breaking news
Jangaon
-
క్రీడలతో శారీరక దృఢత్వం పెంపు
జనగామ రూరల్: క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం పెంపొందుతుందని, విద్యార్థులు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవర్చుకుంటే భవిష్యత్తులో గొప్పవారవుతారని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 11వ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహించుకోవడం గర్వకారణమన్నారు. విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి లక్ష్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. జాయింట్ సెక్రటరీ బి.సక్రునాయక్, డీఎస్సీడీఓ డాక్టర్ బి.విక్రమ్, డీఐఓ కె. జితేందర్రెడ్డి, ఎంపీడీఓ బి.మహేశ్, ఎంఈఓ జి.శంకర్రెడ్డి, మల్టీజోన్–1 ఆఫీసర్ అరుణకుమారి, జోనల్ ఆఫీసర్ ఎస్.విద్యారాణి, ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ అలగోని నర్సింహులు, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ జి. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. రసాయన రహిత సాగుపై అవగాహన కల్పించాలి ప్రతి గ్రామంలో ప్రతి రైతుకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ అభ్యసించిన కృషి సఖీలకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమం కలెక్టరేట్లోని వీసీ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..మండల సమాఖ్య సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రధాన అజెండాగా తీసుకొని, అంగన్వాడీ కేంద్రాలు పాఠశాల స్థాయిలో కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొదటి విడతగా 1875 మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించామననారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, నాబార్డ్ ఏజీఎం చైతన్య రవి తంగ, వ్యవసాయ అధికారి శరత్ చంద్ర , డీఆర్డీఏ జిల్లా అధికారి వసంత, అసిస్టెంట్ డీఆర్డీఏ అధికారి నిరుద్దీన్, డీపీఎం నళిని , మారి స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రాం కార్యకర్తలు మారపాక వెంకటస్వామి, మల్కాపురం ప్రమోద్, రావుల రాజేందర్, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ చెవ్వ కరుణాకర్ పాల్గొన్నారు. ఇంటి నుంచే యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియాని బుక్ చేయడం ద్వారా రైతులకు సాఫీగా సమర్థవంతంగా అందుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. యూరియా బుకింగ్ యాప్ అమలుపై కలెక్టర్ అధ్యక్షతన వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈనెల 20వ తేదీ నుంచి జిల్లాలో యూరియా అమ్మకాలు పూర్తిగా బుకింగ్ యాప్ ద్వారానే జరగాలన్నారు. జిల్లాలోని ప్రతి యూరియా విక్రయ కేంద్రంలో రైతు రిజిస్టర్ నిర్వహణ తప్పనిసరి అని యూరియా పొందే ప్రతి రైతు పేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, పంట వివరాలు, యూరియా బుకింగ్ ఐడీని తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. జనగామ: జిల్లాలో మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేసిన వివిధ శాఖల అధికారులను కలెక్టర్ అభినందించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు సహకరించిన పోలీసు, రెవెన్యూ, పంచాయతీ, విద్యాశాఖ, మాస్టర్ ట్రైనర్లు, పీవో, ఓపీవో, మైక్రో అబ్జర్వర్లు, జోనల్, రూట్ అధికారులు, హెల్త్, అంగన్వాడీ టీచర్లు, విద్యుత్, జిల్లా గ్రామీణభివృద్ధి శాఖతో పాటు ఎలక్షన్ విధుల్లో భాగస్వామ్యం పంచుకున్న అన్ని శాఖల అధికారులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ 11వ రాష్ట్రస్థాయి గురుకుల క్రీడలు ప్రారంభం -
నవశకం
పల్లెపాలనలో జనగామ: గ్రామ పాలనలో కొత్త శకం ఆరంభమైంది. జిల్లాలోని జనగామ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో 96 శాతం మందికి తొలిసారి సర్పంచ్గా అవకాశమొచ్చి, గ్రామ రాజకీయాలకు తాజా దిశను అందించనున్నారు. కొంగొత్త గ్రామ సచివాలయాల్లో అడుగుపెట్టి అభివృద్ధి లక్ష్యాలను ముందుకు నడి పేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతీ గ్రామ అభివృద్ధిలో నూతన సర్పంచ్ల పాత్ర కీలకంగా మారనుండగా, అనుభవం కన్నా ఆత్మవిశ్వాసానికి ప్రజలు మద్దతు తెలిపిన తీరు ప్రత్యేకంగా నిలిచింది. జిల్లాలో గ్రామ రాజకీయాలు చారిత్రక మలుపు తిరిగాయి. స్టేషన్ ఘన్న్పూర్, జనగామ, పాలకుర్తి నియోజకవర్గాల్లో మూడు విడతల్లో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 280 సర్పంచ్ స్థానాలకు గాను 269 స్థానాల్లో కొత్త ముఖాలే గెలుపొందడం జిల్లా చరిత్రలోనే రికార్డుగా నిలిచింది. కేవలం 11 మంది మాత్రమే గతంలో సర్పంచ్గా పని చేసిన వారు తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందగలిగారు. ఈ నెల 22న బాధ్యతలు స్వీకరించనున్న కొత్త సర్పంచులు, ఇకపై ఐదేళ్ల పాటు గ్రామ పరిపాలన భవిష్యత్తును నిర్దేశించనున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 96.07 శాతం స్థానాల్లో కొత్త నాయకత్వానికే ప్రజలు పట్టం కట్టడం గ్రామాల్లో మార్పుపై ఉన్న ఆకాంక్షను స్ప ష్టంగా చూపిస్తోంది. వీరిలో కొందరు ఉన్నత విద్య ను అభ్యసించిన వారు కాగా, మరి కొందరు మధ్యస్థాయి విద్యతో గ్రామ రాజకీయాల్లోకి అడుగుపెట్టా రు. ఇంకొందరికి పంచాయతీ పరిపాలనపై పూర్తి స్థాయి అనుభవం లేకపోయినా, ప్రజల నమ్మకమే తమ బలమని భావిస్తూ బాధ్యతలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. అనుభవం లేకున్నా, ప్రజల సమస్యలపై అవగాహన పెంచుకోవడం, అధికార యంత్రాంగంతో సమన్వయం సాధించడం ద్వారా సమర్థవంతమైన పాలన అందించాల్సిన అవసరం ఉంది. రాబోయే ఐదేళ్లపాటు గ్రామాభివృద్ధి దిశగా వారి నిర్ణయాలే కీలకంగా మారనున్నాయి. గ్రామాల్లో శానిటేషన్ నిర్వహణ, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలు, రహదారులు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమైనది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను సక్రమంగా వినియోగించడంతో పాటు, అవసరమైన చోట ఎమ్మెల్యేలు, ఎంపీల సహకారంతో అదనపు బడ్జెట్ను తీసుకురావడంలో చురుకుదనం చూపాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిధులు గ్రామ ప్రజల కనీస అవసరాలను తీర్చేలా ఖర్చు చేయడమే కాకుండా, దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికా బద్ధంగా పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని మేధావులు సూచిస్తున్నారు. ఎన్నో ఆశలతో ఓట్లు వేసి గెలిపించిన గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కొత్త సర్పంచుల ముందున్న అతిపెద్ద సవాల్. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పారదర్శక పాలన అందించినప్పుడే ప్రజల మెప్పు పొందగలరు. ప్రతి రూపాయి గ్రామ అభివృద్ధికే ఖర్చు చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్లినప్పుడే నిజమైన ప్రజాప్రతినిధులుగా గుర్తింపు దక్కుతుంది. జిల్లా గ్రామ రాజకీయాల్లో వచ్చిన ఈ మార్పు గ్రామాభివృద్ధికి మేలు కలిగించేలా ఉండాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సర్పంచుల పాలన గ్రామాలకు సుభిక్షం తీసుకురావాలని, ప్రజలకు చేరువైన పాలనతో జిల్లాకు ఆదర్శంగా నిలవాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. కొత్త నాయకత్వానికి ఇది ఒక గొప్ప అవకాశం..అదే సమయంలో చరిత్రను మార్చే బాధ్యత కూడా ఎక్కువే అంటున్నారు. -
పతుల రాజకీయంలో సతులే సర్పంచులు
దేవరుప్పుల: ఒక్క సారి కాదు..రెండోసారి కూడా పతులు రాజకీయం చేస్తే అనివార్యంగా రెండోసారి సతులు సర్పంచ్లు కావడం ప్రత్యేకత సంతరించుకుంది. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని మున్పహాడ్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పదిహేను ఏళ్ల కిందట బీసీ మహిళ రిజర్వ్ కావడంతో అనివార్యంగా తన భార్య బాలమ్మ బరిలో నిలిపి గెలిచారు. ఇలాగే ధర్మగడ్డతండాకు చెందిన బీఆర్ఎస్ మండల నాయకుడు భూక్య జనార్దన్ గతంలో ఎస్టీ మహిళ రిజర్వు కావడంతో టీడీపీ నుంచి ఆయన భార్య అరుణకు సర్పంచ్ పదవి వరించింది. ఈ ఎన్నికల్లో సైతం మున్పహాడ్, ధర్మగడ్డతండా గ్రామాలు సర్పంచ్ మహిళ రిజర్వు కావడంతో మరోసారి వారి భార్యలను బరిలో నిలిపి సర్పంచ్లుగా గెలిపించుకున్నారు.పారుపెల్లి బాలమ్మ శ్రీనివాస్, భూక్య అరుణ జనార్దన్ -
ఎట్టకేలకు ఇప్పగూడెం ఉపసర్పంచ్ ఎన్నిక
స్టేషన్ఘన్పూర్: మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఇప్పగూడెం ఉపసర్పంచ్ ఎన్నిక ఎట్టకేలకు జరిగింది. మండలంలో సమస్యాత్మక గ్రామంగా ఉన్న ఇప్పగూడెంలో నూతనంగా ఎన్నికై న వార్డు సభ్యుల మధ్య సయోధ్య లేక వరుసగా నాలుగుసార్లు ఉపసర్పంచ్ ఎన్నిక వాయిదా పడిన విషయం విదితమే. పోలింగ్ జరిగిన ఈనెల 11న, అనంతరం 12న, 15న, 16వ తేదీన వరుసగా నాలుగుసార్లు ఉపసర్పంచ్ ఎన్నిక కోసం ఎంపీడీఓ, ఆర్ఓ, పంచాయతీ అఽధికారులు ప్రయత్నించినా వార్డుసభ్యుల మధ్య సయోధ్య లేక వాయిదా పడింది. గ్రామంలో కాంగ్రెస్, సీపీఎం పొత్తుతో ఎన్నికల్లోకి వెళ్లగా కాంగ్రెస్, సీపీఎం బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అదేవిధంగా ఆరు వార్డులు కాంగ్రెస్, ఆరు వార్డులు సీపీఎం కై వసం చేసుకున్నాయి. ముందస్తు ఒప్పందం మేరకు సీపీఎంకు ఉపసర్పంచ్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. అయితే సీపీఎం నుంచి గెలిచిన ఆరుగురు వార్డు సభ్యులలో 5, 6, 11వ వార్డుల నుంచి గెలుపొందిన వారు ఉపసర్పంచ్ కోసం పట్టుబట్టగా నాలుగుసార్లు ఉపసర్పంచ్ ఎన్నిక వాయిదా పడింది. ఉపసర్పంచ్గా లింగనబోయిన రాజు ఎట్టకేలకు ఉపసర్పంచ్ ఎన్నిక జరుగగా సీపీఎం బలపర్చిన అభ్యర్థిగా ఆరో వార్డు నుంచి గెలుపొందిన లింగనబోయిన రాజు ఉపసర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపసర్పంచ్ ఎన్నిక కోసం చివరి అవకాశంగా ఎంపీడీఓ నర్సింగరావు, పంచాయతీ కార్యదర్శులు నరేశ్, సత్యనారాయణ గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు వార్డు సభ్యులకు సమయం ఇవ్వగా గడువు సమయానికి సరిగ్గా పదినిమిషాల ముందు కాంగ్రెస్, సీపీఎం నాయకులతో కలిసి నూతన సర్పంచ్ మందపురం రాణిఅనీల్, 11 మంది వార్డుసభ్యులు గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. మొత్తంగా 12 వార్డులకు గాను ఐదో వార్డు సభ్యుడు పోలాసు పద్మాకర్ గైర్హాజరయ్యారు. కాగా ఉపసర్పంచ్గా రాజును వార్డు సభ్యుడు మంద మహేందర్ ప్రతిపాదించగా మరో వార్డు సభ్యుడు కత్తుల రాజయ్య బలపర్చారు. దాంతో ఏకగ్రీవంగా లింగనబోయిన రాజు ఉపసర్పంచ్గా ఎన్నికై నట్లు మండల ఎన్నికల అధికారి, ఎంపీడీఓ నర్సింగరావు ప్రకటించారు. దాంతో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్, సీపీఎం శ్రేణులు బాణాసంచాలు కాల్చి సంబురాలు చేసుకున్నాయి. ఏకగ్రీవంగా ఎన్నికై న లింగనబోయిన రాజు -
ఫలితం తారుమారు!
జనగామ: జిల్లాలో మూడు విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం, చెల్లని ఓట్లు, నోటా వినియోగం కీలక చర్చనీయాంశంగా మారింది. స్టేషన్ఘన్పూర్, జనగామ, పాలకుర్తి మూడు నియోజకవర్గాల్లో మొత్తం 3,90,945 మంది ఓటర్లు ఉండగా, అందులో 3,44,040 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 46,905 మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉండి పోగా, నోటా, చెల్లని కేటగిరీలో 15,419 ఓట్లు ఉన్నాయి. 100 ఓట్లలో ఒకటి నోటాకు, ప్రతి వంద ఓట్లకు 3.6 శాతం మేర ఓట్లు చెల్లనివిగా ఉన్నాయి. సర్పంచ్..వార్డులకు ఇలా.. జిల్లాలో 280 గ్రామ పంచాయతీలు, 2,534వార్డుల పరిధిలో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ అభ్యర్థులకు వేసే ఓటులో నోటాకు 1,203, చెల్లని ఓట్లు 6,098 నమోదయ్యాయి. వార్డు సభ్యుల నోటాకు 1,681, చెల్లని ఓట్లు 6,437 నమోదయ్యాయి. సర్పంచ్, వార్డు సభ్యులకు కలుపుకుని 15,419 ఓట్లు నోటా, చెల్లనివిగా ధ్రువీకరించగా, అభ్యర్థులకు ఉపయోగం లేకుండా పోయాయి. మొత్తం మీద పోలైన ఓట్లలో నోటాకు వచ్చిన ఓట్లు 2,884, చెల్లని ఓట్లు 12,535 ఉన్నట్లు తేల్చారు. ఈ లెక్కన ఓటర్ల ఆలోచనా తీరు, మరి కొందరిలో అవగాహన లేకపోవడం, ఆసక్తి తగ్గుదలపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. బరిలో ఉన్న సర్పంచ్, వార్డు అభ్యర్థులకు నోటా, చెల్లని ఓట్లు నిర్ణయాత్మక దశలో భారీ నష్టాన్నే మిగిల్చినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక్క ఓటే విజయం లేదా ఓటమిని నిర్ణయించే సమయంలో వేలాది ఓట్లు నోటా, చెల్లనివిగా రావడం విజయాన్ని తలకిందులు చేశాయి. జిల్లాలో పోలింగ్ శాతం అత్యధికంగా 88శాతం ఉండటం మంచిదే అయినప్పటికీ, పోలింగ్కు దూరంగా ఉన్న ఓటర్లతో పాటు చెల్లని, నోటా వచ్చిన సంఖ్య వందలాది మంది అభ్యర్థుల ఆఽశలను ఆవిరి చేసింది. ఓటర్లలో ఓటు వేయడంపై అవగాహన ఉన్నా, సరైన గుర్తుపై ముద్ర వేయడంలో తడబాటు పడడంతో ఆ ఓటును పక్కనబెట్టారు. నోటా వినియోగం చాలా తక్కువే అయినా, ఇది ప్రజాభిప్రాయానికి సూచనగా భావిస్తున్నారు. పొరపాటు ఎక్కడ జరిగింది...? ఓటర్లు గుర్తుపై ముద్ర వేయడంలో పొరపాట్లు చేయడం, బ్యాలెట్ పత్రాలు అర్థం కాని పరిస్థితిలో వార్డు, సర్పంచ్ ఓటింగ్ విధానంపై స్పష్టత లేకపోవడంతో పెద్ద సంఖ్యలో ఓట్లు చెల్లనివిగా మిగిలిపోయాయి. ఇలా జరగని పక్షంలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూసిన అభ్యర్థుల విజయం పూర్తిగా మారిపోయే అవకాశం ఉండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్కు ముందు అవగాహన కార్యక్రమాల నిర్వహణలో అలసత్వం, ఓటర్లు బ్యాలెట్ నియమాలు అర్థం చేసుకునేలా చర్యలు తీసుకోకపోవడం కూడా కా రణంగా పేర్కొంటున్నారు. బరిలో ఉన్న అభ్యర్థులు కూడా ఇంటింటా ప్రచారం చేసే సమయంలో ఓటింగ్ విధానం గురించి సరైన మార్గదర్శకత్వం ఇవ్వడంలో విఫలమయ్యారు. ఈ రెండు వైఫల్యాలే వేలాది ఓట్లను వృథా చేశాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రతీ ఓటు విలువైనదే కానీ ఈ ఎన్నికల్లో ఓటర్ల ఆసక్తి ఉన్నప్పటికీ అవగాహన లోపం కారణంగా అమూల్యమైన ఓట్లు లెక్కలోకి రాకుండా పోవడం ఓటమి చవిచూసిన అభ్యర్థులను నిరాశ మిగిల్చింది. ప్రభావం చూపిన నోటా, చెల్లని ఓట్లు స్వల్ప ఓట్లతో ఓడినవారికి నిరాశ పోలింగ్కు దూరంగా 46వేల మంది -
సమన్వయంతో ఎన్నికలు ప్రశాంతం
వరంగల్ క్రైం: అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించడంతో కమిషనరేట్ పరిధిలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగా యని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. గురువారం డీసీపీలు అంకిత్కుమార్, రాజమహేంద్రనాయక్, కవిత సీపీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేసి శుభా కాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ సన్ప్రీత్సింగ్ మాట్లాడుతూ డీసీపీ నుంచి మొదలుకొని హోంగార్డు స్థాయి వరకు అందరూ ప్రణాళికాబద్ధంగా పనిచేశారని తెలిపారు. పో లింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించి ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేశామని పేర్కొన్నారు. పెంబర్తి ఏఐఎఫ్ సైన్స్ ల్యాబ్ పరిశీలనజనగామ రూరల్: జిల్లాలో విద్యా మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ గురువారం మండలంలోని పెంబర్తి పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏఐఎఫ్ సైన్స్ ల్యాబ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ల్యాబ్లో ఉన్న పరికరాలు, విద్యార్థులకు ప్రయోగాత్మకంగా అందుతున్న శిక్షణ, బోధనా విధానాలు ల్యాబ్ వినియోగంపై అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో ఆధుని క సైన్స్ ల్యాబ్లు విద్యార్థుల విజ్ఞానాభివృద్ధికి దోహదపడతాయన్నారు. పనులు వేగవంతంగా పూర్తి చేయండి లింగాలఘణపురం: కేజీవీబీలో ఇటీవల మంజూరైన మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పింకేశ్కుమార్ ఆదేశించారు. మండలంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో రూ.42 లక్షలతో జరుగుతున్న అదనపు గది, సీసీ డ్రైన్, టాయిలెట్స్ నిర్మాణం, కిచెన్ గదిలో మరమ్మతు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ విష్ణుమూర్తి, ఏఎంఓ శ్రీనివాసు, జీసీడీఓ గౌసియాబేగం, డీఈ రవీందర్, ఏఈ వెంకటనర్సు, స్పెషల్ ఆఫీసర్ అన్నపూర్ణ ఉన్నారు. నేడు నర్మెటలో విద్యుత్ వినియోగదారుల సదస్సుజనగామ: నర్మెట విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో సేవలు అందిస్తున్న వినియోగదారుల సమస్యలపై టీజీఎన్పీడీసీఎల్ వినియోగదారుల ఫోరం (సీజీఆర్ఎఫ్ఐ) సమావేశం ఈనెల 19న(శుక్రవారం) నిర్వహించడం జరుగుతుందని డీఈ లక్ష్మినారాయణరెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ సబ్స్టేషన్ ప్రాంగణంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సదస్సు జరుగుతుందన్నారు. ఇందులో ట్రాన్స్ఫార్మర్ మార్పులు, మోటార్ మార్చడం, లైన్ల హార్డువేర్ సమస్యలు, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మెరుగులు, మీటర్ మార్పులు, సరఫరా నాణ్యత, బిల్లుల సవరణ, బిల్లుల వివాదాలు వంటి అనేక అంశాలపై వినియోగదారులు ఫోరానికి వినతి చేసుకోవచ్చన్నారు. సీజీఆర్ఎఫ్ఐ ఫోరం చైర్మన్ ఎన్వీ వెంకటగోపాలచారి (8712481311), టెక్నికల్ సభ్యుడు కె.రమేశ్ (8712481314), ఫైనాన్న్స్ సభ్యుడు ఎన్.దేవేందర్ (8712481316), స్వతంత్ర సభ్యుడు ఎం.రామారావు (8712481485) సదస్సుకు హాజరుకానున్నట్లు తెలిపారు. నేటి నుంచి ‘మాస్టర్ప్లాన్’ డ్రోన్ సర్వేజనగామ: జనగామ పట్టణ అభివృద్ధిలో అమృత్–2.0లో భాగంగా జీఐఎస్ బేస్డ్ కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు ఈనెల 19(శుక్రవారం) నుంచి డ్రోన్ సర్వేను 20వ తేదీ వరకు రెండు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్కు చెందిన మెస్సర్ ఆర్ఎస్ఐ సాఫ్ట్టెక్ ప్రతినిధులు జనగామకు రానున్నట్లు తెలిపారు. పట్టణ పరిపాలన, ట్రాఫిక్, ప్రజాసౌకర్యాలు, రోడ్లు, ఇంటి నిర్మాణాలు, పార్కులు, వాటర్ డ్రైనేజీ వ్యవస్థ వంటి అంశాలపై సమాచారాన్ని కచ్చితత్వంతో సేకరించడం దీని ఉద్దేశమన్నారు. డ్రోన్ సర్వే సమయంలో ఇళ్ల పైకప్పులపై ఎలాంటి కార్యకలాపాలు చేయరాదన్నారు. జనగామ పట్టణాభివృద్ధి కోసం చేపట్టబోయే డ్రోన్ సర్వే ఒక కీలక అడుగని, సర్వే విజయవంతం అయ్యేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. -
కోర్టు తీర్పు మోదీ, అమిత్షాకు చెంపదెబ్బ
● డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి జనగామ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదును కోర్టు కొట్టివేయడం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాకు చెంపదెబ్బలాంటిదని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి అన్నారు. గురువారం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, మోదీ, అమిత్షా నిరంకుశ వైఖరిని నిరసిస్తూ జనగామ ఆర్టీసీ చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాతో పాటు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ కేసులో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని కోర్టు స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీపై కక్ష సాధింపు రాజకీయాలే లక్ష్యంగా ఈడీ ద్వారా కేసులు నమోదు చేయించారని మండిపడ్డారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్, నాయకులు చెంచారపు బుచ్చిరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, ఇందిర, ఉడుత రవి, లింగాల నర్సింరెడ్డి, గౌస్, స్టాలిన్, కృష్ణ ఉన్నారు. -
చేతులెత్తేశారు..
జనగామ: జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అర్ధరాత్రి రవాణా లేక, సమయానికి భోజనం అందక, వీల్ఛైర్ సేవలు కరువై అధికారులు, ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బచ్చన్నపేట బూత్లో వృద్ధ మహిళ జారి పడగా, ఏర్పాట్లలో లోపాలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. మొదటి విడత పోలింగ్ సమయంలో స్టేషనన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని చిల్పూరు మండలంలో పోలింగ్ విధులు నిర్వహించిన పీఓలు, ఓపీఓలు సహా ఇతర సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలింగ్ ముగిసిన అనంతరం అర్ధరాత్రి 12 గంటలకు తిరుగు ప్రయాణం కోసం అధికారులు, సిబ్బంది మండల కేంద్రానికి చేరుకున్నారు. అయితే, అక్కడి నుంచి జనగామకు రవాణా సౌకర్యంలేదని మండల అధికారులు చేతులెత్తేశారు. కూర్చునే వీలులేని దయనీయ స్థితిలో ఎలక్షన్ అధికారులు రోడ్డుపైనే నిలబడి పోయారు. ఈ విషయమై స్థానిక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అందులో కొందరు అధికారులు జనగామ సాక్షి దృష్టికి తీసుకు రాగా, వెంటనే జిల్లా కలెక్టర్కు సమాచారం అందించగా, ఆయన ఆదేశాల మేరకు అర్ధరాత్రి ఒంటిగంటకు ఓ బస్సు ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఆదేశించినప్పటికీ, స్టేషన్ ఘన్పూర్ వరకే తీసుకెళ్తామని చెప్పడంతో సిబ్బంది మరింత ఆగ్రహం వ్యక్తం చేయడంతో జనగామ వరకు తీసుకొచ్చారు. కొడకండ్లలో తీవ్ర నిర్లక్ష్యం మూడవ విడతలో పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్లలో విధులు నిర్వర్తించిన సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారికి తాగునీరు, టీ, భోజనం వంటి సౌకర్యాలు లేక రాత్రి 11.30 గంటల వరకు ఆకలితోనే ఉండాల్సి వచ్చింది. ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని నినదిస్తూ, వెంటనే కలెక్టర్ రావాలని బూత్ ప్రాంగణంలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. పరిస్థితి చేయిదాటిపోయే అవకాశం ఉండడంతో జీపీ చెత్త సేకరణ ట్రాక్టర్లో ఓ సంచిలో అన్నం ప్యాకెట్లను వేసుకుని తీసుకొచ్చారు. ఇలాంటి వాటిలో ఎలా తినాలి, మధ్యాహ్నం నుంచి కడుపు మండిపోతోంది, షుగర్, బీపీలాంటి సమస్యలతో బాధపడేవారు ఉన్నారు, ఇదేనా ఎన్నికల్లో సిబ్బందిపై శ్రద్ధ అంటూ మండిపడ్డారు. కాగా జనగామలో రిజర్వులో ఉన్న పలువురు ఎలక్షన్ అధికారులకు రూ.1,500 ఇవ్వాల్సి ఉండగా, రూ.1,000తో సరిపెట్టే సమయంలో సదురు అధికారిని నిలదీయడం, పలు ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు అక్కడకు రావడంతో మిగతా డబ్బులు ఇవ్వడంతో గొడవ సద్దుమణిగినట్లు తెలిసింది. పోలింగ్ విధులు నిర్వర్తించే పీఓ, ఓపీఓ, ఇతర సిబ్బంది ఇంతటి స్థాయిలో ఇబ్బంది పడేలా చేసే ఎలక్షన్ అధికార గణం.. విధులకు గైర్హాజరైతే షోకాజ్ నోటీసుల పేరిట హెచ్చరిడం భావ్యం కాదని వాపోతున్నారు. ఎన్నికలు మూడు విడతలుగా విజయవంతంగా ముగిశాయి. అయినప్పటికీ అనేక ప్రాంతాల్లో రవాణా, భోజనం, విశ్రాంతి వంటి ప్రాథమిక సదుపాయాల్లో లోపాలు వెలుగుచూశాయి. పోలింగ్ సిబ్బందికి సౌకర్యాలు కల్పించడంలో అధికారుల విఫలం మూడు విడతల్లో తప్పని తిప్పలు అర్ధరాత్రి రవాణా సౌకర్యం కల్పించకపోవడంతో ఇక్కట్లు సరైన భోజనం పెట్టకపోవడంతో పస్తులు -
తరలొచ్చారు!
● మూడో విడత పంచాయతీ పోరులో 88.48 శాతం పోలింగ్ నమోదు ● మహిళ–పురుష ఓటర్ల సమాన స్పందన ● జిల్లాలో మూడు విడతల్లో కలిపి 88.90శాతం ఓటింగ్జనగామ: పాలకుర్తి నియోజకవర్గంలోని మూడు మండలాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైంది. పోలింగ్ ముగిసే సమయానికి మూడు మండలాల పరిధిలో 88.48శాతం నమోదైంది. దేవరుప్పుల మండలం 90.10శాతంతో అగ్రస్థానంలో నిలవగా, పాలకుర్తి మండలంలో 88.19శాతం, కొడకండ్లలో 86.29శాతం ఓటింగ్తో గ్రామీణ ఓటర్ల ప్రజాస్వామ్య చైతన్యానికి నిలువుటద్దంలా నిలిచారు. మూడు మండలాల్లో మొత్తం 1,17,381 మంది ఓటర్లలో 89శాతానికి చేరువగా ఓటింగ్ నమోదై స్టేషన్ఘన్పూర్ తర్వాత రెండో స్థానం దక్కించుకుంది. జిల్లాలో మూడు విడతల్లో కలిపి 88.90శాతం పోలింగ్ నమోదైంది. గంట గంటకూ పెరిగిన శాతం మూడు మండలాల పరిధిలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓటర్ల రద్దీ కనిపించింది. ఉదయం 9 గంటల ట్రెండ్ చూస్తే మూడు మండలాల్లో కలిపి 25.01 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రారంభ సమయంలో దేవరుప్పుల, పాలకుర్తి మండలాల్లో ఓటర్లు పెద్దఎత్తున తరలిరాగా, కొడకండ్లలో మాత్రం కాస్తా వేగంగా పుంజుకుని ఉదయం 11 గంటల కల్లా ఓటింగ్ శాతం రెట్టింపు పెరిగింది. అప్పటి వరకు మూడు మండలాల్లో కలిపి 51.82 శాతం ఓట్లు నమోదయ్యాయి. పోలింగ్ ముగిసే సమయం మధ్యాహ్నం 1 గంటకు 83.27 శాతం ఓట్లు పోలు కాగా, చివరికి సాయంత్రం ముగిసే సమయానికి మొత్తం కలిపి 88.48 శాతం ఓటింగ్ వద్ద ముగిసింది. మండలాల వారీగా.. దేవరుప్పుల మండలంలో ఉదయం నుంచి పెరిగిన ఓటర్ల వేగం మధ్యాహ్నానికి గరిష్ఠ స్థాయికి చేరింది. చివరికి 90.10శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో అత్యధిక రికార్డు ఇదే. కొడకండ్ల మండలంలో ఆరంభంలో మందగించిన పోలింగ్ 11 గంటల తర్వాత ఊపందుకుంది. పాలకుర్తి మండలంలో 88.19శాతం ఓట్లు నమోదయ్యాయి. మూడు విడతల్లో 88.90శాతం ఓటింగ్ మొదటి విడత స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 89.71 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ మూడు నియోజకవర్గాల పరిధిలో అధిక ఓటింగ్ శాతం నమోదైంది.రెండో విడతలో జనగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 88.52 శాతం పోలింగ్ జరిగింది. ఇది ఇతర నియోజకవర్గాల కంటే కొద్దిగా తక్కువైనా, జిల్లాలో మంచి స్థాయి ఓటింగ్గా పరిగణించవచ్చు. మూడో విడతలో పాలకుర్తి నియోజకవర్గంలో 88.44శాతం పోలింగ్ నమోదు కాగా, స్టేషన్ఘన్పూర్, జనగామ శాతంతో పోలిస్తే, స్వల్పంగా తక్కువ. మూడు నియోజకవర్గాల పోలింగ్ను కలిపి పరిశీలిస్తే 88.90 శాతం రావడం ప్రజాస్వామ్యంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. -
లాస్ట్ పంచ్ ..కాంగ్రెస్దే
మూడో విడతలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారుల పోటాపోటీ జనగామ: పాలకుర్తి నియోజకవర్గంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్–బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల మధ్య ఉత్కంఠభరిత పోటీ నెలకొంది. మూడు మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 108 వార్డులు, మూడు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవంగా, 88 సర్పంచ్, 692 వార్డు స్థానాల్లో పోటీ నెలకొంది. బుధవారం జరిగిన పోలింగ్ అనం తరం మధ్యాహ్నం ప్రారంభమైన లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. ఏకగ్రీవాలను కలుపుకొని కాంగ్రెస్ 49 స్థానాలు తెచ్చుకోగా, బీఆర్ఎస్ 38 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ రెబల్స్గా పోటీ చేసిన నలుగురు స్వతంత్రులుగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకవైపు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పై చేయిగా నిలువగా, మరోవైపు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రభావంతో బీఆర్ఎస్ తన ప్రతిష్టను నిలబెట్టుకుంది. ఇరు పార్టీల ప్రచార బృందాలు గ్రామాల వారీగా పర్యటించి ఓటర్లను ఆకట్టుకునేందుకు శక్తివంచన లేకుండా శ్రమించాయి. మండలాల వారీగా పాలకుర్తి నియోజకవర్గంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కొడకండ్ల మండల పరిధిలోని 21 గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ 16 స్థానాలు గెలుచుకుంది. ఒక చోట కాంగ్రెస్ రెబల్ విజయం సాధించగా, నాలుగు చోట్ల బీఆర్ఎస్ ఆధిపత్యం ప్రదర్శించింది. దేవరుప్పుల మండల పరిధిలో 32 పంచాయతీలకు ఎన్నికలు జరగగా, కాంగ్రెస్ 14, ఒక స్వతంత్ర స్థానాన్ని కై వసం చేసుకుంది. బీఆర్ఎస్ 17 స్థానాల్లో ఆధిక్యం సాధించింది. పాలకుర్తి మండల పరిధిలో కాంగ్రెస్ 19, కాంగ్రెస్ రెబల్స్ ఇద్దరు, బీఆర్ఎస్ 16 స్థానాల్లో గెలు పొంది అధికార పార్టీకి జలక్ పుట్టించింది. ప్రధాన పోరు పూర్తిగా కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య నడవగా, ఇతర పార్టీలు ప్రభావం చూపలేకపోయాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పంచాయతీ ఎన్నికల్లో అగ్రశ్రేణి ఆధిపత్యాన్ని ప్రదర్శించినప్పటికీ, ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉన్నా రెండు పార్టీలు పోటీపడటం విశేషం. పాలకుర్తి ప్రాంతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ బలం ఇప్పటికీ నిలకడగా ఉన్నదనే సంకేతాలు ఫలితాలు ఇస్తున్నాయి. ఎవరికి వారే.. ప్రచార సమయంలో మాజీమంత్రి ఎర్రబెల్లి తన పదవీకాలంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు గుర్తుచేసే ప్రయత్నం చేశారు. మరోవైపు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గ అభివృద్ధి తమ ఆధిక్యానికి కారణమని కాంగ్రెస్ స్థానిక నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీరెడ్డి నేతృత్వంలో గ్రామాల వారీగా విస్త్రత ప్రచారం చేశారు. బలబలాలు.. పాలకుర్తి మూడో విడత ఎన్నికల ఉత్కంఠను మరింత పెంచాయి. కాంగ్రెస్ 49, బీఆర్ఎస్ 38 స్థానాలు గెలుచుకొని ఏ మాత్రం తమ బలం తగ్గలేదని నిరూపించుకున్నాయి. పాలకుర్తి ప్రజలు రెండూ ప్రధాన పార్టీలకు సమాన గౌరవం ఇస్తూ తమ నిర్ణయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు.కొత్తగా ఎన్నికై న సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీకి ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈమేరకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 20వ తేదీన శుభ ముహూర్తాలు లేవన్న మెజార్టీ సర్పంచుల అభిప్రాయం మేరకు ప్రమాణ స్వీకార తేదీని మార్చారు. సర్పంచులు, వార్డు సభ్యులు 22వ తేదీ ఉదయం నిర్ణయించిన సమయాల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈమేరకు గ్రామ పంచాయతీల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణ ప్రాంగణాలను శుభ్రపరచడం, పండుగ వాతావరణం నెలకొనే విధంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామాభివృద్ధికి కొత్త సంకల్పాలతో ముందుకు సాగుతామని పలువురు సర్పంచులు పేర్కొన్నారు. కాంగ్రెస్ 49, బీఆర్ఎస్ 38 స్థానాల్లో జయకేతనం పాలకుర్తి, దేవరుప్పలలో రెండు పార్టీలకు సమాన స్థానాలు కొడకండ్లలో కాంగ్రెస్కు పూర్తిస్థాయి ఆధిక్యం మూడు విడతల్లో కాంగ్రెస్–148.. బీఆర్ఎస్ 105మండలం జీపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ స్వతంత్రులు పాలకుర్తి 38 19 17 02 దేవరుప్పుల 32 14 17 01 కొడకండ్ల 21 16 04 01 మొత్తం 91 49 38 04మొదటి విడతలో స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి నాయకత్వంలో కాంగ్రెస్ 69 స్థానాలు, బీఆర్ఎస్ 27 స్థానాలు సాధించగా పూర్తి ఆధిపత్యం కనబర్చగా, 10 చోట్ల స్వతంత్రులు పైచేయి సాధించారు. రెండో విడ తలో జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ హవా కొనసాగింది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఈ ఎలక్షన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ఎదురులేకుండా పోయింది. 40 స్థానాల్లో గులాబీ దళం పరుగులు పెట్టగా, కాంగ్రెస్ 30 స్థానాలు గెలుచుకుంది. జిల్లాలో మూడు విడతలుగా పరిశీలిస్తే కాంగ్రెస్ 148 స్థానాలు, బీఆర్ఎస్ 105 స్థానాలు కై వసం చేసుకోగా బీజేపీ కేవలం నాలుగు స్థానాలకు పరిమితమైంది. ఇంకా గెలుపొందిన వారీగా స్వతంత్రులు 23 మంది ఉన్నారు. -
పోలింగ్ కేంద్రాల పరిశీలన
దేవరుప్పుల: మండల కేంద్రంలోని హైస్కూల్లో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల సరళిని కలెక్టర్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవాంఛనీయ సంఘటనలకు తావివ్వొద్దన్నారు. వరంగల్ క్రైం: జిల్లాలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ డీసీపీ రాజామహేంద్ర నాయక్తో కలిసి పరిశీలించారు. అదనపు డీసీపీ రవి, ఏసీపీ నర్సయ్య, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. -
ముహూర్తం ఖరారు
● ఈ నెల20న గ్రామ పంచాయతీ పాలక మండళ్ల ప్రమాణం ● అదే రోజు తొలి సమావేశం ● కొత్త సర్పంచ్లపై పారదర్శక పాలన.. గ్రామాల అఽభివృద్ధి బాధ్యతజనగామ: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎన్నికై న నూతన పాలకవర్గాలకు సంబంధించిన తొలి సమావేశ తేదీ ఖరారైంది. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి శాఖ కమిషనర్ గెజిట్ నోటిఫికేషన్న్ విడుదల చేశారు. ఈ నెల 20వ తేదీన పంచాయతీల మొదటి సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మ ంగళవారం వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈనెల 17లోపు మూడో విడతలో ఎన్నికలు జరగని గ్రామ పంచాయతీలకు తొలి సమావేశ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఈ సమావేశాలతో గ్రామస్థాయిలో కొత్త పాలకవర్గాల పాలన అధికారికంగా ప్రారంభం కానుంది. 20న సర్పంచుల ప్రమాణ స్వీకారం.. ఈ నెల20వ తేదీన జరగనున్న తొలి సమావేశంలో సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రజల నమ్మకంతో ఎన్నికై న ప్రతినిధులు ఇకపై గ్రామ అభివృద్ధికి నాయకత్వం వహించాల్సిన కీలక దశ ఇది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా తొలి అడుగు పడనుంది. నూతన పాలకమండళ్లు ముందుగా గ్రామ అవసరాలను గుర్తించి స్పష్టమైన అభివృద్ధి ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, అంతర్గత రహదారులు, డ్రైనేజీ, పచ్చదనం వంటి ప్రాథమిక అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రామపంచాయతీ నిధులు, ప్రభుత్వ పథకాలు, ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా వినియోగించుకోవడం కీలకం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన గ్రామసభలను క్రమం తప్పకుండా నిర్వహించడం, ప్రజల అభిప్రాయాలను నిర్ణయాల్లో భాగం చేయడం ద్వారా పారదర్శక పాలన సాధ్యమవుతుంది. అవినీతి, వివక్షలకు తావులేకుండా సమాన న్యాయం అందించాల్సిన బాధ్యత పాలకవర్గాలపై ఉంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తేనే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం సాకారం అవుతుందని అధికారులు, ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. శుభముహూర్తాల వేటలో జిల్లాలోని 280మంది సర్పంచ్లు, 2,534మంది వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ లు ఈ నెల 20న ప్రమాణ స్వీకారం సందర్భంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కీలక ఘట్టాన్ని శుభప్రదంగా ప్రారంభించాలనే సంకల్పంతో సర్పంచులు, వార్డు సభ్యులు వేద పండితులను ఆశ్రయిస్తూ శుభ ముహూర్తాలపై ఆరా తీ స్తున్నారు. ప్రమాణ స్వీకారం ఏ సమయంలో చేయాలి, ఆ రోజు అనుకూలమా అనే అంశాలతో పాటు గ్రామపంచాయతీ కార్యాలయంలో చాంబర్లో ఏ దిశగా కూర్చోవాలి, వాస్తుపరంగా ఏమైనా సరిదిద్దుకోవాలా అనే విషయాలపై కూడా సలహాలు తీసుకుంటున్నారు. రాబోయే ఐదేళ్లు ప్రశాంతంగా, అభివృద్ధి పథంలో సాగాలన్న ఆకాంక్షతో ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. -
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్పాలకుర్తి టౌన్: మూడో విడత ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో డిస్ట్రిబ్యూటరీ కేంద్రాన్ని డీసీపీ రాజామహేంద్ర నాయక్తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గొడవలకు పాల్ప డితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాలయేసులో ఏర్పాట్లు బాగున్నాయి.. దేవరుప్పుల: మూడో విడత ఎన్నికల ప్రక్రియలో భాగంగా సామగ్రి పంపిణీతో పాటు అధికారుల కేటాయింపు కోసం మండల కేంద్రంలోని బాలయేసు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో చేసిన ఏర్పాట్లు బాగున్నాయని కలెక్టర్ సహ సిబ్బంది కొనియాడారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా సందర్శించిన సమయంలో పోలీసులకు తీసిపోకుండా ఎన్సీసీ విద్యార్థుల సర్వీసు, పార్కింగ్, భోజన తదితర వసతులు చూసి ముగ్ధులయ్యారు. వెంటనే గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రత్యేక ఏర్పాట్ల తీరుపై ఓ డాక్యుమెంటరీ తీసి ఎన్నికల కమిషన్కు పంపుతున్నట్టు సమాచారం. కాగా విధులకు వచ్చిన పలువురిని కదిలించగా ఇటీవల రెండు విడతల్లో ఎక్కడా ఇలాంటి ఏర్పాట్లు చూడలేదని కితాబు ఇవ్వడం గమనార్హం. డిస్టిబ్యూషన్ సెంటర్ పరిశీలన కొడకండ్ల: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను మంగళవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. -
24వరకు పనులు పూర్తిచేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ పనులన్నీ ఈ నెల 24వ తేదీ కల్లా పూర్తి చేయాలని ములుగు కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. మేడారంలోని అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ అభివృద్ధి పనులు, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల రాతి నిర్మాణాలను, రాతి స్తంభాల స్థాపన నిర్మాణం, రహదారులు, ఫ్లోరింగ్ సుందరీకరణ, జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లోని పనులను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత అధికారులు, గుత్తేదారులతో మాట్లాడారు. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ముందస్తు మొక్కులు చెల్లించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. మహా జాతరకు విచ్చేసే కోట్లాది మంది భక్తులకు దేవాలయ ప్రాంగణం మహా కళాఖండంగా దర్శనమిస్తుందని తెలిపారు. ప్రతీ భక్తుడికి మధురానుభూతిని కలిగించే విధంగా ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకుంటుందని వివరించారు. నిర్దేశించిన గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. గద్దెల పునర్నిర్మాణ పనులు పరిశీలన మేడారం గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులను ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మంగళవారం పరిశీలించారు. పనుల్లో ఆలస్యం జరగకుండా పగలు, రాత్రి విరామం లేకుండా పనులు చేయాలని ఎస్పీ కాంట్రాక్టర్ను ఆదేశించారు. గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులను పోలీసు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, పనులకు విద్యుత్ సౌకర్యం కల్పించి రాత్రి సమయంలో సైతం పనులు చేసే వీలు కల్పించాలన్నారు. -
ఇప్పగూడెం ఉపసర్పంచ్ ఎన్నిక మూడోసారి వాయిదా
స్టేషన్ఘన్పూర్: మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఇప్పగూడెం ఉపసర్పంచ్ ఎన్నిక మూడోసారి సైతం వాయిదా పడింది. సమస్యాత్మక గ్రామంగా ఉన్న ఇప్పగూడెంలో ఈనెల 12న ఉపసర్పంచ్ ఎన్నిక అనివార్యకారణాలతో వాయిదా పడింది. కాగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 15న ఉపసర్పంచ్ ఎన్నిక కోసం ఆర్ఓ, పంచాయతీ అఽధికారులు ప్రయత్నించినా వార్డుసభ్యుల మధ్య సయోధ్య లేక వాయిదా పడింది. కాగా నూతనంగా ఎన్నికై న వార్డు సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించి ఉపసర్పంచ్ ఎన్నిక చేసే లక్ష్యంగా స్వయంగా ఎంపీడీఓ నర్సింగరావు మంగళవారం ఇప్పగూడెం గ్రామపంచాయతీకి చేరుకున్నారు. అయినప్పటికీ మధ్యాహ్నం 1 గంట వరకు సైతం వార్డు సభ్యులెవ్వరూ పంచాయతీ కార్యాలయానికి రాకపోవడంతో మరోసారి వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీఓ తెలిపారు. కాగా ఈనెల 18న చివరి అవకాశం ఇస్తున్నామని, అదే ఫైనల్ అని స్పష్టం చేశారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శులు నరేశ్, సత్యనారాయణ, కారోబార్ శ్రీను తదితరులు ఉన్నారు. వార్డుమెంబర్ల మధ్య కుదరని సయోధ్య ఇప్పగూడెం ఉపసర్పంచ్ ఎన్నిక వరుసగా మూడుసార్లు వాయిదాపడడం చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో కాంగ్రెస్, సీపీఎం పొత్తుతో ఎన్నికల్లోకి వెళ్లగా కాంగ్రెస్, సీపీఎం బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అదేవిధంగా ఆరు వార్డులు కాంగ్రెస్, ఆరు వార్డులు సీపీఎం కై వసం చేసుకున్నాయి. ముందస్తు ఒప్పందం మేరకు సీపీఎంకు ఉపసర్పంచ్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. అయితే సీపీఎం నుంచి గెలిచిన ఆరుగురు వార్డు సభ్యుల్లో 5, 6, 11వ వార్డుల నుంచి గెలుపొందిన వారు ఉపసర్పంచ్ కోసం పట్టుపడుతున్నారు. సీపీఎం శ్రేణులు రెండు వర్గాలుగా మారి ఉపసర్పంచ్ పదవికి పోటీపడుతుండగా సయోధ్య కుదరడం లేదు. ఏది ఏమైనా ఈనెల 18న ఉపసర్పంచ్ ఎన్నికకు తెరపడనున్నట్లు సమాచారం. -
కొనుగోళ్లు వెంటనే పూర్తిచేయాలి
రఘునాథపల్లి: ధాన్యం కొనుగోళ్లు జాప్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ బెన్షాలోం ఆదేశించారు. మండలంలోని కోమళ్ల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులను పరిశీ లించి ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు.. నిల్వ ఉన్న ధాన్యం వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలోని రైతులతో మాట్లాడుతూ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ..అని అడిగి కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను వెంట వెంటనే మిల్లులకు పంపించాలని ఆయన ఆదేశించారు. దేవరుప్పుల: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎవరూ విఘాతం కలిగించినా కఠిన చర్యలు అనివార్యమని జనగామ డీసీపీ రాజామహేంద్రనాయక్ హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని జనగామ–సూర్యాపేట రహదారితోపాటు పలు సమస్యాత్మక గ్రామాలైన సింగరాజుపల్లి, సీతారాంపురం, చిన్నమడూరు, కడవెండి, కోలుకొండ, మాధాపురం తదితర గ్రామాల్లో పోలీసు కవాతు నిర్వహించారు. ఎన్నికల పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు వర్ధన్నపేట టేసీపీ అంబటి నర్సయ్య పర్యవేక్షణలో సీఐలు సత్యనారాయణ, అబ్బయ్య, సుజాత, 18మంది ఎస్సైలు, 8 మంది ఏఏస్సైలు, 28 హెడ్కానిస్టేబుళ్లు, 145 కానిస్టేబుళ్లు తమ విధులు నిర్వర్తిస్తున్నట్టు వివరించారు. బచ్చన్నపేట: దళితులమని తమను చిన్నచూపు చూస్తున్నారని మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలోని దళితులు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ మాజీ సర్పంచ్ భర్త ఎన్నికల ముందు దళితులమని చిన్నచూపుతో దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రవర్ణాలమనే అహంకారంతో తమను చిన్నచూపు చూడడం తగదన్నారు. అంతేకాకుండా మాజీ సర్పంచ్ ఇంటికి వెళ్తే తన కాళ్లు మొక్కడానికి వచ్చారా అని దురుసుగా మాట్లాడారని ఆరోపించారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు క్షమాపణ చేప్పే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఎస్కే అబ్దుల్ హమీద్ గ్రామానికి చేరుకొని వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఈ విషయమై స్థానిక పోలీస్స్టేషన్లో ఎస్సై హమీద్కు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినల్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి బాలుర స్పోర్ట్స్ మీట్ ఏర్పాట్ల పరిశీలనజనగామ రూరల్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ ఆధ్వర్యంలో11వ రాష్ట్రస్థాయి బాలుర స్పోర్ట్స్ మీట్ ఈ నెల 18 నుంచి 20 వరకు జనగామ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల (బాలురు)లో జరగనుంది. ఈ స్పోర్ట్స్ మీట్కు సంబంధించిన ప్లేగ్రౌండ్, వసతి సదుపాయాలు, భోజన ఏర్పాట్లు, భద్రత తదితర ఏర్పాట్లను మల్టీజోన్–1 అధికారి హెచ్.అరుణకుమారి మంగళవారం పరిశీలించారు. నిర్వహణ ఏర్పాట్లపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ గురుకులాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్పోర్ట్స్ మీట్ను విజయవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది సమిష్టి కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పి. శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ ఎ.నరసింహులు గౌడ్, రవీందర్, ఫిజికల్ డైరెక్టర్లు శ్రీనివాస్, కిషన్, వెంకట్రెడ్డి, లింగనాయక్, రమేశ్ సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. -
