Jangaon
-
యువత డ్రగ్స్కు బానిస కావొద్దు
కేయూ క్యాంపస్ : యువత డ్రగ్స్కు బానిస కావొద్దని, దేశభవిష్యత్ యువతపైనే ఆధారపడి ఉందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పి.మల్లారెడ్డి అన్నారు. శనివారం నెహ్రూ యువకేంద్రం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ సౌజన్యంతో కేయూలోని గణితశాస్త్ర విభాగం సెమినార్ హాల్లో నిర్వహించిన మాదక ద్రవ్యాల నియంత్రణపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంపిక చేసిన యువతీయువకులకు రెండురోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. మాదకద్రవ్యాల వినియోగం లేని సమాజ స్థాపన లక్ష్యంగా యవత పని చేయాలన్నారు. రిసోర్స్ పర్సన్ ప్రముఖ సైక్రియాటిస్టు డాక్టర్ ప్రహసిత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా యువత డ్రగ్స్ తీసుకుంటే కలిగే అనర్థాలపై వివరించారు. మీ చుట్టుపక్కల వారు ఎవరైనా మాదక ద్రవ్యాలు సేవిస్తూ కనిపిస్తే 1933 నంబర్కు తెలియజేయాలన్నారు. సమావేశంలో నార్కోడ్రగ్స్ ఇన్స్పెక్టర్ సైదులు, గణితశాస్త్ర విభాగం అధిపతి డాక్టర్ భారవిశర్మ, కేయూ హాస్టల్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎల్.పి.రాజ్కుమార్, జాతీయ యువజన అవార్డు గ్రహీత మధు, న్యాయవాది బానోత్ మహేందర్, ఎక్స్ఎన్వై వలంటీర్లు భిక్షపతి, సురేశ్ పాల్గొన్నారు. కేయూ రిజిస్ట్రార్ ఆచార్య పి.మల్లారెడ్డి -
బెల్లంపల్లి లోకోస్టార్దే రైల్వే క్రికెట్ ట్రోఫీ
కాజీపేట రూరల్ : రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ కమిటీ ఆధ్వర్యంలో కాజీపేట రైల్వే స్టేడియంలో 12 రోజుల పాటు జరిగిన 76వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ క్రికెట్ లీగ్ సికింద్రాబాద్ డివిజనల్ లెవెల్ టోర్నమెంట్లో బెల్లంపల్లి లోకోస్టార్ విజయం సాధించింది. కాజీపేట ఆర్పీఎఫ్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన బెల్లంపల్లి జట్టు 20 ఓవర్లకు 195 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన కాజీపేట ఆర్పీఎఫ్ జట్టు 20 ఓవర్లకు 180 పరుగులు చేసింది. ఈ సందర్భంగా విన్నర్, రన్నరప్ జట్లకు సికింద్రాబాద్ డివిజన్ అడిషనల్ రైల్వే మేనేజర్ (ఏడీఆర్ఎం) ఎం.గోపాల్ బహుమతులు అందజేశారు. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. క్రీడాకారులు ఆహ్లాదకర వాతావరణంలో ఆడుకోవడం అభినందనీయమన్నారు. అంతకు ముందు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ ప్రెసిడెంట్ కె.శ్రీనివాస్ ప్రత్యేక అతిథిగా హాజరై బెల్లంపల్లి లోకోస్టార్–కాజీపేట ఆర్పీఎఫ్ జట్ల మధ్య టాస్వేసి పోటీని ప్రారంభించారు. ఇన్స్టిట్యూట్ సెక్రటరీ దేవులపల్లి రాఘవేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రైల్వే ఇన్స్టిట్యూట్ చైర్మన్ ఆర్.ప్రశాంత్కృష్ణసాయి, వైస్ చైర్మన్ ఎన్.వి.వెంకటకుమార్, రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ పి.రవీందర్, జెడ్బ్ల్యూసీ మెంబర్ శ్రీనివాస్, ఓబీసీ సంఘం డివిజన్ ప్రెసిడెంట్ ఆర్.రమేశ్, ఇన్స్టిట్యూట్ జాయింట్ సెక్రటరీ ఎం.రాజయ్య, తదితరులు పాల్గొన్నారు. రన్నరప్ కాజీపేట ఆర్పీఎఫ్ జట్టు ట్రోఫీని అందజేసిన ఏడీఆర్ఎం -
29న జాబ్మేళా
కాళోజీ సెంటర్ : ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగ యువతి, యువకులకు ఈనెల 29వ తేదీన వరంగల్ ములుగు రోడ్డు సమీపంలోని ఐటీఐ క్యాంపస్లో గల వరంగల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఉదయం 10.30 గంటలకు జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఉమారాణి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి సమాచారం కోసం 7093168464 నంబర్లో సంప్రదించాలని సూచించారు. సరస్వతీ పుష్కరాలకు రూ.70లక్షలతో విద్యుత్ లైన్లుకాళేశ్వరం: కాళేశ్వరంలో మే 15 నుంచి 26వ తేదీ వరకు సరస్వతీ నది పుష్కరాలకు ప్రభుత్వం రూ.25కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరంలో టీజీ ఎన్పీడీసీఎల్ సంస్థ మరమ్మతులు, కొత్త లైన్లు, విద్యుత్ ట్రాన్స్ఫర్మర్లు అమర్చడానికి రూ.70 లక్షలు కేటాయించినట్లు సంధింత శాఖ ఏఈఈ శ్రీకాంత్, లైన్ ఇన్స్పెక్టర్ సదానందం తెలిపారు. ముఖ్యంగా బస్టాండ్ నుంచి గోదావరి వరకు ప్రత్యేకంగా లైన్ ఏర్పాటు చేయనున్నారు. దేవస్థానానికి సబ్స్టేషన్ నుంచి ప్రత్యేకంగా ఎక్స్ప్రెస్ లైన్ పనులు చేపట్టనున్నారు. ప్రధాన రహదారిలో రెండు ట్రాన్స్ఫర్మర్లు, వీఐపీ ఘాట్కు ప్రత్యేకంగా లైన్ నిర్మాణం 11కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కేటాయించారు. అతి త్వరలో పనులు ప్రారంభించడానికి సంబంధిత శాఖ అధికారులు ఎస్ఈ మల్సూర్, డీఈఈ పాపిరెడ్డి, ఏడీ నాగరాజు సన్నద్ధమవుతున్నారు. రూ.40 లక్షల రివార్డు అందుకున్న దీప్తి జీవాంజి పర్వతగిరి: పారాలింపిక్స్లో కాంస్య పతకం, ఇటీవల అర్జున అవార్డు అందుకున్న వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జీవాంజిని శనివారం ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి మండల సమీపంలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ తరఫున రూ.25లక్షలు, అర్జున అవార్డు పొందిన నేపథ్యంలో మరో రూ.15 లక్షలు.. మొత్తం 40 లక్షల నగదు ప్రోత్సాహం అందించారు. కాగా, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు.. దీప్తి జీవాంజీకి శుభాకాంక్షలు తెలిపారు. -
