breaking news
Jangaon
-
కొనసాగుతున్న ఆపరేషన్ టైగర్
సాక్షి, జనగామ: జిల్లాలో పెద్దపులి కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. నెల రోజులు కావొస్తున్నా.. దాని జాడ మాత్రం చిక్కడం లేదు. ఈ తెల్లవారు జామున నర్మెట మండలం అమ్మపురం గ్రామంలో రెండు దూడలను పులి చంపింది. దీంతో.. చుట్టుపక్కల గ్రామాలు భయాందోళనకు గురవుతున్నాయి.ఈ పెద్దపులి తొలుత ఆడ తోడు కోసం ఆమ్రాబాద్ అడవుల నుంచి వచ్చిందని అటవీశాఖ అధికారులు భావించారు. అయితే ఆ తర్వాతే మహారాష్ట్ర అడవుల నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల మీదుగా తాజాగా జనగామ జిల్లాలోకి ప్రవేశించిందని నిర్ధారించుకున్నారు. మొదటిగా లింగాలఘనపురం మండలంలో అడుగుపెట్టింది. తర్వాత దేవరుప్పల మండలంలోని వ్యవసాయ పొలాల మీదుగా శుక్రవారం రఘునాథపల్లి మండలం మండలగూడెం గ్రామ శివారులో సంచరించినట్లు అటవీ, పోలీస్ శాఖల అధికారులు గుర్తించారు. గత.. మూడు రోజులుగా జిల్లాలో పులి సంచారంతో ప్రజలంతా భయాందోళన చెందుతున్నారు. ఈ ఉదయం.. పశువుల అరుపులు విన్న వాటి యాజమానులు బయటకు వచ్చేసరికి.. రెండు దూడలు మృతదేహాలుగా కనిపించాయి. ఈ దాడి తర్వాత గ్రామంలో భయం మరింత పెరిగింది. పిల్లలు, మహిళలు బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. రైతులు తమ పశువులను కాపాడుకోవడానికి గూడెల వద్ద కాపలా కాస్తున్నారు. అటవీశాఖ తక్షణమే స్పందించి తమ సిబ్బందిని అక్కడికి పంపించింది. తోడు కోసం మొదలైన యాత్ర.. యాదాద్రి, సిద్ధిపేట, జనగాం.. జిల్లాల గుండా వెళ్లే దారిలో పులి అక్కడక్కడా లేగదూడలను చంపుతోంది. అయితే.. ఆడ పులి కోసం వెతుకుతూ సంచారం ప్రారంభించిందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. డ్రోన్ కెమెరాల సాయంతో జాడ తెలుసుకునేందుకు శ్రమిస్తున్నారు. అదే విధంగా అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లే రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ.. జనగామ, హనుమకొండ జిల్లాల అటవీశాఖ అధికారి లావణ్య ఒక ప్రకటన విడుదల చేశారు. లింగాలఘనపురం, రఘునాథపల్లి, నర్మెట్ట, జనగామ, దేవరుప్పుల, తరిగొప్పుల తదితర మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే.. పులి సంచారంపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సంప్రదించాల్సిన ఫోన్నంబర్లుబీట్ ఆఫీసర్, రఘునాథపల్లి : 96037 80678ఎఫ్ఎస్వో, రఘునాథపల్లి : 73826 19411ఎఫ్ఎస్వో, జనగామ: 81213 16323డిప్యూటీ ఆర్వో, లింగాలఘనపురం: 97046 01785ఎస్హెచ్వో, రఘునాథపల్లి : 87126 85211తహసీల్దార్, రఘునాథపల్లి: 96763 88123ఎఫ్ఆర్వో, జనగామ: 93989 46440డీఎఫ్వో, జనగామ: 94408 10093 -
పులి.. ఒకటా? రెండా?
● జిల్లాలో పశువులపై సాగిస్తున్న వేట ● పులికోసం బోన్లు.. ట్రాప్ కెమెరాల ఏర్పాటు ● పగలు కొండల్లో.. రాత్రి పొలాల్లో టైగర్ జాడలు ● ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు జనగామ: మూడు రోజులుగా జిల్లాలోని బచ్చన్నపేట, జనగామ, లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల పరిసర అటవీ ప్రాంతాల్లో పులి సంచారం వార్తలు గ్రామాలను వణికిస్తున్నాయి. మొదట అటవీ ప్రాంతాల్లోనే తిరుగుతున్నట్లు భావించినా ఇప్పుడు మనుషుల నివాస ప్రాంతాలవైపు వచ్చిందన్న ప్రచారంతో అధికార యంత్రాంగం ప్రజలను మరింత అప్రమత్తం చేస్తోంది. రఘునాథపల్లి, బచ్చన్నపేట మండలాల్లోని చెరువుల అంచులు, పల్లె వెలుపల ఉన్న పొలాల్లో పులి పాదముద్రలు కనిపించడంతో గ్రామస్తులు రాత్రివేళలో బయటకు రావడానికి, వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లడానికి జంకుతున్నారు. పశువులను కూడా వెలుపల వదలడానికి భయపడుతున్నారు. పగలు కొండకోనల్లో తిష్ట వేసిన పులి ఇప్పటివరకు రాత్రివేళల్లో యాదాద్రి, జనగామ జిల్లాలో 20 వరకు ఆవులు, మేకలను వేటాడినట్టు పలు గ్రామాల్లో వార్తలు, సంఘటనలు వెలుగులోకి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆడనా.. మగనా... ఈ పులి ఎక్కడినుంచి వచ్చింది.. మగపులా? ఆడపులా? లేక రెండు పులులా? అన్న అనుమానాలు కొనసాగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరించిన పులిని అటవీశాఖ అధికారులు రాయల్ బెంగాల్ టైగర్గా గుర్తించారు. ఇది మగ పులిగా నిర్ధారించారు. ఇదిలా ఉండగా బచ్చన్నపేట మండలంలో మరో పులి సంచరిస్తోందనే ప్రచారం ప్రజల్లో మరింత భయాన్ని రేకెత్తిస్తోంది. ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో పులిఛాయలు, పాదముద్రలు భిన్నంగా ఉండటం వంటి అంశాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో అటవీశాఖ, పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాయి. పులి కదలికలను గుర్తించేందుకు అటవీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, ట్రాపింగ్ బోన్లు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో రాత్రి పహారా బృందాలను ఏర్పాటు చేసి గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజల అప్రమత్తతకు.. సూచనలు ● పులి సంచారంపై జిల్లా అటవీశాఖ అధికారులు ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు చెబుతున్నారు. ● పులి కదలికలు రాత్రివేళల్లో చురుకుగా ఉంటాయని, వేకువజామున, సాయంత్రం, చీకటి పడిన తర్వాత పులి సంచరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండడం మంచిది. ● పులి కనిపించిన సందర్భంలో పెద్దగా గోల చేయరాదు. శబ్ధాల వల్ల పులి మరింత ఆందోళనకు గురవుతుంది. ● మేకలు, ఆవులు వంటి పశువులను రాత్రివేళల్లో బయట ఉంచవద్దు. ● రాత్రి పొలాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు, వృద్ధులు, మహిళలు రాత్రివేళల్లో ఒంటరిగా బయటికి వెళ్లొద్దు. ● వీలైనంత వరకు గుంపులుగా ప్రయాణించాలి. ● పులి కదలికలు కనిపిస్తే వెంటనే ఎస్ఎస్ఓ, ఎఫ్ఆర్ఓ, ఎస్హెచ్ఓ, తహసీల్దార్లకు సమాచారం ఇవ్వాలి.ఎఫ్బీఓ రఘునాథపల్లి : 9603780678ఎస్హెచ్ఓ రఘునాథపల్లి : 8712685211ఎఫ్ఎస్ఓ రఘునాథపల్లి : 7382619411తహసీల్దార్ రఘునాథపల్లి : 9676 388123ఎఫ్ఎస్ఓ జనగామ : 8121316323ఎఫ్ఆర్ఓ జనగామ : 939894 6440డీఆర్ఓ లింగాల ఘణపురం : 9704601785డీఎఫ్ఓ జనగామ : 944 0810093 -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
జనగామ రూరల్: జిల్లాలో జనగామ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. పీఓ, ఏపీఓల నియామకంతో పాటు ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరగడంలో మైక్రో అబ్జర్వర్లు అత్యంత కీలకపాత్ర పోషిస్తారని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మైక్రో అబ్జర్వర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జనరల్ అబ్జర్వర్ నర్సింహారెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ హాజరై వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ..పోలింగ్ బూత్లో జరిగే మొత్తం ప్రక్రియను మైక్రో అబ్జర్వర్ నిశితంగా పరిశీలించాలన్నారు. జనరల్ అబ్జర్వర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమన్నారు. కాగా, జనగామ, స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలకు సంబంధించి పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, నోడల్ అధికారి హౌజింగ్ పీడీ మాతృనాయక్ పాల్గొన్నారు. -
వీరిచేతుల్లోనే విజయం!
పురపాలికల ఎన్నికల్లో ఇన్చార్జ్లదే కీలకపాత్రజనగామ: జిల్లాలో జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. రెండుచోట్ల పీఠాలను కై వసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ శక్తిని వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాల సర్పంచులు, నాయకులు, స్థానిక ప్రతినిధులు ఇప్పుడు పట్టణ ఎన్నికల్లో కీలక పాత్రధారులుగా మారి అభ్యర్థుల విజయానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. తెల్లవారుజాము ఆరుగంటల నుంచి రాత్రి పన్నెండు వరకు ఎవరికి వారే తమ బృందాలతో వీధుల్లో తిరుగుతూ పోల్ మేనేజ్మెంట్, ఓటర్ కనెక్ట్, ప్రచా ర వ్యూహాలపై దృష్టి సారిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ మండలాల నుంచి వచ్చిన ఇన్న్చార్జ్ నాయకులు తమకు అప్పగించిన వార్డులపై పూర్తి ఫోకస్ పెట్టారు. వారికి తెలిసిన గ్రామస్తులు, తమ ప్రాంత ప్రజలు జనగామ లేదా స్టేషన్ఘనన్పూర్ పట్టణాల్లో ఓటర్లుగా ఉండడం అభ్యర్థులకు మరింత ప్లస్ పా యింట్గా మారుతోంది. ప్రతీ ఓటర్ను సంప్రదించి సంబంధాలను పటిష్టం చేసి తమ వైపు తిప్పుకోవడంలో వారు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఎక్కడ చూసినా ఇనన్చార్జ్ బృందాల హడావిడి, చురుగ్గా తిరిగే కార్యకర్తలదే ఈ ఎన్నికల్లో అసలు పోరు అని చెప్పవచ్చు. ఒక్కో వార్డులో కనీసం 20 మంది వరకు ఇనన్చార్జ్లు, వార్డు కమిటీ సభ్యులు, సహాయకులు కలిసి ముమ్మరంగా పనిచేస్తున్నారు. పట్టణంలోని ప్రతీ వీధిలో వారి ఉనికి స్పష్టంగా కనిపిస్తోంది. వార్డుల వారీగా ఓటర్ లిస్టులు సిద్ధం చేసి, ప్రభావవంతులైన కుటుంబాలను దగ్గర చేసుకోవడం, అసంతృప్తులను చర్చలతో దగ్గరకు చేర్చుకోవడం, గ్రూపుల మధ్య కలహాలను తగ్గించడం వంటి పనులను వారు ఎంతో వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఆయా మండలాల నుంచి ఇన్చార్జ్లుగా వచ్చిన నాయకులు తమ ప్రాంత పరిచయాలను కూడా పూర్తిగా వినియోగిస్తున్నారు. పట్టణంలో నివసిస్తున్న తమ గ్రామాల ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఓటరు–ఓటరుకు లింక్ విధానం అమలు చేస్తున్నారు. స్థానికంగా తమ ప్రభావం ఉన్న కుటుంబాలకు మరింత చేరువై వారిని అభ్యర్థికి అనుసంధానం చేస్తూ రానిఓట్లను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పురపాలిక ఎన్నికల ప్రచారం పట్టణాన్ని పండుగ వాతావరణంలోకి తీసుకెళ్లింది. రోడ్లపై పార్టీ జెండాలు, గల్లీల్లో నినాదాలు, ఇంటింటికీ తిరిగే ప్రచార బృందాలు ఏ వార్డులోకి వెళ్లినా అదే ఉత్సాహం కనిపిస్తోంది. ఇన్న్ చార్జ్ బృందాల సందడితో పాటు అభ్యర్థుల పాదయాత్రలు, సమావేశాలతో పట్టణంలో సందడి నెలకొంది. తెల్లవారు లేచింది మొదలు అర్ధరాత్రి వరకు గెలుపు వ్యూహాలు 20 మంది జట్టుగా..అహర్నిశలు శ్రమ పట్టణాల్లో ఎటు చూసినా సందడే ప్రతీ ఓటు కీలకం కావడంతో పక్కా ప్రణాళికలుసర్పంచులు, రైతు నాయకులు, స్థానిక నేతలు, గత ఎన్నికల్లో ప్రభావం చూపిన ఓటరు గ్రూపులందరూ తమ అభ్యర్థుల వెనుక నిలబడే విధంగా కసరత్తు సాగుతోంది. ఈసారి మున్సిపల్ పీఠం కోసం జరిగే పోరులో పార్టీలు కాకుండా నాయకుల వ్యక్తిగత ప్రభావం ప్రచారం గెలుపు, ఓటములను నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనగామ, స్టేషన్ఘన్న్పూర్ పురపాలికల్లో ఈసారి ఎన్నికలు తీవ్ర హోరాహోరీ వాతావరణంలో సాగుతున్నాయి. ఇన్చార్జ్లు, కార్యకర్తల కలసికట్టుగా పోరాటం పట్టణంలోని ప్రతీ ఓటును కీలకంగా మార్చబోతోంది. -
అగ్రనేతలకు సవాలే!
సాక్షిప్రతినిధి, వరంగల్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా.. రెండు రోజుల ముందే ప్రచారానికి తెరపడనుంది. అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి ఇంకా మూడు రోజులే మిగిలింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు అభ్యర్థుల గెలుపు కోసం దూకుడు పెంచారు. ప్రజాప్రతినిధులు, పార్టీలు నియమించిన ఎన్నికల ఇన్చా ర్జ్లు రెండు రోజులుగా మున్సిపాలిటీలలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇంటింటి ప్రచారం, కులసంఘాలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్లో ఈ ఎన్నికలు మూడు పార్టీల నేతలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను సవరించుకుంటూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. 10నియోజకవర్గాలు.. 12 మున్సిపాలిటీలు.. ఉమ్మడి వరంగల్లో 12 మున్సిపాలిటీలలో 260 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిసి 1,073 మంది పోటీలో ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్.. 12 మున్సిపాలిటీలను కై వసం చేసుకోవడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ తర్వాత ఎక్కువ పంచాయతీలలో తమ మద్దతుదారులను గెలిపించుకుని రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్.. గత వైభవాన్ని చాటుతామంటోంది. బీజేపీ 12 మున్సిపాలిటీల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. కాగా వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు మినహా 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా నేతలకు ఈ ఎన్నికలు సవాలే.. ● హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ తరఫున కాళిప్రసాదరావు ప్రచారం చేస్తున్నారు. ● వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్దన్నపేట మున్సిపాలిటీలు కాంగ్రెస్, బీఆర్ఎస్లకు సవాల్గా మారాయి. నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేల పెద్ది సుదర్శన్ రెడ్డిలు చైర్మన్ పీఠం కోసం కుస్తీ పడుతున్నారు. వర్ధన్నపేటలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం వార్డుల్లో తిరుగుతున్నారు. ● జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీ పీఠం కోసం బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభ్యర్థుల గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. ఇన్చార్జ్లు, ముఖ్య నేతలను కలుపుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త, టీపీసీసీ నేత ఝాన్సీ అభ్యర్థులను బరిలోకి దింపారు. వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ● జనగామ మున్సిపాలిటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నువ్వా, నేనా అన్న రీతిలో ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వార్డు కౌన్సిలర్ల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఉండగా, భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్రెడ్డి, వెంకటేశ్వర్లులు ఇన్చార్జ్లుగా ఉన్నారు. ● స్టేషన్ ఘన్పూర్ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కాగా.. ఇక్కడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్తో కలిసి నడుస్తున్న కడియం శ్రీహరి ఆ పార్టీ అభ్యర్థులను అందరిని గెలిపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత డా.తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతున్నారు. ● భూపాలపల్లి మున్సిపాలిటీలో పాగా వేసేందుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (కాంగ్రెస్), గండ్ర వెంకట రమణారెడ్డి (బీఆర్ఎస్)లు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మెజార్టీ స్థానాలను దక్కించుకుని చైర్మన్ పీఠంను కై వసం చేసుకోవాలని చూస్తున్నారు. బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి అభ్యర్థులను బరిలోకి దింపారు. ● ములుగు నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ధనసరి సీతక్క కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని భావిస్తున్నారు. ముఖ్యనేతలు, పార్టీ ఇన్చార్జ్లతో కలిసి అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి బీఆర్ఎస్ ఇన్చార్జ్గా ఉన్న బడే నాగజ్యోతి.. ఆమెకు తోడుగా మాజీమంత్రి సత్యవతి రాథోడ్ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ● మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మహబూబాబాద్, కేసముద్రం మున్సిపాలిటీల ఎన్నికలు ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ (కాంగ్రెస్), మాజీ ఎమ్మెల్యే బి.శంకర్నాయక్(బీఆర్ఎస్)లకు ప్రతిష్టాత్మకం కాగా, బీఆర్ఎస్ నుంచి మాజీ విప్ దాస్యం వినయభాస్కర్, కాంగ్రెస్ నుంచి సీహెచ్ వెంకటేశ్లు ఇన్చార్జ్లుగా ఉన్నారు. బీజేపీ నుంచి హుస్సేన్నాయక్.. అభ్యర్థులను బరిలోకి దింపారు. ● డోర్నకల్ నియోజకవర్గంలో డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల ఎన్నికలు ఎమ్మెల్యే జాటోతు రామచంద్రు నాయక్ (కాంగ్రెస్), మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ (బీఆర్ఎస్)లకు సవాల్గా మారాయి. పుర పోరు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకం మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకూ కత్తి మీద సామే గ్రామ పంచాయతీ ఫలితాల బేరీజు.. పకడ్బందీగా గెలుపు కోసం పావులు రెండు రోజులుగా మున్సిపాలిటీల్లోనే నేతల మకాం ఓట్ల కోసం పార్టీల నేతలు, ఇన్చార్జ్ల పాట్లు.. రోజువారీ పరిస్థితిపై అధిష్టానాల ఆరా.. -
ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడండి
రఘునాథపల్లి: మండల పరిధిలోని పలుప్రాంతాల్లో పులి సంచారం నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అటవీశాఖ సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రఘునాథపల్లి పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్స్టేషన్లోని రికార్డ్, స్టేషన్ రైటర్ రూమ్లు, రిసెప్షన్ సెంటర్, ఇతర విభాగాలను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నేరాల రేటు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, నమోదైన కేసుల పురోగతిపై ఆరా తీశారు. అధికారులు, సిబ్బంది పనితీరును మరింత మెరుగు పరుచుకొని చేపట్టాల్సిన విధి విధానాలపై సీఐ, ఎస్సైలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో స్టేషన్ఘన్పూర్ ఏసీపీ భీంశర్మ, జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్రెడ్డి, ఎస్సై దూదిమెట్ల నరేశ్ ఉన్నారు. అటవీశాఖతో సమన్వయం చేసుకోవాలి రఘునాథపల్లి పోలీస్స్టేషన్ను తనిఖీ చేసిన సీపీ -
ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహం
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ రూరల్: ప్రతిభావంతులైన క్రీడాకారులకు సీఎం కప్ ప్రోత్సాహమని, చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. శుక్రవారం స్థానిక ధర్మకంచ మినీ స్టేడియంలో నియోజకవర్గ స్థాయి సీఎం కప్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో క్రీడాకారులు తమ ప్రతిభను చూపించి గుర్తింపు తీసుకురావాలన్నారు. జిల్లా ఇన్చార్జ్ యువజన, క్రీడల శాఖ అధికారి కోదండరాములు, తహసీల్దార్, ఎంపీడీఓలు పాల్గొన్నారు. అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానం సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026–28 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్లెన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం మీడియా యాజమాన్యాలు తమ జర్నలిస్టుల పేర్ల జాబితాను జిల్లా పౌరసంబంధాల అధికారికి సమర్పించాలని సూచించారు. యాజమాన్యాల ద్వారా పంపిన పేర్లలో ఉన్న జర్నలిస్టులు అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
పోలీసుల కవాతు
జనగామ: మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాటు ఓటర్లలో సంపూర్ణ విశ్వాసాన్ని పెంపొందించేందుకు పట్టణంలో శుక్రవారం పోలీసులు కవాతు నిర్వహించారు. ఏఎస్పీ పండేరి నితిన్ చేతన్ ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై, ఆర్ఏఎఫ్ డిప్యూటీ కమాండెంట్ టి.పి. బగేల్, ఇన్స్పెక్టర్లు రమణారెడ్డి, ఖలీద్తో పాటు 40 మంది బలగాల సహకారంతో ముఖ్య కూడళ్లు, ఆర్టీసీ చౌరస్తా, సున్నితమైన, అప్రమత్తత అవసరమైన ప్రాంతాల్లో కవాతు నిర్వహిచారు. నేడు మహాశివరాత్రి జాతరపై సమీక్షపాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 14 నుంచి 18 వరకు జరిగే మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శనివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ జెండా ఎగురవేయాలిజనగామ: పురపాలిక ఎన్నికల సందర్భంగా పట్టణంలో అత్యధిక స్థానాలు కై వసం చేసుకుని చైర్మన్ పీఠం దక్కించుకునే విధంగా ప్రతీ కార్యకర్త, నాయకులు కష్టపడి పనిచేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. నియోజకవర్గ కార్యాలయంలో మంత్రి జిల్లా ముఖ్యనాయకులతో సమీక్ష నిర్వహించారు. జనగామ మున్సిపల్ ఎన్నికల్లో ప్రతీ ఒక్క కార్యకర్తను కలుపుకొని కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని దిశనిర్దేశం చేశారు. అంతకు ముందు మంత్రికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, టీపీసీసీ సభ్యులు లక్ష్మీ నారాయణనాయక్, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్, యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, వేమెళ్ల సత్య నారాయణరెడ్డి, కంచె రాములు, వంగాల మల్లారెడ్డి, కొమరవెల్లి దేవస్థాన చైర్మన్ వెంకటనర్సింమారెడ్డి తదితరులు ఉన్నారు. నేడు మంత్రి పొంగులేటి రాకజనగామ: పురపాలిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 7న (శనివారం) గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రానున్నట్లు నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి తెలిపారు. శుక్రవారం కొమ్మూరి మాట్లాడుతూ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి వరకు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తారన్నారు. ఇందులో భాగంగా ధర్మకంచ కమ్యూనిటీ హాల్, 14వ వార్డు అంబేద్కర్ విగ్రహం, ఆర్టీసీ చౌరస్తా, తహసీల్ కార్యాలయం ఏరియాలో కార్నర్ మీటింగ్లను నిర్వహిస్తామన్నారు. స్టేషన్ఘన్పూర్: మొబైల్ యాప్లో ఎల్సీ తీసుకోవడం ద్వారా ప్రాణాలకు భరోసా ఉంటుందని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ టి.మధుసూదన్ అన్నారు. స్టేషన్ఘన్పూర్ 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో విద్యుత్ సిబ్బందికి మొబైల్యాప్లో ఎల్సీ తీసుకోవడంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యుత్ సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ భద్రతా ప్రమాణాలను పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఇ టెక్నికల్ గడ్డం గణేశ్, స్టేషన్ఘన్పూర్ డీఈ సారయ్య, ఏడీఈ రణధీర్రెడ్డి, ఏఈలు శ్వేత, శంకర్, శివకుమార్, సురేష్, సబ్ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. -
భూసేకరణ పనులు వేగవంతంగా చేపట్టాలి
జనగామ రూరల్: భూసేకరణ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, వేగవంతంగా చేపట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో భూసేకరణ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణలో వివిధ దశల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. యూనిట్–1 పరిధిలో, పీఎన్ దశలో, పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియకు సంబంధించిన అవార్డు విచారణను రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు, సర్వేయర్లతో కలిసి గ్రామాల వారీగా సంయుక్త తనిఖీల ద్వారా వారం లోపు పూర్తి చేయాలని, పెగ్ మార్కింగ్ పనులను నెలలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే యూనిట్–2 పరిధికి సంబంధించి పెండింగ్లో ఉన్న వివిధ పనులను వారం లోపు, పెగ్ మార్కింగ్ను నెలలోపు పూర్తి చేయాలని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, జనగామ పరిధిలో భూసేకరణ పెండింగ్లో పనులను వారం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. చీటకోడూర్ ఆర్ఎంసీకి సంబంధించి అవార్డు విచారణను ‘సర్వే – పేమెంట్ వెరిఫికేషన్ టీం’ ద్వారా ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు, సర్వేయర్లతో కలిసి తనిఖీ నిర్వహించి, పెండింగ్లో ఉన్న పనులను పూర్తిచేయాలని సూచించారు. అదేవిధంగా అశ్వరావుపల్లికి సంబంధించిన భూసేకరణ కూడా వారం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, రెవెన్యూ డివిజనల్ అధికారులు జనగామ, ఘనపూర్ స్టేషన్ ప్రత్యేక ఉప కలెక్టర్ సూపరింటెండింగ్ ఇంజనీర్, ఈఈలు, డిప్యూటీ ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు. మ్యాపింగ్ ప్రక్రియ.. ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియ, ఎస్సీ స్కాలర్షిప్, మున్సిపల్ ఎలక్షన్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గూగుల్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, బీఎల్వోలు ఆయా పోలింగ్ కేంద్రాల వారీగా క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి ఎస్ఐఆర్ మ్యాపింగ్ వేగవంతంగా చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. మున్సిపల ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, అధికారులు వసంత, విక్రమ్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
శుక్రవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
వలస ఓటర్లపై ప్రత్యేక దృష్టి హైదరాబాద్, భీమండి, హనుమకొండ, వరంగల్ తదితర ప్రాంతాలకు కూలీ, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం వలస వెళ్లిన ఓటర్లు పోలింగ్లో కీలకపాత్ర పోషించనుండటంతో పార్టీలన్నీ వారిని తిరిగి రప్పించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశాయి. వారికి రోజూ ఫోన్ కాల్స్ చేస్తూ మర్యాదపూర్వక పలకరింపులు, చివరి రోజు ప్రత్యేక వాహనాల్లో తరలించేందుకు ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటున్నారు. వలస ఓటర్ల కోసం పోలింగ్ రోజు మినీ వాహనాలతో పాటే ఏసీ లగ్జరీలను ఏర్పాటు చేసేలా ఆయా పార్టీలు ముందు అడ్వాన్స్లను సైతం ఇస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్, వరంగల్, భీమండి ఓటర్లపై అభ్యర్థుల కన్ను ● ఓట్లు రాబట్టుకునేందుకు ‘ప్రత్యేక’ ప్రణాళికలు ● తమకే ఓటు వేయాలంటూ ఫోన్లు ● మందు, పైసలు, ప్రయాణ ఖర్చులు..అన్నీ భారీగానే! జనగామ: ఓట్ల కోసం పోల్ మేనేజ్మెంట్ రాజకీయం తారాస్థాయికి చేరుకుంది. దూరప్రాంతాల్లో ఉపాధి, ఉద్యోగ, చదువురీత్యా ఉన్నవారి ఓట్ల కోసం అభ్యర్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వారి ఓట్లను తమకే వేయాలంటూ ముందుగానే మాట తీసుకుంటున్నారు. వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసేందుకు హామీ ఇస్తున్నారు. ప్రచార గడువు నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో జనగామ, స్టేషన్ ఘన్పూర్ పురపాలికల్లో పోటీ చేసే అభ్యర్థులు, పార్టీలు గెలుపు కోసం పోల్ మేనేజ్మెంట్ పేరిట భారీ వ్యూహరచనలో బిజీబిజీ అయిపోయారు. ప్రజల సమస్యలు, అభివృద్ధి హామీలు అన్నీ పక్కనపెట్టి, ఓటును తమ గూటికి దించుకోవడమే ప్రధాన లక్ష్యంగా మిగిలింది. కులాల వారీగా ఓటర్ల లెక్కలు.. ప్రత్యేక కమిటీలు ప్రతీ పార్టీ కులాల వారీగా ఓటర్ల వివరాలు సేకరిస్తూ, పోల్ మేనేజ్మెంట్ ప్రత్యేక బృందాలను మోహరించింది. ఏ కులంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో, ఎవరికి మొగ్గు చూపుతున్నారో, ఎవరిని తమవైపు తిప్పుకోవాలో ప్రత్యేక ప్లానింగ్ చేస్తున్నారు. సంఘాల వారీగా సమష్టి భోజనాలు, విందులు, సమావేశాలు ఈసారి ప్రచారాల్లో ప్రధాన హైలెట్గా మారింది. డబ్బు పంపిణీకి రహస్య ఏర్పాట్లు ఎన్నికల సంఘం కంటపడకుండా డబ్బుల పంపిణీ విషయంలో పార్టీలు సీక్రెట్ను మెయింటెనెన్స్ చేస్తున్నాయి. ఈనెల 11న పోలింగ్ నేపథ్యంలో 8వ తేదీ అర్ధరాత్రి నుంచే వార్డుల వారీగా నమ్మకస్తుల ఇళ్లలో ‘మనీ డంపింగ్’ చేస్తున్నారనే సమాచారం ఉంది. చిన్న చిన్న మొత్తాల్లో ప్యాకెట్లు, పంపిణీ సమయంలో ఎక్కడా పట్టుపడకుండా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మద్యం, వెండి కాయిన్లు, గిఫ్టులు రెడీ క్లస్టర్ల వారీగా భారీగా మద్యం డంపింగ్ జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖరీదైన మందుబాటిళ్లు, వెండి నాణేలు, గిఫ్టులతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎవరికి వారే కొత్త ప్రయత్నాల్లో ఉన్నారు. ఓటరే రాజు అంటూ చెప్పుకుంటూనే... లోపల మాత్రం ఓటును ‘మేనేజ్’ చేసేందుకు అభ్యర్థులు పట్టపగ్గాలు విప్పేశారు. ఈసారి ఎన్నికల్లో అభివృద్ధి చర్చ కంటే, వ్యూహరచన, ఓటు మేనేజ్మెంట్, వలసఓటర్ల లెక్కలు, మద్యం, డబ్బు పంపిణీ ఇవే ప్రధాన అంశాలుగా మారుతున్నాయి. ఓటర్లు ఎవరి మాట నమ్ముతారు, ఎవరి వ్యూహం ఫలిస్తుందనే అసలు పోరు ఇప్పుడే మొదలు కానుంది. స్టార్ క్యాంపెయినర్ల రాక పురపాలిక ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కడియం శ్రీహరి, ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్కుమార్రెడ్డి, జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి, పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్ క్యామ మల్లేశం, యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి ప్రస్తుతం ప్రచారం చేస్తున్నారు. రాబోయే నాలుగు రోజుల పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్క, మాజీమంత్రులు హరీశ్రావు, కేటీఆర్, ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ తదితర ప్రముఖులు జనగామ, స్టేషన్ఘన్పూర్ పట్టణాలకు రానున్నారు. అన్ని పార్టీలు రోజుకు 5 నుంచి 8 వార్డులను చుట్టేస్తూ ప్రచారంలో స్పీడు పెంచారు. ర్యాలీలతో పాటు ఇంటింటి ప్రచారాన్ని తెల్లవారు జాము 5 గంటల నుంచే మొదలుపెడుతున్నారు. -
అమలు కాని హామీలతో మోసం
● ప్రచారంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ: ప్రత్యర్థి పార్టీలు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తూ అమలు కాని హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా 13, 17, 18, 19, 22, 23, 24 తదితర వార్డుల్లో గురువారం ఎమ్మెల్యే ప్రచారం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి తప్ప, ప్రస్తుత కాంగ్రెస్ ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండున్నరేళ్లుగా తమ నీలిమా ఆస్పత్రిలో కార్పోరేట్ స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. పట్టణ ఓటర్లు బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట నాయకులు గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, బాల్దె సిద్ధిలింగం, గద్దల నర్సింగారావు తదితరులు ఉన్నారు. -
పట్టణ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం
● నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి, ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు జనగామ: పట్టణ అభివృద్ధి ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యమని నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి, పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు అన్నారు. పురపాలిక ఎన్నికల్లో భాగంగా 7,8,9,10 వార్డుల్లో బుధవారం ఇంటింటి ప్ర చారం చేశారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందన్నారు. పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి, పట్టణ సమగ్రాభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలకు సహకారం అందించాలన్నారు. గృహలక్ష్మి, మహాలక్ష్మి ఇలా అరు గ్యారంటీ పథకాలతో ప్రతీ ఇంటికి లబ్ధి చేకూరుతుందన్నారు. పేద కుటుంబాలకు సొంతింటి కల సాకారం చేస్తున్నామని, అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్కు పట్టం కట్టాలన్నారు. యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ తదితరులు ఉన్నారు. -
వామ్మో పెద్దపులి!
లింగాలఘణపురం: మండలంలోని కుందారంలో బుధవారం రాత్రి పులి సంచరించినట్లుగా పాదాల గుర్తుల ఆనవాళ్లు కనిపించాయని ఎఫ్ఆర్ఓ కొండల్రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం కుందారం సమీపంలో పులి పాదాల గుర్తులను గమనించిన రైతులు డయల్ 100కు ఫోన్ చేయడంతో స్థానిక ఎస్సై శ్రావణ్కుమార్ అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా డీఎఫ్ఓ తన సిబ్బందితో వెళ్లి పాదాల గుర్తులను పరిశీలించి పులి సంచరించినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. మంగళవారం యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలో శారాజీపేటలో ఆవును చంపిన పులి అక్కడి నుంచి కుందారం వచ్చినట్లుగా గుర్తించామని, రఘునాథపల్లి మండలం నారాయణపురం, లింగాలఘణపురం మండలం కుందారం మధ్య సుమారు నాలుగైదు వందల ఎకరాల్లో సర్కార్ తుమ్మ చెట్లు ఉన్నాయని, అక్కడే ఉండి ఉండవచ్చని అనుమానంతో తమ సిబ్బంది గాలిస్తున్నారని వివరించారు. రిజర్వ్ ఫారెస్ట్కు సంబంధించిన నిపుణుల బృందం కుందారం గ్రామానికి చేరుకుని పులి సంచరించిన పరిసరాలను పరిశీలించారు. అందులో పులిని బంధించేందుకు మత్తు ఇంజక్షన్లు వేసే నిపుణులు, డాక్టర్ల బృందం ఉన్నారు. రఘునాథపల్లి: మండలంలోని శ్రీమన్నారాయణపురం శివారులో పెద్ద పులి సంచారం గుబులు రేపుతోంది. గురువారం తెల్లవారుజామున లింగాలఘణపురం మండలం కుందారం నుంచి మండలంలోని శ్రీమన్నారాయణపురం శివారులోకి వచ్చి నట్లు పాదముద్రలు ఉన్నాయన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు వెళ్లి పరిశీలించారు. స్థానిక ఎస్సై దూదిమెట్ల నరేశ్, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు శ్రీమన్నారాయణపురం, నిడిగొండ, భాంజీపేట రఘునాథపల్లి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. దేవరుప్పుల: మండలంలోని నీర్మాల గ్రామ నర్రెగడ్డ వ్యవసాయ క్షేత్రం ఏరియాలో సరిహద్దు గ్రామమైన వెల్మజాల(గుండాల మండలం)కు చెందిన రైతు జోలం పాండు పులి పాదగుర్తులను గుర్తించి విషయాన్ని అధికారులకు చేరవేశారు. ఈ గుర్తుల ఆధారంగా నీర్మాల నుంచి వనపర్తి మీదుగా కుందారం మీదుగా రఘనాథపల్లి మండలానికి వెళ్లిందనే పులి అడుగుల గుర్తులను బట్టి తెలుస్తోంది. కడవెండి–సీతారాంపురం మధ్య కూటికంటి ఎల్లయ్య అనే రైతు వ్యవసాయ పొలాల వద్ద గుర్తులను చూడగా.. జనగామ ఫారెస్టు డీఆర్ఓ ఆజాజ్ అహ్మద్, బీట్ ఆఫీసర్ రమేశ్, ఎస్ఓ రవీందర్, స్థానిక ఎస్సై ఊర సృజన్కుమార్, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలాన్ని గుర్తించి ఆ ప్రాంత రైతులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎఫ్ఆర్ఓ కొండల్ రెడ్డి జనగామ రూరల్: జిల్లాలోని లింగాల ఘణపురం మండలం కుందారం గ్రామశివారుల్లో పులి సంచరిస్తున్నట్లు దాని పాదముద్రల ద్వారా గుర్తించినట్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఆర్ఓ రావుల కొండల్ రెడ్డి తెలిపారు. లింగాల ఘణపురం, రఘునాథపల్లి, నర్మెట, జనగామ, దేవరుప్పుల మొదలగు మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తప్పనిసరి పరిస్థితులలో తప్ప మిగతా సమయాల్లో బయటకు రావొద్దన్నారు. అత్యవసరమైతే గుంపులు గుంపులుగా వెళ్లాలని తెలిపారు. పశువులను ఇంటివద్దనే సంరక్షించుకోవాలన్నారు. పులి సంచార సమాచారం తెలిస్తే ఫారెస్ట్ అధికారులు, పోలీసులకు తెలియజేయాలన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. పలు మండలాల్లో పాదముద్రలు, సంచరించినట్లు గుర్తింపు భయాందోళనలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్న ఫారెస్ట్, పోలీస్ అధికారులు -
వాతావరణం
జిల్లాలో ఉదయం పొగమంచు ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు కాస్త ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి సమయంలో చలి తీవ్రంగా ఉంటుంది.‘పుర’పోరుకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లుసాక్షిప్రతినిధి, వరంగల్: మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. మున్సిపాలిటీల వారీగా సీని యర్ నాయకులను ఇన్చార్జ్లు గా నియమించిన టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్.. వార్డుల వారీగా అభ్యర్థుల గెలుపు బాధ్యతలను వారిపైనే పెట్టారు. నియోజకవర్గాల వారీగా ఆయా మున్సిపాలిటీల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను సమన్వయం చేసుకుంటూ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ వరంగల్, మహబూబాబాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్లుగా ఉన్నారు. వీరికి తోడు మున్సిపాలిటీల వారీగా కోఆర్డినేటర్లను గురువారం నియమించారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జనగామ మున్సిపాలిటీకి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, పాయం వెంకటేశ్వర్లుకు మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్లుగా బాధ్యతలు ఇచ్చారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని తొర్రూరు మున్సిపాలిటీకి ఎంపీ డాక్టర్ కడియం కావ్య, కొలను హనుమంతరెడ్డిని నియమించారు. పరకాలకు టెస్కాబ్ మాజీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, స్టేషన్ఘన్పూర్కు భీమగాని సౌజన్య, భూపాలపల్లికి ఎర్రబెల్లి వరద రాజేశ్వర్రావు, వర్ధన్నపేటకు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని డోర్నకల్ మున్సిపాలిటీకి గాజర్ల అశోక్, మరిపెడకు ఎంపీ పోరిక బలరాంనాయక్, కేసముద్రంకు దూడ వెంకటరమణ, మహబూబాబాద్కు సీహెచ్ వెంకటేశ్, ములుగుకు ఈవీ శ్రీనివాస్రావు, నర్సంపేటకు డాక్టర్ పులి అనిల్కుమార్ను సమన్వయకర్తలుగా టీపీసీసీ నియమించింది. కోఆర్డినేటర్లుగా నియమితులైన వారికి అభ్యర్థుల గెలుపు బాధ్యతలను అప్పగించింది. కోఆర్డినేటర్లుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు మినహా ఇతర సీనియర్లకు భవిష్యత్లో నామినేటెడ్ పోస్టులకు మున్సిపల్ ఎన్నికల విజయాలకు కూడా పార్టీ అధిష్టానం లింకు పెట్టినట్లు సమాచారం. కాగా, టీపీసీసీ నియమించిన సమన్వయకర్తలు అభ్యర్థుల గెలుపు కోసం వెంటనే రంగలోకి దిగారు. 12 మున్సిపాలిటీలకు సీనియర్ల నియామకం జనగామ, తొర్రూరు, మరిపెడకు ఎంపీలు చామల కిరణ్కుమార్రెడ్డి, కడియం కావ్య, బలరాంనాయక్ ఉత్తర్వులు జారీచేసిన టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అభ్యర్థుల గెలుపునకు.. నామినేట్ పదవులకు లింకు -
ప్రతిభను వెలికిదీసేందుకే సీఎం కప్ పోటీలు
● అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ పాలకుర్తి టౌన్: గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికిదీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ అన్నారు. గురువారం మండలంలోని కార్మెల్ స్కూల్లో సీఎం కప్ క్రీడలను అదనపు కలెక్టర్ ముఖ్య అఽతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గస్థాయిలో నిర్వహించే కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీల్లో యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి కోదండరామ్, ఎంపీడీఓ వేదవతి, తహసీల్దార్ సరస్వతీ, సీఐ జానకీరాంరెడ్డి, సర్పంచ్ కమ్మగాని విజయ, ఎస్సై పవన్కుమార్, ఎంఈఓ పోతుంటి నర్సయ్య, హైస్కూల్ హెచ్ఎం శోభారాణి, ప్రగతి విద్యాలయం ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. నేలను కాపాడుకోవాలి.. జఫర్గఢ్: నేల సంపదను కాపాడుకోవాలని అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్ర భుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో స్కూల్ సాయిల్ హెల్త్పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్ వరలక్ష్మి, డీఏఓ అంబికాసోని, ఏడీఏ వసంత సుగుణ, తహసీల్దార్ రాజేశ్రెడ్డి, ఎంపీడీఓ సుమన్, శిరీష, రవి తదితరులు పాల్గొన్నారు. -
సేంద్రియ సాగుతో బహుళ ప్రయోజనాలు
దేవరుప్పుల: విషతుల్య ఆహారపు ఉత్పత్తులకు స్వస్తి పలికేలా సేంద్రియ పంటల సాగుతో రైతులు బహుళ ప్రయోజనాలు పొందుతారని జిల్లా సాంకేంతిక వ్యవసాయ అధికారులు శరత్చంద్ర, విజయ్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ధారావత్తండాలో కునుసోతు బిచ్చనాయక్ వ్యవసాయ క్షేత్రంలో సాగు చేస్తున్న సేంద్రియ ఎరువు తయారీ, పంటల సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సేంద్రియ సాగులో వర్మికంపోస్టు, జీవామృతం, బీజామృతం, ఘనజీవామృతం వంటి స్వతహాగా తయారు చేసుకొని విజయవంతంగా సాగు చేస్తున్న రైతు బిచ్చానాయక్ను అభినందించారు. కార్యక్రమంలో పెద్దమడూరు ఏఈఓ భాస్కర్, పలువురు రైతులు పాల్గొన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్కు 68 మంది గైర్హాజరుజనగామ రూరల్: ఇంటర్ ప్రయోగ పరీక్షలకు 68మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఇంటర్ విద్యాధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా వ్యాప్తంగా 9 కేంద్రాల్లో జనరల్, ఒకేషనల్ ప్రయోగ పరీక్షలు జరగగా మొత్తం 429 మంది జనరల్ విద్యార్థులకు గాను 425మంది హాజరు కాగా నలుగురు గైర్హాజరయ్యారు. ఒకేషనల్లో మొత్తం 307 విద్యార్థులకు గాను 274మంది హాజరు కాగా, 33మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు 410 జనరల్ విద్యార్థులకు గాను 403మంది హాజరు కాగా, 7 గైర్హాజరయ్యారు. ఒకేషనల్లో 222 విద్యార్థులకు గాను 198 హాజరు కాగా 24 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్ విద్యాధికారి జితేందర్ రెడ్డి జనగామ, జఫర్గఢ్, స్టేషన్ ఘన్ఫూర్ పరీక్షా కేంద్రాలను సందర్శించగా డీఈసీ సభ్యులు శ్రీనివాస్ పాలకుర్తి, కొడకండ్లలోని పరీక్ష కేంద్రాలను సందర్శించారు. పీహెచ్సీలో ప్రసవాలు పెంచాలిరఘునాథపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్రావు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేషెంట్లకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల వల్ల కలిగే లాభాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పీహెచ్సీలో జరుగుతున్న కార్యక్రమాలపై రివ్యూ చేసి రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ కమలహాసన్, ఎంఎల్హెచ్పి డాక్టర్ ప్రీతి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామ్కిషన్, హెచ్ఈఓ ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు. రూ.5వేల కోట్లు కేటాయించాలిజనగామ రూరల్: రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి రూ.5వేల కోట్లు కేటాయించాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో కుర్ర ఉప్పలయ్య అధ్యక్షతన జరిగిన కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.. రాష్ట్ర బడ్జెట్లో ప్రతిసారి అన్యాయమే జరుగుతోందని, గత సంవత్సరం రూ.70 కోట్లు మాత్రమే కేటాయించి అందులో కేవలం రూ.17 కోట్లే ఖర్చు చేశారన్నారు. ఏప్రిల్ 17న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే నిరాహార దీక్షకు గీత కార్మికులు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాల్నే వెంకటమల్లయ్య, కనకట రాజయ్య, పరదుల భాస్కర్, బండపల్లి శంకరయ్య, మాచర్ల రఘురాములు, జొన్నగోని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రంగా రంగా ప్రచార స్థలాన!
