breaking news
Jangaon
-
విద్య, వైద్య రంగాలతో సమాజ అభివృద్ధి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝాదేవరుప్పుల: విద్య, వైద్య రంగాల పురోగతితోనే సమాజ అభివృద్ధి ముడిపడి ఉందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం మండల కేంధ్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దేవరుప్పుల హైస్కూల్లో పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్వహణ స్థితిగతులు పరిశీలించి పలు సూచనలు చేశారు. రోగులకు సమయానికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వల్మిడి బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేయండిజనగామ: పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. బుధవారం డీసీపీ రాజమహేంద్ర నాయక్, సంబంధిత అధికారులతో కలిసి కలెక్టరేట్ మినీ కాన్ఫెరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వామివారి బ్రహ్మోత్సవాల కోసం ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ వెంకన్న, ఏసీపీ నర్సయ్య, పలువురు అధికారులు ఉన్నారు. రైతు మహోత్సవంలో పాల్గొనాలి సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు మహోత్సవంలో రైతులు ఉత్సాహంగా పాల్గొనాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యానవన, ఆయిల్ ఫెడ్, అనుబంధ శాఖలు, ఆర్టీసీ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి అంబికాసోని, మార్కెటింగ్, ఉద్యనవన తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అధికారుల నిర్లక్ష్యంతోనే శ్రీవిద్య ఆత్మహత్య
● కేయూలో విద్యార్థి సంఘాల ధర్నా కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విద్యార్థిని శ్రీవిద్య సీ నియర్ల వేధింపులతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, ఇది ముమ్మాటికి యూనివర్సిటీ అఽధికారుల నిర్లక్ష్యమని నిరసిస్తూ ఎంఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, సేవాలాల్సేన, ఏబీఎస్ ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం యూనివర్సిటీలో ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించా రు. లైబ్రరీ ప్రాంగణం నుంచి పరిపాలనా భవనం వరకు ర్యాలీ కొనసాగింది. పరిపాలనా భవనంలోనికి దూసుకువచ్చి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయా విద్యార్థి సంఘాల బాధ్యులు మాట్లాడుతూ శ్రీవిద్య ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొద్ది రో జులుగా ఈ విషయంపై సంబంధిత యూనివర్సిటీ అధికారులు సరిగా స్పందించలేదన్నారు. కార్యక్రమంలో మనోహర్, భాస్కర్ పాల్గొన్నారు. -
ఆరోగ్య భాగ్యం
బుధవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2026సహజ సేద్యం..జిల్లాలో విస్తరిస్తున్న నేచురల్ ఫార్మింగ్● జీవామృతం, ఘన జీవామృతంపై అవగాహన ● మిత్ర పురుగుల సంరక్షణతో జీవవైవిధ్యం ● పెట్టుబడులు తక్కువ.. లాభాలు ఎక్కువ ● జిల్లాలో 15 క్లస్టర్లు, 1,875 మంది రైతులుజనగామ: ప్రకృతి ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్ఎంఎన్ఎఫ్) పథకం కింద జిల్లాలో సహజ వ్యవసాయం వేగంగా విస్తరిస్తోంది. జిల్లా పరిధిలో 15 క్లస్టర్లు ఏర్పాటు చేసి, ప్రతీ క్లస్టర్కు 125 మంది చొప్పున 1,875 మంది రైతులకు సహజ వ్యవసాయ కిట్లను అధికారులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం 12 మండలాల వ్యాప్తంగా అమలు అవుతోంది. తొలి దశలో గ్రామాల వారీగా ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ ఏర్పాటు చేసి రైతులకు నేచురల్ ఫార్మింగ్ తత్వం, పెంపక పద్ధతులు, మట్టిలో జీవాలను పెంపొందించడం తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. పథకాన్ని విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు కేంద్రం, రాష్ట్రం, జిల్లా పరిధిలో కోఆర్డినేటర్లు నియమిస్తారు. వీరు సాధారణ రైతు సమూహాలతో సహకరిస్తూ పథకం అమలును పర్యవేక్షిస్తారు. రసాయనిక ఎరువులకు దూరంగా.. రసాయనాల వినియోగం పెరుగుతున్న నేపధ్యంలో భూసారం తగ్గిపోకుండా, పంటల నాణ్యత దెబ్బతినకుండా, ప్రజలకు ఆరోగ్యకరమైన దిగుబడులు అందేలా చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. రసాయనిక వ్యవసాయం వైపు రైతులు మళ్లిపోతున్న పరిస్థితుల్లో, నేల ఆరోగ్యాన్ని కాపాడే పద్ధతులు అవలంభించడం అత్యంత అవసరమని కేంద్రం దృష్టి సారించింది. ఈ పథకం కింద రైతులకు అవగాహన కార్యక్రమాలు, శిక్షణా శిబిరాలు నిర్వహిస్తూ ప్రకృతి సిద్ధ ఎరువుల తయారీ వరకు అన్ని అంశాల్లో రైతులకు అధికారులు సలహాలు అందిస్తున్నారు. ముఖ్యంగా జీవామృతం, ఘన జీవామృతం, కషాయాల వంటి సన్నద్ధ పద్ధతుల ద్వారా పూర్తిగా రసాయన రహిత సాగును ప్రోత్సహిస్తున్నారు. రైతులు మార్కెట్ ఆధారిత రసాయన ఎరువులపై ఆధారపడకుండా, తమ వద్దే లభించే పదార్థాలతో ఎరువులు తయారు చేసుకునే విధానం ఈ పథకంలో భాగం. అలాగే స్థానిక విత్తనాల వినియోగం, పంటల వైవిధ్యాన్ని పెంపొందించడం, మిత్ర పురుగుల రక్షణ, సహజ రీతిలో జీవ వైవిధ్యం పెంపుదల వంటి అంశాలను రైతులకు బోధిస్తున్నారు. ఈ పథకం ద్వారా రసాయన వ్యయాలు తగ్గి, రైతుల ఆదాయం పెరగడంతో పాటు నేల జీవసమృద్ధి కూడా పెరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో సహజ వ్యవసాయం మరింత విస్తరించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. సహజ వ్యవసాయం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం ప్రభుత్వ లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలో ఈ పథకానికి మంచి స్పందన లభించడంతో, మరిన్ని క్లస్టర్లను ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని వివరించారు. శిక్షణ.. వర్క్షాపులు మట్టి ఆరోగ్యం–పర్యావరణ సుస్థిరతని సాధించడం పథకం ప్రధాన లక్ష్యం. రైతులకు ప్రతీ ఎకరాకు నేచురల్ ఫార్మింగ్ అమలు కోసం ఆర్థిక అస్సిస్టెన్స్ ఇవ్వబడుతుంది. శుద్ధ జీవ ఎరువులు, పది రకాల లేదా అంతకన్నా ఎక్కువ జీవసిద్ధ సిప్ ఎరువుల తయారీకి స్థానిక స్థాయిలో శిక్షణ, వర్క్షాప్లు నిర్వహిస్తారు. నేచురల్ పద్ధతుల ద్వారా పంటలు, పప్పు దినులపంటలు వేసుకునేలా మార్గనిర్ధేశకాలు అందిస్తారు. రైతులు ఎటువంటి రసాయనాలపై ఆధార పడకుండా పంటల ఆరోగ్యం, పెట్టుబడి పెంపొందించుకోవచ్చు. రైతులకు సాంకేతిక సహాయం, మార్కెట్ లింక్, నేచురల్ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం కేంద్రం ప్రత్యేక ప్రక్రియలు రూపొందిస్తున్నారు. -
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
జనగామ రూరల్: మండలంలోని శామీర్పేట గ్రామంలోని తెలంగాణ ఎస్టీ బాలికల హాస్టల్ను అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిచెన్, స్టాక్ రిజిస్టర్లు రైస్, ఆయిల్, పప్పు తదితర సరుకులతో పాటు స్టాఫ్ రిజిస్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిచెన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నాణ్యమైన సరుకులను భోజన తయారీకి వినియోగించాలని ప్రిన్సిపాల్, వార్డెన్లకు తెలిపారు. సర్పంచ్ గణిపాక వనితమహేందర్, సిబ్బంది ఉన్నారు. రాంగ్ రూట్లో వెళ్తే చర్యలు చిల్పూరు: యూటర్న్ల వద్ద రాంగ్ రూట్లో ప్రయాణం చేస్తే చర్యలు తప్పవని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. మండలంలోని చిన్నపెండ్యాల గ్రామ సమీపంలోని జాతీయ రహదారిలోని యూటర్న్ వద్ద చిల్పూరు ఎస్సై నవీన్కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం రాంగ్ రూట్ ప్రయాణం ప్రమాదకరం నినాదంతో ఉన్న పోలీస్ కారు బొమ్మను ఏర్పాటు చేయించగా డీసీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ సమయంలో రాంగ్ రూట్లో వెళ్తున్న వాహనాలను ఆపి అవగాహన కల్పించారు. ఇక నుంచి రాంగ్ రూట్లో వెళ్తే సీసీ కెమరాలకు చిక్కి జరిమానా కట్టాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్రెడ్డి, నాయకులు తాళ్లపల్లి సమ్మయ్య, గడ్డమీది అశోక్, వెంకటస్వామి, సాదం నర్సింహులు, సాదం బీమయ్య, సాదం రాజ్కుమార్, ఉంచాల రాజు తదితరులు ఉన్నారు. సోమయ్యకు ఉగాది పురస్కారం దేవరుప్పుల: మారుమూల పల్లెల్లో జీవిస్తూ తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న తెలుగు అధ్యాపకుడు, సామాజిక కవి అంకాల సోమయ్యకు ఉగాది పురస్కారం లభించింది. మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీ పరాభావ నామ సంవత్సరం పురస్కరించుకొని ఉగాది కవి సమ్మేళనం, అష్టావధానం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో తెలంగాణ సాహిత్య అకాడమీ బాధ్యులు ఏనుగు నరసింహారెడ్డి, నందిని సిద్దారెడ్డితో పాటు పలువురి చేతుల మీదుగా సోమ య్య ఉగాది పురస్కారం అందుకున్నారు. నామినేషన్ ప్రక్రియ పూర్తి జనగామ రూరల్: జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ 2026–27 సంవత్సరానికి గాను ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వై. చంద్రరుషి, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్లు కె.చంద్రశేఖర్, పి.చంద్రశేఖర్ల ఆధ్వర్యంలో నామినేషన్ పక్రియ పూర్తి చేశారు. ఈ మేరకు అధ్యక్ష అభ్యర్థులుగా దయాకర్రెడ్డి, కె.ఎల్లారెడ్డి, పానుగంటి శ్రీనివాస్ నామినేషన్లు వేశారు. ఉపాధ్యక్షులుగా టి.రాజయ్య, ఎన్. సిద్దులు, ఎన్.రేణుక, ప్రధాన కార్యదర్శులుగా ఎం.సత్తయ్య, సీహెచ్ నర్సింగరావు నామినేషన్లు వేశారు. కాగా సెక్రటరీగా ఎంవీ భద్రినాఽథ్, కోశాధికారిగా ఎన్.శ్రీమన్, జి.అమృతయ్య, క్రీడలు, సౌంస్కృతిక కార్యదర్శిగా బాలరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహిళా కార్యదర్శిగా ఎం.స్వప్న, కే.సునీతారాణి నామినేషన్ వేశారు. ఈసీ మెంబర్లుగా ఎన్.కల్యాణి, జ్యోత్స్న, దయామని, సంపత్, శ్రీనివాస్లు నామినేషన్లు వేశారు. ఈ నెల 20న ఉపసంహరణ ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. -
వేగంగా.. సులభంగా..
● కొత్త ఎల్టీ సర్వీస్ల కోసం సరళమైన చార్జీలుజనగామ: వినియోగదారులకు విద్యుత్ కనెక్షన్ల మంజూరులో వేగంగా, సులభంగా అందించేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నూతన విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. కొత్తగా ఎల్టీ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే వినియోగదారులు ఇకపై క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, లోడ్ ఆధారంగా మాత్రమే చార్జీలు చెల్లించి త్వరగా సర్వీసులు పొందవచ్చు. ఈ మేరకు రెగ్యులేషన్ నంబర్ 1 ఆఫ్ 2026 ప్రకారం కొత్త సర్వీసుల కొరకు ఎన్పీడీసీఎల్ సంస్థ సర్వీస్ లైన్ చార్జీల (ఎస్ఎల్ఎస్) విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో.. వినియోగదారులు ముందుగానే తమకు ఎంత సర్వీస్ లైన్ చార్జీలు వస్తాయో తెలుసుకుని సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అనవసర ఆలస్యాలు, అదనపు భారం పూర్తిగా తగ్గిపోతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కనెక్షన్ పొందడం మరింత సులభం కానుంది. చార్జీలు ఇలా.. 20 కిలోవాట్ వరకు డెవలప్మెంట్, సర్వీసు చార్జీలు వర్తింపు. 20 కిలోవాట్ పైగా కేవలం ఎస్ఎల్ఎస్ మాత్రమే తీసుకుంటారు. డెవలప్మెంట్ చార్జీలు రద్దు చేశారు. కేటగిరీ వారీగా చార్జీల విషయానికి వస్తే గృహ వినియోగదారులు (ఎల్టీ–1) పరిధిలో 1 కిలోవాట్ వరకు రూ.500, 1 నుంచి 5 కిలో వాట్కు రూ.500, ప్రతీ కిలోవాట్కు రూ.600, 5 నుంచి 20 కిలోవాట్ రూ.2,900, ప్రతి కిలోవాట్కు రూ.1500, 20 కిలోవాట్ పైగా ప్రతీ కిలోవాట్కు రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. కమర్షియల్ పరిధిలో 1 కిలోవాట్ వరకు రూ.1,000, 1 నుంచి 5 కిలోవాట్ వరకు రూ.1,000, ప్రతీ కిలోవాట్కు రూ.1,200, 20 కిలోవాట్ పైగా ప్రతీ కిలోవాట్కు రూ.10వేలు చెల్లించాలి. మిగతా కేటగిరీల్లో కూడా లోడ్కు అనుగుణంగా చార్జీలను సవరించారు. అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, మల్టీ, స్టోరీ భవనాలకు మొత్తం కాంట్రాక్ట్ లోడ్పై ఆధారపడి ఎస్ఎల్ఎస్ అమలు చేశారు. ట్రాన్స్ఫార్మర్ ఖర్చు వినియోగదారుడిపై భారం పడకుండా నిబంధనలు అమలులోకి తెచ్చారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు బాధ్యత పూర్తిగా విద్యుత్ సంస్థదే ఉంటుంది. రైతులకు లాభం వ్యవసాయ వినియోగదారులకు సులభమైన రేట్లు అమల్లోకి తీసుకువచ్చాం. వ్యవసాయ కనెక్షన్కు కేవలం 1 కిలోవాట్కు రూ.1,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కొత్త విధానం ద్వారా సేవల మంజూరులో వేగం పెరిగి, అవినీతి అవకాశాలు పూర్తిగా తగ్గి, చార్జీలపై స్పష్టత పెరుగుతుంది. విద్యుత్ కనెక్షన్ పొందడాన్ని సులభతరం చేయడమే ప్రభుత్వం లక్ష్యం. – సంపత్రెడ్డి, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్ -
అధికారులు పారదర్శకంగా పనిచేయాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: అధికారులు పారదర్శకంగా పనిచేస్తేనే సత్ఫలితాలు సాధ్యమని కలెక్టర్ సందీప్ కుఆమర్ ఝా అన్నారు. మంగళవారం భూ భార తి, ఇసుక తరలింపు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తదితర అంశాల మీద కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూకు సంబంధించిన ఏ అంశాలు పెండింగ్లో ఉండకూడదన్నారు. భూ భారతికి సంబంధించిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలన్నారు. అక్రమ ఇసుక, మొరం, గ్రావెల్ అక్రమ రవాణా కాకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను జనాభా లెక్కల విధులను సమర్థంగా నిర్వహించాలన్నారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు లేకుండా.. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం జిల్లా స్థాయి గ్యాస్ సరఫరా పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. టోల్ ఫ్రీ నంబర్ అమలు, గ్యాస్ సరఫరా, నిల్వల పరిస్థితిపై ఆరా తీశారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వినియోగదారులతో పాటు వయోవృద్ధులు, దివ్యాంగులు, ఆస్పత్రులకు, విద్యాసంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో కమర్షియల్ సిలిండర్ మాత్రమే ఉపయోగించాలని, డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు రవీందర్, హసీనా బేగం, విక్రమ్, డీడబ్ల్యూఓ కో దండరాములు, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌ డ్, గ్యాస్ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు. మహిళా సంఘాలు ముఖ్య పాత్ర వహించాలి మహిళా సంఘాలు వ్యవసాయ రంగంలో ముఖ్య పాత్ర వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ మినీ కాన్ఫరెన్స్ హాల్లో మార్క్ ఫెడ్ ప్రతినిధులు, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులతో మంగళవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో మొక్కజొన్న సాగు, కోతలు, కొనుగోళ్లు మొదలు కావడంతో వాటికి సంబంధించిన కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారి అంబి కాసోని, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వసంత, ఏడీఏలు, అడిషనల్ పీడీలు, అధికారులు పాల్గొన్నా రు. అనంతరం పెంబర్తిలో నిర్మాణంలో ఉన్న జిల్లా సమైక్య భవనాన్ని కలెక్టర్ పరిశీలించి నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
సుస్థిర వ్యవసాయ విధానాలను అనుసరించాలి
రఘునాథపల్లి: ఆరోగ్యకరమైన పంటల కోసం రైతులు సుస్థిర వ్యవసాయ విధానాలను అనుసరించాలని జిల్లా వ్యవసాయాధికారి కట్ట అంబికాసోని అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో మంగళవారం సహజ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. రసాయన ఎరువులు లేని ఆహారాన్ని పండించడం ఎంతో అవసరమన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అవలంభించడం ద్వారా ఆరోగ్యకరమైన పంటలతో పాటు, నేల సారాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు మాట్లాడుతూ సహజ వ్యవసాయం ద్వారా నేల సారాన్ని పెంచడంతో పాటు దీర్ఘకాలికంగా వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరుస్తుందన్నారు. అనంతరం సుస్థిర వ్యవసాయం చేస్తున్న రైతులకు వ్యవసాయ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ఎస్.కరుణాకర్, ఏఈఓలు శివుడు, అజయ్ కల్పన, సౌజన్య, కీర్తి స్నేహ, కృషి, సఖి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రేపు రుద్రేశ్వరాలయంలో ఉగాది వేడుకలు
హన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో గురువారం ఉగాది, సీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఈఓ ధరణికోట అనిల్కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం దేవాలయంలో ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. ఉగాది వేడుకల్లో భాగంగా సాయంత్రం పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ ఉదయం స్వామివారికి ఉగాది పచ్చడి నివేదన, సీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. వేదపండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు సందీప్శర్మ, సిబ్బంది మధుకర్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా మాసశివరాత్రి పూజలు.. మాసశివరాత్రిని పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితుడు మణికంఠశర్మ, అర్చకుల ప్రణవ్, సందీప్శర్మ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతసేవ, ఉత్తిష్ట గణపతికి ఆరాధన, శ్రీరుద్రేశ్వరుడికి రుద్రాభిషేకం చేశారు. అనంతరం నాట్యమండపంలో రుద్రేశ్వరిదేవి, శ్రీరుద్రేశ్వరస్వామివారిని ప్రతిష్ఠించి కలశస్థాపన, బాసికధారణ, యజ్ఞోపవీతధారణ, పాదప్రక్షాళన, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, అక్షతారోహణ, మహాహారతి జరిపి శ్రీరుద్రేశ్వరిదేవి, శ్రీరుద్రేశ్వరస్వామికి కల్యాణోత్సవం నిర్వహించారు. -
వైద్యులు సమయపాలన పాటించాలి
● జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మల్లికార్జునరావు రఘునాథపల్లి: వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీ వ్రంగా ఉంటాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధి కారి డాక్టర్ మల్లికార్జునరావు సూచించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి ఆస్పత్రిలో ప్రసవాలు పెంచాలని పేర్కొన్నారు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది ఆందిస్తున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నా రు. వేసవి దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నేటి నుంచి చేపట్టనున్న లెప్రసీ ఐడెంటిపై సర్వే చేసి లెప్రసీని ఏరాడికెట్ చేయడానికి కృషి చేయాలన్నారు. అలాగే మండలంలోని ఖిలాషాపూర్ ఆరో గ్య కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి స్రవంతి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ డి.రామకృష్ణ, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళాశక్తి స్టాల్స్ను తొలగించొద్దు
● కలెక్టర్కు వినతిపత్రం అందించిన మహిళలుజనగామ రూరల్: పేద మహిళల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి వనితా టీ స్టాల్, విజయ మిల్క్ డెయిరీ స్టాల్ను తొలగించవద్దని మహిళలు సోమవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు వినతి పత్రం అందజేశారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బొట్ల శేఖర్, బూడిది గోపి మాట్లాడుతూ.. పాలమాకుల చిన్నమంజుల, పొత్కసూరి విజయలక్ష్మి ఉపాధి కోసం డీఆర్డీఏ ఆధ్వర్యంలో టీస్టాల్, విజయ మిల్క్ స్టాల్ కలెక్టరేట్ గోడ వద్ద ఏర్పాటు చేశారని, ఉపాధికోసం ఏర్పాటు చేస్తే నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. సంబంధిత విషయంపై భువనగిరి పార్లమెంట్ ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి వద్దకు వెళ్లగా స్టాళ్లను అలాగే కొనసాగించాలని ఇచ్చిన లేఖను కలెక్టర్కు అందించారు.పట్టణంలో ప్రజాసమస్యలు అనేకం ఉన్నాయని వాటిపై అధికారులు దృష్టిపెట్టాలని కోరారు. -
మెడికల్ షాపులపై ఆకస్మిక దాడులు
● నిబంధనలు ఉల్లంఘించిన 6 దుకాణాలపై కేసు నమోదుజనగామ: జిల్లాలో మత్తు కలిగించే మందుల అక్రమ విక్రయాలను అరికట్టేందుకు డ్రగ్ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వరంగల్ ఔషధ నియంత్రణ పరిపాలన సహాయ సంచాలకులు డాక్టర్ రాజ్యలక్ష్మి పర్యవేక్షణలో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో 65 మెడికల్ షాపుల్లో టెస్ట్ పర్చేజ్ విధానాన్ని అమలు చేశారు. అపరిచిత వ్యక్తుల ద్వారా మందులు విక్రయిస్తున్నారో లేదో పరీక్షించగా పలు అనుమానాస్పద అంశాలు బయటపడ్డాయి. ఈ తనిఖీల్లో 6 మెడికల్ షాపులు నిషేధితంగా, మత్తును కలిగించే ట్రమాడాల్ అనే నొప్పినివారణ మందును నిబంధనలు ఉల్లంఘించి విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. జనగామలో 2, రఘునాథపల్లిలో 3, స్టేషన్ ఘన్పూర్లో ఒక దుకాణంపై కేసు నమోదు చేసి ఔషధాలు, సౌందర్య సాధనాల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడానికి సిఫారసు చేయగా, సంబంధిత షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మత్తు కలిగించే మందులను అనధికారికంగా విక్రయించినా, వినియోగించినా చట్టపరంగా కఠినమైన క్రిమినల్ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
కలెక్టర్ సార్!
నర్మెట: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉపాధ్యాయుడిగా మారిపోయారు. మండలంలోని మాన్సింగ్తండాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సోమవారం ఆకస్మిక తనిఖీ చేసి పదో తరగతి విద్యార్థులకు గణితం బోధించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఇష్టంతో చదివి లక్ష్యాలను సాధించాలని సూచించారు. తరగతి గదులను, వంటగదిని పరిశీలించి మెనూ ప్రకారం పౌష్టిక ఆహారాన్ని అందించాలని ప్రత్యేక అధికారి బైరోజు రజితకు సూచించడంతో పాటు విద్యార్థినుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆస్పత్రి గదులను, పరిసరాలను, రికార్డులను పరిశీలించి, సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వైద్యాధికారి సిద్ధార్థరెడ్డికి సూచించారు. -
విద్యుత్ సరఫరా..మరింత మెరుగ్గా
● అంతరాయాలు తగ్గించేందుకు ఎమర్జెన్సీ రీస్టోరేషన్ వాహనాలు ● జనగామ సర్కిల్ పరిధిలో అందుబాటులోకి..జనగామ: ప్రకృతి విపత్తులు, భారీ వర్షాలు, ఈదురుగాలులు, సాంకేతిక లోపాలు వంటి కారణాలతో విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయాలను తగ్గించేందుకు జనగామ ఎన్పీడీసీఎల్ సర్కిల్ పరిధిలో పటిష్ట చర్యలు చేపట్టారు. సంస్థ ఎస్ఈ సంపత్రెడ్డి నేతృత్వంలో వినియోగదారులకు మరింత వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించేందుకు అత్యవసర రీస్టోరేషన్ చర్యలను ప్రాధాన్యంగా అమలు చేస్తున్నారు. సర్కిల్ పరిధిలో రెండు ఎమర్జెన్సీ రీస్టోరేషన్ వాహనాలు సర్కిల్ పరిధిలో 2 ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ (ఈఆర్టీ) వాహనాలు సిద్ధం చేశారు. 24 గంటల పాటు కార్యకలాపాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే సబ్డివిజన్ స్థాయిలో 7 ప్రత్యేక వాహనాలు కూడా అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు ముందుగానే సిద్ధం చేసి ఉంచారు. ఈ వాహనాల్లో విద్యుత్ లైన్ల మరమ్మతుల కు అవసరమైన కండక్టర్లు, ఇన్సులేటర్లు, కేబుల్స్, టూల్స్ వంటి మెటీరియల్ను ముందుగానే లోడ్ చేసి ఉంచుతున్నారు. సమస్య ఏర్పడిన వెంటనే బృందాలు ఘటనాస్థలానికి చేరుకునేందుకు ఈ ఆర్టీ వాహనాలకు జీపీఆర్ఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అమర్చారు. దీంతో సమస్యలను అత్యంత వేగంగా గుర్తించి పరిష్కరించే అవకాశం కలుగుతుంది. తక్షణ పరిష్కారం.. విద్యుత్ సరఫరాలో హఠాత్తుగా ఏర్పడే లోపాలు, లైన్ బ్రేక్డౌన్లు, ట్రాన్స్ఫార్మర్ సమస్యలను వీటి సహాయంతో తక్షణమే పరిష్కరించడంలో ఈ వ్య వస్థ ఉపకరిస్తుంది. విద్యుత్ సంబంధిత సమస్యలు ఉత్పన్నమైతే టోల్ ఫ్రీ నెంబర్ 1912కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరుతున్నారు. ఈ నెంబర్ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. నాణ్యమైన సేవల కోసం..విద్యుత్ అంతరాయాలను తగ్గించి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో సంస్థ మరింత సమర్థవంతంగా ముందుకెళ్తోంది. విద్యుత్ అంతరాయాల సమయంలో తక్షణం పునరుద్ధరించేందుకు ఈఆర్టీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. 24 గంటల పాటు ఈ కార్యకలాపాలు నిర్వహించేందుకు అధికారులు, ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమస్యలను మాకు వేగంగా తెలియజేయవచ్చు. –సంపత్రెడ్డి, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్, జనగామ -
వినతుల పరిష్కారం వేగంగా..
● ప్రజావాణిలో అధికారులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశం ● ప్రజల నుంచి 224 వినతుల స్వీకరణ ● కలెక్టరేట్లో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాట్లుజనగామ రూరల్: కుమారుడు బాగోగులు చూసుకోవడం లేదని ఓ తల్లి, జిల్లాలో రైతు విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయాలని భూమి కోల్పోయిన నష్టపరిహారం చెల్లించాలని ఒకరు, మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతులు, గృహజ్యోతి, సబ్సిడీ గ్యాస్ రావడం లేదని ఓ లబ్ధిదారుడు, వ్యవసాయ బావుల వద్దకు దారి ఇవ్వడం లేదని గ్రామస్తులు..ఇలా పలు సమస్యలతో ప్రజలు గ్రీవెన్స్ సెల్కు తరలివచ్చారు. ఈసందర్భంగా కలెక్టరేట్లోని కాన్ఫ్రెన్స్ హాల్లో ప్రజావాణికి వచ్చిన ప్రజలను కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆప్యాయంగా పలకరించి సమస్యలను విని వినతులు స్వీకరించారు. ప్రజావాణిలో ఫిర్యాదు దారుల నుంచి వచ్చిన వివిధ సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎప్పటికప్పుడు అర్జీలు పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా 224 అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ఈమేరకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆర్డీఓలు గోపిరాం, వెంకన్న, డీఆర్డీఓ వసంత, డీఏఓ అంబికా సోనీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తులు కొన్ని ఇలా.. ● పాలకుర్తి మండలం విస్నూర్ గ్రామానికి చెందిన బి.వసంత, 12 సంవత్సరాలుగా జగిత్యాల జిల్లా పొలాస గ్రామంలో జీవనం సాగిస్తున్నామని, గుంట భూమి ఉండగా ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేశామని, తన ప్రజాపాలన దరఖాస్తును జనగామ జిల్లా నుంచి జగిత్యాల జిల్లా పొలాస రూరల్కు బదిలీ చేయాలని విన్నవిస్తూ దరఖాస్తు చేశారు. ● తరిగొప్పుల మండలం ఎన్యా నాయక్ తండాకు చెందిన ఎం.నిర్మల, తనకు గల ఒక గుంట భూమి పట్టా పాస్ బుక్ లాక్ అయిందని, ఆర్డీఓ లాగిన్లో ఉందని, ఈ సమస్యను పరిష్కరించాలని వినతి అందజేశారు. ● లింగాల ఘణపురం మండలం వడిచర్ల గ్రామానికి చెందిన రమాదేవి, తనకు సొంత ఇల్లు, సొంత స్థలం ఏమీ లేదని, అద్దెకు ఉంటున్నానని, గతంలో ఇందిరమ్మ ఇల్లు కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నానని, తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంది. ● జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీ 12వ వార్డుకు చెందిన పెంట సోమలక్ష్మి గత ప్రజాపాలన కార్యక్రమంలో ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నానని, తమకు ఎటువంటి ఇల్లు, ఖాళీ స్థలం లేదని, డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పించాలని వేడుకుంది. ● జిల్లా కేంద్రంలోని బాలాజీ నగర్కు చెందిన గౌరోజు సదాశివరావు, హైదరాబాద్ రోడ్డులోని ఏకశిల కళాశాల పక్కన తనకు ప్లాటు కలదని, ఆ ప్లాటు కెనాల్ కాలువలో పోయిందని, ఈ విషయమై తనకు నష్ట పరిహారం ఇప్పించాలని వినతిపత్రం అందజేశారు. ● గోవర్థనగిరి గ్రామంలో సర్వే నెంబర్ 228లో 50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, గతంలో రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు భూ సర్వే కోసం ప్రతిపాదనలు పంపగా ఆర్డీఓ వద్ద పెండింగ్లో ఉందని త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్కు రఘునాథపల్లి మండలం కన్నాయిపల్లి గ్రామానికి చెందిన మంతపురం యాదగిరి వినతి పత్రం అందజేశారు. ● పట్టణంలోని రాజీవ్నగర్ 1వ వార్డు చెందిన చింతల సంపత్ తనకు గృహజ్యోతి, గ్యాస్ సబ్సిడీ రావడం లేదని, వెంటనే అందజేయాలని వినతి పత్రం అందించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసి..రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదన్నారు. ● నష్కల్ గ్రామం పరిధిలో ఉన్న తమ భూమి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం కోల్పోయామని, నష్టపరిహారం కాజేయాలని తమ పాలివారు ప్రయత్నం చేస్తున్నారని, వారసత్వం కింద తమకే అందజేయాలని చిల్పూరు మండలం వంగాలపల్లికి చెందిన మట్వాడ అంజయ్య వినతి అందించారు. -
చివరి తడి
మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026జలసంరక్షణతోనేజిల్లా సగటు (మీటర్లలో)గతేడాది కంటే మెరుగ్గానే భూగర్భజలాలుజనగామ: జిల్లా పరిధిలో భూగర్భ జలాల స్థితిలో స్వల్ప మార్పులే నమోదయ్యాయి. ఫిబ్రవరి 2025, ఫిబ్రవరి 2026, అలాగే జనవరి 2026 నెలలోని నీటి మట్టాలను పరిశీలిస్తే, కొన్ని మండలాల్లో పెరుగుదల కనిపించగా, మరికొన్ని ప్రాంతాల్లో తగ్గుదల చోటుచేసుకుంది. జిల్లా సగటు భూగర్భ జలాల మట్టం ప్రకారం ఫిబ్రవరి 2025లో 8.01 మీటర్లు, జనవరి 2026లో 5.01 మీటర్లు, ఫిబ్రవరి 2026 వచ్చే సరికి కేవలం 5.99 మీటర్ల లోతులోనే ఉన్నట్లు గుర్తించారు. నిలకడగా ఉన్నా.. రాబోయే రెండు నెలలపై ఆందోళన జనవరి 2026తో పోలిస్తే ఫిబ్రవరి 2026లో స్వల్ప తగ్గుదల (సుమారు 0.98 మీటర్లు) కనిపించినప్పటికీ, ఫిబ్రవరి 2025తో పోలిస్తే నీటిమట్టం మెరుగైన స్థాయిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోని చెరువుల్లో ఉన్న నీటి మట్టంతో భూగర్భజలాలు నిలకడగా ఉన్నాయి. కొన్ని మండలాల్లో నీటి మట్టం మెరుగుపడిన చోట్ల వ్యవసాయ, తాగునీటి బోర్లు స్థిరంగా పనిచేస్తున్నాయి. అయితే అధిక లోతు ప్రాంతాల్లో స్వల్ప తగ్గుదల కనిపించడం వల్ల వేసవిలో అదనపు నీటి సంరక్షణ చర్యలు అవసరం ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. జిల్లా సగటు నీటిమట్టం ప్రస్తుతం 5.99 మీటర్ల వద్ద ఉండడం సానుకూల సంకేతమే అయినప్పటికీ, రాబోయే రెండు నెలలు కీలకమని అధికారులు భావిస్తున్నారు. వేసవి తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో, యాసంగి సీజన్ పంటలతో పాటు పంచాయతీల నుంచి మున్సిపల్ పరిధి వరకు నీటివినియోగంపై ముందస్తు ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నారు. జిల్లా భూగర్భ జలాల పరిస్థితి గత సంవత్సరంతో పోలిస్తే మెరుగ్గా ఉన్నప్పటికీ, నీటి వినియోగంపై జాగ్రత్తలు పాటించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. దేవాదుల ఒక్కటే శరణ్యం దేవాదుల కాలువల ద్వారా సాగునీటి విడుదల ఒక్కటే యాసంగి సీజన్కు ఊపిరిగా రైతులు భావిస్తున్నారు. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలోని చెరువుల్లో 25 నుంచి 50శాతం మేర నీటినిల్వలు ఉండగా, యాసంగి సీజన్లో సాగు చేసిన పంటలకు సాగునీరు అందిస్తున్న నేపథ్యంలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. కాలువల ద్వారా చెరువులకు జలాలను తరలిస్తే.. పడిపోతున్న భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో వరి పంటకు అరకొర సాగునీరు అందించే గడ్డుకాలం మొదలైంది. అయినా వేసవి తీవ్రతతో సాగుభయం దేవాదుల ఒక్కటే శరణ్యమంటున్న రైతులు చెరువులు నింపితేనే పంట చేతికి వస్తుందంటూ విన్నపం జిల్లాలో మొదలవుతున్న సాగునీటి కష్టాలుమండలం(ఊరు) ఫిబ్రవరి–25 జనవరి–26 ఫిబ్రవరి–26 బచ్చన్నపేట 9.16 4.5 5.24 దేవరుప్పుల 4.2 1.83 2.38 జనగామ 4.79 2.61 3.14 కొడకండ్ల 10.21 7.77 8.55 లిం.ఘణపురం 7.15 3.97 5.62 పాలకుర్తి 9.91 4.35 6.15 రఘునాథపల్లి 10.05 5.86 7.29 తరిగొప్పుల 9.02 3.06 3.92 -
నిబంధనలు విస్మరించొద్దు
● హాస్టళ్లలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ ఆకస్మిక తనిఖీ జనగామ రూరల్: పేద విద్యార్థుల సంక్షేమం విషయంలో నిర్వాహకులు నిబంధనలు విస్మరిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని ఎస్సీడీడీ, టీఎంఆర్జేసీ హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిచెన్, స్టాక్ రిజిస్టర్లు, స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్లను తనిఖీ చేసి ప్రిన్సిపాల్, వార్డెన్లకు పలు సూచనలు చేశారు. -
బోరులో నీటిమట్టం తగ్గుతోంది..
