Jangaon
-
ఆగ్రోస్ సేవా కేంద్రం తనిఖీ
బచ్చన్నపేట: మండలంలోని ఆగ్రోస్ సేవా కేంద్రంలో తహసీల్దార్ ఫణికిశోర్, మండల వ్యవసాయ అధికారి విద్యాకర్రెడ్డి, ఎస్సై ఎస్కే అబ్దుల్ హమీద్, పెద్ద వంగర ఎస్సై సురేశ్, టాస్క్ఫోర్స్ బృందం ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో 27 బస్తాల జీలుగ విత్తనాలు తేడారావడంతో ఆగ్రోస్ యజమాని కామిడి శ్రీనివాస్రెడ్డి నుంచి ల్యాప్టాప్, స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్, రికార్డు బుక్స్ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలోని ఆగ్రోస్ సేవా కేంద్రం ద్వారా అక్రమంగా తరలిస్తున్న జీలుగ విత్తనాలను తొర్రూరు వద్ద అక్కడి పోలీసులు పట్టుకున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరకు జీలుగ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. కాగా షాపు యజమానుల లైసెన్స్ రద్దు చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు. -
బరిగీసి కొట్లాడిన జనగామ
జనగామ: రజాకార్ల అరాచకాలు..గడీల పాలనపై తిరుగుబాటు చేసి... దున్నేవాడికే భూమి అంటూ ఎదురొడ్డి పోరాడిన జనగామ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన తొలి, మలిదశ ఉద్యమంలో బరిగీసి కొట్లాడింది. పోలీసుల లాఠీలు, నిర్భందా లను సైతం లెక్క చేయకుండా సకల జనులు రోడ్లపైకి వచ్చి ఢిల్లీ కోటలు బద్దలయ్యేలా నినదించారు. తల్లి తెలంగాణ కోసం పండు ముసలి నుంచి పడచు యువకుడి వరకు పోరుబాటలో నేను సైతం అంటూ ముందుకు కదిలారు. రాస్తారోకోలు, ధర్నాలతో ఆనాటి ఉమ్మడి పాలకులు గడగడలాడించారు. జైలుకై నా వెళ్తాం.. ప్రాణాలైనా ఇస్తాం అంటూ పో లీసుల తూటాలకు ఎదురొడ్డి జనగామ గడ్డ పౌరుషాన్ని చూపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. చరిత్రలో మరచిపోలేని ఘటనలు ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన మలిదశ ఉద్యమ చరి త్రలో మరచిపోలేని ఎన్నో ఘటనలు నేటికి గుర్తుకు చేస్తూనే ఉంటాయి. బచ్చన్నపేట మండలం మన్సాన్పల్లి గ్రామానికి చెందిన పొన్నం అశోక్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉరితాడును ముద్దాడాడు. దీంతో ఉద్యమకారులు రగిలి పోయారు. అశోక్ నుంచి మొదలుకుని అనేక గ్రామాల్లో ఆత్మహత్యలు, ప్రయత్నాలు జరుగుతూనే వచ్చా యి. ఈ ఘటనలో ఎందరో యువకులు బలిదానాలయ్యారు. అప్పటి వరకు ర్యాలీలు, ధర్నాలతో, రిలే దీక్షలతో అట్టుడికి పోతున్న ఉద్యమం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాహనాలను దహనం చేయడంతో పాటు ధ్వంసం చేశారు. రోజుల తరబడి రోడ్లను బ్లాక్ చేసి పాలకులకు అల్టి మేటం జారీ చేశారు. 2001లో మొదలైన 144 సెక్షన్ తెలంగాణ ఆవిర్భావం 2014 వరకు కొనసాగింది. జనగామ, బచ్చన్నపేట, లింగాలఘణపురం, దేవరుప్పుల, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి ఇలా ప్రతీ మండలంలో ఏళ్ల తరబడి రిలే దీక్షలు కొనసాగాయి. బరిగీసి కొట్లాడిన విద్యాలోకం ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం 2009 చివరి అంకంలో తారా స్థాయికి చేరుకుంది. విద్యార్థులు, యువ త ఒక్కసారిగా గర్జించారు. వేలాది ర్యాలీలు చేస్తూ గంటల తరబడి రోడ్లపై బైఠాయించారు. రేపటి భవిష్యత్ కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇలా ప్రతిఒక్కరిని అడ్డుకుని ముందుకు కదలనివ్వలేదు. వాహనాల అద్దాలను ధ్వంసం చేస్తూ, దాడులకు సైతం వెనకాడలేదు. ఆంధ్ర పేరుతో ఉన్న కార్యాలయాల బోర్డులను మార్చేశారు. సర్కారు బోర్డులపై తెలంగాణ పేరుతో ముందే స్వరాష్ట్రాన్ని ప్రకటించుకున్నారు. దేశం మొత్తం వినిపించేలా.. తెలంగాణ ఉద్యమాన్ని దేశం మొత్తం వినిపించేలా కొత్త తరహా నిరసనలకు శ్రీకారం చుట్టారు. జనగామ జిల్లా పరిధిలోని రైల్వే ట్రాక్పై బైఠాయింపు, గొర్లమందలు, గేదెలను వదిలి రాకపోకలకు ఇబ్బందులు కలిగించడంతో ఒక్కసారిగా దేశం ఇటువైపు చూసింది. ఉద్యమకారులపై సైతం రైల్వే పోలీసులు కేసులు నమోదు చేసినా వెనక్కి తగ్గలేదు. దీనికి తోడు కేసీఆర్, హరీష్రావు, కోదండరామ్ ఇలా ఉద్యమ నేతల సభలు ప్రజల్లో చైతన్యం కలిగించా యి. సకల జనులు రోడ్లపైకి వచ్చి వంటావార్పు, బోనాలు, బతుకమ్మ ఆటలతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటుతూ నిరసన తెలిపారు. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో ‘జనగామ’ స్ఫూర్తి ప్రస్తుత 32 జిల్లాలను కదిలించిందని ఆనాటి మేధావులు అనేక ప్రసంగాల్లో చెబుతూ వచ్చారు. చరిత్రలో మరచిపోలేని ఘటనలు దశాబ్దంన్నర పాటు 144 సెక్షన్ తొలి, మలిదశ ఉద్యమంలో ముఖ్యపాత్ర కోర్టుచుట్టూ తిరుగుతున్న ఉద్యమకారులుకోర్టు చుట్టూ తిరుగుతున్న ఉద్యమకారులు తెలంగాణ కోసం 14 ఏళ్ల పోరాటం...స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరి 12 ఏళ్లు గడిచి పోతున్నా ఆనాటి ఉద్యమకారుల్లో పలువురు నేటికి కో ర్టు చుట్టూ తిరుగుతున్నారు. నాలుగున్నర కో ట్ల ప్రజల కోసం పోరాడి, తమ భవిష్యత్ను ఫణంగా పెట్టిన ఉద్యమకారులకు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కోర్టుల చుట్టూ తిరగక తప్పడం లేదు. స్వరాష్ట్ర పాలకులు, అధికారులు కరుణించి అప్పటి కేసుల నుంచి విముక్తి కలిగించాలని బచ్చన్నపేట మండలం కట్కూర్కు చెందిన మూసిన బాబుగౌడ్ కోరుతున్నారు. -
అవతరణ వేడుకలకు సర్వం సిద్ధం
జనగామ: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో సర్వం సిద్ధం చేశారు. ఆదివారం డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండేరి చేతన్నితిన్తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు చెందిన పలు శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య హాజరు కానున్నారు. ఉదయం 9.45 గంటలకు వేడుకల ప్రాంగణానికి చేరుకుని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివా ళులర్పిస్తారు. 10 నుంచి 10.10 గంటల లోపు జాతీ య జెండాను ఆవిష్కరించిన తర్వాత, పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. 10.10 నుంచి 10.30 గంటల వరకు జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై బీర్ల అయిలయ్య ప్రసంగించనున్నారు. అనంతరం పలు సాంసృతిక కార్యక్రమాలు, బహుమతులు అందజేస్తారు. ఇందిరమ్మ ఇళ్ల అర్హులకు ఉత్తర్వుల కాపీలు.. జూన్ 2 పురస్కరించుకుని నేడు (సోమవారం) ఇందిరమ్మ ఇళ్ల ఉత్తర్వుల కాపీలను అతిథుల చేతులు మీదుగా అందిస్తారని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలి పారు. జనగామ నియోజకవర్గానికి సంబంధించి సాయిరాం ఫంక్షన్ హాల్, స్టేషన్ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని పాలకుర్తి రోడ్డు సిరిపురం గార్డెన్, పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలోని దశరథ గార్డెన్లో అతిథుల చేతులమీదుగా ఇందిరమ్మ ఇళ్ల ఉత్తర్వు కాపీలను అందిస్తారన్నారు. ముఖ్యఅతిథిగా హాజరు కానున్న ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ -
సోమవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2025
జనగామ: రేషన్ సన్నబియ్యం పంపిణీలో కొత్త చికొచ్చి పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిరుపేదలకు అందించే సన్నబియ్యం పంపిణీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలం సీజన్ నేపథ్యంలో ఈనెల నుంచి ఒకేసారి మూడు నెలల కోటాను అందిస్తున్నారు. గతంలో ఒక్క వేలి ముద్రతో ఐదు నిమిషాల్లో బియ్యం పంపిణీ ప్రక్రియ ముగిసేది. మూడు నెలల బియ్యం ఇచ్చే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వేర్వేరుగా వేలి ముద్ర తీసుకుని కాంటా వేయడంతో తీవ్ర జాప్యానికి కారణమైంది. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి బియ్యం పంపిణీ పూర్తి చేసేసరికి అరగంటకు పైగా సమయం పడుతుంది. ఈ సమస్యతో జిల్లాలో మొదటి రోజు ఎక్కడా 10 శాతం బియ్యం పంపిణీ కాలేదు. సమస్య ఎక్కడంటే.. రేషన్ లబ్ధిదారులకు జూన్ మాసం నుంచి మూడు నెలలకు సరిపడా సన్నబియ్యం ఒకేసారి ఇస్తున్నారు. కేంద్రం 5 కిలోలు, రాష్ట్రంలో కిలో చొప్పున ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల బియ్యం అందిస్తోంది. మూడు నెలల కోటాకు సంబంధించి రేషన్ డీలర్లు లబ్ధిదారుడి నుంచి నెలవారి చొప్పున కేంద్రం, రాష్ట్రం అందించే బియ్యానికి సంబంధించి వేర్వేరుగా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆరు సార్లు తీసుకోవాలి. ఇదే సమయంలో ఈ–పాస్ మిషన్లో సాంకేతిక లోపం, పదిహేను నిమిషా లకు ఒకసారి లాగ్అవుట్ కావడంతో డీలర్లకు బి య్యం పంపిణీ కత్తిమీద సాములా మారిపోయింది. లింగాలఘణపురం మండలంలోని ఓ రేషన్ షాపు లో ఆదివారం ఉదయం 7 గంటలకు బియ్యం పంపిణీ ప్రారంభించగా...మధ్యాహ్నం 3 గంటల వర కు 20 మందికి పంపిణీ చేయలేకపోయారు. కొన్ని చోట్ల లబ్ధిదారులు గంటల తరబడి నిరీక్షించి ఓపిక లేక వెళ్లిపోతే, డీలర్లు సైతం దుకాణాలను మూసి వేశారు. చిల్పూరు మండల పరిధిలో 9 రేషన్ దుకాణాల్లో ఈ–పాస్లో సాంకేతిక లోపంతో పంపిణీ నేటికి (సోమవారం) వాయిదా వేశా రు. ఈ పాస్లో 3.2 వెర్షన్ ఎలక్ట్రానిక్ కాంటాకు బ్లూటూత్ కనెక్షన్తో సమస్య తీవ్రమవుతోంది. ఈ వెర్షన్తో పాటు కాంటాకు బ్లూటూత్ అనుసంధానాన్ని తొలగించాలని మెజార్టీ డీలర్లు కోరుతున్నారు. రేషన్ షాపులకు చేరుకున్న సరుకు జిల్లాలో 335 రేషన్ దుకాణాలు ఉండగా, మూడు నెలల సన్నబియ్యం కోటా 90,140 క్వింటాళ్లు కేటాయించారు. ఇందులో ఇప్పటివరకు 175 షాపులకు 24,336 క్వింటాళ్ల సన్నబియ్యం పంపించగా, ఇంకా 165 దుకాణాలకు 65,810 క్వింటాళ్ల సరుకు పోవాల్సి ఉంది. ఆరుసార్లు వేలిముద్ర వేశా.. రేషన్ బియ్యం తీసుకెళ్తామని తండా నుంచి మండల కేంద్రానికి వస్తే బియ్యం తీసుకునేందుకు రెండు గంటల సమయం పట్టింది. నెలకు 30 కిలోల చొప్పున 3 నెలలకు సంబంధించి 90 కిలోల బియ్యం తీసుకునేందుకు ఆరుసార్లు వేలిముద్ర వేశా. – గుగులోత్ స్వామి, గుమ్ముల బండ తండా, కొడకండ్లఇబ్బందిగా ఉంది.. ప్రభుత్వం చేపట్టిన రేషన్ లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ రేషన్ డీలర్లకు తలనొప్పిగా మారింది. నూతన సాఫ్ట్వేర్ డౌన్లోడ్ సమస్యగా ఉంది. మూడు నెలల బియ్యానికి కేంద్ర ప్రభుత్వానికి మూడుసార్లు, రాష్ట్ర ప్రభుత్వానికి మూడు సార్లు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మాదిరిగా ఇలాంటి పద్ధతులను డీలర్లకు చెప్పడం బాధాకరం. – గట్టు మొగిళిగౌడ్, డీలర్ల సంఘం డివిజన్ అధ్యక్షుడు, స్టేషన్ఘన్పూర్అరగంట సమయం పడుతుంది.. ఒకేసారి మూడునెలల బియ్యం ఇవ్వడంతో ఒక్కొక్క కార్డు హోల్డ ర్కు అరగంటకు పైగా సమయం పడుతోంది. కేంద్రం అందించే ఐదు కిలోలు, రాష్ట్రం ఇచ్చే ఒక కిలో బియ్యానికి వేర్వేరుగా వేలిముద్ర తీసుకుంటున్నాం. పైగా బియ్యం పంపిణీ చేసే సమయంలో యాప్ మోరాయిస్తుంది. – వల్లాల ప్రసన్న, రేషన్ డీలర్, గోపాల్నగర్, బచ్చన్నపేట●న్యూస్రీల్ -
నిబంధనల మేరకు పంట రుణాలివ్వాలి
స్టేషన్ఘన్పూర్: స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రిజర్వ్ బ్యాంకు నిబంధనల మేరకు రైతులకు పంట రుణాలు అందించాలని తెలంగాణ రైతు సంఘం జి ల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య డి మాండ్ చేశారు. రైతాంగ సమస్యల పరి ష్కారానికి తెలంగాణ రైతు సంఘం ఆ ధ్వర్యంలో ఈనెల 5, 6వ తేదీల్లో బ్యాంకుల ఎదుట ధర్నాలు, 11న తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని మండలంలోని ఇప్పగూడెంలో ఆదివారం చేపట్టారు. రైతు సంఘం మండల కార్యదర్శి లింగనబోయిన కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన సోమయ్య మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతులు, రైతు సంఘం బాధ్యులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాసు ప్రభాకర్, ఎల్.సుధాకర్, బక్క సోమయ్య, కుమార్, గట్టయ్య, మంకయ్య, ఉప్పలయ్య, గోపయ్య, గట్టుమల్లు, లక్ష్మయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
పాలకుర్తిలో ఉద్రిక్తత.. కాంగ్రెస్-బీఆర్ఎస్ల మధ్య ఘర్షణ
జనగామ: జిల్లాలోని పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు అంశం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్ శ్రేణులు కొత్త నమూనా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాలనే ప్రయత్నం చేస్తుండగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. పాత నమూనా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. దాంతో ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్-బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అక్కడ భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకోవడంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో పాలకుర్తిలో పోలీసులను మోహరించి పరిస్థితిని చక్కదిద్దే యత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య కూడా తోపులాట చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెపట్టాయి. దాంతో పోలీసులను భారీగా మోహరించారు. -
పొదుపు.. భవిష్యత్కు మలుపు
కాజీపేట: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)ను గతంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే అనుకునేవారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్వావలంబన్ పథకం’కు గృహిణి నుంచి కూలీ పని చేసుకునే ప్రతి ఒక్కరూ అర్హులు. ఈ పథకంలో చేరడం వల్ల వృద్ధాప్యంలో పెన్షన్ పొందే అవకాశం ఉంది. ప్రస్తుత రోజూవారీ ఖర్చులను అధిగమించడం కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో సంపాదించే వయసులోనే ఎలాంటి పొదుపు చేకుండా ఉంటే వృద్ధాప్యంలో ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఎంతో మంది వృద్ధ తల్లిదండ్రులను జీవిత చరమాంకంలో కొడుకులు పట్టించుకోకపోవడం ప్రస్తుతం చూస్తున్నాం. ఆసరా కరువై.. పనిచేసే శక్తిలేక.. ఆర్థిక అండ కరువై ఎంతోమంది వృద్ధులు దుర్భరంగా బతుకుతున్నారు. వయసు పెరగడంతో పాటు జీవన వ్యయాలు కూడా పెరుగుతున్నాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ఆర్థికంగా స్వాతంత్య్రం ఉండాలి. అందుకే ‘స్వావలంబన్’ యోజన పథకంలో చేరితే చక్కటి ఫలితంగా ఉంటుంది. వయసులో ఉన్న సమయంలో చేసిన పొదుపు.. వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవంగా జీవించేందుకు అవకాశం కల్పిస్తుంది. పింఛన్ ఇలా పొందుతారు.. ఖాతాదారుడి వయస్సు 60 ఏళ్ల నిండిన వెంటనే తాము జమచేసిన డబ్బు మొత్తం 60 శాతం నగదును ఒకేమారు చెల్లిస్తారు. మిగతా 40శాతం వారి ఖాతాలో అలాగే ఉంచి, దానిపై వచ్చే రాబడిని జీవితాంతం ప్రతీనెలా పింఛన్ రూపంలో చెల్లిస్తారు. ఖాతాదారుడు మరణిస్తే అప్పటివరకు ఖాతాలో పొదుపు చేసిన మొత్తం నిధిని వారి నామినీకి అందిస్తారు. 60 ఏళ్ల తర్వాత పింఛన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే ఖాతాలో నిల్వ ఉన్న 40శాతం సొమ్మును కూడా వారికే అందజేస్తారు. ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మండలస్థాయి కోఆర్డినేటర్లను నియమించినా ఆశించిన ఫలితాలు రావడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో ప్రయోజనకరంగా ఉన్న ఈ పథకానికి సరైన ప్రచారం చేస్తే మరింత ఉపయోగం ఉంటుంది. టోల్ఫ్రీ నంబర్ 1800–110708కు ఫోన్చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.‘స్వావలంబన్ యోజనతో’ వృద్ధాప్యంలో ఆర్థిక అండ 18 నుంచి 60 ఏళ్ల వారు అర్హులు కేంద్ర ప్రభుత్వ పథకంతో భవిష్యత్కు ఆర్థిక ధీమాస్వావలంబన్తో ప్రయోజనాలు.. వృద్ధాప్యంలో పింఛన్ అందజేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 18 నుంచి 60 ఏళ్ల వయసున్న భారతీయ పౌరులందరూ ఈ ఖాతాను తెరిచేందుకు అర్హులు. ప్రతీ పౌరుడు ఏడాదిలో కనీసం రూ.వెయ్యి నుంచి రూ. 2వేలకు తగ్గకుండా పొదుపు చేయాలి. ప్రభుత్వం ఏటా రూ.600 కలుపుతుంది. ప్రతీ ఖాతాదారుడికి ఫొటోతో పాటు పాన్కార్డు (పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్)ను ఇస్తుంది. ఈ కార్డుతో ఎన్పీఎస్లో సభ్యత్వం ఉన్నట్లు గుర్తించొచ్చు. ఖాతా తెరిచిన 45 రోజుల్లో ఈ కార్డును పొందొచ్చు.నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్వావలంబన్ యోజన పథకం’ వృద్ధాప్యంలో ఆర్థికంగా అండగా నిలవనుంది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి దేశంలోని సామాన్యులు సైతం 60 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్ పొందేందుకు కేంద్రం ఈ అవకాశం కల్పించింది. బడుగు, బలహీన వర్గాల వారితోపాటు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ఆటో, ట్యాక్సీ, లారీ డ్రైవర్లు, ఇతర ప్రైవేట్ ఉద్యోగులు, చిన్న,పెద్ద వ్యాపారులు ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. వయసులో చేసిన పొదుపు.. వృద్ధాప్యంలో అండగా నిలవనుంది. స్వావలంబన్ యోజన విశిష్టత.. ప్రభుత్వ ఉద్యోగులకు కాకుండా దేశంలోని సామాన్యులు కూడా 60 ఏళ్ల తర్వాత వృద్ధాప్యంలో పెన్షన్ పొందేందుకు కేంద్రప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా 2009లో ‘జాతీయ పెన్షన్ స్వావలంబన్ యోజన పథకం’ను ప్రారంభించింది. -
డల్లాస్ సభ చరిత్రలో నిలిచిపోతుంది
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ: అమెరికా డల్లాస్లో నేడు(ఆది వారం) నిర్వహించే సభ చరిత్రలో నిలిచి పోతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని డల్లాస్లో నిర్వహించే సభ ఏర్పాట్లను శనివారం పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులకు ఫోన్ ద్వారా సందేశం పంపించారు. కేసీఆర్ ముందు చూపు, ఆలోచన విధానానికి ప్రస్తుత రాజకీయాల్లో ఆయనకు సాటి ఎవరూ లేరన్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటి సారి నిర్వహించిన కరీంనగర్ శంఖారావం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రికార్డు సృష్టించిందని చెప్పారు. ఇటీవలి ఎల్కతుర్తి సభకు లక్షలాదిగా జనం వచ్చి విజయవంతం చేశారని, ఆ సభ తర్వాత ప్రజలకు కేసీఆర్, బీఆర్ఎస్పై నమ్మకం మరింత పెరిగిందన్నారు. ఎల్కతుర్తి సభ సక్సెస్ను స్వాగతిస్తూ డల్లాస్ సభకు ప్లాన్ చేసినట్లు వివరించారు. ఈ సభకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు హాజరుకానున్నారని, అన్ని వర్గాల వారు పాల్గొని విజ యవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
వైభవంగా వార కల్యాణం
చిల్పూరు: శ్రీ బుగులు వెంకటేశ్వరస్వామి సన్నిధిలో శనివారం వార కల్యాణాన్ని అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచా ర్యులు వైభవంగా నిర్వహించారు. హనుమకొండకు చెందిన అడెపు శ్రీనగేష్–శ్వేత, పింగిళి మధుపాల్రెడ్డి–ప్రేమలత భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్ తదితరులు పాల్గొన్నారు. తాళ్లపెల్లి నరేష్గౌడ్కు డాక్టరేట్జఫర్గఢ్: షాపల్లికి చెంది న తాళ్లపెల్లి నరేష్గౌడ్కు కాకతీయ విశ్వవిద్యాల యం డాక్టరేట్ ప్రకటించింది. ‘స్టేట్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏ స్టడీ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ’ అనే అంశంపై పొలిటికల్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ పోరిక సమ్మూలాల్ పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేసినందుకు డాక్టరేట్ ప్రకటించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. కూచిపూడిలో ఆదిత్రి ప్రతిభచిల్పూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిలకలూరిపేట కళా నిలయం వారు ఇటీవల నిర్వహించిన 40వ అంతర్జాతీయ నృత్యకళా పోటీల్లో చిల్పూరు మండలం వెంకటాద్రిపేటకు చెందిన ఏమాండ్ల రాజనర్సింహారెడ్డి–రమ దంపతుల కూతురు ఆదిత్రిరెడ్డి కూచిపూడి చంద్ర కేటగిరి(5 నుంచి 14 ఏళ్ల లోపు)లో స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది. ఆదిత్రి ప్రస్తుతం కరీంనగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. ఈ సందర్భంగా ఆమెను గ్రామానికి చెందిన చల్లా రాజమహేందర్రెడ్డి, కందుల రఘుపతి, జంగం యాదగిరి, ఎన్నకూస కుమార్, వలబోజు బ్రహ్మచారి, గుర్రపు విజయ్కుమార్, చొల్లేటి రాజేశ్వరశర్మ తదితరులు అభినందించారు. -
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
పాలకుర్తి టౌన్: మండల కేంద్రం రాజీవ్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు అంశం ఘర్షణకు దారితీసింది. రోడ్డు విస్తరణలో భాగంగా చౌరస్తాలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న, తెలంగాణ తల్లి విగ్రహాలను రెండేళ్ల క్రితం తొలగించి పోలీస్టేషన్లో భద్రపరిచారు. పనులు పూర్తయ్యాక చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న విగ్రహాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన గద్దైపెనే నూతనంగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ నాయకులు శనివారం స్లాబ్ వేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు వచ్చి తమ ప్రభుత్వం రూపొందించిన పాత విగ్రహమే ఏర్పాటు చేయాలని స్లాబ్ను కూల్చివేశారు. సమాచారం అందుకున్న వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని నాయకులను చెదరగొట్టారు. దీంతో అదే ప్రదేశంలో బైఠాయించి నిరసన తెలుపగా కొందరిని అరెస్ట్ చేశా రు. ఈ క్రమంలో స్లాబ్ కూల్చిన ప్రదేశంలో కాంగ్రెస్ నాయకులు పనులను పునరుద్ధరించడానికి పూనుకోగా బీఆర్ఎస్ నాయకులు చేరుకున్నారు. ఇరువర్గాలు కర్రలతో దాడి చేసుకోవడానికి సిద్ధమవగా పోలీసులు వారిని చెదరగొట్టారు. అనంతరం బందోబస్తు మధ్య స్లాబ్ పనులు తిరిగి మొదలు పెట్టారు. ఈ ఘటన నేపథ్యంలో గంట పాటు ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పసునూని నవీన్, మాజీ జెడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్రావు, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ బొబ్బాల అశోక్రెడ్డి మాట్లాడుతూ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశామని, దానిపై కాంగ్రెస్ నాయకులు కొత్త విగ్రహం ఏర్పా టు చేస్తే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయులు సురేష్నాయక్, మహేందర్, పాపారావు, బాలు నాయక్, దిండిగాల వెంకన్న, బెల్లి సోమన్న తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటులో వివాదం కొత్త విగ్రహం ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్.. పాత విగ్రహమే కావాలన్న బీఆర్ఎస్ నాయకులు స్లాబ్ నిర్మాణం కూల్చివేత.. ఇరువర్గాల ఘర్షణ.. పరిస్థితి ఉద్రిక్తం -
పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి
జనగామ రూరల్: యువత పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి ఇ.సుచరిత అన్నారు. శనివారం కోర్టు హాల్లో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. పొగాకు వినియోగంతో ముఖ్యంగా మౌత్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, కిడ్నీలు పాడై డయాలసిస్ వరకు వెళ్తున్నారని చెప్పారు. ఇంట్లోని పెద్దలు, ఫ్రెండ్స్తోపాటు సినిమాల ప్రభావం కారణంగా పొగాకు అలవాటుగా మారుతోందన్నారు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ఎక్సర్సైజ్, యోగా, వాకింగ్, రన్నింగ్ చేయాలని సూచించారు. డాక్టర్ కమలహాసన్ మాట్లాడుతూ.. 15 ఏళ్ల క్రితం 100 మందిలో ఇద్దరు లేదా ముగ్గురికి క్యాన్సర్ వచ్చేదని, ఇప్పుడు ఆ స్థాయి ఎక్కువగా పెరిగిందన్నారు. ఇందు కు పొగాకు ఎక్కువగా వాడటమే కారణమని పేర్కొన్నారు. అంతకు మందు విద్యార్థులు పారాలీగల్ వలంటీర్లతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.సందీప, లీగలైట్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ ఎం.రవీంద్ర, సోషల్ వర్కర్ ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఆస్పత్రిలో.. పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ర్యాలీ అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎన్సీడీ డాక్టర్ సుధీర్, డాక్టర్ కర్ణాకర్ రాజు, డాక్టర్ మధుకర్, డాక్టర్ కమలహాసన్, ఎన్సీడీ కోఆర్డినేటర్ రాజబాబు, భూక్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సివిల్ జడ్జి సుచరిత -
‘పుష్కరాల’ చెత్త తొలగింపు ఏదీ!
కాళేశ్వరం: గత నెల 15 నుంచి 26వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరిగిన సరస్వతీనది పుష్కరాల్లో చెత్త తొలగింపుపై పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. గోదావరిలోని ఖాళీ వాటర్ బాటిళ్లు, వ్యర్థాలు తొలగించడం లేదు. దీంతో పశువులు అందులోని వ్యర్థాలు, ప్లాస్టిక్ను తింటున్నా యి. ఫలితంగా పశువులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇదే కాకుండా అన్నదానసత్రాలు, హోటళ్లు, ఇతర వ్యాపారాలు నిర్వహించిన ప్రాంతాల్లో వ్యర్థాలు కుళ్లి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో వర్షాకాలంలో దోమలు వ్యాప్తి చెంది, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికై నా అధి కారులు స్పందించి దోమలు వ్యాప్తి చెందకుండా చెత్తను తొలగించి, అన్ని వార్డుల్లో రెండు రోజులకు ఒక్కసారి వారం పాటు బ్లీచింగ్ ఫౌడర్ చల్లాలని గ్రామస్తులు పేర్కొంటున్నారు. పారిశుద్ధ్యంపై తక్షణ చర్యలు తీసుకుని దుర్గంధం వెదజల్ల కుండా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. -
ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025
చిన్న పెండ్యాల గ్రామంలో సుమారు 250 కుటుంబాలు ఉంటాయి. వీరి ప్రధాన జీవనాధారం వ్యవసాయం, కులవృత్తులు. మబ్బుల్నే నిద్రనుంచి లేవడం, పొలంబాట పట్టడం, వ్యవసాయ పనులు చేసుకుని సాయంత్రానికి ఇంటికి చేరడం వీరి రోజువారీ విధి. వరంగల్, జనగామ, మహా అంటే హైదరాబాద్ తప్ప ఇతర పెద్ద నగరానికి వెళ్లింది లేదు. బస్సు, కారు తప్ప ఇతర వాహనం ఎక్కింది లేదు. కానీ వారిలోని ఐక్యమత్యం.. వారిని రాష్ట్రం దాటించింది. ఎప్పుడూ ఆకాశంలో వెళ్తుంటే చూసిన విమానాన్ని సైతం తమ దరికి చేర్చింది. పరపతి సంఘాల ఏర్పాటుతో రూపాయి, రూపాయి పొదుపు చేసుకుని అందులోనుంచే ఖర్చు చేసి విమానాన్ని ఎక్కారు. ఎప్పుడూ చూడలేమనుకున్న అనేక ప్రాంతాలను చుట్టివచ్చారు. ఈ గ్రామంలో మొత్తం కలిపి 22 పరపతి సంఘాల దాకా ఉంటాయి. అందులో పెద్దవి ఐదు (చైతన్య, ప్రగతి, శ్రీలక్ష్మీ, సిరి, శ్రీ గణేశ్) ఉన్నాయి. ఇందులో అన్ని కులాలు, వృత్తుల వారు సభ్యులుగా ఉన్నారు. ప్రతీ సభ్యుడు నెలకు రూ.100 వేసుకుంటున్నారు. ప్రతీ నెల ఒకరు ఎత్తుకుని 1 పర్సంట్ చొప్పున వడ్డీ కడతారు. ఇలా కొన్నేళ్లుగా జమచేసిన డబ్బులే వారి ఆర్థికప్రగతికి సహకారం అందిస్తున్నాయి. ● పరపతి సంఘం ద్వారా సామాన్యుల విమానయానం ● కల నెరవేర్చుకున్న రైతులు, కూలీలు, వృత్తిదారులు ● కుటుంబ సమేతంగా ఛార్ధామ్, ఆగ్రా, కాశీ విహారయాత్రలు ● దేశాన్ని చుట్టివస్తున్న చిన్నపెండ్యాల గ్రామస్తులు విమానం పోతుంటే చూసేటోడిని..నా కులవృత్తి తాళ్లు ఎక్కడం. రోజూ ఉదయం, సాయంత్రం తాటిచెట్లు ఎక్కి కల్లు అమ్ముకుంటాం. బయటి ఊర్లకు ఎక్కువగా వెళ్లింది లేదు. ఎప్పుడైనా ఆకాశంలో విమానం వెళ్తుంటే తాటిచెట్టుపైనుంచి చూసేటోడిని. కానీ ఆ విమానం నేను ఎక్కగలనా.. అనుకున్నా. ఆ కల నెరవేరింది. పరపతి సంఘం ద్వారా సభ్యులంతా కుటుంబంతో కలిసి ఛార్ధామ్యాత్రకు విమానంలో వెళ్లాం. మొదటిసారి విమానం ఎక్కినప్పుడు ఎంతో సంతోషం వేసింది. – గీసగోని రాజయ్య, గీతకార్మికుడు ప్రముఖులెవరైనా సభకో, సమావేశానికో వస్తే వాళ్లంతా వరుసకట్టేవారు. వారి మాటలు వినడానికో, సమావేశంలో పాల్గొనడానికో కాదు.. వారిని తీసుకొచ్చిన హెలికాప్టర్ను చూడ్డానికి.. అది కూడా అరకిలోమీటరు దూరం నుంచి.. జీవితంలో ఒక్కసారైనా కనీసం వాటిని తాకుతామా? అని ఆలోచించేవారు. కానీ చిన్నమొత్తాల పొదుపే వారిని ఆకాశంలో విహరించేలా చేసింది. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామస్తుల కలలకు రెక్కలు తొడిగింది. గాల్లో వెళ్తుంటే బాగుంది..గ్రామంలో రోజూ కూలి పనికి వెళ్తా. వరినాట్లు, ఇతర వ్యవసాయ పనులకు వెళ్తుంటా. మేం పరపతి సంఘంలో సభ్యులుగా చేరాం. అందరితో కలిసి విమానం ఎక్కిన తర్వాత మొదట కొంచెం భయం వేసింది. ఆ తర్వాత గాల్లో వెళ్తుంటే బాగుంది. యాత్రలో అందరితో కలిసి పడవ ఎక్కినం, స్టీమర్ ఎక్కినం. ఛార్ధామ్ యాత్రలో గుర్రాలు ఎక్కినం. పరపతి సంఘం ద్వారా ఇదంతా సాధ్యమైంది. – రామగిరి సరోజ, వ్యవసాయ కూలీ, చిన్నపెండ్యాల అందరి కృషి.. పల్లెటూరి వాళ్లను కంపల్సరీ ఫ్లైట్ ఎక్కించాలని అనుకున్నాం. అందుకు ఏం చేయాలని మీటింగ్ పెట్టి నిర్ణయించుకున్నాం. డబ్బులు సమకూర్చుకున్నాం. అనుకున్నట్లుగానే టూర్కు వెళ్లాం. ఛార్ధామ్ యాత్రకు వెళ్లాం. ఇది మా అందరి కృషి. రోజూ కూలీ పని చేసే వాళ్లం. విమానాశ్రయానికి వెళ్లాక అందరి కళ్లు ఆనందభాష్పాలను రాల్చాయి. – చావ కుమారస్వామి, మల్లారెడ్డి, సంఘం సభ్యులు చిన్నపెండ్యాల సెల్ఫీ తీసుకుని మురిసిపోయా.. గ్రామంలో అందరం కుటుంబ సభ్యుల్లా ఉంటాం. గ్రామం దాటి బయటికి వెళ్లింది లేదు. కానీ, పరపతి సంఘం ద్వారా ఫ్లైట్ ఎక్కినం. మొదటిసారి విమానం ఎక్కిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. నేను, నా భార్య విమానంలో సెల్ఫీ తీసుకుని మా బంధువులకు పంపి ఆనందపడ్డాం. ఈసారి పూరి జగన్నాథ్యాత్రకు వెళ్దామనుకుంటున్నాం. – కీర్తిసత్యం, గ్రామస్తుడు, చిన్నపెండ్యాల పరపతి సంఘాల సభ్యులంతా 2023లో కాశీకి వెళ్లాలనుకున్నారు. ‘రెక్కల కష్టం నమ్ముకున్నాం.. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కుదాం’.. అని సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. 50 కుటుంబాలు (భార్యాభర్త) విమాన ప్రయాణానికి ఎంత ఖర్చు అవుతుందని సంబంధిత టూర్స్, ట్రావెల్స్ వాళ్లను అడగగా రూ.20 నుంచి రూ.24 లక్షలు అవుతుందని చెప్పారు. ఇందుకు అవసరమైన డబ్బుల కోసం కమిట్మెంట్ చిట్టీలు వేసుకుని రూ.20 లక్షలు పోగేసుకున్నారు. చేతి ఖర్చుకు ఒక్కో కుటుంబం రూ.10 వేల వరకు దగ్గర ఉంచుకుంది. ఇంకేముంది వారనుకున్న విమానయాన కల నెరవేరింది. ఇలా ఒక్కసారి కాదు.. ఇప్పటికే ఐదుసార్లు తమ కలను నెరవేర్చుకున్నారు. ఆలోచన వచ్చిందిలా.. గ్రామ పరపతి సంఘాల సభ్యులు ఇప్పటివరకు ఛార్ధామ్, కాశీ టూర్, రామేశ్వరం, ఢిల్లీ, ఆగ్రా యాత్రలకు వెళ్లారు. హనుమకొండలోని నగరంలోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్కు డబ్బులిస్తే వాళ్లు మొత్తం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లి.. అక్కడ ప్రత్యేకంగా బస్సు మాట్లాడుకుని ప్రదేశాలకు తిరిగారు. ఆవిమానం మొత్తం ఒకే ఊరు వాళ్లు ఉండడం.. మొదటిసారి విమానం ఎక్కిన వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. న్యూస్రీల్పరపతి సంఘాలు.. ఐకమత్యానికి నాంది ఎక్కడికెళ్లినా ఫ్యామిలీతోనే.. -
మేడారం ఈఓగా వీరస్వామి
హన్మకొండ కల్చరల్: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఈఓగా మేకల వీరస్వామి బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ, ధర్మదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు మేరకు శనివారం వరంగల్లోని ధర్మిక భవన్లోని మేడారం సమ్మక్క , సారలమ్మ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈఓ మేకల వీరస్వామికి వరంగల్ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ రామల సునీత, తెలంగాణ అర్చక ఉద్యోగ జాక్ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, ఉద్యోగ విరమణ పొందిన మేడారం సమ్మ క్క, సారలమ్మ జాతర ఈఓ రాజేంద్రం, మరో ఆలయ ఈఓ వేణుగోపాల్ను ఘ నంగా సన్మానించారు. కా ర్యక్రమంలో అర్చక సమాఖ్య రాష్ట ప్రధాన కార్యదర్శి తనుగుల రత్నాకర్, ఈఓలు అద్దంకి నాగేశ్వరరావు, వెంకటయ్య, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు -
సమన్వయంతోనే పుష్కరాలు సక్సెస్
భూపాలపల్లి: అధికారులు, ప్రజల సమన్వయంతోనే సరస్వతీనది పుష్కరాలు విజయవంతమయ్యాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్లో కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన నిర్వహించిన ‘సరస్వతి పుష్కరాలు ఎ డే ఆఫ్ థాంక్స్’ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే మార్గనిర్దేశంలో 33 శాఖలకు చెందిన అటెండర్ నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ మూడు నెలలు కష్టపడ్డారన్నారు. పుష్కరాల విజయవంతంలో వారి పాత్ర కీలకమని, వారందరికీ అభినందనలు తెలిపారు. పుష్కరాల నిర్వహణ అంత తేలిక కాదని, ఏ చిన్న పొరపాటు జరిగినా, నిర్లక్ష్యంగా ఉన్నా జరిగే నష్టం అంతా ఇంతా కాదన్నారు. కొందరు సరస్వతీనది పుష్కరాలు విజయవంతం కాకుండా చేయాలని కుట్రలు పన్నారని, చిన్న అంశాలను భూతద్దంలో చూపించి తమను బద్నాం చేసేందుకు యత్నించారన్నారు. త్వరలోనే కాళేశ్వరం జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, కాళేశ్వరం, ఇతర ప్రాంతాల్లో కొత్త బస్డిపోల నిర్మాణానికి శ్రీకారం చుడుతామన్నారు. 2027లో జరుగనున్న గోదావరి పుష్కరాలను మరింత వైభవోపేతంగా నిర్వహిస్తామని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు, దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పుష్కరాల విజయవంతానికి కృషి చేశారన్నారు. పుష్కరాలకు వస్తూ రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోయిన వారిని ప్రభుత్వపరంగా ఆదుకోవాలన్నారు. అనంతరం పుష్కరాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన పలు శాఖల అధికారులకు ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ కిరణ్ ఖరే, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అటెండర్ నుంచి రాష్ట్రస్థాయి అధికారి వరకు మూడు నెలలు శ్రమించారు పుష్కరాలు విజయవంతం కావొద్దని కొందరు కుట్రలు పన్నారు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు -
ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి
జనగామ: కలెక్టరేట్ ఆవరణలో జూన్ 2న నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. ఈ మేరకు డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ చేతన్నితిన్తో కలిసి ఆయన శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. జాతీయ జెండా ఆవిష్కరణ, ప్రముఖులు, మీడియా, అతిథుల కోసం ఏర్పాటు చేసే గ్యాలరీ ప్రాంతాన్ని సందర్శించి.. వేదిక, అలంకరణ, సౌండ్ సిస్టం, తాగునీటి సదుపాయంపై అధికారులకు సూచనలు చేశారు. పోలీసుల గౌరవ వందనం, బందోబస్తుకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ గోపీరాం, ఉద్యానవన అధికారి శ్రీధర్రావు, తహసీల్దార్ హుస్సేన్, కలెక్టరేట్ ఏఓ మన్సూర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పిల్లలకు ఉచిత స్వర్ణ ప్రాశనజనగామ: జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్డులోని వేద ఆయుర్వేదిక్ పంచకర్మ, వెల్నెస్ సెంటర్లో శనివారం ఉచిత స్వర్ణ ప్రాశన కార్యక్రమాన్ని కలెక్టర్ రిజ్వాన్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అంజిరెడ్డి మాట్లాడుతూ.. స్వర్ణ ప్రాశన తీసుకోవడం వల్ల పిల్లల్లో రోగనిరోధక, మేధాశక్తి, ఎముకల పటిష్టత, జీర్ణశక్తి పెరుగుతుందన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
సమాజం అండదండలతోనే ‘పద్మశ్రీ’
