breaking news
Jangaon
-
కుక్కల ఆపరేషన్ @ రూ.2.97 లక్షలు
జనగామ: జనగామ మున్సిపల్లో కుక్కల సంచారం ప్రజల పాలిట ప్రమాదకరంగా మారింది. ఏ వీధికెళ్లినా ఏ ముందులే అన్నట్టుగా అడుగడుగునా శునకాలు రాజ్యమేలుతున్నాయి. కాలినడకన కనిపించినా.. ద్విచక్రవాహనం వెళ్తున్నా.. కుక్కలు వెంబడిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇటీవల అనేక వార్డుల్లో కుక్కల దాడుల్లో పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఒంటరిగా బయటకు పంపించాలంటేనే వణికిపోతున్నారు. ఈ నేపధ్యంలో గతేడాది సెప్టెంబర్–అక్టోబర్ మాసంలో కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేందుకు పురపాలిక అధికారులు నిర్ణయం తీసుకున్నారు. చంపక్హిల్స్ డంపింగ్ యార్డు సమీపంలో నిర్మాణం చేసిన జంతువుల జనన నియంత్రణ (ఏబీసీ/కు.ని) సెంటర్లో ఈ ఆపరేషన్కు సిద్ధం చేశారు. అయితే కుక్కలను పట్టుకునే సమయంలో లొకేషన్లో ట్రేస్ అవుట్ చేయాలి. ఆపరేషన్ చేసి, ఆరోగ్యంగా కోలుకున్న తర్వాత ఎక్కడ నుంచి పట్టుకు వెళుతున్నారో, అక్కడే వదిలిపెట్టి పూర్తి ఆధారాలు మున్సిపల్లో అందుబాటులో ఉంచుకోవాలి. 180 కుక్కలకు ఆపరేషన్ అధికారుల లెక్కల ప్రకారం విడతల వారీగా 180 కుక్కలను పట్టుకుని ఏబీసీ సెంటర్కు తరలించి కు.ని ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్కు ముందు మూడు రోజుల పాటు సంరక్షించి, 4వ రోజు సర్జరీ చేస్తారు. మరో మూడు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుకుని, ఏడవ రోజు కుక్కను పట్టుకు వెళ్లిన ప్రదేశంలో వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కో శునకం ఆపరేషన్ ఖర్చు కోసం సుమారు రూ.1,650 లెక్కన మొత్తంగా రూ.2.97లక్షల వరకు ఖర్చు చేశారు. కుక్కల సంతతి తగ్గించేందుకు ఆపరేషన్ కార్యక్రమం బాగున్నప్పటికీ, కు.ని తర్వాత వాటిని ఎక్కడ వదిలేశారు.. జీపీఎస్ లొకేషన్ ఎక్కడ? అనే ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేకుండా పోయింది. పట్టణంలో ఏ వార్డుకు వెళ్లినా పదుల సంఖ్యలో కుక్కలు దాడి చేసే పరిస్థితికి చేరుకున్నాయి. లక్షల రూపాయల ప్రజా ధనం ఖర్చు చేసి, శునకాలకు ఆపరేషన్ చేయించినా, ఫలితం లేదంటున్నారు పట్టణ ప్రజలు. కుక్కల ఆపరేషన్ కోసం చేసిన ఖర్చు వివరాలకు సంబంధించి విచారణ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై శానిటేషన్ ఇన్స్పెపెక్టర్ గోపయ్య మాట్లాడుతూ కుక్కల ఆపరేషన్కు రూ.2.97 లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పారు. కుక్కలను పట్టుకు వెళ్లిన ప్రదేశం, జీపీఎస్ తమ వద్ద లేదన్నారు. ఎక్కడ పట్టుకెళ్లారు జీపీఎస్ లొకేషన్ ఉందా ? వీధుల వెంట గుంపులుగుంపులుగా శునకాలు -
ముగిసిన సమ్మర్ ఇంటర్న్షిప్
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో సమ్మర్ ఇంటర్న్షిప్–25 ప్రోగ్రాం శుక్రవారంతో ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ హాజరై సమ్మర్ ఇంటర్న్షిప్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. నిట్ వరంగల్లో తొలిసారిగా మే 9వ తేదీన ప్రవేశపెట్టిన సమ్మర్ ఇంటర్న్షిప్నకు అనూహ్య స్పందన లభించిందని, యూజీ, పీజీ నుంచి 194 విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఇక ప్రతిఏటా సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంను అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీన్ అకడమిక్, ప్రొఫెసర్ వెంకయ్య చౌదరి, ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాసమస్యలు పరిష్కరించాలని ధర్నా
జనగామ రూరల్: పట్టణంలో పేరుకుపోయిన ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. పట్టణ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ప్రజలకు సక్రమంగా సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు జనాభాకు అనుగుణంగా లేకపోవడంతో పట్టణంలో ఎక్కడి చెత్త అక్కడే ఉండటంతో దుర్వాసన వస్తుందన్నారు. ఏసి రెడ్డి నగర్లో డబుల్ బెడ్రూంలో సీసీ రోడ్డు డ్రెయినేజీ నిర్మించాలని, అర్హులైన పేదలందరికీ కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వర్గ సభ్యులు అహల్య, బొట్ల శేఖర్, బూడిది గోపి, చుంచు విజయేందర్, చందు నాయక్, పొతుకునూరి ఉపేందర్, కల్యాణం లింగం పల్లెలు లలిత, పందిళ్ల కల్యాణి, బొట్ల శ్రావణ్, పాము కుంట్ల చందు, పాము శ్రీకాంత్, పగిడిపల్లి బాలమణి తదితరులు పాల్గొన్నారు. పోరాటాలకు సిద్ధం కావాలి రఘునాథపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలపై పార్టీ శ్రేణులు పోరాటాలకు సిద్ధంగా కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పిలుపు నిచ్చారు. శుక్రవారం మండలంలోని కుర్చపల్లిలో సీపీఎం రెండు రోజుల మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాపర్తి రాజు, సాంబరాజు యాదగిరి, గంగాపురం మహేందర్, కాసాని పుల్ల య్య, మంచాల మల్లేష్, బీమగోని చంద్రయ్య, మైలారపు వెంకటేశ్వర్లు, యాదగిరి, వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
సీఎంఆర్ను సకాలంలో అందించాలి
జనగామ రూరల్: రబీ, ఖరీఫ్ 2024–25కు గాను సీఎంఆర్ను సకాలంలో అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రేషన్ కార్డులు, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు తదితర అంశాలపై అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్తో కలిసి తహసీల్దార్లు, రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్యాలను అనుగుణంగా రైస్ మిల్లర్లు సీఎంఆర్ను నిర్ణీత సమయంలో డెలివరీ చేయాలని, లేకుంటే చర్యలు తప్పవన్నారు. ఖరిఫ్ (వానాకాలం) 2024–25 సీజన్ కు సంబంధించి 91827.554 మెట్రిక్ టన్నుల బియ్యానికి గాను 73664.210 మెట్రిక్ టన్నుల బియ్యం, 80.22శాతం ఇప్పటికే మిల్లింగ్ చేసి డెలివరీ చేయగా ఇంకా 18163.344 మెట్రిక్ టన్నులు డెలివరీ చేయాల్సి ఉందన్నారు. రబీ (యాసంగి) 2024–25 సీజన్కు సంబంధించి 144834.216 మెట్రిక్ టన్నుల బియ్యానికి గాను 38135.916 మెట్రిక్ టన్నుల బియ్యం, 26.33శాతం ఇప్పటికే మిల్లింగ్ చేసి డెలివరీ చేయగా ఇంకా 106698.300 మెట్రిక్ టన్నులు డెలివరీ చేయాల్సి ఉందన్నారు. కొత్తరేషన్ కార్డుల జారీ, పాత రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు సంబందించి ప్రక్రియ వేగవంతం కావాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు, సివిల్ సప్లయీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
జనాభా నియంత్రణకు కృషి చేయాలి
జనగామ రూరల్: జనాభా నియంత్రణకు సమష్టిగా కృషి చేసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఎక్కువగా చేపట్టాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్ రావుతో కలిసి అదనపు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్టాండ్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు వైద్య సిబ్బందితో జనాభా నియంత్రణపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 1987లో ఐక్యరాజ్య సమితి జనాభా నియంత్రణకు చర్యలు తీసుకోగా 1989 జూలై 11వ తేదీ నుంచి ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటించడం జరుగుతుందన్నారు. ఆశ కార్యకర్తలు ఇంటింటి సర్వే చేపట్టికొత్తగా వివాహం జరిగిన మహిళలను గుర్తించి 23 సంవత్సరాలు ఉండి, ఆరోగ్యవంతురాలిగా ఉన్నప్పుడే గర్భం దాల్చేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులకు తెలియ చెప్పాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ మహిళలు సంపూర్ణ ఆరోగ్య వంతురాలిగా ఉన్నప్పుడు గర్భం దాల్చినట్లయితే గర్భస్రావాల రేటు తగ్గుతుందన్నారు. అత్యధికంగా 700 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన డాక్టర్ శకుంతల, మోటివేషన్ పర్సన్ దీపారాణి, ఉత్తమ సేవలందించిన దేవరుప్పల మండల పీహెచ్సీకి చెందిన ఆశకార్యకర్త స్వప్నలను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ -
83.29శాతం
మొక్కల సంరక్షణజనగామ: అటవీ ప్రాంతంలో మొక్కల సంరక్షణపై ప్రత్యేక ఫోకస్ సారిస్తున్నారు. నాటిన ప్రతీ మొక్కను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ జిల్లాలో గడిచిన తొమ్మిదేళ్ల లెక్కలను పరిశీలిస్తే అటవీ ప్రాంతం కేవలం 0.5 శాతం మాత్రమే పెరిగింది. 2015కు మందు ఒక శాతం ఫారెస్ట్ ఏరియా ఉండగా... డబుల్ చేసేందుకు నాటి నుంచి నేటి వరకు కష్టపడినా.. ఫలితం కనిపించడం లేదు. మండలాల పరిధిలో ఎక్కువగా అటవీ ప్రాంతం లేకపోవడంతో అధికారులు ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నారు. ఒక్కో మొక్కను పెంచి పెద్ద చేసి, నాటే వరకు రూ.86 ఖర్చు చేస్తున్నారు. జిల్లాలో పచ్చదనం ఏటా అటవీ ప్రాంతం విస్తీర్ణం పెరుగుదల తదితర అంశాలపై సాక్షి ప్రత్యేక కథనం. తొమ్మిదేళ్లు..4.83 కోట్ల మొక్కలు జనగామ ప్రత్యేక జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉమ్మడి జిల్లాలో అతి తక్కువ అటవీ ప్రాంతం కలిగిన జిల్లాలో జనగామ ఒకటి. కేవలం ఒకే ఒక్క అటవీ ప్రాంతంతో ఉన్న జిల్లాలో రెండు నుంచి మూడుకు పెంచాలని నాటి కలెక్టర్ దేవసేన నుంచి ప్రస్తుత జిల్లా బాస్ రిజ్వాన్ బాషా వరకు కృషి చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ 0.5 శాతం మాత్రమే పెంచగలిగారు. ఎక్కువగా ఫారెస్ట్ ఏరియా లేకపోవడం, సాగు పెరగడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. 2016 నుంచి 2024 వరకు 5.80 కోట్ల మొక్కల లక్ష్యం కాగా 4.83 కోట్లు నాటారు. ఇందులో 83.29 శాతం మేర మొక్కలను సంరక్షించగలిగారు. 2.18 లక్షల హెక్టార్ల భౌగోళిక ప్రాంతం జనగామలో 2,18,750 హెక్టార్ల భౌగోళిక ప్రాంతం ఉండగా, ఇందులో లింగాలఘణపురం, జనగామ, కొడకండ్ల మినహా 9 మండలాల పరిధిలో 3,357.03 హెక్టార్ల మేర అటవీ ప్రాంతం (1.05 శాతం) విస్తరించి ఉంది. జనగామ, నర్మెట మండలం వె వెల్దండ గ్రామంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నర్సరీలు ఉండగా, బచ్చన్నపేట మండలం మన్సాన్పల్లిలో త్వరలోనే ప్రారంభించనున్నారు. వీటి పరిధిలో 1.20లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండగా, ఇటీవల పురపాలికలోని 30 వార్డుల్లో నాటేందుకు 12,500 మొక్కలను వెల్దండ, మరో 10 వేలను జనగామ నర్సరీ నుంచి సరఫరా చేశారు. మొక్కను పెంచేందుకు రూ.12, నాటేందుకు (అన్ని కలుపుకుని) రూ.74 మేర మొత్తంగా రూ.86 ఖర్చు చేస్తున్నారు. ఈ లెక్కన తొమ్మిదేళ్లలో రూ.4.15 కోట్ల మేర ఖర్చు చేయగా, మంచి ఫలితాలు వచ్చాయని చెప్పుకోవచ్చు. వందశాతం మొక్కలు నాటే సమయంలో ఇందులో ఎండి, విరిగి పోవడం, చెదలు పట్టడంతో 10 నుంచి 20 శాతం మేర నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. వీటి స్థానంలో కొత్త మొక్కలను నాటి వందశాతం ఫలితాలను తీసుకు వచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు. 10వేల మొక్కలకు ఒక వాచర్ను ఏర్పాటు చేసి రెండేళ్ల పాటు మొక్కల సంరక్షణ బాధ్యతను అప్పగిస్తున్నారు. ప్రస్తుత వనమహోత్సవంలో 2025 వార్షిక టార్గెట్ అన్ని శాఖలు కలుపుకొని 33 లక్షలు ఉండగా అటవీశాఖ 14,400 మొక్కలు నాటాల్సి ఉంది. రూ.4.15 కోట్ల ఖర్చు జిల్లాలో 3,357.03 హెక్టార్లలో అటవీ ప్రాంతం తొమ్మిదేళ్లలో 0.5 శాతం పెరుగుదల ఈ సంవత్సరం లక్ష్యం 14,400 ఒక్కో మొక్కకు రూ.86 ఖర్చు బచ్చన్నపేట 188.82మండలాల వారీగా అటవీ ప్రాంతం (హెక్టార్లలో)రఘునాథపల్లి 605.48పాలకుర్తి 1,107.75మొత్తం 3357.03నర్మెట 250.12స్టేషన్ఘన్పూర్ 924.30 చిల్పూరు, తాటికొండ, జఫర్గఢ్ 183.45తరిగొప్పుల 97.11జిల్లాలో అటవీ విస్తీర్ణం జిల్లా భౌగోళిక ప్రాంతం: 2,18,750 హెక్టార్లు అటవీ ప్రాంతం: 3,357.03హెక్టార్లు అటవీ శాతం: 1.05శాతంమొక్కల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణజిల్లాలోని అటవీ ప్రాంతాల్లో మొక్కలు నాటి సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం. 12 మండలాల పరిధిలో పెద్దగా అటవీ ప్రాంతం లేదు. ప్రస్తుతం 3,357.03హెక్టార్ల పరిధిలో మాత్రమే పారెస్ట్ ఏరియా ఉండగా, పొలం గట్లు, చెరువు కట్టలు, వ్యవసాయ క్షేత్రాలు, ఇతర ప్రదేశాల్లో మొక్కలు నాటి కొంతమేర అటవీ ప్రాంతాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇందు కోసం రైతులను కూడా ప్రోత్సహిస్తున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు వనమహోత్సవం ప్రోగ్రాంలో అటవీ శాఖ ప్రధాన భూమిక పోషిస్తోంది. 9 సంవత్సరాల్లో మంచి ఫలితాలు సాధించి, 2025 వార్షిక సంవత్సరానికి 14,400 మొక్కల పెంపకం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. నాటిన మొక్కలు వాడి పోవడం, ఎండటం, చెదలు పట్టకుండా మందులు చల్లుతూ వాచర్ పర్యవేక్షణలో నిత్యం దృష్టి సారిస్తున్నాం. ఒకవేళ 10 నుంచి 20 శాతం లోపు మొక్కలకు నష్టం కలిగితే వాటి స్థానంలో మళ్లీ మొక్క నాటుతున్నాం. వందశాతం ఫలితాలు వచ్చేలా అందరి భాగస్వామ్యంతో కష్టపడుతున్నాం. – కొండల్రెడ్డి, ఫారెస్ట్రేంజ్ ఆఫీసర్ -
విద్యార్థులు లక్ష్యంతో చదవాలి
స్టేషన్ఘన్పూర్: ప్రతిఒక్కరూ విద్యార్థి దశలోనే భవిష్యత్ లక్ష్యాలను నిర్ధేశించుకుని లక్ష్యసాధనకు ప్రణాళికయుతంగా చదివితే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న అన్నారు. మండలంలోని ఛాగల్లు ఉన్నత పాఠశాలను డీఈఓ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని రికార్డులు, రిజిస్టర్లు, టీచర్ల డైరీలు, బేస్ లైన్ పరీక్షల వివరాలు, పాఠ్య ప్రణాళికలు తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల బోధన ఎలా ఉంది, పాఠ్యాంశాలు సరిగా అర్థం అవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, వినయం కలిగి ఉండాలని, ఉన్నత చదువుతో సమాజంలో సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. విద్యార్థులు ఎలాంటి దురలవాట్లకు గురికావద్దని, చదువుపైనే శ్రద్ధ వహించాలన్నారు. ఉపాధ్యాయుల సూచనల మేరకు ఇష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత, అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. వంట చేసే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంఈఓ కొమురయ్య, ఉపాధ్యాయులు ఉన్నారు. డీఈఓ భోజన్న -
మొక్కలు నాటి సంరక్షించాలి
జనగామ రూరల్: ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని బీసీ వెల్పేర్ అధికారి బి. రవీందర్ అన్నారు. జనగామలోని రైల్వే ట్రాక్ట్ వద్ద గల ఎంజే పీ బాలుర పాఠశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అధ్వర్యంలో శుక్రవారం బీసీ వెల్ఫేర్ అధికారి బి.రవీందర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు మొక్కలు నాటారు. పెంబర్తి మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల, బచ్చన్నపేట మ హాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలికల జూ నియర్ కాలేజీ, పాఠశాలలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 200 వందల మొ క్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయని, మొక్కలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయన్నారు. ఈ కార్యక్రమాల్లో స్టేషన్ఘన్పూర్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భాగ్యలక్ష్మి, ప్రిన్సిపాల్ ఎం.అనిత, అధ్యాపకులు పాల్గొన్నారు. బీసీ వెల్ఫేర్ అధికారి రవీందర్ ఎంజేపీల్లో వనమహోత్సవం -
బహుమతుల ప్రదానం
జనగామ రూరల్: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా తెలంగాణ విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ రోడ్డులోని సేయింట్ మేరీ హైస్కూల్లో శుక్రవారం జిల్లా స్థాయి కామిక్ రైటింగ్ పోటీలు విద్యార్థులకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ పాఠశాల నుంచి విద్యార్థులు పాల్గొని కార్టూన్లు గీసి తమ ప్రతిభను చాటారు. కాగా, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ భోజన్న గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లతోపాటు నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో పోటీల ఇన్చార్జ్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి బొమ్మనబోయిన శ్రీనివాస్, శామ్యూల్ ఆనంద్, నవీన్, అనిల్ పాల్గొన్నారు. -
జీలుగతో భూసారం పెంపు
● ఏడీఏ వసంత సుగుణదేవరుప్పుల: వ్యవసాయ క్షేత్రాల్లో పంటల సాగుకు ముందు జీలుగ వేయడం వల్ల భూసారం పెరుగుతుందని స్టేషన్ఘన్పూర్ ఏడీఏ వసంత సుగుణ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని జీలుగ పంట సాగును ఆమె పరిశీలించారు. పంటల మార్పు చేయడంతోపాటు జిలుగు విత్తనాలు వేసి ఎదిగిన పంటను కలియదున్నడం వల్ల బలసంవర్ధకంగా భూమి మారి సాగు చేసే పంటలు రోగాల బారిన పడకుండా అధిక దిగుమతి పొందుతారని సూచించారు. రఘునాథపల్లి ఏవో ఓ శ్రీనివాస్ రెడ్డి, ఏఈఓ సాగర్, ఆదర్శ రైతులు లెక్కల ఇంద్రసేనారెడ్డి, ఆవుల సురంజన్ రెడ్డి,ఊఉగు సత్యనారాయణ, వెంకటయ్య, యాదయ్య పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి
పాలకుర్తి టౌన్: మంజూరైన ఇందిరమ్మ ఇల్లును గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు తొలగించారని ఆరోపిస్తు శుక్రవారం బమ్మెర గ్రామానికి చెందిన బరిగెల పోతన కుటుంబ సభ్యులతో శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పోతన మాట్లాడుతూ రెండు నెలల క్రితం బమ్మెర వచ్చిన కలెక్టర్ రిజ్వాన్ భాష తనకు ఇల్లు మంజూరు చేస్తూ కట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. కాగా, గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఇల్లు మంజూరు అయితే రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. వెంటనే ఇళ్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ధర్నాలో పోతన భార్య రేణుకతోపాటు ఇద్దరు పిల్లలు పాల్గొన్నారు. -
కామన్ స్కూల్ విద్యావిధానాన్ని అమలు చేయాలి
జనగామ రూరల్: వివిధ యాజమాన్యాల కింద కొనసాగుతున్న పాఠశాలలు అన్నింటినీ ఒకే గొడుగు కిందకి తీసుకువచ్చి కామన్ స్కూల్ విద్యావిధానాన్ని అమలు చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉమాపతి కార్యాలయంలో టీపీటీఎఫ్ జిల్లా సబ్ కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు ఎన్ఎన్ రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధ్యా య విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, ప్ర భుత్వ పాఠశాలలన్నింటినీ సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలన్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్ల, బదిలీల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు. పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల వివిధ రకాల బిల్లులను విడుదల చేయాలని, వెంటనే పీఆర్సీని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు ఎన్ ఎన్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలన్నింటికీ పదివేల ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంకుషావలి, రాష్ట్ర కౌన్సిలర్ కుర్రంల యాదగిరి, సత్యనారాయణ రెడ్డి, వజ్రయ్య, రాజారెడ్డి, లక్ష్మణ్ జి, రాజేందర్, ప్రభాకర్, శారద, కవిత తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక వసతుల కల్పనకు కృషి
రఘునాథపల్లి: ఖిలాషాపూర్ ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు అన్నారు. శుక్రవారం పాఠశాలను ఆయన సందర్శించి విద్యార్థుల సంఖ్య పెంచిన హెచ్ఎం ఆలేటి యాదవరెడ్డి, ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు. పాఠశాలకు మూడు అదనపు తరగతి గదులు, సరిపడు టాయిలెట్స్ మంజూరు చేయాలని హెచ్ఎం వినతి పత్రం అందజేశారు. తరగతి గదుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు శ్రమదానంతో గదులు నిర్మించుకోవడాన్ని చూసి రాంబాబు వారిని అభినందించారు. మాజీ జెడ్పీటీసీ లింగాల జగదీష్ఛందర్రెడ్డి, మండల అధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్, తోటకూర రమేష్, మేకల నరేందర్ పాల్గొన్నారు. -
కేజీబీవీ విద్యార్థిని అదృశ్యం
తరిగొప్పుల: కస్తూర్బా గాంధీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైంది. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో అల్పాహారం చేసేందుకు పాఠశాల విద్యార్థులను సిబ్బంది పిలవగా ప్లేట్ తీసుకువస్తానని గదిలోకి వెళ్లిన విద్యార్థిని కనిపించకుండా పొయింది. సదరు విద్యార్థిని వద్ద మొబైల్ ఫోన్ దొరికిందని, అట్టి విషయాన్ని సిబ్బంది పాఠశాల ప్రత్యేక అధికారినికి దృష్టికి తీసుకువెళ్లారని, దీంతో భయబ్రాంతికి గురై పాఠశాల నుంచి పారిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. పాఠశాల ప్రధాన ద్వారం మూసి ఉన్నప్పటికీ గదిలోని కిటికీ ఇనుప గ్రిల్స్ లేకపోడంతో దానిగుండ విద్యార్థిని పారిపోయినట్లు అనుమానం వ్యక్తం అవుతుంది. కాగా, ఇట్టి విషయమై పోలీస్స్టేషన్లో ఎస్ఓ సునీత ఫిర్యాదు చేసినట్లు ఎస్సై శ్రీదేవి తెలిపారు. సమస్యలు పరిష్కరించాలి స్టేషన్ఘన్పూర్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయల సమస్యల పట్ల అనుసరిస్తున్న ఉదాసీనత వైఖరిని విడనాడి తక్షణమే పరిష్కరించాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాష్ డిమాండ్ చేశారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా విద్యారంగంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన ఉందన్నారు. ‘గులాబీ జెండా ఎగరాలి’ రఘునాథపల్లి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పిలుపు నిచ్చారు. శుక్రవారం మండలకేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామ గ్రామాన జరిగిన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందని, 17 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి విస్మరించి ప్రజలను నిలువునా మోసం చేస్తుందన్నారు. వై కుమార్గౌడ్, ముసిపట్ల విజయ్, పెండ్లి మల్లారెడ్డి, మడ్లపల్లి సునీత, గైని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి సాయం చిల్పూరు: కొండాపూర్ గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి దాత బంగారి రెడ్డి కుమారుడు పింగిళి యోగానందరెడ్డి రూ.2.40 లక్షల విరాళం అందజేశారు. కాగా, శుక్రవారం విరాళంతో ఆలయ కమిటీ ఆలయంలో రేకులషెడ్ను నిర్మించింది. అభినందనీయం దేవరుప్పుల: ప్రభుత్వ పాఠశాల అభ్యున్నతి కోసం పూర్వవిద్యార్థుల తోడ్పాటు అభినందనీయమని ఎంఈఓ జి.కళావతి అన్నారు. శుక్రవారం చిన్నమడూరు ఉన్నత పాఠశాలలో 1993–94 పదోవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో పాఠశాలకు బీరువా, పోడియం బహూకరించారు. గోదావరి జలాలతో చెరువులు నింపుతాం బచ్చన్నపేట: గోదావరి జలాలతో చెరువులను, కుంటలను డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి చొరవతో నింపుతామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇజ్జగిరి రాములు అన్నారు. శుక్రవారం లక్ష్మాపూర్ గ్రామం వద్ద ఉన్న గోదావరి పైపులైన్ డెలివరీ పాయింట్ నుంచి బండనాగారం గ్రామ చెరువు, కుంటలకు వెళ్లే కాల్వకు మరమ్మతు పనులు చేయించారు. దేవస్థాన మాజీ చైర్మన్ చల్ల సురేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇప్ప శ్రీధర్రెడ్డి, ప్రవీణ్ ఉన్నారు. ఆస్పత్రి ఆవరణలోకి పాము స్టేషన్ఘన్పూర్: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోకి శుక్రవారం పాము రావడంతో ఆస్పత్రికి వచ్చిన రోగులు, వైద్య సిబ్బంది ఆందోళనకు గురైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఘన్పూర్ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని శుక్రవారం ఓ పాము రావడంతో అక్కడ ఉన్న రోగులు గమనించి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే విషయాన్ని వైద్య సిబ్బందికి తెలుపగా వారు పాములు పట్టే స్నేక్ క్యాచర్ రమణాకర్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే అతడు ఆసుపత్రికి చేరుకుని పామును పట్టుకోవడంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. -
ఘనంగా ‘పల్లా’ జన్మదిన వేడుకలు
సాక్షి నెట్వర్క్: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా కేక్లు కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కాగా, జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించగా, 50 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తం దానం చేశారు. ప్రముఖ వైద్యుడు పగిడిపాటి సుధసుగుణాకర్రాజుతో పాటు పలువురు రక్తదానం చేశారు. అలాగే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ధర్మపురి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాణాపురం ఆంజనేయస్వామి దేవాలయంలో మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభం
జనగామ: పట్టణంలోని 12వ వార్డులో శుక్రవారం డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిట్ల అంజమ్మ, పళ్ళ రమ, వంగ యుగేందర్, ఎనగందుల వెంకటేష్, శ్రీరామ్ శ్రీనివాస్, వెంకటేష్, సమ్మయ్య, కుడికాలు రాజు ఉన్నారు. ‘దేవాదుల’ నుంచి నీటిని విడుదల చేయాలి స్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ రిజర్వాయర్కు చెందిన ఛాగల్లు పంప్హౌజ్ నుంచి ఛాగల్లు, విశ్వనాథపురం, ఇప్పగూడెం, పాలకుర్తి తదితర ప్రాంతాలకు నీటిని విడుదల చేయాలని ఛాగల్లు మాజీ ఎంపీటీసీ కనకం స్వరూప, బీఆర్ఎస్ జిల్లా నాయకులు గణేష్ డిమాండ్ చేశారు. ఛాగల్లు పంప్హౌజ్ కెనాల్ నుంచి రిజర్వాయర్ నీటిని విడుదల చేయాలని కోరుతూ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో రైతులతో కలిసి వారు శుక్రవారం వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం దున్నకాలు, వరినాట్ల సమయం కావడంతో సాగునీరు అందక ఛాగల్లు, విశ్వనాథపురం, ఇప్పగూడెం తదితర ప్రాంతాల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వేసిన వరినాట్లు, పత్తి మొక్కలు ఎండిపోతున్నాయని, కనీసం పశువులకు సైతం నీరు లేక అన్నదాతలు అరిగోస పడుతున్నారన్నారు. ఈ విషయమై ఇరిగేషన్ అధికారులు తక్షణమే స్పందించాలని, ఛాగల్లు పంప్హౌజ్ కెనాల్ నుంచి నీరు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. -
సంక్షిప్త సమాచారం
పరామర్శ పాలకుర్తి: ఇటీవల కాలుకి ఆపరేషన్ చేసుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వావివాలకు చెందిన రాష్ట్ర దివ్యాంగుల సమితి జిల్లా అధ్యక్షుడు రావుల సత్యనారాయణను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శుక్రవారం పరిమర్శించారు. అలాగే గ్రామంలో మృతి చెందిన కూనబోయిన కోమురయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న రావులసతీష్, అనపర్తి యాకూబ్లను పరామర్శించారు. అలాగే పాడిశెట్టి మహేందర్ తల్లి అనారోగ్యంతో మృతి చెందగా బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. నివాళి జనగామ: జనగామ పట్టణ సీనియర్ జర్నలిస్టు మాదంశెట్టి శివకుమార్ తల్లి మనమ్మ (90) మృతి చెందింది. కాగా, శుక్రవారం ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్, కోశాధికారి బెజుగం భిక్షపతిలు మనమ్మ మృతదేహంపై పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబాన్ని పరామర్శించారు. తండాలను బమ్మెరలో చేర్చాలి పాలకుర్తి: 2018 వరకు బమ్మెర ఎంపీటీసీ స్థానంలో ఉన్న తమ తండాలను బమ్మెరలోనే చేర్చాలని గిరిజన సంఘం నాయకుడు రమేష్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. సంఘం నాయకులు పాల్గొన్నారు. ఎన్నిక రఘునాథపల్లి: మండలంలోని దాసన్నగూడెం గ్రామానికి చెందిన బొక్క రామచంద్రయ్య టీడీపీ మండల అధ్యక్షుడిగా మూడో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం మండల కేంద్రంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల మల్లేష్, రాష్ట్ర నాయకులు ఎండీ జహంగీర్, ఉమ్మగోని నర్సయ్యల సమక్షంలో నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రామచంద్రయ్య, ఉపాధ్యక్షులు సత్తయ్య, తానాజీ, ఈర్యానాయక్, మండల ప్రధాన కార్యదర్శి కొంగరి నర్సింగరావు, ప్రచార కార్యదర్థి వీరస్వామి తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బండి సంజయ్ జన్మదిన వేడుకలు జఫర్గఢ్: కేంద్రమంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలను బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లుపంపిణీ చేశారు. నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోచయ్య సేవలు మరువలేనివి బచ్చన్నపేట: కొన్నె గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వేముల పోచయ్య మృతి పార్టీకి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నాగపురి రాజలింగంగౌడ్ అన్నారు. శుక్రవారం పోచయ్య మృత దేహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. కొడవటూర్ దేవస్థాన చైర్మన్ మల్లారెడ్డి, జంగిటి విద్యానాథ్, వెంకట్రెడ్డి, ఎల్లయ్య, బాలకిషన్గౌడ్, ఆగయ్య, సిద్దిరాములు, అంజి, మహేందర్, బిక్షపతి, చంద్రయ్య ఉన్నారు. శ్రీనివాస్జీ సేవలు.. దేవరుప్పుల: రాజకీయాలకతీతంగా బడుగుల అభ్యున్నతి కోసం పాటుపడిన శ్రీనివాస్జీ సేవలు మరువలేనివని తెలంగాణ గిరిజన కార్పొరేషన్ స్టేట్ మాజీ చైర్మన్ మోహన్ గాంధీనాయక్ అన్నారు. శుక్రవారం కడవెండి పడమటి తోట ప్రాంగణం వద్ద మాజీ సర్పంచ్ అస్నాల శ్రీనివాస్జీ వర్ధంతి పురస్కరించుకొని ఆయన స్మారక స్థూపానికి కుటుంబ సభ్యులు తదితరులు నివాళులర్పించారు. ‘స్థానికం’లో కాంగ్రెస్ సత్తా చూపాలి కొడకండ్ల: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చే అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి సత్తాను చూపాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ధరావత్ సురేష్నాయక్ కోరారు. శుక్రవారం హక్యతండాలో నిర్వహించిన ఎంపీటీసీ క్లస్టర్ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తహసీల్దార్ను కలిసిన నాయకులు రఘునాథపల్లి: రఘునాథపల్లి తహసీల్దార్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఫణికిషోర్ను శుక్రవారం కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్ కార్యాలయంలో బొకేలు, శాలువాలతో సత్కరించారు. మారుజోడు రాంబాబు, లింగాల జగదీష్చందర్రెడ్డి, కోళ్ల రవి, మేకల నరేందర్ ఉన్నారు. ఆర్థికసాయం జఫర్గఢ్: మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలకు చెందిన పేద విద్యార్థిని యాతం సంధ్యారాణికి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అన్నం బ్రహ్మారెడ్డి పంపిన రూ.5 వేల సాయం మాజీ ఎంపీటీసీలు ఇల్లందుల స్రవంతి మొగిళి, బాదవత్ దేవేందర్నాయక్ శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సంధ్యారాణి ఇంటర్ ఫలితాల్లో మండల స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించి ఎంసెట్లో ప్రతిభ కనబరిచిందన్నారు. పై చదువులకు బ్రహ్మారెడ్డి ఆర్థికసాయం అందజేయడం అభినందనీయమన్నారు. మాజీ వార్డు సభ్యులు కాట సుధాకర్, ఎల్లయ్య, పాఠశాల ఉపాధ్యాయినులు, విద్యార్థినులు పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి.. బచ్చన్నపేట: అనారోగ్యంతో బాదపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మండల కేంద్రానికి చెందిన జర్నలిస్టు తేలుకంటి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు సామాజిక సేవా కర్త కోడూరి శివకుమార్ గౌడ్ రూ. 5వేల సాయం అందజేశారు. క్రీడాకారిణికి.. చిల్పూరు: పల్లగుట్ట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న క్రీడాకారిణి కోల సాయిప్రియ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. కాగా, సాయిప్రియకు చిల్పూరు ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు శుక్రవారం ఆర్థికసాయం పంపగా హెచ్ఎం పెనుమాటి వెంకటేశ్వర్లు అందజేశారు. హెచ్ఎం మాట్లాడుతూ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొన్న సాయిప్రియ ప్రతిభ కనబరిచి ఆగస్టులో బిహార్ రాష్ట్రంలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్రావుకు వ్యాయామ ఉపాధ్యాయుడు దేవ్సింగ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, చిర్ర వెంకటేశ్వర్లు, జీడి ఆనందంలు కృతజ్ఞలతు తెలిపారు. కాల్వకు మరమ్మతు చిల్పూరు: సాగునీటి సమస్యను పరిష్కరించాలని పల్లగుట్ట గ్రామానికి చెందిన చిల్పూరు ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు ఆధ్వర్యంలో రైతులు ఈనెల 9వ తేదీన ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కాగా, శుక్రవారం అధికారులు గ్రామంలోని బర్రెంకల చెరువు నుంచి వెంకటాద్రి చెరువు వరకు వెళ్లే కాల్వకు పొక్లెయినర్తో మరమ్మతు పనులు చేయించారు. పాఠశాల అభివృద్ధికి సహకరించాలి బచ్చన్నపేట: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలని మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమారాణి అన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ఎలగందుల బార్గవి–శేఖర్ దంపతులు రూ.5వేల విరాళం అందించారని తెలిపారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ‘బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి’ కొడకండ్ల: ఉనికిని కాపాడుకొనేందుకై బీఆర్ఎస్ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, ధరావత్ సురేష్నాయక్ అన్నారు. రామేశ్వరం గ్రామ పరిధిలోని పలుగుల తండాకు చెందిన ఎస్టీ సెల్ నాయకులు సురేష్నాయక్, నరేష్నాయకులు శుక్రవారం తిరిగి సొంతగూటికి చేరగా వారు కండూవాలు కప్పారు. కార్యక్రమంలో శ్రీనునాయక్ పాల్గొన్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు దేవరుప్పుల: మండలంలోని వాగు పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు అనివార్యమని ఎస్సై ఊర సృజన్కుమార్ అన్నారు. శుక్రవారం గొల్లపల్లిలో వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరిస్తున్న తీగల వెంకన్న పై కేసు నమోదు చేశామని, ట్రాక్టర్ సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. -
నిర్మాణాల్లో నిబంధనలు తప్పనిసరి
● హౌసింగ్ కార్పొరేషన్ ఏఈ ప్రీతితరిగొప్పుల: ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారమే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టాలని హౌసింగ్ కార్పొరేషన్ ఏఈ ప్రీతి సూచించారు. ఎంపీడీఓ ఆలేటి దేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను ఆమె లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ మండలానికి ఎమ్మెల్యే కోటా కింది 62 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి సమక్షంలోనే ఇంటి నిర్మాణానికి ముగ్గు పోయాల్సిందిగా సూచించారు. ఎస్సై గుగులోత్ శ్రీదేవి, ఏపీఎం విజయ, ఎంపీఓ మాలతి, పింగిళి జగన్మోహన్రెడ్డి, తాళ్లపల్లి రాజేశ్వర్గౌడ్, చిలువేరు లింగం,బూస యాదగిరి, ముద్దసాని వెంకట్రెడ్డి, సాయిల్ల రాజు, రాచకొండ సంపత్,మర్రికుమార్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ నర్మెట: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుక్రవారం ఎంపీడీఓ బోడపాటి అరవింద్ చౌదరి మంజూరు పత్రాలను అందజేశారు. తొలి విడతలో 106 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోటాలో ఇళ్లను అధికారులు మంజూరు చేశారు. నర్మెట–19, ఆగాపేట–6, అమ్మాపురం–7, డీసీ తండా–3, గండిరామారం–6, హన్మంతాపురం–10. గుంటూర్పల్లి–3, ఇప్పలగడ్డ–7, ఇసుకబాయితండా–2, కన్నెబోయిన గూడెం–4, లోక్యతండ–3, మచ్చుపహాడ్–8, మల్కపేట–6, మాన్సింగ్తండా–7, సూర్యబండతండా–4, వెల్దండ–11, కాగా బొమ్మకూర్ పాయిలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. కార్యక్రమంలో జూనియర్ అస్టిస్టెంట్ రవిందర్, పంచాయతీ కార్యదర్శులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో.. జనగామ రూరల్: మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్థిదారులకు మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. మండలంలోని 20 గ్రామ పంచాయితీల్లో ఎంపికై న 119 మంది లబ్ధిదారులకు ఎంపీడీఓ సంపత్కుమార్ ఆధ్వర్యంలో జీపీ కార్యదర్శులు లబ్ధిదారులకు అందజేశారు. హౌజింగ్ ఏఈ మఽధు, జూనియర్ అసిస్టెంట్ సృజన పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన మౌలిక సౌకర్యాలతో పాటు అర్హత కల్గిన ఉపాధ్యాయులచే విద్యాబోధన అందిస్తున్నారని, ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి సద్వినియోగం చేసుకోవాలని స్టేషన్ఘన్పూర్ ఎస్సై మనీష అన్నారు. పాంనూర్ మండల పరిషత్ యూపీఎస్ను ఎస్సై శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు సిరికొండ కుమారస్వామి ముగ్గురు పిల్లలను అదే పాఠశాలలో చేర్పించిన విషయం తెలుసుకుని ఉపాద్యాయుడిని, పిల్లలను ఎస్సై అభినందించారు. హెచ్ఎం రఘుప్రసాద్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
ఓటరుగా నమోదు చేయించాలి
● ఆర్డీఓ గోపీరామ్బచ్చన్నపేట: 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులను ఓటరుగా నమోదు చేయించాలని జనగామ ఆర్డీఓ గోపీరామ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో బీఎల్ఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తహసీల్దార్ రామానుజాచారి, ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్, ఎంఆర్ఐలు వంశీ కృష్ణ, మున్వర్, ఆయా గ్రామాల బీఎల్ఓలు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి తరిగొప్పుల: రాబోయే స్థానిక సంస్థలు ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు ఏడెల్లి శ్రీనివాస్రెడ్డి పిలుపునిచ్చారు. ఆగస్టు నెలాఖరులోగా పరిషత్, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన నేపథ్యంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కృషిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మె పరిస్థితి లేదన్నారు.ప్రతీ కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని పిలుపున్చిరు. మండల అభివృద్ధికి కృషి దేవరుప్పుల: మండల అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఎంపీడీఓ టి సురేష్కుమార్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఇటీవల ఎంపీడీఓగా ఉన్న కె.లక్ష్మీనారాయణ ఉద్యోగ విరమణ పొందడంతో ఎంపీఓ కొనసాగుతున్న టి.సురేష్కుమార్కు జిల్లా సీఈఓ.. ఎంపీడీఓగా ఉత్తర్వులు జారీ చేయడంతో విధుల్లో చేరారు. ఈ సందర్భంగా మండల పరీశీలనకు వచ్చిన డీపీఓ స్వరూప శుభాకాంక్షలు తెలిపారు. -
ఆయిల్పామ్ సాగుపై రైతుల ఆసక్తి