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం దామెర, ఆత్మకూరు, శాయంపేట మండల కేంద్రాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీని పరిశీలించారు. పోలీసు బందోబస్తు ఏర్పాట్లను సీపీ సమీక్షించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. 1,991 మంది పోలీస్ సిబ్బంది.. ఎన్నికల నిర్వహణకు 1,991 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సీపీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అదనపు డీసీపీలు, 16 మంది ఏసీపీలు, 29 మంది ఇన్స్పెక్టర్లు, 131 మంది ఎస్సైలు, 339 మంది ఏఎస్సైలు/హెడ్ కానిస్టేబుళ్లు, 1,218 మంది కానిస్టేబుళ్లు, 258 హోంగార్డులతోపాటు డిస్ట్రిక్ట్ గార్డ్స్, బాంబ్ డిస్పోజబుల్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. మొబైల్ పార్టీలు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తాయని సీపీ వెల్లడించారు. రేపు ఉదయం వరకు నిషేధాజ్ఞలు.. రాష్ట్ర ఎన్నికల అధికారి ఉత్తర్వుల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద గురువారం ఉదయం 10 గంటల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట అదనపు డీసీపీ బాల స్వామి, ఏఎస్పీ శుభం, ఏసీపీలు సతీశ్బాబు, సత్యనారాయణ, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు ఉన్నారు. -
నేడే తుది పోరు
జనగామ: పాలకుర్తి నియోజకవర్గంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మూడు మండలాల పరిధిలో ఈనెల 17న(బుధవారం) పోలింగ్ జరగనుంది. భద్రత, నిఘా కట్టుదిట్టం చేయగా, సుదూర ప్రాంతాల నుంచి ఓటర్లు తరలివస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అత్యధిక స్థానాలపై నజర్ పెట్టడంతో రాజకీయ వర్గాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సర్పంచ్ బరిలో 88 మంది.. పాలకుర్తి నియోజకవర్గంలోని మూడు మండలాల పరిధిలో 91 గ్రామ పంచాయతీలు, 800వార్డులు ఉండగా, వీటిలో మూడు జీపీలు, 108 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవం కాకుండా మిగిలిన 91 జీపీల పరిధిలో 88 మంది సర్పంచులు, 692 వార్డుల్లో 1,524 మంది సభ్యులు బరిలో నిలిచారు. పోలింగ్ నిర్వహణ కోసం 800 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 960 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,222 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. పోలింగ్ నేపథ్యంలో మూడు మండలాల పరిధిలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ సామగ్రి తరలింపునకు అధికారులు 51 బస్సులను సిద్ధం చేశారు. నియోజకవర్గంలో మొత్తం 1,18,870 ఓట్లు ఉండగా, ఇందులో పురుష ఓటర్లు 59,001, మహిళా ఓటర్లు 59,866, ఇతరులు ముగ్గురు ఉన్నారు. అమలులో 144 సెక్షన్ భద్రత పరంగా మూడు మండలాల్లో 35 క్రిటికల్ గ్రామాలను గుర్తించి, 40 రూట్లలో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించారు. శాంతిభద్రతలు, క్రమశిక్షణ, ప్రశాంతతను కాపాడేందుకు మూడో దశ ఎన్నికల ప్రాంతాల్లో డీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి రిజ్వాన్ బాషా తెలిపారు. పోలింగ్ మరుసటి రోజు 18వ తేదీ ఉదయం 10 గంటల వరకు లేదా లెక్కింపు పూర్తై ఎన్నికల సామగ్రి సురక్షితంగా నిల్వ చేసే వరకు మూడు మండలాల పరిధిలో ఈ నిషేధాజ్ఞలు(144 సెక్షన్) కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఉదయం 7 గంటల నుంచి.. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం1గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్న విరామం అనంతరం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగించి, సాయంత్రం 4 గంటలకు ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నారు. చివరి పోరు గ్రామపంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని జిల్లాలో రెండు విడతల పోలింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తికాగా, మూడో విడత పోలింగ్ పాలకుర్తి నియోజకవర్గంలో జరగనుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా సాగిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు పాలకుర్తితోనే ముగింపు పలుకనుంది. చివరి దశ కావడంతో రాజకీయ ఉత్కంఠ నెలకొనగా, అధికార యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసింది. పోలింగ్ పూర్తయ్యాక జిల్లా మొత్తంలో గ్రామ పాలనకు సంబంధించి కొత్త ప్రజాప్రతినిధుల రూపకల్పన పూర్తవనుండగా, ఎన్నికల ఫలితాలపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మూడో విడత పోలింగ్కు సర్వం సిద్ధం కట్టుదిట్టమైన బందోబస్తు మూడు మండలాల్లో హైటెన్షన్ ఓ వైపు ఎమ్మెల్యే యశస్విని.. మరోవైపు మాజీ మంత్రి ఎర్రబెల్లి సర్పంచ్ బరిలో 88మంది అభ్యర్థులు.. వార్డు మెంబర్ల స్థానాలకు 1,524 మంది డీసీపీతో కలిసి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలిగ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడో విడతలో జరగనున్న పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు రవికిరణ్, కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. గ్రామపంచాయితీ మూడో విడత ఎన్నికల సందర్భంగా పాలకూర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఎలక్షన్ అబ్జర్వర్ కలెక్టర్ రిజ్వాన్ బాషా సందర్శించారు. ప్రీసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది సాయంత్రంలోగా తమకు కేటాయించిన ఆయా గ్రామ పంచాయతీల పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, ఆర్డీఓ వెంకన్న, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్పై ప్రజల విశ్వాసం
● జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిజనగామ: పంచాయతీ పోరులో గ్రామస్థాయిలో బీఆర్ఎస్పై ప్రజలకు ఉన్న విశ్వాసమే సర్పంచ్, వార్డు సభ్యుల విజయంలో స్పష్టంగా కనపడిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన సన్మాన కార్యక్రమంలో నూతనంగా గెలుపొందిన నియోజకవర్గంలోని సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు స్వతంత్రులుగా విజయం సాధించిన వారు, 2500 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వీరంతా ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించగా, అనంతరం ఎమ్మెల్యే నూతన సర్పంచ్, వార్డు సభ్యులను ఘనంగా సత్కరించారు. అంతకుముందు నియోజకవర్గంలో స్వతంత్రులుగా గెలుపొందిన ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్యే వారిని స్వాగతించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా విజయం సాధించిన ప్రజాప్రతినిధులు సైతం అభివృద్ధి లక్ష్యంగా బీఆర్ఎస్తో కలిసి రావడం సంతోషకరమన్నారు. సర్పంచ్, వార్డు సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని స్పష్టం చేశారు. -
ముగిసిన తుది విడత ప్రచారం
జనగామ: జిల్లాలో మూడో విడత పోలింగ్కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో నేడు (మంగ వారం) మండల పరిషత్ కార్యాలయాల ప్రాంగణాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి మండలాల వారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 1,18,870 ఓట్లు జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల మండలాల్లో మూడో విడత పోలింగ్ జరగనుంది. మూడు మండలాల్లో 91 జీపీల పరిధిలో 3 సర్పంచ్, వార్డుల పరిధిలో 108 అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. 88 జీపీల్లో 266 మంది సర్పంచ్, 800 వార్డుల్లో 1,668 వార్డు అభ్యర్థులు బరిలో నిలిచారు. పురుషులు 59,001, మహిళలు 59,866 అదర్స్ 3 కలుపుకుని మొత్తంగా 1,18,870 ఓట్లు ఉన్నాయి. మూడు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఈ నెల 17వ తేదీన పాలకుర్తి నియోజకవర్గంలో జరుగనున్న పోలింగ్ కోసం నేడు ఎలక్షన్ సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు మండలాల పరిధిలో సామగ్రి పంపిణీ, పోలింగ్ ముగిసిన తర్వాత రిసీవ్ చేసుకునేందుకు సాంఘిక గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేయగా, మండలాల పరిధిలో ఎంపీడీఓ కార్యాలయాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి 800 పోలింగ్ స్టేషన్ల పరిధిలో పీఓ 597, ఓపీఓ 597 మొత్తంగా 1,194 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. పోలింగ్ సామగ్రి, అధికారులు, సిబ్బందిని తరలించేందుకు 40 బస్సుల వరకు సిద్ధం చేశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రూట్ల వారీగా పటిష్ట బందోబస్తు చేపట్టారు. పోలీసుల ముందస్తు నిఘా పాలకుర్తి నియోజకవర్గంలో మూడో విడత, చివరి సర్పంచ్ ఎలక్షన్ నేపధ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా.. అన్నట్టు ఎలక్షన్లలో పోటీ పడుతుండడంతో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు నిఘా వేస్తున్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక ఫోకస్ సారిస్తూ, ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ నుంచి నివేదికలను తెప్పించుకుంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నియోజకవర్గాలు కావడంతో పోలీసులకు కొంతమేర సవాల్ అని చెప్పుకోవచ్చు. సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేయగా, అత్యధిక స్థానాల్లో పాగా వేసి..అధికార పక్షానికి జలక్ ఇవ్వాలని బీఆర్ఎస్ తనదైన శైలిలో ముందుకు వెళ్తోంది. మూడో విడతకు సిద్ధం..కలెక్టర్ రిజ్వాన్ బాషా జిల్లాలో మొదటి, రెండవ విడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్లే, మూడవ విడత ఎన్నికల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయంగా పని చేసి విజయవంతంగా ముగించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. సోమవారం 17వ తేదీన మూడో విడత ఎన్నికలు జరగనున్న దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల మండలాల్లో ఎలక్షన్పై కలెక్టర్ గూగుల్ మీట్ ద్వారా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, జెడ్పీ సీఈఓ, ఆర్డీఓలు, డీఆర్డీఓ, డీఎస్డీఓ, మండల స్పెషల్ అధికారులుతో సమీక్ష నిర్వహించారు. ఎలక్షన్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పోలింగ్, కౌంటింగ్ తదితర వాటిపై పలు సూచనలు చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మెటీరియల్ పంపిణీ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. పోలింగ్ నిర్వహణకు వచ్చే అధికారులు, సిబ్బందికి ఆహారం విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కౌంటింగ్ సమయంలో వేగవంతంగా జరిగేందుకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు ముగిసిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి చేయాలన్నారు. మూడు మండలాల పరిధిలోని మొత్తం జీపీలు, వార్డులు, ఓటర్ల వివరాలుజీపీ వార్డులుమొత్తం ఓటర్లు నేడు ఎలక్షన్ సామగ్రి పంపిణీ పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో ఏర్పాట్లు బరిలో 266 సర్పంచ్, 1,668 మంది వార్డు అభ్యర్థులు రేపు పోలింగ్918001,18,870 మూడు మండలాల పరిధిలోని జీపీలు, వార్డులు, ఓటర్ల వివరాలు మండలం జీపీ వార్డులు మొత్తం పోలింగ్ ఓటర్లు కేంద్రాలు దేవరుప్పుల 32 274 37,333 274 పాలకుర్తి 38 336 52,865 336 కొడకండ్ల 21 190 28,672 190మూగబోయిన మైక్లు ఆయా గ్రామాల్లో ప్రలోభాల హడావుడి జనగామ: పాలకుర్తి నియోజకవర్గంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు సర్పంచ్ ఎన్నికల ప్రచారం ముగియడంతో బహిరంగ రాజకీయ హడావుడి తగ్గినట్టే కనిపిస్తున్నా, ప్రలోభాల పర్వం ఉత్కంఠను రేపుతున్నాయి. మద్యం దుకాణాలను మూసివేసినప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మైకుల ప్రచారం ఆగిపోవడంతో ప్రధాన పార్టీ లు, స్వతంత్ర అభ్యర్థులు రహస్య వ్యూహాలకు పదును పెట్టినట్లు సమాచారం. ఓట్లు జారిపోకుండా కాపాడుకోవడమే లక్ష్యంగా అర్ధరాత్రి వేళ నగదు, గిఫ్టుల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈనెల 17న పోలింగ్ నేపథ్యంలో నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
లక్కీ చాన్స్..
● ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయడంతో సర్పంచ్గా అవకాశం జనగామ రూరల్: గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అర్హులు కాదనే నింబధన ఉండేది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిబంధన ఎత్తి వేయడంతో సర్పంచ్గా పోటీ చేసే అవకాశం వచ్చింది. దీంతో మండలంలోని మరిగడి గ్రామానికి చెందిన కర్రె పర్శరాములు తనకు ముగ్గురు పిల్లలు ఉన్నా..ఎస్సీ రిజర్వేషన్ కావడంతో పోటీ చేసి గెలుపొందాడు. మొదటిసారిగా సర్పంచ్గా అవకాశం రావడంతో గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని, ముఖ్యంగా అన్ని వార్డుల్లో డ్రెయినేజీలు, సీసీ రోడ్లు, మంచి నీటి వసతికి మొదటగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. -
యమబాధలు తొలగి.. ముక్తి పొందుతారు
కాళేశ్వరం : కాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకుంటే యమబాధలు తొలగి..ముక్తి పొందుతారని ఉత్తర్ప్రదేశ్లోని మలూక్ పీఠాధితి రాజేంద్రదాస్జీ వృందావన్ భక్తులకు ప్రవచనంలో వినిపించారు. సోమవారం స్వామిజీ మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణ మండపం వద్ద స్వామిజీని ఈఓ మహేష్ కండువాతో సన్మానించారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ..అలహాబాద్లోని గంగా, యమున, సరస్వతి ఎంత ప్రసిద్ధి చెందినవో.. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతి నదుల్లో భక్తులు స్నానాలు చేస్తే అంతటి మహాభాగ్యం పొందుతారని అన్నారు. 2026, మే 21నుంచి జూన్ 1వరకు సరస్వతినదికి అంత్యపుష్కరాలు జరుగుతాయని, భక్తులు పుణ్యస్నానాలు చేసి పునీతులు కావాలని కోరారు. -
నోట్ల వర్షం కురిపించినా..
మంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్ శ్రీ 2025జనగామ: జిల్లాలో రెండో విడత జరిగిన సర్పంచ్ ఎన్నికలు అనేక రాజకీయ లెక్కలను తారుమారు చేశాయి. గెలుపు ధీమాతో లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసిన అభ్యర్థులు బ్యాలెట్ బాక్సులు తెరుచుకున్న వేళ ఓటమి షాక్కు గురయ్యారు. పార్టీ కేడర్, నాయకుల సహకారం, సొంత సర్వేలు అన్నీ అనుకూలంగా ఉన్నాయని తేలినప్పటికీ ఆ నమ్మకం ఫలితాల్లో తారుమారైంది. అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్ముకుని ప్రచారం చేసినా.. ఆశించిన ఓట్లు రాకపోవడంతో అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు. ఎక్కడ తేడా జరిగింది? ఎవరు వెన్నుపో టు పొడిచారు? అంటూ ఓటమికి కారణాలు వెతుక్కుంటూ, రాజకీయ భవిష్యత్పై మళ్లీ లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. తేడా ఎక్కడ వచ్చింది.. జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిపాలైన అభ్యర్థులు తీవ్ర మదనంలో మునిగిపోయారు. ఎలా ఓడిపోయాం, ఎక్కడ తేడా వచ్చింది, ఎవరు మోసం చేశారనే లెక్కలతో రోజులు గడుపుతున్నారు. ప్రచారంలో నాయకులు సహకరించారు, పార్టీ కేడర్ అడుగడుగునా వెంట నడిచింది, మెజార్టీ మనదేనన్న ధీమా చివరి నిమిషం వరకూ ఉంది. కానీ బ్యాలెట్ బాక్సులు తెరిచి లెక్కించే సరికి ఫలితాలు పూర్తిగా భిన్నంగా రావడంతో షాక్కు గురయ్యారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులతో పాటు వార్డు సభ్యులు లక్షలు, కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ప్రచారం మొదటి రోజు నుంచి పోలింగ్ రోజు వరకు ఒక్కో ఓటుకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చు చేసిన సందర్భాలు ఉన్నాయని ప్రచారం ఉంది. అప్పులు తెచ్చి, ప్లాట్లు అమ్ముకొని, ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఎన్నికల బరిలోకి దిగిన వారు ఎందరో. చివరి నిమిషం వరకు గెలుపుపై ధీమా పోలింగ్ ముగిసే చివరి నిమిషం వరకు గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన అభ్య ర్థులకు ఫలితాలు చుక్కలు చూపించాయి. పార్టీ ఇంటెలిజెనన్స్ నివేదికలు, సొంత సర్వేలు కూడా మనమే గెలుస్తాం అన్న భరోసా ఇచ్చినప్పటికీ, లెక్కింపులో పరిస్థితి తలకిందులైంది. కనీసం రెండో స్థానంలో నిలుస్తామనుకున్న వారు మూడు, నాలుగో స్థానాల్లో నిలవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అన్నా, తమ్ముడూ.. అంటూ ఆశీర్వదించిన ఓటర్లు చివరకు ఎందుకు తిరస్కరించారని అభ్యర్థులు తమ అనుచరుల ద్వారా ఆరా తీస్తున్నారు. గండి ఎక్కడ పడిందో, పక్కనే తిరుగుతూ వెన్నుపోటు పొడిచిన నాయకులు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బహిరంగంగా ఎవరినీ నిందించకపోయినా, లోలోపల వెన్నుపోటు పొడిచిన వారి జాబితాను తయారు చేసుకుంటున్నట్లు సమాచారం. ఎక్కడెక్కడ చేజారిపోయిందంటే.. జనగామ మండలం పెంబర్తిలో రెబల్ అభ్యర్థి గెలుపొందగా బీఆర్ఎస్ బలబర్చిన అభ్యర్థి ఓటమి పాలయ్యాడు. బచ్చన్నపేట మండలం పోచన్నపేటలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి ఓటమి పాలవగా, తమ్మడపల్లిలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మనస్వినికీర్తన అప్పులు తెచ్చి, ప్లాట్లు అమ్ముకుని ఖర్చు చేస్తే.. చివరికి ఓటమి ప్రచారం జోరు.. ఫలితాల్లో ఫెయిల్ ఎవరు మోసం చేశారు.. ఓటమి తర్వాత మొదలైన లెక్కలు రెండో స్థానం ఓకే... మూడుగు దిగజారడం ఏంటి? అభ్యర్థుల లెక్కలు తారుమారు చేసిన రెండో విడత పోలింగ్ -
రాలని ఓట్లు
అధిష్టానం సీరియస్ జిల్లాలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓటమి పాలవడంతో పార్టీ అధిష్టానాలు సీరియస్గా ఉన్నట్లు సమాచారం. ఓటమి చెందిన గ్రామాలకు సంబంధించి గెలుపు తారుమారు అయిన కారణాలపై సమగ్రంగా తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీలను నియమించే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఆయా కమిటీల ద్వారా గ్రౌండ్ లెవల్ పరిస్థితులు, అంతర్గత విభేదాలు, అభ్యర్థుల ఎంపికలో జరిగిన లోపాలపై నివేదికలు తెప్పించుకొని భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై నిర్ణయాలు తీసుకునేందుకు పార్టీలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
పెద్ద కొరివి దయ్యం ఎమ్మెల్యే పల్లా
స్టేషన్ఘన్పూర్: కేసీఆర్ చుట్టూ కొరివిదయ్యాలు చేరాయని, వాటి వల్లనే బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పడుతుందని కల్వకుంట్ల కవిత సాక్ష్యాలతో సహా పలు మార్లు విమర్శలు చేసిందని, అందులో పెద్ద కొరివిదయ్యం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అని మాజీ మంత్రి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ఘన్పూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పల్లా రాజేశ్వర్రెడ్డి.. కేసీఆర్ పంతన చేరి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాడని, అందుకే కవిత దూరమైందని, కేటీఆర్, హరీశ్రావు మఽధ్య సైతం గ్యాప్ వచ్చిందన్నారు. కేసీఆర్ పక్కన చేరి వందల కోట్ల రూపాయలు అవినీతి చేశాడని విమర్శించారు. అలాంటి వ్యక్తి ఘన్పూర్ నియోజకవర్గానికి వచ్చి సుద్దపూసలా మాట్లాడుతున్నాడన్నా రు. జీపీ ఎన్నికల ప్రచారంలో పల్లా, డాక్టర్ రాజయ్య నాపై తీవ్ర స్థాయిలో దూషణలు, దిగజారుడు విమర్శలు చేశారని గుర్తు చేశారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన అభివృద్దిని ప్రజలు గమనించి అత్యధిక పంచాయతీలు గెలిపించారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో రాజయ్య ప్రచారం చేస్తే ఓట్లు రావని ఎమ్మెల్యే పల్లా పరోక్షంగా నియోజకవర్గంలో ప్రచారం చేశారని, ఇదంతా రాజయ్యను జీరో చేయాలనే ప్రణాళిక అని ఆరోపించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, ఏఎంసీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్రెడ్డి, నాయకులు బెలిదె వెంకన్న, జగదీష్చందర్రెడ్డి, మంచాల ఎల్లయ్య, అంబటి కిషన్రాజ్, బూర్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు. రాజయ్యను జీరో చేయాలని చూస్తున్నాడు.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపణ -
నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
● ఎన్పీడీసీఎల్ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి జనగామ: రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని జనగామ పట్టణ పరిధిలో నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా లోడ్ సామర్థ్యాన్ని పెంచడం జరుగుతుందని ఎన్పీడీసీఎల్ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు. సోమవారం డీటీఆర్లను బిగించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వినియోగదారుల అవసరాలను ముందుగానే అంచనా వేసి, అందుకు తగ్గట్టుగా 7–100 కేవీఏ డీటీఆర్ల స్థానంలో ఆధునిక సామర్థ్యంతో కూడిన మరో 7–60 కేవీఏ డీటీఆర్లను ఏర్పాటు చేశామన్నారు. వీవర్స్ కాలనీలో ఎస్ఎస్–3, నెహ్రూపార్కు ఏరియాలో ఎస్ఎస్–13, గిర్నిగడ్డలో ఎస్ఎస్–1, గీతానగర్లో ఎస్ఎస్–34, సెయింట్ మేరీస్ స్కూల్ రోడ్లో ఎస్ఎస్–149, సాన్మారియా గేట్, జ్యోతి నగర్లో ఎస్ఎస్–378, ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయం, సూర్యాపేట రోడ్ పరిధిలో ఎస్ఎస్–337 ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. సామర్థ్యం అప్గ్రేడేషన్తో వేసవిలో లోడ్, తక్కువ వోల్టేజ్ సమస్యలు తగ్గి, వినియోగదారులకు అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించేందుకు వీలు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ వేణుగోపాల్, టౌన్–1 ఏఈ సౌమ్య, టౌన్–2 ఏఈ చంద్రమోహన్, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
మెరుగైన వైద్యసేవలందించాలి
జనగామ రూరల్: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సోమవారం గూగుల్ మీట్ ద్వారా ఆదేశించారు. డీఎంహెచ్ఓ కె.మల్లికార్జునరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, ప్రోగ్రాం అధికారులు మెడికల్ ఆఫీసర్ డీఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ప్రత్యేకంగా ఆర్బీఎస్కే, టీకా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు, పర్యవేక్షణ నివేదికల సమర్పణపై మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లా క్షేత్రస్థాయిలో వైద్యసేవలను మరింత బలోపేతం చేయడం, సమయానికి నివేదికల సమర్పణ, నాణ్యమైన సేవలు అందించాలని ఆయన సూచించారు. -
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సీపీ
జనగామ: జనగామ నియోజకవర్గంలో రెండో విడత ఆదివారం జరిగిన సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పలు గ్రామపంచాయతీల్లో జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీతిసింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ జనగామ జిల్లాలోని శామీర్పేట, బచ్చన్నపేట, నర్మెట, మచ్చుపహాడ్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాటతో పాటు ఎన్నికలు జరుగుతున్న తీరుతెన్నులపై సీపీ అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్షించారు. సీపీ వెంట డీసీపీలు కుమార్, రాజమహేంద్రనాయక్, ఏసీపీ చైతన్య, ఏసీపీ నర్సయ్య, రమణ బాబుతో పాటు స్థానిక ఇన్న్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
కారు దోబార్!
జనగామ: జిల్లాలో రెండో విడత జరిగిన గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికర మలుపులు తిరిగాయి. తొలి విడతలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయగా, మలి విడతలో మాత్రం బీఆర్ఎస్ గులాబీ దళం తన సత్తాను చాటుకుని తిరిగి ఆధిపత్యం సాధించింది. నాలుగు మండలాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో సగం సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకుని బీఆర్ఎస్ మరోసారి జనగామ తన కంచుకోటేనని నిరూపించింది. రెండో విడతలో బీఆర్ఎస్ విజయానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సుడిగాలి పర్యటన ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఊరూరా తిరుగుతూ చేసిన ప్రచారం, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం గులాబీ దళానికి కలిసివచ్చింది. జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి, రాష్ట్ర యువ నాయకుడు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో విస్త్రత ప్రచారం కొంతమేర ఫలితాలు ఇచ్చినప్పటికీ, అంతర్గత అసంతృప్తి, రెబ ల్స్ ప్రభావం పార్టీని నష్టపరిచినట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ 38 సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకోగా, కాంగ్రెస్ 26 సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది. కానీ కొన్ని గ్రామాల్లో స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి చెందడంతో ఆశించిన స్థాయిలో సీట్లు దక్కకపోవడం ఆ పార్టీకి నిరాశ కలిగించింది. స్వతంత్రుల సత్తా రెండో విడత ఎన్నికల్లో అసలైన హైలైట్ మాత్రం స్వతంత్ర అభ్యర్థులదే పైచేయిగా నిలిచింది. మొత్తం 13 మందిలో నలుగురు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మరో 8 మంది స్వతంత్రులు అధికార–ప్రతిపక్ష పార్టీలకు గట్టి సవాల్ విసిరి విజయదుందుభి మోగించారు. గెలిచిన స్వతంత్రుల్లో ఇద్దరు బీఆర్ఎస్ రెబల్స్, ఇద్దరు కాంగ్రెస్ రెబల్స్ ఉండటం రాజకీయంగా కీలకంగా మారింది. పార్టీల కంటే వ్యక్తిగత పలుకుబడి, స్థానిక సమస్యలే ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేశాయనే విషయం ఈ ఫలితాలతో స్పష్టమైంది. రెండు చోట్ల బీజేపీ బోణీ.. బీజేపీ కూడా ఈసారి తన బోణి చేసింది. జనగామ, బచ్చన్నపేట మండలాల్లో రెండు చోట్ల సర్పంచ్ స్థానాలు గెలుచుకుని నియోజకవర్గం కమల దళానికి గుండెకాయలాంటిదని నిరూపించింది. నరాలు తెగే ఉత్కంఠ.. నాలుగు మండలాల్లో కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొదట వార్డు సభ్యుల ఓట్లను లెక్కించి, అనంతరం సర్పంచ్ బ్యాలెట్ పత్రాలను కౌంట్ చేశారు. బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి, పోచన్నపేట, గోపాల్నగర్, జనగామ మండలం వడ్లకొండ, పెంబర్తి తదితర గ్రామాల్లో ఫలితాలు అభ్యర్థులకు చెమటలు పట్టించాయి. కొన్నిచోట్ల రీకౌంటింగ్ నిర్వహించగా, తమ్మడపల్లిలో ఓటమిని నిరసిస్తూ ధర్నాలు కూడా చోటు చేసుకున్నాయి. ఎస్కార్టు మధ్య బ్యాలెట్ బాక్స్ల తరలింపు జనగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి బ్యాలెట్ బాక్స్లను పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు నడుమ మండల పరిషత్ కార్యాలయాలు, అక్కడ నుంచి జిల్లా కేంద్రంలోని సోషల్ వెవెల్ఫేర్ గురుకులంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి తరలించారు. పీఓ, ఓపీఓలు బ్యాలెట్ బాక్స్లను అక్కడ అప్పగించారు. 73 సర్పంచ్...555 వార్డులు జిల్లాలో 79 జీపీలు, 710 వార్డుల్లో ఆరు చోట్ల సర్పంచ్, 155 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. 73 సర్పంచ్, 555 వార్డుల్లో పోటీ జరిగింది. హోరాహోరీ జరిగిన సమరంలో కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆర్వో అన్యాయం చేశారంటూ ధర్నాబచ్చన్నపేట: మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో స్థానిక ఎన్నికల్లో ఆర్వో అన్యాయం చేశారంటూ సర్పంచ్ అభ్యర్థి ఎలుగల శ్రీనివాస్రెడ్డితో పలువురు గ్రామస్తులు కలిసి జనగామ–బచ్చన్నపేట రహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆర్వో మరో ప్రత్యర్థి అభ్యర్థి బేజాడి సిద్దులుకు అండగా నిలిచి ఆయన గెలిచినట్లు ప్రకటించారని దీనిపై సంబంధిత ఎన్నికల అధికారులు విచారణ జరపాలని పట్టుబట్టి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. గ్రామ ఎన్నికల ఫలితాలపై మూడుసార్లు రీకౌంటింగ్ చేసినా బేజాడి సిద్దులుకు 4 ఓట్లు ఎక్కువగా వచ్చాయని ఆ ఫలితాలనే ప్రకటించారని సర్పంచ్గా బేజాడి సిద్దులును ప్రకటించారని వారు డిమాండ్ చేశారు. పట్టుపట్టి..మూడోసారికి పదవి పట్టి!బచ్చన్నపేట: మండలంలోని బండనాగారం గ్రామ సర్పంచ్ ఇజ్జగిరి రాములు మూడుసార్లు సర్పంచ్గా పోటీచేయగా మూడో సారికి గెలుపొందారు. గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోగా పట్టుదల వదలని విక్రమార్కుడిలా మళ్లీ మళ్లీ పోటీ చేసి ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచి సమీప అభ్యర్థి ప్రభాకర్పై 345 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి పాటుపడుతానని తెలిపారు.మరిన్ని ఎన్నికల వార్తలు 8లో సర్పంచ్లు వీరే.. 9లో నాలుగు మండలాల్లో 38 స్థానాలు కై వసం కాంగ్రెస్ 26, బీజేపీ 2 స్థానాల్లో గెలుపు సత్తాచాటిన స్వతంత్రులు రెబల్స్ ప్రభావం..కాంగ్రెస్, బీఆర్ఎస్లకు నష్టంమండలం జీపీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ స్వతంత్రులు జనగామ 21 10 05 01 05 తరిగొప్పుల 15 05 08 – 02 నర్మెట 17 08 05 – 04 బచ్చన్నపేట 26 15 08 01 02 మొత్తం 79 38 26 02 13 -
మెజారిటీలో తగ్గేదేలే!
● భారీ మెజారిటీతో గెలుపొందిన అర్జుల జ్యోతి మదుసూదన్రెడ్డి తరిగొప్పుల: మండలకేంద్రంలో కాంగ్రెస్పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి అర్జుల జ్యోతిమధుసూదన్రెడ్డి 1,545 ఓట్ల మెజారిటీతో సమీప బీఆర్ఎస్ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి ఏదునూరి శివరాణి నర్సింహులపై గెలుపొందారు. గ్రామంలో 4,313 ఓట్లు ఉండగా 3,595 ఓట్లు పోలవగా అర్జుల జ్యోతికి 2133 ఓట్లు, ఏదునూరి శివరాణికి 588 ఓట్లు వచ్చాయి.ప్రత్యర్థులు..ఒకేచోటజనగామ రూరల్: మండలంలోని గానుగుపహడ్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు ముగ్గురు మహిళలే బరిలో ఉన్నారు. ఆదివారం తమను గెలిపించాలని ఒక వైపు ముమ్మర ప్రచారం చేపట్టి తమ ఓటు వినయోగించుకోవడానికి వచ్చి ముగ్గురు అభ్యర్థులు దాసరి అనూష, కన్నెబోయిన భాగ్యమ్మ, తుపాకుల రాజేశ్వరీ పోలింగ్ కేంద్రం వద్ద ఒక్క దగ్గర కూర్చున్నారు. చూసేవారు గ్రామస్తులకే పోటీ ఉంది. తమకే పోటీ లేదు అన్నట్లు కూర్చున్నారు. -
ఓటోత్సాహం
జనగామ: రెండో విడత సర్పంచ్ ఎలక్షన్లలో ఓటర్ల చైతన్యం కనిపించింది. నాలుగు మండలాల పరిధిలో తమ ఓటుతో మార్పును కోరుకున్నారు. జనగామ నియోజకవర్గంలోని బచ్చన్నపేట, జనగామ, నర్మెట, తరిగొప్పుల మండలాల్లో రెండో విడత ఆదివారం జరిగిన సర్పంచ్ ఎన్నికలు గ్రామీణ ప్రజాస్వామ్యానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. నాలుగు మండలాల్లో కలిపి 88.52 శాతం పోలింగ్ నమోదు కావడం ఓటర్ల రాజకీయ చైతన్యాన్ని స్పష్టంగా ప్రతిబింబించింది. నియోజకవర్గంలో మొత్తంగా 1,07,067 మంది ఓటర్లు ఉండగా, 94,776 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించిన సందడి మధ్యాహ్నానికి మరింత ఊపందుకుంది. ఉదయం 9 గంటల వరకు 16.72 శాతం పోలింగ్ నమోదుకాగా, 11 గంటల వరకు 51 శాతం దాటింది. మధ్యాహ్నం 1 గంటల వరకు 81.20 శాతం పోలింగ్ నమోదు కాగా, ఓవరాల్గా 88.52 శాతంతో ముగించారు. మండలాల వారీగా చూస్తే జనగామ మండలం 91.03 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. మహిళా ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. మండలాల వారీగా విశ్లేషణ జనగామ మండలంలో రికార్డు స్థాయిలో 91.03 శాతం పోలింగ్ నమోదై అగ్రస్థానంలో నిలిచింది. 33,137 ఓటర్లు ఉండగా, పురుషులు 15,043, మహిళలు 15,122 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, మొత్తంగా 30,165 ఓట్లు పోలయ్యాయి. రాజకీయ చైతన్యం, పోటీ తీవ్రతే ఈ అధిక పోలింగ్కు కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నర్మెట మండలంలో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఈ ప్రాంతంలో 20,096 ఓట్లు ఉండగా, పురుషులు 8,941, మహిళలు 8,909 మంది ఓటు వేశారు. మొత్తంగా 17,850 ఓట్లు పోలు కాగా, 88.82 శాతం పోలింగ్ నమోదైంది. తరిగొప్పుల మండలంలో 15,283 ఓట్లు ఉండగా, పురుషులు 6,738, మహిళలు 6,734 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, 13,472 ఓట్లు పోలయ్యాయి. 88.15 శాతం పోలింగ్తో నర్మెటకు సమీపంగా నిలిచింది. చివరి గంటల్లో పోలింగ్ ఊపందుకోవడంతో ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. బచ్చన్నపేట మండలంలో ఇతర మండలాలతో పోలిస్తే చాలా తక్కువగా 86.35 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం తర్వాత ఓటర్ల రాక అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మండలంలో 38,551ఓట్లు ఉండగా, పురుషులు 16,520, మహిళలు 16,769 మంది, మొత్తం 32,289 మంది ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. రాజకీయ ప్రాధాన్యం.. గ్రామ స్థాయి పాలనకు సర్పంచ్ ఎన్నికలు పునాది కావడంతో, ఇవి భవిష్యత్తు రాజకీయాలపై ప్రభా వం చూపనున్నాయి. అధిక పోలింగ్ శాతం ప్రజలు తమ నాయకులను ఎన్నుకోవడంలో ఎంతటి అవగాహనతో ముందుకు వస్తున్నారో సూచిస్తోంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 88.52శాతం పోలింగ్ 91.03శాతం పోలింగ్తో జనగామ మండలం అగ్రస్థానం భారీగా తరలివచ్చిన మహిళలు, యువత ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణమండలం ఓట్లు పురుషులు శాతం మహిళలు శాతం మొత్తం బచ్చన్నపేట 38,551 16,520 87.74 16,769 85.03 86.35 జనగామ 33,137 15,043 91.41 15,122 90.66 91.03 నర్మెట 20,096 8,941 90.19 8,909 87.50 88.82 తరిగొప్పుల 15,283 6,738 88.46 6,734 87.84 88.15 మొత్తం 1,07,067 47,242 89.44 47,534 87.62 88.52రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో మహిళల పాత్ర ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొత్తం ఓటింగ్లో పురుషుల పోలింగ్–89.44 శాతం, మహిళల పోలింగ్ 87.62 శాతంగా నమోదైంది. కొన్ని మండలాల్లో మహిళల పోలింగ్ పురుషులకు సమానంగా ఉండటం గ్రామీణ ప్రాంతాల్లో మహిళా రాజకీయ చైతన్యం పెరుగుతున్న దానికి నిదర్శనంగా భావిస్తున్నారు. మొదటి విడతలో 87.33 శాతం పోలింగ్ నమోదు కాగా, రెండో విడతకు వచ్చేసరికి 88.52తో 1.19 శాతం ఓట్లు పెరిగాయి. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ ఓటర్లకు అవగాహన కల్పించడంతో ఓటర్లు తమ ఓటును సద్వినియోగం చేసుకున్నారు. -
అబ్బా..ఓటెయ్యలేకపోయానే!
జనగామ: బచ్చన్నపేట పోలింగ్ కేంద్రం మూసివేసిన అర క్షణంలో యువకుడు కానుగంటి సందీప్ రాగా, పోలీసులు లోనకు నిరాకరించారు. ఐదేళ్లకోసారి వచ్చే ఓటు వేసే అవకాశం త్రుటిలో కోల్పోవడంతో ఆవేదనకు లోనయ్యారు. నేటితో మూడో విడత ప్రచారానికి తెరజనగామ: జిల్లాలో జరగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గంలో ఈనెల 15(సోమవారం)తో ప్రచారానికి తెరపడనుంది. 17వ తేదీన ఎన్నికల సందర్భంగా మద్యం దుకాణాలను సైతం మూసివేయనున్నారు. దీంతో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రలోభాలు షురూ కానున్నాయి. -
అవాంఛనీయ ఘటనలు జరగొద్దు
తరిగొప్పుల: రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియను డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ భీంశర్మతో కలసి మండలకేంద్రం, నర్సాపూర్ పోలింగ్ కేంద్రాలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టాలని పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు జనగామ:వరంగల్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణలో ఏఎస్పీ,ఏసీపీలు పండేరీ చేతన నితిన్, నర్సయ్య, భీంశర్మ ఆధ్వర్యంలో సీఐ,ఎస్సైలు, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. నర్మెట, జనగామ,బచ్చన్నపేట మండలాల్లో సీపీ పర్యటించి పోలింగ్ తీరు తెన్నులను ప్రత్యక్షంగా పరిశీలించారు. -
మలిపోరుకు సిద్ధం!
జనగామ: గ్రామవీధుల గోడలపై పోస్టర్లు అభ్యర్థుల గుర్తులను జ్ఞాపకం చేస్తుంటే..ప్రతీ ఇంటి ముందు పోలింగ్ గురించే చర్చ జరుగుతోంది. జనగామ నియోజకవర్గంలో జరగనున్న రెండో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్కు ముందు రోజు గ్రామాల్లో రాజకీయ నిశ్శబ్దం అలుముకుంది. ప్రజల మనసుల్లో మాత్రం తీర్పు ప్ర క్రియ మొదలైపోయింది. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు తుది ఏర్పాట్లలో నిమగ్నమవుతుండగా, మరోవైపు గ్రామస్తులు తమ ఓటు గ్రామ భవిష్యత్తును ఎలా మార్చబోతున్నారో లెక్కలు వేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల్లో ఈనెల 14న(ఆదివారం) రెండో విడతలో పోలింగ్ జరగనున్న పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. జనగామ మండలానికి సంబంధించి జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకులం, మిగతా మూడు మండలాల్లో మండల పరిషత్ కార్యాలయాల్లో ఎన్నికల సామగ్రిని డిస్ట్రిబ్యూషన్ చేశారు. పీఓలు 853, ఓపీఓలు 1,039 మంది, ఇతర సిబ్బందితో సహా మెటీరియల్ను 29 రూట్ల వారీగా 45 బస్సుల్లో పోలీసు ఎస్కార్ట్ నడుమ తరలించారు. రెండో విడతలో 79 గ్రామపంచాయతీలు, 710 వార్డులు ఉన్నాయి. ఇందులో 6 చోట్ల సర్పంచ్లు, 155 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇంకా 73 జీపీల్లో 245 మంది సర్పంచ్, 555 వార్డుల్లో 1,310 మంది బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో 27 క్రిటికల్ గ్రామాలు ఉన్నట్లు పోలీసు శాఖ గుర్తించింది. పోలింగ్, ఆ తర్వాత లెక్కింపు, గెలుపోటముల తర్వాత అలర్లు, గొడవలకు ఆస్కారం లేకుండా అధికారులు అక్కడ అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆదేశాల మేరకు ప్రతీ మండలంలో ఏసీపీ ర్యాంకు ఉన్నతాధికారి పర్యవేక్షణలో పోలీసుశాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర గస్తీ కొనసాగుతోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కఠినంగా అమలు లో ఉందని అధికారులు స్పష్టం చేశారు. డబ్బులు, మద్యం, గిఫ్టుల పంపిణీపై ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటి క్ టీములు విస్త్రత తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నా, ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు ఆగడం లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. జనగామ నియోజకవర్గంలో నెల రోజుల ముందుగానే ప్రతి పల్లె సంక్రాంతి పండగ వాతావరణం కనిపిస్తోంది. ఊరి అభివృద్ధి ప్రదాతను ఎన్నుకునేందుకు పనులన్నీ వదులుకుని కుటుంబాలు ఇంటిబాట పడుతున్నారు. దీంతో ప్రతీ గ్రామంలో సందడి నెలకొంది. యాదృశ్చికంగా ఆదివారం సెలవు రోజు పోలింగ్ రావడంతో ఓటింగ్ శాతం మొదటి విడత కంటే పెరుగుతుందని భావిస్తున్నారు. గ్రామంలో బస్సు దిగే సమయం... కార్లలో ఇంటి ముందు ఆగడమే ఆలస్యం... అభ్యర్థులు వాలిపోతూ ‘అన్నా.. అక్కా... తమ్ముడు.. బావ..’ అంటూ వరుసలు పెట్టి మరీ ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. జనగామ నియోజకవర్గంలోని 4మండలాల్లో ఏర్పాట్లు పూర్తి ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు పటిష్ట భద్రత, నిఘా అభ్యర్థుల భవితవ్యం మార్చనున్న మహిళలు, యువత ఓట్లురెండో విడత ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం కీలకంగా మారనుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మహిళలు, యువత పోలింగ్పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. గ్రామ అభివృద్ధిపై తమ ఆశలను ఓటు రూపంలో వ్యక్తపరచడానికి సిద్ధంగా ఉన్నారు. నాలుగు మండలాల్లో 1,10,120 ఓట్లు ఉండగా, ఇందులో పురుషులు 54,344, మహిళలు 55,775, ఇతరులు ఒకరు ఉన్నారు. బచ్చన్నపేట మండలంలో అత్యధికంగా 20,208 మహిళా ఓట్లు ఉండగా, అత్యల్పంగా తరిగొప్పులలో 8,079 ఓట్లు ఉన్నాయి. ఓవరాల్గా లక్ష ఓట్లలో 30వేల వరకు 18 నుంచి 35 ఏళ్ల లోపు యువకుల ఓట్లు ఉంటాయి.రెండో విడత పోలింగ్తో జిల్లాలో గ్రామ పాలనకు కొత్త దిశ నిర్ణయించబడనుంది. ప్రతి ఓటు గ్రామఅభివృద్ధికి కీలకమని అధికారులు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ప్రతీ గ్రామంలో వందశాతం ఓటింగ్తో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. సొంతూరును వదిలి బతుకు దెరువు కోసం వె వెళ్లిన కుటుంబాలను పోలింగ్ రోజు రప్పించేందుకు సర్పంచ్, వార్డు అభ్యర్థులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఓటింగ్ను పెంచేందుకు సుదూర ప్రాంతాల్లో ఉన్న వారికి వ్యక్తిగతంగా ఫోన్లు చేస్తూ తమదైన శైలిలో అభ్యర్థిస్తున్నారు. -
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
జనగామ రూరల్: ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ చెప్పారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శని వారం పెంబర్తి, సిద్దెంకి, ఒబుల్కేశవాపూర్, ఎర్రగొల్లపహాడ్ గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్పీ పండారీ చేతన్ నితిన్, సీఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. నర్మెట: మండల కేంద్రంతో పాటు బొమ్మకూర్లో సాయంత్రం భద్రతా బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. డీసీపీ రాజమహేంద్రనాయక్ వెంట ఏసీపీ రమణబాబు, సీఐలు ముసుకు అబ్బయ్య, ఎడెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు. తరిగొప్పుల: మండలకేంద్రంతో పాటు, నర్సాపూర్, బొత్తలపర్రె గ్రామాల్లో కవాతు నిర్వహించారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్ , ఏసీపీ భీమ్శర్మ, సీఐ అబ్బయ్య, ఎస్సై గుగులోతు శ్రీదేవి, సిబ్బంది పాల్గొన్నారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ -
రేటు పెరిగిన ఓటు!