జనగామ: పురపాలక ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్ పురపాలికల్లో బుధవారం నుంచి ప్రధాన పార్టీలన్నీ ప్రచార రంగంలోకి దిగడంతో వార్డులన్నీ పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. రంగంలోకి ముఖ్యనేతలు ప్రచార రథాలు, బైకులు, ఆటోలు, పార్టీ బ్యానర్లు..ఇలా ప్రతి వీధిలోనూ నినాదాల ప్రతిధ్వని వినిపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రధాన నేతలతో పాటు ఎమ్మెల్యేలు, సీనియర్ క్యాడర్, డివిజన్ స్థాయి నాయకులు కూడా బూత్ల వారీగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డుల వారీగా క్యాడర్ అభ్యర్థుల వెంట అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈసారి స్వతంత్ర అభ్యర్థులూ ప్రధాన పార్టీలకు సమానంగా ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. వారికి వచ్చిన ఎన్నికల గుర్తులను చూపిస్తూ ‘తమ గుర్తుకు ఓటేయండి.. అభివృద్ధి కోసం మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి..’ అని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటికీ తిరిగే స్వతంత్రులు ఓటర్లలో ఆప్యాయతను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అవ్వా.. అమ్మా.. తాతా అంటూ.. ప్రచారంలో అభ్యర్థుల మాటతీరు కూడా ఓటర్లలో చర్చనీయాంశమైంది. ‘అమ్మా.. అవ్వా.. తాత.. ఎలా ఉన్నారు.. నేను ఫలానా పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. ఈసారి తప్పకుండా నాకు అశీర్వాదం ఇవ్వండి. మీరు పలికిన వెంటనే ముంగిట ప్రత్యక్షమవుతా.. ఐదు సంవత్సరాలు మీ పక్కనే ఉంటా.. అభివృద్ధి చేస్తా’ అంటూ భరోసా కల్పిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. వ్యక్తిగతంగా ఓటర్లను కలుస్తూ.. వార్డుల వారీగా క్యాడర్ ఇంటింటికీ తిరుగుతుండగా, పలు సమయాల్లో అభ్యర్థులు మాత్రం ముఖ్యమైన ఓటర్ల ఇళ్లకు వ్యక్తిగతంగా వెళ్లి మద్దతు ఇచ్చి గెలిపించాలని విన్నవిస్తున్నారు. మరోవైపు పార్టీ లీడర్ల అలకలను, గ్రూపుల మధ్య చిన్న చిన్న విబేధాలను బుజ్జగించేందుకు అభ్యర్థులు విపరీతంగా శ్రమిస్తున్నారు. అలకలు పోవడం, వర్గాలు కలవడం, అభ్యర్థితో కలిసి ప్రచారంలోకి రావడం ఇవన్నీ ప్రచారంలో భాగమయ్యాయి. తదుపరి రోజుకు నేటి రాత్రే ప్రణాళిక ప్రధాన వీధులు, బస్టాండ్లు, మార్కెట్ ప్రాంతాలు పార్టీల ర్యాలీలతో కళకళలాడుతున్నాయి. హోటళ్లలో కూర్చున్న వారితో చేతులు కలుపుతూ షాప్లను సందర్శిస్తూ, మహిళలను పలకరిస్తూ ప్రతి ఓటరును ప్రేమ, ఆప్యాయతతో తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో అభ్యర్థులు బిజీబిజీగా గడుపుతున్నారు. పొద్ద ంతా ఊరేగింపులు, ర్యాలీలు చేసిన పార్టీల క్యాడర్ రాత్రికి తిరిగి పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు, తదుపరి రోజు వ్యూహరచన...ప్రచారం మరింత వేగం పొందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రజల్లో అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నప్పటికీ ఎవరి ప్రచారం ఎంత ప్రభావం చూపుతుందన్నది పోలింగ్ రోజునే తేలనుంది. మైకుల హోరు..ఊరేగింపుల జోరు పండుగ వాతావరణంలో వీధులు పొద్దంతా ర్యాలీలు..రాత్రికి వ్యూహరచన అమ్మా, అవ్వా, తాతా.. అంటూ ఆకట్టుకునే యత్నం -
బుగులు వెంకన్నకు నాగాభరణాలు
చిల్పూరు: చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామికి బుధవారం సంగోజు మోహనాచారి–శంకర్లక్ష్మి దంపతులు రూ.50వేల విలువైన రెండు వెండి నాగాభరణాలు, ఇత్తడి ప్లేటును ఆలయ అర్చకులకు అందజేశారు. ఆలయానికి చేరుకున్న దాత దంపతులు అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేదమంత్రాల నడుమ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ శ్రీధర్రావు ఆధ్వర్యంలో ఆలయానికి అందజేశారు. కార్యక్రమంలో కుర్రెంల మోహన్ తదితరులు పాల్గొన్నారు. తాటికొండ జాతర ఆదాయం రూ.2లక్షలుస్టేషన్ఘన్పూర్: మండలంలోని తాటికొండ, జిట్టెగూడెం సమ్మక్క–సారలమ్మ జాతర ఆదా యం రూ.2,03,738లు వచ్చినట్లు జాతర కమిటీ బాధ్యులు తెలిపారు. జాతర కమిటీ గౌరవ అధ్యక్షుడు చల్లా సుధీర్రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రాపోలు మధుసూదన్రెడ్డి, సర్పంచ్లు మారపాక సుజనశ్రీను, బానోతు బాలునా యక్ ఆధ్వర్యంలో బుధవారం హుండీల లెక్కింపు చేపట్టారు. జాతర ఆదాయం రూ.2,03,738 వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్లు లునావత్ రజిత రవీందర్, ఎడమ కట్టమల్లు, వార్డు సభ్యులు, వివిధ కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు. ఎల్సీ యాప్ ద్వారా లైన్క్లియర్ తప్పనిసరిజనగామ రూరల్: ఎల్సీ యాప్ ద్వారా లైన్క్లియర్ తప్పనిసరిగా తీసుకోవాలని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆపరేషన్స్ సంపత్రెడ్డి అన్నారు. బుధవారం జనగామ టౌన్–1లో సెక్షన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యుత్ పనుల నిర్వహణలో భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ ఎం.లక్ష్మీనారాయణరెడ్డి, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ డి.వేణుగోపాల్, అసిస్టెంట్ ఇంజనీర్ (టౌన్–1) బి. సౌమ్య, అసిస్టెంట్ ఇంజనీర్ (బచ్చన్నపేట) జి. రాజ్కుమార్, సబ్ ఇంజనీర్ ఎం.మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
వివక్షలేని సమాజమే లక్ష్యం
జనగామ రూరల్: అసమానతలు, వివక్ష లేని సమాజాన్ని నిర్మించడమే తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎన్.ఎల్.నరసింహారావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాలకు సమానత్వం, సాధికారత పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం కలెక్టరేట్లో పనిచేసే హౌస్ కీపింగ్ సిబ్బందిని సన్మానించారు, అంతకుముందు తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్షాలోమ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు. డబుల్ బెడ్రూం నిర్మాణాల వివరాలివ్వండి డబుల్ బెడ్రూం నిర్మాణాల అప్పగింతకు సంబంధించిన వివరాలు అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. గూగుల్ మీట్లో మాట్లాడుతూ.. పంచాయతీరాజ్, ఇరిగేషన్, సోషల్ వెల్ఫేర్ తదితర ఇంజనీరింగ్ అధికారులు గతంలో చేపట్టిన రెండు పడక గదుల నిర్మాణలకు సంబందించిన పూర్తి వివరాలతో టెక్నికల్, ఫిజికల్లతో సహా ఫిబ్రవరి 15వ తేదీలోగా హౌజింగ్ శాఖకి అప్పగించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
డీసీపీకి ఉత్కృష్ట్ట పతకం
● సీపీ చేతుల మీదుగా అందజేత వరంగల్ క్రైం: పోలీస్ విభాగంలో ఉత్తమ సేవలందించినందుకు కేంద్ర ప్రభుత్వం వరంగల్ పోలీస్ కమిషనరేట్ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్కు ఉత్కృష్ట పతకాన్ని అందజేసింది. ఈమేరకు బుధవారం సీపీ క్యాంపు కార్యాలయంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ డీసీపీ రాజమహేంద్ర నాయక్కు పతకాన్ని అందించి అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చే అధికారులకు శాఖాపరమైన గుర్తింపుతో పాటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు కూడా లభిస్తుందన్నారు. 2010 డీఎస్పీగా పోలీస్ శాఖలో చేరిన రాజమండ్రి నాయక్ నెల్లూరు జిల్లాతో పాటు వరంగల్ సీసీఎస్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో డీఎస్పీగా పని చేసి 2017 అదనపు ఎస్పీగా భూపాలపల్లి, ఇంటెలిజెన్స్లో పనిచేసి, 2021లో ఎస్పీగా పదోన్నతి పొంది ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు. ప్రస్తుతం వెస్ట్ జోన్ డీసీపీగా ఎంతో సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా ఎన్నో కీలక కేసులను పరిష్కరించడం డీసీపీ రాజ మహేంద్ర నాయక్ కీలకంగా నిలిచారు. ఈసందర్బంగా వెస్ట్ జోన్ పరిధి పోలీస్ అధికారులు, సిబ్బంది డీసీపీ అభినందనలు తెలిపారు. -
ఎన్నికల నియమావళి పాటించాలి
జనగామ రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలని ఏఎస్పీ పండారీ చేతన్ నితిన్ సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పోటీచేస్తున్న అభ్యర్థులకు బుధవారం సిద్దిపేట రోడ్డులోని గాయత్రి ఫంక్షన్ హాల్లో ఎన్నికల ఖర్చులు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల నియమావళి అనుసరించి వ్యయాలు ఉండాలని, నిబంధనలు ఉల్లంగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు, మున్సిపల్ కమిషనర్, అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. -
వేడెక్కిన ఓరుగల్లు
తల్లులకు తనివితీరా మొక్కులు8 లోuమూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా ‘మున్సిపల్’ పోరుమేడారం బుధవారం భక్తజనసంద్రమైంది.. తిరుగువారం పండుగను మేడారం, కన్నెపల్లిలోని సమ్మక్క, సారలమ్మ ఆలయాల్లో పూజారులు ఘనంగా నిర్వహించారు. తల్లులకు పూజారులు ధూపదీపాలు వెలిగించి యాటలను నైవేద్యంగా సమర్పించారు. తిరుగువారం పండుగకావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. – ఎస్ఎస్ తాడ్వాయి ● మేడారం, కన్నెపల్లిలోని సమ్మక్క, సారలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు ● భారీగా తరలివచ్చిన భక్తులు..● అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతల ప్రచారం ● ఈనెల 8న భూపాలపల్లికి సీఎం రేవంత్రెడ్డి.. ● బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు ● కేంద్ర మంత్రులు వస్తారంటున్న బీజేపీ నేతలుసాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగియగా.. 260 వార్డులకు 1,073 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీపీఐ, సీపీఎంలతో పొత్తులతో సాగుతుండగా, బీఆర్ఎస్, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. ప్రచారానికి మరో ఐదు రోజులే సమయం ఉండడంతో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. రెబల్స్పై బుజ్జగింపుల అస్త్రం మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు ఇంకా ఆరు రోజులే ఉండడంతో రెబల్స్ను దారికి తెచ్చుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీపీఐ, సీపీఎంలతో పొత్తులతో పోటీ చేస్తుండగా.. 40 చోట్ల రెబల్స్ బెడద ఉంది. ఒంటరి పోరు చేస్తున్న బీఆర్ఎస్కు సైతం రెబల్స్ సెగ తాకుతోంది. నర్సంపేట, వర్ధన్నపేటలో ఎనిమిది చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ రెబల్స్ ఉన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది, బీఆర్ఎస్ నుంచి ఆరుగురు రెబల్ అభ్యర్థులుగా పోటీలో ఉండగా, వారితో పార్టీ నేతలు మంతనాలు చేస్తున్నారు. డోర్నకల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు, మరిపెడలో కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీఆర్ఎస్ నుంచి నలుగురు, కేసముద్రంలో కాంగ్రెస్ నుంచి ఒక్కరు, బీఆర్ఎస్లో ఇద్దరు చొప్పున రెబల్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరందరితో ఆ పార్టీల నేతలు చేస్తున్న ప్రయత్నాలు నేడో రేపో కొలిక్కి రావచ్చన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 12 మున్సిపాలిటీల్లో మొత్తం 260 వార్డులకుగాను ఒకచోట బీజేపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికాగా 26 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో లేరు.మేడారంలో తిరుగువారం పండుగఅన్ని మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఏఐఎఫ్బీ తదితర పార్టీలు, స్వతంత్రులు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇదే సమయంలో ‘పుర’ పీఠాలు లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు.. ఆ పార్టీల అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు అగ్రనేతలను రంగంలోకి దింపుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్లుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (వరంగల్), పొన్నం ప్రభాకర్ (మహబూబాబాద్)లను నియమించింది. వారు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలను కలుపుకుని సమన్వయం చేస్తున్నారు. ఏఐసీసీ పరిశీలకుడు పి.విశ్వనాథన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం పర్యటించగా.. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి జేఎస్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఏర్పాటు చేసే సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 12 మున్సిపాలిటీలకు ఇన్చార్జ్లను నియమించారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, అరూరి రమేశ్ తదితరులు ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ నుంచి అభ్యర్థుల గెలుపు కోసం కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ జిల్లా అధ్యక్షులను సమన్వయం చేస్తున్నారని, త్వరలోనే వారి పర్యటన ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ రూరల్: మున్సిపల్ ఎన్నికల విధులను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో విస్తృత స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేశారు. తెలంగాణ మున్సిపాలిటీలు చట్టం 2019, రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా, పోలింగ్ విధానాలపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారి పూర్తి బాధ్యతలు అధికారాలు తెలుసుకోవాలని, ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండ్ బుక్ ఒక మార్గదర్శకమన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని జనరల్ ఆబ్జర్వర్ నర్సింహరెడ్డి పరిశీలించారు. శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు మెరుగు రామరాజు, కె.సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహా జాతరనూ వదల్లేదు!
సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతరను దొంగల ముఠాలు వదల్లే. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ల నుంచి వచ్చి మేడారం జాతరలో భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని హల్చల్ చేసిన దొంగల వివరాలు ఆలస్యంగా వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా జంపన్న వాగు, గద్దెల పరిసరాల్లో భక్తుల మొబైల్ ఫోన్లు, బంగారు గొలుసులు, నగదును దొంగిలించిన ఘటనల్లో కీలక వ్యక్తుల సమాచారం లభమైంది. ‘వ్యాల్యూ పిచ్’ సాఫ్ట్వేర్ ఆధారంగా ఫేస్ రికగ్నేషన్ సిస్టంతో ఈ దొంగతనాలకు సంబంధించి కొందరు నిందితులను, దొంగిలించిన వస్తువులను కొనుగోలు చేసేవారిని పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా అవుతోంది. మేడారం జాతరలో ఫేస్ రిక గ్నేషన్ ద్వారా గతంలో దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట ముఠాలకు చెందిన దొంగలను గుర్తించినట్లు క్రైం ఇన్వెస్టిగేషన్ విభాగం ప్రకటించింది. సాంకేతిక సహకారంతో దొంగల ఆటకట్టు... సమ్మక్క, సారలమ్మను దర్శించుకునే భక్తులపై పటిష్టమైన పర్యవేక్షణ, వారి కదలికలు, వాహనాల రాకపోకలను నిశితంగా గమనించేందుకు ఈ జాతరలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో కూడిన ప్రత్యేక కెమెరాలు పెట్టారు. ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ కెమెరాలను (ఏఎన్పీఆర్) పదిచోట్ల అమర్చారు. దొంగతనాలకు పాల్పడే పాత నేరస్తులను గుర్తించేందుకు ఆటోమెటిక్ ఫేస్ రికగ్నేషన్ కోసం ప్రత్యేక సీసీ కెమెరాలను జనం రద్దీ ఉండే అన్ని ప్రాంతాల్లో పెట్టారు. గతంలో తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడిన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బీహార్ ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ఫొటోలను కంప్యూటర్లో ఫీడ్ చేశారు. వ్యాల్యూ పిచ్ అనే సాఫ్ట్వేర్తో అనుసఽంధానం చేయడంలో వల్ల కంప్యూటర్లో ఫీడ్ చేసిన ఫొటోల్లోని వ్యక్తులు ఎవరు వచ్చినా పోలీసులకు అలర్ట్ ఇస్తుంది. ఇదంతా గద్దెల పక్కనే ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్లో అమర్చిన పెద్ద ఎల్సీడీ స్క్రీన్లను 24/7 నిరంతర పర్యవేక్షణ చేసేలా ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఈ విధానం ద్వారా జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరిగిన నాలుగు రోజుల్లో పాత దొంగలు వచ్చినట్లు 70 అలర్ట్లు వచ్చాయి. డ్రోన్, సీసీ కెమెరాలు ఆ దొంగలను గుర్తించి కమాండ్ కంట్రోల్ రూమ్కు వారి ముఖాలను పంపడంతో అప్రమత్తమైన పోలీసులు మహారాష్ట్ర, ఏపీలోని నంద్యాల గ్యాంగ్లకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. మేడారంలో మహారాష్ట్ర, నంద్యాల దొంగలు ట్రేస్ చేసిన వ్యాల్యూ పిచ్ సాఫ్ట్వేర్ ‘ఫేస్ రికగ్నేజేషన్ సిస్టం’తో దొరికిన ఆచూకీ 70 మంది గుర్తింపు, ఐదుగురి అరెస్టు.. విచారణ -
బరికి రెఢీ!
బరికి రెఢీ!పూర్తయిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియజనగామ: పురపాలిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ పర్వం పూర్తయింది. జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల్లో కలిపి 91 మంది తమ నామినేషన్లు వెనక్కి తీసుకోవడంతో 209 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. స్టేషన్లో 32 మంది, జనగామలో 59మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. బరిలో 209 మంది.. జనగామ మున్సిపాలిటీలో 127 మంది, స్టేషన్ఘన్పూర్లో 82 మంది పోటీలో నిలిచారు. ఈ రెండు మున్సిపాలిటీల్లో 57 మంది స్వతంత్రులు బరిలో ప్రధాన పార్టీలకు దడ పుట్టిస్తున్నారు. వారిలో జనగామలో 30, స్టేషన్ఘన్పూర్లో 27 మంది ఉన్నారు. జనగామ 22వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఆ పార్టీ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య 29కి చేరింది. కాంగ్రెస్ 30, బీజేపీ 26 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా, (20, 7, 13, 29 వార్డుల్లో) బీజేపీ పోటీ చేయడం లేదు. జనగామ మున్సిపల్లో సీపీఎం–కాంగ్రెస్ పొత్తులో భాగంగా 3, 5, 7 వార్డుల్లో పోటీ చేస్తుండగా, 17, 7 వార్డుల్లో ఇరు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో ఇద్దరికీ రెండు పార్టీల నుంచీ బీ–ఫామ్లు జారీ అయ్యాయి. ఇక్కడ ఫ్రెండ్లీ పోటీ ఉంటుందని రెండు పార్టీలు పరస్పర అవగాహన కుదుర్చుకుంటున్నాయి. ఇక 22వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి అంజలి విత్డ్రా చేసుకోగా అదే వార్డులో బీజేపీ అభ్యర్థి మాలతి, మరో స్వతంత్ర అభ్యర్థి అల్ల అనిత బరిలో ఉన్నారు. దీంతో అనిత ప్రచారానికి సంబంధించి ప్రధాన ప్రతిపక్షం మద్దతు ఇస్తుందా లేదా ఎలా ముందుకెళ్తుందోననే ఉత్కంఠ నెలకొంది. గుర్తుల కేటాయింపు–అత్యధికంగా.. స్వతంత్రులకు గ్యాస్స్టౌ, విజిల్, ఫుట్బాల్, రింగ్, బ్యాట్, కత్తెర వంటి గుర్తులు కేటాయించారు. జనగామ మున్సిపల్లో 5, 14, 23, 25 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు స్వతంత్రులు కలిపి ఆరుగురు చొప్పున పోటీలో ఉన్నారు. అలాగే 7, 8, 9, 10, 11, 16 వార్డుల్లో ఐదుగురు బరిలో నిలిచారు. 6వ వార్డులో మొత్తం ఏడుగురు పోటీ పడటం ప్రత్యేకత. జనగామ 30 వార్డుల్లో 20వ వార్డులో మాత్రమే ఇద్దరి మధ్యనే పోటీ నెలకొననుంది. ఘన్పూర్లో 13వ వార్డులో అత్యధికంగా ఎనిమిది మంది బరిలో ఉండగా, 10వ వార్డులో ఇద్దరు మాత్రమే పోటీ చేస్తున్నారు. జోరందుకున్న ప్రచారం నామినేషన్ విత్డ్రాలు ముగిసిన వెంటనే అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. పార్టీ గుర్తులు, స్వతంత్రుల ప్రత్యేక గుర్తులు కేటాయించడంతో గంటలోపే పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లు సిద్ధం చేసి అభ్యర్థులు విస్త్రత ప్రచారాన్ని ప్రారంభించారు. జనగామ, స్టేషన్ఘన్పూర్ ఉపసంహరణలుపురపాలిక కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సీపీఎం సీపీఐ స్వతంత్రులు జనగామ 26 10 10 – – 13 స్టే.ఘన్పూర్ 18 09 02 01 – 01బీఫామ్ల అందజేత కాంగ్రెస్ తరఫున పినపాక ఎమ్మెల్యే, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ వెంకటేశ్వర్లతో పాటు డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి, యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, వేమెల్ల సత్యనారాయణరెడ్డి బీఫామ్లను ఆర్ఓలకు అందించారు. బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి క్యామ మల్లేశం, ఇర్రి రమణారెడ్డి, బాల్దె సిద్ధిలింగం, పోకల జమున, గాడిపల్లి ప్రేమలతారెడ్డి, తాళ్ల సురేష్రెడ్డి, గజ్జెల నర్సిరెడ్డి, సందీప్, అనిత, మామిడాల రాజుతో కలిసి ఆర్ఓలకు బీఫామ్లను అందించారు. -
ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా నిర్వహించాలి
● జనరల్ అబ్జర్వర్ ఎ. నర్సింహారెడ్డి జనగామ రూరల్: ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా సజావుగా నిర్వహించాలని జనరల్ అబ్జర్వర్ ఎ.నర్సింహారెడ్డి సూచించారు. మంగళవారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా జనరల్ అబ్జర్వర్ ఎ.నర్సింహరెడ్డి ఘనపూర్, జనగామ మున్సిపాలిటీ పరిధిలోని నామినేషన్ ఉపసంహరణ కేంద్రం డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్లను సందర్శించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఆయనతో పాటు నోడల్ ఆఫీసర్ మాతృనాయక్ సిబ్బంది ఉన్నారు. -
అక్రమ మైనింగ్ పరిశీలన
రఘునాథపల్లి: మండలంలోని గోవర్ధనగిరి గోపాలస్వామిగుట్ట వద్ద అక్రమంగా మట్టి, మొరం తరలిస్తున్నారని సర్పంచ్, గ్రామస్తులు సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం ప్రభుత్వ విభాగాలు గుట్ట వద్ద పెద్దఎత్తున జరిపిన మట్టి తవ్వకాల వద్దకు వెళ్లారు. మైనింగ్ ఏడీ విజయ్కుమార్, తహసీల్దార్ ఎస్సై నరేశ్, రాయల్టీ ఇన్స్పెక్టర్ అనిత ఇతర విభాగాల అధికారులు పరిశీలించారు. తవ్వకాలు జరిపిన వద్ద కొలతలు తీసుకున్నారు. అధికారులు వచ్చిన విషయం తెలిసిన గ్రామస్తులు అక్కడికి చేరుకొని జేసీబీ, టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నా ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. మట్టిని తరలించిన అక్రమార్కులపై చర్యలు తీసుకోకుంటే న్యాయస్థానాన్ని అశ్రయిస్తామని సర్పంచ్ తోటకూరి సదానందం పేర్కొన్నారు. అనుమతులు లేకుండా మట్టి తరలించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు గ్రామస్తులకు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ తోటకూరి సదానందం, ఉప సర్పంచ్ యాదగిరి, సర్వేయర్ నరేశ్, ఆర్ఐ శరత్, జీపీఓ విశ్వేశ్వర్రావు, ముప్పిడి రాజు, దుస్స భిక్షపతి, మల్లయ్య, వెంకటరత్నం, రాజు, రవి, సత్యనారాయణరెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
నానోయూరియాపై రైతులకు అవగాహన
● వీడియో కాన్ఫరెన్స్లో రైతులతో మాట్లాడిన మంత్రి తుమ్మల జనగామ రూరల్: ప్రతీ మంగళవారం జరిగే రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం చీటకోడూరు రైతు వేదికలో వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు వీడియో కాన్ఫరెన్న్స్ ద్వారా రైతులకు వరిలో వచ్చే చీడపీడలు, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టం, నానోయూరియా గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతులకు అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామానికి చెదిందిన రైతు బండారు తిరుపతితో మాట్లాడారు.. గ్రామంలో యూరియా కొరత లేదని యూరియా యాప్ విధానంతో ఇబ్బందులు తొలిగిపోయాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోనీ, జనగామ ఏడీఏ అపర్ణ, చీటకోడూరు సర్పంచ్ కూకట్ల యాదగిరి, ఉప సర్పంచ్ ఎం.చంద్రకళ, ఏఈఓ గిరిరాజు, అనిల్ కుమార్, చింతకింది రాజేష్, బండ మమత, రిషిత పాల్గొన్నారు. -
జిల్లా సరిహద్దులో బోన్ల ఏర్పాటు
● పెద్దపులి సంచారంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులుజనగామ రూరల్: యాదాద్రి జిల్లా శ్రీనివాసపురం నుంచి చుట్టుపక్కల ఉన్న జిల్లాలోని ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉందని, పెంబర్తి, సిద్దెంకి, ఎల్లంల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఆర్ఓ కొండల్రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లాలోకి పెద్దపులి ఇంకా ప్రవేశించలేదని, పాదముద్రల ద్వారా సమాచారం సేకరిస్తున్నామన్నారు. జిల్లాలోకి పెద్దపులి వచ్చిందని సమాచారం వస్తుందడంతో ఎఫ్ఆర్ఓను వివరణ కోరగా ఆవును చంపిన తర్వాత 10 కిలోమీటర్లు వెళ్లి వచ్చి మళ్లీ చనిపోయిన అవును తింటుందని, ఈక్రమంలో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వారం రోజుల పాటు పశువులు ఇంటి వద్ద ఉంచు కోవాలని బావుల వద్దకు గుంపులుగా వెళ్లాలని సూచించారు. శ్రీనివాసపురం, లక్ష్మక్కపల్లిలో బోనులు ఏర్పాటు చేశామని సీసీ కెమెరాల ద్వారా అన్వేషిస్తున్నామని వివరించారు. -
ఆదర్శ మున్సిపాలిటీగా ‘ఘన్పూర్’
స్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదామని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఎంపీ కడియం కావ్య చేతుల మీదుగా బీఫామ్లు అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.. ప్రజల అభిప్రాయాలు, గెలిచే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వీరే.. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులకు చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య మంగళవారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు 1వ వార్డు సింగపురం దయాకర్, 2వ గుర్రం హరినాధ్, 3వ గుర్రం హైమ, 4వ బూర్ల శంకర్, 5వ వార్డు కొంతం రజిత, 6వ కనకం రమేశ్, 7వ అన్నెపు సుమలత, 8వ చాతరబోయిన సత్యనారాయణ, 9వ సౌదరపల్లి సంపత్రాజ్, 10వ తోకల అనూష, 11వ నీల రాజమ్మ, 12వ గట్టు సంగీత, 13వ తాటికొండ వినయ్కుమార్, 14వ పెసరు కృష్ణవేణి, 15వ బొల్లు లక్ష్మీ, 16వ అంగడి రజిత, 17వ పొన్నం స్వరూప, 18వ వార్డుకు కౌన్సిలర్ అభ్యర్థిగా పొన్నం రవిని ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన వరంగల్ ఎంపీ కడియం కావ్య -
ఆరోగ్యకర జీవనశైలితో క్యాన్సర్ నియంత్రణ
జనగామ రూరల్: ఆరోగ్యకర జీవనశైలి పాటించడం ద్వారా క్యాన్సర్ను నియంత్రించవచ్చని జూనియర్ సివిల్ జడ్జి శశి అన్నారు. బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి జిల్లా న్యాయ సేవా సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్సల ప్రాముఖ్యంపై రోగులు, ప్రజలకు అవగాహన కల్పించారు. సమయానికి స్క్రీనింగ్ చేయించుకోవడం, ఆరోగ్యకర జీవనశైలి పాటించడం ద్వారా క్యాన్సర్ను నియంత్రించవచ్చని సూచించారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె.మల్లికార్జునరావు, ప్రోగ్రాం అధికారులు వైద్యులు అశోక్, కమల్ హసన్, ప్రభాకర్, మల్లికార్జున్, సిబ్బంది పాల్గొన్నారు. జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు చరిష్మాజఫర్గఢ్: మండలంలోని హిమ్మత్నగర్ గ్రామానికి చెందిన తాటికాయల చరిష్మా అనే విద్యార్థిని జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికై నట్లు తెలంగాణ రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ సెక్రెటరీ శీలం పార్థసారథి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చరిష్మా భీమారంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నదన్నారు. బాక్సింగ్లో ప్రతిభ చాటడంతో 69వ ఎస్జీఎఫ్ఐ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. విద్యార్థిని చరిష్మాను గ్రామస్తులు అభినందించారు. దివ్యాంగులు సదరం క్యాంపునకు హాజరుకావాలిజనగామ రూరల్: దివ్యాంగులు యూడీఐడీ సదరం క్యాంపునకు హాజరుకావాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వసంత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ రకాల దివ్యాంగులు కొత్తవారు, రెన్యూవల్ వారు మీ సేవలో యూడీఐడీ వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ చేసుకున్న వారు రశీదులో ఉన్న ఫోన్ నెంబర్కు మెసేజ్ వచ్చిన తేదీల్లో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరం శిబిరానికి హాజరుకావాలన్నారు. ఈనెల 6వ తేదీ నుంచి కొనసాగే ఈ శిబిరం 6,9,11,18,19,23,27వ తేదీల్లో ఆర్థో, దృష్టి, వినికిడి లోపం, మానసిక, తలసేమియా, క్రానిక్ న్యూరాలజీ, సంబంధిత దివ్యాంగులకు వైద్యులతో క్యాంపులు నిర్వహించబడుతాయన్నారు. కొత్తవి 225 ఉండగా, రెన్యూవల్ 65 ఉన్నాయని మొత్తంగా 290 మందికి అవకాశం ఉన్నదన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 8008202287లో సంప్రదించగలరని ఆమె సూచించారు. ‘ఐదేళ్ల అభివృద్ధిని రెండేళ్లలో చేసి చూపించాం’ జనగామ: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి ఐదేళ్ల అభివృద్ధిని రెండేళ్లలో చేసి చూపించారని జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్తో కలిసి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరుస్తున్నారన్నారు. కొనసాగుతున్న ఇంటర్ ప్రాక్టికల్స్ జనగామ రూరల్: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఇంటర్ విద్యాధికారి జితేందర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10 కేంద్రాల్లో జనరల్, ఒకేషనల్ ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ఉదయం జనరల్లో 582 విద్యార్థులకు గాను 573మంది హాజరయ్యారని, 9 మంది గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్ మొత్తం 714 విద్యార్థులకు గాను 652 హాజరయ్యారని, 62 మంది గైర్హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం జనరల్లో 497 విద్యార్థులకు గాను 487 మంది హాజరు కాగా, 10మంది గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్లో మొత్తం 610 విద్యార్థులకు గాను 587మంది హాజరయ్యారని, 23మంది గైర్హాజరయ్యారని తెలిపారు. -
నేడు తిరుగువారం పండుగ
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో సమ్మక్క– సారలమ్మకు బుధవారం పూజారులు తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుగువారం పండుగలో భాగంగా మేడారం, కన్నెపల్లి అమ్మవార్ల ఆలయాలను పూజారులు శుద్ధి చేసి దూప దీపాలు వెలిగించి యాటను నైవేధ్యంగా సమర్పిస్తారు. అనంతరం పూజారుల కుటుంబీకులు, స్థానిక ఆదివాసీలు, గిరిజనేతరులు అమ్మవార్ల ఆలయాలకు చేరుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం పూజారులు అమ్మవార్ల పూజాసామగ్రి, వస్త్రాలను తిరిగి ఆలయాల్లో భద్రపర్చనున్నారు. తిరుగువారం పండుగతో మహాజాతర పూజా కార్యక్రమాల తంతు ముగియనుంది. తిరుగువారం పండుగ సందర్భంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవార్లను దర్శించుకోనున్నారు. పుణ్యస్నానాలు.. మొక్కులు జాతర ముగిసి మూడు రోజులు గడిచినా మేడారానికి భక్తులు వస్తూనే ఉన్నారు. మంగళవారం భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల వద్ద పూజలు చేశారు. ఈ క్రమంలో గద్దెల వద్ద పేరుకుపోయిన కొబ్బరి, బెల్లం మిశ్రమాన్ని దేవాదాయశాఖ సిబ్బంది తొలగిస్తున్నారు. -
కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల ఫిరాయింపు ఫిర్యాదుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ మంగళవారం నోటీసులు జారీ చేశారు. బుధవారం తమ ఎదుట విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. కడియం శ్రీహరి కారు పార్టీ మీద నెగ్గి కాంగ్రెస్లోకి ఫిరాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11గం. జరగబోయే విచారణకు రావాల్సిందిగా వివేకాకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. కడియం, వివేకా వాదనలను స్పీకర్ విననున్నారు.మొత్తం పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లు తన ముందుకు రాగా.. ఇప్పటికే ఏడుగురికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్లెవరూ పార్టీ మారలేదని.. బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లు తీర్పు ఇచ్చారు. దానం నాగేందర్ పిటిషన్ ఇంకా విచారణ దశలోనే ఉంది. ఇకప్పుడు కడియం శ్రీహరి పిటిషన్ విచారణ జరగబోతోంది. మరో ఎమ్మెల్యే సంజయ్ వ్యవహారంపై స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
ఎడ్లబండికి టోల్ట్యాక్స్!
జనగామ ‘పుర’ప్రస్థానం మొదలైందిలా! జనగామ మున్సిపల్ సమాచారం కుటుంబాలు: 16,084 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా: 52,408ప్రస్తుతం: 80వేలకు పైగానే (అంచనా)అన్ని విభాగాల్లో ఏటా వచ్చే ఆదాయం: రూ.15.50కోట్లు ఏటా ఖర్చు: రూ.15కోట్లురెగ్యులర్ శానిటేషన్ కార్మికులు: 16 మంది కాంట్రాక్టు కార్మికులు: 150 మందిప్రతీ రోజు చెత్త సేకరణ: 6 టన్నులు స్లమ్ ఏరియాలు : 19 స్లమ్ ఏరియాలో జనాభా: 22,731 మందివిస్తీర్ణం: 19.1 చ.కి.మీ1935లో దేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగించారు. ఒక్క హైదరాబాద్ మినహా(నిజాం పాలనలో ఉండడం చేత) అంతటా లోకల్బాడీ ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధుల పాలన అమలులోకి వచ్చింది. దీంతో నిజాం నవాబు బల్దియా (మునిసిపల్) పరిధిలో తహసీల్దార్ను చైర్మన్గా నియమించి పేరు ప్రఖ్యాతలు ఉన్న ఐదుగురు సభ్యులను నామినేటెడ్గా నియమించారు. 17 ఏళ్ల పాటు కొనసాగిన తహసీల్దార్ పాలనకు 1952లో స్వస్తిపలికారు. 1952 నవంబర్లో జనగామలో మొదటి సారిగా 14వార్డులకు ఎన్నికలను నిర్వహించారు. వార్డు సభ్యుల ఎన్నికల్లో జనగామ మొదటి చైర్మన్గా కోడూరి జగన్నాథరెడ్డి, వైస్ చైర్మన్గా పెద్ది నారాయణ ఎన్నికయ్యారు. ఇందులో ముగ్గురు అఫీషియల్స్, మరో ముగ్గురు నాన్అఫీషియల్స్ను నామినేటెడ్ పద్ధతిలో నియమించారు. రెండో చైర్మన్గా రాగి నర్సింహులు ఆ తర్వా త వెన్నెం వెంకటనర్సింహరెడ్డి, వీరారెడ్డి భాస్కర్రెడ్డి, చొల్లేటి ప్రభాకర్, పబ్బా శివకోటి, పీటీ దశరథ గెలుపొందారు. ఆరో చైర్మన్గా ఎర్రమళ్ల సుధాకర్, ఆ తర్వాత డాక్టర్ కరుణాకర్రాజు, వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, నాగారపు వెంకట్, పోకల జమున పనిచేశారు. రూ.36వేల ఆదాయంతో మొదలు.. 1952లో 12వేల జనాభా, మూడు వేల నివాస గృహాలతో రూ.36వేల ఆదాయంతో మున్సిపల్ ప్రస్థానం మొదలైంది. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పట్టణ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. స్వతహాగా నిధులను సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో పెద్దల నిర్ణయం మేరకు సైకిళ్లకు లైఫ్ ట్యాక్స్ను అమలులోకి తీసుకొచ్చారు. ఏడాదికి రూ.3 చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తులతో పాటు వ్యాపార పరంగా వివిధ ప్రాంతాల నుంచి జనగామకు వచ్చే ఎడ్లబండ్లు, ఇతర వాహనాలు పట్టణంలోని రావాలంటే టోల్ట్యాక్స్ చెల్లించే విధంగా నిబంధనలు విధించారు. ఒక్కో ఎడ్ల బండికి నాలుగు అణా లు టోల్కింద తీసుకునే వారు. ప్రతీ ఇంటి యజ మాని ఏడాదికి రూ.5 నుంచి రూ.వెయ్యి వరకు ట్యాక్స్ చెల్లించేవారు. 1964లో అప్పటి చైర్మన్ వెంకటనర్సింహరెడ్డి ఆరు బోర్లను వేయించారు.ప్రజల అవసరాలు తీర్చినంపట్టణ ప్రజలు కనీస అవసరాలపై దృష్టి సారిస్తూనే, అభివృద్ధి కోసం దీక్షతో పని చేసినం. వేసవిలో ట్రాక్టర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని ప్రభుత్వం నిధులు మంజూరు చేసేది. కానీ నా హయాంలో బోరుబావులు తవ్వించేందుకు నిర్ణయం తీసుకోగా, అప్పటి కలెక్టర్ ససేమిరా అన్నారు. బోరుబావుల అవసరంపై ఆయనకు వివరించి, తాగునీటి సమస్య లేకుండా చేసినం. – వెన్నెం వెంకటనర్సింహరెడ్డి నాటి మునిసిపల్ చైర్మన్చీటకోడూరు రిజర్వాయర్ ఏర్పాటు పట్టణ ప్రజలకు దాహార్తిని తీర్చాలనే సంక ల్పంతో అప్పటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య హయాంలో 2005లో 11.13 ఎంఎల్డీ సామర్థ్యంతో చీటకోడూరు వద్ద రిజర్వాయర్ నిర్మించారు. రిజర్వాయర్లో ప్రస్తుత నీటి సామర్థ్యం ఆధారంగా, ప్రతీ రోజు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. తహసీల్దార్ పాలన నుంచి కమిషనర్ వరకు 1952లో రూ.36వేల ఆదాయం మున్సిపల్ చైర్మన్లుగా 14మంది నేటికి రాబోవు పాలకవర్గం ఏర్పాటుతో 74 ఏళ్ల చరిత్ర! -
ప్రశాంతంగా ప్రాక్టికల్ పరీక్షలు
● 122 మంది గైర్హాజరు జనగామ రూరల్: జిల్లా వ్యాప్తంగా 10 సెంటర్లలో ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జితేందర్రెడ్డి తెలిపారు. సోమవారం జనరల్, ఒకేషనల్ ప్రయోగ పరీక్షలు రెండు విడతలుగా నిర్వహించగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించారు. సీసీ కెమెరా నిఘాలో బోర్డు నిబంధనల మేరకు నిర్వహించినట్లు తెలిపారు. ఉదయం జనరల్ విద్యార్థులు 530 విద్యార్థులకు గాను 523మంది హాజరయ్యారు, 7 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షలో 739 విద్యార్థులకు గాను 661 హాజరుకాగా 78మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జనరల్ మొత్తం 450 విద్యార్థులకు గాను 437 హాజరయ్యారు, 13 గైర్హాజరయ్యారు. ఒకేషనల్ మొత్తం 611 విద్యార్థులకు గాను 587 హాజరయ్యారు, 24 గైర్హాజరయ్యారు. డీఈసీ సభ్యులు శ్రీనివాస్ శేఖర్, ఫ్లయింగ్ సభ్యులు పలు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. -
దిగితే కాని తెలవట్లే!
● ప్రచారానికి తక్కువ టైం.. అయినా పెరుగుతున్న ఖర్చు ● నేటి ఉపసంహరణతో పోటీపై స్పష్టత ● ప్రచారంలో పల్లా, కడియం దూకుడు జనగామ: పురపాలిక ఎన్నికల్లో అభ్యర్థులకు ఫీల్డ్లోకి దిగిన తర్వాతే అసలు పరీక్ష ఎదురవుతోంది. ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో ఖర్చు తగ్గుతుందని ముందుగా భావించారు. ఇంటింటా ప్రచారం, కేడర్తో సమన్వయం, సమావేశాలు, ర్యాలీలు..రాత్రి సమయంలో విందులతో ఖర్చుతో పాటు ఒత్తిడి అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో రెండు పురపాలికల్లో ఎన్నికల వేడి రగులుతోంది. పోటీ తీవ్రంగా ఉండడంతో ఖర్చు భారీగానే పెట్టాల్సి వస్తుందని అభ్యర్థులు వణికిపోతున్నారు. హోరాహోరీ.. జనగామ, స్టేషన్న్ఘన్పూర్ మున్సిపాలిటీల్లో హోరాహోరీ ప్రచారం సాగుతోంది. జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి రోజుకి ఐదు వార్డుల్లో ప్రచారం చేస్తూ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిషలు కష్టపడుతున్నారు. ఇదే వేగంతో స్టేషన్న్ఘన్పూర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేడర్కు దిశానిర్దేశం చేస్తుండగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక జనగామలో కాంగ్రెస్ పరిస్థితి మాత్రం కొంచెం క్లిష్టంగానే కనిపిస్తోంది. పలు వార్డుల్లో అభ్యర్థుల ఎంపిక ఆలస్యమవడంతో ప్రచారం ఇంకా పూర్తిగా పట్టాలు ఎక్కలేదు. అధికార పార్టీ, బీజేపీ, ఇతర అభ్యర్థులు ప్రచారం మొదలెట్టిన వేళ అభ్యర్థుల ఖరారులో జాప్యం కాంగ్రెస్ ప్రచారానికి ఇంకా దూరంగానే ఉందని చెప్పుకోవచ్చు. కానీ పలు వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు.నేడు ఉపసంహరణ ఇంతలో నామినేషన్ల ఉపసంహరణ దశకు చేరుకోవడంతో పార్టీల దృష్టి ఆ వైపు మళ్లింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల బీఫామ్లను ఎన్నికల అధికారులు వద్ద సమర్పించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. అదే సమయానికి పార్టీల బీఫామ్ల అందజేత ప్రక్రియ కూడా ముగియనుంది. ఉపసంహరణ కోసం ఎన్నికల కమిషన్ జనగామ మున్సిపల్, స్టేషన్ఘన్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సెంటర్లలో నామినేషన్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉపసం హరణతో తుది జాబితా ఖరారుకానుండడంతో అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఎవరెవరిని నిలబెట్టాలి.. ఎవరిని ఉపసంహరించాలి.. ఏ వార్డులో అధికార పార్టీ, ఏ వార్డులో రెబల్స్ ప్రభావం అన్నదానిపై పార్టీ నాయకులు గంట గంటకు ప్లాన్ మార్చుకుంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్ర చారం మరింత వేడెక్కుతుండడంతో వచ్చే రెండు రోజులపాటు జనగామ, స్టేషన్ ఘన్పూర్ రాజకీయం ఉండే అవకాశం ఉంది. -
పది విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
● అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ రఘునాథపల్లి : పదో తరగతి విద్యార్థుల విద్యా ప్రగతిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అదనపు కలెక్టర్ పింకేశ్కుమార్ సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థుల సామర్ధ్యాలు, ఉపాధ్యాయుల బోధనా తీరును పరిశీలించారు. ఇన్చార్జ్ హెచ్ఎం బాల్నె నాగభూషణం, ఎంఈఓ రఘునందన్రెడ్డి, ఏఎంఓ శ్రీనివాస్, కనకయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మున్సి‘పోల్స్’ను సమర్థవంతంగా నిర్వహించాలి
● అధికారులకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచన స్టేషన్ఘన్పూర్: మున్సిపాలిటీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ రాధాక్రిష్ణకు పలు సూచనలు చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్ను పరిశీలించి విధులు నిర్వహిస్తున్న అధికారులకు పలు సూచనలు చేశారు. పక్కా ప్రణాళికతో చదవాలి పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులు పక్కా ప్రణాళికతో ప్రత్యేక శ్రద్ధతో సిద్ధం కావాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. స్థానిక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ సోమవారం సందర్శించారు. ముందుగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వారు పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతున్నారు.. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో మార్కులు ఎలా వచ్చాయి.. ఏ సబ్జెక్టులను ఎంత వరకు చదవడం పూర్తయిందని తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటశాలకు వెళ్లి వంటలను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులున్నారు. ఉపాధిలో ప్రాధాన్య పనులకు అవకాశం జనగామ రూరల్: ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో జాబ్కార్డు కలిగిన ప్రతీ ఒక్కరికి 100 రోజుల పని కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనుల పురోగతిపై అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్తో కలిసి పీడీ హౌజింగ్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపిఓలతో కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సమీక్షించారు. ప్రతి గ్రామానికి 75 మందికి తగ్గకుండా కూలీలతో పని చేయించాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ వసంత, అదనపు డీఆర్డీఏలు నూరుద్దీన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
విస్తృత చర్చలతోనే అభ్యర్థుల ఎంపిక
జనగామ రూరల్: విస్తృత చర్చలు, అభిప్రాయా లతోనే అభ్యర్థుల ఎంపిక జరిగిందని, పార్టీకి సేవ చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చామని ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి కార్యాలయంతో ఆయనతో పాటు జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి సమక్షంలో జనగామ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, పార్టీ విధానాలకు అనుగుణంగా, వార్డు అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, పట్టణ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపి, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి వెల్లడించారు. వార్డు కౌన్సిలర్ అభ్యర్థుల వివరాలు: 1: మూడ్ లక్ష్మణ్ నాయక్, 2: రామగళ్ల విజయ్కుమార్, 4: మంత్రి సుమలత, 8: ఝెర్ర రజిని, 9:వంగాళ కళ్యాణి, 12: వంగా ఉమా, 13: మేడ శ్రీనివాస్, 14: తిరువైప్పడి ఆండాలు, 15: సిద్దం శివశంకర్, 16: కడకంచి సుశీలా 17: గొడేపాక రామచంద్ర 18: కొండ శ్రీనివాస్ రావు,19: దోర్నాల అనిత,20: గడారి రేణుక, 21: మోతే రేణుక, 24: వెమల్ల పద్మ, 26: జక్కుల వేణుమాధవ్, 27: చంచరపు కరుణాకర్ రెడ్డి, 28: రతియా బేగం, 29: మరుకుకుల శ్రీనివాసులు, 30: ఆరుట్ల రాంనర్సింహరెడ్డి. ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనారిటీలకు ప్రాధాన్యం కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి -
మేడారంలో తగ్గని రద్దీ
● మహాజాతర ముగిసినా తరలివచ్చిన భక్తజనం ● కిక్కిరిసిన సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణంకేసీఆర్పై సిట్ విచారణ సిగ్గుచేటుజనగామ రూరల్: ఫోన్ ట్యాపింగ్ పేరుతో కేసీ ఆర్పై సిట్ విచారణ చేపట్టడం సిగ్గుచేటని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. కేసీఆర్ను సిట్ విచారణకు పిలువడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పార్టీ శ్రేణులతో కలసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నల్లబ్యాడ్జిలు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనకు నాయకత్వం వహించిన కేసీఆర్ను, తెలంగాణ ప్రజలను అవమానించేలా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. కేవలం రాజ కీయ కక్షతోనే సిట్ విచారణ పేరుతో కేసీఆర్ను ఇబ్బందులకు గురిచేయడం ఏమాత్రం సరికాదన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పా ల్పడుతున్నదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు జి.నర్సింగరావు, పెద్ది రాజిరెడ్డి, బాల్దె సిద్దిలింగం, బండా పద్మ, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, మాజీ ఎంపీపీ కలింగ రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
వారెంత? మనమెంత?