లింగాలఘణపురం: జిల్లాలో ఆయిల్పామ్ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారని, వచ్చే మూడేళ్లలో ఎక్కువ విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం మండలంలోని నెల్లుట్లలో చిట్ల జ్ఞానేందర్రెడ్డికి చెందిన 12 ఎకరాల భూమిలో మెగా ఆయిల్పామ్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యానవనశాఖ, వ్యవసాయశాఖ, ఆయిల్ఫెడ్ సహకారంతో మూడేళ్లుగా 6,500 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 3,500 ఎకరాలను లక్ష్యంగా చేసుకొని ఇప్పటికే 734 ఎకరాలను సాగు చేశామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఆయిల్పామ్ సేకరణ కేంద్రం ఏర్పాటు చేస్తామని, జిల్లాలో 40 ఎకరాల్లో నర్సరీ ఏర్పాటు, కార్యకలాపాల నిర్వహణకు భవ నం మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యా న శాఖ అధికారి శ్రీధర్రావు, డీఏఓ రామరావునాయక్, ఆయిల్ఫెడ్ జిల్లా మేనేజర్ శంకర్, ఏఓ వెంకటేశ్వర్లు, రైతులు వంచ మనోహర్రెడ్డి, చిట్ల ఉపేందర్రెడ్డి, సుధీర్రెడ్డి పాల్గొన్నారు. అర్హులకు పింఛన్లు అందించాలి జనగామ రూరల్: అర్హులందరికీ పింఛన్లు అందా లని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువా రం కలెక్టరేట్లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సెర్ప్ ఆధ్వర్యంలో అన్ని మండలాల ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్, బిల్ కలెక్టర్లు, పోస్టల్ డిపార్ట్మెంట్ సిబ్బంది, టెక్నికల్ స్టాఫ్, ఎన్ఎఫ్బీఎస్ సిబ్బందికి చేయూత పింఛన్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్స్ స్కీం అమల్లో జిల్లాను ముందంజలో నిలబెట్టాలన్నారు. అర్హుల వివరాలను పోర్టల్లో స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద 769 మంది అర్హులైన లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వానికి పంపగా.. అందులో 576 మందికి రూ.20,000 చొప్పున మంజూరయ్యాయని తెలిపారు. సెర్ప్ పెన్షన్ విభాగం డైరెక్టర్ గోపాల్ రావు వివిధ రకాల పింఛన్ అర్హతలో సాంకేతిక సమస్యలు స్పౌజ్, డార్మెంట్ అకౌంట్స్, శాశ్వత వలస తదితర అంశాలపై జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు చేయాల్సిన పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, డీఆర్డీఓ వసంత, అదనపు డీఆర్డీఓ నూరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు. ఉపాద్యాయుల ధ్రువపత్రాల పరిశీలన జనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ పాఠశాలలో గెజిటెడ్ హెడ్ మాస్టర్ పదోన్నతుల కోసం జరుగుతున్న ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రక్రియ వివరాలు విద్యాశాఖాధికారి భోజన్న ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓపెన్ స్కూల్కి సంబంధించిన కరపత్రాలు, గోడపత్రికను విడుదల చేశారు. కార్యక్రమంలో స్టేట్ కోర్డినేటర్ మాధవి, ఉల్లాస్, టాస్ ఇన్చార్జ్ శంకర్ రావు, జిల్లా పరీక్షల సెక్రెటరీ చంద్రభాన్, రవి, నాగరాజు పాల్గొన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఆయిల్పామ్ సేకరణ కేంద్రం 40 ఎకరాల్లో నర్సరీ, జిల్లా కేంద్రంలో మానిటరింగ్కు భవనం కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
భవిష్యత్పై బాధ్యతతో తీసుకున్న నిర్ణయం
పాలకుర్తి టౌన్: మా జీవితం చిన్నదే కానీ, లక్ష్యం స్పష్టంగా ఉంది. మా కుమార్తెకు ఉత్తమ చదువు, ఆరోగ్యం, స్వేచ్ఛతో కూడిన భవిష్యత్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక కూతురు చాలనుకున్నాం. పెరుగుతున్న ఖర్చులు, స్కూల్ ఫీజులు, హెల్త్ చెకప్స్ అన్నీ చూస్తుంటే, నాణ్యతతో జీవితం ఇవ్వడం ఒక్కరితోనే సాధ్యమవుతుంది. ఒక బిడ్డ అయితే మరింత ప్రేమ, మరింత శ్రద్ధ చూపే అవకాశం దొరుకుతుంది. భవిష్యత్లో పిల్లలకు అవకాశాలు తగ్గకుండా ఉండాలంటే మనం తీసుకునే ప్రతి నిర్ణయం అందుకు అనుగుణంగా ఉండాలి. – దేవగిరి రేణుక– నాగరాజు, పాలకుర్తి, అర్చకుడు -
నాడు ఆదర్శం.. నేడు విచ్ఛిన్నం
కనుమరుగవుతున్న ఉమ్మడి కుటుంబాలునేడు ప్రపంచ జనాభా దినోత్సవంపాశ్చాత్య పోకడలతో దూరమవుతున్న ప్రేమ, అనుబంధాలు కుటుంబ పోషణ, చదువు, ఇతర ఖర్చుల భారంపొద్దన లేచింది మొదలుకుని రాత్రి పడుకునే వరకు ఇళ్లంతా సందడి.. కడుపులో ముద్ద వేసామంటే ఎవరిపనికి వారు వెళ్లడం.. సాయంత్రానికి ఇంటికి చేరడం... అందరి సంపాదన ఇంటిపెద్ద చేతిలో పెట్టే ఆనాటి ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. సంపాదన తక్కువ ఉన్నా క్రమశిక్షణతో పిల్లలను పోషించడంలో ఉమ్మడి కుటుంబాలు సక్సెస్ అయి ఆదర్శంగా నిలిచాయి. కానీ, రెండున్నర దశాబ్దాలుగా ఉమ్మడి కుటుంబాల్లో వేరుకుంపటి మొదలైంది. పిల్లల కార్పొరేట్ చదువులు.. భార్య, భర్త ఉద్యోగం వంటి కారణాలతో వేరుకుంపటి అనివార్యంగా మారింది. దీంతో బంధాలు, అనుబంధాలు అంటే పిల్లలకు తెలియని పరిస్థితి ఏర్పడింది. కానీ, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆనాటి ఉమ్మడి కుటుంబాలు నేటికీ సంతోషంగా ఉంటున్నాయి. కానీ, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు, పిల్లలను పెంచే ఓపిక, ఆలనా పాలనా చూసుకునే పెద్ద దిక్కులు లేకపోవడంతో ఒక్కరు, లేదా ఇద్దరితోనే సరిపుచ్చుకుంటున్నారు. ఈనేపథ్యంలో నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం.స్టేషన్ఘన్పూర్: ఈ ఫొటోలో కనిపిస్తున్నది స్టేషన్ఘన్పూర్ మండలంలోని రంగరాయగూడెం గ్రామానికి చెందిన ఐత వీరేశం కుటుంబం. గ్రామానికి చెందిన ఐత రామయ్య, ద్రాక్షమ్మ దంపతులకు ఐదుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. రామయ్య చిన్న కిరాణాషాపు నిర్వహిస్తూ పది మంది సంతానాన్ని పోషించారు. ఉమ్మడి కుటుంబంగా ఉంటూ అందరి వివాహాలు జరిపించారు. పదేళ్ల క్రితం రామయ్య మృతి చెందగా, ద్రాక్షమ్మ ఏడాది క్రితం మృతి చెందారు. అయినప్పటికీ ఐదుగురు అన్నదమ్ములు ఉమ్మడి కుటుంబంగా గ్రామంలోనే కలిసి ఉంటున్నారు. వారి వ్యాపారాలు వేరైనా అందరూ ఒకే ఇంట్లో నివాసముంటూ ఇప్పటికీ రాత్రి భోజనాలు కలిసే చేస్తారు. పెద్దన్న వీరేశం మాట మిగిలిన నలుగురు తమ్ములు ఏనాడు జవదాటకుండా ఉంటూ గ్రామంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. – జనగామ -
ఆడపిల్ల కోసమని ఐదుగురిని కన్నా
దేవరుప్పుల: ఇంటికి ఆడపిల్ల కావాలని ఐదుగురురు కొడుకుల్ని కన్నాను. ఐదుగురు కొడుకులు పుట్టినంక వేరుపడేస్తే అర ఎకరం వ్యవసాయంతో సంసారం మొదలైంది. నా భర్త, నేను కూలీ చేసుకుంటూ పిల్లలను పెంచాం. నలుగురు కొడుకుల్ని జీతాలు ఉంచాం. చెప్పిన పని చేసిండ్రు. అందరి పెళ్లిల్లు చేసి మనిషికి ఎనిమిది ఎకరాల జాగ అప్పజెప్పినం. ఇప్పుడు పెద్దోడికి ముగ్గురు పిల్లలు కాగా మిగితా వారికి ఇద్దరు చొప్పున పిల్లలు ఉన్నరు. పదకొండు మంది (మనవళ్లు, మనవరాళ్లు)లో ఏడుగురి పెండ్లిళ్లు చూసిన, ఇంక నలుగురి పెళ్లి చూస్తే ఈ జన్మకు ఇక చాలు. నా కొడుకులు ఐతే మంచిగా బతుకుతుండ్రు. ఏ ఇంట్లో కార్యమైన కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు, కొత్త ఇయ్యం అందుకున్న చుట్టాలు కలిస్తే పెండ్లంత సందడి. వామ్మో ఇప్పుడు ఒక్కరిద్దరు చాలని ఆపరేషన్ చేసుకుంటుండ్రు. ఐనా ఎనుకటి పిల్లలకు ఇది కావాలి, అది కావాలనే స్వార్థంలేదు. ఇప్పుడు పుట్టగానే బాయిలర్ కోళ్లలాగా సాదుతుండ్రు. అయ్య, అవ్వ ఆస్తిని ఆక్రమించుకోవాలనే చూస్తుండ్రు. – తోటకూరి సోమనర్సమ్మ, దేవరుప్పుల -
వివరాలు 8లో
ఓరుగల్లులో తగ్గిన జననాల రేటు రాష్ట్ర జననాల సగటులో 13వ స్థానంలో ఉమ్మడి జిల్లా ● 2011 నుంచి జననాల రేటు తగ్గుముఖం... ఐదేళ్లలో పుట్టింది 70 వేల మందే.. ● ఇలాగైతే వచ్చే ఇరవై ఏళ్లలో పెరగనున్న సీనియర్ సిటిజన్లు ● ఆందోళన కలిగిస్తున్న జననాల సంఖ్య... – సాక్షిప్రతినిధి, వరంగల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి ● అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ -
అంతకంటే ఎక్కువ వద్దంటున్న యువ జంటలు
ఉమ్మడి కుటుంబంలో ఉంటేనే సంతోషం ● ‘సాక్షి’ సర్వేలో స్పష్టీకరణ 1. మీరు ఎంత మంది పిల్లలను కనాలనిఅనుకుంటున్నారు?3. పెళ్లి చేసుకున్నాక పిల్లలను కనే ప్లాన్ ఎలా చేస్తారు? 2. ఉమ్మడి కుటుంబమా.. ఒంటరిగా ఉండడం ఇష్టమా? ఉమ్మడి కుటుంబం భార్యాభర్తలు విడిగా ఉండడంభార్యాభర్తలు జాబ్ చేయడం వల్ల పిల్లలను చూసుకునే వారు లేక ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయని..4. ఈ తరంలో ఒక్కరు, ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలను కనడం లేదు ఎందుకు? 401510051626362024‘ఒక్కరు.. లేదా ఇద్దరు పిల్లలు చాలు. అంతకంటే ఎక్కువ మందిని కనే పరిస్థితులు లేవు. ఆ ఆలోచన కూడా మాకు లేదు’ అని అంటున్నాయి యువజంటలు. దీంతోపాటు ఉమ్మడి కుటుంబం ఉంటేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశాయి. మారిన జీవన పరిస్థితుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడం, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో ఈ తరం ఒక్కరు లేదా ఇద్దరితో సరిపెట్టుకుంటున్నారు. కానీ వచ్చే ఇరవై ఏళ్లలో యువజనుల జనాభా తగ్గి, సీనియర్ సిటిజన్ల సంఖ్య పెరుగుతుందని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముగ్గురికి పైగా.. బిడ్డల్ని కనాలన్న సూచనలు వస్తున్నాయి. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఇద్దరి కంటే ఎక్కువ మందిని కనే విషయంలో యువజంటలు ఏమంటున్నాయి.. వీరితో పాటు 25 ఏళ్ల పైబడి వివాహ ప్రయత్నాల్లో ఉన్న వారి మనోగతంపై ‘సాక్షి’ గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు అంశాలపై సర్వే నిర్వహించింది. – సాక్షి నెట్వర్క్ -
జీఎంసీ ప్రిన్సిపాల్ బాధ్యతల స్వీకరణ
జనగామ: జనగామ మెడికల్ కళాశాల ప్రిన్సి పాల్గా ఫ్రొఫెసర్ డాక్టర్ నాగమణి(మైక్రో బయాలజీ) గురువారం బాధ్యతలను స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మెడికల్ కళాశాలలో మైక్రో బయాలజీ ఫ్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె, బదిలీపై ఇక్కడకు వచ్చారు. పాథాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎండీ అన్వర్, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ అనురాధ, పిడియాట్రిక్స్ ప్రొఫెసర్, ఎంసీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్రెడ్డి, అనాటమీ ప్రొఫెసర్ డాక్టర్ జితేంద్ర, ఆప్తాల్మాజీ ప్రొఫెసర్ డాక్టర్ పద్మిని, ఫిజియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణ, ఎస్పీఎం అసోసియేట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు ఆమెను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి జనగామ రూరల్: సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి డాక్టర్ విక్రమ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత పరీక్ష జూలై 13వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్షలో పొందిన మెరిట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు ప్రవేశం కల్పించి హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఎస్సీ స్టడీ సర్కిల్లో సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత వసతి, భోజనంతో 10 నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నీటిని ఒడిసి పట్టండి లింగాలఘణపురం: ప్రతి సబ్సెంటర్లలో ఇంకుడు గుంతలను నిర్మించి నీటిని ఒడిసి పట్టాలని డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు సూచించారు. మండలంలోని నెల్లుట్ల సబ్సెంటర్లో నిర్మించిన ఇంకుడు గుంతను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ అవకాశం ఉన్న ప్రతి చోట ఇంకుడు గుంతలను నిర్మించాలని సిబ్బందికి చెప్పారు. తద్వారా భూగర్భజలాలు పెరిగి ప్రజలకు ఉపయోగపడుతాయని చెప్పారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి స్వర్ణలత, ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. బోగస్ హామీలతో కాంగ్రెస్ మోసం ● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకొడకండ్ల: సార్వత్రిక ఎన్నికల్లో బోగస్ 420 హామీలతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసగించిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలకేంద్రంలో బీఆర్ఎస్ నూతన పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించిన అనంతరం సిందె రామోజీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో దయాకర్రావు మాట్లాడారు. తెలంగాణలో బ్లాక్ మెయిలర్ చేతిలో ప్రభుత్వం నడువడం బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు గోసపడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కే 80 శాతం అనుకూలంగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. రామేశ్వరం గ్రామ కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు భూక్య నరేష్తోపాటు పలువురు ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మండల ఇన్చార్జ్ బబ్బూరి శ్రీకాంత్గౌడ్, పేరం రాము, అభిమన్గాంధీ, సోమరాములు, జ్యోతి, రాజిరెడ్డి, విజయమ్మ, సతీష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ‘నీట్’లో జనగామ విద్యార్థినికి ఉత్తమ ర్యాంకు జనగామ: వైద్యవృత్తి కోర్సు అభ్యసన కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షలో జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు బొగ్గారపు శ్రీనివాసు, వాణిశ్రీ కుమార్తె బొగ్గారపు సాయి సంయుక్త జాతీయ స్థాయిలో 5,153, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించిన ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 164 ర్యాంకు సాధించారు. -
లేబర్ కోడ్లు రద్దు చేయాల్సిందే..
జనగామ రూరల్: కేంద్ర ప్రభుత్వం లేబర్కోడ్లు రద్దు చేయాల్సిందేనని, లేదంటే కార్మికులు ఆగ్రహా నికి గురికాకతప్పదని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న హెచ్చరించారు. బుధవారం కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సీఐటీయూ, ఏఐటీయూసీ, బీఆర్టీయూ, ఐఎన్టీయూసీ, జా డు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రిస్టన్ గ్రౌండ్ నుంచి నెహ్రూపార్క్ వరకు ర్యాలీ చే పట్టారు అనంతరం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వేము ల నర్సింగం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ అధ్యక్షత జరిగిన సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు సిహెచ్ రాజారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్నలు మాట్లాడారు. బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, దే శంలో పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు కా ర్మికులను కట్టు బానిసలుగా మార్చే కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకురావడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎనిమిది గంటల పనిని 10 గంటలకు పెంచే జీఓ 282ను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు సుంచు విజేందర్, భూక్య చందు నాయక్, జేరుపోతుల కుమార్, శ్రీదేవి, రాధ, యాకుబ్, కార్మికులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ -
ప్రాథమిక స్థాయిలోనే డిజిటల్ తరగతులు
జనగామ: ప్రభుత్వం ప్రాథమిక స్థాయిలో డిజిటల్ తరగతులను అమలు చేస్తుంది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులకు వచ్చే నిరుపేద పిల్లల భవిష్యత్కు బంగారు బాటలు వేసే విధంగా ముందుకు వెళుతుంది. గణితాన్ని సులభంగా పరిచయం చేయడంతో పాటు చిత్రాల ద్వారా కూడిక, తీసివేతల లెక్కలపై పిల్లలకు అవగాహన కల్పిస్తోంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ కేంద్రం (ఎస్సీఈఆర్టీ) ద్వారా బుధవారం టీ–శాట్ నిపుణుల ద్వారా ప్రాథమిక ప్రాథమికో న్నత పాఠశాలల్లో గణిత శాస్త్ర బోధనపై అవగాహన కల్పించారు. వర్చువల్ పద్ధతిలో జిల్లాలోని 348 ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆసక్తిగా పాల్గొన్నారు. ట్యాబ్ల అందజేత సీఎం రేవంత్రెడ్డి ఆలోచనకు అనుగుణంగా విద్యశాఖ అధికారులు ఎస్సీఈఆర్టీ భాగస్వామ్యంతో డిజిటల్ అక్షరాస్యతకు శ్రీకారం చుట్టింది. వీటిని స మర్థవంతంగా నిర్వహించేందుకు ఉపాధ్యాయుల కు ట్యాబ్లను అందించింది. వీటితో గణితం వంటి సబ్జెక్ట్లకు అనుసంధానం చేసి, ప్రాథమిక స్థాయిలో డిజిటల్ నైపుణ్యం పెంచేందుకు కృషి చేస్తుంది. వర్చువల్ పద్ధతిలో నిపుణుల బోధన -
పసుపు అలంకరణలో రేణుకా ఎల్లమ్మ
జనగామ: ఆషాఢమాసం పర్వదినం పురస్కరించుకుని పట్టణంలోని బాలాజీనగర్ రేణుకా ఎల్లమ్మ తల్లి పసుపు (హిరణ్యం) అలంకరణలో బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు. కాలనీవాసులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. నేడు శాకంబరీ ఉత్సవాలు పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో నేడు (గురువారం) శాకంబరీ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు తెలిపారు. శ్రీచండిక అమ్మవారి దేవాలయంలో పార్వతీదేవి శాకంబరీ దేవిగా అలంకరిస్తారన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పెన్షన్దారులను మోసం చేస్తున్న ప్రభుత్వంజనగామ రూరల్: పెన్షన్దారులను మోసం చేస్తున్న ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోడ సునీల్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్లో వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం సోమరాజు అధ్యక్షతన ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆసరా పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఆగష్టు 13న నిర్వహించ తలపెట్టిన చలో హైదరాబాద్ పెన్షన్దారుల గర్జనకు లక్షలాది మంది తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పైస రాజశేఖర్, తాళ్లపల్లి కుమార్, బిర్రు నగేష్, ఇనుముల నర్సయ్య, రవీందర్, శాంసన్ నిర్మలా భాస్కర్, గువ్వల రవి తదితరులు పాల్గొన్నారు.దేవాలయాల పరిశీలనపాలకుర్తి టౌన్: ధూప దీప నైవేద్యం పథకాన్ని అమలు చేయడానికి త్రిసభ్య కమిటీ సభ్యులు బుధవారం పాలకుర్తి మండలంలోని వల్మిడి, మంచుప్పుల, ఎల్లరాయిని తొర్రూరులోని ఆ లయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మీ మా ట్లాడుతూ దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమి షన్ ఆదేశాల మేరకు జిల్లాలో 45 దేవాలయాలు ధూప దీప నైవేద్యం పథకం కోసం దరఖా స్తు చేసుకున్నాయన్నారు. ఆయా ఆలయాలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రిస భ్య కమిటీ సభ్యులు దేవగిరి అనిల్కుమార్, త్రిపురారి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.ఆస్పత్రి సూపరింటెండెంట్గా బాధ్యతల స్వీకరణజనగామ: జనగామ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్గా ప్రొఫెసర్, డా క్టర్ రాజలింగం బుధవారం బాధ్యతలను స్వీకరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మెడికల్ కళాశాలలో ఆప్తమాలజీ ప్రొఫెసర్గా పని చేస్తున్న ఆయనను జనగామ డీహెచ్ సూపరింటెండెంట్గా బదిలీ చేశారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, డాక్టర్ గోపాల్రెడ్డి సమక్షంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు మధుకర్, అనురాధ, వైద్య సిబ్బంది పాల్గొని నూతన సూపరింటెండెంట్ను శాలు వాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించారు.ట్రెజరీ అధికారిగా అన్వర్ హుస్సేన్..జనగామ రూరల్: జిల్లా ట్రెజరీ అధికారిగా ఎండీ అన్వర్ హుస్సేన్ బుధవారం బాధ్యతల స్వీకరించారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. -
ముందుకు సాగట్లే.. !
ఉమ్మడి జిల్లాకు కలిసిరాని వానాకాలం ● గత సీజన్లో ఇప్పటికే 74శాతం.. ఈ సారి 34.50 శాతానికే పరిమితం ● సాగు అంచనా 15.83 లక్షల ఎకరాలు.. ఇప్పటికీ అయ్యింది 5.46 లక్షల ఎకరాలు ● లోటు వర్షపాతం ఖాతాలో ఆరు జిల్లాలు ● కష్టకాలంలో పత్తి సాగువైపే మొగ్గు... వరి సాగుపై వేచి చూసే ధోరణిసాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి జిల్లా రైతులకు ఈ వానాకాలం అనుకూలించడం లేదు. గతేడాది ఇదే సమయంలో కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. గోదావరి, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కానీ, ఈ సీజన్లో రైతులకు ఆ పరిస్థితి లేదు. ముందస్తు వర్షాలకు మురిసిన రైతులు ఇప్పుడు దిగులు పడుతున్నారు. మే నెలలో కురిసిన వర్షాలకు కొందరు దుక్కులు దున్నుకుని పత్తి విత్తనాలను వేస్తే.. మరికొందరు పొలాలు సిద్ధం చేసుకుని నారు పోసుకున్నారు. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు లేక చాలా వరకు పత్తి, మొక్కజొన్న విత్తనాలు భూమిలో ఎండిపోగా.. పొలాలు దున్నిన రైతులు సైతం ఇప్పటికీ వేచిచూసే ధోరణిలోనే ఉన్నారు. వానాకాలం మొదలై రెండు మాసాలు నడుస్తున్నా.. ఇప్పటికీ లోటు వర్షపాతమే ఉంది. దీంతో జలాశయాలు, చెరువులకు నీరు చేరక.. పెరిగిన భూగర్భజలాలు కూడా అంతంతే కావడంతో రైతులకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదును దాటుతున్నా సాగు 34.50 శాతమే.. మే 28, 30 తేదీల్లో ముందస్తుగానే వర్షాలు పడటంతో సాగు విస్తీర్ణం అంచనాలు దాటుతుందని అందరూ భావించినా.. ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గతేడాది వానాకాలంలో 14.15 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని భావించగా, 15.45 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. గత సాగును దృష్టిలో పెట్టుకుని ఈ సీజన్లో ఉమ్మడి వరంగల్లో 15,82,755 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు వేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈసారి సాగు ముందుకు కదలడం లేదు. గతేడాది ఇదే సమయానికి 74 శాతం వరకు పంటలు వేయగా.. అదును దాటుతున్న ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో 5,46,138 (34.50 శాతం) ఎకరాల్లోనే సాగు చేశారు. ముందస్తుగా ఒకటి రెండు వర్షాలు పడినా..ఆశించిన మేరకు వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల ఈసారి ఆశించిన మేరకు సాగు పెరగలేదని, అయితే ఇంకా సమయం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్లో 2025–2026 వానాకాలం సాగు అంచనా, సాగు లెక్క ఇదీ..మొత్తం సాగు అంచనా ఎకరాలు5,46,138 మొత్తం సాగు శాతం : 34.50 శాతం15,82,755 ఇంకా లోటు వర్షపాతమే... వరి సాగు 6.39 శాతమే.. జనగామ జిల్లాల్లో 47 శాతం, జయశంకర్ భూపాలపల్లిలో 30 శాతం లోటు వర్షపాతం ఉండగా.. మహబూబాబాద్లో సాధారణ వర్షాపాతానికంటే 18 శాతం తక్కువగా నమోదైంది. అలాగే వరంగల్లో 23, ములుగులో 32, హనుమకొండలో 30శాతం తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే సాగు తగ్గినా.. రైతులు కష్టకాలంలోనూ వర్షాధార పంటగా పత్తిని ఎంచుకున్నారు. 5,76,863 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటి వరకు 4,07,554 (70.28 శాతం) ఎకరాల్లో వేశారు. కాగా 8,78,376 ఎకరాల వరిసాగు అంచనాకు కేవలం 56,155 (6.39 శాతం) ఎకరాల్లోనే వరి పంటలు వేయడం ఈసారి ప్రతికూల పరిస్థితులకు అద్దం పడుతోంది. -
పదోన్నతులకు వేళాయె
జనగామ: రాష్ట్రంలోని ఉన్నత, ప్రాథమికో న్నత పాఠశాలల్లో పని చేస్తున్న అర్హత కలిగి న స్కూల్ అసిస్టెంట్ల(ఎస్ఏ) పదోన్నతి ప్రక్రియ పట్టా లెక్కింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను విద్యాశాఖ మొదలు పె ట్టగా, సర్కారు నుంచి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. సీనియర్ అసిస్టెంట్ నుంచి గెజిటెడ్ హెచ్ఎంగా పదోన్నతి పొందిన తర్వాత మల్టీజోన్–2 పరిధిలో (14 జిల్లాలు) బదిలీ కావా ల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయిలో సీని యార్టీ జాబితాను తయారు చేసిన తర్వా త, జిల్లాల వారీగా ఉన్న ఖాళీలను పరిగణలోకి తీ సుకుని పోస్టింగులను ఇస్తారు. మొదటి విడత మ ల్టీజోన్ పదోన్నతి, బదిలీల సమయంలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల నుంచి 2 నుంచి 400కిలోమీటర్ల వరకు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తు తం ఉన్న జీహెచ్ఎంలను బదిలీలు చేసిన తర్వాత, పదోన్నతులు చేపడితే ప్రతిఒక్కరికి న్యాయం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాల వాదన. పదోన్నతికి 163 స్కూల్ అసిస్టెంట్లు.. జిల్లాలో ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు 167 ఉన్నాయి. ఈ పాఠశాలల పరిధిలో గెజిటెడ్ హెచ్ఎంకు అర్హత కలిగిన 163 స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ ఏ) ఉన్నారు. 2009లో పదోన్నతుల ప్రక్రియ జరుగగా, వరుసగా 2011, 2013, 2015లో క్రమం తప్పకుండా నిర్వహించారు. 9 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత అనేక పోరాటాల ఫలితంగా 2024 జూన్ 12వ తేదీన 2001 సీనియార్టీ ప్రకారం ఎస్ఏలకు మల్టీజోన్–2 గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించి, బదిలీ చేశారు. ఏడాది తర్వాత రెండోసారి పదోన్నతుల ప్రక్రియకు కదలిక వచ్చింది. కానీ ప్ర భుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం 2022 డిసెంబర్ 31వ తేదీ వరకు ఎస్ఏగా సీనియార్టీ ప్రాతిపదికన పదోన్నతికి అర్హతగా లెక్కించనున్నారు. పదోన్నతుల సమయంలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, జనరల్ కోటలో రిజర్వేషన్ల ఆధారంగా సీనియార్టీ జాబితాను తయారు చేస్తారు.సీనియర్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురుచూపులు నేడు ప్రెస్టన్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జిల్లాలో 163 సీనియర్ స్కూల్ అసిస్టెంట్లునేడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జిల్లా కేంద్రం హనుమకొండరోడ్లోని ప్రెస్టన్ స్కూల్లో నేడు (గురువారం) స్కూల్ అసిస్టెంట్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ జరుగనుంది. జిల్లాలో ఉన్నత పాఠశాలలో 148, ప్రాథమికోన్నత స్థాయిలో 15 మంది గెజిటెడ్ హెచ్ఎంకు అర్హత కలిగి ఉన్నారు. జిల్లాల వారీగా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే జాబితాను ఆర్జేడీకి పంపిస్తారు. మల్టీజోన్–2 పరిధిలో ఖాళీల ఆధారంగా సీనియార్టీ జాబితా ప్రకారం రెండు, మూడు రోజుల్లో ప్రక్రియను పూర్తి చేస్తారు. స్థానిక సంస్థల నగారా మొగనున్న నేపధ్యంలో ప్రభుత్వం తక్షణమే పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు బదిలీలను చేపట్టాల్సి ఉంటుంది. అంతకు ముందుగానే మల్టీజోన్–2 ఏరియాలో గెజిటెడ్ హెచ్ఎంల బదిలీలను నిర్వహించి, జిల్లాల వారీగా ఖాళీల్లో ప్రస్తుతం పదోన్నతులు పొందే వారికి అవకాశం కల్పిస్తే ఇబ్బందులు ఉండవని ఉపాధ్యాయ సంఘాల వాదన. ఎస్ఏలకు పదోన్నతులు కల్పించే క్రమంలో ఆ ఖాళీలను సీనియర్ ఎస్జీటీలతో భర్తీ చేయనున్నారు. -
ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలి
స్టేషన్ఘన్పూర్: లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిఽ ధిలోని చాగల్లులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను హౌసింగ్ పీడీ మాతృసింగ్తో కలిసి బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇంటి నిర్మాణం పనితీరు గురించి, ఇసుక, సిమెంట్, కంకర ఎక్కడ నుంచి తెచ్చారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణాలకు సరిపోను ఇసుక మండలంలోని కొత్తపల్లి, తాటికొండ రీచ్లో సమృద్ధిగా ఉందని, ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని, ఇసుక లోడింగ్, రవాణా ఖర్చులు మాత్రమే లబ్ధిదారుడు చెల్లించా ల్సి ఉంటుందన్నారు. అనంతరం స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ఎంపీడీఓతో కలిసి సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చే ట్రేడ్ లైసెన్స్, అడ్వటైజ్మెంట్ హోర్డింగ్ రెంట్, ప్రాపర్టీ టాక్స్, కమర్షియల్ భవనాల రెంట్, వాటర్ టాక్స్ లక్ష్యానికి తగినట్లు వసూలు చేయాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విజయశ్రీ, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంత రం మండలంలోని ఇప్పగూడెం జెడ్పీ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అన్ని సబ్జెక్టుల్లో రాణించాలని, వార్షిక పరీక్షలో ఉత్తమ మా ర్కులు సాధించాలన్నారు. మధ్యాహ్న భోజనం, వంటగది, కూరగాయలు శుభ్రంగా ఉండాలన్నా రు. అలాగే ఇప్పగూడెం పీహెచ్సీని సందర్శించి రి జిస్టర్లు పరిశీలించారు. టీబీ ముక్త్భారత్ అభియాన్ అమలుతీరును పరిశీలించారు. హెచ్ఎం రఘు, డాక్టర్ ప్రణీత, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
బ్యాంకర్లు చిత్తశుద్ధితో పనిచేయాలి
జనగామ రూరల్: బ్యాంకులు వచ్చే ఏడాదికి పూర్తి లక్ష్యాలు సాధించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి బ్యాంకు మేనేజర్లు, బ్యాంకు కంట్రోలర్స్తో బ్యాంకు రుణాల వివరాలు, బ్యాంకు లింకేజీ ప్రభుత్వ పథకాలపై డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. 2025–26 వార్షిక సంవత్సరానికి రూ.5,381.87 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ రైతులకు రుణాలు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ వసంత, ఎల్డీఎం మూర్తి, ఆర్బీఐ ఏజీఎం చేతన్, అధికారులు పాల్గొన్నారు. పథకాలను విస్తృత ప్రచారం చేయాలి ఇందిరా మహిళా శక్తి పథకాలను విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం కలెక్టరేట్లో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో ఇందిర మహిళా శక్తి పథకాల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన వాహనాన్ని డీఆర్డీఓ వసంత ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. సర్వే అధికారులకు పరీక్షలు నిర్వహిస్తాం గ్రామపాలన, సర్వే అధికారులకు పరీక్షలు నిర్వహిస్తామని సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి వీసీలో మాట్లాడారు. ఈ నెల 27న జీపీ, సర్వే అధికారులకు పరీక్షలు నిర్వహిస్తామని, అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. లైసెన్స్డ్ సర్వేయర్లుగా రాణించాలి సర్వేయర్లు పూర్తిస్థాయిలో శిక్షణ పొంది సర్వేయర్లుగా రాణించాలని అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ అ న్నారు. బుధవారం క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న సర్వేయర్ల శిక్షణ శిబిరాన్ని ఏడీ సర్వే అండ్ ల్యాండ్ కార్డ్స్ మన్యంకొండ, ఆర్డీఓ గో పిరామ్తో కలిసి పరిశీలించారు. సర్వేయర్లుగా రా ణించినప్పుడే వృత్తికి గౌరవం లభిస్తుందన్నారు. రూ.5,381.87కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక కలెక్టర్ రిజ్వాన్ బాషా -
ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి..
మల్టీజోన్–2లో 280 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీల్లో సీనియర్ టీచ ర్లు హెచ్ఎంలుగా అదనపు బాధ్యతలను స్వీకరించడంతో సబ్జెక్టుల కొరత ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది పదవీ విరమణ చేయడంతో సమస్య మరింత జఠిలమవుతోంది. నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా ఖాళీలను భర్తీ చేయడానికి పభుత్వం నిర్ణయించుకోవడం అభినందనీయం. అదే సందర్భంలో ఎంఈఓలను నియమిస్తే బాగుంటుంది. పదోన్నతులతో ఏర్పడిన ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తే, విద్యారంగంలో నాణ్యత పెరగడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం దిశగా ముందుకు వెళతాయి. – పి.చంద్రశేఖర్రావు, టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
దుర్మార్గుడు చచ్చిపోయాడంటూ సంతోషం..!
జనగామ జిల్లా: అతనికి ఇద్దరు భార్యలు. వారిద్దరూ తోబుట్టువులే. తమ తల్లిని చంపాడన్న పగతో ఉన్న ఆ ఇద్దరూ భర్తను గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం పిట్టలోనిగూడెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సీఐ శ్రీనివాస్రెడ్డి, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్టలోనిగూడేనికి చెందిన కాలియా కనకయ్యకు చొక్కమ్మ, గౌరమ్మలిద్దరూ భార్యలు. మే 18న కనకయ్య.. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాలలో అత్త జున్నుబాయిని (చొక్కమ్మ, గౌరమ్మల తల్లి) మామిడి తోటలో ఉండగా తాగిన మైకంలో గొడ్డలితో నరికి చంపాడు. మరో గ్రామంలో మామిడితోటలో ఉన్న తన ఇద్దరు భార్యలకు విషయం చెప్పకుండా వారిని తీసుకొని సిద్దిపేటకు పారిపోయాడు. తెల్లవారుజామున విషయం పోలీసులకు తెలిసి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా కనకయ్య సిద్దిపేటలో ఉన్నాడన్న సమాచారం మేరకు పోలీసులు అక్కడకు వెళ్లి పట్టుకునేలోపు పారిపోయాడు. ఈ విషయం చొక్కమ్మ, గౌరమ్మలకు తెలియడంతో పిట్టలోనిగూడేనికి తిరిగివచ్చారు. అప్పటినుంచి కనకయ్య పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పిట్టలోనిగూడెం వచి్చన కనకయ్య భార్యలతో గొడవ పడ్డాడు. దీంతో గూడెంలోని ప్రజలంతా నిద్రలేచి అక్కడకు వచ్చారు. గొడవ తీవ్రంగా జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన చొక్కమ్మ, గౌరమ్మలు.. వరుసకు సోదరులైన జనార్దన్, శ్రీనివాసులుతో కలిసి గొడ్డలితో కనకయ్యను హత్య చేశారు. మృతదేహాన్ని గ్రామంలో నుంచి కొద్ది దూరం తీసుకెళ్లి చెట్ల పొదల్లో పడేశారు. కనకయ్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ చెప్పారు. పీడ విరగడైంది..: నేర చరిత్ర కలిగిన కనకయ్య తాగిన మైకంలో ఏం చేస్తాడో తెలియదని, క్రూరమృగంలా ప్రవర్తించి.. మహిళలతో వావివరుసలు లేకుండా వ్యవహరిస్తాడని గ్రామస్తులు చెప్పుకొచ్చారు. మహిళలు ఇంట్లోనుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు ఉండేవన్నారు. అతని చేష్టలపై గతంలో పంచాయితీలు పెట్టి పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్టు గ్రామస్తులు చెప్పారు. -
మున్సిపల్ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు
● అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ జనగామ: జనగామ పురపాలికలో ప్రభుత్వ స్థలా లను ఆక్రమిస్తే చర్యలు తప్పవని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ హెచ్చరించారు. పట్టణంలో రోడ్లపై పార్కింగ్, ఫుట్పాత్ల ఆక్రమణ, ఎంక్రోచ్మెంట్లపై సాక్షిలో ప్రచురితమైన కథనాలకు ఆయన స్పందించారు. ఏఎస్పీ పండరి నితిన్ చేతన్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆర్అండ్బీ ఈఈ స్వరూప, ఏఈ మహిపాల్తో కలిసి నె హ్రూపార్కు ఏరియాను సందర్శించారు. రూ.2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు ట్రాఫిక్, పార్కింగ్, రోడ్ల ఆక్రమణలకు సంబంధించి ఆరా తీశారు. సిద్దిపేటరోడ్డు నెహ్రూపార్క్ వద్ద ఏర్పాటు చేయనున్న ట్రాఫిక్ కంట్రోల్ పనులకు సంబంధించి ఏఎస్పీతో చర్చించారు. అక్కడ నుంచి హైదరాబాద్ బైపాస్ వరకు చేపట్టిన 60 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులను అధికారులను అ డిగి తెలుసుకున్నారు. విస్తరణలో భాగంగా విద్యుత్ ఫోల్స్ను పక్కకు జరిపేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. అనంతరం హైదరాబాద్ రూట్లో వరద కాల్వ నిర్మాణ పనులను పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. -
అభివృద్ధి పథం..
● మానుకోట జిల్లా సోమ్లాతండా, కేసముద్రంలో రూ.400కోట్ల పనులకు శంకుస్థాపనలు ● హాజరైన డిప్యూటీ సీఎం, ఐదుగురు మంత్రులు సాక్షి, మహబూబాబాద్/ కేసముద్రం/మహబూబా బాద్ రూరల్: మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 400కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు మంగళవారం అభివృద్ధి పనుల శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, ధనసరి సీతక్క, కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమ్లాతండా, కేసముద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలకు మహిళలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. రూ.400కోట్ల పనులకు శంకుస్థాపన మహబూబాబాద్ పరిధిలో సుమారు రూ.100కోట్లతో రహదారులు, మున్సిపాలిటీ అభివృద్ధి, ట్రైబల్ వెల్ఫేర్ భవనాలు, నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి శుంకుస్థాపనలు చేశారు. అలాగే రూ.300కోట్లతో కేసముద్రం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవన నిర్మాణం, అంగన్వాడీ కేంద్రం, పట్టణంలో 30పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం, నూతన సబ్స్టేషన్లు, సీసీరోడ్లు, కల్వర్టులు, అంతర్గత రోడ్ల అభివృద్ధి పనులు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, నూతన గిడ్డంగుల నిర్మాణం, ఆలయాల అభివృద్ధి, తదితర పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ, జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేశారు. కార్యకర్తల్లో జోష్.. బహిరంగ సభల్లో డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రసంగాలతో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నిండింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకోసం రూ.70వేల కోట్లు ఖర్చుచేసి, రైతు ప్రభుత్వమని నిరూపించుకున్నామన్నారు. మహబూబాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాకు గోదావరి జలాల మళ్లింపుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతమైన మానుకోట అభివృద్ధికి మరిన్ని నిధులు ఇవ్వాలని, ఇంజనీరింగ్ కళాశాల, ఔటర్ రింగ్రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమాల్లో డిప్యూటీ స్పీకర్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు కనకయ్య, నాగరాజు, ట్రైకార్ చైర్మన్ బెల్ల య్య నాయక్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంత్రులు ఏమన్నారంటే...– వివరాలు 8లోu -
బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
● సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డిజనగామ రూరల్: జనగామ నుంచి హుస్నాబాద్ గానుగపహడ్ వద్ద అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మా ణం చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నర్మెట, జనగామ, తరిగొప్పుల మండలాల ముఖ్యనాయకులు కార్యకర్తలు బ్రిడ్జి వద్ద వంటావార్పు, ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడారు. బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్రెడ్డి, కలెక్టర్ స్పందించి తక్షణమే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రమాదాల నుంచి కాపాడాలని కోరారు. నా యకులు సాయన్న, చొప్పరి సోమన్న, చెల్లూరు మల్లేశం, తేజవతి విజయ, పండుగ నిర్మల, యాదలక్ష్మి, పులి కృష్ణ, ఊదర వెంకటాద్రి, ఎం. సుదర్శనం, రాఘవులు తదితరులు పాల్గొన్నారు. -
అక్రమాల డొంక కదులుతోంది..
