Jangaon
-
కలెక్టర్ వైఖరితో జీవనోపాధిపై ప్రభావితం
జనగామ: కలెక్టర్ వైఖరి ప్రజల జీవనోపాధిఽపై ప్రభావితం చూపిస్తోందని అఖిలపక్ష నాయకులు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహారశైలిపై ఆందోళన వ్యక్తం చేస్తూ మంగళవారం స్థానిక విజయ ఫంక్షన్ హాల్లో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి బొట్ల శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, కౌన్సిలర్లు, కార్మిక, కర్షక సంఘాలు పాల్గొన్నాయి. దళిత మహిళ మంజుల మాట్లాడుతూ.. గత కలెక్టర్ మంజూరు చేసిన తన టీస్టాల్ను ప్రస్తుత కలెక్టర్ ఎటువంటి కనికరంలేకుండా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. సాదిక్ ఫౌండేషన్ చైర్మన్, న్యాయవాది సాదిక్ అలీ మాట్లాడుతూ.. కలెక్టర్ వైఖరి ఆందోళన కలిగిస్తోందని, కాంగ్రెస్ నాయకులు దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రజల్లో నమ్మకం కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 3వ వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి మాట్లాడుతూ.. మహిళా ప్రజాప్రతినిధిగా తాను కలెక్టరేట్కు వెళ్తే సమయం కూడా ఇవ్వలేదన్నారు. సీపీఎం, టీఆర్పీ, జేఎంఐ, టీఆర్ఎస్ (కవిత) వర్గాల నాయకులు మాట్లాడుతూ.. కలెక్టర్ తన వైఖరిని 20 రోజుల లోపు మార్చుకోకపోతే అన్ని పార్టీలు కలిసి ఉద్యమాలు చేపడతామని, రాజకీయాలకు అతీతంగా ఈ తీర్మానాన్ని అమలు చేస్తారని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్ కత్తుల రాజిరెడ్డి, సుంచు విజేందర్, సింగారపు రమేశ్, మల్లిగారి రాజు, ఎండీ దస్తగిరి, న్యాయవాది రాగల్ల శ్రీహరి, ట్రాక్టర్ యజమానుల సంఘం నాయకుడు ఆకుల లక్ష్మయ్య, అజహర్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. అఖిలపక్ష సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం -
ముగిసిన చెస్ శిక్షణ శిబిరం
జనగామ: గుడాల ఫ్యామిలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చెస్ శిక్షణ క్యాంపు మంగళవారంతో విజయవంతంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ సత్యనారాయణరెడ్డి, బీజేపీ స్పోక్స్ పర్సన్ ఆరుట్ల దశమంతరెడ్డి, డాక్టర్ ప్రీతి దయాల్, కాసాల సంతోష్ కుమార్, గుడాల ఫ్యామిలీ ఫౌండే షన్ డైరెక్టర్ రాము, చెస్కోచ్లు పాల్గొన్నారు. 10 రోజుల పాటు నిర్వహించిన చెస్ క్యాంపులో 120 మంది విద్యార్థులు పాల్గొని చెస్కు సంబంధించిన మౌలిక నైపుణ్యాలు, వ్యూహాలు నేర్చుకున్నారు. కార్యక్రమం చివరి రోజు పది మందికి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్ను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. అలాగే క్యాంపులో పాల్గొన్న ప్రతీ విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గుడాల ఫ్యామిలీ ఫౌండేషన్ చైర్మన్ గుడాల శ్రీనివాస్, కో–చైర్మన్లు గుడాల వేణు, గుడాల శ్రీధర్కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
అజ్ఞాతం వీడిన పసునూరి
సాక్షి ప్రతినిధి, వరంగల్: సీపీఐ (మావోయిస్ట్) పార్టీ అగ్రనేత పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్ అలియాస్ సంతోశ్ ఎట్టకేలకు ఉద్యమ బాట వదిలారు. పార్టీ సాధారణ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ నాయకుడి వరకు ఎదిగిన ఆయన జనజీవన స్రవంతిలో కలిశారు. 1982లో అజ్ఞాతంలోకి వెళ్లారు. సుమారు మూడు దశాబ్దాల పాటు మావోయిస్ట్ పార్టీ ఉద్యమంలో కొనసాగిన ఆయన మంగళవారం అడవిబాటను వదిలి పోలీసుల సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. సోమిడి నుంచి జార్ఖండ్ వరకు.. పసునూరి నరహరి స్వస్థలం హనుమకొండ జిల్లాలోని కాజీపేట మండలం సోమిడి గ్రామం. 1980 నుంచి పీపుల్స్వార్కు అనుబంధంగా ఉన్న రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యూత్ లీగ్లలో ఆయన చురుకై న పాత్ర పోషించారు. పులి అంజయ్య, క్రాంతి రణదేవ్, గోపగాని అయిలన్న అలియాస్ మహేశ్తో కలిసి వరంగల్ నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహించిన నరహరి.. అనతికాలంలోనే పోలీసులకు వాంటెడ్గా మారారు. నిర్బంధం తీవ్రం కావడంతో 1982లో పూర్తికాలపు కార్యకర్తగా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి.. ఉత్తర తెలంగాణ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పని చేసిన ఆయన ఆంధ్రా ఒడిశా సరిహద్దుకు బదిలీపై వెళ్లారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఉద్యమ సహచరిని పెళ్లి చేసుకున్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఏఓబీ, ఝార్ఖంఢ్లో మావోయిస్ట్ ఉద్యమ విస్తరణకు కీలకంగా పని చేశారు. నరహరి పలు ఆపరేషన్స్లో కీలక పాత్ర పోషించినట్లుగా పోలీసు రికార్డులు చెబుతున్నాయి. నాలుగున్నర దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉంటూ క్రమంగా మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. ఉమ్మడి వరంగల్ నుంచి చివరి లొంగుబాటు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్లో భాగంగా పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. దళాలకు దళాలే మృత్యువాత పడగా.. మరికొందరు అగ్రనేతలు, మావోయిస్టుల ఆయుధాలతో సహా లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 31 టార్గెట్గా చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ పూర్తయిన సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్ట్ అగ్రనేతలు ముప్పాల లక్ష్మణ్రావు అలియాస్ గణపతి, పొలిట్బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రాతో పాటు పసునూరి నరహరి అలియాస్ సంతోశ్ పేరును కూడా కేంద్రం ప్రకటించింది. ఇటీవల కాలంలో పోలీస్ కూంబింగ్లు మరింత ఉధృతంగా సాగుతున్న తరుణంలో కేంద్ర కమిటీ సభ్యుడు, జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగం ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, అలియాస్ సంతోశ్ మంగళవారం భార్యతో కలిసి తెలంగాణ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. కాగా, ఉమ్మడి వరంగల్ నుంచి ఇంకా ఐదారుగురు మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నట్లు ప్రచారం ఉన్నా.. పోలీసు రికార్డుల్లో మాత్రం లేరు. దీంతో ఉమ్మడి వరంగల్ నుంచి పోలీసు రికార్డుల్లో కీలక నేతగా ఉన్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, సంతోశ్ లొంగుబాటు చివరిదిగా చెబుతున్నారు. అజ్ఞాత మావోయిస్టుల జాబితాలో ఉన్న నరహరి జనజీవన స్రవంతిలో కలవడంతో నక్సల్స్ రహిత జిల్లాగా మారిందంటున్నారు. జనజీవన స్రవంతిలోకి మావోయిస్ట్ అగ్రనేత నరహరి అలియాస్ విశ్వనాథ్ పార్టీ మెంబర్ నుంచి కేంద్ర కమిటీ సభ్యుడి వరకు.. నాలుగున్నర దశాబ్దాలపాటు ఉద్యమంలో పనిచేసిన అనుభవం జార్ఖండ్ ఇన్చార్జ్గా పనిచేసి లొంగిపోయిన నేత -
భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి
జనగామ: జిల్లావ్యాప్తంగా మంగళవారం హనుమాన్ జయంతి భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా జరిగాయి. భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు చేరుకోగా, అర్చకులు చందన సమర్పణ, 108 తమలపాకులు, వడలతో స్వామి అలంకరణ, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీ మూలభావి శ్రీ హనుమత్ రామనాథ సహిత శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు మోహన్ కృష్ణ భార్గవ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. శ్రీ సంతోషిమాత గణేష్ స్ట్రీట్, గుండ్లగడ్డ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, గీతాశ్రమం, కురుమవాడ, గిర్నిగడ్డ, అంబేద్కర్ నగర్, బాణాపురం సహా పలు ప్రాంతాల ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ, గంగు సాంబమూర్తి శర్మ నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల దీక్ష, అరమండల దీక్షలో భాగంగా నియమ నిష్ఠలతో మాల ధరించిన స్వాములు మాలవిరమణ చేశారు. -
విద్యాభివృద్ధిపై నేడు సదస్సులు
జనగామ: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లాలోని మూడు నియోజకవర్గ కేంద్రాల్లో నేడు(బుధవారం) సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఒక్కరోజు అవగాహన సదస్సులను నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థుల నమోదు పెంపు, డ్రాపవుట్ తగ్గింపు, బడిబాటలో ప్రజాప్రతినిధుల పాత్ర వంటి ప్రధాన అంశాలపై ఈ సదస్సుల్లో మార్గదర్శకత్వం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓలు, ఉపాధ్యాయులు గ్రామాల వారీగా మంగళవారం సర్పంచ్లు, కౌన్సిలర్లకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. నియోజకవర్గాల వారీగా.. జనగామ నియోజకవర్గానికి సంబంధించిన సదస్సు జిల్లా కేంద్రం సిద్దిపేట రోడ్డులోని శామీర్పేట శివారు రమాదేవి ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొనాలి. స్టేషన్న్ఘన్పూర్ నియోజకవర్గ సదస్సు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. స్టేషన్ ఘన్పూర్, చిల్పూరు, జఫర్గఢ్, రఘునాథపల్లి, లింగాలఘణపురం మండలాల సర్పంచ్లు, కౌన్సిలర్లు హాజరవ్వాలి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య పాల్గొననున్నారు. పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని సదస్సు దర్థెపల్లి రోడ్డులోని విన్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్నారు. పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల సర్పంచ్లు ఈ అవగా హన సమావేశానికి హాజరు కానున్నారు. విద్యారంగం పురోగతి, బడిబాట పటిష్టం, విద్యార్థుల సంఖ్య పెంపు దిశగా ఈ సదస్సులు కీలకంగా ఉపయోగపడతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. నియోజకవర్గస్థాయిలో సర్పంచ్, కౌన్సిలర్లకు అవగాహన విద్యాప్రగతిలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ‘స్టేషన్’ సదస్సుకు హాజరుకానున్న ఎమ్మెల్యే కడియం, ఎంపీ కావ్య -
పాలిసెట్కు సర్వం సిద్ధం
జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నిర్వహించనున్న పాలిసెట్–2026 ప్రవేశ పరీక్షకు జిల్లాలో సర్వం సిద్ధం చేశారు. ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం ప్రతీ సంవత్సరం నిర్వహించే ఈ పరీక్షకు భారీ సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేయడంతో జిల్లాలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో పర్యవేక్షణ బృందాలు, అవసరమైన సిబ్బందిని నియమించారు. జిల్లాలో ఈ సంవత్సరం 1,615 మంది విద్యార్థులు పాలిసెట్కు హాజరుకానున్నారు. వీరి కోసం అధికారులు ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు సెంటర్లు(ఏ,బీ) ఏర్పాటు చేయగా, ఇక్కడ ఒక్కో కేంద్రంలో 300 మంది చొప్పున మొత్తం 600 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జనగామ మండలంలోని యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో సైతం మరో రెండు సెంటర్లు (ఏ,బీ) ఏర్పాటు చేశారు. సెంటర్– ఏలో 288 మంది, సెంటర్– బీలో 260 మంది విద్యార్థులను కేటాయించారు. స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ సెంటర్లో 300 మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లో 167 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాబోతున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో తాగునీరు, టెంట్లు, వైద్య సదుపాయం, భద్రతా ఏర్పాట్లు కల్పించడంతో పాటు సీసీ కెమెరాలతో పోలీసులు పకడ్బందీ పర్యవేక్షణ చేయనున్నారు. పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.30 గంటలకు ముగుస్తుంది. విద్యార్థులు ఉదయం 10 గంటల కల్లా గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 11 గంటల తర్వాత గేట్లు క్లోజ్ చేసి నిమిషం ఆలస్యమైనా ఎవరినీ లోపలికి అనుమతించరు. పరీక్షకు సంబంధించి విద్యార్థులు హాల్టికెట్తో పాటు హెచ్బీ బ్లాక్ పెన్సిల్, బ్లూ లేదా బ్లాక్ బాల్పెన్ తప్పనిసరిగా తీసుకురావాలి. మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు, స్మార్ట్ డివైస్లు పూర్తిగా నిషేధమని అధికారులు వెల్లడించారు. జిల్లా విద్యాశాఖ, పోలీసు శాఖ కలిసి ప్రత్యేక బృందాలను మోహరించనున్నారు. ట్రాఫిక్ నియంత్రణ నుంచి పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల వరకు అన్ని చర్యలు చేపట్టనున్నారు. విద్యార్థుల కోసం హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేసి సందేహాలు నివృత్తి చేయనున్నారు. పాలిసెట్–2026 ఎంట్రెన్స్ను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. హాల్ టికెట్పై విద్యార్థి ఫొటో ముద్రణ జరగకుండా వచ్చినట్లైతే పాస్ఫొటోతో పాటు గుర్తింపుగా ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచనలు చేశారు. జిల్లాలో సెంటర్ల వారీగా వివరాలు: 6 సెంటర్లు..హాజరుకానున్న 1,615 మంది విద్యార్థులు ఉదయం 11 గంటలకు గేట్లు మూసివేత నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్దిపేట రోడ్డు: (సెంటర్– ఏ): 300మంది ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్దిపేట రోడ్డు: (సెంటర్– బీ): 300మంది క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాల(సీజేఐటీ), యశ్వంతాపూర్(సెంటర్– ఏ): 288మంది క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాల(సీజేఐటీ), యశ్వంతాపూర్ (సెంటర్– బీ): 260మంది ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, స్టేషన్ ఘన్పూర్: 300మంది ప్రభుత్వ జూనియర్ కళాశాల, స్టేషన్ ఘన్పూర్: 167మందిపాలిసెట్–2026 కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశాం. 1,615 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్ష 11 గంటలకు ప్రారంభమవుతుంది. విద్యార్థులను ఉదయం 10 గంటల నుంచి లోపలికి అనుమతిస్తాం. సరిగ్గా 11 గంటలకు గేట్లు క్లోజ్ చేసిన తర్వాత, ఎవరినీ కూడా లోనికి అనుమతించం. –శ్రీనివాస్, డిస్ట్రిక్ కో ఆర్డినేటర్, ఏబీవీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ -
కొనుగోళ్లపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
● వీసీలో సీఎం రేవంత్రెడ్డి జనగామ: ధాన్యం, మక్కల కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వీసీ అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు.. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా పాటిస్తూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు రాకుండా, రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రతీ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. టోకెన్ పద్ధతి ప్రకారం తేమ శాతం రాగానే కొనుగోళ్లు చేపట్టి, అదే రోజూ ట్యాగ్ చేసిన మిల్లులకు ధాన్యాన్ని తరలించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఆర్డీఓ రంగారావు, పౌర సరఫరాల సంస్థ డీఎం హతీరాం, సహకార శాఖ అధికారి కోదండరాములు, జిల్లా మార్కెటింగ్ అధికారి రామకృష్ణ, ఇన్చార్జ్ డీసీఎస్ఓ సురేష్ రెడ్డి, ఏపీడీ నూరొద్దీన్, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్గౌడ్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పామాయిల్ తోటలో అగ్నిప్రమాదంరఘునాథపల్లి: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ వెనకాల మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పది ఎకరాల పామాయిల్ తోటలు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో డ్రిప్ పరికరాలు కూడా కాలిపోయాయి. హన్మకొండకు చెందిన అరుకొండ శ్రీధర్ మూడేళ్ల క్రితం ఏడున్నర ఎకరాల్లో పామాయిల్ తోట సాగు చేశారు. తోట కాపునకు వచ్చే తరుణంలో అటు వైపు వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు బీడి తాగి ఆర్పకుండా విసరడంతో తోటలోని గడ్డికి మంటలు అంటుకున్నాయి. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా తోట చుట్టూ పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అదే విధంగా పక్కనే ఉన్న హన్మకొండకు చెందిన వెంకటేశ్వర్లు, ప్రభాకర్కు చెందిన మూడు ఎకరాల పామాయిల్ తోటలకు కూడా మంటలు అంటుకున్నాయి. ముగ్గురికి చెందిన పది ఎకరాల్లో డ్రిప్ పరికరాలు కాలిపోయాయి. మంటలను గుర్తించిన పోలీసులు వెంటనే స్థానికుల సహకారంతో పచ్చని చెట్ల కొమ్మలతో శ్రమించి మంటలను ఆర్పారు. అప్పటికే పామాయిల్ తోటలు దగ్ధమై రైతులకు తీవ్ర నష్టం జరిగినట్లు సమాచారం. ‘బండి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలి’జనగామ రూరల్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని ప్రజాత్రంత మహిళా సంఘం, డీవైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ వద్ద మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి ఇర్రి అహల్య, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడ నరేందర్ మాట్లాడుతూ.. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన బండి భగీరథ్పై పోక్సో కేసు పెట్టి నాలుగు రోజులైనా ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. దీనిపై బీజేపీ మహిళా మోర్చా నాయకురాళ్లు స్పందించాలన్నారు. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ధర్మభిక్షం, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి మోకు భవాని, ఎర్ర అనిత, కొండ వరలక్ష్మి, మమత, కనకచారి, విప్లవ, సాత్విక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నైపుణ్యాలు పెంచుకోవాలికేయూ క్యాంపస్: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలు పెంచుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. మంగళవారం కేయూలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ సెమినార్ హాల్లో ప్లేస్మెంట్ సెల్, మేజిక్ బస్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన జాబ్ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచం మొత్తం భారత్వైపు చూస్తోందన్నారు. కేయూ వీసీ ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ.. సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా విద్యార్థులు ప్రత్యేక నైపుణ్యాలు పెంపొందించుకోవాలన్నారు. కేయూ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ చిర్రరాజు మాట్లాడారు. ఈజాబ్ మేళాలో 12 ప్రముఖ సంస్థలు పాల్గొనగా విద్యార్థులు హాజరయ్యారు. -
ధాన్యం దిగుమతిలో జాప్యం చేయొద్దు
జనగామ: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని దిగుమతి చేసుకునేందుకు రైస్మిల్లర్లు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ధాన్యం సేకరణలో భాగంగా మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అవసరమైతే అదనపు హమాలీలను ఏర్పాటు చేసుకొని, దిగుమతిలో వేగం పెంచాలన్నారు. ధాన్యం బస్తాల రవాణా విషయంలో స్పందించని లారీ డ్రైవర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పౌరసరఫరాల సంస్థ డీఎం హతీరామ్, జిల్లా మార్కెటింగ్ అధికారి రామకృష్ణ, ఇన్చార్జ్ డీసీ ఎస్ఓ సురేష్రెడ్డి, ఏపీడీ నూరొద్దీన్, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్పై దృష్టి సారించాలి ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా తాజా ఓటరు జాబితాను ఎస్ఐఆర్ జాబితాతో మ్యాపింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి ఆర్డీఓ, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియలో జిల్లా రాష్ట్ర స్థాయిలో ముందంజలో ఉందని, ఈ మేరకు వారం రోజుల్లోగా 90 శాతానికి చేరుకోవాలన్నారు. ఆర్డీఓ గోపీరాం, జనగామ, చేర్యాల, ధర్మసాగర్, సిద్దిపేట తహసీల్దార్లు పాల్గొన్నారు. పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి భూ భారతిలో వివిధ మాడ్యూల్స్లోని సక్సెషన్, మ్యుటేషన్, ఖాతా సమీకరణ, డేటా కరెక్షన్, అర్బన్ ల్యాండ్, కోర్టు కేసులు, జీపీపీ, పీపీబీ, నాలా తదితర పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. భూ భారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలి రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టడంతో పాటు భద్రత ప్రమాణాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టరేట్లో డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి కలెక్టర్ రహదారి భద్రత, మత్తు పదార్థాల నియంత్రణపై ఎకై ్సజ్, పోలీసు, వైద్య శాఖ అధికారులతో వేర్వేరుగా ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని రెండు నేషనల్ హైవేలపై అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. ప్రధాన రహదారులపై వీధి వ్యాపారాలు లేకుండా వారి కోసం ప్రత్యేక వెండింగ్ జోన్ను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ ఆర్అండ్బీ ఈఈ సరిత, డీటీఓ శ్రీనివాస్గౌడ్, ఎకై ్సజ్ అధికారి అనిత, డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జునరావు, ఆర్టీఏ మెంబర్ అభిగౌడ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, నేషనల్ హైవేస్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణపై విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రైతులకు ఇబ్బందులు సృష్టిస్తే కఠిన చర్యలు సమీక్షలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
ఆలకించి..ఆదేశించి
జనగామ రూరల్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. ఈసందర్భంగా ప్రజల సమస్యలను విని వారి నుంచి 190 దరఖాస్తులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, జెడ్పీ సీఈఓ రంగారావు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, సీపీఓ చినకోట్యానాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ ప్రజల నుంచి 190 దరఖాస్తుల స్వీకరణ -
ఈ–ఆఫీసులోనే అన్ని రికార్డులు
జనగామ: జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని డీఈఓ కార్యాలయాన్ని కలెక్టర్, విద్యాశాఖ అధికారి సందీప్ కుమార్ ఝా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని సెక్షన్లను కలెక్టర్ పరిశీలించారు. సిబ్బంది పనితీరు, సెక్షన్న్వారీ ఫైళ్ల నిర్వహణ విధానం, రికార్డు క్రమబద్ధీకరణపై ఆరా తీశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇకపై కార్యాలయంలో భౌతిక (ఫిజికల్) ఫైళ్ల నిర్వహణకు పూర్తిగా స్వస్తి పలకాలని స్పష్టం చేశారు. అన్ని ఫైళ్లను ఈ–ఆఫీస్లోనే డిజిటల్ విధానంలో నిర్వహించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్కు నాణ్యమైన విద్యే బాట బచ్చన్నపేట: విద్యార్థుల భవిష్యత్కు నాణ్యమైన విద్యే బాట అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 11 నుంచి 17 వరకు చేపట్టిన విద్యా వారోత్సవాల సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోని కేజీబీవీలో నిర్వహిస్తోన్న వేసవి శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా శిబిరంలో పాల్గొన్న బాలికలతో కలెక్టర్ ఆప్యాయంగా ముచ్చటించారు. కార్యక్రమంలో జీసీడీఓ గౌసియా బేగం, స్పెషలాఫీసర్ నారమల్ల గీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. డీఈఓ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ -
మైనింగ్కు ఊతం!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రభుత్వం మైనర్ ఖనిజ బ్లాకుల వేలం విధానంలో కొత్త మార్గదర్శకాలకు శ్రీకారం చుట్టింది. ఖనిజాల తవ్వకాల్లో పారదర్శకత, ఆదాయం పెంపు లక్ష్యంగా హైబ్రిడ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ద్వారా ఖనిజాల లీజులు కేటాయించనున్నారు. ఈమేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎన్.శ్రీధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనింగ్ రంగానికి ఊతమివ్వనున్నాయి. ముఖ్యంగా గ్రానైట్, స్టోన్ మెటల్, బ్లాక్ గ్రానైట్, రోడ్ మెటల్, మట్టి, ఇసుక వంటి ఖనిజాల తవ్వకాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు.. ఉమ్మడి వరంగల్లో ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు ఉన్నాయి. వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అధికంగా క్వారీలు ఉన్నాయి. మైన్స్ అండ్ జియాలజీ శాఖ అంచనాల ప్రకారం ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల పరిధిలో ప్రస్తుతం చిన్నా, పెద్దవి కలిపి సుమారు 250కు పైగా మైనింగ్, క్వారీ లీజులు అమలులో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో అధిక భాగం స్టోన్ మెటల్, రోడ్ మెటల్ యూనిట్లు, గ్రానైట్ తవ్వకాలు, బ్రిక్ ఎర్త్, మట్టి క్వారీలు, ఇసుక రీచ్లు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు అధికంగా ఉండండంతో గ్రానైట్, స్టోన్ మెటల్ క్వారీల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పట్టాదారులకు తీపి కబురు ఇకపై మైనర్ ఖనిజాల వేలం మొత్తం ఆన్లైన్లోనే జరగనుంది. బిడ్డింగ్ నుంచి లీజు కేటాయింపు వరకు ప్రతీ దశ డిజిటల్ విధానంలో ఉండడంతో అక్రమాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కనీసం ముగ్గురు బిడ్డర్లు తప్పనిసరి చేయడం ద్వారా పోటీ పెరిగి ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, పట్టా భూముల్లో ఖనిజ తవ్వకాలకు అంగీకరించిన భూ యజమానులకు ప్రభుత్వం అదనపు సొమ్ము చెల్లించనుంది. గ్రానైట్, మార్బుల్ మినహా ఇతర ఖనిజాలకు సీనియరేజ్ ఫీజులో 10 శాతం, గ్రానైట్, మార్బుల్కు 5 శాతం పెంచనున్నారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని ప్రైవేట్ భూముల్లో కొత్త క్వారీలకు భూ యజమానులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు. రాయల్టీ పెరిగే అవకాశం.. కొత్త వేలం విధానం అమలైతే ఉమ్మడి వరంగల్లో ఖనిజ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సుమారుగా ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తుండడంతో రోడ్ మెటల్, స్టోన్ మెటల్, గ్రానైట్కు డిమాండ్ పెరుగుతోంది. కొత్త లీజులు మంజూరైతే ప్రభుత్వానికి రూ.25–30 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని మైనింగ్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మైనర్ ఖనిజాల వేలంలో భారీ మార్పులు హైబ్రిడ్ విధానానికి సర్కారు గ్రీన్సిగ్నల్ పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త లీజులు గ్రానైట్, స్టోన్ మెటల్, ఇసుక క్వారీలపై ఫోకస్ 40–60 కొత్త లీజులకు అవకాశం? ఇప్పటి వరకు పర్యావరణ, కాలుష్య నియంత్రణ అనుమతులు లేక వేలం జరగని అనేక ఖనిజ బ్లాకులు కొత్త ‘హైబ్రిడ్ విధానం’ ద్వారా వేలంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్లోనే మరో 40 నుంచి 60 వరకు కొత్త మైనింగ్ లీజులు, క్వారీ బ్లాకులు వేలానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని మైనింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మహబూబాబాద్లో బ్లాక్ గ్రాౖ నెట్, భూపాలపల్లిలో రోడ్ మెటల్, ములుగులో స్టోన్ క్వారీలు, వరంగల్, హనుమకొండ పరిసరాల్లో నిర్మాణ రంగానికి అవసరమైన మెటల్ క్వారీలు అధికం. కాగా, ఆయా జిల్లాల్లో కొత్త విధానంతో వేగంగా అనుమతులు పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
జనగామ రూరల్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాటు పూర్తి చేసినట్లు డీఐఈఓ కె.జి తేందర్ రెడ్డి అన్నారు. సోమవారం డీఐఈఓ ఆధ్వర్యంలో సోమవారం చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ అధికారుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు. జిల్లా కేంద్రంలో 5 సెంటర్లు ఉన్నాయని, నర్మెటలో 1, స్టేషన్ ఘన్పూర్లో 2, జఫర్గఢ్లో 1 కొడకండ్లలో 1, దేవరుప్పులలో 1, పాలకుర్తిలో 1 పరీ క్ష కేంద్రాలు ఉన్నాయన్నారు. జిల్లావ్యాప్తంగా మొదటి సంవత్సరంలో జనరల్ విద్యార్థులు 1,966 మంది, ఒకేషనల్ విద్యార్థులు 372మంది, మొత్తం 2,338 మంది ఉన్నారన్నారు. రెండో సంవత్సరం జనరల్ విద్యార్థులు 957 మంది, ఒకేషనల్ విద్యార్థులు 302మంది మొత్తం 1,259మంది పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. సమావేశంలో డెక్ సభ్యురాలు సునంద, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా చిట్యాల శ్వేతపాలకుర్తి టౌన్: రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలిగా మండల కేంద్రానికి చెందిన తెలంగాణ రైతాంగ సాయుఽఽధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనువరాలు చిట్యాల శ్వేతను నియమిస్తున్న సోమవారం ప్రభుత్వం ఉత్తర్యులు జారీ చేసింది. హైదరాబాద్లోని కోఠిలోని మహిళ విశ్వవిద్యాలయానికి తెలంగాణ సాయుఽధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఐలమ్మ మనవరాలు శ్వేతను మహిళ కమిషన్ సభ్యురాలుగా నియమించడంపై అమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ కళాశాలలో విద్యా వారోత్సవాలుస్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ ప్రభుత్వ జూని యర్ కళాశాలలో సోమవారం విద్యావారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వం, ఇంటర్ విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కళాశాలకు సంబంధించి ఏ సమస్యలున్నా పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ చేశారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ కమలాకర్, అధ్యాపకులు నరేందర్రావు, లావణ్య, శ్వేత, రాంబాబు, రాజీవ్, సహజ, సంతోష, థామస్, రమేశ్, స్రవంతి, ప్రేమ్, సౌందర్య, నరేష్, ప్రదీప్ పాల్గొన్నారు. రేపటి నుంచి కాకతీయ కళల జాతరనయీంనగర్: కాకతీయ కళల జాతర ఈ నెల 13, 15, 17 తేదీల్లో నిర్వహించనున్నట్లు చేతన కళావేదిక వ్యవస్థాపకుడు, పూర్వ ఫిలిం సెన్సార్బోర్డ్ మెంబర్, రచయిత గాయకుడు ఆకుల నాగేశ్వర్ తెలిపారు. హనుమకొండ ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వెయ్యేళ్ల ఘన చరిత్ర కలిగిన కాకతీయ రాజుల పరిపాలన విశిష్టత, గొలుసుకట్టు చెరువుల నిర్మాణం వంటి అంశాలు, భారతదేశంలో అత్యంత ప్రాచీన నగరమైన ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు, పేరిణి, జానపదాలకు నిలయమన్నారు. కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించనున్న మొదటి రోజు కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, శాసనమండలి ఉపసభాపతి బండ ప్రకాశ్ హాజరవుతారన్నారు. అనంతరం కళల జాతర పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో సహ కార్యనిర్వాహకుడు గోకారపు శ్యాంకుమార్, బూరం ప్రశాంత్, నిర్వాహకులు మచ్చ రాజు, గాయకులు శివ, రాజేశ్, సునీల్ రావు, శ్రీనివాస్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు. ఇంటర్ అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదలవిద్యారణ్యపురి: అన్ని యాజమాన్యాల పరిధిలోని జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు సోమవారం ఇంటర్ బోర్డు షెడ్యూల్ను విడుదల చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, వివిధ గురుకులాల్లోనూ ప్రవేశాలు కల్పించనున్నారు. జూన్ 1 నుంచి తరగతులు.. మొదటి దశ ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈనెల 12 నుంచి అడ్మిషన్ల ప్రక్రి య ప్రారంభం కానుంది. జూనియర్ కళాశాలల్లో 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 1 నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియ జూన్ 30 వరకు పూర్తిచేయాల్సి ఉంటుంది. -
మా కష్టానికి విలువేది?
