breaking news
Jangaon
-
సంక్షేమ పథకాలు అందరికీ అందాలి
● ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య బచ్చన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికి అందాలన్నదే సీఎం రేవంత్రెడ్డి లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం మండలంలోని కొడవటూర్ గ్రామంలోని శ్రీ సిద్ధేశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదినం, బ్రహ్మోత్సవాల సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిద్ధేశ్వరాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ చిందం వంశీ, ఆలయ ప్రదాన పూజారి ఓం నమశివాయ, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, సీపీఐ చేర్యాల మండల కార్యదర్శి జంగిలి యాదగిరి, ఆలయ సిబ్బంది లక్ష్మికాంత్రెడ్డి, శ్రీనివాస్, బానుప్రకాష్రెడ్డి, గుర్రపు బాల్రాజు, జిల్లా సందీప్, జంగిడి సిద్దులు తదితరులు పాల్గొన్నారు. -
కమనీయం..శివకల్యాణం
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో ఆదివారం రాత్రివేద పండితుడు తాటిపాముల నరసింహమూర్తి శర్మ నేతృత్వంలో శివ పార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలబ్రాలు తీసుకొచ్చారు. 107 జంటలు కల్యాణంలో పాల్గొన్నాయి. ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, ఆర్చకులు,భక్తులు పాల్గొన్నారు. సిద్ధులగుట్టలో.. బచ్చన్నపేట: మండలంలోని కొడవటూరు సిద్ధేశ్వరాలయంలో వీరశైవ సాంప్రదాయం ప్రకారం ఆలయ ప్రధాన అర్చకుడు ఓం నమఃశివాయ మంత్రోచ్ఛరణల నడుమ ఆదివారం రాత్రి 9 గంటలకు శివపార్వతుల కల్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిపించారు. గ్రామ సర్పంచ్ నీల కవితమురళి, ఈఓ వంశీ స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. కల్యాణ తంతు అనంతరం మహిళలు అమ్మవారికి ఓడిబియ్యం పోసి, కానుకలు సమర్పించుకున్నారు. కొడవటూర్, బచ్చన్నపేట ఒగ్గు కళాకారులు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కల్యాణ మహోత్సవం ముగిసిన అనంతరం శివపార్వతుల దేవతామూర్తులతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నూకల బాల్రెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మల్లారెడ్డి, సర్పంచ్లు ఆరె రవికుమార్, నల్ల సిద్దినర్సమ్మ, ఇ జ్జగిరి రాములు, అర్చకుతు, సిబ్బంది, పలువురు పాల్గొన్నారు. నర్మెట సీఐ అబ్బయ్య పర్యవేక్షణలో ఎస్సై ఎస్కే హమీద్ బందోబస్తు నిర్వహించారు. -
సమాన ఓట్లు వస్తే లాటరీ!
జనగామ: జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఇరు పార్టీలకు సమాన ఓట్లు పడే అవకాశం ఉండడంతో లాటరీ ద్వారా పురపాలిక చైర్మన్న్ ఎన్నుకునే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వెల్లడించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఇరు పార్టీల అంగీకారంతో ఈ ప్రక్రియ నిర్వహించబడనుందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సూచించిన చైర్మన్ అభ్యర్థుల పేర్లను ఒక్కొక్కరికి ఐదు చీటీల రూపంలో సిద్ధం చేసి, ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన ఓ డబ్బాలో వేసి, వీడియో సర్వైలెన్స్ పర్యవేక్షణలో అందరి సాక్షిగా లాటరీ తీస్తారు. చీటీలో రెండు పార్టీలు కోరంతో సమావేశానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నందున నేడే లాటరీ జరగవచ్చు. అయితే, ఏదైనా పార్టీ సమావేశానికి రాలేని పక్షంలో కోరం లేని సమయంలో ప్రక్రియ వాయిదా పడే అవకాశం ఉంది. నేటి ప్రజావాణి రద్దు జనగామ రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికతో పాటు ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నందున ప్రజలు గమనించాలని కలెక్టర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ‘స్టేషన్’ విప్గా సంపత్రాజ్ స్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ విప్గా 9వ వార్డు నుంచి కౌన్సిలర్గా ఎన్నికై న సౌదరపెల్లి సంపత్రాజ్ను నియమించినట్లు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఈ మేరకు హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో సంపత్రాజ్కు విప్గా నియమిస్తూ నియామక పత్రాన్ని అందించారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లులోని 9వ వార్డుకు చెందిన సంపత్రాజ్ను విప్గా నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ వర్సిటీ టోర్నమెంట్కు కేయూ జట్టు కేయూ క్యాంపస్: రొహతక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో ఈనెల 15న ప్రారంభమైన ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ క్రాస్క్రంటీ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ క్రాస్కంట్రీ పురుషుల జట్టును స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య ప్రకటించారు. జె.రాఘవ, జె.రిషిక్, ఎం.అఖిల్, జె.అనిల్, జి.శివకుమార్, ఎండీ హబీబుద్దీన్ జట్టులో ఉన్నారని ఆయన తెలిపారు. ఈజట్టుకు కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కె.శ్రీధర్కుమార్ కోచ్ కం మేనేజర్గా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
సోమేశ్వరాలయంలో ఏర్పాట్ల పరిశీలన
సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో జరిగే మహారాత్రి బ్రహ్మోత్సవాలను అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. శనివారం మండలకేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బ్ర హ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్, లడ్డూ ప్రసాదం తయారు చేయు వంట గది, పోలీసు క్యాంపును కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. డీఆర్డీఓ పీడీ వసంత, ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, ఏసీపీ నర్సయ్య, విద్యుత్ డీఈ సారయ్య, ఆర్డబ్ల్యూ డీఈ నవీన్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్బాషా జిలాల్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పరోక్ష ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)ను కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాలు జారీ చేశారు. శనివారం కలెక్టరేట్ నుంచి అధికారులతో గూగుల్ మీట్లో మాట్లాడారు. ఉదయం 11 గంటలకు సంబంధిత మున్సిపల్ కార్యాలయ సమావేశం హాళ్లలో ప్రారంభమవుతుందన్నారు. ఎన్నికకు 50 శాతం మంది హాజరు కావాలన్నారు. సభ్యులతో 11 గంటలకు ప్రమాణ స్వీకారం నిర్వహించి, మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్మన్, అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తామన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరఫున ఎన్నికై న సభ్యులు పార్టీ విప్ను తప్పనిసరిగా అనుసరించాలన్నారు. ఎన్నిక సమావేశ ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న, తహసీల్దార్లు, మాస్టర్ ట్రేనర్లు పాల్గొన్నారు. -
ఉత్తమ ఫలితాలు
ఇష్టంతో చదివితేనేదేవరుప్పుల: విద్యార్థులు భవిష్యత్లో రాణించాలంటే కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఉత్తమ ఫలితాలు వస్తాయని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. శనివారం మండలకేంద్రంలోని తిరుమల గార్డెన్లో దేవరుప్పుల మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో త్వరలో జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల సన్నద్ధం కోసం మండల స్థాయిలో తలపెట్టిన ప్రేరణ కార్యక్రమం ఎంఈఓ జి.కళావతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి.. జిల్లా ప్రథమ స్థానం సాధించుటకు విద్యార్థులు మరింత శ్రమించి చదవాలన్నారు. పరీక్షలు అంటే భయం లేకుండా నమ్మకంగా ఉండాలని, చదువుతోపాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనన్నారు. గత సంవత్సరం జిల్లాలో టాప్ మార్కులతో నిలిచిన టాపర్లను ఆదర్శంగా తీసుకొని ఉత్తమ మార్కులు సాధించాలన్నారు. అంతకుముందు సబ్జెక్టు ఉపాధ్యాయులు రూపొందించిన ఏడు సబ్జెక్టుల ప్రత్యేక స్టడీ మెటీరియల్ను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కర్నూలుకు చెందిన మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ వి. బ్రహ్మారెడ్డి విద్యార్థులకు చదువు, వ్యక్తిత్వము, ఆరోగ్యం, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ఏకాగ్రత, వ్యక్తిత్వ నిర్మాణం గురించి సందేశమందించారు. హైకోర్టు అడ్వకేట్ ఈటూరు శ్రీనివాసరావు బాలికల విద్య ప్రాముఖ్యత, వివిధ కోర్సులు, అవకాశాల గురించి వివరించి, మండల విద్యా విషయాలకు తన వంతు తోడ్పాటును అందిస్తామన్నారు. కార్యకమంలో జనగామ ఏరియా ఆస్పత్రి ఆర్ఎంఓ కోటాచలం, ఏఎంఓ బొమ్మనబోయిన శ్రీనివాస్, దేవరుప్పుల సర్పంచ్ పెద్ది కృష్ణమూర్దిగౌడ్, హెచ్ఎం విష్ణువర్దన్రెడ్డి, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. క్రీడలతో మానసికోల్లాసం జనగామ రూరల్: క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. జిల్లా స్థాయి సీఎం కప్ 2025లో భాగంగా శనివారం మినీస్టేడియం, సోషల్ వెల్ఫేర్లో వాలీబాల్, కబడ్డీ, చెస్, క్యారమ్, యోగా, నెట్బాల్, ఫుట్బాల్ తదితర క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మకంచలోని మినీస్టేడియంలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతోపాటు క్రీడల్లోనూ పాల్గొనేలా ప్రోత్సహించాలన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో రాణించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి కోదండరాములు, సెక్రటరీ ఘోర్ సింగ్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 18వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.ఆలయ ఈఓ లక్ష్మి ప్రసన్న, డీఆర్డీఓ వసంత, ఏసీపీ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
బుగులు వేంకటేశ్వరుడికి వారకల్యాణం
చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారికి అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేద మంత్రాల నడుమ వైభవంగా వార కల్యాణం నిర్వహించారు. ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు ఆధ్వర్యంలో రామోజు వెంకటేశ్వర్లు–విశాల, ఆదిమూలం సునీల్కుమార్–సాగరికలు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో దాత సంగోజు మోహనాచారి– శంకరలక్ష్మి, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్, వీరన్న, మల్లికార్జున్, హరిశంకర్, కృష్ణ పాల్గొన్నారు. సోమేశ్వరాలయంలో ధ్వజారోహణంపాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. గుట్టపై మహామండపంలో గణపతి పూజా, పుణ్యాహవచనం, పంచగవ్వం, అంకురాప్పణ, రుత్తిక్వరుణ, ధ్వజారోహణ, వేదస్వస్తి, త్రిశూలపూజ, స్వామివారికి అభిషేకాలు, అఖండ దీపారాధన అర్చకులు నిర్వహించారు. ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, ఏసీపీ అంబటి నర్సయ్య, సూపరింటెండెంట్ వెంకటయ్య, ప్రధాన అర్చకుడు దేవగిర లక్ష్మన్న, అర్చకులు డీవీఆర్శర్మ, అనిల్కుమార్, నాగరాజు, భక్తులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి సదస్సుకు ఎంపికజనగామ రూరల్: జనగామ పట్టణానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, పరిశోధకుడు, సీనియర్ తెలుగు అధ్యాపకుడు కోడం కుమారస్వామి జాతీయస్థాయి సదస్సుకు ఎంపికయ్యారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 17, 18 తేదీల్లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సహకారంతో నిర్వహిస్తున్న ఐరన్ మ్యాన్ విజినరీ లీడర్షిప్ – లిబరేషన్ ఆఫ్ హైదరాబాద్ అనే అంశంపై రెండు రోజుల సదస్సు జరగనుంది. ఈ సదస్సులో కుమారస్వామి కాళోజీ కవిత్వం–నిజాం పాలన వ్యతిరేకత అనే అంశంపై పరిశోధన పత్రం సమర్పించి ప్రసంగించనున్నారు. జాతీయ సదస్సుకు ఎంపికై న కుమారస్వామిని జనగామ రచయితల సంఘం అధ్యక్షుడు నక్క సురేష్, జి.కృష్ణ, సోమేశ్వర్, పానుగంటి రామ్మూర్తి, శ్రీనివాస్ తదితరులు అభినందనలు తెలిపారు. తల్లుల దీవెనలతో ప్రజలకు సేవ చేస్తాంఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మల తల్లుల దీవెనలతో ప్రజలకు మరింత సేవ చేస్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నూతనంగా ఎన్నికై న స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లతో కలిసి ఆయన శనివారం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు ఎత్తు బంగారం, చీరసారె, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలకు మరింత సేవ చేయాలని సంకల్పించామని తెలిపారు. ఆలయ సంప్రదాయ ప్రకారం దేవాదాయశాఖ అధికారులు, పూజారులు కడియం శ్రీహరితోపాటు నూతనంగా ఎన్నికై న కౌన్సిలర్లకు డోలి వాయిద్యాలతో స్వాగతం పలికారు. కంప్యూటర్ సైన్స్ బీఓఎస్గా రమేశ్ కేయూ క్యాంపస్: కేయూ లోని కంప్యూటర్ సైన్స్ విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా (బీఓఎస్) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.రమేశ్ను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రా మచంద్రం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు బీఓఎస్గా పనిచేసిన డాక్టర్ మంజుల పదవికాలం ముగియడంతో రమేశ్ను ని యమించారు. రమేశ్ ఈ పదవిలో 2 సంవత్సరాలపాటు కొనసాగనున్నారు. -
16ః16
జనగామ చైర్మన్ పీఠానికి చేరి సగం బలం జనగామ: జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ సమాన బలం, స్వతంత్రుల కీలక మద్దతు, ఎక్స్అఫీషియో ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు అన్నీ కలిసి రాజకీయ సమీకరణాలను మరింత క్లిష్టం చేశాయి. 16ః16 ఓట్ల సమీకరణతో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ కనిపించక చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందనే విషయం పెద్ద ప్రశ్నగా మారింది. స్వతంత్రుల వైఖరి, పార్టీల క్యాంపు రాజకీయాలు 16న జరిగే ఎన్నికలను హాట్టాపిక్గా మార్చాయి. జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై రాజకీయ ఉ త్కంఠ పీక్ స్టేజీకి చేరింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇరు పార్టీలకూ సమాన సీట్లు రావడం, నలుగురు స్వ తంత్రుల్లో ఇద్దరు చొప్పున రెండు పార్టీలకు మద్దతు ఇవ్వడంతో ఎవరు చైర్మన్ పీఠం అధిరోహిస్తారన్న దానిపై అనిశ్చితి నెలకొంది. స్థానిక పురపాలక రాజకీయాల్లో అరుదుగా కనిపించే ఇలాంటి సమీకరణాలు జనగామలో హాట్టాపిక్గా మారాయి. ఇ టీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 12, ఆ పార్టీ మద్దతుతో గెలుపొందిన సీపీఎంకు–1, బీఆర్ఎస్ 13, స్వతంత్రులు 4 స్థానాలు గెలుచుకున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు సాధించాలంటే కనీసం 16 ఓట్లు అవసరం. ఇక్కడే అసలు స స్పెన్స్ మొదలైంది. ఎక్స్అఫీషియో ఓటుగా బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, కాంగ్రెస్ తరఫున ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి ఓటు హ క్కు వినియోగించనున్నారు. దీంతో ఇరు పార్టీలకూ స్వతంత్రుల మద్దతుతో సమానంగా 16 ఓట్లు చేరుతున్నాయి. ఇదే సమాన బలం ఉండగా, రాబోయే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఎవరి గెలుపునైనా ప్రశ్నార్థకంగా మార్చేయనుంది. నలుగురు స్వతంత్రుల్లో ఇద్దరు బీఆర్ఎస్ క్యాంపులో, మరొకరు కాంగ్రెస్కు పూర్తి మద్దతు ప్రకటించగా, మరో స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్తో చర్చలు కొనసాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇరు పార్టీలకు 16ః16 ఓట్ల సమీకరణంలో ఎవరు చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు దక్కించుకుంటారన్నది ఇప్పుడు జనగామ రాజకీయాల్లో పెద్ద ప్రశ్నగా మారింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమకు పూర్తి మెజార్టీ వస్తుందని నమ్మినా, ప్రచారంలో స్వతంత్రులతో కలిసి పెద్ద ఎత్తున డబ్బుల లావాదేవీలు జరిగినట్లు ప్రచారం. ఓటర్లు ఇరు పార్టీల నుంచి డబ్బులు తీసుకుని ఎవరి మనసు నొప్పంచకుండా ఓటు షేరింగ్ చేసిన నేపథ్యంలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాలేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు వేర్వేరు క్యాంపుల్లో ఉంచగా, 16న జరిగే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఎవరిని భాగ్యం వరిస్తుందన్నది ఆసక్తిగా మారింది. సమాన బలం కొనసాగితే జనగామ మున్సిపల్ చరిత్రలో తొలిసారి టాస్ ద్వారా చైర్మన్ ఎంపిక అయ్యే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్లో ఉత్కంఠ చైర్మన్ ఎన్నికకు 16వ తేదీన ముహూర్తం ఎన్నికపై సస్పెన్స్ పురపాలిక రాజకీయంలో స్వతంత్రుల హాట్టాపిక్ క్యాంపులో ఇరు పార్టీల కౌన్సిలర్లుచైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మొదటిసారి, రెండవసారి కూడా వాయిదా పడే అవకాశం లేకపోలేదు. మూడోసారి మాత్రం సభ్యుల కోరం ఉన్నా.. లేకపోయినా ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాల్సిందే. పరిస్థితి మళ్లీ సమానంగా ఉంటే టాస్ వేసి తుది నిర్ణయం తీసుకునే అ వకాశం అధికార వర్గాల్లో వినిపిస్తుంది. -
హంగామా!
స్వతంత్రులదేఏకశిల బీఈడీ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ.. జనగామ: జనగామ పురపోరులో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నువ్వా,నేనా అన్నట్టుగా తలపడగా, ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో హంగ్ పరిస్థితి నెలకొంది. మొత్తం 30 వార్డుల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 13, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని పోటీ చేసిన సీపీఎం 1, స్వతంత్రులు నలుగురు విజయం సాధించారు. చైర్మన్ పీఠం సాధించేందుకు 16 స్థా నాలు అవసరమైన నేపథ్యంలో రెండు ప్రధాన పా ర్టీలకు స్వతంత్రుల మద్దతు తప్పనిసరి అయ్యింది. కౌంటింగ్ సెంటర్ వద్దే రాజకీయాలు పట్టణంలోని ఏకశిల బీఈడీ కళాశాలలో శుక్రవారం ఉదయం పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కాగా, 10 గంటలకు తొలి ఫలితం విడుదల అయింది. 30 వార్డుల ఫలితాలు మధ్యాహ్నం 2 గంటల వరకు తేలిపోయాయి. ఓట్ల లెక్కింపు సమయంలో ఎన్నికల, కౌంటింగ్ ఏజెంట్లతో పాటు అభ్యర్థులు, ప్రతిపాదికులు కంటిరెప్ప వాల్చకుండా ప్రతి ఓటును క్షుణ్ణంగా పరిశీలించారు. వార్డుల వారీగా ఎలక్షన్ అధికారులు విజేతలను ప్రకటించగా, విక్టరీ చూపిస్తూ అభ్యర్థులు, అనుచర వర్గం ఉరికించే ఉత్సాహంతో బయటకు రాగా, ఓటమి చెందిన వారు మాత్రం తీవ్ర నిరాశతో వెళ్లిపోయారు.మొత్తంగా 48 పోస్టల్ ఓట్లు పోలు కాగా, నోటాకు 119, రిజెక్ట్ అయిన ఓట్లు 259 ఉండగా మొత్తంగా 478 ఓట్లు చెల్లుబాటు కాలేదు. స్వతంత్రుల కోసం.. 8వ వార్డు నుంచి గెలిచిన స్వతంత్ర అభ్యర్థి సందుపట్ల మంజుల, 15వ వార్డు నుంచి విజయం సాధించిన మారబోయిన పాండు, 23వ వార్డు స్వతంత్ర అభ్యర్థి భూష పర్వతాలు, 5వ వార్డులో గెలిచిన ఇండింపెండెంట్ మిద్దెపాక భాస్కర్ చైర్మన్ రేసులో కీలకంగా మారారు. భూష పర్వతాలను తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా, యాదాద్రి భువనగిరి జిల్లా హెడ్క్వార్టర్ హైవేపై ఉన్న ఓ హోటల్లో హైడ్రామా చోటుచేసుకున్నట్లు సమాచారం. పర్వతాలు బీఆర్ఎస్ వైపు వెళ్లాలని మొండికేయడంతో పాటు కాంగ్రెస్ నాయకుల నుంచి తప్పించుకుని గులాబీ శ్రేణులు వద్దకు చేరుకోగా, ఆయన్ను రహస్య ప్రాంతానికి తరలించినట్టు సమాచారం. మంజుల సైతం బీఆర్ఎస్ గూటికి చేరినట్లు తెలుస్తుండగా, భాస్కర్ మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. అత్యంత కీలక స్థానంలో ఉన్న మారబోయిన పాండు మాత్రం రెండు పార్టీల మధ్య చర్చలు సాగించడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన్ను తీసుకెళ్లేందుకు రెండు పార్టీలు కార్లు సిద్ధం చేయగా, చివరకు తన సన్నిహితుడి కారులో ఇంటికి వెళ్లిపోయారు. పట్టణంలో ఈ నలుగురు స్వతంత్రులకు 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ ఆఫర్లు చేసినట్లు చర్చ నడుస్తోంది. తనకు చైర్మన్ పీఠం ఇస్తే ఆ పార్టీకే మద్దతు ఇస్తానని పాండు మీడియాకు వెల్లడించగా, మిగతా ముగ్గురు కూడా తన మాట వింటారని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఎవరు చైర్మన్ పీఠం ఎక్కినా...వైస్ చైర్మన్ పదవి మాత్రం స్వతంత్రుల్లో ఒక్కరికి అవకాశం వస్తుందని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి 23వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన భూష పర్వతాలకు వైస్ చైర్మన్ ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. చైర్మన్ రేసులో పోటీదారులు కాంగ్రెస్ తరఫున 22వ వార్డు నుంచి కడకంచి బాలమణి, బీఆర్ఎస్ నుంచి 29వ వార్డు ముస్తాల మౌనిక దయాకర్, 18వ వార్డు గోపగోని సుగుణాకర్ గౌడ్ బరిలో ఉన్నారు. రెండు పార్టీలు ఎక్స్అఫీషియో ఓట్లతో కూడి చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకోవాలనే వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. కలెక్టర్ పర్యవేక్షణలో.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, ఆర్డీఓలు గోపిరామ్, వెంకన్న, మునిసిపల్ కమిషనర్లు మహేశ్వర్రెడ్డి, రాధాకృష్ణ, డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారుల కంటిమీద కునుకు లేకుండా బందోబస్తు నిర్వహణ చేపట్టారు. కాగా, ప్రజలు తేల్చుకోలేని తీర్పు ఇవ్వడంతో స్వతంత్రులే గేమ్ఛేంజర్లుగా మారి చైర్మన్ పీఠం ఎటు తిరుగుతుందనే ఆసక్తి జిల్లాలో రాజకీయ హీట్ పెంచుతోంది. ‘ఇండింపెండెంట్లే గేమ్ఛేంజర్లు’ అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనం నిజం కావడం గమనార్హం. వారు మద్దతు ఇచ్చినవారికే జనగామ పుర‘పీఠం’ కాంగ్రెస్–12, బీఆర్ఎస్–13, సీపీఎం–1, స్వతంత్రులు–4 బీఆర్ఎస్ కోటలో ఇద్దరు.. కాంగ్రెస్ పక్కన ఒక్కరు రెండు పార్టీలకు టచ్లో మరో అభ్యర్థి.. స్వతంత్ర విజేత కోసం భువనగిరి హోటల్ వద్ద హైడ్రామా స్వతంత్రులకు లక్షల్లో ఆఫర్..! ఓట్ల శాతంలో బీఆర్ఎస్దే పైచేయి జనగామ,స్టేషన్ ఘన్పూర్లో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు -
కాంగ్రెస్ వెంటే ఘన్పూర్ ప్రజలు
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంట, తన వెంట ఉన్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కౌన్సిలర్లుగా గెలుపొందిన పార్టీ అభ్యర్థులతో కలిసి శుక్రవారం ఆయన స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు.. ముందుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులతో కలిసి ఆయన సంబురాల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో జోష్నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ మొట్టమొదటి కౌన్సిలర్లుగా మెజార్టీ స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించిందన్నారు. మున్సిపాలిటీలో 70 శాతానికి పైగా సీట్లను గెల్చుకున్నామని, ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు తమ ఓట్లతో బుద్ధి చెప్పారన్నారు. పనిలేని ప్రతిపక్ష పార్టీల విమర్శలు పట్టించుకోనన్నారు. కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్రెడ్డిపై, ఎమ్మెల్యేగా తనపై ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, అందరూ బాధ్యతగా పనిచేస్తూ మున్సిపాలిటినీ ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయాలన్నారు. విజయం అందించిన ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, జగదీష్చందర్రెడ్డి, సతీష్ పాల్గొన్నారు. -
భువనగిరిలో హైడ్రామా!
భువనగిరి : జనగామ మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులు కింగ్ మేకర్స్గా మారారు. 23వ వార్డునుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన భూష పర్వతాలును కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కారులో ఎక్కించుకుని హైదరాబాద్కు బయలుదేరారు. మార్గమధ్యలో భువనగిరి బైపాస్ రోడ్డులోని ఓ హోటల్ వద్ద ఆగగా, ఆ అభ్యర్థి.. బీఆర్ఎస్ నాయకులకు సమాచారం అందడంతో వెంటనే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి.. పార్టీ నాయకులతో కలిసి భువనగిరికి చేరుకున్నారు. తమకు మద్దతు తెలిపే అభ్యర్థిని అప్పగించాలని కాంగ్రెస్ నాయకులను కోరారు. అప్పటికే హోటల్కు వద్దకు చేరుకున్న ఎంపీ కిరణ్కుమార్రెడ్డితోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు.. అభ్యర్థితో ఉండడంతో ఎమ్మెల్యే పల్లా స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హోటల్ వద్దకు చేరుకోగా, పల్లా వారితో మాట్లాడి తమకు మద్దతు తెలిపే అభ్యర్థిని బలవంతంగా తీసుకెళ్తున్నారని చెప్పారు. పోలీసులు సదరు అభ్యర్థిని ఎవరికి మద్దతు ఇస్తారని అని అడగ్గా బీఆర్ఎస్కు అని చెప్పడంతో అతన్ని ఎమ్మెల్యే పల్లాకు అప్పగించగా ఆయన వెంటబెట్టుకుని తీసుకెళ్లారు. -
ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ేేేజనగామ: జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు శుక్రవారం విజయవంతంగా ముగిసిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. స్టేషన్ఘన్పూర్ 18, జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులకు జరిగిన ఎన్నికలు, కౌంటింగ్ సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. 16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జనగామ, స్టేషన్ఘన్పూర్లో ఎన్నికైన వార్డు సభ్యులకు ఈ నెల 16వ తేదీన ఉదయం 11లకు ప్రతిజ్ఞ, ఆ తర్వాత 12.30 గంటల సమయంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధిత మున్సిపల్ కార్యాలయాల్లో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సభ్యులు ప్రతి ఒక్కరు హాజరు కావాలన్నారు. -
చేతికి ‘స్టేషన్’ పగ్గాలు
● పురపోరులో సత్తాచాటిన కాంగ్రెస్ ● 18వార్డులకు 13 స్థానాలు అధికార పార్టీకే ● 5 స్థానాలకే బీఆర్ఎస్ పరిమితంస్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. ఘన్పూర్ శివారు పల్లగుట్ట క్రాస్రోడ్డు సమీపాన ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. మొత్తంగా 18 వార్డులకు గాను 18 టేబుళ్లను ఏర్పాటు చేసి కౌంటింగ్ చేపట్టారు. ఉదయం 8 గంటలకు చేపట్టిన కౌంటింగ్లో మొదట పోస్టల్, సర్వీస్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అందులో మొత్తం 5 ఓట్లు పోల్కాగా రెండు ఓట్లు బీఆర్ఎస్ పార్టీలకు చెందిన అభ్యర్థులకు, మూడు ఓట్లు స్వతంత్రులకు పడ్డాయి. అనంతరం బ్యాలెట్ పేపర్లను కట్టలుగా కట్టి కౌంటింగ్ పూర్తి చేసిన అనంతరం ఉదయం 11.30 గంటల అనంతరం అభ్యర్థుల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. కాగా ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ సెంటర్ సమీపానికి పెద్ద ఎత్తున వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు రాగా సందడి నెలకొంది. మధ్యాహ్నం 12 గంటల అనంతరం పూర్తిస్థాయిలో ఫలితాలు వెలువడ్డాయి. సత్తా చాటిన కాంగ్రెస్ నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలుపొంది సత్తా చాటారు. మొత్తంగా 18 వార్డులకు గాను 13 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకోగా బీఆర్ఎస్ ఐదు స్థానాలతో సరిపెట్టుకుంది. మొత్తంగా స్టేషన్ఘన్పూర్లోని పది వార్డుల్లో తొమ్మిది వార్డులు కాంగ్రెస్ గెలుపొందటం విశేషం. మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో నాలుగు, ఛాగల్లులోని నాలుగు వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ తలా రెండు స్థానాలు దక్కించుకున్నాయి. ఘన్పూర్లోని 1వ వార్డు బీఆర్ఎస్కు రాగా మిగిలిన 10 నుంచి 18 వరకు తొమ్మిదివార్డులు కాంగ్రెస్ కై వసం చేసుకుంది. -
పురాధీశులు ఎవరో?
జనగామ, స్టేషన్ఘన్పూర్లో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధంజనగామ: పురపోరు ప్రజాభిప్రాయ తీర్పుతో గెలుపు ఎవరిదోననే ఉత్కంఠ అభ్యర్థుల్లో నెలకొంది. ఈనెల 13న(శుక్రవారం) ఫలితాలు వెలువడనుండగా, జనగామ, స్టేషన్ఘన్పూర్లో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పురపాలక ఎన్నికల పోలింగ్ ముగియడంతో జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జనగామలోని హైదరాబాద్రోడ్డు ఏకశిల బీఈడీ కళాశాల, ఘన్పూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు కేంద్రాల్లో కూడా అధికారులు, పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జనగామ పురపాలికలో 44,045 మంది ఓటర్లు ఉండగా, 34,281 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్ శాతం 79.04గా నమోదైంది. స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో 18,850 ఓట్లలో 15,670 ఓట్లు పోలై 84.47 శాతం ఓటింగ్ జరిగింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. జనగామలోని 30 వార్డులకు 30 టేబుల్స్ ఏర్పాటు చేయగా ఒకే రౌండులో ఓట్ల లెక్కింపు పూర్తిచేయనున్నారు. స్టేషన్ ఘన్పూర్లో 18 వార్డులకు 18 టేబుల్స్పై లెక్కింపు చేపట్టి ఒకే రౌండ్లో ప్రక్రియ పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. జనగామ లెక్కింపు కేంద్రంలో 36 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 72 మంది అసిస్టెంట్ సూపర్వైజర్లు విధుల్లో పాల్గొననున్నారు. స్టేషన్ ఘన్పూర్లో 20 మంది సూపర్వైజర్లు, 40మంది అసిస్టెంట్ సూపర్వైజర్లు కౌంటింగ్ సమయంలో సేవలు అందించనున్నారు. ఆర్ఓలు, సిబ్బందికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం స్నాక్స్ మాత్రమే అందజేస్తారు. లంచ్ సదుపాయం లేకపోవడంతో రిలీవ్ సమయంలో ఇంట్లోనే భోజనం చేయాల్సి ఉంటుంది. కౌంటింగ్ హాళ్లలో ప్రత్యేక పాసు ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించ నున్నారు. జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి గురువారం ఆయా శాఖల ఉన్నతాధికారులతో గూగుల్ మీటింగ్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ఎన్నికల నియమావళిని అనుసరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించాలన్నారు. లెక్కింపు ప్రక్రియలో ప్రతీ దశను స్పష్టంగా అమలు చేసే విధంగా సిబ్బందికి ముందస్తుగా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. లెక్కింపు కేంద్రం వద్ద మూడంచెలుగా భద్రతా ఏర్పాట్లు చేశామని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రక్రియ కొనసాగుతుందని, అభ్యర్థులు, ఏజెంట్లకు గుర్తింపు కార్డుల ఆధారంగా ప్రవేశం కల్పించేలా చూడాలని కలెక్టర్ సూచించారు. జనగామ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ఏకశిల బీఈడీ కళాశాలలో ఏర్పాట్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ పరిశీలించారు. కౌంటింగ్ హాల్స్ నిర్వహణ, టేబుల్స్ ఏర్పాటు, సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా చర్యలు, తాగునీరు, టాయిలెట్ సదుపాయాలు, విద్యుత్ సరఫరాతో పాటు ఇతర మౌలిక వసతులపై అధికారులతో చర్చించారు. ఏసీ వెంట ఆర్డీఓ గోపీరామ్, కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఉన్నారు. ప్రజాతీర్పుపై అభ్యర్థుల్లో ఉత్కంఠ జనగామలో 30, ఘన్పూర్లో 18 టేబుల్స్ రెండుచోట్ల ఒకే రౌండ్ ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలు మధ్యాహ్నం 2 గంటల వరకే ఫలితాలు భద్రత వలయంలో కౌంటింగ్ కేంద్రాలుడీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 200 మీటర్ల దూరంలో ఆంక్షలు అమలు చేస్తూ అవాంఛనీయ ఘటనలను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు, మైక్రో అబ్జర్వర్ సిస్టం ద్వారా కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు మొబైల్ ఫోన్లతో లోపలికి వెళ్లేందుకు అనుమతించరు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రిజ్వాన్ బాషా షేక్ ఆధ్వర్యంలో మొత్తం లెక్కింపు ప్రక్రియ జరుగనుంది. అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు మహేశ్వర్రెడ్డి, రాధాకృష్ణ లెక్కింపును సమీక్షించనున్నారు. -
కదిలింది..కార్మికదండు!
● లేబర్కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల భారీ ప్రదర్శనజనగామ రూరల్: బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక ప్రజావ్యతిరేక విధానాలను ఐక్య పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని, దానిద్వారానే 4 లేబర్కోడ్లను వెనక్కితీసుకొనేలా చేయగలమని ఐఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఽ శ్రీదేవి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్, ఐఎన్టీయూసీ జిల్లా నాయకుడు డాక్టర్ లక్ష్మీనారాయణనాయక్ పిలుపునిచ్చారు. గురువారం దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా సీఐటీయూ, బీఆర్టీయూ, ఐఎన్టీయూసీ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల కేంద్ర కమిటీల పిలుపులో భాగంగా రైల్వే స్టేషన్ నుంచి ప్రెస్టిన్ గ్రౌండ్ వరకు కార్మికులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వేముల నర్సింగం, బైరగోని అంజమ్, రాజమణి, కోమల్ల ఎల్లమ్మ, బూడిద ప్రశాంత్, తోటగోని రాధ, ఎర్రబెల్లి సంతోష తదితరులు పాల్గొన్నారు. కేంద్రం తీసుకోచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ అన్నారు. -
స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించిన డీసీపీ
స్టేషన్ఘన్పూర్: డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్రూమ్ను డీసీపీ రాజమహేంద్రనాయక్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందితో మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, శాంతిభద్రతలకు విఘాతం కల్గించినా చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. డీసీపీ వెంట సీఐ జి.వేణు, ఎస్ఐ వినయ్కుమార్ తదితరులున్నారు. జనగామ రూరల్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పా ట్లు చేసినట్లు ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ తెలి పారు. గురవారం పోలీసులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో తగినంత పోలీసు బలగాల ను మోహరించి, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు, అభ్యర్థులు, పార్టీల నాయకులు సహకరించి ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు● సీపీ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధి జనగామ, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాల వద్ద శుక్రవారం నుంచి నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా.. 200 మీటర్ల పరిధిలో బీఎన్ఎస్ఎస్, సీఆర్పీసీ–163 ప్రకారం.. ప్రజలు ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం నిషేధమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ నిషేధం నేడు (శుక్రవారం) ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఎవరైనా ఈ ఉత్తర్వులు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా చేపట్టాలి● అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ స్టేషన్ఘన్పూర్: ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత కీలకమైందని, సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పారదర్శకంగా, కచ్చితంగా కౌంటింగ్ నిర్వహించాలని అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ సూచించారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఓట్ల లెక్కింపు జరుగనున్న స్థానిక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల కౌంటింగ్ కేంద్రాన్ని గురువారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి అంతరాయం కలుగకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘మేడారం’ ఆదాయం రూ.13,51,76,275
హన్మకొండ కల్చరల్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగిన సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఆదాయం రూ. 13,51,76,275 వచ్చినట్లు మేడారం జాతర ఈఓ వీరస్వామి తెలిపారు. మహాజాతర సందర్భంగా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద దేవాదాయశాఖ ఏర్పాటు చేసిన 780 ఇనుపరేకు హుండీలు, 45 వస్త్ర, 3 ఒడిబాలబియ్యం హుండీలు కలిపి మొత్తం 828 హుండీలను భారీ సెక్యూరిటీతో ఫిబ్రవరి 2వతేదీ సోమవారం హనుమకొండ లష్కర్బజార్లోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలోకి చేర్చారు. హుండీల లెక్కింపు ఫిబ్రవరి 5న గురువారం ప్రారంభమైంది. చివరిరోజు లభించిన ఆదాయం.. ఎనిమిదో రోజు (చివరిరోజు) గురువారం చిల్లరనాణేలను వేరు చేసి తూకం వేసి లెక్కించడంతో మహాజాతర హుండీల లెక్కింపు పూర్తయ్యింది. చివరిరోజు లెక్కింపులో నాణేల ద్వారా లభించిన ఆదాయం రూ.4,56,399, ఈ–హుండీల ద్వారా (క్యూ ఆర్ ద్వారా) రూ. 21,36,607 మొత్తం కలిపి రూ.25,93,006 సమకూరింది. జాతర ఆదాయం రూ.13,51,76,275 మహా జాతర మొత్తం ఆదాయం రూ.13,51,76,275గా నమోదైందని ఈఓ వీరస్వామి తెలిపారు. భక్తులు వివిధ రకాల వస్తువుల రూపంలో వేసిన బంగారం, వెండి సూక్ష్మ కానుకలను సైతం ప్రత్యేక నిపుణుల సహాయంతో, సెన్సార్ల సహాయంతో గుర్తించి లెక్కకట్టారు. ఏటా పెరుగుతున్న ఆదాయం 1946లో జాతర ఆదాయం రూ.17,173 కాగా, 1968లో దేవాదాయశాఖ మొదటిసారిగా నిర్వహించిన జాతరలో రూ.1,20,113గా నమోదైంది. 1980లో మొదటిసారిగా వరంగల్ జిల్లా కలెక్టర్గా పని చేసిన జె.బాపురెడ్డి ఐఏఎస్ పెద్ద ఎత్తున ప్రచారంతో జాతర ఆదాయం రూ. 4,50,000 వచ్చింది. అదేవిధంగా 2002 నుంచి జాతర ఆదాయం కోటి రూపాయలు దాటింది. 2016 జాతర ఆదాయం రూ. 8.90 కోట్లుగా నమోదైంది. ఈవిధంగా ప్రతిఏటా జాతర ఆదాయం కోట్లల్లో పెరుగుతూ వస్తోంది. 2024లో మేడారం జాతర సందర్భంగా గద్దెల ప్రాంగణంలో 518 హుండీలు, తిరుగువారం హుండీలు 22 కలుపుకుని మొత్తం 540 హుండీలకుగాను ఆదాయం రూ.12,71,79,280 సమకూరింది. కాగా, ప్రస్తుతం జాతరలో గద్దెల ప్రాంగణంలో 828 హుండీలను ఏర్పాటు చేయగా.. రూ.13,51,76,275గా నమోదైంది. గతంకంటే 288 హుండీలను అదనంగా ఏర్పాటు చేశారు. గతంతో పోలిస్తే భక్తుల రద్దీ పెరిగినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదు. గత జాతరలో 779 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారం, 55 కిలోల 150 గ్రాముల వెండి కానుకలు లభించాయి. ప్రస్తుత జాతరలో 486 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 31కిలోల 700 గ్రా ముల వెండి లభించింది. గతం కంటే తక్కువగా కానుకలు వచ్చాయి. దీనికి బంగారం, వెండి రే ట్లు పెరగడమే కారణంగా చెప్పవచ్చని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా గత జాతర ఆదాయంతో పోలిస్తే ప్రస్తుత జాతర ఆదాయం ఆశించినంత పెరగలేదు. పూర్తయిన మహా జాతర హుండీల లెక్కింపు చివరి రోజు లభించిన ఆదాయం రూ. 4,56,399 ఈ–హుండీల ద్వారా (క్యూ ఆర్ల ద్వారా) రూ. 21,36,607 గత జాతరకంటే అదనంగా 288 హుండీల ఏర్పాటు అయినప్పటికీ పెరగని ఆదాయం, తగ్గిన బంగారు, వెండి కానుకలు -
‘స్వయంభూ’ దర్శనభాగ్యం!
బుగులు వెంకన్న భక్తులకు నెరవేరిన చిరకాల స్వప్నం 650 మెట్లు ఎక్కితే కొండపై గుహలో స్వామి దర్శనంచిల్పూరు: చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరుడి దర్శనానికి వచ్చే భక్తులకు చిరకాల స్వప్నం నెరవేరింది. స్వయం భూవలయుడిగా వెలిసిన ప్రాంతమున్న కొండపైకి చేరుకునేందుకు మెట్ల మార్గం పూర్తయింది. 650 మెట్లు ఎక్కితే కొండ గుహలో వెలిసిన దేవుడిని దర్శనం చేసుకోవచ్చు. ఎత్తైన కొండపై గుహలో వెలిసిన స్వయం భూవలయని దర్శనం కోసం భక్తులు ఒకప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతూ వెళ్లేవారు. పైకి ఎక్కలేని భక్తులు కింది నుంచే దర్శనం చేసుకునేవారు. దీన్ని గమనించిన ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు కొండపైకి మెట్ల మార్గం పూర్తి చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈవిషయాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే, భక్తుల సహకారంతో 650 మెట్లను పూర్తి చేయించారు. దీంతో పాటు లైట్లు, పలు సౌకర్యాలు కల్పించారు. గతంలో ప్రతీ శనివారం అర్చకుడితో పాటు ఒకరికి తోడుగా ఒకరు చేయిపట్టుకుని పైకి ఎక్కి దర్శనం చేసుకునేవారు. ప్రస్తుతం మెట్ల మార్గం పూర్తి కావడంతో భక్తులు ఇక నిత్యం కొండపైకి ఎక్కి స్వయం భూవలయున్ని దర్శించుకోవచ్చు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ, భక్తుల సహకారంతో మెట్ల మార్గం పూర్తి చేయించాను. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎంతో ఉత్సాహంగా కొండపైకి వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు. –పొట్లపల్లి శ్రీధర్రావు, చైర్మన్స్వయం భూవలయున్ని దర్శించుకోవాలనే భక్తుల కోరిక మెట్ల మార్గం పూర్తి కావడంతో నెరవేరింది. ప్రస్తుతం మెట్లకు రంగులు, పైవరకు లైట్లు పూర్తి అయ్యాయి. –భాగం లక్ష్మీప్రసన్న, ఈఓ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం మెట్ల మార్గం పూర్తయింది. కొండ గుహలో వెలిసిన దేవుని దర్శన భాగ్యం ప్రతీ ఒక్కరికి కలుగుతుంది. అల్వార్రాజులు, క్షేత్రపాలకులు, ఆంజనేయ స్వామి ఉండడం వల్ల భక్తులు కోర్కెలు నెరవేరుతాయి. – రవీందర్శర్మ, ఆలయ అర్చకులు -
పైసామే పురమాత్మ!
