగా గంగు సాంబమూర్తి, సిద్ధులు, నర్సిరెడ్డి, భాస్కర్రెడ్డి, వెంకటేశ్వర్లు, రామమూర్తిని ఎన్నుకున్నారు. భట్టు రమేశ్కు అభినందన కేయూ క్యాంపస్: హైదరాబాద్లో తెలంగాణ తెలుగు అకాడమీ డైరెక్టర్గా సోమవారం బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ భట్టు రమేశ్ను తెలుగు యూనివర్సిటీ మాజీ వీసీ హనుమాండ్ల భూమయ్య, వరంగల్ గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి గడ్డం వెంకన్న, కేయూ దూరవిద్య ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కొట్టె భాస్కర్, పి.రవీందర్ సన్మానించారు. -
తెలంగాణ వనరులను దోచుకున్నారు..
● స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం శాఖలవారీగా పంచుకుని తెలంగాణ వనరులను దోచుకున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులున్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే కరువు వచ్చిందని మాజీ మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. మేడిగడ్డ కుంగిపోతే కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయవచ్చు కదా అంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వాలు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అఽథారిటీ సూచనల మేరకే పనిచేస్తాయని స్పష్టం చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ వినయ్కుమార్, వైస్ చైర్మన్ నీల రాజమ్మ, పార్టీ పట్టణ అధ్యక్షుడు అంబటి కిషన్రాజ్, నాయకులు నీల గట్టయ్య, బూర్ల శంకర్, గన్ను నర్సింహులు, గట్టు రమేశ్, గుర్రం రమేశ్, పోశాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా జగన్నాథ రథయాత్ర
జనగామ: పట్టణంలో శ్రీ పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర సోమవారం సాయంత్రం హరేకృష్ణ హరేరామ భక్త బృందం, గీతాశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. బస్టాండ్ చౌరస్తా వద్ద ప్రారంభమైన రథయాత్రను మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ ప్రారంభించారు. వాస్తు గణపతి దేవాలయం మీదుగా పట్టణ ప్రధాన వీధుల గుండా రైల్వేస్టేషన్ వరకు సాగిన ఈ యాత్రలో భక్తులు హరినామ సంకీర్తనలు, భజనలతో పాల్గొని భక్తి పారవశ్యాన్ని నెలకొల్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీసీపీ రాజమహేంద్ర నాయక్ పర్యవేక్షణలో ఇద్దరు ఏసీపీలు, సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సైలు, పోలీసు సిబ్బంది విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కార్యక్రమంలో ధనుంజయ్ పండిత్ దాస్, మాధవ్ గోవింద దాస్ ప్రభు, శ్రీ సనాతన దాసు, పద్మావతి దేవి దాసి, కృష్ణ భావదేవిదాసి, బాలమణి, వెంకన్న, నాగేందర్, ధర్మపురి శ్రీను, అరుణ్, పరశురాములు, విజయ్, సిద్ధులు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి ఒడిలో జీవన పాఠాలు
జనగామ: పుస్తకాల భారానికి నెలలో ఒకరోజు విరామమిస్తూ, ప్రకృతి, పొలం, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలనే తరగతి నుంచి బయటకు తీసుకెళ్లి విద్యార్థులకు అనుభవాత్మక విద్యను అందిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రతీ నెల మూడో శనివారం నిర్వహిస్తున్న ‘నో బ్యాగ్ డే’ కార్యక్రమం ద్వారా ఆటలు, పా టలు, ప్రత్యక్ష పరిశీలనతో నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తూ విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు, క్రమశిక్షణ, సామాజిక అవగాహన పెంపొందిస్తున్నాయి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా జీవిత నైపుణ్యాలు, ప్రకృతి పరిజ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నో బ్యాగ్ డే’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. జిల్లాలోని 341 ప్రాథమిక, 64 ఉన్నత ప్రాథమిక, 103 ఉన్నత పాఠశాలలు కలిపి 508 ప్రభుత్వ పాఠశాలల ఉండగా, చాలా పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి, ముందుగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం విద్యార్థులను పొలంబడి, ప్రకృతి వనాలు, చారిత్రక ప్రదేశాలు, శిలాశాసనాలు, దేవాలయాలు, స్థానిక వారసత్వ కట్టడాల వద్దకు తీసుకెళ్తున్నారు. కొన్ని పాఠశాలల్లో వరి నాట్లు వేయించడం, పంటల సాగు విధానాలను ప్రత్యక్షంగా చూపించడం ద్వారా వ్యవసాయంపై అవగాహన కల్పిస్తుండగా, మరికొన్ని చోట్ల మొక్కల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం ప్రాధాన్యాన్ని వివరిస్తున్నారు. ఆటలు, పాటలు, నాయకత్వ లక్షణాలు ఆటలు, పాటలు, జానపద కళలు, కథల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణను పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. పాఠ్యాంశాలతో పాటు స్థానిక చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై అవగా హన పెరగడంతో విద్యార్థుల్లో పరిశీలనా దృష్టి, సామాజిక బాధ్యతా భావం కూడా పెరుగుతోంది. జిల్లాలోని వందలాది ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ఈ కార్యక్రమం విద్యార్థులను సమగ్ర వ్యక్తిత్వంతో తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తోందని విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. పిల్లల అభ్యాసాన్ని ఆనందదాయకంగా మార్చడంతో పాటు భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించే సామర్థ్యాన్ని పెంపొందించే వినూత్న విద్యా విధానంగా నో బ్యాగ్ డే కార్యక్రమం నిలుస్తోంది. పొలం పాఠాలు గుర్తుండిపోతాయిపొలంబడి కార్యక్రమంలో పాల్గొని వరి నాట్లు ఎలా వేస్తారో ప్రత్యక్షంగా చూశాం. రైతులు పడే కష్టాన్ని అర్థం చేసుకున్నాం. పుస్తకాల్లో చదివిన దానికంటే ప్రత్యక్షంగా నేర్చుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. –ఎం.వర్షిత, 6వ తరగతి, ప్రభుత్వ పాఠశాల, కొడవటూరు సులభంగా నేర్చుకుంటున్నాం..ప్రకృతి ఒడిలో చెట్ల ప్రాముఖ్యం, పర్యావరణ పరిరక్షణ గురించి ఉపాధ్యాయులు వివరించారు. మొక్కలను కాపాడాలనే బాధ్యత పెరిగింది. ఇలాంటి కార్యక్రమాలతో కొత్త విషయాలు సులభంగా నేర్చుకుంటున్నాం. –నీలా దినేష్, 6వ తరగతి, ప్రభుత్వ పాఠశాల, కొడవటూరు, బచ్చన్నపేట ‘నో బ్యాగ్ డే’తో విద్యార్థులకు అనుభవాత్మక విద్య వ్యవసాయం నుంచి చరిత్ర వరకు నేర్చుకునే అవకాశం ప్రతీ మూడో శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో వినూత్న కార్యక్రమం -
అద్వితీయం
మంగళవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2026అత్యుత్తమం..వ్యవసాయ పనితీరులో రాష్ట్రంలో జిల్లాకు రెండో స్థానం జనగామ: రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన జూన్–2026 పారామీటర్ వైజ్ డిస్ట్రిక్ట్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్లో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానం సాధించింది. గతంలో 25వ స్థానంలో ఉన్న జిల్లా.. ప్రస్తుత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం మూడున్నర నెలల్లోనే విశేష పురోగతి సాధించి రాష్ట్రంలో అగ్రశ్రేణి జిల్లాల్లో ఒకటిగా నిలవడం గమనార్హం. రాష్ట్రం రూపొందించిన ఏడు కీలక పనితీరు సూచికల్లో 70 మార్కులకు గాను 49.73 పాయింట్లు సాధించిన జిల్లా, పెద్ద జిల్లాలను మాత్రమే కాకుండా వ్యవసాయ పరంగా ముందంజలో ఉన్న అనేక జిల్లాలను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని దక్కించుకుంది. పెండింగ్ కేసుల పరిష్కారం.. రైతుబీమా, రైతు భరోసా వంటి పథకాల అమలులో అధికారులు దృష్టి సారించి దరఖాస్తులు పెండింగ్లో ఉండకుండా నిరంతర సమీక్షలు నిర్వహించారు. రైతుబీమాకు సంబంధించిన మొత్తం 552 కేసులు ఉండగా ప్రస్తుతం 21కేసులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. కోర్టు వివాదాలు తదితర కారణాలతో నిలిచిపోయిన కేసులతో పాటు ఇటీవల నమోదైన మరో 9 కేసులను కూడా పరిష్కరించి 100 శాతం క్లెయిమ్ క్లియరెన్స్ సాధించే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. ఫార్మర్ రిజిస్ట్రీలో వేగం.. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియలో జిల్లా ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తి చేసింది. రైతుల భూములు, పంటలు, ఆధార్, బ్యాంకు వివరాలను సమగ్రంగా నమోదు చేయడం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల అమలుకు పటిష్టమైన డేటాబేస్ సిద్ధమవుతోంది. ఫర్టిలైజర్స్ విక్రయాలపై పర్యవేక్షణ ఎరువులు, పురుగు మందుల విక్రయాలను పూర్తిగా ఆన్లైన్ విధానంలో పర్యవేక్షించడం, ఫర్టిలైజర్ దుకాణాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం, స్టాక్లను పరిశీలించడం, బ్లాక్ మార్కెటింగ్కు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవడం, ప్రతీ విక్రయాన్ని ఆన్లైన్లో నమోదు చేయించడం వంటి చర్యలతో జిల్లా మంచి మార్కులు సాధించింది. ఆరుతడి పంటలకు ప్రోత్సాహంలో.. ప్రస్తుత వానాకాలంలో వరిసాగు తగ్గించి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను ప్రోత్సహించ డంపై వ్యవసాయ శాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో వరి, పత్తి సాగు అంచనాతో పోలిస్తే సుమారు 52 వేల ఎకరాలు తక్కువ నమోదవడంతో రైతులకు కందులు, పెసర్లు, ఇతర పప్పుధాన్యాల సాగుపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో కందుల సాగు లక్ష్యం 3,350 ఎకరాలు కాగా ఇప్పటికే 5,613 ఎకరాలకు పైగా, పెసర సాగు లక్ష్యం 657 ఎకరాలు కాగా 562 ఎకరాల్లో సాగు పూర్తయింది. ఇంకా ఈ నెల చివరి వరకు, వచ్చే నెల తొలి వారంలో 18వేల ఎకరాల్లో కందులు సాగు చేసుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతిరోజూ సమీక్షలు.. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవసాయ శాఖ పనితీరుపై నిరంతర సమీక్షలు, మండలాల వారీగా పురోగతిని పరిశీలించడం, వెనకబడిన అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించడం, జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని క్షేత్రస్థాయిలో అధికారులతో సమన్వయం చేస్తూ నిరంతర పర్యటనలు చేయడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అధికారులు పేర్కొంటున్నారు. ఏఈఓలు, ఏఓలు, జిల్లా స్థాయి సిబ్బంది సమష్టి కృషితో జిల్లా రెండో స్థానాన్ని దక్కించుకుని ఆదర్శంగా నిలిచిందని అభిప్రాయపడుతున్నారు. వివిధ విభాగాల్లో జిల్లా సాధించిన మార్కులు రైతుల నమోదు రైతుబీమా మరణాల నమోదు రైతుబీమా పరిహార దరఖాస్తుల పరిష్కారం యూరియా వినియోగ ధ్రువీకరణ నివేదిక క్షేత్రస్థాయి సేవల మొబైల్ వినియోగం ఆన్లైన్ భూసంబంధ సేవల నిర్వహణ వ్యవసాయ విస్తరణ అధికారుల హాజరు గతంలో 25వ స్థానం.. మూడున్నర నెలల్లోనే అద్భుత ప్రగతి 70 మార్కులకు గాను 49.73 పాయింట్లు కలెక్టర్ పర్యవేక్షణలో అధికారుల సమష్టి కృషి -
విప్రచిత్తా, మహావజ్రేశ్వరీ క్రమాల్లో అమ్మవారు
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శాకంబరీ నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా సోమవారం ఆరవ రోజు అమ్మవారిని విప్రచిత్తా, మహావజ్రేశ్వరీ అలంకరించి పూజలు నిర్వహించారు. అర్చకులు భద్రకాళి శేషు అధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి నిత్యాహ్నికం, క్షీరాన్ననివేదన నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని విప్రచిత్తా క్రమంలో, షోడశీక్రమాన్ని అనుసరించి బోగభేరాన్ని మహావజ్రేశ్వరీ క్రమంలో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ రామల సునీత మాట్లాడుతూ భక్తులు సంప్రదాయమైన దుస్తులు ధరించి రావాలని, దేవాలయం, ప్రాంగణంలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోలు తీయడం, రీల్స్ చేయడం నిషేధమని పేర్కొన్నారు. ఇందుకు భక్తులు సహకరించాలని కోరారు. -
ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని నిలిపివేయండి
● దుకాణాల యజమానులకు మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ సూచనజనగామ: పట్టణంలో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం వెంటనే నిలిపివేయాలని మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, కమిషనర్ రాజశేఖర్రెడ్డి సూచించారు. సోమవారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు, కిరాణా దుకాణాల యజమానులకు నిషేధిత ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ క్యారీ బ్యాగు తయారీ, అమ్మకం, నిల్వ, పంపిణీ, వినియోగం పూర్తిగా నిషేధించారని స్పష్టం చేశారు. వ్యాపారులు వెంటనే ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగాన్ని నిలిపివేసి, వాటికి బదులుగా గుడ్డ సంచులు, కాగితపు సంచులు, జీవ విచ్ఛిన్నమయ్యే పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగదారులకు అందించాలని సూచించారు. నిషేధిత ప్లాస్టిక్ క్యారీబ్యాగులను వినియోగిస్తున్నట్లు, విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నిబంధనల ప్రకారం జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్లాస్టిక్ నిషేధ అమలులో మున్సిపాలిటీకి పూర్తి సహకారం అందిస్తామని హోటల్, రెస్టారెంట్, కిరాణా దుకాణాల యజమానులు ఈసందర్భంగా హామీ ఇచ్చారు. -
ఆరుతడి పంటలు సాగుచేయాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొడకండ్ల: ప్రస్తుత సీజన్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పంటల సాగు విధానాలను మార్చుకొని, ఆరుతడి పంటల సాగును చేయాలని, ఈమేరకు గ్రామాల్లో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దిశానిర్దేశం చేశారు. సోమవారం మొండ్రాయి గ్రామంలో కొమ్ము మహేందర్ కూరగాయల సాగు క్షేత్రాన్ని కలెక్టర్ సందర్శించి సాగుతీరును పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ..ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేయడం వల్ల తక్కువ నీళ్లతో దిగుబడి వచ్చి ఆదాయం సమకూరే అవకాశం ఉందని సూచించారు. గిర్నితండాలోని జ్యోతిబాఫూలే గురుకులాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ విద్యా బోధన, మౌలిక వసతులు, విద్యార్థుల అభ్యసనా సామర్థ్యం, పరిశుభ్రత, ఆహార నాణ్యతను పరిశీలించారు. అలాగే గ్రామంలోని అభయ్ పర్టిలైజర్ షాపును కలెక్టర్ తనీఖీ చేసి లైసెన్స్, కొనుగోలు రిజిష్టర్లను పరిశీలించి స్టాక్ నిల్వలను పరిశీలించారు. ఈపాస్ యంత్రంలో నమోదైన కొనుగోలు వివరాలు, నిల్వ ఉన్న యూరియా బస్తాల స్టాక్లో తేడా రావడంతో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని వ్యవసాయాధికారి శ్రీనివాస్రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి రవికాంత్, సర్పంచ్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. నెలవారీ పరిశుభ్రత మూల్యాంకనం జనగామ రూరల్: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణ, తాగునీటి భద్రత, దోమల నివారణ, ఓడీఎఫ్ స్థిరత్వం, ప్రజా ఆరోగ్య ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ‘ఎస్జే–స్కోర్ (స్వచ్ఛ జనగామ పారిశుద్ధ్యం టాస్క్ఫోర్స్) పేరిట నెలవారీ సమగ్ర మూల్యాంకన విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి పారిశుద్ధ్య నిర్వహణపై మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..ప్రతీ గ్రామ పంచాయతీలో ప్రతీ నెల ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఆధారాలతో కూడిన 100 మార్కుల విధానంలో మూల్యాంకనం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. గ్రేడ్–ఏ సాధించిన గ్రామ పంచాయతీలకు ప్రత్యేక ప్రశంసపత్రాలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీ పురస్కారాలు అందజేస్తామని, వరుసగా తక్కువ గ్రేడ్లు పొందిన గ్రామ పంచాయతీలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమీక్షలో ఆర్డీఓలు గోపీరామ్, కిరణ్ ప్రకాష్, డీఆర్డీఓ భాస్కర్, పీడీ ఈజీఎస్ సూరి, డీపీఓ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నామినేట్..లేట్ !
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీపై నెలకొన్న ఉత్కంఠకు మరికొంత కాలం తెరపడే అవకాశం కనిపించట్లేదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడంతో నామినేటెడ్ పోస్టుల నియామకాల ప్రక్రియను ఆగస్టు 3వ తేదీ తర్వాత చేపట్టే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో పదవీకాలం ముగిసిన నేతలు, కొత్తగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారిలో అయోమయం నెలకొంది. ఇటీవలే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న నేతల పదవీకాలం పూర్తయ్యింది. మరోసారి కొనసాగిస్తారా? లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా? అనే చర్చ కొనసాగుతుండగానే నియామకాలు వాయిదా పడతాయనే సంకేతాలు రావడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. సభ్యత్వ నమోదుపైనే దృష్టిప్రస్తుతం పార్టీకి అత్యంత ప్రాధాన్యమైన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపైనే సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం. ఈకార్యక్రమం పూర్తయ్యే వరకు ఎలాంటి నామినేటెడ్ పోస్టుల నియామకాలపై నిర్ణయం తీసుకోకూడదని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆగస్టు 3 తర్వాతే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అధిష్టానం అప్రమత్తంనామినేటెడ్ పదవుల కోసం కొద్ది రోజులుగా ఆశావహులు పెద్దఎత్తున హైదరాబాద్కు వెళ్లి మంత్రులు, ముఖ్యనేతలను కలుస్తున్న నేపథ్యంలో.. పార్టీ అధిష్టానం కూడా అప్రమత్తమైనట్లు సమాచారం. సభ్యత్వ నమోదుపైనే దృష్టి పెట్టాలని, లాబీయింగ్ కోసం హైదరాబాద్కు రావొద్దని ముఖ్యనేతలు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. గాంధీభవన్లో కూడా ప్రస్తుతం నామినేటెడ్ పోస్టుల అంశంపై చర్చలకు పెద్దగా అవకాశం ఇవ్వడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 3 తర్వాతే నామినేటెడ్ పోస్టులకు మోక్షం ‘సర్’పై దృష్టి పెట్టాలన్న సీఎం, టీపీసీసీ చీఫ్ హైదరాబాద్కు రావొద్దని నేతలకు సూచన గాంధీభవన్లో లాబీయింగ్కు ఇక బ్రేక్ ఉమ్మడి వరంగల్లో పలువురి పదవీకాలం ముగింపు ఆశావహుల్లో అంతా అయోమయంఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉండగా, జంగా రాఘవరెడ్డి, ఇనగాల వెంకట్రాంరెడ్డి, బెల్లయ్యనాయక్, అయిత ప్రకాశ్రెడ్డి, పోదెం వీరయ్య, ఎండీ రియాజ్తోపాటు కీలక నామినేటెడ్ బాధ్యతల్లో ఉన్న నాయకుల పదవీకాలం ఇటీవల ముగిసింది. వీరిలో ఎవరిని కొనసాగిస్తారు? ఎవరికి కొత్త బాధ్యతలు అప్పగిస్తారు? అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. -
నకిలీ బిల్లులు..జేబుల్లోకి నిధులు
జనగామ: కలెక్టరేట్ నిధుల్లో మరో భారీ ఆర్థిక అక్రమం వెలుగుచూసింది. గతంలో ‘దిక్సూచి’ పుస్తకాల వ్యవహారంలో రూ.46.50 లక్షల ప్రజాధనం దుర్వినియోగం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. ఇప్పుడు కలెక్టరేట్లోని ఖాతా నుంచి రూ.37,85,050 అపహరణ జరిగినట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఈ వ్యవహారంపై జనగామ పట్టణ పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత–2023తో పాటు ఐటీ చట్టం–2000లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి కలెక్టరేట్కు చెందిన ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసి శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. నకిలీ బిల్లులతో నిధుల మళ్లింపు జిల్లా యంత్రాంగం నిర్వహించిన అంతర్గత తనిఖీలు, భౌతిక తనిఖీ, రికార్డుల పరిశీలన కమిటీ ఈ నెల 15న సమర్పించిన నివేదికలో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ట్రెజరీ, పీఎఫ్ఎంఎస్ వ్యవస్థలకు వెలుపల ఒక ప్రైవేట్ బ్యాంకులో నిర్వహిస్తున్న కలెక్టరేట్ ఖాతా నుంచి అసలు సరఫరా జరగని ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర సామగ్రి కొనుగోలు చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించి, ఒకే వ్యక్తి నియంత్రణలో ఉన్న వేర్వేరు సంస్థల పేరిట 2026 ఫిబ్రవరిలో ఒకే రోజున మొత్తం రూ.37.85 లక్షలు బదిలీ చేసినట్లు గుర్తించారు. అనంతరం నిర్వహి ంచిన ఆకస్మిక భౌతిక తనిఖీలో చెల్లింపులకు సంబంధించిన ఒక్క వస్తువూ లభించకపోగా, ఎలాంటి కొనుగోలు రికార్డులు కూడా లేనట్లు అధికారులు నిర్ధారించారు. పరిపాలనా చర్యలు.. దర్యాప్తు ముమ్మరం ఈ ఘటనపై ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతోపాటు సీసీఏ నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు ప్రారంభించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ట్రెజరీ వెలుపల ఉన్న అన్ని ప్రభుత్వ ఖాతాలను మూసివేయడం లేదా ట్రెజరీ విధానంలోకి మార్చడం, బాధ్యతల మార్పు జరిగిన రోజే బ్యాంకు మాండేట్లు రద్దు చేసి కొత్త నమూనా సంతకాలు నమోదు చేయడం, నెలవారీ రీకన్సిలియేషన్ ధ్రువీకరణలను తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. మరిన్ని లావాదేవీలపై విచారణ ఇది ఒక్కటే ఘటన కాదని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. గతంలో పదో తరగతి విద్యార్థుల కోసం ‘దిక్సూచి’ పుస్తకాల పేరిట రూ.46.50 లక్షలు చెల్లించినప్పటికీ ఒక్క పుస్తకం కూడా జిల్లాకు సరఫరా కాలేదని గుర్తించి, ఆ వ్యవహారాన్ని ఇప్పటికే సంబంధిత దర్యాప్తు సంస్థకు అప్పగించారు. అదే ఖాతాలపై లోతైన పరిశీలనలో మరిన్ని అనుమానాస్పద చెల్లింపులు కూడా బయటపడినట్లు వెల్లడించారు. మొత్తంగా కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం బహుళ సంస్థల దర్యాప్తు పరిధిలో ఉందని పేర్కొన్నారు. దర్యాప్తు ప్ర యోజనాల దృష్ట్యా నిందితుల పేర్లు, ఇతర సాక్ష్యాధారాలను ప్రస్తుతం వెల్లడించడం లేదని, వ ్యక్తిగత బాధ్యత న్యాయ విచారణలో తేలుతుందని అధికారులు తెలిపారు. అలాగే ప్రజాధనంలో ప్రతి పైసా తిరిగి రాబట్టి, బాధ్యులు ఎవరైనా, ఏ స్థాయిలో ఉన్నా చట్టంముందు జవాబుదారీ కాక తప్పదని, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. కలెక్టరేట్లో రూ.37.85లక్షల అక్రమం ఫర్నిచర్, కంప్యూటర్ల పేరిట డ్రా కేసు నమోదు..ముగ్గురు కలెక్టరేట్ ఉద్యోగుల సస్పెన్షన్ దుర్వినియోగంపై కొనసాగుతున్న విచారణ బాధ్యులపై చట్టప్రకారం చర్యలు: జిల్లా యంత్రాంతం -
డేంజర్ ఫుడ్
సోమవారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2026జనగామ: జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాల తయారీ, పరిశుభ్రత లోపాలు, నాణ్యతలేని వంటకాల విక్రయంపై వినియోగదారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల ఫుడ్సేఫ్టీ, మున్సిపల్ శాఖలు పలువురు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ కేంద్రాలపై దాడులు నిర్వహించి భారీ జరిమానాలు విధిస్తున్నప్పటికీ పరిస్థితిలో ఆశించిన మార్పు కనిపించడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. నిరంతరం తనిఖీలు చేస్తేనే.. జిల్లా కేంద్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, జ్యూస్ పాయింట్లు, స్వీట్హౌస్లు, టిఫిన్ సెంటర్లు, నాన్న్వెజ్ కేంద్రాలు, చిన్న సమోసా తయారీ యూనిట్లు, స్నాక్స్ తయారీ కేంద్రాలు, వైన్న్స్ పర్మిట్ రూంలు, మీల్స్ హోటల్ విభాగాల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు ఎంత మేరకు పాటిస్తున్నారనే సందేహాలు వినియోగదారుల్లో పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెలుగుచూస్తున్న ఆందోళనకర అంశాల నేపథ్యంలో జిల్లాలో కూడా సమగ్ర తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలు పాటిస్తున్నారా? బేకరీల్లో బ్రెడ్, కేకులు, ఇతర ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించే నీటి నాణ్యత, తయారీ ప్రదేశాల పరిశుభ్రత, నిల్వ విధానాలపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాన్వెజ్ హోటళ్లలో మిగిలిపోయిన ఆహారాన్ని మరుసటి రోజు విక్రయిస్తున్నారా, ఒకే నూనెను పదేపదే ఉపయోగిస్తున్నారా, ప్రమాదకర కృత్రిమ రంగులను కలుపుతున్నారా అనే అంశాలపై కఠిన తనిఖీలు అవసరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఫాస్ట్ఫుడ్ సంగతేంటి.. ఫాస్ట్ఫుడ్ కేంద్రాల్లో ఉదయం తయారు చేసిన నూడుల్స్, ప్రైడ్ రైస్, మంచూరియా వంటి పదార్థాలను రోజంతా బహిరంగంగా ఉంచడం, దుమ్ము, కాలుష్యం నుంచి రక్షించే చర్యలు లేకపోవడం కూడా ఆరోగ్యానికి ముప్పుగా మారుతోందని అంటున్నారు. కేవలం జరిమానాలు విధించడం వరకు మాత్రమే పరిమితం కాకుండా, నిబంధనల అమలు, ఆహార నాణ్యత, పరిశుభ్రత, వినియోగదారుల ఆరోగ్య రక్షణపై ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ శాఖలు నిరంతర తనిఖీలు నిర్వహించి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అనుమతులపై ఆరా తీయాలి హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, టీ దుకాణాలు, గప్చుప్ బండ్లు, బేకరీలు తదితర ఆహార విక్రయ కేంద్రాలకు ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్తో పాటు ఇతర తప్పనిసరి అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై అధికారులు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. పట్టణంలోని పలు ఫాస్ట్ఫుడ్ కేంద్రాలు, టీ దుకాణాలు మురుగు కాలువలపైనే నిర్వహిస్తుండటంతో అక్కడి నుంచి వచ్చే దుర్వాసన ఆహార పదార్థాలపై ప్రభావం చూపుతోందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.శుచి, శుభ్రత ఉట్టిదేనా..! ఆహార తయారీలో వినియోగించే వంటనూనె, పిండి, మసాలాలు, కృత్రిమ రంగులు, నీటి నాణ్యతపై ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించాలని వినియోగదారులు కోరుతున్నారు. అనేక హోటళ్లలో వంటశాలలు, ప్లేట్లు శుభ్రం చేసే ప్రదేశాలు, చేతులు కడుక్కునే ప్రాంతాలు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. టీ గ్లాసులు, ప్లేట్లను రోజంతా అదే నీటితో కడుగుతున్న ఘటనలను గతంలో అధికారులు గుర్తించిన సందర్భాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కొన్ని హోటళ్లు, ఇతర వాటిలో ఉదయం నుంచి రాత్రి వరకు ఉన్న ప్లేట్లను ఒకేచోట వేయ డం.. రాత్రి శుభ్రం చేసే సమయంలో అప్పటికే ఎలుకలు, ఇతర క్రిమికీటకాలు వాటిపై తిరుగుతూ ప్రమాదాన్ని పెంచుతున్నాయని కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. నాణ్యత ఎక్కడ?.. పరిశుభ్రత ఏదీ? వాడుతున్న నూనె ఏదీ.. కలర్ల మాటేమిటి?... బేకరీల నుంచి బిర్యానీ వరకు ఆహార నాణ్యతపై అనుమానాలు! హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లపై నిఘా పెంచాలంటున్న వినియోగదారులు జరిమానాలే కాదు..నిబంధనలు తప్పనిసరి చేయాలని డిమాండ్ -
బాలికల డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