యాసంగి సీజన్లో బోరుబావి కింద మూడున్నర ఎకరాల్లో వరి పంట సాగు చేశా. వేసవిలో ఎండలు పెరగక ముందే బోరుబావిలో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. బోర్ నుంచి కొద్దిపాటి నీరు మాత్రమే వస్తోంది. నెలరోజుల పాటు పంటకు నీరు అందించాల్సి ఉంది. ఇప్పుడే ఈ పరిస్థితి ఇలా ఉంటే, పంట చేతి కందే వరకు కష్టంగా మారనుంది. కొద్దిరోజుల నుంచి దేవాదుల కాలువల నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇంకా పనులు మొదటి దశలోనే ఉన్నాయి. వీటి ద్వారా పంటలకు సాగునీరు వచ్చే పరిస్థితి లేదు. –భూక్య బాలాజీ నాయక్, రైతు, టీబీ తండా, జఫర్గఢ్ -
మల్లన్నకు పెద్దపట్నం
ఐనవోలు: ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతర చివరి ఆదివారం మహా పెద్ద పట్నం, గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మలతో మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి నిత్య పూజలు పూర్తయిన తర్వాత ఆలయ ప్రాంగణంలో నటరాజస్వామి మండపానికి ఎదురుగా ఉదయం 7 గంటల నుంచే 53 అడుగుల అతిపెద్ద పట్నం 11 రకాల రంగులతో సుమారు 50 మంది ఒగ్గు పూజారులు 6 గంటల పాటు శ్రమించి మహా పెద్దపట్నం వేశారు. పెద్దపట్నంపైకి ఉత్సవ మూర్తులు పెద్దపట్నం వేసిన అనంతరం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆలయ మూల మూర్తులైన అమ్మవార్లు గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మ, మల్లికార్జునుడి ప్రతిరూపమైన ఉత్సవ విగ్రహాలను ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలతో మహా పెద్దపట్నంపైకి తీసుకొచ్చారు. అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ శైవాగమోక్తంగా స్వామి, అమ్మవార్ల కల్యాణం నేత్ర పర్వంగా నిర్వహించారు. అనంతరం కల్యాణ మూర్తులను మహా పెద్దపట్నం చుట్టూ ప్రదక్షిణ గావించి ఒగ్గు పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరికాయలు, మంగళ హారతులు స్వామివారికి సమర్పించి అక్షతలను పెద్దపట్నంపై చల్లారు. పూజలు పూర్తయిన వెంటనే శివసత్తులు, ఒగ్గు పూజారులు, భక్తులు తన్మయత్వంతో బండారి (పసుపు) చల్లుకుంటు మహా పెద్దపట్నంపై నృత్యాలు చేసి ఓలలాడారు. అనంతరం ఉత్సవమూర్తులను ఒగ్గు పూజారులు బండారి చల్లుకుంటూ నృత్యాలు చేసుకుంటూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్, ముఖ్య అర్చకులు శ్రీనివాస్, మధుకర్ శర్మ, వేదపండిట్లు గట్టు పురుషోత్తమ శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు భానుప్రసాద్, మధు, శ్రీనివాస్, నరేశ్, దేవేందర్, ఒగ్గు పూజారులు పెద్ద మనుషులు మజ్జిగ మహేందర్, రాజయ్య, అశోక్ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చక సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.వైభవంగా కల్యాణోత్సం -
వినియోగదారులు హక్కులు తెలుసుకోవాలి
జనగామ రూరల్: వినియోగదారులు తమకు రాజ్యాంగం కల్పించిన హక్కులు తెలుసుకోవాలని సాధిక్ ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు అడ్వకేట్ సాధిక్ అలీ అన్నారు. ఆదివారం ప్రపంచ వినియోగ దా రుల దినోత్సవం సదర్భంగా పట్టణంలోని స్కాలర్ గ్రామర్ స్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగామలో వినియోగదారుల ఉద్యమం 1986లో మొదలై నేటి వరకు కొనసాగుతున్నదని తెలిపారు. వినియోగదారులకు ఏవైనా సమస్యలుంటే కలెక్టర్ కార్యాలయంలో వినియోగదారుల సమాచార కేంద్రంలో ఫిర్యాదు చేయవచ్చని, ప్రతీరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటుందన్నారు. కళాకారుల ఐక్య వేదిక అధ్యక్షుడు జి.కృష్ణ,పెట్లోజు సోమేశ్వరాచారి, అయిలా సోమ నరసింహచారి, రామచంద్రం, పొట్టబత్తిని భాస్కర్, బుదారపు లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణం, సుస్థిరాభివృద్ధిపై అవగాహన
జనగామ రూరల్: పర్యావరణంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని స్టేషన్ ఘన్పూర్ కళాశాల ఎన్న్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జ్యోత్స్న అన్నారు. పెంబర్తి గ్రామంలో ఎనన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా ఆదివారం పర్యావరణం, సుస్థిరాభివృద్ధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు పర్యావరణాన్ని సంరక్షించడం, చెట్ల పెంపకం, నీటి వనరులను కాపాడటం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి అంశాలపై ప్రజలకు వివరించారు. భవిష్యత్ తరాలకు శుభ్రమైన ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. -
పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యమే లక్ష్యం
జనగామ: పారిశుద్ధ్య కార్మికుల సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆదివారం జనగామ మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు, కార్యాలయ సిబ్బందికి జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైద్య శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించి, మరింత మెరుగైన చికిత్సలు అవసరమున్న వారిని జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే పట్టణ ప్రజల ఆరోగ్యం కాపాడగలరని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ అశోక్ కుమార్, 10వ వార్డు కౌన్సిలర్ నీరటి రజిని, డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ శానిటరీ ఇన్న్స్పెక్టర్, జవాను సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గొందాల వాగును పరిశీలించిన కలెక్టర్ జనగామ రూరల్: మండలంలోని గానుగుపహాడ్ గ్రామం నుంచి భాషనగర్ తండాకు వెళ్లే రహదారి మధ్యలో ఉన్న గొందాల వాగును కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా గ్రామంలోని ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సర్పంచ్ శానబోయిన అనూష మహిపాల్ కలెక్టర్ను కోరారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గొందాల వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక వైద్యశాలను కూడా సందర్శించి అక్కడి సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొర్ర శంకర్, వార్డుసభ్యులు పాల్గొన్నారు.మున్సిపాలిటీలో వైద్యశిబిరం ప్రారంభించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
లక్ష మల్లెపూలతో అభిషేకం
జనగామ: జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ ఉప్పలమ్మతల్లి ఆలయంలో ఆది వారం అమ్మవారికి లక్ష మల్లెపూలతో పూలాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి వారణాసి పవన్శర్మ మంత్రోచ్ఛరణల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మహిళలు సామూహిక విష్ణులలితా సహస్ర నామాలను పారాయణం చేశా రు. అమ్మవారిని దర్శించుకుని, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నేటి నుంచి ఒంటిపూట బడులుజనగామ రూరల్: ఈనెల 16 (సోమవారం) నుంచి ఒక్కపూట బడులు ప్రారంభమవుతున్నాయని విద్యాశాఖ అధికారుల అదివారం తెలిపారు. ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటుందన్నారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఆయా కేంద్రాల్లో తరగతులను మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ‘అద్భుత ప్రపంచంలోకి మా ప్రయాణం’ పుస్తకావిష్కరణహన్మకొండ కల్చరల్: వరంగల్ మిత్రమండలి సౌజన్యంతో సామాజికవేత్త రంగరాజు శ్యాంసుందర్ రావు రాసిన ‘అద్భుత ప్రపంచంలోకి మా ప్రయాణం’ పుస్తకావిష్కరణ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ మేరకు హనుమకొండ పోస్టల్కాలనీలోని అభయాంజనేయస్వామి దేవాలయ ఆవరణలో కవి వీఆర్ విద్యార్థి అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. యాత్రను రచనగా చేయడం వల్ల ప్రకృతిని ఆస్వాదించడమే కాకుండా, అక్కడి సంస్కృతి అందరికి తెలిసేలా చేసిన రచయిత శ్యాంసుందర్ అభినందనీయుడని అన్నారు. సాహితీవేత్తలు గన్నమరాజు గిరిజమనోహరబాబు, నాగిళ్ల రామశాస్త్రి, మల్యాల మనోహర్రావు, పొట్లపల్లి శ్రీనివాసరావు, వేముగంటి శుక్తిమతి అతిథులుగా హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు చాడ జైహింద్రెడ్డి, స్థానికులు వాసిరెడ్డి కృష్ణారావు, మండవ రవీందర్రావు, దిలీప్కుమార్, ఏవీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ షురూవిద్యారణ్యపురి/కాళోజీ సెంటర్: ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ను ఆదివారం ప్రారంభించినట్లు హనుమకొండ, వరంగల్ డీఐఈఓలు ఎ.గోపాల్, శ్రీధర్సుమన్ తెలిపారు. వరంగల్ ఎల్బీ కళాశాలలో వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లాల జవాబు పత్రాలు, హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జనగామ, హనుమకొండ, భూపాలపల్లి జిల్లాల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఇంటర్మీడియట్ బోర్డు పరిశీలకుడు రాజన్న మూల్యాంకన కేంద్రాలను సందర్శించి పలు సూచనలు చేశారు. హనుమకొండ క్యాంపు ఆఫీసర్గా డీఐఈఓ ఎ.గోపాల్, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్ జనరల్–1గా హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.శ్రీనివాస్రావు వ్యవహరిస్తున్నారు. -
మహిళాశక్తి స్టాల్స్ తొలగింపును నిలిపివేయండి
జనగామ రూరల్: ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ తొలగింపును నిలిపివేయాలని ఆదివారం ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డికి హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో మహిళలు వినతి పత్రం అందజేశారు. పట్టణ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయ కాంప్లెక్స్ గోడ మూల వద్ద గత కలెక్టర్ రిజ్వాన్ బాషా చొరవతో డ్వాక్రా గ్రూపు మహిళలు పాలమాకుల చిన్న మంజుల, పోత్కనూరి విజయలక్ష్మి వనితా టీ స్టాల్, విజయ పాల ఉత్పత్తి పార్లర్ ఏర్పాటు చేశారు. ఇటీవల కొత్తగా వచ్చిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మున్సిపల్ పోలీసు అధికారులతో 10వ తేదీ, 11వ తేదీ తొలగించే ప్రయత్నం చేశారని చామల కుమార్ రెడ్డికి వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహిళలను ఆర్థికంగా ఎదగడం కోసం చిన్న వ్యాపారాలకు సహకరిస్తున్నారని, కలెక్టర్ చర్యలు మాత్రం నష్టదాయకంగా ఉన్నాయని తెలిపారు. ఎంపీని కలిసిన వారిలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బానోతు ధర్మభిక్షం నాయక్ , పాలమాకుల కనకయ్య, సోమయ్య పాల్గొన్నారు. ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డికి మహిళల వినతి -
కొసరు మిగిలే
యాదాద్రి– వరంగల్ హైవేపై పూర్తికాని సర్వీసు రోడ్లు, రెయిలింగ్ పనులుఅసలు అయిపాయే..సర్వీసు రోడ్లు లేక ప్రజల అవస్థలు గ్రామాల్లో సర్వీసు రోడ్లు లేకపోవడంతో ప్రజలు అవస్థల పాలవుతున్నారు. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా గ్రామాలు ఉన్న చోట ప్రజల సౌకర్యం కోసం తప్పనిసరిగా సర్వీసు రోడ్లు వేయాలి. సర్వీసు రోడ్డుపై నుంచి ప్రజలు నేరుగా జాతీయ రహదారిపైకి రాకుండా మధ్యలో రెయిలింగ్ వేయాలి. సర్వీసు రోడ్డుకు, జాతీయ రహదారికి మధ్య హైమాస్ట్ లైట్లు పెట్టాలి. సర్వీసు రోడ్డు పక్కన డ్రెయినేజీలు పూర్తి చేసి ఆ నీరు ఇళ్లలోకి రాకుండా ఏర్పాటు చేయాలి. అయితే సంబంధిత అధికారులు కేవలం జాతీయ రహదారి విస్తరణ చేశారేగాని సర్వీసురోడ్లు, రెయిలింగ్ పనులు విస్మరించారు. కొన్ని గ్రామాల్లో సర్వీసు రోడ్లు కొంతమేర వేసి వదిలేశారు. స్టేషన్ఘన్పూర్: జిల్లాలో జాతీయ రహదారి పనుల విషయంలో పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లో సర్వీస్రోడ్లు, రెయిలింగ్లు, డ్రెయి నేజీ పనులు అరకొరగా అసంపూర్తిగా చేయగా ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా జాతీ య రహదారి పనుల పరిస్థితి అసంపూర్తిగా ఉండడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడినా అధికారులు, పాలకులకు పట్టడం లేదు. పనులు పూర్తి చేయాల్సిన గడువు ముగి సి ఏడేళ్లయినా పనుల పూర్తికి మోక్షం కలగడం లేదు. కేవలం ప్రధాన రహదారి పనులపై దృష్టి సారించి రహదారి వెంట ఉన్న గ్రామాల్లో సర్వీసు రోడ్లు, రెయిలింగ్లు చేపట్టలేదు. అసలు పనులను పూర్తి చేసిన అధికారులు కొసరు పనుల్లో జాప్యం చేస్తున్నారు. 2015లో మొదలైన పనులు.. జాతీయ రహదారి 143 విస్తరణ పనుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో రూ.1,920 కోట్లతో యాదాద్రి–వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో రహదారి విస్తరణ పనులకు రూ.897.03కోట్లు, మిగిలిన రూ.1,022.97కోట్లు భూసేకరణ, ఇళ్ల యజమానులకు కేటాయించారు. 2016 జూన్ 1న నాటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ పనులకు శంకుస్థాపన చేయగా ఎల్అండ్టీ సంస్థ పనులు చేపట్టింది. యాదాద్రి జిల్లా వంగపల్లి నుంచి వరంగల్ జిల్లా ఆరెపల్లి వరకు 99.10 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులను 30 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు చేపట్టారు. వాస్తవానికి 2019 జనవరి వర కు పనులు పూర్తి కావాల్సి ఉంది. గడువు ముగిసి ఏడేళ్లయినా పూర్తిస్థాయిలో పనులు చేపట్టలేదు. జిల్లా వ్యాప్తంగా ఇదే దుస్థితి జాతీయ రహదారి విస్తరణ పనుల్లో జిల్లా వ్యాప్తంగా ఇదే దుస్థితి నెలకొంది. జిల్లాలోని లింగాలఘణ పురం, రఘునాథపల్లి, స్టేషన్ఘన్పూర్, చిల్పూరు మండలాల్లో పలు చోట్ల సర్వీసు రోడ్డు పనులు పూర్తి చేయలేదు. యూటర్న్లు లేకపోవడంతో వాహనాలు ఎదురెదురుగా వచ్చి పలుమార్లు రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటనలున్నాయి. స్టేషన్ఘన్పూర్, రఘునాథపల్లిలో హైదరాబాద్, జనగామ నుంచి హన్మకొండవైపు వచ్చే ఆర్టీసీ బస్సులు బస్టాండ్లోకి రాకపోవడంతో ప్రయాణికులకు తీవ్ర సమస్యగా మారింది. సర్వీసు రోడ్లపై ఎండలో నిల్చుని బస్సులను ఆశ్రయిస్తున్నారు. స్టేషన్ఘన్పూర్లో సర్వీసు రోడ్లు అసంపూర్తిగా వేశారు. స్థానిక బస్టాండ్ నుంచి శ్రీవాణి గురుకులం వరకు సర్వీసు రోడ్డు వేయాల్సి ఉండగా కేవలం విద్యుత్సబ్స్టేషన్ వరకే వేసి వదిలేశారు. దీంతో సర్వీసు రోడ్డు నిరుపయోగంగా మారగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా ఘన్పూర్ మండలం రాఘవాపూర్లో రహదారికి రెండువైపులా ఇంతవరకు సర్వీసు రోడ్లు వేయలేదు. కొత్తపల్లి క్రాస్రోడ్డు వద్ద జాతీయ రహదారిపైకి ప్రజలు నేరుగా వస్తుండగా పలురోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో హైమాస్ట్ లైట్లు లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు అవస్థల పాలవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి సర్వీసు రోడ్లు, రెయిలింగ్ పనులను పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. 1. స్టేషన్ఘన్పూర్లో అసంపూర్తిగా ఉన్న సర్వీసు రోడ్డు 2. ఘన్పూర్ బస్టాండ్ వద్ద సర్వీసురోడ్డుపై ప్రమాదకరంగా బస్సులు ఎక్కుతున్న ప్రజలు 3. రాఘవాపూర్లో కంకరపోసి వదిలేసిన రోడ్డు బస్సుల కోసం అవస్థలు హైదరాబాద్, జనగామ నుంచి హన్మకొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులు బస్టాండ్లోకి రావడం లేదు. రహదారి పక్కన సర్వీసు రోడ్డుపై బస్సులు నిలుపుతుండగా బస్సుల కోసం ప్రయాణికులు జాతీయ రహదారిని ప్రమాదకరంగా దాటాల్సి వస్తోంది. ఈ విషయమై అధికారులు వెంటనే స్పందించాలి. – మునిగెల రాజు, స్టేషన్ఘన్పూర్ పెండింగ్ పనులు పూర్తి చేయాలిఘన్పూర్లో సర్వీసు రోడ్డు విషయంలో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు అరిగోస పడుతున్నారు. ఇప్పటికై నా స్పందించి ఘన్పూర్తో పాటు గ్రామాల్లో సర్వీసు రోడ్లు, రెయిలింగ్, డ్రైనేజీ పనులు పూర్తి చేయాలి. – మారెపల్లి ప్రసాద్, స్టేషన్ఘన్పూర్ 2 నిర్మాణ పనులకు గడువు ముగిసి ఏడేళ్లు రోడ్డు ప్రమాదాలతో ప్రజలకు ఇక్కట్లు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి.. పట్టింపులేని పాలకులు, అధికారులు -
యూజీడీ వైపు అడుగులు
రూ.5,257 కోట్లకు ఇటీవల పరిపాలన అనుమతిసాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ నగరంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) ప్రాజెక్టు వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. సుమారు 40 ఏళ్లుగా ఈ ప్రాజెక్టుకు మోక్షం కలగలేదు. పలుమార్లు ప్రతిపాదనలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వాలకు పంపించినా ఏదో ఒక కారణంతో ఆచరణకు నోచుకోలేదు.ఎట్టకేలకు యూజీడీ కోసం ప్రభుత్వం ఇటీవల రూ.5,257 కోట్లతో పరిపాలన అనుమతి ఇవ్వగా.. పనుల ప్రారంభం కోసం కసరత్తు జరుగుతోంది. యూజీడీ లేక రోడ్లపైకి మురుగు నీరు.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) అంచనాల ప్రకారం సాధారణ సమయంలో నగరంలో రోజుకు సుమారు 180–200 మిలియన్ లీటర్ల (ఎంఎల్డీ) మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. ఈ మురుగును శుద్ధి చేసేందుకు రెడ్డిపురం, ప్రగతినగర్, ఉర్సుగుట్ట సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీ) ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 120 ఎంఎల్డీలు మాత్రమే శుద్ధి అవుతున్నాయి. మిగిలిన మురుగు నీరంతా నగరంలో బంధం చెరువు, ధర్మసాగర్, మడికొండ, గోపాలపూర్, భద్రకాళి, వడ్డేపల్లి తదితర చెరువులతో పాటు ఎస్సారెస్పీ కాల్వలోకి చేరి కలుషితం అవుతున్నాయి. ఇక వర్షాకాలం వస్తే చాలు పలుమార్లు రోడ్లపైకి పారే వరద, మురుగునీరు కారణంగా ప్రధాన కాలనీలు మునిగిపోయిన పరిస్థితి. ఎట్టకేలకు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీకి ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇవ్వడంతో పాటు టెండర్ల ప్రక్రియను సైతం మొదలెట్టడం చర్చనీయాంశం అవుతోంది. ఏప్రిల్లో సీఎంతో పనులు ప్రారంభం.. నేడు తేదీలు ఖరారయ్యే అవకాశం యూజీడీ పనులకు ఈ నెలాఖరులోగా టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 10న వరంగల్ అభివృద్ధి పనులపై మంత్రి కొండా సురేఖతో కలిసి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఈ నెలాఖరులో యూజీడీ పనుల టెండర్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. టెండర్ల ప్రక్రియ ఈ నెలలో పూర్తి చేసి వచ్చే నెలలో సీఎం రేవంత్రెడ్డితో శంకుస్థాపన చేయించే యోచనలో నేతలు ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యూజీడీ విషయమై కూడా సీఎంను కలవనున్నట్లు తెలుస్తోంది. త్వరితగతిన నిర్మాణం చేపట్టేలా కార్యాచరణ ఈ నెలాఖరులో టెండర్ల ప్రక్రియ.. అధికారుల కసరత్తు పూర్తి సకాలంలో పనులు పూర్తయితే ‘గ్రేటర్’కు తప్పనున్న మురుగు, ముంపు యూజీడీ ప్రాజెక్టు వివరాలు..ప్రాజెక్టు పేరు: అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) మొత్తం వ్యయం: రూ. 5,257 కోట్లు అమలు సంస్థ: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాజెక్టు లక్ష్యం: ట్రైసిటీలో సమగ్ర యూజీడీ వ్యవస్థ ఏర్పాటు పైపులైన్ నెట్వర్క్: 740 కిలోమీటర్లు యూజీడీ జోన్లు: 9 సీవరేజ్ ట్రీట్మెంట్ జోన్లు: 21 డ్రెయినేజీ కనెక్షన్లు: దాదాపు 3.15 లక్షల ఇళ్లువరంగల్ : గిర్మాజీపేట, శివనగర్, మండిబజార్, మట్టెవాడ, దేశాయిపేట, మిల్స్కాలనీ, రాంనగర్, ఆటోనగర్, ఎంజీఎం హాస్పిటల్ పరిసరాలు, హంటర్ రోడ్డు, కరీమాబాద్ హనుమకొండ : సుబేదారి, బాలసముద్రం, అదాలత్ సెంటర్, ఎల్బీనగర్, నయీంనగర్, కిషన్పుర క్రాస్, ఎన్జీఓస్ కాలనీ, తిరుమల బార్ చౌరస్తా, అంబేడ్కర్ భవన్ ఏరియా కాజీపేట : రైల్వే కాలనీ, ఫాతిమానగర్, శివనగర్, గాంధీనగర్, ఎల్ఐసీ కాలనీ, డీజిల్ కాలనీ, మడికొండ రోడ్డు పరిసరాలు -
అంధకారం.. భయంతో ప్రయాణం
స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని శివాజీచౌక్ నుంచి శివునిపల్లి అంబేడ్కర్ సెంటర్ వరకు ఉన్న రైల్వే ఫ్లైౖఓవర్పై లైట్లు వెలగకపోవడంతో అంధకారంగా మారింది. స్టేషన్ఘన్పూర్ నుంచి శివునిపల్లి, జఫర్గఢ్, ఐనవోలు, వర్ధన్నపేట, పాలకుర్తి తదితర ప్రాంతాలకు ప్రధాన మార్గంగా ఉన్న ఈ ఫ్లైౖఓవర్ బ్రిడ్జిపై కొద్ది రోజులుగా లైట్లు వెలగడం లేదని ప్రజలు వాపోతున్నారు. దాంతో ఈ ఫ్లైౖఓవర్పై రాత్రివేళ ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఫ్లైౖఓవర్పై వెళ్లే వాహనదారులు భయంభయంతో నెమ్మదిగా వెళ్తున్నారు. గతంలో ఈరోడ్డుపై ప్రమాదాలు జరిగిన సంఘటనలు సైతం అనేకం ఉన్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి లైట్లను వీలైనంత తొందరగా వేయించాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. -
సాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి
జనగామ: జిల్లాలో యాసంగి సీజన్లో పంటలకు తగినంత సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశం హాలులో పంటల పరిస్థితి, సాగునీటి వినియోగం, విద్యుత్ సరఫరా అంశాలపై నీటి పారుదల, ఎన్పీడీసీఎల్, వ్యవసాయ శాఖ సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నీటి వనరులు, వినియోగ నిర్వహణ ప్రణాళికలను సిద్ధం చేసి అందించాలని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించాలన్నారు. సమావేశంలో డీఏఓ అంబికా సోనీ, నీటిపారుదల ఎస్ఈ సీతారాం, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు లేవు.. జిల్లాలో గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని కలెక్టర్ సందీప్ కుమా ర్ ఝా తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశం హాలులో డీసీపీ రాజమహేంద్ర నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, ఇతర సంబంధిత అధికారులతో కలిసి గ్యాస్ సరఫరాపై కలెక్టర్ గ్యాస్ సరఫరా పర్యవేక్షణ కమిటీ (డీఎల్ఈఎస్ఎంసీ) సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గ్యాస్ డిమాండ్కు అనుగుణంగా సంబంధిత ఏజెన్సీల వద్ద సరిపడా గ్యాస్ సిలిండర్ల నిల్వలు ఉన్నాయన్నారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఆందోళన చెందవద్దు అని చెప్పారు. అక్రమ గ్యాస్ తరలింపుపై సమాచారం కోసం కలెక్టరేట్లో హెల్ప్లైన్ నెంబర్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డీసీపీ మాట్లాడుతూ.. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే తప్పుడు ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని తెలిపారు. సమీక్షాలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, జిల్లా పౌరసరఫరాల అధికారి సరస్వతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు రవీందర్, హసీనా బేగం, విక్రమ్, డీఏఓ అంబికా సోనీ, డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జునరావు, డీడబ్ల్యూఓ కోదండరాములు, ఇతర సంబంధిత అధికారులు, గ్యాస్ డీలర్ల సంఘం అధ్యక్షులు, సభ్యులు, డిస్ట్రిబ్యూటర్లు,, తది తరులు పాల్గొన్నారు. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు లేవు సమీక్షలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
ఎవరికీపట్టని ‘సీఎంఆర్’!
సాక్షిప్రతినిధి, వరంగల్: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఓ రైస్మిల్లును ఏడాది క్రితం డిఫాల్టర్ల జాబితాలో చేర్చారు. 2021–22, 2022–23 సంవత్సరాలకు సీఎంఆర్ కింద కేటాయించిన సుమారు రూ.7.50 కోట్ల విలువైన ధాన్యం ఎగవేయడమే ఇందుకు కారణం. డిఫాల్టర్ల జాబితాలో చేర్చి నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేసినా ఇప్పటికీ నూరు శాతం సీఎంఆర్ రికవరీ కాలేదు. హసన్పర్తి మండలంలోని ఓ రైస్మిల్లు నిర్వాహకులు 2,200 మెట్రిక్ టన్నుల బియ్యం చెల్లించాల్సి ఉంది. దాడులు, తనిఖీలు చేసి నోటీసులు జారీ చేయడంతో 1,300 మెట్రిక్ టన్నులు చెల్లించారు. ఇంకా 900 మెట్రిక్ టన్నులు ఇవ్వాలని కమిషనర్ కార్యాలయానికి అందిన ఫిర్యాదులో పేర్కొన్నారు. .. ఇలా ప్రతీసారి కస్టం మిల్లింగ్ ధాన్యం (సీఎంఆర్) దారి మళ్లుతోంది. వ్యాపారం, వృత్తి మీద నిబద్ధత ఉన్న సుమారు 75 శాతం మంది రైస్మిల్లర్లు సకాలంలో సీఎంఆర్ చెల్లిస్తున్నారు. కొందరు రాజకీయ పలుకుబడి, మరికొందరు అక్రమార్జన కోసం సీఎంఆర్ బకాయి పెడుతున్నారు. ఓ సీజన్కు చెల్లించాల్సింది మరో సీజన్కు ఇస్తూ.. కొందరు అధికారులను మేనేజ్ చేస్తూ సర్కారు ధాన్యంతో వ్యాపారం చేస్తున్నారు. కొందరైతే మొత్తానికే ఎగవేస్తున్నారు. సర్కారు ధాన్యం మరాడించి పక్క రాష్ట్రాలకు తరలించి బియ్యం అమ్ముకుని.. ఆ డబ్బుతో ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేసి ‘రియల్’ వ్యాపారం చేస్తున్నారు. ఏటా రూ.కోట్ల విలువ చేసే ధాన్యం దారి మళ్లుతుండగా అవినీతి, అక్రమాలకు అలవాటుపడిన కొంతమంది అధికారులు, రైస్మిల్లర్లకు సీఎంఆర్ వరంగా మారిందన్న చర్చ జరుగుతోంది. స్కాం ఇలా వెలుగులోకి.. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తోంది. ఈ ధాన్యాన్ని సివిల్ సప్లయీస్/మార్కెటింగ్ శాఖ ద్వారా రైస్ మిల్లులకు పంపుతుంది. మిల్లర్లు ధాన్యం తీసుకున్న తర్వాత మిల్లింగ్ చేసి బియ్యం ఇవ్వాలి. ఒప్పందం ధాన్యం మిల్లింగ్ చేసి సుమారు 67 శాతం బియ్యం ఎఫ్సీఐ/సివిల్ సప్లయీస్ గోదాములకు ఇవ్వాలి. ఇక్కడే అసలు స్కాం మొదలవుతుంది. కొంతమంది మిల్లర్లు ప్రభుత్వ ధాన్యం మిల్లింగ్ చేయరు.. లేదా కొంత మాత్రమే మిల్లింగ్ చేస్తారు. మిగిలిన ధాన్యాన్ని మార్కెట్ ధర ఎక్కువ ఉంటే ప్రైవేట్కు అమ్మేయడం, లేదంటే మరాడించి బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి అమ్ముకుంటున్నారు. ఈ వ్యవహారంలో ఫేక్ మిల్లింగ్ రికార్డులు, స్టాక్ రిజిస్టర్ మార్పులు చేసి తక్కువ బియ్యం చూపించడం.. బియ్యం ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరిగితే ధాన్యం తడిగా ఉండడం, మిల్లింగ్, ట్రాన్స్పోర్ట్ సమస్యలను చెప్పి దాటవేయడం పరిపాటి. తీరా పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేసినప్పుడు మిల్లుల్లో ఉన్న ధాన్యం, సరఫరా చేసిన బియ్యం లెక్కల్లో భారీ తేడా కనిపిస్తుంది. దీంతో సీఎంఆర్ బకాయిలు, పక్కదారి పట్టించిన స్కాంలు బయట పడుతున్నాయి. 33 మంది మిల్లర్ల నిర్లక్ష్యం 2021–22లో రైతుల నుంచి వానాకాలం, యాసంగి సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద రైస్మిల్లర్లకు సరఫరా చేశారు. ఆ ధాన్యానికి సంబంధించిన బియ్యం సరఫరా చేయడంలో ఉమ్మడి వరంగల్లోని 33 మంది మిల్లర్లు నిర్లక్ష్యం వహించారు. బియ్యం చెల్లించని వారికి పౌరసరఫరాలశాఖ నోటీసులు ఇచ్చింది. స్పందించకపోవడంతో ఆయా మిల్లులకు సరఫరా చేసిన లెక్కల ప్రకారం ఉండాల్సిన ధాన్యానికి 2023లో టెండర్లు నిర్వహించారు. అలా ఉమ్మడి వరంగల్లోని మిల్లుల్లో 2,92,585 మెట్రిక్ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు.. తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధికారులు ఎట్టకేలకు 1,83,985 మెట్రిక్ టన్నులు రాబట్టినట్లు అప్పట్లోనే ప్రకటించారు. ఇంకా సుమారు రూ.107 కోట్ల విలువ చేసే ఆ ధాన్యం రైస్మిల్లర్ల వద్ద ఉందని పౌర సరఫరాలశాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తేల్చారు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అవకాశం ఉంది. కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై తాజాగా పౌర సరఫరాల శాఖ కమిషనర్కు కొందరు రైస్మిల్లర్లే ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీఎంఆర్ బకాయిలు రాబట్టడంపై కొందరిపై కఠినంగా, మరికొందరిపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించినట్లు తెలిసింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్లో సీఎంఆర్ బకాయిలపై కమిషనర్ కార్యాలయం తాజాగా ఆరా తీయడం రైస్మిల్లర్లలో చర్చనీయాంశంగా మారింది. డిఫాల్టర్ రైస్మిలర్లపై చర్యలు లేవు.. వారి వద్దే కస్టం మిల్లింగ్ రైస్ నోటీసులకే పరిమితమైన రికవరీ.. ‘తిలా పాపం తలా పిడికెడు’లా పరిస్థితి మూడేళ్లు గడిచినా ఇంకా మౌనమే.. మిల్లర్ల వ్యాపారానికి సర్కారు ధాన్యం అధికారుల ఉదాసీనతపై కమిషనర్ సీరియస్.. మళ్లీ తెరపైకి బకాయిల వ్యవహారం -
రాములోరి కల్యాణానికి కోటి తలంబ్రాలు
బచ్చన్నపేట: మండలంలోని గోపాల్నగర్ గ్రామం నుంచి భద్రాచలంలో శ్రీరామ కల్యాణానికి కోటి తలంబ్రాలను గ్రామస్తులు పంపించారు. శనివారం భద్రాచలం ఆలయం నుంచి వచ్చిన స్వామి రామకోటి రామరాజుతో భద్రాచలం పంపించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ.. భద్రాచల ఆలయం వారు పంపించిన వడ్ల ప్యాకెట్లను తీసుకొని రామభక్తులు చేతితో ఒలిచి మళ్లీ ప్యాకెట్లలో పెట్టి కోటి తలంబ్రాలను అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పేరబోయిన కళ్యాణి పర్షరాములు, ఉపసర్పంచ్ చింతల కర్ణాకర్, భక్తులు దొంతుల రాజు, కొత్తపల్లి కాశీపతి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేటకు ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులుజనగామ రూరల్: జిల్లా కేంద్రం నుంచి సిద్దిపేటకు రెండు ఎక్స్ప్రెస్ బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ డీపో మేనేజర్ ఎస్.స్వాతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనగామ నుంచి సిద్దిపేటకు 05:40, 07:10, 10:00, 11:10, 14:30, 14:40, 17:50, 18:20 గంటల వరకు, సిద్దిపేట నుంచి జనగామకు 07:45, 09:15, 12:15, 12:45, 16:10, 16:35, 19:45, 20:10 గంటల సమయాల్లో సర్వీసులు ఉంటాయని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. డిజిటల్ చెల్లింపులపై అవగాహనజనగామ రూరల్: మండలంలోని పెంబర్తి ఎంజేపీ మహిళ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థినుల ప్రత్యేక శిబిరం నిర్వహించారు. శనివారం గ్రామంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపుల ఉపయోగాలు, భద్రతా జాగ్రత్తలు, ఫోన్పే, గూగుల్ పే వంటి యాప్ల ద్వారా సులభంగా డబ్బులు పంపడం, స్వీకరించడం ఎలా అనే విషయాలను వివరించారు. నగదు లావాదేవీలకు బదులుగా డిజిటల్ లావాదేవీలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామ ప్రజలకు తెలియజేశారు. కార్యక్రమంలో స్టేషన్ ఘన్పూర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జ్యోత్స్న, విద్యార్థులు పాల్గొన్నారు. కోచ్ ఫ్యాక్టరీలో కొలువులివ్వాలి..కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీలో అయోధ్యపురం భూ నిర్వాసితులు, గ్రామస్తులకు, కాజీపేట పరిసర ప్రాంతాల వారికి, రైల్వే ఆక్ట్ అప్రెంటీస్ చేసిన వారికి, ఉమ్మడి జిల్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ అన్నారు. కాజీపేట రైల్వే ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాఘవేందర్ మాట్లాడుతూ.. ఆదివారం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎంట్రెన్స్ ఎదుట రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో మహా నిరసన దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. రైల్వే జేఏసీ చైర్మన్ కోండ్ర నర్సింగరావు మాట్లాడుతూ.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పించాలని రైల్వే జేఏసీ చేపడుతున్న డిమాండ్లు నెరవేరే వరకు అందరి సహకారం ఉండాలన్నారు. కాజీపేట డివిజన్ కోసం రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని, రైల్వే జేఏసీ దీక్షను అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రైల్వే జేఏసీ బృందం పాక వేద ప్రకాశ్, గుర్రపు సుధాకర్రావు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
కమర్షియల్ సిలిండర్
జనగామ: ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగి ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సరఫరాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావం జిల్లాలో కమర్షియల్ గ్యాస్ కస్టమర్లపై తీవ్రంగా పడింది. కమర్షియల్ సిలిండర్ల కొరత నాలుగు రోజులుగా కొనసాగుతుండటంతో హోట ల్స్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, టీ దుకాణాల కార్యకలాపాలు చాలా చోట్ల స్తంభించాయి. పరిస్థితి ఇంకా అలా గే కొనసాగితే గృహ వినియోగదారులకు కూడా సిలిండర్ల కొరత తప్పదన్న భయం నెలకొంది. బుకింగ్ల వెల్లువ, సర్వర్లు డౌన్ యుద్ధం కారణంగా ధరలు పెరుగుతాయనే ఆందోళన ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో అవసరమున్నా లేకున్నా అడ్వాన్స్గా గ్యాస్ కోసం బుకింగ్ చేస్తున్నారు. జనగామ పట్టణంలో రోజుకు 1,000 నుంచి 1,800ల బుకింగ్లు వస్తుండగా, మండలాల్లో 150 నుంచి 400 బుకింగ్లు నమోదవుతున్నాయి. సాధారణంగా జిల్లా కేంద్రంలో రోజువారీ బుకింగ్లు 300 నుంచి 400 మధ్యే ఉండేది. అయితే అత్యవసర భయంతో మూడు రెట్లు పెరగడంతో గ్యాస్ కంపెనీల సర్వర్లు కూడా నిలకడ కోల్పోతున్నాయని ఏజెన్సీ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. బుకింగ్ చేసినా సిలిండర్ సమయానికి రాకపోవడంతో ప్రజలు ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. కొరత లేదు.. ముందస్తు బుకింగ్లను చేయవద్దంటూ నిర్వాహకులు చెబుతున్నా వినియోగదారుల భయం తగ్గడం లేదు. ప్రస్తుతం జనగామ పట్టణానికి ప్రతి రోజు 524 సబ్సిడీ సిలిండర్లు వస్తుండగా, మండలాల వారీగా ఇంతే మొత్తంలో వస్తున్నాయి. బుకింగ్లు ఒక్కసారిగా పెరగడంతో కొరత ఉన్నట్టు కనిపిస్తోంది. జిల్లాలో కమర్షియల్ కనెక్షన్లు తక్కువ జిల్లాలో సబ్సిడీ సిలిండర్ల కనెక్షన్లు 1.60లక్షలు ఉండగా, కమర్షియల్ కనెక్షన్లు 378 మాత్రమే ఉన్నాయి. కానీ కమర్షియల్ సిలిండర్ల సప్లై నాలుగు రోజుల క్రితమే నిలిచిపోయింది. దీంతో కలెక్టరేట్లోని క్యాంటిన్ నిర్వాహకులు కట్టెల పొయ్యిలను ఉపయోగించి రోజువారీ కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, టీ దుకాణాల్లో అయితే పరిస్థితి మరింత దారుణం. నాలుగు రోజులుగా కమర్షియల్ సిలిండర్లు లేకపోయినా, పలు హోటళ్లు వాటితో వ్యాపారం చేయడంపై గ్యాస్ ఏజెన్సీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ది గుమతి నిలిచిపోయిన కమర్షియల్ సిలిండర్లు ఎక్కడ నుంచి వస్తున్నాయని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. సబ్సిడీ గృహ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేసి, వాటిని కమర్షియల్ సిలిండర్లలో రీఫిల్ చేస్తున్నారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం ఓఎస్డీ ప్రభాకర్, లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో భారీ తనిఖీలు చేపట్టారు. 18 హోటల్స్, టిఫిన్ సెంటర్లలో జరిగిన రైడ్స్లో 45 సబ్సిడీ సిలిండర్లను సీజ్ చేశారు. నిర్వాహకులపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇకపై సబ్సిడీ సిలిండర్లను కమర్షియల్గా వాడితే కఠిన చర్యలు తప్పవని, జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని హెచ్చరించారు. వారి వెంట జనగామ అధికారులు ఇట్టబోయిన శ్రీనివాస్, లచ్చు నాయక్ ఉన్నారు. జిల్లాలో గ్యాస్ కొరత లేదు. ఆందోళనతో ఒక్కసారిగా బుకింగ్ చేసుకుని, ఇంకా సిలిండర్లు సప్లై చేయడం లేదని మా వద్దకు వస్తున్నారు. రోజు వారీగా సిలిండర్లతో వచ్చే లోడ్ను వినియోగదారులకు ఇంటింటికీ వెళ్లి అందిస్తున్నాం. కమర్షియల్ సిలిండర్ల సప్లై నాలుగు రోజుల క్రితమే నిలిచి పోయింది. సబ్సిడీ సిలిండర్ల కొరత ఏ మాత్రం లేదు. – కాశీ విశ్వనాథం, గ్యాస్ ఏజెన్సీ మేనేజర్, జనగామకమర్షియల్ సిలిండర్ సాధారణ ధర రూ.2,100 ఉండగా, ప్రస్తుతం బ్లాక్ మార్కెట్లో రూ.2,500 నుంచి రూ.3,000 వరకు అమ్ముతున్నట్లు సమాచారం. ఇక సబ్సిడీ సిలిండర్లను కూడా కొందరు అదనపు ధరలకు కొనుగోలు చేసి, మార్కెట్లో విక్రయిస్తున్నట్లు ప్రచారం ఉంది. ప్రస్తుత సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంటున్న దళారులకు అధికారులు చెక్ పెట్టాల్సిన అవసరం పెరిగింది. ఇప్పటికిప్పుడు గృహ వినియోగదారులకు సబ్సిడీ సిలిండర్ల కొరత లేకున్నప్పటికీ, బుకింగ్లు విపరీతంగా పెరగటం, కమర్షియల్ మార్కెట్ ఇప్పటికే కుప్పకూలడంతో పరిస్థితి ఇలాగే కొనసాగితే డొమెస్టిక్ సిలిండర్ సరఫరాపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని తెలుస్తోంది. దీంతో ముందే డబుల్ సిలిండర్ తీసుకుని నిల్వ చేసుకో వడానికి ప్రయత్నిస్తున్నారు. కట్టెల కొరత ప్రస్తుతం లేకున్నప్పటికీ, జిల్లాలో కర్రలు క్వింటాళుకు రూ.700 ధర పలుకుతోంది. పట్టణంలో రోజుకు వెయ్యి నుంచి 1,800 బుకింగ్లు నిలిచిన సప్లై.. బ్లాక్ మార్కెట్లో రూ.3వేలు..? 18 హోటళ్లపై విజిలెన్స్ రైడ్, 40 సిలిండర్ల సీజ్ గుట్టుచప్పుడు కాకుండా రీఫిల్లింగ్ దందా -
మున్సిపల్ ఎన్నికల ఖర్చులు చూపించండి
జనగామ: ఇటీవల జరిగిన పురపాలిక ఎన్నికల నేపథ్యంలో పోటీచేసిన అభ్యర్థులు ఎలక్షన్ల ఖర్చులు చూపించాలని జనగామ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోటీ చేసిన ప్రతీ అభ్యర్థి ఎలక్షన్ లెక్కల ఖర్చుల వివరాలను మున్సిపల్ కార్యాలయంలో అబ్జర్వర్కు ఈ నెల 29 వరకు సమర్పించాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానంజనగామ: జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం ద్వారా జనగణన–2027 విధులకు సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు కనీసం 4 సంవత్సరాలు వరుసగా జనగామ జిల్లాలో చదివి ఉండడంతో పాటు స్టడీ సర్టిఫికెట్ తప్పనిసరి అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు గెజిటెడ్ ఆఫీసర్ ధ్రువీకరించిన 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లను జతపరిచి, కలెక్టరేట్లోని రెండో అంతస్థు 29వ నెంబర్లోని కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. 16వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషిజనగామ రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సంస్థ నిరంతరం కృషి చేస్తుందని విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ వేణుగోపాలచారి అన్నారు. శుక్రవారం మండలంలోని పెంబర్తి ఓల్డ్ సబ్స్టేషన్ కార్యాలయ ఆవరణలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈసందర్భంగా విఽనియోగదారుల నుంచి 22 దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ సంపత్రెడ్డి, డీఈ లక్ష్మినారాయణరెడ్డి, ఎస్ఏఓ సుదర్శన్రావు తదితరులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ ఏటీఎంఏ, బీఎఫ్ఏసీ సభ్యుల ఎంపికజనగామ: మండల స్థాయిలో అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ(ఏటీఎంఏ) పథకం కింద బ్లాక్ ఫార్మర్స్ అడ్వైజరీ కమిటీ (బీఎఫ్ఏసీ), (డీఎ్ఫ్ఏసీ) సభ్యుల ఎంపిక కోసం అర్హులైన ప్రగతిశీల రైతుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏటీఎంఏ 2025–26 మార్గదర్శకాల ప్రకారం మండల స్థాయిలో రైతుల అవసరాలు, సమస్యలు, సూచనలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు బీఎఫ్ఏసీ కమిటీ ముఖ్యపాత్ర పోషిస్తోందన్నారు. ఈ కమిటీ ద్వారా బ్లాక్స్థాయి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన, రైతుల భాగస్వామ్యం పెంపొందుతుందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో (పాడి, ఉద్యానవన పంటలు, మత్స్య పరిశ్రమ, పట్టు పరిశ్రమ, ప్రకృతి వ్యవసాయం) అనుభవం కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గల రైతు లు తమ దరఖాస్తులను సంబంధిత మండల వ్యవసాయ అధి కారి (ఎంఏఓ) కార్యాలయంలో ఈ నెల 19వ తేదీ లోపు సమర్పించాలని కోరారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు జిల్లా పోర్టల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. -
విజయీభవ!
జనగామ: జిల్లా వ్యాప్తంగా ఈనెల 14 (శనివారం) నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. విద్యార్థులు కఠోర శ్రమ, ఆత్మవిశ్వాసంతో ప్రిపరేషన్ అవుతుండగా, విజయోస్తు అంటూ అధికారులు, ఉపాధ్యాయులు దీవిస్తున్నారు. విద్యలో ఉన్నతి సాధించే ఈ కీలక దశలో విద్యార్థులు ఎలాంటి టెన్షన్, ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచిస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో జిల్లా అత్యుత్తమ ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని జిల్లా విద్యాశాఖ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోంది. ప్రత్యేక తరగతులు, రిమైండర్ క్లాసులతో విద్యార్థుల్లో నమ్మకం పెంపొందించారు. జిల్లాలో విద్యార్థుల హాజరు, సెంటర్ల వివరాలు జిల్లాలో 183 ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలు ఉండగా, పదో తరగతి పరీక్షలకు 6,645 మంది హాజరు కానున్నారు. కాగా ఒకేషనల్ పరీక్షల కోసం 713 మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 39 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల సమయంలో సెంటర్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదనపు భద్రత నిమిత్తం 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కఠిన నియంత్రణ...సెల్ఫోన్లకు నో పరీక్ష కేంద్రంలో విద్యార్థులు మాత్రమే కాదు, పర్యవేక్షణలో ఉన్న అధికారులు కూడా సెల్ఫోన్లు తీసుకురావడం నిషేధం. ప్రశ్నపత్రాలను పోలీస్ ఎస్కార్ట్తో ఉదయం పరీక్షలకు ముందు సెంటర్లకు తరలించనున్నారు. ప్రస్తుతం అన్ని పోలీస్ స్టేషన్లలోని స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నపత్రాల బండిల్ను ఓపెన్ చేస్తారు. పరీక్షా సమయం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, ఫిజిక్స్, బయాలజీ (సైన్స్) 9.30 నుంచి 11.00 వరకు జరుగనుంది. ఇదిలా ఉండగా ఏప్రిల్ 15న ఒకేషనల్ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 11.00 వరకు జరుగుతాయి. పోలీస్, విద్యాశాఖ ఏర్పాట్లు పదో తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. పరీక్ష కేంద్రాలు, మార్గాలు అన్ని పర్యవేక్షణలో ఉంటాయి. విద్యాశాఖ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు పరీక్షల పరిస్థితిని నిరంతరం పరిశీలించనున్నారు.పాఠశాలలు 183 (ప్రభుత్వ, ప్రైవేటు) సెంటర్లు 39 విద్యార్థులు 6,445 ఒకేషనల్ విద్యార్థులు 713 నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ 39 సెంటర్లలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్.. జిరాక్స్ సెంటర్ల మూసివేత -
ముగిసిన ఇంటర్ పరీక్షలు
జనగామ రూరల్: ఫిబ్రవరి 25వ తేదీన ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఇంటర్ విద్యాధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారంతో ఇంటర్ సెకండియర్ పరీక్షలు ముగిశాయని పరీక్షల నిర్వహణకు సహకరించిన కలెక్టర్ సందీప్కుమార్ ఝా, పోలీసు అధికారులకు, ఇతర శాఖల అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా చివరి రోజు పరీక్షకు 77 మంది గైర్హాజరయ్యారన్నారు. జనరల్లో 3,085 మందికి గాను 3,044 మంది హాజరుకాగా 41 మంది గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్లో 576 మందికి 540 మంది హాజరుకాగా 36 మంది గైర్హాజరయ్యారన్నారు. -
ఘన్పూర్ అభివృద్ధికి రూ.63కోట్ల బడ్జెట్
● ప్రజాప్రతినిధులందరూ బాధ్యతగా పనిచేయాలి ● మున్సిపాలిటీ తొలి వార్షిక బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ బాధ్యతగా సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కడి యం శ్రీహరి అన్నారు. ఘన్పూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్ అధ్యక్షతన 2026–27 వార్షిక బడ్జెట్ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కడియం మాట్లాడు తూ.. బడ్జెట్ అంచనాలపై చర్చించారు. 2026–27 సంవత్సరానికి గాను రూ.63,33,70,000ల బడ్జెట్ అంచనాలను పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారన్నారు. పట్ణణ కేంద్రంలోని బస్టాండ్ సమీపాన ఉన్న శ్రీతిరుమలనాథస్వామి దేవస్థాన భూమిని లీజుకు తీసుకుని అందులో మార్కెట్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేయగా. పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. అదేవిధంగా పట్ట ణ కేంద్రంలోని పార్కును అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయాలని, వక్ఫ్బోర్డు ఆధీనంలో ఉన్న నాలుగు ఎకరాల భూమిని లీజుకు తీసుకునేలా తీర్మానాలు చేసినట్లు తెలిపారు. నిధుల వినియోగంపై ప్రశ్నించిన బీఆర్ఎస్ సమావేశంలో బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్లు బూర్ల రాజేశ్వర్, పొన్న రాజశేఖర్, అనీల్గౌడ్, తాటికొండ మధు, చల్లా రమ్యరఘురెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి వచ్చిన నిధుల వినియోగంపై ప్రశ్నించారు. మున్సిపాలిటీకి వచ్చిన రూ.50 కోట్ల నిధులలో ఇప్పటివరకు ఎక్కడెక్కడ టెండర్లు పిలి చారు, ఎంతవరకు పనులు పూర్తయ్యాయి, పెండింగ్లో ఏమి ఉన్నాయి.. తదితర వివరాలు తెలుపాలని కోరారు. కాగా ఏఈ ద్వారా కౌన్సిలర్లకు వివరాలను అందించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాధాక్రిష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధికి అందరూ సహకరించాలి నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేలా అందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా సహకరించాలని మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్ అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు. పన్నుల విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని, మున్సిపల్ పాలక మండలి తీర్మానం మేరకు పేదలపై పెద్దగా ఆర్థిక భారం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. -
రైతులు ఆర్థికాభివృద్ధి సాధించాలి
పాలకుర్తి టౌన్: రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణను కూడా అభివృద్ధి చేసి ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. పశువైద్యం, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అయ్యంగారిపల్లిలో ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిఽథిగా పాల్గొని ప్రారంభించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ.. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పశువులకు టీకాలు వేయించుకోవాలన్నారు. కల్టెకర్ సందీప్కుమార్ ఝా మాట్లాడుతూ.. పశువైద్యశాఖ అధికారులు గ్రామాల వారీగా టీకాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి మురళీ, విజయ డైయిరీ డిప్యూటీ డైరెక్టర్ గోపాల్ సింగ్, సర్పంచ్ ముస్కు సుధాకర్, తహసీల్దార్ సరస్వతి, ఎంపీడీఓ వేదవతి, పశువైద్యాధికారి అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
మూడున్నర కిలోమీటర్లు వెళ్లి తీసుకోవాలి
ప్రతి నెల మూడున్నర కిలోమీటర్లు వెళ్లి రేషన్ బియ్యం తీసుకోవాల్సి వస్తోంది. తండాలో 80 మందికి పైగా రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరంతా ప్రతినెల కిష్టగూడెం వెళ్లి తీసుకోవాల్సి వస్తోంది. రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో వర్షాకాలం వెళ్లాలంటే నానా ఇబ్బందులు పడుతున్నాం. – ధరావత్ సురేందర్. డీకే తండా వాసిఎన్నో ఏళ్ల నుంచి రేషన్ సరుకుల కోసం మా తండా నుంచి టీబీ తండా వద్ద ఉన్న రేషన్ షాపునకు సుమారు రెండున్నర కిలోమీటర్లు పోవాల్సి వస్తోంది. తాము ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. – బాదావత్ రాజు, రేగడి తండా గ్రామ నివాసి -
పక్కూరికెళ్తేనే ‘రేషన్’
జనగామ రూరల్: పరిపాలన సౌలభ్యంకోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. కానీ అక్కడ ఎలాంటి వసతులు కల్పించకపోవడంతో సమస్యలు పరిష్కారం కాక తిష్ఠవేసుకొని ఉన్నాయి. ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులు తీసుకునే అవకాశం లేక కిలో మీటర్ల మేర ఇతర గ్రామాలకు వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. కొత్త జీపీలకు రేషన్ షాపులు ఇప్పటి వరకు రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయలేదు. దీంతో దివ్యాంగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నూతన జీపీలకు రేషన్ షాఫులు కరువు.. జిల్లాలో 281 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో పాతవి 190, నూతనంగా 91 జీపీలు ఏర్పాటు అయ్యాయి. వాటిలో కొన్ని రేషన్ షాపులు ఏర్పాటు కాగా ఇంకా చేయాల్సి ఉంది. జిల్లాలో మొత్తం 335 రేషన్ షాపులు ఉండగా వాటిలో 1,86,294 కార్డులు ఉన్నాయి. కాగా కొత్తగా 24 దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. నూతనంగా ఏర్పడిన జీపీల్లో రేషన్ షాపులు ఏర్పాటు చేయలేదు. జిల్లాలో రేషన్ షాపుల పరిస్థితి 500 జనాభా ఉన్న వాటికి కొత్తగా రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయాలి. కాని ప్రభుత్వ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. జనగామ మండలంలోని పెద్దతండా (ఎం), పెద్దతండా (వై) తండాల వారు మరిగడి, ఎర్రగొల్లపహడ్కు వెళ్లి తీసుకోవల్సిన పరిస్థితి ఉంది. అలాగే జఫర్గఢ్ మండలంలోని ముగ్థాంతండా, దరాగ్యతండా, లక్ష్మి నాయక్ తండా, ఏంబీ తండాలు నూతనంగా ఏర్పాటయ్యాయి. తండాల వారు రేషన్ కోసం రేగడితండాకు వెళ్లాల్సి ఉంది. మాసిరెడ్డిపల్లి వారు 7 కిలోమీటర్లు ఉప్పుగళ్లుకు వెళ్లి తీసుకుంటున్నారు. తరిగొప్పుల మండలంలోని జాలుబాయి తండా ప్రజలు బొంతగట్టు నాగారానికి వెళ్తున్నారు. లింగాల ఘణపురం మండలంలోని రామచంద్రాగుడెం ప్రజలు జీడికల్కు, చిక్కుడుగూడెం ప్రజలు నాగా రం గ్రామానికి, మంధొని గూడెం ప్రజలు మాణిక్యపూరానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. చిల్పూర్ మండలంలో యాపలతోడు తండా పంచంగాల తండా, దేవోజీ తండా, రత్న నాయక్ తండా ప్రజలు లింగంపెల్లికి రేషన్ సరుకుల కోసం వెళ్లాల్సి వస్తోంది. బచ్చన్నపేట మండలం వీఎస్ఆర్నగర్ వాసులు కట్కూర్కు వెళ్తున్నారు. లక్ష్మిపూర్ గ్రామస్తులు బండనాగారానికి, కొడకండ్లలో రాగ్యానాయక్ తండా, గుమ్ముల బండ తండా, కడగుట్టతండా, బోదతండా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు మూడు కిలోమీటర్లు వెళ్లి తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. పక్క గ్రామాలకు వెళ్లాలంటే ఆటో కిరాయి తీసుకోని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అధికారులు చొరవ తీసుకుని కొత్త జీపీల్లో రేషన్ షాపులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కొత్త గ్రామపంచాయతీల్లో షాపులెక్కడ? తీరని సమస్య..కిలోమీటర్ల ప్రయాణం జిల్లాలో 281 జీపీలు, 1,86,294 రేషన్కార్డులు కొత్తగా ఏర్పడాల్సిన షాపులు 24 -
గ్యాస్ సరఫరాపై అపోహలు వద్దు
జనగామ: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై వినియోగదారులు గందరగోళం చెందుతున్న దృష్టా మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో సమీక్షించారు. ఈసందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించే పరిస్థితుల్లో ప్రచారంపై అధికార యంత్రాంగం అ ప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. జిల్లాలో వినియోగదారులకు గ్యాస్ కొరత లేదన్నారు. జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి, గ్యాస్ నిల్వలు, సరఫరా మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తామన్నారు. అసత్య ప్రచారాలను ఆసరాగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా సిలిండర్లను బ్లాక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీసీలో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, డీసీపీ రాజమహేంద్రనాయక్, వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సప్లై తదితర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి జిల్లాలో గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ -
ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
జనగామ రూరల్: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఫస్టియర్లో జనరల్ విభాగంలో 3,477మందికి గాను 3,425 మంది హాజరుకాగా 52 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకేషనల్లో 640 మంది విద్యార్థులకు గాను 592 మంది విద్యార్థులు హాజరుకాగా 48 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతగా ముగిశాయని డీఐఈఓ జితేందర్రెడ్డి తెలిపారు. తమకు సహకరించిన కలెక్టర్ సందీప్కుమార్ ఝా, పోలీస్ అధికారులకు, డిపార్ట్మెంట్ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు పరీక్షలు ముగియడంతో వారి సొంతూళ్లకు తరలివెళ్లారు. చివరి రోజు 100మంది విద్యార్థుల గైర్హాజరు -
కిడ్నీల ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి
జనగామ: కిడ్నీ సంబంధిత వ్యాధుల వల్ల ప్రభుత్వరంగ ఆసుపత్రుల్లో చికిత్సకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని, కిడ్నీ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గురువారం ప్రపంచ కిడ్నీ దినో త్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం, డాక్టర్ లక్ష్మినారాయణ, ఆర్ఎంఓ కోటాచలం, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ భిక్షపతి, నర్సింగ్ సూపరింటెండెంట్ అరుణ కుమారి, హెడ్ నర్సులు విజయ నిర్మల, వెంకటరమణ తదితరుల ఆధ్వర్యంలో కేక్కట్ చేశారు. అనంతరం రాజలింగం సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. అనారోగ్యకర జీవనశైలి, నీటి వినియోగం తగ్గడం, మోతాదు లేని మందుల వాడకం కారణంగా కిడ్నీలపై ప్రభావం పడుతోందని తెలిపారు. షుగర్, బీపీ ఉన్నవారు తప్పనిసరిగా రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఆసుపత్రి నర్సులు, టెక్నీషియన్లు, పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం -
అధిక ధరలతో అవస్థలు..