జనగామ: జిల్లాలో మొదటి విడత పోలింగ్ ఫలితాలను అనుభవంగా తీసుకుంటూ, రెండో విడతలో ఎలాగైనా గెలుపే లక్ష్యంగా జనగామ నియోజకవర్గ సర్పంచ్, వార్డుమెంబర్ అభ్యర్థులు ముందుకెళ్తున్నారు. నాలుగు మండలాల్లోని అభ్యర్థులు వ్యూహాలు రచిస్తూ, పోలింగ్కు ముందురోజు రాత్రి నుంచి ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రజాస్వామ్య పండుగగా ఉండాల్సిన ఎన్నికలు డబ్బులు, గిఫ్టుల పోటీగా మార్చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్కు ముందు అర్ధరాత్రి 12 గంటల నుంచి 1 గంట వరకు ప్రత్యర్థి ఎంత ఇస్తున్నాడన్న సమాచారాన్ని నిఘా వర్గాల ద్వారా తెలుసుకుంటూ, అంతకంటే 10 నుంచి 20 శాతం ఎక్కువ ఇవ్వాలన్న నిర్ణయాలతో అభ్యర్థులు వేచిచూసే ధోరణి అవలంబించారు. పలు గ్రామాల్లో తెల్లవారుజాము 3 గంటల నుంచి ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకు, మరికొన్ని కీలక గ్రామాల్లో రూ.2వేల నుంచి రూ.3వేల వరకు పంపిణీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఎలక్షన్ కమిషన్ నిఘా, అనేక బృందాలు 24 గంటల పాటు నిఘా ఉంచినప్పటికీ, ఇంతపెద్ద మొ త్తంలో డబ్బులు ఎలా పంచారనే దానిపై సా మాన్య ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. సర్పంచ్ ఎలక్షన్లలో కనివిని ఎరగని రీతిలో కోట్ల రూపాయలు వరదలా పారిస్తున్న పరిణామాలపై సీనియర్ సిటిజన్లు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గెలుపు తర్వాత ఈ ఖర్చును ఎలా రాబట్టుకుంటారన్న ప్రశ్న పక్కన పెడితే, భారీగా ఖర్చు చేసి ఓట్లను కొనుగోలు చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. పోలింగ్ జరుగుతున్న సమయంలో ఆశించిన ఓట్లను రాబట్టుకునేందుకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని పలుచోట్ల సర్పంచ్, వార్డు అభ్యర్థులు ప్రత్యేక టీంలను సిద్ధం చేసుకున్నారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓటు చొప్పున నగదు అక్కడికక్కడే పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసినట్లు ప్రచారం జరుగుతున్నట్లు సమాచారం.మొదటి విడతలో కొన్నిచోట్ల గెలుపు వాకిట నిలిచిన అభ్యర్థులు చిన్నచిన్న తప్పిదాలతో ఓటమిపాలవ్వడంతో, రెండో విడతలో అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదన్న ఆలోచనతో డబ్బుల పంపిణీతో పాటు రాత్రింబవళ్లు కాళ్లబేరాలు, వ్యక్తిగత సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ప్రత్యేకంగా బచ్చన్నపేట వంటి పలు మండలాల్లో మినీ గ్యాస్ సిలిండర్లు, పొయ్యిలు, ఇతర గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ జోరుగా సాగింది. గెలుపు కోసం పడరాని పాట్లు పడుతూ లక్షలు ఖర్చు పెట్టేందుకు అభ్యర్థులు వెనుకాడడం లేదు. ఎక్కడ ఓట్లకు గండిపడుతుందోనన్న భయంతో కులాల వారీగా లెక్కలు వేసుకుంటూ, ఒకటికి రెండుసార్లు సంప్రదింపులు కొనసాగించారు. ఎక్కడా ఓటు మైనస్ కాకుండా మూడో కన్నుతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దీంతో జనగామ నియోజకవర్గంలో పోల్ మేనేజ్మెంట్ హై వోల్టేజ్కు చేరింది. మొదటి విడతలో ఓడిన అభ్యర్థుల అనుభవాలే గుణపాఠం కీలక గ్రామాల్లో ఒక్కో ఓటుకు రూ.2 వేల నుంచి 3వేలు పకడ్బందీ నిఘా ఉన్నా డబ్బులు, మద్యం, గిఫ్టుల పంపకాలు -
పాల విప్లవకారుడు మర్రి పాపిరెడ్డి
జనగామ: జిల్లాలో పాల విప్లవం తీసుకొచ్చిన ఘనత దివంగత మర్రి పాపిరెడ్డిది అని, ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తు ఉండిపోతాయని విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.గోపాల్సింగ్ కొనియాడారు. జిల్లా కేంద్రంలోని పాలకేంద్రం ఆవరణలో శనివారం పాపిరెడ్డి ఆరో వర్ధంతి నిర్వహించారు. అనంతరం పాల ఉత్పత్తిదారుల అధ్యక్షులు కాసారపు ధర్మారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.. జిల్లాలో ప్రతీ మండలానికి మినీ పాలసేకరణ కేంద్రాలు, పాలసేకరణ భవనాలు ఏర్పాటు చేయడంలో పాపిరెడ్డి ఎంతో కృషి చేశారన్నా రు. కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షుడు నాగరాజు, విజయ డెయిరీ మ్యాక్స్ సొసైటీ ఉపాధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, మేనేజర్ నరేశ్, నర్మెట బీఎంసీ చైర్మన్ అంజనేయులు, మాజీ జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి, నాగారం అధ్యక్షురాలు రాధ, దేవరుప్పుల మేనేజర్ లక్ష్మి, గోపాలమిత్ర సూపర్వైజర్ జయపాల్రెడ్డి, నాగరా జు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.గ్లోబల్ సమ్మిట్లో చిందు యక్షగానందేవరుప్పుల: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్లో గడ్డం సమ్మయ్య బృందం జానపద సాంస్కృతికత విశిష్టతను తెలిపేలా చిందు యక్షగానం ప్రదర్శనలు ఇచ్చింది. శనివారం మండలంలోని అప్పిరెడ్డిపల్లె చిందు యక్షగాన బృందం హైదరాబాద్లోని గ్లోబల్ సమ్మిట్ ఉత్సవాల్లో భూకై లాస్ యక్షగాన ప్రదర్శనలు చేశారు. కార్యక్రమంలో గడ్డం శ్యామ్సుందర్, రఘుపతి, శ్రీపతి, వెంకన్న, లక్ష్మయ్య, హిమగిరి, రాసాల ప్రభాకర్, పిట్టల మహేశ్ పాల్గొన్నారు. తక్కువ రెమ్యునరేషన్ అవమానకరం జనగామ రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 10 రోజుల పాటు 8 రోజుల పోలింగ్, 2 రోజుల శిక్షణ విధులు నిర్వహించిన వేలాది మంది ఉపాధ్యాయులు, అధికారులకు స్వల్ప మొత్తం రెమ్యునరేషన్ ఇవ్వడం తీవ్ర అవమానకరమని తెలంగాణ రాష్ట్ర యూనైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్ విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్రావు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పది రోజులకు గాను స్టేజ్–1 రిటర్నింగ్ అధికారి – కేవలం రూ.3,500, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి 2,200, స్టేజ్–2 రిటర్నింగ్ అధికారికి 2,000 చెల్లిస్తున్నారని వివరించారు. కొన్ని జిల్లాల్లో ఈ రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, కోశాధికారి చిక్కుడు శ్రీనివాస్, కృష్ణ , సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘బాలయేసు’ విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
దేవరుప్పుల: బాలయేసు విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎంపీడీఓ మేనక పౌడేల్ ఆకాంక్షించారు. శనివారం మండల కేంద్రంలోని బాలయేసు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో ‘టెక్ ఇన్నోవేషన్ సమ్మిట్ –2025’ ప్రారంభోత్సవానికి పాఠశాల కరస్పాండెంట్ బ్రదర్ జేసురాజు అధ్యక్షత వహించగా ఎంపీడీఓ ప్రారంభించారు. ఎంపీడీఓ మేనక పౌడెల్ మాట్లాడుతూ.. ప్రయోగాత్మక విద్యతోనే సాంకేతిక పరిజ్ఞానం, నవీన ఆలోచనాత్మక ఆవిష్కరణలు సాధ్యమన్నారు. ఈ సందర్భంగా 9వ తరగతి విద్యార్థినులు ‘భారతదేశం 21 వ శతాబ్దం విదేశాంగ విధానపు రూపురేఖలు’, 7వ తరగతి విద్యార్థినులు ‘రక్షణ రంగంలో భారత సాంకేతిక ఆధిపత్యం’ అనే అంశం, 8వ తరగతి విద్యార్థినులు ‘నిత్యజీవితంలో కృత్రిమ మేధస్సు ప్రభావం’ అనే అంశంపై ప్రతిభను చాటిచారు. ఉపాధ్యాయులు మదన్మోహన్, మహేశ్, అనిత, మాధవి, ఎన్సీసీ పీఓ కృష్ణ పాల్గొన్నారు. టెక్ ఇన్నోవేషన్ సమ్మిట్ –2025ను ప్రారంభించిన ఎంపీడీఓ మేనక పౌడేల్ -
ఇబ్బందులు తలెత్తితే మా దృష్టికి తీసుకురండి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బచ్చన్నపేట: మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో జరుగుతున్న మెటీరియల్ పంపిణీ సరిగ్గా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ శనివారం సందర్శించి మెటీరియల్ పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పక్కాగా అందించాలని, చెక్లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి అందిందా, లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తేవాలని ఆర్ఓలకు, మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ పండరి చేతన్ నితిన్, మండల స్పెషల్ అధికారి అంబికాసోని, ఎంపీడీఓ మమతాబాయ్, తహసీల్దార్ రామానుజాచారి, ఎస్సై ఎస్కే అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల పరిశీలననర్మెట: ఎన్నికల సందర్భంగా మండలకేంద్రంలోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను శనివారం అదనపు కలెక్టర్ (ఎల్బీ) పింకేశ్ కుమార్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ కావ్య శ్రీనివాస్, ఎంపీఓ వెంకట మల్లికార్జున్, సిబ్బంది ఉన్నారు. తరిగొప్పులలో.. తరిగొప్పుల: ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ సూచించారు.శనివారం మండలకేంద్రంలో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఎన్నికల సజావుగా సాగేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లావణ్య, తహసీల్దార్ మొగుళ్ల మహిపాల్రెడ్డి, డీటీ రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ధనుర్మాసం..ధార్మికశోభ
పాలకుర్తి టౌన్: గోదాదేవి వ్రతాలు, కల్యాణాలతో మండలంలోని వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం, శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయాలు ధనుర్మాస శోభ సంతరించుకోనున్నాయి. ఈనెల 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. భక్తులు ఈ నెలంతా తెల్లవారుజామున తీర్థసాన్నాలు ఆచరించి దైవరాధన చేస్తారు. ఈ మాసంలో గోదాదేవి, శ్రీరంగనాయకసావమిని వేకువజామున దర్శించుకోవడం గొప్ప యోగంగా భావిస్తారు. ఈనెల 30న వైకుంఠ ఏకాదశిని వైభవంగా నిర్వహించేందుకు ఆలయ ఆధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజు ఉత్తర ద్వారం గుండా శ్రీవిష్ణుమూర్తిని దర్శించుకుంటారు.● ఈనెల 16 నుంచి వైష్ణవ ఆలయాల్లో పూజలు ● ముస్తాబైన వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం -
ఇప్పగూడెంలో 1,465 ఓట్ల మెజార్టీ..
స్టేషన్ఘన్పూర్: మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ అయిన ఇప్పగూడెంలో కాంగ్రెస్, సీపీఎం పార్టీలు బలపర్చిన అభ్యర్థి మందపురం రాణిఅనీల్గౌడ్ రికార్డు స్థాయిలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పగూడెంలో 4,472 ఓట్లు ఉండగా 3,820 ఓట్లు పోలయ్యాయి. అందులో మందపురం రాణికి 2,582 ఓట్లు రాగా బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థికి 1,117 ఓట్లు వచ్చాయి. మొత్తానికి రికార్డు స్థాయిలో 1465 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి విక్టరీ సాధించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ రాణి మాట్లాడుతూ గ్రామంలో ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవతో పనిచేస్తానన్నారు. -
14న షైన్ స్కాలర్ షిప్ టెస్ట్
హన్మకొండ : హనుమకొండ బాలసముద్రంలోని షైన్ జూనియర్ కళాశాలలో ఈనెల 14న షైన్ స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్యాదవ్ తెలిపారు. శుక్రవారం కళాశాలలో స్కాలర్షిప్ టెస్ట్ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ టెస్ట్లో 96 నుంచి 100 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ఇంటర్ ప్రవేశంలో పూర్తి రాయితీ అందించనున్నట్లు తెలిపారు. 91 నుంచి 95 మార్కులు సాధించిన విద్యార్థులకు 75 శాతం, 86 నుంచి 90 మార్కులు సాధించినవారికి 50 శాతం, 81 నుంచి 85 మార్కులు సాధించిన విద్యార్థులకు 25 శాతం ట్యూషన్ ఫీజు రాయితీ మొదటి ఐదుగురు విద్యార్థులకు అందించనున్నట్లు వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో షైన్ విద్యాసంస్థల డైరెక్టర్లు మూగల రమ, ఏ.కవిత, మూగల రమేష్, ప్రిన్సిపాల్స్ పి.శ్రీనివాస్, ప్రశాంత్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
నెల్లుట్ల సర్పంచ్కు 1,001 ఓట్ల ఆధిక్యం
లింగాలఘణపురం: మండలంలోని నెల్లుట్లకు చెందిన నర్సింగ రామకృష్ణకు మండలంలోని 21 పంచాయతీల్లో అత్యధికంగా 1,001 ఓట్ల మెజారిటీ సాధించారు. నెల్లుట్లలో 4,885 ఓట్లకు గాను 4,058 ఓట్లు పోలైయ్యాయి. అందులో 1,946 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి 945 ఓట్లు, నల్ల అనిల్కుమార్కు 649, చెపూరి ఉపేందర్కు 207, నల్ల కుమారస్వామి 102, నల్ల విజయ్కు 79 ఓట్లు వచ్చాయి. తిరస్కరించినవి 104, నోటాకు 26 ఓట్లు వచ్చాయి. రెండోస్థానంలో లింగాలఘణపురం మండల కేంద్రానికి చెందిన ఎడ్ల లావణ్య 857 ఓట్ల మెజారిటీ సాధించగా అత్యల్పంగా పటేల్గూడెంకు చెందిన పొన్నాల బుచ్చయ్య 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. -
స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి..
రఘునాథపల్లి: స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని మేజర్ గ్రామపంచాయతీ రఘునాథపల్లి జీపీ (ఎస్సీ మహిళ) సర్పంచ్ అభ్యర్థిగా బొల్లం ఉమారాణి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచింది. అధికార పార్టీ తరఫున పోటీ చేసిన నీలం వనమాలపై 567 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి బొల్లం కుటుంబం కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో పని చేస్తోంది. ఉమారాణికి అధికార పార్టీ నుంచి టికెట్ ఆశించినా.. అవకాశం ఇవ్వలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఉమారాణి ప్రత్యేకతను చాటుకున్నారు. జఫర్గఢ్లో.. జఫర్గఢ్: జఫర్గఢ్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా కుల్లా మోహన్రావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం చి త్తశుద్ధితో పని చేస్తానన్నారు. గతంలో కూడా సర్పంచ్గా గ్రామానికి సేవలందించినట్లు తెలిపారు. ఈసారి కూడా తనను సర్పంచ్గా అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
సహజారెడ్డి అంత్యక్రియలు పూర్తి
● అమెరికాలో ఎనిమిది రోజుల క్రితం అగ్నిప్రమాదంలో మృతి స్టేషన్ఘన్పూర్: అమెరికా బర్మింగ్ హోమ్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో భారత కాలమాన ప్రకారం ఈనెల 5న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మృతిచెందిన ఉడుముల సహజారెడ్డి అంత్యక్రియలు ఆమె స్వగ్రామమైన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామశివారు గుంటూరుపల్లిలో శుక్రవారం సాయంత్రం క్రైస్తవ సంప్రదాయంలో నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. గుంటూరుపల్లికి చెందిన ఉడుముల జయాకర్రెడ్డి, గోపు మరియశైలజ కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. వారి పెద్ద కుమార్తె సహజారెడ్డి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లింది. అమెరికాలో బర్మింగ్హోమ్లో ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న ఆమె ఎనిమిది రోజుల క్రితం అగ్నిప్రమాదంలో మృతిచెందింది. కాగా ఆమె మృతదేహాన్ని గుంటూరుపల్లికి శుక్రవారం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగా విశాఖపట్నం అగ్రపీఠాధిపతి బిషప్ ఉడుముల బాల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టారు. -
రాజకీయ అనుభవం లేకున్నా..
చిల్పూరు: ప్రజలు కోరిన విధంగా గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తానని మండల కేంద్రం అయిన చిల్పూరు గ్రామ సర్పంచ్గా గెలుపొందిన నలిమెల అనిత అన్నారు. శుక్రవారం మాట్లాడుతూ ఎంబీఏ వరకు చదివిన తనకు రాజకీయంగా అనుభవం లేకున్నా గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకుని ఎమ్మెల్యే శ్రీహరి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. ముఖ్యంగా చిల్పూరు గుట్ట ఆలయానికి వచ్చే భక్తులతో పాటు గుట్ట చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారికి కోతుల బెడద నివారణకు పాటుపడతానని అన్నారు. -
జాతర పనులు త్వరగా పూర్తి చేయాలి
మోహన్రావు ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతర పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ, హౌసింగ్, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం, మేడారంలో రోడ్ల విస్తర్ణ పనులతోపాటు భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న పనులన్నీ ఈనెల 30 వరకు పూర్తి చేయాలని ఇది లాస్ట్ డెడ్లైన్ అని మంత్రి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మంత్రి సీతక్కతో కలిసి అమ్మవార్ల గద్దెల ప్రాంగణం అభివృద్ధి పనులు, సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్దరణ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలు, గద్దెల ప్రాంగణంలో ఫ్లోరింగ్ పనులు, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం రోడ్ల నిర్మాణం, జంపన్న వాగు వద్ద ఏర్పాట్లు, వాగులో ఇసుక లెవలింగ్ పనులను పరిశీలించారు. అనంతరం జాతర అభివృద్ధి పనులపై ఆయాశాఖల అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించి జాతర పనుల పురోగతి వివరాలపై ఆరా తీశారు. గద్దెల ప్రాంగణం సాలహారం, గద్దెల విస్తర్ణ, ఆర్చీ ద్వారా స్థంబాల స్థాపన పనుల్లో నెమ్మదిగా సాగుతున్నాయని పూజారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈసందర్భంగా పొంగులెటి మాట్లాడుతూ.. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులతోపాటు, జాతర అభివృద్ధి పనులన్నీ ఈనెల 30 వరకు పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు కార్మికుల సంఖ్యను పెంచడంతోపాటు అదనంగా మరో రెండు క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. క్యూలైన్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. అంతకుముందు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్శన్ రేగ కల్యాణి. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు పాల్గొన్నారు. పనులను పరిశీలించిన మంత్రులు పొంగులేటి, సీతక్క ఈనెల 30 లాస్ట్ డెడ్లైన్ అధికారులతో సమీక్ష సమావేశం -
వెట్టి చాకిరీపై.. కదిలిన యంత్రాంగం
వరంగల్ క్రైం: విద్యార్థులతో బలవంతంగా అంట్లు తోమించి.. టిఫిన్లు తయారు చేయించిన ఓగ్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వ్యవహారంపై శుక్రవారం సాక్షిలో ‘చిట్టి చేతులు.. వెట్టి చాకిరీ’ పేరిట కథనం ప్రచురితమైంది. దీంతో రాష్ట్ర, జిల్లా అధికారులు కదిలారు. సాక్షి కథనంపై స్పందించిన పరకాల కోర్టు న్యాయమూర్తి జి.సాయి శరత్ పాఠశాలను సందర్శించడంతో వెట్టి చాకిరీ వ్యవహారం ఒక్కసారిగా వెడెక్కింది. దామెర తహసీల్దార్, జ్యోతి వరలక్ష్మి, డీసీఓ ఉమామహేశ్వరి, భద్రాది కొత్తగూడెం జోనల్ అధికారి అలివేలు, దామెర ఎస్సై అశోక్ కుమార్, ఎంఈఓ రాజేష్ ఉదయం పాఠశాలను సందర్శించారు. ముందుగా టిఫిన్ చేసిన విద్యార్థులను వేర్వేరుగా ప్రశ్నించారు. విచారణలో విద్యార్థులు తమతో బలవంతంగా పనులు చేయించినట్లు అధికారులకు చెప్పినట్లు సమాచారం. పాఠశాలలో పనిచేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్ తన దగ్గర వంట మనుషులు లేకపోవడంతో విద్యార్థులను పనిలో పెట్టుకున్నట్లు అధికారులకు చెప్పినట్లు తెలిసింది. చిట్టి వెట్టి చాకిరి కథనంపై స్పందించిన న్యాయమూర్తి సాయి శరత్ ఈఅంశాన్ని సుమోటాగా తీసుకుని పాఠశాల లో విచారణ చేపట్టి నివేదికను జిల్లా ప్రధాన న్యాయమూర్తికి అందజేసినట్లు తెలిసింది. సమస్యల స్వాగతం.. పాఠశాలలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడంతో అధికారులు ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్లు తెలిసింది. పాఠశాలలో చోటుచేసుకున్న ఘట నపై లోతుగా విచారణ చేసినట్లు తెలిసింది. భద్రా ది కొత్తగూడెం జోనల్ అధికారి అలివెలు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి వివరాలు సేకరించారు. విద్యార్థులు టిఫిన్ వండటం, విద్యార్థులను కులం పేరుతో దూషించిన ఘటనలపై సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శికి నివేదిక సమర్పిస్తామని, ఆ తర్వాత శాఖాపరమైన చర్యలు ఉంటాయని జోనల్ అధికారి అలివేలు తెలిపారు. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలి: విద్యార్థి సంఘాలు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న ప్రిన్సిపాల్ సమ్మయ్య ను సస్పెండ్ చేయాలని కోరుతూ టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నం సునిల్, టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ రంజిత్ కుమార్, విద్యార్థి సంఘాల జేఏసీ కోఆర్డినేటర్ అనిల్ భద్రాది కొత్తగూడెం జోనల్ అధికారికి వినతి పత్రం అందజేశారు. విద్యార్థులతో మాట్లాడిన పరకాల జడ్జి ప్రిన్సిపాల్ సస్పెన్షన్కు విద్యార్థి సంఘాల డిమాండ్ ‘సాక్షి’ కథనంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు -
లక్ష్యానికి నవోదయం !
ఖిలా వరంగల్: నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు(శనివారం) జరిగే ప్రవేశ పరీక్షకు మొత్తం 28 పరీక్ష కేంద్రాలను 14 బ్లాకులుగా విభజించి ఏర్పాటు చేశారు. 5,648 మంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 3,207 బాలురు, 2,439 బాలికలు ఉన్నారు. మొత్తం 80 సీట్లు ఉండగా.. పట్టణ(నగర) పరిధిలో 20 సీట్లకు 1,934 మంది, గ్రామీణ ప్రాంత పరిధిలో 60 సీట్లకు 3,714 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. సీటు వస్తే నవోదయమే.. మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో ఒక్కసారి సీటు లభిస్తే ఆరో తరగతి మొదలు 12వ తరగతి (ప్లస్ టూ) వరకు ఉచితంగా చదువు కొనసాగించవచ్చు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం మామునూరులోనే ఉంది. ఈ విద్యాలయంలో ఏటా ప్రవేశానికి పోటీ భారీగా ఉంటోంది. శనివారం ఎంపిక పరీక్ష నిర్వహించనున్న నేపధ్యంలో పాటించాల్సిన మెలకువలను నవోదయ ప్రిన్సిపాల్ పూర్ణిమ వివరించారు.నేడు నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఉమ్మడి జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలు పరీక్ష కేంద్రానికి గంట ముందే అనుమతి పరీక్ష రాసే విద్యార్థులు 5,648 మంది -
కొడుకు చేతిలో తండ్రి హత్య
గూడూరు: మద్యం మత్తులో గొడవపడిన తండ్రిని కుమారడు కొట్టి చంపిన ఘటన మానుకోట జిల్లా గూడూరు మండలంలోని దామరవంచ శివారు హఠ్యతండాలో గురువారం అర్ధరాత్రి జరిగింది. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హఠ్యతండాకు చెందిన ధారావత్ నందీరాంనాయక్ (45) భార్యా పిల్లలతో హైదరాబాద్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి స్వగ్రామానికి వచ్చారు. గురువారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన నందీరాం గొడవ చేస్తున్నాడు. గొడవ వద్దని చెప్పిన భార్యపై మద్యం మత్తులో రోకలితో దాడి చేయడానికి యత్నించాడు. గుర్తించిన కుమారుడు కృష్ణ అదే రోకలితో తండ్రి ఛాతిపై కొట్టాడు. వెంటనే కింద పడి స్ప్రృహకోల్పోయాడు. కొద్దిసేపటికి గుర్తించిన కుటుంబ సభ్యులు గూడూరు సీహెచ్సీకి తరలించారు. వైద్యుడు పరీక్షించి, అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. ఈ సంఘటనపై మృతుడి తల్లి ధారావత్ సోమ్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గిరిధర్రెడ్డి తెలిపారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల వాగ్వాదం
స్టేషన్ఘన్పూర్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలోని తాటికొండలో పోలింగ్ అనంతరం కౌంటింగ్ ఏజెంట్ల విషయమై కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాటలు, ఘర్షణ వాతావరణం నెలకొంది. తాటికొండలో ఉదయం పోలింగ్ సమయం నుంచి స్వల్వ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ కేంద్రానికి సమీపాన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా ప్రచారం చేపట్టారు. కాగా పోలింగ్ అనంతరం కౌంటింగ్ ఏజెంట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి మొదట ప్రకటించిన వ్యక్తి కాకుండా మరో కాంగ్రెస్ నాయకుడు వెళ్తుండగా బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. ఒక దశలో ఘర్షణ వాతావరణం నెలకొనగా అక్కడ విధుల్లో ఉన్న ఎస్ఐ రాజేశ్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో ఏపీపీ భీమ్శర్మ, సీఐలు వేణు, రాఘవేందర్ పోలీసు సిబ్బందితో గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులను నచ్చజెప్పి సర్దిచెప్పారు. కోమటిగూడెంలోనూ.. మండలంలోని కోమటిగూడెంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ కేంద్రానికి సమీపాన కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తుండగా బీఆర్ఎస్ వారు అడ్డుకోవడంతో స్వల్వ ఉద్రిక్తత నెలకొంది. కాగా పోలీసులు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. తాటికొండలో ఉద్రిక్త వాతావరణం -
వేగం పుంజుకుని
జనగామ: జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు ఓటర్ల ఉత్సాహంతో రికార్డు స్థాయిలో ముగిశాయి. స్టేషన్న్ఘన్పూర్ నియోజకవర్గంలోని లింగాలఘనపురం, రఘునాథపల్లి, స్టేషన్ఘన్పూర్, చిల్పూరు, జఫర్గఢ్ ఐదు మండలాల పరిధిలో 87.33 శాతం ఓటింగ్ నమోదు కావడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించింది. 110 గ్రామపంచాయతీల పరిధిలో 1,66,497 మంది ఓటర్లు ఉండగా 1,45,404 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 88.73శాతంతో ముందంజలో నిలవగా, మహిళలు 85.97శా తంతో సమాన పోటీని చూపించారు. పోలింగ్ శాతంలో లింగాలఘణపురం మండలం 89.71 శాతంతో మొదటి స్థానంలో నిలువగా, చిల్పూరు మండలం 86.59 శాతంతో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఉదయం నెమ్మదిగా సాగిన పోలింగ్, 10 గంటల తర్వాత వేగం పుంజుకుని మధ్యాహ్నానికి తారస్థాయికి చేరింది. మొత్తం మీద ఐదు మండలాల్లో ఓటింగ్ సరళి ఉత్కంఠ భరితంగా సాగింది. మండలాల వారీగా.. ఐదు మండలాల్లో పురుష–మహిళా ఆధిక్యం ఇలా ఉంది. చిల్పూరులో పురుషులు 87.55శాతం, మహిళలు 85.66 శాతం ఓటింగ్తో స్వల్ప పురుష ఆధిక్యం కనిపించగా, స్టేషన్న్ఘన్న్పూర్లో 87.62శాతం పురుషులు, 84.61శాతం మహిళలు ఓటేసి అదే ధోరణి కొనసాగించారు. లింగాలఘణపురంలో మాత్రం 91.92శాతం పురుషులు నమోదు కాగా మహిళలు 87.59శాతం మాత్రమే ఓటు వేయగా, పురుషుల స్పష్టమైన ఆధిక్యం కనిపించింది. రఘునాథపల్లిలో 89.27శాతం పురుషులు, 86.82శాతం మహిళలు ఓట్లతో పోలింగ్లో ఆసక్తి కనిపించగా, జఫర్గఢ్ మండలంలో మాత్రం పురుషులు 86.90శాతం ఓట్లు నమోదు కాగా, 84.63 శాతంతో మహిళలు కాసింత వెనకబడ్డారు. రెండు గంటలకోసారి.. జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎలక్షన్ల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 7–9 గంటల మధ్య ఓటింగ్ నెమ్మదిగా సాగి 34, 941 ఓట్లు పోలు కాగా(20.99,శాతం), 10 గంటల తర్వాత వేగం పెరిగింది. 10–11 గంటల మధ్య 79,786 ఓట్లు పోలవడంతో(47.92) బరిలో నిలిచిన అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అదే ఊపు కొనసాగించారు. దీంతో పోలింగ్ ముగిసే సమయం మధ్యాహ్నం 1 గంటల వరకు 73.40 శాతం మార్కు చేరుకుంది. అప్పటికే క్యూలో నిలబడ్డ ఓటర్లను కలుపుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తం ఓట్ల సంఖ్య 1,45,404 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, 87. 33శాతం ఓటింగ్తో మొదటి విడత పోలింగ్ ఉత్తేజభరితంగా ముగిసింది. గంట గంటకూ పోలింగ్లో వేగం మారడం గమనార్హం.మండలం మొత్తం ఓటర్లు పురుషులు శాతం మహిళలు శాతం మొత్తం శాతం చిల్పూరు 31,129 13,465 87.55 13,491 85.66 86.59 స్టే.ఘన్పూర్ 26,030 11,308 87.62 11,104 84.61 86.10 లిం.ఘణపురం 33,356 15,004 91.92 14,920 87.59 89.71 రఘునాథపల్లి 42,007 18,550 89.27 18,429 86.82 88.03 జఫర్గఢ్ 33,975 14,597 86.90 14,536 84.63 85,75 మొత్తం 1,66,497 72,924 88.73 72,480 85.97 87.33 -
కాంగ్రెస్దే తొలివిడత
జనగామ: స్టేషన్ఘన్పూర్ మొదటి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. గురువారం జరిగిన పోలింగ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. 110 సర్పంచ్లు, 1,024 వార్డులకు గాను 228 ఏకగ్రీవం కాగా, 796 చోట్ల పోలింగ్ జరిగింది. ఐదు మండలాల పరిధిలో కాంగ్రెస్ దండయాత్ర కొనసాగగా, పార్టీ బలపరిచిన అభ్యర్థులు 110 గ్రామపంచాయతీల్లో 65 స్థానాల్లో విజయం సాధించి పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. లింగాలఘణపురం, రఘునాథపల్లి, స్టేషన్ఘన్పూర్, చిల్పూర్, జఫర్గఢ్ మండలాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయగా, బీఆర్ఎస్ అభ్యర్థులు 26 స్థానాల్లో మాత్రమే విజేత లుగా నిలిచారు. ఈ ఎన్నికల్లో 13 చోట్ల కాంగ్రెస్ రెబల్స్ గెలుపొందగా, ఐదుగురు స్వతంత్రులు ప్రజాభిమానం సంపాదించారు. ఒక గ్రామపంచాయతీ ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 10 జీపీల్ల్లో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం తెలిసిందే. ఇదిలా ఉండగా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల ఫలితం రాత్రి 11.30 గంటలు దాటిని వెలువడలేదు. రెబల్స్, స్వతంత్రుల సత్తా రెబల్స్, స్వతంత్రులు కలిపి 17 స్థానాల్లో ఆధిపత్యం చాటడం గమనార్హం. ప్రధాన పార్టీల అభ్యర్థులుగా అంచనాలు వేసుకున్న పలువురు అనూహ్యంగా ఓటమిపాలు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో స్వతంత్ర, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సమానంగా 210 ఓట్లు సాధించగా, అధికారులు టాస్ వేయగా, స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. రాత్రి వరకు లెక్కింపు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రాత్రి 11:30 గంటల వరకూ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. అనంతరం పోలీసు బందోబస్తు నడుమ బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంకు తరలించారు. గెలిచిన అభ్యర్థులు తమ అనుచ రులతో పటాకులు పేలుస్తూ సంబరాలు జరుపుకోగా, ఓటమి చెందిన వారిలో మాత్రం ఆవేదన, నిరాశ వాతావరణం నెలకొంది. ప్రచారంలో భారీగా ఖర్చు పెట్టి ఓటమి చవిచూసిన కుటుంబాలు తీవ్ర ఆవేదన గురయ్యారు. స్టేషన్ఘన్పూర్ పరిధిలో వెలువడిన ఈ ఫలితాలు జిల్లాలో రానున్న రెండో , మూడో విడత రాజకీయ సమీకరణలకు కొత్త మలుపు తీసుకుని రావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పురుషులదే ఆధిపత్యం జఫర్గఢ్లో సర్పంచ్ ఎలక్షన్లలో ఈసారి గులాబీ దళానికి బోణి కుదరకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో నిరాశను రేకెత్తించింది. మరోవైపు లింగాల ఘణపురంలో బీఆర్ ఎస్ తన సత్తాను చాటుకుని 8 కీలక స్థానాల్లో గెలుపు సాధించడం పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. పోలింగ్ ఫలితాల్లో పురుషులదే స్పష్టమైన ఆధిపత్యం కనబడింది. 65 స్థానాల్లో కాంగ్రెస్.. 26 చోట్ల బీఆర్ఎస్ దుమ్మురేపిన రెబల్స్, స్వతంత్రులు లెక్కింపులో ఉత్కంఠ.. విజయంలో ‘ఉంగరం’ మెరుపులు.. జఫర్గఢ్లో బోణికొట్టని గులాబీ దళం లింగాలఘణపురంలో సత్తాచాటిన బీఆర్ఎస్ మద్దతుదారులు పోలింగ్.. విజయంలోనూ పురుషులదే ఆధిపత్యంజఫర్గఢ్: ఉపాధ్యాయ సంఘం నేతగా పని చేసిన గోపు సోమ య్య సర్పంచ్గా ఎన్నికయ్యారు. తిడుగు గ్రామానికి చెందిన గోపు సోమ య్య ఏపీటీఎఫ్ డీటీఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పని చేయడంతో పాటు టీడీటీఎఫ్ రాష్ట్ర శాఖలో కీలక పాత్ర పోషించారు. ఐదు మండలాల పరిధిలో ఉంగరం గుర్తుపైనే ఓటర్ల తీర్పు ఎక్కువగా పడింది. తరువాత స్థానాల్లో కత్తెర, బ్యాట్,ఫుట్బాల్ గుర్తులు నిలిచాయి. పలు గ్రామాల్లో స్థానిక సమీకరణాలు, గ్రామపెద్దల అనుబంధాలు, అంతర్గత విభేదాలు ఫలితాలను ప్రభావితం చేశాయి. ఓటర్ల ఉత్సాహంతో చలిని సైతం తట్టుకుని పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. మధ్యాహ్నం 1 గంట వరకు 90 శాతం పోలింగ్ పూర్తి కగా, పలుచోట్ల మూడు గంటల వరకూ పోలింగ్ సాగింది. పోలింగ్ ముగిసిన వెంటనే లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్యాలెట్ పేపర్లు తెరి చే ప్రతిసారీ అభ్యర్థులు ఉత్కంఠతో శ్వాస ఆపి ఫలితాలను గమనించడంపై దృష్టిపెట్టారు. -
కలెక్టరేట్ నుంచి పోలింగ్ కేంద్రాలపై నిఘా!
● వెబ్కాస్టింగ్ నిఘా విజయవంతంజనగామ: జిల్లాలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా జిల్లా పరి పాలన కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. స్టేషన్ఘన్న్పూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పోలింగ్ ప్రారంభమైన నిమిషం నుంచి ముగిసే వరకూ జిల్లా ఎన్నికల అబ్జర్వర్ రవికిరణ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా స్వయంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలను నిశితంగా పరిశీలించారు. వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ పర్యవేక్షణలో పోలీస్ శాఖ ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. మొదటి విడత పోలింగ్ను శాంతియుతంగా ముగించిన ఎన్నికల ని ర్వాహక యంత్రాంగం ఇప్పుడు రెండో, మూడో విడతలకు మరింత సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. -
నమిలిగొండ పోలింగ్ కేంద్రంలో సీపీ
స్టేషన్ఘన్పూర్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలోని నమిలిగొండ గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాట్లతో పాటు ఎన్నికలు జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించారు. పోలింగ్ సజావుగా జరిగేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అక్కడ విధులలో ఉన్న ఎన్నికల అధికారులు, పోలీసులకు తగిన సూచనలు అందించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ప్రజలందరూ సహకరించాలన్నారు. సీపీ వెంట డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ భీమ్శర్మ, సీఐ జి.వేణు తదితరులున్నారు. -
మెరుగైన సేవలు అందించాలి
● అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ జనగామ రూరల్: అధికారులు సమన్వయంతో పనిచేసి పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో విభాగాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్ సిబ్బంది, వివిధ లైన్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోండి లింగాలఘణపురం: ఎన్నికల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకొని పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని అధికారులకు అదనపు కలెక్టర్ పింకేశ్కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. ఆయనతో పాటు ఎంపీడీఓ శివశంకర్రెడ్డి, తహసీల్దార్ రవీందర్ తదితరులు ఉన్నారు. -
తొలి పోరుకు రెఢీ
నేటి ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జనగామ: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఎన్నికల వేళ రాత్రి గ్రామాల్లో డబ్బుల వర్షం కురిసింది. అభ్యర్థులు ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు పంపిణీ చేస్తూ..వెండి నాణేలు, గిఫ్ట్ ప్యాకెట్లతో ఓటర్లను ఆకర్శించే ప్రయత్నం చేశారు. కొన్ని గ్రామాల్లో తెల్లవారుజాము 3 గంటల నుంచే ఇంటింటికీ తిరిగి చక్రం తిప్పారు. 200 ఓటర్లకు ఒక క్లస్టర్గా విభజించి నమ్మకమైన వారికే క్యాష్ పంపిణీ చేసే బాధ్యతలు అప్పగించారు. మరోవైపు మద్యం ఏరులై పారించారు. కొంతమంది ఓటర్లు మాత్రం డబ్బు, గిఫ్టులను తిరస్కరించారు. డబ్బు రాజకీయాలతో పోలింగ్ ముందే వేడిపెరిపోగా, పోలీసులు సమస్యాత్మక గ్రామాలపై నిఘా పెంచారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అల్లర్లకు పాల్పడే వారికి ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. పోలింగ్ ప్రారంభానికి ముందే ఓటరు లెక్కలు మార్చేందుకు సాగిన రాత్రి డ్రామా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా పోలింగ్ కేంద్రాల్లో భద్రత కోసం భారీ బందోబస్తు చేపట్టనున్నారు. 59 క్రిటికల్ కేంద్రాల్లో ప్రత్యేక నిఘా వేయనున్నారు. ఐదు మండలాల్లో 1.72 లక్షల ఓటర్లు గురువారం ఎవరి భవితవ్యం తేలుస్తారో వేచి చూడాలి. స్టేషన్ఘనన్పూర్ నియోజకవర్గ పరిధిలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు యంత్రాంగం సిద్ధమైంది. లింగాలఘణపురం, రఘునాథపల్లి, స్టేషన్ఘన్న్పూర్, జఫర్గఢ్, చిల్పూరు మండలాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 4 గంటలకు ఉపసర్పంచ్ ఎన్నికలు ప్రార ంభిస్తారు. 1,024 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఎన్నికల యంత్రాంగం, ఈసారి ఓటర్ల సౌకర్యం, భద్రత, నిష్పాక్షికతపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 100 ఓట్ల వరకు 266, 101–200 ఓట్ల మధ్య 413, 201–400 ఓట్ల వరకు 345 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 72 మంది మైక్రో అబ్జర్వర్లు, 36 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేపట్టనున్నారు. అదనంగా 42 జోన్లలో 112 రూట్లను ఏర్పాటు చేసి, 59 కేంద్రాలను క్రిటికల్గా గుర్తించారు. ఇదిలా ఉండగా ఐదు మండలాల పరిధిలో 5 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి 72 బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు అఽధికారులు, సిబ్బంది, ఎన్నికల సామగ్రిని పోలీసు ఎస్కార్ట్ నడుమ తరలించారు. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ పరంగా వెస్ట్జోన్ పరిధిలోని 166 పంచాయతీల్లో 108 సాధారణ, 58 క్రిటికల్ గ్రామాలుగా గుర్తించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ పర్యవేక్షణలో ఇద్దరు అడిషనల్ డీసీపీలు, ఏడుగురు ఏసీపీలు, 14మంది సీఐలు, 100మంది ఎస్ఐలు, 1,500 మంది ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, ఆర్ముడ్ ఫోర్స్ సిబ్బంది బందోబస్తులో ఉంటారు. గత ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడిన వారిని ముందుగానే పోలీసులు హెచ్చరించారు. ఓటింగ్, కౌంటింగ్ తర్వాత గెలుపు, ఓటముల నేపథ్యంలో ఏ సంఘటనలు జరగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. గ్రామాల్లో పోలింగ్ కోసం సిద్ధం చేశారు.లింగాలఘణపురంలో బ్యాలెట్ బాక్సులతో సిబ్బంది మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్, విజేతల ప్రకటన సాయంత్రం 4 గంటలకు ఉప సర్పంచ్ ఎన్నిక ఎన్నికల్లో గెలుపు కోసం డబ్బులు, మద్యం ఎర ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థుల చివరి యత్నాలుగ్రామ పంచాయతీలు : 110 వార్డులు : 1,024 మొత్తం ఓట్లు : 1,72,506 పురుషులు : 85,180 మహిళలు : 87,322 ఇతరులు : 8 మైక్రో అబ్జర్వర్లు : 72 వెబ్ కాస్టింగ్ : 36పోలింగ్ నిర్వహణలో 1,131 మంది పీఓలు, 1,544 మంది ఓపీఓలు, 10శాతం అదనపు సిబ్బందితో కలిపి మొత్తం 2,872 మంది పనిచేయనున్నారు. స్టేజ్ –2 ఆర్వో ఆధ్వర్యంలో మొత్తం ప్రక్రియ ముందుకు సాగనుంది. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల లోపల ఎవరూ చేరకుండా కఠిన ఆదేశాలు జారీ చేశారు.మొదటి విడతలో 110 పంచాయతీలు, 1,024 వార్డులు, ఎలక్షన్లు జరుగుతుండగా, ఇప్పటికే 10 మంది సర్పంచులు, 228 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 341 మంది సర్పంచులు, 784 మంది వార్డు సభ్యులు బరిలో ఉండడంతో పోటీ ఉత్కంఠ భరితంగా మారింది.ఉదయం 7 గంటల మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ మధ్యాహ్నం 2 గంటలకు లెక్కింపు సాయంత్రం 4 గంటలకు ఉప సర్పంచ్ ఎన్నికస్టేషన్ఘన్పూర్ : 97 చిల్పూరు : 39 జఫర్గడ్ : 94 రఘునాథపల్లి : 142 లింగాలఘనపురం : 62 మొత్తం : 434 -
ఎన్నికల విధుల్లో జాగ్రత్తగా ఉండాలి
● ఎన్నికల పరిశీలకుడు రవికిరణ్, కలెక్టర్ రిజ్వాన్ బాషా స్టేషన్ఘన్పూర్: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలని ఎన్నికల పరిశీలకుడు రవికిరణ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం నిర్వహించనున్న పోలింగ్ను పురస్కరించుకుని మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో విధులు నిర్వహించనున్న ఎన్నికల అధికారులు, పీఓలు, ఏపీఓలు, ఎన్నికల సిబ్బందికి ఘన్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో బుధవారం ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ మెటీరియల్ పంపిణీ సెంటర్ను ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. కార్యక్రమంలో ఆర్డీఓ డీఎస్ వెంకన్న, ఎంపీడీఓ నర్సింగరావు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బాధ్యతగా వ్యవహరించాలి.. రఘునాథపల్లి: ఎన్నికల విధులు భాద్యతగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్బాషా అధికారులకు సూచించారు. బుధవారం రఘునాథపల్లి ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, తహసీల్దార్ ఫణికిషోర్, పంచాయతీ కార్యదర్శి బాలకిషన్, పీఓ, ఏపీఓలు ఉన్నారు. గూగుల్ మీట్లో సమీక్ష జనగామ: పోలింగ్, లెక్కింపు ప్రక్రియను అధికార యంత్రాంగం సమన్వయంతో జాగ్రత్తగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు రవి కిరణ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. మొదటి విడత పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి బుధవారం ఎంపీడీఓ, తహసీల్దార్, ఆర్వోలు, జోనల్ ఆఫీసర్లతో గూగుల్ మీట్లో సమీక్షించారు. -
యాక్షన్ ప్లాన్ రెడీ!