జనగామ రూరల్: మండలంలోని శామీర్పేట గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ జి.సంధ్యారాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22 నుంచి 24 వరకు ప్రవేశాలు ఉన్నాయని, ఎస్టీ విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనాథలకు, బీసీ, బీసీ–ఈ, ఓసీ, పీహెచ్సీ, ఎన్సీసీ స్పోర్ట్ కోటా కింద ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, లైఫ్సైన్స్, ఎంఎల్టీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన బాలికలు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. మరిన్ని వివరాల కోసం 8309754381, 7382524420 9963276391, 9347819166 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. నేటి గ్రీవెన్స్ రద్దు జనగామ రూరల్: ఈనెల 20వ తేదీన(సోమవారం) జరిగే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం హనుమకొండలో మంత్రుల సమావేశం ఉన్నందున గ్రీవెన్స్ను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ విషయం గమనించాలని కలెక్టరేట్కు రావొద్దని కోరారు. బయటవ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలిజనగామ రూరల్: లాడ్జీలకు వస్తున్న బయట వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచించారు. ఆదివారం సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్ఐ రతీష్, చెన్నకేశవులుతో కలిసి పట్టణంలోని లాడ్జీలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఆస్తినేరాలు, చైన్ స్నాచింగ్ ఘటనల దృష్ట్యా తనిఖీలు చేపట్టామన్నారు. లాడ్జీల నిర్వాహకులు వ్యక్తుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఘనంగా సౌరవృత్త తారావళి పుస్తకావిష్కరణ హన్మకొండ కల్చరల్: సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వరంగల్ ఆధ్వర్యంలో అజో విభో కంధాళం ఫౌండేషన్ అధ్యక్షుడు అప్పాజోస్యుల సత్యనారాయణ రచించిన సౌర వృత్త తారావళి, వ్యాఖ్య పుస్తకాల ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ మేరకు ఆదివారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని పీఆర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో సహృదయ సంస్థ అధ్యక్షులు గన్నమరాజు గిరిజామనోహరబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీ వేత్త, కవి విహారి, విశిష్ట అతిథులుగా తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి అనుమాండ్ల భూమయ్య, రచయిత, వ్యాఖ్యాత ఆచార్య తాడేపల్లి పతంజలి, సాహితీవేత్త డాక్టర్ దహగం సాంబమూర్తి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేంద్ర సాహితీ అవార్డు గ్రహిత డాక్టర్ అంపశయ్య నవీన్, కవి రామచంద్రమౌళి, వీఆర్.విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాసరావు, వనం లక్ష్మీకాంతారావు, మల్యాల మనోహరరావు, కళా రాజేశ్వర్, డాక్టర్ టి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. బోడ కాకర @400 జనగామ : మార్కెట్లో బోడ కాకరకాయ ధర రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం కిలో బోడ కాకర రూ.400 వరకు పలుకుతుండటంతో వినియోగదారులు కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు. వర్షాల ప్రభావంతో దిగుబడి తగ్గడం, మార్కెట్కు సరఫరా లేకపోవడం వల్ల ధరలు ఒక్కసారిగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ధరలు తగ్గాలంటే సరఫరా పెరగాల్సి ఉందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. -
కూలిన ప్రహరీ..తప్పిన ప్రమాదం
జనగామ: పట్టణంలోని 21వ వార్డు పరిధిలోని కురుమవాడలో ఆదివారం జరిగిన ప్రహరీ కూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. డీసీపీ కార్యాలయం వెనుక భాగంలో నూతన భవన నిర్మాణ పనులు జరుగుతుండగా, నిర్మాణానికి అవసరమైన ఇసుకను ప్రహరీకి ఆనుకొని ఇసుక డంప్ చేశారు. అనంతరం పొక్లెయినర్తో ఇసుకను తొలగించే సమయంలో గోడపై అధిక ఒత్తిడి పడడంతో సిమెంట్, ఇటుకలతో నిర్మించిన ప్రహరీ ఒక్కసారిగా కురుమవాడ గల్లీ వైపు కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడ పార్క్ చేసిన రెండు కార్లు పూర్తిగా దెబ్బతినగా, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక సైకిల్ కూడా ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే తీవ్ర ప్రాణనష్టం సంభవించే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రహరీ కొంతకాలంగా ప్రమాదకర స్థితిలోనే ఉందని, దీనిపై పలుమార్లు అధికారులకు సమాచారం ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. నిర్మాణ పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకుండా, ఇసుకను గోడకు డంప్ చేసి జేసీబీతో నిర్లక్ష్యంగా పనులు చేయడమే ప్రమాదానికి కారణమని మండిపడ్డారు. ప్రమాద ఘటన అనంతరం స్థానిక కౌన్సిలర్ మామిడాల రజితరాజుతో కలిసి కాలనీవాసులు డీసీపీ రాజమహేంద్ర నాయక్ను కలిసి జరిగిన ప్రమాదంపై ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, నష్టపోయిన వాహనాల యజమానులకు తగిన నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. నిర్మాణపనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం రెండు కార్లు, మూడు ద్విచక్ర వాహనాలు ధ్వంసం -
బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి
స్టేషన్ఘన్పూర్: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరుతో రాష్ట్రంలో భారీగా ఓట్లను తొలగించే ఉద్దేశ్యంతో ఉందని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కలిసి బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆరోపించారు. పట్టణ కేంద్రంలో ఓటరు జాబితా సవరణ(ఎస్ఐఆర్)పై నియోజకవర్గ ఎస్ఐఆర్ క్లస్టర్ ఇన్చార్జ్లు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు, సర్పంచ్లతో ఆదివారం ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడారు.. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతగా నిర్వహించాలని, అర్హులైన ఒక్క ఓటు కూడా పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఓటరు జాబితా సవరణలో ఘన్పూర్ నియోజకవర్గం రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలువాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఈనెల 25న మరోసారి నియోజకవర్గ స్థాయి సమావేశం ఉంటుందని, ప్రతీ బూత్లో 95 శాతం ఎన్యుమరేషన్ పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్నాయక్, ఏఐసీసీ పరిశీలకులు అహ్మద్ నాసిర్, టీపీసీసీ నియోజకవర్గ పరిశీలకులు దుద్దిళ్ల శ్రీనుబాబు, మాస్టర్ ట్రైనర్ రాజశేఖర్రెడ్డి, హనుమకొండ, జనగామ డీసీసీ అధ్యక్షులు వెంకట్రాంరెడ్డి, ధన్వంతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుడోజు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్య, పార్టీ మండల, ఘన్పూర్ పట్టణ అధ్యక్షులు శిరీష్రెడ్డి, కిషన్రాజ్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య -
విరోధిని, వహ్నివాసిని క్రమాల్లో అమ్మవారు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శాకంబరీ నవరాత్ర మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు ఆదివారం అమ్మవారిని విరోధిని, వహ్నివాసినిగా అలంకరించి పూజలు చేశారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్ననివేదన, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం కాళీ క్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని విరోధిని క్రమంలో, షోడశీ క్రమాన్ని అనుసరించి బోగభేరాన్ని వహ్నివాసిని క్రమంలో అలంకరించి విశేష పూజలు చేశారు. మహిళలు హాజరై అమ్మవారికి చీర, సారె సమర్పించారు. సెలవు దినం కావడంతో అధికసంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ రామల సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ప్రశాంతంగా అవుట్సోర్సింగ్ పోస్టుల పరీక్ష
జనగామ రూరల్: జిల్లాలోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శాఖ యూనిట్లలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో అవుట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేసేందుకు నిర్వహించిన అర్హత రాత పరీక్షలు ప్రశాంతంగా పారదర్శకంగా జరిగాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లో జరిగిన పరీక్ష నిర్వహణ తీరును అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యూనిట్ 1,2 విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్ట్ల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిపై భర్తీ చేసేందుకు, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. కాగా, వివిధ విభాగాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, చైన్న్మెన్, స్వీపర్, ఆఫీసు సబార్డినేట్ పోస్టులకు మొత్తం 615 మంది అభ్యర్థులు దరఖాస్తులు స్వీకరించగా, 446 మంది అభ్యర్థుల పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష నిర్వహణలో జిల్లా ఉపాధి కల్పన అధికారి కుమారస్వామి, జీసీడీఓ గౌసియాబేగం, విద్యాశాఖల సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
డెంటల్ విభాగంలో ఒకే డాక్టర్!
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని డెంటల్ (దంత వైద్య) విభాగం నామమాత్రంగా నడుస్తోంది. ఇందులో ఒకే వైద్యురాలు అరకొర వసతుల మధ్య వైద్య సేవలు అందిస్తున్నారు. క్లినికల్ వైపు నుంచి ఓ డెంటల్ హైజినిస్టు ఓపీ పేషంట్లకు వైద్య చికిత్స చేస్తున్నారు. అయితే, వైద్య నిపుణుల కొరతతో రోగులకు సరైన సేవలు అందడం లేదని విమర్శలు వస్తున్నాయి. గతంలో ఆరోగ్యశ్రీ కింద ఇద్దరు వైద్యులుండగా వీరిని తొలగించి ఇంటర్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్యూలకు నలుగురు వైద్యులు హాజరు కాగా.. ఇద్దరు వైద్యులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఏడాది దాటినా కూడా ఆ ఇద్దరు వైద్యుల నియామకం ఎంతవరకు వచ్చిందో తెలియదు. అలాగే, మరో గవర్నమెంట్ ఔట్సోర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ను సైతం టర్మినేషన్ చేశారు. ముఖ్యంగా డెంటల్ డిపార్ట్మెంట్కు హెచ్ఓడీగా ఉన్న ప్రొఫెసర్ సైతం నర్సంపేటకు బదిలీ అయ్యారు. దీంతో ఈ విభాగం నుంచి నలుగురు వెళ్లినా ఏ ఒక్కరు కూడా రాకపోవడంతో ఇద్దరిపై భారం పడుతోంది. ● ఎంజీఎం ఆస్పత్రిలో పరికరాలు ఉన్నా వేధిస్తున్న సిబ్బంది కొరత ● రోగులకు అరకొరగా వైద్యసేవలు -
ఆదివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2026
మామునూరు ఎయిర్పోర్ట్ నమూనా (ఏఐ చిత్రం)సాక్షి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మామునూరు విమానాశ్రయం కల సాకారం దిశగా కీలక అడుగు పడింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సుమారు రూ.203.49 కోట్లతో విమానాశ్రయ అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచింది. రన్వే ఆధునీకరణ నుంచి టెర్మినల్కు అనుసంధాన రహదారులు, విమానాల పార్కింగ్ అప్రాన్, ట్యాక్సీ వేలు, గ్రౌండ్ సపోర్ట్ సదుపాయాల వరకు అన్ని పనులను 15 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ కూడా విడుదల చేసింది. ఈ ప్లాన్ ప్రకారం విమానాశ్రయానికి ప్రధాన ఎంట్రీ, ఎగ్జిట్ను వరంగల్–సూర్యాపేట జాతీయ రహదారి (ఎన్హెచ్–563) వైపు ప్రతిపాదించారు. అక్కడి నుంచి ప్రత్యేక యాక్సెస్ రోడ్డు ద్వారా టెర్మినల్ భవనానికి చేరుకునేలా డిజైన్ రూపొందించారు. టెర్మినల్ ఎదుట ఒకేసారి మూడు విమానాలు నిలిపే అప్రాన్, లింక్ ట్యాక్సీవే, గ్రౌండ్ సపోర్ట్ ఎక్విప్మెంట్ (జీఎస్ఈ) ప్రాంతం, పెరిమీటర్ రోడ్లు, అత్యవసర యాక్సెస్ రోడ్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. 1930లోనే నిజాం హయాంలోనే మామూనూరు ఎయిర్పోర్టు ఉండగా వివిధ కారణాలతో 1980లో మూతపడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 7న ఫైనాన్షియల్ బిడ్... ఈ నెల 23న (గురువారం)ప్రీ–బిడ్ సమావేశాన్ని మామునూరు విమానాశ్రయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినట్టు టెండర్ నోట్లో పేర్కొన్నారు. జూలై 29 నుంచి ఆగస్టు 12 వరకూ బిడ్ దాఖలకు అవకాశం కల్పించారు. ఆగస్టు 18న బిడ్ ఓపెన్ చేయనున్నారు. సెప్టెంబరు 7న ఫైనాన్షియల్ బిడ్ను తెరవనున్నట్టు టెండర్ నోట్లో పొందుపరిచారు. మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్హాల్, ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ సహా మరికొన్ని నిర్మాణాలకు త్వరలో మరో టెండర్ను పిలిచేందుకు ఏఏఐ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. కాకతీయ వైభవం ఉట్టిపడేలా... తెలంగాణకు చారిత్రక వారసత్వంగా నిలిచిన కాకతీయుల కళా సంపదను ప్రతిబింబించేలా మూమునూరు విమానాశ్రయ టెర్మినల్ భవ నం, ప్రవేశ ద్వారాలు, అంతర్గత అలంకరణలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, అందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది టెర్మినల్ ముఖద్వారంలో కాకతీయ కళాతోరణం శైలిని ప్రతిబింబించే నమూనాలు, లోపలి గోడలపై కాకతీయుల చరిత్రను తెలియజేసే చిత్రాలు, శిల్పాల ప్రతిరూపాలు, తెలంగాణ జానపద సంస్కృతిని చాటిచెప్పే అలంకరణలు ఉండేలా ప్రణాళిక రూపొందించే అవకాశ ముంది. దీంతో వరంగల్కు వచ్చే దేశీయ, విదేశీ ప్రయాణికులకు విమానాశ్రయంలోనే కాకతీయుల గొప్పతనం పరిచయం కానుంది. 2,800 మీటర్ల పొడవు, 75 మీటర్ల వెడల్పు గల రన్వే నిర్మాణంతో ఎయిర్బస్–320 వంటి పెద్ద ప్రయాణికుల విమానాలు, భారీ కార్గో విమానాలు కూడా దిగే అవకాశం ఉంటుంది. భవిష్యత్లో అంతర్జాతీయ విమానాశ్రయంగా విస్తరించే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని 949.44 ఎకరాల్లో ప్రణాళిక సిద్ధం చేశారు. వెడల్పు : 75 మీటర్లు అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచిన ఏఏఐ టెర్మినల్ ఎదుట ఒకేసారి మూడు విమానాలు నిలిపే అప్రాన్ కాకతీయ కళా వైభవం చాటేలా నిర్మాణాలు ఉండే అవకాశం 2028లో విమానాలు టేకాఫ్ అయ్యేలా కార్యాచరణ ఇక్కడి వ్యాపారవేత్తలు హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు ఒకే రోజులో వెళ్లి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో వ్యాపార సమావేశాలు, పెట్టుబడులు, స్టార్టప్లు, కార్పొరేట్ కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయి. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ రంగాలకు వేగవంతమైన రవాణా అందుబాటులోకి వస్తుంది. దేశీయ, విదేశీ కంపెనీలు వరంగల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది. వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాలకు త్వరగా తరలించొచ్చు. దీంతో రైతులకు మెరుగైన మార్కెట్లు లభించడంతోపాటు ఎగుమతులకు కూడా మార్గం సుగమం అవుతుంది. రామప్ప ఆలయం, వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, భద్రకాళి ఆలయానికి పర్యాటకుల రాక పెరుగుతుంది. ఎయిర్ అంబులెన్స్, అవయవ మార్పిడి, విపత్తుల సమయంలో సహాయక చర్యలు వేగంగా చేపట్టవచ్చు. రియాల్టీ రంగానికి కూడా రెక్కలు రానున్నాయి. మామునూరు విమానాశ్రయనిర్మాణం నుంచి నిర్వహణ వరకు ప్రత్యక్ష, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. నగరం దేశంలోని ప్రధాన నగరాలతో నేరుగా అనుసంధానమవుతుంది. దీంతో జాతీయస్థాయిలో గుర్తింపు వస్తుంది.రన్వే పొడవు : 2,800 మీటర్లు -
ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇంటినంబర్లు కేటాయించాలి
● సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి జనగామ రూరల్: పట్టణంలో మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లకు ఇంటి నంబర్లు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులతో కలిసి సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ ఆధ్వర్యంలో కలె క్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించా రు. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ 2012–13 సంవత్సరంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 1,146 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి స్థలం చూపించకపోవడంతో సీపీఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిలో గుడిసెలు నిర్మించుకుంటే ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేస్తుందన్నారు. అధికారులు కూడా రీసర్వే పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. మున్సిపల్ ద్వారా ఇంటినంబర్ కేటాయించాలని విన్నవించినా ఫలితం లేదన్నారు. కాగా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులకు లబ్ధిదారులకు మధ్య తోపులాట జరిగింది. అలాగే ఏసీపీ భీమ్ శర్మ పోలీస్స్టేషన్లో నాయకులపై అమర్యాదగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఏసీపీపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొట్ల శేఖర్, సుంచు విజేందర్, మిట్యా నాయక్, కౌన్సిలర్ బూడిద జ్యోతి, కల్యాణ లింగం, పగిడిపల్లి బాలమణి, బూడిద ప్రశాంత్, బొట్ల శ్రావణ్, పాము శ్రీకాంత్, అండాలు నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
మూడు దశల ప్రణాళిక
జనగామ: ఈ వానాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో రైతులు ఆందోళన చెందకుండా శాసీ్త్రయ పద్ధతులతో సాగు కొనసాగించేలా జిల్లా యంత్రాంగం సమగ్ర సమాచార ప్రసార కార్యాచరణ (మూడు దశల) ప్రణాళికను విడుదల చేసింది. కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ ప్రణాళికలో వర్షపాతం లోటు, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఎరువులు, విత్తనాల లభ్యత, క్షేత్రస్థాయి ప్రచారంపై కలెక్టర్ సందీప్కుమార్ ఝా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. వర్షాభావ లోటును ఎదుర్కొనేలా.. జూలై 8 నాటికి జిల్లాలో సాధారణంగా 177.45 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 141.92 మిల్లీ మీటర్లు మాత్రమే కురవడంతో 20 శాతం లోటు నమోదైంది. 12 మండలాల్లో ఏడు మండలాలు వర్షాభావ పరిస్థితిని ఎదుర్కొనే విధంగా ప్రణాళిక రూపొందించారు. ముఖ్యంగా రఘునాథపల్లి, లింగాలఘణపురం, పాలకుర్తి, బచ్చన్నపేట, చిల్పూరు మండలాల్లో వర్షపాతం లోటు అధికంగా ఉంది. గతేడాది ఇదే సమయానికి 2.27 లక్షల ఎకరాల్లో సాగు జరగగా, ఈ ఏడాది 1.55 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు నమోదైంది. వరి సాగు కొంత వెనుకబడినా పత్తి సాగు సంతృప్తికరంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. జూలై 15, 30, ఆగస్టు 15 తేదీలు.. వర్షాలు మరింత ఆలస్యమైతే గ్రామాల వారీగా మూడు దశల్లో ప్రత్యామ్నాయ సాగు ప్రణాళిక అమలు చేయనున్నట్లు వెల్లడించారు. జూలై 15, జూలై 30, ఆగస్టు 15 తేదీలను లక్ష్యంగా పెట్టుకుని కంది, పెసర, మినుము, మొక్కజొన్న, జొన్న, సజ్జ వంటి స్వల్పకాలిక పంటల సాగును ప్రోత్సహించనున్నారు. అవసరమైన విత్తనాలు రైతు భరోసా కేంద్రాలు, మహిళా శక్తి రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ శాఖ ద్వారా అందుబాటులో ఉంచారు. ఎరువులు అదనపు నిల్వలు జిల్లాలో ఎరువుల కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. 329 ఎరువుల విక్రయ కేంద్రాల్లో అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉండగా, మార్క్ఫెడ్ ద్వారా అదనపు నిల్వలు సిద్ధంగా ఉంచారు. జిల్లా స్థాయిలో 2,700 మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ నిల్వ ఏర్పాటు చేయడంతో పాటు యూరియా బుకింగ్ యాప్లో సుమారు 45,900 సంచులు బుకింగ్కు సిద్ధంగా ఉంచినట్లు స్పష్టం చేశారు. ఊరూరా ప్రచారం రైతువేదికలు, గ్రామ సభలు, రైతు భరోసా కేంద్రాలు, వాట్సాప్ గ్రూపులు, ఎస్ఎంఎస్, స్థానిక టీవీలు, పత్రికలు, ఎఫ్ఎం రేడియో, సోషల్ మీడియా వంటి వేదికల ద్వారా విస్త్రృత ప్రచారం చేపట్టాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఎరువులు, విత్తనాల కల్తీపై జిల్లా వ్యవసాయ కంట్రోల్ రూమ్ 8977745512కు రైతులు తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చని ఆయన పేర్కొన్నారు. వర్షపాతం మి.మీ.జిల్లాలో వర్షపాతం వివరాలుజిల్లాలో సాగు వివరాలు177.45 మి.మీ.141.92 మి.మీ.2.27 లక్షల ఎకరాలు 1.55 లక్షల ఎకరాలు 20 శాతంసాగు విస్తీర్ణం తగ్గుదలగతేడాది సాగు (ఇప్పటి వరకు)నమోదైన వర్షపాతంఈ ఏడాది సాగు (ఇప్పటి వరకు)వాన తక్కువైనా.. వ్యవసాయానికి భరోసా కరువు కాదు.. అప్రమత్తత అవసరం వర్షపాత లోటు ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధం కలెక్టర్ ఆదేశాలు.. ఊరూరా ప్రచారం -
చిన జీయర్ స్వామికి ఘన స్వాగతం
జనగామ: జిల్లా కేంద్రంలోని బాణాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కా ర్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరు కానున్న చిన జీయర్ స్వామికి పట్టణంలో శనివారం భక్తులు ఘ న స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ జీపులో శోభా యాత్రగా జనగామ చౌరస్తా నుంచి నెహ్రూపార్కు, ఆర్అండ్బీ అతిథి గృహం మీదుగా బాణాపురం వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకోగా భక్తులు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. జూలై 23 వరకు స్వామి వారి పర్యవేక్షణలో మహా సుదర్శనయాగం, ప్రత్యే క పూజలు, వివిధ వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయ అర్చకులు, మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, వైటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు డాక్టర్ లక్ష్మి నా రాయణనాయక్, వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, వి కాస్ తరంగిణి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
కురుకుల్లా, భేరుండా క్రమాల్లో భద్రకాళి
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రి మహోత్సవాలు శనివారం నాలుగో రోజుకు చేరాయి. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్ననివేదన, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని కురుకుల్లాక్రమంలో, షోడశీక్రమాన్ని అనుసరించి బోగభేరాన్ని భేరుండా క్రమంలో అలంకరించి నవరాత్ర విశేషపూజలు నిర్వహించారు. సాయంత్రం కార్మిక, ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్ అమ్మవారిని దర్శించుకున్నారు. కురుకుల్లా ,భేరుండా క్రమంలో అమ్మవారు -
నిబంధనలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో ఈఏడాది (2026–27) నుంచి అమలు చేస్తున్న ప్రీప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీ కోసం శనివారం కలెక్టరేట్ సమావేశం హాలులో పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో ప్రభుత్వం 39 ప్రీప్రైమరీ స్కూల్స్ మంజూరీ చేయగా, రాతపరీక్ష ద్వారా అర్హులైన టీచర్లు, ఆయాలను ఎంపిక చేయనున్నారు. ఇన్స్ట్రక్టర్ పోస్టులకు హ్యాబిటేషన్ (స్థానిక) పరిధిలోని అభ్యర్థుల నుంచి మొత్తం 269 దరఖాస్తులు అందగా, వారిలో 254 మంది పరీక్షకు హాజరు కాగా 15 మంది గైర్హారయ్యారు. ఆయా పోస్టులకు 152 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 139 మంది హాజరుకాగా 13 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియాబేగం, ఏసీజీఈ, డీసీఈబీ సెక్రటరీ, కేజీబీవీల అకౌంటెంట్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశారు. ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి జనగామ రూరల్: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులతో వర్షాభావ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యవసాయ ప్రణాళికలు, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వీసీలో పాల్గొన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. శాఖల వారీగా అధికారులు సమగ్ర నివేదికలతో సిద్ధంగా ఉండాలన్నారు. రాజీపడితేనే కేసుల పరిష్కారం ● సీనియర్ సివిల్ జడ్జి శంకర్ శ్రీదేవి జనగామ రూరల్: కక్షిదారులు రాజీ పడితేనే కేసులు పరిష్కారం అవుతాయని సీనియర్ సివిల్ జడ్జి శంకర్ శ్రీదేవి అన్నారు. శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఆదేశాల మేరకు ప్రత్యేక ఎన్ఐ యాక్ట్ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా సివిల్ జడ్జి మాట్లాడుతూ చెక్ బౌనన్స్ కేసులో కోర్టు నుంచి శిక్ష పడకుండా ఉండాలంటే ఇరు పక్షాల వారు రాజీ పడుతూ కేసులను పరిష్కరించుకోవాలన్నారు. స్పెషల్ లోక్ అదాలత్లో చెక్బౌన్స్లో 5 పరిష్కరించగా దీనికి గాను రూ.27.25లక్షలు వసూలు అయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి శశి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె సందీప, బండ దయాకర్ రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు. కోర్టు నిర్మాణ పనుల పరిశీలన పట్టణంలోని చంపక్హిల్స్లో ఏర్పాటు చేయనున్న కోర్టు నిర్మాణ పనులను సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి శంకర్ శనివారం పరిశీలించారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
అధికారం కోల్పోయిన అక్కసుతోనే ఆరోపణలు
లింగాలఘణపురం: అధికారం కోల్పోయిన అక్కసుతోనే ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. శుక్రవారం మండలంలోని సిరిపురంలో సీసీ రోడ్డు, ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఒకవైపు ఎల్నినో ప్రభావంతో నదులు, రిజర్వాయర్లలో నీళ్లు లేవని, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలో గోదావరిలో నీళ్లు ఎత్తిపోసి రైతులకు సాగునీరు ఇవ్వాలని అసత్యపు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. సమావేశంలో తహసీల్దార్ అండాలు, సర్పంచ్లు ఎడ్లలావణ్యరాజు, మల్లారెడ్డి, సంపత్, విష్ణు, బుచ్చయ్య, సదానందం, రాజు, పీఏసీఎస్ చైర్మన్లు ఉపేందర్, శ్రీశైలం, మార్కెట్ వైస్ చైర్మన్ శివకుమార్, డైరెక్టర్లు శ్రీలతారెడ్డి, మోహన్, సిరిపురంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయ్మనోహర్, జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వరినారు ముదిరిపోయింది
వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాం. నాకున్న ఎకరంతో పాటు మూడు ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న. రెండు నెలల క్రితం పోసిన వరి నారు ముదిరిపోయింది. ఈ సీజన్లో మోస్తరు వర్షం కూడా లేక, దుక్కుల నుంచి కిందికి నీళ్లు జార లేదు. వర్షాలు లేక బోరు, బావిలో నీళ్లు ఇంకిపోయాయి. పంటల దిగుబడి రాకపోయినా కౌలుకు డబ్బులు ఇవ్వాల్సిందే. ఎలా బతకాలో అర్థం కావడం లేదు. –దొరగొల్ల కొండయ్య, రైతు, ఇబ్రహీంపూర్, రఘునాథపల్లి ఎకరమే పారుతోంది.. ఆరు ఎకరాల పొలంలో వరి కోసం నాలుగు ఎకరాలు సిద్ధం చేశాం. పెట్టుబడి కోసం రూ.లక్ష ఖర్చు చేశాం. సాగునీరుతో ఎకరం కూడా పారడం లేదు. మిగతా పంట ఎండి పోయేదశలో ఉంది. దేవాదుల ద్వారా సాగునీరు లేకపోవడం, వర్షాభావ పరిస్థితులతో బోర్లు వట్టిపోతున్నాయి. –భూస భాగ్యమ్మ, మహిళా రైతు, గోపిరాజుపల్లి, జనగామ మండలం -
ఏనెబావిలో ‘పాల’ఊట!