జనగామలో 30, స్టేషన్ ఘన్పూర్లో 18 మొత్తంగా 48 వార్డుల్లో 209 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. స్వతంత్రులు అనేక చోట్ల ప్రధాన పార్టీల కు గట్టిపోటీ ఇవ్వగా, వీరికిపడే ఓట్లు ఎవరిని దెబ్బతీస్తాయోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చైర్మన్, వైస్ చైర్మన్ రేస్లో ఉన్నవారు భారీగా ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఉద యం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి అన్ని పార్టీల నాయకులు ఓటర్లను మేనేజ్ చేయడంలో నిమగ్నమైపోయారు. ఇంటెలిజెన్స్ అంచనాలు, రాజకీయ విశ్లేషకుల రిపోర్టులు, గెలుపు, ఓటమి లెక్కలు, డబ్బుల పంపిణీతో తారుమారైనట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.జనగామ: జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ ఎన్నికల్లో పంచిన డబ్బులు అభ్యర్థుల రాజకీయ లెక్కలను పూర్తిగా తారుమారు చేస్తున్నాయి. ఒక్కో ఇంటికి పది, పదిహేను కాదు.. కొన్నిచోట్ల యాభై వేల వరకు చేరి.. చివరకు ఓట్ల పంపకాలపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చింది. ఏ పార్టీ ఇచ్చినా తీసుకున్న ఓటర్లు, పోలింగ్ రోజున మాత్రం నిశ్శబ్దంగా బూత్కి వెళ్లి ఓటు వేశారు. ఎవరి వైపు మొగ్గు చూపారో.. ఎవరికీ వేశారో అభ్యర్థులు కూడా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. ఇంటెలిజెన్స్ రిపోర్టులు, పార్టీల లెక్కలు, రాజకీయ విశ్లేషణలు అన్నీ డబ్బు ట్రెండ్తో తారుమారయ్యాయి. చివరికి డబ్బులు ఇచ్చిన వారు గెలుస్తారా లేక డబ్బులు తీసుకున్న ఓటర్లు గేమ్ మార్చారా అన్నది రేపటి ఫలితాలే చెప్పాలి. పురపాలక ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా జిల్లాలోని రెండు మున్సిపాలిటీల పరిధిలో డబ్బు దందా అమాంతం పెరిగింది. ఓటుకు నోటు లెక్క రాజకీయం మారడంతో ఓటర్ల ఇళ్ల వద్దే వేల రూపాయల నుంచి లక్ష దాకా డబ్బులు పంపిణీ చేశారు. గతంలో ఊహించని విధంగా ఓటర్లకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు, కొన్ని చోట్ల రూ.50 వేల రూపాయల వరకు అభ్యర్థులు ఖర్చు పెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఎక్కడ చూసినా ‘మనీ మోటివేషన్’ స్పష్టంగా కనబడగా, డబ్బులు ఇచ్చిన అభ్యర్థులే ఇప్పుడు ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. ఓటుకు నోటు.. జనగామ పట్టణంలోని కొన్ని వార్డుల్లో ఓటుకు రూ.10 వేల వరకు ఇవ్వగా, మరికొన్ని చోట్ల రూ.3వేల రూ.5 వేలకు పైగా పంపిణీ చేశారు. పోలింగ్ రోజు తెల్లవారుజాము వరకూ కూడా డబ్బుల పంపిణీ సాగింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లకు బస్సు ఛార్జీలు, భోజన ఖర్చులు, అదనంగా ఓటుకు నోటు అంటూ వేల రూపాయలు అందించిన ఘటనలు కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు పట్టుచీరలు, చికెన్ ప్యాకెట్లు, మద్యం, సిల్వర్ కాయినన్స్, స్వీట్ బాక్స్లు వంటి తాయిలాలు పంపిణీ చేశారు. బూత్ ల వద్ద కూడా అభ్యర్థుల అనుచరులు డబ్బుతో రెడీగా ఉండి అప్పటికప్పుడు ఓటును తమవైపు తిప్పుకునే దృశ్యాలు ఎక్కడ చూసినా కనిపించాయి. సైలెంట్ ఓటింగ్...అభ్యర్థుల్లో ఆందోళన డబ్బు పంపిణీకి ముందు ఉన్న అంచనాలన్నీ డబ్బులు ఇచ్చిన తర్వాత మారిపోయినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓటర్లు ఇంత పెద్దఎత్తున డబ్బులు తీసుకున్న తర్వాత ఏ పార్టీ వైపు మొగ్గుచూపారో చివరి నిమిషం వరకు చెప్పకుండా సైలెంట్గా వ్యవహరించడం అభ్యర్థుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. గత ఎన్నికల్లో ఓటర్లు బయటే బాహాటంగా చెప్పినప్పటికీ, ఈసారి పూర్తిగా నిశ్శబ్దంగా ఓటింగ్ చేయడం అభ్యర్థుల వారీగా ఓట్లు విభజనకు గురయ్యాయా అనే ఊహాగానాలు వినిపించాయి. పోలింగ్కు ఒక రోజు ముందు రాత్రి నుంచి ప్రారంభమైన డబ్బుల పంపిణీ తెల్లవారుజాము వరకు పలు వార్డుల్లో కొనసాగగా, కొన్ని చోట్ల పోలింగ్ రోజున సాయంత్రం వరకూ రహస్యంగా నోట్ల పంపిణీ జరిగింది. దీంతో అభ్యర్థులు పగలు, రాత్రి తేడా లేకుండా పోల్ మేనేజ్మెంట్లోనే నిమగ్నమయ్యారు. బూత్ల వద్దే పంపకాలు ఇంటికి రూ.2వేల నుంచి 10వేలు.. చైర్మన్, వైస్ చైర్మన్ రేసులో కోట్ల ఖర్చు ఎన్నడూ లేని సైలెన్స్...అందరికీ టెన్షన్ -
హనుమకొండ జిల్లా : 80.18 శాతం వరంగల్ జిల్లా : 85.42 శాతం జేఎస్ భూపాలపల్లి : 65.18 శాతం ములుగు జిల్లా : 80.41 శాతం మహబూబాబాద్ జిల్లా : 78.90 శాతం జనగామ జిల్లా : 80.66 శాతం
ఉమ్మడి జిల్లాలో 80.09 శాతం పోలింగ్● గతంతో పోలిస్తే పెరిగిన 13.38 శాతం సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాల్లో 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్, తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్ల నుంచి 1,073 మంది కౌన్సిలర్ల కోసం పోటీ పడ్డారు. బుధవారం రాత్రి వరకు అధికారుల ప్రకటించిన ప్రకారం ఉమ్మడి జిల్లాలో 80.09 శాతంగా పోలింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లా 12 మున్సిపాలిటీల్లో మొత్తం 3,35,244 మంది ఓటర్లకు 2,58,930 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2020లో జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 9 మున్సిపాలిటీలలో 200 వార్డులుండగా ఏకగ్రీవమైన 18 వార్డులు మినహాయించి 182 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. 2,32,763 మంది ఓటర్లకు ఆ ఎన్నికల్లో 1,77,508 (76.26 శాతం) మంది ఓట్లేశారు. 2020 ఎన్నికలకు ఈసారి ఎన్నికలు పోలిస్తే కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలు పెరిగాయి. పెరిగిన మున్సిపాలిటీలు, ఓటర్లు, పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే గతంతో పోలిస్తే 13.38 శాతం పెరిగింది. -
ప్రత్యర్థులతో స్నేహహస్తం!
జనగామ/ జనగామ రూరల్: ఓవైపు ఓటింగ్..మరోవైపు ఓట్లు ఎవరికి పడుతున్నాయోనని టెన్షన్.. అయినా ఆ అభ్యర్థులు ఏకంగా ప్రత్యర్థులతోనే స్నేహహస్తం చాటారు. జనగామ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యాక ఒకటో వార్డు నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి సజ్జ దుర్గాప్రసాద్, కాంగ్రెస్ అభ్యర్థి మూడ్ లక్షణ్ నాయక్, బీజేపీ అభ్యర్థి కూరాకుల శ్రీలత ముగ్గురూ కలిసి బయటకు వచ్చి స్నేహపూర్వకంగా చేతులు కలిపి గెలుపు గుర్తులు చూపించారు. అలాగే రెండో వార్డు కౌన్సిల్ ఎన్నికల పోలీంగ్ ప్రెస్టన్ కళాశాల ఆవరణలో కొనసాగుతుండగా కాంగ్రెస్ అభ్యర్థి రామగళ్ల విజయ్, బీఆర్ఎస్ అభ్యర్ది రావెల రవి కలుసుకుని రాజకీయాలు పక్కనబెట్టి గెలుపోటములపై సమాలోచనలు చేశారు. కక్షపూరిత రాజకీయాలు పెట్రేగుతున్న కాలంలో ఇలా స్నేహహస్తం చాటడంపై పలువురు అభినందించారు. రెండో వార్డు అభ్యర్థుల మాటాముచ్చటపోలింగ్ కేంద్రం వద్ద 1వ వార్డు అభ్యర్థులు -
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ
స్టేషన్ఘన్పూర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్టేషన్ఘన్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, శివునిపల్లి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. పోలింగ్ స్టేషన్ ఇన్చార్జులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ట్రైనీ ఐపీఎస్ మనీషానెహ్రా, డీసీపీ రాజమహేంద్రనాయ క్, ఏసీపీలు భీమ్శర్మ, నర్సయ్య, సీఐలు జి.వేణు, ఎ.శ్రీనివాస్రెడ్డి, ఎస్ఐలు తదితరులున్నారు. -
నిదానంగా ఓటెత్తారు!
జనగామ: జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ మొదట నిదానంగా ప్రారంభమైనప్పటికీ గంటగంటకూ ఓటర్ల రాక పెరుగుతూ వచ్చింది. పోలింగ్ బూత్లలో ఉదయం 6 గంటలకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, సరిగ్గా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొదటి రెండు గంటల్లో 10 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ నమోదు కాగా, ఉదయం 10 తర్వాత ఓటర్లు వరుసగా బూత్లకు చేరుకోవడం మొదలైంది. జనగామలో 66, స్టేషన్ఘన్పూర్లో 36 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షించగా, ఏఎస్పీ చేతన్ నితిన్, ఏసీబీ, సీఐ, ఎస్సై ఆధ్వర్యంలో 750 మందికి పైగా పోలీసు బలగాలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షించడంతో రెండు చోట్ల పోలింగ్ పూర్తిగా ప్రశాంతంగా ముగిసింది. మాకెందుకు డబ్బులు ఇవ్వలేదు.. పట్టణంలోని 23వ వార్డులో ఓటర్లు స్వయంగా ఓ అభ్యర్థిని నిలదీసిన ఘటన ఎన్నికల ప్రక్రియకు విభిన్నంగా నిలిచింది. మా ఓటుకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని ఓటర్లు అభ్యర్థిని ప్రశ్నించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వెంటనే పోలీసులు చేరుకుని పరిస్థితిని శాంతింపజేశారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్ల కోసం పార్టీ నాయకులు వేచి ఉండి, వాహనం దిగిన వెంటనే వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశారు. కొన్ని చోట్ల వీల్ఛైర్ల కొరత కారణంగా దివ్యాంగులకు ఇబ్బందులు కలగగా తెలుసుకున్న అధికారులు వెంటనే తెప్పించి సేవలను ప్రారంభించారు. కట్టుదిట్టమైన చర్యలతో.. పోలింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లకు అనుమతి ఇవ్వకుండా, ఓటర్లను పూర్తిగా చెక్ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. సీసీ కెమెరాలు, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో పోలింగ్ మొత్తం సాగింది. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ సెంటర్ నుంచి జనరల్ అబ్జర్వర్ నరసింహారెడ్డి, కలెక్టర్ షేక రిజ్వాన్ బాషా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. అలాగే ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి ప్రెస్టన్ మైదానంలోని పోలింగ్ బూత్లను సందర్శించారు. బూత్ల వద్ద స్థానికేతర నాయకులు ఉండకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే వారిని అక్కడి నుంచి పంపించారు. ఇదే క్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ బాల్దె సిద్దిలింగంను అరెస్ట్ చేసి పీఎస్కు తరలించగా, పరిస్థితులు ఉద్రిక్తతమయ్యే అవకాశం ఉండడంతో కావడంతో పోలీస్ జీప్లో పెంబర్తిలోని ఆయన స్వగృహానికి తరలించారు. చిన్న గందరగోళాలు తప్పి తే పోలింగ్ శాంతియుతంగా సాగింది. ఎప్పటికప్పుడు పరిశీలన.. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర పింకేశ్ కుమార్, పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఎప్పటికప్పుడు పరిశీలించారు. జనగామ, స్టేషన్ఘన్పూర్లోని సెయింట్ మెరీస్, ఏబీవీ హైస్కూల్, ధర్మకంచ ఉన్నత పాఠశాల, పోలింగ్ బూత్లను సందర్శించి, అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. పోలీసు బందోబస్తు, ఓటర్లకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, మెడికల్ క్యాంపు తదితర వాటికి సంబంధించి సూచనలు చేశారు. ప్రశాతం వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు సహకరించిన ఓటర్లు, అధికార యంత్రానికి కలెక్టర్ అభినందించారు. 21వ వార్డులో వృద్ధురాలిని ఓటు వేసేందుకు తీసుకెళ్తున్న సిబ్బంది వృద్ధురాలిని తీసుకెళ్తున్న పారిశుద్ధ్యకార్మికురాలుగంటగంటకూ పెరుగుతూ..జనగామ: జనగామ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోలింగ్ ప్రారంభమైన మొదటి గంట నుంచి ఓటర్లు మంచి స్పందన చూపించారు. పట్టణంలో 44,045 ఓట్లు ఉండగా, పురుషులు 21.358, మహిళలు 22,678, అదర్స్ 9 మంది ఉన్నారు. ఉదయం 9 గంటలకే మొత్తం 4,489 మంది, అంటే 10.19శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించారు. 11 గంటల వరకు రద్దీ పెరగడంతో 11,674 ఓట్లు నమోదు కాగా, శాతం 26.5శాతానికి చేరింది. మధ్యాహ్నం 1 గంట సమయానికి పోలింగ్ మరింత ఊపందుకొని 20,545 ఓట్లు పడగా, శాతం 46.65శాతం వద్దకు చేరింది. మధ్యాహ్నం 1గంట నుంచి 3 గంటల వరకు అనూహ్యంగా రద్దీ పెరగడంతో 3 గంటలకు 28,764 ఓట్లు పోలు కాగా, పోలింగ్ శాతం 65.1 శాతానికి చేరుకుంది. సాయంత్రం చివరి గంటల్లోనూ పోలింగ్ వేగం తగ్గకపోవడంతో 5 గంటల నుంచి రాత్రి 7 వరకు పోలింగ్ ముగిసే వరకు 34,821 ఓట్లు పోలు కాగా, 79.04శాతం వద్ద నిలిచింది. ఇందులో పురుషులు 16,914, మహిళలు 17,898 మంది ఓటు వేశారు. జనగామ మున్సిపాలిటీలో ఉత్సాహభరితంగా ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ముఖ్యంగా మహిళల ఓటింగ్ శాతం పురుషుల కంటే ఎక్కువగా ఉంది. ఘన్పూర్లో ఓటింగ్ శాతం.. స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు ఊహించిన దానికంటే ఎక్కువ ఉత్సాహం కనబర్చారు. రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతం విడుదల చేయగా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటింగ్ స్థిరంగా పెరుగుతూ వచ్చింది. మొత్తం 18,550 మంది ఓటర్లలో పురుషులు 8,913, మహిళలు 9, 636, ఇతరులు 1 ఉన్నారు. ఉదయం 9 గంటలకు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్రమంగా రావడంతో మొత్తం 2,138 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, 11.52శాతంగా నమోదైంది. 11 గంటలు వరకు ఓటర్లు పెద్ద సంఖ్యలో కేంద్రాలకు చేరుకోవడంతో 6,181 ఓట్లు పోలయ్యాయి. ఈ దశలో పోలింగ్ శాతం 33.32శాతానికి చేరింది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ కేంద్రాల్లో మరింత రద్దీ పెరిగింది. పార్టీల ప్రతినిధులు ఎక్కువ మొత్తంలో ఓటర్లను తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఈ సమయానికి మొత్తం 10,458 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, 56.38 శాతానికి చేరుకుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ఓటర్లు పెద్ద సంఖ్యలో కేంద్రాలకు చేరుకున్నారు. ఈ సమయానికి పోలైన మొత్తం ఓటర్ల సంఖ్య 13,752 కాగా, శాతం 74.13శాతానికి చేరుకుంది. సాయంత్రం చివరి గంటల్లో కూడా ఓటర్లు చురుకుగా స్పందించడంతో 5 గంటల వరకు 15,670 ఓట్లు నమోదు కాగా ఇందులో పురుషులు 7,6 20, మహిళలు 8,049 మందితో 84.47 శాతంతో ముగిసింది. గతం కంటే 0.32 శాతం తగ్గిన ఓటింగ్ జనగామ మున్సిపాలిటీలో 2020 పురపాలిక ఎన్నికల కంటే 0.29శాతం ఓటింగ్ తగ్గింది. గతంలో 40,099 ఓట్లు ఉండగా, 31,822 ఓట్ల పోలింగ్తో 79.36శాతం ఓటింగ్ నమోదు కాగా, ప్రస్తుతం 79.04తో 0.32శాతం ఓటింగ్ తగ్గింది.కొత్త కొత్తగా ఉన్నది!మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు యువత ఉత్సాహం చూపించింది. ముఖ్యంగా ఈ ఏడాదే ఓటు హక్కు వచ్చిన యువత ఓటు వేసి సెల్ఫీలు తీసుకుని, వాట్సాప్ల్లో స్టేటస్లు పెట్టుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఎక్కువగా విద్యార్థులే కావడంతో ఓటు వేయడానికి సొంతూరుకు వచ్చారు. తమ స్నేహితులతో కలిసి పోలింగ్ కేంద్రాల బయట సందడి చేశారు. –జనగామ మరిన్ని వార్తలు, ఫొటోలు 8, 9లో మధ్యాహ్నం వరకు పెరిగిన ఓటింగ్ చిన్న చిన్న ఉద్రిక్తతలు మినహా సజావుగా ఎన్నికలు జనగామ 79.04శాతం, స్టేషన్లో 84.47శాతం పోలింగ్ పట్టణంలో ఓటేసిన ఎమ్మెల్యే పల్లా, కలెక్టర్ రిజ్వాన్ బాషా దంపతులు ఉ 9గంటలు 11గంటలు ఒంటిగంట 3గంటలు 5 గంటలకు జనగామ 10.19 26.5 46.65 65.1 79.04 స్టే.ఘన్పూర్ 11.52 33.32 56.38 74.13 84.47 -
నోఓటు యుద్ధం!
జనగామ: జనగామ, స్టేషన్ఘన్పూర్ పురపోరు రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. రెబల్స్ దూసుకురావడం, నోటు, మద్యం ప్రవాహం, అనేక వార్డుల వారీగా హోరాహోరీ త్రిముఖ పోటీతో ఎన్నికలను రణరంగంగా మార్చేసింది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు రూ.500 నుంచి రూ.5,000 వరకు నగదు, గిఫ్టులు, మద్యం,, చీరలు, వెండి కాయిన్ల పంపిణీతో ప్రలోభాల రాజకీయాలు చేపట్టారు. పొత్తులు, రెబల్స్ రాజకీయాలు రెండు మున్సిపాలిటీల్లో కలిపి 209 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అందులో జనగామలో 127, స్టేషన్ఘన్పూర్లో 82 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీల పొత్తు ఎన్నికల వేడిని పెంచగా, ముఖ్యంగా జనగామలో 3, 5, 7వ వార్డుల్లో సీపీఎం, 11వ వార్డులో సీపీఐ పోటీతో రసవత్తర రాజకీయం నెలకొంది. 17వ వార్డులో కాంగ్రెస్, సీపీఎం ఇద్దరికీ బీఫాంలు ఇవ్వడంతో అక్కడ ఫ్రెండ్లీ పోటీ నెలకొంది. జనగామ పరిధిలో 17 వార్డుల్లో 40 మంది రెబల్స్ పోటీ బరిలో నిలవడం కాంగ్రెస్కు తలనొప్పిగా మారింది. 23, 14, 5, 3వ వార్డుల్లో కాంగ్రెస్ రెబల్స్ భూష పర్వతాలు, దూసరి ధనలక్ష్మి, మిద్దెపాక భాస్కర్ బరిలో నిలవడంతో అక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. 7వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి, మాజీ కౌన్సిలర్ ఆకుల రజని ప్రధాన పార్టీలకు గట్టి చెక్ పెట్టడంతో గెలుపు ఎవ్వరిదనే అంచనాలు అంతు చిక్కడం లేదు. 15వ వార్డులో బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి, మాజీ కౌన్సిలర్ మారబోయిన పాండు గెలుపు కోసం పరితపిస్తుండగా, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా బలమైన ప్రచారంతో పోటీని హోరాహోరీగా మార్చారు. స్టేషన్ఘన్పూర్లో 30 మంది రెబల్స్ పోటీలో ఉండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహాలు ఒక్కసారిగా మారిపోయాయి. స్టేషన్లోనూ నువ్వా నేనా? స్టేషన్ఘన్పూర్ 5వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్కు బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. స్టేషన్ఘన్పూర్లో 1, 5, 4, 10, 14వ వార్డుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నెలకొంది. 16వ వార్డులో కాంగ్రెస్ రెబల్ గట్టి పోటీ ఇస్తుండగా, 17వ వార్డులో బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి బరిలో నిలిచారు. స్టేషన్లో కూడా ఓటుకు రూ.2 వేల నుంచి రూ.4వేల వరకు పంపిణీ చేసినట్లు సమాచారం. ఓటుకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు డబ్బు, మద్యం, చీరలు, వెండికాయిన్లు ‘మాకు తక్కువ ఎందుకిస్తున్నారు..?’ అంటూ పలు వార్డుల్లో ఓటర్ల ఆగ్రహం రెండు మున్సిపాలిటీల్లో 48వార్డులు.. బరిలో 209 మంది అభ్యర్థులు ఎవరూ తగ్గట్లే! ఈసారి పురపోరులో ఓట్ల కొనుగోలుకు సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు మున్సిపాలిటీల్లో చాలా వార్డుల్లో ఒక్కో ఓటుకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు ఇవ్వడం జరుగుతుండగా, కొన్నిచోట్ల స్వతంత్ర అభ్యర్థులు రూ.4వేల నుంచి కేవలం రూ.500, వెండి ఉంగరం ఇస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. కొన్ని వార్డుల్లో రూ.4వేలు, మద్యం బాటిల్, గిఫ్టులు, చీరలు పంపిణీ చేసినట్లు సమాచారం. ఆయా వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇప్పటికే రెండు మూడు విడతల్లో రూ.ఐదు వేల వరకు పంపిణీ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. స్వతంత్రులు మాత్రం అప్పులు చేసి ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఒకచోట రూ.4,000, మరోచోట రూ.2,000, ఇంకోచోట రూ.2,500 పంపిణీ చేస్తున్న సమయంలో పక్క వార్డుల ఓటర్లు తమకు తక్కువ ఎందుకిస్తున్నారు? అంటూ అభ్యర్థులను నిలదీశారు. ఉత్కంఠ గత రెండు ఎన్నికల్లో చోటుచేసుకున్న ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకొని ఈసారి పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. మొత్తం 750 మంది పోలీసు బలగాలను రంగంలోకి దించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ ప్రత్యక్ష పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జనగామలో 8, స్టేషన్ఘన్పూర్లో 4 పోలింగ్ కేంద్రాలను క్రిటికల్ స్టేషన్లుగా గుర్తించి, అక్కడ ఎస్సై స్థాయి అధికారులను మోహరించారు. మొత్తం పోలింగ్ ప్రక్రియ అంతా సీసీ కెమెరాలు, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో సాగనుంది. -
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పరిశీలన
స్టేషన్ఘన్పూర్: మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్, జిల్లా అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ సంయుక్తంగా మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను, స్ట్రాంగ్రూమ్ను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా, భద్రతా ప్రమాణాల మేరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయి సిద్ధం చేయాలని ఆదేశించారు. వారి వెంట డీసీపీ రాజమహేంద్రనాయక్, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, ఏసీపీ భీమ్శర్మ తదితరులున్నారు. -
కట్టుదిట్టమైన బందోబస్తు: డీసీపీ
జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల పరిధిలో 750 మంది పోలీసులు బలగాల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..అడిషినల్ ఎస్పీతో పాటు రెండు చోట్ల ఏఎస్పీ, ఏసీపీ, 7 సీఐలు, 32 మంది ఎస్సైలు బీఎఎస్ఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ పోలీసులు గట్టి నిఘా ఉంచనున్నట్లు తెలిపారు. జనగామలో 30, స్టేషన్లో 18 రూట్లను ఏర్పాటు చేసి ఆయా మార్గాల్లో పోలీసు పర్యవేక్షణ ఉంటుందన్నారు. క్రిటికల్ కేంద్రాల వద్ద ఎస్సై ర్యాంకు అధికారి బందోబస్తు ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల లోపు పార్టీ జెండాలు, ప్రచారానికి అనుమతి లేదన్నారు. రెండు పురపాలికల పరిధిలో 30 లోకేషన్ల పరిధిలో మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ ఉంటుందన్నారు. కాగా జనగామలో డీసీసీ, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణరెడ్డి ఆద్వర్యంలో పోలీసులు కవాతు నిరహించారు. -
ఆర్టీసీ ఆదాయం రూ. 20.24 కోట్లు
● మేడారానికి మొత్తం ట్రిప్పులు 25,027 హన్మకొండ: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ప్రత్యేక బస్సులు నడిపిన టీజీఎస్ ఆర్టీసీ రూ.20,24,28,124 ఆదాయం రాబట్టుకుంది. జాతరకు 1,711 ప్రత్యేక బస్సులు నడిపి, 9,203 బస్ డేస్లలో, 25,027 ట్రిప్పుల ద్వారా మొత్తం 28,06,155 కిలోమీటర్లు నడిపింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. జాతరలో మొత్తం 12,33,585 మంది ప్రయాణికులు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఇందులో 6,08,686 మంది మహిళ(ఉచిత టికెట్)లు కాగా, 5,12,399 మంది చార్జీల చెల్లింపు ప్రయాణికులు ఉన్నారు. ఉద్యోగుల సమష్టి కృషితో... అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషితో జాతరను విజయవంతం చేశాం. ఏర్పాట్లు మొదలు నుంచి జాతర పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ కష్టించి పని చేశారు. జాతరను విజయవంతం చేసిన అందరికీ అభినందనలు. దర్శనం విజయ భాను, ఆర్ఎం, వరంగల్ -
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో ఎలక్షన్లను స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర రిజ్వాన్ బాషా షేక్ కోరారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనున్నట్లు తెలి పారు. పోలింగ్ నేపథ్యంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, అనుచరులు ఎన్నికల ప్రవర్తన నియమాలు–2019ను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ఆయుధాలు నిషేధమని, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణ కోసం ఎవరూ ఆయుధాలతో పోలింగ్ కేంద్రానికి, దాని పరిసర ప్రాంతాలకు రావడానికి అనుమతి లేదని తెలిపారు. ఉల్లంఘనకు పాల్పడిన వారికి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని హెచ్చరించారు. అభ్యర్థికి ఒక్క వాహనం మాత్రమే అనుమతి ఉంటుందని, అభ్యర్థి ఏజెంట్ లేదా ఇతర పార్టీ నేతలకు వేరే వాహనాలకు అనుమతి లేదన్నారు. అభ్యర్థి హాజరు లేకపోతే, అతడి పేరుతో అనుమతించిన వాహనాన్ని ఇతరులు వినియోగించరాదన్నారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లడం లేదా తిరిగి తీసుకురావడం పూర్తిగా నిషేధమన్నారు. ఇది క్రిమినల్ నేరంగా పరిగణించబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ప్రచారం పూర్తిగా నిషేధమని, అలాగే పోలింగ్ బూత్తో పాటు వాటి పరిసరాల్లో మొబైల్ ఫోన్లు, వైర్లెస్ సెట్లు, కార్డ్లెస్ ఫోన్లు, వాడటం లేదా తీసుకెళ్లడం నిషేధమన్నారు. అనంతరం కలెక్టర్ ఎన్నికల పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించి, స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ హాల్స్కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట జనగామ ఆర్డీఓ గోపీరాం, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, తహసీల్దార్ తదితర అధికారులు ఉన్నారు. -
మున్సిపోల్కు సిద్ధం
బుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు పూర్తిఫ్లయింగ్ స్క్వాడ్ : 3స్టాటిక్ సర్వేలెన్స్ : 9 సోమన్న బ్రహ్మోత్సవాలకు కలెక్టర్కు ఆహ్వానం పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 14 నుంచి 18 వరకు జరిగే మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్కు ఆహ్వాన పత్రికను ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న ఆలయ ప్రధాన అర్చకుడు దేవగిరి లక్ష్మన్న అందించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన్ను కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. అలాగే అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, జెడ్పీ సీఈఓ మాధురి షాకు ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు దేవగిరి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సుక్కా.. ముక్కాస్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా ఎన్నికయ్యేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలోని ఓ వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటుకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు అందించడంతో పాటు ఒక ఇంటికి కిలో చికెన్, అర్ధసేరు మద్యం బాటిళ్లను అందించారు. కాగా చికెన్తో పాటు కొత్తిమీర, నిమ్మకాయలను సైతం అందించడం విశేషం. అదేవిధంగా స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం ఎస్సీ జనరల్కు కేటాయించగా ఘన్పూర్లో ఎస్సీ జనరల్ రిజర్వేషన్లు ఉన్న ఒకటో, పదమూడో వార్డులలో పోటీ తీవ్రంగా ఉంది. చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థులు సైతం ఓటర్లకు పెద్ద మొత్తంలో తాయిలాలు అందిస్తున్నారు. డీఎం, సిబ్బందికి ప్రశంసలు జనగామ రూరల్: మేడారం జాతర 2026 విజయవంతమైన సందర్భంగా మంగళవారం వరంగల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కరీంనగర్, రీజినల్ మేనేజర్ వరంగల్ ఆధ్వర్యంలో జనగామ డిపో అధికారులకు, సిబ్బందిని ప్రశంసించారు. ఈసందర్భంగా జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో జనగామ డిపో మేనేజర్ ఎస్.స్వాతికి ప్రశంసపత్రాలు అందజేశారు. జనగామలోని ప్రెస్టన్ గ్రౌండ్స్, స్టేషన్ ఘన్పూర్ నుంచి మేడారం జాతరకు 130 స్పెషల్ బస్సులను దిగ్విజయంగా నడిపించారు. సహకరించిన ప్రతి ఒక్కరికి డీఎం కృతజ్ఞతలు తెలిపారు. కొనసాగుతున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనగామ రూరల్: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఇంటర్ విద్యాధికారి జితేందర్రెడ్డి మంగళవారం తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షకు జనరల్లో 270 విద్యార్థులకు గాను 269 మంది, ఒకేషనల్లో 120 మందికి 107 హాజరయ్యారన్నారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షలో జనరల్లో 260 విద్యార్థులకు 257 మంది, ఒకేషనల్లో 40 38 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు.రూట్ ఆఫీసర్స్: 6జనగామ/స్టేషన్ఘన్పూర్: జిల్లాలో జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల్లో ఈనెల 11న(బుధవారం) ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను పూర్తి చేసేలా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేస్తున్నారు. జనగామ మున్సిపాలిటీలోని 30వార్డుల పరిధిలో 66, స్టేషన్ఘన్పూర్లో 18వార్డులకు గాను 36 మొత్తంగా 102 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్లు..పోలింగ్ కేంద్రాలు ఇలా.. జిల్లాలోని రెండు పురపాలికల్లో 62,595మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 30,271, మహిళలు 32,314మంది ఉన్నారు. ఇందులో జనగామ పరిధిలో 44,045 ఓటర్లలో పురుషులు 21,358, మహిళలు 2 2,678 ఓటర్లు, ఇతరులు 9 మంది ఉన్నారు. స్టేషన్ఘన్పూర్లో 18,550 ఓట్లలో పురుషులు 8,913, మహిళలు 9,636మంది, ఇతరులు ఒక్కరు ఉన్నారు. జనగామలో 66, ఘన్పూర్లో 36 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని రెండు పురపాలికల్లో ఓట్ల వరకు పరిశీలిస్తే మహిళలదే పైచేయిగా కనిపిస్తోంది. 372మంది అధికారులు, సిబ్బంది జనగామ, స్టేషన్ఘన్ఫూర్లో పీఓ, ఓపీఓ, తదితర అధికారులు, సిబ్బంది 372 మంది సేవలు అందించనున్నారు. జనగామలో 80 మంది ప్రిసైడింగ్, మరో 80 మంది సహాయ ప్రిసైడింగ్ మొత్తంగా 160 మంది ఉన్నారు. స్టేషన్ఘన్పూర్లో 44 మంది ప్రిసైడింగ్, మరో 44 మంది సహాయ ప్రిసైడింగ్తో కలుపుకుని 132 మందితో పాటు ఇతర పోలింగ్ అధికారులను నియమించారు. ఇదిలా ఉండగా జనగామ 28, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలో 9 మంది మొత్తం 37 మంది మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో జరుగనున్నాయి. ఎలక్షన్ కమిషన్ నిఘా నేటి పోలింగ్ సందర్భంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఎప్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఎంసీసీ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. 9మంది జోనల్ ఆఫీసర్స్, 9 మంది రూట్ అధికారులను నియమించామని ఉన్నతాధికారులు తెలిపారు. జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల్లో రెండు చోట్ల ఒక్కొక్కరిని వ్యయ (ఖర్చుల) పరిశీలకులను నియమించారు. కౌంటింగ్ సూపర్వైజర్లు జనగామ మున్సిపల్ పరిధిలో 36, స్టేషన్ఘన్పూర్లో 22మంది కౌంటింగ్ సూపర్మైజర్స్, అలాగే స్టేషన్ఘన్పూర్లో 44, జనగామ మున్సిపల్లో 72 కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఎన్నికలు ప్రక్రియను వందశాతం వెబ్కాస్టింగ్ ద్వారా నిర్వహించనున్నారు. పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలు పోలింగ్ను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఏకశిల బీఈడీ కళాశాల, స్టేషన్ఘన్పూర్లోని పట్టగుట్ట రోడ్డులోని సోషల్ వెల్ఫేర్ స్కూల్లో పోలింగ్ సామగ్రి(డిస్ట్రిబ్యూషన్) పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సుల్లో పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు నడుమ పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు. మున్సిపాలిటీ పురుషులు మహిళలు అదర్స్ మొత్తం జనగామ 21,358 22,678 9 44,045 స్టే.ఘన్పూర్ 8,913 9,636 1 18,550 మొత్తం 30,271 32,314 10 62,595పోలింగ్ కేంద్రాలు జనగామ: 66 స్టేషన్ఘన్పూర్: 36సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఇవే.. జనగామ, స్టేషన్ఘన్పూర్లో 12 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఇందులో జనగామలో అంబేడ్కర్నగర్(ప్రాథమిక పాఠశాల/పీఎస్), మున్సిపల్ ఆఫీసు, ఉర్దూ మీడియం(లక్ష్మీబాయ్కుంట), వీవర్స్ కాలనీ (ప్రాథమిక పాఠశాల), ధర్మకంచ(జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల), ధర్మకంచ రైల్వే లైన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, రైల్వేస్టేషన్(ప్రాథమికోన్నత పాఠశాల), గుండ్లగడ్డ ప్రాథమిక ఉర్దూ మీడియం సమస్యాత్మక పరిధిలో ఉన్నాయి. స్టేషన్ ఘన్పూర్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, శివునిపల్లి జెడ్పీహెచ్ఎస్, చాగల్లు జెడ్పీహెచ్ఎస్, ప్రైమరీ స్కూళ్లను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా పోలీసులు గుర్తించారు.జనగామలో నిఘా బృందాలు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఓటు వేయాలంటే గుర్తింపుకార్డు తప్పనిసరి జనగామలో ఏకశిల బీఈడీ కళాశాల, ఘన్పూర్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సామగ్రి పంపిణీ కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తుస్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీఓటేసేందుకు 18 కార్డులు.. మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ -
రెండేళ్లలో పదేళ్ల అభివృద్ధి
● చివరి రోజు ఎన్నికల ర్యాలీలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యజనగామ: పదేళ్లలో బీఆర్ఎస్ చేయని అభివృద్ధిని సీఎం రేవంత్రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన రెండేళ్లలో చేసి చూపించారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కొనియాడారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచారం చివరి రోజు పట్టణంలోని 20, 21, 22, 23 వార్డుల్లో ఆయన పాల్గొన్నారు. బీరప్పగడ్డ నుంచి ర్యాలీగా నెహ్రూపార్కు, కుర్మవాడ మీదుగా లక్ష్మీ వాటర్ప్లాంట్ వరకు చేరుకున్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి అధ్యక్షతన జరిగిన ర్యాలీలో ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతితో కలిసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 21వ వార్డులో మైసమ్మ గుడి పునర్మిర్మాణానికి ఎంపీతో కలిసి కృషి చేస్తామన్నారు. కొత్తగా 3,500 ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయని, కాంగ్రెస్, సీపీఎం బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి ప్రజాపాలనకు మద్దతు పలకాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు కడకంచి బాలమనిశ్రీనివాస్, గ్యాదరి రేణుక, బాల్దె మల్లేశం, మోటో రేణుక, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, నాయకులు కంచె రాములు తదితరులు పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్బీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 14 నుంచి 18వరకు జరిగే మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ పరిశీలించారు. ఈసందర్భంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో పార్కింగ్ ప్రదేశం, క్యూలైన్ పరిశీలించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ జానకిరాంరెడ్డి, ఎస్సై దూలం పవన్కుమార్, ఆలయ ఈఓ లక్ష్మీప్రసన్న, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అనుమానితుల కదలికలపై నిఘా జనగామ: ఎలక్షన్ ప్రచారం ముగిసిన నేపథ్యంలో పట్టణంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అనుమానిత వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. సోమవారం సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై చెన్న కేశవులుతో కలిసి లాడ్జీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
టూరిజం కోర్సుల అధ్యయనంతో ఉపాధి
● కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ విజయబాబు ● కేడీసీలో సర్టిఫికెట్ కోర్సు ప్రారంభం విద్యారణ్యపురి: టూరిజం కోర్సుల అధ్యయనంతో విద్యార్థులు ఉపాధి అవకాశాలు పెంచుకోవాలని కేయూ హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ విభాగం రిటైర్డ్ ఆచార్యులు విజయబాబు అన్నారు. సోమవారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో ‘టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ తెలంగాణ’ సర్టిఫికెట్ కోర్సును బీసీ విద్యార్థులకు ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. టూరిజాన్ని స్మోక్ లెస్ ఇండస్ట్రీగా అభివర్ణించారు. టూరిజం అభివృద్ధితో ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. సమావేశంలో ఆ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రజనీలత, అధ్యాపకులు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ఎ.శ్రీనాఽథ్, చరిత్ర విభాగం అధిపతి ఇందిరాదేవి, ఎస్.సమ్మయ్య, రామ్రెడ్డి, బి.రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ విజయబాబును అధ్యాపకులు సన్మానించారు. -
గప్చుప్గా పంచుడు!