నిత్యవసర ధరలు పెంచడంతో అవస్థ పడుతున్నాం. ఆర్థిక భారం పెరిగింది. మా కుటుంబంలో కొడుకులు, కోడళ్లు, మనవళ్లతో కలుపుకుని 12 మందిమి ఉన్నాం. గ్యాస్, నూనె, పప్పుల ధరలు పెరగడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. నెలవారీగా వచ్చే ఆదాయానికి ధరలు రెట్టింపు కావడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది.యుద్ధంతో పేద, మధ్యతరగతిపై ఆర్థిక భారం పడుతోంది. మా కుటుంబంలో ఆరుగురు వ్యక్తులు ఉంటారు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. మా ఇంట్లో నెలకు మూడు కిలోల నూనె అవసరం పడుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పేదల బతుకులు దుర్భరంగా మారుతాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని నిత్యావసర వస్తువుల ధరలపై నియంత్రణ చేపట్టాలి. – మారేపల్లి ప్రసాద్, ప్రైవేట్ ఉద్యోగి, స్టేషన్ఘన్పూర్ -
ధరాఘాతం
యుద్ధప్రభావం..సలసలకాగుతున్న వంటనూనె ధరలు పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు కుదేలవుతున్నాయి. యుద్ధ ప్రభావం భారత్లోని ఇంధన, నిత్యావసర సరుకుల మార్కెట్పై పడుతోంది. దిగుమతి చేసుకునే సరుకుల రవాణా ఖర్చులు యుద్ధం కారణంగా పెరిగాయి. దీంతో పాటు పలు వస్తువులు పశ్చిమాసియా నుంచి రావాల్సి ఉండడం కూడా ధరల పెరు గుదలకు మరో కారణం. యుద్ధం మరింత కాలం కొనసాగితే ధరా భారం తీవ్రం కానుంది.జనగామ: ఇప్పటికే గ్యాస్ ధరలు పెరిగి గృహ బడ్జెట్కు భారంగా మారాయి. సబ్సిడీ గ్యాస్ సిలిండర్పై రూ.60, కమర్షియల్ సిలిండర్పై రూ.114 వరకూ పెరగడం సాధారణ కుటుంబాలకు పెద్ద దెబ్బగా మారింది. వంటనూనెల ధరలు కూడా మండిపోతున్నాయి. సన్ఫ్లవర్, పామాయిల్ తదితర నూనెల దిగుమతులకు అంతరాయం కలగడంతో ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గతంలో లీటర్కు రూ.155 ఉన్న సన్ఫ్లవర్ ఆయిల్ ప్రస్తుతం రూ.170కు చేరింది. 5 లీటర్ల క్యాన్ రూ.780 నుంచి రూ.880కూ, 15 లీటర్ల క్యాన్ రూ.2380 నుంచి రూ.2480 వరకు పెరిగాయి. పామాయిల్ ప్యాకెట్ ధర రూ.111 నుంచి రూ.120కు చేరింది. రైస్బ్రాన్ ఆయిల్లో లీటర్కు రూ.10 చొప్పున పెరుగుదల నమోదైంది. ఇతర నిత్యావసరాలపై కూడా.. ఒకవైపు నూనెల ధరలు పెరుగుతుండగా, మరోవైపు వెల్లుల్లి, పల్లీల ధరలు వినియోగదారులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కిలో పల్లీలు రూ.120 నుంచి రూ.165కు పెరగడం గమనార్హం. వెల్లుల్లి ధర రూ.120 నుంచి రూ.150కు ఎగబాకింది. దీంతో పల్లీల ఆధా రంగా తయారయ్యే అనేక ఉత్పత్తుల ధరలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్లాస్టిక్ ఉత్పత్తుల మార్కెట్లో కూడా ధరల పెరుగుదల వేగం తగ్గడం లేదు. గ్యాస్ ఆధారిత తయారీ కావడంతో మినీ వాటర్ గ్లాసుల ప్యాకెట్ ధర రూ.25 నుంచి రూ.35, జంబో గ్లాసుల ప్యాకెట్ రూ.35 నుంచి రూ.60కు పెరిగింది. హ్యాండిల్ కవర్ల కిలో ధర రూ.120 నుంచి రూ.170, బిగ్ సైజ్ కవర్లు రూ.145 నుంచి రూ.220కు పెరగడం చిన్న వ్యాపారులను, రిటైల్ షాపులను ఇబ్బందుల్లోకి నెడుతోంది. యుద్ధం కొనసాగుతున్నంతకాలం ధరలు ఇంకా ఎక్కడికి చేరతాయో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుండగా, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ తేదీలను పెంచడం కూడా కొరత భయాన్ని మరింత పెంచింది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేకపోవడంతో రాబోయే రోజుల్లో ధరలు స్థిరపడతాయా, సరుకుల కొరత మరింత పెరుగుతుందా అనే అంశాలపై వినియోగదారులు, వ్యాపార వర్గాలు తీవ్ర అనిశ్చితిలో ఉన్నారు.– సిరిపాటి రాందాస్, గోపాల్నగర్, బచ్చన్నపేట వెల్లుల్లి, పల్లి, ఇతర నిత్యావసర సరుకులది అదే తీరు దిగుమతి వస్తువులపై రవాణా భారమే కారణం ప్లాస్టిక్ ఉత్పత్తుల ధరలు కూడా పెంపు పేద, మధ్యతరగతి ప్రజలకు భారంవస్తువు గత ధర ప్రస్తుతం ధర పెరిగిన ధర సబ్సిడీ సిలిండర్ రూ.907.50 రూ.957.50 రూ.60 కమర్షియల్ సిలిండర్ రూ.1,997 రూ.2,111 రూ.114 సన్ఫ్లవర్ ఆయిల్ (1 లీ.) రూ.155 రూ.170 రూ.15 సన్ఫ్లవర్ క్యాన్ (5 లీ.) రూ.780 రూ.880 రూ.100 సన్ఫ్లవర్ క్యాన్ (15 లీ.) రూ.2380 రూ.2,480 రూ.100 రైస్బ్రాన్ ఆయిల్ (1 లీ.) రూ.160 రూ.175 రూ.10 పామాయిల్ ప్యాకెట్ రూ.111 రూ.120 రూ.09 పల్లీలు (1 కిలో) రూ.120 రూ.165 రూ.45 వెల్లుల్లి (1 కిలో) రూ.120 రూ.150 రూ.30 -
ఏ జిల్లా శిశుగృహ ఆ జిల్లాలోనే ఉండాలి
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒకటే శిశుగృహ ఉండడంతో దత్తతలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఏ జిల్లాకు చెందిన శిశుగృహ ఆ జిల్లాలోనే ఉంటే ఇలాంటి సమస్యలు రావని అందరు సమన్వయంతో ముందుకెళ్లవచ్చని హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి బి.రాజమణి అభిప్రాయపడ్డారు. ‘సమన్వయ లోపం.. శిశువులకు పాపం’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనంపై ఆమె స్పందించారు. కోర్టులో పెండింగ్లో ఉన్న అక్రమ దత్తత కేసులు తొందరగా పరిష్కారమైతే ఐదుగురు శిశువుల దత్తత ప్రక్రియ త్వరగా ముగుస్తుందన్నారు. శిశువుల దత్తతలో ఆలస్యమవడానికి గల కారణాలను లోతుగా పరిశీలించి జిల్లా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. హనుమకొండలోని శిశుగృహలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 13 మంది శిశువులు ఉంటే 10 మంది అక్రమ దత్తత, డీఎన్ఏ పెండింగ్, కిడ్నాప్ కేసుల వల్ల దత్తత వెళ్లలేకపోతున్నారని పేర్కొన్నారు. దీంతో నాలుగు గోడల మధ్యే ఉండాల్సిన పరిస్థితి ఉందని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడే దత్తత సమస్యలు త్వరగా పరిష్కారం హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి బి.రాజమణి -
సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
శిక్షణకు హాజరైన ప్రజాప్రతినిధులు, కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝాజనగామ రూరల్: ప్రజాపాలనలో సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని కళ్లెం రోడ్డులో గల శ్రీ భక్తమార్కండేయస్వామి, పద్మశాలి కల్యాణ మండపంలో జిల్లాలో నూతనంగా ఎన్నికై న ప్రజా ప్రతినిధులకు శిక్షణ అందించారు. ఈ సందర్భంగా పది అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆయా శాఖలకు చెందిన అధికారులు ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇచ్చి, అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ప్రజాప్రతినిధులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీటి నిర్వహణ, ఆరోగ్యం, గృహ నిర్మాణం వంటి కార్యక్రమాలను నిరంతం చేపట్టాలన్నారు. ముఖ్యంగా పది అంశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని వ్యవసాయం పద్ధతులు, పరికరాల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల బలో పేతం, పర్యావరణం, నీటి సంరక్షణ, గ్రామీణ క్రీడలు, మహిళ సంక్షేమ పథకాలు, వడ్డీలేని రుణాలు, గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధం అమలు వంటి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని సూచించారు. పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన ఉండాలన్నారు. అనంతరం డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ..ప్రతీ ఒక్కరు క్షేమంగా ఇంటికి చేరాలంటే కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, మానవ తప్పిదాలతో జరిగే ప్రమాదాలను అరికట్టడంలో అందరి భాగస్వామ్యం ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల నివారణపై ప్రతిజ్ఞ చేసి, అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, జనగామ మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, వైస్ చైర్మన్ బూష పర్వతాలు, స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, వైస్ చైర్మన్ నీలరాజమ్మ, ఆర్డీఓలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన ఉండాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజాప్రతినిధులకు ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’పై శిక్షణ -
నేడు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక
జనగామ: జనగామ, బచ్చన్నపేట మండలాల పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను తెలుసుకొని వాటికి తక్షణ పరిష్కారం చూపే లక్ష్యంతో ఎన్పీడీసీఎల్ శాఖ వినియోగదారుల ఫోరం ఆధ్వర్యంలో ఈనెల 13న (శుక్రవారం) ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఫోరం చైర్పర్సన్ ఎన్వీ వెంకటగోపాలచారి గురువారం తెలిపారు. జనగామ మండలం పెంబర్తి ఓల్డ్ సబ్స్టేషన్ కార్యాలయ ఆవరణలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశంలో వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను రాతపూర్వకంగా సమర్పించవచ్చన్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి, ఓల్టేజి హెచ్చుతగ్గులు, లోపాలు ఉన్న మీటర్ల మార్పు, కొత్త సర్వీసుల మంజూరు తదితర సమస్యలను వినియోగదారులు తమ దృష్టికి తీసుకు రావచ్చన్నారు. కృత్రిమ మేధానైపుణ్యాలను పెంపొందించుకోవాలికేయూ క్యాంపస్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ముందంజలో నిలవాలంటే కృత్రిమ మేధా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె.ప్రతాప్రెడ్డి కోరారు. యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు గురువారం రూసా 2 ప్రాజెక్టు కింద రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాళ్లు ప్రొఫెసర్లు ఎన్.రమణ, కెభిక్షాలు, డాక్టర్ ఆసిం ఇక్బాల్, మహేందర్తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా దశమంత్రెడ్డిజనగామ: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకులు ఆరుట్ల దశమంతరెడ్డిని నియమిస్తూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ కార్యకలాపాలను ప్రజలకు చేరవేయడం, పార్టీ అభిప్రాయాలను సమర్థవంతంగా ప్రతిబింబించడం వంటి కీలక బాధ్యతలు రాష్ట్ర అధికార ప్రతినిధులపై ఉంటాయని ఆయన తెలిపారు. మిర్చి యార్డులో దడవాయిల జీరో దందావరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్లోని మిర్చి యార్డులో కొంతమంది దడవాయిలు జీరో దందా యథేచ్ఛగా సాగిస్తున్నట్లు వెలుగుచూసింది. బుధవారం వచ్చిన మిర్చికి పలికిన ధరలను మార్కెట్ అధికారులు ఆన్లైన్లో పరిశీలించగా కొంతమంది రైతుల సరుకులకు సగం ధరలు పలికినట్లు వెల్లడి కావడంతో ఈ దందా వెలుగు చూసింది. ఇందుకు కారణమైన దడవాయిలు తూర్పాటి రమేష్, నిమ్మాని నాంపల్లి, ఆకుతోట సతీష్లకు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేషం నోటీసులు జారీ చేసి గురువారం వీరికి డ్యూటీలు వేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. దందా కొన్నేళ్లుగా సాగుతున్నట్లు మార్కెట్లో చర్చించుకుంటున్నారు. -
వనిత టీ డబ్బాలు తొలగించొద్దు
జనగామ రూరల్: జిల్లా కేంద్రంలో సూర్యాపేట రోడ్డు ఏరియాలోని బతుకమ్మకుంట జంక్షన్ ప్రాంతంలో గత కలెక్టర్ ప్రారంభించిన వనిత టీ స్టాల్ తొలగింపునకు సంబంధించి గురువారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టరేట్ ప్రహరీ వెంట ఉన్న విజయ డెయిరీ ప్రోడక్ట్స్, టీస్టాల్ను తొలగించేందుకు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ రెడ్డితో కలిసిరాగా నిర్వాహకులు ఆందోళనకు దిగారు. వాటిని తొలగించవద్దని బాధితులు అడ్డుకున్నారు. డీఆర్డీఏ ద్వారా రూ.3 లక్షల రుణం తీసుకొని ఏర్పాటు చేశామని దీనిని గత కలెక్టర్ ప్రారంభించగా ఇప్పుడు ఎలా తొలగిస్తున్నారని ఆవేదన చెందారు. తాము తీసుకున్న రుణం తిరిగి చెల్లించి డబ్బాను తొలగించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గంటసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా, సీపీఎం నాయకులు మద్దతు పలకగా కమిషనర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ఆన్లైన్లో ఆర్టీఏ సేవలు
ఖిలా వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆర్టీఏ సేవలన్నీ వందశాతం ఆన్లైన్లోకి తెచ్చింది. శుక్రవారం నుంచి పేపర్ రహిత సేవలను పక్కాగా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రవాణాశాఖ అధికారులు కార్యాలయాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. జనవరి 24 నుంచి వాహనాలు విక్రయించిన షోరూంలలోనే నాన్ ట్రాన్స్పోర్ట్ వాహన రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ విధానాన్ని రవాణాశాఖ డిప్యూటీ ట్రాన్స్ఫోర్ట్ కమిషనర్ సురేశ్రెడ్డి పర్యవేక్షణలో ఆరు జిల్లాల షోరూం డీలర్ల వద్ద తాత్కాలిక, పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. దరఖాస్తుల సమర్పణ ఆన్లైన్లోనే.. వాహనాల శాశ్వత నమోదు కోసం షోరూం డీలర్ల వద్ద దరఖాస్తుల సమర్పణకు బదులుగా వందశాతం పేపర్ రహిత ఆన్లైన్ విధానం అమలు చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. డీలర్లు.. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఫామ్ –20 (ఫైనాన్షియర్ సంతకం అవసరమైతే), ఇతర పేపర్ ఆధారిత ప్రతాలను స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా సంబంధిత ఆర్టీఏ కార్యాలయాలకు పంపిస్తున్నారు. ఈ విధానం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆలస్యం జరుగుతున్నట్లు రవాణాశాఖ గుర్తించింది. అన్ని పత్రాలు స్కాన్ చేసి ఆన్లైన్ పంపిస్తే అధికారులు పరిశీలించి ఆదే రోజు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయింపుతోపాటు కార్డు జారీకి ఆదేశాలు వెళ్లనున్నాయి. నేటినుంచి పేపర్రహిత సేవలు .. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో, షోరూం డీలర్లకు ఫామ్ 20, ఇతర పేపర్ పత్రాలను నేరుగా సమర్పించే విధానాన్ని పూర్తిగా రద్దు చేసి శుక్రవారం ఉదయం నుంచి వాహన షోరూంలో జరిగే తాత్కాలిక రిజిస్ట్రేషన్(టీఆర్) వాహనాలకు, డీలర్లు ఫామ్ –20, ఇతర పత్రాలు స్కాన్ కాపీలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాహనం తీసుకోగానే పత్రాలన్నీ ఆన్లైన్లో నమోదు చేసే బాధ్యత డీలర్లదే. తప్పుడు లేదా నకిలీ పత్రాలు సమర్పిస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయని డీటీసీ సురేశ్రెడ్డి స్పష్టం చేశారు. నేటినుంచి వందశాతం పేపర్ రహిత సేవలు ఫామ్20, ఇతర పత్రాలు నేరుగా సమర్పించే విధానం రద్దు పత్రాలన్నీ స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిందే.. ఆర్టీఏ కార్యాలయాల్లో పక్కాగా అమలుకు నిర్ణయంవాహన షోరూం డీలర్ నుంచి ఆర్టీఏ కార్యాలయానికి ఆన్లైన్లో పంపించిన దరఖాస్తులను రెండు పనిదినాల్లో అధికారులు పరిశీలించి ఆమోదం లేదా రివ్యూ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆలస్యం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం. డీలర్ల వద్ద 7రోజులకు మించి దరఖాస్తులు పెండింగ్లో ఉంచకూడదు. ఉల్లంఘన జరిగితే వారి లాగిన్ నిలిపివేస్తారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. డీలర్లు అందరూ ఆన్లైన్ సేవలను వినియోగించుకుని, వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఫామ్ 20, ఇతర పత్రాలను ఆన్లైన్ విధానంలోనే సమర్పించాలి. – సురేశ్రెడ్డి, డీటీసీ -
విద్య, వైద్య రంగాల పురోగతితోనే సమాజ అభివృద్ధి
దేవరుప్పుల: విద్య, వైద్య రంగాల పురోగతితోనే సమాజ అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. బుధవారం మండలంలోని సింగరాజుపల్లిలో ఆకస్మికంగా పర్యటించి పలు సూచనలు చేశారు. తొలుత ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల నిర్వహణ, 6, 8, 9, 10వ తరగతి గదుల్లో జరుగుతున్న బోధన విధానాన్ని గమనించి, విద్యార్థులతో మాట్లాడారు. టెన్త్ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాలను పరీక్షించారు. గణితం, జీవ శాస్త్ర పాఠాలను బోధించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం, తాగునీరు, పరిశుభ్రత వంటి సదుపాయాలను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేసి ప్రజలకు అందుతున్న వైద్యసేవలు, సిబ్బంది హాజరు, ఔషధాల నిల్వ, టీకా కార్యక్రమాల అమలు వంటి అంశాలను సమీక్షించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు, చిన్నపిల్లలకు అవసరమైన టీకాలు సమయానికి ఇవ్వాలని సిబ్బందికి ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారుల హాజరు, పౌష్టికాహార పంపిణీ, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవల గురించి కలెక్టర్ ఆరా తీశారు. అనంతరం ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తాగునీటి ట్యాంకు పరిసర ప్రాంతంలో పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని వీధులు, డ్రెయినేజీలు, చెత్త నిర్వహణ తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీపీఓ వసంత, హౌసింగ్ పీడీ మాతృ నాయక్, ఎంపీఓ వెంకటేశ్వర్లు, సర్పంచ్ కొండ ఊర్మిళమల్లారెడ్డి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా సింగరాజుపల్లిలో ఆకస్మిక పర్యటన -
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
జనగామ రూరల్: పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదనపు కలెక్టర్ బెన్షాలోపమ్ అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, స్టాక్ రిజిస్టర్లు రైస్, ఆయిల్, పప్పు తదితర సరుకులు, స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నాణ్యమైన సరుకులనే భోజన తయారీకి వినియోగించాలని ప్రిన్సిపాల్, వార్డెన్లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీల అభివృద్ధికి చర్యలు
నర్మెట/బచ్చన్నపేట: గ్రామ పంచాయతీల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ సీనియర్ కన్సల్టెంట్ సంత్దీప్ సింగ్ అన్నారు. ఉత్తమ పంచాయతీల ఎంపికలో భాగంగా బచ్చన్నపేట మండలంతోపా టు, నర్మెట మండలంలోని కన్నెబోయినగూడెం జీపీ కార్యాలయం, మండల పరిషత్ కా ర్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో 20 23–24 రికార్డులు, అభివృద్ధి పనులను పరిశీ లించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎస్పీఎం ఇ–పంచాయతీ సీపీఆర్ రాజయ్య, జెడ్పీ సూపరింటెండెంట్ ఉ మామహేశ్వరి, ఇన్చార్జ్ ఎంపీడీఓ వెంకట మ ల్లికార్జున్, సర్పంచ్ రమేష్, ఉప సర్పంచ్ మ ధు, కార్యదర్శి విద్యాసాగర్, ఆర్ఐ సింగారపు సాయిబాబా, తదితరులు ఉన్నారు. ఎలుగుబంటి సంచారం! రఘునాథపల్లి: మండలంలోని కంచనపల్లి శివారులో కొన్ని రోజులుగా ఎలుగుబంటి సంచారంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. మొక్కజొన్న, వేరుశనగ పంటలను వన్యప్రాణుల నుంచి రక్షించుకోవడానికి రాత్రి సమయంలో పంట పొలాల వద్దకు వెళ్తున్నారు. బుధవారం తెల్లవారు జామున మొక్కజొన్న చేనులో ఎలుగుబంటిని గుర్తించిన రైతులు బెంబేలెత్తిపోయారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంటిని పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేయాలని రైతులు కోరుతున్నారు. వినియోగదారుల ఆందోళన జనగామ రూరల్: పెట్రోల్కు బదులు బంక్లో నీళ్లు వచ్చాయని ఆరోపిస్తూ వినియోగదారులు ఆందోళనకు దిగిన ఘటన బుధవారం రాత్రి పట్టణంలోని ఆర్టీసీ పెట్రోల్ బంక్ వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. జిల్లాకేంద్రంలోని కాంప్లెక్స్లో నడుస్తున్న పెట్రోల్ బంక్లో వినియోగదారుడు లక్కాకుల ప్రసాద్ తన ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోయించుకుని సుమారుగా 200 మీటర్లు వెళ్లే సరికి బైక్ ఆగిపోయింది. దీంతో మెకానిక్ వద్దకు వెళ్తే అసలు విషయం బయటపడింది. పెట్రోల్ తీసి చూసేసరికి వాటర్ లాంటి పదార్థం బయటకు రావడంతో అవాక్కయ్యారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు సమాచారం అందించగా వారు వచ్చి నిర్ధారణ కోసం పరీక్షలకు పంపినట్లు తెలిపారు. గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర సందర్భంగా పలు రకాల సేవల ద్వారా రూ.21,44,433 ఆదాయం లభించిందని ఆలయ ఈఓ ప్రసాద్, ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్రెడ్డి, వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. బుధవారం హుండీల లెక్కింపు చేపట్టగా గతనెల 27 నుంచి ఈనెల 11 వరకు వివిధ సేవల ద్వారా ఆదాయం సమకూరిందన్నారు. -
గురువారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2026
జనగామ రూరల్: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ రుణాలు అందిస్తుంది. మహిళలు స్వయం ఉపాధితో ఎదిగేలా అండగా నిలుస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 8,609 స్వయం సహాయక సంఘాలకు రూ.46,034 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటికే రూ.42,163 కోట్ల రుణాలు మహిళా గ్రూపులకు అందించారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరం మరో 19 రోజులు మిగిలి ఉండగా రూ.30 కోట్ల వరకు రుణాలు ఆయా సంఘాలకు అందించాల్సి ఉంది. సగటున రోజూ కోటిన్నర చొప్పున రుణాలు అందజేస్తే లక్ష్యం చేరుకుంటారు. 91.59 శాతం పూర్తి చేయగా వందశాతం లక్ష్యం సాధించే విధంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. మొదటి స్థానంలో నర్మెట జిల్లాలోని 12 మండలాల్లో రెండు మండలాలు వందశాతం లక్ష్యం పూర్తి కాగా లక్ష్యానికి మించి రుణాలు ఇవ్వగా, మిగతా 8 మండలాల్లో లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అత్యల్పంగా దేవరుప్పుల మండలం 44.38 శాతం, జఫర్గఢ్ 44.91 శాతం, కొడకండ్ల 56.03 శాతంతో రుణ మంజూరులో వెనుకబడి ఉన్నాయి. మొదటి స్థానంలో నర్మెట మండలం 112.61 శాతం, బచ్చన్నపేట మండలం 103శాతం రుణాలు మంజూరు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం మరో 19 రోజుల్లో గడువు ముగియనుంది. లక్ష్యాన్ని సాధించే దిశగా ఆయా మండలాల సెర్ప్ సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. బ్యాంకులను సంప్రదిస్తూ మిగతా సంఘాలకు రుణాలు మంజూరు చేసేలా ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా వందశాతం లక్ష్యాన్ని సాధించాలని వెనుకబడిన మండలాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి లక్ష్యం చేరుకోనేలా కృషి చేస్తున్నారు.మొత్తం ఎస్హెచ్జీలు, లక్ష్యం, అందించిన రుణాలురూ. 46,034.43 కోట్లురూ. 42,163.06 కోట్లు8,069ఎస్హెచ్జీలుఅందించిన రుణాలులక్ష్యం -
మళ్లీ జనగణన
సాక్షి ప్రతినిధి, వరంగల్: దేశవ్యాప్తంగా త్వరలో జనగణన చేపట్టనున్నారు. ఈనేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనాభా వివరాలపై మళ్లీ చర్చ మొదలైంది. చివరిసారిగా 2011లో జరిగిన జనగణనలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం జనాభా 35,12,576గా నమోదైంది. వాస్తవానికి మళ్లీ 2021లో జనగణన చేపట్టాల్సింది. కరోనాతో అది జరగలేదు. అప్పటి నుంచి 15 ఏళ్లలో జనాభా గణనీయంగా పెరిగినట్లు అంచనాలు చెబుతున్నాయి. అధికారిక గణాంకాలు వెలువడితే ఉమ్మడి జిల్లాలో జనాభా 38 లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత మొదటిసారి.. ఉమ్మడి వరంగల్ను హనుమకొండ, వరంగల్ , జనగామ, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలుగా విభజించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జరగనున్న ఇది మొదటి పూర్తిస్థాయి జనగణన కావడం విశేషం. కాగా, కొత్త జిల్లాల వారీగా మొదటి పూర్తి డేటా జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మొదటిసారిగా జరగనున్న ఈ జనగణనలో ప్రతి జిల్లాకు విడిగా పూర్తి గణాంకాలు వెలువడనున్నాయి. దీంతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడానికి ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం అందనుంది. దశాబ్దంలో పెరిగిన పట్టణీకరణ.. 2011 గణాంకాల ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత దశాబ్దంలో పట్టణీకరణ వేగంగా పెరిగింది. ముఖ్యంగా వరంగల్–హనుమకొండలో జనాభా పె రుగుదల ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధి కారులు భావిస్తున్నారు. పట్టణాలకు వలసలు, వి ద్య అవకాశాలు, పరిశ్రమలు, ప్రభుత్వ ఉద్యోగాలు పెరగడమే ఇందుకుకారణమని చెబుతున్నారు. డిజిటల్గా జనగణన.. జనగణన ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో చేపట్టే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా కాగితపు దరఖాస్తుల స్థానంలో సర్వేయర్లు మొబైల్ యాప్ల ద్వారా సమాచారాన్ని నమోదు చేయనున్నారు. దీంతో డేటా సేకరణ వేగంగా పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. జనగణనలో ప్రతి ఇంటి కుటుంబ వివరాలు, విద్యస్థాయి, ఉద్యోగం, గృహ పరిస్థితులు తదితర అంశాలను నమోదు చేస్తారు. కొత్తగా ఆన్లైన్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసే అవకాశం కూడా కల్పించే యోచన ఉంది. కాగా, సర్వేలో ఇల్లు, కుటుంబ సభ్యుల సంఖ్య, వయస్సు, లింగం, విద్యస్థాయి, ఉద్యోగం/వృత్తి, ఇల్లు సొంతమా అద్దెనా, తాగునీరు, మరుగుదొడ్డి వంటి సదుపాయాలు.. తదితర 33 ప్రశ్నలతో వివరాలు సేకరించనున్నారు. రెండు విడతల్లో జనగణన సర్వే జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు.. ఎన్యుమరేటర్లకు శిక్షణ ఉమ్మడి వరంగల్లో పకడ్బందీగా జనగణన చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ దశ 11 మే 2026న ప్రారంభమై 9 జూన్ 2026 వరకు కొనసాగుతుంది. రెండో దశలో జనాభా గణన (పాపులేషన్ ఎన్యుమరేషన్) ప్రక్రియ ఫిబ్రవరి 2027లో నిర్వహిస్తారు. 1 మార్చి 1 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారు. కాగా, రెండు విడతల్లో చేపట్టే జనగణనలో ఉమ్మడి జిల్లా నుంచి వేలాది మంది సర్వేయ ర్లు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో వారందరికీ మంగళవారం నుంచి మూడు రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా రెవెన్యూ అధికారి, డీ ఎఫ్ఓ, ఆర్డీఓలు, వరంగల్ మహానగర పాలకసంస్థ, మున్సిపల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొంటున్నారు.అక్షరాస్యత 65.11% గ్రామీణ జనాభా 71.7% పట్టణ జనాభా 28.3%కరోనాతో వాయిదా.. 15 ఏళ్ల తర్వాత త్వరలో శ్రీకారం కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మొదటిసారి వివరాల నమోదు ఉమ్మడి వరంగల్ జిల్లా జనాభా 38 లక్షలు దాటే అవకాశం పట్టణీకరతో వరంగల్, హనుమకొండలో జనాభా భారీగా పెరుగుదల -
స్పీకర్ నిర్ణయం అసెంబ్లీ చరిత్రలోనే బ్లాక్డే
స్టేషన్ఘన్పూర్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం అసెంబ్లీ చరిత్రలోనే బ్లాక్డేగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. బుధవారం ఘన్పూర్లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం ఏకపక్షంగా ఉందని మండిపడ్డారు. అసెంబ్లీ చరిత్రలో స్పీకర్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, అప్పుడే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికై నా రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, లేదంటే రానున్న రోజుల్లో నియోజకవర్గ ప్రజలు ఊరుకోరన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య -
చేనేత ఉత్పత్తుల కొనుగోలుకు టెండర్ వద్దు
కాశిబుగ్గ: చేనేత ఉత్పత్తుల కొనుగోళ్లకు కొత్తగా టెండర్ విధానం అమలు చేయవద్దని వరంగల్ కొత్తవాడకు చెందిన చేనేత సహకార సంఘాల ప్రతినిధులు కోరారు. ఈ మేరకు బుధవారం వారు హుస్నాబాద్లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చేనేత సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఉత్పత్తి అవుతున్న కార్పెట్స్ బెడ్షీట్స్, బెడ్డింగ్ మెటీరియల్ను టెండర్ విధానం ద్వారా ప్రైవేట్ వ్యక్తులు, కాంట్రాక్టర్లకు ఇస్తే 60వేల చేనేత కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ చేనేత కార్మికులకు అన్యాయం జరగకుండా చూసుకుంటానని, ఎవరూ ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు, చేనేత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాజుల భగవాన్, చేనేత సహకార సంఘాల సమాఖ్య అధ్యక్షుడు పంతగాని శ్రీనివాస్, అడిగొప్పుల సంపత్, దూబల రాజేందర్, ఆడెపు రవి, ఝెలుగం సాంబయ్య, పరికిపండ్ల రమేశ్, కూచన ఓదెలు పాల్గొన్నారు. చేనేత పరిశ్రమను పరిరక్షించాలి చేనేత పరిశ్రమ పరిరక్షణకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాములు వెంకట్రాములు, ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మీనర్సయ్య కోరారు. ఈ మేరకు బుధవారం వారు హైదరాబాద్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, శాసనమండలి సభ్యుడు నెల్లికంటి సత్యంకు వినతిపత్రాలు అందజేసి మాట్లాడారు. 13 సంవత్సరాలుగా ఎన్నికలు లేకపోవడంతో చేనేత సహకార సంఘాలు నిర్వీర్యం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాంబశివరావు, ఎమ్మెల్సీ సత్యం మాట్లాడుతూ చేనేత సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
అభ్యసన సామర్థ్యాలపై శిక్షణ
జనగామ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 3, 4, 5వ తరగతి విద్యార్థులకు ఏఐ ద్వారా అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ఏఎంఓ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలోని 12 పాఠశాలల్లో 55 మంది ఉపాధ్యాయులకు ఇందులో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని ధర్మకంచ ప్రభుత్వ పాఠశాలలో మొదటి రోజు 27 మంది ఉపాధ్యాయులకు ఎఫ్ఎల్ఎన్, ఏఐపై డీఆర్పీలు శ్యామ్మోహన్రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సుజిత్ శ్రావణి, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. నేడు (గురువారం) మరో 28 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఈ శిక్షణ కార్యక్రమం ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని, సద్వినియోగం చేసుకోవాలని ఏఎంఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
రైతుల డబ్బులతో రాజకీయాలు చేస్తే సహించం
జనగామ రూరల్: రైతుల డబ్బులతో రాజకీయాలు చేస్తే సహించేది లేదని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందునాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశాన్ని రాపర్తి సోమయ్య అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో రైతులకు భారీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు. రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులను వెంటనే ఖాతాల్లో జమచేయాలన్నారు. జిల్లాలో మొక్కజొన్న పంటను కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈనెల 23, 24 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు మాచర్ల సారయ్య, రామావత్ మీట్యా నాయక్, బెల్లకొండ వెంకటేష్, మంగ బీరయ్య, నక్క యాకయ్య, అంజయ్య, మంద చంద్రమోళి, కుమారస్వామి, బిక్షపతి, రాములు, తదితరులు పాల్గొన్నారు. -
భూ సేకరణకు చర్యలు తీసుకోవాలి
జనగామ రూరల్: జిల్లాలో దేవాదుల, గౌరవెల్లి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ పనులకు అవసరమైన భూ సేకరణకు చర్యలు తీసుకోవాల ని ఆర్అండ్ కమిషనర్ కె.శివకుమార్ నాయుడు తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మినీ కాన్ఫరెన్స్హాల్లో కలెక్టర్ సందీప్కుమార్ ఝాతో కలిసి ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతిపై ఇరిగేషన్, రెవెన్యూ, సర్వేల్యాండ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గౌరవెల్లి ప్రాజెక్టు, రిజర్వాయర్ ఇతర ప్రాజెక్టులకు రిక్విజేషన్ ఇచ్చిన వాటికి సర్వేలు చేసి పెగ్ మార్కింగ్ను వేగంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భూ సేకరణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ బి. సీతారామ్, ఈఈలు, రెవెన్యూ శాఖ అధికారులు, ల్యాండ్ అండ్ సర్వే శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే 2027 జనాభా లెక్కలు ప్రభుత్వ పథకాల అమలుకు కీలకమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లాలో జనగణన సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా, మండలస్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు జరుగుతుందన్నారు. దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారని, మొబైల్ యాప్లు, వెబ్ పోర్టల్లను ఉపయోగించి గణన ప్రక్రియను నిర్వహించనున్నట్లు తెలిపారు. శిక్షణ నిర్వాహకులు, సీపీఓ చినకోట్యా నాయక్, రవి నాయక్, హిమ వర్ష, అధికారులు, ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు. ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు -
సర్వం సిద్ధం
బుధవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2026ఈనెల 14 నుంచి ఏప్రిల్ 15 వరకు పదో తరగతి పరీక్షలుజనగామ: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 14 నుంచి ప్రా రంభమయ్యే పరీక్షలకు 6,645 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో బాలురు 3,186, బాలికలు 3,259 మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం 183 పాఠశాలల్లో 40 ప్రైవేటు, 143 ప్రభుత్వ పాఠశాలలు పరీక్షల్లో ఉన్నాయి. 39 కేంద్రాలు.. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 39 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్ చొప్పున 39 మంది, 4 మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, 383 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పోలీస్ స్టేషన్లకు దూరంగా ఉన్న 8 సెంటర్లను సీ సెంటర్లుగా గుర్తించగా, ప్రశ్నపత్రాల రవాణా, భద్రతను కస్టోడియన్ పర్యవేక్షించనున్నారు. ప్రశ్నపత్రాలకు సంబంధించి రెండు సెట్లను ఇప్పటికే ఆయా పోలీస్ స్టేషన్లలోని స్ట్రాంగ్ రూంల్లో భద్రపరిచారు. ఆబ్జెక్టివ్ మార్గదర్శకాలు ఆబ్జెక్టివ్ ప్రశ్నపత్రాల పంపిణీ విషయంలో ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. ఫిజిక్స్, బయాలజీ పరీక్షకు 15 నిమిషాల ముందు, ఇంగ్లిష్ పరీక్షకు ప్రారంభంలోనే, తెలుగు, హిందీ, సోషల్, గణితం పరీక్షల సమయంలో 30 నిమిషాల ముందు ఆబ్జెక్టివ్ పేపర్ అందజేయనున్నారు. ఈసారి కొత్తగా తీసుకొచ్చిన మరో ప్రధాన నిబంధన ఏమిటంటే, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ మూడు భాషా పేపర్లు పూర్తయిన రోజునే వాటి పేపర్ వాల్యుయేషన్ చేపట్టనున్నారు. విద్యార్థులు పరీక్షలు రాయడానికి అన్ని సెంటర్లలో డ్యూయల్ డెస్క్లు తప్పని సరి చేశారు. ప్రతీ విద్యార్థికి 24 పేజీల బుక్లెట్ అందజేసి అందులోనే అన్ని సమాధానాలు రాయాల్సి ఉంటుంది. సైనన్స్ పరీక్ష కోసం మాత్రమే 12 పేజీల ఓఎంఆర్ షీట్ ఇవ్వనున్నారు. 14 నుంచి పరీక్షలు పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరగనున్నాయి. ఏప్రిల్ 15న ఒకేషనల్ పరీక్ష నిర్వహించనుండగా, మొత్తం పరీక్ష ప్రక్రియ ఏప్రిల్ 16తో పూర్తవుతుంది. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి జిల్లాలోని 10 మోడల్ స్కూల్స్, స్టేషన్ ఘన్పూర్ కేజీవీబీ గురుకులాల్లో చదువుతున్న 713 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో ఐటీ, హోటల్ మేనేజ్మెంట్, టూరిజం, బ్యూటిషియన్ వంటి విభాగాల్లో పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్ష ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షలకు హాజరుకాబోయే విద్యార్థుల కోసం అన్ని సెంటర్లలో తాగునీరు, టాయిలెట్లు, అత్యవసర వైద్యసేవల సమయంలో హెల్త్ క్యాంప్ వంటి అన్ని వసతులు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. సమగ్రమైన ఏర్పాట్లతో ఈ ఏడాది పది పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నేతృత్వంలో జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. అంతా సిద్ధం చేశాం..జిల్లాలో పది పరీక్షలకు సర్వం సిద్ధం చేశాం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకులాలు కలుపుకుని 183 ఉండగా, 39 సెంటర్లను ఏర్పాటు చేశాం. 6,445మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రశ్న పత్రాలు పోలీస్ స్టేషన్ స్ట్రాంగ్ రూంల్లో భద్రపరిచారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్ అనుమతి లేదు. చీఫ్ సూపరింటెండెంట్ చాంబర్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నపత్రాలను ఓపెన్ చేస్తారు. – టి.రవికుమార్, ఏసీజీ, విద్యాశాఖ కొత్తగా క్లాక్రూమ్ సేవలు.. జిల్లాలో 183 ఉన్నత పాఠశాలలు.. 39 సెంటర్లు హాజరుకానున్న 6,445 మంది విద్యార్థులు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ పరీక్షలు పూర్తికాగానే మూల్యాంకనం విద్యార్థుల సామగ్రి భద్రత కోసం క్లాక్ రూమ్ సేవలు పరీక్ష హాల్లోకి సెల్ఫోన్ నిషేధం ఒకేషనల్ పరీక్షలకు 713 మంది విద్యార్థులుపరీక్ష కేంద్రాల్లో ఈసారి కొత్తగా క్లాక్ రూంలను ఏర్పాటు చేయడం ఒక ప్రత్యేకతగా నిలుస్తోంది. విద్యార్థులు వెంట తెచ్చుకునే గైడ్లు, ఎలక్ట్రానిక్ వాచీలు, ఇతర వస్తువులను ఈ గదుల్లో భద్రపరిచే అవకాశం ఉంటుంది. పరీక్ష హాల్లోకి సెల్ఫోన్కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. ఈ నిబంధన చీఫ్ సూపరింటెండెంట్ సహా బయట నుంచి వచ్చేవారితో పాటు కేంద్రంలో పనిచేసే ప్రతీ అధికారికి వర్తిస్తుంది. సెంటర్ ప్రాంగణంలో వాహనాలకు కూడా అనుమతి లేదు. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. ఫిజిక్స్, బయాలజీ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు ఉంటాయి. -
హెచ్పీవీ టీకా తప్పనిసరిగా వేయించాలి
జనగామ: హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్పీవీ) టీకా బాలికలను సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం పట్టణంలోని అర్బన్ పీహెచ్సీలో హెచ్పీవీ టీకాను కలెక్టర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు టీకా కార్యక్రమానికి సహకరించి బాలికలకు తప్పనిసరిగా టీకా వేయించేలా చొరవ చూపించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జున్రావు, డాక్టర్లు శ్యామ్ కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్, చైల్డ్ హెల్త్ ఇమ్యునైజేషన్ అశోక్, ప్రోగ్రాం ఆఫీసర్ కమల్ హాసన్, కనకరాజు, అనురాధ, మెడికల్ ఆఫీసర్ రేవతి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్ష కేంద్రంలో కలెక్టర్ తనిఖీ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణలో భాగంగా పట్టణంలోని ధర్మకంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య, గైర్హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. క్యాన్సర్ నుంచి బాలికలకు రక్ష టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
డ్రగ్స్రహిత సమాజ స్థాపనకు పాటుపడాలి
● డీసీపీ రాజమహేంద్రనాయక్ స్టేషన్ఘన్పూర్: డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన–ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవా రం డివిజన్ కేంద్రంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి శివాజీ చౌక్ వరకు మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీని చేపట్టారు. అనంతరం స్థానిక మాగార్డెన్స్ ఫంక్షన్హాల్లో సీఐ జి.వేణు అధ్యక్షతన నిర్వహించిన సమావేశా నికి డీసీపీ ముఖ్య అతిథిగా హాజర య్యారు. కార్యక్రమంలో నార్కోటిక్ సీఐ దీలీప్కుమార్, ఎఫ్ఆర్ఓ చంద్రకాంత్రెడ్డి, ఫైర్ ఎస్ఐ దేవేందర్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, కమిషనర్ రాధాకృష్ణ, ఎంఈఓ కొమురయ్య, సీడీపీఓ సరస్వతి, డాక్టర్ అజయ్కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. డ్రగ్స్పై కలిసి పోరాడాలి పాలకుర్తి టౌన్: డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరం కలిసి పోరాడాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని బాషారత్ గార్డెన్లో మంగళవారం ఎస్సై దూలం పవన్కుమార్ అధ్యక్షతన ఓ యువత మేలుగో...డ్రగ్స్ మానుకో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రగ్స్ నిర్మూలనపై డీసీపీ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రాజీవ్ చౌరస్తాలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. విస్నూరు, బమ్మెర, గ్రామాల్లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈఓ పోతుగంటి నర్సయ్య, వైద్యాధికారి బండి ఉషా, ఎస్సైలు రంజిత్కుమార్, యాకుబ్ హుస్సేన్ పాల్గొన్నారు. -
ఏప్రిల్లో యూజీడీ పనులు
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ మహానగర సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ‘గ్రేటర్’కు కీలకమైన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) నిర్మాణం కోసం రెండు రోజుల క్రితం రూ.5,257 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో యూజీడీతో పాటు ఇతర పనులను వేగవంతం చేయడంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో వరంగల్ జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర రెవెన్యూ శాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మంత్రి కొండా సురేఖతో కలిసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి.. సమీక్ష సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి దీటుగా వరంగల్ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. వరంగల్ నగర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల అమలులో వేగం పెంచాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాధాన్యం కలిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టిన వివిధ ప్రగతి పనులు వచ్చే జూన్ 2వ తేదీ కల్లా పూర్తి కావాలని, సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు నిర్విరామంగా పనిచేయాలన్నారు. యూజీడీకి టెండర్ పూర్తిచేయాలి.. వరంగల్లో చేపట్టే భూగర్భ డ్రెయినేజీ పనులకు సంబంధించి వెంటనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి వచ్చేనెలలో పనులను ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న రెండు పడక గదుల ఇళ్లకు ఈనెల 31లోగా లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించాలని సూచించారు. రెండు పడక గదుల ఇళ్ల కాలనీల్లో కరెంట్, డ్రెయినేజీ, తాగునీరు, రోడ్లు వంటి కనీస సౌకర్యాలను ఆనాటి ప్రభుత్వం విస్మరించిందని తక్షణమే ఆయా కాలనీల్లో కనీస వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు పంపిస్తే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ‘సూపర్’ ఆస్పత్రిలో సిబ్బందిని నియమించాలి.. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు పూర్తి చేశామని, జూన్ నాటికి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్రెడ్డి అధికారులకు సూచించారు. ఆస్పత్రి నిర్మాణ పనులు, ఆస్పత్రి సామగ్రి ఏర్పాటు, డాక్టర్ల నుంచి మొత్తం సిబ్బంది నియామకానికి సత్వరమే కార్యాచరణ పూర్తి చేయాలని ఆదేశించారు. భద్రకాళి ఆలయ అభివృద్ధి పనులు, భద్రకాళి చెరువు పూడికతీత అంశాలకు సంబంధించి ఆలయ మాడవీధుల్లో కృష్ణశిలతో నిర్మించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రకాళి చెరువు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో విషయంలో భూ సేకరణను వేగవంతం చేయాలన్నారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిన ఇన్నర్ రింగ్రోడ్డు, ఔటర్ రింగ్రోడ్డు, పశ్చిమ నియోజకవర్గంలో మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూసేకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరా జు, ఎమ్మెల్సీ సారయ్య, మేయర్ గుండు సుధారాణి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, చాహత్ బాజ్పాయ్ తదితరులు పాల్గొన్నారు. ఇన్నర్, ఔటర్ రింగురోడ్డు నిర్మాణం వేగవంతం ఈ నెలాఖరులో అర్హులకు ‘డబుల్’ ఇళ్ల పంపిణీ వరంగల్ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు త్వరలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సచివాలయంలో వరంగల్ అభివృద్ధిపై సమీక్ష పాల్గొన్న ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు -
శ్రీనిధి అవకతవకలపై విచారణ జరిపించాలి
పాలకుర్తి టౌన్: నియోజకవర్గంలో శ్రీనిధి సంస్థలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి మంగళవారం ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్కను కలిసి గత ప్రభుత్వంలో శ్రీనిధి వ్యవహారంలో జరిగిన అక్రమాలతో నష్టపోయిన బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పులిరాజుజనగామ: జనగామ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ఎస్డీసీ/ఎల్ఏ)గా పులిరాజు ఉంద్రజవరపునకు పదోన్నతితో పోస్టింగ్ ఇస్తూ మంగళవారం ప్రభుత్వ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే అమల్లోకి వచ్చేలా నియామకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్తగా నియమించబడిన అధికారుల రిలీవ్, జాయినింగ్ తేదీలను ప్రభుత్వంకు తెలియజేయాలని రెవెన్యూ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. తాత్కాలిక ఎస్హెచ్ఓగా ట్రెయినీ ఐపీఎస్ మనీషా నెహ్రాస్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ పోలీస్స్టేషన్కు 12 వారాలకు గాను ఎస్హెచ్ఓగా రాజస్థాన్కు చెందిన ట్రెయినీ ఐపీఎస్ మనీషానెహ్రా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్స్టేషన్లో ట్రెయినీ ఐపీఎస్ మాట్లాడుతూ.. ఐపీఎస్ శిక్షణలో భాగంగా 12 వారాల పాటు ఇక్కడ ఎస్హెచ్ఓగా విధులను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా నేరుగా పోలీస్స్టేషన్కు వచ్చి సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ జి.వేణు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ భద్రతా నియమాలు పాటించాలిజనగామ: విద్యుత్ వినియోగదారులు, రైతులు విద్యుత్ సంబంధిత పనుల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ ప్రమాదాలు చిన్న నిర్లక్ష్యంతోనే పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉండటంతో భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలన్నారు. భారీవర్షాలు, గాలిదుమారాల సమయంలో తీగలు తెగిపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, అలాంటి సందర్భాల్లో వెంటనే సంబంధిత ఏఈ, లైన్మన్, సెక్షన్ అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. గృహాల్లో నాణ్యమైన వైరింగ్ ఉండేలా చూసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో టోల్ఫ్రీ నెంబర్ 1912కు ఫోన్చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. -
డ్రగ్స్తో యువత భవిష్యత్ నాశనం
జనగామ: మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును ఛిద్రం చేసే ప్రమాదకర శక్తిగా మారిపోయిందని హైదరాబాద్ ఈగల్ ఫోర్స్ ఎస్పీ పి.సీతారాం నాయక్ హెచ్చరించారు. మంగళవారం 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. నెహ్రూ పార్కు నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎన్ఎంఆర్ గార్డెన్స్ వరకు కొనసాగింది. విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది భారీగా పాల్గొన్నారు. అనంతరం ఎన్ఎంఆర్ గార్డెన్స్, క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అవగాహన సదస్సుల్లో పాల్గొని ఎస్పీ సీతారాం నాయక్ మాట్లాడుతూ.. గంజాయి వినియోగాన్ని గుర్తించేందుకు కొత్త పద్ధతి అందుబాటులోకి వచ్చిందన్నారు. మూత్రపరీక్ష ద్వారా 30 రోజుల వరకు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్థారించగల సామర్థ్యం దీనిలో ఉందన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. అనంతరం విద్యార్థులచేత ప్రతిజ్ఞ చేయించారు. మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలామణిశ్రీనివాస్, సీజేఐటీ డైరెక్టర్ ఫాదర్ విజయపాల్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సైలు భరత్, చెన్నకేశవులు, నర్సయ్య, డాక్టర్ ప్రవీణ్, కౌన్సిలర్లు చెంచారపు కరుణాకర్రెడ్డి, సేవెల్లి మధు, పానుగంటి సువార్త, లింగాల నర్సిరెడ్డి, అన్వర్ తదితరులు ఉన్నారు. మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి జనగామ రూరల్: మత్తు పదార్థాలకు ప్రతీ ఒక్కరు దూరంగా ఉండాలని ఎస్పీ సీతారాం నాయక్ అన్నారు. మండలంలోని పెంబర్తి ఎంజేపీ పాఠశాలలో ప్రజాపాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణ, సర్పంచ్ చిన్నబోయిన రేఖరాజు, ప్రిన్సిపల్ అనిత, నార్కోటిక్ ఎస్ఐ శ్రీతేజ, ఎస్ఐ చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఈగల్ ఫోర్స్ ఎస్పీ పి.సీతారాం నాయక్ డ్రగ్స్కు నో.. విద్యార్థులచే ప్రతిజ్ఞ -
రోబోటిక్స్ షేర్–అవుట్ షురూ
జనగామ: రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), డిజిటల్ లెర్నింగ్పై జిల్లా స్థాయి స్టూడెంట్స్ షేర్–అవుట్ కార్యక్రమం మంగళవారం కలెక్టరేట్ సమావేశం హాల్లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ సత్యమూర్తి, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి ఉపేందర్ ప్రారంభించారు. విద్యార్థుల ఆవిష్కరణలు ప్రశంసనీయం విద్యార్థులు రూపొందించిన మోడళ్లు, ప్రయోగాలు ప్రశంసనీయమని అసిస్టెంట్ డైరెక్టర్ సత్యమూర్తి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సాంకేతిక ధోరణుల్లో నిలబడాలంటే సృజనాత్మకత, విజ్ఞానపరమైన దృక్పథం అవసరమని విద్యార్థులకు సూచించారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ గట్టు రమేశ్ మాట్లాడుతూ.. మండల స్థాయిలో ఎంపికై న 68 మంది విద్యార్థులు తమ ప్రాజెక్టులు, ప్రోటోటైప్లను జిల్లా స్థాయిలో ప్రదర్శించారన్నారు. ఈ కార్యక్రమం శాసీ్త్రయ దృక్పథంతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంలో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అమెరికన్ ఇండియా, ఫౌండేషన్ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో భాగంగా మార్చి 11న డిజిటల్ లెర్నింగ్ను సమర్థంగా అమలు చేసిన ఉపాధ్యాయులకు సత్కారం నిర్వహించనున్నారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు డిజిటల్ ఈక్వలైజర్ ప్రోగ్రామ్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్టీఈఎం విద్యను ప్రోత్సహిస్తున్నట్లు ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేశ్ తెలిపారు. జనగామ మండలం పెంబర్తి ఉన్నత పాఠశాలలో రూ.13 లక్షల వ్యయంతో ఇన్నోవేషన్ అండ్ లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థులు రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్ సహా ఆధునిక సాంకేతికతపై శిక్షణ పొందుతున్నారన్నారు. స్టూడెంట్స్ షేర్–అవుట్ కార్యక్రమం ద్వారా జిల్లా విద్యార్థులు తమ సృజనాత్మక, ఆలోచనలు, సాంకేతిక ప్రతిభను ప్రదర్శించినట్లు తెలిపారు. భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలు మరిన్ని ఆవిష్కరణలకు దోహదం చేస్తాయని స్పష్టం చేశారు. 68 మంది విద్యార్థుల టెక్ ప్రాజెక్టుల ప్రదర్శన ఏఐ, ఎంఎల్ మోడళ్లకు అధికారుల ప్రశంసలు నేడు ఉపాధ్యాయులకు సత్కారం -
ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకం
జనగామ రూరల్: ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నిౖకైన సర్పంచులు, కౌన్సిలర్లకు పాలనపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగేందుకు 99 రోజుల ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 12వ తేదీన ప్రజాప్రతినిధులకు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఈనెల 12న ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పది థీమ్లను వివరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రగతి ప్రణాళికపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమీక్ష -
శిక్షణ విస్తృ తం..
మంగళవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2026జనగామ: రాష్ట్ర విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో స్కూల్ ఎడ్యుకేషన్, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇ.నవీన్ నికోలస్ ముందడుగు వేశారు. ఉపాధ్యాయుల నైపుణ్యాలు, శిక్షణ అవసరాలను కచ్చితంగా తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నీడ్ బెస్డ్ సర్వే ప్రారంభిస్తూ, 2026 శిక్షణ ప్రణాళికలకు బలమైన పునాది వేశారు. విద్యార్థుల అభ్యాస ప్రమాణాల పెరుగుదలకే కేంద్రీకృతమైన ఈ చర్య,.. విద్యారంగంలో కీలకమైన మార్పులకు నాంది పలుకుతోంది. విద్యార్థుల అభ్యసన ఫలితాల మెరుగుదల.. 2026 విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయుల శిక్షణ అవసరాలను గుర్తించేందుకు ఎస్సీఈఆర్టీ రాష్ట్ర వ్యాప్తంగా నీడ్ బేస్డ్ సర్వే ప్రారంభించింది. ప్రభుత్వ ఎల్బీ, కేజీబీవీ, మోడల్, యూఆర్ఎస్, అన్ని గురుకులాలు, వివిధ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, హెచ్ఎంలు, ఎంపీఈఓలు, డీఈఓల శిక్షణ అవసరాలను కచ్చితంగా అర్థం చేసుకోవడానికి ఈ సర్వే రూపొందించింది. 2025 వేసవి శిక్షణ, అనంతర విద్యా సంవత్సరంలో నిర్వహించిన కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇచ్చిన నేపథ్యంలో, 2026కు శిక్షణలను పూర్తిగా అవసరాల ఆధారంగా ప్రణాళిక చేయడానికి ఈ సర్వే ముఖ్యమైనదిగా పేర్కొంది. తరగతి గదిలో ఉపాధ్యాయులు ఎదుర్కొనే సమస్యలు, వారు అభ్యసించాలనుకునే అంశాలు, ఆధునిక బోధన పద్ధతులపై అవసరమయ్యే శిక్షణలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం ప్రధాన ఉద్దేశంగా ఎస్సీఈఆర్టీ వెల్లడించింది. ఇందుకోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఆన్లైన్ ఫారం ఎస్సీఈఆర్టీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. నేడు చివరి అవకాశం.. ఉపాధ్యాయులు ఈనెల 10వ తేదీ(మంగళవారం)లోపు తమ వివరాలను సమర్పించాలని ఎస్సీఈఆర్టీ సూచించింది. నిర్ణీత గడువులోపు స్పందించే విధంగా జిల్లా విద్యాధికారులు, ప్రాంతీయ సంయుక్త డైరెక్టర్లు ఉపాధ్యాయులకు సమాచారాన్ని పూర్తి స్థాయిలో చేరవేయాలని ఆదేశించింది. ఉపాధ్యాయుల అభిప్రాయాల మేరకు 2026 వేసవి సెలవులతో పాటు 2026–27 నూతన విద్యాసంవత్సరంలో జిల్లాల వారీగా ప్రత్యేక శిక్షణల ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు ఎస్సీఈఆర్టీ జీఓలో స్పష్టం చేసింది. ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాల పెరుగుదల, ప్రధానోపాధ్యాయుల నాయకత్వాభివృద్ధి, విద్యార్థుల సాధన ప్రమాణాల మెరుగుదల లక్ష్యాలతో రూపొందించబడిన ఈ సర్వే రాష్ట్ర విద్యావ్యవస్థ పురోగతికి పునాదిరాయిగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు. విద్యార్థుల అభ్యాస ప్రమాణాల పెంపునకు ముందడుగు టీచర్ల బోధనా నైపుణ్యాల పెంపుపై విద్యాశాఖ దృష్టి ఉపాధ్యాయుల అభిప్రాయ సేకరణకు సర్వే డాటా ఆధారంగానే వేసవి శిక్షణ ప్రణాళిక ప్రభుత్వ విద్యా వ్యవస్థ పురోగతికి సర్వే కీలకంమెజార్టీ టీచర్ల అభిప్రాయాల మేరకే ఉపాధ్యాయుల నైపుణ్య అభివృద్ధి దిశగా ప్రభుత్వం ఈసారి మరింత విస్తృతంగా శిక్షణ కార్యక్రమాలను ప్రణాళికబద్ధం చేస్తోంది. గతంలో సబ్జెక్టుల వారీగా స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు ప్రత్యేక శిక్షణలు ఇచ్చినా, ఇప్పుడు ఉపాధ్యాయుల అవసరాల ప్రకారం కమ్యూనికేషన్ స్కిల్స్, ఐసీటీ, స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ నాలెడ్జ్, ల్యాబ్ నిర్వహణ వంటి విభాగాల్లో శిక్షణల అవసరమేమిటో తెలుసుకునేందుకు ప్రభుత్వం అభిప్రాయాలను సేకరిస్తోంది. మెజార్టీ ఉపాధ్యాయుల సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ ఈసారి స్కూల్ అసిస్టెంట్లతో పాటు మోడల్, కేజీబీవీ, అన్ని గురుకులాల ఉపాధ్యాయులను కూడా శిక్షణ పరిధిలోకి తీసుకున్నారు. ఇందుకోసం అందించిన ఆన్లైన్ లింక్ ద్వారా ఉపాధ్యాయులు తమ శిక్షణ అవసరాలను నమోదు చేయాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 3 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. -
వరే.. సరి..!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఈ యాసంగిలోనూ రైతులు వరి సాగువైపే మొగ్గు చూపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఈ సీజన్లో వరిసాగు గతంతో పోలిస్తే కొంత మేర పెరిగినట్లు వ్యవసాయ శాఖ అంచనాలు సూచిస్తున్నాయి. సాగునీటి లభ్యత, మార్కెట్ డిమాండ్ కారణంగా రైతులు మళ్లీ వరి వైపు మొగ్గు చూపినట్లు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మొత్తం సుమారు 6.35 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు ప్రాథమిక అంచనా. గత యాసంగిలో ఇది 5.98 లక్షల ఎకరాల వరకు నమోదైంది. దీంతో ఈసారి దాదాపు 37 వేల ఎకరాలకు పైగా పెరుగుదల కనిపించింది. యాసంగి సాగు ఇలా... గతంతో పోలిస్తే ఈ యాసంగిలో వరిసాగు పదిశాతం మేర తగ్గుతుందని వ్యవసాయశాఖ అధికారులు మొదట అంచనా వేశారు. ఈ మేరకు ఈ సీజన్లో మొత్తం సాగు విస్తీర్ణం 9,12,880 ఎకరాలని అంచనా వేసిన అధికారులు 5.75 లక్షల ఎకరాల్లో వరి పంటలకు అవకాశం ఉందన్నారు. అందుకు భిన్నంగా మొత్తం పంటలు 9,82,880 ఎకరాల్లో వేయగా, 6,34,579 (64.56 శాతం) ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. మొక్కజొన్న, ఇతర పంటలన్నీ కలిపితే 35.44 శాతంగా నమోదయ్యాయి. ఈ లెక్కన గతంతో పోలిస్తే 37 వేల పైచిలుకు ఎకరాల్లో ఈసారి వరి సాగుకాగా, ఈసారి కూడ ఉమ్మడి వరంగల్ది రికార్డేనని వ్యవసాయశాఖ జిల్లా అధికారి ఒకరు పేర్కొన్నారు. వరి సాగు పెరగడానికి కారణాలు... జిల్లాల వారీగా చూస్తే హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో వరి సాగు గణనీయంగా పెరిగింది. అలాగే మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కూడా కొంత మేర విస్తీర్ణం పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. సాగునీటి లభ్యత, సాగు సౌకర్యాలు మెరుగుపడటం, ప్రభుత్వం వరి కొనుగోలుపై హామీ ఇవ్వడం, సన్నరకం మీద బోనస్ ఇవ్వడం వంటి కారణాలతో రైతులు ఇతర పంటల కంటే వరి సాగును ఎక్కువగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని మండలాల్లో నీటి కొరత, వాతావరణ మార్పులు వంటి కారణాలతో వరి సాగు విస్తీర్ణం కొంత తగ్గిన ప్రాంతాలు కూడా ఉన్నాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. తొమ్మిదెకరాల్లో వరి వేసిన.. నాకున్న ఆరు ఎకరాలకు తోడు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. ఇందులో మూడెకరాలు సన్నాలు, మరో మూడెకరాలు దొడ్డు రకం, ఇంకో మూడెకరాలు సీడ్ వరి వేసిన. వరి పంటకు మంచి డిమాండ్ ఉండటంతో పాటు మద్దతు ధర కూడా వస్తుండటంతో మొత్తానికి మొత్తం వరి వేసిన. – ఎండపెల్లి తిరుపతిరెడ్డి, రైతు, కమలాపూర్ వరి సాగుతో పనిభారం తక్కువ.. మిగతా పంటలతో చూస్తే వరితో పనిభారం తక్కువుంటుంది. మార్కెట్లో డిమాండ్ కూడా ఉంది. కనీస మద్దతు ధరతోపాటు సన్నరకాలపై రూ.500ల బోనస్ కూడా వస్తుంది. ఇతర పంటల కంటే వరి సాగులోనే లాభాలు ఉన్నాయి. – హింగే మనోహర్, రైతు, పీచర, వేలేరు మండలంలాభసాటిగా అనిపించింది నాకున్న 6 ఎకరాల్లో యాసంగి సీజన్లో వరి సాగుచేశా. మా ఏరియాలో వర్షాకాలంలో ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా వర్షాలు కురిశాయి. నీటి సామర్థ్యం వరి సాగుకు అనుకూలంగా ఉంది. మిగతా పంటలకంటే వరే కొంచెం లాభసాటిగా అనిపించింది. – కీర్తి సంపత్, రైతు, షోడాషపల్లి, వేలేరు మండలం యాసంగిలో మళ్లీ వరిసాగు వైపు ఉమ్మడి జిల్లా రైతుల మొగ్గు మొత్తం విస్తీర్ణంలో 64.56 శాతం వరి నమోదు గతంతో పోలిస్తే పెరిగిన వైనం.. మిగతా పంటలతో పోలిస్తే మేలంటున్న రైతులు జిల్లా మొత్తం పంటలు వరి వరంగల్ 1,96,722 95,152 హనుమకొండ 1,77,735 1,11,380 జనగామ 2,07,353 1,79,010 మహబూబాబాద్ 2,13,665 1,07,617 జేఎస్ భూపాలపల్లి 1,17,085 89,000 ములుగు 70,320 52,420 మొత్తం 9,82,880 6,34,579 -
నాణ్యమైన భోజనం అందించాలి
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాలకుర్తి టౌన్: మండలంలోని చెన్నూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి, చెన్నూరు, మైలారం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 14 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్పర్సన్ లావుడ్యా మంజుల, తహసీల్దార్ సరస్వతి, ఎండీపీఓ వేదవతి, సర్పంచ్లు కారుపోతులు శ్రీనివాస్గౌడ్, కమ్మగాని విజయ, గుగులోతు విమల, ఏపీఎం వెంకటేశ్వర్లు, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, ఎర్రబెల్లి రాఘవరావు,గడ్డం యాకసోమయ్య, మాదాసు హరీష్, కిషన్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సీడ్బాల్ తయారీపై వర్క్షాపు
జనగామ రూరల్: ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎకో క్లబ్ ఆధ్వర్యంలో సీడ్ బాల్ తయారీపై సోమవారం వర్క్షాప్ నిర్వహించారు. వర్క్షాప్లో ప్రధానంగా సీడ్ బాల్స్ తయారీ పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో వాటి ప్రాముఖ్యంపై అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపల్ కె.శ్రీనివాస్, డి.లక్ష్మి అనురాధ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జోరుగా బెట్టింగులు జనగామ: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ క్రికెట్ అభిమానులను అలరించగా.. బెట్టింగులు జోరుగా నడిచాయి. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం రాత్రి న్యూజిలాండ్–ఇండియా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్పై భారీ స్థాయిలో బెట్టింగ్లు సాగినట్లు సమాచారం. ఈ బెట్టింగ్ వ్యవహారం ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా నడిచినట్లు సమాచారం. అక్కడి నుంచి పలువురు ఏజెంట్లు వివిధ ప్రాంతాల్లో బ్రోకర్లను నియమించుకొని మొత్తం వ్యవహారాన్ని ఫోన్ల ద్వారా నిర్వహించినట్లు తెలిసింది. రూ.1000 నుంచి మొదలుకుని రూ.లక్షకు పైగా బెట్టింగ్లకు పాల్పడ్డారని సమాచారం. బెట్టింగ్లను ఫోన్ల ద్వారా నడిపించగా, నగదు విషయంలో అత్యంత గోప్యంగా వ్యవహరించినట్లు ప్రచారంలో ఉంది. ఇందులో కొంతమంది బెట్టింగ్లకు పాల్పడి పెద్ద ఎత్తున డబ్బు పోగొట్టుకున్నట్లు పట్టణంలో చర్చ జరుగుతోంది. ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు విక్రయించాలి ఎంజీఎం: రిటైల్ మందుల వ్యాపారులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నవారికి మాత్రమే మందులు విక్రయించాలని డ్రగ్ కంట్రోల్ శాఖ వరంగల్ ఏడీ డాక్టర్ జి.రాజ్యలక్ష్మి సూచించారు. సరైన డ్రగ్ లైసెన్స్ ఉన్న రిటైల్ సంస్థలకు హోల్సేల్ వ్యాపారులు విక్రయించాలని పేర్కొన్నారు. డ్రగ్ లైసెన్స్ లేకుండా ఎవరూ మందులను విక్రయించరాదని వివరించారు. ఏదైనా మెడికల్ షాపు ఆర్ఎంపీలకు మందులు విక్రయిస్తే డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గ్యాస్ ధర తగ్గించాలని కేంద్రం దిష్టిబొమ్మ దహనం జనగామ రూరల్: పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జనగామ చౌరస్తాలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. సుంచు విజేందర్, ఎండీ అజారుద్దీన్, బాల్నె వెంకట మల్లయ్య, బూడిది ప్రశాంత్, శాఖా కార్యదర్శులు సురేశ్, అబ్రహం లింకన్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ మార్కెట్కు భారీగా మిర్చి రాక వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్కు ఈసీజన్లో మొదటిసారిగా 50 వేల వరకు మిర్చి బస్తాలు విక్రయించేందుకు రైతులు యార్డుకు తీసుకొచ్చారు. శనివారం యార్డు బంద్, ఆదివారం వారాంతపు బంద్ కావడంతో సోమవారం భారీగా మిర్చిని తీసుకొచ్చారు. తేజ, యూఎస్–341 రకానికి చెందిన మిర్చిని రైతులు ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చారు. ఇందులో క్వింటా మిర్చి తేజ రకానికి గరిష్టంగా రూ.19,500, యూఎస్–341కు రూ.21,600, వండర్ హాట్కు రూ.35,000, దేశీ రకానికి రూ.42 వేలు, ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. -
మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి
● స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే శ్రీహరి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాజనగామ: మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆకాంక్షించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశం హాలులో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, స్టేషన్ఘనపూర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, చిల్పూరు బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ శ్రీధర్రావు, గ్రంథాలయ సంస్థ కమిటీ చైర్మన్ మారుజోడు రాంబాబుతో కలిసి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు రాజకీయంగా, సామాజికంగా ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తోందన్నారు. అనంతరం జిల్లా అధికారులను శాలువాతో సత్కరించి, ప్రశంసపత్రాలను అందజేశారు. అదే విధంగా వివిధ శాఖల ఉద్యోగినులకు ప్రశంసపత్రాలతో పాటు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ కోదండరాములు, డీసీపీఓ రవికాంత్, మిషన్ శక్తి కో–ఆర్డినేటర్ శారద, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
వెల్లువలా వినతులు
● ప్రజావాణిలో 157 దరఖాస్తుల స్వీకరణ ● సత్వరమే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశంపక్క ఫొటోలోని వృద్ధ దంపతుల పేర్లు చల్లా మధుసూదన్ రెడ్డి, సులోచన. వీరిది బచ్చన్నపేట మండలం బండానాగారం గ్రామం. వీరికి 32 ఎకరాల భూమి ఉంది. అందులో 25 ఎకరాల భూమిని తమ ఇద్దరు కొడుకులకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారు. అయితే తమ పేరు మీద 7 ఎకరాలను అమ్ముకుందామంటే కుమారులు కొర్రీలు పెడుతున్నారని, బెదిరిస్తున్నారని ఆరోపించారు. మొన్నటి వరకు వచ్చిన రైతు భరోసాతో కాలం గడిచిందని, తమకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, మందులకు చాలా ఇబ్బందవుతోందన్నారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్ను కోరగా.. సంబంధిత ఆర్డీఓకు సమస్యను పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఈ ఫొటోలోని దివ్యాంగ మహిళ పేరు పాలబిందెల విజయలక్ష్మి. జనగామ పట్టణం 25వ వార్డు. పుట్టుకతో రెండు కాళ్లు పడిపోయాయి. ఆమె భర్త నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందగా తన కుమార్తె దగ్గర ఉంటోంది. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో 90శాతం సదరం సర్టిఫికెట్తో రూ.1500ల పెన్షన్ తీసుకుంది. తన తల్లి ప్రభుత్వ ఉద్యోగం కావడంతో రిటైర్డ్ కాగా వచ్చే పెన్షన్ తనకు ఆధారంగా ఉంటుందని అనుకుంది. దివ్యాంగ పింఛన్ రావడంతో అది తొలగించాలని కోరగా రద్దు చేశారు. గత ఏడేళ్ల నుంచి కలెక్టరేట్ చుట్టు తిరుగుతున్న తనకు దివ్యాంగుల పెన్షన్ ఇవ్వాలని వేడుకుంటోంది.జనగామ రూరల్: కుమారులు తమను చూసుకోవడం లేదని, గిఫ్ట్ భూమిని తిరిగి ఇవ్వాలని, ఇందిరమ్మ బిల్లు రాక ఇబ్బందులు పడుతున్నామని, సాదాబైనామా కింద కొనుగోలు చేసిన భూమి పట్టా చేయాలని, రుణమాఫీ కావడం లేదని..ఇలా పలు సమస్యలతో సోమవారం గ్రీవెన్స్ సెల్కు ప్రజలు తరలివచ్చారు. ఈసందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి కలెక్టర్ సందీప్కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ 157 దరఖాస్తులు వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను నిశితంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సంబంధి జిల్లా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓలు గోపిరామ్, డీఎస్ వెంకన్న, డీఆర్డీఓ వసంత, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్జికార్జున్ రావు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తులు కొన్ని ఇలా.. జనగామ మండలం గానుగుపహాడ్కు చెందిన బింగి వెంకటమ్మ తన భర్త భిక్షపతి, దివ్యాంగుల పెన్షన్ పొందుతూ మరణించాడని, తను కూడా దివ్యాంగురాలు అయినందున తనకు భర్త పింఛన్ ఇప్పించాలని లేదా కొత్తగా దివ్యాంగుల పింఛను మంజూరు చేయాలని వేడుకుంది. పెంబర్తి గ్రామానికి చెందిన కంతిరి వనిత తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, గ్రామంలో తమకు ఎలాంటి ఆస్తులు లేవని అద్దె భవనంలో ఉంటున్నామని ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు అందించారు. పట్టణంలోని 16వ వార్డు సంజయ్నగర్కు చెందిన ఎమ్డీ నూర్జహాన్ చాలా సంవత్సరాల నుంచి కిరాయి ఇంట్లో ఉంటున్నాను. తాను నిరుపేదను అయినందున డబుల్ బెడ్రూమ్ కోసం విన్నవిస్తూ అర్జీని సమర్పించారు. తరిగొప్పుల మండల కేంద్రంలో 1990లో సాదాబైనామా కింద సర్వేనెంబర్ 248/5లో 23 గుంటలు, 248జీలో 38 గుంటల భూమిని కొనుగోలు చేశానని, నాటి నుంచి ఖాస్తులో ఉన్నానని, గ్రామానికి చెందిన మరొక వ్యక్తి భూమిని పట్టా చేయకుండా అడ్డుకుంటున్నాడని జంగా ముత్తయ్య అనే వ్యక్తి కలెక్టర్కు వినతిపత్రం అందించారు. తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు. ఇందిరమ్మ బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని స్టేషన్ ఘన్పూర్ మండలం పామునూరు గ్రామానికి చెందిన తాళ్లపల్లి శారద వినతి పత్రం అందించారు. ఆధార్ కార్డు నెంబర్లో ఇంటిపేరు, వ్యక్తుల పేర్లు ఒకటిగా ఉండడంతో వేరే వ్యక్తులకు సంబంధించి ఆధార్ను ఆన్లైన్లో నమోదు చేశారని, ఇల్లు బేస్మెంట్ పూర్తి చేసి ఎనిమిది నెలలు అవుతోందని, సొంతంగా మూడు లక్షలుఖర్చు చేశానని, ఆధార్ కార్డు మార్చి న్యాయం చేయాలని కోరారు. ఆన్లైన్లో ప్రజాపాలన దరఖాస్తు వివరాలు నమోదు చేయలేదని జనగామ పట్టణంలోని 12వ వార్డు నారాయణ మమత దరఖాస్తు అందించారు. ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోగా ఆన్లైన్లో కనబడడం లేదని, దీంతో వార్డు అధికారి డబుల్ బెడ్రూమ్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారని తెలిపారు. తాను ఒంటరి మహిళనని, ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఎలాంటి ఆస్తి లేదని అద్దె ఇంట్లో ఉంటున్నామ ని, ప్రజాపాలన వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి తనకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కోరారు. -
సాగునీరు విడుదల చేయండి
● మంత్రి ఉత్తమ్కు ఫోన్లో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విన్నపందేవరుప్పుల: యాసంగి సాగు పంట పరిరక్షణకు సత్వరమే సాగునీటి విడుదల చేయాలని, లేకుంటే రైతుల పక్షాన ఆందోళనలు నిర్వహిస్తామని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. సోమవారం మండలంలోని మాధాపురం శివారు దుబ్బతండా, ధర్మాపురం శివారులో మల్యాతండా, లకావత్ తండాలో ఎండిన వరిసాగు పంటలు, ఫెయిలైన బోర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ఘన్పూర్ రిజర్వాయర్లో నిల్వ ఉన్న సాగునీటిని ఎల్–4 కాల్వల ద్వారా సకాలంలో అందించని పక్షంలో ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ ఎకరానికి రూ.30 వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతుల గోస విన్న ఎర్రబెల్లి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్లో సమస్యను తెలియజేశారు. రెండు రోజుల్లో ఎల్–4 కాల్వ ద్వారా సాగునీరు అందకపోతే చేతికి వచ్చిన పంట సైతం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉందని వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పల్ల సుందర్రామిరెడ్డి, బబ్బూరి శ్రీకాంత్గౌడ్, బస్వ మల్లేశం, సర్పంచ్లు లకావత్ ఆనంద్, చందులాల్, చింత రవి, నాయకులు అర్జున్, గండిపెల్లి యాకయ్య, బావ్సింగ్, మోర్సింగ్, ఉపేందర్,లాలునాయక్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలి
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిజనగామ: మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాణి రుద్రమదేవి, చాకలి ఐలమ్మ, సమ్మక్క–సారలమ్మ, మధు స్వరాజ్యం వంటి మహనీయ మహిళలు ఈ నేలలో పుట్టి పోరాట స్ఫూర్తిని నాటారని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ప్రతీ ఉద్యమంలో మహిళలు కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. అనంతరం మహిళలను సన్మానించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
పోస్టింగ్ కోసం పోటాపోటీ!