లింగాలఘణపురం: ఏనెబావి అంటేనే ఒకప్పుడు సేంద్రియ వ్యవసాయానికి మారుపేరుగా ఉండేది. కాలక్రమంలో ఆ వ్యవసాయ విధానాన్ని వదిలి నేడు పాడి పరిశ్రమకు నిలయంగా మారింది. మండలంలోని పిట్టలోనిగూడెం గ్రామ పంచాయతీ శివారు గ్రామమైన ఏనెబావిలో 45 కుటుంబాలు ఉండగా, సుమారు 200లకు పైగా ఆవులు ఉన్నాయి. వీటితో నేడు రోజుకు 600 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రతి ఇంటికీ ఐదు నుంచి ఆరు పాడి ఆవులు ఉంటాయి. ప్రతీ రైతు పొలం వద్ద తప్పకుండా నేపియర్ గడ్డి ఉంటుంది. ఉదయం, సాయంత్రం పాలను పితికి కొంతమంది ప్రైవేట్ డెయిరీకి పోయగా మరికొంత మంది విజయ డెయిరీకి పోస్తున్నారు. గ్రామంలో కరుణాకర్ అనే రైతు మొదట రెండు పాడి ఆవులను జెర్సీ, హెచ్ఎఫ్ రకాలను కొనుగోలు చేశాడు. దీంతో అతడి ఆదాయం, నిర్వహణ చూసిన గ్రామస్తులు ఒక్కొక్కరు పాడి ఆవులను కొనుగోలు చేసుకోవడం, పాలను ఉత్పత్తిని పెంచడం మొదలుపెట్టారు. ఇలా గ్రామంలో పాడిపరిశ్రమ వారికి పెద్ద ఉపాధిగా మారింది. గ్రామంలో ఇంటింటికీ ఐదారు పాడి ఆవులు.. పాడిపరిశ్రమే గ్రామస్తుల ప్రధాన ఉపాధి 45 కుటుంబాలు.. రోజుకు 600లీటర్ల పాల ఉత్పత్తిరోజుకు 30 లీటర్ల పాలు పోస్తా..రోజుకు 30 లీటర్ల పాలు పోస్తా.. నాకు పది ఆవులు ఉన్నాయి. అందులో కొన్ని ప్రస్తుతం పాలు ఇస్తున్నాయి. మరికొన్ని సూడికి ఉన్నాయి. పాడితో ఉపాధి మంచిగానే ఉంది. దాణా ఖర్చులు బాగా పెరిగాయి. పాల రేటును పెంచితే మరింత బాగుంటుంది. –పొన్నాల శ్రీనివాస్, పాడి రైతు -
కూరగాయల సాగు బాగుంది!
● రైతు శ్రీనివాస్ను అభినందించిన కలెక్టర్లింగాలఘణపురం: ‘కూరగాయల సాగు చాలా బాగుంది..మార్కెటింగ్ ఎలా చేస్తున్నావు..ఎంత లాభం వస్తుంది..’ అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మండలంలోని కళ్లెం గ్రామంలో కూరగాయలు పండిస్తున్న రైతు నకీర్త శ్రీనివాస్ను అభినందించారు. శుక్రవారం శ్రీనివాస్ పండిస్తున్న కూరగాయల పంట క్షేత్రాన్ని డీఏఓ, ఇన్చార్జ్ జిల్లా హార్టికల్చర్ అధికారి అంబికాసోనీతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సోరకాయ, బీరకాయ, కీరదోస, చిక్కుడు కాయగూరల సాగును కలెక్టర్ పరిశీలించారు. సేంద్రియ వ్యవసాయం చేస్తున్నావా..? ఎరువులు వాడుతున్నావా అని ప్రశ్నించగా రెండు కలిపి చేస్తున్నానని, మార్కెటింగ్లో ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించడంతో ఆశించిన లాభాలు రావడంలేదని రైతు చెప్పారు. కాగా, వరి సాగుతో పోల్చితే కూరగాయలు, ఇతర ఆరుతడి పంటలకు నీటి వినియోగంలో ఉన్న వ్యత్యాసాలను నివేదిక సిద్ధం చేయాలని డీఏఓ, ఇతర అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే రైతు శ్రీనివాస్ సాగు విధానంపై కేస్ స్టడీ తయారు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఏఓ నజీరుద్ధీన్, సర్పంచ్ శోభచంద్రమౌళి, ఏఈఓ ప్రత్యూష, రైతులు ఉన్నారు. -
పార్టీని మరింత బలోపేతం చేయాలి
● ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి ● కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభంజనగామ రూరల్: ప్రభుత్వం అమలు చేస్తున్న్ద అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేయాలని, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సమన్వయంతో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మినారాయణ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని కలెక్టరేట్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు లక్ష్మీనారాయణ నాయక్ హాజరయ్యారు. ఈసందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ..పార్టీ కార్యకలాపాలకు జిల్లా కార్యాలయం కేంద్రబిందువుగా నిలుస్తుందన్నారు. ప్రతీ ఒక్కరూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి, కౌన్సిలర్లు, రాష్ట్ర కమిటీ నాయకులు, మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వారాహిగా భద్రకాళి అమ్మవారు
● కుల్లా, నిత్యక్లిన్నా క్రమాల్లో పూజలు హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం అమ్మవారికి కుల్లా క్రమంలో, నిత్యక్లిన్నా క్రమంలో పూజలు జరిపి వారాహి అమ్మవారుగా అలంకరించారు. శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ఉదయం నుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, చతుఃస్థానార్చన, అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరానికి కుల్లా క్రమంలో పూజలు నిర్వహించి వారాహి అమ్మవారుగా అలంకరించారు. షోఢశీక్రమాన్ని అనుసరించి స్నపన మందిరంలోని బోగభేరాన్ని నిత్యక్లిన్నాగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ రాముల సునీత, సిబ్బంది పర్యవేక్షించారు. చిల్పూరు ఆలయానికి రెండు అర్చక పోస్టులు చిల్పూరు: చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి దేవాలయానికి రెండు అర్చక పోస్టులు మంజూరు కాగా శుక్రవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో దేవాదాయ ముఖ్యకార్యదర్శి శైలజారామయ్యర్, కమిషనర్ హనుమంతరావు చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. సముద్రాల కృష్ణమాచార్యులు (అర్చక పాంచరాత్ర ఆగమం), చెరువు ఆదిత్య (అర్చక వేదిక స్మార్త ఆగమం) ఇద్దరు అర్చకులు ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న ఆధ్వర్యంలో అందుకున్నారు. నియామకమైన అర్చకులకు చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు శుభాకాంక్షలు తెలిపారు. సమన్వయంతోనే గ్రామీణాభివృద్ధి రఘునాథపల్లి: ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రైతులు సమన్వయంతో పనిచేస్తే గ్రామీణాభివృద్ధి మరింత వేగవంతమవుతుందని నాబార్డ్ జిల్లా అభివృద్ధి మేనేజర్ పసుల విజయ్కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నాబార్డు 45వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురష్కరించుకొని మహిళా సంఘాలు, రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళా సంఘాల సభ్యులకు ఆర్థిక నిర్వహణ, పొదుపు, బ్యాంకు రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు, ఉపాధి యూనిట్ల స్థాపనపై అవగాహన కల్పించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డీపీఎం భవాని, పశు సంవర్ధక శాఖ అధికారి మురళీధర్రావు, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణమూర్తి, సర్పంచ్ బొల్లం ఉమారాణి, ఏఓ కరుణాకర్, విజయ డెయిరీ డీడీ గోపాల్సింగ్, బ్యాంకు మేనేజర్లు సంతోష్, సతీష్, నంద కిశోర్, మారి సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎంజీఎం సూపరింటెండెంట్గా రాంకుమార్రెడ్డి కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ కాటం రాంకుమార్రెడ్డిని నియమిస్తూ శుక్రవారం కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఉత్తర్వులు జారీ చేశారు. ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెంటెండ్గా డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి హైదరాబాద్కు బదిలీ అయిన తర్వాత కొత్త సూపరింటెండెంట్ కోసం అందరూ ఎదురుచూశారు. పలువురు సీనియర్ వైద్యుల పేర్లు కూడా పరిగణనలోకి వచ్చాయి. దాదాపు 45 రోజుల నుంచి ఆస్పత్రిలో నెలకొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ సత్యశారద.. డాక్టర్ రాంకుమార్రెడ్డి సూపరింటెండెంట్గా (ఎఫ్ఏసీ) అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. స్పోర్ట్స్ హాస్టల్లో ప్రవేశాలకు ఎంపికలు వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న క్రీడా అకాడమీలు, ప్రాంతీయ క్రీడా వసతి గృహాల్లో (2026–27) విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఎంపిక ప్రక్రియ చేపడుతున్నట్లు హనుమకొండ డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 97046 69637 మొబైల్ నంబర్లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
అడుగంటుతున్న ఆశలు
వానల కోసం వేయికళ్లతో అన్నదాతల ఎదురుచూపుమూడు బోర్లు వేసినా చుక్కనీరు రాలేదు జఫర్గడ్ మండలం రేగడి తండా గ్రామ శివారు టీబీ తండాకు చెందిన రైతు భూక్య రవీందర్ తనకు ఉన్న నాలుగు ఎకరాల్లో 3 ఎకరాల్లో పత్తి, మరో ఎకరంలో వరి సాగు కోసం నారు సిద్ధం చేసి ఉంచాడు. పెట్టుబడులకు రూ.35వేల వరకు ఖర్చు చేశాడు. వర్షాలు లేకపోవడం, ఉన్న ఒక్క బోరు ఒట్టిపోవడంతో పంటల కోసం రూ.2.50లక్షలు ఖర్చు చేసి 5వందల ఫీట్లకు పైగా మూడు బోర్లు వేసినా చుక్క నీరు రాలేదు. జనగామ మండలం గోపిరాజుపల్లిలో బీళ్లుబారిన పొలంలో వరణుడి కోసం ఎదురు చూస్తున్న మహిళా రైతుకౌలు రైతు కష్టాలు తరిగొప్పుల మండలం మరియపురానికి చెందిన కౌలు రైతు రాజబోయిన చిన్ను పత్తి చేనులో గుంటుక తోలుతూ అక్కడక్కడ మొలిసిన పత్తి మొక్కలను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎకరాకు రూ.18 వేల చొప్పున కౌలు చెల్లిస్తూ వ్యవసాయం చేస్తున్నాడు. అడపాదడపా కురిసిన వర్షాలకు తోడు చెరువుకుంటల్లో కొద్దిపాటి నీటి నిల్వలు ఉండడంతో రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాడు.జిల్లాలో పంటల సాగు అంచనా (ఎకరాల్లో)పంట అంచనా ప్రస్తుత సాగు వరి 95,653 68,000 పత్తి 1,38,000 92,500 కందులు 2,305 2,500 మొక్కజొన్న 8,000 3,100 పెసర్లు 562 350 ఇతర పంటలు 1,180 2,090 2,15,700 1,68,540జనగామ: కరువు కబంధ హస్తాల్లో వ్యవసాయం కొట్టుమిట్టాడుతోంది. తక్కువ వర్షపాతం, అడుగంటిన చెరువులు, ఎండిపోతున్న పంటలు, ప్రమాదకర భూగర్భ జలాలతో జిల్లా తీవ్ర కరువు కోరల్లో చిక్కుకుంటోంది. రైతుల ఆశలన్నీ ఇప్పుడు వరణుడి కరుణపైనే నిలిచాయి. జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, కందులు తదితర పంటలు కలిపి ఈ సీజన్లో సుమారు 2.15 లక్షల ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే ఇప్పటివరకు సుమారు 1.68 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. ఈ సాగు కూడా నార్లు, విత్తన దశలోనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో వరి నార్లు సిద్ధంగా ఉండగా, మరికొన్ని చోట్ల రైతులు పత్తి విత్తనాలు వేస్తున్నారు. కానీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పోవడంతో సాగు పనులు ముం దుకు సాగడం లేదు. వర్షపాతం తక్కువే ఎల్నినో ప్రభావంతో జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడంతో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. దేవాదుల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల లేకపోవడం, చెరువులు అడుగంటిపోవడం, బోర్లలో నీరు తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 770 చెరువులు ఉన్న జిల్లాలో ఏ ఒక్క చెరువులోనూ 25 శాతం నీటి నిల్వలు లేకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. రిజర్వాయర్లలో కూడా నీటి నిల్వలు సగానికి తగ్గిపోయాయి. వరి, పత్తి పంటలకు కరువు ఛాయలు వరి, పత్తి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పంటల కాలం దాటి పోతుండడంతో 10 ఎకరాల్లో సాగు చేయాలనుకున్న రైతులు ఒకటి లేదా రెండు ఎకరాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. వాటికి కూడా సాగునీరు అందక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అనేక ప్రాంతాల్లో బకెట్లు, ట్రాక్టర్లు, పైపులైన్ల ద్వారా మొక్కలకు నీరు అందిస్తూ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుండగా, వరికి భారీ పైపు లైన్లను ఏర్పాటు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. ప్రస్తుతం ఐదు నుంచి ఎనిమిది అడుగుల వరకు పెరగాల్సిన పత్తి మొక్కలు అడుగు ఎత్తు కూడా పెరగక వాడిపోతున్నాయి. వందల ఎకరాల్లో రెండోసారి, మూడోసారి విత్తనాలు వేసినా ఆశించిన ఫలితం లేక రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. అయితే రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడం, ఉదయం తరచూ ట్రిప్ అవుతుండడంతో ఉన్న కొద్దిపాటి నీటిని కూడా వినియోగించుకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అనేక మంది రైతులు అప్పులు చేసి 500 అడుగుల లోతు వరకు బోర్లు వేస్తున్నా చుక్క నీరు కూడా పడక లక్షల రూపాయలు నష్టపోతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గత ఏడాది ఇదే సమయంలో పచ్చని పంటలతో కళకళలాడిన పొలాలు నేడు పగుళ్లతో కనిపిస్తుండటంతో 1996 కరువు రోజులు గుర్తుకు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. లోటు వర్షపాతం జిల్లాలో ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో ఆశించిన మేర వర్షాలు కురవలేదు. జూన్లో సాధారణంగా 124.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 88.5 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. దీంతో 29 శాతం లోటు నమోదైంది. జూలైలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. సాధారణంగా 102.7 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉండగా, 47.2 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో 54 శాతం లోటు ఏర్పడింది. ఎల్నినో కోరలు..సాగుపై తీవ్ర ప్రభావం నీరులేక ఎండుతున్న పొలాలు.. బోసిపోతున్న చెరువులు.. వట్టిపోయిన బోర్లు పంటలను బతికించుకునేందుకు రైతుల ప్రయాస -
మురికినీటి నిర్వహణకు మ్యాజిక్ డ్రెయిన్
● పైలట్ ప్రాజెక్ట్ను పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: మురికినీటి నిర్వహణకు మ్యాజిక్ డ్రెయిన్ విధానం అమలుచేస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. పైలట్ ప్రా జెక్ట్గా మండలంలోని వడ్లకొండ గ్రామంలో చేపడుతున్న మ్యాజిక్ డ్రెయిన్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మ్యాజిక్ డ్రెయిన్ విధానంలో మొత్తం 30 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు వేర్వేరు సోక్ పిట్లు ఏర్పాటు చేసి, నీరు సహజసిద్ధంగా భూమిలోకి ఇంకిపోయేలా తగిన వాలుతో నిర్మా ణం చేపట్టడం జరుగుతుందన్నారు. నీటి ప్రవాహం ఎక్కడా నిలిచిపోకుండా గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా సజావుగా సాగేందుకు ప్రత్యేక డిజైన్ అనుసరిస్తారని తెలిపారు. ఈ పరిశీలనలో డీఆర్డీఓ భాస్కర్, ఈజీఎస్ పీడీ సూరి, ఎంపీడీఓ మహేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకు సేవలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
జనగామ: జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్లో ఉన్న భవనంలో కొనసాగుతున్న కెనరా, డీసీసీ బ్యాంకు శాఖలు ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ తనిఖీలు నిర్వహించి భవనాన్ని సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో రెండు బ్యాంకుల సేవలు తాత్కాలికంగా నిలిచిపోయా యి. ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా కెనరా బ్యాంకు అధికారులు శాఖ ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేసి డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అత్యవసర సేవల కోసం లింగాలఘణపురం మండలం నెల్లుట్ల శాఖను సంప్రదించాలని, వివరాలకు– 701 3203331ను సంప్రదించాలని మేనేజర్ కోరారు. అలాగే డీసీసీ బ్యాంకు ఖాతాదారులు రఘునాథపల్లి, దేవరుప్పుల శాఖలను వినియోగించుకోవాలని, అవసరమైతే–9701361879కు సంప్రదించాలని సూచించింది. ఇదిలా ఉండగా, అత్యవసర నగదు అవసరాల కోసం డీసీసీ బ్యాంకు వద్ద మొబైల్ మినీ ఏటీఎంను ఏర్పాటు చేసి రోజుకు రూ.20 వేల వరకు నగదు డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. -
తాగునీటి సరఫరాకు ప్రాధాన్యమివ్వాలి
జనగామ రూరల్: తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులకు సూచించారు. గురువారం తాగునీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నియంత్రణ, విద్యాశాఖ, సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ.. తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని ప్రాజెక్టుల్లో తాగునీటికి అవసరమైన నీటి మట్టాల ను తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ప్రతీ నీటిబొట్టును సంరక్షించేలా ఇంకుడు గుంతలు, ఇతర నీటి సంరక్షణ పనులను సమర్థవంతంగా చేపట్టాలన్నారు. విద్యార్థులకు అందించాల్సిన ఏకరూప దుస్తుల్లో ఒక జతను ఆగస్టు 15 నాటికి అందజేయాలని ఆదేశించారు. కాగా, జిల్లాలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి రైతుసేవా కేంద్రాలను ఆయన అభినందించారు. వీసీలో డీఏఓ అంబికా సోని, డీఆర్డీఓ భాస్కర్, డీసీఎస్ఓ సురేష్ రెడ్డి, డీఎం సీఎస్ హతిరామ్, డీపీఓ వెంకట్ రెడ్డి, విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లాలో మహిళా శక్తి రైతుసేవా కేంద్రాల ఏర్పాటుపై అభినందన -
ఎరువులు, విత్తనాల కొరత ఉండొద్దు
● సమీక్షలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ: జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతులకు యూరియా, విత్తనాలు, ఇతర వ్యవసాయ ఇన్పుట్లు ఎలాంటి కొరత లేకుండా సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఎస్హెచ్జీ మహిళా శక్తి రైతు సేవా కేంద్రాల మహిళలతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 62 ఎస్హెచ్జీ మహిళా శక్తి రైతు సేవా కేంద్రాల్లో ప్రస్తుతం 44 కేంద్రాలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, నేడు 15 ఇ–పాస్యంత్రాల పంపిణీతో 59 క్రియాశీల వ్యవసాయ ఇన్పుట్ కేంద్రాలు రైతులకు సేవలు అందించనున్నాయని తెలిపారు. అనంతరం ఎస్ హెచ్జీ మహిళా శక్తి రైతు సేవా కేంద్రాలకు 15 ఇ–పాస్ యంత్రాలను కలెక్టర్ పంపిణీ చేశారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, డీఆర్డీఓ, డీపీఎం, మార్క్ఫెడ్, ఏడీఏ, సీ్త్రనిధి బ్యాంకు ప్రతినిధులు, 62 రైతు సేవా కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు. పాడి రైతులకు ఎక్స్గ్రేషియా అందజేత జనగామ రూరల్: ప్రజావాణిలో అందిన ప్రతీ అర్జీని సానుభూతితో పరిశీలించి, అర్హులైన బాధితులకు ప్రభుత్వ సహాయం అందేలా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదవశాత్తు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తగిలి గేదెలు మృతి చెందిన ఇద్దరు పశుపోషక రైతులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఎక్స్గ్రేషియా చెక్కులను కలెక్టర్ తన చాంబర్లో బాధితులకు అందజేశారు. దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన ఉప్పల అంజయ్యకు రూ.1,00,000 ఎక్స్గ్రేషియా, అదే మండలం చిన్నమడూర్ గ్రామానికి చెందిన అనగాని రాజుకు రూ.1,20,000 ఎక్స్గ్రేషియా మంజూరు చేసి కలెక్టర్ వారికి చెక్కులు అందజేశారు. -
చురుగ్గా సర్
● ఇప్పటివరకు 70 శాతానికి పైగా డిజిటైజేషన్ ● ఆగస్టు 3 వరకు గడువు పెంచిన కేంద్రంజనగామ: ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్)లో భాగంగా జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) విస్తృతంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ఓటర్ల వివరాల ధ్రువీకరణ చేపడుతున్నారు. జిల్లాలో 7,67,484 మంది ఓటర్లు ఉండగా, ఒక్కో బీఎల్ఓకు సగటున 887 మంది ఓటర్లు కేటాయించారు. జిల్లాలో మూడు నియోజకవర్గాలు కలిపి ఎస్ఐఆర్ డిజిటైజేషన్ 70.40 శాతంగా నమోదైంది. ఈనెల 24వ తేదీ వరకు ఎస్ఐఆర్ అవకాశం ఉండగా, కేంద్రం వచ్చే నెల 3వ తేదీ అంటే 10 రోజుల పాటు గడువు పెంచింది. నియోజకవర్గాల వారీగా జనగామ నియోజకవర్గంలో 278 మంది బీఎల్ఓలు పనిచేస్తుండగా, 2,49,437 మంది ఓటర్లకు సంబంధించిన ఎస్ఐఆర్ ఫారాలు 100 శాతం డౌన్లోడ్, ముద్రణ, పంపిణీ పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 1,69,281 ఫారాలు (67.87 శాతం) డిజిటైజేషన్ చేయగా, 1,68,494 ఫారాలు (67.55శాతం) బీఎల్ఓల ద్వారా ధ్రువీకరించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో 291 మంది బీఎల్ఓలు 2,56,806 మంది ఓటర్లకు సంబంధించిన ఫారాలను పూర్తిగా పంపిణీ చేశారు. ఇందులో 1,89,723 ఫారాలు (73.88శాతం) డిజిటైజేషన్ కాగా, 1,89,210 ఫారాలు (73.68 శాతం) ధ్రువీకరణ పూర్తి చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో 296 మంది బీఎల్ఓలు 2,61,241 మంది ఓటర్లకు సంబంధించిన ఫారాలను పూర్తిగా పంపిణీ చేశారు. ఇందులో 1,81,341 ఫారాలు (69.42శాతం) డిజిటైజేషన్ చేయగా, 1,80,810 ఫారాలు (69.21 శాతం) బీఎల్ఓలు ధ్రువీకరించారు. జిల్లా వ్యాప్తంగా 5,40,345 ఫారాలు (70.40శాతం) డిజిటైజేషన్ కాగా, 5,38,514 ఫారాలు (70.17శాతం) ధ్రువీకరణ పూర్తి చేశారు. -
ఏఐతో ప్రభుత్వ కార్యాలయాల్లో మార్పులు..