హన్మకొండ అర్బన్ : సమాజం అండదండలతోనే తనకు ‘పద్మశ్రీ’ అవార్డు లభించిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న అనంతరం శనివారం వరంగల్ చేరుకున్నారు. రైల్వేస్టేషన్లో ఎమ్మార్పీస్ శ్రేణులు, ఇతర సంఘాల నాయకులు మంద కృష్ణ దంపతులను భారీ గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వరంగల్ రైల్వే స్టేషన్లో, రాత్రి హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో పద్మశ్రీ మంద కృష్ణమాదిగ మాట్లాడారు. ఈ సంవత్సరంలో ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితంగా వర్గీకరణ సాధించడం, తనకు పద్మశ్రీ పురస్కా రం రావడం మాదిగజాతికి గర్వకారణమన్నారు. ఈ గౌరవం తనకు మాత్రమే కాకుండా తనకు ఉద్యమంలో అన్ని విధాలా సహకరించిన సమాజానికి కూడా అన్నారు. మూడు దశాబ్దాల ఉద్యమ పోరాటంలో అనేక ఒడిదొడుకులు ఎదురైనా ధైర్యంగా బరిలో నిలిచి లక్ష్యం సాధించామన్నారు. ప్రధాని, ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు .. వర్గీకరణ విషయంలో ముందుండి నడిపిన ప్రధాని మోదీ, సహకరించిన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్రెడ్డి, చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలి పారు. ఇది మాదిగ జాతి ఉద్యమ విజయానికి నిదర్శమన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకునిపోతూ వర్గీకరణ సాధించామన్నారు. ఈక్రమంలో అనేక వర్గాలు సహకరించాయన్నారు. రా నున్న రోజుల్లో వారి అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. కాళోజీ కళాక్షేత్రంలో జాతీయ కార్యవర్గ సమావేశం.. వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి సుమారు 11గంటల ప్రాంతంలో హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రానికి చేరుకున్నారు. తెలంగాణ, ఏపీ ఎమ్మార్పీస్ నేతలు, ఇతర ప్రజాసంఘాల ఆఽధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణను సన్మానించారు. అనంతరం ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో మందకృష్ణను అభినందిస్తూ తీర్మానంచేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు మాదిగ, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధ్యుక్షులు గోవిందు నరేశ్ మాదిగ, రుద్రపోగు సురేశ్ మాదిగ, జాతీయ నేత మంద కుమార్ మాదిగ, బొడ్డు దయాకర్, నరేంద్ర, బొర్ర భిక్షపతి, బుర్రి సతీశ్, రవి, గద్దల సుకుమార్, బండారు సురేందర్ తదితరులు పాల్గొన్నారు. మంద కృష్ణమాదిగకు ఘన స్వాగతం ఖిలా వరంగల్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు వరంగల్లో ఘనస్వాగతం పలికారు. మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న ఆయన శనివారం రాత్రి ఏపీ ఎక్స్ప్రెస్ రైలులో వరంగల్ వచ్చారు. రైల్వేస్టేషన్లో దిగిన ఆయనకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పుష్పగుచ్ఛాలు అందించి ఘనస్వాగతం పలికారు. అనంతరం డప్పుచప్పుళ్లు, డీజే మోతలతో రైల్వేస్టేషన్నుంచి హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం వరకు ర్యాలీగా చేరుకున్నారు. వర్గీకరణ స్వప్నం సాకారమమడం ఉద్యమ విజయం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ -
విద్యారంగానికి అధిక ప్రాధాన్యం
స్టేషన్ఘన్పూర్: విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తాను.. ప్రభుత్వ విద్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ఘన్పూర్కు మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను శివునిపల్లిలోని జీఆర్ఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలో తాత్కాలికంగా నిర్వహించనున్నారు. 2025–26 విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే తరగతుల కు సంబంధించి ఏర్పాట్లను కలెక్టర్ రిజ్వాన్బాషాతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల ఏళ్లనాటి కల నెరవేరిందని, వచ్చే ఏడాదిలో డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా సంబంధిత అధికారులు పనిచేయాలని సూచించారు. ఫర్నిచర్, డిజిటల్ బోర్డులు, ఎలక్ట్రిసిటీ, ఫ్యాన్లు, తాగునీరు, టాయిలెట్లు తదితర సౌకర్యాలను నెలరోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రిన్సిపాల్పై ఆగ్రహం డిగ్రీ కళాశాల తరగతి గదులను పరిశీలించడానికి వచ్చిన ఎమ్మెల్యేకు పరిసరాలు అపరిశుభ్రంగా కనిపించాయి. ఫర్నిచర్ చిందరవందరగా ఉండటంతో అసంతప్తి వ్యక్తం చేశారు. ‘ఇలా ఉంటే విద్యార్థులు ఎలా వస్తారు.. కమిట్మెంట్తో పనిచేస్తే చేయాలి.. లేదంటే వెళ్లిపోవచ్చు’ అని ప్రిన్సిపాల్ రాజిరెడ్డిపై ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. కార్యక్రమంలో ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, డిగ్రీ, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ నర్సయ్య, రాజిరెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ లావణ్యశిరీష్రెడ్డి, అధ్యాపకులు సాంబమూర్తి, ప్రేమ్, థామస్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
ముందస్తు బియ్యం వచ్చేశాయ్
జనగామ: రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం వచ్చే మూడునెలల కోటా ఒకేసారి పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వర్షాకాలం నేపథ్యంలో బియ్యం రవాణాలో తలెత్తే సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యాన అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ పర్యవేక్షణలో పౌరసఫరాల శాఖ జూన్, జూలై, ఆగస్టుకు సంబంధించిన సన్న బియ్యం కోటాను జూన్ ఒకటో తేదీ నుంచి పంపిణీకి చర్యలు చేపట్టింది. వర్ష్షాకాలంతో అప్రమత్తం.. వర్షాకాలంలో ఏటా దేశంలోని అనేక ఏజెన్సీ ప్రాంతాల్లో ముందస్తు రేషన్ సరుకులు పంపి ణీ చేయడం గతం నుంచే కొనసాగుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో కల్వర్టులు, చెరువు కట్టలు, మట్టి రహదారులు కోతకు గురై రవాణా వ్యవస్థ స్తభించి పోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసుకుంటూ కేంద్రం రేషన్ సరుకులను ఒకేసారి పంపిణీ చేస్తున్నది. అయితే ఈసారి మాత్రం దేశంలోని అన్ని ప్రాంతాల్లో మూడు నెలలకు సంబంధించిన సరుకులను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసింది. 5,35,689 మంది లబ్ధిదారులు జిల్లాలో 1,63,283 రేషన్ కార్డులు ఉండగా.. 335 రేషన్ దుకాణాలు ఉన్నాయి. లబ్ధిదారులు 5,35,689 మంది ఉండగా.. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున 30,049 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తున్నారు. మూడు నెలలకు సరిపడా 90,147 క్వింటాళ్ల సన్న బియ్యం రేషన్ దుకా ణాలకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 195 దుకాణాలకు 20వేల క్వింటాళ్ల సన్న బియ్యం తరలించారు. వచ్చే నెల 10వ తేదీ వరకు వందశాతం కోటా పంపించేలా ట్రాన్స్పోర్టేషన్ను సిద్ధం చేశారు. పంపిణీ నిబంధనల సడలింపు రేషన్ దుకాణాల ద్వారా మూడు నెలల కోటా సన్న బియ్యం ఒకేసారి తీసుకువెళ్లేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ మేరకు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నా రు. గతంలో 18వ తేదీ వరకు బియ్యం తీసుకుపోయే అవకాశం ఉండగా.. ఈసారి జూన్ 30వ తేదీ వరకు పంపిణీ చేసేలా నిబంధనలను సడలించారు. జూన్ 10 వరకు వందశాతం కోటా.. జిల్లాలో రేషన్ దుకాణాల ద్వారా మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యం ఒకేసారి పంపిణీ చేయబోతున్నాం. ఇప్పటి వరకు 195 రేషన్ దుకాణాలకు బియ్యం వచ్చాయి. 10వ తేదీలోగా అన్ని దుకాణాలకు వందశాతం కోటా వెళ్తుంది. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – హథీరామ్, సివిల్ సప్లయీస్ డీఎంజిల్లాలో రేషన్ వివరాలురేషన్ దుకాణాలు: 335 రేషన్ కార్డులు: 1,63,283 లబ్ధిదారులు: 5,35,689 నెలవారీ కోటా: 30,049 క్వింటాళ్లుమూడు నెలల కోటా ఒకేసారి రేపటి నుంచి పంపిణీ షురూ 195 దుకాణాలకు చేరిన సన్న బియ్యం జూన్ 10వ తేదీ వరకు వందశాతం.. 30వ తేదీ వరకు పంపిణీకి అవకాశం వర్షాకాలం నేపథ్యంలో నిర్ణయం -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
● డీసీపీ రాజమహేంద్రనాయక్ పాలకుర్తి టౌన్: నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలో ని పలు ఎరువులు, పురుగుల మందు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆయన.. సరుకు నాణ్యతా ప్రమాణాలు, స్టాక్ రిజిస్టర్, బిల్బుక్ నిర్వహణ తదితరాలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. రైతులు నాసిరకం విత్తనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎవరికై నా అనుమానం వస్తే వెంటనే వ్యవసాయ విభాగానికి సమాచారం ఇవ్వాలని సూచించారు. తనిఖీలో ఏసీపీ అంబటి నర్సయ్య, వ్యవసాయ అధికారులు రామారావు, పరుశురాంనాయక్, ఏఓ శరత్చంద్ర, ఎస్సై దూలం పవన్కుమార్, లింగా రెడ్డి, పీఎస్సై రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
భూసేకరణ పనులు వేగవంతం చేయాలి
● సమీక్ష సమావేశంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా జనగామ: జిల్లాలో దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలోని భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్తోపాటు ప్యాకేజీ–7 పరిధి నవాబ్పేట రిజర్వాయర్, చీట కోడూరు, అశ్వరావుపల్లి రైట్ మెయిన్ కెనాల్ భూసేకరణ, రైతులకు పరిహారం చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలని చెప్పారు. నేషనల్ హైవే–365బీకి సంబంధించి జనగామ నుంచి సిద్దిపేట జిల్లా దుద్దెడ వరకు భూసేకరణ, నష్ట పరిహారం చెల్లింపు ల విషయంలో ఆలస్యం చేయొద్దన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ రోహిత్సింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఇరిగేషన్, ఎన్హెచ్ అధికారులు పాల్గొన్నారు. వైద్య సేవల్లో మొదటి స్థానంలో నిలపాలి ● డీహెచ్ డాక్టర్ రవీందర్నాయక్ జనగామ: వైద్య సేవల్లో జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబెట్టేలా కృషి చేయాల ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్(డీహెచ్) డాక్టర్ బి.రవీందర్నాయక్ అన్నా రు. కలెక్టరేట్లోని జిల్లా వైద్యాధికారి కార్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. అంతకు ముందు డీఎంహెచ్ఓ, డిప్యూటీ డీఎంహెచ్ఓ, ప్రోగ్రాం ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీహెచ్ మాట్లాడుతూ.. టీబీ కార్యక్రమాలకు సంబంధించి నోటిఫికేషన్లు పెంచాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు. వ్యాధులు ప్రభలకుండా ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలతో ఫీవర్ సర్వే చేయించాలని సూచించారు. డీఎంహెచ్ఓ, ప్రోగ్రాం అధికారులు ఎప్పటికప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు సబ్ సెంటర్లను సందర్శించాలని పేర్కొన్నారు. -
దుబాయిలో ‘తెలంగాణ’ వేడుకలు
● 8 మంది కళాకారులకు ఆహ్వానం జనగామ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు దుబాయి వేదిక కానుంది. తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్, అబుదాబి గవర్నమెంట్ సంయుక్త ఆధ్వర్యంలో టీజీ ఫార్మేష న్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జూన్ ఒకటో తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ప్రదర్శనలకు కళాకారులను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ చొరవతో ఉస్తాద్ బిసిమిల్లా ఖాన్ అవార్డు గ్రహీత పేరిణి రాజ్కుమా ర్ సారథ్యంలో ఎంపిక చేశారు. ఎంబసీ ఆఫ్ ఇండియా అబుదాబి (యూఏఈ) ఆడిటోరియంలో నిర్వహించే ఈ ఉత్సవాలకు 8 మంది కళాకారులు అర్హత సాధించారు. పేరణి నృత్య విభాగంలో ఉస్తాద్ పేరిణి రాజ్కుమార్(సూర్యాపేట), రంజిత్కుమార్(వరంగల్), సంతోష్ పెరుమాండ్ల(జనగామ), ప్రశాంత్ (నిజామాబాద్), ఒగ్గుకథ విభాగం ఒగ్గు రవి(జనగామ), డప్పు విభాగం ఉస్తాద్ అందె భాస్కర్(సిద్దిపేట), గుస్సాడి నృత్యం కె.ఆనంద్, కె,శ్రీధర్(ఆదిలాబాద్) ఎంపికైన వారిలో ఉన్నారు. -
‘విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం’
జనగామ రూరల్: విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు ఎ.నరసింహారెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ఉమాపతి భవనంలో టీపీటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి సంఘం పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. విద్యారంగ సమస్యలతో పాటు ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మాట్లాడుతూ సంఘం ఆవిర్భావం నుంచి నేటి వరకు ఉద్యోగ, ఉపాధ్యాయుల, విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పోరాటాలు సాగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎండీ అంకుషావలి, బి.లక్ష్మయ్య, శ్రీరామ్, రాజారెడ్డి, శ్రీహరి, సత్యనారాయణరెడ్డి, లక్ష్మణ్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో పెరిగిన రేషన్ కార్డుల వివరాలు ఇలా..
బచ్చన్నపేట 13,045 13,050 05చిల్పూరు 12,449 12,725 276దేవరుప్పుల 12,636 12,835 199స్టేషన్ఘన్పూర్ 16,410 16,664 254జనగామ రూరల్ 11,090 12,111 202జనగామ అర్బన్ 12,123 12,421 298మండలం మే జూన్ పెరిగిన కార్డులు -
ప్రత్యేక రాష్ట్రంతోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి
దేవరుప్పుల : రాజకీయాలకు అతీతంగా సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంతోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి చెందిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం ఉదయం(అమెరికా కాలమా నం ప్రకారం) డల్లాస్లో జూన్ 1న అమెరికాలో తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు విస్తృత ప్రచా రంతోపాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వా న తెలంగాణ సాధనతోనే దగాపడిన రాష్ట్రంలో నీరు, విద్య, ఉద్యోగ కల్పనతోపాటు వ్యవసాయరంగం పురోగతిని గణనీయంగా పెంచుకోగలిగా మని చెప్పారు. సప్తసముద్రాలు దాటి స్థిరపడిన ఎన్ఆర్ఐలు జన్మభూమి కోసం ఉద్యమాలు చేశార ని గుర్తు చేశారు. ఇలాంటి చారిత్రాత్మక అభివృద్ధికి దోహదపడిన బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల ఉత్సవాలకు ఎన్ఆర్ఐలు అధిక సంఖ్యలో హాజరై భవిష్యత్ కార్యాచరణకు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ఎర్రబెల్లితోపాటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నాయకులు దామోదర్రెడ్డి, తిరుపతిరెడ్డి తదితరులున్నారు. -
సోమేశ్వర ఆలయంలో ఆరుద్రోత్సవం
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో గురువారం రాత్రి ఆరుద్రోత్సవ కార్యక్రమాన్ని అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య వైభవంగా నిర్వహించారు. పంచ హారతులతో చేపట్టిన గర్భాలయ దీపోత్సవాన్ని భక్తులు కనులారా తిలకించి తరించా రు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్.శర్మ, దేవగిరి అనిల్కుమార్, నాగరా జు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలిరఘునాథపల్లి: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా రైతులకు సూచించారు. గురువారం రఘునాథపల్లి, కంచనపల్లి కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన.. రైతులు తీసుకువచ్చిన ధాన్యంలో తేమను పరిశీలించారు. లారీల కొరత, మిల్లర్ల సమస్యలపై ఆరా తీశారు. టార్పాలిన్ షీట్లు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం కాంటాలు అయిన వెంటనే మిల్లులకు తరలించాలని చెప్పారు. చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తహసీల్దార్ ఎండీ.మోహ్సిన్ముజ్తబ, ఏపీఎం సారయ్య పాల్గొన్నారు.యాక్షన్ ప్లాన్ను విజయవంతం చేయాలిజనగామ: రాష్ట్ర ప్రభుత్వం పురపాలికల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ను విజయవంతం చేయాలని కమిషనర్ వెంకటేశ్వర్లు సూచించారు. మున్సిపాలిటీలో గురువారం మేనేజర్, ఆర్ఓ, ఆర్ఐ, శానిటరీ ఇన్స్పెక్టర్, వార్డు ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ యాక్షన్ ప్లాన్లో ఇంటింటికీ తడి పొడిచెత్త సేకరణపై ప్రజలకు అవకాహన కల్పించాలని, ఇంటి పరిసరాల్లో చెత్తను తొలగించడం, రోడ్డు పక్కన ఉన్న పొదలను క్లీన్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజారోగ్య శాఖ నుంచి వైద్యుల ఆధ్వర్యాన డెంగీ, మలేరియా బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. -
సుందరీకరణ పనులు త్వరగా చేపట్టాలి
● భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి జనగామ: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భార త్ స్టేషన్ స్కీమ్లో జనగామ రైల్వేస్టేషన్ సుందరీకరణ పనులు త్వరగా చేపట్టాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి అన్నారు. ఈ మేర కు దక్షిణ మధ్య రైల్వే డీజీఎం ఉదయ్తో ఫోన్లో మాట్లాడా రు. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి, రాష్ట్ర నాయకుడు కొమ్మూరి ప్రశాంత్రెడ్డితో కలిసి గురువారం ఆయన రైల్వేస్టేషన్ సుందరీరణ పనులను పరిశీలించారు. మొదటి విడత సుందరీకరణ పనులకు రూ.24.75 కోట్లు మంజూరైనా పనులు ఆలస్యం కావడంపై డీజీఎంను ఎంపీ అడగ్గా.. నవంబర్ నాటికి వందశాతం పనులు పూర్తి చేస్తామని వివరించారు. ఎలాంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తీసుకురా వాలని ఆయన కోరారు. అయితే.. రైల్వేస్టేషన్ ఆవరణలో గ్రీనరీకి ప్రాధాన్యత ఇవ్వాలని, ఫుట్ఓవర్ బ్రిడ్జి, రెండు ప్లాట్ ఫాంలపై వానరాలతో ప్రయాణికులకు ఇబ్బందులున్నాయని, సోలార్ పెన్షింగ్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డీజీఎంకు ఎంపీ సూచించారు. -
ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు
జనగామ: తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. గురువారం కలెక్టరేట్లో డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ చేతన్ నితిన్తో కలిసి సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయ న మాట్లాడారు. జూన్ 2వ తేదీన నిర్వహించే ఈ వేడుకల సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చూపించేందుకు ఆయా శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయ ని, వీటి నిర్వహణ బాధ్యతను విద్యాశాఖ తీసుకోవాలని చెప్పారు. రాజీవ్ యువ వికాసం, ఇందిర మ్మ ఇళ్ల పథకం, బ్యాంకు లింకేజీ కింద అర్హులకు ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నా రు. జిల్లా, మండల స్థాయిలో అన్ని ప్రభుత్వ, పోలీసు కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని తెలిపారు. సమావేశంలో జనగామ ఆర్డీఓ గోపీరాం, కలెక్టరేట్ ఏఓ మన్సూర్, డీఈఓ భోజన్న, పౌరసరఫరాల అధికారి సరస్వతి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ వసంత, డీపీఓ స్వరూప, ఉద్యానవన అధికారి శ్రీధర్రావు, డీవైఎస్ఓ వెంకట్రెడ్డి, తహసీల్దార్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపడుతున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. గురువారం కలెక్టరేట్లో డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ చేతన్ నితిన్ పండేరీతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 3 నుంచి 13 వరకు జరిగే టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా కేంద్రంలోని ధర్మకంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సెంటర్లు ఏర్పాటు చేశామని, 74 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు చెప్పారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పేపర్ల తనిఖీ నిర్వహించాల ని, మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా కట్టుదిట్ట మైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఈఓ భోజన్న, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, జీసీడీఓ గౌసియాబేగం తదితరులు పాల్గొన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి రాష్ట్ర అవతరణ వేడుకల సన్నాహక సమావేశంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా -
‘నకిలీ’పై ఉక్కుపాదం
హన్మకొండ అర్బన్: నాసిరకం విత్తనాలు, ఎరువుల్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్ట ర్లు, ఎస్పీలను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ధాన్యం సేకరణ, వ్యవసాయం, వర్షాకాల ముందస్తు ప్రణాళిక, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. నాసిరకం విత్తనాలు, ఎరువులను ఉక్కుపాదంతో అరికట్టాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా విక్రయించకుండా నకిలీ ఎరువులు, విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. రాష్ట్రంలో అంచనాలకుమించి 160 శాతం ధాన్యం అధికంగా వచ్చిందని, దేశ వ్యాప్తంగా ధాన్యం సేకరణలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 85శాతం ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయడంపై అధికారులు, ప్రజాప్రతినిధులను మంత్రి అభినందించారు. నత్తనడకన ఇందిరమ్మ ఇళ్లు.. రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీనివాస్రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు ప్రతీస్థాయి వరకు పర్యవేక్షిస్తున్న పనులు ముందుకు సాగకపోవడంతో ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 6వ తేదీ నాటికి ఇందిరమ్మ ఇళ్ల అర్హులకు ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ప్రొసీడింగ్స్ అందజేయాలన్నారు. అత్యంత నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలనే ప్రభుత్వ లక్ష్యం కోసం అధికారులు పనిచేయాలన్నారు. ప్రతీ సోమవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి బిల్లులను అర్హుల ఖాతాలకు జమ చేస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందని, రవాణా ఖర్చులు మాత్రం లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. 2వ తేదీన జీపీఓలకు నియామక పత్రాలు గ్రామపాలన ఆఫీసర్లుగా ఉత్తీర్ణులైన వారికి జూన్ 2న నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. రైతులు, భూమి ఉన్న వారిని ఇబ్బందులు పెట్టొద్దని, ఇబ్బంది పెడితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. జూన్ 3 నుంచి 20 వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించి ఆగస్టు 15 నాటికి పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఎరువులు, విత్తనాలపై నిఘా ఉంచాలి ధాన్యం సేకరణలో దేశంలోనే మొదటి స్థానం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచారశాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాపై సమీక్ష పాల్గొన్న మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులుకమిటీలో రైతులకు చోటు: మంత్రి సురేఖ నాసిరకం విత్తనాలు, ఎరువుల నియంత్రణకు ఏర్పాటు చేసిన కమిటీలో అధికారులతోపాటు రైతులను భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లు, ధాన్యం కొనుగోలు, రవాణా, చెల్లింపులు వంటి అంశాలపై మాట్లాడారు. సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు మామిడాల యశస్వినిరెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, రిజ్వాన్ బాషా, టీఎస్ దివాకర, అద్వైత్ కుమార్ సింగ్, రాహుల్ శర్మ, ఎస్పీలు, మేయర్ సుధారాణి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఏనుగుల మానస పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్
జనగామ: జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాల ని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి పనులను పరిశీలించిన ఆయన.. మాట్లాడుతూ బతుకమ్మకుంట అభివృద్ధి పనులకు రూ.కోటి 50 లక్షలు మంజూరయ్యాయని, పంచతంత్ర థీమ్తో డెవలప్ చేస్తున్నట్లు చెప్పారు. సుందరీకరణ నేపథ్యంలో గ్రిల్స్, కాలిబాట, గజి బోలు, లైటింగ్, వ్యాయామం, ఆట పరికరా లు, చిన్నారుల ఆటస్థలం, మినీ పార్కు ఏర్పా టు పనులను మరో 15 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారు. అలాగే కుంట పూడికతీత పనులను త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించా రు. కలెక్టర్ వెంట మున్సిపల్ డీఈ రాజ్కుమార్, ఏఈ మహిపాల్ ఉన్నారు.సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలిజనగామ రూరల్: ప్రజలకు వైద్య సేవలు అందించడంతోపాటు సీజనల్ వ్యాధులపై అవగా హన కల్పించాలని డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు అన్నారు. వడ్లకొండ పీహెచ్సీని ఆయన బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమాలను విధిగా అమలు చేయాలని చెప్పారు. చిన్నారులకు వ్యాక్సిన్లు తప్పనిసరిగా వేయించాలని, సిబ్బంది ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు సకాలంలో ఆరోగ్య కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. రికార్డులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు.నిట్లో టెమ్ ఎక్స్పోకాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లోని సీఆర్ఐఎఫ్ (సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్ట్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ) భవనంలో బుధవారం ఏర్పాటుచేసిన టెమ్ (ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్పోపీ) స్పెసిమెన్ ప్రిపరేషన్ పరికరాల ఎక్స్పోను నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ప్రారంభించి మాట్లాడారు. నానో టెక్నాలజీలో నూత న ఆవిష్కరణలకు వేదికగా ఎక్స్పో నిలవాలని ఆకాంక్షించారు. నిట్తోపాటు వివిధ విద్యాసంస్థల విద్యార్థులకు, పరిశోధకులకు, శాస్త్రవేత్తలకు తోడ్పడుతుందన్నారు. కార్యక్రమంలో డీన్ అకాడమీ శరత్బాబు, ప్రొఫెసర్ శ్రీలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.వరంగల్లో సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్హన్మకొండ చౌరస్తా: త్వరలో వరంగల్లో సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ప్రారంభమవుతుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురా లు డాక్టర్ కడియం కావ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెల్నెస్ సెంటర్కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిన ట్లు ఆ శాఖ అదనపు కార్యదర్శి రోలీసింగ్ లేఖ రాశారని పేర్కొన్నారు. అవసరమైన పోస్టుల భర్తీకి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్నుంచి ఆమోదం కూడా లభించినట్లు పేర్కొన్నారు. ఈ వెల్నెస్ సెంటర్ ద్వారా వైద్య చికిత్సలు, వ్యాధి నిర్ధారణ తదితర సదుపాయాలు కలుగుతాయని తెలిపారు. సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేసిన ఎంపీ కావ్యకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.క్రైం ఏసీపీగా సదయ్యహసన్పర్తి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైం ఏసీపీగా సదయ్య నియమితులయ్యారు. సీఐడీ విభాగంలో పనిచేసిన ఆయన బదిలీపై ఇక్కడికిచ్చారు. ఈ మేరకు బుధవారం సదయ్య బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆత్మకూర్లో ఎస్సైగా, కేయూసీ, సుబేదారి పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించారు. -
దుక్కులు దున్ని.. గొర్రుకొట్టిన అన్నదాతలు
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025– 8లోuఅందుబాటులో ఉన్న ఎరువులు వివరాలు (మెట్రిక్ టన్నులు)ఈనెలలో నమోదైన వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో)● టాస్క్ఫోర్స్ టీంల తనిఖీలు ముమ్మరం● నార్లు పోయడానికి పొలాలు సిద్ధం ● పత్తి విత్తన కొనుగోళ్లలో రైతులు బిజీ యూరియా డీఏపీ 26,086 5,386.5తేదీ వర్షపాతం 20 0.4 21 10.3 22 12.2 23 0.7 24 7.3 25 5.5 26 6.1 27 28.7 28 34.1ఎస్ఎస్పీ కాంప్లెక్స్ పొటాష్ 1,783 10,599 3,529అందుబాటులో ఉన్న విత్తనాలు వరి 44,012 మెట్రిక్ టన్నులు పత్తి ప్యాకెట్లు 5.80లక్షలు పంటల సాగు అంచనా వివరాలు(ఎకరాల్లో)మొక్కజొన్న వరి పత్తి 2.15 1.25 లక్షలు లక్షలు3,670 కందులు పెసర్లు వేరుశనగ 3,500 700 100జనగామ: యాసంగి ధాన్యం అమ్మకాలు చివరి దశకు చేరుకున్నాయి. మరో వైపు వానా కాలం సీజన్కు సమయమం ఆసన్నమైంది. గత ఏడాది కంటే ముందుగానే రుతుపవణాలు ఎంట్రీ ఇవ్వగా.. అల్పపీడన ద్రోణి ప్రభావంతో అడపా దడపా వర్షాలు కురుస్తూనే ఉన్నా యి. నేల తల్లినే నమ్ముకున్న రైతన్నలు వానాకాలం సాగుకు సమాయత్తమయ్యారు. దుక్కులుదున్ని.. గొర్రుకొట్టి వరి నార్లకు పొలాలను సిద్ధం చేయగా.. పత్తి విత్తనాలు నాటేందుకు సాళ్లను రెడీ చేసుకున్నారు. కత్తెర సాగు(మూడో పంట) నాట్లు మొదలయ్యాయి. వచ్చే నెల 10 నుంచి 15వ తేదీ వరకు పత్తి సాగు ముమ్మరం కానుండగా.. 10 నుంచి 20వ తేదీ లోపు వరి నాట్లు ఊపందుకోనున్నాయి. జిల్లాలో ఈ నెలలో సాధారణ వర్షపాతం 27.1 మిల్లీమీటర్లు కాగా.. 100.8 మి.మీ కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 3.40లక్షల ఎకరాల్లో సాగు జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, పెసర్లు, టుబాకో, వేరుశనగ తదితర పంటలు 3.40లక్షల ఎకరా ల్లో సాగు చేస్తారని వ్యవసాయ శాఖ ముందస్తు అంచనా వేసింది. ఇందుకు తగినట్టుగా ఫర్టిలైజర్ దుకాణాలు, గ్రోమోర్ కేంద్రాల్లో ఎరువులు, విత్తనాలను సిద్ధంగా ఉంచింది. యూరియా, డీఏపీ, ఎస్ఎస్పీ, కాంప్లెక్స్, పొటాష్ 47,383 మెట్రిక్ టన్నులు, వరి విత్తనాలు 44,012 మెట్రిక్ టన్నులు, 5.80 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. టాస్క్ఫోర్స్ టీంలు ఎరువులు, విత్తన ప్యాకెట్ల కృత్రిమ కొరత, నకిలీల బెడద, ఎమ్మార్పీకంటే అధిక ధరలకు విక్రయాలపై నిఘా పెట్టేందుకు కలెక్టర్ రిజ్వాన్ బాషా నేతృత్వంలో డీఏఓ రామారావు ఆధ్వర్యాన మండలాల వారీగా ఏఓ, రెవెన్యూ ఆఫీసర్, ఎస్సై(పోలీసు) బృందంతో టాస్క్ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసి ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేస్తున్నారు. సాగు పనులు మొదలు పెట్టాం.. వానాకాలం సీజన్లో రెండెకెరాల్లో వరి, మరో రెండు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నాను. వరిలో 1010 దొడ్డురకం, పత్తిలో మైకోసీడ్స్ తీసుకున్నాను. ఎమ్మార్పీ ధరలకే విత్తనాలు ఇచ్చారు. రెండు రోజుల నుంచి వానలు పడుతున్నాయి. సాగు పనులు మొదలు పెట్టాం. – లూనావత్ బాలు, రైతు, క్రిష్ణాజీగూడెం(స్టేషన్ఘన్పూర్)విత్తన ప్యాకెట్కు ధర పెరిగింది నాకున్న రెండు ఎకరాల్లో వరి సాగు చేసేందుకు దుక్కులు దున్ని సిద్ధం చేసిన. 2 విత్తన ప్యాకెట్లు రూ.800 చొప్పున కొనుగోలు చేశాను. గత సీజన్ కంటే ఈసారి 10 కిలోల విత్తన ప్యాకెట్ ధర రూ.50 పెరిగింది. – కర్రె చంద్రయ్య, రైతు, కొన్నె(బచ్చన్నపేట)ఐదు ఎకరాల్లో పత్తి సాగు నాకు ఏడెకరాల పొలం ఉంది. ఐదెకరాల్లో పత్తి, రెండెకరాల్లో వరి సాగుకు సిద్ధం చేసుకున్న. విత్తన ప్యాకెట్లు కొనుగోలు చేసిన. ఎమ్మార్పీ ధరకే ఇచ్చారు. రెండు రోజుల క్రితం భూమి దున్ని అచ్చుకట్టిన. సాళ్లలో పత్తి విత్తనాలు వేస్తున్నాను. – భూక్య బాషా, రైతు, టీబీతండా(జఫర్గఢ్)వానాకాలం పంటలు మొదలయ్యాయి జిల్లాలో వానాకాలం సాగు పనులు మొదలయ్యాయి. రెండు రోజులుగా వర్షం కురుస్తుండడంతో భూమి కొంతమేర చల్లబడింది. జూన్ 10 నుంచి 15 వరకు పత్తి, అదే నెల 10 నుంచి 20 వరకు వరినాట్లు పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయి. వరి కత్తెర పంట నాట్లు మొదలు పెట్టారు. సరిపడా విత్తనాలు ఉన్నాయి. నకిలీల బెడద, ఎమ్మార్పీకంటే అదనపు ధరలు, విత్తన ప్యాకెట్ల కొరత లేకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశాం. – రామారావు, డీఏఓన్యూస్రీల్విత్తనాల కొనుగోళ్లలో బిజీ జిల్లాలో రెండు రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తుండడంతో రైతులు విత్తన ప్యాకెట్ల కొనుగోళ్లతో ఎరువుల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. వరి విత్తనాల్లో సన్నరకం కేఎన్ఎం, ఆర్ఎన్ఆర్ 1271, దొడ్డు రకం 1010, 64, జేజీఎల్ తదితర సీడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొక్కజొన్నలో కావేరి, బెయిర్, సింజెంటా, పత్తిలో టాటాబిగ్ఎక్స్, బాహుబలి, సదానంద్, చంద్రగోల్డ్, రాశి వైరెటీలు, యూఎస్ 6067, ఎస్సీహెచ్ 414, సనాతన్, బాక్సర్, సురేఖ గోల్డ్, ఆదిత్య–10 వంటి విత్తన ప్యాకెట్లకు పలు చోట్ల డిమాండ్ ఉంది. -
ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ చేపట్టాలి
జనగామ రూరల్ : మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతోపాటు పలువురి ఎన్కౌంటర్లపై కేంద్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ముందుకు రాకపోతే సుప్రీంకోర్టు కేసును సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణకు ఆదేశించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గబ్బెట గోపాల్రెడ్డి భవన్లో కావటి యాదగిరి ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కొంతకాలంగా జరుగుతున్న మావో యిస్టుల, ఆదివాసీల ఎన్కౌంటర్లతో పాటు ఆపరేష న్ కగార్ను విచారణ అంశంలో చేర్చాలని కోరారు. స్థానిక ప్రజల హక్కులు, వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని ఏకపక్షంగా ఎన్కౌంటర్ చేయడం శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్య అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సీహెచ్.రాజారెడ్డి, పాతూరి సుగుణమ్మ, ఆది సాయన్న, శ్రీనివాస్, యాకూబ్, కె.యాదగిరి, చొప్పరి సోమయ్య, జువారి రమేశ్, రావుల సదానందం తదితరులు పాల్గొన్నారు. -
ఆధునికీకరణకు రూ.94.84 లక్షలు
● శ్రీసోమేశ్వర ఆలయానికి నిధులు మంజూరు పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, పాల్కురికి సోమనా థ స్మృతి వనం, కల్యాణ మండపం ఆధునికీకరణ పనులకు రూ.94.84 లక్షలు మంజూరయ్యాయి. ఇందుకు ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి ప్రత్యేకంగా కృషి చేశారు. పాలకుర్తి సాంస్కృతిక, వారస త్వ, పర్యాటక సమగ్రాభివృద్ధికి సంబంధించి ఆర్ అండ్ బీ ఎలక్ట్రికల్ విభాగం ఈఈ పూనం, డీఈ ఇబ్రహీం బుధవారం విద్యుదీకరణకు సంబంధించి ఎస్టిమెషన్ తయారు చేశారు. శ్రీసోమేశ్వరాలయంలో అంతర్గత విద్యుదీకరణ, గర్భగుడిలో ఏసీలు, గర్బగడి బటయ లైటింగ్కు రూ.22 లక్షలు, సోమనాథ స్మృతి వనం విద్యుదీకరణ, లైటింగ్కు రూ.21.50 లక్షలు, కల్యాణ మండపం అంతర్గత, బ్యాహ విద్యుదీకరణ, లైటింగ్కు రూ. 53.54 లక్షల వ్యయంతో అంచనాలు సిద్ధం చేశారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఎలక్ట్రికల్ విభాగం ఏఈఈ శృతి, ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు, సూపరింటెండెట్ కొత్తపల్లి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాల అమలుకు కృషి చేయాలి
జనగామ రూరల్: ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలుకు వివిధ శాఖల అధికారులు కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవా రం అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో జూన్ నాలుగో తేదీలోపు అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు పక్రియ పూర్తి చేయాలని చెప్పారు. రేషన్ కార్డుల లబ్ధిదారులకు ప్రభుత్వం జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసే ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని అన్నారు. ఈ మేరకు రేషన్ డీలర్లతో తహసీల్దార్లు సమీక్షించాలని, లబ్ధిదారుల థంబ్, ఐరిష్, గుర్తింపు జాగ్రత్తగా తీసుకుని జూన్ 30వ తేదీలోగా రేషన్ పంపిణీ పూర్తి చేయాలని పేర్కొన్నారు. రేషన్ కార్డు దరఖాస్తుల వెరిఫికేషన్ పెండింగ్ ఉండొద్దని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా జరిగేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. మంజూరైన ఇళ్లకు సంబంధించి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ద్వారా లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇప్పించాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకంలో సిమెంట్, ఇటుకబట్టీ యూనిట్ల ఏర్పాటుకు కూడా అవకాశం కల్పించాలని సూచించారు. జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు ప్రతీ గ్రామంలో భూభారతి సదస్సులు పక్కాగా నిర్వహించాలని చెప్పారు. జిల్లాలో సరిపడా విత్తనాలు, ఎరువులు ఉన్నాయని, జూన్ 5లోపు రైతు వేదికల్లో అన్నదాతలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి విత్తనాల కొనుగోలు లో రైతులకు సహకరించాలన్నారు. జూన్ 3 నుంచి ‘బడిబాట’ ప్రారంభించాలని, అలాగే సీజనల్ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవా లని వివరించారు. జూన్ 2న ప్రొసీడింగ్స్ పంపిణీరాజీవ్ యువ వికాసం పథకం కింద లాభసాటి వ్యాపార యూనిట్ల గ్రౌండింగ్ జరిగేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలి.. జూన్ 2న లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. బుధవారం రాజీవ్ యువ వికాసం అమలుపై రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వాలు కార్పొరేషన్ ద్వారా మొక్కుబడిగా పథకాలు అమలు చేశాయని, తమ ప్రభుత్వం లక్షలాది మంది యువతకు స్వయం ఉపాధి కల్పించా లనే చిత్తశుద్ధితో రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తున్నదని చెప్పారు. ఈ పథకం కింద వచ్చే సహాయంతో యువత వ్యాపారం చేసి లబ్ధిపొందాలని సూచించారు. మంజూరు చేసిన యూనిట్లను గ్రౌండింగ్ చేసిన తర్వాత వాటి పనితీరును పర్యవేక్షించేందుకు జిల్లాలో కమిటీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈనెల 29, 30 తేదీల్లో నిర్వహించే సమావేశాల్లో పథకంపై చర్చించి తుది జాబితాను ఆమోదించాలని సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, బీసీ, ఎస్సీ సంక్షేమ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
వన్ నేషన్.. వన్ ఎలక్షన్తోనే అభివృద్ధి..
