breaking news
South India
-
మీసాలు తీసేసి యంగ్గా మారిన విజయ్ సేతుపతి.. సాయి పల్లవితో లవ్స్టోరీ!
సాధారణంగా ఒక్కో సినీ దర్శకుడికి ఒక్కో ముద్ర ఉంటుంది. అయితే ఏ తరహా కలనైనా తనదైనశైలిలో తెరపై ఆవిష్కరించి విజయం సాధించగల సత్తా కలిగిన దర్శకుడు మాత్రం మణిరత్నం ఒక్కరే అని చెప్పాలి. ఈయన రోజూ, బొంబాయి వంటి సున్నితమైన ప్రేమ కథా చిత్రాన్ని హృద్యంగా తెరకెక్కించగలరు, దళపతి,నాయకన్ వంటి యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన కమర్షియల్ ఎంటర్ టైన్మెంట్ కథా చిత్రాలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకోనూ గలరు. అదే విధంగా ఓ కణ్మణి వంటి రోమాంటిక్ కథా చిత్రాలతో కురక్రారును అలరించగలరు. పొన్నియిన్ సెల్వన్ వంటి చారిత్రాత్మక కథా చిత్రాలను బ్రహ్మాండంగా తెరపై ఆవిష్కరించగలరు. అలాగని మణిరత్నం చేసిన చిత్రాలు అన్నీ హిట్ అని చెప్పట్లేదు. ఇటీవల ఆయన చేసిన థగ్ లైఫ్ చిత్రం ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో చిన్న బ్రేక్ తీసుకుని మళ్లీ యూత్ ఫుల్ లవ్ స్టొరీతో ప్రేక్షకుల ముందుకు పొందడానికి సిద్ధం అవుతున్నారు. అందుకు ఆయన విజయ్ సేతుపతి నటి, సాయి పల్లవి ని ప్రధాన పాత్రధారులుగా ఎంచుకున్నారు.ఈ చిత్రం ఎలాంటి చడీ చప్పుడు లేకుండా ఇటీవల కోల్కత్తాలో షూటింగ్ ను ప్రారంభించుకుని అక్కడ ప్రసిద్ధి చెందిన హౌరా బ్రిడ్జి దాని పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకునే పనిలో ఉంది చిత్ర యూనిట్. అక్కడ ఓ బ్యూటీఫుల్ పాటను చిత్రీకరిస్తున్నారు తెలిసింది. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఇంకా పేరు నిర్ణయించిన ఈ చిత్రాన్ని మణిరత్నంకు చెందిన మద్రాస్ టాకీస్,లైకా ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. కాగా ఈ చిత్రం కోసం విజయ్ సేతుపతిని, సాయి పల్లవిని మణిరత్నం పూర్తిగా మార్చేశారు. ముఖ్యంగా మీసం, గడ్డాలతో ముదురుగా కనిపించే విజయ్ సేతుపతిని యంగ్గా చూపించే ప్రయత్నం చేస్తు న్నారు. ఇది యూత్ ఫుల్ ప్రేమ కథా చిత్రంగా ఉంటోందని పిస్తోంది. -
సినిమాల్లో నటించే ప్రసక్తే లేదని చెప్పేశా : త్రిష
ఇండియన్ సినిమాలోనే నటి త్రిష ఒక సంచలనం. హీరోయిన్గా రెండు దశాబ్దాలకు పైగా పయనం, ఎన్నో విజయాలు. కొన్ని అపజయాలు. వ్యక్తిగతంగానూ సంతోషంతో పాటు చేధు అనుభవాలు ఎదుర్కొన్నారు. అయితే చేదు అనుభవాలను ధైర్యంగా ఎదురొడ్డి నిలిచారు. ఎంతటి వారికైనా జీవితంలో ఎత్తుపల్లాలు సహజం అనడానికి త్రిష ఒక చిన్న ఉదాహరణ. నటి సిమ్రాన్ కథానాయకిగా నటించిన జోడీ చిత్రంతో ఆమె స్నేహితురాలిగా ఒకటి రెండు సన్నివవేశాల్లో మెరిసిన ఈ బ్యూటీ ఆ తరువాత హీరోయిన్ స్థాయికి ఎదిగి ఇప్పటి వరకు అగ్ర కథానాయకిగా రాణిస్తున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటిస్తూ భారతీయ సీనీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.గత ఏడాది ఆమె నటించిన చిత్రాల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ఒక్కటే విజయం సాధించింది. దీంతో కెరీర్ పరంగా కొంచెం ఒడిదుకులను ఎదుర్కొన్నా.. ఈ ఏడాది ఆరంభంలోనే కరుప్పు చిత్రంతో మంచి విజయాన్ని అందుకొని మళ్లీ ఫామ్లోకి వచ్చారు. 44 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల యువతిలా ఉంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.ఇక పోతే తెలుగులో చిరంజీవికి జంటగా నటించిన విశ్వంభర చిత్రం త్వరోనే తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ఒక భేటీలో త్రిష పేర్కొంటూ ఆరంభంలో మిస్ చెన్నై కీరిటాన్నిగెలుకున్న తాను మోడలింగ్ రంగంలోకి ఎంట్రి ఇచ్చానన్నారు. అప్పట్లో చాలా మంది సినీ రంగంలోకిప్రవేశిస్తారా అని అడగ్గా..ఎప్పటికీ అలా చేయనని అని దృఢంగా చెప్పానన్నారు. సినిమా అంటే తెలిసీ తెలియని వయసు అది అని నటి త్రిష పేర్కొన్నారు. ఈ సంచనల నటి ఆరంభంలో చెప్పినట్లుగా సినిమాకు దూరంగా ఉండి ఉంటే ఇండియన్ సినిమా ఒక మంచి నటిని కోల్పోయేది అని నెటిజన్స్ కామెంట్ చేస్తుననారు. -
ఓటీటీకి లేటేస్ట్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన స్పోర్ట్స్ కామెడీ చిత్రం గట్ట కుస్తీ-2. ఈ సినిమాకు చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 3న థియేటర్లలో విడుదలైంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సినీ ప్రియులను మెప్పించింది. ఈ చిత్రంలో రమ్య కృష్ణన్, యోగి బాబు, కరుణాస్ కీలక పాత్రల్లో నటించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్దమైంది. ఈ నెల 31 నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. గతంలో వచ్చిన మట్టి కుస్తీకి సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో కేవలం తమిళంలోనే విడుదల చేశారు. అయితే ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. Biggest Blockbuster of the season 🔥 #GattaKusthi2 (Tamil)Streaming from July 31 on Netflix in Tamil, Telugu, Kannada, Malayalam Hindi 🍿!!#OTT_Trackers pic.twitter.com/EIPUelKlU8— OTT Trackers (@OTT_Trackers) July 28, 2026 -
స్టార్ హీరో భార్యకు రూ.40 లక్షల భరణం.. కోర్ట్ షాకింగ్ తీర్పు
తమిళ స్టార్ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి విడాకుల కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇతడికి అనుకూలంగా చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: రామ్ చరణ్కి సర్జరీ.. కోయంబత్తూరులోనే ఎందుకంటే?)రవి మోహన్ నుంచి అతడి భార్య ఆర్తి, నెలకు రూ.40 లక్షల భరణం (మెయింటెనెన్స్) కోరింది. ఈ మేరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఆ డిమాండ్ తిరస్కరణకు గురైంది. కేసు తుది తీర్పు వచ్చేవరకు ప్రతి నెల రూ.3 లక్షలు చెల్లించాలని రవిమోహన్ని కోర్టు ఆదేశించింది. అలానే ఈ దంపతుల ఇద్దరు కొడుకులు ఆరవ్, అయాన్లని తండ్రి రవిమోహన్ కలుసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని స్పష్టం చేసింది.గత కొన్నాళ్లుగా తన పిల్లలని కలవకుండా ఆర్తి అడ్డుకుంటోందని రవిమోహన్ బహిరంగంగా ఆరోపించిన సంగతి తెలిసిందే. తన కొడుకులకు పాఠశాలకు సెక్యూరిటీతో పంపుతున్నారని, వారు కారు ప్రమాదానికి గురైన విషయాన్ని కూడా తనకు చెప్పలేదని రవిమోహన్ గతంలో ఆరోపించారు. ఆ ప్రమాదం గురించి వేరే వాళ్ల ద్వారా తెలుసుకోవాల్సి వచ్చిందని, పిల్లల గురించి ఆందోళన ఉన్నప్పటికీ వారిని కలిసే అవకాశం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడీ విషయంలో ఈ హీరోకి ఊరట దక్కింది.2009 జూన్లో రవిమోహన్, ఆర్తి పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 15 ఏళ్లపాటు కొనసాగిన వీళ్ల వైవాహిక జీవితంలో మనస్పర్థలు తలెత్తాయి. 2024 సెప్టెంబరులో విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు రవిమోహన్ ప్రకటించారు. ఈ నిర్ణయం తనకు తెలియకుండానే తీసుకున్నారని ఆర్తి అప్పట్లో చెప్పింది. అప్పటి నుంచి ఈ విడాకులు కేసు.. భరణం, పిల్లల సంరక్షణ హక్కులు, వ్యక్తిగత ఆరోపణలు తదితర అంశాలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రవి మోహన్కి అనుకూలంగా వచ్చాయి.(ఇదీ చదవండి: తండ్రి మరణించిన ఆస్పత్రిలోనే హీరో కన్నుమూత) -
సీఎంగా విజయ్.. తమిళ హీరోలు ఇలా బయటపడుతున్నారేంటి?
రాజకీయాలకు, సినిమా ఇండస్ట్రీకి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే నటీనటులు చాలామంది రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ఎన్టీఆర్, ఎమ్జీఆర్, విజయ్ లాంటి వాళ్లు ఏకంగా ముఖ్యమంత్రులు కూడా అయిపోయారు. అయితే హీరో విజయ్.. తమిళ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈయన కొన్ని సీట్లు గెలిస్తే గొప్ప అనుకున్నారు. కానీ సీఎం అయ్యేసరికి అంతా ఆశ్చర్యపోయారు. ఈయనకు అధికారం రావడం మాటేమో గానీ తమిళ హీరోలు ఒకరి తర్వాత రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తిని బయటపెడుతున్నారు. తాజాగా ఈ లిస్టులోకి విశాల్ చేరిపోయాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కొరియన్ హారర్ సినిమా.. తెలుగులోనూ)రీసెంట్ టైంలో కొరియోగ్రాఫర్ కమ్ హీరో రాఘవ లారెన్స్ తనకున్న రాజకీయ ఆసక్తిని బయటపెట్టేలా మాట్లాడగా.. హీరో ధనుష్ ఏకంగా పెద్ద సభని ఏర్పాటు చేశాడు. తాజాగా విశాల్ కూడా ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ తాను సొంతం చేసుకున్న మంచి పేరును ప్రజా సేవకు ఉపయోగించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నా. మీరు చూపిన అభిమానానికి.. మీకు తిరిగి ఏదో ఒకటి చేయాలని భావిస్తున్నా. ఇకపై నా ప్రయాణం సాధారణంగా ఉండదు. ఎలాంటి అడ్డదారులు లేకుండా నేరుగా, నిజాయతీగా ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నా. ఆ మార్గంలో ప్రయాణిస్తూ అన్ని రంగాల్లో మీకు అండగా ఉంటానని విశాల్ అన్నాడు. దీంతో ఈ హీరో కూడా త్వరలోనే రాజకీయ ఎంట్రీ ఇస్తారని మాట్లాడుకుంటున్నారు.అయితే విజయ్కి కలిసొచ్చినట్లు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న మిగతా తమిళ హీరోలకు పరిస్థితులు కలిసొస్తాయా అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే విజయ్కి ఉన్న ఫ్యాన్ బేస్ వేరు. ధనుష్, విశాల్ లాంటి హీరోలకు ఉన్న అభిమాన గణం వేరు. చూస్తుంటే రాబోయే రోజుల్లో తమిళ రాజకీయాల్లోకి చాలామంది హీరోలు వచ్చేలా కనిపిస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: రామ్ చరణ్కి సర్జరీ.. కోయంబత్తూరులోనే ఎందుకంటే?)#Vishal 🔥 pic.twitter.com/L6gFlHmgab— Cine World Entertainment 🌍 (@CineWorldEnt) July 28, 2026 -
కోలీవుడ్లో క్రేజీ కాంబినేషన్ రిపీట్.. మరో బ్లాక్ బస్టర్ కొట్టేనా?
సామాజికపరమైన సమస్యలను తెరపై ఆవిష్కరించడంలో దిట్ట దర్శకుడు వెట్రిమారన్. ఆడుగళం చిత్రంతో దర్శకుడిగా రంగ ప్రవేశం చేసిన ఈయన దర్శకుడు బాలు మహేంద్ర శిష్యుడు అన్నది తెలిసిందే. ఆ తర్వాత పొల్లాదవన్, విచారణై, వడచైన్నె , విడుదలై, విడుదలై –2 పలు వైవిధ్య భరిత కథా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈయన శింబు కథానాయకుడిగా అరసన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ది క్రియేషన్స్ కలైపులి ఎస్ ధాను నిర్మిస్తున్న ఇందులో నటుడు విజయ్ సేతుపతి,, ఆండ్రియా, ప్రియాంక మోహన్, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా దర్శకుడు వెట్రిమారన్ మరోసారి విజయ్ చతుపతి కథానాయకుడు చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. గిరి కాంబినేషన్లో ఇంతకుముందు విడుదలై, విడుదలై 2 చిత్రాలు రూపొంది మంచి విజయాన్ని సాధించాయి. అదేవిధంగా తాజాగా వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న అరసన్ చిత్రంలో కూడా విజయ్ సేతుపతి ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. దీంతో వీరి కాంబినేషన్లో నాలుగవ చిత్రం తెరకెక్కనుదన్న మాట. అయితే దర్శకుడు వెట్రీ మారన్ ప్రస్తుతం రూపొందిస్తున్న అరసన్ చిత్రం తర్వాత ధనుష్ హీరోగా తమిళ్ మురుగన్, వడచైన్నె– 2 చిత్రాలు చేయాల్సి ఉంది. వీటిని పూర్తి చేసిన తర్వాతే విజయ్ సేతుపతితో చేసే చిత్రం ఉంటుందని సమాచారం. అదేవిధంగా దీనికి సంబంధించిన అధికారికి ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. -
ఓటీటీకి వచ్చేసిన మలయాళ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీల్లో మలయాళ సినిమాలకు ప్రత్యేక డిమాండ్ ఉంటోంది. ఈ చిత్రాలకు ఇతర భాషల్లో ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సరికొత్త కంటెంట్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. మలయాళంలో హిట్ మూవీస్ తెలుగులోనూ ఆదరణ దక్కించుకుంటున్నాయి. తాజాగా మరో మలయాళ సినిమా ఓటీటీకి వచ్చేసింది.ఈ ఏడాది మలయాళంలో రిలీజై హిట్గా నిలిచిన చిన్న చిన్న ఆసై ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ రోజు నుంచే నుంచి జియో హాట్స్టార్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి వర్ష వాసుదేవ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఇంద్రన్స్, మధు బాల, అపర్ణ బాలమురళి, జాఫర్ సాదిక్, విష్ణు అగస్త్య కీలక పాత్రల్లో నటించారు. -
ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు పూరి జగన్నాథ్ గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భారీ అంచనాలతో విడుదలైన లైగర్, ఇస్మార్ట్ శంకర్ 2 సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. ఈ పరిస్థితుల్లో ఆయన అభిమానులు, సినీ వర్గాలు ఆయన కమ్బ్యాక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు, గాయకుడు రఘు కుంచె పూరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన మాటల్లో.. అప్పట్లో 'పూరి' ఒక వ్యక్తిని బాగా నమ్మాడు. కానీ ఆ వ్యక్తి చేసిన మోసం వల్ల ఆయనకు భారీగా ఆర్థిక నష్టం జరిగింది. ఆ అప్పులు తీర్చేందుకు ప్రతి నెలా రూ.50 లక్షల వరకు వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. దాంతో చివరికి పూరి ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న ఆఫీస్ను కూడా అమ్మేయాల్సి వచ్చింది. తర్వాత అద్దె ఆఫీస్లో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రఘు కుంచె తెలిపారు. అయితే ఆ వ్యక్తి పేరు మాత్రం ఆయన వెల్లడించలేదు. అప్పట్లో ఓ ఇంటర్వూలో పూరి కూడా ఈ విషయంపై స్పంధించారు. అప్పుడు నేను ప్రభాస్, గోపీచంద్, అమితాబ్ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నాను. కానీ వచ్చే డబ్బు మాత్రం అప్పులకు వడ్డీలు చెల్లించేవాడిని. ఆ సమయంలో పెంపుడు జంతువులను కూడా ఫీడ్ చేయలేక ఇతరులకు ఇచ్చేశాను. ఆ సమయంలో మొదటిసారి ఏడ్చాను. నా డబ్బు పోయినదానికంటే ఆ విషయంలో నేను ఎక్కువ బాధపడ్డానని పూరి చెప్పారు.ఇక పూరి జగన్నాధ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్, జెబి మోషన్ పిక్చర్స్ సంస్థలపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జెబి నారాయణరావు కొండ్రొల్లా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. పూరి జగన్నాథ్ కెరీర్లో ఈ సినిమా కీలక మలుపు అవుతుందనే ఆశలు అభిమానుల్లో ఉన్నాయి. -
దీక్షిత్ శెట్టి కొత్త సినిమా.. ట్రైలర్ వచ్చేసింది
దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా కీలక పాత్రల్లో వస్తోన్న చిత్రం కేజేక్యూ(కింగ్.. జాకీ.. క్వీన్). ఈ పీరియాడికల్ క్రైమ్ కథగా రూపొందించారు. ఈ మూవీకి కేకే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రాన్ని గ్యాంగ్స్టర్ నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు పూర్ణచంద్ర తేజస్వీ సంగీతమందించారు. -
హిట్ హీరో.. హిట్ దర్శకుడు కలిసి!
రీసెంట్ టైంలో వేర్వేరు సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు, నటుడు కలిసి పని చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. విష్ణు విశాల్ హీరోగా 'గట్ట కుస్తీ' రెండు మూవీస్ తీసి హిట్స్ అందుకున్న దర్శకుడు చెల్లా అయ్యావు. తొలిసారి హీరో కమ్ దర్శకుడిగా చేసి ఘనవిజయాన్ని అందుకున్న కెన్ కరుణాస్. ఇప్పుడు వీళ్లిద్దరే కలిసి పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది.గట్ట కుస్తీ 2 చిత్రంలో కీలకపాత్ర చేసిన నటుడు కరుణాస్కు దర్శకుడు సెల్లా అయ్యావు తో మంచి స్నేహం ఏర్పడిందని, దీంతో ఆయన దర్శకత్వంలో తన కొడుకు కెన్ కరుణాస్ హీరోగా మూవీని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల సమాచారం. -
సీఎం విజయ్పై సీనియర్ నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయాల్లోకి వస్తారని అస్సలు ఊహించలేదని సీనియర్ నటుడు నిళ్గల్ రవి అన్నారు. షూటింగ్లో రాజకీయాల గురించి విజయ్ ఎప్పుడూ మాట్లాడేవారు కాదని, అలాంటిది పాలిటిక్స్లోకి ఎంటరై ముఖ్యమంత్రి కావడం తనకు ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.విజయ్ రాజకీయ ప్రయాణం ఊహించలేదువిజయ్ ముఖ్యమంత్రిగా ఎదుగుతారని తాను ఎప్పుడూ ఊహించలేదని నిళ్గల్ రవి అన్నారు. "నేను విజయ్తో 'ఖుషి' (2000), 'తిరుమలై' (2003), 'కావలన్' (2011) చిత్రాల్లో కలిసి నటించాను. షూటింగ్ సమయంలో ఎన్నోసార్లు మాట్లాడినా, ఆయనలో రాజకీయాలపై ఆసక్తి కనిపించలేదు. నిజంగా ఇది నాకు పెద్ద ఆశ్చర్యమే. 1990ల మధ్యలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నాను. కానీ ఆ అవకాశం విజయ్కు రావడం ఆనందంగా ఉంది. ఆయన ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండేవారు. తెరపై ఎలా భిన్నంగా కనిపిస్తారో, రాజకీయాల్లో కూడా 'సైలెంట్ డైనమైట్'గా తన సత్తా చాటార''ని కొనియాడారు.అభిమానుల ప్రేమ అసాధారణం'జన నాయగన్' సినిమాను అభిమానుల సమక్షంలో ధియేటర్లో చూసినట్టు వెల్లడించారు. "మదురైలో జన నాయకన్ సినిమా చూశాను. విడుదల రోజున అక్కడ షూటింగ్ ఉండటంతో ప్రత్యేకంగా అనుమతి తీసుకుని సినిమాకు వెళ్లాను. కమల్ హాసన్ 'నాయకన్' విడుదల సమయంలో చూసిన సంబరాల తర్వాత, ఇలాంటి అభిమానుల ఉత్సాహాన్ని ఇప్పుడు 'జన నాయకన్'కే చూశాను. విజయ్పై ప్రజలకు ఉన్న ప్రేమ, అభిమానం అసాధారణం. సినిమాలో నా పాత్రకు కూడా మంచి స్పందన వచ్చింది. చాలా ఏళ్లుగా మాట్లాడని వారు కూడా ఫోన్ చేసి అభినందించడం ఆనందంగా ఉంది" అని తెలిపారు.నేరేషన్ అవకాశాలు పెరిగాయి'జన నాయకన్' సినిమాలో స్క్రీన్ టైమ్ తక్కువే ఉన్నప్పటికీ, కథను ముందుకు నడిపే పాత్ర దక్కడం సంతృప్తినిచ్చిందని రవి చెప్పారు. "వాయిస్ యాక్టింగ్ ఎంత శక్తివంతమైన అంశమో 'కేజీఎఫ్' సినిమా తర్వాత అందరికీ తెలిసింది. అప్పటి నుంచి నాకు నేరేషన్ అవకాశాలు పెరిగాయి. 'జన నాయకన్'లో కూడా అలాంటి అవకాశం వచ్చింది. డాక్యుమెంటరీలకు నేరేషన్ ఇవ్వడం ఒకలా ఉంటే, సినిమాల్లో మాత్రం సన్నివేశానికి అనుగుణంగా స్వరంలో భావోద్వేగాలు జోడించే అవకాశం ఉంటుంది. దర్శకుడు వినోద్ నాపై పూర్తి నమ్మకం ఉంచి స్వేచ్ఛ ఇచ్చారు" అని తెలిపారు.విలన్ పాత్రలకు సిద్ధమేతన సినీ జీవితంలో ఎక్కువగా తెలివైన, అసలు స్వరూపాన్ని చివర్లో బయటపెట్టే పాత్రలే వచ్చాయని, కానీ పూర్తిస్థాయి విలన్ పాత్రలు మాత్రం ఎక్కువగా దక్కలేదని రవి తెలిపారు. "రజనీకాంత్తో చేసిన అనేక సినిమాల్లో మాయమాటలు చెప్పే, కుట్రలు పన్నే పాత్రల్లో కనిపించాను. దర్శకులు నన్ను అలాంటి పాత్రలకే ఎక్కువగా ఎంపిక చేశారు. అయితే బహిరంగంగా కనిపించే విలన్ పాత్రలు చేయడానికి కూడా నేను సిద్ధమే. నాకు పాత్రల పరిమాణం కంటే నటనపై ఉన్న ప్రేమే ముఖ్యమైనది. అందుకే పాత్రల కోసం ఎప్పుడూ వెతకాలేదు. వచ్చిన అవకాశాలనే స్వీకరించాను" అని చెప్పారు.చదవండి: 23 ఏళ్లుగా కనిపించని ప్రముఖ నటుడు!తదుపరి చిత్రాలుప్రస్తుతం నిళ్గల్ రవి (Nizhalgal Ravi) కార్తీ–పీఎస్ మిత్రన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'సర్దార్ 2'లో నటిస్తున్నారు. అలాగే దర్శకుడు చింబు దేవన్ రూపొందిస్తున్న కామెడీ చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. -
సీఎం సినిమాకే తప్పని తిప్పలు.. షోలు ఆపేసి మరీ
తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగన్'.. గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చింది. తెలుగులో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తమిళనాడులో మాత్రం అభిమానులు థియేటర్లకు వెళ్తున్నారు. అయితే చెన్నైలోని పలు థియేటర్లలో ఈ మూవీ షోలని మధ్యలోనే నిలిపివేయడంతో గందరగోళం నెలకొంది.(ఇదీ చదవండి: నటుడు చనిపోయిన 16 ఏళ్లకు సొంతింటి కల సాకారం)వయలెన్స్ ఉందనే కారణంతో ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్.. ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అయినా సరే కొందరు ప్రేక్షకులు తమతోపాటు చిన్న పిల్లల్ని కూడా థియేటర్లకు తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం చెన్నైలోని పలు మల్టీప్లెక్స్ల్లో జరిగిన పోలీసుల తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. ఇది రూల్స్కి విరుద్ధం కావడంతో షోలు ఆపేశారు.ఈ క్రమంలోనే పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులని థియేటర్లలో నుంచి బయటకు పంపేందుకు దాదాపు గంట పట్టింది. ఫలితంగా కొన్నిచోట్ల షోలు ఆలస్యమయ్యాయి. మరోసారి నిబంధనలని గుర్తుచేస్తూ మైనర్లతో వచ్చేవాళ్లని మల్టీప్లెక్స్ల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశాయి.తెలుగు సినిమా 'భగవంత్ కేసరి'కి రీమేక్గా దీన్ని తీశారు. అసలైన పాయింట్ తీసుకుని మిగతాది అంతా యాక్షన్తో నింపేశారని, దీంతో వరస్ట్గా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ కాగా మమిత బైజు కీలక పాత్ర చేసింది. హెచ్.వినోద్ దర్శకుడు. లెక్క ప్రకారం ఈ ఏడాది సంక్రాంతికే రిలీజవ్వాలి కానీ సెన్సార్ సమస్యలని దాటుకుని గత వీకెండ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.(ఇదీ చదవండి: నా కథ, స్క్రీన్ప్లే దొంగిలించారు) -
నటుడు చనిపోయిన 16 ఏళ్లకు సొంతింటి కల సాకారం
'శివాజీ' సినిమాలో ప్రొఫెషనల్ ఎథిక్ అంటూ డైలాగ్ చెప్పే నటుడు మీకు గుర్తుండే ఉంటుంది. ఆ ఒక్క డైలాగ్తో తెలుగులోనూ చాలా ఫేమస్ అయిన ఈయన మలయాళ నటుడు కొచ్చిన్ హనీఫా. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కలిపి 300కి పైగా చిత్రాల్లో నటించారు. 2010లో సడన్గా చనిపోవడంతో ఈయన కుటుంబం సొంతింటిని నిర్మించుకునే విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఎట్టకేలకు ఆ కల తాజాగా సాకారమైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)నటుడిగా ఉన్నప్పుడే హనీఫా.. సొంతింటిని కట్టుకోవాలని చాలా ఆశపడ్డారు. అందుకోసం కొద్దికొద్దిగా డబ్బుని పొదుపు చేసుకున్నారు. కానీ 2010లో మరణించిన తర్వాత ఈయన ఆస్తులకు సంబంధించి న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యాయి. ఫలితంగా ఇంటి నిర్మాణం ఎన్నో ఏళ్లు ఆలస్యమైంది. దీంతో ఈయన భార్య ఫసీలా, కవల కుమార్తెలు సఫా, మార్వా.. కొచ్చిలోని కడవంత్ర ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లోకి మారారు. అప్పటినుంచి అక్కడే ఉంటూ వచ్చిన హనీఫా కుటుంబం.. ఎట్టకేలకు ఇప్పుడు సొంతింటిలో అడుగుపెట్టారు. ఈ శుభకార్యంలో హీరో దిలీప్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు.కొచ్చిలోని వెన్నల ప్రాంతంలో నిర్మించిన ఈ మూడు అంతస్తుల ఇంటికి 'కొచ్చిన్ హనీఫాస్ ఏబీ మంజిల్' అని పేరు పెట్టారు. తమకు నాలుగేళ్ల వయసున్నప్పుడు తండ్రిని కోల్పోయిన సఫా, మార్వా.. తమ కొత్త ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేయడం విశేషం. ఇంటి నిండా హనీఫా ఫొటోలు, ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలని ఏర్పాటు చేశారు.మా కుటుంబం ఒక్క రూపాయి కోసం కూడా ఎవరి ముందు చేయి చాచలేదు. చట్టపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ హనీఫా దాచిన సొమ్ముతోనే ఈ ఇంటిని కట్టుకున్నాం. అదే ఆయన కోరిక కూడా. హనీఫా ఉపయోగించిన టయోటా ఇన్నోవా కారును తన సినిమా షూటింగ్లకు వినియోగించేలా ఏర్పాటు చేసి, దాదాపు 16 సంవత్సరాల పాటు కుటుంబానికి స్థిరమైన ఆదాయం వచ్చేలా దిలీప్ సహకరించారు అని హనీఫా భార్య ఫసీలా చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి లవ్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Neelakkuyil Entertainments (@neelakkuyil_entertainments) -
వీర వీర ఓంకార
ధనుష్ హీరోగా రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఓం చాప్టర్ 1: రుధిర–ది బ్లడ్ ఉడ్’. సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్టేక్ స్టూడియోస్, వండర్బార్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 16న విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు టీజర్ను విడుదల చేశారు మేకర్స్. ‘‘అరుణాచలేశ్వరుడికి హరోం హర’ అనే డైలాగ్తో పాటు, ‘వీర వీర ఓంకార..’ అనే పాట కూడా ఈ టీజర్లో ఉంది.‘‘భారీ బడ్జెట్తో రూపొందిస్తున్న సినిమా ఇది. ‘ఆర్ టెక్ స్టూడియోస్’కు తమిళంలో తొలి సినిమా. ఈ నిర్మాణ సంస్థతో మా జర్నీ ఇలానే కొనసాగుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు వండర్బార్ ఫిలిమ్స్ ప్రతినిధి శ్రేయస్. ‘‘ప్రేక్షకులందర్నీ అలరించే చిత్రం ఇది’’ అని పేర్కొన్నారు ఆర్ టేక్ స్టూడియోస్ ప్రతినిధులు శ్రద్ధ, అజ్మత్. ‘‘ప్రేక్షకులకు గుర్తుండిపోయే చిత్రంగా ‘ఓం’ నిలుస్తుంది’’ అని డివో మ్యూజిక్ ప్రతినిధి విషు, వార్నర్ మ్యూజిక్ గ్రూప్–ఇండియా ప్రతినిధి జై మెహతా చె΄్పారు. ఈ సినిమాకు సంగీతం: సాయి అభ్యంకర్. -
ఎప్పటికైనా ఆ ఇద్దరి దర్శకత్వంలో నటిస్తే చాలు: భాగ్యశ్రీ
మాస్రాజా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే అడుగుపెట్టింది. మొదటి సినిమా ఫ్లాప్ అయినా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా భాగ్యశ్రీ, అఖిల్తో కలిసి నటించిన లెనిన్ సినిమా ఆమె కెరీర్కు మలుపు తిప్పింది.తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ తన కెరీర్పై ప్రత్యేకమైన కలలు ఏమీ పెట్టుకోలేదని స్పష్టం చేసింది. నాకు ఎలాంటి డ్రీమ్ రోల్స్ లేవు.. ఫ్లోలో వెళ్లిపోవడమే. టార్గెట్లు లాంటివి పెట్టుకుంటే టెన్షన్ వస్తుంది. చిన్న చిన్న టైమ్ లైన్స్ పెట్టుకొని ముందుకు సాగితే మనసుకు చాలా హాయిగా ఉంటుందని ఆమె చెప్పింది.తెలుగు ఇండస్ట్రీలోనే సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్న భాగ్యశ్రీ, తన చివరి చిత్రం కూడా తెలుగులోనే చేస్తానని ఇప్పటికే తెలిపింది. అలా ఈ గ్యాప్లో రాజమౌళి, సుకుమార్ దర్శకత్వంలో నటిస్తేచాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.ప్రస్తుతం భాగ్యశ్రీ తెలుగు నేర్చుకుంటోంది. అంతేకాదు తెలుగు సంస్కృతికి కూడా అలవాటు పడుతోంది. ఉదయం అల్పాహారం నుంచి డిన్నర్ వరకు అన్నింటిలో తెలుగు వంటకాలను ఇష్టపడుతోంది. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ, ఊతప్పం, ఉప్మా వంటి వంటకాలు తన ఫేవరెట్ లిస్ట్లో ఉన్నాయని వెల్లడించింది.ఇక తనకు ప్రత్యేకంగా ఏ నగరంలో సెటిల్ అవ్వాలని లేదని, కానీ హిల్ స్టేషన్లు అంటే చాలా ఇష్టమని తెలిపింది. బీచ్ల కంటే కొండ ప్రాంతంలో ఉండడమే తనకు హాయిగా అనిపిస్తుందని చెప్పింది. ఇటీవల తన సంపాదనతో తల్లికి మొబైల్ ఫోన్ కొనిచ్చిందని తెలిపింది. తనది మధ్యతరగతి కుటుంబమని.. కానీ తల్లిదండ్రుల కోసం ఎంత ఖర్చు పెట్టినా తప్పులేదని ఆమె భావోద్వేగంగా చెప్పింది. -
'రాయన్'కి జాతీయ అవార్డ్.. విమర్శలకు ధనుష్ కౌంటర్
2024కి సంబంధించి కొన్నిరోజుల క్రితం జాతీయ సినీ అవార్డులని ప్రకటించారు. అయితే వీటిపై చాలానే విమర్శలు వచ్చాయి. కొన్ని చిత్రాలకు అసలు ఏ ప్రాతిపదికన ఇచ్చారంటూ సోషల్ మీడియాలో గట్టిగానే విమర్శించారు. అలా ట్రోల్స్ బారిన పడ్డ మూవీ 'రాయన్'. ఉత్తమ తమిళ సినిమాగా దీనికి పురస్కారం దక్కింది. ఈ విషయమై హీరో ధనుష్ని పలువురు విమర్శించారు. ఇప్పుడు వాళ్లకు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.(ఇదీ చదవండి: డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఇంట విషాదం)చెన్నైలో ఆదివారం, ధనుష్ పేరిట బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధనుష్.. తన చిత్రానికి జాతీయ అవార్డ్ ప్రకటించడంపై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చాడు. అప్పట్లో ఒక్కరూ మాట్లాడలేదు కానీ ఇప్పుడు 90 శాతం మంది వ్యతిరేకిస్తున్నారని కౌంటర్ ఇచ్చాడు.'మైయిళగన్(సత్యం సుందరం), మహారాజా సినిమాలు 'రాయన్' కంటే బాగున్నాయి. ఆ విషయాన్ని నేను కూడా ఒప్పుకొంటాను. కానీ గతంలో నేను నటించిన పుదుపెట్టై, వడచెన్నై, కర్ణన్, మరియన్, రన్ఝానా తదితర చిత్రాలు విడుదలైన టైంలో జాతీయ అవార్డులకు అర్హమైనవని బలంగా వాదించిన వాళ్లు చాలా తక్కువమంది. ఇప్పుడు నాకు వచ్చిన జాతీయ అవార్డుని 90 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. కానీ గతంలో నాకు ఇదే అవార్డులు రాకపోయినప్పుడు కనీసం 10 శాతం మంది కూడా నాకు సపోర్ట్గా మాట్లాడలేదు' అని ధనుష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఈ ఏడాది ఏప్రిల్లో 'కర' సినిమాతో వచ్చిన ధనుష్.. ప్రస్తుతం 'ఓం' సినిమా చేస్తున్నాడు. అక్టోబరు 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. 'అమరన్' తీసిన రాజ్ కుమార్ పెరియసామి దర్శకుడు. సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్లు.(ఇదీ చదవండి: ఓటీటీలో క్రైమ్ కామెడీ సినిమా 'కాన్ సిటీ' తెలుగు రివ్యూ)Thalaivan #Dhanush Speech about Raayan controversy.. 🤍#DhanushBloodDonationCamp #OM pic.twitter.com/Ty4F9xlQnG— Director vky (@vkycinecrave) July 26, 2026 -
జన నాయగన్.. మూడు రోజులైనా ఆ మార్క్ దాటలే..!