అంశం పనిభారం తగ్గే శాతం80%పవర్పాయింట్/రిపోర్టులు ప్రజా ఫిర్యాదులు డేటా విశ్లేషణ తెలుగు అనువాదం మీటింగ్ మినిట్స్ డాక్యుమెంట్ సారాంశం లెటర్ల తయారీ82%85%88%90%92%95%ఏఐతో శాఖల వారీగా ప్రయోజనాలు ఇలా..శాఖ ప్రయోజనాలు రెవెన్యూ భూ రికార్డుల పరిశీలన, ఫైళ్ల సారాంశం, పెండింగ్ దరఖాస్తుల విశ్లేషణ పంచాయతీరాజ్ గ్రామసభ మినిట్స్, అభివృద్ధి పనుల నివేదికలు జీడబ్ల్యూఎంసీ ప్రజా ఫిర్యాదుల వర్గీకరణ, వార్డుల వారీగా సమస్యల విశ్లేషణ కలెక్టరేట్ అధికారిక లేఖలు, సమీక్ష నివేదికలు, సమావేశాల మినిట్స్ ఇతర శాఖలు డేటా విశ్లేషణ, అనువాదం, ప్రజెంటేషన్లు -
శుక్రవారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2026
జనగామ: జిల్లాలో ఉద్యాన పంటల విస్తరణ, ఆధునిక సాగు పద్ధతులకు ప్రోత్సాహం, రైతుల ఆదా యం పెంచే లక్ష్యంతో జిల్లా ఉద్యానవన శాఖ 2026–27 సంవత్సరానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాలో మొత్తం 24,334 ఎకరాల్లో ఉద్యాన పంటల అభివృద్ధికి రూ.24,334 లక్షల ప్రణాళిక రూపొందించారు. ఇందులో మామిడి 8,882 ఎకరాలు, ఆయిల్పామ్ 8,283.14 ఎకరాలు ప్రధానంగా సాగవుతున్నాయి. 2,000 ఎకరాల్లో సూక్ష్మ నీటిపారుదల పర్ డ్రాప్ మోర్ క్రాప్ (పీఎండీసీ) పథకం కింద జిల్లాలో 2,000ఎకరాల్లో సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థల ఏర్పాటు కోసం రూ.6.287కోట్ల బడ్జెట్ కేటాయించారు. మండలాలకు లక్ష్యం నిర్దేశించారు. వర్గాల వారీగా.. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, బీసీ, ఎస్ఎఫ్, ఎంఎఫ్ రైతులకు 80 శాతం, ఇతర రైతులకు 70 శాతం వరకు రాయితీ ఇవ్వనుండగా, 12.50 ఎకరాలకు అర్హులు. ఇతర రైతులకు 70శాతం రాయితీతో 12.50 ఎకరాల వరకు లబ్ధి పొందవచ్చు. పోర్టబుల్ స్ప్రింక్లర నీటి పారుదల వ్యవస్థలకు అన్ని వర్గాల రైతులకు 65శాతం రాయితీ కల్పించారు. దరఖాస్తుదారులు సంబంధిత పత్రాలతో టీజీఎంఐపీ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే, క్షేత్ర పరిశీలన అనంతరం పరిపాలన అనుమతులు మంజూరు చేస్తారు. ఎంఐడీహెచ్ కింద.. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఎంఐడీహెచ్) కింద జిల్లాలో 659.49 హెక్టార్లలో రూ.4.29 కోట్లతో పలు ఉద్యాన పంటల అభివృద్ధికి లక్ష్యాలు నిర్ణయించారు. అరటి, బొప్పాయి, మామిడి, నిమ్మ, జామ, డ్రాగన్ఫ్రూట్, అవకాడో, పూలసాగు, ప్లాస్టిక్ మల్చింగ్, కూరగాయల గ్రాఫ్టులు, వ్యక్తిగత ఫార్మ్ పాండ్లకు 40 నుంచి 75 శాతం వరకు రాయితీలు అందించనున్నారు. డ్రాగన్ఫ్రూట్ సాగుకు ఎకరానికి రూ.2.70లక్షలు, అరటికి రూ.70 వేల వరకు, మామిడి, నిమ్మ, జామ, అవకాడో సాగుకు రూ.50 వేల వరకు అందించనున్నారు. ఆయిల్పామ్ సాగుకు.. ఎన్ఎంఈఓ–ఆయిల్పామ్(ఎన్ఎంఈఓ, ఓపీ) పథ కం కింద జిల్లాలో 2,000 ఎకరాల్లో రూ.2.11 కోట్ల తో ఆయిల్పామ్ సాగు విస్తరణ చేపట్టనున్నారు. దిగుమతి మొక్కలకు మొక్కకు రూ.11,580, నాలు గు సంవత్సరాల నిర్వహణకు రూ.16,800 వరకు, రవాణా ఖర్చు మొక్కకు రూ.20 అందించనున్నారు. శాశ్వత పందిళ్లు, మల్బరీ సాగుకు.. పీఎం–ఆర్కేవీవై కింద 28 హెక్టార్లలో రూ.70 లక్షలతో శాశ్వత పందిళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఒక యూనిట్కు రూ.1 లక్ష వ్యయం ఉండగా, 50 శాతం (గరిష్ఠంగా రూ.50 వేల) రాయితీ అందించనున్నారు. అలాగే మల్బరీ సాగు, మల్బరీ రింగ్ బెడ్లు, టిష్యూ కల్చర్ మొక్కల పెంపకానికి కూడా ప్రత్యేక సబ్సిడీలు కల్పించనున్నారు. సద్వినియోగం చేసుకోవాలిజిల్లాలో 2026–27 సంవత్సరానికి ఉద్యాన పంటల విస్తరణకు ప్రభుత్వం పలు పథకాల కింద రాయితీలు అందిస్తోంది. సూక్ష్మనీటిపారుదల, పండ్ల తోటల ఏర్పాటు, ఆయిల్పామ్, డ్రాగన్ ఫ్రూట్, పూలసాగు, ప్లాస్టిక్ మల్చింగ్, శాశ్వత పందిళ్లు వంటి పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఆసక్తి గల రైతులు ఆధార్, పట్టాదారు పాస్బుక్, బ్యాంకు ఖాతా వివరాలతో సమీప ఉద్యానవన శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. – అంబికాసోని, జిల్లా వ్యవసాయశాఖ, ఇన్చార్జ్ హార్టికల్చర్, సెరికల్చర్ అధికారి 2026–27కు ఉద్యానవన శాఖ సమగ్ర ప్రణాళిక సిద్ధం రైతులకు కోట్ల రూపాయల రాయితీలు 2 వేల ఎకరాల్లో సూక్ష్మ నీటిపారుదల లక్ష్యం అరటి నుంచి డ్రాగన్ఫ్రూట్ వరకు సబ్సిడీ -
ఏఐతో ప్రజా సమస్యల పరిష్కారం
వివిధ విభాగాల అధికారులకు సమాచారం, ఆదేశాలను త్వరగా చేరవేసేందుకు ఏఐ ఎంతో ఉపయోగపడుతుంది. సాధారణంగా అయితే డ్రాఫ్ట్ రెడీ చేసుకునేందుకు గంటల సమయం తీసుకుంటుంది. అదే ఏఐకి సరైన ప్రాంప్ట్ ఇస్తే సెకన్ల వ్యవధిలోనే డ్రాఫ్ట్ రెడీ అవుతుంది. కోర్టు కేసుల్లోనూ 100 నుంచి 150 పేజీల డాక్యుమెంట్ ఉన్న కాపీలను గూగుల్ క్ల్లౌడ్లో స్కాన్ చేసి ఒక పేజీలో ముఖ్యమైన సారాంశం ఇవ్వాలని సరైన ప్రాంప్ట్ ఇస్తే సెకన్లలో సిద్ధమవుతుంది. అలాగే, అధికారులు కూడా తమ రోజువారీ పనుల్లో ఏఐ వాడితే ప్రజాసమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫైళ్ల కదలికలో వేగం పెరుగుతుంది. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం తగ్గుతుంది. ప్రభుత్వ సేవలు త్వరగా చేరువ అవుతాయి. పారదర్శకత పెరుగుతుంది. – డాక్టర్ సత్యశారద, వరంగల్ కలెక్టర్ -
ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం
సాక్షి, వరంగల్: జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకొస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రజాహితంగా సమూల మార్పులు తేనుంది. ప్రజా సమస్యలు, ఫైళ్లు, లెటర్ల తయారీ, సమావేశాల నిర్ణయాల అమలులో జాప్యాన్ని నియంత్రించేందుకు ఏఐ ఉపయోగపడనుంది. హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్లలో 250 మంది అధికారులకు ఏఐ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫీషియెన్సీ శిక్షణ ఇచ్చింది. రోజువారీ ప్రభుత్వ పనుల్లో అధికారులు ఏఐ వినియోగాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద కూడా చాలెంజ్గా తీసుకొని అధికారులు ఏఐ వినియోగిస్తే ప్రజల సత్వర సేవలకు మరింత దగ్గరవుతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా అధికారిక లేఖల తయారీ, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు సమాధానాలు, ఉన్నతాధికారులకు సమర్పించే నివేదికలు, మీటింగ్ మినిట్స్, జీఓ ఉత్తర్వుల సారాంశం, వివిధ పథకాల అమలుకు ప్రజలకు సులభంగా అర్థమయ్యే సమాచారం రూపొందించడం వంటి పనుల్లో చాట్జీపీటీ, నోట్బుక్ఎల్ఎం, క్లాడ్, భాషిణి వంటి ఏఐ సాధనాలను వినియోగించనున్నారు. ఇలా నెలరోజుల్లో ఏఐ పనితీరుతో జిల్లా పరిపాలనలో వేగం, పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ సాంకేతికతను అమలుచేస్తే ‘మీ పని పూర్తయ్యింది‘ అనే సమాధానం ప్రజలకు చేరనుంది. అదే జరిగితే ప్రభుత్వ కార్యాలయాలపై ప్రజలకు నమ్మకం మరింత బలపడుతుంది. వరంగల్ కలెక్టరేట్లో అధికారులకు ఏఐపై శిక్షణ ఇస్తున్న ట్రైనర్ఏఐ నుంచి కచ్చితమైన, ఉపయోగకరమైన ఫలితాలు పొందాలంటే అధికారులు నాలుగు దశల ప్రాంప్ట్ ఫ్రేమ్వర్క్ పాటించాలి. ముందుగా మీ పాత్రను స్పష్టంగా పేర్కొనాలి. తర్వాత ఏ పనిచేయాలో టాస్క్ రూపంలో వివరించాలి. ఆపై సంబంధిత గణాంకాలు, తేదీలు, అవసరమైన సమాచారం వంటి వివరాలు ఇవ్వాలి. చివరగా సమాధానం ఏ రూపంలో కావాలో ఫార్మాట్ను సూచించాలి. ఈ నాలుగు అంశాలను స్పష్టంగా ఇవ్వడం ద్వారా ఏఐ మరింత కచ్చితమైన, అవసరానికి అనుగుణమైన సమాధానాలు అధికారులకు అందిస్తుంది. – వాసుదేవ నటరాజ్, ఏఐ ట్రైనర్, టీఫైబర్ ఇలా చేస్తేనే ఫలితం.. ఫైళ్ల కదలిక, ప్రజా సమస్యల పరిష్కారంలో పెరగనున్న వేగం విధి నిర్వహణలో యంత్రాంగానికి సమయం ఆదా అయ్యే అవకాశం ఇప్పటికే వివిధ శాఖల అధికారులకు ఏఐ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫీషియెన్సీ శిక్షణ -
భూసమస్యలకు చెక్
బచ్చన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో భూ సమస్యలు లేకుండా చేయాలనే లక్ష్యంతో భూభారతి భూ రీసర్వేలను చేపట్టింది. జిల్లాలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా భూముల మ్యాపులు సరిగా లేని 7 గ్రామాలను గుర్తించారు. బచ్చన్నపేట మండలంలో కొడవటూర్, జనగామ మండలంలో మరిగడి, కొడకండ్లలో నర్సింగాపూర్, పాలకుర్తిలో లక్ష్మినారాయణపూర్, తరిగొప్పులలో అక్కరాజుపల్లి, చిల్పూర్లో రాజవరం, దేవరుప్పులలో చౌడూరు గ్రామాలను గుర్తించి మొదటి విడతగా భూభారతి భూరీసర్వేలను చేయాలని ఆయా మండలాల అధికారులను ఆదేశించారు. సర్వే చేస్తారిలా.. గ్రామాల్లో గల భూమి, సర్వే నంబర్లను సర్వేయర్లు తీసుకొని మొదటి విడతగా హద్దులు నిర్ణయించారు. మూడు గ్రామాల ట్రై యాంగిల్ జంక్షన్లను తీసుకొని, 30 మీటర్లకు ఒక హద్దును నిర్ణయించి గ్రామహద్దులను పెట్టారు. రెండో దశలో గ్రామంలోని పట్టా, అసైన్డ్, ప్రభుత్వ భూములను గుర్తించి పట్టా భూములను ఐదు ఖండాలుగా విభజించనున్నారు. అలాగే సాగు భూములకు ఎల్పీఎం (ల్యాండ్ పెంటల్ మ్యాప్), ఎల్పీఎన్ (ల్యాండ్ పెంటల్ నెంబర్) భూదార్ నెంబర్లు మనకు ఆధార్ నంబర్లలాగా ఇస్తారు. పాత హద్దులను గుర్తించడానికి డీజీపీఎస్తో రేఖాంశాలు, అక్షాంశాలను గుర్తించి హద్దులను నిర్ణయిస్తారు. చెరువులు, కుంటలు, బాటలు, రోడ్లకు ప్రతీ 200 మీటర్లకు భూదార్ నంబర్లను రైతులకు సులువుగా ఉండడానికి కేటాయిస్తారు. ఈ భూములను రీసర్వే చేయడానికి తహసీల్దార్, ఎంఆర్ఐ, జీపీఓ, సర్వేయర్, ఐదుగురు లైసెన్స్డ్ సర్వేయర్లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దానికి తహసీల్దార్ నేతృత్వం వహిస్తారు. ఈ భూములను కొలతలు వేయడానికి అధికారులు ఏడు డీజీపీఎస్ మిషన్లను ఆయా మండలాల అధికారులకు అందించారు. దీంతో గ్రామంలో ఉన్న భూసమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కానున్నాయి. ప్రతీ రైతుకు రీసర్వేతో న్యాయం చేకూరనుంది. రెండో విడతలో బచ్చన్నపేట మండలంలోని నారాయణపురం, గంగాపూర్, ఇటుకాలపల్లి, రామచంద్రాపూర్, పుల్లగూడ, దబ్బగుంటపల్లి, బండనాగారం, మన్సాన్పల్లి, బసిరెడ్డిపల్లి, లక్ష్మాపూర్ రెవెన్యూ గ్రామాలలో భూ రీసర్వేలను చేపడతారు. కొడవటూర్లో.. గ్రామంలో 364 సర్వే నంబర్లలో 2470–07 ఎకరాల మొత్తం విస్తీర్ణం భూమిలో 1,740 మంది రైతులు ఖాతాలను కలిగిఉన్నారు. 13 సర్వేనంబర్లలో 362–08 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, ఎకరాలు 30–10 గుంటల భూమిని కెనాల్స్ కోసం ప్రభుత్వం కొనుగోలు చేసింది. గ్రామంలో 12రోడ్లు, బాటలు ఉన్నాయి. లక్ష్మాపూర్, బండనాగారం, కేసిరెడ్డిపల్లి, బసిరెడ్డిపల్లి, బచ్చన్నపేట ఐదు గ్రామాల్లో ట్రైజంక్షన్లు ఉన్నాయి. గ్రామంలో ట్రెయినీ అదనపు కలెక్టర్ ఎం.తేజస్విని, ఏడీ మన్నెంకొండ, ఆర్డీఓ గోపీరాంనాయక్, తహసీల్దార్ ఇంద్రవల్లి హుస్సేన్లో పర్యటిస్తూ భూకొలతలను పరిశీలిస్తున్నారు. భూభారతి భూ రీసర్వేలతో పరిష్కారం జిల్లాలో 7 గ్రామాల్లో సర్వేలుసమస్యలు లేకుండా చేస్తాం..గ్రామాల్లో భూభారతి రీసర్వేలతో భూసమస్యలు పరిష్కారం అవుతాయి. రైతు కలిగి ఉంటే మొత్తం భూమికి భూదార్ నంబర్ ఒకటే కేటాయిస్తాం. ప్రస్తుతం రైతులు ఎంత సేద్యపు భూమిలో ఉన్నారో కూడా ప్రామాణికంగా తీసుకుంటాం. రైతులకు సమాచారం అందిస్తూనే పనులు చేస్తూ ముందుకు సాగుతాం. – హస్సేన్, తహసీల్దార్ -
డిగ్రీ.. డిమాండ్ డౌన్!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ విద్యాసంవత్సరం 2026–2027లో ప్రవేశాలకు విద్యార్థులు అనాసక్తి చూపుతున్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, గురుకుల, అటానమస్ డిగ్రీ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో ఇంకా 70శాతం సీట్లు ఖాళీగానే ఉన్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీకాం కంప్యూటర్స్ తదితర కోర్సులతోపాటు ఈసారి కొన్ని కాలేజీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తంగా 241 డిగ్రీ కళాశాలలుండగా ప్రథమ సంవత్సరంలో 1,00,600 సీట్లు ఉన్నాయి. ఆన్లైన్ దోస్త్ ద్వారా ఇప్పటికే మూడు దశల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించారు. ఇప్పటివరకు 30,071సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. విద్యార్థులు ఎక్కువగా ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులవైపు ఆసక్తి చూపడం వల్లే సీట్లు భర్తీ కావడం లేదని భావిస్తున్నారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో ఇంకా మొదటి దశలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయితే సీట్లురాని వారు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందనున్నారు. నాల్గవ దశ లేదా స్పెషల్ ఫేజ్పైనే ఆశలు.. కాలేజీల్లో ప్రవేశాలకు నాల్గవ దశ లేదా స్పెషల్ ఫేజ్గా మరోసారి రాష్ట్ర ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించబోతుంది. ఈనెల 20నుంచి 25వ తేదీ మధ్య స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ నోటిఫికేషన్ రానున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ దశలో మిగతా సీట్లలో కొంతమేర భర్తీ అవుతాయనే ధీమాతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఉన్నారు. ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు అడ్మిషన్ల కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పలు కొత్త కోర్సులను కూడా ప్రవేశపెట్టారు. దీంతో గతంకంటే కొన్ని కళాశాలల్లో సీట్లు పెరిగాయి. కానీ, కొన్ని ప్రైవేట్ కళాశాలల్లోనూ వివిధ కోర్సుల్లో ఆశించిన మేర సీట్లు భర్తీ కాకపోవడం ఆందోళన కలిగించే అంశంగా అధ్యాపకులు చెబుతున్నారు. ఈసారి కొత్త కోర్సులు ఇలా.. ఈ విద్యాసంవత్సరంలో డిగ్రీ స్ధాయిలో ప్రభుత్వం ఉపాధి కల్పనకు కోర్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందులో అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాం కింద (ఏఈడీపీ), బీకాం బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), బీఎస్సీ హార్టికల్చర్, హెల్త్కేర్ మేనేజ్మెంట్, డెయిరీ అండ్ పౌల్ట్రీ మేనేజ్మెంట్, బీబీఏ రిటైల్ ఆపరేషన్స్, బీఎస్సీ లైఫ్సైన్సెస్ ప్రధానంగా ఉన్నాయి. వీటిద్వారా పలు కళాశాలల్లో కొంత మేర అడ్మిషన్లు అయ్యాయి. మరికొన్నింటిల్లో అంతంత మాత్రమే భర్తీ అయ్యాయి.కేయూ పరిధిలో లక్షకు పైగా సీట్లలో 30,071 మాత్రమే భర్తీ మూడు విడతల ప్రవేశాలు పూర్తయినా ఇంకా 70 శాతం సీట్లు ఖాళీ ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులవైపు విద్యార్థుల మొగ్గు ప్రత్యేక లేదా నాలుగో విడత కౌన్సెలింగ్పైనే కళాశాలల ఆశలు -
ఉల్లంఘనులపై ఉక్కుపాదం
పట్టణంలో వివిధ ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా నిబంధనల ఉల్లంఘనలపై బుధవారం విస్తృత తనిఖీలు నిర్వహించాయి. మున్సిపల్ అధికారులు అక్రమ సెల్లార్లు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఓ భారీ భవనాన్ని సీజ్ చేశారు. కమర్షియల్ టాక్స్ అధికారులు ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రొఫెషనల్ టాక్స్ బకాయిల చెల్లింపుపై నోటీసులు జారీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖ అనుమతులు లేని ల్యాబ్ను సీజ్ చేయగా, రెవెన్యూ, విద్యుత్, ఫైర్ సేఫ్టీ, ఇంటర్మీడియట్ బోర్డు తదితర శాఖలు కూడా ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఉల్లంఘనలపై చర్యలు ప్రారంభించాయి. జనగామ: పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న భవన యజమానులపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. పార్కింగ్ కోసం నిర్మించిన సెల్లార్లలో వ్యాపార సంస్థలు నిర్వహించడం వల్ల ప్రజలకు పార్కింగ్ ఇబ్బందులు తలెత్తడంతో పాటు రోడ్లపై వాహనాలు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, విద్యుత్, ఇంటర్మీడియట్, అగ్నిమాపక, తదితర శాఖల అధికారులతో కలిసి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. గతనెల 17న ‘సెల్లార్లలో వ్యాపారాలు, రోడ్లపై వాహనాల పార్కింగ్’ సాక్షిలో శీర్షికతో ప్రచురితమైన కథనానికి స్పందించిన కమిషనర్ జిల్లా కేంద్రంలోని స్వర్ణ కళామందిర్ ప్రాంతంలో ఉన్న సెల్లార్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన భవన యజమానులకు ఇప్పటికే మొదటి, రెండో నోటీసులు జారీ చేసి నెల రోజుల గడువు ఇచ్చినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఐదు సెల్లార్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన సెల్లార్ల తాళాలు, సీళ్లను మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు ప్రారంభించారు. కొనసాగనున్న తనిఖీలు పట్టణంలోని హైదరాబాద్ రోడ్, హనుమకొండ రోడ్, సూర్యాపేట రోడ్, సిద్దిపేట రోడ్, కృష్ణ, స్వర్ణ కళామందిర్ ప్రాంతాలతో పాటు ఇతర ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో దశలవారీగా తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న సెల్లార్లపై ఇదే తరహా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. ప్రతీ భవనం మున్సిపల్ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, అనుమతులు పొందిన విధంగానే వినియోగించాలని కమిషనర్ రాజశేఖర్రెడ్డి సూచించారు. తనిఖీల్లో నాని హాస్పిటల్ పరిధిలోని సెల్లార్, ఎస్కే సూపర్ బజార్, బిగ్ బజార్, తుల్జాభవానీ లేడీస్ ఎంపోరియం తదితర వ్యాపార సముదాయాలకు చెందిన సెల్లార్లను సీజ్ చేసి తదుపరి చట్టపరమైన చర్యలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అనుమతులు లేని ల్యాబ్ సీజ్ పట్టణంలోని నాని ప్రైవేట్ ఆసుపత్రిలో నిబంధనలకు విరుద్ధంగా అవసరమైన రిజిస్ట్రేషన్, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ల్యాబొరేటరీని సంబంధిత అధికారులు సీజ్ చేశారు. తనిఖీల సందర్భంగా ల్యాబ్ నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన అధికారులు వెంటనే సీజ్ చర్యలు చేపట్టారు. ప్రైవేటు ఆస్పత్రులకు నోటీసులు పట్టణంలోని 30 ప్రైవేటు ఆస్పత్రులకు ప్రొఫెషనల్ టాక్స్ బకాయిల చెల్లింపులపై అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రతీ సంవత్సరం సుమారు రూ.2,500వరకు ప్రొఫెషనల్ టాక్స్ చెల్లించాల్సి ఉండగా, పలుచోట్ల బకాయిలు పేరుకుపోయినట్లు గుర్తించారు. నోటీసులు అందిన ఆస్పత్రులు నిర్దేశిత గడువులోపు బకాయిలను చెల్లించాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల వివరాలను కూడా పరిశీలించి, వాటికి సంబంధించిన బకాయిలపై నోటీసులు జారీ చేయనున్నట్లు కమర్షియల్ టాక్స్ అధికారి వీరబాబు తెలిపారు. పట్టణంలో ఐదు అక్రమ సెల్లార్లు సీజ్ సెల్లార్ల దుర్వినియోగంపై మున్సిపల్ కమిషనర్ కఠిన చర్యలు ఒక్కరోజే పలు శాఖల అధికారుల మెరుపు తనిఖీలు నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకులు, కళాశాల నిర్వహణ కలెక్టర్ ఆదేశాలతో భవనం మూసివేత పార్కింగ్ నిబంధనల ఉల్లంఘన, అనుమతి లేని హాస్టళ్లు తనిఖీల్లో బయటపడ్డ అక్రమాలు కెనరా బ్యాంకు ప్రమాదం తర్వాత.. పట్టణంలోని బాలాజీనగర్ ఏరియా కెనరా బ్యాంకు శాఖలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి నేతృత్వంలో ఎనిమిది శాఖల ఉన్నతాధికారులు బుధవారం భవనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బాలాజీ నగర్లో నిమ్మ రామ్మోహన్రెడ్డికి సంబంధించిన భవనంలో అద్దెకు కొనసాగుతున్న కెనరా బ్యాంకుతో పాటు డీసీసీ బ్యాంకు, పై అంతస్తుల్లో అనుమతులు లేకుండా కళాశాల తరగతి గదులు, హాస్టళ్లు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీలో భవన నిర్మాణం, వినియోగంలో పలు నిబంధనల ఉల్లంఘనలు వెలుగు చూశాయి. నివాస గృహ నిర్మాణానికి అనుమతి పొందిన భవనాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించడం, స్టిల్ట్ ఫ్లోర్ను పార్కింగ్కు బదులుగా ఇతర అవసరాలకు ఉపయోగించడం, తప్పనిసరిగా ఉండాల్సిన సెట్బ్యాక్లను పాటించకపోవడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. అలాగే భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండానే విద్యుత్ కనెక్షన్ పొందినట్లు, విద్యాశాఖ అనుమతులు లేకుండా కళాశాల తరగతులు, హాస్టళ్లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత భవనాన్ని పూర్తిగా సీజ్ చేసినట్లు కమిషనర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. తనిఖీల్లో ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి, అగ్నిమాపక శాఖ అధికారి రేమండ్బాబు, విద్యాశాఖ అదనపు డైరెక్టర్ కార్యాలయ ప్రతినిధులు, పట్టణ ప్రణాళిక, పురపాలిక విభాగం అధికారులు పులి శేఖర్, కుమార్, పవన్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో ఉన్న రెండు బ్యాంకుల నిర్వహణకు సంబంధించి బ్యాంకింగ్ ఉన్నతాధికారులు నేడు కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను కలవనున్నట్లు సమాచారం. -
రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు
కాజీపేట అర్బన్: సర్కారుకు ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తున్న రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మించాలనే సంకల్పంతో ఈనెల 7న జీఓ ఆర్టీ నంబర్ 414ను ప్రభుత్వం విడుదల చేసింది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తే అద్దె మిగులుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎనిమిదితో పాటు డీఐజీ కార్యాలయం కూడా అద్దె భవనాల్లోనే కొనసాగుతుండగా కొడకండ్లలో నిర్మాణంలో ఉంది. కాగా, ఏడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు డీఐజీ కార్యాలయం అద్దెలో కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో పూర్తిస్థాయిలో శాశ్వత భవనాలు నిర్మాణంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు లభించే అవకాశం ఉంటుంది. స్థల సేకరణకు కలెక్టర్లకు వినతులు ఉమ్మడి జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నర్సంపేట, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ ఆర్ఓలో డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్ ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలకు భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోమ, మంగళవారాల్లో వినతులు అందజేశారు. ఒక్కో కార్యాలయానికి ఒక్కో ఎకరం భూమి అందుబాటులోకి తెచ్చుకోవాలని, స్థల సేకరణ పూర్తి కాగానే ప్రభుత్వమే స్వయంగా శాశ్వత భవనాలను నిర్మించనున్నట్లు జీఓలో పేర్కొన్నారు. ప్రతీ నెల మిగలనున్న రూ.1,88,852 అద్దె ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని ఎనిమిది కార్యాలయాలు, డీఐజీ కార్యాలయం అద్దె భవనాల్లో కొనసాగుతుండడంతో ప్రతి నెల1,88,852 రూపాయలను అద్దె రూపంలో చెల్లిస్తున్నారు. ప్రభుత్వం శాశ్వత భవనాలను నిర్మిస్తే ఈ మొత్తం నగదు మిగలనుంది. స్థలం సేకరించాలని ప్రభుత్వం ఆదేశాలు కలెక్టర్లకు వినతుల అందజేత అద్దెలకు చెక్.. ఖజానాకు మిగలనున్న ఆదాయం -
