జనగామ రూరల్: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఫస్టియర్లో జనరల్ విభాగంలో 3,477మందికి గాను 3,425 మంది హాజరుకాగా 52 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకేషనల్లో 640 మంది విద్యార్థులకు గాను 592 మంది విద్యార్థులు హాజరుకాగా 48 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతగా ముగిశాయని డీఐఈఓ జితేందర్రెడ్డి తెలిపారు. తమకు సహకరించిన కలెక్టర్ సందీప్కుమార్ ఝా, పోలీస్ అధికారులకు, డిపార్ట్మెంట్ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు పరీక్షలు ముగియడంతో వారి సొంతూళ్లకు తరలివెళ్లారు.
చివరి రోజు 100మంది విద్యార్థుల గైర్హాజరు