చదువుతోపాటు నైపుణ్యం ప్రధానం
ములుగు : ఎంత చదివామనేది ముఖ్యం కాదని, ఉ ద్యోగ సాధన సమయంలో మనలో ఏ నైపుణ్యం ఉందనేదే ప్రధాన అంశంగా మారుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. టాస్క్ (తెలంగాణ అకడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) ప్రా రంభోత్సవానికి శనివారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చాలా మంది డిగ్రీలు పూర్తి చేసుకొని రూ.3 నుంచి 5 వేల వరకు వేతనాలను తీసుకుంటూ స్థానికంగా ప్రైవేట్ జాబ్లతో సరిపుచ్చుకుంటున్నారన్నారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్ ఉద్యోగాలకు అనుగుణంగా స్కిల్స్ పెంపొందించుకుంటే మంచి ఉద్యోగాన్ని సాధించుకోవచ్చని అన్నారు. కష్టం నుంచి వచ్చిన విజయ విజయగాథగా మిగిలిపోతుందన్నారు. స్థానికంగా ఉద్యోగం లభించాలనే ధోరణిని వదిలి ఎక్కడైనా చేసి కుటుంబాన్ని పోషించగలుగతామనే ధైర్యంతో ముందుకుసాగాలని అన్నారు. రాష్ట్రంలో టాస్క్ తరపున ములుగులో ఏర్పడిన 14వ బ్రాంచ్ నిరుద్యోగ యువతకు వరం లాంటిదని అన్నారు. 15 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇంటి వద్దే ఉండి తల్లిదండ్రులకు భారంగా మారకూడదని సూచించారు. తాను ఒడిదుడుకులను ఓర్చుకొని మంత్రి హోదాలో ఇలా మీ ముందు ఉన్నానన్నారు. కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ వెంకటేశ్ సినిమా చూసి ఇంటర్వ్యూ అంటే ఇంత కష్టంగా ఉంటుందా, ఇంగ్లిష్లో మాట్లాడాలా అని తెలుసుకొని స్నే హితుడి ద్వారా లాంగ్వేజ్ను మెరుగుపరుచుకున్నానన్నారు. జిల్లాలో 50 వేల మంది యువత డిగ్రీ చేసి ఇంటివద్దే ఉంటున్నారని, అలాంటి వారికి టా స్క్ మంచి ఉద్యోగ సంపాదన స్టేజ్ లాంటిద న్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, సీఈఓఓ రాఘవేందర్రెడ్డి, రీజినల్ సెంటర్ హెడ్ నవీన్రెడ్డి, క్లస్టర్ మేనేజర్ సుధీర్, రిలేషన్షిప్ మేనేజర్ రామకృష్ణ, సెంటర్ మేనేజర్ మురళీకృష్ణ, డీపీఓ దేవరాజ్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం పాల్గొన్నారు. పోటీ ప్రపంచంలో ఇదే అవసరం మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క -
కోటగుళ్ల గురించి తెలిపేందుకే స్కెచింగ్ టూర్
గణపురం : కోటగుళ్ల శిల్ప సంపదను ప్రపంచానికి చాటి చెప్పేందుకే రెండు రాష్ట్రాలకు చెందిన 60 మంది కళాకారులతో స్కెచింగ్ టూర్ను ఏర్పాటు చేసినట్లు టార్చ్ సంస్థ అధ్యక్షుడు అరవింద్ ఆర్య అన్నారు. జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం సేవా టూరిజం, టార్చ్ సంస్థల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 60 మంది కళాకారులను పిలిపించినట్లు తెలిపారు. కళాకారులు పెన్సిళ్లతో వేసే అద్భుత కోటగుళ్ల శిల్ప సంపద చిత్రాలను త్వరలో హైదరాబాద్లో ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ గణపేశ్వరాలయం శిల్ప సంపద అద్భుతంగా ఉందని, ఆలయాలను చూసి ఎంతో పులకించిపోయామని తెలిపారు. కార్యక్రమంలో సేవా టూరిజం, కల్చర్ సొసైటీ అధ్యక్షుడు కుసుమ సూర్యకిరణ్, పురావాస్తు శాఖ ఏడీ మల్లు నాయక్, కట్ట శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. టార్చ్ సంస్థ అధ్యక్షుడు అరవింద్ ఆర్య -
ఐదేళ్లు.. రూ.36కోట్ల ఖర్చు!
జనగామ: జనగామ మున్సిపల్ పాలక మండలి పదవీ కాలం ఆదివారం అర్ధరాత్రితో ముగియనుంది. సోమవారం నుంచి పురపాలికలో స్పెషల్ అధికారి పాలన పట్టా లెక్కనుంది. 2020 జనవరి 25న ఎన్నికల ఫలితాలు వెలువడగా 27న పురపాలిక పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసింది. పట్టణ పరిధి వార్డుల్లో కనీస మౌలిక వసతి సౌకర్యాలు కల్పించలేని దయనీయస్థితిలో ప్రస్తుత పాలక మండలి దిగిపోనుంది. అస్తవ్యస్తంగా మారిన ‘పురపాలిక’ స్పెషల్ అధికారి పాలనలలో గాడిన పడుతుందా.. లేదా అనేది వేచి చూడాల్సిందే. ఈ ఐదేళ్ల పాలక మండలి హయాంలో 15వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, పట్టణ ప్రగతి, జనరల్ ఫండ్ అన్నీ కలుపుకుని సుమారు రూ.40కోట్ల మేర బడ్జెట్ రాగా.. పలు అభివృద్ధి పనులు, సిబ్బంది వేతనాలు తదితరాలకు రూ.36 కోట్ల మేర ఖర్చు చేశారు. ఇంటి, నల్లా, తదితర కమర్షియల్ పన్నుల రూపంలో 2024–25 ఆర్థిక సంవత్సరం రూ.5.71 కోట్ల మేర డిమాండ్ ఉండగా, ఇప్పటి వరకు 1.77(31.03 శాతం)కోట్లు వసూలయ్యాయి. మార్చి 31 వరకు వందశాతం వసూలు లక్ష్యంగా పని చేస్తున్నారు. 2019–20లో 96.92శాతం, 2020–21లో 80.56శాతం, 2021–22లో 72.72శాతం, 2022–23లో 65.75శాతం, 2023–24లో 71.71 శాతం పన్నులు వసూలు చేశారు. పురపాలికలో పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, ఇంజనీరింగ్ ఇతర శాఖల పరిధిలో కమిషనర్ల పర్యవేక్షణ కొరవవడంతో పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. ఇంటి అనుమతుల కోసం కమిషనర్ చెప్పినా.. అనుమతులు దొరకని పరిస్థితి నెలకొనడంపై జోరుగా చర్చ జరుగుతోంది. మధ్య వర్తుల పెత్తనంతో కమీషన్ల దందా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్పెషల్ ఆఫీసర్ పాలనలోనైనా పట్టణానికి మంచి రోజులు వస్తాయని ప్రజలు భావిస్తున్నారు. నేటితో ముగియనున్న మున్సిపల్ పాలక మండలికి గడువు రేపటి నుంచి స్పెషల్ అధికారి పాలన -
ప్రజల కోసమే ఎర్రజెండా ..