జనగామ: పురపాలిక పాపాలపుట్ట కదులుతోంది. ఇంటి అనుమతుల నుంచి మొదలుకుని పట్టణ ప్రణాళిక, రెవెన్యూ శాఖల పరిధిలో ప్రతీ ఫైల్ దుమ్ము దులుపుతున్నారు. ‘సెటిల్మెంట్ కింగ్లు ఎవరు’ శీర్షిన సాక్షిలో ప్రచురితమైన కథనం పురపాలికను షేక్ చేసింది. దీనిపై అన్ని వర్గాల ప్రజల్లో చర్చ జోరుగా సాగుతుంది. మున్సిపల్పై వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపధ్యంలో డీఎంఏ సైతం కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మ్యుటేషన్లు, ఇంటి నంబర్ల కేటాయింపులు, పన్నుల నిర్ధారణపై నిజనిజాలను బయటకు తీసేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ డీఎల్పీఓ వెంకట్రెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. ఏడాది అనుమతులపై విచారణ మున్సిపల్లో గడిచిన ఏడాది నుంచి ఇంటి నంబర్ల కేటాయింపులు, పన్నుల కేటాయింపులకు సంబంధించి ఫైల్ టు ఫైల్ పరిశీలన చేయాలని విచారణ అధికారిని అదనపు కలెక్టర్ ఆదేశించారు. మొదట ఆరు నెలల కాలంలో కొత్త ఇంటి నంబర్లకు అనుమతులు ఇచ్చారనే దానిపై తనిఖీ చేయాలని చెప్పినప్పటికీ, ఆ తర్వాత ఏడాదికి పొడగించారు. సుమారు 6 వందల వరకు ఫైల్స్ ఉండగా.. ప్రస్తుతం 311 అసెస్మెంట్ల ఫైల్స్ బయటకు తీసి, ప్రత్యేకంగా తయారు చేసిన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. కొత్త ఇంటి నంబర్ల కేటాయింపులపై డీఎల్పీఓ ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా వెళ్లి అనుమతి ప్రకారం నిబంధలు ఉన్నాయా లేదా అని పరిశీలన చేయాల్సి ఉంటుంది. అనుమతుల సమయంలో ‘ఫార్మాల్టీస్’ ఉన్నాయా అనే కోణంలో సైతం విచారణ చేయనున్నారు. పురపాలికలో జరుగుతున్న అవకతవకల బాగోతంతో మామూళ్లశ్రీ ఉచ్చులో బలైన చాలా మంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. గప్చుప్గా మున్సిపల్ వాతావరణం.. మ్యుటేషన్ల అవకతవకలపై సాక్షిలో ప్రచురితమైన కథనంతో మున్సిపల్ వాతావరణం గప్చుప్గా మారిపోయింది. అనుమతుల కోసం కొత్త ఫైల్స్ వచ్చిన సమయంలో ఒకటికి రెండు సార్లు పరిశీలన చేస్తున్నారు. ఒకటో ముచ్చట తప్ప.. రెండో మాట వద్దంటున్నట్లు సమాచారం. అందులో పని చేస్తున్న కొందరు సర్కారు కొలువు చేస్తున్నామనే విషయాన్ని మరిచి పోయి ఇక్కడ నుంచి సమాచారం లీక్ అవుతుందని సహచరులపై బాహాటంగానే ఎత్తిపొడుపు మాటలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని చర్చ జరుగుతుంది. కమిషనర్ నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత చిన్న చిన్న స్టాంపులు, తదితర పనులకు చేతులు తడిపే వరకు పని జరగదనే ప్రచారం బాహాటంగానే వినిపిస్తుంది. ఇందులో కొంతమంది తప్పులు చేస్తూనే, మంచి కోసం పని చేసే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలు రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురపాలికలో అంకితభావంతో పని చేయాలే తప్ప, ‘టిప్’ కోసం చేతులు చాచితే ఎవరైన సరే ఫిర్యాదు చేస్తామంటున్నారు సమాజం మేలు కోరే ప్రజలు. విచారణ జరిపిస్తున్నాం.. జనగామ మున్సిపల్లో గడిచిన ఏడాది నుంచి ఇప్పటి వరకు నూతనంగా ఇంటి నంబర్ల జారీకి సంబంధించిన ఫైల్స్ను తనిఖీ చేస్తున్నాం. ప్రస్తుతం 311 ఫైల్ బయటకు తీయగా, మిగతా వాటిని ఒక్కొక్కటిగా సేకరిస్తున్నాం. ఇంటి నంబర్ల కేటాయింపులపై క్షేత్రస్థాయికి వెళ్తాం. తుది నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తాం. – వెంకట్రెడ్డి, విచారణ అధికారి, డీఎల్పీఓ ఏడాది అనుమతులపై విచారణ ఇంటి నంబర్ల కేటాయింపులపై ఆరా విచారణ అఽధికారిగా డీఎల్పీఓ -
వైఎస్సార్కు ఘన నివాళి
జనగామ: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఆదేశా ల మేరకు పట్టణంలోని లేబర్ అడ్డా వైఎస్ఆర్ విగ్రహానికి జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ వంగాల మల్లారెడ్డి, మాజీ కౌ న్సిలర్లు మేడ శ్రీనివాస్, గాదెపాక రామచందర్, తోట సత్యం, జమాల్ షరీ ఫ్, గౌస్, జాఫర్ షరీఫ్ తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. -
పక్కాగా ఫీవర్ సర్వే నిర్వహించాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా జనగామ రూరల్: జిల్లాలో ప్రణాళికాబద్ధంగా ఇంటింటి ఫీవర్ సర్వే చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. 100 రోజుల టీబీ ముక్త్ భారత్ క్యాంపెయిన్లో భాగంగా టీబీ బారిన పడిన వారిని, వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ఎలా గుర్తిస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆశవర్కర్లకు ఫీవర్ సర్వేపై పలు సూచనలు చేశారు. 13వ వార్డులో జరుగుతున్న ఫీవర్ సర్వేను పరిశీలించి జ్వరం, దగ్గు, ఒంటి నొప్పుల వంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి అవసరమైన పరీక్షలు, వైద్యసేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారి శ్రీతేజ, సూపర్వైజర్ రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే మెరుగైన విద్య ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే మెరుగైన విద్య లభిస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఇంటర్ అడ్మిషన్లపై ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జితేందర్రెడ్డి, ప్రిన్సిపాల్స్, డీఈఓ భోజన్న, అధికారులు పాల్గొన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. మున్సిపాలిటీలోని 21 వార్డు కుర్మవాడలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన పరిశీలించారు. అలాగే పట్టణంలోని ధర్మకంచ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు మార్గదర్శకులు కావాలన్నారు. -
తక్కువ ఖర్చుతో నిర్మాణం..
నాడు వారసత్వ సంపదగా భూములు, ఆస్తులు ఉండేవి. నేడు గ్లోబల్ వార్మింగ్ నేపధ్యంలో మన భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, కలుషితం లేని నీరు అందించాల్సి న అవసరం ఏర్పడింది. ఆరోగ్యంగా ఉండాలంటే మన చుట్టూ పచ్చదనం ఉండేలా చూసుకోవాలి. వనమహోత్సవంలో నాటిన ప్రతీ మొక్కను సంరక్షించుకోవాలి. ప్రతీ నీటిబొట్టును ఒడిసి పట్టుకుని, భూమి లోపలకు పంపించే విధంగా తక్కువ ఖర్చుతో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టాం. ప్రతీ ఇంటి ముందు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రుల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేశాం. భవిష్యత్లో గాలి, నీరు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడదు. – రిజ్వాన్ బాషా, కలెక్టర్ ● -
కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు సరికాదు
● ఎమ్మెల్యే కడియం శ్రీహరిజఫర్గఢ్: సీఎం రేవంత్రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇప్పటికై న భాష మార్చుకోకపోతే ప్రజలు క్షమించరని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీ కడియం కావ్యతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలకు పాల్పడి వేల కోట్ల ఆస్తులు సంపాదించింది ఎవరని ప్రశ్నించారు. ప్రభుత్వంలో పొరపాట్లు జరిగితే ఎత్తిచూపాలని, అంతేగాని మీ తప్పిదాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తీగల కర్ణాకర్రావు, వైస్ ఎంపీపీ నూకల ఐలయ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
అవే సమస్యలు..తీరని వ్యథలు!
జనగామ రూరల్: ఏళ్ల తరబడి పట్టా పాస్బుక్ కావడం లేదని ఒకరు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని దివ్యాంగుడు, భూమిని కబ్జా చేశారని మరొకరు, పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని వృద్ధులు.. ఇలా ప్రజలు ప్రజావాణికి వచ్చారు. చెప్పులరిగేలా తిరుగుతున్నా.. సమస్యలు పరిష్కారం కావడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్లు రోహిత్సింగ్, పింకేష్కుమార్లతో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా వినతులు స్వీకరించారు. మొత్తం 58 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తమ పరిధిలో ఉన్న వినతులను తక్షణమే పరిష్కరించాలన్నారు. పరిష్కారం కాని సమస్యను దర ఖాస్తుదారులకు తెలియజేయాలన్నారు. అర్హులైన ప్రతీఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతుందన్నారు. లబ్ధిదారులు నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆర్డీఓ గోపిరామ్, డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమంత నాయక్, డీఆర్డీఓ వసంత, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని సమస్యలు ఇలా.. ● రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామానికి చెందిన దేవేందర్ తన తండ్రి ముడావత్ లింబ సర్వే నంబర్ 310 లో 2008 సంవత్సరంలో సర్పంచ్ అనుమతి పొంది ఇంటిని నిర్మించుకోగా దాని ధ్రువీకరణ పత్రం, ఇంటి నంబర్ ఇప్పించాలని కోరారు. ● పాత హరిజనవాడలో సర్వే నంబర్ 403/82, 404/82లో సొంత స్థలంలో గంధమల్ల ఇస్తారి అనే వ్యక్తి ఆక్రమించి రేకుల షెడ్డు నిర్మిస్తున్నారని, తగిన చర్య తీసుకోవాలని బచ్చన్నపేటకు చెందిన విజయలక్ష్మి విన్నవించారు. ● తన పేరుమీద ఉన్న 12 గుంటల భూమికి పట్టా పాస్బుక్ ఇచ్చి రైతు భరోసా వచ్చేలా చూడాలని రఘునాథపల్లి మండలం మాధారంకు చెందిన మోహన్ వినతిపత్రం అందించారు. ● కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ వీహెచ్ పీఎస్ ఆధ్వర్యంలో బిర్రు నగేష్, గడ్డం సోమరాజ్ కలెక్టర్కు విన్నవించారు. ● లింగాలఘణపురం మండలం చీటూరుకు చెందిన వృద్ధురాలు ఎలిశాల రాజమ్మకు వృద్ధాప్య పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్కు వేడుకుంది. ప్రజావాణిలో 58 దరఖాస్తులు ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించాలి కలెక్టర్ రిజ్వాన్ బాషా -
పారిశుద్ధ్య నిర్లక్ష్యంపై నిరసన
జనగామ: జిల్లా కేంద్రంలో పేరుకుపోతున్న పారిశుద్ధ్యంపై పాలకవర్గం లేకపోగా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంపై ప్రతిపక్ష పార్టీలు వినూత్న నిరసన తెలిపారు. ఇటీవల ‘సాక్షి’లో జనగామ మున్సిపల్లో గాడితప్పిన శానిటేషన్ నిర్వహణ, అంతర్గత రోడ్లు గుంతలమయం, రహదారులపై పేరుకుపోతున్న చెత్తకు సంబంధించి వరుస కథనాలకు ఉన్నతాధికారులతో పాటు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేశ్ రెడ్డి ఆధ్వర్యంలో ‘సాక్షి’ కథనాలను చూపిస్తూ సోమవారం పట్టణంలో ‘క్లీన్ అండ్ గ్రీన్ జనగామ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పోకల జమున మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో పాలకవర్గం ఎన్నికలు నిర్వహించక పోవడంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. వీధి దీపాలు వెలుగక, మురుగు నీరు రోడ్లపైకి చేరి కంపు కొడుతుందన్నారు. కమిషనర్ నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రావెల రవి, మొహినుద్దీన్, దేవుని సతీష్, మాజీ కౌన్సిలర్లు పేర్ని స్వరూప, వాంకుడోత్ వనిత, జూకంటి లక్ష్మీ శ్రీశైలం, బండ పద్మ, మాజీ కోఆప్షన్ సభ్యులు మసీ ఉర్ రెహమాన్, ధర్మపురి శ్రీనివాస్, సేవెల్లి మధు, కృష్ణ ఉల్లెంగుల సందీప్, ఉడుగుల నరసింహులు, తిప్పారపు విజయ్, యాకూబ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. వెలుగని వీధిదీపాలు, దుర్వాసనతో ప్రజల అవస్థలు మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం! ఎమ్మెల్యే పల్లా ఆదేశాలతో బీఆర్ఎస్ ‘క్లీన్ అండ్ గ్రీన్ జనగామ’ -
అత్యాధునిక బోధన!
సర్కారు బడుల్లో జనగామ: విద్యారంగంలో సరికొత్త అధ్యాయానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సర్కారు బడులకు వచ్చే విద్యార్థులకు కార్పొరేట్కు దీటుగా బోధన చేసేలా దేశంలోని ప్రసిద్ధ సంస్థల భాగస్వామ్యంతో ఒప్పందం కుదుర్చుకుంది. డిజిటల్ సాధనాలు, ఏఐ బోధన, పిల్లల భద్రత, స్నేహపూర్వక వాతావరణంలో విద్యాబోధన తదితర కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ మేరకు ‘తల్లిదండ్రుల భాగస్వామ్యం–డిజిటల్ తరగతులు’ అనే అంశంపై నేడు (మంగళవారం) సమగ్ర శిక్షలో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, కేజీబీవీ, మోడల్ పాఠశాలలు, గురుకులాల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం) నిర్వహించేందుకు ఉత్తర్వులను జారీ చేసింది. విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర జిల్లాలోని సర్కారు పాఠశాలల్లో తల్లిదండ్రుల భాగస్వామ్యంతో సమావేశం నిర్వహించబోతున్నారు. పిల్లల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్రపై ఇందులో చర్చించనున్నారు. సమావేశాలకు ఒక్కరోజు ముందుగానే హెచ్ఎంలు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి వారిని ఆహ్వానించాలి. సమావేశానికి హాజరయ్యే క్రమంలో తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ తెచ్చుకోవాలి. వారి ఫోన్లో స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ను డౌన్లోడ్ చేయాలి. పిల్లలు నమోదు, హాజరు మెరుగుపర్చేందుకు తల్లిదండ్రుల మద్దతు తీసుకోవాలి. ప్రతీ మూడో శనివారం పీటీఎం నిర్వహించడం జరుగుతుందని ముందుగానే సమాచారం ఇవ్వాలి. అవగాహన కల్పించాలి.. సర్కారు బడుల్లో అమలు చేస్తున్న డిజిటల్ తరగతుల వివరాలను తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. డిజిటల్ లెర్నింగ్, జేఈఈ, నీట్, చైల్డ్ సేఫ్టీ తదితర అంశాలపై పిల్లలను తీర్చిదిద్దడంలో 6 సంస్థలు విద్యాశాఖతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ సంస్థల ద్వారా పిల్లలకు అవసరమైన నైపుణ్యాలను అందించడంలో పూర్తి సహకారం లభిస్తుంది. ఎన్జీవోల సహకారంతో చదవడం, అర్థం చేసుకోవడం (2 నుంచి 5 తరగతులు), విద్యార్థులు, ఉపాధ్యాయులకు డిజిటల్ లెర్నింగ్ సపోర్టు (6 నుంచి 10 తరగతులు), ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, డిజిటల్ ఇనిషియేటివ్, కోడింగ్, సమస్య పరిష్కారం, హ్యాండ్స్ అండ్ లెర్నింగ్, (1 నుంచి 10 తరగతులు), పోటీ పరీక్షల ప్రిపరేషన్ (నీట్, జేఈఈ, సీఎల్ఏటీ /9 నుంచి 12 తరగతులు/ప్రత్యక్ష తరగతులు, పరీక్షలు), పిల్లల భద్రత, రక్షణ, కౌన్సెలింగ్ (6 నుంచి 12 తరగతులు), బడి బయట ఉన్న పిల్లల నమోదు, వయోజన అక్షరాస్యత, వృత్తిపరమైన శిక్షణ (ఓపెన్ స్కూల్ విద్య) ఇస్తున్నట్లు తల్లిదండ్రులకు స్పష్టం చేయాలి. విద్యార్థుల దినచర్యను గమనించాలి విద్యార్థి బడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే దినచర్యను ఎప్పటికప్పుడు గమనించాలి. పిల్లలు నేర్చుకోవడంలో సహాయ పడడానికి ‘ఇంటింట చదువుల పంట’ (ఐసీపీ) యాప్ను వారికి అందుబాటులో ఉంచాలి. పిల్లలు చదువకునే ప్రదేశంలో టీవీ, రేడియో శబ్ధాలు లేకుండా చూడాలి. మోడల్: 8ప్రాథమిక : 341 ప్రాథమికోన్నత: 64కేజీబీవీ: 12ఉన్నత: 103 స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో డిజిటల్ సాధనాలు పిల్లల భవిష్యత్పై ప్రభుత్వం ముందుచూపు కార్పొరేట్కు దీటుగా విద్యాబోధన బడుల పర్యవేక్షణపై తల్లిదండ్రుల భాగస్వామ్యం నేడు పేరెంట్స్, ఉపాధ్యాయుల సమావేశం పీటీఎంలో పాల్గొనాలి.. పీటీఎంలో విద్యార్థి తల్లిదండ్రులు హాజరు కావాలి. గ్రామ పెద్దలు కూడా వీటిలో భాగస్వామ్యం అయితే మంచిది. విద్యార్థుల ప్రతిభ సామర్థ్యాలతో పాటు ఏమైన లోపాలు ఉంటే సమావేశాల్లో చర్చించవచ్చు. తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండి విద్యార్థి సామర్థ్యాలు మరింత మెరుగుపడేందుకు దోహదపడతాయి. – రావుల రామ్మోహన్రెడ్డి, ఉపాధ్యాయుడు సద్వినియోగం చేసుకోవాలి..తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో చేపట్టబోయే సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సర్కారు బడుల అభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వామ్యం కీలకం. ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యాబోధన గురించి ప్రస్తావించాలి. – భోజన్న, డీఈఓ -
కాంగ్రెస్ ఇన్చార్జ్గా అడ్లూరి లక్ష్మణ్కుమార్
● సంస్థాగత నిర్మాణంపై పార్టీ దృష్టి ● వీరి ఆధ్వర్యంలో గ్రామ, మండల, జిల్లా కమిటీలు! సాక్షిప్రతినిధి, వరంగల్: సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు పార్టీని మరింత బలోపేతం చేయడంపై కసరత్తు చేస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఇటీవలి పర్యటన తర్వాత ఆ పార్టీ హైకమాండ్ దూకుడు పెంచింది. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాలకు నియమించిన అధిష్టానం.. సోమవారం ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జ్లను నియమించింది. ఈక్రమంలో ఉమ్మడి వరంగల్కు పార్టీ ఇన్చార్జ్గా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను నియమించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మణ్కుమార్ గతంలో ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ చైర్మన్గా.. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విప్గా నియమితులయ్యారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కగా, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖను కేటాయించారు. నల్లగొండ ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న లక్ష్మ ణ్కు ఉమ్మడి వరంగల్ పార్టీ ఇన్చార్జ్గా నియమితులయ్యారు. ఉమ్మడి వరంగల్లో ఇటీవల నెలకొన్న గ్రూపు రాజకీయాల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్ సోమవారం లక్ష్మణ్కుమార్ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. కాగా.. మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల ఘట్టం మొదలవనుండగా.. సమర్థంగా ఎదుర్కొనేందుకు సంస్థాగత కమిటీలు పూర్తి చేసేందుకు అన్ని స్థాయిల్లో కసరత్తు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈక్రమంలోనే ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్చార్జ్లను నియమించిన అధిష్టానం.. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే వీరి ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల సమన్వయంతో గ్రామ, మండల, జిల్లా కమిటీలను పూర్తి చేసే బాధ్యతలను అప్పగించినట్లు పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. టీబీ రహిత జిల్లాగా మార్చాలి జనగామ రూరల్: టీబీ రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్, ఎన్సీడీ ప్రోగ్రాం అమలు తీరును జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావుతో కలిసి పీహెచ్సీ, సబ్ సెంటర్స్, వైద్యులతో సమీక్షించారు. ఆస్పత్రులకు వచ్చే రోగులను పరిశీలిస్తూ అనుమానితులకు పరీక్షలు నిర్వహించాలన్నారు. ఎన్సీడీ వ్యక్తి పీహెచ్సీకి వస్తే వివరాలు అప్డేట్ చేసి, రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. ఆస్పత్రుల్లోకార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలందించాలన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకంతో ఉపాధి ఇందిరా మహిళా శక్తి పథకంతో ఉపాధి కల్పన కలుగుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలతో నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబురాలు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి కలెక్టర్ హాజరై విజయోత్సవ సంబరాల ఆవశ్యకత నిర్వహణ గురించి దిశా నిర్దేశం చేశారు. -
గుండెపోటుతో చిన్నారి మృతి
స్టేషన్ఘన్పూర్: ముక్కుపచ్చలారని చిన్నారి గుండె ఆగి చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన గోవింద్ అశోక్, అనూష దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, ఉపాధి కోసం వీరు హైదరాబాద్కు వచ్చారు. అశోక్ నగరంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. రెండో కుమార్తె మిధున (6) శనివారం రాత్రి ఛాతీలో నొప్పి వస్తుందని అంటూ.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగానే పాప మృతిచెందింది. కాగా, గుండె పోటుతో తమ కుమార్తె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని తల్లిదండ్రులు తెలిపారు. -
భక్తిశ్రద్ధలతో బీరప్ప బోనాలు
అమ్మవారికి పట్టువస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించిన కురుమ కులస్తులు సోమవారం శ్రీ 7 శ్రీ జూలై శ్రీ 2025బచ్చన్నపేట: సిద్ధేశ్వరాలయంలో లక్ష పుష్పాలంకరణలో శివలింగంపాలకుర్తి టౌన్: లక్ష్మీనర్సింహస్వామికి పూజలు చేస్తున్న అర్చకులుజనగామ: తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని పట్టణంలో ఆదివారం కురుమ కులస్తులు బీరప్ప స్వామికి బోనాలు స మర్పించారు. వందలాది మంది మహిళలతో జనగామ పురవీ ధులు భక్తి పారవశ్యంతో పులకించాయి. కళాకారుల ఢోలు విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టింది. కురుమ కుల సంఘ పెద్దలు అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. జనగామలో బీరప్ప బోనాల పండుగ కనుల పండువగా జరిగింది. కుర్మవాడ, నాగులకుంట, ధర్మకంచ, సాయినగర్, జ్యోతినగర్, బీరప్ప ప్రాంతాల నుంచి వందలాది మంది మహిళలు బోనం ఎత్తుకుని డప్పు చప్పుళ్లతో ర్యాలీగా బొడ్రాయి వద్దకు చేరుకున్నారు. బొడ్రాయి వద్ద గుమ్మడి కాయలు, నిమ్మకాయలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడి నుంచి మహంకాళి దేవాలయం, గుడి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నేరుగా బీరప్ప ఆలయానికి చేరుకున్నారు. బీరప్ప దేవునికి నైవేద్యం సమర్పించారు. మొక్కుల చెల్లింపులు పట్టణంలోని బీరప్ప కామారతి, మహంకాళి అమ్మవార్లకు సంఘ పెద్దలు మొక్కులు చెల్లించారు. ఆలయంలో ప్రత్యేక పూజ లు చేసి, అమ్మవారికి బో నం నైవేద్యం సమర్పించా రు. బోనాల పండుగ నేపధ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టారు. కాగా పెద్ద కురుమ మోటె లింగయ్య, పట్టణ అధ్యక్షుడు బాల్దె మల్లేశం ఇంటి నుంచి ర్యాలీగా స్వామి వారి పట్టు వస్త్రాలు తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘ ప్రతినిధులు జూకంటి శ్రీశైలం, కేమిడి ఉపేందర్, కర్రె కృష్ణ, కడకంచి మధు, మంత్రి శ్రీశైలం, వైకుంఠం, శ్రీను, శ్రీనివాస్, ఉపేందర్, రాములు, చందు పాల్గొన్నారు. సోమేశ్వరాలయంలో..పాలకుర్తి టౌన్: తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించారు. ఆలయాల్లో మామిడి తోరణాలతో తులసీ దళాలతో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు, ఆలయ అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్శర్మ, దేవగిరి అనిల్కుమార్, మత్తగజం నాగరాజు, సుందరాచార్యులు, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.న్యూస్రీల్ -
స్నాతకోత్సవానికి వేళాయె..
నేడు కేయూకు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రాక ● ముఖ్య అతిథిగా ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి ● 387 మందికి పీహెచ్డీ పట్టాలు.. ● 373 మందికి 564 గోల్డ్ మెడల్స్ ప్రదానం ● అడ్మిట్కార్డులు, ఎంట్రీపాస్ల పంపిణీకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవాన్ని సోమవారం ఉదయం 11:30 గంటలకు క్యాంపస్లోని ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఒక స్టీరింగ్ కమిటీ బాధ్యులతోపాటు 10 సబ్కమిటీలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. 2020 నుంచి 2025 వరకు పీహెచ్డీ పూర్తయిన వారిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న 387 మంది విద్యార్థులు పట్టాలు అందుకోనునున్నారు. ఇందులో ఆర్ట్స్లో 56, సైన్స్ 96, ఫార్మసీ 21, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ 49, సోషల్ సైన్సెస్ 133, ఎడ్యుకేషన్ 18, లా 4, ఇంజనీరింగ్లో 10 మంది పీహెచ్డీ పట్టాలు అందుకోనున్నారు. 2016 నుంచి 2021 వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన 373 మందికి 564 గోల్డ్మెడల్స్ ప్రదానం చేయనున్నారు. ఆర్ట్స్లో 60, సైన్స్లో 161, ఫార్మసీలో 48, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో 66, సోషల్ సైన్సెస్లో 88, ఎడ్యుకేషన్లో 25, లా 72, ఇంజనీరింగ్లో 44 మందికి గోల్డ్మెడల్స్ ప్రదానం చేయనున్నారు. కళాశాలలకు గోల్డ్మెడల్స్ విద్యార్థుల జాబితాలు.. పీహెచ్డీ పట్టాలు పొందే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు, ఎంట్రీపాస్లను పరీక్షల విభాగంలో అందజేశారు. పేరెంట్స్కు కూడా ఎంట్రీపాస్లు జారీ చేశారు. కేయూలోని వివిధ కళాశాలలు, అనుబంధ కళాశాలల్లో పలు కోర్సులు చదివి గోల్డ్మెడల్స్ సాధించిన వారి జాబితాలను ఆయా కళాశాలలకు ఇప్పటికే పంపారు. అలాగే, ఆయా విద్యార్థులకు అడ్మిట్కార్డులు, ఎంట్రీపాస్లను కూడా పరీక్షల విభాగాధికారులు పంపించారు. గోల్డ్మెడల్స్ పొందే విద్యార్థులు అడ్మిట్ కార్డులు, ఎంట్రీపాస్లతో స్నాతకోత్సవానికి రావాల్సి ఉంటుంది. ముందుగానే గోల్డ్మెడల్స్ ప్రదానం.. యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 నుంచి 9:30 గంటల వరకు అభ్యర్థులకు గోల్డ్మెడల్స్ ముందే అందజేస్తారు. ఇందుకు అధ్యాపకులతో కూడిన కమిటీ కూడా ఉంది. అభ్యర్థులు గోల్డ్మెడల్స్ తీసుకుని ఆడిటోరియంలో కేటాయించిన సీట్లలో కూర్చోవాల్సి ఉంటుంది. పీహెచ్డీ విద్యార్థులకు పట్టాల ప్రదానం అనంతరం గోల్డ్మెడల్స్ విద్యార్థులు వేదిక మీదకు వచ్చి గవర్నర్ జిష్ణుదేవ్వర్మతో ఫొటోలు దిగాల్సి ఉంటుంది. 373 మంది విద్యార్థులను 19 బ్యాచ్లుగా చేశారు. అయితే అందులో ఎంతమంది హాజరవుతారనేది ఉదయమే తెలియనుంది. ఎందుకంటే వారిలో కొందరు ప్రస్తుతం ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరు విదేశాలకు వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. పేరెంట్స్కు బయట స్క్రీన్ ఏర్పాటు పీహెచ్డీ పట్టాలు, గోల్డ్మెడల్స్ పొందే విద్యార్థుల తల్లిదండ్రులకు ఆడిటోరియంలోకి అనుమతిలేదు. వీరి కోసం ఆడిటోరియం బయట భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఆడిటోరియంలో జరిగే స్నాతకోత్సవాన్ని వీరు వీక్షించనున్నారు. షెడ్యూల్ ఇలా... గవర్నర్ జిష్ణుదేవ్వర్మ హైదరాబాద్ నుంచి ఉదయం 8:30 గంటలకు బయల్దేరి ఉదయం 11 గంటలకు వరంగల్ నిట్కు చేరుకుంటారు. ఉదయం 11:15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి కాకతీయ యూనివర్సిటీకి ఉదయం 11:25 గంటలకు చేరుకుంటారు. ఆడిటోరియం వద్ద ఉదయం 11:30 గంటలకు అకడమిక్ సెనేట్ సమావేశం ఉంటుంది. 11:35 గంటలకు సెనేట్ సభ్యులు గవర్నర్తో ఫొటో దిగుతారు. అనంతరం ప్రొసెసన్ ఉంటుంది. ఉదయం 11:40 గంటలకు కాన్వొకేషన్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. 11:50 గంటలకు కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి రిపోర్ట్ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్య అతిథి శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్ ఐఐసీటీ డైరెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి ప్రసంగిస్తారు. 12:10 గంటలకు చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ప్రసంగిస్తారు. 12:20 గంటల నుంచి పీహెచ్డీ అభ్యర్థులకు పట్టాల ప్రదానం, అనంతరం గోల్డ్మెడల్స్ అభ్యర్థులు గ్రూప్ ఫొటో దిగాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 1:15 గంటలకు స్నాతకోత్సవం ముగుస్తుంది.గవర్నర్, ఐఐసీటీ డైరెక్టర్ రాక కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రానున్నారు. అలాగే, ముఖ్య అతిథిగా శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్లోని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి హాజరుకానున్నారు. స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పీహెచ్డీ అభ్యర్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. పీహెచ్డీ పట్టాలు, గోల్డ్మెడల్స్ పొందేవారు వైట్ డ్రెస్లోనే రావాల్సి ఉంటుంది. కేటాయించిన సీట్లలో వీరు కూర్చోవాల్సి ఉంటుంది. కేయూలో భారీ బందోబస్తు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో సోమవారం నిర్వహించనున్న స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రానుండడంతో క్యాంపస్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం స్నాతకోత్సవాన్ని నిర్వహించే ఆడిటోరియం ప్రాంతంలో బాంబుస్క్వాడ్ తనిఖీ చేసింది. సోమవారం ఉదయం మరోసారి తనిఖీ చేయనున్నది. కేయూలో పోలీసులు మొహరించారు. కేయూ పోలీస్ స్టేషన్తోపాటు వివిధ పోలీస్స్టేషన్లకు చెందిన ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలు, 150 మందికి పైగా పోలీస్ సిబ్బంది అందులో క్విక్ రెస్పాన్స్ పోలీస్ ఫోర్స్ కూడా బందోబస్తు నిర్వహిస్తారు. ఎంట్రీపాస్లు ఉన్న అభ్యర్థులకు వివిధ కమిటీల బాధ్యులకు సభ్యులకు (ఆచార్యులు, ఉద్యోగులు) పాలక మండలి సభ్యులు, సెనేట్ సభ్యులకు ప్రెస్కు ఆడిటోరియంలోకి అనుమతి ఉంటుంది. పలు విద్యార్థి సంఘాల బాధ్యులపై పోలీసులు నిఘా ఉంచారు. -
రజకుల సమస్యలు పరిష్కరించాలి
స్టేషన్ఘన్పూర్: రజక వృత్తిదారులు సమస్యలు పరిష్కంచాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పైళ్ళ ఆశయ్య అన్నారు. మండలంలోని ఇప్పగూడెం గ్రామంలో ఆదివారం రజక వృత్తిదారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో లక్షలాది మంది రజక వృత్తిదారులు రజక వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా తీవ్రంగా వెనుకబడి ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో వివిధ చేతి వృత్తిదారులకు ఇచ్చిన హామీలను అమలులో రజకులను ఆర్థికంగా నిలబడటానికి ప్రతీఒక్కరికి రుణ సౌకర్యం కల్పించాలన్నారు. గ్రామాల్లో కమ్యూనిటీ హాల్లు, దోబీ ఘాట్లు నిర్మించాలని, యాభై సంవత్సరాలు నిండిన వృత్తిదారులకు పెన్షన్ అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదునూరి మధు, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నాయకులు పొన్నల రమేశ్, పద్మాకర్, భానుచందర్, రవి, వెంకటయ్య, సాంబయ్య, యాదగిరి, అశోక్, ఉపేందర్, పరశురాములు, రవి, కొండల్ తదితరులు పాల్గొన్నారు. రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆశయ్య -
బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
జనగామ రూరల్: జనగామ హుస్నాబాద్ రోడ్డు వడ్లకొండ, గానుగుపహాడ్ మధ్య అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేసి ప్రజలను ఆదుకోవాలని ఆదివారం అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వడ్లకొండ మాజీ సర్పంచ్ బోల్లం శారద, గానుగుపహాడ్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడతూ రెండేళ్ల క్రితం ప్రారంభించిన పనులు ఇప్పటి వరకు పూర్తి కాలేదని, ప్రజలు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ నుంచి హుస్నాబాద్ ద్వారా కరీంనగర్కు రాకపోకలు జరుగుతాయని, వందల సంఖ్యలో వాహనాలు ర్రాతింబవళ్లు నడుస్తాయన్నారు. ఇప్పటికై న అధికారులు చొరవ తీసుకొని పనులు త్వరగా పూర్తి చేయాలన్నా రు. ఈ సందర్భంగా నిర్మాణ పనులకు సంబంధించి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన నాయకులు ఇరుగు సిద్దులు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శా నబోయిన మహిపాల్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు దడిగ సందీప్యాదగిరి, దడిగ సిద్ధులు, తిరుపతి, గుర్రం నరేష్, శ్రవణ్, వెంకటేష్ పాల్గొన్నారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నా -
ఘనా, నీలపతాక క్రమాల్లో అమ్మవారికి పూజలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రోత్సవాల్లో భాగంగా పదకొండో రోజు ఆదివారం అమ్మవారికి ఘనా, నీలపతాక క్రమాలలో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు ఉదయం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని ఘనా అమ్మవారిగా, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని నీలపతాక అమ్మవారిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. తొలి ఏకాదశి, ఆదివారం సెలవు కావడంతో అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ జరిగింది. ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. -
శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు పాటుపడాలి
జనగామ రూరల్: శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు పాటుపడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. ఆదివారం శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్ప విద్యావేత్త, జాతీయవాది, భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుడు ఒకే దేశం ఒకే జెండా అనే నినాదం చేసిన మొదటి వ్యక్తి అని కొనియాడారు. రాజకీయానికి నూతన దశాదిశ నేర్పిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతీఒక్కరు కృషి చేయాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్ యాదవ్, ఓబీసీ రాష్ట్ర నాయకుడు గుజ్జుల నారాయణ, భాగాల నవీన్ రెడ్డి, పెద్దోజు జగదీష్, శివ కృష్ణ, రఫ్తార్ సింగ్, చందు, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేశ్ -
మత సామరస్యానికి ప్రతీక మొహర్రం
మత సామరస్యానికి ప్రతీకగా మొహర్రంను ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. తొమ్మిది రోజు ఊరూరా పురవీధుల్లో పీరీల (షావర్ల) పండుగ సందడి కనిపించింది. జనగామ జిల్లా కేంద్రంతో పాటు లింగాలఘణపురం, జఫర్గఢ్, స్టేషన్ఘన్పూర్, బచ్చన్నపేట, చిల్పూర్, దేవరుప్పుల తదితర మండలాల్లో పీరీలను ఊరేగింపు నిర్వహించారు. సీతారాంపురంలో మాజీ ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేషమ్ దంపతులు షావర్లకు కుడుకలు, జట్టీలు కట్టి మొక్కులు తీర్చుకున్నారు.– సాక్షి నెట్వర్క్మరిన్ని ఫొటోలు 9లో.. -
రేపు సిద్ధేశ్వరాలయంలో వేలం
బచ్చన్నపేట: మండలంలోని కొడవటూర్ గ్రా మంలోని స్వయంభూ శ్రీ సిద్ధేశ్వరాలయంలో రేపు (మంగళవారం) తలనీలాల హక్కుకు వే లం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఆ ముదాల మల్లారెడ్డి ఆదివానం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తలనీలాలు వేలం పాట వరుసగా రెండుసార్లు సరైన పాట రానందున వాయిదా వేశామన్నారు. ఆసక్తిగల వేలం పాటదారులు సకాలంలో వేలంలో పాల్గొనాలన్నారు. జీఓ 282ను ఉపసంహరించుకోవాలిజనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 282ను ఉపసంహరించుకోవాలని సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు పారిశ్రామిక యాజమాన్యానికి లాభాలు చేకూర్చేందుకు కార్మికుల శ్రమను తీవ్రంగా దోపిడీ చేసేందుకే కార్మిక శాఖ ద్వారా 8 గంటల పని దినాన్ని 10 నుంచి 12 గంటలకు పెంచేందుకు జీఓ 282 ఉత్తర్వులు జారీ చేశారని, ఈ జీఓను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సీపీఎం నాయకుల నిరసనజనగామ రూరల్: పట్టణంలోని సెయింట్ మేరీస్ పాఠశాల క్రాస్ వద్ద జరుగుతున్న అండర్ గ్రౌండ్ పనులు నత్తనడక నడుస్తున్నాయని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి అన్నారు. ఆదివారం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అండర్ గ్రౌండ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని 3, 4 వార్డుల్లో బాలాజీనగర్, జ్యోతినగర్ సెంట్ మేరీ స్కూల్ ఏరియా, లక్ష్మీ వాటర్ ప్లాంట్ ఏరియా, కురుమవాడ, ఏకశిలా స్కూల్ ప్రాంతం తదితర ప్రాంతాల్లో వరద నీటి నివారణ కోసం నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ పెద్ద మోరీ పనులు ప్రారంభించి మూడు నెలలు కావస్తుందన్నారు. పనులు పూర్తి కాకపోవడంతో చిన్నపిల్లలు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలన్నా రు. ఈ కార్యక్రమంలో పల్లెర్ల లలిత, గాడి శివ, గుండు శ్రీనివాస్, రామా, తేజ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఎరుకుల కులస్తుల అభివృద్ధికి కృషి జనగామ రూరల్: సమాజంలో వెనుకబడిన ఎరుకుల కులస్తుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని ఎరుకుల సంఘం జిల్లా అధ్యక్షుడు దేవర ఎల్లయ్య అన్నారు. ఆదివారం ఏకలవ్య జయంతి సందర్భంగా జనగామ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఏకలవ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దేవర ఎల్లయ్య మాట్లాడుతూ. తరతరాలుగా ఎరుకల జాతి ప్రజలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, ప్రభుత్వాలు కూడా చిన్నచూపు తగదన్నారు. ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళిక ద్వారా ఎరుకల కులస్తులను ఆదుకోవాలన్నారు. 1/70 చట్టం ద్వారా అటవీ హక్కులను స్థానిక ఆదివాసులకే ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సిద్ధిని రాములు, అంగడి మల్లయ్య, అంగిడి పోశయ్య, మైసయ్య, రిటైర్డ్ సీటీఓ ఉప్పలయ్య, దేవర రామ, మానుపాటి యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ముగిసిన చెస్ పోటీలు వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ పబ్లిక్గార్డెన్ వద్ద ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఓపెన్ టు ఆల్ చెస్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హోరాహోరీగా సాగిన పోటీల్లో గండు రిత్విక్, దారా సాయివివేష్, జె.రంజిత్, నిక్రీ ప్రహర్ణ విజేతలుగా నిలిచినట్లు నిర్వహణ కార్యదర్శి పి.కన్నా తెలిపారు. ముగింపు వేడుకల్లో ఆర్బిటర్లు సీహెచ్ శ్రీనివాస్, రజినీకాంత్, ఫ్రాంక్లిన్, అక్షయ్ తల్లిదండ్రులు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. -
ఓటరు జాబితా సవరణలో జాగ్రత్తలు తీసుకోవాలి
పాలకుర్తి టౌన్: ఓటరు జాబితా సవరణలో బీఎల్ఓ లు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ అన్నారు. శనివారం మండలకేంద్రంలోని ఎండీపీఓ కార్యాలయంలో పాలకుర్తి అసెంబ్లీ లెవ ల్ మాస్టర్ ట్రైనర్ నరసింహమూర్తి, శేషగిరిరావు బీఎల్ఓలకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరమే నూతన ఓటరు నమోదు, సవరణ, తొలగింపు, బదిలీ, ఫొటో మార్పిడి తదితర సవరణలు చేపట్టాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందున బల్క్గా ఓటరు దరఖాస్తు ఫారాలు, ఒకే వ్యక్తి పెద్ద మొత్తంలో ఇచ్చే ఓటరు నమోదు దరఖాస్తులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతీ బీఎల్ఓ ఓటర్లుకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.నాగేశ్వర్రావు, డీటీ వేణుగోపాల్రెడ్డి, ఆర్ఐ రాకేష్, బీఎల్ఓలు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ -
నత్తే నయం!