జనగామ: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధి కాటన్ యార్డులో ఏర్పాటు చేసిన ఐకేపీ, మెప్మా ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. వందలాది బస్తాల ధాన్యం తడిసిపోయింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన స్వల్ప వరద ప్రవాహంతో గింజలు కొట్టుకుపోయి నష్టం వాటిల్లింది. ఈ పరిణామాల నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఆర్డీఓ గోపిరాం ఐకేపీ, మెప్మా సెంటర్లను సందర్శించారు. రైతుల వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. నెల రోజుల నుంచి ధాన్యం అమ్ముకోలేక, ఇప్పటికే అమ్మిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆర్డీఓకు ఆవేదన వెళ్లగక్కారు. ఆర్డీఓ వాహనానికి రైతులు అడ్డంగా నిలవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ విఫలమవడంతో పరిశీలన పూర్తిచేసుకుని బయలుదేరే సమయంలో ఆర్డీఓ వాహనాన్ని అడ్డుకున్నారు. సెంటర్ల నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆర్డీఓ బైక్పై వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో తేమశాతం ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని మిల్లుకు తీసుకు వెళ్లాలని ఓ లారీ డ్రైవర్ను కోరగా, అందుకు ఆయన నిరాకరించారు. తడిసిన ధాన్యం తీసుకెళ్తే రోజుల తరబడి దిగుమతి కావడం లేదని, దీంతో ఈఎంఐలు కట్టలేకపోతున్నామని లారీ డ్రైవర్ అబ్దుల్ బషీర్ లారీ పైకి ఎక్కి ఉరి వేసుకొనేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓ హమాలీ కార్మికుడు ధైర్యం చేసి డ్రైవర్ను కాపాడారు. తేమ తగ్గి నష్టం పెరిగింది ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ, సెంటర్లలో పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉందని రైతులు వాపోయారు. 15 నుంచి 30 రోజులుగా కొనుగోలు సెంటర్లలో ధాన్యం పేరుకుపోవడంతో తేమ 8 శాతానికి పడిపోయిందని, తేమ తగ్గుదలతో ఒక్కో రైతుకు భారీ నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే పూర్తిగా దిగుబడి తగ్గిపోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తరచుగా వచ్చే గాలివానలు, అడపాదడపా వర్షాలు ధాన్యాన్ని మరింత నష్టపరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లుల్లో కోతలు.. సెంటర్ల నుంచి రైస్ మిల్లులకు తరలించిన ధాన్యంపై అన్యాయమైన కోతలు వేస్తున్నారని రైతులు ఆరోపించారు. చీటకోడూరు రూట్లోని సోమేశ్వర రైస్ మిల్లుకు 8శాతంతో ఉన్న ధాన్యం తీసుకెళ్తే తాలు పేరుతో 40 కిలోల వరకు కోత విధించారని రైతు గన్నెబోయిన సారయ్య ఆర్డీఓ ఎదుటే గోడును వెల్లబోసుకున్నాడు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన 10 వేల బస్తాలను తరలించాల్సి ఉండగా, మరో 10 వేల బస్తాలు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయని మెప్మా సెంటర్ ఇన్చార్జ్ రేణుక తెలిపారు. కాంటా వేసిన 2,500 బస్తాలను మిల్లులకు తరలించాల్సి ఉండగా, మరో 15 వేల బస్తాలు కళ్లాల్లోనే పేరుకుపోయాయని ఐకేపీ ఇన్చార్జ్ అనిత తెలిపారు. రైతుల కన్నీటి పర్యంతం రోజువారీ పనులు వదిలి నెల రోజులుగా కొనుగోలు సెంటర్ల వద్దే గడుపుతున్నామని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. వర్షం వస్తే బస్తాలను కిందకు, మీదకు మార్చమని చెప్పి తమను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. అమ్ముకున్న సరుకు మిల్లుకు వెళ్లే వరకు తమనే కాపలా పెడుతున్నారని మండిపడ్డారు. తమ కష్టానికి విలువ లేదని, తేమ పెరిగిందంటూ మిల్లర్లు కోతలు వేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటర్లలో సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ రైతులకు హామీ ఇచ్చినప్పటికీ, రైతుల ఆవేదన మాత్రం తీరలేదు. జనగామ యార్డులో కొనుగోళ్లు సజావుగా సాగేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలంటూ వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆర్డీఓ సందర్శన.. వాహనం అడ్డగించిన అన్నదాతలు కళ్లాల్లో పేరుకుపోయిన వేలాది ధాన్యం బస్తాలు మిల్లులకు తరలించడంలో జాప్యంతో ఇక్కట్లు -
బండి సంజయ్ రాజీనామా చేయాల్సిందే
జనగామ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలను బీజేపీ నిర్లక్ష్యంగా తీసుకోవడం ఆందోళనకరమని డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మినారాయణనాయక్ అన్నారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు..బండి సంజయ్కి నీతి, నిజాయితీ, ఉంటే ఎంపీ, మంత్రి పదవులకు రాజీనామా చేసి విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. మైనర్ను ఫాంహౌస్కు రప్పించి, కూల్డ్రింక్స్లో మత్తు పదార్థాలు కలిపి భగీరథ లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు చిన్నవేమీ కావన్నారు. దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు, ప్రజాస్వామ్య వాదులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ బీజేపీ నేతలు నిశ్శబ్దం పాటించడం మహిళల భద్రతపై వారి అసలు వైఖరి బయటపడుతుందని విమర్శించారు. సమావేశంలో మాజీ మున్సిపల్, మార్కెట్ చైర్మన్లు వేమెళ్ల సత్యనా రాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్ తదితరులు ఉన్నారు.డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి -
నేడు హనుమాన్ జయంతి
జనగామ: జిల్లా వ్యాప్తంగా మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలకు ఆలయాలు సిద్ధమయ్యాయి. జిల్లా కేంద్రంలోని మూలబావి శ్రీ ఆంజనేయస్వామి ఆలయంతో పాటు హౌసింగ్ బోర్డు, గణేష్ స్ట్రీట్, గుండ్లగడ్డ, గిర్నిగడ్డ, గీతానగర్, తది తర ఆలయాల్లో ప్రత్యేక పూజల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. బచ్చన్నపేట, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్, రఘునాథపల్లి, లింగాలఘణపురం, దేవరప్పుల, చిల్పూరు, జఫర్గఢ్, నర్మెట, తరిగొప్పుల, కొడకండ్ల మండలాల్లోని దేవస్థానాల్లో హనుమంతుడి జయంతిని ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో పోలీసు, ఆలయ కమిటీలు, స్థానిక వలంటీర్లు కలిసి చర్యలను తీసుకుంటున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జనగామ పట్టణానికి చెందిన కొత్తపల్లి శ్రీలత బియ్యం గింజలపై హనుమాన్ చాలీసా రాసి భక్తిని చాటుకున్నారు. గణేష్ స్ట్రీట్లోని హనుమాన్ ఆలయంబియ్యం గింజలపై హనుమాన్ చాలీసా -
మేడారంలో భక్తుల సందడి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం వేల సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు. జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద షెవర్ కింద స్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం, ఒడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. మొక్కుల అనంతరం మేడారం పరిసరాల్లో చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్లు జగదీశ్వర్, మధు, రామదేవి భక్తులకు సేవలందించారు. రేపటినుంచి కేడీసీలో ఉచిత కోచింగ్ విద్యారణ్యపురి : వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీపీజీఈటీ పరీక్షకు ఉచిత శిక్షణను హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ఈ ఉచిత కోచింగ్ను ఈనెల 12 నుంచి ప్రారంభించినున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏటా కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో 40 రోజుల ఉచిత శిక్షణను నిర్వహిస్తున్నట్లు కెమిస్ట్రీ విభాగం అధిపతి ప్రొఫెసర్ వాసం శ్రీనివాస్ తెలిపారు. ఈ సారి కెమిస్ట్రీ సబ్జెక్టుతోపాటు ఇంగ్లిష్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, బాటనీ, కామర్స్, మైక్రోబయాలజీ సబ్జెక్టులో కూడా పీజీ కోర్సుల్లో ప్రవేశాలకోసం విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ వివరించారు. ఆసక్తి గల విద్యార్థులు కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తమ తమ సబ్జెక్టు విభాగాల అధిపతులను ఇతర వివరాలకు పీజీ కోఆర్డినేటర్ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ శ్రీనివాస్ కోరారు. అంతర్జాతీయ సదస్సుకు అధ్యాపకుడు ఆదిరెడ్డి కేయూ క్యాంపస్ : అమెరికాలోని ఎరోడెక్స్ రీసెర్చ్ యూనివర్సిటీలో ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆర్ట్స్అండ్ సైన్స్కళాశాల అధ్యాపకుడు, జర్నలిజం విభాగాధిపతి రుక్కిరెడ్డి ఆదిరెడ్డి పాల్గొనబోతున్నారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి ఆదివారం తెలిపారు. ఈ సదస్సులో మీడియా అధ్యయనాలు, డిజిటల్ కమ్యూనికేషన్ సమకాలిన జర్నలిజం ధోరణలపై ఆదిరెడ్డి తన పరిశోధన పత్రాన్ని సమర్పించబోతున్నారని ఆమె వెల్లడించారు. ఈమేరకు అంతర్జాతీయ సదస్సుకు రావాలని ఆదిరెడ్డికి ఆహ్వానం అందిందన్నారు. ప్రిన్సిపాల్తోపాటు పలువురు అధ్యాపకులు ఆదిరెడ్డిని అభినందించారు. చైల్డ్లైన్ సంరక్షణలో ఐదేళ్ల బాలుడుకాళోజీ సెంటర్: హనుమకొండ శిశు గృహానికి ఐదేళ్ల బాలుడిని తరలించినట్లు బాలరక్షక్ చైల్డ్ హెల్ప్లైన్ (1098) విభాగం సూపర్ వైజర్ కల్పన తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) నుంచి ఓ మహిళను ఈనెల 9న 108లో ఎంజీఎంకు తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు రిజర్వ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందించారు. అయినా సదరు మహిళ ఆదివారం ఉదయం మృతి చెందింది. మృతురాలి వెంట ఐదు సంవత్సరాల బాలుడు ఉన్నాడు. 1098 ద్వారా చైల్డ్వెల్ఫేర్ అధికారులకు సమాచారం అందించడంతో వారు హనుమకొండలోని శిశు సంరక్షణ కేంద్రంలో అప్పగించారు. హేమాచలక్షేత్రంలో కోలాహలంమంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఈనెల 6వ తేదీతో ముగిసినప్పటికీ భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వయంభు స్వామి వారిని దర్శించుకునేందుకు తరలి వచ్చిన భక్తులతో ఆలయం కోలాహలంగా మారింది. ఆది వారం సెలవు రోజు కావడం, బ్రహ్మోత్సవాల కు రాలేకపోయిన భక్తులతో పాటు ఆలయ ప్రాంగణంలో జరిగిన వివాహాలకు తరలివచ్చిన వారితో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల్లో దీక్ష విరమణకు వెళ్తున్న ఆంజనేయస్వామి మాలధారులు స్వామివారిని భారీ సంఖ్యలో దర్శించుకున్నారు. -
బడిలో పండగ
నేటినుంచి విద్యావారోత్సవాలు ప్రారంభంజనగామ: విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘ఎడ్యుకేషన్ వీక్’ కార్యక్రమాలు నేటి(సోమవారం) నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు, శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఆదర్శ, కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి రోజు (మే11) పాఠశాల భవనాలు, తాగునీటి సదుపాయాలు, లైటింగ్, బయో టాయిలెట్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అదే రోజు నుంచి మే 25 వరకు పీఎంశ్రీ, కేజీబీవీ పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహించనున్నారు. జిల్లాలో ఉన్నత, ప్రాథమిక, ప్రాథమికోన్నత, గురుకుల పాఠశాలలు సు మారు 600 వరకు ఉండగా, 40వేల మంది పిల్లల వరకు ఉంటారు. విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలి సమీక్షలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగబోయే విద్యావారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఈ కార్యక్రమ సన్నాహక ఏర్పాట్లకు సంబంధించి ఆదివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్, విద్యాశాఖాధికారి సందీప్ కుమార్ ఝా ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో విద్యాశాఖ భాగస్వామ్యం కీలకమన్నారు. పీఎం శ్రీ స్కూల్స్లో 15 రోజుల పాటు ఆర్ట్స్, కల్చరల్, డాన్స్ మ్యూజిక్ తదితర రంగాలలో పిల్లలకు సమ్మర్ కోచింగ్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు పెరిగేలా వారి సహకారాన్ని తీసుకోవాలన్నారు. 10వ తరగతిలో ఫెయిల్ అయిన ప్రభుత్వ, ప్రయివేట్ విద్యార్థులకు కోసం జిల్లా కేంద్రంలోని ధర్మకంచ ప్రభు త్వ ఉన్నత పాఠశాల, దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడెంలో ఏ ర్పాటు చేసిన ప్రత్యేక తరగతుల శిబిరంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు అయ్యేంత వరకు సబ్జెక్ట్ల వారీగా సులభమైన పద్ధతుల ద్వారా బోధన చేయాలన్నారు. జున్ 2వ తేదీన జరిగే బడిబాట కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో సర్పంచ్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి విద్యార్థుల నమోదు గణనీయంగా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా వారోత్సవాల ముగింపు సమావేశంలో 10వ తరగతి, ఇంటర్ ఫలితాల్లో టాప్ 3 సాధించిన విద్యార్థులకు, జిల్లా స్థాయి క్రీడల్లో ప్రతిభ చూపిన ముగ్గురికి రూ.10 వేల నగదు పురస్కరంతో పాటు సన్మానం చేయాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ రెవెన్యూ బెన్ షాలోమ్, స్టేషన్ఘన్పూర్ ఏసీపీ భీంశర్మ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, డీఐఈఓ జితేంద్ర కుమార్, విద్యాశాఖ కార్యాలయ ఏడీ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియా బేగం ఉన్నారు. రోజు వారీ కార్యక్రమాలు11వ తేదీ: తొలి రోజు ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ భవనాలు, తాగునీటి సదుపాయాలు, లైటింగ్, బయోటాయిలెట్ల పరిశుభ్రతపై అధికారులు సమీక్ష నిర్వ హిస్తారు. పీఎంశ్రీ, కేజీబీవీల్లో మే 25 వరకు సమ్మర్ క్యాంపులు నిర్వహించాలి. ఈ శిబిరాల్లో విద్యార్థులకు డ్రాయింగ్, యోగా, క్రీడలు, కళలు, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. 12వ తేదీ: జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థుల కోసం రిమీడియల్ క్యాంపులు నిర్వహించాలి. పరీక్షల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణతో పాటు పిల్లల సందేహాలకు నివృత్తి చేయాలి. విద్యార్థులకు సబ్జెక్ట్ వారీగా ప్రత్యేక సూచనలు ఇస్తారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 13వ తేదీ: మూడో రోజు సర్పంచులు, ప్రజాప్రతినిధులతో విద్యాభివృద్ధిపై ప్రత్యేక వర్క్షాప్లు నిర్వహిస్తారు. పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థుల నమోదు పెంపు, డ్రాపవుట్ తగ్గింపు వంటి అంశాలపై చర్చించాలి. 14వ తేదీ: బడిబాట కార్యక్రమంతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు (పీటీఎం) నిర్వహించనున్నారు. విద్యార్థుల హాజరు, చదువులో పురోగతి, పాఠశాల అవసరాలపై తల్లిదండ్రులతో చర్చించనున్నారు. కొత్త అడ్మిషన్ల కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలను పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 15వ తేదీ: లైబ్రరీ–ది హార్ట్ ఆఫ్ నాలెడ్జ్ పేరుతో పాఠశాలల్లో పుస్తక ప్రదర్శనలు, బుక్టాక్స్, డిజిటల్ క్లాస్రూమ్ ప్రదర్శనలు నిర్వహిస్తారు. విద్యార్థుల్లో పఠనాభిరుచి పెంపొందించేందుకు పుస్తకాల ప్రాధాన్యంపై అవగాహన కల్పించనున్నారు. 16వ తేదీ: విద్యార్థుల ప్రతిభాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ క్రీడాభిరుచి డే నిర్వహించనున్నారు. కళలు, క్రీడలు, యోగా, కరాటే, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొననున్నారు. 17వ తేదీ: వారం రోజుల పాటు సాగిన ‘ఎడ్యుకేషన్ వీక్’ కార్యక్రమాలు విద్యా విజయోత్సవంతో ముగుస్తాయి. 10వ తరగతి, ఇంటర్, స్కిల్ డెవలప్మెంట్ రంగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించనున్నారు. సర్వం సిద్ధం చేసిన విద్యాశాఖ బడిబాటతో అడ్మిషన్ల పెంపునకు ఊతం విద్యా ప్రమాణాలకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు వేడుకలపై కలెక్టర్ ప్రత్యేక ఫోకస్ -
అకాల వర్షంతో ఆగమాగం
జనగామ: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం రైతులకు తీవ్ర నిరాశ మిగి ల్చింది. ప్రభుత్వ ధాన్యం సెంటర్లలో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వందలాది బస్తాల ధాన్యం నీటిలో తడిసి రైతులు నష్టాన్ని చవిచూశారు. జనగామ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని కాటన్ యార్డుల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ, మెప్మా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేలాది బస్తాల ధాన్యం గింజలు రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు నిలిచిపోయాయి. కొనుగోళ్లలో ఆలస్యం కావడంతో రైతులు తమ బస్తాలను కంటికి రెప్పలా కాపాడేందుకు సెంటర్ల వద్ద రాత్రింబవళ్లు ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆకస్మికంగా కురిసిన ఆకాల వర్షం రైతుల కష్టాలను రెట్టింపు చేసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన స్వల్ప వరదతో గింజలు కొట్టుకుపోయి నేలపాలయ్యాయి. వరదలో చిక్కుకున్న ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. అయితే ముందస్తు జాగ్రత్తగా కొంతమంది రైతులు టార్పాలిన్ కవర్లు కప్పుకోవటంతో నష్టం తప్పింది. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, తక్షణమే షిఫ్ట్ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు. పలు గ్రామాల్లో.. జనగామ రూరల్: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో స్వల్పంగా ధాన్యం తడిసింది. రోజలు తరబడి కోనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలుఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాటన్ యార్డు సెంటర్లలో తడిసిన ధాన్యం నీటిలో మునిగిన ధాన్యం.. కొట్టుకుపోయిన గింజలు కొనుగోళ్లలో వేగం పెంచాలని రైతుల వేడుకోలు -
ప్రపంచ యవనికపై వరంగల్ ‘5ఎఫ్’
సాక్షి, వరంగల్/గీసుకొండ: కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా 5ఎఫ్ (ఫామ్ టు ఫైబర్.. టు ఫ్యాక్టరీ.. టు ఫ్యాషన్...టు ఫారిన్) దృక్కోణంతో ఓరుగల్లు ఖ్యాతి ప్రపంచానికి తెలిసేలా మరో అడుగు ముందుకు పడింది. పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ ఎగుమతుల దాకా ఒకే వేదికపై పూర్తి విలువ వ్యవస్థను కల్పించేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పీఎం మిత్ర (ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్కు) పథకం కింద 2023లో ఎంపిక చేశారు. ఈ మేరకు రూ.200 కోట్లతో కూడిన అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వేదికగా ఆదివారం వర్చువల్గా ప్రారంభించారు. ఇప్పటికే విడుదల చేసిన రూ.30 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టగా, మరో రూ.170 కోట్ల దఫాల వారీగా కేంద్రం రాష్ట్రానికి అందివ్వనుంది. దీంతో పాటు ‘కాంపిటిటివ్ ఇన్సెంటివ్ సపోర్ట్’ కింద రూ.300 కోట్ల వరకు ప్రోత్సాహక మద్దతు ఇవ్వనుండడంతో దేశ, విదేశీ కంపెనీలు ఇక్కడికి క్యూ కట్టే అవకాశం ఉంది. గీసుకొండ, సంగెం మండలాల్లోని శాయంపేట హవేలీలో మొత్తం 1,327 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ పార్కులో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.1695.54 కోట్ల వ్యయం కాగా, వివిధ మార్గాల ద్వారా రూ.6,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ పార్కు ద్వారా 24,400కు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రారంభోత్సవాన్ని వీక్షించిన కలెక్టర్, అధికారులు పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పీఎం మోదీ హైదరాబాద్లో వర్చ్వల్గా ప్రారంభించగా ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా కలెక్టర్ సత్యశారద, అధికారులు పార్కు వద్ద వీక్షించారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ జోన్ మేనేజర్ స్వామినాయక్ మాట్లాడుతూ కేఎంటీపీ నిర్మాణానికి రూ.1,695 కోట్లను అంచనా వేశారని, వాటిలో సుమారు రూ. 800–900 కోట్ల వరకు పలు అభివృద్ధి పనులు, సదుపాయాల పనులతో పాటు భూ సేకరణ పనులకు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ ఎగుమతులు ఒకే వేదికపై.. కేఎంటీపీకి పీఎం మిత్ర కింద రూ.200 కోట్లు, సీఐఎస్ కింద రూ.300 కోట్లు వర్చువల్గా హైదరాబాద్ నుంచి ప్రారంభించిన పీఎం నరేంద్రమోదీ -
సరస్వతీఘాట్లో భారీ సెట్టింగ్
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది అంత్యపుష్కరాలకు భారీ సెట్టింగులు వేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఘాటుపై సరస్వతీమాత విగ్రహం, ప్లాట్ఫారంపై నాలుగు దిక్కులా తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. మెట్ల కింద నుంచి ఇసుకలో నీటి వరకు వెదురు పందిర్లు సుమారుగా 900 మీటర్ల పొడవునా వేస్తున్నారు. వేసవి దృష్ట్యా అందులో నీటి తుంపర్లు నిత్యం పడేలా చల్లదనంతో కూడా నీడనిచ్చే విధంగా తయారు చేస్తున్నారు. భక్తులు స్నానాలకు వెళ్లి వచ్చే వరకు చల్లదనం అస్వాదించనున్నారు. హారతి వేదిక వద్ద ప్రముఖుల గ్యాలరీ, భక్తులకు గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే 40 టెండ్సిటీ టెండ్లు, మాడ్రన్ లుక్తో వేస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఏర్పాటు చేస్తున్నారు. ఖాదీవస్త్రాలు, చేనేత వస్త్రాలు విక్రయించడానికి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. -
లేబర్ కోడ్ రద్దుకు అసెంబ్లీ తీర్మానం చేయాలి
● సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమన్నజనగామ రూరల్: నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను ఐక్య పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని రాష్ట్రంలో లేబర్ కోడ్ రద్దు కోసం అసెంబ్లీ తీర్మానం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు యటాల సోమన్న డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆదివారం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ రూల్స్ ప్రతులను జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెహ్రూ పార్క్ సెంటర్ వద్ద దహనం చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్, కోశాధికారి అన్నబోయిన రాజు, సహా య కార్యదర్శి బూడిద ప్రశాంత్, బండారు శంకర్ ,కొమురయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు. -
పాత పెన్షన్ అమలు చేయాలి
జనగామ రూరల్: స్పెషల్ లీవ్ పిటిషన్ వెనక్కి తీసుకొని 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం పీఆర్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కొల్ల మైపాల్రెడ్డి అధ్యక్షతన పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణులైన ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ‘ప్రతిభ అవార్డ్స్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. 2004కు ముందుగా నోటిఫికేషన్ విడుదలై అనంతరం నియమితులైన 2003ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మెమో నంబర్ 57/4, 57/5లను జారీ చేసిందని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసిందని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆమరణ దీక్ష చేపడతానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి, రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి, సుంకరి భిక్షంగౌడ్, నూకల ఎల్లారెడ్డి పాల్గొన్నారు. స్పెషల్ లీవ్ పిటిషన్ వెనక్కి తీసుకోవాలి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి -
ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి
జనగామ రూరల్: కొనుగోలు అయిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం జనగామ మండలంలోని వడ్లకొండ రోడ్, నర్మెట మండలంలోని హనుమంతపూర్, అనంతరం తరిగొప్పుల, చిల్పూర్ మండలంలోని శ్రీపతిపల్లి, లింగంపల్లి, వెంకటాద్రిపేట, మల్కాపూర్, చిల్పూర్గుట్టలలో పర్యటించి అక్కడ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని నిర్వహకులకు కలెక్టర్ స్పష్టం చేశారు. మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి జిల్లాలో యాసంగి మార్కెటింగ్ సీజన్ 2025–26లో వరి కొనుగోలు ప్రక్రియ సందర్భంగా రైతులు, రవాణాదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్, మేజిస్ట్రేట్ సందీప్ కుమార్ ఝా సుమోటోగా స్పందించి జిల్లాలోని సీఎంఆర్ కేటాయింపు పొందిన రైస్ మిల్లర్లకు ప్రాథమిక షరతులతో కూడిన ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీ మిత్ర ఆగ్రో ఇండస్ట్రీస్, చిన్నరాంచర్ల, బచ్చన్నపేట మండలం, అలాగే సోమేశ్వర ఇండస్ట్రీస్, చీటకోడూరు, జనగామ మండలం, రెండు మిల్లులపై చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. కొనుగోలు ప్రారంభమై 20 రోజులు గడిచినా, కొన్ని రైస్ మిల్లుల వద్ద వరి అన్లోడింగ్ ప్రక్రియ మందగించడంతో కొనుగోలు కేంద్రాల్లో వరి నిల్వలు పెరిగాయన్నారు. తరలింపును వేగవంతం చేయాలి చిల్పూరు: రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లతో పాటు తరలింపును వేగవంతం చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. మండలంలోని శ్రీపతిపల్లి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏడీఆర్, డీఓ, ఐకేపీ ఏపీఎం పిట్టల నరేందర్, ఎంఏఓ నజీరుద్ధీన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
గూడ్స్ రైలు వ్యాగన్లో పొగలు
స్టేషన్ఘన్పూర్: గూడ్స్ రైలు వ్యాగన్లో పొగలు వ్యాపించడంతో స్టేషన్ఘన్పూర్ రైల్వేస్టేషన్లో శనివారం సాయంత్రం అధికారులు రైలును నిలిపివేశారు. ఘన్పూర్ రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్రైలు సాయంత్రం ఘన్పూర్కు రాగా 14వ వ్యాగన్లో పొగలు వ్యాపించాయి. గమనించిన రైల్వేసిబ్బంది రైలును స్టేషన్ఘన్పూర్లో నిలిపివేశారు. రైల్వే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నీరజ్కుమార్కు సమాచారం అందించగా ఘన్పూర్కు వచ్చారు. రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించి రైల్వే అప్లైన్ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కాగా, సమాచారం అందుకున్న స్టేషన్ఘన్పూర్ ఫైర్స్టేషన్ హెడ్కానిస్టేబుల్ కె.లింగయ్య ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది ఇంద్రసేనారెడ్డి, శ్రీనాఽథ్, తిరుపతి సంఘటనా స్థలానికి చేరుకుని 14వ వ్యాగన్లో ఫైర్ఇంజన్ ద్వారా నీళ్లతో బొగ్గును ఆర్పివేశారు. ఘన్పూర్ అప్లైన్లో గూడ్స్రైలు దాదాపు మూడు గంటలు నిలిచిపోవడంతో సాయంత్రం కాజీపేట నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే పలు రైళ్లను కాజీపేటలో నిలిపినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఎండ తీవ్రతతో బొగ్గు తరలించే గూడ్స్ బోగీల్లో అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని అధికారులు వివరణ ఇచ్చారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఫైర్ ఇంజన్తో ఆర్పివేత -
పంటలకు సాగునీరు అందించడమే లక్ష్యం
జఫర్గఢ్: చెరువులు, కాల్వలను అభివృద్ధి పర్చి పంటలకు సాగునీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు జిల్లా ఇరిగేషన్ శాఖ ఎస్ఈ సీతారాంనాయక్ పేర్కొన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని కూనూరు చెరువులో చేపట్టిన పూడికతీత పనులను జిల్లా ఇరిగేషన్ శాఖ ఎస్ఈ సీతారాంనాయక్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలసి శనివారం పరిశీలించారు. అనంతరం రూ.9 లక్షల నిధులతో కూనూర్ చెరువు మత్తడి పునఃనిర్మాణ పనులను సర్పంచ్ కాటం దేవేంద్ర మల్లారెడ్డి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఈఈ వినయ్ బాబు, డీఈ శేషగిరి, ఏఈలు శరత్, కృష్ణ, జీవన్, ఉప సర్పంచ్ ఇల్లందుల ఐలయ్య, మాజీ ఎంపీటీసీ శిరబోయిన సంధ్యా శ్రీనివాస్, వార్డు సభ్యులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. జిల్లా ఇరిగేషన్ శాఖ ఎస్ఈ సీతారాంనాయక్ -
నేటితో స్వీయగణనకు చివరి రోజు
జనగామ: జనగణన–2027లో భాగంగా ప్రభుత్వం అందించిన స్వీయగణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) అవకాశం నేటి(ఆదివారం)తో ముగియనుండటంతో ప్రతీ కుటుంబం తప్పనిసరిగా నమోదు పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత, కుటుంబ వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుకుంటూ, కేవలం 5 నుంచి 7 నిమిషాల్లోనే స్వయంగా నమోదు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు. ఒక మొబైల్ నంబర్తో ఒక కుటుంబం మాత్రమే నమోదు చేయగలరని, ఓటీపీ ఆధారంగా ధ్రువీకరణ జరుగుతుందని చెప్పారు. జిల్లా, పిన్ కోడ్, గ్రామం, పట్టణ వివరాలు ఇచ్చిన తర్వాత మ్యాప్లో ఇంటి స్థానం సరిగా గుర్తించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఇంటి, కుటుంబ సభ్యుల వివరాలు, సౌకర్యాలు, ఆస్తుల సమాచారం నమో దు చేసిన తర్వాత ప్రివ్యూ చూసి సబిమిట్ చేయాలని సూచించారు. ఒకసారి సమర్పించిన తర్వాత మార్పులు సాధ్యం కాదని స్పష్టం చేశారు. నమోదు పూర్తయ్యాక 11 అంకెల ఎస్ఈ ఐడీ లభిస్తుందని, ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఎస్ఈ ఐడీ నంబర్ చూ పించాల్సి ఉంటుందన్నారు. వివరాలు సరిపో తే నమోదు ఫైనల్ అవుతుందని, లేనిపక్షంలో ఎన్యుమరేటర్ తిరిగి సమాచారం నమోదు చేస్తారన్నారు. నమోదు కోసం se.census .gov.in వెబ్సైట్లో సంప్రదించాలన్నారు. డాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి హన్మకొండ: ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (పల్లె దవాఖానా)లలో పనిచేస్తున్న డాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మహేందర్ రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి.శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిని అసోషియేషన్ ప్రతినిధులు కలిసి సమస్యలు విన్నవించారు. అనంతరం మంత్రిని సన్మానించారు. డాక్టర్లు వెంకటేశ్, శివశంకర్, అనుపచంద్, ఆశాజ్యోతి, స్వప్న, సంగీత, సుష్మ, భార్గవి, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. జూడో శిక్షణ కేంద్రం ప్రారంభం వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం ఆవరణలో ఉన్న మినీ ఇండోర్ స్టేడియంలో శనివారం శాశ్వత జూడో శిక్షణ కేంద్రాన్ని తెలంగాణ జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బైరబోయిన కై లాశ్యాదవ్, డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీవైఎస్ఓ ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. కై లాశ్యాదవ్ మాట్లాడుతూ జూడో శిక్షణ నిరంతరం అందేలా సహకరించిన డీవైఎస్ఓ ప్రశాంత్కు ధన్యవాదాలు తెలిపారు. హ్యాండ్బాల్ కోచ్ బొడ్డు విష్ణువర్ధన్, స్విమ్మింగ్ కోచ్ రాయబారపు నవీన్, బ్యాడ్మింటన్ కోచ్ కూరపాటి రమేశ్, తైక్వాండో కోచ్ వెంకటస్వామి, సీనియర్ జూడో కోచ్లు నాయకపు నాగరాజు, దామెర నక్షత్ర పాల్గొన్నారు. పారా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కమిటీవరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ సుబేదారిలోని ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహంలో తెలంగాణ పారా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కమిటీని ఎన్నుకున్నారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గాడిపెల్లి ప్రశాంత్ అధ్యక్షతన శనివారం జరిగిన దివ్యాంగ క్రీడాకారుల సమావేశంలో కార్యవర్గాన్ని ప్రకటించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ముప్పిడి రాజుకుమార్, సలహాదారుగా సింగారపు బాబు, ప్రెసిడెంట్గా నిషా ఇన్ననీ, నిర్వహణ కార్యదర్శిగా సీవీ జగన్నాథరావు, వైస్ ప్రెసిడెంట్లుగా బొట్ల కార్తీక్, దామెర మనీందర్, కోశాధికారిగా బల్లె రాజు ఎన్నికైనట్లు ప్రశాంత్ తెలిపారు. తమకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, పారా ఒలింపిక్స్ కమిటీ, ఖేలో ఇండియా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
ప్రేమ మూర్తి.. అమ్మ కీర్తి
తాను ఎలా ఉన్నా పిల్లలను ఉన్నతంగా చూడాలనుకుంటుంది. పస్తులుండైనా కన్నవారి కడుపు నింపాలనుకుంటుంది. కష్టాల కడలిని ఎదురీదైనా పిల్లల భవిష్యత్కు బాటలు వేయాలనుకుంటుంది. కుటుంబ పెద్ద మరణించినా అన్నీ తానై నడిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలో అనాథలకు ప్రేమను పంచుతున్న వారు ఒకరైతే.. భర్తలేకపోయినా పెంచి పెద్ద చేసిన వారు మరొకరు. ఇలా ఆదర్శంగా నిలుస్తున్న వారెందరో.. అలాంటి దైవాల ప్రేమకు అక్షర రూపమిస్తూ.. నేడు(ఆదివారం) మాతృ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. జఫర్గఢ్: వందలాది మంది అనాథ పిల్లలతో అమ్మ అని ఆప్యాయంగా పిలుపించుకుంటున్నారు ‘మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె పుష్పరాణి. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీతండా వద్ద గాదె ఇన్నయ్య 20 ఏళ్ల క్రితం ‘మా ఇల్లు’ ప్రజాదరణ అనాథ ఆశ్రమాన్ని స్థాపించారు. 32 మంది పిల్లలతో ప్రారంభించిన ఈ ఆశ్రమంలో ఇప్పటి వరకు వందకు పైగా అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ఆశ్రమంలోని ఆడపిల్లల విషయంలో ఆమె ప్రత్యేక శ్రద్ధవహిస్తూ తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తున్నారు. ఆశ్రమానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలకు సొంత ఖర్చులతో వివాహాలు జరిపించారు. పుష్పరాణి కృషి ఫలితంగా ఆశ్రమానికి చెందిన పిల్లలు లాయర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, నర్సులు, ఉపాధ్యాయులు, కానిస్టేబుల్గా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా గాదె పుష్పరాణి మాట్లాడుతూ.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది అనాథ పిల్లలకు అమ్మలా సేవ చేయడం, వారితో అమ్మ అని పిలిపించుకోవడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. జనగామ: జనగామ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు బి.మాలతి. చిన్నప్పటి నుంచే తన తండ్రి తనను ఉద్యోగస్తురాలిగా చూడాలని కలలు కన్నారు. ఆ ఆశయం నెరవేర్చేందుకు బీటెక్ చదివి కష్టపడి ఉద్యోగం సాధించారు. భర్త వెంకటేష్ సపోర్ట్ చేస్తుండడంతో పెళ్లయిన తర్వాత కూడా ఉద్యోగంలో రాణిస్తున్నానని చెప్పారు. ఇంటికెళ్తే పిల్లలు ‘మమ్మీ’ అంటే తన అలసట తీరిపోతుందంటున్నారు. ఉద్యోగం, కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటున్నానని చెప్పారు. తల్లి సరోజనతో సీఐ శ్రీనివాస్రెడ్డికుటుంబ పెద్ద లేకపోయినా పెంచి పెద్ద చేస్తూ.. ● ఆదర్శంగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లా మాతృమూర్తులు బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన గూడ లావణ్య – కీ.శే. భూపాల్రెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు అపూర్వ, కుమారుడు అశ్విష్రెడ్డి. కూతురు బీటెక్ మూడో సంవత్సరం చదువుతుండగా లావణ్య భర్త భూపాల్రెడ్డి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో మృతి చెందాడు. ఆ కుటుంబం అంతా దుఖసాగరంలో మునిగిపోయింది. అయినప్పటికీ, తల్లి లావణ్య దిగులు పడకుండా తన పిల్లలను చదివించింది. అపూర్వ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ పట్టుదలతో చదివి ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా పని చేస్తున్నారు. కష్టాలు, కన్నీళ్లు ఎన్ని ఎదురైనా మనోధైర్యం, గుండె నిబ్బరం వీడకుండా ముందుకు సాగాలని, తన తల్లే తనకు ఆదర్శమని ఎస్సై అపూర్వరెడ్డి చెబుతున్నారు. జనగామ: జనగామ మున్సిపల్ కార్యాలయంలో 1992 నుంచి పెన్షన్ సెక్షన్ ఆఫీసర్గా పని చేస్తున్నారు పులి విజయలక్ష్మి. తండ్రి వారసత్వంగా వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని దైవ ప్రసాదంలా భావించి 34 ఏళ్లుగా నిబద్ధతతో సేవ చేస్తున్నారు. ఒక పక్క ఉద్యోగం.. మరో పక్క కుటుంబం.. ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లతో పెద్దకుటుంబం నడిపేటప్పుడు ఎన్నో సవాళ్లు ఎదురైనా సమయం, క్రమశిక్షణ పాటించి రెండింటిలోనూ సక్సెస్ సాధించానని చెబుతున్నారు. తన ప్రయాణంలో అండగా నిలిచిన భర్త నర్సింగరావే తన బలమంటున్నారు. రఘునాథపల్లి: మా అమ్మ ఎడవెల్లి సరోజన కష్టాలు బయటపె ట్టకుండా, మా కుటుంబం కోసం నిశ్శబ్ద పోరాటం చేసిన మహానుబావురాలు. చిన్నతనంలో చేయిపట్టి నడిపించింది. ఇప్పటికీ ఆమె ప్రేమే నన్ను ముందుకు నడిపిస్తోంది. నేనీ స్థాయిలో ఉన్నానంటే విలువలు, క్రమశిక్షణతో జీవనం కొనసాగిస్తున్నానంటే అమ్మ మార్గదర్శనంతోనే. నా ప్రతీ అడుగులో అమ్మ ప్రోత్సాహం ఉంది. తల్లులందరికీ శుభాకాంక్షలు. జనగామ: పెళ్లి తర్వాత కూడా తన చదువు, లక్ష్యం ఆగిపోలేదని అంటున్నారు జనగామ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వి.స్వాతి. కుటుంబం ఇచ్చిన నమ్మకం, భర్త శ్రీధర్ (జూనియర్ లెక్చరర్) ఇచ్చిన ప్రోత్సాహంతో పోటీ పరీక్షలకు సిద్ధమై ఉద్యోగం సంపాదించానని చెప్పారు. ఒక కూతురు, బాబు ఉన్నారని, అటు ఉద్యోగం, ఇటు కుటుంబం రెండింటిని సమతుల్యం చేసుకోవడమే తన నిజమైన విజయం అంటున్నారు. -
తాగునీటి సమస్యను పరిష్కరిస్తా
స్టేషన్ ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్యను పరిష్కరించేలా ప్రత్యేక చొరవతో పనిచేస్తానని మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని తాగునీటి సరఫరా సమస్యలపై ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల నుంచి పలువురు నీటి సమస్యపై విన్నవించగా అందుకు మున్సిపల్ చైర్మన్ సానుకూలంగా స్పందించారు. ప్రధానంగా రెండు, మూడు రోజులకు ఒకసారి నీటి సరఫరా చేస్తున్నారని, పలు ఏరియాల్లో కలుషిత, మురుగునీరు వస్తోందని, పైప్లైన్ల లీకేజీలు, గేట్వాల్వ్లు, మిషన్ భగీరథ నల్లాలకు ఆన్ఆఫ్ ఏర్పాటు చేయాలని, బోర్లను మరమ్మతు చేయించాలని, వాటర్ ట్యాంక్లను శుభ్రం చేయించాలని తదితర అంశాలను పలువురు ప్రస్తావించారు. కాగా ప్రధానంగా 17వ వార్డు నుంచి ఎక్కువగా సమస్యలు వెల్లువెత్తాయి. ప్రశ్న: నల్లాలు వదిలిన సమయంలో మొదట 5 నిమిషాలు నల్లాల ద్వారా మురుగునీరు వస్తున్నాయి. పైప్లైన్ల లీకేజీలతో సమస్యగా ఉంది.. – సాంబారి సత్యనారాయణ, 12వ వార్డు మున్సిపల్ చైర్మన్: మున్సిపాలిటీలో పైప్లైన్ల లీకేజీపై ప్రత్యేక దృష్టి సారించాం. వాటర్మెన్లతో మాట్లాడి లీకేజీలపై ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరిస్తాం. ప్రశ్న: సమయపాలన లేకుండా నీటి సరఫరా చేస్తున్నారు. ఇళ్లలో అందరూ పనికి వెళ్లాక మధ్యాహ్నం సమయంలో నీటి సరఫరా చేస్తున్నారు. ఉదయమైనా, సాయంత్రమైనా నిర్ణీత సమయానికి నీటి సరఫరా చేయాలి.. – కుసుమ సాంబశివ, బోడ వేద ప్రకాష్, 15వ వార్డు చైర్మన్: మిషన్ భగీరథ వారు మన వాటర్ ట్యాంకులకు మధ్యాహ్నం వేళల్లో నీటిని అందిస్తున్నారు. అందుకే నీటి సరఫరా సమయంలో సమస్యగా ఉంది. ఈ విషయమై మిషన్ భగీరథ, మున్సిపాలిటీ వారితో చర్చించి సమయం ప్రకారం నీటిని అందించేలా చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: వాటర్ ట్యాంకులను శుభ్రం చేయడం లేదు. పద్మశాలీ కాలనీలో ట్యాంకు పాకురుపట్టి ఉంది. దాంతో నల్లాల ద్వారా కలుషిత నీరు వస్తోంది.. – చిలగాని శ్రీధర్, 2వ వార్డు చైర్మన్: ట్యాంకులన్నింటినీ శుభ్రం చేయించి బ్లీచింగ్ చేయిస్తాం. ప్రశ్న: నీటి సమస్య తీవ్రంగా ఉంది. పైప్లైన్ వేసి గేట్వాల్వ్ ఏర్పాటు చేయలేదు. నాలుగైదు రోజులుకు ఒకసారి నీరు వస్తున్నాయి. వాటర్ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలి. – దాసరి పరశురాములు, ఎల్లావుల ఉపేంద్ర, సీహెచ్.కనకతార 17వ వార్డు, గుర్రం ఫాతికుమార్, 2వ వార్డు, –పెసరు మలేంద్ర, 17వ వార్డు చైర్మన్: 17వ వార్డులో నీటి సరఫరా సమస్య ఉన్నది వాస్తవమే. అభివృద్ధి పనుల్లో భాగంగా పాత ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న వాటర్ట్యాంక్ను తొలగించాం. దాంతో నీటి సమస్య ఉంది. పైప్లైన్లకు అవసరమైన చోట గేట్వాల్వ్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికి వాటర్ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తాం. ప్రశ్న: మిషన్ భగీరథ నల్లాలకు ఆన్ఆఫ్లు లేకపోవడంతో పలుచోట్ల నీరు వృథాగా పోతోంది. నల్లాలకు ఆన్ఆఫ్లు ఏర్పాటు చేస్తే బావుంటుంది.. –బంగ్లా శ్రీను 16వ వార్డు, పోశాల కృష్ణమూర్తి, 2వ వార్డు చైర్మన్: నీటి వృథాను అరికట్టేందుకు తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఈ క్రమంలోనే పైప్లైన్ల లీకేజీల మరమ్మతులు చేయించాం.. ప్రశ్న: వాటర్ ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేస్తే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఽఘన్పూర్లో రిజర్వాయర్ ఉన్నందున ధర్మసాగర్ మాదిరిగా ఇక్కడ వాటర్ ఫిల్టర్బెడ్ ఏర్పాటు చేయించాలి – నీల సోమన్న, 11వ వార్డు చైర్మన్: వాటర్ ఫిల్టర్బెడ్ నిర్మాణ విషయాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్తా. నీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పనిచేస్తా. ప్రశ్న: డ్రైనేజీలలో గేట్వాల్వ్లు ఉండటంతో నల్లాల ద్వారా మురుగునీరు వస్తోంది. సమస్యను పరిష్కరించాలి.. – గుర్రం సురేష్ 3వ వార్డు చైర్మన్: మున్సిపాలిటీ పరిధిలోని డ్రైనేజీల వద్ద ఉన్న గేట్వాల్వ్ల విషయమై మున్సిపాలిటీ నీటిసరఫరా సిబ్బందితో చర్చిస్తా. సమస్యను శాశ్వతంగా పరిష్కరించి పరిశుభ్రమైన నీటిని అందిస్తా. ప్రశ్న: వీవర్స్కాలనీ సమీప న్యూ ముదిరాజ్ కాలనీలో వాటర్ ట్యాంకుకు మిషన్ భగీరథ నీరు రావడం లేదు. పైప్లైన్ వేసి ఒకటే గేట్వాల్వ్ ఏర్పాటు చేయడంతో పాలిటెక్నిక్ కళాశాలకు మొత్తం నీరు వెళ్తున్నాయి. దాంతో కాలనీలో మిషన్ భగీరథ నీరు రావడం లేదు.. – కొండ రవి, 3వ వార్డు చైర్మన్: సమస్యను స్వయంగా పరిశీలించి వాటర్ ట్యాంక్కు మిషన్ భగీరథ నీరు అందించేలా కృషి చేస్తా. అవసరమైన చోట మరో గేట్వాల్వ్ ఏర్పాటు చేసి అటు పాలిటెక్నిక్ కళాశాలకు, ఇటు కాలనీకి నీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: నీటి సమస్య తీవ్రంగా ఉంది. కాలనీలోని బో ర్లు, చేతిపంపులను మరమ్మతు చేయించాలి. కాలనీలో నూతన వాటర్ ట్యాంకు ఏర్పాటు చేయించాలి.. – పండుగ అశోక్, కుంభం నరేష్, పిట్టల మల్లేష్, 17వ వార్డు చైర్మన్: 17వ వార్డులో పైప్లైన్, గేట్వాల్వ్ సమస్యను పరిష్కరిస్తాం. కాలనీలో చెడిపోయిన చేతిపంపులను, బోర్లను త్వరలో మరమ్మతులు చేయించి నీటి సమస్యను పరిష్కరిస్తాం. అవసరమైతే కాలనీకి ప్రత్యేకంగా వాటర్ ట్యాంక్ నిర్మా ణం చేసేలా చర్యలు తీసుకుంటా. మున్సిపాలిటీలో ప్రతీ రోజు నీరందించేందుకు కృషి చేస్తా.. పైప్లైన్ లీకేజీలు, గేట్వాల్వ్ తదితర మరమ్మతు పనులు చేయిస్తా.. స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్ ‘సాక్షి ఫోన్ ఇన్’ కార్యక్రమానికి విశేష స్పందన -
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
జనగామ: ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేప్తోందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే మాట్లాడారు.. నియోజకవర్గంలో ధాన్యం సేకరణ పరిస్థితి రైతులకు తీవ్ర ఆందోళన కలిగించే స్థితిలో ఉందన్నారు. 80 శాతం కోతలు పూర్తయినప్పటికీ ప్రభుత్వం కేవలం 25 శాతం ధాన్యమే కొనుగోలు చేసిందన్నారు. ఇది రైతులను పూర్తిగా మోసం చేసినట్లే అని విమర్శించారు. రెండు రోజుల క్రితం జనగామ మార్కెట్కు సెలవులు ఇవ్వడం, చేర్యాల మార్కెట్లో వారం రోజులుగా ఒక్క కిలో ధాన్యం కొనకపోవడం రైతులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు లేకపోవడం, తూకం కాంటాలు పనిచేయకపోవడం, లారీలు ఎత్తకపోవడం, మిల్లర్లు ధాన్యం దించకపోవడం చివరికి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడం వరకు ప్రతీ దశలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. వెంటనే లారీలు, గన్నీ బ్యాగులు, మిల్లర్లను సమన్వయం చేసేందుకు సీఎం జోక్యం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు తాళ్ల సురేష్రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బాల్దె సిద్దిలింగం, నీల యాదగిరి, ఉల్లెంగుల సందీప్, సలీం తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
బడిబాట పట్టాలి!
జనగామ: జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను గణనీయంగా పెంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. 2026–27 విద్యా సంవత్సరానికి ముందుగానే ప్రవేశాల పెంపుపై సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తూ, ప్రతీ పాఠశాలకు స్పష్టమైన లక్ష్యాలు కేటాయించారు. గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, ఎయిడెడ్ పాఠశాలలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఎంత మంది ప్రవేశం పొందారు? ఈ సంవత్సరం కనీసం ఎంత పెంపు చేయాలి? అనే దానిపై స్కూల్స్, గురుకులాల వారీగా లక్ష్యాలు నిర్ధారించారు. తల్లిదండ్రుల్లో విశ్వాసం పెంపొందించేందుకు విద్యాశాఖతో కలిసి ప్రగతిశీల కార్యక్రమాలు చేపట్టాలని, బోధన నాణ్యత, పాఠశాలల వసతులు, మౌలిక సదుపాయాలు, శుభ్రత, డిజిటల్ క్లాస్ రూంల వినియోగం, విద్యార్థుల హాజరు శాతం పెంపుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. అధికారులు, హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరగడమే కాకుండా విద్యా నాణ్యత కూడా మెరుగవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న విద్యా సౌకర్యాలను సమర్థంగా వివరించి ప్రతీ పాఠశాల నిర్దేశిత లక్ష్యాన్ని తప్పనిసరిగా చేరుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల పెంపు లక్ష్యంగా జిల్లాలోని అన్ని మండల విద్యా అధికారులు (ఎంఈఓలు), హెడ్మాస్టర్లు ప్రవేశాల పెంపు లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని ఆదేశించారు. ప్రత్యేకంగా జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నాణ్యత, భద్రత, మౌలిక సదుపాయాలు, ఇంగ్లిష్ మీడియం వంటి అంశాలు విద్యార్థుల ఆకర్షణకు ప్రధాన బలంగా అవుతున్నాయని సూచనలు చేశారు. ఎంఈఓలకు అప్పగించిన లక్ష్యాలు, పర్యవేక్షణను కచ్చితంగా నిర్వహించాల్సి ఉంటుంది. హెచ్ఎంలు తమ పాఠశాలలకు కేటాయించిన లక్ష్యాలను 100 శాతం చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మౌలిక వసతులు–ప్రభుత్వ పాఠశాలల బలం ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను తల్లిదండ్రులకు వివరించాలని అధికారులు పాఠశాలల యాజమాన్యానికి సూచించారు. మెరుగైన తరగతి గదులు బాలురు, బాలికలకు ప్రత్యేక టాయిలెట్స్, స్వచ్ఛమైన నీరు, విద్యుత్, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, ఈ సదు పాయాలు ప్రభుత్వ పాఠశాలల విశ్వసనీయతను పెంచడంలో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థుల–తల్లిదండ్రుల అవసరాలకు ప్రాధాన్యం తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటూ, వారి నమ్మకాన్ని పెంపొందించడానికి హెచ్ఎంలు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. నాణ్యమైన బోధన, రోజువారీ హాజరు పర్యవేక్షణ, సహ పాఠ్యాతేర కార్యక్రమాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాల అభివృద్ధి, డిజిటల్ లెర్నింగ్ వినియోగం వంటి అంశాలు ప్రవేశాల పెంపునకు దోహదం చేయనున్నాయి. డ్రాపౌట్ల నియంత్రణపై దృష్టి సారించి ఎంఈఓలు ప్రతీ వారం పాఠశాల వారీగా అడ్మిషన్ల పురోగతిని పరిశీలించి జిల్లా విద్యాధికారి కార్యాలయానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. హెడ్మాస్టర్లు రోజువారీ నమోదు వివరాలు నిర్వహించాలి. డ్రాపౌట్లను పూర్తిగా తగ్గించడం, గత విద్యార్థుల తల్లిదండ్రులతో ఫీల్డ్ విజిట్లు చేయడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రతీ పాఠశాలకు లక్ష్యాలు నిర్దేశించి, వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ సూచించడంతో, ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య భారీగా పెరగనున్నట్లు విద్యాశాఖ అంచనా వేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచాలని కలెక్టర్ ఆదేశం 2026–27 విద్యా సంవత్సరానికి 100శాతం చేరికలే లక్ష్యం ఎంఈఓ, హెచ్ఎంలకు ప్రత్యేక బాధ్యతలు డ్రాపౌట్ నివారణపై దృష్టిమండలం సూల్స్ పిల్లల బడిబాట పెరిగితే సంఖ్య టార్గెట్ పిల్లల సంఖ్యబచ్చన్నపేట 41 3,003 1,181 4,184 చిల్పూరు 36 1,992 718 2,710 దేవరుప్పుల 49 2,053 914 2,967 స్టే.ఘన్పూర్ 33 3,006 990 3,996 జనగామ 58 4,651 1,853 6,504 కొడకండ్ల 32 1,822 826 2,648 లింగాల ఘనపురం 32 2,245 890 3,135 నర్మెట 28 1,719 849 2,568 పాలకుర్తి 53 2,533 976 3,509 రఘునాథపల్లి 49 2,883 1,504 4,387 తరిగొప్పుల 22 995 403 1,398 జఫర్గఢ్ 32 2,485 1,018 3,503 మొత్తం 465 29,397 12,097 41,494 -
చెత్తసేకరణ ఆటోలో పిల్లల తరలింపు
జనగామ: అధికారికంగా నిర్వహించిన జనగణన అవగాహన మారథాన్ ర్యాలీకి పిల్లలను చెత్త తరలించే అటోలో తీసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులను ఇటువంటి వాహనంలో తరలించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. మినీ స్టేడియంలో సమ్మర్ క్యాంపులో ఉన్న విద్యార్థులను పీఈటీ అభ్యర్థన మేరకు హరితహారం కోసం ఉపయోగించే ఆటోలో విద్యార్థులను ర్యాలీకి తీసుకు రావడం జరిగిందన్నారు. మంత్రి ఉత్తమ్ను కలిసిన జిల్లా రైస్మిల్లర్స్ జనగామ: జిల్లాలో బియ్యం సేకరణలో నెలకొన్న సమస్యలపై శుక్రవారం హైదరాబాద్లో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, సివిల్ సప్లయీస్ కమిషనర్లకు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి వినతి చేసినట్లు వెంకటనారాయణగౌడ్ తెలిపారు. తమ వినతిపై వారు సానుకూలంగా స్పందించారన్నారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వచ్చే సోమవారం నుంచి ధాన్యం దిగుమతులను నిలిపివేయాలనే నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గాదె శ్రీనివాస్, జొన్నల సోమేశ్వర్, మాశెట్టి అశోక్, మర్యాల లక్ష్మణ్, పెండ్లి దిలీప్రెడ్డి, శివన్న, నర్సయ్య, రమేశ్, కృష్ణమూర్తి, మాధవరెడ్డి, రాజేష్, సంతోష్, రమేశ్, అమీన్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ కళాశాల స్కీంకు దరఖాస్తుల ఆహ్వానం జనగామ రూరల్: 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి కార్పొరేట్ కళాశాల స్కీంలో భాగంగా ప్రైవేట్ జూనియర్ కళాశాలల ఎంపిక కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి విక్రమ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 90శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించి, అందులో కనీసం 50 శాతం మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ర్యాంకులు సాధించిన ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఈ స్కీంలో తమ కళాశాల పేరును నమోదు చేసుకోవచ్చన్నారు. కళాశాలల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ ఈనెల 7నుంచి 11 వరకు ఉంటుందని రిజిస్ట్రేషన్ హార్డ్ కాపీలను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. 14వ తేదీన జిల్లా కమిటీ ద్వారా కళాశాలల తనిఖీ చేస్తారని 18వ తేదీన ఎంపికై న కళాశాలల జాబితాను సీజీజీ ద్వారా ఆన్లైన్లో ప్రకటిస్తారని తెలిపారు. రామప్ప భూముల వేలంలో పెరిగిన ఆదాయం వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయం ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి సంబంధించి దేవస్థానం తరి భూములను రెండు పంటల కౌలు హక్కుల కోసం శుక్రవారం ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్ ఆధ్వర్యంలో బహిరంగ వేలం నిర్వహించారు. -
పశుసంపద గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక
● కలెక్టర్ సందీప్కుమార్ఝా స్టేషన్ఘన్పూర్: పశుసంవర్ధక రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని కొత్తపల్లి గ్రామంలో పశు వైద్య సంతానోత్పత్తి శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ శిబిరాన్ని ప్రారంభించి దూడలకు, గొర్రెలు, మేకలకు నులిపురుగుల నివారణ మందులు వేయించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మురళీధర్రావు, సర్పంచ్ ముక్కెర స్వరూపరవి, ఉపసర్పంచ్ ఇసాక్, జనగామ ఏడీ డాక్టర్ దేవేందర్, స్టేషన్ఘన్పూర్ ఏడీ డాక్టర్ చక్రధర్, తిమ్మంపేట ఏడీ డాక్టర్ సారంగపాణి, గోపాలమిత్ర సూపర్వైజర్ రాజేశ్వర్రావు, గోపాలమిత్రలు పాల్గొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు జనగామ రూరల్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పరీక్షలపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 13 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు, ఏమైనా సందేహాలు ఉంటే టెలీ మానస్ టోల్ ఫ్రీ నంబర్ 14416లో సంప్రదించి సమస్యలను నివృత్తి చేసుకోవాలని కోరారు. సమన్వయ సమావేశంలో డీఐఈఓ జితేందర్ రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఓపీఎంఎస్లో వివరాలను నమోదు చేయాలి రైతులు పండించే ప్రతీ ధాన్యం గింజను సకాలంలో కొనుగోలు చేసి, ట్యాగ్ చేసిన మిల్లులకు ఎలాంటి ఆలస్యం లేకుండా రవాణా చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఐకేపీ, పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు, ఓపీఎంఎస్లో నమోదు, మొదలగు అంశాలపై ఏపీఎం, సీసీలు, కేంద్ర నిర్వాహకులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఆర్డీఓ రంగారావు, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోని, పౌరసరఫరాల డీఎం హతిరామ్, అదనపు డీఆర్డీఓ నూరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
● వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ వరంగల్ల క్రైం: ఉద్యోగంలో స్థాయి పెరిగినా కొద్ది బాధ్యతలు కూడా పెరుగుతాయని, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలందించేలా అధికారులు కృషి చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల ఏఎస్సై స్థాయి నుంచి సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన 25 మంది అధికారులు శుక్రవారం పోలీస్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పదోన్నతి పొందిన ఎస్సై భుజాలపై స్టార్స్ను అలంకరించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పదోన్నతులతో కేవలం హోదా పెరగడమే కాకుండా ప్రజల పట్ల మరింత బాధ్యతతో పనిచేసే అవకాశం లభిస్తుందన్నారు. ప్రజా సమస్యలను సానుభూతితో వినడం, చట్టపరంగా వేగవంతమైన చర్యలు తీసుకోవడం, పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేలా విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు. -
విద్యార్థులకు నైపుణ్యాధారిత శిక్షణ
● కేయూ వీసీ ప్రతాప్రెడ్డి కేయూ క్యాంపస్: విద్యార్థులకు నైపుణ్యాధారిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కేయూ వీసీ ప్రతాప్రెడ్డి అన్నారు. శుక్రవారం వర్సిటీలోని సెనేట్ హాల్లో అధ్యాపకులకు, డీన్లకు, యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాకతీయ యూనివర్సిటీ – స్కిల్ డిజైర్తో అవగాహన ఒప్పందం ద్వారా ఫుల్ స్టాక్ జావా, డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులతో పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించనున్నామన్నారు. స్కిల్ డిజైర్ డైరెక్టర్ ముప్పల శ్రీకాంత్ ఈ కార్యక్రమాలకు సంబంధించి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు అంశాలను వివరించారు. రాబోయే సెమిస్టర్ నుంచి ఈకార్యక్రమాలు అమలు చేయనున్నారు. -
‘మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి’
పాలకుర్తి టౌన్: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ చిక్కుడు రాములు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల, దేవరుప్పుల, పాలకుర్తి మండలాల మత్స్య సొసైటీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్య్స ఉత్పత్తి పెంపు, చెరువుల సమర్థ నిర్వహణ, చేపల వ్యాధుల నివారణ, కలుపు నియంత్రణ చర్యలు, ఆధునిక చేపల పెంపకం, మత్స్యకార సంక్షేమ పథకాలు, చేపపిల్లల వితరణ, నీటి వనరుల సమర్థ వినియోగంపై మత్స్యశాఖ అధికారి జరపుల కిషన్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇరిగేషన్, డీఈఈ, ఏఈ,మత్స్య సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
రేపు రైల్వే ప్రాజెక్ట్ల ప్రారంభం
● వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని కాజీపేట రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్ట్లను ఈ నెల 10వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనలో వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నట్లు శుక్రవారం రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట–హసన్పర్తి రైల్వేస్టేషన్ల మధ్య కోమటిపల్లి రైల్వే గేట్సమీపంలో నిర్మించిన సొరంగమార్గం (రైల్ అండర్ రైల్), బల్లార్షా – కాజీపేట – విజయవాడ మూడవ రైలు మార్గాన్ని ప్రారంభించనున్నారు. కాగా, కాజీపేట రైల్వే మ్యాన్ఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ–కోచ్ఫ్యాక్టరీ) ప్రధాని ప్రారంభించే ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు లేదని రైల్వే అధికారులు తెలిపారు. పనులు పూర్తి స్థాయిలో కాలేదని పేర్కొన్నారు. -
తలసేమియాపై అవగాహన ఉండాలి
జనగామ రూరల్: ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి ఎల్.అశోక్ కుమార్ పాల్గొని ప్రజలకు తలసేమియా వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. తలసేమియా వ్యాధి వారసత్వంగా సంక్రమించే రక్త సంబంధిత వ్యాధి అని, సరైన సమయంలో పరీక్షలు చేయించుకోవడం ద్వారా నివారణ సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా 50 మంది గర్భిణులకు స్క్రీనింగ్ నిర్వహించి, నమూనాలు సేకరించి గర్భిణి పాజిటివ్గా తేలిన పక్షంలో భర్తకు కూడా పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు అందిస్తున్నట్లు చెప్పారు. అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు వైద్యులు కమల్ హాసన్, శ్రీతేజ, అనురాధ జాదవ్ పాల్గొన్నారు. -
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
● సీపీ సన్ప్రీత్ సింగ్చిల్పూరు: బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వెస్ట్ జోన్ పరిధిలోని చిల్పూరు పోలీస్స్టేషన్ను గురువారం సందర్శించారు. ముందుగా బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయానికి రాగా అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కష్ణమాచార్యులు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. తీర్థప్రసాదాలతో పాటు స్వామి వారి శేషవస్త్రాన్ని సీపీకి అందజేశారు. అనంతరం పోలీస్స్టేషన్ను సందర్శించగా వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేందర్నాయక్, ఏసీపీ భీంశర్మ, సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్సై సిరిపురం నవీన్కుమార్లు పుష్పగుచ్ఛం అందించారు. స్టేషన్ పరిసరాలను, రికార్డులను తనిఖీ చేసి సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులు లేకుండా చూడాలన్నారు. అక్రమ ఇసుక, మొరం రవాణా, పాఠశాలల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరగకుండా చూడాలన్నారు. -
సౌర విద్యుత్ ప్రయోజనాలు వినియోగించుకోవాలి
లింగాలఘణపురం: సౌర విద్యుత్తో ఉండే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని ట్రాన్స్కో డీఈ లక్ష్మీనారాయణరెడ్డి కోరారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం మండలంలోని రైతు వేదికలో వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలపై ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, సబ్సిడీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ లక్ష్మీనారాయణరెడ్డి మాట్లాడుతూ జలవిద్యుత్, థర్మల్ విద్యుత్కు ఉపయోగపడే వనరులు తగ్గడం, కాలుష్యం వంటి సమస్యలు ఏర్పడుతాయని, సౌర విద్యుత్తో ఎలాంటి కాలుష్యం లేకుండా సూర్యరశ్మితో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. వ్యవసాయ క్షేత్రాలతో పాటు, గృహ అవసరాలకు సౌర విద్యుత్ను వినియోగించుకొని ఎక్కువ ఉత్పత్తి అయితే గ్రిడ్ కొనుగోలు చేస్తే ఉత్పత్తిదారులకు ఆదాయం కూడా వస్తుందన్నారు. సమావేశంలో ఏడీ అనిల్కుమార్, ఏఈ శంకరయ్య, లింగాలఘణపురం సర్పంచ్ ఎడ్ల లావణ్య, ట్రాన్స్కో సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
పుస్తకాలొచ్చేశాయ్..