దళపతి విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. పొలిటికల్ ఎంట్రీకి ముందే ఇదే తన చివరి చిత్రమని ప్రకటించారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈనెల 23న రిలీజైన ఈ చిత్రం వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మార్కు దాటిన జన నాయగన్.. మూడో రోజు కూడా అదే జోరు కనిపించింది.ఈ మూవీ రిలీజైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల మార్కుకు చేరువగా వచ్చేసింది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా రూ. 171.84 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అంతేకాకుండా కేవలం ఇండియాలోనే రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను అధిగమించింది. అయినప్పటికీ విజయ్ నటించిన 'లియో' (2023), 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (2024) సాధించిన వసూళ్ల కంటే వెనకంజలోనే ఉంది. గతంలో 'లియో' చిత్రం మూడో రోజు ఇండియాలో రూ. 38.30 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. గోట్ మూవీ సైతం రూ. 33.50 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది.ప్రముఖ ట్రేడ్ వెబ్సైట్ ప్రకారం జన నాయగన్' ఇండియాలో మూడో రోజు రూ. 28.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఓవర్సీస్లో మరో రూ. 20 కోట్లను రాబట్టింది. ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 108.34 కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా.. రూ. 92.35 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. విదేశాల్లో రూ. 63.50 కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా.. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా రూ. 171.84 కోట్లకు చేరుకున్నాయి.కాగా.. ఈ చిత్రంలో విజయ్ 'వెట్రి కొండన్' అనే మాజీ పోలీస్ అధికారి పాత్రలో నటించారు. ఆయన తన దత్తపుత్రికగా 'విజి' పాత్రలో మమితా బైజు కనిపించింది. ఈ మూవీ పూజా హెగ్డే హీరోయిన్గా మెప్పించగా.. బాబీ డియోల్ 'జాన్ హిమ్లర్' అనే విలన్ పాత్రను పోషించారు. -
లెనిన్ హిట్ ఎఫెక్ట్.. 30 లక్షల నుంచి 2 కోట్ల దాకా
తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్గా అడుగుపెట్టిన భాగ్యశ్రీ, మొదటి సినిమా ఫ్లాప్ అయినా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా భాగ్యశ్రీ, అఖిల్తో కలిసి నటించిన లెనిన్ సినిమా ఆమె కెరీర్కు మలుపు తిప్పింది. మొదటి సినిమాలో ఆమెకు ఇచ్చిన పారితోషికం కేవలం రూ.30 లక్షలు మాత్రమే. కానీ లెనిన్ చిత్రానికి ఆమె రెమ్యూనరేషన్ ఒక్కసారిగా పెరిగి కోటిన్నర రూపాయలకు చేరింది. ఇక త్వరలో సెట్స్పైకి రాబోతున్న మరో ప్రాజెక్ట్కి ఆమెకు రూ.2 కోట్ల పారితోషికం ఖరారైనట్టు సమాచారం. ఈ మధ్య లెనిన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా భాగ్యశ్రీ తన వ్యక్తిగత జీవితం గురించి కూడా చెప్పుకొచ్చింది. భాగ్యశ్రీ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. తనకు డబ్బు విలువ బాగా తెలుసని, చిన్నప్పుడు తన తండ్రి ఉద్యోగం కోసం ఎంతగా ప్రయత్నించాడో ఇప్పటికీ గుర్తుందని తెలిపింది. అందం, నటన రెండూ కలిసిన భాగ్యశ్రీ, కాంత, లెనిన్ వంటి సినిమాల్లో నటించి తన టాలెంట్ను నిరూపించుకుంది. గ్లామర్ రోల్స్కి కూడా ఎలాంటి కండిషన్లు పెట్టకుండా నటించడం ఆమె ప్రత్యేకత. ఇక మరో హిట్ పడితే, ఆమె పారితోషికం మరింత పెరగడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. -
45 ఏళ్లకు తల్లయిన టాలీవుడ్ హీరోయిన్
తెలుగు సినిమా 'శ్రీను వాసంతి లక్ష్మి'తో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన పద్మప్రియ.. ఆపై తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ సినిమాల్లోనూ నటించింది. పన్నెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈమె.. ఇన్నాళ్లకు తల్లయిన విషయాన్ని అది కూడా బిడ్డ పుట్టిన ఏడాది తర్వాత బయటపెట్టింది. రెండు ఫొటోలు షేర్ చేసింది. కాకపోతే బాబు లేదా పాప అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)స్వతహాగా మలయాళీ అయిన పద్మప్రియ.. టాలీవుడ్ మూవీతోనే కెరీర్ ప్రారంభించింది. ఆపై తెలుగులో అందరి బంధువయ, పటేల్ సర్ సినిమాలు చేసింది గానీ పెద్దగా పేరైతే రాలేదు. కానీ సొంత భాష మలయాళంలో మాత్రం వరసగా చిత్రాలు చేసింది. మృగం లాంటి డబ్బింగ్ మూవీలోనూ ఈమె నటించింది. చివరగా 2022లో రిలీజైన 'వండర్ ఉమెన్' సినిమాలో కనిపించింది.వ్యక్తిగత విషయానికొస్తే.. ఆప్ పార్టీకి చెందిన జాస్మిన్ షా అనే వ్యక్తిని 2014లో పద్మప్రియ పెళ్లి చేసుకుంది. భర్త రాజకీయంగా బిజీగా ఉండగా.. ఈమె మాత్రం వివాహం తర్వాత కూడా అడపాదడపా మూవీస్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు తనకు ఓ బిడ్డ పుట్టిందనే సంగతి వెల్లడించింది. అంటే 45 ఏళ్ల వయసులో పద్మప్రియ తల్లయింది.ఏడాదిగా సోషల్ మీడియాలో పద్మప్రియ యాక్టివ్గా ఉన్నప్పటికీ ఇప్పటివరకు తన ప్రెగ్నెన్సీ గురించి గానీ, బిడ్డ పుట్టిన విషయాన్ని గానీ ఎక్కడా ప్రస్తావించలేదు. సడన్గా పోస్ట్ పెట్టేసరికి అంతా ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే తోటి నటీనటులు పద్మప్రియకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: నా కొడుకుతో 'సిసింద్రీ 2' సినిమా చేస్తా: అఖిల్) View this post on Instagram A post shared by Padmapriya Janakiraman (@padmapriya_offl) -
లగ్జరీ విల్లా కొనుగోలు చేసిన నయన తార..ధర తెలిస్తే షాకే!
సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో నయనతార ఒకరు. గత రెండు దశాబ్దాలుగా తనదైన నటనతో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ చేతిలో దాదాపు 8 భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక్కో సినిమాకు తక్కువలో తక్కువ రూ.15 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ డబ్బును వృధా చేయకుండా.. పలు వ్యాపారాల్లో పెట్టుబడిగా పెడుతుంది. ఇప్పటికే సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ని నిర్వహిస్తుంది. దీంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ నయన తార పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా తమిళనాడు రాజధాని చెన్నైలోని అత్యంత విలాసవంతమైన, ప్రముఖులు నివసించే ‘పోయెస్ గార్డెన్’ ఏరియాలో ఆమె ఒక లగ్జరీ నివాసాన్ని కొనుగోలు చేశారట. మార్కెట్ విలువల ప్రకారం దాని విలువ రూ. 40 కోట్ల విలువ ఉంటుందట. త్వరలోనే కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేయబోతున్నట్లు కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఏరియాలో . సూపర్ స్టార్ రజినీకాంత్, నటుడు ధనుష్లతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నివాసాలు ఉన్నాయి. నయనతార నటిస్తున్న చిత్రాల్లో ఆగస్ట్ 26న ‘టాక్సిక్’, ఆగస్ట్ 14న హాయ్ చిత్రం రిలీజ్ కానుంది. -
నీట్ లీకేజీ రచ్చ.. హీరోయిన్ జ్యోతిక ఆసక్తికర పోస్ట్!
నీట్ పేపర్ లీక్ వివాదం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు సినీ తారలు సైతం మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్, అదితిరావు హైదరీతో పాటు పలువురు సినీ తారలు విద్యార్థులకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాజాగా దక్షిణాది స్టార్ హీరో సూర్య సతీమణి, హీరోయిన్ కూడా విద్యార్థుల ఆందోళనకు తన మద్దతు తెలిపారు. నీట్ పేపర్ లీక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు.‘నేను విద్యార్థులు, దేశ భవిష్యత్తు తరపున నిలబడతా. నేను ప్రజాస్వామ్య భారతదేశానికి మద్దదు ఇస్తున్నా. విద్యా వ్యవస్థలో సంస్కరణలు రావాలని కోరున్నా. తల్లులుగా మా పిల్లలను ‘సోనమ్ వాంగ్చక్, అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్లా గా పెంచాలని కోరుకుంటున్నాం. జెన్ జీ చేస్తున్న పోరాటం చూసి గర్వంగా ఉంది. భయం లేకుండా ఉద్యమం చేస్తున్న సీజేపీకి ధన్యవాదాలు. జైహింద్’అని జ్యోతిక తన ఇన్స్టా ఖాతాలో రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
తండ్రి... కుమార్తెల అనుబంధం
విజయ్ ఆంటోని హీరోగా నటించిన తాజా చిత్రం ‘నాన్న కుట్టి’. మారన్ దర్శకత్వంలో మీరా విజయ్ ఆంటోని నిర్మించారు. రామాంజనేయులు జవ్వాజి సహ నిర్మాతగా వ్యవహరించారు. జూలై 24న విజయ్ ఆంటోని పుట్టినరోజు సందర్భంగా ‘నాన్న కుట్టి’ నుంచి ఓ పోస్టర్ విడుదల చేశారు.‘‘తండ్రి, కుమార్తెల అనుబంధం, సెంటిమెంట్తో రూపొందిన చిత్రం ‘నాన్న కుట్టి’. యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, హృద్యమైన సంగీతం, ఆకట్టుకునే స్క్రీన్ప్లేతో ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
విడాకుల వివాదం.. ‘జన నాయకన్’ చూసిన సంగీత?
తమిళనాడు నాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకన్’ (తెలుగులో జన నాయకుడు) భారీ అంచనాల మధ్య ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాధారణ ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించకపోయినా.. విజయ్ ఫ్యాన్స్ని మాత్రం ఆకట్టుకుంది. అభిమానులు ఆశించే యాక్షన్, డ్యాన్స్, ఎమోషన్స్ అన్ని ఈ చిత్రంలో ఉన్నాయి. అలాగే పొలిటికల్ టచ్ కూడా ఇవ్వడంతో ఫ్యాన్స్తో పాటు టీవీకే పార్టీ శ్రేణులు కూడా సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక విజయ్ స్నేహితురాలు, స్టార్ హీరోయిన్ త్రిష కూడా ఈ సినిమా వీక్షించారు. ఆమె థియేటర్స్కి వెళ్లిన వీడియో క్లిప్పులు నెట్టింట వైరల్గా మారింది. దీంతో పాటు మరో వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. విజయ్ భార్య సంగీత కూడా ‘జన నాయకన్’ వీక్షించారట. ఆమె థియేటర్కి సినిమా చూసిన వీడియో ఒక్కటి ఇప్పుడు వైరల్ అవుతుంది.అయితే అసలు నిజం ఏంటంటే.. అది చాలా పాత వీడియో. గతంలో ఓ సినిమా కోసం థియేటర్కి వెళ్లిన సంగీత వీడియో క్లిప్పుని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలో సంగీత కారులో నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు ఉన్నాయి, ఆమె ముఖానికి మాస్క్ ధరించి, సాంప్రదాయ దుస్తులు ధరించి ఉన్నారు. ఈ వీడియోతో విజయ్ అభిమానులు ఆమె 'జన నాయకన్' చిత్రాన్ని చూడటానికి థియేటర్కు వచ్చారని ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ వీడియో పాతది. దీన్ని కొత్త వీడియోలతో కలిపి ఆమె థియేటర్కు వెళ్లినట్లు చూపించడానికి ఉపయోగించారు.విడాకుల వివాదం..ఈ ఏడాది ప్రారంభంలో, విజయ్ భార్య సంగీత.. తన భర్త విజయ్తో విడాకులు ఇప్పించాలంటూ కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తమిళనాడు ఎన్నికల ముందు ఆమె కోర్టు మెట్లు ఎక్కారు. విజయ్.. వెరొక నటితో రిలేషన్లో ఉన్నారని ఆమె ఆరోపించారు. అప్పటి నుంచి త్రిష పేరు నెట్టింట మారుమోగిపోయింది. విజయ్ రిలేషన్లో ఉన్న నటి త్రిషనే అని ప్రచారం చేశారు. అది నిజం అన్నట్లుగానే త్రిష, విజయ్ కలిసి ఓ ఫంక్షన్ హాజరయ్యారు. ఎన్నికల్లో గెలిచి.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా త్రిష తన తల్లితో కలిసి ఆ వేడుకకు హాజరైంది. కానీ విజయ్ సతీమణి సంగీత, పిల్లలు మాత్రం హాజరు కాలేదు.அண்ணனின் #jananayagan படம் பார்க்க வந்தா அண்ணி சங்கீதா அவர்கள் pic.twitter.com/GFVv7xah6t— 𝚃𝚊𝚖𝚒𝚕 𝚜𝚎𝚕𝚟𝚊𝚗 𝚃𝚅𝙺 (@Selvatvk6kb) July 23, 2026 -
ఏడాది కష్టపడ్డా.. 'జన నాయగన్'లో నా సీన్ తీసేశారు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' థియేటర్లలోకి వచ్చేసింది. తమిళంలో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ తెలుగులో డిజాస్టర్ టాక్ వచ్చింది. అయితే ఈ మూవీ కోసం ఏడాది పాటు పనిచేశానని, కానీ తన సీన్ కట్ చేసి పడేశారని ఓ తమిళ నటి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి తన బాధని బయటపెట్టింది.(ఇదీ చదవండి: 'జన నాయగన్' తొలిరోజు కలెక్షన్ ఎన్ని కోట్లు?)'ఈ సినిమా కోసం నేను ఏడాది పాటు పనిచేశాను. విజయ్ సర్తో నటించే ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావించాను. కానీ చివరికి నా సీన్ కట్ చేయడంతో చాలా బాధగా ఉంది. 'జన నాయగన్' విజయ్ చివరి సినిమా అని అంతా చెబుతున్నారు. ఆయనతో కలిసి మరోసారి పనిచేసే అవకాశం కూడా లేదు కాబట్టి ఇంకా బాధగా అనిపిస్తోంది' అని నటి ఆనందిత అజయ్ కన్నీళ్లు పెట్టుకుంది.ఆనంది.. స్వతహాగా సీరియల్ నటి. తమిళంలో 'కార్తిగై పెంగళ్', 'యమునా', 'కనా కానుం కాలంగళ్', 'కల్లికట్టు పళ్లికూడం' తదితర సీరియల్స్లో నటించింది. క్లాసికల్ డ్యాన్సర్ కూడా అయిన ఈమె.. 'డాన్స్ జోడీ డాన్స్ 3.0', 'జోడి నెం.1' సీజన్ 6, 7, 'మానాడా మయిలాడా' సీజన్ 7 తదితర డ్యాన్స్ రియాలిటీ షోల్లోనూ పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ టైంలో అయితే సూర్య 'కరుప్పు', గట్టకుస్తీ 2 చితాల్లో కనిపించింది.ఈ సినిమాల హీరోయిన్ పూజా హెగ్డే సీన్సే చాలావరకు తొలగించారు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు హెచ్.వినోద్ చెప్పాడు. అలాంటిది ఆనందిత బాధపడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈమెని సపోర్ట్ చేస్తూ పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే 'జన నాయగన్' మూవీకి తొలిరోజు రూ.78 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో తెలుగులో వచ్చిన బాలకృష్ణ 'భగవంత్ కేసరి'కి ఈ చిత్రం రీమేక్ ఇది.(ఇదీ చదవండి: ‘జన నాయకుడు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)Actress #Anandhi, who was in tears after watching #Vijay's #JanaNayagan in theatres yesterday, has openly expressed her sadness over the editing of her scenes in the film directed by #HVinoth. pic.twitter.com/RJcEnVfrQX— Chennai Times (@ChennaiTimesTOI) July 24, 2026 -
ఆ హీరో, అతని భార్య నన్ను టార్గెట్ చేశారు : జోజు జార్జ్
మలయాళ సినీ పరిశ్రమలో పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) ప్రచారాల వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రముఖ నటుడు జోజు జార్జ్ తనపై ఓ ప్రముఖ మలయాళ నటుడు, ఆయన భార్య కలిసి కుట్రపూరితంగా వ్యతిరేక పీఆర్ ప్రచారం చేయిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తన కొత్త చిత్రం 'వరవ్' విడుదల సందర్భంగా నిర్వహించిన ఇన్స్టాగ్రామ్ లైవ్లో మాట్లాడిన ఆయన, ఈ విషయాలను వెల్లడించారు. సదరు నటుడి దంపతులే కాకుండా, మలయాళ ఇండస్ట్రీకి చెందిన మరికొందరు ప్రముఖులు కూడా డబ్బులు తీసుకుని ఇలాంటి పీఆర్ కార్యకలాపాలు నడుపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.షాజీ కైలాస్ దర్శకత్వంలో ఏ.కే. సాజన్ కథ అందించిన 'వరవ్' చిత్రం జూలై 16న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతోంది. ఈ చిత్రంలో జోజు జార్జ్ హై రేంజ్ ప్రాంతానికి చెందిన 'పౌల్సన్' అనే కీలక పాత్రలో కనిపించారు. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన 'వలతు వషతే కల్లన్ ' చిత్రం తర్వాత జోజు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇదే కావడం విశేషం.జోజు జార్జ్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం మలయాళ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. లైవ్లో ఆయన ఎవరి పేర్లూ ప్రత్యక్షంగా చెప్పకపోవడంతో, ఆ స్టార్ దంపతులు ఎవరై ఉంటారనే దానిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా చర్చిస్తున్నారు. -
అదృష్టం అంటే ఈ హీరోయిన్దే.. తొలి చిత్రమే రూ.300 కోట్ల బడ్జెట్!
ఏ రంగంలోనైనా సక్సెస్ ప్రభావం గట్టిగా ఉంటుంది. అలా టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్లో మంచి విజయం కోసం ఎదురుచూసిన హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్. తండ్రి ప్రియదర్శన్.. దర్శకుడు కావడంతో సులభంగానే ఇండస్ట్రీలోకి వచ్చింది. కానీ కెరీర్ ప్రారంభంలో హిట్స్ పడక డీలా పడింది. తమిళంలో శింబు 'మానాడు' సక్సెస్ ఈమెకు కాస్త ఊరటనిచ్చింది. అలాంటిది కల్యాణి.. రీసెంట్ టైంలో చేసిన మలయాళ చిత్రం 'లోక' మూవీ అనుహ్యంగా బ్లాక్బస్టర్ అయింది. రూ.300 కోట్ల కలెక్షన్స్ సాధించింది.(ఇదీ చదవండి: 'జన నాయగన్' తొలిరోజు కలెక్షన్ ఎన్ని కోట్లు?)ఉమెన్ సెంట్రిక్ సూపర్ హీరో కథతో తీసిన ఈ సినిమా.. కల్యాణి ప్రియదర్శన్కు యాక్షన్ హీరోయిన్గా పేరు తెచ్చిపెట్టింది. దీంతో ఈ బ్యూటీకి ఇప్పుడు బాలీవుడ్ నుంచి పిలుపొచ్చినట్లు తెలుస్తోంది. 'ధురంధర్' ఫేమ్ రణ్వీర్ సింగ్.. త్వరలో జాంబి థ్రిల్లర్ స్టోరీతో తీస్తున్న రూ.300 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో కల్యాణిని హీరోయిన్గా తీసుకున్నారట.ఇందులో కల్యాణిది యాక్షన్ రోల్ అని తెలుస్తోంది. ఆగస్టులో ఈ ప్రాజెక్ట్ మొదలు కానుందని టాక్. దీని తర్వాత తనకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన 'లోక' సీక్వెల్లో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్లో ప్రారంభం అవుతుందని సమాచారం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన) -
'జన నాయగన్' తొలిరోజు కలెక్షన్ ఎన్ని కోట్లు?
స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చేసిన చివరి సినిమా 'జన నాయగన్'. లెక్క ప్రకారం సీఎం కాకముందే అంటే ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ కావాలి. కానీ సెన్సార్ సమస్యల కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు నిన్న(జూలై 23) థియేటర్లలో రిలీజైంది. తమిళంలో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు గానీ తెలుగులో మాత్రం డిజాస్టర్ టాక్ వచ్చింది. మరి ఈ మూవీకి తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయ్?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా)ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసిన 'జన నాయగన్' చిత్రానికి తొలిరోజు రూ.78.27 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.41 కోట్ల నెట్ వసూళ్లు రాగా.. గ్రాస్ రూ.48.27 కోట్లుగా తేలింది. ఓవర్సీస్ నుంచి రూ.30 కోట్లు వచ్చాయి. ఇలా ఓవరాల్గా రూ.78.27 కోట్ల గ్రాస్ అని టాక్. ఇందులో హిందీ నుంచి రూ.1.75 కోట్లు తెలుగు నుంచి రూ.2.75 కోట్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. మిగతాది అంతా తమిళ ప్రేక్షకుల నుంచే వచ్చింది.అయితే విజయ్ చివరి సినిమా అని హడావుడి చేసినప్పటికీ గతంలో వచ్చిన 'గోట్' తొలిరోజు కలెక్షన్స్ని 'జన నాయగన్' అధిగమించలేదని అంటున్నారు. ప్రస్తుతానికైతే ఇవన్నీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న నంబర్స్ మాత్రమే. నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తే వసూళ్లపై క్లారిటీ వస్తుంది.(ఇదీ చదవండి: చివరి నిమిషంలో షాకిచ్చిన 'రామాయణ' మేకర్స్)'జన నాయగన్' విషయానికొస్తే.. దళపతి వెట్రి కొండాన్ (విజయ్) జైలులో ఉంటాడు. తనతో పాటు ఖైదీగా ఉన్న ఓ వ్యాపారవేత్తని కాపాడి జైలర్ (గౌతమ్ మేనన్) దృష్టిలో పడతాడు. ఆ అధికారి సాయంతోనే క్షమాభిక్ష కింద వెట్రి బయటకొస్తాడు. అంతలోనే ఆ అధికారి ప్రమాదంలో చనిపోతాడు. దీంతో ఆయన కూతురు విజ్జి (మమిత బైజు)ని పెంచే బాధ్యతని వెట్రి తీసుకుంటాడు. చిన్నప్పుడు తల్లి దారుణ హత్యని కళ్లారా చూసిన విజ్జి ప్రతి చిన్న విషయానికీ భయంతో వణికిపోతుంటుంది. ఆమెను ధైర్యవంతురాలిగా మార్చి, సైన్యంలో చేర్పించాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం శిక్షణ కూడా ఇప్పిస్తుంటాడు.మరోవైపు జాన్ హిమ్లర్ (బాబీ దేవోల్) విజ్జిని లక్ష్యంగా చేసుకుని ఆమెని చంపాలని తన ముఠాని పంపుతాడు. అసలు విజ్జిని జాన్ హిమ్లర్ లక్ష్యంగా చేసుకోవడానికి కారణమేంటి? ఆఫ్రికా దేశాల్ని వణికించిన జాన్ హిమ్లర్ ఎవరు? అతడిని వెట్రి కొండాన్ ఎలా ఎదిరించాడు? విజ్జిలోని భయాన్ని పోగొట్టి ఆమెని ధైర్యవంతురాలిగా మార్చాడా?లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘జన నాయకుడు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
‘రా ఎన్టీఆర్’ వివాదం.. అభిమానులకు జూ. ఎన్టీఆర్ స్పష్టమైన సందేశం
జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలపై ఇటీవల వెలుగులోకి వచ్చిన వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. అభిమానుల పేరుతో ఏర్పడిన ‘రా ఎన్టీఆర్’ సంఘం చేసిన చర్యలు హీరోకు అసౌకర్యం కలిగించాయి.ఈ సంఘం ఊరూవాడ అనే కార్యక్రమం పెట్టారు. వంద కోట్ల రూపాయల ఫండ్ సేకరణ అంటూ స్టేట్మెంట్లు ఇచ్చింది. నిజానికి ఈ సంఘం వారికి నిజంగానే ఎన్టీఆర్ అంటే అభిమానం. అప్పటికే వీళ్లు పలు సేవా కార్యక్రమాలు కూడా చేశారు. తమ హీరోను మరింత ఎలివేట్ చేయాలనుకున్నారు. కానీ అదే సమయంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై లీకులు రావడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఈ పరిణామాలపై ఎన్టీఆర్ స్వయంగా ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ లేఖ తర్వాత ‘రా ఎన్టీఆర్’ సంస్థ ప్రెస్ మీట్ పెట్టింది. ఎన్టీఆర్ కోటరీ చుట్టూ పలు విమర్శలు చేసింది. కలసి మాట్లాడతాం తమకు ఎపాయింట్మెంట్ ఇవ్వాలని కూడా కోరింది. కానీ తెరవెనక ఒత్తిడి పెరగడంతో చివరికి సేవా కార్యక్రమాలను నిలిపివేస్తున్నామని ‘రా ఎన్టీఆర్’ సంస్థ స్వయంగా ప్రకటించింది. దీంతో కొంతమంది ఆపన్నులకు అందాల్సిన సాయం ఆగిపోయింది. ఈ ఘటన ద్వారా ఎన్టీఆర్ అభిమానులకు స్పష్టమైన సందేశం వెళ్లింది. అభిమాన సంఘాలు హీరో పేరుతో చేసే పనులు పరిమితి లోపల ఉండాలి. సేవా కార్యక్రమాల వరకు ఓకే, కానీ.. రాజకీయాలు లేదా పెద్ద ఫండ్ సేకరణలు చేసే ముందు హీరో అనుమతి లేకుండా చేయరాదు. -
'చాలా బాధగా ఉంది'.. జన నాయగన్పై త్రిష మదర్ రివ్యూ
రాజకీయాల్లోకి ఎంట్రీకి ముందు విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది. ఆ వివాదం ముగియడంతో దాదాపు ఏడు నెలల తర్వాత థియేటర్లలో రిలీజైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య జన నాయకుడు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీని థియేటర్లలో చూసిన ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీని హీరోయిన్ త్రిష కూడా వీక్షించారు. చెన్నైలోని రోహిణి థియేటర్కు వెళ్లిన ఆమె జన నాయగన్ ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అంతేకాకుండా ఈ మూవీని త్రిష మదర్ కూడా జన నాయగన్ చూశారు. ఈ సందర్భంగా ఆమె సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.విజయ్ జన నాయగన్ సినిమా చూసి మేము చాలా ఆనందించామని నటి త్రిష తల్లి ఉమా కృష్ణన్ అన్నారు. ఈ మూవీని ఎంతో ఆస్వాదించామని తెలిపారు. ఇది ఆయన చివరి చిత్రం కావడం నాకు బాధగా ఉందన్నారు. మేము ఆయనను చాలా మిస్ అవుతామని ఉమా కృష్ణన్ నిరాశ వ్యక్తం చేశారు. -
విద్యార్థుల ఉద్యమం.. తరలివచ్చిన మలయాళ నటులు
కొచ్చి: దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మలయాళ సినీ పరిశ్రమ సంఘీభావం ప్రకటించింది. కొచ్చిలోని మహారాజాస్ కాలేజీలో నిర్వహించిన సంఘీభావ ర్యాలీకి మలయాళ సినీ తారలు తరలివచ్చారు. పలువురు నటులు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన వారు సోషల్ మీడియా ద్వారా తమ సంఘీభావం తెలియజేశారు.నటుడు జోజు జార్జ్ (Joju George), నటి శాంతి బాలచంద్రన్, దర్శకుడు ఆశిక్ అబు, రచయిత ఎన్ఎస్ మాధవన్, ప్రముఖ రచయిత్రి కేఆర్ మీరా ర్యాలీలో పాల్గొని విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. నటి గౌరీ కిషన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, "శాంతియుత స్వరాలను వినండి.. ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరి మాట వింటుంది" అని రాసిన ప్లకార్డును ప్రదర్శించారు. నటుడు, ర్యాపర్ బేబీ జీన్ కూడా విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు.సోషల్ మీడియాలో వెల్లువలా మద్దతుమంగళవారం పలువురు మలయాళ సినీ నటులు సోషల్ మీడియా వేదికగా విద్యార్థుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఇంద్రజిత్ సుకుమారన్, మీనాక్షి, కుంచాకో బోబన్, సిజు సన్నీ, రహ్మాన్, వినయ్ ఫోర్ట్, కాలిదాస్ జయరామ్, నస్లెన్, నిఖిలా విమల్, గ్రేస్ ఆంటోనీ, దీపా థామస్, హషీర్ తదితరులు విద్యార్థులకు మద్దతుగా పోస్టులు చేశారు.అంతకుముందు రోజు టోవినో థామస్, పార్వతి తిరువోతు, రీమా కల్లింగల్, విస్మయ మోహన్లాల్ కూడా విద్యార్థుల నిరసనలకు సోషల్ మీడియా ద్వారా మద్దతు ప్రకటించారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని టోవినో థామస్ ఖండించారు. పార్వతి తిరువోతు.. ప్రతి పౌరుడికి నిరసన తెలిపే హక్కు ఉందని పేర్కొంటూ జంతర్మంతర్ వద్ద జరిగిన నిరసనలకు సంబంధించిన వీడియోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పంచుకున్నారు.చదవండి: నటుడు మాధవన్ గాయబ్.. ఫొటో వైరల్!ఇంద్రజిత్ సుకుమారన్ కూడా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. ప్రతి పౌరుడికి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందన్నారు. అలాంటి నిరసనకారులపై అధికారులు హింసకు పాల్పడకూడదని పేర్కొన్నారు. అణచివేత ఘటనలపై మౌనంగా ఉండకూడదని ప్రజలకు పిలుపునిచ్చారు. నిరసనల సందర్భంగా గాయపడిన వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.సంఘీభావ సభలు, ర్యాలీలుకేరళలోని పలు ప్రాంతాల్లో కూడా విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా సంఘీభావ సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీంతో నీట్ వివాదంపై విద్యార్థులకు మద్దతు తెలుపుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.Joju george..🔥🔥🔥🔥 pic.twitter.com/59zPuj25It— Nani (@Ravanaroy) July 23, 2026 -
జన నాయగన్.. విజయ్ పారితోషికం అన్ని కోట్లా?
రాజకీయాల్లోకి ఎంట్రీకి ముందు విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది. ఆ వివాదం ముగియడంతో దాదాపు ఏడు నెలల తర్వాత థియేటర్లలో రిలీజైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య జన నాయకుడు ప్రేక్షకుల ముందుకొచ్చాడు.ఈ సినిమా రిలీజ్ వేళ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ సినిమాకు దళపతి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే నెట్టింట చర్చించుకుంటున్నారు. అయితే ఈ సినిమా కోసం విజయ్కు ఏకంగా రూ. 220 కోట్ల నుంచి రూ. 275 కోట్ల వరకు చెల్లించారని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఓ ఇండియన్ హీరోకు దక్కిన అత్యధిక పారితోషికాలలో ఒకటిగా నిలిచే అవకాశముంది. అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనైతే లేదు.మరోవైపు ఓ నివేదిక ప్రకారం దర్శకుడు హెచ్ వినోద్కు ఈ సినిమా కోసం రూ. 25 కోట్లు అందుకున్నారని టాక్. ఇదే నిజమైతే ఆయన కెరీర్లోనే అతిపెద్ద పారితోషికం కానుందని చెబుతున్నారు. ఈ మూవీకి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఏకంగా రూ. 13 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా హీరోయిన్ పూజా హెగ్డేకు రూ. 6 కోట్ల వరకు ముట్టజెప్పారని సమాచారం. విలన్ రోల్ పోషించిన బాబీ డియోల్కు రూ. 5 నుంచి 10 కోట్ల మధ్య అందుకున్నట్లు తెలుస్తోంది.అలాగే ఈ మూవీతో ప్రకాష్ రాజ్ రూ. 5 కోట్లు సంపాదించగా.. ప్రియమణి, గౌతమ్ వాసుదేవ్ మీనన్లకు చెరో రూ. 3 కోట్లు చెల్లించారని టాక్. ఈ మూవీ కోసం నరైన్ రూ. 2.5 కోట్లు అందుకున్నట్లు చెబుతున్నారు. మమితా బైజు రెమ్యునరేషన్ దాదాపు రూ. 60 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు ఉందని తెలుస్తోంది. అయితే ఈ పారితోషికాలపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. -
ఓటీటీకి సైకలాజికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాలకు కొదువ లేకుండా పోయింది. ఏ భాషలో రిలీజైనా సరే డబ్బింగ్ వర్షన్లో ఓటీటీలో చూసేస్తున్నారు. ఓటీటీలతో కొత్త కొత్త కంటెంట్, మరింత ఎంటర్టైన్మెంట్ లభిస్తోంది. తాజాగా మరో లేటేస్ట్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.ఈ ఏడాది మే నెలలో థియేటర్లలోకి వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఈగో రామన్. ఈ మూవీకి గణేషన్ నాచిముత్తు దర్శకత్వం వహించారు. ఒక సివిల్ సర్వీస్ ఆశించే యువకుడికి, అతని మాజీ ఉపాధ్యాయుడికి మధ్య జరిగే మానసిక సంఘర్షణ, అహం (ఈగో) నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం జూలై 24 నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులోకి రానుంది. అమెజాన్తో పాటు ఓవర్సీస్ అభిమానుల కోసం సింప్లీ సౌత్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో సిబి చంద్రన్, రోబో శంకర్, కీర్తన శ్రీకుమార్, కవిత రమేష్ ప్రధాన పాత్రలు పోషించారు.#EgoRaman (Tamil)Streaming from July 24 on Prime Videoand Simply South 🍿!!#OTT_Trackers pic.twitter.com/mFta1yHoNr— OTT Trackers (@OTT_Trackers) July 23, 2026 -
దళపతి విజయ్ కాదు.. సీఎం జోసెఫ్ విజయ్
దళపతి విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతోన్న మొదటి సినిమా 'జన నాయగన్'. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో విడుదలైంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. దాదాపు ఏడు నెలల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కట్టారు.ఈ సందర్భంగా థియేటర్లలో ఆసక్తికర సన్నివేశం కనిపించిది. ఇప్పటి వరకు దళపతి విజయ్ అని పడిన టైటిల్ కార్డు.. ఇప్పుడు గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ థియేటర్లలో కనువిందు చేసింది. సీఎం విజయ్ అని స్క్రీన్మీద కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అది కూడా విజయ్ సీఎం అయ్యాక అసెంబ్లీలో ఆయన చేసిన సంజ్ఞతో ఈ టైటిల్కార్డు వేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. అల్లు అర్జున్ స్టైల్లో గడ్డం కింద చేయి పెట్టి డీఎంకేను విజయ్ ఎద్దేవా చేస్తూ ఓ సైగ చేశారు. ఆ స్టిల్ నెట్టింట తెగ వైరల్ కాగా.. ఇప్పుడదే థియేటర్లో కనిపించడంతో ఆ వీడియోలు అభిమానులు నెట్టింట షేర్ చేస్తున్నారు. #JanaNayagan Santhosa Padratha illa varuththa Padratha theriyala 🥺 any way love you na @actorvijay 🫂 forever ♾️ ni maddum than 🫀 pic.twitter.com/MvZJC0yEqf— Sai Jegadheesh (@saijegadheeshh) July 23, 2026 -
విజయ్ జన నాయగన్.. త్రిష ఏ థియేటర్లో చూశారంటే?