నెహ్రూసెంటర్ : అధికారమున్నా లేకపోయినా దేశంలో ప్రజల పక్షాన పోరాడి విజయం సాధించిన ఘనత సీపీఐకే దక్కుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో సీపీఐ శతాబ్ది ఉత్సవాల ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. సెప్టెంబర్ 17 స్ఫూర్తి చిహ్నం, మానుకోట మొదటి ఎమ్మెల్యే తీగల సత్యనారాయణరావు విగ్రహాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్, మానుకోట ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, ఎంపీ పోరిక బలరాంనా యక్, సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ దేశంలో ఎన్ని పార్టీలు వచ్చినా.. రంగులు ఎలిసిపోతున్నా చెక్కుచెదరని పార్టీ పతాకం ఎర్రజెండా మాత్రమేనన్నారు. ప్రజల పక్షాన పోరా టాలు నిర్వహించిన వందేళ్ల ఉద్యమ చరిత్ర సీపీఐకే దక్కుతుందన్నారు. దోపిడీదారులు అసెంబ్లీ, పార్లమెంట్లోకి వస్తుంటే ప్రజల పక్షాన పోరాడే ఒక్క మావోయిస్టును కూడా ఉంచమని కేంద్ర మంత్రి అమిత్షా ప్రకటిస్తున్నారని, రాముడిని బందీగా చేసి బీజేపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ను ఓడించేందుకు కమ్యూనిస్టులు కాంగ్రెస్తో జత కట్టగా వారి మద్దతుతోనే పలుచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు కమ్యూనిస్టుల మే లు మరిచి వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్.. కమ్యూనిస్టుల మద్దతు కూడగట్టుకోలేక పోవడం మూలంగానే గద్దె దిగిపోయిందన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి పేదల కోసం సీపీఐ పని చేసిందన్నా రు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిందన్నారు. ఎంపీ పోరిక బలరాంనాయక్ మాట్లాడుతూ క్రమశిక్షణ, పోరాట పటిమలో కమ్యూనిస్టులే ముందుంటారన్నారు. ఎన్ని అవరోధాలు వచ్చినా పోరాటా లు వదిలిపెట్టని యోధులు కమ్యూనిస్టులన్నా రు. మానుకోట ఎమ్మెల్యే భూక్య మురళీనా యక్ మాట్లాడుతూ సమిష్టిగా మానుకోట నియోజకవర్గం అభివృద్ధి జరిగేలా పని చేద్దామన్నారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్రెడ్డి అన్నా రు. మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, మున్సిపల్ ఫ్లోర్లీడర్ బి.అజయ్సారథిరెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు తమ్మెర విశ్వేశ్వర్రావు, నల్లు సుధాకర్రెడ్డి, కట్టెబోయిన శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్ నీరజారెడ్డి ధర్మన్న, పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న, రేషపల్లి నవీన్, మామిండ్ల సాంబలక్ష్మి, కట్లోజు పాండురంగాచారి, వరిపెల్లి వెంకన్న, నెల్లూరు నాగేశ్వర్రావు, పోగుల శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. వందేళ్ల పోరాట చరిత్ర సీపీఐదే పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు ఘనంగా సీపీఐ శతాబ్ది ఉత్సవ సభ -
సాగుకు ‘డ్రోన్’ సేవలు
రఘునాథపల్లి: వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతోంది. సులువుగా పని పూర్తయ్యేలా.. కూలీల కొరతను అధిగమించేందుకు రైతులు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. పూర్వీకులు చీడ పీడల నుంచి పంటలను కాపాడుకునేందుకు చేతి పంపులు వాడేవారు. ఐదారేళ్లుగా రైతులు చార్జింగ్ పంపులు, పెట్రోల్ పంపులు వినియోగిస్తున్నారు. సుమారు 20 లీటర్ల బరువు కలిగిన పంపులను మోస్తూ పిచికారీ చేయడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. గతంలో మాదిరిగా కూలీలు అందుబాటులో లేక డ్రోన్లను వినియోగిస్తున్నారు. 10 నిముషాల్లోనే ఎకరం పొలం పిచికారీ చేసే 10 లీటర్ల సామర్థ్యం కలిగిన డ్రోన్ల వైపు రైతులు ఆసక్తి చూపుతున్నా రు. పొలంలోకి దిగకుండానే.. గట్టుమీది నుంచి రిమోట్ ద్వారా డ్రోన్తో సులువుగా మందు స్ప్రే చేస్తున్నారు. డ్రోన్లు కొనుగోలు చేసిన రైతులు.. సొంత పొలాలకు మందు పిచికారీ చేసుకోవడంతో పాటు ఇతర రైతుల పంటలకు ఎకరాకు రూ.500 తీసుకుని స్ప్రే చేసి ఉపాధి పొందుతున్నారు. డ్రోన్ వ్యవసాయంతో సమయం, ఖర్చు ఆదా అవుతున్నదని మండల కేంద్రానికి చెందిన రైతు నీలం వాసు పేర్కొన్నారు. డ్రోన్తో వరి, మామిడి, జామ, మిర్చి తదితర పంటలకు రోజు 20 నుంచి 30 ఎకరాల వరకు సులువుగా మందు స్ప్రే చేయవచ్చని చెబుతున్నాడు. -
బడుగుల నేతకు జాతీయస్థాయి గుర్తింపు
హన్మకొండ: సామాజిక ఉద్యమకారుడు, బడుగుల నాయకుడు మంద కృష్ణమాదిగకు జాతీయస్థాయి గుర్తింపు వచ్చింది. ప్రజా వ్యవహారాల్లో విశిష్ట సేవలు అందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం శనివారం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. ఎస్సీల్లో మాదిగలకు జరుగుతున్న అన్యాయం, కోల్పోతున్న అవకాశాలపై మంద కృష్ణమాదిగ గత 30 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణతోపాటు, సామాజిక సమస్యలపై పోరాటం చేశారు. హనుమకొండ హంటర్ రోడ్లోని న్యూశాయంపేటకు చెందిన మంద చిన్న కొమురయ్య, కొమురమ్మలకు పదవ సంతానంగా మంద కృష్ణ మాదిగ 1965, జూలై 7న జన్మించారు. ఆయనకు భార్య మంద జ్యోతి, సంతానం కిషన్, డాక్టర్ కృష్ణవేణి, కార్తీక్ ఉన్నారు. 1994లో ఉద్యమం మొదలు.. మంద కృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఈదురుమూడి గ్రామంనుంచి 14 మంది యువకులతో 1994, జూలై 7న మాదిగ దండోరా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎస్సీ కులాలకు జనాభా నిష్పత్తి ప్రకారం అవకాశాలు అందాలని, మాదిగలకు న్యాయం జరగాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. అనతి కాలంలోనే బలమైన ఉద్యమ సంస్థగా ఎమ్మార్పీఎస్ ఎదిగింది. అణగారిన వర్గాల గొంతుకగా నిలిచింది. ఒకవైపు దండోరా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే మరో వైపు వికలాంగులకు పెన్షన్, ఇతర హక్కుల సాధనకు, గుండె జబ్బుల వ్యాధులతో బాధపడుతున్న చిన్న పిల్లలు, వృద్ధులు, వితంతువుల పక్షాన పోరాటం చేశారు. వర్గీకరణ విజయం.. ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ ద్వారా 30 ఏళ్లుగా చేసిన ఉద్యమం ఇటీవల విజయం సాధించింది. విద్య ఉద్యోగ రిజర్వేషన్లలో ఎస్సీ ఉప వర్గీకరణ కు అనుకూలంగా గత ఏడాది ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మంద కృష్ణమాదిగ చివరి వరకు ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యంగా, సామాజిక సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశారు. కాగా, మంద కృష్ణకు పద్మశ్రీ రావడం పట్ల పలువురు ప్రజా సంఘాల నాయకులు, ఉమ్మడిజిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సామాజిక ఉద్యమకారుడు మంద కృష్ణమాదిగకు పద్మశ్రీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసిన ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు -
సాద్విన్రెడ్డికి అభినందనలు