వరంగల్ కమిషనరేట్లో సీఐల పైరవీలుబదిలీల ప్రచారం.. పైరవీల కలకలంసాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారుల మధ్య పోస్టింగ్ల కోసం పోటీ జోరందుకున్నట్లు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ నగర పరిధి కీలక పోలీస్స్టేషన్లలో ఎస్హెచ్ఓల కోసం ఇన్స్పెక్టర్లు కొందరు ఎడాపెడా పైరవీలు చేస్తున్నారన్న ప్రచారం పోలీస్వర్గాల్లో సాగుతోంది. ‘గ్రేటర్’ పరిధి కొన్ని పోలీస్స్టేషన్లే ఇప్పుడు ‘హాట్ ఠాణా’లుగా మారాయి. ఆ ఠాణాల్లో ఎస్హెచ్ఓలుగా చేరి సుమారు ఏడాదిన్నర కావొస్తుండగా.. ఇటీవల మారిన పోలీస్స్టేషన్ల కోసం కూడా సిట్టింగ్ ఎస్హెచ్ఓలే పైరవీలు చేసుకుంటుండడం చర్చనీయాంశం అవుతోంది. కొందరు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ ప్రయత్నాలు చేస్తుండగా.. ఇప్పటికే కొందరు లేఖలు పొందినట్లు చెబుతున్నారు. అయితే, లేఖలు పొందిన కొందరికీ పోలీసు ఉన్నతాధికారులు ‘నో’ చెప్పడంతో బదిలీ తప్పదని తెలిసి ఇతర ప్రాంతాలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ఠాణాలపైనే అందరి గురి.. గ్రేటర్ పరిధిలోని 12 పోలీస్స్టేషన్లపై ఆశావహులు కన్నేసినట్లు పోలీసుశాఖలో ప్రచారం ఉంది. వ్యాపారం, రియల్ ఎస్టేట్, ట్రాఫిక్, రాజకీయ యాక్టివిటీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు కావడంతో ‘ప్రాధాన్యత పోస్టింగ్స్’గా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే పోస్టింగ్ల కోసం పోటాపోటీగా పైరవీలు చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. ఈ ఠాణాల్లో పోస్టింగ్ కోసం సీఐలు రాజకీయ నాయకుల ద్వారా, మరికొందరు సీనియర్ అధికారుల ద్వారా లాబీయింగ్ చేస్తున్నట్లు చెబుతుండగా.. ఇంకొందరు ఈ రెండు రకాల ప్రయత్నాలతో ముందంజలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, ప్రధానంగా గ్రేటర్ పరిధిలో హనుమకొండ, కాజీపేట, కేయూసీ, మడికొండ, సుబేదారి, మట్టెవాడ, వరంగల్ మిల్స్కాలనీ, ఇంతేజార్గంజ్, మట్టెవాడ, ధర్మసాగర్, హసన్పర్తి, ఎల్కతుర్తి, కమలాపూర్, పరకాల, ఆత్మకూరు, మామునూరు పోలీస్స్టేషన్లు కీలకమైనవిగా చర్చ ఉంది. బదిలీల చర్చ మొదలైతే చాలు ఈ ఠాణా కుర్చీలపై ‘ఖర్చీఫ్’ వేసుకునేందుకు పోటీపడతారు. అయితే, సుబేదారి, ధర్మసాగర్, హసన్పర్తి, మట్టెవాడ.. మరో రెండు స్టేషన్ల ఎస్హెచ్ఓలు కొత్తగా చేరి ఐదారు మాసాలు అవుతుండగా.. ఏడాది నుంచి ఏడాదిన్నర దాటిన పోలీస్స్టేషన్లకు పోస్టింగుల్లో ఉన్నవారితోపాటు లూప్లైన్లలో ఉన్న సీఐల పోటాపోటీ పైరవీలు ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారుతోంది. కాసులు కురిపించే ఠాణాలపై అందరి గురి ఏడాదిన్నర పూర్తయిన స్టేషన్లపై కన్ను ప్రజాప్రతినిధుల లేఖలతో సీట్లపై ఖర్చీఫ్లు కొందరు సీఐలపై ఉన్నతాధికారుల సీరియస్ త్వరలో పలువురు ఇన్స్పెక్టర్లకు స్థానచలనంకమిషనరేట్ పరిధిలో పలువురు సీఐల బదిలీలు అనివార్యమన్న ప్రచారం నేపథ్యంలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కొందరు పొలిటికల్ ప్రెషర్ తట్టుకోలేక బదిలీల ప్రయత్నాల్లో ఉండగా.. ఆ పోస్టింగ్లో ఖర్చీఫ్ వేసేందుకు కీలక ప్రజాప్రతినిధుల లేఖలు తీసుకుంటున్నారు. అయితే, ఈ లేఖల్లో చాలా వరకు పోలీసు ఉన్నతాధికారుల మద్దతు దక్కడం లేదని తెలుస్తోంది. వరంగల్ సెంట్రల్ జోన్ పరిధిలోని ఓ సీఐపై వచ్చిన ఆరోపణలు, పనితీరుపై ఉన్నతాధికారి ఒకరు ఇటీవలే సీరియస్ అయ్యారని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఆస్థానం కోసం వీఆర్లో ఉన్న ఓ సీఐ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, అదే డివిజన్కు చెందిన ఓ పోలీస్స్టేషన్కు నిఘా విభాగంలోని ఓ సీఐ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అక్కడున్న ఎస్హెచ్ఓ నర్సంపేట్ సబ్డివిజన్కు లెటర్ తీసుకుంటే ఉన్నతాధికారులు అంగీకరించలేదన్న సమాచారం. కాగా, త్వరలోనే సీఐల బదిలీలు ఉంటాయన్న చర్చ కొద్ది రోజులుగా సాగుతుండగా.. కేయూసీ, ఎల్కతుర్తి, మడికొండ, ఇంతేజార్గంజ్, పరకాల, ఆత్మకూరు, వర్ధన్నపేట తదితర ఠాణాలకు ఆశావహులు పెరుగుతుండడం పోలీస్వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. అయితే పోస్టింగ్లు, బదిలీలపై జరుగుతున్న ఈ ప్రచారంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోగా.. పోస్టింగ్ల కోసం జరుగుతున్న ఈ పైరవీలపై ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. -
ఆర్టీసీ డిపోలో మహిళా దినోత్సవం
జనగామ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ ఆర్టీసీ డిపోలో ఆదివారం మేనేజర్ ఎస్.స్వాతి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగుల కోసం ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ రీజినల్ మేనేజర్ డి. విజయభాను హాజరై మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు నేటి సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తూ తమ ప్రతిభను చాటుతున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇద్దరు మహిళా ఉద్యోగులను ప్రత్యేకంగా సత్కరించారు. కార్యక్రమంలో డిపో సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సంఘటిత పోరాటాలతోనే రక్షణజనగామ రూరల్: సంఘటిత పోరాటాలతోనే మహిళలు హక్కులకు రక్షణ కలుగుతుందని, సమానత్వం కోసం ఉద్యమించాలని ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కేఎన్ ఆశాలత అన్నారు. ఆదివారం ప్రజాసంఘాల కార్యాలయంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఈర్రి అహల్య అధ్యక్షత ఐద్వా, సీఐటీయూ, రైతుసంఘం, ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలోఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆశాలత మాట్లాడుతూ.. దేశ జనాభాలో 48 శాతంగా ఉన్న మహిళల విద్య, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి, భద్రతలో మహిళా వివక్ష స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు సుంచు విజేందర్, చందు నాయక్, 3వ వార్డు కౌన్సలర్ బూడిద జ్యోతి, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎండీ షాబాన, పొదల లవకుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ లైన్లకు యూనిక్ పోల్ నంబర్లుజనగామ: జీఐఎస్ అసెట్ మ్యాపింగ్ అండ్ ట్రాకింగ్ ప్రక్రియలో భాగంగా జనగామ సర్కిల్ పరిధిలోని 33 కేవీ లైన్ పరిధిలో ఉన్న 44 ఫీడర్ల పనులను పూర్తి చేసినట్లు జనగామ సర్కిల్ సూపరింటెండింగ్(ఎన్పీడీఎల్) ఇంజనీర్ సంపత్ రెడ్డి తెలిపారు. ఎస్ఈ ఆదివారం మాట్లాడుతూ.. 11 కేవీ లైన్లలోని 363 ఫీడర్లకు యూనిక్ పోల్ నంబర్ పెయింటింగ్ పనులను కూడా చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ అమలు చేయడం ద్వారా ప్రతి పోల్ ఆధారంగా లైన్లకు పెట్రోలింగ్ నిర్వహించడం సులభమవుతుందని ఆయన తెలిపారు. అలాగే నిర్వహణ పనులను సమర్థవంతంగా ట్రాక్ చేసుకునే అవకాశం కూడా కలుగుతుందని చెప్పారు. గతంలో జరిగిన విద్యుత్ అంతరాయాలు, ట్రాన్స్ఫార్మర్ వైఫల్యాలు వంటి వివరాలను కూడా సులభంగా గుర్తించి ట్రాక్ చేయడానికి ఈ వ్యవస్థ సహాయపడుతుందని వివరించారు. -
ఆడపిల్లలకు హెచ్పీవీ రక్ష
పాలకుర్తి టౌన్: మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్) వ్యాధిని ముందస్తుగా అడ్డుకునేందుకు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ (హెచ్పీటీ) కీలకప్రాత పోషిస్తుందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి మల్లికార్జునరావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత శ్రేణి ఆస్పత్రిలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హెచ్పీవీ టీకాను మల్లికార్జున్రావు ప్రాంరభించారు. ఆయన మాట్లాడుతూ.. 14 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాలు పూర్తి కాని బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ను వేయలన్నారు. డీసీహెచ్ఓ నరేందర్, పరమేశ్వరి, శాంతకుమార్, మండల వైద్యాధికారి బండి ఉషా, గాయత్రి, ఎంపీడీఓ వే దవతి, ఎంపీఓ శ్రీనాథ్రెడ్డి, ఎంఈఓ నర్సయ్య, స ర్పంచ్ విజయ, ఉప సర్పంచ్ కిరణ్ పాల్గొన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి మల్లికార్జునరావు -
నెత్తిన ‘బండ’
● పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు ● జిల్లాలో 1.60లక్షల సిలిండర్లు ● పేద కుటుంబాల బడ్జెట్ తలకిందులుజనగామ: పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దేశీయంగా గ్యాస్ సిలిండర్ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో ధరలు పెరుగుతుండడంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల ధరలు కూడా పెరిగాయి. గృహ వినియోగదారులకు అందించే సబ్సిడీ సిలిండర్తో పాటు కమర్షియల్ సిలిండర్లపై కూడా ధరలు పెరగడంతో సామాన్యులు, పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. పెరిగిన ధరలు గృహ వినియోగానికి ఇచ్చే సబ్సిడీ సిలిండర్పై రూ.60 పెంపు ప్రకటించారు. దీంతో మొన్నటి వరకు రూ.907.50 పైసలుగా ఉన్న సబ్సిడీ సిలిండర్ ధర ఇప్పుడు రూ.967.50 పైసలకు చేరింది. అదే విధంగా హోటళ్లు, వ్యాపార సంస్థలు వినియోగించే కమర్షియల్ సిలిండర్ ధర కూడా భారీగా పెరిగింది. ముందుగా రూ.1,997గా ఉన్న కమర్షియల్ సిలిండర్పై రూ.114 పెంచడంతో ప్రస్తుతం అది రూ.2,111కు చేరింది. 1.60లక్షల కనెక్షన్లు జిల్లాలో భారత్ గ్యాస్, ఐఓసీఎల్, హెచ్పీ గ్యాస్ కంపెనీలకు చెందిన 12 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా, గృహ వినియోగ సబ్సిడీ సిలిండర్లు సుమారు 1,60 లక్షలు ఉన్నాయి. అదే విధంగా కమర్షియల్ వినియోగానికి సంబంధించిన సిలిండర్లు సుమారు ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు ఉన్నట్లు గ్యాస్ ఏజెన్సీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సబ్సిడీ సిలిండర్లలో వివిధ పథకాల కింద పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు. సీఎస్ఆర్ కేటగిరీలో 14,570 సిలిండర్లు, దీపం పథకంలో 41,222, ఉజ్వల పథకం ద్వారా 18,070 మందికి గ్యాస్ కనెక్షన్లు అందించగా, జనరల్ కేటగిరీలో 86,154 సిలిండర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు 1,86,294 ఉండగా, వాటిలో సభ్యులు సుమారు 5,62,221 మంది ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు అత్యధికంగా గ్యాస్ సిలిండర్లను వంటకు ఉపయోగిస్తుండడంతో ధరల పెంపు నేరుగా కుటుంబ బడ్జెట్పై ప్రభావం చూపుతోంది. పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంధన ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం వల్ల పేద కుటుంబాలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో నెలవారీ ఖర్చులు పెరిగి కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సబ్సిడీ సిలిండర్లు 1.60లక్షలు ఉండగా, పెరిగిన రూ.60తో రూ.96లక్షలు, కమర్షియల్పై రూ.9.12లక్షల మేర భారం పడుతుంది. సబ్సిడీ సిలిండర్లపై ప్రభుత్వం రూ.40 మాత్రమే అందిస్తుండగా, ఉజ్వల సిలిండర్లకు మాత్రం రూ.300 మేర వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. -
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్
జనగామ: జిల్లాలో గత కొన్ని రోజులుగా విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. జిల్లాకు కేటాయించిన విద్యుత్ కోటా 6.66 మిలియన్ యూనిట్లు (ఎంయూ) కాగా, ఈ నెల 1వ తేదీ నుంచి వినియోగం 5.67 ఎంయూ నుంచి 6.50 ఎంయూ వరకు పెరిగినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో విద్యుత్ డిమాండ్ కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ నెల 6వ తేదీన అత్యధికంగా రికార్డు స్థాయిలో 414.59 మెగావాట్ల (ఎండబ్ల్యూ) డిమాండ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక డిమాండ్గా గుర్తించబడింది. అయితే పెరుగుతున్న వినియోగం ఉన్నప్పటికీ జిల్లాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగిస్తున్నామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయ లైన్లు ఏర్పాటు చేయడం, కొత్త సబ్స్టేషన్లు నిర్మించడం, ఫీడర్ల విభజన చేయడం, పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడం వంటి చర్యలతో నిరంతర విద్యుత్ సరఫరా అ ందించగలుగుతున్నామని పేర్కొన్నారు. వాతావరణంలో మార్పులు రావడంతో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా పనిచేస్తున్నారని చెప్పారు. వినియోగదారులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా 1912 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా స్థానిక ఏఈలను సంప్రదించాలని అధికారులు సూచించారు.తేదీ వినియోగం డిమాండ్ (ఎంయూ) (ఎండబ్ల్యూ) 28 5.70 373.47 01 5.67 366.34 02 5.82 374.63 03 5.96 379.50 04 6.03 384.17 05 6.08 390.74 06 6.36 414.59 07 6.50 395.11 రికార్డు స్థాయిలో వినియోగం 6వ తేదీన 414.59 మెగావాట్లకు చేరిక ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో నిరంతర విద్యుత్ ఇటీవల ఉష్ణోగ్రతలు పెరగడం, గృహ వినియోగం అధికమవడం, వ్యవసాయ అవసరాలు పెరగడం వంటి కారణాల వల్ల విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోందని అధికారులు తెలిపారు. పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఫీడర్లు, సబ్స్టేషన్లు, ట్రానన్స్ఫార్మర్లు నిరంతరం పర్యవేక్షిస్తూ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అవసరమైనప్పుడు లోడ్ మేనేజ్మెంట్ చర్యలు కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ నెల 6వ తేదీన రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం జరిగింది. – సంపత్రెడ్డి, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్, జనగామ -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా వైద్యులు, వైద్య సిబ్బంది బాధ్యతగా, అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ అన్నారు. డివిజన్ కేంద్రమైన స్టేషన్ఘన్పూర్లో కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా విస్తృత పర్యటన చేశారు. ముందుగా స్థానిక సీహెచ్సీ(కమ్యూనిటీ హెల్త్ హెంటర్)ను సందర్శించారు. ఆసుపత్రి పరిసరాలు, టాయిలెట్స్, వార్డుల నిర్వహణ, రోగులకు అందించే మందులను పరిశీలించారు. అనంతరం వార్డులలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులతో స్వయంగా మాట్లాడారు.. వైద్యులు, వైద్యసిబ్బంది సమయానికి వస్తున్నారా.. అందుబాటులో ఉంటున్నారా.. వైద్య సేవలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. వైద్య అధికారులతో మాట్లాడుతూ ఆసుపత్రిలో ఎక్స్రే సేవలను వెంటనే తీసుకురావాలని, డయాలసిస్ సేవలను వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆసుపత్రిని పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయ సందర్శన స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం నూతనంగా ఎన్నికై న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు కలెక్టర్ను కలువగా వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ నరేందర్, సీహెచ్సీ వైద్యులు సంధ్య, ప్రదీప్కుమార్ పాల్గొన్నారు.రఘునాథపల్లి: విద్యార్థులకు పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఆదివారం మండలంలోని ఖిలాషాపూర్ కస్తూ ర్బా పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందించే ఆహారాన్ని పరిశీలించారు. వంటశాలను సందర్శించి భోజనం తయారీ విధానం, నాణ్యత, పరిశుభ్రత వంటి అంశాలను పర్యవేక్షించారు. ఆహారాన్ని తనిఖీ చేసి మెనూ ప్రకారం అందిస్తున్నారా ..? అని ఆరా తీశారు. జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు శ్రీలత పాల్గొన్నారు. సీహెచ్సీ వైద్యులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ స్టేషన్ఘన్పూర్లో విస్తృత పర్యటన -
గాదె ఇన్నయ్యకు కండీషన్ బెయిల్
జఫర్గఢ్: ఉపా చట్టం కింద అరెస్టు అయిన సామాజిక ఉద్యమకారుడు, మా ఇల్లు అనాథ ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నయ్య మరోసారి షరతులతో కూడిన బెయిల్పై తండ్రి సాల్మోన్రెడ్డి దశదినకర్మ కార్యక్రమాలకు ఆదివారం హాజరయ్యారు. ఎన్ఐఏ కేసులో జైలులో ఉన్న ఇన్నయ్య తన తల్లి థెరిసమ్మతో పాటు తండ్రి సాల్మోన్రెడ్డి నెలన్నర రోజుల వ్యవధిలో ఇద్దరు తనువుచాలించడంతో వీరి అంత్యక్రియలకు పోలీస్ భద్రత నడుమ కండీషన్ బెయిల్పై హాజరైన విషయం తెలిసిందే. ఇటీవలనే తన తండ్రి అంత్యక్రియలకు హాజరైన ఇన్నయ్యను కోర్టు ఇచ్చిన గడువు మేరకు పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. కాగా ఆదివారం నుంచి తన తండ్రి దశదినకర్మ కార్యక్రమాలు ఉండడంతో ఈ కార్యక్రమాలకు ఇన్నయ్య హాజరయ్యేందుకు అనుమతి కోరుతూ కుటుంబ సభ్యులు ఇచ్చిన పిటిషన్ మేరకు మళ్లీ కోర్టు షరతులతో కూడిన 5 రోజుల పాటు బెయిల్ను మంజూరు చేసింది. దీంతో తండ్రి దశదిన కార్యక్రమాల్లో ఇన్నయ్య పాల్గొన్నారు. తండ్రి దిశదినకర్మకు హాజరు -
జయహో భారత్
అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై టీమిండియా ఘన విజయాన్ని స్వాగతిస్తూ జిల్లా వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో జాతీయ జెండాలను చేత పట్టుకుని భారత్ మాతాకీ జై.. అంటూ భారీ బైక్ ర్యాలీ సంబరాలు బాణాసంచా పేల్చి వేడుకలను జరుపుకున్నారు.● టీ–20 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఘనవిజయం ● జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన సంబురాలు – జనగామ -
బదిలీ కలెక్టర్కు వీడ్కోలు
జనగామ: జిల్లాలో రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించి బదిలీపై జోగులాంబ గద్వాల జిల్లాకు వెళ్లిన కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాకు శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు సన్మాన సభ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ఆధ్వర్యంలో పని చేసిన పలువురు అధికారులు తమ అనుభవాలు పంచుకున్నారు. ఈసందర్భంగా షేక్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, వివిధ శాఖలకు చెందిన అధికారులు, టీఎన్జీఓ, టీజీఓ యూనియన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ‘ఎవరిపై దౌర్జన్యంగా వ్యవహరించలేదు’జనగామ రూరల్: తమ కార్యాలయానికి వచ్చే ప్రజలకు సత్వర న్యాయం చేస్తున్నామని, ఎవరిపై దౌర్జన్యంగా వ్యవహరించలేదని తహసీల్దార్ మోసిన్ శనివారం తెలిపారు. పెద్దరాంచర్ల గ్రామానికి చెందిన మహిళపై, సర్పంచ్ వల్లాల మల్లేశంపై ఎలాంటి దుర్భాషలాడలేదన్నారు. తమపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని, అందులో నిజం లేదన్నారు. సంబంధిత వ్యక్తిపై 2వ తేదీన పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారిస్తున్నట్లు పేర్కొన్నారు. కావాలనే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పరిశుభ్రతకు పాటుపడాలిజనగామ రూరల్: గ్రామంలోని పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని డీఎల్పీఓ వెంకట్రెడ్డి అన్నారు. ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం’లో భాగంగా శనివారం మండలంలోని శామీర్పేటలో సర్పంచ్ గణిపాక వనిత మహేందర్ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీఓ సంపత్ కుమార్, కార్యదర్శి స్వప్న, ఉపసర్పంచ్ నరేందర్, టి.నర్సింగ్, వార్డు సభ్యులు మహిళా సంఘ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నేడు జిల్లా స్థాయి రిలే కార్నివాల్ అథ్లెటిక్స్ ఎంపికలుజనగామ రూరల్: జిల్లా స్థాయి రిలే కార్నివాల్ అథ్లెటిక్స్ ఎంపికలు ఆదివారం పట్టణంలోని స్థానిక ధర్మకంచ మినీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికల్లో 14 ఏళ్ల బాలబాలికలు, 20 ఏళ్ల యువతకు అథ్లెటిక్స్ ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లా స్థాయి ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు పూర్తి వివరాలకు 98850 46437, 99124 53220, 77995 52233, 99852 23047 నంబర్కు ఫోన్ చేసి పూర్తి వివరాలు పొందవచ్చని సూచించారు. -
పురపాలికలో ‘మహిళ’ చైతన్యం
● 30 వార్డుల్లో 18 మంది ప్రాతినిథ్యం ● నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జనగామ: జనగామ మున్సిపాలిటీలో మహిళల ప్రాతినిథ్యం గణనీయంగా పెరిగింది. 30 వార్డులు ఉండగా అందులో 18 మంది మహిళా కౌన్సిలర్లు ఎన్నికై సుమారు 60 శాతం ప్రాతినిథ్యాన్ని సాధించారు. మహిళలకు కేటాయించిన రిజర్వేషన్ స్థానాలతో పాటు జనరల్, బీసీ స్థానాల్లో కూడా మహిళలు పోటీ చేసి విజయం సాధించడం విశేషం. దీంతో మున్సిపాలిటీ పాలనలో మహిళల పాత్ర మరింత బలపడింది. స్థానిక అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో మహిళా కౌన్సిలర్లు చురుగ్గా పాల్గొంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనగామ మున్సిపాలిటీలో మహిళల అధిక ప్రాతినిథ్యం మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తోంది. నేడు (ఆదివారం) వారంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్నారు. మినిమం పే స్కేల్ వర్తింపజేయాలి..జనగామ రూరల్: కేజీబీవీ ఉపాధ్యాయులకు రెగ్యులర్ స్కేల్లో మినిమం పే వర్తింపజేయాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎండీ షరీఫ్ ఇప్ప రాంరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు బి.చొక్కయ్య, టి.శ్రీనివాసులు, బి.శివరాం, ఎం.యాదయ్య, ఎన్.దూడయ్య, కె.యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
సొంత నిర్ణయంతోపాటు తల్లిదండ్రుల సూచనతోనే కోర్సు ఎంపిక మహిళా దినోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ సర్వేలో విద్యార్థినుల మనోగతం
‘మేం రోజువారీ తీసుకునే నిర్ణయాల్లో సగమే స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నాం.. ఇటు తల్లిదండ్రుల సూచన, సొంత నిర్ణయంతో ఇప్పుడు చదువుతున్న కోర్సులను ఎంచుకున్నాం. మేం తీసుకునే నిర్ణయాల్లో సగమే మద్దతు వస్తోంది. పూర్తి స్థాయిలో రావాలి. అదే సమయంలో తల్లిదండ్రులు ఆడపిల్లలపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా మేం ఉండాలి.’ అని అంటున్నారు విద్యార్థినులు. నేడు (ఆదివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ‘మీరెంత ఇండిపెండెంట్’.. అన్న అంశంపై ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 18–25 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థినులను ‘సాక్షి’ సర్వే చేసింది. పలు అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుంది. – సాక్షి నెట్వర్క్ ఏ) పూర్తిగా బీ) కొద్దిమేర సీ) లేదు 3. మీ నిర్ణయాలకు మీ ఇంట్లో ఎంత మేర మద్దతు లభిస్తోంది? 2. మీరు ప్రస్తుతం ఎంచుకున్న కోర్సును మీరు కావాలనే ఎంచుకున్నారా?ఏ) నా సొంత నిర్ణయం58ఏ) 50 %44ఏ4. ఒక సీ్త్ర ఇండిపెండెంట్గా ముందుకు వెళ్లాలంటే.. ఎవరి సహకారం ఎక్కువ అవసరం? 18బీ) 100%బీసీ) సమాజం8సీ) 25%ిసీబీ) స్నేహితులు24ఏ) కుటుంబంబీ) మా తల్లిదండ్రుల నిర్ణయం సీ) స్నేహితుల సూచన88డీ) 0%సర్వే శాంపిల్ : ప్రతీ జిల్లా నుంచి 20 మంది, ఆరు జిల్లాల నుంచి 120 మంది●ఇండిపెండెంట్గా ముందుకు వెళ్లాలంటే కుటుంబ సహకారం ఎంతో అవసరం1. మీరు తీసుకునే రోజువారీ నిర్ణయాల్లో ఎంత మేరకు స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారు. -
ఎరువులు సకాలంలో అందించండి
జనగామ రూరల్: రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో, సులభంగా అందుబాటులో ఉండేలా ప్రతీ క్లస్టర్లో స్వయం సహాయక సంఘాల ద్వారా ఎరువుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ఫర్టిలైజర్ షాప్ నిర్వహణపై శనివారం కలెక్టరెట్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇందులో డీఏఓ అంబికా సోనీ, వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్లు కమ్యూనిటీ కో–ఆర్డినేటర్లు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్కు పునాది.. విద్యార్థినులు లక్ష్యాన్ని ఎంచుకుని, అందుకు అనుగుణంగా ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. శనివారం మండలంలోని చౌడారం కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో వసతి, భోజన ఏర్పాట్లు, పరిశుభ్రత వంటి అంశాలను పర్యవేక్షించారు. అనంతరం గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ మాతృనాయక్ అధికారులు ఉన్నారు. సమర్థవంతంగా నిర్వహించాలి ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల అధికారులు వారి పరిధిలోని కార్యక్రమాలను పక్కా యాక్షన్ ప్లాన్తో క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. 99 రోజుల కార్యక్రమాల అమలుపై అధికారులతో శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు పనుల పరిశీలన లింగాలఘణపురం: మండలంలోని నెల్లుట్ల పెద్ద చెరువు సమీపంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే పనులను కలెక్టర్ సందీప్కుమార్ ఝా శనివారం పరిశీలించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు ఉన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తొద్దు.. కలెక్టర్ సందీప్కుమార్ ఝా అధికారులతో సమీక్ష -
స్వచ్ఛతకు వారధినవుతా..
శానిటేషన్ కార్మికులతో.. (ఉదయం 5 గంటలకు) చైర్పర్సన్: అమ్మా మీ సమస్యలేంటి? గుర్రం లక్ష్మి: ఈఎస్ఐ ఆలస్యం చేయొద్దు. శానిటేషన్ కార్మికులకు ఓ కాలనీ ఏర్పాటు చేయండి. అందరం అద్దెకు ఉంటున్నాం. సొంత ఇల్లు, ఖాళీ స్థలం లేదు. మాకో సపరేట్ కాలనీ ఉండాలని కోరుకుంటున్నాం. చైర్పర్సన్: ఆరోగ్య సమస్యలున్నాయా? బొట్ల లక్ష్మి: రహదారులు శుభ్రం చేసే సమయంలో దుమ్మంతా కడుపులోకి వెళ్లి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఆరోగ్య రక్షణ కిట్లు అందించాలి. సబ్బులు ఇస్తామన్నారు ఇంకా ఇవ్వలేదు. చీపుర్లు, చెప్పులు కావాలి, టవల్ ఇవ్వట్లేదు. డ్రెస్ చినిగిపోయింది. చైర్పర్సన్: వేతనాలు ఎలా ఉన్నాయి? దేవేంద్ర: 30 సంవత్సరాల నుంచి పని చేస్తున్న. రెగ్యులర్ కాలేదు. ఇల్లు లేదు. వేతనాలు తక్కువ. రూ.10 వేల నుంచి పైకి పెరగడం లేదు. మా కష్టానికి తగ్గట్టుగా జీతాలు ఉంటే బాగుంటుంది. చైర్పర్సన్: మీ బాధలేంటి? కనకమ్మ: మాకు వచ్చే వేతనంతో ఇల్లు కిరాయి కట్టుకోవాలి. ఇంకా వేరే ప్రైవేట్ పని చేసుకునే వీలు లేదు. పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు ప్రైవేటు బడుల్లో ఉచిత విద్యను అందించేలా చూడాలి. ఇదొక సాయం చేయండి. ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాం. చైర్పర్సన్: మీ సమస్యలు మా దృష్టికి తీసుకురండి? గోలి సుగుణ: మమ్మల్ని మీ బిడ్డలం అనుకోండి. మాకు మంచి చేసేందుకు ప్రయత్నించండి. రోడ్లమీద పని చేసి అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే ఖర్చులు భరించలేకపోతున్నాం. మేం లేచింది మొదలు ఇంటికి వెళ్లే వరకు దుమ్ములోనే ఉంటున్నాం. ఊపిరితిత్తుల సమస్య వస్తోంది. హాస్పిటల్ కార్డు చెల్ల ట్లేదు. వైద్య పరీక్షల డబ్బులు వచ్చేలా చూడాలి. వా ర్డులతో పాటు కలెక్టరేట్లోనూ పని చేయిస్తున్నారు. 22 వ వార్డులో.. (ఉదయం 8 గంటలకు) చైర్పర్సన్: కాలనీకి ఏం కావాలి? కాతబోయిన యాదమ్మ: 22వ వార్డులో బతుకమ్మ ఆడుకునేందుకు స్థలం కావాలి. మేమందరం సమావేశమయ్యేందుకు ఓ ఆఫీస్ ఉండాలి. మంచినీళ్ల ప్లాంట్ ఏర్పాటు చేయాలి. మైసమ్మ గుడిని అభివృద్ధి చేయాలి. మా బిడ్డకు ఇందిరమ్మ ఇల్లు, పింఛన్ మంజూరు చేయించండి. చైర్పర్సన్: అవ్వా.. పరిసరాలు ఎలా ఉన్నాయి? నర్సవ్వ: ఇంటి ముందు మోరీ లేదు. మమ్మల్ని మీరే పట్టించుకోవాలి. మిమ్మల్ని చూస్తే మాకు నమ్మకం కలుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించండి. ఇంటి ముందు పోల్కు బుగ్గ పోవడంతో చీకటిగా ఉంది. లైట్ పెట్టించండి. చైర్పర్సన్: పరిశుభ్రత ఎలా ఉంది? అయిలమ్మ: మోరీలను ప్రతీ వారం శుభ్రం చేయాలి. రోడ్లు రోజూ ఊడ్చాలి. చెత్తను తరలించాలి. పరిసరాలను మేం కూడా స్వచ్ఛతగా ఉంచుకుంటాం. ఆరోగ్యంగా జీవిస్తాం. చైర్పర్సన్: అక్కకు పింఛన్ వస్తుందా? కవిత: రాధికకు మాటలు రావు. దివ్యాంగుల పింఛన్ కావాలి. గతంలో దరఖాస్తు పెట్టుకున్నాం. మీరే సాయం చేయాలి. చైర్పర్సన్: ఏమైంది తల్లీ? యాదమ్మ: ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. ఆనందంతో పిల్లర్ల వరకు వేసుకున్నాం. పట్టా ఇచ్చి క్యాన్సిల్ చేశారు. ఇల్లు మళ్లొచ్చేలా చూడాలి. అధికారులను పురమాయించాలి. మహిళలు పోటీ పడే శక్తిని పెంపొందించుకోవాలిజనగామ రూరల్: మహిళలు సమాజంలో పోటీ పడే శక్తిని పెంపొందించుకోవాలని, ఆర్థిక శక్తిగా నిలవాలని ిసీనియర్ సివిల్ జడ్జి సుచరిత అన్నారు. ఆదివారం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని ఏకశిల డిగ్రీ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ధైర్యంతో ముందుకు సాగాలని, ప్రతీ విషయం తెలుసుకోవాలని, మగవారితో సమానంగా పోటీ పడే శక్తిని పెంపొందించుకోవాలన్నారు. ప్రతీ మహిళ చట్టాలపై కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. సమస్యలు ఎదురైతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని, రాలేని పరిస్థితి ఉంటే లెటర్ ద్వారా కూడా తెలియజేయవచ్చని సూచించారు. పలు చట్టాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ మంచాల రవీంద్ర, స్కోప్ ఎన్జీఓ మనోజ్ కుమార్, భరోసా సెంటర్ దయామణి, సుధా, వైస్ ప్రిన్సిపల్ జి.నలిదికుమారి, బి.శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జనగామ పురపాలిక చైర్పర్సన్ సమస్యల పరిష్కారానికి సారథినవుతా..ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం.. పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చూడడం.. వీధి దీపాలు, పన్నుల వసూలు, అభివృద్ధి పనులు, రోడ్ల నిర్మాణాలు, ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక.. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం.. ఇలా నిత్యం పట్టణాభివృద్ధిలో ఆమెది కీలక పాత్ర. అంతటి ప్రాధాన్యమున్న విధులు నిర్వర్తిస్తూనే క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ తరఫున రిపోర్టర్గా మారారు జనగామ మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్. నేడు (ఆదివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ మీడియా వీఐపీ రిపోర్టర్గా శనివారం క్షేత్రస్థాయిలో ప్రజలు, పారిశుద్ధ్య సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. పరిష్కార మార్గం చూపేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. 22వ వార్డు ప్రజలతో ముఖాముఖి అయ్యారు. – జనగామసీనియర్ సివిల్ జడ్జి సుచరిత కార్మికుల సమస్యలు ఒకొక్కటిగా పరిష్కరిస్తాం ‘డ్రెయినేజీ, పారిశుద్ధ్యం’పై ప్రత్యేక ప్రణాళిక మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్, పురపాలిక చైర్పర్సన్ కడమంచి బాలమణి శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో శానిటేషన్ కార్మికులతో ముఖాముఖిప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం..డ్రెయినేజీ, స్వచ్ఛత, వీధి దీపాలు వంటి సమస్యలపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. పది రోజుల్లో వార్డుల్లో మార్పు ఎలా ఉంటుందో ప్రజలే చూస్తారు. ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులు సూచించిన విధంగా శానిటేషన్ కార్మికులు పది రోజుల పాటు కష్టపడి పని చేయాలి. వారి సమస్యలు, అభివృద్ధి, ఆరోగ్య సమస్యలపై ప్రత్యేకంగా పరిష్కారం చూపుతా. – కడకంచి బాలమణి శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్, జనగామ -
ఆశించిన దానికంటే ఎక్కువ వచ్చింది
సొంతంగా మూడు చింతచెట్లు ఉన్నాయి. క్వింటాన్నర దిగుబడి రాగా, మరో క్వింటాల్ వరకు చింతపండు వస్తుంది. ప్రస్తుతం 3 అంకాల పండును మార్కెట్కు తీసుకొచ్చా. పండు నాణ్యతగా, కలర్ ఉండడంతో క్వింటాల్ ధర రూ.11,290లు ధర పలుకడం సంతోషంగా ఉంది. –జీడిమెట్ల కరుణాకర్రెడ్డి, గోపరాజుపల్లి,జనగామముగ్గురం కలిసి 34 అంకాల(సుమారు 10 క్వింటాళ్లు) చింతపండు తీసుకొచ్చినం. క్వింటాల్ పండు రూ.8,500, రూ.9,700, రూ.11,000, రూ.10,000 ధరతో వ్యాపారులు చింతపండు కొనుగోలు చేశారు. కోతులతో కొంతమేర దిగుబడి తగ్గింది. – పి.కుమార్ నమిలె, రాజపేట మండలం, యాదాద్రి జిల్లా -
‘చింత’ లేదిక!
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్కు చింతపండు భారీగా వస్తోంది. వారం రోజుల క్రితమే చింతపండు రాక ప్రారంభమై, శుక్రవారం భారీగా మార్కెట్కు చేరింది. ఈ సీజన్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, కోతుల బెడద ఎక్కువగా ఉండటం వల్ల చింతపండు దిగుబడి 30 నుంచి 40 శాతం వరకు తగ్గినట్లు రైతులు చెబుతున్నారు. దీంతో ఆశించినంత దిగుబడి రాకపోయినా, వచ్చిన పంటను విక్రయించేందుకు రైతులు మార్కెట్కు తరలిస్తున్నారు. ప్రస్తుతం జనగామ మార్కెట్తో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ప్రధాన మార్కెట్లో కూడా చింతపండు భారీగా చేరుతోంది. అయితే ధర విష యంలో జనగామ మార్కెట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఇక్కడి మార్కెట్లో ప్రస్తుతం మధ్యరకం చింతపండు క్వింటాల్కు రూ.8,500 వరకు ధర ఉండగా, మోడల్ ధర రూ.9,700గా నమోదైంది. అత్యధికంగా రూ.10,000 వరకు ధర పలికింది. రికార్డు స్థాయిలో జనగామ మార్కెట్లో రికార్డు స్థాయిలో క్వింటాల్ చింతపండు రూ.11,290 వరకు ధర పలకడం రైతులకు ఆనందాన్ని కలిగించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జనగామ మార్కెట్పై వ్యాపారులు, రైతుల దృష్టి మరింతగా పడింది. భువనగిరి మార్కెట్తో పోలిస్తే క్వింటాల్కు సుమారు రూ.1,000పైగా ధర రావడం గమనార్హం. శుక్రవారం మార్కెట్ జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన 17 మంది రైతులు 14.70 క్వింటాళ్లు(49 అంకాలు) తీసుకొచ్చారు. క్వింటాల్ చింతపండుకు రికార్డుగా రూ.11, 290కి ఖరీదుదారుడు శర్విరాల ఉపేందర్ కొనుగోలు చేయగా, మోడల్ ప్రైజ్ రూ.9,700లు వచ్చింది. దీనికి మార్కెట్ అధికారుల పర్యవేక్షణ ప్రధాన కారణమని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా రానున్న రోజుల్లో జనగామ మార్కెట్కు చిం తపండు రాక మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. అయితే రాక పెరిగే సమయంలో ధరలు పడిపోకుండా మార్కెట్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. జిల్లా వ్యవసాయ మార్కెట్లో రికార్డుస్థాయిలో ధర క్వింటాల్కు రూ.11,290లు పలికిన చింతపండు అత్యధిక ధరలతో రైతుల ఆనందం -
సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలి
సాక్షి, మహబూబాబాద్: సంక్షేమ పథకాలు అర్హులకు చేరినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, ఆ దిశగా అధికారులు ముందుకు పోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికపై ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం శుక్రవారం మహబూబాబాద్ కలెక్టరేట్లో జరిగింది. పలు అంశాలపై కలెక్టర్లు ప్రణాళికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య పనుల్లో నూతన ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని, ఇందుకోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. వేసవి సెలవుల్లో పాఠశాల్లో మరమ్మతులు చేయించాలన్నారు. మండలంలోని అధికారి హాస్టళ్లను దత్తత తీసుకొని వారంలో రెండు రోజులు అక్కడే భోజనం చేసేలా చూడాలని పేర్కొన్నారు. ప్రమాదాలు నివారించేందుకు బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే పాఠశాల గుర్తింపు ఇవ్వాలని ఆదేశించారు. బిల్లులు అందించి ఈనెల చివరి వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి పేదలకు అందించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండ్ చేయని లబ్ధిదారుల నుంచి అంగీకారాన్ని తీసుకుని రద్దు చేయాలని తెలిపారు. ప్రజలకు ఏం అవసరమో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. డాక్టర్లు అంకితభావంతో పనిచేయాలి.. రైతుల సమస్యల పరిష్కార మార్గాలను తెలిపేందుకు సీనియర్ రైతులను భాగస్వామ్యులను చేసి చెప్పించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు అంకిత భావంతో పనిచేస్తే రోగుల సంఖ్య పెరుగుతుందని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే బాధ తప్పుతుందని మంత్రి అన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల మధ్య భూసమస్యలు పెండింగ్లో ఉన్నాయని, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. త్వరలో సాదాబైనామాకు అవకాశం వస్తుందని, అప్పుడు సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి.. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని అధికా రులను ఆదేశించారు. దరఖాస్తుల స్థితిని తెలుసుకుంనేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించాలని, సమాచారాన్ని ప్రజల ఫోన్లకు చేరవేయాలని సూచించారు. ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టే పనులు జాప్యం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ విప్ రాచంద్రునాయక్ మాట్లాడుతూ.. గత కలెక్టర్ హయాంలో ఫైల్స్ పెండింగ్లో ఉండడంతో మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకాలు నిలిచి పోయాయని వివరించారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యేలు, మురళీనాయక్, నాగరాజు, ప్రకాశ్రెడ్డి, రాజేందర్రెడ్డి, దొంతి మాధవరెడ్డి తమ నియోజకవర్గాల్లో సమస్యలు, 99 రోజుల ప్రణాళికలో చేపట్టే కార్యక్రమాలు వివరించారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. కార్యక్రమాలు మొక్కుబడిగా కా కుండా ప్రజల సమస్యలు పరిష్కరించేలా, పథకా లు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూడాలన్నారు. సమావేశానికి హాజరు కాని మహబూబాబాద్ ఆస్పత్రి సూపరింటెండెంట్, ములుగు డీఎఫ్ఓకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. సమీక్షలో ‘కుడా’ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఐదు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు, మున్సిపల్ చైర్మన్లు పాల్గొన్నారు. వార్డు సభ్యుల నుంచి చైర్మన్లు, సర్పంచ్ల వరకు శిక్షణ ఇవ్వండి బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే పాఠశాలకు గుర్తింపు ప్రారంభించిన ప్రతీ ఇందిరమ్మ ఇల్లుకు బిల్లు అందాలి ఫారెస్ట్, రెవెన్యూ మధ్య ఉన్న భూ సమస్యలు పరిష్కరించాలి ప్రజాపాలన–పల్లెప్రగతి ఉమ్మడి జిల్లా సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
ప్రజాసమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం
లింగాలఘణపురం: ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేయడమే ‘ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం’ ప్రథమ లక్ష్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని కలెక్టర్ సందీప్కుమార్ ఝాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.. విద్య, వైద్యం, సాగునీరు, పంటల దిగుబడికి నియోజకవర్గంలో ప్రాముఖ్యం కల్పించడం జరుగుతుందని, జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆరోగ్య స్థితిగతులను పరీక్షించి ప్రత్యేక హెల్త్కార్డులను జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో జనగామ, జఫర్గఢ్లో డయాలిసిస్ సెంటర్లు ఉన్నాయని, నియోజకవర్గ కేంద్రమైన స్టేషన్ఘన్పూర్లో ఏర్పాటు చేయాలని, అదేవిధంగా వంద పడకల ఆసుపత్రి నిర్మాణం డిసెంబర్ వరకు పూర్తి చేయాలన్నారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా డెంగీ, మలేరియా సోకకుండా దోమల నివారణకు ప్రతీ గ్రామంలో పిచికారి చేయడం జరుగుతుందని, ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు మాట్లాడుతూ 99 రోజుల కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలను వివరించారు. సమావేశంలో ప్రోగ్రామ్ ఇన్చార్జ్ రాజేశం, వివిధ విభాగాల డాక్టర్లు ఉమాదేవి, అరుణకుమారి, ప్రదీప్, దీప్తి, క్రాంతిస్వరూప్, అనిల్ వైద్య సేవలు అందించారు. ఆర్డీఓ గోపీరామ్, 108 జిల్లా ఇన్చార్జ్ రాములు, మార్కెట్ వైస్ చైర్మన్ శివకుమార్, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ శివశంకర్రెడ్డి, స్థానిక వైద్యాధికారి స్వర్ణలత, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. పంటల దిగుబడిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
హారం హాసం
పరిజనగామ రూరల్: గత యాసంగిలో వడగళ్ల బీభత్సం, ఆ తర్వాత అతివృష్టి వర్షాలతో పంటలకు తీరని నష్టం వాటిల్లింది. వర్షాలు, గాలి దుమారంతో వేలాది ఎకరాల్లో చేతికందే దశలో ఉన్న వరి, మొక్కజొన్న, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. గత అక్టోబర్లో మొంథా తుపాను విరుచుకుపడడంతో భారీ వరదలు సంభవించి తీవ్రంగా పంట నష్టం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో కూడా పంట నష్టం జరిగినప్పుడు పరిహారం అందించాలని బాధిత రైతులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. దీనిపై స్పందించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తామని చెప్పిన ఆచరణలో జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా రైతుల చేతికి చిల్లిగవ్వ అందలేదు. మోంథా తుఫాన్తో దెబ్బతిన్న పంటలకై నా నష్టపరిహారం ఇవ్వాలని రైతులు, పలు పార్టీల నాయకులు ఆందోళన చేపట్టి వినతి పత్రం కూడా అందజేశారు. పరిహారం అందక ప్రస్తుత ప రిస్థితుల్లో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. 17వేల ఎకరాల్లో పంట నష్టం జిల్లాలో గతేడాదికి సంబంధించిన పంట నష్టపరిహారం 11వేల మందిపైగా రైతులకు చెందిన సుమారు 17వేల ఎకరాల్లోని వరి, మామిడి, మొక్కజొన్నకు తీవ్ర నష్టం వాటిల్లిందని జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు సర్వే నిర్వహించారు. క్లస్టర్లు, గ్రామాల వారీగా ఏఈఓలు పంటల వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదించారు. పరిహారం చెల్లింపుల విషయంపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని అడగ్గా నివేదిక పంపామని, తమకు ఏలాంటి సమాచారం అందలేదని తెలిపారు. రైతులకు అందాల్సిన పరిహారం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. వడగళ్లు, మోంథా తుపానుతో చేతికొచ్చిన పంట నేలపాలు జిల్లాలో 17వేల ఎకరాలపైగా పంట నష్టం ప్రభుత్వానికి నివేదిక అందించామంటున్న అధికారులు -
పోలీస్ స్టేషన్ ఆవరణ శుభ్రం చేసిన డీసీపీ
లింగాలఘణపురం: మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శుక్రవారం జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ పరిసరాలను పరిశుభ్రం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పోలీసు సిబ్బందితో కలిసి ఆవరణలో ఉన్న చెత్తాచెదారం తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని కాపాడుకోవాలని డీసీపీ సూచించారు. కార్యక్రమంలో ఎస్సై శ్రావణ్కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలుజనగామ రూరల్: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఇంటర్ విద్యాధికారి కె.జితేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం జరిగిన సెకండియర్ పరీక్షకు 94 మంది విద్యార్థులు గైర్హాజర్ అయ్యారని తెలిపారు. జనరల్లో 2,830 మంది విద్యార్థులకు 2,792 హాజరు కాగా 38 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ 995 విద్యార్థులకు 939 హాజరు కాగా 56 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి స్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య సమస్యపై అధికారులు, సిబ్బంది ప్రత్యేక చొరవతో పనిచేయాలని మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మొదటిరోజైన శుక్రవారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, మేనేజర్ సత్యనారాయణ, కౌన్సిలర్లు, మహిళలు పాల్గొన్నారు. స్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ కమిషనర్ రాధాకృష్ణ వైఖరిపై పలువురు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన–ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. కాగా సమావేశం ప్రారంభంలోనే పొన్న రాజేష్, బస్వగాని అనిల్ తదితర కౌన్సిలర్లు కమిషనర్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం విషయమై కనీసం తమకు సమాచారం లేదని, వార్డుల్లో ఏదైనా సమస్య విషయమై ఫోన్ చేస్తే కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేదని వాగ్వాదం చేయడంతో కాసేపు సభ రసాభాసగా మారింది. కాగా అందరూ సంయమనం పాటించాలని చైర్మన్ సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. వేయిస్తంభాల గుడిలో సంకటహరచతుర్థి పూజలుహన్మకొండ కల్చరల్: శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శుక్రవారం సాయంత్రం సంకటహరచతుర్థి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అధ్వర్యంలో అర్చకులు గంగు మణికంఠశర్మ, సందీప్శర్మ, ప్రణవ్ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతపూజలు, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. సంకటచతుర్థిని పురస్కరించుకుని సాయంత్రం దేవాలయంలోని కాకతీయుల కాలంనాటి ఉత్తిష్టగణపతికి అభిషేకాలు నిర్వహించారు. గణపతికి ఇష్టమైన గరికతో అష్టోత్తరశతనామాలు పఠిస్తూ షోఢశోపచార పూజలు చేశారు. మహాహారతి మంత్రపుష్పం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. -
టీపీసీసీ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఎర్రబెల్లి స్వర్ణ తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈమేరకు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ మేయర్గా, కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన స్వర్ణ రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ రేసులో ఉన్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన స్వర్ణకు ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు చెప్పారు. -
పట్టణ రూపురేఖలు మారుస్తాం
జనగామ: పట్టణంలోని 22వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. 22వ వార్డుతో పాటు పట్టణంలోని మిగతా 29 వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 22వ వార్డు కార్యక్రమాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించి వెళ్లారు. అంతకు ముందు ముఖ్యమంత్రి పంపించిన సందేశాన్ని చదివి వినిపించి, ప్రతిజ్ఞ చేశారు. చైర్పర్సన్ బాలమణి మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ద్వారా పట్టణంలో స్వచ్ఛతను మరింత మెరుగుపరచడం తమ లక్ష్యమని తెలిపారు. పట్టణ రూపురేఖలను మార్చేందుకు స మష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు చెంచారపు కరుణాకర్రెడ్డి, రామగళ్ల విజయ్, దోర్నాల అనితవెంకటేశ్వర్లు, మంత్రి సుమలతశ్రీశైలం, అండాలు, పురపాలిక మేనేజరు రాములు, శానిటరీ ఇన్స్పెక్టర్ గోపయ్య, మల్లిగారి మధు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ 22వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రారంభం -
దేశాభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషించాలి
జనగామ రూరల్: దేశాభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషించాలని కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ అన్నారు. గురువారం పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ జిల్లా స్థాయి పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కాకతీయ యూనివర్సిటీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ మాట్లాడుతూ..ప్రజాస్వామ్య విలువలు, నా యకత్వ లక్షణాలు విద్యార్థుల్లో పెంపొందించడానికి యూత్ పార్లమెంట్ వంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం యూత్ పార్లమెంట్ పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. సంధ్యారాణి, డీఎస్ వెంకన్న, కె.వేణుగోపాల్రావు, వి.ప్రసాద్రావు, ప్రోగ్రాం ఆఫీసర్ కె.అరుణ కుమారి పాల్గొన్నారు. రఘునాథపల్లి: మండలంలోని అశ్వరావుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బోడ లాస్య జాతీయ స్థాయి ఇన్స్పైర్ అవార్డుకు ఎంపిౖకైనట్లు పాఠశాల హెచ్ఎం పి.శోభన్బాబు గురువారం తెలిపారు. భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఎంపిక జాబితాలో 9వ తరగతి విద్యనభ్యసిస్తున్న బోడ లాస్య స్థానం సంపాదించుకుంది. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మతకను, శాసీ్త్రయ దృక్పథాన్ని వెలికిదీసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేస్తోంది. సందర్భంగా లాస్యను సర్పంచ్ చైతన్య, ఏఏపీసీ చైర్మన్ రేణుక, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు. హన్మకొండ: విద్యుత్ ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్ సబ్సిడీ, సర్ చార్జీల ప్రతిపాదనలపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఈ నెల 6న బహిరంగ విచారణ చేపట్టనుంది. ఈ మేరకు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం బహిరంగ విచారణకు ఏర్పాట్లు చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సవరించబడిన ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్ సబ్సిడీ, సర్ చార్జీల ప్రతిపాదనలపై శుక్రవారం ఉదయం 10:30 గంటలకు హనుమకొండ కలెక్టరేట్లో ఈ విచారణ చేపట్టనున్నట్లు యాజమాన్యం ఒక ప్రకటనలో వివరించింది. ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ డాక్టర్ దేవరాజ్ నాగార్జున్, సభ్యులు రఘు కంజర్ల, సీహెచ్.శ్రీనివాస్రావు పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యుత్ వినియోగదారులు ఈ బహిరంగ విచారణకు హాజరు కావాలని కోరారు. కాజీపేట అర్బన్ : కాజీపేట మండలం మడికొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో(మహిళా ప్రాంగణం)లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య రిటైల్ సేల్స్ అసిస్టెంట్ ఉపాధి నిమిత్తం ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాంగణం జిల్లా అధికారి జయశ్రీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులు ఈనెల 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 76600 22526 లేదా 76600 22525 నంబర్లలో సంప్రదించాలని కోరారు. మహాసభలను జయప్రదం చేయండి జనగామ రూరల్: జీఎంపీఎస్ 3వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి సాదం రమేశ్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా అధ్యక్షుడు మోటే దేవేందర్ ఆధ్యక్షతన జిల్లా కేంద్రంలోని బీరప్ప గుడి ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. అనంతరం మహాసభల కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు జీగారి యాదగిరి, సహాయ కార్యదర్శి కన్నెబోయిన బాలరాజు, ఉలిగిల్ల చంద్రయ్య పాల్గొన్నారు. -
పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో గురువారం పీజీ కోర్సులు ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ తదితర కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీలోని పలు పరీక్ష కేంద్రాలను హ్యూమనిటీస్ భవనం, మైక్రోబయాలజీ, జియాలజీ, కామర్స్అండ్ బిజినెస్మేనేజ్మెంట్ కళాశాలలను కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, పరీక్షల విభాగం అధికారులతో కలిసి సందర్శంచి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్షల నిర్వహణను పరిశీలించిన వారిలో యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య టి.మనోహర్, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి శ్రీనివాస్, వివిధ విభాగాల అధిపతులు ఉన్నారు. సుబేదారిలోని యూనివర్సిటీ మహిళా పీజీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఒకరు కాపీయింగ్ చేస్తూ పట్టుబడి డీబార్ అయినట్లు కేయూ అదనపు పరీక్షల నియంత్రణాధికారి పి.శ్రీనివాస్ తెలిపారు. -
శుక్రవారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2026
నేటి నుంచి జిల్లాలో ప్రజాపాలన–ప్రగతిప్రణాళికగ్రామస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మొదటి రోజు గ్రామసభను నిర్వహించనున్నారు. 90 నిమి షాలపాటు జరిగే ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు సాధించిన విజయాలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు, ప్రజా సమస్యలు వంటి అంశాలపై విస్త్రృతంగా చర్చ నిర్వహిస్తారు. రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తర్వాత వివిధ ప్రభుత్వ శాఖలు సాధించిన విజయాలపై వివరిస్తారు.● 99 రోజుల ప్రోగ్రామ్కు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ● అభివృద్ధి, సంక్షేమంపై అవగాహన.. సమస్యలపై చర్చ ● అధికారులతో కలెక్టర్ సమీక్ష ● ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని ఆదేశంజనగామ: ప్రజాపాలనను సమర్థవంతంగా అమలు చేయడం, పట్టణాల్లో పర్యావరణ పరిశుభ్రతను పెంపొందించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని నిర్ణయించింది. ఈనెల 6 (శుక్రవారం) నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రజాపాలన–ప్రగతిప్రణాళిక కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామసభలో.. గ్రామసభలో వ్యవసాయం, ఆరోగ్యం, సంక్షేమం, విద్య, మహిళా, శిశు సంరక్షణ, యువజన, క్రీడలు, పర్యావరణం వంటి పలు అంశాలపై చర్చ జరగనుంది. రైతులకు సౌర విద్యుత్ కనెక్షన్ల ప్రయోజనాలు, రైతు భరోసా, రైతుబీమా, సాగునీటి సదుపాయాలు, పీఎం కుసుమ్ పథకం కింద సౌర పంపుల అమలు, అదనపు సౌర విద్యుత్ గ్రిడ్కు అనుసంధానం, వ్యవసాయంపై అవగాహన కల్పిస్తారు. రోడ్డు భద్రత..మహిళల సంరక్షణ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు, కమిటీల ఏర్పాటుపై చర్చిస్తారు. అలాగే హైవేలు, ఔటర్ రింగ్ రోడ్లపై భారీ వాహనాల పార్కింగ్ను నిరోధించడం, సర్వీస్ రోడ్లను చెత్త నిల్వ ప్రదేశాలుగా ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలి. మహిళలు, బాలల రక్షణకు సంబంధించి వేధింపుల నివారణ, బాల్య వివాహాల నిర్మూలన అవగాహన, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, 0–6 సంవత్సరాల పిల్లలు, కిశోర బాలికల పోషణపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. స్వయం సహాయక సంఘాలతో సమావేశాలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్, పచ్చదనం పెంపుపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. సంక్షేమంపై ఇలా.. సంక్షేమ రంగంలో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్న బియ్యానికి బోనస్, మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల లబ్ధిదారుల పేర్లను సభలో పరిచయం చేస్తారు. పాఠశాలల్లో చేరికలు, బడిబయట పిల్లలు, నాణ్యమైన విద్య, అమ్మ ఆదర్శ పాఠశాలల అమలు, మధ్యాహ్న భోజనంలో పోషకాహార ప్రమాణాలపై అవగాహన కల్పిస్తారు. ఆరోగ్య రంగంలో తల్లి, శిశు సంరక్షణ, టీకాలు, వ్యాధుల నియంత్రణ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల మెరుగుదల, పీహెచ్సీల నుంచి రిఫరల్ సేవలపై చర్చించనున్నారు. పురపాలికలో.. ఈ నెల 6న మున్సిపాలిటీల్లో శానిటేషన్ డ్రైవ్లు నిర్వహించాలి. 7న ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, స్థానిక ప్రజలతో శుభ్రత కార్యక్రమాలు, 8న కంపోస్ట్ యూనిట్లు, డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ల ఏర్పాటు, చెత్త సేకరణ, 9న 5కే రన్, పార్కుల్లో కంపోస్టింగ్ కేంద్రాల ఏర్పాటు, 10న ప్రధాన కూడళ్లను గుర్తించి వ్యర్థాలతో కళాకృతులు, 11న మరుగుదొడ్ల పరిస్థితి పరిశీలన, హోటళ్లు, రెస్టారెంట్ల తనిఖీలు, 12న ప్రజాప్రతినిధులకు శిక్షణ, 13న నీటి ట్యాంకులు, రిజర్వాయర్ల శుభ్రత, 14న కూడళ్ల అభివృద్ధి, నర్సరీల సందర్శన, మొక్కల నాటడానికి సన్నాహాలు, 15న ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థులతో శుభ్రత కార్యక్రమాలు, పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లు పంపిణీ చేస్తారు. -
సైబర్ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు
జనగామ రూరల్: సైబర్ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. గురువారం పోలీస్ స్టేషన్లో సైబర్ నేరంపై పట్టణానికి చెందిన మహేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్లో ఉండి మొబైల్లో బినాన్స్ యాప్ ద్వారా నాలుగు మ్యూల్ అకౌంట్లు సృష్టించి, ఇతరులతో చేతులు కలిపి ఆ అకౌంట్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ సైబర్ నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో బయటపడిందన్నారు. సైబర్ నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నిందితుడు మహేష్ పాత్ర స్పష్టంగా బయటపడినట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ భరత్ పాల్గొన్నారు. -
‘మద్దతు’ ఇవ్వని మార్క్ఫెడ్!