సాక్షిప్రతినిధి, వరంగల్: యాసంగి పంటలకు సాగునీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఉమ్మడి వరంగల్లో 9,48,114 ఎకరాలకుగాను 5,29,726 ఎకరాలకు నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. 15 రోజులు ఆన్.. 15 రోజులు ఆఫ్ పద్ధతిన యాసంగి పంటలకు సాగునీరు అందించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈనెల 24 నుంచి వరంగల్, ములుగు ఇరిగేషన్ సర్కిళ్ల పరిధిలోని 5,29,726 ఎకరాల తడి, మెట్ట భూములకు 41.28 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు కూడా రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈమేరకు యాసంగికి సాగునీరు అందేలా అధికారులు కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఇరిగేషన్ వరంగల్ చీఫ్ ఇంజినీర్ పరిధిలో మొత్తం 7,92,894 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ యాసంగిలో 4,35,172 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇందులో 2,68,598 ఎకరాల తడి, 1,66,574 ఎకరాల మెట్ట భూములు ఉన్నాయి. జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల ద్వారా 1,95,095 ఎకరాలకు 11.30 టీఎంసీలు, ఎస్సారెస్పీ కాకతీయ కాలువ (ఎల్ఎండీ దిగువ) ద్వారా 1,57,038 ఎకరాలకు 12.88 టీఎంసీలు, ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద 83,039 ఎకరాలకు 6.82 టీఎంసీలు సరఫరా చేయనున్నారు. నీటి లభ్యతను బట్టి యాసంగి పంటలకు సాగునీరు అందేలా నీటిపారుదలశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈమేరకు రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ములుగు ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయం పరిధిలో మొత్తం 1,55,220 ఎకరాల ఆయకట్టు ఉంది. 94,554 ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించనున్నారు. ఇందులో తడి 34,958 ఎకరాలు కాగా, మెట్ట 59,596 ఎకరాలు. ఇందుకోసం 10.28 టీఎంసీల నీరు సిద్ధంగా ఉన్నట్లు నీటిపారుదలశాఖ ప్రతిపాదనల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్ (ఎల్ఎండీ దిగువన) కింద 1,03,883 ఎకరాలకు గాను 58,901 ఎకరాలకు ఆరు టీఎంసీలు సరఫరా చేయనున్నారు. పాకాల చెరువు కింద 18,193 ఎకరాలకు మొత్తంగా, రామప్ప లేక్ కింద 5,180 ఎకరాలకుగాను 1,600 ఎకరాలకు అదనంగా కలిపి 6,780 ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించనున్నట్లు ‘స్కీవం’ కమిటీ పేర్కొంది. అలాగే లక్నవరం చెరువు కింద 8,794 ఎకరాలకు గాను 4,550లు, మల్లూరు వాగు కింద 7,500 ఎకరాలకు 1,500లు, పాలెంవాగు ప్రాజెక్టు కింద 7,500 ఎకరాలకు గాను 1,500 ఎకరాలకే ఈ సారి సాగునీటిని అందించనున్నట్లు ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. ఉమ్మడి వరంగల్లో ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2, దేవాదుల, రామప్ప, పాకాల, లక్నవరం సరస్సులు, చిన్ననీటి వనరుల ద్వారా స్థిరీకరించిన ఆయకట్టు కింద 9,48,114 ఎకరాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులు, నీటి లభ్యతను బట్టి 5,29,726 ఎకరాలకు ఆన్ అండ్ ఆఫ్ (వారబందీ) పద్ధతిన సరఫరా చేయనున్నారు. అయితే, గత యాసంగిలో 6,46,664 ఎకరాలకు నీరిచ్చిన అధికారులు ఈసారి 5,29,726 ఎకరాలే ప్రతిపాదించారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి 1,16,938 ఎకరాలు తగ్గింది. కాగా, 15 రోజులు విడుదల చేసి 15 రోజులు ఆఫ్ చేసే పద్ధతిలో ఈ నెల 24 నుంచి ఆయకట్టుకు నీటి విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఎల్ఎండీ, దేవాదుల, రామప్ప, లక్నవరం, మల్లూరు వాగు, పాలెం వాగుల పరిధి ఆయకట్టు రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. గత యాసంగిలో 6,46,664 ఎకరాలకు సాగు నీరు ప్రస్తుతం 5,29,726 ఎకరాలకు అందించేలా ప్రణాళిక గతేడాదితో పోలిస్తే తగ్గిన 1,16,938 ఎకరాలు వరంగల్ ములుగు ఇరిగేషన్ సర్కిళ్ల పరిధి మెట్ట భూములకు 41.28 టీఎంసీలు 5.30 లక్షల ఎకరాలు.. 41.28 టీఎంసీలు! యాసంగి యాక్షన్ ప్లాన్ రెడీ చేసిన ఇరిగేషన్ శాఖ వరంగల్, ములుగు సర్కిళ్లలో ఆయకట్టుకు సాగునీరు 15 రోజులకోసారి ఆన్అండ్ఆఫ్ -
అప్రమత్తంగా ఉండాలి
చిల్పూరు: స్థానిక ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు పోలీసులు, పోలింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సన్ప్రీత్సీంగ్ సూచించారు. మండల కేంద్రంలో బుధవారం పోలింగ్ సామగ్రి తరలింపు ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ భీంశర్మ, ఎస్సై సిరిపురం నవీన్కుమార్ తదితరులు ఉన్నారు. దేవరుప్పుల/ పాలకుర్తి టౌన్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు అని వార్యమని గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యయ జిల్లా పరిశీలకురాలు జయశ్రీ అన్నారు. బుధవారం దేవరుప్పుల, పాలకుర్తి మండలాల్లో ఆ మె సర్పంచ్, వార్డు సభ్యులకు ప్రవర్తన నియామావళి అవగాహన సమావేశం నిర్వహించారు. వేర్వేరు సమావేశాల్లో జిల్లా సహాయ ఎన్నికల అధికారి మేనక పౌడేల్, పాలకుర్తి ఎంపీడీఓ వేదవతి, తహసీల్దార్లు ఆడెపు అండాలు, స్వర్ణలత, ఎన్నికల వ్యయం మండల పరిశీలకులు ఉమాశంకర్, ఎస్సైలు ఊర సృజన్కుమార్, పవన్కుమార్ పాల్గొన్నారు.రఘునాథపల్లి: పంచాయతీ ఎన్నికల సందర్భ ంగా మండలంలో బుధవారం రాత్రి గ్రామాల్లో ప్రలోభ పర్వం ఊపందుకుంది. ప్రత్యర్థి ఎంత పంచుతున్నారో తెలుసుకొని అంతకంటే ఎక్కు వ ఇచ్చి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ముందే నగదు, మద్యం పంపిణీ ప్రారంభిస్తే అవతలి వ్యక్తి అంతకన్నా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉందనే భావనతో మెజార్టీ అభ్యర్థులు వేచి చూసే ధోరణి ప్రదర్శించారు. ఎదుటి వ్యక్తి రూ.1000 ఇస్తే రూ.1500, ప్రత్యర్థి రూ.1500 పంచుతున్నాడని తెలిస్తే రూ.2000 నగదు ఓటర్లకు ఇచ్చేందుకు పోటీ పడ్డారు. జనగామ రూరల్: విద్యార్థులు రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె. సందీప అన్నారు. జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఆదేశాల మేరకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కళాశాలలో హ్యూమన్ రైట్స్ మానవ హక్కులపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నరసింహులు, రవికుమార్, జి.మనోజ్ కుమార్ పాల్గొన్నారు. జనగామ: జనగామ మాతృదర్శన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివంగత ప్రొఫెసర్ వెదిరె మధుసూదన్రెడ్డి వర్ధంతి పురస్కరించుకుని బుధవారం క్రీడాపోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ గ్రామాలు, కళాశాలలు నుంచి దాదాపు 500 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నట్లు మాతృదర్శన్ ట్రస్ట్ అధ్యక్షుడు నిడిగొండ చంద్రశేఖర్ తెలిపారు. బాల, బాలికలకు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, 2 కిలోమీటర్ల ట్రాక్ ఈవెంట్, షాట్పుట్, లాంగ్జంప్, మ్యూజికల్ చైర్, ముగ్గుల పోటీల్లో ఎవరికి వారే సత్తా చాటుకున్నారు. కార్యక్ర మానికి ముఖ్య అతిథులుగా జిల్లా స్పోర్ట్స్ అండ్ యూత్ ఆఫీసర్, కోఆర్డినేటర్ కోదండరాములు, ప్రముఖ రచయిత్రి కీర్తి పతాకారెడ్డి హాజరయ్యారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో నీల, ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చలామయిరెడ్డి, కోచ్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్భయంగా ఓటు వేయాలి
● డీసీపీ రాజమహేంద్రనాయక్ స్టేషన్ఘన్పూర్: ప్రజలందరూ నిర్భయంగా ప్రశాంత వాతావరణంలో ఓటుహక్కును వినియోగించుకోవాలని వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. బుధవారం ఇప్పగూడెం గ్రామంలో పోలీసు కవాతు నిర్వహించారు. సీఐ జి.వేణు, రాఘవేందర్, ఎస్ఐలు వినయ్, రాజేష్ పాల్గొన్నారు. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు రఘునాథపల్లి: ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని డీసీపీ రాజమహేంద్రనాయక్ హెచ్చరించారు. మండల కేంద్రంలో కవాతు నిర్వహించారు. ఏసీపీ భీంశర్మ, సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్సై నరేష్ పాల్గొన్నారు. సిబ్బందికి అవగాహన.. జఫర్గఢ్: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో సిబ్బందికి డీసీపీ రాజమహేంద్రనాయక్ అవగాహన కల్పించారు. ఏసీపీలు నాగరాజు, అంబటి నర్సయ్య, సీఐలు సంతోష్కుమార్, శ్రీనివాసరావు, ఎస్సై రామారావు పాల్గొన్నారు. -
ప్రలోభ పర్వం!
తాగినంత మందు.. ఓటు లెక్కన నగదు! జనగామ: పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోరు చివరి ఘట్టానికి చేరుకుంది. ప్రచార హోరు ముగిసి, మైకులు మూగబోయాయి. రెండు వారాల పాటు ఇంటింటా ప్రచారం చేసిన సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఓట్లకు గాలం వేసేందుకు ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నారు. దీంతో ప్రచారంతో పాటు ప్రలోభాలు ఊపందుకున్నాయి. రెండో విడతలో ప్రచారం ఊపందుకోగా, తొలి విడత పోలింగ్కు అంతా సమాయత్తమ వుతున్నారు. జఫర్గఢ్, స్టేషన్ఘన్పూర్, చిల్పూరు, రఘునాథపల్లి, లింగాలఘణపురం మండలాల్లో ప్రచారానికి తెరపడగా, ఈ నెల 11న (గురువారం) మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. మద్యం, నగదు పంపిణీకి ఎవరూ కూడా వెనకాడడం లేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, కష్టం వచ్చిన సమయంలో ఆదుకునే మనస్తత్వం కలిగిన సర్పంచ్ అభ్యర్థులకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓటర్లను ఆకర్శించేందుకు.. పంచాయతీ ఎన్నికల పోరులో మొదటి విడతకు ఒక్కరోజే మిగిలిఉంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు బహిరంగ ప్రచారానికి తెరపడింది. దీంతో అభ్యర్థులు ఓటర్లను ఆకర్శించే విధంగా ఒకరికి మించి ఒకరు పోటీపడుతున్నారు. తొలి విడతలో 110 గ్రామ పంచాయతీల పరిధిలో 10 మంది సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవం కాగా, 351మంది, 1,024 వార్డుల్లో 228 ఏకగ్రీవం కాగా 2,082 వార్డుల్లో ఎలక్షన్లు జరుగనున్నాయి. ఏకగ్రీవమైన జీపీల్లో ఎన్నికల హడావిడి కనిపించడం లేదు. ఒక్క మొదటి విడతకే.. జిల్లాలో మొదటి విడత జరిగే స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల పరిధిలో రిజర్వేషన్లు ఖరారైన నాటి నుంచి ఈ నెల10వ తేదీ వరకు సుమారు రూ.50 కోట్ల మేర ఖర్చు జరిగినట్లు చర్చ నడుస్తోంది. పోలింగ్కు ఇంకా ఒక్కరోజు మిగిలి ఉండగా, ఓటు లెక్కన డబ్బులు పంచాల్సి ఉన్న నేపథ్యంలో ఈ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ ఢమాలై, నగదు చేతి మార్పిడి తగ్గిపోయిన సమయంలో ఇన్నాళుల ఇబ్బంది పడ్డ చాలా మంది.. ప్రస్తుతం బరిలో నిలిచిన వారే. ఎలక్షన్లు వచ్చే సరికి లక్షల రూపాయల ధనం బయటకు తీసుకు వచ్చి నీళ్లలా వదిలేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముగిసిన తొలివిడత పంచాయతీ ఎన్నికల ప్రచారం పైసల పంపిణీ.. రహస్య ప్రాంతాల్లో విందులు పనిచేయని ఎలక్షన్ టీంల పర్యవేక్షణఎన్నికలకు ఒక్క రోజు మిగిలి ఉండడంతో అభ్యర్థులకు కీలక పరీక్ష నెలకొంది. రెండు వారాల ఖర్చుతో పోలిస్తే...పోలింగ్కు ఒక్క రోజు ముందు చేసే వ్యయం మూడు రెట్లు పెరుగుతుంది. ఇప్పటివరకు లక్షల్లో మద్యానికి ఖర్చు చేయగా, ఓటుకు రూ.5 వందల నుంచి రూ.3వేల వరకు మేజర్ పంచాయతీలు, పెద్ద గ్రామాలు) ఇచ్చేందుకు పలుచోట్ల నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. దీనికి తోడు ఓటు నజరానా కింద గిఫ్టు ప్యాకులు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రత్యర్థులు ఒకరికొకరు పోటీ పడుతూ, నువ్వెంత అంటే నువ్వెంత అనే రీతిలో మద్యం, నగదును నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఎలక్షన్ నిఘా, షాడో టీంలు తిరుగుతున్నా పార్టీల కేడర్, అభ్యర్థులు పట్టించుకోవడం లేదు. ఎన్నికలకు కొన్ని గంటల ముందు( తెల్లవారుజాము)న ఓట్లకు డబ్బులు పంచేందుకు చాలా చోట్ల రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓటు కు ఎంత ఇస్తున్నారనే నిర్ణయం మేరకు కవర్లలో ప్యాక్ చేసి, బూత్ల వారీగా పంపించినట్లు ఊరూరా మాట్లాడుకోవడం కనిపించింది. సర్పంచ్గా గెలుపొందేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. చిట్టచివరి అవకాశంగా, తమ భవితవ్యాన్ని తేల్చుకునేందుకు ఇన్నాళ్లు దాచుకున్న అస్త్రశస్త్రాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. మందు, విందులతో ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాలు, రిసార్టులు, రహస్య ప్రాంతాల్లో విందులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రచారం ముగిసిన నాటి నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా దావత్లతో పాటు అవసరమైతే ఓటర్లు ఉన్న ప్రాంతానికే మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్నారు. పెగ్గు, పెగ్గుకూ మద్దతు దారులు చేజారిపోకుండా గుర్తును ఒకటికి రెండు సార్లు గుర్తుచేస్తున్నారు. బ్యాలెట్ పేపర్పై వరుస క్రమంలో ఉన్న గుర్తులను చూపిస్తూ అన్నా మరచిపోవద్దు, ఏమరుపాటుగా ఉండే ఓడిపోతామే అంటూ బతిమిలాడుకుంటున్నారు. విందు సమయంలో ముక్క ఏసుకోరాదే అంటూ ప్రేమను పండిస్తున్నారు. చీకటి పడగానే చాలా గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఎలక్షన్ కమిషన్ నగదు, మధ్యం పంపిణీపై కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ, ఆవేమీ పట్టించుకోవడం లేదు. పలువురు అభ్యర్థులు మూడో కంటికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎవరికీ అనుమానం రాని వ్యక్తుల ఇళ్లలో మద్యం బాటిళ్లను డంపింగ్ చేసి, అవసరమున్న చోటకు అనుచరులు చేరవేస్తున్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
● ఎన్నికల అబ్జర్వర్ రవికిరణ్జనగామ: జిల్లాలో పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీంల పాత్ర కీలకమని, అప్రమత్తంగా ఉండాలని ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ రవికిరణ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, తదితర అంశాలపై తహసీల్దార్లతో మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫెరెన్స్ హాల్ నుంచి వారు సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. పోలింగ్ సమయంలో నగదు, మద్యం తదితర వాటితో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా, పోలింగ్ ముగిసేవరకు అధికా రుల పర్యవేక్షణ తప్పనిసరి అన్నారు. ప్రత్యేక బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. రేపు స్థానిక సెలవు జిల్లాలో మూడు విడతలుగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా పోలింగ్ రోజు స్థానిక సెలవులు ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. మొదటి విడత 11వ తేదీ, రెండో విడత 14, మూడో విడత 17వ తేదీన స్థానికంగా సెలవులు ఉంటాయన్నారు. ప్రకటించడం సమీక్షలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండేరీ చేతన్, ఎంసీసీ నోడల్ ఆఫీసర్ విక్రమ్, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
రూ.21 కోట్ల సైబర్ దోపిడీ
సాక్షి, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఏకంగా రూ. 21,74,51,300 కొల్లగొట్టారు. 68 కేసుల్లోనే ఇంత భారీగా నగదు దోచుకోవడం సంచలనంగా మారింది. 2024లో 772 కేసుల్లో రూ.24,70,43,738 సొత్తు సైబర్ నేరగాళ్ల చేతికిపోతే, ఈసారి 69 కేసుల్లో రూ.21,74,51,300 నగదు పోయిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంటే కేసుల సంఖ్య భారీగా తగ్గినా, తక్కువ మంది బాధితులే ఎక్కువ మొత్తంలో నగదు పొగొట్టుకోవడం విస్తుగొల్పుతోంది. ముఖ్యంగా ఈ మోసపోయిన వారిలో ఉన్నత విద్యావంతులు, వైద్యులు, న్యాయవాదులు, ఉద్యోగులు ఉండడం గమనార్హం. ముఖ్యమైన కేసులిలా... ● మోనార్క్ నెట్వర్క్ క్యాపిటల్ పేరుతో ఇన్స్ట్రాగామ్లో యాడ్ రావడంతో చూసిన నగరానికి చెందిన ఇద్దరు వైద్యులు క్లిక్ చేయడంతో ఆటోమేటిక్గా వీరి ఫోన్ నంబర్లు సైబర్ నేరగాళ్లు నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూప్ల్లో యాడ్ చేశారు. వారు ప్రొఫెషనల్ అడ్వయిజర్లుగా చెప్పుకుంటూ రోజువారీగా ఐదు నుంచి 20 శాతం లాభాలొస్తాయంటూ నమ్మబలికారు. ఇలా ఆ మాటలు నమ్మి వారు చెప్పిన విధంగా నకిలీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ యాప్ మోనార్క్ ఫిన్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇందులో 41 ఏళ్ల ఓ వైద్యుడు 27 ట్రాన్సక్షన్ల ద్వారా రూ.1.4 కోట్లు బదిలీ చేశారు. మరో వైద్యుడు 13 ట్రాన్సక్షన్ల ద్వారా రూ.కోటి ఇన్వెస్ట్ చేశారు. ఈ డబ్బులు డ్రా చేసేందుకు ట్యాక్స్ కట్టాలని, టీమ్ డిపాజిట్ కింద రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. ఇవీ చెల్లించాక కూడా విత్డ్రా ఆప్షన్ డిసబుల్ చేసి మరో రూ.20 లక్షలు డిమాండ్ చేయడంతో మోసమని సైబర్ క్రైమ్ పోలీసులను ఈ నెల 3న సంప్రదించారు. ● నగరానికి చెందిన ఓ న్యాయవాదికి వరుసగా వివిధ శాఖల అధికారులమని కాల్స్ చేసి ‘మీపై నగ్న వీడియోలు సర్క్యులేట్ నుంచి మానవ అక్రమ రవాణా వరకు వివిధ కేసులు పెండింగ్లో ఉన్నాయి..’అని నకిలీ ఎఫ్ఐఆర్, తప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు చూపించి అరెస్ట్ చేస్తామంటూ భయబ్రాంతులకు గురిచేశారు. చివరగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారిగా మళ్లీ ఫోన్కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ అంటూ.. ఈ కేసులు క్లియర్ చేసేందుకు సెక్యూరిటీ అమౌంట్ ఇవ్వమనడంతో అప్పటికే భయపడిన న్యాయవాది రూ.42లక్షలు నేరగాళ్లు ఇచ్చిన బ్యాంక్ ఖాతాకు బదిలీ చేశారు. మరుసటిరోజు కాల్ చేసి రూ.32 లక్షలు ఇవ్వాలనడంతో మోసమని సైబర్ పోలీసులను ఆశ్రయించారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 68 కేసులు వీటిలో అత్యధికంగా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ 43 ఆ తర్వాతి స్థానంలో డిజిటల్ అరెస్ట్తో బాధితులకు టోకరా 1930 ద్వారా 24 గంటల్లో ఫిర్యాదు చేస్తేనే రికవరీకి ఛాన్స్ఈ ఏడాది ప్పటివరకు నమోదైన 68 కేసుల్లో బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ (వ్యాపార, పెట్టుబడి మోసాలు) 43 కేసులున్నాయంటే మనిషి ఆశను సైబర్ నేరగాళ్లు ఎలా శ్రీక్యాష్శ్రీ చేసుకుంటున్నారో తెలుస్తోంది. తక్కువ, డబ్బులతో పెట్టుబడి.. ఒక్కరోజులోనే రెండింతలు అంటూ వివిధ ప్రముఖ కంపెనీల పేర్లతో సోషల్ మీడియా వేదికగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు చేస్తున్నారు. ఆరంభంలో రూ.100లు పెడితే రూ.200లు రావడంతో ఇది నిజమని అనేక మంది రూ.వేలు, రూ.లక్షలు వరకు పెట్టుబడి పెట్టాక అసలు మోసం అర్థం అవుతోంది. లాభాలు దేవుడెరుగు కానీ, పెట్టిన డబ్బులు కూడా పోవడంతో అది మోసమని గుర్తించిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదిస్తున్నారు.పొయిన సొత్తు రూ. 21,74,51,300 రికవరీ సొత్తు రూ 1,73,44,677 అరెస్టయిన నిందితులు 9 మంది (15 కేసుల్లోనే)డబ్బులు మోససోయిన వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930 ద్వారా ఫిర్యాదు చేస్తే ఆ రోజు ఏమైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే అక్కడివరకే పోలీసులు ఆయా బ్యాంకుల ఖాతాలను ఫ్రీజ్ చేయగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్ మోసం ఆలస్యంగా గుర్తిస్తుండడంతో ఈ కేసుల్లో భారీగా రికవరీ సాధ్యం కావడం లేదు. – గిరికుమార్, సైబర్ క్రైమ్ ఏసీపీ -
సర్వం సిద్ధం
● నేడు ఎన్నికల సామగ్రి పంపిణీ ● బరిలో 341 మంది సర్పంచ్ అభ్యర్థులు.. ● 1,854 మంది వార్డు సభ్యులుజనగామ: జిల్లాలో మొదటి విడత పోలింగ్కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆద్వర్యంలో ఈనెల 10న (బుధవారం) ఎన్నికల సామగ్రి పంపిణీ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి మండలాల వారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడత పోలింగ్ ఎక్కడంటే.. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని చిల్పూరు, స్టేషన్ఘన్పూర్, రఘునాథపల్లి, జఫర్గఢ్, లింగాలఘణపురం మండలాల్లో మొదటి విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ 100 జీపీలు, 1,024 వార్డులకు గాను 10 మంది సర్పంచ్, 228 వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. 12 జీపీల్లో 341 సర్పంచ్, 1,854 వార్డుల్లో (784 మంది బరిలో) ఎలక్షన్లు జరుగనున్నాయి. ఐదు మండలాల పరిధిలో పురుషులు 85,180, మహిళలు 87,322, అదర్స్ 4 కలుపుకుని మొత్తంగా 1,72,506 ఓట్లు ఉన్నాయి. ఐదు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు...72 బస్సులు ఈ నెల11న జరగనున్న పోలింగ్ కోసం బుధవారం ఎన్నికల సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐదు మండల పరిషత్ కార్యాలయాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి 1,024 పోలింగ్ స్టేషన్ల పరిధిలో పీవో 1,131, ఓపీఓ 1,544 మంది విధులు నిర్వర్తించనున్నా రు. పోలింగ్ సామాగ్రి, అధికారులు, సిబ్బందిని తరలించేందుకు 72 బస్సులను సిద్ధం చేశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు 42 జోన్లుగా విభ జించి, 112 రూట్లను గుర్తించారు. సామగ్రి తీసుకునే సమయంలో సంబంధిత బాధ్యులు డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు ఉదయం 8.30 గంటల వరకే చేరుకోవాల్సి ఉంటుంది. స్టేజ్–2 ఆర్వోల పర్యవేక్షణలో పోలింగ్ నిర్వహణ జరుగుతుంది. బ్యాలెట్ పంపిణీ పక్కాగా జరగాలి.. పోలింగ్ సిబ్బంది చెక్లిస్టు ప్రకారం మెటీరియల్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వానే బయలుదేరాలి. పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్య రాకుండా శిక్షణ కేంద్రం సైతం ఏర్పాటు చేయాలి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎలక్షన్లకు తగ్గట్టుగా బ్యాలెట్ పేపర్ పంపిణీ పక్కాగా జరగాలి. – రిజ్వాన్ బాషా షేక్, ఎన్నికల అధికారి, కలెక్టర్ -
అన్నివర్గాలకు సమన్యాయం
● డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతిజనగామ: సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం దక్కుతోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి కొనియాడారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి, ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం మరింత ముందుకు వెళ్లేలా కోరారు. మంగళవారం ఏఐసీసీ అధినేత సోనియాగాంధీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పట్టణంలోని విజయ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ధన్వంతి కేక్కట్ చేసి మాట్లాడారు.. నాడు వైఎస్ రాజశేఖర్రెడ్డి, నేడు సీఎం రేవంత్రెడ్డి పేదలకు అండగా నిలుస్తున్నారన్నారు. ఓట్చోరీకి సంబంధించి ప్రతీ బూత్కు 100 అప్లికేషన్లు పంపించి సంతకాల సేకరణ చేస్తున్నామని, ఢిల్లీలో 14న జరిగే కార్యక్రమంలో పాల్గొంటామన్నారు. లక్ష్మీనారాయణ నాయక్, వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, చెంచారపు శ్రీనివాస్రెడ్డి, డాక్టర్ రాజమౌళి, వంగాల మల్లారెడ్డి, కళ్యాణి, ఇందిర, డాక్టర్ కృష్ణ, బుచ్చిరెడ్డి, సుధాకర్, నర్సింగరావు, రామచందర్, వెంకట్రెడ్డి, సిద్దారెడ్డి, బాలరాజు పాల్గొన్నారు. -
తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ
జనగామ రూరల్: జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం ఆవరణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంగళవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్షాలోమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, సీఈఓ జడ్పీ మాధురి షా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పరిశీలన చిల్పూరు: మండల కేంద్రంలో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి మాధవీలత, ఎంపీడీఓ శంకర్నాయక్, తహసీల్దార్ విజయ్కుమార్, ఎంపీఓ మదుసూదన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, మండలంలోని రాజవరం గ్రామ సమీపంలో ఉన్న కస్తూర్బా బాలికల పాఠశాలను అడిషనల్ కలెక్టర్, డీఈఓ పింకేష్కుమార్ సందర్శించారు. ఆయన వెంట జీసీడీఓ గౌసియా, డీఈ రవీందర్, ఏఈ వెంకటనర్సు, ఎస్వో ప్రశాంతి ఉన్నారు. రాజీమార్గంతోనే సమస్యల పరిష్కారం జనగామ రూరల్: రాజీమార్గంతోనే కక్షిదారుల సమస్యలు పరిష్కారం అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. మంగళవారం జిల్లా న్యాయసేవ అధికారి సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో ఈనెల 21న జరుగనున్న జాతీయ లోక్అదాలత్ సందర్భంగా న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..సమయం వృథా కాకుండా సామరస్యంగా ఇరుపక్షాలను ఒప్పించి రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, చెక్బౌన్స్ కేసును, కుటుంబ తగాదా కేసులను సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. సీనియర్ సివిల్ జెడ్జి సుచరిత, జి.శశి, కె. సందీప, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దండబోయిన హరిప్రసాద్ యాదవ్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. పడమటితండా (డి) సర్పంచ్, ఐదుగురు వార్డుమెంబర్లు ఏకగ్రీవందేవరుప్పుల: మండలంలోని ధర్మాపురం రెవెన్యూ పరిధి పడమటి తండా (డి) గ్రామపంచాయతీ సర్పంచ్తో సహా ఐదుగురు వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన జాటోతు నవీన్నాయక్ ప్రత్యర్థి జాటోతు మురళి చివరిరోజు ఉపసంహరించుకోగా ఎనిమిది వార్డులకుగానూ ఐదుగురు దస్రూ, పూలమ్మ, తారమ్మ, సునిత, సుజాత ఏకగ్రీవం అయ్యారు. ముగిసిన మూడో విడత విత్డ్రాలు దేవరుప్పుల: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మంగళవారం పలువురు సర్పంచ్, వార్డుమెంబర్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మండలంలో 32 గ్రామ పంచాయతీలకుగానూ పడమటితండా(డీ) ఏకగ్రీవం కాగా మిగతా 31 గ్రామాల్లో సర్పంచ్ గిరి కోసం 91 మంది, 274 వార్డులకుగానూ 45 ఏకగ్రీవం కాగా మిగిలిన 229 వార్డులకు 656 మంది పోటీలో ఉన్నారు. -
మక్కల పైసలు రాకపాయె!
● పంట విక్రయించి నెల రోజులు.. ● ఇప్పటికీ పడని డబ్బులు.. రైతుల ఎదురుచూపు ● చెల్లించాల్సిన మొత్తం రూ.1,34,28,000 పాలకుర్తి టౌన్: మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో పంట ఉత్పత్తులను తూకం చేసి నెల రోజులు దాటినా చేతికి డబ్బులు అందడం లేదని రైతులు వాపోతున్నారు. గిట్టుబాటు ధరలు కల్పించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్క్ఫెడ్ ద్వారా జిల్లా మొత్తానికి పాలకుర్తి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించాయి. జిల్లాలో నవంబర్ 8 నుంచి రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు చేపట్టారు. క్వింటాకు రూ.2,400 చొప్పున ఎఫ్ఎస్సీఎస్ కొనుగోలు చేస్తోంది. మక్కలను తూకం చేసిన పది రోజు ల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావాల్సి ఉండగా నెల రోజులు దాటినా రాకపోవడంతో రైతన్నలకు ఎదురుచూపులు తప్పడం లేదు. కూలీ లకు సై తం డబ్బులు ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు పంట నష్టం.. ఆరుగాలం కష్టపడి పంటలు చేతికి వచ్చే సమయంలో మోంథా తుపాను వచ్చి మొక్కజొన్న రైతులకు భారీగా నష్టాన్ని మిగిల్చింది. కొనుగోలు కేంద్రాల్లో గిట్టబాటు ధర లభిస్తుందనే ఆశతో మక్కలను ఆరబెట్టి తీసుకొచ్చేందుకు ఇబ్బందులు పడ్డామన్నారు. కూలీల ఖర్చు పెరిగిపోయిందని వాపోతున్నారు. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాల్లో 153 మంది రైతులు మొక్కజొన్న విక్రయించగా డబ్బులు ఎవరికీ రాలేదని తెలిపారు. రెండ్రోజుల్లో నగదు జమ..మొక్కజొన్న రైతులకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. మంజూరు కాగానే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. రెండ్రోజుల్లో డబ్బులు జమకానున్నాయని ఉన్నతాధికారులు చెప్పారు. రైతులకు సకాలంలో డబ్బులను అందజేసేలా ఏర్పాటు చేస్తాం. – వై.రంజిత్రెడ్డి, మేనేజర్, మార్క్ఫెడ్ అమ్మిన మొక్కజొన్నలు: 5,595 క్వింటాళ్లు రైతులు సంఖ్య: 153 రావాల్సిన డబ్బు: 1,34,28,000 -
వ్యర్థానికి శాసీ్త్రయత జోడింపు
● ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ బ్రాండ్ అంబాసిడర్ గౌసియాబేగంలింగాలఘణపురం: సృష్టిలో వ్యర్థ పదార్థాలకు శాసీ్త్రయత జోడించడమే ప్రధానమని, దాంతో ఏదీ వ్యర్థం కాదని ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ బ్రాండ్ అంబాసిడర్ గౌసియాబేగం అన్నారు. సోమవారం మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో జిల్లాలోని 13 కేజీబీవీ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో వేస్ట్ అండ్ వెల్త్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్స్ను ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ బ్రాండ్ అంబాసిడర్, జీసీడీఓ గౌసియాబేగం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎగ్జిబిట్స్లో ప్రథమ స్థానం లింగాలఘణపురం కేజీబీవీ, ద్వితీయ స్థానం నర్మెట, తృతీయ స్థానం టీఎస్ఎంఎస్ లింగాలఘణపురం, ప్రోత్సాహక బహుమతి కేజీబీవీ బచ్చన్నపేట మండలాలకు దక్కింది. ఈ సందర్భంగా వారికి బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో స్థానిక కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ అన్నపూర్ణతో పాటు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలందించాలి
● డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు కొడకండ్ల: ప్రజారోగ్యమే ధ్యేయంగా వైద్యులు, సిబ్బంది అంకితభావంతో సేవలందించాలని డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు సూచించారు. సోమవారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. సాధారణ ప్రసవాలను పెంచాలని, ఏఎన్సీ నమోదులను పెంచుతూ వారికి వైద్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయాలన్నారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో డాక్టర్లు గంపల హరికృష్ణరెడ్డి, భారతి, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మండలకేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్న రాములు క్లినిక్ను డీఎంహెచ్ఓ సీజ్ చేశారు. -
మొదటి విడత ప్రచారానికి తెర!
● హోరాహోరీగా ర్యాలీలు, ఊరేగింపులు ● 110 జీపీలు..బరిలో 351 సర్పంచ్ అభ్యర్థులు ● 10 మంది ఏకగ్రీవం ● నేటి నుంచి మద్యం దుకాణాల బంద్జనగామ: స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో గ్రామపంచాయతీ ఎన్నికల జోష్ తారాస్థాయికి చేరుకుంది. లింగాలఘణపురం, రఘునాథపల్లి, చిల్పూరు, జఫర్గఢ్, స్టేషన్ఘన్పూర్ ఐదు మండలాల్లో 12రోజులుగా హోరెత్తిన ప్రచారం ఈనెల 9న (మంగళవారం) సాయంత్రం 5 గంటలతో తెరపడనుంది. 110 పంచాయతీల్లో 351 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండడంతో గ్రామాల్లో ఉత్కంఠ నెలకొంది. చివరి గడియలో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు గ్రామాలను చుట్టేస్తూ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఇదే సమయంలో అధికారులు భద్రత, పోలింగ్ ఏర్పాట్లను కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల వేడి పెరిగిన నేపథ్యంలో 16 వైన్న్స్ సీజ్ చేయడానికి ఎకై ్సజ్ శాఖ సిద్ధమైంది. అయితే గ్రామాల్లో రహస్యంగా మద్యం డంపింగ్, స్టాక్ తరలింపుతో పోరు మరింత వేడెక్కింది. నేటితో ముగింపు.. మంగళవారం సాయంత్రం పోలింగ్కు 48 గంటల ముందు ప్రచార నిషేధం అమల్లోకి రానుండడంతో, అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యేలు, ప్రముఖులు తిరుగుతూ అభివృద్ధి హామీలు ఇస్తున్నారు. అధికార, ప్రతిపక్షాలతో పాటు స్వతంత్రులు, వామపక్షాలు కూడా ప్రజల వద్దకు వెళ్లి తమ తరఫున నిలిచిన అభ్యర్థులకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రతిచోట పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తోంది. స్టేషన్ఘన్పూర్, జఫర్గఢ్లో ఒక్కటి, చిల్పూరులో 3, రఘునాథపల్లిలో ఐదుగురు మొత్తంగా 10 మంది సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవం కాగా, అత్యధికంగా రఘునాథపల్లి మండలంలోనే 107 మంది పోటీ పడుతుండగా, అత్యల్పంగా స్టేషన్ఘన్పూర్ మండలంలో 48 మంది నువ్వా నేనా అన్నట్టుగా నోటీ పడుతున్నారు. నేడు వైన్స్లు బంద్ ప్రచారానికి ముగింపు పలుకుతుండడంతో నియోజకవర్గంలోని 16 మద్యం దుకాణాలను సీజ్ చేయడానికి ఎకై ్సజ్ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. డిసెంబర్ 11న పోలింగ్, కౌంటింగ్ పూర్తై, విజేతలకు ధ్రువపత్రాలు అందించే వరకూ వైన్న్స్లు మూసిఉంచాలి. ప్రచార సమయంలో చివరి రెండు రోజులు కీలకం కావడంతో, కొన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున మద్యం డంపింగ్ చేశారు. క్వార్టర్లు, ఆఫ్, ఫుల్ బాటిళ్లు భారీగా స్టాక్ చేసుకుని, పోలింగ్కు ముందు రోజు ఓటర్లకు పంపిణీ చేసేందుకు రహస్య ప్రదేశాలకు తరలి స్తున్నట్లు సమాచారం. మూడో కంటికి కనిపించకుండా ఈ స్టాక్ని రోజువారీగా లోపలికి పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల హడావుడి, రాజకీయ ఉత్కంఠ, చివరి గంటల్లో అభ్యర్థుల పరుగులతో స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో పంచాయతీ పోరు పీక్ స్టేజీకి చేరుకుంది. -
నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
జనగామ: జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈనెల 9న (మంగళవారం) ఉదయం 10 గంటలకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆవిష్కరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ సోమవారం పరిశీలించారు.ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి జనగామ రూరల్: ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పి. పింకేశ్ కుమార్ అన్నారు. సోమవారం సోమవారం కలెక్టరేట్ కార్యాలయ రిటర్నింగ్ అధికారుల ఫేజ్ –2లో విధులపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..అధికారులు ముందుగానే సూక్ష్మ ప్రణాళికలు సిద్ధం చేసుకుని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలుచేయాలని సూచించారు. ఎన్నికల అధికారులు తమ ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్, ఓటర్ ఐడీ కార్డు, ఫారం–14 పోస్టల్ బ్యాలెట్ వినతిపత్రంతో సంబంధిత కేంద్రాలకు హాజరవ్వాలని తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మాధురి షా, మాస్టర్ ట్రైనర్లు మెరుగు రామరాజు, సురేందర్రెడ్డి, నరసింహామూర్తి తదితరులు పాల్గొన్నారు. రామచంద్రాపూర్ ఉప సర్పంచ్ ఎన్నికబచ్చన్నపేట: మండలంలోని రామచంద్రాపూర్ గ్రామ ఉప సర్పంచ్గా నల్ల రవీందర్రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి–2 ఇర్రి వెంకట్రెడ్డి తెలిపారు. సోమవారం గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులతో ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో వార్డు సభ్యులు నల్ల రవీందర్రెడ్డి, ఆముదాల లావణ్య, పొన్నబోయిన బాలమణి, నర్మెట సుజాత, వేములవాడ నరేష్, ఒగ్గు అంజనేయులు, పెరుమాల్ల యాదగిరి, చొప్పరి మల్లేశం పాల్గొని రవీందర్రెడ్డిని ఎన్నుకున్నారు. ఎన్నికై న ఉప సర్పంచ్కు ఎన్నికల అధికారి, గ్రామ సర్పంచ్ బొందుగుల వినోద్కుమార్ ఎన్నిక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు. నేడు ‘మూడో విడత’ విత్డ్రాలు కొడకండ్ల: గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత షెడ్యూల్లో భాగంగా అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగుస్తుంది. మండలంలో 21 గ్రామ పంచాయతీ సర్పంచ్, 190 వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎన్నికల బరిలో నిల్చిన అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటిస్తారు. కాగా కొందరు పార్టీలతో సంబంధం లేకుండా సర్పంచ్, వార్డుసభ్యులకు కూడా నామినేషన్లు దాఖలు చేయగా వారిని ఉపసంహరించుకోవాలంటూ పార్టీల అభ్యర్థులు బుజ్జగిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం కూడా చర్చలు నడుస్తుండగా ఎవరు ఉపసంహరించుకుంటారో? బరిలో ఎవరుంటారో? అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. పోలీసుల విస్తృత తనిఖీలు జనగామ: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై మండలంలోని పెంబర్తి చెక్పోస్టు వద్ద సోమవారం రాత్రి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణలో ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో చెక్పోస్ట్ వద్ద నాకాబందీ చేపట్టారు. అక్రమ నగదు, మద్యం, ఆయుధాలతో పాటు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే ఇతర నిషేధిత వస్తువుల రవాణాను అడ్డుకునేందుకు నిరంతరం నిఘా ఉంచామన్నారు. అభ్యర్థులు నిబంధనలు పాటించాలి జనగామ రూరల్: స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు పాటించాలని ఏసీపీ పండారీ చేతన్ నితిన్ సూచించారు. సోమవారం ఎంపీఓ మహేశ్ ఆధ్వర్యంలో మండలంలోని చీటకోడూర్ రైతు వేధికలో అభ్యర్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ఓటర్లను ప్రభావితం చేసే వారిపై కఠిన వైఖరి అవలంబిస్తామని హెచ్చరించారు. -
ఎంజీఎంలో గందరగోళం!