స్టేషన్ఘన్పూర్: ‘సాక్షి’ ఆధ్వర్యాన నిర్వహించిన మ్యాథ్స్ బీ (2024–25) రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలో ఘన్పూర్కు చెందిన ఒయాసిస్ హైస్కూల్ విద్యార్థి పి.సాద్విన్రెడ్డి ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈనెల 24న హైదరాబాద్ రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో సాక్షి యాజ మాన్యం నుంచి సాద్విన్రెడ్డి రూ.5వేల నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్ అందుకున్నాడు. ఈ సందర్భంగా శనివారం స్థానిక పాఠశాలలో యాజమాన్యం అతడిని అభినందించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పి.సతీష్రెడ్డి మాట్లాడు తూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తూ వివిధ పోటీ పరీక్షలకు వారిని సన్నద్ధం చేయడానికి ‘సాక్షి’ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కమలాకర్, శ్రీలత, స్వాతి, పద్మజ, ఫాతిమా, అర్చన, షకీరా, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో ఉండాలిబచ్చన్నపేట : ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉంటూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందివచాలని జిల్లా వైద్యాధికారి కె.మల్లికార్జున్రావు అన్నారు. శనివారం స్థానిక ఆస్పత్రిని సందర్శించిన ఆయన మాట్లాడుతూ సర్కారు దవాఖానల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని, ఈ మేరకు ఏఎన్ఎంలు, ఆశ వర్క ర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పా రు. అలాగే పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ బృంద సభ్యులు వచ్చి ఆలింపూర్ సబ్ సెంటర్, బచ్చన్నపేట ఆస్పత్రులను పరిశీలించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, మండల వైద్యాధికారి సృజన, డాక్టర్లు శ్రీనివాస్, అరుణ, దీప్తి, పీహెచ్ఎన్ అన్నాంబిక, సీహెచ్ఓ జంగమ్మ, హెడ్ నర్సు లక్ష్మి, జాస్మిన్, ఫార్మసిస్ట్ బొడ్డు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కు కల్పించిందే అంబేడ్కర్.. జనగామ రూరల్: ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించిందే అంబేడ్కర్ అని తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చెర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో వందేమాతరం స్టూడెంట్ ఫెడరేషన్, జిల్లా ఉద్యమకారుల ఆధ్వర్యాన మంగళంపల్లి రాజు అధ్యక్షతన ఓటుహక్కుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అభివృద్ధి చెందుతున్న భారత దేశంలో ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ఓటు వేయడానికి అంబేడ్కర్ కారణమని పేర్కొన్నా రు. అంతకు ముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉద్యమకారులు తిప్పారపు విజయ్, పానుగంటి ప్రవీణ్, నల్ల రాహుల్, వేంపటి అజయ్, సల్ల మహేష్, యాదగిరి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
కోస్టాయాప్ నిందితుల అరెస్ట్
జనగామ: రెట్టింపు డబ్బుల ఆశచూపించి అమాయకులను మోసం చేసిన కోస్టాయాప్నకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ తెలిపారు. ఈ మేరకు శనివారం జనగామ పోలీస్స్టేషన్లో సీఐ దామోదర్రెడ్డితో కలిసి ఏఎస్పీ విలేకరులకు వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరుకు చెందిన తోకల శ్రీధర్యాదవ్, కాషెగుడిసెకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఎక్రమొద్దీన్., ఆస్ట్రేలియాకు చెందిన వెనెస్సాతో కలిసి కోస్టాయాప్ను తీసుకొచ్చారు. కోస్టాయాప్లో పెట్టుబడులు పెట్టిన వారికి అధిక లాభాలు వస్తాయని ఆశచూపించారు. కోస్టాయాప్ లింక్ను ఫోన్కు పంపించి, బార్ కోడ్ద్వారా రిజిస్టర్ చేసుకుని పెట్టుబడులు పెట్టించారు. ఇందులో లింక్ ద్వారా చైన్ సిస్టమ్లో ఒకొక్కరిని చేర్చించారు. మూడు వందల మందిని చేర్పించిన వారికి గిఫ్ట్గా ద్విచక్రవాహనం, ఆరు వందల మందికి కారు బహుమానంగా ఇస్తామంటూ సామాన్యులకు ఆశ చూపించి ఆకర్షించారు. యశ్వంతాపూర్లోని శ్రీ సత్యసాయి కన్వెన్షన్లో ఫంక్ష న్ ఏర్పాటు చేసి కోస్టాయాప్ ప్రమోట్లో కారు, బైక్, కుక్కర్ గెలుచుకుంటారని చెబుతూ అక్కడకు వచ్చిన వారి తో పెట్టుబడులు పెట్టించారు. అనంతరం స్పందించకపోవడంతో మోసం చేశారని గ్రహించి జనగామ, చేర్యాల చుట్టు పక్కల ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తోకల శ్రీధర్యాదవ్, ఎక్రమొద్దీన్ను అదుపులోకి తీసుకుని విచారించగా నే రం ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. వెనెస్సా పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఫోన్లో వచ్చిన లింక్లను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దన్నారు. రిజిస్టర్ కాని యాప్లో పెట్టుబడులు పెట్టొద్దన్నారు. మల్టీలెవల్ చైన్ సిస్టమ్లో పెట్టుబడులు పెట్టేలా ఎవరూ ప్రోత్సహించొద్దన్నారు.అత్యవసర సమయంలో గంటలోపు (గోల్డెన్ అవర్)100కు డయల్ చేయాలని, సైబర్ క్రైంలో మోసపోయిన వెంటనే 1930(ఉచిత నెంబర్) టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. రామప్పలో హెరిటేజ్ వాక్ వెంకటాపురం(ఎం): జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని సేవా టూరిజం అండ్ కల్చ రల్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని రామప్ప దేవాలయం ఎదుట హెరిటేజ్ వాక్ నిర్వహించారు. హెరిటేజ్ వాక్లో రామప్ప సందర్శనకు వచ్చిన విద్యార్థులతో పాటు పర్యాటక శాఖ, కేంద్ర పురావస్తుశాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవా టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు కుసుమ సూర్యకిరణ్ మాట్లాడుతూ పర్యాటక ప్రదేశాలను సందర్శించడం ద్వారా కొత్త విషయాలను నేర్చుకోవడంతో పాటు వినోదం, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. కాకతీయుల చరిత్ర, పర్యాటక దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ కుమారస్వామి, టూరిజం గైడ్ విజయ్కుమార్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. ● పరారీలో ఆస్ట్రేలియాకు చెందిన మరో వ్యక్తి ● వివరాలు వెల్లడించిన ఏఎస్పీ పండేరి చేతన నితిన్ -
అవార్డుల లావణ్య
చిల్పూరు: గృహిణిగా.. గ్రామ మహిళా సంఘంలో సభ్యురాలి గా చురుగ్గా వ్యవహరిస్తున్న మల్కాపూర్ గ్రామానికి చెందిన బోగం లావణ్య.. ప్రవృత్తిగా ఎంచుకున్న బ్యూటీషియన్లో ప్రత్యేకతలతో ప్రశంసలతో పాటు సౌత్ ఇండియన్ మేకోవర్ అవార్డు సైతం ఎంపికయ్యారు. 2014లో మహిళా సంఘం గ్రూపులో సభ్యురాలిగా చేరినప్పటి నుంచి సభ్యులతో కలిసి చిన్నచిన్న పనులు నేర్చుకునేది. సంఘం అధ్యక్షురాలిగా కొనసాగుతూనే ఐకేపీలో బుక్ కీపర్గా ఉండేది. ఆ సమయంలో ఇంటర్ నేషనల్ బ్యూటీషియన్ ప్రత్యూష వద్ద శిక్షణ పూర్తి చేసుకుంది. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించాలనే ధ్యేయంతో స్వగ్రామంలోనే బ్యూటీషియన్ సెంటర్ ఏర్పాటు చేసుకుంది. శుభకార్యాలకు బ్యూటీషియన్ పనులు అవసరమైతే వెళ్లి వారికి నచ్చేలా తీర్చిదిద్దేది. లావణ్య ప్రతిభను గుర్తించి న సీమ సంస్థ ఫౌండర్ ముఖేష్ సౌత్ ఇండియా మేకోవర్ అవా ర్డు ప్రకటించారు. మల్కాపూర్ పాఠశాలలో జరిగిన ఓ కార్యకమ్రంలో పిల్లలకు వేసిన మేకప్ను పరిశీలించిన భద్రాచలానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ అక్కడి కలెక్టర్ శ్రీనివాస్కు వివరించగా ఆయన చేతుల మీదుగా అవార్డు అందజేశారు. ఐదు నెలల క్రితం హైదరాబాద్లో ఓ సినిమా షూటింగ్లో నటులకు వివిధ రకాల మేకప్ వేయడంతో నటుడు సంతోషిసర్కార్ తన పేర మేకప్ ఉత్తమ అవార్డు అందజేశారు. తండ్రి స్ఫూర్తితో జెండా వందనం జఫర్గఢ్ : దేశ విముక్తి కోసం తన తండ్రి చేసిన పోరాటాన్ని, జెండా వందనాన్ని స్ఫూర్తిగా తీసుకున్న జఫర్గఢ్కు చెందిన బైరి వెంకటేశ్వర్లు. కొన్నేళ్ల నుంచి ప్రతి ఏటా పంద్రాగస్టుతో పాటు గణతంత్ర దినోత్సవం రోజు వేడుకలు నిర్వహిస్తున్నాడు. జాతీయ జెండా ఎగురవేస్తూ దేశం పట్ల ఉన్న అభిమానాన్ని చాటుతున్నాడు. ఆయ న తండ్రి బైరి సత్తయ్య దేశ స్వాతంత్య్రం కోసం పని చేయడంతో పాటు 1958లో మండల కేంద్రం ప్రధాన కూడలి వద్ద జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పట్లో ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తించింది. ఇప్పటికీ ఆ కూడలిని గాంధీ సెంటర్గా పిలుస్తుంటారు. వెంకటేశ్వర్లు తన తండ్రి మర ణం తర్వాత శిథిలావస్థకు చేరుకున్న గాంధీ విగ్రహాన్ని సొంత ఖర్చుతో తిరిగి నిర్మించి గాంధీ జయంతి రోజున వేడుకలు నిర్వహిస్తున్నాడు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న వెంకటేశ్వ ర్లు.. మహాత్మాగాంఽధీ సేవా సమితి పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. -