జనగామ రూరల్: వన్ నేషన్.. వన్ ఎలక్షన్తోనే దేశం అభివృద్ధి చెందుతుందని బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ఆధ్వర్యాన ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’పై బుధవారం నిర్వహించి న అవగాహన సదస్సులో ఆయన మాట్లాడా రు. ఓకే దేశం.. ఓకే ఎన్నిక వలన ఎన్నికల నిర్వహణ ఖర్చు తగ్గి లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం కాకుండా ఉంటుందని చెప్పా రు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒకే సమయంలో పనిచేయడంతో సమన్వయం పెరుగుతుందని, అభివృద్ధి ప్రణాళికలు వేగంగా అమలు అవుతా యని పేర్కొన్నారు. పాలన, రాజకీయ స్థిరత్వం, అభివృద్ధిలో గుణాత్మక మార్పునకు మార్గం సుగమం అవుతుందని వివరించారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఒక వ్యక్తికి 1,400 రూపాయలు ఖర్చవుతుందని, దేశంలో ఎన్ని సార్లు ఎన్నికలు జరిగినా 60 శాతం మంది మాత్రమే ఓటు వేస్తున్నారని, ఓటింగ్ శాతం పెరగాలంటే ఒకేసారి ఎన్నికలు రావాలని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్, నందారెడ్డి, లేగ రామ్మోహన్రెడ్డి, కేవీఎల్ఎన్.రెడ్డి, పజ్జూరి లక్ష్మీనర్సయ్య, ఉడుగుల రమేశ్, శశిధర్ రెడ్డి, కల్నాల్ మాచర్ల భిక్షపతి, బొమ్మకంటి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ‘బాల పురస్కార్’కు దరఖాస్తుల ఆహ్వానంజనగామ రూరల్: ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి డి.ఫ్లోరెన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. 5 నుంచి 18 ఏళ్ల లోపు బాలబాలికలు వివిధ రంగాల్లో సాహసం, ధైర్యసాహసాలు, క్రీడలు, సామాజిక సేవ, సైన్స్, టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సంస్కృతి తదితర అంశాలలో ప్రతిభ కనబర్చిన వారికి 2025 సంవత్సరం ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. జూలై 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ● బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ -
ప్రమాదం మాటున ప్రయాణం
జనగామ: జనగామ పట్టణంలో ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోయింది. డ్రెయినేజీలు, నాలాలపై కప్పులు లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. విద్యుత్ స్తంభాలపై సర్వీసు వైర్లు, కేబుల్స్ ఒకేచోట నుంచి వెళ్లడంతో గాలి దుమారం సమయంలో రాపిడికి గురయ్యే ప్రమాదం ఉంది. పట్టణంలో అనేక చోట్ల ట్రాన్స్ఫార్మర్ గద్దెల కింద చిరు వ్యాపారాలు చేస్తున్నారు. ఓవర్ లోడ్ పెరిగే సమయంలో జరిగే ప్రమాదాలకు బాధ్యులు ఎవరనే ప్రశ్న ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని పలు ప్రాంతాలను సాక్షి పరిశీలన చేసింది. ఇందులో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. పడితే పరలోకానికే.. ధర్మకంచ–అంబేడ్కర్నగర్ ప్రధాన చౌరస్తా చమన్ హనుమాన్ ఆలయం వద్ద లింకును కలిపే నాలా నోరు తెరుచుకుని రెడీగా ఉంది. రెండు రోడ్ల నుంచి వాహనాలపై వచ్చే వారి పాలిట పెను శాపంగా మారింది. ప్రమాదవశాత్తు పడితే పరలోకానికి పయనంలా మారిపోయింది.రక్షణ కవచం ఏదీ..? కప్పులు లేని నాలాలు రక్షణ కవచం లేని ట్రాన్స్ఫార్మర్లు -
ఎల్ఆర్ఎస్పై ప్రత్యేక దృష్టి సారించాలి
జనగామ రూరల్: ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. మంగళవారం జనగామ మండల పరిషత్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఆయా మండలాలు, పురపాలిక వారీగా చర్చించి, దిశానిర్దేశం చేశారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకుంటే 25 శాతం రాయితీ వర్తిస్తుందని, ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అధికారులు ప్రోత్సహించాలన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు ఎక్కువ మొత్తంలో దరఖాస్తుల క్రమబద్ధీకరణ చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలనను వేగవంతం చేయాలని, క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు పరిశీలించి వివరాలు నమోదు చేస్తూ గడువులోగా సర్వే పూర్తి చేయాలన్నారు. ప్రతిరోజూ గ్రామాల్లో సేకరించే చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి, సెగ్రిగేషన్ చేయించాలన్నారు. కంపోస్టు ఎరువు తయారు చేసి విక్రయించాలన్నారు. ఈ సమావేశంలో డీపీఓ స్వరూప, ఎంపీడీఓ సంపత్ కుమార్, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ -
పాలకుల నిర్లక్ష్య వైఖరి వీడాలి
దేవరుప్పుల: వ్యవసాయ రంగ పురోగతిపై పాలకుల నిర్లక్ష్య వైఖరి వీడాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్ తెలిపారు. మంగళవారం మండలకేంద్రంలో సీపీఐ(ఎం) జిల్లా స్థాయి శిక్షణా తరగతుల సందర్భంగా పార్టీ జెండాను జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సింగారపు రమేష్ ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎండీ అబ్బాస్ మాట్లాడుతూ రైతులకు పత్తి విత్తనాలు, ఎరువులు అందుబాటులేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్, జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు ఇర్రి అహల్య, సాంబరాజు యాదగిరి, రాయపర్తి రాజు, సోమయ్య, తదితరులు పాల్గొన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్ -
అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు
జనగామ: ప్రభుత్వం ప్రవేశ పెట్టే సంక్షేమ పథకా లపై అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, ధాన్యం కొనుగోలు, వ్యవసాయ శాఖపై మంగళవారం మంత్రులు, సీఎస్తో కలిసి కలిసి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సెలవుపై ఉన్న కలెక్టర్ రిజ్వాన్ బాషా క్యాంపు కార్యాలయం నుంచి, అదనపు కలెక్టర్లు రోహిత్సింగ్, పింకేష్కుమార్, జిల్లా ఉన్నతాధికారులు వీసీలో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో కలెక్టర్లు కీలక పాత్ర వహించా లని ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగిన రైతులకు ఎకరాకు రూ.10వేల పరిహారం అందించేందుకు నివేదికలను పంపించాలని కలెక్టర్లను కోరారు. వీసీలో సీఎం, మంత్రులు -
పాలకుర్తిలో అత్యధిక వర్షపాతం
జనగామ: అల్పపీడన ప్రభావంతో జిల్లాలోని పలు మండలాల పరిధిలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 17 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇందులో పాలకుర్తి మండలం గూడూరు పరిధిలో అత్యధికంగా 121.5 మిల్లీ మీటర్లు కురవగా, మండలకేంద్రంలో 38 మి.మీ, వావిలాలలో 19 మి.మీ కురిసింది. స్టేషన్ఘన్పూర్ 49.5 మి.మీ, జఫర్గఢ్–కూనూరు 31.5 మీ.మీ, చిల్పూరు–మల్కాపూర్ 30.3 మీ.మీ, దేవరుప్పుల–కొడకండ్లలో 35.8 మీ.మీ, కొడకండ్లలో 16.5 మీ.మీ మేర వర్షం కురవగా తరిగొప్పుల, రఘునాథపల్లి, జనగామ, నర్మెటలో నామమాత్రంగా వర్ష ప్రభావం ఉంది. కుంటలా మారిన ధాన్యం కొనుగోలు కేంద్రం చిల్పూరు: మంగళవారం కురిసిన భారీ వర్షానికి మండల కేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలోకి నీరు చేరడంతో ధాన్యం కుప్పలు నీటిలో మునిగాయి. వర్షం వచ్చే సమయంలో ఐకేపీ నిర్వాహకులు, రైతులు ధాన్యం తడువకుండా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేస్తుండగానే భారీ వర్షం పడడంతో వర్షపు నీరు ఒక్కసారిగా చేరి చిన్న కుంటను తలపించింది. -
హామీలను పక్కన బెట్టి అందాల పోటీలా?
● సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన బెట్టి, అందాల పోటీలతో ఊరేగుతున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం జనగామరూరల్, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాలకు చెందిన 82 మంది లబ్ధిదారులకు రూ.20.46 లక్షల విలువైన సీ ఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 10ఏళ్లలో బీఆర్ఎస్ ప్ర భుత్వ హయాంలో తాగు, సాగునీరు, రైతుబంధు, బీమా, పింఛన్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ పోయాయని, అందాల పోటీల పేరిట కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరో పించారు. జనగామ ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులను కాకుండా నీలిమ ఆస్పత్రికి రోజుకు సుమారు 350 మంది వరకు ఆరోగ్య పరీక్షల కోసం వెళ్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారందరికీ ఆరోగ్య సేవలు అందిస్తూ కాపాడుకుంటామన్నారు. బడ్జెట్ లేదని బదనాం చేస్తూ కేసీఆర్ను ఇబ్బందులకు గురిచేయడమే తప్ప, ఒక్క ఎకరానికి సాగునీరు అందించేదిలేదన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పులిగిల్ల పూర్ణచందర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జము న లింగయ్య, రైతు సమన్వయ సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ బాల్దె సిద్దిలింగం, మాజీ ఎంపీపీ మేకల కలింగరా జు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్రెడ్డి, అ నిల్రెడ్డి, జూకంటి శ్రీశైలం, గంగం సతీష్రెడ్డి, ము స్త్యాల దయాకర్, సందీప్ తదితరులు ఉన్నారు. -
పుష్కరం.. అనుభూతి పుష్కలం!
● ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు ● చివరి రోజు లక్ష మంది భక్తుల రాక ● ఆకట్టుకున్న నవరత్న మాల హారతిపుష్కర స్నానాలు ఆచరించిన భక్తులు పునీతులయ్యారు. కాళేశ్వరం సందర్శనలో జ్ఞాపకాల్ని మూటగట్టుకెళ్లారు. ఎండ, వాన.. గాలి దుమారం.. ఇవేవీ వారిని అడ్డుకోలేదు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్జామ్.. నదీ పరిసరాల్లో బురద.. వారి సంతోషానికి అడ్డు కాలేదు. కిక్కిరిసిన భక్తులతో ఆర్టీసీ బస్సులు. దారి పొడవునా ప్రైవేట్ వాహనాలు. ఇలా.. లక్షలాది మంది భక్తులు కాళేశ్వరానికి వచ్చారు. నదీ మాతకు పూజలు చేశారు. తర్పణాలు వదిలారు. పిండ ప్రదానాలు చేశారు. నదిలో దీపాలు వదిలారు. చీరెసారె సమర్పించారు. 17 అడుగుల సరస్వతీమాత విగ్రహాన్ని దర్శించుకున్నారు. కాళేశ్వర ముక్తీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. నదీమాతకు నవరత్న మాల హారతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సోమవారంతో సరస్వతీ నది పుష్కరాలు ముగిశాయి. చివరిరోజు లక్ష మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. -
రవాణా శాఖలో ఇన్చార్జ్ల పాలన!
సాక్షిప్రతినిధి, వరంగల్ : రవాణా శాఖలో ఇన్చార్జ్ల పాలన కొనసాగుతోంది. కోర్టు స్టే కారణంగా కొద్ది రోజులుగా ఆ శాఖలో డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) జాబితాకు బ్రేక్ పడింది. దీంతో పదోన్నతులు, నియామకాలు నిలిచాయన్న సాకుతో చాలాచోట్ల మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్(ఎంవీఐ)లనే ఇన్చార్జ్ జిల్లా రవాణా శాఖాధికారులు(డీటీఓ)గా నియమించారు. మరికొందరు ఎంవీఐలకు.. ఎంవీఐతో పాటు ఇన్చార్జ్ డీటీఓలుగా ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించారు. కాగా కొందరు ఎంవీఐలు ఇన్చార్జ్ డీటీఓ పోస్టును పోటీపడి తెచ్చుకున్న సందర్భాలుంటే.. మరికొన్నిచోట్ల జూనియర్లను డీటీఓలుగా తెరమీద పెట్టి సీనియర్లు తెరవెనుక చక్రం తిప్పుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు కూడా ఇష్టారాజ్యం.. ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో డీటీసీ, డీటీఓ పోస్టుల్లో ఇన్చార్జ్లే ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పదోన్నతులు నిలిపివేసి ఒక్కో సీనియర్ ఎంవీఐకి రెండు నుంచి నాలుగు జిల్లాల్లో ‘ఆన్ డిప్యూటేషన్ పోస్టింగ్’లు ఇచ్చి పెద్ద ఎత్తున దండుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరిగింది. కీలక సూత్రధారిగా ఉన్న ఓ అధికారి ప్రభుత్వం మారాక స్వచ్ఛంద పదవీ విరమణ పెట్టుకోవడం కొసమెరుపు కాగా.. అతడికి అండగా నిలిచిన కొందరు ఏసీబీ కేసుల్లో ఇరుక్కొని సస్పెండయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొందరు ఇన్చార్జ్ల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్లోని కొందరు పెద్దల ఆశీస్సులతో పలువురు పదోన్నతులు, హోదాలతో పని లేకుండా ఎంవీఐలు ఇన్చార్జ్ డీటీఓలు, డీటీసీలుగా వ్యవహరిస్తున్నారు. అక్కడితో ఆగకుండా పొరుగు జిల్లాల బాధ్యతల కోసం పైరవీలు చేయడంపై చర్చ జరుగుతోంది. పాతుకుపోయారు.. ఉమ్మడి వరంగల్లో ఏళ్లతరబడి పాతుకుపోయిన కొందరు రవాణాశాఖ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చేసుకుంటూ కోరుకున్న పోస్టుల్లో కొనసాగుతున్నారనే చర్చ జరుగుతోంది. భూపాలపల్లి కార్యాలయంలో కీలకంగా ఉన్న ఓ అధికారి నాలుగేళ్లుగా అక్కడే తిష్ట వేశారు. వివిధ పోస్టుల్లో అక్కడే పాతుకుపోవడంతో పాలన గాడి తప్పి అవినీతి పెరిగిందన్న ఆరోపణలున్నాయి. హనుమకొండ డీటీఓ ఆఫీసులో తెరవెనుక చక్రం తిప్పుతున్న ఓ కీలక అధికారి సుమారు పదేళ్లుగా ఉమ్మడి వరంగల్లో వివిధ చోట్ల పనిచేసి పాతుకుపోయారన్న చర్చ ఉంది. ఏడాది క్రితం హనుమకొండకు బదిలీ కాగా.. కొద్ది రోజులకే ఏసీబీ దాడులు జరిగాయి. ఈ కేసులో డీటీసీ పుప్పాల శ్రీనివాస్ సస్పెండ్ కావడం కలకలం రేపింది. ఎంవీఐలే డీటీఓలు.. పలుచోట్ల ఇదే పరిస్థితి హనుమకొండ డీటీఓగా జూనియర్కు బాధ్యతలు తెరవెనుక చక్రం తిప్పుతున్న సీనియర్లు విచారణలు, ఆరోపణలున్నా.. కుర్చీలు వదలని అధికారులు ఆదాయం ఉన్న పోస్టింగ్ల కోసం ఇంకా పైరవీలు కీలక పోస్టుల్లో ఇన్చార్జ్లు.. హనుమకొండ డీటీఓ, డిప్యూటీ ట్రాన్స్ఫోర్ట్ కమిషనర్(డీటీసీ)గా ఉన్న పుప్పాల శ్రీనివాస్పై అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేయగా సస్పెండయ్యారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో కరీంనగర్ డీటీసీ పురుషోత్తంకు ఇన్చార్జ్ డీటీసీ బాధ్యతలు అప్పగించారు. హనుమకొండ డీటీఓ పోస్టు ఖాళీ కావడంతో వాస్తవానికి అదే కార్యాలయంలో సీనియర్గా ఉన్న 1994 బ్యాచ్కు చెందిన రమేశ్రాథోడ్కు ఇన్చార్జ్ డీటీఓగా ఇవ్వాల్సి ఉంది. అయితే కీలక పోస్టులో ఉండటం ఇష్టం లేక ఆతను ఆసక్తి చూపకపోవడంతో 2012 బ్యాచ్కు చెందిన వేణుగోపాల్కు ఇన్చార్జ్ డీటీఓగా నియమించినట్లు ప్రచారంలో ఉంది. మహబూబాబాద్ గౌసుపాషా ఏసీబీకి చిక్కడంతో సస్పెన్షన్కు గురయ్యాడు. ఆయన స్థానంలో వరంగల్ ఎంవీఐ జైపాల్రెడ్డిని ఇన్చార్జ్ డీటీఓగా నియమించారు. ములుగు డీటీఓ సిరాజ్ రెహమాన్ పదవీ విరమణ చేశాడు. అక్కడ ఎంవీఐ, డీటీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిరాజ్ రిటైర్మెంట్ తర్వాత ఆయన స్థానంలో పెద్దపల్లి ఎంవీఐ బి.శ్రీనివాస్ను ఇన్చార్జ్ డీటీఓగా నియమించారు. ప్రస్తుతం ములుగు ఎంవీఐ, ఇన్చార్జ్ డీటీఓగా కూడా శ్రీనివాసే వ్యవహరిస్తున్నారు. జేఎస్ భూపాలపల్లి ఇన్చార్జ్ డీటీఓ వేణు బదిలీ తర్వాత ఎవరినీ నియమించ లేదు. అక్కడ ఎంవీఐగా ఉన్న సంధానికే ఇన్చార్జ్ డీటీఓ బాధ్యతలు ఇచ్చారు. ప్రస్తుతం భూపాలపల్లి ఎంవీఐ, ఇన్చార్జ్ డీటీఓగా సంధానీ పని చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న వరంగల్ డీటీఓ లక్ష్మిపై బదిలీ వేటు పండింది. డీటీసీ పుప్పాల శ్రీనివాస్పై ఏసీబీ దాడులు జరిగిన మరుసటి రోజే లక్ష్మిని బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. ఆమె స్థానంలో ఎంవీఐ శోభన్బాబు ఇన్చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తున్నారు. -
వచ్చుడు..ఇచ్చుడు..పోవుడే..
ఏళ్ల తరబడి తిరుగుతున్నా.. పరిష్కారం కాని సమస్యలు వినతుల్లో కొన్ని ఇలా.. ● బచ్చన్నపేట మండలం సాల్వాపూర్ గ్రామానికి చెందిన జయంతి, అంజలి, అనిత, కమలమ్మ, నవనీత, లక్ష్మీ, కవితలు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లు లొకేషన్ రావడం లేదని, సమస్యను పరిష్కరించాలని కోరారు. ● కొడకండ్ల మండలం నీలిబండతండా గ్రా మానికి చెందిన గుగులోతు భీకి తన 6.24 ఎకరాల భూమిని పెద్ద కుమారుడు అక్రమంగా పట్టా చేయించుకొని ఇబ్బందులు పెడుతున్నాడని, ఆ భూమి మొత్తం రద్దు చేసి, తన పేరు మీదకు పట్టా చేయాలని వినతిపత్రం ఇచ్చారు. ● జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన కొంగరి రమ, 40 ఏళ్లుగా సొంత గ్రామంలో నివాసం ఉంటున్నానని, తనకు 80 గజాల స్థలం ఉందని, ఎటువంటి భూములు, ఇల్లు, ఆస్తులు లేవని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ● జనగామ మండలంలోని యశ్వంతాపూర్ గ్రామ పరిధిలో గల రెహమాన్ బీఈడీ కళాశాలలకు వెళ్లే దారి, రైతులు పొలాల వద్దకు వెళ్లే దారిని రాళ్లు పాతి దారి మూసివేయడంతో విద్యార్థులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని కళాశాల యజమాని ముజిబూర్ రహెమాన్, వంగాల ఎల్లేష్, రైతులు వినతిపత్రం అందించారు. ●రెండు దశాబ్ధాలుగా తమ విలువైన సమయం కేటాయించి ఉద్యమం చేశామని, ప్రభుత్వం ఉద్యమకారులను దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా ఆదుకోవాలని తెలంగాణ ఉత్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా ఉద్యమకారులు మణి, గంగా భవాని కలెక్టరేట్లో వినతి అందజేశారు.జనగామ రూరల్: దూర ప్రాంతాల నుంచి తమ సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్కు వచ్చి దరఖాస్తులు ఇచ్చుడే కాని పరిష్కారం కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. భూ సమస్యల పరిష్కారానికి ఏళ్ల తరబడి తిరుగుతున్నామని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంటి స్థలాన్ని ఆక్రమించారని, పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నామని, కళాశాలకు, రైతుల పొలాలకు వెళ్లడానికి దారిని మూసివేశారని, భూమిని అక్రమం పట్టా చేస్తున్నారని ఇలా పలు సమస్యలతో బాధితులు ప్రజావాణికి వచ్చారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్లో భాగంగా అదనపు కలెక్టర్లు రోహిత్ సింగ్, పింకేష్ కుమార్లు ఇతర అధికారులతో కలిసి ప్రజల నుంచి 85 వినతులను స్వీకరించారు. అనంతరం తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలన్నారు. పెండింగ్ దరఖాస్తులో దృష్టి సారించాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద వచ్చిన దరఖాస్తులను బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల్లోని ఉప కులాల వారీగా అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. నిరుపేదలకు ప్రథమ ప్రాధాన్య కల్పిస్తూ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్లు సుహాసిని, హనుమాన్ నాయక్, డీఆర్డీఓ వసంత, డీపీఓ స్వరూప, డీఏఓ రామారావు నాయక్, గృహ నిర్మాణ శాఖ అధికారి మాతృనాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పక్క ఫొటోలో కనిపిస్తున్న మహిళ పట్టణంలోని ఐదో వార్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన గణపురం మౌనిక. తన ఇంటి పక్కన సర్వీసు రోడ్డు కోసం వదిలిన ప్రభుత్వ స్థలాన్ని కొంత మంది కబ్జా చేశారు. అలాగే 28/1 నంబర్తో ఓ నకిలీ పట్టా సృష్టించారని, అంతటితో ఆగకుండా తమ ఇంటిని కూడా కబ్జా చేయాలని చూస్తున్నారని, ఇల్లు వదిలిపోవాలని బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోయింది. సదరు కబ్జా స్థలంపై సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలని గ్రీవెన్స్లో అధికారులను వేడుకుంది. గ్రీవెన్స్లో 85 దరఖాస్తులు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్అక్రమంగా పట్టా చేసుకున్నారు.. గ్రామంలో సర్వే నంబర్ 121లో ఎకరం భూమి ఉంది. ఏళ్ల తరబడి ఖాస్తులో ఉన్న. తమ బంధువులు తమకు తెలవకుండా అక్రమంగా పట్టా చేసుకున్నారు. భూమి ఇవ్వమంటే బెరిస్తున్నారు. పింఛన్తో బతకలేకపోతున్న. విచారణ చేపట్టి న్యాయం చేయాలి. – బోడిపెల్లి ఐలమ్మ, లక్ష్మీనారాయణపురం, పాలకుర్తి పింఛన్ నిలిపేశారు 9 ఏళ్ల క్రితం పక్షవాతం రాగా ఎడమ చేయి, కళ్లు కనబడటం లేవు. 2019లో సదరం సర్టిఫికెట్తో దివ్యాంగ పింఛన్ మంజూరు అయింది. సర్టిఫికెట్ సమయం గడిచిపోగా మళ్లీ క్యాంప్ ద్వారా సర్టిఫికెట్ పొందాను. అయితే గత రెండు నెలల నుంచి పింఛన్ రావడం లేదు. మందులకు కూడా డబ్బులు లేవు. పింఛన్ ఇచ్చి ఆదుకోవాలి. – అలేటి ప్రభాకర్, వడ్లకొండ, జనగామ -
బుగులు వేంకన్నను దర్శించుకున్న దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్
చిల్పూరు: చిల్పూరు గుట్ట బుగులు వేంకటేశ్వరస్వామిని ఖమ్మం జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వీరస్వామి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కమిషనర్ కుటుంబ సభ్యులకు ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావుల ఆధ్వర్యంలో అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేద మంత్రాల నడుమ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆశీర్వచనా లు, ప్రసాదం అందించారు. జూనియర్ అసిస్టెంట్ కుర్రెలం మోహన్, వీరన్న, ధర్మకర్తలు గనగోని రమేష్, గోలి రాజశేఖర్, మహేష్ పాల్గొన్నారు. -
ఉద్యమకారుల సమస్యలు పరిష్కరిస్తాం
● ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ పాలకుర్తి టౌన్: తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ, సియాసత్ పత్రిక ఎడిటర్ అమీర్ అలీఖాన్ అన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆవేదన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారుల సమస్యలపై సీఎం సానుకూలంగా ఉన్నారన్నారు. అనంతరం తెలంగాణ క్రాంతి దల్ రాష్ట్ర అధ్యక్షుడు పృధ్వీరాజ్ యాదవ్ మాట్లాడుతూ ఉద్యమకారుల డిమాండ్లను నెరవేర్చకుంటే అసెంబ్లీ ముట్టడిస్తామన్నారు. ఉద్యమకారులకు న్యాయం చేయడంలో కోదండరామ్ ముందుండాలని, లేదంటే రాజీనామా చేయాలని తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ విఠల్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో లాఠీలకు తూటాలకు ఎదురొడ్డి పోరాడింది, ప్రాణ త్యాగాలు చేసిన ఉద్యమకారులకు గుర్తింపు దక్కలేదని ఓయూ జేఏసీ కార్యదర్శి జనరల్ తుమ్మల ప్రపుల్రామ్రెడ్డి అన్నారు. ఇప్పటికై న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఈ సదస్సులో రాష్ట్ర చైర్మన్ గోధుమల కుమారస్వామి, డాక్టర్ మాచర్ల భిక్షపతి, తెలంగాణ జర్నలిస్టు ఫ్రంట్ అధ్యక్షుడు మోహన్ బైరాగి, కంచర్ల బద్రి, కృష్ణలత, గుమ్మడిరాజుల సాంబయ్య, పోలస సోమయ్య, మూల ప్రభాకర్, సింగ మహేందర్రాజు, పుల్లిగిల్ల యాకయ్య, సింగరపు దీపక్ తదితరులు పాల్గొన్నారు. మైనార్టీల అభివృద్ధే లక్ష్యం జనగామ రూరల్: మైనార్టీల అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ అన్నారు. పాలకుర్తి పర్యటన నేపథ్యంలో ఆదివారం పట్టణంలోని న్యాయవాది జమాల్ షరీఫ్ ఎమ్మెల్సీని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో దశలవారీగా లక్ష మంది మైనార్టీ యువకులకు ఆర్థికంగా చేయూతఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. అలాగే జనగామ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం సీనియర్ నాయకులు, ముస్లిం పెద్దలు ఎమ్మెల్సీని మర్యాదపూర్వకంగా కలిశారు. -
వైభవంగా సోమేశ్వరస్వామి మాస కల్యాణం
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా చండిక అమ్మవారి ఆలయంలో ఆదివారం చండికాసమేత సోమేశ్వర స్వామివారికి మాస కల్యాణం మేళతాళాలు, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా జరిగింది. భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొని కనులారా తిలకించి తరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్శర్మ, దేవగిరి అనిల్కుమార్, మత్తగజం నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. ఈసెట్లో గూడూరు విద్యార్థి ప్రతిభపాలకుర్తి టౌన్: పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన విద్యార్థి మాచర్ల గణేశ్ ఆదివారం విడుదల చేసిన ఈసెట్ ఫలితాల్లో సీఎస్సీలో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంక్, ఇంటిగ్రేట్డ్ 13వ ర్యాంక్ సాధించాడు. గూడూరు గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన మాచర్ల సదానందం, సరస్వతి దంపతుల కుమారుడు గణేష్ పదో తరగతిలో మండల టాపర్, పాలిసెట్లో రాష్ట్రస్థాయిలో 47వ ర్యాంకు సాధించాడు. ఈసెట్లో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన గణేశ్ను గ్రామస్తులు అభినందించారు. నేటి నుంచి లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణజనగామ: తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) ద్వారా అర్హత సాధించిన లైసెన్స్డ్ సర్వేయర్లకు నేటి (సోమవారం) నుంచి జనగామ మండలం యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో శిక్షణ ఉంటుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు శిక్షణ ప్రారభమవుతుందన్నారు. 50 రోజుల పాటు సర్వేయర్లకు శిక్షణ కొనసాగుతుందన్నారు. అర్హత కలిగిన సర్వేయర్లు శిక్షణకు హాజరయ్యే క్రమంలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని, లేదంటే శిక్షణకు అనుమతించమన్నారు. 94 మంది గైర్హాజరుజనగామ రూరల్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు 94 మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ జితేందర్ తెలిపారు. మొదటి సంవత్సరం జనరల్, ఒకేషనల్ మొత్తం 1,137 విద్యార్థులకు గాను 1,068 విద్యార్థులు హాజరు కాగా 69 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం రెండో సంవత్సరం విద్యార్థులు మొత్తం 742 గాను 717 విద్యార్థులు హాజరు కాగా 25 గైర్హాజరయ్యారు. ఫ్లయింగ్ స్క్వాడ్ పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ సందర్శించారు. డెక్ సభ్యులు జనగామ, జఫర్గఢ్ పరీక్ష కేంద్రాలను సందర్శించారు. -
భారీగా గుట్కాల పట్టివేత
జనగామ: జిల్లా కేంద్రంలో గుట్టుచప్పడు కాకుండా అమ్మకాలు చేస్తున్న గుట్కాలను టాస్క్ఫోర్స్ బృందం శనివారం రాత్రి పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్తాన్కు చెందిన గమ్నారామ్ వ్యాపారి జనగామలో స్థిర పడి గుట్కాల వ్యాపారం చేస్తున్నాడు. పక్కా సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ ఏసీపీ ఏ.మధుసూదన్ ఆధ్వర్యంలో ఎస్సై ఎస్.రాజు నేతృత్వంలో తనిఖీ చేపట్టారు. ఆర్ఆర్ పొగాకు 4 వందల ప్యాకెట్లు (రూ.2.40 లక్షలు), జేకె 3,320 రకానికి చెందిన 12 వందల ప్యాకెట్లు(రూ.2.40లక్షలు) మొత్తంగా రూ.4.80 లక్షల విలువ చేసే ప్యాకెట్లతో పాటు వాటిని తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. కాగా రాజస్తాన్కు చెందిన మరో నిందితుడు మలరాంపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గుట్కా ప్యాకెట్లతో పాటు వాహనాన్ని స్థానిక ఎస్సై చెన్నకేశవులకు అప్పగించారు. -
ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్
ఎలక్ట్రిక్ బస్సుల రాకతో కండక్టర్ల కొరత.. అలాగే.. వరంగల్ రీజియన్కు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం 112 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. ఈ క్రమంలో కండక్టర్ల లోటు భారీగా ఏర్పడింది. దీనికి తోడు రీజియన్లో ఆర్టీసీకి చెందిన సొంత బస్సులు 417 మాత్రమే ఉండగా.. అద్దె బస్సులు 310 ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సులను ప్రయివేట్ సంస్థ జేబీఎం ఆపరేట్ చేస్తున్నది. జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు, అద్దె బస్సులు కలిపి 422 ఉన్నాయి. ఆర్టీసీ సొంత బస్సుల్లో కండక్టర్ల కొరతను అధిగమించేందుకు డ్రైవర్లకు టిమ్లు ఇచ్చి టికెట్ జారీ చేయిస్తూ బస్సులను నడుపుతోంది. ప్రయివేట్ బస్సుల డ్రైవర్లకు టికెట్ జారీ చేసేందుకు టిమ్లు ఇవ్వలేదు. అయితే.. కండక్టర్ల కొరత నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్లకు మాత్రం టిమ్లు ఇచ్చి టికెట్లు జారీ చేయిస్తున్నారు. ఆర్టీసీకి ప్రధాన ఆదాయం టికెట్ల ద్వారానే వస్తుంది కాబట్టి.. ప్రయివేట్ డ్రైవర్లకు అప్పగించేందుకు సిద్ధంగా లేని యాజమాన్యం తాత్కాలికంగా ఔట్ సోర్సింగ్ విధానంలో కండక్టర్ల నియామకానికి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వరంగల్ రీజియన్కు అత్యవసరంగా 100 మంది కండక్టర్లను నియమించనున్నారని, అవసరాన్ని బట్టి మరికొంత మందిని నియమించే ఆలోచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెగ్యులర్ నియామకాలకు ఆలస్యం అవుతుండడంతో తాత్కాలికంగా సమస్య నుంచి గట్టెందుకు ఔట్ సోర్సింగ్ వైపు ఆర్టీసీ మళ్లిందని, తర్వాత రెగ్యులర్ నియామకాలు చేపట్టే అవకాశముందని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఔట్ సో ర్సింగ్లో విజయవంతమైతే పూర్తి స్థాయి నియామకాలను పట్టించుకుంటారా లేదా? అనే సందేహాలు ఆర్టీసీ ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ నియామకాలు అమలులోకి వచ్చాయి. పూర్తి స్థాయి నియామకాలకు మంగళం పాడిన యాజమాన్యం సిబ్బంది లోటును పూడ్చడానికి తాత్కాలిక నియామకాల వైపు మొగ్గు చూపింది. ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాల నియామకం చేపట్టనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ పలు మార్లు ప్రకటనలు చేశారు. ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా.. డ్రైవర్, కండక్టర్ల ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చేపట్టనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అందుకు భిన్నంగా యాజమాన్యం ఔట్ సోర్సింగ్ నియామకాల కోసం జారీ చేసిన సర్క్యులర్ రీజియన్ కార్యాలయాలకు చేరింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ల నియామక సర్క్యులర్ ముందుగా, కండక్టర్లకు సంబంధించి తర్వాత జారీ అయ్యాయి. వరంగల్ రీజియన్లో ఇప్పటికే 30 మంది డ్రైవర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టి శిక్షణ ఇస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం డి.విజయభాను తెలిపారు. మరో 70 మంది డ్రైవర్లను తీసుకునేందుకు సన్నద్ధం అవుతున్నారు. మ్యాన్ పవర్ అందించే ఏజెన్సీల ద్వారా.. ఔట్ సోర్సింగ్ నియామకాలు మ్యాన్ పవర్ అందించే ఎజెన్సీల ద్వారా చేపట్టనున్నారు. ఆర్టీసీకి చెందిన డిప్యూటీ రీజినల్ మేనేజర్లతో కూడిన కమిటీ డ్రైవర్ల నియామకాన్ని చేపడుతోంది. డ్రైవర్ ఉద్యోగానికి చదవడం, రాయడం వస్తే సరిపోతుంది. హెవీ డ్రైవింగ్ లైసెన్స్తోపాటు 18 నెలల అనుభవం ఉండాలి. వయసు 60 ఏళ్లు లోపు వారు అర్హులు. ఎంపిక కమిటీ ముందుగా డ్రైవింగ్ లైసెన్స్, అనుభవాన్ని పరిశీలించిన తర్వాత డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో సంతృప్తి చెందిన అధికారులు వారిని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ నిర్వహించి ఫిట్నెస్ కలిగి ఉన్న వారిని ఎంపిక చేసి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి విధుల్లోకి తీసుకుంటారు. అదే విధంగా కండక్టర్ల నియామకాన్ని ఎంపిక కమిటీ చేపడుతుంది. ఎస్సెస్సీ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై, వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు. వీరి నియామకానికి మ్యాన్ పవర్ అందించే ఎజెన్సీ రూ.2లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. డ్రైవర్లకు నెలకు రూ.22 వేలు జీతం ఇవ్వనుండగా, కండక్టర్లకు రూ.17,969 వేతనం చెల్లిస్తారు. ఎంపికై న వారు రవాణా శాఖ ద్వారా కండక్టర్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది.సిబ్బంది లోటు తీర్చేందుకు తాత్కాలిక చర్యలు వరంగల్ రీజియన్లో ఇప్పటికే 30 మంది డ్రైవర్ల నియామకం మరో 70 మంది డ్రైవర్లు, 100 మంది కండక్టర్ల అవసరం జీతం డ్రైవర్లకు నెలకు రూ.22వేలు, కండక్టర్లకు రూ.17,969 -
సహధర్మచారిణి పక్కనే ‘ముందస్తు స్థలం’
దేవరుప్పుల: సహధర్మచారిణి కాలం చెల్లడంతో తనకు కూడా ఎన్నడైన తప్పదనే ముందస్తు చూపుతో తన భార్య స్మారక విగ్రహం పక్కనే స్థలం కేటాయించుకోవడం ప్రత్యేకత సంతరించుకుంది. దేవరుప్పుల మండలంలోని సీతారాంపురంకు చెందిన ఆవుల ఉప్పలయ్య భార్య మైసమ్మ ఏదాది క్రితం అకస్మికంగా మృతి చెందింది. దీంతో తన వ్యవసాయ క్షేత్రం వద్ద తన భార్య స్మారక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇటీవల ఆవిష్కరించారు. అయితే ఈ స్మారక విగ్రహం పక్కనే భవిష్యత్లో తన విగ్రహం పెట్టేందుకు సెంటిమెంట్గా కుడిభాగాన స్థలం కేటాయించుకోవడం వారి అన్యోన్య దాంపత్యానికి అద్దం పడుతుంది. కాగా వీరి ముగ్గురు కుమారుల్లో ఇద్దరు దేశ రక్షణ విభాగంలో సైనికులు కాగా మరొకరు సివిల్ కానిస్టేబుల్ కావడం గమనార్హం. -
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతం
విద్యారణ్యపురి: యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష–2025 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం అభ్యర్థులు 4,141 మందికి గాను హనుమకొండ జిల్లాలో 10 పరీక్ష కేంద్రాలు కేటాయించారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్లో 2,435 మంది(58.80శాతం), మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షకు 2,422మంది(58.49శాతం)మంది హాజరైనట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు సంబంధించి అడ్మిట్కార్డుతోపాటు గుర్తింపు కార్డు పరిశీలించడంతోపాటు క్షుణ్ణంగా తనిఖీచేశాకే ఉదయం 9 గంటల వరకు లోనికి అనుమతించారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్కాలేజీ, ప్రభుత్వ పింగిళి మహిళా కళాశాల కేంద్రాలను కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఉదయం సెషన్లో 58.80శాతం.. మధ్యాహ్నం సెషన్లో 58.49శాతం హాజరు -
పైలెట్ల సేవలు అభినందనీయం
108 అంబులెన్స్ పైలెట్ల సేవలు అభినందనీయం. జిల్లాలో ఇప్పటి వరకు 10 వేలకు పైగా కేసులను టేకప్ చేసినం. గోల్డెన్ అవర్ కాన్సెప్ట్తో చేర్చే సమయంలో చాలామంది ప్రాణాలు కాపాడగలిగినం. కాల్ వచ్చిన వెంటనే 30 సెకన్లలో వాహనం తీసుకుని బయలు దేరుతారు. వాహనం నడిపించే సమయంలో కనురెప్ప వాల్చకుండా, పేషెంట్ ప్రాణాలు కాపాడడమే ధ్యేయంగా పనిచేస్తారు. మధ్యాహ్న భోజన సమయంలో మధ్యలో కాల్ వస్తే టిఫిన్ బాక్స్ సైతం వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ప్రజల ప్రాణాలకు కాపాడడం తమ బాధ్యతగా భావిస్తున్నారు. – మంద శ్రీనివాస్, 108, 102 ప్రాజెక్టు డైరెక్టర్● -
పేదల సంక్షేమాన్ని మరచిన ప్రభుత్వం
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ బచ్చన్నపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల సంక్షేమాన్ని విస్మరించి బడా బాబులకు పట్టం కడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ఆదివారం మండలంలోని గోపాల్నగర్ గ్రామంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్మించిన గబ్బెట గోపాల్రెడ్డి స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి గోపాల్నగర్ కార్యదర్శి పర్వతం నర్సింహులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాలు మారి న పేదల బతుకులు మారడం లేవన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, కార్యవర్గ సభ్యులు రాపర్తి రాజు, ఇర్రి అహల్య, బొట్ల శేఖర్, మండల ఇన్చార్జ్ సుంచు విజేందర్, బెల్లంకొండ వెంకటేష్, నాయకులు పాల్గొన్నారు. -
సౌధామిని.. పుష్కర మణి!
ప్రాణహితలో మునకలు.. పుష్కరిణికి పూజలు.. పారే నదికి దీపదానాలు.. ప్రవహించే తల్లికి చీరెసారెలు. పితృదేవతలకు పిండ ప్రదానాలు.. అండగా నిలవమని గోదావరికి నవరత్న మాల హారతులు. చదువుల తల్లి నిలువెత్తు రూపానికి భక్తుల నీరాజనాలు. కాళేశ్వర ముక్తీశ్వరుడికి శత కోటి ప్రణామాలు. ఆదివారం కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. సెలవు కావడంతో నదీ పరిసరాలు కిక్కిరిశాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సినీ నటుడు తనికెళ్ల భరణి పుణ్యస్నానం ఆచరించి కాళేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
తరగతి గదుల్లో ఉపాధ్యాయులు ఫోన్వాడొద్దు
రఘునాథపల్లి: తరగతి గదుల్లో ఉపాధ్యాయులు ఫోన్ వాడకుండా విద్యార్థులతో సమయం గడపాల ని వరంగల్ ఎంపీ కడియం కావ్య సూచించారు. జనగామ మండలం యశ్యంతాపూర్ సీజేఐటీలో శనివారం జరిగిన ఉపాధ్యాయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రభు త్వ పాఠశాలల బలోపేతానికి సర్కారు కట్టుబడి ఉందని, అందులో భాగంగానే ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని పేర్కొన్నారు. డీఈఓ భోజన్న, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎంపీ కడియం కావ్య -
‘అంతిమ’ రాగం..