సాక్షి ప్రతినిధి, వరంగల్: మొక్కజొన్నల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. మార్క్ఫెడ్ చాలా చోట్ల ఇంకా కొనుగోళ్లను ప్రారంభించలేదు. ఫలితంగా సిండికేట్గా మారిన ప్రైవేట్ వ్యాపారులు మార్కెట్లో ఇష్టారాజ్యంగా మొక్కజొన్నలు కొంటున్నారు. 2025–26 ఖరీఫ్ సీజన్లో కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాకు రూ.2,400 కనీస మద్దత ధర (ఎంఎస్పీ)ని ప్రకటించింది. మొక్కజొన్నల కొనుగోలు విషయంలో మార్క్ఫెడ్, ఇతర ప్రభుత్వరంగ సంస్థలు దూరంగా ఉన్నాయి. దీంతో ఖరీఫ్లో ఎలాగోలా గండం గట్కెక్కించుకున్న మొక్కజొన్న రైతులకు ఈ యాసంగిలో వ్యాపారులు చుక్కలు చూపెడుతున్నారు. క్వింటాకు రూ.1,850 నుంచి రూ.1,950 మించి ధర ఇవ్వకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. 2.11 లక్షల ఎకరాల్లో సాగు.. ఎంఎస్పీ బహు జాగు 2025–26 యాసంగి సీజన్కు సంబంధించి విత్తనాల వేసే నుంచి ఫిబ్రవరి–మే మధ్య వరకు సాగు నమోదు ఆధారంగా 2,11,500 ఎకరాల్లో మొక్కజొన్న వేసినట్లు వ్యవసాయశాఖ నివేదికలు చెబుతున్నాయి. ఈ సాగు ఆధారంగానే ఒక్కో ఎకరానికి వాతావరణ పరిస్థితుల ఆధారంగా 28 క్వింటాళ్ల నుంచి 32 వరకు వస్తుందనేది అంచనా. ఈ లెక్కన 5.92 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 6.78 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు దిగుబడి రావొచ్చని భావించి ఆ మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మార్క్ఫెడ్ సహా ఇతర ప్రభుత్వరంగ సంస్థలను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోళ్లను ప్రారంభించకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులే వ్యవసాయ మార్కెట్ కమిటీలతో పాటు నేరుగా గ్రామాలకు వెళ్లి అగ్గువసగ్గువకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ‘లాభాల మాట దేవుడెరుగు కానీ ఇంటిల్లిపాది కష్టపడినప్పటికీ పెట్టుబడులు పోను రెక్కల కష్టం కూడా మిగిలడం లేదు’ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి రూ.28,000 నుంచి రూ.40 వేలు ఖర్చు చేస్తే.. ఇప్పుడున్న ధరల ప్రకారం రూ.18.200 నుంచి రూ.23,000 వరకే మిగిలితే అప్పులు, వడ్డీలకే సరిపోతున్నాయని చెబుతున్నారు.2025–26లో జిల్లాల వారీగా మొక్కజొన్న సాగు విస్తీర్ణం.. దిక్కుతోచని స్థితిలో మొక్కజొన్న రైతులు మొక్కజొన్న వ్యాపారుల ‘సిండికేట్’.. క్వింటాకు రూ.1,950 దాటని పరిస్థితి ఎంఎస్పీ క్వింటాలుకు రూ.2,400.. ‘కనీస మద్దతు’ కోసం ఎదురుచూపులు ఉమ్మడి వరంగల్లో 2.11 లక్షల ఎకరాల్లో సాగు 7.56 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేక అన్నదాతల ఆందోళనఖర్చు అంశం సుమారు ఖర్చు రూ.లు)భూమి దున్నడం, సిద్ధం చేయడం 4,000 – 6,000 విత్తనాలు (హైబ్రిడ్) 3,000 – 4,000 ఎరువులు 5,000 – 7,000 మందులు (కీటక నివారణ) 3,000 – 5,000 కూలీల ఖర్చు 6,000 – 8,000 నీటి ఖర్చు 3,000 – 5,000 కోత – రవాణా 4,000 – 6,000 మొత్తం ఖర్చు 28,000 – 40,000 జిల్లా సాగు విస్తీర్ణం ( ఎకరాల్లో...)హనుమకొండ 58,000 వరంగల్ 46,000 జనగామ 30,150 మహబూబాబాద్ 40,230 ములుగు 20,125 జేఎస్ భూపాలపల్లి 16,995 మొత్తం 2,11,500 -
రైతులను ఆదుకోవాలి..
టీజీ మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన మక్కలను ప్రభుత్వ మద్దతు ధరకు కొనాలి. ఎకరానికి రూ.వేలల్లో పెట్టుబడులు పెట్టి చివరకు రెక్కల కష్టం కూడా పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి మొక్కజొన్న రైతులను వెంటనే ఆదుకోవాలి. – టి.సారయ్య, ఉపాధ్యక్షుడు, ఎంఏసీఎస్, మాణిక్యాపూర్, భీమదేవరపల్లి దళారులు ఇబ్బంది పెడుతున్నారు..మార్క్ఫెడ్ అధికారులు సరైన విధంగా కొనుగోలు కేంద్రాలు తెరవని కారణంగా దళారులు, ప్రైవేట్ వ్యాపారులు రంగప్రవేశం చేసి తక్కువ ధరకు మక్కలు కొంటున్నారు. ఖరీఫ్లోనూ రైతులకు మక్కలు అమ్ముకునే విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు యాసంగి మొక్కజొన్నల విషయంలో కనీస మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించాలి – రామారపు సాంబయ్య, రైతు, మాణిక్యాపూర్, భీమదేవరపల్లి -
హలో.. వైద్యసేవలు బాగున్నాయా?
లింగాలఘణపురం: ‘హలో శ్రావణీ గారా..? మేము లింగాలఘణపురం పీహెచ్సీ నుంచి మాట్లాడుతున్నాం.. వైద్య సేవలు ఎలా ఉన్నాయి..? ఏఎన్ఎంలు మీ వద్దకు వస్తున్నారా..? నెలలో ఎన్నిసార్లు పరీక్షిస్తు్ాన్నరు..? ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకుంటున్నారా..డెలివరీ ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నారు..’అంటూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పీహెచ్సీ సిబ్బంది అందిస్తున్న సేవలపై గర్భిణికి ఫోన్ చేసి తెలుసుకున్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గర్భిణుల రిజిష్ట్రర్ను చూసి అందులో ఒకరిద్దరికి వారి ఫోన్ నంబర్లకు నేరుగా ఫోన్ చేసి ఏఎన్ఎం సేవలపై ఆరా తీశారు. తాను కలెక్టర్ను మాట్లాడుతున్నానని అనకుండా పీహెచ్సీ నుంచి మాట్లాడుతున్నామంటూ గర్భిణులతో మాట్లాడారు. అంతకు ముందు సిబ్బంది అటెండెన్స్ రిజిష్ట్రర్ను పరిశీలించారు. ఓపీ డాక్టర్ గదిలో కాకుండా బయట ఏర్పాటు చేయాలని, ఆర్ఓ ప్లాంటు రోగులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ల్యాబ్, ఫార్మసీ, డెలివరీ గదులను పరిశీలించి తగిన సూచనలు చేశారు. అనంతరం ఏఎన్ఎంలతో మాట్లాడుతూ.. క్యాన్సర్ టీకా ఏ వయసు వారికి వేయాలని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డెలివరీలు అయ్యే విధంగా గర్భిణులకు అవగాహన కల్పించాలని డాక్టర్ స్వర్ణలతను ఆదేశించారు. గర్భిణులతో ఫోన్లో ఏఎన్ఎం సేవలపై కలెక్టర్ ఆరా..! పీహెచ్సీలో ఆకస్మిక తనిఖీ -
పట్టణంలోని 22వ వార్డులో..
జనగామ: పట్టణంలోని 22వ వార్డులో ఈనెల 6(శుక్రవారం)న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ తెలిపారు. గురువారం తన చాంబర్లో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, డీఈ రాజ్కుమార్, వార్డు కౌన్సిలర్ మారబోయిన పాండు తదితర అధికారులతో కలిసి ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగుతున్న ప్రజా సంక్షేమపాలనలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకా ల పురోగతిని ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ప్రజాప్రతి నిధులు పాల్గొని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పొందాలని ఆమె కోరారు. -
పెద్దల సభకు వేం నరేందర్రెడ్డి
● పేరు ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం ● నేడు నామినేషన్ దాఖలు సాక్షి, మహబూబాబాద్: రాజ్యసభ సభ్యుడిగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అత్యంత సన్నిహితుడిగా పేరున్న నరేందర్రెడ్డి ప్రస్తుతం సీఎం ముఖ్య సలహాదారుడిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ సభ్యుల స్థానంలో తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. ఏఐసీసీ కోటాలో అభిషేక్ మనుసింఘ్వీకి మరోమారు అవకాశం కల్పించగా, రాష్ట్ర కోటాలో వేం నరేందర్రెడ్డికి చాన్స్ ఇచ్చారు. ఈ మేరకు ఇరువురు నేడు(గురువారం) అసెంబ్లీ సెక్రటరీకి తమ నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన మరో నాయకుడికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.పేరు: వేం నరేందర్రెడ్డి తల్లిదండ్రులు: కృష్ణారెడ్డి, రత్నమ్మ భార్య: విజయ కుమారులు: కృష్ణభార్గవ్, కృష్ణచైతన్య గ్రామం: అర్పనపల్లి, మండలం కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా రాజకీయ అనుభవం: 2004 – 2009 వరకు మహబూబాబాద్ ఎమ్మెల్యే ప్రస్తుతం: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్య సలహాదారుడు -
నాణ్యమైన విద్యకు ‘ఆదర్శం’
జనగామ రూరల్: చదువులో ఆదర్శంగా ఉంటూ బలహీన వర్గాల విద్యార్థులకు గొప్ప అవకాశంగా ఆదర్శ పాఠశాలలు నిలుస్తున్నాయి. ఇటు ఇంగ్లిష్ మీడియం చదువులు..అటు పౌష్టికాహారం అందిస్తూ ఎంతో మంది విద్యార్థుల అభివృద్ధికి తోడ్ప డుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా జిల్లాలో పదో తరగతిలో 98 శాతం, ఇంటర్లో 95 శాతంపైగా ఉత్తీర్ణత సాధిస్తున్నాయి. ప్రస్తుతం 2026–27 సంవత్సరానికి గాను 6వ తరగతిలో 100 సీట్లు, 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలి ఉన్న పరిమిత సీట్లకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోనే అవకాశం కల్పించారు. జిల్లాలో మొత్తం 8 ఆదర్శ పాఠశాలు ఉండగా ఒక్కో పాఠశాలలో 6వ తరగతి ప్రవేశానికి 100 సీట్లు ఉన్నాయి. మిగిలిన తరగతులకు సంబంధించి ఖాళీలు భర్తీ చేయనున్నారు. జిల్లాలో చౌడారం, వెల్ది, బచ్చన్నపేట, కొడకండ్ల, లింగాల ఘణపురం, జఫర్గఢ్, స్టేషన్ ఘన్పూర్, నర్మెట మండలాల్లో పాఠశాలలున్నాయి. వారం ముందు నుంచే హాల్ టికెట్లు ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు 10వ తేదీ తర్వాత ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 6 తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్ష కోసం ఓసీ విద్యార్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 ఫీజు చెల్లించాలి.సంవత్సరం ఉత్తీర్ణతా శాతం 2021–22 94.72 2022–23 91.90 2023–24 98.14 2024–25 98.98 గ్రామీణ పేద విద్యార్థులకు గొప్ప అవకాశం ఆరు నుంచి టెన్త్ వరకు ప్రవేశాలు ఈనెల 10 వరకు దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 19న పరీక్ష.. జిల్లా వ్యాప్తంగా 8 పాఠశాలలుఆరో తరగతి ప్రవేశ పరీక్షలో 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. తెలుగు, గణితం, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఆంగ్లం పాఠ్యాంశాల్లో ఒక్కో దాని నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. 7 నుంచి 10వ తరగతి వారికి గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రం, ఇంగ్లిష్ నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో దాని నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. 2 గంటల పాటు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. -
‘అసంబద్ధ సిఫార్సులు తొలగించాలి’
జనగామ రూరల్: తెలంగాణ విద్యాకమిషన్ సమర్పించిన విధానపత్రంలోని పలు అసంబద్ధ సిఫార్సులను తక్షణమే తొలిగించాలని ఏపీటీఎఫ్ పూర్వాధ్యక్షుడు ఎ.నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. టీపీటీఎఫ్ జిల్లా సబ్ కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు ఎన్ఎన్ రాజు అధ్యక్షతన పట్టణంలోని ఉమాపతి భవన్లో జరిగింది. ఈసందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల ఉత్తీర్ణత మార్కులను 45 శాతానికి పెంచడమనేది విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసేదిగా ఉందని, ఫలితంగా డ్రాపౌట్లు పెరిగే ప్రమాదముందన్నారు. వివిధ ప్రవేశ పరీక్షల రద్దు అనేది కార్పొరేట్ విద్యాసంస్థలకు ఊతమిచ్చేదిగా ఉందన్నారు. పేద విద్యార్థులకు అందజేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేయాలని అనడం సమంజసం కాదన్నారు. ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువని, జీతం కోతపెట్టాలని సూచించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంకుశావళి, జిల్లా పూర్వ అధ్యక్షుడు బి లక్ష్మయ్య, జిల్లా బాధ్యులు శారద, కవిత, రాజారెడ్డి, లక్ష్మణ్ జి, రాజేందర్, వెంకన్న, శ్రీహరి, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్రిటిజల్ సమస్య!
జనగామ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి పరిధిలో చంపక్హిల్స్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ విభాగం త్వరలో ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందించడానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఆమోదించిన ఈ ప్రత్యేక విభాగం జిల్లా ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన సంరక్షణ అందించడమే ముఖ్య ఉద్దేశం. అత్యవసర ఆరోగ్య పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే సేవలను మరింత బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న క్రిటికల్ కేర్ భవనంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ), హైడిపెండెన్సీ యూనిట్ (హెచ్డీయూ), ఐసోలేషన్ వార్డులు, మేజర్ ఆపరేషన్ థియేటర్లు, డయాలిసిస్ యూనిట్, మెటర్నిటీ క్రిటికల్ కేర్, సీటీ స్కాన్, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఈఎండీ వార్డు వంటి విభాగాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి అత్యవసర వైద్యసేవలు, ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులకు 24 గంటల పర్యవేక్షణ, అత్యున్నత స్థాయి చికిత్సలు అందించేలా రూపుదిద్దుకుంటున్నాయి. వెంటిలేటర్ సపోర్ట్, కార్డియాక్ మానిటరింగ్, సెప్సిస్ (ఇన్ఫెక్షన్లకు శరీరం చూపే అతి తీవ్రమైన ప్రతిస్పందన), స్ట్రోక్, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి తక్షణ శస్త్రచికిత్స, నిరంతర పర్యవేక్షణ వంటి సేవలు ఈ ఐసీయూలో అందుబాటులో ఉంటాయి. హెచ్డీయూ యూనిట్లో ఐసీయూ నుంచి కోలుకుంటున్న లేదా అత్యవసర పరిస్థితికి దగ్గరలో ఉన్న రోగులకు మధ్యస్థ సంరక్షణను అందించడానికి ఉపయోగపడుతుంది. కాగా ఐసోలేషన్ వార్డులు వైరల్, ఎపిడెమిక్ వ్యాధుల బారినపడిన రోగులను వేరుగా ఉంచి చికిత్స చేయడానికి ముఖ్యపాత్ర పోషిస్తాయి. క్రిటికల్ డెలివరీ కేసులకు మెటర్నిటీ క్రిటికల్ యూనిట్ ఉపయోగకరంగా ఉంటుంది. సీటీస్కాన్, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ వంటి ఆధునిక నిర్ధారణ పరికరాలు ఉండటం వల్ల అత్యవసర కేసులను తక్షణమే గుర్తించి చికిత్స ప్రారంభించే అవకాశం కలుగుతుంది. ప్రమాదాలు, గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోక్లు, విషతుల్యత్వం, భారీ రక్తస్రావం వంటి పరిస్థితుల్లో ఈ విభాగం ప్రాణరక్షణకు కీలకంగా నిలుస్తుంది. జిల్లా ప్రజలకు అత్యవసర వైద్య సేవల నాణ్యత పెంచడమే కాకుండా, హనుమకొండ, హైదరాబాద్ వంటి దూరప్రాంతాలకు వెళ్లకుండా జిల్లా కేంద్రంలోనే ఉన్నతస్థాయి చికిత్స అందించడంలో క్రిటికల్ కేర్ విభాగం కీలక పాత్ర పోషించనుంది. ఈ విభాగం పూర్తిస్థాయిలో అందుబాటు లోకి వస్తే జిల్లా ఆరోగ్య వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అనుబంధంగా నిర్మించిన క్రిటికల్ కేర్ భవనం పూర్తై నెల రోజులైనా ప్రారంభానికి నోచుకోవడం లేదు. చంపక్హిల్స్ ప్రాంతం కొండల ప్రదేశం కావడంతో అక్కడ వేసిన బోర్లు వెయ్యి అడుగుల లోతు దాటినా నీరు రాకపోవడం పెద్ద సమస్యగా మారింది. భవనం పూర్తిస్థాయిలో ప్రారంభమైతే నీటి కొరత తీవ్రంగా తలెత్తే అవకాశం ఉండడంతో ఆసుపత్రి వర్గాలు.. కాంట్రాక్టర్ నుంచి భవనాన్ని స్వాధీనం చేసుకోవడం లేదు. క్రిటికల్ కేర్కు నీటి సమస్యపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం ఆధ్వర్యంలో కలెక్టర్కు రిప్రజెంటేషన్ అందించారు. నీటి సమస్య పరిష్కారంపై అధికార యంత్రాంగం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నీటి వనరులపై స్పష్టత రాకపోవడంతో క్రిటికల్ కేర్ భవనం స్వాధీనం చేసుకోవడంలో వాయిదా పడుతోంది. నీటి సమస్యకు పరిష్కారం చూపే వరకు భవనం బాధ్యతలు స్వీకరించేందుకు వారు ముందుకు రావడం లేదు.ఎంసీహెచ్ ఆవరణలో 50 పడకల క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్ నిర్మాణం పూర్తయింది. మొత్తం రూ.23.75 కోట్లు వ్యయంతో నిర్మాణం చేపట్టారు. 22 ఎకరాల విస్తీర్ణంలో రెండు అంతస్థుల నిర్మాణం చేపట్టారు. భవన ప్రదేశం 42,691 చదరపు అడుగులు ఉండగా, ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ 24,541 చదరపు అడుగులు, మొదటి అంతస్థు 18,150 చదరపు అడుగుల వైశాల్యంలో ఉంది. మే 2023లో ప్రారంభమైన క్రిటికల్ కేర్ భవన నిర్మాణం మార్చి 2025లో పూర్తి చేశారు. ఆపరేషన్ థియేటర్లు: 2 ఐసోలేషన్ రూములు: 2 ఎగ్జామినేషన్ రూం డయాలిసిస్ రూం మెటర్నిటీ వార్డు ఎల్డీఆర్ ఈఎండీ వార్డుసీటీ స్కాన్ ఎక్స్–రే అబ్జర్వేషన్ రూమ్ అల్ట్రాసౌండ్ ఫస్ట్ ఫ్లోర్: ఐసోలేషన్ వార్డులు:6 ఐసీయూ హెచ్డీయూ వెయ్యి అడుగుల లోతు బోరు వేసినా కనిపించని చుక్కనీరు నీటివనరులపై రాని స్పష్టత కలెక్టర్కు నివేదించిన జిల్లా వైద్యశాఖ అధికారులు -
జిల్లాల వారీగా 9వ తరగతి విద్యార్థులు
హనుమకొండ 15,812 వరంగల్ 11,398ములుగు 3,535మహబూబాబాద్ 7,728జేఎస్ భూపాలపల్లి 3,908 జనగామ 6,560 7 కేంద్రాల్లో నిర్వహణ.. ఇస్రో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), సుళ్లూరుపేట (ఏపీ), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), షిల్లాంగ్(మేఘాలయ). ఎవరు అర్హులంటే.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. స్పేస్, సైన్స్ క్లబ్లో ఉంటే 5 శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాల్లో ఉంటే 5 శాతం, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి 20 శాతం ప్రాధాన్యం ఇస్తారు. ● -
అంకితభావంతోనే సంస్థకు మంచిపేరు
● లైన్మెన్ దినోత్సవంలో ఎస్ఈ సంపత్రెడ్డి జనగామ: ఎన్పీడీసీఎల్ సంస్థలో పనిచేస్తున్న లైన్మెన్ల అంకితభావం, నిబద్ధతతోనే సంస్థకు మంచిపేరు వస్తుందని ఎస్ఈ సంపత్రెడ్డి అన్నారు. లైన్మెన్ దినోత్సవం పురస్కరించుకుని బుధవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయ ఆవరణలో వేడుకలను నిర్వహించారు. అనంతరం ఎస్ఈ మాట్లాడుతూ.. విద్యుత్ విభాగంలో అహర్నిశలు శ్రమిస్తూ ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించే లైన్మెన్ సేవలు ప్రశంసనీయమన్నారు. లైన్మెన్ల సేవలకు గుర్తింపుగా సత్కరించి, ప్రశంసపత్రాలు, పోల్ కై ్లంబింగ్ క్లాంపులు అందజేసి వారి సేవాభావాన్ని అభినందించారు. డీఈలు గణేష్, లక్ష్మీనారాయణరెడ్డి, సబ్డివిజన్ ఏడీఈ వేణుగోపాల్, ఏఈలు సౌమ్య, చంద్రమోహన్, రూరల్ ఏఈఈ మధు, సబ్ ఇంజనీర్లు మనో హర్, కృప, టౌన్–1, టౌన్–2, రూరల్ సిబ్బందితో పాటు ఎఫ్ఎం, ఎస్ఎల్ఐ, ఎల్ఎం, ఏఎల్ఎం, జేఎల్ఎం, ఆర్టిజన్స్, కట్టర్స్ పాల్గొన్నారు. -
ఆలయాల ద్వారబంధనం
పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 8 గంటలకు ఆలయం ద్వారబంధనం చేశారు. శ్రీ సిద్ధేశ్వరాలయం.. బచ్చన్నపేట: మండలంలోని కొడవటూర్ గ్రామంలోని శ్రీ సిద్ధేశ్వరాలయాన్ని చంద్ర గ్రహణం సందర్భంగా మూసివేసినట్లు ఆలయ ఈఓ చిందం వంశీ, ప్రధాన అర్చకులు ఓం నమశివాయ తెలిపారు. చిల్పూరు ఆలయం.. చిల్పూరు: చిల్పూరుగుట్ట శ్రీబుగులు వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మంగళవారం ఉదయం 9 గంటలకు చంద్రగ్రహణం సందర్భంగా ఆలయ అర్చకులు ద్వారబంధనం చేశారు. -
అంగన్వాడీలకు వెలుగులు
366 సెంటర్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్లుజిల్లాలో అంగన్వాడీ సెంటర్ల వివరాలుఅంగన్వాడీలు : 695 శాశ్వత భవనాలు : 243అద్దెభవనాలు : 178నూతన విద్యుత్ కనెక్షన్లు : 366ఖర్చు (రూ.లక్షలు) : 26.25ప్రైవేటులో అద్దెలేని భవనాలు : 274 గర్భిణులు : 2,419 బాలింతలు : 2,393 7 నెలల నుంచి 3 ఏళ్ల పిల్లలు : 11,7443 నుంచి 6 ఏళ్ల పిల్లలు : 8,818 జనగామ: జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యాన్ని అందించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) చర్యలు చేపట్టింది. చిన్నారుల అభ్యున్నతి కోసం అంకితభావంతో పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత విద్యుత్ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ఆదేశాల మేరకు కనెక్షన్ల ప్రక్రియను వేగవంతంగా చేస్తున్నారు. జిల్లాలో 695 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి పర్యవేక్షణలో ఇందులో 366 చోట్ల శాశ్వత విద్యుత్ కనెక్షన్లను ఏర్పాటు చేస్తున్నారు. కీలకంగా విద్యుత్ వినియోగం ప్రీస్కూల్ పేరుతో కొనసాగుతున్న అంగన్వాడీ సేవలను పొందుతున్న వారి సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతుండడంతో విద్యుత్ సౌకర్యం అత్యంత కీలకంగా మారింది. 329 సెంటర్లకు విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 366 చోట్ల జీపీ, ఇతర భవనాల నుంచి తాత్కాలిక పద్ధతిలో కనెక్షన్లు ఇచ్చి నడిపిస్తున్నారు. పిల్లలకు అందించే ప్రీస్కూల్ కార్యకలాపాలు, పోషక ఆహార పంపిణీ, ఆరోగ్య పరీక్షలు, వేసవి కాలంలో తాగునీటి సౌకర్యం, వెంటిలేషన్ కోసం ఫ్యాన్లు వంటి సేవలకు విద్యుత్ కీలకంగా ఉండడంతో శాశ్వత ప్రాతిపదికన చేపట్టిన ఈ చర్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 366 అంగన్వాడీలకు ఉచిత కనెక్షన్లు జిల్లాలో ఇప్పటివరకు విద్యుత్ కనెక్షన్ల్లు లేని 366 అంగన్వాడీలను గుర్తించి, వీటికి మొత్తం రూ.26.25 లక్షల వ్యయంతో ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ లేని కేంద్రాలన్నింటినీ మ్యాపింగ్ చేసి, దశల వారీగా కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. ముందుగా పాఠశాలలు లేదా ఇతర సంస్థల సౌకర్యాలతో విద్యుత్ ఉపయోగిస్తున్న కేంద్రాలకు కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా శాశ్వత సర్వీస్ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా ఎన్పీడీసీఎల్ టీంలు 366 అంగనన్వాడీలకు మీటర్లు బిగించి, సర్వీస్ వైర్లు వేసి కనెక్షన్లు పూర్తిచేశారు. వైరింగ్ పనులు, స్టేఫ్టీ పరికరాలు, తాగునీటి మోటార్లు, లైటింగ్ తదితర పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ మొత్తం ప్రక్రియ పూర్తిగా ఉచితంగా జరుగుతుండటం పేద ప్రాంతాల్లోని అంగన్వాడీలకు పెద్ద ఉపశమనం కలిగించింది. పిల్లల అభ్యాసానికి మెరుగైన వాతావరణంఅంగన్వాడీలకు విద్యుత్ వెలుగులు చేరడంతో చిన్నారులు సౌకర్యవంతమైన వాతావరణంలో విద్య ను అభ్యసించే అవకాశం ఉంటుంది. వేసవిలో ఫ్యాన్లు, బోరు మోటార్లు పనిచేయడం వల్ల పిల్లలు, గర్భిణులు, బాలింతలు, సేవలు పొందగలుగుతున్నారు. అంగన్వాడీల ఆధునీకరణలో ఎన్పీడీసీఎల్ పాత్ర కీలకంగా ఉంది. జిల్లాలో రూ.26.25 లక్షల బడ్జెట్తో 366 కేంద్రాలకు శాశ్వత ప్రాతిపదికన కనెక్షన్లు ఇవ్వగా, అవసరమైన చోట విద్యుత్ పోల్స్ సైతం ఏర్పాటు చేశాం. – సంపత్రెడ్డి, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్ రూ.26.25లక్షల బడ్జెట్ కేటాయింపులు ప్రీస్కూల్ కార్యక్రమాలకు మెరుగైన వాతావరణం -
దశాబ్దకాలం లేట్ !
3వలైన్..సాక్షిప్రతినిధి, వరంగల్: ‘మీరు ఎక్కాల్సిన రైలు.. జీవితకాలం లేట్ అన్నట్లు.. కాజీపేట–విజయవాడ రైల్వే మూడోలైన్ పనులు దశాబ్దకాలమైనా పూర్తికావడం లేదు. దక్షిణమధ్య రైల్వే డివిజన్ పరిధిలోని ఈ పనులు ప్రారంభమై సంవత్సరాలు గడిచినా ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. సుమారు 219.64 కిలోమీటర్లు నిర్మాణ పనులకు 2012–13లో ప్రతిపాదనలు చేశారు. 2016–17లో అధికారికంగా ఆమోదించి ప్రారంభించారు. హైదరాబాద్–చైన్నె, ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో అత్యంత కీలకమైనదిగా ఈ ప్రాజెక్టును తీసుకున్నారు. అయితే, కాజీపేట–విజయవాడ మూడో లైన్ నిర్మాణ పనులు అప్పటి నుంచి నెమ్మదిగా సాగుతున్నాయి. ఖమ్మం–డోర్నకల్ మధ్య 44.624 కిలోమీటర్ల నిర్మాణం కోసం భూసేకరణ సమస్యగా మారింది. ఇటీవల రైల్వే బడ్జెట్ సందర్భంగా కూడా ఈ మూడోలైన్పై చర్చ జరిగింది. కాగా, రూ.2,063 కోట్లతో జరుగుతున్న ఈ పనులను ఇప్పటికై నా వీలైనంత తొందరగా పూర్తి చేస్తే గూడ్స్, ప్యాసింజర్ రైళ్ల ట్రాఫిక్ సమస్య తగ్గి ప్రాజెక్టుకు మోక్షం కలగనుంది. ముందుకుసాగని 28 హెక్టార్ల భూసేకరణ.. కాజీపేట–విజయవాడ రైల్వే మూడో లైన్కు 2017 లో శంకుస్థాపన జరిగింది. ఇందుకోసం తెలంగాణలో 145, ఆంధ్రప్రదేశ్లో 173 కలిపి మొత్తం 318 హెక్టార్లకు పనులు జరిగిన కొద్దీ 290 హెక్టార్లు సేకరించారు. సుమారు 28 హెక్టార్ల భూసేకరణ ముందుకు సాగని కారణంగా పనులు మందగించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, పనుల ప్రారంభసమయంలో రూ.1,952 కోట్లుండగా.. రోజులు గడిచిన కొద్ది రూ.2,063 కోట్లకు చేరింది. 2023–24 నుంచే వేగం ఈ ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగింది. ఈ మూడేళ్లలోనే రూ.1,070 కోట్ల వరకు ఇచ్చారు. 2023–24లో రూ.350 కోట్లు, 2024–25లో రూ.420 కోట్లు, 2025–26లో (చివరి పనుల కోసం) రూ.300 కోట్లు విడుదల చేశారు. 44.624 కిలోమీటర్ల నిర్మాణమే కీలకం.. హైదరాబాద్–చైన్నె, ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో ట్రాఫిక్ను తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఈ కీలక ప్రాజెక్టును తీసుకుంది. ఇందులో బల్లార్షా–కాజీపేట, కాజీపేట–విజయవాడ మధ్యన మూడో లైన్కు శ్రీకారం చుట్టింది. బల్లార్షా–కాజీపేట మధ్యన 202 కిలోమీటర్లకు 183.285 కిమీ పూర్తయి 18.715 కిమీ నిర్మాణం ప్రోగ్రెస్లో ఉన్నట్లు రైల్వే నివేదికలు పేర్కొంటున్నాయి. అదేవిధంగా కాజీపేట–విజయవాడ మధ్యన 219.64 కిమీకు 175.016 కిమీ పూర్తికాగా 44.624 కిమీ మేర బ్యాలెన్స్ ఉంది. ఖమ్మం–డోర్నకల్ మధ్య 19.59 కిమీ, డోర్నకల్–మహబూబాబాద్ మధ్య 25.034 కిమీ మేర రైల్వేలైన్ నిర్మాణం పనులు పూర్తి చేయాల్సి ఉంది. 28 హెక్టార్ల భూసేకరణ పెండింగ్లో ఉండడంతో పనులు నెమ్మదించాయని, ఇటీవలే భూసేకరణ పూర్తయి పనులు ప్రారంభించామని, త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. పదేళ్లయినా అసంపూర్తిగా కాజీపేట–విజయవాడ రైల్వే లైన్ పనులు ఉమ్మడి వరంగల్ నుంచి ఢిల్లీ, చైన్నె మార్గాల్లో వెళ్లడానికి.. ఆ ప్రాంతాలకు వస్తు రవాణా చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో రైళ్ల రద్దీ తగ్గి వేగం పెరగనుంది. ప్రస్తుతం కాజీపేట–విజయవాడ మార్గం రైల్వేకు అధిక ఆదాయాన్ని సమకూర్చే మార్గాల్లో ఒకటి. ప్రస్తుతం ఉన్న రెండు లైన్లు ఈ రద్దీని తట్టుకోలేక తరచూ నిండిపోతున్నాయి. దీని ఫలితంగా ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను నిలిపివేసి ఆదాయం సమకూర్చే గూడ్స్ రైళ్లకు గ్రీన్సిగ్నల్ ఇవ్వాల్సి వస్తోంది. ఈకారణంతో ప్రయాణికుల రైళ్లు ఆలస్యమవుతున్నాయి. మూడోలైన్ అందుబాటులోకి వస్తే రద్దీ నియంత్రించడంలో సాయపడుతుంది.ఈ మార్గంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య 219.64 కిలోమీటర్లు.. రూ.1,952.68 కోట్ల నిధులు 2016–17లో రూ.3,103.99 కోట్లకు అంచనాలు భూసేకరణ, నిధుల కొరతే అసలు సమస్య -
కల్యాణం.. కమనీయం
దేవరుప్పుల : ఏటా హోలీతో ప్రారంభమయ్యే శ్రీ వానకొండ లక్ష్మీనర్సింహ్మస్వామి జాతర పురస్కరించుకొని స్వామివారి కల్యాణమహోత్సవం జరిగింది. మంగళవారం గ్రహణం ఉండడంతో వేదబ్రహ్మణుల సూచనల మేరకు ఉదయం పది గంటలలోపు దేవతమూర్తుల కల్యాణ మహోత్సవం పూర్తి చేసేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలోనే గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో వేసిన కమిటీ సభ్యులు పూర్వపు తంతు మేరకు హనుమాన్ ఆలయం నుంచి స్థానిక సర్పంచ్ భాషిపాక రాములు దంపతులు తలంబ్రాలు తీసుకొని ముందస్తుగానే గుట్టపైకి చేరారు. కాగా గ్రహణంతో నిర్దిష్ట వేళకు కల్యాణం చేయాలనే పూజారుల సంకల్పంతో గుట్ట ముఖద్వారం(ఆర్చి)వద్ద ప్రత్యేక పూజలచే దేవాదాయ శాఖచే నియమించిన తాత్కాలిక ఆలయ కమిటీ చైర్మన్ మాసంపెల్లి భాస్కర్, వైస్ చైర్మన్ కాడవేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో తలంబ్రాలతోపాటు పుస్తెమట్టెలు, జిలుకర బెల్లంతో గుట్టపైకి చేరారు. అలాగే పద్మశాలీలు నల్ల ఉపేందర్, గుడెల్లి శ్రీనివాస్ తదితరులు ఆనవాయితీగా ట్రాక్టర్పై మగ్గంనేస్తూ ఆలయం వరకూ చేరుకొని నూతన వస్త్రాలను అందించారు. కాగా ఆలయ పూజారీ బీట్కూరి సంపత్కుమారచార్యులు వివాదాలకు తావివ్వకుండా ఇరువురు తలంబ్రాలు స్వీకరించి కల్యాణం పూర్తి చేశారు. దేవాదాయ శాఖ తాత్కాలిక కమిటీ చైర్మన్ మాసంపెల్లి భాస్కర్ సహకారంతో పూజారులు అన్నప్రసాద వితరణ చేశారు. వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య నేతృత్వంలో పాలకుర్తి సీఐ జానకిరామిరెడ్డి, స్థానిక ఎస్సై ఊర సృజన్కుమార్ బఽందోబస్తు చేపట్టారు. కార్యక్రమాల్లో సర్పంచ్లు భాషిపాక రాములు, ధారావత్ సుజాత, లాకావత్ అనిత, టీపీసీసీ సభ్యులు లక్ష్మీనారాయణ నాయక్, విజయ డెయిరీ జిల్లా చైర్మన్ఽ ధర్మారెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వైభవంగా శ్రీవానకొండ లక్ష్మీనర్సింహ్మస్వామి వివాహ మహోత్సవం -
సమస్యలకు పరిష్కారం చూ‘పెట్టే’
జఫర్గఢ్: గురుకులాల్లో విద్యార్థులు నిత్యం చిన్నచిన్న సమస్యలతో ఆందోళనకు గురై మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. సమస్యను బైటకు చెప్పుకోలేక లోలోన ఇబ్బందులు పడుతుండడం వల్ల చదువులపై ప్రభావాన్ని చూపుతున్నది. దీన్నించి విద్యార్థులు బైటపడేందుకుగాను ప్రభుత్వం గురుకులాల్లో నూతనంగా ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేవారు. ప్రతీ పాఠశాలలో ప్రతీ శుక్రవారం తెరువాల్సిన విద్యార్థుల ఫిర్యాదుల పెట్టెను జఫర్గఢ్ గురుకుల పాఠశాలలో మాత్రం ప్రతీరోజు తెరిచి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపుతూ ఇతర గురుకులాలకు అదర్శంగా నిలుస్తున్నది. మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్మిడియట్ వరకు 600 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. చదువుల విషయంలోగాని, భోజన నాణ్యతలోగాని, తోటి విద్యార్థుల మధ్య ఏర్పడే సమస్యల పరిష్కారం కోసం వీరు తమ సమస్యలను రాసి ఫిర్యాదు బాక్స్లో వేయాల్సి ఉంటుంది. కాగా ఈ పెట్టెను వారం రోజులకు ఒకసారి తెరిచి బాక్స్లో పడిన ఫిర్యాదులను పరిశీలించి వాటి పరిష్కారానికి మార్గం చూపాలి. కానీ ఈ గురుకుల పాఠశాలలో మాత్రం పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్.వరలక్ష్మి ప్రత్యేకంగా ప్రతీ రోజు ఫిర్యాదుల పెట్టేను తెరిచి సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. జఫర్గఢ్ గురుకుల పాఠశాలలో సరికొత్త ఒరవడి -
సోమనాథుడికి దీపారాధన
పాలకుర్తి టౌన్: తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుడి 787వ దీపారాధన మంగళవారం పాలకుర్తిలోని సోమనాథ స్మృతివనంలో మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సోమనాథ కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాపోలు సత్యనారాయణ అధ్యక్షత వహించగా పోతన సాహిత్య కళా వేదిక అధ్యక్షుడు మాన్యపు భుజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేవస్థాన ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న శివాచార్య సంయోజకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో వీరమనేని వేంకటేశ్వరరావు, మార్గం లక్ష్మీనారాయణ, ఇమ్మడి దామోదర్, బజ్జూరి వేణుగోపాల్, మేరుగు మధుసూదన్, కూరపాటి సుదర్శన్, సింగ మహేందర్ రాజు, గూడూరు నిరంజన్, బెల్లి యాకయ్య, మమత తదితరులు పాల్గొన్నారు. 6న ఉద్యోగ మేళాజనగామ: జిల్లా ఉద్యోగ కల్పన శాఖ, డీఆర్డీఏ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలను అందించేందుకు ప్రైవేట్ జాబ్స్ ప్లేస్మెంట్స్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఈ నెల 6వ తేదీ (శుక్రవారం) ఉదయం 10.30 గంటలకు జనగామ మున్సిపల్ కాంప్లెక్స్ కాన్ఫరెన్స్ హాల్లో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉద్యోగ మేళాలో ప్రముఖ పరిశ్రమ సంస్థ మహీంద్రా, మహీంద్రా లిమిటెడ్ తన జహీరాబాద్ ఆటోమోటివ్ విభాగంలో ఖాళీగా ఉన్న 300 అప్రెంటిస్షిప్ పోస్టులను భర్తీ చేయనుంది. పురుషులు, మహిళలు ఇద్దరూ హాజరుకావచ్చు. అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్, విద్యార్హత సర్టిఫికెట్లు, అవసరమైన ఇతర పత్రాలు తీసుకుని ఇంటర్వ్యూకు హాజరవ్వాలని జిల్లా ఉద్యోగ కల్పనాధికారి పి.సాహితి సూచించారు. ఉద్యోగ మేళా పూర్తిగా ఉచితం కాగా, ఆసక్తిగల యువత ఈ అ వకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. మరింత సమాచారం కోసం 7995430401, 9948695910 నంబర్లలో సంప్రదించాలన్నారు. నిట్తో ఎన్ఐజీఎస్టీ ఎంఓయూకాజీపేట అర్బన్: నిట్ వరంగల్తో ఎన్ఐజీఐఎస్టీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ) సర్వే ఆఫ్ ఇండియా మంగళవారం పరస్పర ఒప్పందం కుదుర్చుకుంది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, ఎన్ఐజీఎస్టీ డైరెక్టర్, సీనియర్ అధి కారి బీసీ పరీదా పరస్పరం ఎంఓయూ పత్రాలను మార్చుకున్నారు. కార్యక్రమంలో ఎన్ఐజీఎస్టీ ప్రతినిధులు నిత్యానందం, వెంకయ్యచౌదరి, నిట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. బ్యాంకు పేరిట నకిలీ పత్రాలు సృష్టించిన టీచర్?కాళోజీ సెంటర్: ప్రతీ ఆర్థిక సంవత్సరం ఉద్యోగులు ఆదాయ పన్ను లెక్కలు సమర్పించడం సాధారణ ప్రక్రియ. అయితే ఇందుకు సంబంధించిన ఓ ఉపాధ్యాయుడు ఏకంగా ఓ ప్రముఖ జాతీయ బ్యాంకు పత్రాలను సృష్టించి ఆదాయ పన్ను శాఖ అధికారులను పక్కదోవ పట్టించినట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యారుణంపై భారీ మొత్తంలో వడ్డీ చెల్లించినట్లు చూపుతూ సుమారు రూ.8.10 లక్షల మేర నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించి లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణలు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై బ్యాంకు అధికారులు విచారణ చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపడితే అసలు విషయం వెలుగులోకి రావడమే కాకుండా మరి కొంతమంది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయమై కాంప్లెక్స్ హెచ్ఎంను వివరణ కోరగా ఈ విషయం మా దృష్టికి రాలేదని చెప్పారు. -
ఆకాశంలో అద్భుతం
కనువిందు చేసిన రెడ్ మూన్ ● 3.27 గంటల సేపు చంద్రగ్రహణం పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమైన గ్రహణం సాయంత్రం 6.47 గంటలకు వీడింది. మొత్తం 3.27 గంటల సేపు ఎరుపు వర్ణంలో (రెడ్ మూన్) చంద్రుడు పలు విధాలుగా కనువిందు చేశాడు. వంద సంవత్సరాల తర్వాత రంగుల పండుగ హోలీ రోజున వచ్చిన చంద్రగ్రహణాన్ని ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. – సాక్షి స్టాఫ్ఫొటోగ్రాఫర్, హన్మకొండ 6:56 -
వైభవంగా తిరువీధియాత్ర
స్టేషన్ఘన్పూర్: పట్టణ కేంద్రంలోని శ్రీతిరుమలనాథస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారి తిరువీధియాత్ర, రథోత్సవం, డోపు ఉత్సవం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కలకోట రంగాచార్యులు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఆలయంలో స్వామివారికి ప్రధాన పూజలు చేపట్టారు. అనంతరం స్వామివారిని అశ్వవాహనంపై ఉంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా రథోత్సవం నిర్వహించారు. తిరువీధియాత్రతో పట్టణకేంద్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కార్యక్రమంలో ఘన్పూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, దేవస్థాన చైర్మన్ నీల నర్సింహులు, వైస్ చైర్మన్ తాటికొండ యాదగిరి, డైరెక్టర్ గట్టు ప్రశాంత్, కొలిపాక సతీష్, భక్తులు పాల్గొన్నారు. -
పీహెచ్సీల వారీగా గుర్తించిన బాలికల వివరాలు
జనగామ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 14 ఏళ్ల నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని గత నెల 28 నుంచి చేపట్టింది. రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ నుంచి వర్చువల్గా ప్రధానమంత్రి మోదీ, హైదరాబాద్ కింగ్కోఠి ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. ఈ టీకాను గర్భాశయ (సర్వైకల్) క్యాన్సర్కు అడ్డుకట్ట వేయడానికి రూపొందించారు. టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని బాలికల ఆరోగ్య సంరక్షణకు ఇది ముఖ్యమని వైద్యాధికారులు చెబుతున్నారు. టీకా ప్రాముఖ్యం ఇదే.. హెచ్పీవీ అంటువ్యాధి కారణంగా ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్ కేసులు వస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ గర్భాశయ కణజాలం సహా ఇతర యోనిరహిత కణజాలాల వద్ద క్యాన్సర్కు అడ్డుకట్ట వేస్తుంది. క్యాన్సర్ను నివారించేందుకు ముందస్తుగా ఈ టీకా వేస్తారు. వ్యాక్సిన్ వైరస్ రాకముందే అందించడం వల్ల అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందుకే కేంద్రం 14 నుంచి15 సంవత్సరాల బాలికలను లక్ష్యంగా చేసుకుంది. రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈ టీకాను వేయించుకోవచ్చు. హెచ్పీవీ టీకా పక్కనే క్యాన్సర్ను ప్రథమ దశలోనే కనుక్కునేందుకు చేసే పాప్ స్మెర్ పరీక్షలు వంటి ఇతర నివారణ చర్యలతో మహిళల ఆరోగ్య రక్షణను బలోపేతం చేస్తుంది. కార్యక్రమం విధానం.. ప్రోగ్రాంలో బాలికలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కేవలం ఒకేసారి గార్డాసిల్–4 టీకా తీస్తారు. ఇది హెచ్పీవీ రోగానికి ముఖ్యమైన రకాలైన 16, 18 వంటి రకాలపై రక్షణ ఇస్తుంది. ఈ టీకా కోసం తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతి తప్పనిసరి. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ హెచ్పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా ప్రతి సంవత్సరం 14 ఏళ్ల బాలికలను టీకా ద్వారా రక్షించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు సంబంధించిన క్యాన్సర్ రుగ్మతను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. జిల్లాలో 5,674 మంది బాలికలు జిల్లాలో 16 పీహెచ్సీల పరిధిలో 14 ఏళ్లలోపు బాలికలు 5,674 మంది ఉన్నట్లు ఆశా, అంగన్వాడీ, లింక్ వర్కర్ల సర్వేలో వెల్లడైంది. జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో ఇమ్యునైజేషన్ అధికారి పర్యవేక్షణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఇంటింటికీ చేపట్టిన సర్వేలో 14 ఏళ్ల లోపు బాలికల సంఖ్యపై ప్రత్యేక గణన పూర్తయ్యింది. జిల్లాలో ఏఎన్ఎంలు 161, ఆశలు 507, అంగన్వాడీలు 695, లింకు వర్కర్లు 78 మంది ఉన్నారు. జనాభా ఎస్హెచ్జీ లెక్కల ప్రకారం అంచనా వేసిన ఒక శాతంతో 14 ఏళ్లలోపు బాలికలు 5,395 మంది ఉండాలి. అయితే వాస్తవ సర్వేలో అంచనా లెక్కల కంటే ఎక్కువగా బాలికలు 5,674 మంది ఉన్నట్లు గుర్తించారు.పీహెచ్సీ బాలికలు ఓబుల్కేశ్వాపూర్ 139 లిం.ఘణపురం 285 నర్మెట్ట 287 రఘునాథపల్లి 403 దేవరుప్పుల 204 బచ్చన్నపేట 274 జనగామ అర్బన్ పీహెచ్సీ 1,151 పీహెచ్సీ బాలికలు స్టే.ఘన్పూర్ 220 తాటికొండ 65 ఇప్పగూడెం 54 మల్కపూర్ 258 జఫర్గఢ్ 438 కూనూర్ 130 పాలకుర్తి 1,194 కొడకండ్ల 421 కోమల్ల 151 -
ఆవేదన విన్నారు.. ఆరోగ్యపరిస్థితి తెలుసుకున్నారు
మా భూమిలో 60 ఏళ్లుగా మా వంశీకులు చనిపోతే గోరీలు నిర్మించుకుంటూ వస్తున్నాం. అయితే ఇటీవల కొంతమంది వ్యక్తులు వచ్చి భూమి తమదంటూ మా పూర్వీకుల గోరీలను కూలగొట్టి ఆ ప్రదేశాన్ని ఆక్రమించారు. ఈ పరిస్థితిని వివరించేందుకు దరఖాస్తుతో కలెక్టర్ సార్ను కలిసి మా ఆవేదన వ్యక్తం చేయడానికి వచ్చాం. నా మోచేతి వాపును చూసిన కలెక్టర్ నన్ను ఏమైందని అడిగారు. తేలు కరిచిందని, నొప్పితో పాటు జ్వరం కూడా ఉందని చెప్పితే వెంటనే అక్కడున్న సిబ్బందిని పిలిచి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాలని ఆదేశించారు. వారు హాస్పిటల్ తీసుకెళ్లగా డాక్టర్లు పరీక్షలుచేసి, గోలీలు ఇచ్చారు. మా సమస్యను వినడమే కాకుండా మా ఆరోగ్యంపై శ్రద్ధ చూపిన సార్కు కృతజ్ఞతలు. – చెరుకు సోమనరసయ్య, కొడకండ్ల -
రోడ్డు ఇక విశాలం..