డిజిటలైజేషన్ త్వరితగతిన పూర్తి చేయాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని బాధ్యతగా, సమర్ధవంతంగా చేపట్టాలని, ప్రతీ ఓటరుతో ఎన్యుమరేషన్ ఫారాలు నింపించి త్వరితగతిన డిజిటలైజేషన్ను పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పట్టణ కేంద్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్ఓలు, సంబంధిత అధికారులతో మాట్లాడారు.. ప్రతీ ఓటరును చైతన్యపరిచి ఎన్యుమరేషన్ ఫారాలను తప్పనిసరిగా నింపించాలన్నారు. అనంతరం స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ సమీపాన జాతీయ రహదారిపై నిర్మాణం చేపడుతున్న ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ స్వప్న, మున్సిపల్ కమిషనర్ రాధాక్రిష్ణ తదితరులున్నారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ ప్రతీ ఒక్కరూ విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని, అప్పుడే భవిష్యత్కు మంచి మార్గం ఏర్పడుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మండలంలోని నమిలిగొండ శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. వంటగదిలోని ఆర్ఓ ప్లాంట్, వంట సరుకులను, సిద్ధం చేసిన భోజనాన్ని పరిశీలించారు. అరటిపండ్లు నాణ్యతగా లేవని, శుభ్రమైన పండ్లను మాత్రమే విద్యార్థులకు అందించాలన్నారు. కోడిగుడ్ల నాణ్యతను నీళ్లలో వేసి స్వయంగా పరిశీలించారు. అనంతరం పదో తరగతిలో అన్అకాడమీ తరగతులను ప్రారంభించి ఫాస్ట్మ్యాథ్స్, గెట్ ఐటీ రైట్ పుస్తకాల ప్రాధాన్యాన్ని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు యూనిఫాంలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జీసీడీఓ గౌసియాబేగం, ఎస్ఓ రజిత తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతికతతో నేరాలు నియంత్రించాలి
వరంగల్ క్రైం: అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి నేరాల నియంత్రణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, శాంతిభద్రతల నిర్వహణలో మరింత సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎస్.శ్వేత అధికారులను ఆదేశించారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లోని పోలీస్ కంట్రోల్ రూం, కమాండ్ కంట్రోల్ రూంను సంబంధిత అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా కంట్రోల్ రూం సిబ్బంది పనితీరు, అత్యవసర కాల్స్ స్వీకరణ విధానం, సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ, నగరంలోని వివిధ ప్రాంతాలపై నిఘా, సాంకేతిక వ్యవస్థల పనితీరును కమిషనర్ సమీక్షించారు. సీపీ వెంట అదనపు డీసీపీలు ప్రభాకర్ రావు, శ్రీనివాస్, ఏసీపీ జితేందర్ రెడ్డి, ఆర్ఐ సతీష్, క్లూస్ ఇన్స్పెక్టర్ రాజ్కుమార్, ఎస్సై రోహిత్, ఆర్ఎస్సై శ్రవణ్ కుమార్ ఉన్నారు. సమష్టి కృషితో అధిక లాభాలునర్మెట: మహిళలు అడుగు వేస్తే సాధించలేనిదంటూ ఏమీలేదని, సమష్టి కృషితో అధిక లాభాలు సాధించవచ్చని డీఆర్డీఓ ఆర్.భాస్కర్ అన్నారు. సెర్ప్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన నర్మెట ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కం.లి. నాలుగు మండలాల(నర్మెట, తరిగొప్పుల, చిల్పూర్, బచ్చన్నపేట) సంఘాల వార్షిక సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు.. కల్తీలేని ఆహార పదార్థాలు అందించే దిశగా పంటల మార్పిడి చేపట్టి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, ప్రాసెసింగ్, గ్రేడింగ్ విధానంతో వినియోగదారులకు చేరువకావడంతో పాటు అధిక లాభాలు ఆర్జించవచ్చని అన్నారు. కావలసిన యంత్రాలకు ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. ఈసందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. చైర్మన్గా సుప్రియ, వైస్ చైర్మన్గా లక్క శ్రీలత, కార్యదర్శిగా తప్పెట రజిత ఎన్నికయ్యారు. కార్యక్రమంలో అదనపు డీఆర్డీఓ ఎమ్డీ నూరొద్దీన్, సెర్ప్ పీఎం పి.ఉమాపతి, సీనియర్ మేనేజర్ శ్రీనివాస్, డీపీఎం నళిని నారాయణ, ఐబీ డీపీఎం శ్రీనివాస్, ఎంపీడీఓ కావ్య శ్రీనివాసన్, ఏఓ బుర్రా మమత, సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్, ఏపీఎంలు, సీసీలు, డైరెక్టర్లు, సంఘాల సభ్యులు పాల్గొన్నారు. పోస్టర్ల ఆవిష్కరణ కేయూ క్యాంపస్: కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ వరంగల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈఏడాది ఆగస్టు 22న కేయూలో వికసిత్ భారత్ 2047 అకౌంటింగ్, ఫైనాన్స్ పాత్రపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రంతో కలిసి బుధవారం ఆవిష్కరించారు. -
‘సర్’ ప్రక్రియలో భాగస్వాములు కావాలి
● కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డిజనగామ రూరల్: ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో అమూల్యమైందని, ఎస్ఐఆర్ ప్రక్రియలో కార్యకర్తలు భాగస్వాములు కావాలని, దొంగ ఓట్లతో అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి సూచించారు. బుధవారం పట్టణంలోని జాబ్లీ గార్డెన్లో పట్టణ అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన నియోజకవర్గ సమగ్ర ఓటరు సవరణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కొమ్మూరి మాట్లాడుతూ.. చేర్యాల, జనగామ పట్టణాల్లో 15 వేల వరకు బోగస్ ఓట్లు ఉన్నాయని, ఇప్పుడు అవి బయట పడతాయన్నారు. అన్ని గ్రామాల్లో, పట్టణంలో ఎన్యుమరేషన్ వందశాతం పూర్తి చేసేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ మాట్లాడుతూ..పట్టణంలో ప్రతీ రెండు వార్డులకు ఒక హెల్ప్లైన్ డెస్క్ ఏర్పాటు చేసి ఓటు నమోదుకు కృషి చేస్తామని తెలిపారు. కౌన్సిలర్లు, మండలాల అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు. ముమ్మరంగా ‘ఎస్ఐఆర్’ చేపట్టాలిజనగామ రూరల్: నియోజకవర్గంలో ఓటరు సవరణ ప్రక్రియ ముమ్మరంగా చేపట్టాలని ఆర్డీఓ గోపిరామ్ అన్నారు. బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో అసెంబ్లీ నియోజకవర్గం–98లోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 15 నుంచి 24వ తేదీ వరకు ఎన్యూమరేషన్ ఫారంల సేకరణ, డిజిటలైజేషన్ పూర్తి చేయాల్సి ఉందన్నారు. 31లోగా ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురించనున్న నేపథ్యంలో సర్వేలో అందరూ భాగస్వాములై సహకరించాలని కోరారు. -
ఇంకుడు గుంతల ఏర్పాటు తప్పనిసరి
● పురపాలిక సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన మున్సిపల్ కమిషనర్జనగామ: ప్రతీ ఇల్లు, విద్యాసంస్థ, ప్రభుత్వ కార్యాలయం, వాణిజ్య సముదాయంలో తప్పనిసరిగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ (ఇంకుడు గుంతలు) వ్యవస్థలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి సూచించారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ‘క్యాచ్ ది రైన్–వర్షపు నీటిని ఒడిసిపట్టండి’ అవగాహన కార్యక్రమాన్ని పురపాలక కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, ప్రతీ ఇంటిలో ఇంకుడు గుంతల ఏర్పాటు, వర్షపు నీటిని వృథా కాకుండా నిల్వ చేసుకోవాల్సిన అవసరంపై అధికారులు, ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ‘ప్రతి నీటి బొట్టును సంరక్షిద్దాం, వర్షపు నీటిని ఒడిసిపట్టి భవిష్యత్ తరాలకు నీటి వనరులను కాపాడుదాం’ అంటూ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక, ఇంజినీరింగ్ విభాగం అధికారులు, శానిటేషన్ సిబ్బంది, ఇతర శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. -
చెర వీడి..సర్కార్ చేతికి!
జనగామ: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు రైతుల భూసమస్యల పరిష్కారంపై సమాంతరంగా దృష్టి సారిస్తూ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని వివిధ మండలాల్లో ప్రభుత్వ భూములపై జరిగిన ఆక్రమణలను గుర్తించి వాటిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చే ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ చర్యల ఫలితంగా ఇప్పటి వరకు సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూమి రక్షించబడినట్లు సమాచారం. బచ్చన్నపేట మండలం సాల్వాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 147లో ఉన్న సుమారు 163 ఎకరాల ప్రభుత్వ భూమిని పూర్తిగా ప్రభుత్వానికి పునరుద్ధరించారు. ఇందులో ప్రధానంగా ఆక్రమణలో ఉన్న సుమారు 84 ఎకరాల భూమిని అధికారుల సమక్షంలో వివరణాత్మక పంచనామా నిర్వహించి భౌతికంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి మూలాధార సెటిల్మెంట్ రికార్డుల్లో ‘గెరాన్’గా నమోదై ఉండటంతో పాటు నిషేధిత ఆస్తుల జాబితాలో రక్షణ పొందిన భూమిగా గుర్తించబడింది. అయినప్పటికీ హక్కులు లేని వ్యక్తులు రిజిస్టర్డ్ అమ్మకపు దస్తావేజుల ద్వారా భూమిని స్వాధీనం చేసుకున్నట్లు విచారణలో వెలుగుచూసింది. అదే విధంగా చిల్పూరు మండల కేంద్రంలో ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణలో ఉన్న రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా విముక్తి చేసి ప్రభుత్వానికి అప్పగించారు. మరోవైపు జనగామ మండలం శామీర్పేటలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రైతు భూమి సమస్యకు పరిష్కారం చూపిన కలెక్టర్, బచ్చన్నపేట మండలం బండనాగారం గ్రామంలో దాదాపు 60 ఏళ్లుగా కొనసాగుతున్న వ్యవసాయ పావుల వద్ద పానాది వివాదాన్ని కూడా పరిష్కరి ంచి రైతులకు ఉపశమనం కల్పించారు. జిల్లాలో ప్రభుత్వ భూములు ప్రైవేటు పట్టాలుగా ఎలా మారాయి? అప్పటి రెవెన్యూ నిబంధనలు ఎందుకు అమలు కాలేదు? మాన్యువల్ రికార్డుల్లో ఎలాంటి మార్పులు జరిగాయి? దశాబ్దాలుగా ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు ఎలా అనుభవించారనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారుల పాత్రపైనా సమగ్ర విచారణ జరపాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఈ భూములకు రైతుబంధు నిధులు విడుదలయ్యాయా, విడుదలై ఉంటే ఎంత మొత్తం చెల్లించారో విచారించి, అక్రమంగా పొందిన సొమ్మును తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. కబ్జాలు, అక్రమ పట్టాలపై దర్యాప్తు ఆక్రమణల గుట్టు విప్పుతున్న రెవెన్యూ యంత్రాంగం సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం మరో వెయ్యి ఎకరాలపై విచారణ? -
ప్రజల భద్రతే పోలీస్ శాఖ లక్ష్యం
హసన్పర్తి: ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. కిట్స్ కళాశాల సమావేశపు మందిరంలో పోలీస్ అధికారుల నెలవారీ నేర సమీక్ష మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలో పెండింగ్ కేసులు, వివిధ నేరాల దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతల పరిస్థితి, మహిళలు, చిన్నారులపై దాడులు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలపై సీపీ సమీక్షించారు. అనంతరం కమిషనర్ శ్వేత మాట్లాడుతూ ప్రతి కేసును పారదర్శకంగా దర్యాప్తు చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డయల్ 100 ద్వారా వచ్చే ప్రతికాల్పై తక్షణమే స్పందించి బాధితులకు సకాలంలో సేవలు అందించాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని, అవసరమైతే రౌడీషీట్ తెరవాలని పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన, పోగొట్టుకున్న సుమారు రూ.50 లక్షల విలువైన 352 సెల్ఫోన్లను సీపీ బాధితులకు అందజేశారు. సమావేశంలో డీసీపీలు అంకిత్ కుమార్, దారా కవిత, రాజమహేంద్రనాయక్, కిశోర్సింగ్, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. నెలవారీ నేర సమీక్షలో వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత -
వరుస తడి.. పారేనా మడి
నర్మెట శివారు మరియాపురంలో మిర్చితోటకు నీరుపారిస్తున్న వృద్ధ రైతు కిష్టయ్యరోహిణి, మృగశిర, ఆరుద్ర కార్తెలు పోయి పుష్యమి వచ్చినా వర్షాలు కురువకపోవడంతో రైతన్న మబ్బుల వంక ఆశగా చూస్తున్నాడు. అడపాదడపా కురిసిన వర్షాలకు పత్తి విత్తనాలు పెట్టడంతో పాటు మిర్చి, వరి నార్లు పోశారు. తీరా వరణుడు ముఖం చాటేసి..నడి వేసవిని తలపించేలా భానుడు భగభగలాడుతుండడంతో అన్నదాత అల్లాడిపోతున్నాడు. బావులు, బోరు బావులు కలిగిన రైతులు వరినారును, పత్తి, మిర్చి మొలకలను దక్కించుకునే ప్రయత్నంలో వరుస తడులుగా నీరందిస్తూ కరుణించు వానదేవుడా అని వేడుకుంటున్నారు.– నర్మెట -
తెలంగాణకు మణికిరీటం ‘తాడిచర్ల–2’
● కోల్బ్లాక్ ద్వారా రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్ ● కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డిమల్హర్: తాడిచర్ల–2 కోల్బ్లాక్ తెలంగాణకు మణికిరీటంగా నిలుస్తుందని, తాడిచర్ల–2 కోల్బ్లాక్ను సింగరేణికి అప్పగించడం సంతోషకరమైన విషయమని కేంద్రమంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. సింగరేణి భరోసాయాత్రలో భాగంగా మంగళవారం మండల కేంద్రం తాడిచర్లలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడారు.. తాడిచర్ల–2 నుంచి త్వరలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కానుందన్నారు. ఈ గని ద్వారా సుమారు 2,000 శాశ్వత ఉద్యోగాలు, మరో 5,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఈ ప్రాంతంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గని కార్యకలాపాలతో వేలాది వాహనాల రాకపోకలు పెరిగి స్థానికంగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ బ్లాక్ద్వారా సుమారు రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్ జరిగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. భారతదేశంలోలోనే అతిపెద్ద కోల్బ్లాక్గా తాడిచర్ల–2 నిలుస్తుందని, ఇది ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న అద్భుత నిర్ణయమని కొనియాడారు. గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు, సింగరేణి సంస్థ, తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అవసరమైన అన్ని అనుమతులు, క్లియరెన్స్లు త్వరగా పొందిన అనంతరం సింగరేణి పనులు ప్రారంభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, రాష్ట్ర నాయకులు సునీల్రెడ్డి, నారాయణరెడ్డి, కీర్తిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నిషిధర్రెడ్డి, మల్క మోహన్రావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
హోటళ్లు, బార్లలో ఆకస్మిక తనిఖీలు
జనగామ: మున్సిపాలిటీ, ఫుడ్ సేఫ్టీ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, ఆహార విక్రయ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత ప్రమాణాలు పాటించని యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయడంతో పాటు సంబంధిత నిబంధనల ప్రకారం మొత్తం రూ.85 వేల జరిమానా విధించారు. అమృత బార్ అండ్ రెస్టారెంట్కు రూ.20 వేలు, భువన బార్కు రూ.10 వేలు, వినాయక బార్కు రూ.30 వేలు, బాలాజీ బార్కు రూ.10 వేలు, బాలాజీ స్వీట్ హౌస్కు రూ.5వేలు, అగర్వాల్ స్వీట్ హౌజ్కు రూ.10 వేల చొప్పున జ రిమానాలు విధించారు. తనిఖీల్లో మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ అధికారులు గొర్రె కుమార్, పులి శేఖర్, నిఖిల్ పాల్గొన్నారు. -
చదువుతోనే సమాజంలో మార్పు
జఫర్గఢ్: చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను మంగళవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు విభా గాలను పరిశీలించారు. వంట గదిని తనిఖీ చేసి విద్యార్థినులకు అందిస్తున్న అహార నాణ్యత డైట్ చార్జీల అమలు, ప్రతీ రోజు వండుతున్న భోజన పదార్థాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోనాయిచలం రెవెన్యూ పరిధిలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన సముదాయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లాలోని ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఫారాల పంపిణీ, స్వీకరణ, డేటా ఎంట్రీ పురోగతిని పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ దేవేందర్, సిబ్బంది పాల్గొన్నారు. కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్ కొడకండ్ల: విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. మండల కేంద్రంలోని బాలికల గురుకులాన్ని కలెక్టర్ సందర్శించి విద్యార్థులకు అందుతున్న విద్యా బోధన, వసతులు, సదుపాయాలను పరిశీలించారు. జీసీడీఓ గౌసియాభేగం, తహసీల్దార్ అనీల్బాబు, ఎంపీడీఓ రవిందర్, సర్పంచ్ మమతసతీష్గౌడ్, ప్రిన్సిపాల్ దిలీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వ్యాపార రంగంలో రాణించాలి జనగామ రూరల్: మహిళా సంఘాల సభ్యులు వ్యాపార రంగంలో రాణించాలని, ఆదాయ వనరులను సమకూర్చుకునేలా పెద్ద యూనిట్ల ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్లో సీ్త్రనిధి రుణాలపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ‘మన సీ్త్రనిధి’ మొబైల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా సూపర్మార్ట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. డీఆర్డీఓ పీడీ భాస్కర్, ఏపీడీ నూరుద్దీన్, సీ్త్రనిధి జోనల్ మేనేజర్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు, సీ్త్రనిధి డైరెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ -
వన మహోత్సవానికి సిద్ధం
జనగామ రూరల్: గ్రామాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు, అటవీ విస్తీర్ణం పెంచి సమతుల్య వాతావరణానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా వన మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 25,92,100 లక్షల మొక్కలను నాటాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు కలెక్టర్ సందీప్కుమార్ ఝా వివిధ శాఖలకు లక్ష్యాలు కేటాయించారు. అత్యధికంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ 18 లక్షల20 వేలు లక్ష్యం నిర్దేశించారు. ఉపాధి పథకం కింద గుంతలతీత పనులను పదిహేను రోజుల క్రితం ప్రారంభించారు. ఇప్పటికే 7 లక్షలకు పైగా గుంతలను తీసి సిద్ధంగా ఉంచారు. ఈవారంలో అధికారికంగా వన మహోత్సవానికి శ్రీకారం చుట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా 281 గ్రామ పంచాయతీలకు గాను ప్రతీ గ్రామానికి నర్సరీని ఏర్పాటు చేయగా ఈ నర్సరీల్లో మొత్తం 25 లక్షల మొక్కల పెంపకం సంరక్షణ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులు చేపడుతున్నారు. నీడ, పండ్ల మొక్కలే ఎక్కువ వన మహోత్సవంలో నీడనిచ్చే చెట్లతో పాటు పండ్ల చెట్లను అధికంగా నాటేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసుకుంది. రహదారులు, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో నీడనిచ్చే మొక్కలను నాటనున్నారు. గ్రామ పంచాయతీల్లో ప్రతీ ఇంటికి రెండు మొక్కల చొప్పున పండ్లు, పూల మొక్కలు అందించనున్నారు. రైతులు తమ పొలం గట్లపై నాటుకునేలా పండ్ల మొక్కలను ఇవ్వనున్నారు. అలాగే రహదారుల వెంట నేరేడు పండ్ల మొక్కలను నాటితే కోతులు పంట పొలాల వైపు రాకుండా ఉంటాయని ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేశారు. వర్షాభావంతో ఆలస్యం ఏటా ఆగస్టులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అంతటా మొక్కలు నాటడం పూర్త య్యే సరికి వర్షాలు తగ్గిపోయి నాటిన మొక్కలు చనిపోతున్నాయి. ఈ క్రమంలో రుతుపవనాలు వచ్చిన మొదట్లోనే నర్సరీల నుంచి మొక్కలను తెచ్చి నాటితే బాగుంటుందని భావించి ఈ ఏడాది ముందుగానే మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. ఉపాధి హామీ పథకం కింద రహదారులకు ఇరువైపులా, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో కూలీలతో గుంతలను తీస్తున్నారు. అయితే వర్షాభావ పరిస్థితి కారణంగా మొక్కలు నాటే కార్యక్రమం కొంత ఆలస్యమవుతోంది. నాటాల్సిన మొక్కల లక్ష్యం 25.92 లక్షలు శాఖలవారీగా లక్ష్య నిర్దేశం 7 లక్షలకుపైగా గుంతలతీత పనులువన మహోత్సవంలో మొక్కలు నాటేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడితే మొక్కలు నాటేందుకు అనుకూలంగా ఉంటుంది. గుంతలు తీసే ప్రక్రియ ఇప్పటికే చేపట్టాం. ఒకటి రెండు పెద్ద వానలు పడితే నెల చివరి కల్లా పూర్తి చేసే అవకాశం ఉంది. – భాస్కర్, డీఆర్డీఓ -
కేసులను సామరస్యంగా పరిష్కరించుకోవాలి
జనగామ రూరల్: కక్షిదారులు సామరస్యంగా కేసులను పరిష్కరించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి శంకర్ శ్రీదేవి అన్నారు. మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఆదేశాల మేరకు జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 18 నిర్వహించే ఎన్ఐ యాక్ట్(నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్)పై ప్రత్యేక లోక్ అదాల త్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిట్ఫండ్స్, బ్యాంకుల్లో పెండింగ్లో ఉన్న ఎన్ఐ యాక్ట్ కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో జూనియర్ సివిల్ జడ్జి జి.శశి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.సందీప, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బండ దయాకర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంజనగామ: అర్హులైన ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు సకాలంలో అందించడమే తన లక్ష్యమని, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడకుండా పెండింగ్లో ఉన్న కల్యాణలక్ష్మి దరఖాస్తులను పరిష్కరించి చెక్కులను అందజేస్తున్నామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం జనగామ తహసీల్దార్ కార్యాలయంలో పట్టణం, మండలానికి చెందిన కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి 39 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొంతకాలంగా కల్యాణలక్ష్మి చెక్కులు పెండింగ్లో ఉండటాన్ని గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.నేటి పరీక్ష వాయిదాజనగామ: స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ఎస్డీసీ) విభాగంలోని యూనిట్ 1, యూనిట్ 2కు సంబంధించి జిల్లాలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల కోసం ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఎంపిక కోసం నేడు(బుధవారం)రోజున నిర్వహించాల్సిన పరీక్షను అనివార్య కారణాల వల్ల ఈనెల 19వ తేదీన నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి కుమారస్వామి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. మరిన్ని వివరాలకు–79954 30401 నంబర్ను సంప్రదించాలన్నారు. నేటి నుంచి భద్రకాళి శాకంబరీ ఉత్సవాలు హన్మకొండ కల్చరల్: వరంగల్ భద్రకాళి దేవాలయంలో బుధవారం శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం భద్రకాళి అమ్మవారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు సహస్ర కలశాభిషేకంలో ఉపయోగించే వేయి మృత్తికా ఘటాలకు సూత్ర వేష్ఠనం (కుండలకు దారాలు చుట్టడం) జరిపారు. రాత్రి 7 గంటలకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులలో సర్వాంగసుందరంగా మండల రచన చేశారు. చంద్రోదయం అనంతరం రాత్రి అంకురార్పణ జరిపారు. -
పోలీస్ క్రీడాకారులు స్ఫూర్తిగా నిలవాలి