జనగామ: మున్సిపల్ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో అధికారికంగా ముగిసింది. ప్రచార పరిమితులు అమల్లోకి రావడంతో జనగామ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీల్లో నిశ్శబ్దం అలుముకుంది. పోలింగ్కు 48 గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో మైకులు, ర్యాలీలు, రోడ్షోలు, బహిరంగ ప్రచారం ఆగిపోయినా, పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఇంటింటి ప్రచారంలో వేడి పెంచారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ కాగా, పోలీసులు, ఎలక్షన్ నిఘా టీంలు మద్యం సరఫరా, డబ్బు పంపిణీ, గిఫ్టుల పంపకాలపై నిఘా మరింత కఠినతరం చేశారు. భారీ ర్యాలీలు..జోరు ప్రచారం చివరి రోజు ప్రచారంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, సీపీఎం, బీజేపీ, స్వతంత్రులు ప్రదర్శన, ర్యాలీలు చేపట్టారు. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, కాంగ్రెస్ తరఫున ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థుల బలం, అభివృద్ధి హామీలను ప్రజలకు నాయకులు వివరించారు. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో 30 వార్డుల్లో వందలాది మంది కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. గులాబీ జెండాలతో నిండిన ర్యాలీలో యువత భారీగా పాల్గొని ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. సీపీఎం, సీపీఐతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈసారి ఓటర్లను ఆకర్షించేందుకు వాడవాడలా భారీ ర్యాలీలతో రంగంలోకి దిగి తమ శక్తిని చాటుకున్నారు. ఎన్నికల సంఘం అప్రమత్తం ప్రచార ముగింపు నేపథ్యంలో ఎన్నికల అధికారులు, పోలీసు బృందాలు రాజకీయ పార్టీల కదలికలపై ప్రత్యేకంగా నిఘా పెట్టాయి. డబ్బు, మద్యం, గిఫ్ట్ సరఫరా జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. పోలింగ్కు రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో అన్ని పార్టీలూ ఓటర్లను టచ్ చేస్తూ చివరి నిమిషంలో గెలుపు కోసం ప్రతి ప్రయత్నంలో వేగం పెంచారు. ఈసారి ఫలితాలు ఎలా ఉండబోతాయో పట్టణం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మద్యం దుకాణాలు బంద్ పురపాలిక ఎలక్షన్ల నేపథ్యంలో ఈ నెల9వ తేదీ 5 గంటల నుంచి 11వ తేదీ పోలింగ్ ముగిసే వరకు జనగామ, స్టేషన్ఘన్పూర్ రెండు మున్సిపాలిటీల పరిధిలో 17 మద్యం దుకాణాలు, 5 బార్లు మూసివేయనున్నారు. ఇందుకు సంబంధించి ఎకై ్సజ్ శాఖ మద్యం దుకాణాలతో పాటు బార్లను మూసివేసి సీజ్ చేశారు. అనంతరం ఓట్ల లెక్కింపు రోజు సైతం వీటిని మూసివేయనున్నారు. మున్సిపల్ పరిధిలో వైన్స్లను మూసివేశారు. పెంబర్తి, నెల్లుట్ల, రఘునాథపల్లి మండలాల నుంచి పెద్దఎత్తున మద్యం తరలించనుండగా, చాలా మంది అభ్యర్థులు రెండు రోజలు ముందుగానే రహస్య ప్రాంతాల్లో డంప్ చేసినట్లు సమాచారం. ఓటుకు నోటుతో పాటు సిట్టింగ్లతో పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు అన్ని వార్డుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.బయటి హడావిడి ఆగింది.. ఇంటింటి బాట మొదలైంది సరిగ్గా సాయంత్రం ఐదు గంటలు దాటగానే ఎన్నికల నియమావళి ప్రకారం అన్ని మైకులు ఆగిపోయాయి. రాజకీయ నేతలు కూడా మౌనాన్ని పాటించాల్సి రావడంతో వీధులు ఒక్కసారిగా ప్రశాంత వాతావరణంలోకి జారుకున్నాయి. అయితే ప్రచారం ముగిసిందే కానీ పోరు చల్లారలేదు. విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ, కొమ్మూరి, ధన్వంతి 5 గంటల సమయం కంటే నాలుగు నిమిషాల ముందుగానే ప్రచారరథం నుంచి కిందకు దిగగా, ఎమ్మెల్యే ర్యాలీ నుంచి ముందుగానే క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను సంప్రదించడం మాత్రమే ప్రస్తుతం పార్టీలు, అభ్యర్థుల ప్రధాన వ్యూహంగా మారింది. వార్డుల్లో ఇప్పటికే ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, సంఘాల వారీగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం, గిఫ్ట్ ప్యాకెట్లు, వెండి కాయిన్లు, ఓటుకు నోటు పద్ధతి, బాండ్ పేపర్లపై హామీలు ఇలా ఎన్నో రూపాల్లో గంపగుత్తగా ఓట్ల కొనుగోలు ప్రయత్నంలో వేగం పెంచారు. కొందరు అభ్యర్థులు సంఘాల ఆధ్వర్యంలో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఓట్ల బ్లాకులను తమవైపు తిప్పుకునేందుకు కసరత్తులు చేస్తున్నారని సమాచారం. ముగిసిన పురపోరు ప్రచారం మూగబోయిన జనగామ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీల వీధులు చివరిరోజు అన్ని పార్టీల జోరు ప్రచారం కాంగ్రెస్, బీఆర్ఎస్ భారీ ర్యాలీలు సంఘాల వారీగా రహస్య ఒప్పందాలు 48 గంటల్లో పోలింగ్... అంతటా ఉత్కంఠ -
రవీందర్రావుకు జీవిత సాఫల్య పురస్కారం
లింగాలఘణపురం: మండలంలోని నెల్లుట్ల శివారు శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు, నెల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అనసూయమ్మ లక్ష్మారావు కళాపీఠం నిర్వాహుకుడు నెల్లుట్ల రవీందర్రావుకు ఆదివారం రాత్రి శివానీ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. హైదరాబాద్లో హనుమాన్పేట్లోని కమ్యూనిటీ హాల్లో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో శివానీ ఆర్ట్స్ అసొసియేషన్ అధ్యక్షుడు పరమేశ్వర్, గౌరవ అధ్యక్షుడు దొంతి శిల్పారెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ జీసీ రెడ్డి, డైరెక్టర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
ఇచ్చిన మాట తప్పేది లేదు
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడంతో పాటు తమ నీలిమా ఆస్పత్రిలో ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం చివరి రోజు ప్రచారంలో భాగంగా పట్టణంలోని 30 వార్డుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలోని ప్రతి వార్డు నుంచి నీలిమా ఆస్పత్రికివె వెళ్లి ఉచిత వైద్యం, మందులు, ఆపరేషన్లతో కార్పోరేట్ చికిత్సలు పొందుతున్నారన్నారు. ఈ సేవలు మరో 3ఏళ్ల పాటు ఇలాగే కొనసాగుతాయన్నారు. జనగామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, పట్టణ ప్రజలు ఆలోచన చేసిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. -
నిర్భయంగా ఓటేయాలి
● పోలీస్ కవాతులో ఏసీపీ భీమ్శర్మ స్టేషన్ఘన్పూర్: ఈనెల 11న నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని స్టేషన్ఘన్పూర్ ఏసీపీ భీమ్శర్మ సూచించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా స్టేషన్ఘన్పూర్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం డివిజన్కేంద్రంలో పోలీసుకవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ఎన్నికల కోసం పోలీసుశాఖ తరఫున తగిన బందోబస్తు ఏర్పాటు చేశామని, డీసీపీ పర్యవేక్షణలో ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐలు, 15 మంది ఎస్ఐలు, 200 మంది పోలీసు కానిస్టేబుళ్లు విధుల్లో ఉంటారన్నారు. కార్యక్రమంలో సీఐలు జి.వేణు, శ్రీనివాస్రెడ్డి, ఎస్ఐలు వినయ్కుమార్, రమేశ్, మనీషా తదితరులు పాల్గొన్నారు. -
పక్కాగా పోలింగ్ ఏర్పాట్లు
● డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో వసతులు కల్పించాలి ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్జనగామ రూరల్: జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని ఇందుకు ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. ఈ నెల11న జనగామ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పోలింగ్ స్టేషన్లలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, నోడల్ అధికారులతో సోమవారం గూగుల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ అధికారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. వందశాతం వెబ్కాస్టింగ్కు ఏర్పాటు చేస్తామని, పోలింగ్ అనంతరం బ్యాలెట్ పేపర్లను జాగ్రత్తగా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచ్చాలన్నారు. ఎన్నికల నియమాలు కట్టుదిట్టంగా అమలు.. స్వేచ్ఛాయుతంగా, ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ఈ నేపథ్యంలో 09.02.2026 సాయంత్రం 5.00 గంటల నుంచి 11.02.2026 సాయంత్రం 5.00 గంటల వరకు నిశ్శబ్ద కాలం అమల్లో ఉంటుందని తెలిపారు. జనగామ మున్సిపాలిటీకి ఏకశిలా బీఎడ్ కళాశాల, హైదరాబాద్ రోడ్, ఘన్పూర్ మున్సిపాలిటీకి సోషల్ వెల్ఫేర్ స్కూల్ నుంచి పోలింగ్ సిబ్బందికి అవసరమైన సామగ్రి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ‘పది’ ఫలితాల్లో మొదటి స్థానంలో నిలవాలి విజయోస్తు 2.0తో జిల్లాను మొదటి స్ధానంలో నిలపాలని, విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలంటే ప్రణాళికబద్ధంగా చదవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. స్టేషన్ రోడ్లోని ప్రభుత్వం ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు విజయోస్తు 2.0 స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, హెచ్ఎం నర్సింహరెడ్డి, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన తప్పనిసరి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన తప్పనిసరిగా ఉండాలని, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధి కోసం సోక్ పిట్ల ఏర్పాటు అవసరమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని పొలాల్లో ఎర్త్ ఆగర్యంత్రం ద్వారా సోక్ పిట్లు తవ్వే విధానంపై డెమో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పాలీహౌస్ను సందర్శించి, అందులో కూరగాయల సాగు చేస్తున్న రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, ఏఈఓ అనిల్, అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
పోలింగ్ సామగ్రి పంపిణీకి సిద్ధం
స్టేషన్ఘన్పూర్: ఈనెల 9న నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సామగ్రి పంపిణీకి స్థానిక ప్రభుత్వ ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్డీఓ డీఎస్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను మున్సిపల్ కమిషనర్తో కలిసి ఆర్డీఓ సోమవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..18 వార్డులకు ఆరు లొకేషన్లలో 36 పోలింగ్బూత్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్టేషన్ఘన్పూర్లో 2, ఛాగల్లులో 2, శివునిపల్లిలో 2 లొకేషన్లలో పోలింగ్బూత్లు ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. రేపటి నుంచి వ్యవసాయ మార్కెట్కు సెలవులు జనగామ: పురపాలిక ఎన్నికల సందర్భంగా ఈ నెల11, 12వ తేదీన జనగామ వ్యవసాయ మార్కెట్కు సెలవులను ప్రకటించడం జరిగిందని ఏఎంసీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జీవన్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 12వ తేదీన హమాలీ కార్మికుల కోరిక మేరకు బంద్ ఇచ్చినట్లు, 13వ తేదీన యథావిధిగా సేవలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు జనగామ రూరల్: జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కలెక్టర్ ఆదేశానుసారం డీఆర్డీఏ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ లాజిస్టిక్స్ ట్రైనింగ్ ఆఫ్ ఎక్స్లెన్స్ సహకారంతో జాబ్ గ్యారంటీతో కూడిన ఉచిత స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు డీఆర్డీఓ వసంత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భాగంగా హైదరాబాద్లోని విద్యానగర్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో 30 మంది యువతీ యువకులు శిక్షణలో చేరారన్నారు. రియల్ టైమ్ ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్, సప్లై చైన్ అసోసియేట్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అంశాలపై వీరికి మూడు నెలల ఉచిత వసతితో కూడిన శిక్షణ ఇవ్వడం జరిగిందని, ఈ నెల చివరి భాగంలో వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం బహుళ జాతీయ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. బ్యాచ్ కోసం మార్చి 5 వ తేదీ నుంచి పై కోర్సులకు దరఖాస్తులు తీసుకుంటామన్నారు. సుశ్రుత, దేవర్ష్లది కులదురహంకార హత్య పాలకుర్తి టౌన్: సుశ్రుత, దేవర్ష్లది కుల దురహంకార హత్య అని, కులాంతర వివాహాల రక్షణకు చట్టం చేయాలని కులఅసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలు గన్నారపు సరోజన అన్నారు. సోమవారం మండలంలోని గూడూరులో సుశ్రుత, దేవర్ష్ ల ఏడో వర్ధంతిని సుశ్రుత తల్లి కోమల, కుటుంబ సభ్యులతో కలిసి సమాధుల వద్ద నిర్వహించారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కన్వీనర్ గుండె ప్రమోద్, విలాస్, స్పప్న, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కోర్టు ప్రాంగణంలో నిందితుడి ఆత్మహత్యాయత్నం జనగామ రూరల్: తాను జైలుకు వెళ్లే అవకాశం ఉందని జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో సోమవారం ఓ నిందితుడు ఆత్మహత్యకు యత్నించాడు. పాలకుర్తి మండలంలోని వావిలాల గ్రామానికి చెందిన కర్ణం సాయికి తల్లిదండ్రులు లేరు. ఒక సోదరి ఉంది. దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఇటీవల ఉప్పల్కు చెందిన ఒక యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పాలకుర్తిలోని డబుల్ బెడ్ రూంలో అద్దెకు ఉంటున్నాడు. ఇటీవల పక్క ఇంట్లో దొంగతనం చేయగా పోలీసులు పట్టుకొని రిమాండ్ తరలించారు. సోమవారం జడ్జి వాదనలు విని జైలుశిక్ష ఖరారు చేశారు. తాను జైలుకు వెళ్లనని, తనకు భార్య ఉందని ఆమెను కూడా జైలుకు పంపాలని గొంతుకోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. కాగా ఇప్పటికే 14 సార్లు జైలుకు వెళ్లాడని, అతడికి అలవాటుగా మారిందని పోలీసులు తెలిపారు. -
పురపాలికలకు నిధుల వరద
సోమవారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026కొద్ది రోజులుగా పలు కొత్త జిల్లాలను రద్దు చేస్తారని, రెండు జిల్లాలను కలిపి ఒకటి చేస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ములుగు, భూపాలపల్లిని కలిపి ఒకటే చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో జిల్లాల రద్దు ప్రచారంపై సీఎం రేవంత్రెడ్డి స్పష్టత ఇచ్చారు. జిల్లాలను రద్దు చేయబోమని, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయమని ప్రకటించారు. దీంతో భూపాలపల్లి జిల్లా రద్దు అనే ప్రచారానికి చెక్ పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. భూపాలపల్లి జిల్లా చెల్పూరులో జరిగిన సభకు హాజరైన జనం, అభివాదం చేస్తున్న సీఎం రేవంత్పాలకవర్గాలు లేకపోయినా గడిచిన ఏడాదిలో భారీగా విడుదల చేశాం..భూపాలపల్లి / భూపాలపల్లి అర్బన్ / రేగొండ / గణపురం: ఏడాది కాలంగా మున్సిపాలిటీలకు పాలకవర్గాలు లేకపోయినా భారీగా నిధులు మంజూరు చేసి పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అన్నా రు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారు సింగరేణి వేయి క్వార్టర్ల ఎదురుగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజా పాలన–ప్రగతి బాట బహిరంగ సభకు రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖతో కలిసి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ... గడిచిన ఏడాది కాలంలో భూపాలపల్లి మున్సిపాలిటీకి రూ. 92 కోట్లు, పరకాలకు రూ.52 కోట్లు, జనగామకు రూ.82కోట్లు.. ఇలా ప్రతీ మున్సిపాలిటీ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేశామన్నారు. త్వరలో ఏర్పడబోయే పాలకవర్గం ఆ నిధులతో ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలన్నారు. ఓరుగల్లుది ఉద్యమాల చరిత్ర.. ఉమ్మడి వరంగల్కు గొప్ప చరిత్ర ఉందని, ప్రపంచంలోనే భారత దేశానికి గొప్ప పేరు తెచ్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఈ ప్రాంతానికి చెందిన బిడ్డ అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కర్త, క్రియగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వ్యవహరించారన్నారు. రాష్ట్రాన్ని సాధించడంలో ముందుభాగంలో నిలబడిన ప్రొఫెసర్ జయశంకర్ ఈ ప్రాంతం బిడ్డ అంటూ.. ఓరుగల్లు ఉద్యమ చరిత్రను గుర్తు చేశారు. సింగరేణి కార్మికులు సైతం రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. మెడికల్ బోర్డుపై తప్పుడు ప్రచారం.. తాత్కాలిక ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు సింగరేణి మెడికల్ బోర్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బోర్డును రద్దు చేసేది లేదని, విష ప్రచారం చేస్తున్న వారిని మోకాళ్లపై కూర్చోబెట్టి కొట్టాలని సీఎం అన్నారు. 217 మంది డిస్మిస్డ్ కార్మికులు ఉన్నారని, వారి సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తామన్నారు. సింగరేణి కార్మికులకు నష్టం కలిగించే పనులు చేయబోమన్నారు. బైపాస్కు నిధులు మంజూరు.. భూపాలపల్లి పట్టణంలో నిత్యం రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని, కేంద్రంతో మాట్లాడి బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించామన్నారు. ప్రస్తుతం డీపీఆర్ ప్రక్రియ పూర్తయిందని, టెండర్ దశలో ఉందన్నారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. గత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఏనాడూ భూపాలపల్లి పట్టణాన్ని పట్టించుకోలేదన్నారు. ఆయన నకిలీ గండ్ర.. మీ ఎమ్మెల్యే సత్యనారాయణరావు అసలు గండ్ర అని, మరొకరు నకిలీ గండ్ర అని సీఎం రేవంత్ అన్నారు. నకిలీ గండ్రను మీరు నమ్మి గెలిపిస్తే గుండెల మీద తన్ని వేరే పార్టీలో చేరాడన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. అనంతరం మహిళా సంఘాలకు రూ.205 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల నమూనా చెక్కును సీఎం అందజేశారు. ఆకట్టుకున్న ఇందిరా ‘మహిళా’శక్తి చీరల రంగు మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకంకింద అందించిన నీలి రంగు చీరలను కట్టుకుని ప్రాంగణానికి చేరుకున్నారు. అందరూ ఒకేచోట కూర్చోవడంతో ప్రాంగణ మంతా నీలిరంగుతో కళకళలాడింది. సీఎం, మంత్రుల ప్రసంగాల సమయంలో మహిళలు కేరింతలు కొట్టారు. మరికొందరు నృత్యాలు చేశారు. మున్సిపాలిటీలను సుందరంగా తీర్చిదిద్దుతున్నాం భూపాలపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.500 కోట్లు సింగరేణి మెడికల్ బోర్డు రద్దు చేస్తామంటూ విష ప్రచారం మున్సిపల్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి చెల్పూరు ప్రజా పాలన–ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి -
పూర్వ విద్యార్థుల ఔదార్యం
● పాఠశాలకు రూ,1,20,000 విలువైన డెస్క్ బెంచీల అందజేత పాలకుర్తి టౌన్: పాలకుర్తి మండలం గూడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలో 1996–1997 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు అర్జుల రాంరెడ్డి, గందె రాధిక సహకారంతో పాఠశాలకు రూ.1,20,000 విరాళాన్ని ప్రకటించారు. ఆ విరాళంతో 25 డెస్క్ బెంచీలను ఆదివారం పాఠశాలకు అందజేశారు. 2024 డిసెంబర్ 1న నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో.. ఆ నిధులతో విద్యార్థులకు ఉపయోగార్థం 25 డెస్క్ బెంచీలను గ్రామ సర్పంచ్ మాచర్ల స్వరూప, ఉపాధ్యాయల సమక్షంలో పాఠశాలకు అందజేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మాచర్ల పుల్లయ్య, మడత రవీంద్రుడు, బెల్లి సంపత్, సర్థార్ అశోక్, మానుపాటి శ్రీనివాస్, గదరి నర్సింగ్,కూస సోమయ్య, తుమ్మ నాగలక్ష్మీ, సుజాత, పెద్దురి కళావతి, వంగపల్లి స్వరూప, ఎనగందుల సునీత, టీ రమేష్, కుమార్, పూజారి మల్లయ్య పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి
పాలకుర్తి టౌన్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 14 నుంచి 18 వరకు జరిగే మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని దేవస్థానం ఆవరణంలో మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాల ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఓ లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ.. ప్రచార రథాల ద్వారా ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలో మహాశివరాత్రి జాతర ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న, అర్చకులు డీవీఆర్శర్మ, అనిల్కుమార్, మత్తగజం నాగరాజు, ఆలయ సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు. సోమన్న ఆలయంలో ప్రచార రథాలు ప్రారంభం -
కేంద్ర నిధులతోనే అభివృద్ధి
● బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ జనగామ రూరల్: కేంద్ర నిధులతోనే సంక్షేమం, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రెండేళ్లుగా రాష్ట్రంలో, జిల్లాలో 5 పైసల పనికుడా చేయలేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా పట్టణంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. నెహ్రూపార్కు ఏరియా, గిర్నిగడ్డ లేబర్ అడ్డా, సంజయ్ నగర్ చమాన్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక, బార్డర్లో ఎలాంటి తుపాకుల మోత లేదని దేశం మొత్తం ప్రశాంతంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. పట్టణం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని ప్రజలు ఒక్క సారి ఆలోచించి బీజేపీకి అవకాశం ఇవ్వాలని అన్నారు. ఈకార్యక్రమంలో అభ్యర్ధులు మాచర్ల స్వరూప, కోట వినోద్,నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కొడవటంచ ఆలయంలో పూజలు..
జిల్లా పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సీఎం రేవంత్రెడ్డి తొలుత రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో స్వామివారిని మంత్రులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రూ.12.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃనిర్మాణ పనులు, అలాగే రూ.74.15 కోట్లతో అతిథి గృహాలు, అంతర్గత రహదారుల నిర్మాణం తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో రావిమొక్క నాటారు. ఆయా కార్యక్రమాల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ హరీశ్, కనీస వేతనాల కార్పొరేషన్ చైర్మన్ జనక్ప్రసాద్, పీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, డీసీసీ అధ్యక్షుడు కర్ణాకర్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో నష్కల్ విద్యార్థికి గోల్డ్మెడల్
చిల్పూరు: మండలంలోని నష్కల్ గ్రామానికి చెందిన పాశం వేణు కుమారుడు విశ్వేష్ ఆదివారం సెయింట్ ఆంథోని పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రాండ్మాస్టార్లు పాపయ్య, ప్రశాంత్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్తో పాటు సర్టిఫికెట్ అందుకున్నాడు. అంతర్రాష్ట్ర ఓపెన్ స్కూల్స్ టోర్నమెంట్ సికోకై షీటో రియో కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో కరాటే పోటీలు నిర్వహించగా విశ్వేష్ స్పారింగ్లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈసందర్భంగా సర్పంచ్ శాతబోయిన రాజు, పాశం రాజు, శాగంటి మణి, గుంజె రఘుపతి, రంగు రాజు, స్కూలు యాజమాన్యం అభినందనలు తెలిపారు. జనగామ రూరల్: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 57మంది గైర్హాజరయ్యారని ఇంటర్ విద్యాధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 7 కేంద్రాల్లో నిర్వహించగా ఉదయం జరిగిన పరీక్షలో జనరల్లో 287 మంది విద్యార్థులకు గాను 286మంది హాజరు కాగా ఒక్కరు గైర్హాజరయ్యారు. ఒకేషనల్లో 270మంది విద్యార్థులకు గాను 236మంది హాజరు కాగా 34 గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 217మంది విద్యార్థులకు గాను 216మంది హాజరు కాగా ఒక్కరు గైర్హాజరయ్యారు. ఒకేషనల్ 291మంది విద్యార్థులకు గాను 270మంది హాజరు కాగా, 21మంది గైర్హాజరయ్యారు. -
స్థానికేతరులు వెళ్లిపోవాలి
వరంగల్క్రైం: మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం ముగియనుండడంతో స్థానికేతరులు వెళ్లిపోవాలని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. వెళ్లకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి స్టేషన్ ఘన్పూర్, జనగామ, పరకాల, వర్ధన్నపేట పట్టణాల్లో ప్రచారం ముగియనున్న నేపఽథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రచారం నిమిత్తం వచ్చిన ఆయా పార్టీలకు చెందినవారు గమ్యస్థానాలకు తిరిగి వెళ్లాలని సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ -
ప్రచారానికి నేటితో తెర!
జనగామ: పది రోజుల పాటు ఉర్రూతలూగించిన పుర ప్రచారం ఈనెల 9న (సోమవారం) సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. గత నెల 31వ తేదీ నుంచి అన్ని రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు వార్డుల వెంట ప్రచార రథాలతో మైకుల మోత మోగించి, ఇంటింటికీ తిరిగి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. హోరెత్తిన వార్డులు నేటి రాత్రితో నిశ్శబ్దంలోకి వెళ్లనున్నాయి. రెండు విడతల్లో..! ప్రచారం ముగియడంతో, ఇప్పుడు అన్ని పార్టీల దృష్టి పోల్ మేనేజ్మెంట్పై కేంద్రీకరించనున్నాయి. ఏ వార్డులో ఎవరికెన్ని ఓట్లు వస్తాయో అన్న లెక్కలను అభ్యర్థులు ముందే సిద్ధం చేసుకుని, దాని ఆధారంగా తాయిలాల పంపిణీ వ్యూహాలు రూపొందిస్తున్నారు. శ్రీఎదుటి పార్టీ అభ్యర్థి ఎంత ఇస్తున్నాడు.. మనం ఎంత ఇవ్వాలి.. ఎక్కడ పంపిణీ చేయాలి..శ్రీఅనే లెక్కలతో పత్రాలు, జాబితాలు సిద్ధమయ్యాయి. నేటి అర్ధరాత్రి నుంచి తొలి విడతగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు మొదలై, ఎన్నికలకు ముందు రాత్రి మరోసారి డబ్బు, గిఫ్టులను పంపిణీ చేయాలనే స్కెచ్ ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. ఓటర్ల కోసం రహస్యంగా డీల్ జనగామ, స్టేషన్న్ ఘన్పూర్ రెండు మున్సిపాలిటీల్లో ఆయా వార్డుల్లో త్రిముఖ పోటీలు ఉండడంతో ఓట్ల కొనుగోలు బరిలో దిగిన అభ్యర్థుల కోసం కీలకంగా మారింది. ముఖ్యంగా 10నుంచి 20శాతం వెనుకబడి ఉన్న అభ్యర్థులు ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో నోట్లకట్టలు విప్పేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం ఉంది. విజయం కోసం ఏ రిస్క్కై నా సిద్ధం అన్న భావనతో ప్రభావితం చేయగలిగే ఓటర్లను గుర్తించి రహస్యంగా డీల్ జరుపుతున్నట్లు సమాచారం.ప్రచారం ముగియడంతో ఓటర్లను ప్రలో భాలకు గురిచేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక ఎన్నికల కమిషన్ నిఘా ఏర్పాటు చేసింది. ఎలాంటి ప్రలోభాలు, డబ్బు పంపిణీ జరగకుండా ఎఫ్ఎస్టీలు, ఎస్ఎఫ్ఎస్టీలు రంగంలోకి దిగారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపాలిటీ పరిధిలో డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆధ్వర్యంలో పో లీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టారు. ముఖ్యమైన వార్డుల్లో అదనపు పికెటింగ్, పెట్రోలింగ్తో చేస్తూ అప్రమత్తంగా ఉన్నారు. రాత్రి నుంచే ప్రలోభపర్వం ‘పోల్ మేనేజ్మెంట్’లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు డబ్బులు, గిఫ్టులు సిద్ధం రంగంలోకి ఎన్నికల కమిషన్ -
52.27శాతం ఉత్తీర్ణత
● డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల జనగామ రూరల్: కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల అటానమస్గా ఏర్పాటు అయిన తరువాత మొదటిసారిగా కళాశాల ప్రాంగణంలో డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలను ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, అధ్యాపకులు శనివారం విడుదల చేశారు. అన్ని కోర్సుల విద్యార్థులు 308మందికి 161 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, ఉత్తీర్ణత శాతం 52.27గా నమోదైంది. ఈ మేరకు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, వారికి సహకరించిన అధ్యాపకులకు కాకతీయ విశ్వవిద్యాలయ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కట్ల రాజేందర్, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ తిరుమలాదేవి, ప్రొఫెసర్ వెంకటయ్య, కళాశాల ప్రిన్సిపాల్ అభినందనలు తెలిపారు.బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి ● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ: పట్టణంలోని 30 వార్డుల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని 5, 6, 7, 8, 9, 10 వార్డుల్లో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీలు అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరిస్తూ, కిడ్నాప్లకు పాల్పడుతున్నారని రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. -
అభివృద్ధి చేసే వారికే ఓటు
నిజాయితీ గల నాయకులను అందలం ఎక్కిస్తామంటున్న ఓటర్లుస్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీని సమగ్రంగా అభివృద్ధి చేసేవారినే అందలం ఎక్కిస్తామని స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ ఓటర్లు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న స్టేషన్ఘన్పూర్.. పక్కనే ఉన్న శివునిపల్లి, ఛాగల్లు గ్రామపంచాయతీలను కలుపుతూ గతేడాది జనవరిలో మున్సిపాలిటీగా అవతరించింది. నియోజకవర్గం, రెవెన్యూ డివిజన్ కేంద్రమైన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీగా ఏర్పడినప్పటికీ పలు సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. మున్సిపాలిటీలో 18 వార్డులుండగా ముప్పైవేల పైచిలుకు జనాభా, 18,550 మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీగా ఏర్పడి ఏడాది గడుసున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ప్రధానంగా పారిశుద్ధ్యం, డ్రెయినేజీలు, రోడ్లు, నీరు, వీధి దీపాలు, పార్కింగ్ తదితర సమస్యలు పేరుకుపోయాయి. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీపై జెండా ఎగురవేసేందుకు వివిధ రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి, పట్టణ ప్రగతికి పాటుపడేవారికే తమ మద్దతు ఉంటుందని మున్సిపాలిటీ పౌరులు అంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో జయగార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ‘సాక్షి’ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన చర్చావేదికలో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తపర్చారు. రోడ్లు, డ్రెయినేజీల సమస్యలు పరిష్కరించాలి ఘన్పూర్ పట్టణ సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి ‘సాక్షి’ చర్చావేదికలో పలువురు ప్రముఖుల అభిప్రాయం -
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. రాత్రివేళ కాస్త చలి తీవ్రత ఉంటుంది. నేడు భూపాలపల్లికి సీఎం రేవంత్రెడ్డి● కొడవటంచ ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన, ప్రత్యేక పూజలు ● సింగరేణి వేయి క్వార్టర్ల ఎదురుగా బహిరంగ సభ భూపాలపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు (ఆదివారం) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. చాపర్ ద్వారా మధ్యాహ్నం 2 గంటలకు రేగొండ మండలం కొడవటంచకు చేరుకుంటారు. లక్ష్మీనర్సింహాస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. విశ్రాంతి భవనాన్ని పరిశీలించిన అనంతరం ఆలయంలో రూ.12 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలిస్తారు. అక్కడి నుంచి చాపర్ ద్వారా గణపురం మండలంలోని సింగరేణి వేయి క్వార్టర్ల ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభావేదికపై డీబీఎం 38 కాల్వకు పైప్లైన్ ఏర్పాటు, భీంఘన్పూర్ రిజర్వాయర్ ఆధునీకీకరణ, గణపసముద్రం చెరువు సిమెంట్ లైనింగ్ తదితర పనులకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిసింది. ఏర్పాట్లు పూర్తి.. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్రెడ్డి పర్యటించే స్థలాలు, సభాస్థలి, హెలిపాడ్ ప్రాంతాలను కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, సీఎం ప్రత్యేక సెక్యూరిటీ అధికారి వాసుదేవరెడ్డి శనివారం పరిశీలించారు. అనంతరం వాసుదేవరెడ్డి మాట్లాడుతూ సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భారీ బందోబస్తు.. సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిరంగ సభ వద్ద సుమారు 1,100 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. 10 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, ఎస్సైలు విధుల్లో ఉండనున్నారు. -
ఇండిపెండెంట్లే కీలకం!
● చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికపై ప్రభావం ● ప్రధాన పార్టీలకు గుబులు ● గెలుపు అవకాశం ఉన్న ఇండిపెండెంట్లపై గురి ● ఇప్పటి నుంచే టచ్లో పెట్టుకునే ప్రయత్నం ● మొదలైన ముఖ్యనేతల బేరసారాలుపోటీలో అత్యధికంగా స్వతంత్రులు సాక్షిప్రతినిధి, వరంగల్: మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికపై వారు ప్రభావం చూపుతారనే చర్చ జరుగుతోంది. మొత్తం 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులుంటే.. 1,073 మంది కౌన్సిలర్ సీటు కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు కలిసి 260 మంది, బీఆర్ఎస్ నుంచి 259, బీజేపీ నుంచి 240 మంది పోటీలో ఉన్నారు. ఇండిపెండెంట్గా 314 మంది వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో సమానంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రధాన పార్టీల్లో గుబులురేపుతున్నారు. ఆశించిన పార్టీలో టికెట్లు రాకపోవడంతో కొందరు స్వతంత్రులుగా రంగంలోకి దిగారు. ఇంకొందరు తమ సత్తా చాటేందుకు యత్నిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీల్లో ఎవరి ఓట్లు చీలుస్తారనే భయం అభ్యర్థుల్లో నెలకొంది. ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. టఫ్ ఫైట్.. స్వతంత్రుల కారణంగా ఎవరి ఓట్లకు గండిపడుతుందనే ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ టికెట్లు రానివారు రంగంలో గట్టిగానే పోరాడుతున్నారు. దీంతో ఓవైపు అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తూనే.. మరో వైపు గెలిచే అవకాశం ఉన్న ఇండిపెండెంట్లను ప్రధాన పార్టీల నేతలు టచ్లో పెట్టుకుంటున్నారు. గెలుపు గుర్రాలను ఎంపిక చేసి ఖర్చులు మోసేందుకు చాటుమాటుగా బేరసారాలు చేస్తున్నారు. 12 మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకునేందుకు పోటాపోటీగా ప్రచారం చేస్తున్న ప్రధాన పార్టీల నుంచి మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు స్వతంత్రులను రాజీ చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అంతర్గత మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడెక్కడ.. ఎలా ఉంది? హనుమకొండ పరకాల మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులకు 100 మంది పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి 22 మంది చొప్పున అభ్యర్థులుండగా, బీజేపీ నుంచి 21 కాగా రెబల్స్, స్వతంత్రులు కలిపి 35 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 12 మందికి విజయావకాశాలున్నాయంటున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ 30 వార్డులకు 120 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అన్ని వార్డులకు అభ్యర్థులను నిలపగా, స్వతంత్రులుగా కూడా 30 మంది తలపడుతున్నారు. ఇందులో ఆరుగురు గెలిచే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో 12 వార్డులకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను బరిలో నిలపగా, అత్యధికంగా 50 మంది ఇండిపెండెంట్లు (రెబల్స్ కూడా) పోటీలో ఉన్నారు. మొత్తం 50 మందిలో 20 మంది ఈజీగా గెలుస్తారన్న చర్చ జరుగుతోంది. జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులకు 27 వార్డుల్లో కాంగ్రెస్, 3 చోట్ల సీపీఐ, సీపీఎంలుండగా, బీఆర్ఎస్ నుంచి 29 మంది, బీజేపీ 26 మంది కౌన్సిలర్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇక్కడి నుంచి రెబల్స్ను కలుపుకుని 45 మంది స్వతంత్రులు బరిలో నిలిచి ప్రధాన పార్టీలకు చుక్కలు చూపెడుతున్నారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలోని 18 వార్డులకు 82 మంది పోటీ చేస్తుండగా, కాంగ్రెస్, బీఆర్ఎస్కు మొత్తం వార్డుల నుంచి అభ్యర్థులుండగా, 13 వార్డులకు బీజేపీ అభ్యర్థులను నిలిపింది. ఇక్కడ 33 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ టికెట్లు ఆశించి స్వతంత్రులుగా నిలిచిన నలుగురు గట్టి పోటీ ఇస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులకు 155 మందిలో.. 58 మంది ఇండిపెండెంట్లుగా పోటీలో నిలిచారు. కాంగ్రెస్ 32, మిత్రపక్షాలు నాలుగు చోట్ల, బీఆర్ఎస్ 35, బీజేపీ నుంచి 30 మంది పోటీ చేస్తున్నారు. ఇక్కడ సుమారు 8 మంది ఇండిపెండెంట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తొర్రూరు మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీ చేస్తుండగా, 15 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 63 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తుండగా, స్వతంత్రులు సైతం జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరిపెడ మున్సిపాలిటీ నుంచి 15 వార్డులకు మొత్తం 63 మంది పోటీ చేస్తుండగా, అన్ని వార్డులకు మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలో దింపాయి. 18 మంది ఇండిపెండెంట్లుగా పోటీలో నిలబడి పోరాడుతున్నారు. కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులకు 58 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు అన్ని వార్డులకు అభ్యర్థులను దింపగా, బీజేపీ 15 చోట్ల పోటీ చేస్తుంది. ఇక్కడ 11 మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు. డోర్నకల్ మున్సిపాలిటీలో 15 వార్డులకు 64 మంది పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అన్ని వార్డులకు అభ్యర్థులను పెట్టగా, బీఆర్ఎస్ 14, బీజేపీ 14 వార్డుల్లో పోటీ పెట్టింది. 21 మంది ఇక్కడి నుంచి ఇండిపెండెంట్లుగా పోటీలో ఉన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులకు 107 మంది ఉండగా, కాంగ్రెస్ 25, మిత్రపక్షాలు 5 కలిపి 30 వార్డులకు పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ 30 వార్డుల్లో, బీజేపీ 25 వార్డుల్లో అభ్యర్థులను పోటీలో దింపగా 27 మంది స్వతంత్రులు బరిలో నిలిచి పోరాడుతున్నారు. ములుగు మున్సిపాలిటీలో 20 వార్డులకు 83 మంది బరిలో ఉన్నారు. మూడు ప్రధాన పార్టీలు అన్ని వార్డులకు పోటీ చేస్తుండగా, 23 మంది ఇండిపెండెంట్లుగా కౌన్సిలర్ కోసం కొట్లాడుతున్నారు. -
ప్రభుత్వం మీది.. సీఎం రేవంత్రెడ్డి మీ వారే
కార్నర్ మీటింగ్లో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి, పక్కన కొమ్మూరి ప్రతాప్రెడ్డి, ఎంపీ కిరణ్కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి, హాజరైన జనంజనగామ: ప్రభుత్వం ప్రజలదని.. సీఎం రేవంత్రెడ్డి ప్రజల పక్షపాతి అని.. తామంతా కలిసి ప్రజా పాలనను ముందుకు తీసుకెళ్తూ అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని ధర్మకంచ, ఆర్టీఓ కార్యాలయం, ఆర్టీసీ చౌరస్తా, తహసీల్దార్ కార్యాలయం కూడళ్ల వద్ద జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి అధ్యక్షతన శనివారం కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రతీ పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. తాము జనగామలో కొత్తగా 16 వేల రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. జనగామ పట్టణాని కి 600 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మరో వెయ్యి మంజూరు చేస్తామని తెలిపారు. 53/1 సర్వే నంబర్ పరిధిలోని భూసమస్యను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పరిష్కరిస్తామని పేర్కొన్నారు. పురపాలిక ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓట్లు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, యువ నాయకుడు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, 30 వార్డుల అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు. జనగామకు 600 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం.. ఇంకా మరిన్ని ఇస్తాం 53/1 సర్వే నంబర్లోని భూ సమస్యకు పరిష్కారం చూపిస్తా పురపాలిక ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించండి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికాంగ్రెస్ జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఐదేళ్లలో చేస్తామన్న సంక్షేమాన్ని రెండేళ్లలో చేసి చూపించిన ఘనత సీఎం రేవంత్రెడ్డికే దక్కుతుందని కాంగ్రెస్ జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే దొంగ ఓట్లతో గెలిచారని ఆరోపించారు. 10ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జనగామ పట్టణానికి ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధే నేటికీ ఉందని, దేవాదుల నీరు ఈ ప్రాంతానికి రావడంలో తన కృషి ఎనలేదని చెప్పారు. ఎనిమిదేళ్లుగా ఎమ్మెల్సీగా ఉన్న ఎమ్మెల్యే.. నాడు ఈ ప్రాంత అభివృద్ధికి పైసా ఇవ్వలేదన్నారు. అవినీతి చేసి సంపాదించిన డబ్బులతో ఓట్లను కొందామని బీఆర్ఎస్ చూస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబంలో ప్రతిఒక్కరూ రూ.లక్ష కోట్లు సంపాదించారని తెలిపారు. -
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
జనగామ రూరల్: మున్నిపల్ ఎన్నికలను అధికారులు సమర్థవంతంగా, పారదర్శకంగా, చట్టబద్ధంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, ట్రైనింగ్ నోడల్ అధికారి మాధురి షా సూచించారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలపై పీఓ, ఏపీఓలకు కలెక్టరేట్లో సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్రియలో పాటించాల్సిన నియమాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్లకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, శాంతియుత వాతావరణంలో పోలింగ్ నిర్వహణ, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారు వివరించారు. కౌంటింగ్ విధానం, వివాదాస్పద బ్యాలెట్ పేపర్ల పరిశీలన, రీకౌంటింగ్కు సంబంధించిన నిబంధనలు, ఫలితాల ప్రకటన వంటి పలు అంశాలపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలు జిల్లాలో రెండు మున్సిపాలిటీల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ 13వ తేదీన ఉదయం 8.00గంటలకు ప్రారంభమవుతుంది. హైదరాబాద్ రోడ్డులోని ఏకశిల బీఎడ్ కళాశాలలో జనగామ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు ఉంటుంది. అలాగే, పల్లగుట్టలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు జరగనుంది. స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ శివారు పల్లగుట్ట క్రాస్రోడ్డు సమీపంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ హాల్, టేబుళ్ల అమరిక, భద్రతా చర్యలు, సీసీటీవీ పర్యవేక్షణ, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, తాగునీరు, మూత్రశాలల సదుపాయాలు, విద్యుత్ సరఫరా తదితర వసతులపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, చట్టబద్ధంగా జరగాలని ఆదేశించారు. మొత్తం ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ అత్యంత కీలకమని గుర్తుచేశారు. ఆయన వెంట ఆర్డీఓ డీఎస్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఉన్నారు. అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ -
ఆడ తోడు కోసం అలుపెరగని ప్రయాణం!
సాక్షి, జనగామ: జిల్లాలో పెద్దపులి కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. నెల రోజులు కావొస్తున్నా.. దాని జాడ మాత్రం చిక్కడం లేదు. ఈ తెల్లవారు జామున నర్మెట మండలం అమ్మపురం గ్రామంలో రెండు దూడలను పులి చంపింది. దీంతో.. చుట్టుపక్కల గ్రామాలు భయాందోళనకు గురవుతున్నాయి.ఈ పెద్దపులి తొలుత ఆడ తోడు కోసం ఆమ్రాబాద్ అడవుల నుంచి వచ్చిందని అటవీశాఖ అధికారులు భావించారు. అయితే ఆ తర్వాతే మహారాష్ట్ర అడవుల నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల మీదుగా తాజాగా జనగామ జిల్లాలోకి ప్రవేశించిందని నిర్ధారించుకున్నారు. మొదటిగా లింగాలఘనపురం మండలంలో అడుగుపెట్టింది. తర్వాత దేవరుప్పల మండలంలోని వ్యవసాయ పొలాల మీదుగా శుక్రవారం రఘునాథపల్లి మండలం మండలగూడెం గ్రామ శివారులో సంచరించినట్లు అటవీ, పోలీస్ శాఖల అధికారులు గుర్తించారు. గత.. మూడు రోజులుగా జిల్లాలో పులి సంచారంతో ప్రజలంతా భయాందోళన చెందుతున్నారు. ఈ ఉదయం.. పశువుల అరుపులు విన్న వాటి యాజమానులు బయటకు వచ్చేసరికి.. రెండు దూడలు మృతదేహాలుగా కనిపించాయి. ఈ దాడి తర్వాత గ్రామంలో భయం మరింత పెరిగింది. పిల్లలు, మహిళలు బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. రైతులు తమ పశువులను కాపాడుకోవడానికి గూడెల వద్ద కాపలా కాస్తున్నారు. అటవీశాఖ తక్షణమే స్పందించి తమ సిబ్బందిని అక్కడికి పంపించింది. తోడు కోసం మొదలైన యాత్ర.. యాదాద్రి, సిద్ధిపేట, జనగాం.. జిల్లాల గుండా వెళ్లే దారిలో పులి అక్కడక్కడా లేగదూడలను చంపుతోంది. అయితే.. ఆడ పులి కోసం వెతుకుతూ సంచారం ప్రారంభించిందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. డ్రోన్ కెమెరాల సాయంతో జాడ తెలుసుకునేందుకు శ్రమిస్తున్నారు. అదే విధంగా అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లే రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ.. జనగామ, హనుమకొండ జిల్లాల అటవీశాఖ అధికారి లావణ్య ఒక ప్రకటన విడుదల చేశారు. లింగాలఘనపురం, రఘునాథపల్లి, నర్మెట్ట, జనగామ, దేవరుప్పుల, తరిగొప్పుల తదితర మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే.. పులి సంచారంపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సంప్రదించాల్సిన ఫోన్నంబర్లుబీట్ ఆఫీసర్, రఘునాథపల్లి : 96037 80678ఎఫ్ఎస్వో, రఘునాథపల్లి : 73826 19411ఎఫ్ఎస్వో, జనగామ: 81213 16323డిప్యూటీ ఆర్వో, లింగాలఘనపురం: 97046 01785ఎస్హెచ్వో, రఘునాథపల్లి : 87126 85211తహసీల్దార్, రఘునాథపల్లి: 96763 88123ఎఫ్ఆర్వో, జనగామ: 93989 46440డీఎఫ్వో, జనగామ: 94408 10093 -
పులి.. ఒకటా? రెండా?
● జిల్లాలో పశువులపై సాగిస్తున్న వేట ● పులికోసం బోన్లు.. ట్రాప్ కెమెరాల ఏర్పాటు ● పగలు కొండల్లో.. రాత్రి పొలాల్లో టైగర్ జాడలు ● ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు జనగామ: మూడు రోజులుగా జిల్లాలోని బచ్చన్నపేట, జనగామ, లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల పరిసర అటవీ ప్రాంతాల్లో పులి సంచారం వార్తలు గ్రామాలను వణికిస్తున్నాయి. మొదట అటవీ ప్రాంతాల్లోనే తిరుగుతున్నట్లు భావించినా ఇప్పుడు మనుషుల నివాస ప్రాంతాలవైపు వచ్చిందన్న ప్రచారంతో అధికార యంత్రాంగం ప్రజలను మరింత అప్రమత్తం చేస్తోంది. రఘునాథపల్లి, బచ్చన్నపేట మండలాల్లోని చెరువుల అంచులు, పల్లె వెలుపల ఉన్న పొలాల్లో పులి పాదముద్రలు కనిపించడంతో గ్రామస్తులు రాత్రివేళలో బయటకు రావడానికి, వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లడానికి జంకుతున్నారు. పశువులను కూడా వెలుపల వదలడానికి భయపడుతున్నారు. పగలు కొండకోనల్లో తిష్ట వేసిన పులి ఇప్పటివరకు రాత్రివేళల్లో యాదాద్రి, జనగామ జిల్లాలో 20 వరకు ఆవులు, మేకలను వేటాడినట్టు పలు గ్రామాల్లో వార్తలు, సంఘటనలు వెలుగులోకి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆడనా.. మగనా... ఈ పులి ఎక్కడినుంచి వచ్చింది.. మగపులా? ఆడపులా? లేక రెండు పులులా? అన్న అనుమానాలు కొనసాగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరించిన పులిని అటవీశాఖ అధికారులు రాయల్ బెంగాల్ టైగర్గా గుర్తించారు. ఇది మగ పులిగా నిర్ధారించారు. ఇదిలా ఉండగా బచ్చన్నపేట మండలంలో మరో పులి సంచరిస్తోందనే ప్రచారం ప్రజల్లో మరింత భయాన్ని రేకెత్తిస్తోంది. ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో పులిఛాయలు, పాదముద్రలు భిన్నంగా ఉండటం వంటి అంశాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో అటవీశాఖ, పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాయి. పులి కదలికలను గుర్తించేందుకు అటవీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, ట్రాపింగ్ బోన్లు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో రాత్రి పహారా బృందాలను ఏర్పాటు చేసి గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజల అప్రమత్తతకు.. సూచనలు ● పులి సంచారంపై జిల్లా అటవీశాఖ అధికారులు ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు చెబుతున్నారు. ● పులి కదలికలు రాత్రివేళల్లో చురుకుగా ఉంటాయని, వేకువజామున, సాయంత్రం, చీకటి పడిన తర్వాత పులి సంచరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండడం మంచిది. ● పులి కనిపించిన సందర్భంలో పెద్దగా గోల చేయరాదు. శబ్ధాల వల్ల పులి మరింత ఆందోళనకు గురవుతుంది. ● మేకలు, ఆవులు వంటి పశువులను రాత్రివేళల్లో బయట ఉంచవద్దు. ● రాత్రి పొలాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు, వృద్ధులు, మహిళలు రాత్రివేళల్లో ఒంటరిగా బయటికి వెళ్లొద్దు. ● వీలైనంత వరకు గుంపులుగా ప్రయాణించాలి. ● పులి కదలికలు కనిపిస్తే వెంటనే ఎస్ఎస్ఓ, ఎఫ్ఆర్ఓ, ఎస్హెచ్ఓ, తహసీల్దార్లకు సమాచారం ఇవ్వాలి.ఎఫ్బీఓ రఘునాథపల్లి : 9603780678ఎస్హెచ్ఓ రఘునాథపల్లి : 8712685211ఎఫ్ఎస్ఓ రఘునాథపల్లి : 7382619411తహసీల్దార్ రఘునాథపల్లి : 9676 388123ఎఫ్ఎస్ఓ జనగామ : 8121316323ఎఫ్ఆర్ఓ జనగామ : 939894 6440డీఆర్ఓ లింగాల ఘణపురం : 9704601785డీఎఫ్ఓ జనగామ : 944 0810093 -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
జనగామ రూరల్: జిల్లాలో జనగామ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. పీఓ, ఏపీఓల నియామకంతో పాటు ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరగడంలో మైక్రో అబ్జర్వర్లు అత్యంత కీలకపాత్ర పోషిస్తారని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మైక్రో అబ్జర్వర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జనరల్ అబ్జర్వర్ నర్సింహారెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ హాజరై వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ..పోలింగ్ బూత్లో జరిగే మొత్తం ప్రక్రియను మైక్రో అబ్జర్వర్ నిశితంగా పరిశీలించాలన్నారు. జనరల్ అబ్జర్వర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమన్నారు. కాగా, జనగామ, స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలకు సంబంధించి పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, నోడల్ అధికారి హౌజింగ్ పీడీ మాతృనాయక్ పాల్గొన్నారు. -
వీరిచేతుల్లోనే విజయం!
పురపాలికల ఎన్నికల్లో ఇన్చార్జ్లదే కీలకపాత్రజనగామ: జిల్లాలో జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. రెండుచోట్ల పీఠాలను కై వసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ శక్తిని వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాల సర్పంచులు, నాయకులు, స్థానిక ప్రతినిధులు ఇప్పుడు పట్టణ ఎన్నికల్లో కీలక పాత్రధారులుగా మారి అభ్యర్థుల విజయానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. తెల్లవారుజాము ఆరుగంటల నుంచి రాత్రి పన్నెండు వరకు ఎవరికి వారే తమ బృందాలతో వీధుల్లో తిరుగుతూ పోల్ మేనేజ్మెంట్, ఓటర్ కనెక్ట్, ప్రచా ర వ్యూహాలపై దృష్టి సారిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ మండలాల నుంచి వచ్చిన ఇన్న్చార్జ్ నాయకులు తమకు అప్పగించిన వార్డులపై పూర్తి ఫోకస్ పెట్టారు. వారికి తెలిసిన గ్రామస్తులు, తమ ప్రాంత ప్రజలు జనగామ లేదా స్టేషన్ఘనన్పూర్ పట్టణాల్లో ఓటర్లుగా ఉండడం అభ్యర్థులకు మరింత ప్లస్ పా యింట్గా మారుతోంది. ప్రతీ ఓటర్ను సంప్రదించి సంబంధాలను పటిష్టం చేసి తమ వైపు తిప్పుకోవడంలో వారు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఎక్కడ చూసినా ఇనన్చార్జ్ బృందాల హడావిడి, చురుగ్గా తిరిగే కార్యకర్తలదే ఈ ఎన్నికల్లో అసలు పోరు అని చెప్పవచ్చు. ఒక్కో వార్డులో కనీసం 20 మంది వరకు ఇనన్చార్జ్లు, వార్డు కమిటీ సభ్యులు, సహాయకులు కలిసి ముమ్మరంగా పనిచేస్తున్నారు. పట్టణంలోని ప్రతీ వీధిలో వారి ఉనికి స్పష్టంగా కనిపిస్తోంది. వార్డుల వారీగా ఓటర్ లిస్టులు సిద్ధం చేసి, ప్రభావవంతులైన కుటుంబాలను దగ్గర చేసుకోవడం, అసంతృప్తులను చర్చలతో దగ్గరకు చేర్చుకోవడం, గ్రూపుల మధ్య కలహాలను తగ్గించడం వంటి పనులను వారు ఎంతో వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఆయా మండలాల నుంచి ఇన్చార్జ్లుగా వచ్చిన నాయకులు తమ ప్రాంత పరిచయాలను కూడా పూర్తిగా వినియోగిస్తున్నారు. పట్టణంలో నివసిస్తున్న తమ గ్రామాల ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఓటరు–ఓటరుకు లింక్ విధానం అమలు చేస్తున్నారు. స్థానికంగా తమ ప్రభావం ఉన్న కుటుంబాలకు మరింత చేరువై వారిని అభ్యర్థికి అనుసంధానం చేస్తూ రానిఓట్లను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పురపాలిక ఎన్నికల ప్రచారం పట్టణాన్ని పండుగ వాతావరణంలోకి తీసుకెళ్లింది. రోడ్లపై పార్టీ జెండాలు, గల్లీల్లో నినాదాలు, ఇంటింటికీ తిరిగే ప్రచార బృందాలు ఏ వార్డులోకి వెళ్లినా అదే ఉత్సాహం కనిపిస్తోంది. ఇన్న్ చార్జ్ బృందాల సందడితో పాటు అభ్యర్థుల పాదయాత్రలు, సమావేశాలతో పట్టణంలో సందడి నెలకొంది. తెల్లవారు లేచింది మొదలు అర్ధరాత్రి వరకు గెలుపు వ్యూహాలు 20 మంది జట్టుగా..అహర్నిశలు శ్రమ పట్టణాల్లో ఎటు చూసినా సందడే ప్రతీ ఓటు కీలకం కావడంతో పక్కా ప్రణాళికలుసర్పంచులు, రైతు నాయకులు, స్థానిక నేతలు, గత ఎన్నికల్లో ప్రభావం చూపిన ఓటరు గ్రూపులందరూ తమ అభ్యర్థుల వెనుక నిలబడే విధంగా కసరత్తు సాగుతోంది. ఈసారి మున్సిపల్ పీఠం కోసం జరిగే పోరులో పార్టీలు కాకుండా నాయకుల వ్యక్తిగత ప్రభావం ప్రచారం గెలుపు, ఓటములను నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనగామ, స్టేషన్ఘన్న్పూర్ పురపాలికల్లో ఈసారి ఎన్నికలు తీవ్ర హోరాహోరీ వాతావరణంలో సాగుతున్నాయి. ఇన్చార్జ్లు, కార్యకర్తల కలసికట్టుగా పోరాటం పట్టణంలోని ప్రతీ ఓటును కీలకంగా మార్చబోతోంది. -
అగ్రనేతలకు సవాలే!