● పూర్తి కాని సర్జికల్, మెడికల్ టెండర్స్ ● అధ్వాన స్థితిలో పేషెంట్కేర్ సేవలు ● పట్టించుకోని పాలనాధికారులుఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రి పాలన రోజురోజుకూ అధ్వాన స్థితికి చేరుకుంటోంది. పూర్తి స్థాయి పరిపాలనాధికారుల అధికారుల లేమితో, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్థాయి వైద్యులను ఆర్ఎంఓలుగా నియమించుకుని కీలక బాధ్యతలు అప్పగించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆస్పత్రిలో రోగులకు అందించాల్సిన ఔషధాలు, రక్త పరీక్షలు, రోగులకు అందించాల్సిన పారిశుద్ధ్యం వంటి టెండర్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పూర్తి చేయడంలో సూపరింటెండెంట్ స్థాయి అధికారికి ఆర్ఎంఓ–1, ఆర్ఎంఓ–2 వంటి అధికారుల సహాయం తప్పనిసరి. రోగులకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందడం, వారికి సంబంధించి ఎంఓయూలను పరిశీలిస్తూ నిబంధనలు ఎలా పాటిస్తున్నారు అనే అంశాలు పరిశీలిస్తూ బిల్లులు చెల్లింపుల్లో కీలకంగా వ్యవహరిస్తూ రోగులకు మెరుగైన సేవలందించాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఎంజీఎంలో ఇలాంటి ప్రక్రి య సరిగ్గా జరగకపోవడంతో రెండేళ్లుగా సర్జికల్, మెడికల్ టెండర్స్తో పాటు ఆస్పత్రిలో పేషెంట్ కేర్ సేవలు అధ్వాన్న స్థితికి చేరుకున్నాయి. 20 నెలలు గడుస్తున్నా పూర్తికాలే.. ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య సేవల్లో రోగులకు ఔషధాలు అందించడం కీలకం. ఆస్పత్రిలో చికిత్స పొందే వేలాది మంది రోగులకు సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి పూర్తిస్థాయిలో మందులు సరఫరా కాని క్రమంలో ఆస్పత్రిలో సర్జికల్, మెడికల్ విభాగాల్లో టెండర్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసిన ఏజెన్సీల ద్వారా రోగులకు ఔషధాలను సరఫరా చేస్తారు. గత 20 నెలల క్రితం టెండర్ సమయం ముగిసింది. ఈప్రక్రియను పూర్తి చేయడంలో పరిపాలనాధికారులు పూర్తిస్థాయిలో విఫలం కావడంతో రోగులకు పూర్తిస్థాయిలో ఔషధాలు అందకపోవడంతో పాటు, కొన్ని రక్తపరీక్షలకు సైతం ప్రైవేట్కు పరుగులు తీయక తప్పట్లేదు. స్టేషనరీ విభాగం పరిస్థితి అంతేనా? ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు చికిత్సలు అందించే విషయంలో ఔషధాలతో పాటు స్టేషనరీ విభాగం సైతం కీలకమే. ఈ విబాగం ద్వారా రోగులకు కేస్షీట్లు, ఓపీ స్లిప్లు, వార్డులకు సంబంధించిన ఎలక్ట్రిక్ సామగ్రి, ఫర్నిచర్, పెన్నులు, బుక్లు వంటి ఇతరత్రా సామగ్రి కొంటుంటారు. స్టేషనరీ విభాగ టెండర్ను సైతం పూర్తిచేయడంలో పరిపాలనాధికారులు వైఫల్యం చెందారు. ముగిసిన ఐహెచ్ఎంఎస్ టెండర్ ఎంజీఎం ఆస్పత్రిలో మరో కీలక విభాగం పారిశుద్ధ్య సేవలు. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో కొనసాగుతున్న ఏజెన్సీ సమయం మూడు నెలల క్రితమే ముగిసింది. వెంటనే టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని పలు కార్మిక సంఘాలు సూపరింటెండెంట్కు వినతి పత్రాలు సైతం అందించాయి. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఏజెన్సీ నిర్వాహకులు ఎంఓయూలో పేర్కొన్నట్లుగా కూడా వేతనాలు చెల్లించట్లేదని ఎన్ని సార్లు పరిపాలనాధికారులకు మొరపెట్టుకున్నా.. పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏజెన్సీ పర్యవేక్షించే ఆర్ఎంఓ స్థాయి అధికారులు రోగులకు సేవలందించే పేషెంట్ కేర్, పారిశుద్ధ్య సేవలు పట్టించుకోకపోవడం వల్ల ప్రస్తుతం కొనసాగుతున్న కార్మికులకు పని ఒత్తిడి సైతం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రాజకీయ లెక్కలు–ప్రజా అభిప్రాయాలు
గ్రామాల్లో అభివృద్ధి, వ్యక్తిగత సంబంధాలు, కుల, సామాజిక సమీకరణాలు, స్థానిక నాయకుల ప్రభావం ఇవన్నీ కలిసి విచిత్ర పొత్తులకు కారణమవుతున్నాయి. పాత శత్రుత్వాలు నీరుగారిపోయి, కొత్త ప్రయోజన సంబంధాలు పెరిగాయి. పార్టీ కంటే వ్యక్తులు, అభ్యర్థుల వ్యక్తిత్వం, స్థానిక ఇమేజ్ ప్రాధాన్యం ఎక్కువవుతోంది. సర్పంచ్ ఎన్నికలు గ్రామాల్లో నెలకొన్న అసలు రాజకీయ స్వభావాన్ని వెలికితీస్తున్నాయి. పైకి పార్టీ జెండాలు వేరైనా, అధికారం కోసం లోపల మాత్రం లెక్కలు ఒక్కటిగా బావిస్తున్నారు. ఈ అనూహ్య కూటములు గ్రామీణ రాజకీయాల్లో వచ్చే రోజుల గమనాన్ని ఎలా మార్చతాయో వేచి చూడాలి. -
ప్రత్యర్థుల పొత్తులాట!
ప్రత్యర్థుల పొత్తులాట!జనగామ: సర్పంచ్ ఎన్నికల్లో చిత్రవిచిత్ర రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. శత్రుత్వంగా కనిపించే పార్టీలు ఒక్కటవుతూ చేతులు కలిపేస్తున్నాయి. సర్పంచ్ కుర్చీ కోసం వింత పొత్తులు కుదుర్చుకుంటున్నాయి. జిల్లాలోని అన్ని గ్రామాల్లో అనూహ్య కూటములు ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. పలు మండలాల పరిధిలో కాంగ్రెస్, సీపీఎం, బీజేపీ మూడు పార్టీలు ఒకే అభ్యర్థి కోసం పనిచేస్తుండగా, మరికొన్ని గ్రామాల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒకరికొకరు మద్దతిచ్చే పంచాయతీలు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడో రెబల్స్కు ఇతర పార్టీల సపోర్ట్, ఆయా గ్రామాల పరిధిలో ఉప సర్పంచ్ పదవి కోసం ఒప్పందాలు.. ఇలా స్థానిక లెక్కలు, వ్యక్తిగత ప్రభావాలు, కుల సమీకరణాలు కలిసి గ్రామీణ రాజకీయాలను కొత్త దిశలో నడిపిస్తున్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికల హడావుడి ఊపందుకుంది. జిల్లాల వారీగా ప్రచారం ముమ్మరమవుతున్న తరుణంలో పార్టీల పరస్పర శత్రుత్వం, ప్రత్యర్థిత్వం అన్నీ మసకబారిపోయాయి. కొత్త కొత్త పొత్తులతో ఓటర్ల ముందుకెళ్తున్నారు. జిల్లా స్థాయి రాజకీయాల్లో ఒకరికి ఒకరు బద్ధశత్రువుల్లా కనిపించే పార్టీలు గ్రామాలకు వస్తే స్నేహపూర్వకంగా చేతులు కలుపుతున్నారు. సర్పంచ్ పదవుల కోసం జరుగుతున్న ఈ చిత్ర విచిత్ర పొత్తులు ఇప్పుడు ప్రతీ మండలంలో చర్చనీయాంశమయ్యాయి. స్టేషన్ఘన్్పూర్ మండలంలోని ఓ గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి కాంగ్రెస్, సీపీఎం, బీజేపీ మూడు పార్టీలు కలిసి పనిచేయడం స్థానిక రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇదే తరహాలో మరో మూడు పంచాయతీల్లో గ్రామాల్లో సీపీఎం–కాంగ్రెస్ కలిసి బలమైన కూటమిని ఏర్పరుచుకున్నాయి. జఫర్గఢ్ మండలంలోని ఓ గ్రామంలో రెండు విభిన్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. కూనూరు, జఫర్గఢ్, తమ్మడపల్లి(జీ)గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కాంగ్రెస్–ిసీపీఎం కలిసి మద్దతు ఇస్తుండగా, ఓబులాపూర్ గ్రామంలో మాత్రం బీఆర్ఎస్–బీజేపీ కలిసి పనిచేయడం రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. చిల్పూరు మండలంలో ప్రత్యర్థులే ఇప్పుడు స్నేహితులుగా మారిపోయిన సంఘటనలు ఓటర్లను సైతం విస్మయానికి గురిచేస్తోంది. కృష్ణాజీగూడెంలో బీఆర్ఎస్కు బీజేపీ, సీపీఎం మద్దతుగా నిలుస్తున్నాయి. లింగాలఘణపురం మండలం జీడికల్ పంచాయతీలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి. బండ్లగూడలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్ నడుస్తోంది. గ్రామాధికారం కోసం అధికార, ప్రతిపక్షాలు కలిసిపోయాయనే చర్చ నడుస్తోంది. జనగామ మండలంలో పొత్తులు రెండు రకాలుగా నడుస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్–సీపీఐ కూటమి బలంగా కనిపిస్తుండగా, కొన్ని గ్రామాల్లో మాత్రం కాంగ్రె స్–బీజేపీ కలిసి పనిచేస్తుండటం రాజకీయ సమీకరణాలను క్లిష్టంగా మార్చేస్తోంది. రఘునాథపల్లి మండల పరిధిలో ఒప్పందాల రాజకీయాలు ఓటర్లను కన్ఫ్యూజ్ చేస్తోంది. నడిగొండలో సీపీఎం సర్పంచ్ అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుండగా, కుర్చపల్లిలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థికి సీపీఎం వెన్నుదన్నుగా నిలుస్తోంది. గబ్బెట పంచాయతీలో ఉప సర్పంచ్ పదవి కోసం ఒప్పందం కుదిరిన నేపథ్యంలో, కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థికి సీపీఎం మద్దతు ఇవ్వడం మరో కొత్త మలుపు. బచ్చన్నపేట మండలం గోపాల్నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థికి సీపీఎం మద్దతు ప్రకటించడం స్థానిక సమీకరణాలకు మరింత ఆసక్తిని తెచ్చింది.హడావిడి రాష్ట్రంలో శత్రువులు.. పల్లెల్లో మిత్రులు సర్పంచ్ కుర్చీ కోసం... కోపతాపాలు పక్కకు ఎవరు ఎవరితో.. ఆసక్తిగా గమనిస్తున్న ఓటర్లు కొన్నిచోట్ల కాంగ్రెస్–సీపీఎం–బీజేపీ కూటమి మరికొన్ని చోట్ల బీఆర్ఎస్–బీజేపీ కూటమి గ్రామీణ రాజకీయంలో మారుతున్న సమీకరణాలు -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
● డీసీపీ బి. రాజమహేంద్ర నాయక్ నర్మెట: ఎన్నికల కమిషన్ విధించిన నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డీసీపీ బి. రాజమహేంద్రనాయక్ హెచ్చరించారు. రెండో విడత గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని సర్పంచ్, వార్డు సభ్యులకు వినాయక గార్డెన్స్లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రవర్తన నియమావళి అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు.. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో, ఓటింగ్ , లెక్కింపు సమయంలో, ఖర్చుల విషయంలో పాటించవలసిన నిబంధనలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల ఖర్చుల అబ్జర్వర్ జయశ్రీ, అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అథారిటీ, ఎంపీడీఓ కావ్య శ్రీనివాసన్, తహసీల్దార్ మొహసిన్ ముత్జాబ, సీఐ ముసుకు అబ్బయ్య, ఎస్సై నైనాల నగేష్, ఎంఈఓ మడిపల్లి ఐలయ్య, ఎంపీఓ ఏవి. మల్లికార్జున్, ఆడిట్ అబ్జర్వర్ విజయ్, జోనల్ అధికారి సుకన్య, శుక్ల, డీటీ కురికాల వేణు, మాస్టర్ ట్రైనీస్, పోటీలో ఉన్న అభ్యర్థులు పాల్గొన్నారు. -
ఎన్నికల నియమావళిని అతిక్రమించొద్దు
● జిల్లా ఎన్నికల వ్యయ పర్యవేక్షణాధికారి జయశ్రీ తరిగొప్పుల: ఎన్నికల నియమావళిని అతిక్రమించొద్దని, స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా కృషిచేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పర్యవేక్షణాధికారి జయశ్రీ సూచించారు. ఎంపీడీఓ బోజనపల్లి లావణ్య అధ్యక్షతన సోమవారం రైతు వేదికలో ఎన్నికల నియమావళిపై సర్పంచ్, వార్డు సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు అందించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మొగుళ్ల మహిపాల్రెడ్డి, సీఐ అబ్బయ్య, ఎస్సై శ్రీదేవి, రామారావు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
‘అమ్మకు అక్షరమాల’ వేగవంతం చేయాలి
పాలకుర్తి టౌన్: జిల్లాలో నిరక్షరాస్యులకు అక్షరజ్ఞానం అందించే లక్ష్యంతో ప్రారంభిచిన ఉల్లాస్ శ్రీఅమ్మకు అక్షరమాలశ్రీ కార్యక్రమాన్ని మండలంలో మరింత బలోపేతం చేయాలని ఉల్లాస్, టాస్ జనగామ జిల్లా ఇన్చార్జి మురాల శంకర్రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో మండల సమాఖ్య కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా మొత్తంలో ప్రారంభమైన అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని సీసీలు, వీఓఏలు సమన్వయంతో విజయవంతం చేసి మండలాన్ని జిల్లా స్ధాయిలో ప్రథమస్థానంలో నిలుపాలని సూచించారు. కార్యక్రమంలో సీసీలు వెంకటేశ్వర్లు, యాదగిరి, శోభ,ఉమ ప్రమీల, వీఓఏ పాల్గొన్నారు. -
వందశాతం ఓటింగ్ సాధ్యమే
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ: జిల్లాలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు విలువైనదని, అందరూ సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్, ఎన్నికల అధికారి రిజ్వాన్ బాషా షేక్ చెప్పారు. సోమవారం కలెక్టరేట్ నుంచి ఆయన మాట్లాడారు.. గతంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో జిల్లా పరిధిలో 90.14 శాతం పోలింగ్ నమోదుకాగా, ఈసారి వంద శాతం ఓటింగ్ నమోదయ్యేలా ప్రజల్లో అవగాహన పెంచుతున్నామన్నారు. ఓటు వేయడానికి వెళ్లేవారు 18 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి చూపిస్తే సరిపోతుందన్నారు. ఓటరు స్లిప్ కూడా అంతే ముఖ్యమైనప్పటికీ, కేవలం పోలింగ్ స్టేషన్ వివరాలు మాత్రమే చూపిస్తుందన్నారు. అందుకే, అధికారిక వెబ్ tsec.gov.in నుంచి ఓటరు స్లిప్ను సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఎన్నికల ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలి పాలకుర్తి టౌన్: ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతీ ప్రక్రియ రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా జరగాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ స్క్రూట్నీ ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వర్కల వేదంతి, తహసీల్దార్ సూత్రం సర్వంతి, ఏంపీఓ హరినాథ్రెడ్డి పాల్గొన్నారు. ఏర్పాట్లపై సమీక్ష.. దేవరుప్పుల: మండల పరిషత్ కార్యాలయంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ, అభ్యర్థుల ఖరారు, గుర్తులు కేటాయింపు, అవగాహన సదస్సు, ఎన్నికల నిర్వహణ, సామగ్రి పంపిణీ వంటి ఏర్పాట్లపై కలెక్టర్ రిజ్వాన్ బాషా సమీక్షించారు. కార్యక్రమంలో ఎన్నికల సహాయ జిల్లా అధికారి మేనక పౌడేల్, తహసీల్దార్ ఆడెపు అండాలు, సూపరింటెండెంట్ పుష్పలత, ఆర్ఐ రాజు తదితరులు పాల్గొన్నారు. పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలి.. కొడకండ్ల: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పకడ్బందిగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ ఆదేశించారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేసి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అధికారులకు ఆదేశాలిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రమోహన్, ఎంపీడీఓ నాగశేషాద్రిసూరి తదితరులు పాల్గొన్నారు. -
పట్నంలో ‘పల్లె ప్రచారం’
దేవరుప్పుల: గ్రామపంచాయతీ ఎన్నికలు వస్తే చాలు పట్నంలో ఉండే వలస ఓటర్ల ప్రభావం ఇక్కడి అభ్యర్థుల ఓటమి గెలుపులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రధాన రాజకీయ పార్టీల్లో నిత్యం పనిచేసే స్థానికులు బాహాటంగా ప్రచారంలో నిమగ్నమవుతారు. కానీ తటస్టులుగా ఉండే పట్నం ఓటర్లను ఎవరు ముందు పావనం చేసుకుంటే వారికే ప్రాధాన్యం ఇస్తారనేది సర్వసాధారణం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే తొలుత పట్నం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆత్మీయ సమ్మేళనం పేరిట అత్యధిక ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలోనే ఆధివారం సెలువు దినం కావడంతో మండలంలోని ధర్మాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లో తమ ఊరి వారు ఉన్న ఇళ్లకు వెళ్లి ప్రచారం చేశారు. -
బొక్కకూర..బగార బువ్వ
స్టేషన్ఘన్పూర్: మొదటి విడత ఎన్నికలకు మరో మూడు రోజులే గడువు ఉండడంతో గ్రామాల్లో పంచాయతీ ప్రచారం ఊపందుకుంది. ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం ప్రచారం చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు మధ్యాహ్నం గ్రామాల్లో ప్రచారంలో పాల్గొన్న వారికి భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం పలు గ్రామాల్లో ప్రచారం అనంతరం చికెన్ కూర, బగార అన్నంతో భోజనాలు ఏర్పాట్లు చేశారు. దాంతో పార్టీలు, అభ్యర్థులకు అతీతంగా పలువురు బొక్క కూర.. బగారా బువ్వ అంటూ కమ్మని భోజనం చేశామని చెపుతున్నారు. గ్రామాల్లో టెంట్లు, భోజనాలతో ఎన్నికల సందడితో పెళ్లి తరహాలో ఎన్నికల సందడి జోరందుకుంది. -
ఓటుహక్కు ప్రజాస్వామ్య పునాది
జనగామ రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల విధులు నిర్వహించనున్న ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి, రెండో, మూడో విడతలుగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్లో ఆయా మండలాల్లో ఓటరుగా నమోదై, ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులు తాము ఓటరుగా నమోదైన సంబంధిత మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటు వేయాలని సూచించారు. మొదటి విడత పోలింగ్ వారికి 9న, రెండో విడత పోలింగ్ వారికి 12న , మూడో విడత పోలింగ్ వారికి 15న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిర్వహిస్తారన్నారు. ఈ సదుపాయం వినియోగించుకోవడానికి ఉద్యోగులు తమ ఎన్నికల విధుల అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీతో పాటు (ఓటర్ ఐడీ) జిరాక్స్, ఏదైనా ఒక గుర్తింపు కార్డును జత చేసి సంబంధిత ఎన్నికల అధికారికి సమర్పించాల్సి ఉంటుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ స్టేజ్–2 ప్రక్రియలో భాగంగా రిటర్నింగ్ అధికారులు పాటించాల్సిన ముఖ్య సూచనలు వివరించారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
నేడు ఉచిత స్వర్ణప్రాశన
జనగామ : పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులోని ఆయుర్వేద పంచకర్మ వెల్నెస్ సెంటర్లో ఈనెల 8న (సోమవారం) పుష్యమి నక్షత్రం పురస్కరించుకుని ఉచిత స్వర్ణప్రాశన కార్యక్రమం ఉంటుందని డాక్టర్ అంజిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, 6 నెలల నుంచి 16 సంవత్సరాల వయస్సు వారికి స్వర్ణప్రాశన వేస్తామన్నారు. వివరాల కోసం 9000097686 నంబర్లో సంప్రదించాలన్నారు. ఘనంగా స్వామివారి కల్యాణోత్సవం నర్మెట : మండల కేంద్రంలోని కాకతీయుల కాలంనాటి అతిపురాతన వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి వార్షిక కల్యాణోత్సవాన్ని ఆలయ పూజారి పార్నంది సతీష్ శర్మ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. గణపతి పూజతో ప్రారంభమైన క్రతువు తలంబ్రాలతో ఘనంగా ముగిసింది. అనంతరం స్వామివారికి, ఉభయ దేవేరులకు ఒడిబియ్యం పోసి కట్నకానుకలు సమర్పించుకున్న మహిళలు, భక్తులు మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కల్యాణంలో ఇమ్మడి సరిత శ్రీనివాస్రెడ్డి, చింతకింది హేమలతా రవీందర్, రంగరాజు సుమబాల విద్యాసాగర్రావు, రంగరాజు సునిత వెంకటరమణారావు, గోపగోని జ్యోతివిజయ్కుమార్, దన్నారపు శోభా దేవి మురళి, గోపగోని లలిత శ్రీధర్, చిర్రవెంకట్ రెడ్డి, గోపగోని రేవంత్ ఆదిత్య, చంద్రకాంత్, మడికొండ నరేష్ తదితరులు పాల్గొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గించొద్దుజఫర్గఢ్: ఎన్నికల్లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కల్గించవద్దని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య కోరారు. మండల కేంద్రంలోని గాంధీ సెంటర్లో ఎన్నికలపై ఏసీపీ అంబటి నర్సయ్య ఆదివారం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశాంతమైన వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాలన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలకు పాల్పడకూడదన్నారు. ఏమాత్రం శాంతిభద్రతలకు విఘాతం కల్గించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఓటర్లు ఏలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు, ఎస్సై రామారావుతో పాటు పోలీసులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురికావొద్దుస్టేషన్ఘన్పూర్: ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం తదితర ప్రలోభాలకు గురికావద్దని, గ్రామ అభివృద్ధికి పాటుపడే వ్యక్తిని ఎన్నుకోవాలని స్థానిక ప్రభుత్వాల సాధికారత వేదిక రాష్ట్ర కన్వీనర్ బండారు రామ్మోహన్రావు అన్నారు. మండలంలోని సముద్రాల గ్రామంలో ఎన్నికల నిఘా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. రాష్ట్రంలో మూడు విడతలుగా జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పటికే ఏకగ్రీవాల పేరిట వేలం పాట రాజకీయాలు కొనసాగాయని, బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్నికల నిఘావేదిక ఉమ్మడి జిల్లా సమన్వయ కర్త ప్రశాంత్కుమార్, ఘన్పూర్ నియోజకవర్గ ఎన్నికల నిఘావేదిక కన్వీనర్ కుంభం విజయ్, శ్రీనివాస్రెడ్డి, ప్రకాశ్, శ్రావ్య, నిశ్చిత్, రాజు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో హేమాచలుడికి పూజలుమంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచలక్షేత్రానికి భక్తులు ఆదివారం భారీగా తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేలాది మంది తరలివచ్చి ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి నువ్వుల నూనెతో తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. -
నేనూ.. మీ గ్రామపంచాయతీని..
జనగామ: ఏడాదిన్నరగా గ్రామ పంచాయతీల్లో పాలకులు లేరు. అధికార ముద్రలేకుండా జీపీ కార్యాలయాలు బోసిపోయాయి. గ్రామాలు అనాథలా మూలనపడ్డాయి. ఈనేపథ్యంలో ఇదే నా కథ అంటూ ఓ గ్రామపంచాయతీ పడుతున్న ఆవేదన.. ‘నా వీధులు చెత్తతో నిండిపోయాయి, నా డ్రైనేజీలు శిథిలమై మురుగునీటి వాసనతో ఊపిరి బిగపట్టేలా మారాయి. రాత్రి వీధిలైట్లు వెలగని పరిస్థితి. ఇవన్నీ చూసి అందరూ పడుతున్న బాధ, పౌరుల తిట్ల పురాణం అన్నీ నా గుండెల మీద బరువుగా పేరుకుపోయాయి. పంచాయతీ ఎలక్షన్లు లేకపోవడంతో ఒక సర్పంచ్ లేడు, నాయకత్వం అసలే లేదు.. ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపించకపోవడంతో ప్రజలు నిత్యం నాగురించే మాట్లాడుకునేలా చేసింది. ఎలక్షన్ల కోసం ఇన్నాళ్లు ఎదురు చూశాను. ఎన్నికల షెడ్యూల్ రావడం, రిజర్వే షన్లను ప్రకటించడం, పోలింగ్ సైతం దగ్గర పడడం.. ఊపిరి పీల్చుకునేలా చేసింది. జిల్లాలో మూడు విడతల్లో మరో 10 రోజుల్లో పాలక మండలి బాధ్యతల్లో కొత్త నాయకత్వం రానున్న వేళ నా గుండెల్లో కొత్త వెలుగుల్ని నింపనుంది. ఇన్నాళ్లు నేను, నా గ్రామం పడిన మానసిక క్షోభ, ప్రజలు పడ్డ యాతన తీరే అవకాశం రాబోతుంది. కొత్త సర్పంచులు, కొత్త వార్డు మెంబర్లు గ్రామానికి నూతన కలను తీసుకురావాల్సిన సమయం వచ్చేసింది. కానీ ఈ బాధ్యత అంత సులభం కాదు. సర్పంచ్ అంటే కత్తిమీద సాము. పగలు, రాత్రి సమస్యలే. ప్రజల అంచనాలు ఆకాశమే హద్దు. కానీ అదే సమయంలో అభివృద్ధికి మార్గం చూపేవారు కూడా వారే. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం, ప్రతీ పనిని జాగ్రత్తగా పర్యవేక్షణ చేయడం, అధికారులతో కలిసి తీసుకునే నిర్ణయాలే గ్రామాన్ని కొత్త దిశగా తీసుకెళ్లుంది. ఆ అవకాశం సర్పంచ్లకే ఉంటుంది. ఎందుకంటే గ్రామం అంటే కేవలం ఇళ్లు కాదు, ప్రతి ఒక్కరి వెనుక ఉన్న ఆశలు. ఇప్పుడు నా ఆశ ఏంటంటే ఈసారి వచ్చే నాయకత్వం నా ప్రజల సమస్యలను వినాలి. అర్థం చేసుకుని పరిష్కరించాలి. నా చీకటి వీధుల్లో మళ్లీ వెలుగు నిండాలి. నా డ్రైనేజీలు శుభ్రంగా ప్రవహించాలి. నా గ్రామం పరిశుభ్రంగా, పచ్చగా మారాలి. నేనిప్పుడు చెప్పేది ఒక్కటే. కొత్త సర్పంచ్లే వస్తే బాగుపతామని కలలు కన్నా గ్రామం, ఏడాదిన్నరగా ఎదురు చూసింది. ఇన్నాళ్లు మానసికంగా పడ్డ నా వేదన.. కొత్త పాలక మండళ్లతో పోతుందని నమ్మకంగా ఉంది.’ఇట్లు మీ గ్రామ పంచాయతీ -
పైసలిస్తేనే పనులు!
● ప్రైవేట్ స్కూళ్ల రెన్యువల్, కొత్త స్కూళ్ల అనుమతికి భారీగా వసూళ్లు ● తాజాగా ఏసీబీకి చిక్కిన హనుమకొండ ఇన్చార్జ్ డీఈఓ, ఇద్దరు ఉద్యోగులువిద్యారణ్యపురి: ఉమ్మడి జిల్లా విద్యాశాఖలో అవినీతి భూతం రాజ్య మేలుతోంది. ఏ పనికావాలన్నా పైసలు ముట్టజెప్పాల్సిందే. అవినీ తి ఆరోపణల నేపథ్యంలో గతంలో డీఈఓలుగా పనిచేసిన పలు వురిని విద్యాశాఖ బదిలీ చేయడంతోపాటు బాధ్యతల నుంచి తప్పించింది. ఒకరిద్దరు మాత్రం వారికివారే తప్పుకున్నారు. హనుమకొండ డీఈఓగా పనిచేసిన వాసంతిపై పలు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదుల నేపథ్యంలో ఆమెను డీఈఓ బాధ్యతల నుంచి తప్పించగా సెలవుపై వెళ్లారు. అదనపు కలెక్టర్ వెంకటరెడ్డికి ఎఫ్ఏసీ డీఈఓగా బాధ్యతలు అప్పగించారు. రెగ్యులర్ డీఈఓలు లేక.. విద్యాశాఖ డీలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యాశాఖ గాడి తప్పింది. రెగ్యులర్ డీఈఓలు లేక డీలా పడింది. ములుగు జిల్లాలో కొంతకాలం క్రితం అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) ఇన్చార్జ్ డీఈఓగా పనిచేస్తూ ఏసీబీకి పట్టుబడ్డాడు. వరంగల్ జిల్లాలో ఏడీ అధికారికే డీఈఓ బాధ్యతలు అప్పగించగా.. అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు వేరే జిల్లాకు బదిలీ చేశారు. హనుమకొండ జిల్లాలో గత డీఈఓను విధులనుంచి తప్పించి అదనపు కలెక్టర్కు బాధ్యతలు అప్పగించినా అదే పరిస్థితి దాపురించింది. డీఈఓ కార్యాలయానికి అప్పుడప్పుడు మాత్రమే వచ్చివెళ్లేవారు. ఎక్కువ ఫైళ్లను కలెక్టరేట్లోని తన చాంబర్కు సిబ్బంది తీసుకెళ్తే సంతకాలు చేసేవారు. దీంతో డీఈఓ కార్యాలయంలో పర్యవేక్షణ కొరవడింది. పలు సెక్షన్లలోని సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో టీసీ బుక్స్ ఇస్తే సెక్షన్లో ఉండే సిబ్బంది ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల నుంచి వసూలు చేసేవారు. దీంతో ఫిర్యాదు రాగా అక్కడ సెక్షన్లో పనిచేసే ఉద్యోగిని తప్పించి టీసీ బుక్స్ ఇచ్చే బాధ్యతలు అప్పటి డీఈఓ అబ్దుల్హై హయాంలో డీసీఈబీకి అప్పగించారు. అప్పటి నుంచి డబ్బులు వసూలు చేయకుండా నిబంధనల ప్రకారమే టీసీ బుక్స్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు ఇస్తున్నారు. అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి బాధ్యతలు స్వీకరించాక టీసీ బుక్స్ మళ్లీ డీఈఓ కార్యాలయంలో సంబంధిత సెక్షన్కే అప్పగించాలని ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. టీసీ బుక్స్కు కూడా డబ్బులు వసులు చేసేందుకే సెక్షన్ సిబ్బంది చక్రం తిప్పి డీఈఓతో ఉత్తర్వులు జారీ చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి.హనుమకొండ జిల్లాలో 200కుపైగా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఒకటి నుంచి ఐదో తరగతి పాఠశాలలు డీఈఓ పరిధిలో, 6 నుంచి 10వ తరగతివరకు పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ పరిధిలో అనుమతులు రెన్యువల్ చేస్తారు. అయితే, హైస్కూళ్లు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. గతంలో ఒక స్కూల్లో ఒకటి నుంచి 5 తరగతుల వరకు డీఈఓ అనుమతి, రెన్యువల్ చేస్తే సంబంధిత సెక్షన్లో రూ.30 వేల వరకు వసూలు చేశారనేది ఆరోపణలున్నాయి. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు డీఈఓ రెన్యువల్, అనుమతి ఇచ్చాక.. 6 నుంచి 10 వతరగతి వరకు అనుమతికి పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీకి కూడా రెకమెండ్ చేయా లి. ఒక కాపీని ఆర్జేడీ కార్యాలయానికి పంపుతారు. గత డీఈఓ హయాంలో కార్యాలయ సెక్షన్లో రూ.60 వేల వరకు వసూలు చేశారని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు పేర్కొన్నారు. కొత్తగా ప్రైవేట్ పాఠశాలల అనుమతికి రూ.లక్షకుపైగానే సెక్షన్ సిబ్బంది వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. రెన్యువల్ ఫీజుగా ప్రభుత్వానికి చలానా రూపంలో చెల్లించేది రూ.5వేలు మాత్రమే. డీఈఓ కార్యాలయ సెక్షన్లో మాతం రూ.60 వేలు ఇవ్వాల్సి రావడంతో యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. నూతన పాఠశాలల అనుమతికి ప్రభుత్వానికి చలాన్ రూ పంలో రూ.10 వేలు మాత్రమే చెల్లించాలి. హనుమకొండ కొత్తూరు జెండాలోని క్రియేటివ్ మోడల్ హైస్కూల్ 10 సంవత్సరాల రెన్యువల్కు డీఈఓ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ గౌస్, జూనియర్ అసిస్టెంట్ మనోజ్ రూ.లక్ష డిమాండ్ చేశారు. శుక్రవారం రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వీరు అధికారులకు పట్టుబడ్డారు. వీరితోపాటు ఇన్చార్జ్ డీఈఓ ఎ.వెంకటరెడ్డిని కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఎఫ్ఏసీ డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన 35 రోజులకే వెంకటరెడ్డి అవినీతి నిరోధక శాఖకు పట్టుబడడం కలకలం రేపింది. -
బంధువులే భల్లాలదేవుళ్లు
పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థులంతా పక్కింటివారు, కావాల్సినవాళ్లేజనగామ: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు పెద్ద పండుగను తలపిస్తున్నాయి. గల్లీల్లో అభ్యర్థుల జోరు ప్రచారాలతో సందడి నెలకొంది. పార్టీల ప్రచారం ఇలా ఉంటే.. సర్పంచ్ ఎలక్షన్లు పక్కింటి వాళ్లను ప్రత్యర్థులుగా మారుస్తున్నాయి. పెదనాన్న కొడుకు, తోటి కోడళ్లు, బాబాయ్, అబ్బాయ్లు వేరు వేరు పార్టీల పక్షాన బరిలో నిలబడటం గ్రామాల్లో చర్చకు దారితీస్తోంది. బాహుబలి సినిమాలో రాజ్యాధికారం కోసం విలన్ భల్లాలదేవుడు, నమ్మించి కుట్ర చేసే కట్టప్పలు ఉన్నట్లే.. పంచాయతీ ఎన్నికల్లో పక్కింటివారు, బంధువుల్లోనూ భల్లాలదేవుళ్లు, కట్టప్పలు ఉంటున్నారు. బంధాలు, బంధుత్వాలతో దశాబ్దాలుగా కలిసి జీవించిన పక్కింటి అనుబంధాలు ఎన్నికల వేళ ఒక్కసారిగా గీత దాటిస్తున్నాయి. బరిలో నిలిచిన ప్రతి అభ్యర్థి ఓటు అడుగుతున్నారు. కడుపులో తలపెడుతూ ‘అన్నా నీ ఓటు వేసి గెలిపిస్తే రుణ పడి ఉంటా..’నని ఎవరికి వారే బతిమిలాడుతున్నారు. ఒకరికి ఓటు వేస్తే ఇంకొకరి మనసు నొప్పించకపోవడమెలా అనే సందిగ్ధతలో చాలా మంది ఓటర్లు ఊగిసలాటలో ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు సీరియల్ కథను తలపిస్తున్నాయి. ఓటర్ల నిత్యకృత్యాలు పూర్తయ్యేలోపే, అభ్యర్థుల బృందాలు ఫ్లకార్డులు పెట్టుకుని ఇంటి ముందు ప్రత్యక్షమవుతున్నారు. ప్రచారంలో ప్రత్యర్థులు ఎదురుపడే సమయంలో నినాదాలతో హోరెత్తిస్తున్నారు. యువకులు, మహిళలు ఈసారి ప్రచారంలో ముందు వరుసలో ఉన్నారు. పాలకేంద్రాలు, టీ స్టాల్స్, రచ్చబండ వద్ద సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎవరు గెలుస్తారన్న చర్చ ఎగ్జిట్ పోల్స్ను మించి ఉంటుంది. నిజంగా గ్రామానికి పని చేస్తారన్న ప్రశ్నే మెజార్టీ ఓటర్ల ద్వారా వినిపిస్తోంది. పచ్చిక పొలాల్లో పని చేస్తూ రైతులు చెప్పే మాటల్లో కూడా అదే భావన. వారు అభ్యర్థుల వ్యక్తిగత నడవడిక, మంచి చెడు, గతంలో చేసిన పనుల గురించి సరిచూసి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎలక్షన్లలో స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున బరిలో నిలువడంతో స్థానిక సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. పలుచోట్ల పార్టీ అభ్యర్థులకే కాకుండా స్థానికంగా మంచి పేరున్న స్వతంత్రులకూ అనుకూలంగా మారిపోతుంది. పార్టీ కంటే వ్యక్తి అనే భావన ఈసారి గ్రామాల్లో బలంగా వినిపిస్తోంది. అభ్యర్థుల వ్యక్తిగత వ్యవహారశైలిపై ఓటర్ల నిర్ణయంపై భారీ ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాగునీరు, రోడ్లు, స్ట్రీట్ లైట్లు, డ్రెయినేజీల నిర్మాణం ఇలా ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలు వేరైనా పరిష్కారం చూపగల నాయకుడే కావాలన్న అభిలాష అన్ని మండలాల్లో ఒకేలా వినిపిస్తోంది. స్టేషర్ఘన్పూర్ ప్రచారానికి మూడు రోజులు మిగిలి ఉండగా, జనగామ నియోజకవర్గంలో ప్రచారంలో వేగం పుంజుకుంది. ఎవరు ఎక్కడ గెలుస్తారనే విషయం కొన్ని రోజుల్లో తేలిపోనుంది. ప్రధాన, ప్రతిపక్ష, ఇతర పార్టీలతో పాటు స్వతంత్రులు ఉదయం 6 గంటల వరకే రోడ్డెక్కేస్తున్నారు. పార్టీల కేడర్, వెంట వచ్చే అనుచరులను అభ్యర్థులు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ప్రచారానికి వెళ్లే సమయంలో ‘అన్నా టిఫిన్లు చేశారా..’ అంటూ ఫోన్లు చేసి ఆప్యాయంగా పలకరిస్తున్నారు. రోజువారీగా విందు పార్టీలకు కొదవ లేదు. బెల్ట్ దుకాణాదారులు లక్షల రూపాయల సరుకును స్టాక్ ఉంచుతున్నారు. ఆఫీసర్ ఛాయిస్ నుంచి బ్లాక్డాగ్ వరకు కొరత లేకుండా చూసుకుంటున్నారు. సర్పంచ్ ఎన్నికల హడావుడి పక్కింటి వారితో చిన్నపాటి గొడవలకు దారి తీస్తోంది. అలా వచ్చి ఇలా వెళ్లి పోయే ఎలక్షన్లతో బంధుత్వం, స్నేహం మధ్య దూరం రాకూడదని పెద్ద మనుషులు మధ్యవర్తిత్వం చేసి కలిసి పోయేలా చేస్తున్నారు. మొత్తం మీద జనగామలో ఈసారి పంచాయతీ ఎన్నికలు రాజకీయ పోరుగా మాత్రమే కాకుండా బంధుత్వాలు, పక్కింటి అనుబంధాలకు దూరాన్ని పెంచేలా చేస్తోంది. పోటీలో ఎక్కువగా అన్నదమ్ముళ్లు, తోటికోడళ్లు, బాబాయ్, అబ్బాయ్లే.. ఎక్కడా చూసినా ఎవరూ గెలుస్తారనే చర్చే గ్రామాల్లో హోరెత్తుతున్న అభ్యర్థుల ప్రచారం -
మేడారంలో భక్తుల కోలాహలం
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుకు పూజలు చేశారు. సుమారు 20వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం, చిలకలగుట్ట, శివరాంసాగర్ పరిసరాల ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. భక్తులకు తప్పని తిప్పలు మేడారంలో రోడ్ల నిర్మాణం పనులు జోరుగా సాగుతుండడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. అమ్మవార్ల గద్దెల వద్దకు వెళ్లే పలు దారుల రోడ్ల నిర్మాణం పనులు చేస్తుండగా అక్కడికి ఎలా చేరుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. జంపన్నవాగు నుంచి బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణ, జంపన్నవాగు నుంచి గద్దెలకు వచ్చే దారిలో నీడ చెట్ల నుంచి హరితహోటల్ దారిలో, ఆర్టీసీ బస్డాండ్ భక్తుల క్యూలైన్ దారిలో రోడ్ల విస్తర్ణం పనులు సాగుతున్నాయి. హరితహోటల్ దారిలో కూడా రోడ్డు విస్తరణ పనులు సాగుతుండగా భక్తులు ఇబ్బందులు పడ్డారు. భారీగా తరలివచ్చిన భక్తజనం వనదేవతలకు మొక్కుల చెల్లింపు రోడ్ల నిర్మాణ పనులతో భక్తుల ఇక్కట్లు -
అటొళ్లు ఇటు..ఇటొళ్లు అటు
దేవరుప్పుల: గ్రామ పంచాయతీ ఎన్నికలు పురస్కరించుకొని కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ ప్రాబల్యం నిరూపించుకునేందుకు ఫిరాయింపుల జోరు సాగిస్తున్నాయి. ప్రధానంగా గిరిజన గ్రామ పంచాయతీలను టార్గెట్ చేసుకున్నాయి. ఆదివారం ధర్మాపురం రెవెన్యూ పరిధి లక్ష్మణ్తండా పరిధి బీఆర్ఎస్ నాయకులు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి సమక్షంలో ఉదయం చేరగా మధ్యాహ్నం కల్లా ఇదే తండా కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరడం కొసమెరుపు. చిన్న గ్రామపంచాయితీల్లో ప్రధాన పార్టీలోని పలు సామాజికవర్గ అభ్యర్థులకు టికెట్ దక్కలేదనే అలకపాన్పు గమనించిన ఇరు పార్టీలు తమ పార్టీల్లోకి చేర్చుకుంటున్నాయి. -
జనవరి నుంచి అక్టోబర్ వరకు ప్రమాదం సమయాల (గంటల్లో)
● సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్యలో 271 ప్రమాదాలు మధ్యాహ్నం మూడు నుంచి ఆరు గంటల మధ్యలోనూ 270 కేసులు సాక్షి, వరంగల్: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆ మూడు గంటల్లోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం, మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్యలో 271 ప్రమాదాలు జరిగి 84 మంది మృతిచెందగా... మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్యలో 270 ఘటనలు జరిగి 65 మంది చనిపోయారు. ఆ సమయాల్లో డ్రైవింగ్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలనే సంకేతాలను ఈ గణాంకాలు చెబుతున్నాయి. సాయంత్రం సమయంలోనే వాహనాలు ఎక్కువగా రోడ్డు మీదకు రావడం, గమ్యస్థానాలకు తొందరగా చేరుకోవాలనుకునే క్రమంలో అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్తో తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. తమకు ఏం సంబంధం లేని ఎదుటివారి ప్రాణాలను బలిగొంటున్నారు. ఇలా ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు అంటే పది నెలల కాలంలో 1,250 రోడ్డు ప్రమాదాలు జరిగితే 377 మంది మృతి చెందగా, 1,253 మంది క్షతగాత్రులయ్యారని ట్రాఫిక్ పోలీసు గణాంకాలు చెబుతున్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండడంతోపాటు ట్రాఫిక్ నియమాలను పాటిస్తే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుతారని పోలీసులు అంటున్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు271 84 240 వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి నుంచి అక్టోబర్ వరకు 1,250 రోడ్డు ప్రమాదాలు మృతులు 377,, క్షతగాత్రులు 1,253 అప్రమత్తతోపాటు ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే సురక్షితంగా గమ్యస్థానాలకు -
అంతులేని అవినీతి..!