పాఠశాలల పునఃప్రారంభం రోజే అందించేలా చర్యలుజనగామ రూరల్: పాఠశాల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. గతంలో పాఠశాలలు ప్రారంభమై నెలలు గడిచినా పూర్తిస్థాయిలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించని విద్యాశాఖ అధికారులు.. రెండేళ్లుగా అందుకు భిన్నంగా సకాలంలో పాఠ్యపుస్తకాలను అందజేస్తోంది. సబ్జెక్ట్ పుస్తకాల కొరత తలెత్తకుండా అధిగమించడానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో ప్రత్యేక చొరవ తీసుకొని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాకేంద్రంలోని స్టాక్ పాయింట్కు 60 శాతం పుస్తకాలు చేరాయి. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడానికి కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో అభివృద్ధి పనులు చేపడుతోంది. పాఠశాలలు ప్రారంభం అయ్యే నాటికి పెండింగ్ పనులు పూర్తి అయ్యేలా ఆదేశాలు జారీ చేశారు. విద్యా సంవత్సరం పాఠశాలల పునఃప్రారంభంలోనే విద్యార్థులకు సమస్యలు రాకుండా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం అందించడానికి చర్యలు తీసుకుంటుంది. ఇందుకు అవసరమెన పుస్తకాలు జిల్లాకు విడతల వారీగా అందిస్తున్నారు. జిల్లాలో 22వేల మంది విద్యార్థులు జిల్లాలో 12 మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలు 434 ఉండగా సొసైటీలు, ఎయిడెడ్, కేజీబీవీలు గు రుకులాలు అన్ని కలిపి 586 పాఠశాలలున్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలు 341, ప్రాథమికో న్నత పాఠశాలలు 64, ఉన్నత పాఠశాలలు 101 ఉ న్నాయి. ఇందులో మొత్తం 22,142 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. వీరికి 2,68,550 పుస్తకాలు అవసరమని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటివరకు 1,54, 620 పుస్తకాలను విడతల వారీగా పంపించగా వాటిని జిల్లాకేంద్రంలో గోదాంలో భద్రపరిచారు. నోట్ బుక్స్ సైతం.. పేద, మధ్యతరగతి కుటుంబాలు వారి పిల్లలకు నోట్బుక్స్ కొనిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వాటిని సైతం ఉచితంగా అందించాలనే ల క్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గతేడా ది నుంచి పాఠ్య పుస్తకాలతో పాటు రాత పుస్తకాలను అందిస్తుంది. ఈ ఏడాది కూడా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. మొదటి రెండేళ్లు 6వ నుంచి 10వ తరగతి వారికి మాత్రమే రాత పుస్తకాలు అందించగా.. గతేడాది నుంచి ప్రాథమిక తరగతులకు ఇవ్వడం ప్రారంభించారు. క్యూ ఆర్ కోడ్తో ముద్రణ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన కొనసాగుతుంది. విద్యార్థుఽలకు అన్ని విషయాలు అర్థం అయ్యే విధంగా ఇబ్బందులు పడకుండా ఉండాలని పాఠ్యపుస్తకాల్లో ఇంగ్లిష్, తెలుగు బాషల్లో పాఠ్యంశాలను ముద్రిస్తున్నారు. అలాగే పుస్తకాలపై క్యూ ఆర్ కోడ్తో ముద్రిస్తున్నారు. దీంతో పుస్తకాలు పక్కదారి పట్టకుండా ఉండే అవకాశం ఉంది. పంపిణీకి సన్నద్ధం జిల్లాకు 2,68,550 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరం ఇప్పటి వరకు వచ్చినవి 1,54,620 ఈనెల చివరి వరకు మిగతావి కూడా వచ్చే అవకాశంజిల్లాలో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మీడియం పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో పుస్తకాలు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. గతంలో రెండు భాషల్లో పాఠ్య పుస్తకాల ముద్రణకు ఆలస్యమయ్యేవి. ఈసారి విద్యార్థులకు ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందస్తుగానే ముద్రణ ప్రారంభించింది. ఈ నెల చివరి కల్లా మిగతా పుస్తకాలు కూడా రానున్నాయి. పూర్తిస్థాయిలో అందిస్తాం..జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాసంవత్సరం ప్రారంభం రోజే ఉచిత పాఠ్య పుస్తకాలు అందేలా కృషి చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాకు 60 శాతం పుస్తకాలు చేరుకున్నాయి. మరో 15 రోజుల్లో పూర్తిస్థాయిలో రానున్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ బుక్స్, ఏకరూప దుస్తులు కూడా అందించడానికి కృషి చేస్తున్నాం. – గౌసియా బేగం, ఇన్చార్జ్ ఏపీఓ -
రైతును కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదే
హన్మకొండ: రైతును కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా గురువారం ముగిసింది. చివరి రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు మేళాలో ఏర్పాటుచేసిన స్టాళ్లను సందర్శించి వివిధ ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతాంగానికి కావాల్సిన అన్ని అవకాశాలు కళ్ల ముందుంచాలని, యాంత్రీకరణ, పురుగు మందులు, ఎరువులు, మార్కెటింగ్ వ్యవస్థ, భవిష్యత్లో రాష్ట్రంలో ఏ రకంగా ముందుకు పోవాలి తదితర అంశాలపై రైతులను అవగాహన కల్పించేందుకే హనుమకొండలో రైతుమేళా నిర్వహించామన్నారు. రైతుకు పాడి–పంట రెండూ అవసరమని, ఈ రెండింటి వైపు రైతును ప్రోత్సహించాలన్నారు. ఆయిల్పామ్ లాభదాయకమని, రైతులు దీని సాగుపై దృష్టి సారించాలన్నారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లాలన్నారు. రైతుబంధు పేరుతో యాంత్రీకరణ అపేసి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అష్టకష్టాల పాలు చేసిందని విమర్శించారు. రుణమాఫీ, రైతు భరోసా, యూరియా సరఫరాపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. రైతులు దానం చేయాలని నాడు వైఎస్ చెప్పారు.. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రైతులు దానం చేయాలని, యాచించకూడదని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారని, ఈ మేరకు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ ఉచిత విద్యుత్ అందించారని, ప్రాజెక్టులు నిర్మించారన్నారు. అదే బాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కొనుగోళ్లు వేగంగా జరగడం లేదు.. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ధాన్యం, మక్కల కొనుగోళ్లు వేగంగా జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వర్షాలు రాకముందే కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో చేతులెత్తేసిందని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు, రైతులు గోపిరెడ్డి గోపాల్ రెడ్డి, లావణ్య రెడ్డి, భాగ్యలక్ష్మి మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యానశాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద, అదనపు కలెక్టర్లు ఎన్.రవి, సంధ్యారాణి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, ఎన్పీడీసీఎల్ అధికారులు, శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.ఆయిల్పామ్ సాగు లాభదాయకం సేంద్రియ పంటల వైపు రైతులు దృష్టి సారించాలి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ముగిసిన రాష్ట్రస్థాయి మెగా రైతుమేళా -
నేడు మెగా జాబ్మేళా
జనగామ: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నేడు (శుక్రవారం) మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి కె. కోదండ రాములు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్మీడియేట్ నుండి పోస్టు గాడ్యుయేషన్ వరకు విద్యార్హత కలిగిన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు 50కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయన్నారు. ఈ నెల 8వ తేదీన హనుమకొండలోని బాలసముద్రం, కొత్త బస్టాండ్ సమీపంలోని కాళోజీ కళాక్షేత్రంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 91825 52593 నంబర్ను సంప్రదించాలన్నారు. మార్కెట్కు రెండు రోజుల సెలవుజనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, మక్కల నిల్వలు పేరుకుపోవడంతో వాటిన తరలించేందుకు ఏఎంసీకి ఈ నెల 8, 9వ తేదీల్లో రెండు రోజులు పాటు సెలవును ప్రకటించినట్లు చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సరుకులను తరలించేం దుకు సరిపడా వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం, మక్కలు పేరుకు పోయాయన్నారు. రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించగా, 10వ తేదీన ఆదివారం కావడంతో రైతులు ఎవరూ కూడా మార్కెట్కు సరుకులను తీసుకురావద్దన్నారు. ఈ నెల 11వ తేదీన యదావిధిగా మార్కెట్ సేవలు పునఃప్రారంభమవుతాయన్నారు. మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ జనగామ: మైనార్టీ విద్యార్థుల రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో యూపీఎస్సీ సీఎస్ఏటీ (సివిల్ సర్వీసెస్ అప్టిట్యూట్ టెస్ట్) 2026 పరీక్షకు ఉచిత శిక్షణను అందించనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసిన మైనార్టీ అభ్యర్థులు ఈ నెల 31వ తేదీ లోపు ఆన్లైన్ (సీఈటీ.సీజీజీ.జీఓవీ.ఇన్.టీఎంఆర్ఐఈఎస్)లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్ 14న జిల్లా కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా మైనార్టీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈవీఎం గోదాం పరిశీలన జనగామ రూరల్: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నెలవారీ తనిఖీలో భాగంగా కలెక్టరేట్లోని ఈవీఎం గోదాంను గురువారం అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పని తీరు, మంటల నియంత్రణ పద్ధతులను పర్యవేక్షించారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ఈ పరిశీలనలో జనగామ ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. గీత కార్మికులు సేఫ్టీ కిట్లను వినియోగించాలి జఫర్గఢ్: ప్రమాదాల బారిన పడకుండా గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కేందుకు తప్పనిసరిగా కాటమయ్య సేఫ్టీ కిట్లను వినియోగించాలని జిల్లా కోఆర్డినేటర్ బాల్నే వెంకటమల్లయ్య కోరారు. మండలంలోని తీగారం గ్రామంలో సేఫ్టీ కిట్లపై గీత కార్మికులకు గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వృత్తుల కంటే కల్లుగీత వృత్తి ప్రమాదకరమన్నారు. కాటమయ్య కిట్లు వాడడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగవన్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎకై ్సజ్ సీఐ సంతోష్రెడ్డి, ట్రేనర్స్ కుర్ర ఉప్పలయ్య, కనకటి రాజయ్య, బాల్నే కార్తిక్, గడ్డం రామచంద్రం, గడ్డం శ్రీనివాస్, తౌటి సురేష్గౌడ్, రాకేష్, పెద్ద శ్రీనివాస్, తవిటి రాకేష్, శ్రవణ్, కుమార్, సతీష్తో పాటు తదితరులు పాల్గొన్నారు. -
క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నాం
జనగామ : కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అనుచరులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతి నిధుల క్యాంపు కార్యాలయాలపైనే బీజేపీ గూండాలు దాడులకు తెగబడటం రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పడానికి నిదర్శనమన్నారు. రాజకీయాల్లో మాటకు మాటతో సమాధానం చెప్పాలి గానీ, దాడులు చేసి విధ్వంసానికి పాల్పడటం బీ జేపీ అసలు స్వభావాన్ని బయటపెడుతోందని విమర్శించారు. ఎ మ్మెల్యే కార్యాలయంలో విధ్వంసం సృష్టించడం, కారు అద్దాలు పగులగొట్టడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూపిస్తోందన్నారు. ఈ ఘటనలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ దాడి చేసే వారికే సహకరిస్తున్నట్టుగా వ్యవహరించడం అత్యంత బాధాకరమన్నారు. బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని, ఈ దాడికి పాల్ప డిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై దౌర్జన్యం ప్రజాస్వామ్యంపై దాడి ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి -
సమస్యల పరిష్కారానికి చర్యలు
దేవరుప్పుల/లింగాలఘణపురం: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. గురువారం దేవరుప్పుల మండలంలోని ధారావ్తండా, సీతారాంపురం, లింగాలఘణపురం మండలంలోని పటేల్గూడెం, వనపర్తి గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తరలించేందుకు అధికార యంత్రాంగం, నిర్వాహకులు సమన్వయం చేసుకొని కాంటా, రవాణా సజావుగా కొనసాగేలా చూడాలన్నారు. అకాల వర్షాల నేపధ్యంలో వీలును బట్టి రైతులు తమ సొంత వాహనాల్లో ధాన్యం తరలించవచ్చన్నారు.కేంద్రాల నిర్వహణ తీరు, రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఎంత ధాన్యం కొనుగోలు చేశారు, టోకెన్లు ఎంత మందికి ఇచ్చారు, సమయానికి లారీలు వస్తున్నాయా, లోడింగ్ అన్లోడింగ్లో సమస్యలు ఉన్నాయా అంటూ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ పనులకు ప్రాధాన్యం ఉపాధి హామీ పథకం పనుల్లో కమ్యూనిటీ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. సీతరాంపూర్లోని మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ వద్ద జరుగుతున్న ఉపాధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ నూరోద్దీన్, ఎంపీడీఓ మేనేక పౌడేల్, సర్పంచ్లు ధారావత్ అనిత, బస్వ ఎలేంద్ర వెంకన్న, ఏపీఎం సత్యనారాయణ, తదితరులు ఉన్నారు. రైతులు సొంత వాహనాల్లో ధాన్యం తరలించవచ్చు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
పేదలకు వరం బీసీ గురుకులాలు
జనగామ రూరల్: కార్పొరేట్ స్థాయిలో విద్యనందిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న బీసీ గురుకులాలు పేద విద్యార్థులకు వరంగా మారాయి. నిత్యం విద్యార్థులకు నూతన విద్యావిధానాలకు అనుగుణంగా విద్యనందించడంతో పాటు పౌష్టికాహారం అందిస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ విద్యాలయాల సంస్థ 2026–27 విద్యాసంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది. జిల్లావ్యాప్తంగా పదో తరగతి పూర్తైన విద్యార్థులు ఆన్లైన్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు ఈనెల 12వ తేదీన దరఖాస్తుకు చివరి తేదీ ఉందని, విద్యార్థులు వినియోగించుకోవాలని బీసీ గురుకులాల సమన్వయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. దరఖాస్తు చేసుకునే విధానం బీసీ గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు ఆయా గురుకులాల ప్రిన్సిపాళ్లకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. మిగతా విద్యార్థులు ఎంజేపీటీబీసీఅడ్మిషన్.ఓఆర్జీ అనే వెబ్సైట్లో ఈనెల 12వ తేదీలోపు రూ.200 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు జిల్లాలో మొత్తం 6 బీసీ గురుకుల కళాశాలలు ఉన్నాయి. ఇందులో బాలుర కళాశాలలు 3, బాలికల కళాశాలలు 3 ఉన్నాయి. ప్రతీ కళాశాలలోఎంపీసీ 40, బైపీసీ 40, ఎంఈసీ 20, సీఈసీ 20 మొత్తం 720 సీట్లు ఉన్నాయి. సద్వినియోగం చేసుకోవాలి ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ విద్యార్థుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాం. అన్ని రకాల వసతులతో ఉత్తమ బోధన కల్పిస్తున్నాం. జిల్లాలో 6 కళాశాలల్లో 720 సీట్లు ఉన్నాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – శ్రీనివాస్, ఎంజేపీ జిల్లా కోఆర్డినేటర్ ఈనెల 12 వరకు ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ జిల్లాలో 6 కళాశాలలు, 700పైగా సీట్లు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి బీసీ గురుకులాల సమన్వయ అధికారి శ్రీనివాస్ -
అకాల వర్షం..ఆగమాగం
● ఐకేపీ కేంద్రాల్లో తడిచిన ధాన్యం ● పలుచోట్ల రాలిన మామిడి ● తడిచిన ధాన్యం తరలింపుపై కలెక్టర్ ఆదేశాలుజనగామ: జిల్లాలో అకాల వర్షం, ఈదురుగాలులు రైతుల కష్టానికి పరీక్షగా మారింది. మంగళవారం రాత్రి భారీగా వీచిన గాలులు, స్వల్ప వర్షంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ధాన్యం, మామిడితోటలకు స్వల్ప నష్టం జరుగగా, నష్టంపై జిల్లా పరిపాలన వేగంగా స్పందించారు. బచ్చన్నపేట మండలంలోని సాల్వాపూర్, గంగాపూర్, పడమటి కేశవాపూర్ ప్రాంతాల్లో మామిడి కాయలు రాలిపోగా, కోతకు సిద్ధమైన ధాన్యం గింజలు నీటిపాలు కాగా, సెంటర్లలో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న సరుకు కొంతమేర తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. జనగామ మండలం గానుగుపహాడ్ సహా పలు ఐకేపీ సెంటర్లలో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న ధాన్యం తడిచింది. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని దేవరుప్పుల మండలంలో రైతులు హైవేపై రెండు గంటల పాటు ధర్నాకు దిగారు. జనగామ మార్కెట్ కాటన్ యార్డులోని ఐకేపీ, మెప్మా సెంటర్లలో ధాన్యం తడిసిపోగా, రైతులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా వెంటనే స్పందించారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. నర్మెట మండలం బొమ్మకూరు కొనుగోలు కేంద్రాన్ని ప్రత్యక్షంగా సందర్శించి, ఆలస్యం జరగకుండా టోకెన్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్లో అత్యవసర సమావేశం నిర్వహించి అన్ని శాఖల సమ న్వయంతో కొనుగోలు తక్షణం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
ప్రయాణికుల సౌకర్యమే ఆర్టీసీకి ప్రాధాన్యం
జనగామ: ప్రయాణికుల సౌకర్యమే ఆర్టీసీకి మొదటి ప్రాధాన్యమని, ప్రతీ సమస్యకు డిపో స్థాయిలో వెంటనే పరిష్కారం చూపుతామని కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.సొలొమోను తెలిపారు. బుధవారం జనగామ డిపోను ఆయన సందర్శించారు. డిపో పరిసరాలు, బస్సుల నిర్వహణ, సిబ్బంది పనితీరును పరి శీలించారు. అనంతరం బస్స్టేషన్న్లో జరిగిన ప్రయాణికుల సదస్సులో పాల్గొని వారితో నేరుగా మాట్లాడారు. కొన్ని రూట్లకు సంబంధించి ప్రయాణికులు సూచనలు, అభ్యర్థనలు తెలియజేయగా, ఈడీ సొలొమోను వెంటనే స్పందించి సంబంధిత డిపో మేనేజర్లకు తగిన ఆదేశాలు జారీ చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం జనగామ డిపో బస్సుల టైమింగ్స్తో కూడిన క్యాలెండర్లను ప్రజలకు అందించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఎస్.స్వాతి, సూపర్ వైజర్లు, సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు. రైతులు ఆందోళన చెందొద్దు జనగామ: జిల్లాలో తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో ఎలాంటి జాప్యం జరగడం లేదని సివిల్ సప్లయీస్ డీఎం హథీరామ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని హన్మంతాపూర్, ఆలీంపూర్, తమ్మడపల్లి రైతుల ధాన్యం ఎక్కువగా ఉన్న కారణంగా రవాణా పరంగా కొంత జాప్యం జరుగుతోందన్నారు. ఈ సమస్యను తక్షణం పరిష్కరించేందుకు అదనపు లారీలను ఏర్పాటు చేయడంతో పాటు తూకం వేసిన సరుకును ఆలస్యం చేయకుండా షిఫ్టింగ్ చేసేలా సదరు కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లాలో గన్నీ బ్యాగుల కొరత లేదన్నారు. జిల్లాలో రైతులు ఆందోళన చెంది రోడ్డోక్కి రాస్తారోకోలు, ధర్నాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతీ గింజను కొనుగోలు చేసే బాధ్యతను జిల్లా యంత్రాంగం తీసుకుందని, రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. మక్కలు కొంటున్నాం.. జనగామ: జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతంగా కొనసాగుతున్నాయని మార్క్ఫెడ్ మేనేజర్ రాజశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 41,718 ఎకరాల్లో మొక్కజొన్న పండగా, అందులో 26,050 మెట్రిక్ టన్నుల దిగుబడి రానున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 11,05,527 క్వింటాళ్ల మొక్క జొన్నను కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 5 మక్కల కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 1,765 మంది రైతుల నుంచి 86,514 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు జరిగిందన్నారు. దీనికి సంబంధించి రూ.20.76 కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన శాశ్వత మానిటరింగ్ వేదిక ఆధ్వర్యంలో సీఏపీ నిల్వ కేంద్రం (4,000 మెట్రిక్ టన్నులు) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే యశ్వంతాపూర్ ఐకేపీ మక్కల కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్నల కొనుగోలు కొనసాగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి స్టేషన్ఘన్పూర్: రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను, సౌకర్యాలను రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.అనిత సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 4 నుంచి నిర్వహిస్తున్న రైతువారం కార్యక్రమంలో భాగంగా స్థానిక రైతువేదికలో బుధవారం రైతులకు ప్రత్యేక అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు, సహకార సంఘాలు, ఎఫ్పీఓల ద్వారా రైతులకు సేవలు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలు తదితర అంశాలపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఘన్పూర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, డీసీఓ కోదండరాం, కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ దివ్య, వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ జన్ను భాస్కర్, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్రెడ్డి, వైస్ చైర్మన్ చిర్ర నాగరాజు, నాబార్డు అధికారులు, బ్యాంకుల మేనేజర్లు, పీఏసీఎస్ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. -
సీఎంను గద్దె దించేందుకు పోరాటానికి సిద్ధం
రేవంత్రెడ్డిని గద్దె దించేందుకు పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. రైతులను గోస పెడుతూ 40 ఏళ్ల నాటి కాంగ్రెస్ పాలనను తిరిగి గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో కల్లాల దగ్గరే పంట కొనుగోలు చేయగా, నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కల్లాల దగ్గర, కాంటాల దగ్గర ఎంత ఇస్తావంటూ అవినీతి రాజ్యమేలుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు నా చాలెంజ్.. రైతు మేళాను రైతుల మార్కెట్లో పెట్టండి.. ఉరికిచ్చి కొడతారు. – ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ మంత్రి కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగం పదేళ్ల కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగంలా ఉండగా, నేటి కాంగ్రెస్ పాలన రైతుల పాలిట రాబందుల పాలనగా మారింది. రైతులను గోస పెట్టుకుంటున్న రేవంత్ పాలన పోయి అన్నం పండించే రైతు మూడు పూటలా కడుపు నిండా భోజనం చేసే బీఆర్ఎస్ పాలన రావాలి. పడించిన పంటలో పావలా వంతు కూడా కొనకుండా రైతులను అరిగోస పెట్టుకుంటున్న ప్రభుత్వం చెర నుంచి రైతులకు విముక్తి రావాలి. – సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి తెలంగాణ ఊపిరి మా సదస్సు పోరాటాలకు పుట్టినిల్లు వరంగల్లో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు పెట్టడానికి అనుమతి ఇవ్వలేదు. ఇక్కడి ఎమ్మెల్యే.. మీది ఏం సదస్సు, ఏం సభ అంటూ వెటకారంగా మాట్లాడారు. మాది తెలంగాణ ఊపిరి సదస్సు. రైతును రాజు చేయాలని, రైతు పక్షపాతి కేసీఆర్.. రైతుబంధు, రైతు భరోసా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుని పథకాలు తీసుకొచ్చా రు. కానీ, కాంగ్రెస్ సర్కారు వాటిని తుంగలో తొక్కింది. – పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే, జనగామ -
టోకెన్ పద్ధతి కచ్చితంగా పాటించాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నర్మెట: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో టోకెన్ పద్ధతిని కచ్చితంగా పాటించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నిర్వాహకులను ఆదేశించారు. మండలంలోని బొమ్మకూర్లో ఐకేపీ ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అక్కడి సౌకర్యాలను పరిశీలించిన తర్వాత రైతులతో మాట్లాడారు.. లారీ ల యజమానులు కొర్రీలు పెడితే సమాచారం అందించాలని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. తడిసిన ధాన్యం మిల్లులకు తరలించాలి జనగామ రూరల్: అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని రైతులు ఆందోళనకు గురికావద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్తో కలిసి సివిల్ సప్లై, వ్యవసాయ, కోఆపరేటివ్, రవాణా, మార్కెటింగ్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. బమ్మెర పోతన అభివృద్ధి పనులు వేగవంతమవ్వాలి పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో చేపడుతున్న పోతన స్మారక మందిరం, కాంస్య విగ్రహం ఏర్పాటు అభివృద్ధి పనులు వేగవంతం కావాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. టూరిజం, ఇరిగేషన్, ఆర్ అండ్బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వీయగణన సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి జాతీయ ఇళ్ల జాబితా, స్వీయగణన నేపథ్యంలో ప్రజలు ఆన్లైన్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్న్లైన్న్లో నమోదు చేసినప్పటికీ ప్రభుత్వం నియమించిన ఎన్యుమరేటర్లు ప్రతీ ఇంటిని సందర్శించి, నమోదు చేసిన వివరాలను ధ్రువీకరిస్తారని స్పష్టం చేశారు. -
వడ్లు కొనండి సారూ..
● ఆర్డీఓ కాళ్లు మొక్కుతూ వేడుకున్న రైతు జనగామ: అకాల వర్షంతో పలుచోట్ల ధాన్యం తడవడంపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వేగవంత చర్యలు తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు ఆర్డీఓ గోపిరాం జనగామ మార్కెట్లోని కాటన్ యార్డుకు చేరుకుని రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఒక్కో రైతు వద్దకు వెళ్లి ధాన్యం నష్టాన్ని అడిగి తెలుసుకున్న ఆర్డీఓ.. సెంటర్ నిర్వాహకులను పిలిపించి కొనుగోలు ప్రక్రియ ఎందుకు ఆలస్యమవుతుందో ఆరా తీశారు. మార్కెట్లో లారీలు రాక 20 రోజులుగా నిలిచిపోవడం వల్లే ధాన్యం పేరుకపోయిందని రైతులు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే లారీలను పంపించి కొనుగోళ్లు ఆలస్యం జరగకుండా చూడాలని విన్నవించారు. ఈక్రమంలో రైతు ప్రకాశ్ తన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆర్డీఓ కాళ్లు మొక్కుతూ వేడుకున్నారు. కాటన్ యార్డులో స్థలం లేక ముగ్గురు, నలుగురు రైతులు బయట ధాన్యాన్ని ఆరబెట్టుకోగా, వాటిని కొనుగోలు చేయలేమని అధికారులు చెప్పడంతో సదరు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఆర్డీఓ కారుకు అడ్డంగా కూర్చొని రైతులు నిరస న తెలిపారు. సీరియల్ ప్రకారం ఆరుబయట ఉన్న రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని ఆర్డీఓ నిర్వాహకులకు చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. -
ఓరుగల్లునుంచే రైతుపోరు
సాక్షిప్రతినిధి, వరంగల్/కాజీపేట అర్బన్: ‘రైతుకు ఓపిక నశిస్తే భూకంపం పుడుతుందని పాలకులు గ్రహించాలి. భూమిని దున్నడం తెలిసిన రైతు నాగలి తిరగేసి కాంగ్రెస్ను బొంద పెడతారు.. వరంగల్ వేదికగా ఏ ఉద్యమం మొదలుపెట్టినా విజయవంతమవుతుంది. ఇప్పుడు జరిగిన ఈ రైతు సంగ్రామ సదస్సు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ హంటర్ రోడ్డులో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు సంగ్రామ సదస్సు నిర్వహించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతుల మృతికి సంతాపంగా తొలుత ఒక నిమిషం మౌనం పాటించి, నివాళులర్పించి సదస్సును ప్రారంభించారు. జై కేసీఆర్ నినాదాలతో సదస్సు ప్రాంగణం మార్మోగింది. ‘కేసీఆర్ సారు మళ్లీ రావాలి. రైతు బంధు రాజ్యం రావాలి. రాబందుల పాల న పోవాలి’ అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు నినదించారు. కాగా, కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ వైఫల్యాలు, ప్రభుత్వ తీరును కేటీఆర్ తన ప్రసంగంలో ఎండగట్టారు. రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు. సదస్సుకు హాజరైన పలువురు రైతులు, రైతు ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై తమ అభిప్రాయాల్లో అసంతృప్తిని వ్యక్తం చేశారు. సదస్సులో పలు తీర్మానాలు ప్రవేశపెట్టి హర్షధ్వానాల మధ్య ఆమోదించారు. రైతు సంగ్రామ సదస్సు బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. సదస్సులో గాయకులు మధుప్రియ, మిట్టపల్లి సురేందర్, రసమయి బాలకిషన్ పాటలతో హోరెత్తించారు. ప్రత్యేక ఆకర్షణగా ఎడ్లబండి.. రైతు సంగ్రామ సదస్సు ప్రాంగణం ఎదుట ఏర్పాటు చేసిన కంకులతో రూపొందించిన పసుపు చీరను కట్టుకున్నట్లుగా ఎడ్లబండి, నాగలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలువురు ఎడ్ల బండి, నాగలి వద్ద సెల్ఫీలు దిగారు. వేసవి తాపానికి అంబలి.. దాహానికి మజ్జిగ, మంచినీళ్లు సదస్సుకు వచ్చిన రైతులకు వేసవి తాపాన్ని తగ్గించేందుకు మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, బాటిళ్లను ఏర్పాటు చేశారు. సుమారు 10 వేల మంది రైతులకు తెలంగాణ వంటకాలను ఏర్పాటు చేశారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అంబలి స్టాల్ను ఏర్పాటు చేసి దాహార్తి తీర్చారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింత ఉధృతం చేస్తామన్న కేటీఆర్ జై కేసీఆర్.. సారు మళ్లీ రావాలి నినాదాలతో మార్మోగిన రైతు సంగ్రామ సదస్సు పాటలతో హోరెత్తించిన మధుప్రియ, మిట్టపల్లి సురేందర్, రసమయి అభిప్రాయాలు, కష్టాలు పంచుకున్న రైతులు.. పలు రైతు తీర్మానాలకు ఆమోదం కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టిన నేతలు.. బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ -
కల్లాల కాడ రైతుల ఎదురు చూపులు
కాంగ్రెస్ వాళ్లకే యూరియా.. వ్యవసాయంలో వ్యత్యాసం చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్లకే ముందుగా యూరియా ఇస్తున్నారు. వాళ్ల పంటనే ముందుగా కొంటున్నారు. వర్షం వచ్చి వడ్లు తడుస్తున్నా.. పట్టించుకునే నాథుడే లేడు. అంతా అవినీతి, అక్రమాలకు నిలయంగా కాంగ్రెస్ పాలన నిలుస్తోంది. – సుబ్బారావు, రైతు, ఖానాపురం, వరంగల్ పండించిన పంటను ఎప్పుడు కొంటారు? పెట్టిన పెట్టుబడి ఎప్పుడు చేతికందుతుందని రైతులు కల్లాల కాడ.. మక్కల అమ్మకానికి నెల రోజులుగా ఎదురుచూస్తున్నారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన ఎవుసం ఎప్పుడూ అభివృద్ధి చెందదు. కేసీఆర్ పాలనలో రైతు బంధు ద్వారా ఎకరాకు రూ.5 వేలు ఇవ్వగా, ఇప్పుడు ఒక ఎకరానికి మాత్రమే రూ.6 వేలు వేస్తున్నారు. – ఊకంటి రవి, రైతు, దుగ్గొండిరైతుబంధు పడట్లేదు.. యాక్సిడెంట్లో కాలు కోల్పోయినా కూడా కేటీఆర్ను చూసేందుకు, బీఆర్ఎస్పై మక్కువతో ఒక్క కాలితో నేలపై అతి కష్టమ్మీద సదస్సుకు వచ్చా. నాకు మూడెకరాల భూమి ఉంటే రైతు బంధు ఇస్తలేరు. కేసీఆర్ సారే సీఎం కావాలి. ఈసారి ఓటు వృథా చేసుకోం – ఎండీ మక్బూల్, రైతు, కొత్తపేట, హనుమకొండ ● -
ఎజెండా ఎలా ఆమోదిస్తారు?
మేం రాకముందేజనగామ: జనగామ మున్సిపల్ సాధారణ సమావేశం బుధవారం రసాభాసగా మారింది. గత నెల 30న వాయిదా పడిన సమావేశాన్ని బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు ప్రారంభించారు. కౌన్సిల్లో మూడో వంతు సభ్యులు హాజరుకావడంతో చైర్పర్సన్ ఆదేశాల మేరకు 54 ఎజెండా అంశాలను సమావేశం ముందుంచగా కాంగ్రెస్కు చెందిన 9 మంది, బీఆర్ఎస్కు చెందిన ముగ్గురు సభ్యులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికి బీఆర్ఎస్ కౌన్సిలర్ ఉడుగుల కిష్ట య్య ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మెజారిటీ సభ్యులు ఆమోదం తెలవడంతో చైర్పర్సన్ అంశం ఆమోదించినట్లు ప్రకటించారు. ఇదే సమయంలో అరగంట ఆలస్యంగా వచ్చిన బీఆర్ఎస్ సభ్యులు, తాము రాకముందే ఎజెండా అంశాలు తీర్మానించడం ఏంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 54 ఎజెండా అంశాలను 30 నిమిషాల్లో ఎలా చదివారు? అని ప్రశ్నిస్తూ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు వారించగా మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆగ్రహం.. నిరసనలు బీఆర్ఎస్ సభ్యులు కమిషనర్ మహేశ్వర్రెడ్డిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రాకముందే సమావేశం నిర్వహించడం అన్యాయమని ఆరోపించగా, కమిషనర్ మాత్రం నియమ నిబంధనల ప్రకారం చైర్పర్సన్ ఆదేశాలతోనే సమావేశం ప్రారంభించామని, మొత్తం వీడియో రికార్డ్ కూడా చేసినట్లు వారికి వివరించారు. అయితే బీఆర్ఎస్ సభ్యులు ఎజెండాలో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన అంశాలు ఉన్నాయని, కావాలనే తమ కు అవకాశం ఇవ్వకుండా ఆమోదించారని మండిపడ్డారు. చైర్పర్సన్ వారి ఆరోపణలను ఖండిస్తూ సమావేశానికి మూడు రోజుల ముందే నోటీసులు ఇచ్చామని, ఆలస్యంగా వచ్చిన వారు ఇప్పుడెలా అభ్యంతరం చెబుతారని, తమ హయాంలో ఏ దుర్వినియోగం జరగదని స్పష్టం చేశారు. ఉద్రిక్తతలు పెరిగే క్రమంలో చైర్పర్సన్ సమావేశం ముగిసినట్లు ప్రకటించి చాంబర్కు వెళ్లిపోయారు. కమిషనర్ కారు ముందు బైఠాయింపు ఆ తర్వాత కమిషనర్ మహేశ్వర్రెడ్డి తన చాంబర్లోకి వెళ్లగా, అక్కడకు చేరుకున్న బీఆర్ఎస్ సభ్యులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. పరిస్థితి వేడెక్కడంతో కమిషనర్ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, ఆయన కారు ముందు బైఠాయించి బీఆర్ఎస్ సభ్యులు అడ్డుకున్నారు. కొంతమంది బీఆర్ఎస్ సభ్యులు ఎజెండా కాపీలను చింపి నిరసన తెలిపారు. ఈ సంఘటనల నేపథ్యంలో సీఐతో పాటు పోలీసులు వచ్చి పరిస్థితిని సమీక్షించి ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేశారు. సమావేశంలో చర్చకు బదులు ప్రతీసారి గొడవలకు దిగుతున్న బీఆర్ఎస్ సభ్యుల ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని చైర్పర్సన్ బాలమణి వ్యాఖ్యానించారు. మరోవైపు చైర్పర్సన్ ఎజెండాను ఇష్టానుసారం ఆమోదించేందుకు ప్రయత్నిస్తున్నారని, దుర్విని యోగాన్ని అడ్డుకునేందుకే తాము ఆందోళన చేస్తున్నామని బీఆర్ఎస్ కౌన్సిలర్లు అన్నారు. కమిషనర్ ఒక పార్టీకే మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. రెండు గంటలపాటు కొనసాగిన ఉద్రిక్త వాతావరణం తర్వాత పరిస్థితి సాధారణమైంది. 30 నిమిషాల్లో 54 అంశాలు చదివారా? ఎజెండా ఆమోదంపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కాపీల చించివేత..కమిషనర్ కారు ఎదుట బీఆర్ఎస్ కౌన్సిలర్ల నిరసన ఆలస్యంగా వచ్చి గొడవ చేస్తారా?: చైర్పర్సన్ బాలమణి రసాభాసగా ముగిసిన మున్సిపల్ సాధారణ సమావేశం -
ధాన్యం తరలించాలని రాస్తారోకో
బచ్చన్నపేట: ధాన్యం తరలించడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని, అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మంగళవారం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే కిలోమీటరు మేర నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్నా తరలించడం లేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు రావడం లేదన్నారు. ధర్నా వద్దకు వచ్చిన ఎస్సై శ్రీకాంత్ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడుతానని హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా మాజీ కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, మాజీ సర్పంచ్ వడ్డెపల్లి మల్లారెడ్డి, పర్వతం మధుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మాది రైతు పక్షపాతి ప్రభుత్వం
హన్మకొండ: రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమని, మాది రైతుపక్షపాతి సర్కార్ అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మూడు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి మెగా రైతుమేళాను బుధవారం మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి పొంగులేటి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రగతి ప్రణాళికలో భాగంగా 99రోజులు అధికారులను ప్రజల ముంగిటికి పంపిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే రైతు ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. 2022లో అద్భుతమైన రైతు డిక్లరేషన్ సభ నిర్వహించి ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెరవేరుస్తామని చెప్పి, సీఎం రేవంత్ నాయకత్వంలో రైతు పక్షపాతి ప్రభుత్వం ఏర్పాటు కాగానే అమలు చేస్తున్నామన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా, రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొంటుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు అధికారం పోయిందని కడుపునిండా విషం నింపుకుని మాట్లాడుతున్నారన్నారు. కల్లాల వద్దకు వెళ్లి సినిమాలో ఫోజులు ఇచ్చినట్లు ఇచ్చి పత్రికల్లో ఫొటోలు వేయించుకుంటున్నారన్నారు. ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా, నాలుగు సార్లు ముక్కు నేలకు రాసినా రైతులు పట్టించుకోరన్నారు. ఓర్వలేక బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు.. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని అన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ను గెలిపించాలని, సీఎం రేవంత్కు అండగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా బీఆర్ఎస్ నాయకులు కళ్లుండి చూడలేని, చెవులు ఉండి వినలేని దద్దమ్మలని అన్నారు. ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బంది పెడుతున్న కేంద్రం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేయాలని చూస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొర్రీలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. గత ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనలేదని, తాము అన్నీ కొంటున్నామన్నారు. ఈ సందర్భంగా భూసార పరీక్షలు నిర్వహించుకున్న ఐదుగురు రైతులకు మంత్రుల చేతులమీదుగా పత్రాలు అందజేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద పాల్గొన్నారు. రైతును రాజును చేయడమే లక్ష్యం ప్రభుత్వం పోయిందని కడుపునిండా విషం నింపుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హనుమకొండలో రాష్ట్రస్థాయి మెగా రైతుమేళా ప్రారంభం వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులు, యంత్ర పరికరాలతో ఆకట్టుకున్న స్టాళ్లు సందర్శించి వివరాలు తెలుసుకున్న అన్నదాతలు -
ఓరుగల్లు వేదికగా రైతుపోరు!