వరంగల్ క్రైం: ఆరోగ్య పరిరక్షణలో పోలీస్ క్రీడాకారులు తోటి సిబ్బందికి స్ఫూర్తిగా నిలవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తెలిపారు. ఇటీవల మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లో జరిగిన ఐదో రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ మొదటి క్లస్టర్లో మొత్తం 61 పతాకాలు సాధించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రీడాకారులకు సోమవారం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. ఈసభకు వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు సురేశ్కుమార్, శ్రీనివాస్, బాలస్వామి, ప్రభాకర్రావు, ఏసీపీ నాగయ్య, ఆర్ఐ స్పర్జన్రాజ్తో ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బాధితులకు సత్వర న్యాయం చేయాలి భరోసా కేంద్రానికి వచ్చే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. సోమవారం వరంగల్ భరోసా కేంద్రాన్ని సందర్శించిన సీపీ బాధితులకు అందిస్తున్న కౌన్సెలింగ్, న్యాయ సహాయం, వైద్య సేవలు, మానసిక పరామర్శ, పునరావాస చర్యలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. సీపీతో పాటు క్రైమ్ అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీ సదయ్య, భరోసా కేంద్రం ఇన్స్పెక్టర్ సువర్ణ, మహిళా పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ సూర్యప్రసాద్, భరోసా ఎస్సై కిరణ్మయి, కౌన్సెలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత -
మంగళవారం శ్రీ 14 శ్రీ జూలై శ్రీ 2026
జనగామ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల (అటానమస్) ఈ విద్యా సంవత్సరంలో రికార్డు స్థాయిలో అడ్మిషన్లతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త కోర్సులు, మెరుగైన విద్యా ప్రమాణాలు, ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టడంతో విద్యార్థులు భారీ సంఖ్యలో కళాశాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టిన ఏఈడీపీ (అప్రెంటిషిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాం) కింద ప్రారంభమైన బీకాం (బీఎఫ్ఎస్ఐ), బీఎస్సీ హెల్త్ కేర్ కోర్సులకు అనూహ్య స్పందన లభించింది. అందుబాటులో కోర్సులు ప్రస్తుతం బీఏ (ఇంగ్లిష్, తెలుగు మీడియం), బీకాం సీఏ, బీఎస్సీ లైఫ్ సైన్స్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, బీఎస్సీ హెల్త్ కేర్, బీఎఫ్ఎస్ఐ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏఈడీపీ కింద ప్రారంభమైన బీఎఫ్ఎస్ఐ కోర్సు ద్వారా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాలకు అవసరమైన నైపుణ్యాలను, బీఎస్సీ హెల్త్ కేర్ ద్వారా ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలు, ఆరోగ్య రంగానికి అవసరమైన శిక్షణను విద్యార్థులకు అందించేలా రూపొందించారు. బీఎఫ్ఎస్ఐ కోర్సుకు అధిక డిమాండ్ ఉండడంతో మరో 60 సీట్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఏఈడీపీలో రాష్ట్రంలో మొదటి స్థానం రాష్ట్ర వ్యాప్తంగా 90 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మాత్రమే ఈ ఏఈడీపీ కోర్సులను అమలు చేస్తుండగా, అడ్మిషన్ల పరంగా ఏబీవీ డిగ్రీ కళాశాల రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటికే దోస్త్ మూడు దశల కౌన్సెలింగ్ పూర్తికాగా, స్లైడింగ్ ఆప్షన్లు కూడా ముగిశాయి. పూర్వ వైభవం ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న పాత విద్యార్థులు 350 మంది ఉండగా, ఈ ఏడాది కొత్తగా ఇప్పటికే 487 మంది అడ్మిషన్లు పొందారు. దీంతో మొత్తం విద్యార్థుల సంఖ్య 837కు చేరుకుంది. స్పెషల్ ఫేజ్, స్పాట్ అడ్మిషన్ల అనంతరం మరో 150 నుంచి 200 మంది వరకు చేరే అవకాశముందని కళాశాల వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో విద్యార్థుల సంఖ్య 1000 మార్కును దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. జిల్లాతో పాటు మంచిర్యాల, ఖమ్మం తదితర జిల్లాల నుంచి కూడా విద్యార్థులు ఈ కళాశాలను ఎంపిక చేసుకోవడం గమనార్హం. అధ్యాపకులను పెంచాల్సిందే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అధ్యాపకుల కొరత సవాలే. కళాశాలకు 30 రెగ్యులర్ పోస్టులు మంజూరై ఉండగా ప్రస్తుతం కేవలం 9 మంది రెగ్యులర్ అధ్యాపకులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు ఇద్దరు కాంట్రాక్ట్, 11 మంది గెస్ట్ లెక్చరర్లు కలిపి మొత్తం 22 మంది బోధన అందిస్తున్నారు. మరో 7 నుంచి 8 మంది అధ్యాపకులు అవసరమని కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యార్థుల నుంచి విశేష ఆదరణప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి ఆధారిత కొత్త కోర్సులకు విద్యార్థులు విశేష ఆదరణ చూపుతున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఎస్సీ, బీసీ తదితర ప్రభుత్వ వసతి గృహాల్లో సీట్లు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ కె.శ్రీనివాస్, ప్రిన్సిపాల్, డిగ్రీ కళాశాల58బీఎస్సీహెల్త్ కేర్అందుబాటులో ఉన్న కోర్సులు: బీఏ(తెలుగు/ఇంగ్లిష్ మీడియం) బీకాం(సీఏ) బీకాం(బీఎఫ్ఎస్ఐ) బీఎస్సీ లైఫ్ సైన్స్ బీఎస్సీ ఫిజికల్ సైన్స్ బీఎస్సీ హెల్త్ కేర్మొత్తంసీట్లు అడ్మిషన్లు భర్తీ శాతం60 55కొత్త కోర్సులకు విద్యార్థుల నుంచి ఫుల్ డిమాండ్ ఏఈడీపీలో రికార్డు స్థాయిలో అడ్మిషన్లు సీట్ల భర్తీలో రాష్ట్రంలోనే తొలి స్థానం ఇతర జిల్లాల నుంచి సైతం చేరుతున్న విద్యార్థులు -
ప్రజల్లో నమ్మకం కలిగించాలి
ఈఫొటోలో కనిపిస్తున్న దివ్యాంగ బాలుడి పేరు ఎండీ జాఫర్. చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామం. గ్రామానికి చెందిన ఎండీ జామీరుద్దీన్, యాకూబీ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె. బాబు జాఫర్ పుట్టకతోనే రెండు చేతులు కాళ్లు సరిగా లేక స్పైనల్ సమస్యతో పుట్టాడు. నాటి నుంచి తల్లిదండ్రులు ఆస్పత్రుల చుట్టూ తిరిగి రూ.6 లక్షలకు పైగా ఖర్చు చేశాడు. తండ్రి కూలి పనితో జీవనం కొనసాగిస్తున్నా, వారికి ఎలాంటి ఆధారం లేదు. నెలకు రూ.4 వేల వరకు మందులకు, ఇతర అవసరాలకు ఖర్చు చేయాల్సి వస్తోంది. కనీసం దివ్యాంగ పెన్షన్ అయిన వస్తే మందులకు అవుతాయని సదరం సర్టిఫికెట్ ఇచ్చి పింఛన్ మంజూరు చేయాలని తల్లిదండ్రులు వేడుకున్నారు. జనగామ రూరల్: ప్రజలకు తమ సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకాన్ని ప్రతీ శాఖ అధికారులు కలిగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి 335 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ భాస్కర్, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల్లో కొన్ని ఇలా.. ● లింగాల ఘణపురం మండలం వేలేరు గ్రామానికి చెందిన పల్లా వెంకటలక్ష్మి, తన తల్లిదండ్రులు పసుపు కుంకుమ కింద ఇచ్చిన భూమిని తన అన్నదమ్ములు తెలియకుండా వారి పేరు మీద పట్టా చేసుకున్నారని, విచారణ చేపట్టి ఆ భూమిని తన పేరు మీదకు పట్టా చేయాలని వినతి అందజేశారు. ● స్టేషన్ ఘన్పూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు డిప్యుటేషన్లో జనగామ మండలం పసరమడ్ల బాలుర ఆశ్రమ పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. మూడేళ్లుగా అక్కడే ఉండి అధికారుల అండదండలతో స్థానచలనం లేకుండా ఉంటున్నారని, డిప్యుటేషన్ రద్దు చేసి పీడీగా పంపించాలని స్టేషన్ ఘన్పూర్ మండలానికి చెందిన లకావత్ చిరంజీవి వినతిపత్రం అందించారు. ● బచ్చన్నపేట మండలం అలింపూర్ గ్రామానికి చెందిన పాకాల నాగయ్య పోచన్నపేట గ్రామంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా విధులు నిర్వహిస్తున్నాడని, కొన్ని నెలల క్రితం బచ్చన్నపేట ఎస్పీఎం కొత్తపల్లి రాజేశ్ అనే వ్యక్తికి పెన్షన్ డబ్బులు రూ.5లక్షలు ఇచ్చి పంపిస్తున్నామని చెప్పి, డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని అలింపూర్కు చెందిన పాకాల ప్రమీల అర్జీ అందించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తన భర్త నాగయ్య అనారోగ్యానికి గురయ్యాడని కలెక్టర్తో వాపోయింది. విచారణ చేపట్టి పోస్టల్ అధికారి డబ్బులతో పరారైన వ్యక్తిపై చర్యలు తీసుకోని డబ్బులు ఇప్పించాలని వేడుకుంది. ● పట్టణంలోని 15 వార్డు జూనియర్ కళాశాల పరిసర ప్రాంతంలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారని, రాత్రి వేళల్లో మహిళలు, పిల్లలు బయటికి వెళ్లలేకపోతున్నారని దిగోజు సాంబయ్యచారి వినతి అందజేశారు. తక్షణం బెల్ట్ షాపును ఎత్తివేయాలని కోరారు. వేగంగా ప్రజల సమస్యలు పరిష్కరించాలి కలెక్టరేట్ గ్రీవెన్స్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
టెట్లో ఉత్తీర్ణత శాతం 31.25
జిల్లాలో టెట్ ఫలితాల వివరాలు● పేపర్–1లో మెరుగు.. పేపర్–2లో నిరాశ జనగామ: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు సోమవారం విడుదల కాగా, జిల్లాలో పేపర్–1తో పోలిస్తే పేపర్–2లో అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం తక్కువగా నమోదైంది. ముఖ్యంగా గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ విభాగాల్లో అర్హత సాధించిన వారి సంఖ్య ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం. ఓవరాల్గా రెండు పేపర్లలో 1,565 మంది పరీక్షలు రాయగా, కేవలం 489 మాత్రమే అర్హత సాధించడంతో 31.25శాతం పాస్ శాతం నమోదైంది. రాబోయే ఉపాధ్యాయ నియామకాల దృష్ట్యా అభ్యర్థులు సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు టెట్ విధానంపై మరింత అవగాహన పెంచుకొని ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ అయితే ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఉత్తీర్ణత శాతం పరీక్షరాసినవారు ఉత్తీర్ణులు4891,565355207675535172110పేపర్–2 (మ్యాథ్స్,సైన్స్)పేపర్–2 (సోషల్)మొత్తంపేపర్–1 -
సందర్శన.. సమీక్ష
ములుగు/కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని గుట్టగంగారంలో ఉన్న దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల పథకాన్ని సోమవారం రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సందర్శించారు. ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. మంత్రులు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద ఉన్న హెలిపాడ్ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. వారికి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ రామ్నాథ్ కేకన్, పీఓ లెనిన్ వత్సల్ టొప్పో పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అక్కడినుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా మంత్రులు సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. బ్యారేజీని పరిశీలించారు. నీటి స్టోరేజీ, సామర్థ్యం, గేట్ల పనితీరు, ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడినుంచి గట్టలగంగారం పరిధిలోని దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల వద్దకు చేరుకొని పంపింగ్ స్టార్టింగ్ పాయింట్ను పరిశీలించారు. మోటార్ల పనితీరు, మూడు ఫేజ్లలో ఎన్ని మోటార్లు ఉన్నాయి.. ప్రస్తుతం ఎన్నింటి ద్వారా నీటిని దిగువకు ఎత్తిపోస్తున్నారని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవాదుల వద్ద ఏర్పాటు చేసిన సమావేశం వద్దకు చేరుకొని ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అధికారులు వారికి ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి మాట్లాడారు. దేవాదుల వద్ద ఉన్న పది మోటార్లు నిరంతరం పంపింగ్ చేయాలని ఆదేశించారు. దీని పరిధిలోని 22 రిజర్వాయర్లను నింపుతామన్నారు. ఈ నీటితో రైతులకు సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రాజెక్టును సందర్శించి, ఏడాది వ్యవధిలోనే పూర్తిచేయాలని స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారని తెలిపారు. లక్ష్య సాధన కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. మధ్యాహ్నం 1.31గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరిగివెళ్లిపోయారు. ఎస్పీ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీస్ భద్రత వలయంలో మంత్రుల పర్యటన సాగింది. కార్యక్రమంలో స్టేషన్ఘన్పూర్, వర్ధన్నపేట, పాలకుర్తి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, యశస్వినిరెడ్డి, అదనపు కలెక్టర్లు మహేందర్ జి.సంపత్రావు, ములుగు డీఎస్పీ రవీందర్, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ బట్టు, ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఈఎన్సీ జనరల్ రమేశ్ బాబు, ఇంజనీరింగ్ అధికారులు ధర్మ, మోహన్రావు, శరత్బాబు, ప్రవీణ్ కుమార్, స్థానిక తహసీల్దార్ సయ్యద్ సర్వర్ తదితరులు పాల్గొన్నారు.దేవాదుల నీటితో 22 రిజర్వాయర్లను పూర్తిగా నింపుతాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి సమ్మక్క సాగర్ బ్యారేజీ, దేవాదుల ప్రాజెక్టు పరిశీలన అధికారులతో సమీక్ష, నీటి సామర్థ్యం, మోటార్ల పనితీరుపై ఆరా సాగునీరందిస్తామని రైతులకు హామీ -
ఆరోగ్యంపై దృష్టి సారించాలి
జనగామ రూరల్: విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఆరోగ్యం, ప్రాథమిక విద్యా నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సోమవారం మండలంలోని చౌడారం మోడల్ పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా ఆల్బెండజోల్ మాత్రలను అందించారు. అనంతరం కలెక్టర్ పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న అన్అకాడమీ తరగతుల బోధనా విధానాన్ని కలెక్టర్ పర్యవేక్షించారు. కలెక్టర్ స్వయంగా రూపొందించిన ‘గెట్ ఐటీ వ్రైట్ ’ ఇంగ్లిష్ గ్రామర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ‘ఫాస్ట్ మ్యాథ్స్’ పుస్తకంలోని ప్రతీ అంశాన్ని రోజూ విద్యార్థులకు బోధించాలని సూచించారు. కార్యక్రమంలో విద్యాశాఖ ఏడీ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు. యూనిఫాంలను త్వరగా పంపిణీ చేయాలి రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలల విద్యార్థినులకు ఎట్టిపరిస్థితుల్లోనూ 15వ తేదీలోపు యూనిఫాంలను పంపిణీ చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సోమవారం యూనిఫాంల పంపిణీ ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డీఆర్డీఓ భాస్కర్, ఏపీడీ నూరుద్దీన్, విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
నేడు డయల్ యువర్ డీఎం
జనగామ: ప్రయాణికుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జనగామ డిపోలో నేడు(మంగళవారం) డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీఎం ఉష సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిపో పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. బస్సు సర్వీసులు, సౌకర్యాలు, ఇతర ఫిర్యాదులపై ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు. తైక్వాండో పారా నేషనల్ చాంపియన్షిప్లో ప్రతిభస్టేషన్ఘన్పూర్: మండలంలోని విశ్వనాధ పురం గ్రామానికి చెందిన మాచర్ల కృష్ణవేణి అనే క్రీడాకారిణి ఐదో ఇండియన్ తైక్వాండో పారా ఓపెన్ నేషనల్ చాంపియన్ 2026–27 పోటీలలో ఉత్తమ ప్రతిభతో ద్వితీయ స్థానంలో నిలిచి రజక పతకం సాధించింది. మహారాష్ట్రలోని పూణెలోని శ్రీశివఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈనెల 10, 11వ తేదీల్లో జరిగిన పోటీల్లో రాష్ట్రం నుంచి పాల్గొన్న కృష్ణవేణి ఉత్తమ ప్రతిభతో ద్వితీయ స్థానంలో నిలిచింది. ప్రతిభ కనబరిచిన కృష్ణవేణిని గ్రామస్థులతో పాటు క్రీడాకారులు అభినందిస్తున్నారు. దరఖాస్తుల ఆహ్వానంజనగామ: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి 10వ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆదేశాల మేరకు ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని, ప్రాస్పెక్టస్–కమ్–దరఖాస్తు పత్రాలు ఈ నెల 29 నుంచి ఆగస్టు 29 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు మీసేవా, టీజీఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటురఘునాథపల్లి: మండల కేంద్రానికి చెందిన పసునూరి సురేష్–రమ్య దంపతుల కుమారుడు రాజా ఏకాంబరం ఆన్లైన్ క్విజ్ పోటీల్లో అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (పంజాబ్) వారు నిర్వహించిన ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్లో అత్యున్నత ప్రతిభ చాటడంతో సంస్థ అతడిని సూపర్ టాలెంటెడ్ కిడ్గా గుర్తిస్తూ రికార్డులో చోటు కల్పించింది. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చేతుల మీదుగా రాజా ఏకాంబరం తన తండ్రితో కలిసి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ అందుకున్నాడు. ఈ సందర్భంగా బాలుడిని కలెక్టర్ అభినందించారు. రాజా ఏకాంబరం మండల కేంద్రంలోని సెయింట్ మేరీస్ హైస్కూల్లో 4వతరగతి చదువుతున్నాడు. ఘనంగా పోతన సాహితీ పద్యనాటకోత్సవాలుపాలకుర్తి టౌన్: బమ్మెర పోతన సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు చేరవేయాలనే లక్ష్యంతో నెల్లుట్ల ఫౌండేషన్ కవులు, కళాకారుల ఐక్యవేదిక జనగామ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో సోమవారం మండలంలోని బమ్మెర పోతన స్మృతివనంలో పోతన సాహితీ పద్యనాటకోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నెల్లుట రవీందర్రావు మాట్లాడుతూ.. తెలంగాణలోని 33 జిల్లాల్లో పోతన జీవితంపై పద్యనాటక ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. అనంత రం పోతన సమాధి వద్ద నివాళులర్పించి, కవులు, కళాకారులను సత్కరించారు. సర్పంచ్ రమ్యప్రశాంత్, ప్రముఖ వైద్యుడు మాచర్ల భిక్షపతి, వీణావాణి శర్మ, రాపోలు సత్యనారాయణ, జి.కృష్ణ, పెట్లోజు సోమేశ్వరాచారి, రాపాక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత పటిష్టం
● ట్రాన్స్కో సూపరింటెండింగ్ ఇంజనీర్ సంపత్రెడ్డి బచ్చన్నపేట : విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి జిల్లాలో విద్యుత్ సరఫరాలో మరో ముందడుగు వేశామని ట్రాన్స్కో సూపరింటెండింగ్ ఇంజనీర్ చెరుకు సంపత్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని రామచంద్రాపూర్ ట్యాపింగ్ పాయింట్ నుంచి పడమటి కేశ్వాపూర్ 33/11 కేవీ సబ్స్టేషన్ వరకు సుమారు 6 కిలోమీటర్ల పొడవున 33 కేవీ లింక్ లైన్ నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు. ఈ కొత్త 33 కేవీ లింక్ లైన్ ద్వారా పడమటి కేశ్వాపూర్ సబ్స్టేషన్న్కు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా మార్గం అందుబాటులోకి వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఆపరేషన్స్ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి , డీఈ ఎం.సీ. విజయ్, జనగామ ఏడీఈ వేణుగోపాల్, కన్స్ట్రక్షన్ ఏడీఈ స్వామిరెడ్డి, ఏఈ సతీష్, కన్స్ట్రక్షన్ ఏఈ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సర్లో ఘన్పూర్ స్పీడ్
జనగామ: జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ వేగంగా సాగుతోంది. జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో ఫారాల పంపిణీ దాదాపు పూర్తికాగా, ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు నమోదైన గణాంకాల ప్రకారం 7.67 లక్షల ఓటర్లలో 47శాతం ఫారాలు ఇప్పటికే డిజిటైజేషన్ అయ్యాయి. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం డిజిటైజేషన్లో జిల్లాలో ముందంజలో ఉండగా, మిగిలిన ప్రక్రియను అధికారులు యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లో 865 మంది బీఎల్ఓలు విధులు నిర్వహిస్తున్నారు. ఎస్ఐఆర్ ఇలా... జిల్లాలో ఇప్పటి వరకు 3,66,628 ఫారాలు (47.77 శాతం) డిజిటైజ్ చేయగా, 3,95,329 ఫారాలు (51.28 శాతం) ఇంకా మిగిలి ఉన్నాయి. ఓటర్లే స్వయంగా సమర్పించిన లేదా బీఎల్ఓలు ధ్రువీకరించిన ఫారాల సంఖ్య 1,859 (0.24 శాతం)గా నమోదైంది. అలాగే బీఎల్ఓల ద్వారా 3,64,327 ఫారాల(47.47 శాతం)ను ధ్రువీకరించగా, 1,89,198 మంది (24.65 శాతం) తమ వివరాలను స్వయంగా మ్యాప్ చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ద్వారా 1,69,820 మంది(22.13 శాతం) వివరాలు మ్యాప్ చేయించుకున్నారు. ఇంకా 5, 311(0.69 శాతం) ఫారాలకు మ్యాపింగ్ జరగాల్సి ఉండగా, మొత్తం 73,838 ఫారాల్లో లోపాలు ఉన్నట్లు(9.62 శాతం) గుర్తించారు. ‘స్టేషన్’ ముందజ సర్ ఫారాల డిజిటైజేషన్లో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ముందంజలో ఉంది. జనగామ, పాలకుర్తి నియోజకవర్గాల్లో కూడా అధికారులు క్షేత్రస్థాయిలో ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. జనగామలో ప్రోజెనీ(వారసత్వ) మ్యాపింగ్ 53,983 (21.64 శాతం)గా నమోదైంది. 23,645 లోపాలు (9.48 శాతం) గుర్తించారు. ఘన్పూర్లో ప్రోజెనీ(వారసత్వ)మ్యాపింగ్ 61,724 (24.04 శాతం)గా నమోదైంది. 25,570 లోపాలు(9.96 శాతం)గా ఉన్నాయి. పాలకుర్తిలో ప్రోజెనీ (వారసత్వ) మ్యాపింగ్ 54,113 (20.71 శాతం)గా నమోదైంది. 24,623 లోపాలు (9.43 శాతం)గా గుర్తించారు. వేగంగా డిజిటైజేషన్ జిల్లాలో ఫారాల ప్రక్రియ 100 శాతం పూర్తవడం ఎన్నికల నిర్వహణలో కీలక ముందడుగుగా నిలిచింది. అయితే డిజిటైజేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. మిగిలిన ఫారాల నమోదు, లోపాల పరిష్కారం, మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తే ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్దేశిత గడువులో పూర్తి చేసే అవకాశం ఉంది. ఫారాల భర్తీకి ప్రత్యేక శిబిరాలు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఫారాల భర్తీలో ఓటర్లకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బీఎల్ఓలతో పాటు వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువకులు, విద్యార్థులు కలిసి గ్రామపంచాయతీలు, కాలనీలు, వార్డులు, ప్రధాన కూడళ్లలో ప్రత్యేక సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో ఓటర్లకు ఫారాల నింపడం, అవసరమైన పత్రాల పరిశీలన, వివరాల నమోదు, సందేహాల నివృత్తిలో సహకారం అందిస్తున్నారు. నిర్ణీత గడువులో ప్రతీ అర్హత కలిగిన ఓటరు ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసుకునేలా అధికారులు విస్తృత అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.జిల్లాలో వేగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్ 7.67 లక్షల ఓటర్లలో 47శాతం ఫారాలు పూర్తి కొనసాగుతున్న లోపాల గుర్తింపు ఊరూరా జీపీలు, స్వచ్ఛంద సంస్థల సహకారం మూడు నియోజకవర్గాల వారీగా ఎస్ఐఆర్ పురోగతి నియోజకవర్గం ఓటర్లు డిజిటైజేషన్ బీఎల్ఓ స్వీయ ధ్రువీకరణ మ్యాపింగ్ జనగామ 2,49,437 1,11,797 1,10,999 55,108 స్టే.ఘన్పూర్ 2,56,806 1,37,052 1,36,199 73,156 పాలకుర్తి 2,61,241 1,17,779 1,17,129 60,934 -
ఆప్షన్ ఉద్యోగుల్లో ఆశలు