సాక్షిప్రతినిధి, వరంగల్ : హనుమకొండ కలెక్టరేట్లో రూ.60వేల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జ్ డీఈఓ ఎ.వెంకట్రెడ్డిపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఓ వైపు భూ నిర్వాసితులు, మరోవైపు కొందరు రైస్మిల్లర్లు తమగోడును వెళ్లబోసుకుంటున్నారు. దామెర, ఊరుగొండ గ్రామాలకు చెందిన గ్రీన్ఫీల్డ్ హైవే బాధిత రైతులు ఏకంగా హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ‘మా ఉసురు తాకింది’అంటూ టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. సీఎంఆర్ వేధింపులకు గురైన రైస్మిల్లర్లు కొందరు సీఎస్ కార్యాలయంలో వెంకట్రెడ్డిపై ఫిర్యాదులు చేయడం కలకలం రేపుతోంది. ఆదినుంచి వివాదాస్పదుడే... రెవెన్యూశాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన ఎ.వెంకట్రెడ్డి ఆదినుంచి వివాదాస్పదుడే. ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే.. ఆ ప్రభుత్వంలోని తన సామాజిక నేపథ్యం ఉన్న నేతల పేర్లు చెబుతూ ఉన్నతాధికారులను మెప్పించే ప్రయత్నం చేసేవారన్న ఆరోపణలున్నాయి. జనగామ ఆర్డీఓగా, సూర్యాపేట అడిషనల్ కలెక్టర్గా పనిచేసిన సమయంలోనూ అవినీతి ఆరోపణలు ఎ దుర్కొన్నారు. జనగా మ ఆర్డీఓగా పని చేసిన సమయంలో అప్పుడు న్న నియోజకవర్గ కీలక నేత, ఆయన బావమరుదులు, బంధువుల ఒ త్తిళ్లకు తలొగ్గి అసైన్డ్, ప్ర భుత్వ భూములను ప ట్టాభూములుగా చిత్రీకరించి రూ.లక్షల్లో పరిహారం చెల్లించారన్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది. అక్రమార్కులకు సీఎంఆర్.. ● హనుమకొండ అడిషనల్ కలెక్టర్గా వెంకట్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో సీఎంఆర్ కేటాయింపులకు తీసుకునే నజరానాలు రెండింతలు పెరిగాయని కొందరు రైస్మిల్లర్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ కార్యాలయంలో చేసిన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ● ఒక్కో సీజన్కు ఒక్కో రైసుమిల్లు నుంచి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపించారు. ● ఇన్టైంలో సీఎంఆర్ ఇచ్చిన రైసుమిల్లర్లను పక్కన పెట్టి.. డిఫాల్టర్లయిన వారు ముడుపులివ్వగానే వారికి పెద్ద మొత్తంలో ధాన్యం కేటాయించారు. ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు...? అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలిసింది. రూ.60 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ మనోజ్, సీనియర్ అసిస్టెంట్ గౌసుద్దీన్లకు ఏసీబీ అధికారులు శనివారం హనుమకొండ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. విచారణ జరిపిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముగ్గురికి ఈ నెల 19 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇవ్వగా, ఖమ్మం జైలుకు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. వెంకట్రెడ్డి టీమ్పై ఏసీబీ ఆరా.. సీఎంఆర్, భూసేకరణ ఫైళ్లపై విచారణ ఏసీబీ అధికారులు శుక్రవారం ఘటనా స్థలంలోనే రసాయన పరీక్షలు చేసి, లంచం డబ్బు వెంకట్రెడ్డి చేతిలో ఉండటాన్ని ధ్రువీకరించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత కలెక్టరేట్లో తనిఖీలు చేసిన ఏసీబీ టీమ్ పలు ఆధారాలను స్వాధీనం చేసుకుంది. ఈ లావాదేవీకి సంబంధించిన డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. వెంకట్ రెడ్డి కార్యాలయ గదిలోని డాక్యుమెంట్లు, కంప్యూటర్లు, ఫైళ్లను స్కాన్ చేశారు. ఈ రైడ్స్లో అదనపు ఆస్తులు, మరిన్ని అవినీతి ఆధారాలు దొరికినట్లు సమాచారం. సీఎంఆర్, భూసేకరణల్లో భారీ అక్రమాలు జరిగాయన్న నిర్ధారణకు వచ్చిన ఏసీబీ.. ఈ రెండు అంశాల్లో అతనికి అత్యంత సన్నిహితంగా మెలిగిన రెవెన్యూ, సివిల్ సప్లయీస్ అధికారులు, సిబ్బంది వివరాలపై ఆరా తీస్తుంది. హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డిపై ఫిర్యాదుల పరంపర తవ్విన కొద్దీ అవినీతి, అక్రమాలు.. సీఎంఆర్లో అవకతవకలు కలెక్టరేట్ ఎదుట టపాసులు కాల్చి రైతుల సంబురాలు -
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
జనగామ రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు రవికిరణ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. శనివారం కలెక్టరేట్లోని కార్యాలయంలో మైక్రో అబ్జర్వర్లకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. మైక్రో అబ్జర్వర్లు తమ చెక్లిస్ట్లో ప్రతీ అంశంపై ‘అవును/కాదు’గా నమోదు చేసి, గమనించిన లోపాలు లేదా సంఘటనలను ప్రత్యేక రిపోర్ట్లో పొందుపరచాలన్నారు. ఫలితాల ప్రకటన, ఎన్నిక సర్టిఫికెట్ జారీ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. ఎన్నికల సంఘం సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. బ్యాలెట్ బాక్స్ పరిశీలన, సీరియల్ నంబర్ల నమోదు, పోలింగ్ కేంద్ర ప్రవేశ నియంత్రణ, ఓటర్ల గుర్తింపు, ఇండిలేబుల్ సిరా గుర్తు వేయడం, ఓటర్ల నమోదు ప్రక్రియ, దివ్యాంగుల సహాయం, పోలింగ్ కేంద్రం చుట్టూ ప్రచారం లేదా ఒత్తిడి పరిశీలన తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్ మెరుగు రామరాజు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేష్కుమార్, జెడ్పీ సీఈఓ మాధురిషా, ఇన్చార్జ్ డీపీఓ వసంత పాల్గొన్నారు. అలాగే జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. ఏకగ్రీవ గ్రామపంచాయతీల్లోనూ ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయన్నారు. పొరపాట్లకు తావివ్వొద్దు లింగాలఘణపురం: ఎన్నికల విధుల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం మండలంలోని బండ్లగూడెం రైతువేదికలో స్టేజ్–2 ప్రిసైడింగ్ అధికారులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించి మా ట్లాడారు. ఎన్నికల ముందు సామగ్రిని సరిచూసుకోవడం, బ్యాలెట్ పేపర్ చెక్ చేసుకోవడం తదితర ప్రతీ అంశాన్ని పరిశీలించి పూర్తి చేయాలన్నారు. తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ శివశంకర్రెడ్డి, మాస్టర్ ట్రైనర్స్ కోటీ, శ్యామ్మోహన్, రాఘవులు, హరిప్రసాద్, రాజశంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలి జనగామ రూరల్: ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యసేవలందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం వైద్యాధికారి మల్లికార్జునరావుతో కలిసి జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై గూగుల్ మీట్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నిత్యం సమీక్షలు జరుపుతూ మలేరియా, డెంగీ నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల పరిశీలకుడు రవికిరణ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్బాషా -
పంపిణీపై ప్రత్యేక నిఘా
మద్యం, డబ్బు జనగామ: జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల వెస్ట్జోన్ పరిధిలో నిర్వహించనున్న జీపీ ఎన్నికలు అత్యంత కీలక దశలోకి ప్రవేశించాయి. మొత్తం మూడు విడతలుగా జరగబోయే ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలు, ఓటర్లను ప్రభావితం చేసేలా మద్యం, డబ్బు పంపిణీపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. శాంతియుత వాతావరణంలో ఎలక్షన్ల నిర్వహణపై పోలీసుశాఖ తీసుకుంటున్న చర్యలపై డీసీపీ రాజ మహేంద్రనాయక్ శనివారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. వెస్ట్జోన్ పరిధిలో జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాలకు చెందిన వర్ధన్నపేట, రాయపర్తి మండలాలు, అలాగే వెంకటాపురం, గరిమెల్లపల్లి గ్రామాలు కలుపుకుని 14 మండలాలు ఉన్నాయి. జనగామ జిల్లాతో పాటు పొరుగు ప్రాంతాలు కలుపుకుని 300 గ్రామపంచాయతీలు ఉండగా, అందులో 197 సాధారణ, 143 సమస్యాత్మక జీపీలను గుర్తించాం. ఓటర్లను ఆకర్షించే విధంగా మద్యం, డబ్బు పంపిణీపై ప్రత్యేక నిఘా ఉంది. జిల్లాలో 45 ఎక్సైజ్ కేసులు నమోదు చేసి 450 లీటర్ల లిక్కర్ స్వాధీనం చేసుకున్నం. 5 గుడుంబా కేసుల్లో 20 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరిపై కేసు నమోదు చేసి 3 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నాం. బెల్ట్ షాపులపై ప్రత్యేక డ్రైవ్ చేసి ఇప్పటి వరకు 729 మందిని రూ.లక్ష పూచీకత్తుతో తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేశాం. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఎక్కడ గొడవలకు దిగకూడదు. ఎన్నికల కేసుల్లో ఇరుక్కుంటే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వా రితో పాటు గ్రూప్ అడ్మిన్పై కేసు నమోదు చేస్తాం. పోలింగ్ సామగ్రి పంపిణీ నుంచి బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్రూంకు చేరేవరకు పటిష్టమైన బందోబస్తు చేపట్టేలా అన్ని రూట్లను సిద్ధం చేసుకున్నం. అన్ని మండలాల్లో ఏసీపీ ర్యాంకు అధికారులతో ప్రత్యేక నిఘా ఉంటుంది. మొత్తం మూడు విడతల్లో జరుగనున్న ఎన్నికల కోసం రెండు నుంచి మూడు వేల మంది పోలీసుల సిబ్బంది అవసరం ఉంటుందని అంచనా వేశాం. పోలింగ్ రోజు కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు మాత్రమే జనసంచారం అనుమతి. ఏజెంట్లు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ముందుగానే బూత్ వద్ద చేరుకోవాలి. అభ్యర్థులు, పార్టీలు, కార్యకర్తలు ప్రశాంతంగా ఎన్నికలను జరిపేలా సహకరించాలి. సర్పంచ్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశాం. ప్రజల సహకారంతో ఈ ఎన్నికలను విజయవంతం చేస్తాం. ప్రజల్లో ఎన్నికల భద్రతపై నమ్మకాన్ని పెంచుతూ, పోలీసుశాఖ సన్నాహకాలను స్పష్టంగా వివరిస్తోంది.సాక్షి ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతీ బూత్ వద్ద నలుగురు పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. బూత్ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు, నిఘా ఉంటుంది. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేశాం. మూడు విడతలకు సంబంధించిన పోలింగ్ రూట్లను మొత్తం రీసెర్చ్ చేసి రూట్ వారీగా పోలీసు ఫోర్స్ను సిద్ధం చేస్తున్నాం. మొదటి విడతలో చిల్పూరు, స్టేషన్ఘన్పూర్, లింగాలఘణపురం, రఘునాథపల్లి, జఫర్గఢ్, రాయపర్తి, వర్ధన్నపేట మండలాల్లో 168 జీపీల్లో ఎలక్షన్లు జరగనున్నాయి. వీటి పరిధిలో 64 రూట్లు, 171 లొకేషన్లు, 1,536 వార్డుల పరిధిలో 59 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. రెండవ విడతలో బచ్చన్నపేట, జనగామ, నర్మెట, తరిగొప్పుల మండలాల్లో 79 జీపీలు, 710 వార్డులు, 29 రూట్లు, 27 క్రిటికల్, 52 నార్మల్ కేంద్రాలు, మూడవ విడతలో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో 79 పంచాయతీలు, 800 వార్డులు, 40 రూట్లు, 91 జీపీల పరిధిలో 38 క్రిటికల్, 53 నార్మల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించాం. జిల్లా వ్యాప్తంగా 133 రూట్లు, 143 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు వద్దు ప్రజల సహకారంతో ఎన్నికలు శాంతియుతంగా నిర్వహిస్తాం.. ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
జనగామ: జిల్లాలోని జనగామ నియోజకవర్గంలో నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో శనివారం రాత్రి నుంచి జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పల మండలాల్లో ప్రచారం ఊపందుకుంది. బచ్చన్నపేటలో 34 మంది సర్పంచ్, 40 మంది వార్డు అభ్యర్థులు విత్ డ్రా చేసుకోగా, ఒక సర్పంచ్, 35 వార్డుల పరిధిలో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నర్మెట మండలంలో సర్పంచ్లు 61, 270 మంది వార్డు సభ్యులు బరిలో నిలువగా, 52 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనగామ మండలంలో ఇద్దరు సర్పంచ్లు విత్ డ్రా చేసుకోగా, 147, 20 మంది వార్డు సభ్యులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా 698 మంది బరిలో నిలిచారు. పాలకుర్తిలో చెల్లుబాటయ్యే నామినేషన్ల జాబితా విడుదల చేయగా, నేడు(ఆదివారం) అప్పీల్కు అవకాశం ఇవ్వగా, ఈ నెల 8వ తేదీన అప్పీల్ పరిష్కారం, 9న నామినేషన్ల ఉపసంహ రణ, అదే రోజు తుది జాబితాను ప్రకటిస్తారు. పాలకుర్తిలో ప్రచారానికి మరో మూడు రోజులు మిగిలి ఉండగా, స్టేషన్ఘన్పూర్, జనగామ నియోజకవర్గంలో ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. ఊపందుకున్న ప్రచారం.. -
మృతుల్లో ఎవరూ ఎక్కువగా ఉన్నారంటే...
● రోడ్డు ప్రమాదాల్లో 377 మంది మృతిచెందితే అత్యధికంగా 128 మంది బైకర్లు ఉన్నారు. ఇందులో దాదాపు 90 మంది వరకు 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారుంటే, మైనర్లు కూడా 12 మంది ఉన్నారు. మిగిలిన 26 మంది 45ఏళ్లపైబడిన వారు. ● ఆ తర్వాత అత్యధికంగా రోడ్లు, డివైడర్లు క్రాస్ చేస్తూ.. రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న 85 మంది పాదచారులు వివిధ ప్రమాదాల్లో మృతిచెందారు. వీరిలో 26 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలే ఎక్కువ శాతం మంది ఉన్నారు. ● కార్లు, జీపులు, వ్యాన్లు వాహనాల్లోని 42 మంది, లారీల్లోని 32 మంది, సైకిల్స్ నడుపుతున్న పది మంది, ఆటోరిక్షాల్లోని ఏడుగురు, బస్సుల్లోని ఐదుగురు, ఈ–ఆటోరిక్షాలోని నలుగురు మృతి చెందారు. 64 మంది ఇతర వాహనాలకు చెందిన వారున్నారు. -
ఎంబీబీఎస్ విద్యార్థులకు హెచ్పీవీ టీకా
జనగామ: జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో శనివారం గర్భాశయ కేన్సర్ నివారణకు ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమణి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.జితేంద్ర పర్యవేక్షణలో హెచ్పీవీ మొదటి విడత వ్యాక్సినేషన్ వేశారు. 131 మంది ఎంబీబీఎస్ విద్యార్థినులకు హెచ్పీవీ టీకా వేసినట్లు వారు తెలిపారు. గర్భాశయ కేన్సర్ నుంచి మహిళలను రక్షించడంలో కీలకంగా భావించే ఈ టీకాపై విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తూ, ఆరోగ్యరంగంలో ఇలాంటి నిరోధక చర్యలు ఎంతో అవసరమన్నారు. విడతల వారీగా టీకా వేస్తామన్నారు. రెండో విడతలో ఆరుగురు సర్పంచ్లు ఏకగ్రీవంతరిగొప్పుల/బచ్చన్నపేట/నర్మెట/జనగామ రూరల్: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎ న్నికల్లో ఆరు సర్పంచ్లు ఏకగ్రీవమయ్యాయి. తరిగొప్పుల మండలంలో 15 గ్రామపంచాయతీలు ఉండగా మాన్సింగ్తండా, కొత్తతండా పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు ఎంపీడీఓ బోజ నపల్లి లావణ్య తెలిపారు. మాన్సింగ్తండా స ర్పంచ్గా కత్తుల కొమురయ్య, కొత్తతండా సర్పంచ్గా భూక్య సమ్మయ్య (ధనుష్) ఏకగ్రీవమయ్యారు. బచ్చన్నపేట మండలంలోని రామచంద్రాపూర్ సర్పంచ్ బొందుగుల నవీన్కుమార్ ఒకే నామినేషన్ ఉండగా ఏకగ్రీవమయ్యారని ఎన్నికల అధికారులు తెలిపారు. నర్మెట మండలంలోని ఇసుబాయితండా గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. సర్పంచ్గా బానోత్ బాలాజీతోపాటు 8 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవమైనట్లు అధికా రులు తెలిపారు. జనగామ మండలంలోని పెద్దతండా వై సర్పంచ్గా తేజావత్ నర్సింహా, ఎర్రకుంటతండాలో రమావత్ శ్రీకాంత్లు ఏకగ్రీవమయ్యారు. విజిలెన్స్ అధికారుల విచారణపాలకుర్తి టౌన్: మండలంలోని గూడూరు గిరిజన బాలికల గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను వరంగల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు శనివారం పరిశీలించారు. తరగతి గదులు, హాస్టల్, వంట గది, భవన నిర్మాణ డిజైన్కు అనుగుణంగా పనులు జరుగుతున్నాయా అనే దానిపై తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ 2016–17లో భవన నిర్మాణానికి రూ.4.20 కోట్లు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారని, 18నెలల్లో పూర్తి చేయాల్సిన భవన నిర్మాణ పనులు 7 సంవత్సరాలైన పూర్తి చేయలేదన్నారు. అదనంగా మరో రూ.2.50కోట్లను చెల్లించారన్నారు. అయితే భవన నిర్మాణ పనుల్లో నాణ్యత లేకపోవడం తదితర అంశాలను గుర్తించినట్లు తెలిపారు. గురుకుల సొసైటీ భవన నిర్మాణ అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో ప్రాంతీయ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఇన్స్పెక్టర్ రాకేష్, ఏఈఈ రవి, గురుకుల సొసైటీ భవన నిర్మాణ అధికారులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
జనగామ: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాలు, సిద్ధాంతాలు సమాజంలో మరింతగా ప్రాచుర్యం పొందేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వే సి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మా ట్లాడుతూ అంబేడ్కర్ అణగారిన వర్గాలు, అట్ట డుగు స్థాయి ప్రజలు చదువు, ఉద్యోగం, రాజకీయాలు వంటి ప్రతీరంగంలో భాగస్వామ్యం కావాలంటే రిజర్వేషన్లు ఎంత ముఖ్యమో బలంగా చెప్పిన తొలి వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అంబేడ్కర్ ఆలోచనలతోనే దేశాభివృద్ధి: డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి జనగామ: అంబేడ్కర్ ఆలోచనలు, విలువలు దేశాన్ని ముందుకు నడిపే శక్తిగా నిలుస్తున్నాయని డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం పార్టీ పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగం కేవలం ఒక గ్రంథం కాదని, ప్రతీ భారతీయుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, గౌరవం ఇచ్చే జీవన విధానమన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు, మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, పీసీసీ సభ్యుడు డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణనాయక్, ఎర్రమల సుధాకర్, వేమల్ల సత్యనారాయణరెడ్డి, వంగాల కల్యాణి, రాజమౌళి, శ్రీనివాస్రెడ్డి, షరీఫ్, శ్రీనివాస్లు ఉన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
నామినేషన్ కేంద్రాల పరిశీలన
పాలకుర్తి: పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని వావిలాల, మల్లంపల్లి, దర్థేపల్లి, బమ్మెర, పాలకుర్తి నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. మూడో విడతలో నిర్వహిస్తున్న ఎన్నికల్లో గ్రామాల్లో ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, ఎస్ఐ దూలం పవన్కుమార్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి నర్మెట: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ, ఆర్డీఓ కె.గోపీరాం అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంతో పాటు మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెస్సన్ సెంటర్ను ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ కావ్య శ్రీనివాసన్, తహసీల్దార్ మొహసిన్ ముజ్తాబ, ఎంపీఓ వెంకటమల్లికార్జున్, డీటీ కురికాల వేణు, పీఆర్ఏఈ ప్రదీప్, కార్యదర్శి దామెర వంశీ ఉన్నారు. అసంతృప్తులను అక్కునజేర్చుకుని.. దేవరుప్పుల: ఇతర పార్టీల్లోని అసంతృప్తులను బీజేపీ అక్కునజేర్చుకొని పలు గ్రామాల్లో బరిలో నిలుపుతోంది. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా మండలాల్లో కేవలం మూడు, నాలుగు గ్రామాలకు పరిమితమైన బీజేపీ.. తమ పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ లేగ రాంమోహన్రెడ్డి తదితరుల నాయకుల ఆధ్వర్యంలో ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గంలో 72 గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులను బరిలో నిలువగా దేవరుప్పుల మండలంలో 12 సర్పంచ్ నామినేషన్లు వేయించడం గమనార్హం. దేవరుప్పుల మండలంలోని కామారెడ్డిగూడెం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దుర్గరాజు, సీతారాంపురం బీఆర్ఏస్ సీనియర్ నాయకుడు బస్వ రమేశ్లను బీజేపీలో చేర్చుకొని తమ ప్రాబల్యం కోసం వెంటనే సర్పంచ్గా నామినేషన్ వేయించారు. -
వానరాయుధం
అభ్యర్థులు కూడా ఓటర్ల ఆవేదన, డిమాండ్ను అర్థం చేసుకుంటూ హామీలు ఇచ్చేస్తున్నారు. బరిలో ఉన్న కొంతమంది ముందుగానే కోతులను పట్టించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఓట్ల కోసం ఇంటింటికీ వెళ్లే సమయంలో కోతుల నివారణ ఎప్పుడు చేస్తారంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. భయం లేకుండా బయటకు వచ్చేలా చేసినవారే నిజమైన సర్పంచ్ అంటూ మాట్లాడుకుంటున్నారు. అభివృద్ధి ఎంత అవసరమో, కోతుల నివారణ కూడా అంతే కీలకమైపోయింది. ఎన్నికల సమయంలోనే కోతుల నివారణకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఓటర్లు బలంగా నమ్ముతున్నారు. కోతులు బోనుల్లోకి.. ఓట్లు బాక్సుల్లోకి! వానరాల బెడద నివారించిన వారికే ప్రజల మద్దతు గ్రామగ్రామాన ప్రధాన సమస్య ఇదే ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థులకు పెద్ద సవాల్ స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ ఓటర్ల డిమాండ్పీపుల్స్ ఎజెండా కోతుల సమస్యకు ఓటుతో డిమాండ్ -
జోరందుకున్న పల్లెపోరు!
● పాలకుర్తిలో ముగిసిన నామినేషన్ల పర్వం ● రాత్రి వరకు స్వీకరణ ● జనగామలో నేడు ఉపసంహరణ, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపుజనగామ: జిల్లాలోని జనగామ నియోజకవర్గంలో రెండో విడత ఎలక్షన్ నిర్వహణలో భాగంగా ఈనెల 6న(శనివారం) నామినేషన్ల ఉపసంహరణ పూర్తికాగానే సర్పంచ్ ఎన్నికల ప్రచార జోరు మొదలుకానుంది. బచ్చన్నపేట, జనగామ, నర్మెట, తరిగొప్పుల నాలుగు మండలాల్లో అభ్యర్థులు తమ ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. సాయంత్రం అధికారులు గుర్తులు కేటాయించగానే కరపత్రాలు, పాంప్లెంట్లు, డోర్ స్టిక్కర్లు ముద్రించుకుని ఇంటింటా తిరిగే కార్యక్రమాన్ని వేగవంతం చేసుకుంటున్నారు. ఉత్కంఠభరితంగా.. ప్రతిసారి కంటే ఈసారి ప్రచారపోరు మరింత ఉత్కంఠభరితంగా మారనుందనే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామాల్లోని స్థానిక నేతలు, పలుకుబడి ఉన్న పెద్దలు ఏ అభ్యర్థికి మద్దతు ఇస్తారో అన్న అంశంపై చర్చ జరుగుతోంది. పాలకుర్తి మండలంలో శుక్రవారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. కాగా రాత్రి వరకు అధికారులు నామినేషన్లను స్వీకరించారు. రెండు ప్రాంతాల్లో.. స్టేషన్ ఘన్పూర్లో ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది. మొదటి విడతగా ఈ నెల 11వ తేదీన జరగనున్న పోలింగ్కు సంబంధించి గ్రామాల్లో ప్రతీ అభ్యర్థి తమ బలాన్ని మరింత బలపరుచుకుంటున్నారు. జనగామ జిల్లాలో స్టేషన్న్ ఘన్పూర్తో పాటు జనగామ నియోజకవర్గంలో రెండు ప్రధాన ప్రాంతాల్లో ప్రచారం వాడీ వేడీగా సాగనుంది. -
ఎన్నికల విధులు అత్యంత కీలకం
● స్టేజ్–2 ఆర్వోల శిక్షణలో కలెక్టర్ రిజ్వాన్ బాషాజనగామ: పంచాయతీ ఎన్నికల్లో విధుల నిర్వహణ అత్యంత కీలకమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్టేజ్–2 ఆర్వోలకు మాస్టర్ ట్రైనర్లు మెరుగు రామరాజు, నరసింహమూర్తి, సురేందర్రెడ్డి, రాజేందర్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ..ఓటరు లిస్ట్లో పేరు ఉన్నవారు మాత్రమే ఓటు వేసేలా చూడాలన్నారు. బరిలో ఉన్న అభ్యర్థుల రోజువారి ఎన్నికల ఖర్చు వివరాలను తనిఖీ చేసి, ఖర్చు వివరాలు సమర్పించడంలో విఫలమైనట్లయితే, వారికి నోటీసులు జారీ చేయలన్నారు. శిక్షణలో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, జెడ్పీ సీఈఓ మాధురిషా, డీఆర్డీఓ వసంత తదితరులు ఉన్నారు. నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం జనగామ రూరల్: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ చెప్పారు. జనగామ టౌన్ 2 సెక్షన్ పరిధిలోని కలెక్టరేట్ సబ్ స్టేషన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అదనపు 5ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్ఈ ఇంజనీర్ సంపత్రెడ్డి, ఆపరేషన్ డీఈ లక్ష్మీ నారాయణరెడ్డి, డీఈ టెక్నికల్ గణేశ్, ఏడీఈ వేణుగోపాల్, ఏడీఈ టీఆర్ఈ శ్రీధర్, టౌన్ వన్ ఏఈ సౌమ్య, చంద్రమోహన్ పాల్గొన్నారు. అద్భుత శక్తికి ప్రతీక దివ్యాంగులు అద్భుతమైన శక్తికి, సృజనాత్మకతకు ప్రతీక దివ్యాంగులని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కొనియాడారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని జూబ్లీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు..జిల్లా సదరం క్యాంపునకు ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక సదుపాయాలతో రేడియాలజీ హబ్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. మహిళా దివ్యాంగుల సంఘాలు కూడా ఏర్పాటు అయ్యాయన్నారు. ఈసందర్భంగా నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రోత్సాహం, సర్టిఫికెట్ అందజేశారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ సంక్షేమశాఖ అధికారి కోదండరాములు, దివ్యాంగుల సంఘాల నాయకులు పాముకుట్ల చందు పంతులు, ప్రభాకర్, మేకల సమ్మయ్య, బొట్ల సుమతి, మట్టి కిషన్, తాళ్లపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 6 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
నర్సంపేటలో జరిగిన ప్రజా పాలన–ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్రెడ్డి, పక్కన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఎంపీ బలరాంనాయక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి, నాయిని, ప్రకాశ్రెడ్డి, రాంచంద్రునాయక్, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ సారయ్యఅభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డినర్సంపేట సీఎం సభ సక్సెస్.. కార్యకర్తల్లో జోష్ ● భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులుహెలిపాడ్ వద్ద రేవంత్రెడ్డికి ఘనస్వాగతం ● పంచాయతీ ఎన్నికలపై దిశానిర్దేశం ● పోలీసుల భారీ బందోబస్తుసాక్షి, వరంగల్/నర్సంపేట/నర్సంపేట రూరల్ : నర్సంపేటలో కాంగ్రెస్ శ్రేణులు కదంతొక్కాయి. పట్టణంలో శుక్రవారం జరిగిన ప్రజాపాలన–ప్రజావిజయోత్సవ సభ సక్సెస్ కావడంతో కార్యకర్తల్లో జోష్ నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి సీఎం అయిన తర్వాత తొలిసారి నర్సంపేట వచ్చారు. శుక్రవారం సాయంత్రం 3.32గంటలకు చేరుకున్న సీఎంకు ఉమ్మడి జిల్లా నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి ప్రజాపాలన–విజయోత్సవ సభావేదిక వద్దకు భారీ కాన్వాయ్తో బయలుదేరారు. సీఎం రేవంత్రెడ్డి రోడ్డుపొడువునా ప్రజలకు అభివాదం తెలుపుతూ సభాస్థలికి చేరుకున్నారు. ముందుగా సభా వేదిక వద్ద సుమారు రూ.600 కోట్లతో అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రసంగించారు. పంచాయతీ ఎన్నికల్లో యువత, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సభకు నర్సంపేట డివిజన్లోని ఆరుమండలాలనుంచే కాకుండా ఉమ్మడి జిల్లానుంచి పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రజల రాకతో సభాప్రాంగణమంతా జనంతో నిండిపోయింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పింగిలి శ్రీపాల్రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ.రియాజ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్.నాగరాజు, డాక్టర్ మురళీనాయక్, రేవూరి ప్రకాశ్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. సీఎం రేవంత్రెడ్డి హెలికాప్టర్ రాజుపేట గ్రామ శివారులోని హెలిపాడ్ వద్ద దిగింది. హెలికాప్టర్ నుంచి బయటకు వచ్చిన సీఎంకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి అనసూయ( సీతక్క), కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితోపాటు మరి కొందరు ఎమ్మెల్యేలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. శాలువాలతో సన్మానించారు. ఔటర్ రింగ్ రోడ్డు, యూజీడీ తీసుకొస్తున్నాం కొత్త ఏడాది మేడారం జాతరకు మళ్లీ వస్తా నర్సంపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి -
ఆమె సర్పంచ్.. ఆయన వార్డ్మెంబర్
● పంచాయతీ బరిలో దంపతులు రఘునాథపల్లి: మండలంలోని శివాజీనగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భార్యాభర్తలు బరిలో నిలిచారు. 503 మంది ఓటర్లు కలిగిన గ్రామంలో ఈసారి సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు కాగా బీఆర్ఎస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా భార్య మంచోజు శోభారాణి, 8వ వార్డు సభ్యుడిగా భర్త మంచోజు శ్రీనివాస్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి శివరాత్రి సంధ్య, 8వ వార్డు అభ్యర్థి పల్లపు లక్ష్మిలపై వారు పోటీ చేస్తున్నారు. గ్రామంలో ముమ్మరంగా ప్రచారం చేస్తుండడంతో ఎవరు గెలుస్తారా? అనే ఆసక్తి పెరిగింది. వార్డుపోటీలో భార్యాభర్తలు బచ్చన్నపేట: మండలంలోని ఆలింపూర్ గ్రామంలో వార్డు సభ్యుల బరిలో భార్యభర్త పోటీపడుతున్నారు. గ్రామానికి చెందిన పోరెడ్డి రాజేశ్వర్రెడ్డి నాలుగో వార్డులో, భార్య పోరెడ్డి కవిత రెండో వార్డులో వార్డు సభ్యులుగా నామినేషన్ దాఖలు చేశారు. ఇద్దరిలో ఎవరు గెలుస్తారు..ఫలితం ఎలా ఉంటుందో అనే ఆసక్తి గ్రామస్తుల్లో పెరిగింది. -
కొత్తకొత్తగా ఉన్నది!
పాలకుర్తి టౌన్: జిల్లాలో కొత్తగా ఏర్పాటైన రెండు గ్రామ పంచాయతీలు.. పాలకుర్తి మండలంలోని మేకల తండా, దుబ్బతండా(టీ)లో తొలిసారి ఎన్ని కలు జరగనున్నాయి. రెండేళ్ల క్రితం ఏర్పడ్డ జీపీలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి. తమ గ్రా మంలోని వ్యక్తినే సర్పంచ్గా ఎన్నుకునే అవకాశం వారికి ఈసారి దక్కుతుంది. స్వయంపాలన దిశగా అడుగులు వేస్తున్నా గ్రామాల్లో పరిస్థితిపై ప్రత్యేక కథనం. ‘గిరి’జన తండాలు పంచాయతీలుగా.. జిల్లాలో గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుతూ 2018 ఆగస్టు 2న ప్రభుత్వం జీవో జారీ చేయగా 2019లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత పాలకుర్తి మండలంలో మేకలతండా, దుబ్బతండా(టీ) ప్రత్యేక గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో, ప్రభుత్వం రెండేళ్ల క్రితం కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. పాలకుర్తి మండలంలోని మేకలతండా.. కొండాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది. రెండేళ్ల క్రితం కొత్త జీపీగా ఏర్పడింది. అప్పటి నుంచి ఎన్నికలు లేకపోవడంతో స్థానిక పాలన లేదు. ఇప్పుడే తొలిసారి పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. జనాభా 520.. ఓటర్లు 450 మంది ఉన్నారు. సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వేషన్ అయింది. కొత్త గ్రామ పంచాయతీ దుబ్బతండా(టీ) మండలంలోని టీఎస్కే పరిధిలో ఉండేది. ఇక్కడ జనాభా 403కాగా.. ఓటర్లు 313మంది ఉన్నారు. జీపీగా ఏర్పాటైన తర్వాత తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. వందశాతం గిరిజనులు ఉండే ఈ రెండు జీపీల్లో స్వయం పాలన రానుంది.కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ మేకలతండా కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ దుబ్బతండా(టీ) -
నిబంధనల మేరకే ఖర్చు చేయాలి
● జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకురాలు జయశ్రీ స్టేషన్ఘన్పూర్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నిబంధనల మేరకే ఖర్చులు చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకురాలు జయశ్రీ సూచించారు. మండలంలో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు స్థానిక రైతు వేదికలో ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యయాలు, నిబంధఽనలు తదితర అంశాలపై గురువారం అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సర్పంచ్లుగా పోటీ చేసే వారు 5వేల జనాభాకు పైగా ఉంటే రూ.2.50లక్షలు, 5వేల జనాభాకు లోపు ఉంటే రూ.1.50 లక్షలు ఖర్చు చేయవచ్చన్నారు. వార్డు స్థానాలకు రూ.50వేలు, రూ.30వేలు ఖర్చు చేయవచ్చన్నారు. అసిస్టెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు సుకుమార్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ ఆఫీస్ సూపరింటెండెంట్ కృష్ణ, సీఐ జి.వేణు, అభ్యర్థులు పాల్గొన్నారు. లింగాలఘణపురంలో.. లింగాలఘణపురం: మండలంలోని బండ్లగూడెం రైతు వేదికలో మండలంలోని సర్పంచ్లు, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులకు జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకురాలు జయశ్రీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శివశంకర్రెడ్డి, మండల ఎన్నికల అధికారి ప్రసాద్, ఎస్సై శ్రావణ్కుమార్, డీటీ షకీర్, ఎన్నికల ట్రైనర్ కోటి తదితరులు పాల్గొన్నారు. చిల్పూరులో.. చిల్పూరు: పంచాయతీ ఎన్నికల్లో బరిలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యులకు మండల కేంద్రంలో జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకురాలు జయశ్రీ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్కుమార్, ఎస్సై సిరిపురం వినయ్కుమార్, ఎంపీఓ మధుసూదన్ ఉన్నారు. -
వరాలు కురిపిస్తారా..!?
అన్ని ఏర్పాట్లు పూర్తి సాక్షిప్రతినిధి, వరంగల్ : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సుమారు 35 రోజుల తర్వాత మళ్లీ ఓరుగల్లులో పర్యటిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు శుక్రవారం తొలిసారి వస్తున్న ఆయన... ‘ప్రజాపాలన – ప్రజావిజయోత్సవాల’ సందర్భంగా పలు అభివృద్ధి పథకాలకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తున్నా.. తరుణంలో నర్సంపేట సభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన పథకాలు, నిధులపై స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు. గ్రేటర్ వరంగల్తోపాటు ఉమ్మడి వరంగల్పై ఏం వరాలు కురిపిస్తారనే చర్చ జరుగుతోంది. అలాగే ‘మోంథా’ తుపాను నష్టం సందర్భంగా ఇళ్లు కూలిపోయిన వారికి ఒక్కొక్కరికి రూ.15వేలకు చెల్లించిన ప్రభుత్వం.. పంటల నష్టంపై నివేదికలు పంపిన చాలామందికి పరిహారం అందలేదు. వీటిపైన సీఎం ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. డీపీఆర్ స్థాయిలోనే ‘గ్రేటర్’పనులు.. ఉమ్మడి వరంగల్కు కావాలి నిధులు.. ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వరంగల్పై పలు హామీలు కురిపించారు. హైదరాబాద్తో పోటీ పడేలా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. ఈ మేరకు సుమారు దశల వారీగా రూ.6,500 కోట్ల వరకు నిధులు మంజూరు చేశారు. ఇందులో మామునూరు ఎయిర్పోర్టుకు రూ.150 కోట్ల వరకు నిధులు విడుదలై భూసేకరణ జరుగుతోంది. భద్రకాళి చెరువు పూడిక, మాఢ వీధులు నిర్మాణం తదితర పనులు నడుస్తున్నాయి. వరంగల్ నగరంలో సుమారు నాలుగు వేల కోట్ల విలువైన అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ ప్రతిపాదనలు డీపీఆర్ల దశలో ఉన్నాయి. ఔటర్ రింగ్రోడ్డు, ఇన్నర్ రింగ్రోడ్డులతోపాటు పలు అభివృద్ధి పథకాలకు నిధులు మంజూరైనా ఆ పనులు సాగడం లేదు. స్మార్ట్సిటీ పనులకు తోడు రాష్ట్రం వాటా కింద నిధులు మరిన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు రావాల్సి ఉంది. అలాగే ఉమ్మడి వరంగల్లో మేడారం అభివృద్ధి, గిరిజన యూనివర్సిటీలకు మరిన్ని నిధులు అవసరం ఉందని ఇటీవల ప్రజాప్రతినిధులు సీఎంను కోరారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కూడా ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఆ మూడు పథకాలపై స్పష్టత.. కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి ఇటీవల వరంగల్లో పర్యటించారు. కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ), కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, మామునూరు ఎయిర్పోర్ట్ పనులను ఆయన ప్రత్యేకంగా పరిశీలించి సమీక్షించారు. ఈ సందర్భంగా 7 మెగా టెక్స్ టైల్ పార్కుల్లో ఒకటైన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు పనులపై కేంద్రం మొత్తం రూ.200 కోట్లతో చేపట్టగా రూ.1,700 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 12,500 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు విషయంలో 696 ఎకరాల భూమి ఎయిర్ పోర్టు అధికారుల వద్ద ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం సుమారు 243 ఎకరాల భూమి సేకరించి ఎయిర్ పోర్టు అథారిటీకి అందజేస్తే త్వరగా నిర్మాణం ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. కాజీపేటలోని రైల్ మానుఫ్యాక్చరింగ్ యూనిట్ త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోందన్నారు. ఈ మూడు పథకాల విషయంలో పలుమార్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరి గాయి. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యా ఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుందని పార్టీవర్గాల సమాచారం. సాక్షి, వరంగల్/నర్సంపేట/నర్సంపేట రూరల్: నర్సంపేట నియోజకవర్గానికి తొలిసారి వస్తున్న సీఎం రేవంత్రెడ్డి పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ సభకు జనసమీకరణ చేయనున్నారు. ప్రజాపాలన–ప్రజా విజయోత్సవ సభలో భాగ ంగా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి రూ.1,023 కోట్లతో అభివృద్ధి పనులకు సీ ఎం శంకుస్థాపన చేయనున్నారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యేలు, నాయకులు హాజరుకానున్నారు. సభా ఏర్పాట్లను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఆర్డీఓ ఉమారాణి, ఏసీపీ రవీందర్ పరిశీలించారు. హెలిపాడ్, సభా ప్రాంగణాన్ని బాంబ్ స్క్వాడ్ బృందాలు, జాగీలాలు తనిఖీ చేశాయి. సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా.. సీఎం రేవంత్రెడ్డి మధ్యాహ్నం 1.15 గంటలకు హైదరాబాద్ బేగంపేటనుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. 2 గంటలకు నర్సంపేట లోని బంజారాభవన్లో ఏర్పాటుచేసిన హెలి పాడ్లో దిగుతారు. మధ్యాహ్నం 2.15నుంచి 3.55 వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి బహిరంగసభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్కు వెళ్తారు. గత పర్యటనలో రూ.6,500 కోట్లు మంజూరు చేసిన సీఎం.. మందకొడిగా పనులు.. ఇటీవల జిల్లాకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. మామునూరు, కేఎంటీపీ, ఆర్ఎంయూలపై వ్యాఖ్యలు ఈ మూడు ప్రాజెక్టులలో రాష్ట్రం పాత్రపై సీఎం స్పష్టత ఇచ్చే అవకాశం ఉమ్మడి వరంగల్ అభివృద్ధికి మరిన్ని నిధులపై ఆశలుప్రజాపాలన – ప్రజా విజయోత్సవ సభ’లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం సభలో మాట్లాడనున్న ఆయన ఉమ్మడి వరంగల్పై నిధుల జల్లు కురిపిస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. అంతకు ముందు గ్రామ పంచాయతీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీకి చెందిన ముఖ్య నేత ఒకరు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో తాజా పరిస్థితి ఏమిటి? పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏం జరుగుతోంది.. ? అని మాట్లాడనున్నారు. మెజార్టీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలిచేలా రేవంత్రెడ్డి మరోసారి మార్గదర్శనం చేయనున్నారని తెలిసింది. -
తొలి విడత ర్యాండమైజేషన్ పూర్తి
● మండలాలకు బ్యాలెట్ పత్రాలుజనగామ: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో ఈ నెల11వ తేదీన తొలి విడత ఎన్నికలు జరుగనున్న సందర్భంగా పోలింగ్ నిర్వహణ కోసం ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. గురువారం కలెక్టరేట్లో సాధారణ ఎన్నికల అబ్జర్వర్ రవికిరణ్, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పారదర్శకంగా నిర్వహించారు. ర్యాండమైజేషన్ ప్రక్రియలో మొదటి దశలో ఎలక్షన్ నిర్వహించేందుకు పీఓ–1,138, ఓపీఓ–1,552 మందిని ఎంపిక చేశారు. సజావుగా నిర్వహించాలి.. జిల్లాలో మొదటి విడత ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. రఘునాథపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. మండలాలకు బ్యాలెట్ పత్రాలు మొదటి విడతలో జరుగనున్న ఎలక్షన్లకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం లోని ఐదు మండలాల ఎంపీడీఓలకు అప్పగించారు. కలెక్టరేట్ స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన బ్యాలెట్ పేపర్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ అధికారి వసంతతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. నిబంధనల ప్రకారమే నిర్వహించాలి.. జనగామ రూరల్: జిల్లాలో పంచాయతీ ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణికుముదిని సూచించారు. గురువారం కలెక్టర్లతో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా సమీక్షించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం వచ్చిన ప్రతీ దరఖాస్తు పరిశీలించి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి మండలంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలెటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. అబ్జర్వర్ రవికిరణ్ మాట్లాడుతూ..జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు తగ్గట్టుగా జరుగుతున్నాయని చెప్పారు. వీడియో కాన్పరెన్స్ అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. జిల్లాలో 10 సర్పంచ్ స్థానాలు, 228 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా..7 గ్రామ పంచాయతీలలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు మొత్తం ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. -
ఉప యోగం!
● సర్పంచ్ రిజర్వేషన్లలో నిరాశ.. ‘సెకండ్ పవర్’ కోసం ఆశ ● ఉప సర్పంచ్ పదవితో రాజకీయ భవిష్యత్ను నిర్మించుకునే ప్రయత్నం ● ఎన్నికల కంటే ముందే లక్షల రూపాయలతో ఒప్పందాలు..? ● పార్టీలు పక్కన బెట్టి.. రహస్య సమీకరణాలు ● పలుచోట్ల సర్పంచ్ పదవికి మించి పోటీ ● జిల్లాలో సర్పంచ్లు–280.. వార్డులు 2,534జనగామ: సర్పంచ్ రిజర్వేషన్లు ఆశావాహులకు నిరాశ కల్పించగా, ఉప సర్పంచ్ పీఠంపై అందరి కన్ను పడింది. సర్పంచ్గా పోటీ చేసే అవకాశం రాకపోవడంతో జిల్లాలో పలువురు నాయకులు ‘సెకండ్ పవర్ సీటు’ వైపు దష్టి సారించారు. వార్డు రిజర్వేషన్లు అనుకూలంగా రావడంతో, సభ్యుల మద్దతు కోసం లక్షల రూపాయలతో ముందుగానే ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. కొన్నిచోట్ల పార్టీలను పక్కనపెట్టి వ్యక్తిగత బంధాలు, ఆర్థిక హామీలతో వార్డు సభ్యులను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు భారీగా కసరత్తు చేస్తున్నారు. గ్రామస్థాయి పాలనలో ఉప సర్పంచ్ పదవికి ఉన్న చెక్ పవర్, నిర్ణయాధికారం, ప్రభావం కారణ ంగా ఈసారి పోటీ సర్పంచ్ రేసుకు మించినంత తీవ్రంగా కనిపిస్తోంది. ఉప సర్పంచ్ పదవి చేపట్టి రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఆతృతతో అభ్యర్థులు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో రిజర్వేషన్లు ఇలా.. జిల్లాలో మొత్తం 280 గ్రామపంచాయతీలు, 2,534 వార్డులు ఉన్నాయి. ఎస్టీ వార్డులు–300, ఎస్సీ వార్డులు–157, బీసీ వార్డులు – 456, జనరల్ వార్డులు–1,120 వార్డుల పరిధిలో మహిళలు, జనరల్ కలుపుకుని రిజర్వేషన్లు కలిసి రాగా, సర్పంచ్ రిజర్వేషన్లలో జనరల్–123, బీసీ జనరల్–45, ఎస్సీ జనరల్–54, ఎస్టీ జనరల్– 58 రెండు కేటగిరీల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. సర్పంచ్ తర్వాత ‘ఉప’కు ప్రాధాన్యం.. గ్రామస్థాయి పాలనలో సర్పంచ్ తర్వాత అత్యంత ప్రభావవంతమైన పదవి ఉప సర్పంచ్కే దక్కుతుంది. అభివృద్ధి పనుల పరిశీలన, పంచాయతీ నిర్ణయాల్లో చురుకై న పాత్ర కారణంగా ఈ పదవి రాజకీయాల్లో మంచి స్థానం కల్పిస్తోంది. ఈసారి అయితే ఉప సర్పంచ్ పోటీ కూడా సర్పంచ్ రేసును తలదన్నేంత స్థాయిలో మారింది. ఎలాగైనా ఉప సర్పంచ్ పీఠాన్ని కై వసం చేసుకుని గ్రామ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే ఇదే గోల్డెన్ ఛాన్స్గా భావిస్తున్నారు. ఉప సర్పంచ్ పీఠం చుట్టూ నెలకొంటున్న హడావుడి గ్రామ రాజకీయాల్లో హీట్ పెరిగేలా చేస్తోంది. మేజర్ పంచాయతీలు, ఆదాయ వనరులు కలిగిన జీపీలపైనే ఎక్కువగా గురి పెడుతున్నారు. పార్టీ నాయకత్వం..నిఘా వర్గాల ఆరా వార్డు స్థాయిలో వేగంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో వార్డు అభ్యర్థుల కదలికలు, సమావేశాలు, ఆర్థిక హామీలు, అభివృద్ధి వాగ్దానాలకు సంబంధించి పార్టీలకు చెందిన నాయకత్వంతో పాటు నిఘా విభాగాలు కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎవరు ఎవరిని కలుస్తున్నారు, ఏ వార్డులో ఎవరు ప్రభావం చూపుతున్నారు, ఎవరి మీద ఒత్తిడి పెరుగుతోంది అన్న విషయాలను పార్టీలు నిశితంగా గమనిస్తున్నాయి. ఉపసర్పంచ్ పీఠం ద్వారా గ్రామ రాజకీయాల్లో పట్టుకోసం జరుగుతున్న ఈ రహస్య రచ్చ పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గ్రామంలో వార్డుల సంఖ్య ఆధారంగా ఉప సర్పంచ్ కోసం ఉబలాట పడిపోతున్న పలువురు ఆశావహులు వార్డు సభ్యులకు ఎన్నికల ఖర్చులకు సంబంధించి ముందుగానే కొంత సొమ్ము ముట్టజెబుతూ ఒప్పంద పత్రాలు రాయించుకుంటున్నారనే ప్రచారం వినిపిస్తోంది. వార్డు మెంబర్గా విజయం సాధించిన తర్వాత ఉప సర్పంచ్గా ఎన్నుకునే సమయంలో ఓటు తనకే వేయాలన్న హామీ ఇప్పుడే తీసుకుంటున్నారనే చర్చ రాజకీయ వేడిని పెంచుతోంది. పార్టీలను పక్కన పెట్టి మెజార్టీగా వ్యక్తిగతంగా కలిసేవారితోనే అవగాహన కుదుర్చు కోవడం ఈసారి ప్రధాన ధోరణిగా కనిపిస్తోంది. గత ఏడాదిన్నరగా పర్యటనలు, పబ్లిసిటీలతో లక్షల్లో ఖర్చు చేసిన ఆశావాహులు సర్పంచ్ పదవులకు వచ్చిన రిజర్వేషన్లు చాలామందికి అనుకూలించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏళ్ల తరబడి నిరీక్షణపై రిజర్వేషన్లు నీళ్లు చల్లడంతో రాజకీయ భవిష్యత్తును ని లబెట్టుకోవాలంటే ఉప సర్పంచ్ పీఠమే శరణ్యమని భావిస్తూ... ముందస్తు కసరత్తు మొదలుపెట్టారు. -
ఏకగ్రీవ అభ్యర్థులకు నియామక పత్రాలు
స్టేషన్ఘన్పూర్: మండల పరిధిలోని 15 గ్రామ పంచాయతీలకుగాను జిట్టెగూడెంతండా గ్రామ పంచాయతీకి సర్పంచ్తో పాటు వార్డు స్థానాలకు ఒక్కొక్కరే నామినేషన్లు దాఖలు చేయడంతో గ్రామ పంచాయతీ పాలకమండలి ఏకగ్రీవమైంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీల సర్పంచ్లు, వార్డు సభ్యులకు గురువారం నియామకపత్రాలు అందించారు. ఆర్ఓ, ఏఆర్ఓ సమక్షంలో ఉపసర్పంచ్గా నునావత్ రజితను ఎన్నుకున్నారు. సర్పంచ్గా బానోతు బాలుతో పాటు ఎనిమిది వార్డు స్థానాలకు బానోతు మహేందర్, బానోతు స్వర్ణ, వాంకుడోతు రవి, నునావత్ రజిత(ఉపసర్పంచ్), లావుడ్య రోజ, భూక్య రవీందర్, లావుడ్య వెంకులు, లావుడ్య బుచ్చమ్మలకు నియామకపత్రాలు అందించారు. అదేవిధంగా మండలంలో ఏకగ్రీవమైన వార్డులలో చంద్రుతండాలో 7గురు, పాంనూర్లో నలుగురు, అక్కపెల్లిగూడెంలో ముగ్గురు, నమిలిగొండ ఒక్కరు, విశ్వనాధపురంలో ఒక్కరికి వార్డు సభ్యులుగా ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందించారు. కార్యక్రమంలో ఆర్ఓ రాజేంద్రప్రసాద్, ఏఆర్ఓ అనీల్కుమార్, పంచాయతీ కార్యదర్శి ఇల్లందుల సురేందర్ పాల్గొన్నారు. చిల్పూరు: మండలంలో 17 జీపీలుండగా మూడు గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. గురువారం గార్లగడ్డతండాలో మాలోతు నవీన్, దేశాయితండాలో భూక్య వెంకట్, తీగలతండా తీగల సాంబరాజు ఆయా గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం ఉప సర్పంచ్లను ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఎలినేని రామారావు, కార్యదర్శులు రంగారెడ్డి, తిరుమలరెడ్డి, భూక్య విమల తదితరులు పాల్గొన్నారు. రఘునాథపల్లి: మండలంలో ఐదు పంచాయతీల సర్పంచ్లు ఏకగ్రీవం కాగా గురువారం రెండు గ్రామాల ఉప సర్పంచ్ల ఎన్నిక పూర్తయినట్లు ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు తెలిపారు. అయా గ్రామాల్లో ఏకగ్రీవ సర్పంచ్లు వాకిటి అలివేలు, పారునంది సునీత సమక్షంలో వార్డు సభ్యులతో అధికారులు ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించగా రామన్నగూడెం ఉప సర్పంచ్గా ఎంపాల భాస్కర్, అయ్యవారిగూడెం ఉప సర్పంచ్గా పారునంది రాజీబ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. నేడు దివ్యాంగుల దినోత్సవంజనగామ రూరల్: జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జూబ్లీ ఫంక్షన్ హాల్లో వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి కోదండరాములు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులు, దివ్యాంగుల కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాల నాయకులు పాల్గొని వేడుకను విజయవంతం చేయాలని కోరారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఈసందర్భంగా క్రీడల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్నకు దరఖాస్తుల ఆహ్వానంజనగామ రూరల్: ప్రభుత్వం రాజీవ్ విద్యా దీవెన స్కీమ్ కింద ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థులు ప్రీ–మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి బి.విక్రమ్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థి కులం, ఆదాయం, ఆధార్ లింక్, బ్యాంక్ అకౌంట్ ధ్రువీకరణ పత్రాలు జతపరచి సంబంధిత పాఠశాలలో సమర్పించాలన్నారు. డే స్కాలర్కు రూ.3,500లు, వసతి గృహ విద్యార్థులకు రూ.7,000లు సంబంధిత విద్యార్థుల బ్యాంక్ అకౌంట్కు సంవత్సరానికి ఒకసారి చెల్లించడం జరుగుతుందన్నారు. పాఠశాల యూడైస్ కోడ్తో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏమైనా రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో సమస్యలు తలెత్తితే సంబంధిత కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఈ నెల చివరిలోగా పూర్తిగా నింపిన దరఖాస్తులను సంబంధిత జిల్లా కార్యాలయంలో అందజేయాలన్నారు. -
సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక చర్యలు
● డీసీపీ రాజామహేంద్ర నాయక్ దేవరుప్పుల: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని డీసీపీ రాజామహేంద్ర నాయక్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో నామినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఆయన వెంట వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ జానకిరామిరెడ్డి, ఎస్సై ఊర సృజన్కుమార్ ఉన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. కొడకండ్ల: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ సూచించారు. మండలకేంద్రంలోని టీజీఆర్ఎస్జేసీ గురుకులంలో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సులో డీసీపీ మాట్లాడుతూ.. ఆన్లైన్ మోసానికి గురైన వెంటనే 1930 నెంబర్కు ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారం సులభతరం అవుతుందన్నారు. కార్యక్రమంలో ఏసీపీ అంబటి నర్సయ్య, పాలకుర్తి సీఐ జానకిరామ్రెడ్డి, ఎస్సై చింత రాజు, ఫ్రిన్సిపాల్ దిలీప్కుమార్ పాల్గొన్నారు. -
వేచి ఉంటాం.. పాలన చేస్తాం..