జనగామ రూరల్: కేంద్ర ప్రభుత్వం రైల్వేస్టేషన్లను సుందరీకరించేందుకు అమృత్ భారత్ పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రయాణికులకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో అమృత్ భారత్ పథకంలో జనగామ రైల్వేస్టేషన్కు చోటు కల్పించారు. 2023 ఆగస్టులో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా అభివృద్ధి పనులు ప్రారంభించగా, రెండేళ్లు కావస్తున్నా సుందరీకరణ పనులు నేటికీ పూర్తి కాలేదు. రాష్ట్రంలోని చర్లపల్లితో పాటు పలు మినీ స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తి చేసుకుని కొత్త కళను సంతరించుకోగా, జిల్లాలో మాత్రం ఎక్కడి పనులు అక్కడే అన్న చందంగా మారిపోయాయి. స్టేషన్ అభివృద్ధి పనులకు రూ.100 కోట్ల నిధులను కేటాయించగా, మొదటి విడతలో రూ.24.50 కోట్ల నిధులను విడుదల చేశారు. ఎక్కడి పనులు అక్కడే.. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును తలదన్నే రీతిలో జనగామ రైల్వే స్టేషన్ నమూనాను డిప్లే చేయగా, అది చూసిన ప్రయాణికులు, ప్రజలు ఖుషీ అయ్యారు. మొదట్లో చకచకా సాగిన పనులు, ఆరు నెలల తర్వాత నత్తనడకన సాగుతున్నాయి. స్టేషన్ ముఖ ద్వారంతో పాటు ఫుట్పాత్, పార్కింగ్, గ్రీనరీ, టాయిలెట్స్ తదితర పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. మొదటి దశ పనులు పూర్తి చేసుకుని, రెండవ దశ సైతం ప్రారంభం కావాల్సిన దశలో మొదటికే మోక్షం కరువైపోయింది. ప్రతిపాదించిన పనులు.. జనగామ రైల్వేస్టేషన్ ఆధునీకరణకు మొదటి విడతలో మంజూరు చేసిన రూ.24.50 కోట్లతో స్టేషన్ ముఖద్వారం తుది మెరుగులు, కొత్తగా రెండవ ప్రవేశ ద్వారం ఏర్పాటుకు ప్రణాళిక చేశారు. అలాగే 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ఓవర్ బ్రిడ్జి, ప్లాట్ఫాం అభివృద్ధితో పాటు అదనపు కవర్ను ఏర్పాటు చేయనున్నారు. మరుగుదొడ్లను మరింత మెరుగుపర్చి, కొత్తగా టాయిలెట్ల బ్లాకుల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రయాణికులు విశ్రాంతి తీసుకునే గదులకు కొత్త హంగులు సమకూరుస్తారు. స్టేషన్ ప్రాంగణంలో గ్రీనరీ, విశాలమైన పార్కింగ్, ప్రయాణికులకు అనుకూలమైన వాతావరణం కలిగించేలా స్టేషన్ అభివృద్ధికి ప్లాన్ చేసిన కేంద్రం, అందుకు తగ్గట్టుగా పనులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్లాట్ఫాంపై కోచ్ ఇండికేషన్ బోర్డుల ఏర్పాటు, క్వార్టర్లు, వెయిటింగ్ హాల్స్లో దోమల నివారణకు చర్యలు తీసుకోనున్నారు. లిఫ్టు, ఎస్కలేటర్, రైళ్ల రాకపోకల సమయంలో మరింత పకడ్బందీగా పర్యవేక్షణ ఉండేలా టెలికాం, సిగ్నల్స్ బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. కానీ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం రెనోవేషన్ పనులు జరుగుతుండడంతో టికెట్ కౌంటర్తో పాటు రాకపోకలకు సంబంధించిన గేటును దారి మర్చారు. ఆలస్యంగా రైల్వేస్టేషన్ సుందరీకరణ పనులు అమృత్ భారత్ స్టేషన్ పథకంలో రూ.100 కోట్లు మంజూరు మొదటి విడతలో రూ.24.50 కోట్లు విడుదలప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు..రూ.100 కోట్లతో రైల్వేస్టేషన్ అభివృద్ధి చేయనున్నారు. వందశాతం పనులు పూర్తయితే స్టేషన్ కార్పొరేట్ హంగులను సంతరించుకుంటుంది. ప్రస్తుతం పనులను పెండింగ్లో ఉంచడంతో ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. ఏడాదిలోపే స్టేషన్కు కొత్త హంగులను తీసుకు వస్తామని అధికారులు చెప్పిన మాటలకు పొంతన లేకుండా పోయింది. ఇప్పటికై నా జాప్యాన్ని నివారించాలి. –కాముని శ్రీనివాస్, యశ్వంతాపూర్రెండో దశ ప్రారంభించాలి..జనగామ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు సంబంధించి మొదటి విడత కంప్లీట్ చేసి, రెండవ దశ పనులను వెంటనే ప్రారంభించాలి. రెండేళ్ల నుంచి పనులు సాగుతూ ఉన్నాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బంది తప్పడం లేదు. పనుల పురోగతిపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు దృష్టి సారించాలి. – జోగు ప్రకాశ్, సీపీఎం పట్టణ కార్యదర్శి -
ప్రజల ప్రాణాలపై పట్టింపు లేదు..
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనగామ మండలం వడ్లకొండ గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న గానుగుపహాడ్ కల్వర్ట్ బ్రిడ్జి ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారిందన్నారు. మహారాష్ట్రకు చెందిన నలుగురు వ్యక్తులు కారులో వచ్చే క్రమంలో అర్ధరాత్రి నిర్మాణంలో ఉన్న కల్వర్టులో పడి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారన్నారు. కాంట్రాక్టర్కు వెంటనే పెండింగ్ బిల్లులను చెల్లించి, గానుగుపహాడ్ బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కోరారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక జనగామ రూరల్: ఇటీవల నిర్వహించిన జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో పట్టణంలోని సెయింట్ మెరీస్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ జైమోన్ థామస్ తెలిపారు. శనివారం రాష్ట్ర స్థాయికి ఎంపికై న విద్యార్థులను అభినందించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ లాంగ్జంప్లో పి.మనోజ్, ఎ.బౌషిక్, 60 మీటర్ల రన్నింగ్లో పి.నిఖిల్ ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా ప్రతిభ కనబర్చాలని కోరారు. వ్యాయామ ఉపాధ్యాయుడు గుణవర్ధన్, నరసింహా, రాజు, హేమలతలు విద్యార్థులను అభినందించారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలిజనగామ రూరల్: ఈ నెల 9న జాతీయ కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బొట్ల శేఖర్ తెలిపారు. శనివారం ప్రజా సంఘాల జిల్లా కార్యాలయంలో కేవీపీఎస్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక సమ్మె కు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు, దళిత సంఘాల నాయకులు పాల్గొనాలన్నారు. జిల్లా అధ్యక్షుడు తుటి దేవదానం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యక్షులు పల్లెర్ల లలిత, మబ్బు ఉప్పలయ్య సహాయ కార్యదర్శి గండం యాదగిరి, కాకర్ల బాబు, బోట్ల శ్రావణ్, ఎండీ హతియా సుల్తానా తదితరులు పాల్గొన్నారు. ఎలుగుబంట్లను బంధించిన అధికారులు జఫర్గఢ్: మండలంలో గత కొద్ది రోజుల నుంచి సంచరిస్తున్న ఎలుగుబంట్లను ఫారెస్టు అధికారులు బంధించారు. వివరాలిలా ఉన్నాయి... శనివారం మండలంలోని తీగారం గ్రామశివారులోని హనుమాన్తండా సమీపంలో ఎలుగుబంట్లు సంచరిస్తున్న విషయాన్ని స్థానికులు ఫారెస్టు అధికారులకు తెలిపారు. దీంతో స్పందించిన ఎఫ్ఆర్ఓ మురళీధర్ నేతృత్వంలో ఫారెస్ట్ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. ముందుగా తల్లి ఎలుగుబంట్టితో పాటు రెండు పిల్ల ఎలుగుబంట్లు ఉన్నట్లు గుర్తించారు. సుమారు మూడు గంటల పాటు శ్రమించి వాటిని బంధించారు. వీటిని హైదరాబాద్ జూపార్కుకు తరలిస్తున్నట్లు ఎఫ్ఆర్ఓ మురళీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ నర్సింగ్, సెక్షన్ ఆఫీసర్ జరినాబేగం, బీట్ ఆఫీసర్ రవి, అంజి, వాచర్ మోహన్, సంతోష్, రిస్క్టీం సభ్యులు పాల్గొన్నారు. -
ఈవీఎం గోదాం పరిశీలన
జనగామ రూరల్: ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కలెక్టరేట్లోని ప్రధాన ఈవీఓం గోదాంను కలెక్టర్ రిజ్వాన్ బాషా శనివారం పరిశీలించారు. ఈ మేరకు భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పరిశీలన, నియంత్రణ పద్ధతులను పరిశీలించారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హుస్సేన్, ఎన్నిక సంఘం సిబ్బంది పాల్గొన్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు జనగామ: జిల్లాలో ట్రిపుల్ ఐటీకి అర్హత సాధించిన 49 మంది విద్యార్థులను కలెక్టర్ రిజ్వాన్ బాషా శనివారం అభినందించారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ట్రిపుల్ ఐటీలో ఆరు సంవత్సరాల కోర్సుకు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. పిల్లలు జిల్లా కీర్తిని ఇనుమడింపజేశారన్నారు. కొడకండ్ల మండలంలోని 15, రఘునాథపల్లి 8, లింగాలఘణపురం, చిల్పూర్, జనగామ మండలం నుంచి ముగ్గురు చొప్పున ప్రవేశం పొందినట్లు స్పష్టం చేశారు. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ కొడకండ్ల నుంచి అత్యధికంగా 8 మంది, ఆదర్శ పాఠశాల నుంచి 5 విద్యార్థులు ఎంపికలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదన్నారు. భవిష్యత్తులో సాంకేతిక విద్య పొందడానికి అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపించాలని, ప్రణాళిక బద్ధంగా బోధన చేస్తూ, పదో తరగతిలో మంచి ఫలితాలను రాబట్టి, ట్రిపు ల్ ఐటీ బాసరలో మరిన్ని సీట్లు పెరిగేలా చూ డాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న ట్రిపుల్ ఐటీలో అవకాశం పొందిన ప్రతీ విద్యార్థిని అభినందిస్తూ, ఉపాధ్యాయుల కృషిని కీర్తించారు. -
‘తొలి ఏకాదశి’కి ముస్తాబు
జనగామ: ఆషాఢమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ‘తొలి ఏకాదశి’ అంటారు. ఉత్తర దిక్కున ఉన్న సూర్యుడు, ఈరోజు నుంచి దక్షిణ దిక్కున ప్రయాణించడంతో దీనిని దక్షిణాయణంగా పరిగణిస్తారు. శివకేశవులు, విష్ణువుకు ఈరోజు ప్రీతికరమైన రోజు గా భావిస్తారు. నేడు (ఆదివారం) తొలి ఏకాదశి ప్రారంభం పురస్కరించుకుని జిల్లాలోని శివాలయాలు, వైష్ణవ దేవాలయాలను ముస్తాబు చేస్తున్నారు. ముస్తాబవుతున్న ఆలయాలు తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్ధేశ్వర, చిల్పూరు వేంకటేశ్వర, పాలకుర్తి సోమేశ్వర, జనగామ పట్టణం బాణాపురం వేంకటేశ్వర, పాతబీటు రామలింగేశ్వర, సంతోషిమాత ఆలయాలను సుందరంగా అలంకరిస్తున్నారు. తొలిఏకాదశి పర్వదినం పురస్కరించుకుని నేడు తెల్లవారు జాము నుంచి ఆలయాలకు వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. నేడు కురుమ కులస్తుల బోనాలు పట్టణంలో కురుమ కులస్తులు బీరప్ప కామరతి, అక్క మహంకాళి దేవతామూర్తులకు బోనాలు సమర్పించనున్నారు. కుర్మవాడ నుంచి నెహ్రూపార్కు మీదుగా ఒగ్గుఢోలు కళాకారుల వాయిధ్యాలు, శివసత్తుల నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు వేలాది మంది మహిళలు బోనాలతో పాటు పట్టువస్త్రాలతో బీరప్ప ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, బోనం నైవేద్యం సమర్పించిన అనంతరం, పట్టు వస్త్రాలు కా నుకగా ఇచ్చి, ఓడిబియ్యం పోస్తారు. ఇందుకు సంబంధించి ఆలయం వద్ద ఏర్పాట్లు చేస్తుండగా, పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు కురుమ కులస్తుల బోనాలు -
నిబంధనలు విస్మరిస్తే చర్యలు
దేవరుప్పుల: నిబంధనలు విస్మరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డీసీపీ రాజమహేందర్నాయక్ హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసుల నమోదు రికార్డులు, జప్తు చేసిన సామగ్రి, కీలక భద్రత గదులను పరిశీలించారు. అనంతరం కామారెడ్డిగూడెంలోని వాగును పరిశీలించి ఇసుక ట్రాక్టర్ అనుమతి పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పేదల ఇళ్ల కోసం నిర్ధేశిత ప్రాంతాలకు రెవెన్యూ అధికారులు ఇస్తున్న అనుమతుల మేరకు ఇసుకను తరలించాలన్నారు. అక్రమంగా ఇతరులకు విక్రయిస్తే వాహనం సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. ఇసుక రవాణా విషయంలో పోలీసు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పర్యవేక్షణ చేయాలన్నారు. డీసీపీ వెంట ఎస్సై ఊర సృజన్కుమార్, సిబ్బంది ఉన్నారు. డీసీపీ రాజమహేందర్నాయక్ -
ప్రజాధనం వృథా!
ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025– 8లోuజనగామ: లక్షలాది రూపాయల ప్రజాధనంతో కొనుగోలు చేసిన మున్సిపల్ వాహనాలు తుప్పుబడుతున్నా.. సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పట్టణ పర్యవేక్షణ గాలికి వదిలేయడంతో కాలనీల్లో మౌలిక వసతులు కరవయ్యాయి. గాడితప్పిన పురపాలికపై సాక్షి ప్రత్యేక కథనం. జనగామ పురపాలికలో ప్రజాధనం అంటే లెక్క లేకుండా పోయింది. ఇంటి, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్లు, ఆయా మార్గాల్లో జరిమానాలు, నిర్మాణ సమయంలో అనుమతుల పేరిట ఏటా కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతుంది. దీంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత నిధుల విడుదల చేస్తుంది. ఒక్కోపైసా ఖర్చు చేసే సమయంలో బాధ్యత ఉండాలి. అభివృద్ధి పనుల్లో నాణ్యత, ప్రజలకు సౌకర్యాలు కల్పించే సమయంలో మూణ్నాళ్ల పాటు బాగుండే విధంగా చూడాల్సిన బాధ్యత కమిషనర్పై ఉంటుంది. ఇక్కడ మాత్రం అవేమీ కనిపించవు. కమిషనర్ అజమాయిషీ లేకపోవడం, పరిపాలనపై అవగాహ న రాహిత్యంతో ప్రజలకు శాపంగా మారింది. సమస్యలపై ఫిర్యాదు చేస్తే రోజుల తరబడి తిరగడం తప్ప, ఒక్క పని జరిగిన దాఖలాలు లేవని పట్టణంలో చర్చ జరుగుతోంది. శానిటేషన్ నిర్వహణ, చెత్త సేకరణ కోసం లక్షల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి కొనుగోలు చేసిన వాహనాలను మూలన పడేశారు. రూ.10లక్షల విలువ చేసే ఆరు డంపర్లు తప్పు పట్టిపోతున్నా.. పట్టించుకోవడం లేదు. మరమ్మతు చేయిస్తే ఉపయోగంలోకి వచ్చే ట్రాక్టర్ ట్రాలీలు అక్కరకు రాకుండా పోతున్నాయి. జనరేటర్ ఎండకు ఎండుతూ, వానకు తడిసి పోతూ ఎందుకు పనికి రాకుండా పోతుంది. హైడ్రాలిక్ ఆటో, మరో ట్రాలీ, వీధుల్లో ఏర్పాటు చేసే చెత్త డబ్బాలు పిచ్చిమొక్కల మధ్య దర్శనమిస్తున్నాయి. అధికారులు కార్యాలయాలకు ఉపయోగించే ఏసీకి అనుసంధానంగా ఉండే ఇన్వర్టర్ను నిర్లక్ష్యంగా చెట్ల పొదల మధ్య ఏర్పాటు చేశారు. ఇన్వర్టర్లోకి పిచ్చిమొక్కలు వెళ్తూ.. వర్షంలో తడుస్తూ పాడై పోతుంది. లక్షల సొమ్ము మట్టి పాలు చేస్తూ కనీస సౌకర్యాలు కల్పించమంటే నిధులు లేవని చెబుతున్న కమిషనర్ నిర్లక్ష్యంపై మెజార్టీ ప్రజలు మండిపడుతున్నారు. మున్సిపల్ శానిటేషన్ విభాగం వాహనాలు మూలకు పడిన వాహనాలివే న్యూస్రీల్ తుప్పుపడుతున్న మున్సిపల్ వాహనాలు వానకు తడుస్తూ..ఎండకు ఎండుతున్న జనరేటర్ పట్టణ ప్రజలకు కనీస మౌలిక వసతులు కరువు పట్టించుకోని పురపాలిక అధికారులురాత్రి వేళలోనూ చెత్త సేకరణ జనగామ: జనగామ పట్టణంలో పురపాలిక అధికారులు రాత్రి సమయంలో చెత్త సేకరణకు శ్రీకారం చుట్టారు. గాడితప్పిన శానిటేషన్ నిర్వహణపై ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలతో అధికారులు స్పందిస్తున్నారు. ప్రధా న రహదారులతో పాటు కమర్షియల్ వార్డుల్లో చెత్తను సేకరిస్తూ డంప్ యార్డుకు తరలిస్తున్నా రు. ఈ ప్రక్రియను మూణ్నాళ్ల ముచ్చటగా కా కుండా, నిరంతర ప్రక్రియగా ముందుగా సా గాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.ఆటోలు: 10ట్రాక్టర్లు:7ప్రైవేట్ ఆటోలు: 5 జేసీబీ: 1 ఫాగింగ్ యంత్రాలు: 4 శానిటేషన్ కార్మికులు: 147స్ప్రేయర్లు: 64 ట్రాలీ కం ఇంజిన్: 1 ట్రాక్టర్ ట్రాలీలు: 2 జనరేటర్: 1 డంపర్లు: 6 హైడ్రాలిక్ ఆటో: 1ఆటో ట్రాలీ: 1 -
ముందస్తు చర్యలు తీసుకోవాలి
జనగామ రూరల్: పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పచ్చదనం విస్తృతంగా చేపట్టాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి దనసరి సీతక్క అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాలోని స్వచ్ఛదనం, పచ్చదనంపై చేపడుతున్న కార్యక్రమాలను జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పింకేష్కుమార్, డీపీఓ స్వరూపారాణి, డీఆర్డీఓ వసంత, జెడ్పీ సీఈఓ మధురీషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ శానిటేషన్ పనులు విస్తృతంగా చేపట్టాలని, పరిసర ప్రాంతాల్లో పిచ్చిమొక్కలు తొలగించాలని, మురుగు కాల్వలు శుభ్రపరచాలని, దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వ లేకుండా చర్యలు తీసుకుంటూ అపరి శుభ్ర ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లించాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలను నిరంతరాయంగా చేపట్టాలన్నారు. ప్రతీ నెల 1, 11, 21 తేదీల్లో ట్యాంకులను శుభ్రం చేయించి, రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు సిద్ధం చేయాలని, ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పచ్చదనం విస్తృతంగా చేపట్టాలి వీసీలో మంత్రి దనసరి సీతక్క -
పన్నులతో పురపాలికకు ఆదాయం
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజు ప్రణాళిక కార్యక్రమంలో పురపాలికకు పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. శనివారం వ్యాపార, వాణిజ్య సంస్థలను ఆయన సందర్శించి కొలతలు తీసుకున్నారు. అనంతనం ఆయన మాట్లాడుతూ పట్టణంలో 15,574 అసెస్మెంట్లు, ఉండగా ఇందులో 12,841 నివాస గృహాలు, 1,088 నివాసేతర గృహాలు, 1,645 మిక్స్డ్ భవనాలు ఉండగా, ఏటా ఆదాయం రూ.5.67 కోట్ల డిమాండ్ ఉందన్నారు. గతంలో నిర్వహించిన సర్వేలో 2,730 గృహాలను రీ అసెస్మెంట్ చేయగా, రూ.44.89 లక్షల డిమాండ్కు పెరగడం జరిగిందన్నారు. ఇంకా నూతన అసెస్మెంట్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 2025–26 వార్షిక సంవత్సరంలో 2,125 దుకాణాల పరిధిలో కొలతలు నిర్వహించినట్లు తెలిపారు. పట్టణ పరిధిలో శిథిలావస్థకు చేరుకున్న 65 గృహాలను గుర్తించి, వాటిని ఆన్లైన్ నుంచి తొలగించడం(వీటి ద్వారా రూ.28.43 లక్షలు కోల్పోయారు) జరిగిందని, కొత్తగా నిర్మాణం చేసే సమయంలో తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. ఆయన వెంట కమిషనర్ వెంకటేశ్వర్లు, పులి శేఖర్ తదితరులు ఉన్నారు. అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ -
నిబద్ధత గల నేత కొణిజేటి రోశయ్య
● కలెక్టర్ రిజ్వాన్ బాషాజనగామ రూరల్: నిబద్ధత గత నాయకుడు కొణిజేటి రోశయ్య అని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని ప్రభుత్వ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈసందర్భంగా రోశయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎంగా, గవర్నర్గా పనిచేసి పరిపాలన దక్షుడిగా కీర్తి ప్రతిష్టలు పొందిన మహోన్నతమైన వ్యక్తి రోశయ్య అని కొనియాడారు. ఉద్యోగులు కొణిజేటి రోశయ్యను ఆదర్శంగా తీసుకొని విధుల్లో అంకితభావం, విధేయత చూపాలని సూచించాఉ. కార్యక్రమంలో ఇన్చార్జ్ డీఆర్వో, డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్, జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
భూగర్భ జలాలను పెంపొందించాలి
దేవరుప్పుల: మానవ జీవిత పురోగతికి నిరంతరం దోహదపడే విద్య, వైద్య రంగాల్లో విధులు నిర్వర్తించే అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ సూచించారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించిన కలెక్టర్ భూరెవెన్యూ సదస్సుల ప్రక్రియ, రేషన్ కా ర్డుల జారీ తదితర విషయాలపై సమీక్షించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దినచర్య యాప్లో కాకుండా రికార్డులపరంగా సమాచారం లేకపోవడాన్ని గుర్తించి సత్వరమే పూర్తి చేయాలని ఉన్నతాధికారులను ఆదేశిస్తూ స్థానికుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి కొత్తకాలనీలో కస్తూర్బా బాలికల హాస్టల్ను సందర్శించిన కలెక్టర్ గంటసేపు పైగా తరగతి గదులు తిరిగి విద్యార్థినుల అభ్యున్నతిపై నిశితంగా ప్రశ్నిస్తూ పలు సందేహాలకు నివృత్తి చేశారు. ప్రతి కుటుంబ అభివృద్ధిలో విద్య కీలకమని, బాలికల అభ్యున్నతికి ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రోత్సహించాలని ఎంఇఓ కళావతికి సూచించారు. పాఠశాలలు ప్రారంభమై నెలదాటినా బాలికలకు యూనిఫామ్ అందించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో అందేలా చర్యలు తీసుకోవాలని ఐకేపీ ఏపీఎం వెంకట్రెడ్డిని ఆదేశించారు. నిర్దేశిత 360 మందికి 310 విద్యార్థినులు ఉండడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన సిబ్బంది కేటాయింపునకు చర్యలు తీసుకోవాలని ప్రత్యేకాధికారి సుకన్యకు సూచించా రు. ఇదిలా ఉండగా.. కామారెడ్డిగూడెం రైతులు తమ వాగు నుంచి ఇసుక తరలించొద్దని కలెక్టర్ను కోరగా.. వారం తర్వాత ఇసుక తరలింపు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భూగర్భ జలాలను పెంపొందించాలి జనగామ రూరల్: ప్రతీ నీటిబొట్టును ఒడిసిపట్టి భవిష్యత్లో తాగు, సాగు నీటి కొరత ఉండకుండా భూగర్భ జలాలను పెంపొందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మన జిల్లా –మననీరు కార్యక్రమంలో భాగంగా తక్కువ ఖర్చుతో ఇంకుడు గుంతల నిర్మాణం ప్రగతి పైన శుక్రవారం సాయంత్రం క్యాంప్ కార్యాలయం నుంచి గూగుల్ మీట్ ద్వారా వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ.. ప్రతి గ్రామ, మండల, జిల్లా కార్యాలయంలో తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మించాలని తెలిపారు. తాగు, సాగు నీరుకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే భూగర్భ జలాలను సంరక్షించుకోవడం తప్పనిసరి అని వివరించారు. వర్షపు నీరు వృథాగా పోకుండా ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత నిర్మించుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి రోజు సాధించిన ప్రగతిని సోక్ పిట్ ఫొటోలను గూగుల్ షీట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. శాఖల వారీగా లక్ష్యాలను నిర్ధేశిస్తూ సాధ్యమైనన్ని సోక్ పిట్ నిర్మాణాలు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని చెపారు. వన మహోత్సవంపై గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించడం ద్వారా అవగాహన కల్పించాలన్నారు. విద్య, వైద్య రంగాల్లో నిర్లక్ష్యం తగదు కలెక్టర్ రిజ్వాన్ బాషా -
దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగించాలి
జనగామ రూరల్: దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నా రు. సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రవీందర్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ పోరాటంలో వెనుకబడిన తరగతుల కులాలకు అండగా నిలబడిన దొడ్డి కొమురయ్య మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వెనుకబడిన తరగతుల కులాలకు ప్రాధాన్యతనిచ్చి వారి అభ్యున్నతికి కృషిచేస్తున్నదన్నారు. కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు కంచె రాములు, పట్టణ అధ్యక్షుడు బల్దే మల్లేశం, పట్టణ కార్యదర్శి జూకంటి శ్రీశైలం, కోశాధికారి ఎండ్రు వైకుంఠం, యాదవ సంఘం పట్టణ అధ్యక్షుడు కానుగంటి ముత్తయ్య, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల బాలరాజు, రజక సంఘం జిల్లా సెక్రటరీ పదునూరి మదార్, కల్లుగీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బల్దే వెంకట మల్లయ్య, కోపా అధ్యక్షుడు కర్రే కృష్ణ పాల్గొన్నారు. -
ఇంటి ఆవరణలో ఇంకుడుగుంత తప్పనిసరి
● డీపీఓ స్వరూపారాణి స్టేషన్ఘన్పూర్: ప్రతీ ఇంటి ఆవరణలో తప్పనిసరిగా ఇంకుడుగుంత నిర్మించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి అన్నారు. మండలంలోని తాటికొండ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి ఎదునూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న లోకాస్ట్ మ్యాజిక్ సోప్పిట్ (తక్కువ ఖర్చుతో నిర్మాణం చేసే ఇంకుడుగుంత)లను శుక్రవారం డీపీఓ పరిశీలించారు. గ్రామంలోని రైతువేదిక, పీహెచ్సీ, అంగన్వాడీ సెంటర్లలో నిర్మాణం చేపట్టిన ఇంకుడు గుంతలను ఆమె పరిశీలించారు. అనంతరం డీపీఓ మాట్లాడుతూ.. ఇంకుడు గుంతలతో ప్రయోజనాలపై ప్రజలు చైతన్యం కావాలన్నారు. ఇంకుడుగుంతల ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని వివరించారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద, నీరు నిల్వ ఉండే చోట ఇంకుడు గుంతల నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ నర్సింగరావు, కార్యదర్శి సత్యనారాయణ, ఏఈఓ శ్రావణి, అంగన్వాడీ టీచర్లు పద్మ, ధనలక్ష్మి, కారోబార్ సలీమ్, పోకల నరేష్ పాల్గొన్నారు. -
ముగిసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్
జనగామ రూరల్: స్థానిక ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎప్సెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసిందని కళాశాల ప్రిన్సిపాల్ రాత్ ఖానం అన్నారు. ఎప్సెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్కు 1,071 విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు తమకు నచ్చిన కాలేజీ కోసం వెబ్ఆప్షన్లు ఇవ్వవచ్చని, 18న మొదటి విడత అలాట్మెంట్ జరుగుతుందన్నారు. అంతర్జాతీయ క్లాసికల్ చెస్ రేటింగ్ సాధించిన శ్రీయాన్రామ్ కొడకండ్ల: మండలకేంద్రానికి చెందిన శివరాత్రి శ్రావణ్కుమార్ – లలిత కుమారుడు శ్రీయాన్రామ్ అంతర్జాతీయ క్లాసికల్ చెస్ రేటింగ్ సాధించాడు. జూన్లో హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో జరిగిన అండర్ –9 చెస్ నేషనల్ టోర్నమెంట్లో శ్రీయాన్రామ్ ప్రతిభ కనబరిచి 1506 రేటింగ్ సాధించినట్లు కోచ్లు రాజు, పవన్ తెలిపారు. తొమ్మిదేళ్ల వయస్సులోనే చెస్లో ప్రతిభను చాటుకొంటున్న శ్రీయాన్రామ్ను పలువురు అభినందించారు. విద్యతోపాటు వినయాన్ని అలవర్చుకోవాలి రఘునాథపల్లి: విద్యతోపాటు విద్యార్థులు వినయాన్ని అలవర్చుకోవాలని జిల్లా విద్యాధికారి భోజన్న సూచించారు. మండలంలోని వెల్ది మోడల్ స్కూల్ను శుక్రవారం ఆయన సందర్శించారు. పదో తరగతి గదిలో విద్యార్థుల పక్కనే కూర్చొని ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువుతోపాటు క్రమశిక్షణ అలవర్చుకుంటే జీవితంలో ఎదిగేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. అనంతరం స్కూల్ ఆవరణలో ప్రిన్సిపాల్ పాలకుర్తి శ్రీధర్తో కలిసి ఇంకుడు గుంత పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గణేష్ కందగట్ల, మల్లం శ్రీధర్, కట్ట రాజు, శ్రీను, జయశ్రీ, విజయ, శశికుమారి, పార్వతి, సౌజన్య, ప్రియ, పీఈటీలు రాజయ్య, వాసుదేవు తదితరులు పాల్గొన్నారు.ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలిబచ్చన్నపేట: లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని డీఎల్పీఓ వెంకట్రెడ్డి అన్నారు. కొడవటూరు రైతువేదికలో జసిరెడ్డిపల్లి, బండనాగారం, లక్ష్మాపూర్, బోనకొల్లూరు, కేసిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగాఆయన వారికి పలు సూచలను చేశారు. లబ్ధిదారులతో వెంటనే ఇళ్లను ప్రారంభింపజేయాలని, కొలతల్లో తేడా రాకుండా చూడాలన్నారు. నిర్మాణ దశలకు అనుగుణంగా లబ్ధిదారుల ఖాతాల్లో చెల్లింపులు జరుగుతాయన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ వెంకట మల్లికార్జున్, హౌసింగ్ ఏఈ ఈశ్వర్, కార్యదర్శులు నర్సింహాచారి, బృంగి రూప, చైతన్య, భరత్, కిషోర్ పాల్గొన్నారు. -
ముగిసిన కోలాట శిక్షణ
జనగామ రూరల్: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజా కళల పరిరక్షణలో భాగంగా నిర్వహించిన బోనాల కోలాట శిక్షణ శిబిరం ము గింపు కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథి గా అరుణోదయ కల్చరల్ ఫెడరేషన్ చైర్మన్ విమల క్క హాజరై మాట్లాడుతూ.. ప్రజా కళలు జీవించాల ని ప్రజలను చైతన్యవంతం చేయడానికి కళాకారులు కృషి చేయాలన్నారు. 51 మంది శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఒగ్గు బీర్ల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఓగ్గు ధర్మయ్య, కనకంచి పాపయ్య తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ అభివృద్ధికి బాధ్యతగా పనిచేయాలి
● మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ జేడీ శ్రీధర్ స్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి అధికారులు, సి బ్బంది ప్రత్యేక చొరవతో బాధ్యతగా పనిచేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ అన్నారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. మున్సిపాలిటీ పరిసరాలు, కమిషనర్ గది, ఫైళ్లు, రిజిష్టర్లను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మా ట్లాడుతూ నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ బాధ్యతగా పనిచేయాలన్నా రు. 100 రోజుల ప్రణాళిక పనులను సమర్ధవంతంగా చేపట్టాలని, విధి నిర్వహణలో అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. గతంలో గ్రామ పంచాయతీ, ప్రస్తుత మున్సిపాలిటీకి పనుల్లో చాలా వ్యత్యాసం ఉంటుందని, అందరూ పనుల్లో అప్గ్రేడ్ కావాలని, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం మాజీ సీఎం రోశ య్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పట్టణ సుందరీకరణకు రూ.1.50 కోట్లు
జనగామ: జనగామ పట్టణంలోని బతుకమ్మకుంటతోపాటు చుట్టూ సుందరీకరణ పనుల కోసం రూ.1.50 కోట్లు ఖర్చు చేయనున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తెలిపారు. సుందరీకరణ పనులపై మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టరేట్లో శుక్రవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. బతుకమ్మ చుట్టూ పాదచారులకు పాత్ వే నిర్మాణంతోపాటు సేదదీరేందుకు బెంచీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఓపెన్ జిమ్, పిల్లలు ఆడుకునే పరికరాలు, కుంట చుట్టూ గ్రిల్స్, గార్డెన్ లైటింగ్, కట్టపై హైమాస్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బతుకమ్మ కుంటలో బురద మట్టి పేరుకుపోయి, దుర్గంధం వెదజల్లడంతో రూ.10 లక్షలతో పూడికతీత పనులు చేపట్టినట్లు తెలిపారు. బస్టాండ్ చౌరస్తాలో డివైడర్పై 12 ఆకృతులతో సూర్య నమస్కారాలు, 12 అడుగుల ఎత్తుతో నమస్కార ముద్ర విగ్రహా న్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్ బైపాస్ రోడ్డులో సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమరయ్య స్మారక చిహ్నాల ఏర్పాటుతోపాటు వాటర్ ఫౌంటేషన్కు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. హనుమకొండ బైపాస్పై పట్టణానికి ఆకర్షనీయమైన ప్రవేశ ద్వారం పనులు జరుగుతున్నట్లు స్పష్టం చేశారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. జనగామ చుట్టూ స్వాగత తోరణాలు జంక్షన్లో సూర్యనమస్కారాల విగ్రహాలు అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ -
చర్య తీసుకోవాలి
స్టేషన్ఘన్పూర్: మహబూబ్నగర్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి భాస్కర్పై దాడి చేసిన మార్కెట్కమిటీ వైస్ చైర్మన్ విజయ్కుమార్పై తగిన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ ఉద్యోగుల అధ్యక్షుడు, స్టేషన్ఘన్పూర్ మార్కెట్ కార్యదర్శి జన్ను భాస్కర్ డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిపై ఈనెల 2న వైస్ చైర్మన్ చేసిన దాడిని ఖండిస్తూ టీఎన్జీఓల మార్కెట్ కమిటీ ఉద్యోగుల కేంద్ర సంఘం నాయకుల పిలుపుమేరకు స్టేషన్ఘన్పూర్లో మార్కెట్ కార్యదర్శి జన్ను భాస్కర్ ఆధ్వర్యంలో గురువారం మార్కెట్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జన్ను భాస్కర్ మాట్లాడారు. మార్కెట్ ఉద్యోగులకు భద్రత కల్పించాలని, వైస్ చైర్మన్ను పదవి నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకోండి
లింగాలఘణపురం: ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా కోరారు. మండల కేంద్రంతోపాటు బండ్లగూడెంలో గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. బేస్మెంట్ వరకు ఎంత ఖర్చు అయింది.. మహిళా సంఘాల నుంచి ఏమైనా రుణాలు తీసుకున్నారా.. మెరీటీయల్ కొనుగోలులో ఏమైనా ఇబ్బందులు తలెత్తున్నాయా.. అంటూ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. మేసీ్త్రలు, కూలీల కొరత ఏమైనా ఉందా.. అని ఆరా తీశారు. ప్రతి సోమవారం లబ్ధిదారులకు ఆయా ఇళ్ల స్థితికి అనుగుణంగా బిల్లులు చెల్లించడం జరుగుతుందని, ఎలాంటి జాప్యం జరగదని తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్మిస్తున్న మోడల్హౌజ్ను పరిశీలించారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో తక్కువ ఖర్చుతో నిర్మిస్తున్న సోక్ఫిట్స్ను పరిశీలించారు. మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపుతో ఎరువుల తనిఖీ చేశారు. ధరల పట్టికల ఏర్పాటు చేయాలని, విత్తనాలు, ఎరువులు విక్రయించే సమయంలో రైతుల పేర్లు, సెల్ నంబర్లను నమోదు చేయాలని సూచించారు. కలెక్టర్తోపాటు తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ జలేందర్రెడ్డి, ఎంపీఓ రాఘురామకృష్ణ, ఏఓ వెంకటేశ్వర్లు, హౌజింగ్ ఏఈ దివ్య, కార్యదర్శులు ప్రవీణ్కుమార్, సంతోషిమాత తదితరులు ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్ రిజ్వాన్బాషా -
ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు
జనగామ: అర్హులైన ప్రతీ కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆర్డీఓ గోపీరాం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జనగామ నియోజకవర్గస్థాయి ఇంది రమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి, అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్లతో కలిసి ఎంపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో నిరుపేదల కల సాకారం అవుతుందన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో భూ భారతి సదస్సులు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించి సమస్యలు పరిష్కారం చేస్తున్నామన్నారు. కొత్త రేషన్కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టబోతున్నామని అన్నారు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం వంటి ప్రభుత్వ పథకాలను నిరంతరంగా కొనసాగిస్తున్నామన్నారు. వ్యవసాయం పండుగలా చేపట్టేందుకు రైతులు పండించిన ధాన్యం కనీస మద్దతు ధరతో కొనుగోలు చేశామన్నారు. సన్నాలు పండించే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహకంగా క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. రైతులకు రుణమాఫీతోపాటు రైతు భరోసా పథకం అమలు చేసిన ఘనత కాంగ్రెస్ సర్కారుకే దక్కుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తే అధికారులు, ప్రజాప్రతినిధులతో వచ్చి ప్రారంభిస్తామన్నారు. ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి వద్ద దమ్ము ఉందని, సంక్షేమం, అభివృద్ధికి ఎక్కడా ఇబ్బందులు ఉండవన్నారు. అంతకు ముందు జనగామ నియోజకవర్గంలోని మున్సిపాలిటీ, జనగామ రూరల్, బచ్చన్నపేట, నర్మెట్ట, తరిగొప్పుల మండలాలకు చెందిన 816 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను ఎంపీ అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, హౌసింగ్ పీడీ మాతృనాయక్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆర్టీఏ మెంబర్ అభిగౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎంకు దమ్ముంది.. సంక్షేమం, అభివృద్ధి ఆగదు ఇళ్ల పట్టాల పంపిణీలో ఎంపీ కిరణ్కుమార్రెడ్డి -
నాలాల క్లీనింగ్.. గుంత పూడ్చివేత
జనగామ: జనగామ పట్టణంలో మట్టి, చెత్త, ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండిన నాలాల క్లీనింగ్ పనులు పురపాలక అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. పురపాలక అధికారుల నిర్లక్ష్యం, అలసత్వంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘మూణ్నాళ్ల ముచ్చటేనా’, ‘కంపు కంపు’, మట్టిరోడ్లు మస్తు తిప్పలు’, ‘చెత్త కంపు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన వరుస కథనాలు పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి. ఈ కథనాలతో శానిటేషన్, ఇంజనీరింగ్ శాఖల అధికారులు నిద్రమత్తు వీడారు.. నాలాల్లో చెత్తను తొలగిస్తుండగా, రోడ్లపై చెత్తను డంప్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియగా సాగితేనే పట్టణంలో స్వచ్ఛత నెలకొంటుంది. ఈ దిశగా అధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తే, సమస్యలు పునరావృతం కాకుండా ఉంటుందనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తూనే.. కమిషనర్ మాత్రం తన సీటును వదిలిబయటకు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. దోమల నివారణకు గురువారం సాయంత్రం సంబంధిత కార్మికులు జనగామలో ఫాగింగ్ చేశారు. ప్రమాదకర గుంతకు మోక్షం హెడ్పోస్టాఫీస్ మలుపు వద్ద ప్రమాదకరంగా మారిన గుంతను పూడ్చి వేశారు. సాక్షి లో వచ్చిన కథనాలకు సంబంధించిన ప్రతులతో అమ్మ ఫౌండేషన్ సంస్థ నిరసనలు తెలుపగా, అధికారులు స్పందించారు. ఇంజనీరింగ్ డిపార్డుమెంట్ ఏఈ మహిపాల్ ఆధ్వర్యంలో గుంతలో సీసీ వేయించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నారు. ప్రజాసమస్యలపై నిత్యం సాక్షి చేస్తున్న పోరాటానికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. -
విద్యార్థుల బాధ్యత ఉపాధ్యాయులదే..