‘తోడుగా మాతోడుండీ.. నీడగా మాతో నడిచి నువ్వెక్కాడెళ్లినావు కొమురయ్యా.. నీ జ్ఞాపకాలూ మరువామయ్యా కొమురయ్యా.. కొడుకునెట్లా మరిసినావే కొమురయ్యా.. నీ బిడ్డనెట్లా మరిసినావే కొమురయ్యా.. బలగాన్నీ మరిసినావే కొమురయ్యా’ అంటూ బలగం సినిమాలో పాడిన పాట అందరినీ కంటతడి పెట్టించిన విషయం తెలిసిందే. ఆఖరి మజిలీలో చనిపోయిన వ్యక్తితో కుటుంబానికి, బంధుగణానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే పాటలు పాడడం ఇప్పుడు ఓరుగల్లులో ఆనవాయితీగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా డప్పు కళాకారుల రాగం.. భావోద్వేగాన్ని పలికిస్తోంది. అదే ఈవారం ‘సాక్షి’ ప్రత్యేకం! – సాక్షి, వరంగల్ఇన్ని రోజులు కలిసి ఉండి.. ఒక్కసారిగా కుటుంబంలో ఒకరు దూరమైతే కుటుంబ సభ్యులు తట్టుకోలేరు. వారి జ్ఞాపకాలు వెంటాడతాయి. వారితో ఉన్న అనుబంధాలు మదిలో మెదులుతాయి. ఇన్నాళ్లూ అంతిమయాత్రలో డప్పుచప్పుళ్లు, అందుకు అనుగుణంగా స్టెప్పులు వేసేవారు. ఇప్పుడు డప్పుకళాకారుల నోటి నుంచి వస్తున్న బంధాలను పెనవేసే పాటలు భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. కుటుంబ పెద్ద మరణించినప్పుడు బలగం సినిమాలో పాడిన పాట, డప్పు కళాకారుల ప్రదర్శన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా ఏళ్ల కిందటి సంప్రదాయం. ఇప్పుడు మరింత ట్రెండీగా మారింది. బలగం సినిమాకు ముందే... 15 ఏళ్ల క్రితమే చెన్నారావుపేట మండలం పాపాయ్యపేట యాకన్న బృందం అంత్యక్రియల్లో పాటలు పాడడం ప్రారంభించింది. ఆతర్వాత నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన యాకాంబరం బృందం కూడా బంధుత్వ విలువలు తెలిసేలా పాటలు పాడడం మొదలు పెట్టింది. అయితే బలగం సినిమా విడుదలైన తర్వాత ఈ డప్పు కళా బృందాలకు ముఖ్యంగా పాటలు పాడే వారికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఎవరు మరణించినా.. అప్పటికప్పుడు వారి గుణగణాలు తెలుసుకుని పాటలు అల్లుతూ పాడుతూ కళాకారులు కన్నీళ్లు పెట్టిస్తున్నారు. ఆదరణ పెరిగింది.. మాది చెన్నారావుపేట మండలం పాపయ్యపేట డప్పు కళా బృందం. 22 మంది సభ్యులతో ప్రత్యేక బృందా న్ని 14 ఏళ్ల క్రితమే ఏర్పాటు చేసుకున్నాం. ఓవైపు డప్పుచప్పుళ్లతో పాటు ఇంకోవైపు పాటలు పాడుతున్నాం. అయినా అప్పుడు పెద్దగా ఆదరణ ఉండేది కాదు. ఇటీవల చాలా మంది మా పాటలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుండడంతో మాకు గిరాకీ పెరిగింది. ఇందుకు అనుగుణంగానే సరికొత్త చరణాలతో అప్పటికప్పుడు పాటలు రాస్తూ.. పాడుతూ బంధాలను మరింత బలోపేతం చేస్తున్నాం. – అబ్బదాసి యాకన్న, డప్పు కళాకారుడు సంగెం మండలం కొత్తగూడలో ఇటీవల అంతిమ యాత్రలో పాట పాడుతున్న కళాకారుడు(ఫైల్)ఇటీవల మారిన అంతిమ యాత్ర తీరు జ్ఞాపకాలు గుర్తు చేస్తూ కన్నీళ్లు పెట్టిస్తున్న పాటలు కట్టిపడేస్తున్న డప్పు కళాబృందాల ప్రదర్శనడప్పుచప్పుళ్లు.. పాటలు ‘నేనెళ్లి పోతున్నా దూరం.. మన ఇల్లు, నీ పిల్ల లు పదిలం.. మన బంధు బలగం పదిలం.. అని పైనుంచి తన ఆత్మ ద్వారా సుశీలవ్వ మనకు చెబుతున్నది’ అంటూ నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన డప్పు కళా బృందం వరంగల్జిల్లా అనంతారంలో పాడిన పాట ఆఖరి మజిలీకి వచ్చినవారందరినీ కంటతడి పెట్టించింది. ఇలా డప్పు కళాకారులు, జానపదులు పాడుతున్న పాటలు బంధాలను బలోపేతం చేస్తున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని చాటిచెబుతున్నాయి. -
గ్రామ పాలనకు జీపీఓలు
జనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గ్రామ పాలన అధికారుల(జీపీఓ) నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. ఆదివారం(నేడు) జీపీఓల ఎంపికకు అర్హత పరీక్ష నిర్వహించడానికి అధికారులు ఏర్పా ట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని ఏబీవీ జూని యర్ కళాశాలను పరీక్ష కేంద్రంగా కేటాయించారు. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం జీపీఓ పోస్టుల కోసం ఆన్లైన్లో 200 వరకు దరఖాస్తులు రాగా పరిశీలన ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు కొన్నింటిని తిరస్కరించారు. గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చా రు. డిగ్రీ పూర్తిచేసిన, ఇంటర్తోపాటు ఐదేళ్ల సర్వీసు ఉన్న వారికి ఆమోదం లభించింది. జిల్లా నుంచి 97మంది వీఆర్వోలు, వీఆర్ఎలు, ఇతరులు పరీక్ష రాయనున్నారు. రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓ జిల్లాలో 281 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓను నియమించనున్నారు. గ్రామీణ భూసమస్యలపై అవగాహన ఉన్న పూర్వ వీఆర్వో, వీఆర్ఏలను జీపీఓలుగా ఎంపిక చేయనున్నారు. భూభారతి చట్టం అమలు బాధ్యతలు నిర్వహించడంలో వీరు కీలకం కానున్నారు. సర్వీసుపై స్పష్టత కరువు 2022లో వీఆర్వో వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటి వరకు పనిచేస్తున్నవారిని ఇత ర శాఖల్లో సర్దుబాటు చేసింది. చాలా మంది ఇతర జిల్లాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరిని సొంత జిల్లాకు తీసుకువచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. గత డిసెంబర్లో ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించగా.. ఈ ఏడాది ఏప్రిల్ 26 వరకు మరోసారి దరఖా స్తులు ఆహ్వానించారు. డిగ్రీ, ఇంటర్ అర్హత ఉన్నవారికి స్క్రీనింగ్ పరీక్ష రాయాలని స్పష్టం చేశారు. అయితే, సర్వీసు విషయంలో స్పష్టత లేకపోవడంతో తక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు ఏర్పాట్లు గ్రామ పాలన అధికారుల నియామకంలో భాగంగా ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించడానికి అవసర మైన ఏర్పాట్లు చేశామని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. ఇందుకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో ఆయన మూడు రోజుల క్రితం జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించి పరీక్ష నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని.. పరీక్ష కేంద్రం, ఇతర వివరాల కోసం అధికారిక సీసీఎల్ వెబ్సైట్లో చూడొచ్చని పేర్కొ న్నారు. హాల్ టికెట్లు వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. మండలాల పరిధి అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేలా తహసీల్దార్లు సహకరించాలని, సమస్యలు ఉంటే నివృత్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. పరీక్ష నిర్వహణలో నిబంధనలు పాటించాలి సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ నేటి గ్రామ పాలన అధికారి పరీక్ష నిర్వహణలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీసీఎల్ ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్ నుంచి అదన పు కలెక్టర్ రోహిత్సింగ్తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా పాల్గొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ.. గ్రామ పాలన అధికారి పరీక్షకు జిల్లాలో నోడల్ అధికారి ఆధ్వర్యాన అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించాలని సూచించారు. స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ సుహాసిని, కలెక్టరెట్ ఏఓ మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.నియామక ప్రక్రియ షురూ జిల్లా నుంచి 97 మందితో నివేదిక నేడు రాత పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి త్వరల్లో విధుల్లోకి చేరనున్న గ్రామ పాలన అధికారులు -
చాలా ఏళ్ల నుంచి పాడుతున్నాం..
చాలా ఏళ్ల నుంచి మేం 12 మంది సభ్యులతో డప్పు కళాబృందం ఏర్పాటు చేసుకున్నాం. మనిషి చనిపోయిన సమయంలో వారు తన కుటుంబసభ్యులకు బాధ్యతలు అప్పగిస్తూ ఏమనుకుంటున్నారనే మాటలతో అప్పటికప్పుడు పాటలు రాసుకుని పాడతాం. మా పాటలతో పెద్ద గొడవలు ఉన్న ఫ్యామిలీలు మారిన సందర్భాలూ ఉన్నాయి. మేం పాడే పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలామంది మమ్మల్ని సంప్రదించి తమ కుటుంబీకుల ఆఖరి మజిలీలో పాటలు పాడాలని అడుగుతున్నారు. – సౌరపు యాకాంబరం, దీక్షకుంట, గ్రామ డప్పు కళాబృందం, నెక్కొండ మండలం -
విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలి●
జనగామ రూరల్: విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించేలా గుణాత్మక విద్య అందించాలని జిల్లా విద్యాధికారి భోజన్న అన్నారు. శనివారం ధర్మకంచ బాలుర ఉన్నత పాఠశాలలో కోర్సు డైరెక్టర్, ఎంఈ ఓ గురిజాల శంకర్రెడ్డి ఆధ్వర్యాన చేపట్టిన ఇన్ సర్వీస్ టీచర్స్ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలు, నాణ్యమైన విద్య తదితరాలను తల్లిదండ్రులకు వివరించి విద్యార్థుల నమోదు పెంచాలన్నా రు. కార్యక్రమంలో తెలుగు, ఇంగ్లిష్, గణిత, పరిసరాల విజ్ఞానం ఆర్పీలు పరశురామన్, బొగ్గారపు శ్రీనివాస్, నిమ్మ రామ్రెడ్డి, రేణిగుంట్ల మురళి, చట్ల సాంబరాజు, వంగ సంతోష్కుమార్, శాడ రవి, నవీన్ కుమార్, సీఆర్పీలు రమేశ్, నరేష్ పాల్గొన్నారు. శిక్షణ ముగింపు కార్యక్రమం అనంతరం డీఈఓ భోజన్నను తెలంగాణ స్టేట్ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యాన సత్కరించారు. జిల్లా అధ్యక్షుడు కాకాని లక్ష్మణమూర్తి, ప్రధాన కార్యదర్శి మేడ మనోజ్కుమార్, కోశాధి కారి బెజ్జం సునీల్కుమార్, అంజయ్య, శేషుకుమార్, రజిత, కుమారి, బలరాం పాల్గొన్నారు. జిల్లా విద్యాధికారి భోజన్న -
‘ఎల్ఆర్ఎస్’ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలి
జనగామ రూరల్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో సెక్షన్ అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ పురపాలిక పరిధిలో లేఅవుట్ ప్లాట్ల క్రమబద్ధీకరణ కు ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్–2020 పథకానికి వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి త్వరగా పరిష్కరించాలని చెప్పారు. అలాగే వార్డుల్లో చెత్త సేకరణ, తరలింపు ప్రక్రియ నిత్యం చేపట్టాలని, డ్రెయినేజీలు, రహదారులు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలన్నారు. తడి, పొడి చెత్త సేకరణ మరింత మెరుగ్గా ఉండాలని సూచించారు. పురపాలికకు సంబంధించిన రిజిస్టర్లు, రికార్డులు, ఖాతాల నిర్వహణ సక్రమంగా చేపట్టాల ని ఆదేశించారు. అనంతరం వార్డుల వారీగా నివాస గృహాల నుంచి వసూలు చేసిన పన్నుల వివరాలపై ఆరా తీసిన అదనపు కలెక్టర్.. వంద శాతం వసూళ్లు లక్ష్యంగా ముందుకు వెళ్లాలని అన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ గోపయ్య, ఆర్ఓ శ్రీనివాసస్వామి, టీపీఎస్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ -
వైభవంగా వార కల్యాణం
చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి సన్నిధి లో శనివారం ఆలయ ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు ఆధ్వర్యంలో స్వామివారి వార కల్యాణాన్ని అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు వేద మంత్రాల నడుమ నిర్వహించారు. భక్తులకు వికారాబాద్ జిల్లా యాలాలకు చెందిన సిద్దాల శ్రీనివాస్–సులోచన, శ్రవణ్కుమార్–సారిక అన్న ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలు గోలి రాజశేఖర్, గణగోని రమేశ్, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్, వీరన్న, లక్ష్మి, మల్లికార్జున్, హరిశంకర్, వసంత, మహేశ్, గాదె శేఖర్, రాజేశ్, విశాల్, కృష్ణ పాల్గొన్నారు. ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం జనగామ రూరల్: గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పార్టీ రాష్ట్ర నాయకుడు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాద వ్ అన్నారు. మండల పరిధి శామీర్పేట గ్రా మంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద వచ్చిన రూ.10 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను శనివారం వారు ప్రారంభించి మా ట్లాడారు. బుచ్చిరెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బాల్నే సుధాకర్, కడకంచి లక్ష్మీవీరమల్లు, తాండ్ర కౌసల్య, కాంసాని భాస్కర్రెడ్డి, బత్తుల లక్ష్మీనారాయణ, తాండ్ర ప్రవీణ్, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. సహకార సంఘాలను మరింత బలోపేతం చేయాలి పాలకుర్తి: ప్రజలకు మేలు చేసే సహకార సంఘాలను మరింత బలోపేతం చేయాలని జిల్లా సహకార అధికారి వై.రాజేందర్రెడ్డి అన్నారు. శనివారం ఎల్లరాయని తొర్రూరు సహకార సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని చైర్మన్ గోనె మైసిరెడ్డి, సొసైటీ సీఈఓ మాసంపల్లి రణధీర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఈరవెన్ను, ఎల్ల రాయని తొర్రూరు కేంద్రాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు సెంటర్లను రాజేందర్రెడ్డి సందర్శించి రైతులతో మాట్లాడారు. సప్లిమెంటరీ పరీక్షలకు 86 మంది విద్యార్థుల గైర్హాజరుజనగామ రూరల్: జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 86 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఫస్టియర్ జనర ల్, ఒకేషనల్ కలిపి 1,762 మంది విద్యార్థుల కు 1,676 మంది పరీక్ష రాసినట్లు డీఐఈఓ జితేందర్ రెడ్డి తెలిపారు. ఉదయం నిర్వహించి న పరీక్షలో మాల్ ప్రాక్టీస్ కేసు ఒకటి నమోదైన ట్లు పేర్కొన్నారు. -
హెచ్టీ సర్వీసులకు సింగిల్ విండో సిస్టం
జనగామ: విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం హెచ్టీ 11, 33 కేవీపై ఓల్టేజీ సర్వీసు ల మంజూరు ప్రక్రియలో వేగం పెంచేందుకు సింగిల్ విండో సిస్టం అందుబాటులోకి తెచ్చి నట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ టి.వేణుమాధవ్ తెలిపారు. శనివారం సర్కిల్ ఆఫీసులో ఆయ న మాట్లాడుతూ.. సర్కిల్, కార్పొరేట్ కార్యాలయాల్లో హెచ్టీ మానిటరింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. 11 కేవీ ఓల్టేజీ దరఖాస్తుల ను సర్కిల్ ఆఫీస్ పరిధి ఏడీతో పాటు కమర్షియల్ అధికారి, 33 కేవీ, ఆపై ఓల్టేజీ దరఖాస్తులను ఏడీ, కమర్షియల్ కార్పొరేట్ ఆఫీస్ అధికారి పర్యవేక్షిస్తార ని చెప్పారు. వినియోగదారులు ముందుగా టీజీ ఎన్పీడీసీఎల్ పోర్టల్లో అవసరమైన పత్రాలతో హెచ్టీ దరఖాస్తు(టీజీ ఐపాస్లో నమోదు కానివి) నమోదు చేసుకు న్నాక కొత్త అప్లికేషన్ నంబర్(యూఐడీ) క్రియేట్ అవుతుంద ని, దాని ద్వారా దరఖాస్తు ఎన్పీడీసీఎల్ సర్కిల్ డాష్ బోర్డులో కనిపిస్తుందని పేర్కొన్నారు. రోజువారీ గా ఏడీఈ, కమర్షియల్ అధికారులు డాష్ బోర్డును మానిటరింగ్ చేస్తారని తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాగానే ఎస్టీమేషన్ల కోసం పంపిస్తార ని, ఏడీఈ, కమర్షియల్ సర్కిల్ ఆఫీస్ ఫీల్డ్ స్టాఫ్ సందర్శించి ఉన్నతాధికారులకు పంపాక ఓకే అయి తే అనుమతులు జారీ చేస్తారని వివరించారు. అనుమతి సాధ్యం కాకుంటే రెండు రోజుల్లో రిమార్కుతో ఎస్ఎంఎస్ పంపిస్తారని చెప్పారు. ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ -
అటవీ ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలి
● వీడియో కాన్ఫరెన్లో మంత్రి కొండా సురేఖ న్యూశాయంపేట: అటవీ ప్రాంతాల అభివృద్ధికి ఫారెస్ట్ ఉన్నతాధికారులు, డీఎఫ్ఓలు సహకరించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. పంచాయతీరాజ్, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి పూర్వ వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ అధికారులతో అటవీ సమస్యలపై శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ అటవీ సంరక్షణ, గిరిజనుల అభివృద్ధి అనివార్యమన్నారు. ఆయా ప్రాంతాల ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా అధికారులు చూడాలని పేర్కొన్నారు. -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జనగామ: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ విద్యుత్ సంస్థకు సహకరించాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ టి.వేణుమాధవ్ అన్నారు. భారీ ఈదురు గాలుల సమయంలో ఇంటి ఆవరణలో ఆరేసిన దుస్తులు ఎగిరి పోయి విద్యుత్ వైర్లపై పడిపోవడం వల్ల కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పాడుతోందని చెప్పారు. విద్యుత్ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రకృతి వైపరీత్యాలు, ఇతర సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైన సయయంలో నాణ్యమైన విద్యుత్ అందించేందుకు శ్రమిస్తున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులకు ఉత్తమ విద్య అందించాలి నర్మెట : ఉపాధ్యాయులు తరగతి గదిలో విద్యార్థులకు ఉత్తమ విద్య అందించాలని విద్యాశాఖ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జి.ఉషారాణి అన్నారు. శుక్రవారం వెల్దండ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరంతోపాటు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల పఠనా సామర్థ్యాలను గుర్తించి వారిని కేటగిరీలుగా విభజించి అనుగుణంగా బోధన చేయాలని సూచించారు. గుణాత్మక విద్య అందించి ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రలకు నమ్మకం పెంచాలన్నారు. డీఈఓ భోజన్న, వయోజన విద్య సమన్వయకర్త విజయ్కుమార్, ఎంఈఓ అయిలయ్య, క్యాంపు ఇన్చార్జ్ అంజిరెడ్డి పాల్గొన్నారు. ఫైర్ సేఫ్టీ తప్పనిసరి జనగామ: ఫైర్ సేఫ్టీ తప్పనిసరి.. అగ్ని ప్రమాదా ల నివారణపై అవగాహన కలిగి ఉండాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. పట్టణంలో వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో అగ్ని మాపక, పోలీసు శాఖలు సంయుక్తంగా వ్యాపా ర, వాణిజ్య సంస్థల నిర్వాహకులకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఏసీపీ నితిన్ చేతన్ పండేరి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి రేమండ్ బాబు ఆధ్వర్యాన ఆర్టీసీ డిపో, షాపింగ్ మాల్స్, దీపావళి క్రాకర్స్ గోదాం, దుకాణాల వద్ద ఫైర్ సేఫ్టీని పరిశీలించారు. ప్రమాద నివారణ జాగ్రత్తలు, ఫైర్ సేఫ్టీ అనుమతులపై ఆరా తీశారు. ముస్లింలు చట్టాన్ని అనుసరించాలి జనగామ రూరల్: ముస్లింలు చట్టాన్ని అనుసరించాలి.. ఆవు, ఆవులలో తక్కువ వయసు కలిగిన వాటిని వధించి బక్రీద్ పండుగ జరుపుకోవద్దని ముస్లిం డెవలప్మెంట్ కమిటీ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది మహమ్మద్ జమాల్ షరీఫ్ కోరారు. శుక్రవారం పట్టణంలోని ఏక్ మినార్ మజీద్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆవు బలి నిషేధ చట్టం అమల్లో ఉన్నందున ముస్లింలు చట్టప్రకారం నడుచుకోవాలని, ఉల్లంఘించిన వారు చట్టప్రకారం శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా బక్రీద్ పండుగ జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అలీముద్దీన్, అఫ్జల్, అబ్దుల్లా, జహంగీర్, షకీర్ తదితరులు పాల్గొన్నారు. -
చివరి దశకు ధాన్యం కొనుగోళ్లు
జనగామ: జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ రికార్డు స్థాయిలో చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్లో మొత్తం దొడ్డు, సన్నరకాలు కలిపి 160 మెట్రిక్ టన్నులకు పైగా కొనుగోలు చేశారు. ధాన్యం సేకరణకు ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లు 282 ఏర్పాటు చేయగా.. కొనుగోళ్లు చివరి దశకు చేరడంతో ఇప్ప టి వరకు 139 కేంద్రాలను మూసి వేశారు. ప్రభుత్వం 30,364 మంది రైతుల నుంచి 149.32 మెట్రిక్ టన్నుల దొడ్డు, సన్నరకం ధాన్యం కొనుగోలు చేసింది. రైతులకు రూ.340కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.315 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది. మరో రూ.25కోట్ల బకాయి ఉంది. ఇందులో 20,174 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన రూ.10.04 కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు పైసా రాలేదు. కొనుగోళ్లలో వేగం రాష్ట్ర వ్యాప్తంగా రెండు, మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో చివరి దశకు చేరుకున్న ధాన్యం కొనుగోళ్లలో మరింత వేగం పెంచారు. ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్ల పరిధిలో సంబంధిత అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అకాల వర్షాలతో సెంటర్లలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంతో పాటు వడ్లు తడవకుండా టార్పాలిన్ కవర్ల ను అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో 5 నుంచి 10 శాతం ధాన్యం మిగిలి ఉంది. సేకరణ ప్రక్రియ ముగిసిన వెంటనే మిగతా సెంటర్లను మూసి వేయనున్నారు.ధాన్యం మిల్లులకు తరలించాలి జిల్లాలో ధాన్యం కొనుగో ళ్లు చివరి దశకు చేరుకు న్నాయి. రెండు, మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిర్వాహకులు సెంటర్లలో ఉన్న కొద్ది పాటి ధాన్యం తడసి పోకుండా చర్యలు తీసుకోవాలి. కాంటా వేసిన ధాన్యం వెంట వెంటనే మిల్లులకు తరలించాలి. రెవెన్యూ, మార్కెటింగ్, సివిల్ సప్లయీస్ తదితర శాఖలు అప్రమత్తంగా ఉండాలి. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వివరాలను అప్లోడ్ చేయాలి. – షేక్ రిజ్వాన్ బాషా, కలెక్టర్ 149.32 మెట్రిక్ టన్నులు సేకరణ 282 కేంద్రాలకు 139 సెంటర్ల మూసివేత 143 సెంటర్లలో 5 నుంచి 10 శాతం ధాన్యం రెండు, మూడు రోజుల్లో కొనుగోళ్లు పూర్తి రైతుల ఖాతాల్లో రూ.315 కోట్లు జమ ఇంకా చెల్లించాల్సి ఉన్న మొత్తం రూ.25కోట్లు.. బోనస్ బకాయి రూ.10 కోట్ల వరకు.. -
జీవ నది.. ఉప్పొంగిన మది
నదిని చూసిన మది ఉప్పొంగింది.. స్నానమాచరించాక కష్టాల గుండె తేలికయ్యింది.. చల్లని తల్లికి నమస్కరించాక భయం పటాపంచలైంది.. సైకత లింగాన్ని పూజించాక అభయం అందినట్లయ్యింది.. ఇలా కాళేశ్వరానికి వచ్చి న వారంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయి కనిపించారు. ‘సల్లంగ సూడు సరస్వతమ్మా’ అంటూ నీటిలో దీపాలు వదిలారు. గోదావరి మాతకు చీరసారె సమర్పించారు. కాళేశ్వర ముక్తీశ్వరున్ని దర్శించుకున్నా రు. శుక్రవారం కాళేశ్వరం భక్తజన సంద్రమైంది. సుమారు లక్షమందికి పైగా పుష్కర స్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. – మరిన్ని ఫొటోలు: 10లోu -
నైపుణ్యం ఉన్న రంగంపై దృష్టి పెట్టాలి
జనగామ రూరల్: విద్యార్థులు నైపుణ్యం ఉన్న రంగంపై దృష్టి సారిస్తే మంచి ఫలితాలు పొందవచ్చని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. రాణి అహల్యాబాయి హోల్కర్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం సూర్యాపేట రోడ్డులోని స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు కత్తుల లక్ష్మి ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అహల్యబాయి హోల్కర్ వందల ఏళ్ల క్రితమే మహిళలు సొంత కాళ్లపై నిలబడాలని వ్యవసాయం నేర్పించి ప్రోత్సహించారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుందని దాన్ని వెలికితీసి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ భిక్షపతి, శివరాజ్ యాదవ్, తోకల ఉమారాణి, మాలతి రెడ్డి, బొమ్మకంటి అనిల్, పెద్దో జు జగదీష్, మైపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా చేపట్టాలి
పాలకుర్తి టౌన్: ఇందిరమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం బమ్మెర గ్రామంలో సర్వే ప్రక్రియను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులకు సంబంధించి ప్రక్రియ క్షేత్రస్థాయి ధ్రువీకరణను వేగవంతం చేయాలని, పక్కా సమాచారం సేకరించాలని చెప్పారు. అర్హులను గుర్తించి వివరాలను ఆన్లైన్లో తప్పులు లేకుండా నమోదు చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా.. మండలంలోని ఈరవెన్న, గూడూరు గ్రామాల్లోని ధాన్యం కొనుకొ లు కేంద్రాలను సందర్శించిన ఆయన.. రైతులు ఆయా సెంటర్లలో ఆరబోసిన ధాన్యం తేమ శాతం, కొగుగోళ్ల రిజిస్టర్లను పరిశీలించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ నాగేశ్వరాచారి, ఎంపీడీఓ రాములు, ఆర్ఐ రాకేశ్ తదితరులు ఉన్నారు. విత్తనాలు అధిక ధరలకు విక్రయించొద్దు రైతులకు విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్ బాషా హెచ్చరించారు. మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, సుధ ఫర్టిలైజర్ దుకాణాలను సందర్శంచిన ఆయన విత్తన క్రయ విక్రయాల రికార్డులు, కంపెనీల పత్రాలను, విత్తన ప్యాకెట్లపై లేబుల్స్, వ్యాపార లైసెన్స్ తదితరాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన తర్వాత విధిగా సంతకంతో కూడిన రశీదు రైతులకు ఇవ్వాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆయా దుఖానాల్లో కొనుగోలు చేసిన పలువురు రైతులకు ఫోన్ చేసి మాట్లాడారు. విత్తనాలు ఎక్కడ కొన్నారు.. ఎంత ధర తీసుకున్నారు.. అదనంగా నగదు ఏమైనా చెల్లించారా అని తెలుసుకున్నారు. మండల వ్యవసాయ అధికారి శరత్చంద్ర, తహసీల్దార్ నాగేశ్వరాచారి, ఆర్ఐ రాకేశ్ పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగంగా చేపట్టాలి
జనగామ రూరల్: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాస పథకం, శానిటేషన్, గ్రామీణ ఉపాధి హామీ పథకం తదితర అంశాలపై ఎంపీడీఓలు, ఎంపీఓ లు, ఏపీఓలతో శుక్రవారం కలెక్టరెట్ నుంచి నిర్వహించిన జూమ్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఈనెల 28 లోపు మండల స్థాయి కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి జిల్లా స్థాయి కమిటీకి నివేదిక పంపించాలన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్ పూర్తి చేసి ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని చెప్పారు. ఉపాధి కూలీలకు కనీస వేతనం విధిగా పెంచాలని, మెటీరియల్ పనులు పౌల్ట్రీ, గోట్స్షెడ్స్ తదితర వాటికి ఎంపీడీఓలు త్వరగా మంజూరు తీసుకోవా లని పేర్కొన్నారు. నీటి వనరుల పరిరక్షణకు తీసుకున్న చర్యలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రతీ గ్రామంలో ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ గుంతలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ వసంత, డీపీఓ స్వరూప, ఎల్డీఎం తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ -
విద్యార్థులకు మార్గ నిర్దేశం చేయాలి
జనగామ: విద్యార్థులకు బాల్య దశలోనే సత్యం, ధర్మం, సన్మార్గంలో నడిచేలా తల్లిదండ్రులు మార్గ నిర్దేశం చేయాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. స్థానిక శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మోహనకృష్ణ భార్గవ ఆధ్వర్యాన నిర్వహిస్తు న్న హిందూ బాల సంస్కార శిక్షణ శుక్రవారం ముగి సింది. డీసీపీ మాట్లాడుతూ శిక్షణలో ధర్మం గురించి తెలుసుకున్న విద్యార్థులు ఉన్నత లక్ష్యాలకు చేరుకు ని సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించాలన్నా రు. పౌరులుగా తమ బాధ్యతలను గుర్తెరిగి ముందుకు నడవాలని సూచించారు. వీహెచ్పీ వరంగల్ విభాగ్ కార్యదర్శి నందాల చందర్బాబు మాట్లాడు తూ ప్రస్తుత సమాజంలో మంచి మాటలు వినే పరిస్థితి పిల్లల్లో లేదని, ఈ తరుణంలో 125 మంది పిల్లలు నిత్యం వైదిక సూత్రాలను వినేందుకు రావ డం శుభ పరిణామమన్నారు. శిక్షణ ముగింపు సందర్భంగా విద్యార్థుల కూచిపూడి నృత్య ప్రదర్శన, శ్లోక పఠనం, గీతాలాపన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులు విద్యార్థులకు ప్రశంస పత్రాలతో పాటు భగవద్గీత, హనుమాన్ చాలీసా, పెన్నులు, పెన్సిల్ బహుమతులుగా అందజేశారు. కార్యక్రమంలో లావణ్య, అంబటి బాలరాజు, మైలారం శ్రీనివాస్, చిలువేరు హర్షవర్ధన్, ఉల్లెంగు ల రాజు, ఝాన్సీ, అంబటి బాలరాజు, పాశం శ్రీశైలం, యెలసాని కృష్ణమూర్తి, కుందారపు బైరునాథ్, కూచిపూడి కిరణ్ ఆచార్య, నాగరాజురెడ్డి, ఉమాక ర్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, అకివేలు, జ్యోతి, వరలక్ష్మీ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ -
అంశాలు, జిల్లాల వారీగా అర్జీల వివరాలు..
సాక్షిప్రతినిధి, వరంగల్: ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రారంభించిన ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని నాలుగు మండలాలను ఎంపిక చేసింది. తర్వాత జిల్లాకు ఒక మండలం చొప్పున ఎంపిక చేసి సదస్సులు నిర్వహించి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలకు సంబంధించి.. నడికూడ (హనుమకొండ జిల్లా), వర్ధన్నపేట (వరంగల్), వెంకటాపురం (ములుగు), దంతాలపల్లి (మహబూబాబాద్), స్టేషన్ఘన్పూర్ (జనగామ), రేగొండ (జేఎస్ భూపాలపల్లి) మండలాలను ‘పైలట్’గా ఎంచుకున్నారు. ఆరు మండలాల నుంచి మొత్తం 19,655 దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ధరణి పోర్టల్లో నిక్షిప్తం చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. భూభారతి సదస్సులు, దరఖాస్తుల స్వీకరణ, రక్షేత్రస్థాయి పరిశీలనలపై ‘గ్రౌండ్రిపోర్ట్’. అధిక సంఖ్యలో అర్జీలు.. క్షేత్రస్థాయి పరిశీలన.. భూభారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారానికి చేపట్టిన సదస్సుల్లో అర్జీలు అధికసంఖ్యలో వచ్చాయి. ఉమ్మడి వరంగల్లో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన మండలాల్లో ఈనెల 5 నుంచి 18 తేదీల వరకు సదస్సులు నిర్వహించారు. ఈఆరు మండలాల్లోని గ్రామాల నుంచి మొత్తం 19,655 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో ప్రధానంగా అర్జీదారులు సాదాబైనామా, అసైన్ట్, వారసత్వ మార్పిడిలను ఎక్కువగా అడిగారు. భూ విస్తీర్ణంలో తేడాలు, భూములు నిషేధిత జాబితాలోకి ఎక్కడం, భూ హద్దుల సమస్య, పేర్లు సరిచేయడం, సర్వే నంబర్ల మిస్సింగ్ తదితర సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా.. 19,655 అర్జీల్లో 8,339 సాదాబైనామా, 3,416 అసైన్డ్, 1,331 వారసత్వ మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నారు. భూవిస్తీర్ణంలో తేడాల సవరణ కోసం 910 మంది అర్జీ పెట్టుకోగా.. మిగిలిన 5,659 దరఖాస్తులు వివిధ అంశాలపై ఉన్నాయి. ఇదిలా ఉంటే.. పైలట్ మండలాల్లో రెవెన్యూ సదస్సుల్లో రైతులకు అవగాహన కల్పించి దరఖాస్తులు స్వీకరించి రసీదులు అందజేసిన అధికారులు, ఆవివరాలను భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. దరఖాస్తుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రెవెన్యూ గ్రామాల వారీగా ఆరు మండలాల్లో 21 ప్రత్యేక బృందాలను నియమించగా.. వారు దరఖాస్తుదారులకు నోటీసులు అందజేసి వారి సమక్షంలోనే సర్వేయర్, రెవెన్యూ బందాలు భూములను పరిశీలించేందుకు వెళ్తున్నారు. పట్టాదా రు పాసుపుస్తకాల్లో రైతుల వివరాలు తప్పుగా నమోదైతే వాటిని గుర్తించి, వెంటనే సరిచేస్తారు. ఈ భూసమస్యలను రెవెన్యూ సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్)లలో సవరణ చేస్తారు. ఆరు మండలాల ఫీడ్ బ్యాక్తో జూన్ మొదటి వారంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్నారు. పైలట్ మండలాల వారీగా ఇదీ పరిస్థితి.. ● హనుమకొండ జిల్లా నడికూడలో రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 2,695 అర్జీలు రాగా, సదస్సులు ముగిశాక 203 అర్జీలు తహసీల్దారు కార్యాలయంలో రైతులు అర్జీలు పెట్టుకున్నారు. మొత్తం 2,898 అర్జీల్లో అత్యధికంగా 1,456 సాదాబైనామా, 481 అసైన్డ్ సవరణ, 331 డీఎస్ పెండింగ్, 223 వారసత్వ మార్పిడి కోసం దరఖాస్తులు చేసుకున్నారు. భూవిస్తీర్ణంలో తేడా తదితర అంశాలపై అర్జీలు అందగా.. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రెవెన్యూ గ్రామాల వారీగా నాలుగు బృందాలు పనిచేస్తున్నాయి. ● వరంగల్ జిల్లాలో భూభారతి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న వర్ధన్నపేట మండలంలో 3,197 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ సదస్సుల్లో 2,917 దరఖాస్తులు రాగా.. తహసీల్ ఆఫీసులో 280 దరఖాస్తులు రైతులు ఇచ్చారు. వీటిలో అత్యధికంగా 1,415 సాదాబైనామాలు రాగా.. అసైన్డ్ భూములకు సంబంధించి 746 దరఖాస్తులు వచ్చాయి. వారసత్వ భూమార్పిడి కోసం 192 దరఖాస్తులు వచ్చాయి. ఉన్న భూమి కంటే తక్కువ నమోదైనవారు 155 మంది ఉన్నారు. ● జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలంలో సదస్సులు ముగిసినప్పటికీ దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. మొత్తం 1,068 దరఖాస్తులు వచ్చినట్లు అఽధికారులు చెబుతున్నారు. సాదాబైనామా మినహా మిగిలిన దరఖాస్తుల్లో 40శాతానికి పైగా.. సమస్యలు పరిష్కారమయ్యాయి. మొత్తంగా భూభారతి చట్టంతో భూసమస్యల పరిష్కారంలో సత్ఫలితాలు వస్తున్నాయని అఽధికారులు, రైతులు చెబుతున్నారు. ● ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 4,555 దరఖాస్తులు వచ్చాయి. గడువు ముగిసినప్పటికీ తహసీల్దార్ కార్యాలయంలో పలువురు వివిధ భూ సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఎలాంటి వివాదాలు లేని పట్టా భూముల్లో ఉన్న సమస్యలను 40 శాతానికి పైగా పరిష్కారమయ్యాయి. మొత్తంగా భూభారతి చట్టంతో సత్ఫలితాలు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. ● జేఎస్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఈనెల 5 నుంచి 13వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. మొత్తం 7,111 దరఖా స్తులు వచ్చాయి. సాదాబైనామా మినహా మిగిలి న దరఖాస్తుల్లో 30 శాతానికిపైగా సమస్యలు పరిష్కారమయ్యాయి. మొత్తంగా భూభారతి చట్టంతో సత్ఫలితాలు వస్తున్నాయని అధికారులు, రైతులు చెబుతున్నారు.గ్రౌండ్ రిపోర్ట్ ఆరు పైలట్ మండలాల నుంచి 19,655 దరఖాస్తులు సదస్సుల ద్వారా అర్జీల స్వీకరణ.. సాదాబైనామాలకే ఎక్కువ ప్రాధాన్యం ఆతర్వాత అసైన్డ్, వారసత్వ మార్పిడి ప్రధానంగా 12 అంశాలపై అర్జీలు ఆన్లైన్ పోర్టల్కూ దరఖాస్తులు.. క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులుఅంశాలు హనుమకొండ వరంగల్ భూపాలపల్లి జనగామ ములుగు మహబూబాబాద్ సాదాబైనామా 1,456 1,415 1,999 422 2,801 246 అసైన్డ్ 481 746 1,362 35 732 60 వారసత్వ మార్పిడి 223 192 290 140 430 56 భూ విస్తీర్ణంలో తేడాలు 134 155 338 84 101 101 డీఎస్ పెండింగ్ 331 45 247 29 100 20 మ్యుటేషన్ పెండింగ్ 16 33 06 41 20 23 మిస్సింగ్ సర్వే నంబర్లు 08 30 23 05 100 37 ఇనామ్–ఓఆర్సీ జారీ 119 28 00 07 01 07 భూ వివరణ 00 22 01 11 203 02 భూ సేకరణ 14 05 08 23 03 29 పేరు సరిచేయుట 21 04 19 11 21 22 నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు 07 01 03 19 24 10 38 –ఈ ధ్రువపత్రం 00 01 00 00 19 00 ఇతర దరఖాస్తులు 88 520 2815 241 00 213 -
నాలుగు కేజీబీవీల్లో కిచెన్ గార్డెన్లు
జనగామ రూరల్: కొడకండ్ల, దేవరుప్పుల, జనగామ, లింగాలగణపురం కేజీబీవీల్లో ‘నిర్మాణ్’ సంస్థ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు గురువారం కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ ను వారి చాంబర్లో మర్యాద పూర్వకంగా కలి శారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్గానిక్ ఉత్పత్తులపై అవగాహన కల్పించడంతో పాటు క్షేత్ర స్థాయిలో పండించిన పంటను ఆహారంగా విద్యార్థులకు అందించి రాబోయే తరాన్ని ఆరోగ్యకరంగా అభివృద్ధి చేసేందుకు ‘నిర్మాణ్ సంస్థ ముందుకు వచ్చిందని చెప్పారు. అడ్మినిస్ట్రేషన్ నుంచి పూర్తి సహకారం లభిస్తుందని, మరిన్ని కిచెన్ గార్డెన్లతోపాటు పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్టులతో ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు అరుణ్కుమార్, నిఖిల్ పటేల్కు సర్టిఫికెట్ అందజేశారు. కార్యక్రమంలో ఏఓ మన్సూరీ, గౌసియాబేగం పాల్గొన్నారు.‘హనుమంతుడికి మొదటి ప్రసాదం’చిల్పూరు: హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం స్థానిక బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయ సమీప హనుమాన్ ఆలయంలో హోమం, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా వానరాలు అక్కడికి చేరాయి. భక్తులు కోతులను వెళ్ల గొట్టగా ఒక కోతి ఎవరినీ ఏమి అనకుండా అక్కడే ఉండిపోయింది. పూజ పూర్తయ్యాక భక్తులకు ప్రసాదం పెట్టేందుకు అర్చకుడు రవీందర్శర్మ పులిహోరను చేతిలోకి తీసుకుని కుర్చీలో కూర్చున్నాడు. అక్కడే ఉన్న కోతి నెమ్మదిగా వచ్చి ఆయన పైకి చేరి చెతిలోని పులిహోరను తిని వెళ్లి పోయింది. దీంతో భక్తులు హనుమంతుడే మొదటి ప్రసాదం స్వీకరించాడంటూ సంతోషపడ్డారు.తెలుగు సాహిత్యానికి పద్యం తలమానికంజనగామ రూరల్: తెలుగు సాహిత్యానికి పద్యం తలమానికమని ప్రముఖ కవి, పరిశోధకుడు డాక్టర్ శంకరమంచి శ్యాంప్రసాద్ అన్నా రు. విద్యాశాఖ ఆధ్వర్యాన తెలుగు భాష ఉపాధ్యాయులకు శిక్షణలో భాగంగా గురువారం ‘తెలుగు పద్య వైభవం’ అనే అంశంపై శ్యాంప్రసా ద్ మాట్లాడుతూ.. పద్యం తెలుగు సాహిత్య గౌరవాన్ని నిలబెడుతూ వందల ఏళ్లుగా వివిధ భూమికలను నిర్వహిస్తూ వర్ధిల్లుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈఓ భోజన్న, తెలుగు సాహిత్యపీఠం అధ్యక్షుడు పానుగంటి రామమూర్తి, ఏఎంఓ శ్రీనివాస్, ఎస్ఓ రమేశ్, ఆర్పీలు శేషుకుమార్, రజితకుమారి, బలరాం, శ్రీనివాసాచారి, కుమారస్వామి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.సప్లిమెంటరీ పరీక్షలకు 79 మంది గైర్హాజరుజనగామ రూరల్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు గురువారం 79 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి జితేందర్రెడ్డి తెలిపారు. ఉదయం ఫస్టియర్ జనరల్, ఒకేషనల్ కలిపి 809 విద్యార్థులకు 752 మంది, మధ్యాహ్నం సెకండియర్ 308 విద్యార్థులకు 286 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. డీఐఈఓ జితేందర్ రెడ్డి పాలకుర్తి, జనగామ సెంటర్లను సందర్శించారు. -
రైతు భరోసాకు వేళాయె..