స్టేషన్ఘన్పూర్: పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తుండడంతో వారి ప్రాతినిధ్యం పెరిగింది. దీంతో పల్లెల్లో ఎక్కడా చూసినా మహిళలే కనపడుతున్నారు. మండలంలోని ఇప్పగూడెం క్లస్టర్లోని ఇప్పగూడెం, అక్కపెల్లిగూడెం, సముద్రాల గ్రామ పంచాయతీల పరిధిలోని వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా అక్కపెల్లిగూడెం, ఇప్పగూడెం జీపీల వార్డు స్థానాలకు బరిలో ఉన్న వారు పోటీలో ఉన్నట్లుగా ధ్రువీకరణపత్రాలతో పాటు పోలింగ్ ఏజెంట్ల జాబితాను అందించేందుకు ఇప్పగూడెం గ్రామ పంచాయతీ వద్ద గంటల తరబడి వేచి ఉన్నారు. నిలబడే ఓపిక నశించిన వారు కాసేపు జీపీ వద్ద కూర్చోవడంతో సాక్షి కెమెరాకు చిక్కారు. -
ఊపందుకున్న పల్లెసమరం
జనగామ: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరుగనున్న నేపథ్యంలో రాజ కీయ పరిణామాలు ఊపందుకున్నాయి. మొదటి విడత నామినేషన్లు ఉపసంహరించుకుని ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. ఎక్కడ చూసినా అభ్యర్థుల మధ్య అభివృద్ధి నినాదం, ఆధిపత్య పోరాటం స్పష్టంగా కనినిస్తోంది. రెండో విడత ఎలక్షన్లు జరిగే జనగామ నియోజకవర్గంలో బుజ్జగింపుల పర్వం సాగుతోంది. జనగామ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి మూడు దశల్లో ఎలక్షన్లు కొనసాగుతుండటంతో జిల్లాలో రాజకీయ చైతన్యం వెల్లివిరుస్తోంది. ఒక వైపు పల్లెల్లో ప్రచార డప్పులు మోగుతుంటే, మరో వైపు జనగామలో స్క్రూటినీ, విచారణలు అభ్యర్థులను టెన్షన్ పుట్టిస్తోంది. పాలకుర్తిలో నామినేషన్ల కోసం అభ్యర్థుల వరుసకడుతున్నారు. ప్రచారం షురూ... స్టేషన్ ఘన్్పూర్ నియోజకవర్గంలో మంగళవారం సాయంత్రం నుంచి ప్రచారం అధికారికంగా ప్రారంభమైంది. అభ్యర్థులు స్థానికులతో సమావేశాలు నిర్వహిస్తూ, ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు. గ్రామాల్లో ప్రజలు ఎదురుచూస్తున్న అభివృద్ధి అంశాలను ముందుకు తెస్తూ, తమ వాదాన్ని గట్టిగనే వినిపిస్తున్నారు. పల్లెల్లో బ్యానర్లు, ర్యాలీలు ఎన్నికల వాతావరణాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇక్కడ 324 మంది సర్పంచ్, 1,950 మంది వార్డు సభ్యులు బరిలో నిలిచారు. స్టేషన్ఘన్పూర్ సర్పంచ్, వార్డు సభ్యులకు గుర్తులను కేటాయించడంతో క్షణం ఆలస్యం చేయకుండా అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లిపోయారు. జనగామలో స్క్రూటినీ.. ఇదే సమయంలో జనగామ నియోజకవర్గంలో నా మినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ జరుగుతోంది. అభ్యర్థులు ఇచ్చిన నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఎవరి నామినేషన్ ఆమోదం పొందుతుందో, తిరస్కరణకు ఎవరిది గురవుతుందో అన్న ఉత్కంఠ అభ్యర్థుల్లో కనిపిస్తోంది. పాలకుర్తి నియోజకవర్గంలో మూడో విడతగా మంగళవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. సర్పంచ్, వార్డు సభ్యుల పోటీకి సిద్ధమవుతున్న అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు జీపీల వద్ద బారులు దీరారు. దీంతో నామినేషన్ కౌంటర్లు బిజీగా మారాయి. అభ్యర్థులు, పార్టీ పెద్దలు, మద్దతుదారులు అందరూ మూడు చోట్ల మూడు విధాలుగా రంగంలో దిగడంతో గ్రామపంచాయతీ ఎన్నికల వేడి రాబోయే రోజుల్లో మరింత ఉధృతం కానుంది. పాలకుర్తి నియోజకవర్గంలో మొదటి రోజు సర్పంచ్కు 41, వార్డులకు 37 నామినేషన్లు వచ్చాయి. జనగామ నియోజకవర్గంలోని తరిగొప్పులలో 25 సర్పంచ్, 6 వార్డు నామినేషన్లను తిరస్కరించారు. బచ్చన్నపేటలో 5 సర్పంచ్, 36 వార్డుల నామినేషన్లను తిరస్కరించారు. జిల్లాలో సర్పంచ్ ఏకగ్రీవమైన గ్రామాల్లో ఈనెల 4న ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. ఇందుకు సంబంధిత మండలాల ఎంపీడీఓలు ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ప్రచారం షురూ జనగామలో స్క్రూటినీ ప్రక్రియ పాలకుర్తిలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం -
పోస్టల్ బ్యాలెట్ పంపిణీ సక్రమంగా చేయాలి
జనగామ రూరల్: పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలను సర్వీస్ ఓటర్లకు, ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు సరిగ్గా పంపిణీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, నిర్వహణపై బుధవారం అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్తో కలిసి జెడ్పీ సీఈఓ, డీపీఓ, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో, ఎంపీఓలతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, నిర్వహణ తదితర అన్ని ప్రక్రియలకు సంబంధించి మాస్టర్ ట్రైనర్ రామరాజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..మొదటి విడత పోలింగ్ జరిగే మండలాల్లో ఈ నెల 9వ తేదీన ఎంపీడీఓ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కోసం ఫెసిలిటేషన్ కేంద్రానికి అవసరమైన ఏర్పా ట్లు చేయాలన్నారు. మొదటి విడత పోలింగ్ జరిగే మండలాల్లో ఈ నెల 6 న పోలింగ్ అధికారులకు రెండో విడత శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
నియామకపత్రం అందుకున్న ధన్వంతి
జనగామ: డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి బుధవారం గాంధీభవన్లో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్, కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో అధిక స్థానాలు గెలుపొందాలని, ఓట్ చోరీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రభుత్వానికి కార్యకర్తలకు సమన్వయం పరిచేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సూచనలు చేశారన్నారు. పార్టీ అధ్యక్షులకు, పార్టీ ఇన్చార్జ్కు లకావత్ ధన్వంతి కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలిజనగామ రూరల్: దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని సీనియర్ సివిల్ జెడ్జి ఇ.సుచరిత అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఆదేశాల మేరకు బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని భవిత సెంటర్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జెడ్జి జి.శశి, ఎంఈఓ శంకర్రెడ్డి, డాక్టర్ లిఖిత, రవీంద్ర, దయామణి, ఎస్.రాములు, వి.శోభారాణి పాల్గొన్నారు. రఘునాథపల్లి: మండలంలోని 36 గ్రామాలకు 5 గ్రామాలు ఏకగ్రీవంగా కాగా 31 గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. బరిలో నిలిచిన సర్పంచ్, వార్డు అభ్యర్థులకు గుర్తులు కేటాయించినట్లు బుధవారం ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు తెలిపారు. ఎన్నికల గుర్తులు కేటాయించిన గంటలోనే వాట్సాప్ గ్రూపులలో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 4 నామినేషన్లు తిరస్కరణజనగామ రూరల్: మండలంలోని 21 గ్రామపంచాయతీలకు 149 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇందులో వడ్లకొండ నుంచి ఒక నామినేషన్ను తిరస్కరించారు. 198 వార్డు సభ్యులకు 569 మంది నామినేషన్లు దాఖలు చేయగా 3 తిరస్కరించారు. ఇందులో వెంకిర్యాల, గానుగుపహడ్, వడ్లకొండలో ఒక్కోటి చొప్పున ఉన్నాయి. బరిలో 69మంది సర్పంచ్ అభ్యర్థులులింగాలఘణపురం: మండలంలోని 21 పంచాయితీలకు గాను 69 మంది, 196 వార్డులకు గాను 163 మంది పోటీలో ఉన్నారు. గతంలో నాలుగు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా ఈసారి కొత్తపల్లి, రామచంద్రగూడెంలో జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మండలంలో ఒక్క స్థానం కూడా ఏకగ్రీవం కాలేదు. రామచంద్రగూడెంలో 8 వార్డులకు గానూ 4 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక్కడి సర్పంచ్ స్థానం ఏకగ్రీవం కోసం గ్రామస్తులు ముమ్మర ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. వేయిస్తంభాల ఆలయ ఆదాయం రూ.12,04,168హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయంలో బుధవారం ఉదయం హుండీ లెక్కింపు నిర్వహించారు. 50 రోజుల హుండీ ఆదాయం రూ.4,57,768, పూజా టికెట్ల ద్వారా రూ. 7,46,400.. మొత్తం ఆదాయం రూ.12,04,168 వచ్చిందని ఈఓ ధరణికోట అనిల్కుమార్ తెలిపారు. పర్యవేక్షకుడిగా దేవాదాయశాఖ పరిశీలకుడు ప్రసాద్ వ్యవహరించారు. దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకుడు మణికంఠ శర్మ అవధాని, సిబ్బంది మధుకర్, లింగబత్తుల రామకృష్ణ, రజిత, రాజరాజేశ్వర సేవాసమితి మహిళా సభ్యులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
పాలకుర్తి టౌన్: నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు రవికిరణ్ ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆయన సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో స్టేషన్ఘన్పూర్ ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహీహసీల్దార్ సూత్రం సరస్వతి, ఎంపీడీఓ వర్కల వేదవతి, ఎంపీఓ హరినాథ్రెడ్డి, ఎస్సై లింగారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు వెంకటాచారి, చంద్రశేఖర్, పాల్గొన్నారు. ఎన్నికల పరిశీలకుడు రవికిరణ్ -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
స్టేషన్ఘన్పూర్: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా స్టేషన్ఘన్పూర్ మండల పరిధిలో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం బుధవారం సాయంత్రం ముగిసింది. మండల పరిధిలో మొత్తం 15 గ్రామ పంచాయతీలకు గాను 146 వార్డులున్నాయి. అందులో జిట్టెగూడెం తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానంతో పాటు మొత్తం 8 వార్డులకు ఒకే ఒక్క నామినేషన్లు దాఖలు కావడంతో నామినేషన్ల ఘట్టం చివరిరోజునే సర్పంచ్తో పాటు వార్డులన్నీ ఏకగ్రీవమైన విషయం విదితమే. మిగిలిన 14 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ స్థానాలకు మొత్తంగా 91 నామినేషన్లు, వార్డులకు 352 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే బుధవారం సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉండగా సర్పంచ్ స్థానాలకు 43 మంది ఉపసంహరణ చేసుకోగా ప్రస్తుతం 14 జీపీలకు 48 మంది బరిలో ఉన్నారు. అదేవిధంగా వార్డు స్థానాలకు 352 మంది ఉండగా 41 మంది నామినేషన్లు ఉపసంహరణ చేసుకోగా 311 మంది బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు, ఎంపీడీఓ నర్సింగరావు తెలిపారు. 24 వార్డులు ఏకగ్రీవం మండల పరిధిలో మొత్తంగా 146 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 24 వార్డులు ఏకగ్రీవయ్యాయి. అందులో జిట్టెగూడెం తండాలో 8 వార్డులు, చంద్రుతండాలో 7, పాంనూర్లో 4, అక్కపెల్లిగూడెంలో 3, నమిలిగొండ 1, విశ్వనాధపురం 1 వార్డు ఏకగ్రీవమయ్యాయి. -
ఎన్నికల నియమావళిని పాటించాలి
పాలకుర్తి టౌన్: ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను పాటించాలని డీసీపీ రాజహేంద్రనాయక్ సూచించారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ, చెన్నూరులో ఏర్పాటు చేసిన నామినేషన్ ప్రతాల స్వీకరణ కేంద్రాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఆయన వెంట వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ జానకిరామిరెడ్డి, ఎస్సైలు దూలం పవన్కుమార్, మేకల లింగారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు సహకరించాలి దేవరుప్పుల: రాజకీయాలకతీతంగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా కొనసాగేలా అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని డీసీపీ రాజామహేంద్రనాయక్ సూచించారు. మండలంలోని కోలుకొండ, మాధాపురం, ధర్మాపురం క్లస్టర్లో కొనసాగిన సర్పంచ్, వార్డు నామినేషన్ల కేంద్రాలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, పాలకుర్తి సీఐ జానకిరామిరెడ్డి, స్థానిక ఎస్సై ఊర సృజన్కుమార్ ఉన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ -
ఉత్సాహంగా దివ్యాంగుల క్రీడలు
జనగామ రూరల్: మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం పట్టణంలోని ధర్మకంచ, మినీ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడాపోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి కె. కోదండరాములు జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా వివిధ మండలాల నుంచి దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 18ఏళ్లలోపు బాలబాలికలకు అలాగే మహిళలకు, పురుషులకు క్యారమ్, చెస్, జావెలిన్ త్రో, 100 మీటర్ల రన్నింగ్, షార్ట్ పుట్ ఈవెంట్లలో క్రీడా పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో పీడీ మెప్మా హర్షవర్ధన్, డీపీఎం జ్యోతి తెలంగాణ వికలాంగుల వేదిక వ్యవస్థాపకులు మేకల సమ్మయ్య, బొట్ల సుమతి, దివ్యాంగుల జిల్లా కమిటీ సభ్యులు పంతులు ప్రభాకర్, మట్టి కిషన్, తాళ్లపల్లి కుమార్, దామెర రమేశ్, సయ్యద్ మున్నావర్, గడ్డం సోమరాజు, సీనియర్ అసిస్టెంట్ సంపత్ కుమార్, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ చింతకింది రాజు, దివ్యాంగులు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని భవిత కేంద్రంలో విద్యాశాఖ అధ్యంలో సాంస్కృతి క కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ నుంచి సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు. -
ఐదుగురు సర్పంచ్లు ఏకగ్రీవం
రఘునాథపల్లి: మండలంలోని 36 గ్రామ పంచాయతీల పరిధిలోని ఏడు నామినేషన్ కేంద్రాల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా నామినేషన్ వేసిన అభ్యర్థుల ఉపసంహరణ గడువు బుధవారం ముగిసింది. మండలంలో ఐదు గ్రామాల్లో పోటీ లేకుండా ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. పడమటిగూడెం నుంచి బాలశౌరెడ్డి, రామన్నగూడెం – వాకిటి అలివేలు, వెల్ది – సింగిరెడ్డి సునీత, సోమయ్యకుంటతండా – కెతావత్ ఈర్యానాయక్, అయ్యవారిగూడెం –పారునంది సునీతలను సర్పంచ్లుగా అయా క్లస్టర్ గ్రామాల్లో అధికారులు ఏకగ్రీవంగా ప్రకటించి ధ్రువపత్రాలు అందజేశారు. చిల్పూరు: మండలంలో 17 గ్రామ పంచాయతీలుండగా గార్లగడ్డతండా, తీగలతండా, దేశాయితండా పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు ఎంపీడీఓ శంకర్నాయక్ తెలిపారు. తీగలతండాలో సర్పంచ్గా తీగల సాంబరాజు, ఉప సర్పంచ్గా బదావత్ తిరుపతి, వార్డు సభ్యులు లక్ష్మి, మేరి, భూక్య తిరుపతి, రవి, భద్రమ్మ, చంద్రకళ, అజ్మీర తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గార్లగడ్డతండాలో సర్పంచ్ మాలోతు నవీన్, ఉప సర్పంచ్ మాలోతు లింగ, వార్డు సభ్యులు సరిత, లక్ష్మ, రజిత, బుజ్జమ్మ, నాగేందర్, దేశాయితండాలో సర్పంచ్గా భూక్య వెంకట్, ఉప సర్పంచ్గా లాల్, వార్డు సభ్యులు రాజు, బుల్లి, జ్యోతి, కాశినాథ్, సుందర్, లలిత, మోతీలాల్, సుమన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జఫర్గఢ్: మండలంలోని దుర్గ్యా నాయక్తండాలో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి బానోత్ అనూష యాకూబ్నాయక్ ఏకగ్రీవం అయ్యారు. గ్రామం నుంచి సర్పంచ్ స్థానానికి నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయగా ముగ్గురు ఉపసంహరించుకున్నారు. దీంతో సర్పంచ్ అభ్యర్థిగా అనూష యాకూబ్నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదే గ్రామం నుంచి ఆరుగురు వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు.వెంకట్సాంబరాజునవీన్ -
అన్నా..తప్పక రావాలె
పట్టణాల్లో ఉంటున్న ఓటర్లకు అభ్యర్థుల ఫోన్లు జనగామ: గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి నడుస్తోంది. పల్లెల్లో జరుగుతున్న ఎన్నికల సన్నాహాలు పెళ్లి విందు కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అభ్యర్థుల ఇళ్లలో హడావుడితో పాటు బయట కూడా అదే ఉత్సాహం కనిపిస్తోంది. హైదరాబాద్, భీవండి, నిజామాబాద్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో ఉన్న గ్రామ ఓటర్లను తీసుకొచ్చేందుకు ప్రత్యేక ట్రావెల్స్ బస్సులు, కార్లను ముందస్తుగా బుక్ చేస్తున్నారు. పోలింగ్ రోజున సుదూర ప్రాంతాల నుంచి ఓటర్లను తీసుకొచ్చే వాహనాలు ఆలస్యం కాకుండా అవ్వకుండా ముందస్తుగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. అభ్యర్థుల ఇళ్లలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. నాయకులు, కార్యకర్తలు, యువకులు, అభిమానులు, బం ధువులు, గ్రామస్థులు ఎవరికి వారే పనుల్లో బిజీగా గడిపేస్తున్నారు. తమ ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారనే సమాచార జాబితాను తయారు చేసి, వారిని తమ వైపు తిప్పుకునేందుకు రూట్ల వారీగా ఒక్కో నాయకునికి బాధ్యతలను అప్పగిస్తున్నారు. ‘అన్నా హైదరాబాద్లో ఉన్న మనోడు వచ్చాడా.. భీవండి నుంచి బయలు దేరారా..’ అనే చర్చలు రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెళ్లి ఆహ్వాన పత్రాలు పంపినట్లుగా వాట్సాప్ గ్రూపుల్లో ఓటర్లకు తమ అభ్యర్థి తరపున సందేశాలు పంపిస్తున్నారు. ‘అన్నా పోలింగ్ రోజు తప్పకుండా గ్రామానికి రావాలి.. మీ అమూల్యమైన ఓటు వేయాలి..’అంటూ మెసేజ్లు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అభ్యర్థులు ముహూర్తాలు చేసుకుని పట్నం బయలు దేరి ఊరి ఓటర్లు ఉన్న కాలనీలకు వెళ్లి సమావేశాలతో వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ‘గ్రామం అభివృద్ధి కోసం ఓటు వేసి...అన్నను గెలిపించే బాధ్యత మీపైనే ఉంది..’ అంటూ ఆ బాధ్యతను వారిపైనే వదిలేస్తున్నారు. ఊరి ఓటర్లతో పాటు గెలుపులో పట్నం ఓటర్లు కింగ్ మేకర్లుగా మారనున్నారు. ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు.. ఎక్కడ ఉంటున్నారు.. ఎప్పుడు వస్తారు.. ఎలాంటి వాహనాలు ఏర్పాటు చేయాలి, ఖర్చు ఎంత అనే బిజీలో అభ్యర్థుల అనుచరులు నిమగ్నమయ్యారు. మరికొంత మంది అభ్యర్థులు తమ ఓటర్లకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మద్దతు కోరుతున్నారు. వలసల పెరుగు దలతో ఇప్పుడు గ్రామ రాజకీయాల్లో పట్నం ఓటర్ల ప్రభావం పెరిగింది. అందుకే అభ్యర్థులందరూ వారిపైనే గంపెడాశలు పెట్టుకుంటున్నారు. గ్రామాల్లో ఓటర్లను ఆకర్షించే విధంగా విందు రాజకీయాలకు తెర లేపుతుండగా, పట్నంలో ఉన్న వలస పక్షులను సైతం తమవైపు తిప్పుకునేందుకు బరిలో ఉన్న ప్రతి అభ్యర్థి ఆయా ప్రాంతాల్లో రోజువారీ వంటకాలు, విందులకు ప్లాన్ చేసుకుంటున్నారు. పట్నం ఓటర్లు ఏఏ ప్రాంతాల్లో ఉన్నారనే లెక్కల మేరకు ఒక్కో ఏరియాకు ఇన్చార్జ్లను నియమించి పోలింగ్ తేదీ వరకు అక్కడే ఉండే విధంగా ప్లాన్ చేశారు. ఇన్చార్జ్లు ప్రతి రోజు వలస ఓటర్లను కలవడం, పనులు ముగించుకుని ఇంటికి రాగా దావత్లతో ఖుషీ చేయడం వంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండాలి. ఈ తతంగమంతా గురువారం నుంచి మొదలు కానుంది. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలను తలదన్నే రీతిలో సర్పంచ్ ఎలక్షన్లలో డబ్బుల ప్రవాహం ఏరులై పారుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో మినీ దావత్లు నడుస్తుండగా... ఒకటి, రెండు రోజుల్లో సుక్కా, ముక్కలతో విందులు షురూ కానున్నాయి. ఒక్క ఓటే ఫలితాన్ని తారుమారుచేయగల పరిస్థితుల్లో ప్రతి అభ్యర్థి వలస ఓటర్లను రప్పించుకోవడానికి చేసే హడావుడి అంతా ఇంతా కాదు. గతంలో చివరి క్షణంలో ఒక్క ఓటే పదలు సంఖ్యలో అభ్యర్థుల ఆశలను తలకిందులు చేసిన సంగతి మనం చూసిందే. ఆ అనుభవాలను గుర్తుకు చేసుకుంటూ ప్రస్తుతం బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరికి వారే ఒక్క ఓటు కూడా చేజారిపోకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. హైదరాబాద్, భీవండి.. తదితర పట్టణాలకు ట్రావెల్స్ బస్సులు ప్రతీ ఓటు కీలకం కావడంతో దూరప్రాంత ఓటర్లపై నజర్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి సోషల్ మీడియా వాడకం -
రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్కు శివునిపల్లి విద్యార్థి
స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి జెడ్పీఎస్ఎస్కు చెందిన విద్యార్థి ఆజ్మీరా జగన్ రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్ఎం కె.రమేశ్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్కు ఎంపికై న విద్యార్థిని మంగళవారం హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన సైన్స్ఫెయిర్లో సైన్స్ గైడ్ టీచర్లు ఎం.యాదగిరి, టి.శ్రీనాధ్ పర్యవేక్షణలో విద్యార్ధి ఆజ్మీరా జగన్ ఆటోమేటిక్ కారు పార్కింగ్ ఎగ్జిబిట్తో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ హెచ్ఎం కె.ప్రవీన్కుమార్, ఉపాధ్యాయులు శ్రీనికాంత్, లక్ష్మీప్రసాద్, వసంతకుమారి, కృష్ణవేణి, ఫకీర్దాస్, రవి తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా
బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 2025పంచాయతీ 12మండలాలుజిల్లాలో జీపీలుప్రశాంత గ్రామాలు103సమస్మాత్మక గ్రామాలుజనగామ: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం విస్త్రత భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. వరంగల్–హైదరాబాద్ ప్రధాన హైవేలోని బచ్చన్నపేట(పోలీసు శాఖ), పెంబర్తి జంక్షన్(ఎలక్షన్ కమిషన్) ఆదేశాల మేరకు రెండు ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలను కట్టుదిట్టం చేశారు. జిల్లాలో మొత్తం 280 గ్రామపంచాయతీలుండగా, వీటిలో 177 గ్రామాలు సాధారణంగా పరిగణలోకి తీసుకుంటుండగా, 103 గ్రామాలను సమస్యాత్మక జీపీలుగా గుర్తించారు. ఈ గ్రామాల్లో ఎలాంటి అవాం ఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బలగాలు, రిజర్వ్ ఫోర్సు బలగాలు, నిఘా టీంలు నిత్యం నిఘా వేస్తున్నాయి. చెక్పోస్టులు, వెబ్కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లు పర్యవేక్షణ ఎన్నికల పారదర్శకతను కాపాడడంలో భాగంగా వెబ్కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లు, స్వతంత్ర అబ్జర్వర్ల పర్యవేక్షణ అమలు కాబోతోంది. గ్రామాల్లో అల్లర్లకు తావివ్వకుండా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామపెద్దలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలను కూడా ఈ కార్యక్రమాలలో భాగస్వాములను చేస్తున్నారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. సున్నితమైన గ్రామాల్లో పోలీసు పహారా, రాత్రి పెట్రోలింగ్ తనిఖీలను మరింత బలోపేతం చేశా రు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో లైసెన్సు కలిగిన వ్యక్తుల వద్ద ఉన్న తుపాకులను ముందస్తు చర్యగా స్వాధీనం చేసుకున్నారు. అలాగే పాత క్రిమినల్ కేసులు ఉన్నవారు, గుడుంబా తయారీ, రవాణాలో నిమగ్నమైన వారు, బెల్ట్షాపుల నిర్వాహకులు, కాంప్లికేటెడ్ హిస్టరీ రౌడీషీటర్లు వంటి 120 మందిని తహసీల్దార్ సమక్షంలో బైండోవర్ చేశారు. ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలు, యంత్రాంగానికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా నడుచుకోవాలని పోలీసు శాఖ వారికి కఠిన హెచ్చరికలు జారీ చేసింది. మూడు విడతల్లో.. జిల్లా వ్యాప్తంగా స్టేషన్ఘన్పూర్, జనగామ, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రతీ విడతకు ప్రత్యేక భద్రతా బలగాల కేటాయింపు, సెక్టార్ మొబైల్ పార్టీలు, రూట్ మ్యాపులు సిద్ధం చేశారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ నాయకత్వంలో, డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణలో అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్థాయి అధికారులు, పోలీసు, జిల్లా ఉన్నతాధికారులు, కలిసి ఎన్నికల రోజు నాటికి ఏ చిన్న ఉద్రిక్తత రాకుండా ముందస్తుగానే శాంతిభద్రతలపై దృష్టి పెడుతున్నారు. జిల్లా అధికారుల సమన్వయంతో చేపట్టిన చర్యలన్నీ గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పి, ప్రజాస్వామ్య ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలనే లక్ష్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. బచ్చన్నపేట, పెంబర్తి చెక్పోస్టుల పరిధిలో రాత్రింబవళ్లు పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తూ, అనుమానాస్పద రవాణాపై కఠిన పర్యవేక్షణ అమలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అక్రమ చలామణి, డబ్బు, మద్యం తరలింపు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టారు. జిల్లా స్థాయి మానిటరింగ్ టీం వ్యవస్థల ద్వారా పోలింగ్ కేంద్రాలన్నింటినీ సరైన సమయంలో అధికారులు పరిశీలించనున్నారు. ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే స్పందించే విధంగా యంత్రాంగం సిద్ధంగా ఉండనుంది. ప్రతీ విడత పోలింగ్కు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. సెక్టార్ అధికారులకు బాధ్యతలు అ ప్పగించగా, పోలింగ్ కేంద్రాల వారీగా రూట్ మ్యాపులు సిద్ధం చేశారు. గుర్తించిన సున్నిత కేంద్రాల్లో అదనపు భద్రతా సిబ్బందిని కేటాయించారు. పర్యవేక్షణ చేస్తున్నాం.. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీసు యంత్రాంగం అలెర్టుగా ఉంది. ప్రతీ రోజు నామినేషన్ల ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాం. ఎన్నికల రోజున ఏ చిన్న ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మొత్తం యంత్రాంగం ఎప్పటికప్పుడు ఫీల్డ్లో ఉండేలా ఏర్పాట్లు చేశాం. 103 సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించగా, 120 మందిని బైండోవర్ చేశాం. అలాగే లైసెన్స్ కలిగిన గన్స్ను డిపాజిట్ చేసుకున్నాం. – రాజమహేంద్ర నాయక్, డీసీపీ, వెస్ట్జోన్ ఎన్నికల వేళ పోలీస్ శాఖ అప్రమత్తం చెక్పోస్టులు, వెబ్కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లు పర్యవేక్షణ 103 గ్రామాల్లో ప్రత్యేక నిఘా 120 మంది బైండోవర్... గన్స్ డిపాజిట్ మూడు విడతల్లో ఎలక్షన్లు.. యంత్రాంగం సర్వం సిద్ధం120 -
మంత్రుల ఆదేశాలు అమలయ్యేనా..?
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ గద్దెల వరుస క్రమంలో గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను పునర్నిర్మిస్తున్నారు. నూతన గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ఈనెల 4వ తేదీ(గురువారం)న పూజారులు ధ్వజస్తంభాల పునఃప్రతిష్ఠ పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. గత నెల 28న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్కలు గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులను పరిశీలించి రెండు గద్దెలపై రాతి పిలర్ల ఏర్పాటు పనులన్నీ ఈనెల 3 వతేదీ కల్లా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కానీ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై స్టోన్స్ ఏర్పాట్ల పనులు ఇంకా పూర్తి కాలేదు. మంత్రుల ఆదేశాల మేరకు బుధవారం నాటికల్లా పూర్తయ్యేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మిగిలింది ఒకరోజే.. గోవిందరాజు, పగిడిద్దరాజులను పునర్నిర్మిస్తున్న గద్దెలపై పునఃప్రతిష్ఠ పూజా కార్యక్రమాలకు ఒక రోజు మాత్రమే మిగిలింది. రెండు గద్దెల చుట్టూ రెండు వరుసల స్టోన్స్ ఏర్పాటు చేశారు. ఆదివాసీ సంస్కృతీసంప్రదాయాలతో లిఖించిన రాతి పిల్లర్ను మంగళవారం పగిడిద్దరాజు గద్దైపె ఏర్పాటు చేయడం కనిపించింది. రెండు గద్దెల చుట్టూ రాతి పిలర్ల ఏర్పాటుతోపాటు డిజైన్కు సంబంధించిన స్టోన్స్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పనులన్నీ బుధవారం ఒక రోజులోనే పూర్తి చేస్తారా అన్న అనుమానాలు పూజారులు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పరిశీలించినా పనులు అంతంతే.. ప్రతిరోజూ జిల్లాస్థాయి ఉన్నతాధికారి మేడారం జాతర అభివృద్ధి పనులను పరిశీలిస్తూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నా పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పనుల పురోగతి విషయంలో కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారుల పనితీరులో మార్పు రావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునర్నిర్మాణం పనులు పూర్తి కాకపోవడంపై ఆర్అండ్బీశాఖ అధికారులు హైరానా పడుతున్నారు. బుధవారంకల్లా రాతి పిలర్ల పనులు పూర్తి కాకపోతే మంత్రులనుంచి ఎలాంటి మాట వస్తుందోనన్న టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. రేపే గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ధ్వజస్తంభాల పునఃప్రతిష్ఠ ముహూర్తం ఖరారు చేసిన పూజారులు మిగిలింది ఒక రోజే.. గద్దెల పనులు పూర్తయ్యేది అనుమానమే -
బుజ్జగింపులు..బేరసారాలు
● ‘నాకు సర్పంచ్, నీకు ఎంపీటీసీ..’ అంటూ మంతనాలు ● నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణలుస్టేషన్ఘన్పూర్: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండల పరిధిలో ఇప్పటికే నామినేషన్లు, అప్పీళ్ల ఘట్టం ముగియగా నామినేషన్ల ఉపసంహరణకు బుధవారంతో గడువు ముగియనుంది. దాంతో గ్రామాల్లో రెబల్స్గా వేసిన అభ్యర్థుల బుజ్జగింపు పర్వాలు ఊపందుకున్నాయి. మండలంలో 15 గ్రామ పంచాయతీలు ఉండగా జిట్టెగూడెం తండా జీపీ ఏకగ్రీవం కాగా మిగిలిన 14 గ్రామాలకు ఎన్నికలు జరుగన్నాయి. మొత్తంగా సర్పంచ్ స్థానాలకు 91 మంది, వార్డు స్థానాలకు 352 మంది బరిలో ఉన్నారు. దాదాపు అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల ఖరారు అయినప్పటికీ పలు గ్రామాల్లో అదేపార్టీ నుంచి రెబల్స్గా ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు వేశారు. దాంతో ఆయా గ్రామాల్లో గ్రామ కాంగ్రెస్ కమిటీలు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి రహస్య సమావేశాలు నిర్వహిస్తూ బుజ్జగింపులు చేస్తున్నారు. పార్టీ నుంచి ఒక్కరే బరిలో ఉండాలని, మాట విని ఉపసంహరణ చేసుకున్న వారికి రానున్న రోజుల్లో సముచితస్థానం కల్పిస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో ఇద్దరు పోటీకి ఉన్న చోట ‘నాకు సర్పంచ్ అవకాశం ఇవ్వు.. నీకు ఎంపీటీసీగా సహకరిస్తా..’ అంటూ రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటూ బేరసారాలు చేస్తున్నారు. కాగా ఇప్పటికే పలు గ్రామాల్లో కాంగ్రెస్ రెబల్స్ అంశం ఎమ్మెల్యే కడియం శ్రీహరి వద్దకు చేరింది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గ్రామ, మండల కమిటీలు పనిచేస్తున్నాయి. పార్టీ బలపర్చిన అభ్యర్థికి సహకరించాలని కోరుతూ రెబల్స్ను పోటీ నుంచి తప్పించేలా పార్టీ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా బుధవారం సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియనుండగా ఏ గ్రామంలో ఎందరు బరిలో ఉంటున్నారు, ఏగుర్తులు వచ్చాయి అనేది తేలనుంది. -
వేసవిలో లోడ్కు సరిపడేలా చర్యలు
● ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి జనగామ రూరల్: రాబోయే వేసవిలో లోడ్కు సరిపడేలా 100 నుంచి 160 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం పెంపు చేసే విధంగా సత్వర చర్యలు తీసుకుంటున్నామని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని వడ్లకొండ 220, 132 కేవీ సబ్స్టేషన్ను ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సందర్శించారు. ఈందర్భంగా విద్యుత్ అధికారులతో ఆయన మాట్లాడుతూ.. కొత్తగా అవసరమైన ఫీడర్ల కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. నూతనంగా నిర్మించే ఎస్ఈ కార్యాలయాన్ని కూడా పరిశీలించి పలు సూచనలు చేశారు. అధునాతనంగా తీర్చిదిద్దాలని, పచ్చదనం ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం 33/11 కేవీ పెంబర్తి గేట్వే సబ్ స్టేషన్న్ను సందర్శించారు. కార్యక్రమంలో జనగామ ఎస్ఈ సీహెచ్.సంపత్ రెడ్డి, డీఈలు లక్ష్మినారాయణ రెడ్డి, గణేష్, విజయ్కుమార్ , సారయ్య, ఏడీఈ స్వామి రెడ్డి, ఈఈ సివిల్ వెంకటేశ్వర్లు , ఎస్ఏ సుదర్శన్ పాల్గొన్నారు. -
అర్ధరాత్రి వరకూ నామినేషన్ల స్వీకరణ
● నేటినుంచి మూడో విడత నామినేషన్లు ● మూడు మండలాల్లో పూర్తయిన ఏర్పాట్లు ● ‘స్టేషన్’లో మొదలు కానున్న సమరంజనగామ: జనగామ నియోజకవర్గంలో రెండో విడత నామినేషన్ల స్వీకరణ మంగళవారంతో ముగియగా... బుధవారం నుంచి పాలకుర్తి నియోజకవర్గంలోని మూడు మండలాల పరిధిలో మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈనెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి మండలాల పరిధిలోని 25 క్లస్టర్ల పరిధిలోని 91 గ్రామపంచాయతీలు, 800 వార్డుల పరిధిలో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 5 గంటలకు కేంద్రాల గేట్లను మూసివేస్తారు. ఆ సమయంలో నామినేషన్ కేంద్రంలో ఉన్న అభ్యర్థుల నుంచి మాత్రమే నామినేషన్లు స్వీకరించాలని కలెక్టర్ సూచించారు. నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల సంఘం జారీ చేసిన నియమాలకు లోబడి వ్యవహరించాలని, స్వీకరణ, పరిశీలన, అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ముగిసిన రెండో విడత నామినేషన్లు జనగామ నియోజకవర్గంలో నామినేషన్ల జోరు కొనసాగింది. చివరి రోజు అర్ధరాత్రి 2 గంటల వరకు రాజకీయ పార్టీలు, స్వతంత్రుల నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరించారు. బుధవారం నామినేషన్లను పరిశీలించనుండ గా, అదే రోజు చెల్లుబాటు అయ్యే నామినేషన్ల జాబితా ప్రకటిస్తారు. 4వ తేదీ వరకు అప్పీళ్లకు అవకాశం కల్పించగా, 5వ తేదీన వాటిని పరిష్కరిస్తారు. 6వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, ఆ తర్వాత తుది అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు. స్టేషన్ ఘన్పూర్లో ఉపసంహరణ మొదటి విడత ఎలక్షన్లు జరిగే స్టేషన్ ఘన్పూర్లో నామినేషన్ల అప్పీళ్ల పరిష్కారం ముగియగా, బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఇవ్వగా, వెంటనే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించి, గుర్తులను కేటాయిస్తారు. దీంతో పంచాయతీ సమరం మొదలుకానుంది. 11వ తేదీన మొదటి విడుత పోలింగ్ జరుగనుంది. -
నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరగాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ రూరల్: ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకుగానూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. మంగళవారం జనగామ మండలం వడ్లకొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న రెండో విడత నామినేషన్ ప్రక్రియను అలాగే హెల్త్ డెస్క్లో అధికారుల పనితీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధులను నిర్వహిస్తున్న అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ పత్రాల పరిశీలన పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బి.మహేశ్, ఎంపీఓ సంపత్కుమార్, తహసీల్దార్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ శ్రేయస్సు, స్థితిస్థాపక కార్యక్రమానికి జిల్లా ఎంపిక వలసలను నిరోధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామీణ శ్రేయస్సు స్థితిస్థాపకత కార్యక్రమానికి జిల్లా ఎంపికై ందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం తెలిపారు. రూరల్ డెవలప్మెంట్ జాయింట్ సెక్రటరీకి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్థితిగతులను వివరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచి మహిళలను, యువతను, రైతులను మరింత సంపన్నులుగా, స్థితిస్థాపకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్లో ప్రకటించిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎంపిక అయిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. సిబ్బంది సహాయం తీసుకోండి.. నర్మెట: నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో అదనపు సిబ్బంది సహాయంతో సకాలంలో స్వీకరణ కార్యక్రమం ముగించాలని కలెక్టర్ రిజ్వాన్ షేక్ బాషా అన్నారు. మండల కేంద్రంతో పాటు మచ్చుపహాడ్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఎంపీడీఓ కావ్య శ్రీనివాసన్, తహసీల్దార్ మొహసిన్, డీపీఆర్ఓ బండి పల్లవి, నర్మెట సీఐ ముసుకు అబ్బయ్య, రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్, ఎస్సై నైనాల నగేష్, ఏఎస్సై వెంకట్రెడ్డి, ఎంపీఓ వెంకట్ మల్లికార్జున్ ఉన్నారు. నామినేషన్ ప్రక్రియ పరిశీలన.. తరిగొప్పుల: మండలంలోని పోతారం గ్రామంలో కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. ఎంపీడీఓ బోజనపల్లి లావణ్య, తహసీల్దార్ మొగుళ్ల మహిపాల్రెడ్డి, ఎంపీఓ కృష్ణకుమారి పాల్గొన్నారు. -
హిందూ ధర్మ పరిరక్షకులుగా నిలవాలి
జనగామ: భగవద్గీతను పాఠ్యపుస్తకాల్లో చేర్చడంతో పాటు విద్యాశాఖలో ప్రత్యేక సంస్కృత విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆధ్యాత్మిక వేత్త, విశ్వహిందూ పరిషత్ నిర్వాహకులు డాక్టర్ మోహనకృష్ణ భార్గవ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సోమవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం గ్రేయిన్ మార్కెట్ ఆవరణలోని లక్ష్మీనారాయణ దేవాలయంలో భగవత్ గీతా జయంతి, శౌర్య దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో భగవద్గీత పఠనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత హిందూ ధర్మ పరిరక్షకులుగా నిలవాలని, భగవద్గీత సకల వేదసారమన్నారు. భగవద్గీత ప్రతీ ఇంటిలో ఉండాలని, అలంకార ప్రాయం కాకుండా చదివి జీవితాన్ని సన్మార్గంలో నడవాలి సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి చిలువేరు హర్షవర్ధన్, కుందారపు బైరునాథ్, శివరామ్, సనత్, ఆలయ కమిటీ సభ్యులు మాడిశెట్టి రవి, వెంకన్న, కై లాసం, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు. -
రెండో రోజు అదే జోరు
జనగామ: జనగామ నియోజకవర్గంలోని జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల పరిధిలోని 79 గ్రామ పంచాయతీలు, 710 వార్డుల పరిధిలో సోమవారం రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. నేటి (మంగళవారం)తో నామినేషన్ల స్వీకరణ ముగియనుంది. నాలుగు మండలాల పరిధిలో 19 క్లస్టర్లను ఏర్పాటు చేసి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. రెండవ రోజు సర్పంచ్ అభ్యర్థులకు 157, వార్డు సభ్యులకు 396 నామినేషన్లు రాగా, రెండు రోజులకు కలుపుకుని సర్పంచ్ కోసం 214, వార్డులకు 464 వచ్చాయి. ఆయా మండలాల పరిధిలో నామినేషన్ సెంటర్లను కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ రవి కిరణ్, డీసీపీ రాజమహేంద్రనాయక్ సందర్శించారు. ఇదిలా ఉండగా మొదటి విడతకు సంబంధించి స్టేషన్ఘన్పూర్ మండలం నమిలిగొండ 6వ వార్డుపై ఒక అప్పీల్ కాగా, అధికారులు పరిశీలన చేస్తున్నారు. రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్ అధికార పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిపై అప్పీల్కు వెళ్లారు. రేపటి నుంచి మూడో విడత నామినేషన్లు షురూ.. ఈ నెల 3వ తేదీ (బుధవారం) నుంచి పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో మూడో విడత పంచాయతీ ఎలక్షన్ల నామినేషన్లు షురూ కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. నియోజకవర్గ పరిధిలో 91 జీపీలు, 800 వార్డుల పరిధిలో నామినేషన్ల స్వీరకరణకు 25 క్లస్టర్లను అధికారులు ఏర్పాటు చేశారు.జనగామ నియోజకవర్గంలో రెండవ రోజు నామినేషన్లు అర్ధరాత్రి వరకు కొనసాగిన రెండో విడత నామినేషన్ల పర్వం రెండు రోజుల్లో సర్పంచ్ 214, వార్డులకు 464 నామినేషన్లు నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ రేపటి నుంచి పాలకుర్తి నియోజకవర్గంలో ప్రారంభం మండలం జీపీ సర్పంచ్ మొత్తం వార్డులు నామినేషన్లు మొత్తం జనగామ 21 39 51 198 106 119 నర్మెట 17 37 40 148 49 51 తరిగొప్పుల 15 32 40 126 86 104 బచ్చన్నపేట 26 49 83 238 155 190 మొత్తం 79 157 214 710 396 464 -
భగవద్గీతను అందరూ చదవాలి
హన్మకొండ కల్చరల్: శ్రీకృష్ణభగవానుడు ఉపదేశించిన భగవద్గీత అందరు చదవాలని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మప్రచార పరిషత్ వరంగల్ అధ్వర్యంలో సోమవారం హనుమకొండలోని టీటీడీ కల్యాణమండపంలో గీతాజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రోగ్రాం ఇన్చార్జ్ రామిరెడ్డి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గంగు ఉపేంద్రశర్మ, అతిథులుగా ఆర్యవైశ్య సంఘం నాయకులు గట్టు మహేశ్బాబు, వికాస తరంగిణి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బచ్చు రాధాకృష్ణ హాజరై జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు భగవద్గీత శ్లోకాల కంఠస్థపోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. న్యాయనిర్ణేతలుగా తెన్నేటి వసుంధర, వలస పైడి, మచ్చమ్మ, దయాకర్స్వామి, వేదాంతం శ్రీదేవి, దుర్గ వ్యవహరించారు. కార్యక్రమంలో టీటీడీ మండపం ఇన్చార్జ్ రఘువీర్, వికాస తరంగిణి ఉపాధ్యక్షులు దయాకర్రెడ్డి, కామిశెట్టి రాజు, బన్న శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
మహాజాతర మరో 56 రోజులే!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు వేళవుతోంది. రెండేళ్లకోసారి ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు కోటి మందికిపైగా భక్తులు తరలివస్తారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కుంభమేళాను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తలపెట్టింది. ఇందుకోసం సుమారు రూ.150 కోట్లు కేటాయించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా సెప్టెంబర్ 23న మేడారంలో సందర్శించి వివరాలు వెల్లడించారు. వంద రోజుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అయితే.. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పనులు వేగంగా జరగట్లేదు. ఈనెల నుంచే భక్తజనం.. 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే మహాజాతరకు మరో 56 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈనెల రెండో వారం నుంచే భక్తుల తాకిడి పెరుగుతుంది. ప్రతీ జాతరకు కనీసం నా లుగైదు నెలల ముందు నుంచి నిర్వహణ ఏర్పాట్లు, అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. ఈసారి జాతర కోసం ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు రూ.51.30 కోట్లు, రహదారులు, భవనాల శాఖకు రూ.9.95 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.5.90 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ.8.57 కోట్లు.. ఇలా సుమారు 21 శాఖల ద్వారా మొత్తం రూ.150 కోట్ల నిధులతో పనులు చేపట్టారు. వంద రోజుల్లోనే పనులు పూర్తి చేయాలని సీఎం ఉన్నతాధికారులకు పదే పదే సూచించారు. ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వారంలో రెండు రోజులు ఈ పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇప్పటికీ మేడారంలో మూడు పర్యాయాలు, హైదరాబాద్లో రెండుసార్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.. జిల్లా మంత్రులు, అధికారులతో సమీక్షించారు. ప్రధానంగా రహదారుల విస్తరణ, సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం, క్యూలైన్లతో సహా పలు ముఖ్యమైన పనులు మాత్రం ఇంకా ముగింపు దశకు చేరుకోలేదు. పనుల వేగవంతానికి ఆదేశం.. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్కుమార్, తన సలహాదారు వేం నరేందర్రెడ్డితో పాటు ఉన్నతాధికారులతో ఆయన జాతర పనులు, ఏర్పాట్లపై ఆరా తీశారు. కొన్ని ప్రధాన పనుల ఆలస్యంపై అధికారులపై సీరియస్ అయినట్లు తెలిసింది. కాగా, మేడారంలో పురోగతిలో ఉన్న పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘గద్దెల దగ్గరలో ఉన్న చెట్లను తొలగించవద్దు. నాణ్యతలో ఏమాత్రం రాజీ పడొద్దు. నిర్మాణంలో విమర్శలకు తావివ్వొద్దు. గద్దెల సమీపంలో నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలి’ అని సీఎం అధికారులకు సూచించారు. గద్దెల దగ్గర నాలుగు వైపులా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి, గ్రాండ్ లుక్ వచ్చేలా లైటింగ్ ఏర్పాటు చేయాలని, గుడి చుట్టూ పచ్చదనం పెంపొందించాలని ఆదేశించారు. భక్తుల రద్దీ పెరగనున్నందున ఆలస్యం చేయకుండా పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఈమేరకు ఇప్పటికై నా పనుల్లో వేగం పెరుగుతుందన్న చర్చ అన్ని వర్గాల్లో జరుగుతోంది. నెల రోజుల ముందు నుంచే భక్తుల తాకిడి సుమారు రూ.150 కోట్లతో కొసాగుతున్న పనులు సెప్టెంబర్ 23న సీఎం సందర్శన.. వంద రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశం హైదరాబాద్లో అత్యవసర సమీక్ష.. పనుల తీరుపై సీఎం సీరియస్ -
కార్యకర్తలకు అండగా ఉంటాం..
● ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. సోమవారం పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామంలో బీఆర్ఎస్, సీపీఎం పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్న వారికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి, మల్లారెడ్డి, రాఘవరావు, సోమేశ్వర్, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్, కుమారస్వామి, రమేష్, రాజశేఖర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
భవిష్యత్ను తీర్చిదిద్దుకోవాలి
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి హన్మకొండ: విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి భవిష్యత్ను తీర్చిదిద్దుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. హనుమకొండ న్యూశాయంపేటలోని శ్రీవ్యాస ఆవాసంలో సులక్ష్య సేవా సమితి బాధ్యులు పేద గిరిజన విద్యార్థులకు సోమవారం యూనిఫాం పంపిణీ చేశారు. సీఎండీ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్కూల్ యూనిఫాం అందించి మాట్లాడారు. విద్యార్థులు పట్టుదలతో చదువుకుని మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని కోరారు. సులక్ష్య సేవా సమితి అధ్యక్షుడు మండువ సంతోష్, ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, శ్రీవ్యాస ఆవాసం అధ్యక్షురాలు వసుంధర, కార్యదర్శి శ్రీనివాస్, డీఈ జి.సాంబరెడ్డి, ఎమ్మార్టీ, విజిలెన్స్ డీఈ అనిల్కుమార్ పాల్గొన్నారు. -
ప్రశాంతంగా నామినేషన్లు వేయాలి
● డీసీపీ రాజమహేంద్రనాయక్ బచ్చన్నపేట: స్థానిక ఎన్నికల నామినేషన్లను ప్రశాంతంగా వేయాలని, క్లస్టర్ కేంద్రాల వద్ద ప్రజలు గుమికూడరాదని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంతో పాటు పోచన్నపేట, కొడవటూర్ గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నామినేషన్ వేసే అభ్యర్థితో మరో ముగ్గురిని మాత్రమే అనుమతించాలని, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను తొందరగా స్వీకరించి బయటకు పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్మెట సీఐ అబ్బయ్య, ఎస్సై ఎస్కే అబ్దుల్ హమీద్, కానిస్టేబుళ్లు పలువురు పాల్గొన్నారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగాలి బచ్చన్నపేట: స్థానిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగాలని ఎన్నికల జిల్లా జనరల్ అబ్జర్వర్ రవికిరణ్ అన్నారు. సోమవారం జిల్లా ఎన్నికల అధికారి రిజ్వాన్ బాషాతో కలిసి బచ్చన్నపేట, పోచన్నపేట, గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఇంతవరకు వచ్చిన నామినేషన్ వివరాలు, టీ పోల్ ఎంట్రీ ప్రక్రియ, ఎన్నికల విధులకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామానుజాచారి, ఎంపీడీఓ మమతాబాయ్, ఎస్సై అబ్దుల్ హమీద్, ఆర్ఐలు వంశీ కృష్ణ, మునవర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. ‘బాండ్’ ప్రచారం రఘునాథపల్లి: అవకాశం ఇచ్చి చూడండి.. కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్, ఇతర పనులు చేసి పెడతామంటూ సర్పంచ్ అభ్యర్థి వినూత్న రీతిలో ప్రచారానికి తెరలేపారు. సోమవారం మండలంలోని ఇబ్రహీంపూర్లో గౌడ కుల సంఘం వారు చిట్టీ నిర్వహిస్తుండగా అదే గ్రామానికి చెందిన బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దొరగొల్ల రవి ఆ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఉడుత రంజిత్తో కులస్తులను కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు. సర్పంచ్గా గెలిపించిన రెండు నెలల్లో సొంత డబ్బులతో గౌడ సంఘం భవనం నిర్మించి ఇస్తానని ఏకంగా బాండ్ రాసిఇచ్చి విజ్ఞప్తి చేశారు. ఫతేషాపూర్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు అక్కనపల్లి సుజాత, అక్కనపల్లి మాధవి వేర్వేరుగా గ్రామంలో చిట్టీ నిర్వహించుకుంటున్న ముదిరాజ్ కులస్తులకు వద్దకు వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థించారు. రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్కు ఎంపిక జఫర్గఢ్: మండలంలోని తిడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఇటీవల జనగామ జిల్లాకేంద్రంలో జరిగిన సైన్స్ఫెయిర్లో పాఠశాలకు చెందిన విద్యార్థులు ఆధునిక ఎద్దుల బండి ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. దీంతో విద్యార్థుల ప్రతిభకను గుర్తించి రాష్ట్ర పోటీలకు ఎంపిక చేశారని హెచ్ఎం సదానందం తెలిపారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులను హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. ఆధార్ కేంద్రం పరిశీలన జనగామ: జనగామ పట్టణంలోని ప్రభుత్వ ఆధార్ కేంద్రాన్ని మీసేవా గవర్నర్ టి. రవికిరణ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆధార్ సేవలను పరిశీలించి, సేవల ప్రమాణాలు, ప్రజలకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కమిషనర్ వెంట ఈడీఎం గౌతమ్రెడ్డి, తదితరులు ఉన్నారు. -
హెచ్ఐవీపై అపోహలు తొలగించాలి
● జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్రావు జనగామ రూరల్: హెచ్ఐవీపై అపోహలు తొలగించాలని జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్రావు అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం వైద్య శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం 2002 నుంచి అనేక అవగాహన కార్యక్రమాలు, చికిత్స సదుపాయాలను అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 3,210 మంది ఎయిడ్స్ బాధితులుగా నమోదు కాగా అందులో 2,690 మంది మందులు తీసుకుంటూ ఆరోగ్యం మెరుగు పరుచుకుంటున్నారన్నారు. జిల్లాలో మూడు సంవత్సరాల్లో 46,000 టెస్టులు చేసి 35 మంది పాజిటివ్ గుర్తించామన్నారు. గర్భిణులకు టెస్టులు నిర్వహిస్తూ.. స్టాఫ్ నర్సులు, వైద్యులు ప్రజలకు సకాలంలో చికిత్స అందిస్తున్నారన్నారు. వ్యాధిపై అవగాహన పెంచుకోవాలని, భయపడకుండా సమీప ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకుని చికి త్స పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
బెల్ట్ జోరు!
మంగళవారం శ్రీ 2 శ్రీ డిసెంబర్ శ్రీ 2025గ్రామాల్లో ఎన్నికల వేళ మద్యం జోరు● రాత్రికి రాత్రే రవాణా ● 3వేల దుకాణాల్లో పెరిగిన వ్యాపారం..! ● పశువుల కొట్టాలు, వ్యవసాయ క్షేత్రాల్లో డంప్ ● జిల్లాలో ‘ఫుల్’ జోష్జనగామ: జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ఊపందుకుంటున్న వేళ మద్యం అమ్మకాలు ఊహించని విధంగా పెరిగింది. నామినేషన్ల ఊపు కొనసాగుతున్న సమయంలో మద్యం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ప్రచారంలో తమవైపు తిప్పుకునేందుకునే ప్రయత్నాల్లో రాత్రికి రాత్రే శివారు దారుల మీదుగా లక్షల రూపాయల మద్యాన్ని దాటించేస్తున్నారు. గ్రామాల్లో రాజకీయ వేడి పెరిగేకొద్ది మద్యం వినియోగం కూడా అదేస్థాయిలో పెరుగుతోందనే ఆరోపణలు లేకపోలేదు. ఓవైపు నామినేషన్లు.. మరోవైపు అమ్మకాలు జిల్లాలో మూడు విడతల్లో సర్పంచ్ ఎలక్షన్లు జరుగనున్నాయి. మొదటి విడతలో స్టేషన్ఘన్పూర్ మండలంలో నామినేషన్ల స్వీకరణ ముగియగా, జనగామ నియోజకవర్గంలో ప్రారంభమైంది. మూడో విడతలో పాలకుర్తిలో ప్రారంభం కావాల్సి ఉంది. ఎలక్షన్ నేపధ్యంలో మద్యం, డబ్బుల తరలింపుపై ఎలక్షన్ విభాగం గట్టి నిఘా వేసింది. ఒత్తిడితో పాటు ఎన్నికల సమయంలో మద్యం కొరత ఉండకూడదనే ఉద్దేశ్యంతో బెల్ట్ దుకాణాల వ్యాపారులు అర్ధరాత్రి సమయంలో మద్యం తరలించి రహస్య ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారు. ప్రతీ గ్రామంలో మద్యం ప్రవాహం పెరగడంతో ఎన్నికల నైతికతపై ప్రజల్లో సందేహాలు మొదలయ్యాయి. పెరుగనున్న మద్యం వ్యాపారం జిల్లాలో 280 గ్రామపంచాయతీలు, దాదాపు 300 పైగా శివారు గ్రామాల పరిధిలో 3వేల వరకు బెల్ట్ షాపులు నడుస్తున్నాయని అంచనా. బెల్ట్ దుకాణాల్లో రూ.10 వేల నుంచి రూ.ఒక లక్ష వరకు రోజు వ్యాపారం జరుగుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. కాని స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ వ్యాపారం రెట్టింపుగా దూసుకువెళ్తోంది. పలువురు ఓటర్లను ఆకర్షించడంలో నగదు, గిఫ్ట్లతో పాటు మద్యం కీలక పాత్ర పోషిస్తుంది. రోజువారీగా ఒక్కో బెల్ట్ దుకాణం నిర్వాహకుల కొనుగోలు కంటే అదనపు ఖరీదు చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా క్వార్టర్, ఆఫ్ బాటిల్స్లే ఉంటున్నాయి. వ్యవసాయ క్షేత్రాలు..పశువుల కొట్టాలు.. ఎలక్షన్కు రెండు రోజుల ముందు భారీగా మద్యం బాటిల్స్ అవసరమున్న నేపధ్యంలో వ్యవసాయ క్షేత్రాలు, పశువుల కొట్టాలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, అనుమానం రాని వ్యక్తుల నివాస ప్రాంతాల్లో అదనపు మద్యం స్టాక్ను డంప్ చేసినట్లు గ్రామాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలక్షన్ సమయంలో ప్రతీ చిన్న సమావేశంలో మద్యం విందులు ప్రధానంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మద్దతు దారులు చేజారి పోకుండా అభ్యర్థులు తమ శక్తినంతా ధార పోసి విందులతో మచ్చిక చేసుకుంటారు. ఎ న్నికల సమయంలో మూతబడాల్సిన బెల్ట్ షాపులు మేము లేనిదే ఎన్నికలు ఎలా జరుగుతాయనే దర్జాగా వెలగబెడుతున్నాయి. బెల్ట్ దుకాణాల నిర్వహణపై ఎక్కడా ఆంక్షలు కనిపించడం లేదని అనేక గ్రామాల ప్రజలు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. బార్డర్లో చెక్ పోస్టులు, పోలీసుల తనిఖీలు ఉన్నప్పటికీ, వారి కళ్లు గప్పి బెల్ట్ నిర్వాహకులు మద్యాన్ని గ్రామాలకు తరలించేస్తున్నారు. గ్రామాల్లో ‘ఫుల్ జోష్’లో నడుస్తున్న మద్యం రాజకీయాలు పంచాయతీ ఎన్నికలకు కొత్త రంగు పులముతుండగా, ఖర్చులో సైతం రెండవ అతి పెద్దదిగా నిలుస్తోంది. -
ఎన్నికల నియమావళిని పాటించాలి
నర్మెట: ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. మండలకేంద్రం పంచాయతీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నామినేషన్ పత్రాల స్వీకరణ కేంద్రాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఎన్నికలకు అంతరాయాలు కల్పిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట ఎస్సై నైనాల నగేష్, ఎంపీడీఓ కావ్య శ్రీనివాసన్, ఎంపీఓ వెంకట మల్లికార్జున్, కార్యదర్శులు పాల్గొన్నారు. జనగామ మండలంలో.. జనగామ రూరల్: జనగామ మండలంలోని ఐదు క్లస్టర్లలో సర్పంచులు, వార్డు మెంబర్లకు గాను నా మినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభం అయింది. వడ్లకొండ క్లస్టర్ను డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఎంపీడీవో బి. మహేశ్, తహసీల్దార్ హుస్సెన్, ఎంపీఓ సంపత్కుమార్, ఎస్ఐ భరత్ పరిశీలించారు.49 వార్డులు ఏకగ్రీవంజఫర్గఢ్: మండలంలోని వివిధ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన, తిరస్కరణ చేపట్టారు. మండలంలో సర్పంచ్ స్థానాలకు 189 నామినేషన్లు వేయగా ఏ ఒక్కటీ కూడా తిరస్కరణకు గురికాలేదు. వార్డు స్థానానికి వచ్చిన 471 నామినేషన్లకు గాను 5 తిరస్కరణకు గురయ్యాయి. కాగా ఆయా గ్రామాల్లో పలు వార్డు స్థానాలకు అభ్యర్థుల నుంచి ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో 49 వార్డులు ఏకగ్రీవమైనట్లు ఎంపీడీఓ సుమన్ తెలిపారు. ఇందులో అల్వార్బండాతండా గ్రామపంచాయితీ నుంచి 6 గురు వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా లక్ష్మినాయక్తండా నుంచి 7, తీగారం 3, కోనాయిచలం 5, దుర్ాగ్యనాయక్తండా 5, సాగరం 9, తిడుగు 4, ఉప్పుగల్లు 1, హిమ్మత్నగర్ 1, తిమ్మాపూర్ 1, షాపల్లి 3, మగ్ధుంతండా నుంచి నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ -
రెండో విడత నామినేషన్లు షురూ
జనగామ: జనగామ నియోజకవర్గంలోని జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల పరిధిలోని 79 గ్రామపంచాయతీలు, 710 వార్డుల పరిధిలో ఆదివారం నుంచి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లకు సంబంధించి నర్మె టలో(4క్లస్టర్లు), జనగామలో (5), తరిగొప్పులలో (5), బచ్చన్నపేటలో (5) మొత్తంగా 19 క్లస్టర్ల వారీగా ఆయా రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులతో పాటు స్వతంత్రుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. సర్పంచ్ అభ్యర్థులకు 57, వార్డు సభ్యులకు 90 నామినేషన్లు వచ్చాయి. ఇదిలా ఉండగా నేడు, రేపు(మంగళవారం) దశమి, ఏకాదశి కలిసొచ్చిన మంచి రోజులతో నామినేషన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. స్టేషన్ ఘన్పూర్లో నామినేషన్ల పరిశీలన, తిరస్కరణ స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో 27వ తేదీ నుంచి 29 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల పరిశీలన చేసి చెల్లుబాటయ్యే అభ్యర్థుల నామినేషన్ల అర్హత వివరాలను ప్రకటించారు. డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5గంటల వరకు అప్పీళ్లకు అవకాశం ఇవ్వగా, 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్పీళ్ల పరిష్కారానికి అవకాశం కల్పించారు. 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్న్ఉపసంహరణ చేసుకున్న అనంతరం, తుది అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. ఒక్క స్టేషన్ఘన్పూర్లో సర్పంచ్కు 689 నామినేషన్లు రాగా, ఇందులో వివిధ కారణాల చేత 30 తిరస్కరించడం గమనార్హం. రఘునాథపల్లిలో 320 వార్డులకు 7 చోట్ల నామినేషన్లు దాఖలు కాకపోవడంతో పాటు 39 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. తొలి రోజు సర్పంచ్–57, వార్డులకు 90.. స్టేషన్ ఘన్పూర్లో చెల్లుబాటు అభ్యర్థుల జాబితా వెల్లడి -
ఇరుకు చౌరస్తాలో ట్రా‘ఫికర్’
నర్మెట చౌరస్తాలో ట్రాఫిక్ జాం మండలకేంద్రంలోని చౌరస్తా ఎప్పుడూ బిజీబిజీ.. ఏక్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. జనగామ–హుస్నాబాద్–కరీంనగర్కు నిత్యం వందలాది వాహనాల రాకపోకలు..ఇరుకై న చౌరస్తా...నలువైపుల నుంచి వాహనాలు...అక్కడే బస్టాప్..మరొక వైపు ప్రయాణికులను చేరవేసే ఆటోలు, జీపులు.. వేగంగా వెళ్లే వాహనాలు.. ఇలా ఎప్పుడూ ప్రమాదభరితమే. దీనికితోడు చౌరస్తా నుంచే తిరిగి హన్మకొండ, హైదరాబాద్ (పికెట్) వెళ్లే బస్సులు. రోడ్డు పక్కనే ద్విచక్రవాహనాల పార్కింగ్లు. స్థలం ఇరుకుగా ఉండడం, పార్కింగ్కు అనువైన స్థలం లేకపోవడం, వాహనదారులు నిబంధనలు పాటించక పోవడంతో నర్మెట చౌరస్తా ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. – నర్మెట -
లోకల్ ధమాకా!
జనగామ: జిల్లాలో నూతన మద్యం పాలసీ సోమవారం(డిసెంబర్ 1) నుంచి అమలుకానుంది. ప్రస్తుత వైనన్స్్ షాపుల లైసెన్స్ గడువు ముగియగా, ఉదయం 10 గంటల నుంచి కొత్త లైసెన్సులతో దుకాణాలు తెరుచుకోనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జిల్లాలో నూతన మద్యం పాలసీ ప్రారంభం కావడం వ్యాపారులకు కలిసిరానుంది. ఎన్నికల వేళ గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రజల్లో రద్దీ పెరగడం, రాజకీయ కార్యకలాపాలు ఊపందు కోవడం వైన్స్ షాపుల వద్ద అమ్మకాలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకునే అవకాశం ఉంది. స్థానికంతో లాభాలు.. నూతన మద్యం షాపుల ప్రారంభంలోనే పంచాయతీ ఎన్నికలు నడుస్తుండడంతో వ్యాపారులకు తొలిరోజు నుంచే లాభాల పంట పండనుంది. ముఖ్యంగా డిసెంబర్ మొదటి వారం నుంచి గ్రామాల్లో అభ్యర్థుల కదలికలు, సమావేశాలు, ఊరేగింపులు, రాత్రి వేళ చర్చలు పెరగడం మద్యం డిమాండ్ను పెంచేస్తుంది. ఎన్నికల సీజన్, కొత్త పాలసీ డబుల్ ఇంపాక్ట్ వల్ల అమ్మకాలలో ఉండే పెరుగుదల అంచనాలకు మించి దాటనుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. కొందరు వ్యాపారులు ఇప్పటికే స్టాక్ను పెంచేసుకోగా, మరికొందరు ప్రీమియం బ్రాండ్ల సరఫరాలను భారీగా ఆర్డర్ చేసినట్టు సమాచారం. వ్యాపారులకు ఎలక్షన్లు అరుదైన గోల్డెన్ ఆఫర్గా మారే అవకాశముందని పలువురు నాయకులు అంటున్నారు. సిండికేట్.. చర్చ వైన్స్షాపుల కేటాయింపులతో పాటు మండలాల పరిధిలో ‘సిండికేట్’ ప్రభావం కొత్తగా చర్చనీయాంశమైంది. లాభదాయకమైన ప్రాంతాలపై ఒకే గ్రూపు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొత్త పాలసీ అమలుతో మారుతున్న వ్యాపార సమీకరణలు, వైన్స్ యజమానుల వ్యూహాలు జిల్లాలో మరోసారి హాట్ టాపిక్గా మారాయి. ఇది రాబోయే నెలల్లో రిటైల్ మార్కెట్ను ఎలా ప్రభావితం చేస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. కొత్త దుకాణం కలిసొచ్చిన వ్యాపారులు సేల్ కౌంటర్ మేనేజర్లు, టీమ్ల నియామకం, ఇంటీరియర్ సెట్అప్, స్టాక్ రిప్లేస్మెంట్, డిజిటల్ మీటర్లు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి పనులను వేగవంతం చేస్తున్నారు. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 మద్యం దుకాణాలకు గాను 1,697 దరఖాస్తులు జిల్లాలో మద్యం వ్యాపారంపై ఉన్న పోటీని మరోసారి రుజువు చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తుల రూపంలోనే ప్రభుత్వానికి రూ.50 కోట్ల 95 లక్షలు ఆదాయం రావడం గమనార్హం. 2025–27 రెండేళ్ల కాలానికి అక్టోబర్ 28న జిల్లాలోని 50 దుకాణాలకు లాటరీ నిర్వహించగా, అదృష్టం కలిసిన నిర్వాహకులు ఇప్పటికే షాపుల ప్రారంభానికి సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా గడిచిన రెండేళ్లలో పాతషాపుల్లో రూ.1100కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు వ్యాపార వర్గాలు అంచనా వేయడం గమనార్హం. కొత్త వైన్స్కు పంచాయతీ ఎన్నికల గిరాకీ నేటి నుంచి నూతన మద్యం పాలసీ ప్రారంభం లాభాల లెక్కలు–సిండికేట్పై చర్చలు జనగామ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీల పరిధి లో వైన్స్ షాపుకు అదనంగా రూ.5 లక్షల లైసెన్స్ ఫీజుతో లిక్కర్ మార్ట్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండడంతో పలువురు వ్యాపారులు దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం జనగామ నియోజకవర్గంలో మూడు లిక్కర్ మార్ట్లు ఉండగా, కొత్త పాలసీతో మరిన్ని ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. కస్టమర్లను ఆకట్టుకునే విధంగా లిక్కర్ మార్టుల్లో ధరల్లో మార్పులు, బ్రాండ్ల లభ్యత, సేవల ప్రమాణాల పెంచే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు అత్యధిక సేల్ కోసం రహస్యంగా ప్రత్యేక ఆఫర్లు, మెరుగైన మౌలిక సదుపాయాలు, అధునాతన డిస్ప్లే ర్యాక్స్ ఏర్పాట్లపై దృష్టి పెడుతున్నారు. -
ఎడమొహం..పెడమొహం
పల్లెల్లో వర్గం ఏదైనా ప్రేమ, ఆప్యాయత పలకరింపులకు ఎక్కడా మాట రానివ్వరు. కానీ ఎలక్షన్ల నేపథ్యంలో గత రెండు, మూడు రోజులుగా పరిస్థితి భిన్నంగా మారిపోయింది. ఊరిలో కలిసి తిరిగే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రెండు కూటములుగా చీలిపోయి, గెలుపు ఎవరిదో చూద్దాం అనే ఎమోషన్లో బరిలోకి దిగుతున్నారు. ఇన్నాళ్లూ ఆప్యాయంగా పిలుచుకున్న వారు ఇప్పుడు ఒకరిని ఒకరు ఓరకంట చూపుతో చూసుకుంటూ రాజకీయ వేడిని పెంచేస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్లో నామినేషన్ల పరిశీలన పూర్తయ్యే సరికి, జనగామలో రెండో విడత మొదలైంది. జిల్లాలో అనేక ప్రాంతాల్లో స్వతంత్రులు, పార్టీ అభ్యర్థులు, తిరుగుబాటు నేతల హడావిడి పార్టీ అధినాయకత్వానికి చెమటలు పట్టిస్తున్నాయి. ఒకవైపు బుజ్జగింపులు, మరోవైపు అధికారిక అభ్యర్థుల ప్రకటన జిల్లా రాజకీయాల్లో సరికొత్త ఊపును తీసుకొస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ నాటికి ఎవరిని బుజ్జగిస్తారు, ఎవరు బరిలో నిలుస్తారు అనే చర్చ వినిపిస్తోంది. ఈ ఎన్నికలు మాత్రం పల్లె రాజకీయాల్లో కొత్త రణరంగానికి నాంది పలుకుతున్నాయి. జనగామ: ‘అన్న, తమ్ముడు, బాబాయి, మామా, అల్లుడు..’ వరుసలు పెట్టుకుని ఆప్యాయంగా పిలుచుకునే నాయకులు ఇప్పుడు ఎడమొహం..పెడమొహంగా మారిపోయారు. పల్లె రాజకీయాల్లో సర్పంచ్ ఎన్నికలు మంటపుట్టిస్తున్నాయి. బుజ్జగింపుల పర్వం పీక్ స్టేజీకి చేరకోగా..వెనక్కి తగ్గేదేలేదంటూ ఆశావహులు కరాఖండీగా తేల్చిచెబుతున్నారు. ‘అన్నా ఒక్కసారి నామినేషన్ తిరిగి తీసుకోరాదే.. ఈసారి నాకు అవకాశం వచ్చింది.. మరోసారి మీకు అండగా నిలబడతాం..’ అంటూ చాలాచోట్ల వేడుకోళ్లు.. బతిమిలాటలు కనిపిస్తున్నాయి. మాట వినే ప్రసక్తే లేదు...బరిలో నిలవాల్సిందే అంటూ పోటీకి కాలుదువ్వుతున్నారు. పార్టీ శ్రేణులు, రెండోస్థాయి నేతలు రంగంలోకి దిగినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. దీంతో జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధి లోని ప్రధాన రాజకీయ పార్టీలు 90 శాతం అభ్యర్థుల జాబితాను ప్రకటించి, డబుల్ పోటీ ఉన్న పంచాయతీలను మాత్రం పెండింగ్లో ఉంచారు. రంగంలోకి ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లు పంచాయతీ ఎన్నికల్లో పార్టీల జెండా ఎగురవేయాలని ఎవరికివారే ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్లు రంగంలోకి దిగి పార్టీలో మంచి గుర్తింపు ఇస్తాం, నామినేటెడ్ పోస్టుల్లో ప్రయార్టీ ఉంటుందని ఒకరి తర్వాత ఒకరిని సముదాయిస్తున్నారు. కానీ కొంతమంది ఆశావాహులు మాత్రం గెలుస్తామనే బలమైన నమ్మకంతో బరిలోనే ఉంటామనే సంకేతాలు ఇస్తుండడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. యువ ఓటర్లే కీలకం పంచాయతీ ఎన్నికల్లో యువఓటర్లదే కీలకం కానుంది. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో ఇప్పటికే చాలా చోట్ల యువకెరటాలకు సంబంధించి సర్పంచ్, వార్డుసభ్యులు ఏకగ్రీవం కాగా, ఓట్ల సమయంలో సైతం వీరి పాత్ర ప్రధానంగా ఉంటుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అనేక గ్రామాల్లో యువత గ్రూపులుగా ఏర్పాటై, తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు ప్రజలను మోటివేట్ చేస్తున్నారు. యువతను తట్టుకునేందుకు రాజకీయ అనుభవంతో సీనియర్లు తమదైన శైలిలో ఓటర్లను ఆకర్షించే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇదిలా ఉండగా పల్లెల్లో అధ్వానమైన రోడ్లు, డ్రైనేజీలు, నీటి సమస్య, దోమల స్వైర విహారం ఇలా అనేక సమస్యలపై బరిలో నిలిచేందుకు ఉత్సాహం చూపిస్తున్న ఆశావహులను పట్టుకుని గెలిపిస్తే ఏం చేస్తావంటే ఇప్పుడే నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు తలనొప్పిగా పోటీదారులు పల్లె రాజకీయాల్లో మంటపెడుతున్న లోకల్ వార్ బరిలో నిలిచేందుకు బుజ్జగింపుల పర్వం -
అన్నదాతలకు ‘దిత్వా’ భయం
దిత్వా తుపాను కారణంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రాగా కారుమబ్బులు కమ్ముకొస్తున్నాయి. దాంతో రైతులు కల్లాల వద్ద, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులుగా పోసి తుపాను ఎఫెక్ట్తో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడం, తీవ్రంగా చలి నెలకొనడంతో పాటు కారుమబ్బులు వస్తుండగా అన్నదాతలు గుబులు చెందుతున్నారు. దీంతో కల్లాల్లో, ఐకేపీ సెంటర్లలో ఆరబోసిన ధాన్యంపై రైతులు ముందస్తు జాగ్రత్తగా పరదాలు కప్పుకుంటున్నారు. – స్టేషన్ఘన్పూర్ -
ఆయిల్పామ్తో నిరంతర ఆదాయం
జనగామ రూరల్: దేశంలో వంట నూనెల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఆయిల్పామ్ సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకుగాను రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తోంది. మొక్కల అందజేత నుంచి డ్రిప్పు పరికరాలు, అంతర పంటల సాగు, తదితర వాటికి ప్రభుత్వం ప్రోత్సాహకాలనిస్తోంది. దిగుమతి సుంకాన్ని 5.5శాతం నుంచి 27.5శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఆయిల్పామ్ ధర టన్నుకు రూ.16,500 పెరిగే అవకాశమున్నందున రైతుకు మంచి ధర పలికి మేలు జరుగనుంది. 2021 నుంచి ఇప్పటివరకు జిల్లాలో 7,457 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలను నాటడంతో రాష్ట్రంలోనే 5వ స్థానంలో నిలిచిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. లాభసాటిగా ఆయిల్పామ్ రైతులకు అధిక ధరలను అందించి, రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగును లాభసాటిగా చేయాలని కొత్త రైతులను ప్రోత్సహించేందుకు మంచి రేటు అందిస్తున్నారు. భవిష్యత్లో మరింత పెరిగే అవకాశం ఉంది. అయిల్పామ్ సాగుపై కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి సాగు రకాలుపెంచేలా కృషి చేస్తున్నారు. నికర ఆదాయానికి అవకాశం ఈ పంట సాగుతో 4–30 ఏళ్ల వరకు నిరంతర ఆదాయం పొందవచ్చు. చీడపీడల బెడద ఉండదు. వేరుశనగ, పెసర, మినుము, నువ్వులు, పొద్దుతిరుగుడు, తదితర అంతర పంటల ద్వారా ఆదాయం పొందవచ్చు. బ్యాంకుల ద్వారా రుణ సాయం అందుతుంది. జిల్లాలో ఈ ఏడాది సుమారు 792 ఎకరాలకు డ్రిప్ పరికరాలకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. ఈ వార్షిక ప్రణాళికలో భాగంగా 216 ఎకరాల్లో రైతులు మొక్కలను నాటారు. పంట సాగులో జిల్లాది 5వ స్థానం రాయితీలతో సాగును ప్రోత్సహిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా వ్యాప్తంగా 7,457 ఎకరాల్లో సాగు -
మేడారంలో భక్తుల కోలాహలం
ఎస్ఎస్తాడ్వాయి : మేడారంలోని వనదేవతల గద్దెల ప్రాంగణం భక్తులతో కోలాహలంగా మారింది. ఆదివారం అమ్మవార్లను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రైవేటు వాహనాల్లో మేడారానికి చేరుకున్నారు. జంపన్నవాగులో స్నానాలు చేసి అమ్మవార్లకు పుట్టువెంట్రుకలు సమర్పించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీర, సారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో గద్దెల ప్రాంగణం సందడిగా మారింది. సంతానం కలగాలని అమ్మవార్లకు మహిళలు ముడుపులు కట్టారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లో వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. -
నేటి ప్రజావాణి రద్దు
జనగామ రూరల్: పంచాయతీ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల పరిశీలనతరిగొప్పుల: రెండో విడత సర్పంచ్ నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏసీపీ పండరి చేతన్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు సీఐ అబ్బయ్య, ఎస్సై గుగులోతు శ్రీదేవి ఉన్నారు. ఆ ఊరి ఓట్ల కంటే వార్డు ఓట్లే ఎక్కువ!లింగాలఘణపురం: మండలంలోని ఏనెబావి గ్రామ పంచాయతీ ఓట్లు మండలంలోని ఓ పెద్ద గ్రామ పంచాయతీలోని ఒక్క వార్డు ఓట్ల కంటే తక్కువగానే ఉన్నాయి. ఏనెబావి గ్రామ పంచాయతీ శివారు గ్రామమైన పిట్టలోనిగూడెం ఓట్లు కలుపుకొని మొత్తం 285 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో 134 పురుషులు, 151 మహిళల ఓట్లు ఉండగా మండలంలోనే పెద్ద గ్రామ పంచాయతీ అయిన నెల్లుట్లలో 4,885 ఓట్లు ఉండగా ఒక్క మూడో వార్డులో 356 ఓట్లు ఉన్నాయి. అంటే ఏనెబావి గ్రామ పంచాయతీలోని మొత్తం ఓట్లతో పోల్చి తే నెల్లుట్లలోని ఒక్క వార్డులో ఉన్న ఓట్లు కూడా లేవు. అందులో మరో విశేషం ఏమిటంటే ఒక్క బీసీ ఓటరు లేని 1,2,3 వార్డులు బీసీలకు రిజ ర్వేషన్ కావడం, ఒక్క ఎస్టీ ఓటరులేని 4,5,6 వార్డులు ఎస్టీకి రిజర్వేషన్ కావడం జరిగింది. ఇందులో 1,2,3 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. గతంలో సర్పంచ్ ఎస్టీ కావడంతో ఏకగ్రీవమైంది. ప్రస్తుతం బీసీ మహిళ కావడంతో ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఒకవేళ ఓటింగ్ జరిగితే 285 ఓట్లలో ఎక్కువ ఎవరికి వస్తే వారే సర్పంచ్గా గెలిచే అవకాశం ఉంది. హేమాచలానికి పోటెత్తిన భక్తులు మంగపేట : మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి వారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి తదితర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి సందడి చేశారు. -
నూతన ఆవిష్కరణలవైపు అడుగులు
జనగామ రూరల్: విద్యార్థులు నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పింకేష్కుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని సాన్మారియా ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి ఇన్స్పైర్, సైన్స్ఫెయిర్ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రదర్శనలను వీక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ముగింపు సమావేశంలో పింకేష్కుమార్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. వినూత్నంగా ఆలోచించి కొత్త ఆవిష్కరణలకు బీజం వేయాలన్నారు. ఉత్తమ ప్రదర్శనలకు సర్టిఫికెట్, బహుమతులు అందించారు. కాగా సైన్స్ఫెయిర్ సబ్ థీమ్స్లో జూనియర్, సీనియర్ విభాగాల్లో మొదటి, రెండో బహుమతి, ఇన్స్పైర్లో 8 ప్రదర్శనలు రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఏఎంఓ శ్రీనివాస్రావు, గౌసియా బేగం, సైన్స్ అధికారి ఉపేందర్, బాను, నాగరాజు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పింకేష్కుమార్ ముగిసిన జిల్లాస్థాయి సైన్స్ఫెయిర్, ఇన్స్పైర్ మనక్ -
నిస్వార్థ సేవలకు గుర్తింపుగా గ్రామాల్లో సర్పంచ్ల విగ్రహాలు
వారు గ్రామానికి ప్రథమ పౌరులు.. ఏళ్ల క్రితమే సేవ కోసం నడుం కట్టారు. అభివృద్ధిని పల్లెకు పరిచయం చేశారు. తమకున్న పరిధిలో ప్రజలకు సేవ చేశారు. కాలక్రమంలో వారు గతించారు. కానీ, వారి అమూల్యమైన సేవలను ఇప్పటికీ ఆయా గ్రామాల ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. పల్లె సారథుల యాదిలో స్థానికులు కూడళ్లలో ప్రతిమల్ని ఏర్పాటు చేశారు. వారి జయంతి, వర్ధంతులను ఇప్పటికీ ఘనంగా జరుపుతున్నారు. వారిని నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని ఆయా గ్రామాలవాసులు చెబుతున్నారు. పల్లె మకుటాలై.. ప్రతిమలై నిలిచిన ఆనాటి సర్పంచ్ల సేవలపై ‘సాక్షి’ సండే స్పెషల్. అభివృద్ధిని స్మరిస్తూ సేవల్ని గుర్తు చేస్తూ.. ఇప్పటికీ ఘనంగా జయంతి, వర్ధంతులు ఉమ్మడి జిల్లాలోని నేటితరం నాయకులకు ఆదర్శం -
పరిశీలన.. సమీక్ష
● ‘గ్రేటర్’లో రోజంతా బిజీబిజీగా గడిపిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి ● వరంగల్ రైల్వే స్టేషన్ పరిశీలన.. క్యాంటిన్లో చాయ్పే చర్చ ● శ్రీభద్రకాళి, వేయిస్తంభాల ఆలయంలో పూజలు● కల్యాణమండపం పనుల అలసత్వంపై అసంతృప్తి ● కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ తనిఖీ.. పనులపై ఆరా ● వరంగల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడి – హన్మకొండ/హన్మకొండ కల్చరల్/ఖిలా వరంగల్/కాజీపేట రూరల్ వేయిస్తంభాల ఆలయ కల్యాణ మండపాన్ని పరిశీలిస్తున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి, చిత్రంలో బీజేపీ నాయకులు -
కేసీఆర్ దీక్షతోనే ప్రత్యేక రాష్ట్రం
జనగామ: పదేళ్ల పాలనలో తెలంగాణను చక్కదిద్ది అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా గుర్తింపు తీసుకు వచ్చిన కేసీఆర్తోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రా జయ్యలు అన్నారు. దీక్షాదివస్ పురస్కరించుకుని యశ్వంతాపూర్ బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. 11 రోజుల పాటు చుక్క నీళ్లు కూడా తాగకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అన్నారు. 14 సంవత్సరాల పాటు కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్య మ పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రమన్నారు. ఆమరణ నిరాహార దీక్ష సమయంలో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్కు అండగా నిలిచారన్నారు. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్తో కలిసి తిరిగే అదృష్టం తనకు లభించిందని ఎమ్మెల్యే పల్లా అన్నారు. -
నిస్వార్థ సేవ.. వెలిశాల తోవ
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలం రెడ్యాలకు చెందిన వెలిశాల రాధాకృష్ణ 1975 నుంచి 1995 వరకు నాలుగు పర్యాయాలు సర్పంచ్గా పనిచేశారు. అనంతరం 2000 నుంచి 2005వ సంవత్సరం వరకు మళ్లీ ఎన్నికై ప్రజలకు సేవలందించారు. గ్రామ అభివృద్ధికి తనవంతు కృషి చేశారు. భూ సమస్యలు, కుటుంబ తగాదాలను పరిష్కరించారు. మృధుస్వభావిగా ఉంటూ అందరి మన్ననలు పొందారు. నిస్వార్థంగా సేవ చేసిన ఆయన 2006 మార్చిలో మృతిచెందారు. పలు పార్టీల నేతలు, గ్రామస్తుల సహకారంతో 2014 జనవరి 27న రాధాకృష్ణ విగ్రహాన్ని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేశారు. -
ఎన్నికలపై అవగాహన కల్పించాలి
జనగామ: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బరిలో నిలిచే అభ్యర్థులకు అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. శనివారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ఆయన మాట్లాడుతూ సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రచారం కోసం పబ్లిక్ మీటింగ్, ర్యాలీలు, మైకుతో పాటు తదితర వాటి కోసం తహసీల్దార్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనుమతి పొందిన బహిరంగ సమావేశాలు, రోడ్ షోల వద్ద లౌడ్ స్పీకర్లు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకే ఉపయోగించాలన్నారు. వీటిని ఉల్లంఘించిన వారిపై పర్యవేక్షణ టీంలు లౌడ్ స్పీకర్లను జప్తు చేయడానికి అధికారం కలిగి ఉంటారన్నారు. ప్రచార వాహనాల వివరాలను తహసీల్దార్లకు ముందుగానే సమాచారం అందించాలన్నారు. ప్రచార ఖర్చులు నమోదు చేయాలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులను నిర్ణీత ఫారంలో నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. అభ్యర్థుల ప్రచార ఖర్చు నమోదు చేసే అంశంపై వ్యయ పరిశీలకులు జయశ్రీ, ఖర్చుల మానిటరింగ్ నోడల్ ఆఫీసర్ కోదండ రాములు, మండల వ్యయ పరిశీలకులు, అన్ని మండలాల ఎంపీడీఓలతో కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత మేరకు ఖర్చు చేయాలనే అంశంలో ఎంపీడీఓలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్ టీ, ఎంసీ ఎంసీటీంలు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అభ్యర్థుల ఎన్నికల వ్యయ, ఖర్చులను పక్కాగా నమోదు చేయాలన్నారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు సమన్వయం చేసుకుంటూ పోటీలో ఉండే అభ్యర్థులకు నిర్ణీత గడువులోగా ఇవ్వాలన్నారు.