హన్మకొండ: రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న మూడో డిస్కం తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్పీడీసీఎల్)కు వెళ్లేందుకు ముందుకు వచ్చిన విద్యుత్ ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. మేలో పూర్తి కావాల్సిన బదిలీ నియామక ప్రక్రియ వివిధ కారణాలతో నిలిచిపోయింది. పలు అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో.. టీజీ ఆర్పీడీసీఎల్కు లైసెన్స్ మంజూరు తర్వాతనే బదిలీ నియామక ప్రక్రియ చేపట్టాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అయితే, బహిరంగ విచారణ నిర్వహించిన తెలంగాణ ఈఆర్సీ వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, ప్రభుత్వానికి పలు కండీషన్లు పెట్టి ఎట్టకేలకు ఈనెల 10వ తేదీతో లైసెన్స్ జారీ చేసింది. మూడో డిస్కంలోకి ప్రస్తుతమున్న టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్కో, టీజీ ఎస్పీపీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి ఆసక్తి కనబర్చే అధికారులు, ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు నాలుగు విద్యుత్ సంస్థల నుంచి ఆసక్తి కనబర్చే ఉద్యోగులు, అధికారుల నుంచి ఆప్షన్లు అడిగారు. పదోన్నతి కల్పిస్తామనడంతో వెళ్లేందుకు పోటీ.. ముందుగా కొత్త డిస్కం ఎలా ఉంటుంది.. వెళ్లాలా వద్దా? అని మల్లగుల్లాలు పడిన ఇంజనీర్లు, ఇతర అధికారులు, ఉద్యోగులు చివరకు పెద్ద ఎత్తున స్పందించారు. పదోన్నతి కల్పిస్తామని జీఓలో పేర్కొనడంతో.. ప్రస్తుతం పనిచేస్తున్న డిస్కంలో ఇప్పట్లో పదోన్నతి రాదు అని భావించిన అధికారులు, ఉద్యోగులు, ఆర్టిజన్లు ఆర్పీడీసీఎల్కు వెళ్లేందుకు పోటీపడ్డారు. ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు ఆసక్తి కలిగిన అధికారులు, ఉద్యోగుల నుంచి సమ్మతి కోరింది. టీజీ ఆర్పీడీసీఎల్కు మొత్తం 2,000 మంది అధికారులు, ఉద్యోగులు అవసరమని జీఓలో పేర్కొంది. రాష్ట్రంలోని టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్కో, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్కు చెందిన ఉద్యోగుల నుంచి ఆప్షన్లు కోరారు. దీంతో ఒక్క టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి 1,252 మంది ఆప్షన్లు ఇచ్చారు. ఇతర డిస్కంల్లోను ఇదే పోటీ నెలకొందని విద్యుత్ ఉద్యోగులు తెలిపారు. ఆప్షన్లో పొందుపరిచిన వివరాలు... వాస్తవ వివరాలు సరి చూసి జాబితాను మూడో డిస్కంకు పంపారు. మేలోనే బదిలీ నియామక ప్రక్రియ పూర్తి చేసేలా షెడ్యూల్ ప్రకటించిన టీజీ ఆర్పీడీసీఎల్ తర్వాత వెనక్కి తగ్గింది. మే 13 నుంచి 19 వరకు బదిలీ ఉత్తర్వులు, జాయినింగ్, పోస్టింగ్ పూర్తి అయ్యేలా ఖరారు చేసినా చివరకు ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం ఈఆర్సీ లైసెన్స్ మంజూరు చేసి తర్వాతే బదిలీ నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రచారం జరిగింది. బదిలీల కోసం ఎదురుచూపులు.. టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి మొత్తం 1,252 మంది ఆర్పీడీఎల్కు వెళ్లేందుకు ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో జూనియర్ లైన్మెన్లు 16 మంది, అసిస్టెంట్ లైన్మెన్లు 271 మంది, లైన్మెన్లు 116, లైన్ ఇన్స్పెక్టర్లు 31, సీనియర్ ఇన్స్పెక్టర్లు 4, ఫోర్మెన్లు 2, అసిస్టెంట్ ఇంజనీర్స్ 115, అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్లు 61, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు 59, డివిజనల్ ఇంజనీర్లు 28, సూపరింటెండెంట్ ఇంజనీర్లు 4, ఒక చీఫ్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్స్ 265, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ 66, ఆసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్స్ 10, అకౌంట్స్ ఆఫీసర్స్ 5, సీనియర్ అసిస్టెంట్లు 50, జూనియర్ అసిస్టెంట్లు 20, జూనియర్ పర్సనల్ ఆఫీసర్స్ 15, పర్సనల్ ఆఫీసర్స్ 2, ఆర్టిజన్ గ్రేడ్కు చెందిన వారు 5, ఆర్టిజన్ గ్రేడ్–3కి చెందిన వారు ఆరుగురు, ఒక్కరు ఆర్టిజన్ గ్రేడ్– 4, ఒక్క రికార్డు అసిస్టెంట్, ఒక్క సివిల్ ఈఈ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. టీజీ ఆర్పీడీసీఎల్కు లైసెన్స్ రావడంతో మరోసారి ఆప్షన్లు ఇచ్చిన వారు పదోన్నతి లభిస్తుందనే సంతోషంలో ఉన్నారు. బదిలీ నియామక ప్రక్రియ ఎప్పుడు చేపడతారోనని అధికారులు, ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. టీజీఆర్పీడీసీఎల్కు కావాల్సిన ఉద్యోగులు 2,000 ఒక్క టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి 1252 మంది దరఖాస్తు మేలో బదిలీ ఉత్తర్వులు వెలువడాల్సి ఉండగా నిలిచిన ప్రక్రియ ఎట్టకేలకు డిస్కంకు లైసెన్స్ జారీ.. బదిలీలకు ఎదురుచూపులు -
యువత క్రీడా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
జనగామ రూరల్: యువత చదువుతో పాటు క్రీడా నైపుణ్యాలు పెంపోందించుకోవాలని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఉప సంచాలకుడు రవీందర్ పిలుపునిచ్చారు. తెలంగాణ స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎంజేపీ బాలుర పాఠశాలలో నిర్వహించారు. ఈసందర్భంగా క్రీడాకారులకు ఆధునిక శిక్షణ విధానాలు, ఫిట్నెస్ స్పోర్ట్స్ అండ్ సైన్స్, పోషకాహారం గాయాల నివారణ, క్రీడల్లో ఉన్నత ప్రతిభ సాధనకు అవసరమైన అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి నరసింహరావు, అంతర్జాతీయ కోచ్ రామకృష్ణ, స్కేటింగ్ కోచ్ విజయ భాస్కర్, స్విమ్మింగ్ కోచ్ శశాంక్, ఫిజియోథెరపీ నిపుణులు, గోకుల్ పాలిటెక్నిక్ క్రీడాకారులు, శారీరక విద్య ఉపాధ్యాయులు, కోచ్లు హాజరయ్యారు. భూసమస్యల పరిష్కారానికే రీసర్వేకొడకండ్ల: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంతో పాటు భూ భారతి చట్టాన్ని సమర్థవంతంగా అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూ రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని అదనపు కలెక్టర్(రెవెన్యూ) బెన్షాలోమ్ అన్నారు. ఆదివారం నర్సింగాపురం గ్రామంలో నిర్వహించిన భూ భారతి–భూ సర్వే అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతతో భూముల సరిహద్దులను కచ్చితంగా నిర్ధారించి భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం రీసర్వేను నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఉత్తలూరి అనీల్బాబు, ఎంపీడీఓ రవిందర్, జీపీఓ భిక్షపతి పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధికి నిధులు తీసుకొస్తాఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జనగామ: పట్టణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులను తీసుకురావడానికి కృషి చేస్తానని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 23వ వార్డు శ్రీమల్లన్న దేవాలయం వద్ద చేపట్టనున్న ప్రహారీ, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఎంపీ కిరణ్ కుమార్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మల్లన్న స్వామిని దర్శించుకుని విలేకరులతో మాట్లాడారు.. అర్బన్ చాలెంజ్ ఫండ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మరిన్ని నిధులు సమకూరేలా ప్రయత్నిస్తానని చెప్పారు. పట్టణానికి అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతిలక్ష్మినారాయణనాయక్, మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ‘కస్తూర్బా’లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం చిల్పూరు: మండలంలోని రాజవరం గ్రామ సమీపంలో ఉన్న కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీలో–15, బైపీసీలో 5 సీట్లు ఖాళీలు ఉన్నట్లు ఎస్ఓ స్వప్న ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో 10వ తరగతి పూర్తి చేసిన అమ్మాయిలు ఈ అవకాశాన్ని సధ్వినియోగం చేసుకోవాలన్నారు. ఈనెల 14 లోపు సర్టిఫికెట్లతో కేజీబీవీలో సంప్రదించాలని కోరారు. ఖిలాషాపూర్లో.. రఘునాథపల్లి: మండలంలోని ఖిలాషాపూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఎంఎల్టీ ఫస్టియర్ కోర్సులో 20 సీట్లు ఖాళీగా ఉన్నట్లు స్పెషల్ ఆఫీసర్ జి.హేమలత తెలిపారు. వివరాల కోసం 9666940586 నెంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. దేవరుప్పులలో.. పాలకుర్తి టౌన్ (దేవరుప్పుల): దేవరుప్పుల మండలంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో స్పాట్ అడ్మిషన్లకు అవకాశం ఉన్నట్టు ప్రత్యేక అధికారి రజిత తెలిపారు. ప్రస్తుతం 6వ తరగతిలో 10సీట్లు, 7వ తరగతిలో 20, ఇంటర్ బైపీసీలో 20, ఎంపీసీలో 20 ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గల విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
‘నులి’పేద్దాం
జనగామ రూరల్: పిల్లలు నులిపురుగుల బారిన పడకుండా వైద్యారోగ్యశాఖ నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 13న ముందుగా గుర్తించిన సెంటర్ల వద్ద, ఈనెల 20న మాప్– అప్డే సందర్భంగా మిగిలిపోయిన పిల్లల కు రెండు విడతల్లో ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. జిల్లాలోని 1నుంచి 19 ఏళ్ల వయసు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇటీవల డీఎంహెచ్ఓ ఇతర శాఖల అధికారులతో కలిసి జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. మొత్తం 1,14,055 మంది పిల్లలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రైమరీ హెల్త్కేర్ సెంటర్లు, వసతి గృహాలు, నర్సింగ్ కళాశాల, జూనియర్ కళాశాలల్లో మొత్తం 1,14,055 మందికి ఆల్బెండజోల్ మాత్రలు అందించనున్నారు. మొత్తం వేయికి పైగా కేంద్రాలు ఏర్పాట్లు చేసి మాత్రలు పంపిణీ చేయనున్నారు. ఒక సంవత్సరం నుంచి రెండేళ్లలోపు మాత్రను, రెండు నుంచి మూడేళ్ల లోపు వారికి ఒక మాత్రను క్రష్ చేసి, మూడేళ్ల నుంచి 19ఏళ్ల పిల్లలకు ఒక మాత్రను చప్పరించి నమిలి మింగాలి. జిల్లాలో ఏ ఒక్కరూ మిగిలి పోకుండా అర్హులైన బాలబాలికలపై ప్రత్యేకార్యచరణ ప్రణాళిక రూపోందించారు. విద్యార్థులకు ఎదుగుదలకు నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, శారీరక, మానసిక ఎదుగుదల మందగించడం, చదువులో ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని అధికారులు కోరుతున్నారు.మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి1నుంచి 19ఏళ్ల లోపు ఉన్న విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా నులిపురుగుల నివారణకు తప్పని సరిగా అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి. తల్లిదండ్రులు బాధ్యతగా సమీప సెంటర్కు వెళ్లి వేయించాలి. ఆశాలు సంబంధిత కార్యకర్తలను సంప్రదించి తగు సూచనలు తీసుకోవాలి. –మల్లికార్జున రావు, డీఎంహెచ్ఓ నేటి నుంచి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ 1 నుంచి 19ఏళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరి నులిపురుగుల నివారణకు వైద్యారోగ్య శాఖ చర్యలు -
అక్రమ వధశాలలపై ఉక్కుపాదం
జనగామ: పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న మటన్ దుకాణాలు, అక్రమ వధశాలలపై మున్సిపల్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. కమిషనర్ సీహెచ్.రాజశేఖర్రెడ్డి నేతృత్వంలో ఆదివారం చేపట్టిన తనిఖీల్లో మున్సి పల్ అనుమతులు లేకుండా మేకలు, గొర్రెలను అక్రమంగా నిల్వ ఉంచి వధ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ ఉన్న సుమారు 20 కిలోల నాసిరకం, అపరిశుభ్ర పరిస్థితుల్లో నిల్వ ఉంచిన మాంసాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ నిబంధనలు పాటించకుండా వ్యాపారం కొనసాగించడంతో సంబంధిత నిర్వాహకుడు కరన్లాల్కు రూ.లక్ష జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం గుర్తించిన, అనుమతి పొందిన స్లాటర్ హౌస్లలో మాత్రమే జంతువులను వధించాలని, అక్కడి నుంచి పరిశుభ్రమైన, నాణ్యమైన మాంసాన్నే వినియోగదారులకు విక్రయించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూ.లక్ష జరిమానా, నాసిరకం మాంసం స్వాధీనం ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యం: మున్సిపల్ కమిషనర్ -
సోమవారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2026
ఎస్.జానకి మృతికి జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు జడల శివ ఆధ్వర్యంలో వరంగల్ కళాకారులు నివాళులు అర్పించారు. ఈమేరకు వరంగల్ గోపాలస్వామి గుడి కొత్తవాడ జంక్షన్లో జానకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జానకి పాడిన పాటను ఆలపించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జనగాం రాము, రమేశ్, శ్రీధరస్వామి, రాంనర్సింహస్వామి, భుజంగరావు, ఇమ్యానియల్ రంగనాఽథ్, చంద్రశేఖర్, సృజన్రావు, నజీర్, యాకూబ్, అనిల్, చందన, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. నందీశ్వరుడితో ఎస్.జానకి (ఫైల్)ప్రజాకవి కాళోజీ నారాయణరావు, గాయని ఎస్.జానకి వాళ్ల మామ మంచి మిత్రులు. 1995లో కాళోజీ వారిని కలవడానికి చైన్నెలోని జానకి నివాసానికి వెళ్లారు. వారితో పాటు నేను వెళ్లాను. ఈ సందర్భంగా ఆమెతో ఫొటో తీసుకున్నాను. జానకమ్మ తనకు లభించిన అవార్డులను, బహుమతులను, షీల్డులను చూపించారు. అలాగే ఆమె భర్త రామప్రసాద్, మామ రామన్, కాళోజీ, కాళోజీ కుమారుడు రవికుమార్ కలిసి గ్రూప్ ఫొటో తీసుకున్నాం. అందరితో ఆప్యాయంగా మాట్లాడే జానకమ్మ మృతి బాధను కలిగిస్తోంది. – మట్టెవాడ అజయ్, మైక్రోఆర్టిస్ట్, గిర్మాజీపేట వరంగల్గాయని జానకమ్మ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు.. ఆమె 2014లో రుద్రేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వరంగల్కు వచ్చారు. దాదాపు గంట పాటు ఆమె రుద్రేశ్వరుడి సన్నిధిలో గడిపారు, ఆలయ పరిక్రమ చుట్టూ తిరుగుతూ శిల్పకళను, నందీశ్వరుడిపై చెక్కిన అలంకరణను పరిశీలించారు. – గంగు ఉపేంద్రశర్మ, వేయిస్తంభాల ఆలయ ప్రధానార్చకుడు, హనుమకొండహన్మకొండ కల్చరల్: ప్రముఖ సినీ నేపథ్యగాయని, గాన కోకిల ఎస్.జానకి మరణంతో ఓరుగల్లు సంగీతకారులు, ఆమె అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెకు ఓరుగల్లుతో విడదీయలేని అనుబంధం ఉంది. శివభక్తురాలైన జానకి 2014 మార్చి 20న వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించారు. రుద్రేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రత్యేకంగా ఆమె వరంగల్కు రావడం విశేషం. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం భద్రకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. 2014లో రుద్రేశ్వరుడిని దర్శించుకునేందుకు వరంగల్కు వచ్చిన గాయని జానకి ఆమె మృతితో ఉమ్మడి జిల్లావాసుల దిగ్భ్రాంతి నివాళులర్పించిన అభిమానులు -
దరఖాస్తుల ఆహ్వానం
జనగామ: మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు టౌన్ లెవల్ ఫెడరేషన్ (టీఎల్ఎఫ్) ద్వారా 30 మంది పారిశుద్ధ్య కార్మికులను రోజువారీ వేతన ప్రాతిపదికన నియమించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ అర్హులైన అభ్యర్థుల నుంచి ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల ను స్వీకరిస్తామన్నారు. దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలని, పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికై న వారికి రోజుకు రూ.400 వేతనం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. నియామకాలు పూర్తిగా తాత్కాలికమైనవని, భవిష్యత్లో శాశ్వత ఉద్యోగంపై ఎ లాంటి హక్కు ఉండదన్నారు. దరఖాస్తు ఫారాలు జనగామ మెప్మా కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయన్నారు. -
15 నుంచి శాకంబరీ ఉత్సవాలు
హన్మకొండ కల్చరల్: శాకంబరీ నవరాత్రోత్సవాలను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ అమ్మవారి అనుగ్రహం పొందాలని భద్రకాళి దేవా లయ ఈఓ, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత అన్నారు. ఆలయ ప్రాంగణంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రామల సునీత, ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, సిబ్బంది పాల్గొని శాకంబరీ ఉత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం రామల సునీత మా ట్లాడుతూ.. ఈ నెల 15 బుధవారం నుంచి జూలై 29 బుధవారం వరకు 15రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు, అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతూ.. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం అమ్మవారికి ఒక్కో క్రమాలలో పూజలు నిర్వహించనున్నట్లు, జూలై 29న మహా శాకంబరీగా అమ్మవారు దర్శనమిస్తారని తెలిపారు. కార్యక్రమంలో నాగరాజుశర్మ, హరినాఽథ్లు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026
ఉమ్మడి జిల్లాలో ఇలా..● అన్నాఅక్క మెంటార్షిప్ కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ఈనెల 1న ప్రారంభం కాగా, సెప్టెంబర్ వరకు కొనసాగనుంది. ● ఈ మెంటార్షిప్ వారానికి రెండు మూడు రోజుల పాటు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకా రం 30 గంటల మేర బోధించనున్నారు. ● ఉమ్మడి జిల్లాలో 14 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నా యి. అందులో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఐదో సెమి స్టర్ చదువుతున్న విద్యార్థులకు అన్నాఅక్క మెంటార్షిప్ టీచింగ్ లెర్నింగ్ ఇంటర్నెషిప్నకు అవకాశం కల్పించారు.సాంకేతిక విద్యనందించాలని.. ప్రభుత్వ యూపీఎస్, హైస్కూల్ విద్యార్థులకు సాంకేతక విద్యను అందించాలని ‘అన్నాఅక్క మెంటార్షిప్, టీచింగ్ ఇంటర్న్షిప్’ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఐదో సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలల్లోని 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ లెర్నింగ్, కంప్యూటింగ్, కోడింగ్, ఫైథాన్, జావా, గేమ్ డిజైన్ వంటి అనేక అంశాలపై బోధిస్తున్నారు.● మెంటార్లుగా డిగ్రీ విద్యార్థులు.. వీరికి ప్రత్యేక శిక్షణ ● అభ్యాసకులు ప్రభుత్వ యూపీఎస్, హైస్కూళ్ల పిల్లలు ● కృత్రిమ మేథ, డిజిటల్ లెర్నింగ్, కోడింగ్ అంశాలపై అవగాహన ● పిల్లల్లో స్నేహపూర్వక వాతావరణం పెంపొందించేలా చర్యలు డిగ్రీ విద్యార్థులకు క్రెడిట్ డిగ్రీ విద్యార్థులు మెంటార్లుగా తెలంగాణ కోడ్మిత్ర పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సర్టిఫికెట్ పొందారు. వీరికి శిక్షణ ఇచ్చారు. బోధన వల్ల వీరికి కమ్యూనికేషన్, టీచింగ్ స్కిల్స్ ఇంప్రూవ్తోపాటు మెంటార్షిప్ 30 గంటల పూర్తి చేసిన విద్యార్థులకు ఐదో సెమిస్టర్ ఫలితాల్లో ఒకటి లేదా రెండు క్రెడిట్ పాయింట్స్ కేటాయిస్తారు. ఇది వారికి ఒక ప్రాజెక్టుగా భావిస్తున్నారు. స్నేహపూర్వక వాతావరణం.. చాలామంది విద్యార్థులు భయం, బెరుకు, స్పీకింగ్ ఫియర్ వల్ల క్లాస్రూమ్లో టీచర్ను సందేహాలు అడగకుండానే ఉండిపోతారు. అన్నాఅక్క మెంటార్షిప్లో భాగంగా విద్యార్థులకు, మెంటార్లకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. భయంలేకుండా సందేహాలు అడగడానికి అవకాశం ఏర్పడుతుంది. త్వరగా అర్థమయ్యే అవకాశం ఉంది. భవిష్యత్ మొత్తం ఏఐదే కాబట్టి బేసిక్ లెవెల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుందని అంచనా. ఇదొక అద్భుత అవకాశం నేను హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి విద్యార్థులకు బోధిస్తున్నాను. నేను డిగ్రీ చదువుతూ ఇలా హైస్కూల్ విద్యార్థులకు బోధించే అవకాశం రావడం అద్భుత అవకాశంగా భావిస్తున్నా. నాలో బోధన నైపుణ్యాలు పెంచుకునే అవకాశం కలిగింది. – బి.భార్గవి, బీసీఏ, ఫైనల్ ఇయర్, కేడీసీ హనుమకొండడిజిటల్ లెర్నింగ్ పుస్తకం చదువుతున్న విద్యార్థులుసాంకేతిక అంశాలు నేర్చుకుంటున్నాం.. అన్నాఅక్క మెంటార్షిప్లో భాగంగా ఏఐ, డిజిటల్ లెర్నింగ్, కోడింగ్ ఫైథాన్, జావా వంటి పలు అంశాలు చెబుతున్నారు. డిజిటల్ లెర్నింగ్కు సంబంధించిన పుస్తకాలు కూడా ఇచ్చారు. వీడియోలను ప్రదర్శిస్తూ బోధిస్తుండడంతో మాకు ఈజీగా అర్థమవుతోంది. – ఎస్ ధనలక్ష్మి, తొమ్మిదో తరగతి, మర్కజీ హైస్కూల్, హనుమకొండ నేర్చుకుంటూ బోధిస్తున్నా.. ఏఐ, డిజిటల్ లెర్నింగ్ తదితర అంశాలను నేను నేర్చుకుంటూ పైడిపెల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులకు బోధిస్తున్నా. ఐపీఎఫ్ బోర్డు ద్వారా ఆయా సాంకేతిక అంశాలను వీడియోలో రూపంలో బోధిస్తుంటే విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారు. – ఎస్.రాజ్కుమార్, బీఏ, కాకతీయ డిగ్రీ కళాశాల, హనుమకొండడిగ్రీ కళాశాల వారీగా ఎంపికైన మెంటార్లు, స్కూళ్లు ఇలా.. మెంటార్లు స్కూళ్లుభవిష్యత్లో ఎంతో ఉపయోగం.. హనుమకొండపరకాల ప్రభుత్వమహబూబాబాద్ ప్రభుత్వజనగామ ఏబీవీపింగిళి మహిళానర్సంపేట ప్రభుత్వకాకతీయ -
నార్లు పోయండి.. నీళ్లిచ్చే బాధ్యత నాది
● ఎమ్మెల్యే కడియం శ్రీహరిరఘునాథపల్లి: కరువు ఉన్నా.. నీళ్లు ఇచ్చే బాధ్యత నాది.. మీరు (రైతులు) నార్లు పోసి నాటు వేయండి.. అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శని వారం మండలంలోని మండలగూడెంలో రూ.15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించి, రూ.10 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మించుకున్న లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ డ్యాగల రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి జలాలను తరలించి బొమ్మకూరు రిజర్వాయర్ నింపి అక్కడి నుంచి మండలగూడెం, ఇతర చెరువులను నింపి పంటలకు సాగు నీరు అందిస్తామన్నా రు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దోచుకోవడమే తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉండాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్చందర్రెడ్డి, మండల అధ్యక్షుడు గాదె మహేందర్రెడ్డి, బొనాసి క్రాంతికుమార్, లింగాజి, బొనాసి కొమురయ్య, నామాల బుచ్చయ్య, కోళ్ల రవిగౌడ్, గొరిగ రవి, తదితరులు పాల్గొన్నారు. -
ఆయుర్వేద వైద్యశిబిరానికి స్పందన
జనగామ: పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు ఏకశిల బీఈడీ కళాశాల ఎదురుగా ఉన్న వేద ఆయుర్వేద పంచకర్మ వెల్నెస్ ఆస్పత్రిలో శనివారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఆస్పత్రి డాక్టర్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రముఖ ఆయుర్వేద వైద్యులతో పాటు హైకోర్టు న్యాయవాది, బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామ సర్పంచ్ బల్ల రవీంద్రనాథ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. శిబిరంలో జనగామలో తొలిసారి ఆయుర్వేద మల ద్వారా శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ చెన్నా అభిలాష్ నేతృత్వంలో అర్షమొలలు తదితర పగుళ్ల సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ బి.శివ ఆధ్వర్యంలో చెవి ముక్కు, కన్ను, గొంతు సంబంధిత సమస్యలను పరిశీలించగా, కంటి వైద్య నిపుణుడు డాక్టర్ అక్షయ్, డాక్టర్ హర్ష రోగులను పరీక్షించారు. మొత్తం 220 మందికి అన్ని రకాల పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మౌనిక, తనుజ, అర్పిత, వెంకటేష్, శివ, సాయి, ఉదయ్, రజిత, రమ్య, యేలేంద్ర, శ్రీలత, వంశీ, సిబ్బంది పాల్గొన్నారు. 220 మందికి వైద్యసేవలు, మందుల పంపిణీ -
రూ.1.50 కోట్లపై ఆరా!