దళపతి విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతోన్న మొదటి సినిమా 'జన నాయగన్'. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో విడుదలైంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. దాదాపు ఏడు నెలల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కట్టారు.జన నాయగన్ రిలీజ్ కావడంతో అందరి దృష్టి ఆమెపైనే పడింది. విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన టైమ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచిన త్రిష కృష్ణన్ గురించి చర్చ మొదలెట్టారు. ఈ మూవీని చూసేందుకు ఆమె చెన్నైలోని రోహిణి థియేటర్కు విచ్చేశారు. ఈ సందర్భంగా జన నాయగన్ మూవీ ఆమె వీక్షించారు. విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక కోలీవుడ్లో త్రిష పేరు మార్మోగిపోయింది. గతంలో త్రిష, విజయ్ పలుమార్లు కలిసి తెరపై జంటగా కనిపించారు. వీరిద్దరు తొలిసారిగా 2004లో 'గిల్లి' చిత్రంలో నటించారు. ఆ తర్వాత 'తిరుపాచి', 'ఆతి', 'కురువి' చిత్రాల్లో మెప్పించారు. 2023లో విడుదలైన 'లియో' చిత్రంలో వీరిద్దరూ చివరిసారిగా కలిసి కనిపించారు. విజయ్ నటించిన 'గోట్' చిత్రంలో త్రిష అతిథి పాత్రలో కూడా కనిపించింది. Actress #Trisha watched Chief Minister Joseph Vijay film #Jananayagan at Rohini Theatre in Chennai... pic.twitter.com/Ql9KOKIuIH— Gv (@gowtham0725) July 23, 2026 -
‘జన నాయకుడు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : జన నాయకన్(జన నాయకుడు)నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు తదితరులునిర్మాణ సంస్థ: కేవీఎన్ ప్రొడక్షన్స్నిర్మాత: వెంకట్ కె. నారాయణ (కేవీఎన్)దర్శకత్వం: హెచ్. వినోద్సంగీతం: అనిరుధ్ రవిచందర్సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ఎడిటింగ్: ప్రదీప్ ఇ. రాఘవ్విడుదల తేది: జులై 23, 2026జన నాయకన్.. తమిళనాడు ఎన్నికల ముందు ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విజయ్ చివరి చిత్రం అని చెప్పడంతో అప్పటికే ‘జన నాయకన్’పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఎన్నికల సమయంలో సెన్సార్ అడ్డంకులు ఏర్పడి, సినిమా రిలీజ్ కాకపోవడం.. దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చలు పెట్టడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఈ సినిమా హీరో విజయ్ ఏకంగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఎలాంటి అడ్డకుంలు లేకుండా నేడు (జులై 23) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. మరి విజయ్ చివరి చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..దళపతి వెట్రి కొండన్(విజయ్) పోలీసు ఆఫీసర్. ఓ నేరం కింద ఆయన మధురై సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తుంటాడు.కొత్తగా వచ్చిన జైలు వార్డెన్(గౌతమ్ వాసుదేవ్ మీనన్),దళపతి మంచి తనం చూసి.. అనారోగ్యంతో ఉన్న తన తల్లి(రేవతి)ని చివరి సారిగా చూసేందుకు అనుమతి ఇస్తాడు. ఆ తర్వాత ఆగస్టు 15న వచ్చే సాధారణ క్షమాభిక్ష ద్వారా జైలు నుంచి విడుదలయ్యేలా చేస్తాడు. ఈ క్రమంలో జైలు జైలర్ కూతురు విజ్జి(మమితా బైజు)తో దళపతికి మంచి అనుబంధం ఏర్పడుతుంది. రోడ్డు ప్రమాదంలో జైలర్ చనిపోవడంతో విజ్జికి అన్ని తానై చూసుకుంటాడు. తండ్రి కోరిక మేరకు ఆమెను ఆర్మీలో జాయిన్ చేయించేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే విజ్జికి ఫియర్ ఫోబియా ఉండడంతో..ప్రేమించి వ్యక్తిని పెళ్లి చేసుకొని సాధారణ జీవితాన్ని గడపాలని కోరుకుంటుంది. అలాంటి విజ్జిని ఓ గ్యాంగ్ టార్గెట్ చేస్తుంది. ఆమెను చంపేందుకు ప్లాన్ చేస్తుంది. దీని వెనుక గ్యాంగ్స్టర్ హిమ్లర్(బాబీ డియోల్) ఉన్నాడని దళపతి తెలుసుకుంటాడు. అసలు హిమ్లర్ ఎవరు? అతని నేపథ్యం ఏంటి? అతని మనుషులు విజ్జిని ఎందుకు టార్గెట్ చేశాడు? ఆఫ్రికాలో అల్లకల్లోలం సృష్టించిన హిమ్లర్..ఇండియాకు ఎందుకు వచ్చాడు? భారత్పై ఆయన చేసిన కుట్ర ఏంటి? దాన్ని దళపతి ఎలా అడ్డుకున్నాడు? ఈ విషయంలో జర్నలిస్ట్ కాయల్(పూజా హెగ్డే)..దళపతికి ఎలా తోడుగా నిలిచింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమా కథని బేస్గా తీసుకొని, దానికి రాజకీయఅంశాలను జోడించి తెరకెక్కించిన చిత్రమే ఈ ‘జన నాయకన్’. హీరో విజయ్ రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి.. ఆయనకు ఉపయోగపడేలా పొలిటికల్ సీన్లను పేర్చి.. భారీ బడ్జెట్తో ఈ సినిమాను తీర్చి దిద్దారు.అయితే ఆయా సీన్లు విజయ్ ఫ్యాన్స్ని అలరిస్తాయేమో కానీ.. జనరల్ ఆడియన్స్ని మాత్రం అంతగా ఆకట్టుకోలేవు. ఇక తెలుగు ప్రేక్షకుల్లో అల్రేడీ భగవంత్ కేసరి చూసినవారైతే..ఓపికతో ఈ సినిమా చూడాల్సిందే.విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. కేవలం అభిమానుల కోసమే అన్నట్లుగా చాలా చోట్ల హీరోకి ఎలివేషన్ ఇచ్చారు. యాక్షన్ సీన్స్ కూడా అదే రేంజ్లో ప్లాన్ చేశారు. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న..గ్యాంగ్ స్టర్ బ్యాక్డ్రాప్..ఎలివేషన్స్.. భారీ యాక్షన్ సీన్స్..అన్ని ఈ సినిమాలో ఉంటాయి. కానీ ఏ ఒక్కటి కూడా కొత్తగా అనిపించవు. పైగా క్లైమాక్స్లో రోబోలతో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అయితే సహనానికి పరీక్షగా మారుతుంది. హీరో పరిచయ సన్నివేశం నుంచి మొదలు ఫస్టాఫ్ మొత్తం దాదాపు ‘భగవంత్ కేసరి’ చూసినట్లుగానే అనిపిస్తుంది. అయినా కూడా కొంతమేర ఎంటర్టైన్ కావొచ్చు. కానీ సెకండాఫ్ మాత్రం మరీ హింసాత్మకంగా మారుతుంది. లాజిక్ లేని సీన్లు ఒకవైపు.. అనవసరమైన పొలిటికల్ డైలాగులు మరోవైపు.. సీట్లో కూర్చున్న ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా పెడతాయి. ఇదంతా ఏం వద్దు..ఎలివేషన్స్..భారీ యాక్షన్ సీన్స్ ఉంటే చాలు అనుకునే వాళ్లకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. ఎవరెలా చేశారంటే.. విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నాడు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను ఎంచుకున్నాడు. దళపతి పాత్రకు తగిన న్యాయం చేశాడు. యాక్షన్తో పాటు ఓ పాటలో డ్యాన్స్ కూడా ఇరగ దీశాడు. బాబీ డియోల్ విలనిజం బాగానే పండింది. ఆయన పాత్రకు కూడా భారీ ఎలివేషన్స్ ఉంటాయి. విజ్జు పాత్రకి మమితా బైజు న్యాయం చేసింది. అయితే శ్రీలీలతో పోలిస్తే మాత్రం కాస్త వెనకే ఉందని చెప్పాలి. పూజా హెగ్డే తెరపై అందంగా కనిపించింది కానీ.. నటనకు పెద్దగా స్కోప్ దక్కలేదు. ప్రకాశ్ రాజ్ పాత్ర బాగుంది. కానీ తెలుగు డబ్బింగ్ మాత్రం దారుణంగా ఉంది. నాజర్, ప్రియమణి, రేవతితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.టెక్నికల్ విషయాలకొస్తే..అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడ తగ్గలేదు. -
మాధవన్ కనబడుటలేదు!
న్యూఢిల్లీ: నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతోంది. విద్యార్థుల పోరాటానికి ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామికవాదులు, హక్కుల కార్యకర్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంఘీభావం ప్రకటించారు. పలువురు సినిమా సెలబ్రిటీలు కూడా మద్దతు తెలిపారు. అయితే బాలీవుడ్తో పాటు దక్షిణాది సినిమా పరిశ్రమకు చెందిన అగ్ర నటులు స్పందించకపోవడాన్ని జనం ప్రశ్నిస్తున్నారు.సీజేపీ నిరసనలపై ప్రముఖ నటుడు, ఫిల్మ్ అండ్ టెలివిజన్ఇ న్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) ఛైర్మన్ ఆర్. మాధవన్ స్పందించకపోవడంపై ఎఫ్టీఐఐ విద్యార్థులు తమదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. మాధవన్ మాయం అయ్యారంటూ పోస్టర్ తయారు చేశారు. “గాయబ్” (Gayab) అని రాసిన ఈ పోస్టర్ను ఏకంగా ఎఫ్టీఐఐ క్యాంపస్లోని ఆయన కార్యాలయానికే అతికించారు విద్యార్థులు. పోస్టర్పై “NEET For Sale” అనే వ్యాఖ్య కూడా రాశారు. మాధవన్ కార్యాలయానికి అతికించిన పోస్టర్ ఫొటోను నిశాంత్ కబీర్ అనే యూజర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దీంతో నెటిజనులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.నెటిజన్ల స్పందనవిద్యార్థుల పోరాటంపై మాధవన్ స్పందించకపోడాన్ని నెటిజనులు తప్పుబడుతున్నారు. అగ్ర నటుడిగా కొనసాగుతూ, ఎఫ్టీఐఐ చైర్మన్ పదవిలో ఉన్న ఆయన నుంచి కనీస స్పందన లేకపోవడాన్ని విమర్శిస్తున్నారు. పద్మశ్రీ అవార్డు తీసుకుని, దుబాయ్లో నివాసం ఉంటున్నారని ఆయనపై ధ్వజమెత్తున్నారు. ధురందర్ 3 స్క్రిప్ట్ చదువుకుంటూ బిజీగా ఉన్నారని, ఆయన ఇంకా అజిత్ దోవల్ క్యారక్టర్ నుంచి బయటకు రాలేదని, అవార్డు తీసుకోవడానికి వెళ్లారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. View this post on Instagram A post shared by Nishant Kabir (@unhinged_paradox)ఆమిర్ ఖాన్పై కూడా విమర్శలువిద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్కు సంఘీభావం తెలపకపోవడంతో బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వివాదమయ్యాయి. ‘3 ఇడియట్స్’ సినిమాలో తాను పోషించిన పాత్రకు సోనమ్ వాంగ్చుక్కు ఎలాంటి సంబంధం లేదని ఆమిర్ఖాన్ అన్నారు. ‘3 ఇడియట్స్’ సినిమా రూపొందుతున్న సమయంలో సోనం వాంగ్చుక్ ఎవరో తనకు తెలియదని ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై నెటిజనులు విమర్శలు ఎక్కుపెట్టారు. సోనం వాంగ్చుక్ తన తొలి భేటీ గురించి ఆమిర్ ఖాన్ ప్రస్తావించిన పాత వీడియోను వెలుగులోకి తెచ్చి వైరల్ చేశారు.విద్యార్థుల ఉద్యమానికి మద్దతుసీజేపీ ఆధ్వర్యంలోని విద్యార్థుల ఉద్యమానికి పలువురు సినీ ప్రముఖులు అండగా నిలిచారు. విలక్షణ నటులు నసిరుద్దీన్ షా, షబానా అజ్మీ, ప్రకాశ్రాజ్.. మద్దతు తెలపడంతో పాటు స్వయంగా నిరసన కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. శత్రుఘ్న సిన్హా, ఆయన కుమార్తె సోనాక్షి సిన్హా, రత్నా పాఠక్ షా, జీనత్ అమన్, ఇమ్రాన్ ఖాన్, అనురాగ్ కశ్యప్, అభయ్ డియోల్, ఓమి వైద్య, అమోల్ పరాశర్, పూనమ్ పాండే, కిశోర్, షాయాజీ షిండే తదితరులు సంఘీభావం ప్రకటించారు. చదవండి: ఆమిర్ ఖాన్కు ఆదిత్య ఠాక్రే కౌంటర్ -
అఫీషియల్: యశ్ టాక్సిక్.. పెద్దలకు మాత్రమే!
కేజీఎఫ్తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ స్టార్ హీరో యశ్.. ఇప్పుడు ‘టాక్సిక్’తో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్లో వయొలెన్స్, గన్స్, స్టైలిష్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు బోల్డ్ టచ్ ఉన్న సన్నివేశాలు, గ్లామరస్ పాటలు సినిమాపై ఆసక్తితో పాటు చర్చకు కూడా కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం పూర్తిగా పెద్దలకు మాత్రమే అనే క్లారిటీ వచ్చేసింది. యశ్ టాక్సిక్పై ఆ నిర్మాత వెంకట్ కె. నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘టాక్సిక్: ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ పెద్దల కోసం రూపొందించిన సినిమా అని స్పష్టం చేశారు. యశ్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సాధారణ కమర్షియల్ సినిమా కాదని నిర్మాత తెలిపారు. కథ చెప్పే విధానం, విజువల్స్, సినిమా స్థాయి అన్నీ ప్రత్యేకంగా ఉంటాయని చెప్పారు. థియేటర్లలో ప్రేక్షకులు ఈ సినిమాను వంద శాతం ఆస్వాదిస్తారని ధీమా వ్యక్తం చేశారు.“టాక్సిక్ చాలా అంబిషియస్ ప్రాజెక్ట్. దీని స్కేల్, గ్రాండియర్, కథన శైలి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ప్రేక్షకులు థియేటర్లలో చూసిన తర్వాత మేము చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకుంటారు. అయితే ఇది పూర్తిగా పెద్దలకు మాత్రమే కంటెంట్తో నిండిన చిత్రం” అని నిర్మాత వెంకట్ కె. నారాయణ పేర్కొన్నారు.ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా గ్లామర్, డార్క్ టోన్, యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా కనిపించడంతో ఈ సినిమా ఏ జానర్లో ఉండబోతోందన్న చర్చ మొదలైంది. కొందరు అభిమానులు గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో భారీ యాక్షన్ ఉంటుందని అంచనా వేస్తుండగా.. మరికొందరు దర్శకురాలు గీతూ మోహన్దాస్ తనదైన శైలిలో కొత్త అనుభూతిని అందించబోతున్నారని భావిస్తున్నారు.తండ్రీకొడుకుల మధ్య సంఘర్షణ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని సమాచారం. యాక్షన్తో పాటు భావోద్వేగాలు, డ్రామా, మానవ సంబంధాలను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నో వాయిదాల తర్వాత యశ్ ‘టాక్సిక్’ రిలీజ్ డేట్ ఖరారైంది. 2026 ఆగస్టు 26న ఈ భారీ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
‘జన నాయగన్’ ట్విటర్ రివ్యూ
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్( తెలుగులో జన నాయకుడు). . హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాల మధ్య నేడు(జులై 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చెన్నైతో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకుల సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.ఎక్స్లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా అదిరిపోయిందని కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తే.. యావరేజ్ సినిమా అని మరి కొంతమంది చెబుతున్నారు. విజయ్ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరోని తెరపై చూసి మురిసిపోతున్నామని చెబుతున్నారు. సినిమాలో విజయ్ వేసిన స్టెప్పులకు సంబంధించిన వీడియో క్లిప్పులు నెట్టింట వైరల్గా మారాయి.‘సీఎం విజయ్ యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. దర్శకుడు వినోద్ సినిమాను బాగా తెరకెక్కించాడు. యాక్షన్ సీన్స్కి అనిరుధ్ ఇచ్చిన బీజీఎం అదిరిపోయింది. పూజా హెగ్డే గ్లామర్ మరో ప్లస్ పాయింట్ అంటూ ఓ నెటిజన్ 4 రేటింగ్ ఇచ్చాడు.#JanaNayaganReview : 4/5 ⭐️⭐️⭐️⭐️#JanaNayagan CM Vijay's High Action & Political Sequence Movie Director #HVinoth Balanced both Cenematic Metric Space @anirudhofficial BGM Score action Sequence, Choreography #PoojaHegde Glamour and #Vijay Fans Fest in Theatres..— South Digital Media (@SDM_official1) July 23, 2026#JanaNayaganReview1st Half:Kerala Fan sitting nearby ~Ditto of leaked version it seems😂Lag, CG worst 😂Cringe pro maxxx dialogues & delivery🤣🐿️s Vinoth ah thookitu poga poranunga😭Most importantly waiting for the response from Islamic parties who offered Support🫣 pic.twitter.com/nM2E1bvWlD— Kingsley (@CineKingsley) July 23, 2026❤️❤️❤️From Thalapathy to CM – today marks one last big-screen journey for Anna with #JanaNayagan ❤️❤️❤️ Fans across TN & beyond are pouring love, from FDFS crowds to emotional celebrations.Cinema gave us a hero; politics now tests the leader. ❤️#JanaNayagan #ThalapathyVijay… pic.twitter.com/EvIvgI5tt9— CM Vijay Rising (@CMVijayRising) July 23, 2026#JanaNayagan Mediocre 1st Half!The interval block is solid and the main highlight so far. Apart from that and a few template elevation scenes, the execution has been sloppy. Bobby Deol’s villain track is absurd, the VFX is poor, and the core daughter emotion feels half baked.…— Venky Reviews (@venkyreviews) July 23, 2026#JanaNayaganFirst half is purely Mass Overloaded... THALAPATHY peak elevation...Never seen before....Enjoy Thalapathy..KGF elevation pathurukom.... Thalapathy ku intha padathula parungaaaa🔥🔥🔥— Praveen Kumar (@Praveen02kumar) July 23, 2026#ThalapathyViiay #JananayaganFirst Half - A Pakka commercial entertainer filled with complete mass moments🥶🔥Anirudh bgm elevate scenes🔥🔥🥵One last dance pic.twitter.com/HLkat99789— Ad Entertainment (@AdithianAd74923) July 23, 2026#JanaNayagan:One Last Dance – the extended 1.5-minute vintage Thalapathy dance sequence is an absolute treat for fans. 💥The interval fight is pure fire! 🔥🔥🔥The first half is a complete mass entertainer, especially for those who haven't watched Bhagavanth Kesari. For…— cinee worldd (@Cinee_Worldd) July 23, 2026One last Peak Tittle Card for Honourable CM @actorvijay ❤️🔥💥 #JanaNayakudu #JanaNayagan pic.twitter.com/gT8PGOAi9r— Rãm Teetøtàller (@urstruly_hrb23) July 23, 2026Exact remake of Bhagavat kesariFirst half looks very bad#JanaNayagan #JananayaganReview#JananayaganDisaster— AssaultSethu (@Assault002) July 23, 2026 -
చెన్నైతో నా లవ్ స్టోరీ: చిరంజీవి
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన చెన్నై లవ్ స్టోరీ సినిమా జూలై 24న విడుదల కానుంది. బేబీ, కలర్ ఫోటో టీమ్ నుంచి వస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు మంచి స్పందన తెచ్చాయి. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను చెన్నైలో గడిపిన రోజులు గుర్తుచేసుకున్నారు. 'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నేనొక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాను. చెన్నైతో లవ్ స్టోరీ రోజులు గుర్తొచ్చాయి. చెన్నైతో నాకున్న అనుబంధం గుర్తొచ్చింది. ఇక్కడ కదా మన బతుకు తెరువు, ఇక్కడ కదా మన ఫ్యూచర్, ఈ స్టూడియోల్లోనే కదా మనం నటుడిగా నిలదొక్కుకోవాలి.. ఇక్కడే కదా మనం పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి అంటూ అప్పట్లో నేను చెన్నై రోడ్ల మీద తిరిగాను. అక్కడే కార్లలో తిరిగాను. అనంతరం అక్కడే స్టార్ స్టేటస్ అందుకున్న చెన్నై రోజులు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ అనే ఈ సినిమా టైటిల్ వినగానే నాకు చెన్నైతో లవ్ స్టోరీ గుర్తుకొచ్చింది ఈ టైటిల్లో ఆ మ్యాజిక్ ఉంది'' అని చిరంజీవి అన్నారు. అభిమానులను తాను ఎంతో ఇష్టపడతానని, కానీ అదే అభిమానులు పైకొస్తే తన ప్రాణప్రదంగా చూసుకుంటానని చిరంజీవి పేర్కొన్నారు. నా అభిమానుల వల్లే ఈ ఈవెంట్కి వచ్చాను. ఎస్కెఎన్, సాయి రాజేష్, దర్శకుడు రవి, నా అభిమానులు. కిరణ్ అబ్బవరం వాళ్ల అన్న నా అభిమాని, కిరణ్ పవన్ కళ్యాణ్ అభిమాని. వీళ్లందరి అభిమానం నన్ను ఇక్కడికి రప్పించింది. అభిమానులు కేవలం అభిమానమే కాకుండా తమను ప్రేరణగా తీసుకొని పైకి రావాలి. ఎస్కెఎన్, సాయి రాజేష్ లాంటి వారు ఏమి లేకుండా వచ్చి ఎదిగారు. కష్టాలు, అవమానాలు ఉన్నా కష్టపడితే విజయం సాధించవచ్చు. ఈ వేదికపై ఉన్న వీళ్లంతా సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినా అసాధారణ కలలు కన్నారు. అదే వీళ్లను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీరు కూడా కలలు కనండి.. వాటిని నిజం చేసుకునేందుకు ప్రయత్నించండి... తప్పకుండా విజయం సాధిస్తారు.. అందుకు నేనే ఉదాహరణ. కంఫర్ట్ జోన్ వదిలేయాలి.. కష్టానికి ఎదురెళ్లాలి. అవకాశాలను సద్వినియోగం చేసుకొని మీ తల్లిదండ్రులు గర్వపడేలా చేయండి. అప్పట్టో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి మహానటుల మధ్య నేను ప్రత్యేకంగా కనిపించాలని చాలా కష్టపడ్డాను. అలాగే కిరణ్ అబ్బవరం కూడా రాయచోటిలో పుట్టి, తిరుపతిలో సినిమాలు చూసి పెరిగి, ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగాడు. అలాంటి కొత్తవాళ్లు ఇంకా ఇండస్ట్రీకి రావాలి. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గురించి మాట్లాడుతూ.. నేను డ్యాన్సులు అంత బాగా చేశానంటే మణిశర్మ సంగీతం వల్లే. ఆయన లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ లేకపోతే నేను లేను. చివరగా చిరంజీవి సినిమా యూనిట్కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జోడీగా నటించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. దర్శకుడు సాయి రాజేశ్ కథను అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్పై సాయి రాజేశ్, ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా రేపు(శుక్రవారం) విడుదలవుతోంది. -
హీరోగా లోకేశ్ కనగరాజ్.. డీసీ తెలుగు ట్రైలర్ రిలీజ్
కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా వస్తోన్న చిత్రం డీసీ. ఈ సినిమారు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో లోకేశ్ సరసన వామిక గబ్బి హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ ట్రైలర్ చూస్తుంటే అంతా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఓ యువతితో పాటు హీరో కూడా వ్యవస్థంపై పోరాటం చేసే కథాంశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నువ్వు పోలీసులను చంపుతావా? అదేమో డాక్టర్లను చంపుతోంది అంటూ చెప్పే డైలాగ్ వింటే కథంటో అర్థమవుతోంది. డీసీ అంటే డాక్టర్స్ అండ్ కాప్స్ అనే ఉద్దేశంతో టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. విజువల్స్తో పాటు, అనిరుధ్ బీజీఎంతో ట్రైలర్తోనే మరింత హైప్ తీసుకొచ్చింది. -
విజయ్ జన నాయగన్.. అడ్వాన్స్ బుకింగ్స్లో రికార్డ్..!
విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతోన్న తొలి సినిమా జన నాయగన్. రాజకీయాల్లో ఎంట్రీకి ముందు ఇదే చివరి సినిమా అని ప్రకటించారు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉన్న ఇప్పటికీ విడుదల కాలేదు. సెన్సార్ సమస్యలతో పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల సెన్సార్ సమస్యలు క్లియర్ కావడంతో ఎట్టకేలకు ఈనెల 23న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో జన నాయగన్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు కేవలం ఇండియాలోనే మూడు భాషల్లో కలిపి 7 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్తో ఇప్పటికే రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. టికెట్ బుకింగ్ ప్రీ-సేల్స్లో అత్యధిక వాటా తమిళ వెర్షన్ కావడం విశేషం. ప్రముఖ ట్రేడింగ్ సైట్ శాక్నిల్క్ ప్రకారం ఈ చిత్రానికి తమిళనాడు అతిపెద్ద మార్కెట్గా కొనసాగుతోంది, అడ్వాన్స్ బుకింగ్లలో రూ. 7.90 కోట్లు రాబట్టింది. కర్ణాటక బెంగళూరులో రూ. 6.03 కోట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత కేరళ బాక్సాఫీస్ వద్ద రూ. 1.91 కోట్లు వసూలు చేసింది. ఇక నగరాల విషయానికొస్తే బెంగళూరు రూ. 5.99 కోట్ల అడ్వాన్స్ అమ్మకాలతో టాప్లో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో చెన్నై (పరిమిత ఓపెనింగ్స్తో) రూ. 1.86 కోట్లు వసూలు చేసింది. ఇక్కడ దేశంలోనే అత్యధిక ఆక్యుపెన్సీ నమోదైంది. కోయంబత్తూరు రూ. 90 లక్షలతో మూడవ స్థానంలో ఉండగా,.. హైదరాబాద్, మదురై, కొచ్చి, తిరువనంతపురం తరువాత స్థానాల్లో నిలిచాయి. లియో, గోట్ సినిమాలతో పోలిస్తే.. జన నాయగన్ కాస్తా వెనకంజలోనే ఉంది.కాగా.. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విజయ్తో పాటు పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రియమణి, నరైన్, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా జూలై 23న విడుదల కానుంది. -
జన నాయకుడు విజయ్కి గొప్ప ఫేర్వెల్: నిర్మాత వెంకట్ కె. నారాయణ
‘‘జన నాయకుడు’ అనుకున్నప్పుడు ఇబ్బందులు రావొచ్చని అనుకున్నాం. ‘ఇది నా చివరి సినిమా... దీని తర్వాత రాజకీయాల్లోకి వెళ్తున్నాను... కొన్ని సమస్యలు వచ్చే చాన్స్ ఉంది’ అని విజయ్గారు కూడా ముందే చె΄్పారు. అయితే రిలీజ్ సమయంలో, థియేటర్స్ విషయంలో అడ్డంకులు రావచ్చని మాత్రమే భావించాం. కానీ సెన్సార్, పైరసీ, కోర్టు వ్యవహారాలు... ఇలా ఇన్ని సమస్యలు ఎదురవుతాయని ఊహించలేదు. ఈ కారణంగా జనవరి 9న విడుదల కావాల్సిన ఈ సినిమా జూలై 23న రిలీజ్ అవుతోంది.ఇందులో మంచిని చూడాలంటే విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా విడుదలవుతుండటం ఫ్యాన్స్కు మరింత ఉత్సాహం ఇస్తోంది’’ అని నిర్మాత వెంకట్ కె. నారాయణ (కేవీఎన్) తెలి పారు. తమిళనాడు ముఖ్యమంత్రి, హీరో విజయ్ నటించిన చిత్రం ‘జన నాయకుడు’. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించారు. కేవీఎన్ ప్రోడక్షన్స్పై వెంకట్ కె. నారాయణ నిర్మించిన ఈ చిత్రం గురువారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా వెంకట్ కె. నారాయణ విలేకరులతో మాట్లాడుతూ–‘‘నాకు సినిమాలంటే ఇష్టం. ముందుగా ఫిల్మ్ ఫైనాన్స్, ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్లోకి అడుగుపెట్టాను.రాజమౌళిగారి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను కర్ణాటకలో పంపిణీ చేశాను. డిస్ట్రిబ్యూషన్ తర్వాత ప్రోడక్షన్లోకి వచ్చాను. ‘జన నాయకుడు’ కథతో విజయ్గారిని కలవగా ఒక్క మీటింగ్లోనే ఆయన ఈ సినిమాని ఓకే చేశారు. ఈ సినిమా విజయ్గారికి గొప్ప ఫేర్వెల్లాంటిది. ఆయన అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. అదేవిధంగా ప్రేక్షకులకు కూడా గొప్ప అనుభూతిని ఇస్తు్తంది.విజయ్గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్న తొలి సినిమా ‘జన నాయకుడు’. ప్రపంచవ్యాప్తంగా సుమారు 7,000 నుంచి 8,000 స్క్రీన్స్లో విడుదల చేస్తున్నాం. నాకు చిన్నప్పటి నుంచి చిరంజీవిగారంటే అభిమానం. అందుకే తెలుగులో మొదటి సినిమా ఆయనతోనే చేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ‘మెగా 158’ సినిమా నిర్మించడం హ్యాపీగా ఉంది’’ అని చెప్పారు. -
యాక్షన్ మండాడి
సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మండాడి’. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ పతాకంపై మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 10న రిలీజ్ కానుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ రిలీజ్ చేస్తోంది.‘‘ఈ సినిమా కోసం సుహాస్, సూరి బాగా మేకోవర్ అయ్యారు. ఈ చిత్రంలోని బోట్ సీక్వెన్స్లు, యాక్షన్ సీక్వెన్స్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అని యూనిట్ పేర్కొంది. మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మణికందన్ సహ–నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్కుమార్ సంగీతం అందించారు. -
జననాయకన్ రిలీజ్ ముందు పూజా హెగ్డేకు షాక్!
పూజా హెగ్డే కెరీర్పై మళ్లీ అనుకోని మబ్బులు కమ్ముకున్నాయి. వరుస ఫ్లాప్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ముద్దుగుమ్మ, తన ఆశలన్నీ జననాయకన్ సినిమాపైనే పెట్టుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి చిత్రం కావడంతో ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుందని ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ సూచిస్తున్నాయి. అయితే పూజా హెగ్డేకు సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉండవని దర్శకుడు హెచ్. వినోద్ స్పష్టంగా ప్రకటించారు. జర్నలిస్టు పాత్రలో కనిపించే పూజా కోసం తొలుత అనేక సన్నివేశాలు రాసుకున్నప్పటికీ, నిడివి కారణంగా చాలావాటిని షూట్ చేయలేకపోయారు. షూట్ చేసిన కొన్ని సన్నివేశాలను కూడా కత్తిరించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ పూజాకు క్షమాపణలు కూడా చెప్పారు. ఇక రీమేక్ అంశంపై కూడా దర్శకుడు స్పందించారు. జననాయకన్ సినిమా, తెలుగులో వచ్చిన భగవంత్ కేసరి రీమేక్ అని అంగీకరించిన ఆయన, కథలో భారీ మార్పులు చేసి కొత్తగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ సినిమా జూలై 23 నుంచే థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ను జారీ చేసింది. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనుండగా.. ప్రేమలు బ్యూటీ మమితా బైజు కీలక పాత్ర పోషించింది. -
సూర్య మూవీతో నయనతార ఢీ.. బాక్సాఫీస్ వద్ద నిలుస్తుందా?
లేడీ సూపర్స్టార్ నయనతార, కవిన్ జంటగా నటించిన లేటేస్ట్ మూవీ హాయ్. ఈ రొమాంటిక్ డ్రామాతో విష్ణు ఎడవన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ తేదీని వెల్లడించారు. ఈ మూవీని ఆగస్టు 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.సూర్యతో నయన్ ఢీ..అయితే అదే రోజున సూర్య హీరోగా వస్తోన్న విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా రిలీజ్ కానుంది. ఈ మూవీకి వెంక అట్లూరి దర్శకత్వం వహించారు. దీంతో నయనతార.. సూర్య చిత్రంతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. హాయ్ మూవీ పోటీలోకి రావడంతో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తిగా మారింది. కాగా.. 'హాయ్' చిత్రాన్ని నయనతార, విఘ్నేష్ శివన్ తమ బ్యానర్ 'రౌడీ పిక్చర్స్, 'సెవెన్ స్క్రీన్ స్టూడియో', 'జీ స్టూడియోస్' భాగస్వామ్యంతో నిర్మించారు. ఈ చిత్రంలో భాగ్యరాజ్, రాధికా శరత్కుమార్, ప్రభు, విటివి గణేష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జెన్ మార్టిన్ సంగీతం అందించారు. -
రోజుకు రూ.100 కోట్లు ఇచ్చినా ఆ పనిచేయను
ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు చేతిలో ఫోన్, అందులో సోషల్ మీడియా అకౌంట్స్ ఆన్లో ఉండాల్సిందే. సామాన్యుడు, సెలబ్రిటీ అనే తేడా లేదు. అంతా ఇదే చేస్తున్నారు. చాలా తక్కువమంది నటీనటులు మాత్రమే దీనికి దూరంగా ఉంటున్నారు. అలాంటి వాళ్లలో మలయాళ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ఒకరు. రూ.100 కోట్లు ఇచ్చినా గానీ సోషల్ మీడియాలోకి రానని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. అందుకు గల కారణాన్ని వెల్లడించింది.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన 'బిగ్బాస్' శుభశ్రీ)'నావి మార్ఫింగ్, డీగ్రేడింగ్ చేసిన ఫొటోలు చూసి షాకయ్యాను. దాని నుంచి తేరుకోవడానికి చాలా టైమ్ పట్టింది. రోజుకు రూ.100 కోట్లు ఇచ్చినా నేను సోషల్ మీడియాకు దూరంగానే ఉంటాను. నా సినిమాల గురించి వచ్చే వార్తలు, ప్రేక్షకుల స్పందన తెలుసుకోవడానికి మాత్రం నా పెంపుడు కుక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఉపయోగిస్తాను. ప్రస్తుతం నేను కొత్త వ్యక్తులని కలవడంలో నిజమైన ఆనందాన్ని పొందుతున్నాను' అని హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి చెప్పుకొచ్చింది.ఈమె నటించిన తమిళ మూవీ 'గట్ట కుస్తీ 2' రెండు వారాల క్రితం థియేటర్లలోకి వచ్చింది. స్పోర్ట్స్ కామెడీ జానర్లో తెరెకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తెలుగులో గాడ్సే, అమ్ము తదితర చిత్రాలు చేసింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ 'సంబరాల ఏటిగట్టు'లో నటిస్తోంది. మరోవైపు పీరియడ్ తమిళ మూవీతో పాటు '#లవ్', 'తీవినై పోట్రు' అనే వెబ్ సిరీస్ల్లోనూ నటిస్తోంది. (ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి మృణాల్ థ్రిల్లర్ సినిమా)#AishwaryaLekshmi: "Even if I'm offered ₹100 crore, I will never return to social media."She revealed that morphed and degrading photos deeply affected her, adding that leaving social media finally gave her peace of mind. pic.twitter.com/tQn2LHhAfT— Filmyscoops (@Filmyscoopss) July 21, 2026 -
'జన నాయగన్' 50 శాతమే రీమేక్.. వేరే కథ విజయ్కి చెబితే
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చిట్టచివరి సినిమా 'జన నాయగన్' మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. అయితే ఇది తెలుగు మూవీ 'భగవంత్ కేసరి' రీమేక్ అనే ప్రచారం చాన్నాళ్లుగా సాగుతోంది. ఇది అదే అని అందరికీ తెలిసినప్పటికీ అధికారికంగా ఏది బయటకు రాలేదు. కానీ ఇప్పుడు స్వయంగా దర్శకుడు హెచ్. వినోత్ రీమేక్ వార్తలపై స్పష్టత ఇచ్చేశాడు. సగం మాత్రమే రీమేక్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఒకే కుటుంబానికి 10 జాతీయ అవార్డులు)''జన నాయగన్'..భగవంత్ కేసరికి రీమేక్. కాకపోతే పూర్తిగా చేయలేదు. 'భగవంత్ కేసరి'లో 50% మాత్రమే ఉంటుంది. ఫస్టాఫ్లో 60%, సెకండాఫ్లో 20% ఉంటుంది. విజయ్ సార్ చివరి మూవీ కోసం నేను మొదట వేరే కథ వినిపించా. కానీ ఆ కథ చాలా హెవీగా ఉందన్నారు. 'భగవంత్ కేసరి'ని రీమేక్ చేయమని నన్ను అడిగారు. బాలయ్య యూనివర్స్ విజయ్ శైలికి భిన్నంగా ఉంటుంది. 'నేర్కొండ పార్వై' తర్వాత మళ్లీ రీమేక్ చేయాలా అనే సందేహాలు నాకు చాలానే ఉండేవి. ఇది విజయ్ చివరి సినిమా కాబట్టి, ఛాన్స్ వదులుకోవాలని అనుకోలేదు''అయితే మనం ఎందుకు రీమేక్ సినిమా చేయాలని నేను విజయ్ని అడిగాను. 'భగవంత్ కేసరి' ఎందుకు నచ్చిందో ఆయన నాకు సీన్ బై సీన్ వివరించారు. విజయ్కి మహిళా సాధికారత పట్ల ఆసక్తి ఉంది. ఇది విజయ్ సర్ చివరి సినిమా అని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అయితే భవిష్యత్తులో సీఎం విజయ్ సర్గా మారిన తర్వాత వచ్చే తొలి సినిమాగా మాత్రం దీన్ని చూడొచ్చు. ఇది కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. విజయ్ని హీరోయిక్గా చూపించడానికే తీసిన సినిమా కాదు. సున్నితమైన రాజకీయాల నేపథ్యంలో సాగే కథ ఇది''జన నాయగన్' విషయంలో నేను రెండుసార్లు ఏడ్చాను. సెన్సార్ ఆలస్యమై పొంగల్ పండగకు సినిమా విడుదల కానప్పుడు, సినిమా ఆన్లైన్లో లీక్ అయినప్పుడు, పైరసీని ఎవరూ ఆపలేకపోయినప్పుడు బాధపడ్డాను. అప్పుడు విజయ్ సార్ నాకు అండగా నిలిచారు. 'ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, బాధపడకండి. ఒకవేళ మనసు బాగోలేకపోతే నాకు ఫోన్ చేయండి' అని నాకు ధైర్యం చెప్పారు' అని డైరెక్టర్ వినోత్ అన్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ కాగా మమిత బైజు కీలక పాత్ర చేసింది. బాబీ డియోల్ విలన్గా నటించాడు. అనిరుధ్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)Dir #HVinoth Recent- #JanaNayagan is not a complete remake of #BhagavanthKesari. Around 50% is inspired by BK, while the remaining 50% is an entirely new story.- The core idea has been reworked, with the hero villain conflict significantly expanded and made much bigger than in…— Movie Tamil (@_MovieTamil) July 20, 2026 -
ఒకే కుటుంబానికి 10 జాతీయ అవార్డులు
ప్రముఖ సంగీత దర్శకుడు,ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ది సంగీత కుటుంబం. ఇతడి తండ్రి నుంచి సోదరీమణి రెహానా, కూతురు ఖతీజా, కొడుకు ఏఆర్.అమీన్ ఇలా అంతా సంగీత కళాకారులే. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్.. రెహమాన్కు స్వయంగా మేనల్లుడు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఇటీవల 72వ జాతీయ అవార్డులను ప్రకటించింది. అందులో 'అమరన్' చిత్రానికిగానూ ఉత్తమ సంగీత దర్శకుడు(నేపథ్య సంగీతం) అవార్డు జీవీ ప్రకాష్ కుమార్ని వరించింది. ఇది ఈయన అందుకోబోతున్న మూడో జాతీయ అవార్డు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)2019లో సూర్య హీరోగా నటించిన 'సూరరై పోట్రు'(ఆకాశమే హద్దురా) చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ జాతీయ అవార్డ్ అందుకున్నారు. తర్వాత 2024లో 'వాత్తి' చిత్రానికిగానూ మరోసారి పురస్కారం ఇతడిని వరించింది. ఇప్పుడు 'అమరన్'తో జాతీయ అవార్డు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా జీవీని మేనమామ ఏఆర్ రెహమాన్ అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.జీవీ ప్రకాష్ కుమార్ మీరు మూడో జాతీయ అవార్డును గెలుచుకున్నందుకు అభినందనలు. ఇదీ మన కుటుంబం గెలుచుకున్న 10వ జాతీయ అవార్డు. ఇది మన కుటుంబానికి చాలా గర్వకారణమైన తరుణం. సంగీతంపై మీ ఆసక్తి, నిజాయితీ,అంకిత భావం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి. మరిన్ని మైలు రాళ్లు అధిగమించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. దేవుడి ఆశీస్సులు మీకు ఉంటాయి అని ఏఆర్ రెహమాన్ పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: పృథ్వీరాజ్, విక్రమ్కు అందుకే అవార్డులు ఇవ్వలేదా?) -
అందుకే అవార్డులు ఇవ్వలేదా?