జనగామ: జనగామ–స్టేషన్ ఘన్పూర్ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నామినేషన్ల దశ పూర్తి కాగా, స్క్రూటినీ అనంతరం ఈ నెల 3వ తేదీన ఉపసంహరణ గడువు ఉండడంతో పార్టీల్లో చర్చలు, లెక్కలు, అంతర్గత రాజకీయం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఎన్నికల్లో ఎవరెంత ఖర్చు చేస్తారు..ఎంత ఖర్చు చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది..ప్రత్యర్థిపై నెగ్గాలంటే ఎంత ఖర్చుపెట్టాల్సి ఉంటుందనే కోణంలో చర్చలు నడుస్తున్నాయి. ఈక్రమంలోనే డమ్మీ అభ్యర్థులను ఉపసంహరించుకునే విధంగా పార్టీల నేతలు సీరియస్గా చర్చలు జరుపుతుండగా, అధికారిక అభ్యర్థులు మాత్రం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మనీ మేనేజ్మెంట్.. ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారానికి కావాల్సిన మనీ మేనేజ్మెంట్లో నిమగ్నమవడం చర్చనీయాంశంగా మారింది. రోజువారీ ప్రచారం, కార్యకర్తల ఖర్చులు, ఓటర్లకు పంచాల్సిన ప్యాకేజీలపై ముందుగానే లెక్కలు వేసుకుంటూ భారీ మొత్తంలో నిధులను సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో కూడా రాజకీయ సమీకరణాలకన్నా మనీ చుట్టూనే అంతా తిరుగుతోందని అని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇప్పటికే పలు వార్డుల్లో ఇంటింటా పర్యటించారు. నామినేషన్లకు ముందే ఆయన ప్రారంభించిన ప్రత్యేక ప్రచారం ఇప్పుడు వేగం పుంజుకుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా ప్రచార రంగంలోకి దిగుతోంది. గత వారం రోజులు అభ్యర్థులు స్వతహాగా ప్రచారం ప్రారంభించగా, ఇప్పుడు డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, జనగామ నియోజకవర్గ ఇన్న్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి వార్డుల వారీగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఘన్పూర్లో గట్టి పోటీ.. ఇక స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ కుర్చీపై రెండు ప్రధాన పార్టీల మధ్య గట్టి పోరు నెలకొంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రతిరోజూ కార్యకర్తలతో చర్చలు కొనసాగిస్తూ అధికార పీఠాన్ని సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇదే తరుణంలో అక్కడి మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య, జనగాామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇద్దరూ కొత్తగా ఏర్పడిన స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యూహాత్మకంగా ప్రతీ వార్డుపై దృష్టిపెట్టి ప్రజలతో సమీపంగా మమేకమవుతున్నారు. పార్టీల అంతర్గత సమస్యల విషయానికి వస్తే, బీఆర్ఎస్లో వార్డుల అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. అయితే కాంగ్రెస్లో మాత్రం కొన్ని చోట్ల అభ్యర్థుల ఎంపికపై గందరగోళం ఇంకా కొనసాగుతోంది. ఇరు పార్టీలూ రెబల్ అభ్యర్థుల సమస్య లేకుండా చూడాలనే ప్రయత్నాలు చేస్తున్నా, కొన్ని చోట్ల తిరుగుబాటు మంటలు చెలరేగే అవకాశం కనిపిస్తోంది. అంతా చూశాక ఈ ఎన్నికల గర్జనలో ఎవరు ఎంత ఖర్చు పెడతారు..? మనీ ఎలా కదులుతుంది..? అనే దానిపైనే చర్చ నడుస్తోంది. అభ్యర్థుల ప్రచార తీరూ, పార్టీల వ్యూహాలూ, ఉపసంహరణ గడువులో జరగబోయే మార్పులే వచ్చే రోజుల్లో కీలకంగా మారనున్నాయి. నెగ్గాలంటే ఎంత ఖర్చు చేయాలన్న దానిపైనే చర్చ బీఆర్ఎస్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి, కాంగ్రెస్లో గందరగోళం జనగామ–‘స్టేషన్్’లో మొదలైన రాజకీయ వేడి.. డమ్మీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు పార్టీల ముమ్మర యత్నాలు -
సమాజాభివృద్ధిలో యువత పాత్ర కీలకం
పాలకుర్తి టౌన్: యువత సమాజ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ సూచించారు. ఆదివారం మండల కేంద్రంలో యువత చైతన్య యూత్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో యువ మండల్ వికాస్ అభియాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి, దేవరుప్పల, కొడకండ్ల మండలాల నుంచి పెద్ద సంఖ్యలో యువత పాల్గొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కార్యక్రమంలో నేషనల్ యూత్ అవార్డు గ్రహీత మధు, వార్డు సభ్యులు కమ్మగాని శ్రీకాంత్, ఎలమకంటి సతీష్, యూత్ అధ్యక్షుడు ఎడవెల్లి సోమశేఖర్,కార్యదర్శి ఎలమకంటి సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
మిర్చికి మళ్లీ జీవం
లింగాలఘణపురం: ఈ ఏడాది మిర్చిపంట తీవ్రమైన తెగుళ్ల బారిన పడి దిగుబడి పూర్తిగా తగ్గి రైతులు నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మిర్చి ధర రోజురోజుకూ పెరుగుతుండడంతో రైతులు తెగుళ్లు సోకిన మిర్చి పంటకు మళ్లీ మందులు వేసి..కలుపు మొక్కలు తీసివేసేందుకు దున్నుతున్నారు. క్వింటాల్కు రూ.18వేల నుంచి రూ.20వేలపైకి చేరుతుండడంతో ఆకు అంతా రాలిపోయి చిగురిస్తుండగా మిర్చిపై మళ్లీ ఆశలు పెంచుకుంటున్నారు. మొక్కను తొలగించడం ఎందుకనే ఉద్దేశంతో ఎంతైనా కొంత దిగుబడి వస్తుందనే ఆశతో మళ్లీ అదే పంటకు జీవం పోయాలని చూస్తున్నారు. కొత్తపల్లికి చెందిన మేకల మల్లయ్య తనకు ఉన్న ఎకరంలో గత ఏడాది సుమారు 30 క్వింటాళ్ల మిర్చి దిగుబడి రాగా ఈసారి కేవలం ఆరేడు క్వింటాళ్లు మాత్రమే రావడంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో ఉన్నారు. చిగురిస్తున్న మిర్చి మొక్కలను మళ్లీ దున్ని మందులు వేసి నీళ్లు పెడితే ఎంతో కొంత దిగుబడి వస్తుందని ఆశతో దున్నుతున్నాడు. ఇదే విధంగా మండలంలో మిర్చి వేసిన రైతులు కొంత మంది అదే ఆశతో ఉన్నారు. తెగుళ్ల బారిన పడిన పంటకు మందులు, కలుపుతీత ‘ఎర్రబంగారం’ ధర పెరుగుతుండడంతో రైతుల ఆశలు -
ప్రత్యేకం!
ఓరుగల్లుకు లేదుఉమ్మడి వరంగల్ జిల్లా వాసులను నిరాశపరిచిన కేంద్ర బడ్జెట్సాక్షిప్రతినిధి, వరంగల్: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్లో ఉమ్మడి వరంగల్కు ప్రత్యేక కేటాయింపులు లేవు. వరంగల్కు కీలకమైన ఎయిర్పోర్ట్ నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. మెడికల్, ఐటీ హబ్లు ఏర్పాటు చేసే నగరాల జాబితాలో చోటు దక్కలేదు. పర్యాటక అభివృద్ధిలో ఈశాన్య రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇచ్చిన కేంద్రం.. ఈ బడ్జెట్లో ఓరుగల్లు పర్యాటకాన్ని పట్టించుకోలేదు. మేడారం జాతరకు జాతీయ హోదా ఊసేలేదు. ములుగు గిరిజన యూనివర్సిటీతో పాటు కాళోజీ, కాకతీయ యూనివర్సిటీల ప్రస్తావన లేదు. ఉమ్మడి వరంగల్లో కీలక ప్రాజెక్టులకు ఈ సారి మొండిచెయ్యే చూపారన్న చర్చ జరుగుతోంది. ప్రాధాన్యం ఇచ్చి ఉంటే బాగుండేదని కొందరు మేధావులు, ఆర్థికవేత్తలు అంటుండగా.. ఈసారి కూడా అన్యాయం జరిగిందని వివిధ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ వర్గాల ఆశలు నెరవేరలే... వ్యవసాయ అనుబంధ రంగాలు, ఉద్యోగులు, మధ్యతరగతి వారి ఆశలు నెరవేరలేదు. ఆ వర్గాలను ప్రభావితం చేసే అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యం దక్కలేదు. ఉమ్మడి జిల్లాలో ఆదాయ పన్ను చెల్లింపుదారులు 5.28 లక్షల మందికి పైగా ఉన్నట్లు అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమలవుతున్న స్లాబులను కొనసాగించడంతోపాటు స్టాండర్డ్ డిడెక్షన్ను పెంచితే బాగుంటుందన్న వారి కోరిక తీరలేదు. డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు విస్తరించి, విద్య, వైద్య ఖర్చులపై టీడీఎస్ను 5 నుంచి 2 తగ్గించి చిన్నతరహా ఆదాయపన్ను చెల్లింపుదారులకు ఆరు నెలల ఊరట ఇచ్చారు. గృహ రుణాల విషయంలో వడ్డీ రాయితీ, చిన్న కమతాలు కలిగిన రైతులకు భరోసా కల్పించే అంశాలు బడ్జెట్లో లేవు. రింగురోడ్డు నిర్మాణం, స్మార్ట్సిటీ పథకం పొ డిగింపుపై స్పష్టత లేదు. బడ్జెట్లో రాయితీలు లేకపోవడంతో అనేకవర్గాలు పెదవి విరుస్తున్నాయి. 6 జిల్లాలకు 6 బాలికల హాస్టళ్లు.. బడ్జెట్పై భిన్నాభిప్రాయాలు.. పర్యాటకం, మెడికల్ హబ్లో దక్కని చోటు ‘ట్రైబల్’ సహా యూనివర్సిటీలకు కేటాయించని నిధులు కేఎంటీపీకి ప్రయోజనం.. రైతులకు ఊరట జిల్లాకో బాలికల హాస్టల్.. ఉపాధి, ఉద్యోగావకాశాలుదేశంలోని అన్ని జిల్లాల్లో బాలికల హాస్టళ్లను అన్ని హంగులతో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలకు బాలికల హాస్టళ్లు రానున్నాయి. రైతులకు ఎరువులపై ఈసారి రాయితీ శాతాన్ని పెంచడం ఊరట కలిగించే అంశం కాగా, 9.17 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. కొత్త పథకం ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 75,834 ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)లకు మేలు జరగనుంది. ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగించి వైద్యం, ఆరోగ్యం పరంగా పేదలకు రాయితీలు ఇచ్చారు. క్యాన్సర్ రోగులకు సరఫరా చేసే మందుల ధరలు తగ్గనుండగా.. 23,190 మందికి నెలనెలా ఖర్చులు తగ్గనున్నాయి. -
ఘనంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
పాలకుర్తి టౌన్: మండలంలోని తొర్రూరు గుట్టపై వెలిసిన వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగ వివాహ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. వేంకటేశ్వర స్వామి కల్యాణం, రేణుక ఎల్లమ్మ తల్లి పట్నాలు, బోనాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ పూజారి రానాచార్యుల నేతృత్వంలో జరిగిన కల్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి మండలంలోని పలు గ్రామాల భక్తులు తరలివచ్చి తిలకించారు. కార్యక్రమంలో సర్పంచ్ పసులాది యాకస్వామి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మహేందర్, ఉపాధ్యక్షుడు పసులాది చంద్రయ్య, కార్యదర్శి గోడ రవి,చిలువేరు బాలరాజు, లంక శ్రీనివాస్, పులి శ్రీను, అంజనేయులు, చిలువేరు పెంటయ్య, కొంక మల్లేశం, గోనె సోమయ్య తదితరులు పాల్గొన్నారు.గోవర్ధనగిరిలో వైభవంగా ఎడ్లపండుగరఘునాథపల్లి: మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో ఆదివారం రైతులు ఎడ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే రైతులు తమ పశువులకు స్నానాలు చేయించి, కొమ్ములకు రంగులు అద్ది సుందరంగా అలంకరించారు. అనంతరం పచ్చని పొలాల వద్ద పశువుల గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం రైతులందరూ సహపంక్తి భోజనం చేశారు. రైతులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొని పండుగకు శోభ తీసుకొచ్చారు. వ్యవసాయానికి ఆధారమైన పశువులపై కృతజ్ఙతాభావంతో ఈ పండుగను ఏటా ఆనవాయితీగా జరుపుకుంటున్నామని రైతులు తెలిపారు. పుష్కర ప్రయుక్త మహాకుంభాభిషేకంజనగామ రూరల్: పట్టణంలోని రామలింగేశ్వరస్వామి దేవాలయంలో పుష్కర ప్రయుక్త మహా కుంభాభిషేక మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంతో పాటు శత రుద్రాభిషేక హోమం, అన్న ప్రసాద వితరణ, వేద పారాయణం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అప్పయ్య శాస్త్రి, దేవస్థానం చైర్మన్ రామిని రాజేశ్వర్, ఉపాధ్యక్షులు మహంకాళి హరిశ్చంద గుప్తా, ప్రధాన కార్యదర్శి కోకల మల్లేశం, కోశాధికారి అయిత శ్రీనివాసులు, సభ్యులు అల్లాడి ప్రభాకర్, పుల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.పులి సంచారంపై అప్రమత్తతబచ్చన్నపేట: మండలంలోని సాల్వాపూర్, మన్సాన్పల్లి చుట్టూ పక్కల గ్రామాల రైతులు జాగ్రత్తగా ఉండాలని ఆయా గ్రామాల సర్పంచ్లు మిద్దెల శ్రీధర్గౌడ్, గీస సందీప్ సూచించారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. తమ గ్రామాలతో పాటు పక్క మండలమైన యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం పరిధిలోని పలు గ్రామాల్లో పులి సంచరిస్తోందన్నారు. ఆ మండలంలోని గంధమల్ల అనే గ్రామంలో పులి ఓ రైతుకు చెందిన లేగదూడను చంపివేసిందన్నారు. మన్సాన్పల్లి, సాల్వాపూర్ గ్రామాల మధ్యన దాదాపు 450 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉన్నదని అందుకే రైతులు జాగ్రత్తలు పాటించాలన్నారు. పులి ఉన్న చోట నుంచి దాదాపు 70 నుంచి 100 కిలోమీటర్ల మేర తిరుగుతుందని బావుల వద్ద పశువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని, రాత్రి పూట బావుల వద్దకు వెళ్లకూడదన్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు పలు సూచనలు చేసినట్లు తెలిపారు. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ కృషి అమోఘంకేయూ క్యాంపస్: అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ కృషి అమోఘం అని జైపూర్లోని ఎంఎన్ఐటీ ప్రొఫెసర్ డాక్టర్ కవిత లాల్వాని అన్నారు. ఆదివారం కేయూ ఫిజిక్స్ విభాగం, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో లెగసీ ఆఫ్ కల్పనా చావ్లాపై నిర్వహించిన ఆన్లైన్ వెబినార్లో పాల్గొని ఆమె కీలకపోన్యాసం చేశారు. డాక్టర్ కల్పనా చావ్లా జీవితం భౌతిక శాస్త్రం, అంతరిక్ష పరిశోధన, మహిళా శాస్త్రవేత్తల ప్రేరణకు ప్రతీకగా నిలిచాయని కవిత అన్నారు. -
‘రెబల్స్’ బెడద
జనగామ రూరల్: జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. ఈ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థుల హంగామా.. రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. నామినేషన్ గడువు ముగియడంతో స్క్రూటినీ కూడా పూర్తయింది. ఇప్పుడు ఉపసంహరణ మాత్రమే మిగిలి ఉండడంతో అభ్యర్థుల మధ్య ఒత్తిడి, చర్చలు, రహస్య ఒప్పందాలు ఊపందుకున్నాయి. పార్టీ నుంచి టికెట్ ఆశించినా.. దక్కకపోవడంతో అసంతృప్తితో బరిలో దిగిన వారు, స్వతంత్రులు ఇప్పుడు అధికార, ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారారు. రెండేళ్లుగా కౌన్సిలర్ ఎన్నిక కోసం సిద్ధమవుతూ, తమ వార్డుల్లో పెద్ద ఎత్తున ఖర్చులు పెట్టిన పలువురు నాయకులు ఇప్పుడు ఉపసంహరణపై మొగ్గు చూపడం లేదు. వారిని నచ్చజెప్పడానికి పార్టీ పెద్దలు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రత్యేక ఆఫర్లు.. ‘వార్డులోని తన అనుచరులను ఆకర్షించేందుకు ప్రతీ రోజు ఖర్చులు అయ్యాయి. ఇప్పుడు ఉపసంహరించుకోమంటే నా అభిమానులకు ఏమి చెప్పాలి’ అంటూ కొంతమంది రెబల్ అభ్యర్థులు అసంతృప్తిగా ఉన్నారు. అందుకే వారిని ఒప్పించేందుకు పార్టీ శ్రేణులు ప్రత్యేక ఆఫర్లతో ప్రతిపాదనలతో ముందుకు వెళ్తున్నారు. కొంతమంది అభ్యర్థులు ఇప్పటికే మధ్యవర్తుల ద్వారా రాజీకి సుముఖంగా ఉండగా, ఉపసంహరించిన తర్వాత ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం ఆఫర్లు క్లియర్ చేసే బాధ్యతను కూడా మధ్యవర్తులకే అప్పగిస్తున్నట్లు సమాచారం. ఓట్ల విభజన జరగకుండా.. ఒక్క ఓటు గెలుపోటములు నిర్ణయించే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ప్రధాన పోటీలో ఉన్నవారు రెబల్ కారణంగా ఓట్ల విభజన జరగకుండా చూడటానికి ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నా రు. ఇక ఉపసంహరణ గడువు సమీపిస్తున్న కొద్ది ఈ రెండు పురపాలికల్లో ఎన్నికల హీట్ మరింత పెరిగింది. రెబల్ అభ్యర్థుల నిర్ణయాలపై అన్ని పా ర్టీల దృష్టి నిలిచింది. ఏదిఏమైన రెబల్ అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశం ఉండటంతో ఎన్నికల పోరు మరింత ఆసక్తికరంగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో పెరుగుతున్న పొలిటికల్ హీట్ ఉపసంహరణకు రహస్య ఒప్పందాలు పార్టీలకు తలనొప్పిగా మారిన రెబల్ అభ్యర్థుల ప్రచారం -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
● జనగామలో 186, స్టేషన్ఘన్పూర్లో 114 మంది అభ్యర్థులు ● నేడు అప్పీళ్ల్ల స్వీకరణ, రేపు తుది జాబితా విడుదలజనగామ రూరల్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శనివారం అధికారులు నామినేషన్లను స్క్రూటినీ ప్ర క్రియ నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్రులు నామినేషన్లను వేశారు. అభ్యర్థులు ముందస్తుగా ఇబ్బందులు తలెత్తకుండా నా మినేషన్ పత్రాలను ఒకటికి రెండుసార్లు పునఃపరి శీలన చేసి అందించారు. దీంతో నామినేషన్ స్క్రూ టినీలో ఒక్కటి కూడా తిరస్కరణకు గురికాలేదు. జిల్లాలో జనగామ, స్టేషన్ఘన్పూర్ రెండు మున్సిపాలిటీలో 48 వార్డులు ఉండగా 300 మంది అభ్యర్థులు మొత్తం 473 నామినేషన్లు వేశారు. ఇందులో అభ్యర్థులు మూడు, నాలుగు సెట్లు దాఖలు చేయగా స్క్రూటినీలో అభ్యర్థికి ఒక్కటి చొప్పున 300 నామినేషన్లను స్వీకరించారు. జనగామలో 186, స్టేషన్ఘన్పూర్లో 114 మంది అభ్యర్థులు ఉన్నారు. జనగామలో బీజేపీ 54, బీఎస్పీ 6, సీపీఎం 5, కాంగ్రెస్ 107, బీఆర్ఎస్ 73, రిజిస్టర్ పార్టీలు 16, స్వతంత్రులు 39 మంది నామినేషన్ వేశారు. అభ్యంతరాల స్వీకరణ, నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన అనంతరం ఎన్నికల బరిలో ఎంతమంది ఉంటారనేది తేలనుంది. స్టేషన్ఘన్పూర్ మున్సిపల్లో 18 వార్డుల గాను 114 మంది అభ్యర్థులు 181 నామినేషన్లు దాఖలు చేశారు. అందులో అత్యధికంగా ఎస్సీ జనరల్ ఉన్న ఒకటవ వార్డులో 15 నామినేషన్లు వేయగా అత్యల్పంగా 7, 14వ వార్డుల్లో 6 చొప్పున నామినేషన్లు వేశారు. -
అరణ్యానికి ఆదిశక్తులు
సమ్మక్క: రాత్రి 7.58 గంటలకుమేడారం(ఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి): ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వన ప్రవేశం కార్యక్రమంతో సమ్మక్క–సారలమ్మ మహాజాతర శనివారం ముగిసింది. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క–సారలమ్మతోపాటు పగిడిద్దరాజు, గోవిందరాజును పూజారులు ఆదివాసీ సంప్రదాయ రీతిలో పూజలు చేసి తల్లులను వనం చేర్చారు. సాయంత్రం గద్దెల వద్ద ప్రారంభమైన వన ప్రవేశ కార్యక్రమం రాత్రి వరకు కొనసాగింది. పూజారులు కన్నెపల్లికి సారలమ్మను, చిలకలగుట్టకు సమ్మక్క తల్లిని తీసుకెళ్లారు. కొండాయికి గోవిందరాజును పూజారులు దబ్బగట్ల గోవర్ధన్, రాజారం, వడ్డె బాబు, పూనుగొండ్లకు పగిడిద్దరాజును పూజారులు పెనక బుచ్చిరాములు పడగలను తీసుకెళ్లారు. భక్తులు.. అమ్మల ఆశీస్సులతో గమ్యస్థానానికి చేరుకున్నారు. డోలు వాయిద్యాలు, కొమ్ముబూర ధ్వనులేమీ లేకుండా తల్లుల వన ప్రవేశం నిశ్శబ్దఽంగా సాగింది. శని వారం సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. తల్లులారా వెళ్లొస్తాం.. తల్లులూ వెళ్లొస్తాం.. అంటూ తీరొక్క మొక్కులు చెల్లించిన భక్తులు శనివారం స్వస్థలాలకు బయల్దేరి వెళ్లారు. బస్టాండ్ పరిసరాలు కిక్కిరిసి కనిపించాయి. బోసిపోయిన మేడారం.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షలాది ప్రైవేట్ వాహనాల్లో భక్తులు తరలివచ్చారు. వాహనాల పార్కింగ్కు కేటాయించిన స్థలాలు జాతర ముగియడంతో నిర్మానుష్యంగా మారాయి. ఇసుకేస్తే రాలనంత మంది జనంతో ఉన్న మేడారం ఒక్కసారిగా బోసిపోయింది. చెట్లు పుట్టలు అంటూ తేడా లేకుండా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మలకు మొక్కులు చెల్లించి తిరుగు ప్రయాణం చేశారు. పోలీసులు వన్ వే చేయడంతో వచ్చిన దారి కాకుండా పోలీసులు సూచించిన దారిలో వాహనాలు తరలించారు. భక్తుల రద్దీతో విరిగిన గ్రిల్స్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా శుక్రవారం వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల తాకిడికి అర్ధరాత్రి సమయంలో సమ్మక్క గద్దె సమీపంలోని ఇనుప గ్రిల్స్ విరిగిపోయాయి. భక్తుల రద్దీ, తోపులాటతో గ్రిల్స్ విరిగి పక్కకు పడ్డాయి. ఆ సమయంలో భక్తులు అనేక మంది అక్కడే ఉన్నప్పటికీ ఎలాంటి గాయాలు కాలేదు. విరిగిన గ్రిల్స్కు ఎండోమెంట్ అధికారులు వెల్డింగ్ చేయించారు. దాంతో దర్శనాలు యథావిధిగా కొనసాగాయి. జనం నుంచి వనం చేరిన తల్లులు ఆదివాసీ సంప్రదాయంతో వన ప్రవేశంవరాల మూటలు భక్తులకిచ్చారు.. వారిచ్చిన ప్రేమను మూటగట్టుకున్నారు. ఆసీనులై అందరి మొర ఆలకించారు.. ఎనలేని కాస్మిక్ ఎనర్జీని ప్రసరించారు. భక్తుల ప్రేమకు మురిసిపోయారు. వెళ్లొస్తామంటూ తల్లులు ముందుకు కదిలారు.. ఆ దారులు.. సెలయేరులై పాదాలు తడపగా గాలులు సుమగంధాలై నాట్యం చేశాయి. వనాలు గొంతెత్తి సుస్వరాలు పలుకగా. ‘సాహో.. అంటూ విశ్వం స్వాగతించింది! -
ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా జనగామ రూరల్: ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రిజ్వన్ బాషా సూచించారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియపై శనివారం అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి మున్సిపల్ కమిషనర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లు, మాస్టర్ ట్రైనర్లతో గూగుల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నామినేషన్ల పరిశీలన విధానం గురించి కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్ల స్క్రూటినీ సమయంలో ప్రతీ దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి, ఎన్నికల నియమావళి ప్రకారం పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల పరిశీలన ప్రక్రియను పరిశీలించారు. ఆర్ఓలు నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అభ్యర్థులను ఖరారు చేయాలని ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర సవరణను పకడ్బందీగా నిర్వహించాలి ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలతో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులు ప్రతీ ఇంటిని సందర్శించి వివరాలు సేకరించాలని, ఓటరు జాబితాలోని ఓటర్ల మ్యాపింగ్ చేపట్టాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడు తూ రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకొని 2026 ప్ర క్రియను నిర్దిష్ట గడువులో పూర్తిచేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. వీసీలో అదనపు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో స్నేహితుల మృతి
● మరొకరికి తీవ్ర గాయాలు ● మరణంలోనూ వీడని స్నేహబంధంభువనగిరిటౌన్ /పాలకుర్తి టౌన్: వారిద్దరు ప్రాణ స్నేహితులు. ఎక్కడకు వెళ్లినా కలిసే వెళ్లేవారు. చివరకు మరణంలోనూ తమ స్నేహబంధం వీడదీయరానిదంటూ రోడ్డు ప్రమాదంలో ఒకేసారి మృతిచెందారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన బాతుల రాకేష్ (20), పాలకుర్తి మండలం శాతాపురం గ్రామానికి చెందిన గన్నె ఆనంద్ (19) ఫొటోగ్రాఫర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరు హైదరాబాద్లోని రామాంతాపూర్లో ఒకే రూంలో ఉంటున్నారు. రాకేష్ అమ్మమ్మ ఊరు కూడా శాతాపురం కావడంతో వీరిద్దరు చిన్నప్ప టి నుంచి స్నేహితులయ్యారు. వీరితో పా టు శాతాపురానిక చెందిన మరో స్నేహితు డు సూర్యప్రసాద్ కూ డా హైదరాబాద్లోనే ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అ క్కడే మరొక రూంలో ఉంటున్నాడు. జనవరి 30న ఆనంద్ పుట్టినరోజు కాగా.. బర్త్డే వేడుకలను మే డారంలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాకేశ్, ఆనంద్, సూర్యప్రసాద్ కలిసి జనవరి 29న రాత్రి హైదరాబాద్ నుంచి బయల్దేరి శా తాపురంలో ఆనంద్ బంధువుల వద్ద కారు తీసుకు ని మేడారం వెళ్లారు. అక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకుని తిరిగి శాతాపురం వచ్చి కారును అప్పగించి శుక్రవారం రాత్రి ముగ్గురు కలిసి బైక్పై హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో భువనగిరి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఫ్లైఓవర్పై బైక్ అదుపుతప్పడంతో వెనుక కూర్చు న్న రాకేశ్, ఆనంద్ బైక్ మీద నుంచి ఎగిరి ఫ్లైఓవర్ పై నుంచి సర్వీసు రోడ్డుపై పడ్డారు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. బైక్ నడుపుతున్న సూర్యప్రకాశ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల స మాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చే రుకుని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. శనివా రం మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రమేశ్ తెలిపారు. ఆనంద్, రాకేశ్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
అమ్మల దీవెన
మేడారం(ఎస్ఎస్తాడ్వాయి/ఏటూరునాగారం): వరాల తల్లులకు భక్తులు మనసారా మొక్కులు చెల్లించారు. నలుగురు దేవతలు గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాల అనంతరం గద్దెలకు చేరుకున్నారు. కోరిన కోర్కెలు నెరవేరడంతో మొక్కులు అప్పగించారు. గద్దెల వద్ద పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, చీరసారె, యాటపోతులు, కోళ్లు, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో గద్దెల ప్రాంగణం కళకళలాడింది. గ్రిల్స్ బయట నుంచి అమ్మవార్లను తనివితీరా మొక్కుకున్నారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. జయజయధ్వానాలతో గద్దెల ప్రాంగణం మార్మోగింది. ఆదివాసీ సంప్రదాయంగా జరిగిన పూజలు, డోలు వాయిద్యాలతో మేడారం ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది. కోటి మందికిపైగా మొక్కులు.. వనదేవతలను ఇప్పటి వరకు కోటి మందికిపైగా.. దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు సుమారు 45 లక్షల మంది భక్తులు తల్లులను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, మంగళవారం నుంచి మొదలైన భక్తుల రద్దీ శుక్రవారం వరకు కొనసాగింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పక్క రాష్ట్రాల నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో మేడారానికి చేరుకున్నారు. మేడారం పరిసరాల ప్రాంతంలోని 20 కిలోమీటర్ల దూరంలో విడిది చేసిన భక్తులు అమ్మవార్లు గద్దెలపైకి రావడంతో బుధవారం రాత్రి నుంచి లక్షల సంఖ్యలో దర్శనానికి పోటెత్తారు. మేడారం ఎక్కడ చూసినా భక్త జన గుడారంలా కనిపించింది. అటవీ ప్రాంతంలోని వనంలో భక్తులు చెట్ల కింద గుడారాలు వేసుకుని మూడు రోజులు సందడిగా గడిపారు. సమీప గ్రామాల్లో భక్తుల సందడి మహా జాతర సందర్భంగా మేడారంతో పాటు చుట్టు పక్కల గ్రామాలైన రెడ్డిగూడెం, ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు, నార్లాపూర్, కాల్వపల్లి, బయ్యక్కపేట, వెంగళాపూర్ గ్రామాల్లో సందడి నెలకొంది. ఆయా గ్రామాల్లో గదులను అద్దెకు తీసుకుని విడిది చేశారు. పండుగ వాతావరణంలో పల్లెలన్నీ కళకళలాడాయి. ఇంటి యజమానులు భక్తులను బంధువులుగా ఆదరించారు. బస చేసింది మూడు రోజులే అయినప్పటికీ వారిలో కొందరు బంధువులుగా మారిపోయారు. తిరుగు ప్రయాణం.. తల్లుల దర్శనం అనంతరం శుక్రవారం భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో వేలాది మంది తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. ఆర్టీసీ బస్టాండ్ భక్తులతో కిక్కిరిసిపోయింది. మేడారం ఆర్టీసీ బస్టాండ్ నుంచి తాడ్వాయి వరకు 14 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఆర్టీసీ బస్సుల రాకపోకలతో బారులుదీరాయి. సాధారణంగా 20 నిమిషాల్లో తాడ్వాయికి చేరుకోవాల్సి ఉండగా.. ఆర్టీసీ బస్సులు బారులుదీరడంతో గంటకు పైగా సమయం పట్టింది. ప్రైవేట్ వాహనాల్లో వచ్చిన భక్తులు సైతం గుడారాలు ఖాళీ చేసి తిరుగు ప్రయాణం కావడంతో పస్రా వరకు ప్రైవేట్ వాహనాలతో దారులన్నీ కిక్కిరిసి కనిపించాయి. భక్త కోటి జనంతో పూజలు అందుకున్న సమ్మక్క–సారలమ్మను నేడు (శనివారం) సమ్మక్క సారలమ్మ పూజారులు వన ప్రవేశం చేయనున్నారు. అదేవిధంగా ఏటూరునాగారం మండలంలోని కొండాయికి గోవిందరాజులు, గంగారం మండలం పూనుగొండ్లకు పగిడిద్దరాజు పడిగలను గద్దెలపై నుంచి పూజారులు తీసుకెళ్లనున్నారు. సారలమ్మతో పాటు గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెల వద్ద నుంచి ముందు బయల్దేరగా, వీరి తర్వాత సమ్మక్కను పూజారులు వన ప్రవేశం చేయించనున్నారు. సంపెంగలో నీళ్లు సంబురపడ్డాయి.. పూనకాలతో పులకించి పోయాయి. తలనీలాలు తన్మయత్వం చెందాయి.. ఎనలేని భక్తిని చాటాయి. పసుపు, కుంకుమలు ప్రణమిల్లాయి.. పొడిసేటి పొద్దులై ప్రభవించాయి. కోళ్లు, యాటలు సై సై అన్నాయి.. మొక్కుల లెక్కల్లో తరించిపోయాయి. సాక చుక్కలు నేలపై పారాయి.. ఆనవాయితీకి అద్దం పట్టాయి. ఎత్తు బంగారపు మూటలు నెత్తిన చేరాయి.. భక్తి నిండిన మనసుల్ని ఉరకలెత్తించాయి. ఒడిబియ్యం, చీర సారెలు పోటీపడ్డాయి.. వనదేవతల ఒడికి వడివడిగా చేరాయి. గద్దెలు పసిడి కాంతులై ధగధగ మెరిశాయి.. భక్తకోటికి ఆడబిడ్డల దీవెనలు అందాయి.మేడారం (కాళేశ్వరం): మేడారం జాతరకు లక్షలాదిగా భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చి జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించి పునీతులయ్యారు. వాగులో ఇసుకతో తల్లుల ప్రతిమలు చేసి పూజించారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. శివసత్తులు పూనకా లతో నీరాజనం పలికారు. వరం పట్టారు. భ క్తులతో జంపన్నవాగు ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది. అనంతరం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద మొక్కులు చెల్లించారు. అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. మేడారంలో కిక్కిరిసిన గద్దెల ప్రాంగణం వనదేవతలను లక్షలాదిగా దర్శించుకుని పూజలు తిరుగు ప్రయాణంలో వాహనాల బారులు -
ముగిసిన నామినేషన్ల పర్వం
జనగామ రూరల్/స్టేషన్ఘన్పూర్: జనగామ, స్టేషన్ఘన్పూర్ పురపాలికల్లో నామినేషన్ల పర్వం శుక్రవారం ముగిసింది. మూడు రోజుల్లో కలిపి జనగామలో 292.. స్టేషన్ఘన్పూర్లో 181 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. జనగామ మున్సిపాలిటీలో కాంగ్రెస్ నుంచి 100 నామినేషన్లు, బీఆర్ఎస్ 82, బీజేపీ 45, ఇండిపెండెంట్ 42 రాగా సీపీఎం 5, సీపీఐ 1, బీఎస్పీ 1, ఏఐఎఫ్బీ 6, ఇతరులు ఆరుగురు నామినేషన్ వేశారు. దంపతులు చిన్న పిల్లలతో కలిసి వచ్చి నామినేషన్ వేశారు. సీఐ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జనగామ మున్సిపల్ వద్ద బందోబస్తు ఏర్పాటుచేశారు. స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థులకు సంబంధించిన బీ పామ్లు అందించడానికి అవసమైన ఆథరైజుడ్ ఫామ్ అదనపు కలెక్టర్ పింకేష్కుమార్కు స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అందజేశారు. నేడు స్క్రూటినీ.. నామినేషన్లను నేడు(శనివారం) స్క్రూటినీ చేయనున్నారు. వార్డుల వారీగా నామినేషన్లను పరిశీలించి ఒకటి, రెండు సెట్లను వేరు చేయనున్నారు. సాయంత్రం వరకు స్క్రూటినీ పూర్తి చేసి.. తుది జాబితాను వెలువరిస్తారు. -
భూముల రీ సర్వే
బచ్చన్నపేట: భూముల రీ సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ అన్నారు. శుక్రవారం బచ్చన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో మాట్లాడారు. భూముల రీ సర్వే కోసం కొడవటూరు గ్రామం ఎంపికై నట్లు తెలిపారు. గ్రామ హద్దులు, సర్వే నంబర్లను సర్వేయర్ లైసెన్స్డ్ సర్వేయర్లతో కలిసి సర్వే చేయాలని అన్నారు. సర్వే చేసే సమయంలో పాటించే నియమాలు, పద్ధతులు అధికారులకు వివరించారు. దశల వారిగా మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో సర్వే చేయాల్సి ఉంటుందని తెలిపారు. సర్వేయర్, రెవెన్యూ అధికారులు కలిసి సర్వే చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ శంకర్, ఆర్ఐ మున్నావర్, ఏడీ, సర్వేయర్ నర్మద, జూనియర్ అసిస్టెంట్ యాకన్న, జీపీఓ సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ -
కుష్ఠుపై అవగాహన
జనగామ రూరల్: ఈనెల 30నుంచి ఫిబ్రవరి 13 వరకు కుష్ఠు వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కె.మల్లికార్జునరావు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని అర్బన్ పీహెచ్సీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. కుష్ఠు పూర్తిగా నయం అయ్యే వ్యాధి అన్నారు. తొలిదశలో గుర్తించి చికిత్స ప్రారంభిస్తే పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. వంశపారంపర్యం కాదని, చికిత్స ప్రారంభించిన తర్వాత ఇది ఇతరులకు సోకదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు, చికిత్స ఉచితంగా అందుబాటులో ఉందని వివరించారు. స్పర్శ జ్ఞానం తగ్గి తెల్లటి, ఎర్రటి మచ్చలు, చేతులు, కాళ్లలో పట్టు లేకపోవడం లక్షణాలుగా చెప్పారు. నరాలు మందగించడం, చికిత్స చేయకపోతే కండరాల బలహీనత, వికారాలు ఉన్న వ్యక్తులు కుష్టు వ్యాధికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్లు కమల్ హాసన్, అనురాధ జాధవ్, రేవతి ప్రతిజ్ఞ చేశారు. -
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
జనగామ రూరల్: మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల సాధారణ అబ్జర్వర్ ఎ.నర్సింహారెడ్డి అన్నారు. జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ అబ్జర్వర్గా నియమితులైన తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఎ.నర్సింహారెడ్డి శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్తో సమావేశం అయ్యారు. జనగామ, స్టేషన్ఘన్పూర్లో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను అబ్జర్వర్కు కలెక్టర్ వివరించారు. అనంతరం నర్సింహరెడ్డి జనగామ ధర్మకంచ ప్రభుత్వ పాఠశాల, వీవర్స్ కాలనీ డగ్లస్ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పింకేష్ కుమార్, జెడ్పీ సీఈఓ మాధురి షా, జనగామ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, హౌజింగ్ పీడీ మాతృనాయక్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ వివిధ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబందనలకు లోబడి ర్యాలీలకు, వాహనాలకు, మైక్, ప్రచార సామగ్రి ముద్రణ అనుమతులలో నిబంధనలు పాటించాలన్నారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ తప్పనిసరిగా అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వ్యయ పరిశీలకులు ఎస్.జయశ్రీ, జెడ్పీ సీఈఓ మాధురి షా, జనగామ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ కమిషనర్లు మహేశ్వర్ రెడ్డి, రాధాకృష్ట, హౌసింగ్ పీడీ కోదండరామ్, తదితరులు పాల్గొన్నారు.ఎన్నికల సాధారణ పరిశీలకుడు నర్సింహారెడ్డి -
రెండోరోజు 146 నామినేషన్లు
జనగామ రూరల్/స్టేషన్ఘన్పూర్: జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల్లో రెండోరోజు గురువారం నామినేషన్లు జోరుగా దాఖలు చేశారు. జనగామలో మొదటిరోజు 8 దాఖలు కాగా రెండోరోజు 87 దాఖలయ్యాయి. స్టేషన్ఘన్పూర్లో మొదటిరోజు ఒకటి దాఖలు కాగా.. రెండోరోజు 59 దాఖలయ్యాయి. మొత్తంగా జనగామలో 95 స్టేషన్ఘన్పూర్లో 60 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజుల్లో 155 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు శుక్రవారం పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి. ప్రత్యేక బృందం ఏర్పాటు జనగామ మున్సిపల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రత్యేక బృందాన్ని పురపాలక సంఘం ఏర్పాటు చేసింది. బృందంలోని సభ్యులు 24 గంటలు అందుబాటులో ఉంటారని కమిషనర్ మహేశ్వర్రెడ్డి తెలిపారు. ఫిర్యాదుల కోసం 75695 34326 నంబర్ను సంప్రదించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు.. జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. జనగామ మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆర్డీఓ గోపిరామ్ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించి హెల్ఫ్లైన్ సెంటర్ వద్ద అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. జనగామలో 87,స్టేషన్ఘన్పూర్లో 59 నేడు భారీగా దాఖలయ్యే అవకాశం -
బంగారు ఆభరణాల చోరీ
లింగాలఘణపురం: మేడారం జాతరకు వెళ్లిన వారి ఇంట్లో దొంగలు పడి 12 తులాల బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కళ్లెం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. రెండు నెలల క్రితం కూడా గ్రామంలో దొంగతనం జరిగి తులంన్నర బంగారం, నగదు దోపిడీ జరిగింది. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కళ్లెం గ్రామానికి చెందిన బుషిగంపల కంట్లం తన కుటుంబసభ్యులతో కలిసి ఈనెల 27న మంగళవారం మేడారం జాతరకు వెళ్లాడు. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులంతా మేడారంలోనే ఉన్నారు. ఇంట్లో కోళ్లను కమ్మేందుకు తన చిన్నాన్న బాలనర్సయ్యకు గేటు తాళం ఇచ్చి వెళ్లాడు. కోళ్లను వదిలిపెట్టేందుకు బాలనర్సయ్య గురువారం గేటు తాళం తీయగా.. ఇంటి తాళం పగలగొట్టి కనిపించింది. దీంతో ఆందోళనకు గురైన బాలనర్సయ్య వెంటనే కంట్లంకు ఫోన్లో సమాచారం అందజేశాడు. వెంటనే కుటుంబ సభ్యులంతా వచ్చి చూసేసరికి బీరువా తాళం తీసి అందులో ఉన్న రెండు బంగారు నక్లెస్లు, రెండు బంగారు గొలుసులు, రెండు ఉంగరాలు, చెవుల దుద్దులు ఇలా సుమారు 12 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఫోరెన్సిక్ నిఫుణులతో వేలిముద్రలు సేకరించి విచారణ జరుపుతున్నారు. జాతర నేపథ్యంలో గ్రామాల్లో దొంగలు హల్చల్ చేస్తున్నారు. మేడారం జాతరకు వెళ్లిన ఇంట్లో 12 తులాలు మాయం వరుస దొంగతనాలతో కళ్లెంలో ఆందోళన -
జయహో జగజ్జనని మేడారంలో గద్దెకు చేరిన సమ్మక్క
● 7.13 గంటలకు మూడోసారి కాల్పులు● 7.14 గంటలకు నాలుగోసారి కాల్పులు ● 7.33 గంటలకు ప్రధాన గేటు దాటి అమ్మవారు బయటకు రాక ● 7.52 గంటలకు ఎదురుకోళ్ల మండపం చేరిక ● 8.29 గంటలకు సమ్మక్క గుడి చేరిక ● 9.47 గంటలకు ప్రధాన ద్వారం వద్దకు రాక ● 9.58 గంటలకు గద్దైపె సమ్మక్క ప్రతిష్ఠాపన వెన్నెల వెల్లివిరిసిన వేళ.. కుంకుమ భరిణె వెలిసింది. లక్షల నయనాల నిరీక్షణల నడుమ.. చిలకలగుట్ట చిందులు వేసింది. గాల్లో పేలిన తూటాల సాక్షిగా మనస్సు ఉప్పొంగింది. దారులన్నీ రంగులు రంగరించుకుంటుంటే.. ఇసుకేస్తే రాలనంత జనం జయజయధ్వానాలు పలికారు. డోలు వాయిద్యాలు.. బూరకొమ్ముల శబ్దాలు తల్లిని కీర్తించగా.. రోప్ పార్టీ వెంట సాహో.. సమ్మక్క నినాదాలు హోరెత్తాయి. అవనినేలే తల్లి ఆసీనురాలవ్వగా.. ధరణి పూల వనమై పులకించిపోయింది. ● జాతరలో మహాఘట్టం ఆవిష్కృతం ● అడుగుడుగునా భక్తుల నీరాజనాలు ● గద్దెలపై కొలువైన నలుగురు దేవతలు ● నేడు మొక్కులు సమర్పించనున్న భక్తులు మేడారం(ఎస్ఎస్తాడ్వాయి/ఏటూరునాగారం): మేడారం మహాజాతరలో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. చిలకలగుట్ట నుంచి కల్పవల్లి సమ్మక్క తల్లి వస్తుండగా జై సమ్మక్క అంటూ భక్తుల నినాదాలు హోరెత్తాయి.. గద్దెల వరకు నీరాజనాలు పలికారు. గుట్ట దిగి సమ్మక్క తల్లిని పూజారులు డోలు వాయిద్యాలు, బూరకొమ్ముల శబ్దాలతో తీసుకొచ్చి గద్దైపె ప్రతిష్ఠించారు. గుట్టపై రహస్య పూజలు.. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్ ఇంటి వద్ద పూజాసామగ్రి, పసుపు, కుంకుమ, కంకనాలు, అమ్మవారికి కావాల్సిన వస్త్రాలను తీసుకొని పూజారులు గుట్టపైకి వెళ్లారు. అమ్మవారిని తీసుకొచ్చే పూజారి కొక్కెర కృష్ణయ్యతోపాటు మరో నలుగురు పూజారులు కలిసి సమ్మక్క కొలువై ఉన్న రహస్య స్థావరం వద్దకు చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి కొన్ని గంటల పాటు రహస్య పూజలు చేశారు. కృష్ణయ్య కుంకుమ భరణి రూపంలో సమ్మక్కను తీసుకొని గుట్టదిగే మధ్యలో మరికొంతమంది పూజారులు కలిసి గుట్టదిగారు. అధికారికంగా తుపాకీతో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గాల్లోకి నాలుగు సార్లు కాల్పులు జరిపి అమ్మవారికి గౌరవ వందనం సమర్పించారు. చిలకలగుట్ట దారిమధ్యలో ఉన్న ఎదురుకోళ్ల పూజా మందిరానికి అమ్మవారిని తీసుకెళ్లి పూజారులు విశ్రాంతి తీసుకుని బయల్దేరారు. అక్కడి నుంచి మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్కుమార్, కలెక్టర్ దివాకర టీఎస్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, జాతర చైర్పర్సన్ ఇర్ప సుకన్య, అధికారులు కలిసి అమ్మవారిని గద్దె వరకు తీసుకొచ్చారు. చిలకలగుట్ట వద్ద మంత్రి సీతక్కతోపాటు పలువురు మంత్రులు, అధికారులు, ఆదివాసీలు నృత్యాలు చేశారు. హరివిల్లు.. చిలకలగుట్ట దారి సమ్మక్కకు స్వాగతం పలికేందుకు మహిళలు దారిలో రంగు రంగులముగ్గులు వేశారు. అమ్మవారికి యాటపోతులు, కోళ్లు, కొబ్బరికాయలు కొట్టి స్వాగతించారు. చెట్టు, పుట్ట, గుట్టలు, ఎత్తయిన భవనాలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తల్లి రాకను తిలకించారు. మూడుసార్లు లైట్ల ఆర్పివేత.. గద్దైపె సమ్మక్కను ప్రతిష్ఠించిన సమయంలో మూడుసార్లు హైమాస్ట్ లైట్లను ఆర్పివేశారు. పూజారులు గద్దైపెన అమ్మవారిని ప్రతిష్ఠించి గౌరవ వందనాన్ని సమర్పించారు. ఇదేక్రమంలో ఫొటోలు, డ్రోన్లు తిరగకుండా నిషేధం విధించారు. సమ్మక్క రాకకు ముందు గద్దైపె ఉన్న బంగారం, కానుకలను తీసుకెళ్లేందుకు గ్రామస్తులు పోటీ పడ్డారు. ఈ ఆచారం అనాదిగా వస్తోందని పూజారులు తెలిపారు. నలుగురు వనదేవతలకు పూజలు.. సమ్మక్కను గద్దైపె ప్రతిష్ఠించడంతో నలుగురు వనదేవతలు కొలువుదీరారు. ఈఓ వీరస్వామి, ఎండోమెంట్ అధికారులతో కలిసి ముందుగా మంత్రులు అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. ఆ తర్వాత దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి ఇచ్చారు. సమ్మక్కను గద్దైపె ప్రతిష్ఠించిన అనంతరం పూజలు చేస్తున్న పూజారులు, ఆదివాసీ యువత, అధికారులు సాయంత్రం 5.30 గంటలకు సమ్మక్క పూజారి కొక్కెర కృష్ణయ్యతోపాటు పూజారులు చిలకలగుట్ట మీదకు వెళ్లారు. 6.45 గంటలకు ములుగు ఎస్పీ సుధీర్రామ్నాథ్ కేకన్ గాల్లోకి కాల్పులు జరిపారు. రాత్రి 7.12 గంటలకు గేటు వద్ద కాల్పులు పోటెత్తిన భక్తజనం మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు గురువారం భక్తులు పోటెత్తారు. జంపన్నవాగు, గద్దెల ప్రాంగణం, చిలకలగుట్ట పరిసర ప్రాంతాలు ఎటుచూసినా జనం కిక్కిరిశారు. కుటుంబ సమేతంగా మేడారానికి వచ్చిన వారు తప్పిపోకుండా ఉండేందుకు కర్రలకు జెండాలు, బెలూన్స్, వాటర్ బాటిళ్లను గుర్తుగా పెట్టుకొని ముందుకు సాగారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించే క్రమంలో శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. ఉహించని విధంగా భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. వనదేవతల గద్దెల ప్రాంగణం భక్తులు సమర్పించిన బంగారంతో కళకళలాడింది. సమ్మక్క రాకముందు ప్రత్యేక పూజలు.. చిలకలగుట్ట పైనుంచి సమ్మక్కతల్లి గురువారం రాత్రి కొలువుదీరడానికి ముందు సమ్మక్క పూజారులు తల్లి గద్దైపె ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సమ్మక్క గుడి నుంచి సమ్మక్క దేవతను తీసుకొచ్చే ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, దూప వడ్డె దొబె నాగేశ్వర్రావు, జలకం వడ్డె మల్యెల సత్యంతోపాటు పూజారులు కలిసి సమ్మక్క వడెరాలు, పసుపు, కుంకుమలను తీసుకుని డోలు వాయిద్యాలు, బూరకొమ్ముల శబ్దాల నడుమ గద్దైపెకి వె ళ్లి పూజలు చేశారు. సమ్మక్క గద్దైపె కంకవనం ప్రతిష్ఠమేడారంలోని జెండాగుట్ట నుంచి సమ్మక్క పూజారులు కంకవనాన్ని తీసుకొచ్చి గురువారం ఉదయం పది గంటలకు గద్దైపె ప్రతిష్ఠించారు. మొదట జెండాగుట్టలో పూజారులు కంకవనానికి పూజలు నిర్వహించారు. కర్రలతో కంకవనాన్ని బందోబస్తు మధ్య గద్దె వద్దకు తీసుకొస్తున్న సమయంలో ఆడపడుచులు ఎదురెళ్లి పూజారుల పాదాలకు నీళ్లు ఆరగించి హారతి పట్టారు. తల్లి వచ్చే దారిలో చిలకలగుట్ట వద్ద ఆనవాయితీగా కింద కూర్చొని పైకి లేచి నమస్కరించారు. గద్దె వద్దకు చేరుకున్న పూజారులు ముందుగా గద్దె పక్కనే ఉన్న రహస్య పూజా మందిరంలోకి పూజలు చేశారు. అనంతరం గద్దైపె ప్రతిష్ఠించారు. ఈ సమయంలో భక్తులను గద్దెలపైకి రాకుండా పోలీసులు అదుపు చేశారు. సారలమ్మ గద్దె వద్ద పూజలు నిర్వహించారు. ఈ వనమహోత్సవానికి మంత్రి సీతక్క హాజరై పూజారులతో కలిసి గద్దైపెకి వచ్చారు. గద్దెలపై నలుగురు వనదేవతలు కొలువుదీరడంతో నేడు (శుక్రవారం) భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని దర్శించుకుంటారు. తీరొక్క మొక్కులు చెల్లించి ఆశీర్వాదాన్ని పొందుతారు. ఇప్పటికే కోటి మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. శనివారం సమ్మక్క, సారలమ్మ వనప్రవేశం చేస్తారు. -
పకడ్బందీగా రంజాన్ ఏర్పాట్లు
జనగామ రూరల్: పవిత్ర రంజాన్ పండుగ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 18నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈద్గాల వద్ద తాగునీటి సౌకర్యం, అవసరమైన చోట్ల నీటిట్యాంకర్ను ఏర్పాటుచేయాలని చెప్పారు. మసీదుల వద్ద చెత్త డబ్బాలను ఏర్పాటుచేయడంతో పాటు పరిశుభ్రత చర్యలు ఎప్పటికప్పుడు చేయాలని ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని చెప్పారు. సమావేశంలో జనగామ ఆర్డీఓ గోపి రామ్, స్టేషన్ ఘన్పూర్ ఏసీపీ భీమ శర్మ, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి డాక్టర్ బి విక్రమ్ కుమార్ తదతరులు పాల్గొన్నారు. లక్ష్యాలను పూర్తిచేయాలి.. వ్యవసాయ యాంత్రీకరణ పథకం లక్ష్యాలను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నా రు. కలెక్టరేట్ నుంచి వ్యవసాయ శాఖ అధికారులతో ఆన్లైన్ మీటింగ్ నిర్వహించారు. ఎస్ఎంఏఎం పథకంలో భాగంగా జిల్లాకు 2025–26 సంవత్సరానికి గాను వానాకాలంలో రూ.2.73 కోట్ల బడ్జెట్ కేటాయించారన్నారు. ఈ పథకంలో బ్యాటరీ పంపులు, తైవాన్ పంపులు, రోటవేటర్లు, విత్తనాలు నాటే మిషన్లు, కేజీ వీల్స్, కలుపు తీసే యంత్రాలు, గడ్డికట్టే యంత్రాలు, పవర్ టిల్లర్ పరికరాలు మంజూరయ్యాయని తెలిపారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్జనగామ రూరల్: మేడారం మహా జాతర సందర్భంగా నేడు (శుక్రవారం) జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సెలవుకు బదులుగా ఫిబ్రవరి 14వ తేది (రెండో శనివారం) ను పనిదినంగా పరిగణించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. -
మొదటి రోజు 9
జనగామ: జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్ పురపాలిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. జనగామలో 8, స్టేషన్ఘన్పూర్లో ఒక నామినేషన్.. మొత్తంగా 9మంది నామినేషన్లు దాఖలు చేశారు. జనగామ మున్సిపల్లో 4, 11, 14, 15, 20, 21, 27, 30 వార్డుల పరిధిలో బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 2, సీపీఐ 1, స్వతంత్రలు రెండు నామినేషన్లు దఖాలు చేసినట్లు కమిషనర్ మహేశ్వర్రెడ్డి వెల్లడించారు. నామినేషన్ సెంటర్ను కమిషనర్ మహేశ్వర్రెడ్డి పరిశీలించారు. ఎన్నికలకు సహకరించాలి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ కోరారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సమీక్షించారు. నామినేషన్ వేసేందుకు పూర్తి వివరాలను తెలుసుకునేందుకు సంబంధిత రిటర్నింగ్ అధికారులను సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల పర్యవేక్షకులు శ్రీధర్, వివిధ రాజకీయ నాయకులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు ఎన్నికలకు సంబంధించిన సమస్యలు, సందేహాలను నివృత్తి చేయడంతో పాటు నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదుల కోసం కలెక్టరేట్లో హెల్ప్డెస్క్ 93908 30087 ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తెలిపారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు పూర్తి వివరాలకోసం హెల్ప్ డెస్క్ను సంప్రదించవచ్చని తెలిపారు. స్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ జెడ్పీహెచ్ఎస్లో ఏర్పాటుచేసిన కేంద్రంలో తొలిరోజు ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. 8వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోగుల సారంగపాణి నామినేషన్ వేసినట్లు జిల్లా అసిస్టెంట్ ఎన్నికల అథారిటీ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ కమిషనర్ బి.రాధాక్రిష్ణ తెలిపారు. మున్సిపల్ నామినేషన్లు షురూ జనగామలో 8, స్టేషన్ఘన్పూర్లో 1 -