ఓటు హక్కు అత్యంత విలువైనది
జనగామ రూరల్: ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది ఓటు హక్కు.. ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. 15వ జాతీయ ఓటరు దినోత్సవా న్ని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు పింకేష్కుమర్, రోహిత్సింగ్, డీసీపీ రాజ మహేంద్రనాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది నిర్వహించిన పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా విజయవంతం చేశామని చెప్పారు. జిల్లాలో 7.62 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, కొత్త ఓటరుగా నమోదు, మార్పులు, చేర్పులు ఉంటే పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించే ప్రత్యేక క్యాంపెయిన్లు, ఎన్నికల కమిషన్ పోర్టల్, ఓటరు యాప్, 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ ఏడాది ‘నథింగ్ లైక్ ఓటింగ్.. ఐ ఓట్ ఫర్ స్యూర్’ నినాదంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. రాబోయే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగకుండా యువత, వివిధ వర్గాల కు చెందిన ఓటర్లు ఎక్కువగా పాల్గొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అదన పు కలెక్టర్లు, డీసీపీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది శక్తిమంతమైన ఆయుధమని, ఓటు ను అమ్ముకోకుండా బాధ్యతగా వినియోగించుకో వాలని సూచించారు. అనంతరం కొత్త యువ ఓటర్లకు కార్డులు అందజేయడంతోపాటు బూత్ స్థాయి సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి.సుహా సిని, ఆర్డీఓ గోపీరాం, డీఆర్డీఓ వసంత, తహసీల్దార్ హుస్సేన్, కలెక్టరేట్ ఏఓ మన్సూర్ పాల్గొన్నారు. ‘సౌర విద్యుత్’తో మహిళల ఆర్థికాభివృద్ధిసౌర విద్యుత్ ఉత్పత్తితో మహిళల ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మోడల్ సౌర విద్యుత్ గ్రామాలను ఎంపిక చేసేందు కు శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన డీఎల్ఆర్సీ సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నాయని, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ చైర్మన్గా, జెడ్పీ సీఈఓ కన్వీనర్గా ఎల్డీఎం, విద్యుత్ ఎస్ఈ, తెలంగాణ రెడ్కో జిల్లా మేనేజర్ సభ్యులుగా ఉంటారని పేర్కొన్నా రు. ‘పీఎం సూర్య ఘర్’ పథకం కింద జిల్లా నుంచి 142 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 1.66 మెగా యూనిట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, ఇందుకు లబ్ధిదారులకు ఏటా రూ.49 లక్షల ఆదాయం వస్తుందని వెల్లడించారు. అలాగే మోడల్ సోలార్ విలేజ్ ఎంపికకు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ‘పీఎం కుసుమ్’ పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వర కు 370 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించా మని, ఇందులో 12 మెగా వాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించి నట్లు వివరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ మాధురీ షా, ఎల్డీఎం శ్రీధర్, విద్యుత్ ఎస్ఈ వేణుమాదవ్, తెలంగాణ రెడ్కో జిల్లా మేనేజర్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు..
వరంగల్ క్రైం: రూ.లక్ష అసలుకు నాలుగు రెట్లు అధికంగా నకిలీ నోట్లు అందజేస్తామని నకిలీ నోట్ల విక్రయాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. ఎనిమిది మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. ఈ మేరకు శనివారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితులనుంచి భారీ మొత్తంలో అసలు నోట్లు రూ.38.84లక్షలు, నకిలీ నోట్లు రూ.21లక్షలు, నకిలీ నోట్ల ముద్రణకు అవరమైన తెల్లకాగితాలు, కారు, ఆటో, తొమ్మిది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నకిలీ నోట్ల విక్రయం ఇలా.. ప్రధాన నిందితుడు మణికాల కృష్ణ గొర్రెల వ్యాపారం నిర్వహించేవాడు. ఈ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం తన అవసరాలకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని ప్రణాళిక రచించుకుని గొర్రెల వ్యాపారం ద్వారా పరిచయమైన వ్యక్తులతో తనకు అడవిలో డబ్బులతో కూడిన డ్రమ్ము దొరికిందని, అందులోని డబ్బు వినియోగిస్తే తన కుటుంబంలో ఆరోగ్య, ఇతర సమస్యలు ఎదరవువుతున్నాయని నమ్మించాడు. ఎవరైనా రూ.లక్ష ఇస్తే వారికి అ డ్రమ్ములోని డబ్బు రెండింతలు ఇస్తానని, అలాగే రూ.లక్ష అసలు ఇస్తే నాలుగు రెట్లు అధికంగా నకిలీ నోట్లు ఇస్తానని నమ్మించేవాడు. ఇదే తరహాలో రెండో నిందితుడు ఎర్రగొల్ల శ్రీనివాస్తో పరిచయం కావడంతో కృష్ణ తన ప్లాన్ అమలు భాగంగా పాల్వంచ అడవిలో నకిలీ నోట్లతో భద్రపర్చిన డ్రమ్మునుంచి అసలు రూ.500నోట్ల కట్టని చూపించాడు. దీంతో అవి అసలు నోట్లని నమ్మిన శ్రీనివాస్ రూ.10లక్షల అసలు నోట్లగాను రూ.20లక్షలు, రూ.5లక్షల అసలు నోట్లకు రూ.20లక్షల నకిలీ నోట్లు మార్పిడి చేసుకునేందుకు నిందితుల ఇద్దరి మధ్య అంగీకారం కుదురింది. తనకు ఆ డబ్బును హనుమకొండకు తీసుకొచ్చి అందజేస్తేనే ఈ ఒప్పందానికి అంగీకరిస్తానని శ్రీనివాస్.. కృష్ణకు షరతు విధించగా అంగీకరించారు. ఒప్పందం ప్రకారం ప్రధాన నిందితుడు కృష్ణ.. మరో నలుగురు నిందితులతో కలిసి కారులో శుక్రవారం కేయూసీ ఔటర్ రింగ్రోడ్డు, పెగడపల్లి క్రాస్ వద్దకు చేరుకున్నాడు. అప్పటికే అక్కడ ఉన్న శ్రీనివాస్ మరో ఇద్దరు నిందితులతో కలిసి అసలు డబ్బుతోపాటు నకిలీ నోట్లను మార్పిడి చేసుకుంటున్న తరుణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించడంతో ఈ ముఠా సభ్యులందరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగులు, కారు తనిఖీ చేయడంతో పెద్ద మొత్తంలో అసలు నగదుతో పాటు, నకిలీ నోట్లు, నకిలీ నోట్ల ముద్రణకు అవసరమైన తెల్లకాగితాలు లభించాయి. దీంతో విచారించగా నిందితులు తమ నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేసినట్లు సీపీ అంబర్కిశోర్ ఝా పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు కృష్ణ ఇదే తరహాలో మరో మిత్రుడితో కలిసి తెల్ల కాగితాలపై రూ. 5 వందల నోటు ముద్రించి పలుమార్లు విక్రయిస్తూ పోలీసులకు చిక్కడంతో సత్తుపల్లి, వీ.ఎం. బంజర, లక్ష్మీదేవి పేట పోలీస్ స్టేషన్ల్లో కేసులు నమోదైనట్లు సీపీ తెలిపారు. కాగా, ఏసీపీ దేవేందర్ రెడ్డి, కేయూసీ ఇన్స్పెక్టర్ రవి కుమార్, ఎస్సై మా ధవ్, హెడ్కానిస్టేబుల్ నర్సింగ్ రావు, కానిస్టేబుళ్లు శ్యాంరాజు, సంజీవ్, సంపత్, హోంగార్డ్ రాజేందర్ను పోలీస్ కమిషనర్ అభినందించారు.ఎనిమిది మంది సభ్యుల అరెస్ట్ రూ.38.84 లక్షలు అసలు.. రూ.21 లక్షలు నకిలీ నోట్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన సీపీ అంబర్ కి శోర్ ఝా నిందితులు వీరే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం, మోరంపల్లి బంజార గ్రామానికి చెందిన మణికాల కృష్ణ, నక్రిపేట తండాకు చెందిన ధరంసోత్ శ్రీను, అదే గ్రామానికి చెందిన తేజావత్ శివ, ముల్కలపల్లి మండలం మూకమామడి గ్రామానికి చెందిన గుగులోత్ వీరన్న, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన ఎర్రగొల్ల శ్రీనివాస్, ఉడుత మల్లేశ్, ఎర్రగొల్ల అజయ్, ఏపీలోని కర్నూల్ జిల్లా కుర్విపేట మండలం వేల్పనూర్ గ్రామానికి చెందిన బిజిని వేముల వెంకటయ్య అరెస్ట్ అయ్యారు. -