జాతీయ చలనచిత్ర అవార్డులపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. విజేతలు ఆనందోత్సాహాల్లో తేలియాడుతుంటే, పరాజితుల మద్దతుదారులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అవార్డుల ఎంపిక విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తమ నటుడు అవార్డు ఎంపికపై పెదవి విరుస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్, విక్రమ్లకు అవార్డు దక్కకపోవడం పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు మలయాళ నటుడు చందు సలీంకుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంచి సినిమాలను వదిలేసి మామూలు చిత్రాలకు అవార్డులు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. పాలక పక్షం వారి కుటుంబ సభ్యులు, స్నేహితులను అవార్డులకు ఎంపిక చేశారని వ్యాఖ్యానించారు.మమ్ముట్టితో పాటు కార్తీక్ ఆర్యన్ను ఉత్తమ నటుడిగా ఎంపిక చేయడంపై చందు సలీంకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. "జాతీయ అవార్డును అధికార పార్టీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు అందజేస్తున్నప్పుడు, దానికున్న హుందాతనాన్ని ఊహించండి. అయినా కూడా వారు మిమ్మల్ని (మమ్ముట్టి) విస్మరించలేకపోతున్నారు, ఎందుకంటే దేశంలోనే మీ నటన అత్యుత్తమమైనద"ని ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. కాగా, 'బ్రహ్మయుగం' చిత్రంలో తన నటనకు మమ్ముట్టి, చందు ఛాంపియన్' చిత్రానికి కార్తీక్ ఆర్యన్.. ఉత్తమ నటులుగా ఎంపికైన సంగతి తెలిసిందే.సాధారణ సినిమాలకు అవార్డులా?మంచి చిత్రాలను విస్మరించి, సాధారణ సినిమాలకు అవార్డులు ఇచ్చారని చందు సలీంకుమార్ విమర్శించారు. అధికార పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగిన వారికి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. "ప్రతిభకు కాకుండా అధికార పార్టీకి దగ్గరగా ఉండటం వల్లే అవార్డులు వచ్చాయనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంటే, చరిత్ర కూడా వాటిని అలాగే గుర్తుంచుకుంటుంది. ప్రభుత్వాలు మారినా అవార్డుల విలువ నిలిచి ఉండాలి. అవి కళాత్మక శ్రేష్ఠతకు నిదర్శనంగా నిలవాలి. ఒకవేళ ప్రజలకు వాటిపై నమ్మకం పోతే, ఆయా కాలాల్లోని అత్యుత్తమ చిత్రాలుగా చరిత్ర వీటిని గుర్తించద"ని ఘాటుగా వ్యాఖ్యానించారు.'ఆడుజీవితం'కు మొండిచేయిపృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ది గోట్ లైఫ్’ (ఆడుజీవితం), చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘తంగలాన్’ చిత్రాలకు ప్రధాన విభాగాల్లో అవార్డులు రాకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. అవార్డుల జాబితా వెలువడిన వెంటనే #TheGoatLife, #Thangalaan హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి. ‘ది గోట్ లైఫ్’కు ఒక్క అవార్డు కూడా రాకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ నటనకు కచ్చితంగా బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఒక్క పురస్కారం కూడా దక్కకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా గళం విన్పిస్తున్నారు. 'పుష్ప 2: ది రూల్', 'రాయన్' వంటి చిత్రాలకు అవార్డులు ప్రకటించిన జ్యూరీ.. ఈ రెండు సినిమాలను ఎందుకు విస్మరించిందని ప్రశ్నిస్తున్నారు. మెయ్యళగన్', 'మంజుమ్మెల్ బాయ్స్', 'కిష్కింధ కాండం' వంటి చిత్రాలకు అవార్డులు దక్కకపోవడాన్ని కూడా ప్రస్తావించారు.అవార్డుల విశ్వసనీయతపై అనుమానాలు72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈ చిత్రానికి సరైన గుర్తింపు లభించకపోవడం పట్ల సోషల్ మీడియాలో అభిమానులు స్పందిస్తూ.. “జాతీయ అవార్డుల విశ్వసనీయత గతంలో ఉన్నంతగా ఇప్పుడు కనిపించడం లేదు” అంటూ వ్యాఖ్యానించారు. “#TheGoatLife ఒక్క అవార్డు కూడా గెలవకపోవడం ఎలా సాధ్యమైంది? పృథ్వీరాజ్ సుకుమారన్ తన పాత్ర కోసం చేసిన కృషి అసాధారణం. ఆయనకు అవార్డు రాకపోయినా, ఆయన చేసిన నటనే ఒక అవార్డు లాంటిది” అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని “మాస్టర్పీస్”గా అభివర్ణిస్తూ, పృథ్వీరాజ్ నటనను “ఐకానిక్ పెర్ఫార్మెన్స్”గా కొనియాడారు.విక్రమ్ అభిమానుల నిరాశ‘తంగలాన్’ సినిమాలో విక్రమ్ నటనకు కూడా అవార్డు వస్తుందని అనుకున్నారు. కానీ ఆయనకూ నిరాశ తప్పలేదు. దీంతో చియాన్ విక్రమ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. “చియాన్ విక్రమ్ను మరోసారి విస్మరించారు. ఇది ఆయన నష్టం కాదు, జాతీయ అవార్డులకే పెద్ద లోటు” అని వారు వ్యాఖ్యానించారు. “తంగలాన్ కోసం విక్రమ్ తన శరీరాన్నీ, మనసునీ పూర్తిగా అంకితం చేశారు. సినిమానే జీవితంగా భావించి పనిచేశారు. అయినప్పటికీ ఆయనకు జాతీయ అవార్డు రాకపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం” అని భావోద్వేగంగా స్పందించారు. “కృషికి గుర్తింపు ఉండాలి. చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ కోసం చేసిన శ్రమ జాతీయ అవార్డుకు అర్హమైనది” అని పేర్కొన్నారు.చదవండి: కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నటుడు నరేశ్ ఆందోళనఅందుకే అవార్డులు ఇవ్వలేదా?పృథ్వీరాజ్ సుకుమారన్, విక్రమ్ సినిమాలకు అవార్డులు ఇవ్వకపోవడానికి కారణాలు వేరే ఉన్నాయని అభిమానులు అంటున్నారు. లూసిఫర్కు సీక్వెల్గా పృథ్వీరాజ్ తెరకెక్కించిన ఎల్2- ఎంపురాన్ సినిమా కేంద్ర ప్రభుత్వానికి గురైంది. దీంతో ఆయన సంస్థపై ఈడీ దాడులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆయన సినిమాకు అవార్డు ఇవ్వకుండా పక్కనపెట్టారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక తంగలాన్ దర్శకుడు ఫా. రంజిత్ కూడా మొదటి నుంచి అంబేద్కర్ వాదాన్ని గట్టిగా వినిపిస్తూ, వివక్షకు వ్యతిరేకంగా సినిమాలు తీస్తున్నారు. బహూశా ఈ కారణంతోనే ఆయన సినిమాకు అవార్డు రాలేదన్న అనుమానాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రాపగాండా సినిమాగా ఆరోపణలు ఎదుర్కొన్న హిందీ మూవీ 'ఆర్టికల్ 370'కి ఉత్తమ చలనచిత్ర పురస్కారం దక్కడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం అర్థయిందని కామెంట్లు పెడుతున్నారు. Master Piece #TheGoatLife #AadujeevithamIconic Performance🔥 @PrithviOfficial Pillar of the movie ❤️ @arrahman"கற்பனைக்கு அப்பாற்பட்ட ஒர் உன்மை சம்பவம்." pic.twitter.com/sOrzH8ctWL— Sasikumar Periasamy (@SKP_Offl) July 19, 2026How did #TheGoatLife did not even win a Single award.On what basis are the #72ndNationalFilmAwards are given National Award deserved #PrithvirajSukumaranHe may not get an award but he himself is an award for the efforts that he have put for the Film. pic.twitter.com/DCSCPL7JDC— Surya (@Suryan0110) July 18, 2026#ChiyaanVikram ignored yet again!Not his loss - it’s a big miss for the National Award.#Thangalaan #72ndNationalAwardspic.twitter.com/6X08MX5jms— Balaji (@RDBalaji) July 18, 2026#ChiyaanVikram's dedication and hard work for #Thangalaan were unmatched..🙏 He put his heart and soul into the role.. It is very disappointing to see it go unrecognized by the National Awards..🚶 The man deserves more..🤝 pic.twitter.com/f4khOtoekh— Laxmi Kanth (@iammoviebuff007) July 19, 2026 -
బిగ్బాస్ బ్యూటీకి అసభ్యకర సందేశాలు.. పోలీసులకు ఫిర్యాదు
కన్నడ నటి, బిగ్ బాస్ కన్నడ కంటెస్టెంట్ ఐశ్వర్య పోలీసులను ఆశ్రయించింది. సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువయ్యాయని ఫిర్యాదు చేసింది. ఆన్లైన్లో వేధింపులు, దుర్భాషలు ఎదుర్కొంటున్నట్లు ఆరోపించింది. తనకు తెలిసిన ఒక వ్యక్తి పేరును వెల్లడిస్తూ.. పలు నకిలీ సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించి తనను లక్ష్యంగా చేసుకున్నారని వాపోయింది.తనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని పోలీసులకు తెలిపింది. దీని వెనుక ఉన్నవారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరింది. దీంతో బెంగళూరులోని సంజయ్నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వేధింపులు చాలా కాలంగా కొనసాగుతున్నాయని.. అందుకే తాను మరోసారి పోలీసులను ఆశ్రయించానని నటి తన ఫిర్యాదులో పేర్కొంది.కాగా.. కన్నడ చిత్ర పరిశ్రమలో మహిళా నటీమణులను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్ వేధింపులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఐశ్వర్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలి రమ్య, దర్శన్ భార్య విజయలక్ష్మి దర్శన్ కూడా ఇలాంటి ఆన్లైన్ ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఈ రెండు కేసుల్లోనూ నిందితులను గుర్తించి పోలీసులు అరెస్టు కూడా చేశారు. -
ఓటీటీకి లేటేస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అర్జున్దాస్, అన్నాబెన్ జంటగా నటించిన చిత్రం కాన్ సిటీ. కమెడియన్ యోగిబాబు, వీటీవీ గణేశ్ కీలక పాత్రల్లో కనిపించారు. హరీష్ దురైరాజ్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా వ్యవహరించారు. ఈ ఏడాది జూన్ 26న తెలుగు, తమిళంలో రిలీజైంది. మనీ కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది.తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 24 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళంతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? అన్న డైలాగ్ ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. ఆ మాట నిజమైతే బాగుండు అనుకునేవాళ్లూ లేకపోలేదు.. దాదాపు అలాంటి కాన్సెప్ట్తో వచ్చిన చిత్రమే "కాన్ సిటీ". ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. -
గాన కోకిల జానకమ్మకు జన గాన ఘన నీరాజనం
ఒక్కటే గొంతు... దాదాపు ఇరవై భాషల్లో 45 వేల కంటే ఎక్కువ పాటలను ఆలపించి, ఆరు దశాబ్దాలుగా కోట్లాది మంది హృదయాలను మురిపించిన కమ్మని కంఠం మన శిష్టాల జానకమ్మ. ఈ అమర గాన కోకిల భౌతికంగా దూరమైనా, ఆవిడ పంచిన గానామృతం తరతరాల పాటు విశ్వమంతటా మారు మోగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో సంగీత సామ్రాజ్ఞి ఎస్. జానకి స్మరణార్థం ‘సాక్షి డిజిటల్’ సగర్వంగా ‘జన గాన ఘన నీరాజనం’ పేరిట ఒక అపూర్వమైన డిజిటల్ నివాళి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.జానకమ్మకు మనసారా వీడ్కోలు పలుకుతూ, ఆమె జ్ఞాపకాలను పదిలపరచుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరినీ ఈ వేదిక ద్వారా ఒకే తాటిపైకి తెస్తోంది. ఈ మహోన్నతమైన కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి సంగీత ప్రియులు, అభిమానులు తమకు నచ్చిన జానకమ్మ పాటను గానీ, ఆవిడ గురించిన మాటలను గానీ ఒక నిమిషం పాటు రికార్డ్ చేసి #tribute2 janaki పేరిట అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.ఇలా దేశ విదేశాల నుండి వచ్చే అభిమానుల సందేశాలను, గీతాలను క్రోడీకరించి ఆగస్టు 21న ప్రత్యేక నీరాజన కార్యక్రమంగా ‘సాక్షి డిజిటల్’ ప్రసారం చేయనుంది. ఆ మధుర గాయని వైభవాన్ని, సంగీత ప్రస్థానాన్ని స్మరించుకుంటూ సగర్వంగా సమర్పించే ఈ స్వరార్చనలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆశిస్తున్నాం. -
జాతీయ అవార్డ్ ప్రకటన.. చైల్డ్ ఆర్టిస్ట్ ఫుల్ ఎమోషనల్
తాజాగా జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. 2024 ఏడాదిలో రిలీజైన సినిమాలకు గానూ ఈ అవార్డులు అందజేయనున్నారు. ఈ అవార్డుల్లో టాలీవుడ్ సినిమాలు సైతం సత్తాయి చాటాయి. కమిటీ కుర్రోళ్లు మూవీ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అలాగే కోలీవుడ్లో పలు సినిమాలకు నేషనల్ అవార్డ్స్ దక్కాయి. అయితే కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి మూవీ మహారాజా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో చైల్ట్ ఆర్టిస్ట్గా మెప్పించిన సచనా నమీదాస్కు జాతీయ అవార్డ్ దక్కింది. ఈ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా ఆమె ఎంపికైంది. ఈ అవార్డుల ప్రకటనను లైవ్లో వీక్షించిన సచనా.. తనపేరు వినగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఒక్కసారిగా ఏడుస్తూ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘మహారాజ’ జ్యోతికి అవార్డు.. ఏడ్చిన నటివిజయ్ సేతుపతి ‘మహారాజ’ మూవీలో జ్యోతి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్గా మెప్పించిన సచనా నమీదాస్ గుర్తున్నారా? ఆ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా ఆమెకు నేషనల్ అవార్డు దక్కింది. అవార్డుల ప్రకటనను లైవ్లో చూస్తూ సచన ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.… pic.twitter.com/b6KJqYa4DX— ChotaNews App (@ChotaNewsApp) July 19, 2026 -
నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫొటోలు వైరల్
తెలుగులో ఓ సినిమాలో నటించిన హీరోయిన్ షర్మిలా మాండ్రే పెళ్లి చేసుకుంది. తమిళ నిర్మాత సుధాన్ సుందరంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలని కాస్త ఆలస్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో తోటీ నటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి)స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన షర్మిలా మాండ్రే..2007 నుంచి దక్షిణాదిలోని తెలుగు, కన్నడ, తమిళంలో సినిమాలు చేస్తోంది. తెలుగులో 2013లో వచ్చిన అల్లరి నరేశ్ 'కెవ్వు కేక' మూవీలో హీరోయిన్గా చేసింది. తమిళంలోనూ హీరోయిన్ కమ్ నిర్మాతగా పలు చిత్రాల్లో నటించింది. మరి ఎప్పుడు ప్రేమలో పడిందో ఏమో గానీ తమిళ నిర్మాత సుధాన్ సుందరంతో రహస్యంగా రిలేషన్షిప్ మెంటైన్ చేసింది.గత నెల 28న నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ఈ నెల 12వ తేదీన రాజస్థాన్లోని జైపూర్లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఈ ఫొటోలని వారం రోజులు ఆలస్యంగా షర్మిలా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. మిస్టర్ అండ్ మిసెస్ సుందరం అని క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం షర్మిలా తమిళంలో ఓ మూవీ చేస్తుండగా, సుధాన్ తన ప్యాషన్ స్టూడియోస్ సంస్థలో సినిమాలు నిర్మిస్తున్నారు. ఇకపోతే విజయ్ సేతుపతితో 'మహారాజా' నిర్మించింది ఈయనే.(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరో ప్రిన్స్) -
జన నాయగన్.. కోలీవుడ్లో తగ్గిన క్రేజ్.. అక్కడ మాత్రం రికార్డ్!
విజయ్ హీరోగా వస్తోన్న చివరి సినిమా జన నాయగన్. ఈ మూవీ రిలీజ్కు అంతా సిద్ధమైంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. ఎట్టకేలకు ఈ నెల 23న థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనుంది.ఇప్పటికే జన నాయగన్ మూవీ టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. విజయ్ సీఎం అయ్యాక ఈ మూవీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్లో జన నాయగన్ దూసుకెళ్తోంది. శనివారం ఒక్క రోజే ఏకంగా 95 వేల టికెట్స్ అమ్ముడయ్యాయి. రిలీజ్కు ఇంకా నాలుగు రోజులు ఉండగానే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించారు.కేవలం ఒక్క తమిళనాడులోనే ఒక్క రోజే 12 వేల టికెట్స్ అమ్ముడయ్యాయి. కేరళలో ఏకంగా 83 వేలకు పైగా టికెట్స్ బుకింగ్స్ పూర్తయ్యాయి. కేరళలో కేవలం 17 నిమిషాల్లో పదివేల టికెట్స్ బుక్ చేసుకున్నారు. దీంతో కోలీవుడ్ కంటే మలయాళంలోనే ఎక్కువ క్రేజ్ ఉండడం మరో విశేషం. ఈ డిమాండ్ చూస్తుంటే జన నాయగన్ పట్ల ఉన్న భారీ క్రేజ్ అర్థమవుతోంది. ఇవాల్టి నుంచి మరిన్ని రాష్ట్రాల్లో బుకింగ్స్ మొదలవనున్నాయి. GAME ON — 🫰🔥#JanaNayagan sold 12,000+ Tickets at Tamilnadu Box-office from it's very limited shows ( 71** ) ✊💥Real-time Pre-sales 22.43 Lakhs & Counting*** 📈💥More shows will open in coming hours, Stay tuned for Real-time updates 📌#ThalapathyVijay𓃵… pic.twitter.com/kwxzaSgyeM— Jerin Georgekutty (@jerinGeorgekut2) July 19, 2026 83000+ Tickets sold for #JanaNayagan at Kerala Box-office within just 18 Hours after bookings opened ✊💥Real-time Pre-sales touched 1.40 CRORES Mark as more shows will open in coming days 📈Total Ww opening day advances gone past 13.25 Crores 🙏🔥Just 4 More days to go 🔜… pic.twitter.com/rzClqQv5Oh— Jerin Georgekutty (@jerinGeorgekut2) July 19, 2026 -
జాతీయ అవార్డుల తీరుపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం!
72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన కొన్ని వర్గాలను అసంతృప్తికి గురిచేసింది. 2024లో విడుదలైన అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా, కళాత్మక, సాంకేతిక విలువల పరంగా అద్భుత సృష్టిగా నిలిచిన ‘తంగలాన్’ సినిమాకు ఈ పురస్కారాల్లో తీవ్ర అన్యాయం జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధాన విభాగాల్లో ఈ చిత్రానికి ఎటువంటి అవార్డులు రాకపోవడంపై అభిమానులు, సినీ విశ్లేషకులు తీవ్ర నిరాశ, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రానికి కనీస గుర్తింపు కూడా దక్కకపోవడం వెనుక ఉన్న కారణాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. జాతీయ అవార్డుల కమిటీ కావాలనే ఈ చిత్రాన్ని పక్కన పెట్టిందని అభిమానులు ఘాటుగా విమర్శిస్తున్నారు. .@chiyaan deserves the National Award for #Thangalaan 🏆A career-defining performance with unmatched dedication, transformation & intensityOne of finest performances in Indian cinema, It's time this brilliance gets the recognition it truly deserves.#ChiyaanVikram #Chiyaan63 pic.twitter.com/4MNO1ouvQU— Dᴀᴠɪᴅ Aᴅᴀᴍ CVF (@David_AdamCVF) July 4, 2026విక్రమ్ పడ్డ శ్రమ వృథానేనా?దర్శకుడు పా.రంజిత్ రూపొందించిన ‘తంగలాన్’ చిత్రంలో గిరిజన నాయకుడిగా విక్రమ్ కనబరిచిన నటన అసాధారణమైనది. ఈ పాత్ర కోసం ఆయన పడ్డ శ్రమ, చూపించిన అంకితభావం సామాన్యమైనవి కావు. పాత్ర స్వభావానికి తగ్గట్టుగా ఆయన తన శారీరక రూపాన్ని మార్చుకున్న తీరు, నటనలోని వైవిధ్యం, భావోద్వేగాలను పండించిన విధానం చూసి విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ఈ అద్భుత ప్రదర్శనతో ఆయన ఖచ్చితంగా ‘ఉత్తమ నటుడు’ పురస్కారానికి అత్యంత బలమైన పోటీదారు అని పరిశ్రమ వర్గాలు నమ్మాయి. కానీ ప్రకటనలో విక్రమ్ పేరు లేకపోవడం అందరినీ షాక్కు గురిచేసింది. ఆయన పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదని ఫ్యాన్స్ వాదిస్తున్నారు.Chiyaan Vikram Deserves National Award For #Thangalaan 🤞pic.twitter.com/AQBaORQd0L— Kolly Corner (@kollycorner) July 4, 2026కథా కథనం, సాంకేతిక విలువల అద్భుత కలయిక.. ‘తంగలాన్’ కేవలం ఒక నటుడి చిత్రమే కాదు, దర్శకుడు పా.రంజిత్ ఆలోచనల నుంచి పుట్టిన ఒక దృశ్య కావ్యం. ఈ చిత్రంలోని కథా కథనం ప్రేక్షకుడిని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. దీనికి తోడు సినిమా సాంకేతిక విలువలు భారతీయ చలనచిత్ర రంగాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేలా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్లోనూ, ప్రతి సన్నివేశంలోనూ చిత్ర బృందం పడ్డ కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతటి ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన చిత్రానికి జాతీయ అవార్డుల జాబితాలో కనీస చోటు దక్కకపోవడం అనేది సాంకేతిక నిపుణులను సైతం విస్మయానికి గురిచేసింది. ఈ విస్మరణ చలనచిత్ర పురస్కారాల చరిత్రలోనే ఒక పెద్ద లోపంగా మిగిలిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.సోషల్ మీడియాలో రచ్చజాతీయ అవార్డుల జాబితా విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియా వేదికలు ‘తంగలాన్’ హ్యాష్ట్యాగ్లతో మార్మోగిపోతున్నాయి. ఈ ఏడాది జరిగిన అతిపెద్ద అవార్డుల విస్మరణలలో ఇది ఒకటని నెటిజన్లు బాహాటంగానే విమర్శిస్తున్నారు. జాతీయ అవార్డుల ఎంపిక కమిటీ అర్హత గల చిత్రాన్ని కావాలనే తొక్కేసిందని, తంగలాన్కు జరిగిన అన్యాయాన్ని సహించలేమంటూ అభిమానులు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. కథా కథనం బాగున్నా, నటన అద్భుతంగా ఉన్నా ఎందుకు అవార్డు ఇవ్వలేదని, అవార్డుల ఎంపికలో పారదర్శకత ఎక్కడ ఉందని సోషల్ మీడియా వేదికగా ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.అభిమానుల గుండెల్లో ఆగ్రహ జ్వాలలుసినిమా విడుదలైన సమయం నుంచే ఈ చిత్రానికి జాతీయ అవార్డులు ఖాయమని అందరూ భావించారు. ముఖ్యంగా విక్రమ్ నటనకు ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు వస్తుందని యావత్ సినీ ప్రపంచం ఆశించింది. కానీ ఫలితాలు చూశాక అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అర్హత ఉన్న చిత్రాలను గుర్తించడంలో కమిటీ విఫలమైందని, ఇది ముమ్మాటికీ ‘తంగలాన్’ చిత్రానికి జరిగిన ఘోర పరాభవమని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ చిత్రం సాధించిన ప్రజాదరణ, విమర్శకుల ప్రశంసల ముందు ఈ అవార్డుల కమిటీ నిర్ణయం చాలా చిన్నదిగా కనిపిస్తోందని వారు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.Why hasn’t #ChiyaanVikram received any major civilian honour like the Padma Shri or Padma Bhushan yet, despite his National Award winning performances and decades of contribution to Tamil cinema ? 🤔@chiyaan @chiyaanCVF @proyuvraaj pic.twitter.com/xtkDUnJbyX— Cinemapatti (@cinemapatti) April 12, 2026ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే విక్రమ్ ‘తంగలాన్’ఏదేమైనప్పటికీ, అవార్డులు అనేవి ఒక నటుడి ప్రతిభకు లేదా ఒక చిత్రం సాధించిన విజయానికి పూర్తి కొలమానం కాదని సినీ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. 72వ జాతీయ అవార్డుల్లో తంగలాన్ చిత్రానికి చోటు దక్కకపోయినప్పటికీ, 2024లో విక్రమ్ కనబరిచిన నటన అత్యుత్తమమైనదిగా ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోతుందని వారు అంటున్నారు. అవార్డుల కమిటీ గుర్తించకపోయినా, ప్రేక్షకుల గుండెల్లో సాధించిన స్థానమే విక్రమ్ సాధించిన అసలైన విజయమని, తంగలాన్ ఎప్పటికీ ఒక క్లాసిక్గా నిలిచిపోతుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: బలూచ్ బిగ్ ట్విస్ట్తో చైనా-పాక్ ఫ్రెండ్షిప్ ఖతం! -
ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
చిన్న సినిమాలో థియేటర్స్లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచన మలయాళ చిత్రం ‘బాలన్-ది బాయ్’. ‘మంజుమ్మల్ బాయ్స్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన చిత్రం ఇది. రోమాంచం.. ఆవేశం లాంటి వైవిధ్యమైన కామెడీ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు జీతు మాధవన్ ఈ చిత్రానికి కథను అందించాడు.ఫర్జానా పాలత్గింగల్, ఆది శేషన్, ముహమ్మద్ జినన్, డాలీ జూన్, టోవినో థామస్ కీలక పాత్రల్లో నటించారు. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో తీర్చిదిద్దిన ఈ సినిమా జూన్ 19న థియేటర్స్లో రిలీజ్ హిట్ టాక్ సంపాదించింది. రూ. 18 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడీ ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. జులై 31 నుంచి ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు సంస్థ అధికారిక ప్రకటన చేస్తూ ట్రైలర్ని రిలీజ్ చేసింది. బాలన్-ది బాయ్ కథేంటే..ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి, తన కొడుకు(ఆది శేషన్)తో బయటకు వచ్చిన ఓ మహిళ(ఫర్జానా పాలత్గింగల్) చుట్టూ ఈ కథ తిరుగుంది. బయటకు వచ్చిన ఆ మహిళ..పేర్లను మార్చుకుంటూ కొడుకుతో కలిసి పలు చోట్ల పని చేస్తుంది. అంతా సవ్యంగా జరుగుతుందన్న సమయంలో ఆ మహిళ మరో హత్య చేయాల్సి వస్తుంది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేస్తారు. రోవైపు స్కూల్కి వెళ్లిన కొడుకు అమ్మ రాక కోసం ఒక చోట ఎదురు చూస్తూ ఉంటాడు. తప్పిపోయిన బాలుడు అనుకొని పోలీసులు అతన్ని స్టేషన్కి తీసుకెళ్తాడు. అయితే తల్లి ఇచ్చిన ట్రైనింగ్ కారణంగా ఆ బాలుడు తన అడ్రస్ని పోలీసులకు చెప్పడు. అంతేకాదు చాలా చాకచక్యంగా స్టేషన్ నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఆ బాలుడు ఎక్కడికి వెళ్లాడు? తల్లిని కలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయా లేదా? తల్లి కొడుకుల కథలోకి టొవినో థామస్ ఎలా వచ్చాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఐరన్ లెగ్ అని ముద్ర వేయకండి : హీరోయిన్ విజ్ఞప్తి
ఏ రంగానికి చెందిన వారికైనా అవమానాలు, అవరోధాలు ఎదురుకావడం సహజం. ముఖ్యంగా సినిమా రంగంలోని వారికి ఇలాంటి ఇబ్బందులు కాస్త ఎక్కువే ఉంటాయి. ఒక్కోసారి శాయశక్తులా శ్రమించినా తమనే కార్నర్ చేసే విమర్శలు గుండెల్లో కలుక్కుమంటుంటాయి. నటి భాగ్యలక్ష్మి భోర్సే ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటోందట. అలా తన ఆవేదనను ఇటీవల ఒక భేటీలో వ్యక్తం చేసిందీ బ్యూటీ. నిజం చెప్పాలంటే నటిగా ఈ అమ్మడికి అదృష్టం ఉన్నా, సరైన విజయం వరించలేదు. తెలుగులో రవితేజ, విజయ్ దేవరకొండ, రామ్ వంటి స్టార్ హీరోలతో జత కట్టినా, ద్విభాషా చిత్రం కాంతాలో దుల్కర్ సల్మా న్ వంటి నటుడితో రొమాన్స్ చేసినా మంచి నటిగా పేరు తెచ్చుకుంది కానీ మంచి సక్సెస్ మా త్రం దోబూచులాడుతూనే ఉంది. అలాంటిది తాజాగా అఖిల్ అక్కినేనితో జత కట్టిన లెనిన్ చిత్రం సంతృప్తి కరమైన విజయాన్ని అందించింది. దీంతో చాలా కాలంగా గూడు కట్టుకున్న ఆవేదన కట్టలు తెంచుకుంది. దాన్ని ఒక భేటీలో వ్యక్తం చేస్తూ. ‘‘చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతే వెంటనే ఆ చిత్ర కథానాయికిని కార్నర్ చేస్తూ ఐరన్ లెగ్ అంటూ ముద్ర వేయకండి. చిత్ర అపజయాన్ని హీరోయిన్లకు మాత్రమే ఆపాదించడం ఎంత వరకు న్యాయం. నేనూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను’’ అంటూ విమర్శకులపై దాడి చేసింది. ప్రస్తుతం ఈ భామ తమిళంలో శివకార్తికేయన్కు జంటగా సెయోన్ చిత్రంలో నటిస్తోంది. -
బర్త్ డేకి టీజర్?
సూర్య హీరోగా ‘ఆవేశం’ ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సూర్య 47’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో నజ్రియా, ‘ప్రేమలు’ ఫేమ్ నస్లీన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సూర్య, జ్యోతిక ఈ సినిమాను నిర్మించారు.కాగా, ఈ మూవీ చిత్రీకరణ పూర్తయిందని యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 23న సూర్య బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్, టీజర్ను రిలీజ్ చేయాలనే సన్నాహాల్లో ఉన్నారట. అంతేకాదు... వచ్చే పొంగల్కి ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో యూనిట్ ఉందని తెలిసింది. -
కాస్త ఆలస్యంగా జీడీ నాయుడు
కొంచెం ఆలస్యంగా థియేటర్స్కు వస్తున్నాడు జీడీ నాయుడు. ప్రముఖ భారతీయ ఆవిష్కర్త, మిరాకిల్ మ్యాన్, ఎడిసన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన జీడీ నాయుడు (గోపాలస్వామి దొరైస్వామి నాయుడు) బయోపిక్ ‘జి.డి.ఎన్’గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో జీడీ నాయుడు పాత్రలో మాధవన్ నటించారు. ఈ సినిమాని కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వంలో ఆర్. మాధవన్, సరిత మాధవన్, విజయ్ మూలన్, వర్గీస్ మూలన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తొలుత ఈ నెల 17న విడుదల చేయాలనుకున్నారు. కానీ చేయలేదు... ఆగస్టు 7న రిలీజ్ చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించారు మేకర్స్. -
మరింత ముదురుతున్న 'జానీ మాస్టర్' డాన్సర్ అసోసియేషన్ వివాదం
డాన్సర్స్ అసోసియేషన్ – ఫెడరేషన్ మధ్య జరుగుతున్న వివాదం మరింత ముదురుతోంది. శుక్రవారం మధ్యాహ్నం ఫెడరేషన్ జానీ మాస్టర్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దాంతో సాయంత్రం జానీ మాస్టర్ ఫెడరేషన్ నాయకులపై నిర్మాతలకు ఫిర్యాదు చేశారు. ఫిలిం ఛాంబర్లోని పెద్దలను కలిసిన జానీ మాస్టర్ యూనియన్లో అవినీతి చేసే వారిపై చర్యలు తీసుకుంటే ఫెడరేషన్ అడ్డుపడుతోందని ఆరోపించారు. అంతేకాక సస్పెండ్ చేసిన సభ్యులను తిరిగి తీసుకోవాలని ఫెడరేషన్ వారిపై ఒత్తిడి తెస్తోందని, నిర్మాతలను మోసం చేస్తున్న వారిపై ప్రెసిడెంట్ సుమలత చర్యలు తీసుకుంటే ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఫెడరేషన్ పెద్దలు ఆమెపై లింగభేదం చూపుతున్నారని కూడా ఆయన ఆరోపించారు.జానీ మాస్టర్ భార్య, ప్రెసిడెంట్ సుమలత కూడా నిర్మాతలతో సమావేశమైయ్యారు. ఫెడరేషన్ జోక్యం లేకుండా చూడాలని కోరారు. తప్పు చేసిన సభ్యుల ఆధారాలను ఛాంబర్ పెద్దలకు అందజేశాం. అవినీతి చేస్తున్న వారిని శిక్షించి వారికి సహకరిస్తున్న ఫెడరేషన్ పెద్దలను మందలించాలని విజ్ఞప్తి చేశారు. డాన్సర్స్ అసోసియేషన్లో కొంతమంది సభ్యులు నిర్మాతలను మోసం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఫెడరేషన్ మాత్రం వారిని కాపాడుతోందని డాన్సర్స్ అసోసియేషన్ నాయకత్వం ఆరోపిస్తోంది. ఈ వివాదం ఫిలిం ఛాంబర్ వరకు చేరింది. ఇప్పుడు ఫెడరేషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. -
ఓటీటీకి మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో మలయాళ సినిమాలకు ప్రత్యేక డిమాండ్ ఉంటోంది. ఈ చిత్రాలకు ఇతర భాషల్లో ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సరికొత్త కంటెంట్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. మలయాళంలో హిట్ మూవీస్ తెలుగులోనూ ఆదరణ దక్కించుకుంటున్నాయి. తాజాగా మరో మలయాళ సినిమా ఓటీటీకి వచ్చేస్తోంది.ఈ ఏడాది మలయాళంలో రిలీజైన చిన్న చిన్న ఆసై ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు చేశారు. ఈనెల 28 నుంచి జియో హాట్స్టార్ వేదికగా అందుబాటులోకి రానుంది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి వర్ష వాసుదేవ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఇంద్రన్స్, మధు, అపర్ణ బాలమురళి, జాఫర్ సాదిక్, విష్ణు అగస్త్య కీలక పాత్రల్లో నటించారు. Every little wish has a story worth telling.Chinna Chinna Aasai streams from July 28 in Malayalam, Tamil, Telugu, Kannada, and Hindi, exclusively on JioHotstar.@Aparnabala2#ChinnaChinnaAasai #JioHotstar #MalayalamCinema pic.twitter.com/ZLvfrvCZIl— JioHotstar Malayalam (@JioHotstarMal) July 17, 2026 -
'మాకు సీఎం కేక్ కావాలి'.. విజయ్ బర్త్ డేకు జాక్పాట్
దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలిసారే సీఎం కావడంతో ఆ క్రేజ్ మరింత పెరిగింది. ఇటీవలే విజయ్ బర్త్డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యాన్స్. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి పుట్టినరోజు కావడంతో అభిమానులు పండుగలా జరుపుకున్నారు. హీరోయిన్ త్రిష సైతం విజయ్ బర్త్ డే రోజు కేక్ కట్ చేయించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.అయితే విజయ్ పుట్టినరోజు ఓ బేకర్ యజమానికి అనూహ్యంగా కలిసొచ్చింది. జూన్ 22న నటి త్రిష పంచుకున్న పుట్టినరోజు ఫోటోలో తమ కేక్ కనిపించిందని యజమాని తన్వి బొకారియా తెలిపారు. ఆ రోజు నుంచే ఆ ఫోటోలోని మామిడి వెనీలా కేక్ కోసం విపరీతంగా డిమాండ్ పెరిగిందన్నారు. ఆ తర్వాత వరుసగా రెండు వారాల్లో అదే కేక్ కోసం సుమారు 300 నుంచి 400 ఆర్డర్లు వచ్చాయని వెల్లడించారు.బేకర్ యజమాని మాట్లాడుతూ.. "మాకు రాత్రికి రాత్రే గొప్ప క్రేజ్ వచ్చింది. ఆ కేక్ ఏ సందర్భం కోసమో మాకు అస్సలు తెలియదు. అది చాలా ప్రత్యేకమైనది.. నన్ను పూర్తిగా ఆశ్చర్యపరిచింది. రెండు వారాలుగా అమ్మకాలతో చాలా బిజీగా ఉన్నాం. అందుకు నేను కృతజ్ఞతతో ఉన్నా. నా బృందం సీఎం జోసెఫ్ విజయ్ వీరాభిమానులు" అని అన్నారు. ప్రస్తుతం మామిడి కేక్ బదులు సీఎం కేక్ కావాలని కస్టమర్స్ అడుగుతున్నారని బొకారియా అన్నారు. కాగా.. విజయ్ సీఎం అయ్యాక త్రిష స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన సంగతి తెలిసిందే. -
దర్శకుడికి జాక్ పాట్.. గిఫ్ట్గా బంగారు గొలుసు, ఖరీదైన కారు
విష్ణు విశాల్ హీరోగా, నిర్మాతగా చేసిన సినిమా 'గట్ట కుస్తీ 2'. రెండు వారాల క్రితం థియేటర్లలో రిలీజైంది. రివ్యూలు ఓ మాదిరిగా వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన దక్కించుకుంది. రూ.50 కోట్ల కలెక్షన్ దిశగా దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు చెల్ల అయ్యావుకి విష్ణు విశాల్ ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: సోనమ్ వాంగ్చుక్కు '3 ఇడియట్స్'తో సంబంధం లేదు)'గత 11 ఏళ్లుగా నా జీవితంలో ప్రతి సంతోషంలో, ప్రతి కష్టంలో తోడుగా నిలిచావు. నీ నమ్మకం, స్నేహం, సపోర్ట్ గురించి మాటల్లో చెప్పలేను. ఈ బహుమతి నీకోసం. నువ్వు దీనికి పూర్తిగా అర్హుడివి' అని విష్ణు విశాల్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. సినిమా విడుదలకు ముందే చిత్రం భారీ విజయాన్ని సాధిస్తే కారును బహుమతిగా ఇస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు విష్ణు విశాల్ చెప్పాడు. దర్శకుడు చెల్ల అయ్యావును ఆశ్చర్యపరుస్తూ కొత్త టయోటా హైక్రాస్ కారును అందజేశాడు. దీని ధర మార్కెట్ లో రూ.15-20 లక్షల మధ్య ఉంది.ఇకపోతే కొన్నిరోజుల క్రితం ఇదే చిత్రానికి సక్సెస్ మీట్ జరిగింది. ఇందులో మరో నిర్మాత అయిన ఇషారి గణేశ్.. హీరో విష్ణు విశాల్కి బీఎండబ్ల్యూ 3 సిరీస్ కారును బహుమతిగా ఇచ్చారు. దర్శకుడు చెల్ల అయ్యావుకు 10 గ్రాముల బంగారు గొలుసు, బ్రేస్లెట్ బహుమతిగా ఇచ్చారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులకు 40 గ్రాముల వెండి నాణేలను అందజేశారు.'గట్ట కుస్తీ 2' విషయానికొస్తే... కీర్తి రెజ్లింగ్ కెరీర్కు అండగా నిలబడతానని ఇచ్చిన మాట ప్రకారం వీరా, ఇంటి బాధ్యతలు స్వీకరించి హౌస్ హస్బెండ్గా మారతాడు. అయితే పిల్లల పెంపకం విషయంలో భార్యభర్తల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో దాంపత్య జీవితంలో విభేదాలు పెరుగుతాయి. విడాకుల వరకు వెళ్లిన వారి బంధం చివరకు కుటుంబ విలువల ప్రాముఖ్యతని ఎలా గుర్తించిందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)This is for you, @ChellaAyyavu ❤️For the last 11 years, you've stood by me through every high, every low, and everything in between.. Your loyalty, belief, and friendship have meant more than words can ever express..Enjoy the ride.. You truly deserve it :) #GattaKusthi2 pic.twitter.com/oqI830W76X— VISHNU VISHAL - VV (@TheVishnuVishal) July 16, 2026 -
రుక్మిణి మిస్.. ప్రీతి ముకుందన్కి లక్కీ ఛాన్స్
వరస సినిమాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్.. మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. డాన్సర్, మోడల్ అయిన ఈ తిరుచిరాపల్లి బ్యూటీ 'ఓం భీమ్ బుష్' అనే తెలుగు మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. అది ఓకే అనిపించుకుంది. తర్వాత తెలుగులోనూ మంచు విష్ణు 'కన్నప్ప'లో నటించింది గానీ అందాల ఆరబోత తప్పితే మరేం చేయలేదు. అనంతరం తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె ఫేట్ మారిపోయింది.(ఇదీ చదవండి: తెలుగు సినిమాలపై కామెంట్స్.. చాలా బాధేసింది: కిరణ్ అబ్బవరం)అర్జున్, అభిరామితో కలిసి ఈమె నటించిన 'బ్లాస్ట్' సినిమా అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. రీసెంట్గా 'ఇదయం మురళి'తో వచ్చింది. ప్రస్తుతం 'దశమకన్' అనే తమిళ చిత్రంతో పాటు మలయాళ ఒకటి, హిందీలో 'నాగ్ జిల్లా'మూవీలో నటిస్తూ బిజీగా ఉంది. నటిగా రంగప్రవేశం చేసిన రెండేళ్లలోనే పాన్ ఇండియా నటిగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కోలీవుడ్లోనే మరో లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం.ధనుష్ 56వ చిత్రంలో హీరోయిన్గా చేసే అవకాశం ప్రీతిని వరించినట్లు తెలుస్తోంది. 'లబ్బర్ పందు' ఫేమ్ తమిళరసన్ మారి ముత్తు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. ఇందులో తొలుత రుక్మిణి వసంత్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఆమె తెలుగులో ఎన్టీఆర్ 'డ్రాగన్'తో బిజీగా ఉన్న కారణంగా ధనుష్తో నటించలేని పరిస్థితి. దీంతో ఆ అవకాశం ప్రీతి ముకుందన్ను వరించినట్లు టాక్. ఈ ప్రాజెక్ట్ ఆగస్టులో సెట్ పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. ధనుష్ ప్రస్తుతం రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో 'ఓం'లో నటిస్తున్నాడు. (ఇదీ చదవండి: విజయ్కు త్రిష.. నాకేమో నవ్వు!) -
విజయ్కు త్రిష.. నాకేమో నవ్వు!