నామినేషన్ల స్వీకరణలో నిబంధనలు పాటించాలి
● అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ జనగామ: పురపాలిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ సమయంలో ఎన్నికల సంఘం నిబంధనలను పాటించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల నామినేషన్లను జనగామ, స్టేషన్ఘన్ పూర్ పురపాలికల పరిధిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, పొరపాట్లకు తావులేకుండా చూడాలని సూచించారు. జనగామ మున్సిపాలిటీలో మూడు వార్డులకు ఒక్కో నామినేషన్ కౌంటర్ చొప్పున మొత్తంగా 10 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్టేషన్ఘన్పూర్లో 18 వార్డులు ఉండగా ఆరు కౌంటర్లను అందుబాటులో ఉంచామన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనల మేరకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను నామినేషన్తో తప్పక సమర్పించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. నామినేషన్ల స్వీకరణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. రిటర్నింగ్ అధికారులు సమన్వయంతో ఒక టీమ్ వర్క్గా విధులు నిర్వహించి విజయవంతం చేయాలని చెప్పారు. పలు సూచనలు, సలహాలతో పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అదనపు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు మహేశ్వర్రెడ్డి, రాధాకృష్ట, రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అదనపు కలెక్టర్తో అబ్జర్వర్ల సమీక్ష ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎ.నర్సింహరెడ్డి(ఐఏఎస్) వ్యయ పరిశీలకులు ఎస్.జయశ్రీ బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల అనుభవం కలిగిన 16 మంది రిటర్నింగ్ అధికారులను నియమించామని, వారు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి, ఏర్పాట్లను పరిశీలించారని తెలిపారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ తదితర అంశాలపై చర్చించారు. సాధారణ అబ్జర్వర్ నర్సింహారెడ్డికి నోడల్ ఆఫీసర్గా హౌజింగ్ పీడీ మాత్రునాయక్, వ్యయ పరిశీలకులు జయశ్రీకి నోడల్ ఆపీసర్గా డీసీఓ కోదండరామ్లను నియమించారు. -
కన్నెపల్లి.. సిరివల్లి
రక్షించే తల్లికి రహస్య పూజలు. అండగా నిలిచే అమ్మకు హనుమంతుడి జెండా నీడలు. సల్లని తల్లికి నీళ్లారగింపులు.. మహిమగల్ల మాతకు మంగళహారతులు. హోరెత్తించే డోలు వాయిద్యాలు. ప్రొటోకాల్కు పోలీసుల వలయాలు. పసిడి వెన్నెలమ్మకు పొర్లు దండాలు.. వరంపట్టిన భక్తులకు శతకోటి వరాలు. జంపన్నవాగులో తడిసిన పాదాలు.. తమ్ముడు జంపన్నకు దీవెనార్తులు. గద్దైపె కొలువుదీరిన సారలమ్మకు జయజయధ్వానాలు.. – మేడారం(ఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి)కన్నెపల్లి నుంచి సారలమ్మ బుధవారం అర్ధరాత్రి తర్వాత మేడారం గద్దైపె కొలువుదీరింది. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, పూజారులు కాక వెంకటేశ్వర్లు, కిరణ్, భుజంగరావు, అమృత, కనకమ్మతోపాటు మరికొంత మంది గుడిలో రహస్య పూజలు చేశారు. హనుమాన్ జెండా నీడలో అమ్మవారిని గుడి నుంచి బయటకు తీసుకొచ్చారు. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్, ములుగు జిల్లా ఎస్పీ రాంనాథ్ కేకన్, జాతర చైర్పర్సన్ ఇర్ప సుకన్యతోపాటు ఆదివాసీ యువకులు, మహిళలతో కలిసి సారలమ్మ యాత్ర కొనసాగింది. గ్రామంలోని ఆడబిడ్డలు అమ్మవారికి ఎదురెల్లి నీళ్లు ఆరగించి మంగళహారతులు పట్టారు. అమ్మవారిని తీసుకుని డోలు వాయిద్యాలతో ఆదివాసీలు, పోలీసుల రోప్ పార్టీ బందోబస్తు మధ్య అధికారంగా యాత్ర కొనసాగింది.దారి పొడవునా దండాలు.. కన్నెపల్లి నుంచి సారలమ్మ బయల్దేరడంతో భక్తులు అమ్మవారి పాద స్పర్శ కోసం వరం పడుతూ నేలపై బోర్లా పడుకున్నారు. తల్లిని కనులారా చూసేందుకు మేడారం గద్దెల వరకు భక్తులు బారులుదీరారు. అమ్మకు జేజేలు అంటూ పసుపును పైకి చల్లారు. సారలమ్మను జంపన్నవాగులో నుంచి తీసుకెళ్లారు. జంపన్నవాగుపై రెండు బ్రిడ్జిలు ఉన్నప్పటికీ ఆనవాయితీగా అక్క సారలమ్మ కాళ్లను తమ్ముడు జంపన్న తాకి నమస్కరించినట్లుగా భావించి జంపన్న వాగులో నుంచి మాత్రమే సారలమ్మను గద్దైపెకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి తల్లి సమ్మక్క గుడిలోకి వెళ్లి అక్కడ పసుపు కుంకుమ్మ సమర్పించి సారలమ్మ పీఠంపై చీర, రవికను అందించారు. అప్పటికే పగిడిద్దరాజు, గోవిందరాజులు సమ్మక్క గుడి వద్దకు చేరుకున్నారు. ఇందులో భాగంగా పెళ్లి కొడుకుగా వచ్చిన పగిడిద్దరాజుకు సమ్మక్క గుడిలో పెళ్లి క్రతువు సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ పెళ్లిని సారలమ్మ, గోవిందరాజులు తిలకించి పగిడిద్దరాజుతో కలిసి గద్దెలపై కొలువుదీరారు.కొలువుదీరే ముందు ప్రత్యేక పూజలుసారలమ్మ ఆలయం నుంచి పసుపు, కుంకుమ, పవిత్రమైన నీటిని తీసుకొని పూజారులు ఆడపడుచులు కలిసి మేడారంలోని సారలమ్మ గద్దెకు చేరుకొని అలికి ముగ్గులు వేశారు. అనంతరం అమ్మవారి ధ్వజస్తంభానికి కంకణాలు కట్టారు. భక్తులెవరూ చూడకుండా చీర చుట్టి పూజలు చేశారు. సాయంత్రం సారలమ్మను గద్దైపెకి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. సమ్మక్క పూజారులు, ఆడపడుచులు కూడా మేడారంలోని సమ్మక్క గుడి నుంచి పసుపు, కుంకుమతో సమ్మక్క గద్దె వద్దకు చేరుకున్నారు. నేడు (గురువారం) సమ్మక్క చిలకలగుట్ట నుంచి గద్దైపె రావడానికి ముందుగా పూజారులు సమ్మక్క గద్దెను మట్టితో అలికి ముగ్గులతో అలంకరించారు.మహా జాతరలో అనూహ్య ఘట్టంఒకే రోజు కొలువుదీరిన నలుగురు దేవతలు !అర్ధరాత్రి 12:28 గంటలకు గద్దైపెకి సారలమ్మ, 12:29 గంటలకు గోవిందరాజులు, పగిడిద్దరాజు..ఏటూరునాగారం: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. తొలి రోజు బుధవారం సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు కొలువుదీరాల్సి ఉండగా.. పూజారులు సమయపాలన పాటించినప్పటికీ అనివార్య కారణాలతో బుధవారం అర్ధరాత్రి 12:28 గంటల తర్వాత (గురువారం) సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై ప్రతిష్ఠించారు. గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెలపైకి రానుంది. ఈ నేపథ్యంలో నలుగురు దేవతలను ఒకే రోజు (గురువారం) గద్దెలపై ప్రతిష్ఠించినట్లు అయ్యింది.పగిడిద్దరాజు పెళ్లికొడుకాయెనె..మేడారం(ఏటూరునాగారం): గంగారం మండలం పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు పెళ్లికొడుకుగా ముస్తాబై అడవిమార్గంలో కాలినడకన బయల్దేరారు. గోవిందరావుపేట మండలం లక్ష్మీపురంలో వారి ఆడబిడ్డ ఇంటి వద్దకు చేరుకున్నాడు. బుధవారం ఉదయం పస్రా మీదుగా కాలినడకన డప్పుచప్పుళ్లతో మేడారానికి చేరుకున్నారు. మేడారంలోని సమ్మక్క గుడికి సారలమ్మ వచ్చిన తర్వాత పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులు కలిసి ఒకేసారి గద్దెలపై కొలువుదీరారు. -
నామినేషన్ల స్వీకరణలో నిబంధనలు పాటించాలి
● అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ జనగామ: పురపాలిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ సమయంలో ఎన్నికల సంఘం నిబంధనలను పాటించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల నామినేషన్లను జనగామ, స్టేషన్ఘన్ పూర్ పురపాలికల పరిధిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, పొరపాట్లకు తావులేకుండా చూడాలని సూచించారు. జనగామ మున్సిపాలిటీలో మూడు వార్డులకు ఒక్కో నామినేషన్ కౌంటర్ చొప్పున మొత్తంగా 10 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్టేషన్ఘన్పూర్లో 18 వార్డులు ఉండగా ఆరు కౌంటర్లను అందుబాటులో ఉంచామన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనల మేరకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను నామినేషన్తో తప్పక సమర్పించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. నామినేషన్ల స్వీకరణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. రిటర్నింగ్ అధికారులు సమన్వయంతో ఒక టీమ్ వర్క్గా విధులు నిర్వహించి విజయవంతం చేయాలని చెప్పారు. పలు సూచనలు, సలహాలతో పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అదనపు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు మహేశ్వర్రెడ్డి, రాధాకృష్ట, రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అదనపు కలెక్టర్తో అబ్జర్వర్ల సమీక్ష ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎ.నర్సింహరెడ్డి(ఐఏఎస్) వ్యయ పరిశీలకులు ఎస్.జయశ్రీ బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల అనుభవం కలిగిన 16 మంది రిటర్నింగ్ అధికారులను నియమించామని, వారు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి, ఏర్పాట్లను పరిశీలించారని తెలిపారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ తదితర అంశాలపై చర్చించారు. సాధారణ అబ్జర్వర్ నర్సింహారెడ్డికి నోడల్ ఆఫీసర్గా హౌజింగ్ పీడీ మాత్రునాయక్, వ్యయ పరిశీలకులు జయశ్రీకి నోడల్ ఆపీసర్గా డీసీఓ కోదండరామ్లను నియమించారు. -
రారండోయ్ మేడారం
నేటినుంచి మహా జాతర ● కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు గద్దెలపైకి రాక మలుగు/ఎస్ఎస్తాడ్వాయి/ఏటూరునాగారం: మేడారం సమ్మక్క– సారలమ్మ మహా జాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారం గద్దైపె కొలువుదీరనుంది. ఈ మేరకు మంగళవారం సారలమ్మ పూజారులు సమావేశమయ్యారు. వన దేవతను గద్దైపెకి తీసుకెళ్లే ముందు గుడిలో నిర్వహించే పూజాకార్యక్రమాలకు సామగ్రి సిద్ధం చేసుకున్నారు. కొత్త వెదురు బుట్టను తయారు చేసి సారయ్య ఇంటి వద్ద పవిత్రంగా ఉంచారు. సారలమ్మ గద్దైపెకి రానున్న సందర్భంగా బుధవారం ఉదయం కన్నెపల్లి గుడి నుంచి పసుపు కుంకుమ, కంకణాలు, పవిత్ర జలం తీసుకొని ఆడపడుచులు సారలమ్మ గద్దెను అలికి ముగ్గులు వేసి ముస్తాబు చేస్తారు. సారలమ్మ పూజారులతో పాటు ఆ గ్రామంలోని స్థానిక ఆదివాసీలు, కాక వంశస్తులు తమ ఇళ్లను శుద్ధి చేసుకొని మంగళహారతి ఇచ్చి మొక్కుతారు. అదేవిధంగా కొండాయి నుంచి గోవిందరాజులును ప్రధాన పూజారి దబ్బగట్ల గోవర్ధన్ తదితరులు పూజలు చేసి పడిగ రూపంలో తీసుకొస్తారు. గోవిందరాజులును వడ్డె బాబుతో కలిసి డప్పుచప్పుళ్లతో బయలుదేరగా పడిగను పట్టుకున్న వడ్డె కాళ్లకు నీళ్లు అంటకుండా మోసుకొస్తారు. కోరికలు నెరవేర్చేందుకు నిలువెత్తు బంగారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునే భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరాలని నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకుంటారు. అమ్మలను కొలిచే జాతర కావడంతో అన్ని సమయాల్లోనూ మేడారానికి మహిళలు రావచ్చు. ఇక్కడే కాన్పులు అయిన మహిళలు వేలల్లో ఉంటారు. రూ.101 కోట్లతో గద్దెల ప్రాంగణం విస్తరణ.. మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రూ.150 కోట్లు నిధులను మంజూరు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ 20 రోజులుగా మేడారంలో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా గద్దెల ప్రాంగణాన్ని రూ.101 కోట్లతో విస్తరించారు. ఈసారి 3 కోట్ల మంది భక్తులు దర్శించుకోవడానికి అధికా రులు ఏర్పాట్లు చేశారు.హనుమాన్ జెండా నీడలో సారలమ్మ.. సారలమ్మను బుధవారం కన్నెపల్లి నుంచి పూజారులు కాక సారయ్య ప్రత్యేక పూజలు చేసి మేడారంలోని గద్దెకు తీసుకువస్తారు. ఇందులో భాగంగానే హనుమాన్ జెండా నీడలోనే సారలమ్మ ముందుకు సాగుతుంది. కన్నెపల్లి నుంచి మేడారం సారలమ్మ గద్దెల వరకు హనుమాన్ జెండా రక్షణలోనే సారలమ్మ గద్దెకు చేరుకుంటారు. గుడారాలతో నిండిన మేడారం..గుడారాలతో మేడారం నిండిపోయింది. నార్లాపూర్ స్తూపం నుంచి మొదలుకొని జంపన్నవాగు పరిసర ప్రాంతాలు, చిలకలగుట్ట నుంచి మొదలుకొని ఆర్టీసీ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఎడ్లబండ్లు, ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చిన భక్తులు మేడారం చుట్టు పక్కల ప్రాంతాల్లో గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎటుచూసినా మేడారం పరిసర ప్రాంతాల్లో ఖాళీ స్థలం కనిపించడం లేదు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి మొదలుకుని జంపన్నవాగు వరకు రోడ్లన్నీ భక్తులతో బారులుదీరాయి. బుధవారం ఉదయం వరకు వేలాది సంఖ్యలో వాహనాలు, లక్షల సంఖ్యలో భక్తులు రానుండడంతో మేడారం కిటకిటలాడనుంది. -
వరుడై వెళ్లి.. మరుబెల్లికి రావయ్య
● పూనుగొండ్ల నుంచి మేడారానికి సమ్మక్క భర్త పగిడిద్దరాజుగంగారం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లకు చెందిన పగిడిద్ద రాజు పెళ్లి కొడుకయ్యాడు. సమ్మక్కను వివాహం చేసుకునేందుకు ములుగు జిల్లా ఎస్ఎస్తాడ్వాయి మండలం మేడారానికి మంగళవారం బయలుదేరి వెళ్లాడు. ఈ మేరకు పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయంలో వడ్డెలు గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసి కల్తీ జగ్గారావు, పూజారులు పడిగను పట్టుకొని తరలివెళ్లారు. పగిడిద్దరాజు గ్రామం దాటే వరకు మహిళలు నీళ్లు ఆరబోశారు. వరుడై వెళ్లి.. మరుబెల్లికి రావయ్యా అంటూ భక్తులు మొక్కులు చెల్లించారు. 70 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి గోవిందరావుపేట మండలం కర్లపల్లి లక్ష్మీపురంలోని పెనక సాంబయ్య ఇంట్లో రాత్రి బసచేశారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు మేడారంలోని గద్దెకు చేరుకుంటారు. సమ్మక్కతో వివాహం అనంతరం జాతర తర్వాత పగిడిద్దరాజు తిరిగి పూనుగొండ్లకు చేరుకుంటారు. రెండురోజుల అనంతరం మరుబెల్లి జాతరను పూనుగొండ్లలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మంత్రి సీతక్క,మేడారం ట్రస్ట్బోర్డు చైర్పర్సన్ సుకన్య, ములుగు మార్కెట్ చైర్పర్సన్ కల్యాణి, డీఎస్పీ తిరుపతిరావు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షిత ప్రయాణం
రఘునాథపల్లి: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా మండల కేంద్రంలోని బస్టాండ్ నుంచి మంగళవారం ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిపారు. ఈసందర్భంగా జనగామ ఆర్టీసీ డిపో మేనేజర్ ఎస్.స్వాతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జిల్లా జెడ్పీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు బొల్లం అజయ్, సర్పంచ్ బొల్లం ఉమారాణి, మాజీ సర్పంచ్ పోకల శివకుమార్ ప్రత్యేక బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ.. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమని, కుటుంబ సమేతంగా ఆర్టీసీ బస్సులో వెళ్లాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో పర్యవేక్షకుడు కుర్ర సురేందర్గౌడ్, లింగాల జగదీష్చందర్రెడ్డి, కోళ్ల రవిగౌడ్, పేర్నె రవి తదితరులు పాల్గొన్నారు. కుమారుడిని ప్రభుత్వబడిలో చేర్పించిన తహసీల్దార్ పాలకుర్తి టౌన్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వ ఉద్యోగులే ముందడుగు వేయాలన్నా సందేశాన్ని ఆ అధికారి చేతల్లో చూపించారు. తమ కుమారుడిని మంగళవారం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. స్థానిక తహసీల్దార్ కడుపుకంటి సరస్వతి ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం కల్పించాలని ఉద్దేశంతో తన కుమారుడు శ్రీవర్ధన్ను మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. శ్రీవర్ధన్కు ప్రధానోపాధ్యాయుడు చిదురాల శ్రీనివాస్ నాలుగో తరగతిలో ఆడ్మిషన్ అందించారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి జనగామ: మున్సిపాలిటీ ఎన్నికలను సమర్థవంతంగా శాంతియుతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తదితర ఉన్నతాధికారులతో కలిసి ఆమె అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో పురపాలిక ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్నికలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మున్సి‘పోల్’ నిబంధనలు ఇవి.. జనగామ: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థులు నామినేషన్లు ఎలా వేయాలి? వాటి నిబంధనలు ఏంటి? అనే సమాచారాన్ని సాక్షి అందిస్తోంది. పార్టీ అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా ఆర్ఓకు తప్పనిసరిగా బీఫాం సమర్పించాలి. పార్టీ అభ్యర్థికి ఒక ప్రతిపాదకుడు, స్వతంత్రులకు మాత్రం 10 మంది అవసరం. ఒక్కరు గరిష్టంగా 4 నామినేషన్లు వేయవచ్చు. -
అంకెల్లో మేడారం
మహా జాతరకు భారీ ఏర్పాట్లుఫైర్ బ్రిగేడ్ వాహనాలు: 15ఫైర్ ఫైటర్లు: 268కమ్యూనికేషన్ – టెక్నాలజీశాశ్వత మొబైల్ టవర్లు: 27తాత్కాలిక మొబైల్ టవర్లు: 33వీహెచ్ఎఫ్ సెట్లు: 450తాగునీటి నల్లాలు: 5,482జంపన్నవాగు వద్ద డ్రెస్సింగ్ రూములు: 119పార్కింగ్ స్థలాలు: 42మొత్తం విస్తీర్ణం: 1,418 ఎకరాలు టీజీఎస్ఆర్టీసీ బస్సులు: 4,000మొత్తం ట్రిప్పులు: 51,000ఆర్టీసీ సిబ్బంది: 10,441వైద్య సిబ్బంది: 5,192అంబులెన్సులు: 30 బైక్ అంబులెన్సులు: 40 ప్రధాన ఆస్పత్రి: 50 పడకలు రోజుకు మెడికల్ క్యాంపులు: 30ట్రాన్స్ఫార్మర్లు: 196విద్యుత్ స్తంభాలు: 911విద్యుత్ లైన్లు: 65.75 కి.మీ విద్యుత్ సిబ్బంది: 350 డీజిల్ జనరేటర్లు (బ్యాకప్): 28టాయిలెట్లు: 5,700బ్లాకులు: 285గజ ఈతగాళ్లు: 210సింగరేణి రెస్క్యూ: 12ఎస్డీఆర్ఎఫ్ బృందాలు: 100– ములుగుపారిశుద్ధ్య సిబ్బంది: 5,000ట్యాంకర్లు: 150 ట్రాక్టర్లు: 100స్వీపింగ్ మెషిన్లు: 18 జేసీబీలు : 12స్వచ్ఛ ఆటోలు: 40 డోజర్లు: 16భక్తుల అంచనా: సుమారు 3 కోట్లు విధుల్లో సిబ్బంది: 21 శాఖలు, 42,027 మంది ఆదివాసీ వలంటీర్లు: పరిపాలనా విభజన: 08 జోన్లు 42 సెక్టార్లు 2,000 మంది -
వనం దారిపట్టిన భక్తజనం
అడవిబిడ్డలు అందరికీ అమ్మలైన సన్నివేశం. తెలంగాణకు శతాబ్దాల కిందటే పోరాటం అబ్బిన సందర్భం. సమ్మక్క–సారలమ్మ దివ్య చరితం. వారి త్యాగాన్ని గుర్తు చేసుకునే వేళ ఇది. పర్యావరణాన్ని రక్షించడానికి ప్రాణాలు ఫణంగా పెట్టిన వారి ధైర్యసాహసాలను స్మరించుకునే సమయం ఇది. రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర ప్రకృతిని ఆరాధించమని ఉద్బోధిస్తుంది. దైవం ముందు ధనిక, పేద తారతమ్యాలు లేవన్న సత్యాన్ని స్పష్టం చేస్తుంది. మాఘశుద్ధ పౌర్ణమితో మొదలు మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మక్క పున్నం) నుంచి జాతర మొదలవుతుంది. నాలుగు రోజుల పాటు ప్రధాన జాతర అంతా ఆదివాసీ సంప్రదాయం ప్రకారమే జరుగుతుంది. ఇక్కడ భక్తుల నమ్మకాలే సహస్ర నామాలు, పూనకాలే హోమాది క్రతువులు. న మ్మిన వారి కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఆ తల్లీకూతుళ్ల వీరత్వమే దైవత్వం. ఆసాహసాన్ని త లుచుకొని భక్తి పారవశ్యం పొందడమే మానవత్వం. ప్రతీ మనిషిలోనూ దైవత్వం ఉందని నిరూపించే అరుదైన జాతర మేడారంలో సాక్షాత్కరిస్తుంది. గద్దెలే దేవతామూర్తులుగా.. మేడారంలో సమ్మక్క– సారలమ్మకు ఎలాంటి విగ్రహాలు ఉండవు. రెండు గద్దెలు ఉంటాయి. ఒకటి సమ్మక్క గద్దె, ఇంకోటి సారలమ్మ గద్దె. వీటినే దేవతామూర్తులుగా కొలుస్తారు. మనిషి ఎత్తు ఉండే కంక మొదళ్ల వంక కన్నార్పకుండా చూస్తూ వన దేవతలను మనసులో ప్రతిష్ఠించుకుంటారు. దట్టమైన అడవి నుంచి దేవతలను తోడ్కొని వచ్చే వడ్డెలు (పూజారులు) తమ మీది నుంచి దాటుకుంటూ వెళ్తే జన్మ సార్థకం అవుతుందని భక్తుల నమ్మకం. పసుపు, కుంకుమ స్వరూపంగా నిలిచిన దైవాలను వాటితోనే ఆర్చిస్తారు. అమ్మవారి రూపంలో ముఖానికి పసుపు పూసుకుని పెద్దబొట్టు పెట్టుకుని వచ్చి వన దేవతలను దర్శించుకుంటారు. కంకబియ్యం (ఒడిబియ్యం), ఎదురుకోళ్లు, లక్ష్మీదేవర (గుర్రం ఆకారపు తొడుగును ముఖానికి కట్టుకుని వచ్చి దానిని అమ్మవారికి సమర్పించడం) వంటి రకరకాల మొక్కులు ఇక్కడ చెల్లించుకుంటారు. దేవతల గద్దెలపై ఉండే కుంకుమను ఎంతో పవిత్రంగా నమ్ముతారు. -
శ్రీఉమామహేశ్వరుడికి జాతీయజెండా అలంకరణ
జనగామ: గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని పట్టణంలోని గుండ్లగడ్డ శ్రీ ఉమాహేశ్వర ఆలయంలో స్వామికి జాతీయ జెండాతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు ఆలయానికి వచ్చి పూజలతో పాటు దేశభక్తిని చాటుకున్నారు. ఢిల్లీ వేడుకల్లో చిన్నపెండ్యాల కళాకారుడుచిల్పూరు: మండలంలోని చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన చిందుయక్షగాన కళాకారుడు గజవెళ్లి మంజునాథ్కు ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కింది. కేంద్ర సాంస్కృతిక శాఖ పరిధిలోని నాగపూర్ సౌత్ సెంట్రల్ జోన్ కల్చర్ వారు 20 రోజల క్రితం గణతంత్ర వేడకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం పంపారు. 20 రోజుల రిహార్సల్ తర్వాత సోమవారం ఇండియా గేట్ కల్చరల్ పరేడ్ కర్తవ్య భవన్లో కళాప్రదర్శన విజయవంతంగా నిర్వహించారు. ఈ కళా ప్రదర్శనను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని పాల్గొని తిలకించారు. -
అన్నిరంగాల్లో అగ్రపథం!
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026అభివృద్ధి, సంక్షేమంలో మోడల్గా జిల్లాఉత్తములకు ప్రశంసలుగణతంత్ర దినోత్సవం సందర్భంగా ధర్మకంచ మినీ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి సెల్యూట్ చేస్తున్న కలెక్టర్మాట్లాడుతున్న కలెక్టర్ రిజ్వాన్ బాషా● పల్లె నుంచి పట్నం వరకు ప్రగతి పరుగులు ● జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో అవార్డులు ● ఉపాధి, విద్య, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ● 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర రిజ్వాన్ బాషా షేక్జనగామ: జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు వేగవంతంగా సాగుతున్నాయని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కలెక్టర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన తర్వాత మాట్లాడారు.. పాలకుర్తిలో అసంపూర్తిగా ఉన్న శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహ కల్యాణ మండపాన్ని రూ.47 లక్షలతో పూర్తిచేసి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ఎస్హెచ్జీ గ్రూపులకు వడ్డీలేని రుణాలు, సీ్త్రనిధి సహాయం కలిసి రూ.475 కోట్లకు పైగా మంజూరై 100శాతం ప్రగతి సాధించారని కొనియాడారు. ఉపాధి హామీ పథకంలో 59శాతం పనిదినాలు, తాగునీటి సరఫరాలో 608 గ్రామాలకు 24 గంటల సేవలు అందిస్తున్నామన్నారు. దేవాదులతో 490 చెరువులు నింపగా, ఆసరా పింఛన్లు 75వేల మందికి చేరాయి. నీటి సంరక్షణ, ఆర్టీఐ, ఎన్నికల నిర్వహణలో జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు జిల్లాకు లభించడం మనందరి కృషి ఫలితమే అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో.. మహాలక్ష్మి పథకంలో జిల్లాలో 2,89,66,830 మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని కలెక్టర్ తెలిపారు. దీంతో ఆర్టీసీకి రూ.140.63 కోట్లు లబ్ధి చేకూరినట్లు చెప్పారు. గృహజ్యోతి స్కీం ద్వారా 200 యూనిట్లలోపు వినియోగదారులకు ఉచిత విద్యుత్ 4,92,000 జీరో బిల్లులు జారీ కాగా, 94,298 కుటుంబాలకు రూ.25.83 కోట్లు సబ్సిడీగా అందించామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు 76.20శాతం ప్రగతితో రాష్ట్రంలో జనగామకు మొదటి స్థానం లభించిందన్నారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేస్తున్న యూరియా బుకింగ్ యాప్ రైతులకు సులభతరంగా మారిందన్నారు. ధన్ధాన్యలో పైలట్ జిల్లాగా.. ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన ప్రయోగాత్మక అమలుకు రాష్ట్రం నుంచి ఎంపికై న నాలుగు జిల్లాల్లో జనగామ ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర పథకాలను అనుసంధానం చేస్తూ పలు రంగాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధమయ్యాయన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలువగా, రైతులకు రూ.385 కోట్లు నేరుగా జమ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో కొత్తగా 25వేల రేషన్కార్డులను జారీ చేశామని, దీంతో 1,85,358 లబ్ధిదారులకు సన్నబియ్యం అందుతున్నాయన్నారు. పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల్లో ఆధునిక రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.200కోట్లు కేటాయించిందన్నారు. పర్యావరణ అవగాహనపై నిర్వహించి ఎన్ఎస్పీసీ–2025 పోటీల్లో 75,156 మంది జిల్లా విద్యార్థులు పాల్గొని జాతీయ స్థాయిలో మొదటి స్థానం సాధించారన్నారు. మహిళా శక్తి స్కీంలో మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వనితటీ సెంటర్లు, యూనిఫాం తయారీ, ఆర్టీసీ అద్దె బస్సుల వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. పట్టణంలో సుందరీకరణ..జనగామ పురపాలకపరిధిలో బతుకమ్మకుంట, జంక్షన్లు తదితర ప్రాంతాల్లో సుందరీకరణ, గార్లకుంట వరకు స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ శ్రీరాంనగర్లో మోడల్ వైకుంఠధామం, టీయూఎఫ్ఐడీసీ నిధులతో రూ.18.74 కోట్ల విలువైన రహదారి, సౌకర్యాల పనులు, నైట్ షెల్టర్స్, లేబర్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. స్టేషన్ఘనపూర్ కొత్త మున్సిపాలిటీలో రూ.50 కోట్లు మంజూరు కాగా, టౌన్ హాల్, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మోడల్ మార్కెట్, పార్క్, లైబ్రరీ, ఓపెన్ జిమ్ నిర్మాణాలు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. దేవాదులకు సంబంధించి రూ.3,838 కోట్ల ఖర్చు చేస్తుండగా, 91శాతం భూసేకరణ పూర్తయిందన్నారు. ఆర్ఎస్ ఘన్పూర్, నవాబ్పేట మెయిన్ కెనాల్, పంప్హౌస్ పనుల కోసం రూ.148.76 కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణలో ఉత్తమ జిల్లాగా రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా సత్కారం లభించిందన్నారు. -
ఉపాధి హామీపై కుట్రలు మానుకోవాలి
జనగామ రూరల్: ఉపాధి హామీ చట్టం నీరుగార్చే కుట్రలను ప్రధాని నరేంద్ర మోదీ మానుకోవాలని, చట్టాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాటం చేస్తుందని ఏఐసీసీ సెక్రటరీ పి.విశ్వనాథన్ అన్నారు. సోమవారం మండలంలోని ఓబుల్కేశాపూర్ గ్రామంలో ఉపాధి హామీ చట్టం పేరు మార్పు, పథకాన్ని నిర్వీర్యంపై డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి ఆధ్వర్యంలో ఫ్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఏఐసీసీ సెక్రటరీ పి.విశ్వనాథన్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. గాంధీ రాముడిని పూజించారని అలాంటి వ్యక్తి పేరును మార్చి పొరపాటు చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. 2006లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో పేదలకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో మహాత్మాగాంధీ పేరు పెట్టారని అన్నారు. అలాంటి చట్టాన్ని రూపుమాపడానికి కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచి పెడుతోందని విమర్శించారు. అనంతరం డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి మాట్లాడారు.. కేరళ, తమిళనాడు మాదిరిగానే తెలంగాణలోనూ ఉపాధి హామీ చట్టం పేరు మార్చొద్దని తీర్మానం చేస్తారన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వేముళ్ల సత్యనారాయణ, కంచ రాములు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వల్లాల మల్లేష్ పాల్గొన్నారు. చట్టాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పోరాటం నిరసన కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్, ఎంపీ చామల -
మద్యం అమ్మితే రూ.10వేల జరిమానా
● మరిగడిలో మద్యపాన నిషేధం జనగామ రూరల్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండలంలోని మరిగడి గ్రామంలో మద్యపాన నిషేధం అమలు చేయాలని సోమవారం గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానాన్ని ఆమోదించింది. సర్పంచ్ కర్రె పరశరాములు అధ్యక్షతన ఉపసర్పంచ్ బాల్నే వెంకటరాజు వార్డు సభ్యులు పుట్టా ఎలేందర్, బోడ నరేందర్,దుబ్బాక స్వాతి, కర్రే కమలాకర్, దండు శ్రావణి,కూరాకుల రమేశ్, బొల్లి కవిత, ఇట్టమైన అశోక్, బాల్నే లోకేశ్వరితో కూడిన పాలకవర్గం గ్రామస్తుల సహకారంతో తీర్మానించారు. ఇక నుంచి గ్రామంలో దుకాణదారులు మద్యం అమ్మకూడదని, ఒకవేళ విక్రయిస్తే రూ.10వేల జరిమానా విధిస్తామని, అమ్మిన వ్యక్తులను పట్టిస్తే రూ.5 వేల నజరానా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కొడవటూర్లో సంపూర్ణ మద్యపాన నిషేధంబచ్చన్నపేట: మండలంలోని కొడవటూర్ గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ నీల కవితమురళి తెలిపారు. సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన గ్రామసభలో ఆమె పాల్గొని మాట్లాడారు.. గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని గ్రామస్తులు అందరూ కలిసి తీర్మానం చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగం దయాకర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి బృంగి రూపాచైతన్య, అంగన్వాడీలు ప్రేమలక్ష్మి, శ్యామల, వీఓఐ మల్లం శోభ, వాణి, ఆశాల అనిత, ఫీల్డ్ అసిస్టెంట్ అశోక్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
మహాజాతరకు ముస్తాబు
రేపటినుంచే మేడారంలో తెలంగాణ కుంభమేళా విద్యుత్ వెలుగుల్లో మేడారంలోని గద్దెల ప్రాంగణం..సాక్షిప్రతినిధి, వరంగల్ : ఆదివాసీల అతి పెద్ద ఉత్సవం, తెలంగాణ కుంభమేళాకు మేడారం ముస్తాబైంది. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు రెండు వారాల ముందునుంచే గిరిజన సంప్రదాయాల ప్రకారం గుడిమెలిగె, మండమెలిగె తదితర పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఓ వైపు సమ్మక్క సారలమ్మల గద్దెల పునరుద్ధరణ పనులు జరుగుతుండగానే ఈ కార్యక్రమాలకు శ్రీకారం జరగ్గా.. ఈ నెల 28న సారలమ్మ రాకతో మొదలయ్యే జాతర 31 వరకు జరుగుతుంది. ఈ మేరకు జాతరకు ఏర్పాట్లు అన్నీ పూర్తయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ముస్తాబైన నయా మేడారం.. మేడారం చరిత్రలోనే తొలిసారిగా రూ.251 కోట్ల భారీ నిధులు కేటాయించారు. ఇందులో గద్దెల శాశ్వత పునరుద్ధరణకు రూ.101 కోట్లు, జాతర నిర్వహణ, భక్తుల సౌకర్యాలకు రూ.150 కోట్లకు పైగా నిధులు వెచ్చించారు. ఇది మేడారం చరిత్రలోనే అత్యధిక కేటాయింపు కావడం విశేషం. మేడారం అభివృద్ధి పనుల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నవి కొత్తగా నిర్మించిన శాశ్వత గద్దెలు. వీటితోపాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను గ్రానైట్ రాళ్లతో పునర్నిర్మించారు. ప్రాకారం చుట్టూ ఉన్న రాతి శిలలపై కోయ గిరిజనుల వీరగాథలు, సమ్మక్క–సారలమ్మ చరిత్ర, ఆదివాసీల గోత్రాలు, వారి ఆచార వ్యవహారాలు, వీరగాథలను ప్రతిబింబించే చిత్రాలను చెక్కారు. ఇవి భవిష్యత్తు తరాలకు మేడారం చరిత్రను వివరించే సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. కాంక్రీట్ కట్టడాలు మాత్రమే కాదు.. గిరిజన సంస్కృతికి అద్దం పట్టే దృశ్యకావ్యాలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. భద్రత వలయంలో మేడారం.. గతంలో వనదేవతల గద్దెల ప్రాంతంలో 2–3 వేల మంది ఉంటేనే తొక్కిసలాట జరిగేది. ఈసారి పునరుద్ధరణలో భాగంగా ఒకేసారి 7వేల నుంచి 8 వేల మంది భక్తులు దర్శించుకునేలా భారీ క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీఐపీలకు ప్రత్యేక లైన్లు, క్యూలైన్లపై జీఐ షీట్లతో పైకప్పు ఏర్పాటు చేశారు. నాలుగు గద్దెలను ఒకేసారి దర్శించుకునేలా కంపార్టుమెంట్లు నిర్మించారు. జంపన్న వాగు వద్ద శాశ్వత స్నానఘట్టాలు, సుందరీకరణ పనులు పూర్తిచేశారు. మేడారం చుట్టూ 10 కి.మీ.ల మేర ఫోర్ లేన్ రోడ్లు, పార్కింగ్కు అదనంగా 63 ఎకరాల స్థల సేకరణ చేశారు. కాగా ఈసారి 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా జాతర సందర్భంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలనుంచి తరలి వచ్చే భక్తుల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. కాగా 460 సీసీ కెమెరాలతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీ ద్వారా రద్దీని పర్యవేక్షించే సిస్టం ఏర్పాటు చేశారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జనసాంద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రమాదాల్ని ముందుగానే నివారించే ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. 20 ప్రత్యేక డ్రోన్ల ద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్, 20 మంది ఐపీఎస్ అధికారులు, 30 వేల మంది సిబ్బంది జాతర విధుల్లో ఉండబోతుండగా, ట్రాఫిక్ నియంత్రణకు ప్రతి 2 కి.మీ.కు ఒక చెక్పోస్టు ఏర్పాటు చేస్తున్నారు. రూ.251 కోట్లతో పునరుద్ధరణ, జాతర నిర్వహణ పనులు జాతర ఏర్పాట్లు పూర్తయినట్లు ప్రకటన వనదేవతల దర్శనానికి తరలివస్తున్న భక్తులు 28 నుంచి 31 వరకు మహా జాతర.. 3 కోట్లమంది వస్తారని అంచనా -
అలరించిన ఆటాపాట
జనగామ: గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో సోమవారం జరిగిన వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మహాత్మాజ్యోతిబాఫూలే, సోషల్ వెల్ఫేర్, ఏకశిల పబ్లిక్ స్కూల్, సాన్మారియా, మోడల్ తదితర పాఠశాలలు, గురుకులాలకు చెందిన విద్యార్థులు జాతీయ భావంతో పాటు మన ఆచార, వ్యవహారాలను తమ ప్రదర్శన ద్వారా అద్భుతంగా చూపించారు. అనంతరం చేనేత రుణమాఫీ పథకం కింద 293 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం అందించిన రూ.2,06,25చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. స్వయం సహాయ సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించిన చెక్కులను అందించారు. చివరగా పోలీస్, వ్యవసాయం, ఉద్యానవన, జిల్లా గ్రామీణభివృద్ధి, మెప్మా, తదితర శాఖల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను కలెక్టర్, అదనపు కలెక్టర్లు, డీసీపీ పరిశీలించి, నిర్వాహకులను అభినందించారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, రెవెన్యూ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, పింకేశ్ కుమార్, డీసీపీ రాజమ హేంద్రనాయక్, ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మినారాయణ నాయక్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జనగామ ధర్మకంచ మినీ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు -
పారదర్శకంగా యూరియా సరఫరా
జనగామ రూరల్: యూరియా సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా రూపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూ రియా బుకింగ్ యాప్ జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తె లిపారు. శనివారం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న అగ్రోస్ రైతు సేవాకేంద్రాన్ని సందర్శించి యూరియా నిల్వలు, యాప్ ద్వారా జరిగిన బుకింగ్స్, విక్రయ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాలో యూ రియా బుకింగ్ యాప్ అమలుకు ముందు రోజు వారీ సగటు యూరియా విక్రయాలు 3,000 నుంచి 3,500 సంచుల వరకు మాత్రమే ఉండేవని, యాప్ అమలులోకి వచ్చిన తర్వాత 6,000 నుంచి 7,000 సంచుల వరకు విక్రయాలు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. యూరియా బుకింగ్ యాప్కు జిల్లాలో రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఇప్పటివరకు 53,946 మంది రైతులు యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్నారని, మొత్తం 62,398 బుకింగ్స్ నమోదయ్యాయని వీటిలో 2,01,012 యూరియా సంచులు రైతులకు విజయవంతంగా విక్రయించినట్లు వెల్లడించారు. అదే విధంగా, గత 15 రోజులుగా జిల్లాలో యూరియా నిల్వలు నిరంతరం 25,000 సంచులకుపైగా ఉన్నాయని తెలిపా రు. రైతులకు యాప్ వినియోగంపై మరింత అవగాహన కల్పిస్తూ, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
ఇప్పగూడెం జాతర ప్రాంగణం పరిశీలన
స్టేషన్ఘన్పూర్: ఇప్పగూడెం, రంగరాయగూడెం, కోమటిగూడెం, అక్కపెల్లిగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని చింతగట్టు శ్రీసమ్మక్క–సారలమ్మ జాతర ప్రాంగణాన్ని డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ముందుగా జాతర ప్రాంగణంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జాతర కమిటీతో మాట్లాడారు. జాతరలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని, భక్తులకు అసౌకర్యం కలుగకుండా అందరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. జాతర కమిటీ చైర్మన్ తోట వెంకన్న, వైస్ చైర్మన్ మ్యాదరబోయిన కరుణాకర్, ఎల్లగౌడ్, కట్టయ్య, సర్పంచ్లు రాణిఅనీల్, సోమేశ్వర్ పాల్గొన్నారు. -
ఓటు హక్కు ఎంతో విలువైనది
జనగామ రూరల్: ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైనదని తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ అన్నారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరెట్లో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సందేశం వినిపించారు. అనంతరం బెన్ షాలోమ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎలాంటి ప్రలో భాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. పద్దెనిమిది ఏళ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావాలని సూ చించారు. రాజ్యాంగం ద్వారా వచ్చిన ఓటు హక్కు ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాదిగా నిలుస్తోందని గుర్తు చేశారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఎన్నికల సంఘం పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తుందన్నారు. ప్రతీసారి వినూత్న పద్ధుతుల్లో ప్రజలను చైతన్యపరుస్తుందని తెలిపారు. ఇందులో భాగంగానే ఈసారి మై ఇండియా – మై ఓటు నినాదంతో ఓటర్లను చైతన్య పరుస్తోందని అన్నా రు. ఈ సందర్భంగా ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్న సీనియర్ సిటిజన్లు, కొత్తగా నమోదైన యువ ఓటర్లకు జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరాం, ఎన్నికల శాఖ అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ -
ఆర్టీసీ సేవలు వినియోగించుకోవాలి
స్టేషన్ఘన్పూర్: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని జనగామ డిపో మేనేజర్ స్వాతి అన్నారు. స్టేషన్ఘన్పూర్ నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సర్వీలసులను ఆదివారం స్థానిక బస్టాండ్లో డీఎం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మేడారం జాతరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలన్నారు. భక్తుల డిమాండ్కు తగినట్లుగా బస్సు సర్వీసులను నడిపిస్తామని, సుశిక్షితులైన డ్రైవర్లు ఉంటారని తెలిపారు. ఘన్పూర్ నుంచి మేడారానికి పెద్దలకు రూ.300, పిల్లలకు రూ.200 టికెట్ చార్జ్ నిర్ణయించినట్లు తెలిపారు. మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఐ జి.వేణు, ఆర్టీసీ జనగామ డిపో అసిస్టెంట్ మేనేజర్ హుస్సేన్, సూపరింటెండెంట్ నారాయణ, సమ్మయ్య, ఘన్పూర్ బస్టాండ్ కంట్రోలర్ ఈఎస్ బాబు, సురేందర్, రమేష్, శ్రీనివాస్, స్వామి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ప్రెస్టన్ గ్రౌండ్ నుంచి.. జనగామ రూరల్: జనగామ నుంచి మేడారం వెళ్లే భక్తుల కోసం ప్రెస్టన్ గ్రౌండ్స్ నుంచి బస్సు సర్వీసులను నడిపించనున్నారు. ఈమేరకు అదనపు కలెక్టర్ బెన్షా లోమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి డిపో మేనేజర్ స్వాతి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఉద్యోగులు ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు. జనగామ డిపో మేనేజర్ స్వాతి ఘన్పూర్ నుంచి మేడారానికి బస్సు సర్వీసుల ప్రారంభం -
గణతంత్ర వేడుకలకు సిద్ధం
జనగామ రూరల్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక ధర్మ కంచ స్టేడియంలో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ శాఖల సమన్వయంతో ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బంది ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారని స్టేడియంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రగతిని తెలిపే స్టాల్స్ ప్రదర్శించనున్నట్లు వెల్ల డించారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్ర శంస పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్కు రాష్ట్రస్థాయి పురస్కారం జనగామ రూరల్: ఎన్నికల శిక్షణ, సామర్థ్య పెంపు విభాగంలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ జిల్లాగా కలెక్టర్ రిజ్వాన్ బాషా అవార్డు అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన రాష్ట్రస్థాయి వేడకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా కలెక్టర్ పురస్కారాన్ని అందుకున్నారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025 సంవత్సరానికిగాను ఎన్నికల నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన అధికారుల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి శనివారం ప్రకటించారు. ఇందులో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ‘శిక్షణ, సామర్థ్య పెంపు’ (ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బి ల్డింగ్) విభాగంలో అవార్డు దక్కించుకున్నారు. ఇన్వెస్టిగేషన్ మార్గదర్శకాల ప్రతుల అందజేత జనగామ రూరల్: పౌర సరఫరాల శాఖ కేసుల్లో చట్టపరమైన అమలుకు మార్గదర్శకాలను ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, కమిషనర్ ఎం.స్టిఫెన్ రవీంద్ర విడుదల చేశారు. కాగా ఈ మార్గదర్శకాల ప్రతులను శనివారం పౌరసరఫరాల శాఖ అధికారులకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అందజేశారు. పౌరసరఫరాల శాఖకు సంబంధించిన బియ్యం అక్రమ రవాణా, వడ్ల కొనుగోలుకు సంబంధించిన అవకతవతలు, అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్లులపై చర్య తీసుకునేందుకు తగిన మార్గదర్శకాలు, ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్కు సంబంధించిన తగు పత్రాలు, రెవెన్యూ రికవరీ యాక్ట్, కోర్ట్ మానిటరింగ్ సిస్టం మార్గదర్శకాల్లో పొందుపరచడం జరిగిందన్నారు. నేడు ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ రాక జనగామ రూరల్: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేడు (సోమవారం) నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. జనగామ మండలం ఓబుల్ కే శపురంలో చేపట్టే ఈ కార్యక్రమానికి ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ రానున్నారు. ఆయనతోపా టు భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పాల్గొననున్నారు. -
ఆ ముగ్గురు స్టూవర్టుపురం దొంగలు
స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ నియోజకవర్గంలో ప్రస్తు తం ఉన్న గజదొంగ డాక్టర్ రాజయ్యకు తోడుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం పేరుతో స్టూవర్టుపు రం దొంగల్లా ఎర్రబెల్లి దయాకర్రావు, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి వస్తున్నారని ఎ మ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. ఘన్పూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏ ర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఎన్నికై న తర్వా త ఘన్పూర్లో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని, ఘన్పూర్లో నిర్మిస్తున్న వంద పడకల ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, మున్సిపాలిటీ ఏర్పాటు అన్నింటికి తామే కారణం అన్నట్లుగా ప్రజలను త ప్పుదోవ పట్టించేలా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. 2023 ఎన్నికల్లో రాజయ్యకు టికెట్ ఇస్తే గెలువడం కష్టమని కేసీఆర్, కేటీఆర్కు చెప్పింది ఎర్రబెల్లి, పోచంపల్లి, పల్లా రా జేశ్వర్రెడ్డిలే అని అన్నారు. ఎర్రబెల్లి దయాకర్రావు మతిభ్రమించి సభ్యత, సంస్కారం లేకుండా మా ట్లాడుతున్నాడని కడియం విమర్శించారు. టీడీపీని హోల్సేల్గా కేసీఆర్కు అమ్మిన నీచచరిత్ర ఎర్రబెల్లిదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అందులోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో దయాకర్రావు నీచచరిత్ర తెలిసి రేవంత్రెడ్డి.. దగ్గరకు రాని వ్వలేదని ఎద్దేవాచేశారు. కేసీఆర్ చుట్టూ బొచ్చుకుక్కలా తిరిగి.. పల్లా రాజేశ్వర్రెడ్డి వందల కోట్లు ఆస్తులు సంపాదించుకున్నాడని, కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చుపెట్టిన పల్లా.. కేసీఆర్ కుటుంబాన్ని నాశనం చేశాడని విమర్శించారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు పోచంపల్లికి ఎక్కడ నుంచి వచ్చాయని, కేటీఆర్, సంతోష్ రావులకు పోచంపల్లి బినామీ అన్నారు. గజదొంగకు తోడుగా వస్తున్న స్టూవర్టుపురం దొంగల విషయంలో ఘన్పూర్ ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జూలు కుంట్ల శిరీష్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, నాయకులు నరేందర్రెడ్డి, బెలిదె వెంకన్న, అంబటి కిషన్రాజు, నూకల ఐలయ్య, తోట సత్యం, నీల గట్టయ్య, పోశాల కృష్ణపటేల్, నర్సింహులు, చింత ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
మెరుగైన విద్యుత్ కోసం సామర్థ్యం పెంపు
● ఎన్పీడీసీఎల్ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి జనగామ: పట్టణంలో వేసవి సీజన్లో మెరుగైన విద్యుత్ సరఫరా కోసం సామర్థ్యం పెంచుతున్నట్లు ఎన్పీడీసీఎల్ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు. వేసవి కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఆదివారం పట్టణంలోని మినీ స్టేడియం ఏరియాలో నాణ్యమైన విద్యుత్ కోసం అదనంగా 100 కేవీఏ సామర్థ్యం కలిగిన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ (డీటీఆర్)ను ఏర్పాటు చేసి సేవలను ప్రారంభించారు. అదనపు డీటీఆర్ ఏర్పాటు చేయడంతో జనగామ టౌన్–2 సెక్షన్ పరిధిలో తక్కువ ఓల్టేజ్ సమస్యలు గణనీయంగా తగ్గి, వినియోగదారులకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఏడీఈ వేణుగోపాల్, టౌన్–1 ఏఈ సౌమ్య, టౌన్–2 ఏఈ పులి చంద్రమోహన్, ఎస్ఎల్ఐ నరేందర్, లైన్మెన్లు భిక్షపతి, మహేందర్, ఏఎల్ఎం అశోక్ ఉన్నారు. -
నవ మేడారం
వనదేవతలు సమ్మక్క–సారలమ్మ ఖ్యాతి విశ్వవ్యాప్తంకారడవిలో, వాగు వంకల నడుమ మొదలైన చిన్న జాతర.. ప్రస్తుతం దేశాన్ని ఆకర్షిస్తోంది. గూడెం ప్రజలు కొలిచిన ఆ సన్నిధి.. ప్రస్తుతం కోట్లాది భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. మట్టి గద్దెల నుంచి విస్తృత సౌకర్యాల దాకా.. దిగబడే ఎగుడు దిగుడు రోడ్ల నుంచి డబుల్ బీటీ రోడ్డు దాకా.. ఎడ్ల బండ్ల ప్రయాణం నుంచి హెలికాప్టర్ దాకా మేడారంలో ఆధునికత సంతరించుకుంది. సెల్ఫోన్ టవర్లు, అత్యాధునిక సీసీ కెమెరాలు.. డ్రోన్లు ఒక్కటేమిటి వన మేడారం ఇప్పుడు నవ మేడారమైంది. – ఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి -
మద్యం మత్తులోనే గొడవ..
● జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కొమ్మూరిజనగామ: పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసేందుకు వ చ్చిన మంత్రి సీతక్క పర్యటనను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అనుచరవర్గానికి మ ద్యం పోయించి గొడవకు దిగారని జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. నియోజకవర్గ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొమ్మూరి మాట్లాడారు. పెంబర్తి జంక్షన్ వద్ద మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించే సమయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రోగ్రాంలో అంతా తానైనట్టుగా వ్యవహరిస్తూ, అక్కడ నుంచే గొవకు తెరలేపాడని ఆరోపించారు. మంత్రి కార్యక్రమంలో ఎమ్మెల్యే సభ్యత, సంస్కారం మరచి వ్యవహారించారన్నారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకుడు రాకేష్పై ఎమ్మెల్యే తిట్టారని, దీనిపై డీసీపీ ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పదవి పూర్తయ్యే వరకు దొంగ ఓట్లపై పోరాడుతామన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ సభ్యుడు లకావత్ లక్ష్మీనారాయణ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ వేముల సత్యనారాయణరెడ్డి, జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, కంచె రాములు, డాక్టర్ రాజమౌళి, కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, లింగాల నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మునీందర్ ఇంటి నుంచే పాన్పు
ఆదివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2026లక్షలాది మంది భక్తులు.. తల్లులను కీర్తిస్తూ జయజయధ్వానాలు.. డోలు వాయిద్యాలు.. కొమ్ము బూరల నాదాలు.. సుగంధ ధూపాల పరిమళాలు.. వీటన్నింటి నడుమ శక్తి స్వరూపాలను వనం నుంచి జనంలోకి తీసుకొచ్చే ఆ చేతులు మరెంతో శక్తివంతమైనవి.. ఎన్ని పదవులు అధిరోహించినా, ఎంత ధనమున్నా అంతటి అదృష్టం ఆ అడవి బిడ్డలకు మాత్రమే దక్కుతుంది. తల్లులను గద్దెకు చేర్చడంలో ఆదివాసీ పూజారుల పాత్ర కీలకం. నిష్టతో వనదేవతల సేవలో లీనమైన దాదాపు 25 మంది పూజారులపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.. – ఏటూరునాగారం/ఎస్ఎస్ తాడ్వాయిఅడవి తల్లులను వనంలోంచి జనంలోకి తీసుకువచ్చే పూజారులది ఎంతో అదృష్టం. సుమారు 25 మంది పూజారులు ఈ మహా ఘట్టంలో పాలుపంచుకుంటుండగా ప్రధానంగా సారలమ్మ పూజారులు ఆరుగురు, సమ్మక్క పూజారులు ఐదుగురు కీలక పాత్ర పోషిస్తారు. కన్నెపల్లి గుడిలోని సారలమ్మను పూజారి కాక సారయ్య ఈనెల 28న గద్దైపెకి తీసుకురానున్నారు. కాళ్లకు పారాణి ధరించి ఎర్రని వస్త్రాల ముసుగుతో అమ్మవారి రూపంలో వెదురుబుట్టలో అమ్మవారిని తీసుకుని కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలకు బయల్దేరుతారు. అమ్మవారిని తీసుకొచ్చే ఉదయాన ప్రత్యేకంగా కుట్టించిన జాకెట్ని మాత్రమే సారయ్య ధరిస్తాడు. తండ్రి వారసత్వంగా ఈ బాధ్యతను సారయ్య గత 8 జాతరల ముందు నుంచి నిర్వర్తిస్తున్నాడు. కాకవంశ పూజారులు అమ్మవారి వెదురు బుట్ట సారయ్య చేతులోకి అందివ్వగానే ఆయనను అమ్మవారు ఆవహిస్తుంది. మిగతా పూజారులు ఆయనను పట్టుకొని గద్దెల వరకు తీసుకొస్తారు. గద్దైపె ప్రతిష్ఠించేంతవరకు ఆయన స్పృహలో ఉండరు. సారలమ్మను తీసుకొస్తున్న కాక సారయ్య(ఫైల్)సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్ ఇంటి నుంచి సమ్మక్క దేవతకు చేయాల్సిన పూజా క్రతువు, సామగ్రి అంతా ఈ ఇంటి నుంచి వెళ్తుంది. సమ్మక్కను తీసుకురావడానికి ముందుగా మునీందర్ ఇంటి వద్ద పసుపు, కుంకుమ, కంకణాలు, నైవేద్యం, ఊదు, అక్షింతలు, పసుపు బియ్యం, ఇతరత్రా పూజారులకు పూజా సామగ్రి (పాన్పు)ని తయారు చేసుకుని వెళ్తారు. మేడారం సమ్మక్క జాతరలో జరిగే ఏ పూజా కార్యక్రమం అయినా ఈ ఇంటి నుంచి వెళ్లడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ అని మునీందర్ చెబుతున్నాడు. సమ్మక్కను తీసుకొస్తున్న పూజారులు (ఫైల్)చిలకలగుట్ట నుంచి ధూపం లేనిదే అమ్మవారు గుట్ట దిగదు. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. ధూపం వడ్డె దొబె నాగేశ్వర్రావు ధూపదీప నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తారు. గుట్ట పైనుంచి గద్దెకు చేరే వరకు అమ్మవారికి వడ్డె.. ధూపం వేస్తూనే ముందుకు సాగుతాడు. -
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు
దేవరుప్పుల: నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్పీడీసీఎల్ జిల్లా చీఫ్ ఇంజనీర్ సంపత్రెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని చిన్నమడూరు ఎస్ఎస్లో అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్తోపాటు బ్రేకర్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంతోపాటు గృహ అవసరాలకు ఉచిత కరెంటు సరఫరా చేస్తున్నందున వినియోగదారులు విధిగా శాఖాపరంగా మంజూరు, ఇంటి మీటర్లు తీసుకోవాలన్నారు. అక్రమ విద్యుత్ వాడకందారులకు శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో డీఈలు లక్ష్మీనారాయణరెడ్డి, విజయ్కుమార్, ఏడీఈ అనిల్, ఏఈ నర్సింహ్ములు పాల్గొన్నారు. -
కలెక్టర్కు మరో విశిష్ట అవార్డు
జనగామ రూరల్: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి వేడుకల్లో జనగామ జిల్లా మరో విశిష్ట గౌరవాన్ని సాధించింది. ఎన్నికల నిర్వహణలో శిక్షణ, సామర్థ్యాభివృద్ధి అంశంలో చేసిన కృషికి గాను కలెక్టర్ రిజ్వాన్ బాషా అవార్డుకు ఎంపికయ్యారు. నేడు (ఆదివారం) హైదరాబాద్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డును కలెక్టర్ స్వీకరించనున్నారు. ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యం అయిన ప్రతీఒక్కరికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. సమష్టి కృషితోనే జిల్లాకు ఈ అవార్డు దక్కిందన్నారు. నేను మీ బంధువును.. టిఫిన్ చేద్దాం పదా అంటూ.. జనగామ రూరల్: నేను మీ బంధువును.. చాలా రోజుల తర్వాత కలిశాం టిఫిక్ చేద్దాం పదా అంటూ బ్యాంకుల వద్ద మోసాలకు పా ల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏ ఎస్పీ పండేరీ చేతన్ నితిన్ తెలిపారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్కు చెందిన అడవి మీద నర్సింహులు గతంలో వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డాడు. ము ఖ్యంగా బ్యాంకులకు వద్ద అమాయకులను ఆసరా చేసుకుని వారితో బంధువునని, పరిచయస్తుడినని చెప్పి టిఫిన్, టీ తాగుతామని నమ్మించి తీసుకెళ్లి వారి నుంచి డబ్బులు తీసుకొని పరారవుతున్నాడు. జనవరి మెదటి వారంలో జిల్లా కేంద్రంలోని ఓ ఎస్బీఐలో ఓ వృద్ధుడు డబ్బులు డ్రా చేసుకుని బయటకు వచ్చాడు. తాను బంధవునవుతానని ఆ వృద్ధుడిని నమ్మించి టిఫిన్ చేద్దామని ఓ హోటల్ తీసుకెళ్లాడు. వృద్ధుడు చేతులు కడుక్కోవడానికి వెళ్లగానే డబ్బుతో ఉడాయించాడు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చే పట్టారు. శనివారం బస్టాండ్ సమీపంలో చోరీ చేయడానికి రాగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో గతంలో చేసిన నేరాలు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని అరెస్ట్చేసి రూ. 70 వేల నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. సీఐ సత్యనారాయణరెడ్డి తోపాటు ఎస్సై, సిబ్బందిని డీసీపీ, ఏఎస్పీ అభినందించారు. -
మహాజాతరకు ప్రత్యేక బస్సులు
జనగామ ప్రెస్టన్ మైదానం, స్టేషన్ఘన్పూర్లో పాయింట్● నేటి నుంచి ప్రారంభం కానున్న మేడారం బస్సు సర్వీసులు ● భక్తులు సద్వినియోగం చేసుకోవాలి ● డీఎం స్వాతిజనగామ: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తుల రాకపోకలు సులభతరం చేసేందుకు జనగామ ఆర్టీసీ డిపో ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని ప్రెస్టన్ మైదానం, స్టేషన్ఘన్పూర్ పాయింట్ నుంచి మేడారం పుణ్యక్షేత్రానికి ఈ నెల 31వ తేదీ వరకు మొత్తం 130 ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. జాతర సమయంలో భారీగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రెస్టన్ మైదానంలో ప్రత్యేక తాత్కాలిక బస్టాండ్, టికెట్ కౌంటర్లు, వేచివుండే షెడ్లు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య ఏర్పాట్లు తదితర మౌలిక సదుపాయాలను సిద్ధం చేశారు. ఈ ప్రత్యేక బస్టాండ్ను నేటి(ఆదివారం) ఉదయం అధికారికంగా ప్రారంభించనున్నారు. రాత్రి వేళల్లో కూడా భక్తులు ఇబ్బందులు పడకుండా విద్యుత్ వెలుగులు, భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ను నియంత్రించే ప్రత్యేక చర్యలు తీసుకుని బస్సుల రాకపోకలు ఎలాంటి ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.టికెట్ ధరలు జనగామ, స్టేషన్ఘన్పూర్ పాయింట్ల నుంచి ఎక్స్ప్రెస్, డీలక్స్ ప్రత్యేక సర్వీసులకు టికెట్ ధరలను నిర్ణయించారు. జనగామ పాయింట్ నుంచి మేడారానికి ఎక్స్ప్రెస్ సర్వీసులో పెద్దలకు రూ.400, పిల్లలకు రూ.250, స్టేషన్ఘన్పూర్ పాయింట్ నుంచి పెద్దలకు రూ.330, పిల్లలకు రూ.200, డీలక్స్ సర్వీసుల్లో జనగామ పాయింట్ నుంచి పెద్దలకు రూ.460, పిల్లలకు రూ.280, స్టేషన్ఘన్పూర్ పాయింట్ నుంచి పెద్దలకు రూ.380, పిల్లలకు రూ.220గా నిర్ణయించారు. -
మేడారానికి పోటెత్తిన భక్తులు
వనదేవతలను దర్శించుకునేందుకు మేడారానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో సుమారు 50 వేల మంది వరకు భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించారు. శివసత్తుల పూనకం, భక్తిగీతాల ఆలాపన, భక్తుల సందడితో జంపన్న వాగు కోలాహలంగా మారింది. పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, చీరసారె సమర్పించి చల్లగా చూడాలని భక్తులు తల్లులను వేడుకున్నారు. అనంతరం అడవిలో చెట్లకింద వంటలు వండుకొని భోజనాలు చేశారు. – ఎస్ఎస్తాడ్వాయిమేడారంలో సమ్మక్క–సారలమ్మను దర్శించుకుంటున్న భక్తులు -
ప్రతీ కుటుంబానికి ఆడపిల్ల ఒక వరం
● కలెక్టర్ రిజ్వాన్ బాషా జనగామ రూరల్: ప్రతీ కుటుంబానికి ఆడపిల్ల ఒక వరమని, బాలికల హక్కులను పరిరక్షించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మహిళా శిశు దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికల పట్ల వివక్షతను ప్రదర్శించకుండా వారి అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. శ్రీబేటీ బచావో–డిజిటల్ హటావోశ్రీ అనే సందేశంతో బాలికలను డిజిటల్ దుర్వినియోగం నుంచి రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలు, పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో డీసీ కోదండరాములు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోని, జీసీడీఓ గౌసియా బేగం, సీడబ్ల్యూసీ చైర్మన్ ఉప్పలయ్య, శ్రీలత, కవిత తదితరులు పాల్గొన్నారు. రేపు సాంస్కృతిక కార్యక్రమాలు జనగామ: రిపబ్లిక్ డే దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు (సోమవారం) జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో ప్రముఖ గాయకుడు రాంమిర్యాల ఆధ్వర్యంలో ఆటాపాట, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 26న సాయంత్రం 6 గంటలకు జరిగే వేడుకలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. రిపబ్లిక్ డేకు పకడ్బందీ ఏర్పాట్లుగణతంత్ర దినోత్సవం సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం వేడుకలు జరిగే ధర్మ కంచ స్టేడియాన్ని అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రోటోకాల్ ప్రకారం స్టేజీ ఏర్పాట్లు, తాగునీటి వసతి, అంబులెన్స్, ఫైర్ తదితర అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏసీపీ పండరి చేతన్, ఆర్డీఓ గోపిరాం, డీఆర్డీఓ వసంత, అధికారులు పాల్గొన్నారు. అలాగే ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ నమోదు లక్ష్యాన్ని సాధించే విధంగా అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. క్యాంపు కార్యాలయం నుంచి ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంఈఓలతో జూమ్ సమావేశం నిర్వహించారు. -
శక్తిని ప్రసాదించే జలకం..
సమ్మక్క తల్లి గుట్ట దిగే సమయం నుంచి గద్దెలకు చేరే వరకు జలకపు వడ్డె మల్లెల సత్యం పూజారులతో కలిసి ముందుకు సాగుతాడు. తొమ్మిది రకాల పానీయాలతో జలకాన్ని ప్రత్యేకంగా పూజారులు తయారు చేస్తారు. ఈ జలకాన్ని సమ్మక్క పూజారుల వడ్డె మల్లెల సత్యం చేతుల పట్టుకుని అమ్మవారిని తీసుకువస్తున్న కృష్ణయ్యతో కలిసి ముందుకు సాగుతాడు. జలకం చల్లితేనే అమ్మవారు ముందుకు కదులుతుంది. అమ్మవారిని తీసుకొచ్చే కృష్ణయ్య ఎక్కడా నీరస పడకుండా జలకాన్ని దప్పికగా అందిస్తారు. దీంతో ఆయన మరింత శక్తిని పుంజుకుని ముందుకు సాగుతాడు. డోలు దరువుతో తల్లుల యాత్ర షురూ.. సమ్మక్క–సారలమ్మను వారి స్థలాల నుంచి గద్దెలపైకి తీసుకురావాలంటే డోలు దరువు ఉండాల్సిందే. డోలు శబ్దాలు ధ్వనిస్తుంటే పూనకాలతో తల్లుల యాత్ర జోరుగా సాగుతుంది. అమ్మలు వచ్చే తరుణంలో ఒక్క క్షణం ఆగకుండా కళాకారులు డోలు వాయిస్తారు. అలసట లేకుండా కళాకారులు అమ్మవారి శక్తిని ప్రసాదించుకుని వాయిస్తారని పూజారులు చెబుతున్నారు. -
సరస్వతి నమస్తుభ్యం!
● భక్తిశ్రద్ధలతో వసంత పంచమి వేడుకలు ● వేదమంత్రోచ్ఛరణలు.. సామూహిక అక్షరాభ్యాసాలుజనగామ: జిల్లావ్యాప్తంగా వసంత పంచమి పర్వదినం శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యాదేవి శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయాల్లో విశే ష పూజలు, అలంకరణలు జరగగా, వేద పండితు ల మంత్రోచ్ఛరణల మధ్య చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని భవానీనగర్ సరస్వతీ మాత ఆలయం, బతుకమ్మకుంట శ్రీవిజయదుర్గమ్మ ఆల యం, సంతోషి మాత ఆలయాలతో పాటు పట్టణంలోని బీరప్పగడ్డ శ్రీసరస్వతి శిశు మందిర్, వాసవి క్లబ్, గెలాక్సీ లయన్స్ క్లబ్, లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ డైమండ్ సంయుక్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గట్టు శ్రీనివాస్ సహకారంతో అంబేద్కర్నగర్ అంగన్వాడీ కేంద్రం చిన్నారులకు అక్షరాభ్యాసంతో పాటు స్కూల్ బ్యాగులు, పలకలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాసవి గెలాక్సీ జోన్ చైర్మన్ బుస్సా సిద్దేశ్వర్, అధ్యక్షులు తాడూరు సంతోష్, సోమేశ్వర్, రామిని ఈశ్వర్, అంగన్ వాడీ సూపర్వైజర్ పూర్ణిమ, టీచర్ అనిత పాల్గొన్నారు. -
మంత్రి కార్యక్రమం వాయిదా
బచ్చన్నపేట: మండల కేంద్రంలో కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల నూతన భవన ప్రారంభ కార్యక్రమం వాయిదా పడినట్లు ఎంపీడీఓ మమతాబాయ్ తెలిపారు. రూ.2.30 కోట్లతో నిర్మించిన కేజీబీవీ పాఠశాల ప్రారంభోత్సవానికి శుక్రవారం మంత్రి సీతక్క రావాల్సి ఉండగా..వాయిదా వేసినట్లు చెప్పారు. కాగా, సాయంత్రం వరకు నాయకులు, అధికారులు వేచి ఉండగా వాయిదా పడడంతో వెనుదిరిగారు. రాజ్యాంగాన్ని రక్షించాలి జనగామ రూరల్: దేశంలో మతోన్మాదాన్ని తిప్పికొట్టి రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని మాజీ పార్లమెంట్ సభ్యురాలు సుభాషిణి అలీ అన్నారు. శుక్రవారం పట్టణంలో గిన్నిగడ్డలో ఆవాజ్ జిల్లా కార్యదర్శి ఎండీ అజారుద్దీన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముస్లిమ్ సమరయోధుల ఫొటో ఎగ్జిబిషన్ను ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా సుభాషిణి మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర పోరాటంలో హిందువులు ముస్లింలు కలిసి ఐక్యంగా బ్రిటీష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉందన్నారు. ముస్లిం సమరయోధుల పోరాట చరిత్రను ఆర్ఎస్ఎస్, బీజేపీ వక్రీకరించి ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంఏ గయాస్, అబ్దుల్ సమద్, ఎండి షబానా, ఇర్రి అహల్య, జోగు ప్రకాష్, ఎండీ దస్తగీర్, బొట్ల శేఖర్, బోడ నరేందర్, సుమ తదితరులు పాల్గొన్నారు బెల్ట్షాపు రూ.8.50 లక్షలు! రఘునాథపల్లి: గ్రామంలో బెల్ట్షాపు ఏర్పాటుకు నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. మండలంలోని ఫతేషాపూర్లో బెల్ట్షాపు, చికెన్ దుకాణం ఏర్పాటు కోసం శుక్రవారం ఏకంగా గ్రామ పంచాయతీ వద్దే వేలం నిర్వహించారు. బెల్ట్షాపు కోసం నిర్వహించిన వేలంలో 14 మంది పాల్గొన్నారు. రూ 8.50 లక్షలు చెల్లించేందుకు ఓ వ్యక్తి ముందుకొచ్చాడు. చికెన్షాపు ఏర్పాటు వేలం రూ.1.50 లక్షలు పలికింది. ఈ మొత్తం రూ.10 లక్షల డబ్బులను పంచాయతీ ఆధ్వర్యంలో మార్చిలో దుర్గమ్మ పండుగ వేడుకలకు, గ్రామాభివృద్ధికి వినియోగించాలని గ్రామపెద్దలు నిర్ణయించారు. ఇదిలా ఉంటే బెల్ట్షాపు ఏర్పాటుపై స్థానిక మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ భర్తలు, పిల్లలు మద్యానికి బానిసలవుతున్నారని వాపోతున్నారు. పక్కనున్న ఇబ్రహీంపూర్ గ్రామంలో ఏడేళ్లుగా సంపూర్ణ మద్యపాన నిషేదం అమలవుతోంది. అక్కడ బెల్ట్షాపులు ఏర్పాటు చేయొద్దని ఊరుమ్మడి నిర్ణయంతో పక్కాగా అమలవుతోంది. అక్కడ పండుగలు చేస్తలేరా..? అభివృద్ధి జరుగడం లేదా..? అని వాపోతున్నారు. మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం జఫర్గఢ్: మోడల్ స్కూల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీకాంత్ తెలిపారు. మండల కేంద్రంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. మోడల్ స్కూల్లో 6వ తరగతిలో 100 సీట్లతో పాటు 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలిపోయిన సీట్లకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 7 నుంచి 10వ తరగతులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుందన్నారు. హాల్ టికెట్లను ఏప్రిల్ 9వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులకు రూ.125, ఓసీ విద్యార్థులకు రూ.200 ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాతరను సక్సెస్ చేద్దాం వరంగల్ క్రైం: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను పోలీస్, ఆర్టీసీ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి సక్సెస్ చేద్దామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. ఈమేరకు సీపీ సన్ప్రీత్ సింగ్ పోలీస్, ఆర్టీసీ అధికారులతో శుక్రవారం కమిషనరేట్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. గత జాతరలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తిన ప్రాంతాలు, కారణాలతో పాటు, పోలీస్, ఆర్టీసీ సంయుక్తంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా మేడారం జాతరకు చేసిన ఏర్పాట్లపై ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయ భాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. భక్తుల రద్దీని గమనిస్తూ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. -
గెలిచే బలముంటేనే పోటీ!
జనగామ: పురపాలిక ఎన్నికల్లో క్యాడర్, ప్రజాబలం లేకుండా పోటీచేస్తే ఓటమి తప్పదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గెలిచే బలం ఉందా, ప్రజలు నమ్ముతారా, క్యాడర్ మన వెంట ఉన్నారా ఇవన్నీ చెక్ చేసుకుని పోటీలో నిలువాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాలన్నారు. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో జనగామ మండలం శామీర్పేటలోని ఓ ఫంక్షన్ హాల్లో డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన పట్టణ వార్డుల కార్యకర్తల సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.. స్థానికంగా ఎమ్మెల్యే లేకపోయినా, ఇటీవల సర్పంచ్ ఎన్నికల విజయోత్సాహం మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. మున్సిపాలిటీలోని 30 వార్డులను గెలవడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రతీ నాయకుడు ప్రజల్లో ఉంటూనే, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఓడిపోయే అవకాశమున్నవారు పోటీ కోసం ఎవరిపై ఒత్తిడి చేయొద్దని,పార్టీకి నష్టం జరగకుండా చూడాలని సూచించారు. జనగామ మునిసిపల్ 30 వార్డుల్లో గెలుపే లక్ష్యంగా ఇన్చార్జ్లను నియమించాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్ యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, కరుణాకర్రెడ్డి, కంచె రాములు, నిమ్మతి మహేందర్రెడ్డి, బడికె ఇందిర, వంగాల కళ్యాణిమల్లారెడ్డి, జంగి విద్యానాథ్, మాసపేట రవీందర్రెడ్డి, డాక్టర్ రాజమౌళి, పజ్జూరి జయహరి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల ప్రారంభం జనగామ పట్టణంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క శుక్రవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంకుస్థాపనలు చేశారు. జనగామ బైపాస్ రోడ్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుల విగ్రహాలు, ఆర్టీసీ బస్టాండ్ చౌరస్తాలో సూర్య నమస్కారాల శిల్పాలు, బతుకమ్మకుంటలో చిల్ట్రన్ పార్కు, జిమ్, కుంట మరమ్మతు పునరుద్ధరణ అభివృద్ధి పనులు, ఆర్అం డ్బీ బంగ్లా, మోడల్ మార్కెట్లను ప్రారంభించగా, నెహ్రూపార్కు 60 ఫీట్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు లకావత్త్ ధన్వంతి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి, అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, ఆర్డీఓ గోపిరాం, జెడ్పీ సీఈఓ మాధు రి షా, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి తదితరులు ఉన్నారు. వనితా టీ, స్నాక్స్ స్టాల్స్.. బతుకమ్మకుంటలో ఏర్పాటు చేసిన వనితా టీస్టాల్స్ను కలెక్టర్ రిజ్వాన్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పార్క్కు వచ్చే ప్రజలకు, చిన్నారులకు రుచికరమైన టీని, పౌష్టికాహారపు చిరుతిళ్లను అందించాలన్నారు. క్యాడర్, పబ్లిక్లో లేకుండా పోటీచేస్తే ఓటమి తప్పదు టికెట్ కోసం ఒత్తిడి చేయొద్దు జనగామ 30 వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగుర వేయాలి పార్టీ సమావేశంలో మంత్రి సీతక్క -
పాలకుర్తిలో కల్యాణ మండపం ప్రారంభం
పాలకుర్తి టౌన్: ప్రజాప్రభుత్వంలో మహిళల అభివృద్ధే తెలంగాణ ప్రగతి దిక్సూచి అని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క)అన్నారు. మండల కేంద్రంలోని ఇందిరా మహిళా శక్తి శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి కల్యాణ మండపాన్ని డీఆర్డీఏకు అప్పగించగా రూ.47లక్షలతో నిర్మించిన డైనింగ్ హాల్ను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డితో కలిసి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో సీతక్క మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడానికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి మాట్లాడుతూ..పాలకుర్తి నియోజకవర్గానికి ప్రజాప్రభుత్వం రూ.2వేల కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి, అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్,డీఆర్డీఓ పీడీ వసంత, అదనపు పీడీ నూరోద్దిన్, తహసీల్దార్ సరస్వతీ, ఎంపీడీఓ వేదవతి, డీఆర్డీఓ పల్లవి, మార్కెట్ చైర్పర్సన్ మంజుల, సర్పంచ్ కమ్మగాని విజయ పాల్గొన్నారు. శ్రీసోమేశ్వరాలయంలో మంత్రి పూజలు మండల కేంద్రంలోని శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి, కలెక్టర్ రిజ్వాన్ బాషా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, అర్చకులు స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. -
కల్లుతాగిన కోతుల్లా ప్రవర్తించారు
● మద్యం మత్తులో నా మీద దాడికి ప్రయత్నించారు ● కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మండిపాటుజనగామ: పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రాంభోత్సవ వేడకల్లో తరుచూ కాంగ్రెస్ నాయకులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి చేతుల మీదుగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేగా తనకు ఆహ్వానం పంపించగా, మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్న్తో కలిసి సీతక్కను మర్యాదపూర్వకంగా స్వాగతం పలికామన్నారు. కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావాలనే కొబ్బరికాయ కొట్టే సమయంలో గందరగోళం సృష్టించారు. కొందరు మద్యం మత్తులో వచ్చి, ఎమ్మెల్యే పల్లా గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ, కల్లుతాగిన కోతుల్లా కార్యక్రమాన్ని భగ్నం చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. జనగామ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కొమ్మూరి ప్రతాప్రెడ్డి కొడుకు ఆధ్వర్యంలో జరిగిన గుండాగిరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు పోకల జమునలింగయ్య, ఇర్రి రమణారెడ్డి, ఉల్లెంగుల సందీప్, రావెల రవి, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మేడారం.. గుడారం
మేడారంలో వెలిసిన గుడారాలుఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి: సుదూర ప్రాంతాల నుంచి మేడారం జాతరకు వచ్చే భక్తులు విడిది చేసేందుకు వ్యాపారులు పెద్ద ఎత్తున గుడారాలు ఏర్పాటు చేశారు. సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో సారలమ్మ వచ్చే ముందు రోజు స్వయంగా గుడారాలు ఏర్పాటు చేసేవారు. కానీ, ఇప్పుడు 15 రోజుల ముందు నుంచే ఏర్పాటు చేసి భక్తులకు అద్దెకిస్తున్నారు. వనదేవతలను దర్శించుకుని పిల్లాపాపలతో ఉండేలా ఇక్కడ అద్దె గదులు ఏర్పాటు చేశారు. వాటిలో సేద తీరితే 24 గంటలకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే టెంట్ సిటీ లగ్జరీతో ఏర్పాటు చేయగా మిగతా ప్రాంతాల్లో తాత్కాలిక పందిళ్లు వేశారు. తడకలు, బర్కాలు, పాలిథిన్ కవర్లు, గ్రీన్ మ్యాట్లతో అద్దె గదులు రూపొందించారు. వాటికి నంబర్లు వేసి భక్తులకు కేటాయిస్తున్నారు. మేడారం ఇప్పడు మెగాసిటీ మేడారం జాతరంటే ఒకప్పుడు చెట్లు, పుట్టలు. భ క్తులు తల్లులను దర్శించుకుని చెట్ల కింద వంటా వార్పు చేసుకొని అడవిలో మూడు రోజులపాటు గడిపేవారు. కంప్యూటర్ యుగంలో మేడారం ఇప్పుడు మెగాసిటీగా మారింది. చాలా మంది వ్యా పారులు జాతర సందర్భంగా మేడారంలోని స్థానిక భూములను గజాల చొప్పున అద్దెకు తీసుకుని గుడారాలు ఏర్పాటు చేశారు. కాంక్రీట్ భవనాలతో వందలాది అద్దె గదులు నిర్మించి కూడా భక్తులకు అద్దెకు ఇస్తున్నారు. ఇవేకాకుండా భవనాలపై తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసి అద్దెకు ఇస్తున్నారు. అద్దెకు ఉండే వారికి వేడి నీళ్లు, మొబైల్ చార్జింగ్, రెడీ టు ఫుడ్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ముందస్తు సందడి.. జాతరకు 15 రోజుల ముందు నుంచి మేడారంలో భక్తుల రద్దీ మొదలైంది. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా డెన్లు ఏర్పాటు చేశారు. జంపన్నవాగు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు, గద్దెల నుంచి చిలకలగుట్ట వరకు ఇరువైపులా గుడారాలు వెలిశాయి. 15 రోజుల క్రితం మూడు వేల వరకు ఉన్న జనాభా నేడు లక్ష వరకు పెరిగింది. ఏ రోడ్డు చూసినా పట్టణ ప్రాంతంగా దర్శనమిస్తోంది. భక్తుల రాకపోకలు మరింత పెరగడంతో ఏ గుడారాలు నిండుగా కనిపిస్తున్నాయి. జోరుగా వ్యాపారాలు మేడారం జాతరలో వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. భక్తుల కోసం ఏర్పాటు చేసిన గూడారాలు, తాత్కాలిక షెడ్లలో అనేక వ్యాపారాలు వెలిశాయి. ఇదే జోరులో వ్యాపారులు కొనసాగుతున్నాయి. కూల్డ్రింక్స్, వాటర్, రెస్టారెంట్ స్థాయిలో ఆహార పదార్థాలు లభిస్తున్నాయి. భక్తులు కుటుంబాలతో దర్శనం కోసం వచ్చి అన్నిరకాల సౌకర్యాలతో ఆహ్లాదాన్ని పొందుతున్నారు. రెండేళ్లకోసారి ఉపాధి మేడారం జాతర రెండేళ్లకోసారి రావడంతో వనదేవతలను దర్శించుకునే భక్తులు సేద తీరేందుకు అద్దె గదులు ఏర్పా టు చేస్తున్నాం. వాటిని ద్వారా మేం కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటాం. ప్రతీ జాతర మాకు జీవనోపాధి కల్పిస్తుంది. భక్తులను ఇంటి కుటుంబ సభ్యులు లాగానే చూసుకుంటాం. – సంకెపల్లి జైపాల్రెడ్డి, రెడ్డిగూడెం వేలాదిగా వెలిసిన తాత్కాలిక పందిళ్లు అడుగడుగునా భక్తులకు అద్దె గదుల స్వాగతం సౌకర్యాలపై ప్రత్యేక దృష్టిసారించిన వ్యాపారులుమేడారం, రెడ్డిగూడెం, ఊరట్టం, నార్లాపురం తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్థానికులు సైతం వారు ఉండే ఇళ్లను భక్తులకు అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటారు. భక్తులను ఆకట్టుకునేలా గుడారాలను తీర్చిదిద్దుతున్నారు. -
బడివేళకు బస్సేది?
జనగామ: జిల్లాలో రోడ్డు సౌకర్యం దాదాపు అన్ని గ్రామాలకు ఉంది. బస్సు సౌకర్యం సైతం చాలా గ్రామాలకు ఉంది. అయితే ఇప్పటికీ పలు మండలాల్లోని చాలా గ్రామాలకు బడి సమయానికి బస్సులు లేకపోవడంతో విద్యార్థులు నడిచి వెళ్లడమో, ఆటోలను ఆశ్రయించడమో జరుగుతోంది. అలాగే బస్సు సౌకర్యం లేని గ్రామాల విద్యార్థులు పక్క ఊరు బడికి వెళ్లడానికి తిప్పలు పడాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా ఆటోల్లో పరిమితికి మించి, ప్రమాదకరరీతిలో విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. గతంలో పలు ప్రమాదకర ఘటనలు సైతం జరిగాయి. కాగా, ఆర్టీసీ అధికారులతో మాట్లాడి తమ తమ నియోజకవర్గాల పరిధిలో సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అయితే, జిల్లాలో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే సమయంతో పాటు తిరుగు ప్రయాణంలో బస్సు సమస్య లేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 5కి.మీ. నడవాల్సిందే.. బచ్చన్నపేట: మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు వచ్చే మన్సాన్పల్లి గ్రామ విద్యార్థులు లింగంపల్లి గ్రామం వరకు 5 కిలోమీటర్లు నడిచి వచ్చి బస్సు ఎక్కి వస్తున్నారు. మళ్లీ అక్కడ దిగి సాయంత్రం కూడా నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు.పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మండలంలోని పలుగ్రామాల నుంచి 100 మంది విద్యార్థులు ప్రతి రోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుంటారు. అయితే రాజీవ్ చౌరస్తాలో బస్సులు ఆగకుండా నేరుగా బస్టాండ్లో దించడంతో అక్కడి నుంచి పాఠశాలకు వరకు నడవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. రోడ్డు ఉన్నా బస్సు సౌకర్యం లేని పలు గ్రామాలు చదువుకోవాలంటే రెండు, మూడు కి.మీ. నడవాల్సిందే ఆటోల్లో ప్రమాదకర ప్రయాణంతో భయాందోళనలో తల్లిదండ్రులు పాఠశాల విద్యార్థుల కోసం బస్సులు నడపాలని వేడుకోలులింగాలఘణపురం: బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రతీ రోజు ఆటోల్లోనే బడికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో చదువుకొనే నాగారం, మాణిక్యాపురం, కళ్లెం, సిరిపురం గ్రామాల విద్యార్థులు సైకిళ్లు, ఆటోల్లోనే వెళ్తున్నారు. నాగారం గ్రామం నుంచి మూడు ఆటోల్లో సుమారు 50 మందికి పైగా అదేవిధంగా సిరిపురం, కళ్లెం, మాణిక్యాపురం గ్రామాల విద్యార్థులు సుమారు మరో 50 మంది ఆటోలు, సైకిళ్లపై వెళుతున్నారు. మండల కేంద్రానికి నాగారం, కళ్లెం, మాణిక్యాపురం నుంచి బీటీ రోడ్డు ఉన్నప్పటికీ బస్సు సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. నర్మెట: మల్కపేట, బొమ్మకూర్, ఆగాపేట, ఇప్పలగడ్డ తదితర గ్రామాల విద్యార్థులు మండలకేంద్రానికి రావాల న్నా, హన్మంతాపురం వెళ్లాలన్నా ఆటోలను, ద్విచక్ర వాహనదారులను ఆశ్రయించాల్సిందే లేదంటే నడక సాగించాల్సిందే. రోడ్డుసౌకర్యాలు ఉన్నా బస్సులు లేకపోవడంతో వారికి తిప్పలు తప్పడంలేదు. -
అభివృద్ధి పనులు.. శంకుస్థాపనలు
జనగామ: జిల్లా కేంద్రంతో పాటు పాలకుర్తి, బచ్చన్నపేట, తరిగొప్పుల మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మంత్రి ఽసీతక్క శుక్రవారం పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి గురువారం అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, ఆర్డీఓ గోపిరామ్, ఆర్అండ్బీ ఈఈ, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, డీఈ, ఏఈలతో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పనులను పరిశీలించారు. సుమారు రూ.10కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారు. మంత్రి పర్యటన ఇలా.. పాలకుర్తి మండల కేంద్రంలో ఉదయం 10 గంటలకు ఇందిరా మహిళా శక్తి పథకంలో మండల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహా ఫంక్షన్ హాల్, డైనింగ్ హాల్ ప్రారంభోత్సవం చేయనున్నారు. అక్కడ నుంచి నేరుగా జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. జనగామ బైపాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ఫౌంటెన్, శిల్పాల ఆవిష్కరణ, బస్టాండ్ చౌరస్తా జంక్షన్ వద్ద గల శిల్పాల ఆవిష్కరణ, ఆర్అండ్బీ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసి న విగ్రహ ఆవిష్కరణ, ఆతర్వాత ఆర్అండ్బీ బంగ్లా ప్రారంభోత్సవం, మోడల్ మార్కెట్ మార్కెట్ ప్రారంభోత్సవం, బతుకమ్మ కుంటలోని వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం బచ్చన్నపేట మండల కేంద్రంలోని కేజీబీవీ ప్రారంభోత్సవం, తరిగొప్పుల పీహెచ్సీ సబ్ సెంటర్కు శంకుస్థాపన కార్యక్రమాలు చేయనున్నారు. జిల్లాలో నేడు మంత్రి సీతక్క పర్యటన -
భాషల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ రూరల్: భాషల అభివృద్ధికి జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం జిల్లా ఉపాధ్యాయ పండిత పరిషత్తు జిల్లా శాఖ క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భాషల అభివృద్ధి సమాజ వికాసానికి పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలుగు, హిందీ వంటి దేశీయ భాషల అభివృద్ధి కోసం భాషోపాధ్యాయుల సహకారంతో జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, బండి కుమారస్వామి, బెజ్జమ్ సునీల్ కుమార్, చకిలేల శ్రీనివాస్, జగడంపల్లి శంకర్, ఆకుల సంజీవ్, పద్మిని, అరుణ్ జ్యోతి,ఎల్లంబట్ల రమేష్, వజ్రయ్య, ఎల్లయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు శివునిపల్లి విద్యార్థులు స్టేషన్ఘన్పూర్: ఇటీవల వరంగల్లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి స్కూల్గేమ్స్ అండర్–17 ఎంపిక పోటీల్లో సాఫ్ట్బాల్ విభాగంలో హాజరైన శివునిపల్లి జెడ్పీహెచ్ఎస్కు చెందిన విద్యార్థులు నర్సింగ సాత్విక్, గుగులోత్ మధుసూదన్ ఉత్తమ ప్రతిభతో రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం కె.రమేశ్ తెలిపారు. ఈ నెల 23, 24వ తేదీల్లో నిజామాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కాగా, రాష్ట్ర స్థాయికి ఎంపికై న వారిని హెచ్ఎం కె.రమేష్, పీడీ కె.రవి అభినందించారు. చేనేత కార్మికులకు రుణమాఫీ జనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పథకం కింద వ్యక్తిగత చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు రుణాన్ని మాఫీ చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు చౌడేశ్వరీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేసినట్లు పేర్కొన్నారు. మొదటి విడతగా జిల్లాలోని 104మంది లబ్ధిదారులకు మాఫీ అమలవుతుందన్నారు. -
ట్రిప్పులు తగ్గించారు..