● విద్యాశాఖపై కలెక్టర్ సమీక్షజనగామ: సర్కారు బడుల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయులపై ఆధారపడి ఉందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. ‘శిథిల గదులు– చదువులు ఆగం’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. 2025–26 నూతన విద్యా సంవత్సరంలో విజయోస్తు 2.0 కార్యక్రమంలో భాగంగా బడిబాట నమోదు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ, అకాడమీక్ క్యాలెండర్, పది వార్షిక పరీక్షల ముందస్తు ప్రణాళిక తదితర వాటిపై అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీఈఓ భోజన్న, ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులతో కలిసి గురువారం కలెక్టరేట్లో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి స్కూల్కు రెగ్యుల్గా వచ్చేలా మానిటరింగ్ చేయడంతోపాటు ప్రతి అంశాన్ని ఆన్లైన్లో పొందుపర్చాలన్నారు. ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని ప్రతి రోజు నివేదిక రూపంలో అందించాలని ఆదేశించారు. పాఠ్యంశాల బోధనకు ఇబ్బంది కలగకుండ లీవ్ మేనేజ్మెంట్ చేసుకోవాలన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలన్నారు. పాఠశాలల్లో కిచెన్ షెడ్లు, పంట సామగ్రి, నీరు, కూరగాయలు శుభ్రంగా ఉండాలన్నారు. కొత్తగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు ముందు బెంచ్లో కూర్చునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ నెల 10వ తేదీ లోపు ఇంటర్లో చేరిన విద్యార్థుల నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పదో తరగతి ముందస్తు కార్యాచరణను మొదలు పెట్టాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే కేరిర్ గైడెన్స్ ఉండాలని, విద్యార్థులు చదువుతోపాటు క్రీడాంశాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలన్నారు. ప్రతి పాఠశాలలో కనీసం 3 సోక్ పిట్స్ నిర్మాణం చేసి, వన మహోత్సవంలో పెద్దఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నషా ముక్త భారత్లో భాగంగా హై స్కూల్ విద్యార్థులపై ప్రత్యేక ఫోకస్ సారించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో బోధన మెరుగుపడాలన్నారు. -
డ్రెయినేజీలు, రోడ్ల పరిశీలన
స్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో అధ్వానంగా ఉన్న డ్రెయినేజీలు, రోడ్లు, పారిశుద్ధ్య సమస్యపై ‘మారని తీరు–మున్సిపాలిటీ అయినా కంపు కొడుతున్న వార్డులు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి మున్సిపాలిటీ అధికారులు స్పందించారు. మున్సిపల్ పరిధిలోని ఛాగల్లు, స్టేషన్ఘన్పూర్, శివునిపల్లిలోని పలువార్డులను కమిషనర్ రాధాకృష్ణ అధికారులతో కలిసి గురువారం సందర్శించారు. ఆయా వార్డుల్లో అసంపూర్తిగా ఉన్న డ్రెయినేజీలు, మట్టిరోడ్లు, దెబ్బ తిన్న సీసీ రోడ్లను పరిశీలించారు. అవసరమైన చోట డ్రెయినేజీలు, సీసీ రోడ్లను ప్రాధాన్యత క్రమంలో చేపడతామని, ఈ మేరకు నివేదికను తయారు చేయాలని అధికారులకు సూచించారు. వార్డుల్లో చెత్తా చెదారం లేకుండా కార్మికులు బాధ్యతగా పనులు చేయాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ ఏఈ వంశీకృష్ణ, జూనియర్ అసిస్టెంట్లు శ్రీనివాస్, సందీప్, నాయకులు బూర్ల శంకర్, పోశాల కృష్ణ, సారంగపాణి, రమేష్, నాగేష్, ఫాతికుమార్, పూర్ణచందర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
స్థానిక పోరుకు సై
పల్లెల్లో రాజకీయ నేతల హడావుడి జనగామ: స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పుతో పల్లెల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కొద్దిరోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఆశావహులు రంగలోకి దిగుతున్నారు. కేడర్తోపాటు అధిష్టానం ఆశీస్సుల కోసం తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. పోటీకి సర్వం సిద్ధం చేసుకుంటూ, రిజర్వేషన్లు ఎలా ఉంటాయ నే దాని పై కులాల వారీగా లెక్కలు వేసుకునేపనిలో పడ్డారు. తెరపైకి ఆశావహులు స్థానిక సంస్థల ఎన్నికలకు కొద్దిరోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఆశావహులు ఖద్దర్ డ్రెస్లతో ప్రజల ముందు ప్రత్యక్షమవుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 2న సర్పంచ్, జూలై 4న ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి గ్రామం, మండలం, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేసినా, బీసీ రిజర్వేషన్లు, కులగణన నేపథ్యంలో వాయిదా పడ్డట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో అప్పటి వరకు పోటీపై ఆసిక్తగా ఉన్న వివిధ పార్టీల ఆశావహులు డీలా పడిపోయారు. కేడర్తోపాటు సేవా కార్యక్రమాల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్నారు. స్థానిక సమరానికి సమయం ఆసన్నం కావడంతో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, బీఆర్ఎస్ పార్టీల్లోని నాయకులతోపాటు స్వతంత్రంగా పోటీ చేసేందుకు ఆశావహులు మళ్లీ తెరపై కనిపిస్తున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్లుగా పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్న నాయకులు విందులతో తమవైపు తిప్పుకునే ప్రయత్నం ప్రారంభించారు. జిల్లాలో ఎక్కడ చూసినా స్థానిక సమరం గురించే చర్చించుకుంటున్నారు. ప్రధాన, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలదే స్థానిక ఎన్నికల్లో హవా కొనసాగడం ఆనవాయితీ. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించడంలో జాప్యం చేయడంతో సర్కార్పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కొంతమేర ఎలక్షన్స్పై పడే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యేక పాలనలో మున్సిపాలిటీలు, గ్రామాల అభివృద్ధి కుటుంబడిపోతుండడం, కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోవడంతో ఎలక్షన్లు నిర్వహించేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందరికీ ప్రతిష్టాత్మకమే.. అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కాబోతున్నాయి. స్థానిక సంస్థల్లో తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుని పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని బీఆర్ఎస్ బరిలో దిగనుండగా, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను పునరావృతం చేసుకుని సంపూర్ణ విజయం పొందాలని కాంగ్రెస్ సమాయత్తమవుతుంది. ఈ రెండు పార్టీల పరిస్థితి ఇలా ఉంటే.. ఈసారి అత్యధిక స్థానాలను కై వసం చేసుకునేలా బీజేపీ ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తుంది. సీపీఎం, సీపీఐ, స్వతంత్రులు సైతం బరిలో గట్టి పోటీ ఇచ్చేందుకు తమదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నారు. రిజర్వేషన్ మారేనా..?ఎన్నికల్లో పోటీచేయాలంటే మందుగా రిజర్వేషన్ కలిసిరావాలి. అయితే ఆసారి పాత రిజర్వేషన్లనే కొనసాగిస్తారా.. లేక కొత్త ప్రతిపాదనలు చేస్తారా.. అనే విషయంలో క్టారిటీ లేకపోవడంతో ఆశావహులు సందిగ్ధంలో పడ్డారు. అయితే పాత రిర్వేషన్ల ప్రకారమే ఎలక్షన్లు నిర్వహించబోతున్నట్లు ప్రచారం జరుగుతుండడం గమనార్హం. తెరపైకి ఆశావహులు సేవా కార్యక్రమాల్లో బిజీబిజీ రిజర్వేషన్లపై సందిగ్ధంసిద్ధమవుతున్న అధికారులు గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనే మందుస్తు ఊహాగానాలతో అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎలక్షన్ల నిర్వహణ కోసం ఆర్ఓ, ఏఆర్ఓలు ఇతర సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి చేశారు. స్టేషన్ఘన్పూర్ డివిజన్ను మున్సిపల్ చేయడంతో జిల్లాలో 280 జీపీలు, 2,576 వార్డులు ఉన్నాయి. 12 జెడ్పీటీసీలు, 134 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జెడ్పీ ఎలక్షన్ల కోసం 753, పంచాయతీ ఎన్నికల కోసం 2,576 పోలింగ్ కేంద్రాలను గుర్తించడంతోపాటు బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ ముద్రణ, ఎలక్షన్ సామగ్రిని సిద్ధం చేసి అధికారులు రెడీగా ఉన్నారు. -
అభివృద్ధికే స్కూల్ కౌన్సిల్ ఎన్నికలు
జనగామ రూరల్: పాఠశాల అభివృద్ధి.. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకే స్కూల్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ భోజన్న తెలిపారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల స్కూల్ కౌన్సిల్ ఎన్ని కలను ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించారు. జూన్ 30వ తేదీన పాఠశాలలో ఎన్నికలు నిర్వహించగా ఫలితాలను జూలై 1న వెల్లడించి గురువారం ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థులతో డీఈఓ భోజన్న ప్రమాణ స్వీకారం చేయించి బ్యాడ్జీ లను అందజేశారు. ఈసందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తాను కూడా సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలోనే చదువుకొని డీఈఓ స్థాయికి ఎదిగినట్లు గుర్తు చేసుకున్నారు. ఎన్నికలలో విజయం సాధించిన విద్యార్థులు నాయకత్వ లక్షణాలను అలవరచుకొని రాబోయే కాలంలో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపే గొప్ప నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ నరసింహులు గౌడ్ పాల్గొన్నారు. డీఈఓ భోజన్న -
విద్యార్థులు లక్ష్యంతో చదవాలి
లింగాలఘణపురం: విద్యార్థులు జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని అందుకుతగ్గట్టుగా కృషి చేసి సాధించాలని జనగామ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సి.విక్రమ్ అన్నారు. మండలంలోని నెల్లుట్ల ఉన్నత పాఠశాలలో న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం మాదకద్రవ్యాలు, బాల్యవివాహాలపై అ వగాహన కల్పించారు. చెడు వ్యసనాలకు విద్యార్థులు బానిసలు కావొద్దని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత, ఉ పాధ్యాయ బృందం, వలంటీర్లు పాల్గొన్నారు. టీబీ కేసులను గుర్తించాలి జనగామ: దేశ వ్యాప్తంగా చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ప్రోగ్రాంలో కే సులను గుర్తించాలని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కా ర్యదర్శి ఆరాధన పట్నాయక్ ఆదేశించారు. గు రువారం ఢిల్లీ నుంచి టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ఇంటెన్సిఫైడ్ క్యాంపెయి న్పై ఎండీ ఎన్హెచ్ఎంతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టరేట్ నుంచి పీఓ ఎన్టీ ఈపీ సిబ్బందితో కలిసి అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో 1,21,613 మందికి ఎక్స్రే, నాట్ ద్వారా టీబీ నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 736 మందికి ఎక్స్రే, 781 మందికి నాట్ టీబీ పరీక్షలు చేయగా.. 43 మందికి టీబీ ఉన్నట్లు గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు టీచర్ల వేతనాల విడుదల జనగామ: 2008లో డీఎస్సీ అర్హత సాధించి పదహారేళ్లుగా పోరాటం చేస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కాంట్రాక్టు పద్దతిలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పోస్టింగ్ ఇచ్చింది. ఇందులో జనగామ జిల్లాలో 32 మంది(ఎస్జీటీ)గా బాధ్యతలు స్వీకరించారు. 2025–26 వా ర్షిక సంవత్సరంలో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న వీరి వేతనాలకు సంబంధించి జిల్లాకు రూ.1,33,73,800 విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గైనిక్, అనస్థటిస్ట్ పోస్టులకు ఇంటర్వ్యూలు జనగామ: జిల్లా వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న గైనకాలజిస్టు(1), అనస్థటిస్ట్(1) పోస్టుల ను నేషనల్ హెల్త్ మిషన్ స్కీంలో కాంట్రాక్ట్ ప ద్దతిలో భర్తీ చేయనున్నట్లు డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. గైనకాలజిస్టు(అర్హత ఎంబీబీఎస్/ ఎంఎస్,డీజీఓ/ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్/వేతనం రూ.లక్ష) అనస్థటిస్ట్ పోస్టుకు(ఎండీ డిప్లొమా ఇన్ అనస్తియా (డీఏ), మెడికల్ కౌన్సి ల్ రిజిస్ట్రేషన్/వేతనం రూ.లక్ష) అర్హత కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు సర్టిఫికెట్లతో ఈ నెల 8వ తేదీన కలెక్టరేట్లో మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలిపారు. కొనసాగుతున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జనగామ రూరల్: టీజీఎప్సెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ స్థానిక ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతోందని కళాశాల ప్రిన్సిపాల్ రాత్ ఖహ్నం గురువారం ఒక ప్రకటనలో తెలి పారు. ఇప్పటి వరకు 800లకుపైగా విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయిందని తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6:00 వరకు వరకు ఈప్రక్రియ ఉంటుందని తెలిపారు. వెరిఫికేషన్ పూర్తయిన వారు ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు కాలేజీ కోసం ఆన్లైన్లో ఆప్ష న్ ఇవ్వాలని తెలిపారు. 18న మొదటి విడత అలాట్మెంట్ జరుగుతుందని తెలిపారు. నేడు కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలు జనగామ రూరల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పనిచేసిన కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలు శుక్రవారం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం ఉదయం నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొనాలని పేర్కొన్నారు. -
‘నేను నిన్ను ప్రేమిస్తున్నా.. భర్త, పిల్లలను వదిలేసి రా'
జనగాం: ఒక పక్క భర్త.. మరోపక్క ప్రేమపేరుతో తరచూ ఫోన్ చేస్తున్న ఓ యువకుడి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెందిన ఏదుల సతీశ్కుమార్తో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన శైలజ(24)కు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరి కాపురం 5 సంవత్సరాలు సజావుగానే సాగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో 3 సంవత్సరాల నుంచి పిండిప్రోలు గ్రామానికి చెందిన యువకుడు కంపటి శ్రీరామ్.. తరచూ శైలజకు ఫోన్ చేసి ప్రేమపేరుతో వేధిస్తున్నాడు.‘నేను నిన్ను ప్రేమిస్తున్నా.. మనమిద్దరం కలిసి ఉందాం.. పిల్లలు, భర్తను వదిలిపెట్టి రా’అని వేధిస్తున్నాడు. ఈ విషయం భర్త సతీశ్కుమార్కు రెండు సంవత్సరాల క్రితం తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఎన్నాళ్ల నుంచి కొనసాగుతుందని ప్రశ్నిస్తూ.. నువ్వు ఎందుకు బతుకుతున్నావు, చావరాదు అని తరచూ శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. దీంతో భర్త సతీశ్కుమార్, యువకుడు శ్రీరామ్ వేధింపులు తాళలేక శైలజ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగింది. గమనించిన భర్త సతీశ్కుమార్ హుటాహుటిన మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా శైలజ మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి కవిత ఫిర్యాదు మేరకు భర్త సతీశ్కుమార్, యువకుడు శ్రీరామ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్కె. రియాజ్పాషా తెలిపారు. -
అంగన్వాడీల బలోపేతానికి కృషి
జనగామ రూరల్:అంగన్వాడీల బలోపేతానికి కృషి చేయాలని రీజినల్ జాయింట్ డైరెక్టర్ మోహితి అన్నారు. బుధవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో జిల్లా స్థాయి సిబ్బంది, డీసీపీయూ, చైల్డ్ హెల్ప్లైన్, సఖి సెంటర్, పోషణ అభియాన్, అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీల్లో పిల్లల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు. గర్భిణులకు, చిన్నారులకు పౌష్టికాహా రం అందేలా చూడాలన్నారు. అంతకుముందు పట్టణంలోని అంబేడ్కర్నగర్, రఘునాథపల్లి మండలంలోని అంగన్వాడీ కేంద్రాలను పరి శీలించారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలినర్మెట: విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్ అన్నారు. మండలంలోని కస్తూ ర్భాగాంధీ బాలికల విద్యాలయం, నర్మెట గ్రామపంచాయతీని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీ పరిసరాలు, తరగతి గదులు, వంటశాల పరిశీలించిన అనంతరం విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థినులు ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్నారు. అనంతరం గ్రామ పంచాయతీలోని పలు రికార్డులు పరిశీలించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలను నిర్మించాలన్నారు. ఆయన వెంటన డీఈఓ భోజన్న, జీసీడీఓ గౌసియా బేగం, ఎంపీడీఓ అరవింద్ చౌదరి, ఎంఈఓ మడిపల్లి ఐలయ్య, ఎస్ఓ రజిత, కార్యదర్శి కందకట్ల శ్రీధర్, సిబ్బంది తదితరులున్నారు. సమస్యలు సత్వరమే పరిష్కరించాలిచిల్పూరు: ఫిర్యాదుదారులు ఇచ్చే దరఖాస్తులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి సత్వరమే చర్యలు తీసుకోవాలని వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేందర్ నాయక్ అన్నారు. చిల్పూరు పోలీస్ స్టేషన్ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్య క్తం చేశారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్ర వర్తించాలన్నారు. కార్యక్రమంలో జనగామ రూరల్ సీఐ ఎడవెళ్లి శ్రీనివాస్రెడ్డి, ఎస్సై నవీన్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. గృహ నిర్మాణ శాఖ పీడీగా హనుమాజనగామ: జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ ఎస్డీసీ–2 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పని చేస్తున్న వి.హనుమాకు స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్టు డైరెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నుంచి రిలీవ్ అయి, కొత్త పో స్టులో జాయినింగ్ తేదీని ప్రభుత్వానికి తెలియ పర్చాలని అందులో పేర్కొన్నారు. తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్ల బదిలీలుజనగామ: జిల్లాలో నలుగురు తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లను బదిలీ చేయడంతో పాటు పోస్టింగ్లు ఇస్తూ కలెక్టర్ రిజ్వాన్ బాషా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రఘునాథపల్లి తహసీల్దార్ ఎండీ మొహ్సిన్ ముజ్తభాను నర్మెటకు, నర్మెటలో పని చేస్తున్న తహసీల్దార్ రామానుజాచారికి బచ్చన్నపేటకు పోస్టింగ్ కల్పిస్తూ ఆర్డర్ ఇచ్చారు. బచ్చన్నపేటలో ఇన్చార్జ్ తహసీల్దార్గా పని చేస్తున్న నాయబ్ తహసీల్దార్ ఎల్.ఫణికిషోర్ రఘునాథపల్లికి బదిలీ చేయడంతో పాటు తహసీల్దార్గా అదనపు పూర్తి బాధ్యతలను అప్పగించారు. రఘునాథపల్లి నాయబ్ తహసీల్దార్గా పని చేస్తున్న సుంచు శంకర్ జనగామ ఆర్డీఓ కా ర్యాలయానికి బదిలీ కాగా, తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కలెక్టరేట్లో డిప్యూటేషన్ పై పని చేస్తారన్నారు. బదిలీ అయిన తహసీల్దా ర్లు, నాయబ్ తహసీల్దార్లు వెంటనే విధుల్లో చే రాలని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఆయిల్పామ్ సాగును పెంచాలి●
● కలెక్టర్ రిజ్వాన్ బాషా జనగామ రూరల్: రైతులకు అధిక ఆదాయాన్ని ఇచ్చే ఆయిల్పామ్ సాగును పెంచాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఆయిల్ పామ్ విస్తీర్ణం పెంపుపై ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఉద్యానవన, వ్యవసాయ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 3,500 ఎకరాలు ఆయిల్ పామ్ సాగుకు అవకాశం ఉందని, ముందుగా గుర్తించిన 700 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు చర్యలు తీసుకోవాలన్నారు. 2,800 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేసేందుకు ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా లక్ష్యాలు రూపొందించుకొని ఫలితాలు సాధించాలన్నారు. భూగర్భ జలాలను పరిరక్షించేందుకు ప్రతీ రైతువేదికలో ఇంకుడుగుంతలు నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన, పట్టు పరిశ్రమ శా ఖ అధికారి శ్రీధర్, వ్యవసాయ శాఖ అధికారి రా మారావు నాయక్, సహకార శాఖ అధికారి రాజేందర్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ జిల్లా మేనేజర్ శంకర్, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నత విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నతమైన విద్య, పౌష్టికాహారం అందుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. బుధవారం మండలంలోని ఓబుల్కేవాపూర్ జెడ్పీ హైస్కూల్ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా 9, 10 తరగతిలో విద్యార్థుల సామర్థ్యాలు, డిజిటల్ బోధన తీరు, మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరం టెన్త్ ఫలితా ల్లో మొదటి స్థానం వచ్చేలా విద్యార్థులు, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కష్టమైన సబ్జెక్టులు ఉంటే ఇప్పటినుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనం మెనూలోది కాకుండా వేరేది పెడితే కఠిన చర్యలు తప్పవన్నారు. అనంతరం అంగన్వాడీ పాఠశాలను సందర్శించి పిల్లల బరువు, ఎత్తు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భోజన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జీరో పర్మిట్ విధానం అమలు చేయాలి జిల్లాలో ఆన్లైన్లో జీరో పర్మిట్ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇసుక, కంకర, ఖనిజ వనరులకు సంబంధించిన ఆన్లైన్ల జీరో పర్మిట్, టీజీఎండీసీలో ఇసుక అనుమతులు తీసుకునే విధానంపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీరో పర్మిట్ విధానం ద్వారా అనుమతులు తీసుకునే విధంగా కాంట్రాక్టర్లకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ శాఖ ఏడీ విజయ్ కుమార్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025
పక్క ఫొటోలో కనిపిస్తున్న ఏరియా స్టేషన్ఘన్పూర్ ఎస్సీ కాలనీలోని 16వ వార్డు దుస్థితి. వార్డులో డ్రెయినేజీ సౌకర్యం సరిగా లేకపోవడంతో మురుగునీరు జనవాసాల మధ్య నిలుస్తూ చిన్నపాటి కుంటను తలపిస్తుంది. ఇళ్ల మధ్య మురుగునీరు నిలిచి ఉండగా పందులు, దోమల స్వైర విహారంతో కాలనీవాసులు దుర్వాసనతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. స్టేషన్ఘన్పూర్ ఎస్సీ కాలనీలోని జనవాసాల మధ్య నిలిచిన మురుగునీరు న్యూస్రీల్ -
కురిసిన వర్షం.. రైతన్న హర్షం
పత్తి, వరి పంటకు ఊపిరి ● రెండవసారి పత్తి విత్తనాలువిత్తుతున్న రైతులు ● ఆలస్యంగా ప్రారంభమైన వరి నాట్ల పనులు ● వ్యవసాయ క్షేత్రాల్లో సందడిజనగామ: వానాకాలం సీజన్ రైతులను కలవరపాటుకు గురి చేస్తోంది. సీజన్కు ముందు మురిపించిన వర్షాలు, పత్తి విత్తులు, నారు మళ్లు సిద్ధం చేసుకున్న తర్వాత ముఖం చాటేశాయి. గడిచిన నెలరోజుల్లోగా వరణుడి పలకరింపు లేకపోవడంతో నాటిన విత్తనాలు మట్టిలో కలిసి పోగా, నారు మళ్లు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. దీంతో నాట్లు వేయడం కొంత ఆలస్యం జరుగగా, వర్షం కోసం అన్నదాతలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. రెండు రోజుల క్రితం కురిసిన మోస్తరు వర్షం పత్తి మొలకలు, నారు మళ్లకు ఊపిరిపోసింది. వరణుడి కరుణతో కురిసిన కంటి తుడుపు వర్షంతో వ్యవసాయ క్షేత్రాల్లో సందడి నెలకొంది. 3.40 లక్షల ఎకరాల్లో సాగు అంచనా.. జిల్లాలో వానాకాలం సీజన్లో 3.40 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, వేరుశనగ తదితర పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ ముందస్తుగా అంచనా వేసింది. పత్తి 1.25 లక్షలు, వరి 2.15 లక్షలు సాగు చేయనున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు పత్తి, 20వ తేదీ వరకు నాట్లు 70 శాతం మేర పూర్తి కావాల్సి ఉంది. రైతన్నకు ఊరట.. జిల్లాలో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులకు కొంత మేర ఊరట కలిగిస్తున్నాయి. ఇప్పుడప్పుడే భూగర్భ జలాలు పెరిగే అవకాశం లేనప్పటికీ, వరద నీరు పొలాల్లోకి వచ్చి చేరుతుంది. నార్లు పోసి సిద్ధంగా ఉంచుకోగా, నాట్ల కోసం దుక్కులు మొదలు పెట్టారు. పలుచోట్ల పత్తిలో కలుపు తీత పనులు జోరుగా సాగుతున్నాయి. పత్తి కొమ్మలు వా డి పోతున్న సమయంలో ఈ వాన జీవం పోసింది. ఒక్కోరైతుకు రూ.10వేల నష్టం ఈ సీజన్లో ఆశించిన మేర వర్షాలు లేకపోవడంతో ముందస్తుగా నాటిన పత్తి విత్తులు నేలలోనే మురికి పోయాయి. ఒక్కో రైతు రూ.5 నుంచి రూ.10 వేల వరకు నష్టపోయారు. ఇటీవల కురుస్తున్న మోస్తరు వర్షాలతో రెండవ సారి పత్తి విత్తులు నాటుతుండడంతో పెట్టుబడి భారం పెరిగిపోతుంది. జిల్లాలో సాగు వివరాలు (ఎకరాల్లో) పత్తి : 57,807వరి : 42,342కందులు : 605పెసర : 278ధైంచ : 10,127మొక్కజొన్న : 4,007మొత్తం సాగు : 1,15,166వర్షపాతం వివరాలు(మిల్లీ మీటర్లు) నెల కురియాల్సింది కురిసింది శాతం జూన్ 124.2 56.8 మైనస్ 54 శాతం జూలై 8.4 39.0 ప్లస్ 36 శాతంపంటలకు ప్రాణం పోసింది.. వేల రూపాయలు ఖర్చు చేసి వరి, పత్తి పంట సాగు చేసిన. దుక్కుల నుంచి మొదలుకుని విత్తనాల కొనుగోలు, నారు మళ్లు, కూలీల ఖర్చు వేలల్లో ఉంది. పత్తి విత్తనాలు నాటి, నాట్లకు సిద్ధం చేసుకుందామంటే చినుకు జాడ లేదు. దీంతో ఆందోళన చెందాం. ప్రస్తుత వర్షం పంటలకు ప్రాణం పోసింది. – చెవుల రాజు, రైతు, నర్మెట -
ఈసారి ముందస్తుగానే.. మహాజాతర
ఎస్ఎస్తాడ్వాయి: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. 2026 జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతర జరగనుంది. ప్రతీ రెండేళ్లకోసారి సాగే మహాజాతర తేదీలను పూజారులు ఎక్కువగా ఫిబ్రవరి నెలలోనే ఖరారు చేస్తారు. ఈసారి అధిక అమావాస్య రావడంతో వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పూజారులు బుధవారం మహాజాతర తేదీలను ప్రకటించారు. 20 రోజుల ముందుగానే జాతర ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన మేడారం మహాజాతర ఈసారి 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. దీంతో 20 రోజుల ముందుగానే మహాజాతర జరగనుంది. పూజారులు పంచాంగం, కొత్త క్యాలెండర్ ప్రకారం మాఘశుద్ధ పౌర్ణమి, అమ్మవార్ల గడియలను బట్టి జాతర తేదీలను ఖరారు చేస్తారు. ప్రతీ రెండేళ్లకోసారి జాతర తేదీలను అమావాస్య రోజుల్లో పౌర్ణమికి ముందుగా నిర్ణయించడం ఆనవాయితీ. ఈసారి 2026 జనవరి 17 నుంచి అమావాస్య మాసం ప్రారంభం కావడం, జనవరి 31న పౌర్ణమి అవుతుండడంతో మాఘశుద్ధ పౌర్ణమికి ముందుగా జాతర తేదీలను నిర్ణయించారు. అంటే అధిక అమావాస్య రావడంతో ఈసారి జనవరిలోనే నిర్ణయించినట్లు పూజారులు వెల్లడించారు. 2018లో జనవరిలోనే జాతర.. గత మహాజాతరల తేదీలతో పోలిస్తే 2018లో జనవరి 31నుంచి ఫిబ్రవరి 3 వరకు జాతర తేదీలను నిర్ణయించారు. అలాగే 2010లో ఫిబ్రవరి 17నుంచి 20 వరకు, 2012లో ఫిబ్రవరి 8 నుంచి 11వరకు, 2014లో ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు, 2016లో ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు, 2020లో ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు, 2022లో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు, 2024లో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మహాజాతర సాగింది. 2018లో మాత్రం జనవరి 31 నుంచి జాతర సాగగా.. ఈ దఫా 2026 జనవరి నెలాఖరులోనే జాతర సాగనుంది. జాతర ఇలా..జనవరి 28వ తేదీ: సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి రాక 29వ తేదీ : సమ్మక్క గద్దైపెకి 30వ తేదీ: భక్తుల మొక్కుల చెల్లింపు 31వ తేదీ: దేవతల వనప్రవేశం అధిక అమావాస్య రాకతో జనవరిలో నిర్వహణ మేడారం జాతర తేదీలను ప్రకటించిన పూజారులు 2026 జనవరి 28 నుంచి 31 వరకు.. కొనసాగుతున్న శాశ్వత అభివృద్ధి పనులుఅధికార యంత్రాంగం సమాయత్తం మేడారం మహాజాతర తేదీలను పూజారులు ప్రకటించడంతో జిల్లా అధికార యంత్రాంగం జాతర అభివృద్ధి పనులపై సమాయత్తం కానుంది. ఈసారి ముందస్తుగానే శాశ్వత అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే సంకల్పంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి సీతక్క చొరవతో ఇప్పటికే మేడారంలో శాశ్వత నిర్మాణం పనులు కొ నసాగుతున్నాయి. ఇకనుంచి జిల్లా యంత్రాంగం జాతర అభివృద్ధి పనులపై ప్రణాళికలతో ముందుకెళ్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పూజారుల సంఘం అ ధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు కోరారు. -
మారని తీరు!
స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ అయినా కంపు కొడుతున్న వార్డులు ● అధ్వానంగా రోడ్లు, డ్రెయినేజీలు ● ఎక్కడి చెత్త అక్కడే.. ● పారిశుద్ధ్య లోపంతో ప్రజల పాట్లు స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ వివరాలు విస్తీర్ణం 48.24 చ.కి.మీ. వార్డులు 18 జనాభా 30,527 ఓటర్లు 18,358 పురుషులు 8,842 సీ్త్రలు 9516 గృహాలు 7,408అసంపూర్తిగా డ్రెయినేజీ నిర్మాణం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మోడల్ కాలనీకి వెళ్లే రోడ్డులో ఉన్న డ్రెయినేజీ అసంపూర్తిగా నిర్మాణం చేయడంతో మురుగునీరు జనవాసాల్లో నిలుస్తుంది. డ్రెయినేజీ సమస్యను పట్టించుకునే వారు లేక కాలనీవాసులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు.గుంతల రోడ్డుతో అవస్థలు స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి అంబేడ్కర్ సెంటర్ రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. శివునిపల్లి నుంచి జఫర్గఢ్, ఐనవోలుకు వెళ్లేందుకు ఈ దారిపైనే ప్రయాణించాల్సి ఉంది. గుంతలమయమైన రోడ్డుపై అవస్థలు పడుతున్నారు. -
ఆర్అండ్బీ ఈఈగా బాధ్యతల స్వీకరణ
జనగామ: జనగామ జిల్లా రోడ్లు, భవనాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)గా స్వరూపారాణి మంగళవారం పదవీబాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఈఈ కలెక్టర్ రిజ్వాన్బాషాను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.పశు సంరక్షణపై అవగాహన కల్పించాలిజనగామ రూరల్: విద్యార్థులకు ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయ పశు సంరక్షణ, పోషణపై అవగాహన కల్పించాలని గో సేవా విభాగం తెలంగాణ ప్రశిక్షణ ప్రముఖ్ డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో హిందూ సంస్థల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ మాసంలో పర్యావరణ పరిరక్షణ అవగాహన పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి మోహనకృష్ణ భార్గవ, సహా కార్యదర్శి చిలువేరు హర్షవర్ధన్, మాధవరెడ్డి, ముక్క స్వామి, చిక్కుడు నగేష్, సత్యం, అంచూరి రమేష్, కృష్ణమూర్తి, రాంబాబు, భజరంగ్ దళ్ నగర కన్వీనర్ యామంకి రాఖేష్ తదితరులు పాల్గొన్నారు.పెన్షనర్ల మనోభావాలను దెబ్బతీసిన ప్రభుత్వంచిల్పూరు: ప్రభుత్వం పెన్షనర్లపై మొండి వైఖరిని కొనసాగిస్తూ వారి మనోభావాలను దెబ్బతీశారని పెన్షనర్ల సాధన పోరాట సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఇనుగాల ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. మండలకేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెన్షనర్లకు 15 నెలలుగా రావాల్సిన బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కొందరు సంఘం నాయకులు ఒక తప్పుడు సమాచారాన్ని సీఎంకు చేరవేయడంతోనే ఇలాంటి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇప్పటికై న ప్రభుత్వం మంచి మనసుతో ఆలోచించి పెన్షనర్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు.గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానంజనగామ రూరల్: పెంబర్తి మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో ఖాళీగా ఉన్న కంప్యూటర్ సైన్స్ పోస్టుకు సంబంధిత పీజీ సబ్జెక్టులో 55శాతం ఉత్తీర్ణత, బోధనలో అనుభవం, యూజీసీ నెట్, సెట్, పీహెచ్డీ అర్హత గల అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటు ందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 4వ తేదీలోపు కళాశాలలో నేరుగా దరఖాస్తు సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు 70133 10928 నంబర్లో సంప్రదించాలన్నారు.మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలిలింగాలఘణపురం: జీవితాలను నాశనం చేసే మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. మానసిక, శారీరక ఆరోగ్యాలపై ఏ విధంగా ప్రభావం చూపుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో కోర్టు సూపరింటెండెంట్ సీతారామరాజు, ప్రిన్సిపాల్ సునీత, పారా లీగల్ వలంటీర్లు రవీందర్, జితేందర్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో 26.3 మిల్లీమీటర్ల వర్షం
జనగామ: జిల్లాలో గత నెల 31వ తేదీ నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షం పత్తి, వరి పంటలకు ఊపిరిపోసింది. మృగశిర కార్తె ప్రారంభమైన తర్వాత చినుకు జాడ లేకపోవడంతో పత్తి విత్తులు నేలలోనే మురికి పోగా, నారు, నాట్లు వేసిన మళ్లు పగుళ్లు పట్టే పరిస్థితికి చేరుకున్నాయి. దీంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురైయింది. ఈ పరిస్థితుల్లో వరణుడి కరుణతో కొంత మేలు జరిగింది. జిల్లాలో మంగళవారం నాటికి 26.3 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వర్షంతో జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకోగా, రైతులు విత్తనాల కొనుగోలుకు జనగామ బాట పట్టారు.మండలాల వారీగా వర్షపాతం వివరాలు (మిల్లీ మీటర్లలో)మండలం వర్షపాతం బచ్చన్నపేట 48.0 జనగామ 45.5 లింగాలఘణపురం 42.5 దేవరుప్పుల 42.3 కొడకండ్ల 35.0 పాలకుర్తి 25.5 తరిగొప్పుల 23.3 నర్మెట 23.3 జఫర్గఢ్ 21.3 స్టేషన్ఘన్పూర్ 19.5 రఘునాథపల్లి 14.3 చిల్పూరు 10.3 -
సమాజ హితమే వైద్యుల ధ్యేయం
జనగామ: సమాజ హితమే ధ్యేయంగా వైద్యులు పని చేస్తున్నారని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్ హాల్లో మంగళవారం డాక్టర్స్ డేను పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జనగామ బ్రాంచ్ ఆధ్వర్యంలో డాక్టర్ బాలాజీ అధ్యక్షతన నిర్వహించిన రక్తదాన శిబిరంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు రక్తదానం మరొకరికి ప్రాణం పోస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో ఐఎంఏ సహకారం అందించాలన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్రావు మాట్లాడుతూ ఐఎంఏ ఆధ్వర్యంలో జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం అ భినందనీయమన్నారు. సీనియర్ డాక్టర్ డి.లవకుమార్రెడ్డి, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి.కరుణాకర్రాజు, వైద్యులు అన్వర్, ఏ.శ్రీనివాస్, కన్న పరశురాములు, కల్నల్ మాచర్ల భిక్షపతి, కృష్ణ జీవన్ బజాజ్, కెమిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధి దేవరాజ్, డాక్టర్ సీహెచ్.రాజమౌళి, కృష్ణ, వెంకటేశ్వర్లు, కనకరాజు, తదితతరులు పాల్గొన్నారు. పక్కాగా పారిశుద్ధ్య నిర్వహణ జనగామ రూరల్/లింగాలఘణపురం: జిల్లాలోని అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సమర్థవంతంగా జరుగుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యక్రమం కింద మంగళవారం తమిళనాడు నుంచి సర్పంచ్లు, బ్లాక్ ప్రెసిడెంట్, అధికారులు జిల్లాకు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామంలో డీపీ ఓ స్వరూప ఆధ్వర్యంలో తడి పొడి చెత్త, పారిశుద్ధ్య నిర్వహణ, నర్సరీలో మొక్కల పెంపకం గురించి వివరించారు. అనంతరం జెడ్పీ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతీ గ్రామ పంచాయతీలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ, తడి పొడిచెత్త నిర్వహణ ద్వారా వస్తున్న ఆదాయం, నర్సరీలో మొక్కల పెంపకం, భూగర్భ జలాల పెంచేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం, పంటల సాగు, శానిటేషన్ నిర్వహణతో సీజనల్ వ్యాధులను అరికడుతున్న తీరును సర్పంచ్ బృందానికి వివరించారు. డాక్టర్స్డేలో కలెక్టర్ రిజ్వాన్ బాషా -
చెత్త కంపు
బుధవారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2025– 8లోuఇది రోడ్డేనా...? గిర్నిగడ్డ ప్రాంతంలో రోడ్లన్నీ చెత్తతో అపరిశుభ్రంగా మారిపోయాయి. రోజు వారి చెత్త సేకరణలో జాప్యం జరుగుతుండడంతో రహదారిపై చెత్త పేరుకుపోతుంది.నాలా పక్కనే చెత్త నిల్వ హనుమకొండ రోడ్డు దేవీ థియేటర్ సమీపంలోని ఓ నాలా పక్కనే చెత్తను నిల్వ చేస్తున్నారు. మురికి నీటిలో చెత్తను తొలగించి, వెంటనే తీసుకు వెళ్లక పోవడంతో తిరిగి అందులోనే పడిపోయే అవకాశం లేకపోలేదు. దేవీ థియేటర్ నాలా వద్ద పేరుకుపోయిన చెత్త గిర్నిగడ్డ గోదాం వద్ద చెత్తమయం వైద్య కళాశాల రూట్లో..న్యూస్రీల్ -
ఆ.. జలపాతాల సందర్శన నిషేధం
వాజేడు: గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో దండకారణ్యంలోని పలు జలపాతాల సందర్శనకు అటవీశాఖ, పోలీసుల ఆధ్వర్యంలో బ్రేకులు వేశారు. ములుగు జిల్లాలో ప్రాచుర్యం పొందని జలపాతాల సందర్శనకు పర్యాటకులు రావద్దని కోరుతూ నిషేధం విధించారు. దీంతో గుట్టల సమీపంలో ఉన్న జలపాతాలను సందర్శించడం ఇక కష్టం కానుంది. నిషేధించిన జలపాతాలు ఇవే.. వాజేడు, వెంకటాపురం(కె) మండలాలను ఆనుకుని దండకారణ్యం, కర్రె గుట్టలు ఉన్నాయి. ఈ గుట్టలపైనుంచి జాలువారుతూ వాజేడు మండలంలో మరికొన్ని జలపాతాలు ఉన్నాయి. కొంగాల సమీపంలో దుసపాటిలొద్ది, కృష్ణాపురం సమీపంలో భామనసిరి, దూలాపురం సమీపంలోని మాసన్లొద్ది, అరుణాచలపురం సమీపంలో గుండం, వెంకటాపురం(కె)లో ముత్యంధార జలపాతాలు ఉన్నాయి. ఇవి ఇంకా ప్రాచుర్యం పొందలేదు. కానీ, బొగత జలపాతం సందర్శన వచ్చే పర్యాటకులు ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ జలపాతాలను తిలకించడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. నిషేధం ఉందని తెలిసినా వెళ్తున్నారు. రక్షణ లేకపోవడంతోనే.. దుసపాటి లొద్ది, మాసన్ లొద్ది, గుండం, ముత్యం ధార, భామన సిరి జలపాతాలు నట్టడవిలో ఉన్నాయి. ఇక్కడికి చేరుకోవాలంటే చాలాదూరం అడవిలో కాలినడకన వెళ్లాలి. సెల్ఫోన్ సిగ్నల్స్ ఉండవు. ఇవి ఇంకా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందలేదు. దీంతో ఇక్కడికి అష్టకష్టాలు పడి వెళ్లిన పర్యాటకులు ప్రమాదాలకు గురైన సందర్భంలో సమాచారం బయటికి తెలిసే అవకాశం ఉండడంలేదు. దీంతో స్థానిక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఈ జలపాతాల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు, సౌకర్యాలు లేవు. దీంతో అటవీశాఖ సిబ్బంది వీటిని నిషేధించడంతోపాటు ఇక్కడికి పర్యాటకులు వెళ్లొద్దని అటువైపు వెళ్లే దారులను బారికేడ్లు పెట్టి మూసివేశారు. ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దొంగ దారిలో వెళ్లకుండా సిబ్బందిని కాపలాగా ఉంచారు.తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన బొగత జలపాతానికి ఎలాంటి ఇబ్బందులూ లేవని, పర్యాటకులు తరలి రావాలని అధికారులు కోరుతున్నారు. అన్ని సౌకర్యాలున్న ఈ జలపాతాన్ని పర్యాటకులు వీక్షించాలని ఆహ్వానిస్తున్నారు. ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ కూడా బొగత జలపాతాన్ని వీక్షించాలని పిలుపునిచ్చారు. ఇక్కడికి రోజురోజుకూ పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నప్పటికి మండలంలో సరైన వర్షం లేకపోవడంతో పూర్తిస్థాయిలో జాలువారడం లేదు.నిషేధిత జలపాతాలకు వెళ్లొద్దు దట్టమైన అటవీప్రాంతంలోని ప్రమాదకర జలపాతాల సందర్శనకు అనుమతులు లేవు. అనవసరంగా పర్యాటకులు వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు. ప్రమాదం జరిగితే రక్షించడానికి ఆ సమయంలో ఎవరూ అందుబాటులో ఉండరు. ఈ విషయాన్ని పర్యాటకులు గుర్తుంచుకుని మాకు సహకరించాలి. – ద్వాలియా, ఎఫ్డీఓ, వెంకటాపురం(కె))●బొగతకు రావాలంటూ పిలుపు అటవీ, పోలీస్ అధికారుల నిర్ణయం రక్షణ లేకపోవడం.. గత ప్రమాదాలే ప్రధాన కారణం దారులు మూసి.. కాపలాగా ఉన్న సిబ్బంది బొగత జలపాతానికి రావాలంటూ పిలుపు -
విద్యార్థుల భాగస్వామ్యం అవసరం
● రీజినల్ జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి జనగామ రూరల్: బోధనలో విద్యార్థుల భాగస్వామ్యంతోనే ఆశించిన అభ్యసన సామర్థ్యాలు సాధిస్తామని పాఠశాల విద్యా రీజినల్ జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం చౌడారంలో కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాన్ని డీఈఓ భోజన్నతో కలిసి ఆమె ఆకస్మికంగా సందర్శించారు. బోధన తీరును పరిశీలించి విద్యార్థుల పఠనా సామర్థ్యాన్ని పరీక్షించారు. బోధనలో కృత్యాలను వినియోగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎస్ఓ రాణి పాల్గొన్నారు. -
రోడ్డు ఎత్తుపల్లాలుగా ఉంది..