సాక్షి సినిమా : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిష కృష్ణన్ బంధంపై తరచూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. మలయాళ నటుడు ధ్యాన్ శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. తన తాజా చిత్రం 'విజిటర్' ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడిన ధ్యాన్.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకను పరోక్షంగా ప్రస్తావిస్తూ వేసిన సరదా పంచ్లు ప్రేక్షకులను నవ్వించాయి. అయితే ఈ వ్యాఖ్యలు కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారడంతో పాటు విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్ ఈవెంట్లో తన సహనటి నవ్యా నాయర్ను ఉద్దేశించి ధ్యాన్ మాట్లాడుతూ.. "చాలా రోజుల తర్వాత మనిద్దరం కలిసి సినిమా చేస్తున్నాం. నవ్యాకు పెళ్లై, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయినా నేను ఒకరోజు కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే.. నువ్వు తెల్లచీర కట్టుకుని ముందు వరుసలో కూర్చొని, కళ్లలో నీళ్లతో నన్ను చూస్తూ ఉండాలి" అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ మాటలతో సభలో నవ్వులు పూశాయి.Trisha emotions were on high during Vijay oath ceremony. An emotional moment ❤️ pic.twitter.com/GrJcW88bwg— Devanshu Mani Tripathi (@devanshu_mani) May 10, 2026ఆ తర్వాత మైక్ అందుకున్న నవ్యా నాయర్ కూడా అదే స్థాయిలో స్పందించింది. "నువ్వు సీఎం అయితే.. నువ్వు చెప్పినట్టే తెల్లచీరకు ఆకుపచ్చ అంచు, డైమండ్ నెక్లెస్ వేసుకుని ముందు వరుసలో కూర్చుంటా. కళ్లలో ఆనందబాష్పాలతో నీకు జైకొడతా. కానీ ముందు వరుసలో నాకు సీటు మాత్రం రిజర్వ్ చేయాలి" అంటూ చమత్కరించింది. దీంతో సభలో మరోసారి నవ్వుల వెల్లువ ఎగిసింది.ఇదంతా సరదా సంభాషణలా అయినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం తప్పు బడుతున్నారు. ఈ వ్యాఖ్యలను విజయ్ ప్రమాణ స్వీకార వేడుకతో పోలుస్తున్నారు. వాళ్లిద్దరిపైనా మండిపడుతున్నారు. The day I take the oath as CM... I think Navya will be there in the front row wearing a saree...!!- Dhyan Sreenivasan 😂 pic.twitter.com/UT5GvyK8Fq— Trollywood 𝕏 (@TrollywoodX) July 16, 2026 తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు త్రిష.. ఆయన తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభతో కలిసి ముందు వరుసలో కూర్చోవడం, విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆమె భావోద్వేగానికి గురికావడం అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ ఘటననే ధ్యాన్ తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా ప్రస్తావించాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఈ కార్యక్రమంలో ధ్యాన్ మరో సరదా వ్యాఖ్య కూడా చేశాడు. విజయ్ ముఖ్యమంత్రి అయినట్లే.. తానూ రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ల తర్వాత కేరళ ముఖ్యమంత్రి అవుతానని జోక్ చేశాడు. అలాగే తన స్నేహితుడు, నటుడు అజు వర్గీస్ను ఈ సంభాషణలోకి లాగుతూ.. తనకి గవర్నర్ పదవి బాగుంటుందని నవ్వించాడు. వెంటనే అజు వర్గీస్ మీ అమ్మగారికి రాష్ట్రపతి పదవి దక్కుతుందని జోక్ చేశాడు.అయితే ఈ ఎపిసోడ్ ఎటు దారి తీస్తుందని అనుకున్నాడో ఏమో.. అజు వర్గీస్ వేదిక మీదకు వచ్చి "విజయ్ సార్, నా ఫ్రెండ్ కొంచెం పిచ్చోడు.. దయచేసి క్షమించండి" అంటూ వ్యాఖ్యానించాడు. ఆ మాటతో అక్కుడున్నవాళ్లంతా కడుపుబ్బా నవ్వుకున్నారు.ఎవరీ ధ్యాన్-నవ్యా?ధ్యాన్ శ్రీనివాసన్(Dhyan Sreenivasan) మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత అయిన శ్రీనివాసన్ కుమారుడు. ప్రముఖ నటుడు, దర్శకుడు, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అయిన వినీత్ శ్రీనివాసన్కు సోదరుడు. 2013లో వచ్చిన తీరా సినిమాతో నటుడిగా పరిచయమైన ధ్యాన్, 2013లో 'తీరా' చిత్రంతో నటుడిగా పరిచయమైన ధ్యాన్ శ్రీనివాసన్.. 'ఆది కాప్యారే కూటమణి', 'కుంజిరామాయణం', 'గూడలోచన', 'వర్షంగళ్క్కు శేషం' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా కూడా మలయాళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక.. నవ్యా నాయర్ మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటి. 'నందనం', 'ఇష్టం', 'కళ్యాణరామన్', 'పందిప్పాడ' వంటి విజయవంతమైన చిత్రాలతో గుర్తింపు పొందిన ఆమె, మలయాళంతో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ధ్యాన్ శ్రీనివాసన్ 2017లో అర్పితా సెబాస్టియన్ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నవ్యా నాయర్ 2010లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త సంతోష్ మీనన్ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. -
పెళ్లికి ముందు ఇంకొకరితో ప్రేమలో ఉన్నా.. బ్రేకప్కి కారణం ఇదే: నటి
మలయాళ, తమిళ చిత్రాల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి స్వాసిక విజయ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన గత ప్రేమ బంధం గురించి వివరిస్తూ, సినీ పరిశ్రమలోని సవాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘పెళ్లికి ముందు నేను ఒకరితో రిలేషన్లో ఉన్నా. ఒక సీరియల్లో నటిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డాను. 'మనసు పోలే మంగళ్యం' సీరియల్ షూటింగ్ సమయంలో మా పరిచయం ప్రేమగా మారింది. అతను వృత్తిరీత్యా గేమ్ డెవలపర్. అతని కుటుంబానికి నటనతో ఎలాంటి సంబంధం లేదు. కానీ కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రం హోమ్ ఉండటం వల్ల, అతను సరదాగా సీరియల్లో నటించడానికి వచ్చాడు. ఆ సమయంలో ఇద్దరి ఆలోచనలు, నటనపై ఉన్న ప్యాషన్ కలవడంతో మేము దగ్గరయ్యాం. అతను చాలా మంచి వ్యక్తి, నన్ను ఎంతో గౌరవించేవాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ అనూహ్యంగా అతని కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అలాగే కొందరు కుటుంబ సభ్యులు మరణించారు. ఆ పరిస్థితులు అతన్ని మానసికంగా తీవ్రంగా దెబ్బతీశాయి. ఆ డిప్రెషన్ కారణంగానే అతను నన్ను దూరం చేసుకున్నాడు. ఇందులో నా తప్పేమీ లేదు’ అని స్వాసిక చెప్పుకొచ్చింది.ఇక సినీ పరిశ్రమలో ఎదురయ్యే 'కాస్టింగ్ కౌచ్’ గురించి మాట్లాడుతూ..ఈ సమస్యలు కేవలం సినిమా రంగానికే పరిమితం కావని, అన్ని రంగాల్లోనూ ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, మీడియా దృష్టి ఎక్కువగా సినిమా పరిశ్రమపైనే ఉండటం వల్ల ఇది ఇక్కడ పెద్ద విషయంగా కనిపిస్తుందని ఆమె విశ్లేషించారు. -
హీరో సూర్యతో రాజమౌళి కొత్త సినిమా?
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్స్టార్ మహేష్బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి చిత్రం తర్వాత జక్కన్న ఏ హీరోతో సినిమా చేయబోతున్నారనే చర్చ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది. గతంలో రాజమౌళి తర్వాత చిత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో ఉండబోతుందని ప్రచారం జోరుగా జరిగింది. అయితే దీనిపై అల్లు అర్జున్ నుంచి కానీ, రాజమౌళి టీం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.అయితే తాజాగా రాజమౌళి వారణాసి తర్వాత చిత్రం తమిళ స్టార్ హీరో సూర్య కాంబినేషన్లో ఉండబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. సినీ ఇండస్ట్రీలో కూడా సూర్యతో సినిమా చేయడానికి రాజమౌళి సానుకూలంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే.. ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత క్రేజీ కాంబినేషన్లలో ఇది ఒకటిగా నిలవడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే సూర్య-రాజమౌళి కాంబినేషన్పై ఇలాంటి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. వీరి కాంబినేషన్లో సినిమా రానుందంటూ గతంలో కూడా పలు వార్తలు తెగ హల్చల్ చేశాయి. అప్పట్లో రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రంలో హీరోగా ముందు సూర్య పేరును పరిశీలించినట్లు జోరుగా ప్రచారం కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. అనంతరం కూడా పలుమార్లు వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపించినప్పటికీ, అవి అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు. సూర్యతో మూవీ చేసే అవకాశాన్ని తాను మిస్ అయ్యానని అప్పట్లోనే రాజమౌళి చాలా సార్లు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా సూర్య తన 50వ సినిమా రాజమౌళి దర్శకత్వంలోనే ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరి కాంబోలో ఓ భారీ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. దాంతో సూర్య అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్పై రాజమౌళి నుంచి కానీ సూర్య నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది కరుప్పుతో సూపర్ హిట్ కొట్టిన సూర్య ఫుల్ జోష్ మీదున్నారు. వరుస పెట్టి సినిమాలు తీస్తూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా విశ్వనాథ్ అండ్ సన్స్ అనే మూవీ ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ సినిమా ఆగస్టులో థియేటర్లలో సందడి చేయనుంది. అనంతరం భారీ చిత్రాలు నిర్మించే హోంబలే ఫిల్మ్స్తో జతకట్టారు. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్కు జై భీమ్ డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. -
'అందుకే జానకమ్మను చివరిసారి చూడలేకపోయా'.. సింగర్ శ్వేత ఎమోషనల్
ప్రముఖ లెజెండరీ సింగర్ జానకి మరణంపై గాయని శ్వేతా మోహన్ ఎమోషనల్ అయ్యారు. జానకమ్మ మరణాన్ని తలచుకుని వేదికపైనే కన్నీటి పర్యంతమయ్యారు. జూలై 11న లండన్లో జరిగిన ఇళయరాజా సంగీత కచేరీలో శ్వేతా మోహన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె అంత్యక్రియలకు ఎందుకు రాలేదని చాలామంది అడిగారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. జానకి అంత్యక్రియలకు హాజరు కాలేదని శ్వేతపై కొందరు ట్రోలింగ్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాను హాజరు కాకపోవడానికి గల కారణాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.శ్వేతా మోహన్ తన ఇన్స్టాలో రాస్తూ "జానకి అమ్మ అంత్యక్రియలకు నేను ఎందుకు హాజరు కాలేదని చాలా మంది నన్ను అడుగుతున్నారు... ఆ టైమ్లో నేను లండన్లో ఇళయరాజా సార్ సంగీత కచేరీలో పాల్గొన్నా. ఆమెను చివరిసారిగా చూసి ఆశీర్వాదం తీసుకోలేకపోవడం నాకు ఎంతో కష్టంగా అనిపించింది. ఈ విషయాన్ని నేను ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఆమె అంబులెన్స్లో ఉన్నప్పుడు చివరిసారిగా వీడియో కాల్లో చూశా. నన్ను విమర్శిస్తున్న వారిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెడుతున్నా. నన్ను ఎగతాళితో ప్రశ్నించిన వారందరికీ నా విజ్ఞప్తి. దయచేసి ఇది మానసికంగా చాలా కష్టమైన సమయం. దయచేసి నన్ను మరింత బాధపెట్టకండి," అని ఆమె రాసింది.ఈ పోస్ట్కు ఆమె అభిమానుల నుంచి మద్దతు లభించింది. జానకమ్మ మరణంతో మీరు ఎంతగా కుంగిపోయారో మేము చూశామని రాసుకొచ్చాడు. మీరు అంతలా నిబ్బరంగా ఉన్నందుకు మీకు చాలా గౌరవంగా ఉందని మరొకరు పోస్ట్ చేశారు. కాగా.. జానకి మరణవార్త విన్న తర్వాత శ్వేత సోషల్ మీడియాలో నివాళులర్పించారు. View this post on Instagram A post shared by Shweta Mohan (@_shwetamohan_) -
విజయ్ జన నాయగన్.. రిలీజ్ డేట్ ఫిక్స్
దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ జన నాయగన్. రాజకీయాలకు ముందు ఆయన నటించిన చివరి చిత్రమిదే. ఈ మూవీనే తన ఆఖరి సినిమా అని కూడా విజయ్ విజయ్ ప్రకటించారు. ఎప్పుడో సంక్రాంతికి రావాల్సిన ఈ మూవీ ఎట్టకేలకు రిలీజ్కు రెడీ అయిపోయింది. ఇప్పటికే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు.తాజాగా జన నాయగన్ రిలీజ్ డేట్ను రివీల్ చేశారు మేకర్స్. జూలై 23 నుంచే థియేటర్లలో సందడి చేయనుందని ప్రకటించారు. ఈ మేరకు విజయ్ పోలీస్ డ్రెస్లో పోస్టర్ షేర్ చేశారు. దీంతో విజయ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ను జారీ చేసింది. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనుండగా.. ప్రేమలు బ్యూటీ మమితా బైజు కీలక పాత్ర పోషించింది. Tested by fire.Forged by time.Built for history.The tougher the battle,The louder the victory.#JanaNayaganFromJuly23#JanaNayakuduFromJuly23#JanNetaFromJuly23The Hon'ble Chief Minister @actorvijay @KvnProductions #HVinoth @hegdepooja @anirudhofficial @thedeol… pic.twitter.com/21xjixgUBM— KVN Productions (@KvnProductions) July 15, 2026 -
జరిగిన విషయాన్ని ఎవరూ మార్చలేరు: హన్సిక
హీరోయిన్ హన్సిక సినిమాల కంటే వ్యక్తిగతంగా ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. ఇంతకుముందు ఓ హీరోని ప్రేమించిన వ్యవహారం పెళ్లి వరకు వెళుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తర్వాత కొన్నాళ్లకు సొహైల్ కతూరియా అనే వ్యాపారవేత్తని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఆ వివాహ బంధం ఎక్కువకాలం నిలవలేదు. మనస్పర్థల కారణంగా విడిపోయారు. కొన్నాళ్ల క్రితం హన్సిక తన భర్త నుంచి అధికారికంగా విడాకులు తీసుకుంది. తర్వాత ఆధ్యాత్మిక బాట పట్టి గుళ్లు, గోపురాలు తిరిగింది. విదేశాలు చుట్టొస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఇలా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.(ఇదీ చదవండి: ఆగిపోలేదు.. ఆ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా)ఇలాంటి పరిస్థితుల్లో తన గురించి వస్తున్న విమర్శలు, వ్యక్తిగత విషయాలు, సోషల్ మీడియాలోని రూమర్స్ గురించి హన్సిక ఘాటుగా స్పందించింది. 'సాధారణంగా సెలబ్రిటీస్ అనగానే వారి వ్యక్తిగత విషయాల గురించి ఎవరైనా విమర్శించొచ్చు అనే భావన పలువురిలో ఉంటుంది. ప్రముఖులకు మనసు అనేది ఒకటి ఉంటుందని అలాంటి వారు గ్రహించాలి. జీవితంలో కష్టకాలాన్ని అధిగమించే సమయంలో వాళ్ల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. జరిగిన విషయాలను ఎవరు మార్చలేరు. ఇకపై సాగే జీవితం ఆనందంగా తీర్చిదిద్దుకోవచ్చు. గత కాలాన్ని తలుచుకుంటూ కూర్చోవడం పూలిష్నెస్. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఎదగడమే ముఖ్యం' అని హన్సిక చెప్పుకొచ్చింది.ఇకపోతే హీరోయిన్గా 50 సినిమాలు చేసిన హన్సిక.. నిర్మాతగా మారి ఓ మూవీ తీసింది. కానీ భారీ నష్టాలతో చేతులు కాల్చుకుంది. మళ్లీ ఈ అమ్మడిని తెరపై ఎప్పుడు చూస్తామో ఏంటో?(ఇదీ చదవండి: శరత్ని లాగి చెంప పగలగొట్టాలనిపించింది: రాధిక) -
మా ఆయన చెంప పగలగొట్టాలనిపించింది: రాధిక
సీనియర్ నటుడు శరత్ కుమార్ చేయని పాత్రంటూ లేదు. తెలుగు, తమిళంలో హీరో, విలన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన మంగళవారం తన 62వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు కూడా చెప్పారు. కాగా ఈ సందర్భంగా కొద్దిరోజుల క్రితం ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో శరత్ కుమార్ గురించి ఆయన భార్య, నటి రాధిక శరత్ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో శరత్ కుమార్ జోక్స్ గురించి రాధిక మాట్లాడిన విధానం అందరినీ నవ్వించింది.(ఇదీ చదవండి: సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?)శరత్ కుమార్ని నేను తొలిసారిగా కలిసినప్పుడు లాగి చెంప పగలగొట్టాలనిపించింది. దానికి కారణం ఆయన ఓ జోక్ చెప్పి తనే నవ్వుకుంటున్నారు. నాకు అస్సలు నవ్వే రాలేదు. అంతకంటే మంచి జోక్ మీకు తెలియదా? అని అడిగాను. అప్పటి నుంచి ఆయన ఆ అలవాటు ఇప్పటికీ మార్చుకోలేదు. అలాంటి చెత్త జోక్స్కి శరత్ కుమార్ ఓ యూనివర్సిటీ లాంటివారు' అని రాధిక చెప్పుకొచ్చింది.అలానే ఒక తండ్రిగా శరత్ కుమార్ ఎలా ఉంటారు అనే దానికి కూడా రాధిక సమాధానమిచ్చింది. నా కూతురు రాయన్ని నేను సింగిల్ పేరెంట్గానే పెంచాను. మంచి, చెడు అంటూ జీవిత అనుభవాన్ని నేనే నేర్పించాను. మా కొడుకు విషయంలో అలా కాదు. అతనికి నేను ఏదైనా చెప్పే ప్రయత్నం చేయగానే వదిలేయ్ నేను చెబుతాను అంటూ శరత్ కుమార్ వచ్చేస్తారు. అతనికి సంబంధించిన అన్ని విషయాలు ఆయనే చూసుకుంటారు. అందుకు ఫలితం ఎలా ఉంటుంది అనేది మా అబ్బాయి పెద్దయిన తర్వాతే తెలుస్తుంది' అని రాధిక పేర్కొంది. (ఇదీ చదవండి: ఆగిపోలేదు.. ఆ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా) -
సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?
హీరోగా స్టార్డమ్ అనుభవించిన విజయ్.. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఈయన కొడుకు జేసన్ సంజయ్ లండన్లో సినిమాకు సంబంధించిన కోర్స్ చేసొచ్చాడు. ఈ క్రమంలోనే తండ్రిలా హీరో అవుతాడనుకుంటే జేసన్ మాత్రం అందరికీ షాకిస్తూ డైరెక్టర్ అయ్యాడు. సిగ్మా పేరుతో ఓ మూవీ తీశాడు. ఇది ఈ నెల 31న రిలీజ్ కావాలి కానీ 'జన నాయగన్' కారణంగా వాయిదా పడేలా ఉంది.(ఇదీ చదవండి: రామ్ చరణ్ కొత్త లగ్జరీ ఫామ్ హౌస్!)ఈ సినిమాలోనే జేసన్ సంజయ్ ఒక పాటలోనూ నటించడం విశేషం. దీంతో పలువురు సినీ ప్రముఖులు జేసన్.. హీరోగానూ త్వరలో ఎంట్రీ ఇస్తారని భావించారు. ఇప్పుడు అందుకు తగ్గట్లే విజయ్ కొడుకు హీరోగా ఓ మూవీ చేయబోతున్నాడు. దీనిని తమిళ్ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు జీకే తమిళ్ కుమరన్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారట. స్టార్ డైరెక్టర్ తీయబోయే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన 'సిగ్మా' రిలీజైన తర్వాత రానుందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: తండ్రి దళపతి విజయ్ కోసం తగ్గిన కొడుకు) -
కొత్త లోకం
భారతీయ పురాణాలు, ఇతిహాసాల నేపథ్యంలో ఇప్పటికే సిల్వర్ స్క్రీన్పై ఎన్నో సినిమాలు వచ్చాయి. భవిష్యత్లోనూ వస్తాయి. కానీ పురాణాలతో కూడిన ఈ కథలను దర్శకులు సిల్వర్ స్క్రీన్పై ఆడియన్స్కు ఎంత అద్భుతంగా చూపించారు? కథలను వారికి అర్థమయ్యేలా ఎలాంటి స్క్రీన్ప్లేతో చెప్పారు? అన్నది ముఖ్యం. ఈ తరహా చిత్రాలను పర్ఫెక్ట్గా తెరకెక్కిస్తే సూపర్ హిట్ ఖాయం. ప్రస్తుతం పురాణాలు, ఇతిహాసాల స్ఫూర్తితో కొన్ని మైథాలజీ అంశాలతో కూడిన సినిమాలు సిద్ధం వుతున్నాయి. ఈ సినిమాల కోసం దర్శకులు సరికొత్త లోకాలను సృష్టిస్తున్నారు. ఈ సినిమాలపై మీరూ ఓ లుక్ వేయండి. శ్రీరాముడు సిల్వర్ స్క్రీన్పై శ్రీరాముడిగా మహేశ్బాబు కనిపించనున్నారు. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న అడ్వెంచరస్ టైమ్ ట్రావెల్ అండ్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘వారణాసి’. ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడు.. ఇలా రెండు పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు మహేశ్బాబు. ఇప్పటివరకు మహేశ్బాబు సిల్వర్ స్క్రీన్పై పూర్తి స్థాయిలో శ్రీరాముడు గెటప్లో కనిపించింది లేదు. ‘వారణాసి’ సినిమా కోసం శ్రీరాముడిగా మహేశ్బాబు మేకోవర్ అయ్యారు. ఈ చిత్రంలో శ్రీరాముడిగా మహేశ్బాబు దాదాపు 30 నిమిషాలు కనిపిస్తారని, ఈ ఎపిసోడ్ అత్యద్భుతంగా ఉంటుందని ఆల్రెడీ ఈ చిత్రదర్శకుడు రాజమౌళి చెప్పారు.ఆగస్టు 9న మహేశ్బాబు బర్త్ డే. ఈ సందర్భంగా ‘వారణాసి’ సినిమాలో శ్రీరాముడు గెటప్లో ఉన్న మహేశ్బాబు లుక్ బయటకు రావొచ్చనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అంతేకాదు... విభిన్న కాలమానాల్లో ఈ సినిమా కథనం సాగుతుందని, లార్డ్ శివగానూ మహేశ్బాబు కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ఇంకా 80 రోజుల షూటింగ్ జరిగితే ‘వారణాసి’ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది.ఇప్పటికే ఈ సినిమాలోని మేజర్ యాక్షన్ సీక్వెన్స్, ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. కేవలం కథను అనుసంధానించే సన్నివేశాల చిత్రీకరణే జరుగుతోందని ఇటీవల పారిస్లో జరిగిన ఓ కార్యక్రమంలో రాజమౌళి తెలిపారు. ఈ సినిమాలోని మందాకిని పాత్రలో ప్రియాంకా చోప్రా, కుంభ పాత్రలో పృద్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. శివభక్తుడి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపిస్తారు. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ సాహసోపేతమైన జర్నీ సినిమాను కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదల కానుంది.సత్యలోకంచిరంజీవి హీరోగా నటించిన అడ్వెంచరస్ యాక్షన్ అండ్ మైథాలజీ సినిమా ‘విశ్వంభర’. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించగా మరో లీడ్ రోల్లో ఆషికా రంగనాథ్ నటించారు. వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్ రెడ్డి సమర్పణలో వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. ఈ సినిమా ఈపాటికే విడుదల కావాల్సింది. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్స్, క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ లేకుండా, సిల్వర్ స్క్రీన్పై ఈ సినిమాను ప్రేక్షకులకు అద్భుతంగా చూపించాలని ‘విశ్వంభర’ టీమ్ ప్రయత్నిస్తోంది. అందుకే ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతోంది.అయితే ఈ చిత్రానికి సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్స్, పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కావొచ్చాయి. దీంతో ఈ సినిమాను అక్టోబరు 16న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ‘పైన 7, కింద 7... మొత్తం 14 లోకాలు ఉన్నాయి. యమలోకం, స్వర్గం, పాతాళం... ఇలా ఎవరికి తోచిన విధంగా వారు ఈ 14 లోకాలను చూపించారు.కానీ 14 లోకాలను దాటి, బ్రహ్మదేవుడు ఉండే సత్య లోకాన్ని ‘విశ్వంభర’ సినిమాలో చూపించాను. హీరో డైరెక్ట్గా ఈ సత్య లోకానికి ఎలా వెళ్తాడు? హీరోయిన్ను ఎలా తిరిగి తెచ్చుకుంటాడు? అన్నదే ‘విశ్వంభర’ సినిమా కథనం’’ అని దర్శకుడు వశిష్ఠ ఓ సందర్భంలో పేర్కొన్నారు. మరి... సత్య లోకం నుంచి హీరోయిన్ను హీరో ఎలా తీసుకురాగలిగాడు? అన్న అంశాలను థియేటర్స్లో విజువల్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే దసరా పండగ వరకు ప్రేక్షకులు వేచి చూడాల్సిందే.గాడ్ ఆఫ్ వార్ ‘యమదొంగ’ సినిమాలో యముడు పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తే ఆయన అభిమానులు మురిసిపోయారు. ఓ పూర్తి స్థాయి మైథాలజీ సినిమాలో సిల్వర్ స్క్రీన్పై ఎన్టీఆర్ కనిపిస్తే చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఆ సమయం వచ్చేసింది. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మైథాలజీ సినిమా గురించిన అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కళ్యాణ్రామ్ ఈ సినిమాను నిర్మించనున్నారు.ఈ సినిమాకు ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ను మేకర్స్ అనుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంలో దేవతల సర్వ సైన్యాధ్యక్షుడు, లార్డ్ కుమార స్వామిగా ఎన్టీఆర్ నటించనున్నారని తెలిసింది. కొంత కాలం క్రితం లార్డ్ మురుగన్ అనే బుక్ ఎన్టీఆర్ చేతిలో కనిపించింది. దీంతో ఈ సినిమాపై ఎన్టీఆర్ ప్రిపరేషన్ ఆల్రెడీ మొదలైందనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది.అయితే ప్రస్తుతం ‘డ్రాగన్’ సినిమాతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం సాగుతోంది. అలాగే తమిళ దర్శకుడు నెల్సన్తో ఎన్టీఆర్ ఓ సినిమా చేయాల్సి ఉంది. దీంతో ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి కొంత సమయం పడుతుందని ఊహించవచ్చు.⇒ ‘కేజీఎఫ్, సలార్’ వంటి చిత్రాలను తీసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ మైథాలజీ కథను సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమాకు ‘రావణం’ అనే టైటిల్ను ఆయన అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మైథాలజీ సినిమాలో ప్రభాస్ లేదా అజిత్ హీరోగా నటించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. కాగా ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభాస్తో ‘సలార్ 2’, యశ్తో ‘కేజీఎఫ్ 3’ సినిమాలు చేయాల్సి ఉంది. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత ‘రావణం’ సినిమాను ప్రశాంత్ నీల్ సెట్స్కు తీసుకుని వెళ్తారని ఊహించవచ్చు. మరోవైపు ప్రభాస్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదొక మైథాలజీ సినిమా సబ్జెక్ట్ అని తెలిసింది. ఈ సినిమాకు ‘బ్రహ్మరాక్షస’ అనే టైటిల్ను మేకర్స్ అనుకుంటున్నారని, ప్రభాస్ ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత ఈ సినిమా గురించిన పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్నగర్ సమాచారం. ప్రశాంత్ వర్మ ఒకవైపు ‘జై హనుమాన్’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నప్పటికీ వీలైనప్పుడు ‘బ్రహ్మరాక్షస’ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్పై కూడా దృష్టి పెడుతున్నారని తెలిసింది.కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించనుందట. ఈ రెండు సినిమాల సంగతి ఇలా ఉంచితే... ప్రస్తుతం నాగ్ అశ్విన్ డైరెక్షన్లోని ‘కల్కి సినిమాటిక్ వర్క్స్’లో భాగంగా రూపొందిన తొలి సినిమా ‘కల్కి 2898 ఏడీ’. ఈ మైథాలజీ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాలో భైరవగా, కర్ణుడిగా ప్రభాస్ కనిపించిన సంగతి తెలిసిందే. ఈ మైథాలజీ కమ్ సైన్స్ ఫిక్షన్ డ్రామాను వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ‘కల్కి 2’ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అమితాబ్ బచ్చన్, కమల్హాసన్ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ⇒ ఇటీవలే ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రామ్చరణ్. ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్లో రామ్చరణ్ హీరోగా నటించాల్సిన మూవీ సెట్స్కు వెళ్తుంది. అయితే బాలీవుడ్లో ‘కిల్’ అనే యాక్షన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ ఓ మైథాలజీ స్టోరీని రెడీ చేశారట. ఈ కథలో రామ్చరణ్ హీరోగా నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. శాపం ఎందుకు?మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ‘మహేంద్రగిరి వారాహి’. ఈ మైథాలజీ అండ్ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్లో సుమంత్ హీరోగా నటించారు. మాళవిక నాయర్, ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి గోస్వామి, బ్రహ్మనందం ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్ నిర్మించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇటీవల ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మైథాలజీ అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహేంద్రభూపతి మహారాజు వంశానికి ఉన్న శాపం, మహేంద్రగిరి అమ్మవారి ఆలయం చుట్టూ నెలకొన్న మిస్టరీ, ఈ మిస్టరీని చేధించేందుకు హీరో చేసే ప్రయత్నాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని టీజర్ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రానుంది.తొలిసారిగా...!ఇరవైకి పైగా సినిమాలు చేశారు అల్లు అర్జున్. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న ‘రాకా’ ఆయన కెరీర్లోని 22వ చిత్రం. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాదే పూర్తవుతుంది. మేజర్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. కాగా, అల్లు అర్జున్ తర్వాతి చిత్రం తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్తో ఖరారైంది. ఈ ఏడాదే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు.అయితే ఈ సినిమాలో కొన్ని మైథలాజికల్ ఎలిమెంట్స్ ఉన్నాయని, ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని, ఇటీవలే అల్లు అర్జున్కు కథ పరంగా ఓ నరేషన్ ఇచ్చారని తెలిసింది. ముంబైలో లుక్ టెస్ట్ కూడా పూర్తయింది. అల్లు అర్జున్ ఎప్పుడైతే ‘రాకా’ సినిమా చిత్రీకరణను పూర్తి చేస్తారో అప్పుడు లోకేష్ కనగరాజ్తో సినిమాను సెట్స్పైకి తీసుకువెళతారు. కెరీర్లో అల్లు అర్జున్ తొలిసారి మైథాలజీ అంశాలున్న సినిమా చేయనున్నారు. మరి... అల్లు అర్జున్ కోసం లోకేష్ కనగరాజ్ ఏ తరహా మైథలాజికల్ ఎలిమెంట్స్తో కథను సిద్ధం చేస్తున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఈ సినిమా 2028 ద్వితీయార్ధంలో విడుదల కావొచ్చు.దశావతార ఆలయంశతాబ్దాల క్రితం నాటి పవిత్రమైన దశావతార ఆలయం నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ‘హైందవ’. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తున్నారు. సంయుక్త హీరోయిన్గా నటిస్తున్నారు. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో మూన్ షైన్ పిక్చర్స్ పతాకంపై మహేశ్ చందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా, దేవుడి విగ్రహాలను, దేవాలయాలను తమ స్వార్థం కోసం వాడుకునే దుష్ట శక్తులను దైవం ఏ రూపంలో శిక్షిస్తుంది? ఎవరి ద్వారా ధర్మరక్షణకు సంకల్పిస్తుంది? అన్న అంశాలతో పాటు కొన్ని మైథాలజీ ఎలిమెంట్స్తో ఈ రూపొందుతోందని తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ సగానికి పైగా పూర్తయింది. గత ఏడాది జనవరిలోనే టీజర్ను రిలీజ్ చేశారు. అయితే భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్ వర్క్స్తో కూడుకున్న సినిమా ఇది. దీంతో ఈ సినిమా మేకింగ్ కాస్త స్లోగా సాగుతోందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాను గురించిన కొత్త అప్డేట్ రానుందట.జై హనుమాన్ ‘ప్రశాంత్వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా రూపొందిన సినిమా ‘హను–మాన్’. ఈ సినిమాకు సీక్వెల్గా ‘జై హను–మాన్’ సినిమా రానుంది. ‘హను–మాన్’ చిత్రంలో తేజ సజ్జ హీరోగా నటిస్తుండగా, ‘జై హను–మాన్’ చిత్రంలో కన్నడ ప్రముఖ దర్శక–నిర్మాత, నటుడు, ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ చిత్రంలో నటుడు–నిర్మాత రానా కూడా భాగమయ్యారని, ప్రస్తుతం రిషబ్–రానాల మధ్య వచ్చే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ షూటింగ్ జరుగుతోందని తెలిసింది. అలాగే ‘హను–మాన్’ హీరో తేజ సజ్జ కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు. ఈ చిత్రంలో తేజ సజ్జ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కావొచ్చు.⇒ ఇటు కోలీవుడ్లోనూ మైథాలజీ సినిమాలు తెరకెక్కుతున్నాయి. లార్డ్ కుమారస్వామి జీవితం ఆధారంగా ‘తమిళ్ మురుగన్’ అనే సినిమాను ప్రకటించారు ధనుష్ . ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్నారు. ధనుష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అలాగే శివకార్తికేయన్ ‘సీయోన్’ చిత్రం కూడా మైథాలజీ అంశాలతోనే రూపొందుతోందని తెలిసింది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ రూరల్ యాక్షన్ డ్రామాను కమల్హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరులో ఈ సినిమా విడుదల కానుంది. ⇒ భారతీయ సినీ పరిశ్రమలో యానిమేషన్ సినిమాలు ఊపందుకుంటున్నాయి. అ శ్విన్ కుమార్ దర్శకత్వంలోని ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ నుంచి వచ్చిన తొలి భాగం ‘మహావతార్ నరసింహా’. 2025లో విడుదలైన ఈ యానిమేషన్ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో భారతీయ పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా యానిమేషన్ సినిమాలను తెరకెక్కించేందుకు దర్శక–నిర్మాతలు చాలా ఆసక్తి చూపిస్తున్నారు.ఈ క్రమంలో ‘కార్తికేయ, కార్తికేయ 2’ చిత్రాల ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో వాయుపుత్ర అనే సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే అరుణ్కుమార్ రాపోలు దర్శకత్వంలో ‘హనుమత్ సుందరకాండ’ అనే యానిమేషన్ సినిమా ప్రకటన వచి్చంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో నిశి్చత సేతు, హరినాథ్ దేవర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అలాగే కాళికాదేవి కథలను యానిమేషన్ సినిమాల రూపంలో తీసుకువచ్చేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సన్నాహాలు చేస్తోందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది.ఇంకా ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ నుంచి ‘మహావతార్ పరశురామ్, మహావతార్ రఘునందన్, మహావతార్ ద్వారాకాదీష్ , మహావతార్ గోకులనంద, మహావతార్ కల్కి పార్ట్ 1, మహావతార్ కల్కి పార్ట్ 2’ సినిమాల ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రోడక్షన్స్ సంస్థలు ఈ యానిమేషన్ సినిమాలను నిర్మించనున్నాయి. ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ నుంచి రెండు సంవత్సరాలొక సినిమా చొప్పున విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నామని ‘మహాతార్ సినిమాటిక్ యూనివర్స్’ దర్శకుడు అశ్విన్ కుమార్ ఓ సందర్భంలో పేర్కొన్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ కోవలో మరికొన్ని యానిమేషన్ సినిమాలు ఉన్నాయి.– ముసిమి శివాంజనేయులు -
నాని–నితిన్ కాంబోలో కొత్త ప్రాజెక్టు.. హీరోయిన్గా రుక్మిణి వసంత్?