జనగామ: జనగామ కలెక్టరేట్లో అప్పటి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మరో కీలక అంశం తెరపైకి వచ్చినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే దిక్సూచి పుస్తకాల ముద్రణ పేరిట సుమారు రూ.40 లక్షల వ్యయానికి సంబంధించిన అవకతవకలపై ప్రస్తుత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక దృష్టి సారించగా, అప్పటి కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్పై పోలీస్స్టేషన్లో కేసు నమోదు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యవహారం ఇంకా విచారణలో ఉండగానే కలెక్టరేట్ కా ర్యాలయ ఖాతాల్లోని మరో రూ.1.50 కోట్ల నిధుల వినియోగంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏ ఏ కార్యక్రమాలకు ఖర్చు చేశారు? గతంలో కలెక్టర్ కార్యాలయ ఖాతాల్లో ఉన్న ఈ నిధులు ఏ ఏ కార్యక్రమాలకు ఖర్చు చేశారు, సంబంధిత పరిపాలన అనుమతులు ఉన్నాయా, వ్యయానికి సంబంధించిన పూర్తి లెక్కలు, ఓచర్లు, ఆడిట్ రికార్డులు అందుబాటులో ఉన్నాయా? అనే అంశాలపై పరిశీలన జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ నిధులపై క్రమబద్ధమైన ఆడిట్ జరిగిందా? లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కలెక్టరేట్ పరిధిలోని ఖాతాల్లోని నిధులను ప్రభుత్వ బ్యాంకుల్లోనే నిర్వహించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, గతంలో రెండు ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్లు సమాచారం. ఈ అంశంపై వెంటనే స్పందించిన ప్రస్తుత కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ఖాతాలను ప్రభుత్వ రంగ బ్యాంకులకు మార్చారు. ఈ మార్పు వెనుక ఆర్థిక పారదర్శకత, ప్రభుత్వ నిబంధనల అమలే ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు. ఇక మరో ఆసక్తికర అంశంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఫిబ్రవరి 26న బాధ్యతలు స్వీకరించినప్పటికీ, ఆయన డిజిటల్ సంతకం ఆన్లైన్ వ్యవస్థలో వారం నుంచి ఎనిమిది రోజుల తర్వాత మాత్రమే నమోదు అయినట్లు సమాచారం. ఈ ఆలస్యానికి గల కారణాలపై కూడా అంతర్గతంగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఆ సమయంలో ఎలాంటి పరిపాలనా లేదా ఆర్థిక లావాదేవీలు జరిగాయా అనే కోణంలో పరిశీలన కొనసాగుతున్నట్లు సమాచారం. దిక్సూచి వ్యవహారం తర్వాత ఇప్పుడు రూ.1.50 కోట్ల నిధుల వినియోగంపై కూడా కలెక్టరేట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆరోపణలపై అధికారిక విచారణ పూర్తయిన తర్వాతనే పూర్తి వివరాలు బయటకు వస్తాయని తెలుస్తుంది. ప్రైవేట్ బ్యాంకుల నుంచి ప్రభుత్వ బ్యాంకులకు మార్పు డిజిటల్ సంతకం ఆలస్యంపైనా నిఘా అక్రమాలపై కఠిన చర్యలకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంకేతాలు -
అక్రమాలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు
జిల్లాలో ప్రజాధనం వినియోగంలో పూర్తి పారదర్శకత ఉండాలి. ప్రజలకు మేలు చేసే పనులనే అమలు చేస్తున్నాం. మాకు ఎలాంటి భయం లేదు. తప్పు చేయడం లేదనే నమ్మకం ఉంది. ప్రతీ ఉద్యోగి అంకితభావంతో పని చేయాలి. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే శాఖాపరమైన చర్యలతో పాటు అవసరమైతే నేరుగా ఏసీబీకి కూడా రాస్తాం. ఖాతాలను ప్రైవేట్ బ్యాంకుల నుంచి ప్రభుత్వ బ్యాంకులకు మార్పించాం. కలెక్టర్ కార్యాలయ ఖాతాలకు సంబంధించి రూ.1.50 కోట్ల నిధుల ఖర్చుపై ఆరా తీస్తాం. ఆడిట్ జరిగిందా లేదా అనే కోణంలో పరిశీలన చేస్తాం. – సందీప్కుమార్ ఝా, కలెక్టర్ -
ప్రశాంతంగా చేనేత ఎన్నికలు
జనగామ: జిల్లా వ్యాప్తంగా చేనేత సహకార సంఘాల ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో మొత్తం 12 చేనేత సహకార సంఘాలు ఉండగా, వాటిలో 9 సంఘాలు ముందుగానే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన మూడు సంఘాలైన జిల్లా కేంద్రంలోని భారత్ టీసీ జెడ్ బీహెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్, జనగామ సంజయ్నగర్ ప్రాజెక్టు హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్, పాలకుర్తి మండలం గూడూరు హెచ్డబ్ల్యూసీఎస్ లిమిటెడ్లలో ఎన్నికలు నిర్వహించారు. గూడూరు సంఘంలో ఇద్దరు మహిళా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగిలిన ఏడుగురు పురుష సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. జనగామలో ఎన్నికల ప్రచారం, పోలింగ్ పంచాయతీ ఎన్నికలను తలపించేలా సాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించగా, అనంతరం గంటపాటు భోజన విరామం ఇచ్చి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపి రి పీల్చుకున్నారు. ఎన్నికై న పాలకవర్గ సభ్యులు మూడు రోజుల్లోగా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడితో పాటు పాలకమండలిని ఎన్నుకోనున్నారు. -
పేదల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి జఫర్గఢ్: పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. మండల కేంద్రంలో శుక్రవా రం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కడియం శ్రీ హరి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జఫర్గఢ్ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనంటూ పేర్కొన్నారు. స్టేషన్ఘన్పూర్ నుంచి జఫర్గఢ్ మీదుగా వర్ధన్నపేట వరకు రూ.40 కోట్లతో నాలుగు లైన్ల రోడ్డు, సెంట్రల్ లైటింగ్ మంజూరు కావడం జరిగిందని, త్వరలో ఈ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వేల్పుగొండ లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుల్లా మోహన్రావు, సింగిల్ విండో చైర్మన్ తీగల కర్ణాకర్రావు, వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, పార్టీ జిల్లా నాయకులు అన్నెబోయిన భిక్షపతి, ఇల్లందుల బేబి శ్రీనివాస్, మంచాల ఎల్లయ్య, మనోజ్రెడి పాల్గొన్నారు. -
డీఏపీ నో స్టాక్
● నాట్లు ఎలా వేయాలని రైతుల ఆందోళన ● ఎరువుల కోసం పడిగాపులురఘునాథపల్లి: వానాకాలం పంటల సాగు ఊపందుకుంటున్న వేళ డీఏపీ ఎరువుల కొరత రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఎరువుల దుకాణాల వద్ద డీఏపీ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండడంతో రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సాగు కు అత్యంత కీలకమైన డీఏపీ అందుబాటులో లేకపోవడంతో రైతులు ప్రత్నామ్నాయంగా అధిక ధర కలిగిన కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేస్తూ అదనపు ఆర్థిక భారం మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఏపీ 50 కేజీల బస్తా ధర రూ.1,350 మాత్రమే ఉండటంతో రైతులు ప్రధానంగా ఈ ఎరువునే వినియోగిస్తుంటారు. డీఏపీ కొరతను మండలంలోని కొందరు వ్యాపారులు అవకాశంగా మలుచుకొని ఒక్కో బస్తాను రూ.1,500 నుంచి రూ.1,600 వరకు విక్రయించారని రైతులు ఆరోపిస్తున్నారు. ●రైతులకు అత్యంత అవసరమైన డీఏపీ ఎరువును ప్రభుత్వం వెంటనే అందుబాటులో ఉంచాలి. వరినాట్లు, పత్తి పంట ప్రారంభ దశలో డీఏసీ అత్యవసరం. ముందస్తుగా ఎరువుల నిల్వలు ఏర్పాటు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులకు డీఏపీ దొరకని పరిస్థితి నెలకొంది. – మంతపురి యాదగిరి, కన్నాయపల్లిడీఏపీ కొరత రాష్ట్రవ్యాప్తంగా ఉంది. మహిళా సంఘా ల షాపులకు ఇప్పటికే ఇండెంట్ పంపించాం. త్వరలో వచ్చే అవకాశముంది. డీఏపీలా పనిచేసే రూ.750 ధర గల భాస్వరం, కాల్షియం, సల్ఫర్తో కూడిన సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బస్తా కూడా బాగా పని చేస్తుంది. ఒక డీఏసీ బస్తాకు బదులు రెండు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బస్తాలు వేస్తే సరిపోతుంది. – కరుణాకర్, మండల వ్యవసాయాధికారి -
కుట్టేదెప్పుడు? ఇచ్చేదెప్పుడు?
జనగామ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఉచితంగా అందించే రెండు జతల యూనిఫాం పంపిణీ ప్రక్రియ ఈసారి అస్తవ్యస్తంగా మారింది. పాఠ్యపుస్తకాలతో పాటు ఇవ్వాల్సి ఉండగా పాఠశాలలు ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా ఇప్పటివరకు యూనిఫాం కోసం అవసరమైన క్లాత్(వస్త్రం) జిల్లాలకు పూర్తిస్థాయిలో చేరలేదు. అయితే వచ్చిన వస్త్రంతో కుట్టు పనులు ప్రారంభమైనా నత్తనడకన సాగుతోంది. దీంతో పిల్లలు పాత యూనిఫాంలతో లేదా రంగు దుస్తులతోనే తరగతులకు హాజరవుతున్నారు. నత్తనడకన కుట్టు పనులు సాధారణంగా ఏటా మార్చిలోనే విద్యార్థుల కొలతలు సేకరించి, ఏప్రిల్, మే నెలల్లో క్లాత్ను మండల కేంద్రాల ద్వారా మహిళా సంఘాలకు అందిస్తారు. వారు దుస్తులు కుట్టి పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు ప్రధానోపాధ్యాయులకు అప్పగిస్తారు. కానీ వస్త్రం ఆలస్యంగా వచ్చింది. ఒక్కో డ్రెస్ కుట్టినందుకు రూ.100 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇప్పటి వరకు 6వేల దుస్తులను 399 మంది మహిళా సంఘాల ద్వారా సిద్ధం చేసినట్లు, ఈనెల చివరికల్లా అందేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. స్పష్టత రాని ఎడ్యుకేషన్ కిట్ ఈ ఏడాది నుంచి యూనిఫాంలతో పాటు 24 వస్తువులతో కూడిన ‘ఎడ్యుకేషన్ కిట్’ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 15 నాటికి అన్ని పాఠశాలలకు కిట్లు చేరుస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు వాటి పంపిణీ కూడా ప్రారంభం కాలేదు. అధికారులు తక్షణమే యూనిఫాంలు, కిట్ పంపిణీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థులకు నీలం రంగు దుస్తులు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలం విద్యార్థులకు ప్రభుత్వం యూనిఫాం కలర్ మార్చింది. గతేడాది రెడ్ అండ్ యాష్ కలర్లో ఉంది. ఈ సారి లేత నీలం రంగుగా మార్చారు. బాలురకు నీలం రంగు చొక్కా, లేత నీలంరంగు నిక్కర్ లేదా ప్యాంటు, బాలికలకు లాంగ్ ఫ్రాక్, షర్ట్, స్కర్ట్ తరగతుల వారీగా అందించనుంది. తక్షణం యూనిఫాంలు, కిట్ అందించాలి పాఠశాలలు ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా.. నేటికీ విద్యార్థులకు యూనిఫాం అందకపోవడం బాధాకరం. యూనిఫాంలతో పాటు ఎడ్యుకేషన్ కిట్ను తక్షణమే అందించాలి. లేకపోతే విద్యార్థులతో కలిసి ఆందోళనలు చేపడతాం. –పోదల లవకుమార్, జిల్లా అధ్యక్షుడు, ఎస్ఎఫ్ఐ స్కూళ్ల ప్రారంభం రోజే యూనిఫాంలు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు 6వేల వరకే యూనిఫాంలు సిద్ధం నత్తనడకన సాగుతున్న కుట్టుపనులు జిల్లా వ్యాప్తంగా 27 వేలకుపైగా విద్యార్థులు స్పష్టత లేని ఎడ్యుకేషన్ కిట్ పంపిణీమొత్తం విద్యార్థులు: 27,768 మంది యూనిఫాంల అవసరం: 55 వేలు యూడైస్ ప్రకారం మొత్తం పాఠశాలలు: 503ఎస్హెచ్జీ మహిళలు: 399 మంది ఇప్పటివరకు సిద్ధమైన యూనిఫాంలు: 6000 -
ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ షురూ
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లోని మేథమెటిక్స్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ‘సైంటిఫిక్ కంప్యూటింగ్ అండ్ విజువలైజేషన్’ అంశంపై మూడు రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ను నిట్లోని రామన్హాల్లో అట్టహాసంగా ప్రారంభించారు. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ ఇండీస్, సేయింట్ ఆగస్టీన్ ప్రొఫెసర్, హెడ్ శ్రీధరరావు గునకాల ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ను ప్రారంభించి, కాన్ఫరెన్స్ సావనీర్ను విడుదల చేశారు. కాన్ఫరెన్స్లో భాగంగా శుక్రవారం ఉద్యోగ విరమణ పొందిన నిట్ ప్రొఫెసర్లు కేఎన్ఎస్, కాశీవిశ్వనాథన్, జేవీ రమణమూర్తిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఐఐటీ ఖరగ్పూర్ ప్రొఫెసర్ పీవీఎస్ఎన్ మూర్తి, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ వైవీఎస్ఎస్ సన్యాసిరాజు, నిట్ ఇన్చార్జ్ డైరెక్టర్, ప్రొఫెసర్ ఎన్వీ.ఉమామహేశ్, సీహెచ్.రామ్రెడ్డి పాల్గొన్నారు. -
బస్సుల కొరత..ప్రయాణికుల అవస్థ
జనగామ: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో శుక్రవా రం బస్సుల కొరతతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద యం నుంచి రాత్రి వరకు పలు మార్గాల్లో బస్సులు సకాలంలో రాకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు నుంచి మూడు గంటల పాటు ఒక టి, రెండు బస్సులు మినహా మిగతా సర్వీసులు లేకపోవడంతో ప్లాట్ఫారాలు ప్రయాణికులతో కిక్కిరిశాయి. సిద్దిపేట, నర్మెట, సూర్యాపేట, రఘునాథపల్లి, పాలకుర్తి, హనుమకొండ, ఉప్పల్, జగద్గిరిగుట్ట, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు 60 నుంచి70 శాతం తగ్గడంతో ఇబ్బందులు మరింత పెరిగాయి. వచ్చిన కొద్దిపాటి బస్సుల్లో సీట్లు దక్కించుకునేందుకు ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. ఖమ్మంలో సీఎం సభకు బస్సులు తరలించడంతోనే ఈ సమస్య తలెత్తినట్లు పలువురు ప్రయాణికులు అభిప్రాయపడ్డారు. -
ఈవీఎం గోదాం పరిశీలన
జనగామ రూరల్: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, త్రైమాసిక తనిఖీలో భాగంగా శుక్రవారం సమీకృత కార్యాలయాల భవన సముదాయంలోని ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పనితీరు, మంటల నియంత్రణ పద్ధతులను పర్యవేక్షించారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. పరిశీలనలో జనగామ ఆర్డీఓ గోపీరాం, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. జీడికల్ ఆలయానికి రూ.2 లక్షల విరాళం లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో దివ్యవిమాన రథోత్సవానికి సంపంగి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం రూ.2లక్షల విరాళం అందజేశారు. గతంలో కార్పెంటర్ శంకరాచారికి అడ్వాన్స్గా రూ.1,16,000 ఇవ్వగా మొత్తం రూ.3,16,000లు రథం తయారీకి అందజేశారు. కార్యక్రమంలో ఈఓ వంశీ, దేవస్థాన చైర్మన్ మూర్తి, సిబ్బంది భరత్, అర్చకులు భార్గవాచార్యులు తదితరులు ఉన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి జనగామ రూరల్: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న డిజిటలైజ్ ప్రక్రియను వేగవంతం చేయాలని భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీ నుంచి కార్యదర్శి నవీన్ కుమార్తో కలిసి వీడియో కాన్ఫరెన్న్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ.. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేసి ఈ నెల 24 తేదీ నాటికి డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ..ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ 99.6 శాతం, డిజిటలైజేషన్ ప్రక్రియ 21.94 శాతం పూర్తయిందన్నారు. రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య బాధాకరం జనగామ రూరల్: ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్మెంట్ బకాయిలు అందక మానసిక వేధనతో విశ్రాంత ఉపాధ్యాయుడు మల్లయ్య ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమని, ఆయన ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పూర్ణిమ కాలనీలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు పగిడిపల్లి మల్లయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మల్లయ్య కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సొసైటీ పెట్రోల్ బంక్ సీజ్ కొడకండ్ల: మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం పెట్రోల్ బంక్ను శుక్రవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్టేషన్ఘన్పూర్ ఆర్డీఓ కిరణ్ప్రకాశ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ అనీల్బాబు బంక్ను సీజ్ చేయడంతో పాటు సేల్స్కు సంబంధించిన ‘బీ’ లైసెన్స్ను కూడా రద్దు చేశారు. సొసైటీ భూమికి సంబంధించిన పత్రాలు సరిగా లేనందునే బంక్ను సీజ్ చేసి లైసెన్స్ను రద్దు చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. ఈ భూమికి సంబంధించిన ఆధారాలు, రికార్డులను అందజేయాలని జూన్ 27న రెవెన్యూ అధికారులు సొసైటీకి నోటీసులు అందజేయగా గడువు కోరారు. 30వ తేదీ న బంక్లో సేల్స్ను నిలిపివేస్తూ జూలై 7 వరకు రికార్డులు సమర్పించేందుకు రెవెన్యూ అధికారులు సొసైటీకి గడువిచ్చారు. నిర్దేశించిన గడువులోగా భూమికి సంబంధించిన రికార్డులను కలెక్టర్కు అందజేసినట్లు ఎండీ నరేష్ తెలిపారు. షోకాజ్ నోటీస్పై సొసైటీ పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.