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
జనగామ రూరల్: ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాల ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రవీంద్ర శర్మ అన్నారు. జిల్లా సబ్ జైలులో ఖైదీల హక్కుల గురించి శనివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. ఖైదీలు విడుదలైన తర్వాత తప్పు చేయొద్దని, ఇందుకోసం లీగల్ అవేర్నెస్ క్యాంపుల ద్వారా వారిని చైతన్యవంతులుగా మార్చి నేర ప్రవృత్తి లేకుండా చేయవచ్చని చెప్పా రు. సీనియర్ సివిల్ జెడ్జి సి.విక్రమ్ మాట్లాడుతూ ష్యూరిటీ పెట్టుకోలేని పేదవారు, బెయిల్ వచ్చి 14 రోజులు దాటిన వారు దరఖాస్తు చేసుకుంటే న్యాయం అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో 24 గంటల కన్నా ఎక్కువ సేపు ఉంచొద్దని, అలా ఎవరైనా ఉంటే వారి బంధువులు తమ దృష్టికి తీసుకుని వస్తే జడ్జి ఆదేశానుసారం ఆ కేసులను టేకప్ చేస్తామని తెలిపారు. అందరూ స్నేహభావంతో ఉండాలని, ఖైదులందరూ తమ బంధువులతో మాట్లాడటానికి ఉన్న ములాఖత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి జి.శశికల, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.సందీప, డిఫెన్స్ కౌన్సిల్ ఎం.రవీంద్ర, జైలర్ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రశర్మ -
టెన్నికాయిట్ ఫెడరేషన్జిల్లా అధ్యక్షుడిగా విజయ్
రఘునాథపల్లి: గోవర్దనగిరి గ్రామానికి చెందిన ముసిపట్ల విజయ్ టెన్నికాయిట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు టెన్నికాయిట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలువుల రాజ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం మండల కేంద్రంలో జిల్లా కార్యవర్గం వివరాలను విజయ్ వెల్లడించారు. ఉపాధ్యక్షుడిగా లోకుంట్ల సృజన్కుమార్, ప్రధాన కార్యదర్శి కన్నారపు కుమారస్వామి, సహాయ కార్యదర్శి ఎడ్ల బాలరాజు, కోశాధికారి దుబ్బాక హరీశ్గౌడ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నునావత్ కుమార్నాయక్, ఇమ్మడిశెట్టి రఘురాం నియమితులైనట్లు పేర్కొన్నారు. -
No Headline
తరిగొప్పుల/నర్మెట: అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజనతండాలో కనీస సౌకర్యాలు లేని పరిస్థితుల్లో.. పట్టుదలతో చదివి భారత సైన్యంలో చేరారు.. తరిగొప్పుల మండలం మాన్సింగ్తండాకు చెందిన ఎనిమిది మంది యువకులు. 14 ఏళ్లుగా దేశ రక్షణలో భాగంగా వివిధ రాష్ట్రాల సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తూ ఆదర్శంగా నిలు స్తున్నారు. ఒకరిని చూసి ఒకరు బార్డర్ బాటపట్టారు. అందులో కాయిత సంజీవరాజు, లకావత్ మోహన్, కత్తుల శ్రీను(జమ్మూకశ్మీర్), కాయిత ప్రశాంత్(లేహ్ లడఖ్), లకావత్ రాజు(డార్జిలింగ్), కత్తుల సాంబరా జు(ఉదంపూర్), లకావత్ సంపత్(ఛత్తీస్గఢ్), లకావత్ లచ్చు(బిహార్) రాష్ట్రాల సరిహద్దులో సేవలందిస్తున్నారు. అలాగే నర్మెట మండలంలోని 10 మంది యువతీ యువకులు దేశరక్షణలో తమవంతు సేవలందిస్తున్నా రు. మచ్చుపహాడ్ గ్రామానికి చెందిన డేగల సంపత్(ఛత్తీస్ గఢ్), డేగల సురేష్(బిహార్), ధరంతోష్ స్వాతి(లక్షద్వీప్), ఆగపేటకు చెందిన మతియాస్ రెడ్డి(అస్సాం), బత్తుల కృష్ణంరాజ్(తెలంగాణ), కన్నెబోయినగూడెంకు చెందిన డి.సురేందర్(ఆంధ్రప్రదేశ్), ధరావత్ శ్రీలత(తెలంగాణ), బండతండాకు చెందిన భూక్య శంకర్(తెలంగాణ), బొమ్మకూర్కు చెందిన ఇస్లావత్ రమేష్(ఛత్తీస్గఢ్)అంగోతు శ్రీనివాస్(కేరళ) ఆయా రాష్ట్రాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.తండా నుంచి సైన్యం బాట -
ఓటు హక్కు అత్యంత విలువైనది
జనగామ రూరల్: ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది ఓటు హక్కు.. ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. 15వ జాతీయ ఓటరు దినోత్సవా న్ని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు పింకేష్కుమర్, రోహిత్సింగ్, డీసీపీ రాజ మహేంద్రనాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది నిర్వహించిన పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా విజయవంతం చేశామని చెప్పారు. జిల్లాలో 7.62 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, కొత్త ఓటరుగా నమోదు, మార్పులు, చేర్పులు ఉంటే పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించే ప్రత్యేక క్యాంపెయిన్లు, ఎన్నికల కమిషన్ పోర్టల్, ఓటరు యాప్, 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ ఏడాది ‘నథింగ్ లైక్ ఓటింగ్.. ఐ ఓట్ ఫర్ స్యూర్’ నినాదంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. రాబోయే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగకుండా యువత, వివిధ వర్గాల కు చెందిన ఓటర్లు ఎక్కువగా పాల్గొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అదన పు కలెక్టర్లు, డీసీపీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది శక్తిమంతమైన ఆయుధమని, ఓటు ను అమ్ముకోకుండా బాధ్యతగా వినియోగించుకో వాలని సూచించారు. అనంతరం కొత్త యువ ఓటర్లకు కార్డులు అందజేయడంతోపాటు బూత్ స్థాయి సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి.సుహా సిని, ఆర్డీఓ గోపీరాం, డీఆర్డీఓ వసంత, తహసీల్దార్ హుస్సేన్, కలెక్టరేట్ ఏఓ మన్సూర్ పాల్గొన్నారు. ‘సౌర విద్యుత్’తో మహిళల ఆర్థికాభివృద్ధిసౌర విద్యుత్ ఉత్పత్తితో మహిళల ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మోడల్ సౌర విద్యుత్ గ్రామాలను ఎంపిక చేసేందు కు శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన డీఎల్ఆర్సీ సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నాయని, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ చైర్మన్గా, జెడ్పీ సీఈఓ కన్వీనర్గా ఎల్డీఎం, విద్యుత్ ఎస్ఈ, తెలంగాణ రెడ్కో జిల్లా మేనేజర్ సభ్యులుగా ఉంటారని పేర్కొన్నా రు. ‘పీఎం సూర్య ఘర్’ పథకం కింద జిల్లా నుంచి 142 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 1.66 మెగా యూనిట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, ఇందుకు లబ్ధిదారులకు ఏటా రూ.49 లక్షల ఆదాయం వస్తుందని వెల్లడించారు. అలాగే మోడల్ సోలార్ విలేజ్ ఎంపికకు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ‘పీఎం కుసుమ్’ పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వర కు 370 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించా మని, ఇందులో 12 మెగా వాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించి నట్లు వివరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ మాధురీ షా, ఎల్డీఎం శ్రీధర్, విద్యుత్ ఎస్ఈ వేణుమాదవ్, తెలంగాణ రెడ్కో జిల్లా మేనేజర్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
గణతంత్ర వేడుకలకు సిద్ధం