సాక్షిప్రతినిధి, వరంగల్: రైతు సంగ్రామ సదస్సు కోసం ఓరుగల్లు ముస్తాబైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా బుధవారం హాజరవుతున్న ఈ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. సదస్సు ఏర్పాట్లను కేటీఆర్ డైరెక్షన్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్రెడ్డి, తదితర ముఖ్య నేతలు, సీనియర్లతో కలిసి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఉమ్మడి వరంగల్ నుంచి సుమారు 10 వేల మంది రైతులు హాజరవుతారని అంచనా వేసిన నేతలు ఆ మేరకు సదస్సులో ఏర్పాట్లు చేశారు. కాగా, వరంగల్ నుంచే రైతుపోరుకు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్.. సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. విస్తృత ఏర్పాట్లు... రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ చేసిన మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించనున్న సదస్సుకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. గత నెల 26న హైదరాబాద్లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రైతు సంగ్రామ సదస్సుకు చకచకా ఏర్పాట్లు చేశారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్కు ఎదురుగా ఉన్న సుమారు ఐదెకరాల స్థలంలో సదస్సు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సుమారు 10వేల మంది రైతు ప్రతినిధులు సదస్సుకు హాజరు కానున్న నేపథ్యంలో ఎండ వేడిని తట్టుకునేలా జర్మనీ టెంట్లు వేశారు. ఆ పక్కనే హాజరయ్యే రైతుల కోసం భోజనం ఏర్పాటు చేశారు. కాగా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సదస్సుకు హాజరయ్యే రైతుల వాహనాల పార్కింగ్ కోసం కూడా ప్రత్యేక ప్రాంతాలను సూచించారు. కొలంబో మెడికల్ కాలేజ్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న ప్రైవేట్ స్థలంలో పాలకుర్తి, ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్, వర్ధన్నపేట నియోజకవర్గాలకు చెందిన వాహనాలు, తేజస్వీ స్కూల్ గ్రౌండ్తో పాటు, భారత్ పెట్రోల్ బంక్కు ఎదురుగా ఉన్న స్థలంలో స్టేషన్ఘన్పుర్, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల వాహనాలు, పాపడమ్స్ ఎదురుగా ఉన్న పద్మాలయ ఫంక్షన్ హాల్లో జనగామ నియోజకవర్గంతో పాటు జనరల్ వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు, గులాబీ తోరణాలు బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు సంగ్రామ సదస్సు సందర్భంగా వరంగల్ నగరంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీమయమయ్యాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్య నేతల రాక సందర్భంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు, గులాబీ తోరణాలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ నేతలు మంగళవారం ప్రెస్మీట్లో వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 9 గంటల వరకే రైతులు సదస్సుకు హాజరయ్యేలా కార్యాచరణ సిద్ధం చేశారు. సదస్సు ప్రారంభంలో మొదట రైతు ప్రతినిధుల నుంచి ప్రభుత్వం వైఖరి, పరిపాలన విధానాలపై అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఈసందర్భంగా పలువురు రైతు ప్రతినిధులను సదస్సులో మాట్లాడించనున్నారు. ఆతర్వాత మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు కూడా తమ ప్రసంగం ద్వారా అభిప్రాయాలు వెల్లడించనున్నారు. అనంతరం రైతు సదస్సు ద్వారా ప్రస్తుత ప్రభుత్వ విధానాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు వివరించనున్నారు. ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. నేడు బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు హంటర్రోడ్డులో 10వేల మందికి ఏర్పాట్లు ఉదయం 9 గంటలకే వచ్చేలా సమీకరణ మొదట ప్రభుత్వ వైఖరిపై రైతుల అభిప్రాయాలు అనంతరం బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రసంగం గులాబీమయమైన వరంగల్ నగరం కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించేందుకే రైతు సదస్సు విలేకరులతో బీఆర్ఎస్ నేతలు -
జైసోనియా, రాహుల్ అంటే డబ్బులొస్తాయా?
జనగామ రూరల్: శ్రీరాం అంటే డబ్బులు వస్తాయా అని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించడం సరికాదని, జై సోనియా, రాహూల్గాంఽధీ అంటే డబ్బులు వస్తాయా? అని ఎంపీ రఘునందన్రావు విమర్శించారు. మంగళవారం జనగామలో జరిగిన ప్రధాని జనగ్రహ సభ సన్మాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.. కొండా సురేఖ దేవాదాయశాఖ మంత్రి అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ శ్రీరామ్ అంటుందని, రాముని వారసులమని, దేవుళ్ల తోటి పెట్టుకున్న వాళ్లు కాలగర్భంలో కలిసిపోతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయం జెండా ఎగరవేస్తామని అన్నారు. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారి తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీ రూ.7వేల కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మాజీ మంత్రి గుండే విజయరామారావు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరుట్ల దశమంత రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యాసాగర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు లేగ రామ్మోహన్ రెడ్డి, ఉడుగుల రమేష్, సుభాష్, బల్ల శ్రీనివాస్, కొంతం శ్రీనివాస్ , శివరాజ్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు భాగాల నవీన్ రెడ్డి, తోకల ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలు సరికాదు ప్రధాని మోదీ సభ సన్నాహక సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు -
గన్నీసంచులు అందుబాటులో ఉంచండి
రఘునాథపల్లి: ధాన్యం కొనుగోలులో రైతులు ఇబ్బంది పడకుండా అవసరమైన గన్నీసంచులు అందుబాటులో ఉంచాలని, రవాణా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ప్రమాణాల ప్రకారం ఉంటే రైతులు తీసుకొచ్చే ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలన్నారు. మంగళవారం మండలంలోని రఘునాథపల్లి, కంచనపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాంట ఎలా వేస్తున్నారు.? కేంద్రాలకు లారీలు సకాలంలో వస్తున్నాయా? అని తదితర వివరాలు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీ తనిఖీ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పీహెచ్సీలో అందుతున్న వైద్యసేవలు, సిబ్బంది హాజరు, మందుల లభ్యత, పరిశుభ్రత, రోగులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని,, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి జనగామ రూరల్: భూభారతి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, సాదాబైనామా పరిష్కారంలో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం భూ భారతి, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ సంబంధిత పత్రాలు, పాత రికార్డులు, ఆదాయ పత్రాలు, తదితర వివరాలను కచ్చితంగా పరిశీలించాలన్నారు. దరఖాస్తుదారులకు పారదర్శకంగా సమాచారం అందించి, ఎటువంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. కొనుగోళ్లలో జాప్యం జరగొద్దు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
పంట సౌభాగ్యం
భూసార పరీక్షలతో స్థిర వ్యవసాయంజనగామ: జిల్లా రైతుల్లో భూసారం పరిరక్షణపై అవగాహన పెరుగుతోంది. మంచి దిగుబడులు సాధించాలంటే భూమి ఆరోగ్యం అత్యంత కీలకమని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. నేలలో పోషకాలు, సేంద్రియ పదార్థం, నీటి నిల్వ సామర్థ్యం, గాలి ప్రసరణ వంటి అంశాలు సమతుల్యంగా ఉన్న ప్పుడే పంటలు సమృద్ధిగా పండుతాయని అధికారులు చెబుతున్నారు. వచ్చే వానాకాలం సీజన్ నాటికి రైతులు మట్టి పరీక్షలు చేయించుకునే విధంగా వ్యవసాయ శాఖ అవగాహన కల్పిస్తోంది. పంటల సాగుకు 20 రోజుల ముందుగానే మట్టి పరీక్షలు చేయించుకుని సాగుపనులు మొదలుపెడితే ఎరువుల ఖర్చు తగ్గడంతో పాటు పంట దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. భూసారాన్ని ప్రభావితం చేసే అంశాలు జిల్లాలో ఇసుక, బంకమట్టి, ఎర్రమట్టి వంటి విభిన్న నేల రకాలున్నాయి. నేలలోని సేంద్రియ పదార్థం పరిమాణం, సూక్ష్మజీవుల క్రియాశీలత, వాతావరణ పరిస్థితులు ఇవన్నీ భూసారం స్థాయిని నిర్ణయించే ముఖ్యమైన అంశాలు. వరుస పంటలు, అధిక రసాయన ఎరువుల వినియోగం వల్ల భూసారం తగ్గుతు ండడంతో భూసార శ్రేణిని పెంచే పద్ధతులను రైతులు అవలంబించాలని నిపుణులు సూచిస్తున్నారు. చెరువు మట్టి–మళ్లీ సారం చేరే మార్గం రైతులు ప్రతీ 2–3 సంవత్సరాలకు ఎకరానికి 15 నుంచి 20 బండ్ల చెరువు మట్టిని వేయడం ద్వారా భూమిలో సూక్ష్మపోషకాలు పునరుద్ధరించవచ్చు. జనగామ, బచ్చన్నపేట, లింగాలఘణపురం ప్రాంతాల్లో ఇప్పటికే పలువురు రైతులు ఈ పద్ధతిని అమలు చేస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారని అధికారులు చెబుతున్నారు. చెరువు మట్టి నేల నిర్మాణాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. సేంద్రియ ఎరువులతో నేల ఆరోగ్యం జిల్లాలో పెంటపోగు వినియోగం పెరుగుతోంది. పశువుల ఎరువు, పంట అవశేషాలతో తయారైన పెంటపోగు ఎరువు నేల గాలి ప్రసరణను, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుందని అధికారులు చెబుతున్నారు. రైతులు వర్మికంపోస్ట్ తయారీపై ఆసక్తి చూపుతున్నారు. 40 నుంచి 60 రోజుల్లో సిద్ధమయ్యే ఈ సహజ ఎరువు నేలలో సూక్ష్మజీవులను పెంచి పంటలకు తక్షణ పోషకాలను అందిస్తుంది. పంటల మార్పిడి.. వరి తర్వాత పప్పు ధాన్యాలు, పత్తి తర్వాత కూరగాయలు వంటి పంటల మార్పిడి పద్ధతులు నేలలో పోషకాల లోపాలను నివారిస్తాయి. వరుసగా ఒకే పంట వేయడం వల్ల నేలలోని కొన్ని నిర్దిష్ట పోషకాలు తక్కువై దిగుబడులు పడిపోతున్నాయి. విత్తనాల ఎంపిక, రైతుల అవగాహనే భవిష్యత్తు వ్యాధి నిరోధక, స్థానిక వాతావరణానికి తట్టుకునే విత్తనాలను ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నేల పరీక్షలతో అవసరమైన ఎరువులను వినియోగించడం ద్వారా ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇదిలా ఉండగా జిల్లాలో గతంలో 6వేల మట్టి శాంపిళ్లు తీయగా, దీనికి సంబంధించిన రిపోర్టు కాపీల ను రైతులకు అందించారు. ప్రజా పాలనలో భాగంగా 176 రెవెన్యూ గ్రామాల్లో 1,760 మట్టి నమూనాలను సేకరించి, ఇందుకు సంబంధించి రిజల్ట్ కాపీలను రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అందించారు. రెండు రోజుల క్రితం ప్రారంభమైన రైతు సదస్సుల్లో గ్రామానికి 20 చొప్పున 3,520 మట్టి శాంపిళ్లను సేకరించి ల్యాబ్కు పంపించారు. జిల్లాలో మట్టి పరీక్షల సమాచారం రైతులు పట్టాలు: 1.86లక్షలు రెవెన్యూ గ్రామాలు: 176గతంలో మట్టి పరీక్షలు: 6009 (రిజల్ట్ వచ్చింది) ప్రజాపాలనలో రెవెన్యూ గ్రామాల్లో చేసిన మట్టి పరీక్షలు: 1,760 (రిజల్ట్ వచ్చింది) రైతు సదస్సుల్లో మట్టి పరీక్షల శాంపిళ్ల సేకరణ: 3,520 చెరువు మట్టితో భూమిలో సూక్ష్మ పోషకాలు నేల పరీక్షల ప్రాధాన్యంపై రైతులకు అవగాహన వానాకాలం సీజన్కు ఇప్పటి నుంచే కసరత్తుస్థిర వ్యవసాయం వైపు అడుగులుజిల్లా రైతులు సహజ ఎరువులు, పంటల మార్పిడి, నేల పరీక్షలు వంటి పద్ధతులను అవలంబిస్తే భూసార యాజమాన్యం మెరుగై, దీర్ఘకాలికంగా స్థిరమైన వ్యవసాయం సాధ్యమవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. భూసారం బలంగా ఉంటే పంటల దిగుబడులు పెరిగి రైతుల ఆదాయం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. -
జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
జనగామ రూరల్: పట్టణంలోని స్థానిక ధర్మకంచ మినీ స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి 8, 10, 12, 14 16, 18 20 ఏళ్ల మెన్, ఉమెన్ అథ్లెటిక్స్ ఎంపికలు జరిగాయని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి గంగి శెట్టి మనోజ్ కుమార్ తెలిపారు. దాదాపు 130 మంది బాలబాలికలు వివిధ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొన్నారని, ఎంపికై న 8, 10, 12 14 సంవత్సరాల బాలబాలికలు ఈనెల 17న కొల్లూరులో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారన్నారు. అలాగే 14, 16, 18, 20 ఏళ్ల మెన్, ఉమెన్లలో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 10వ తేదీన హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే మూడో తెలంగాణ రాష్ట్ర స్థాయి త్రోస్ అండ్ జంప్స్ పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంజనగామ రూరల్: జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేయడానికి ఆసక్తి, అర్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి సందీప్ కుమార్ ఝా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అభ్యర్థులు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండడం తప్పనిసరని ముఖ్యంగా ఎంఎస్ ఆఫీసు వంటి అప్లికేషన్లలో నైపుణ్యం కలిగి ఉండాలన్నారు. అదనంగా డేటా సైన్స్ అంశాలపై అవగాహనతో పాటు కంప్యూటర్ సైన్స్లో విద్యార్హతలు ఉండాలని స్పష్టం చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 7వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కలెక్టర్ కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న విద్యా శాఖ ఇన్వార్డ్ విభాగంలో సమర్పించాలని కోరారు. డీఆర్ఓగా వెంకటేశ్వర్లు జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల బదిలీలు, పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో సిరిసిల్ల ఆర్డీఓగా పనిచేస్తున్న సీహెచ్.వెంకటేశ్వర్లను జన గామ జిల్లా డీఆర్ఓగా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన సిరిసిల్లలో ఆర్డీఓగా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో వెంటనే నూతన బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొన్నారు. సీఐకి అభినందన పతకంజనగామ: జనగామ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి ఐటీ నిబంధనలు, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం(సీఓటీపీఏ) అమలు, డ్రగ్ నియంత్రణ చర్యల్లో చూపిన కఠినతరమైన అమలు విధానానికి గుర్తింపుగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ చేతుల మీదుగా మంగళవారం అభినందన పురస్కారం అందుకున్నారు. ఇటీవలి కాలంలో ఈగిల్ యాక్షన్ గ్రూప్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై చేపట్టిన ప్రత్యేక చర్యలు, యువతకు మాదక ద్రవ్యాల ప్రమాదాలపై అవగాహన కల్పించడంలో సీఐ సత్యనారాయణరెడ్డి కీలకపాత్ర పోషించారు. సమాజంలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, చట్టాల అమలు వంటి అంశాల్లో సీఐ సత్యనారాయణ రెడ్డి చేపట్టిన చర్యలు పోలీస్ విభాగంలో అభినందనీయమని కమిషనర్ పేర్కొన్నారు. న్యాయవాదుల గుమస్తాల సంఘం నూతన కమిటీజనగామ రూరల్: జిల్లా కోర్టు న్యాయవాదుల గుమస్తాల సంఘం నూతన కార్యవర్గ కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కోర్నపాక ఉపేందర్, ప్రధాన కార్యదర్శిగా వల్లూరి నరేష్ ఎంపిక కాగా ఉపాధ్యక్షుడిగా భైరగోని శ్రీను, కోశాధికారిగా యాట అశోక్, కార్యదర్శిగా వేల్పుల మల్లేష్, కల్చరల్ యాక్టివిటీ ఇన్చార్జ్గా లకావత్ మహేందర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా శాడా శ్రవణ్, తోకల రమేశ్, గూడెపు అశోక్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు ఎమ్డీ ఖాజా పాషా, పుస్కూరి రఘు, ఎదునూరి పోచయ్య, బైరి శ్రీను, తుంగ బాలస్వామి, మల్ల మధు తదితరులు పాల్గొన్నారు. -
మట్టి పరీక్షలు తప్పనిసరి
జనగామ రూరల్: రైతులు మట్టి పరీక్షలు తప్పనిసరి చేసుకోవాలని వరితో పాటు పప్పు ధాన్యాలను పండించి ఆర్థిక వృద్ధి సాధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. 99 రోజుల ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని చౌడారం రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ..నేల ఆరోగ్య కార్డుల ద్వారా భూమిలో నత్రజని, భాస్వరం, పొటాష్ సూక్ష్మ పోషకాల స్థితిని తెలుసుకుంటే అవసరమైన ఎరువులను సరైన మోతాదులో అందించవచ్చన్నారు. దీంతో సాగు ఖర్చులు తగ్గడంతో పాటు దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. అనంతరం నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం మీద వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. రైతులకు మట్టి హెల్త్ కార్డును కలెక్టర్ అందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోని, డిప్యూటీ డైరెక్టర్ అఫ్ అగ్రికల్చర్ అనిత, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రమాకాంత్, ఏఈఓలు అనిల్, చౌడారం ఉప సర్పంచ్ ప్రవీణ్, రైతులు పాల్గొన్నారు. వరితోపాటు పప్పు ధాన్యాలను పండించాలి రైతులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచన -
వచ్చుడే లేటు..గంటకే పోవుడు
స్టేషన్ఘన్పూర్: వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పింఛన్ల కోసం లబ్ధిదారులు గంటల తరబడి మండుటెండలో వేచి ఉండాల్సి వస్తోంది. పట్టణానికి చెందిన లబ్ధిదారులకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రతీ నెల తపాలాశాఖ సిబ్బంది పింఛన్లు పంపిణీ చేస్తారు. అయితే పంపిణీ చేసే సిబ్బంది సకాలంలో రాకపోవడం, వచ్చినా ఒక గంట సేపు పంపిణీ చేసి వెళ్లిపోతుండగా లబ్ధిదారులు పెన్షన్ కోసం పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం వేసవికాలంలో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో నరకయాతన అనుభవిస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటల వరకే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు పెన్షన్ కోసం మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే 11 గంటల వరకు పెన్షన్ పంపిణీ చేసే వారు రాకపోవడంతో మండుటెండలో పండుటాకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం 11 గంటల వచ్చిన సిబ్బంది కేవలం ఒక గంట సేపు పంపిణీ చేసి వెళ్లిపోవడంతో లబ్ధిదారులు చేసేదేమి లేక మధ్యాహ్నం వరకు వేచి ఉన్నారు. ఈ విషయమై మున్సిపల్ చైర్మన్, సంబంధిత అధికారులు స్పందించాలని, పెన్షన్లను సకాలంలో పంపిణీ చేయాలని, ఒకే చోట అందరికీ కాకుండా వార్డుల వారీగా ఆయా బస్తీలలో పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. సకాలంలో పింఛన్లు అందించని తపాలా సిబ్బంది మండుటెండల్లో పండుటాకుల నిరీక్షణ -
చెల్లి బిడ్డలు ఇంటి నుంచి వెళ్లగొట్టారు..
ఈ ఫొటోలోని వృద్ధురాలి పేరు శ్రీరామోజు సోమక్క. భర్త పేరు పాపయ్య. లింగాల ఘణపురం మండలం వనపర్తి గ్రామం. 40 ఏళ్ల క్రితం భర్త మృతిచెందాడు. తనకు పిల్లలు లేకపోవడంతో ఒంటరిగా ఉంటోంది. తన చెల్లెలి కూతుళ్లు తనను చూసుకుంటానని తన వద్ద ఉన్న రెండున్నర తులాల బంగారం, రెండున్నర లక్షల రూపాయలు తీసుకున్నారు. మూడు నెలల తర్వాత ఇంటినుంచి వెళ్లగొట్టారు. దీంతో దిక్కుతోచక గ్రామంలోని తనకు ఉన్న పెంకుటింట్లో తలదాచుకుంటోంది. తనకు కాలు చేయి విరిగిందని పనిచేయలేని స్థితిలో ఉన్నానని, వచ్చే వృద్ధాప్య పింఛన్తో బతుకుతున్నానని వాపోయింది. షుగర్, బీపీతో ఇబ్బందులు పడుతున్నానని, తనకు ఆసరాగా తన డబ్బు బంగారం ఇవ్వాలని కలెక్టరేట్లో మొరపెట్టుకుంది. -
వైభవంగా హేమాచలుడి తెప్పోత్సవం
మంగపేట: మల్లూరులోని హేమాచల క్షేత్రంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు తెప్పోత్సవం కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాల యాగ్నికులు మరళీకృష్ణమాచార్యుల బృందం వేద మంత్రోచ్ఛరణతో సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం ఆలయంలోని మూలవిరాట్కు నిత్య పూజ, యాగశాలలో సేవాకాలం, బాలభోగం, చతుస్థానార్చన ఆలయ సమీపంలోని ఎద్దు ముక్కు వద్ద గల ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం(స్నపనం) మహానివేదన కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం 7 నుంచి 9గంటల వరకు చతుస్థానార్చన, తెప్పోత్సవం, దోపోత్సవం, శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం, హవనం కార్యక్రమ క్రతువులను వేద పండితులు మంత్రోచ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెప్పోత్సవం కార్యక్రమంలో భాగంగా లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పల్లకి(సేవ)పై మంగళ వాయిద్యాలతో తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలోని కొలనులో రెండు గంటల పాటు తెప్పోత్సవం నిర్వహించారు. అనంతరం పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ఆలయ ప్రాంగణంలో దోపోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు ముక్కామల శేఖర్ శర్మ, కారంపుడి పవన్కుమార్, అనిపెద్ది రాజీవ్శర్మ, ఏడునూతుల ఈశ్వర్చంద్ రామానుజం, బ్రహ్మోత్సవాల యాగ్నికులు పెరంబదూర్ మధనమోహనాచార్యులు, శ్రీ కృష్ణ యజుర్వేదం పండితులు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వెల్లువలా వినతులు
● కలెక్టరేట్ ప్రజావాణికి తరలొచ్చిన అర్జీదారులు ● 151 దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ● వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశంజనగామ రూరల్: కలెక్టరేట్ ప్రజావాణికి అర్జీదారులు పోటెత్తారు. చెల్లి కూతుళ్లు ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఓ మహిళ, బోదకాలుతో ఇబ్బంది పడుతున్నానని.. పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని ఒకరు,, భర్తలేడని తనకు పెన్షన్ ఇవ్వాలని ఓ వివాహిత..ఇలా పలు సమస్యలతో సోమవారం గ్రీవెన్స్ సెల్కు వచ్చారు. కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్న్స్ హాల్లో నిర్వహించిన గ్రీవెన్స్లో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా 151 అర్జీలను స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, వారి పరిధిలో ఉండే సిబ్బంది స్వీయగణన నమోదు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రంగారావు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృ నాయక్, డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు, డీడబ్ల్యూఓ కోదండరాములు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల్లో కొన్ని.. ● జనగామ మండలం చీటకోడూరు గ్రామానికి చెందిన కె.గణేష్ యాదవ్, తాను బీసీ డీ, యాదవ కులానికి చెందినవాడినని, తల్లిదండ్రులు కూలి పని చేస్తుంటారని, భూమి జాగా లేదు అని, ప్రైవేట్లో చదివించే స్థోమత లేదని, ఎంజేపీలో సీటు ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నాడు. ● లింగాల ఘణపురం మండలం పటేల్ గూడెం గ్రామానికి చెందిన జె.సురేష్, తనకు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం విద్యుత్ తీగల వల్ల ఆగిందని బిల్లు రాక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సమస్యను పరిష్కరించాలని వినతి అందజేశాడు. ● పాలకుర్తి మండలం సరిసన్నగూడెం గ్రామానికి చెందిన ఎస్.కొమురమ్మ తమది నిరుపేద కుటుంబమని, ఉండడానికి ఇల్లు లేదని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని కోరింది. ● జనగామ మండలం వెంకిర్యాల గ్రామానికి చెందిన మామిడి అంజయ్య, తనకు పెంకుటిల్లు ఉందని, అది శిథిలావస్థలో ఉందని, ప్రస్తుతం అద్దెకు ఉంటున్నారని, డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని వినతిపత్రం అందజేశాడు. ● లింగాల ఘణపురం మండలం చీటూరు గ్రామ సర్పంచ్ బర్ల గణేష్, గ్రామంలోని ఎంపీపీ పాఠశాలకు అదనపు తరగతి గదులు కావాలని, అలాగే వంటశాల షెడ్ మంజూరు చేయలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ● జనగామ పట్టణం వెంకన్నకుంటకు చెందిన బి.లక్ష్మి తన భర్త 5ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడని, సొంత ఇల్లు కూడా లేదని వాపోయింది. కూలి పని చేసుకుంటూ అద్దె ఇంట్లో తన పిల్లలతో జీవిస్తున్నానని, వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరింది. కలెక్టరేట్లో వైద్య శిబిరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కలెక్టరేట్కు వచ్చే వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడకుండా ఏఎన్ఎంతో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కలెక్టరేట్కు వచ్చేవారు బీపీ, షుగర్ వంటి పరీక్షలు చేయించుకోని మందులు తీసుకున్నారు. -
ఆమెకు ధీమా
జనగామ రూరల్: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించడంతోపాటు కుటుంబ ఆర్థిక ప్రగతికి వెన్నుదన్నుగా నిలుస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు బీమా పథకం మరింత ధీమా ఇవ్వనుంది. మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా వారి జీవితాలకు భరోసా కల్పిస్తూ..ప్రమాద బీమా పథకాన్ని 2028 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్నవారిలో ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా పరిహారం పొందే సౌలభ్యం కల్పించింది. దీనిపై జిల్లాలో సీ్త్రనిధి రుణాలు పొందిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు మరింత లబ్ధి చేకూరనుంది. జిల్లాలో 12 మండల సమైక్య సంఘాల్లో 11,237 సంఘాలున్నాయి. ఇందులో 1,26,786 మంది సభ్యులు ఉన్నారు. వీరు సీ్త్రనిధితో పాటు, బ్యాంకుల ద్వారా రుణాలు పొందుతూ స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకుంటున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆయా యూనిట్లు, ఉపాధి అవకాశాలు నెలకొల్పి, ఉపాధి పొందుతున్నారు. ప్రమాద బీమాను పెంచుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బీమా పథకం సీ్త్రనిధి ద్వారా అమలు జరగనుంది. మహిళలు స్వశక్తి సంఘంలో ఉండి ఏదైనా సహజమరణం చెందితే వారు తీసుకున్న రుణం మాఫీ కానుంది. ఆదే సీ్త్రనిధి, బ్యాంక్ రుణాలు తీసుకున్న మహిళా సంఘం సభ్యురాలు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం అందించే రూ.10లక్షలు నామినీ ఖాతాల్లో జమ చేయనున్నారు. వారికి సంబంధించిన రుణాన్ని మాఫీ చేస్తారు. 50 శాతం మించిన అంగవైకల్యం ఏర్పడితే సదరం ధ్రువపత్రం ద్వారా పరిశీలించి, రూ.5 లక్షలు అందించనున్నారు. ఈ పథకం ప్రారంభించక ముందు రుణం పొందిన వారు మరణిస్తే, వడ్డీతో కలిపి చెల్లించాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులు, సంఘం సభ్యులపై పడేది. పథకం లబ్ధికి అర్హత గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో 18 నుంచి 58 ఏళ్ల వారు స్వయం సహాయ సభ్యురాలిగా ఉన్నవారికి బీమా వర్తిస్తుంది. స్వశక్తి సంఘాల మహిళలకు బీమా భరోసా ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు, రుణమాఫీ పథకాన్ని 2028 వరకు పొడిగించిన ప్రభుత్వం జిల్లాలో 1,26,786 మంది సభ్యులు -
టెక్నాలజీతో లైబ్రరీ సేవల్లో మార్పులు
కేయూ క్యాంపస్: టెక్నాలజీతో లైబ్రరీ సేవల్లో వినూత్న మార్పులు వచ్చాయని గుజరాత్ రాష్ట్రంలోని ఇన్ఫ్లిబినెట్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ దేవికా పి మదల్లి అన్నారు. కాకతీయ యూనివర్సిటీలోని సెనేట్హాల్లో కేయూ పరిధిలోని లైబ్రరీ అసిస్టెంట్లకు సోమవారం నిర్వహించిన ఇన్ఫ్లిబినెట్ రీజినల్ ట్రైనింగ్ ప్రోగ్రాం లైబ్రరీ ఆటోమేషన్ ప్రారంభ సమావేశంలో ఆమె మాట్లాడారు. వన్నేషన్ ఇన్ సబ్స్క్రిప్షన్ కార్యక్రమం కింద సుమారు 6,500 సంస్థలు నమోదు చేసుకున్నామని పేర్కొన్నారు. కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీ లైబ్రరీకి రూసా నిధుల కింద రూ.2 కోట్లు, ప్రాజెక్టు కింద రూ.49 లక్షలు, సాధారణ బడ్జెట్లో రూ.కోటి మంజూరు చేసినట్లు తెలిపారు. బెంగళూరుకు చెందిన విశ్రాంత ఆచార్యులు ఏఆర్డీ ప్రసాద్ మాట్లాడుతూ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్పై అవగాహన కలిగి ఉండాలన్నారు. నిట్ లైబ్రేరియన్ ప్రొఫెసర్ వై. శ్రీనివాస్రావు, సోషల్ సైన్స్, ఆర్ట్స్ డీన్ బి.సురేశ్లాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి
స్టేషన్ఘన్పూర్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, కలెక్టర్ సూచనల మేరకు ఆర్డీఓ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఘన్పూర్ ఆర్డీఓ ఆఫీస్లో నిర్వహించిన ప్రజావాణికి 30 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆర్డీఓ డీఎస్ వెంకన్న మాట్లాడారు.. డివిజన్లోని వివిధ మండలాల నుంచి పలు సమస్యలపై 30 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇకపై ఆర్డీఓ కార్యాలయంలో ప్రతీ సోమవారం ప్రజావాణి ఉంటుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలు అందించిన దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. 8న వరంగల్లో జాబ్ మేళాజనగామ: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా యువతకు ఉపాధి అవకాశాలను విస్తృతంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్హత ఉన్న నిరుద్యోగ యువత కోసం మార్కెటింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్, హెల్త్కేర్, ఐటీ, బిజినెస్ సర్వీసెస్, కస్టమర్ సర్వీస్, హాస్పిటల్, డిజిటల్ మీడియా, లాజిస్టిక్స్ వంటి విభిన్న రంగాల్లో ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ, ఇండస్ట్రీస్, కామర్స్ విభాగం, ఐటీఈ,–సీ శాఖ ఆధ్వర్యంలో 50 కి పైగా ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో భాగస్వామ్యం కానున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి కె.కోదండరాములు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా యువత కోసం ఈ నెల 8వ తేదీన వరంగల్లో ఈ జాబ్మేళా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జాబ్ మేళాలో పాల్గొనే యువత https://satg.telangana. gov.in/prajapalana వెబ్సైట్ ద్వారా లేదా కేటాయించిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం–918255 2593 నెంబర్ను సంప్రదించవచ్చని తెలియజేశారు. ఆయిల్పామ్ సాగుపై నేడు అవగాహన సదస్సుబచ్చన్నపేట: ఆయిల్పామ్ సాగుపై రైతులకు అవగాహన కలిగించేందుకు నేడు (మంగళవారం) మండల కేంద్రంలో ఆయిల్పామ్ రైతుల అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆయిల్ఫెడ్ ఇన్చార్జ్ దయాకర్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నేడు ఉదయం 11 గంటలకు మండల కేంద్రంలోని జనగామ రోడ్డులో గల శ్రీనివాస ఫంక్షన్ హాల్లో జరిగే అవగాహన సదస్సుకు అన్ని గ్రామాల రైతులు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు. సదస్సుకు తెలంగాణ రాష్ట్ర ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, డీసీసీ అధ్యక్షులు లకావత్ ధన్వంతి, డీసీసీ ఉపాధ్యక్షుడు నూకల బాల్రెడ్డి, పలువురు అధికారులు హాజరవుతున్నారని తెలిపారు. టైర్ పేలి మద్యం వ్యాన్ బోల్తారఘునాథపల్లి: హైదరాబాద్–హన్మకొండ జాతీయ రహదారిలోని గోవర్ధనగిరి వద్ద సోమవారం రాత్రి ఓ మద్యం వ్యాన్ టైర్ పేలి బోల్తాపడింది. రాంపూర్ నుంచి రూ.5 లక్షల విలువైన మద్యం లోడ్తో జనగామ వైపు వెళ్తుండగా గోవర్ధనగిరి సమీపంలోకి రాగానే టైర్ పేలడంతో వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో వ్యాన్లో ఉన్న ఇద్దరు కార్మికులు, డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో మద్యం సీసాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. సగం వరకు మద్యం సీసాలు పగిలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మద్యం సీసాలు అపహరణకు గురికాకుండా చర్యలు తీసుకున్నారు. -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
జనగామ రూరల్: ఈనెల 7వ తేదీన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కడియం శ్రీహరి నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పర్యటనపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ..రూ.50 కోట్లతో 7 విద్యుత్ ఉప కేంద్రాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని వేలేరు మండలం, పీచర గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన 132/33 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని, చిల్పూర్ మండలం, కొండాపూర్, జఫర్గఢ్ మండలం సాగరం, రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామంలో 33/11 కేవీ ఉప కేంద్రాలను ప్రారంభించనున్నారన్నారు. చిల్పూర్ మండలంలో 33/11 కేవీ లింగంపల్లి, పల్లగుట్ట, నష్కల్ ఉప కేంద్రాలకు శంకుస్థాపన చేయనున్నారన్నారు. ఉప ముఖ్యమంత్రి పర్యటనను విజయ వంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యటనలో ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని స్పష్టం చేశారు. సమీక్ష సమావేశంలో ఆర్డీఓ వెంకన్న, డీఏఓ అంబికా సోనీ, జెడ్పీ సీఈఓ రంగారావు, ఏబీసీడీఓ రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవి లత, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్, విద్యుత్ శాఖ అధికారి సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పల్లగుట్టలో సభ ఏర్పాట్ల పరిశీలనచిల్పూరు: మండలంలోని పల్లగుట్టలో ఈనెల 7న జరగనున్న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క బహిరంగ సభ ప్రాంతాన్ని ఎమ్మెల్యే కడియం పరిశీలించారు. చిల్పూరు ఆలయ చైర్మన్ శ్రీధర్రావు, సర్పంచ్ ఎనగందుల నరసింహారెడ్డి, అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొదట జఫర్గడ్ మండల కేంద్రంలో బహిరంగ సభ అనుకున్నప్పటికీ దాన్ని పల్లగుట్ట గ్రామంలో 5 వేల మందితో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సర్పంచ్లు శాతబోయిన రాజు, ఆర్డీఓ వెంకన్న, తహసీల్దార్ విజయ్కుమార్, ఎంపీడీఓ రఘురామకృష్ణ, ట్రాన్స్కో అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటనపై ఎమ్మెల్యే కడియం, కలెక్టర్ సమీక్ష పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం -
లారీల కోసం రోడ్డెక్కిన రైతన్న
నర్మెట: లారీలు సకాలంలో రాకపోవడంతో ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతోందని మండలంలోని హన్మంతాపురం ఐకేపీ సెంటర్ రైతులు ఆదివారం రోడ్డుపై ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. మద్దతు తెలిపిన సీపీఎం రైతు సంఘం జిల్లా కార్యదర్శి చందూనాయక్ మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యంతో లారీలు సకాలంలో రాకపోవడంతో మండుటెండలో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, అన్నదాతలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని తక్షణం అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై నైనాల నగేష్ తన సిబ్బంది రాజు, విజయ్ కిరణ్తో వెళ్లి సర్దిచెప్పి ధర్నా విరమింపజేశారు. -
గాలిదుమారం..రైతుల ఆగమాగం
అకాల వర్షం.. అన్నదాతల ఇక్కట్లుదేవరుప్పుల: ఆరుగాలం శ్రమించి పంట దిగుమతి చేసి ఫలితం పొందుదామన్నా అన్నదాతలకు అకాల వర్షం వెంటాడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షం పడడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, రైతుల కల్లాల వద్ద మొక్కజొన్నల రక్షణకు రైతులు నానా తంటాలు పడ్డారు. మరోవైపు నెల రోజులు కావాస్తున్నా ధాన్యం కాంటా పెట్టకపోవడంతో ఇటు మండుటెండలకు ఆరిపోవడమేగాక అకాల వర్షంతో రాశులు నీళ్లపాలు అయ్యేటట్టూ ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతుల దుస్థితిపై సత్వరమే స్పందించి యుద్ధప్రాతిపదికన కాంటాపెట్టి రైసు మిల్లుకు తరలించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.కొడకండ్ల: కాంటాలు నత్తనడకన సాగుతుండడం, మబ్బులు పట్టి చిరుజల్లులు కురుస్తుండడంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆగమాగమవుతున్నారు. ఆదివారం సాయంత్రం ఆకస్మాత్తుగా గాలిదుమారం, ఉరుములతో కూడిన చిరుజల్లు కురువడంతో కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యాన్ని తడువకుండా కాపాడుకొనేందుకు అష్టకష్టాలు పడ్డారు. మార్కెట్ యార్డులో ఐకేపీ ఆధ్వర్యంలో రెండు కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తుండగా 20 మంది మాత్రమే హమాలీలు ఉండడంతో కాంటాలు ఆలస్యమవడమే కాకుండా కాంటా అయిన ధాన్యం కూడా ఎగుమతిలో జాప్యం జరుగుతోంది. తేమశాతం వచ్చేదాక ధాన్యాన్ని ఆరబోసుకొని తాలు లేకుండా తూర్పారపట్టిన తర్వాత కాంటా వేసిన ధాన్యం మిల్లుకు ఎగుమతి అయ్యాక మిల్లర్లు తాలు పేరిట బస్తాకు కిలో చొప్పున కోత విధిస్తుండడంతో తమ గోడును పట్టించుకొనే వారే కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే అకాల వర్షాల భయం నెలకొనగా కాంటాలు ఆలస్యమై కొనుగోలు కేంద్రాల్లోనే పది రోజులకు పైగా పడికాపులు కాయాల్సి రావడం, తీరా కాంటా అయ్యాక కిలో తరుగుకు అంగీకరిస్తేనే దిగుమతి చేసుకొంటామని లేకుంటే చేసుకోమని మిల్లర్లు షరతులు విధిస్తుండటంతో దిక్కుతోచని దుస్థితిలో రైతులు కోతకు అంగీకరిస్తున్నారు. మార్కెట్ పాలకవర్గం, అధికారులు తమ గోసను పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఇక మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించి పది రోజులు దాటినా కూడా ఇంత వరకు కాంటా ప్రారంభించకపోవడంతో రైతులు పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హమాలీల కొరతతో కాంటాలు ఆలస్యం పదిరోజులైనా కాంటా కాని మక్కలు -