రెండేళ్ల క్రితం ఉన్న ఆర్టీసీ బస్సు ట్రిప్పులు, రూట్లను ప్రస్తుతం తగ్గించారు. బడి పిల్లల అవసరమున్న చోట ఆపడం లేదు. పెంబర్తి తదితర ప్రాంతాలు, స్కూల్స్ వద్ద ఇదే పరిస్థితి పునరావృతం అవుతోంది. బడుల సమయానుకూలంగా బస్సు సర్వీసులను నడిపించాలి. ఈ విషయమై రాష్ట్రస్థాయి ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్తా. – పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే,జనగామ నియోజకవర్గంలో గతంతో పోలిస్తే ప్రస్తుతం రోడ్లు, ఆర్టీసీ బస్సుల విషయమై పెద్దగా సమస్య లేదు. నేను మొదటి నుంచి విద్యారంగానికి పెద్దపీట వేస్తాను. విద్యార్థులకు రవాణా విషయమై వాస్తవంగా సమస్య ఉంటే ఆర్టీసీ అధికారులతో చర్చించి పరిష్కరించేలా కృషి చేస్తా. –కడియం శ్రీహరి, ఎమ్మెల్యే, స్టేషన్ఘన్పూర్ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు ఇబ్బంది కలుగనివ్వకుండా చూస్తా.. వారి భద్రత, చదువు దృష్టిలో పెట్టుకొని, రాజీవ్ చౌరస్తా సమీపంలో విద్యార్థులు ప్రయాణించే బస్సులను అపాడానికి ఆర్టీసీ ఆధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటాం. – యశస్వినిరెడ్డి, ఎమ్మెల్యే, పాలకుర్తి జిల్లాలో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే సమయంతో పాటు తిరుగు ప్రయాణంలో బస్సు సమస్య లేదు. విద్యార్థులు వెళ్లు స్టేజీ నుంచి కిలోమీటరు నుంచి కిలోమీటరున్నర వరకు కనెక్టివిటీ లేని సమయంలో అక్కడ వరకే ఎండ్ పాయింట్ ఉంటుంది. మా వద్ద ఒక్క దరఖాస్తు పెండింగ్ లేదు. – స్వాతి, మేనేజర్, జనగామ ఆర్టీసీ డిపో -
నిన్న మాట్లాడిన నేస్తాలు..నేడు విగతజీవులై
‘నిన్ననే ఎంతో ఆనందంగా మాట్లాడితిరి కదరా..ఇంతలోనే కానరాని లోకాలకు వెళ్లిపోయిన్రా..శాశ్వతంగా మీ మాటలు ఇక వినలేమా..’ అని స్నేహితులు రోదిస్తున్నారు.. ‘మంచి భవిష్యత్ ఉందనుకున్నాం..కుటుంబానికి అండగా ఉంటారనుకున్నాం..మా జీవితమే మీరనుకున్నాం..మూడు పదులు రాకుండానే నూరేండ్లు నిండిపోయినయా కొడుకా..’ అంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. యాదాద్రి జిల్లా ఆలేరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జిల్లా యువకులు దుర్మరణం చెందడంతో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.ప్రమాదానికి కారణమైన కారు, మృతుల బైక్జనగామ: యాదాద్రి జిల్లా ఆలేరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాలను శోకసంద్రంలో ముంచేసింది. భోజనం కోసం వెళ్లిన ఇద్దరు మిత్రులు నితిన్రెడ్డి, ఎండీ సిజాహిద్ చావులోనూ స్నేహాన్ని పంచుకున్నారు. జనగామ జిల్లా కేంద్రం వికాస్నగర్కు చెందిన వట్టి నితిన్రెడ్డి (28), జిల్లా ఆసుపత్రి ఏరియా గీతానగర్కు చెందిన ఎండీ సిజాహిద్ (24) ఇద్దరు స్నేహిహితులు. ఈనెల 21(బుధవారం) రాత్రి ఆలేరు మండల కేంద్రం సమీపం కందిగడ్డ శివారు వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ డాబాకు భోజనం చేసేందుకు బుల్లెట్ బైక్పై వెళ్లారు. భోజనం చేసిన అనంతరం తిరుగు ప్రయాణమాయ్యారు. హైదరాబాద్ నుంచి హనుమకొండ వైపు వేగంగా వస్తున్న ఓ కారు వెనక నుంచి ఢీకొట్టడంతో బుల్లెట్పై ఉన్న ఇద్దరు స్నేహితులు ఎగిరి చెట్ల పడి, అక్కడికక్కడే మరణించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్కు చెందిన పవన్ కళ్యాణ్ తన కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని నితిన్ తండ్రి వట్టి బాలసుధాకర్రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, జనగామ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబాలకు అప్పగించారు. కారు డ్రైవర్తో పాటు అందులో ఉన్న మరో ఇద్దరికి గాయాలు కాగా, వారిని ఆలేరు ఆస్పత్రికి తరలించారు. ఒక్కగానొక్క కొడుకు..ఎదిగొస్తాడనుకుంటే మృతుడు నితిన్రెడ్డి ఏకై క కుమారుడు. ఇతడికి ఓ సోదరి ఉంది. తండ్రి బాలసుధాకర్రెడ్డి వ్యాపారి, తల్లి అరుణ బచ్చన్నపేట 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. నితిన్ హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జీతంతో పనిచేస్తున్నాడు. భోజనం చేసేందుకు ఇంటి నుంచి బయలుదేరిన కొడుకు కొద్ది గంటల్లోనే విగతజీవిగా ఇంటికి రావడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి. తల్లిని కంటికి రెప్పలా చూసుకునేటోడు.. మరో మృతుడు సిజాహిద్ ఇంట్లో తీర్చలేని విషాదం అలుముకుంది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి బొగ్గు వ్యాపారం చేస్తూ అన్నతో కలిసి సిజాహిద్ కుటుంబభారం మోస్తున్నాడు. తల్లి అనీఫా బేగాన్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. సిజాహిద్ ఇక లేడనే వార్త తెలియడంతో తల్లి, అన్న, బంధువులు విలపిస్తున్నారు.వట్టి నితిన్రెడ్డి, ఎండీ సిజాహిద్ (ఫైల్) ఆలేరు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితుల దుర్మరణం శోకసంద్రంలో కుటుంబసభ్యులు, స్నేహితులు -
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
జనగామ రూరల్: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. గురువారం రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో భాగంగా పట్టణంలో బైక్ర్యాలీ చేపట్టారు. ఈసందర్భంగా వాహనదారులకు హెల్మెట్లు బహూకరించి రోడ్డు భద్రతపై సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ పండారీ చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్ఐలు వాహనదారులు పాల్గొన్నారు. మంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన జనగామ: జిల్లాలో శుక్రవారం రాష్ట్రమంత్రి సీతక్క పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను డీసీపీ రాజమహేంద్ర నాయక్ పరిశీలించారు. సీఐ సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డితో కలిసి డీసీపీ ఆయా ప్రాంతాలను సందర్శించారు. జనగామ రూరల్: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు కోర్టు ద్వితీయ శ్రేణి స్పెషల్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్గా జనగామ జిల్లా కోర్టుకు చెందిన న్యాయవాది కోట రామ్రెడ్డిని నియమిస్తూ తెలంగాణ హైకోర్టు లీగల్ అఫైర్స్ సెక్రటరీ పాపిరెడ్డి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రాంరెడ్డి జనగామ జిల్లా కోర్టులో 15 ఏళ్లకు పైగా న్యాయవాద వృత్తిని నిర్వహిస్తున్నారు. కోటా రామ్రెడ్డి రెండో శ్రేణి స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్గా నియామకం కావడంపై జిల్లా న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. జనగామ రూరల్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలకు 72 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ జితేందర్ గురువారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 52 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలో 3,965 మంది విద్యార్థులకు గాను 3,893 హాజరయ్యారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగాయని తెలిపారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషిజనగామ రూరల్: జిల్లాలో వినియోగదారుల సమస్యలు పరిష్కరించాలని సూపరింటెండింగ్ ఇంజనీర్ సంపత్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో హెచ్టీ వినియోగదారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..వినియోగదారుల సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు అధికారులు చొరవ తీసుకోని వాటిని పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు ముత్తయ్య, డివిజనల్ ఇంజనీర్ లక్ష్మీనారాయణరెడ్డి, డీఈ టెక్నికల్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. జనగామ: కేటీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడం ప్రజాసమస్యల నుంచి దృష్టిమళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కక్ష్యసాధింపు చర్య అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేటీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. దీని వెనుక పూర్తి రాజకీయ దురుద్దేశమే ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే సిట్ నోటీసులను ఆయుధంగా ఉపయోగిస్తున్నారని, ఈ కుట్ర ఎంత పెద్దదైనా తాము భయపడదని స్పష్టం చేశారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ 9వ సమావేశం నిర్వహించనున్నట్లు హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ విభాగం అధిపతి డాక్టర్ చిలువేరు రాజ్కుమార్ తెలిపారు. ఈమేరకు క్యాంపస్లో గురువారం పోస్టర్ను వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ టి.మనోహర్, ఆచార్యులు బి.సురేశ్లాల్, ఆర్.మల్లికార్జున్రెడ్డి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. -
‘కవర్’ భలే..పంట భళా!
లింగాలఘణపురం: శీతాకాలంలో కూరగాయ పంటల సాగులో చలి, చీడపీడల నుంచి రక్షణకు కవర్ (నాన్ ఓన్ క్రాప్ కవర్)లతో సాగు చేస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు మండలంలోని కళ్లెంకు చెందిన రైతు నకీర్త శ్రీనివాస్. ఇప్పటికే సుమారు పదేళ్లుగా కూరగాయలు సాగుచేస్తున్న శ్రీనివాస్ ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండిస్తున్నాడు. ప్రస్తుతం చలి తీవ్రతతో మొక్కల ఎదుగుదల తక్కువగా ఉంటోందని, అదేవిధంగా మొక్క దశలో అనేక చీడపీడలు ఆశిస్తాయని నాన్ ఓన్ క్రాప్ కవర్ ఏర్పాటు చేసి బీర, సోర, మిర్చి, కీర వంటి కూరగాయలను పండిస్తున్నాడు. విత్తనం నాటే దశలోనే కవర్లను ఏర్పాటు చేసి ఆయా కూరగాయలను బట్టి నెల రోజుల వరకు కవర్ అలాగే ఉంచి ఆ తర్వాత తొలగిస్తానని, తీగ జాతి పంటలకు కవర్ తొలగించి పందిళ్లు ఏర్పాటు చేస్తామని, దీంతో చీడపీడల నివారణతో పాటు మొక్కలు ఆరోగ్యవంతంగా ఉంటాయని అంటున్నాడు. ఒక్క ఎకరానికి సుమారు రూ.30వేల వరకు ఖర్చు అవుతుందని, ఒక్కసారి వాడిన కవర్ను రెండో పంటకు కూడా వినియోగించవచ్చని చెబుతున్నాడు. కూరగాయల సాగులో ‘నాన్ ఓన్ క్రాప్ కవర్’ చలి, చీడపీడల నుంచి రక్షణ -
గెలుపు గుర్రాల వేట
పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీజనగామ: రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పటిష్టం చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. ఈమేరకు ప్రతీ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా కమిటీలు కీలక భూమిక పోషించనున్నాయి. ప్రతీ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధిత ఇన్చార్జ్ మంత్రి కమిటీ చైర్మన్గా వ్యవహరించనున్నారు. డీసీసీ అధ్యక్షులు కన్వీనర్లుగా, పార్లమెంట్ పరిధిలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, సీనియర్ నాయకులు సభ్యులుగా ఉంటారు. కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగే అభ్యర్థుల ఎంపికలో ఈ కమిటీలదే తుది నిర్ణయం. రెండు మున్సిపాలిటీల్లో పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్న అభ్యర్థులు జిల్లా పార్టీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. వార్డుల వారీ గా వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఆశావహులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ వచ్చేవరకు దరఖాస్తులను స్వీకరించి, ఆ తర్వాత వార్డు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపడుతాం. – లకావత్ ధన్వంతి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు, జనగామ●జిల్లాలో జనగామ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్చార్జ్ మంత్రి ధనసరి సీతక్క చైర్మన్గా ఉండగా, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి కన్వీనర్, ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ నియోజకవర్గ ఇనన్చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి, టీపీసీసీ సభ్యుడు లక్ష్మీనారాయణ నాయక్తో పాటు కీలక నాయకులు ఈ స్క్రీనింగ్ కమిటీలో భాగస్వాములు కానున్నారు. జనగామలో 30, స్టేషన్ ఘన్పూర్లో 18 మొత్తంగా 48 వార్డులకు గాను కాంగ్రెస్ అభ్యర్థుల ఎం పిక బాధ్యత ఈ కమిటీపై ఉంటుంది. ప్రస్తుతం వార్డుల వారీగా ఆశావహులకు సంబంధించి ప్రాథమిక స్థాయిలో గుర్తించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు బరిలో నిలవాలని ఉత్సాహపడే నాయకుల నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ కమిటీ ఆధ్వర్యంలో దరఖాస్తులను స్వీకరించనున్నారు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అభ్యర్థులను ఖరారుకు సంబంధించిన ప్రక్రియ మొదలుపెడతారు. పార్టీ శ్రేణుల నుంచి అభ్యర్థుల వివరాలను సేకరిస్తూనే, ఇంటెలిజెన్స్ రిపోర్టులు, స్థానిక రాజకీయ సమీకరణాలు పరిశీలించిన తర్వాతనే గెలుపు సాధించే అభ్యర్థులను తుది జాబితాలో ఎంపిక చేస్తారు. స్క్రీనింగ్ కమిటీల ఏర్పాటు పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని, కష్టపడి పనిచేసిన నాయకులకు ప్రాధాన్యం లభించే అవకాశం ఉందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో కీలకపాత్ర నోటిఫికేషన్ వచ్చేవరకు ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కమిటీలో చైర్మన్గా ఇన్చార్జ్ మంత్రి సీతక్క -
‘ఉజ్వల’తో మహిళలు, బాలికలకు భరోసా
పాలకుర్తి టౌన్: మహిళలు, బాలికల హక్కులు, భద్రత, ఆరోగ్యం, విద్యపై సమగ్ర అవగాహన కల్పించడమే లక్ష్యంగా ‘ఉజ్వల’ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ‘భవిత మీది–భరోసా మాది’ అనే నినాదంతో రూపొందించిన ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా జిల్లాలోని పాలకుర్తి మండలం గూడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీపీ రాజమహేంద్రనాయక్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ శాఖల సమన్వయంతో ప్రతీ బుధవారం జిల్లాలోని పాఠశాలల్లో ఉజ్వల కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు ఎవరికీ ఇవ్వకూడదన్నారు. అనంతరం కలెక్టర్, డీసీపీ విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడి విద్యార్థులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో ఏసీపీ నర్సయ్య, ఆర్డీఓ వెంకన్న, జిల్లా సంక్షేమ అధికారి కోదండరాములు, సర్పంచ్ హెచ్ఎం శైలజ, మాజీ సర్పంచ్ పుల్లయ్య, వివిధ శాఖల అధికారులు, విద్యార్థుల తల్లిండ్రులు పాల్గొన్నారు. అనంతరం ఈనెల 23న ప్రారంభం కానున్న మండల కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ ఫంక్షన్హాల్ను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. ‘గణతంత్ర’ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి.. జనగామ రూరల్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అధికారులు సమన్వయంతో పనిచేయాలని అందుకు తగిన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ సమీక్షించారు. అనంతరం ఈనెల 28వ తేదీ నుంచి 31 వరకు మేడారం జాతరకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జిల్లాలోనే మొదటిసారిగా గూడూరు ఉన్నత పాఠశాలలో ప్రారంభం -
దుమ్ము రోడ్డుకు స్వస్తి!
జనగామ: బచ్చన్నపేట మండల కేంద్ర పరిధిలోని సుమారు మూడు కిలోమీటర్ల బీటీ నిర్మాణంలో కదలిక వచ్చింది. ‘దుమ్ముతో జీవనం–గుంతల్లో ప్రయాణం’, ‘బిజినెస్లు డౌన్’ శీర్షికన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన వరుస కథనాలకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్తో పాటు నేషనల్ హైవే అథారిటీ ఉన్నతాధికారులు స్పందించారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన రోడ్డు సేఫ్టీ సమీక్షలో కలెక్టర్ బచ్చన్నపేట దుమ్మురోడ్డుపై ఎన్హెచ్ అధికారులను అడిగారు. రోడ్డు నిర్మాణ పనులు త్వరతగతిన పూర్తిచేసి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని సూచించారు. ఆ నిబంధనే అడ్డు.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఎక్కడైనా బైపాస్ పనులు పూర్తి చేసిన తర్వాతనే, ఆర్అండ్బీ పరిధిలోని స్టేట్ రోడ్డును పూర్తి చేయాలనే అగ్రిమెంటు ఉంటుంది. బచ్చన్నపేట బైపాస్ రోడ్డు నిర్మాణంలో పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లడంతో ఏళ్ల తరబడి ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. పోలీస్టేషన్ నుంచి కొడవటూరు కమాన్ సమీపం వరకు సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు జరగాల్సి ఉంది. దీంతో రోడ్డంతా గుంతల మయంగా మారి, కంకర, మట్టిగా మారిపోయింది. విజయవాడ–సిద్దిపేట ప్రధాన రహదారి కావడంతో వాహనాల రద్దీ ఎక్కువే. దీంతో సెకను గ్యాప్ లేకుండా పైకి లేస్తున్న దుమ్ముతో పట్టణం కాస్తా దమ్ముకు నిలయంగా మారిపోయింది. వ్యాపారులు, అన్ని వర్గాలు, ఆయా గ్రామాల నుంచి వచ్చే వ్యాపారులు, ప్రజలు, ప్రయాణికులు దుమ్ముతో వేగలేక చౌరస్తాలో నిలబడలేక అనేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు పడుతున్న కష్టాలను సాక్షి అక్షర రూపంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి బైపాస్ నిర్మాణాలు జరగకుండా, స్టేట్ హైవేలను పూర్తి చేయవద్దనే నిబంధనతో బచ్చన్నపేట బీటీ రోడ్డు ఆగిపోయింది. సాక్షి వరుస కథనాలతో ప్రజలు పడుతున్న కష్టాలను ఎన్హెచ్ఎస్ఈ జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ శాఖ (ఎంఓఆర్టీహెచ్) దృష్టికి తీసుకెళ్లారు. అయితే వచ్చే నెల 17వ తేదీన బైపాస్ నిర్మాణంపై కోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో ఎన్హెచ్ అధికారులు సైతం వేచి చూసే ధోరణిలో ఉన్నారు. అ యితే దుమ్ముతో వందలు, వేలాది మంది ప్రాణాలకు ముప్పు ఉండడంతో ఎన్హెచ్ అధికారుల కోరిక మేరకు సంబంధిత కేంద్ర ప్రభుత్వం శాఖ కూడా పాజిటివ్గా స్పందించినట్లు సమాచారం. ఎన్హెచ్ అధికారులతో మాట్లాడిన కలెక్టర్ ఎంఓఆర్టీహెచ్తో మాట్లాడిన ఎస్ఈ వారంలో మండల కేంద్ర వాసులకు శుభవార్త బైపాస్ నిర్మాణ నిబంధనలను సైతం పక్కన బెట్టి, ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని వారం రోజుల్లో పట్టణ పరిధిలోని రోడ్డు నిర్మాణం కోసం శుభవార్త వినిపిస్తారనే సమాచారం తెలిసింది. వారంలోపు బీటీ రోడ్డు నిర్మాణం కోసం జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ శాఖ నుంచి ఎలాగైనా అప్రూవల్ తీసుకు వచ్చేందుకు ఎన్హెచ్ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బైపాస్ నిర్మాణం కోర్టు పరిధిలో ఉండడంతోనే బచ్చన్నపేట పట్టణంలో బీటీ రోడ్డు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని, ప్రజలు పడుతున్న ఇబ్బందులపై తమ ఉన్నతాధికారులు కేంద్రంతో మాట్లాడగా, కలెక్టర్ సైతం ప్రత్యేక చొరవ చూపిస్తున్నారన్నా రు. వారం రోజుల్లో సానుకూల వార్త వస్తుందన్నారు. -
గురువారం శ్రీ 22 శ్రీ జనవరి శ్రీ 2026
ఈ నెల 9 నుంచి 19 వరకు ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీవరంగల్ రీజియన్ ఆదాయం రూ.26,98,89,147 19న ఒక్క రోజు ఆదాయం రూ.368.31 లక్షలుహన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీకి సంక్రాంతి మంచి ఆదాయాన్ని ఆర్జించి పెట్టింది. పండుగకు ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతోపాటు, ప్రధాన పండుగ కావడంతో వివిధ ప్రాంతాల్లో పిల్లల చదువుల కోసం, ఉపాధి, ఉద్యోగం కోసం నగరాలు, పట్టణాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు సొంతూళ్లకు చేరుకోవడం సహజం. దీంతో సంస్థ ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయడానికి వరంగల్ రీజియన్లో రోజువారీ షెడ్యూల్స్తోపాటు ఈ నెల 9 నుంచి 19 వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. హనుమకొండ–హైదరాబాద్ రూట్తోపాటు ఇతర రూట్లలో రద్దీని బట్టి ప్రత్యేక సర్వీసులు నడిపింది. వీటికి అదనపు చార్జీలు 50శాతం వసూలు చేసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి 2,87,659 కిలోమీటర్లు అదనంగా నడిపి రూ.2,80,65,188 ఆదాయం రాబట్టుకుంది. -
చిన్నరామన్చర్లలో సంపూర్ణ మద్యపాన నిషేధం
బచ్చన్నపేట: మండలంలోని చిన్నరామన్చర్ల గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలుచేస్తున్నట్లు గ్రామ సభలో గ్రామస్తులు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ ఎండీ ఆజామ్ తెలిపారు. బుధవారం గ్రామసభ అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిలో భాగంగా మొదటి గ్రామసభలో పాలకవర్గం, గ్రామస్తులు కలిసి చేసిన తీర్మానం ప్రకారం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నిషేధం అమలులో ఉంటుందన్నారు. నిబంధనలు అతిక్రమించి మద్యం అమ్మిన వారికి లక్ష రూపాయలు జరిమానా విధిస్తామని, అమ్ముతుండగా ఆధారాలతో సహా చూపించిన వారికి రూ.10వేల బహుమతి అందిస్తామన్నారు. అలాగే మద్యపాన నిషేధ కమిటీ కూడా 15 మంది సభ్యులతో వేశామన్నారు. చైర్మన్గా సర్పంచ్ ఆజాం, వైస్ చైర్మన్గా ఉప సర్పంచ్ కత్రి యాదయ్య, కన్వీనర్ అన్నబోయిన రాజులతో పాటు పలువురిని నియమించామన్నారు. -
మండమెలిగె.. జాతర మొదలాయె..
చలిగంజి, పాలు, సారా, బెల్లంపానకం, పవిత్ర శుద్ధిజలాన్ని ధూపంతో నేలపై ఆరగింపు చేస్తున్న పూజారులు బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు సమ్మక్క, సారలమ్మ పూజాసామగ్రితో మేడారం గద్దెల వద్దకు చేరుకుంటున్న పూజారులు సంప్రదాయబద్ధ్దంగా నిర్వహించిన మండమెలిగె పూజలతో మేడారం మహాజాతర పండుగ ఆరంభమైంది. బుధవారం మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో సమ్మక్క–సారలమ్మ పూజారులు అచారసంప్రదాయాలతో అమ్మవార్లకు పూజాకార్యక్రమాలు జరిపారు. దిష్టి తగలకుండా ప్రధాన కూడళ్లలో సోరకాయ, కోడిపిల్ల, మామిడి ఆకులతో తోరణాలు కట్టా రు. రాత్రంతా గద్దెల వద్ద జాగారాలు చేసి సంబురాలు జరిపారు. భక్తులు అధిక సంఖ్య లో హాజరయ్యారు. తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. – ఎస్ఎస్తాడ్వాయి● మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో పూజలు ● అమ్మవార్ల గద్దెల వద్ద జాగారాలతో రాత్రంతా సంబురాలు -
బిజినెస్లు డౌన్!
● బచ్చన్నపేటలో ఊపిరి సలపనివ్వని దుమ్ము! ● అవస్థలు పడుతున్న ప్రయాణికులు, దుకాణాదారులుబచ్చన్నపేట: మండల కేంద్రంలో పాత బస్టాండ్ నుంచి పోలీస్స్టేషన్ వరకు రోడ్డుపై వాహనాలు వెళ్లినప్పుడు విపరీతమైన దుమ్ము లేచి ప్రయాణికులు, చుట్టుపక్కల దుకాణదారులు అవస్థలు పడుతున్నారు. ప్రధాన చౌరస్తా గుండా చేర్యాల, ఆలేరు, జనగామ మూడు పట్టణాలకు వెళ్లేదారులు ఉన్నాయి. ప్రతి నిత్యం ఈ చౌరస్తా గుండా వందల వాహనాలు పలు పట్టణాలకు వెళ్తుంటాయి. అలాగే పలువురు ప్రయాణికులు కూడా పాత బస్టాండ్ నుంచి గ్రామపంచాయతీ వరకు కాలినడకన వెళ్తుంటారు. ఇక్కడ లేచిన దుమ్ము వారి కళ్లలో పడుతున్నది. అలాగే పక్కనే ఉన్న పలు హోటళ్ల వద్దకు కూడా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వస్తుంటారు. అలాగే నిత్యం రోడ్డు పక్కన పెట్టి అమ్ముకునే తినుబండారాల దుకాణాలు, హోటల్లలో తయారు చేసి నిలువ ఉంచే తినుబండారాలపై, ఆహారపదార్థాలపై దుమ్ము చేరి అవి తిన్న పలువురి ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది. అలాగే పండ్లు, మొక్కజొన్న కంకులను అమ్ముకునే వారు కూడా రోడ్డు పక్కనే తోపుడు బళ్లను పెట్టుకుంటారు. పలువురు తరుచూ ఆసుపత్రులకు వెళ్లి వేలలో డబ్బులను వైద్యానికి ఖర్చు చేస్తున్నారు. పలు ప్రాంతాలకు వెళ్లే వారు బస్సుల కోసం ఇక్కడ వేచిఉంటారు. వారు కూడా దుమ్ముతో అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపైకి దుమ్ము రాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని మండల, గ్రామాల ప్రజలు కోరుతున్నారు.శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి చౌరస్తా దగ్గర షాపులో ప్రతీ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటూ అందులోనే నివాసముంటున్నాం. విపరీతమైన దుమ్ముతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. షాపులో ఏమైనా ఆహార పదార్థాలను తినాలన్నా తినలేకపోతున్నాం. తినే సమయంలో మరొకరిని షాపులో ఉంచాల్సి వస్తున్నది. దుమ్ము భయంతో మా షాపులకు వినియోగదారులు కూడా సరిగా రావడం లేదు. –దొంతుల అజయ్కుమార్, ఎలక్ట్రికల్ షాపు, బచ్చన్నపేటదుకాణంలో ఉండలేకపోతున్నాం చౌరస్తా వద్ద ఉన్న దుకాణాలకు విపరీతమైన దుమ్ము వస్తుండడంతో మాస్కు లేకుండా ఉండలేకపోతున్నాం. పొద్దంతా మాస్క్లను వినియోగిస్తే తొందరగా అలసిపోతున్నాం. దుకాణాల్లో ఉన్న నూతన వస్తువులపై దుమ్ము చేరి అవి పాతవిగా అగుపిస్తున్నాయి. ప్రతి రోజు వాటిని శుభ్రం చేయడానికి చాలా సమయం అవుతున్నది. –గడ్డమీది రామాంజనేయులు, బచ్చన్నపేట హోటల్లోకి గిరాకీ రావడం లేదు చౌరస్తా పక్కనే ఉన్న మా హోటల్లోకి విపరీతమైన దుమ్ము చేరడంతో తినుబండారాలను, టిఫిన్ చేయడానికి వినియోగదారులు రావడం లేదు. దీంతో అడ్డా కిరాయి మీద పడుతున్నది. ఒక్కో రోజు తయారు చేసిన టిఫిన్లు అమ్ముడపోక నష్టం వాటిల్లుతోంది. భారీ వాహనాలు వచ్చినప్పుడు దమ్ము సలుపనీయకుండా దుమ్ము వస్తున్నది. దీనితో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నాం. –నర్సింహ, హోటల్, బచ్చన్నపేటబంద్కు పిలుపునిస్తాం రోడ్డు మరమ్మతు విషయంలో అధికారులు, నాయకులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అఖిలపక్ష పార్టీల జేఏసీ ఆధ్వర్యంలో బచ్చన్నపేట బంద్కు పిలుపునిస్తాం. ఈ గుంతల రోడ్డుపై రోజుకో ప్రమాదం జరుగుతున్నా ఎవ్వరికి చీమకుట్టినట్లు కూడా అవడం లేదు. –ఇర్రి రమణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా మాజీ కోఆర్డినేటర్ -
ఏఎల్ఎం సాహసం
● చెరువులో ఈదుకుంటూ వెళ్లి విద్యుత్ పనుల మరమ్మతుస్టేషన్ఘన్పూర్: మండలంలోని కొత్తపల్లి గ్రామంలో అగ్రికల్చర్ ఫీడర్కు విద్యుత్సరఫరాకు అంతరాయం ఏర్పడంతో అసిస్టెంట్ లైన్మన్(ఏఎల్ఎం) సామల అశోక్ చెరువు మధ్యలో ఉన్న విద్యుత్ పోల్ వద్దకు నీటిలో ఈదుకుంటూ వెళ్లి మరమ్మతు చేసి ఔరా అనిపించాడు. ఈ సంఘటన మంగళవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కొత్తపల్లి గ్రామంలో 11 కేవీ అగ్రికల్చర్ ఫీడర్ ఇన్సులేటర్ పగిలి లైన్ బ్రేక్డౌన్ అయింది. అయితే విషయం తెలుసుకున్న విద్యుత్సిబ్బంది చెరువు మధ్యలో ఉన్న పోల్పై ఇన్సులేటర్ మార్చేందుకు భయపడ్డారు. అయితే అసిస్టెంట్ లైన్మన్ సామల అశోక్ ధైర్యంతో నడుముకు పైగా ఉన్న నీటిలో ఈదుకుంటూ వెళ్లేందుకు సిద్దమయ్యాడు. ఎర్త్ రాడ్తో పాటు మార్చాల్సిన ఇన్సులేటర్ను తీసుకుని చెరువులోకి ఈదుకుంటూ వెళ్లి పోల్ను ఎక్కి మరమ్మతు చేసి ఇన్సులేటర్ను మార్చాడు. దాంతో కొత్తపల్లి రైతులకు విద్యుత్ సరఫరా అంతరాయం సమస్యను పరిష్కరించాడు. కాగా విషయం తెలుసుకున్న ఏఈ పి.శంకర్తో పాటు తోటి విద్యుత్ సిబ్బంది, విద్యుత్ వినియోగదారులు ఏఎల్ఎం అశోక్ను అభినందించారు. -
సర్వం సిద్ధం
ఎస్ఎస్ తాడ్వాయి : మహాజాతరలో భాగంగా మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో 21న (బుధవారం) జరగనున్న మండమెలిగె పండుగకు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు వారాలముందు గుడిమెలిగె పండుగతో తొలిఘట్టం పూజలు ప్రారంభం కాగా, సరిగ్గా వారం రోజుల ముందు నిర్వహించే ఈ మండమెలిగె పండుగతో మహాజాతర పూజా కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. బుధవారం ఉదయం మేడారం, కన్నెపల్లి వనదేవతల ఆలయాల్లో సమ్మక్క, సారలమ్మ పూజారులు ఆలయాలు, అమ్మవారి పూజా సామగ్రి (మువ్వలు, గంటలు, వస్త్రాలు, ఊత కొమ్ములు) శుద్ధి చేయనున్నారు. ముగ్గులతో ఆడపడుచులు సుందరంగా అలంకరిస్తారు. పూజారులు ఉదయాన్నే తలంటుస్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరిస్తారు. ఆలయాల్లో ప్రత్యేకంగా ధూపదీపాలు వెలిగించి ఆచారసంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. మేడారం అష్ట దిగ్బంధం.. మండమెలిగె పండుగ సందర్భంగా పూజారులు మేడారాన్ని బుధవారం అష్ట దిగ్బంధం చేయనున్నారు. ముందుగా నిష్టతో నులకతాడు తయారు చేసి దానికి మామిడి ఆకుల తోరణాలు కడతారు. మేడారం, కన్నెపల్లి గ్రామాల్లో అమ్మవార్లను తీసుకువచ్చే ప్రధాన రహదారుల వద్ద బూర్కకర్ర(ముళ్లతో కూడుకున్న పచ్చికర్రలు)లకు మామిడి తోరణాలు కట్టి నిలుపుతారు. ఎలాంటి దుష్టశక్తుల చూపు పడకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని పూజారులు ఆనవాయితీగా నిర్వహించనున్నారు. ప్రతీ ఇంటా పండుగే.. పూజారులు కుటుంబాలు, స్థానిక ఆదివాసీలు, గ్రామస్తులు కూడా ఆలయాలను దర్శించుకొని ఇళ్లలో కూడా పండుగ నిర్వహించుకోనున్నారు. భక్తులు కూడా భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఉదయంనుంచి మధ్యాహ్నం వరకు మండమెలిగె పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం అర్ధరాత్రి సమ్మక్క పూజారులు ఆలయంనుంచి అమ్మవారి పూజాసామగ్రి, వస్త్రాలను తీసుకొని గద్దెల వద్దకు వెళ్లనున్నారు. సమ్మక్క గద్దెను అలికి ముగ్గులు వేసి పూజా సామగ్రిని గద్దైపె ఉంచి రాత్రంతా డోలు వాయిద్యాల నడుమ జాగారం నిర్వహిస్తారు. గురువారం ఉదయం సమ్మక్క గద్దెలపై ఉంచి అమ్మవారి వస్త్రాలను తీసుకొని సమ్మక్క పూజారులు గుడికి తిరుగుప్రయాణమవుతారు. అనంతరం అమ్మవారికి మరోసారి పూజలు నిర్వహించి యాట మొక్కు చెల్లిస్తారు. సారలమ్మ పూజారులు కూడా ఇలాగే గద్దెనుంచి కన్నెపల్లిలోని అమ్మవారి గుడి చేరుకుంటారు. అక్కడా మళ్లీ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గుడిమెలిగె పండుగ ఒక్కరోజుతో ముగిస్తే.. మండమెలిగె పూజా కార్యక్రమాలు మాత్రం రెండు రోజులపాటు జరగడం విశేషం.‘మండమెలిగె’కు నేడు మేడారం దిగ్బంధం భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు -
మేడారం జాతరకు 130 ఆర్టీసీ బస్సులు
జనగామ: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసింది. జనగామ డిపో ఆధ్వర్యంలో ప్రెస్టన్ మైదానంలో ఏర్పాటు చేయనున్న తాత్కాలిక షెల్టర్ నుంచి ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మేడారం వరకు 130 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని డిపో మేనేజర్ ఎస్.స్వాతి మంగళవారం తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఈ బస్సులు మేడారం అమ్మవారి గద్దెల వరకు నడుస్తాయన్నారు. మహిళల ప్ర యాణానికి మహాలక్ష్మి స్కీమ్ ఈ ప్రత్యేక బస్సుల్లో కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. జనగామతో పాటు పరి సర ప్రాంతాల భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 7382 926139 నెంబర్ను సంప్రదించవచ్చని తెలిపారు. -
నిజాలు బయటపెట్టినందుకే వేధింపులు
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ: కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గాలను ప్రశ్నించడంతో పాటు అధికార పార్టీ అవినీతిని బయటపెడుతున్నందుకే మాజీమంత్రి హరీశ్రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో వేధించాలని ప్రభుత్వం చూస్తోందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వ ర్రెడ్డి ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బొగ్గు స్కాంపై సీబీఐ న్యాయ విచారణ జరిపించాలంటూ హరీశ్రావు లెటర్ రాసిన దానికి ప్రతికారంగానే టెలిఫోన్ ట్యాపింగ్ కేసును ప్రభుత్వం తెరమీదకు తెచ్చిందన్నారు. తనకు సంబంధం లేదంటూ హైకోర్టు, సుప్రీంకోర్టులో హరీశ్రావు పిటిషన్ వేయగా, అనుకూలంగా కోర్ట్ తీర్పులు ఉన్నప్పటికీ పోలీసులు విచారణకు పిలువడం ఏంటన్నారు. రాజకీయ కక్ష సాధింపులు మానుకోకపోతే రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
పోరు ప్రతిష్టాత్మకం!