సాక్షిప్రతినిధి, వరంగల్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా.. రెండు రోజుల ముందే ప్రచారానికి తెరపడనుంది. అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి ఇంకా మూడు రోజులే మిగిలింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు అభ్యర్థుల గెలుపు కోసం దూకుడు పెంచారు. ప్రజాప్రతినిధులు, పార్టీలు నియమించిన ఎన్నికల ఇన్చా ర్జ్లు రెండు రోజులుగా మున్సిపాలిటీలలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇంటింటి ప్రచారం, కులసంఘాలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్లో ఈ ఎన్నికలు మూడు పార్టీల నేతలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను సవరించుకుంటూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. 10నియోజకవర్గాలు.. 12 మున్సిపాలిటీలు.. ఉమ్మడి వరంగల్లో 12 మున్సిపాలిటీలలో 260 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిసి 1,073 మంది పోటీలో ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్.. 12 మున్సిపాలిటీలను కై వసం చేసుకోవడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ తర్వాత ఎక్కువ పంచాయతీలలో తమ మద్దతుదారులను గెలిపించుకుని రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్.. గత వైభవాన్ని చాటుతామంటోంది. బీజేపీ 12 మున్సిపాలిటీల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. కాగా వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు మినహా 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా నేతలకు ఈ ఎన్నికలు సవాలే.. ● హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ తరఫున కాళిప్రసాదరావు ప్రచారం చేస్తున్నారు. ● వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్దన్నపేట మున్సిపాలిటీలు కాంగ్రెస్, బీఆర్ఎస్లకు సవాల్గా మారాయి. నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేల పెద్ది సుదర్శన్ రెడ్డిలు చైర్మన్ పీఠం కోసం కుస్తీ పడుతున్నారు. వర్ధన్నపేటలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం వార్డుల్లో తిరుగుతున్నారు. ● జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీ పీఠం కోసం బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభ్యర్థుల గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. ఇన్చార్జ్లు, ముఖ్య నేతలను కలుపుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త, టీపీసీసీ నేత ఝాన్సీ అభ్యర్థులను బరిలోకి దింపారు. వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ● జనగామ మున్సిపాలిటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నువ్వా, నేనా అన్న రీతిలో ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వార్డు కౌన్సిలర్ల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఉండగా, భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్రెడ్డి, వెంకటేశ్వర్లులు ఇన్చార్జ్లుగా ఉన్నారు. ● స్టేషన్ ఘన్పూర్ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కాగా.. ఇక్కడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్తో కలిసి నడుస్తున్న కడియం శ్రీహరి ఆ పార్టీ అభ్యర్థులను అందరిని గెలిపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత డా.తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతున్నారు. ● భూపాలపల్లి మున్సిపాలిటీలో పాగా వేసేందుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (కాంగ్రెస్), గండ్ర వెంకట రమణారెడ్డి (బీఆర్ఎస్)లు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మెజార్టీ స్థానాలను దక్కించుకుని చైర్మన్ పీఠంను కై వసం చేసుకోవాలని చూస్తున్నారు. బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి అభ్యర్థులను బరిలోకి దింపారు. ● ములుగు నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ధనసరి సీతక్క కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని భావిస్తున్నారు. ముఖ్యనేతలు, పార్టీ ఇన్చార్జ్లతో కలిసి అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి బీఆర్ఎస్ ఇన్చార్జ్గా ఉన్న బడే నాగజ్యోతి.. ఆమెకు తోడుగా మాజీమంత్రి సత్యవతి రాథోడ్ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ● మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మహబూబాబాద్, కేసముద్రం మున్సిపాలిటీల ఎన్నికలు ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ (కాంగ్రెస్), మాజీ ఎమ్మెల్యే బి.శంకర్నాయక్(బీఆర్ఎస్)లకు ప్రతిష్టాత్మకం కాగా, బీఆర్ఎస్ నుంచి మాజీ విప్ దాస్యం వినయభాస్కర్, కాంగ్రెస్ నుంచి సీహెచ్ వెంకటేశ్లు ఇన్చార్జ్లుగా ఉన్నారు. బీజేపీ నుంచి హుస్సేన్నాయక్.. అభ్యర్థులను బరిలోకి దింపారు. ● డోర్నకల్ నియోజకవర్గంలో డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల ఎన్నికలు ఎమ్మెల్యే జాటోతు రామచంద్రు నాయక్ (కాంగ్రెస్), మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ (బీఆర్ఎస్)లకు సవాల్గా మారాయి. పుర పోరు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకం మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకూ కత్తి మీద సామే గ్రామ పంచాయతీ ఫలితాల బేరీజు.. పకడ్బందీగా గెలుపు కోసం పావులు రెండు రోజులుగా మున్సిపాలిటీల్లోనే నేతల మకాం ఓట్ల కోసం పార్టీల నేతలు, ఇన్చార్జ్ల పాట్లు.. రోజువారీ పరిస్థితిపై అధిష్టానాల ఆరా.. -
ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడండి
రఘునాథపల్లి: మండల పరిధిలోని పలుప్రాంతాల్లో పులి సంచారం నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అటవీశాఖ సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రఘునాథపల్లి పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్స్టేషన్లోని రికార్డ్, స్టేషన్ రైటర్ రూమ్లు, రిసెప్షన్ సెంటర్, ఇతర విభాగాలను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నేరాల రేటు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, నమోదైన కేసుల పురోగతిపై ఆరా తీశారు. అధికారులు, సిబ్బంది పనితీరును మరింత మెరుగు పరుచుకొని చేపట్టాల్సిన విధి విధానాలపై సీఐ, ఎస్సైలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో స్టేషన్ఘన్పూర్ ఏసీపీ భీంశర్మ, జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్రెడ్డి, ఎస్సై దూదిమెట్ల నరేశ్ ఉన్నారు. అటవీశాఖతో సమన్వయం చేసుకోవాలి రఘునాథపల్లి పోలీస్స్టేషన్ను తనిఖీ చేసిన సీపీ -
ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహం
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ రూరల్: ప్రతిభావంతులైన క్రీడాకారులకు సీఎం కప్ ప్రోత్సాహమని, చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. శుక్రవారం స్థానిక ధర్మకంచ మినీ స్టేడియంలో నియోజకవర్గ స్థాయి సీఎం కప్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో క్రీడాకారులు తమ ప్రతిభను చూపించి గుర్తింపు తీసుకురావాలన్నారు. జిల్లా ఇన్చార్జ్ యువజన, క్రీడల శాఖ అధికారి కోదండరాములు, తహసీల్దార్, ఎంపీడీఓలు పాల్గొన్నారు. అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానం సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026–28 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్లెన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం మీడియా యాజమాన్యాలు తమ జర్నలిస్టుల పేర్ల జాబితాను జిల్లా పౌరసంబంధాల అధికారికి సమర్పించాలని సూచించారు. యాజమాన్యాల ద్వారా పంపిన పేర్లలో ఉన్న జర్నలిస్టులు అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
పోలీసుల కవాతు
జనగామ: మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాటు ఓటర్లలో సంపూర్ణ విశ్వాసాన్ని పెంపొందించేందుకు పట్టణంలో శుక్రవారం పోలీసులు కవాతు నిర్వహించారు. ఏఎస్పీ పండేరి నితిన్ చేతన్ ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై, ఆర్ఏఎఫ్ డిప్యూటీ కమాండెంట్ టి.పి. బగేల్, ఇన్స్పెక్టర్లు రమణారెడ్డి, ఖలీద్తో పాటు 40 మంది బలగాల సహకారంతో ముఖ్య కూడళ్లు, ఆర్టీసీ చౌరస్తా, సున్నితమైన, అప్రమత్తత అవసరమైన ప్రాంతాల్లో కవాతు నిర్వహిచారు. నేడు మహాశివరాత్రి జాతరపై సమీక్షపాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 14 నుంచి 18 వరకు జరిగే మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శనివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ జెండా ఎగురవేయాలిజనగామ: పురపాలిక ఎన్నికల సందర్భంగా పట్టణంలో అత్యధిక స్థానాలు కై వసం చేసుకుని చైర్మన్ పీఠం దక్కించుకునే విధంగా ప్రతీ కార్యకర్త, నాయకులు కష్టపడి పనిచేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. నియోజకవర్గ కార్యాలయంలో మంత్రి జిల్లా ముఖ్యనాయకులతో సమీక్ష నిర్వహించారు. జనగామ మున్సిపల్ ఎన్నికల్లో ప్రతీ ఒక్క కార్యకర్తను కలుపుకొని కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని దిశనిర్దేశం చేశారు. అంతకు ముందు మంత్రికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, టీపీసీసీ సభ్యులు లక్ష్మీ నారాయణనాయక్, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్, యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, వేమెళ్ల సత్య నారాయణరెడ్డి, కంచె రాములు, వంగాల మల్లారెడ్డి, కొమరవెల్లి దేవస్థాన చైర్మన్ వెంకటనర్సింమారెడ్డి తదితరులు ఉన్నారు. నేడు మంత్రి పొంగులేటి రాకజనగామ: పురపాలిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 7న (శనివారం) గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రానున్నట్లు నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి తెలిపారు. శుక్రవారం కొమ్మూరి మాట్లాడుతూ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి వరకు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తారన్నారు. ఇందులో భాగంగా ధర్మకంచ కమ్యూనిటీ హాల్, 14వ వార్డు అంబేద్కర్ విగ్రహం, ఆర్టీసీ చౌరస్తా, తహసీల్ కార్యాలయం ఏరియాలో కార్నర్ మీటింగ్లను నిర్వహిస్తామన్నారు. స్టేషన్ఘన్పూర్: మొబైల్ యాప్లో ఎల్సీ తీసుకోవడం ద్వారా ప్రాణాలకు భరోసా ఉంటుందని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ టి.మధుసూదన్ అన్నారు. స్టేషన్ఘన్పూర్ 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో విద్యుత్ సిబ్బందికి మొబైల్యాప్లో ఎల్సీ తీసుకోవడంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యుత్ సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ భద్రతా ప్రమాణాలను పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఇ టెక్నికల్ గడ్డం గణేశ్, స్టేషన్ఘన్పూర్ డీఈ సారయ్య, ఏడీఈ రణధీర్రెడ్డి, ఏఈలు శ్వేత, శంకర్, శివకుమార్, సురేష్, సబ్ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. -
భూసేకరణ పనులు వేగవంతంగా చేపట్టాలి
జనగామ రూరల్: భూసేకరణ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, వేగవంతంగా చేపట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో భూసేకరణ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణలో వివిధ దశల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. యూనిట్–1 పరిధిలో, పీఎన్ దశలో, పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియకు సంబంధించిన అవార్డు విచారణను రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు, సర్వేయర్లతో కలిసి గ్రామాల వారీగా సంయుక్త తనిఖీల ద్వారా వారం లోపు పూర్తి చేయాలని, పెగ్ మార్కింగ్ పనులను నెలలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే యూనిట్–2 పరిధికి సంబంధించి పెండింగ్లో ఉన్న వివిధ పనులను వారం లోపు, పెగ్ మార్కింగ్ను నెలలోపు పూర్తి చేయాలని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, జనగామ పరిధిలో భూసేకరణ పెండింగ్లో పనులను వారం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. చీటకోడూర్ ఆర్ఎంసీకి సంబంధించి అవార్డు విచారణను ‘సర్వే – పేమెంట్ వెరిఫికేషన్ టీం’ ద్వారా ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు, సర్వేయర్లతో కలిసి తనిఖీ నిర్వహించి, పెండింగ్లో ఉన్న పనులను పూర్తిచేయాలని సూచించారు. అదేవిధంగా అశ్వరావుపల్లికి సంబంధించిన భూసేకరణ కూడా వారం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, రెవెన్యూ డివిజనల్ అధికారులు జనగామ, ఘనపూర్ స్టేషన్ ప్రత్యేక ఉప కలెక్టర్ సూపరింటెండింగ్ ఇంజనీర్, ఈఈలు, డిప్యూటీ ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు. మ్యాపింగ్ ప్రక్రియ.. ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియ, ఎస్సీ స్కాలర్షిప్, మున్సిపల్ ఎలక్షన్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గూగుల్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, బీఎల్వోలు ఆయా పోలింగ్ కేంద్రాల వారీగా క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి ఎస్ఐఆర్ మ్యాపింగ్ వేగవంతంగా చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. మున్సిపల ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, అధికారులు వసంత, విక్రమ్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
శుక్రవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
వలస ఓటర్లపై ప్రత్యేక దృష్టి హైదరాబాద్, భీమండి, హనుమకొండ, వరంగల్ తదితర ప్రాంతాలకు కూలీ, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం వలస వెళ్లిన ఓటర్లు పోలింగ్లో కీలకపాత్ర పోషించనుండటంతో పార్టీలన్నీ వారిని తిరిగి రప్పించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశాయి. వారికి రోజూ ఫోన్ కాల్స్ చేస్తూ మర్యాదపూర్వక పలకరింపులు, చివరి రోజు ప్రత్యేక వాహనాల్లో తరలించేందుకు ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటున్నారు. వలస ఓటర్ల కోసం పోలింగ్ రోజు మినీ వాహనాలతో పాటే ఏసీ లగ్జరీలను ఏర్పాటు చేసేలా ఆయా పార్టీలు ముందు అడ్వాన్స్లను సైతం ఇస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్, వరంగల్, భీమండి ఓటర్లపై అభ్యర్థుల కన్ను ● ఓట్లు రాబట్టుకునేందుకు ‘ప్రత్యేక’ ప్రణాళికలు ● తమకే ఓటు వేయాలంటూ ఫోన్లు ● మందు, పైసలు, ప్రయాణ ఖర్చులు..అన్నీ భారీగానే! జనగామ: ఓట్ల కోసం పోల్ మేనేజ్మెంట్ రాజకీయం తారాస్థాయికి చేరుకుంది. దూరప్రాంతాల్లో ఉపాధి, ఉద్యోగ, చదువురీత్యా ఉన్నవారి ఓట్ల కోసం అభ్యర్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వారి ఓట్లను తమకే వేయాలంటూ ముందుగానే మాట తీసుకుంటున్నారు. వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసేందుకు హామీ ఇస్తున్నారు. ప్రచార గడువు నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో జనగామ, స్టేషన్ ఘన్పూర్ పురపాలికల్లో పోటీ చేసే అభ్యర్థులు, పార్టీలు గెలుపు కోసం పోల్ మేనేజ్మెంట్ పేరిట భారీ వ్యూహరచనలో బిజీబిజీ అయిపోయారు. ప్రజల సమస్యలు, అభివృద్ధి హామీలు అన్నీ పక్కనపెట్టి, ఓటును తమ గూటికి దించుకోవడమే ప్రధాన లక్ష్యంగా మిగిలింది. కులాల వారీగా ఓటర్ల లెక్కలు.. ప్రత్యేక కమిటీలు ప్రతీ పార్టీ కులాల వారీగా ఓటర్ల వివరాలు సేకరిస్తూ, పోల్ మేనేజ్మెంట్ ప్రత్యేక బృందాలను మోహరించింది. ఏ కులంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో, ఎవరికి మొగ్గు చూపుతున్నారో, ఎవరిని తమవైపు తిప్పుకోవాలో ప్రత్యేక ప్లానింగ్ చేస్తున్నారు. సంఘాల వారీగా సమష్టి భోజనాలు, విందులు, సమావేశాలు ఈసారి ప్రచారాల్లో ప్రధాన హైలెట్గా మారింది. డబ్బు పంపిణీకి రహస్య ఏర్పాట్లు ఎన్నికల సంఘం కంటపడకుండా డబ్బుల పంపిణీ విషయంలో పార్టీలు సీక్రెట్ను మెయింటెనెన్స్ చేస్తున్నాయి. ఈనెల 11న పోలింగ్ నేపథ్యంలో 8వ తేదీ అర్ధరాత్రి నుంచే వార్డుల వారీగా నమ్మకస్తుల ఇళ్లలో ‘మనీ డంపింగ్’ చేస్తున్నారనే సమాచారం ఉంది. చిన్న చిన్న మొత్తాల్లో ప్యాకెట్లు, పంపిణీ సమయంలో ఎక్కడా పట్టుపడకుండా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మద్యం, వెండి కాయిన్లు, గిఫ్టులు రెడీ క్లస్టర్ల వారీగా భారీగా మద్యం డంపింగ్ జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖరీదైన మందుబాటిళ్లు, వెండి నాణేలు, గిఫ్టులతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎవరికి వారే కొత్త ప్రయత్నాల్లో ఉన్నారు. ఓటరే రాజు అంటూ చెప్పుకుంటూనే... లోపల మాత్రం ఓటును ‘మేనేజ్’ చేసేందుకు అభ్యర్థులు పట్టపగ్గాలు విప్పేశారు. ఈసారి ఎన్నికల్లో అభివృద్ధి చర్చ కంటే, వ్యూహరచన, ఓటు మేనేజ్మెంట్, వలసఓటర్ల లెక్కలు, మద్యం, డబ్బు పంపిణీ ఇవే ప్రధాన అంశాలుగా మారుతున్నాయి. ఓటర్లు ఎవరి మాట నమ్ముతారు, ఎవరి వ్యూహం ఫలిస్తుందనే అసలు పోరు ఇప్పుడే మొదలు కానుంది. స్టార్ క్యాంపెయినర్ల రాక పురపాలిక ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కడియం శ్రీహరి, ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్కుమార్రెడ్డి, జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి, పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్ క్యామ మల్లేశం, యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి ప్రస్తుతం ప్రచారం చేస్తున్నారు. రాబోయే నాలుగు రోజుల పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్క, మాజీమంత్రులు హరీశ్రావు, కేటీఆర్, ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ తదితర ప్రముఖులు జనగామ, స్టేషన్ఘన్పూర్ పట్టణాలకు రానున్నారు. అన్ని పార్టీలు రోజుకు 5 నుంచి 8 వార్డులను చుట్టేస్తూ ప్రచారంలో స్పీడు పెంచారు. ర్యాలీలతో పాటు ఇంటింటి ప్రచారాన్ని తెల్లవారు జాము 5 గంటల నుంచే మొదలుపెడుతున్నారు. -
అమలు కాని హామీలతో మోసం
● ప్రచారంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ: ప్రత్యర్థి పార్టీలు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తూ అమలు కాని హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా 13, 17, 18, 19, 22, 23, 24 తదితర వార్డుల్లో గురువారం ఎమ్మెల్యే ప్రచారం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి తప్ప, ప్రస్తుత కాంగ్రెస్ ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండున్నరేళ్లుగా తమ నీలిమా ఆస్పత్రిలో కార్పోరేట్ స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. పట్టణ ఓటర్లు బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట నాయకులు గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, బాల్దె సిద్ధిలింగం, గద్దల నర్సింగారావు తదితరులు ఉన్నారు. -
పట్టణ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం
● నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి, ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు జనగామ: పట్టణ అభివృద్ధి ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యమని నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి, పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు అన్నారు. పురపాలిక ఎన్నికల్లో భాగంగా 7,8,9,10 వార్డుల్లో బుధవారం ఇంటింటి ప్ర చారం చేశారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందన్నారు. పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి, పట్టణ సమగ్రాభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలకు సహకారం అందించాలన్నారు. గృహలక్ష్మి, మహాలక్ష్మి ఇలా అరు గ్యారంటీ పథకాలతో ప్రతీ ఇంటికి లబ్ధి చేకూరుతుందన్నారు. పేద కుటుంబాలకు సొంతింటి కల సాకారం చేస్తున్నామని, అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్కు పట్టం కట్టాలన్నారు. యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ తదితరులు ఉన్నారు. -
వామ్మో పెద్దపులి!
లింగాలఘణపురం: మండలంలోని కుందారంలో బుధవారం రాత్రి పులి సంచరించినట్లుగా పాదాల గుర్తుల ఆనవాళ్లు కనిపించాయని ఎఫ్ఆర్ఓ కొండల్రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం కుందారం సమీపంలో పులి పాదాల గుర్తులను గమనించిన రైతులు డయల్ 100కు ఫోన్ చేయడంతో స్థానిక ఎస్సై శ్రావణ్కుమార్ అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా డీఎఫ్ఓ తన సిబ్బందితో వెళ్లి పాదాల గుర్తులను పరిశీలించి పులి సంచరించినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. మంగళవారం యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలో శారాజీపేటలో ఆవును చంపిన పులి అక్కడి నుంచి కుందారం వచ్చినట్లుగా గుర్తించామని, రఘునాథపల్లి మండలం నారాయణపురం, లింగాలఘణపురం మండలం కుందారం మధ్య సుమారు నాలుగైదు వందల ఎకరాల్లో సర్కార్ తుమ్మ చెట్లు ఉన్నాయని, అక్కడే ఉండి ఉండవచ్చని అనుమానంతో తమ సిబ్బంది గాలిస్తున్నారని వివరించారు. రిజర్వ్ ఫారెస్ట్కు సంబంధించిన నిపుణుల బృందం కుందారం గ్రామానికి చేరుకుని పులి సంచరించిన పరిసరాలను పరిశీలించారు. అందులో పులిని బంధించేందుకు మత్తు ఇంజక్షన్లు వేసే నిపుణులు, డాక్టర్ల బృందం ఉన్నారు. రఘునాథపల్లి: మండలంలోని శ్రీమన్నారాయణపురం శివారులో పెద్ద పులి సంచారం గుబులు రేపుతోంది. గురువారం తెల్లవారుజామున లింగాలఘణపురం మండలం కుందారం నుంచి మండలంలోని శ్రీమన్నారాయణపురం శివారులోకి వచ్చి నట్లు పాదముద్రలు ఉన్నాయన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు వెళ్లి పరిశీలించారు. స్థానిక ఎస్సై దూదిమెట్ల నరేశ్, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు శ్రీమన్నారాయణపురం, నిడిగొండ, భాంజీపేట రఘునాథపల్లి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. దేవరుప్పుల: మండలంలోని నీర్మాల గ్రామ నర్రెగడ్డ వ్యవసాయ క్షేత్రం ఏరియాలో సరిహద్దు గ్రామమైన వెల్మజాల(గుండాల మండలం)కు చెందిన రైతు జోలం పాండు పులి పాదగుర్తులను గుర్తించి విషయాన్ని అధికారులకు చేరవేశారు. ఈ గుర్తుల ఆధారంగా నీర్మాల నుంచి వనపర్తి మీదుగా కుందారం మీదుగా రఘనాథపల్లి మండలానికి వెళ్లిందనే పులి అడుగుల గుర్తులను బట్టి తెలుస్తోంది. కడవెండి–సీతారాంపురం మధ్య కూటికంటి ఎల్లయ్య అనే రైతు వ్యవసాయ పొలాల వద్ద గుర్తులను చూడగా.. జనగామ ఫారెస్టు డీఆర్ఓ ఆజాజ్ అహ్మద్, బీట్ ఆఫీసర్ రమేశ్, ఎస్ఓ రవీందర్, స్థానిక ఎస్సై ఊర సృజన్కుమార్, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలాన్ని గుర్తించి ఆ ప్రాంత రైతులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎఫ్ఆర్ఓ కొండల్ రెడ్డి జనగామ రూరల్: జిల్లాలోని లింగాల ఘణపురం మండలం కుందారం గ్రామశివారుల్లో పులి సంచరిస్తున్నట్లు దాని పాదముద్రల ద్వారా గుర్తించినట్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఆర్ఓ రావుల కొండల్ రెడ్డి తెలిపారు. లింగాల ఘణపురం, రఘునాథపల్లి, నర్మెట, జనగామ, దేవరుప్పుల మొదలగు మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తప్పనిసరి పరిస్థితులలో తప్ప మిగతా సమయాల్లో బయటకు రావొద్దన్నారు. అత్యవసరమైతే గుంపులు గుంపులుగా వెళ్లాలని తెలిపారు. పశువులను ఇంటివద్దనే సంరక్షించుకోవాలన్నారు. పులి సంచార సమాచారం తెలిస్తే ఫారెస్ట్ అధికారులు, పోలీసులకు తెలియజేయాలన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. పలు మండలాల్లో పాదముద్రలు, సంచరించినట్లు గుర్తింపు భయాందోళనలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్న ఫారెస్ట్, పోలీస్ అధికారులు -
వాతావరణం
జిల్లాలో ఉదయం పొగమంచు ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు కాస్త ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి సమయంలో చలి తీవ్రంగా ఉంటుంది.‘పుర’పోరుకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లుసాక్షిప్రతినిధి, వరంగల్: మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. మున్సిపాలిటీల వారీగా సీని యర్ నాయకులను ఇన్చార్జ్లు గా నియమించిన టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్.. వార్డుల వారీగా అభ్యర్థుల గెలుపు బాధ్యతలను వారిపైనే పెట్టారు. నియోజకవర్గాల వారీగా ఆయా మున్సిపాలిటీల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను సమన్వయం చేసుకుంటూ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ వరంగల్, మహబూబాబాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్లుగా ఉన్నారు. వీరికి తోడు మున్సిపాలిటీల వారీగా కోఆర్డినేటర్లను గురువారం నియమించారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జనగామ మున్సిపాలిటీకి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, పాయం వెంకటేశ్వర్లుకు మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్లుగా బాధ్యతలు ఇచ్చారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని తొర్రూరు మున్సిపాలిటీకి ఎంపీ డాక్టర్ కడియం కావ్య, కొలను హనుమంతరెడ్డిని నియమించారు. పరకాలకు టెస్కాబ్ మాజీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, స్టేషన్ఘన్పూర్కు భీమగాని సౌజన్య, భూపాలపల్లికి ఎర్రబెల్లి వరద రాజేశ్వర్రావు, వర్ధన్నపేటకు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని డోర్నకల్ మున్సిపాలిటీకి గాజర్ల అశోక్, మరిపెడకు ఎంపీ పోరిక బలరాంనాయక్, కేసముద్రంకు దూడ వెంకటరమణ, మహబూబాబాద్కు సీహెచ్ వెంకటేశ్, ములుగుకు ఈవీ శ్రీనివాస్రావు, నర్సంపేటకు డాక్టర్ పులి అనిల్కుమార్ను సమన్వయకర్తలుగా టీపీసీసీ నియమించింది. కోఆర్డినేటర్లుగా నియమితులైన వారికి అభ్యర్థుల గెలుపు బాధ్యతలను అప్పగించింది. కోఆర్డినేటర్లుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు మినహా ఇతర సీనియర్లకు భవిష్యత్లో నామినేటెడ్ పోస్టులకు మున్సిపల్ ఎన్నికల విజయాలకు కూడా పార్టీ అధిష్టానం లింకు పెట్టినట్లు సమాచారం. కాగా, టీపీసీసీ నియమించిన సమన్వయకర్తలు అభ్యర్థుల గెలుపు కోసం వెంటనే రంగలోకి దిగారు. 12 మున్సిపాలిటీలకు సీనియర్ల నియామకం జనగామ, తొర్రూరు, మరిపెడకు ఎంపీలు చామల కిరణ్కుమార్రెడ్డి, కడియం కావ్య, బలరాంనాయక్ ఉత్తర్వులు జారీచేసిన టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అభ్యర్థుల గెలుపునకు.. నామినేట్ పదవులకు లింకు -
ప్రతిభను వెలికిదీసేందుకే సీఎం కప్ పోటీలు
● అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ పాలకుర్తి టౌన్: గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికిదీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ అన్నారు. గురువారం మండలంలోని కార్మెల్ స్కూల్లో సీఎం కప్ క్రీడలను అదనపు కలెక్టర్ ముఖ్య అఽతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గస్థాయిలో నిర్వహించే కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీల్లో యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి కోదండరామ్, ఎంపీడీఓ వేదవతి, తహసీల్దార్ సరస్వతీ, సీఐ జానకీరాంరెడ్డి, సర్పంచ్ కమ్మగాని విజయ, ఎస్సై పవన్కుమార్, ఎంఈఓ పోతుంటి నర్సయ్య, హైస్కూల్ హెచ్ఎం శోభారాణి, ప్రగతి విద్యాలయం ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. నేలను కాపాడుకోవాలి.. జఫర్గఢ్: నేల సంపదను కాపాడుకోవాలని అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్ర భుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో స్కూల్ సాయిల్ హెల్త్పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్ వరలక్ష్మి, డీఏఓ అంబికాసోని, ఏడీఏ వసంత సుగుణ, తహసీల్దార్ రాజేశ్రెడ్డి, ఎంపీడీఓ సుమన్, శిరీష, రవి తదితరులు పాల్గొన్నారు. -
సేంద్రియ సాగుతో బహుళ ప్రయోజనాలు
దేవరుప్పుల: విషతుల్య ఆహారపు ఉత్పత్తులకు స్వస్తి పలికేలా సేంద్రియ పంటల సాగుతో రైతులు బహుళ ప్రయోజనాలు పొందుతారని జిల్లా సాంకేంతిక వ్యవసాయ అధికారులు శరత్చంద్ర, విజయ్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ధారావత్తండాలో కునుసోతు బిచ్చనాయక్ వ్యవసాయ క్షేత్రంలో సాగు చేస్తున్న సేంద్రియ ఎరువు తయారీ, పంటల సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సేంద్రియ సాగులో వర్మికంపోస్టు, జీవామృతం, బీజామృతం, ఘనజీవామృతం వంటి స్వతహాగా తయారు చేసుకొని విజయవంతంగా సాగు చేస్తున్న రైతు బిచ్చానాయక్ను అభినందించారు. కార్యక్రమంలో పెద్దమడూరు ఏఈఓ భాస్కర్, పలువురు రైతులు పాల్గొన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్కు 68 మంది గైర్హాజరుజనగామ రూరల్: ఇంటర్ ప్రయోగ పరీక్షలకు 68మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఇంటర్ విద్యాధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా వ్యాప్తంగా 9 కేంద్రాల్లో జనరల్, ఒకేషనల్ ప్రయోగ పరీక్షలు జరగగా మొత్తం 429 మంది జనరల్ విద్యార్థులకు గాను 425మంది హాజరు కాగా నలుగురు గైర్హాజరయ్యారు. ఒకేషనల్లో మొత్తం 307 విద్యార్థులకు గాను 274మంది హాజరు కాగా, 33మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు 410 జనరల్ విద్యార్థులకు గాను 403మంది హాజరు కాగా, 7 గైర్హాజరయ్యారు. ఒకేషనల్లో 222 విద్యార్థులకు గాను 198 హాజరు కాగా 24 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్ విద్యాధికారి జితేందర్ రెడ్డి జనగామ, జఫర్గఢ్, స్టేషన్ ఘన్ఫూర్ పరీక్షా కేంద్రాలను సందర్శించగా డీఈసీ సభ్యులు శ్రీనివాస్ పాలకుర్తి, కొడకండ్లలోని పరీక్ష కేంద్రాలను సందర్శించారు. పీహెచ్సీలో ప్రసవాలు పెంచాలిరఘునాథపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్రావు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేషెంట్లకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల వల్ల కలిగే లాభాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పీహెచ్సీలో జరుగుతున్న కార్యక్రమాలపై రివ్యూ చేసి రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ కమలహాసన్, ఎంఎల్హెచ్పి డాక్టర్ ప్రీతి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామ్కిషన్, హెచ్ఈఓ ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు. రూ.5వేల కోట్లు కేటాయించాలిజనగామ రూరల్: రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి రూ.5వేల కోట్లు కేటాయించాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో కుర్ర ఉప్పలయ్య అధ్యక్షతన జరిగిన కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.. రాష్ట్ర బడ్జెట్లో ప్రతిసారి అన్యాయమే జరుగుతోందని, గత సంవత్సరం రూ.70 కోట్లు మాత్రమే కేటాయించి అందులో కేవలం రూ.17 కోట్లే ఖర్చు చేశారన్నారు. ఏప్రిల్ 17న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే నిరాహార దీక్షకు గీత కార్మికులు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాల్నే వెంకటమల్లయ్య, కనకట రాజయ్య, పరదుల భాస్కర్, బండపల్లి శంకరయ్య, మాచర్ల రఘురాములు, జొన్నగోని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రంగా రంగా ప్రచార స్థలాన!
జనగామ: పురపాలక ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్ పురపాలికల్లో బుధవారం నుంచి ప్రధాన పార్టీలన్నీ ప్రచార రంగంలోకి దిగడంతో వార్డులన్నీ పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. రంగంలోకి ముఖ్యనేతలు ప్రచార రథాలు, బైకులు, ఆటోలు, పార్టీ బ్యానర్లు..ఇలా ప్రతి వీధిలోనూ నినాదాల ప్రతిధ్వని వినిపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రధాన నేతలతో పాటు ఎమ్మెల్యేలు, సీనియర్ క్యాడర్, డివిజన్ స్థాయి నాయకులు కూడా బూత్ల వారీగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డుల వారీగా క్యాడర్ అభ్యర్థుల వెంట అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈసారి స్వతంత్ర అభ్యర్థులూ ప్రధాన పార్టీలకు సమానంగా ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. వారికి వచ్చిన ఎన్నికల గుర్తులను చూపిస్తూ ‘తమ గుర్తుకు ఓటేయండి.. అభివృద్ధి కోసం మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి..’ అని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటికీ తిరిగే స్వతంత్రులు ఓటర్లలో ఆప్యాయతను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అవ్వా.. అమ్మా.. తాతా అంటూ.. ప్రచారంలో అభ్యర్థుల మాటతీరు కూడా ఓటర్లలో చర్చనీయాంశమైంది. ‘అమ్మా.. అవ్వా.. తాత.. ఎలా ఉన్నారు.. నేను ఫలానా పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. ఈసారి తప్పకుండా నాకు అశీర్వాదం ఇవ్వండి. మీరు పలికిన వెంటనే ముంగిట ప్రత్యక్షమవుతా.. ఐదు సంవత్సరాలు మీ పక్కనే ఉంటా.. అభివృద్ధి చేస్తా’ అంటూ భరోసా కల్పిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. వ్యక్తిగతంగా ఓటర్లను కలుస్తూ.. వార్డుల వారీగా క్యాడర్ ఇంటింటికీ తిరుగుతుండగా, పలు సమయాల్లో అభ్యర్థులు మాత్రం ముఖ్యమైన ఓటర్ల ఇళ్లకు వ్యక్తిగతంగా వెళ్లి మద్దతు ఇచ్చి గెలిపించాలని విన్నవిస్తున్నారు. మరోవైపు పార్టీ లీడర్ల అలకలను, గ్రూపుల మధ్య చిన్న చిన్న విబేధాలను బుజ్జగించేందుకు అభ్యర్థులు విపరీతంగా శ్రమిస్తున్నారు. అలకలు పోవడం, వర్గాలు కలవడం, అభ్యర్థితో కలిసి ప్రచారంలోకి రావడం ఇవన్నీ ప్రచారంలో భాగమయ్యాయి. తదుపరి రోజుకు నేటి రాత్రే ప్రణాళిక ప్రధాన వీధులు, బస్టాండ్లు, మార్కెట్ ప్రాంతాలు పార్టీల ర్యాలీలతో కళకళలాడుతున్నాయి. హోటళ్లలో కూర్చున్న వారితో చేతులు కలుపుతూ షాప్లను సందర్శిస్తూ, మహిళలను పలకరిస్తూ ప్రతి ఓటరును ప్రేమ, ఆప్యాయతతో తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో అభ్యర్థులు బిజీబిజీగా గడుపుతున్నారు. పొద్ద ంతా ఊరేగింపులు, ర్యాలీలు చేసిన పార్టీల క్యాడర్ రాత్రికి తిరిగి పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు, తదుపరి రోజు వ్యూహరచన...ప్రచారం మరింత వేగం పొందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రజల్లో అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నప్పటికీ ఎవరి ప్రచారం ఎంత ప్రభావం చూపుతుందన్నది పోలింగ్ రోజునే తేలనుంది. మైకుల హోరు..ఊరేగింపుల జోరు పండుగ వాతావరణంలో వీధులు పొద్దంతా ర్యాలీలు..రాత్రికి వ్యూహరచన అమ్మా, అవ్వా, తాతా.. అంటూ ఆకట్టుకునే యత్నం -
బుగులు వెంకన్నకు నాగాభరణాలు
చిల్పూరు: చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామికి బుధవారం సంగోజు మోహనాచారి–శంకర్లక్ష్మి దంపతులు రూ.50వేల విలువైన రెండు వెండి నాగాభరణాలు, ఇత్తడి ప్లేటును ఆలయ అర్చకులకు అందజేశారు. ఆలయానికి చేరుకున్న దాత దంపతులు అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేదమంత్రాల నడుమ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ శ్రీధర్రావు ఆధ్వర్యంలో ఆలయానికి అందజేశారు. కార్యక్రమంలో కుర్రెంల మోహన్ తదితరులు పాల్గొన్నారు. తాటికొండ జాతర ఆదాయం రూ.2లక్షలుస్టేషన్ఘన్పూర్: మండలంలోని తాటికొండ, జిట్టెగూడెం సమ్మక్క–సారలమ్మ జాతర ఆదా యం రూ.2,03,738లు వచ్చినట్లు జాతర కమిటీ బాధ్యులు తెలిపారు. జాతర కమిటీ గౌరవ అధ్యక్షుడు చల్లా సుధీర్రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రాపోలు మధుసూదన్రెడ్డి, సర్పంచ్లు మారపాక సుజనశ్రీను, బానోతు బాలునా యక్ ఆధ్వర్యంలో బుధవారం హుండీల లెక్కింపు చేపట్టారు. జాతర ఆదాయం రూ.2,03,738 వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్లు లునావత్ రజిత రవీందర్, ఎడమ కట్టమల్లు, వార్డు సభ్యులు, వివిధ కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు. ఎల్సీ యాప్ ద్వారా లైన్క్లియర్ తప్పనిసరిజనగామ రూరల్: ఎల్సీ యాప్ ద్వారా లైన్క్లియర్ తప్పనిసరిగా తీసుకోవాలని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆపరేషన్స్ సంపత్రెడ్డి అన్నారు. బుధవారం జనగామ టౌన్–1లో సెక్షన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యుత్ పనుల నిర్వహణలో భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ ఎం.లక్ష్మీనారాయణరెడ్డి, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ డి.వేణుగోపాల్, అసిస్టెంట్ ఇంజనీర్ (టౌన్–1) బి. సౌమ్య, అసిస్టెంట్ ఇంజనీర్ (బచ్చన్నపేట) జి. రాజ్కుమార్, సబ్ ఇంజనీర్ ఎం.మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
వివక్షలేని సమాజమే లక్ష్యం
జనగామ రూరల్: అసమానతలు, వివక్ష లేని సమాజాన్ని నిర్మించడమే తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎన్.ఎల్.నరసింహారావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాలకు సమానత్వం, సాధికారత పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం కలెక్టరేట్లో పనిచేసే హౌస్ కీపింగ్ సిబ్బందిని సన్మానించారు, అంతకుముందు తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్షాలోమ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు. డబుల్ బెడ్రూం నిర్మాణాల వివరాలివ్వండి డబుల్ బెడ్రూం నిర్మాణాల అప్పగింతకు సంబంధించిన వివరాలు అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. గూగుల్ మీట్లో మాట్లాడుతూ.. పంచాయతీరాజ్, ఇరిగేషన్, సోషల్ వెల్ఫేర్ తదితర ఇంజనీరింగ్ అధికారులు గతంలో చేపట్టిన రెండు పడక గదుల నిర్మాణలకు సంబందించిన పూర్తి వివరాలతో టెక్నికల్, ఫిజికల్లతో సహా ఫిబ్రవరి 15వ తేదీలోగా హౌజింగ్ శాఖకి అప్పగించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
డీసీపీకి ఉత్కృష్ట్ట పతకం
● సీపీ చేతుల మీదుగా అందజేత వరంగల్ క్రైం: పోలీస్ విభాగంలో ఉత్తమ సేవలందించినందుకు కేంద్ర ప్రభుత్వం వరంగల్ పోలీస్ కమిషనరేట్ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్కు ఉత్కృష్ట పతకాన్ని అందజేసింది. ఈమేరకు బుధవారం సీపీ క్యాంపు కార్యాలయంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ డీసీపీ రాజమహేంద్ర నాయక్కు పతకాన్ని అందించి అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చే అధికారులకు శాఖాపరమైన గుర్తింపుతో పాటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు కూడా లభిస్తుందన్నారు. 2010 డీఎస్పీగా పోలీస్ శాఖలో చేరిన రాజమండ్రి నాయక్ నెల్లూరు జిల్లాతో పాటు వరంగల్ సీసీఎస్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో డీఎస్పీగా పని చేసి 2017 అదనపు ఎస్పీగా భూపాలపల్లి, ఇంటెలిజెన్స్లో పనిచేసి, 2021లో ఎస్పీగా పదోన్నతి పొంది ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు. ప్రస్తుతం వెస్ట్ జోన్ డీసీపీగా ఎంతో సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా ఎన్నో కీలక కేసులను పరిష్కరించడం డీసీపీ రాజ మహేంద్ర నాయక్ కీలకంగా నిలిచారు. ఈసందర్బంగా వెస్ట్ జోన్ పరిధి పోలీస్ అధికారులు, సిబ్బంది డీసీపీ అభినందనలు తెలిపారు. -
ఎన్నికల నియమావళి పాటించాలి
జనగామ రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలని ఏఎస్పీ పండారీ చేతన్ నితిన్ సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పోటీచేస్తున్న అభ్యర్థులకు బుధవారం సిద్దిపేట రోడ్డులోని గాయత్రి ఫంక్షన్ హాల్లో ఎన్నికల ఖర్చులు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల నియమావళి అనుసరించి వ్యయాలు ఉండాలని, నిబంధనలు ఉల్లంగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు, మున్సిపల్ కమిషనర్, అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. -
వేడెక్కిన ఓరుగల్లు
తల్లులకు తనివితీరా మొక్కులు8 లోuమూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా ‘మున్సిపల్’ పోరుమేడారం బుధవారం భక్తజనసంద్రమైంది.. తిరుగువారం పండుగను మేడారం, కన్నెపల్లిలోని సమ్మక్క, సారలమ్మ ఆలయాల్లో పూజారులు ఘనంగా నిర్వహించారు. తల్లులకు పూజారులు ధూపదీపాలు వెలిగించి యాటలను నైవేద్యంగా సమర్పించారు. తిరుగువారం పండుగకావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. – ఎస్ఎస్ తాడ్వాయి ● మేడారం, కన్నెపల్లిలోని సమ్మక్క, సారలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు ● భారీగా తరలివచ్చిన భక్తులు..● అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతల ప్రచారం ● ఈనెల 8న భూపాలపల్లికి సీఎం రేవంత్రెడ్డి.. ● బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు ● కేంద్ర మంత్రులు వస్తారంటున్న బీజేపీ నేతలుసాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగియగా.. 260 వార్డులకు 1,073 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీపీఐ, సీపీఎంలతో పొత్తులతో సాగుతుండగా, బీఆర్ఎస్, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. ప్రచారానికి మరో ఐదు రోజులే సమయం ఉండడంతో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. రెబల్స్పై బుజ్జగింపుల అస్త్రం మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు ఇంకా ఆరు రోజులే ఉండడంతో రెబల్స్ను దారికి తెచ్చుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీపీఐ, సీపీఎంలతో పొత్తులతో పోటీ చేస్తుండగా.. 40 చోట్ల రెబల్స్ బెడద ఉంది. ఒంటరి పోరు చేస్తున్న బీఆర్ఎస్కు సైతం రెబల్స్ సెగ తాకుతోంది. నర్సంపేట, వర్ధన్నపేటలో ఎనిమిది చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ రెబల్స్ ఉన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది, బీఆర్ఎస్ నుంచి ఆరుగురు రెబల్ అభ్యర్థులుగా పోటీలో ఉండగా, వారితో పార్టీ నేతలు మంతనాలు చేస్తున్నారు. డోర్నకల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు, మరిపెడలో కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీఆర్ఎస్ నుంచి నలుగురు, కేసముద్రంలో కాంగ్రెస్ నుంచి ఒక్కరు, బీఆర్ఎస్లో ఇద్దరు చొప్పున రెబల్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరందరితో ఆ పార్టీల నేతలు చేస్తున్న ప్రయత్నాలు నేడో రేపో కొలిక్కి రావచ్చన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 12 మున్సిపాలిటీల్లో మొత్తం 260 వార్డులకుగాను ఒకచోట బీజేపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికాగా 26 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో లేరు.మేడారంలో తిరుగువారం పండుగఅన్ని మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఏఐఎఫ్బీ తదితర పార్టీలు, స్వతంత్రులు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇదే సమయంలో ‘పుర’ పీఠాలు లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు.. ఆ పార్టీల అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు అగ్రనేతలను రంగంలోకి దింపుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్లుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (వరంగల్), పొన్నం ప్రభాకర్ (మహబూబాబాద్)లను నియమించింది. వారు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలను కలుపుకుని సమన్వయం చేస్తున్నారు. ఏఐసీసీ పరిశీలకుడు పి.విశ్వనాథన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం పర్యటించగా.. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి జేఎస్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఏర్పాటు చేసే సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 12 మున్సిపాలిటీలకు ఇన్చార్జ్లను నియమించారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, అరూరి రమేశ్ తదితరులు ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ నుంచి అభ్యర్థుల గెలుపు కోసం కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ జిల్లా అధ్యక్షులను సమన్వయం చేస్తున్నారని, త్వరలోనే వారి పర్యటన ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ రూరల్: మున్సిపల్ ఎన్నికల విధులను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో విస్తృత స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేశారు. తెలంగాణ మున్సిపాలిటీలు చట్టం 2019, రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా, పోలింగ్ విధానాలపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారి పూర్తి బాధ్యతలు అధికారాలు తెలుసుకోవాలని, ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండ్ బుక్ ఒక మార్గదర్శకమన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని జనరల్ ఆబ్జర్వర్ నర్సింహరెడ్డి పరిశీలించారు. శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు మెరుగు రామరాజు, కె.సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహా జాతరనూ వదల్లేదు!
సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతరను దొంగల ముఠాలు వదల్లే. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ల నుంచి వచ్చి మేడారం జాతరలో భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని హల్చల్ చేసిన దొంగల వివరాలు ఆలస్యంగా వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా జంపన్న వాగు, గద్దెల పరిసరాల్లో భక్తుల మొబైల్ ఫోన్లు, బంగారు గొలుసులు, నగదును దొంగిలించిన ఘటనల్లో కీలక వ్యక్తుల సమాచారం లభమైంది. ‘వ్యాల్యూ పిచ్’ సాఫ్ట్వేర్ ఆధారంగా ఫేస్ రికగ్నేషన్ సిస్టంతో ఈ దొంగతనాలకు సంబంధించి కొందరు నిందితులను, దొంగిలించిన వస్తువులను కొనుగోలు చేసేవారిని పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా అవుతోంది. మేడారం జాతరలో ఫేస్ రిక గ్నేషన్ ద్వారా గతంలో దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట ముఠాలకు చెందిన దొంగలను గుర్తించినట్లు క్రైం ఇన్వెస్టిగేషన్ విభాగం ప్రకటించింది. సాంకేతిక సహకారంతో దొంగల ఆటకట్టు... సమ్మక్క, సారలమ్మను దర్శించుకునే భక్తులపై పటిష్టమైన పర్యవేక్షణ, వారి కదలికలు, వాహనాల రాకపోకలను నిశితంగా గమనించేందుకు ఈ జాతరలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో కూడిన ప్రత్యేక కెమెరాలు పెట్టారు. ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ కెమెరాలను (ఏఎన్పీఆర్) పదిచోట్ల అమర్చారు. దొంగతనాలకు పాల్పడే పాత నేరస్తులను గుర్తించేందుకు ఆటోమెటిక్ ఫేస్ రికగ్నేషన్ కోసం ప్రత్యేక సీసీ కెమెరాలను జనం రద్దీ ఉండే అన్ని ప్రాంతాల్లో పెట్టారు. గతంలో తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడిన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బీహార్ ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ఫొటోలను కంప్యూటర్లో ఫీడ్ చేశారు. వ్యాల్యూ పిచ్ అనే సాఫ్ట్వేర్తో అనుసఽంధానం చేయడంలో వల్ల కంప్యూటర్లో ఫీడ్ చేసిన ఫొటోల్లోని వ్యక్తులు ఎవరు వచ్చినా పోలీసులకు అలర్ట్ ఇస్తుంది. ఇదంతా గద్దెల పక్కనే ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్లో అమర్చిన పెద్ద ఎల్సీడీ స్క్రీన్లను 24/7 నిరంతర పర్యవేక్షణ చేసేలా ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఈ విధానం ద్వారా జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరిగిన నాలుగు రోజుల్లో పాత దొంగలు వచ్చినట్లు 70 అలర్ట్లు వచ్చాయి. డ్రోన్, సీసీ కెమెరాలు ఆ దొంగలను గుర్తించి కమాండ్ కంట్రోల్ రూమ్కు వారి ముఖాలను పంపడంతో అప్రమత్తమైన పోలీసులు మహారాష్ట్ర, ఏపీలోని నంద్యాల గ్యాంగ్లకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. మేడారంలో మహారాష్ట్ర, నంద్యాల దొంగలు ట్రేస్ చేసిన వ్యాల్యూ పిచ్ సాఫ్ట్వేర్ ‘ఫేస్ రికగ్నేజేషన్ సిస్టం’తో దొరికిన ఆచూకీ 70 మంది గుర్తింపు, ఐదుగురి అరెస్టు.. విచారణ -
బరికి రెఢీ!
బరికి రెఢీ!పూర్తయిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియజనగామ: పురపాలిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ పర్వం పూర్తయింది. జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల్లో కలిపి 91 మంది తమ నామినేషన్లు వెనక్కి తీసుకోవడంతో 209 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. స్టేషన్లో 32 మంది, జనగామలో 59మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. బరిలో 209 మంది.. జనగామ మున్సిపాలిటీలో 127 మంది, స్టేషన్ఘన్పూర్లో 82 మంది పోటీలో నిలిచారు. ఈ రెండు మున్సిపాలిటీల్లో 57 మంది స్వతంత్రులు బరిలో ప్రధాన పార్టీలకు దడ పుట్టిస్తున్నారు. వారిలో జనగామలో 30, స్టేషన్ఘన్పూర్లో 27 మంది ఉన్నారు. జనగామ 22వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఆ పార్టీ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య 29కి చేరింది. కాంగ్రెస్ 30, బీజేపీ 26 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా, (20, 7, 13, 29 వార్డుల్లో) బీజేపీ పోటీ చేయడం లేదు. జనగామ మున్సిపల్లో సీపీఎం–కాంగ్రెస్ పొత్తులో భాగంగా 3, 5, 7 వార్డుల్లో పోటీ చేస్తుండగా, 17, 7 వార్డుల్లో ఇరు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో ఇద్దరికీ రెండు పార్టీల నుంచీ బీ–ఫామ్లు జారీ అయ్యాయి. ఇక్కడ ఫ్రెండ్లీ పోటీ ఉంటుందని రెండు పార్టీలు పరస్పర అవగాహన కుదుర్చుకుంటున్నాయి. ఇక 22వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి అంజలి విత్డ్రా చేసుకోగా అదే వార్డులో బీజేపీ అభ్యర్థి మాలతి, మరో స్వతంత్ర అభ్యర్థి అల్ల అనిత బరిలో ఉన్నారు. దీంతో అనిత ప్రచారానికి సంబంధించి ప్రధాన ప్రతిపక్షం మద్దతు ఇస్తుందా లేదా ఎలా ముందుకెళ్తుందోననే ఉత్కంఠ నెలకొంది. గుర్తుల కేటాయింపు–అత్యధికంగా.. స్వతంత్రులకు గ్యాస్స్టౌ, విజిల్, ఫుట్బాల్, రింగ్, బ్యాట్, కత్తెర వంటి గుర్తులు కేటాయించారు. జనగామ మున్సిపల్లో 5, 14, 23, 25 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు స్వతంత్రులు కలిపి ఆరుగురు చొప్పున పోటీలో ఉన్నారు. అలాగే 7, 8, 9, 10, 11, 16 వార్డుల్లో ఐదుగురు బరిలో నిలిచారు. 6వ వార్డులో మొత్తం ఏడుగురు పోటీ పడటం ప్రత్యేకత. జనగామ 30 వార్డుల్లో 20వ వార్డులో మాత్రమే ఇద్దరి మధ్యనే పోటీ నెలకొననుంది. ఘన్పూర్లో 13వ వార్డులో అత్యధికంగా ఎనిమిది మంది బరిలో ఉండగా, 10వ వార్డులో ఇద్దరు మాత్రమే పోటీ చేస్తున్నారు. జోరందుకున్న ప్రచారం నామినేషన్ విత్డ్రాలు ముగిసిన వెంటనే అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. పార్టీ గుర్తులు, స్వతంత్రుల ప్రత్యేక గుర్తులు కేటాయించడంతో గంటలోపే పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లు సిద్ధం చేసి అభ్యర్థులు విస్త్రత ప్రచారాన్ని ప్రారంభించారు. జనగామ, స్టేషన్ఘన్పూర్ ఉపసంహరణలుపురపాలిక కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సీపీఎం సీపీఐ స్వతంత్రులు జనగామ 26 10 10 – – 13 స్టే.ఘన్పూర్ 18 09 02 01 – 01బీఫామ్ల అందజేత కాంగ్రెస్ తరఫున పినపాక ఎమ్మెల్యే, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ వెంకటేశ్వర్లతో పాటు డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి, యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, వేమెల్ల సత్యనారాయణరెడ్డి బీఫామ్లను ఆర్ఓలకు అందించారు. బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి క్యామ మల్లేశం, ఇర్రి రమణారెడ్డి, బాల్దె సిద్ధిలింగం, పోకల జమున, గాడిపల్లి ప్రేమలతారెడ్డి, తాళ్ల సురేష్రెడ్డి, గజ్జెల నర్సిరెడ్డి, సందీప్, అనిత, మామిడాల రాజుతో కలిసి ఆర్ఓలకు బీఫామ్లను అందించారు. -
ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా నిర్వహించాలి
● జనరల్ అబ్జర్వర్ ఎ. నర్సింహారెడ్డి జనగామ రూరల్: ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా సజావుగా నిర్వహించాలని జనరల్ అబ్జర్వర్ ఎ.నర్సింహారెడ్డి సూచించారు. మంగళవారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా జనరల్ అబ్జర్వర్ ఎ.నర్సింహరెడ్డి ఘనపూర్, జనగామ మున్సిపాలిటీ పరిధిలోని నామినేషన్ ఉపసంహరణ కేంద్రం డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్లను సందర్శించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఆయనతో పాటు నోడల్ ఆఫీసర్ మాతృనాయక్ సిబ్బంది ఉన్నారు. -
అక్రమ మైనింగ్ పరిశీలన
రఘునాథపల్లి: మండలంలోని గోవర్ధనగిరి గోపాలస్వామిగుట్ట వద్ద అక్రమంగా మట్టి, మొరం తరలిస్తున్నారని సర్పంచ్, గ్రామస్తులు సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం ప్రభుత్వ విభాగాలు గుట్ట వద్ద పెద్దఎత్తున జరిపిన మట్టి తవ్వకాల వద్దకు వెళ్లారు. మైనింగ్ ఏడీ విజయ్కుమార్, తహసీల్దార్ ఎస్సై నరేశ్, రాయల్టీ ఇన్స్పెక్టర్ అనిత ఇతర విభాగాల అధికారులు పరిశీలించారు. తవ్వకాలు జరిపిన వద్ద కొలతలు తీసుకున్నారు. అధికారులు వచ్చిన విషయం తెలిసిన గ్రామస్తులు అక్కడికి చేరుకొని జేసీబీ, టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నా ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. మట్టిని తరలించిన అక్రమార్కులపై చర్యలు తీసుకోకుంటే న్యాయస్థానాన్ని అశ్రయిస్తామని సర్పంచ్ తోటకూరి సదానందం పేర్కొన్నారు. అనుమతులు లేకుండా మట్టి తరలించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు గ్రామస్తులకు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ తోటకూరి సదానందం, ఉప సర్పంచ్ యాదగిరి, సర్వేయర్ నరేశ్, ఆర్ఐ శరత్, జీపీఓ విశ్వేశ్వర్రావు, ముప్పిడి రాజు, దుస్స భిక్షపతి, మల్లయ్య, వెంకటరత్నం, రాజు, రవి, సత్యనారాయణరెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
నానోయూరియాపై రైతులకు అవగాహన
● వీడియో కాన్ఫరెన్స్లో రైతులతో మాట్లాడిన మంత్రి తుమ్మల జనగామ రూరల్: ప్రతీ మంగళవారం జరిగే రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం చీటకోడూరు రైతు వేదికలో వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు వీడియో కాన్ఫరెన్న్స్ ద్వారా రైతులకు వరిలో వచ్చే చీడపీడలు, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టం, నానోయూరియా గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతులకు అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామానికి చెదిందిన రైతు బండారు తిరుపతితో మాట్లాడారు.. గ్రామంలో యూరియా కొరత లేదని యూరియా యాప్ విధానంతో ఇబ్బందులు తొలిగిపోయాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోనీ, జనగామ ఏడీఏ అపర్ణ, చీటకోడూరు సర్పంచ్ కూకట్ల యాదగిరి, ఉప సర్పంచ్ ఎం.చంద్రకళ, ఏఈఓ గిరిరాజు, అనిల్ కుమార్, చింతకింది రాజేష్, బండ మమత, రిషిత పాల్గొన్నారు. -
జిల్లా సరిహద్దులో బోన్ల ఏర్పాటు
● పెద్దపులి సంచారంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులుజనగామ రూరల్: యాదాద్రి జిల్లా శ్రీనివాసపురం నుంచి చుట్టుపక్కల ఉన్న జిల్లాలోని ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉందని, పెంబర్తి, సిద్దెంకి, ఎల్లంల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఆర్ఓ కొండల్రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లాలోకి పెద్దపులి ఇంకా ప్రవేశించలేదని, పాదముద్రల ద్వారా సమాచారం సేకరిస్తున్నామన్నారు. జిల్లాలోకి పెద్దపులి వచ్చిందని సమాచారం వస్తుందడంతో ఎఫ్ఆర్ఓను వివరణ కోరగా ఆవును చంపిన తర్వాత 10 కిలోమీటర్లు వెళ్లి వచ్చి మళ్లీ చనిపోయిన అవును తింటుందని, ఈక్రమంలో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వారం రోజుల పాటు పశువులు ఇంటి వద్ద ఉంచు కోవాలని బావుల వద్దకు గుంపులుగా వెళ్లాలని సూచించారు. శ్రీనివాసపురం, లక్ష్మక్కపల్లిలో బోనులు ఏర్పాటు చేశామని సీసీ కెమెరాల ద్వారా అన్వేషిస్తున్నామని వివరించారు. -
ఆదర్శ మున్సిపాలిటీగా ‘ఘన్పూర్’
స్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదామని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఎంపీ కడియం కావ్య చేతుల మీదుగా బీఫామ్లు అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.. ప్రజల అభిప్రాయాలు, గెలిచే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వీరే.. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులకు చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య మంగళవారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు 1వ వార్డు సింగపురం దయాకర్, 2వ గుర్రం హరినాధ్, 3వ గుర్రం హైమ, 4వ బూర్ల శంకర్, 5వ వార్డు కొంతం రజిత, 6వ కనకం రమేశ్, 7వ అన్నెపు సుమలత, 8వ చాతరబోయిన సత్యనారాయణ, 9వ సౌదరపల్లి సంపత్రాజ్, 10వ తోకల అనూష, 11వ నీల రాజమ్మ, 12వ గట్టు సంగీత, 13వ తాటికొండ వినయ్కుమార్, 14వ పెసరు కృష్ణవేణి, 15వ బొల్లు లక్ష్మీ, 16వ అంగడి రజిత, 17వ పొన్నం స్వరూప, 18వ వార్డుకు కౌన్సిలర్ అభ్యర్థిగా పొన్నం రవిని ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన వరంగల్ ఎంపీ కడియం కావ్య -
ఆరోగ్యకర జీవనశైలితో క్యాన్సర్ నియంత్రణ
జనగామ రూరల్: ఆరోగ్యకర జీవనశైలి పాటించడం ద్వారా క్యాన్సర్ను నియంత్రించవచ్చని జూనియర్ సివిల్ జడ్జి శశి అన్నారు. బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి జిల్లా న్యాయ సేవా సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్సల ప్రాముఖ్యంపై రోగులు, ప్రజలకు అవగాహన కల్పించారు. సమయానికి స్క్రీనింగ్ చేయించుకోవడం, ఆరోగ్యకర జీవనశైలి పాటించడం ద్వారా క్యాన్సర్ను నియంత్రించవచ్చని సూచించారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె.మల్లికార్జునరావు, ప్రోగ్రాం అధికారులు వైద్యులు అశోక్, కమల్ హసన్, ప్రభాకర్, మల్లికార్జున్, సిబ్బంది పాల్గొన్నారు. జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు చరిష్మాజఫర్గఢ్: మండలంలోని హిమ్మత్నగర్ గ్రామానికి చెందిన తాటికాయల చరిష్మా అనే విద్యార్థిని జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికై నట్లు తెలంగాణ రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ సెక్రెటరీ శీలం పార్థసారథి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చరిష్మా భీమారంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నదన్నారు. బాక్సింగ్లో ప్రతిభ చాటడంతో 69వ ఎస్జీఎఫ్ఐ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. విద్యార్థిని చరిష్మాను గ్రామస్తులు అభినందించారు. దివ్యాంగులు సదరం క్యాంపునకు హాజరుకావాలిజనగామ రూరల్: దివ్యాంగులు యూడీఐడీ సదరం క్యాంపునకు హాజరుకావాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వసంత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ రకాల దివ్యాంగులు కొత్తవారు, రెన్యూవల్ వారు మీ సేవలో యూడీఐడీ వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ చేసుకున్న వారు రశీదులో ఉన్న ఫోన్ నెంబర్కు మెసేజ్ వచ్చిన తేదీల్లో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరం శిబిరానికి హాజరుకావాలన్నారు. ఈనెల 6వ తేదీ నుంచి కొనసాగే ఈ శిబిరం 6,9,11,18,19,23,27వ తేదీల్లో ఆర్థో, దృష్టి, వినికిడి లోపం, మానసిక, తలసేమియా, క్రానిక్ న్యూరాలజీ, సంబంధిత దివ్యాంగులకు వైద్యులతో క్యాంపులు నిర్వహించబడుతాయన్నారు. కొత్తవి 225 ఉండగా, రెన్యూవల్ 65 ఉన్నాయని మొత్తంగా 290 మందికి అవకాశం ఉన్నదన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 8008202287లో సంప్రదించగలరని ఆమె సూచించారు. ‘ఐదేళ్ల అభివృద్ధిని రెండేళ్లలో చేసి చూపించాం’ జనగామ: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి ఐదేళ్ల అభివృద్ధిని రెండేళ్లలో చేసి చూపించారని జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్తో కలిసి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరుస్తున్నారన్నారు. కొనసాగుతున్న ఇంటర్ ప్రాక్టికల్స్ జనగామ రూరల్: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఇంటర్ విద్యాధికారి జితేందర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10 కేంద్రాల్లో జనరల్, ఒకేషనల్ ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ఉదయం జనరల్లో 582 విద్యార్థులకు గాను 573మంది హాజరయ్యారని, 9 మంది గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్ మొత్తం 714 విద్యార్థులకు గాను 652 హాజరయ్యారని, 62 మంది గైర్హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం జనరల్లో 497 విద్యార్థులకు గాను 487 మంది హాజరు కాగా, 10మంది గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్లో మొత్తం 610 విద్యార్థులకు గాను 587మంది హాజరయ్యారని, 23మంది గైర్హాజరయ్యారని తెలిపారు. -
నేడు తిరుగువారం పండుగ
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో సమ్మక్క– సారలమ్మకు బుధవారం పూజారులు తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుగువారం పండుగలో భాగంగా మేడారం, కన్నెపల్లి అమ్మవార్ల ఆలయాలను పూజారులు శుద్ధి చేసి దూప దీపాలు వెలిగించి యాటను నైవేధ్యంగా సమర్పిస్తారు. అనంతరం పూజారుల కుటుంబీకులు, స్థానిక ఆదివాసీలు, గిరిజనేతరులు అమ్మవార్ల ఆలయాలకు చేరుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం పూజారులు అమ్మవార్ల పూజాసామగ్రి, వస్త్రాలను తిరిగి ఆలయాల్లో భద్రపర్చనున్నారు. తిరుగువారం పండుగతో మహాజాతర పూజా కార్యక్రమాల తంతు ముగియనుంది. తిరుగువారం పండుగ సందర్భంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవార్లను దర్శించుకోనున్నారు. పుణ్యస్నానాలు.. మొక్కులు జాతర ముగిసి మూడు రోజులు గడిచినా మేడారానికి భక్తులు వస్తూనే ఉన్నారు. మంగళవారం భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల వద్ద పూజలు చేశారు. ఈ క్రమంలో గద్దెల వద్ద పేరుకుపోయిన కొబ్బరి, బెల్లం మిశ్రమాన్ని దేవాదాయశాఖ సిబ్బంది తొలగిస్తున్నారు. -
కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల ఫిరాయింపు ఫిర్యాదుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ మంగళవారం నోటీసులు జారీ చేశారు. బుధవారం తమ ఎదుట విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. కడియం శ్రీహరి కారు పార్టీ మీద నెగ్గి కాంగ్రెస్లోకి ఫిరాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11గం. జరగబోయే విచారణకు రావాల్సిందిగా వివేకాకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. కడియం, వివేకా వాదనలను స్పీకర్ విననున్నారు.మొత్తం పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లు తన ముందుకు రాగా.. ఇప్పటికే ఏడుగురికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్లెవరూ పార్టీ మారలేదని.. బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లు తీర్పు ఇచ్చారు. దానం నాగేందర్ పిటిషన్ ఇంకా విచారణ దశలోనే ఉంది. ఇకప్పుడు కడియం శ్రీహరి పిటిషన్ విచారణ జరగబోతోంది. మరో ఎమ్మెల్యే సంజయ్ వ్యవహారంపై స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
ఎడ్లబండికి టోల్ట్యాక్స్!
జనగామ ‘పుర’ప్రస్థానం మొదలైందిలా! జనగామ మున్సిపల్ సమాచారం కుటుంబాలు: 16,084 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా: 52,408ప్రస్తుతం: 80వేలకు పైగానే (అంచనా)అన్ని విభాగాల్లో ఏటా వచ్చే ఆదాయం: రూ.15.50కోట్లు ఏటా ఖర్చు: రూ.15కోట్లురెగ్యులర్ శానిటేషన్ కార్మికులు: 16 మంది కాంట్రాక్టు కార్మికులు: 150 మందిప్రతీ రోజు చెత్త సేకరణ: 6 టన్నులు స్లమ్ ఏరియాలు : 19 స్లమ్ ఏరియాలో జనాభా: 22,731 మందివిస్తీర్ణం: 19.1 చ.కి.మీ1935లో దేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగించారు. ఒక్క హైదరాబాద్ మినహా(నిజాం పాలనలో ఉండడం చేత) అంతటా లోకల్బాడీ ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధుల పాలన అమలులోకి వచ్చింది. దీంతో నిజాం నవాబు బల్దియా (మునిసిపల్) పరిధిలో తహసీల్దార్ను చైర్మన్గా నియమించి పేరు ప్రఖ్యాతలు ఉన్న ఐదుగురు సభ్యులను నామినేటెడ్గా నియమించారు. 17 ఏళ్ల పాటు కొనసాగిన తహసీల్దార్ పాలనకు 1952లో స్వస్తిపలికారు. 1952 నవంబర్లో జనగామలో మొదటి సారిగా 14వార్డులకు ఎన్నికలను నిర్వహించారు. వార్డు సభ్యుల ఎన్నికల్లో జనగామ మొదటి చైర్మన్గా కోడూరి జగన్నాథరెడ్డి, వైస్ చైర్మన్గా పెద్ది నారాయణ ఎన్నికయ్యారు. ఇందులో ముగ్గురు అఫీషియల్స్, మరో ముగ్గురు నాన్అఫీషియల్స్ను నామినేటెడ్ పద్ధతిలో నియమించారు. రెండో చైర్మన్గా రాగి నర్సింహులు ఆ తర్వా త వెన్నెం వెంకటనర్సింహరెడ్డి, వీరారెడ్డి భాస్కర్రెడ్డి, చొల్లేటి ప్రభాకర్, పబ్బా శివకోటి, పీటీ దశరథ గెలుపొందారు. ఆరో చైర్మన్గా ఎర్రమళ్ల సుధాకర్, ఆ తర్వాత డాక్టర్ కరుణాకర్రాజు, వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, నాగారపు వెంకట్, పోకల జమున పనిచేశారు. రూ.36వేల ఆదాయంతో మొదలు.. 1952లో 12వేల జనాభా, మూడు వేల నివాస గృహాలతో రూ.36వేల ఆదాయంతో మున్సిపల్ ప్రస్థానం మొదలైంది. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పట్టణ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. స్వతహాగా నిధులను సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో పెద్దల నిర్ణయం మేరకు సైకిళ్లకు లైఫ్ ట్యాక్స్ను అమలులోకి తీసుకొచ్చారు. ఏడాదికి రూ.3 చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తులతో పాటు వ్యాపార పరంగా వివిధ ప్రాంతాల నుంచి జనగామకు వచ్చే ఎడ్లబండ్లు, ఇతర వాహనాలు పట్టణంలోని రావాలంటే టోల్ట్యాక్స్ చెల్లించే విధంగా నిబంధనలు విధించారు. ఒక్కో ఎడ్ల బండికి నాలుగు అణా లు టోల్కింద తీసుకునే వారు. ప్రతీ ఇంటి యజ మాని ఏడాదికి రూ.5 నుంచి రూ.వెయ్యి వరకు ట్యాక్స్ చెల్లించేవారు. 1964లో అప్పటి చైర్మన్ వెంకటనర్సింహరెడ్డి ఆరు బోర్లను వేయించారు.ప్రజల అవసరాలు తీర్చినంపట్టణ ప్రజలు కనీస అవసరాలపై దృష్టి సారిస్తూనే, అభివృద్ధి కోసం దీక్షతో పని చేసినం. వేసవిలో ట్రాక్టర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని ప్రభుత్వం నిధులు మంజూరు చేసేది. కానీ నా హయాంలో బోరుబావులు తవ్వించేందుకు నిర్ణయం తీసుకోగా, అప్పటి కలెక్టర్ ససేమిరా అన్నారు. బోరుబావుల అవసరంపై ఆయనకు వివరించి, తాగునీటి సమస్య లేకుండా చేసినం. – వెన్నెం వెంకటనర్సింహరెడ్డి నాటి మునిసిపల్ చైర్మన్చీటకోడూరు రిజర్వాయర్ ఏర్పాటు పట్టణ ప్రజలకు దాహార్తిని తీర్చాలనే సంక ల్పంతో అప్పటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య హయాంలో 2005లో 11.13 ఎంఎల్డీ సామర్థ్యంతో చీటకోడూరు వద్ద రిజర్వాయర్ నిర్మించారు. రిజర్వాయర్లో ప్రస్తుత నీటి సామర్థ్యం ఆధారంగా, ప్రతీ రోజు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. తహసీల్దార్ పాలన నుంచి కమిషనర్ వరకు 1952లో రూ.36వేల ఆదాయం మున్సిపల్ చైర్మన్లుగా 14మంది నేటికి రాబోవు పాలకవర్గం ఏర్పాటుతో 74 ఏళ్ల చరిత్ర! -
ప్రశాంతంగా ప్రాక్టికల్ పరీక్షలు
● 122 మంది గైర్హాజరు జనగామ రూరల్: జిల్లా వ్యాప్తంగా 10 సెంటర్లలో ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జితేందర్రెడ్డి తెలిపారు. సోమవారం జనరల్, ఒకేషనల్ ప్రయోగ పరీక్షలు రెండు విడతలుగా నిర్వహించగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించారు. సీసీ కెమెరా నిఘాలో బోర్డు నిబంధనల మేరకు నిర్వహించినట్లు తెలిపారు. ఉదయం జనరల్ విద్యార్థులు 530 విద్యార్థులకు గాను 523మంది హాజరయ్యారు, 7 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షలో 739 విద్యార్థులకు గాను 661 హాజరుకాగా 78మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జనరల్ మొత్తం 450 విద్యార్థులకు గాను 437 హాజరయ్యారు, 13 గైర్హాజరయ్యారు. ఒకేషనల్ మొత్తం 611 విద్యార్థులకు గాను 587 హాజరయ్యారు, 24 గైర్హాజరయ్యారు. డీఈసీ సభ్యులు శ్రీనివాస్ శేఖర్, ఫ్లయింగ్ సభ్యులు పలు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. -
దిగితే కాని తెలవట్లే!
● ప్రచారానికి తక్కువ టైం.. అయినా పెరుగుతున్న ఖర్చు ● నేటి ఉపసంహరణతో పోటీపై స్పష్టత ● ప్రచారంలో పల్లా, కడియం దూకుడు జనగామ: పురపాలిక ఎన్నికల్లో అభ్యర్థులకు ఫీల్డ్లోకి దిగిన తర్వాతే అసలు పరీక్ష ఎదురవుతోంది. ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో ఖర్చు తగ్గుతుందని ముందుగా భావించారు. ఇంటింటా ప్రచారం, కేడర్తో సమన్వయం, సమావేశాలు, ర్యాలీలు..రాత్రి సమయంలో విందులతో ఖర్చుతో పాటు ఒత్తిడి అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో రెండు పురపాలికల్లో ఎన్నికల వేడి రగులుతోంది. పోటీ తీవ్రంగా ఉండడంతో ఖర్చు భారీగానే పెట్టాల్సి వస్తుందని అభ్యర్థులు వణికిపోతున్నారు. హోరాహోరీ.. జనగామ, స్టేషన్న్ఘన్పూర్ మున్సిపాలిటీల్లో హోరాహోరీ ప్రచారం సాగుతోంది. జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి రోజుకి ఐదు వార్డుల్లో ప్రచారం చేస్తూ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిషలు కష్టపడుతున్నారు. ఇదే వేగంతో స్టేషన్న్ఘన్పూర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేడర్కు దిశానిర్దేశం చేస్తుండగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక జనగామలో కాంగ్రెస్ పరిస్థితి మాత్రం కొంచెం క్లిష్టంగానే కనిపిస్తోంది. పలు వార్డుల్లో అభ్యర్థుల ఎంపిక ఆలస్యమవడంతో ప్రచారం ఇంకా పూర్తిగా పట్టాలు ఎక్కలేదు. అధికార పార్టీ, బీజేపీ, ఇతర అభ్యర్థులు ప్రచారం మొదలెట్టిన వేళ అభ్యర్థుల ఖరారులో జాప్యం కాంగ్రెస్ ప్రచారానికి ఇంకా దూరంగానే ఉందని చెప్పుకోవచ్చు. కానీ పలు వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు.నేడు ఉపసంహరణ ఇంతలో నామినేషన్ల ఉపసంహరణ దశకు చేరుకోవడంతో పార్టీల దృష్టి ఆ వైపు మళ్లింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల బీఫామ్లను ఎన్నికల అధికారులు వద్ద సమర్పించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. అదే సమయానికి పార్టీల బీఫామ్ల అందజేత ప్రక్రియ కూడా ముగియనుంది. ఉపసంహరణ కోసం ఎన్నికల కమిషన్ జనగామ మున్సిపల్, స్టేషన్ఘన్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సెంటర్లలో నామినేషన్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉపసం హరణతో తుది జాబితా ఖరారుకానుండడంతో అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఎవరెవరిని నిలబెట్టాలి.. ఎవరిని ఉపసంహరించాలి.. ఏ వార్డులో అధికార పార్టీ, ఏ వార్డులో రెబల్స్ ప్రభావం అన్నదానిపై పార్టీ నాయకులు గంట గంటకు ప్లాన్ మార్చుకుంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్ర చారం మరింత వేడెక్కుతుండడంతో వచ్చే రెండు రోజులపాటు జనగామ, స్టేషన్ ఘన్పూర్ రాజకీయం ఉండే అవకాశం ఉంది. -
పది విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
● అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ రఘునాథపల్లి : పదో తరగతి విద్యార్థుల విద్యా ప్రగతిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అదనపు కలెక్టర్ పింకేశ్కుమార్ సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థుల సామర్ధ్యాలు, ఉపాధ్యాయుల బోధనా తీరును పరిశీలించారు. ఇన్చార్జ్ హెచ్ఎం బాల్నె నాగభూషణం, ఎంఈఓ రఘునందన్రెడ్డి, ఏఎంఓ శ్రీనివాస్, కనకయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మున్సి‘పోల్స్’ను సమర్థవంతంగా నిర్వహించాలి
● అధికారులకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచన స్టేషన్ఘన్పూర్: మున్సిపాలిటీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ రాధాక్రిష్ణకు పలు సూచనలు చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్ను పరిశీలించి విధులు నిర్వహిస్తున్న అధికారులకు పలు సూచనలు చేశారు. పక్కా ప్రణాళికతో చదవాలి పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులు పక్కా ప్రణాళికతో ప్రత్యేక శ్రద్ధతో సిద్ధం కావాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. స్థానిక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ సోమవారం సందర్శించారు. ముందుగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వారు పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతున్నారు.. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో మార్కులు ఎలా వచ్చాయి.. ఏ సబ్జెక్టులను ఎంత వరకు చదవడం పూర్తయిందని తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటశాలకు వెళ్లి వంటలను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులున్నారు. ఉపాధిలో ప్రాధాన్య పనులకు అవకాశం జనగామ రూరల్: ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో జాబ్కార్డు కలిగిన ప్రతీ ఒక్కరికి 100 రోజుల పని కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనుల పురోగతిపై అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్తో కలిసి పీడీ హౌజింగ్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపిఓలతో కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సమీక్షించారు. ప్రతి గ్రామానికి 75 మందికి తగ్గకుండా కూలీలతో పని చేయించాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ వసంత, అదనపు డీఆర్డీఏలు నూరుద్దీన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
విస్తృత చర్చలతోనే అభ్యర్థుల ఎంపిక
జనగామ రూరల్: విస్తృత చర్చలు, అభిప్రాయా లతోనే అభ్యర్థుల ఎంపిక జరిగిందని, పార్టీకి సేవ చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చామని ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి కార్యాలయంతో ఆయనతో పాటు జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి సమక్షంలో జనగామ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, పార్టీ విధానాలకు అనుగుణంగా, వార్డు అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, పట్టణ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపి, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి వెల్లడించారు. వార్డు కౌన్సిలర్ అభ్యర్థుల వివరాలు: 1: మూడ్ లక్ష్మణ్ నాయక్, 2: రామగళ్ల విజయ్కుమార్, 4: మంత్రి సుమలత, 8: ఝెర్ర రజిని, 9:వంగాళ కళ్యాణి, 12: వంగా ఉమా, 13: మేడ శ్రీనివాస్, 14: తిరువైప్పడి ఆండాలు, 15: సిద్దం శివశంకర్, 16: కడకంచి సుశీలా 17: గొడేపాక రామచంద్ర 18: కొండ శ్రీనివాస్ రావు,19: దోర్నాల అనిత,20: గడారి రేణుక, 21: మోతే రేణుక, 24: వెమల్ల పద్మ, 26: జక్కుల వేణుమాధవ్, 27: చంచరపు కరుణాకర్ రెడ్డి, 28: రతియా బేగం, 29: మరుకుకుల శ్రీనివాసులు, 30: ఆరుట్ల రాంనర్సింహరెడ్డి. ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనారిటీలకు ప్రాధాన్యం కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి -
మేడారంలో తగ్గని రద్దీ
● మహాజాతర ముగిసినా తరలివచ్చిన భక్తజనం ● కిక్కిరిసిన సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణంకేసీఆర్పై సిట్ విచారణ సిగ్గుచేటుజనగామ రూరల్: ఫోన్ ట్యాపింగ్ పేరుతో కేసీ ఆర్పై సిట్ విచారణ చేపట్టడం సిగ్గుచేటని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. కేసీఆర్ను సిట్ విచారణకు పిలువడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పార్టీ శ్రేణులతో కలసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నల్లబ్యాడ్జిలు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనకు నాయకత్వం వహించిన కేసీఆర్ను, తెలంగాణ ప్రజలను అవమానించేలా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. కేవలం రాజ కీయ కక్షతోనే సిట్ విచారణ పేరుతో కేసీఆర్ను ఇబ్బందులకు గురిచేయడం ఏమాత్రం సరికాదన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పా ల్పడుతున్నదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు జి.నర్సింగరావు, పెద్ది రాజిరెడ్డి, బాల్దె సిద్దిలింగం, బండా పద్మ, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, మాజీ ఎంపీపీ కలింగ రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
వారెంత? మనమెంత?
జనగామ: జనగామ–స్టేషన్ ఘన్పూర్ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నామినేషన్ల దశ పూర్తి కాగా, స్క్రూటినీ అనంతరం ఈ నెల 3వ తేదీన ఉపసంహరణ గడువు ఉండడంతో పార్టీల్లో చర్చలు, లెక్కలు, అంతర్గత రాజకీయం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఎన్నికల్లో ఎవరెంత ఖర్చు చేస్తారు..ఎంత ఖర్చు చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది..ప్రత్యర్థిపై నెగ్గాలంటే ఎంత ఖర్చుపెట్టాల్సి ఉంటుందనే కోణంలో చర్చలు నడుస్తున్నాయి. ఈక్రమంలోనే డమ్మీ అభ్యర్థులను ఉపసంహరించుకునే విధంగా పార్టీల నేతలు సీరియస్గా చర్చలు జరుపుతుండగా, అధికారిక అభ్యర్థులు మాత్రం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మనీ మేనేజ్మెంట్.. ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారానికి కావాల్సిన మనీ మేనేజ్మెంట్లో నిమగ్నమవడం చర్చనీయాంశంగా మారింది. రోజువారీ ప్రచారం, కార్యకర్తల ఖర్చులు, ఓటర్లకు పంచాల్సిన ప్యాకేజీలపై ముందుగానే లెక్కలు వేసుకుంటూ భారీ మొత్తంలో నిధులను సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో కూడా రాజకీయ సమీకరణాలకన్నా మనీ చుట్టూనే అంతా తిరుగుతోందని అని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇప్పటికే పలు వార్డుల్లో ఇంటింటా పర్యటించారు. నామినేషన్లకు ముందే ఆయన ప్రారంభించిన ప్రత్యేక ప్రచారం ఇప్పుడు వేగం పుంజుకుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా ప్రచార రంగంలోకి దిగుతోంది. గత వారం రోజులు అభ్యర్థులు స్వతహాగా ప్రచారం ప్రారంభించగా, ఇప్పుడు డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, జనగామ నియోజకవర్గ ఇన్న్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి వార్డుల వారీగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఘన్పూర్లో గట్టి పోటీ.. ఇక స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ కుర్చీపై రెండు ప్రధాన పార్టీల మధ్య గట్టి పోరు నెలకొంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రతిరోజూ కార్యకర్తలతో చర్చలు కొనసాగిస్తూ అధికార పీఠాన్ని సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇదే తరుణంలో అక్కడి మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య, జనగాామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇద్దరూ కొత్తగా ఏర్పడిన స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యూహాత్మకంగా ప్రతీ వార్డుపై దృష్టిపెట్టి ప్రజలతో సమీపంగా మమేకమవుతున్నారు. పార్టీల అంతర్గత సమస్యల విషయానికి వస్తే, బీఆర్ఎస్లో వార్డుల అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. అయితే కాంగ్రెస్లో మాత్రం కొన్ని చోట్ల అభ్యర్థుల ఎంపికపై గందరగోళం ఇంకా కొనసాగుతోంది. ఇరు పార్టీలూ రెబల్ అభ్యర్థుల సమస్య లేకుండా చూడాలనే ప్రయత్నాలు చేస్తున్నా, కొన్ని చోట్ల తిరుగుబాటు మంటలు చెలరేగే అవకాశం కనిపిస్తోంది. అంతా చూశాక ఈ ఎన్నికల గర్జనలో ఎవరు ఎంత ఖర్చు పెడతారు..? మనీ ఎలా కదులుతుంది..? అనే దానిపైనే చర్చ నడుస్తోంది. అభ్యర్థుల ప్రచార తీరూ, పార్టీల వ్యూహాలూ, ఉపసంహరణ గడువులో జరగబోయే మార్పులే వచ్చే రోజుల్లో కీలకంగా మారనున్నాయి. నెగ్గాలంటే ఎంత ఖర్చు చేయాలన్న దానిపైనే చర్చ బీఆర్ఎస్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి, కాంగ్రెస్లో గందరగోళం జనగామ–‘స్టేషన్్’లో మొదలైన రాజకీయ వేడి.. డమ్మీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు పార్టీల ముమ్మర యత్నాలు -
సమాజాభివృద్ధిలో యువత పాత్ర కీలకం
పాలకుర్తి టౌన్: యువత సమాజ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ సూచించారు. ఆదివారం మండల కేంద్రంలో యువత చైతన్య యూత్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో యువ మండల్ వికాస్ అభియాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి, దేవరుప్పల, కొడకండ్ల మండలాల నుంచి పెద్ద సంఖ్యలో యువత పాల్గొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కార్యక్రమంలో నేషనల్ యూత్ అవార్డు గ్రహీత మధు, వార్డు సభ్యులు కమ్మగాని శ్రీకాంత్, ఎలమకంటి సతీష్, యూత్ అధ్యక్షుడు ఎడవెల్లి సోమశేఖర్,కార్యదర్శి ఎలమకంటి సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
మిర్చికి మళ్లీ జీవం
లింగాలఘణపురం: ఈ ఏడాది మిర్చిపంట తీవ్రమైన తెగుళ్ల బారిన పడి దిగుబడి పూర్తిగా తగ్గి రైతులు నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మిర్చి ధర రోజురోజుకూ పెరుగుతుండడంతో రైతులు తెగుళ్లు సోకిన మిర్చి పంటకు మళ్లీ మందులు వేసి..కలుపు మొక్కలు తీసివేసేందుకు దున్నుతున్నారు. క్వింటాల్కు రూ.18వేల నుంచి రూ.20వేలపైకి చేరుతుండడంతో ఆకు అంతా రాలిపోయి చిగురిస్తుండగా మిర్చిపై మళ్లీ ఆశలు పెంచుకుంటున్నారు. మొక్కను తొలగించడం ఎందుకనే ఉద్దేశంతో ఎంతైనా కొంత దిగుబడి వస్తుందనే ఆశతో మళ్లీ అదే పంటకు జీవం పోయాలని చూస్తున్నారు. కొత్తపల్లికి చెందిన మేకల మల్లయ్య తనకు ఉన్న ఎకరంలో గత ఏడాది సుమారు 30 క్వింటాళ్ల మిర్చి దిగుబడి రాగా ఈసారి కేవలం ఆరేడు క్వింటాళ్లు మాత్రమే రావడంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో ఉన్నారు. చిగురిస్తున్న మిర్చి మొక్కలను మళ్లీ దున్ని మందులు వేసి నీళ్లు పెడితే ఎంతో కొంత దిగుబడి వస్తుందని ఆశతో దున్నుతున్నాడు. ఇదే విధంగా మండలంలో మిర్చి వేసిన రైతులు కొంత మంది అదే ఆశతో ఉన్నారు. తెగుళ్ల బారిన పడిన పంటకు మందులు, కలుపుతీత ‘ఎర్రబంగారం’ ధర పెరుగుతుండడంతో రైతుల ఆశలు -
ప్రత్యేకం!