ప్రశాంతంగా ‘నీట్’
సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026ఘనంగా శ్రీరంగనాథస్వామి విగ్రహ ప్రతిష్ఠాపనజఫర్గఢ్: మండల కేంద్రంలోని వేల్పుగొండ కొండ దిగువన ఉన్న సీతారామచంద్ర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శ్రీరంగనాథస్వామి విగ్రహా ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామివారి ఉత్సవ విగ్రహాలతో వేదపండితులు తమ మంత్రోచ్ఛరణల మధ్య పూజ కార్యక్రమాలు ప్రారంభించారు. కుంభస్థాపన, అగ్నిప్రతిష్ట, శాంతి హోమం, పూర్ణహూతి తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించడంతో పాటు కల్యాణమహోత్సవాన్ని నిర్వహించారు. కన్నులపండువగా సాగిన ఈ వేడుకలను భక్తులు కనులారా తిలకించి భక్తి పారవశ్యంలో ముగినిగిపోయారు. అనంతరం స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా స్వామివారి తీర్థప్రసాదాలను అందజేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పూజారులు పొడిచేటి వెంకటాచార్యులు, శ్రీనివాసచార్యులు, కృష్ణమాచార్యులతో పాటు భక్తులు, భారీ సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. చురుగ్గా ఆర్యూబీ పనులురఘునాథపల్లి: మండలంలోని గోవర్ధనగిరి రైల్వే గేట్ వద్ద ఆర్యూబీ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. నాలుగు నెలల్లో ఆర్యూబీ అందుబాటులోకి తీసుకొచ్చేలా నిర్మాణ పనులు వేగవంతం చేశారు. ఇందులో బాగంగా ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపివేసి రెండు భారీ క్రేన్లతో 45 టన్నుల సామర్థ్యం గల గడ్డర్ను ఏర్పాటు చేశారు. రైల్వే ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా యుద్ధప్రాతిపదికన దాదాపు 140 మందితో గడ్డర్ ఏర్పాటు చేశారు. భారీస్థాయిలో చేపట్టిన ఈ పనులను గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. సికింద్రాబాద్– కాజీపేట రైల్వే మార్గం కావడంతో ఈ గేట్ వద్ద రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో ఒక్కోసారి 10 నుంచి 15 నిముషాల పాటు గేటు మూసివేయడంతో అత్యవసర పనులపై వెళ్లే గ్రామస్తులు పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్యూబీ అందుబాటులోకి వస్తే గ్రామస్తుల నిరీక్షణకు తెర పడనుంది. కామ్రేడ్ దోస్తులు.. సైకిల్ సవారీజనగామ: జిల్లాలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్న్స్ టెస్ట్ (నీట్) పరీక్ష ఆదివారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల, పెంబర్తిలోని జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో మొత్తం రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 566 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా, 23 మంది గైర్హాజరైనట్లు పరీక్షల కో ఆర్డినేటర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ వెల్లడించారు. పరీక్ష కేంద్రాల వారీగా హాజరు ఏబీవీ డిగ్రీ కళాశాల కేంద్రంలో 408 మందికి అవకాశం ఇవ్వగా, 389 మంది విద్యార్థులు హాజరయ్యారు. 19 మంది గైర్హాజరయ్యారు. పెంబర్తిలోని జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాల కేంద్రంలో 158 మందికి బదులు 154 మంది హాజరుకాగా, నలుగురు గైర్హాజరైనట్లు అధికారులు వివరించారు. ఉదయం 11 గంటల నుంచి సెంటర్ల వద్ద విద్యార్థులను లోనికి అనుమతిస్తూ సిబ్బంది క్రమశిక్షణతో తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష మూడు గంటల పాటు సాగింది. పరీక్ష సమయంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు లేకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ పర్యవేక్షణలో ఇద్దరు ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు సహా భారీగా పోలీసు సిబ్బందిని మోహరించారు. కఠినమైన తనిఖీలు.. పరీక్షలో నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ విద్యార్థినుల జడ క్లిప్లను కూడా తీసి వేయించారు. హైహీల్స్ సాండిల్స్, నల్లటి దారాలు, సాక్సులు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి వాటిని రెండుసార్లు తనిఖీ చేసిన తర్వాతే బయట వేసి లోనికి పంపారు. పాస్ ఫొటోలు తెచ్చుకోని విద్యార్థులు ఎక్కువగా ఉండడంతో తల్లిదండ్రులు 42 డిగ్రీల సెల్సియస్ ఎండలో ఫొటో స్టూడియోల కోసం పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈ సందర్భంలో పోలీసులు తల్లిదండ్రులకు రవాణా పరంగా పూర్తి సహకారం అందించారు. ఎరేజర్, పెన్సిల్ వంటి అవసరాలపై స్పష్టత లేక కొంతమంది తల్లిదండ్రులు పరీక్ష సెంటర్ల వద్ద ఆందోళన చెందారు. మూడు గంటల పాటు పరీక్ష రాసే విద్యార్థుల కోసం బయట వేచిచూసిన కుటుంబ సభ్యులు ఎండ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సెంటర్ల వద్ద అంబులెన్స్తో పాటు వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లను సిద్ధంగా ఉంచారు. పరీక్షలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థుల ఆవేదన చివరి పది నిమిషాల్లో నలుగురు విద్యార్థులు రావడంతో హడావుడి నెలకొంది. మధ్యాహ్నం 1.30 తర్వాత వచ్చిన మరో ముగ్గురు విద్యార్థులను అధికారులు సెంటర్లలోకి అనుమతించలేదు. ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్కు లకావత్ బాపూజీ ఉదయం ఎనిమిదిన్నరకు రావడంతో గందరగోళానికి గురై మధ్యాహ్నం తిరిగి వచ్చినప్పటికీ ఆలస్యంగా రావడంతో పరీక్ష రాయలేకపోయాడు. ఆలేరు నుంచి వచ్చిన ఆరె హిందూప్రియ, లకావత్ ఉదయ్ కిరణ్ కూడా ఆలస్యంగా రావడంతో నిరాశ చెందారు. పోలీసుల పర్యవేక్షణ, కట్టుదిట్టమైన తనిఖీలతో జిల్లాలో నీట్ పరీక్ష ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా విజయవంతంగా ముగిసింది.● చల్లబడ్డ ఆకాశం.. ఈదురు గాలులు రైతుల ఆందోళన ● ధాన్యం సెంటర్లలో వేలాది బస్తాలు ● కోతకు సిద్ధంగా ఉన్న వరిపంటచుక్క సత్తయ్య విగ్రహావిష్కరణ చేస్తున్న బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యే పల్లా, క్యామ మల్లేశం పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు 566 మంది విద్యార్థులు... 543 మంది హాజరు ముగ్గురు విద్యార్థుల ఆలస్యం.. కన్నీటి పర్యంతంతో ఇంటికి విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోనికి అనుమతిప్రశాంత వాతావరణంలో పరీక్ష: కలెక్టర్ జిల్లాలో నిర్వహించిన నీట్ పరీక్ష ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో జరిగిందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఆదివారం జిల్లాలో నీట్ పరీక్ష జరిగిన ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెంబర్తిలోని మహాత్మ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ గురుకుల సెంటర్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, పోలీసు అధికారులు, నీట్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
పొద్దంతా ఎండలు..సాయంత్రం మబ్బులు
జనగామ: జిల్లాలో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి, ఈదురుగాలులతో అన్నదాతను టెన్షన్ పెట్టించింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటతో పాటు ధాన్యం కొనుగోలు సెంటర్లలో నిల్వలు, రహదారులపై ఆరబోసిన ధాన్యంతో రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కోతకు సిద్ధమైన పంటలకు కూడా అకాల వర్షాలు ముప్పుగా మారాయి. జిల్లాలో ఆదివారం ఉదయం 42 డిగ్రీల సెల్సీఎస్ ఆకాశంలో మబ్బులు, ఉరుములు కనిపించినప్పటికీ మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండలు రైతులను ఇబ్బందులకు గురిచేశాయి. సాయంత్రం ఐదున్నర తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో పాటు ఈదురుగాలులు, కొన్నిచోట్ల చిరుజల్లు కురవడంతో జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకున్నాయి. అకాల వాతావరణ మార్పులు రైతుల్లో ఆందోళన పెంచాయి. ధాన్యం నిల్వలపై వర్షం ప్రభావం ధాన్యం కొనుగోలు సెంటర్లలో కాంటా పూర్తి చేసుకుని తరలింపునకు సిద్ధంగా ఉంచిన వేలాది బస్తాలతో పాటు కొనుగోలుకు ఎదురుచూస్తున్న ధాన్యం నిల్వలతో అధికార యంత్రాంగంతో పాటు రైతులు అలర్టయ్యారు. తేమ శాతం కోసం రహదారులు, కల్లాలు, గ్రామ పరిసరాల్లో ఆరబోసుకున్న ధాన్యాన్ని రైతులు వెంటనే ఒకచోట చేర్చి కుప్పగా చేస్తున్నారు. టార్పాలిన్ కవర్లు ముందస్తుగా సిద్ధం చేసుకుని వర్షం కురిస్తే నష్టం జరగకుండా అష్టకష్టాలు పడుతున్నారు. కోతకు సిద్ధంగా వరి జిల్లాలో అన్ని మండలాల్లో కొంతమేర వరి పంటలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సమయంలో ఈదురుగాలులు, అకాల చిరుజల్లులు పంటలకు నష్టం చేసే అవకాశం ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా మార్చి చివరి వారం, ఏప్రిల్ మొదటి వారాల్లో వడగళ్ల వాన, ఈదురుగాలులతో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చేది. అయితే ఈసారి మే తొలివారంలో ఇలాంటి వాతావరణ మార్పులు రైతులను మరింతగా టెన్షన్ పుట్టించేలా గురిచేస్తున్నాయి. చల్లబడుతున్న ఆకాశంతో రైతుల కష్టాలు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు దంచికొట్టే ఎండలు నమోదయ్యాయి. వెంటనే గాలులు, చిరుజల్లులు రావడంతో వాతావరణం పూర్తి భిన్నంగా మారిపోయింది. వడదెబ్బకు గురి చేసే విధంగా మండే ఉష్ణోగ్రతల మధ్య ధాన్యం రక్షణ చర్యలు చేపట్టడం రైతులకు భారీ శ్రమగా మారింది. ఈ పరిస్థితుల్లో ధాన్యం, పంటలకు ఏ నష్టం జరగకూడదని రైతులు వరుణ దేవున్ని ప్రార్థిస్తున్నారు. -
నేటినుంచి రైతు వారోత్సవాలు
జనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రోత్సాహం రైతులను ఆర్థికంగా మరింత బలోపేతం చేయాలనే ప్రధాన ఉద్దేశ్యంతో రాష్ట్రవ్యాప్తంగా రైతు వారోత్సవాలు–2026 కార్యక్రమాలకు సిద్ధమైంది. ఈనెల 4 నుంచి 9 వరకు అన్ని మండలాలు, గ్రామపంచాయతీలు, రైతు వేదికలు, క్లస్టర్ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు శాసీ్త్రయ పద్ధతులు అవలంబించడం ప్రతీ రైతుకు నేరుగా చేరుకుని, క్షేత్రస్థాయిలో సమగ్ర అవగాహన కల్పించేలా రైతు వారోత్సవాలు నిర్వహించనున్నారు చేపట్టనున్న కార్యక్రమాలు వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య, సహకార, మార్కెటింగ్, విద్యుత్ శాఖల సమన్వయంతో జిల్లాలోని ప్రతీ గ్రామంలో రైతులు కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని రైతు వేదికల్లో గ్రామ సచివాలయాలు, పంచాయతీ భవనాలు, పాఠశాల ప్రాంగణాలలో రైతులతో ముఖాముఖి సమావేశాలు, క్షేత్ర ప్రదర్శనలు, సాంకేతిక సదస్సులు, ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రతీ మండలంలో ప్రణాళిక సిద్ధం చేసి గ్రామాల వారీగా షెడ్యూల్ ప్రకారం మహిళా రైతులు, యువ రైతులు, కౌలు రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులకు ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ పథకాల అర్హులైన రైతులను అక్కడికక్కడే గుర్తించి నమోదు చేయనున్నారు. రోజు వారీ కార్యక్రమాలు: ● 4వ తేదీన భూసార పరిరక్షణ, నేల ఆరోగ్య నిర్వహణ, సేంద్రియ పదార్థాల వినియోగం, పంటల మార్పిడి, గ్రీన్ మ్యాన్యూర్, సూక్ష్మ పోషకాల వినియోగం, నేల నమూనాల సేకరణ, భూసార పరీక్షల ప్రాముఖ్యంపై రైతులకు అవగాహన కల్పించడం ● 5వ తేదీన పండ్ల తోటలు, కూరగాయల సాగు, ఆయిల్పామ్, మసాలా పంటలు, పూల సాగు, నర్సరీ అభివృద్ధి, రక్షిత సాగు, షేడ్నెట్, పాలీహౌస్ సాగుపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహిస్తారు. ● 6వ తేదీన పంట రుణాలు, వ్యవసాయ యంత్రాల సబ్సిడీలు, పంట బీమా, రైతు క్రెడిట్ కార్డులు, బ్యాంకు లింకేజీ, సహకార సంఘాల సేవలు, మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన ● 7వ తేదీన ఆధునిక వ్యవసాయం యాంత్రీకరణ డ్రోన్ సాంకేతికత, వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్లు, పవర్ వీడర్లు, రీపర్లు, సీడ్ డ్రిల్స్, స్ప్రేయర్లు, డ్రోన్ టెక్నాలజీ వినియోగంపై ప్రదర్శనలు నిర్వహిస్తారు. ● 8వ తేదీన పాడి పరిశ్రమ, గొర్రెలు, మేకల పెంపకం, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై అవగాహన ● 9వ తేదీన రైతు వారోత్సవాల ముగింపులో నీటి వనరుల పరిరక్షణ, సాగునీటి సమర్థ వినియోగం పరిసరాల పరిశుభ్రతకు పంటల అవసరాలకు అనుగుణంగా నీటిని పొదుపుగా వినియోగించే పద్ధతులు, సూక్ష్మ నీటిపారుదల విధానాలు తెలపడం. వారం రోజుల పాటు నిర్వహించనున్న రైతు వారోత్సవాల్లో జిల్లాలోని వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్ని మండలాల అధికారులు, రైతు సంఘాలు, రైతులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, శాఖల అధికారులు, సిబ్బంది, యువత స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలి. – అంబికా సోని, జిల్లా వ్యవసాయ అధికారి ఆరు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు రైతులకు శాసీ్త్రయ ఆధునిక సాంకేతికత వ్యవసాయంపై అవగాహన -
ఎలాంటి ఇబ్బందులూ రావొద్దు
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించే నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నారు. అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఉండాలన్నారు. సమీక్ష సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, వర్ధన్నపేట ఏసీపీలు పాల్గొన్నారు. -
‘నీట్’కు సర్వం సిద్ధం
జనగామ: దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్)–2026 వైద్య ప్రవేశ పరీక్షకు సంబంధించి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలోని జిల్లా లెవెల్ కోఆర్డినేటర్ కమిటీ పర్యవేక్షణలో ఈ పరీక్షలను నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. సిటీ కోఆర్డినేట్, నోడల్ ఆఫీసర్, ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్ నే తృత్వంలో జిల్లాలోని రెండు సెంటర్లను ఏర్పాటు చే శారు. ఇందులో సిద్దిపేట రోడ్డులోని ఏబీవీ ప్రభు త్వ డిగ్రీ కళాశాల, పెంబర్తి మహాత్మా గాంధీ జ్యోతి బాఫూలే గురుకులంలో పరీక్ష నిర్వహించనున్నారు. రెండు సెంటర్లు.. 566 మంది విద్యార్థులు జిల్లాలో నీట్ పరీక్ష కోసం ఏర్పాటు చేసిన రెండు సెంటర్ల పరిధిలో 556 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిమిత్తం ఏబీవీ డిగ్రీ కళాశాలలో 17 రూమ్లు, మహాత్మా జ్యోతిబాఫూలే సెంటర్లో 7 రూమ్లు సిద్ధం చేశారు. మొత్తం 48 మంది ఇన్విజిలేటర్లను నియమించగా, ప్రతీరూమ్లో 24 మంది విద్యార్థులకు ఇద్దరు ఇన్విజిలేటర్లు పర్యవేక్షణ ఉంటుంది. ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్ సూపరింటెండెంట్గా డాక్టర్ ఎ.రవీంద్ర నాయక్, మహా త్మా జ్యోతిబాఫూలే సెంటర్ సూపరింటెండెంట్గా ఎం.వనిత విధులు నిర్వర్తించనున్నారు. పరీక్షల సందర్భంలో పోలీసు, పురపాలక, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ తదితర విభాగాలు సమన్వయంగా పనిచేస్తున్నాయి. నీట్–2026 పరీక్ష పూర్తిగా సీసీ కెమెరాల నిఘా నీడలో నిర్వహించనున్నారు. విద్యార్థులకు రూటు పరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో సెంటర్లకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. 180 ప్రశ్నలు..720 మార్కులు నీట్ పరీక్షలో 180 ప్రశ్నలు, 720 మార్కులకు నిర్వహిస్తారు. పూర్తిగా ఆఫ్లైన్లో, మల్టిపుల్ ఛాయిస్ మోడల్లో పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూడు గంటల పాటు జరగనుంది. బయోమెట్రిక్, ఫేస్ రికగ్నేషన్ తదితర పరిశీలనల కోసం విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు అంటే రెండున్నర గంటల ముందు నుంచే సెంటర్లలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత గేట్లు మూసివేస్తారు. గేట్లు మూసిన అనంతరం సెకను ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించరు. పోలీసు పర్యవేక్షణ పరీక్షా సెంటర్ల పరిసరాల్లో సెక్షన్ 144 అమల్లో ఉంటుంది. డీసీపీ రాజమహేంద్ర నాయక్ పర్యవేక్షణ లో ఇద్దరు ఏసీపీలు, ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్సైలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, 35 కానిస్టేబుళ్లు మొత్తం 45 మంది బందోబస్తులో ఉంటారు. జిల్లా కేంద్రంలో రెండు సెంటర్లు పరీక్షకు హాజరుకానున్న 566 మంది విద్యార్థులు అరగంట ముందుగానే గేట్లు క్లోజ్ సెకను ఆలస్యంగా వచ్చిన అనుమతికి నోజిల్లాలో నీట్–2026 పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యవేక్షణలో పకడ్బందీగా పరీక్షల నిర్వహణ కోసం చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో రెండు సెంటర్లను ఏర్పాటు చేయగా, 566 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. – డాక్టర్ కె.శ్రీనివాస్, పరీక్షల కోఆర్డినేటర్ -
మక్కల ప్రైవేట్ తూకంపై కలెక్టర్ ఆగ్రహం
లింగాలఘణపురం: మండలంలోని కుందారం మక్కల కొనుగోలు కేంద్రంలో తూకంలో జాప్యం జరుగుతోందని, కొంతమంది రైతులు ప్రైవేట్గా కాంటాలు వేస్తున్నారని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. శనివారం మండలంలోని కుందారం, చీటూరులో ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కుందారంలో మక్కల కొనుగోలు కేంద్రంలో కొంతమంది రైతులు సొంత కాంటాలను ఏర్పాటు చేసుకొని తూకం వేస్తుండడం గమనించి ఇదేంటని ప్రశించి ఇలాంటి వ్యవహారాలు చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుందారంలో మక్కల కొనుగోలులో జాప్యం, తూకం వేసిన మక్కలను తరలించడంలో కలుగుతున్న ఇబ్బందులు, ఇతర మండలాల నుంచి మక్కలు రావడంతో ఎక్కువై కలుగుతున్న ఇబ్బందులను సర్పంచ్ కూకట్ల రాజు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ మార్క్ఫెడ్ అధికారులతో మాట్లాడి రైతులు ప్రైవేట్గా తమ ట్రాక్టర్లలో గోదాంలకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. -
నెలరోజులుగా పనులకు రాని ఉపాధి కూలీలు
కొడకండ్ల: మండలంలో ఉపాధిహామీ పనులు ముమ్మరంగా జరుగుతున్నా గుమ్ములబండ తండాలో మాత్రం నెలరోజులుగా ఉపాధి పనులకు కూలీలు రావడం లేదు. ఉపాధిహామీ సిబ్బంది తండాకు వెళ్లి పలుమార్లు ఉపాధి పనులకు రావాలని కూలీలను కోరినా ఫలితం లేకుండా పోయింది. గుమ్ములబండ తండాలో 112 జాబ్కార్డులుండగా 200 దాకా కూలీలు ఉన్నప్పటికీ రెగ్యులర్గా 120 మంది ఉపాధి కూలీలు పనులు హాజరవుతుంటారు. ఈ సీజన్లో వరి కోతలు, మొక్కజొన్న కోతలు వంటి వ్యవసాయ పనులుండటంతో వారంతా ఆ పనుల్లో నిమగ్నమై ఉపాధి పనులకు దూరంగా ఉంటున్నారు. కాగా, శనివారం సర్పంచ్ గుగులోత్ వీరేశ్నాయక్ ఇంటింటికి తిరిగి ఉపాధి పనులకు హాజరు కావాలని బొట్టు పెట్టి మరి కూలీలను ఆహ్వానించారు. ముమ్మరంగా వ్యవసాయ పనులు ఉండటం వలన రాలేకపోయామని, సోమవారం నుంచి హారజవుతామని కూలీలు ఏపీఓ నరిగే కుమారస్వామికి తెలిపారు. బొట్టుపెట్టి రావాలని సర్పంచ్ వినతి -
190 ఈఓ పోస్టులతో దేవాలయ పాలన సులభం
పాలకుర్తి టౌన్: తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖకు నూతనంగా 190 కార్యనిర్వహణాధికారుల పోస్టులు మంజూరు చేయడంతో దేవాలయాల పరిపాలన సులభమవుతుందని అర్చక, ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డీవీఆర్ శర్మ అన్నారు. శనివారం హన్మకొండలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నివాసంలో అర్చక ఉద్యోగ నేతలు ఆమెను కలిశారు. ఈ సందర్భంగా జీఓ 42 కాపీని మంత్రి అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర అధ్యక్షుడు బేతి రంగారెడ్డి, టక్కర్సు సత్యం, సూపరింటెండెంట్లు చారి, విజయ్, కొత్తపల్లి వెంకటయ్య పాల్గొన్నారు. -
ధాన్యం తరలించాలని రాస్తారోకో
బచ్చన్నపేట: ధాన్యం తరలించడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని శనివారం మండలంలోని ఆలింపూర్, తమ్మడపల్లి గ్రామాల్లో రైతులు రాస్తారోకో నిర్వహించారు. వడ్ల బస్తాలను జనగామ–చేర్యాల జాతీయ రహదారిపై వేసి కలెక్టర్ రావాలంటూ నిరసన తెలిపారు. దీంతో వాహనాలు అక్కడే కిలోమీటరు మేర నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు నరెడ్ల బాల్రెడ్డి, మేకల కవితరాజు మాట్లాడుతూ.. వరి కోసి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్నా ధాన్యం తరలించడం లేదని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు రావడం లేదని వెంటనే సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. ధర్నా వద్దకు ఎస్సై ఎ.శ్రీకాంత్ చేరుకొని కొనుగోలు కేంద్రాలకు లారీలు వచ్చేలా అధికారులతో మాట్లాడుతానని హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు వందలాది మంది పాల్గొన్నారు. -
‘బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు అవాస్తవం’
జనగామ: పది సంవత్సరాలు అధికారంలో ఉండి అభివృద్ధి చేయలేని బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలు వాస్తవానికి దూరంగా, రాజకీయ అక్కసుతో నిండిపోయి ఉన్నాయని మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ అన్నారు. శనివారం పురపాలికలోని తన చాంబర్లో మాట్లాడారు.. ఇటీవల జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశంపై బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలను ఖండించారు. దశాబ్దకాలం పాటు మున్సిపాలిటీని అప్పుల బారిన పడేలా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన అన్నారు. కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగడం వల్లే సభ వాయిదా పడిందని తెలిపారు. ఇంటింటికీ చెత్త సేకరణలో భాగంగా ప్రజలపై ఒక్క రూపాయి భారం పడకుండా 11 ఆటోలు కొనుగోలు చేయడంతో పాటు 30 మంది సిబ్బందిని నియమించేందుకు మంత్రి, కలెక్టర్ అనుమతిని ఇప్పటికే పొందినట్లు తెలిపారు. -
కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలి
జఫర్గఢ్: పిల్లలందరూ కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీతండా వద్ద ఉన్న మా ఇల్లు ప్రజాదరణ అనాథ ఆశ్రమంలో శనివారం చైల్డ్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్, డ్రగ్స్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. లక్ష్య సాధన దిశగా ముందుకు సాగినప్పుడే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతామన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కోదండరాములు, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ శ్రీనివాసరావు, స్థానిక ఎస్సై రామారావు, ఈగల్ (నార్కోటిక్) ఎస్సై కుమారస్వామి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రవికాంత్, స్వప్నరాణి, చైల్డ్ హెల్ప్ లైన్ కౌన్పిలర్ మమత, ఆశ్రమ ఇన్చార్జిలు పూజ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ -
మా జీవితాలు ఇక దుర్భరమే..
కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం దారుణం. ఒక్కసారిగా రూ.1000 పెంచడంతో వ్యాపారంపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. తమ హోటల్లో నెలకు పదికి పైగా కమర్షియల్ సిలిండర్లు అవసరముంటాయి. ఇప్పటికే గ్యాస్ కొరతతో పలు హోటళ్లను నామమాత్రంగా నడిపిస్తున్నాం. పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటల్ వ్యాపారుల జీవితాలు దుర్భరంగా మారనున్నాయి. – జొన్నల వినయ్, టిఫిన్ సెంటర్ యజమాని, శివునిపల్లి, స్టే.ఘన్పూర్● -
చట్టాలపై అవగాహన ఉండాలి
జనగామ రూరల్: పారా లీగల్ వలంటరీలకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో పారా లీగల్ వలంటరీలకు చట్టాలపై భవిష్యత్తులో చేసే కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎస్.శ్రీదేవి, వలంటీర్లు పాల్గొన్నారు.నూతన జడ్జి బాధ్యతల స్వీకరణస్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ జూనియర్ సివిల్ కోర్టుకు పర్మినెంట్ జడ్జిగా వచ్చిన జూనియర్ సివిల్ జడ్జి శివలీల శనివారం బాధ్యతలు స్వీకరించగా ఘన్పూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకం రమేశ్, న్యాయవాదులు స్వాగతం పలికారు. ఆయన వెంట బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మునిగాల రవీందర్, షన్మాకుమారి, శ్రీనివాస్, బాబు తదితరులున్నారు. ఈసందర్భంగా స్థానిక న్యాయవాదులు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో న్యాయవాదులు గట్టు రవి, గట్టు మనోహర్, నీరటి కార్తీక్, పోగుల కార్తీక్, గాదె పృథ్వీ, సుష్మ, భువన్చంద్ర తదితరులు పాల్గొన్నారు.ప్రతీ సోమవారం ఆర్డీఓ కార్యాలయాల్లో గ్రీవెన్స్జనగామ: జిల్లాలో ప్రజల వినతులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ సోమవారం ఆర్డీఓ కార్యాలయాల్లో రెవెన్యూ డివిజన్ స్థాయి గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టరేట్ సూపరింటెండెంట్ రజిత శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రీవెన్స్లో ఆర్డీఓ నోడల్ అధికారిగా పర్యవేక్షించనుండగా, అన్ని శాఖల డివిజన్ స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై, ప్రజల వినతులను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతీ అర్జీని ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఇక నుంచి ఎన్ఐీసీ పోర్టల్ స్థానంలో సీజీజీ గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా నమోదు చేయడం జరుగుతుందన్నారు. ప్రతీ వినతిదారుడికి యూనిక్ రిఫరెన్స్ నెంబర్తో కూడిన రశీదు పత్రం ఇవ్వనున్నట్లు, దీని ద్వారా వారు తమ వినతిని ఆన్లైన్లో సులభంగా తెలుసుకోవచ్చన్నారు. వినతులను 30 రోజుల్లోపు పరిష్కరించి, సంబంధిత నివేదికలను పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. ఆలస్యం జరిగితే ఆ కేసులను నేరుగా ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందని ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తుల పరిశీలనజనగామ: జనగామ పురపాలిక కార్యాలయంలో ఎస్సీ నిరుద్యోగ యువతీ, యువకులు ఎలక్ట్రిక్ వెహికిల్ టూ వీలర్, టూవీలర్(గూడ్స్, ప్యాసింజర్) కోసం చేసుకున్న ఆన్లైన్ ద్వారా చేసుకున్న దరఖాస్తులను పరిశీలించారు. శనివారం మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, కార్పొరేషన్, రవాణాశాఖ, బ్యాంకు అధికారుల సమక్షంలో దరఖాస్తులను స్క్రీనింగ్ టెస్ట్ చేశారు. వీటి కోసం 95 మంది దరఖాస్తు చేసుకోగా, స్క్రీనింగ్ టెస్ట్ కోసం 82 మంది హాజరయ్యారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ నియామకం● 69 మందితో నూతన కమిటీ ● డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి జనగామ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ ఆమోదంతో జిల్లా కాంగ్రెస్ కమిటీకి కొత్తగా 69 మంది వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, ట్రెజరర్, సెక్రటరీలు, స్పోక్స్ పర్సన్లు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ల నియామకాలను ప్రకటించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతిలక్ష్మినారాయణ నాయక్ ఆధ్వర్యంలో తుది పరిశీలన జరిగిన తర్వాత శనివారం ఈ జాబితా విడుదల చేశారు. అనంతరం డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ జిల్లా కమిటీ పేర్లను వెల్లడించారు. జిల్లాలో పార్టీ కార్యకలాపాలు, బూత్ స్థాయి బలోపేతం, సభ్యత్వ విస్తరణ, వచ్చే ఎన్నికల వ్యూహాల రూపకల్పనలో ఈ కొత్త కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని ధన్వంతి తెలిపారు. -
ఈతకు వెళ్లి యువకుడి గల్లంతు
బచ్చన్నపేట: సరదాగా ఈత కొట్టడానికి స్నేహితులతో కలిసిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు బావి లో పడి గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు, ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఎనుగుల పద్మ– భిక్షపతి దంపతులకు చిన్నకుమారుడు ఎనుగుల ప్రశాంత్ (27) ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం గ్రామశివారులోని చేర్యాల రహదారి పక్కనగల రాజన్న బావిలో ఈత కొట్టడానికి వెళ్లాడు. ఇందులోభాగంగా బావి పక్కనే ఉన్న చెట్టు ఎక్కి బావిలో దూకిన ప్రశాంత్ నీటి అడుగుభాగానికి వెళ్లి పైకి రాలేదు. గమనించిన స్నేహితులు బావిలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహం కోసం వెతికినా రాత్రి వరకు కూడా మృతదేహం లభ్యం కాలేదు. దీంతో నేడు(ఆదివారం) మళ్లీ బావిలో మృతదేహం కోసం వెతకనున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
కట్టెల పొయ్యే దిక్కు!
కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై భారీ బాదుడు జనగామ: కమర్షియల్ సిలిండర్ ధర పెంపు హోటళ్ల నిర్వహణను తలకిందులు చేస్తోంది. వరుసగా పెరుగుతున్న ధరలు చిన్న వ్యాపారులపై పెనుభారం మోపుతున్నాయి. దీంతో చాలా మంది కట్టెల పొయ్యిపైనే హోటళ్లు నిర్వహించాల్సి వస్తోంది. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్పై కొద్ది రోజుల క్రితం రూ.412 పెంపు చేసిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా మరో రూ.839 మేర పెంచింది. దీంతో కేవలం కొన్ని నెలల్లోనే ఒక్క సిలిండర్పై పెంపు రూ.1,251కి చేరింది. దీంతో సిలిండర్ ధర రూ.3, 219కి చేరి వ్యాపారులకు తీవ్రమైన ఆర్థిక భారంగా మారింది. జిల్లాలో 12 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా, అధికారికంగా 500కు పైగా కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు మరో 800 వరకు అనధికారిక కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, గప్చుప్ బండ్లు, చిన్న హోటళ్లు, తినుబండారాల దుకాణాలు ప్రధానంగా కమర్షియల్ సిలిండర్లపైనే ఆధారపడతాయి. నెలకు నాలుగు నుంచి ఐదు సిలిండర్లు వినియోగించే చిన్న హోటళ్లకు కొత్త ధరల ప్రకారం ప్రతీ నెల కనీసం రూ.5వేల వరకు అదనపు వ్యయం తప్పదు. ఇప్పటికే భవన అద్దెలు, సిబ్బంది వేతనాలు, కూరగాయలు, నూనెలు, నిత్యావసరాల ధరలు పెరుగుతుండగా కమర్షియల్ గ్యాస్ ధరల భారీ పెంపు వారిపై మరింత ఒత్తిడిని పెంచుతోంది. వ్యాపారం కొనసాగించడమే పెద్ద సవాలుగా మారిందని, ప్రభుత్వ సహాయం లేకుంటే చిరు వ్యాపారరంగం తీవ్రమైన దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కమర్షియల్ సిలిండర్ల ధరలు పెరగడంతో టిఫిన్లు, ఇతర తినుబండారాల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని పలు రెస్టారెంట్లు అదనంగా గ్యాస్ ధరలను జోడించి కస్టమర్ల వద్ద బిల్లులు వసూలు చేస్తున్నాయి. సామాన్య కుటుంబాలపై సైతం ధరల ప్రభావం పడనుంది. చిరు హోటళ్ల యజమానులపై ఆర్థిక భారం నెలకు రూ.5వేలకు పైగా అదనపు భారం కొద్ది నెలల్లోనే సిలిండర్పై రూ.1,251 పెంపు -
‘నీట్’కు పకడ్బందీ ఏర్పాట్లు
కేయూ క్యాంపస్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకుగాను దేశవ్యాప్తంగా ఈ నెల 3న నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు (నీట్)– 2026కు ఉమ్మడి జిల్లాలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా 14 కేంద్రాల్లో కలిపి 6,016మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 11గంటల నుంచే సెంటర్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1–30గంటలకు మెయిన్ గేట్లను మూసివేస్తారు. ఆ తరువాత వచ్చేవారికి అనుమతించబోరు. దివ్యాంగ అభ్యర్థులకు పరీక్ష రాసేందుకు అదనంగా గంట సమయం ఇస్తారు. ఆయా అభ్యర్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది. హనుమకొండ, వరంగల్లోని పరీక్ష కేంద్రాల్లో ఐదుగురు స్క్రైబర్స్ను కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు రెండు జిల్లాల నీట్ నోడల్ ఆఫీసర్ భిక్షపతి తెలిపారు. జిల్లా సెంటర్లు అభ్యర్థులుహనుమకొండ, వరంగల్ 09 4,600 జయశంకర్ భూపాలపల్లి 02 374 జనగామ 02 566 మహబూబాబాద్ 01 476 రేపు మధ్యాహ్నం 2నుంచి 5 గంటల వరకు నిర్వహణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలు ఉదయం 11గంటల నుంచే సెంటర్లలోకి అనుమతి మధ్యాహ్నం 1–30గంటల తరువాత నో ఎంట్రీ హాజరుకానున్న 6,016మంది అభ్యర్థులు అభ్యర్థులు అడ్మిట్ కార్డుతోపాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, 4x6 సైజ్ ఫొటో ఒకటి, ఏదైనా గుర్తింపుకార్డు వెంట తీసుకునిరావాలి. పన్ను, పెన్సిల్ తీసుకురావొద్దు. వీటిని పరీక్ష కేంద్రాల్లోనే అందజేస్తారు. బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచ్లు తీసుకురావొద్దు. మహిళలు బంగారు నగలు పెట్టుకొని రాకూడదు. ఒకవేళ పెట్టుకుని వస్తే కేంద్రం వద్ద తీసివేయిస్తారు. కాళ్లకు షూస్ ధరించకూడదు. జీన్స్లాంటివి గాకుండా ఇతర సాధారణ దుస్తులు ధరించి రావాలి. పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్స్ను తీసుకురావచ్చు. డయాబెటిక్ అభ్యర్థులుంటే వారు పండ్లు (అరటి, యాపిల్) తీసుకొని రావచ్చు. ప్రతి గదిలో, మెయిన్ గేట్వద్ద అందరికీ కనిపించేలా గడియారాలు ఏర్పాటు చేస్తారు. వరంగల్ నిట్లో రెండు సెంటర్లు, హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీకళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్), వరంగల్లో సీకేఎం కళాశాల, ఎల్బీ కళాశాల, కేంద్రీయ విద్యాలయం, యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల, యూనివర్సిటీ పీజీ కళాశాల. జయశంకర్ భూపాలపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో), ప్రభుత్వ జూనియర్ కళాశాల. జనగామ జిల్లా కేంద్రంలోని ఏవీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెంబర్తిలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల విద్యాలయం. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోగల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల. మహబూబాబాద్లో నీట్ నోడల్ ఆఫీసర్గా కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ ముఖేశ్కుమార్ వ్యవహరించనున్నారు. -
నేడు స్క్రీనింగ్ టెస్ట్
జనగామ: జనగామ మున్సిపల్ పరిధిలోని ఎలక్ట్రిక్ వెహికిల్, టూ వీలర్, ఎలక్ట్రిక్ టూవీలర్(గూడ్స్ అండ్ ప్యాసింజర్) కోసం దరఖాస్తు చేసుకున్న ఎస్సీ నిరుద్యోగ యువతీ, యువకులకు శనివారం(2వ తేదీ) మున్సిపల్ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని కమిషనర్ మహేశ్వర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. జఫర్గఢ్: మండల కేంద్రంలోని వేల్పుగొండ కొండ దిగువన ఉన్న సీతారామచంద్ర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈ నెల 3న (ఆదివారం) శ్రీరంగనాథస్వామి మూర్తి విగ్రహా ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకుడు పొడిచేటి వెంకటాచార్యులు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా శనివారం నుంచి రెండు రోజుల పాటు ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. మరింగంటి నర్సింహాచార్యుల కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వేడుకల్లో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జనగామ: జిల్లాలో రైతులకు మద్దతు ధర కల్పించేందుకు అన్నదాతల ముంగిటే సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఇన్చార్జ్ డీఆర్డీఓ నూరొద్దీన్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ‘మా పడ్లు కొనండి సారూ’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. రైతు ఇంటి దగ్గరే మార్కెట్ సౌకర్యాలు కల్పిస్తూ, ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతుతో ఎంఎస్పీని పూర్తి స్థాయిలో అందిస్తున్నామని అధికారులు హామీ ఇచ్చారు. 12 మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సజావుగా జరుగుతోందని కొన్ని గ్రామాలను ఇతర కేంద్రాలకు లింక్ చేసినట్లు తెలిపారు. అందులో భాగంగా జనగామ మండలం యశ్వంతాపూర్ గ్రామాన్ని చీటకో డూరు కొనుగోలు కేంద్రానికి అనుసంధానం చేసినట్లు వివరించారు. గ్రామాల రైతులు తమ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం అమ్ముకోవాలన్నారు. వైభవంగా హేమాచలుడి తిరుకల్యాణంమంగపేట: రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి గాంచిన మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో లక్ష్మీనర్సింహాస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వాహణ ఇన్చార్జ్ అధికారి ఎం.వీరస్వామి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో లక్ష్మీనర్సింహాస్వామి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల కల్యాణ మహోత్సవాన్ని భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకుడు అమరవాది మురళీ కృష్ణమాచార్యుల బృందం వేద మంత్రోచ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు ప్రధానాలయంలోని స్వయంభు స్వామివారిని నూతన వస్త్రాలంకరణ చేసి నిత్యారాధన, తిరు కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. సుమారు రెండు గంటల పాటు స్వామివారి కల్యాణ మహోత్సవ క్రతువును నిర్వహించారు. 12.30 గంటలకు అభిజిత్ లగ్నంలో జిలకరబెల్లం, మాంగళ సూత్రదారణ, ముత్యాల తలంబ్రాలతో స్వామివారి కల్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిపించారు. -
‘లెక్క’ తప్పారు!