జనగామ: యాసంగి సీజన్ మధ్యలోనే నిలిచిన రైతు భరోసా పెట్టుబడి సాయం నేటి(శుక్రవారం) నుంచి రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీజన్కు ముందు నాలుగు ఎకరాల వరకు పెట్టుబడి సాయం అందించిన సర్కారు.. మిగతా రైతులను హోల్డింగ్లో ఉంచింది. దీంతో నాలుగు నెలలుగా ఎదురు చూపులు తప్పడం లేదు. పంట కోతలు దగ్గర పడి ధాన్యం అమ్మకాలు చివరి దశకు చేరుకునే సమయంలో రైతు భరోసాకు మోక్షం లభించింది. వానాకాలం సీజన్కు రైతులు సన్నద్ధమవుతున్న తరుణంలో రెండు కలిపి పెట్టుబడి సాయం అందిస్తే అప్పులు చేసే అవసరం ఉండదనే అభిప్రాయం అన్నదాతల నుంచి వ్యక్తం అవుతున్నది. జిల్లాలో 3.50 లక్షల ఎకరా ల సాగు భూమి ఉంది. ఇందులో ఏటా యాసంగి సీజన్లో వరి, పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలు కలుపుకుని 2లక్షల ఎకరాల వరకు సాగవుతున్న ది. కాగా యాసంగి సీజన్లో 1,79,498 మంది రైతులు పెట్టుబడి సాయానికి అర్హత సాధించారు. ఎకరాకు రూ.6వేల చొప్పున రూ.217.16 కోట్ల మేర బడ్జెట్ను ప్రభుత్వం జిల్లాకు కేటాయించింది. ఇందులో నాలుగు ఎకరాల వరకు 1,53,185 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.143.68 కోట్ల మేర ఫిబ్రవరిలో జమయ్యాయి. ఆ తర్వాత కాలయాపన కావడంతో రైతులు వ్యవసాయ అధికారులను అడిగినా ప్రయోజనం లేక పోయింది. యాసంగిలో అతివృష్టి, అనావృష్టితో దిగుబడులు కోల్పోయిన రైతులు మిగిలిన కొద్దిపాటి ధాన్యం అమ్ముకున్నారు. చాలా మందికి పెట్టుబడి కూడా రాలేదు. ఈ క్రమంలో కనీసం ఐదెకరాలు ఉన్న అన్నదాతలకు రైతు భరోసా రూ.6వేల చొప్పున రూ. 30వేల పెట్టుబడి సాయం వస్తే కొంత వెసులు బాటుగా ఉంటుందని ఆశించినా నిరాశే ఎదురైయింది. ఎట్టకేలకు శుక్రవారం(నేడు) నుంచి మిగిలి న యాసంగి రైతులకు రూ.6వేల చొప్పున పెట్టుబ డి సాయం జమ చేయనుండడంతో రైతన్నలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.యాసంగి పెట్టుబడి సాయం వివరాలు నేటి నుంచి యాసంగి పెట్టుబడి సాయం మధ్యలో నిలిచిపోయిన వారికి చెల్లింపు జిల్లాలో రైతులు 26,313 మంది చెల్లించే మొత్తం రూ.73.48 కోట్లు నాలుగు నుంచి ఐదెకరాలపైన వారికి.. వానాకాలం సీజన్కు అన్నదాత సన్నద్ధం మొత్తం రైతులు : 1,79,498 పెట్టుబడి సాయం : 217.16కోట్లు నాలుగెకరాల వరకు చెల్లింపు : రూ.143.68కోట్లు చెల్లించాల్సిన పెట్టుబడి సాయం : రూ.73.48కోట్లు సాయం అందుకున్న రైతులు : 1,53,185 మిగిలి ఉన్న రైతులు : 26,313 -
భూభారతి.. సమస్యల హారతి
శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025ప్రాణహిత పరవళ్లు.. కాళేశ్వరం విరాజిల్లు!– 8లోuపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులుమేఘం నీళ్లను కుమ్మరించినా.. ఈదురుగాలి చల్లగా పలకరించినా.. నేల చిత్తడిగా మారినా.. భక్తుల నిష్ట చెక్కు చెదరలేదు. రాష్ట్రాలు దాటి వచ్చిన వారు కొందరైతే.. గంటలకు గంటలు ప్రయాణించి వచ్చిన వారు ఇంకొందరు. భక్తజనులతో కాళేశ్వరాలయం, నదీ పరిసరాలు కిక్కిరిశాయి. పుణ్యస్నానమాచరించిన అనంతరం గోదావరికి ప్రత్యేక పూజలు చేశారు. కాళేశ్వరముక్తీశ్వరుణ్ని దర్శించుకునేందుకు పోటెత్తారు. గురువారం సుమారు లక్షమందికి పైగా భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు.– వివరాలు, మరిన్ని ఫొటోలు : 8లోuనదిలో దీపం వదులుతున్న భక్తురాలున్యూస్రీల్ -
అత్యాధునిక సౌకర్యాలతో రైల్వేస్టేషన్లు
● కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమలశాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ● వరంగల్ రైల్వేస్టేషన్ను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రూ.25.41కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేసిన వరంగల్ రైల్వేస్టేషన్ను గురువారం రాజస్థాన్లోని బికనీర్నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఈసందర్భంగా రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమలశాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మతోపాటు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. – ఖిలా వరంగల్ – వివరాలు 8లోu -
కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
● కలెక్టర్ రిజ్వాన్ బాషా జనగామ రూరల్: నాణ్యమైన విత్తనాలు మాత్ర మే విక్రయించాలి.. రైతులకు నకిలీ, కల్తీ విత్తనా లు అమ్మితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్ బాషా స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రోహిత్సింగ్, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ చేతన్నితిన్తో కలిసి విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల డీలర్లకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. పోలీసు, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామని, సమన్వయం చేసుకుని నకి లీ, కల్తీ విత్తనాల సరఫరా జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. డీలర్లందరూ విత్తన చట్టానికి లోబడి వ్యాపారం చేసుకోవాలని చెప్పారు. స్టాక్ బోర్డు తప్పనిసరిగా ప్రదర్శించాలని, స్టాక్ రిజిస్టర్లో రైతుల కొనుగోళ్ల వివరాలు నమోదు చేయాలన్నారు. సీడ్ సర్టిఫికేషన్ ఉన్న విత్తనాలను మాత్రమే కొనాలని చెప్పారు. కాల పరిమితి ముగిసిన పురుగు మందులు విక్రయించినా, పీసీలు లైసెన్స్లో పొందుపరచకుండా స్టాక్ అమ్మినా, రైతులకు రశీదులు ఇవ్వకున్నా చర్యలు తప్పవన్నారు. అంతకుముందు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాల పై డీలర్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. డీలర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. డీఏఓ రామారావు నాయక్, ఘనపూర్(స్టేషన్), వర్ధన్నపేట ఏసీపీలు భీంశర్మ, నర్స య్య, డీపీడీ విజయశ్రీ, అసోసియేషన్ ప్రెసిడెంట్ పజ్జూరి గోపయ్య తదితరులు పాల్గొన్నారు. రాత పరీక్షకు పక్కా ఏర్పాట్లు ● అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ జనగామ రూరల్: జిల్లాలో ఈనెల 25న గ్రామ పాలనా అధికారుల రాత పరీక్ష పక్కాగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ అన్నా రు. గురువారం కలెక్టరేట్లో సంబంధిత అధికా రులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని ఏబీ వీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెంటర్లో ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంట ల వరకు పరీక్ష ఉంటుందన్నారు. జీపీఓల నియామకంలో భాగంగా పూర్వ వీఆర్వో, వీఆర్ఏలకు ఆప్షన్ల కింద అవకాశం కల్పించగా జిల్లా నుంచి 110 దరఖాస్తులు వచ్చాయని, అందులో 97 మంది ఈ పరీక్షకు హాజరుకానున్నారని వెల్లడించారు. స్పెషల్ డిపూటీ కలెక్టర్ సుహాసిని, చీఫ్ సూపరింటెండెంట్ నర్సయ్య, అబ్జర్వర్, సిట్టింగ్ స్క్వాడ్ విక్రమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీకి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఝాన్సీరెడ్డితో పాటు ఆమె భర్త రాజేందర్ రెడ్డికి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. 2017లో తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో 75 ఎకరాల భూమిని ఝాన్సీ రెడ్డి కొనుగోలు చేశారు. దీంతో ఫెమా నిబంధనలను ఉల్లంఘించి భూమి కొనుగోలు చేశారంటూ దామోదర్రెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.నిబంధనలకు విరుద్ధంగా ఝాన్సీ రెడ్డికి పాస్ బుక్ మంజూరు చేశారని రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ, సీసీఎల్ఏ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దార్లకు సైతం నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. భూమి విషయంలో విచారణ చేసి పూర్తి నివేదికను అందించాలని ఈడీ జాయింట్ డైరెక్టర్కు కూడా నోటీసులు జారీ చేసింది. -
మెరుగైన వైద్యం అందించాలి
జనగామ: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించి సర్కారు ఆస్పత్రులపై మరింత నమ్మకం పెంచాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్రావుతో కలిసి పలు విభాగాలను పరిశీలించారు. జనరల్, ఎమర్జెన్సీ వార్డుల్లో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి ఆస్పత్రిలో వసతులు, అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, అపరిశుభ్రతకు తావులేకుండా శానిటేషన్ పనులను పర్యవేక్షించాల ని చెప్పారు. నూతన సీటీ స్కాన్ సేవలను త్వరగా అందుబాటులోకి తేవాలని, లాప్రోస్కోపీ, డెంటల్ విభాగంలో రూట్ కెనాల్ సేవలను మరింత ఇంప్రూవ్ చేయాలని సూచించారు. పలు వార్డుల్లో ఉన్న ఏసీలు పనికి రాకుండా పోగా.. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యూడీఐడీ కేటాయింపునకు దివ్యాంగులను వెంట వెంట నే పరీక్షిచి పంపించాలన్నారు. రోగుల సౌకర్యార్థం ఎంసీహెచ్లో లిఫ్టు ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం ప్రిన్సిపాల్ చాంబర్లో హెచ్ఓడీలు, వైద్యులతో సమీక్షించారు. ఆస్పత్రిలో కొరత ఉన్న వైద్య పరికరాలను కొనుగోలు చేయాలని, రోగుల కు అసౌకర్యం కలుగకుండా చూడాలని సూచించా రు. అక్కడి నుంచి మెడికల్ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ వసంత ఉన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
‘సెల్లార్’ బిజినెస్
జనగామ: వరుస అగ్ని ప్రమాదాలతో అమాయక ప్రజలు మృత్యువాత పడుతున్నారు.. వందల కోట్ల రూపాయల ఆస్తి బుగ్గి పాలవుతోంది.. అయినా అధికార యంత్రాంగం మేల్కోవడం లేదు. నిబంధనలను ఉల్లంఘించి సెల్లార్ల నిర్మాణంతో వ్యాపారా లు చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగితే మంటలు ఆర్పే పరిస్థితి కనిపించడం లేదు. ఇరుకై న రోడ్లు.. అందులోనే వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వహణ ఆందోళన కలిగిస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రులు, బాంక్వెట్ హాళ్లు, షాపింగ్ మాళ్లు, హోటళ్లు, లాడ్జీలు, బార్ అండ్ రెస్టాంట్లు, బ్యాంకులు, విద్యాసంస్థలు, ఫంక్షన్ హాళ్లు సూపర్ మార్కెట్లు, వాహన షోరూంలలో ఫైర్ సేఫ్టీ గాలిలో దీపంలా మారింది. పురపాలిక అనుమతులు జారీ చేసే సమయంలో కళ్లు మూసుకుని పర్మిషన్లు ఇస్తున్నారు. అడ్డగోలుగా సెల్లార్ల నిర్మాణం పట్టణంలో సుమారు 1,950 వరకు వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉండగా.. 11వేల పైచిలుకు గృహాలు(మొదటి, రెండవ, మూడవ, పెంటౌస్) ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు అపార్టుమెంట్ల నిర్మాణ సమయంలో పురపాలిక, అగ్నిమాపక తదితర శాఖల అనుమతులు తీసుకో వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీతో పాటు ప్రమాదం జరిగితే ఎగ్జిట్ ఉండేలా చూసుకోవాలి. అయితే.. పట్టణంలో సెల్లార్లకు అనుమతులు లేకున్నా.. పార్కింగ్ కోసమంటూ ‘కొంతమంది’ని మేనేజ్ చేస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు. కొద్ది రోజుల పాటు సెల్లార్ ఖాళీగా ఉంచి.. ఆ తర్వాత వ్యాపార సంస్థలకు అద్దెకు ఇస్తున్నారు. ఇందులో ఎలక్ట్రికల్ దుకాణాల గోదాంలు, ప్రైవేట్ ఆస్పత్రులకు అనుబంధంగా ఉన్న లేబొరేటరీలు, బిగ్ జబార్, ఫ్యాన్సీ స్టోర్, ఏజెన్సీలు తదితర షోరూంల నిర్వహణ సాగిస్తున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ వ్యాపార సంస్థల్లో పదుల సంఖ్యలో కస్టమర్లు, అందులో పని చేసే కార్మికులు ఉంటారు. ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని చెలరేగితే తప్పించుకునే పరిస్థితి ఉండదు. వరుస ఘటన.. అయినా మేల్కొని అధికారులు జనగామ పట్టణంలో గతంలో షాపింగ్మాల్, ఎలక్ట్రిల్ షాపులో మంటలు చెలరేగి లక్షలాది రూపాయల ఆస్తి నష్టంతోపాటు తృటిలో ప్రాణాపాయం తప్పిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ బైక్ షోరూంలో రాత్రి సమయంలో మంటలు వ్యాపించగా.. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. సెల్లార్లను వ్యాపార సంస్థలకు అద్దెకు ఇస్తున్నారు. వాటిలో ఎలక్ట్రికల్, పేయింట్స్, ప్లాస్టిక్, డోర్లు, కరెంటు సామగ్రి, బిగ్ బజార్, కెమికల్, ఆయిల్ తదితర దుకాణాదారులు స్టాక్ను భద్ర పరుస్తున్నారు. ఈ క్రమంలో అగ్ని ప్రమాదం జరిగితే కనీసం నివారించే పరిస్థితి లేకుండా పోయింది. భారీగా మంటలు చెలరేగిన సమయంలో పక్కనే ఉన్న భవనాలు, నివాస ప్రాంతాలకు వ్యాపిస్తాయి. ఇటీవల పట్టణంలో బాంక్వెట్ హాళ్ల కల్చర్ పెరిగింది. వీటిలో చిన్న చిన్న ఫంక్షన్లు చేయడానికి అన్ని వర్గాల ప్రజలు ముందుకువస్తున్నారు, బాంక్వెట్ హాల్లోకి ప్రవేశించిన వారు తిరిగి అదే దారిన లేదా లిఫ్టు నుంచి కిందకు రావాల్సి ఉంటుంది. ఒక్కో ఫంక్షన్లో కనీసం 150 మంది నుంచి 250 మంది వరకు ఉంటారు. అనుకోకుండా సంభవించే ప్రమాదాలతో అందులో నుంచి బయటకు రావడం చాలా కష్టం. అక్కడ ఫైర్ సేఫ్టీ కూడా ఉండదు. ప్రతీ చోట ఫైర్ సేఫ్టీ ఉండాలి ఫంక్షన్ హాళ్లు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, షాపింగ్మాల్స్, బాంక్వెట్ హాళ్లు, హోటళ్లు, లాడ్జీలు, ఇండస్ట్రియల్, కాటన్ మిల్లులు ఇలా ప్రతీచోట ఫైర్ సేఫ్టీ ఉండాలి. పట్టణంలో చాలా చోట్ల ఫైర్ సేఫ్టీ లేదు. అన్ని వర్గాల వ్యాపార, వాణిజ్య సంస్థలకు గతంలోనే నోటీసులు జారీ చేశాం. అగ్ని ప్రమాదం సంభవిస్తే ఫైర్ ఇంజన్ వచ్చే వరకు మంటలను అదుపు చేసేందుకు ఫోర్టబుల్ అగ్నిమాపక యంత్రాలు తప్పక అమర్చుకోవాలి. ఇందుకు సంబంధించి 8 అంశాలతో కూడిన రిపోర్టును ఉన్నతాధికారులకు అందించాం. – రేమండ్బాబు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి2024 ఏప్రిల్ నుంచి 2025 మే వరకు జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాద వివరాలు ప్రాణాలతో చెలగాటం నిబంధనలకు నీళ్లు.. అడ్డగోలుగా అనుమతులు..? ఫైర్ ఇంజన్ వెళ్లలేని ఇరుకై న రోడ్లు.. ఫైర్ స్టేఫీ లేకుండానే అద్దెలకు.. మామూళ్ల మత్తులో అధికారులునియోజకవర్గం ప్రమాదాలు నష్టం సేవ్(నగదు) జనగామ 52 రూ.24.33కోట్లు రూ.42.90కోట్లు పాలకుర్తి 33 రూ.28.05లక్షలు రూ. 2.07కోట్లు స్టేషన్ఘన్పూర్ 16 రూ.8.10లక్షలు రూ.34లక్షలు -
యుద్ధ ప్రాతిపదికన రిజర్వాయర్ల పనులు
పాలకుర్తి టౌన్: చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే ధ్యేయని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. బుధవారం చెన్నూరు రిజర్వాయర్ పనులను పరిశీలించిన ఆమె మాట్లాడుతూ చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్లను పూర్తి చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందని, పనులు పూర్తి చేస్తే సుమారు 77వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. భూసేకరణకు చర్యలు చేపట్టాల ని అధికారులను ఆదేశించారు. చెన్నూరు రిజర్వాయర్ తూము సమస్య పరిష్కరించి రైతులను ఆదుకుంటామని అన్నారు. మాజీ ఎంపీపీ కారుపోల శ్రీనివాస్గౌడ్, మదాసు హరీశ్, గుగులోతు యాకూబ్నాయక్ తదితరులు పాల్గొన్నారు పేదల సంక్షేమమే ధ్యేయం కొడకండ్ల: ప్రజలకు మౌలిక వసతుల కల్పన, పల్లెల అభివృద్ధి, నిరుపేదల సంక్షేమమే తన ధ్యేయమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నా రు. బుధవారం మండలంలోని రామన్నగూడెం, లక్ష్మక్కపల్లి గ్రామాల్లో రూ.కోటికి పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు సురేష్నాయక్, రాజేష్నాయక్, మార్కెట్ వైస్ చైర్మన్ ఈరంటి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు న్యాయం పాలకుర్తి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు సరైన న్యాయం జరిగిందని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. బుధవారం చెన్నూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ధాన్యం విక్రయానికి వచ్చిన రైతులతో మాట్లాడారు. మద్దతు ధర గురించి ఆరా తీసి సమస్యలు తెలుసుకున్నారు. తూకంలో పారదర్శకత ఉండాలని, తడిసిన ధాన్యాన్ని తిరస్కరించే పద్ధతి కాదని నిర్వాహకులకు సూచించారు. కారుపోతుల శ్రీనివాస్, మాదాసు హరిష్, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
రెండు రోజులు.. భారీ వర్షాలు
జనగామ: అల్పపీడనం కారణంగా రాగల రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతా వరణ శాఖ హెచ్చరించి న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల ని కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. వర్షాల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతాయని, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడి న వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైందని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం తెల్లవారు జాము 5 గంటల వరకు 6.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాత్రి 7 గంటల వరకు 10 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీవర్షాల నేపథ్యంలో జిల్లాలోని కుంటలు, చెరువుకట్టలపై అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రజలు చెరువులు, కాలువల వద్ద జాగ్రత్తగా ఉండాలని, వర్షం కురుస్తున్న సమయంలో ఎవరూ చెట్ల కిందకు వెళ్ల కూడదని కలెక్టర్ సూ చించారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు అధి కారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి పోకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం నుంచి బుధవారం రాత్రి వరకు జిల్లాలో కురిసిన వర్షపాతం (మిల్లీమీటర్లలో)ఇలా.. హెచ్చరించిన వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ రిజ్వాన్ బాషా మండలం లొకేషన్ వర్షపాతం బచ్చన్నపేట పడమటికేశ్వాపూర్ 32.8 పాలకుర్తి గూడూరు 34.0 బచ్చన్నపేట బచ్చన్నపేట 22.5 స్టేషన్ఘన్పూర్ స్టేషన్ఘన్పూర్ 16.8 పాలకుర్తి వావిలాల 16.0 పాలకుర్తి పాలకుర్తి 20.0 దేవరుప్పుల దేవరుప్పుల 7.8 జఫర్గఢ్ జఫర్గఢ్ 7.3 కొడకండ్ల కొడకండ్ల 6.5 -
జనగామ డిపో సేవలు భేష్
జనగామ: ఆర్టీసీ జనగామ డిపో సోవలు బాగున్నాయి.. ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నదని కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.సోలమన్ అన్నా రు. బుధవారం రీజినల్ మేనేజర్ విజయ భాను, డిప్యూటీ రీజినల్ మేనేజర్ భానుకిరణ్తో కలిసి ఆయన స్థానిక డిపోను సందర్శించారు. డీఎం ఎస్.స్వాతి వారికి స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం డిపో ఆవరణలో మొక్కలు నాటి నీరు పోసిన తర్వాత ఉద్యోగులు, సిబ్బంది పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ డిపో పరిధిలో ఉన్న అన్ని విభాగాల సిబ్బంది ఉత్తమ సేవలు అందిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగించి ప్రయాణికుల మన్ననలు పొందడంతోపాటు సంస్థకు మరింత మంచి పేరు తేవాలని సూచించారు. క్రమశిక్షణతో పని చేయడం వల్లే ఉత్తమ ఫలితాలు వచ్చాయని వివరించారు. ఉత్తమ సేవలు అందించిన పలువురు ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ సోలమన్ -
చెట్ల తొలగింపు పనులు షురూ
జనగామ: ఐదు రాష్ట్రాల వారధిపై వృక్షాలుగా మారుతున్న రావి చెట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. ‘వారధికి ముప్పు’ శీర్షికన సాక్షిలో ఈ నెల 19న ప్రచురితమైన కథనానికి కలెక్టర్ రిజ్వాన్ బాషా స్పందించారు. చెట్ల తొలగింపునకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లను ఆదేశించగా.. స్పెషల్ ఆఫీసర్ పులి శేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం పనులను ప్రారంభించారు. మున్సిపల్ కార్మికులు భారీ క్రేన్ల సహాయంతో బ్రిడ్జికి ఇరువైపులా మహా వృక్షాలుగా పెరిగిన రావి చెట్లను తొలగిస్తున్నారు. చెట్లను పూర్తి స్థాయిలో తొలగించాలంటే రెండు నుంచి మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. రావి చెట్ల వేర్లు బ్రిడ్జి లోనకు చొచ్చుకుని పోవడంతో కార్మికులకు కష్టతరంగా మారింది. చెట్టు కొన వరకు కటింగ్ చేసి అక్కడికే వదిలేస్తున్నారు. దీంతో కొద్ది రోజుల్లో మొండెం కాస్తా మొలకెత్తే అవకాశం లేకపోలేదు. ఏదేమైన ప్లై ఓవర్పై చెట్ల తొలగింపు ప్రక్రియ వేగంగా సాగుతోంది. కుంగిన ఫుట్పాత్కు మరమ్మతు ఎప్పుడు? బ్రిడ్జిపై కుంగిన ఫుట్పాత్, కూలుతున్న రేలింగ్, పెచ్చులూడి పోతున్న స్లాబ్ పరిస్థితి ఏంటనే అనుమానాలను పట్టణ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి ఫుట్పాత్పై బాటసారులు నడవకుండా ఏర్పాటు చేసిన పూలకుండీలను నేటికి తొలగించలేదు. అదే సమయంలో ఫుట్పాత్కు సమాంతరంగా రోడ్డు పెరగడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఏర్పడింది. అలాగే బ్రిడ్జి కింద ఎలాంటి వ్యాపారాలు, పనులు, దుకాణాల నిర్వహణ ఉండొద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ, పురపాలిక అధికారుల పర్యవేక్షణ కరువవడంతో అన్ని వ్యాపారాలు అక్కడే జరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాల్లో ఎప్పుడూ వందలాది మంది ఉంటారు. జరగరాని ప్రమాదం జరిగితే ఏంటనే సందేహాలు సైతం వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బ్రిడ్జి నాణ్యత, సామర్థ్యం లెక్కించి రోజువారీగా వాహనాల రవాణా, లోడ్ ఎంత మేర వెళుతుందనే దానిపై దృష్టి సారించాలి. కలెక్టర్ రిజ్వాన్ బాషా స్పందించి బ్రిడ్జిపై ఉన్న పూలకుండీలను తొలగించి, కుంగిన ఫుట్పాత్కు మరమ్మతు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కుంగిన ఫుట్పాత్.. కూలుతున్న రేలింగ్ పరిస్థితి ఏంటి? -
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
● సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమన్న జనగామ రూరల్: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమన్న డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సోమన్న మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు కోడ్లను తీసుకువచ్చి వాటిని అమలు చేయాలని చూస్తుందన్నారు. జూలై 9వ తేదీన తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. జిల్లాలో పని చేస్తున్న ఆశవర్కర్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని వైద్య ఆరోగ్యశాఖ సూపరింటెండెంట్కు అందజేశారు. ఈ కార్యక్రమలో బూడిద ప్రశాంత్, ఆశ వర్కర్ యూనియన్ జిల్లా కార్యదర్శి ముదాం రాజమణి, జిల్లా కోశాధికారి పసులాది శోభ, స్వప్న మంజుల, కవిత, అనిత, కల్పన, మమత, మల్లేష్ రాజ్, శివరాత్రి రాజు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా అష్టదళ పాదపద్మారాధన పూజ
చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి సన్నిధిలో మంగళవారం భక్త జనసందోహం నడుమ ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు–కిరణ్మయి దంపతుల ఆధ్వర్యంలో అష్టదళ పాద పద్మారాధన పూజ వైభవంగా నిర్వహించారు. భక్తుల సమక్షంలో 108 బంగారు పుష్పాలు, వెండి పాదపద్మంను అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేద మంత్రాల నడుమ స్వామివారి ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్, వీరన్న, భక్తులు పాల్గొన్నారు. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు స్టేషన్ఘన్పూర్: ఎరువులు, విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్ బాషా హెచ్చరించారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, తిరుమల ఫర్టిలైజర్స్ షాపులను అదనపు కలెక్టర్ రోహిత్సింగ్తో కలిసి కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విత్తనాలు, ఎరువుల క్రయవిక్రయాలు, రైతులు కొనుగోలు చేసిన వివరాల రిజిస్టర్లను తనిఖీ చేసి రోజూవారి విక్రయాల గురించి అడిగారు. రైతులకు కొనుగోళ్ల బిల్లులను అందించాలని, అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు నిర్వహించాలని సూచించారు. స్టాక్ నిల్వలు, ధరల పట్టిక తప్పనిసరిగా బోర్డుపై ప్రదర్శించాలని సూచించారు. ఆయన వెంట డీఏఓ రామారావునాయక్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఏఓ చంద్రన్కుమార్ తదితరులున్నారు. సమాజ చైతన్య నిర్మాణం కోసమే బాల సంస్కార శిక్షణ ● వీహెచ్పీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీత జనగామ: జాగృతమైన హిందూ సమాజ చైతన్య నిర్మాణం కోసమే బాల సంస్కార శిక్షణ ఉద్ధేశ్యమని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీత రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో విశ్వహిందూ పరిషత్ నిర్వాహకులు మోహనకృష్ణ భార్గవ ఆధ్వర్యంలో కొనసాగుతున్న హిందూ బాల సంస్కార శిక్షణవర్గకు ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పిల్లలకు భక్తిగీతాలు, నీతికథలు, ఆధ్యాత్మిక విషయాలపై బోధించడం గొప్పవిషయమన్నారు. ఉత్సాహంతో వందలాది పిల్లలు తరగతులకు హాజరు కావ డం హిందూ ధర్మం గొప్పదనమన్నారు. ఈ కార్యక్రమంలో చిలువేరు హర్షవర్ధన్, మైలారం శ్రీనివాస్, ఉల్లెంగుల రాజు, ఝాన్సీ, మణి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
లండన్లో చదువుకున్నా..మన సంస్కృతిని మరిచిపోలేదు
హన్మకొండ/హన్మకొండ కల్చరల్/ఖిలావరంగల్: లండన్లో చదువుకున్నా మన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోలేదని కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర భంజ్దేవ్ అన్నారు. మంగళవారం ఆయన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, నన్నపునేని నరేందర్తో కలిసి నగరంలోని వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, ఖిలావరంగల్ కోటలోని స్వయంభు శంభు లింగేశ్వర ఆలయంలో, వడ్డెపల్లిలోని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పోచమ్మ మైదాన్లోని రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం హనుమకొండలోని హోటల్ హరిత కాకతీయలో ప్రజలతో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు సాంస్కృతికపరంగా ఎంతో అభివృద్ధి చెందిందని, పారిశ్రామిక పరంగా అభివృద్ధి జరిగేందుకు సలహాలు ఇవ్వాలని కోరారు. కాకతీయుల కాలంలో సాంస్కృతిక జీవనం విలసిల్లిందని, ఇప్పుడు ఆ సంస్కృతి, కలలు కాపాడడానికి మీరు ఏమైనా చేయగలుగుతారా అని ప్రజలు అడిగారు. కమల్ చంద్ర భంజ్దేవ్ స్పందిస్తూ తనకు కళలు, కళాకారులన్నా చాలా ఇష్టమని, సాధ్యమైనంతవరకు సంస్కృతిని కాపాడుతానన్నారు. తాను లండన్లో విద్యనభ్యసించే సమయంలో తమ వద్ద జరిగే దసరా వేడుకలకు కాలేజీ మానేసి వచ్చేవాడినన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించడం తనకు ఇష్టమన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా పర్యాటకశాఖాధికారి ఎం.శివాజి, టార్చ్ కార్యదర్శి అరవింద్ ఆర్య, సేవా టూరిజం అండ్కల్చరల్ సొసైటీ వ్యవస్థాపకుడు కుసుమ సూర్యకిరణ్, పర్యాటక శాఖ ఉద్యోగులు జై నరేష్, రాజు, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు దాస్యం విజయ్భాస్కర్, బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజక వర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, తదితరులు పాల్గొన్నారు. కాలేజీ వదిలేసి దసరాకు వచ్చేవాడిని కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర భంజ్దేవ్ కోట, వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయంలో పూజలు -
విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయులదే..
జనగామ రూరల్: విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని కలెక్టర్ రిజ్వాన్ బా షా అన్నారు. మంగళవారం మండలంలోని యశ్వంతాపూర్ పరిధిలోని క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఐదు రోజుల పాటు జరగనున్న రెండో విడత జిల్లా స్థాయి ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజ స్థాపనలో విద్యార్థులను ఉన్నతమైన, ఆదర్శవంతమైన విద్యార్థులుగా సిద్ధం చేయాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షణలో అందిస్తున్న అంశాలను అర్థం చేసుకొని విద్యార్థుల్లో ఆశించిన మార్పుల సాధనే లక్ష్యంగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భోజన్న, ఏఎంఓ శ్రీనివాస్, ఏసీజీఈ రవి కుమార్, జీసీడీఓ గౌసియా బేగం, కో ర్సు ఇన్చార్జ్లు మల్లిఖార్జున్, యాదగిరి, ఆనంద్బాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే కడవెండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బడిబాట కరపత్రాన్ని కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీఈఓ భోజన్న ఆవిష్కరించారు. పోస్టర్లతో ప్రభుత్వ పాఠశాలలో లభిస్తున్న సౌకర్యాలను ప్రచారం చేయాలన్నారు. జల్ శక్తి అభియాన్ పోర్టల్లో వివరాలు నమోదు చేయాలి ఈనెల 31వ తేదీ లోగా జల్ శక్తి అభియాన్ పోర్టల్లో వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి జల్ శక్తి అభియాన్పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ, వ్యవసాయ, ఉద్యానవన, ఆర్డబ్ల్యూఎస్, భూగర్భ జల శాఖ తదితర శాఖల సమన్వయంతో జల సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ మాధురి షా, సరిత, డీఆర్డీఓ వసంత, డీఏఓ రామారావు నాయక్, డీఈఓ భోజన్న, తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి స్టేషన్ఘన్పూర్: భూసమస్యల పరిష్కారంలో వేగం పెంచుతూ త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులపై స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో అదనపు కలెక్టర్ రోహిత్సింగ్తో కలిసి డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రతీ మాడ్యూల్లో వచ్చిన భూసమస్యల పరిష్కారానికి దిశా నిర్దేశం చేశారు. సక్సెషన్, పెండింగ్ మ్యుటేషన్, మిస్సింగ్ నంబర్, భూసేకరణ, కోర్టు కేసులు, డిజిటల్ సంతకం తదితర మాడ్యుల్లోని సమస్యల పరిష్కారానికి సూచనలు ఇచ్చారు. మొత్తంగా భూ భారతి సదస్సు, తహసీల్దార్ కార్యాలయంలో 1,900 దరఖాస్తులు వచ్చాయని, ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తూ వేగంగా పరిష్కరించాలన్నా రు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమనాయక్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, వివిధ మండలాల రెవెన్యూ అఽధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా వృత్యంతర శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి -
డబ్బులిచ్చి రోగాలు కొనుక్కోవడమే..
వేసవిలో చల్లదనం కోసం ఐస్ క్రీంలను కొనుక్కోవడమంటే డ బ్బులిచ్చి రోగాలను తెచ్చుకోవడమే. ఈకొలయ్ అనే బ్యాక్టీరి యా కూల్ వెదర్లో మల్టీప్లే అ వుతుంది. ఈ వైరస్తో పేగు ఇన్ఫెక్షన్కు గురి చే స్తోంది. లూజ్మోషన్స్, డయేరియా, వాంతులతో పాటు టైఫాయిడ్కు గురయ్యే అవకాశం ఉంటుంది. ఐస్క్రీం 24 గంటల పాటు చల్లదనంలో ఉండడం వల్ల బ్యాక్టీరియా సజీవంగా ఉంటుంది. దానిని తినే సమయంలో అది కాస్త కడుపులోకి వెళ్లి, చిన్న, పెద్ద పేగు సంబంధిత రోగాలు, గొంతు, పొట్ట ఇన్ఫెక్షన్కు గురి చేస్తూ, రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఇది పిల్లలపై అధికంగా ప్రభావం చూపిస్తుంది. అపరిశుభ్ర వాతావరణం, కలుషితమైన వాటర్, నాణ్యత లేని పాలను ఉపయోగించే క్రమంలో ఐస్ క్రీంలో ఈ బ్యాక్టీరియా చేరుతోంది. పిల్లలు మారం చేస్తే.. అనారోగ్యం బారిన పడతామని నచ్చ చెప్పాలి. – డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణనాయక్, ప్రముఖ సర్జన్ పలు రకాల ఐస్ క్రీంలు● -
షాపు నుంచి గెంటేశాడు..
జనగామ బస్టాండ్లోని స్టాల్ నంబర్ 03లో జగదాంబ పాప్కార్న్ షాపునకు జనగా మకు చెందిన గుగులోత్ వెంకట్తో కలిసి టెండర్ వేయగా వెంకట్ పేరున టెండర్ వచ్చింది. ఆయనతో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నాను. షాపు అద్దె రూ.50 వేలు కూడా చెల్లించాను. అగ్రిమెంట్ ప్రకారం సంవత్సరంపాటు భాగస్వాములుగా ఉండాల్సి ఉండగా రెండు నెలల తర్వాత షాపు నుంచి గెంటేశాడు. పోలీస్ స్టేషన్లో సంప్రదిస్తే కానిస్టేబుళ్లను పంపించి నన్నే షాపు నుంచి బయటికి పంపించేశారు. అట్రాసిటీ కేసు పెడుతామని బెదిరిస్తున్నారు. న్యాయం చేయాలి. – నామాల రాజు, వడ్లకొండ -
త్రివేణి సంగమం.. భక్తజన సంద్రం
కాళేశ్వరంలో భక్తుల సందడి ● పుణ్యస్నానాలు ఆచరించిన వేలాది భక్తులు ● ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రముఖులు త్రివేణి సంగమం.. భక్త జన సంద్రమైంది. పుష్కరిణి స్నానం.. పులకించేలా చేసింది. వడివడిగా పరుగులు పెడుతున్న చల్లని తల్లికి వాయినాలిచ్చే ఆడపడుచులు.. పితృదేవతలను స్మరిస్తూ తర్పణాలు వదిలే పురుషులు. కేరింతలు కొడుతూ అల్లరి చేస్తున్న యువతులు, చిన్నారులతో నదీ ప్రాంతం సందడిగా మారింది. ఐదో రోజు సోమవారం వేలాదిగా భక్తులు కాళేశ్వరానికి తరలివచ్చారు. ముక్తీశ్వరున్ని దర్శించుకునేందుకు గంట ల కొద్దీ క్యూలో వేచి చూశారు.– వివరాలు, మరిన్ని ఫొటోలు 8లోu -
ప్రతీఒక్కరు భక్తిభావాన్ని కలిగి ఉండాలి
పాలకుర్తి: ప్రతీఒక్కరు భక్తిభావాన్ని కలిగిఉండాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్, ముది రాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండా ప్రకాశ్ అన్నారు. మండలంలోని వల్మిడి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించగా.. మాజీ మంత్రి దయాకర్రావుతో కలిసి బండా ప్రకాశ్ సోమవారం ద ర్శించుకున్నారు. ఈసందర్భంగా ప్రకాశ్ మా ట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి సహకరిస్తానన్నారు. కార్యక్రమంలో కల్నల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి, ముదిరాజ్ మహాసభ నాయకులు నీరటి చంద్రయ్య, మాచర్ల ఎల్లయ్య, ఉత్సవ కమిటీ మోకాటి కొమురయ్య, వంగ సైదులు, నీరటి సోమయ్య, తదితరులు పాల్గొన్నారు. రైతు సంక్షేమానికి కృషి పాలకుర్తి టౌన్: రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మామి డాల యశస్వినిరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వ రాయితీపై అందించిన జీలుగ విత్తనాలను ఎమ్మెల్యే.. రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానికి దక్కిందన్నా రు. ఎరువుల వాడకాన్ని తగ్గించి భూసారాన్ని పెంచుకునేందుకు జీలుగ విత్తనాలు దోహదపడతాయని తెలిపారు. రైతుల ఆర్ధికంగా నష్టపోకూడదని జీలుగ విత్తనాలు రాయితీపై అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ పాలకుర్తి సబ్ డివిజన్ ఉపసంచాలకులు అజ్మీరా పరుశరామ్నాయక్, మండల వ్యవసాయ అధికారి శరత్చంద్ర, నాయకులు రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, ఎర్రబెల్లి రాఘవరావు, యాకాంతరావు, నాగన్న, సలీం, రైతులు పాల్గొన్నారు. రక్తహీనత లేని సమాజాన్ని నిర్మిద్దాం జనగామ: రక్తహీనత లేని సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలని డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు పిలుపునిచ్చా రు. జిల్లా కార్యాలయంలో ఫార్మసీ ఆఫీసర్స్తో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో 50 నుంచి 60 శాతం మేర మహిళలు, చిన్న పిల్లలు రక్త హీనతతో బాధపడుతున్నారన్నారు. మహిళలకు ఐరన్ ఫొలిక్ మాత్రలు, పిల్లలకు ఐరన్ సిరప్లను అందించేందుకు జిల్లాకు ఇండెంట్తోపాటు సరఫరా చేసే విధానంపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. రక్తహీనతకు సంబంధించి మాత్రలు, సిరప్ల కొరత లేకుండా ఫార్మసీ ఆఫీసర్స్ అలర్ట్గా ఉండాలన్నారు. పీహెచ్సీల వారీగా నిల్వ ఉన్న మందుల సమాచారం ఫిజికల్, ఆన్లైన్లో సరిగ్గా ఉండే విధంగా చూసువాలన్నారు. జిల్లా ఫార్మసీ ఆఫీసర్ రాజేందర్ తదితరులు ఉన్నారు. ప్రొటోకాల్ పాటించకుంటే చర్యలు తప్పవుజనగామ: కాంగ్రెస్ పార్టీలో ప్రొటోకాల్ పాటించకుంటే ఎంతటి వారైనా చర్యలు తప్పవని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ హెచ్చరించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశంలో జనగామ, చేర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మెరుగు బాలరాజు గౌడ్, మల్లేష్తో కలిసి మాట్లాడారు. జనగామలో గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టి, ప్రతి ఒక్కరూ పార్టీ ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోవాలన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి సూచన మేరకు పార్టీ కా ర్యక్రమాలు చేపట్టాలన్నారు. నాగపురి కిరణ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరులో కమీషన్లకు తెరలేపుతున్నాడని ఆరోపించారు. కిరణ్పై టీపీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో నాయకులు గంగం నరసింహారెడ్డి, ఆలేటి సిద్ధిరాములు, బక్క శ్రీని వాస్, లక్ష్మీనారాయణ, యాదగిరిగౌడ్, సాయిలు, బన్సీ నాయక్, అనిల్ పాల్గొన్నారు. -
పాత స్టాక్.. కొత్తధరలు
జనగామ: తెలంగాణ ప్రభుత్వం పెంచిన లిక్కర్ ధరలు.. మద్యం దుకాణాలకు కాసులు కురిపించా యి. పాత స్టాక్.. పాత ధరలకే విక్రయించాలని ప్ర భుత్వం సర్క్యులర్ జారీ చేసినా.. వ్యాపారులు పెడచెవిన పెట్టారు. ఉదయం 10 గంటలకు తెరుచుకోవాల్సిన లిక్కర్ దుకాణాలు.. మధ్యాహ్నం 12.30 గంటలు దాటినా మూసే ఉంచారు. డిపోల ద్వారా నూతన బిల్లింగ్ పూర్తయ్యే వరకు కొన్ని చోట్ల షాపులు తెరవలేదు. లిక్కర్ దుకాణాలకు వచ్చే రెగ్యులర్ కస్టమర్లు షాపులు మూసి ఉండడంతో ఆందోళనకు గురి కాగా, పాత స్టాక్ను కొత్తగా అమ్ముకునేందుకే ఇలా చేశారనే ప్రచారం జరిగింది. ఇదంతా ఎకై ్సజ్ శాఖ చూసీ.. కూడా చూడనట్టు వ్యహరిస్తూ మద్యం దుకాణాదారులకు సహకారం అందించిందనే ఆరోపణలు బాహాటంగానే వినిపించాయి. మద్యం ప్రియుల జేబులు లూటీ..! రాష్ట్ర ప్రభుత్వం క్వార్టర్పై రూ.10, ఆఫ్ రూ.20, ఫుల్ బాటిల్ లిక్కర్పై రూ.40 వరకు పెంచుతూ ఈ నెల 18వ తేదీన జీఓ జారీ చేసింది. వైన్స్లో ఉన్న పాత స్టాక్కు కొత్త రేట్లు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఓల్డ్ స్టాక్పై ఎంతో కొంత వెనకేసుకోవాలనే ఆలోచనతో దుకాణాదారులు సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలు దాటిన తర్వాత వైన్స్ తెరిచి కొత్త ధరలతో స్టాక్ విక్రయించారు. ఇదేంటని మద్యం ప్రియులు నిలదీస్తే ‘ఎకై ్సజ్ అధికారులు వచ్చారు.. పాత స్టాక్ వివరాలు రాసుకున్నారు.. వీటికి చలానా రూపంలో అదనపు డబ్బులు వసూలు చేస్తారు’ అని చెప్పి కొత్త ధరలకు లిక్కర్ విక్రయించారు. కానీ, ప్రభుత్వం పాత స్టాక్ పూర్తయ్యే వరకు ఓల్డ్ రేట్లు మాత్రమే తీసుకోవాలని స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. ఎకై ్సజ్ అధికారుల బూచీ చూపెడుతూ.. మద్యంవ్యాపారులు మద్యం ప్రియుల జేబులను ఖాళీ చేశారు. ఇదిలా ఉండగా లిక్కర్ ధరలు పెంచుతూ ప్రభుత్వం 18వ తేదీ సాయంత్రం సర్క్యులర్ జారీ చేయగా, అదే రోజు జిల్లాలోని చాలా చోట్ల గంట ముందుగానే వైన్స్ మూసివేశారు. కాగా, జిల్లాలో 47 మద్యం దుకాణాలు ఉండగా, రోజు వారీగా రూ.1.10 కోట్ల మేర వ్యాపారం జరుగుతుంది. పాత ధరలపై కొత్త రేట్లతో విక్రయించడంతో సుమారు రూ.5లక్షల వరకు మద్యం బాబులపై అదనపు వడ్డన పడింది. కానరాని ఎకై ్సజ్ శాఖ ధరల పెంపు సమయంలో విక్రయాలపై ఎకై ్సజ్ శాఖ నిఘా ఉండాలి. దుకాణాలు ఎప్పుడు తెరుస్తున్నారు.. అదనపు ధరలు తీసుకుంటున్నారా.. లేదా.. అని చెక్ చేసుకోవాలి. పాత స్టాక్ పాత ధరలకే విక్రియించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.. జిల్లాలో ఎవరూ పాటించలేదు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన ఎకై ్సజ్ శాఖ నిమ్మకుండిపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైన్స్ మధ్యాహ్నం 12.30 గంటల వరకు తెరుచుకోకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనికితోడు ఏ ఒక్క వైన్స్ వద్ద కూడా కొత్త ధరలు సూచించే ఫ్లెక్సీ కన్పించకపోవడం గమనార్హం.సమీపించినా మూసి ఉన్న మద్యం దుకాణం ధరలు పెరగడంతో ఆలస్యంగా తెరిచిన వైన్స్ మద్యం ప్రియుల మండిపాటు కనిపించని ధరల పట్టిక పట్టించుకోని ఎకై ్సజ్ అధికారులు -
ఘనంగా మహంకాళి విగ్రహ ప్రతిష్ఠాపన
● హాజరైన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే శ్రీహరి స్టేషన్ఘన్పూర్: మండలంలోని సముద్రాల గ్రామంలో శ్రీమహంకాళి అమ్మవారు, పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన, ధ్వజస్థంభ ప్రతిష్ఠాపనో త్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త, నిర్మాణకర్త కుందూరు సోమిరెడ్డి, నాగమణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలకు ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఎంపీకి, ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి సహకరించిన ధర్మకర్త సోమిరెడ్డికి, ఆలయ నిర్మాణానికి నిధుల కేటాయించిన ఎంపీ కావ్యకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో సముద్రాల గ్రామపరిధిలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నాగమణి, సోమిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు వెంకటేశ్వర్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, నాయకులు నరేందర్రెడ్డి, ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఇనుగాల లలితాదేవి, గుండె విమలనర్సయ్య, కుమారస్వామి, నాయకులు భాస్కుల కిరణ్, రాజు, నారాయణ, హరిప్రసాద్, రవీందర్, రాజు, నర్సింహులు, కిషన్రాజ్, తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల పనులు పూర్తిచేయాలి
జనగామ రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని, ఇళ్ల పెండింగ్ దరఖాస్తుల సర్వే, మార్కింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్లతో కలిసి సోమవారం ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 90 శాతం ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ పూర్తయిందన్నారు. పైలట్ మండలాల కింద 12 గ్రామాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ మార్కింగ్ ప్రక్రియలో వేగం పెంచాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకంలో అర్హులను ఎంపిక చేసేందుకు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అదే విధంగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరుగుతోందని, 20 శాతం ధాన్యం కొనుగోలు మిగిలి తెలిపారు. సన్న బియ్యం పంపిణీ కేంద్రాలను తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలన్నారు. తాగునీటి సరఫరాలో వేసవి కార్యాచరణ ప్రణాళికను సక్రమంగా అమలు చేయాలని తెలిపారు. ఎరువుల దుకాణాలను తహసీల్దార్లు, ఏఈఓలు, ఎంఏఓలు, మండల ప్రత్యేక అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, జిల్లాకు సరిపడా విత్తనాలు వచ్చాయని, విత్తనాల కొరత రాకుండా, నాణ్యమైన విత్తనాల క్రయ విక్రయాలు జరిగేలా చూడాలని అన్నారు. ప్రతి దుకాణంలో ధరల పట్టిక బోర్డును తప్పనిసరిగా ప్రదర్శించేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జనగామ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఘనపూర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హనుమాన్ నాయక్, డిప్యూటీ జెడ్పీ సీఈఓ సరిత, డీఆర్డీఓ వసంత, డీఏఓ రామారావు నాయక్, డీసీఎస్ఓ సరస్వతి, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
దేశం గర్వించేలా పాకిస్తాన్తో పోరాడాం
జనగామ రూరల్: పహల్గాం ఉగ్రదాడికి బదులుగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత సైనికులు దేశం గర్వించేలా పాకిస్తాన్తో పోరాడడం గొప్ప విషయమని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని స్మరించుకుంటూ సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ఆధ్వర్యంలో జనగామ రైల్వేస్టేషన్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు తిరంగా యాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీ రాజేందర్ మాట్లాడుతూ.. భరతమాత నుదిటి మీద తిలకం తుడిచిన వారిని మట్టు పెట్టడానికి ‘ఆపరేషన్ సిందూర్’ పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విషయంలో చాలా మంది తప్పుడు ప్రచారం చేసినా.. మోదీ భయపడలేదన్నారు. దేశాన్ని ప్రపంచంలో విశ్వ గురువు స్థానానికి తీసుకువెళ్తున్నారని వివరించారు. కాజీపేట రైల్వేస్టేషన్కు కోచ్ ఫ్యాక్టరీ రాబోతుందని, జనగామ రైల్వేస్టేషన్ను రూ.26 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ నంద రెడ్డి, మాజీ ఎంపీ గుండె విజయరామారావు, ఆరుట్ల దశమంత్ రెడ్డి, ఉడుగుల రమేష్, కేవీఎల్ఎన్.రెడ్డి, శివరాజ్, కత్తుల లక్ష్మి, దేవరాయ ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. ప్రజల కోసం పని చేస్తున్న మోదీ ఎంపీ ఈటల రాజేందర్ -
మా సమస్యలు పరిష్కారమయ్యేనా..?