ఓరుగల్లుకు లేదుఉమ్మడి వరంగల్ జిల్లా వాసులను నిరాశపరిచిన కేంద్ర బడ్జెట్సాక్షిప్రతినిధి, వరంగల్: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్లో ఉమ్మడి వరంగల్కు ప్రత్యేక కేటాయింపులు లేవు. వరంగల్కు కీలకమైన ఎయిర్పోర్ట్ నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. మెడికల్, ఐటీ హబ్లు ఏర్పాటు చేసే నగరాల జాబితాలో చోటు దక్కలేదు. పర్యాటక అభివృద్ధిలో ఈశాన్య రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇచ్చిన కేంద్రం.. ఈ బడ్జెట్లో ఓరుగల్లు పర్యాటకాన్ని పట్టించుకోలేదు. మేడారం జాతరకు జాతీయ హోదా ఊసేలేదు. ములుగు గిరిజన యూనివర్సిటీతో పాటు కాళోజీ, కాకతీయ యూనివర్సిటీల ప్రస్తావన లేదు. ఉమ్మడి వరంగల్లో కీలక ప్రాజెక్టులకు ఈ సారి మొండిచెయ్యే చూపారన్న చర్చ జరుగుతోంది. ప్రాధాన్యం ఇచ్చి ఉంటే బాగుండేదని కొందరు మేధావులు, ఆర్థికవేత్తలు అంటుండగా.. ఈసారి కూడా అన్యాయం జరిగిందని వివిధ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ వర్గాల ఆశలు నెరవేరలే... వ్యవసాయ అనుబంధ రంగాలు, ఉద్యోగులు, మధ్యతరగతి వారి ఆశలు నెరవేరలేదు. ఆ వర్గాలను ప్రభావితం చేసే అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యం దక్కలేదు. ఉమ్మడి జిల్లాలో ఆదాయ పన్ను చెల్లింపుదారులు 5.28 లక్షల మందికి పైగా ఉన్నట్లు అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమలవుతున్న స్లాబులను కొనసాగించడంతోపాటు స్టాండర్డ్ డిడెక్షన్ను పెంచితే బాగుంటుందన్న వారి కోరిక తీరలేదు. డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు విస్తరించి, విద్య, వైద్య ఖర్చులపై టీడీఎస్ను 5 నుంచి 2 తగ్గించి చిన్నతరహా ఆదాయపన్ను చెల్లింపుదారులకు ఆరు నెలల ఊరట ఇచ్చారు. గృహ రుణాల విషయంలో వడ్డీ రాయితీ, చిన్న కమతాలు కలిగిన రైతులకు భరోసా కల్పించే అంశాలు బడ్జెట్లో లేవు. రింగురోడ్డు నిర్మాణం, స్మార్ట్సిటీ పథకం పొ డిగింపుపై స్పష్టత లేదు. బడ్జెట్లో రాయితీలు లేకపోవడంతో అనేకవర్గాలు పెదవి విరుస్తున్నాయి. 6 జిల్లాలకు 6 బాలికల హాస్టళ్లు.. బడ్జెట్పై భిన్నాభిప్రాయాలు.. పర్యాటకం, మెడికల్ హబ్లో దక్కని చోటు ‘ట్రైబల్’ సహా యూనివర్సిటీలకు కేటాయించని నిధులు కేఎంటీపీకి ప్రయోజనం.. రైతులకు ఊరట జిల్లాకో బాలికల హాస్టల్.. ఉపాధి, ఉద్యోగావకాశాలుదేశంలోని అన్ని జిల్లాల్లో బాలికల హాస్టళ్లను అన్ని హంగులతో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలకు బాలికల హాస్టళ్లు రానున్నాయి. రైతులకు ఎరువులపై ఈసారి రాయితీ శాతాన్ని పెంచడం ఊరట కలిగించే అంశం కాగా, 9.17 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. కొత్త పథకం ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 75,834 ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)లకు మేలు జరగనుంది. ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగించి వైద్యం, ఆరోగ్యం పరంగా పేదలకు రాయితీలు ఇచ్చారు. క్యాన్సర్ రోగులకు సరఫరా చేసే మందుల ధరలు తగ్గనుండగా.. 23,190 మందికి నెలనెలా ఖర్చులు తగ్గనున్నాయి. -
ఘనంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
పాలకుర్తి టౌన్: మండలంలోని తొర్రూరు గుట్టపై వెలిసిన వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగ వివాహ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. వేంకటేశ్వర స్వామి కల్యాణం, రేణుక ఎల్లమ్మ తల్లి పట్నాలు, బోనాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ పూజారి రానాచార్యుల నేతృత్వంలో జరిగిన కల్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి మండలంలోని పలు గ్రామాల భక్తులు తరలివచ్చి తిలకించారు. కార్యక్రమంలో సర్పంచ్ పసులాది యాకస్వామి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మహేందర్, ఉపాధ్యక్షుడు పసులాది చంద్రయ్య, కార్యదర్శి గోడ రవి,చిలువేరు బాలరాజు, లంక శ్రీనివాస్, పులి శ్రీను, అంజనేయులు, చిలువేరు పెంటయ్య, కొంక మల్లేశం, గోనె సోమయ్య తదితరులు పాల్గొన్నారు.గోవర్ధనగిరిలో వైభవంగా ఎడ్లపండుగరఘునాథపల్లి: మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో ఆదివారం రైతులు ఎడ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే రైతులు తమ పశువులకు స్నానాలు చేయించి, కొమ్ములకు రంగులు అద్ది సుందరంగా అలంకరించారు. అనంతరం పచ్చని పొలాల వద్ద పశువుల గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం రైతులందరూ సహపంక్తి భోజనం చేశారు. రైతులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొని పండుగకు శోభ తీసుకొచ్చారు. వ్యవసాయానికి ఆధారమైన పశువులపై కృతజ్ఙతాభావంతో ఈ పండుగను ఏటా ఆనవాయితీగా జరుపుకుంటున్నామని రైతులు తెలిపారు. పుష్కర ప్రయుక్త మహాకుంభాభిషేకంజనగామ రూరల్: పట్టణంలోని రామలింగేశ్వరస్వామి దేవాలయంలో పుష్కర ప్రయుక్త మహా కుంభాభిషేక మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంతో పాటు శత రుద్రాభిషేక హోమం, అన్న ప్రసాద వితరణ, వేద పారాయణం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అప్పయ్య శాస్త్రి, దేవస్థానం చైర్మన్ రామిని రాజేశ్వర్, ఉపాధ్యక్షులు మహంకాళి హరిశ్చంద గుప్తా, ప్రధాన కార్యదర్శి కోకల మల్లేశం, కోశాధికారి అయిత శ్రీనివాసులు, సభ్యులు అల్లాడి ప్రభాకర్, పుల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.పులి సంచారంపై అప్రమత్తతబచ్చన్నపేట: మండలంలోని సాల్వాపూర్, మన్సాన్పల్లి చుట్టూ పక్కల గ్రామాల రైతులు జాగ్రత్తగా ఉండాలని ఆయా గ్రామాల సర్పంచ్లు మిద్దెల శ్రీధర్గౌడ్, గీస సందీప్ సూచించారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. తమ గ్రామాలతో పాటు పక్క మండలమైన యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం పరిధిలోని పలు గ్రామాల్లో పులి సంచరిస్తోందన్నారు. ఆ మండలంలోని గంధమల్ల అనే గ్రామంలో పులి ఓ రైతుకు చెందిన లేగదూడను చంపివేసిందన్నారు. మన్సాన్పల్లి, సాల్వాపూర్ గ్రామాల మధ్యన దాదాపు 450 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉన్నదని అందుకే రైతులు జాగ్రత్తలు పాటించాలన్నారు. పులి ఉన్న చోట నుంచి దాదాపు 70 నుంచి 100 కిలోమీటర్ల మేర తిరుగుతుందని బావుల వద్ద పశువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని, రాత్రి పూట బావుల వద్దకు వెళ్లకూడదన్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు పలు సూచనలు చేసినట్లు తెలిపారు. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ కృషి అమోఘంకేయూ క్యాంపస్: అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ కృషి అమోఘం అని జైపూర్లోని ఎంఎన్ఐటీ ప్రొఫెసర్ డాక్టర్ కవిత లాల్వాని అన్నారు. ఆదివారం కేయూ ఫిజిక్స్ విభాగం, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో లెగసీ ఆఫ్ కల్పనా చావ్లాపై నిర్వహించిన ఆన్లైన్ వెబినార్లో పాల్గొని ఆమె కీలకపోన్యాసం చేశారు. డాక్టర్ కల్పనా చావ్లా జీవితం భౌతిక శాస్త్రం, అంతరిక్ష పరిశోధన, మహిళా శాస్త్రవేత్తల ప్రేరణకు ప్రతీకగా నిలిచాయని కవిత అన్నారు. -
‘రెబల్స్’ బెడద
జనగామ రూరల్: జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. ఈ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థుల హంగామా.. రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. నామినేషన్ గడువు ముగియడంతో స్క్రూటినీ కూడా పూర్తయింది. ఇప్పుడు ఉపసంహరణ మాత్రమే మిగిలి ఉండడంతో అభ్యర్థుల మధ్య ఒత్తిడి, చర్చలు, రహస్య ఒప్పందాలు ఊపందుకున్నాయి. పార్టీ నుంచి టికెట్ ఆశించినా.. దక్కకపోవడంతో అసంతృప్తితో బరిలో దిగిన వారు, స్వతంత్రులు ఇప్పుడు అధికార, ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారారు. రెండేళ్లుగా కౌన్సిలర్ ఎన్నిక కోసం సిద్ధమవుతూ, తమ వార్డుల్లో పెద్ద ఎత్తున ఖర్చులు పెట్టిన పలువురు నాయకులు ఇప్పుడు ఉపసంహరణపై మొగ్గు చూపడం లేదు. వారిని నచ్చజెప్పడానికి పార్టీ పెద్దలు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రత్యేక ఆఫర్లు.. ‘వార్డులోని తన అనుచరులను ఆకర్షించేందుకు ప్రతీ రోజు ఖర్చులు అయ్యాయి. ఇప్పుడు ఉపసంహరించుకోమంటే నా అభిమానులకు ఏమి చెప్పాలి’ అంటూ కొంతమంది రెబల్ అభ్యర్థులు అసంతృప్తిగా ఉన్నారు. అందుకే వారిని ఒప్పించేందుకు పార్టీ శ్రేణులు ప్రత్యేక ఆఫర్లతో ప్రతిపాదనలతో ముందుకు వెళ్తున్నారు. కొంతమంది అభ్యర్థులు ఇప్పటికే మధ్యవర్తుల ద్వారా రాజీకి సుముఖంగా ఉండగా, ఉపసంహరించిన తర్వాత ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం ఆఫర్లు క్లియర్ చేసే బాధ్యతను కూడా మధ్యవర్తులకే అప్పగిస్తున్నట్లు సమాచారం. ఓట్ల విభజన జరగకుండా.. ఒక్క ఓటు గెలుపోటములు నిర్ణయించే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ప్రధాన పోటీలో ఉన్నవారు రెబల్ కారణంగా ఓట్ల విభజన జరగకుండా చూడటానికి ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నా రు. ఇక ఉపసంహరణ గడువు సమీపిస్తున్న కొద్ది ఈ రెండు పురపాలికల్లో ఎన్నికల హీట్ మరింత పెరిగింది. రెబల్ అభ్యర్థుల నిర్ణయాలపై అన్ని పా ర్టీల దృష్టి నిలిచింది. ఏదిఏమైన రెబల్ అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశం ఉండటంతో ఎన్నికల పోరు మరింత ఆసక్తికరంగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో పెరుగుతున్న పొలిటికల్ హీట్ ఉపసంహరణకు రహస్య ఒప్పందాలు పార్టీలకు తలనొప్పిగా మారిన రెబల్ అభ్యర్థుల ప్రచారం -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
● జనగామలో 186, స్టేషన్ఘన్పూర్లో 114 మంది అభ్యర్థులు ● నేడు అప్పీళ్ల్ల స్వీకరణ, రేపు తుది జాబితా విడుదలజనగామ రూరల్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శనివారం అధికారులు నామినేషన్లను స్క్రూటినీ ప్ర క్రియ నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్రులు నామినేషన్లను వేశారు. అభ్యర్థులు ముందస్తుగా ఇబ్బందులు తలెత్తకుండా నా మినేషన్ పత్రాలను ఒకటికి రెండుసార్లు పునఃపరి శీలన చేసి అందించారు. దీంతో నామినేషన్ స్క్రూ టినీలో ఒక్కటి కూడా తిరస్కరణకు గురికాలేదు. జిల్లాలో జనగామ, స్టేషన్ఘన్పూర్ రెండు మున్సిపాలిటీలో 48 వార్డులు ఉండగా 300 మంది అభ్యర్థులు మొత్తం 473 నామినేషన్లు వేశారు. ఇందులో అభ్యర్థులు మూడు, నాలుగు సెట్లు దాఖలు చేయగా స్క్రూటినీలో అభ్యర్థికి ఒక్కటి చొప్పున 300 నామినేషన్లను స్వీకరించారు. జనగామలో 186, స్టేషన్ఘన్పూర్లో 114 మంది అభ్యర్థులు ఉన్నారు. జనగామలో బీజేపీ 54, బీఎస్పీ 6, సీపీఎం 5, కాంగ్రెస్ 107, బీఆర్ఎస్ 73, రిజిస్టర్ పార్టీలు 16, స్వతంత్రులు 39 మంది నామినేషన్ వేశారు. అభ్యంతరాల స్వీకరణ, నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన అనంతరం ఎన్నికల బరిలో ఎంతమంది ఉంటారనేది తేలనుంది. స్టేషన్ఘన్పూర్ మున్సిపల్లో 18 వార్డుల గాను 114 మంది అభ్యర్థులు 181 నామినేషన్లు దాఖలు చేశారు. అందులో అత్యధికంగా ఎస్సీ జనరల్ ఉన్న ఒకటవ వార్డులో 15 నామినేషన్లు వేయగా అత్యల్పంగా 7, 14వ వార్డుల్లో 6 చొప్పున నామినేషన్లు వేశారు. -
అరణ్యానికి ఆదిశక్తులు
సమ్మక్క: రాత్రి 7.58 గంటలకుమేడారం(ఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి): ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వన ప్రవేశం కార్యక్రమంతో సమ్మక్క–సారలమ్మ మహాజాతర శనివారం ముగిసింది. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క–సారలమ్మతోపాటు పగిడిద్దరాజు, గోవిందరాజును పూజారులు ఆదివాసీ సంప్రదాయ రీతిలో పూజలు చేసి తల్లులను వనం చేర్చారు. సాయంత్రం గద్దెల వద్ద ప్రారంభమైన వన ప్రవేశ కార్యక్రమం రాత్రి వరకు కొనసాగింది. పూజారులు కన్నెపల్లికి సారలమ్మను, చిలకలగుట్టకు సమ్మక్క తల్లిని తీసుకెళ్లారు. కొండాయికి గోవిందరాజును పూజారులు దబ్బగట్ల గోవర్ధన్, రాజారం, వడ్డె బాబు, పూనుగొండ్లకు పగిడిద్దరాజును పూజారులు పెనక బుచ్చిరాములు పడగలను తీసుకెళ్లారు. భక్తులు.. అమ్మల ఆశీస్సులతో గమ్యస్థానానికి చేరుకున్నారు. డోలు వాయిద్యాలు, కొమ్ముబూర ధ్వనులేమీ లేకుండా తల్లుల వన ప్రవేశం నిశ్శబ్దఽంగా సాగింది. శని వారం సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. తల్లులారా వెళ్లొస్తాం.. తల్లులూ వెళ్లొస్తాం.. అంటూ తీరొక్క మొక్కులు చెల్లించిన భక్తులు శనివారం స్వస్థలాలకు బయల్దేరి వెళ్లారు. బస్టాండ్ పరిసరాలు కిక్కిరిసి కనిపించాయి. బోసిపోయిన మేడారం.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షలాది ప్రైవేట్ వాహనాల్లో భక్తులు తరలివచ్చారు. వాహనాల పార్కింగ్కు కేటాయించిన స్థలాలు జాతర ముగియడంతో నిర్మానుష్యంగా మారాయి. ఇసుకేస్తే రాలనంత మంది జనంతో ఉన్న మేడారం ఒక్కసారిగా బోసిపోయింది. చెట్లు పుట్టలు అంటూ తేడా లేకుండా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మలకు మొక్కులు చెల్లించి తిరుగు ప్రయాణం చేశారు. పోలీసులు వన్ వే చేయడంతో వచ్చిన దారి కాకుండా పోలీసులు సూచించిన దారిలో వాహనాలు తరలించారు. భక్తుల రద్దీతో విరిగిన గ్రిల్స్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా శుక్రవారం వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల తాకిడికి అర్ధరాత్రి సమయంలో సమ్మక్క గద్దె సమీపంలోని ఇనుప గ్రిల్స్ విరిగిపోయాయి. భక్తుల రద్దీ, తోపులాటతో గ్రిల్స్ విరిగి పక్కకు పడ్డాయి. ఆ సమయంలో భక్తులు అనేక మంది అక్కడే ఉన్నప్పటికీ ఎలాంటి గాయాలు కాలేదు. విరిగిన గ్రిల్స్కు ఎండోమెంట్ అధికారులు వెల్డింగ్ చేయించారు. దాంతో దర్శనాలు యథావిధిగా కొనసాగాయి. జనం నుంచి వనం చేరిన తల్లులు ఆదివాసీ సంప్రదాయంతో వన ప్రవేశంవరాల మూటలు భక్తులకిచ్చారు.. వారిచ్చిన ప్రేమను మూటగట్టుకున్నారు. ఆసీనులై అందరి మొర ఆలకించారు.. ఎనలేని కాస్మిక్ ఎనర్జీని ప్రసరించారు. భక్తుల ప్రేమకు మురిసిపోయారు. వెళ్లొస్తామంటూ తల్లులు ముందుకు కదిలారు.. ఆ దారులు.. సెలయేరులై పాదాలు తడపగా గాలులు సుమగంధాలై నాట్యం చేశాయి. వనాలు గొంతెత్తి సుస్వరాలు పలుకగా. ‘సాహో.. అంటూ విశ్వం స్వాగతించింది! -
ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా జనగామ రూరల్: ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రిజ్వన్ బాషా సూచించారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియపై శనివారం అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి మున్సిపల్ కమిషనర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లు, మాస్టర్ ట్రైనర్లతో గూగుల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నామినేషన్ల పరిశీలన విధానం గురించి కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్ల స్క్రూటినీ సమయంలో ప్రతీ దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి, ఎన్నికల నియమావళి ప్రకారం పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల పరిశీలన ప్రక్రియను పరిశీలించారు. ఆర్ఓలు నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అభ్యర్థులను ఖరారు చేయాలని ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర సవరణను పకడ్బందీగా నిర్వహించాలి ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలతో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులు ప్రతీ ఇంటిని సందర్శించి వివరాలు సేకరించాలని, ఓటరు జాబితాలోని ఓటర్ల మ్యాపింగ్ చేపట్టాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడు తూ రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకొని 2026 ప్ర క్రియను నిర్దిష్ట గడువులో పూర్తిచేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. వీసీలో అదనపు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో స్నేహితుల మృతి
● మరొకరికి తీవ్ర గాయాలు ● మరణంలోనూ వీడని స్నేహబంధంభువనగిరిటౌన్ /పాలకుర్తి టౌన్: వారిద్దరు ప్రాణ స్నేహితులు. ఎక్కడకు వెళ్లినా కలిసే వెళ్లేవారు. చివరకు మరణంలోనూ తమ స్నేహబంధం వీడదీయరానిదంటూ రోడ్డు ప్రమాదంలో ఒకేసారి మృతిచెందారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన బాతుల రాకేష్ (20), పాలకుర్తి మండలం శాతాపురం గ్రామానికి చెందిన గన్నె ఆనంద్ (19) ఫొటోగ్రాఫర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరు హైదరాబాద్లోని రామాంతాపూర్లో ఒకే రూంలో ఉంటున్నారు. రాకేష్ అమ్మమ్మ ఊరు కూడా శాతాపురం కావడంతో వీరిద్దరు చిన్నప్ప టి నుంచి స్నేహితులయ్యారు. వీరితో పా టు శాతాపురానిక చెందిన మరో స్నేహితు డు సూర్యప్రసాద్ కూ డా హైదరాబాద్లోనే ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అ క్కడే మరొక రూంలో ఉంటున్నాడు. జనవరి 30న ఆనంద్ పుట్టినరోజు కాగా.. బర్త్డే వేడుకలను మే డారంలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాకేశ్, ఆనంద్, సూర్యప్రసాద్ కలిసి జనవరి 29న రాత్రి హైదరాబాద్ నుంచి బయల్దేరి శా తాపురంలో ఆనంద్ బంధువుల వద్ద కారు తీసుకు ని మేడారం వెళ్లారు. అక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకుని తిరిగి శాతాపురం వచ్చి కారును అప్పగించి శుక్రవారం రాత్రి ముగ్గురు కలిసి బైక్పై హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో భువనగిరి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఫ్లైఓవర్పై బైక్ అదుపుతప్పడంతో వెనుక కూర్చు న్న రాకేశ్, ఆనంద్ బైక్ మీద నుంచి ఎగిరి ఫ్లైఓవర్ పై నుంచి సర్వీసు రోడ్డుపై పడ్డారు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. బైక్ నడుపుతున్న సూర్యప్రకాశ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల స మాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చే రుకుని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. శనివా రం మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రమేశ్ తెలిపారు. ఆనంద్, రాకేశ్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
అమ్మల దీవెన
మేడారం(ఎస్ఎస్తాడ్వాయి/ఏటూరునాగారం): వరాల తల్లులకు భక్తులు మనసారా మొక్కులు చెల్లించారు. నలుగురు దేవతలు గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాల అనంతరం గద్దెలకు చేరుకున్నారు. కోరిన కోర్కెలు నెరవేరడంతో మొక్కులు అప్పగించారు. గద్దెల వద్ద పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, చీరసారె, యాటపోతులు, కోళ్లు, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో గద్దెల ప్రాంగణం కళకళలాడింది. గ్రిల్స్ బయట నుంచి అమ్మవార్లను తనివితీరా మొక్కుకున్నారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. జయజయధ్వానాలతో గద్దెల ప్రాంగణం మార్మోగింది. ఆదివాసీ సంప్రదాయంగా జరిగిన పూజలు, డోలు వాయిద్యాలతో మేడారం ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది. కోటి మందికిపైగా మొక్కులు.. వనదేవతలను ఇప్పటి వరకు కోటి మందికిపైగా.. దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు సుమారు 45 లక్షల మంది భక్తులు తల్లులను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, మంగళవారం నుంచి మొదలైన భక్తుల రద్దీ శుక్రవారం వరకు కొనసాగింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పక్క రాష్ట్రాల నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో మేడారానికి చేరుకున్నారు. మేడారం పరిసరాల ప్రాంతంలోని 20 కిలోమీటర్ల దూరంలో విడిది చేసిన భక్తులు అమ్మవార్లు గద్దెలపైకి రావడంతో బుధవారం రాత్రి నుంచి లక్షల సంఖ్యలో దర్శనానికి పోటెత్తారు. మేడారం ఎక్కడ చూసినా భక్త జన గుడారంలా కనిపించింది. అటవీ ప్రాంతంలోని వనంలో భక్తులు చెట్ల కింద గుడారాలు వేసుకుని మూడు రోజులు సందడిగా గడిపారు. సమీప గ్రామాల్లో భక్తుల సందడి మహా జాతర సందర్భంగా మేడారంతో పాటు చుట్టు పక్కల గ్రామాలైన రెడ్డిగూడెం, ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు, నార్లాపూర్, కాల్వపల్లి, బయ్యక్కపేట, వెంగళాపూర్ గ్రామాల్లో సందడి నెలకొంది. ఆయా గ్రామాల్లో గదులను అద్దెకు తీసుకుని విడిది చేశారు. పండుగ వాతావరణంలో పల్లెలన్నీ కళకళలాడాయి. ఇంటి యజమానులు భక్తులను బంధువులుగా ఆదరించారు. బస చేసింది మూడు రోజులే అయినప్పటికీ వారిలో కొందరు బంధువులుగా మారిపోయారు. తిరుగు ప్రయాణం.. తల్లుల దర్శనం అనంతరం శుక్రవారం భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో వేలాది మంది తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. ఆర్టీసీ బస్టాండ్ భక్తులతో కిక్కిరిసిపోయింది. మేడారం ఆర్టీసీ బస్టాండ్ నుంచి తాడ్వాయి వరకు 14 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఆర్టీసీ బస్సుల రాకపోకలతో బారులుదీరాయి. సాధారణంగా 20 నిమిషాల్లో తాడ్వాయికి చేరుకోవాల్సి ఉండగా.. ఆర్టీసీ బస్సులు బారులుదీరడంతో గంటకు పైగా సమయం పట్టింది. ప్రైవేట్ వాహనాల్లో వచ్చిన భక్తులు సైతం గుడారాలు ఖాళీ చేసి తిరుగు ప్రయాణం కావడంతో పస్రా వరకు ప్రైవేట్ వాహనాలతో దారులన్నీ కిక్కిరిసి కనిపించాయి. భక్త కోటి జనంతో పూజలు అందుకున్న సమ్మక్క–సారలమ్మను నేడు (శనివారం) సమ్మక్క సారలమ్మ పూజారులు వన ప్రవేశం చేయనున్నారు. అదేవిధంగా ఏటూరునాగారం మండలంలోని కొండాయికి గోవిందరాజులు, గంగారం మండలం పూనుగొండ్లకు పగిడిద్దరాజు పడిగలను గద్దెలపై నుంచి పూజారులు తీసుకెళ్లనున్నారు. సారలమ్మతో పాటు గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెల వద్ద నుంచి ముందు బయల్దేరగా, వీరి తర్వాత సమ్మక్కను పూజారులు వన ప్రవేశం చేయించనున్నారు. సంపెంగలో నీళ్లు సంబురపడ్డాయి.. పూనకాలతో పులకించి పోయాయి. తలనీలాలు తన్మయత్వం చెందాయి.. ఎనలేని భక్తిని చాటాయి. పసుపు, కుంకుమలు ప్రణమిల్లాయి.. పొడిసేటి పొద్దులై ప్రభవించాయి. కోళ్లు, యాటలు సై సై అన్నాయి.. మొక్కుల లెక్కల్లో తరించిపోయాయి. సాక చుక్కలు నేలపై పారాయి.. ఆనవాయితీకి అద్దం పట్టాయి. ఎత్తు బంగారపు మూటలు నెత్తిన చేరాయి.. భక్తి నిండిన మనసుల్ని ఉరకలెత్తించాయి. ఒడిబియ్యం, చీర సారెలు పోటీపడ్డాయి.. వనదేవతల ఒడికి వడివడిగా చేరాయి. గద్దెలు పసిడి కాంతులై ధగధగ మెరిశాయి.. భక్తకోటికి ఆడబిడ్డల దీవెనలు అందాయి.మేడారం (కాళేశ్వరం): మేడారం జాతరకు లక్షలాదిగా భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చి జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించి పునీతులయ్యారు. వాగులో ఇసుకతో తల్లుల ప్రతిమలు చేసి పూజించారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. శివసత్తులు పూనకా లతో నీరాజనం పలికారు. వరం పట్టారు. భ క్తులతో జంపన్నవాగు ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది. అనంతరం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద మొక్కులు చెల్లించారు. అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. మేడారంలో కిక్కిరిసిన గద్దెల ప్రాంగణం వనదేవతలను లక్షలాదిగా దర్శించుకుని పూజలు తిరుగు ప్రయాణంలో వాహనాల బారులు -
ముగిసిన నామినేషన్ల పర్వం
జనగామ రూరల్/స్టేషన్ఘన్పూర్: జనగామ, స్టేషన్ఘన్పూర్ పురపాలికల్లో నామినేషన్ల పర్వం శుక్రవారం ముగిసింది. మూడు రోజుల్లో కలిపి జనగామలో 292.. స్టేషన్ఘన్పూర్లో 181 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. జనగామ మున్సిపాలిటీలో కాంగ్రెస్ నుంచి 100 నామినేషన్లు, బీఆర్ఎస్ 82, బీజేపీ 45, ఇండిపెండెంట్ 42 రాగా సీపీఎం 5, సీపీఐ 1, బీఎస్పీ 1, ఏఐఎఫ్బీ 6, ఇతరులు ఆరుగురు నామినేషన్ వేశారు. దంపతులు చిన్న పిల్లలతో కలిసి వచ్చి నామినేషన్ వేశారు. సీఐ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జనగామ మున్సిపల్ వద్ద బందోబస్తు ఏర్పాటుచేశారు. స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థులకు సంబంధించిన బీ పామ్లు అందించడానికి అవసమైన ఆథరైజుడ్ ఫామ్ అదనపు కలెక్టర్ పింకేష్కుమార్కు స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అందజేశారు. నేడు స్క్రూటినీ.. నామినేషన్లను నేడు(శనివారం) స్క్రూటినీ చేయనున్నారు. వార్డుల వారీగా నామినేషన్లను పరిశీలించి ఒకటి, రెండు సెట్లను వేరు చేయనున్నారు. సాయంత్రం వరకు స్క్రూటినీ పూర్తి చేసి.. తుది జాబితాను వెలువరిస్తారు. -
భూముల రీ సర్వే
బచ్చన్నపేట: భూముల రీ సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ అన్నారు. శుక్రవారం బచ్చన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో మాట్లాడారు. భూముల రీ సర్వే కోసం కొడవటూరు గ్రామం ఎంపికై నట్లు తెలిపారు. గ్రామ హద్దులు, సర్వే నంబర్లను సర్వేయర్ లైసెన్స్డ్ సర్వేయర్లతో కలిసి సర్వే చేయాలని అన్నారు. సర్వే చేసే సమయంలో పాటించే నియమాలు, పద్ధతులు అధికారులకు వివరించారు. దశల వారిగా మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో సర్వే చేయాల్సి ఉంటుందని తెలిపారు. సర్వేయర్, రెవెన్యూ అధికారులు కలిసి సర్వే చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ శంకర్, ఆర్ఐ మున్నావర్, ఏడీ, సర్వేయర్ నర్మద, జూనియర్ అసిస్టెంట్ యాకన్న, జీపీఓ సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ -
కుష్ఠుపై అవగాహన
జనగామ రూరల్: ఈనెల 30నుంచి ఫిబ్రవరి 13 వరకు కుష్ఠు వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కె.మల్లికార్జునరావు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని అర్బన్ పీహెచ్సీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. కుష్ఠు పూర్తిగా నయం అయ్యే వ్యాధి అన్నారు. తొలిదశలో గుర్తించి చికిత్స ప్రారంభిస్తే పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. వంశపారంపర్యం కాదని, చికిత్స ప్రారంభించిన తర్వాత ఇది ఇతరులకు సోకదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు, చికిత్స ఉచితంగా అందుబాటులో ఉందని వివరించారు. స్పర్శ జ్ఞానం తగ్గి తెల్లటి, ఎర్రటి మచ్చలు, చేతులు, కాళ్లలో పట్టు లేకపోవడం లక్షణాలుగా చెప్పారు. నరాలు మందగించడం, చికిత్స చేయకపోతే కండరాల బలహీనత, వికారాలు ఉన్న వ్యక్తులు కుష్టు వ్యాధికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్లు కమల్ హాసన్, అనురాధ జాధవ్, రేవతి ప్రతిజ్ఞ చేశారు. -
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
జనగామ రూరల్: మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల సాధారణ అబ్జర్వర్ ఎ.నర్సింహారెడ్డి అన్నారు. జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ అబ్జర్వర్గా నియమితులైన తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఎ.నర్సింహారెడ్డి శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్తో సమావేశం అయ్యారు. జనగామ, స్టేషన్ఘన్పూర్లో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను అబ్జర్వర్కు కలెక్టర్ వివరించారు. అనంతరం నర్సింహరెడ్డి జనగామ ధర్మకంచ ప్రభుత్వ పాఠశాల, వీవర్స్ కాలనీ డగ్లస్ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పింకేష్ కుమార్, జెడ్పీ సీఈఓ మాధురి షా, జనగామ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, హౌజింగ్ పీడీ మాతృనాయక్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ వివిధ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబందనలకు లోబడి ర్యాలీలకు, వాహనాలకు, మైక్, ప్రచార సామగ్రి ముద్రణ అనుమతులలో నిబంధనలు పాటించాలన్నారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ తప్పనిసరిగా అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వ్యయ పరిశీలకులు ఎస్.జయశ్రీ, జెడ్పీ సీఈఓ మాధురి షా, జనగామ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ కమిషనర్లు మహేశ్వర్ రెడ్డి, రాధాకృష్ట, హౌసింగ్ పీడీ కోదండరామ్, తదితరులు పాల్గొన్నారు.ఎన్నికల సాధారణ పరిశీలకుడు నర్సింహారెడ్డి -
రెండోరోజు 146 నామినేషన్లు
జనగామ రూరల్/స్టేషన్ఘన్పూర్: జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల్లో రెండోరోజు గురువారం నామినేషన్లు జోరుగా దాఖలు చేశారు. జనగామలో మొదటిరోజు 8 దాఖలు కాగా రెండోరోజు 87 దాఖలయ్యాయి. స్టేషన్ఘన్పూర్లో మొదటిరోజు ఒకటి దాఖలు కాగా.. రెండోరోజు 59 దాఖలయ్యాయి. మొత్తంగా జనగామలో 95 స్టేషన్ఘన్పూర్లో 60 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజుల్లో 155 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు శుక్రవారం పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి. ప్రత్యేక బృందం ఏర్పాటు జనగామ మున్సిపల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రత్యేక బృందాన్ని పురపాలక సంఘం ఏర్పాటు చేసింది. బృందంలోని సభ్యులు 24 గంటలు అందుబాటులో ఉంటారని కమిషనర్ మహేశ్వర్రెడ్డి తెలిపారు. ఫిర్యాదుల కోసం 75695 34326 నంబర్ను సంప్రదించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు.. జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. జనగామ మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆర్డీఓ గోపిరామ్ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించి హెల్ఫ్లైన్ సెంటర్ వద్ద అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. జనగామలో 87,స్టేషన్ఘన్పూర్లో 59 నేడు భారీగా దాఖలయ్యే అవకాశం -
బంగారు ఆభరణాల చోరీ
లింగాలఘణపురం: మేడారం జాతరకు వెళ్లిన వారి ఇంట్లో దొంగలు పడి 12 తులాల బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కళ్లెం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. రెండు నెలల క్రితం కూడా గ్రామంలో దొంగతనం జరిగి తులంన్నర బంగారం, నగదు దోపిడీ జరిగింది. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కళ్లెం గ్రామానికి చెందిన బుషిగంపల కంట్లం తన కుటుంబసభ్యులతో కలిసి ఈనెల 27న మంగళవారం మేడారం జాతరకు వెళ్లాడు. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులంతా మేడారంలోనే ఉన్నారు. ఇంట్లో కోళ్లను కమ్మేందుకు తన చిన్నాన్న బాలనర్సయ్యకు గేటు తాళం ఇచ్చి వెళ్లాడు. కోళ్లను వదిలిపెట్టేందుకు బాలనర్సయ్య గురువారం గేటు తాళం తీయగా.. ఇంటి తాళం పగలగొట్టి కనిపించింది. దీంతో ఆందోళనకు గురైన బాలనర్సయ్య వెంటనే కంట్లంకు ఫోన్లో సమాచారం అందజేశాడు. వెంటనే కుటుంబ సభ్యులంతా వచ్చి చూసేసరికి బీరువా తాళం తీసి అందులో ఉన్న రెండు బంగారు నక్లెస్లు, రెండు బంగారు గొలుసులు, రెండు ఉంగరాలు, చెవుల దుద్దులు ఇలా సుమారు 12 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఫోరెన్సిక్ నిఫుణులతో వేలిముద్రలు సేకరించి విచారణ జరుపుతున్నారు. జాతర నేపథ్యంలో గ్రామాల్లో దొంగలు హల్చల్ చేస్తున్నారు. మేడారం జాతరకు వెళ్లిన ఇంట్లో 12 తులాలు మాయం వరుస దొంగతనాలతో కళ్లెంలో ఆందోళన -
జయహో జగజ్జనని మేడారంలో గద్దెకు చేరిన సమ్మక్క
● 7.13 గంటలకు మూడోసారి కాల్పులు● 7.14 గంటలకు నాలుగోసారి కాల్పులు ● 7.33 గంటలకు ప్రధాన గేటు దాటి అమ్మవారు బయటకు రాక ● 7.52 గంటలకు ఎదురుకోళ్ల మండపం చేరిక ● 8.29 గంటలకు సమ్మక్క గుడి చేరిక ● 9.47 గంటలకు ప్రధాన ద్వారం వద్దకు రాక ● 9.58 గంటలకు గద్దైపె సమ్మక్క ప్రతిష్ఠాపన వెన్నెల వెల్లివిరిసిన వేళ.. కుంకుమ భరిణె వెలిసింది. లక్షల నయనాల నిరీక్షణల నడుమ.. చిలకలగుట్ట చిందులు వేసింది. గాల్లో పేలిన తూటాల సాక్షిగా మనస్సు ఉప్పొంగింది. దారులన్నీ రంగులు రంగరించుకుంటుంటే.. ఇసుకేస్తే రాలనంత జనం జయజయధ్వానాలు పలికారు. డోలు వాయిద్యాలు.. బూరకొమ్ముల శబ్దాలు తల్లిని కీర్తించగా.. రోప్ పార్టీ వెంట సాహో.. సమ్మక్క నినాదాలు హోరెత్తాయి. అవనినేలే తల్లి ఆసీనురాలవ్వగా.. ధరణి పూల వనమై పులకించిపోయింది. ● జాతరలో మహాఘట్టం ఆవిష్కృతం ● అడుగుడుగునా భక్తుల నీరాజనాలు ● గద్దెలపై కొలువైన నలుగురు దేవతలు ● నేడు మొక్కులు సమర్పించనున్న భక్తులు మేడారం(ఎస్ఎస్తాడ్వాయి/ఏటూరునాగారం): మేడారం మహాజాతరలో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. చిలకలగుట్ట నుంచి కల్పవల్లి సమ్మక్క తల్లి వస్తుండగా జై సమ్మక్క అంటూ భక్తుల నినాదాలు హోరెత్తాయి.. గద్దెల వరకు నీరాజనాలు పలికారు. గుట్ట దిగి సమ్మక్క తల్లిని పూజారులు డోలు వాయిద్యాలు, బూరకొమ్ముల శబ్దాలతో తీసుకొచ్చి గద్దైపె ప్రతిష్ఠించారు. గుట్టపై రహస్య పూజలు.. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్ ఇంటి వద్ద పూజాసామగ్రి, పసుపు, కుంకుమ, కంకనాలు, అమ్మవారికి కావాల్సిన వస్త్రాలను తీసుకొని పూజారులు గుట్టపైకి వెళ్లారు. అమ్మవారిని తీసుకొచ్చే పూజారి కొక్కెర కృష్ణయ్యతోపాటు మరో నలుగురు పూజారులు కలిసి సమ్మక్క కొలువై ఉన్న రహస్య స్థావరం వద్దకు చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి కొన్ని గంటల పాటు రహస్య పూజలు చేశారు. కృష్ణయ్య కుంకుమ భరణి రూపంలో సమ్మక్కను తీసుకొని గుట్టదిగే మధ్యలో మరికొంతమంది పూజారులు కలిసి గుట్టదిగారు. అధికారికంగా తుపాకీతో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గాల్లోకి నాలుగు సార్లు కాల్పులు జరిపి అమ్మవారికి గౌరవ వందనం సమర్పించారు. చిలకలగుట్ట దారిమధ్యలో ఉన్న ఎదురుకోళ్ల పూజా మందిరానికి అమ్మవారిని తీసుకెళ్లి పూజారులు విశ్రాంతి తీసుకుని బయల్దేరారు. అక్కడి నుంచి మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్కుమార్, కలెక్టర్ దివాకర టీఎస్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, జాతర చైర్పర్సన్ ఇర్ప సుకన్య, అధికారులు కలిసి అమ్మవారిని గద్దె వరకు తీసుకొచ్చారు. చిలకలగుట్ట వద్ద మంత్రి సీతక్కతోపాటు పలువురు మంత్రులు, అధికారులు, ఆదివాసీలు నృత్యాలు చేశారు. హరివిల్లు.. చిలకలగుట్ట దారి సమ్మక్కకు స్వాగతం పలికేందుకు మహిళలు దారిలో రంగు రంగులముగ్గులు వేశారు. అమ్మవారికి యాటపోతులు, కోళ్లు, కొబ్బరికాయలు కొట్టి స్వాగతించారు. చెట్టు, పుట్ట, గుట్టలు, ఎత్తయిన భవనాలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తల్లి రాకను తిలకించారు. మూడుసార్లు లైట్ల ఆర్పివేత.. గద్దైపె సమ్మక్కను ప్రతిష్ఠించిన సమయంలో మూడుసార్లు హైమాస్ట్ లైట్లను ఆర్పివేశారు. పూజారులు గద్దైపెన అమ్మవారిని ప్రతిష్ఠించి గౌరవ వందనాన్ని సమర్పించారు. ఇదేక్రమంలో ఫొటోలు, డ్రోన్లు తిరగకుండా నిషేధం విధించారు. సమ్మక్క రాకకు ముందు గద్దైపె ఉన్న బంగారం, కానుకలను తీసుకెళ్లేందుకు గ్రామస్తులు పోటీ పడ్డారు. ఈ ఆచారం అనాదిగా వస్తోందని పూజారులు తెలిపారు. నలుగురు వనదేవతలకు పూజలు.. సమ్మక్కను గద్దైపె ప్రతిష్ఠించడంతో నలుగురు వనదేవతలు కొలువుదీరారు. ఈఓ వీరస్వామి, ఎండోమెంట్ అధికారులతో కలిసి ముందుగా మంత్రులు అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. ఆ తర్వాత దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి ఇచ్చారు. సమ్మక్కను గద్దైపె ప్రతిష్ఠించిన అనంతరం పూజలు చేస్తున్న పూజారులు, ఆదివాసీ యువత, అధికారులు సాయంత్రం 5.30 గంటలకు సమ్మక్క పూజారి కొక్కెర కృష్ణయ్యతోపాటు పూజారులు చిలకలగుట్ట మీదకు వెళ్లారు. 6.45 గంటలకు ములుగు ఎస్పీ సుధీర్రామ్నాథ్ కేకన్ గాల్లోకి కాల్పులు జరిపారు. రాత్రి 7.12 గంటలకు గేటు వద్ద కాల్పులు పోటెత్తిన భక్తజనం మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు గురువారం భక్తులు పోటెత్తారు. జంపన్నవాగు, గద్దెల ప్రాంగణం, చిలకలగుట్ట పరిసర ప్రాంతాలు ఎటుచూసినా జనం కిక్కిరిశారు. కుటుంబ సమేతంగా మేడారానికి వచ్చిన వారు తప్పిపోకుండా ఉండేందుకు కర్రలకు జెండాలు, బెలూన్స్, వాటర్ బాటిళ్లను గుర్తుగా పెట్టుకొని ముందుకు సాగారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించే క్రమంలో శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. ఉహించని విధంగా భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. వనదేవతల గద్దెల ప్రాంగణం భక్తులు సమర్పించిన బంగారంతో కళకళలాడింది. సమ్మక్క రాకముందు ప్రత్యేక పూజలు.. చిలకలగుట్ట పైనుంచి సమ్మక్కతల్లి గురువారం రాత్రి కొలువుదీరడానికి ముందు సమ్మక్క పూజారులు తల్లి గద్దైపె ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సమ్మక్క గుడి నుంచి సమ్మక్క దేవతను తీసుకొచ్చే ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, దూప వడ్డె దొబె నాగేశ్వర్రావు, జలకం వడ్డె మల్యెల సత్యంతోపాటు పూజారులు కలిసి సమ్మక్క వడెరాలు, పసుపు, కుంకుమలను తీసుకుని డోలు వాయిద్యాలు, బూరకొమ్ముల శబ్దాల నడుమ గద్దైపెకి వె ళ్లి పూజలు చేశారు. సమ్మక్క గద్దైపె కంకవనం ప్రతిష్ఠమేడారంలోని జెండాగుట్ట నుంచి సమ్మక్క పూజారులు కంకవనాన్ని తీసుకొచ్చి గురువారం ఉదయం పది గంటలకు గద్దైపె ప్రతిష్ఠించారు. మొదట జెండాగుట్టలో పూజారులు కంకవనానికి పూజలు నిర్వహించారు. కర్రలతో కంకవనాన్ని బందోబస్తు మధ్య గద్దె వద్దకు తీసుకొస్తున్న సమయంలో ఆడపడుచులు ఎదురెళ్లి పూజారుల పాదాలకు నీళ్లు ఆరగించి హారతి పట్టారు. తల్లి వచ్చే దారిలో చిలకలగుట్ట వద్ద ఆనవాయితీగా కింద కూర్చొని పైకి లేచి నమస్కరించారు. గద్దె వద్దకు చేరుకున్న పూజారులు ముందుగా గద్దె పక్కనే ఉన్న రహస్య పూజా మందిరంలోకి పూజలు చేశారు. అనంతరం గద్దైపె ప్రతిష్ఠించారు. ఈ సమయంలో భక్తులను గద్దెలపైకి రాకుండా పోలీసులు అదుపు చేశారు. సారలమ్మ గద్దె వద్ద పూజలు నిర్వహించారు. ఈ వనమహోత్సవానికి మంత్రి సీతక్క హాజరై పూజారులతో కలిసి గద్దైపెకి వచ్చారు. గద్దెలపై నలుగురు వనదేవతలు కొలువుదీరడంతో నేడు (శుక్రవారం) భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని దర్శించుకుంటారు. తీరొక్క మొక్కులు చెల్లించి ఆశీర్వాదాన్ని పొందుతారు. ఇప్పటికే కోటి మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. శనివారం సమ్మక్క, సారలమ్మ వనప్రవేశం చేస్తారు. -
పకడ్బందీగా రంజాన్ ఏర్పాట్లు
జనగామ రూరల్: పవిత్ర రంజాన్ పండుగ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 18నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈద్గాల వద్ద తాగునీటి సౌకర్యం, అవసరమైన చోట్ల నీటిట్యాంకర్ను ఏర్పాటుచేయాలని చెప్పారు. మసీదుల వద్ద చెత్త డబ్బాలను ఏర్పాటుచేయడంతో పాటు పరిశుభ్రత చర్యలు ఎప్పటికప్పుడు చేయాలని ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని చెప్పారు. సమావేశంలో జనగామ ఆర్డీఓ గోపి రామ్, స్టేషన్ ఘన్పూర్ ఏసీపీ భీమ శర్మ, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి డాక్టర్ బి విక్రమ్ కుమార్ తదతరులు పాల్గొన్నారు. లక్ష్యాలను పూర్తిచేయాలి.. వ్యవసాయ యాంత్రీకరణ పథకం లక్ష్యాలను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నా రు. కలెక్టరేట్ నుంచి వ్యవసాయ శాఖ అధికారులతో ఆన్లైన్ మీటింగ్ నిర్వహించారు. ఎస్ఎంఏఎం పథకంలో భాగంగా జిల్లాకు 2025–26 సంవత్సరానికి గాను వానాకాలంలో రూ.2.73 కోట్ల బడ్జెట్ కేటాయించారన్నారు. ఈ పథకంలో బ్యాటరీ పంపులు, తైవాన్ పంపులు, రోటవేటర్లు, విత్తనాలు నాటే మిషన్లు, కేజీ వీల్స్, కలుపు తీసే యంత్రాలు, గడ్డికట్టే యంత్రాలు, పవర్ టిల్లర్ పరికరాలు మంజూరయ్యాయని తెలిపారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్జనగామ రూరల్: మేడారం మహా జాతర సందర్భంగా నేడు (శుక్రవారం) జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సెలవుకు బదులుగా ఫిబ్రవరి 14వ తేది (రెండో శనివారం) ను పనిదినంగా పరిగణించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. -
మొదటి రోజు 9
జనగామ: జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్ పురపాలిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. జనగామలో 8, స్టేషన్ఘన్పూర్లో ఒక నామినేషన్.. మొత్తంగా 9మంది నామినేషన్లు దాఖలు చేశారు. జనగామ మున్సిపల్లో 4, 11, 14, 15, 20, 21, 27, 30 వార్డుల పరిధిలో బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 2, సీపీఐ 1, స్వతంత్రలు రెండు నామినేషన్లు దఖాలు చేసినట్లు కమిషనర్ మహేశ్వర్రెడ్డి వెల్లడించారు. నామినేషన్ సెంటర్ను కమిషనర్ మహేశ్వర్రెడ్డి పరిశీలించారు. ఎన్నికలకు సహకరించాలి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ కోరారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సమీక్షించారు. నామినేషన్ వేసేందుకు పూర్తి వివరాలను తెలుసుకునేందుకు సంబంధిత రిటర్నింగ్ అధికారులను సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల పర్యవేక్షకులు శ్రీధర్, వివిధ రాజకీయ నాయకులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు ఎన్నికలకు సంబంధించిన సమస్యలు, సందేహాలను నివృత్తి చేయడంతో పాటు నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదుల కోసం కలెక్టరేట్లో హెల్ప్డెస్క్ 93908 30087 ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తెలిపారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు పూర్తి వివరాలకోసం హెల్ప్ డెస్క్ను సంప్రదించవచ్చని తెలిపారు. స్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ జెడ్పీహెచ్ఎస్లో ఏర్పాటుచేసిన కేంద్రంలో తొలిరోజు ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. 8వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోగుల సారంగపాణి నామినేషన్ వేసినట్లు జిల్లా అసిస్టెంట్ ఎన్నికల అథారిటీ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ కమిషనర్ బి.రాధాక్రిష్ణ తెలిపారు. మున్సిపల్ నామినేషన్లు షురూ జనగామలో 8, స్టేషన్ఘన్పూర్లో 1 -
నామినేషన్ల స్వీకరణలో నిబంధనలు పాటించాలి
● అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ జనగామ: పురపాలిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ సమయంలో ఎన్నికల సంఘం నిబంధనలను పాటించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల నామినేషన్లను జనగామ, స్టేషన్ఘన్ పూర్ పురపాలికల పరిధిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, పొరపాట్లకు తావులేకుండా చూడాలని సూచించారు. జనగామ మున్సిపాలిటీలో మూడు వార్డులకు ఒక్కో నామినేషన్ కౌంటర్ చొప్పున మొత్తంగా 10 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్టేషన్ఘన్పూర్లో 18 వార్డులు ఉండగా ఆరు కౌంటర్లను అందుబాటులో ఉంచామన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనల మేరకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను నామినేషన్తో తప్పక సమర్పించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. నామినేషన్ల స్వీకరణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. రిటర్నింగ్ అధికారులు సమన్వయంతో ఒక టీమ్ వర్క్గా విధులు నిర్వహించి విజయవంతం చేయాలని చెప్పారు. పలు సూచనలు, సలహాలతో పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అదనపు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు మహేశ్వర్రెడ్డి, రాధాకృష్ట, రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అదనపు కలెక్టర్తో అబ్జర్వర్ల సమీక్ష ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎ.నర్సింహరెడ్డి(ఐఏఎస్) వ్యయ పరిశీలకులు ఎస్.జయశ్రీ బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల అనుభవం కలిగిన 16 మంది రిటర్నింగ్ అధికారులను నియమించామని, వారు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి, ఏర్పాట్లను పరిశీలించారని తెలిపారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ తదితర అంశాలపై చర్చించారు. సాధారణ అబ్జర్వర్ నర్సింహారెడ్డికి నోడల్ ఆఫీసర్గా హౌజింగ్ పీడీ మాత్రునాయక్, వ్యయ పరిశీలకులు జయశ్రీకి నోడల్ ఆపీసర్గా డీసీఓ కోదండరామ్లను నియమించారు. -
కన్నెపల్లి.. సిరివల్లి