నేచురల్ స్టార్ హీరో నాని నిర్మాతగా, నితిన్ హీరోగా ఒక కొత్త సినిమా దాదాపు ఖరారైనట్టే సమాచారం. గత ఏడాది వచ్చిన ‘దండోరా’ చిత్ర దర్శకుడు మురళీకాంత్ చెప్పిన కథ నానికి నచ్చడంతో, తన సొంత బ్యానర్పై ఈ ప్రాజెక్టు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ పేరు వినిపిస్తోంది. ఇటీవల ఆమెతో ఈ చిత్రంపై చర్చలు జరిగాయి. అనంతరం రుక్మిణి నుంచి సరే చూద్దాం అన్న స్థాయిలోనే మాట ముగిసిందని సమాచారం. కానీ ఈ సినిమాలో నితిన్ సరసన రుక్మిణి వసంత్ ఫిక్స్ అయింది అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వచ్చేశాయి. ప్రస్తుతం నితిన్ ఓ సినిమా షూట్లో ఉన్నాడు. అక్టోబర్ నెల వరకు ఆయన బిజీగా ఉండే అవకాశం ఉంది. రుక్మిణి కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. అక్టోబర్ నాటికి ఆమె తన కాల్షీట్లు సర్దుబాటు చేయగలనో లేదో అనే అనుమానం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టుపై ఇంతవరకు మాత్రమే చర్చలు జరిగాయి. అధికారికంగా దీనిపై రుక్మిణి ఎలాంటి హామీ ఇవ్వలేదు. నాని కూడా ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ షూట్లో ఉన్నాడు. మరో నెల రోజుల్లో ఆ సినిమా షూటింగ్ అయిపోతుంది. ఆ తర్వాతే ఈ కొత్త ప్రాజెక్టుపై స్పష్టత ఇవ్వనున్నాడు. ఆ తరువాతే రుక్మిణి వసంత్ ఈ సినిమాలో ఉంటుందో లేదో తేలిసే అవకాశం ఉంది. -
ఊహించని డైరెక్టర్తో యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్..!
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన లేటేస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ టాక్సిక్..ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ పాన్-ఇండియన్ చిత్రం ఆగస్టు 26న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్పై ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. మరి బోల్డ్గా ఉన్నాయంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.ఈ సినిమా సంగతి పక్కన పెడితే యశ్ నెక్ట్స్ మూవీపై అప్పుడే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే యశ్ తదుపరి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరన్న విషయంపై శాండల్వుడ్లో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ టాక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం సప్త సాగరదాచే ఎల్లో మూవీతో హిట్ కొట్టిన దర్శకుడు హేమంత్ ఎం రావుతో జతకట్టనున్నారని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ విషయాన్ని ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ తన పేజీలో ప్రస్తావించింది. దీంతో ఈ విషయం కన్నడ ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. ఈ మూవీని ఓ ఆర్మీ జవాన్.. పోలీసుగా మారిన కథాంశంగా తెరకెక్కించనున్నారని ఐఎండీబీ తన పేజీలో పేర్కొంది. ఈ సినిమాకు హేమంత్ ఎం రావుతో పాటు యశ్ రచయితగా ఉండడం మరో విశేషం. ఈ మూవీని కరణ్ జోహార్, హిరూ జోహార్, అపూర్వ మెహతాల నిర్మించనున్నారు. అయితే ఈ విషయంపై యశ్ కానీ, హేమంత్ ఎం రావు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే హేమంత్ ఎం రావు ప్రస్తుతం '666: ఆపరేషన్ డ్రీమ్ థియేటర్' అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీతో బిజీగా ఉన్నారు. -
కన్నీళ్లు కనిపించలేదని ట్రోలింగ్.. ఎస్.జానకి మనవరాలు ఎమోషనల్ పోస్ట్
గానకోకిల ఎస్.జానకి మరణం సంగీత ప్రపంచాన్ని తీవ్ర శోకసముద్రంలో ముంచేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషాద సమయంలో ఆమె మనవరాలు అప్సర విద్యుల(Apsara Vydyula)పై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అనవసరపు విమర్శలు, ట్రోలింగ్కు దిగారు. జానకి భౌతికకాయం వద్ద అప్సర ఏడవలేదంటూ కొందరు చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో తనపై వస్తున్న ట్రోలింగ్కు అప్సర సోషల్ మీడియా వేదికగా అత్యంత హుందాగా, ఎమోషనల్గా సమాధానమిచ్చారు.కంటికి కనిపించని కన్నీళ్లతో మా బాధను కొలవొద్దు‘మనకు ఇష్టమైన మనిషిని కోల్పోయినప్పుడు వచ్చే దుఃఖం కేవలం కొన్ని రోజుల్లో మాయమైపోయేది కాదు. అది జీవితాంతం ఒక గుండె బరువుగా మారి, మనసును మెలిపెడుతూనే ఉంటుంది. దయచేసి కంటికి కనిపించని కన్నీళ్లతో మా గుండెల్లోని బాధను ముడిపెట్టొద్దు’ అంటూ అప్సర ఆవేదన వ్యక్తం చేశారు.ఆ దుఃఖం నుంచి ఇంకా కోలుకోలేదుఈ ప్రపంచంలో మా నానమ్మ(జానకి)కు మా అక్క వర్ష అంటే ప్రాణం. వాళ్లిద్దరూ ఒకేలా ఉండేవారు. పోలికల దగ్గర నుంచి మాట్లాడడం వరకూ ఒకరి కోసం ఒకరు పుట్టారా అనేలా ఉండేవారు. నిజానికి నానమ్మ అంతక్రియలు మా అక్క వర్ష నిర్వహించాలి. కానీ, ఆమె 2023లోనే కన్నుమూసింది. ఆ దుఃఖం నుంచి మేం ఇప్పటికీ కోలుకోలేదు. వర్ష చేయాల్సిన బాధ్యతలు నేను ఎంత బాధతో నిర్వహించానో నా మనసుకు తెలుసు. మాకెంతో ఇష్టమైన అక్క, నానమ్మ మమ్మల్ని వదిలి వెళ్లారనే బాధ కంటే.. వారిద్దరూ స్వర్గంలో ఒకరినొకరు కలుసుకుని ఉంటారనే ఆలోచనే నాకు ఇప్పుడు పెద్ద ఓదార్పునిస్తోంది’ అని అప్సర తన ఇన్స్టా ఖాతాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం అప్సర చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దుఃఖాన్ని ప్రదర్శించే విధానం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుందని, కష్ట సమయంలో ఉన్న ఒక కుటుంబంపై ఇలాంటి ట్రోలింగ్ చేయడం సరికాదంటూ నెటిజన్లు అప్సరకు మద్దతుగా నిలుస్తున్నారు. View this post on Instagram A post shared by Apsara Vydyula (@apsaravydyula) -
అసభ్యకరంగా హీరోయిన్ మార్ఫింగ్ ఫోటోలు.. పోలీసులకు ఫిర్యాదు
సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న సైబర్ వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రముఖ మలయాళ హీరోయిన్ అన్నా రేష్మా రాజన్ సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న సైబర్ దాడిపై తీవ్రంగా స్పందించారు. తన ప్రమేయం లేకుండా, తన ఫోటోను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో ప్రచారం చేసిన ఓ వ్యక్తిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు అతని ఇన్స్టాగ్రామ్ ఖాతా వివరాలను బహిర్గతం చేస్తూ కేరళ పోలీసులు, సైబర్ సెల్కు ఆమె ఫిర్యాదు చేశారు.‘ఈ నీచమైన చర్య నా గౌరవానికి, వ్యక్తిగత ప్రైవసీకి తీవ్ర భంగం కలిగించింది. ఇలాంటి అసభ్యకర కంటెంట్ను సృష్టించేవారైనా, దాన్ని ఇతరులతో పంచుకునే వారైనా సరే చట్టానికి సమాధానం చెప్పుకోవాల్సిందే. ఈ ఇన్స్టాగ్రామ్ ఖాతాపై అధికారికంగా ఫిర్యాదు చేశాను. నాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఆపను, చట్టపరంగా ముందడుగు వేస్తాను’ అని ఆమె తన ఇన్స్టా ఖాతాలో రాసుకొచ్చింది.అన్నా రాజన్కు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా వివిధ వేదికలపై ఆమె ధరించిన దుస్తులను లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. పలు సందర్భాల్లో ఆమె బాడీ షేమింగ్కు, అసభ్యకర వ్యాఖ్యలకు గురయ్యారు. అయినప్పటికీ ధైర్యంగా నిలబడి వాటన్నింటినీ ఆమె తిప్పికొట్టారు.అన్నా రాజన్ సినీ కెరీర్ విషయాలకొస్తే.. 2017లో లీజో జోస్ పెల్లిస్సేరి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్బస్టర్ సినిమా 'అంగమాలి డైరీస్' ద్వారా అన్నా రాజన్ వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో ఆమె పోషించిన 'లిచ్చి' పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో, ఆమెను అంతా 'లిచ్చి' అని పిలవడం ప్రారంభించారు. 'వెలిపడింతే పుస్తకం', 'మధుర రాజా', 'అయ్యప్పనుమ్ కోషియుమ్' వంటి చిత్రాలకు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన 'జైలర్ 2' లో నటిస్తున్నారు. ఈ సినిమాతో ఆమె కోలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. View this post on Instagram A post shared by Anna raajan (@annaspeeks) -
విజయ్ చివరి సినిమా.. కొడుకు ఊహించని నిర్ణయం!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చిట్టచివరి సినిమా 'జన నాయగన్' సెన్సార్ పూర్తయినట్లు ఇటీవలే ప్రకటించారు. అందుకు తగ్గట్లే వచ్చే శుక్రవారం (జూలై 24) థియేటర్లలో మూవీని రిలీజ్ చేయనున్నారనే టాక్ నడుస్తోంది. దాదాపు ఈ తేదీ కన్ఫర్మ్ అయినప్పటికీ నిర్మాణ సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు తండ్రి విజయ్ కోసం కొడుకు జేసన్ సంజయ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: జైలులోనే స్టార్ హీరో.. ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి సినిమా)విజయ్ తన భార్య సంగీతతో విడాకులు తీసుకుబోతున్నాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. దీంతో కొడుకు జేసన్, తండ్రి నుంచి దూరంగా తల్లితో కలిసి ఉంటున్నాడు. అయితే జేసన్.. తండ్రిలా హీరో అవుతాడని అంతా అనుకున్నారు కానీ దర్శకుడిగా మారి 'సిగ్మా' అనే మూవీ తీశాడు. సందీప్ కిషన్ హీరోగా నటించాడు. దీన్ని జూలై 31న రిలీజ్ చేస్తామని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. కానీ 'జన నాయగన్'.. ఆ తేదీకి సరిగ్గా వారం ముందే వస్తున్న నేపథ్యంలో రిలీజ్ వాయిదా వేయాలని 'సిగ్మా' టీమ్ అనుకుంటోందట.ప్రస్తుతం 'సిగ్మా' వాయిదా రూమర్స్ కోలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే తండ్రి విజయ్ కోసం కొడుకు జేసన్ సంజయ్ వెనక్కి తగ్గినట్లు అవుతుంది. ఇకపోతే 'భగవంత్ కేసరి' రీమేక్ అయిన 'జన నాయగన్'లో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్ర చేసింది. హెచ్.వినోద్ దర్శకుడు.(ఇదీ చదవండి: నాగచైతన్య, సమంత, అఖిల్.. నెక్స్ట్ ఎవరు?) -
కొత్తింట్లోకి అడుగుపెట్టిన శ్రుతి హాసన్.. ఫొటోలు వైరల్
స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ శుభవార్త చెప్పేసింది. చెన్నైలో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోమవారం ఉదయం సంప్రదాయబద్ధంగా గృహప్రవేశ వేడుక నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లోనూ శ్రుతి హాసన్ పాల్గొంది. ఈ క్రమంలోనే అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)గతేడాది బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్.. ముంబైలోని శ్రుతి హాసన్ ఇంటికి వెళ్లారు. అందుకు సంబంధించిన వీడియోని ఫరా.. తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. ఆ ఇంటిని శ్రుతి హాసన్ తన అభిరుచులకు అనుగణంగా డెకరేట్ చేసుకుంది. ఇప్పుడు చెన్నైలోని ఇంటిని కొనుగోలు/కట్టించుకుని మరోసారి తన సొంతిటి కల నెరవేర్చుకుంది.శ్రుతి హాసన్ కెరీర్ విషయానికొస్తే గతేడాది 'కూలీ'లో నటించింది. రీసెంట్గా వచ్చిన 'పెద్ది'లో ఐటమ్ సాంగ్ చేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్న తెలుగు మూవీ 'ఆకాశంలో ఒక తార', విజయ్ సేతుపతి 'ట్రైన్' చిత్రాల్లో శ్రుతి హీరోయిన్గా చేస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగు రివ్యూ) -
'జన నాయగన్' రూట్లో 'జైలర్ 2'
రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ 'జైలర్ 2'. నెల్సన్ దర్శకత్వం వహించగా సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించింది. అనిరుధ్ సంగీతమందించాడు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీని అక్టోబర్ 15వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇదివరకే ప్రకటించారు. తొలి భాగం హిట్ కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ)ఇకపోతే మూవీ విడుదలకు ముందు నిర్వహించే ఆడియో విడుదల కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది. గతంలో విజయ్ 'జన నాయగన్' మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని మలేసియాలో భారీ ఎత్తున నిర్వహించారు. దీంతో మంచి ప్రచారం లభించింది. ఇప్పుడీ దారిలోనే జైలర్ 2 ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని మలేసియాలో భారీ ఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు రజినీకాంత్ నుంచి అనుమతి ఇంకా లభించలేదని తెలుస్తోంది.ఈ వయసులో భారీ బహిరంగ ప్రదేశంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లడం శ్రేయస్కరమేనా? ప్రస్తుతం నటిస్తున్న చిత్రానికి సంబంధించిన కాల్ షీట్స్ సర్దుబాటు వ్యవహారం వంటి విషయాల గురించి రజినీకాంత్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆయన గ్రీన్ సిగ్నల్ రాగానే జైలర్ 2 ఆడియో ఈవెంట్ గురించి క్లారిటీ వస్తుంది. (ఇదీ చదవండి: విజయ్ జన నాయగన్.. రిలీజ్కు ముందే రికార్డ్స్..!) -
సమంత తన డెలివరీ కోసం మరో దేశం వెళ్తారా..?
త్వరలోనే అమ్మకానున్న సమంత డెలివరీపై అప్పుడే చర్చలు ఊపందుకున్నాయి. దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న తర్వాత తక్కువ గ్యాప్లోనే మాతృత్వ దశలోకి అడుగుపెట్టింది సమంత. ఈ ఏడాది డిసెంబర్లోనే ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇటీవలే వచ్చిన ‘మా ఇంటి బంగారం’ సూపర్ హిట్టైన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత సమంత పూర్తిగా తన నివాసానికే పరిమితమైంది. కాగా తన డెలివరీ కోసం ఎక్కడికి వెళ్తుందనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సంపన్నులు, సెలబ్రిటీలు తరచుగా అనుసరించే ‘బర్త్ టూరిజం’పై కూడా చర్చ జరుగుతోంది. అమెరికా, లండన్, కెనడా లాంటి దేశాల్లో పుట్టిన బిడ్డకు పౌరసత్వం లభించే అవకాశం ఉండటంతో చాలామంది ఆ దిశగా వెళ్తారు. అయితే అమెరికాలో బర్త్ టూరిజంపై ఇటీవల గందరగోళం నెలకొనింది. వీసా సమస్యలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో సమంత అమెరికా వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. కెనడా కూడా పుట్టుకతోనే పౌరసత్వం ఇచ్చే నిబంధనలు కలిగి ఉన్నప్పటికీ, అక్కడికి వెళ్లే ఆలోచన కూడా సమంతకు లేదని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై సమంత టీమ్కు చెందిన క్లోజ్ సర్కిల్ మాత్రం ఈ ఊహాగానాలను కొట్టిపారేస్తోంది. ఆమె ఇండియాలోనే తన బిడ్డకు జన్మనిస్తుందని స్పష్టంగా చెబుతున్నారు. అయితే హైదరాబాద్లో కాకుండా, ముంబయిలో డెలివరీ అయ్యే అవకాశాలను పరిశీలిస్తున్నారని సమాచారం. దీంతో సమంత డెలివరీ ఎక్కడ జరుగుతుందనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. -
ప్రియుడితో పెదకాపు హీరోయిన్ ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్
తమిళ టీవీ సీరియల్ 'ఆహా కల్యాణం'లో పవి టీచర్గా తెగ వైరలైన బ్రిగిడా సాగా.. ఇటీవలే తన ప్రేమ సంగతి బయటపెట్టింది. నటుడు ఆనంద్ రామ్తో రిలేషన్లో ఉన్న సంగతి సోషల్ మీడియాలో పంచుకుంది. తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకుని అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ పిక్స్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.2019లో తమిళం వచ్చిన 'అయోగ్య'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మాస్టర్, ఇళవిన్ నిళల్, గరుడన్, మార్గన్, ఇడ్లీ కడై, హాట్స్పాట్ టూ మచ్ చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ సింధూరం, పెదకాపు మూవీస్ చేసింది. ఇకపోతే ఈమె తెలుగు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో డేటింగ్ చేస్తుందనే రూమర్స్ కొన్నాళ్ల క్రితం వచ్చాయి. కానీ ఆ తర్వాత అంతా మర్చిపోయారు. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కాగా.. ఆనంద్ రామ్.. హిప్ హాప్ ఆది హీరోగా చేసిన 'మీసయ్య మురుక్క' మూవీలో నటించాడు. మరో తమిళ చిత్రంలో హీరోగానూ చేశాడు. View this post on Instagram A post shared by BRIGIDA SAGA (@brigida_saga) -
శివరాజ్ కుమార్ కొత్త సినిమా.. ఆసక్తిగా పోస్టర్
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా వస్తోన్న సినిమా 'వెల్కమ్ టూ వైల్డ్ లైఫ్'. ఈ చిత్రాన్ని కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఆయన గతంలో 'నిను వీడని నీడను నేనే', 'సింగిల్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించారు. తాజాగా వైల్డ్ లైఫ్ మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఇవాళ శివరాజ్ కుమార్ బర్త్ డే కావడంతో పోస్టర్ను రిలీజ్ చేశారు. చేతిలో సింహం పిల్లని పట్టుకుని శివరాజ్కుమార్ కనిపించారు. మరోవైపు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీని కేవీకే ప్రొడక్షన్స్ బ్యానర్పై కుడిపూడి విజయ్ కుమార్ నిర్మాస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
విజయ్ జన నాయగన్.. రిలీజ్కు ముందే రికార్డ్స్..!
దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ జన నాయగన్. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది. విజయ్ సీఎం అయ్యాక కూడా ఈ మూవీ రిలీజ్ కాలేదు. తాజాగా ఇటీవల సెన్సార్ బోర్డ్ సమస్యలు క్లియర్ కావడంతో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనెల 24న జన నాయగన్ విడుదల కానుందని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఇటీవల ఈ మూవీకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటికే టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. అప్పుడే రికార్డ్స్ సృష్టిస్తోంది. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్లో యూకేలో అప్పుడే రూ.కోటికి పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని ఏషియన్ బాక్స్ ఆఫీస్ సోషల్ మీడియాలో పంచుకుంది. అంతేకాకుండా యూకేలో జన నాయగన్ అన్కట్ వెర్షన్ విడుదల చేయనున్నట్లు డిస్ట్రిబ్యూటర్స్ ప్రకటించారు. మరి కొన్ని దేశాల్లోనూ అన్కట్ వెర్షన్ను ప్రదర్శించడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.కాగా.. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో నటించారు. -
50 ఏళ్ల వయసులో పెళ్లి.. తనకంటే భార్య 16 ఏళ్లు చిన్నది
ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ రఘు దీక్షిత్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, తొలిప్రేమ, కృష్ణార్జున యుద్ధం తదితర సినిమాల్లో పాటలు పాడాడు. గతేడాది అక్టోబరులో 50 ఏళ్ల వయసులో గాయని వరిజాశ్రీని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇతడికి భార్యతో 16 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉండటంపై ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిపై రఘు స్పందించాడు. కొన్ని కామెంట్స్ ఎంతో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశాడు.(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి)'పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు మాకు సంబంధించి ప్రతి విషయంలోనూ అభిప్రాయాలు వస్తాయని ముందే తెలుసు. నిజం చెప్పాలంటే కొన్ని కామెంట్స్ చూసి చాలా బాధ అనిపించింది. అయితే సంతోషకరమైన జీవితానికి చిన్న రహస్యముంది. ఇంటర్నెట్లో వచ్చే ప్రతి కామెంట్ సీరియస్గా తీసుకోకూడదు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నిజమైన ఫ్యాన్స్ ప్రేమాభిమానాలే నాకు ముఖ్యం''మేమిద్దరం చాలాకాలం నుంచి ఫ్రెండ్స్. ప్రేమ అనేది విచిత్రమైన అనుభూతి. అది ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అది సహజంగా జరిగిపోయింది. ప్రేమ, పరస్పర గౌరవం, నమ్మకంతో తీస్తున్న నిర్ణయాల ముందు బయటవాళ్లు చేసే ట్రోల్స్కి పెద్దగా విలువ ఉండదు. మా వైవాహిక జీవితం సంగీతానికి మాత్రమే పరిమితం కాదు. కలిసి నవ్వుకుంటాం. సంగీతం కంపోజ్ చేస్తాం. టూర్స్కి వెళ్తాం. ఇవే మా బంధాన్ని మరింత బలపరుస్తున్నాయి. ఆమె అద్భుతమైన సంగీత విద్వాంసురాలు మాత్రమే కాదు, గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి' అని రఘు దీక్షిత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో విమర్శలకు కౌంటర్ ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ) -
'బిగ్బాస్' ఫేమ్ వాటర్మెలన్ స్టార్ అరెస్ట్
తమిళనాట 'వాటర్మెలన్' స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ దివాకర్ వివాదంలో చిక్కుకున్నాడు. గతేడాది జరిగిన తమిళ బిగ్బాస్ 9వ సీజన్లోనూ పాల్గొన్న ఇతడు.. రీసెంట్ టైంలో ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహకులని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో ఇతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)తన వీడియోల ద్వారా యూట్యూబ్ ఛానెల్కి చాలా ఆదాయం వస్తున్నందున, రూ.లక్ష డిమాండ్ చేస్తూ దివాకర్ బెదిరించాడనే ఆరోపణలు వచ్చాయి. ఒక ఇంటర్వ్యూ సంధర్భంగా జరిగిన గొడవలో దివాకర్.. ఖరీదైన కెమెరాని పగలగొట్టారని ఆరోపణలు వచ్చాయి. కంపెనీ తరఫున సంబంధిత ఆధారాలతో కిల్పాక్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీని ఆధారంగా పోలీసులు, దివాకర్పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.మరోవైపు యూట్యూబ్ ఛానెల్ ఉద్యోగులు తనని అక్రమంగా ఓ గదిలో బంధించి, దాడి చేశారని చెబుతూ వీడియోలని సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరుతూ దివాకర్ ఓ వీడియోని పోస్ట్ చేశాడు. ఇందులో ప్రమేయం ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దివాకర్ కోరాడు. ఈ విషయమై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు దివాకర్ తన వీడియోలో పేర్కొన్నాడు. ఆ విషయంపై కూడా దర్యాప్తు జరుగుతోంది.(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో హీరో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి) -
ఇది నా నిజ జీవిత పాత్రలానే ఉంది
పారి ఇళవళగన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా 'అన్బే డయానా'. మిలియన్ డాలర్ స్టూడియోస్, నియో క్యాస్టిల్ క్రిమేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రమ్య నారాయణన్ హీరోయిన్. ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం చైన్నెలోని ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో నటి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మా ఇంటి బంగారం'.. అధికారిక ప్రకటన)'సుమారు 11 ఏళ్ల తరువాత నేను నటించిన సినిమా 'లెనిన్ పాండియన్'. దాని తర్వాత ఇదే. దర్శకుడు పారి ఇళవళగన్ నన్ను కలిసి కథ చెప్పినప్పుడే ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అనిపించింది. నేను ఇందులో ఆంధ్రా నుంచి చైన్నెకి వచ్చి సెటిల్ అయిన అమ్మాయిగా నటించాను. ఇది నా నిజజీవిత పాత్రలానే ఉంది. మూవీ కోసం అందరూ బాగా పనిచేశారు' అని రోజా చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ఇప్పుడు వాళ్ల కళ్లు చల్లబడ్డాయి.. జానకి మరణంపై సుశీల) -
మలేషియాలో ఓం
ధనుష్ హీరోగా రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఓం చాప్టర్ 1– ఉదిరమ్: ది బ్లడ్ ఉడ్’. ఈ చిత్రంలో సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. మమ్ముట్టి, నసీరుద్దీన్ షా ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ మలేషియాలో ప్రారంభం కానుంది. ఆల్రెడీ ధనుష్తో పాటు ప్రధాన తారాగణమంతా మలేషియాకు చేరుకున్నారని కోలీవుడ్ సమాచారం. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతో పాటుగా ఓ యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేసేందుకు ప్లాన్ చేశారట రాజ్కుమార్. ఈ షెడ్యూల్తో సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందట. ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వుండర్బార్ ఫిల్మ్స్పై నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 16న రిలీజ్ కానుంది. -
జైలర్ ఇంట్లో హృతిక్
రజనీకాంత్, హృతిక్రోషన్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘జైలర్ 2’. రమ్యకృష్ణ, ఎస్జే సూర్య, విజయ్ సేతుపతి, యోగిబాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, హృతిక్ రోషన్ గెస్ట్ రోల్స్ చేశారు. రజనీకాంత్–హృతిక్ రోషన్ మధ్య వచ్చే సన్నివేశాలను జూన్ నెల చివర్లో చెన్నైలో చిత్రీకరించారు.ఆ సమయంలో రజనీకాంత్ ఇంటికి మర్యాద పూర్వకంగా వెళ్లారు హృతిక్ రోషన్ . ఈ ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ‘జైలర్ 2’లో జైలర్ ముత్తువేల్ పాండియన్ గా నటించారు రజనీకాంత్. కథ రీత్యా హృతిక్ రోషన్ కూడా ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా నటించారని తెలిసింది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ‘జైలర్ 2’ అక్టోబరు 15న రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. 1986లో రిలీజైన హిందీ చిత్రం ‘భగవాన్ దాదా’లో రజనీకాంత్ –హృతిక్ రోషన్ కలిసి నటించారు. ఆ సమయంలో హృతిక్ రోషన్ బాలనటుడు. హృతిక్ రోషన్ తండ్రి, దర్శక–నిర్మాత రాకేష్ రోషన్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. -
నాగార్జున మీద ఒట్టేసి చెబుతున్నా.. ‘లెనిన్’పై ఆర్జీవీ రివ్యూ
అఖిల్ అక్కినేని తన తాజా చిత్రం ‘లెనిన్’ తో కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు. “వస్తున్నాం.. మనోడు కొడుతున్నాడు” అంటూ ప్రమోషన్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. వసూళ్ల వివరాలు పక్కన పెడితే.. అఖిల్ నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రంతో ఆయన తన కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని కొనియాడారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) సోషల్ మీడియాలో అఖిల్ను అభినందించారు. హే అఖిల్ అక్కినేని ‘లెనిన్’తో బ్లాక్బస్టర్ అందుకున్నందుకు బిగ్ కంగ్రాట్స్ అంటూ పోస్ట్ చేశారు. దీనికి అఖిల్ స్పందిస్తూ.. థ్యాంక్యూ సార్.. ప్లీజ్ సినిమా చూడండి అని రిప్లై ఇచ్చారు. Hey @AkhilAkkineni8 Just saw #Lenin , and apart from the FILM being GREAT , I realised that you are the BEST ACTOR in the #Akkineni family and I swear this on @iamnagarjuna 🔥🔥 Your ease is remarkable even when there’s no emotion in the scenes and in the emotional scenes you… https://t.co/az4x6dFsTL— Ram Gopal Varma (@RGVzoomin) July 12, 2026తాజాగా సినిమా చూసిన ఆర్జీవీ, ఎక్స్ వేదికగా తన రివ్యూని పంచుకున్నారు. ఆయన అఖిల్ నటనపై ప్రశంసలు కురిపించారు. నాగార్జున మీద ఒట్టేసి చెబుతున్నా.. అక్కినేని ఫ్యామిలీలోనే అఖిల్ అత్యుత్తమ నటుడు అని ఆర్జీవీ పేర్కొన్నారు. సాధారణ సన్నివేశాల్లో కూడా అఖిల్ నటనలో కనిపించే ఈజ్ అద్భుతం, భావోద్వేగ సన్నివేశాల్లో అయితే అదరగొట్టేశాడని వర్మ అభిప్రాయపడ్డారు. అఖిల్కు ఇలాంటి అద్భుతమైన పాత్రను అందించిన దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
'అది మీ పిరికితనమే'.. రాధిక శరత్కుమార్ ఆగ్రహం
టాలీవుడ్ సీనియర్ నటి రాధిక శరత్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలబ్రిటీల పిల్లలను ఎగతాళి చేయడం వాక్ స్వాతంత్ర్యం కాదని మండిపడింది . ప్రముఖుల కుమార్తెలను ఎగతాళి చేయడం హాస్యం కాదని తెలిపింది. ఇది కేవలం మీ పిరికితనమేనని ఎద్దేవా చేసింది. మనకు అవతలి వాళ్ల రూపం కంటే.. వ్యక్తిత్వమే చాలా ముఖ్యమని ట్వీట్లో రాసుకొచ్చింది. కాగా..గతంలో చాలాసార్లు ఖుష్బు కూతుర్లను బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాంటి వారికి తనదైన శైలిలో కౌంటరిచ్చింది. దీంతో నటి ఖుష్బు కుమార్తెలను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై రాధిక శరత్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడింది. సెలబ్రిటీల పిల్లలను టార్గెట్ చేయడం పిరికిపంద చర్య గట్టిగానే కౌంటరిచ్చింది. వాక్ స్వాతంత్ర్యం అంటే బెదిరించే స్వేచ్ఛ కాదని తెలిపింది. విమర్శించడం అనేది క్రూరత్వం కాదు.. హాస్యం అవమానించడం కాదని హితవు పలికింది. నేను ఖుష్బూ, ఆమె కుమార్తెలకు అండగా నిలుస్తానని పేర్కొంది. ఎవరైనా సరే ఇలాంటి ప్రవర్తన ఎక్కడ జరిగినా సరే తాను ఖండిస్తానని రాధిక శరత్కుమార్ స్పష్టం చేసింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Freedom of speech is not freedom to bully. Criticism is not cruelty. Humour is not humiliation.Mocking a public figure's daughters is not comedy — it is cowardice. Looks are not an achievement or a failure. Character is.I stand with Khushbu and her daughters. I condemn this… pic.twitter.com/Dn7WjXRYUU— Radikaa Sarathkumar (@realradikaa) July 11, 2026 -
జానకమ్మ పాడిన 48 వేల పాటల్లో అత్యంత కష్టమైన సాంగ్ ఇదే!