జనగామ రూరల్: కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్లో సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలి తం లేదని, తిరుగుడు తప్ప పరిష్కారం కావడంలేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో సుమారు 74 వినతులు స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బా షా సైతం గ్రీవెన్స్లో వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారంపై అధికారులు, సిబ్బందికి దిశానిర్ధేశం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రో హిత్ సింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, స్టేషన్ ఘనపూర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హనుమాన్ నాయక్, డిప్యూటీ జెడ్పీ సీఈఓ సరిత, డీ ఆర్డీఓ వసంత, డీఏఓ రామారావు నాయక్, డీసీ ఎస్ఓ సరస్వతి, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని ఇలా.. ● దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడేనికి చెందిన నాగిడి మల్లారెడ్డి హాస్పిటల్కి వెళ్లిన సమయంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేశారు. మళ్లీ సర్వే చేసి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. ● రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామం చెందిన జట్టి వెంకటయ్య, తన 4.5 ఎకరాల వ్యవసాయ భూమికి దారి లేక ఇబ్బంది పడుతున్నానని పరిష్కారం చూపాలని కోరాడు. ● బచ్చన్నపేట మండలం సాల్వాపూర్ గ్రామం చెందిన గీస పోశమ్మ తనకు ఎలాంటి పనిలేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉండని వృద్ధాప్య ఫించన్ మంజూరు చేయాలని కోరింది. ● జనగామ మండలం మరిగడి పరిధిలోని టాక్యతండాకు చెందిన రామావత్ శంకర్ తమ ఊరిలో మిషన్ భగీరథ ద్వారా నీరు రావడం లేదని, తండాకు నీరందించాలని కోరాడు. గ్రీవెన్స్లో బాధితుల ఆవేదన ప్రజల నుంచి 74 వినతుల స్వీకరణ -
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత
జనగామ: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ పార్టీ వర్గపోరు మరోసారి బయటపడింది. నాగపురి –కొమ్మూరి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలు తోపులాడుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద సోమవారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్గౌడ్ ఆధ్వర్యంలో రూ.10లక్షల విలువ చేసే 24 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసే సమయంలో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి వర్గీయులు అడ్డుకున్నారు. జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి ప్రోటోకాల్, అనుమతి లేకుండా కిరణ్ చెక్కులను పంపిణీ చేయడం ఏంటని ప్రశ్నించారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట, ఒకరిపై ఒకరు చేయి వేసుకునే వరకు వెళ్లింది. అక్కడే ఉన్న పోలీసులు ఇరువురిని సముదాయించి పంపించారు. చెక్కులను పంపిణీ చేసేందుకు నాగపురి కిరణ్ తన వర్గీయులతో కలిసి సిద్ధిపేటరోడ్డు గాయత్రి గార్డెన్కు చేరుకున్నారు. డీసీసీ అధ్యక్షులు లేకుండా చెక్కులను ఎక్కడా పంపిణీ చేయొద్దని కొమ్మూరి వర్గీయులు వచ్చి అడ్డుకున్నారు. పార్టీ పౌరు తీస్తున్నారంటూ కొమ్మూరి అనుచరవర్గం కిరణ్ వర్గంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అరగంటపాటు మాటల యుద్ధంతో కొట్టుకున్నంత పని చేశారు. ఏఎస్పీ చేతన్ నితిన పండేరీ ఆధ్వర్యంలో సీఐ దామోదర్రెడ్డి, ఎస్సైలు.. నాగపురి కిరణ్ కు మార్గౌడ్తోపాటు కొమ్మూరి వర్గీయులను అక్కడ నుంచి పంపించారు. అనంతరం షామీర్పేటలోని ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గనిపాక మహేందర్ నివాసం వద్ద కిరణ్ చెక్కులను పంపిణీ చేశారు. నాగపురి వర్సెస్ కొమ్మూరి వర్గం ఇరు వర్గాల మధ్య తోపులాట ఉద్రిక్తత, పోలీసుల రంగ ప్రవేశం -
ప్రజా ఉద్యమాలే ఊపిరిగా పోరాటం..
● సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి జఫర్గఢ్: ప్రజా ఉద్యమాలే ఊపిరిగా సీపీఐ పోరాటాన్ని సాగిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఉప్పుగల్లు గ్రామంలో సీపీఐ మహాసభను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఓట్లు, సీట్లతో సంబంధం లేకుండా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం పోరాటాలు సాగిస్తున్నామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర, ఎరువులు, విత్తనాల సబ్సిడీతో పాటు పంట పొలాలకు సాగునీరు అందించే విషయంలో సాగించిన పోరాటం ప్రశంసనీయమన్నారు. భవిష్యత్లో కూడా ఇదే తరహాలో పోరాటాలను సాగించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి జువారి రమేష్, నాయకులు ఎండీ యాకుబ్పాష, పెండ్యాల సమ్మయ్య, కూరపాటి చంద్రమౌళి, మంద బుచ్చయ్య, బుల్లె దూడయ్య, ఎండీ జాఫర్, గట్టుమల్లు, అన్నెపు అజయ్, నరహరి, రడపాక సత్యం, సాయిలు, యాదగిరి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో చీటకోడూరు రికార్డ్
జనగామ రూరల్: స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన చీటకోడూరు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ఈ సీజన్ కొనుగోళ్లలో రికార్డు సృష్టించిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేవాల మేరకు జిల్లాలో సన్న, దొడ్డు రకం ధాన్యం కొనుకోళ్లకు ఐకేపీ, పీఏసీఎస్ కలిపి మొత్తం 258 కేంద్రాలను ఏర్పాటు చేసి సజావుగా కొనుగోళ్లను చేపట్టడం జరిగిందన్నారు. గత రజీ సీజన్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి. ఎస్ చౌహాన్ జిల్లాలోని పలు కేంద్రాలను సందర్శించి అక్కడ ఉత్పన్నమైన సమస్యల పరిష్కార మార్గాలను అధికారులకు వివరించారు. అవే సూచనలు ఈ సీజన్లో కూడా పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లను చేపట్టడం జరిగిందన్నారు. ఈ రబీ సీజన్లో 497 మంది రైతుల నుంచి ఇప్పటి వరకు 38,104 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి జిల్లాలోనే అత్యధిక ధాన్యం కొనుగోలు చేసిన కేంద్రంగా రికార్డు సృష్టించిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రతీ గింజను కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. -
అగ్ని ప్రమాదాల నివారణలో ప్రభుత్వం విఫలం
జనగామ: వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ముందస్తు చర్యలు తీసుకోవడంతో ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ పాతబస్తీలో గుల్జార్ హౌస్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో 17 మంది మృతి చెందటం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. ఇప్పటికై న అగ్నిమాపక శాఖ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. అగ్ని ప్రమాద మృతు ల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషి యా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 17 మంది మృతి బాధాకరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
వారధికి ముప్పు
సోమవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2025– 8లోu బ్రిడ్జికి ఇరువైపులా పెరిగిన మహావృక్షాలుజనగామ ఫ్లై ఓవర్పై మహావృక్షాలు ● పగుళ్లు పడుతున్న బ్రిడ్జి ● కుంగిపోతున్న ఫుట్పాత్.. కూలిన మెట్లమార్గం ● ఆందోళనలో పట్టణ ప్రజలుజనగామ: ప్రమాదాన్ని పక్కనే బెట్టుకుని ప్రయాణం చేయాల్సిన దుస్థితి. ఆర్అండ్బీ నాది కాదంటారు, ఎన్హెచ్ పట్టించుకోరు, పురపాలిక నాకేంటిలే అని వదిలేశారు. అందరూ కలిసి జనగామ ఫ్లై ఓవర్ ఆలనా పాలన గాలికి వదిలేస్తున్నారు. దీంతో ఫ్లై ఓవర్ కు ఇరువైపులా రావి చెట్లు మహా వృక్షాలుగా మారిపోతూ.. సిమెంట్ దిమ్మెల లోనకు చొచ్చుకు పోతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే భయాందోళనలో పట్టణ ప్రజలు, వాహన చోదకులు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ ఐదు రాష్ట్రాలకు వారధిగా ఉన్న జనగామ జిల్లా కేంద్రంలోని ఫ్లై ఓవర్ నిర్మాణం చేసి మూడు దశాబ్ధాలు గడిచి పోతుండగా, వాహనాల రద్దీకి అనుగుణంగా ప్రత్యామ్నాయ చర్యలు, ప్రస్తుత మరమ్మతు గురించి అధికార యంత్రాంగం ఆలోచన చేయడం లేదు. బ్రిడ్జికి ఇరువైపులా మహావృక్షాలు.. జనగామ జిల్లా కేంద్రం పాతబీటు బజారు నుంచి రైల్వే గేటు మీదుగా రాకపోకలు సాగించే వారు. ఐదు రాష్ట్రాలకు జనగామ ప్రధాన హైవే. నిత్యం రైళ్ల రాకపోకలతో గేటు మూసి వేస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమయ్యాయి. దీంతో నాటి ప్రభుత్వం ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టింది. మూడు దశాబ్ధాల క్రితం ఫ్లై ఓవర్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు భారీ వాహన రాకపోకలకు ఇబ్బందులు తప్పాయి. ప్రస్తుతం ఫ్లై ఓవర్ కు ఇరువైపులా రావి చెట్లు మహా వృక్షాలుగా పెరగడంతో పాటు బ్రిడ్జి రేలింగ్, మెట్ల మార్గం కూలిపోయి, ఫుట్పాత్ కుంగిపోతుంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందోననే భయాందోళనలో స్థానికులు ఉన్నారు. ఫుట్పాత్పై పూలకుండీలను ఏర్పాటు చేయడంతో పాదాచారులు నడవలేని స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డుపై వెళుతున్నారు. నిత్యం భారీ వాహనాలు కాకినాడ పోర్టుతో పాటు తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు ప్రధాన హైవే కావడంతో నిత్యం వందలాది వాహనాలకు ఫ్లై ఓవర్ ఒక్కటే దిక్కు. ఆయా రాష్ట్రాల్లో ఇండస్ట్రీయల్గా అభివృద్ధి చెందుతున్న తరుణంలో విశాఖపట్టణం, చైన్నె నుంచి మహారాష్ట్ర, గుజరాత్, అక్కడ నుంచి ఇటువైపుగా యంత్ర పరికరాలకు సంబంధించిన మెటీరియల్ తీసుకు వెళ్లే భారీ కంటైయినర్లు ఇటీవల కాలంలో పెరిగాయి. బ్రిడ్జి సామర్థ్యానికి మించి ఓవర్లోడ్తో ఇసుక, కంకర, ధాన్యం బస్తాలు, ఇతర వాహనాలు ప్రయాణం చేస్తుండడంతో దానిపై అధిక భారం పడుతుంది. నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ పోర్టేషన్ జరుగుతున్నా పట్టించుకున్న నాధుడు లేడు. జనగామ, చుట్టు పక్కల జిల్లాకు చెందిన అనేక మంది ప్రజలు, వ్యాపారులు, అన్ని వర్గాల వారు పనుల కోసం జిల్లా కేంద్రానికి వస్తుంటారు. వాహనాలతో బ్రిడ్జి ఎప్పుడూ రద్దీగా కనిపిస్తుంది. న్యూస్రీల్గాలిలో దీపంలా.. ఫ్లై ఓవర్ రక్షణ చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు నిద్ర నుంచి మేలుకోవడం లేదు. 8 ఏళ్ల క్రితమే బ్రిడ్జి ప్రమాదంలో ఉందని అప్పటి ఇంజనీరింగ్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు హెచ్చరించిన పట్టించుకోవడంలేదనే ఆరోపణలు లేకపోలేదు. జనగామ ఫ్లై ఓవర్ పరిస్థితిని అంచనా వేసి... ప్రస్తుత అవసరాల మేరకు కొత్తగా నిర్మాణం చేస్తారా, లేక దీనికి రిపేర్లు చేసి సామర్థ్యం పెంచేలా ప్లాన్ చేస్తారా అంటూ ప్రజల సందేహాలను అధికారులు నివృత్తి చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా మొదటగా బ్రిడ్జికి ఇరువైపులా పెరిగిన మహా వృక్షాలను తొలగించి, ప్రమాద నివారణను కొంతమేరకై న తగ్గించాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
మద్యం ప్రియులకు షాక్
జనగామ: తెలంగాణ ప్రభుత్వం మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది. నైన్టీ వేయకుండానే మత్తెక్కిచే వార్త చెప్పింది. ఇటీవల బీర్ల ధరలు పెంచిన సర్కారు.. ఆదివారం అర్థరాత్రి నుంచి లిక్కర్ రేట్లను పెంచుతూ సర్క్యులర్ జారీ చేసింది. దీంతో మందు ప్రియులు ఒకింత కినుకుగా ఉన్నారు. జిల్లాలో 47 మద్యం దుకాణాలు, ఐదు బార్లు ఉన్నాయి. రోజు వారీగా రూ.1.10 కోట్ల మేర లిక్కర్, బీర్ల వ్యాపారం జరుగుతుంది. ఇటీవల లైట్ బీర్, స్ట్రాంగ్ బీర్లపై రూ.30 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లిక్కర్ వంతు వచ్చేసింది. పలు బ్రాండ్లకు సంబంధించి క్వార్టర్పై రూ.10, ఆఫ్కు రూ.20, ఫుల్పై రూ.40 పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆదివారం అర్థరాత్రి నుంచి కొత్త రేట్లు అందుబాటులోకి వస్తాయని సూచనలు చేసింది. ప్రతీరోజు క్వార్టర్, ఆఫ్ చొప్పున తీసుకునే మ ద్యం ప్రియులు పెరిగిన ధరలను ఆదా చేసుకునేందుకు ఒక్కసారే నెలకు సరిపడా స్టాక్ కొనుగోలు చేస్తున్నారు. బెల్ట్ దుకాణదారులు రోజు వారి స్టాక్ కంటే రెట్టింపు కొనుగోలు చేశారు. ధరల పెరుగుదలతో ఆవరేజ్గా ప్రతీరోజు మద్యం ప్రియులపై రూ.10లక్షల మేర అదనపు భారం పడనుంది. లిక్కర్ ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం -
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
జనగామ రూరల్: జీపీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల నర్సింహులు అన్నారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉద్యోగుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కారోబార్లు, బిల్ కలెక్టర్లను పంచాయతీ అసిస్టెంట్లుగా నియమించాలని, జీఓ 51ని ఎత్తివేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి భద్రత కల్పించాలన్నారు. ఈ డిమాండ్లను సాధించుకునేందుకు ఈ నెల 25న రాష్ట్ర కమిటీ సమావేశం హైదరాబాద్ ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రంలో పని చేస్తున్న అన్ని సంఘాల బాధ్యులు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి చొల్లేటి శ్రీనివాసాచారి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, కంజర్ల భాస్కర్, కోశాధికారి పిల్లి రవి, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీధర్ యాదవ్, సహాయ కార్యదర్శి తిరుపతి, నాయకులు బాలనర్సయ్య, పాషా, మురళి, ప్రభాకర్, బాబుగౌడ్, శ్రీనివాస్, సురేశ్, గూడూరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జీపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహులు -
సీఎంను కలిసిన ఎమ్మెల్యే కడియం
స్టేషన్ఘన్పూర్: హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్డ్డిని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధిపై సీఎంతో చర్చించారు. ఘన్పూర్ మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్ప న, కార్యాలయాల నిర్మాణం, పలు అభివృద్ధి పనులకు సంబంధించి రూ.87 కోట్లతో ప్రతిపాదనలను అందించారు. అలాగే మున్సిపాలిటీలో తాగునీటి అవసరాలకు సంబంధించి రూ.20 కోట్లతో ప్రతిపాదనలు అందించారు. ఆయా ప్రతిపాదనలపై సీఎం సానుకూలంగా స్పందించారని, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. సీఎంను కలిసిన వారిలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తదితరులున్నారు. ఘన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.87 కోట్లు, తాగునీటి వసతికి రూ.20 కోట్ల ప్రతిపాదనలు -
సోమేశ్వరాలయానికి వెండి కలశాల బహూకరణ
పాలకుర్తి టౌన్: శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహాస్వామి ఆలయానికి రెండు వెండి కలశా లను (చెంబులు) భక్తులు శనివారం బహూక రించినట్లు ఈఓ సల్వాది మోహన్బాబు తెలిపారు. స్వామి వారి పూజా కార్యక్రమాల్లో వినియోగించేందుకు వరంగల్కు చెందిన భ క్తుడు అనంతుల రవి కుమార్, స్వప్న కుటుంబ సభ్యులు రూ.1,35,000 విలువైన 1.34 కేజీల వెండి కలశాలు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు దేవగిరి లక్ష్మ న్న, డీవీఆర్ శర్మ, దేవగిరి అనిల్కుమార్, మత్తగజం నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. మధ్యవర్తిత్వ కేంద్రాలతో సమస్యల పరిష్కారం●జనగామ రూరల్: మధ్యవర్తిత్వ కేంద్రాలతో ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని సీనియర్ సివిల్ జడ్జి సి. విక్రమ్ అన్నారు. శని వారం ప్రధాన న్యాయమూర్తి బి ప్రతిమ ఆదేశాల మేరకు పట్టణంలోని కురుమవాడలో జనహిత కౌండిన్య మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రతీ చిన్న సమస్యకు పోలీస్స్టేషన్, కో ర్టుకు వెళ్లడం సరికాదని, మధ్యవర్తిత్వ కేంద్రాల్లో పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ దామోదర్ రెడ్డి, మధ్యవర్తి మేకపోతుల ఆంజనేయులు పాల్గొన్నారు. ఉప్పల్ డీలక్స్ బస్సు సర్వీసులకు రిజర్వేషన్జనగామ: జనగామ డిపో నుంచి ఉదయం 6.20 (8552) బస్సు నంబర్), 7.10 (8554) గంటలకు ఉప్పల్కు వెళ్లే డీలక్స్ బస్సు సర్వీసులకు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం కల్పించినట్లు డిపో మేనేజర్ ఎస్.స్వాతి తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ ఉప్పల్కు వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు ఇంటి నుంచే టీజీఎస్ఆర్టీసీబస్.ఇన్ వెబ్సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చన్నారు. తిరంగా యాత్రను విజయవంతం చేయాలిజనగామ రూరల్: ఆర్మీ జవాన్లకు సంఘీభావంగా నిర్వహిస్తున్న తిరంగా యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. శనివారం పట్టణంలో తిరంగా యాత్ర కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషప్ సిందూర్ కార్యక్రమం విజయవంతం చేసినందుకు గాను నేడు (ఆదివారం) సాయంత్రం 4 గంటలకు పట్టణంలోని రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు నిర్వహించే తిరంగా యాత్రను విజయవంతం చేయాలని కోరారు. బెస్ట్ అవైలబుల్ స్కీంకు దరఖాస్తు చేసుకోవాలిజనగామ రూరల్: ఎస్సీ విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు 2025–26 విద్యాసంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పథకంలో భాగంగా 1వ, 5వ తరగతిలో ప్రవేశాలు కల్పించేందుకు జిల్లాకు చెందిన ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమ అధికారి డాక్టర్ విక్రమ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో మౌలిక వసతులు, 7, 10వ తరగతిలో 90శాతం పైగా ఉత్తీర్ణత కలి గి ఉండాలన్నారు. ఆసక్తిగల ఇంగ్లిష్ మీడి యం పాఠశాలల యాజమాన్యాలు ఈ నెల 19 వ తేదీలోగా కలెక్టరేట్లోని ఎస్సీ సంక్షేమ కా ర్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు. సబ్సిడీపై జీలుగ విత్తనాలుజనగామ రూరల్: ప్రభుత్వ సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాల్లో జీలుగు విత్తనాలు సబ్సిడీతో అందుబాటులో ఉన్నాయని క లెక్టర్ రిజ్వాన్ బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 30 కిలోల బస్తా పూర్తి ధర రూ.4,275కి గాను 50శాతం సబ్సిడీ పోను రూ.2,137.5లకు రైతులకు అందిస్తున్నామన్నారు. విత్తనాలు కావాల్సిన రైతులు ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్తో సంబంధిత ఏఈఓలను సంప్రదించాలన్నారు. జిలుగ సాగుతో భూమిలో సారవంతం పెరిగి వచ్చే వర్షాకాలంలో పంట దిగుబడి పెరిగేందుకు దోహదపడుతుందన్నారు. -
ప్రభుత్వ కళాశాలల్లోనే మెరుగైన బోధన
జనగామ రూరల్: విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలపై అధికారులు దృష్టి సారించారు. ఈ నెల ఒకటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు విఽ దించింది. పదో తరగతి పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదల కాగా జిల్లాలో 4,924 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న కళా శాలల్లోనే చేరాలని విద్యార్థులకు అధికారులు సూచి స్తున్నారు. మరోవైపు ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లకు కళాశాల అధ్యాపకులు ఇంటింటా తిరుగుతూ వివరాలు సేకరిస్తూ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ కళాశాలలు జిల్లాలో అనుబంధ గుర్తింపు కళాశాలల్లో ప్రవేశాలు చేపడుతున్నారు. తమ కళాశాలల్లో ముందు చేరితే ఫీజుల్లో రాయితీ ఇస్తామంటూ విద్యార్థులు, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 7 ప్రభుత్వ కళాశాలలు.. జిల్లాలో 7 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటిలో నర్మెట, కొడకండ్ల, ప్రభుత్వ బాలికల కళాశాల జనగామ, ప్రభుత్వ కళాశాల జనగామ, దేవరుప్పుల, స్టేషన్ ఘన్పూర్, జఫర్గఢ్ కళాశాలలు ఉన్నాయి. ఒక్కో సెక్షన్లో 44 మందిని మాత్రమే చేర్చుకోవాలి. ఒక్కో కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఐసీలో 80 సీట్ల చొప్పున భర్తీ చేయనున్నారు. గుర్తింపు ఉంటేనే ప్రవేశాలు ఇంటర్ బోర్డు గుర్తింపు ఉన్న కళాశాలల్లోనే చేరాలని ప్రభుత్వం సూచిస్తోంది. ప్రభుత్వ కళాశాలలకు ఫైర్సెఫ్టీ పరికరాలను బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ సరఫరా చేసింది. శానిటైజేషన్, స్ట్రక్చరల్ సౌండ్నెస్ సర్టిఫికెట్ సమర్పిస్తే సరిపోతుంది. ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు అనుబంధ గుర్తింపునకు అన్ని సౌకర్యాలు ఉంటేనే అనుమతి ఇస్తారు. నిబంధనల ప్రకారం నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ), ఆటస్థలం, అగ్నిమాపక అనుమతులు, కాలుష్యం, శబ్ధ నియంత్రణ, భవనం పటిష్టత, ట్రాఫిక్ తదితర ధ్రువీకరణ పత్రాలు, బోధకులు, సిబ్బంది వివరాలు ఉంటేనే అనుబంధ గుర్తింపు లభిస్తుంది. కొన్ని కళాశాలల్లో ఫైర్ సేఫ్టీ లేకపోవడం, మిక్స్డ్ ఆక్యుపెన్సీ ఉండడం ప్రధాన సమస్య కాగా, అప్లియేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరిస్తుంది. ఫిక్స్డ్ అగ్రిమెంట్ సేల్ డీడ్ అగ్రిమెంట్ వంటివాటితో ప్రభుత్వానికి అప్లియేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా జిల్లాలోని అన్ని కళాశాలల యాజమాన్యాలు రిజిస్ట్రేషన్ చేసుకుని అనుమతుల కోసం వేచి చూస్తూనే ప్రవేశాలు చేపడుతున్నాయి. ప్రభుత్వ అధ్యాపకుల ఇంటింటా ప్రచారం ఈ నెల 31వ తేదీ వరకు అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ జిల్లాలో 7 ప్రభుత్వ కళాశాలలుసద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలి. ప్రైవేట్ కళాశాలల పునరుద్ధరణకు దరఖాస్తులు మాత్రమే సమర్పించాయి. అన్ని అనుమతులు ఉంటేనే అనుమతి ఇస్తారు. ప్రభుత్వ కళాశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. –జితేందర్రెడ్డి, డీఐఈఓ -
దరఖాస్తుల పరిశీలన వేగంగా జరగాలి: కలెక్టర్
తెలంగాణ యువతకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. శనివారం జిల్లాలో జరుగుతున్న దరఖాస్తుల వెరిఫికేషన్కు సంబంధించి ఎంపీడీఓలతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులు ఎన్ని.. వెరిఫికేషన్ ఏ మేరకు పూర్తి చేశారనే విషయం అడిగి తెలుసుకున్నారు. ప్రతీ మండలం వారీగా వచ్చిన దరఖాస్తులను సమీక్షిస్తూ ... ఎంత మేరకు వెరిఫికేషన్ జరిగిందని వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూమ్ మీటింగ్లో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎస్.మాధవిలత, బీసీ సంక్షేమ అధికారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
పొగాకుకు నిప్పంటించి నిరసన
స్టేషన్ఘన్పూర్: పొగాకు పంటను కంపెనీ వారు కొనుగోలు చేయడం లేదని శనివారం ఛాగల్లు గ్రామంలో జాతీయ రహదారిపై పొగాకుకు నిప్పంటించి రైతులు నిరసన, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత రైతులు ఆకుల నర్సింగం, వడ్లకొండ యాదగిరి, పొన్నబోయిన రాజు, కె.యాకయ్య తదితరులు మాట్లాడారు. ఛాగల్లుకు చెందిన పొగాకు రైతులకు వీఎస్టీ, డెక్కన్ కంపెనీలకు చెందిన ఉద్యోగి మాయమాటలు చెప్పి పొగాకు పంట సాగు చేశాక క్వింటాకు రూ.18వేలకు తీసుకుంటామని నమ్మబలికారని చెప్పారు. దీంతో ఛాగల్లు క్లస్టర్ పరిధిలో దాదాపు 300 ఎకరాల్లో పొగాకు సాగుచేశామన్నారు. తీరా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేశాక ప్రస్తుతం ఆయా కంపెనీల వారు కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వృథాగా పోతుందని, ఈ విషయమై సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాస్కుల యాదగిరి, ఐలయ్య, శేషు తదితరులు పాల్గొన్నారు. -
డెంగీ నివారణకు కృషి చేయాలి
జనగామ రూరల్: డెంగీ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు అన్నారు. శుక్రవారం జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డెంగీ లక్షణాలను ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ సులవు అవుతుందని, ఈ మేరకు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమ తెరలు వినియోగించాలని సూచించారు. వ్యాధి సోకినట్లు అనుమానం వచ్చిన వెంటనే డాక్టర్ను సంప్రదించి పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహా మేరకు మందలతోపాటు సమతుల పౌష్టికాహారం తీసుకోవా లని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి అశోక్, యూపీహెచ్సీ అధికారి డాక్టర్ శ్రీతేజ, ప్రభాకర్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.ఆట పాటలతో నేర్పించాలిలింగాలఘణపురం: విద్యార్థులకు వారికి ఇష్టమైన వాటిని ఆట పాటలతో నేర్పించాలని విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ జి.ఉషారాణి అన్నారు. శుక్రవారం మండలంలోని నెల్లుట్ల, లింగాలఘణపురం పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులను పరిశీలించిన అరంతరం ఆమె మాట్లాడారు. క్యాంపులో విద్యార్థులు నేర్చుకున్న డాన్స్లు, పాటలు, కథలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళా సంఘం సభ్యులతో ఏర్పాటు చేసిన ‘బడిబాట’ సమావేశాన్ని సందర్శించిన ఆమె.. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని చెప్పారు. ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తున్న పాఠశాలలను బలోపేతం చేయడానికి ముఖ్యంగా మహిళలు కృషి చేయాలని కోరారు. చదువురాని నిరక్షరా స్య మహిళలకు చదువు నేర్పించాలని చెప్పా రు. అడిషనల్ డైరెక్టర్తో పాటు డిప్యూటీ డైరెక్టర్ నూమాన్, డీఈఓ భోజన్న, విజయ్కుమార్రెడ్డి, ఎంఈఓ విష్ణుమూర్తి, హెడ్మాస్టర్లు విద్యారాణి, మార్తా పాల్గొన్నారు. కడియం నాయకత్వంలోనే స్టేషన్ అభివృద్ధి : కొమ్మూరిజనగామ: ఎమ్మెల్యే కడియం శ్రీహరి నాయకత్వంలోనే స్టేషన్ఘన్పూర్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన జనగామలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన 18 నెలల కాలంలోనే సీఎం రేవంత్రెడ్డి సహకారంతో ఘన్పూర్కు కడియం శ్రీహరి రూ.800ల కోట్ల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నారని, ఆయనకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అసత్యపు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రతీ పనికి కమీషన్లు తీసుకున్న రాజయ్య.. నీతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే కడియంపై అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నా రు. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మోసాలకు కేరాఫ్ అడ్రస్ మాజీ సీఎం కేసీఆర్ అని ధ్వజమెత్తారు. కేటీఆర్కు బీఆర్ఎస్ పగ్గాలు అప్పగించిన వెంటనే మాజీ మంత్రి హరీశ్రావు పార్టీ వీడబోతున్నారని జోస్యం చెప్పారు. కేటీఆర్కు బాధ్యతలు అప్పగించినా పనిచేస్తానని అనడం వెనుక కుట్ర దాగి ఉందని పేర్కొన్నారు. సమావేశంలో జనగామ ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్, నాయకులు లింగాల జగదీష్ చందర్ రెడ్డి, చెంచారపు బుచ్చిరెడ్డి, వంగాల మల్లారెడ్డి, గాదెపాక రాంచందర్ పాల్గొన్నారు. కార్యదర్శులకు శిక్షణజనగామ రూరల్: మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన శుక్రవారం కలెక్టరేట్లో ఆర్టీఐ గ్రామసభలపై పంచాయతీ కార్యదర్శులకు రెండు రోజుల శిక్షణ కార్యక్ర మం చేపట్టారు. ఈ సందర్భంగా కార్యదర్శులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు, సవాళ్లపై డీపీఓ స్వరూప చర్చించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీసీ కర్ణాకర్, ఎంపీఓ ప్రకాశ్ మాస్టర్ ట్రైనర్లు, జిల్లాకు చెందిన 35 మంది కార్యదర్శులు పాల్గొన్నారు. -
మత్తు పదార్థాల నియంత్రణపై దృష్టి పెట్టాలి
జనగామ: గంజాయి, మత్తు పదార్థాల క్రయ విక్రయాల నియంత్రణపై స్టేషన్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. స్థానిక ఏసీపీ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన వెస్ట్జోన్ పోలీసు అధికా రుల సమావేశ ప్రాంగణాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం డీసీపీ రాజమహేంద్రనాయక్తో కలిసి పండ్ల మొక్కలు నాటి నీరు పోశా రు. అక్కడి నుంచి వెస్ట్జోన్న్ పరిధి జనగామ పోలీస్స్టేషన్తో పాటు డీసీపీ కార్యాలయాన్ని సందర్శించారు. స్టేషన్ పరిసరాలు, సీసీ కెమెరాల పని తీరును పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలు, బ్లూకోల్ట్స్ సిబ్బంది పనితీరు, రౌడీ షీటర్లు, నమోదవుతున్న కేసుల వివరాలు తెలుసుకున్నారు. ప్రతి స్టేషన్ అధికారి తప్పనిసరిగా రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లి వారి ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీయాలని సూచించారు. ఆర్థిక, సైబర్ నేరాలకు సంబంధించి నేరస్తుల మూలాలను సైతం దర్యాప్తులో కనిపెట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనగామ ఏఎస్పీ చైతన్య నితిన్ పండేరీ, ఏసీపీలు భీంశర్మ, నర్సయ్య, సీఐలు దామోదర్రెడ్డి, అబ్బయ్య, శ్రీనివాస్, ఎస్సైలు పాల్గొన్నారు. విజుబుల్ పోలిసింగ్ అవసరం చిల్పూరు: నేరాల నియంత్రణకు విజుబుల్ పోలీ సింగ్ అవసరం.. ఇందుకు పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. సీపీగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి పోలీస్స్టేషన్ను ఆయన శుక్రవారం సందర్శించారు. జనగామ రూరల్ సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్సై నవీన్కుమార్ సీపీకి పూలబొకె అందజేశారు. అనంతరం ఆయన మొక్క నాటారు. చెక్పోస్టును పరిశీలించిన సీపీ లింగాలఘణపురం : మండల పరిధిలోని కుందారం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన చెక్పోస్టును శుక్రవారం వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ పరిశీలించారు. రౌడీ షీటర్ల ఇళ్లను సందర్శించాలి సైబర్ నేరస్తుల మూలాలను కనిపెట్టాలి వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ -
సామరస్య పరిష్కారానికే మధ్యవర్తిత్వ కేంద్రాలు
రఘునాథపల్లి: కుటుంబ సభ్యులు, ఇతరులతో జరిగే చిన్న తగాదాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకే మధ్యవర్తిత్వ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రం అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపూర్లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన సర్వజన మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ మీడియేటర్ మేకల శంకరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్జి మాట్లాడు తూ.. జీవితం వెయ్యేళ్లు కాదుకదా.. ఉన్నన్నాళ్లు సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి.. గొడవలు, తగాదాలతో కోర్టులు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగి సమయం, డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. మధ్యవర్తిత్వ కేంద్రంలో సమస్యలు పరిష్కరించుకుంటే బంధాలు బలపడతాయని పేర్కొన్నారు. కమ్యూనిటీ మీడియేటర్ పెద్దమనిషిగా వివాదాలను స్వచ్ఛందంగా పరిష్కరిస్తారని చెప్పా రు. నిజామాబాద్, కరీంనగర్లో మధ్యవర్తిత్వ కేంద్రాలు విజయవంతంగా పని చేస్తున్నాయని, జిల్లాలో మొదట ఇబ్రహీంపూర్లో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సై నరేష్, కమ్యూనిటీ మీడియేటర్లు ధర్మయ్య, కృష్ణారెడ్డి, రమేశ్, నర్సయ్య, వైష్ణవి గ్రామైఖ్య సంఘం అధ్యక్షురాలు అంబీరు అరుణ, వీఓఏలు మౌనిక, వరలక్ష్మి, అంగన్వాడీ టీచర్ రాజమణి, పరపతి సంఘం అధ్యక్షుడు మోర్తాల మహేందర్, మేకల శ్రీనివాస్, గాజులపాటి మైసారావు, దామెర వెంకన్న, బండ్ర రామచంద్రం, మేకల శ్రీనివాస్రెడ్డి, గాజులపాటి లక్ష్మయ్య,, దొరగొల్ల కుమార్, మల్లయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సివిల్ జడ్జి విక్రం -
మైనార్టీ గురుకులంలో నాణ్యమైన విద్య
జనగామ: తెలంగాణ ప్రభుత్వం నిరుపేద మైనార్టీ విద్యార్థులకు గురుకులాల ద్వారా నాణ్యమైన విద్య అందిస్తోందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మైనారిటీ గురుకులాల్లో అడ్మిషన్ల ప్రవేశానికి సంబంధించిన పోస్టర్ను ఆయన శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో కలిసి ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. జనగామ, స్టేషన్ఘన్పూర్ మైనార్టీ గురుకులాల్లో 100 శాతం ఫలితాలు సాధించడం సంతోషకరమన్నారు. జిల్లాలోని మైనార్టీ విద్యార్థులు నాణ్యమైన విద్య కోసం గురుకులంలో అడ్మిషన్ తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి విక్రమ్కుమార్, పాఠశాల, కళాశాల ప్రిన్సిపాళ్లు కె.కుమారస్వామి, అనిల్ బాబు, మాధవీలత పాల్గొన్నారు. పట్టణ సుందరీకరణ పనులను పర్యవేక్షించిన కలెక్టర్ జనగామ: హనుమకొండ బైపాస్ రోడ్డు జంక్షన్ వద్ద జనగామకు వెల్కం చెబుతూ స్వాగత తోరణం నిర్మిస్తున్నారు. శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. శుక్రవారం స్వాగత తోరణం పనులతో పాటు హైదరాబాడ్ రోడ్డు, పెంబర్తి బైపాస్ జంక్షన్ అభివృద్ధి, బతుకమ్మకుంట సుందరీకరణ పనులను అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. పనుల పురోగతికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏఈ మహిపాల్తో మాట్లాడారు. పనుల్లో వేగం పెంచాలన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి మరింత కృషి జనగామ రూరల్: దివ్యాంగుల సంక్షేమానికి మరింత కృషి చేస్తామని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నేషనల్ ట్రస్ట్ చట్టం–1999 ప్రకారం, దివ్యాంగుల కోసం లీగల్ గార్డియన్ షిప్ పొందడానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు జిల్లా స్థాయిలో లోకల్ లెవల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధార పత్రాలను సమగ్రంగా పరిశీలించి నేషనల్ ట్రస్ట్ చట్టం విధానాల మేరకు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా సంక్షేమ అధికారి ఫ్లోరెన్న్స్ దివ్యాంగుల సంఘం ప్రతినిధి బిట్ల గణేష్, మల్లికాంబ మనోవికాస కేంద్రం జనరల్ సెక్రటరీ రామలీల పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
చివరి గింజ వరకూ మద్దతు ధర
జనగామ రూరల్: రైతులు పండించిన చివరి గింజ వరకూ మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని, హమాలీలు, రవాణా వాహనాల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్. చౌహాన్తో కలిసి ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహించగా జిల్లాలో కలెక్ట ర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే నగదు జమ అవుతున్నదని చెప్పారు. రానున్న 15 రోజులు ఎంతో కీలకమని, ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికా రులను ఆదేశించారు. అవసరమైన గోనె సంచులు, టార్పాలిన్లు అందుబాటులో పెట్టుకోవాలన్నారు. ఇదిలా ఉండగా.. మీ–సేవా కేంద్రాలు, ప్రజాపాలన కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి అర్హులకు రేషన్ కార్డులను జారీ చేయాలని మంత్రి వెల్లడించారు. వీసీలో డీఎం సీఎస్ హాతీరాం, డీసీఎస్ఓ సరస్వతి, డీఎంఓ నరేందర్, డీఏఓ రామారావు నాయక్, డీసీఓ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
పుష్కర స్నానం.. సకల పాప హరణం
● రెండో రోజు సరస్వతి పుష్కరాలకు తరలివచ్చిన భక్తులు ● సుమారు 80వేల మంది వరకు పుణ్యస్నానాలు ఆచరణ ● కిటకిటలాడిన సరస్వతి ఘాట్, దేవస్థానం ● పుష్కర స్నానం చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, పలువురు వీఐపీలుభూపాలపల్లి/కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతినది పుష్కరాలకు రెండో రోజు శుక్రవారం భక్తులు పోటెత్తారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతినదిలో పుష్కర స్నానాలు ఆచరించారు. నదీమాతకు పండ్లు, పూలతో పాటు, పసుపు, కుంకుమ, చీరె, సారెను సమర్పించారు. దీపాలు వదిలారు. సైకత లింగాలు చేసి ఆరాధన చేశారు. పితృతర్పనాలు, పిండప్రదానాలు చేశారు. బ్రాహ్మణ ముత్తయిదువులు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. భక్తుల కష్టాలు, ఇబ్బందులు తొలగిపోవాలని కోరుతూ కాళేశ్వరాలయంలో సంకష్టహర గణపతి హోమం నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో వేదపండితులు రెండోరోజు హోమాలు, విశేష పూజలు చేశారు. రాత్రి కాశీపండితుల ఆధ్వర్యంలో నదికి నవరత్నమాల హారతి ఇచ్చారు. నిండిన పార్కింగ్ స్థలాలు, చలువ పందిళ్లు.. ఆర్టీసీ బస్సులు, ట్రావెల్స్, ప్రైవేటు వాహనాల్లో భక్తులు తరలిరావడంతో పార్కింగ్ స్థలాలు కిటకిటలాడాయి. వరంగల్, భూపాలపల్లి మీదుగా తరలి వస్తున్న భక్తులు, వాహనాలను వీఐపీఘాట్, ఇప్పలబోరు వైపు పార్కింగ్లకు పోలీసులు తరలించారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మంచిర్యాల వైపునుంచి వచ్చే వాహనాలను బస్టాండ్ సమీపంలోని పార్కింగ్ స్థలం వద్ద నిలిపివేస్తున్నారు. అక్కడినుంచి ఘాట్ వరకు భక్తుల సౌకర్యార్థం ఉచిత ఆర్టీసీ షటిల్ బస్సులు ఏర్పాటు చేశారు. స్థానిక ఆటోలకు కూడా అనుమతివ్వడంతో భక్తులను పార్కింగ్స్థలాలనుంచి సరస్వతి ఘాట్, అక్కడినుంచి ఆలయానికి తరలిస్తున్నారు. ఎండ వేడిమి అధికంగా ఉండడంతో భక్తులు చలువ పందిళ్లకింద సేదదీరడం కనిపించింది. వీఐపీల రాక.. రెండవ రోజు శుక్రవారం సరస్వతినదిలో పలువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్రెడ్డి, భూపాలపల్లి ఇన్చార్జ్ జడ్జి పట్టాభిరాంలు వేర్వేరుగా పుష్కర స్నానాలు చేసి, శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. పుష్కరాల మరిన్ని వార్తలు, ఫొటోలు – IIలోu -
రాణి రుద్రమ పౌరుషాన్ని దెబ్బతీశారు
జనగామ: సుందరీమనుల కాళ్లు కడగడం క్షమించరాని నేరం.. సమ్మక్క–సారక్క స్ఫూర్తి, రాణి రుద్రమదేవి పౌరుషాన్ని దెబ్బతీశారని జనగామ ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. జనగామ మండలం యశ్వంతాపూర్లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, నన్ను కోసుకుతిన్నా పైసా లేదంటూ సీఎం రేవంత్రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అందాల పోటీలకు కోట్లు కుమ్మరించడంపై విమర్శించారు. అందాలబామల కాళ్లు కడగడం తెలంగాణ మంత్రులు మన సంప్రదాయంగా సమర్థించ డం సరికాదని.. రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రులు పుణ్యక్షేత్రాలను సందర్శించిన సమయంలో ఇలాంటి పనులు ఎప్పుడూ చేయలేదన్నారు. ఈ విషయంలో తెలంగాణ మేధావులు ఎక్కడ పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఐరన్ లెగ్గా పేరు తెచ్చుకున్నాడని, నియోజకవర్గ ప్రజలు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. రేషన్ దుకాణాల్లో ఆరు కిలోల బియ్యం పంపిణీకి 60 మంది పోలీసులను కాపలా పెట్టుకు ని తిరిగే పరిస్థితిలో కడియం ఉన్నారని ఎద్దేవా చేశా రు. ఆయన తిన్నింటి వాసాలు లెక్కించే విధంగా కేసీఆర్, పల్లా రాజేశ్వర్రెడ్డిని విమర్శిస్తున్నాడని అన్నారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్ రెడ్డి, నాయకులు ఇర్రి రమణారెడ్డి, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, పోకల జమునలింగయ్య, బాల్దె సిద్ధి లింగం, మేకల కలింగరాజు, పగిడిపాటి సుధసుగుణా కర్రాజు, జూకంటి శ్రీశైలంలక్ష్మి, దయాకర్, కిష్టయ్య, మధు, స్వరూప, శారద, సదీప్, దేవునూరి సతీష్, గుర్రం నాగరాజు ఉన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
ప్రత్యేక తరగతులు