జనగామ: పట్టణంలోని కృష్ణ కళామందిర్ గల్లీలో వ్యాపార సంస్థల యజమానులు రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన హోర్డింగ్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. ‘రోడ్డెక్కిన హోర్డింగ్లు’ శీర్షికన సాక్షి దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు మధ్యన ఉన్న మూడు భారీ హోర్డింగ్లతో పాటు చిన్న చిన్న ప్రచార బోర్డులను తీసి వేయించారు. ఈ విషయమై జీఎంఆర్ కాలనీకి చెందిన శివ అనే వ్యక్తి కలెక్టర్కు ఫిర్యాదు చేయగా, అప్పటికే తొలగించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దారిలో రాకపోకలకు ఇబ్బందులు తొలగడంతో బాటసారులు, వాహనా చోదకులు సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు. -
రాహుల్గాంధీని సన్మానించిన ధన్వంతి
జనగామ: వికారాబాద్ జిల్లాలో నిర్వహించిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీని జనగామ డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు.. జిల్లాలో అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ పార్టీ బలోపేతం చేయాలని రాహుల్ సూచించినట్లు ధన్వంతి తెలిపారు. ముగిసిన బుగులు వెంకన్న బ్రహ్మోత్సవాలు చిల్పూరు: వారం రోజుల పాటు అంగరంగవైభవంగా నిర్వహించిన చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం స్వామివారి చక్రస్నానంతో ముగిశాయి. ఉదయం అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేదమంత్రాల నడుమ హోమం, బలి హరణం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. 10 గంటలకు స్వామి వారి చక్రస్నానం భక్తుల సమక్షంలో నిర్వహించి ఆశీర్వాదం అందజేశారు. కార్యక్రమంలో ఈఓ లక్ష్మిప్రసన్న–విష్వక్సేన, చైర్మన్ శ్రీధర్రావు, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. సదరం క్యాంపునకు హాజరుకావాలి జనగామ రూరల్: మీ సేవలో స్లాట్ బుకింగ్ చేసుకున్న దివ్యాంగులు యూడీఐడీ సదరం క్యాంపునకు హాజరుకావాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వసంత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రకాల దివ్యాంగులు కొత్త, రెన్యూవల్ వారు మీ సేవలో యూడీఐడీ వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ చేసుకున్న వారు రశీదులో ఉన్న ఫోన్ నంబర్కు మెసేజ్ వచ్చిన తేదీల్లో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సదరం శిబిరానికి హాజరుకావాలని కోరారు. ఈనెల 6వ తేదీ నుంచి కొనసాగే ఈ శిబిరంలో 6,9,11,12,13, 18,24,25,26,30వ తేదీల్లో ఆర్థో, దృష్టి, వినికి డి లోపం, మానసిక, తలసేమియా, క్రానిక్ న్యూరాలజీ, సంబంధిత దివ్యాంగులకు వైద్యులతో క్యాంపులు ఉంటాయన్నారు. కొత్తవి 292 ఉండగా, రెన్యూవల్ 136 ఉన్నాయని మొత్తంగా 428 మందికి అవకాశం ఉన్నదన్నారు. ఫోన్కు మెసేజ్ వచ్చినవారు డాక్టర్ రిపోర్టులతో ఆధార్ కార్డు ఫొటో, మీసేవ రశీదుతో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన శిబిరానికి హాజరు కావాలన్నారు. భలే భలే బార్న్ గుడ్లగూబ జనగామ: వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై అరుదైన జాతికి చెందిన ఒక బార్న్ గుడ్లగూబ(శాసీ్త్రయ నామం టైటో ఆల్బా)ను సోమవారం పట్టుకున్నారు. గుండె ఆకారంలో తెల్లటి ముఖం, బంగారు, తెలుపు రంగుల మిశ్రమంతో కనిపించే ఈ గుడ్లగూబ అరుదుగా కనిపిస్తుంది. దీనిని శ్వేత గుడ్లగూబ అనికూడా పిలుస్తారని అంటున్నారు. దాని శబ్దం చాలా విచిత్రంగా ఉంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన ఎస్బీ కానిస్టేబుల్ సోమలింగయ్య, అతడి స్నేహితులు భిక్షపతి, కుమారస్వామి, శంకర్ కారులో హైదరాబాద్కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో అస్వస్థతతో రోడ్డుపై కనిపించింది. వెంటనే ఓ డబ్బాలో వేసుకుని జనగామ పోలీస్స్టేషన్లోని కానిస్టేబుల్ సోమనారాయణకు అప్పగించారు. ఆయన వెంటనే సీఐ సత్యనారాయణరెడ్డికి సమాచారం అందించగా, అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. సెక్షన్ ఆఫీసర్ రవీందర్ వచ్చి గుడ్లగూబను తీసుకెళ్లారు. బార్న్ గుడ్లగూబను చూసేందుకు పోలీస్టేషన్ సమీప ప్రజలు ఆసక్తి కనబరిచారు. 02జెజిఎన్062:అరుదైన గుడ్లగూబను అటవీశాఖకు అప్పగిస్తున్న పోలీసులు 02జెజిఎన్,64:వింత ఆకారంలో బార్న్ గుడ్లగూబ -
చీకటి వెలుగులు పక్కపక్కనే!
రఘునాథపల్లి: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఓ వైపు వెలుగులు విరజిమ్ముతుంటే, మరోవైపు చిమ్మ చీకట్లోనే వాహనదారులు ప్రయాణించాల్సిన దుస్థితి. మండల కేంద్రంలో ఇరువైపులా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు వారం రోజు లుగా బస్టాండ్ నుంచి జనగా మ వైపు వెళ్లే సర్వీస్ రోడ్డుపై లైట్లు పనిచేయకపోవడంతో ప్రయాణికులు చీకట్లోనే ప్రయాణిస్తున్నారు. ఈ రహదారి గుండా ప లు గ్రామాల ప్రజలు రైల్వే స్టేషన్, ప్రభుత్వ ఆస్పత్రి, స్టేషన్ కాలనీకి వెళ్లి వస్తుంటారు. వెలుతురు లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రమాదాలకు గుర య్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఎన్హెచ్ఏఐ అధికారుల నిర్లక్ష్యంతో సర్వీస్ రోడ్డు గుండా చీకట్లోనే ప్రయాణించాల్సి వస్తోందని వాపోతున్నారు. -
పరిష్కారం.. త్వరితగతిన
● ప్రజావాణిలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● వినతులు విని సిబ్బందికి ఆదేశాలు ● ప్రజల నుంచి 86 దరఖాస్తుల స్వీకరణజనగామ రూరల్: కుమారులు పట్టించుకోవడం లేదని, ఇందిరమ్మ ఇల్లు రావడం లేదని, భర్త నుంచి రావల్సిన భూమి ఇవ్వడం లేదని, కుమారుడు భూమి ఆక్రమించుకున్నాడని..ఇలా పలు సమస్యలతో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా వాణికి ప్రజలు పోటెత్తారు. ఈసందర్భంగా కలెక్టర్ సందీప్కుమార్ ఝా వారి వినతులను ఆలకించి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామని భరోసా కల్పించారు. అదనపు కలెక్టర్ బెన్ షాలో మ్తో కలిసి అయన 86 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, డీఆర్డీఓ వసంత, జిల్లా పౌరసరఫరాల అధికారి సరస్వతి, డీఏఓ అంబికా సోనీ, వివిధ శాఖల సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తులు కొన్ని ఇలా.. ● జఫర్గఢ్ మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన లోకిని కిష్టయ్య, తనకు సర్వే నంబర్ 173లో 7 గుంటలు, 324/బీలో 36 గుంటల భూమి కలదని, తన పేరున పట్టా పాస్ బుక్ జారీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ● కొడకండ్ల మండలం రంగాపురం గ్రామానికి చెందిన నలమాస నర్సమ్మ, తన భర్త కల్లు గీత కార్మికుడిగా చేస్తూ అనారోగ్యంతో మరణించాడని, తాను ఒంటరి మహిళ అయినందున పింఛన్ ఇప్పించాలని వేడుకుంది. ● జఫర్గఢ్ మండలం రఘునాథపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల స్వప్న, తనకు ఎకరం 27 గుంటల భూమి కలదని, ఆ భూమిని రికార్డులో తన పేరును నమోదు చేయించాలని వినతిపత్రం అందించింది. ● రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామానికి చెందిన తురిగొండ విమల తన భర్త రాములు మరో వివాహం చేసుకొని తనను ఇబ్బందులు పెడుతున్నాడని వాపోయింది. తన భర్త పేరుమీద ఉన్న 5 ఎకరాల భూమిలో తనకు వాటా ఇవ్వాలని కోర్టులో కేసు నమోదైనా పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరింది.కుమారులు పట్టించుకోవడం లేదు పై ఫొటోని వృద్ధురాలి పేరు గురిజాల బాలమణి. 70 ఏళ్ల వృద్ధురాలు. జనగామ మండలంలోని సిద్దెంకి గ్రామం. ఆమెకు ఇద్దరు కుమారులు. గ్రామంలో ఆమెకు పసుపుకుంకుమ కింద వచ్చిన భూమి 4ఎకరాలు కుమారులకు గిఫ్ట్ రిజస్ట్రేషన్ చేసింది. ఇప్పుడు తన బాగోగులు చూసుకోవడం లేదని దిక్కుతోచని స్థితిలో ఉన్నానని కలెక్టర్ పట్టించుకొని న్యాయం చేయాలని వేడుకుంది. దీంతో కలెక్టర్ తక్షణం స్పందించి వారం రోజుల్లో సమస్య పరిష్కారించాలని ఆర్డీఓను, సంబంధిత అధికారులను ఆదేశించారు. -
పట్టణాభివృద్ధిపై కలెక్టర్తో ఎమ్మెల్యే భేటీ
● కౌన్సిలర్లతో కలిసి సమస్యలపై వినతిజనగామ: జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సందీప్ కుమార్ ఝాను సోమవారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కలెక్టర్తో పలు అభివృద్ధి పనులు, సమస్యలపై భేటీ అయ్యారు. ఈ భేటీకి జనగామ మున్సిపాలిటీ పరిధిలోని కౌన్సిలర్లు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎమ్మెల్యే పల్లా ప్రతి కౌన్సిలర్ను కలెక్టర్కు వ్యక్తిగతంగా పరిచయం చేస్తూ, వార్డు పరిధిలో ఉన్న ముఖ్య సమస్యలను వివరించారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, శానిటేషన్, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరామన్నారు. -
ఆయా.. హోలీ
● నేడు రంగులపండుగ ● ఊరూ..వాడా ఉత్సాహంగా కామదహనం జనగామ: హోలీ పండగకు జిల్లా సిద్ధమైంది. హోలీ రంగుల అమ్మకాలకు ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి. యువత, పిల్లలు రంగులను కొనుగోలు చేసి ఆటకు సిద్ధమయ్యారు. హోలీ పండగ(మంగళవారం) రోజు మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణం ఉండడంతో, వేద పండితులు రాష్ట్ర ప్రజలకు ముఖ్య సూచనలు చేస్తున్నారు. గ్రహణం ప్రారంభం కాకముందే పూజలు, హోలీ సంబరాలను పూర్తి చేసుకోవాలని, గ్రహణ కాలంలో ఏ విధమైన శుభకార్యాలు చేయరాదని జనగామ వేద పండితులు స్పష్టం చేస్తున్నారు. గ్రహణం, హోలీ కలిసివచ్చిన ఈ సంవత్సరం, పూజా సంప్రదాయాలకు భంగం కలగకుండా జాగ్రత్తలు పాటిస్తూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని సంతోషీమాత ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ తెలిపారు. కామ దహనాలు.. పట్టణంలో సోమవారం రాత్రి కామదహనం కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లోని వాడవాడల్లో కామ దహనాలు జరిగాయి. -
ఇస్మార్ట్..స్టేషన్
జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్కు కొత్త సొబగులు జనగామ: అమృత్ భారత్ పథకంలో భాగంగా జనగామ రైల్వేస్టేషన్ రూపురేఖలు మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.125 కోట్లతో ఆధునికీకరణ వేగవంతమైంది. తొలి విడతగా విడుదలైన రూ.25 కోట్లతో ఫుట్ఓవర్ బ్రిడ్జ్, ప్లాట్ఫామ్ విస్తరణ, డిజిటల్ సదుపాయాలు, ప్రాంగణ సుందరీకరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉత్తర, దక్షిణ రైల్వే మార్గానికి కీలకంగా ఉన్న ఈ స్టేషన్, అభివృద్ధి పూర్తయ్యాక అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు కొత్త అనుభవాన్ని అందించనుంది. ఈ పథకంలో స్టేషన్ లను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తారు. ప్రయాణికుల అవసరాలు మాత్రమే కా క పెరిగే రద్దీ, వసతుల విస్తరణ, రైల్వే కార్యకలాపాల బలోపేతం వంటి అంశాలకూ ప్రా ధాన్యం ఇస్తారు. ఇదే ప్రక్రియలో భాగంగా జనగామ స్టేషన్ ప్రస్తుతం భారీ మార్పులకు వేదికవుతోంది. మొదటి విడతలో రూ.25కోట్ల ఖర్చు జిల్లా కేంద్రంగా ఉన్న జనగామ రైల్వేస్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ ప్రోగ్రామ్లో భాగంగా ఆధునిక సదుపాయాలతో రూపుదిద్దుకుంటోంది. రైల్వేశాఖ ఈ స్టేషన్ అభివృద్ధికి మొదటి విడతలో సుందరీకరణ, ప్రాథమిక మౌలిక వసతుల పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం స్టేషన్లో కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జి, డిజిటల్ డిస్ప్లే కోచ్, రెండు ప్లాట్ఫామ్ల విస్తరణ, ప్రయాణికులకు అనుగుణంగా టికెట్ కౌంటర్ ఆధునీకరణ, పచ్చదనంతో స్టేషన్ ప్రాంగణం అందుబాటులోకి తేవడం వంటి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నూతన హంగులు, ప్రయాణికులు కూర్చునే సదుపాయాలు, తాగునీటి సదుపాయాలు, ఆధునిక టాయిలెట్లు, సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థ, ఏసీ వెయిటింగ్ హాల్స్, క్రమబద్ధమైన పార్కింగ్ ప్రాంతాలు వంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. దక్షిణ,ఉత్తర రాష్ట్రాలకు కేంద్రంగా దక్షిణ భారతాన్ని ఉత్తర భారతంతో కలిపే కీలక మార్గంలో ఉన్న ఈ స్టేషన్పై ప్రతీ రోజు విజయవాడ, చైన్నె, ఢిల్లీ, హైదరాబాద్, మహారాష్ట్ర వంటి అనేక ప్రాంతాలకు రైళ్లు ప్రయాణిస్తాయి. వ్యాపార వాణిజ్య ప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు ఇలా అన్ని వర్గాల వారు పెద్ద సంఖ్యలో ఈ మార్గాన్ని వినియోగిస్తున్నారు. రోజురోజుకూ ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో స్టేషన్ను ఆధునిక ప్రమాణాలకు తగిన విధంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని రైల్వే శాఖ భావించింది. దీంతో జనగామ పట్టణ అభివృద్ధి, వాణిజ్య వృద్ధి, ప్రయాణికుల రద్దీ పెరుగుదలకు కొత్త దిశగా మారుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రెండు ప్లాట్ఫామ్ల విస్తరణ, వాటిపై విశాలమైన రూఫ్ షెల్టర్లు కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం ఆధునిక డిజిటల్ డిస్ప్లే కోచ్ బోర్డు స్టేషన్ భవనం విస్తరణ, రీడిజైన్ కొత్త చార్జింగ్ స్టేషన్లు, ఎనర్జీ ఎఫిషియంట్ లైటింగ్ ఆధునీకరించబడిన టికెట్ కౌంటర్లు, రిజర్వేషన్ హాల్ పచ్చదనం పెంపు, ల్యాండ్స్కేపింగ్ పార్కింగ్ స్థలాల విస్తరణ సుందరీకరణ పనులకు రూ.125 కోట్ల కేటాయింపులు మొదటి విడతలో రూ.25కోట్ల ఖర్చు ప్రారంభానికి సిద్ధం..వడివడిగా పనులు అత్యాధునికంగా ఫుట్ఓవర్ బ్రిడ్జి, ఎస్కలెటర్, డిస్ప్లేకోచ్ -
ముగిసిన ముప్పిడి ఉద్యమ ప్రస్థానం
సాక్షి ప్రతినిధి, వరంగల్: సీపీఐ (మావోయిస్టు) పార్టీలో ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్ అలియాస్ జంగ్ దాదా ఉద్యమ ప్రస్థానం ముగిసింది. ఆయిడిసి, బాయిడిసి.. నాన్ననిడిసి సాయుధ బాట పట్టిన మావోయిస్టు నేత మళ్లీ జనం మధ్యకు రానున్నారు. పేద, బడుగు బలహీన వర్గాల కోసం తుపాకీ ఎత్తి రాజీలేని ఉద్యమాన్ని సాగించిన ముప్పిడి సాంబయ్య ఆదివారం జనజీవన స్రవంతిలో కలిశారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా, దండకారణ్య డివిజన్ కమిటీ నేతగా ఉన్న ఆయన తన 14 మంది అనుచరులతో కలిసి ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారన్న వార్త చర్చనీయంశంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన సాంబయ్య సుమారు నాలుగు దశాబ్దాల క్రితం మావోయిస్టు ఉద్యమంలో చేరారు. పదో తరగతి చదువుతున్నప్పుడే ఉద్యమం వైపు.. ముప్పిడి సాంబయ్య 1984లో పదో తరగతి చదువుతున్నప్పుడు ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. వరంగల్ ఉద్యమ పితామహుడు, వరంగల్ జిల్లా కార్యదర్శి పులి అంజన్నను స్ఫూర్తిగా తీసుకొని 1984లో పూర్తిస్థాయి కార్యకర్తగా పార్టీలో చేరారు. మొదట పరకాల ఏరియా దళసభ్యుడిగా, కొద్ది రోజులకే బాబన్న పేరుతో పరకాల – చిట్యాల ఏరియా కమాండర్గా వ్యవహరించారు. పరకాల కమాండర్ నుంచి ఖమ్మం జిల్లాకు జిల్లా కమిటీ సభ్యుడిగా బదిలీ అయ్యి 2002 వరకు అక్కడే ఉన్నారు. 2002 తర్వాత 2018 వరకు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, తూర్పు ఇన్చార్జ్గా భాస్కర్ పేరుతో వ్యవహరించారు. 2018లో ఒడిశా స్టేట్ కమిటీ మెంబర్గా వ్యవహరించారు. 2025లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి స్థానంలో ఒడిశా నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికై కొనసాగుతున్నారు. కాగా, 2013లో కమాండర్ స్థాయి అయిన నిమ్మల సారమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు ఉంది. వివాహం జరగగా ప్రస్తుతం ఆమె జనగామలో ఉంటున్నట్లు పోలీసుల సమాచారం. వికాస్, జంగ్ దాదా ఆయనే.. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పనిచేసిన సాంబయ్య.. వికాస్, జంగ్ దాదా పేర్లతో కూడా పనిచేసి పాపులర్ అయ్యారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జిల్లా కమిటీ సభ్యుడు, కార్యదర్శిగా పనిచేసినప్పుడు సుదర్శన్, వికాస్ పేర్లతో వ్యవహరించారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో జంగ్ దాదాగా ఆదివాసీ గిరిజనులతో మమేకమయ్యారు. సాహిత్యంలో అనేక రచనలు చేశారు. సాంబయ్య తల్లిదండ్రులు రామస్వామి–భద్రమ్మ కాగా.. ప్రస్తుతం భద్రమ్మ ఉంది. సాంబయ్య కు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉండగా.. ఒక సోదరుడు సదానందం ప్రభుత్వ టీచర్. ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత, అనుచరులు కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన ముప్పిడి సాంబయ్య పులి అంజన్న స్ఫూర్తితో 42 ఏళ్ల క్రితం ఉద్యమ బాట ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశాలో పనిచేసిన సాంబయ్య ఉమ్మడి వరంగల్ నుంచి మిగిలింది నరహరి, పాండునే.. -
వైభవంగా బుగులు వెంకన్న రథోత్సవం
చిల్పూరు: చిల్పూరుగుట్ట శ్రీబుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజైన ఆదివారం ఉదయం అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేదమంత్రాల నడుమ హోమం బలిహరణం నిర్వహించారు. సాయంత్రం 6.30కి రథోత్సవాన్ని ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ శ్రీధర్రావు ప్రారంభించారు. ఆలయం నుంచి పురవీధుల్లో స్వామివారిని ఊరేగించారు. గ్రామంలో సర్పంచ్ నలిమెల అనితనవీన్, ఉప సర్పంచ్ రాజారపు రంజిత్కుమార్, ధర్మకర్తలు గణగోని రమేశ్ నారాయణరెడ్డి, తదితరులు స్వాగతం పలికారు. చట్టం ప్రకారం నడుచుకోవాలి● జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ జనగామ రూరల్: చట్టం ప్రకారం నడుచుకోవాలని, సమాజంలో అందరు సమానులే అని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. అదివారం జిల్లా కేంద్రానికి రాగా మండలంలోని వెంకిర్యాల గ్రామ సర్పంచ్ గొల్లపల్లి ఆలేఖ్య ఈర్ల నవీన్ కుమార్ తమ సమస్యలను తెలిపారు. అనంతరం జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం మద్యం తాగి న్యూసెన్స్ చేస్తున్నారని గ్రామ ప్రజలు సర్పంచ్ దృష్టికి తీసుకుని రాగా సర్పంచ్ వెళ్లి వారిని అడిగితే.. కులంపేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈవిషయమై జనవరి 15 తేదీన పిటిషన్ ఇచ్చినా సీఐ సత్యనారాయణ రెడ్డి గ్రామస్తులతో కౌన్సిలింగ్ చేశారని, కానీ చట్టపరమైన చర్యల కేసు పెట్టలేదని అన్నారు. కాగా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ నివాసానికి సీఐ రాగా అధికార పార్టీకి వత్తాసు పలుకకుండా వెంటనే విచారణ జరిపి కేసు రిజిష్టర్ చేయాలన్నారు. లేని పక్షంలో చట్టం ప్రకారం బాధ్యులు అవుతారని ఢిల్లీలో జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్ వద్దకు రావాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సర్పంచ్ అలేఖ్య సీఐకి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. సమస్యలు పరిష్కరించాలని పాల ఉత్పత్తిదారుల ధర్నాబచ్చన్నపేట: మండలంలోని కొన్నె గ్రామానికి చెందిన పాల ఉత్పత్తిదారులు మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఆదివారం పాల క్యాన్లతో వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తమ గ్రామ పాలను బచ్చన్నపేట మినీ డెయిరీలో కాకుండా జనగామ డెయిరీలో దించితే పలు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు. సకాలంలో బిల్లులు రాకపోగా వెన్న శాతం కూడా తక్కువ వస్తుండడంతో డబ్బులు తక్కువ వస్తున్నాయని, బిల్లులు నెలకు ఒకసారి కూడా రావడం లేదన్నారు. తమ గ్రామ పాలను బచ్చన్నపేటలోనే దిగుమతి చేసుకోవాలని భీష్మించుకోగా ధర్నా వద్దకు బీఎంసీ మండల చైర్మన్ పుర్మ జోగిరెడ్డి, సూపర్వైజర్ శ్రీనివాస్రెడ్డి వచ్చి బచ్చన్నపేటలోనే దిగుమతి చేసుకుంటామని హామీ ఇవ్వడంతో పాల ఉత్పత్తిదారులు ధర్నా విరమించారు. నూతన సబ్స్టేషన్ పరిశీలనచిల్పూరు: మండలంలోని కొండాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించి త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 33/11కేవీ ట్రాన్స్కో సబ్స్టేషన్ను ఆదివారం రాత్రి ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మోహన్రావు సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.2.50 కోట్లతో నిర్మిస్తున్న సబ్స్టేషన్లో పనులు పూర్తి అయ్యాయని రెండు వారాల్లో ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు,. ఆయన వెంట ఏడీఈ రణధీర్రెడ్డి, ఏఈ సురేష్, లైన్ ఇన్స్పెక్టర్ ఐలేష్, కృష్ణంరాజు, రాజిరెడ్డి, రవి, సిద్ధయ్య, శ్రీను సర్పంచ్ గుగులోతు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
వానకొండ.. అభివృద్ధి వెక్కిరింత
దేవరుప్పుల: హోలీ పర్వదినం పురస్కరించుకుని ఉగాది వరకు శ్రీ వానకొండ లక్ష్మీనర్సింహ్మస్వామి జాతర వైభవంగా కొనసాగనుంది. ఈనెల 3 (మంగళవారం) నుంచి జాతర ప్రారంభం కానుంది. జాతరకు ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలకు చెందిన భక్తులు భారీగా తరలివస్తారు. ప్రధానంగా గిరిజనులు కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. గ్రహణంతో ఆర్భాటాలకు స్వస్తి ఈసారి శ్రీ లక్ష్మీనర్సింహ్మస్వామి కల్యాణోత్సవం రోజు గ్రహణం ఉండడంతో వేదబ్రహ్మణుల సూచన మేరకు గుట్ట పూజారి బీట్కూరి సంపత్కుమారచార్యులు ఆర్భాటాలకు తావివ్వకుండా ఉదయం 10 లోపు కల్యాణం ముగిసేలా నిర్ణయించారు. దీంతో కడవెండి నుంచి తలంబ్రాలు, చేనేత వస్త్రాలు నేరుగా గుట్టవద్దకు చేరడంతో ఉత్సవాల ప్రారంభానికి సన్నాహాకాలు చేస్తున్నారు. అభివృద్ధి జాడేది..? నూటయాభై ఏళ్ల నుంచి కొనసాగుతున్న వానకొండ లక్ష్మీనర్సింహ్మస్వామి జాతర అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేదనే విమర్శలు ఉన్నాయి. ఎన్ని పాలకవర్గాలు వచ్చినా అభివృద్ధి అంతంతే. ఐదు దశాబ్దాల కిందట సాదాసీదా వసతులతో కొనసాగిన జాతరకు ఆపై కడవెండి గ్రామస్థుల ప్రత్యేక వసతులపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం పక్షాన తాగునీటి, విద్యుత్ వంటి సౌకర్యాలు ఏర్పర్చారు. భక్తులు కాలినడకన ఇబ్బందులు పడుతున్నారని 12 ఏళ్ల కింద గుట్టపైకి మెట్లు నిర్మించారు. ముఖద్వారం, పైన రేకులషెడ్ల వసతులు వంటివి దాతలు సమకూర్చారు. ఈ నేపథ్యంలోనే 2023 జూలై 7 వ తేదీన అప్పటి పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎంఎంఆర్ గ్రాంట్ కింద రూ.2.50 కోట్లతో గుట్టపైకి ఘాట్రోడ్డు, సీఎం అదనపు నిధుల కింద రూ. కోటితో త్రితల విమాన గోపురం, మండపం నిర్మాణం కోసం శిలాఫలకాలు వేశారు. గత అసెంబ్లీ నాటికి గుట్టపైకి సదరు కాంట్రాక్టర్ ఘాట్ రోడ్డుకోసం చదును చేసి చేతులెత్తేశారు. ప్రస్తుత పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి గతేడాది జాతరకు వచ్చి నిధుల రీమంజూరుతో మిగులు పనులు చేయిస్తానన్న హామీ ఇవ్వగా ఆచరణలోకి రాలేదు. జాతర ఉత్సవ కమిటీ నియామకం శ్రీ వానకొండ లక్ష్మీనర్సింహ్మస్వామి జాతర పురస్కరించుకొని ఉత్సవ నిర్వహణ కోసం దేవాదాయశాఖ పక్షాన తాత్కాలిక ఆలయ కమిటీని నియమించినట్టు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్గా మాసంపెల్లి భాస్కర్, వైస్ చైర్మన్గా కాడవేని శ్రీనివాస్, జనరల్ సెక్రటరీలుగా పాముకుంట్ల చొక్కయ్య, సంపంగి యాకరాజు, కోశాధికారిగా భాషిపాక పరుశరాములు, కార్యవర్గ సభ్యులుగా మూడ నర్సింహ్మ, మైనాల రమేష్, రంపీస శ్రీనివాస్, మేడబోయిన మహేశ్, కాడవేని కుమార్, బోసు కనకయ్య, కొండయ్య, యాదయ్య, యాకయ్యను నియమించినట్టు పేర్కొన్నారు. శిలాఫలకాలతో సరి..కానరాని పురోగతి ఎన్ని పాలకవర్గాలు వచ్చినా అభివృద్ధి శూన్యం రేపటి నుంచి శ్రీ వానకొండ లక్ష్మీనర్సింహ్మస్వామి జాతర -
గృహహింస కేసుల్లో మహిళలకు ‘భరోసా’
జనగామ: రాష్ట్రంలో 34వ భరోసా సెంటర్ను జిల్లా హెడ్క్వార్టర్లో ప్రారంభించించినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మహిళలకు సంబంధించిన గృహహింస, చైల్డ్ హరాస్మెంట్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు నేరుగా పోలీస్ స్టేషన్ రావడంలో సంకోచించే సందర్భాల్లో భరోసా సెంటర్ సమగ్ర సహాయాన్ని అందిస్తుందన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని హన్మకొండరోడ్డులో ఏసీపీ కార్యాలయం ఏరియాలో నూతనంగా నిర్మించిన భరోసా, షీటీం నూతన భవన సముదాయాలను సీపీ సన్ప్రీత్సింగ్, కలెక్టర్ సందీప్కుమార్ ఝా, డీసీపీలు రాజమహేంద్ర నాయక్, అంకిత్కుమార్, కవితతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. అంతకు ముందు సీపీ, డీసీపీ డీజీపీకి ఘన స్వాగతం పలుకగా, కలెక్టర్తో పాటు పోలీసు ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం భరోసా సెంటర్లోని కౌన్సిలింగ్ చాంబర్లను పరిశీలించి, పై అంతస్తులోని షీటీం భవనాన్ని ప్రారంభించారు. తదనంతనం భరోసా సెంటర్ ఆవరణలో డీజీపీ, సీపీ, కలెక్టర్ మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడారు.. హైదరాబాద్లో పదేళ్ల క్రితం ప్రారంభించిన భరోసా సెంటర్ వ్యవస్థ రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు ఇస్తోందని తెలిపారు. భరోసా సెంటర్లో ఇన్చార్జ్ లీగల్ అడ్వైజర్, మెడికల్ సపోర్టర్, ఇద్దరు సపోర్ట్ సిబ్బంది, లాయర్లు, సైకాలజిస్టులు, సోషల్ వర్కర్లు బాధితుల సమస్యలను విని, కేసు నమోదు నుంచి చార్జిషీట్ దాఖలు వరకు పోలీసులకు అవసరమైన సమాచారాన్ని అందజేస్తారని, కోర్టు ట్రయల్ సమయంలో కూడా భరోసా సెంటర్ అండగా నిలుస్తుందని వివరించారు. అంతుకు ముందు షీటీం కార్యాలయంలో సేవలపై డీజీపీ ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్–అలైవ్’ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రాష్ట్రంలో 8వేల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్ల కనెక్టివిటీ, వాహనాల స్పీడు పెరగడం, డ్రైవర్లలో ప్రాథమిక డ్రైవింగ్ టెక్నిక్స్ లోపం ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలు సంప్రదాయ కార్యక్రమంలా మారిపోయిందని, దీనిపై ప్రజల్లో మరింత అవగాహన పెంచే మాదిరిగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతినెల చివరి వారం రాష్ట్ర వ్యాప్తంగా ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గతేడాది చేసిన ప్రత్యేక చర్యలతో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గిందని, అయితే ప్రమాదాలు పెరిగాయని, ఇవి రెండూ తగ్గేలా చర్యలు కొనసాగిస్తామని చెప్పారు. జనగామ హెడ్క్వార్టర్లో డీసీపీ నూతన భవనం నిర్మాణం, రూరల్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన ఫైల్ కూడా త్వరలోనే కార్యరూపం దాల్చనున్నట్లు డీజీపీ ప్రకటించారు. కార్యక్రమంలో ఏసీపీలు భీంశర్మ, నర్సయ్య, రవీందర్రెడ్డి, సతీష్బాబు, నర్సింహారావు, ఎస్బీ ఏసీపీలు ఎం.జితేందర్రెడ్డి, జానీ నర్సింహులు, సీఐలు సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, అబ్బయ్య, ఎస్సై, పోలీసులు ఉన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్–అలైవ్’ ప్రోగ్రాం భరోసా సెంటర్, షీటీం నూతన భవనాలు ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి -
సృజనాత్మకతను వెలికి తీయాలి
జనగామ రూరల్: సృజనాత్మకతను వెలికి తీసి శాస్త్రియతను పెంపొందించాలని జిల్లా సైన్స్ అధికారి చింతల ఉపేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైన్స్ అధికారి ఉపేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని సి.వి.రామన్ చిత్రపటానికి పూలమాల వేసి సైన్స్ ఎగ్జిబిట్స్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఇమిడి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి పాఠశాలలో అంతర్గతంగా నిర్వహించే వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని, అబ్దుల్ కలాం చెప్పినట్లు కలలు కనండి.. వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ తుమ్మ శ్రీలతరెడ్డి, ప్రిన్సి పాల్ జైమోన్ థామస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే గౌతమ్ మోడల్ స్కూల్లో నిర్వహించిన సైన్స్ దినోత్సవంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థుల్లో సృజనాత్మకతతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలను మెరుగు పరచుకోవడానికి ఉపయోగపడతాయన్నారు. ఎ.శంకర్ రెడ్డి, భాష్యం విష్ణు చరణ్, ఎండీ మేహరాజ్ అహ్మద్, మోతే సురేందర్ రెడ్డి, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పసరమడ్లలోని ఆశ్రమ పా ఠశాలలో సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఎం జె.లచ్చిరాం,స్టా బి. జయరామ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా సైన్స్ అధికారి ఉపేందర్ ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం -
ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులను అరికట్టాలి
జనగామ: ప్రైవేట్ ఆస్పత్రులు, వైద్యులు, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను తక్షణమే అరికట్టాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జనగామ శాఖ ఆధ్వర్యంలో శనివారం డీసీపీ రాజమహేంద్రనాయక్కు వినతి చేశారు. అనంతరం జిల్లా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జె.బాలాజీ, కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ హైదరాబాద్ బండ్లగూడ జాగీర్, రాజేంద్రనగర్లోని ఆస్పత్రుల్లో చోటుచేసుకున్న దాడులు వైద్యుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయన్నారు. ప్రజలకు నిరంతర వైద్యసేవలు అందించడంలో అంతరాయం కలిగిస్తున్నారన్నారు. ఇలాంటి దాడులు వైద్యుల ప్రాణాలకు ముప్పు కలిగించడమే కాకుండా, అత్య వసర వైద్యసేవలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నారు. వైద్యులు, వైద్య సిబ్బందిపై, మెడికల్ సంస్థలపై దాడుల విషయంలో తెలంగాణ మెడికల్ సర్వీస్ పర్సనల్ అండ్ మెడికల్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, దాడులకు పాల్పడిన నిందితులపై చట్టప్రకారం శిక్ష విధించేలా కఠిన చర్యలు తీసుకునే విధంగా పోలీసు శాఖ హామీ ఇవ్వాలన్నారు. వారి వెంట మాజీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డి.లవకుమార్ రెడ్డి, వైద్యులు లక్ష్మీనారాయణ నాయక్, రంజిత్ కుమార్, స్వప్న రాథోడ్, విఘ్నశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
కమనీయం.. శ్రీనివాసుడి కల్యాణం
చిల్పూరు: చిల్పూరుగుట్ట శ్రీబుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు శనివారం స్వామి వారి కల్యాణ మహోత్సవం అశేష భక్తుల సమక్షంలో గోవింద నామస్మరణల మధ్య కమనీయంగా నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గుట్టపైనున్న ఆలయం నుంచి కోలాటాల నడుమ పల్లకీలో స్వామి వారిని ఊరేగింపుగా మండపానికి తీసుకువచ్చారు. ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ శ్రీధర్రావు, కిరణ్మయి, సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై సరిపురం నవీన్కుమార్, సర్పంచ్ నలిమెల అనిత, శాశ్వత దాత సంగోజు మోహనాచారి, శంకరలక్ష్మి తదితరులు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు, ఆరుట్ల రాకేషాచార్యులు వేద మంత్రాల నడుమ వైభవంగా కల్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కళాకారుల వేషధారణ ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎంపీ కడియం కావ్య -
సేవాలాల్ ఆశయాలు మార్గదర్శకం
జనగామ రూరల్: సంత్ సేవాలాల్ ఆశయాలు మా ర్గదర్శకమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మీనారాయణనాయక్ అన్నారు. శనివారం సేవాలాల్ జయంతి సందర్భంగా పట్టణంలోని నెహ్రూపార్క్ నుంచి గిరిజన మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేశారు. సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ముందుగా నిలిచిన బంజారా సమాజం, నేటి పరిస్థితుల్లో తమ జాతి ప్రయోజనాల కోసం మరింత ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అజ్మీరా స్వామి, ఆర్డీఓ గోపీరామ్, మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, గాంధీ నాయక్, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
విభిన్న సెట్టింగులు.. చిన్నారుల ఫొటోలు
ఇదివరకు ఎవరైనా ఇంటికొస్తే కాసేపు మాట్లాడాక ఫొటో ఆల్బమ్ ముందు పెట్టేవాళ్లు. ఫొటోలు చూపిస్తూ సరదాగా గడిపేవాళ్లు. ఇప్పుడు టీవీలు ఆన్ చేస్తున్నారు. ఫొటో షూట్లు, వీడియో ఆల్బమ్లు చూపిస్తున్నారు. డిఫరెంట్ లొకేషన్లలో భారీ సెట్టింగుల్లో దిగిన ఫొటోలు, మంచి మంచి లొకేషన్లలో, ఆకట్టుకునే పాటలతో తయారు చేసిన వీడియోలు ప్లే చేస్తున్నారు. చిన్నారుల జ్ఞాపకాలు చిరకాలం పదిలంగా ఉండేలా ఆల్బమ్లు రూపొందిస్తున్న స్టూడియోలపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.. – ఖిలా వరంగల్ఫొటోలు తీసుకునేందుకు ఒకప్పుడు పార్కులు, నది, సముద్రతీరాలు, చారిత్రక కట్టడాల వంటి ప్రదేశాలకు వెళ్లేవాళ్లు. ఇప్పుడు వాటినే మన ముందుకు తీసుకొచ్చారు ఫొటో స్టూడియోల నిర్వాహకులు. డిఫరెంట్ సెట్లతో బేబీ ఫొటో స్టూడియోలు ఎక్కడికక్కడ ఏర్పాటయ్యాయి. బేబీ ఫొటో షూట్ ట్రెండ్ ఏళ్ల కిందటి నుంచే ఉన్నప్పటికీ ఈ మధ్య ఈ విధానంపై గ్రేటర్ వరంగల్ వాసుల ఆసక్తి మరింత పెరిగింది. అంతేకాకుండా ఇటీవల వచ్చిన ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా సృజనాత్మకతంగా చూపించడంతో అందరి దృష్టి ఫొటో షూట్వైపు పడుతోంది. ప్రస్తుతం ఇదొక ఆనవాయితీగా మారిందని ఫొటో స్టూడియోల నిర్వాహకులు చెబుతున్నారు. అభిరుచికి అనుగుణంగా.. పిల్లల తల్లిదండ్రుల అభిరుచి మేరకు ఏదైనా విభిన్న సెట్ కావాలంటే.. అదనపు ఖర్చుతో నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. చారిత్రక కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ మధ్యకోటలో మనసుదోచేలా ఆహ్లాదం కల్పించేలా భారీ సెట్లతో స్టూడియో ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాలోని చిన్న పిల్లల మనసు దోచేస్తున్నారు. ఇటీవల కాలంలో మధ్యతరగతి వర్గాలు సైతం ఈషూట్లపై ఆసక్తి కనబరుస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. సమయాన్ని బట్టి ధరలు.. బేబీ స్టూడియోలు మధ్యకోట, వరంగల్, మహబూబాబాద్, ములుగు, రామప్ప, భూపాలపల్లి, కాళేశ్వరం, జనగామ జిల్లా, మండల కేంద్రాల్లోనూ ఉన్నాయి. ఇవి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో తెరిచి ఉంటాయి. బర్త్ డే ఆల్బమ్ కోసం రూ.10 వేల నుంచి రూ. 25వేల వరకు చార్జ్ చేస్తున్నారు. స్టూడియోలో ఏదైనా ఆట వస్తువులు ఉపయోగించుకుంటే రూ.1500 నుంచి రూ.2,500 వసూలు చేస్తున్నారు. వారాంతాల్లో అయితే వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఫొటోగ్రాఫర్ను ఔత్సాహికులు తెచ్చుకుంటే.. గంటకు రూ.1,500 చార్జ్, అదే నిర్వాహకుల ఫొటోగ్రాఫర్ అయితే గంటకు రూ.2,500 వరకు తీసుకుంటామని చెబుతున్నారు. వీటి ఏర్పాటుకు దాదాపు రూ.8 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఓ స్టూడియో నిర్వాహకుడు పేర్కొన్నారు. బర్త్డేకు ఫొటో షూట్ చేయించాం.. మా బాబు ఫస్ట్ బర్త్డేను ప్రత్యేకమైన రోజుగా చూస్తున్నాం. తీపి గుర్తు కోసం బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నాం. బర్త్డే అంటే స్పెషల్ డేగా గుర్తించి ఆధునిక హంగులతో కూడిన బేబీ స్టూడియోలో ఫొటో షూట్ చేయించాం. తరచూ ఫొటోలు, వీడియోలు చూసి జ్ఞాపకాలు గుర్తు చేస్తూ సంతోషిస్తున్నాం. –అయాన్తో తల్లిదండ్రులు అఖిల, జూహకర్ పిల్లలు మెచ్చేలా.. చిన్నారులు ఇష్టపడే బాహుబలి, పోలీస్ స్టేషన్, విమానం, బేబీ షవర్, జీప్ డ్రైవింగ్, ఉయ్యాల, నది వంతెన, ట్రైన్, బైక్, గార్డెనింగ్, చారిత్రక అందాల సీన్స్ వంటి సెట్లను స్టూడియోల నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. తాజ్మహల్, కొలనులు, స్విమ్మింగ్ పూల్, దేవాలయం, గ్రామీణ నేపథ్యం ఉండే సెట్లు సైతం వీరి వద్ద అందుబాటులో ఉంటున్నాయి. సెట్కు తగిన మేకప్ కిట్లు, దుస్తులు స్టూడియోలోనే అందుబాటులో ఉంచుతున్నారు. కొన్నింటిలో పుట్టిన రోజు వేడుకలు సైతం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఏడాది వయస్సు చిన్నారుల నుంచి ఐదేళ్ల పిల్లల కోసం ప్రత్యేక సెట్లు స్టూడియోల్లో అందుబాటులో ఉన్నాయి. ఆకట్టుకుంటున్న స్టూడియోలు సమయానుగుణంగా ధరలు ఏఐ సాంకేతికతతో మరింత క్రేజ్ -
3న సోమన్న ఆలయం మూసివేత
పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవాలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా ఈనెల 3 (మంగళవారం)న ఉదయం 8 గంటలకు ఆలయం మూసివేయనున్నట్లు (ద్వారబంధనం) ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, ప్రధాన అర్చకుడు దేవగిరి లక్ష్మన్న శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరిగి 4వ తేదీ బుధవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం స్వామివారి దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు, భక్తులు సహకరించాలని కోరారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి జనగామ రూరల్: పాడి పరిశ్రమ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్లో మేనేజింగ్ డైరెక్టర్ కె.చంద్రశేఖర్రెడ్డి, విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.గోపాల్ సింగ్లను జిల్లా నాయకులు శనివారం కలిశారు. ప్రస్తుతం ఉన్న పాల సేకరణ ధరలను పెంచి, ఎస్ఎన్ఎఫ్ తగ్గించాలను తొలగించాలని కోరారు. పాడి రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు. అనంతరం చైర్మన్ అమిత్ రెడ్డి మాట్లాడుతూ విజయ డెయిరీ ప్రతీ రోజు మూడు లక్ష్యల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరిస్తున్నామని, త్వరలోనే పాల కొనుగోలు ధరలను పెంచతామన్నారు. డైరెక్టర్ కె.చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ పాడి రైతులు ప్రైవేట్ డెయిరీలను నమ్మి మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ మధుసూదన్, పాడి రైతులు పి.జోగారెడ్డి, స్వామి, సాదం రమేష్, శ్రీనివాస్, మేనేజర్ నరేష్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్షణికావేశం.. తొందరపాటు నిర్ణయం● పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య ● రోడ్డుపాలైన కుటుంబం లింగాలఘణపురం: తండ్రి క్షణికావేశం..తొందరపాటు నిర్ణయంతో చిన్నారులు తండ్రిలేని పిల్లలయ్యారు. అల్లారుముద్దుగా అమ్మానాన్నల ఆలనాపాలనలో పెరగాల్సిన చిన్నారులకు తండ్రిలేని లోటు తీర్చేదెవరూ? చనిపోవాలనుకొనే క్షణంలో ఒక్కసారి తన గుండెలపై తన్నుకుంటూ ఆడుకునే ఆ చిన్నారులు గుర్తుకు రాలేదా..అంటూ రోదిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు ప్రతీఒక్కరి కంట కన్నీరు కార్చిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామస్తులు, విశ్వసనీయ సమాచారం మేరకు.. మండలంలోని గుమ్మడవెల్లికి చెందిన వేల్పుల అనిల్కుమార్ (28) అతని భార్య సంతోషి మధ్య ఫిబ్రవరి 26న స్వల్ప గొడవ జరిగింది. దీంతో క్షణికావేశంలో అదేరోజున అనిల్కుమార్ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు జనగామకు అక్కడి నుంచి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. అనిల్కుమార్కు నాలుగేళ్ల విఘ్నేష్, రెండున్నరేళ్ల పాప ఉంది. నాన్న..నాన్న అంటూ చిన్నారులు ఏడుస్తున్న తీరు ప్రతీఒక్కరి గుండెను కదిలించింది. తల్లిదండ్రుల గొడవలతో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో అభంశుభం తెలియని పిల్లలు తండ్రిలేని వారయ్యారు. సౌత్జోన్ టోర్నమెంట్కు కేయూ జట్టు కేయూ క్యాంపస్: తమిళనాడులోని తిరుచారపల్లిలోని భారతీదాస్ యూనివర్సిటీలో మార్చి 2, 3 తేదీల్లో నిర్వహించనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ చెస్ టోర్నమెంట్కు కేయూ పురుషుల జట్టు పాల్గొననున్నట్లు శనివారం కేయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య తెలిపారు. ఈజట్టులో పి.శ్రీచైతన్య , ఎస్.శివసాత్విక్, ఎస్.సంజయ్చంద్ర, బి.రాకేశ్, కె.సచిన్, జె.శివకుమార్తో పాటు మాస్టర్జీ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కె.నరేందర్ కోచ్ కమ్ మేనేజర్గా వ్యవహరించనున్నట్లు వెంకయ్య తెలిపారు. -
కోఆప్షన్ ఎవరికో?