● ఆ తర్వాత సైన్స్ పరీక్షలో 50మంది విద్యార్థులు ● మొత్తంగా జిల్లాలో ఉత్తీర్ణులు కానిది 198 మంది ● అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఖరారుజనగామ: పదో తరగతి వార్షిక పరీక్షల్లో సబ్జెక్టుల వారీగా ఫెయిల్యూర్స్ నమోదు ఆందోళన కలిగిస్తోంది. సబ్జెక్టుల వారీగా పలవురు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ప్రతీ సబ్జెక్టులో విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అయ్యారన్న దానిపై విశ్లేషణ జరపాల్సి ఉంది. జిల్లాలోని విద్యార్థుల అభ్యాసన విధానం, బోధనా ప్రమాణాలు, ప్రాథమిక అవగాహన లోపం వంటి కారణాలు ఉండొచ్చని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. 6,443 మంది పరీక్షకు హాజరు మార్చిలో నిర్వహించిన పదో తరగతి వార్షిక పరీక్షల్లో 6,443 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 3,105 మంది బాలురు, 3,338 మంది బాలికలు ఉన్నారు. వీరిలో 6,292 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో 3,013 మంది బా లురు, 3,279 మంది బాలికలు ఉన్నారు. 183 పాఠశాలల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 32 ప్రైవే ట్ పాఠశాలలు, 58 ఉన్నత పాఠశాలలు, 8 కేజీబీ వీలు, 4 మోడల్ పాఠశాలలు, 4 బీసీ వెల్ఫేర్ పాఠశాలలు, 1 ఎయిడెడ్, 1 రెసిడెన్షియల్, 2 మైనారిటీ, 2 సోషల్ వెల్ఫేర్, 1 ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి. తెలుగులో 29 మంది మాతృభాష తెలుగులో 29 మంది విద్యార్థులు ఫెయిల్ కావడం గమనార్హం. సాధారణంగా ఈ విషయంలో ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే పరిస్థితి ఉండేది. అయితే రచనా శైలి, వ్యాకరణ అవగాహన లోపం, పాఠ్యాంశాలపై నిర్లక్ష్యం వంటి అంశాలు ఫలితాలను ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా దీర్ఘ ఉత్తర ప్రశ్నల రచనలో విద్యార్థులు మార్కులు కోల్పోయినట్లు విశ్లేషిస్తోంది. హిందీ విషయంలో ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఫెయిల్ కావడంతో ఈ సబ్జెక్ట్లో మొత్తం విద్యా బోధన స్థిరంగా ఉన్నట్టు అర్థమవుతోంది. ఇంగ్లిష్లో 28 మంది ఇంగ్లిష్లో 28 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోవడం సాధారణంగానే ఉన్నప్పటికీ, భాషపై ప్రాథమిక అవగాహన లోపం, స్పెల్లింగ్ తప్పులు, గ్రామర్లో నిర్లక్ష్యం, రీడింగ్, రైటింగ్ స్కిల్స్ బలహీనత కారణాలుగా నిలిచాయి. ముఖ్యంగా వ్యాసరచన, లెటర్ రైటింగ్ ప్రాంతాల్లో తక్కువ మార్కులు పొందినట్లు స్పష్టమైంది. గణితంలో 79 మంది రికార్డు స్థాయిలో గణితం సబ్జెక్టులో అత్యధికంగా 79 మంది ఫెయిల్ శాతం నమోదైంది. ఈ ఫెయిల్యూర్ రేటుతో జిల్లాలో మ్యాథ్స్ బోధనపై ప్రశ్నార్థకం ఏర్పడింది. ఫార్ములాల పట్ల అవగాహన లేకపోవడం, సున్నితమైన కాన్సెప్ట్లను గ్రహించడంలో ఇబ్బంది పడడం, సమస్యలను దశల వారీగా పరిష్కరించే నైపుణ్యం లోపించడం వంటి కారణాలు విద్యార్థుల పనితీరు తగ్గడానికి దారి తీశాయనే చర్చ ఉంది. సైన్స్లో 50 మంది సైన్స్లో 50 మంది విద్యార్థులు ఫెయిల్ కావడం కూడా ఆందోళనకరమే. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం విభాగాల్లో ప్రయోగాత్మక అవగాహన లోపం, డయాగ్రామ్లు సరిగా రాయకపోవడం, సిద్ధాంతాత్మక ప్రశ్నల్లో అ స్పష్టత ప్రధాన కారణాలుగా గుర్తించినట్లు తెలుస్తోంది. సాంఘికశాస్త్రంలో 9 మంది మాత్రమే ఫెయిల్ కావడం ఒక రకంగా స్థిరమైన ఫలితంలా కనిపిస్తుంది. పరీక్ష ఫీజుల చెల్లింపులు అభ్యర్థులు పరీక్ష ఫీజును సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల వద్ద ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల14వ తేదీ వరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, 15వ తేదీ వరకు హెచ్ఎం, ఈఎన్ఆర్ను ఆన్లైన్ ద్వారా డీఈఓకు సమర్పించాల్సి ఉంటుంది. 16వ తేదీ నాటికి డీఈఓలు ఈఎన్ఆర్ను ప్రభుత్వ పరీక్షల కార్యాలయానికి ఆన్లైన్ ద్వారా సమర్పించాలి. రూ.50 ఆలస్య రుసుముతో సంబంధిత సబ్జెక్టు పరీక్షకు రెండు రోజుల ముందుగా చెల్లించే అవకాశం కల్పించారు. రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు జూన్లో నిర్వహించనున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటించింది. జూన్ 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటాయి. 5వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్ గ్రూప్–ఏ పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటుంది. ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్–1 (కంపోజిట్ కోర్సు) ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50, ఫస్ట్ లాంగ్వేజ్ పార్టు–2 (కంపోజిట్ కోర్సు) ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 వరకు జరుగనుంది. 6వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30, 7వ తేదీ ఇంగ్లిష్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30, 8వ తేదీన గణితం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30, 9న సైన్స్ పార్ట్–1 (ఫిజికల్ సైన్స్) ఉదయం 9.30 నుంచి 11 గంటలు, 10న సైన్స్ పార్ట్–2 (బయోలాజికల్ సైన్స్) ఉదయం 9.30 నుంచి 11 గంటలు, 11న సాంఘిక శాస్త్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరగనుంది. -
పన్ను వసూళ్ల లక్ష్యసాధనకు చర్యలు
జనగామ రూరల్: మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూళ్ల లక్ష్యసాధనకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్తో కలిసి మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పారిశుధ్యం, జనన, మరణాలు, వివిధ అభివృద్ధి పనులు, బిల్డింగ్ అనుమతులు, ఆస్తి, వాణిజ్య పన్నులు, పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ తదితర వివరాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయా విభాగాల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ వార్డులో ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, ఉదయం 5 నుంచి 8 గంటల రోడ్ల శుభ్రత, ఇంటింటి చెత్త సేకరణ ప్రాధాన్యం, పరిశుభ్రత, పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. వాణిజ్య ప్రకటనల పన్నులు తప్పనిసరిగా వసూలు చేయాలని, మున్సిపాలిటీకి ఆదాయాన్ని పెంచాలన్నారు. మున్సిపల్ చైర్మన్ వినయ్కుమార్ మాట్లాడుతూ.. ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ వసూలు చేసే అంశంలో ప్రభుత్వ నియమ నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని, నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న రోడ్డు, మురుగు కాల్వల నిర్మాణ పనులు, వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణం, కమ్యూనిటీ హాల్ తదితర వివిధ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, మేనేజర్ సత్యనారాయణ, పట్ణణ ప్రణాళిక అధికారి సుష్మా, ఇంజనీరింగ్, శానిటరీ ఇన్స్పెక్టర్, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
ఎగిరింది కార్మిక జెండా
కార్మికుల సాధనాలు, కార్యక్రమాల నివేదిక పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్, ఏఎల్ఓ ఆర్టీసీ డిపో వేడుకల్లో ఏఎంసీ చైర్మన్ శివరాజ్ యాదవ్, డిపో మేనేజర్ స్వాతిజనగామ: జిల్లా వ్యాప్తంగా మేడే వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్న్స్ హాల్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ..కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణలో కార్మిక సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని, అన్ని సంఘాలు కలిసికట్టుగా పనిచేస్తే సమస్యలకు సమగ్ర పరిష్కారం సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం కార్మికుల సాధనాలు, కార్యక్రమాల నివేదిక పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఎల్ఓ కుమారస్వామి, బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహరావు, ఏబీసీడీఓ రవీందర్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్లో.. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో డిపో మేనేజర్ స్వాతి ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అసిస్టెంట్ మేనేజర్ హుస్సేన్, ట్రాఫిక్ ఇన్చార్జ్ ఎంబీకే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో.. జనగామ పురపాలిక ప్రాంగణంలో మున్సిపల్ ఔట్సోర్సింగ్ వర్కర్స్, డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు మల్లిగారి రాజు ఆధ్వర్యంలో కార్మికులు మేడే వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు మిద్దెపాక రాజు, కార్యదర్శి గడిపె ప్రవీణ్ కుమార్, డ్రైవర్ల యూనియన్ అధ్యక్షులు మునిగె రవి, కార్యదర్శి మసి రాజు, ఉపాధ్యక్షులు వాతాల యాదగిరి, మునిగె కరుణాకర్, 13 వ వార్డు కౌన్సిలర్ పానుగంటి ప్రవీణ్ సువార్త, మౌనిక తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా మేడే వేడుకలు -
బస్టాండ్లో జనజాతర
జనగామ ఆర్టీసీ బస్టాండ్లో రాత్రి 9 గంటలకు వందలాది మంది ప్రయాణికుల రద్దీపెళ్లిళ్లు, శుభకార్యాలు, దుర్గామాత, బొడ్రాయి పండుగలతో జనగామ ఆర్టీసీ బస్టాండ్ జాతరను తలపించింది. శుక్రవారం రాత్రి 10 గంటలు దాటినా వందలాది మంది ప్రయాణికులు బస్సుల కోసం నిరీక్షించారు. హన్మకొండ, జగద్గిరిగుట్ట, సిద్దిపేట, తరిగొప్పుల తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ప్లాట్ఫామ్లతో పాటు ప్రయాణ ప్రాంగణం మొత్తం నిండిపోయారు. బస్సులు ప్లాట్ఫామ్పైకి వచ్చేదాక చూడకుండా ఎదురుగా వెళ్లి ఎక్కే ప్రయత్నం చేశారు. ఒక్కో బస్సులో 90 నుంచి 100 మందికి పైగా ప్రయాణం చేశారు. – జనగామ -
పథకాలపై అవగాహన పెంచుకోవాలి
జనగామ రూరల్: కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎస్. శ్రీదేవి అన్నారు. మేడే సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లాలోని నెల్లుట్ల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి శ్రీదేవి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శశి, లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ ఎం.రవీంద్ర, సర్పంచ్ రామకృష్ణ, దీప్తి, శేఖర్, జితేంద్ర, సుందరయ్య, అమృత పాల్గొన్నారు. -
విద్యుత్, రోడ్డు భద్రత పాటించాలి
జనగామ: విద్యుత్, రోడ్డు భద్రత పాటించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి పిలుపునిచ్చారు. విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో శుక్రవారం విద్యుత్ భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని వారు ముఖ్యఅతిథిగా హాజరై పోస్టర్ను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగులు, ప్రజలు భద్రతా ప్రమాణాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రోడ్డు నియమాలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. సమాజాన్ని నాశనం చేస్తున్న డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. కరెంటు ఎల్సీ తీసుకునే సమయంలో యాప్ ద్వారా మాత్రమే సేవలను ఉపయోగించుకోవాలని ఎస్ఈ సూచించారు. కార్యక్రమంలో డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, ఏడీఈ వేణుగోపాల్, టౌన్–1 ఏఈ సౌమ్య, టౌన్–2 ఏఈ చంద్రమోహన్, రూరల్ ఏఈ మధు, పెంబర్తి ఏఈ కనకయ్య, సిబ్బంది పాల్గొన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రతిఒక్కరూ భాగస్వాములవ్వాలి డీసీపీ రాజమహేంద్ర నాయక్ -
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
జనగామ రూరల్: దీర్ఘకాలికంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేసేలా పాటుపడాలని కోరుతూ తపస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చల్లా తిరుపతిరెడ్డి, అంకం సతీష్కుమార్ హైదరాబాద్లోని నాచారంలో జరుగుతున్న అభ్యాసవర్గ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఏవీఎన్రెడ్డి, మల్క కొమురయ్యకు శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల నుంచి ఉపాధ్యాయుల సమస్యల పెండింగ్లో ఉన్నాయని, వీటని పరిష్కరించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. పెండింగ్లో ఉన్న డీఏలు, పీఆర్సీని వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో సంఘం బాధ్యులు మల్లారెడ్డి, పంచాక్షరి, క్రాంతి, కృతాత్మమూర్తి, రమేశ్, అన్నపూర్ణ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీలకు తపస్ జిల్లా నాయకుల వినతి -
7న ఉప ముఖ్యమంత్రి పర్యటన
హన్మకొండ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 7న స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటనలో భాగంగా విద్యుత్ సబ్ స్టేషన్ల ప్రారంభం, శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయన్నారు. వేలేరు మండలం పీచరలో 132/33 కేవీ సబ్ స్టేషన్, చిల్పూరు మండలం కొండాపూర్, జఫర్గడ్ మండలం సాగరం, రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామాల్లో 33/11కేవి సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవం, జఫర్గడ్ మండలం కేంద్రంలో 132/33కేవి సబ్ స్టేషన్, చిల్పూరు మండలం లింగంపల్లి, పల్లగుట్ట, నష్కల్ గ్రామాల్లో 33/11 కేవీ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. ఉప ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా జఫర్గడ్లో 5 వేల మందితో బహిరంగ సభకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ మేరకు అధి కారులకు ఆదేశాలివ్వాలని సీఎండీ వరుణ్ రెడ్డికి సూచించారు. జఫర్గడ్ 132/33కేవి సబ్ స్టేషన్కు సంబంధించిన భూ కేటాయింపునకు ట్రాన్స్ కో అధికారులు వెంటనే చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలన్నారు. ఈ మేరకు సీఎండీ వరుణ్ రెడ్డి సంబంధిత అధికారులకు సభ, భూ కేటాయింపుపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. లోటుపాట్లు లేకుండా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేసి ఉప ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. -
శోభాయమానం.. పుష్పయాగం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో చివరిరోజు గురువారం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తిని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. చూర్ణోత్సవం జరిపి చక్రతీర్థోత్సవం నిర్వహించి తిరిగి చక్రాన్ని అమ్మవారి సన్నిధికి చేర్చారు. అలాగే దేవాలయం చుట్టూ అమ్మవారి ఊరేగింపు జరపడానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి విరాళంగా అందజేయనున్న కోటి రూపాయలతో 30 అడుగుల రథం తయారీకి ఉపయోగించే కలపకు పూజలు చేశారు. శిల్పి గిర్మాజీ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అందజేసిన అడ్వాన్స్ రూ.45 లక్షలతో నాగపూర్ నుంచి తెప్పించిన మేలు రకం టేకు కలపకు అర్చకులు పూజలు చేసి పని ప్రారంభించారు. అమ్మవారికి పుష్పయాగం అమ్మవారికి శతఘటాభిషేకం జరిపి రాత్రి స్నపనమందిరంలో వేదపండితులు మంత్రోచ్ఛరణ చేస్తుండగా గులాబీలు, మల్లెలు, లిల్లీ లు, విరజాజు లు, బంతులు, చామంతులు, కనకాంబరాలతో పుష్పయాగం నిర్వహించారు. పుష్పయాగం నిర్వహించడం వల్ల బ్రహ్మోత్సవాల్లో జరిగిన దోషాలు తొలగిపోతాయని భద్రకాళి శేషు తెలిపారు. భద్రకాళి ఆలయంలో ముగిసిన కల్యాణ బ్రహ్మోత్సవాలు -
అజెండా అంశంలో స్పష్టత లేదు
జనగామ: మున్సిపల్ కౌన్సిల్లో బడ్జెట్, అజెండా అంశాల తయారీపై తీవ్ర అసంతృప్తి నెలకొందని మాజీ మున్సిపల్ చైర్పర్సన్లు ప్రేమలతారెడ్డి, పోకల జమున లింగయ్య విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.. 54 అజెండా అంశాలు తయారు చేసే సమయంలో వైస్ చైర్మన్ను ఎందుకు ఆహ్వానించలేదన్నారు. సాధారణ మున్సిపల్ బడ్జెట్ నుంచి రూ.1.50 కోట్ల మొత్తాన్ని మళ్లిస్తే కార్మికుల జీతాలు, పీఎఫ్లు, ఆఫీసు అత్యవసర ఖర్చులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. అజెండా సిద్ధం చేసే ప్రక్రియను పూర్తిగా పక్కనబెట్టి, మూడు రోజుల ముందు ఇవ్వాల్సిన కాపీలు ఒక్కరోజు ముందే ఇచ్చారని నిలదీశారు. సమావేశం జరుగుతున్న సమయంలో కౌన్సిల్ హాల్లోకి పోలీసులను ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. వైస్ చైర్మన్ను వేదికపై నుంచి దిగమని పోలీసులు అడగడమేంటి, ఇది స్పష్టమైన ప్రొటోకాల్ ఉల్లంఘన అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ అజెండా అంశాల గురించి తనకు తెలియదని చెప్పడం ఆశ్చర్యకరమన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు సేవెల్లి మధు, గోపగోని సుగుణాకర్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్రెడ్డి, సజ్జ దుర్గాప్రసాద్, గునిగంటి వెన్నెల, పానుగంటి సువార్త, మామిడాల రజిత, అనూష, నాయకులు మల్లేశం, ఉల్లెంగుల సందీప్, రాజు, దావెర రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్లు ప్రేమలతారెడ్డి, జమున -
ఇందిరమ్మ ఇళ్ల జాబితా విడుదల చేయండి
● మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే పల్లా వినతి జనగామ: నియోజకవర్గానికి సంబంధించి మిగిలిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాను వెంటనే విడుదల చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి గురువారం హైదరాబాద్లో విజ్ఞాపన పత్రాన్ని అందించారు. జిల్లా పరిధిలో జరుగుతున్న గృహ నిర్మాణ పనులు, ఎదురవుతున్న సమస్యలు, ప్రజల అవసరాలను మంత్రికి వివరించినట్లు పేర్కొన్నారు. పథకాన్ని మరింత వేగవంతం చేయడానికి రెవెన్యూ, హౌజింగ్ శాఖల సమన్వయాన్ని బలోపేతం చేయాలని, అర్హత ఉన్న ప్రతీ కుటుంబం ఇల్లు పొందేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జనగామ నియోజకవర్గానికి 2025–26లో మంజూరైన 3,500 ఇందిరమ్మ ఇళ్లలో 1,400 ఇళ్లు ఎమ్మెల్యే సిఫారసుల్లో భాగంగా కేటాయించాల్సి ఉండగా, వాటిలో 600 ఇళ్లు సిద్దిపేట సెగ్మెంట్కు వెళ్లాయన్నారు. వీటిలో 462 ఇళ్లు ఇప్పటికే మంజూరు కాగా, 138 ఇళ్లు ఇంకా బకాయిగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూల్మిట్ట కలుపుకుని కొత్తగా 128 దరఖాస్తులు వచ్చాయన్నారు. జనగామ సెగ్మెంట్లో కేటాయించిన 800ఇళ్లకు 577 ప్రతిపాదనలు అందాయన్నారు. బచ్చన్నపేట 424, జనగామ 395, నర్మెట 161, తరిగొప్పుల 130, జనగామ టౌన్ 477 ప్రతిపాదనలు వచ్చినట్లు వివరాల్లో పేర్కొన్నారు. ఇప్పటివరకు 357 ఇళ్లు మంజూరు కాగా, 223 ఇళ్లు రెండో విడతలో మిగిలి ఉన్నాయని తెలిపారు. వీటిని వెంటనే విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి● రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా జనగామ రూరల్: పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యాకార్యక్రమాలు పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్తో కలిసి వారు కలెక్టర్లతో 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించే విద్య వారోత్సవాలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. విద్యా శాఖ కార్యదర్శి మాట్లాడుతూ.. 2026–2027 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 2,700 ప్రభుత్వ పాఠశాలలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో మే 11వ తేదీ నుంచి వారోత్సవాలను నిర్వహించాలని మౌలిక వసతుల కల్పనకు సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులతో శంకుస్థాపనలు చేయించాలన్నారు. వీసీ అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 3న చుక్కా సత్తయ్య విగ్రహావిష్కరణజనగామ: ఒగ్గు కళాకారుడు చుక్కా సత్తయ్య 91వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 3వ తేదీన జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్డు కళ్లెం కమాన్వద్ద విగ్రహా విష్కరణ ఉంటుందని జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు కంచె రాములు, బీసీ సంఘం జిల్లా చైర్మన్ సేవెల్లి సంపత్ తెలిపారు. గురువారం విగ్రహావిష్కరణ మహోత్సవానికి సంబంధించి జిల్లా కురుమ సంఘం కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జాయ మల్లేష్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. అనంతరం ఉత్సవ కమిటీ చైర్మన్గా ఎన్నికై న కంచె రాములు మాట్లాడుతూ.. చుక్కా సత్తయ్య విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్బండ జానపద కళాకారులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బీసీ సంఘం జిల్లా చైర్మన్ సేవెల్లి సంపత్ మాట్లాడుతూ.. ఒగ్గుకళను ఒక వర్గానికి పరిమితం కాకుండా జాతీయ, అంతర్జాతీయ వేదికలకు పరిచయం చేసిన వ్యక్తి చుక్కా సత్తయ్య అన్నారు. వేలాది మంది శిష్యులను తీర్చిదిద్దిన ఆది గురువు సత్తయ్య విగ్రహావిష్కరణకు బహుజనులు భారీసంఖ్యలో తరలిరావాలన్నారు. సమావేశంలో బండి వీరస్వామి, చౌదరపల్లి రోశయ్య, మంగళంపల్లి రాజు, పాశం శ్రీశైలం, జూకంటి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. -
మక్కల కొనుగోళ్లలో జాప్యంపై ధర్నా
పాలకుర్తి టౌన్: నెల రోజులుగా మండల కేంద్రంలోని చిట్యాల ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ యార్డులో మక్కల కొనుగోళ్లు జరగకవపోడంతో సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ జిల్లా కార్యదర్శి గుమ్మడిరాజుల సాంబయ్య ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు బైఠాయించి మూడూ గంటల పాటు ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ సరస్వతి మార్కెట్ యార్డును సందర్శించే వరకు ఆందోళన కొనసాగింది. సేష్టన్ ఘన్పూర్ ఆర్టీఓ డీఎస్ వెంకన్న ఆదేశాల మేరకు తహసీల్దార్ మార్కెట్ యార్డుకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మార్క్ఫెడ్ అధికారులు గన్నీ బ్యాగులు పంపించడం లేదని, కాంటాలు పెట్టిన మక్కలను గో దాముల్లోకి తరలిస్తుంటే గోదాముల్లో డెలివరీ చేసుకోవడం లేదని డీసీసీ బ్యాంక్ సీఈఓ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ధర్నాలో పార్టీ నాయకులు జీడి సో మయ్య, మంకాళి శ్రీనివాస్, కొనుక్కటి కళింగరా జు, బక్క నాగరాజు, బక్క సోమయ్య, సమ్మయ్య, గట్టుమల్లు, రమేశ్, నాగరాజు, కత్తల జోగయ్య, యాకయ్య తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల బైఠాయింపు -
ఉద్యమ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
జనగామ: జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగంలో అవగాహన పెంపుతో పాటు స్వయం సహాయక సంఘాల సాధికారతకు దోహదపడేలా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేపట్టినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం హాల్లో దీనిపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం (టీఓటీ) నిర్వహించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన డీఆర్డీఏ, సెర్ప్, పరిశ్రమల శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీఎంలు, ఎంఎస్ఓలు, సీసీలకు దశలవారీ మార్గదర్శకత్వం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని స్వయం సహాయక సంఘాలు మే 10లోపు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అనేక సబ్సిడీలు, ఆర్థిక ప్రోత్సాహకాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. స్నేహ వేసవి కాలపట్టికపై అవగాహన ఉద్యమ్ శిక్షణ అనంతరం స్నేహ వేసవి కాలపట్టిక 2026పై జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నిర్వహించారు. మే 2 నుంచి జూన్ 10 వరకు జరిగే ఈ శిబిరాల్లో బాలబాలికల అభివృద్ధి, భద్రత, అవగాహన, ఆరోగ్యం, నైపుణ్యాలు, కెరీర్ మార్గదర్శకత్వం వంటి అంశాలపై ప్రత్యేక సెషన్లు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ నూరుద్దీన్, డీపీఓ వెంకట్రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలి ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11 నుంచి 16 వరకు నిర్వహించే విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. విద్యా వారోత్సవాలపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో విద్యా శాఖ ఏడీ శ్రీని వాస్, ఇతర విద్యా శాఖ అధికారులు, అన్ని మండలాల ఎంఈఓలు, హెడ్ మాస్టర్లు పాల్గొన్నారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా ఉండాలి జనగామ రూరల్: జిల్లాలో ఏర్పాటు చేసిన 234 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగాలని, ఇందుకు వ్యవసాయ, సివిల్ సప్ప్లై వివిధ శాఖల అధికారులు సమన్వయంగా పనిచేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. మండలంలోని శామీర్పేట్లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. సమీక్షలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
ప్రత్యేక శ్రద్ధతో మెరుగైన ప్రగతి
జనగామ రూరల్: పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లా మరోసారి సత్తా చాటుకుంది. వార్షిక పరీక్షలకు 6,443 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 6,292 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 97.66 శాతం ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా రాష్ట్రంలో 17వ స్థానాన్ని దక్కించుకుంది. ప్రత్యేకంగా సర్కారు పాఠశాలల్లో కనిపించిన ఈ పురోగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల కృషికి నిదర్శనంగా నిలిచింది. తల్లిదండ్రులు, గ్రామస్థాయి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ల భాగస్వామ్యం కూడా ఫలితాల మెరుగుదలకు దోహదపడిన అంశంగా అధికారులు భావిస్తున్నా రు. ఫలితాల్లో బాలికలు మరింత మెరుగైన ప్రతిభ చూపారు. మొత్తం బాలికల ఉత్తీర్ణత శాతం 98.23 కాగా, బాలురు 97.04 శాతం అందుకున్నారు. జెడ్పీలపై ప్రత్యేక శ్రద్ధ జిల్లాలోని 103 జెడ్పీ, మండల పరిషత్, అర్బన్ సర్కారు పాఠశాలలు ఈ ఏడాది ప్రత్యేక శ్రద్ధతో బోధనా కార్యక్రమాలు నిర్వహించగా, ఫౌండేషన్ కోర్సులు, రివిజన్ ప్రోగ్రామ్లు, వారానికొకసారి నిర్వహించిన మానిటరింగ్ సమావేశాలు మంచి ఫలితాలను ఇచ్చాయని అధికారులు తెలుపుతున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంపు, ప్రత్యేక క్లాస్లు, పరిశీలన పద్ధతులే ఈ విజయానికి దోహదపడ్డాయన్నారు. తగ్గిన రాష్ట్ర స్థాయి ర్యాంక్ గత రెండు పర్యాయాలు జిల్లా రాష్ట్రస్థాయిలో టాప్ 5లో ర్యాంకు సాధించింది. విజయోస్తు కార్యక్రమంలో భాగంగా జెడ్పీ పాఠశాలలు, ఇతర యజామాన్యాలు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో గత రెండు ఏళ్లలో మంచి ఫలితాలు సాధించింది. గతేడాది 2024–25లో రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది. 2023–24లో 4వ స్థానం సాధించగా ప్రస్తుత 2025–26లో 17వ స్థానానికి పడిపోయింది. అయితే ఈ ఏడాది ర్యాంకు తగ్గినప్పటికీ ఎక్కువ మంది విద్యార్థులు పాస్ కావడం గమనార్హం. పది ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లాకు 17వ స్థానం 6,443 మంది విద్యార్థులకు 6,292 మంది పాస్ వంద శాతం సాధించిన జఫర్గఢ్ మండలం సత్తాచాటిన జెడ్పీ పాఠశాలలుబచ్చన్నపేట 97.30 చిల్పూర్ 98.56 దేవరుప్పుల 91.83 స్టేషన్ ఘన్పూర్ 97.73 జనగామ 96.41 కొడకండ్ల 99.74 లింగాలఘణపురం 98.53 నర్మెట 95.72 పాలకుర్తి 98.99 రఘునాథపల్లి 99.41 తరిగొప్పుల 97.74 జఫర్గఢ్ 100జిల్లాలో 100శాతం ప్రగతి సాధించిన ఏకై క మండలంగా జఫర్గఢ్ నిలిచింది. 369 మందిలో 369 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి, 100శాతంతో సత్తా చాటుకున్నారు. కాగా, దేవరుప్పుల మండలంలో 355 మందిలో 326 మంది పాస్ కాగా, పాస్ శాతం 91. 83. జిల్లాలో అత్యల్ప శాతాన్ని నమోదు చేసిన మండలం ఇదే. -
ప్రొటోకాల్ రగడ
వైస్ చైర్మన్కు గౌరవం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ కౌన్సిలర్ల వాగ్వాదంజనగామ: మున్సిపల్ సాధారణ సమావేశంలో ప్రొటోకాల్ వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వైస్ చైర్మన్కు వేదికపై అవకాశం ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కి, చివరికి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధంగా మారింది. గురువారం మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ అధ్యక్షతన 54 అంశాలతో కూడిన అజెండాతో పురపాలిక సాధారణ సమావేశం జరిగింది. కౌన్సిల్ సాధారణ సమావేశం ప్రారంభం కానున్న వేళ, గత సంప్రదాయం ప్రకారం మున్సిపల్ వైస్ చైర్మన్ భూష పర్వతాలు వేదికపై కూర్చునే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు కోరారు. వైస్ చైర్మన్కు వేదికపైనే గౌరవం ఇవ్వాలని ఉడుగుల కిష్టయ్య, గోపగోని సుగుణాకర్ గౌడ్, సజ్జ దుర్గాప్రసాద్, సేవెల్లి మధు, పానుగంటి సువార్త, అనూష, హఫీజ్ ఫాతిమా, మామిడాల రజిత, దావెర రామ రాజు, గునిగంటి వెన్నెల తదితర గులాబీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. ప్రొటోకాల్ గొడవ జరుగుతున్న సమయంలో పురపాలిక అధికారి కౌన్సిల్ అజెండా అంశాలు చదవడం ప్రారంభించగానే బీఆర్ఎస్ కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ కుర్చీని వేదికపై తీసుకెళ్లారు. దీనిపై కాంగ్రెస్ కౌన్సిలర్లు చెంచారపు కరుణాకర్రెడ్డి, రజిని, బుక్కా బాలభరద్వాజ్, పాముకుంట్ల ప్రసాద్ గౌడ్ తదితరులు వేదికపైకి చేరి ఆ కుర్చీ తీసివేయడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తమైంది. సమావేశ ప్రాంగణానికి వెంటనే పోలీసులు చేరుకున్నారు. సమాచారం అందుకున్న సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సైలు భరత్, చెన్నకేశవులు, మహిళా కానిస్టేబుళ్లతో కలిసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేపట్టారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఒకేసారి జరిగినా, వేదికపై కూర్చోడానికి ఎటువంటి జీఓ లేదని చైర్పర్సన్ బాలమణి పేర్కొన్నారు. చైర్పర్సన్ లేని సందర్భంలో మాత్రమే వైస్ చైర్మన్ సభ చేపడతారని కమిషనర్ మహేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. అయితే వైస్ చైర్మన్ వేదికపై కూర్చోవచ్చని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఓ జీఓ కాపీని చూపించారు. అజెండా ప్రారంభ సమయంలో 15వ వార్డు కౌన్సిలర్ మా రబోయిన పాండు గత సమావేశానికి సంబంధించిన తమ ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలని అధికారులను అడిగారు. అజెండా ఎవరిని అడిగి తయారు చేశారు? వైస్ చైర్మన్కు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? అని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రశ్నించారు. అజెండా కాపీలు సాధారణ సమావేశానికి ఎన్ని రోజులు ముందుగా ఇవ్వాలి అనే ప్రశ్నలను లేవనెత్తారు. ప్రతీ కౌన్సిలర్ వార్డుల పర్యటన చేసి ప్రజాసమస్యలను పరిగణనలోకి తీసుకుని అజెండా సిద్ధం చేయాలని, ఇష్టానుసారంగా అజెండా తయారు చేయడం ఏంటని మండిపడ్డారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగిన మున్సిపల్ సాధారణ సమావేశంలో ఉద్రిక్తత కారణంగా సభ ముందుకు సాగలేదు. వేదిక గౌరవం, అజెండా ప్రొటోకాల్, వైస్ చైర్మన్ అవమానానికి సంబంధించి న వివాదం తీవ్రరూపం దాల్చడంతో, పరిస్థితి అదుపులో లేకపోవడంతో చైర్పర్సన్ బాలమణి శ్రీనివాస్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో కమిషనర్ మహేశ్వర్రెడ్డి, మేనేజర్ రాములు, ఎన్పీడీసీఎల్ ఏఈ సౌమ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. నిబంధనలు లేవన్న చైర్పర్సన్, కమిషనర్ వేదికపై కుర్చీ వేసిన బీఆర్ఎస్ సభ్యులు కుర్చీ తొలగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం పోడియం వద్ద గులాబీ కౌన్సిలర్ల బైఠాయింపు పరిస్థితి అదుపు తప్పడంతో వాయిదావేదికపై కూర్చున్న వైస్ చైర్మన్ పర్వతాలను పోలీసులు నచ్చజెబుతూ కిందికి దింపేందుకు ప్రయత్నించగా మరోసారి ఉద్రిక్తత నెలకొంది. గులాబీ కౌన్సిలర్లు పోడియం వద్ద బైఠాయిస్తూ వైస్ చైర్మన్కు గౌరవం ఇచ్చేవరకు తమ సీట్లలో కూర్చోమని నిరాకరించారు. బీసీ వైస్ చైర్మన్ పర్వతాలను అవమానపరుస్తున్నారని, అంబేడ్కర్ రాజ్యాంగం ఇక్కడ అమలు కావడంలేదని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చకు తాము ఎప్పుడూ ఆటంకం కలిగించమని, కానీ వైస్ చైర్మన్కు వేదిక గౌరవం దక్కేవరకు పోడియం వద్దే కూర్చుని సభను కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. చేర్యాల, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్లను వేదికపై కూర్చోడానికి జీఓ ఉంటే జనగామలో ఎందుకు వర్తించదంటూ ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే కలెక్టరేట్ సమావేశంలో కూడా వైస్ చైర్మన్కు ఆహ్వానం ఇవ్వకపోవడంపై కమిషనర్ను నిలదీశారు. -
కొనుగోలు కేంద్రం.. ఉన్నట్టా..! లేనట్టా..?
లింగాలఘణపురం: మండల కేంద్రంలోని మాణిక్యాపురంలో కళ్లెం పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రం ఉన్నట్టా.. లేనట్టా అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకే చోట రెండు కొనుగోలు కేంద్రాలు ఉండడంతో వివాదం నెలకొని పీఏసీఎస్ ఆధ్వర్యంలోని కేంద్రంలో కాంటాలు పెట్టడంలేదు. గురువారం రైతు సంఘం జిల్లా కార్యదర్శి చందు నాయక్ ఆధ్వర్యంలో కేంద్రాన్ని సందర్శించి వెంటనే కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు రైతు సంఘం నాయకులు ఉప్పలయ్య, పాపిరెడ్డి, నరేందర్రెడ్డి, భవాని తదితరులు ఉన్నారు. -
‘పది’ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ విజయభేరి
విద్యారణ్యపురి: టెన్త్ పరీక్షల ఫలితాల్లో ఎస్ఆర్ స్కూల్స్ విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ విద్యా సంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి తెలిపారు. ఈ ఫలిత్లాలో సి. సంస్కృతారెడ్డికి 600 మార్కులకు గాను 589, పి.రంజివంశీకి 588, ఎస్.కీర్తనకు 587, అంకం సౌజన్యకు 587, ఎ. సంజయ్కు 586, టి. వైష్ణవికి 585, బాశెట్టి సాయిశ్రీకి 584 మార్కులు వచ్చాయని వారు తెలిపారు. క్రమశిక్షణతో కూడిన విద్యనందిస్తున్నామని, పాఠ్యప్రణాళిక, అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందం విద్యాబోధన చేశారని తెలిపారు. తమ విద్యార్థులు పోటీ పరీక్షలను ఎదుర్కొనేలా ఐఐటీ అండ్ మెడికల్ ఫౌండేషన్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా బృహత్తర పద్ధతిలో రాష్ట్రవ్యాప్తగా ప్రైమ్స్కూల్స్ ప్రారంభించామని తెలిపారు. -
‘తేజస్వి’ విద్యార్థుల సత్తా
నయీంనగర్ : పదో తరగతి ఫలితాల్లో తేజస్వి పాఠశాల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. 591 మార్కులతో కందిక సాహిత్య ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎం.అభివర్షిని 590, ఎం.శ్రీతిక 588, జి.సాయి శ్రేష్ఠ, ఆర్.తన్మయి, ఎ.హర్షిత్, ఎండి.సుమేర్ అహ్మద్, అమృత వర్షిణి 587, కె.హిమవర్షిత, కె.నాగస్వామి, మణి సాయి ప్రణవ్ 586, జి.సౌమ్య శ్రీ, ఎల్.కిరణ్ తేజ్, సిహెచ్.మహిన్వద, ఎం.దీప్తి, ఎన్.కార్తికేయ 585, పి.సాయిసాన్వి, పి.శ్రీపాద రెడ్డి 584, సి.హెచ్.శ్రేష్ఠ 583, జునైరియా నౌరిన్, ఎల్.వర్ష, ఎ.రేష్మిత, ఎ.వర్షిణిశ్రీ 582, ఎం.గీతిక, ఎం.మేద, బి.లాస్య, ఎ.నీలిమైతిలి, టి.శశిధర్ 581, జి.సింధు 580 మార్కులు సాధించింది. 570– 579 మధ్య 78 మంది విద్యార్థులు, 560– 569 మధ్య 67 మంది విద్యార్థులు 550–559 మధ్య73 మంది విద్యార్థులు, 540 – 549 మధ్య 48 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 539 కంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు 161 మందితో నయీంనగర్, పోచమ్మకుంట, ప్రశాంత్నగర్ బ్రాంచ్లలో జిల్లా స్థాయిలో అధిక మార్కులు సాధించడం తేజస్వి ఘనత. విజయ పరంపర కొనసాగించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులకు పాఠశాల చైర్మన్ రేవూరి జెన్నారెడ్డి, పిల్లలమర్రి చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. -
‘పది’లో బాలికలదే హవా
జనగామ రూరల్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో జిల్లా 98.23 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో 17వ స్థానంలో నిలిచింది. మొత్తం 183 ప్రభుత్వ, ప్రైవేట్, పాఠశాలలు, మైనార్టీ, కస్తూర్బా గాంధీ, సాంఘిక సంక్షేమ, మహాత్మా జ్యోతి బాపూలే, బీసీ వెల్ఫేర్, ఆశ్రమ, ఎయిడెడ్, మోడల్ స్కూల్, గిరిజన పాఠశాలలు ఉండగా ఇందులో మొత్తం 6,443 విద్యార్థులు పరీక్షలు రాయగా 6,292 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 3,013 మంది, బాలికలు 3,279 ఉన్నారు. గత ఏడాది జిల్లా విద్యార్థులు 98.81 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈఏడాది 97.66 ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదికంటే ఒక శాతం ఉత్తీర్ణత తగ్గగా.. బాలికల ఉత్తీర్ణత శాతం గత ఏడాదికంటే కొంత పెరిగింది. వివిధ పాఠశాలల ఉత్తీర్ణత వివరాలు ఇలా.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 183 పాఠశాలలు ఉన్నాయి. ఎయిడెడ్ పాఠశాలలు 88.88 శాతం, ఆశ్రమ పాఠశాలలు 96.03 శాతం, బీసీ వెల్ఫేర్ 99.84 శాతం, ప్రభుత్వ పాఠశాల 92.94 శాతం, కేజీబీవీలు 99.61 శాతం, మోడల్ పాఠశాలలు 98.35 శాతం, ప్రైవేట్ పాఠశాలలు 99.36 శాతం, రెసిడెన్షియల్ 100శాతం, మైనార్టీ పాఠశాల 100 శాతం, సోషల్ వెల్ఫేర్ 99.26 శాతం, ట్రైబల్ వెల్ఫేర్ 99.28 శాతం, జిల్లా పరిషత్ పాఠశాలలు, 95.53 శాతం ఉత్తీర్ణత సాధించాయి. కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ జిల్లాలోని 12 కేజీబీవీల్లో 8 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. 505 మంది విద్యార్థులకుగాను 498 మంది ఉత్తీర్ణత సాధించారు. 99 శాతం ఉత్తీర్ణత ఉండగా 551 మార్కులతో పాలకుర్తి కేజీబీవీ విద్యార్థిని పూర్ణిమ ప్రథమ స్థానంలో నిలిచింది. కొడకండ్ల కేజీబీవీ విద్యార్థిని యశస్విని 548 మార్కులు సాధించింది. 80మంది 500 పైగా మార్కులు సాధించారు. జెడ్పీ విద్యార్థుల ఉత్తీర్ణత పట్టణంలోని ధర్మకంచ, మండలంలోని వడ్లకొండ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. మొత్తం 1,577 మంది విద్యార్థులకుగాను 1,523 మంది ఉత్తీర్ణత సాధించారు. వడ్లకొండ జెడ్పీ పాఠశాల విద్యార్థిని గోల్లపల్లి ఐశ్వర్య 571 మార్కులు సాధించింది. ధర్మకంచ పాఠశాలకు చెందిన మారబోయిన సంయుక్త 557 మార్కులు, కొయ్యాడ ధనశ్రీ 554 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. మైనార్టీ బాలుర గురుకులాల్లో.. జనగామ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. బి.కేవిన్ 533 మార్కులు, పి.మణికంఠ 525 మార్కులు సాధించారని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. మెరిసిన మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల విద్యార్థులు మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. మొత్తం 6 పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత 4 పాఠశాలలు సాధించగా 397 మంది విద్యార్థులకు 394 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. పూజశ్రీ 581 మార్కులు, విఘ్నేశ్ 579 మార్కులు సాధించారు. సోషల్ వెల్ఫేర్లో.. జిల్లాలోని అయిదు సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు, పాలకుర్తి, జఫర్గఢ్ రెండు గురుకులాలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. నర్మెట పాఠశాలకు చెందిన బిందు 571 మార్కులు, జఫర్గఢ్ పాఠశాలకు చెందిన సహస్ర 555 మార్కులు సాధించారు.గత ఐదేళ్లలో ఉత్తీర్ణత శాతం ఇలా.. సంవత్సరం బాలికలు బాలురు మొత్తం 2021–22 96.01 93.39 94.72. 2022–23 91.17 92.58 91.90 2023–24 98.68 97.59 98.16 2024–25 99.20 98.40 98.81 2025–26 98.23 97.04 97.66 రాష్ట్రస్థాయిలో జిల్లాకు 17వ స్థానం జిల్లా వ్యాప్తంగా 97.66 శాతం పాస్ గతంకంటే పెరిగిన ఉత్తీర్ణత శాతం -
‘బాలయేసు’ విజయదుందుభి
దేవరుప్పుల : జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని బాలయేసు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో మరోసారి విజయదుందుభి మోగించారు. 582 మార్కులతో బాకి అభిజ్ఞాన్ దేవరుప్పుల మండలంలో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. మహ్మద్ రైసున్నీసా 576, కున్సోతు స్వాతి 566 మార్కులు, మొత్తం 32 మంది విద్యార్థుల్లో 22 మంది 500లకు పైగా మార్కులు సాధించారని, ఇది ఎంతో గర్వకారణమని పాఠశాల కరస్పాండెంట్ బ్రదర్ జేసురాజ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రతీ విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులు మదన్ మోహన్, మహేశ్, కృష్ణ, పాషా, షబానా, సంధ్య విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. -
‘ఏకశిల’ విద్యార్థుల ప్రతిభ
హసన్పర్తి: టెన్త్ పరీక్ష ఫలితాల్లో ఏకశిల విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వరుసగా 585,582,580,578 ,577,576,574,573,572,571,570 మార్కులతో రాష్ట్ర స్థాయిలో టాపర్గా నిలిచినట్లు ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి తెలిపారు. ఈసందర్భంగా హసన్పర్తి మండలం పెంబర్తిలోని ఏకశిల టెక్నో స్కూల్లో బుధవారం అభినందన సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకశిల విద్యాసంస్థలో విద్య అంటే మార్కులు మాత్రమే కాదు.. భవిష్యత్ను నిర్మించే శక్తి అన్నారు. నాణ్యమైన విద్యతో పాటు నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, జీవిత నైపుణ్యాలను పెంపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫలితాలతో ఏకశిల విద్యాసంస్థకు మరింత గౌరవం పెరిగిందన్నారు. అనంతరం అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఏకశిల విద్యాసంస్థల డైరెక్టర్లు బేతి కొండల్రెడ్డి, గౌరు సువిజారెడ్డి, ప్రిన్సిపాళ్లు బేతి శైలాజారెడ్డి, ముచ్చ స్వప్నరెడ్డి, ఎం.డి. బాబా, కె.డి. స్వర్ణరాజ్, లవకుమార్, అడ్మినిస్ట్రేషన్ ఇన్చార్జ్ జి.రాంప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
● డీసీపీ రాజమహేంద్రనాయక్ జనగామ రూరల్: విద్యార్థులు మత్త పదార్థాలకు దూరంగా ఉండాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. బుధవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా పెంబర్తి మహాత్మా జ్యోతిరావు ఫూలే కళాశాలలో శ్రీబాలల భద్రత– మత్తు పదార్థాలకు నో చెప్పండిశ్రీ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ సత్యనారాయణ రెడ్డి, మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఏహెచ్టీయూ, డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీసీపీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మత్తుపదార్థాలు భవిష్యత్ను నాశనం చేస్తాయని వివరించారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత సమాచారం రక్షణ, అనుహ్య లింకులు, ఫేక్ కాల్స్పై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత బాధ్యతాయుత పౌరులుగా మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, సైబర్ నేరాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించి సమాజాభివృద్ధికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రైతుల సమస్యలు పరిష్కరించాలి
● కలెక్టరేట్ ఎదుట రైతుసంఘం ధర్నా జనగామ రూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ డిమాండ్ చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వినతి అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ధాన్యం ఎగుమతికి లారీలను తరలించాలని, ధాన్యం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న జాప్యాన్ని అరికట్టాలని కోరారు. గన్నీ సంచుల కొరత తీవ్రంగా ఉందని సహకార సంఘాలకు కొత్త గన్నీ బ్యాగులు ఇవ్వాలన్నారు. తరుగు పేరుతో రైతుల ధాన్యం, మిల్లర్ల కట్టింగును నియంత్రించాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య, గొర్ల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి కన్నెబోయిన బాలరాజు, గానుగుపహాడ్ ఉపసర్పంచ్ కుర్ర శంకర్ నాయక్, పెద్ద తండా ఉపసర్పంచ్ గోగులోతు ఝాన్సీరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. అంత్యపుష్కరాలను విజయవంతం చేయాలి ● మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్బాబు కాళేశ్వరం: సరస్వతీ నది అంత్యపుష్కరాలను అధి కారులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగే సరస్వతీనది అంత్యపుష్కరాల నిర్వహణకు సంబంధించి బుధవారం హైదరాబాద్లో అంబేడ్కర్ సచివాలయంలో మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంత్య పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ రాహుల్ శర్మ మంత్రులకు వివరించారు. పుష్కరాల నిర్వహణలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా చర్యలు, రవాణా, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు మాట్లాడుతూ అంత్య పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున చేపట్టిన ఏర్పాట్లును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సరస్వతీ అంత్య పుష్కరాల వాల్ పోస్టర్, పుష్కరాల టీజర్ను విడుదల చేశారు. -
పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఆందోళన వద్దు
జనగామ: జిల్లాలో డీజిల్, పెట్రోల్ సరఫరా విషయంలో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ సందీప్ కుమర్ ఝా అన్నారు. పెట్రోలు, డీజిల్ సరఫరాపై బుధవారం కలెక్టరేట్లో పెట్రోలియం సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఎనర్జీ కమిటీ సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. జిల్లాలో పెట్రోలు, డీజిల్ నిల్వలపై తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దార్, పోలీస్, లీగల్ మెట్రాలాజీ అధికారులు నిరంతరం బంకుల్లో ఉన్న ఇంధన నిల్వలను తనిఖీ చేయాలన్నారు. పెట్రో, డీజిల్ను బాటిళ్లు, క్యాన్లలో పోయడంతో వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, సివిల్ సప్లయీస్ డీఏం హతీరామ్, లీగల్ మెట్రాలాజీ అధికారి ఝాన్సీ, డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు ఉన్నారు. మే డేను విజయవంతం చేయాలి మే డే కార్మిక దినోత్సవాన్ని జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ హాల్లో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మే 2 నుంచి 10వ తేదీ వరకు మేడే వారోత్సవాలను జిల్లాలోని ప్రతి మండలంలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో చేపట్టాలని సూచించారు. కార్మిక వారోత్సవాల కమిటీ చైర్మన్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన వేడుకలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మే డే ఉత్సవాల్లో ఉత్తమ నిర్వహణ, ఉత్తమ అధికారిని సన్మానించాలన్నారు. సమీక్షలో జిల్లా కార్మిక శాఖ అధికారి కుమారస్వామి, జిల్లా ఉపాధి అధికారి రవికాంత్, ఐటీఐ ప్రిన్సిపాల్, వివిధ కార్మిక సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. ఎంపీ లాడ్స్ నిధులు వినియోగించుకోవాలి ఎంపీ లాడ్స్ నిధుల ద్వారా మంజూరైన పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎంపీ లాడ్స్ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పనులకు సంబంధించిన పురోగతిపై చర్చించి దిశానిర్దేశం చేశారు. సీసీ రోడ్లు, పాఠశాలల మరమ్మతులు, వీధి దీపాలు, మరుగుదొడ్లు, ఆర్ఓ ప్లాంట్లు, విద్యుత్, కమ్యూనిటీ హాల్ వంటి అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. సమీక్షలో సీపీఓ చినకోట్యా నాయక్, ఈఈ పీఆర్ శ్రీనివాసరావు, మిషన్ భగీరథ ఈఈ(ఇంట్రా) శ్రీకాంత్, పలువురు ఎంపీడీఓలు, జనగామ మున్సిపల్ మేనేజర్ రాములు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
పెట్రోల్ బంక్ల తనిఖీ
కొడకండ్ల: మండలంలోని పెట్రోల్ బంక్లను స్టేషన్ఘన్పూర్ ఆర్డీఓ వెంకన్న బుధవారం తనిఖీ చేశారు. కొడకండ్ల, మొండ్రాయి బంక్లను ఆయన తనిఖీ చేసి స్టాక్ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో మండల సమస్యలపై సమీక్ష నిర్వహించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఉత్తలూరి అనీల్బాబు, ఆర్ఐ అశోక్, సిబ్బంది ఉన్నారు. నోస్టాక్ బోర్డు పెట్టొద్దు పాలకుర్తి టౌన్: తప్పనిసరై అయితేనే బోర్డులుపెట్టాలని.. పెట్రోల్, డీజిల్ ఉన్నప్పటికీ నో స్టాక్ బోర్డులు పెడితే చర్యలు తప్పవని ఆర్డీఓ డీఎస్ వెంకన్న అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో నో స్టాక్ బోర్డు పెట్టిన పెట్రోల్, డీజిల్ బంకులలను తనిఖీ చేశారు. తనిఖీ చేసిన బంకులో పెట్రోల్, డీజిల్ లేదని తెలిపారు. బంకుల్లో ఎక్కడైనా పెట్రోల్, డీజిల్ కొరత ఉంటే ట్రోల్ ఫ్రీ నంబర్ 1800 425 00 333, లేదా రాష్ట్ర విపత్తుల హెల్ప్లైన్ 1077కు సమాచారం ఇవ్వాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ సుత్రం సరస్వతి, ఆర్ఐ రాకేష్, అధికారులు ఉన్నారు. -
‘షైన్’ విజయకేతనం..