తన గాత్రంలో కోట్లాది మంది శ్రోతలను ఓలలాడించిన దిగ్గజ గాయని, 'దక్షిణ భారత నైటింగేల్' ఎస్. జానకి (88) ఇక లేరనే వార్తను సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. తన ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ కెరీర్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో దాదాపు 48 వేలకు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించారు ఆమె.లాలిపాటలు, జానపదాలు, క్లాసికల్, మెలోడీలు.. ఇలా ఆమె పాడని పాట లేదు, పలకని భావం లేదు. అయితే, ఇన్ని వేల పాటలు పాడిన జానకమ్మకు తన కెరీర్లో అత్యంత సవాలుగా నిలిచిన ఒక పాట ఉందన్న విషయం మీకు తెలుసా?గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జానకి గారు స్వయంగా తనకు అత్యంత కష్టమైన పాట గురించిన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. 1977లో విడుదలైన కన్నడ చిత్రం 'హేమవతి'లోని 'శివ శివ ఎన్నడ నలికే ఏకే' అనే పాట తాను పాడిన అన్ని పాటలలోకెల్లా అత్యంత కష్టమైనదని ఆమె పేర్కొన్నారు. ఈ పాటను అంత క్లిష్టంగా మార్చింది ఆ పాట యొక్క స్వరకల్పనే. సంగీత దర్శకుడు ఈ పాటలోని ప్రతి రెండో చరణంలో 'తోడి', 'అపోకి' అనే రెండు వేర్వేరు రాగాలను ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలా అద్భుతంగా, అంతే క్లిష్టంగా స్వరపరిచారు.పాడేటప్పుడు రాగాలలో వచ్చే ఈ అత్యంత సూక్ష్మమైన మార్పులను పట్టుకోవడం సాధారణ విషయం కాదు. ఏ మాత్రం శృతి తప్పినా పాట గాడి తప్పుతుంది. అందుకే, క్లాసికల్ సంగీతంలో ఎంతో పట్టున్న ఎస్. జానకి సైతం, తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఈ పాటను అత్యంత సవాలుతో కూడుకున్న పాటగా అభివర్ణించారు. ఆమె భౌతికంగా మనల్ని విడిచివెళ్లినా, ఆమె పాడిన ఇలాంటి అపురూపమైన పాటలు సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. -
డబ్బు కోసం ముద్దు సీన్లలో నటించలేను : సాయి పల్లవి
సినీ కథానాయకల్లో ఒక్కొక్కరికీ ఒక్కో బాణి ఉంటుంది. కొందరు అందచందాలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. కొందరు తమ నటనా ప్రతిభనే నమ్ముకుంటారు. ఇంకొకరు అన్ని రకాల పాత్రలను పోషించాలని కోరుకుంటారు. వీటిలో రెండవ కేటగిరీకి చెందిన నటి సాయి పల్లవి. వైద్య వృత్తి చదివినా నటనపై ఆసక్తితో ఈ రంగంలోకి ప్రవేశించిన సాయి పల్లవి ప్రేమమ్ అనే మలయాళ చిత్రంతో తానేమిటో నిరూపించుకున్నారు. తర్వా తెలుగు, తమిళ భాషల్లో కూడా నటిస్తూ స్టార్ అంతస్తుకు చేరుకున్నారు.ఈమధ్య ఈమె శివకార్తికేయన్కు జంటగా నటించిన అమరన్ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. ముఖ్యంగా సాయి పల్లవి నటన సర్వత్ర ప్రశంసలు అందుకుంది. కాగా ఇటీవల బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చారు. అక్కడ అమీర్ ఖాన్ వారసుడు జునైత్ ఖాన్గా ఏక్ దిన్ అనే చిత్రంలో నటించారు. ప్రస్తుతం భారతీయ ఇతిహాసం అయినా రామాయణం నేపథ్యంలో రెండు భాగాలుగా రూపొందుతున్న రామాయణ అని పాన్ ఇండియా చిత్రంలో సీతగా నటిస్తున్నారు.అదేవిధంగా తమిళంలో ధనుష్ కు జంటగా ఓమ్ అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మరో నాయిక శ్రీలీల నటిస్తున్నారు. ఇదిలా ఉండగా సాయి పల్లవి నటిగా ఆది నుంచి ఒక ప్రిన్సిపల్స్ పాటిస్తూ వస్తున్నారు. మేకప్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోవడం, నటనలో సహజత్వానికి ప్రాముఖ్యతను ఇవ్వడం, గ్లామర్ కు దూరంగా ఉండటం, కథా పాత్రలు నచ్చితేనే నటించడానికి సమ్మతించడం వంటివి ఈమె కచ్చితంగా పాటిస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో సాయి పల్లవి ఇటీవల ఒక భేటిలో పేర్కొంటూ ..‘నా కెరీర్ ప్రారంభం నుంచే నేను చిత్రాల్లో ముద్దు సన్నివేశాలకు వ్యతిరేకిని. అలాంటి సన్నివేశాలు నటించడానికి నా మనసు అంగీకరించదు. ఈ ప్రపంచంలో ప్రతి యువతి యువకుడు సంతోషంగా జీవించడానికి ఓ ఇల్లు, మంచి కారు ఉండాలని కోరుకుంటారు. దేవుని దయవల్ల నాకు అలాంటి ఆడంబర జీవితం, సంతోషం లభించాయి. అదేవిధంగా ఆడంబరాల కోసం మాత్రమే నేను ఎప్పుడూ సినిమాల్లో నటించలేదు. మరో కొత్త కారు కొనుక్కోవడానికో, డబ్బు కోసం నటులతో ముద్దు సన్నివేశాల్లో నటించాల్సిన అవసరం నాకు లేదు. అదే విధంగా హద్దులు మీరిన ప్రేమ సన్నివేశాల్లో నటించాలంటే వేరెవరినైనా వెతుక్కోండి.. నా వద్దకు రాకండి. మంచి నటన కోసం మాత్రమే నా వద్దకు రండి’ అని నటి సాయి పల్లవి పేర్కొన్నారు. -
మూగబోయిన స్వర కోయిల
మైసూరు/బెంగళూరు/తెనాలి: తేనెలూరు తెలుగువారి గళ మాధుర్యాన్ని అనేక భాషల్లో శ్రోతలకు రుచి చూపించి మన కీర్తి పతాకను దశ దిశలా ఎగురవేసిన స్వర కోయిల మూగవోయిందన్న వార్త సంగీత ప్రియులను దిగ్భ్రాంతికి గురిచేసింది. తన పాటలతో జగమే ఊయల చేసిన మధుర గాయని ఎస్.జానకి ఇక లేరన్న చేదు వార్త విని సర్వత్రా ఆవేదన వ్యక్తమైంది. తన సుమధుర కంఠంతో ఆబాలగోపాలాన్ని ఓలలాడించిన బహుభాషా గాయని ఎస్.జానకి (88) శనివారం రాత్రి మైసూరు నగరంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె పాత తాలూకాలోని నిజాంపట్నం మండలం పల్లపట్ల వాస్తవ్యురాలైన ఆమె ఆరేళ్లుగా మైసూరు బన్నూరు రోడ్డులోని ఫార్మ్హౌజ్లో నివాసం ఉంటున్నారు. ఎల్లప్పుడూ ధవళ వర్ణ సంప్రదాయ చీరకట్టులో కనిపించేవారు. కొన్నేళ్లుగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఇటీవలే బోగాది నగరలోని ఎస్బీఎం లేఔట్ నివాసంలో అద్దెకు ఉంటున్నారు. నవీన్, పవన్ అనే వ్యక్తులు ఆమెకు తోడునీడగా ఉంటూ సేవలు చేస్తూ వచ్చారు. వారం క్రితమే ఆమె మంగళూరుకు తన అక్క ఇంటికి వెళ్లి తిరిగి వచ్చారు. ఈ సమయంలో ఆమెతో పాటు కోడలు ఉమా, మనమరాలు అప్సరా కూడా ఉన్నారు. గత సంవత్సరం ఆమె తన కుమారుడు మురళీకృష్ణను కోల్పోవడంతో తీవ్ర మానసిక కుంగుబాటుకు గురయ్యారు. బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని మౌనంగా ఉండిపోయారు. ఈ క్రమంలో శనివారం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మధ్యాహ్నం 12.49 గంటలకు మైసూరులోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. అయినా ఆమె మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూల్ (బహుళ అవయవ వైఫల్యం)తో గుండెపోటుకు గురయ్యారు. రాత్రి 7.30 గంటలకు ఆమె మరణించారని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకుని ఆమె బంధువులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అభిమానులు ఆస్పత్రి వద్దకు భారీగా తరలివచ్చారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు మైసూరు బోగాది సమీపంలోని కణియర హుండి గ్రామంలోని ఫామ్హౌజ్లో జరుగుతాయని బంధువులు మీడియాకు తెలిపారు. అంతంకు ముందు ఆమె పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మైసూరులోని మహారాజ కాలేజ్ గ్రౌండ్స్లో ఉంచుతారు. ప్రభుత్వ లాంఛనాలతో జానకి అంత్యక్రియలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆటుపోట్ల జీవితం ఎస్.జానకి తన తీయని కంఠం ద్వారా ప్రజలను ఎంతగా ముగ్ధుల్ని చేశారో ఆమె జీవితం అంతగా ఆటుపోట్లకు గురైంది. 1938 ఏప్రిల్ 23న సత్యవతి, శ్రీరామమూర్తి దంపతులకు జన్మించారు. తండ్రి ఆయుర్వేద వైద్యుడు. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో నాలుగో సంతానం జానకి. చదువంటే శ్రద్ధ లేదు. బడి అంటే ఆమడదూరం వెళ్లేవారు. రేడియోలో పాటలు వింటూ కాలక్షేపం. రోడ్డుపైకి వెళ్లినపుడు లతా మంగేష్కర్ పాటలు వింటూ, తాను పాడుతూ పెరిగారు. వివిధ కారణాలరీత్యా శ్రీరామమూర్తి కుటుంబం కొంతకాలం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో, తర్వాత రాజమండ్రిలో ఉన్నారు. సిరిసిల్లలోనే తన బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. తన చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి ఎండ్ల బండిలో వేములవాడకు వెళ్లి బాలనాగమ్మ సినిమాను చూసి వచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో జానకి గుర్తుచేసుకున్నారు. పాటలపై కూతురుకు గల ఆసక్తిని గమనించిన తల్లి సత్యవతి, రాజమండ్రిలో నాదస్వర విద్వాన్ గాడవల్లి పైడిస్వామి దగ్గర సంగీతంలో ప్రాథమిక శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా శాస్త్రీయ సంగీతం ఎవరి వద్దా నేర్చుకోలేదు. గురువు గారు కీర్తనలతో ఆరంభించినా, జానకి ధ్యాసంతా సినిమా పాటలపైనే ఉండేది. అక్కడుండే ‘క్రాంతి కళామండలి యూత్ అసోసియేషన్’లో సినిమా పాటల కచేరీల్లో పాటలు పాడుతున్న కాలంలో, అమ్మ మరణంతో మళ్లీ ఆ కుటుంబం హైదరాబాద్కు చేరుకుంది.జానకి మామయ్య ‘ఫన్ డాక్టర్’చంద్రశేఖర్ వేదికపై ప్రదర్శనలిస్తుండేవారు. మధ్యమధ్యలో జానకి పాటలు పాడుతూ వచ్చారు. ఆయన కుమారుడు వి.రాంప్రసాద్, జానకి స్వరంలోని ప్రత్యేకతను గమనించారు. కుమారుడు చేసిన సూచనతో చంద్రశేఖర్, చెన్నైలోని రెండు మూడు స్టూడియోలకు జానకి గురించి లేఖ రాశారు. ఏవీఎం స్టూడియో నుంచి ఆడిషన్కు రమ్మని కబురొచి్చంది. స్టూడియో స్టాఫ్గా ఎంపిక చేసుకున్నారు. తాను ఇష్టపడిన రాంప్రసాద్తోనే ఆమెకు 1959లో వివాహమైంది. పాటలకు సంబంధించిన ఒప్పందాలు, రెమ్యూనరేషన్, రాయల్టీలు అన్ని విషయాలు ఆయనే చూసుకున్నారు.1997లో గుండెపోటుతో భర్త మృతి చెందారు. చెన్నైలో స్థిరపడిన జానకి దంపతులకు ఏకైక కుమారుడు మురళీకృష్ణ కొన్ని సినిమాల్లో నటించినా ఎక్కువకాలం కొనసాగలేదు. కోడలు ఉమ నర్తకి. దూరదర్శన్ ఏ గ్రేడ్ ఆర్టిస్ట్. తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’అవార్డు కూడా తీసుకున్నారు. ‘పాట నాకు ప్రాణం.. ప్రాణమున్నంతకాలం పాడుతూనే ఉంటాను’అంటుండే జానకి, భౌతికంగా ఊపిరి కోల్పోయినా ఆమె పాట ఇప్పటికీ, ఎప్పటికీ అభిమాన శ్రోతలను అలరిస్తూనే ఉంటుంది. కాగా, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంతోనూ ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది. తుమ్మలూరు గ్రామంలోని మ్యాక్ ప్రాజెక్టులో 279 నంబర్ విల్లాను కొనుగోలు చేసి కుమారుడు మురళీకృష్ణతో ఆమె నివసించారు. ఒక ఊపు ఊపిన ‘నీ లీల పాడెద దేవా..’ ⇒ 1957లో సంగీత దర్శకుడు టి.చలపతిరావు సంగీత దర్శకత్వంలో ‘విధియిన్ విళైయట్టు’తమిళ సినిమాలో రెండు పాటలు పాడించారు. ఆ సినిమా విడుదల కాలేదు. ఆ వెంటనే తెలుగులో ‘ఎంఎల్ఏ’సినిమా కోసం ‘నీ ఆశ అడియాశ చెయి జారే మణిపూస’పాటను ఘంటసాలతో కలిసి పాడారు. తొలిగా విషాదగీతంతో ఆరంభించినా, ఆమె సినీ కెరీర్ మధుర వెన్నెలలా కొనసాగింది. బావా మరదళ్లు సినిమాలో ‘నీలి మేఘాలలో గాలి కెరటాలలో’పాటతో బిజీ అయ్యారు. ⇒ ఆ క్రమంలోనే ‘మురిపించే మువ్వలు’సినిమాలో జానకి పాడిన ‘నీ లీల పాడెద దేవా’పాట దక్షిణాదిని ఒక ఊపు ఊపింది. తద్వారా సినీ రంగంలో ఆమెకో ప్రత్యేక స్థానం లభించింది. వాస్తవానికి ఆ పాటను పి.లీలతో పాడించాలని నిర్ణయించారు. అంత హైపిచ్తో తాను పాడలేనని, జానకిచే పాడించమని పి.లీల సూచించారు. ఆ పాటకు అభినయించే సావిత్రి మాత్రం సుశీలతో పాడించాలని పట్టుబట్టారు. ఆ చిత్ర సంగీత దర్శకుడు సుబ్బయ్యనాయుడు జానకి చేతనే పాడించారు. ⇒ ఇక జానకి వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. దిగ్గజ సంగీత దర్శకుల సంగీతానికి పాటలు పాడుతూ బిజీ అయ్యారు. మరో సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వరరావు జానకి పాటను అనుకోకుండా విన్నారు. వెంటనే పూజాఫలం సినిమాలో ‘పగలే వెన్నెలా.. జగమే ఊయల’పాడించటంతో మరింత బిజీ గాయనిగా మారారు. ⇒ ఆరాధనలో ‘ఆడదాని ఓరచూపులో’, రంగులరాట్నంలో ‘నడిరేయి ఏ జాములో’వంటి సూపర్ హిట్ పాటలతో జానకి సినిమా పాటల ప్రయాణం ప్రవాహంలా సాగింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, పంజాబి, ఒరియా, తుళు, కొంకణి, బడగ, సింహళం, ఇంగ్లి‹Ù, సంస్కృతం, జర్మన్, జపాన్ వంటి 20 భాషల్లో 48 వేలకు పైగా పాటలతో అలుపెరగని కోయిల అనిపించుకున్నారు. వీటిలో 17 వేలకు పైగా సినిమా పాటలు కాగా, మిగిలినవి ప్రైవేటు రికార్డులు, త్యాగరాజ కృతులు, మీరా భజన్లు. సొంత సంగీతంలో పాడారు. వీటితో పలు భక్తి సంగీత క్యాసెట్లు వచ్చాయి.ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు ⇒ చిన్న పిల్లలకు పాడాలన్నా జానకమ్మనే పిలిచే వారు సంగీత దర్శకులు. ‘చందమామ రావే’(1987), ‘జడ్జిమెంట్’(1990) సినిమాల్లో బేబి సుజితకు డబ్బింగ్ చెప్పారు. ఉషాకిరణ్ మూవీస్ వారి ‘మౌన పోరాటం’సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. తన గాన మాధుర్యానికి వరించిన గౌరవాలెన్నో. ఆకాశవాణి పాటల పోటీల్లో ద్వితీయస్థానం సాధించి అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. నాలుగుసార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయని అవార్డును స్వీకరించారు. ⇒ 13 సార్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, ఆరుసార్లు తమిళనాడు ప్రభుత్వ అవార్డులు, మరో ఆరుసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవార్డులు, 12 నంది అవార్డులు (ఇందులో రెండు టెలివిజన్), ఒడిశా ప్రభు త్వ అవార్డులు లభించాయి. కలైమామణి, సుర్సింగార్, సింగర్ ఆఫ్ ది సెంచరీ, భారతీదాసన్ వంటి అవార్డులు మరికొన్ని. సంగీత ప్రపంచంలో రారా ణిగా వెలుగొందిన జానకి తమిళనాడు కోటాలో కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్’పురస్కారాన్ని ప్రకటించింది. అప్పుడా గౌరవాన్ని జానకి తిరస్కరించటం దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం అయింది. అయిదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో చేసిన కృషికి ప్రభుత్వం ఆలస్యంగా స్పందించినా, దేశ ప్రజలందరి హృదయాల్లో తనకున్న స్థానమే చాలని ఆమె సంతృప్తి చెందారు. గాయనిగా ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఎప్పుడో ఇస్తే ఎలాగని తిరస్కరించారని అంతా భావించారు. ⇒ ఎస్.జానకికి దైవ భక్తి ఎక్కువ. నంజనగూడులోని నంజుండేశ్వర, చాముండేశ్వరి, యోగా నరసింహస్వామి దేవాలయాల్లో తరచూ పూజలు చేసేవారు. అద్భుత సంగీత పయనం అనంతరం 2017 అక్టోబర్ 28న మైసూరు విశ్వవిద్యాలయం మానస గంగోత్రిలోని రంగమందిరంలో ఆమె తన పాటకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇకపై తాను ప్రజా వేదికల్లో పాడబోనని ప్రకటిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో నిలిచిపోయారువైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని ఎస్.జానకి మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో దశాబ్దాల పాటు తన గాన ప్రతిభతో చెరగని ముద్ర వేసిన ఎస్.జానకి సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్ జగన్ పేర్కొన్నారు.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు ఆలపించి, భారతీయ సంగీత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించారని కొనియాడారు. తన స్వరంతో ఎన్నో తరాలను అలరించిన ఎస్.జానకి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని అన్నారు. ఆమె పాడిన పాటలు, ఆమె అందించిన సంగీత వారసత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఎస్.జానకి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించానన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సంగీత ప్రపంచానికి తీరని లోటు: గవర్నర్ సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయని ఎస్.జానకి మృతిపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా సంతాపం వ్యక్తంచేశారు. జానకి మృతి భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు. తెలుగు నేల గర్వించదగ్గ మహోన్నత గాయని జానకి అని కొనియాడారు. జానకి గానామృతం తరతరాలపాటు సంగీతాభిమానుల హృదయాల్లో నిలిచిపోతుందన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జానకి తెలుగు ప్రజలకు గర్వకారణం: సీఎం జానకి మృతి పట్ల సీఎం ఎ.రేవంత్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె తెలుగు వారు కావడం తెలుగు ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. జానకమ్మ మరణం భారతీయ చలనచిత్ర పరిశ్రమకే కాకుండా కోట్లాది సంగీతాభిమానులకు తీరని లోటని పేర్కొన్నారు. జానకి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కిషన్రెడ్డి, సంజయ్, రాంచందర్రావు సంతాపం జానకి మృతి పట్ల కేంద్రమంత్రులు జి.కిషన్రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. దశాబ్దాల పాటు శ్రోతలను అలరించిన జానకి కన్నుమూశారనే వార్త విచారకరమని కిషన్రెడ్డి పేర్కొన్నారు. జానకి మరణం భారతీయ సంగీతానికి ఎంతో లోటని సంజయ్ తెలిపారు. ప్రపంచ సంగీతానికి జానకి మరణం తీరని లోటని రాంచందర్రావు పేర్కొన్నారు. జానకి మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు: కేసీఆర్ జానకి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు సంతాపం తెలిపారు. జానకమ్మ మరణం దక్షిణ భారత సంగీత ప్రపంచానికి, భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటని కేసీఆర్ పేర్కొన్నారు. ఆరు దశాబ్దాలపాటు వేలాది పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జానకి మరణవార్త ఎంతో బాధాకరం: కేటీఆర్ జానకి మరణం చలనచిత్ర రంగానికి తీరనిలోటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జానకి తన బాల్యంలో కొన్నేళ్లు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో నివాసం ఉన్నారన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. -
సూపర్ హీరో రెడీ
అర్జున్ దాస్, శాండీ మాస్టర్, తేజు అశ్విని నటించిన చిత్రం ‘సూపర్ హీరో బాబు’ (తమిళంలో ‘సూపర్ హీరో’). విఘ్నేష్ వేణుగోపాల్ దర్శకత్వంలో నిర్మాత కె.ఎస్. సినిష్ సోల్జర్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ సమర్పణలో శంజన్ .జి నిర్మించారు.ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో రూపొందించిన చిత్రం ‘సూపర్ హీరో బాబు’. అర్జున్ దాస్, తేజు అశ్విని మధ్య వచ్చే సన్నివేశాలు, శాండీ, అర్జున్ దాస్ల సీన్స్ ఆకర్షణగా నిలుస్తాయి. హేషమ్ అబ్దుల్ వహాబ్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు’’ అని యూనిట్ పేర్కొంది. -
'జన నాయగణ్' అప్డేట్ ఇచ్చిన సీఎం విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. రాజకీయాలకు చిన్న బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. ఎందుకంటే సీఎం కాకముందు ఈయన తన చివరి సినిమా చేశారు. అదే 'జన నాయగణ్'. లెక్క ప్రకారం ఈ ఏడాది సంక్రాంతికే రిలీజైపోవాలి. కానీ సెన్సార్ సమస్యల వల్ల ఇప్పటికీ అలా ఉండిపోయింది. ఈనెలలో రిలీజ్ కావొచ్చని రూమర్స్ వినిపిస్తున్న క్రమంలో విజయ్.. అధికారికంగా ఓ అప్డేట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.(ఇదీ చదవండి: త్రివిక్రమ్ కొత్తగా ఇంకేం తీస్తాడబ్బా?)తెలుగు సినిమా 'భగవంత్ కేసరి'కి రీమేక్ అయిన జన నాయగణ్ చిత్రానికి ఎట్టకేలకు సెన్సార్ పూర్తయింది. ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. దీనిని సీఎం విజయ్.. తన సోషల్ మీడియాలో ఖాతాల్లో పంచుకున్నారు. ఇకపోతే ఈ నెల 24న తెలుగు, తమిళంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. దాదాపు ఇదే తేదీ ఫైనల్ అని కూడా అంటున్నారు.ఇకపోతే ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా మమిత బైజు కీలక పాత్ర చేసింది. హెచ్. వినోద్ దర్శకుడు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ నిర్మించారు.(ఇదీ చదవండి: పెళ్లయ్యాక అఖిల్ టైమ్ మొదలైంది: నాగార్జున)pic.twitter.com/cV9UHXjjsR— Vijay (@actorvijay) July 11, 2026 -
కారులో వెంబడించాడు.. అలాంటి సైకోని చూడలేదు : హీరోయిన్
సినిమా తారలంటే అందరికీ క్రేజ్. అభిమాన హీరో, హీరోయిన్లను ఒక్కసారి దగ్గరగా చూడాలని, షేక్హ్యాండ్ ఇవ్వాలని, ఫోటో దిగాలని అభిమానులు ఉత్సాహం చూపించడం సహజమే. కానీ ఓ అభిమాని మాత్రం ఫోన్ నెంబర్ ఇవ్వమంటూ మలయాళ నటి అవంతిక మోహన్ని కారులో వెంబడించాడు. ‘మీరంటే ఇష్టం..ఇన్స్టాలో రిప్లై ఇవ్వండి’అంటూ ఆమెను ఇబ్బందికి గురిచేశాడు. అతను ఏం చేస్తాడోనన్న భయంతో నవ్వుతూ మాట్లాడుతూ.. ఇన్స్టాలో రిప్లై ఇస్తానని చెప్పడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. వ్యక్తిగత పరిమితులను గౌరవించాలని కోరింది.‘ఇటీవల నాకు చాలా విచిత్రమైన అనుభవం ఎదురైంది. నేను బయట మాస్క్ ధరించి ఉన్నప్పుడు, ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి, ‘మీరు అవంతికనేనా?’ అని అడిగాడు. నేను కాదని చెప్పినా, నా ఫోన్ నెంబర్ కావాలని పట్టుబట్టాడు. నేను మర్యాదగా తిరస్కరించినా, అతను వెనక్కి తగ్గలేదు. నా స్నేహితురాలు అతనిని వెళ్ళమని కోరగా, అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత, అతని కారు మమ్మల్ని వెంటాడుతుందని నేను గుర్తించాను. వెంటనే, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశానికి వెళ్లి, తమను ఫాలో అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాను. వెంటనే అతను ఏడవడం ప్రారంభించాడు, 'నాకు మీరంటే ఇష్టం, మేడం' అని చెప్పాడు. ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇవ్వండి అని కూడా అడిగాడు. ఆ సమయంలో నా భద్రత కోసం నేను అంగీకరించడంతో అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నా జీవితంలో చాలా మంది సైకోలను చూశాను, కానీ అతని ప్రవర్తన అంతుకు మించి ఉంది. దయచేసి ఒకరు వద్దంటే గౌరవించండి, పరిమితులను దాటి ప్రవర్తించొద్దు. అభిమాన నటీనటుల పట్ల మర్యాదగా ఉండండి. వారి వ్యక్తిగత జీవితాలను కూడా గౌరవించండి’ అని అనంతిక కోరింది. అవంతిక.. యక్షి- ఫేత్ఫుల్లీ యువర్స్, గర, ఆలమరం వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించింది.ఇంద్రజిత్ ప్రధాన పాత్రలో నటించిన 'ధీరం' సినిమాలో కూడా అవంతిక ముఖ్య పాత్ర పోషించారు. -
2016లోనే నయనతారతో కలిసి నటించా.. హీరోయిన్ ముఖ్యం కాదు: యోగిబాబు
నటుడు యోగి బాబు కథానాయకుడిగా నటించిన 300వ చిత్రం అర్జునన్ పేర్ పత్తు. ఇందులో నటి అనామిక మహీ నాయకిగా నటించింది. ఇందులో కాళీ వెంకట్, అరుళ్ దాస్, లెనిన్ భారతి, సుబ్రహ్మ ణ్యం శివ, మైనా నందిని, మదన్ దక్షిణామూర్తి, సెండ్రాయన్, హలో కందస్వామి, ఎం.సౌందర్య శరవణన్, రంజన్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఆర్.రాజ్ మోహన్ కథ, కథనం బాధ్యతలను చేపట్టారు. ఈ చిత్రాన్ని దేవ్ సినిమాస్ పతాకంపై కతిక తంగపాండి ఎస్.తంగపాండి డీ నిర్మించారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ నెల 17వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్లో ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం చేప ట్టారు. ఇందులో పాల్గొన్న నటుడు యోగి బాబు మాట్లా డు తూ ఇది తాను నటించిన 300వ చిత్రం అని దర్శక నిర్మాతలు ఎలా కనుగొన్నారో తెలియదన్నారు. తనకు సంఖ్య ముఖ్యం కాదని, నటిస్తూనే ఉండాలని అన్నా రు. నాగే శ్, మనోరమ అమ్మ మాదిరి నటించారని తెలిపారు. అదే విధంగా తనను అందరూ కామెడీ నటుడు అంటున్నారని, అదే తనను కాపాడుతోందన్నారు. మరో విష యం ఏమి టంటే తాను 2016 లోనే నయనతారతో కలిసి నటించానని, ఇకపై ఎవరితో నటించలేదన్న చింత లేదన్నా రు. తనకు హీరోయిన్ ఎవరన్నది ముఖ్యం కాదని, కథే ముఖ్యమన్నారు. చిత్ర దర్శకుడు రాజ్ మోహన్ గురించి చెబుతూ ఒకసారి తనని కలిసి కథ చెప్పారని, ఆ తర్వాత మళ్లీ కనిపించలేదని చెప్పారు. రెండేళ్ల క్రితం తానే ఆయనకు ఫోన్ చేసి ఏం చేస్తున్నారు అని అడిగానన్నారు. అందు కు ఆయన తాను చేస్తున్న పని గురించి చెప్ప గా, చెన్నైకి రండి చిత్రం చేద్దాం అని పిలిచానన్నా రు. అలా ఈ చిత్రం ప్రారంభమైనట్లు చెప్పారు. చిత్రం జనరంజకంగా ఉంటుందన్నారు. ఈ చిత్రానికి డీ.ఇమాన్ సంగీతాన్ని అందించారు. -
శ్రీలీల ఇన్స్ట్రాగామ్ ఆదాయం ఎంతో తెలుసా?
తమిళంలో ఒక సామెత ఉంది ప్రభుత్వం ఉద్యోగులకు సంబళం కంటే గింబళం ఎక్కువ అని. అంటే జీతం కంటే పైన వచ్చే ఆదాయమే అధికం అని అర్ధం. అలా ఇప్పుడు మనం హీరోయిన్ల పారితోషికంతో పాటు ఇన్స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా చేతి నిండా సంపాదిస్తున్నారు. అందుకు చిన్న ఉదాహరణ నటి శ్రీలీల. కన్నడ సినీ రంగం నుంచి నటిగా కెరీర్ను ప్రారంభించిన ఈ బ్యూటీ తర్వాత పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్లోకి అడుగు పెట్టారు. అలా తొలి చిత్రంతోనే తన చలాకి నటన, రంజింపజేసే డ్యాన్స్తో కుర్రకారును ఆకట్టుకున్నారు. అలా అక్కడ క్రేజీ హీరోయిన్గా రాణిస్తున్న ఈ భామ పరాశక్తి చిత్రంతో కోలీవుడ్కు పరిచయమయ్యారు. ఇప్పుడు ఇక్కడ కూడా క్రేజీ ఆఫర్లను అందుకుంటున్నారు. ఇకపోతే ఇటీవల బాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా కథానాయకిగా ఎదిగారు. దీంతో కోట్లలో పారితోషికం అందుకుంటున్నారు. యూత్ ఫుల్ క్రేజ్ హీరోయిన్లకు ఇన్స్ట్రాగామ్ ఫాలోవర్స్ మామూలుగా ఉండరు. అలా శ్రీలీలకు 17 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. దానికి ప్రతిఫలాన్ని శ్రీలీల అధికంగానే పొందుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పలు వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తుల ప్రకటనలను శ్రీలీల ఇన్స్ట్రాగామ్లో ప్రచారం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అందుకు రోజుకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు తెలిసింది. అలా ఈ అమ్మడు నెలకు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ సంపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ప్రేమ కబుర్లు
ఇక్కడున్న ఫొటో చూస్తున్నారుగా...కాంపౌండ్ వాల్పై దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటున్నారో! ఈ ప్రేమ కబుర్లు విజువల్గా ‘శ్రీ శ్రీ’లో చూడొచ్చు. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘శ్రీ శ్రీ’ టైటిల్ ఖరారైంది. ‘లవ్ విల్ స్పార్క్ అగైన్’ అనేది క్యాప్షన్. ఈ సినిమాను రవి నెలకుదిటి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘‘ప్రేమ, వినోదం, మనసుని తాకే భావోద్వేగాలను చక్కగా మేళవించిన రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. స్క్రీన్పై హీరో–హీరోయిన్ల మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
అర్జున్ దాస్ లేటేస్ట్ మూవీ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
అర్జున్ దాస్, శాండీ మాస్టర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సూపర్ హీరో బాబు' (తమిళంలో ‘సూపర్ హీరో’). ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత, నిర్మాత కేఎస్ సినిష్ సోల్జర్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్పై సమర్పణలో 'రెడాక్టెడ్ స్టూడియోస్'కు చెందిన శంజన్ జి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీని తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అర్జున్ దాస్కి తెలుగులో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. రీసెంట్గా ఓజీ మూవీతో అందరినీ ఆకట్టుకున్నారు. అలాంటి అర్జున్ దాస్ సూపర్ హీరో బాబు చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా తేజు అశ్విని కనిపించనుంది. ఈ చిత్రంతో విఘ్నేష్ వేణుగోపాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతమందించారు. Super Hero Babu.. Title & Poster 👌 @sinish_s presents #SUPERHERO BABUA commercial family entertainer.@iam_arjundas @iamSandy_Off #SuperHeroBabu pic.twitter.com/XPkx6Rp4kW— H A N U (@HanuNews) July 10, 2026 -
ఆ కేసులో ప్రకాశ్ రాజ్కు బిగ్ రిలీఫ్..!
టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్కు బిగ్ రిలీఫ్ లభించింది. గతంలో ఆయనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ను బెంగళూరు కోర్ట్ రద్దు చేసింది. ప్రకాష్ రాజ్ పలు రాష్ట్రాల్లో ఓటర్ గుర్తింపు కార్డులను కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. తాజాగా ఈ కేసులో ప్రకాశ్ రాజ్కు బెయిల్ మంజూరూ చేసింది. గతంలో కోర్టు నోటీసులకు స్పందించడంలో ఫెయిల్ అయ్యారని నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.ఓటర్ ఐడి కేసులో శుక్రవారం బెంగళూరు కోర్టు ముందు ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు. ఈ కేసులో వాదనలు విన్న న్యాయస్థానం నాన్-బెయిలబుల్ వారెంట్ రద్దు చేస్తూ ప్రకాష్ రాజ్కు బెయిల్ మంజూరు చేసింది. రూ. 4,000 నగదు పూచీకత్తు సమర్పించాలనే షరతు విధించింది. ఈ కేసులో ఎప్పుడూ సమన్లు అందలేదని ప్రకాష్ రాజ్ తరఫు న్యాయవాది వాదించారు.ప్రకాష్ రాజ్ కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో సహా నాలుగు రాష్ట్రాల్లో ఓటర్ ఐడీ కార్డులు కలిగి ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై 2019లో న్యాయవాది దిలీప్ కుమార్ హలసూరు గేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. జాతీయ అవార్డ్ డైరెక్టర్ కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ చెజియాన్(57) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ సంఘటనతో కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. చెన్నైలోని తారామణిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ ప్రముఖులు, అభిమానులు డైరెక్టర్ మృతి పట్ల సంతాపం తెలిపారు. తమిళ సినిమాకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కేవలం డైరెక్టర్గా మాత్రమే కాదు.. సినిమాటోగ్రాఫర్గా రాణించారని కొనియాడుతున్నారు. దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాని పోస్టులు పెడుతున్నారు.కాగా.. తమిళనాడులోని శివగంగైలో జన్మించిన చెజియాన్.. ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత తనకున్న అభిరుచితో సినీ జీవితాన్ని ప్రారంభించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి. శ్రీరామ్ వద్ద సహాయకుడిగా కెరీర్ మొదలెట్టారు. ఆ తర్వాత 2007లో 'కల్లూరి' చిత్రంతో సినిమాటోగ్రాఫర్గా అరంగేట్రం చేశారు. అనంతరం 'రెట్టైసుళి', 'తెన్మెర్కు పరువకాట్రు', 'మగిళ్చి', 'పరదేశి', 'జోకర్' వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. తమిళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'పరదేశి' సినిమాకు గానూ 2013లో లండన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డు లభించింది.ఆ తర్వాత ఆయన 'టు లెట్' అనే చిత్రంతో దర్శకుడిగా అడుగుపెట్టారు. ఈ చిత్రం జాతీయ సీనీ పురస్కారాన్ని గెలుచుకోవడంతో పాటు.. పలు అంతర్జాతీయ ఫెస్టివల్స్లో ప్రశంసలు అందుకుంది. ఆయన సినిమాలతో పాటు రచయితగా కూడా ప్రసిద్ధి చెందారు. ఆయన రచనలు పాఠకులకు ప్రపంచ సినిమాను పరిచయం చేయగా.. ఆయన చిత్రాలు వాస్తవికత, భావోద్వేగం, కళాత్మక నిజాయితీ పట్ల నిబద్ధతను ప్రతిబింబించాయి.His work behind the camera will continue to inspire! His contribution to cinema will always be remembered! Rest in peace, Chezhiyan. 🤍#RIPChezhiyan #AGSCinemas pic.twitter.com/GSGcjgza8A— AGS Cinemas (@agscinemas) July 10, 2026 -
టాక్సిక్లో నయనతార.. అన్ని కోట్లు తీసుకుంటోందా?
కన్నడ స్టార్ యశ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ టాక్సిక్. ఈ మూవీకి గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు వచ్చేనెల 26న థియేటర్లకు రానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లలో భాగంగా ఓ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. అది టీజర్ లాగే విమర్శలకు దారితీసింది. ఓవర్గా రొమాన్స్ ఉండడంతో విమర్శలొస్తున్నాయి.అయితే ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ కాగా.. నయన్ ఓ ప్రధాన పాత్రలో నటించింది. ఈ నేపథ్యంలోనే నయనతార పారితోషికంపై నెట్టంట చర్చ మొదలైంది. అసలు టాక్సిక్ కోసం నయన్ ఎంత తీసుకుందనే దానిపై శాండల్వుడ్తో పాటు కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.అయితే ఈ చిత్రంలోని తన పాత్రకు నయనతార భారీగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి ఏకంగా రూ.15 కోట్లు డిమాండ్ చేసిందని టాక్. ఈ ప్రాజెక్ట్లో నయనతారకు ఎక్కున స్క్రీన్ టైమ్ లేకపోవడంతో మేకర్స్ ఆమె పారితోషికాన్ని తగ్గించుకోవాలని కోరినట్లు సమాచారం. నిర్మాతలతో పలు దఫాల చర్చల తర్వాత నయన్ రూ. 12 కోట్లకు ఓకే చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆమెకు ఎక్కువ స్క్రీన్ టైమ్ లేకపోయినా ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ చెల్లించడం విశేషం. -
కాయదు.. ఆ హీరోతో సినిమా సెట్ అవ్వట్లేదు!