జనగామ: జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల్లో నూతన పాలక మండళ్లు బాధ్యతలు స్వీకరించడంతో ఇప్పుడు కోఆప్షన్ సభ్యుల ఎంపికపై రాజకీయ చర్చలు వేడెక్కుతున్నాయి. ము న్సిపల్ రాజకీయం కొత్త దశలోకి అడుగుపెట్టగా, రెండు పట్టణాల్లోనూ అభ్యర్థుల పోటీ, పార్టీల వ్యూహాలు, స్థానిక నేతల లాబీయింగ్ మరింత ఊపందుకుంటుంది. స్టేషన్ఘన్పూర్లో పూర్తి మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీకి నాలుగు కో ఆప్షన్ స్థానాలు దక్కనున్నాయి. ఇక్కడ విద్యావేత్తలు, అనుభవం కలిగిన ప్రజాప్రతినిధులు, రెండు మైనార్టీ వర్గాల అభ్యర్థుల మధ్య పోటీ ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆశీస్సులు అందుకునే వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు తమ అర్హతలు, పార్టీకి చేసిన సేవలు, స్థానికంగా ఉన్న ప్రభావాన్ని ప్రస్తావిస్తూ నేతల ప్రసన్నం కోసం పరస్పరం పోటీ పడుతున్నారు. ఇక జనగామ మున్సిపాలిటీలో పరిస్థితి భిన్నంగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఎక్స్ ఆఫీషియో ఓట్లు కలుపుకుని చెరి 16 చొప్పున సమాన బలం కలిగి ఉండటంతో కో ఆప్షన్ ఎన్నికలు ఎలా సాగుతాయన్నదానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే స్పష్టత రావాల్సి ఉంది. కో ఆప్షన్ కేటాయింపులో విద్యావేత్త, అనుభవం ఉన్న మాజీ కౌన్సిలర్, ఇద్దరు మైనార్టీలు, అందులో 50 శాతం మహిళలకు అవకాశం కల్పించాల్సి ఉండటంతో మొత్తం నలుగురు కోఆప్షన్ సభ్యుల ఎంపిక జరుగనుంది. ఈ నాలుగు స్థానాల కోసం ఒక్కో పార్టీ నుంచి 5 నుంచి 10 మంది వరకు బరిలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు సమాన బలం ఉండగా, పోటీకి సై అంటే ఇరు పార్టీల కోఆప్షన్ అభ్యర్థులు నామినేషన్లు వేస్తారు. ఇప్పటికే కో ఆప్షన్ పదవి కోసం ఆశావహులు పార్టీకి దరఖాస్తు చేసుకుంటుండగా, పోటీ అనివార్యమైతే ఎన్నికకు వెళ్లాల్సి వస్తుంది. రెండు పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాముగా మారగా, పదవి రాని నాయకులను బుజ్జగించేందుకు శక్తికి మించిన భారం పార్టీలపై పడనుంది. కానీ ఎవరికి వారే కో ఆప్షన్ తమకే దక్కనుందని పూర్తి విశ్వాసంతో ఉండగా, ఒక వేళ చేజారి పోతే వారిని ఎలా దారిలో పెట్టాలనే దానిపై అన్ని పార్టీలు ఆలోచన చేస్తున్నాయి. కోఆప్షన్ కాకపోతే ఇతర నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని పలువురు నాయకులకు నచ్చ చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్లో భారీ పోటీ చెరిసగం ఇచ్చుకుంటారా.. లాటరీ పునరావృతం అవుతుందా?సమాన ఓట్లు ఉన్న నేపథ్యంలో చైర్పర్సన్ ఎన్నికల మాదిరిగానే చేతులెత్తే విధానంలో కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై తుది నిర్ణయం నోటిఫికేషన్ వచ్చాకే తెలుస్తుంది. ఇరు పార్టీలు అంతర్గతంగా అభ్యర్థుల ఎంపికపై ఒకే అభిప్రాయానికి రావడానికి ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. పోటీ చేస్తున్న వారిని బుజ్జగించేందుకు నాయకులు లాబీయింగ్ చేస్తున్నారు. వార్డుల వారీగా కౌన్సిలర్లను గెలిపించడంలో తమ పాత్రను ప్రస్తావిస్తూ కొందరు అవకాశాన్ని కోరుతుండగా, మరికొందరు రెండు, మూడు దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్నామంటూ హక్కుగా కో ఆప్షన్ కోరుతున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లానే కో ఆప్షన్ ఎన్నికలు కూడా సజావుగా సాగుతాయా లేక లాటరీ పద్ధతికి వెళ్లే పరిస్థితి వస్తుందా అనే చర్చ పట్టణంలో జోరుగా సాగుతోంది. అవసరమైతే కో ఆప్షన్ ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేసే అవకాశం ఉందని సీనియర్ నాయకులు అంటున్నారు. మొత్తం మీద కోఆప్షన్ ఎన్నికలు స్థానిక రాజకీయాల్లో మరో కీలక మలుపుగా నిలవనున్నాయి. -
పట్టణాభివృద్ధే ముఖ్యం
● నిధుల కోసం ఎక్కడికై నా వెళదాం.. ● మున్సిపల్ మొదటి సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే పల్లాజనగామ: ‘పట్టణ అభివృద్ధి కోసం ఎంత తగ్గాలో అంత తగ్గుతా..నిధుల కోసం ఎక్కడికై నా వెళదాం..నా వంతు సహకారం ఉంటుంది..’అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ సమావేశం హాలులో నూతన పాలక మండలి మొదటి సాధారణ సమావేశం చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ అధ్యక్షతన జరగగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి హాజరై మా ట్లాడారు.. పార్టీలకతీతంగా పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని పాలక మండలికి పిలుపునిచ్చారు. సమస్యలు విన్నవించిన సభ్యులు మున్సిపల్ సాధారణ సమావేశంలో సభ్యులు తమ వార్డుల్లో ఉన్న సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. జనగామ అభివృద్ధి సంపూర్ణ సహకారం అందిస్తామని వైస్ చైర్మన్ భూష పర్వతాలు అన్నారు. 30 వార్డుల్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ముందుగా గుర్తించి, ప్రియార్టీ ప్రకారం అభివృద్ధి చేసుకుంటే ఐదేళ్లలో జనగామ సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుందని సభ్యులు కోరారు. ఓటింగ్ రోజు తప్పు చేశా.. క్షమించు తల్లీ ‘చెర్మన్ ఓటింగ్ రోజు జరిగిన ఎన్నికల్లో పొరపాటు జరిగింది.. మహిళలను గౌరవించడంలో ముందుంటా, తప్పు జరిగింది, పొరపాటుకు చింతిస్తున్నా, నీ కొడుకు లాంటి వాడిని, పెద్ద మనసు చేసుకుని క్షమించాలి’ అని 8వ వార్డు సభ్యురాలు మంజులను 15వ వార్డు సభ్యుడు పాండు కోరారు. సభ్యులకు సత్కారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి చైర్పర్సన్ బాలమణి, వైస్చైర్మన్ పర్వతాలను శాలువాతో సత్కరించి శుబాకాంక్షలు తెలుపగా, మిగతా 28 మంది వార్డు సభ్యులు అభినందలు తెలిపారు. కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఉన్నారు.14, 17, 27, 29 వార్డుల సభ్యులు సాధారణ సమావేశానికి హాజరు కాలేదు. -
నేడు బుగులు వెంకన్న కల్యాణం
చిల్పూరు: శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 28న (శనివారం) నిర్వహించే కల్యాణానికి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు తెలిపారు. గుట్ట కింద అంగడి ప్రదేశంలోని కల్యాణ మండపంలో నిర్వహించే స్వామివారి కల్యాణ ఏర్పాట్లను శుక్రవారం ఈఓ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. స్వామివారి కల్యాణానికి తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఘనంగా ఎదుర్కోళ్లు బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజైన శుక్రవారం ఉదయం ఆరుట్ల రాకేషచార్యుల సమక్షంలో ఆలయ అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేదమంత్రాల నడుమ నిత్యనిధిహోమం, సాయంత్రం 5 గంటలకు ఎదుర్కోళ్లు కార్యక్రమం నిర్వహించారు. -
కల్చర్ఫుల్ ఫెస్ట్..
● నిట్లో ఉత్సాహంగా స్ప్రింగ్స్ప్రీ–26 వేడుకలు ● ఆకట్టుకున్న స్వయంభు సినిమా యూనిట్ ● సందడి చేసిన హీరోయిన్లు సంయుక్త మీనన్, నభా నటేష్ ● ప్రత్యేక ఆకర్షణగా హీరో నిఖిల్ సిద్ధార్థ, డైరెక్టర్ శైలేష్ ● ఉర్రూతలూగించిన ప్రోషో కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లో విద్యార్థులే నిర్వాహకులుగా నిర్వహిస్తున్న సాంస్కృతిక మహోత్సవం కల్చరల్ఫెస్ట్ కలర్పుల్గా సాగింది. ఈ ఫెస్ట్లో దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొని తమతమ సంస్కృతీసంప్రదాయాలను పంచుకున్నారు. తొలిరోజు శుక్రవారం స్ప్రింగ్స్ప్రీ–26లో డైరెక్టర్స్ కట్లో సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను, స్వయంభు మూవీ హీరో నిఖిల్ సిద్ధార్థ్, హీరోయిన్లు సంయుక్త మీనన్, నభా నటేష్, అభినవ్ గోమటమ్, కెమెరామెన్ కేకే సెంథిల్కుమార్, ప్రోషోలో జోనితాగాంధీ తన గానామృతంతో విద్యార్థులను అలరించారు. ఫ్లాష్ షూట్ సీఈఓ స్టార్టప్ రంగాలపై అవగాహన కల్పించారు. చివరి రోజు శనివారం ప్రోషోలో రానినారెడ్డి పాప్ సాంగ్స్తో అలరించనుంది. -
బ్రహ్మోత్సవాలకు ముస్తాబు
స్టేషన్ఘన్పూర్: డివిజన్కేంద్రమైన స్టేషన్ఘన్పూర్ బస్టాండ్ సమీపంలోని పురాతన తిరుమలనాథస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ నెల 23 నుంచి మార్చి 4వ తేదీవరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతీ రోజూ విశేష పూజలను నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని దేవస్థాన కమిటీ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది. 1న(ఆదివారం) ప్రధాన ఘట్టమైన శ్రీతిరుమలనాథస్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రామానుజచార్యులు తెలిపారు. -
3 నుంచి వార్డుల్లోకి..
జనగామ: పట్టణంలో అభివృద్ధి వేగవంతం చేసేందుకు నూతన చైర్పర్సన్ కడకంచి బాలమణి వచ్చేనెల 3వ తేదీ నుంచి ‘మన చైర్పర్సన్..మన వార్డు’ సందర్శనకు శ్రీకారం చుట్టారు. పట్టణ సమస్యలను ప్రత్యక్షంగా గుర్తించి, తక్షణ పరిష్కారాల కోసం ప్రత్యేక పర్యటన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. మొదటి వార్డు నుంచి 30వ వార్డు వరకు ప్రతీ రోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు కాలనీల్లో పాదయాత్రగా పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్శనల్లో వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, అధికారులు, సీనియర్ నాయకులు పాల్గొంటారు. అభివృద్ధిపై ఫోకస్.. పట్టణ అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి అడుగు వేస్తున్నామని చైర్పర్సన్ ప్రకటించారు. పట్టణంలో పారిశుధ్యం, రోడ్లు, కాలువల శుభ్రత, వీధిదీపాలు, నాణ్యమైన తాగునీటి సరఫరా, పౌర సేవల మెరుగుదల వంటి అన్ని రంగాల్లో సమగ్ర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాపాలన బాటలో పరిపాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు. టౌన్ ప్లానింగ్లో సమస్యలు టౌన్ ప్లానింగ్ సమస్యలపై వచ్చే వారం ప్రత్యేక సమీక్ష నిర్వహించవలసిందిగా కమిషనర్ను ఆదేశించినట్లు చెప్పారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ప్రజలు చాలా వరకు ఇబ్బందులకు గురవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇక నుంచి మరింత పారదర్శకత ఉండేలా చూస్తామంటూ హామీ ఇచ్చారు. చైర్పర్సన్ బాధ్యతల స్వీకరణ జనగామ మున్సిపల్ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేసిన కడకంచి బాలమణిశ్రీనివాస్, శుక్రవారం అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. బాణాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు క్రిష్ణమాచారి సిద్ధాంతి మంత్రోచ్ఛరణల మధ్య ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి, యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి సమక్షంలో కుర్చీలో కూర్చుని సంతకం చేశారు. అంతకు ముందు ఎంపీ, కొమ్మూరి, ప్రశాంత్రెడ్డి, టీపీసీసీ సభ్యుడు లక్ష్మినారాయణనాయక్, పార్టీ కేడర్తో కలిసి భారీ ర్యాలీ, మేళతాళాల నడుమ ఊరేగింపుగా మున్సిపల్కు చేరుకున్నారు. పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకునేలా పనిచేయాలని ఎంపీ, కొమ్మూరి ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి చైర్పర్సన్ చాంబర్కు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. -
కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు
జనగామ రూరల్: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఇంటర్ విద్యాధికారి కె.జితేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం మూడో రోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు 16 పరీక్షల కేంద్రాల్లో జరిగాయన్నారు. జిల్లావ్యాప్తంగా మొదటి సంవత్సరం జనరల్ 3,227 విద్యార్థులకు 3,187 హాజరు కాగా 40 మంది గైర్హజరయ్యారు. ఒకేషనల్లో 1,036 విద్యార్థులకు 956 హాజరు కాగా, 80మంది గైర్హాజరయ్యారు. మొత్తం 97.18 శా తం విద్యార్థులు హాజరయ్యారు. కాగా జిల్లాలో ని పరీక్ష కేంద్రాలను ఆయన సందర్శించారు. డెక్ సభ్యులు సునంద, నర్మెట, దేవరుప్పుల కొడకండ్ల పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. గీతకార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ జనగామ: జిల్లా కేంద్రంలోని వికాస్ ఫార్మసీ కళాశాలలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, రెవె న్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ హాజరయ్యారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ.. శిక్షణ పొందిన ప్రతీ గీత కార్మికుడు విధిగా రక్షణ కిట్లను ఉపయోగించాలన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. కల్లు గీత కార్మికులందరూ రక్షణ కిట్లను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. అనంతరం 419 మంది కల్లుగీత కార్మికులకు కాటమయ్య కిట్లను అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎన్.ఎల్.నరసింహ రావు, డీపీఈఓ అనిత, ఏబీసీడీఓ రవీందర్, కేజీకేఎస్ ప్రధాన కార్యదర్శి వెంకట మల్లయ్య, ఎకై ్సజ్ శాఖ సిబ్బంది, వెనుకబడిన తరగతుల శాఖ సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్, విత్తన చట్టాలతో రైతాంగానికి ముప్పు పాలకుర్తి టౌన్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్ సవరణ బిల్లులు, విత్తన చట్టాలు రైతాంగ మనుగడకు ముప్పుగా మారుతున్నాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.జంగారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని శ్రీసోమేశ్వర ఫంక్షన్హాల్లో జరిగిన జిల్లా మూడో మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయడం వల్ల ఉచిత విద్యుత్ రద్దయ్యే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు మోకు కనకారెడ్డి మాట్లాడుతూ.. పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల పనులు వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భుక్య చందనాయక్, నాయకులు సింగారపు రమేశ్, మదార్, మాచర్ల సారయ్య, మిట్యానాయక్, బచ్చు శ్రీలత, చిట్యాల సోమన్న, సోమ సత్యం పాల్గొన్నారు. వచ్చే నెల 25న పోస్టల్ డాక్ అదాలత్ ఖిలా వరంగల్: మార్చి 25న పోస్టల్ సర్వీసులపై, వినియోగదారుల ఫిర్యాదులపై 53వ ప్రాంతీయ స్థాయి డాక్ అదాలత్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్లు వరంగల్ తపాలా శాఖ డివిజనల్ సూపరింటెండెంట్ రవికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లాల పరిధి డివిజన్కు సంబంధించి తపాలా సేవల వినియోగదారులకు ఏవైనా ఫిర్యాదులుంటే పోస్టల్ ఎన్వలప్/కవర్పై 53 డాక్ అదాలత్ అసిస్టెంట్ డైరెక్టర్ (స్టాఫ్ అండ్ విజిలెన్స్) పోస్ట్మాస్టర్ జనరల్, హైదరాబాద్ రీజియన్ హైదరాబాద్–500001కి మార్చి 9లోగా చేరేలా పంపించాలని కోరారు. -
ఆరోగ్య భాగ్యం
శనివారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026● హైపర్టెన్షన్, మధుమేహ నియంత్రణకు తొలి అడుగు ● జిల్లాలో మరో కార్యక్రమానికి శ్రీకారం ● 30ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికి పరీక్షలు ● గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ప్రత్యేక కార్యాచరణ● ‘మన చైర్పర్సన్..మన వార్డు సందర్శన’ కార్యక్రమం ● ప్రజా సమస్యలపై స్పెషల్ డ్రైవ్ ● బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ చైర్పర్సన్ బాలమణి జనగామ: జిల్లా వ్యాప్తంగా హైపర్టెన్షన్, మధుమేహం వంటి అసంక్రామ్య వ్యాధుల నియంత్రణ, ముందస్తు గుర్తింపు కోసం శ్రీఆరోగ్య జనగామ–మన ఆరోగ్యం మన చేతుల్లోశ్రీ కార్యక్రమానికి వైద్యారోగ్య శాఖ శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జున్రావు ఆధ్వర్యంలో ప్రోగ్రాం కొనసాగుతోంది. ఎన్సీడీల పెరుగుతున్న భారంపై ఆందోళన రాష్ట్రంలో అసంక్రామ్య వ్యాధుల (ఎన్సీడీ–నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) నిర్ధారణలో ఆరుగురిలో నాలుగు మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా హృదయ సంబంధిత వ్యాధులు దేశంలో 29 శాతం మరణాలకు దారితీస్తుండగా, హైపర్టెన్షన్ ప్రధాన ప్రమాదకారకంగా నిలుస్తోంది. మధుమేహం 3 శాతం మరణాలకు కారణమవుతోందని ఆరోగ్యశాఖ పేర్కొంది. కార్యక్రమ లక్ష్యాలు.. ఎన్సీడీలపై పెరుగుతున్న భారాన్ని తగ్గించడంతో పాటు నిర్ధారణ కాని హైపర్టెన్షన్, మధుమేహ కేసులను గుర్తించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. ముందస్తు నిర్ధారణతో చికిత్స, జీవనశైలిలో మార్పులు చేసుకునేలా అవగాహన కల్పిస్తారు. స్ట్రోక్, హార్ట్ డిసీజ్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సంక్లిష్టతలను నివారించడ ంలో వైద్యులు, సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుంటారు. ఎవరిని లక్ష్యంగా చేసుకుంటారు.. ఆరోగ్య జనగామ కార్యక్రమంలో 30 ఏళ్లు పైబడిన ప్రతీ వ్యక్తి ఊబకాయం, కుటుంబ చరిత్ర, పొగతాగడం, మద్యపానం చేసే ప్రమాదభరిత వర్గాలను ఎంచుకుంటారు. సబ్సెంటర్లు, పీహెచ్సీలు, సీహెచ్సీలు, జిల్లా ఆసుపత్రిలో స్క్రీనింగ్తో పాటు గ్రామస్థాయిలో ఏఎన్ఎంలు, ఆశలు, ఎంపీడబ్ల్యూలు వైద్య శిబిరాలతో పాటు తలుపుతట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. బీపీ, బ్లడ్ షుగర్ పరీక్షలు చేసి, వైద్యులతో నిర్ధారణ, ఆ తర్వాత చికిత్స ప్రారంభిస్తారు. పరిస్థితి క్రిటికల్ అని నిర్ధారించుకుంటే ఉన్నత కేంద్రాలకు రెఫర్ చేస్తారు. రక్తపోటు, మధుమేహ నియంత్రణ.. 30 ఏళ్లు పైబడిన ప్రతీ వ్యక్తి తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయిం చుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య విభాగం అధికారులు సూచిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయివరకు దశల వారీగా అమలు చేస్తున్నారు. వ్యక్తుల మొబిలైజేషన్ బాధ్యతను ఆశాలకు అప్పగించారు. స్క్రీనింగ్ ప్రక్రియను ఏఎన్ఎం, ఎంఎల్ హెచ్పీలు నిర్వహిస్తారు. నియంత్రణ లో ఉన్న రక్తపోటు, బ్లడ్షుగర్ రోగులకు స్థానిక ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పీలు ఫాలో చేస్తారు. నియంత్రణలో లేని రోగులను జిల్లా ఆసుపత్రిలోని ఎన్సీడీ క్లినిక్కు రెఫర్ చేస్తారు. సబ్సెంటర్ స్థాయిలో కార్యాచరణ సబ్సెంటర్ స్థాయిలో గతంలో ఉన్న హైపర్టెన్షన్, డయాబెటిస్ కేసుల వివరాలను సిద్ధం చేస్తారు. ఎంఎల్హెచ్పీ, సూపర్వైజర్, ఏఎన్ఎం, ఎంపీహెచ్ఏ (ఎం), ఆశాలతో కూడిన టీం అవగాహన సమావేశాలు నిర్వహిస్తుంది. బీపీ, ఆర్బీఎస్ పరీక్షలు చేసి ఏవైనా అసాధారణ రోగాలు ఉంటే పీహెచ్సీకి పంపిస్తారు. పీహెచ్సీ స్థాయి చర్యలు పీహెచ్సీ స్థాయిలో రెఫర్ అయిన కేసులను మళ్లీ పరిశీలించి అవసరమైతే సీబీపీ, హెచ్బీఏ1సీ, ఎల్ఎఫ్టీ, ఆర్ఎస్బీ వంటి పరీక్షలు చేయిస్తారు. క్లిష్టమైన కేసులను ఉన్నతస్థాయి ఆసుపత్రులకు రిఫర్ చేసి, పేషెంట్లకు చికిత్స, కౌన్సెలింగ్ ఇస్తారు. ఒకరి కంటే ఎక్కువ వైద్యులు ఉన్న పీహెచ్సీల్లో ఓపీ సేవలు, ఫీల్డ్ మానిటరింగ్ (ఆరోగ్య జనగామ) ద్వారా స్క్రీనింగ్ శిబిరాల పర్యవేక్షణ చేస్తారు. ఆరోగ్య శాఖ సందేశం ఆరోగ్య జనగామతో ముందస్తు పరీక్షలు చేయించడం ద్వారా త్వరిత గుర్తింపుతో ప్రాణాలను కాపాడవచ్చు. ఈ ప్రోగ్రాంతో జిల్లా ఆరోగ్యవంతమైన వైద్య పరీక్షల్లో మరో ముందడు గు వేయనుంది. జిల్లాలో హైపర్టెన్షన్, మధుమేహ నియంత్రణను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రస్థాయి షూటింగ్బాల్ పోటీలకు ఎంపిక జిల్లా సమాచారం జిల్లా జనాభా: 5,33,104 30 ఏళ్లు పైబడిన వారు: 1,97,786 ప్రస్తుత మధుమేహ వ్యాధిగ్రస్థులు: 9.76 శాతం(అంచనా 17శాతం) హైపర్టెన్షన్ ఉన్నవారు: 11.76శాతం (అంచనా 30శాతం) నమోదైన ఎన్సీడీ కేసులు: 32,022ఆరోగ్య జనగామగా చేసుకుందాం జిల్లాను మధుమేహం, అధిక రక్తపోటు రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజారోగ్య కార్యక్రమంలో భాగంగా ‘ఆరోగ్య జనగామ’ ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టాం. జిల్లాలో 30 ఏళ్లు పైబడిన ప్రతీ వ్యక్తికి హైపర్టెన్షన్, మధుమేహం స్క్రీనింగ్ నిర్వహించి, వ్యాధులను ముందుగానే గుర్తించి సరైన చికిత్స అందించడం అందరి లక్ష్యం. ప్రారంభ దశలో ప్రతీ గ్రామంలో రోజుకు 100 మంది చొప్పున స్క్రీనింగ్ చేస్తున్నాం. వచ్చే నెల 2 నుంచి ఏప్రిల్ 30 వరకు గర్భిణులు, యువతలో స్క్రీనింగ్ పూర్తి చేసి హెల్త్ కార్డులు ఇస్తాం. -
పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు కంటిపరీక్షలు
జనగామ: పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో డీజీపీ ఆదేశాలు, సీపీ ఉత్తర్వుల మేరకు డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆటోడ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఆటో డ్రైవర్లకు రాత్రి డ్రైవింగ్, దుమ్ము, కాలుష్యం వల్ల వచ్చే కంటి సమస్యలపై డాక్టర్లు అవగాహన కల్పించారు. చూపు సమస్యలు ఉన్న వారికి అద్దాలు పంపిణీ చేశారు. పోలీసుల సేవా కార్యక్రమంపై ఆటో డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేస్తూ ఆ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్ఐలు భరత్, రతీష్, చెన్నకేశవులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
గద్వాల్కు రిజ్వాన్ బాషా
జనగామ: జిల్లా అభివృద్ధికి తనదైన ముద్ర వేసిన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జోగుళాంబ గద్వాల్ జిల్లాకు బదిలీ అయ్యారు. రెండేళ్ల పదవీ కాలంలో విద్య, వైద్యం, సంక్షేమం, నీటి సంరక్షణ, పారదర్శక పరిపాలన రంగాల్లో జిల్లా పేరును రాష్ట్ర, జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన కలెక్టర్గా ఆయన రుజువు చేసుకున్నారు. 2024 ఫిబ్రవరి 24న కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న రిజ్వాన్ బాషా.. సరిగ్గా రెండేళ్ల పాటు ఇక్కడ పని చేశారు. జాతీయ, రాష్ట్రస్థాయిల్లో గుర్తింపు జిల్లాలో చేపట్టిన ‘మన జిల్లా–మన నీరు’ కార్యక్రమానికి 2025లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ చేతుల మీదుగా జల్ సంచాయ్, జన్ భాగీధారీ 1.0 అవార్డు, జల్ ప్రహరీ సమ్మాన్ అందుకున్నారు. ఆర్టీఐ దరఖాస్తులను వేగంగా పరిష్కరించడంలో 2025లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఉత్తమ జిల్లా అవార్డు లభించింది. అలాగే 2026 జనవరిలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్వర్మ చేతుల మీదుగా ఉత్తమ జిల్లా పురస్కారం లభించింది. జాతీయ స్థాయిలో న్యాస్–2024లో 3వ తరగతిలో దేశంలో 16వ స్థానం, 6వ తరగతిలో 35వ స్థానం, 9వ తరగతిలో 33వ స్థానం సాధించడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో జనగామ జిల్లా మాత్రమే జాతీయ ర్యాంకుల్లో స్థానం సంపాదించింది. ఈ విజయానికి గుర్తింపుగా 2025 సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. జిల్లా అభివృద్ధికి తమ వంతు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ, గద్వాల్ జిల్లాలోనూ ప్రజాసేవలో అదే ఒరవడిని కొనసాగిస్తానని కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. జిల్లాలో అభివృద్ధి, పారదర్శక పరిపాలనకు ప్రతీకగా నిలిచిన కలెక్టర్ సేవలను గుర్తుచేసుకుంటూ ప్రజలు, అధికారులు అభినందనలు తెలియజేశారు. కాగా కాన్ఫరెన్స్ హాలులో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీహరితో పాటు డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఆర్డీఓ వెంకన్న, ఉన్నతాధికారులు బదిలీపై వెళ్లిన కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్లను సత్కరించారు. జనగామ జిల్లాలో అడిషనల్ కలెక్టర్, విద్యాశాఖ అధికారి(లోకల్ బాడీస్) గా బాధ్యతలు నిర్వర్తిస్త్తున్న పింకేష్ కుమార్ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆ దేశాలు జారీ చేసింది. కాగా, అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లోని కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా నియమితులయ్యారు. ఇదిలా ఉండగా పింకేశ్ కుమార్ స్థానంలో ఎవరికి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, విద్యాశాఖ అధికారి రెండు పోస్టులు ఖాళీగా మారాయి. ఆయన హయాంలో జిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు కలెక్టర్, అదనపు కలెక్టర్లకు ఎమ్మెల్యే కడియంతో సహా పలువురి సత్కారం -
సెకండియర్ పరీక్షలు ప్రారంభం
జనగామ రూరల్: జిల్లా వ్యాప్తంగా 16 సెంటర్లలో గురువారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 98.09 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్ విద్యాధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 3,999మంది విద్యార్థులకు 3,923 మంది విద్యార్థులు హాజరు కాగా 76 మంది గైర్హాజరయ్యారన్నారు. జనరల్లో 3,091 మందికి విద్యార్థులకు 3,055 మంది హాజరుకాగా 36 మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఒకేషనల్లో 908 మంది గాను 868 మంది హాజరు కాగా 40 మంది గైర్హాజరయ్యారన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 98.09శాతం విద్యార్థుల హాజరు ప్రశాంతంగా రెండోరోజు ఇంటర్ పరీక్షలు -
ప్రాంగణాలపై పట్టింపేది?
స్పోర్ట్ ్స స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంజనగామ రూరల్: జిల్లాలోని గ్రామీణ క్రీడా మైదానాలు(ప్రాంగణాలు) పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో బోర్డులు తొలగించి నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడానికి గత ప్రభుత్వం ఊరూరా క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు సంకల్పించింది. ఇందుకు ఆయా గ్రామీణ ప్రాంతాల్లో స్థలాలు గుర్తించింది. వాటిలో నిర్మాణాలు చేపట్టి బోర్డులను ఏర్పాటు చేసింది. ఆశయం గొప్పదే అయినప్పుటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అమలుకావడం లేదు. వాటిని పూర్తిగా వినియోగంలోకి తీసుకురావడంలో అలసత్వం వల్ల నిరుపయోగంగా మారాయి. జిల్లావ్యాప్తంగా 281 గ్రామ పంచాయతీలు 201 అనుబంధ గ్రామాలు ఉండగా మొత్తం 483 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు గుర్తించి 450 వరకు నిర్మాణాలు పూర్తి చేశారు. ప్రతీ క్రీడా ప్రాంగణానికి రెండు లక్షల చొప్పున వెచ్చించారు. చాలా చోట్ల అనువైన స్థలాలు దొరక్కపోవడంతో అందుబాటులో ఉన్న చోట చదును చేసి బోర్డులు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. ప్రతీ వార్డులో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్నవి పిచ్చిమొక్కలతో నిండిపోయి ఆడుకోవడానికి వీలుకాకుండా తయారయ్యాయి. క్రీడా పరికరాలు ఎక్కడ? లక్ష్యానికి అనుగుణంగా క్రీడాకారుల్లో ఆసక్తిని బట్టి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ పరికరాలు అందజేశారు. జిల్లా అధికారులు వాటిని ఎంపీడీఓ కార్యాలయాలకు పంపించారు. అక్కడ నుంచి గ్రామాలకు చేర్చారు. క్రికెట్ కిట్లు, వాలీబాల్, బాస్కెట్బాల్, డంబెల్స్, రింగ్ బాల్స్, టీషర్టులు వంటి పెద్ద మొత్తంలో ఇచ్చారు. ప్రస్తుతం అవి ఎక్కడా ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. దూరంగా క్రీడా ప్రాంగణాలు.. ప్రతీ పంచాయతీలో ఎకరం స్థలంలో ప్రాంగణం ఏర్పాటు చేయాల్సి ఉండగా కొన్ని గ్రామాలో స్థలం లభించకపోవడంతో అందుబాటులో ఉన్న స్థలంలోనే నిర్మించారు. కొన్ని గ్రామాల్లో ఊరికి దూరంగా ఉండడంతో వాటి నిర్వహణ చూసేవారు కరువయ్యారు. పాఠశాలల్లో, వెంచర్లలో లక్షలు ఖర్చు చేసిన ప్రాంగణాలు పనికి రాకుండా పోతున్నాయి. జనగామ మండల యశ్వాంతాపూర్లో కిలోమీటర్ దూరంలో ఉండగా అందులో మొక్కలు నాటి వదిలేశారు. వడ్లకొండలో స్థలం లేక వెంచర్ భూమి లో నిర్మించారు. ఎల్లంలతో పాటు మరి కొన్ని గ్రామాల్లో నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా గ్రామాలకు దూరంగా అనేక ప్రాంగణాలు ఉన్నాయి. జఫర్గఢ్లో తిమ్మంపేట, బచ్చన్నపేటలో కేసిరెడ్డిపల్లి, స్టేషన్ ఘన్పూర్లో నమిలిగొండ, సముద్రాల, రంగరాయిగూడెంతో పాట పలు గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు వసతుల లేక సమస్యలతో దర్శనమిస్తున్నాయి. పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్న క్రీడా మైదానాలు పరికరాలు లేవు.. వసతులు కరువు నిర్వహణ పట్టించుకోని అధికారులు జిల్లావ్యాప్తంగా 483 గ్రామీణ క్రీడా మైదానాలు లక్షలు ఖర్చు పెట్టినా ప్రయోజనం శూన్యం జనగామ రూరల్: రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్లో 2026–27 విద్యా సంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి కె.కోదండ రాములు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27 నుంచి వచ్చే నెల 4వ తేదీ లోపు పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పారు. పేర్లు నమోదుచేసుకున్న వారికి ఆయా మండల కేంద్రంలో ఎంపిక ఉంటుందన్నారు. మండల స్థాయిలో ఎంపికై న వారిని జిల్లాస్థాయిలో 28న మినీ స్టేడియంలో ఎంపిక చేసి ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే ఎంపికకు పంపుతామన్నారు. అర్హులైన వారు tgss telangana.govt.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత ఒరిజినల్స్, జిరాక్స్ కాపీలను తీసుకుని రావాలని సూచించారు. -
క్రీడలతో మానసికోల్లాసం
జనగామ రూరల్: క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక ఉత్సాహం కలుగుతుందని జెడ్పీ సీఈఓ మాధురి షా అన్నారు. కేంద్ర ప్రభుత్వం ‘మేరా యువభారత్ వరంగల్ కేంద్రం’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ను గురువారం పట్టణంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా సీఈఓ మాట్లాడుతూ..క్రీడలతో ఉన్నత స్థాయిలో నిలబడవచ్చని, ప్రతీ ఒక్కరు క్రీడలపై ఆసక్తి చూపాలని, తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలన్నారు. కబడ్డీ, టగ్ ఆఫ్ వార్లో ఏబీవీ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బి.భవాని, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజ్కుమార్, ఫిజికల్ డైరెక్టర్ టి.కల్యాణి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ కె.రాము, క్రీడాకారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓ మాధురిషా -
నేడు మున్సిపల్ పాలకమండలి బాధ్యతల స్వీకరణ
జనగామ: జనగామ మున్సిపల్ నూతన పాలక మండలి చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, వైస్ చైర్మన్ భూష పర్వతాలు, 28 మంది కౌన్సిలర్లతో కూడిన మండలి సభ్యుల పరిచయ కార్యక్రమం ఈనెల 27న (శుక్రవారం) నిర్వహించనున్నారు. మున్సిపల్ కాన్ఫరెన్స్ హాలులో ఉదయం 11 గంటలకు నూతన పాలకమండలి పరిచయ కార్యక్రమంతో పాటు చైర్పర్సన్ అధికారికంగా బాధ్యతలను తీసుకోనున్నారు. అనంతరం కొత్తగా కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్ను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్కుమార్రెడ్డి హాజరుకానున్నట్లు కమిషనర్ మహేశ్వర్రెడ్డి తెలిపారు. -
కొత్త కలెక్టరొచ్చారు!
జనగామ: జిల్లా కొత్త కలెక్టర్గా పరిపాలనకు కొత్త దిశ ఇవ్వడానికి ప్రభుత్వం ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝాను నియమించింది. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా పనిచేస్తున్న ఆయన్ను జిల్లాకు బదిలీ చేసింది. గురువారం జిల్లా కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా బాధ్యతలు చేపట్టారు. సమస్యలకు పరిష్కారం లభించేనా? జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, భూసర్వే, తదితర సమస్యల పరిష్కారంలో వేగవంతమైన అడుగులు పడతాయన్న ఆశాభావం ప్రజలు, అధికారుల్లో కనిపిస్తోంది. జిల్లాలో ఎక్కువగా కనిపించే భూ రికార్డు సవరణలు, సర్వే ఇష్యూలు, పాస్ బుక్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్, రోడ్ల నాణ్యత, కాలువల సమస్యల పరిష్కారంలో వేగం చూపాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య సేవల్లో మెరుగుదల దిశగా కృషి చేయాల్సిన అవసరముంది. జిల్లాలో ఆయా రోగాలు, మధుమేహం, రక్తపోటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామ స్థాయిలో స్క్రీనింగ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతం, అవసరమైన సిబ్బంది నియామకం వంటి పనులు ప్రాధాన్యం పొందవచ్చని ఆరోగ్య శాఖ వర్గాలు తెలుపుతున్నాయి. బాధ్యతల స్వీకరణ జిల్లా కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా గురువారం మధ్యాహ్నం బాధ్యతలను స్వీకరించారు. బదిలీపై వెళ్లిన ప్రస్తుత కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆయనకు బాధ్యతలు అప్పగించగా, కొత్త కలెక్టర్ అధికారికంగా సంతకం చేశారు. అనంతరం పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగులు కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన సందీప్ కుమార్ ఝా కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ నుంచి జిల్లాకు.. పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభించాలని జిల్లా వాసుల ఆకాంక్ష