జనగామ: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో జనగామలో బీఆర్ఎస్, స్టేషన్ఘన్పూర్లో కాంగ్రెస్ అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకోగా, పాలకుర్తిలో రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ ఎన్నికల వేడి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేదికపై మరింత రగులుతోంది. జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్ పురపాలికలను దక్కించుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా, అదే పట్టుదలతో కాంగ్రెస్ సర్వం సిద్ధం చేసుకుంటోంది. ఇదిలా ఉంటే బీజేపీ కూడా తన వర్గీకరణ బలోపేతంపై దృష్టి సారించి రోజువారీ సమావేశాలతో వ్యూహాలను ఖరారు చేస్తోంది. ప్రజాబలం ఉన్న అభ్యర్థులను గుర్తించేందుకు మూడు పార్టీలు కూడా వార్డు స్థాయిలో విస్తృత కసరత్తు ప్రారంభించాయి. ఆశావహుల నుంచి అప్లికేషన్లు స్వీకరించి, వార్డుల వారీగా బేరీజు వేసుకుంటూ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నవారినే ఫైనల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. అయితే ఒక్కో వార్డులో ఇద్దరు లేదా ముగ్గురు ఆసక్తి చూపడం పార్టీలను కొంత ఇబ్బందుల్లో పడేస్తోంది. ఓట్లు చీలకుండా వారిని బుజ్జగించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చర్చలు జరుపుతూ.. టికెట్ ఇవ్వని వారికి ఎలక్షన్ పనులు అప్పగించే పద్ధతిని అనుసరిస్తున్నారు. అయినా కొన్ని వార్డుల్లో రెబల్ సమస్య తప్పదన్న భావనతో ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు సమీక్షలు, రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎం కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీతో పొత్తు కుదుర్చుకునే ప్రయత్నం చేస్తుండటం ఎన్నికలను మరింత హోరాహోరీగా మార్చే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చైర్మన్ రేసులో ప్రముఖులు చైర్మన్ రేస్పై రాజకీయ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది. జనగామ మున్సిపాలిటీలో కాంగ్రెస్ నుంచి స్థానిక నేతలతో పాటు కొన్ని ప్రముఖ పేర్లు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్లో కూడా ఇద్దరు ప్రధాన నేతలు ముందు వరుసలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. స్టేషన్ఘన్పూర్లో సైతం చైర్మన్ పదవిపై రెండు పార్టీలు ఆచితూచి అడుగులు వేయనున్నాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లో ప్రస్తుతం చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినప్పటికీ, పోలింగ్ పూర్తయ్యేవరకు గోప్యంగా ఉంచాలని ఆలోచన చేసినట్లు సమాచారం. రెండు మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్ స్థానంపై ఇతర వర్గాలు దృష్టిసారించాయి. రిజర్వేషన్ల ప్రభావంతో కొన్ని వార్డుల్లో ఆశావహులకు సంబంధించి ఇంకా పోటీపై స్పష్టతకు రాలేక సందిగ్ధంలో ఉన్నారు. ప్రధాన పార్టీలు అనధికారికంగా కొందరికి అభ్యర్థిత్వాన్ని సూచించడంతో వారు ఇప్పటికే ఇంటింటా ప్రచారం మొదలుపెట్టారు. మరోవైపు అధిష్టానం తమవైపే ఉందని, టికెట్ తమదేనంటూ మరో గ్రూప్ కూడా ప్రచారం చేస్తుండటంతో నోటిఫికేషన్, షెడ్యూల్ విడుదల కాకముందే కొన్ని వార్డుల్లో ఎలక్షన్ హీట్ పీక్ స్థాయికి చేరేలా చేస్తోంది. జనగామ, స్టేషన్ఘన్పూర్ రెండు చోట్ల అన్ని పార్టీలు బలమైన వ్యూహాలతో హోరాహోరీగా బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుని. నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నాయి. బీసీ జనరల్కు జనగామ మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ వైస్ చైర్మన్పై ఇతర వర్గాల గురి చైర్మన్ రేసులో ప్రముఖుల పేర్లు.. రెబల్స్కు బుజ్జగింపు.. వినకుంటే ఓట్లు చీలకుండా ప్లాన్ స్టేషన్లోనూ అనధికారికంగా గ్రీన్సిగ్నల్.. ప్రచారంలోకి అభ్యర్థులుబడ్జెట్పై అంచనా..మున్సిపల్ బరిలో పోటీ చేస్తే బడ్జెట్ ఎంత అనే దానిపై అభ్యర్థులు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. గతంలో పోటీ చేసిన అభ్యర్థులు సొంతంగా నిధుల ఖర్చుపై ఓ అంచనాకు వస్తుండగా, కొత్తగా ఎలక్షన్లకు వచ్చేవారు మాత్రం అనుభవం ఉన్న నాయకులను సంప్రదిస్తూ వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎన్నికల్లో చిన్ని పంచాయతీ నుంచి మేజర్ వరకు ఎంత ఖర్చు చేశారనే దానిపై ఇన్పుట్స్ తీసుకుంటూ.. వార్డుల్లో ఓటుకు ఎంత.. రోజువారి ఖర్చులు ఏమేరకు అవుతా యనే దానిపై నిధుల సమీకరణలో బరిలో నిలిచే అభ్యర్థులు ఉన్నారు. డబ్బులను ముందుగానే వార్డుల పరిధిలోని మూడు, నాలుగు చోట్ల భద్రపరిచి, ఎన్నికల కమిషన్ కంటబడకుండా అక్కడ నుంచి పంపకాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. పలు వార్డులు మినహాయిస్తే కొన్ని వార్డుల్లో రూ.20 లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఖర్చు కావొచ్చని అంచనా వేస్తున్నట్లు సమాచారం. -
విద్యుత్ లక్ష్యాలను వేగంగా పూర్తిచేయాలి
జనగామ: విద్యుత్ లక్ష్యాలను గడువులోగా పూర్తి చేసేందుకు అంకితభావంతో పని చేయాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో ఇంజనీర్లతో గత నెలలో పూర్తయిన పనులపై సమీక్షించడంతో పాటు ప్రస్తుత లక్ష్యాలపై దిశానిర్దేశం అందించారు. అనంతరం ఎస్ఈ మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలో ఓవర్లోడ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలన్నారు. వినియోగదారులు, రైతులు దళారులను నమ్మొద్దని, ఎలాంటి చెల్లింపులైనా మీసేవా లేదా ఆన్లైన్లో మాత్రమే చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలపై టోల్ఫ్రీ నెంబర్ 1912కు కాల్ చేయాలని తెలిపారు. సమీక్షలో డీఈ లక్ష్మినారాయణరెడ్డితో పాటు ఇంజనీర్లు ఉన్నారు. కేసుల విచారణ పారదర్శకంగా జరగాలిరఘునాథపల్లి: పోలీస్స్టేషన్లో నమోదయ్యే కేసుల విచారణ పారదర్శకంగా ఉండాలని వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఆయన రఘునాథపల్లి పోలీస్స్టేషన్ రికార్డులను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల రికార్డు గది, నేరాల రికార్డులు, సంబంధిత వాహనాలు, పార్కు చేసిన స్థలం, స్టేషన్లోని ఇతర రికార్డులను పరిశీలించారు. పరేడ్ ఇన్స్పెక్షన్, మెన్ అండ్ ఆఫీసర్ టర్న్అవుట్, మెన్ కిట్ తదితరాలను పరిశీలించారు. కార్యక్రమంలో జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్రెడ్డి, ఎస్సై దూదిమెట్ల నరేష్, ఏఎస్సై బత్తిని కట్టమల్లు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్ ఉన్నారు. రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత స్టేషన్ఘన్పూర్: రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా స్టేషన్ఘన్పూర్ పోలీస్స్టేషన్లో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఏసీపీ భీమ్శర్మ, సీఐ జి.వేణు, ఎస్ఐలు వినయ్కుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సాధికారతకు శిక్షణ దోహదంకాళోజీ సెంటర్: సాధికారత సాధించడానికి శిక్షణ దోహదపడుతుందని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి రాంనివాస్ అన్నారు. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లు, కేర్ టేకర్లకు శిక్షణ కార్యక్రమం మంగళవారం రెండోరోజూ హనుమకొండ హరిత హోటల్లో కొనసాగింది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ.. సమస్య పరిష్కార నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని, వృత్తి నైపుణ్యం, సామర్థ్యాలను బలోపేతం చేయాలని సూచించారు. నిట్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ విభాగం నిర్మాణాత్మక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ ద్వారా బాలికలకు నాణ్యమైన విద్యనందించడానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర అసిస్టెంట్ జెండర్ కోఆర్డినేటర్ సతీశ్, మాస్టర్ ట్రెనర్లు కృష్ణవేణి, సరస్వతి, జ్యోతి, జనగామ స్పెషల్ ఆఫీసర్ గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన వైద్య సేవలు అందించాలి జనగామ రూరల్: ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైధ్యాధికారి డాక్టర్ కె.మల్లికార్జున్రావు అన్నా రు. మంగళవారం మండలంలోని ఓబుల్కేశవాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ల్యాబ్, ఫార్మసీ విభాగాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి ప్రవీణ్ కుమార్, ప్రభాకర్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
‘పది’లో ప్రథమస్థానంలో నిలవాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ రూరల్: పదో తరగతి పరీక్షలకు పక్కాగా యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్లాలని నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అఽన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో విజయోస్తు 2.0 యాక్షన్ ప్లాన్, స్పెషల్ క్లాసెస్, సర్వే, దిక్సూచి ఆచరణ, మాక్ టెస్ట్పాఠశాల సందర్శనలు, అభ్యాసదీపికల పంపిణీ, హాజరు, ప్యానెల్ ఇన్స్పెక్షన్ టీమ్స్, ఇతర బోధన, బోధనేతర అంశాల మీద కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్, విద్యాశాఖ అధికారి పింకేశ్ కుమార్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ..పదో తరగతి ఫలితాల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని, పీఎం పోషణ కార్యక్రమంలో మన కార్యక్రమం డేటా అప్లోడ్ చేసి ప్రథమ స్థానంలో ఉంచాలన్నారు. పాఠశాలలకు కొత్తగా ఎన్నికై న సర్పంచ్లను ఆహ్వానించాలని పాఠశాల అభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేయాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తేజస్వి, విద్యాశాఖ ఏడీ సత్యనారాయణమూర్తి, శ్రీనివాస్, నాగరాజు, రవికుమార్, చంద్రభాను వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వడ్డీలేని రుణాల పరిమితి పెంచాలి
● మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్జనగామ: మహిళల ఆర్థిక అభివృద్ధిని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అమలుచేస్తున్న వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.20 లక్షల వరకు పెంచాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో 354 స్వయం సహాయక సంఘాలకు రూ.1,03,67,691ల వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రుణాలు తీసుకుని ఆర్థిక బలోపేతమవుతూ, తిరిగి చెల్లించడంలో మనమే ముందువరుసలో ఉన్నామన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్క మహిళతో పాటు దివ్యాంగులు కూడా మహిళా సంఘంలో సభ్యత్వం తీసుకునేందుకు ప్రభుత్వం సవరణ చేసిందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరాం, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, మెప్మా పీడీ హర్షవర్ధన్, పట్టణ స్వయం సహాయక సభ్యులు పాల్గొన్నారు. -
పల్లెపాలనపై పట్టుసాధించాలి
● పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి శాఖ కమిషనర్ శ్రుతిఓజా ● నూతన సర్పంచ్లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంజనగామ రూరల్: గ్రామ అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రుతి ఓజా అన్నారు. నూతనంగా ఎన్నికై న సర్పంచ్లకు గ్రామ పంచాయతీ పాలన, విధులు, అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై ఐదు రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, జెడ్పీ సీఈఓ మాధురి, ఇన్చార్జ్ డీపీఓ వసంతతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మొదటి విడతలో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల సర్పంచ్లు హాజరయ్యారు. ఈసందర్భంగా కమిషనర్ శ్రుతి ఓజా మాట్లాడుతూ.. గ్రామాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలంటే సర్పంచ్లు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. పంచాయతీరాజ్చట్టంలో సర్పంచ్ లకు పొందుపరిచిన అధికారాలు, విధులు తదితర అంశాలను శిక్షణలో భాగంగా క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సర్పంచ్లది ప్రధాన పాత్ర ఉందన్నారు. శిక్షణ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ట్రైనర్స్, సర్పంచ్లు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి స్టేషన్ఘన్పూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలు అవగాహన కల్గి ఉండాలని, పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రుతి ఓజా సూచించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్తో కలిసి కమిషనర్ మండలంలోని రంగరాయగూడెం, మీదికొండ గ్రామాల్లో సోమవారం పర్యటించారు. రంగరాయగూడెం గ్రామంలో పీఎంకేఎస్వై పథకం కింద నిర్మించిన చెక్డ్యామ్లను పరిశీలించారు. చెక్డ్యామ్ల నిర్మాణం నాణ్యతతో చేశారా అని తనిఖీ చేశారు. అనంతరం మీదికొండ గ్రామంలో పీఎంకేఎస్వై పథకం లబ్ధిదారులతో సమావేశమయ్యారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు అందించే పౌష్టికాహారాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వసంత, అసిస్టెంట్ డీఆర్డీఓ చంద్రశేఖర్, డీఎల్పీఓ వెంకట్రెడ్డి, ఎంపీడీఓ నర్సింగరావు, ఏపీఎం ప్రేమయ్య తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కూలీల వేతనాలపై ఆరా రఘునాథపల్లి: మండలంలోని నిడిగొండలో కొనసాగుతున్న జాతీయ ఉపాధి పనులను పంచాయతీ రాజ్ కమిషనర్ శ్రుతి ఓజా, కలెక్టర్ రిజ్వాన్బాషా పరిశీలించారు. మట్టి పనులను పరిశీలించి కూలీలతో నేరుగా మాట్లాడారు. దినసరి వేతనం రూ.307 కూలీ అందుతుందా? పనుల వద్ద ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. -
రోడ్డు భద్రత అందరి బాధ్యత
లింగాలఘణపురం: రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, ప్రాణాలు కోల్పోయిన వారికే ఆ బాధ తెలుస్తుందని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. సోమవారం మండలంలోని నెల్లుట్ల బ్రిడ్జి వద్ద రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని ఎస్సై శ్రావణ్కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీసీపీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. కార్యక్రమంలో సీఐ శ్రీని వాస్రెడ్డి, ఎన్హెచ్ అధికారులు, ఆర్టీఓ అధికా రులు, బాధిత కుటుంబాలతో పాటు నెల్లుట్ల సర్పంచ్ నర్సింగ రామకృష్ణ మాట్లాడుతూ నెల్లుట్ల బ్రిడ్జి వద్ద రోడ్డు వెడల్పు చేసి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంగ్ల పెడగాగి పోటీల్లో జాతీయస్థాయికి ఎంపిక జనగామ రూరల్: ఈనెల17వ తేదీన ఎస్ఈఆర్టీ హైదరాబాద్లో జరిగిన సమృద్ధి స్కీం రాష్ట్ర స్థాయి ఆంగ్ల పెడగాగి పోటీల్లో మండలంలోని జెడ్పీహెచ్ఎస్ ఎర్రగొల్లపహడ్ ప్రధానోపాధ్యాయుడు సీహెచ్. వెంకటేశ్వర్లు రాష్ట్రంలోనే టాపర్గా నిలిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఉపాధ్యాయులు పాల్గొనగా ముగ్గురు మాత్రమే జాతీయస్థాయికి ఎంపిక అయ్యారు. వీరు ఈనెల 26న ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. జాతీయస్థాయికి ఎంపికైన వెంకటేశ్వర్లును సోమవారం పాఠశాల ఉపాధ్యాయ బృందం సన్మానించింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి. హరిలాల్, వాణిశ్రీ, సత్తిరెడ్డి, సత్తయ్య, రామ్మోహన్, జంపయ్య, నరేందర్రెడ్డి, సుధీర్బాబు, డాక్టర్ భాస్కర్, విక్రమ్ పాల్గొన్నారు. బుగులు వెంకన్న వేలంపాటల ఆదాయం రూ.21.25లక్షలు చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన వివిధ దుకాణాలకు 2026–27 సంవత్సరానికి గాను సోమవారం వేలం పాటలు నిర్వహించగా రూ.21.25 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ శ్రీధర్రావు తెలిపారు. ఉదయం ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ భువనగిరి విభాగం పరిశీలకుడు నిఖిల్ పర్యవేక్షణలో వేలం నిర్వహించారు. కొబ్బరికాయలు, పూజ సామగ్రి అమ్ముకోవడం, గండదీపం వద్ద నూనె, కొబ్బరి ముక్కలు పోగు చేసుకునేందుకు స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడెంకు చెందిన మొలుగూరి హరికిషన్ రూ. 14 లక్షలకు దక్కించుకున్నాడు. అంగడిలో పశువుల క్రయవిక్రయాలు, రహదారి రుసుం, దుకాణా పన్నులు వసూలు చేసుకోవడానికి పాలకుర్తికి చెందిన వీరమనేని హనుమంతు రూ.7.25 లక్షలకు దక్కించుకున్నాడు. జూనియర్ అసిస్టెంట్ మోహన్, అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు పాల్గొన్నారు. -
మా గోస చూడండి సారూ!
జనగామ రూరల్: కుమారులు పట్టించుకోవడం లేదని బతికేదెట్లా అని తల్లిదండ్రులు, వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నామని చిరుద్యోగులు, భూమి డబ్బులు పడడం లేదని రైతులు పలు సమస్యలతో సోమవారం గ్రీవెన్స్సెల్కు వచ్చారు. ‘మా గోస చూడండి సారూ.. ’అంటూ అదనపు కలెక్టర్కు మొర పెట్టుకున్నారు. ఏళ్ల తరబడి ప్రదక్షిణలు తప్పడం లేదని ప్రజల అవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్ షాలోమ్ తదితర అధికారులు ప్రజల నుంచి 20 దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజాసమస్యలను పరిష్కరించడానికి అధికారులు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలకు వెంటనే పరిష్కారం జరగాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరామ్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధుల పేర్లు రాగీరు యశోద, సత్యనారాయణ. బచ్చన్నపేట మండలం అలీంపూర్ గ్రామం. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరికీ వివాహమైంది. తమకు ఉన్న 9 ఎకరాల భూమిని ఇద్దరు కుమారుల పేరుమీద పట్టా చేయించారు. కొడుకులు అన్నం పెట్టడం లేదని, బాగోగులు చూసుకోవడం లేదని వాపోతున్నారు. ఎకరం భూమిని తమ పేరిట పట్టా చేయాలని వినతిపత్రం అందజేశారు. బైపాస్ రోడ్డులో డబ్బులు ఇవ్వడం లేదు శామీర్పేట గ్రామం వద్ద బైపాస్ రోడ్డులో సర్వే నెంబర్ 311 నెంబర్ బదులుగా 312 నెంబర్ పడడంతో నాకు రావల్సిన నష్టపరిహారం అందడం లేదు. అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదు. కొంత మంది బెదిరిస్తున్నారు. వారసత్వంగా వస్తున్న సాగు భూమి నాది, విచారణ చేపట్టి న్యాయం చేయాలి. –గుజ్జుల నాగయ్య, శామీర్పేట, జనగామ కుమారులు పట్టించుకోవడం లేదు ఎలా బతికేది? ముగ్గురు పిల్లలను ఎలా సాకేది? సమస్యల పరిష్కారానికి ‘గ్రీవెన్స్’కు తరలొచ్చిన ప్రజలు వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్లు -
దుమ్ముతో జీవనం..గుంతల్లో ప్రయాణం
జనగామ: జనగామ–సిద్దిపేట జాతీయ రహదారి అద్దంలా మెరిసిపోతున్నా..అందులో బచ్చన్నపేట మాత్రం దుమ్ముతో ఊపిరి పీల్చుకోలేకపోతోంది. మండల కేంద్రం మధ్యలో మూడు కిలోమీటర్ల రహదారి పనులు నిలిచిపోయి సంవత్సరాలు గడుస్తుండగా, ఇప్పుడు పరిస్థితి ఇలా మారింది. అక్కడ ప్రజలు రోడ్డు మీదే కాదు, ఆరోగ్యంతో, ప్రాణాలతో కూడా పోరాడుతున్నారు. మా ఆరోగ్యం, ప్రాణాలు మీ చేతుల్లోనే.. రోజూ వందల ట్రక్కులు దూసుకెళ్తుంటే దుమ్ము సుడిగుండాలు ఎగసిపడి టౌన్ మొత్తాన్ని కప్పేస్తోంది. వ్యాపారులకు దుకాణాల్లో కస్టమర్లు కనిపించడం కాదు...దుమ్మే ముందుగా కనిపిస్తోంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు శ్వాస తీసుకోవడం కష్టమై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఆస్తమా, దగ్గు, అలెర్జీలతో బచ్చన్నపేట కొత్త పేషెంట్లకు నిలయంగా మారిపోతోంది. ‘రోజూ దుమ్ము మింగి బతుకుతున్నాం.. ఇంత దుస్థితిలో జీవితం ఎలా సాగుతుందో చెప్పండి సార్..’ అంటూ ఓ వ్యాపారి కళ్లలో నీళ్లు పెట్టుకుని చెబుతున్నాడు. మరొకరు ‘కంకర రాళ్లు ఎగిరి పిల్లలమీద పడతా యేమో అనిపిస్తోంది.. రోడ్డుమీదికి వెళ్లడం కూడా భయంగా మారింది’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. బైపాస్ వివాదం ఏది ఏమైనా సరే బాధ మాత్రం ప్రజలదే. వివాదం పూర్తయ్యే వరకై నా తాత్కాలిక రోడ్డు, దుమ్ము నియంత్రణ చర్యలు చేపట్టాలని ఎన్నోసార్లు విన్నవించినా స్పందన లేదని మండిపడుతున్నారు. ‘కలెక్టర్ గారూ మా ఆరోగ్యం, ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. ఒక్కసారి మాపై దృష్టి సారించి ఈ రోడ్డు సమస్యను పరిష్కరించండి. మాకు రోడ్డు కావాలి.. బతికే అవకాశం ఇవ్వాలి’ అని తీవ్ర మనోవేధనతో బతిమిలా డుతున్న ఈ గ్రామం ప్రజల దుఖం తీర్చాలని మానవతా వాదులు సైతం కోరుతున్నారు. ప్రజల పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు ఏర్పడినా.. సమస్యల పరిష్కారం కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. బచ్చన్నపేటలో 3 కి.మీ. మేర నిలిచిన రోడ్డు పనులు ఊపిరి ఆడనివ్వని దుమ్ముతో ఇబ్బందులు శ్వాసకోశ వ్యాధుల బారిన ప్రజలు గుంతల రోడ్డుతో ప్రమాదాలు రోడ్డును బాగు చేసి ఆరోగ్యాలు కాపాడాలని కలెక్టర్కు ప్రజల వినతి -
‘హిమ’దారుల్లో..ఎన్నెన్నో అందాలు!
ఇటీవలి జిల్లాలో వాతావరణం చిత్రవిచిత్రంగా మారిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. తెల్లవారు జామున తీవ్ర చలి, ఆకాశాన్ని కప్పేస్తున్న మంచుతో తెల్లవారుజాము 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు దుప్పటి విడిస్తే వణకాల్సి వస్తోంది. ఇక 11గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మండే ఎండలు ఉక్కిబిక్కిరి చేస్తున్నాయి. చలితో పాటు ఆకస్మిక ఎండలు పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావితం చేస్తున్నాయి. దగ్గు, జలుబు, జ్వరాలు కేసులు పెరుగుతుండగా ఆసుపత్రుల్లోకి వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. –జనగామ -
మంగళవారం శ్రీ 20 శ్రీ జనవరి శ్రీ 2026
ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుటుంబ సమేతంగా సోమవారం తెల్లవారుజామున దర్శించుకుని తొలిమొక్కులు చెల్లించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులతో కలిసి గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణ పైలాన్ను ప్రారంభించారు. ఆదివారం రాత్రి మేడారంలో బస చేసిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉదయం 7 గంటలకే హరిత హోటల్నుంచి అమ్మవార్ల గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. వీరికి నూతనంగా నిర్మించిన ప్రధాన ఆర్చ్ నుంచి ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయంలో దేవాదాయ శాఖ అధికారులు, పూజారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా మంత్రులతో కలిసి సీఎం రేవంత్ పైలాన్ను ప్రారంభించారు. ఉదయం సూర్య కిరణాలు పడుతున్న సమయంలో సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను దర్శించుకుని తొలి మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం రేవంత్రెడ్డి స్వయంగా అమ్మవార్లకు చీర పెట్టి, పూలమాల వేశారు. పూజారులు, మంత్రి సీతక్క.. సీఎం రేవంత్రెడ్డి, కేబినెట్ మంత్రులకు కంకణాలు కట్టగా, పూజారులు అమ్మవార్ల పసుపు, కుంకుమ బొట్టుపెట్టారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి, కుటుంబ సభ్యులు, మంత్రులకు పూజారులతో కలిసి మంత్రి సీతక్క చీర, సారె, పట్టువస్త్రాలు అందించి ప్రసాదం(బెల్లం) బహూకరించారు. సీఎం రేవంత్రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రివర్గం, అధికార గణమంతా రెండు రోజులు మేడారంలోనే పర్యటించడంతో ముందస్తుగానే జాతర మొదలైందన్న సందడి కనిపించింది. మహిళలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ చీరలు కట్టుకుని హాజరయ్యారు. పైలాన్ వద్ద మూడు రాతి శిలలు.. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ ప్రారంభోత్సవానికి మూడు రాతి శిలలతో ఆదివాసీ సంప్రదాయంగా పైలాన్ ఏర్పాటు చేశారు. అందులో ఒక రాతి శిలపై సీఎంతోపాటు, మంత్రుల పేర్లు చెక్కగా మరో రాతిపై పూజారులు, మరోదానిపై దేవాదాయశాఖ, ఇంజనీరింగ్ ఉన్నతాధికారుల పేర్లను చెక్కించారు. ఈ పైలాన్ వద్ద అధికారులు, భక్తులు ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. గద్దెలకు నూతన శోభమేడారం సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను రకరకాల పూలతో అలంకరించడంతో నూ తన శోభ సంతరించుకుంది. అమ్మవార్ల గద్దెలు, సాలహా రం చుట్టూ ఆర్చ్ ద్వారాలను పూలతో అలంకరించారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్రెడ్డి.. వనదేవతలను ద ర్శించుకుని తిరిగి వస్తున్న సమయంలో క్యూలైన్లో ఉన్న భక్తులతో ఆప్యాయంగా పలకరించారు. సీఎంను చూసిన భక్తులు జై రేవంత్రెడ్డి, జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. మొక్కుల అనంతరం సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్లో నిలబడి భక్తులకు అభివాదం చేశారు.మంత్రి ధనసరి సీతక్క -
చిల్పూరు ఆలయంలో నేడు వేలంపాటలు
చిల్పూరు: చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించి వివిధ దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ఈనెల 19(సోమవారం) మధ్యాహ్నం 11 గంటలకు దేవస్థానం కార్యాలయంలో వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ శ్రీధర్రావు తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. వేలంలో కొబ్బరికాయలు, పూజ సామగ్రి, అంగడిలో పశువుల క్రయ విక్రయాలు, తలనీలాల సేకరణ తదితర వాటిపై బహిరంగ వేలం, సీల్డ్ టెండర్లు నిర్వహిస్తున్నందున వేలంలో పాల్గొనేవారు సకాలంలో హాజరు కావాలని కోరారు. జనగామ: పట్టణంలోని బాణాపురం హనుమాన్ ఆలయంలో ఆదివారం 51వ గీతా యజ్ఞం పూజాకార్యక్రమం జరిగింది. ఆలయ ప్రతినిధి విజయ్కుమార్ బజాజ్ మాట్లాడుతూ.. కర్మ, జ్ఞానం, భక్తితో మోక్షం సాధించడం సులభం కాదు, ధర్మాలను పరమాత్మకే వదిలి శరణాగతి కోరడం సులభమైన మార్గమని అన్నారు. శాంతి సౌఖ్యలతో వర్ధిల్లడం కోసం ప్రతి ఒక్కరూ గీతాయజ్ఞంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉత్సవంలో భక్తులు గిరిగాని రమేశ్, భాస్కర్రెడ్డి, రమేశ్, మురళి, శ్రీశైలం, సాయిలు తదితరులు పాల్గొన్నారు. కాలభైరవస్వామికి ప్రత్యేక పూజలుజనగామ: జిల్లా కేంద్రంలోని సాయినగర్ కాలభైరవ దేవస్థానంలో అమావాస్య పర్వదినం పు ర స్కరించుకొని ఆదివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారి దర్శనం, సేవల్లో పాల్గొన్నారు. కూష్మాండ ద్వీపదర్శనం వైభవంగా జరుగగా, అనంతరం మల్లారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసా ద కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజ రయ్యారు. భక్తుల సమష్టి సహకారంతో జరిగి న ఈ కార్యక్రమం సాయినగర్ కాలనీ ఐక్యతను ప్రతిబింబించిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. అమావాస్య ప్రత్యేక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. కాలభైరవ స్వామివారి కృపతో శాంతి, సౌఖ్యాలు కలగాలని భక్తులు ప్రార్థించారు. గట్టమ్మతల్లికి మొక్కులుములుగు రూరల్: ఆదిదేవత గట్టమ్మ తల్లికి మేడారం భక్తులు మొక్కులు చెల్లించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో మేడారం సమ్మక్క–సారలమ్మ దర్శనానికి బయలుదేరిన భక్తులు మొదటి మొక్కులు గట్టమ్మ తల్లికి చెల్లించారు. భక్తులు అమ్మవారికి పసుపు–కుంకుమలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న సమ్మక్క–సారలమ్మ గద్దెలకు పసుపు–కుంకుమ సమర్పించారు. -
తరలొచ్చిన సర్కారు.. మురిసిన మేడారం
పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిసాక్షి ప్రతినిధి, వరంగల్: కాంక్రీట్ జంగిల్లో నుంచి రాష్ట్ర సర్కారు పచ్చని వనానికి చేరుకుంది. కంచు గజ్జల సవ్వడితో.. కొమ్ము బూరల నాదంతో.. జంపన్న వాగు అలల సాక్షిగా.. సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల బృందం, అధికార గణానికి గిరిజనులు ఆత్మీయ స్వాగతం పలకగా, వనసిరి వెలుగుల్లో.. మారిన నవ మేడారం ముఖచిత్రం చూసి అందరూ అబ్బురపోయారు. సాయంత్రం నుంచి వనంనుంచి రాష్ట్ర పాలన సాగించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వమంతా తరలిరావడంతో మేడారం ఆదివారం పోలీసులమయమైంది. ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్న కీకారణ్యంలో మంత్రి వర్గ సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. సాహసోపేతమైన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర పోలీసు యంత్రాంగం మేడారంపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రి వర్గ సభ్యులు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీలు, స్పెషల్ సెక్రటరీలు, డీజీపీలు, సీనియర్ ఐపీఎస్లు, ఐఏఎస్లు అందరూ ఆదివారం సాయంత్రం మేడారం చేరుకున్నారు. రూ.251 కోట్లతో చేపట్టిన ఆధునికీకరణ పనులు, శిలలతో సాలాహారాలు, ద్వార బంధాలు, గద్దెల సుందరీకరణ పనులను ప్రత్యేకంగా పరిశీలించేందుకు మంత్రులు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే దాదాపు 80 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. సమ్మక్క–సారలమ్మ గుడి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సైతం ఏర్పాటు చేసుకుని రెండు రోజుల పాటు ఇక్కడే ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఆదివాసీ సంప్రదాయాలతో జరిగే మేడారం జాతర ఈసారి ప్రత్యేకంగా ఉండాలని మంత్రి సీతక్క పట్టుబట్టడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో పనులు వేగంగా జరిగేలా సీఎం చర్యలు తీసుకున్నారు. ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభం, మొక్కుల సమర్పణతోపాటు మంత్రి వర్గ సమావేశానికి సైతం కార్యాచరణకు శ్రీకారం జరిగింది. పోలీసుల వలయంలో మేడారం మేడారం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబ ల్యం తగ్గినప్పటికీ సీఎం, మంత్రుల బస నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా పికెట్లు, బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు, ఏఎన్పీఆర్ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. రెండు రోజులముందు నుంచి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. నార్త్ జోన్ ఐజీ చంద్రశేఖర్రెడ్డి మేడారంలో పర్యటించి ఐపీఎస్ అధికారులతో సమన్వయం చేశారు. ములుగు కలెక్టర్ దివాకర టీఎస్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్కేకన్ అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు అతిథుల కోసం మౌలిక వసతులపై దృష్టి పెట్టారు. 10 మంది ఐపీఎస్ అధికారులు, 1,600 పోలీసు అధికారులు, సిబ్బంది మేడారంలో బందోబస్తు నిర్వహించారు. మంత్రులు మాత్రమే.. మేడారంలోని హరిత హోటల్లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానికి కేవలం మంత్రులు, మంత్రి వర్గ సమావేశ ప్రత్యేక ఆహ్వానితులను మాత్రమే అనుమతించారు. చీఫ్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీని కూడా అనుమతించారు. సాయంత్రం 4 గంటల నుంచి హరిత హోటల్ ముఖ ద్వారం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి, మంత్రులు మినహా మిగతా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను అనుమతించలేదు. మంత్రివర్గ సమావేశం అనంతరం సమావేశం నిర్ణయాలను ప్రకటించేలా మీడియా బ్రీఫింగ్ భేటీకి మాత్రం హైదరాబాద్ సమాచార పౌర సంబంధాలశాఖ తయారు చేసిన జాబితాలోని అక్రిడేటెడ్ జర్నలిస్టులను అనుమతించారు. కాగా, మొదట ఆదివారం సాయంత్రం 5 గంటలనుంచి 6 గంటల వరకు సుమారు గంటపాటు మంత్రివర్గ సమావేశం ఉంటుందని సీఎం టూర్ షెడ్యూల్ను అధికారులు ప్రకటించారు. అయితే, ఖమ్మం జిల్లా పాలేరులో కార్యక్రమాలు ఆలస్యం కావడంతో ముఖ్యమంత్రి 5:30 గంటలకు మేడారం చేరుకోవడం వల్ల సుమారు గంట ఆలస్యంగా కేబినెట్ సమావేశం మొదలైంది. ఈసమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ సాహసోపేత నిర్ణయం సీఎం, మంత్రుల పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత హరిత హోటల్లో పలు అంశాలపై చర్చ కేబినెట్ భేటీకి మంత్రులకు మాత్రమే అనుమతి మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు -
ఆలేటి ఎల్లవ్వకు బోనాలు
పాలకుర్తి టౌన్: మండలంలోని బమ్మెర గ్రామ శివారు ఆలేటి ఎల్లవ్వ ఆలయంలో ఆదివారం తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం జనగామ జిల్లా ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఒగ్గు డోళ్ల బృందం, బోనాల కోలాటం, పోతురాజల ఆలేటి ఎల్లవ్వ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఊర సంపత్, కాసర్ల రమేశ్, కొనుకుంట్ల అనిత, సోమ సత్యం, కొంరమ్మ, మల్లేష్, శివ, గణేష్, సాయి,పస్తం నగేష్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
బరిలోకి సతులు
జనగామ: రిజర్వేషన్లు కలిసిరాక పతుల స్థానంలో సతులు బరిలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పక్కవార్డులో పోటీ చేస్తే పార్టీలో అంతర్గత వ్యతిరేకత పెరుగుతుందనే సందేహం ఆశావహుల్లో కనిపిస్తోంది. ప్రజాదరణ ఉన్న నాయకులకు పార్టీల టికెట్లు ఇవ్వాలన్న ఆలోచన కొనసాగుతోంది. సీపీఎం, సీపీఐ మద్దతు ఎవరికన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రధాన పార్టీలు ఇంటెలిజెన్స్ సర్వేలతో విజేతలను అంచనా వేస్తుండగా, బీజేపీ ఎక్కువ వార్డుల్లో పోటీకి సిద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికల సమయం దగ్గరపడుతుండగా, జనగామ, స్టేషన్ ఘన్పూర్ పురపాలికలో వార్డు రిజర్వేషన్ల మార్పులు ఆశావహుల రాజకీయ లెక్కలను తారుమారు చేశాయి. కొందరు నాయకులు తమ సొంత వార్డులో పోటీ చేయాలని భావించినా, రిజర్వేషన్ల మార్పుల కారణంగా ఓటు వేయాల్సిన వార్డే మారిపోవడం వారు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యగా మారింది. ఫలితంగా, తమకే ఓటు వేయలేని పరిస్థితి ఏర్పడడంతో ఆశావహుల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. గెలుపు గుర్రాల కోసం ఇంటెలిజెన్స్ సర్వే రాజకీయంగా బలమైన పక్కవార్డుల్లో పోటీకి దిగితే సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉందనే భావన ఆశావహులను మరింత సందిగ్ధంలోకి నెడుతోంది. మరోవైపు, మహిళా రిజర్వేషన్లు పెరగడంతో అనేక మంది నాయకులు తమ స్థానంలో భార్యలను బరిలోకి దించే ప్రయత్నాలు ప్రారంభించారు. కొన్ని వార్డుల్లో వ్యూహరచనలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు సీపీఎం, సీపీఐ కూడా అంతర్గతంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశాయి. పార్టీల అధిష్టానాలు ఆశావహుల పేర్లను సేకరించడమే కాకుండా, సైలెంట్గా గెలిచే అవకాశాలపై సొంతంగా ఇంటెలిజెన్స్ సర్వేలు కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, కడియం శ్రీహరి, జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి నేతృత్వంలో పురపాలికలపై జెండా ఎగురవేయాలనే పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు. జనవరి 20న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఫిబ్రవరి 12న పోలింగ్ జరుగుతుందన్న అంచనాలతో పార్టీలు ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసే దిశగా కదులుతున్నాయి. పార్టీలకతీతంగా ఆయా వార్డుల్లో ప్రజాదరణ ఉన్న స్వతంత్రులను కూడా పరిగణనలోకి తీసుకుంటూ టికెట్లు ఇవ్వాలన్న ఆలోచన కొన్ని పార్టీల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా జనగామ, స్టేషన్ ఘన్పూర్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తున్నాయి. మరోవైపు, బీజేపీ జనగామలో అన్ని వార్డుల్లో పోటీ చేయాలని యోచిస్తున్నప్పటికీ, స్టేషన్ ఘన్పూర్లో మాత్రం గెలుపు అవకాశాలు ఉన్న వార్డులను మాత్రమే ఎంచుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీపీఎం, సీపీఐలు ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారన్న విషయం తెలియాల్సి ఉంది. స్వతంత్రంగా పోటీ చేయాలా, లేక బలమైన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలా అనే అంశంపై ఆ పార్టీల్లో చర్చలు సాగుతున్నట్లు సమాచారం. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ల మార్పులు స్థానిక రాజకీయాలను కుదిపేసిన ఈ నేపథ్యంలో, పార్టీల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, స్వతంత్రుల ప్రభావం ఇవన్నీ కలిసి మున్సిపల్ ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయి. రిజర్వేషన్లు కలిసిరాని వార్డుల్లో పోటీకి సిద్ధం పక్కవార్డులో పోటీచేస్తే అంతర్గత వ్యతిరేకత తప్పదా ప్రజాదరణ ఉన్న నాయకులకే పార్టీల టికెట్..? సీపీఎం, సీపీఐ మద్దతు ఎవరికి...! ప్రధాన పార్టీల ఇంటెలిజెన్స్ సర్వే -
సీఎం రేవంత్కు ఘన స్వాగతం
● జంపన్నవాగు పుష్కరఘాట్ పనుల పరిశీలన ఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి: ఖమ్మం నుంచి హెలికాప్టర్లో మేడారం సమ్మక్క, సారలమ్మ సన్నిధికి చేరుకున్న సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు మంత్రులు, అధికారులు ఆదివారం ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో మంత్రులు ధనసరి సీతక్క, ఉత్తమ్ కుమార్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖతోపాటు కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, దొంతి మాధవరెడ్డి, డాక్టర్ మురళీ నాయక్, యశస్విని రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, స్టేట్ ఫైనాన్స్, ఆయిల్ ఫెడ్ కమిషన్ చైర్మన్లు సిరిసిల్ల రాజయ్య, జంగా రాఘవరెడ్డి, ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అక్కడినుంచి నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించి జాతర ప్రాంతాల దృశ్యాలను తిలకించారు. ఏఐ అత్యాధునిక కెమెరాలు, ఏఎన్పీఆర్ కెమెరాల పనితీరును పోలీసు అధికారులు వివరించారు. అంతకుముందు కమాండ్ కంట్రోల్ వద్ద సీఎంకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. పనుల పరిశీలన జంపన్నవాగు వద్దకు వెళ్లిన సీఎం, మంత్రులు భక్తుల కోసం ఏర్పాటు చేసిన స్నానఘట్టాలు, బాత్రూమ్లు, షవర్లను పరిశీలించారు. అనంతరం కాలినడకన హరిత హోటల్ సమీపంలోని సర్కిల్, ఊరట్టం స్తూపం వద్దకు చేరుకున్నారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాండ్ స్కేపింగ్లో సుందరంగా తీర్చిదిద్దిన కళాచిత్రాలను పరిశీలించారు. -
సీఎం కప్ క్రీడాపోటీలు షురూ
● క్రీడలకు పకడ్బందీ ఏర్పాట్లు ● పంచాయతీ నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు ● 727 మంది క్రీడాకారుల రిజస్ట్రేషన్జనగామ రూరల్: రాష్ట్రంలో క్రీడాస్ఫూర్తిని పతాక స్థాయిలో నిలిపేలా, క్రీడా వాతావరణాన్ని సృష్టించడానికి శనివారం నుంచి చీఫ్ మినిస్టర్ కప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ మహా క్రీడలను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం, క్రీడాశాఖల ఆధ్వర్యంలో ప్రణాళిక సిద్ధం చేసింది. పోటీల నిర్వహణలో పారదర్శకత, పకడ్బందీగా ఉండేలా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు, పోలీస్అధికారులు, క్రీడాశాఖాధికారులు, ఒలింపిక్ సంఘం ప్రతినిధులు భాగస్వాములను చేశారు. కమిటీల ఏర్పాట్లు పంచాయతీస్థాయిలో 17 నుంచి 22వ తేదీ వరకు జరిగే పోటీలకు సర్పంచ్ చైర్మన్గా వ్యవహరిస్తారు. మండలస్థాయిలో 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే పోటీలకు ఎంపీడీఓ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఎంఈఓ, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మెంబర్ కన్వీనర్, తహసీల్దార్ సభ్యులుగా ఉంటారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ స్థాయిలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు జరిగే పోటీలకు మున్సిపల్ కమిషనర్ మెంబర్ కన్వీనర్, తహసీల్దార్, ఎంఈఓ, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సభ్యులుగా వ్యవహరిస్తారు. నియోజకవర్గ స్థాయిలో ఫిబ్రవరి 9 నుంచి 12వ తేదీ వరకు జరిగే పోటీలకు ఎమ్మెల్యే చైర్మన్ వ్యవహరిస్తారు. రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ద్వారా నియామకమైన అధికారి చైర్మన్, డీవైఎస్ఓ వైస్ చైర్మన్గా, ఎంఈఓ కన్వీనర్, తహసీల్దార్, ఒలింపిక్ సంఘం బాధ్యులు, క్రీడా విశ్లేషకులు కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు. జిల్లాస్థాయిలో 20 నుంచి 23వ తేదీ వరకు జరిగే పోటీలకు ఇన్చార్జ్గా మంత్రి చైర్మన్గా, కలెక్టర్ కో–చైర్మన్గా వ్యవహరిస్తారు. సద్వినియోగం చేసుకోవాలివచ్చే నెల 12వ తేదీ వరకు నిర్వహించే సీఎం కప్ క్రీడాపోటీలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి. క్రీడాకారులు తమ ప్రతిభను వెలికి తీసేవిధంగా ఈ పోటీలు ఉపయోగపడుతాయి. – రిజ్వాన్ బాషా, కలెక్టర్, క్రీడల కన్వీనర్ -
అయ్యయ్యో!