హన్మకొండ : పదో తరగతి పరీక్ష ఫలితాలలో షైన్ విద్యా సంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. తమ పాఠశాలకు చెందిన ఎ.అక్షర 588 మార్కులు, ఎల్.రేవంత్, ఎండి అఫ్రోజ్ 586, సమీరా నయీం 585, వెలుదండి సీమ, జి.సంహిత, కె.సుమిత్ 584, టి హాసిని, ఎ.ప్రశాంతి, ఎ.సుశాంత్, సీహెచ్.సిరి 583, వి.జాహ్నవి, మార్క శ్రీధన్ 582, ఎ.హర్షిణీ 581, పి.యతిస్, పి.హర్షిత 580 మార్కులు సాధించారని షైన్ విద్యాసంస్థల అధినేత మూగల కుమార్ యాదవ్ వివరించారు. ఐఐటీ ఫౌండేషన్, నీట్తోపాటు పదో తరగతి పరీక్షలకు ప్రత్యేక శిక్షణా ఇవ్వడంతోనే ఈ ఫలితాలు సాధించామన్నారు. ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాలలో కూడా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించారన్నారు. బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు, వారి ఉన్నతికి శ్రమించిన అధ్యాపకులను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో కరెస్పాడెంట్ మూగల రమ, షైన్ పబ్లిక్ స్కూల్ ఎరగ్రట్టుగుట్ట బ్రాంచ్ సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్, ఐఐటీ కోఆర్డినేటర్ మూగల రమేశ్ యాదవ్, ప్రిన్సిపళ్లు పి.విశాల్, కె.దినేశ్, రాజ్ కుమార్, కవిత, ప్రగతిరెడ్డి, సబితా, మానస, కాలేజీ ప్రిన్సిపాళ్లు రాజుగౌడ్, పి.శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఓటరు మ్యాపింగ్ శాతాన్ని పెంచాలి
● డిప్యూటీ సీఈఓ పద్మావతి జనగామ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా జిల్లాలో ఓటరు మ్యాపింగ్ శాతాన్ని పెంచాలని డిప్యూటీ సీఈఓ పద్మావతి పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ సీఈఓ కార్యాలయం నుంచి జిల్లాకు వచ్చిన డిప్యూటీ సీఈఓ పద్మావతి.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ పురోగతిపై కలెక్టరేట్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని అన్మ్యాప్డ్ ఎలక్టోరల్స్పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్త్రృతంగా మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఇందులో భాగంగా ప్రతీ ఇంటికి వెళ్లి వివరాలను సేకరించాలని, వలసదారుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు. బీఎల్ఓల ద్వారా ఫారం–7 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. డబుల్ మ్యాపింగ్ వంటి సమస్యలను గుర్తించి, పరిష్కారంలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. ఈ మేరకు నిర్దేశిత సమయంలోగా మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. అనంతరం రెవెన్యూ అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ మండల స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి వెంటనే సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. సమీక్ష సమావేశంలో ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీధర్, తహసీల్దార్లు, అధికారులు, పాల్గొన్నారు. -
జనగామ
గురువారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026బాలికలదే హవా7ముగ్గురు ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతులువరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి లభించింది. రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో హనుమకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గొర్ల సీతారెడ్డి, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సార్ల రాజు, ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ ఇన్స్పెక్టర్ బోలగాని శ్రీనివాస్గౌడ్ ఉన్నారు. పదోన్నతి పొందిన వారిని అధికారులు అభినందించారు. కొనుగోళ్లను వేగంగా చేపట్టండి ● ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: మక్కలు, ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ధాన్యాన్ని వెంటనే సంబంధిత రైస్ మిల్లులకు చేరేలా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝాను కోరారు. బుధవారం కలెక్టరేట్లో ఎమ్మెల్యే శ్రీహరి కలెక్టర్ను కలిశారు. ఇదిలాఉండగా.. మే 7వ తేదీన నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు కలెక్టర్కు తెలిపారు. భట్టి పర్యటనకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. టెన్త్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లాకు 17వ స్థానం ● జిల్లా వ్యాప్తంగా 97.66 శాతం పాస్ ● గతంకంటే పెరిగిన ఉత్తీర్ణత శాతం -
మార్కులకు మించింది పిల్లల జీవితం!
● పరీక్ష ఫలితాల వేళ భరోసా ఇవ్వాల్సింది తల్లిదండ్రులే ● తొర్రూరు ఉపాధ్యాయుల సందేశ పత్రం జనగామ: పదో తరగతి ఫలితాలు నేడు(బుధవారం)విడుదల కానున్న నేపథ్యంలో తమ పిల్లల భవిష్యత్తు విషయంలో తల్లిదండ్రులు తీసుకోవా ల్సిన కీలక నిర్ణయాలపై పాలకుర్తి మండలం తొర్రూరు(జె) ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మంగళవారం ప్రత్యేక సందేశాన్ని కరపత్రం ద్వారా విడుదల చేశారు. 10వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఎలా ఉన్నా, పి ల్లలపై ప్రేమ, అండ ఎల్లప్పుడూ ఉండాలని, మార్కుల ఆధారంగా భవిష్యత్తును తీర్చిదిద్దకూడదని అందులో సూచించారు. పరీక్షలు జీవితం కాదు, అవి జీవిత యాత్రలో ఒక భాగమని, పిల్లల మనసును మెరుగ్గా అర్థం చేసుకొని వారికి భరోసా ఇవ్వడం ప్రతీ కుటుంబం బాధ్యత అని గుర్తు చేశారు. పరీక్షల ఒత్తిడితో పిల్లలు నిరుత్సాహానికి గురికాకుండా, వారికి ధైర్యం నింపుతూ ముందుకు నడిపించాలని పాఠశాల మండలి సూచించింది. -
పల్లెల్లో పబ్లిక్ స్కూల్స్!
జనగామ: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల(టీపీఎస్) ఏర్పాటును వేగవంతం చేస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికి (ఓఆర్ఆర్) పరిధికి వెలుపల ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో (టీపీఎస్)లను ఏర్పాటు చేయాలన్న సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ నిర్ణయం గ్రామీణ ప్రాంతాల విద్యాభివృద్ధికి కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మూడు పాఠశాలలను ఎంపిక చేశారు. డేటా ఆధారిత ఎంపిక.. పాఠశాలల ఎంపికను సాధారణ పరిపాలనా నిర్ణయంగా కాకుండా డేటా ఆధారంగా చేపట్టడం ఈ ప్రక్రియలో ప్రత్యేకత. మండల స్థాయి నుంచి పాఠశాలల మౌలిక వసతులు, విద్యార్థుల సంఖ్య, భవనాల స్థితి, ఉపాధ్యాయుల లభ్యత వంటి అంశాలను సేకరించారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రతిపాదనలను విశ్లేషించి, దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసింది. నియోజకవర్గాల వారీగా ఎంపిక ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పాఠశాలను ఎంపిక చేయడం ద్వారా ప్రాంతీయ సమతౌల్యాన్ని కాపాడే ప్రయత్నం కనిపిస్తోంది. నర్మెటలో మోడల్ స్కూల్, చిల్పూరులో పీఎంశ్రీ మల్కాపూర్ ఉన్నత, కొడకండ్లలో ఉన్నత పాఠశాల ఎంపిక కాగా, ఇవి భౌగోళికంగా, విద్యార్థుల అవసరాల పరంగా కీలక కేంద్రాలుగా ఉన్నాయి. ఈ ఎంపికతో సమీప గ్రామాల విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడం సాధ్యమవుతుంది. ఆరుట్ల మోడల్..నాణ్యతకు ప్రమాణం ఇప్పటికే రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ నమూనాను అనుసరించడం ద్వారా టీపీఎస్లకు ఒక స్థిరమైన ప్రమాణం లభిస్తోంది. ఈ మోడల్లో ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన, ఇంగ్లిష్ మీడియం, నైపుణ్యాభివృద్ధి ప్రధానంగా ఉంటాయి. అదే విధానాన్ని జిల్లాలో అమలు చేస్తే విద్యార్థుల సామర్థ్యాలు పెరగడంతో పాటు పోటీ పరీక్షల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు పెరుగుతాయి. గ్రామీణ విద్యార్థులకు కొత్త అవకాశాలు ఈ ప్రణాళిక అమలు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు మెరుగైన వసతులు, నాణ్యమైన బోధన పొందే అవకాశం ఉంది. ఇప్పటివరకు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్న తల్లిదండ్రులు, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలపైనా విశ్వాసం పెంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం లేకపోలేదు. మౌలిక వసతుల అభివృద్ధికి తగిన నిధులు, నాణ్యమైన ఉపాధ్యాయుల నియామకం, నిరంతర పర్యవేక్షణ వంటి అంశాలు ఇందులో కీలకంగా మారనున్నాయి. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ విస్తరణ చర్యలు రాష్ట్ర విద్యారంగంలో ఒక పెద్ద సంస్కరణగా నిలిచే అవకాశముంది. టీపీఎస్లో 1,000 మంది విద్యార్థుల సామర్థ్యం కలిగి ఉంటుందని తెలుస్తుంది. ఇందులో ప్రీ ప్రైమరీ(ఎన్కేజీ, యూకేజీ), ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, 11, 12వ తరగతులు ఉంటాయి, సైన్స్ ల్యాబ్, ఆట స్థలం, క్రీడా సామగ్రి, కొరత లేని టీచర్లు, ల్యాబ్స్, పూర్తి స్థాయిలో ఇన్ఫాస్ట్రక్చర్, మినరల్ వాటర్, కిచెన్షెడ్, డైనింగ్ హాల్, అదనపు తరగతి గదులు, కొత్త భవనాల నిర్మాణం కోసం నిధులు రానున్నాయి. దూర ప్రాంతాల పాఠశాలలు విలీనం చేస్తే విద్యార్థులకు బస్సు సౌకర్యం కూడా కల్పించే అవకాశం ఉంది. ఈపాఠశాలల్లో ఎన్ని పాఠశాలలను విలీనం చేస్తారనే పక్కా సమాచారం త్వరలో వెలువరించనున్నారు. కార్పొరేట్ తలదన్నేలా ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మూడు నియోజకవర్గాలకు.. మూడు పాఠశాలలు నర్మెట, కొడకండ్ల, చిల్పూరు మండలాలకు సువర్ణావకాశం విద్యారంగ సంస్కరణల్లో కీలక అడుగుకొడకండ్ల ఉన్నత పాఠశాల పాఠశాల విద్యార్థుల సంఖ్య: 118 ప్రస్తుతం పాఠశాల విస్తీర్ణం: (పక్కనున్న ప్రైమరీ స్కూల్ కలుపుకుంటే) 4 ఎకరాలు ప్రస్తుతం పాఠశాలలో ఉన్న గదుల సంఖ్య: 24 నర్మెట మోడల్ ఉన్నత పాఠశాల విద్యార్థుల సంఖ్య:600 ప్రస్తుతం పాఠశాల విస్తీర్ణం: 6ఎకరాలు మల్కాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థుల సంఖ్య: 195 ప్రస్తుతం పాఠశాల విస్తీర్ణం:3ఎకరాలు -
స్టాక్ ఉండి నో స్టాక్ బోర్డు పెడితే చర్యలు
● పెట్రోలు బంకులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయండి ● అధికారులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశంజనగామ: జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిర్వహణపై అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మంగళవారం ఆయా శాఖల అధికారులతో పెట్రోల్, డీజిల్ నిల్వలపై కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్పై ప్రజలు అపోహలకు గురి కావొద్దన్నారు. సాధారణ అవసరాలకు మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని, అధికారులు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని సూచించారు. జిల్లాలో ఉన్న బంకుల్లో తహసీల్దార్, సివిల్ సప్లై, పోలీస్, తూనికలు కొలతల శాఖల అధికారు లు జాయింట్ యాక్షన్ కమిటీలుగా బంకుల్లోని పెట్రోల్, డీజిల్ నిల్వలను తరుచూ చెక్ చేయాలన్నారు. ఒక వేళ బంకుల్లో పెట్రోల్, డీజిల్ ఉన్నప్పటికీ స్టాక్ లేదని బోర్డు కనిపిస్తే, సదరు యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా పెట్రోల్, డీజిల్ కొరత ఉంటే టోల్ ఫ్రీ నెంబర్–1800 425 00 333 లేదా రాష్ట్ర విపత్తుల హెల్ప్లైన్ 1077కు సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, జనగామ, స్టేషన్ఘన్పూర్ ఆర్డీఓలు గోపిరామ్, వెంకన్న, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ, ఆరోగ్య, విద్య, వైద్య, సంక్షేమ శాఖల అధికారులు, పెట్రోల్ బంక్ డీలర్లు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీలకు ఎంపిక
స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి జెడ్పీఎస్ఎస్కు చెందిన ఏడుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్ఎం కె.రమేశ్, పీడీ కొండ రవి తెలిపారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు..ఇటీవల జిల్లాకేంద్రంలో జరిగిన జిల్లాస్థాయి బేస్బాల్ క్రీడల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఎంపిౖకైన వారిలో గుగులోతు మధుసూదన్(10వ తరగతి), 9వ తరగతికి చెందిన సుంకరి రుత్విక్, నునావత్ చింటు, కొమ్మరాయల చరణ్, 8వ తరగతి నుంచి గుర్రం నాని, ఏడో తరగతికి చెందిన గుర్రం అనిరుధ్, గుర్రం చెర్రీ ఉన్నారన్నారు. రాష్ట్రస్థాయి ఈనెల 29, 30వ తేదీల్లో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో జరుగుతాయని తెలిపారు. విద్యార్థులను హెచ్ఎం, పీడీతో పాటు పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్పర్సన్ రాధిక, పూర్వ విద్యార్థుల కమిటీ అధ్యక్షుడు జొన్నల రాజేశ్వర్, యంజాల ప్రభాకర్, ఎన్.వెంకట్రాంనర్సయ్య తదితరులు అభినందించారు. లోటస్ హాస్పిటల్ స్కానింగ్ యంత్రం సీజ్ జనగామ: పట్టణంలోని లోటస్ హాస్పిటల్కు సంబంధించిన స్కానింగ్ యంత్రాన్ని అధికారులు సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య సమర్పించిన దర్యాప్తు నివేదిక ఆధారంగా పీసీపీఎన్డీటీ చట్టం ఉల్లంఘనలకు సంబంధించి ఈ చర్య తీసుకున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. పీసీపీఎన్డీటీ రిజిస్ట్రేషన్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో పీసీపీఎన్డీటీ సర్టి ఫికెట్ వివరాలు, ఇన్వాయిస్ చిరునామాలతో సరిపోలకపోవడం, ఇన్స్పెక్షన్ చెక్లిస్ట్లో తేదీ, సమయం ఖాళీగా ఉండడం, డీఎల్ఏఏ కమిటీ నిమిషాలు ఫైల్లో లభ్యం కాని పరిస్థితి, అల్ట్రాసౌండ్ యంత్రానికి సంబంధించి బీఎండబ్ల్యూ సేవా సర్టిఫికెట్ గడువు ముగిసినా కూడా పునరుద్ధరించినట్లు చూపించడంతోనే సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. సస్పెన్షన్ అమల్లో ఉన్న సమయంలో ఎటువంటి ప్రీ నాటల్ డయాగ్నస్టిక్ విధులు నిర్వహించరాదని ఆదేశించారు. అలాగే ఆల్ట్రాసౌండ్ యంత్రాన్ని వినియోగించరాదన్నారు. హాస్పిటల్ సస్పెండ్ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను 3 రోజుల్లో అధికారులకు అప్పగించాలని సూచనలు చేశారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే సెక్షన్ 23 ప్రకారం ప్రాసిక్యూషన్కు గురి కావాల్సి ఉంటుందన్నారు. లింగనిర్ధారణ వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలను నిరోధించడంలో అన్ని వర్గాల ప్రజలు సహకరించాలన్నారు. కనులపండువగా అష్టదళ పాద పద్మారాధన పూజ చిల్పూరు: చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేదమంత్రాల నడుమ స్వామివారికి అష్టదళ పాద పద్మారాధన పూజ నిర్వహించారు. ఆలయ చైర్మన్ శ్రీధర్రావు, ఈఓ లక్ష్మీప్రసన్న, జూనియర్ అసిస్టెంట్ మోహన్, మంచిక సరిత–అరుణ్కుమార్ పాల్గొన్నారు. -
దారెంటా ధాన్యపు రాశులు!
జఫర్గఢ్: మొక్కజొన్న, వరి పంట ఒకేసారి చేతికి రావడంతో పల్లెలు ఎటూచూసినా ధాన్యపు రాశులతో కళకళలాడుతున్నాయి. అయితే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఆలస్యం అవుతుండడంతో రైతులు వడ్లు, మక్కలనురోడ్లపైనే ఆరబోస్తున్నారు. మండలంలోని తిమ్మాపూర్ గ్రామ శివారు ఎస్సీ కాలనీ ప్రధాన రహదారి నుంచి మొదలుకొని తమ్మడపల్లి (జి) గ్రామం మీదుగా పాలకుర్తి మండలంలోని బమ్మెర శివారు వరకు రోడ్లపైనే కిలోమీటర్ల మేర రైతులు తమ ధాన్యాన్ని అరబోయడంతో పాటు పెద్ద ఎత్తున నిల్వలు చేశారు. ఇటీవల తమ్మడపల్లి (జి) గ్రామంతో పాటు జఫర్గఢ్లో ప్రధాన రహదారుల పక్కనే ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కల్లాలు లేకపోవడంతో ధాన్యంతో పాటు మక్కలను ఆరబోయడానికి రోడ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు కొనుగోళ్లలో జాప్యం లేకుండా చేస్తే ఇబ్బందులు తప్పనున్నాయి. -
దిగి వెళ్లాడో లేదో.. బైక్ భగ్గుమంది!
● ఒక్కసారిగా దగ్ధమైన పాలవ్యాపారి ద్విచక్రవాహనం ● మంటలు తీవ్రంగా వ్యాపించడంతో కాలనీవాసుల భయాందోళనజనగామ: పట్టణంలో మంగళవారం ఓ బైక్ దగ్ధమైన ఘటన కాలనీ వాసులను టెన్షన్కు గురిచేసింది. వివరాలిలా ఉన్నాయి. రఘునాథపల్లి మండలం పడమటిగూడెం గ్రామానికి చెందిన ఉడుముల ధర్మారెడ్డి పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతిరోజూ పట్టణానికి వచ్చి కాలనీల్లో రెగ్యులర్ ఖాతాదారులకు పాల డబ్బాలు ఇచ్చి వెళ్లుంటాడు. రోజువారీలాగే తన బైక్పై ఉదయం 7 గంటలకు గణేష్ స్ట్రీట్లోని ప్రభుత్వ పాఠశాల సమీపానికి చేరుకున్నాడు. అక్కడ తన బైక్ను నిలిపి, ఇంటింటికీ వెళ్లి పాల డబ్బాలు ఇచ్చేందుకు వెళ్లిన సమయంలో బైక్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న వారంతా పరుగులు పెట్టా రు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో 100తో పాటు అగ్నిమాపక శాఖకు డయల్ చేయగా, పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను పూర్తిగా ఆర్పేయగా, అప్పటికే బైక్ పూర్తిగా కాలిపోయింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. బైక్కు సంబంధించి అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
విరజిమ్మే వెలుగులు..మోడ్రన్ హంగులు
● జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్ సుందరీకరణ పనులు పూర్తి ● 10వ తేదీన వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోదీజనగామ: పట్టణానికి ప్రాధాన్యాన్ని చాటుతూ, వచ్చే నెల 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా జనగామ రైల్వేస్టేషన్ సుందరీకరణ మొదటి విడత పనులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో స్టేషన్ ప్రాంగణంలో పండుగ వాతావరణాన్ని తలపిస్తూ వెలుగు జిలుగులు సంతరించుకున్నాయి. స్టేషన్ప్రాంగణం ఆధునికతతో రూపాంతరం చెందుతూ, పెద్ద నగరాల రైల్వే స్టేషన్లను తలదన్నేలా తీర్చిదిద్దుతున్నారు. ప్లాట్ఫామ్ల విస్తరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, ఆధునిక ఏసీ వెయిటింగ్ రూములు, ప్రాంగణంలో ఆకర్షణీయ విద్యుత్ దీపాలు వంటి అత్యాధునిక వసతులతో కొత్త రూపం సంతరించుకుంది. రాత్రివేళల్లో విద్యుత్ దీపాల వెలుగులతో స్టేషన్ ధగధగలాడుతుండడంతో ప్రజలు ఆసక్తిగా సందర్శిస్తూ సరికొత్త అందాలను ఆస్వాదిస్తున్నారు. -
– సాక్షి, మహబూబాబాద్/తొర్రూరు
బుధవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026నాన్నా.. చాక్లెట్లు కొనిస్తానన్నావు.. ఊరంతా తిప్పి ఊరవతలికి తీసుకువచ్చావు ఎందుకు నాన్నా.. చెట్టుకిందికి తీసుకువచ్చి తాడు తీస్తుంటే ఏదో ఊయల కడుతున్నావు అనుకున్నాం. నాకు, తమ్ముడి మెడకు చుట్టావు. ఏదో ఆట అనుకున్నాం. కొమ్మపైనుంచి తీసి లాగుతున్నావు. ఊపిరి ఆడట్లేదు నాన్న. ఇంకోసారి చాక్లెట్లు అడగము. గొంతు బిగుసుకుపోతోంది. తాడు తీయ్ నాన్నా.. నేను తమ్ముడు బాధ భరించలేకపోతున్నాం. మమ్ముల్ని కిందికి దింపు నాన్నా.. అమ్మకు, నీకు మధ్య మేము అడ్డుగా ఉన్నామా.. మీరిద్దరు పంచాయితీ పెట్టుకుంటే మాదా తప్పు. మేమేం చేశాం నేరం.. మీ పిల్లలుగా పుట్టడమా.. ’ అంటూ ఆ చిన్నారులు తమ ఆఖరి క్షణాల్లో తండ్రిని వేడుకున్నారేమో.. ఆ మాటలకు తండ్రి మనస్సు కరిగి కిందికి దించి ఉంటే రెండు ప్రాణాలు దక్కేవి. కానీ, పిల్లల రోదనలు వినే పరిస్థితిలో లేని తండ్రి.. ఇద్దరి ప్రాణాలు పోయేవరకు అక్కడే రాయిలా నిలబడి చూశాడు. విగతజీవులయ్యారని నిర్ధారించుకున్నాక సమాజం తనను ఛీ కొడుతుందని భావించి అదే చెట్టుకు ఉరివేసుకున్నాడు. కిన్నెర గుంశావలి (ఫైల్)బిడ్డలకోసం నూటొక్క ముడుపులు కట్టి.. కోటొక్కా.. పూజలు చేసిన వారు ఉన్నారు.. ఇది సమాజంలో ఒకవైపు ఉంటే.. భార్యాభర్తల తగాదాలు, వివాహేతర సంబంధాలు, క్షణికావేశాలతో కన్నబిడ్డలను కర్కశంగా చంపిన ఘటనలు మరోవైపు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సోమవారం జరగగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని ఆ పసికూనలను ఓ తండ్రి చంపి తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. కింద పడితేనే తండ్రి గుండె పగిలినంత బాధ ఉంటుందంటారు.. కానీ, పిల్లలను ఉరివేసి వారి ప్రాణం పోయేదాక చూసిన అతను ఎంత కర్కోటకుడోనని, అతనికి మనస్సెట్టా వచ్చిందని.. ఆ బిడ్డలు ఎంత తల్లడిల్లిపోయారో అంటూ ఈ ఘ టన చూసిన, విన్న స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పిల్లలను తన దగ్గరికి రానివ్వడం లేదన్న అక్కసుతో.. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావలి (29), అదే గ్రామానికి చెందిన కిన్నెర కాంతను 11 ఏళ్ల క్రితం వివాహమాడాడు. వారికి కూతురు విన్య, కుమారులు విలాస్ (5), వికేష్ (3) ఉన్నారు. గుంశావలి తొర్రూరులోని ఓ బైక్ మెకానిక్ షాప్లో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన గుంశావళి రోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. ఈ బాధలు భరించలేక కాంత పది రోజుల క్రితం అదే గ్రామంలోని నానమ్మ సీతమ్మ ఇంటికి పిల్ల లను తీసుకొని వెళ్లింది. గుంశావలి.. పది రోజులుగా పిల్లల కోసం వెళ్తే ఆమె పంపించడం లేదు. దీంతో భార్యపై కోపం పెంచుకున్నాడు. తనకు దక్కని పిల్లలు భార్య వద్ద కూడా ఉండొద్దని కక్ష గట్టాడు. కాంత సోమవారం రోజువారీగా కూలి పనికి వెళ్లగా ఇద్దరు కుమారులు ఇంటి వద్దనే ఉన్నారు. కూతురు ఆడుకోవడానికి మరోచోటికి వెళ్లింది. సమయం చూసి వచ్చిన గుంశావలి పిల్లలకు చాక్లెట్లు కొనిస్తానని ఆశ చూపగా మానాన్న కొనిస్తాడు అంటూ హుషారుగా తండ్రి బైక్పై ఎక్కారు. గుంశావలి తొర్రూరుకు వచ్చి ఓ దుకాణంలో తాళ్లు కొనుగోలు చేశాడు. పిల్లలు నాన్నా చాక్లెట్లు ఏవీ అంటే కొనిస్తానని నమ్మబలికాడు. సాయంత్రం వరకు అటు ఇటు బైక్పై తిప్పాడు. పిల్లలు కూడా సరదాగా ఉందనుకున్నారు. సాయంత్రం తొర్రూరు మార్కెట్ సమీపంలో చెట్టుకు మొదట ఇద్దరు పిల్లలకు ఉరివేసి తరువాత తనూ ఉరేసుకున్నాడు. కాగా, కాంతకు సొంత ఇల్లు, జాగ లేదు. బంధువులింటి సమీపంలో ఓ టెంట్ వేసుకుని భర్త, పిల్లల మృతదేహాల కోసం ఎదురుచూడడం గమనార్హం. విలాస్ (ఫైల్)వికేష్ (ఫైల్)పనికి వెళ్లిన భార్య కాంత సాయంత్రం ఇంటికి వచ్చి తమ్ముళ్లు ఎక్కడికి వెళ్లారని కుమార్తె విన్యను అడగగా నాన్న తీసుకువెళ్లాడని బదులిచ్చింది. ఆందోళన చెందిన కాంత స్థానికుల సహాయంతో ఆటో తీసుకొని బావులు, చెరువులు, సమీప ప్రాంతాల్లో గాలించగా ఆచూకీ తెలియరాలేదు. మంగళవారం ఉదయం తొర్రూరులో పిల్లలు చంపిన ఘటన వెలుగులోకి రావడం.. పోలీసులు వివరాలు సేకరించి తల్లికి సమాచారం అందించారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై భార్య కాంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు. చాక్లెట్లు కొనిస్తానని చెప్పి మెడకు తాళ్లు బిగించావు.. ఎప్పుడూ చాక్లెట్లు అడగము.. నొప్పిగా ఉంది.. తాడు విప్పి దించు నాన్నా.. అయినా నీ మనస్సు కరగలేదా..తొర్రూరులో ఇద్దరు కొడుకులకు మరణశాసనం రాసి తనూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి కుటుంబ కలహాలకు పిల్లలు బలి గుండెలవిసేలా రోదించిన తల్లి, బంధువులు -
డీసీసీలకు దిశానిర్దేశం
జనగామ: జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంలో మరింత బలోపేతం చేసేందుకు టీపీసీసీ దిశానిర్దేశం చేసింది. సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ అధ్యక్షతన భువనగిరి పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన ‘సంఘటన్ సృజన్ అభియాన్’ రివ్యూ మీటింగ్కు ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్యఅతిథిగా హాజరు కాగా, జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధన్వంతిలక్ష్మినారాయణ నాయక్ పాల్గొన్నారు. ఇందులో పార్టీ బలో పేతం, బూత్ స్థాయి నిర్మాణం, మండల, విలేజ్ కమిటీల కార్యక్రమాలపై మార్గదర్శనం చేశారు. సంఘటన్ సృజన్ అభియాన్ ద్వారా పార్టీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేయాలని వారు పిలుపునిచ్చినట్లు డీసీసీ అధ్యక్షురాలు తెలిపారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఫర్టిలైజర్ షాపుల బంద్ విజయవంతం జనగామ: జిల్లాలో ఆల్ఇండియా, స్టేట్ అసోసియేషన్ పిలుపు మేరకు ఎరువులు, పురుగుల మందులు, విత్తన(ఫర్టిలైజర్స్) దుకాణాల బంద్ సోమవారం విజయవంతమైంది. ఫ్లెక్సీలతో వ్యాపారులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ప్రతినిధి పజ్జూరి గోపయ్య మాట్లాడుతూ.. యూరియా కంపెనీలు అనేక లింకుల సాకుతో ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. యూరియా సరఫరా చేసే సమయంలో రవాణా (ఎఫ్ఓఎల్) చార్జీలను తమపైనే మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు ప్రొడక్ట్ కొనుగోలు చేసే సమయంలో లింకు పేరుతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం లింకు ఉండరాదని స్పష్టంగా చెబుతున్నా, కంపెనీలు పట్టించుకోవడం లేదన్నారు. తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకుని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి జనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే నిధులను విడుదల చేయాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రావుల తిరుమల్రెడ్డి అన్నారు. సోమవారం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కలెక్టర్ సందీప్కుమార్ ఝాకు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..విద్యార్థుల ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడంతో పైతరగతులకు వెళ్లడానికి, అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వారికి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. ముఖ్యమంత్రి గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి ఫీజు బకాయిలు వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చి రెండున్నర ఏళ్లు దాటినా నిధులు చెల్లించలేదన్నారు. కార్యక్రమంలో నాయకులు కందుకూరి ప్రభాకర్, ఉల్లెంగుల సందీప్, ఇరుగు యాకన్న, పోశాల పవన్ గౌడ్, దండు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. 30న జాబ్ మేళావిద్యారణ్యపురి: హనుమకొండ అంబేడ్కర్ విగ్రహం ప్రాంతంలోని ఐసీఎస్ఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్లో ఈనెల 30న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు డీఐఈఓ గోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26లో 75 శాతం ఉత్తీర్ణతతో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన బీపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఒకేషనల్ (కంప్యూటర్ సైన్స్) విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థులు వేతనంతోపాటు ప్రముఖ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులు కూడా చేయవచ్చని తెలిపారు. 30న ఉదయం 11:30 గంటలకు జాబ్మేళాలో విద్యార్థులు పాల్గొనాలని ఆయన కోరారు. -
కోతల వేళ కొరత
జనగామ: జిల్లా వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ కొరత తీవ్రమైంది. జిల్లాలో 97 బంకులు ఉండగా 80శాతం మేర ప్రాంతాల్లో పెట్రోలు, డీజిల్ కొరత వేధిస్తోంది. జనగామ పట్టణంతో పాటు మండలంలోని వడ్లకొండ, పెంబర్తి, యశ్వంతాపూర్ ప్రాంతాల్లో ఉన్న 14 బంకుల్లో 13 చోట్ల ఇంధనం పూర్తిగా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క జనగామ ఆర్టీసీ చౌరస్తా వద్ద ఉన్న బంకులో మాత్రమే కొంత పెట్రోలు అందుబాటులో ఉండడంతో సోమవారం వందలాది వాహనాలు క్యూ కట్టాయి. నాలుగు రోజులుగా ఈ పరిస్థితి కొనసాగుతుండగా, ఎప్పటికప్పుడు ఇంధనం సరఫరా అయ్యే అవకాశం ఉంటే వెంటనే బంకుల వద్ద వాహనదారులు గుమికూడుతున్నారు. డీజిల్ కొరత ముఖ్యంగా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్న నేపథ్యంలో హార్వెస్టర్లకు డీజిల్ అత్యవసరం కాగా, సరఫరా లేక పనులు నిలిచిపోతున్నాయి. అదేవిధంగా ఆటో, ట్రాక్టర్, లారీ, క్యాబ్ డ్రైవర్లు తమ వృత్తిని కొనసాగించలేక ఆర్థికంగా నష్టపోతున్నారు. బచ్చన్నపేట, కొడకండ్ల, జఫర్గఢ్, చిల్పూరు, రఘునాథపల్లి, స్టేషన్ ఘన్పూర్, దేవరుప్పుల, పాలకుర్తి, నర్మెట మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు వెలిశాయి. జిల్లాలో రోజుకు లక్షల లీటర్ల పెట్రోలు, మూడున్నర లక్షల డీజిల్ వినియోగం ఉండగా, కంపెనీల నుంచి సరిపడా సరఫరా లేకపోవడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని బంకు నిర్వాహకులు చెబుతున్నారు. డీజిల్ దొరక్కపోవడంతో నిలిచిపోతున్న వ్యవసాయ పనులు జిల్లాలో 80శాతానికి పైగా బంకుల్లో నో స్టాక్ దొరికిన చోట వాహనాల బారులు.. -
విజిలెన్స్
మంగళవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుపై ● ఏడాది రికార్డుల పరిశీలన ● రిజిస్ట్రేషన్లు, కమీషన్లపై ఆరా ● తప్పుడు ఆధార్ రిజిస్ట్రేషన్పై విచారణ..? ● చనిపోయిన వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్ చేయడంపై ఆశ్చర్యం..! ● సమగ్ర విచారణతో నిజాలు వెలుగులోకి ● షెట్టర్లు క్లోజ్ చేసి డాక్యుమెంట్ రైటర్ల పరారీ ● రొటీన్లో భాగమే విచారణ.. : ఎన్ఫోర్స్మెంటు అధికారులుజనగామ: జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆకస్మిక తనిఖీలు సంచలనంగా మారాయి. సోమవారం జరిగిన ఈ తనిఖీల్లో సీఐలు గౌతమ్ రెడ్డి, రాకేశ్, తహసీల్దార్ లక్ష్మణ్ తమ బృందంతో కలిసి కార్యాలయంలో ఆరు నెలల నుంచి ఏడాది కాలంగా జరిగిన రిజి స్ట్రేషన్ డాక్యుమెంట్లను ఒక్కొక్కటిగా క్షుణ్ణంగా పరిశీలించారు. రెండు గంటలకుపైగా సబ్ రిజిస్ట్రార్ చాంబర్లో ప్రతీ డాక్యుమెంట్ను పరిశీలిస్తూ రికార్డులను వెరిఫికేషన్ చేశారు. ఒక్కొక్కరిగా విచారణ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పలువురు డాక్యుమెంట్ రైటర్లను పిలిపించి రోజువారీ రిజిస్ట్రేషన్లు, తీసుకునే ఫీజులు, కమీషన్లపై విచారణ జరిపినట్లు సమాచారం. రోజు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.. ఎవరెవరికీ ఎంత మొత్తంలో డబ్బులు ఇస్తున్నారు.. అనే అంశాలపై ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. స్టాంప్ డ్యూటీ చెల్లింపులు ఆన్లైన్లో జరుగుతున్నాయా లేదా అనే విషయంపై కూడా అధికారులు ఆరా తీశారు. ఇటీవల తప్పుడు ఆధార్ కార్డు ఆధారంగా జరిగిన ఒక రిజిస్ట్రేషన్న్పై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం పలు ముఖ్యమైన డాక్యుమెంట్లు, రిజిస్టర్ లను అధికారులు తమ వెంట తీసుకెళ్లడం ప్రాధాన్యం గమ నార్హం. ఈ తనిఖీలపై సీఐ రాకేశ్ మాట్లాడుతూ.. ఇది ప్రొటోకాల్లో భాగంగానే నిర్వహించిన తనిఖీ అని, తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. అయితే కొన్ని డాక్యుమెంట్లను పరిశీలన కోసం తీసుకెళ్లినట్లు, పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ దీపక్ మాట్లాడుతూ.. ఈ తనిఖీలు సాధారణ ప్రక్రియలో భాగమని, ఎలాంటి ఫిర్యాదులు లేవని తనకు తెలిపారని చెప్పారు. ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఉన్న రికార్డులను పరిశీలించి కొన్ని పత్రాలను అధికారులు తీసుకెళ్లినట్లు ఆయన స్పష్టం చేశారు. మరణించిన వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసిన ఘటనపై.. 12 సంవత్సరాల క్రితం మరణించిన వ్యక్తికి సంబంధించిన ప్లాట్ను అతడు ఇంకా బతికే ఉన్నట్టు ఆధార్ కార్డులో మార్పులు చేసి రిజిస్ట్రేషన్ చేసిన ఘటన ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డు మార్ఫింగ్కు బాధ్యులు ఎవరు,? కార్యాలయంలో ఇలాంటి మరిన్ని అక్రమాలు జరిగాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై కలెక్టర్తో పాటు సంబంధిత ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. మరణించిన వ్యక్తిని జీవించి ఉన్నట్టుగా చూపిస్తూ రిజిస్ట్రేషన్ సమయంలో లింక్ డాక్యుమెంట్లను సరిగా పరిశీలించకుండా నమోదు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐదు రోజులుగా ఈ ఘటనపై చర్చ కొనసాగుతుండగా, ఇందులో కీలక పాత్రధారులు బయటపడకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రైవేట్ వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఇలాంటి రిజిస్ట్రేషన్లలో పైరవీలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆధార్ మార్ఫింగ్ చేసి రిజిస్ట్రేషన్ జరిగిందంటే వ్యవస్థలో లోపాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థమవుతోందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. సమగ్ర విచారణ జరిపితే ఈ మార్ఫింగ్ వెనుక ఉన్న సూత్రధారులు బయటపడడమే కాకుండా, ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్లు ఇంకా ఎన్ని ఉన్నాయో కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వారు అంటున్నారు. కొద్ది నెలలుగా ఓ వ్యక్తి అంతా తానే అయినట్టు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అంతా చక్కబెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. సదరు వ్యక్తి ఆధార్ మార్ఫింగ్ చేశారా లేక దీని వెనక ఇంకా పెద్దలు ఎవరైనా అనే దానిపై ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. జనగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం -
విన్నపాలు వినవలె!
● ప్రజావాణికి వినతుల వెల్లువ ● 247 అర్జీలు స్వీకరించిన అధికారులు ● సమస్యలు విని పరిష్కారానికి ఆదేశించిన కలెక్టర్జనగామ రూరల్: వివిధ సమస్యలతో కలెక్టరేట్ గ్రీవెన్స్కు సోమవారం ప్రజలు పోటెత్తారు. ‘నడవలేని స్థితిలో ఉన్నాను మూడు చక్రాల స్కూటీ ఇవ్వాలని ఓ దివ్యాంగుడు.. అక్రమంగా పట్టా చేసుకున్నారని ఓ బాధితుడు.. గుంతల రోడ్డుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు..’ ఇలా పలు సమస్యలను పరిష్కరించాలని అధికారులకు అర్జీలు సమర్పించారు. వీరి నుంచి కలెక్టర్ సందీప్కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ ఇతర అధికారులు 247 వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, డీఆర్డీఓ నూరుద్దీన్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని ఇలా.. ● బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామం చెందిన వై.పద్మ, తనకు పెంకుటిల్లు ఉందని, ఆ ఇల్లు శిథిలావస్థలో ఉందని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ● ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేస్తే ఆధార్లో పేరు సరిగా లేదని మంజూరు కాలేదని, తనకు ఇల్లు ఇప్పించాలని స్టేషన్ ఘన్పూర్ మండలం రంగరాయిగూడెం చెందిన నెలమంచ సుమలత వినతి అందజేశారు. ● దేవరుప్పుల మండలం చిన్నమడూరు గ్రామానికి చెందిన సోమయ్య తన ఇంటి అనుమతులు రావడం లేదని, అధికారులు పరిశీలించి ఇంటి నంబర్ కేటాయించాలని అర్జీ పెట్టుకున్నారు. ● ప్రభుత్వం గతంలో దళితులకు సాగు నిమిత్తం 5 ఎకరాల 15 గుంటల భూమి కేటాయించిందని, ఆ భూమిని అక్రమంగా సాగు చేస్తున్నారని, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామం చెందిన మేకల భిక్షపతి అర్జీ అందించారు. ● తనకు గతంలో ఎయిడ్స్ వచ్చిందని, వృద్ధాప్య పింఛన్ వస్తోందని, తనకు ఎలాంటి ఆధారం లేదని తనకు రూ. 4వేల పింఛన్ అందించాలని జనగామ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వృద్ధురాలు వేడుకుంది. ● రఘునాథపల్లి మండలం నుంచి కంచన్పల్లి వరకు ఉన్న రోడ్డు సరిగా లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, హ్యామ్ రోడ్ల కింద అభివృద్ధి చేయాలని గ్రామానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ కుత్బుల్లాపూర్ ఇన్చార్జ్ నర్సింగోజు వివేకానంద కలెక్టర్ వినతి పత్రం అందించారు. కాలువ పనులు పూర్తి చేయాలి జనగామ మండలంలోని చీటకోడూర్ రిజర్వాయర్ నుంచి మెయిన్ కెనాల్ ద్వారా 2008లో జనగామ, శామీర్పేట, బాణాపురం, ఎల్లంల, పెంబర్తి, శ్రీనివాసపురం, టంగుటూర్, పటేల్గూడెం, బండ్లగూడెం వరకు 15 కిలోమీటర్ల కోసం కాలువ నిర్మాణం అయ్యిందని, ఇందులో 14 కిలోమీటర్లు పూర్తి కాగా మరో కిలోమీటర్ శామీర్పేట వద్ద నిలిచిపోయిందని జనగామ మండలం శామీర్పేట రైతులు వాపోయారు. దీంతో సాగునీరు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పెండింగ్ పనులు వెంటనే పూర్తిచేసి ఆదుకోవాలని కలెక్టర్కు వినతి పత్రం అందించారు. మూడు చక్రాల స్కూటీ అందించండి.. నాకు చిన్నతనంలోనే పోలియో వచ్చింది. ప్రమాదవశాత్తు కుడి కాలు పూర్తిగా కోల్పోయాను. నడవలేని స్థితిలో ఉంటూ పింఛన్తో కాలం వెల్లదిస్తున్నాను. ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చే మూడు చక్రాల స్కూటీకి గతేడాది దరఖాస్తు చేసుకున్నాను. అఽధికారుల సమక్షంలో డ్రా పద్ధతిలో స్కూటీ వచ్చింది. నాలుగు రోజుల తర్వాత డ్రా పద్ధతి చెల్లదని ఇవ్వడం లేదు. కలెక్టర్ చొరవ తీసుకోని స్కూటీ మంజూరు చేయాలి. –కంకల రాజమల్లయ్య, 22వ వార్డు, జనగామ -
తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన బీఆర్ఎస్
● పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుజనగామ: బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల పయనంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. యశ్వంతాపూర్ బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎర్రబెల్లి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పాత్ర అపారమని, అప్పటి సమైక్య పాలకుల అణచివేతకు తెరదించిన ఉద్యమం గులాబీ జెండా నేతృత్వంలో విజయవంతమైందని గుర్తు చేశారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలలో ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక గులాబీ జెండాను ప్రజలు మరోసారి ఎగురవేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, జనగామ, ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఒక్కరోజూ బడికి తప్పియ్యలే!