తమ ఇంటి దారిలో మట్టిరోడ్డు ఎత్తు పల్లాలుగా ఉంది. వర్షం కురిస్తే నీరంతా ఒకేచోట చేరి రోడ్డును ముంచేస్తున్నది. ఇంటి కి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుంది. సీసీ రోడ్డు నిర్మాణం చేస్తే బాగుంటుంది. – కిరణ్, శ్రీవిల్లాస్ కాలనీ శివారు కాలనీల అభివృద్ధిపై దృష్టి పెట్టండి..వికాస్నగర్, దుర్గమ్మ కాలనీ లోని అనేక ప్రాంతాల్లో నేటికీ సీసీ రోడ్ల నిర్మాణం లేదు. కనీసం డ్రెయినేజీల పనులు కూడా చేపట్టలేదు. పురపాలిక అధికారులకు ఈ కాలనీలు అంటే పట్టింపు లేదు. వీధి దీపాలు కూడా వెలగడం లేదు. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మట్టిరోడ్లతో ఇబ్బంది తప్పేలా లేదు. – తొట్టె క్రిష్ణ, దుర్గమ్మకాలనీ జ్యోతినగర్ కాలనీని పట్టించుకోండిజ్యోతినగర్ ప్రధాన రోడ్డుపై సీసీ వేయాలని ఏళ్ల తరబడి విన్నవించుకుంటున్నాం. వర్షాకాలంలో రోడ్డు ఎంట్రెన్స్లో బురదమయమై మట్టి బంకలా మారడంతో జనం జారి పడుతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే సీసీ రోడ్డు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది. – వలబోజు సత్యనారాయణ, జ్యోతినగర్ -
డ్రెయినేజీల క్లీనింగ్ షురూ..
జనగామ: పట్టణంలోని డ్రెయినేజీల్లో నిండిన సిల్ట్, చెత్త, చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు ప్రక్రియను మున్సిపల్ అధికా రులు సోమవారం ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో అస్తవ్యస్తంగా తయారైన పారిశుద్ధ్య పనులపై ‘కంపు కంపు’ శీర్షికన ఈనెల 30న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పురపాలిక అధికారులు స్పందించారు. కమిషనర్ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు అధికారి పులి శేఖర్ ఆధ్వర్యాన సాయినగర్, జ్యోతినగర్, 11, 22వ వార్డుల పరిధి హైదరాబాద్రోడ్డు ఏరియా, ఇతర ప్రాంతాల్లో డ్రెయినేజీలను శుభ్రం చేశారు. శానిటేషన్ కార్మికులు, జేసీబీలతో నాలాలు, డ్రెయిన్లలో నిండిన మట్టి, చెత్తను తీసి డంపింగ్ యార్డుకు తరలించారు. డ్రెయినేజీల శుభ్రంతో కొంత మేరకు ఇబ్బందులు తప్పనున్నాయని, ఈ క్లీనింగ్ ప్రక్రియ నిరంతరం చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంలో సమస్యను అధికా రుల దృష్టికి తీసుకెళ్లడానికి కృషి చేసిన ‘సాక్షి’కి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. -
మట్టిరోడ్లు.. మస్తు తిప్పలు
జనగామ: జనగామ పట్టణ సమగ్రాభివృద్ధి కోసం ఏటా బడ్జెట్ పేరిట అంకెల గారెడీ తప్ప.. ఆచరణలో చూపించడం లేదు. రోజురోజుకూ విస్తరిస్తు న్న పురపాలిక అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. విస్తరణకు తగినట్టుగా ప్రణాళిక రూపొందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. బాలాజీనగర్, ప్రెస్టన్ ఏరియా, బాణాపురం, జ్యోతినగర్, శ్రీ విల్లాస్ కాలనీ, 60 ఫీట్లరోడ్డు, వికాస్నగర్, దుర్గమ్మకాలనీ తదితర ప్రాంతాలు నేటికీ సీసీరోడ్డు నిర్మాణానికి నోచు కోవడం లేదు. చిన్న పాటి వర్షానికే మట్టిరోడ్లు చిత్తడిగా మారి కాలినడక కూడా సాధ్యంకాని పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాలనీ ఏర్పడి ఏళ్లు గడిచి పోతున్నా మట్టి రోడ్లపైనే రాకపోకలు సాగిస్తున్నారు. సుమారు 20 కిలోమీటర్ల మేర సీసీరోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉండగా.. రూ.75కోట్ల మేర బడ్జెట్ అవసరం. సోమవారం పట్టణంలోని పలు కాలనీలను ‘సాక్షి’ సందర్శించిగా మట్టిరోడ్లతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు వెలుగుచూశాయి. ఫై ఫొటోలో కనిపిస్తున్న వీధి ప్రెస్టన్ స్కూల్ శ్రీసాయి రెసిడెన్షి సమీప కాలనీలోనిది. ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ఏళ్లు గడుస్తున్నా సీసీ రోడ్డుకు మోక్షం కలగడం లేదు. చిన్నపాటి వర్షానికే వీధి గుంతల మయంగా మారిపోతుంది. వరద నీరంతా ఇళ్ల ముందే నిలిచి అడుగు ముందుకు వేయలేని పరిస్థితి నెలకొని కాలనీ వాసులు కష్టాలు పడుతున్నారు. పట్టణంలోని అనేక కాలనీల్లో పరిస్థితి ఇలానే ఉంది. ప్రధాన రోడ్డును పట్టించుకోండిబాలాజీనగర్ మూడు వార్డులకు అనుసంధానంగా ఉంటుంది. ఇక్కడ సుమారు 14వేల జనాభాకు పైగా ఉంటారు. కెనరా బ్యాంకు లైన్లో వందలాది ఇళ్లతో అటాచ్ ఉన్న ఈ కాలనీకి సీసీరోడ్డు లేకపోవడం.. మట్టిరోడ్డుతో అష్టకష్టాలు పడుతున్నారు. ప్రధాన రహదారులు సైతం సీసీకి నోచుకోవడం లేదు. రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు, బురద, ఉబికి వస్తున్న డ్రెయినేజీ నీటితో కాలనీ అపరి శుభ్రంగా మారిపోతున్నది. ఏళ్ల తరబడి నోచుకోని సీసీరోడ్లు కాలనీలకు వెళ్లాలంటే నరకమే పట్టణ దారులన్నీ గుంతల మయం -
అదనపు కలెక్టర్కు సత్కారం
జనగామ: రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్గా పదోన్నతి పొందిన రోహిత్సింగ్ను జనగామ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి గాదె శ్రీనివాస్, కోశాధికారి మర్యాల లక్ష్మణ్ సోమవారం శాలువాతో సత్కరించారు. అనంతరం ఏసీకి శుభాకాంక్షలు తెలిపారు.సీసీ కెమెరాల అందజేతజనగామ: జనగామ పట్టణంలో మరింత నిఘా పెంచేందుకు ది చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రూ.3.20 లక్షల విలువ చేసే సీసీ కెమెరాలతో పాటు మెటీరియల్ అందజేశారు. ఈ మేరకు సోమవారం చాంబర్ అధ్యక్షుడు పోకల లింగయ్య, కార్యవర్గ సభ్యులు.. సీసీ కెమెరాల ను ఏఎస్పీ చేతన్ నితిన్, సీఐ దామోదర్ రెడ్డికి అప్పగించారు.అప్రమత్తంగా ఉండాలిజనగామ రూరల్: డ్రగ్స్ విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ ఆధ్వర్యాన సోమవారం పెంబర్తి ఉన్నత పాఠశాలలో ‘డీఏడబ్ల్యూఎన్, డ్రగ్ అవేర్నెస్ అండ్ వెల్నెస్ నావిగేషన్ ఫర్ ఏ డ్రగ్– ఫ్రీ ఇండియా స్కీం–2025’పై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా డ్రగ్స్తో కలిగే అనర్థాలను వివరించారు. కార్యక్రమంలో హెచ్ఎం డాక్టర్ జి.నాగరాణి శేఖర్, జితేంద్ర పాల్గొన్నారు.దరఖాస్తు చేసుకోవాలిజనగామ రూరల్: జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ అవార్డుకు ఈనెల 13వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ భోజన్న ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి మార్గదర్శకాలు, ఇతర వివరాలు పోర్టల్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.పనుల్లో వేగం పెంచండిజనగామ: పట్టణ సుందరీకరణ పనుల్లో మరింత వేగం పెంచాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ పింకేష్కుమార్, ఏఈ మహిపాల్తో కలిసి ఆర్టీసీ బస్టాండు చౌరస్తా, హనుమకొండ రోడ్డులో ఏర్పాటు చేయనున్న సూర్య నమస్కారం స్టాచ్యూ పనులపై ఆరా తీశారు.హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంరఘునాథపల్లి: సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంఘటిత సమాజ నిర్మాణమే విశ్వహిందూ పరిషత్ లక్ష్యమని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహనకృష్ణ అన్నారు. సోమవారం వీహెచ్పీ జిల్లా సహాయ కార్యదర్శి చిలువేరు హర్షవర్ధన్, పట్టణ ఉపాధ్యక్షులు తాడూరి సంతోష్రాజ్, కాసర్ల మహేందర్లతో కలిసి మండలకేంద్రంలోని ఆధ్యాత్మిక, ధార్మిక ప్రముఖులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో పడకంటి రవీందర్, ఎల్.కిషన్రావు, చింతకింది కృష్ణమూర్తి, సత్యనారాయణ, వల్లాల శివ, జంపయ్య, పోకల హరిప్రసాద్, అంబటి బాలరాజు, ఉప్పలయ్య, రోహిత్, ఉప్పలయ్య, మహేందర్ పాల్గొన్నారు. -
తిరుగుడే.. సమస్యలు తీరేదెప్పుడు..?
జనగామ రూరల్: సమస్యలపై అధికారులకు అర్జీలు అందజేసి తిరుగుడే తప్ప వాటికి పరిష్కా రం లభించడంలేదని ప్రజలు వాపోయారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు వివిధ సమస్యలపై ప్రజలు 59 వినతులు అందజేశారు. వాటిని కలెక్టర్ రిజ్వాన్ బాషాతోపాటు అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్ స్వీకరించారు. వినతులను సంబంధిత శాఖల అధికారులకు అందజేసిన కలెక్టర్.. త్వరితగతిన సమస్యలను క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, డీఆర్డీఓ తదితరులు పాల్గొన్నారు. పక్క ఫొటోలోని డి.సుశీల, కొమురయ్య వృద్ధ దంపతులది రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామం. సుశీల పేరు మీద 303బైఏ సర్వే నంబర్లో 3 ఎకరాల 14 గుంటల భూమి ఉంది. వారికి నలుగురు ఆడపిల్లలు. ఎకరం భూమి తన పేర పట్టా చేయాలని పెద్ద కూతురు అడగ్గా సరేనన్నారు. ఆమె నమ్మించి ఉన్న భూమి మొత్తం అక్రమంగా పట్టా చేసుకుంది. ‘తమ బతుకు దెరువుకు ఆధారం లేదు.. న్యాయం చేయాలని’ వృద్ధ దంపతులు కలెక్టర్ను వేడుకున్నారు. గ్రీవెన్స్లో అర్జీదారుల ఆవేదన వివిధ సమస్యలపై 59 వినతులు స్వీకరించిన కలెక్టర్, అదనపు కలెక్టర్లు -
లయన్స్క్లబ్ సేవలు విస్తృతం చేయాలి
స్టేషన్ఘన్పూర్: లయన్స్ క్లబ్ సేవలు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతం చేయాలని క్లబ్ జిల్లా గవర్నర్ కె.వెంకట్రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక లయన్ భవన్లో స్టేషన్ఘన్పూర్ లయన్స్క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. క్లబ్ నూతన అధ్యక్షుడిగా కోతి వేణు, కార్యదర్శిగా దుస్స నరేష్, కోశాధికారిగా కోతి అశోక్తో పాటు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం క్లబ్ పూర్వ అధ్యక్షుడు అంబటి కిషన్రాజ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా గవర్నర్ మాట్లాడారు. స్టేషన్ఘన్పూర్ లయన్స్క్లబ్ 32 సంవత్సరాలు విశేష సేవలు అందిస్తుందని, అదే స్తూర్తితో నూతన క్లబ్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్క్లబ్ బాధ్యులు చంద్రశేఖర్ఆర్య, కేసీ జాన్బన్నీ, కన్నా పరశురాములు, రాజిరెడ్డి, అంబటి కిషన్రాజ్, జొన్నల రాజేశ్వరరావు, హరికిషన్రెడ్డి, కరుణాకర్రెడ్డి, వీటీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీల్లో నూతన మెనూ..
జనగామ రూరల్: కేజీబీవీల బలోపేతానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. విద్యార్థినులు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నట్లు ఇటీవల చేపట్టిన సర్వేలో తేలింది. దీంతో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో చదువుతున్న బాలికలకు పౌష్టికాహారం అందించి వారిని అనారోగ్య సమస్యల నుంచి దూరం చేయడానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గతంలో ఉన్న మెనూలో పలు మార్పులు చేసింది. ఈ విద్యాసంవత్సరంలో నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించనున్నారు. పెరిగిన మెస్ చార్జీలు గతంలో 6–10, ఇంటర్ విద్యార్థులకు ఒకేవిధంగా నెలకు రూ.1,225 ప్రభుత్వం అందించేది. కానీ నూతన మెనూ ప్రకారం 6 నుంచి 7వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1,330, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1,540, ఇంటర్ విద్యార్థులకు నెలకు రూ.2,100 అందించనున్నారు. 12 కేజీబీవీల్లో అమలు జిల్లా వ్యాప్తంగా 12 మండలాల్లో కేజీబీవీలు ఉండగా వాటిలో గతంలో 8 పాఠశాలలో ఇంటర్ విద్యను అందిస్తున్నారు. గతంలో మెనూ చార్జీలు సరిపోక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడే వారు. అన్ని సంక్షేమ హాస్టల్స్, గురుకులాలకు మెస్ చార్జీలు పెంచగా ఈ ఏడాది ప్రభుత్వం కేజీబీవీలకు పెంచడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 12 కేజీబీవీలు ఉండగా వాటిలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 2,363 విద్యార్థులు అభ్యసిస్తున్నారు. పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ గతంలో కంటే ఏడాది పదవ తరగతి 99 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే ఇంటర్ కూడా మంచి ఫలితాలు రావడంతో విద్యార్థులకు పోటీ పరీక్షల్లో కూడా ఈ ఏడాది శిక్షణ ఇవ్వనున్నారు. నూతన మెనూ ఇదే ఉదయం: టమాట కిచిడీ, సాంబారు, బూస్ట్, పూరి, రాగి జావ, ఉప్మా, పులిహోర, వడ, బోండా, చపాతి, జీరా రైస్తో పాటు రోజుకు ఒక్కో రకమైన పండ్లు అందించాలి. ఇందులో అరటి, జామ, వాటర్ మిలన్, బొప్పాయి, సపోట వంటి పండ్లు అందించాలి. మధ్యాహ్నం: టమాట పప్పుతో కూడిన అన్నం, నెయ్యి, రసం, పెరుగు, ఉడక బెట్టిన గుడ్డు, చికెన్ అందించాలి. సాయంత్రం: ఉడకబెట్టిన శనగలు, కోడిగుడ్డు బజ్జీ, బెల్లం పల్లీలు, అల్లం చాయ్, మిల్లెట్ బిస్కెట్లు, పకోడి ఇవ్వాలి. రాత్రి వేళ: వివిధ రకాల కూరలతో తయారు చేసిన అన్నం, సాంబారు, మజ్జిగ అందించాలి. నెలలో రెండు సార్లు మటన్, అయిదుసార్లు గుడ్లు, ప్రతీరోజు నెయ్యి అందించాలి.నూతన మెనూ ప్రకారమే.. ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి నూతన మెనూ అమలు చేయాలని కేజీబీవీల ఎస్ఓలకు సూచించాం. కొత్త మెనూ పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. నూతన మెనూ చార్టులు ఏర్పాటు చేయాలని సూచించాం. – గౌసియా బేగం, బాలిక విద్యాధికారి ● పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు పెరిగిన మెస్చార్జీలు జిల్లావ్యాప్తంగా 12 విద్యాలయాల్లో 2,368 మంది విద్యార్థినులు -
బ్యాంకు డిపాజిట్లు రూ.219.20 కోట్లు
రామన్నపేట : వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరంలో 14.24 శాతం వృద్ధితో డిపాజిట్లు రూ.219.20 కోట్లకు చేరాయని బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు వెల్లడించారు. నగరంలోని దేశాయిపేట రోడ్డులోని కేఆర్ గార్డెన్స్లో ఆదివారం బ్యాంక్ 29వ మహాజన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదీప్రావు మా ట్లాడుతూ రుణాల మంజారులో 13.20 శాతం వృద్ధితో రూ154.13 కోట్లు కలిపి మొత్తం వ్యాపారం రూ.373.43 కోట్లకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల లాభం రూ.3.03 కోట్లు కాగా అందులో రూ.60.90 లక్షల ఆదాయపు పన్ను చెల్లించగా నికరలాభం రూ.2.22 కోట్లు అర్జించినట్లు వెల్లడించారు. డిపాజిట్ దారులకు రిజర్వ్ బ్యాంకు నిబంధనల మేరకు డీఐసీజీసీ ద్వారా రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గోపాల్పూర్, మహబూబాబాద్, జనగాం, వడ్డేపల్లి నూతన శాఖలను ప్రారంభించనట్లు తెలిపారు. సమావేశంలో బ్యాంకు వైస్ చైర్మన్ తోట జగన్నాథం, డైరెక్టర్లు వేణుగోపాల్ ముందడ, కూరపాటి చంద్రమౌళి, తోట సంపత్కుమార్, మహమ్మద్ గౌసొద్దీన్, ఒడితర పవన్కుమార్, బొమ్మినేని పాపిరెడ్డి, పొన్న హరినాథ్, పోలేపాక రవికుమార్, బండారి భార్గవి, మంద స్వప్న, నామినేట్ డైరెక్టర్లు అప్పరాజు రాజేంద్రకుమార్, పుల్లూరి సుధాకర్, బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ఎం.సత్యనారాయణరావు , వరంగల్, హనుమకొండ డీసీఓలు కోదండ రాములు, సంజీవరెడ్డి, ఏఆర్ అన్నమనేని జగన్మోహన్రావు, సేల్స్ ఆఫీసర్ కె.రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ప్రదీప్కుమార్ -
నేడు పాలకుర్తికి మంత్రి పొంగులేటి
పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలో 50 పడకల సామాజిక ఆరోగ్యకేంద్రం భవన నిర్మాణానికి నేడు (సోమవారం) రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి శంకుస్థాపన చేస్తారని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలకేంద్రంలోని రూ.17.50 కోట్ల వ్యయంతో ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు.కేంద్ర బృందం పర్యటనకొడకండ్ల: మండలంలోని ఏడునూతుల గ్రామంలో కేంద్ర స్వచ్ఛ సర్వేక్ష గ్రామీణ్ మిషన్ బృందం ఆదివారం పర్యటించింది. ఎస్ఎస్జీ రాష్ట్ర పరిశీలకులు అశోక్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జ్ శ్రీకృష్ణలు గ్రామంలోని అంగన్వాడీ భవనం, మరుగుదొడ్లు, ఉన్నత పాఠశాలలోని మరుగుదొడ్లను పరిశీలించారు. బలహీన వర్గాల, గిరిజన, దళిత నివాసాలను సందర్శించి మరుగుదొడ్ల వినియోగాన్ని పరిశీలించారు. తడిపొడి చెత్త షెడ్లు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, స్వచ్ఛత, పరిశుభ్రతలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ కర్ణాకర్, ఎంపీడీఓ నాగశేషాద్రిసూరి, ఎపీఓ కుమారస్వామి, ఎంపీఓ ఇందిర, టీఎ యాకయ్య, ఎఫ్ఏ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో వృత్తి విద్యాకోర్సులుజనగామ రూరల్: విద్యార్థులకు కేవలం సాధారణ విద్యతో పాటు వృత్తి విద్య కోర్సులు ప్రవేశ పెట్టినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో 9, 10, ఇంటర్ విద్యార్థులకు ఈ వృత్తి విద్యా కో ర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందులో శిక్షణ పొందిన వారు ఐటీ, బ్యూటీ వెల్నెస్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. జిల్లాలో 15 పాఠశాలలు ఎంపికయ్యాయన్నారు. మల్కాపూర్, స్టేషన్ ఘన్పూర్, ధర్మకంచ జెడ్పీహెచ్ఎస్లో మైక్రో ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్, డాటా ఎంట్రీ ఆపరేటర్, కేజీబీవీ చౌడారంలో బ్యూటీ థెరఫిస్టు, పాలకుర్తి జెడ్పీహెచ్ఎస్లో బ్యూటీ థెరఫిస్టు, ప్లంబింగ్, తరిగొప్పుల జెడ్పీహెచ్ఎస్లో బ్యూటిథెరఫిస్టు, డాటా ఎంట్రీ ఆపరేటర్, జఫర్గఢ్ సో షల్ వెల్ఫేర్లో మిషన్ ఆపరేటర్, హోమ్ హెల్త్, కూనూర్ జెడ్పీఎస్ఎస్లో బ్యూటిథెరఫిస్టు, డా టా ఎంట్రీలో శిక్షణ ఇవ్వనున్నారు.మెడికల్ యజమానుల కమిటీ ఎన్నికజనగామ: ది జనగామ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం పట్టణంలో సంఘ ఎన్నికల నేపధ్యంలో మూడు పోస్టులకు ఆసక్తి ఉన్న వారి నుంచి నామినేషన్లను కోరారు. పోటీ లేకపోవండతో కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. సంఘ అధ్యక్షుడిగా బడుగు అంజనేయులు, ప్ర ధాన కార్యదర్శిగా బుక్కబాల భరద్వాజ్, కోశాధికారిగా కొలుపుల యాదగిరి ఎన్నికయ్యారు. ఎన్నికల కమిటీ సభ్యులు మేకపోతుల అంజనేయులు, లగిశెట్టి కృష్ణమూర్తి, పాము పాండరి తదితరులు పాల్గొన్నారు.తొమ్మిది కిలోల కణతి తొలగింపుజనగామ: జనగామ పట్టణం హైదరాబాద్రోడ్డులోని రవళి నర్సింగ్ హోమ్లో డాక్టర్ రాజమౌళి ఆదివారం అరుదైన శస్త్ర చికిత్స చేశారు. రఘునాథపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి గత కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చారు. స్కానింగ్ ద్వారా పెద్ద కణతి ఉన్నట్లు నిర్ధారించుకుని, శస్త్ర చికిత్స ద్వారా 9 కిలోల బరువు ఉన్న కణతిని తొలగించారు. క్రిటికల్ ఆపరేషన్ల సమయంలో పరేషన్ చేసి, యువతి ప్రాణాలను కాపాడడంతో పా టు రికార్డు సృష్టించిన డాక్టర్ రాజమౌళిని ప లువురు అభినందించారు. శస్త్ర చికత్సలో వైద్య సిబ్బంది అలిసేరి శ్రీనివాస్, మోర్తాల ప్రభాకర్, రమేశ్ తదితరులు ఉన్నారు. -
ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2025
ఐనవోలు: మండల కేంద్రానికి చెందిన వడిచర్ల శ్రీనివాస్–అనురాధ దంపతుల కుమారుడు కమల్హాసన్, కూతురు శివాని. శ్రీనివాస్ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సమాజ సేవంటే ఇష్టపడే శ్రీనివాస్ ఎంపీటీసీగా పని చేశారు. గతేడాది జనవరి 22న అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందాడు. కమల్ హాసన్ నాన్న నిర్ణయం మేరకు డిగ్రీ తర్వాత లండన్కు వెళ్లారు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన కోరిక మేరకు చెల్లి పెళ్లి జరిపించాడు. ఆపెళ్లిలో అతడి తండ్రి ఫైబర్ విగ్రహాన్ని తయారు చేయించి నాన్నతో తనకున్న ఎమోషన్ను అందరికి చూపించాడు. ఈసారి లండన్ నుంచి ఇండియాకు వచ్చినపుడు ఆ ఫైబర్ విగ్రహాన్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేయించనున్నట్లు కమలహాసన్ తెలిపారు.న్యూస్రీల్పెళ్లిలో విగ్రహం ఓ ఎమోషన్ -
ఎన్ఎంసీ నిబంధనలు పాటించాలి
జనగామ: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ ఆదేశించారు. రాష్ట్రంలోని సర్కారు మెడికల్ కళాశాలల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించి ఎన్ఎంసీ షోకాజ్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అలర్ట్ అయిన ప్రభుత్వం వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. మెడికల్ కళాశాల పరిధిలో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలతో పాటు మరింత మెరుగు పరిచేందుకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టింది. శనివారం కలెక్టర్ రిజ్వాన్ బాషా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్రావుతో కలిసి చంపక్హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి (ఎంసీహెచ్), మెడికల్ కళాశాలను సంగీత సత్యనారాయణ సందర్శించారు. ఓపీ రిజిస్ట్రేషన్, ఈ ఔషధలో ఎంట్రీ, సేవలపై ఆరా తీశారు. అనంతరం మెడికల్ కళాశాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఎంసీహెచ్, జిల్లా ఆస్పత్రి పరిధిలో మరో 72 పడకల సామర్థ్యం పెంచుకోవాలన్నారు. ప్రతి రోజు డాక్టర్ల ఫేషియల్ అటెండెన్స్ రెండు సార్లు తీసుకోవాలన్నారు. సీటీ స్కాన్ సేవలను అందుబాటులోకి తీసుకు రావాలని సూచించారు. థర్డ్ ఇయర్ బోధనకు తాత్కాలిక భవనం వైద్య కళాశాల మూడవ సంవత్సరం తరగతి బోధనకు ప్రస్తుతం ఉన్న రెండు లెక్చర్ గ్యాలరీల సమీపంలో తాత్కాలిక షెడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఎస్ట్మేషన్ వేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని టీఎస్ఎంఐడీసీ సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా ఎంబీబీఎస్లో చేరే విద్యార్థులకు హాస్టల్ వసతి సౌకర్యంలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. భవన నిర్మాణ పనుల్లో వేగం పెరగాలన్నారు. కాగా కళాశాల చుట్టూ పవర్గ్రిడ్ విద్యుత్ తీగలు ఉండటంతో ఇంటర్నెట్ సమస్య వేధిస్తోందని కమిషనర్కు వైద్యులు వివరించారు. సమీక్షలో నోడల్ ఆఫీసర్ డాక్టర్ మోహన్దాస్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లిఖార్జున్రావు, ఎంసీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ మధుసూదన్రెడ్డి, ప్రొఫెసర్, మెడిసిన్ డాక్టర్ శంకర్, వైద్యులు అన్వర్, అనురాధ, శంకర్, కమలహాసన్, టీఎస్ఎంఐడీసీ కేఎస్కే ప్రసాద్, ఆర్అండ్బీ ఏఈ శ్రీధర్రెడ్డి, రాజశేఖర్ తదితరులు ఉన్నారు. థర్డ్ ఇయర్ కోసం తాత్కాలిక భవనం మరో మూడు ఆపరేషన్ థియేటర్లు సిద్ధం చేయండి రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ -
రెవెన్యూ అదనపు కలెక్టర్ హోదా పెంపు
జనగామ: రెవెన్యూ అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ హోదాను పెంచుతూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో రాష్ట్రంలోని ఆయా జిల్లాల పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న 33 మందికి అదనపు కలెక్టర్లుగా పదోన్నతి కల్పించారు. ప్రస్తుతం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్గా పని చేస్తున్న రోహిత్ సింగ్కు ప్రభుత్వం ఇక్కడే పూర్తి స్థాయి అదనపు కలెక్టర్ హోదాను కల్పించింది. ఈ మేరకు ఏసీ రోహిత్సింగ్ను పలువురు అభినందించారు. -
భర్త జ్ఞాపకాలతో..
మహబూబాబాద్ రూరల్: కట్టుకున్న భర్తను ప్రాణంగా భావించి ఆయన మృతి అనంతరం పాలరాతితో విగ్రహం చేయించి ఓ భార్య ఆయనకు గుడి కట్టించింది. మహబూబాబాద్ మండలం సోమ్లా తండా గ్రామానికి చెందిన బానోత్ కల్యాణి ఎంపీటీసీగా పనిచేసింది. హరిబాబుతో ఆమెకు 1996లో వివాహం కాగా.. 2021లో హరిబాబు అనా రోగ్యంతో మృతిచెందాడు. ఆయనతోపాటే తాను చనిపోదామని కల్యాణి ప్రయత్నించినా బంధువులు ధైర్యం చెప్పడంతో హరిబాబు జ్ఞాపకాలతో జీవిస్తోంది. ఈక్రమంలో రూ.5.30 లక్షలతో పండుగ వాతావరణంలో గతేడాది ఏప్రిల్ 23న గుడి ప్రారంభించింది. ప్రతీ శనివారం ఆయనకు పూజలు చేస్తోంది. -
ఉన్నత లక్ష్యంతో చదవాలి
కేజీబీవీలో విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ లింగాలఘణపురం: విద్యార్థినులు ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా కోరారు. శనివారం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాల, మోడల్ స్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వం అందజేసిన పుస్తకాలు, దుస్తులు, నోట్బుక్స్ అందాయా లేదా అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గదుల శుభ్రత, వంటగదిలో ఆహార పదార్థాల నాణ్యత, మరుగుదొడ్లలను పరిశీలించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ భోజన్న, తహసీల్దార్ రవీందర్, ఎంఈఓ విష్ణుమూర్తి, ఎంపీఓ రఘురామకృష్ణ, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సునీత, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ అన్నపూర్ణ తదితరులు ఉన్నారు. గోదావరి జలాలతో చెరువులు నింపాలి జనగామ రూరల్: గోదావరి జలాలతో జనగామ ప్రాంతంలోని చెరువులు, కుంటలు నింపి రైతులకు సాగునీరు అందించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందునాయక్ డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య అధ్యక్షతన శనివారం ప్రజా సంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా జనగామ ప్రాంతానికి సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న రైతు భరోసా నిధులను విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మంగ బీరయ్య, మాచర్ల సారయ్య, రామావత్ మీట్యా నాయక్, నక్క యాకయ్య, పయ్యావుల భిక్షపతి, ఉర్సుల కుమార్, బండ కింది బాలనారాయణ, తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ స్కూల్లో చేరడం గొప్ప అవకాశంజనగామ రూరల్: చదువును మధ్యలో నిలిపివేసిన వారు చదువుకోవడానికి ఓపెన్ స్కూల్లో చేరడం గొప్ప అవకాశమని అడల్ట్ ఎడ్యుకేషన్ లైసన్ ఆఫీసర్ విజయ్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్లో సెర్ఫ్ జిల్లా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వయోజన విద్యా విభాగం, విద్యాశాఖ, టాస్ సంయుక్తంగా చేపడుతున్న ఉల్లాస్, టాస్ కార్యక్రమం గురించి కోఆర్డినేటర్ శంకర్రావు వివరించారు. చదువురాని వారిని, చదువు మధ్యలో ఆపేసిన వారిని గుర్తించి వారి చదువుకొనసాగించేలా అవగాహన కల్పించాలన్నారు. ఓపెన్ స్కూల్ ఒక వరం లాంటిదన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ వసంత, అడిషనల్ డీఆర్డీఓ నూరోద్దీన్, డీపీఓ రాజేంద్ర ప్రసాద్, ఏపీఓ జ్యోతి, సీఎంఓ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు జనగామ రూరల్: పట్టణంలోని మినీ స్టేడియం ధర్మకంచలో జిల్లా స్థాయి 10, 12, 14 సంవత్సరాల బాలబాలికల ట్రయాతలిన్ అథ్లెటిక్స్ ఎంపికలు శనివారం జరిగాయి. ఈ ఎంపికలకు 500 మంది విద్యార్థులు వివిధ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనగా 25 మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జూలై 6న జేఎన్ఎస్ హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి మనోజ్ కుమార్ తెలిపారు. జిల్లా అసోసియేషన్ కోశాధికారి ఆవుల అశోక్, తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు గోర్ సింగ్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి హనుమంతరావు, రంజిత్, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
చిల్పూరు: సీజనల్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలని డీఎంహెచ్ఓ మల్లికార్జున్ అన్నారు. మల్కాపూర్ గ్రామంలోని పీహెచ్సీని శనివారం ఆయన సందర్శించారు. ముందుగా వాఛ్యతండాలో మానిటర్ ఇమ్యునైజేషన్ను ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కమల్హాసన్, డాక్టర్ అశోక్లతో కలిసి పరిశీలించారు. వెంకటాద్రిపేటలో డెంగీ పాజిటివ్ వచ్చిన పేషంట్తో మాట్లాడి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలి పారు. గ్రామంలో చెత్త చెదారం, మురుగు నీ రు నిల్వ ఉండడంతో దోమలు పెరిగి డెంగీ వ స్తుందని, పరిశుభ్రత పాటించాలన్నారు. అనంతరం పీహెచ్సీలో డాక్టర్ కుశాలి, డాక్టర్ శ్రవణ్ ఆధ్వర్యంలో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సిబ్బంది సమయ పాలన పా టించాలని, ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన మందులు అందజేయాలన్నారు. -
గ్రీన్ సిగ్నల్
జనగామ: జనగామ ప్రభుత్వ వైద్య కళాశాలలో 2025–26 నూతన వైద్య విద్యాసంవత్సరంలో అండర్ గ్రాడ్యుయేట్ సీట్ల (ఎంబీబీఎస్) పునరుద్ధరణకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఎంబీబీఎస్ సీట్ల పునరుద్ధరణ మంజూరుకు ఎన్ఎంసీ నిబంధనలను అనుసరించి మెడికల్ కళాశాల వివరాలు, సమగ్ర డేటాను అప్లోడ్ చేయాలని 2024 నవంబర్ 1న పబ్లిక్ నోటీసు జారీ చేశారు. కళాశాలకు సంబంధించిన నిపుణులు సమర్పించిన నివేదిక ఆధారంగా లోపాలను గుర్తిస్తూ 2025 మే 3న జాతీయ వైద్య కమిషన్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అధ్యాపకులకు సంబంధించి తక్కువ హాజరు శాతం, 420 పడకలకు గాను 410, కాడవర్ సంఖ్య 10కి గాను 7, అందుబాటులో లేని సీటీ స్కాన్, ఎమ్మారై, మైనర్, మేజర్ ఓటీల సంఖ్య పెంచడం (ఆపరేషన్ థియేటర్లు), మృతదేహాల కొరత తదితర లోపాలు ఉన్నట్లు షోకాజ్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలల వారీగా గుర్తించిన లోపాలను సరి దిద్దేందుకు వివరణాత్మకమైన కార్యాచరణ ప్రణాళికను నిపుణుల ఉప సంఘం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రభుత్వం అందించిన నివేదిక ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు (యూజీఎంఈబీ) 2025–26లో ఎంబీబీఎస్ సీట్ల పునరుద్ధరణకు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జారీ చేసిన నాలుగు నెలల లోపు లోపాలను సరిదిద్దుకోవాలని అందులో పేర్కొన్నారు. నిబంధనల మేరకు కాలపరిమితి ముగిసిన వెంటనే మెడికల్ కళాశాల నిర్వహణకు సంబంధించి వైద్య విద్య ప్రమాణాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో లోపాలు అలాగే కొనసాగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఊపిరి పీల్చుకున్న అధికారులు ఈ వైద్యవిద్యాసంవత్సరంలో ఎంబీబీఎస్ సీట్ల పునరుద్ధరణతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్ఎంసీ చూపించిన లోపాల్లో సీటీ స్కాన్ సేవలు వారం రోజుల్లో ప్రారంభం కానుండగా మృతదేహాలకు సంబంధించి మరో నాలుగు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాకల్టీకి సంబంధించి ఖాళీ లను సైతం భర్తీ చేస్తున్నారు. అధ్యాపకుల ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ను సైతం అమలులోకి తీసుకు వస్తున్నారు. 100 ఎంబీబీఎస్ సీట్లకు గాను 15 శా తం జాతీయ స్థాయి, 85 శాతం రాష్ట్రాస్థాయిలో అ డ్మిషన్లు ఉంటాయి. ఈ విషయమై మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్రావు మాట్లాడు తూ 2025–26 సంవత్సరానికి ఎంబీబీఎస్ సీట్ల పునరుద్ధరణకు మంజూరు వచ్చిందన్నారు. తరగతులు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.వైద్య కళాశాలకు షరతులతో కూడిన అనుమతులు ఊపిరి పీల్చుకున్న అధికారులు -
ఎల్లప్పుడూ కళ్ల ముందే ఉండాలని..