ఆదివారం శ్రీ 18 శ్రీ జనవరి శ్రీ 2026జనగామలో రిజర్వేషన్ల తారుమారుతో ఆశలు గల్లంతు● పక్కవార్డుల వైపు ఆశావహుల చూపు ● పురపోరుకు రంగం సిద్ధం ● టికెట్ల కసరత్తులో రాజకీయ పార్టీలుదక్షిణ భారత స్థాయి సైన్స్ ఫెయిర్కు ఎంపిక జనగామ రూరల్: జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు జాతీయ, దక్షిణ భారత స్థాయి సైన్స్ఫెయిర్కు ఎంపికవడం గర్వకారణమని కలెక్టర్ రిజ్వాన్బాషా, అడిషనల్ కలెక్టర్ పింకేష్కుమార్లు అన్నారు. ఈ మేరకు ఇన్స్పైర్ విభాగంలో కేజీబీవీ విద్యార్థిని జి.అక్షిత, టీఎల్ఎం విభాగంలో లింగాలఘణపురం మండలంలోని కుందారం పాఠశాల ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు బండోజు శ్రీనివాసాచారి, మ్యాన్ మేడ్ ఓజోన్ లేయర్ ప్రాజెక్టులో పట్టణంలోని అరబిందో హైస్కూల్కు చెందిన కె. మయూరి సదర్న్ ఇండియా సైన్స్ఫెయిర్కు ఎంపిక కాగా వారిని అభినందించారు. జాతీయస్థాయిలోనూ ప్రతిభ కనబర్చాలని వారు ఆకాక్షించారు. వేయిస్తంభాల దేవాలయంలో మాసశివరాత్రి పూజలు హన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శనివారం మాసశివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠ అవధాని, అర్చకులు ప్రణవ్, సందీప్శర్మ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతసేవ, ఉత్తిష్ట గణపతికి ఆరాధన గరికపూజ, శ్రీరుద్రేశ్వరుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు. అనంతరం నాట్యమండపంలో శ్రీరుద్రేశ్వరిదేవి, శ్రీరుద్రేశ్వరస్వామివారిని ప్రతిష్ఠించి కలశస్థాపన, బాసికధారణ, యజ్ఞోపవీతధారణ, పాదప్రక్షాళన, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, అక్షతారోహణ, మహాహారతి జరిపి కల్యాణోత్సవం నిర్వహించారు. 11 మాసశివరాత్రులు శనివారంతో పూర్తయి మాఘమాసంలో వచ్చే ఫిబ్రవరి 15న మహాశివరాత్రి పర్వదినం వస్తుందని గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.రోడ్డు భద్రతపై అవగాహనజనగామ: పట్టణంలోని నెహ్రూ పార్క్ వద్ద గల సెయింట్ పాల్స్ ఉన్నత పాఠశాలలో డీసీపీ రాజమహేంద్రనాయక్ రోడ్డు భద్రతపై విద్యార్థులకు శనివారం అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు అంశాలపై పోటీలను నిర్వహించిన అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ పండేరి చేతన్నితిన్, ప్రిన్సిపల్ ఫాదర్ జోసఫ్, సీఐ, ఎస్సైలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓపెన్ స్కూల్ ఫీజు గడువు పెంపు జనగామ రూరల్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పింకేశ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదోతరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల పరీక్ష ఫీజును, రూ.50 ఆలస్య రుసుముతో జనవరి 17 నుంచి 25వ తేదీ వరకు, తత్కాల్ కింద జనవరి 26 నుంచి 28వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఫీజు చెల్లింపులో ఏమైన సందేహాలు ఉంటే జిల్లా విద్యాశాఖ కార్యాలయం శంకర్రా వు (8919606868)ను సంప్రదించాలన్నారు. డంపింగ్యార్డులో మంటలు జనగామ: మండలంలోని పసరమడ్ల గ్రామ పరిధిలోని చంపక్హిల్స్ వద్ద ఉన్న మున్సిపల్ డంపింగ్యార్డులో చెత్త అంటుకుని డంపింగ్యార్డులో మంటలు చెలరేగిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపల్ డంపింగ్యార్డులో ప్రమాదవశాత్తు చెత్త అంటుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన మున్సిపల్ సిబ్బంది ఫైర్ ఇంజన్ వారికి సమాచారం అందించారు. కాగా డంపింగ్యార్డులో అన్ని రకాల వ్యర్థాలు ఉండటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. అయితే మంటలు ప్రమాదకరస్థాయికి వెళ్లకుండా అగ్నిమాపక సిబ్బంది కష్టపడుతున్నారు. తెలంగాణ వారసత్వ శాఖతో ఎంఓయూ కేయూ క్యాంపస్ : తెలంగాణ ప్రభుత్వ వారసత్వ శాఖ (హెరిటేజ్ డిపార్ట్మెంట్), కాకతీయ యూనివర్సిటీ హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ విభాగం మధ్య శనివారం హైదరాబాద్లో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుది రింది. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం, రా ష్ట్ర హెరిటేజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అర్జున్ రావు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసి పత్రాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్, హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ విభాగం అధిపతి డాక్టర్ చిలువేరు రాజ్కుమార్, డిప్యూ టీ డైరెక్టర్ డాక్టర్ నాగరాజు, ఓఎస్డీ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎంఓయూ ద్వారా ఇరు సంస్థలకు ప్రయోజనం కలుగనుంది.జనగామ: మున్సిపల్ రిజర్వేషన్ల తాజా జాబితా వెలువడడంతో జనగామ, స్టేషన్ఘన్పూర్ రాజకీయాల్లో సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి. రెండేళ్లుగా మున్సిపల్ పీఠాలను నిశితంగా గమనిస్తూ, ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ కీలక నేతలు రిజర్వేషన్ల కేటాయింపులు అనుకున్న విధంగా రాకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. ముఖ్యంగా జనరల్ కోటాలో పోటీ చేసి పట్టాభిషేకం సాధించాలన్న ఆత్మవిశ్వాసంతో ఎదురు చూసిన పలువురు నేతలకు సొంత వార్డులో మహిళలు, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు రావడం షాక్ ఇచ్చింది. చైర్మన్ రేసులో మేము సైతం.. జనగామ మున్సిపల్ చైర్మన్ పదవిని ఈసారి బీసీ జనరల్కు కేటాయించగా, స్టేషన్ ఘన్పూర్లో కొత్త మున్సిపాలిటీ ఎస్సీ జనరల్కు అవకాశం వచ్చింది. మరోవైపు జనగామలో రొటేషన్ విధానాన్ని అనుసరించడంతో 2019తో పోలిస్తే ఈసారి రిజర్వేషన్ల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. 3, 4, 6, 7, 18, 20, 25, 26, 29వ వార్డులు బీసీ జనరల్ నుంచి బీసీ మహిళా కోటాకు మారడంతో అనేక నాయకుల సమీకరణాలు గందరగోళానికి గురయ్యాయి. ఇందులో చైర్మన్ రేసులో కాంగ్రెస్ నుంచి కంచె రాములు, ఎర్రమల్ల సుధాకర్, ఎండీ.అన్వర్, దోర్నాల వెంకటేశ్వర్లు, తదితరులతో పాటు బీఆర్ఎస్ నుంచి మేకల రాంప్రసాద్, జూకంటి లక్ష్మీశ్రీశైలం, కన్నా పరశురాములు, నీల యాదగిరి, మారబోయిన పాండు వంటి నేతలు ఉన్నారు. ఇందులో పలువురికి తమకు సరిపోయే వార్డులు రాకపోవడంతో పక్కవార్డుల వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. స్టేషన్ ఘన్పూర్లో చైర్మన్ రిజర్వేషన్ ఎస్సీ జనరల్గా నిర్ణయించటంతో అక్కడ కూడా పోటీ మరింతగా పెరిగింది. కాంగ్రెస్ నుంచి కనకం రమేష్, సింగపురం దయాకర్, చేపూరి వినోద్, సింగపురం వెంకటయ్య, జీడి రమేష్, చేవూరి చిరంజీవి, తాటికొండ వినయ్, సింగపురం రాజయ్య, గుర్రం రాజు, జీడి ప్రసాద్, తదితరులు రేసులో ఉండగా, బీఆర్ఎస్ నుంచి కనకం గణేష్, తాడికొండ సురేష్, గుర్రం శంకర్, మారేపల్లి ప్రసాద్, గుర్రం ఏసు బాబు, గుర్రం శ్రీను, గుండె మల్లేష్ నేతలు సిద్ధంగా ఉన్నారు. గెలుపు గుర్రాల కోసం.. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక మున్సిపల్ నోటిఫికేషన్ విడుదల మాత్రమే మిగిలి ఉంది. దీంతో అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు గెలుపు గుర్రాలను గుర్తించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. టికెట్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తూ, అంతర్గత విభేదాలను చక్కదిద్దుకునే దిశగా అన్ని పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఎవరు ఎక్కడి నుంచి బరిలో నిలుస్తారు, ఎవరికి చైర్మన్ అదృష్టం వరిస్తుందోననే ప్రశ్నలతో జనగామ, స్టేషన్ఘన్పూర్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి.కేటగిరీ వార్డులు శాతం జనరల్ మహిళ 9 30 జనరల్ 6 20 బీసీ జనరల్ 5 16.67 బీసీ మహిళ 4 13.33 ఎస్సీ జనరల్ 3 10 ఎస్సీ మహిళ 2 6.67 ఎస్టీ జనరల్ 1 3.33 మొత్తం 30 100శాతంరిజర్వేషన్లు ఖరారు బస్సు ఎక్కేందుకు పోటీ పడుతున్న ప్రయాణికులుజనగామ ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ జనగామ: సంక్రాంతి పండుగ నేపథ్యంలో సుదూ ర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు చేరుకున్న కు టుంబాల తిరుగు ప్రయాణం శనివారం నుంచే మొ దలైంది. ఆదివారం అమావాస్య కావడంతో మెజా ర్టీ కుటుంబాలు ముందుగానే పయనమవ్వడంతో ఆర్టీసీ, రైల్వే ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. జనగామ సహా పలు పట్టణాల్లో ఆర్టీసీ బస్టాండ్లు, ప్రైవేట్ ట్రావెల్ పాయింట్ల వద్ద విపరీతమైన రద్దీ కనిపించింది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించినప్పటికీ రద్దీ తగ్గలేదు. వరంగల్–హైదరాబాద్, సిద్దిపేట–జనగామ, సూర్యాపేట వైపు వెళ్లే హైవేలపై వాహన రద్దీ కనిపించింది. రిటర్న్ జర్నీతో బస్టాండ్లు, స్టేషన్లు కోలాహలంగా మారగా ఆర్టీసీ టికెట్ కలెక్షన్లు ఒక్కసారిగా పెరిగాయి. -
ట్రాఫిక్ నిబంధనలతో ప్రమాదాల నివారణ
జనగామ రూరల్: ట్రాఫిక్ నిబంధనలను పాటించి రోడ్లు ప్రమాదాలను నివారించాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచించారు. శుక్రవారం ఆర్టీసీ డిపోలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసం–2026లో భాగంగా ‘చేరుకోండి, ప్రాణాలతో ఉండండి’ అనే నినాదంతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. వాహానాలు నడిటప్పుడు మత్తు పదార్థాలు తీసుకోవద్దన్నారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ప్రమాదాలను నివారించడానికి పలు సూచనలు చేశారు. అనంతరం రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. పట్టణంలోని చౌరస్తాలో రవాణా శాఖ ఆధ్వర్యంలో చౌరస్తాలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిపో మేనేజర్ ఎస్.స్వాతి, కానిస్టేబుల్ సమద్, మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ -
ఆర్టీసీ డ్రైవర్ల పాత్ర కీలకం
హన్మకొండ: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ డ్రైవర్ల పాత్ర కీలకమ ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన శ్రీఆరైవ్..ఆలైవ్శ్రీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వరంగల్ ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో ఆర్టీసీ హనుమకొండ డిపోలో రోడ్డు ప్రమాదాలపై ఆర్టీసీ ఉద్యోగులకు అవగాహన సదస్సు జరిగింది. పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు పెద్ద సమస్యగా మారిందన్నారు. ఆర్టీసీకి సంబంధించి రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఆర్టీసీ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. రాత్రి సమయాల్లో బస్ బ్రేక్డౌన్ అయితే బస్సు వెనుక భాగంలో రేడియం స్టిక్కర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మేడారం జాతరలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రోడ్లపై బస్సులను నిలిపివేయవద్దని డ్రైవర్లకు సూచించారు. అనంతరం సుదీర్ఘ కాలంగా డ్రైవర్గా పనిచేస్తూ ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా విధులు నిర్వర్తించిన డ్రైవర్లను పోలీస్ కమిషనర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులచే ప్రతిజ్ఞ చేయించారు. సెంట్రల్ జోన్న్డీసీపీ కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, డిప్యూటీ రీజినల్ మేనేజర్ కేశరాజు భానుకిరణ్, డిపో మేనేజర్ ధరంసింగ్, కాజీపేట ట్రాఫిక్ ఇన్స్స్పెక్టర్ వెంకన్న, సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ -
అంబరాన్నంటిన సంబురాలు
ముగిసిన సంక్రాంతి వేడుకలు జనగామ: జిల్లావ్యాప్తంగా మూడు రోజుల పాటు సంక్రాంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నా రు. భోగి నుంచి కనుమ దాకా ప్రతీ ఊరు, ఇంటి వద్ద పండగ సందడి అంబరాన్నంటింది. భోగి ఉదయాన్నే భోగిమంటలు, రంగురంగుల ముగ్గులు, గోబ్బెమ్మలు, గాలి పటాల క్రీడలు గ్రామాలన్నీ పండగ కాంతులతో వెలిగిపోయాయి. సంక్రాంతి రోజున ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇంటింటా పాలు పొంగించి నవధాన్యాలతో కొత్త సంవత్సరానికి శుభారంభం పలికారు. మహిళలు మంగళగౌరి, సందెదీపాల నోములు, బొమ్మ ల కొలువులను భక్తిశ్రద్ధలతో నోచుకుని సంప్రదాయాని కి మరింత వన్నె తెచ్చారు. శుక్రవారం కనుమ పర్వదినం పురస్కరించుకుని గ్రామాల్లో సామూహిక వ్రతా లు, నోములు నిర్వహించగా, కుటుంబ సభ్యులు, బంధువులు ఒక్కటై పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఆలయాలకు పోటెత్తిన భక్తులు సంక్రాంతి, కనుమను పండగను పురస్కరించుకుని జిల్లాలోని చిల్పూరు బుగులోని శ్రీ వేంకటేశ్వరస్వామి, లింగాలఘణపురం మండలం జీడికల్ శ్రీ సీతారామచంద్రస్వామి, శ్రీ పాలకుర్తి సోమేశ్వరస్వామి, బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్దులగుట్ట, జనగామ బాణాపురం శ్రీ వేంకటేశ్వర, శ్రీ చెన్నకేశ్వర, శ్రీ సంతోషీమాత, పాతబీటు బజార్లోని శ్రీ రామలింగేశ్వర, చీటకోడూరు పంచకోసురామ లింగేశ్వర, సాయిబాబా, గీతాశ్రమం, బతుకమ్మకుంట శ్రీ విజయ దుర్గామాత ఆ లయాలు భక్తులతో కిటకిటలాడాయి. -
శిగమూగిన ఆలేటి ఎల్లవ్వ జాతర
పాలకుర్తి టౌన్: మహిళల బోనాలు, డప్పుచప్పుళ్ల కోలాహలం, శివసత్తుల పూనకాలతో మండలంలోని బమ్మెర శివారులోని ఆలేటి ఎల్లవ్వ జాతర శిగమూగిపోయింది. శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు ఆలేటి ఎల్లవ్వ తల్లిని దర్శించుకున్నారు. మండలంలోని బమ్మెర, తొర్రూరు, అయ్యంగారిపల్లి, ఈరవెన్ను గ్రామాల నుంచి ఎడ్లబండ్లతో వచ్చి గుడి చుట్టు ప్రదక్షిణ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఎల్లవ్వ తల్లిని దర్శించుకున్నారు. బోనమెత్తిన మాజీమంత్రి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆలేటి ఎల్లవ్వను సందర్శించి ఆలయంలో బోనమెత్తుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే బమ్మెరతోపాటు నియోజకవర్గంలో పలు ఆయాలను పునరుద్ధరించి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. వర్ధన్నపేట ఏసీపీ ఆంబటి నర్సయ్య, సీఐ జానకీరాంరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా బందోబస్తు నిర్వహించారు. పూజలు నిర్వహించిన వారిలో.. బీఆర్ఎస్ నాయకులు పల్లా సుందర్రాంరెడ్డి, నవీన్, నాగిరెడ్డి, శ్రీనివాస్రావు, ఎల్లయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, మార్కెట్ చైర్పర్సన్ లావుడ్యా మంజుల, బమ్మెర సర్పంచ్ జిట్టబోయిన రమ్యప్రశాంత్, అయ్యంగారిపల్లి సర్పంచ్ ముస్కు సుధాకర్, దార శంకరయ్య, గోనె మహేందర్, బత్తిని సురేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆలేటి ఎల్లవ్వ జాతరలో గుడి వద్ద చెట్టుపై నాగుపాము ప్రతక్ష్యం కావడంతో ఆలేటి ఎల్లవ్వ స్వరూపంలోనే పాము ప్రత్యక్షమైందని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సంతానం లేని భక్తులు ఎల్లవ్వను దర్శించుకొని ఆలయ సమీపంలో తాటిచెట్టు వద్ద వరం పట్టడం ఆనవాయితీ. ఆలయానికి పోటెత్తిన భక్తులు బోనాలు, శివసత్తుల పూనకాలతో కోలాహలం -
పురపాలిక ఎన్నికలకు సిద్ధంకండి
జనగామ: త్వరలో జరుగనున్న మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించి సంబంధిత అధికారులతో మినీ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్న్లోని మార్గనిర్దేశకాల ప్రకారం మున్సిపాలిటీల వార్డుల రిజర్వేషన్పై సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. పారదర్శక విధానం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించే విధంగా చూడాలన్నారు. సమీక్షలో జనగామ, స్టేషన్ఘన్పూర్ ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న, మహేశ్వర్రెడ్డి, రాధాకృష్ణ తదితరులు ఉన్నారు. మైనార్టీ సీట్లను సద్వినియోగం చేసుకోవాలి జనగామ రూరల్: జిల్లాలోని ముస్లిం మైనార్టీ పాఠశాల, ఇంటర్మీడియట్ కళాశాలలో మైనార్టీ రెసిడెన్షియల్ అడ్మిషన్ల కోటాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. మైనారిటీ అడ్మిషన్లకు సంబంధించిన పోస్టర్ను కలెక్టరేట్లో విడుదల చేశారు. జిల్లాలోని ఒక బాలు ర (జనగామ)లో, ఒక బాలికల (స్టేషన్ ఘన్పూర్) లోని పాఠశాల, కళాశాలలో గల సీట్లలో 80శాతం మైనారిటీలకు, 20శాతం నాన్ మైనార్టీలకు సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జి ల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి విక్రమ్ కుమార్, ప్రిన్సి పాల్ కె.కుమారస్వామి, పి.అనిల్ బాబు, అధ్యాపకులు తాయినాత్ సగీరా, పెట్లోజు సోమేశ్వరా చారి, రెహానా వార్డెన్ సల్మాన్, ఫసి పాల్గొన్నారు. సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
ఉత్కంఠకు నేటితో తెర
జనగామ: జనగామ, స్టేషన్న ఘన్పూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికల సన్నాహాల్లో వేగం పుంజుకుంది. మూడు రోజుల క్రితం వార్డుల వారీ రిజర్వేషన్లను ఖరారు చేసిన అధికారులు, ఆ వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచారు. ఈనెల 17న (శనివారం) జనగామ కలెక్టరేట్లో రెండు మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లను అధికారికంగా వెల్లడించనున్నారు. అదే రోజు అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ పద్ధతిలో మహిళా రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన బీసీలకు 32 శాతం, ఎస్సీలకు 13, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు ఖరారు కాగా, మిగతా 50 శాతం జనరల్ కేటగిరీకి కేటా యించారు. ప్రతీ వర్గంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తైన వెంటనే ఆ వివరాలను సీడీఎంఏకు పంపించి, ఫైనల్ గెజిట్కు అనుమతి వచ్చిన తర్వాతే అధికారిక వార్డుల రిజర్వేషన్ల జాబితా విడుదల చేయనున్నారు. ఈనెల 18న జరగనున్న కేబినెట్ సమావేశం తర్వాత, 19 లేదా 20 తేదీల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశమున్నట్లు సమాచారం. వచ్చేనెల ఫిబ్రవరి 10 నుంచి 12 మధ్య ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసి ఆ తర్వాత ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పురపాలిక ఎన్నికలకు సంబంధించి ఈసారి రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారవుతున్న నేపథ్యంలో, గత ఐదేళ్లుగా ఒకే వార్డులో క్రమంగా ప్రజల్లో అనుబంధం పెంచుకున్న పలువురు ఆశావాహులకు షాక్ తగలవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎన్నో సంవత్సరాలుగా శ్రీసేఫ్ వార్డుశ్రీగా భావించి పని చేస్తున్న నేతలు ఇప్పుడు ఏ రిజర్వేషన్ వస్తుందో తెలియక గందరగోళంలో పడిపోతున్నారు. ఈ అనిశ్చితి కారణంగా కొంతమంది ఆశావాహులు ముందుగానే ఇతర సాధ్యమైన వార్డులపై కన్నేశారు. ఆ వార్డు నేతలు, ఓటర్లను సంప్రదించడం ప్రారంభించారు. తమ ప్రత్యర్థులకు పోటీలో ఉంటున్నట్లు ముందస్తు సంతేకాలు సైతం పంపిస్తున్నారు. రొటేషన్న్ విధానంలో రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉండదేమోననే అంచనాలతో ఇన్నాళ్లు కౌన్సిలర్గా బరిలో నిలవాలని విశ్వప్రయత్నం చేస్తున్న పలువురు బలహీన వర్గాల నాయకులు, ఒకవేళ జ నరల్ కేటగిరీ వస్తే కూడా పోటీకి సిద్ధమేనన్న ధోరణి ప్రదర్శిస్తున్నారు. బీసీలకు 32 శాతం రిజర్వేషన్ ఉన్నప్పటికీ, జనరల్ కేటగిరీలో కూడా ఆ వర్గానికి చెందిన అభ్యర్థులు ఎక్కువగానే నిలబడే అవకాశం ఉండడంతో పోటీ శాతం ఇంకా పెరగనుంది. రిజర్వేషన్ల జాబితా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వద్ద గోప్యంగా ఉండగా, శనివారం ప్రకటన కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్లలో ఉత్కంఠ నేపథ్యంలో ఈ రెండు మున్సిపాలిటీల రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించనుంది. కలెక్టర్ వద్ద గోప్యంగా వివరాలు లాటరీ ప్రక్రియలో మహిళా రిజర్వేషన్లు ఎంపిక మహిళకు 50శాతం...బీసీలకు 32 శాతం రొటేషన్ పద్ధతిలో ఆశావహులకు షాక్మున్సిపాలిటీ ఎస్టీ ఎస్సీజనరల్ ఎస్సీమహిళ బీసీజనరల్ బీసీమహిళ జనరల్ జనరల్ మహిళ జనగామ 1 3 2 5 4 6 9 స్టేషన్ఘన్పూర్ 1 3 2 2 1 3 6 మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్కు సంబంధించి రాష్ట్రస్థాయిలో ఎంపిక చేయనున్న నేపథ్యంలో జనగామలో జన రల్ లేదా బీసీ కేటగిరీలో మహిళకు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్టేషన్ఘన్పూర్ విషయానికి వస్తే ఎస్సీ సామాజిక వర్గంలో జనరల్ లేదా మహిళకు రావచ్చని సమాచారం. శనివారం కలెక్టరేట్ సమావేశం హాలులో కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో మునిసిపల్ కమిషనర్లు మహేశ్వర్రెడ్డి, రాధాకృష్ణ, ఇతర అధికారుల పర్యవేక్షణలో వార్డుల వారీ రిజర్వేషన్లు, లాటరీ పద్ధతిలో మహిళా రిజర్వేషన్లను ఎంపిక చేయనున్నారు. -
తుది ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల
జనగామ: జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్ పరిధిలోని పోలింగ్ బూత్ల వారీగా ఫొటో ఓటరుతో కూడిన తుది ఓటరు జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాల జాబితాను శుక్రవారం కమిషనర్లు మహేశ్వర్రెడ్డి, రాధాకృష్ణ విడుదల చేశారు. జనగామ పరిధిలో 66, స్టేషన్ఘన్పూర్లో 36 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కార్యక్రమంలో మేనేజర్ జి.రాములు, టౌన్ ప్లానింగ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.ఆలయ నిర్మాణానికి రూ.1.25 లక్షల విరాళంనర్మెట: మండలంలోని ఇప్పలగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలోని రత్నతండాలో నూతనంగా నిర్మించ తలపెట్టిన దుర్గామాత ఆలయానికి సర్పంచ్ ధరావత్ రాజమణి రూ.1,25,116లు విరాళంగా అందజేశారు. ఈసందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీకి శుక్రవారం నగదు అందజేశారు. అనంతరం సర్పంచ్ కుటంబ సభ్యులను కమిటీ సన్మానించింది. కార్యక్రమంలో ధరావత్ రాజూ నాయక్, యువకులు, తండావాసులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.బచ్చన్నపేట: మండలంలోని కేసిరెడ్డిపల్లి, బోనకొల్లూర్ గ్రామాల మధ్య పులి సంచరిస్తున్నట్లు ఇరుగ్రామాల రైతులు, ప్రజలు తెలిపారు. శుక్రవారం పలువురు మాట్లాడుతూ నాలుగు రోజులుగా సాయంత్రం వేళ జగ్గారెడ్డి తోట సమీపంలో పలువురు పులిని చూసినట్లు తెలిపారు. అలాగే గీతకార్మి కులు, గొర్రెల కాపర్లు కూడా చూశామని చెప్పారు. పులి కనిపించగానే భయంతో పరుగులు తీశామన్నారు. అది నడిచిన పాదాల అడుగులను గుర్తించామని రాత్రివేళ 30, 40 మంది రైతులు కలిసి కర్రలను, టార్చ్లైట్లను పట్టుకొని వ్యవసాయ బావుల వద్ద పహరా కాసినట్లు తెలిపారు. సంబంధిత ఫారెస్ట్ అధి కారులు పులిని పట్టుకొని వెళ్లి ఇరుగ్రామాల ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రోడ్డు భద్రతపై అవగాహనపాలకుర్తి టౌన్ : ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది విధుల్లోకి బయలుదేరే సమయంలో ఇంటికి నుంచి సురక్షితంగా బయలుదేరి, తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాల యం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్.. అలైవ్’ కార్యక్రమంలో భా గంగా ప్రభుత్వ సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ జానకిరామ్రెడ్డి, ఎస్సై దూలం పవన్కుమార్, తహసీల్దార్ సరస్వతి, సూపరింటెండెంట్ రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు. కాళేశ్వరం దేవస్థానం హుండీల లెక్కింపుకాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి, అనుబంధ దేవాలయాల హుండీలను శుక్రవారం లెక్కించారు. మూడు నెలల హుండీల ఆదాయం రూ.34,42,598 లక్షలు సమకూరినట్లు ఈఓ ఎస్.మహేశ్ తెలిపారు. హుండీల పర్యవేక్షణను దేవాదాయశాఖ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అనిల్కుమార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ సిబ్బంది, దేవస్థానం అర్చక స్వాములు, దేవస్థానం సిబ్బంది, శ్రీ వల్లి సేవా ట్రస్ట్ (కరీంనగర్), శ్రీ వెంకట అన్నమాచార్య సేవా సమితి సభ్యులు, నరసింహ సేవా సమితి సభ్యులు, శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. -
జనగామ, యాదాద్రి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ స్కామ్.. రూ.3.72 కోట్ల అవినీతి
వరంగల్: జనగామ-యాదాద్రి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ స్కామ్ వెలుగు చూసింది. ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో రూ. 3.72 కోట్ల అవినీతి జరిగినట్లు వెల్లడైంది. ఈ మేరక 15 మంది నిందితులను జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అవినీతికి పాల్పడిన నిందితుల నంచి రూ. 63 లక్షల నగద, ఒక కారు, 2 ల్యాప్టాప్లు, 5 డెస్క్టాప్లు, 17 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఇది ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన కేసుగా నిర్దారించారు. ఈ కేసుకు సంబంధించి మరో 9 మంది పరారైనట్లు తెలుస్తోంది. -
ఐలోని మల్లన్న.. నీకు వేవేల దండాలు!
జఫర్గఢ్: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఐనవోలు మల్లన్నను ఇలవేల్పుగా కొలిచే యాదవుల సందడి అంతా ఇంతా కాదు. సంక్రాంతికి 15 రోజుల ముందుగానే యాదవులు తమ ఇళ్లకు సున్నాలు వేసి శుభ్రం చేస్తారు. అనంతరం రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు. సంక్రాంతి రోజు ఉదయాన్నే మహిళలు తమ ఇళ్లలోనే ఐనవోలు మల్లన్నకు ఎదురుబోనాలు సమర్పిస్తారు. సాయంత్రం సమయంలో యాదవ కులస్తులు పిల్లల నుంచి మొదులుకొని పెద్దలు, యువకులు కాళ్లకు గజ్జెలు కట్టుకొని గజ్జెలలాగులు ధరించి కళ్లకు రంగురంగుల అద్దాలు ధరించి ఒంటిపై వలలను కప్పుకొని డోలు వాయిద్యాలు, తాళాల చప్పట్ల నడుమ నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా ఐనవోలు మల్లన్న జాతరకు బయలుదేరుతారు. తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని యాదవ కులస్తులు ఇప్పటికీ కొనసాగిస్తుండడం విశేషం. ఆధ్యాత్మిక చింతనతోనే శాంతి సమాజందేవరుప్పుల: ఆయా సామాజికవర్గాలు ఆచరించే ఆధ్మాత్మిక చింతనతోనే శాంతి సమాజం వర్ధిల్లుతుందని జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. బుధవారం మండలంలోని పెద్దమడూరుకు చెందిన జోగు బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రారంభమైన బంజర మల్లన్న స్వామి జాతర పురస్కరించుకొని సంప్రదాయపద్ధతిలో బోనాలు చేసి స్వామికి సమర్పించారు.ఈ సందర్బంగా జాతరను పరిశీలించేందుకు వచ్చిన డీసీపీ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు, యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. జాతరలో పటిష్టబందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సై ఊర సృజన్కుమార్, జోగు బ్రదర్స్ కుటుంబాలు, ఒగ్గు పూజారులు, కళాకారులు పాల్గొన్నారు. జర్నలిస్టుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికంజనగామ: కాంగ్రెస్ ప్రభుత్వం తమ రాజకీయ క్రీడలో భాగంగా మంత్రులను బలిచేయడానికి టీవీ చానెళ్లకు లీకులు ఇచ్చి ఉపయోగించుకోవడం, మళ్లీ వారినే అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సిట్ వేసి అర్ధరాత్రి అక్రమంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లి అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రస్తుతం పరిణామాలన్నీ డ్రామాలని ప్రజలకు తెలుసనీ, ఎమర్జెన్సీని తలపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే భేషరతుగా విడుదలచేయాలి డిమాండ్ చేశారు. సమాజహితం కోసం యువత పాటుపడాలిదేవరుప్పుల: జన్మనిచ్చిన గ్రామ సమాజ హితం కోసం యువత పాటుపడాలని కడప జిల్లా బద్వేల్ కోర్టు అడిషనల్ సివిల్ జడ్జి పెండెం ముఖేష్ కుమార్ సూచించారు. బుధవారం మండలంలోని సీతారాంపురం హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధి అంబటి యాకయ్య ఆధ్వర్యంలో తలపెట్టిన సంక్రాంతి పర్వదిన ప్రతిభాపాటవ, రోడ్డు భద్రత, క్రికెట్ క్రీడోత్సవాలను ఎస్సై ఊర సృజన్కుమార్తో ప్రారంభించారు. మోకిడి రాంబాబు కుటుంబం ఆధ్వర్యంలో క్రీడాకారులతోపాటు అనాథ శరణాలయ వృద్ధులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బస్వ ఎలేంద్రవెంకన్న, కాంగ్రెస్, బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు ఉప్పల సురేష్బాబు, బస్వ మల్లేషమ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూముల్ని కాపాడాలిపాలకుర్తి టౌన్: పాలకుర్తిలో కోట్ల విలువైన ప్రభుత్వ ఆసైన్డ్, ఇనాం, కాందిశీకుల భూములు అన్యాక్రాంత అయ్యాయని, వాటిని ప్రజాఅవసరాలకు ఉపయోగించాలని సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేశ్రాజా, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కార్యదర్శి గుమ్మడిరాజల సాంబయ్య డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతోజు రజిత, జీడి సోమన్న, కళింగరాజు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఆలేటి ఎల్లవ్వ జాతర
పాలకుర్తి టౌన్: భక్తుల కోరిన కోరికలు తీర్చే ఆలేటి ఎల్లవ్వ జాతర ఉత్సవాలు మండలంలోని బమ్మెర శివారు అయ్యంగారిపల్లి గ్రామ సమీపంలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ తెల్లారి కునుమ రోజున ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. జాతరను ఘనంగా నిర్వహించేందుకు బమ్మెర గ్రామ పంచాయతీ, ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. 15న రాత్రి ఆలయం చుట్టూ ఎడ్లబండ్లు తిరుగుడు, 16న బోనాలు, పట్నాలు శివసత్తులు నడుమ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. సంక్రాంతి పండుగ మరుసటి రోజు జరిగే కనుమ రోజున ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆలేటి ఎల్లమ్మ తల్లిని దర్శించుకునేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. సంతానం లేనివారు ఎల్లవ్వను దర్శించుకొని ఆలయం సమీపంలో ఉన్న తాటి చెట్టువద్ద వరంపడితే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. వరం పట్టే తాటి చెట్టుపై నుంచి పసుపు ముద్దలు పడతాయని నమ్ముతారు. డీసీపీ పూజలు.. ఆలేటి ఎల్లవ్వ ఆలయాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. జాతర ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎస్సై దూలం పవన్కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు
జనగామ: మున్సిపల్ రెండో సాధారణ ఎన్నికల నేపథ్యంలో వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో14ను విడుదల చేసింది. డెడికేటెడ్ కమిషన్ అందించిన రిపోర్టు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ నివేదికల ఆధారంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలు, అన్రిజర్వుడ్ వర్గాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసింది. మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి టి.కె.శ్రీదేవి జారీ చేశారు. రిజర్వేషన్ మార్గదర్శకాలు విడుదల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వార్డు రిజర్వేషన్ల కేటాయింపుపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. మొత్తం వార్డుల్లో 50 శాతం సీట్లు రిజర్వుడ్ వర్గాలకు, మిగతా 50 శాతం సీట్లు అన్ రిజర్వుడ్ వర్గాలకు కేటాయించే విధానాన్ని ప్రభుత్వం కొనసాగించింది. ఇదే సందర్భంలో స్థానిక సంస్థలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ నిబంధనను కచ్చితంగా అమలు చేస్తూ, మొత్తం వార్డులలో సగం స్థానాలు మహిళలకు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. కొత్త రిజర్వేషన్ కేటాయింపులతో జనగామ మున్సిపాలిటీ ఎన్నికల పరిస్థితులపై స్పష్టత నెలకొంది. ఇదిలా ఉండగా వార్డుల వారీగా రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక అధికారులు త్వరలోనే వెల్లడించనున్నారు. జనగామ వార్డు వారీగా రిజర్వేషన్ల ఖరారు ఇలా ఉంది. మొత్తం వార్డులు 30, ఎస్టీ జనరల్ 1, ఎస్సీ 5, ఎస్సీ జనరల్ 3, ఎస్సీమహిళ 2, బీసీ వర్గం మొత్తం 9, బీసీ మహిళ 4, బీసీ జనరల్ 5, మహిళా జనరల్ 9, జనరల్ (అన్ రిజర్వ్) 6 కేటాయించారు. స్టేషన్ఘన్పూర్లో.. స్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీలకు 2024 కులగణన ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేశారు. అదేవిధంగా జనరల్ మహిళలకు టీఎం చట్టం 2019 ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేశారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలో మొత్తం 18 వార్డులు ఉండగా అందులో ఎస్టీలకు 1, ఎస్సీలకు 5, బీసీలకు 3, జనరల్కు 9 స్థానాలను కేటాయించారు. కాగా ఎస్టీలలో ఎస్టీ జనరల్కు 1 స్థానం, ఎస్సీలలో జనరల్ 3, మహిళలకు 2, బీసీలలో జనరల్ 2, మహిళలకు 1, ఓసీలలో జనరల్ 3, మహిళలకు 6 స్థానాలను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో అత్యధికంగా జనరల్కు ఏకంగా 9 స్థానాలు కేటాయించడం విశేషం. కాగా మొత్తం 18 వార్డులలో ఏ వార్డుకు ఏ రిజర్వేషన్లు అనేది రెండు రోజుల్లో తేలనున్నట్లు అధికారులు తెలిపారు. జీవో జారీ చేసిన ప్రభుత్వం -
నూతన సర్పంచులకు 5 రోజుల శిక్షణ
జిల్లా ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలుజనగామ రూరల్: జిల్లాలో నూతంగా ఎన్నికై న 280 మంది సర్పంచులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఓరియెంటేషన్ శిక్షణ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం మూడు విడతలుగా ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమాలు జనగామ మండలం యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలో వసతులతో నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. మొదటి విడతలో పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాలకు చెందిన 91 మంది సర్పంచులకు ఈనెల 19 నుంచి 23 వరకు ఐదు రోజుల పాటు ఉంటుంది. రెండో విడతలో జనగామ నియోజకవర్గంలోని జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల పరిధిలోని 79 మంది సర్పంచులకు ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు, మూడో విడతలో స్టేషన్ ఘననపూర్ నియోజకవర్గంలోని స్టేషన్ ఘన్న్పూర్, చిల్పూర్, రఘునాథపల్లి, జఫర్ఘఢ్, లింగాలఘణపురం మండలాల్లోని 110 మంది సర్పంచులకు ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు శిక్షణ ఉంటుందన్నారు. ఈ శిక్షణల్లో పంచాయతీ రాజ్ చట్టం, పాలన, అభివృద్ధి కార్యక్రమాలు, బాధ్యతలు వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. భోజనం, నివాసం వంటి వసతులు కల్పించనున్నారు. ఐదురోజులు పూర్తిగా హాజరైన వారికే సర్టిఫికెట్ జారీ అవుతుందన్నారు. ఉత్తమ ఫలితాలకు కృషి చేయాలి జిల్లాలో ఇంటర్ ఫలితాలపై అధికారులు ప్రత్యేక దృష్టి కేటాయించాలని ఉత్తమ ఫలితాలకు కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్పెషల్ ఆఫీసర్ వసుంధర దేవి, ఇంటర్ విద్యాధికారి జితేందర్రెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ను కలెక్టరేట్లో కలిసి ఇంటర్ ప్రగతి, వసతులపై చర్చించారు. ఈసందర్భంగా వారు వివరిస్తూ.. ఈవిద్యాసంవత్సరం జిల్లాలోని ఏడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన బోధనతో అడ్మిషన్ల సంఖ్య పెరిగిందన్నారు. ఫిజిక్స్వాలా ద్వారా విద్యార్థులకు ఎంసెట్, జేఈఈ కోచింగ్ ఇస్తున్నామన్నారు. మూడు విడతల్లో క్రీస్తుజ్యోతిలో నిర్వహణ తొలి విడత ఈనెల 19 నుంచి ప్రారంభం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్జనగామ: ప్రకృతితో ముడిపడి ఉన్న పండుగలన్నిటిలో తెలుగువారికి ముఖ్యమైన సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. భోగితో భోగభాగ్యాలు, సంక్రాంతితో ఆనందాలు, కనుమతో కొత్త సంతోషాలు ప్రతి ఇంటా నిండాలని కలెక్టర్ కోరుకున్నారు. అందరి జీవితాల్లో ఈ పండుగ తెచ్చే నూతన వైభవం వెల్లివిరియాలని ఆశిస్తూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. -
ఆ ఇంటికి ‘పెద్ద’రాయుడు..
నల్లబెల్లి: నల్లబెల్లి మండ ల పరిసర గ్రామాల్లో తిరుగుతూ గంగిరెద్దును ఆడించే పెద్ద వెంకటయ్యది మూడు తరాల చరిత్ర. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వృత్తే అతడికి జీవనాధారం. వెంకటయ్య దగ్గర ఉన్న గంగిరెద్దు పేరు పెద్దరాయుడు. తెల్లటి శరీరం, నుదుట ఎర్రని చుక్క, మెడలో గంటలతో అడుగు పెడితే పిల్లలందరూ చుట్టుముడుతారు. ‘పెద్దరాయుడిని మేము ఎద్దులా చూడము. మా కుటుంబంలో నా కన్న బిడ్డలా చూసుకుంటాం’అని పెద్ద వెంకటయ్య చెప్పుతుంటే ఆయన కళ్లలో గర్వం, ప్రేమ కనిపించాయి. పెద్దరాయుడు గురించి ఆయన మాటల్లో.. కఠినమైన శిక్షణ.. ప్రేమతోనే సాధ్యం ఒక ఎద్దును గంగిరెద్దుగా తీర్చిదిద్దడం వెనుక ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. తిరుపతి కొండల్లో గురువు ప్రేమ సైగలతో శిక్షణ ఇస్తారు. డూడూ బసవన్న అంటే తల ఊపడం, కాళ్లతో తాళం వేయడం, యజమాని మాట ప్రకారం ఆశీర్వదించడం ఇవన్నీ నేర్పడానికి ఎంతో ఓర్పు ఉండాలి. ప్రతిరోజూ పెద్దరాయుడు (గంగిరెద్దు)కు స్నానం చేయించి ప్రత్యేకమైన ఆహారం అందిస్తూ కుటుంబ సభ్యులకంటే జాగ్రత్తగా కాపాడుకుంటున్నా. పండుగ సమయంలో గతంలో బియ్యం, ధాన్యం, కాసిన్ని డబ్బులు ఇచ్చేవారు. కానీ పట్టణీకరణ పెరగడం, ప్రజల్లో ఆసక్తి తగ్గడంతో ప్రస్తుతం ఆదరణ తగ్గింది. కుటుంబ పోషణతోపాటు ఎద్దు మేతకు కూడా ఇబ్బంది అవుతోంది. ప్రభుత్వం మమ్ముల్ని కళాకారులుగా గుర్తించి పింఛన్ ఇవ్వాలి. పశుపోషణకు సాయం చేస్తే ఈ కళను బతికించుకుంటాం. -
నేటినుంచి వ్యవసాయ మార్కెట్లకు సెలవులు
జనగామ/స్టేషన్ఘన్పూర్: సంక్రాంతి పండగను పురస్కరించుకుని జనగామ, స్టేషన్ ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్లకు ఈనెల 14 (బుధవారం) నుంచి ఈ నెల 18వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు జనగామ ఏఎంసీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జీవన్ కుమార్, స్టేషన్ఘన్పూర్ ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, మార్కెట్కార్యదర్శి జన్ను భాస్కర్ మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. 14వ తేదీన భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ, 17న అడ్తిదారుల కోరిక మేరకు, 18వ తేదీన సాధారణ సెలవుగా ప్రకటించినట్లు వారు తెలిపారు. సెలవుల అనంతరం మార్కెట్ సేవలు 19వ తేదీ(సోమవారం) నుంచి పునఃప్రారంభమవుతాయన్నారు. రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలిరఘునాథపల్లి: రోడ్డు భద్రతపై అరైవ్–అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జనగామ వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. ప్రతి ఒక్క వాహనదారుడు రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరి పాటించాలని పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రత ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలోని కోమళ్ల టోల్ ప్లాజా వద్ద పోలీసులు అరైవ్, అలైవ్ కార్యక్రమంలో భాగంగా 200 వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్రెడ్డి, ఎస్సై దూదిమెట్ల నరేష్, పోలీస్ సిబ్బంది, టోల్ ప్లాజా సిబ్బంది పాల్గొన్నారు. ఆలేటి ఎల్లవ్వ జాతర ఏర్పాట్ల పరిశీలనపాలకుర్తి టౌన్: మండలంలోని బమ్మెర గ్రామశివారులో ఈనెల 14నుంచి 16 వరకు జరిగే ఆలేటి ఎల్లవ్వ జాతర ఏర్పాట్లను మంగళవారం వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ జానకీరాంరెడ్డి, ఎస్సై దూలం పవన్కుమార్ పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు రాపాక సత్యనారాయణ, బమ్మెర సర్పంచ్ జిట్టబోయిన రమ్య ప్రశాంత్, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జాతరల్లో నిరంతర విద్యుత్ సరఫరాస్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ డివిజన్ పరిధిలో నిర్వహించే శ్రీసమ్మక్క–సారలమ్మ జాతరలకు నిరంతర విద్యుత్ సరఫరాను అందించేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సీహెచ్.సంపతరెడ్డి అన్నారు. మండలంలోని ఇప్పగూడెం, రంగరాయగూడెం, అక్కపెల్లిగూడెం, కోమటిగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని చింతగట్టు శ్రీసమ్మక్క–సారలమ్మ జాతర ప్రాంగణాన్ని డీఈ సారయ్యతో కలిసి ఎస్ఈ సంపత్రెడ్డి మంగళవారం సందర్శించారు. కార్యక్రమంలో ట్రాన్స్కో ఏడీఈ రణధీర్రెడ్డి, ఏఈ శివకుమార్, లైన్ ఇన్స్పెక్టర్ కాలురామ్నాయక్, లైన్మన్ సాయిబాబు, కాంట్రాక్టర్ రఘురెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా విడుదలజనగామ: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జనగామ పురపాలక సంఘం పరిధిలోని 62 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కమిషనర్ మహేశ్వర్రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి.రాములు, రాజకీయ పార్టీల ప్రతినిధులు బూడిద గోపి, చొప్పరి సోమయ్య, బృంగి భాస్కర్, విజయభాస్కర్, కొత్తపల్లి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
గాలిపటమా పద పద..
వరంగల్ ఎల్లంబజార్లో నిజాం కాలం నుంచి విక్రయాలుఖిలా వరంగల్: సంక్రాంతిని పురస్కరించుకొని అందరూ గాలిపటాలు ఎగురవేస్తుంటారు. ఈసారి ఈగల్, డోరేమాన్, లేడీబర్డ్, జాజ్, పందెం కోడి వంటి ఆకర్షణీయమైన పతంగులు కనువిందు చేస్తున్నాయి. నిజాం నవాబుల కాలం నుంచే వరంగల్ ఎల్లంబజార్లో పతంగులు విక్రయిస్తూ ఎన్నో కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్, గుజరాత్ నుంచి పతంగులను దిగుమతి చేసుకుంటున్నారు. 2017 నుంచి చైనా మాంజా విక్రయాలపై నిషేధం.. 2016లో జాతీయ ట్రిబ్యునల్ తీర్పుతో 2017 నుంచి చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై ప్రభుత్వాలు నిషేధం విధించాయి. అయినా కొందరు వ్యాపారులు దొంగచాటున విక్రయిస్తున్నారు. పోలీసులు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి మాంజాను స్వాధీనం చేసుకొని విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. నిజాం కాలం నుంచి అమ్ముతున్నాం.. వరంగల్ ఎల్లంబజార్లో నివాసం ఉంటాం. తాత ముత్తాతలు పతంగుల వ్యాపారం చేసేవారు. వంశపారంపర్యంగా నిజాం కాలం నుంచి పతంగులను అమ్ముతూ జీవనం సాగిస్తున్నాం. మా ఇద్దరు కుమారులు సైతం ఇదే వ్యాపారం చేస్తున్నారు. 30 రోజులు మాత్రమే సీజన్ ఉంటుంది. –చౌహాన్ సూరాజ్, వ్యాపారి, ఎల్లంబజార్, వరంగల్మా షాపునకు వందేళ్ల చరిత్ర.. సురాజ్ మాల్కు వందేళ్ల చరిత్ర ఉంది. ఈ షాపును నమ్ముకొని నా ఇద్దరు కుమారులు జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన యువత ఇక్కడి నుంచి హోల్సేల్, రిటైల్గా కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. –చౌహాన్చంద్, వ్యాపారి పెద్దల పర్యవేక్షణలోనే ఎగురవేయాలి. నాణ్యమైన గాలిపటాలు కొనుగోలు చేసి కాటన్ దారాలు మాత్రమే వాడాలి. చైనా, ఇతర మాంజాలు వాడొద్దు.భవనాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగురవేయొద్దు. జనావాసాలకు దూరంగా విశాలమైన మైదాన ప్రదేశంలోనే ఎగురవేయాలి. పైకి చూస్తే భవనంపై నుంచి కింద పడే ప్రమాదం ఉంది. పతంగులు విద్యుత్ తీగలు, స్తంభాలకు చిక్కినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కర్రలు, ఇనుప చువ్వలతో తీసే ప్రయత్నం చేయొద్దు. -
పరిష్కారమేది ?
స్వీకరణతో సరి !జనగామ రూరల్: ప్రజా సమస్యలపై దరఖాస్తులు తీసుకోవడమే తప్పా పరిష్కారం కావడం లేదని సోమవారం కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్లో ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ తదితర అధికారులు ప్రజల నుంచి 43 దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను తీర్చడానికి అధికారులు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై ఇచ్చిన దరఖాస్తులను తీసుకోని సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి అనంతరం వివిధ అంశాలపై అధికారులతో కలెక్టర్ రిజ్వాన్ బాషా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో ఆధార్ అప్డేషన్ ప్రక్రియలో ఆధార్లో మార్పులు, చేర్పుల్లో జిల్లా టాప్లో ఉందని ఇలాగే కొనసాగేలా మానటరింగ్ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. జిల్లాలో సరిపడా యూరియా స్టాక్ అందుబాటులో ఉందని మండల స్పెషల్ అధికారులు, తహసీల్దార్లు ఫర్టిలైజర్ షాప్లను పర్యవేక్షణ చేస్తూ రైతుల అవసరాలకు సరిపడా యూరియా సరఫరా అయ్యేలా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. పీఎం పోషణ్ యాప్లో వంద శాతం ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ జరగాలన్నారు. జిల్లాలో మినీ మేడారం జాతరలు జరిగే ప్రాంతాల్లో వివిధ శాఖలకు అప్పగించిన బాధ్యతలను త్వరగా చేపట్టాలని భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు, జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని..● రేషన్ కార్డు నెంబర్ ఆన్లైన్లో తప్పుగా పడడంతో ఇల్లు మంజూరు కాలేదని, సాక్షన్ ఆర్డర్ కాపీ అగిపోయిందని రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన పాలమాకుల భాగ్య, నరేశ్ దంపతులు వినతి పత్రం అందించారు. సంబంధిత అధికారులకు తెలిపినా ఫలితం లేదన్నారు. అద్దె ఇంటిలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నామని, విచారణ చేపట్టి ఇల్లు మంజూరయ్యేలా చూడాలని కలెక్టర్ను కోరారు. ● వారసత్వంగా వస్తున్న భూమి ఖాస్తులో ఉండగా తన పేరా భూమిని పట్టా చేయాలని పాలకుర్తి మండలం శాతపురం గ్రామానికి చెందిన దురా్గానీ సురేశ్ వినతి పత్రం అందించారు. గ్రామంలో సర్వే నెంబర్ 119బై1బై1లో 2.28 ఎకరాల భూమి అమ్మమ్మ దుర్గానీ మల్లమ్మ పేరు మీద ఉందని, తమకు తెలియకుండా మరో వ్యక్తి అక్రమంగా పట్టా చేసుకున్నారని విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు. ● తన భర్త వేల్పూల యాదగిరి పేరు మీద సర్వే నెంబర్ 63 సీ2,3 లో 23 గుంటల భూమి ఉందని, పట్టా పాస్ బుక్కూడ వచ్చిందని, గ్రామంలో కొంత మంది వ్యక్తులు 4 ఏళ్ల క్రితం ఉన్న భూమి అక్రమంగా పట్టా చేసుకున్నారని చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామానికి చెందిన వేల్పూల సరోజన వినతి పత్రం అందించింది. తమకు రావల్సిన రైతుభరోసా, ఇతర పథకాలు అందడం లేదని విచారణ చేపట్టి తన భర్త భూమిని తన పేరా పట్టా చేయాలని కోరింది. రేషన్షాపు మంజూరు చేయాలి నా పేరు లింగమూర్తి, దివ్యాంగుడిని. నా భార్య కూడా దివ్యాంగురాలు. మాకు గ్రామంలో ఎలాంటి ఆధారం లేదు. పెన్షన్తో కాలం వెళ్లదీస్తున్నాం. పిల్లల చదువులు, ఇతర అవసరాలు తీరడం లేదు. గ్రామంలో రెండు వేలకు పైగా జనాభా.. 1,050 రేషన్ కార్డులు ఉన్నాయి. గ్రామంలో ఒకే రేషన్ షాపు ఉంది. మాకు రేషన్ షాపు మంజూరు చేసి ఉపాధి చూపాలి. – పిల్లి లింగమూర్తి, మీదికొండ, స్టేషన్ఘన్పూర్ ●ప్రజావాణిలో దరఖాస్తుదారుల ఆవేదన ఏళ్ల తరబడిగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నామని వెల్లడి కలెక్టరేట్ ప్రజావాణిలో 43 దరఖాస్తులు -
జిల్లా రద్దుకు కాంగ్రెస్ కుట్ర
జనగామ: జిల్లాను కనుమరుగు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు చేస్తున్న వ్యాఖ్యలతో ప్రజ ల్లో ఆందోళన కలుగుతోందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. జనగామ మున్సిపల్లో అభివృద్ధి, తదితర మౌలిక వసతి సౌకర్యాలు, నిధుల విడుదల తదితర వాటిపై పురపాలికలో కమిషనర్ మహేశ్వర్రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు.. జిల్లా సాధన కోసం ప్రజలతో కలిసి చేసిన పోరా టాన్ని గుర్తుచేస్తూ ఇలాంటి నిర్ణయాలపై వ్యతిరేక మాటలు మాట్లాడటం బాధాకరమని మండిపడ్డారు. జిల్లాను ఏర్పాటు చేసి, కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, మెడికల్ హాస్పిటల్ ఏర్పాటు చేసుకుని, నవోదయ స్కూల్ వంటి కీలక అడుగు వేసే సమయంలో కొందరు కాంగ్రెస్ నేతలు జిల్లా అవసరం లేదంటూ ప్రచారం చేయడం రాజకీయ కక్షసాధింపు తప్ప మరేమీ కాదన్నారు. జిల్లాను మూసివేయాలన్న ఎమ్మెల్యేలు కడియం, నాయిని రాజేందర్రెడ్డి ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేరని హెచ్చరించారు. భూభారతి ఫెయిల్యూర్ వ్యవస్థ.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సజావుగా నడుస్తుంటే రాజకీయ కక్షలతో భూభారతి అనే ఫెయిల్యూర్ వ్యవస్థను తెచ్చి మధ్యవర్తులు వందల కోట్ల ప్రజాధనాన్ని మాయం చేసుకునేలా అప్పగించారని పల్లా ఆరోపించారు. చలాన్ల వ్యవహారాల్లో భారీ మోసాలు జరిగినా, రైతులకు, కొనుగోలు దారులకు నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. అభివృద్ధిపై ఫోకస్ పురపాలిక అభివృద్ధి కోసం రూ.30 కోట్లు తీసుకొచ్చానని, ప్రస్తుతంలో మరో రూ.19 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. వైకుంఠధామం రోడ్డుకు రూ.72 లక్షలతో రిపేర్లు చేస్తామని, ఇందుకు సంబంధించి టెండరు ప్రక్రియ త్వరలోనే ఉంటుందన్నారు. ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు భూభారతి కుంభకోణంలో వందల కోట్లు మాయం మున్సిపల్ అభివృద్ధిపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సమీక్ష -
తుది ఓటరు జాబితా విడుదల
జనగామ/స్టేషన్ఘన్పూర్: పురపాలక ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం జనగామ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డులవారీ తుది ఓటర్ల జాబితాను కమిషనర్లు మహేశ్వర్రెడ్డి, రాధాకృష్ణ వేర్వేరుగా విడుదల చేశారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 30 వార్డులు, ఘన్పూర్ మున్సిపాలిటీలోని 18 వార్డుల పరిధిలో పురుషులు, మహిళలు, ఇతరులను విభజించి జాబితాను రూపొందించారు. జనగామ మున్సిపాలిటీలో.. జనగామ మున్సిపాలిటీలో 44,045 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 21,358, మహిళలు 22,678, ఇతరులు 9 మంది ఉన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈనెల 16వ తేదీన పోలింగ్ బూతుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాను బూత్ల వారీగా అధికారికంగా ప్రకటించనున్నారు. జనగామలో గత ఎన్నికల్లో ఉన్న 60 పోలింగ్ బూత్లు ఉండగా, ఈసారి రెండు పెరగడంతో 62కి చేరుకున్నాయి. ఈనెల 13వ తేదీన పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు. స్టేషన్ఘన్పూర్లో.. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో 18 వార్డులకు గాను 36 పోలింగ్స్టేషన్లు ఉన్నాయి. మొత్తంగా ఓటర్లు 18,550 కాగా అందులో పురుషులు 8913, సీ్త్రలు 9636 ఉండగా ఇతరులు ఒక్కరున్నారు. నిబంధనల మేరకు ఫొటోలతో కూడిన ఓటర్ల తుదిజాబితాను ఏర్పాటు చేశారు. ఈనెల 13న పోలింగ్స్టేషన్లు, ఓటర్ల వివరాలను ఆన్లైన్లో టీపోల్లో నమోదు చేస్తారు. స్టేషన్ఘన్పూర్ వార్డులు :18 ఓటర్లు :18,550 పురుషులు : 8,913 మహిళలు : 9,636 ఇతరులు : 01 పోలింగ్ బూత్లు : 36జనగామ వార్డులు : 30 ఓటర్లు : 44,045 పురుషులు : 21,358 మహిళలు : 22,678 ఇతరులు : 9 పోలింగ్ బూత్లు : 62 జనగామ మున్సిపాలిటీలో 44,045 ఓటర్లు..‘స్టేషన్’లో 18,550 మంది నేడు పోలింగ్ కేంద్రాల ముసాయిదా -
భక్తుల కొంగుబంగారం బంజర మల్లన్న
దేవరుప్పుల: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని పెద్దమడూరు జోగు బ్రదర్స్ నిర్వహంచే బంజర మల్లన్న జాతర ఈనెల 14(బుధవారం) నుంచి ప్రారంభంకానుంది. మండలంలోని చిన్నమడూరు రెవెన్యూ పరిధి బంజర గ్రామ శివారు చెరువు సమీపంలో పూర్వం తలపెట్టిన పెద్దమడూరుకు చెందిన జోగు బ్రదర్స్ కుటుంబాలు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ జాతరకు ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాల పలు మండలాల నుంచి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో పెద్దఎత్తున శివభక్తులు చేరుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. మొదటిరోజు జోగు కుటుంబాలు శివసత్తుల పూనకాల మధ్య ఆలయానికి చేరుకొని సామూహికంగా వంటలు చేసి బోనాలు సమర్పిస్తారు. రెండోరోజు (గురువారం) శ్రీ మల్లికార్జునస్వామి (బంజరమల్లన్న)కు ఒగ్గు పూజారులచే పట్నాలు వేసి కళ్యాణోత్సవం జరుపుతారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జోగు బ్రదర్స్ ఆధ్వర్యంలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసు యంత్రాంగం భద్రతను పర్యవేక్షించనుంది. రేపటినుంచి పెద్దమడూరు పరిధిలో జాతర షురూ ఉమ్మడి జిల్లా నుంచి శివభక్తుల రాక