● వంద శాతం హాజరుతో అక్కాచెల్లెళ్ల ఆదర్శం ● అభినందనలు తెలిపిన విద్యాశాఖ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్నర్మెట: ప్రస్తుత రోజుల్లో బడికి బంకు కొట్టే విద్యార్థులే ఎక్కువ..ఏ చిన్న ఫంక్షనో, అనారోగ్యమో వచ్చిందంటే చాలు బ్యాగు అటకెక్కించడమే.. కానీ ఈ చిన్నారి అక్కాచెల్లెళ్లు గత రెండేళ్లుగా వంద శాతం హాజరుతో ఆదర్శంగా నిలుస్తున్నారు. మండలంలోని మాన్సింగ్తండా ప్రాథమిక పాఠశాలలో అక్కాచెల్లెళ్లు పార్వతి, రితిక 5, 4వ తరగతులు చదువుతున్నారు. వీరు వరుసగా రెండో ఏడాది (2024–25, 2025–26) సైతం పాఠశాలకు 100 శాతం హాజరు కావడం విశేషం. వరుసగా రెండు విద్యాసంవత్సరాలు 100 శాతం హాజరు నమోదు కావడం రికార్డని విద్యాశాఖ అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, అడిషనల్ డైరెక్టర్ లింగయ్య విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారని కాంప్లెక్స్ హెచ్ఎం నీలం వేణు తెలిపారు. ఈమేరకు చిన్నారులను సోమవారం ఉపాధ్యాయులు సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రావుల రామ్మోహన్ రెడ్డి, పి. దామోదర్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆదు‘కొనండి’ సారూ!
పాలకుర్తి టౌన్: తాము పండించిన ధాన్యం కొనాలి మహా ప్రభో అని రైతులు అధికారులను వేడుకుంటున్నారు. సోమవారం మండలంలోని ఈరవెన్ను గ్రామంలో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి 20 రోజులు అవుతున్నా ఇంతవరకు ఒక్క బస్తా కూడా కొనుగోలు చేయలేదని వాపోయారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలుకుప్పలుగా పేరుకపోయిందని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. వర్షం పడితే ధాన్యం మొత్తం దెబ్బతింటుందని, వెంటనే కొని ఆదుకోవాలన్నారు. -
రైతులను ఇబ్బంది పెడితే చర్యలు
● ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రవాణా వేగవంతంగా జరగాలి ● సమీక్ష సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాజనగామ రూరల్: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరగాలని, రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ, ఐకేపీ, సివిల్ సప్లై, రవాణా, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలసత్వం, నిర్లక్ష్యం వహించి రైతులకు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులను కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సివిల్ సప్ప్లై శాఖ అధికారులు ప్రతీ కొనుగోలు కేంద్రాన్ని నిరంతరం సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. వ్యవసాయ, సివిల్ సప్లై, రవాణా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, సివిల్ సప్లై డీఎం హతీరామ్, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా మార్కెటింగ్ అధికారి రామకృష్ణ, అడిషనల్ డీఆర్డీఏ నూరోద్దీన్, పావని తదితరులు పాల్గొన్నారు. -
విజిలెన్స్ అధికారులు వచ్చారని..
విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు వచ్చారని సమాచారం అందుకున్న పలు డాక్యుమెంటు రైటర్లు దుకాణాలను క్లోజ్ చేసి పరారీ అయ్యారు. ఈ సమయంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్న ఓ డాక్యుమెంటు రైటర్ను విజిలెన్స్ బృందం విచారించింది. మిగతా డాక్యుమెంటు రైటర్లను పిలిపించే స మయంలో అందుబాటులో ఎవరూ లేకుండా పోయారు. డాక్యుమెంటు రైటర్లు తప్పు చేయని పక్షంలో భయపడి షెట్టర్లను క్లోజ్ చేసి ఎందుకు వెళ్లి పోయారు..? అసలు కమీషన్ల దందా వెనక వీరి పాత్ర ఏమైనా ఉటుందా? అనే ప్రజల అనుమానాలకు నిజమనే సమాధానం సైతం ఉండవచ్చని తెలుస్తోంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంపై సైతం నిఘా వేయాలని ప్రజలు కోరుతున్నారు. -
నేడు మోహిని ఏకాదశి
జనగామ: వైశాఖ మాస శుక్ల పక్షంలో వచ్చే పవిత్రమైన మోహిని ఏకాదశి వ్రతాన్ని జిల్లావ్యాప్తంగా భక్తులు సోమవారం భక్తిశ్రద్ధలతో ఆచరించేందుకు సిద్ధమయ్యారు. పురాణాల్లో మహావిష్ణువు మోహిని అవతారాన్ని స్మరించుకునే సందర్భంగా భావించే ఈ ఏకాదశి రోజున ఉపవాసం, జపం, ధ్యానం చేయడం శ్రేష్టఫలితాలను ఇస్తుందని పండితులు పేర్కొంటున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకూ విష్ణు ఆలయాలు ఇప్పటికే వేడుకలకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా జనగామ పట్టణంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి, చెన్నకేశ్వర, శ్రీ సంతోషీమాత ఆలయాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లోని విష్ణు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించనున్నారు. మహిళలు ప్రత్యేకంగా తులసి పూజలు, విష్ణుసహస్రనామ పారాయణాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీసీ రోడ్డు పనుల ప్రారంభంజనగామ రూరల్: మండలంలోని పెంబర్తి గ్రామంలో రూ.పది లక్షలతో సీసీ రోడ్డు పనులను ఆదివారం ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ హయాంలో ఇంది రమ్మ ఇళ్లు, రోడ్ల నిర్మాణాలతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. పేదల పక్షపాతిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పని చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిన్నబోయిన రేఖ, గ్రామస్తులు పాల్గొన్నారు. రామప్పలో విదేశీయుల సందడివెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆదివారం కామెరూన్ దేశానికి చెందిన సోనిలీ, ఫ్రాన్స్ దేశానికి ఇవాన్ వెబర్ వేర్వేరుగా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. రామప్ప ఆలయ చరిత్ర గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించగా వారు ఆసక్తిగా తిలకించారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి సరస్సులో బోటింగ్ చేశారు. ‘అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు’ధర్మసాగర్: ఇందిరమ్మ ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలో ఆదివారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నెరవేరుతుందని పేర్కొన్నారు. అంతకుముందు పెద్ద పెండ్యాల జీపీ కార్యాలయానికి చేరుకున్న ఎంపీకి సర్పంచ్, పంచాయతీ అధికారులు స్వాగతం పలికారు. -
మా వడ్లు కొనండి సారూ !
జనగామ: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ పరిధి కాటన్ యార్డులో ఈ నెల 19న ప్రారంభమైన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంతో మ్యాపింగ్ పరిమితుల కారణంగా సమస్యలు తలెత్తుతున్నాయి. చీటకోడూరు క్లస్టర్లోని చీటకోడూరు, జనగామ, యశ్వంతపూర్ గ్రామాలకు చెందిన రైతుల ధాన్యాన్ని మాత్రమే ఈ కేంద్రంలో కొనుగోలు చేసేలా అధికారికంగా మ్యాపింగ్ చేశారు. అయితే కొనుగోలు కేంద్రం ప్రారంభానికి ముందే జనగామ మండలంలోని మరిగడి, గానుగుపహాడ్, చౌడారం, షామీర్పేట్, పెద్దపహాడ్, వడ్లకొండ, రామచంద్ర గూడెం, కళ్లెం తదితర గ్రామాలకు చెందిన రైతులు ధాన్యం తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇతర గ్రామాలకు చెందిన ధాన్యం సుమారు 15 నుంచి 20 వేల బస్తాల వరకూ నిల్వ ఉంది. మ్యాపింగ్తో ఇక్కట్లు.. ధాన్యం కేంద్రాలకు వెబ్సైట్లో ముందుగా నిర్ణయించిన మ్యాపింగ్ కారణంగా, కేంద్ర పరిధిలోకి రాని గ్రామాల రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల సుమారు 8 గ్రామాలకు చెందిన రైతులు తమ ధాన్యాన్ని అమ్మలేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తీసుకొచ్చిన ధాన్యం నిల్వ ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించి, ఇప్పటికే యార్డుకు తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. లేకపోతే, తాము తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ సమస్యపై జిల్లా స్థాయి అధికారులు స్పందించి, తగు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. కాగా, కేంద్రం పరిధిలో ఉన్న చీటకోడూరు కొంతమేర భూములు చౌడారం రెవెన్యూ పరిధిలో ఉండడంతో ఇక్కడ సైతం ధాన్యం కొనుగోలు సమయంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కాటన్ యార్డులోని కొనుగోలు కేంద్రంలో ‘మ్యాపింగ్’ కష్టాలు పరిధిలో లేని గ్రామాల ధాన్యం కొనని నిర్వాహకులు కేంద్రం ఏర్పాటుకు ముందే తీసుకొచ్చిన రైతులు తమ ధాన్యం కొనాలని 8 గ్రామాల అన్నదాతల ఎదురుచూపులు కేంద్రంలో 15వేల నుంచి 20వేల బస్తాలు -
నాణ్యత లేకుండా రోడ్డు వేస్తారా?
స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లులో త్వరలో నిర్వహించనున్న కాటమయ్య పండుగ కోసం గుడి వద్ద చేపడుతున్న సీసీ రోడ్డు పనులను నాణ్యత ప్రమాణాలు పాటించకుండా చేపడుతున్నారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు పొన్న రాజేష్, బాలగాని అనీల్గౌడ్, తాటికొండ మధు, బూర్ల రాజేశ్వర్, చల్లా రమ్యరఘురెడ్డి ఆదివారం సాయంత్రం అడ్డుకున్నారు. ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనులు నాసిరకంగా ఉన్నాయనే సమాచారంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు అక్కడికి చేరుకుని పరిశీలించారు. పనులకు గోదావరి ఇసుకను కాకుండా పక్కనే ఉన్న వాగుకు చెందిన దుబ్బ ఇసుకను వాడుతున్నట్లు వారు గుర్తించారు. అదేవిధంగా సీసీ పనులు చేసేవద్ద ఎలాంటి చదును చేయకుండా, కనీసం కింద కవర్ సైతం వేయకుండా పనులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై పనులు చేస్తున్న వారితో వాగ్వాదం చేసి అడ్డుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సదరు పనులు చేస్తున్న విషయాన్ని తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులతో కౌన్సిలర్లు వాగ్వాదం చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్ అక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ల వాదన విన్న చైర్మన్ సానుకూలంగా స్పందించారు. నిబంధనల మేరకు పనిచేయకుంటే సహించేది లేదని, నాసిరకంగా పనులు చేస్తే తప్పక తగిన చర్యలు ఉంటాయని చెప్పడంతో వారు శాంతించారు. ఛాగల్లులో పనులు అడ్డుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదం -
హేమాచలక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు
మంగపేట: రెండో యాదగిరిగుట్టగా పేరుగాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 10 రోజుల పాటు జరిగే తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను ఆగమశాస్త్రం ప్రకారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం, ఆలయ అర్చకులతో శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ ఇన్చార్జ్ అధికారి వీరస్వామి తెలిపారు. అత్యంత వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేశారు. అంకురార్పణతో జాతర ప్రారంభం హేమాచల క్షేత్రంలో నేడు(సోమవారం) ఉదయం 6 గంటల నుంచి బ్రహ్మోత్సవాల యాగ్నికులు యాగశాలలో విశ్వక్షేనపూజా, భగవత్ పుణ్యాహ వాచన, పసరిషత్ ప్రార్థన, రుత్విక్వరణం, రక్షాబంధనం, ఉత్సవ మూర్తులకు స్నపనం(ఉత్సవాంగస్నపనం), ఆళువార్లకు తిరువంజనం(అభిశేకం), సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పన, 28న మంగళవారం గరుడాదివాసం, 29న ధ్వజారోహనం, 30న ఎదుర్కోలు మహోత్సవం, మే 1న మధ్యాహ్నం 12.32 గంటలకు అభిజిత్ లగ్నంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లతో తిరు కల్యాణ మహోత్సవం, 2న రథోత్సవం, 3న సదస్యం(వేదాశీర్వచనం), 4వ తేదీన తెప్పోత్సవం, 5న మహాపూర్ణాహుతి, నాకబలి(నాగవెల్లి), 6న ఉదయం 11 గంటలకు వసంతోత్సవం, గజవాహనసేవ, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఈఓ వీరస్వామి తెలిపారు. నేటి నుంచి పది రోజుల పాటు కార్యక్రమాలు ముస్తాబైన ఆలయం.. తరలిరానున్న భక్తజనం -
రాష్ట్రంలో నిరంకుశ పాలన
● మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్టేషన్ఘన్పూర్: రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి నిరంకుశ పాలన సాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శించారు. స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.. సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ముందు చేసిన హామీలను విస్మరిస్తూ తుగ్లక్ పాలన సాగిస్తున్నారని, కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. ప్రజల గుండెల్లో నుంచి కేసీఆర్ను తీసివేయడం రేవంత్రెడ్డి తరం కాదన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువాతో గ్రామాల్లో తిరుగుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరిని, ఆయన అనుచరులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యంతో రైతులు అరిగోస పడుతున్నా కాంగ్రెస్ పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
డీజిల్ నోస్టాక్
● వరికోతల వేళ ఇబ్బందులు కొడకండ్ల: వరికోతల వేళ డీజిల్ కొరతతో వాహనాల యాజమానులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి న పరిస్థితి నెలకొంది. మండలకేంద్ర పరిధిలోని నాలుగు బంకుల్లో నాలుగు రోజులుగా డీజిల్ స్టాక్ లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వరికోతల సమయంలో డీజిల్ స్టాక్ లేక వరికోత యంత్రాలు, ట్రాక్టర్ యాజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా వరికోతలు ఆలస్యమవుతుండడంతో రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. బంక్ల నిర్వాహకులు డబ్బులు చెల్లించినా కూడా వారానికి ఒకసారి కూడా అయిల్ కంపెనీల నుంచి డీజిల్ సరఫరా కాకపోవడంతో నిర్వాహకులు నోస్టాక్ బోర్డులు పెట్టుకొవాల్సిన పరిస్థితి నెలకొంది. వరికోత యంత్రాల, ట్రాక్టర్ల యాజమానులు సీజన్ కావడంతో దూరప్రాంతాల్లో డీజిల్ స్టాక్ ఉన్న బంక్ల వద్దకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయిల్ కంపెనీలు స్పందించిన వరికోతల సీజన్లో డీజిల్ సరఫరా చేసి ఇబ్బందులు తీర్చాలని వాహనాల యాజమానులు, రైతులు కోరుతున్నారు. -
ఈ నంబర్లు అత్యవసరం
జనగామ: అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సేవలను వేగంగా పొందేందుకు మిషన్ వాత్సాల్య పథకంలో భాగంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం హెల్ప్లైన్ నంబర్ల జాబితా విడుదల చేసింది. మహిళలు, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, సైబర్ మోసాలు, దత్తత ప్రక్రియ, డ్రగ్స్ వ్యసనం వంటి అనేక అత్యవసర సందర్భాల్లో వెంటనే సంబంధిత విభాగాలకు సమాచారం అందజేసి సహాయం పొందేలా ఇవి రూపొందించారు. ప్రజలు ఈ హెల్ప్లైన్ నంబర్లను గుర్తుంచుకొని, అత్యవసర సమయాల్లో ఉపయోగించుకోవాలని డీడబ్ల్యూఓ కోదండరాములు తెలిపారు. జిల్లా మహిళా, పిల్లల, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ సంయుక్తంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. హెల్ప్లైన్ నంబర్ల జాబితా విడుదల సైబర్ మోసాలు, డ్రగ్స్, వేధింపులపై ఫిర్యాదులు 1098–14567 వరకు అత్యవసర సమయంలో వినియోగం పిల్లలు, దివ్యాంగులు, మహిళలు, వృద్ధుల కోసం..అత్యవసర సమయాల్లో హెల్ప్లైన్ ఫోన్ నంబర్లు: పిల్లల కోసం ప్రత్యేక హెల్ప్లైన్–1098 ఈఆర్ఎస్ అత్యవసర సహాయ నెంబర్–112 మహిళల కోసం–181 హెల్ప్లైన్ పిల్లల దత్తత కోసం–1800–11–1311 డ్రగ్స్ నియంత్రణ –1908 మహిళల భద్రత కోసం షీ టీమ్స్– 8712685142 సైబర్ మోసాలపై ఫిర్యాదు–1930 పోలీసు హెల్ప్లైన్–100 అంగన్వాడీ సేవల కోసం–155209 దివ్యాంగుల హెల్ప్లైన్–1800–572–8980 వృద్ధుల కోసం హెల్ప్లైన్–14567 -
మీ వివరాలు మీరే !
జిల్లాలో స్వీయ గణన ప్రారంభంజనగామ: జనగణన 2027 సెల్ఫ్ ఎన్యుమరేషన్తో డిజిటల్ దిశగా కీలక అడుగు వేస్తోంది. ఇందులో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పౌరులే స్వయంగా తమ కుటుంబ, గృహ వివరాలను నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ద్వారా ఇంటింటికీ వెళ్లే ఎన్యుమరేటర్లపై భారం తగ్గడంతో పాటు, డేటా కచ్చితత్వం పెరుగుతుందని అధికారులు తెలిపారు. 1,169 ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు జిల్లాలో 281 గ్రామ పంచాయతీల పరిధిలో రిజర్వుతో కలుపుకుని 994 మంది ఎన్యుమరేటర్లు, రిజర్వు కలుపుకుని 174 సూపర్వైజర్లు కలుపుకుని మొత్తం 1,168 మంది ఇంటింటి గణన కోసం సేవలు అందించనున్నారు. 2027లో ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు నిర్వహించనున్న జనగణన నేపథ్యంలో ఈ నెల 26 నుంచి మే 10 వరకు ఇంటింటి గణన జరుగనుంది. 33 ప్రశ్నలకు సమాధానం సెల్ఫ్ ఎన్యుమరేషన్లో భాగంగా పౌరులు ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్లో లాగిన్ అయి 33 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ పోర్టల్ ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఉద్యోగాలు, వలసలతో అందుబాటులో లేని వారికి మంచి అవకాశం. ఈ పోర్టల్ తెలుగుతో సహా 16 భాషల్లో అందుబాటులో ఉంది. యూజర్ ఫ్రెండ్లీ డిజైన్, టూల్ టిప్స్, ట్యుటోరియల్ వీడియోలతో సులభంగా ఉపయోగించుకునేలా రూపొందించారు. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, డేటా ఎన్క్రిప్షన్ ద్వారా భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లా, పిన్కోడ్, గ్రామం లేదా పట్టణం ఆధారంగా లొకేషన్ గుర్తించే స్మార్ట్సెర్చ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు. ఇళ్ల జాబితాలో అడిగే ప్రశ్నలు ఇల్లు సంబంధిత వివరాలు, జనగణన జాబితా నెంబర్, ఇంటి ఫ్లోర్, ఇంటిని ఎలా వాడుతున్నారు (నివాస/వాణిజ్య/ఇతర), ఇల్లు బలహీన స్థితిలో ఉందా. ఇల్లు నివసించడానికి అనుకూలమేనా.. ఇంటి సభ్యుల వివరాలు, కుటుంబ సభ్యుల మొత్తం సంఖ్య. ఇంటి పెద్ద ఎవరు.. ఏ వర్గానికి చెందిన వారు. ఇంటి నిర్మాణం, వినియోగం, ఇల్లు సొంతమా, అద్దె ఇల్లా, గదుల సంఖ్య, వంటగది, ఇంటికి డ్రైనేజ్, విద్యుత్, తాగునీటి ప్రధాన వనరు, విద్యుత్, సోలార్, డిజిటల్ సదుపాయాలు, రేడియో, టీవీ, ఇంటర్నెట్ కనెక్షన్, ల్యాప్టాప్, కంప్యూటర్, ఫోన్లు, వాహనాల సంఖ్య. ప్రారంభమైన స్వీయ గణన జిల్లాలో జనగణనలో భాగంగా స్వీయ గణన ప్రక్రియ ప్రారంభమైందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కుటుంబ వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చన్నారు. ఆదివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు, ముందుగా స్వీయ గణన నమోదుపై మాస్టర్ ట్రెయినర్ రామరాజు ఆధ్వర్యంలో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ర్వహించారు. అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా సులభంగా కుటుంబ వివరాలను నమోదు చేయవచ్చు. ఈసారి జనగణనలో మొదటిసారిగా స్వీయ గణనను ప్రవేశపెట్టారు. కలెక్టర్ వెంట సీపీఓ చిన్న కోట్య నాయక్ ఉన్నారు. మే 10 వరకు అవకాశం పూర్తి భద్రతతో డిజిటలైజేషన్ మ్యాప్లో ఇల్లు పిన్ చేయడం కీలకం 33 ప్రశ్నలకు సమాధానాలురిజిస్ట్రేషన్ ఎలా చేయాలి https://se.census.gov.in లాగిన్ కావాలి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం ఎంచుకోవాలి క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి కుటుంబ యజమాని పేరు నమోదు చేయాలి ఒక కుటుంబానికి ఒక మొబైల్ నెంబర్ మాత్రమే ఉపయోగించాలి మీకు నచ్చిన భాష ఎంచుకోండి మొబైల్కు వచ్చిన ఓటీపీ వెరిఫై చేయాలి లొకేషన్–అడ్రస్ వివరాలు జిల్లా, పిన్కోడ్, గ్రామం, పట్టణం వివరాలు నమోదు చేయాలి మ్యాప్లో ఉన్న రెడ్ మార్కర్ను కచ్చితంగా మీ ఇంటిపైకి డ్రాగ్ చేయాలి ఇళ్ల జాబితా ప్రశ్నలు పూర్తి చేసి, అందులో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాలి. తదనంతరం వివరాలను సమీక్ష చేసి, ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ‘హెచ్’ తో మొదలయ్యే 11 అంకెల ఎస్ఈ ఐడీ జనరేట్ అవుతుంది. సెన్సస్ సిబ్బందికి ఐడీ చూపించాలి. వారు మ్యాప్ చేసిన వెంటనే ఇంటి గణన పూర్తవుతుంది. -
భక్తిశ్రద్ధలతో వాసవిమాత జయంతి
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవం ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమా నికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి అమ్మవారి చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. వేడుకల్లో ఇన్చార్జ్ యువజన, క్రీడల అభివృద్ధి శాఖ అధికారి కోదండరాములు, సీపీఓ కోటా నాయక్, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు గంగిశెట్టి ప్రమోద్ కుమార్, చాంబర్ అధ్యక్షుడు పోకల లింగయ్య, మాజీ అధ్యక్షుడు మహంకాళి హరిశ్చంద్రగుప్త, రైస్మిల్లర్స్ ప్రతినిధి పూజ్జూరి జయహరిగుప్త, బెజుగం భిక్షపతి, అరుగుల శ్రీనివాస్, బిజ్జాల నవీన్, గట్టు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. డీసీపీ కార్యాలయంలో.. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతిని పురస్కరించుకుని డీసీపీ కార్యాలయంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్ పూజలు చేశారు. ఆర్యవైశ్యులు సమాజంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, పేద కుటుంబాలకు అండగా నిలిచే గురుతర బాధ్యత కలిగిన వారన్నారు. ఆర్యవైశ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కానిస్టేబుళ్లు కె.సంపత్, జి.ప్రసాద్, తాటికొండ రవి, డ్రైవర్ శ్రీను, గన్మన్ శ్రీనివాస్, ఏఆర్ గాడ్, సిబ్బంది ఉన్నారు. -
డిజిటల్ చెల్లింపులు బెటర్!
జనగామ: ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వినియోగదారులు ఎలాంటి బిల్లులను అయినా ఆన్లైన్లోనే చెల్లిస్తున్నారు. ఈ చెల్లింపులతో వినియోగదారులు కార్యాలయాలకు తిరగకుండా ఎక్కడి నుంచైనా చెల్లించడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. వినియోగదారుల సౌకర్యార్థం నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పీడీసీఎల్) డిజిటల్ చెల్లింపుల విధానంపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులు ప్రతీ ఏటా సుమారు 10 శాతం మేర వినియోగదారులు తమ నెలవారీ విద్యుత్ బిల్లులను టీజీ ఎన్పీడీసీఎల్ యాప్తో పాటు టీ–వాలెట్, గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం, హెచ్డీఎఫ్సీ ఆన్లైన్, ఇండియన్ బ్యాంక్ ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ ఫారంల ద్వారా చెల్లిస్తున్నారు. గణాంకాల ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో ప్రతీ నెల 30,753 మంది వినియోగదారులు ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేయగా, 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 33,942కు పెరిగినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఆన్లైన్ పద్ధతుల్లో చెల్లింపులు చేసుకునే విధంగా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యుత్ కార్యాలయాల కౌంటర్ల వద్దకు వెళ్లి ఎండదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆన్లైన్ చెల్లింపుల ద్వారా వినియోగదారులు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎక్కడి నుంచైనా రెండు నిమిషాల వ్యవధిలో చెల్లింపులు చేసుకునే విధంగా అవకాశం ఉంది. ఎండ తీవ్రతతో ఆన్లైన్ చెల్లింపులకు పెరుగుతున్న ఆదరణఆన్లైన్ పేమెంట్ చెల్లించండివిద్యుత్ వినియోగదారులు తమ బిల్లులను ఆన్లైన్ పేమెంట్ ద్వారా చెల్లించి సమయం ఆదా చేసుకోండి. వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ మొబైల్లో ఎన్పీడీసీఎల్ యాప్ను డౌన్్ లోడ్ చేసుకుని, విద్యుత్ బిల్లుపై ఉన్న యూఎస్సీ నంబర్ను నమోదు చేసి సులభంగా బిల్లు చెల్లించవచ్చు. వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు, సేవలను సులభతరం చేసి ఆధునీకరించేందుకు టీజీఎన్న్పీడీసీఎల్ నిరంతరం కృషి చేస్తుంది. – సంపత్రెడ్డి, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్ -
విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు
జఫర్గఢ్: సమాజంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలన్న పదిమందికి సహాయపడాలన్న చదువుతోనే సాధ్యమవుతుందని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్ఎస్ఎ సెక్రటరీ శ్రీదేవి అన్నారు. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీతండా వద్ద ఉన్న మా ఇల్లు ప్రజాధరణ అనాథ ఆశ్రమంలో శనివారం బాల్య వివాహాల విముక్త భారతం అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె పుష్ప అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడుతూ ఏధి సాధించాలన్న చదువు ఎంతో ముఖ్యమన్నారు. పాఠ్యపుస్తకాలే కాకుండా వాటితో పాటు రోజు వారి వార్త పత్రికలు, లైబ్రరీలో పుస్తకాలు ఒక గంట పాటు చదివినట్లయితే సమాజంపై అవగాహన పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భరోసా లీగల్ అడ్వైజర్ దయామణి, అడ్వకేట్ అనిల్, పీఓ స్వప్నరాణి, స్కోప్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మనోజ్, పూజ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. నేడు మున్సిపల్ ఆధ్వర్యంలో ‘హ్యాపీ సండే’జనగామ: ప్రజాపాలన–ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు జనగామ మున్సిపల్ ఆధ్వర్యంలో నేడు (ఆదివారం) ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు బతుకమ్మ కుంటలో ‘హ్యాపీ సండే’ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు కమిషనర్ మహేశ్వర్రెడ్డి, చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యోగా మాస్టర్ గీతేష్ కుమార్ బజాజ్ ఆధ్వర్యంలో యోగాసనాలతో పాటు సంపూర్ణ ఆరోగ్యం కోసం నవ్వుల కార్యక్రమం, తడి పొడి చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన ఉంటుందన్నారు. పాత వాహనాలతో ఇబ్బందులు జనగామ: బియ్యం రవాణా సమయంలో పాత వాహనాలను ఉపయోగించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణగౌడ్ అన్నారు. ఈ మేరకు జనగామ మండలం వడ్లకొండ గోదాంను కాజీపేట ఎఫ్సీఐ మేనేజర్ నేత్ర ప్రకాష్ శనివారం తనిఖీ చేశారు. ఈ ఆయన మర్యాద పూర్వకంగా కలిసి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. సీఎంఆర్ రైస్ను ఎఫ్సీఐ గోదాంలకు తరలించడంలో పాత వాహనాలు ఉపయోగించడంతో మిల్లర్లు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. ఆలస్యం, ఆపరేషనల్ సమస్యలు ఏర్పడి, సమయానుకూల డెలివరీ కష్టమవుతోందని విన్నవించారు. జనగామ మండలం యశ్వంతాపూర్, వడ్లకొండ గోదాంల వద్దకు చేరే వాహనాలను అదే రోజు అన్లోడ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రబీ 2024–25 సీజన్లో సుమారు 700 ఏసీకేఎస్ బియ్యం చేరనున్నట్లు లేఖలో పేర్కొంటూ, తమ అభ్యర్థనను పరిశీలించి, అవసరమైన సహాయం అందించాలని కోరారు. అధ్యక్షుడి వెంట కార్యదర్శి గాదె శ్రీనివాస్, కోశాధికారి మార్యాల లక్మినారాయణ ఉన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలునర్మెట (తరిగొప్పుల): ఎరువుల దుకాణాలను పారదర్శకంగా నిర్వహించాలని, అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఏఓ అంబికా సోని అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మండలకేంద్రంలోని ఎరువుల దుకా ణాలను ఎస్సై గుగులోత్ శ్రీదేవి, ఎంఏఓ మనోహిత్ విక్రంతో కలిసి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎరువులు, విత్తనా లు, పురుగుల మందులు, లైసెన్స్లు, రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలన్నారు. లైసెన్స్లను, స్టాక్ బోర్డుల వివరాలను ప్రదర్శించాలని, స్టాక్ రిజిస్టర్లను ప్రతిరోజు అప్డేట్ చేయాలన్నారు. మోతాదుకు మించి ఎరువులను, పురుగు మందులను వాడొద్దన్నారు. ప్రెజ్ఞాపురం నర్సింహులు తదితరులు ఉన్నారు. -
సాంకేతిక విద్యాబోధనకు తోడ్పాటు
దేవరుప్పుల/జనగామ రూరల్: ప్రాథమిక స్థాయిలోనే సాంకేతిక విద్యాబోధన తోడ్పాటు అందిస్తున్నట్లు ఇన్ఫోసిస్ సంస్థ ప్రతినిధురాలు రాపాక స్వాతినాగరాజు తెలిపారు. శనివారం మండలంలోని నీర్మాల ఎస్సీకాలనీ, దొడ్లబండతండా, బంజర, కడవెండి, చిన్నమడూరు, పెద్దమడూరు, సింగరాజుపల్లి ప్రాథమిక పాఠశాలతో పాటు జనగామ పట్టణంలోని ప్రాథమిక పాఠశాలకు సంస్థ ఆధ్వర్యంలో కంప్యూటర్లను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకురాలు సుధామూర్తి ఆశయంతో ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల అభ్యున్నతికి కంప్యూటర్లను అందజేస్తున్నామన్నారు. ప్రతీ విద్యార్థి ప్రాథమిక స్థాయిలోనే టెక్నాలజీని నేర్చుకొని శాస్త్ర సాంకేతిక రంగంలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కొల్ల మహిపాల్ రెడ్డి, దేవరుప్పుల మండల అసోసియేట్ ప్రెసిడెంట్ శివగారి కిరణ్ కుమార్, బోగ్గారపు శ్రీనివాస్, హెచ్ఎంలు గైని శంకరయ్య, మరియాల మాధవి, బాస్కుల అంజయ్య, వెంకన్న, సుహాసిని, భాగ్యలక్ష్మి, రజనీ, దిలీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అతివలే అధికం
‘ఉపాధి’లో జిల్లాలో 70 శాతం పనులు వారివే..● కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న మహిళలు ● జిల్లా వ్యాప్తంగా 1.16లక్షల జాబ్ కార్డులు ● కూలీలు 2,24,000ఈ ఫొటోని మహిళ జఫర్గఢ్ మండలం వడ్డెగూడెం గ్రామానికి చెందిన పిన్నింటి రాజమ్మ. పురుషులకు దీటుగా పనులు చేస్తూ కూలి పొందుతుంది. కుటుంబ పోషణలో తన భాగస్వామ్యాన్ని చాటుతోంది. ఉదయం ఇంట్లో వంట పనులు చేసుకుని 7 గంటలకే ఉపాధి పనుల్లో నిమగ్నమవుతోంది. ఇలా రాజమ్మ ఒక్కరే కాదు జిల్లాలో చాలా మంది మహిళలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు.జనగామ రూరల్: ఉపాధి పనుల్లో మహిళలు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలు నేడు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. పలుగు, పార చేతబట్టి ఉపాధి హామీ పథకంలో పురుషులతో సమానంగా పనిచేస్తున్నారు. కుటుంబ పోషణకు ఆసరాగా నిలుస్తున్నారు. పొలం పనులతో పాటు గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి పనులను సద్వినియోగం చేసుకుంటున్నారు. అసంఘటిత రంగంలోనూ సత్తాచాటుతున్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉపాధి పనుల్లో భాగస్వాములవుతున్నారు. జిల్లాలో మొత్తం 70 శాతం వరకు వారే పనులు చేపడుతున్నారు. ఉపాధి పనులు సద్వినియోగం ఉన్న ఊరిలో పని దొరకక వలస వెళ్తున్న గ్రామీణ ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వగ్రామంలోనే పనులు కల్పించాలనే లక్ష్యంతో ఉపాధి పథకాన్ని ప్రారంభించాయి. ఈ పథకం పేదలు, వలస జీవులకు వరంగా మారింది. మహిళలు కుటుంబ పనులు చేయడమే కాకుండా పురుషులకు సమానంగా ఉదయం 7 గంటలకే ఇంటి పని ముగించుకుని ఉపాధి బాటపడుతున్నారు. పురుషుల కంటే మహిళలే ఉపాధి పనిని సద్వినియోగం చేసుకుంటున్నారు. కొంత మంది పేద మహిళలు ఉపాధి పనులతో ఆర్థిక సమస్యలను అధిగమిస్తూనే తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్నారు. వ్యవసాయ పనులు ఉన్నా ఉపాధి పనికే మొగ్గు చూపడం విశేషం. పనుల ప్రాధాన్యం ఇలా.. చెక్ డ్యాంలు, ఫీడర్ చానల్స్, మట్టి కట్టలు, గ్యావెల్ రోడ్డులు, పండ్లతోటల పెంపకాలు, ఊట గుంటలు, చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు, కట్టుకాల్వల పనులు చేపట్టనున్నారు. ఈసారి భూగర్భ జలాలు పెంచేలా నీటి నిల్వ గుంతలు, పంట కాల్వలు, మట్టి దారులు, కందకాల తవ్వకాలు, పశువుల పాకల నిర్మాణాలకు ఇందిరమ్మ ఇళ్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నార ు. వంద రోజుల పని కల్పించేలా.. పథకంలో భాగస్వాములైన కూలీలందరికీ ఆర్థిక సంవత్సరంలో వంద రోజుల పని కల్పించేలా అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా గ్రామాలకు అవసరమైన పనులు గుర్తించడంతో పాటు ఇందులో పనులకయ్యే ఖర్చు వివరాలు తయారు చేసి అందజేశారు. కోరిన వెంటనే జాబ్కార్డు ఇచ్చి ఉపాధి అందేలా చూస్తున్నారు.మొత్తం జాబ్ కార్డులు : 1,16,000మొత్తం ఉపాధి కూలీలు : 2, 24,000ఆక్టీవ్ జాబ్ కార్డులు : 76,727ఆక్టీవ్ కూలీల సంఖ్య : 1,14,000 -
రోడ్డెక్కిన బస్సులు
జనగామ: ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవడంతో మూడు రోజులుగా కొనసాగిన సమ్మెకు తెరపడింది. శుక్రవారం అర్ధరాత్రి సమ్మె విరమణ ప్రకటించగా, శనివారం తెల్లవారు జాము 5 గంటల నుంచే జనగామ బస్టాండ్ నుంచి బస్సు సర్వీసులు యథావిధిగా రోడ్లపైకి వచ్చాయి. మూడు రోజుల పాటు రవాణా సేవలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ఈ పరిణామంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. జనగామ డిపో పరిధిలో 115 బస్సులు ఉన్నాయి. ఇందులో ఎక్స్ప్రెస్ 26, డీలక్స్ 13, పల్లె వెలుగు 37, అద్దె బస్సులు 39 ఉన్నాయి. ఈ బస్సులు ప్రతిరోజూ హనుమకొండ, ఉప్పల్, జగద్గిరిగుట్ట, సికింద్రాబాద్, పాలకుర్తి, సూర్యాపేట, మోత్కూరు, సిద్దిపేట, తదితర ప్రాంతాలకు రోజుకు 385 ట్రిప్పులు తిరుగుతాయి. రోజువారీగా సుమారు 45 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ 56 నుంచి 58 వేల మంది ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుస్తాయి. కార్మికుడి మృతితో.. మొదటి రెండు రోజుల్లో కొంతమేర బస్సులు నడిచినా, నర్సంపేటకు చెందిన కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్యతో పరిస్థితి మరింత విషమించింది. దీంతో మూడోరోజు పూర్తిగా బస్సులు నిలిచిపోయేలా చేసింది. ఫలితంగా సంస్థకు రోజుకు రావాల్సిన సుమారు రూ.23 లక్షల టికెట్ ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. మూడు రోజుల్లో కలిపి దాదాపు రూ.60 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. సమ్మె విరమణ అనంతరం డిపో మేనేజర్ స్వాతి ఆధ్వర్యంలో అధికారులు, సూపర్వైజర్లు అత్యవసరంగా చర్యలు చేపట్టారు. మొదటి రోజే అన్ని బ స్సులను రూట్లపైకి తీసుకొచ్చేలా చర్యలు తీసు కున్నారు. అయినప్పటికీ సమ్మె ప్రభావం వెంటనే తగ్గలేదని గణాంకాలు సూచిస్తున్నాయి. సాధారణంగా 56 నుంచి 58 వేల మంది ప్రయాణించే చోట, సమ్మె తర్వాత తొలి రోజున కేవలం 48 వేల మంది మాత్రమే ప్రయాణించారు. అంటే దాదాపు 10 వేల మంది ప్రయాణికులు తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఇది ప్రజల్లో ఇంకా కొంత అనిశ్చితి ఉండడంతోనే తగ్గుదలకు కారణమని అధికారులు భావిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె విరమణ 3 రోజుల సమ్మె, రూ.60లక్షల నష్టం -
కూలీలకు వసతులు కల్పించాలి
నర్మెట: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అధిక ఆదాయాన్ని పొందాలని అడిషనల్ డీఆర్డీఓ చంద్రశేఖర్ అన్నారు. మచ్చుపహాడ్లోని ఉపాధి హామీ (వరద నీటి అడ్డుకట్ట) పనులను శనివారం పరిశీలించిన ఆయన సిబ్బందికి, కూలీలకు పలు సూచనలు చేశారు. వర్షాకాలం నీటి నిల్వలతో భూగర్భ జలాలు పెరిగే విదంగా పీడర్ చానల్స్, పూడికతీత, పనులు చేపట్టాలని, పశువులు, జీవాల, కోళ్ల షెడ్డుల నిర్మాణాలు చేసుకోవాలన్నారు. ఉదయం 6 నుంచి 7గంటలలోపే పనులకు హాజరుకావాలని, ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా పని ప్రారంభమైన నాలుగు గంటలకు రెండో సారి ఫొటో తీసిన అనంతరం వెళ్లాలని కూలీలకు సూచించారు. అనంతరం వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్థానిక వైద్యుడు కూలీలకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ లింగాల హైమ రమేష్, ఎంపీఓ ఆకుల వెంకటమల్లికార్జున్, ఏపీఓ బిరుకూరి రమాదేవి, ఎఫ్ఏ భూక్య బిక్కు నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
అవసరాలు తీరుతున్నాయి
వేసవిలో పనులు తక్కువగా ఉంటాయి. ఉపాధి పనులతో ఆర్థిక అవసరాలు తీరుతున్నాయి. రోజు పనికి పోతన్న. ఎండలు బాగా ఉన్నాయి. సకాలంలో డబ్బులు వస్తే బాగుంటుంది. కూలి రేటు కూడా పెంచాలి. – కొన్నె వరలక్ష్మి పడమటి కేశవాపూర్, బచ్చన్నపేటమహిళలదే కీలక పాత్రఉపాధి పథకంలో మహిళలే కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చిన వేతనంతో కుటుంబాలకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. చేతి నిండా పని దొరకడంతో మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. జిల్లాలో 70 శాతం మహిళలే ఉన్నారు. – నూరుద్దీన్, అడిషనల్ డీఆర్డీఓ -
ప్యాక్స్ కిరీటాలు ఎవరికో?
సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్) నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లను నియమించే ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. సహకార సంఘాల పదవీ కాలం గత ఏడాది ఫిబ్రవరి 14తో ముగియడంతో, ప్రస్తుతం వీటి బాధ్యతలను ప్రత్యేకాధికారులు నిర్వహిస్తున్నారు. తిరిగి వారి స్థానంలో అధికార పార్టీకి చెందిన నాయకులను వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల తరహాలో సహకార సంఘాలకూ పాలకమండళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల (ఈ నెల 23న) జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పీఏసీఎస్లతో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీ), సహకార మార్కెటింగ్ సమాఖ్య (డీసీఎంఎస్)లకు కూడా ఇదే పద్ధతిలో పాలకమండళ్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్కు చెందిన ఆశావహులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇదీ పీఏసీఎస్ల లెక్క... ఇన్ఛార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలే కీలకం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారుల వివరాల ప్రకారం 98 సహకార సంఘాలు ఉండగా, సుమారు 2.96 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. నామినేటెడ్ పద్ధతి ద్వారా ఉమ్మడి జిల్లాలో 98 చైర్మన్ పోస్టులు, 98 వైస్ చైర్మన్ పోస్టులతో పాటు మరో 1,260 మందికి డైరెక్టర్లుగా అవకాశం దక్కనుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, స్థానిక నేతలకు మంత్రివర్గం నిర్ణయం ద్వారా ఈ నామినేటెడ్ పదవులు పొందే అవకాశం కలగనుంది. అయితే మార్కెట్ కమిటీల మాదిరిగానే, స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకు పాలకవర్గాలను నియమిస్తారు. ఎమ్మెల్యే లేని నియోజకవర్గాల్లో జిల్లా మంత్రి ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది. ఈ ప్రక్రియలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి కూడా కీలకంగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియను అమలు చేయాలని భావించిన ప్రభుత్వం ప్రస్తుత సహకార చట్టంలో మార్పులు, చేర్పులపై ఉన్నతస్థాయి కసరత్తు మొదలెట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఎన్నికల నుంచి ‘నామినేటెడ్’ వైపు... సహకార సంఘాల ఎన్నికలు అధికారికంగా పార్టీ రహితంగా జరిగినా, పంచాయతీ ఎన్నికల మాదిరిగానే వీటిలో రాజకీయ పార్టీల ప్రమేయం పరోక్షంగా ఉండేది. ఆయా సంఘాల్లో సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే హక్కు ఉంటుంది. సభ్యులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారై ఉండటంతో సహకార చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి దశలో సభ్యులు ఓటు వేసి డైరెక్టర్లను ఎన్నుకోవడం.. రెండవ దశలో ఎన్నికై న ఆ డైరెక్టర్లు తమలో నుండి ఒకరిని చైర్మన్గా, మరొకరిని వైస్ చైర్మన్గా ఎన్నుకునేవారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ ఎన్నికల పద్ధతికి బదులుగా, మార్కెట్ కమిటీల తరహాలో నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లను నియమించాలని భావిస్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే, సాధారణ సభ్యులు ఓటు వేసి డైరెక్టర్లను ఎన్నుకునే ప్రక్రియకు బదులుగా, ప్రజా ప్రతినిధుల సిఫార్సుతో నేరుగా ప్రభుత్వం పాలకమండళ్లను ఎంపిక చేయడమే ఈ ‘మార్కెట్ కమిటీ తరహా నియామకం’. త్వరలోనే నామినేటెడ్ ద్వారా పాలకమండళ్లను నియమించనున్నారన్న నిర్ణయం మేరకు పీఏసీఎస్ డైరక్టర్ మొదలుకుని డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల వరకు పదవులు పొందేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నామినేటెడ్ ద్వారానే ‘సహకార’ పదవులు ఎంపికలో మంత్రులు, ఎమ్మెల్యేలే కీలకం ‘పరిషత్’ ఎన్నికలకు ముందే ప్రకటన ఆశల పల్లకిలో అధికార పార్టీ నేతలు... మొదలైన ఆశావహుల పైరవీలు