జనగామ: జిల్లా కేంద్రం ధర్మకంచ మినీ స్టేడియంలో ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. కలెక్ట ర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యాన అధికారులు ఏర్పాట్ల ను పర్యవేక్షించారు. సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఉదయం 8.15 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ధర్మకంచ మినీ స్టేడియంకు చేరుకుని 9 గంటలకు జెండా ఎగుర వేస్తా రు. 9.10 నుంచి 9.15 గంటల వరకు పోలీస్ గౌర వ వందనం, 9.15 నుంచి 9.25 వరకు పోలీసు పరేడ్ కార్యాక్రమం ఉంటుంది. 9.25 నుంచి 9.40 గంటల వరకు జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ ప్రసంగిస్తారు. 9.40 నుంచి 10.15 వరకు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది. అనంతరం మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాల్స్ను సందర్శిస్తారు. సాయంత్రం కలెక్టరేట్ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. నేడు నాలుగు పథకాలు ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకా లను నేడు(ఆదివారం) ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలో మండలానికి ఒక గ్రామం చొప్పున 12 గ్రామాలను ఎంపిక చేయగా.. జనగామ మండలం ఎర్రగుంటతండాలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితోపాటు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, స్టేషన్ఘన్పూర్ మండలం తానేదార్పల్లిలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పాలకుర్తి మండలం తీగారంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. అనంతరం జిల్లాలో కలెక్టర్ రిజ్వాన్ బాషా జూమ్ మీటింగ్లో అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జూమ్ మీటింగ్లో అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్, జెడ్పీ సీఈఓ మాధురీ షా, డిప్యూటీ సీఈఓ సరిత, ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్ నాయక్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. జనగామ పట్టణ పరిధిలో నిర్వహించిన వార్డు సభల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులకు మంజూరు పత్రాల అందజేత కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. మంత్రి పర్యటనకు ఏర్పాట్లు.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి జనగామ మండలం ఎర్లకుంటతండా గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు సంక్షేమ పథకాలను ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు ప్రత్యేక, జిల్లా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సంక్షేమ పథకాలకు ఎంపికై న గ్రామాలు ధర్మకంచ మినీ స్టేడియంలో ఏర్పాట్లు 9 గంటలకు కలెక్టర్ చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణమండలం గ్రామం బచ్చన్నపేట సాల్వాపూర్ చిల్పూరు గార్లగడ్డతండా దేవరుప్పుల లకావత్తండా(టీ) స్టేషన్ఘన్పూర్ తానేదార్పల్లి జనగామ ఎర్రకుంటతండా కొడకండ్ల నీలిబండతండా లింగాలఘణపురం కొత్తపల్లి నర్మెట బొమ్మకూరు పాలకుర్తి తీగారం రఘునాథపల్లి కన్నాయపల్లి తరిగొప్పుల వాచ్చ్యాతండా జఫర్గఢ్ అల్వార్బండతండా (శంకర్తండా) -
ఆధునికం.. ఆదర్శం
– 8లోu● పలు రంగాల్లో రాణిస్తున్న జిల్లా వాసులు ● దేశ సేవకు అంకితమైన యువకులు దేశం అభివృద్ధి చెందడమంటే.. అద్దాల మేడలు, రంగురంగుల గోడలు కాదు. పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి.. ●– డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ఒకప్పుడు వెనుకబాటుతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, సదుపాయాలతో వివిధ రంగాల్లో రాణిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నవారు కొందరైతే.. దేశ సేవకు అంకితమైన యువకులు ఇంకొందరు ఉన్నారు. జాతీయ స్ఫూర్తిని చాటుతున్నారు మరికొందరు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలోప్రత్యేక కథనం. లింగాలఘణపురం: ఒకప్పుడు గుడుంబా తయారీకి మారుపేరుగా ఉన్న పటేల్గూడెం నేడు పంటల సాగులో ప్రత్యేకతను చాటుకుంటోంది. 2వేల జనాభా.. 1,300 ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో 1995 నుంచి 2014 వరకు ఎక్కువ మంది గుడుంబా తయారు చేసి ఇతర ప్రాంతా ల్లో విక్రయించే వారు. ఎకై ్సజ్ శాఖలో నిత్యం పటేల్గూడెం పేరు మార్మోగేది. తెలంగాణ ప్రేత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత గుడుంబాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో క్రమంగా తయారీ తగ్గించి వ్యవసాయంపై దృష్టి పెట్టారు. వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి, పొగాకు పండిస్తున్నారు. అలాగే కూరగాయల్లో వంకాయ పండించి హైదరాబాద్ మార్కెట్లకు తరలిస్తున్నా రు. దీంతో ఒకప్పుడు గుంట భూమిలేని పేదలు నేడు భూములు కొనుగోలు చేసి 90 శాతం మంది వ్యవసాయంపై జీవిస్తున్నారు. కూరగాయలు, ఆకు కూరలు పండించి ఇతర గ్రామాల్లో విక్రయిస్తున్నారు. పదేళ్లుగా ప్రజల్లో చాలా మా ర్పు వచ్చింది. పాడిపరిశ్రమ కూడా అభివృద్ధి చెందింది. పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ఇటీవల డీఎస్సీలో కడుదూరి శ్రీకాంత్, వట్టెం సౌందర్య ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు. మార్పు వచ్చింది.. గ్రామంలో మార్పు వచ్చింది. ఒకప్పుడు గుడుంబా గూడెంగా ముద్రపడింది. నేడు అందరూ వ్యవసాయంపై దృష్టి పెట్టారు. కూరగాయలతో పాటు వాణిజ్య పంట లు పండిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివిస్తున్నారు. నేను బీటెక్ పూర్తి చేసి వ్యవసాయం చేసుకుంటూ ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాస్తున్నాను. – పొన్నాల కార్తీక్, బీటెక్ విద్యార్థిపంటల పటేల్ గూడెం -
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
జనగామ: వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించి గమ్యస్థానాలకు చేరుకోవాలని జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి శ్రీనివాస్గౌడ్ సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం జనగామ ఆర్టీసీ డిపోలో డ్రైవర్స్ డే నిర్వహించారు. రోడ్డు భద్రతా నియమాలతో కూడిన ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ.. ర్యాలీ నిర్వహించారు. 27 ఏళ్లుగా యాక్సిడెంట్ ఫ్రీ రికార్డు కలిగిన ఆర్టీసీ డ్రైవర్స్ పి.గురువయ్య, ఎ.కిషన్, బి.శ్రీనివాస్ను సన్మానించారు. డీటీఓ శ్రీనివాస్, డిపో మేనేజర్ స్వాతి, సూపర్వైజర్స్, సిబ్బంది తదితరులున్నారు. -
బాలికలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి
జనగామ రూరల్: బాలికలు తమ హక్కుల కోసం పోరాడుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 18 ఏళ్లలోపు ఉన్నవారు తెలివిగా తమ సమస్యలు పరిష్కరించుకునేలా ఉండాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని పథకాలను, చట్టాలను రాజ్యాంగంలో కల్పించిన హక్కులను ఉపయోగించుకుంటూ అభివృద్ధి చెందాలన్నారు. ప్రస్తుత సమాజంలో బాలికలు ఉన్నత చదువులతో గోప్ప స్థాయిలో ఉన్నారన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని శరీరక మానసికంగా దృఢంగా ఉండాలన్నారు. ఏదైనా సమస్య వస్తే జిల్లా న్యాయ సేవధికార సంస్థకు తెలియజేయాలని కాగితంపై సమస్య రాస్తే చాలు చర్య తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.సునంద, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎం.రవీంద్ర, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ -
అభివృద్ధి చేయలేకపోయాం