డోర్నకల్: కంటికి రెప్పలా చూసుకునే భర్త, అమ్మా అమ్మా అంటూ రోజుకు వెయ్యిసార్లు పలకరించే కుమారుడు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో దిక్కు తోచని స్థితికి చేరుకున్న ఓ మహిళ తన భర్త, కుమారుడిని విగ్రహాల రూపంలో చూసుకుంటూ వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంది. డోర్నకల్ మండలం దుబ్బతండాకు చెందిన అజ్మీర బాల్యా, భారతి దంపతులకు సాయికుమార్ ఏకై క కుమారుడు. భారతి దుబ్బతండా సర్పంచ్గా పని చేసి భర్త బాల్యా సహకారంతో గ్రామాభివృద్ధిలో తమ వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించింది. బాల్యా, భారతి వ్యవసాయం చేస్తుండగా కుమారుడు ఖమ్మంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. గత జూన్ 5న కుమారుడు సాయికుమార్ను కళాశాలకు పంపేందుకు బాల్యా ద్విచక్రవాహనంపై ఖమ్మం బయల్దేరగా ఖమ్మంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని బాల్యా, సాయికుమార్ మృతి చెందారు. వారిని మర్చిపోలేని భారతి.. బాల్యా, సాయికుమార్ విగ్రహాలను గ్రామ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసింది. జూన్ 15న వారి సంతాప సభలోబాల్యా సాయికుమార్ విగ్రహాలను ఆవిష్కరించారు. -
కుమారులు దూరమై.. విగ్రహాల్లో కొలువై
కొడకండ్ల: అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమారులు రోడ్డు ప్రమాదంలో దూరమయ్యారు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని వారి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ ఆ తల్లిదండ్రులు కాలం వెళ్లదీస్తున్నారు. ప్రాణం పోయిన వారి కుమారులకు విగ్రహాల రూపంలో ప్రాణం పోసి కళ్లారా చూస్తున్నారు. కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన మేటి రాములు–రాజేశ్వరి దంపతులకు ముగ్గురు కుమారులు. వ్యవసాయమే జీవనాధారమైన వారు కుమారులను చిన్నప్పటి నుంచి ప్రైవేట్ పాఠశాలల్లోనే చదివించారు. తల్లిదండ్రుల శ్రమను గుర్తించిన వారు ప్రయోజకులయ్యారు. పెద్దకుమారుడు అరవింద్, రెండో కుమారుడు శ్రవణ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్లో మూడో కుమారుడు శ్రవణ్ వరంగల్ ఎంజీఎంలో హౌస్ సర్జన్గా పనిచేసేవారు. గత సంవత్సరం మే 19న శివ హైదరాబాద్లోని అన్న శ్రవణ్ వద్దకు వెళ్లాడు. భోజనం తెచ్చుకునేందుకు బయటికి వెళ్లిన ఇద్దరు సోదరులను స్కార్పియో కారు ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కుమారులను గుర్తు చేసుకుంటూ తమ వ్యవసాయ భూమిలో గదిని నిర్మించి శ్రవణ్, శివ విగ్రహాలను ఏర్పాటు చేయించారు. మే 19న ప్రథమ వర్ధంతి సందర్భంగా తల్లిదండ్రులు ఆవిష్కరించుకున్నారు. -
వేంకటేశ్వరస్వామి ఆలయంలో గోవింద నామస్మరణ
చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి సన్నిధిలో శనివారం భక్త జన సందోహం మధ్య గోవింద నామస్మరణలతో అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేద మంత్రాల నడుమ వైభవంగా స్వామి వారి వార కల్యాణం నిర్వహించారు. ఆలయ ఈఓ భాగం లక్ష్మిప్రసన్న, ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, ధర్మకర్తలు గనగోణి రమేశ్, తాళ్లపల్లి బుచ్చయ్య, రత్నాకర్రెడ్డి, చల్ల వెంకటరమణాదేవి, గోలి రాజశేఖర్, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్, వీరన్న, మళ్లికార్జున్, మహేష్, గాదె శేఖర్, హరిశంకర్, రాజేష్, విశాల్ పాల్గొన్నారు. అనంతరం భక్తులకు హైదరాబాద్కు చెందిన అఖిల్ శర్మ– వనిత కల్యాణి, వరంగల్కు చెందిన మేర్గు నవీన్–వీణ, విశ్వతేజ దంపతులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. -
నేతన్నకు పొదుపు భరోసా
జనగామ: చేనేత రంగానికి ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు గత సర్కారు అమలు చేసిన థ్రిప్టు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ‘నేతన్న పొదుపు’ పథకంగా ముందుకు తెచ్చింది. 36 నెలల కాల పరిమితిని ప్రస్తుత ప్రభుత్వం 24 నెలలకు కుదించింది. నేత, అనుబంధ కార్మికులు చెల్లించే వాటాధనంలో సర్కారు రెండింతలు కలిపి జమచేస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తోంది. పథకం ద్వారా నేతన్న కుటుంబాల్లో పొదుపు అలవాటును ప్రోత్సహించడం సర్కారు ముఖ్యఉద్దేశం. జిల్లాలో 2,824 మంది కార్మికులు నేతన్న పొదుపు స్కీం ద్వారా జిల్లాలో 2,824 మంది నేత, అనుబంధ కార్మికులకు లబ్ధి చేకూరనుంది. జిల్లాలో 15వేల జియోట్యాగ్ మగ్గాలు, పవర్ లూమ్స్(మర మగ్గాలు) ఉన్నాయి. నేతన్న పొదుపు పథకానికి గతంలోనే కార్మికుల నుంచి సుమారు 3వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. చేనేత జౌళి శాఖ ప్రత్యేక అధికారుల బృందం అర్హత నిర్ధారణ కోసం ప్రతీ ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత థర్డ్ పార్టీ సర్వే చేపట్టారు. ఇందులో తప్పిన కార్మికుల వివరాలను జిల్లా అధికారులు నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపించారు. ఇదిలా ఉండగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో నేత కార్మికులు నేతన్న పొదుపు పథకానికి దూరంగా ఉన్నారు. అధికారులు తనిఖీకి వెళ్లిన సమయంలో సుదూర ప్రాంతాలకు వెళ్లడం, శుభకార్యాల నేపథ్యంలో మగ్గాలు విప్పి అటెక్కించడంతో ప్రస్తుతం నేత వృత్తి చేయడం లేదని రికార్డులో ఎక్కించారు. తమ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ నేతన్న పొదుపులో అవకాశం కల్పించాలని కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పథకం అమలు ఇలా.. నేత, అనుబంధ కార్మికులు ప్రతి నెలా తమ వేతనం నుంచి 8 శాతం కాంట్రిబ్యూషన్ చేస్తారు. ప్రభుత్వం కార్మికుల పొదుపునకు రెండింతలు(16శాతం) కలుపుకుని 24 నెలల తర్వాత వారి ఖాతాలో జమ చేస్తుంది. నేత కార్మికులు గరిష్టంగా రూ.1,200, అనుబంధ కార్మికులు రూ.800 వాటా ధనం చెల్లిస్తారు. మరమగ్గాల కార్మికులు 8 శాతం పొదుపు చేసుకోగా, ప్రభుత్వం అంతే మొత్తంలో భరోసా కల్పిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 36 నెలల కాలపరిమితితో థ్రిఫ్టు పథకం అమలు చేయగా, సీఎం రేవంత్రెడ్డి దీనిని 24 నెలలకు కుదించి నేతన్న పొదుపు పథకంగా మార్చారు. నెలనెలా పొదుపు చేసుకునే సమయంలో ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఆలస్యం జరిగితే.. నేత కార్మికులకు మూడు నెలల వెసులుబాటు కల్పించారు. అప్పటికీ పొదుపు జమ చేసుకోని పరిస్థితుల్లో సదరు కార్మికులు ఆ పథకం జాబితా నుంచి ఆటో మేటిక్గా తొలగిపోతారు.జిల్లాలో నేతన్న పొదపు లబ్ధిదారుల వివరాలు మండలం నేత స్కీం మొత్తం కార్మికులు అర్హులు జనగామ 683 683 1,366 బచ్చన్నపేట 359 330 689 నర్మెట 23 22 45 తరిగొప్పుల 17 15 32 స్టే.ఘన్పూర్ 11 11 22 చిల్పూరు 01 01 02 జాఫర్గడ్ 01 01 02 లిం.ఘనపురం 190 178 368 ర.నాథపల్లి 32 26 58 పాలకుర్తి 08 07 15 కొడకండ్ల 03 03 06 దేవరుప్పుల 137 82 219 మొత్తం 1,465 1,359 2,824జిల్లాలో 2,824 మందికి లబ్ధి స్కీం కాలపరిమితి 24 నెలలు వీవర్ వాటా రూ.1,200 అనుబంధ కార్మికుడికి రూ.800 వాటాధనం చెల్లింపునకు మూడు నెలల వెసులుబాటు -
ధర్మకంచలో పట్టపగలే చోరీ
జనగామ: జిల్లా కేంద్రం ధర్మకంచ ప్రధాన రహదా రిలో పట్టపగలే భారీ చోరీ సంఘటన శుక్రవారం జరిగింది. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మకంచకు చెందిన అంగన్వాడీ టీచర్ మంగోలు రేణుక ఉదయం 9.30 గంటలకు సెంటర్కు వెళ్లి.. రాత్రి 7 గంటలకు తిరిగి ఇంటికి చేరుకుంది. ముఖద్వారం తలుపులు తెరిచి ఉన్నా యి. లోపలికి వెళ్లి చూడగా రెండు బీరువాలు పగుల గొట్టి ఉండడంతో వెంటనే 100 నంబర్కు డయల్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకుని క్లూస్ టీంలను రప్పించారు. సుమారు 12 తులాల బంగారు ఆభరణాలు, 60 తులాల వెండి వస్తువులు(కాళ్ల కడియాలు, పట్టా గొలుసులు), రూ.60వేల నగదు అపహరణకు గురైనట్లు రేణుక తెలిపారు. కూతురు పెళ్లి కోసం భద్రపరిచిన నగలు, నగదు చోరీకి గురి కావడంతో బాధితురాలు కన్నీరు మున్నీరుగా విలపించింది. పోలీసులు విచారణ ప్రారంభించారు. 12 తులాల బంగారు, 60 తులాల వెండి ఆభరణాల అపహరణ రూ.60వేల నగదు కూడా.. -
నోటరీ మ్యుటేషన్లపై ఆరా..!
జనగామ: జనగామ మున్సిపల్లో జరిగిన మ్యుటేషన్ల సవరణ, సెటిల్ మెంట్లపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అదనపు కలెక్టర్(ఏసీ) పింకేష్కుమార్ ఆరా తీశారు. ‘సెటిల్మెంట్ కింగ్ ఎవరు’, ‘సెటిల్మెంట్పై ఇంటలిజెన్స్ ఆరా’ శీర్షికన సాక్షిలో ఇటీవల ప్రచురితమైన వరుస కథనాలకు స్పందించిన అదనపు కలెక్టర్ శుక్రవారం మున్సిపాలిటీని ఆకస్మికంగా సందర్శించడంతో ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. కమిషనర్ చాంబర్లో రెండున్నర గంటల పాటు రెవెన్యూ, అకౌంట్స్, పట్టణ ప్రణాళిక, శానిటేషన్, ఇంజనీరింగ్ తదితర విభాగాల వారీగా సమీక్షించారు. ఇటీవల మ్యుటేషన్ల సవరణకు సంబంధించి 22 మంది జాబితాను జతపరుస్తూ సీడీఎంఏ కమిషనర్ వెంకటేశ్వర్లుకు మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. గడిచిన ఆరు నెలల కాలంలో నోటరీ, నిర్మాణాల రెగ్యులరైజేషన్, మ్యుటేషన్ల సవరణపై సమగ్ర సమాచారంతో నివేదిక సమర్పించా లని ఆదేశించారు. ఇక నుంచి నోటరీపై ఉన్న వాటిని రెగ్యులరైజ్ చేయరాదని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గతంలో చేసిన మ్యుటేషన్ల సవరణపై కూపీ లాగడంతో పాటు సదరు ఉద్యోగులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో మరింత వేగం పెంచాలని చెప్పారు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పనితీరు, వ్యవహారంపై ఎక్కువ సమయం కేటాయించినట్టు సమాచారం. సమీక్షలో మేనేజర్ రాములు, ఆయా శాఖల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతోంది..? పట్టణ ప్రణాళిక సేవలపై వివరాల సేకరణ శాఖల వారీగా రెండున్నర గంటల పాటు సమీక్షించిన అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ -
పొదుపు పథకం బాగుంది
చేనేత వృత్తి నిరాధరణకు గురవుతున్న సమయంలో నాడు కేసీఆర్, నేడు రేవంత్రెడ్డి అమలు చేస్తున్న నేతన్న పొదుపు పథకం కింద రెట్టింపు బోనస్ కలిపి ఇవ్వడంతో ఆర్థికంగా బలపడుతున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ నెలకు రూ.1,200 చెల్లిస్తే మరో రూ.2,400 కలిపి మూడేళ్లకు గాను రూ.1,29,600 రెండుసార్లు తీసుకున్నాను. నాతో పాటు భార్య కూడా నెలకు రూ.600 చెల్లిస్తే, ప్రభుత్వం రూ.1,200 బోనస్తో మూడేళ్లకు రూ.64,800 ఇచ్చింది. గత ప్రభుత్వం మూడేళ్లకు బోనస్ ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కీంను రెండేళ్లకు కుదించడంతో కార్మికులకు త్వరగా లబ్ధి చేకూరుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ మగ్గం నేసే కార్మికులకు చేయూత కొనసాగించడం అసరాగా నిలుస్తుంది. – చింతకింది సోమయ్య, చేనేత కార్మికుడు, కోలుకొండ(దేవరుప్పుల) -
సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం
● ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి పాలకుర్తి టౌన్: నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం.. ఇందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించిందని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నిరుపేద కుటుంబాలకు ఇందిర మ్మ ఇళ్ల మంజూరు పత్రాలను కలెక్టర్ రిజ్వాన్ బాషాతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని చెప్పారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్పర్సన్ మంజుల, డీఆర్డీఓ వసంత, ఎంపీడీఓ రాములు, కాంగ్రెస్ నాయకులు రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, కమ్మగాని నాగన్న, ఎండీ.నజీర్, యాకూబ్, పుల్లి గణేష్, బైరు భార్గవ్, పన్నీరు వెంకన్న, కమ్మగాని కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వేంకటేశ్వరుడికి విశేష అలంకరణ
చిల్పూరు: భూనీల సమేత శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి శుక్రవారం భక్తులకు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఉదయం అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు స్వామివారికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, ధర్మకర్తలు గోలి రాజశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. స్టూడెంట్ డైరీ ఆవిష్కరణజఫర్గఢ్: మండల పరిధి తిడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయ బృందం రూపొందించిన స్టూడెంట్ డైరీని కలెక్టర్ రిజ్వాన్ బాషా శుక్రవారం తన కార్యాలయంలో డీఈఓ భోజన్నతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి డైరీ ఎంతగానో దోహదపడుతుందని, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో డైరీని రూపొందించడం అభినందనీయమని అన్నారు. డీఈఓ భోజన్న మాట్లాడుతూ పిల్లల విద్యా ప్రగతిని తల్లిదండ్రులు తెలుసుకోవడంతో పాటు విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన పాటించేందుకు డైరీ ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్టీ జిల్లా అధ్యక్షుడు కొల్ల మహిపాల్రెడ్డి, హెచ్ఎం సదానందం, ఉపాధ్యాయులు నవీన్రెడ్డి, శ్రవణ్కుమార్, రాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలిదేవరుప్పుల : పేదరిక నిర్మూలనతోపాటు సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ట్రైబల్ వెల్ఫేర్ అధికారి రూపాదేవి సూచించారు. శుక్రవారం లకావత్తండా(ఎం)లో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన నిర్వహించిన ‘పీఎం ధర్తీ అభజన్ భగీధారి అభయాన్’ ప్రత్యేక గ్రామసభలో ఆమె మాట్లాడారు. కిసాన్ క్రెడిట్ కార్డ్, ఆయుష్మాన్ భారత్, వృద్ధ్ధాప్య పింఛన్లు, ఇన్సూరెన్స్ స్కీమ్స్, రేషన్ కార్డులు తదితర సంక్షేమ పథకాల వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీఓ సురేష్కుమార్, మండల వైద్యాధికారి రవితేజ, ఏఈఓ సనా మహావీణ్, గ్రామ ప్రత్యేక అధికారి పి.మహేష్ పాల్గొన్నారు. నాటి ‘ఎమర్జెన్సీ’ రోజులు గుర్తుకొస్తున్నాయి..జనగామ రూరల్: ఇందిరాగాంధీ పాలనలో అమలు చేసిన ఎమర్జెన్సీ.. నాటి చీకటి రోజు లు గుర్తుకొస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం భారతీయ జనతా యువమోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యాన పట్టణంలోని నెహ్రూ పార్కు వద్ద నిర్వహించిన ‘సంవిధాన్ హత్య దివస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 1975లో నాటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ సొంత ప్రయోజనాల కోసం అంతర్గత కలహాలు అనే ఒక కుంటిసాకు చూపి ఎమర్జెన్సీ విధించి భారత పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడంతో పాటు పత్రికా స్వేచ్ఛను హరించి నిరంకుశ పాలన కొనసాగించిందన్నారు. అటల్ బిహారీ వాజేపేయి, ఎల్కే అద్వానీ, జయప్రకాశ్ నారాయణ జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి అధికార కాంక్ష తప్ప ప్రజలపై చిత్తశుద్ధి ఏనాడూ లేదని, ఇప్పటికీ అదే ధోరణితో ప్రజల పట్ల వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజు, ఉపాధ్యక్షులు దేవరాయ ఎల్లయ్య, డాక్టర్ భిక్షపతి, మహిపాల్, నవీన్, దడిగా రవి, ఉల్లెంగుల రాజు, కీర్తి వెంకటేష్, రఫ్తార్ సింగ్, అవినాష్, రంజిత్, రాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఓపెన్ స్కూల్ ఓ వరం
● తెలంగాణ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి పాలకుర్తి టౌన్: ఆర్థిక పరిస్థితులు, కుటుంబ కారణాలతో పాఠశాల స్థాయిలోనే చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్ ఓ వరమని ఓపెన్ స్కూల్ తెలంగాణ జాయింట్ డైరెక్టర్ ఎం.సోమిరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పాలకుర్తి మండలంలో ఓపెన్ టెన్త్, ఇంటర్లో అడ్మిషన్స్ చేయించాలని, డ్రాపౌట్ లేకుండా చూడాలని చెప్పా రు. అలాగే ఉల్లాస్ ప్రొగ్రాంలో భాగంగా నిరక్షరా స్యులను అక్షరాస్యులుగా చేసే బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర బాలికల ఎడ్యుకేషన్ ఆఫీసర్ సతిన్, అడల్ట్ ఎడ్యుకేషన్ ఏపీఓ విజయ్కుమార్రెడ్డి, టాస్ కోఆర్డినేటర్ శంకర్రావు, అసిస్టెంట్ కోఆర్డినేటర్ రవి, హెచ్ఎంలు శోభారాణి, ఉపాధ్యాయులు ఓరుగంటి రమేష్, అశోక్, బలరాం, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
మత్తుపదార్థాలపై అప్రమత్తంగా ఉండాలి
● సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ జనగామ రూరల్: మత్తుపదార్థాల విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. ‘డీఏడబ్ల్యూఎన్, డ్రగ్ అవేర్నెస్ అండ్ వెల్నెస్ నావిగేషన్ ఫర్ ఏ డ్రగ్– ఫ్రీ ఇండియా స్కీం – 2025’పై ఓబుల్కేశవపూర్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ అమ్మేవారు స్కూల్ విద్యార్థులను టార్గెట్ చేస్తున్నారని, జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పా రు. ఈ సందర్భంగా డ్రగ్స్తో కలిగే అనర్థాల గురించి వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు శేఖర్, జితేంద్ర, విద్యార్థులు పాల్గొన్నారు. -
వచ్చే వారమే సీటీ స్కాన్ సేవలు
జనగామ: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(డీహెచ్)లో నూతనంగా ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ సేవలను వచ్చే వారంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. శుక్రవారం ఆయన ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంతకు ముందు సీటీ స్కాన్ పని తీరుకు సంబంధించి డెమోను పరిశీలించారు. అనంతరం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్రావుతో కలిసి జనరల్ వార్డు, ఇతర విభాగాలను సందర్శించారు. ఫిజియో థెరపీ సేవలతో పాటు బ్లడ్ బ్యాంకు నిర్వహణ, అత్యవసర సమయంలో యూనిట్లను అందించేందుకు ఏ మేర సామర్థ్యం కలిగి ఉందనే దానిపై ఆరా తీశారు. భోజన వడ్డింపుపై రోగులను అడిగి తెలుసుకున్నారు. సమయానుకూలంగా భోజనం వడ్డించాలని సిబ్బందికి సూచించారు. ఆస్పత్రిలో ఆపరేషన్లు, జనరల్ సేవలు, డాక్టర్ల పనితీరుపై రోగులతో మాట్లాడారు. సర్కారు ఆస్పత్రిని నమ్ముకుని వచ్చే నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి మరింత నమ్మకం కలిగించాలని కలెక్టర్ వైద్యులు, సిబ్బందికి సూచించారు. సమయ పాలన పాటించి రోగులకు అందుబాటులో ఉండాలని చెప్పారు. కలెక్టర్ వెంట ఆర్ఎంఓ లక్ష్మీనారాయణ, డాక్టర్లు అనురాధ శంకర్, పద్మ, ప్రభ తదితరులు ఉన్నారు. ముగిసిన కేంద్ర బృందం పరిశీలనజనగామ రూరల్: జలశక్తి అభియాన్ కింద నేషనల్ వాటర్ అవార్డులో భాగంగా క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం పర్యటన శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు కలెక్టర్ రిజ్వాన్ బాషాతో సమావేశమయ్యారు. వారు మాట్లాడుతూ భూగర్భజల సంరక్షణకు చేపట్టిన పనులు, గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ బాగుందన్నారు. బతుకమ్మకుంట అభివృద్ధి కూడా భూగర్భ జలాల సంరక్షణకు చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. అనంతరం ‘మన జిల్లా–మన నీరు’ కార్యక్రమం కింద తక్కువ ఖర్చుతో కలెక్టరెట్లో నిర్మించిన ఇంకుడు గుంతను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సభ్యులు అశ్వరావుపల్లి ఆర్ఎస్ రిజర్వాయర్, మీదికొండ చెక్డ్యాం, వెల్ది గ్రామంలో బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్, ఛాగల్లులో ఆయిల్పామ్ సాగు, నెల్లుట్లలో ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ ప్లాంటేషన్ నర్సరీ, రఘునాథపల్లిలో ఫీజో ఎలక్ట్రిక్ మీటర్, పాలకుర్తిలో ఫామ్ పాండ్స్, వాటర్ ట్యాంకు, పైపులైన్ నిర్మా ణాలు, కంపోస్ట్ షెడ్డు, జనగామలోని బతుకమ్మ కుంట అభివృద్ధి పనులు పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేష్కుమార్, డీఆర్డీఓ వసంత తదితరులు పాల్గొన్నారు. వైద్యులు సమయపాలన పాటించాలి డీహెచ్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రిజ్వాన్ బాషా -
ప్రభుత్వం విద్యా విధ్వంస విధానాలను మానుకోవాలి
● విద్యా పరిరక్షణ కమిటీ బాధ్యులు జనగామ రూరల్: కేంద్ర, రాష్ట్ర పాలకులు ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసే విధానాలను మానుకోవా లని విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి.లక్ష్మయ్య, ఇ.రామిరెడ్డి అన్నారు. హైదరా బాద్ ఇందిరాపార్క్ వద్ద ఈనెల 27న నిర్వహించే ధర్నా కరపత్రాలను గురువారం తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యాన జిల్లా కేంద్రంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ సర్కారు విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణను వేగిరం చేయడానికి నూతన జాతీయ విద్యావిధానాన్ని తీసుకువ చ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసిన గత సర్కారు విధానాలనే ప్రస్తుత ప్రభు త్వం అమలు చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్, ఫౌండేషన్ స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో విద్యారంగంలో తీసుకొస్తున్న మార్పులు అన్ని స్థాయిల్లో దళిత, ఆదివాసీ, నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు విద్యను దూరం చేసేలా ఉన్నాయ న్నారు. రాజు, అంకుశావళి, యాదగిరి, శివరాం, జి.శ్రీరామ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం
చిల్పూరు: రాజకీయంగా జన్మనిచ్చిన స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం.. ఇందుకు తమ ప్రతీ అడుగు ఆ దిశగా ఉంటుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మల్కాపూర్లో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ భవనం, చిన్నసెండ్యాలలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించే రెడ్డి కమ్యూనిటీ భవన నిర్మాణాలకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడు తూ గత పాలకుల కారణంగా నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని, ఇక నుంచి ఏడాదిలో ప్రతిపక్షాల గొంతులు మూగబోయేలా అభివృద్ధి చేస్తానని చెప్పారు. దేవునూరుగుట్టను ఎకో టూరిజంగా మారుస్తామన్నారు. స్టేషన్ఘన్పూర్లో లెదర్ పార్కు ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సరస్వతి, చిల్పూరు ఆలయ చైర్మన్ శ్రీధర్రావు, పార్టీ నాయకులు సురేష్, యశ్వంతరెడ్డి, మల్లారెడ్డి, మామిడాల లింగా రెడ్డి, వెంకట్రెడ్డి, కె.పోషయ్య, జంగం రవి, రంజిత్రెడ్డి, లక్ష్మారెడ్డి, యాదవరెడ్డి పాల్గొన్నారు. ఎంపీ కావ్య, ఎమ్మెల్యే శ్రీహరి -
బతుకమ్మకుంట పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్
జనగామ రూరల్ : పట్టణంలోని బతుకమ్మకుంటలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచా లని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువా రం అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి పనులను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మకుంట అభివృద్ధి పనులకు రూ.కోటి 50 లక్షల నిధులు మంజూరయ్యాయని, పంచతంత్ర థీమ్తో అభివృద్ధి చేయాలని చెప్పారు. సుందరీకరణ నేపథ్యంలో గ్రిల్స్, వ్యాయామ పరికరాలు, చిన్నారుల ఆటస్థలం, ఆట పరికరాలు, చిన్న పార్కు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు చెరువు పూడికతీత పనులు, వాకింగ్ ఏరియా, లైటింగ్, ఫెన్సింగ్, ఒక వాటర్ ట్యాంక్ పనులు పూర్తయ్యాయని, మిగతావి త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. అకాల వర్షాల వల్ల చెరువు పూడికతీత పనులు ఆలస్యం కావడంతో సివిల్ పనులు చేసేందుకు వీలు కాలేదని పేర్కొన్నారు. వారి వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఈ రాజ్కుమార్, ఏఈ మహిపాల్ పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలి బచ్చన్నపేట: వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండా లి.. ఇందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవా లని జిల్లా పంచాయతీ అధికారి నాగపురి స్వరూపరాణి సూచించారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆమె గురువారం సందర్శించారు. రికార్డులను పరిశీలించిన అనంత రం పంచాయతీ కార్యదర్శులతో సమావేశమై సూచనలు చేశారు. డీఎల్పీఓ వెంకట్రెడ్డి, ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్ పాల్గొన్నారు. పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వద్దు నర్మెట: పారిశుద్ధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదు.. తడి పొడిచెత్తతో తయారు చేసిన సేంద్రియ ఎరువు పంచాయతీలకు అదనపు ఆదాయం తెచ్చిపెడుతుందని ఎస్ఎస్జీ డీసీ పి.శ్రీకృష్ణ, ఎస్బీఎం డీసీ రామగుండం కరుణా కర్ అన్నారు. మండల పరిధి బొమ్మకూర్, బొమ్మకూర్తండా, రాళ్లబాయితండాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్లు, సీసీరోడ్లు, ఇంకుడుగుంతలు తదితర అభివృద్ధి పనులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. కార్యదర్శి సుజాతకు పలు సూచనలు చేశారు. భూగర్భ జలాల పెరుగుదలకు చర్యలు చేపట్టాలని, వృక్షసంపదను పెంచాలని చెప్పారు. అనంతరం రాళ్లబాయితండా ఎంపీపీఎస్ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడా రు. హెచ్ఎం బిర్రు ఉప్పలయ్య పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంపాలకుర్తి: గిరిజన లబ్ధిదారులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన ఉండాలని హనుమకొండ, జనగామ జిల్లాల అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ బానోతు రూపాదేవి అన్నారు. మండల పరిధిలో ఎంపిక చేసిన కొండాపురం, మైలారం గ్రామాల్లో గురువారం ఎంపీడీఓ రాములు ఆధ్వర్యాన ఏర్పా టు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఎంపీఓ రవిందర్, జీపీ కార్యదర్శి యూసుఫ్, మాజీ సర్పంచ్ కిషన్, లక్పతి గుగులోతు పాటిల్, కమిటీ చైర్మన్ రామ్సింగ్, ఏఈఓ కీర్తి తదితరులు పాల్గొన్నారు. బోనస్ జమచేయాలి జనగామ రూరల్: ప్రభుత్వం కొనుగోలు చేసిన సన్న రకం ధాన్యానికి సంబంధించిన బోనస్ డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందునాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సంఘం ఆధ్వర్యాన కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చందునాయక్ మాట్లాడుతూ రైతులు పండించే దొడ్డు, సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం కేవలం సన్న రకానికే అమలు చేస్తోందన్నారు. జిల్లాలో రైతులకు సుమారు రూ.12 కోట్ల బోనస్ డబ్బులు పెండింగ్లో ఉన్నట్లు పేర్కొన్నారు. రైతులు పండించే అన్ని రకాల పంటలకు బోనస్ అమలు చేయాలని, లేదంటే తహసీల్ కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించా రు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య, ఉపాధ్యక్షుడు మంగ బీరయ్య, నాయకులు కర్రె రాములు, కర్ర బీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
జనగామ రూరల్ : డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా యువత పోరాడాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియో గం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ, విద్యా, వైద్యం, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యాన నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏఎస్పీ పండరి నితిన్ చేతన్తోపాటు పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు, అంగన్వాడీ టీచ ర్లు, ఆశ వర్కర్లు, మహిళలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బస్టాండ్ చౌరస్తాలో మానవహారంగా ఏర్పడి డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు చేశారు. అనంత రం ర్యాలీ కామాక్షి ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగిస్తున్న వారి వివరాలను తెల్లకాగితంపై రాసి పోస్ట్బాక్స్లో వేయాలని, ఆచూకీ తెలిపిన వారికి బహుమతులు ఇస్తామన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ మాట్లాడుతూ డ్రగ్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ భోజన్న, జిల్లా సంక్షేమాధికారి ఫ్లోరెన్స్, డీఎంహెచ్ ఓ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ మత్తు పదార్థాలకు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నా రు. జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యాన డీఏడబ్ల్యూఎన్ డ్రగ్ ఫ్రీ ఇండియా స్కీమ్–2025పై శామీర్పేట జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల కు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాలు మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతాయని, వాటికి బానిస కావొద్దని సూచించారు. మాదకద్రవ్యాలు అమ్మేవారు చిన్న పిల్లలను టార్గెట్ చేస్తారని అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు వివరించారు. ఏ రూపంలోనైనా మత్తు పదార్థాలు ఉండవచ్చని జాగ్రత్తగా ఉండాల ని చెప్పారు. ద్విచక్ర వాహనాలపై లిఫ్ట్ ఇస్తాను అంటే బాలికలు వెళ్లకూడదని పేర్కొన్నారు. అలాగే బాల్య వివాహాలపై మాట్లాడుతూ.. 18 ఏళ్ల వయ సు లోపు వివాహం చేసుకోవద్దని, అలా వివాహం చేసిన వారు చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం నీరజ, భీమయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
సేంద్రియ సాగును ప్రోత్సహించాలి
● ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాలకుర్తి టౌన్: సేంద్రియ వ్యవసాయ సాగుపై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో ని పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి మండలాలకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. సేంద్రియ వ్యవసాయంతోనే మానవ మనుగడ సాధ్యమని, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేలా అవగాహన కల్పించి రైతులను ప్రొత్సహించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ప్రతీ గ్రామంలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చుడాలని తెలిపా రు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి రామారావునాయక్, ఏడీఏ అజ్మీరా పరశురాంనాయక్, ఏఓలు శరత్చంద్ర, దివ్య, విజయ్రెడ్డి, వీరభద్రం, రామనర్సయ్య పాల్గొన్నారు. -
భద్రకాళి అమ్మవారికి సహస్ర కలశాభిషేకం
హన్మకొండ కల్చరల్: వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళి దేవాలయంలో శాకంబరి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారికి సహస్ర కలశాభిషేకోత్సవం శోభాయమానంగా జరిగింది. కుడా చెర్మన్ ఇనుగాల వెంక్రటామిరెడ్డి, దేవాలయం ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం అమ్మవారి సన్నిధిలో జ్యోతిప్రజ్వలనం చేసి ఉత్సవాలను ప్రారంభించారు. సహస్ర కళశాభిషేకం మధ్యాహ్నం ప్రారంభమైంది. భద్రకాళి పంచమూర్తులకు, శ్రీచక్రానికి అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని కాళీక్రమంలో అలంకరించారు. రాత్రి కామేశ్వరీనిత్యాక్రమంలో ఆవరణార్చనలు జరిపా రు. భక్తులతో దేవాలయం కిక్కిరిసిపోయింది. భద్రకాళి శరణంమమ అంటూ జయజయధ్వానాలు చేస్తూ పులకించిపోయారు. ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ శేషు భారతి, సూపరింటెండెంట్ అద్దంకి విజయ్కుమార్, ఆలయ ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శుక్రవారం ఉదయం కపాలినీ క్రమంలో, సాయంత్రం భగమాలినిక్రమంలో పూజలు జరపనున్నారు. శాకంబరి ఉత్సవాలు ప్రారంభం -
ఘన్పూర్ మున్సిపల్ కమిషనర్గా రాధాకృష్ణ
స్టేషన్ఘన్పూర్: స్థానిక మున్సిపాలిటీ నూతన కమి షనర్గా బండ్ల రాధాకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం జీడబ్ల్యూఎంసీ కాజీపేట సర్కిల్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న రవీందర్ ఇక్కడ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. అయి తే.. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ శాఖలో చేపట్టిన బదిలీలు, పదోన్నతుల్లో భాగంగా సత్తుపల్లి మున్సిపాలిటీ శానిటేషన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రాధాకృష్ణను పదోన్నతిపై ఘన్పూర్ మున్సి పల్ కమిషనర్గా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో నీరు, వీధిదీపాలు, పారిశుద్ధ్య సమస్యపై ప్రత్యేకంగా పనిచేస్తానని, నూతనంగా ఏర్పడిన ఈ మున్సి పాలిటీ సమగ్రాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. ప్రజలు సహకరించాలని కోరారు. ఆరు నెలల్లో మూడో కమిషనర్ ఘన్పూర్ మున్సిపాలిటీ ఈ ఏడాది జనవరి 27న ఏర్పడింది. మొదటి కమిషనర్గా బాధ్యత లు స్వీకరించిన కృష్ణారెడ్డి వారం రోజుల అనంత రం హైదరాబా ద్కు బదిలీపై వెళ్లారు. కాజీపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ ఇన్చార్జ్ కమిషనర్గా అదనపు బాధ్యతలు చేపట్టారు. కాగా ప్రస్తుతం రాధాకృష్ణ పూర్తి స్థాయి కమిషనర్గా వచ్చారు. నూతన కమిషనర్కు పలువురి సన్మానం కమిషనర్ రాధాకృష్ణను కాంగ్రెస్తో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. అంతకు ముందు కమిషనర్.. కలెక్టర్ రిజ్వాన్ బాషాను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆరు నెలల్లో మూడో కమిషనర్ -
గడువు మూడురోజులే..
జనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) రాయితీకి ఇచ్చిన మరో అవకాశం గడువు మూడు రోజుల్లో ముగియనుంది. ప్లాట్ల యజమానుల నుంచి అనుకున్న మేర స్పందన లేకపోవడంతో 25 శాతం రాయితీ సదుపాయాన్ని ఆరోసారి ఈనెల 30వ తేదీ వరకు గడు వు పొడిగించింది. జనగామ పురపాలికలో 2020 సంవత్సరం ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు 18,095 వచ్చా యి. ఇప్పటి వరకు 2,823 మంది ఫీజు చెల్లించి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకున్నారు. 1,979 దరఖా స్తులు అండర్ ప్రాసెస్లో ఉన్నారు. ఇందులో 2,823 మందికి ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. ఎల్ఆర్ఎస్పై ఇప్పటి వరకు పురపాలికకు రూ.6.68 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోండి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రభుత్వం పొడిగించిన 25 శాతం రాయితీ గడువు ఈనెల 30 వరకు ఉంది. లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) ద్వారా ఫీజు చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ప్రశాంతి, టీపీఎస్, జనగామ పురపాలిక ఈనెల 30తో ముగియనున్న ఎల్ఆర్ఎస్ 25 శాతం రాయితీ.. వచ్చిన అప్లికేషన్లు 18,095.. ఆదాయం రూ.6.68కోట్లు అండర్ ప్రాసెస్లో 1,979 దరఖాస్తులు -
ఇంకెప్పడు..?
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం సర్కారు స్కూళ్లలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ(ప్రీ ప్రైమరీ) విద్యను అమలు చేస్తున్నట్లు నూతన విద్యా సంవత్సరానికి ముందుగానే ప్రకటించింది. రాష్ట్రంలో వెయ్యి ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించబోతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. దీంతో ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలు, టీచర్లు ప్రభుత్వ ఉద్దేశాన్ని ‘బడి బాట’లో తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ వారి పిల్లలను ప్రీ ప్రైమరీ స్కూల్లో చేర్పించుకున్నారు. రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ పీఎస్లో సుమారు 40, జనగామ మండలం యశ్వంతాపూర్లో 25, పసరమడ్లలో 25, ఇతర పాఠశాలల పరిధిలో ప్రీ ప్రైమరీ అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. అయితే ఇటీవల 210 ప్రీ ప్రైమరీ పాఠశాలల సంబంధించి విడుదల చేసిన జాబితాలో జనగామ జిల్లాకు చోటు దక్కలేదు. మిగతా పాఠశాలల్లో సైతం ఈ విద్యను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై పదిహేను రోజులు గడిచిపోతున్నా ఆచరణకు నోచుకోవడం లేదు. సర్కారు నిర్ణయంలో ఆలస్యం జరుగుతుండడంతో తల్లిదండ్రులకు హామీ ఇచ్చిన ఉపాధ్యాయులు సందిగ్ధంలో పడిపోయారు. ప్రీ ప్రైమరీలో నేటికీ విద్యాబోధన ప్రారంభం కాకపోవడంతో కొద్ది రోజులు వేచి చూసి తమ పిల్లలను ప్రైవేట్ కిడ్స్ స్కూళ్లకు పంపించేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. ఇలా అయితే ప్రభుత్వ పాఠశాలల పరిధిలో వచ్చే విద్యాసంవత్సరం ఒకటో తరగతి అడ్మిషన్ల సంఖ్య తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితమే మూడు ప్రీ ప్రైమరీ.. జిల్లాలో రెండేళ్ల క్రితమే సమగ్ర శిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ) స్కీంలో మూడు పాఠశాలల పరిధిలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ నిర్వహిస్తున్నారు. బచ్చన్నపేట మండలం పోచన్నపేట పీఎస్(55), కొడవటూరు పీఎస్(10), బచ్చన్నపేట పీఎస్(25)లో ఈ విద్య కొనసాగుతున్నది. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు గెస్ట్ ఫ్యాకల్టీగా స్థానికంగా నివసించే నిరుద్యోగుల నుంచి అర్హత ఆధారంగా ఒక టీచర్, ఆయాను నియమించారు. టీచర్కు నెలవారీ వేతనం రూ.8వేలు, ఆయాకు రూ.6వేలతో పాటు ఏడాదికి రూ.1.50లక్షల నిధులను ఎస్ఎస్ఏ ద్వారా అందిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ప్రీ ప్రైమరీ స్కూళ్లను జిల్లాలో ఏర్పాటు చేస్తే సంఖ్య ఆధారంగా నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు లభిచడంతో పాటు పేద కుటుంబాల తల్లిదండ్రులపై ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల భారం తగ్గుతుంది. అంతే కాకుండా ప్రభుత్వ స్కూళ్లలో ఒకటో తరగతి అడ్మిషన్లు పెరగడానికి దోహదపడుతుంది. గ్రీన్ సిగ్నల్ రాగానే..జిల్లాలో ప్రీ ప్రైమరీ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ప్రారంభిస్తాం. అయినప్పటికీ ప్రీ ప్రైమరీ స్థాయి పిల్లలను అంగన్వాడీతో పాటు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించి బోధన సాగిస్తున్నాం. ప్రీ ప్రైమరీ స్థాయిలో ఆశించిన మేర అడ్మిషన్లు వచ్చాయి. ఈ విద్యకు ఎక్కడా ఆటంకం లేదు. – భోజన్న, డీఈఓ మూడింట్లో నిర్వహిస్తున్నాం..బచ్చన్నపేట మండల పరిధి మూడు పాఠశాలలో రెండు సంవత్సరాలుగా ప్రీ ప్రైమరీ స్కూ ల్స్ నడిపిస్తున్నాం. ఇందులో సు మారు 90 మంది పిల్లలు ఉన్నా రు. ప్రైవేట్కు దీటుగా ఇందులో చిన్నారుల అభ్యసనా సామర్థ్యాలను పెంచేందుకు కృషి చేస్తున్నాం. – బొమ్మగాని శ్రీనివాస్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ఇదీ సర్కారు ఉద్దేశం.. ప్రీ ప్రైమరీ స్కూల్ విద్యా బోధన పిల్లల అధికారిక అభ్యసనా అనుభవంలో ప్రాథమిక దశకు కీలకంగా ఉపకరిస్తుంది. మూడు నుంచి ఐదేళ్ల వయసు చిన్నారుల కోసం ఈ విద్యకు రూపకల్పన చేశారు. ప్రీ ప్రైమరీలో పిల్లలకు అభాస్యంపై ప్రేరణ కలిగించడం, వారిలోని నైపుణ్యాలను గుర్తించే అవకాశం ఉంటుంది. చిత్రలేఖనం, కథలు చెప్పడం, ఆటలు, రంగులు, ఆకారాలు, అక్షరాలు, సృజనాత్మకతను వెలికి తీసేందుకు దోహదపడుతుంది. ఐదేళ్లు నిండక ముందే పిల్లలు సహచ ర స్నేహితులు, పెద్దలతో మాట్లాడడంలో సహాయ పడుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడానికి పునాదిగా పనిచేస్తుంది. సర్కారు స్కూళ్లలో ఒకటో తరగతిలో అడ్మిషన్ల సంఖ్య పెరగడానికి అవకాశం కలుగుతుంది. -
యువజన విభాగం కీలకంగా పనిచేయాలి
జనగామ రూరల్ : పార్టీ బలోపేతంలో యువజన విభాగం కీలకంగా పనిచేయాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో నిర్వహించిన యువజన కాంగ్రెస్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మీటింగ్కు ఆయనతోపాటు రాష్ట్ర ఇన్చార్జ్ ఖలీద్ హమీద్ హాజరయ్యారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్యాదవ్ ఆధ్వర్యాన వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు క్రాంతి, ఉపాధ్యక్షుడు చెట్కూరి కమలాకర్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేష్ కృష్ణన్, జనగామ, స్టేషన్ఘనపూర్, పాలకుర్తి నియోజకవర్గాల అధ్యక్షులు కర్క సంతోష్రెడ్డి, విజయ్, రాజేష్నాయక్, ప్రకాష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్రెడ్డి -
కేంద్రం ఒరగబెట్టిందేమీ లేదు..