టెన్త్ ఫెయిల్ విద్యార్థులకుసర్కారు స్కూళ్లలో 62.. ప్రైవేట్లో 12 మంది ● అడ్వాన్స్డ్ పరీక్షలకు సన్నద్ధం ● తెలుగులో తప్పిన ఎక్కువ మంది విద్యార్థులుజిల్లాలో 10 వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల బడులుజనగామ: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థు ల కోసం జిల్లా విద్యాశాఖ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. జిల్లాలోని 37 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పరిధిలో 62, ప్రైవేట్ స్కూళ్లలో 12 మంది మొత్తం 74 మంది ఫెయిల్ అయ్యారు. వీరు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే విధంగా డీఈఓ భోజన్న నేతృత్వంలో ప్రత్యేక తరగతులు ఇప్పిస్తున్నారు. వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యార్థులకు ఉదయం రెండు గంటలపాటు ఫెయిల్ అయిన సబ్జెక్టుకు సంబంధించి బోధన చేస్తూ.. రిటన్ టెస్ట్ సైతం నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పర్యవేక్షణ జిల్లాలో ఫెయిల్ అయిన టెన్త్ విద్యార్థులకు సంబంధించి డాటా తయారు చేసి.. ఆయా పాఠశాలల హెచ్ఎంలు, సబ్జెక్టు టీచర్లకు అందజేశారు. రోజూ సదరు విద్యార్థులకు ఫోన్ చేసి బడికి వచ్చేలా చూడాలి. సబెక్జులకు సంబంధించి బోధనతో పా టు పరీక్ష నిర్వహించి ఎన్ని మార్కులు వస్తున్నాయో పరిశీలించారు. రోజువారి కార్యాచరణకు సంబంధించి ఫొటో రూపంలో డీఈఓ వాట్సప్ గ్రూప్లో షేర్ చేయాల్సి ఉంటుంది. సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థుల కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడకుండా విద్యాశాఖ తీసుకున్న ప్రత్యేక తరగతుల నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగులో అత్యధికంగా.. టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థుల్లో తెలుగు సబ్జెక్టుకు సంబంధించి అత్యధికంగా 51 మంది ఉన్నారు. సైన్స్లో 17, సాంఘికశాస్త్రంలో 16, గణితంలో 9, ఇంగ్లిష్లో 12, హిందీలో 4 మంది ఉన్నారు. జూన్ 3వ తేదీ నుంచి పది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానుండగా, అప్పటి వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి. మండలం పాఠశాలల సంఖ్య బచ్చన్నపేట 4 చిల్పూరు 1 దేవరుప్పుల 4 స్టేషన్ఘన్పూర్ 4 జనగామ 9 కొడకండ్ల 1 లింగాలఘణపురం 2 నర్మెట 1 పాలకుర్తి 4 రఘునాథపల్లి 3 జఫర్గఢ్ 4వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం.. పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో వందశాతం ఫలితాలే లక్ష్యంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. జిల్లాలో 37 ప్రభుత్వ పాఠశాలల పరిధిలో 62 మంది ఫెయిల్ అయ్యారు. సబ్జెక్టుల వారీగా పిల్లలకు ప్రతీ రోజు బోధన, ఆ తర్వాత స్లిప్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. పిల్లవాడి పఠనా సామర్థ్యాన్ని బట్టి బోధన చేయిస్తున్నాం. – భోజన్న, డీఈఓ, జనగామ -
విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలే లక్ష్యం
స్టేషన్ఘన్పూర్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని ఎన్పీడీసీఎల్ స్టేషన్ఘన్పూర్ డీఈ రాంబాబు అన్నారు. స్థానిక సబ్స్టేషన్ ఆవరణలో నిర్మించనున్న డీఈ కార్యాలయ శంకుస్థాపన పనులను ఆయన గురువారం పరిశీలించారు. ప్రస్తుతం డీఈ కార్యాలయం అద్దె భవనంలో ఉండడం ఇబ్బందిగా మారిందని, ఎమ్మె ల్యే శ్రీహరి చొరవతో నూతన కార్యాలయ నిర్మాణా నికి నిధులు మంజూరయ్యాయని డీఈ చెప్పారు. ఏడీఈ రణధీర్రెడ్డి, ఏఈలు భువనేశ్వరి, శంకర్, లైన్మన్లు శ్రీధర్, అన్వర్ పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
రఘునాథపల్లి: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. గురువారం మండలంలోని గోవర్ధనగిరి, కుర్చపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన రికార్డులను పరిశీలించారు. నాణ్యత కలిగిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా కాంటా వేసి బస్తాలను వెంటనే మిల్లులకు తరలించాలని చెప్పా రు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియలో వేగం పెంచాలని ఆదేశించారు. ఓపీఎంఎస్లో రైతుల, ధాన్యం కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. తహసీల్దార్ ఎండీ.మోహ్సిన్ముజ్తబ, సీసీలు రీనావతి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం
జనగామ: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు అధికారులు పరీక్షల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఫస్టియర్ 2,383, సెకండియర్ 1,560 మొత్తం 3,943 మంది విద్యార్థులు పరీక్షల కు హాజరు కానుండగా.. 10 సెంటర్లు కేటాయించా రు. ఈ మేరకు గురువారం కలెక్టర్ గూగుల్ మీట్ ద్వారా పరీక్షలకు సంబంధించి అధికారులతో సమీక్షించారు. 22 నుంచి పరీక్షలు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 22 నుంచి 28వ తేదీ వరకు ఉన్నాయి. ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయని కలెక్టర్ వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు పది మంది చొప్పున, అదనపు చీఫ్ సూపరింటెండెంట్, కస్టోడియన్ ఒకరి చొప్పున, ఫ్లయింగ్ స్క్వాడ్ పరీక్షలను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు www.trbie.cff.gov.in వెబ్సైట్లో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని, సందేహాలుంటే టెలీ మానస్ టోల్ ఫ్రీ నంబర్–14416లో సంప్రదించాలని సూచించారు. ఈనెల 22 నుంచి 28 వరకు.. 3,943 మంది విద్యార్థులు 10 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు పరీక్షల నిర్వహణపై కలెక్టర్ సమీక్షసీసీ కెమెరాల పర్యవేక్షణలో.. పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నామని, సంబంధింత అధికారులు సెంటర్లలో కెమెరాలను సరిచూసుకోవాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా ఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులు నడిపించాలని పేర్కొన్నా రు. సెంటర్ల వద్ద వైద్య ఆరోగ్య సిబ్బందితో పాటు మందులు అందుబాటులో ఉంచుకో వాలని సూచించారు. దివ్యాంగ విద్యార్థులకు స్క్రైబ్ సౌకర్యం కోసం అవసరమైన పత్రాలు సమర్పించాలని, ప్రతి కేంద్రంలో ర్యాంప్ తదితర సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఐఈఓ జితేందర్రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
తహసీల్ ఎదుట 10 గంటల ధర్నా
జనగామ: పట్టణంలో బాణాపురం మూడో విడతలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు ఇంటి నంబర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాల యం ఎదుట సీపీఎం ఆధ్వర్యాన లబ్ధిదారులు గురువారం 10 గంటల పాటు ఆందోళన చేపట్టా రు. పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ అధ్యక్షతన ఉదయం 9 నుంచి రాత్రి 7 వరకు బైఠాయించారు. ఇంటి నంబర్లు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాలనీలో కనీస సౌకర్యాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడు తూ ఏడాది కాలంగా ఇంటి నంబర్లకు ఆదేశాలు ఇవ్వకుండా మున్సిపల్ కమిషనర్ కాలయాపన చేస్తూ నిరుపేదల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అర్బన్ డబుల్ బెడ్రూం పథకంలో జీప్లస్ టూ పద్ధతిన 144 నిళ్ల నిర్మాణం మొదలు పెట్టడంతోపాటు 2003 ఆగస్టులో అదే భూమిని అండర్ టేకింగ్ చేసుకున్నట్లు పురపాలిక అధికారులు చెప్పారని తెలిపారు. ఆర్డీఓ సమక్షంలో లక్కీ డ్రా ద్వారా ప్లాట్లు కేటాయించి ఇప్పుడు తమ పరిధి కాదనడం సబబుకాదన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇంటి నంబర్లు వేసి, కనీస సదుపాయాలు కల్పించే వరకు కదిలే ప్రసక్తే లేదని భీష్మించారు. రాత్రి 7 గంటలకు కమిషనర్ వెంకటేశ్వర్లు వచ్చి వారితో మాట్లాడడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో నాయకులు రాపర్తి రాజు, ఉపేందర్, అజహరొద్దీన్, భూక్య చందునా యక్, బిట్ల గణేష్, కల్యాణం లింగం, పాముకుంట్ల చందు, పగిడిపల్లి బాలమణి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇంటి నంబర్లు ఇవ్వాలని లబ్ధిదారుల డిమాండ్ -
సమర్థులకే పార్టీ పదవులు
రఘునాథపల్లి/కొడకండ్ల:కాంగ్రెస్ పార్టీలో సమర్థులకే పదవులు వస్తాయని పీసీసీ జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. గురువారం జనగామ మండలం యశ్వంతాపూర్లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఆధ్వర్యాన జరిగిన స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడా రు. బీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేసి కేసీఆర్ సీఎం అవుతారని బీజేపీ నేతలు వాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ ఆ హామీ నెరవేర్చలేదని, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకై నా దళితుడిని అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారంటీల అమలుతో పాటు విద్య, వైద్యం ఉచితంగా అందించాల ని ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ, మండ ల, జిల్లా, రాష్ట్ర పదవులు కావాలనుకునే వారు ఎమ్మెల్యే కార్యాలయం, పార్టీ జిల్లా కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఇరిగేషన్, విద్య, వైద్యం, సంక్షేమ పథకాలు నియోజకవర్గ ప్రజలకు అందించడమే తన ఎజెండా అని పేర్కొన్నారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ కాంగ్రెస్తోనే దేశ రక్షణ సాధ్యమని, నాడు ఇందిరాగాందీ ఫలితం సాధించాకే యుద్ధం ఆపినట్లు పేర్కొన్నారు. అయితే ప్రధాని మోదీ ‘ఆపరేషన్ సిందూర్’ ఆపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్ను పాషా, రాష్ట్ర గంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ అహ్మద్, ‘కూడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, పీసీసీ పరిశీలకులు లింగంయాదవ్, జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కొడకండ్లలో.. కొడకండ్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ దయాకర్ మాట్లాడుతూ జిల్లా పార్టీలో క్రమశిక్షణ, సమన్వయం ఉంది.. సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారు.. అదే బాట లో పాలకుర్తిలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఝాన్సీ రెడ్డి పనిచేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ పాలమూరు బిడ్డగా పాలకుర్తి కోడలుగా మాట ఇస్తున్నాను.. పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ పనులను తన హాయంలోనే పూర్తి చేయిస్తానని చెప్పారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, సంక్షేమ పథకాలు అందించే బాధ్యత తనదే అన్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ -
ముహూర్తం ప్రకారం 5.44 గంటలకు..
జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతినది పుష్కరాలను వేదపండితులు శాస్త్రోకంగా గణపతిపూజతో ప్రారంభించారు. గురువారం తెల్లవారుజామున 5.44గంటలకు కాళేశ్వరంలోని సరస్వతిఘాటుకు చేరుకొని ముహూర్తం ప్రకారం గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతి నదికి విశేష పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా రంగంపేటకు చెందిన పీఠాధిపతి మాధవానందసరస్వతిస్వామి ముందుగా పుష్కరునికి ఆహ్వాన పూజ చేశారు. పండితులు సరస్వతిమాతకు పూలు, పండ్లు, పాలు, చీరసారెతో నైవేద్యం సమర్పించారు. మాధవా నందసరస్వతిస్వామి పుష్కరినిలో స్నానం ఆచరించి ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఆయన సతీమణి, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, దేవాదాయ కమిషనర్ వెంకట్రావు, కలెక్టర్ రాహుల్శర్మ, ఆర్జేసీ రామకృష్ణారావు, ఈఓ మహేశ పుష్కర ప్రారంభ స్నానాలు ఆచరించారు. అనంతరం వేదపండితులు ఐదు కలశాలలో గోదావరి జలాలను తీసుకుచ్చి శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామికి అభిషేక పూజలు చేశారు. -
కాళేశ్వరం శాశ్వత అభివృద్ధికి తోడ్పాటు : సీఎం రేవంత్రెడ్డి
మంత్రి శ్రీధర్బాబు కోరినట్లుగా కాళేశ్వరం శాశ్వత అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. మాస్టర్ ప్లాన్ తయారు చేసి నివేదించాలని మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ను సీఎం కోరారు. పుష్కర ఏర్పాట్లపై సీఎం సంతృప్తి వ్యక్తం చేసి మంత్రి శ్రీధర్బాబును, అధికారులను అభినందించారు. మంత్రులు ఏమన్నారంటే.. ● మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ రాబోయే గోదావరి పుష్కరాల్లోగా కాళేశ్వర అభివృద్ధికి రూ.100 కోట్ల నిధుల మంజూరుతోపాటు పర్యాటక క్షేత్రంగా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు. ఇప్పటికే రూ.35కోట్లు మంజూరు చేశారని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ● దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి సీఎం ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రానున్న గోదావరి, కృష్ణ ఫు ష్కరాలతో పాటు సమ్మక్క–సారలమ్మ జాతరను విజయవంతం చేస్తామని అన్నారు. ● రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక లోటుపాట్లతో ఉన్నప్పటికి పుష్కర ఏర్పాట్లు ఘనంగా చేశామన్నారు. ● రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పన్నెండేళ్లకు ఓసారి వచ్చే సరస్వతిమాత పుష్కర స్నానాలను భక్తులు ఆచరించాలని సూచించారు. – మరిన్ని పుష్కర వార్తలు, ఫొటోలు 8లోu -
‘సఖి’ సేవలపై అవగాహన కల్పించాలి
జనగామ: మహిళలకు సఖి సెంటర్ ద్వారా అందజేసే సేవలపై అవగాహన కల్పించాలని మహిళా కమిషన్ సభ్యురాలు జి.పద్మ అన్నా రు. జిల్లా కేంద్రం వడ్లకొండ ఇంటిగ్రేటెడ్ ప్రభు త్వ కార్యాలయాల సముదాయంలోని సఖి సెంటర్ను ఆమె బుధవారం సందర్శించారు. సెంటర్లోని రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించిన అనంతరం బాధితులకు అందించే సేవలపై ఆమె ఆరా తీశారు. మహిళా కమిషన్ వాట్సాప్ నంబర్–94905 55533, హెల్ప్లైన్ నంబర్–181ను సద్వినియోగం చేసుకునేలా విస్రృత ప్రచారం కల్పించాలని కోరారు. అనంతరం పద్మను సఖిసెంటర్ నిర్వాహకులు సత్కరించారు.రేపటి నుంచి నెట్బాల్ పోటీలుజనగామ: జిల్లా కేంద్రం బతుకమ్మకుంటలో ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు స్టేట్ లెవల్ 8వ సబ్ జూనియర్ నెట్బాల్ చాంపియన్ షిప్–2025 పోటీలు నిర్వహిస్తున్నట్లు నెట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామస్వామి, సహాయ కార్యదర్శి రవికుమార్ తెలిపారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు టోర్నమెంట్ ప్రారంభమతుందని, రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులు రానున్నారని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలిజనగామ: ఆర్టీసీ ఉద్యోగులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానానికి చేరవేస్తూ వారి ఆదరాభిమానాలు పొందుతూ సంస్థకు మంచి పేరు తేవాల ని స్థానిక డిపో మేనేజర్ ఎస్.స్వాతి అన్నారు. డిపోలో పరిధిలో ఏప్రిల్ నెలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రగతి రథ చక్రం అవార్డులతో పాటు ప్రశంసాపత్రాలను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉద్యోగులను ఆమె అభినందించారు. కార్యక్రమంలో సూపర్ వైజర్లు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. లైసెన్స్ సర్వేయర్ శిక్షణ●జనగామ: తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ నుంచి లైసెన్స్ సర్వేయర్ శిక్షణకు అర్హులు దరఖాస్తు చేసుకో వాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎంపికై న వారికి జిల్లా కేంద్రంలో 50 రోజుల పనిది నాలతో పాటు సర్వేపై ప్రత్యేక శిక్షణ ఉంటుంద ని చెప్పారు. ఇంటర్మీడియట్లో(గణిత శాస్త్రం ఒక అంశంగా) కనీసం 60 శాతం మార్కులతో పాటు ఐటీఐ డ్రాప్ట్స్మెన్ (సివిల్), డిప్లొమా(సివిల్), బీటెక్ (సివిల్) లేదా ఇతర సమానమైన కోర్సులు చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఈనెల 17వ తేదీ వరకు రూ.100 ఫీజుతో పాటు ఓసీ అభ్యర్థులు రూ.10వేలు, బీసీ అభ్యర్థులు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2,500 మీ–సేవా కేంద్రంలో చెల్లించి అప్లై చేసుకోవాలన్నారు. లైసెన్స్ కలిగిన సర్వేయర్లుగా బాధ్యతలు చేపట్టేందుకు ఇది సువర్ణ అవకాశమని, జిల్లాలో ఇప్పటి వరకు 37 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. -
రిజర్వాయర్ల పనులు త్వరగా పూర్తిచేయాలి
పాలకుర్తి టౌన్: పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల పనులు త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం పాలకుర్తి రిజర్వాయర్ పనులను పరిశీలించారు. పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ పనుల తక్షణ సమాచారం కోరుతూ ప్యాకేజ్ 6 వివరాలను తెలుసుకున్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే పనులు ముగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, నీటిపారుదల శాఖ ఎస్ఈ సుధీర్, ఈఈలు ప్రవీణ్, సీతారాం, డీఈలు శ్రీకాంత్ శర్మ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా స్టేషన్ఘన్పూర్: భూ భారతి రెవెన్యూ సదస్సులు ముగిసినందున అందులో వచ్చిన భూసమస్యల దరఖాస్తులను త్వరగా పరి ష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. స్థానిక తహసీల్దా ర్ కార్యాలయాన్ని బుధవారం కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. రెవెన్యూ సదస్సుల్లో 1,060 దరఖాస్తులు రాగా ప్రత్యేకంగా ఇప్పటి వరకు తహసీల్దార్ కార్యాలయానికి 300 వచ్చాయ ని చెప్పారు. ఇంకా ఎవరైనా ఉంటే నేరుగా వచ్చి దరఖాస్తు సమర్పించాలని సూచించారు. సక్సేషన్ పెండింగ్ మ్యుటేషన్, మిస్సింగ్ నంబర్, భూసేకరణ, కోర్టు కేసులు, డిజిటల్ సంతకం వంటి మాడ్యూల్లోని సమస్యల పరిష్కారంలో పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పారు. అనంతరం స్థానిక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీ లించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు. ఆయన వెంట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, హనుమాన్నాయక్ ఉన్నారు. -
వచ్చే మూడేళ్లలో హామీలన్ని నెరవేరుస్తా..
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిల్పూరు: వచ్చే మూడేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా.. నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకువచ్చి గౌరవం పెంచేలా పనిచేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గార్లగడ్డతండాలో ఇందిరమ్మ ఇళ్ల శిలాఫలకం ఆవిష్కరణ, మండల కేంద్రం కొత్తపల్లిలో సీసీరోడ్డు పనుల ప్రారంభం, చిన్నపెండ్యాల, నష్కల్ గ్రామాల్లో నూతన ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణాలకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడు తూ.. పేద ప్రజల కలలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాకారం అవుతున్నాయని అన్నారు. పదేళ్లు పాలించిన వారు అభివృద్ధి చేయకున్నా ఇప్పుడు చేస్తున్న వారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ సరస్వతి, వ్యవసాయ మార్కెట్, చిల్పూరు ఆలయ కమిటీ చైర్మన్లు శిరీష, శ్రీధర్రావు, నాయకులు గడ్డమీది సురేష్, ఎడవెళ్లి మల్లారెడ్డి, బొమ్మిశెట్టి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
సరస్వతీనది పుష్కరాలకు వేళాయె..
సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన విద్యుత్ వెలుగులు, వేదిక జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతీనది పుష్కరాలు నేటినుంచి (గురువారం) ప్రారంభంకానున్నాయి. 12 రోజుల పాటు నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం 5.44 గంటలకు వేదపండితులు ముహూర్తం ఖరారు చేశారు. నదికి విశేష పూజాకార్యక్రమాలతో వేదపండితులు పుష్కరుడిని ఆహ్వానిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులు సరస్వతి ఘాట్లో పుణ్య స్నానం ఆచరించనున్నారు. సీఎంతో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ముఖ్యులు పాల్గొననున్నారు. – కాళేశ్వరం నేటినుంచి 26వ తేదీ వరకు నిర్వహణ ● సరస్వతిఘాట్లో పుణ్యస్నానం ఆచరించ నున్న సీఎం రేవంత్రెడ్డి దంపతులు ● లక్షలాదిగా తరలిరానున్న భక్తజనం– వివరాలు 8లోu -
కాకతీయుల గడ్డపై మెరిసిన ప్రపంచ సుందరీమణులు
రవిని తలపించే మోము.. తారల వెలుగులు నిండిన కనులు.. నుదుటిపై బొట్టు.. తలనిండా మల్లె, కనకాంబర పూలు, నెలవంక కట్టగా నెమలంచు చీర.. కన్నెపిల్లలు చుట్టగా కలువ రేకుల చీర.. ఆరు మూరల చీర కట్టిన అరిందలు.. ఓరుగల్లులో విహరించారు. ఫ్యాన్సీ దుస్తులు వదిలేసి పదహారణాల తెలుగమ్మాయిల్లా మారి ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధ్ధులను చేశారు. రెడ్కార్పెట్పై హొయలొలుకుతూ చిరునవ్వులతో తమ అందాలను ఆరబోశారు. ● తెలుగింటి ఆడపడుచుల్లా ముస్తాబు ● ఫ్యాన్సీ డ్రెస్లు వదిలి అంచుల చీరలు, పట్టుపరికిణీలు కట్టిన భామలు ● హైదరాబాద్ నుంచి నేరుగా హరిత కాకతీయకు.. ● వేయిస్తంభాలు, రామప్ప ఆలయంలో సంప్రదాయబద్ధంగా పూజలు ● అందరికీ అభివాదం చేస్తూ ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు ● సుందరీమణులకు ప్రత్యేక బహుమతుల అందజేతసాక్షిప్రతినిధి, వరంగల్/సాక్షి, వరంగల్/హన్మకొండ చౌరస్తా/వెంకటాపురం(ఎం) : మిస్ వరల్డ్–2025 పోటీదారులు బుధవారం వరంగల్ నగరంలో సందడి చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా హనుమకొండకు చేరుకున్న వారు హరిత కాకతీయలో దిగారు. హోటల్ వద్ద వారికి హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, సీపీ సన్ప్రీత్ సింగ్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఇతర అధికారులు స్వాగతం పలికారు. హోటల్లో సుమారు గంటకుపైగా గడిపిన వారు వేయిస్తంభాల ఆలయానికి వెళ్లే ముందు చీర కట్టుకొని తిలకం దిద్దుకొని అచ్చం తెలుగు అమ్మాయిల్లా తయారయ్యారు. సుందరీమణుల రాకతో చారిత్రక ఆలయ ప్రాంగణం మెరిసిపోయింది. ముందుగా తూర్పు ద్వారం వద్ద గల ఆలయ విశిష్టత, చారిత్రక నేపథ్యాన్ని వివరించే ఏకశిలాశాసనాన్ని టూరిజం గైడ్ సూర్యకిరణ్ క్లుప్తంగా వివరించారు. చారిత్రక ఆలయాన్ని చూసి మురిసిపోయారు.నందీశ్వరుడి ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీల్లో పాదాలను శుభ్రం చేసుకున్నారు. నందీశ్వరుడి వద్ద ఫొటోలు దిగిన సుందరీమణులకు కల్యాణమంటపం విశిష్టతను గైడ్ వివరించారు. మంటపం వద్ద మరోసారి ఫొటోషూట్తో సందడి చేసి, ఆలయం చుట్టూ ప్ర దక్షిణలు చేశారు. ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ సుందరీమణులకు సన్నాయి మేళాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో రుద్రేశ్వరుడికి అభిషేకం చేసిన అనంతరం పట్టువస్త్రాలు, ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం ఖిలావరంగల్కు బయలుదేరి వెళ్లారు. కోట చారిత్రక అందాలకు ఫిదా విశ్వసుందరి పోటీదారులు ఖిలావరంగల్ కోటకు రాత్రి 7.20గంటలకు చేరుకొని కాకతీయ కళా వైభవాన్ని తెలుసుకొని మంత్రముగ్ధులయ్యారు. కోటలో ఏర్పాటు చేసిన ఫ్లియా మార్కెట్ను సందర్శించి చేనేత కలంకారి దర్రీస్, జీఐ ట్యాగ్ పొందిన చపాట మిర్చి, పసుపు, హ్యాండ్ బ్యాగులు, బంగారు వర్ణంలో మెరిసిన హ్యాండ్ క్రాఫ్ట్ ప్రత్యేకతల గురించి అధికారులు వివరించడంతో ఆసక్తిగా విన్నారు. కాకతీయుల నాలుగు కీర్తితోరణాల నడు మ నళ్ల రాతిలోని శిల్ప కళ సంపదను అందాల భా మలు మరింత ఆసక్తిగా తిలకించారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను పర్యాటక శాఖ అధికారులు వివరించారు. టీజీ టీడీసీ ఆధ్వర్యంలో 45 నిమిషాల నిడివిగల సౌండ్ అండ్ లైటింగ్ షోను ఇంగ్లిష్లో ప్రదర్శించగా... ఆసక్తిగా వీక్షించారు. అంతకుముందు కాకతీయుల తోరణం ఎదుట గ్రూపు ఫొటో దిగారు. అనంతరం శిల్పాల ప్రాంగణంలో పేరిణి నృత్య కళాకారుడు గంజల రంజిత్ శిష్య బృందం ప్రదర్శించిన శివతాండవం ఆకట్టుకుంది. చివరగా సుందరీమణులకు చేనేత కలంకారి దర్రీస్, చపాట మిర్చి, పాకాల, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా రూపొందించిన సావనీర్తో కూడిన బహుమతులు అందించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రామప్ప అందాలు వీక్షించి.. రామప్ప సరస్సుకట్టపై ఉన్న హరితహోటల్ వద్దకు సాయంత్రం 4:30 గంటలకు చేరుకున్న మిస్వరల్డ్ పోటీదారులు సంప్రదాయ దుస్తులు ధరించారు. 5:50గంటలకు రామప్ప ప్రధాన గేట్ వద్దకు చేరుకున్న వారికి కొమ్ముకోయ నృత్యంతో కళాకారులు స్వాగతం పలికారు. కలెక్టర్ దివాకర టీఎస్తో పాటు అధికార యంత్రాంగం వారికి పుష్పగుచ్ఛాలు అందించారు. ఆలయానికి చేరుకున్న తరువాత రెండు బృందాలుగా విడిపోయారు. 18 మంది, 15 మంది వేర్వేరుగా రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టతను ప్రొఫెసర్ పాండురంగారావుతో పాటు టూరిజం గైడ్లు విజయ్కుమార్, వెంకటేష్ వారికి వివరించగా శిల్పకళ సంపదను తమ సెల్ఫోన్లో బంధించుకున్నారు. ముఖ్య అతి థిగా వచ్చిన మంత్రి ధనసరి సీతక్కతో కలిసి ఆల య ఆవరణలో గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం గార్డెన్లో పేరిణి నృత్యం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా ఆసక్తిగా తిలకించారు. -
బుధవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2025
పున్నమి వెలుగుల్లో రామప్పసుందరీమణుల రాక సందర్భంగా రామప్ప ఆలయం జిగేల్మంటోంది. విదేశీ వనితలు భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తూ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయం చుట్టూ గ్రీన్ మ్యాట్ వేశారు. ప్రత్యేక విద్యుత్దీపాలు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం గార్డెన్లో స్టేజీ నిర్మించారు. సరస్సు కట్టపై ఉన్న హరి త కాటేజీలను ముస్తాబు చేశా రు. వెయ్యి మంది సిబ్బందితో మూడంచెల భద్రత ఏర్పాటు చేసి మంగళవారం రాత్రి నుంచే పోలీసులు విధుల్లో చేరారు. పర్యాటకులకు బుధవారం రామప్ప సందర్శనకు అనుమతి లేదు.● వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట సందర్శన ● రామప్పలో సందడి చేయనున్న అందాలభామలు ● అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా.. 3వేల మందికి పైగా పోలీసులు ● మూడంచెల భద్రత.. సీనియర్ అధికారుల పర్యవేక్షణ● 4గంటలకు రామప్పకు చేరుకుంటారు. 4:40 గంటలకు రామప్ప సరస్సు అందాల వద్ద ఫొటో సెషన్లో పాల్గొంటారు. ● 4:55 గంటలకు రామప్ప ఆలయానికి చేరుకుంటారు. 5 గంటలకు రామప్ప ఎంట్రెన్స్ గేట్ వద్ద కొమ్ముకోయ నృత్యంతో కళాకారులు వారికి స్వాగతం పలుకుతారు. ● 5:10 నుంచి 6 గంటల వరకు సంప్రదాయ దుస్తుల్లో రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని శిల్పకళాసంపదను తిలకిస్తారు. ● 6.10 గంటల నుంచి రాత్రి 7.00 గంటల వరకు రామప్ప గార్డెన్లో అలేఖ్య శాసీ్త్రయ నృత్యం, పేరిణి ప్రదర్శన వీక్షించిన అనంతరం ప్రముఖులు అతిథులను సన్మానిస్తారు. ● రాత్రి 7.20 గంటలకు ఇంటర్ప్రిటిషన్ సెంటర్కు చేరుకుంటారు. 7.30 గంటలకు డిన్నర్ చేసి 8:15 గంటలకు హైదరాబాద్ ప్రయాణమవుతారు. ● హైదరాబాద్ నుంచి రెండు బృందాలుగా ప్రత్యేక బస్సుల్లో బయలుదేరుతారు. ● ఒక బృందం హనుమకొండలోని హరిత కాకతీయకు సాయంత్రం 4.35 గంటలకు చేరుకుంటుంది. ● సుమారు గంటపాటు హోటల్లోనే గడిపి సాయంత్రం 5.45 గంటలకు వేయిస్తంభాల గుడికి చేరుకుంటారు. ఏయే దేశాల సుందరీమణులంటే.. ప్రపంచంలోని 19 దేశాలకు చెందిన సుందరీమణులు గ్రేటర్ వరంగల్ నగరానికి, 32 దేశాల వారు రామప్ప ఆలయానికి రానున్నట్లు సమాచారం. వారిలో అర్జెంటీనా, బొలివియా, బ్రెజిల్, కెనడా, చీలి, కొలంబో, ఈక్వెడార్, ఈ సాల్వడార్, గౌతమాల, మెక్సికో, పనామా, పరాగ్వే, పెరు, యునైటెడ్ స్టేట్స్, వెనిజులా, హైతీ, హోందురాస్, నికరగ్వా, సురినామే తదితర దేశాల సుందరీమణులు ఉన్నారు. ● 40 నిమిషాలు పాటు అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ● సాయంత్రం 6.25 వరంగల్ కోటకు చేరుకుంటారు. 7.30 గంటలకు వరకు అక్కడే పేరిణి శివతాండవం, ఇతర సంప్రదాయ నృత్యాలను తిలకించి తిరిగి హరిత హోటల్కు చేరుకుంటారు. ● 8 గంటల నుంచి 9 గంటల వరకు పర్యాటక శాఖ విందులో పాల్గొని 9.15 గంటలకు హైదరాబాద్కు బయలుదేరుతారు. డిన్నర్లో ఇవే.. సుందరీమణులకు హనుమకొండ నక్కలగుట్టలోని టూరిజం హోటల్ హరిత కాకతీయ ముస్తాబైంది. హోటల్కు చేరుకున్న బృందానికి స్వాగత పలకరింపుగా నారింజ జ్యూస్ అందిస్తారు. స్టాటర్గా ప్రెలూడే ప్లేట్–స్టార్టర్ ట్రియో, గోల్డెన్ కోస్ట్ ఫిష్ బైట్స్ లేదా చీజ్ అండ్ హెర్బ్ మిలాంజ్ క్రాక్వెట్స్, సీసర్స్ గార్డెన్, మెయిన్ ఆఫెయిర్– సిగ్నేచర్ ప్లేట్స్గా నాన్ వెజిటేరియన్గా హర్బ్ గ్రిల్డ్ చికెన్ సుప్రీం, వెజిటేరియన్గా గ్రిల్డ్ కాటేజ్ చీస్ స్టీక్, మెడిటెర్రానీన్ వెజిటబుల్ గ్రాటిన్, టస్కాన్ పెన్న అర్రాబిటా, గోల్డెన్ చిప్స్, స్వీట్ ఇప్రెషన్గా చాక్లెట్ మౌసెస్, సాఫ్రాన్ ఫిర్ని, సీసన్స్ బౌంటి అందిస్తారు. న్యూస్రీల్అందాల భామలకు ఆహ్వానంరామప్ప ఆలయంలో ఇలా..4.35 గంటలకు వరంగల్కు.. -
ఓరుగల్లుకు నేడు ‘ప్రపంచ సుందరీమణులు’
సాక్షిప్రతినిధి, వరంగల్/వెంకటాపురం(ఎం): చారిత్రక నేపథ్యమున్న ఓరుగల్లులో వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు బుధవారం సందడి చేయనున్నారు. కళలు, దేవాలయాలు, చారిత్రక కట్టడాలు.. సాంస్కృతిక వేదికలు.. సంస్కృతీసంప్రదాయాలకు పెద్దపీట వేసిన కాకతీయుల కాలంనాటి కట్టడాలను తిలకించనున్నారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు రెండు బృందాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట, రామప్పలో సకల ఏర్పాట్లు చేశారు. ఐదు రోజులుగా హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్, వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. రామప్పలో ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ శబరీష్ రెవె న్యూ, పర్యాటక తదితర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పనులు చేయించారు. ముస్తాబైన నగరం.. వరంగల్ నగరంలో మూడుచోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వేయిస్తంభాల దేవాలయం, ఫోర్ట్ వరంగల్ వద్ద సౌండ్ అండ్ లైట్, ఫ్లియా మార్కెట్, సాంస్కృతిక ప్రదర్శనల వేదిక, మీడియా పాయింట్లు ఏర్పాటు చేశారు. హరిత కాకతీయ, వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట, పలు ముఖ్య కూడళ్లు ఫ్లడ్లైట్ల వెలుతురులో జిగేల్మంటున్నాయి. సుందరీమణుల పర్యటనను పర్యవేక్షించేందుకు వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో ప్రస్తుతమున్న సీసీ కెమెరాలతోపాటు అదనంగా మరికొన్ని అమర్చారు. మూడంచెల భద్రత కోసం కమిషనరేట్ పరిధిలో సుమారు రెండు వేల మందికిపైగా పోలీసులను వినియోగిస్తున్నారు. హరిత హోటల్ చుట్టూ 200 మంది సిబ్బంది పహారా కాస్తున్నారు. విద్యుత్ వెలుగుల్లో వేయిస్తంభాల గుడి -
వెరిఫికేషన్ వేగంగా పూర్తి చేయాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ రూరల్: ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక పరిశీలన వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి అన్ని మండలాల స్పెషల్ అధికారులు మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ పీడీ, బీసీ, ఎస్సీ సంక్షేమ అధికారులు, ఎస్సీ కార్పొరేషన్, ఎల్డీఎం, ఎంపీడీఓలతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంత మందిని అర్హులుగా గుర్తించ్చారో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఆధునిక పద్ధతులను పాటించాలి రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచి గుణాత్మక, ఆధునిక విద్యనందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభు త్వ, ఆదర్శ, తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ కొడకండ్ల, కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులకు క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఐదు రోజులపాటు నిర్వహించే జిల్లా స్థాయి వృత్యంతర శిక్షణ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠ్యంశాల బోధనలో విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. శిక్షణ మెలుకువలను పాఠశాల స్థాయికి తీసుకెళ్లి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. పుస్తక పరిజ్ఞానంతో పాటు అధునాతన టెక్నాలజీకి తగ్గట్టు విద్యార్థుల మేథాశక్తిని పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ భోజన్న, ఏఎంఓ శ్రీనివాస్ కోర్సు ఇంచార్జ్లు మల్లికార్జున్, యాదగిరి, ఆనంద్ బాబు పాల్గొన్నారు. అక్షరాస్యతలో అంతరాన్ని తగ్గించి ఉజ్వల భవిష్యత్కు బాటలు వేయాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరెట్లో అక్షరాస్యతా కార్యక్రమం మీద తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, మహిళా శిశు సంక్షేమ శాఖ విద్యాశాఖల సంయుక్త సమావేశం నిర్వహించారు. చదువు రాని, మధ్యలో బడి మానేసిన వారి వివరాల సర్వే 19వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ట్రైనర్ నాగరాజు, మండల విద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం వహిస్తే సహించం
బచ్చన్నపేట: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని తొందరగా మిల్లులకు తరలించాలని.. నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ అన్నారు. మండలంలోని కొడవటూర్, ఆలింపూర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడుతూ.. రైతుల ధాన్యం తేమ శాతం రాగానే తూకం వేసి, మిల్లులకు తరలించాలని అన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతుల ధాన్యం తడిసి చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గన్నీ బ్యాగులు సరిపడా లేకున్నా, లారీలు రాకున్నా తెలియజేస్తే సంబంధిత అధికారులతో మాట్లాడుతామన్నారు. మిల్లర్లు రైతుల ధాన్యంపై కొర్రీలు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలింపూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేసి మూడు రోజులు అవుతున్నా.. లారీలు రావడంలేదని రైతులు ఆయనకు తెలియజేయడంతో వెంటనే లారీ యాజ మాన్యంతో మాట్లాడి లారీని పంపించాలని చెప్పారు. తహసీల్దార్ ప్రకాశ్రావు, ఎంఆర్ఐ వంశీకృష్ణ, సీసీ సత్యనారాయణ పాల్గొన్నారు.సాధారణ ప్రసవాలను పెంచాలిస్టేషన్ఘన్పూర్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను పెంచేదిశగా వైద్య, ఆరోగ్య సిబ్బంది పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మల్లికార్జునరావు అన్నారు. స్టేషన్ఘన్పూర్, మల్కాపూర్, ఇప్పగూడెం, తాటికొండ పీహెచ్సీల మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలతో స్థానిక సీహెచ్సీలో మంగళవారం ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను పెంచేలా అందరూ బాధ్యతగా పనిచేయాలని అన్నారు. ప్రతినెలలో సీహెచ్సీ పరిధిలో కనీసం యాభై సాధారణ ప్రసవాలను చేపట్టాలన్నారు. ఇద్దరు పిల్లలతో కుటుంబ నియంత్రణ చేసుకునేలా ప్రజలను చైతన్యం చేయాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలపై ఏఎన్ఎంలు, సూపర్వైజరీ స్టాఫ్ ప్రజలకు వివరించాలన్నారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ వీరాంజనేయులు, మాతా, శిశు సంక్షేమ కార్యక్రమ అధికారి డాక్టర్ రవీందర్గౌడ్, ఘన్పూర్ సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ సంధ్య, డాక్టర్లు సునీత, రుబీనా, ప్రణీత, జ్యోతి, కుషాలి, శ్రావన్, అజయ్కుమార్, సీహెచ్ఓ వెంకటస్వామి, ప్రభాకర్ పాల్గొన్నారు.అసోసియేషన్ ఎన్నికజనగామ: జనగామ జిల్లా ఫర్టిలైజర్స్ ఫెస్టిసైడ్స్, సీడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలను పట్టణంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫర్టిలైజర్ సీడ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరీశెట్టి ము నిందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బజ్జూరి రవీందర్ హాజరయ్యారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా పజ్జూరి గోపయ్య, ప్రధాన కార్యదర్శిగా సదానందం, కోశాధికారి కాసర్ల రవీందర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసందర్భంగా మునిందర్ మాట్లాడుతూ.. సీడ్స్ లైసె న్స్ రెండు సంవత్సరాల కాలపరిమితి నుంచి మూడేళ్లకు పెంపు, ఫెస్టిసైడ్స్ లైసెన్స్కు సంబంధించి రెగ్యులర్గా ఉండే విధంగా ఆల్ ఇండియా అసోసియేషన్ భాగస్వామ్యంతో కలిసి భారత ప్రభుత్వాన్ని ఒప్పించి హక్కులను సాధించుకున్నామన్నారు. కార్యక్రమంలో గూ డెల్లి మధుసూదన్రెడ్డి, నడిపెల్లి సీతారాంరెడ్డి, ధనుంజయ, మహేష్, సురేందర్ ఉన్నారు.అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలుజనగామ: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. డీసీసీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో జనగామ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. ప్రభుత్వం అ ర్హులకు మాత్రమే పథకాలు అందిస్తోందన్నా రు. సంక్షేమ పథకాలు అందుకున్నవారు విని యోగించుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ రాజకీయలకు అతీతంగా, అవినీతికి తావులేకుండా పారదర్శకంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనను పార్టీ కేడర్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు అవినీతికి పాల్పడినా పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు తప్పదని హెచ్చరించారు. -
ప్రశాంతంగా పాలీసెట్
జనగామ: టీజీ పాలీసెట్ –2025 ప్రవేశ పరీక్ష జిల్లాలో మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. పాలిటెక్నిక్(డిప్లొమా) కోర్సుల్లో అడ్మిషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించగా.. జిల్లాలో 1,416 మంది విద్యార్థుల కోసం మూడు సెంటర్లను ఏర్పాటు చేశారు. 1,343 మంది ప్రవేశ పరీక్షకు (94.84 శాతం) హాజరయ్యారు. 73 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పరీక్షల కో ఆర్డినేటర్ డాక్టర్ ఏ.నర్సయ్య వెల్లడించారు. వివిధ కేంద్రాల్లో హాజరు శాతం.. జనగామ పట్టణంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెంటర్లో 576 మంది విద్యార్థులకు 553 మంది (96 శాతం) హాజరుకాగా.. 23మంది గైర్హాజరయ్యారు. హైదరాబాద్ రోడ్డులోని సెయింట్ మెరీస్ హైస్కూల్ కేంద్రంలో 480 మందికి 450మంది (94 శాతం)హాజరుకాగా.. 30 మంది గైర్హాజరయ్యారు. స్టేషన్ఘన్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సెంటర్లో 360 మంది విద్యార్థులకు 340మంది (94.44శాతం) హాజరుకాగా.. 20 మంది గైర్హాజరయ్యారు. మొత్తం పరీక్ష కేంద్రాల్లో బాలురకంటే బాలికలే ఎక్కువమంది పరీక్షకు హాజరయ్యారు. 9 గంటల నుంచి లోనికి అనుమతి పాలీసెట్ నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచే సెంటర్ల వద్దకు విద్యార్థుల రాక ప్రారంభమైంది. 9 గంటల నుంచి అధికారులు పరీక్ష కేంద్రంలోనికి అనుమతించారు. సెంటర్ల వద్ద డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తుతోపాటు 144 సెక్షన్ అమలు చేశారు. జిరాక్స్ సెంటర్లను మూసి వేశారు. అధికారులు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే సెంటర్లోకి పంపించారు. ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా.. నిమిషం నిబంధన అమలు చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్ష ప్రశాంతంగా ముగియగా, పోలీసుల బందోబస్తు నడుమ పరీక్ష సామగ్రిని స్ట్రాంగ్ రూంకు తరలించారు. 1,343 మంది విద్యార్థుల హాజరు.. 73 మంది గైర్హాజరు పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు -
తల్లి ఆసరా లేనిదే నడవలేడు..