జనగామ: ‘వార్డులను అభివృద్ధి చేయలేకపోయాం. బాధగా ఉంది. భవిష్యత్లో పట్టణం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఓట్లు వేసి గెలిపించిన ఓటర్లను క్షమించాలని కోరుతున్నాం’ అని జనగామ పురపాలిక పాలక మండలి చివరి సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. శుక్రవారం ము న్సిపల్ చైర్పర్సన్ పోకల జమునలింగయ్య అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం ఎజెండా అంశాలపై చర్చ లేకుండానే ముగిసింది. ఐదేళ్ల కాలంలో ఏ పనులు చేశామని సన్మానాలు చేస్తున్నారు? ఎజెండా అంశాలను మెజార్టీ సభ్యులు అంగీకారం లేకుండా తీర్మానించుకున్నారు... కౌన్సిల్ పూర్తిగా విఫలమైంది అంటూ ఆగ్రహం వెల్లగక్కారు. కుంటుపడిన అభివృద్ధి! బీజేపీ ఫ్లోర్ లీడర్ మహంకాళి హరిశ్చంద్రగుప్త మాట్లాడుతూ.. ఐదేళ్ల తమ పాలకమండలి పాలనలో కమిషనుర్లు, ఆయా శాఖల అధికారులు, సెక్షన్ డిపార్ట్మెంట్లలో పని చేసే ఉద్యోగుల బదిలీలతో అభివృద్ధి, పాలన పూర్తిగా కుంటుపడి పోయిందన్నారు. పాలక ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకు రావడంలో అధికారులు, గత ప్రజాప్రతినిధులు విఫలం కావడంలో పట్టణంలో అనుకున్న మేర అభివృద్ధి చేయలేకపోయామన్నారు. చర్చను అడ్డుకోవడం సిగ్గు చేటు.. 17వ వార్డు కౌన్సిలర్ జక్కుల అనిత వేణుమాధవ్ మాట్లాడుతూ.. ఐదేళ్ల పాటు ఏం చేశారని సత్కరించారని, తాము ప్రజలకు ఏం జవాబు చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. సర్వసభ్య సమావేశాల పేరిట కాలయాపన మినహా, చర్చ లేకుండానే ఎజెండా అంశాలను తీర్మానించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల సమయంలో ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోలేక పోయామన్నారు. చివరి సమావేశంలో సైతం చర్చను అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. రూ.9 లక్షల జనరల్ ఫండ్ను సాధారణ పద్దు కింద మార్చి ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు. చివరి సమావేశం పేరిట ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును పూర్తిగా కడిగేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలకు సేవ చేయలేని సమయంలో సత్కారాలు అవసరం లేదని తిరస్కరించినట్లు చెప్పారు. పదవీ కాలంలో సంతృప్తిగా లేము.. వార్డు ప్రజలు క్షమించాలంటూ తన ప్రసంగాన్ని ముగించారు. మహిళా సభ్యులు గుర్రం భూలక్ష్మి నాగరాజు, బండ పద్మయాదగిరిరెడ్డి, ఉడుగులు శ్రీలత, తాళ్ల సురేశ్రెడ్డి, గాదెపాక రాంచందర్, పేర్ని స్వరూప మాట్లాడుతూ.. వార్డుల పరిధిలో అనుకున్న మేర అభివృద్ధి చేయలేకపోయామని, భవిష్యత్లో పట్టణం మరింత అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 14 ఎజెండా, 8 టేబుల్ అంశాలను కౌన్సిల్ ముందుకు తీసుకు రాగా ఆమోదించారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, మేనేజర్ రాములు, మల్లిగారి మధు తదితరులు ఉన్నారు.ప్రజాసేవలో భాగస్వాములు కావాలి: పల్లా పదవీకాలం ముగిసినా ప్రజాసేవలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి పురపాలిక పాలక మండలికి సూచించారు. శుక్రవారం మున్సిపల్లో జరిగిన పాలక మండలి వీడ్కోలు సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యులను సత్కరించి మాట్లాడారు. గడిచిన ఐదేళ్లలో పట్టణ ప్రజలకు సేవ చేసిన కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో మున్సిపాలిటీలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. పదవితో సంబంధం లేకుండా ప్రజాసేవలో నిరంతరం పని చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే కాలంలో ప్రజాసేవలో ఉంటూ మరెన్నో పదవులు సాధించాలని ఆకాంక్షించారు. ఓట్లేసిన ప్రజలు క్షమించాలి: పాలక మండలి సభ్యులు చివరి సమావేశంలో ఊసే లేని చర్చ సాధారణ పద్దు కింద జనరల్ ఫండ్! భావోద్వేగాలతో ముగిసిన కౌన్సిల్ సమావేశం -
ఆడపిల్లలు భవితకు సోపానాలు
జనగామ రూరల్: ఆడపిల్లలు భారం కాదని, భవితకు సోపానాలని తల్లిదండ్రులు వారిని సమానంగా చూడాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ పాల్గొన్నారు. మిషన్ శక్తి సామర్థ్య పోస్టర్లను ఆవిష్కరించారు. ఆటల పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, డీఆర్డీఏ వసంత, డీఈఓ రమేశ్, జీసీడీఓ గౌసియా బేగం, డీసీపీఓ రవికాంత్, సీడీపీఓలు రమాదేవి, సత్యవతి, చైల్డ్ హెల్ప్ లైన్ కో–ఆర్డినేటర్ రవికుమార్ ఐసీడీఎస్ సూపర్వైజర్లు తదితరులున్నారు. జాగ్రత్తగా ఆన్లైన్ చేయాలి ప్రజాపాలన గ్రామ, వార్డు సభల అభ్యంతరాలు, దరఖాస్తులు, ఆత్మీయ భరోసా సర్వే వివరాల్ని ఆన్లైన్లో జాగ్రత్తగా నమోదు చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో జరుగుతున్న ఆన్లైన్ నమోదు ప్రక్రియను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక ఎమ్మార్సీలో ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నేపథ్యంలో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై మండల స్థాయిలో విద్యార్థులకు నిర్వహిస్తున్న వ్యాస రచన, ఉపన్యాస పోటీలను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ మాధురి షా, ఎంపీడీఓ హరికృష్ణ, ఎంపీఓ సంపత్ కుమార్, తహసీల్దార్ హుస్సేన్, ఎంఈఓ రాజేందర్ తదితరులున్నారు. రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోండి జనగామ: కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందిన రైతులు ఈనెల 31లోగా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాష ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో పాస్ బుక్ కోసం దరఖాస్తు చేసుకోని రైతులు, బ్యాంకు ఖాతా వివరాల్లో మార్పులు, చేర్పులు అవసరమైన వారు వ్యవసాయ విస్తరణాధికారికి దరఖాస్తు చేసుకో వాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం -
గ్రామసభలకు దరఖాస్తుల వెల్లువ
జనగామ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న నూతన పథకాల అర్హుల ఎంపిక కోసం నాలుగు రోజులుగా జిల్లాలో కొనసాగుతున్న గ్రామసభలు శుక్రవారంతో ముగిశాయి. జాబితా లో పేర్లు గల్లంతవడంతో జిల్లా వ్యాప్తంగా గ్రామ సభల్లో అధికారులను నిలదీశారు. ఇదే విషయమై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు జరిగాయి. కొన్ని చోట్ల తన్నుకోగా.. మరికొన్ని గ్రామాల్లో దూషణల పర్వం కొనసాగింది. చివరి రోజు సైతం జిల్లాలో పోలీసు పహారా నడుమ గ్రామ సభలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా నాలుగు పథకాలకు సంబంధించి కొత్తగా 34,531 దరఖాస్తులు వచ్చాయి. ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. నాలుగు రోజుల పాటు జరిగిన గ్రామ సభల్లో పోలీసులు కీలక పాత్ర పోషించారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ నేతృత్వంలో ఏసీపీ, సీఐ, ఎ స్సై, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తూ.. అర్జీదారులు, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులకు నచ్చజెబుతూ గొడవలు జరగకుండా చూసుకున్నారు. చిన్న చిన్న గొడవలు మినహా.. తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా గ్రామ సభలు ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందించనున్నారు. జిల్లాలో ఇలా.. కొత్తగా 34,531 దరఖాస్తులు నిరసనల నడుమ ముగిసిన సభలు ఊపిరి పీల్చుకున్న అధికారులుగ్రామ సభలు: 283 మున్సిపల్ వార్డులు: 30 రేషన్ కార్డుల దరఖాస్తులు: 14,532 ఇందిరమ్మ ఇళ్లు: 13,955 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా: 5,270 రైతుభరోసా: 491 మొత్తం 34,531