రక్షించే తల్లికి రహస్య పూజలు. అండగా నిలిచే అమ్మకు హనుమంతుడి జెండా నీడలు. సల్లని తల్లికి నీళ్లారగింపులు.. మహిమగల్ల మాతకు మంగళహారతులు. హోరెత్తించే డోలు వాయిద్యాలు. ప్రొటోకాల్కు పోలీసుల వలయాలు. పసిడి వెన్నెలమ్మకు పొర్లు దండాలు.. వరంపట్టిన భక్తులకు శతకోటి వరాలు. జంపన్నవాగులో తడిసిన పాదాలు.. తమ్ముడు జంపన్నకు దీవెనార్తులు. గద్దైపె కొలువుదీరిన సారలమ్మకు జయజయధ్వానాలు.. – మేడారం(ఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి)కన్నెపల్లి నుంచి సారలమ్మ బుధవారం అర్ధరాత్రి తర్వాత మేడారం గద్దైపె కొలువుదీరింది. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, పూజారులు కాక వెంకటేశ్వర్లు, కిరణ్, భుజంగరావు, అమృత, కనకమ్మతోపాటు మరికొంత మంది గుడిలో రహస్య పూజలు చేశారు. హనుమాన్ జెండా నీడలో అమ్మవారిని గుడి నుంచి బయటకు తీసుకొచ్చారు. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్, ములుగు జిల్లా ఎస్పీ రాంనాథ్ కేకన్, జాతర చైర్పర్సన్ ఇర్ప సుకన్యతోపాటు ఆదివాసీ యువకులు, మహిళలతో కలిసి సారలమ్మ యాత్ర కొనసాగింది. గ్రామంలోని ఆడబిడ్డలు అమ్మవారికి ఎదురెల్లి నీళ్లు ఆరగించి మంగళహారతులు పట్టారు. అమ్మవారిని తీసుకుని డోలు వాయిద్యాలతో ఆదివాసీలు, పోలీసుల రోప్ పార్టీ బందోబస్తు మధ్య అధికారంగా యాత్ర కొనసాగింది.దారి పొడవునా దండాలు.. కన్నెపల్లి నుంచి సారలమ్మ బయల్దేరడంతో భక్తులు అమ్మవారి పాద స్పర్శ కోసం వరం పడుతూ నేలపై బోర్లా పడుకున్నారు. తల్లిని కనులారా చూసేందుకు మేడారం గద్దెల వరకు భక్తులు బారులుదీరారు. అమ్మకు జేజేలు అంటూ పసుపును పైకి చల్లారు. సారలమ్మను జంపన్నవాగులో నుంచి తీసుకెళ్లారు. జంపన్నవాగుపై రెండు బ్రిడ్జిలు ఉన్నప్పటికీ ఆనవాయితీగా అక్క సారలమ్మ కాళ్లను తమ్ముడు జంపన్న తాకి నమస్కరించినట్లుగా భావించి జంపన్న వాగులో నుంచి మాత్రమే సారలమ్మను గద్దైపెకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి తల్లి సమ్మక్క గుడిలోకి వెళ్లి అక్కడ పసుపు కుంకుమ్మ సమర్పించి సారలమ్మ పీఠంపై చీర, రవికను అందించారు. అప్పటికే పగిడిద్దరాజు, గోవిందరాజులు సమ్మక్క గుడి వద్దకు చేరుకున్నారు. ఇందులో భాగంగా పెళ్లి కొడుకుగా వచ్చిన పగిడిద్దరాజుకు సమ్మక్క గుడిలో పెళ్లి క్రతువు సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ పెళ్లిని సారలమ్మ, గోవిందరాజులు తిలకించి పగిడిద్దరాజుతో కలిసి గద్దెలపై కొలువుదీరారు.కొలువుదీరే ముందు ప్రత్యేక పూజలుసారలమ్మ ఆలయం నుంచి పసుపు, కుంకుమ, పవిత్రమైన నీటిని తీసుకొని పూజారులు ఆడపడుచులు కలిసి మేడారంలోని సారలమ్మ గద్దెకు చేరుకొని అలికి ముగ్గులు వేశారు. అనంతరం అమ్మవారి ధ్వజస్తంభానికి కంకణాలు కట్టారు. భక్తులెవరూ చూడకుండా చీర చుట్టి పూజలు చేశారు. సాయంత్రం సారలమ్మను గద్దైపెకి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. సమ్మక్క పూజారులు, ఆడపడుచులు కూడా మేడారంలోని సమ్మక్క గుడి నుంచి పసుపు, కుంకుమతో సమ్మక్క గద్దె వద్దకు చేరుకున్నారు. నేడు (గురువారం) సమ్మక్క చిలకలగుట్ట నుంచి గద్దైపె రావడానికి ముందుగా పూజారులు సమ్మక్క గద్దెను మట్టితో అలికి ముగ్గులతో అలంకరించారు.మహా జాతరలో అనూహ్య ఘట్టంఒకే రోజు కొలువుదీరిన నలుగురు దేవతలు !అర్ధరాత్రి 12:28 గంటలకు గద్దైపెకి సారలమ్మ, 12:29 గంటలకు గోవిందరాజులు, పగిడిద్దరాజు..ఏటూరునాగారం: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. తొలి రోజు బుధవారం సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు కొలువుదీరాల్సి ఉండగా.. పూజారులు సమయపాలన పాటించినప్పటికీ అనివార్య కారణాలతో బుధవారం అర్ధరాత్రి 12:28 గంటల తర్వాత (గురువారం) సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై ప్రతిష్ఠించారు. గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెలపైకి రానుంది. ఈ నేపథ్యంలో నలుగురు దేవతలను ఒకే రోజు (గురువారం) గద్దెలపై ప్రతిష్ఠించినట్లు అయ్యింది.పగిడిద్దరాజు పెళ్లికొడుకాయెనె..మేడారం(ఏటూరునాగారం): గంగారం మండలం పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు పెళ్లికొడుకుగా ముస్తాబై అడవిమార్గంలో కాలినడకన బయల్దేరారు. గోవిందరావుపేట మండలం లక్ష్మీపురంలో వారి ఆడబిడ్డ ఇంటి వద్దకు చేరుకున్నాడు. బుధవారం ఉదయం పస్రా మీదుగా కాలినడకన డప్పుచప్పుళ్లతో మేడారానికి చేరుకున్నారు. మేడారంలోని సమ్మక్క గుడికి సారలమ్మ వచ్చిన తర్వాత పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులు కలిసి ఒకేసారి గద్దెలపై కొలువుదీరారు. -
నామినేషన్ల స్వీకరణలో నిబంధనలు పాటించాలి
● అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ జనగామ: పురపాలిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ సమయంలో ఎన్నికల సంఘం నిబంధనలను పాటించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల నామినేషన్లను జనగామ, స్టేషన్ఘన్ పూర్ పురపాలికల పరిధిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, పొరపాట్లకు తావులేకుండా చూడాలని సూచించారు. జనగామ మున్సిపాలిటీలో మూడు వార్డులకు ఒక్కో నామినేషన్ కౌంటర్ చొప్పున మొత్తంగా 10 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్టేషన్ఘన్పూర్లో 18 వార్డులు ఉండగా ఆరు కౌంటర్లను అందుబాటులో ఉంచామన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనల మేరకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను నామినేషన్తో తప్పక సమర్పించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. నామినేషన్ల స్వీకరణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. రిటర్నింగ్ అధికారులు సమన్వయంతో ఒక టీమ్ వర్క్గా విధులు నిర్వహించి విజయవంతం చేయాలని చెప్పారు. పలు సూచనలు, సలహాలతో పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అదనపు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు మహేశ్వర్రెడ్డి, రాధాకృష్ట, రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అదనపు కలెక్టర్తో అబ్జర్వర్ల సమీక్ష ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎ.నర్సింహరెడ్డి(ఐఏఎస్) వ్యయ పరిశీలకులు ఎస్.జయశ్రీ బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల అనుభవం కలిగిన 16 మంది రిటర్నింగ్ అధికారులను నియమించామని, వారు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి, ఏర్పాట్లను పరిశీలించారని తెలిపారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ తదితర అంశాలపై చర్చించారు. సాధారణ అబ్జర్వర్ నర్సింహారెడ్డికి నోడల్ ఆఫీసర్గా హౌజింగ్ పీడీ మాత్రునాయక్, వ్యయ పరిశీలకులు జయశ్రీకి నోడల్ ఆపీసర్గా డీసీఓ కోదండరామ్లను నియమించారు. -
రారండోయ్ మేడారం
నేటినుంచి మహా జాతర ● కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు గద్దెలపైకి రాక మలుగు/ఎస్ఎస్తాడ్వాయి/ఏటూరునాగారం: మేడారం సమ్మక్క– సారలమ్మ మహా జాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారం గద్దైపె కొలువుదీరనుంది. ఈ మేరకు మంగళవారం సారలమ్మ పూజారులు సమావేశమయ్యారు. వన దేవతను గద్దైపెకి తీసుకెళ్లే ముందు గుడిలో నిర్వహించే పూజాకార్యక్రమాలకు సామగ్రి సిద్ధం చేసుకున్నారు. కొత్త వెదురు బుట్టను తయారు చేసి సారయ్య ఇంటి వద్ద పవిత్రంగా ఉంచారు. సారలమ్మ గద్దైపెకి రానున్న సందర్భంగా బుధవారం ఉదయం కన్నెపల్లి గుడి నుంచి పసుపు కుంకుమ, కంకణాలు, పవిత్ర జలం తీసుకొని ఆడపడుచులు సారలమ్మ గద్దెను అలికి ముగ్గులు వేసి ముస్తాబు చేస్తారు. సారలమ్మ పూజారులతో పాటు ఆ గ్రామంలోని స్థానిక ఆదివాసీలు, కాక వంశస్తులు తమ ఇళ్లను శుద్ధి చేసుకొని మంగళహారతి ఇచ్చి మొక్కుతారు. అదేవిధంగా కొండాయి నుంచి గోవిందరాజులును ప్రధాన పూజారి దబ్బగట్ల గోవర్ధన్ తదితరులు పూజలు చేసి పడిగ రూపంలో తీసుకొస్తారు. గోవిందరాజులును వడ్డె బాబుతో కలిసి డప్పుచప్పుళ్లతో బయలుదేరగా పడిగను పట్టుకున్న వడ్డె కాళ్లకు నీళ్లు అంటకుండా మోసుకొస్తారు. కోరికలు నెరవేర్చేందుకు నిలువెత్తు బంగారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునే భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరాలని నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకుంటారు. అమ్మలను కొలిచే జాతర కావడంతో అన్ని సమయాల్లోనూ మేడారానికి మహిళలు రావచ్చు. ఇక్కడే కాన్పులు అయిన మహిళలు వేలల్లో ఉంటారు. రూ.101 కోట్లతో గద్దెల ప్రాంగణం విస్తరణ.. మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రూ.150 కోట్లు నిధులను మంజూరు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ 20 రోజులుగా మేడారంలో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా గద్దెల ప్రాంగణాన్ని రూ.101 కోట్లతో విస్తరించారు. ఈసారి 3 కోట్ల మంది భక్తులు దర్శించుకోవడానికి అధికా రులు ఏర్పాట్లు చేశారు.హనుమాన్ జెండా నీడలో సారలమ్మ.. సారలమ్మను బుధవారం కన్నెపల్లి నుంచి పూజారులు కాక సారయ్య ప్రత్యేక పూజలు చేసి మేడారంలోని గద్దెకు తీసుకువస్తారు. ఇందులో భాగంగానే హనుమాన్ జెండా నీడలోనే సారలమ్మ ముందుకు సాగుతుంది. కన్నెపల్లి నుంచి మేడారం సారలమ్మ గద్దెల వరకు హనుమాన్ జెండా రక్షణలోనే సారలమ్మ గద్దెకు చేరుకుంటారు. గుడారాలతో నిండిన మేడారం..గుడారాలతో మేడారం నిండిపోయింది. నార్లాపూర్ స్తూపం నుంచి మొదలుకొని జంపన్నవాగు పరిసర ప్రాంతాలు, చిలకలగుట్ట నుంచి మొదలుకొని ఆర్టీసీ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఎడ్లబండ్లు, ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చిన భక్తులు మేడారం చుట్టు పక్కల ప్రాంతాల్లో గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎటుచూసినా మేడారం పరిసర ప్రాంతాల్లో ఖాళీ స్థలం కనిపించడం లేదు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి మొదలుకుని జంపన్నవాగు వరకు రోడ్లన్నీ భక్తులతో బారులుదీరాయి. బుధవారం ఉదయం వరకు వేలాది సంఖ్యలో వాహనాలు, లక్షల సంఖ్యలో భక్తులు రానుండడంతో మేడారం కిటకిటలాడనుంది. -
వరుడై వెళ్లి.. మరుబెల్లికి రావయ్య
● పూనుగొండ్ల నుంచి మేడారానికి సమ్మక్క భర్త పగిడిద్దరాజుగంగారం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లకు చెందిన పగిడిద్ద రాజు పెళ్లి కొడుకయ్యాడు. సమ్మక్కను వివాహం చేసుకునేందుకు ములుగు జిల్లా ఎస్ఎస్తాడ్వాయి మండలం మేడారానికి మంగళవారం బయలుదేరి వెళ్లాడు. ఈ మేరకు పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయంలో వడ్డెలు గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసి కల్తీ జగ్గారావు, పూజారులు పడిగను పట్టుకొని తరలివెళ్లారు. పగిడిద్దరాజు గ్రామం దాటే వరకు మహిళలు నీళ్లు ఆరబోశారు. వరుడై వెళ్లి.. మరుబెల్లికి రావయ్యా అంటూ భక్తులు మొక్కులు చెల్లించారు. 70 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి గోవిందరావుపేట మండలం కర్లపల్లి లక్ష్మీపురంలోని పెనక సాంబయ్య ఇంట్లో రాత్రి బసచేశారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు మేడారంలోని గద్దెకు చేరుకుంటారు. సమ్మక్కతో వివాహం అనంతరం జాతర తర్వాత పగిడిద్దరాజు తిరిగి పూనుగొండ్లకు చేరుకుంటారు. రెండురోజుల అనంతరం మరుబెల్లి జాతరను పూనుగొండ్లలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మంత్రి సీతక్క,మేడారం ట్రస్ట్బోర్డు చైర్పర్సన్ సుకన్య, ములుగు మార్కెట్ చైర్పర్సన్ కల్యాణి, డీఎస్పీ తిరుపతిరావు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షిత ప్రయాణం
రఘునాథపల్లి: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా మండల కేంద్రంలోని బస్టాండ్ నుంచి మంగళవారం ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిపారు. ఈసందర్భంగా జనగామ ఆర్టీసీ డిపో మేనేజర్ ఎస్.స్వాతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జిల్లా జెడ్పీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు బొల్లం అజయ్, సర్పంచ్ బొల్లం ఉమారాణి, మాజీ సర్పంచ్ పోకల శివకుమార్ ప్రత్యేక బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ.. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమని, కుటుంబ సమేతంగా ఆర్టీసీ బస్సులో వెళ్లాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో పర్యవేక్షకుడు కుర్ర సురేందర్గౌడ్, లింగాల జగదీష్చందర్రెడ్డి, కోళ్ల రవిగౌడ్, పేర్నె రవి తదితరులు పాల్గొన్నారు. కుమారుడిని ప్రభుత్వబడిలో చేర్పించిన తహసీల్దార్ పాలకుర్తి టౌన్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వ ఉద్యోగులే ముందడుగు వేయాలన్నా సందేశాన్ని ఆ అధికారి చేతల్లో చూపించారు. తమ కుమారుడిని మంగళవారం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. స్థానిక తహసీల్దార్ కడుపుకంటి సరస్వతి ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం కల్పించాలని ఉద్దేశంతో తన కుమారుడు శ్రీవర్ధన్ను మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. శ్రీవర్ధన్కు ప్రధానోపాధ్యాయుడు చిదురాల శ్రీనివాస్ నాలుగో తరగతిలో ఆడ్మిషన్ అందించారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి జనగామ: మున్సిపాలిటీ ఎన్నికలను సమర్థవంతంగా శాంతియుతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తదితర ఉన్నతాధికారులతో కలిసి ఆమె అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో పురపాలిక ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్నికలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మున్సి‘పోల్’ నిబంధనలు ఇవి.. జనగామ: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థులు నామినేషన్లు ఎలా వేయాలి? వాటి నిబంధనలు ఏంటి? అనే సమాచారాన్ని సాక్షి అందిస్తోంది. పార్టీ అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా ఆర్ఓకు తప్పనిసరిగా బీఫాం సమర్పించాలి. పార్టీ అభ్యర్థికి ఒక ప్రతిపాదకుడు, స్వతంత్రులకు మాత్రం 10 మంది అవసరం. ఒక్కరు గరిష్టంగా 4 నామినేషన్లు వేయవచ్చు. -
అంకెల్లో మేడారం
మహా జాతరకు భారీ ఏర్పాట్లుఫైర్ బ్రిగేడ్ వాహనాలు: 15ఫైర్ ఫైటర్లు: 268కమ్యూనికేషన్ – టెక్నాలజీశాశ్వత మొబైల్ టవర్లు: 27తాత్కాలిక మొబైల్ టవర్లు: 33వీహెచ్ఎఫ్ సెట్లు: 450తాగునీటి నల్లాలు: 5,482జంపన్నవాగు వద్ద డ్రెస్సింగ్ రూములు: 119పార్కింగ్ స్థలాలు: 42మొత్తం విస్తీర్ణం: 1,418 ఎకరాలు టీజీఎస్ఆర్టీసీ బస్సులు: 4,000మొత్తం ట్రిప్పులు: 51,000ఆర్టీసీ సిబ్బంది: 10,441వైద్య సిబ్బంది: 5,192అంబులెన్సులు: 30 బైక్ అంబులెన్సులు: 40 ప్రధాన ఆస్పత్రి: 50 పడకలు రోజుకు మెడికల్ క్యాంపులు: 30ట్రాన్స్ఫార్మర్లు: 196విద్యుత్ స్తంభాలు: 911విద్యుత్ లైన్లు: 65.75 కి.మీ విద్యుత్ సిబ్బంది: 350 డీజిల్ జనరేటర్లు (బ్యాకప్): 28టాయిలెట్లు: 5,700బ్లాకులు: 285గజ ఈతగాళ్లు: 210సింగరేణి రెస్క్యూ: 12ఎస్డీఆర్ఎఫ్ బృందాలు: 100– ములుగుపారిశుద్ధ్య సిబ్బంది: 5,000ట్యాంకర్లు: 150 ట్రాక్టర్లు: 100స్వీపింగ్ మెషిన్లు: 18 జేసీబీలు : 12స్వచ్ఛ ఆటోలు: 40 డోజర్లు: 16భక్తుల అంచనా: సుమారు 3 కోట్లు విధుల్లో సిబ్బంది: 21 శాఖలు, 42,027 మంది ఆదివాసీ వలంటీర్లు: పరిపాలనా విభజన: 08 జోన్లు 42 సెక్టార్లు 2,000 మంది -
వనం దారిపట్టిన భక్తజనం
అడవిబిడ్డలు అందరికీ అమ్మలైన సన్నివేశం. తెలంగాణకు శతాబ్దాల కిందటే పోరాటం అబ్బిన సందర్భం. సమ్మక్క–సారలమ్మ దివ్య చరితం. వారి త్యాగాన్ని గుర్తు చేసుకునే వేళ ఇది. పర్యావరణాన్ని రక్షించడానికి ప్రాణాలు ఫణంగా పెట్టిన వారి ధైర్యసాహసాలను స్మరించుకునే సమయం ఇది. రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర ప్రకృతిని ఆరాధించమని ఉద్బోధిస్తుంది. దైవం ముందు ధనిక, పేద తారతమ్యాలు లేవన్న సత్యాన్ని స్పష్టం చేస్తుంది. మాఘశుద్ధ పౌర్ణమితో మొదలు మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మక్క పున్నం) నుంచి జాతర మొదలవుతుంది. నాలుగు రోజుల పాటు ప్రధాన జాతర అంతా ఆదివాసీ సంప్రదాయం ప్రకారమే జరుగుతుంది. ఇక్కడ భక్తుల నమ్మకాలే సహస్ర నామాలు, పూనకాలే హోమాది క్రతువులు. న మ్మిన వారి కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఆ తల్లీకూతుళ్ల వీరత్వమే దైవత్వం. ఆసాహసాన్ని త లుచుకొని భక్తి పారవశ్యం పొందడమే మానవత్వం. ప్రతీ మనిషిలోనూ దైవత్వం ఉందని నిరూపించే అరుదైన జాతర మేడారంలో సాక్షాత్కరిస్తుంది. గద్దెలే దేవతామూర్తులుగా.. మేడారంలో సమ్మక్క– సారలమ్మకు ఎలాంటి విగ్రహాలు ఉండవు. రెండు గద్దెలు ఉంటాయి. ఒకటి సమ్మక్క గద్దె, ఇంకోటి సారలమ్మ గద్దె. వీటినే దేవతామూర్తులుగా కొలుస్తారు. మనిషి ఎత్తు ఉండే కంక మొదళ్ల వంక కన్నార్పకుండా చూస్తూ వన దేవతలను మనసులో ప్రతిష్ఠించుకుంటారు. దట్టమైన అడవి నుంచి దేవతలను తోడ్కొని వచ్చే వడ్డెలు (పూజారులు) తమ మీది నుంచి దాటుకుంటూ వెళ్తే జన్మ సార్థకం అవుతుందని భక్తుల నమ్మకం. పసుపు, కుంకుమ స్వరూపంగా నిలిచిన దైవాలను వాటితోనే ఆర్చిస్తారు. అమ్మవారి రూపంలో ముఖానికి పసుపు పూసుకుని పెద్దబొట్టు పెట్టుకుని వచ్చి వన దేవతలను దర్శించుకుంటారు. కంకబియ్యం (ఒడిబియ్యం), ఎదురుకోళ్లు, లక్ష్మీదేవర (గుర్రం ఆకారపు తొడుగును ముఖానికి కట్టుకుని వచ్చి దానిని అమ్మవారికి సమర్పించడం) వంటి రకరకాల మొక్కులు ఇక్కడ చెల్లించుకుంటారు. దేవతల గద్దెలపై ఉండే కుంకుమను ఎంతో పవిత్రంగా నమ్ముతారు. -
శ్రీఉమామహేశ్వరుడికి జాతీయజెండా అలంకరణ
జనగామ: గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని పట్టణంలోని గుండ్లగడ్డ శ్రీ ఉమాహేశ్వర ఆలయంలో స్వామికి జాతీయ జెండాతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు ఆలయానికి వచ్చి పూజలతో పాటు దేశభక్తిని చాటుకున్నారు. ఢిల్లీ వేడుకల్లో చిన్నపెండ్యాల కళాకారుడుచిల్పూరు: మండలంలోని చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన చిందుయక్షగాన కళాకారుడు గజవెళ్లి మంజునాథ్కు ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కింది. కేంద్ర సాంస్కృతిక శాఖ పరిధిలోని నాగపూర్ సౌత్ సెంట్రల్ జోన్ కల్చర్ వారు 20 రోజల క్రితం గణతంత్ర వేడకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం పంపారు. 20 రోజుల రిహార్సల్ తర్వాత సోమవారం ఇండియా గేట్ కల్చరల్ పరేడ్ కర్తవ్య భవన్లో కళాప్రదర్శన విజయవంతంగా నిర్వహించారు. ఈ కళా ప్రదర్శనను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని పాల్గొని తిలకించారు. -
అన్నిరంగాల్లో అగ్రపథం!
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026అభివృద్ధి, సంక్షేమంలో మోడల్గా జిల్లాఉత్తములకు ప్రశంసలుగణతంత్ర దినోత్సవం సందర్భంగా ధర్మకంచ మినీ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి సెల్యూట్ చేస్తున్న కలెక్టర్మాట్లాడుతున్న కలెక్టర్ రిజ్వాన్ బాషా● పల్లె నుంచి పట్నం వరకు ప్రగతి పరుగులు ● జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో అవార్డులు ● ఉపాధి, విద్య, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ● 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర రిజ్వాన్ బాషా షేక్జనగామ: జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు వేగవంతంగా సాగుతున్నాయని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కలెక్టర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన తర్వాత మాట్లాడారు.. పాలకుర్తిలో అసంపూర్తిగా ఉన్న శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహ కల్యాణ మండపాన్ని రూ.47 లక్షలతో పూర్తిచేసి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ఎస్హెచ్జీ గ్రూపులకు వడ్డీలేని రుణాలు, సీ్త్రనిధి సహాయం కలిసి రూ.475 కోట్లకు పైగా మంజూరై 100శాతం ప్రగతి సాధించారని కొనియాడారు. ఉపాధి హామీ పథకంలో 59శాతం పనిదినాలు, తాగునీటి సరఫరాలో 608 గ్రామాలకు 24 గంటల సేవలు అందిస్తున్నామన్నారు. దేవాదులతో 490 చెరువులు నింపగా, ఆసరా పింఛన్లు 75వేల మందికి చేరాయి. నీటి సంరక్షణ, ఆర్టీఐ, ఎన్నికల నిర్వహణలో జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు జిల్లాకు లభించడం మనందరి కృషి ఫలితమే అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో.. మహాలక్ష్మి పథకంలో జిల్లాలో 2,89,66,830 మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని కలెక్టర్ తెలిపారు. దీంతో ఆర్టీసీకి రూ.140.63 కోట్లు లబ్ధి చేకూరినట్లు చెప్పారు. గృహజ్యోతి స్కీం ద్వారా 200 యూనిట్లలోపు వినియోగదారులకు ఉచిత విద్యుత్ 4,92,000 జీరో బిల్లులు జారీ కాగా, 94,298 కుటుంబాలకు రూ.25.83 కోట్లు సబ్సిడీగా అందించామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు 76.20శాతం ప్రగతితో రాష్ట్రంలో జనగామకు మొదటి స్థానం లభించిందన్నారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేస్తున్న యూరియా బుకింగ్ యాప్ రైతులకు సులభతరంగా మారిందన్నారు. ధన్ధాన్యలో పైలట్ జిల్లాగా.. ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన ప్రయోగాత్మక అమలుకు రాష్ట్రం నుంచి ఎంపికై న నాలుగు జిల్లాల్లో జనగామ ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర పథకాలను అనుసంధానం చేస్తూ పలు రంగాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధమయ్యాయన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలువగా, రైతులకు రూ.385 కోట్లు నేరుగా జమ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో కొత్తగా 25వేల రేషన్కార్డులను జారీ చేశామని, దీంతో 1,85,358 లబ్ధిదారులకు సన్నబియ్యం అందుతున్నాయన్నారు. పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల్లో ఆధునిక రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.200కోట్లు కేటాయించిందన్నారు. పర్యావరణ అవగాహనపై నిర్వహించి ఎన్ఎస్పీసీ–2025 పోటీల్లో 75,156 మంది జిల్లా విద్యార్థులు పాల్గొని జాతీయ స్థాయిలో మొదటి స్థానం సాధించారన్నారు. మహిళా శక్తి స్కీంలో మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వనితటీ సెంటర్లు, యూనిఫాం తయారీ, ఆర్టీసీ అద్దె బస్సుల వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. పట్టణంలో సుందరీకరణ..జనగామ పురపాలకపరిధిలో బతుకమ్మకుంట, జంక్షన్లు తదితర ప్రాంతాల్లో సుందరీకరణ, గార్లకుంట వరకు స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ శ్రీరాంనగర్లో మోడల్ వైకుంఠధామం, టీయూఎఫ్ఐడీసీ నిధులతో రూ.18.74 కోట్ల విలువైన రహదారి, సౌకర్యాల పనులు, నైట్ షెల్టర్స్, లేబర్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. స్టేషన్ఘనపూర్ కొత్త మున్సిపాలిటీలో రూ.50 కోట్లు మంజూరు కాగా, టౌన్ హాల్, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మోడల్ మార్కెట్, పార్క్, లైబ్రరీ, ఓపెన్ జిమ్ నిర్మాణాలు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. దేవాదులకు సంబంధించి రూ.3,838 కోట్ల ఖర్చు చేస్తుండగా, 91శాతం భూసేకరణ పూర్తయిందన్నారు. ఆర్ఎస్ ఘన్పూర్, నవాబ్పేట మెయిన్ కెనాల్, పంప్హౌస్ పనుల కోసం రూ.148.76 కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణలో ఉత్తమ జిల్లాగా రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా సత్కారం లభించిందన్నారు. -
ఉపాధి హామీపై కుట్రలు మానుకోవాలి
జనగామ రూరల్: ఉపాధి హామీ చట్టం నీరుగార్చే కుట్రలను ప్రధాని నరేంద్ర మోదీ మానుకోవాలని, చట్టాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాటం చేస్తుందని ఏఐసీసీ సెక్రటరీ పి.విశ్వనాథన్ అన్నారు. సోమవారం మండలంలోని ఓబుల్కేశాపూర్ గ్రామంలో ఉపాధి హామీ చట్టం పేరు మార్పు, పథకాన్ని నిర్వీర్యంపై డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి ఆధ్వర్యంలో ఫ్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఏఐసీసీ సెక్రటరీ పి.విశ్వనాథన్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. గాంధీ రాముడిని పూజించారని అలాంటి వ్యక్తి పేరును మార్చి పొరపాటు చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. 2006లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో పేదలకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో మహాత్మాగాంధీ పేరు పెట్టారని అన్నారు. అలాంటి చట్టాన్ని రూపుమాపడానికి కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచి పెడుతోందని విమర్శించారు. అనంతరం డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి మాట్లాడారు.. కేరళ, తమిళనాడు మాదిరిగానే తెలంగాణలోనూ ఉపాధి హామీ చట్టం పేరు మార్చొద్దని తీర్మానం చేస్తారన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వేముళ్ల సత్యనారాయణ, కంచ రాములు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వల్లాల మల్లేష్ పాల్గొన్నారు. చట్టాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పోరాటం నిరసన కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్, ఎంపీ చామల -
మద్యం అమ్మితే రూ.10వేల జరిమానా
● మరిగడిలో మద్యపాన నిషేధం జనగామ రూరల్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండలంలోని మరిగడి గ్రామంలో మద్యపాన నిషేధం అమలు చేయాలని సోమవారం గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానాన్ని ఆమోదించింది. సర్పంచ్ కర్రె పరశరాములు అధ్యక్షతన ఉపసర్పంచ్ బాల్నే వెంకటరాజు వార్డు సభ్యులు పుట్టా ఎలేందర్, బోడ నరేందర్,దుబ్బాక స్వాతి, కర్రే కమలాకర్, దండు శ్రావణి,కూరాకుల రమేశ్, బొల్లి కవిత, ఇట్టమైన అశోక్, బాల్నే లోకేశ్వరితో కూడిన పాలకవర్గం గ్రామస్తుల సహకారంతో తీర్మానించారు. ఇక నుంచి గ్రామంలో దుకాణదారులు మద్యం అమ్మకూడదని, ఒకవేళ విక్రయిస్తే రూ.10వేల జరిమానా విధిస్తామని, అమ్మిన వ్యక్తులను పట్టిస్తే రూ.5 వేల నజరానా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కొడవటూర్లో సంపూర్ణ మద్యపాన నిషేధంబచ్చన్నపేట: మండలంలోని కొడవటూర్ గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ నీల కవితమురళి తెలిపారు. సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన గ్రామసభలో ఆమె పాల్గొని మాట్లాడారు.. గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని గ్రామస్తులు అందరూ కలిసి తీర్మానం చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగం దయాకర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి బృంగి రూపాచైతన్య, అంగన్వాడీలు ప్రేమలక్ష్మి, శ్యామల, వీఓఐ మల్లం శోభ, వాణి, ఆశాల అనిత, ఫీల్డ్ అసిస్టెంట్ అశోక్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
మహాజాతరకు ముస్తాబు
రేపటినుంచే మేడారంలో తెలంగాణ కుంభమేళా విద్యుత్ వెలుగుల్లో మేడారంలోని గద్దెల ప్రాంగణం..సాక్షిప్రతినిధి, వరంగల్ : ఆదివాసీల అతి పెద్ద ఉత్సవం, తెలంగాణ కుంభమేళాకు మేడారం ముస్తాబైంది. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు రెండు వారాల ముందునుంచే గిరిజన సంప్రదాయాల ప్రకారం గుడిమెలిగె, మండమెలిగె తదితర పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఓ వైపు సమ్మక్క సారలమ్మల గద్దెల పునరుద్ధరణ పనులు జరుగుతుండగానే ఈ కార్యక్రమాలకు శ్రీకారం జరగ్గా.. ఈ నెల 28న సారలమ్మ రాకతో మొదలయ్యే జాతర 31 వరకు జరుగుతుంది. ఈ మేరకు జాతరకు ఏర్పాట్లు అన్నీ పూర్తయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ముస్తాబైన నయా మేడారం.. మేడారం చరిత్రలోనే తొలిసారిగా రూ.251 కోట్ల భారీ నిధులు కేటాయించారు. ఇందులో గద్దెల శాశ్వత పునరుద్ధరణకు రూ.101 కోట్లు, జాతర నిర్వహణ, భక్తుల సౌకర్యాలకు రూ.150 కోట్లకు పైగా నిధులు వెచ్చించారు. ఇది మేడారం చరిత్రలోనే అత్యధిక కేటాయింపు కావడం విశేషం. మేడారం అభివృద్ధి పనుల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నవి కొత్తగా నిర్మించిన శాశ్వత గద్దెలు. వీటితోపాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను గ్రానైట్ రాళ్లతో పునర్నిర్మించారు. ప్రాకారం చుట్టూ ఉన్న రాతి శిలలపై కోయ గిరిజనుల వీరగాథలు, సమ్మక్క–సారలమ్మ చరిత్ర, ఆదివాసీల గోత్రాలు, వారి ఆచార వ్యవహారాలు, వీరగాథలను ప్రతిబింబించే చిత్రాలను చెక్కారు. ఇవి భవిష్యత్తు తరాలకు మేడారం చరిత్రను వివరించే సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. కాంక్రీట్ కట్టడాలు మాత్రమే కాదు.. గిరిజన సంస్కృతికి అద్దం పట్టే దృశ్యకావ్యాలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. భద్రత వలయంలో మేడారం.. గతంలో వనదేవతల గద్దెల ప్రాంతంలో 2–3 వేల మంది ఉంటేనే తొక్కిసలాట జరిగేది. ఈసారి పునరుద్ధరణలో భాగంగా ఒకేసారి 7వేల నుంచి 8 వేల మంది భక్తులు దర్శించుకునేలా భారీ క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీఐపీలకు ప్రత్యేక లైన్లు, క్యూలైన్లపై జీఐ షీట్లతో పైకప్పు ఏర్పాటు చేశారు. నాలుగు గద్దెలను ఒకేసారి దర్శించుకునేలా కంపార్టుమెంట్లు నిర్మించారు. జంపన్న వాగు వద్ద శాశ్వత స్నానఘట్టాలు, సుందరీకరణ పనులు పూర్తిచేశారు. మేడారం చుట్టూ 10 కి.మీ.ల మేర ఫోర్ లేన్ రోడ్లు, పార్కింగ్కు అదనంగా 63 ఎకరాల స్థల సేకరణ చేశారు. కాగా ఈసారి 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా జాతర సందర్భంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలనుంచి తరలి వచ్చే భక్తుల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. కాగా 460 సీసీ కెమెరాలతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీ ద్వారా రద్దీని పర్యవేక్షించే సిస్టం ఏర్పాటు చేశారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జనసాంద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రమాదాల్ని ముందుగానే నివారించే ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. 20 ప్రత్యేక డ్రోన్ల ద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్, 20 మంది ఐపీఎస్ అధికారులు, 30 వేల మంది సిబ్బంది జాతర విధుల్లో ఉండబోతుండగా, ట్రాఫిక్ నియంత్రణకు ప్రతి 2 కి.మీ.కు ఒక చెక్పోస్టు ఏర్పాటు చేస్తున్నారు. రూ.251 కోట్లతో పునరుద్ధరణ, జాతర నిర్వహణ పనులు జాతర ఏర్పాట్లు పూర్తయినట్లు ప్రకటన వనదేవతల దర్శనానికి తరలివస్తున్న భక్తులు 28 నుంచి 31 వరకు మహా జాతర.. 3 కోట్లమంది వస్తారని అంచనా -
అలరించిన ఆటాపాట
జనగామ: గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో సోమవారం జరిగిన వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మహాత్మాజ్యోతిబాఫూలే, సోషల్ వెల్ఫేర్, ఏకశిల పబ్లిక్ స్కూల్, సాన్మారియా, మోడల్ తదితర పాఠశాలలు, గురుకులాలకు చెందిన విద్యార్థులు జాతీయ భావంతో పాటు మన ఆచార, వ్యవహారాలను తమ ప్రదర్శన ద్వారా అద్భుతంగా చూపించారు. అనంతరం చేనేత రుణమాఫీ పథకం కింద 293 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం అందించిన రూ.2,06,25చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. స్వయం సహాయ సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించిన చెక్కులను అందించారు. చివరగా పోలీస్, వ్యవసాయం, ఉద్యానవన, జిల్లా గ్రామీణభివృద్ధి, మెప్మా, తదితర శాఖల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను కలెక్టర్, అదనపు కలెక్టర్లు, డీసీపీ పరిశీలించి, నిర్వాహకులను అభినందించారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, రెవెన్యూ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, పింకేశ్ కుమార్, డీసీపీ రాజమ హేంద్రనాయక్, ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మినారాయణ నాయక్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జనగామ ధర్మకంచ మినీ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు -
పారదర్శకంగా యూరియా సరఫరా
జనగామ రూరల్: యూరియా సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా రూపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూ రియా బుకింగ్ యాప్ జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తె లిపారు. శనివారం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న అగ్రోస్ రైతు సేవాకేంద్రాన్ని సందర్శించి యూరియా నిల్వలు, యాప్ ద్వారా జరిగిన బుకింగ్స్, విక్రయ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాలో యూ రియా బుకింగ్ యాప్ అమలుకు ముందు రోజు వారీ సగటు యూరియా విక్రయాలు 3,000 నుంచి 3,500 సంచుల వరకు మాత్రమే ఉండేవని, యాప్ అమలులోకి వచ్చిన తర్వాత 6,000 నుంచి 7,000 సంచుల వరకు విక్రయాలు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. యూరియా బుకింగ్ యాప్కు జిల్లాలో రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఇప్పటివరకు 53,946 మంది రైతులు యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్నారని, మొత్తం 62,398 బుకింగ్స్ నమోదయ్యాయని వీటిలో 2,01,012 యూరియా సంచులు రైతులకు విజయవంతంగా విక్రయించినట్లు వెల్లడించారు. అదే విధంగా, గత 15 రోజులుగా జిల్లాలో యూరియా నిల్వలు నిరంతరం 25,000 సంచులకుపైగా ఉన్నాయని తెలిపా రు. రైతులకు యాప్ వినియోగంపై మరింత అవగాహన కల్పిస్తూ, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
ఇప్పగూడెం జాతర ప్రాంగణం పరిశీలన
స్టేషన్ఘన్పూర్: ఇప్పగూడెం, రంగరాయగూడెం, కోమటిగూడెం, అక్కపెల్లిగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని చింతగట్టు శ్రీసమ్మక్క–సారలమ్మ జాతర ప్రాంగణాన్ని డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ముందుగా జాతర ప్రాంగణంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జాతర కమిటీతో మాట్లాడారు. జాతరలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని, భక్తులకు అసౌకర్యం కలుగకుండా అందరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. జాతర కమిటీ చైర్మన్ తోట వెంకన్న, వైస్ చైర్మన్ మ్యాదరబోయిన కరుణాకర్, ఎల్లగౌడ్, కట్టయ్య, సర్పంచ్లు రాణిఅనీల్, సోమేశ్వర్ పాల్గొన్నారు. -
ఓటు హక్కు ఎంతో విలువైనది
జనగామ రూరల్: ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైనదని తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ అన్నారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరెట్లో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సందేశం వినిపించారు. అనంతరం బెన్ షాలోమ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎలాంటి ప్రలో భాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. పద్దెనిమిది ఏళ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావాలని సూ చించారు. రాజ్యాంగం ద్వారా వచ్చిన ఓటు హక్కు ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాదిగా నిలుస్తోందని గుర్తు చేశారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఎన్నికల సంఘం పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తుందన్నారు. ప్రతీసారి వినూత్న పద్ధుతుల్లో ప్రజలను చైతన్యపరుస్తుందని తెలిపారు. ఇందులో భాగంగానే ఈసారి మై ఇండియా – మై ఓటు నినాదంతో ఓటర్లను చైతన్య పరుస్తోందని అన్నా రు. ఈ సందర్భంగా ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్న సీనియర్ సిటిజన్లు, కొత్తగా నమోదైన యువ ఓటర్లకు జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరాం, ఎన్నికల శాఖ అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ -
ఆర్టీసీ సేవలు వినియోగించుకోవాలి
స్టేషన్ఘన్పూర్: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని జనగామ డిపో మేనేజర్ స్వాతి అన్నారు. స్టేషన్ఘన్పూర్ నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సర్వీలసులను ఆదివారం స్థానిక బస్టాండ్లో డీఎం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మేడారం జాతరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలన్నారు. భక్తుల డిమాండ్కు తగినట్లుగా బస్సు సర్వీసులను నడిపిస్తామని, సుశిక్షితులైన డ్రైవర్లు ఉంటారని తెలిపారు. ఘన్పూర్ నుంచి మేడారానికి పెద్దలకు రూ.300, పిల్లలకు రూ.200 టికెట్ చార్జ్ నిర్ణయించినట్లు తెలిపారు. మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఐ జి.వేణు, ఆర్టీసీ జనగామ డిపో అసిస్టెంట్ మేనేజర్ హుస్సేన్, సూపరింటెండెంట్ నారాయణ, సమ్మయ్య, ఘన్పూర్ బస్టాండ్ కంట్రోలర్ ఈఎస్ బాబు, సురేందర్, రమేష్, శ్రీనివాస్, స్వామి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ప్రెస్టన్ గ్రౌండ్ నుంచి.. జనగామ రూరల్: జనగామ నుంచి మేడారం వెళ్లే భక్తుల కోసం ప్రెస్టన్ గ్రౌండ్స్ నుంచి బస్సు సర్వీసులను నడిపించనున్నారు. ఈమేరకు అదనపు కలెక్టర్ బెన్షా లోమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి డిపో మేనేజర్ స్వాతి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఉద్యోగులు ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు. జనగామ డిపో మేనేజర్ స్వాతి ఘన్పూర్ నుంచి మేడారానికి బస్సు సర్వీసుల ప్రారంభం -
గణతంత్ర వేడుకలకు సిద్ధం
జనగామ రూరల్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక ధర్మ కంచ స్టేడియంలో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ శాఖల సమన్వయంతో ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బంది ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారని స్టేడియంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రగతిని తెలిపే స్టాల్స్ ప్రదర్శించనున్నట్లు వెల్ల డించారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్ర శంస పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్కు రాష్ట్రస్థాయి పురస్కారం జనగామ రూరల్: ఎన్నికల శిక్షణ, సామర్థ్య పెంపు విభాగంలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ జిల్లాగా కలెక్టర్ రిజ్వాన్ బాషా అవార్డు అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన రాష్ట్రస్థాయి వేడకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా కలెక్టర్ పురస్కారాన్ని అందుకున్నారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025 సంవత్సరానికిగాను ఎన్నికల నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన అధికారుల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి శనివారం ప్రకటించారు. ఇందులో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ‘శిక్షణ, సామర్థ్య పెంపు’ (ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బి ల్డింగ్) విభాగంలో అవార్డు దక్కించుకున్నారు. ఇన్వెస్టిగేషన్ మార్గదర్శకాల ప్రతుల అందజేత జనగామ రూరల్: పౌర సరఫరాల శాఖ కేసుల్లో చట్టపరమైన అమలుకు మార్గదర్శకాలను ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, కమిషనర్ ఎం.స్టిఫెన్ రవీంద్ర విడుదల చేశారు. కాగా ఈ మార్గదర్శకాల ప్రతులను శనివారం పౌరసరఫరాల శాఖ అధికారులకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అందజేశారు. పౌరసరఫరాల శాఖకు సంబంధించిన బియ్యం అక్రమ రవాణా, వడ్ల కొనుగోలుకు సంబంధించిన అవకతవతలు, అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్లులపై చర్య తీసుకునేందుకు తగిన మార్గదర్శకాలు, ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్కు సంబంధించిన తగు పత్రాలు, రెవెన్యూ రికవరీ యాక్ట్, కోర్ట్ మానిటరింగ్ సిస్టం మార్గదర్శకాల్లో పొందుపరచడం జరిగిందన్నారు. నేడు ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ రాక జనగామ రూరల్: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేడు (సోమవారం) నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. జనగామ మండలం ఓబుల్ కే శపురంలో చేపట్టే ఈ కార్యక్రమానికి ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ రానున్నారు. ఆయనతోపా టు భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పాల్గొననున్నారు. -
ఆ ముగ్గురు స్టూవర్టుపురం దొంగలు
స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ నియోజకవర్గంలో ప్రస్తు తం ఉన్న గజదొంగ డాక్టర్ రాజయ్యకు తోడుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం పేరుతో స్టూవర్టుపు రం దొంగల్లా ఎర్రబెల్లి దయాకర్రావు, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి వస్తున్నారని ఎ మ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. ఘన్పూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏ ర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఎన్నికై న తర్వా త ఘన్పూర్లో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని, ఘన్పూర్లో నిర్మిస్తున్న వంద పడకల ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, మున్సిపాలిటీ ఏర్పాటు అన్నింటికి తామే కారణం అన్నట్లుగా ప్రజలను త ప్పుదోవ పట్టించేలా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. 2023 ఎన్నికల్లో రాజయ్యకు టికెట్ ఇస్తే గెలువడం కష్టమని కేసీఆర్, కేటీఆర్కు చెప్పింది ఎర్రబెల్లి, పోచంపల్లి, పల్లా రా జేశ్వర్రెడ్డిలే అని అన్నారు. ఎర్రబెల్లి దయాకర్రావు మతిభ్రమించి సభ్యత, సంస్కారం లేకుండా మా ట్లాడుతున్నాడని కడియం విమర్శించారు. టీడీపీని హోల్సేల్గా కేసీఆర్కు అమ్మిన నీచచరిత్ర ఎర్రబెల్లిదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అందులోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో దయాకర్రావు నీచచరిత్ర తెలిసి రేవంత్రెడ్డి.. దగ్గరకు రాని వ్వలేదని ఎద్దేవాచేశారు. కేసీఆర్ చుట్టూ బొచ్చుకుక్కలా తిరిగి.. పల్లా రాజేశ్వర్రెడ్డి వందల కోట్లు ఆస్తులు సంపాదించుకున్నాడని, కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చుపెట్టిన పల్లా.. కేసీఆర్ కుటుంబాన్ని నాశనం చేశాడని విమర్శించారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు పోచంపల్లికి ఎక్కడ నుంచి వచ్చాయని, కేటీఆర్, సంతోష్ రావులకు పోచంపల్లి బినామీ అన్నారు. గజదొంగకు తోడుగా వస్తున్న స్టూవర్టుపురం దొంగల విషయంలో ఘన్పూర్ ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జూలు కుంట్ల శిరీష్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, నాయకులు నరేందర్రెడ్డి, బెలిదె వెంకన్న, అంబటి కిషన్రాజు, నూకల ఐలయ్య, తోట సత్యం, నీల గట్టయ్య, పోశాల కృష్ణపటేల్, నర్సింహులు, చింత ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
మెరుగైన విద్యుత్ కోసం సామర్థ్యం పెంపు
● ఎన్పీడీసీఎల్ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి జనగామ: పట్టణంలో వేసవి సీజన్లో మెరుగైన విద్యుత్ సరఫరా కోసం సామర్థ్యం పెంచుతున్నట్లు ఎన్పీడీసీఎల్ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు. వేసవి కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఆదివారం పట్టణంలోని మినీ స్టేడియం ఏరియాలో నాణ్యమైన విద్యుత్ కోసం అదనంగా 100 కేవీఏ సామర్థ్యం కలిగిన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ (డీటీఆర్)ను ఏర్పాటు చేసి సేవలను ప్రారంభించారు. అదనపు డీటీఆర్ ఏర్పాటు చేయడంతో జనగామ టౌన్–2 సెక్షన్ పరిధిలో తక్కువ ఓల్టేజ్ సమస్యలు గణనీయంగా తగ్గి, వినియోగదారులకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఏడీఈ వేణుగోపాల్, టౌన్–1 ఏఈ సౌమ్య, టౌన్–2 ఏఈ పులి చంద్రమోహన్, ఎస్ఎల్ఐ నరేందర్, లైన్మెన్లు భిక్షపతి, మహేందర్, ఏఎల్ఎం అశోక్ ఉన్నారు. -
నవ మేడారం
వనదేవతలు సమ్మక్క–సారలమ్మ ఖ్యాతి విశ్వవ్యాప్తంకారడవిలో, వాగు వంకల నడుమ మొదలైన చిన్న జాతర.. ప్రస్తుతం దేశాన్ని ఆకర్షిస్తోంది. గూడెం ప్రజలు కొలిచిన ఆ సన్నిధి.. ప్రస్తుతం కోట్లాది భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. మట్టి గద్దెల నుంచి విస్తృత సౌకర్యాల దాకా.. దిగబడే ఎగుడు దిగుడు రోడ్ల నుంచి డబుల్ బీటీ రోడ్డు దాకా.. ఎడ్ల బండ్ల ప్రయాణం నుంచి హెలికాప్టర్ దాకా మేడారంలో ఆధునికత సంతరించుకుంది. సెల్ఫోన్ టవర్లు, అత్యాధునిక సీసీ కెమెరాలు.. డ్రోన్లు ఒక్కటేమిటి వన మేడారం ఇప్పుడు నవ మేడారమైంది. – ఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి -
మద్యం మత్తులోనే గొడవ..
● జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కొమ్మూరిజనగామ: పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసేందుకు వ చ్చిన మంత్రి సీతక్క పర్యటనను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అనుచరవర్గానికి మ ద్యం పోయించి గొడవకు దిగారని జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. నియోజకవర్గ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొమ్మూరి మాట్లాడారు. పెంబర్తి జంక్షన్ వద్ద మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించే సమయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రోగ్రాంలో అంతా తానైనట్టుగా వ్యవహరిస్తూ, అక్కడ నుంచే గొవకు తెరలేపాడని ఆరోపించారు. మంత్రి కార్యక్రమంలో ఎమ్మెల్యే సభ్యత, సంస్కారం మరచి వ్యవహారించారన్నారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకుడు రాకేష్పై ఎమ్మెల్యే తిట్టారని, దీనిపై డీసీపీ ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పదవి పూర్తయ్యే వరకు దొంగ ఓట్లపై పోరాడుతామన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ సభ్యుడు లకావత్ లక్ష్మీనారాయణ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ వేముల సత్యనారాయణరెడ్డి, జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, కంచె రాములు, డాక్టర్ రాజమౌళి, కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, లింగాల నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మునీందర్ ఇంటి నుంచే పాన్పు
ఆదివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2026లక్షలాది మంది భక్తులు.. తల్లులను కీర్తిస్తూ జయజయధ్వానాలు.. డోలు వాయిద్యాలు.. కొమ్ము బూరల నాదాలు.. సుగంధ ధూపాల పరిమళాలు.. వీటన్నింటి నడుమ శక్తి స్వరూపాలను వనం నుంచి జనంలోకి తీసుకొచ్చే ఆ చేతులు మరెంతో శక్తివంతమైనవి.. ఎన్ని పదవులు అధిరోహించినా, ఎంత ధనమున్నా అంతటి అదృష్టం ఆ అడవి బిడ్డలకు మాత్రమే దక్కుతుంది. తల్లులను గద్దెకు చేర్చడంలో ఆదివాసీ పూజారుల పాత్ర కీలకం. నిష్టతో వనదేవతల సేవలో లీనమైన దాదాపు 25 మంది పూజారులపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.. – ఏటూరునాగారం/ఎస్ఎస్ తాడ్వాయిఅడవి తల్లులను వనంలోంచి జనంలోకి తీసుకువచ్చే పూజారులది ఎంతో అదృష్టం. సుమారు 25 మంది పూజారులు ఈ మహా ఘట్టంలో పాలుపంచుకుంటుండగా ప్రధానంగా సారలమ్మ పూజారులు ఆరుగురు, సమ్మక్క పూజారులు ఐదుగురు కీలక పాత్ర పోషిస్తారు. కన్నెపల్లి గుడిలోని సారలమ్మను పూజారి కాక సారయ్య ఈనెల 28న గద్దైపెకి తీసుకురానున్నారు. కాళ్లకు పారాణి ధరించి ఎర్రని వస్త్రాల ముసుగుతో అమ్మవారి రూపంలో వెదురుబుట్టలో అమ్మవారిని తీసుకుని కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలకు బయల్దేరుతారు. అమ్మవారిని తీసుకొచ్చే ఉదయాన ప్రత్యేకంగా కుట్టించిన జాకెట్ని మాత్రమే సారయ్య ధరిస్తాడు. తండ్రి వారసత్వంగా ఈ బాధ్యతను సారయ్య గత 8 జాతరల ముందు నుంచి నిర్వర్తిస్తున్నాడు. కాకవంశ పూజారులు అమ్మవారి వెదురు బుట్ట సారయ్య చేతులోకి అందివ్వగానే ఆయనను అమ్మవారు ఆవహిస్తుంది. మిగతా పూజారులు ఆయనను పట్టుకొని గద్దెల వరకు తీసుకొస్తారు. గద్దైపె ప్రతిష్ఠించేంతవరకు ఆయన స్పృహలో ఉండరు. సారలమ్మను తీసుకొస్తున్న కాక సారయ్య(ఫైల్)సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్ ఇంటి నుంచి సమ్మక్క దేవతకు చేయాల్సిన పూజా క్రతువు, సామగ్రి అంతా ఈ ఇంటి నుంచి వెళ్తుంది. సమ్మక్కను తీసుకురావడానికి ముందుగా మునీందర్ ఇంటి వద్ద పసుపు, కుంకుమ, కంకణాలు, నైవేద్యం, ఊదు, అక్షింతలు, పసుపు బియ్యం, ఇతరత్రా పూజారులకు పూజా సామగ్రి (పాన్పు)ని తయారు చేసుకుని వెళ్తారు. మేడారం సమ్మక్క జాతరలో జరిగే ఏ పూజా కార్యక్రమం అయినా ఈ ఇంటి నుంచి వెళ్లడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ అని మునీందర్ చెబుతున్నాడు. సమ్మక్కను తీసుకొస్తున్న పూజారులు (ఫైల్)చిలకలగుట్ట నుంచి ధూపం లేనిదే అమ్మవారు గుట్ట దిగదు. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. ధూపం వడ్డె దొబె నాగేశ్వర్రావు ధూపదీప నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తారు. గుట్ట పైనుంచి గద్దెకు చేరే వరకు అమ్మవారికి వడ్డె.. ధూపం వేస్తూనే ముందుకు సాగుతాడు. -
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు
దేవరుప్పుల: నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్పీడీసీఎల్ జిల్లా చీఫ్ ఇంజనీర్ సంపత్రెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని చిన్నమడూరు ఎస్ఎస్లో అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్తోపాటు బ్రేకర్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంతోపాటు గృహ అవసరాలకు ఉచిత కరెంటు సరఫరా చేస్తున్నందున వినియోగదారులు విధిగా శాఖాపరంగా మంజూరు, ఇంటి మీటర్లు తీసుకోవాలన్నారు. అక్రమ విద్యుత్ వాడకందారులకు శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో డీఈలు లక్ష్మీనారాయణరెడ్డి, విజయ్కుమార్, ఏడీఈ అనిల్, ఏఈ నర్సింహ్ములు పాల్గొన్నారు. -
కలెక్టర్కు మరో విశిష్ట అవార్డు
జనగామ రూరల్: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి వేడుకల్లో జనగామ జిల్లా మరో విశిష్ట గౌరవాన్ని సాధించింది. ఎన్నికల నిర్వహణలో శిక్షణ, సామర్థ్యాభివృద్ధి అంశంలో చేసిన కృషికి గాను కలెక్టర్ రిజ్వాన్ బాషా అవార్డుకు ఎంపికయ్యారు. నేడు (ఆదివారం) హైదరాబాద్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డును కలెక్టర్ స్వీకరించనున్నారు. ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యం అయిన ప్రతీఒక్కరికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. సమష్టి కృషితోనే జిల్లాకు ఈ అవార్డు దక్కిందన్నారు. నేను మీ బంధువును.. టిఫిన్ చేద్దాం పదా అంటూ.. జనగామ రూరల్: నేను మీ బంధువును.. చాలా రోజుల తర్వాత కలిశాం టిఫిక్ చేద్దాం పదా అంటూ బ్యాంకుల వద్ద మోసాలకు పా ల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏ ఎస్పీ పండేరీ చేతన్ నితిన్ తెలిపారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్కు చెందిన అడవి మీద నర్సింహులు గతంలో వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డాడు. ము ఖ్యంగా బ్యాంకులకు వద్ద అమాయకులను ఆసరా చేసుకుని వారితో బంధువునని, పరిచయస్తుడినని చెప్పి టిఫిన్, టీ తాగుతామని నమ్మించి తీసుకెళ్లి వారి నుంచి డబ్బులు తీసుకొని పరారవుతున్నాడు. జనవరి మెదటి వారంలో జిల్లా కేంద్రంలోని ఓ ఎస్బీఐలో ఓ వృద్ధుడు డబ్బులు డ్రా చేసుకుని బయటకు వచ్చాడు. తాను బంధవునవుతానని ఆ వృద్ధుడిని నమ్మించి టిఫిన్ చేద్దామని ఓ హోటల్ తీసుకెళ్లాడు. వృద్ధుడు చేతులు కడుక్కోవడానికి వెళ్లగానే డబ్బుతో ఉడాయించాడు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చే పట్టారు. శనివారం బస్టాండ్ సమీపంలో చోరీ చేయడానికి రాగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో గతంలో చేసిన నేరాలు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని అరెస్ట్చేసి రూ. 70 వేల నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. సీఐ సత్యనారాయణరెడ్డి తోపాటు ఎస్సై, సిబ్బందిని డీసీపీ, ఏఎస్పీ అభినందించారు. -
మహాజాతరకు ప్రత్యేక బస్సులు
జనగామ ప్రెస్టన్ మైదానం, స్టేషన్ఘన్పూర్లో పాయింట్● నేటి నుంచి ప్రారంభం కానున్న మేడారం బస్సు సర్వీసులు ● భక్తులు సద్వినియోగం చేసుకోవాలి ● డీఎం స్వాతిజనగామ: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తుల రాకపోకలు సులభతరం చేసేందుకు జనగామ ఆర్టీసీ డిపో ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని ప్రెస్టన్ మైదానం, స్టేషన్ఘన్పూర్ పాయింట్ నుంచి మేడారం పుణ్యక్షేత్రానికి ఈ నెల 31వ తేదీ వరకు మొత్తం 130 ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. జాతర సమయంలో భారీగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రెస్టన్ మైదానంలో ప్రత్యేక తాత్కాలిక బస్టాండ్, టికెట్ కౌంటర్లు, వేచివుండే షెడ్లు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య ఏర్పాట్లు తదితర మౌలిక సదుపాయాలను సిద్ధం చేశారు. ఈ ప్రత్యేక బస్టాండ్ను నేటి(ఆదివారం) ఉదయం అధికారికంగా ప్రారంభించనున్నారు. రాత్రి వేళల్లో కూడా భక్తులు ఇబ్బందులు పడకుండా విద్యుత్ వెలుగులు, భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ను నియంత్రించే ప్రత్యేక చర్యలు తీసుకుని బస్సుల రాకపోకలు ఎలాంటి ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.టికెట్ ధరలు జనగామ, స్టేషన్ఘన్పూర్ పాయింట్ల నుంచి ఎక్స్ప్రెస్, డీలక్స్ ప్రత్యేక సర్వీసులకు టికెట్ ధరలను నిర్ణయించారు. జనగామ పాయింట్ నుంచి మేడారానికి ఎక్స్ప్రెస్ సర్వీసులో పెద్దలకు రూ.400, పిల్లలకు రూ.250, స్టేషన్ఘన్పూర్ పాయింట్ నుంచి పెద్దలకు రూ.330, పిల్లలకు రూ.200, డీలక్స్ సర్వీసుల్లో జనగామ పాయింట్ నుంచి పెద్దలకు రూ.460, పిల్లలకు రూ.280, స్టేషన్ఘన్పూర్ పాయింట్ నుంచి పెద్దలకు రూ.380, పిల్లలకు రూ.220గా నిర్ణయించారు. -
మేడారానికి పోటెత్తిన భక్తులు
వనదేవతలను దర్శించుకునేందుకు మేడారానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో సుమారు 50 వేల మంది వరకు భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించారు. శివసత్తుల పూనకం, భక్తిగీతాల ఆలాపన, భక్తుల సందడితో జంపన్న వాగు కోలాహలంగా మారింది. పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, చీరసారె సమర్పించి చల్లగా చూడాలని భక్తులు తల్లులను వేడుకున్నారు. అనంతరం అడవిలో చెట్లకింద వంటలు వండుకొని భోజనాలు చేశారు. – ఎస్ఎస్తాడ్వాయిమేడారంలో సమ్మక్క–సారలమ్మను దర్శించుకుంటున్న భక్తులు -
ప్రతీ కుటుంబానికి ఆడపిల్ల ఒక వరం
● కలెక్టర్ రిజ్వాన్ బాషా జనగామ రూరల్: ప్రతీ కుటుంబానికి ఆడపిల్ల ఒక వరమని, బాలికల హక్కులను పరిరక్షించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మహిళా శిశు దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికల పట్ల వివక్షతను ప్రదర్శించకుండా వారి అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. శ్రీబేటీ బచావో–డిజిటల్ హటావోశ్రీ అనే సందేశంతో బాలికలను డిజిటల్ దుర్వినియోగం నుంచి రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలు, పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో డీసీ కోదండరాములు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోని, జీసీడీఓ గౌసియా బేగం, సీడబ్ల్యూసీ చైర్మన్ ఉప్పలయ్య, శ్రీలత, కవిత తదితరులు పాల్గొన్నారు. రేపు సాంస్కృతిక కార్యక్రమాలు జనగామ: రిపబ్లిక్ డే దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు (సోమవారం) జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో ప్రముఖ గాయకుడు రాంమిర్యాల ఆధ్వర్యంలో ఆటాపాట, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 26న సాయంత్రం 6 గంటలకు జరిగే వేడుకలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. రిపబ్లిక్ డేకు పకడ్బందీ ఏర్పాట్లుగణతంత్ర దినోత్సవం సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం వేడుకలు జరిగే ధర్మ కంచ స్టేడియాన్ని అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రోటోకాల్ ప్రకారం స్టేజీ ఏర్పాట్లు, తాగునీటి వసతి, అంబులెన్స్, ఫైర్ తదితర అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏసీపీ పండరి చేతన్, ఆర్డీఓ గోపిరాం, డీఆర్డీఓ వసంత, అధికారులు పాల్గొన్నారు. అలాగే ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ నమోదు లక్ష్యాన్ని సాధించే విధంగా అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. క్యాంపు కార్యాలయం నుంచి ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంఈఓలతో జూమ్ సమావేశం నిర్వహించారు. -
శక్తిని ప్రసాదించే జలకం..
సమ్మక్క తల్లి గుట్ట దిగే సమయం నుంచి గద్దెలకు చేరే వరకు జలకపు వడ్డె మల్లెల సత్యం పూజారులతో కలిసి ముందుకు సాగుతాడు. తొమ్మిది రకాల పానీయాలతో జలకాన్ని ప్రత్యేకంగా పూజారులు తయారు చేస్తారు. ఈ జలకాన్ని సమ్మక్క పూజారుల వడ్డె మల్లెల సత్యం చేతుల పట్టుకుని అమ్మవారిని తీసుకువస్తున్న కృష్ణయ్యతో కలిసి ముందుకు సాగుతాడు. జలకం చల్లితేనే అమ్మవారు ముందుకు కదులుతుంది. అమ్మవారిని తీసుకొచ్చే కృష్ణయ్య ఎక్కడా నీరస పడకుండా జలకాన్ని దప్పికగా అందిస్తారు. దీంతో ఆయన మరింత శక్తిని పుంజుకుని ముందుకు సాగుతాడు. డోలు దరువుతో తల్లుల యాత్ర షురూ.. సమ్మక్క–సారలమ్మను వారి స్థలాల నుంచి గద్దెలపైకి తీసుకురావాలంటే డోలు దరువు ఉండాల్సిందే. డోలు శబ్దాలు ధ్వనిస్తుంటే పూనకాలతో తల్లుల యాత్ర జోరుగా సాగుతుంది. అమ్మలు వచ్చే తరుణంలో ఒక్క క్షణం ఆగకుండా కళాకారులు డోలు వాయిస్తారు. అలసట లేకుండా కళాకారులు అమ్మవారి శక్తిని ప్రసాదించుకుని వాయిస్తారని పూజారులు చెబుతున్నారు. -
సరస్వతి నమస్తుభ్యం!
● భక్తిశ్రద్ధలతో వసంత పంచమి వేడుకలు ● వేదమంత్రోచ్ఛరణలు.. సామూహిక అక్షరాభ్యాసాలుజనగామ: జిల్లావ్యాప్తంగా వసంత పంచమి పర్వదినం శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యాదేవి శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయాల్లో విశే ష పూజలు, అలంకరణలు జరగగా, వేద పండితు ల మంత్రోచ్ఛరణల మధ్య చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని భవానీనగర్ సరస్వతీ మాత ఆలయం, బతుకమ్మకుంట శ్రీవిజయదుర్గమ్మ ఆల యం, సంతోషి మాత ఆలయాలతో పాటు పట్టణంలోని బీరప్పగడ్డ శ్రీసరస్వతి శిశు మందిర్, వాసవి క్లబ్, గెలాక్సీ లయన్స్ క్లబ్, లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ డైమండ్ సంయుక్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గట్టు శ్రీనివాస్ సహకారంతో అంబేద్కర్నగర్ అంగన్వాడీ కేంద్రం చిన్నారులకు అక్షరాభ్యాసంతో పాటు స్కూల్ బ్యాగులు, పలకలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాసవి గెలాక్సీ జోన్ చైర్మన్ బుస్సా సిద్దేశ్వర్, అధ్యక్షులు తాడూరు సంతోష్, సోమేశ్వర్, రామిని ఈశ్వర్, అంగన్ వాడీ సూపర్వైజర్ పూర్ణిమ, టీచర్ అనిత పాల్గొన్నారు. -
మంత్రి కార్యక్రమం వాయిదా
బచ్చన్నపేట: మండల కేంద్రంలో కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల నూతన భవన ప్రారంభ కార్యక్రమం వాయిదా పడినట్లు ఎంపీడీఓ మమతాబాయ్ తెలిపారు. రూ.2.30 కోట్లతో నిర్మించిన కేజీబీవీ పాఠశాల ప్రారంభోత్సవానికి శుక్రవారం మంత్రి సీతక్క రావాల్సి ఉండగా..వాయిదా వేసినట్లు చెప్పారు. కాగా, సాయంత్రం వరకు నాయకులు, అధికారులు వేచి ఉండగా వాయిదా పడడంతో వెనుదిరిగారు. రాజ్యాంగాన్ని రక్షించాలి జనగామ రూరల్: దేశంలో మతోన్మాదాన్ని తిప్పికొట్టి రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని మాజీ పార్లమెంట్ సభ్యురాలు సుభాషిణి అలీ అన్నారు. శుక్రవారం పట్టణంలో గిన్నిగడ్డలో ఆవాజ్ జిల్లా కార్యదర్శి ఎండీ అజారుద్దీన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముస్లిమ్ సమరయోధుల ఫొటో ఎగ్జిబిషన్ను ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా సుభాషిణి మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర పోరాటంలో హిందువులు ముస్లింలు కలిసి ఐక్యంగా బ్రిటీష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉందన్నారు. ముస్లిం సమరయోధుల పోరాట చరిత్రను ఆర్ఎస్ఎస్, బీజేపీ వక్రీకరించి ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంఏ గయాస్, అబ్దుల్ సమద్, ఎండి షబానా, ఇర్రి అహల్య, జోగు ప్రకాష్, ఎండీ దస్తగీర్, బొట్ల శేఖర్, బోడ నరేందర్, సుమ తదితరులు పాల్గొన్నారు బెల్ట్షాపు రూ.8.50 లక్షలు! రఘునాథపల్లి: గ్రామంలో బెల్ట్షాపు ఏర్పాటుకు నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. మండలంలోని ఫతేషాపూర్లో బెల్ట్షాపు, చికెన్ దుకాణం ఏర్పాటు కోసం శుక్రవారం ఏకంగా గ్రామ పంచాయతీ వద్దే వేలం నిర్వహించారు. బెల్ట్షాపు కోసం నిర్వహించిన వేలంలో 14 మంది పాల్గొన్నారు. రూ 8.50 లక్షలు చెల్లించేందుకు ఓ వ్యక్తి ముందుకొచ్చాడు. చికెన్షాపు ఏర్పాటు వేలం రూ.1.50 లక్షలు పలికింది. ఈ మొత్తం రూ.10 లక్షల డబ్బులను పంచాయతీ ఆధ్వర్యంలో మార్చిలో దుర్గమ్మ పండుగ వేడుకలకు, గ్రామాభివృద్ధికి వినియోగించాలని గ్రామపెద్దలు నిర్ణయించారు. ఇదిలా ఉంటే బెల్ట్షాపు ఏర్పాటుపై స్థానిక మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ భర్తలు, పిల్లలు మద్యానికి బానిసలవుతున్నారని వాపోతున్నారు. పక్కనున్న ఇబ్రహీంపూర్ గ్రామంలో ఏడేళ్లుగా సంపూర్ణ మద్యపాన నిషేదం అమలవుతోంది. అక్కడ బెల్ట్షాపులు ఏర్పాటు చేయొద్దని ఊరుమ్మడి నిర్ణయంతో పక్కాగా అమలవుతోంది. అక్కడ పండుగలు చేస్తలేరా..? అభివృద్ధి జరుగడం లేదా..? అని వాపోతున్నారు. మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం జఫర్గఢ్: మోడల్ స్కూల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీకాంత్ తెలిపారు. మండల కేంద్రంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. మోడల్ స్కూల్లో 6వ తరగతిలో 100 సీట్లతో పాటు 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలిపోయిన సీట్లకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 7 నుంచి 10వ తరగతులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుందన్నారు. హాల్ టికెట్లను ఏప్రిల్ 9వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులకు రూ.125, ఓసీ విద్యార్థులకు రూ.200 ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాతరను సక్సెస్ చేద్దాం వరంగల్ క్రైం: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను పోలీస్, ఆర్టీసీ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి సక్సెస్ చేద్దామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. ఈమేరకు సీపీ సన్ప్రీత్ సింగ్ పోలీస్, ఆర్టీసీ అధికారులతో శుక్రవారం కమిషనరేట్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. గత జాతరలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తిన ప్రాంతాలు, కారణాలతో పాటు, పోలీస్, ఆర్టీసీ సంయుక్తంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా మేడారం జాతరకు చేసిన ఏర్పాట్లపై ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయ భాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. భక్తుల రద్దీని గమనిస్తూ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. -
గెలిచే బలముంటేనే పోటీ!
జనగామ: పురపాలిక ఎన్నికల్లో క్యాడర్, ప్రజాబలం లేకుండా పోటీచేస్తే ఓటమి తప్పదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గెలిచే బలం ఉందా, ప్రజలు నమ్ముతారా, క్యాడర్ మన వెంట ఉన్నారా ఇవన్నీ చెక్ చేసుకుని పోటీలో నిలువాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాలన్నారు. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో జనగామ మండలం శామీర్పేటలోని ఓ ఫంక్షన్ హాల్లో డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన పట్టణ వార్డుల కార్యకర్తల సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.. స్థానికంగా ఎమ్మెల్యే లేకపోయినా, ఇటీవల సర్పంచ్ ఎన్నికల విజయోత్సాహం మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. మున్సిపాలిటీలోని 30 వార్డులను గెలవడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రతీ నాయకుడు ప్రజల్లో ఉంటూనే, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఓడిపోయే అవకాశమున్నవారు పోటీ కోసం ఎవరిపై ఒత్తిడి చేయొద్దని,పార్టీకి నష్టం జరగకుండా చూడాలని సూచించారు. జనగామ మునిసిపల్ 30 వార్డుల్లో గెలుపే లక్ష్యంగా ఇన్చార్జ్లను నియమించాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్ యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, కరుణాకర్రెడ్డి, కంచె రాములు, నిమ్మతి మహేందర్రెడ్డి, బడికె ఇందిర, వంగాల కళ్యాణిమల్లారెడ్డి, జంగి విద్యానాథ్, మాసపేట రవీందర్రెడ్డి, డాక్టర్ రాజమౌళి, పజ్జూరి జయహరి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల ప్రారంభం జనగామ పట్టణంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క శుక్రవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంకుస్థాపనలు చేశారు. జనగామ బైపాస్ రోడ్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుల విగ్రహాలు, ఆర్టీసీ బస్టాండ్ చౌరస్తాలో సూర్య నమస్కారాల శిల్పాలు, బతుకమ్మకుంటలో చిల్ట్రన్ పార్కు, జిమ్, కుంట మరమ్మతు పునరుద్ధరణ అభివృద్ధి పనులు, ఆర్అం డ్బీ బంగ్లా, మోడల్ మార్కెట్లను ప్రారంభించగా, నెహ్రూపార్కు 60 ఫీట్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు లకావత్త్ ధన్వంతి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి, అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, ఆర్డీఓ గోపిరాం, జెడ్పీ సీఈఓ మాధు రి షా, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి తదితరులు ఉన్నారు. వనితా టీ, స్నాక్స్ స్టాల్స్.. బతుకమ్మకుంటలో ఏర్పాటు చేసిన వనితా టీస్టాల్స్ను కలెక్టర్ రిజ్వాన్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పార్క్కు వచ్చే ప్రజలకు, చిన్నారులకు రుచికరమైన టీని, పౌష్టికాహారపు చిరుతిళ్లను అందించాలన్నారు. క్యాడర్, పబ్లిక్లో లేకుండా పోటీచేస్తే ఓటమి తప్పదు టికెట్ కోసం ఒత్తిడి చేయొద్దు జనగామ 30 వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగుర వేయాలి పార్టీ సమావేశంలో మంత్రి సీతక్క -
పాలకుర్తిలో కల్యాణ మండపం ప్రారంభం
పాలకుర్తి టౌన్: ప్రజాప్రభుత్వంలో మహిళల అభివృద్ధే తెలంగాణ ప్రగతి దిక్సూచి అని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క)అన్నారు. మండల కేంద్రంలోని ఇందిరా మహిళా శక్తి శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి కల్యాణ మండపాన్ని డీఆర్డీఏకు అప్పగించగా రూ.47లక్షలతో నిర్మించిన డైనింగ్ హాల్ను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డితో కలిసి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో సీతక్క మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడానికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి మాట్లాడుతూ..పాలకుర్తి నియోజకవర్గానికి ప్రజాప్రభుత్వం రూ.2వేల కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి, అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్,డీఆర్డీఓ పీడీ వసంత, అదనపు పీడీ నూరోద్దిన్, తహసీల్దార్ సరస్వతీ, ఎంపీడీఓ వేదవతి, డీఆర్డీఓ పల్లవి, మార్కెట్ చైర్పర్సన్ మంజుల, సర్పంచ్ కమ్మగాని విజయ పాల్గొన్నారు. శ్రీసోమేశ్వరాలయంలో మంత్రి పూజలు మండల కేంద్రంలోని శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి, కలెక్టర్ రిజ్వాన్ బాషా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, అర్చకులు స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. -
కల్లుతాగిన కోతుల్లా ప్రవర్తించారు
● మద్యం మత్తులో నా మీద దాడికి ప్రయత్నించారు ● కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మండిపాటుజనగామ: పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రాంభోత్సవ వేడకల్లో తరుచూ కాంగ్రెస్ నాయకులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి చేతుల మీదుగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేగా తనకు ఆహ్వానం పంపించగా, మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్న్తో కలిసి సీతక్కను మర్యాదపూర్వకంగా స్వాగతం పలికామన్నారు. కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావాలనే కొబ్బరికాయ కొట్టే సమయంలో గందరగోళం సృష్టించారు. కొందరు మద్యం మత్తులో వచ్చి, ఎమ్మెల్యే పల్లా గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ, కల్లుతాగిన కోతుల్లా కార్యక్రమాన్ని భగ్నం చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. జనగామ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కొమ్మూరి ప్రతాప్రెడ్డి కొడుకు ఆధ్వర్యంలో జరిగిన గుండాగిరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు పోకల జమునలింగయ్య, ఇర్రి రమణారెడ్డి, ఉల్లెంగుల సందీప్, రావెల రవి, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మేడారం.. గుడారం
మేడారంలో వెలిసిన గుడారాలుఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి: సుదూర ప్రాంతాల నుంచి మేడారం జాతరకు వచ్చే భక్తులు విడిది చేసేందుకు వ్యాపారులు పెద్ద ఎత్తున గుడారాలు ఏర్పాటు చేశారు. సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో సారలమ్మ వచ్చే ముందు రోజు స్వయంగా గుడారాలు ఏర్పాటు చేసేవారు. కానీ, ఇప్పుడు 15 రోజుల ముందు నుంచే ఏర్పాటు చేసి భక్తులకు అద్దెకిస్తున్నారు. వనదేవతలను దర్శించుకుని పిల్లాపాపలతో ఉండేలా ఇక్కడ అద్దె గదులు ఏర్పాటు చేశారు. వాటిలో సేద తీరితే 24 గంటలకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే టెంట్ సిటీ లగ్జరీతో ఏర్పాటు చేయగా మిగతా ప్రాంతాల్లో తాత్కాలిక పందిళ్లు వేశారు. తడకలు, బర్కాలు, పాలిథిన్ కవర్లు, గ్రీన్ మ్యాట్లతో అద్దె గదులు రూపొందించారు. వాటికి నంబర్లు వేసి భక్తులకు కేటాయిస్తున్నారు. మేడారం ఇప్పడు మెగాసిటీ మేడారం జాతరంటే ఒకప్పుడు చెట్లు, పుట్టలు. భ క్తులు తల్లులను దర్శించుకుని చెట్ల కింద వంటా వార్పు చేసుకొని అడవిలో మూడు రోజులపాటు గడిపేవారు. కంప్యూటర్ యుగంలో మేడారం ఇప్పుడు మెగాసిటీగా మారింది. చాలా మంది వ్యా పారులు జాతర సందర్భంగా మేడారంలోని స్థానిక భూములను గజాల చొప్పున అద్దెకు తీసుకుని గుడారాలు ఏర్పాటు చేశారు. కాంక్రీట్ భవనాలతో వందలాది అద్దె గదులు నిర్మించి కూడా భక్తులకు అద్దెకు ఇస్తున్నారు. ఇవేకాకుండా భవనాలపై తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసి అద్దెకు ఇస్తున్నారు. అద్దెకు ఉండే వారికి వేడి నీళ్లు, మొబైల్ చార్జింగ్, రెడీ టు ఫుడ్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ముందస్తు సందడి.. జాతరకు 15 రోజుల ముందు నుంచి మేడారంలో భక్తుల రద్దీ మొదలైంది. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా డెన్లు ఏర్పాటు చేశారు. జంపన్నవాగు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు, గద్దెల నుంచి చిలకలగుట్ట వరకు ఇరువైపులా గుడారాలు వెలిశాయి. 15 రోజుల క్రితం మూడు వేల వరకు ఉన్న జనాభా నేడు లక్ష వరకు పెరిగింది. ఏ రోడ్డు చూసినా పట్టణ ప్రాంతంగా దర్శనమిస్తోంది. భక్తుల రాకపోకలు మరింత పెరగడంతో ఏ గుడారాలు నిండుగా కనిపిస్తున్నాయి. జోరుగా వ్యాపారాలు మేడారం జాతరలో వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. భక్తుల కోసం ఏర్పాటు చేసిన గూడారాలు, తాత్కాలిక షెడ్లలో అనేక వ్యాపారాలు వెలిశాయి. ఇదే జోరులో వ్యాపారులు కొనసాగుతున్నాయి. కూల్డ్రింక్స్, వాటర్, రెస్టారెంట్ స్థాయిలో ఆహార పదార్థాలు లభిస్తున్నాయి. భక్తులు కుటుంబాలతో దర్శనం కోసం వచ్చి అన్నిరకాల సౌకర్యాలతో ఆహ్లాదాన్ని పొందుతున్నారు. రెండేళ్లకోసారి ఉపాధి మేడారం జాతర రెండేళ్లకోసారి రావడంతో వనదేవతలను దర్శించుకునే భక్తులు సేద తీరేందుకు అద్దె గదులు ఏర్పా టు చేస్తున్నాం. వాటిని ద్వారా మేం కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటాం. ప్రతీ జాతర మాకు జీవనోపాధి కల్పిస్తుంది. భక్తులను ఇంటి కుటుంబ సభ్యులు లాగానే చూసుకుంటాం. – సంకెపల్లి జైపాల్రెడ్డి, రెడ్డిగూడెం వేలాదిగా వెలిసిన తాత్కాలిక పందిళ్లు అడుగడుగునా భక్తులకు అద్దె గదుల స్వాగతం సౌకర్యాలపై ప్రత్యేక దృష్టిసారించిన వ్యాపారులుమేడారం, రెడ్డిగూడెం, ఊరట్టం, నార్లాపురం తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్థానికులు సైతం వారు ఉండే ఇళ్లను భక్తులకు అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటారు. భక్తులను ఆకట్టుకునేలా గుడారాలను తీర్చిదిద్దుతున్నారు. -
బడివేళకు బస్సేది?
జనగామ: జిల్లాలో రోడ్డు సౌకర్యం దాదాపు అన్ని గ్రామాలకు ఉంది. బస్సు సౌకర్యం సైతం చాలా గ్రామాలకు ఉంది. అయితే ఇప్పటికీ పలు మండలాల్లోని చాలా గ్రామాలకు బడి సమయానికి బస్సులు లేకపోవడంతో విద్యార్థులు నడిచి వెళ్లడమో, ఆటోలను ఆశ్రయించడమో జరుగుతోంది. అలాగే బస్సు సౌకర్యం లేని గ్రామాల విద్యార్థులు పక్క ఊరు బడికి వెళ్లడానికి తిప్పలు పడాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా ఆటోల్లో పరిమితికి మించి, ప్రమాదకరరీతిలో విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. గతంలో పలు ప్రమాదకర ఘటనలు సైతం జరిగాయి. కాగా, ఆర్టీసీ అధికారులతో మాట్లాడి తమ తమ నియోజకవర్గాల పరిధిలో సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అయితే, జిల్లాలో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే సమయంతో పాటు తిరుగు ప్రయాణంలో బస్సు సమస్య లేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 5కి.మీ. నడవాల్సిందే.. బచ్చన్నపేట: మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు వచ్చే మన్సాన్పల్లి గ్రామ విద్యార్థులు లింగంపల్లి గ్రామం వరకు 5 కిలోమీటర్లు నడిచి వచ్చి బస్సు ఎక్కి వస్తున్నారు. మళ్లీ అక్కడ దిగి సాయంత్రం కూడా నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు.పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మండలంలోని పలుగ్రామాల నుంచి 100 మంది విద్యార్థులు ప్రతి రోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుంటారు. అయితే రాజీవ్ చౌరస్తాలో బస్సులు ఆగకుండా నేరుగా బస్టాండ్లో దించడంతో అక్కడి నుంచి పాఠశాలకు వరకు నడవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. రోడ్డు ఉన్నా బస్సు సౌకర్యం లేని పలు గ్రామాలు చదువుకోవాలంటే రెండు, మూడు కి.మీ. నడవాల్సిందే ఆటోల్లో ప్రమాదకర ప్రయాణంతో భయాందోళనలో తల్లిదండ్రులు పాఠశాల విద్యార్థుల కోసం బస్సులు నడపాలని వేడుకోలులింగాలఘణపురం: బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రతీ రోజు ఆటోల్లోనే బడికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో చదువుకొనే నాగారం, మాణిక్యాపురం, కళ్లెం, సిరిపురం గ్రామాల విద్యార్థులు సైకిళ్లు, ఆటోల్లోనే వెళ్తున్నారు. నాగారం గ్రామం నుంచి మూడు ఆటోల్లో సుమారు 50 మందికి పైగా అదేవిధంగా సిరిపురం, కళ్లెం, మాణిక్యాపురం గ్రామాల విద్యార్థులు సుమారు మరో 50 మంది ఆటోలు, సైకిళ్లపై వెళుతున్నారు. మండల కేంద్రానికి నాగారం, కళ్లెం, మాణిక్యాపురం నుంచి బీటీ రోడ్డు ఉన్నప్పటికీ బస్సు సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. నర్మెట: మల్కపేట, బొమ్మకూర్, ఆగాపేట, ఇప్పలగడ్డ తదితర గ్రామాల విద్యార్థులు మండలకేంద్రానికి రావాల న్నా, హన్మంతాపురం వెళ్లాలన్నా ఆటోలను, ద్విచక్ర వాహనదారులను ఆశ్రయించాల్సిందే లేదంటే నడక సాగించాల్సిందే. రోడ్డుసౌకర్యాలు ఉన్నా బస్సులు లేకపోవడంతో వారికి తిప్పలు తప్పడంలేదు. -
ట్రిప్పులు తగ్గించారు..
రెండేళ్ల క్రితం ఉన్న ఆర్టీసీ బస్సు ట్రిప్పులు, రూట్లను ప్రస్తుతం తగ్గించారు. బడి పిల్లల అవసరమున్న చోట ఆపడం లేదు. పెంబర్తి తదితర ప్రాంతాలు, స్కూల్స్ వద్ద ఇదే పరిస్థితి పునరావృతం అవుతోంది. బడుల సమయానుకూలంగా బస్సు సర్వీసులను నడిపించాలి. ఈ విషయమై రాష్ట్రస్థాయి ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్తా. – పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే,జనగామ నియోజకవర్గంలో గతంతో పోలిస్తే ప్రస్తుతం రోడ్లు, ఆర్టీసీ బస్సుల విషయమై పెద్దగా సమస్య లేదు. నేను మొదటి నుంచి విద్యారంగానికి పెద్దపీట వేస్తాను. విద్యార్థులకు రవాణా విషయమై వాస్తవంగా సమస్య ఉంటే ఆర్టీసీ అధికారులతో చర్చించి పరిష్కరించేలా కృషి చేస్తా. –కడియం శ్రీహరి, ఎమ్మెల్యే, స్టేషన్ఘన్పూర్ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు ఇబ్బంది కలుగనివ్వకుండా చూస్తా.. వారి భద్రత, చదువు దృష్టిలో పెట్టుకొని, రాజీవ్ చౌరస్తా సమీపంలో విద్యార్థులు ప్రయాణించే బస్సులను అపాడానికి ఆర్టీసీ ఆధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటాం. – యశస్వినిరెడ్డి, ఎమ్మెల్యే, పాలకుర్తి జిల్లాలో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే సమయంతో పాటు తిరుగు ప్రయాణంలో బస్సు సమస్య లేదు. విద్యార్థులు వెళ్లు స్టేజీ నుంచి కిలోమీటరు నుంచి కిలోమీటరున్నర వరకు కనెక్టివిటీ లేని సమయంలో అక్కడ వరకే ఎండ్ పాయింట్ ఉంటుంది. మా వద్ద ఒక్క దరఖాస్తు పెండింగ్ లేదు. – స్వాతి, మేనేజర్, జనగామ ఆర్టీసీ డిపో