స్టేషన్ఘన్పూర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లుగా ఒరగబెట్టిందేమి లేదు.. కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ చేతగాని చవట దద్దమ్మలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్లో రూ.2.12కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆధునిక బిగ్ కవర్ షెడ్ను బుధవారం ప్రారంభించారు. అనంత రం ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే నిరుపేదలు, బడుగు, బలహీన వర్గాలు, రైతులు, మహిళ ల పక్షపాతి అన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి సర్కారు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని, రైతులకు ఉచిత కరెంటుతో పాటు ఒక ఆర్థిక సంవత్సరంలోనే 25 లక్షల మందికి రూ.20,600 కోట్ల పంటరుణాలు మాఫీ చేసిందని చెప్పారు. తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే బీజేపీ, ఇతర రాజకీ య పార్టీలు ఒక్కసారి ఆలోచించాలని హితవు పలి కారు. మొదటి నుంచి బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని విమర్శించారు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నేతలు వేల కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ఎవరెన్ని చవకబారు విమర్శలు చేసినా పట్టించుకునే పనిలేదని, అభివృద్ధే తమ ఎజెండా అని అన్నారు. అనంతరం ఇందిరమ్మ మైనార్టీ మహిళా పథకం ద్వారా 13 మంది క్రిష్టియన్ మైనా ర్టీ మహిళలకు కుట్టు మిషన్లు, వివిధ గ్రామాలకు చెందిన 87 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ లావణ్యశిరీష్రెడ్డి, డీఎంఓ బి.నరేంద్ర, డీఈ ఎల్లేష్, మార్కెట్ కార్యదర్శి జన్ను భాస్కర్, వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, ఆర్డీఓ వెంకన్న, చిల్పూరు దేవస్థాన చైర్మన్ శ్రీధర్రావు, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్రెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
ప్రోత్సాహం
గురువారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2025ఉద్యాన పంటల సాగుకు–8లోuసిద్ధేశ్వరుడికి లక్ష పుష్పార్చన బచ్చన్నపేట : కొడవటూర్ స్వయంభూ శ్రీ సిద్ధేశ్వరాలయంలో బుధవారం స్వామివారికి లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. అమావాస్య తిథి ఆషాఢ మాసం ప్రారంభం సందర్భంగా అందరికీ మంచి జరగాలని ప్రత్యేక పూజలు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి తెలిపారు. ఆషాఢం ముగిసిన తర్వాత శ్రావణంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గంగం నర్సింహారెడ్డి, ఈఓ చిందం వంశీ, ఆలయ ప్రధాన పూజారి ఓం నమఃశివాయ, మహాశివుడు, సిబ్బంది నూకల లక్ష్మీకాంత్రెడ్డి. గంగం భానుప్రకాష్రెడ్డి, బండా రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సోమేశ్వరాలయంలో ఆరుద్రోత్సవం పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బుధవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆరుద్రోత్సవం వైభవంగా నిర్వహించారు. పంచ హారతులు, కుంభహారతి, నక్షత్ర హారతి, విశేష హారతులతో గర్భాలయం దేదీప్యమానంగా వెలుగొందింది. భక్తులు తిలకించి పులకించి పోయారు. కార్యక్రమంలో ఈఓ సల్వాది మోహన్బాబు, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్.శర్మ, దేవగిరి అనిల్కుమార్, నాగరాజు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకట య్య తదితరులు పాల్గొన్నారు. అన్నప్రసాద వితరణకు రూ.లక్ష విరాళం చిల్పూరు: శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతీ శనివారం నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణకు హైదరాబాద్ సౌభాగ్యపురికి చెందిన దాతలు అంచూరి హనుమంతరావు–గీత దంపతులు రూ.1,00,116 విరాళం అందజేశారు. ఈ మేరకు బుధవారం ఆలయానికి చేరుకున్న వారు ప్రత్యేక పూజల అనంతరం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, ఈఓ లక్ష్మీప్రసన్న కు విరాళం అందజేశారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక రఘునాథపల్లి: జాతీయ స్థాయి కబడ్డీ చాంపియన్ షిప్–2025(అండర్–19 బాలుర, బాలికల) పోటీలకు జిల్లా నుంచి యూ.సంతోష, జశ్వంత్ ఎంపికైనట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి వై.కుమార్గౌడ్, గట్టయ్య, ఉప్పల య్య ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్లో ఈనెల 28 నుంచి ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. అంకితభావంతో సేవలందించాలి కొడకండ్ల : వైద్యులు, సిబ్బంది అంకితభావంతో సేవలందించాలని డీఎంహెచ్ఓ మల్లికార్జున్ అన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించా రు. ఓపీ, స్టాక్ రిజిష్టర్లను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల విషయమై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం లక్ష్మక్కపల్లి సబ్సెంట ర్ను సందర్శించిన డీఎంహెచ్ఓ.. ఇమ్యునైజేష న్ కార్యక్రమాన్ని పరిశీలించారు. వైద్యాధికారి హరికృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. ● పండ్లు, కూరగాయ తోటలకు సబ్సిడీపై డ్రిప్, స్ప్రింక్లర్లు ● ఉచితంగా కూరగాయల నారు ● పూల తోటలకు 40, నీటి గుంటలకు 75శాతం రాయితీ ● 2025–26 ఆర్థిక సంవత్సరం రూ.48.80 లక్షల బడ్జెట్ఆయిల్పాం పంట సాగును పరిశీలిస్తున్న కలెక్టర్ రిజ్వాన్ బాషాజనగామ రూరల్: జిల్లాలో వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా ఆయిల్పాంతో పాటు పండ్లు, కూరగాయల తోటల పెంపకమే లక్ష్యంగా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ ముందుకు వెళ్తోంది. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలపై అవగాహన కల్పిస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 3,500 ఎకరాల్లో ఆయిల్పాం సాగు లక్ష్యంగా అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తున్నారు. పండ్ల తోటల సాగు, సబ్సిడీపై నీటి కుంటల నిర్మాణం, యాంత్రీకరణ పనిముట్లు అందివ్వడానికి బడ్జెట్ కేటాయించారు. పెరుగుతున్న ఆయిల్పాం సాగు జిల్లాలో 2021 నుంచి 2025 మార్చి వరకు ఆయిల్పాం సాగు 6,963 ఎకరాల్లో చేయగా.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 3,500 ఎకరాలుగా టార్గెట్ పెట్టుకుంది. కాగా 2వేల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉన్నట్లు గుర్తించగా, ఇప్పటి వరకు 98 ఎకరాలకు మొక్కలు పంపిణీ చేశారు. ఒక్కో మొక్కకు రూ.193 సబ్సిడీ ఇవ్వగా, రైతు రూ.20 భాగస్వామ్యంతో వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈసారి ఆయిల్పాం దిగుబడి 3వేల ఎకరాల్లో 18వేల టన్నులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు 29 మంది రైతులు 227 మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించారు. పండ్ల తోటల సాగుకు సబ్సిడీ జిల్లాలో మామిడి, నిమ్మ, జామ, సీతాఫలం, బొప్పాయ, అరటి, డ్రాగన్, అవకాడో తదితర పండ్ల తోటలు 146.50 ఎకరాల్లో సాగు లక్ష్యంగా రూ.48.80లక్షల బడ్జెట్ కేటాయించారు. రెండు సంవత్సరాల పాటు రూ.32వేల నుంచి రూ.లక్ష వరకు రాయితీ ఇవ్వనున్నారు. 12.5 ఎకరాల్లో బంతి, చామంతి, మల్లె, లోకల్ గులాబీ యూనిట్ ధర రూ.20వేలు నిర్ణయించగా.. 40 శాతంతో రూ.8వేల సబ్సిడీ ఉంది. దుంప జాతిరకంలో 5.5 ఎకరాల్లో లిల్లీ, జర్బెర, గ్లాడియోలస్ రకానికి చెందిన పూలతోటలసాగుకు యూనిట్ ధర రూ.లక్ష కాగా.. ఇందులో రూ.40వేల రాయితీ లభిస్తుంది. అలాగే ఎకరా టమాటా, వంకాయ కూరగాయల తోటలకు రూ.8వేలు, పచ్చి మిర్చికి 6,400 మొక్కలు ఉచితంగా ఇవ్వనున్నారు. మొత్తంగా 85 ఎకరాల టార్గెట్తో రైతులను ప్రోత్సహిస్తున్నారు. అంటుకట్టిన కూరగాయల సాగు కు సంబంధించి 20 ఎకరాలు లక్ష్యం పెట్టుకు ని ఎకరాకు 2వేల వంగ మొక్కలు ఇస్తారు. ఇందుకు రైతు తన వాటాగా రూ.5వేలు డీడీ తీసి ఇవ్వాల్సి ఉంటుంది. మామిడి తోటల పునరుద్ధరణ జిల్లాలో 20 ఎకరాల్లో పాత మామిడి తోటల పునరుద్ధరణకు ఒక్కో యూనిట్ రూ.24వేల చొప్పున 40శాతం(రూ.9,600)తో రాయితీ ఇస్తున్నారు. అలాగే 6 యూనిట్ల నీటి గుంటల(ఫాంపాండ్స్) నిర్మాణానికి ఒక్కో యూనిట్ ధర రూ.1.50లక్షల చొప్పున నిర్ణయించి 75శాతం(రూ.75వేలు) సబ్సిడీ ఇస్తారు. మల్చింగ్ విధానంతో కూరగా యల సాగుకు 2.50 ఎకరాలకు యూనిట్(ఎకరాకు) రూ.1,600 ధరతో రూ.8వేల సబ్సిడీ ప్రకటించారు. మిర్చి ఎండ బెట్టేందుకు 70 కేజీల సామర్థ్యంతో 36 యూనిట్ల సోలార్ డ్రయ్యర్లను ఒక్కో యూనిట్కు రూ.2.50లక్షల ధర ఉంది. ఇందులో జనరల్ వారికి 40శాతంతో రూ.లక్ష, ఎస్సీ, ఎస్టీలకు 55 శాతంతో రూ.1.37లక్షల సబ్సిడీ ఇస్తున్నా రు. 8 నుంచి 11 హెచ్పీ పవర్ టిల్లర్లు 6 మంజూరు చేశారు. సన్న, చిన్న కారు, ఎస్సీ, ఎస్టీ రైతులకు 50శాతం, పెద్ద రైతులకు 40శాతం సబ్సిడీ ఉంది. 9 పవర్ టిల్లర్లు మంజూరుకాగా.. చిన్న, సన్న, ఎస్సీ, ఎస్టీ రైతులకు 50శాతం, పెద్ద రైతులకు 40 శాతం రాయితీతో ఇస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 బ్రష్ కటర్లు మంజూరు కాగా, ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్న, మహిళా రైతులకు 50శాతం, పెద్ద రైతులకు 40శాతం, 10 స్ప్రేయర్ పంపులకు గాను ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్న, మహిళా రైతులకు 50శాతం, పెద్ద రైతులకు 40 శాతం సబ్సిడీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఆయిల్పాం సాగుపై దృష్టిజిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరం 3,500 ఎకరాల్లో ఆయిల్పాం సాగు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు 2వేల ఎకరాలు గుర్తించి 98 ఎకరా లకు మొక్కలు అందించాం. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాన్ని రైతులకు వివరిస్తున్నాం. తోటల సాగుకు ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తుతో పాటు భూమి పాస్బుక్కు నకలు, ఆధార్, బ్యాంకు ఖాతా బుక్కు, పాస్ఫొటో జత చేసి సంబంధిత ఉద్యానవన అధికారులకు అందించాలి. ఓసీ లేదా ఇతర రైతులకు 50శాతం, బీసీలకు 29శాతం, ఎస్సీ రైతులకు 15శాతం, ఎస్టీలకు 6 శాతంతో రిజర్వేషన్ల ఆధారంగా రాయితీపై మొక్కలు, తోటల సాగుకు సంబంధించి మంజూరు చేస్తాం. దరఖాస్తులు రాగానే కలెక్టర్కు పంపిస్తాం. అనంతరం సదరు అధికారి క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన తర్వాత రాయితీకి ఆర్థిక పరమైన అనుమతులు పొందుతాం. – బి.శ్రీధర్రావు, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారిపండ్ల తోటల పెంపకం, సబ్సిడీ వివరాలు (2025–26 సంవత్సరం ఎకరాల్లో..)● కలెక్టర్ రిజ్వాన్ బాషా న్యూస్రీల్పంట లక్ష్యం యూనిట్ ధర రాయితీ(40శాతం) మామిడి 65 రూ.80వేలు రూ.32వేలు నిమ్మ 7.50 రూ.80వేలు రూ.32వేలు జామ 10.00 రూ.80వేలు రూ.32వేలు సీతాఫలం 2.50 రూ.30వేలు రూ.12వేలు బొప్పాయి 20.00 రూ.30వేలు రూ.12వేలు డ్రాగన్ 9.00 రూ.2.70లక్షలు రూ.1.08లక్షలు అరటి 25.00 రూ.70వేలు రూ.28వేలు అవకాడో 7.50 రూ.50వేలు రూ.20వేలుఈ పంటల సాగుకు రెండు సంవత్సరాల పాటు రాయితీ ఇస్తారు. ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తుతో పాటు మొక్కలు, ఎరువు, పురుగు మందుల బిల్లులు జత పరిచి హార్టికల్చర్ అధికారులకు అందజేయాలి. -
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
పాలకుర్తిటౌన్/కొడకండ్ల/జఫర్గఢ్: పోలీస్స్టేషన్ వచ్చి బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ అన్నారు. బుధవారం పాలకుర్తి, కొడకండ్ల, జఫర్గఢ్ పోలీస్సేష్టన్లను సందర్శించిన ఆయన పరిసరాలు, రికార్డులు, రిసెప్ష్షన్, లాకప్, మెన్ బ్యారక్ పరిశీలించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ వెస్ట్జోన్ వర్ధన్నపేట డివిజన్ పరిధి పోలీస్స్టేషన్ల అధికారుల పని తీరును పరిశీలించేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. బాధితుల ఇచ్చిన ఫిర్యాదు తీసుకొని సత్వరమే నాయ్యం చేసేలా చర్యల తీసుకోవా లని ఆదేశించారు. అసాంఘిక చర్యలకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపాలని హెచ్చరించారు. ఆయన వెంట జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐలు జానకీరామ్రెడ్డి, శ్రీనివాస్రావు, ఎస్సైలు వపన్కుమార్, లింగారెడ్డి, యాకూబ్రెడ్డి, చింత రాజు, రామ్చరణ్ తదితరులు పాల్గొన్నారు. అంత కు ముందు శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న సీపీ.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయనను అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలతో సన్మానించి స్వామివారి ప్రసాదం అందజేశారు. ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్.శర్మ, దేవగిరి అనిల్కుమార్, మత్తగం నాగరాజు పాల్గొన్నారు. వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ -
జల సంరక్షణకు అధిక ప్రాధాన్యం
జనగామ రూరల్: జల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.. వివిధ శాఖల ద్వారా భూగర్భ జలాల సంరక్షణకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. ‘జలశక్తి అభియాన్’ కింద నేషన ల్ వాటర్ అవార్డ్స్–2024 కోసం కేంద్రం నుంచి అధ్యయన కమిటీ సభ్యులు కేంద్ర భూగర్భ జల శాఖ సైంటిస్ట్ డాక్టర్ ఎమ్.సుధీర్కుమార్, భూగర్భ జల కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ చరణ్ బుధవారం ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా వారికి కలెక్టర్ జిల్లాలో భూగర్భజల వనరుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అశ్వరావుపల్లి, చీటకో డూరు, స్టేషన్ఘనపూర్ రిజర్వాయర్ల సామర్థ్యం, సాగు, తాగు నీటి వినియోగం గురించి తెలియజేశా రు. ఉద్యానవన పంటల సాగుకు నీటి సంరక్షణలో భాగంగా స్ప్రింక్లర్లు, డ్రిప్ పరికరాల వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇదిలా ఉండగా.. చేపల పెంపకం వలన సుమారు 80వేల మంది మత్స్యకారులు లబ్ధి పొందుతున్నారని, చేపలను ఎగుమతి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్డీఓ వసంత, నీటిపారుదల ఎస్ఈ సుధీర్, వ్యవసాయం, ఫిషరీస్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. తాటికొండలో జలశక్తి బృందం స్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ మండలం తాటికొండ గ్రామంలోని వాటర్షెడ్ పథకం కింద చేపట్టిన పనులను కలెక్టర్ రిజ్వాన్బాషా, అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి కేంద్ర జలశక్తి బృందం బాధ్యులు బుధవారం పరిశీలించారు. ముందుగా తాటికొండ రైతువేదికలో మహిళా సంఘం సభ్యులతో సమావేశమై తాగునీటి సరఫరా గురించి తెలు సుకున్నారు. గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామ ని, ప్రస్తుతం వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టి ఇంటింటికీ నీరు ఇస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయం గురించి అడగ్గా.. గతంలో దిగుబడి అంతంత మాత్రమే ఉండేదని, ప్రస్తుతం భూగర్భ జలాలు పెరిగి పంటల సాగు లాభసాటిగా ఉందన్నారు. ఘన్పూర్ రిజర్వాయర్ నిర్మాణంతో భూగర్భ జలా లు పెరిగి ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని కలెక్టర్ కేంద్ర బృందానికి వివరించా రు. తాటికొండ అటవీ ప్రాంతంలో గుట్టల పైనుంచి పడుతున్న వర్షపునీరు భూమిలోకి ఇంకడానికి కందకాలను అంచలంచెలుగా నిర్మించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వసంత, డీఏఓ రామారావునాయక్, మత్స్యశాఖ అధికారి రాణాప్రతాప్, అదనపు డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్, పంచా యతీ సెక్రటరీ సత్యనారాయణ పాల్గొన్నారు. పర్యావరణంపై అవగాహన అవసరం జనగామ రూరల్: విద్యార్థులకు పర్యావరణపై అవగాహన అవసరమని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నా రు. నేషనల్ గ్రీన్ కోర్ తయారుచేసిన నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ పోటీ పోస్టర్ను బుధవారం కలెక్టరేట్లో ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘హరిత్ ద వే ఆఫ్ లైఫ్’ అనే థీమ్పై దేశవ్యాప్తంగా 1వ తరగతి నుంచి పరిశోధన విద్యార్థుల వరకు ఐదు విభాగాల్లో నిర్వహించే ఈ పోటీకి జూలై 1 నుంచి ఆగస్టు 21 వరకు రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుందని, ఎకో మిత్రమ్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. హిందీ, ఇంగ్లిష్ మరిన్ని భాషల్లో క్విజ్ ఉంటుందని, విద్యార్థులతోపాటు సామాన్య పౌరులు కూడా పాల్గొనవచ్చని వివరించారు. పోటీలో పాల్గొన్న ప్రతీ విద్యార్థికి వెంటనే ఇ–సర్టిఫికెట్ లభిస్తుందని విద్యా సంస్థలకూ ప్రత్యేక గుర్తింపు ఇస్తారని తెలిపారు. మొక్క నాటుతున్న, నీరు సేవ్ చేస్తున్న లేదా వ్యర్థాలను వేరు చేస్తున్న సెల్ఫీ అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్జీసీ కోఆర్డినేటర్ గౌసియా బేగం, ఏఎంఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. ‘స్వచ్ఛ సర్వేక్షణ్’లో అగ్రగామిగా నిలపాలి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ(ఎస్ఎస్జీ)–2025లో జిల్లాను అగ్రగామిగా నిలపాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. కలెక్టరేట్లో ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఎం, ఏపీఓ, పంచాయితీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య కార్మికుల పనితీరు బాగుండాలని చెప్పారు. గ్రామానికి 20 చొప్పున ఇంకుడు గుంతలు నిర్మించాలన్నారు. డీపీఓ స్వరూప, డీఎల్పీఓ వెంకట్రెడ్డి, కర్ణాకర్ పాల్గొన్నారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
● ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు లవకుమార్ రఘునాథపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పొదల లవకుమార్ అన్నారు. మంగళవారం ఎస్ఎఫ్ఐ, ఎంఎస్ఎఫ్ల ఆధ్వర్యంలో మండలంలోని వెల్ది మోడల్ స్కూల్ను సందర్శించారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లవకుమార్ మాట్లాడుతూ మోడల్ స్కూల్లో మరమ్మతుకు నోచుకోని వాటర్ ప్యూరిఫయర్ను అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతు చేయించాలన్నారు. మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులు చెల్లించాలని, వర్షాకాలం నేపధ్యంలో పాఠశాలల ఆవరణలో గడ్డి తొలగించి శుభ్రం చేయాలని, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి, పూర్తిస్థాయిలో పుస్తకాలు అందించాలన్నారు. లేదంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ అధ్యక్షుడు ఉదయ్, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆర్య, శివకృష్ణ, అరుణ్, సామరాజు తదితరులు ఉన్నారు. -
డ్రగ్స్ రహిత కమిషనరేటే లక్ష్యం
● సీపీ సన్ప్రీత్సింగ్ వరంగల్ క్రైం: డ్రగ్స్ రహిత వరంగల్ పోలీస్ కమిషనరేట్గా గుర్తింపు సాధించడమే మనందరి లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకుని డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్పోస్టర్లను మంగళవారం సీపీ ఆవిష్కరించారు. ఈసందర్భంగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలను సమాజం నుంచి తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. వారోత్సవాల్లో భాగంగా విద్యాసంస్థల్లో, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో డ్రగ్స్పై అవగాహన కల్పించడంతో పాటు, ర్యాలీలు, డ్రాయింగ్, వ్యాస రచన పోటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా, వినియోగించినా 87125 84473 నంబ ర్లో సమాచారం అందించాలని సూచించారు. కా ర్యక్రమంలో అదనపు డీసీపీ రవి, సీసీఆర్బీ ఏసీపీ డేవిడ్ రాజు, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
జనగామ రూరల్: జిల్లా కేంద్రం స్థానిక ధర్మకంచలో జెడ్పీహెచ్ఓస్ బాయ్స్ హైస్కూల్లో సోషల్ వాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు డీఈఓ భోజన్న పాల్గొని మాట్లాడుతూ క్రీడాస్ఫూర్తితో పోటీలు విజయవంతం చేయాలన్నారు. విద్యార్థులు డ్రగ్స్ వాడకుండా అవగాహన కల్పించాలన్నారు. డీడబ్ల్యూఓ ఫోరెన్స్, మంగళంపల్లి రాజు, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి వెంకట్ రెడ్డి, ఎస్ఓ శ్రీనివాస్, సభ్యులు కౌశిక్, నల్ల రాహుల్ ప్రవీణ్, ఆసర్ల సుభాష్, నరసింహ, వెంపటి అజయ్, చిటుకుల అశోక్, దేశ్ పాండే సంస్థ ప్రతినిధులు చిన్న రాజేందర్, తదితరులు పాల్గొన్నారు. -
రైతుల ఆనందమే ప్రభుత్వ ధ్యేయం
లింగాలఘణపురం: రైతు కళ్లల్లో ఆనందం చూడటమే ప్రభుత్వ ధ్యేయమని, కేవలం 9 రోజుల్లో రూ.9వేల కోట్ల రైతుభరోసాను వారి ఖాతాల్లో జమ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం మండలంలోని బండ్లగూడెం రైతువేదికలో సీఎంతో ముఖాముఖి కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీఏఓ రామారావునాయక్, రైతులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర లోపు 25లక్షల మందికి రూ.21వేలకోట్ల రుణమాఫీ, సన్నాలకు బోనస్ అందించామన్నారు. రైతు సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ప్రతీహామీని అమలు చేసి ప్రజలకు మేలు చేయడం కోసమే సీఎం రేవంత్రెడ్డి పని చేస్తున్నారని, రైతుభరోసా అందజేసి రైతులకు పెట్టుబడిగా అందించిన సందర్భంగా నియోజకవర్గ ప్రజల పక్షాన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం 9 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, ఏఓ వెంకటేశ్వర్లు, ఏఈఓలు స్పందన, శ్రీనివాసు, జనగామ మార్కెట్ వైస్ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివకుమార్, మార్కెట్ డైరెక్టర్లు మోహన్, శ్రీలతారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీశైలం, మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్రెడ్డి, నాయకులు దిలీప్రెడ్డి, నాగేందర్, గణపతి, సంపత్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి జిల్లాలోని రైతువేదికల్లో సీఎంతో ముఖాముఖి -
వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి
జనగామ రూరల్: ప్రజల భాగస్వామ్యంతో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మంత్రి కొండా సురేఖతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వన మహోత్సవంలో భాగంగా ప్రతీ ఇంటికి మొక్కలు అందించడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ఆయా గ్రామాల్లో కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఇప్పటికే లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించామన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇసుక ఉచితంగా సరఫరా చేస్తుందన్నారు. అలాగే జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ వీసీలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. భూగర్భ జల సంరక్షణ అందరి బాధ్యత భూగర్భ జల సంరక్షణ అందరి బాధ్యతని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. తక్కువ ఖర్చుతో ఇంకుడుగుంతల నిర్మాణం, మ్యాజిక్ సోక్ పిట్స్, ఫారమ్ పాండ్ నిర్మాణాలకు సంబంధించిన పోస్టర్ని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్తో కలిసి కలెక్టరెట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కలెక్టరేట్లో ఇంకుడుగుంత నిర్మాణం ప్రారంభించారు. భూగర్భ జలసంరక్షణకు సహకరించాలన్నారు. ఎత్తిపోతల పనులు త్వరగా పూర్తి కావాలి దేవాదుల ఎత్తిపోతల పనులు త్వరగా పూర్తి కావా లని స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అ న్నారు. మంగళవారం దేవాదుల ఎత్తిపోతల పనుల ప్రగతిపై కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్సింగ్లతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ అశ్వరావుపల్లి కుడి ప్రధాన కాల్వ పనులను నెల రోజులలో పూర్తి చేయాలన్నారు. పంపింగ్లో ఎలాంటి సమస్యలు లేకుండా ముందుగానే రిజర్వాయర్లు నింపి పెట్టుకోవాలన్నారు. ధర్మసాగర్ నుంచి నీటి డిస్ట్రిబ్యూషన్పై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ధర్మసాగర్, ఘన్పూర్, నవాబ్పేట, అశ్వరావుపల్లి రిజర్వాయర్లను 20 రోజుల్లో నింపాలని, ధర్మసాగర్ నార్త్, సౌత్ కెనాల్స్ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరు చేరాలన్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ సీఈ అశోక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావణ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఇరిగేషన్ శాఖ అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. వీసీలో సీఎస్ రామకృష్ణారావు -
కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉండాలి
● జిల్లా గిరిజన సహాయ అధికారి రూపాదేవి పాలకుర్తి: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన ఉండాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ సహాయ అధికారి రూపాదేవి అన్నారు. మంగళవారం మండలంలోని కొండాపురం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలుపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. రేషన్ కార్డులు, కుల ధృవీకరణ, కిసాన్ పథకాలు, బ్యాంకు అకౌంట్, పెన్షన్లు, ప్రధాన మంత్రి జనశ్రీ బీమా యోజన తదితర పథకాలపై అవగాహన ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాములు, పశువైద్యాధికారి అశోక్ రెడ్డి, ఏపీఓ మంజుల, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాకేష్, గణేశ్, మహేష్, సిద్దారెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు. -
శ్యామాప్రసాద్ ముఖర్జీని ఆదర్శంగా తీసుకోవాలి
జనగామ రూరల్: నేటి యువత డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీని ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ జి ల్లా అధ్యక్షుడు చౌడ రమేశ్ అన్నారు. మంగళవారం జనగామ పట్టణంలో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ బలి దాన్ దివాస్ పురస్కరించుకొని ఆయన జ్ఞాపకార్థం ‘ఒక మొక్క–అమ్మ పేరు మీద’ అనే కార్యక్రమంలో భాగంగా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కత్తుల లక్ష్మి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు హాజరై మాట్లాడుతూప్రతిఒక్కరూ మొక్కలు నాటా ల న్నారు. కార్యక్రమంలో శివరాజ్ యాదవ్, ఎల్ల య్య, అనిల్, నవీన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ సదస్సులకు దరఖాస్తుల వెల్లువ
14 1,510లింగాల ఘణపురం20 1,044జనగామ బచ్చన్నపేట 23 2,504దేవరుప్పుల 13 1,00308 1,151రెవెన్యూ సదస్సులో దరఖాస్తును పరిశీలిస్తున్న కలెక్టర్ రిజ్వాన్బాషా (ఫైల్)మండలాల వారీగా దరఖాస్తులు● భూ భారతిలో లేని ఆప్షన్లకే ఎక్కువ వినతులు●● ఇప్పటికే ఆన్లైన్ ప్రక్రియ షురూ ● సత్వర పరిష్కారానికి అధికారుల చర్యలు08 1,013నర్మెట తరిగొప్పుల గ్రామాలు దరఖాస్తులుజనగామ రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులు జిల్లాలో విజయవంతంగా ముగిశాయి. పైలట్ ప్రాజెక్టుగా స్టేషన్ఘన్పూర్ మండలంలో దరఖాస్తుల స్వీకరణ విజయవంతం కావడంతో ఈ నెల 4వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహించారు. 176 రెవెన్యూ గ్రామాల పరిధిలో రైతుల నుంచి వివిధ సమస్యలపై 18,929 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల సత్వర పరిష్కారానికి కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుంది. సదస్సులు ముగిసిన రోజు నుంచే ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించగా, మండల స్థాయిలో పరిష్కారానికి నోచుకోని దరఖాస్తులను జిల్లా అధికారులకు పంపించనున్నారు. తహసీల్దార్కు కీలక బాధ్యతలు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భవిష్యత్లో సమస్యలు ఉత్పన్నం కాకుండా ధరణి పోర్టల్ను తీసుకువచ్చింది. కానీ ధరణి ఆప్షన్లో తహసీల్దార్, ఆర్డీఓ, ఏసీ కోర్టు లేకపోవడం క్షేత్ర స్థాయి నుంచి కాకుండా కలెక్టర్కు హక్కులను కల్పించడంతో రైతుల కొంత మేర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్రెడ్డి ధరణి స్థానంలో భూ భారతి తీసుకువచ్చారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో తహసీల్దార్ నుంచి ఆర్డీఓలకు కీలక బాధ్యతలను అప్పగిస్తూ ఈ పోర్టల్కు రూపకల్పన చేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు చిన్న చిన్న సాంకేతిక సమస్యలు కూడా ఉండకూడదనే ఉద్దేశ్యంతో మొదటగా పైలట్ గ్రామాలను ఎంపిక చేసి భూ భారతి రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. పైలట్ గ్రామాల్లో విజయవంతం కావడంతో అన్ని గ్రామాల్లో అమలు చేశారు. ఒక్కో గ్రామంలో దరఖాస్తులు అధిక సంఖ్యలో రావడంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆప్షన్లు లేని వాటికే ఎక్కువ.. జిల్లాలోని 176 రెవెన్యూ గ్రామాల పరిధిలో భూ భారతి రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. ఇందులో 18,929 మంది రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తులు చేసుకున్నారు. 17 మాడ్యూల్స్కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ జరుగగా, అత్యధికంగా ఇందులో లేని ఆప్షన్లకు 8,512 దరఖాస్తులు రావడం గమనార్హం. మిస్సింగ్ సర్వే నంబర్ 2,959, పెండింగ్ మ్యుటేషన్ (కోర్టు ఆర్డర్స్) 1,583, డీఎస్ పెండింగ్ (డిజిటల్ సైన్) 291, ఎక్స్టెంట్ 1,580, పట్టాదార్ పాస్ బుక్కులో నేమ్ చేంజ్ 142, ప్రొహిబిటెడ్ నుంచి డిలీషన్ 163, అసైండ్ ల్యాండ్ ఇష్యూస్ 388 దరఖాస్తులు వచ్చాయి. భూములను హోల్డింగ్లో ఉంచడం, నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, వారసత్వం, అసైన్డ్, ఓఆర్సీ, 38–ఇ, భూ యజమాని తండ్రి పేరు, కులం, ఆధార్ నంబర్ల తప్పులు, మ్యుటేషఫన్, డిజిటల్ సంతకం, పట్టాదార్ పుస్తకాల్లో భూములు ఎక్కలేదని దరఖాస్తుల్లో పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులను స్వీకరించే సమయంలో రోజు వారీగా కలెక్టర్కు నివేదించారు. కలెక్టర్ వాటిని పరిశీలన చేసి నివేదిక రూపంలో సీసీఎల్ఏకు పంపించారు. కలెక్టర్ పర్యవేక్షణలో రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ ఆధ్వర్యంలో ఆర్డీఓలు గోపీరామ్, డీఎస్ వెంకన్న ఆధ్వర్యంలో తహసీల్దార్లు రెవెన్యూ సదస్సులను విజయవంతంగా ముగించారు. రఘునాథపల్లి19 3,535చిల్పూరు12 66613 1,062స్టేషన్ఘన్పూర్16 850జఫర్గఢ్●పాలకుర్తి21 3,619కొడకండ్ల 09 972మొత్తం 176 18,929 -
ప్రైవేటీకరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి
● రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చందునాయక్ జనగామ రూరల్: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ల ప్రైవేటీకరణ చేయాలని తీసుకువచ్చిన ముసాయిదా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందునాయక్ డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్బాషాకు సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో 2014 సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని డాక్టర్ స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు అమలు చేయడంలేదన్నారు. ఇప్పటికై న ప్రభుత్వం తమ ఆలోచనను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే రాబోయో కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య, నాయకులు నక్క యాకయ్య, నక్క సారయ్య, మహిళా నాయకురాలు రాపర్తి రజిత పాల్గొన్నారు. ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలిజనగామ రూరల్: యూపీఎస్సీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోచింగ్కు ప్రవేశ పరీక్షకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులా ల అభివృద్ధి అధికారి బి.విక్రమ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 13న ప్రవేశ పరీక్ష ఉంటుందని, అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండాలని, డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ అభ్యర్థులు జూలై 7వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
డయేరియాపై అవగాహన కల్పించాలి
జనగామ రూరల్: డయేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో డయేరియా క్యాంపెయిన్– 2025ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 31వ తేదీ వరకు చేపడుతున్న డయేరియా ప్రచారం విస్తృతంగా చేపట్టాలని, ప్రతిఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. గ్రామాలు, సబ్ సెంటర్లు, పీహెచ్సీల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. జిల్లాలో ఐదు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు ఓఆర్ఎస్ తాగించాలని, జింక్ టాబ్లెట్లు వాడాలన్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక యాత్ర.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి విహారయాత్ర ప్యాకేజీని రూపొందించిన ప్రత్యేక యాత్ర పోస్టర్ను కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ స్వాతితో కలిసి మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ ప్రత్యేక యాత్ర ప్రదేశాలు చూడాలనుకునే వారికి ఐదు రూట్లో ప్రయాణించేందుకు ప్రత్యేక విహార యాత్ర టూర్ ప్యాకేజీ అవకాశం కల్పించిందన్నారు. రూట్ –1లో రంగాపురం, బీచుపల్లి, జోగులాంబ యాత్రకు పెద్దలకు రూ.1100, పిల్లలకు రూ.600, రూట్–2లో పర్ణశాల, భద్రాచలం, కిన్నెరసాని డ్యాం, మల్లూరు, బొగత, మేడారం, రామప్ప, లక్నవరం ఉందని, పెద్దలకు రూ.1300, పిల్లలకు రూ. 700 చార్జీ కేటాయించినట్లు తెలిపారు. ఇలా రూట్ –3, 4, 5లో కూడా వివిధ ప్రదేశాలు ఉన్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 7382852923, 7382852818, 9948164847, 7981951562 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎండీ హుస్సేన్, ఎస్ఎం ఎం. సమ్మయ్య, సూపరింటెండెంట్ వై.యాదమణిరావు, ఎం ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ క్రీడా సంబురాల పోస్టర్ ఆవిష్కరణ సోషల్ వాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో తెలంగాణ క్రీడా సంబురాల పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ క్రీడలో గెలుపొందిన వారు మొదటి బహుమతిగా రూ.లక్ష పొందవచ్చన్నారు. యువత చెడు మార్గాన్ని వీడి, సన్మార్గంలో పయనించాలన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
నిర్మాణాలు సాగేదెలా?
లింగాలఘణపురం: ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సాగెదెలా? అంటూ లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఒక్కసారిగా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో ఇన్నాళ్లు వేచి చూసిన వ్యాపారస్తులు ఒకేసారి దోచుకునేందుకు సిద్ధమయ్యారు. ఽఇసుక నుంచి మొదలుకొని సిమెంట్, స్టీలు, మేసీ్త్రల రేటు, కూలీల ధరలు పెరగడంతో ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలతో ఇల్లు నిర్మాణం పూర్తయ్యేనా అంటూ ఆందోళనలో పడుతున్నారు. మండలంలో మొదటి విడతగా పైలెట్ ప్రాజెక్టుగా కొత్తపల్లిలో 35 ఇళ్లు మంజూరు చేయగా రెండో విడతగా 20 పంచాయతీల్లో 370 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే 200లకు పైగా ఇళ్లను ఆయా గ్రామాల్లో మాజీ ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు అట్టహాసంగా ముగ్గులు పోసి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధరలు ఇలా.. 400 స్క్వేర్ ఫీట్లలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకుంటే పునాదికి రూ.19,000, సిమెంట్ రూ.42,000, స్టీలు 800 కిలోలకు రూ.45,000, 20 ఎంఎం కంకర 4 ట్రాక్టర్లకు రూ.14,000, 40 ఎంఎం కంకర 2 ట్రాక్టర్లకు రూ.5,000, ఇసుక రవాణా చార్జీలు 8 ట్రాక్టర్లకు రూ.8,000, పునాది రాయికి 3 ట్రాక్టర్లకు, మేసీ్త్ర చార్జీలు రూ.49,000, సిమెంట్ ఇటుకల గోడ నిర్మాణానికి రూ.1,10,200, ఆర్సీసీ దర్వాజలు, కిటికీలకు (బెండ్లు) రూ.17,000, తలుపులు, కిటికీలకు (డోర్స్) రూ.23,000, స్లాబు సెంట్రింగ్ చార్జీలు రూ.27,000, గోవ చార్జీలు రూ.13,000, కాంక్రీట్ మిల్లర్ కిరాయి, ప్లాస్టరింగ్కు రూ.34,000, ఇళ్లు పూర్తైన అనంతరం కరెంట్, శానిటరీ, నీటి సరఫరా, మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.66,000, కలరింగ్కు రూ.5,000 ఇలా రూ.5 లక్షలతో 400 స్క్వేర్ ఫీట్లలో ఇల్లు నిర్మించుకొనేందుకు ప్రభుత్వం ధరలను నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో మరోలా.. ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసేందుకు మేసీ్త్రల రేటు రూ.1,35,000 లక్షలు నిర్ణయించగా ఒక్కొక్క గ్రామంలో ఒక్కోవిధంగా కొనసాగుతుంది. అందులో స్క్వేర్ ఫీటు రూ.350 నుంచి రూ.450 వరకు ఉంది. ఇసుక ట్రిప్పు రవాణా చార్జీలతో కలిపి రూ.4,500, 20 ఎంఎం కంకర రూ.3,000, 40 ఎంఎం కంకర రూ.3,500, సిమెంట్ సాధారణ రకం బస్తాకు రూ.300, స్టీలు క్వింటాకు సాధారణ రకం రూ.5,600 ఇలా ప్రతీ మెటీరియల్కు ధరలు పెరిగిపోయాయి. పిల్లర్లు రంద్రాలు తీసేందుకు జేసీబీతో ఒకదానికి రూ.800, కూలీలైతే రూ.1,200 వరకు చెల్లించాల్సి వస్తుంది. మండల స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ధరల నియంత్రణకు ఉన్న కమిటీ చర్యలు మాత్రం తీసుకోవడంలేదు. రూ.5లక్షలతో ఇందిరమ్మ ఇల్లు పూర్తయ్యేనా? ధరల నియంత్రణ చేసేదెవరు..? మెటీరియల్కు పెరిగిన ధరలు మేసీ్త్ర, కూలీలకు ఒక్కొక్కచోట ఒక్కో రేటు లబోదిబోమంటున్న లబ్ధిదారులు! -
విద్యార్థులు లక్ష్యాలు ఎంచుకోవాలి
● డీఈఓ భోజన్న బచ్చన్నపేట: ప్రతీ విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని చదవాలని జిల్లా విద్యాధికారి భోజన్న అన్నారు. సోమవారం మండలంలోని ఇటుకాలపల్లి గ్రామంలోని సెకండరీ పాఠశాలలో ఆదిరెడ్డి అకాడమీ చైర్మన్, కల్నల్ సి.నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతిలో ఉత్తమ మార్కులు వచ్చిన విద్యార్థులకు బహుమతులను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి ప్రోత్సాహంతో విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఇర్రి వెంకట్రెడ్డి, ప్రధానోపాధ్యాయులు విజయ, బాలకిషన్రావు, సుధాకర్, ఇంద్రసేనారెడ్డి, మధుకర్రెడ్డి, ఇన్చార్జ్ గొట్టె కనుకయ్య, టీచర్లు లక్ష్మి, పావని, యాదగిరి, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.