జనగామ పట్టణం గ్రేయిన్ మార్కెట్ ఏరియాకు చెందిన రావుల సత్తెమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు సంతోష్ పుట్టుకతోనే దివ్యాంగుడు. కాళ్లు చచ్చుపడ్డాయి. తొమ్మిదేళ్ల వయసు వచ్చినా తల్లి ఆసరా లేకుండా నిలబడలేడు. ఈ పరిస్థితి ప్రత్యక్షంగా కనిపిస్తున్నా పింఛన్ కోసం ఏళ్ల తరబడి తిరుగుతున్నామని సత్తెమ్మ వాపోయింది. ఆర్థిక పరిస్థితి బాగోలేక కుటుంబ పోషణ కష్టంగా మారింది. పింఛన్ మంజూరు చేస్తే కొంత ఆసరాగా ఉంటుందని సత్తెమ్మ కోరింది. నడవలేని కొడుకు ను తీసుకుని ఆమె కలెక్టరేట్కు వచ్చింది.అర్హులకు అన్యాయం చేశారు.. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అర్హులతో పాటు దివ్యాంగులకు అన్యాయం చేశారని రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్, గన్నోజు మధు, జోగు సురేష్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అధికారులు పంపించిన జాబితాలో తన పేరు ఉన్నా ఫైనల్ నివేదికలో కనిపించ లేదని దివ్యాంగుడు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని అర్జీలో పేర్కొన్నాడు. భూమి కోసం పదేళ్లుగా తిరుగుతున్న.. మాకు మండల కేంద్రంలో 62/8లో ఎకరం భూమి ఉంది. 2019 వరకు ఆన్లైన్లో తమ పేరు చూపించింది. ధరణి వచ్చిన తర్వాత 27 గుంటలు మాత్రమే కనిపిస్తోంది. సమస్య పరిష్కరించాలని పది సంవత్సరాలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. – ఏనుగుల శంకరయ్య, నర్మెట -
నేడే టీజీ పాలీసెట్
● జిల్లాలో మూడు సెంటర్లు ● అమలులో నిమిషం నిబంధన జనగామ: పాలిటెక్నిక్(డిప్లొమా) కోర్సుల్లో అడ్మిష న్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం(నేడు) నిర్వహించే టీజీ పాలీసెట్–2025 పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రంలోని సిద్ధిపేటరోడ్డున ఉన్న ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హైదరాబాద్రోడ్డులోని సెయింట్ మేరీ హైస్కూల్, స్టేషన్ఘన్పూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెంట ర్లు కేటాయించారు. మొత్తం 1,416 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. నిమిషం నిబంధన అమలులో ఉన్నందున విద్యార్థులను ఉదయం 9 గంటల నుంచి సెంటర్లోకి అనుమతి స్తారు. సమయం 11 గంటలు కాగానే గేట్లు క్లోజ్ చేస్తారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను ఎట్టిపరి స్థితుల్లోనూ అనుమతించరని పరీక్ష డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.నర్సయ్య తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్తో పాటు హెచ్బీ బ్లాక్ పెన్సిల్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తెచ్చుకోవాలి. హాల్ టికెట్పై ఫొటో లేకపోతే గెజిటెడ్తో సంతకం చేయించి ఆధార్ తీసుకు రావాల్సి ఉంటుందని, సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని కోఆర్డినేటర్ స్పష్టం చేశారు. వ్యాయామంతో ఆరోగ్యంపాలకుర్తి టౌన్: వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సీఐ జి.మహేదర్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన 5కే రన్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పోలీసులు నిత్యం ఒత్తిడిలో పని చేస్తారని వ్యాయామంతో మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు. -
సంక్షేమ పథకాలు అర్హులకు అందాలి
జనగామ: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల క్షేత్ర స్థాయి పరిశీలన త్వరగా పూర్తి చేయాలని, ఇప్పటి వరకు వెరిఫికేషన్ పూర్తయినవి ఆన్లైన్లో నమోదయ్యేలా చూడాలని చెప్పారు. రాజీవ్ యువ వికాసం పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో సిబిల్ స్కోర్ వెరిఫికేషన్ పూర్తి చేసి, సంక్షేమ శాఖ అధికారులు తుది జాబితా ఇవ్వాలని చెప్పారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపుల్లో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని, ఈ స్థానం కొనసాగాలంటే మరో 15 రోజుల పాటు పర్యవేక్షణ నిరంతరం ఉండాలన్నారు. ప్రస్తుత వేసవిలో తాగు నీటికి ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనుల తుది జాబితా సిద్ధం చేయాలని, నగదు చెల్లించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందజేయాలని అన్నారు. మీటింగ్లో అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్ పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
విద్యుత్ వినతులపై ప్రత్యేక దృష్టి●
● గ్రీవెన్స్లో ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ జనగామ: విద్యుత్ వినియోగదారుల సమస్యలు సత్వరం పరిష్కరించేందుకు ప్రతీ సోమవారం గ్రీవెన్స్ నిర్వహించడంతో పాటు వినతులపై ప్రత్యే క దృష్టి సారిస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ తెలిపారు. సోమవారం జిల్లా పరిధి మండలాలతో పాటు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో వినతులు స్వీకరించారు. 2024 జూన్ 17 నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామ ని.. 426 ఫిర్యాదులు రాగా 361 పరిష్కరించినట్లు చెప్పారు. ప్రతీ సోమవారం డివిజన్, ఈఆర్వో, సబ్డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట, సర్కిల్ ఆఫీస్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వినతులు స్వీకరిస్తామని చెప్పారు. గ్రీవెన్స్ నిర్వహించే రోజు ఉద్యోగులు అందుబాటులో ఉండి వినియోగదారుల సమస్యలకు పరిష్కారం చూపించాలని ఆదేశించారు. -
పద్దెనిమిదేళ్లకు ఇంటికి చేరిన మహిళ
రఘునాథపల్లి : మతిస్థిమితం కోల్పోయి 18 సంవత్సరాల క్రితం తప్పిపోయిన మండల పరిధి కన్నాయపల్లికి చెందిన మంతపురి ఎల్లమ్మ ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో సోమవారం కుటుంబ సభ్యుల చెంతకు చేరింది. దేవరుప్పులకు చెందిన చింత సోమయ్య–వెంకటమ్మ దంపతుల కూతురు ఎలమ్మ ను కన్నాయపల్లికి చెందిన యాదయ్యకు ఇచ్చి వివా హం చేశారు. ఇద్దరు కుమారులు జన్మించాక మతిస్థిమితం కోల్పోయిన ఎల్లమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆచూకీ కోసం కుటుబ సభ్యులు ఎక్కడ వెతికినా జాడ లభించక విసిగిపోయారు. కేరళకు వెళ్లిన ఎల్లమ్మను అక్కడి ఆకాష్ ప్రవల్ స్వచ్ఛంద సంస్థ చేరదీసి మానసిక వ్యాధి నిపుణుల వద్ద ఆరోగ్య పరీక్షలు చేయించింది. అదే స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్న దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి వాసి బాషిపెల్లి యాకయ్యతో తాను జనగామ జిల్లా కన్నాయపల్లికి చెందిన మహిళగా చెప్పుకుంది. దీంతో ఎల్లమ్మ పూర్తి వివరాలు తెలుసుకున్న యాకయ్య దేవరుప్పుల, కన్నాయపల్లి గ్రామస్తుల కు సమాచారం అందించాడు. సంస్థ ప్రతినిధులు ఎలిషాబెత్, బి.సుభాషి, జెత్రుదీ సోమవారం ఎల్లమ్మను గ్రామానికి తీసుకొచ్చి పంచాయతీ కార్యదర్శికి, కుమారుడు అరవింద్కు అప్పగించారు. స్వచ్ఛంద సంస్థ సహకారంతో కుటుంబం చెంతకు -
అభివృద్ధి పనులు చూసి బుద్ధి తెచ్చుకోవాలి
స్టేషన్ఘన్పూర్: అదేపనిగా అసత్యపు ఆరోపణలు, విమర్శలు చేసే వారు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్పూర్లో చేపట్టిన వంద పడకల ఆస్పత్రి, బంజారా భవన్ నిర్మాణ పనులను ఆయన సోమవారం పరి శీలించారు. ముందుగా సంబంధిత శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించి అక్కడున్న అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అనంతరం ఆర్డీఓ డీఎస్ వెంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో కడియం మాట్లాడారు. ఎమ్మెల్యేగా ఎన్నికై న ఏడాదిలోపే సీఎంను ఒప్పించి నియోజకవర్గానికి రూ.800 కోట్ల నిధులు తీసుకువచ్చానని చెప్పారు. కళ్ల ముందు అభివృద్ధి పనులు కనిపిస్తుంటే మాజీ ఎమ్మెల్యే రాజయ్య, బీఆర్ఎస్ నాయకులు ఒక్కపైసా అభివృద్ధి జరగలేదని తప్పుడు ప్రచారం చే యడం సిగ్గుచేటన్నారు. పనులను చూసైనా కొందరికి జ్ఞానం రావడం లేదని విమర్శించారు. త్వరలో స్టేషన్ఘన్పూర్ రూపురేఖలు మారనున్నాయని, మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.70కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, నాయకులు బెలిదె వెంకన్న, సీహెచ్.నరేందర్రెడ్డి, కొలిపాక సతీష్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విజయశ్రీ, గిరిజన శాఖ జేఈ వినీల్, ఈఈ వీరభద్రం, డీఈ ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
ధాన్యం త్వరగా తరలించాలి
బచ్చన్నపేట : కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని జనగామ ఆర్డీఓ గోపీరాం అన్నారు. సోమవారం మండల పరిధి పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అలాగే వివాదాస్పద భూములను పరిశీ లించారు. అనంతరం మాట్లాడుతూ భూ భారతి ద్వారా ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. భూసమస్యలు ఉన్న వారు నేరుగా రెవెన్యూ అధికారులను సంప్రదించాలని, దళారుల వద్దకు వెళ్లకూడదని తెలిపా రు. ఆయన వెంట తహసీల్దార్ ప్రకాశ్రావు, ఎంఆర్ ఐ గోపీ, సర్వేయర్ నర్మద ఉన్నారు. -
ప్లాట్ల సమస్య పరిష్కరించండి
జిల్లా కేంద్రం హనుమకొండ రోడ్డులోని ఓ వెంచర్లోని ప్లాట్లను సుమారు 150 నుంచి 200 మంది కొనుగోలు చేసి రిజిష్ట్రేషన్ చేసుకున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసిన పలు కుటుంబాల్లో తగాదాల మూలంగా 2012లో వారు కోర్టుకు వెళ్లగా 2023లో ఆ కేసును కోర్టు కొట్టి వేసింది. అయినా హద్దు రాళ్లు తొలగించి తమను ఇబ్బంది పెడుతున్నారని కాలనీ అధ్యక్షుడు కె.నానాజీ, గొట్టం శ్రీధర్రెడ్డి, ఎల్ల స్వామి, నరసింహ, స్వప్న, లక్ష్మి, సోమశేఖర్, నోముల మహేందర్, బిక్షపతి, సునీత, హరికిషన్, పురుషోత్తం తెలిపారు. ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ అవకాశం కల్పించడంతో పాటు ఇంటి నిర్మాణ అనుమతులు ఇప్పించాలని కలెక్టర్కు అర్జీ పెట్టుకున్నారు. -
ఒక్కొక్కరిది ఒక్కో సమస్య
జనగామ/జనగామ రూరల్: ‘ఆసరా లేనిదే నడవలేని కొడుక్కు పింఛన్ కోసం ఓ మాతృమూర్తి.. తలదాచుకోవడానికి నీడలేక ఇందిరమ్మ ఇల్లు మంజూ రుకు నిరుపేద మహిళ.. ఇళ్ల మంజూరులో అన్యా యం చేశారని ఓ దివ్యాంగుడు.. ఆన్లైన్లో భూమి కనిపించక పదేళ్లుగా తిరుగుతున్నా సమస్య పరిష్కరించడంలేదని మరో బాధితుడు’.. ఇలా.. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు వచ్చిన ప్రజలు అధికారులకు తమ గోడు చెప్పుకున్నారు. ఏళ్ల తరబడి తిరుగుతున్నా పరిష్కా రం కావడంలేదని వాపోయారు. వివిధ సమస్యలపై 47 వినతులు రాగా కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్, జిల్లా స్థాయి అధికారులు స్వీకరించారు. అర్జీలు పెండింగ్లో లేకుండా సత్వరమే పరిష్కారం చూపించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ తదితరులు పాల్గొన్నారు. గ్రీవెన్స్కు 47 వినతులు అర్జీలు పెండింగ్లో ఉండొద్దు అధికారులకు కలెక్టర్ ఆదేశం -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
జనగామ: పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. బతుకమ్మకుంట, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏరియా లేబర్ ఆఫీస్, చీటకోడూరులో జరుగుతున్న ఇంట్రా పైపులైన్ పనులను సోమవారం ఆయన పరిశీ లించారు. పనుల్లో నాణ్యత పాటిస్తూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఈ రాజ్కుమార్, ఏఈ మహిపాల్ పాల్గొన్నారు.‘నైటింగేల్’కు నివాళిజనగామ: చంపక్హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో సోమవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. వైద్య రంగంలో నర్సు వృత్తికి గౌరవం తీసుకువచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు 31 వరకు పొడిగింపుజనగామ: ప్రభుత్వం అందించే 25 శాతం రా యితో ప్లాట్ల క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్) చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకా శం కల్పిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికీ రెండు సార్లు అవకాశం ఇవ్వగా.. గడువు ముగిసినప్పటికీ.. ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈనెల 31వ తేదీ వరకు పొడిగించింది. ప్లాట్ల యజమానులు రాయితీని సద్వినియోగం చేసుకోవాలని సూ చించింది. జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సి పాలిటీలతోపాటు మండలాల పరిధిలో ఇటీవ ల గడువు ముగిసే నాటికి 13,332 అప్లికేషన్ల ఎల్ఆర్ఎస్ పూర్తి కాగా, రూ.24.67 కోట్ల మేర ఆదాయం సమకూరింది.‘గాలికుంటు’ నివారణే లక్ష్యంలింగాలఘణపురం: పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణే లక్ష్యమని వీబీఆర్ఐ(వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) మాని ట రింగ్ ఆఫీసర్ డాక్టర్ సుధారాణి అన్నారు. సోమవారం రామచంద్రగూడెంలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. వ్యాక్సిన్ భద్రపరిచే కోల్డ్స్టోరే జీ, పశువైద్యశాలను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ గాలికుంటు నివారణకు ఏటా రెండుసార్లు వ్యాక్సినేషన్ చేస్తున్నామని రైతులు వినియోగించుకోవాలని సూచించారు. టీకా వేయకపోతే వ్యాధి సోకిన పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గడమే కాకుండా నష్టం జరుగుతుందని చెప్పారు. జిల్లా పశువైద్యాధికారి రాధాకిషన్ మాట్లాడుతూ జిల్లాలో 1,35,000 పశువులు ఉండగా.. 87,779 పశువులకు టీకాలు వేశామన్నారు. ఉమ్మడి జిల్లా పశువ్యాధి నిర్ధారణ కేంద్రం ఏడీ నాగమణి, డాక్టర్లు నేహా, అనిత, భగవాన్రెడ్డి పాల్గొన్నారు. -
వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం
లింగాలఘణపురం: మండలంలోని బండ్లగూడెం బండగుట్ట లక్ష్మీనర్సింహ్మస్మామి కల్యాణం వేదపండితులు కృష్ణమాచార్యుల వేదమంత్రోచ్ఛారణలతో మధ్య ఆదివారం వైభవంగా నిర్వహించారు. అంతకుముందు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ఉత్సవ విగ్రహాలను అలంకరించి ఢోలువాయిధ్యాలతో భక్తుల నృత్యాలతో ఆటపాటలతో ఊరేగించారు. మండల కేంద్రంలోని చేనేత కార్మికులు ట్రాక్టర్పై మగ్గాన్ని ఏర్పాటు చేసుకొని ఉత్సవ మూర్తుల ఊరేగింపు కొనసాగుతుండగా మగ్గంపై పట్టువస్త్రాన్ని నేస్తూ కల్యాణోత్సవంలో లక్ష్మీనర్సింహ్మస్వామికి సమర్పించారు. కార్యక్రమ నిర్వాహకులు బండ్లగూడెంకు చెందిన వంచ మహేశ్వర్రెడ్డి, రాంరెడ్డి, మండల కేంద్రానికి చెందిన లింగాల దీపక్రెడ్డిల ఆధ్వర్యంలో ఉత్సవాన్ని నిర్వహించారు. చేనేత కార్మికులు వంగ ఉప్పలయ్య, బింగి స్వామి, కారంపురి చంద్రయ్య, బాల్నె సత్యనారాయణ, రమేష్, యాదగిరి తదితరులు చేనేత వస్త్రాన్ని నేసి కల్యాణోత్సవంలో సమర్పించారు. 17 మంది పుణ్యదంపతులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. -
పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్
జనగామ: సర్కారు బడులకు పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్. వేసవి సెలవులు ముగిసిన వెంటనే... అడ్మిషన్ల ప్రారంభం నుంచే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం వేసవిసెలవులు కొనసాగుతున్న నేపధ్యంలో.. జూన్ 12వ తేదీ నుంచి బడులు పునఃప్రారంభం కానున్నాయి. అంతకు ముందే జిల్లాల వారీగా విద్యాశాఖ విద్యార్థుల సంఖ్య ఆధారంగా నివేదికలను పంపించగా, ప్రభుత్వం దాని ఆధారంగా పాఠ్యపుస్తకాలను జిల్లాకు పంపించింది. గత పది రోజుల క్రితమే జిల్లాకు పుస్తకాలు చేరకోగా... డీఈఓ భోజన్న ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయుల సమక్షంలో స్కూల్స్కు అందజేస్తున్నారు. మొదటి విడతలో 81 శాతం.. జిల్లాలో ప్రభుత్వ, లోకల్ బాడీ, గురుకులాలు కలుపుకుని 558 విద్యా సంస్థలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక 341, ప్రాథమికోన్నత 64, ఉన్నత 103, మోడల్ 8, కేజీబీవీ 12, యూఆర్ఎస్ 1, ఎయిడెడ్ 10, రెసిడెన్షియల్ 19 ఉండగా.. 45 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. బడిబాట కార్యక్రమంతో పాటు రెగ్యులర్గా వచ్చే కొత్త అడ్మిషన్లతో 10 నుంచి 20 శాతం మేర విద్యార్థుల సంఖ్య పెరగనుంది. 1వ తరగతి నుంచి 10 వరకు జిల్లాకు 2,14,460 పాఠ్యప్తుస్తకాలు (తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ) అవసరం ఉండగా, ఇప్పటి వరకు 1,73,730 (81శాతం) వచ్చాయి. వీటిని వీవర్స్ కాలనీ ఓల్డ్ డీఈఓ కార్యాలయ గోదాంలో నిల్వ చేశారు. ప్రైవేట్కు దీటుగా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా రెండు జతల యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నం భోజనం తదితర వాటిని ప్రభుత్వ విద్యార్థులకు ప్రోత్సాహంగా అందిస్తోంది. ప్రైవేట్కు దీటుగా డిజిటల్ తరగతులు, సైన్స్ ప్రయోగాలతో ఉత్తమ బోధన చేస్తూ పేద విద్యార్థుల జీవితాలకు బంగారు భవిష్యత్ను అందిస్తుంది. ప్రస్తుతం 81శాతం మేర పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుగా, బడులు పునఃప్రారంభమయ్యే లోపు మిగతా 19 శాత పాఠ్యపుస్తకాలను కూడా రానున్నాయి. పాఠశాలలు తెరుచుకున్న తర్వాత విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఒకవేళ పుస్తకాల సంఖ్య తక్కువగా ఉంటే... పై తగతులకు వెళ్లే పిల్లల నుంచి తీసుకుని వాటిని అందించేలా ప్లాన్ చేస్తున్నారు. పాఠశాలలకు పంపిణీ 2025–26 నూతన విద్యా సంవత్సరానికి గాను సర్కారు బడుల పిల్లలకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలను జిల్లాలో పలు మండలాల ఎమ్మార్సీ కార్యాలయాలకు పంపించారు. జనగామ మండలం(28,645), బచ్చన్నపేట (10,570), నర్మెట (7,77 6), దేవరుప్పుల (7,385) మొత్తంగా 54,376 రకాల పుస్తకాలను మండలాలకు పంపించారు. ఇంకా 8 మండలాలకు 1,19,354 పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. ఎమ్మార్సీల నుంచి విద్యార్థుల ఇండెంట్ ప్రకారం పాఠ్యపుస్తకాలను ప్రధానోపాధ్యాయులకు అప్పగించనున్నారు.జిల్లాలో విద్యాసంస్థల వివరాలుపీఎస్ 341 యూపీఎస్ 64 ఉన్నత 103 గురుకులాలు 19 కేజీబీవీ 12 యూఆర్ఎస్ 01 మోడల్ 8 ఎయిడెడ్ 10 జిల్లాకు 2.14 లక్షలు అవసరం ఇప్పటివరకు చేరుకున్నవి 1.73 లక్షలు రెండో విడతలో వందశాతం 155 స్కూల్స్, గురుకులాలు 45 వేల మంది విద్యార్థులురెండో విడతలో పూర్తిస్థాయిలో.. సర్కారు బడులు, గురుకులాల పిల్లలకు ఉచితంగా అందించే ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను మండలాల వారీగా పంపిణీ చేస్తున్నాం. ఇప్పటివరకు నాలుగు మండలాలకు 54,376 పుస్తకాలను అందించాం. జిల్లాకు ప్రభుత్వం నుంచి 81 శాతం మేర పాఠ్యపుస్తకాలు రాగా, రెండో విడుతలో పూర్తి స్థాయిగా రానున్నాయి. – భోజన్న, డీఈఓ -
గ్రామాభివృద్ధే లక్ష్యం
దేవరుప్పుల: జన్మనిచ్చిన గ్రామ అభివృద్ధి లక్ష్యంగా విద్య, వైద్య రంగాల్లో ట్రస్టు పక్షాన నిరంతర తోడ్పాటు అందిస్తామని సీతారాంపురం హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ అంబటి యాకన్న అన్నారు. ఆదివారం మండలంలోని సీతారాంపురం గౌడ కమ్యూనిటీ హాల్లో పగిడిపల్లి సతీష్ అధ్యక్షతన తొలుత ఇటీవల పాకిస్తాన్ సరిహద్దులో దేశం కోసం అశువులు బాసిన వీరజవానుల మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం ఇటీవల పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సహకాలు అందించి తల్లిదండ్రులను సన్మానించారు. చైతన్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు కెరీర్ గైడెన్స్పై అవగాహన కల్పించి పలు సందేహాలకు నివృత్తి చేశారు. అలాగే ట్రస్టు సభ్యుడు పోరండ్ల శ్రీనివాస్ ఽఆధ్వర్యంలో అనాథ శరణాలయంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ఉపాధ్యక్షుడు డాక్టర్ హనుమాన్జీ, ప్రధాన కార్యదర్శి పగిడిపల్లి సతీష్, కోశాధికారి ఆవుల రాజు, సంయుక్త కార్యదర్శులు బస్వ నాగరాజు, దొడ్డి రమేష్, పుప్పల సోమేశ్వర్, భాషిపాక సుధాకర్, కార్యవర్గ సభ్యులు అనంతుల శివ, పెండెం ఉపేందర్, బస్వ మల్లేషమ్ తదితరులు పాల్గొన్నారు.భూమాత రైతు సంక్షేమ సంఘం జిల్లా కోశాధికారిగా పద్మారెడ్డిస్టేషన్ఘన్పూర్: భూమాత రైతు సంక్షేమ సంఘం జిల్లా కోశాధికారిగా మండలంలోని తానేదార్పల్లికి చెందిన దుంపల పద్మారెడ్డిని నియమించినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జ సమ్మయ్యయాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్షుడు చెవుల యాదగిరి ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా పద్మారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఈ నియామకానికి సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.కేజీబీవీలో డిజిటల్ క్లాస్ మానిటర్ చోరీతరిగొప్పుల: మండలకేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలో గుర్తుతెలియన వ్యక్తులు శనివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సునీత తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలకు వేసవి సెలవులు కావడంతో హాస్టల్ విద్యార్థులు వారి ఇంటికి వెళ్లిపోయారు. నైట్ వాచ్ ఉమెన్ ఉన్నప్పటికీ రాత్రివేళలో ఒంటరిగా విధులు నిర్వర్తించలేక ఉదయం సమయంలోనే విధులు నిర్వర్తించి రాత్రి సమయంలో విధుల్లో ఉండడంలేదు. ఇది గమనించిన దుండగులు శనివారం రాత్రి పాఠశాల తాళం పగులకొట్టి సీసీ కెమెరా హార్డ్డిస్క్, డిజిటల్ తరగతులు బోధించే 100 అంగుళాల ఎల్ఈడీ మానిటర్ ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం యథావిధిగా సిబ్బంది విధులకు రాగా పాఠశాల తాళం పగులగొట్టి ఉండడంతో విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ మేరకు చోరీ విషయమై స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఓ తెలిపారు. -
రోడ్డుపైనే సిట్టింగ్
● సోమేశ్వర ఆలయ పరిసరాల్లో మందుబాబుల ఓపెన్ సిట్టింగ్ ● పట్టించుకోని పోలీసులు పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలో మందుబాబు లు బహిరంగంగానే మద్యం తాగుతున్నారు. సోమేశ్వర ఆలయం, గిరిప్రదక్షిణ రోడ్డు, పంచగుళ్లు, ఆలయం ఘాట్రోడ్డు, పాల్కురికి సోమనాథుడి స్మృతివనం తదితర ప్రాంతాలు సాయంత్రం అయి తే చాలు మందుబాబులతో హడావుడిగా మారిపోతున్నాయి. ఆలయానికి వచ్చే భక్తులు, వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటిబాట పట్టిన మహిళలు రోడ్డుపై మందుబాబులు సిట్టింగ్తో ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తీసుకుంటామని వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ ఆదేశాలు జారీ చేసిన స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై న స్థానిక పోలీసులు మందుబాబులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, భక్తులు, మహిళలు కోరుతున్నారు. -
తగిన గుణపాఠం చెప్పాలి
యుద్ధ విరమణను ఉల్లంఘించిన పాకిస్తాన్పై జిల్లా పౌరుల స్పందన ● పహల్గాం దాడికి రెట్టింపు చర్య జరగాల్సిందే! జనగామ: ప్రజాసమస్యలను పక్కన బెట్టి.. దేశసంపదతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ.. భారత్తో గిచ్చి కయ్యం పెట్టుకుంటున్న దాయాది దేశం పాకిస్తాన్పై జిల్లా ప్రజలు భగ్గున మండిపడుతున్నారు. అమెరికా మధ్య వర్తిత్వంతో కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించిన మూడు గంటల వ్యవధిలో పాకిస్తాన్ భారత్పై క్షిపణి దాడులు చేయడంపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ కుయక్తులను తిప్పకొట్టిన భారత ఆర్మీకి జేజేలు పలుకుతూ... పహల్గాం దాడికి రెట్టింపు ట్రీట్మెంట్ ఉండాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. కాల్పుల విరమణ.. పాకిస్తాన్ కవ్వింపు.. భారత్ ఎదురుదాడికి సంబంధించి ఆయా వర్గాల అభిప్రాయాలతో ప్రత్యేక కథనం.జవాన్లకు అండగా ఉంటాం.. ఉగ్రవాదం పేరుతో అమాయకులను పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్కు ఆపరేషన్ సిందూర్తో గుణపాఠం చెప్పాలి. ప్రతిసారి పాకిస్తాన్ ఉగ్రవాదులతో కలిసి దేశంపై దాడి చేస్తూ అమాయక ప్రజలను చంపుతున్నారు. ఇందుకు పహల్గాం ఘటనే నిదర్శనం. దేశ సరిహద్దులో పాకిస్తాన్తో పోరాడుతున్న వీర జవాన్లకు మేమంతా అండగా ఉంటాం. – తోట రమేష్, రైతు, జఫర్గఢ్ శివారు వడ్డెగూడెందీటైన సమాధానం చెప్పిన ఆర్మీ.. ఉగ్రమూకలను పెంచి పోషిస్తూ, ప్రశాంతంగా ఉన్న భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడిన పాకిస్తాన్పై ఆర్మీ యుద్ధభేరి సరైన నిర్ణయం. యుద్ధంతోనే పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చి తోక ముడిచింది. యుద్ధం అనేది లేకుండా శాంతి నెలకొనాలి. కానీ రెచ్చిపోతే తగిన గుణపాఠం చెప్పక తప్పదు. – గజ్జెల దామోదర్, మండలం కిరాణ వర్తక సంఘం అధ్యక్షుడు, చిల్పూరుతీవ్రవాదం లేకుండా నిర్మూలించాలి ఇండియా పాకిస్తాన్ కాల్పుల విరమణ అనేది మన ప్రభుత్వం ఒక వ్యూహాత్మకంగానే వ్యవహరించినట్లు అనిపిస్తుంది. మనకు ఆర్థికంగా, జననష్టం కాకుండా, పాకిస్తాన్ను ప్రపంచంలో ఒక దోషిగా, తీవ్రవాద దేశంగా అందరికీ తెలిసేటట్లు భారత ప్రభుత్వం చేసింది. కానీ అమెరికా జోక్యం చేసుకోకుంటే పీఓకేను ఆక్రమించి పాకిస్తాన్కు బుద్ధి చెప్తే బాగుండేది. – పోతుగంటి నరసయ్య, ఎంఈఓ, పాలకుర్తిశాంతిని కోరుకోవడం శుభ పరిణామం యుద్ధం నుంచి శాంతిని కోరుకోవడం శుభ పరిణామం. ఇరు దేశాలతో చర్చలు జరిపి కృషి చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు అభినందనలు. మొదటగా పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలు మానుకోవాలి. ఉగ్ర సంస్థలను నిర్మూలన చేసి, అభివృద్ధి కోసం భారత్తో స్నేహసంబంధమైన వాతావరణం నెలకొనేలా చేసుకోవాలి. – డాక్టర్ సుగుణాకర్రాజు, దళిత రత్న, జనగామకవ్వింపు చర్యలు సహించరానివి అమెరికా అధ్యక్షుడి మధ్యవర్తిత్వంతో భారత దేశం, పాకిస్తాన్ సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికీ ఇంకా సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటం సహించరానిది. ఒప్పందం ప్రకారం యుద్ధ విరమణ, సీజ్ ఫైర్ను అమలు చేయాల్సిందే. –మంగు జయప్రకాశ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, స్టేషన్ఘన్పూర్ -
కళల విశిష్టతను నలువైపులా చాటాలి
● అన్నమాచార్య అకాడమీ వ్యవస్థాపకులు సూత్రపు అభిషేక్ హన్మకొండ కల్చరల్: ఓరుగల్లు ఖ్యాతిని, కళల విశిష్టతను నలువైపులా చాటాలనే సంకల్పంతో ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అన్నమాచార్య అకాడమీ వ్యవస్థాపకులు సూత్రపు అభిషేక్ అన్నారు. అన్నమయ్య సాహితీ కళా వికాస పరిషత్ సౌజన్యంతో తెలుగు వాగ్గేయకారులు, పదకవితా పితామహులు తాళ్లపాక అన్నమాచార్యుల 617వ జయంత్యుత్సవం, అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ వా ర్షికోత్సవం ఘనంగా నిర్వహించా రు. ఆదివారం ఉదయం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో సూత్రపు అభిషేక్ అధ్యక్షతన జరి గిన కార్యక్రమాల్లో నగరానికి చెందిన కళాకారులతో పాటు వివిధ జిల్లాలకు చెందిన వందకుపైగా కళాకారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు ప్రదర్శించిన సంగీ త, నృత్యాలు అలరించాయి.