సినిమా రంగంలో ఎవరిని ,ఎప్పుడు అదష్టం వరిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒకే ఒక్క హిట్ వస్తే చాలు వరస అవకాశాలు తలుపుతడతాయి. హీరోయిన్ కాయదు లోహర్ విషయంలోనూ ఇదే జరిగింది. కన్నడం, తెలుగు చిత్రాలతో తొలుత ఉనికి చాటుకున్న ఈ అమ్మడు.. తమిళంలో చేసిన 'డ్రాగన్' మూవీతో సంచలన విజయాన్ని సాధించింది. అంతే కాయదుకు సడన్ క్రేజ్ వచ్చేసింది. అదేచిత్రంలో నటించిన అనుపమకు రాని క్రేజ్ కాయదుని వరించింది. నిజం చెప్పాలంటే 'డ్రాగన్' తర్వాత ఈమెకు హిట్ పడలేదు. కానీ క్రేజ్ మాత్రం తగ్గలేదు. అవకాశాలు వరుస కడుతున్నాయి.(ఇదీ చదవండి: 'ఐ, నోబడీ' మూవీ రివ్యూ)ప్రస్తుతం ఈమె తమిళంలో 'ఇమ్మోర్టల్', మారి సెల్వరాజ్ 'మంజనది', మలయాళంలో 'ఐ యామ్ గేమ్', తెలుగులో 'ది ప్యారడైజ్' మూవీస్ చేస్తోంది. తాజాగా సూర్య చిత్రంలోనూ నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇలా బిజీగా ఉన్న కాయదు లోహార్ని ఇంతకుముందే శింబుతో రొమాన్స్ చేసే అవకాశం వరించింది. ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ ప్రారంభం కాకపోవడంతో అందులో నుంచి కాయదు డ్రాప్ అయిందని టాక్ నడిచింది.ఇదే విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కాయదు మాట్లాడుతూ.. శింబుకు జంటగా నటించే అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో ఒక కారణంతో ఆ చిత్రం ఆగిపోతోందని చెప్పుకొచ్చింది. దీంతో తాను ఆయనతో కలిసి నటించిన చిత్రం కచ్చితంగా ప్రత్యేకంగా ఉంటుందని నమ్ముతున్నానని పేర్కొంది. ఆ చిత్రం విధి చేతిలో ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆమె అభిమానులు మాత్రం త్వరలోనే శింబుతో జోడీకడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. (ఇదీ చదవండి: అఖిల్ 'లెనిన్' ట్విటర్ రివ్యూ) -
హీరోకి బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్.. దర్శకుడికి గోల్డ్ చెయిన్
తమిళ హీరో విష్ణు విశాల్ లేటెస్ట్ సినిమా 'గట్ట కుస్తీ 2'. ఐసరి గణేష్తో పాటు విష్ణు విశాల్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి సెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. గత వీకెండ్ థియేటర్లలో రిలీజైన ఈ మూవీ అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుని కోట్ల కొద్ది కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం మధ్యాహ్నం చైన్నెలోని థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.(ఇదీ చదవండి: 'ఐ, నోబడీ' మూవీ రివ్యూ)ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఐసరి గణేష్ మాట్లాడుతూ తాను ఈ చిత్రం పూజా కార్యక్రమాలు, ఆడియో విడుదల కార్యక్రమానికి, ఇప్పుడు సక్సెస్ మీట్ మాత్రమే హాజరయ్యానన్నారు. మిగతాదంతా విష్ణు విశాల్నే చూసుకున్నాడు. విష్ణు విశాల్ మాట్లాడుతూ ఐసరి గణేష్ తనపై ఉంచిన నమ్మకం, ఇచ్చిన స్వేచ్ఛనే ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణమని అన్నాడు. తన 18 ఏళ్ల సినీ ప్రస్థానంలో తనకు దక్కిన తొలి సక్సెస్ క్రెడిట్ ఈ చిత్రమేనని విష్ణు విశాల్ పేర్కొన్నాడు. కాగా ఈ చిత్ర విజయాన్ని పురస్కరించుకుని నిర్మాత గణేష్.. యూనిట్ సభ్యులకు ఒక్కొక్కరికి 40 గ్రాముల వెండి పలకాన్ని బహుమతిగా ఇచ్చారు. అలానే దర్శకుడు సెల్లా అయ్యావుకు 10 గ్రాముల బంగారు గొలుసు, బ్రాస్లెట్ని అందించారు, విష్ణు విశాల్కు ఖరీదైన బీఎండబ్ల్యూ కారుని బహుమతిగా అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: అఖిల్ 'లెనిన్' మూవీ ట్విటర్ రివ్యూ) View this post on Instagram A post shared by M VIGNESH (@wikkitalks_official) View this post on Instagram A post shared by Rahul 😉 (@_sm_rahul) -
నువ్వు అఖిల్ అయితే నేను నాగార్జున.. హీరోకి షాకిచ్చిన అపరిచితుడు
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమా జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నేడు (శుక్రవారం) తెల్లవారుజామున 5 గంటల షోతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి యూఎస్ ప్రీమియర్స్ ముందుగానే ప్రారంభం కానున్నాయి. సినిమా ప్రమోషన్స్లో భాగంగా అఖిల్, గెటప్ శ్రీనుతో కలిసి చేసిన ఓ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీ తాగుతూ, మస్క్ బన్ తింటూ ఇద్దరూ సరదాగా ముచ్చటిస్తూ ఈ ఇంటర్వ్యూలో ఓ అపరిచితుడికి ప్రాంక్ కాల్ చేశారు. ఆ ప్రాంక్ కాల్లో.. అఖిల్ నేను అఖిల్ అక్కినేనిని మాట్లాడుతున్నానని చెప్పగా, దానికి అవతలి వ్యక్తి వెంటనే నేను నాగార్జునను మాట్లాడుతున్నానంటూ కౌంటర్ ఇచ్చాడు. అఖిల్ నిజంగానే తనతో మాట్లాడుతున్నాడని చెప్పినా కూడా ఆ వ్యక్తి నమ్మకుండా నాగ చైతన్య ఇప్పుడు ఎలా ఉన్నాడో చెప్పు అంటూ మరింత సెటైర్ చేశాడు. అంతేకాక, ఆ వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు వాయిస్ను మిమిక్రీ చేస్తూ “నా మనవడి వాయిస్ నేను గుర్తుపట్టలేను అనుకుంటున్నావా నాన్నా అఖిల్” అని మరో పంచ్ వేశాడు. అనంతరం అఖిల్ పక్కనే ఉన్న గెటప్ శ్రీను ఫోన్ అందుకుని నేను గెటప్ శ్రీను అన్నా అని చెప్పగా, ఆ వ్యక్తి వెంటనే నేను సుధీర్.. ఏంటో చెప్పండి అంటూ మరోసారి సెటైర్ చేశాడు. ఎంత చెప్పినా అతడు నమ్మకపోవడంతో అఖిల్, శ్రీను నవ్వుకుంటూ కాల్ కట్ చేశారు. కొద్దిసేపటికి ఆ వ్యక్తి తిరిగి కాల్ చేసి ఎవరు మీరు? ఎందుకు ఫోన్ చేశారు? అని అడగడం వీడియోలో కనిపించింది. ఈ సరదా ప్రాంక్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ మూవీ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూడేళ్ల గ్యాప్ తర్వాత అఖిల్ నుంచి వస్తోన్న సినిమా ఇదే కావడంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. -
విజయ్ జన నాయగన్.. రిలీజ్కు ఆల్ క్లియర్..!
దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ జన నాయగన్. ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పటి వరకు థియేటర్లలోకి రాలేదు. సెన్సార్ సమస్యలతో పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. రాజకీయాల్లోకి ఎంట్రీకి ముందు విజయ్ నటించిన చివరి చిత్రమిదే. విజయ్ సీఎం అయినా కూడా ఇంకా విడుదల కాలేదు.తాజాగా ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ మూవీ రన్టైమ్ 183 నిమిషాలుగా నిర్ణయించింది. గతంలో సెన్సార్ సమస్యల వల్లే ఆ మూవీ రిలీజ్ ఆగిపోయింది. తాజాగా ఆ సమస్య క్లియర్ కావడంతో ఈ నెల 24న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ రిలీజ్ డేట్పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు.కాగా.. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ప్రేమలు బ్యూటీ మమిత బైజు, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. OFFICIAL: #JanaNayagan Censored "🅰️"DURATION : 3 Hours 3 Minutes 11 Seconds📌LINK: https://t.co/M7W87PlkKV pic.twitter.com/ar4JpmMQQ8— Actor Vijay Team (@ActorVijayTeam) July 9, 2026 -
జన నాయగన్.. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్..!
దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం జన నాయగన్. సంక్రాంతి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యలతో ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. విజయ్ సీఎం అయ్యాక కూడా ఈ మూవీ విడుదలకు నోచుకోలేదు. జన నాయగన్ రిలీజ్ డేట్పై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.అయితే తాజాగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ జన నాయగన్ విడుదల తేదీని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈనెల 24న థియేటర్లలో సందడి చేయనుందని పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. కెనడాలో జన నాయగన్ రిలీజ్ చేస్తున్నట్లు యార్క్ సినిమాస్ ప్రత్యేక పోస్టర్ను షేర్ చేసింది. ఎట్టకేలకు ఆరు నెలల తర్వాతనైనా జన నాయగన్ థియేటర్లలో సందడి చేయనుంది.పాలిటిక్స్లో ఎంట్రీకి ముందు ఇదే నా చివరి సినిమా అని విజయ్ ప్రకటించాడు. ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు హీరోయిన్లుగా నటించారు. 🔥 Finally! Our Own Thalapathy Vijay is ready to set the big screen on fire with #JanaNayagan💥🇨🇦 Canada Release by York Cinemas🎬 Igniting screens from July 24.Get ready for the ultimate theatrical celebration. Stay tuned for tickets 🎫#thalapathyvijay #yorkcinemas pic.twitter.com/CcyiZAZqUp— York Cinemas (@yorkcinemas) July 8, 2026 -
ధనుష్ మరొకటి.. మామూలు స్పీడ్ కాదు ఇది
పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ నటుడు ధనుష్. ఈయన నటనతో పాటు కథకుడు, గాయకుడు, దర్శకుడు, నిర్మాత ఇలా పలు బాధ్యతలు సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నాడు. చేతినిండా సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ధనుష్ ప్రస్తుతం 'ఓమ్' అనే యాక్షన్ మూవీ చేస్తున్నాడు. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకుడు. ఇదలా ఉండగానే మరొకటి ప్రాజెక్ట్ ప్రకటించాడు.(ఇదీ చదవండి: అక్కినేని హీరోకి అగ్నిపరీక్ష.. 11 ఏళ్లుగా వెయిటింగ్)ఇందులో డీ,వీ అనే ఇంగ్లీష్ అక్షరాలు, 10–07–26 అనే తేదీ మాత్రమే ఉన్నాయి. ధనుష్ తదుపరి మూవీ సత్యజ్యోతి సంస్థలో చేయబోతున్నట్లు చాలారోజులుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఈ పోస్టర్లో వీ అనే అక్షరానికి దర్శకుడు వెంకట్ ప్రభు అనే ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ జాన్వీ కపూర్ అని, విలన్ ఎస్జే సూర్య అని ప్రచారం సాగుతోంది. మరోవైపు '12th ఫెయిల్'తో ఆకట్టుకున్న విదు వినోద్ చోప్రా పేరు కూడా వినిపిస్తోంది. మరి ధనుష్తో పనిచేసే ఆ దర్శకుడు ఎవరు?(ఇదీ చదవండి: ప్రేమ పేరుతో నాలుగేళ్లు నా వెంటపడ్డాడు: హీరోయిన్ అంజలి) -
ప్రేమ పేరుతో నాలుగేళ్లు నా వెంటపడ్డాడు
ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒక దశలో ప్రేమ ఉంటుంది. కొందరు దాన్ని బయటకు చెప్పుకొంటారు. కొందరు మనసులోనే రహస్యంగా ఉంచుకుంటారు. సినిమా వాళ్లు దీనికి అతీతం కాదు. చాలామంది హీరోయిన్లు తన చిన్నప్పటి ప్రేమ సంగతుల్ని ఎప్పటికప్పుడు గుర్తుచేసుకుంటూనే ఉంటారు. హీరోయిన్ అంజలికి అలాంటి చిన్న లవ్ స్టొరీ ఉందట.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ 'కలర్స్' స్వాతి)2006లో 'కట్రదు తమిళ్' సినిమాతో కథానాయికిగా తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన అంజలి.. తర్వాత వరుసగా అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ అయింది. ఎంగేయుమ్ ఎప్పోదుమ్, కలగలప్పు లాంటి సక్సెస్ఫుల్ చిత్రాలు ఈమె ఖాతాలో ఉన్నాయి. తెలుగులోనూ పలు మూవీస్ చేసి హిట్స్ అందుకుంది. చిన్న గ్యాప్ తరువాత కోలీవుడ్లో' మకుటం'లో నటించింది. విశాల్ హీరోగా నటించి తొలి సారిగా దర్శకత్వం వహించిన చిత్రమిది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అంజలి.. టీనేజీలో తన జీవితంలో జరిగిన ప్రేమ సంఘటన గురించి చెప్పింది. నా క్లాస్ మేట్ ఒకరు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. దానికి ఫుల్స్టాప్ పెట్టాలని భావించి, నువ్వు అంటే ప్రేమ లేదని చెప్పా. దాంతో అతను నీకు ధైర్యం ఉంటే నాకు రాఖీ కట్టు అని అన్నాడు. వెంటనే నేను రాఖీ కట్టేసరికి షాక్ అయినా అతడు.. వెంటనే దాన్ని తీసిపారేసి వెళ్లిపోయాడు. తర్వాత మేం ఎప్పటికీ కలుసుకోలేదు అని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: అక్కినేని హీరోకి అగ్నిపరీక్ష.. 11 ఏళ్లుగా వెయిటింగ్) -
రూమర్స్ ఆపండి.. ప్రభాస్ సినిమాలపై టీమ్ క్లారిటీ
ప్రభాస్ కొత్త సినిమాలపై పుకార్లు ఆపాలని అతడి టీమ్ స్పష్టత ఇచ్చింది. ప్రతి నెలా కొత్త దర్శకుల పేర్లు వినిపిస్తున్నా, ప్రస్తుతం ప్రభాస్ ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అతడి సన్నిహితులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయడానికే ఆయన రెస్ట్ లేకుండా పని చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో మరిన్ని సినిమాలు ప్రకటించి తనపై ఒత్తిడి పెంచుకోవడం ఇష్టపడడంలేదని వారు తెలిపారు. అంతే కాదు హోంబలే ఫిలిమ్స్ మంచి స్టోరీలైన్తో ప్రభాస్ను సంప్రదించారట. దానికి కూడా ప్రభాస్ నో చెప్పేశాడట. దాని కోసం నిర్మాతలు రెండేళ్లు వెయిట్ చేస్తామని చెప్పినా కూడా ప్రభాస్ తన ప్రస్తుత ఫోకస్ను మార్చకుండా వారించాడని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు ఫౌజీ, స్పిరిట్, కల్కి-2, సలార్-2. ఈ నాలుగు సినిమాలపై ప్రభాస్ పూర్తి దృష్టి పెట్టనున్నాడు. అంతకుముందు నెల్సన్, లోకేశ్ కనగరాజ్ పేర్లు కూడా వినిపించినా, అవన్నీ పుకార్లేనని తన టీమ్ చెబుతోంది. -
సినిమా సూపర్ హిట్.. డైరెక్టర్కి కాస్ట్లీ కారు గిఫ్ట్
సినిమా హిట్ అయితే హీరోలకు లేదా దర్శకులకు నిర్మాత.. కారు గిఫ్ట్ ఇవ్వడం లాంటివి టాలీవుడ్లో చూస్తూనే ఉంటాం. మిగతా ఇండస్ట్రీల్లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పుడు అలా తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నిర్మాతగానూ అడపాదడపా మూవీస్ చేస్తుంటాడు. అలా ఈ ఏడాది ఓ మూవీ నిర్మించగా అది ఊహించని సక్సెస్ అందుకుంది. ఇప్పడా చిత్ర దర్శకుడికే ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ 'కలర్స్' స్వాతి.. ఫొటోలు వైరల్)రాధిక ప్రధాన పాత్రలో శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించిన సినిమా 'థాయ్ కిళవి'. ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో థియేటర్లలో రిలీజైంది. రీసెంట్గానే విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఫైనల్ రన్ పూర్తి చేసుకుని మొత్తంగా రూ.80 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ అంతా కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం నిర్మాత శివకార్తికేయన్.. దర్శకుడు శివకుమార్కి రూ.20 లక్షలు విలువ చేసే మహీంద్రా బీఈ6 కారుని బహుకరించాడు.ఇకపోతే శివకుమార్ మురుగేశ్ ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా 'సెయాన్' అనే సినిమాని తీస్తున్నాడు. కుమారస్వామి నేపథ్య కథతో దీనిని తెరకెక్కిస్తున్నారు. కమల్ హాసన్ నిర్మాత కాగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్.(ఇదీ చదవండి: ఓటీటీలో సూపర్ హిట్ సినిమా 'తాయ్ కిళవి' తెలుగు రివ్యూ) View this post on Instagram A post shared by Sivakarthikeyan Productions (@skprodoffl) -
వెండితెరపై మరో మహానుభావుడి బయోపిక్.. టైటిల్ రోల్లో మాధవన్!
భారత దిగ్గజ ఆవిష్కర్త కోయంబత్తూర్ కు చెందిన జీడీ నాయుడు గురించి ఈ తరం వారికి పెద్దగా తెలిసి ఉండక పోవచ్చు. ఆయన (1893–1974) కాలంలోనే ఎడిషన్ ఆప్ ఇండియా, వెల్త్ క్రయేటర్ ఆఫ్ కోయంబత్తూర్ గా ప్రసిద్ధి స్వయం కృషితో ఎదిగిన గొప్ప ఆవిష్కర్త, పారిశ్రామిక వేత్త, విద్యా సేవకుడు. దక్షిణ భారత పారిశ్రామిక అభివద్ధికి బలమైన పునాదులు వేశారు. భారత దేశంలో తొలి ఎలక్ట్రిక్ మోటార్,రాసంట్ రేజర్, ఓటు నమోదు యంత్రం, 1952లో రూపొందించిన రెండు సీట్ల పెట్రోల్ కారు వంటి పలు ఆవిష్కరణల కర్త ఈయన. సర్ సీవీ.రామన్, సర్ ఎం.విశ్వేశ్వరయ్య, డా.అంబేడ్కర్ వంటి మహానీయులు ప్రశంసలు అందుకున్న గొప్ప ఆవిష్కర్త జీడీ.నాయుడు. 1967లోనే పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన జీడీ నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా ఇప్పుడు జీడీఎన్ పేరుతో చిత్రం రూపొందడం విశేషం. ఈ చిత్రంలో నటుడు మాధవన్ టైటిల్ పొత్రను పోషించడం మరో విశేషం.నటుడు సత్యరాజ్, ప్రియమణి, దంషారా విజయన్, వినయ్ రాయ్, తంబి రామయ్య,నందలాల్, షీలా,కరుణాకరన్,మురళిధరన్,అతిది బాలన్ మొదలగు పలువురు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను కష్ణకుమార్ రామ్ కుమార్ నిర్వహించారు. వర్గీస్ మూలన్, విజయ్ మూలన్, మాధవన్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి అరవింద్ కమలనాధన్ ఛాయాగ్రహణం, గోవింద్ వసంత్ సంగీతాన్ని అందించారు.నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇటీవల కోయంబత్తూర్ లోని ప్రసిద్ధి చెందిన కరీ మోటార్ స్పీడ్ వే లో ఘనంగా నిర్వహించారు. నటుడు, నిర్మాతల్లో ఒకరైన మాధవన్ మాట్లాడుతూ ‘‘ జీడీ నాయుడు కేవలం ఆవిష్కర్త మాత్రమే కాదు .ఆయన గొప్ప దూరదృష్టి కలిగిన వ్యక్తి. అసాధారణ విజయాలను సాధించిన మహానుభావుడు.అంతకంటే ముఖంగా నిజమైన దేశభక్తుడు.ఆయన సేవలు అన్ని రంగాల్లోనూ విస్తరించాయి.అంతటి అద్భుతమైన జీవిత చరిత్ర తమిళనాడుకే కాకుండా దేశమంతటికి తెలియాల్సిన అవసరం ఉందని భావించాం.అదే జీడీఎన్ చిత్రం.’’ అని మాధవన్ పేర్కొన్నారు. -
20 ఏళ్ల తర్వాత తమన్ ఎంట్రీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ నటుడిగా వస్తోన్న చిత్రం హృదయం మురళి. ఆకాశ్ భాస్కరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్ఎస్ తమన్ కీలక పాత్ర పోషించారు. తమిళంలో ఇదయం మురళి పేరుతో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో హృదయం మురళిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీలో ప్రీతి ముకుందన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రాన్ని లవ్ అండ్ రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాలేజీ సీన్స్ చూస్తుంటే యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ కథగా కనిపిస్తోంది. ఈ మూవీకి తమనే సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రం జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. 20 ఏళ్ల క్రితం శంకర్ దర్శకత్వం వహించిన బాయ్స్ చిత్రంలో తమన్ నటించిన సంగతి తెలిసిందే. -
ఓటీటీకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. ఏకంగా 5 ఓటీటీల్లోకి..!
ఓటీటీలు వచ్చాక సినిమాలు తెగ చూసేస్తున్నారు. కొత్త కంటెంట్ దొరికితే చాలు భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తున్నారు. ఓటీటీల్లో ముఖ్యంగా మలయాళ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటోంది. తాజాగా మరో మలయాళ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ఇటీవలే రిలీజైన మలయాళ మిస్టరీ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ డోస్. ఈ చిత్రానికి అభిలాష్ ఆర్ నాయర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సిజు విల్సన్, జగదీష్, అశ్విన్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు చేశారు మేకర్స్. జూలై 10 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్తో పాటు సింప్లీ సౌత్, ఆహా తమిళం, మనోరమ మ్యాక్స్, లయన్స్ గేట్ ప్లే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది.#Dose (Malayalam) streaming from July 10 on PrimeVideo, SimplySouth, AhaTamil, ManoramaMax,LionsGatePlay 🍿!!#OTT_Trackers pic.twitter.com/0fKM8KFcYY— OTT Trackers (@OTT_Trackers) July 7, 2026 -
ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయితే ఇలా ఉంటుంది
ఏ భాషలో చూసుకున్నా సరే ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ లేకపోతే ఏ సినిమాలు కూడా నిలబడవు. అభిమానులు, మూవీ లవర్స్ నుంచి మహా అయితే కొన్ని కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే వస్తాయి. అదే కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వస్తే లెక్క వేరే ఉంటుంది. రీసెంట్ టైంలో తెలుగులో అలా 'మా ఇంటి బంగారం' కనెక్ట్ అయింది. హిట్ అయింది. ఇప్పుడు దీనిలా తమిళంలో ఓ మూవీ.. ఫ్యామిలీ ఆడియెన్స్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తోంది. ఇంతకీ దీని సంగతేంటి?(ఇదీ చదవండి: బతికుండగా పట్టించుకోలేదు.. ఇప్పుడు నెరవేర్చారు)తమిళ హీరో విష్ణు విశాల్ తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే. పలు డబ్బింగ్ చిత్రాలతో వచ్చాడు. దీనికంటే తెలుగు షట్లర్ గుత్తా జ్వాల భర్తగానే చాలామందికి తెలుసు. ఇతడు హీరోగా నటించిన 'మట్టీ కుస్తీ' అనే సినిమా 2022లో రిలీజైంది. హీరో రవితేజ దీని నిర్మాణంలో భాగమయ్యాడు. కానీ ఇదేమంత సక్సెస్ కాలేదు. ఇలాంటి చిత్రానికి సీక్వెల్ తీస్తారని ఎవరైనా అనుకుంటారా? కానీ విష్ణు విశాల్ తీశాడు. అదే 'గట్ట కుస్తీ 2'. ఈసారి తమిళం వరకు మాత్రమే విడుదల చేశారు.గత వీకెండ్ థియేటర్లలో రిలీజ్ చేయగా యావరేజ్, పర్లేదు అనే రివ్యూలు ఎక్కువగా వచ్చాయి. కానీ కుటుంబ ప్రేక్షకులకు ఇది కనెక్ట్ అయిపోయింది. దీంతో మూడు రోజుల్లోనే రూ.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. విష్ణు విశాల్ మార్కెట్కి ఇది చాలా ఎక్కువ. అసలు ఇది హిట్ అవుతుందని కూడా ఊహించి ఉండరు. అలాంటిది చూస్తుంటే ఇప్పుడు బ్లాక్ బస్టర్ వసూళ్లు తెచ్చుకునేలా కనిపిస్తోంది.ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ ఉంటే యావరేజ్ సినిమాకు వసూళ్లు ఎంతలా వస్తాయనేది 'గట్ట కుస్తీ 2' నిరూపిస్తోంది. ఇంటర్వెల్ తర్వాత హీరోహీరోయిన్ల మధ్య వచ్చే కుస్తీ ఫైట్, మూవీలోని కామెడీని ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. మరి దీనిని తెలుగు డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారా? లేదంటే ఓటీటీలోకి వచ్చినప్పుడు తెలుగు వెర్షన్ అందుబాటులోకి తీసుకొస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సూపర్ గర్ల్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
బతికుండగా పట్టించుకోలేదు.. ఇప్పుడు నెరవేర్చారు
తమిళ చిత్రసీమలో భాగ్యరాజ్.. అత్యుత్తమ కథా రచయిత, దర్శకుడిగా గుర్తింపు పొందారు. 25కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు 75కి పైగా సినిమాల్లో నటించారు. అలాంటి ఈయన అకస్మాత్తుగా కొన్నిరోజుల క్రితం గుండెపోటుతో మరణించారు. సినీ ప్రముఖుల దగ్గర నుంచి అభిమానుల వరకు నివాళి అర్పించారు. ఇకపోతే ఈయన ఎప్పటినుంచో కోరుకున్న విషయాన్ని ప్రముఖ రచయిత వైరముత్తు నెరవేర్చారు.(ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టిస్తున్న భాగ్యరాజ్ చివరి లెటర్)ఇటీవల కన్నుమూసిన తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్.. గతంలో తన స్వీయచరిత్రాన్ని పుస్తకంగా రాశారు. దానికి ముందు మాట రాయాలని ప్రముఖ గీత రచయిత వైరముత్తుని కోరుతూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కానీ భాగ్యరాజ్ బతికుండగా అది జరగలేదని, ఇప్పుడు ఆ పుస్తకానికి ముందు మాట రాసి భాగ్యరాజ్ కోరికని నెరవేర్చినట్లు వైరముత్తు చెప్పారు. ఆయన భార్య పూర్ణిమ భాగ్యరాజ్, కొడుకు శాంతను భాగ్యరాజ్ కి సదరు ప్రతిని అందించినట్లు వెల్లడించారు.భాగ్యరాజ్ చనిపోయిన తర్వాత ఆయన చివరి లెటర్ అంటూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'మీ ప్రేమతో నిండిన చూపుల కోసం నా కళ్లని సజీవంగా ఉంచండి. దయచేసి వాటిని జాగ్రత్తగా చూసుకోండి. జీవితంతం నాకు అందించిన ప్రేమ, ఆదరణ ఇకపై శాంతనుకు కూడా అందించండి. నేను శారీరకంగా లేకపోయినప్పటికీ దానం చేసిన కళ్ల ద్వారా అభిమానులని చూస్తూనే ఉంటాను' అని ఈయన రాసినట్లు అందులో ఉంది.(ఇదీ చదవండి: తమిళ రాజకీయాల్లోకి స్టార్ హీరో ధనుష్.. ఎంట్రీ ఫిక్స్ అయిందా?) -
అప్పుడు విలన్ ఇప్పుడు హీరోయిన్
స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.. ఇప్పుడు హీరో, నిర్మాతగానూ రాణిస్తున్నాడు. ఈయన లీడ్ రోల్ చేసిన 'డీసీ' ఈ నెల చివరలోనే రిలీజ్ రానుంది. జీ స్క్వాడ్ పేరుతో నిర్మాణ సంస్థ స్థాపించి యంగ్ డైరెక్టర్లతో పలు చిత్రాల్ని తీస్తున్నాడు. ఈయన నిర్మిస్తున్న 'బెంజ్', 'ఫైట్ క్లబ్' నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా మరో చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి విశాల్ వెంకట్ దర్శకుడు.విశాల్ వెంకట్ ఇంతకు ముందు సిరి నేరంగలిల్ సిల మనిదర్గళ్, బాంబ్ వంటి వైవిధ్య భరితమైన చిత్రాలను తెరకెక్కించారు. ఈయన ఇప్పుడు మహిళా నేపథ్య కథాచిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో రెజీనాని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో తమిళంలో అజిత్ 'విడాముయర్చి'లో రెజీనా విలన్గా చేసింది. చిన్న గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు దర్శకుడు లోకేష్ కనకరాజ్ నిర్మాణంలో నటించనుంది.విశేషం ఏమిటంటే లోకేష్ కనకరాజ్ తొలి మూవీ 'మానగరం'లో రెజీనానే హీరోయినే. తాజాగా రూపొందనున్న చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా మూవీతో బిజీగా ఉన్నాడు. -
రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో.. ఎంట్రీ ఫిక్స్..!
తమిళనాడు రాజకీయాల్లో కోలీవుడ్ హీరో విజయ్ ప్రభంజనం సృష్టించాడు. పోటీ చేసిన తొలిసారే ఏకంగా సీఎం పీఠంపై కూర్చున్నారు. అత్యధిక సీట్లు గెలిచిన విజయ్.. ఇతర పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. సినీ గ్లామర్తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్.. కమల్ హాసన్ లాంటి స్టార్స్కు సాధ్యం కానీ ఫీట్ సాధించారు.ఇక విజయ్ గెలుపుతో ద్రవిడ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. సినీ స్టార్స్ వరుసగా రాజకీయ అరంగేట్రానికి రెడీ అవుతున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ ధనుశ్ సైతం ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా ఆయన అభిమాన సంఘం ఓ కార్యక్రమంలో అధికారిక జెండాను ఆవిష్కరించారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునివ్వడం ధనుశ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారన్న వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది.దళపతి విజయ్ లాగే ధనుశ్ సైతం రాజకీయాల్లో అడుగు పెడతారనే చర్చ కోలీవుడ్లో ఊపందుకుంది. వచ్చే ఎన్నికల కల్లా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పక్కా ప్లాన్కో ఎంట్రీ ఇస్తారని ప్రచారం నడుస్తోంది. తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తల వేళ.. ధనుష్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రిలీజ్ చేయలేదు. -
దిగ్గజ సెలబ్రిటీ ఇంటి నుంచి కొత్త హీరో
కోలీవుడ్లో మరో వారసుడి అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. దివంగత మ్యూజిక్ కంపోజర్ ఆర్డి.భాస్కర్ వారసుడు జైయన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుల్లో ఆర్డి భాస్కర్ ఒకరు. మ్యూజిక్ కంపోజర్గా పేరుగాంచిన ఈయన పలువురు సినీ ప్రముఖులతో కలిసి పనిచేశారు. తమిళ చిత్ర పరిశ్రమతో ఎంతో అనుబంధం కలిగిన ఈయన వారసుడు జైయన్.జైయన్ హీరోగా చేస్తున్న సినిమాకు 'రాజాస్ ప్లే లిస్ట్' అని ఇళయరాజాని గుర్తుచేసేలా టైటిల్ పెట్టారు. దీనికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. రమణన్ బాలగంగాధర్ నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు కథ అందిస్తున్న ఈ చిత్రంతో సుజిత్ ఎన్.సుబ్రమణియమ్ డైరెక్టర్గా పరిచయమవుతున్నారు.జైయన్కు జంటగా సోనా ఒలికల్ నటిస్తోంది. ఇతర పాత్రల్లో వాగై చంద్రశేఖర్, గురు సోమసుందరం తదితరులు కనిపించనున్నారు. షూటింగ్ చైన్నెలో ఆదివారం జరిగిన పూజ కార్యక్రమంతో ప్రారంభమైంది. ఇది మంచి మ్యూజికల్ డ్రామా చిత్రంగా ఉంటుందని నిర్మాత పేర్కొన్నారు. మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
'డ్యూడ్' కాంబో రిపీట్.. కొత్త సినిమాకు ఏకంగా ఆరుగురు డైరెక్టర్లు
లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుని.. వీటన్నింటితోనూ చెరో రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకున్న తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్.. రీసెంట్ టైంలో 'ఎల్ఐకే' మూవీతో తొలి ఫ్లాప్ చూశారు. దాని సంగతి పక్కనబెడితే తాను హీరోగా చేయబోతున్న కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. ఈ మేరకు అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)హీరో కాకముందు ప్రదీప్ రంగనాథన్.. షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. 'కోమలి' మూవీతో దర్శకుడిగా మారాడు. 'లవ్ టుడే' చిత్రానికి కూడా ఇతడే దర్శకుడు. మళ్లీ చాన్నాళ్ల తర్వాత తన మూవీ తానే స్టోరీ రాశాడు. అదే ఈ ప్రాజెక్ట్. దీనితోనే నిర్మాతగానూ మారాడు. తన దగ్గర పనిచేసిన ఆరుగురు కుర్రాళ్లని 'ద ఆల్ఫా టీమ్' మార్చి దీనికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు.ఇకపోతే ఈ మూవీలో 'డ్యూడ్' కాంబో రిపీటైంది. ప్రదీప్ రంగనాథన్-మమిత బైజు హీరోహీరోయిన్లుగా కాగా లేటెస్ట్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నాడు. తెలుగు నటుడు శివాజీతో పాటు శ్వాసిక, అశ్వత్ మారిముత్తు కీలక పాత్రలు చేయనున్నారు. అనామిక మహి అనే అమ్మాయిని ఈ మూవీతో హీరోయిన్గా పరిచయం చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: అప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా: కమల్ హాసన్) -
రజనీకాంత్ రీల్ కోడలికి హీరోయిన్గా మరో ఛాన్స్
తమిళ నటుడు అరుణ్ విజయ్.. ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గానూ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. 1995లో 'మురై మాప్పిళై' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అలా మూడు దశాబ్దాలుగా దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్నాడు. 'బ్రూస్ లీ', సాహో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. తడం, కుట్రం 23 ,మాఫియా , సెక్క సివంద వానం వణంగాన్ వంటి పలు చిత్రాలను కథానాయకుడుగా తన నటనా ప్రతిభకు ప్రదర్శించిన ఈయన రీసెంట్ టైంలో 'రెట్ట తల' చిత్రంలో ద్విపాత్రాభినయం చేశాడు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. మేకర్స్కి తమిళ నేత వార్నింగ్)అరుణ్ విజయ్ ఇంతకు ముందు నటించిన 'పార్టనర్' అనివార్య కారణాల వల్ల ఇంకా రిలీజ్ కాలేదు. తాజాగా ఈయన ముత్తయ్య దర్శకత్వంలో హీరోగా చేస్తున్న కొత్త మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కుట్టి పులి, కొంబన్, మరుదు, విరుమన్ వంటి చిత్రాలతో ముత్తయ్య ఫేమస్. ఇందులో నటుడు అరుణ్ విజయ్ జంటగా 'జైలర్' ఫేమ్ మిర్నా మీనన్ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇంతకుముందు పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రలు పోషించిన మిర్నా.. హీరోయిన్గా ఇది మంచి అవకాశమే అవుతుంది.ఇప్పటివరకు తెలుగు, తమిళ, మలయాళంలో హీరోయిన్గా పలు సినిమాలు చేసిన ప్రస్తుతానికైతే 'జైలర్ 2'లో రజనీకాంత్ కోడలి పాత్రలో, డాన్ బాస్కో అనే తెలుగు చిత్రంలో నటిస్తోంది. దాదాపు రెండేళ్ల తర్వాత తమిళంలో హీరోయిన్గా అవకాశమొచ్చినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: అప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా: కమల్ హాసన్) -
అప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా: కమల్ హాసన్
జీవితం అంటే కేవలం సోషల్ మీడియా రీల్స్ మాత్రమే కాదు. నేటి యువత, విద్యార్థులు మంచి రాజకీయాలపై అవగాహన పెంచుకోవాలి అని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, తమిళ హీరో కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. విల్లుపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈయన, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తనకు రాజకీయాలు నేర్పిన వారు, తన లాంటి వారు, తందై పెరియార్ చేసిన రాజకీయాలనే చేస్తున్నారని అన్నారు. అందుకే రాజకీయమే తన వృత్తిగా మార్చుకున్నానని పేర్కొన్నారు.(ఇదీ చదవండి: ఆ ఒక్క కారణం వల్లే 'అబ్సెషన్' చూశారు)తాను ప్రజల కోసం పనిచేయడానికి వచ్చానని చెప్పి నాటకాలు ఆడాలనుకోవడం లేదని అన్నారు. సమాజంలో అవినీతి ఉందని చెబితే సరిపోదని, ఎవరైనా లంచాలు తీసుకుంటుంటే, అందులో ఇచ్చే వారి ప్రమేయం కూడా ఉంటుందన్నారు. లంచం ఇస్తే, తీసుకునే చేయి మరింత బలపడుతుందని స్పష్టం చేశారు. తాను చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పుడు నేరుగా స్టార్గానో, దర్శకుడిగానో రాలేదన్నారు. తన కష్టార్జితం, అర్హతల వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా తాను నేరుగా ముఖ్యమంత్రిగా రాలేదని, దానికి కావలసిన అర్హతలు తనకు వచ్చినప్పుడు, ప్రజలు తనకు ఆ పదవిని ఇస్తారని వ్యాఖ్యానించారు.సోషల్ మీడియా రీల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మంచి, చెడు రెండూ ఉన్నాయని కమల్ హాసన్ వివరించారు. సాంకేతికతను నేర్చుకున్న వారు దానిని ఒక వ్యాపారంగా మార్చుకునేంత వరకు నేర్చుకుంటున్నారని చెప్పారు. యువత వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో మంచి రాజకీయ నాయకుడు ఎవరో గుర్తించే వయసుకు తమరు చేరుకున్నారని ఆయన పేర్కొన్నారు. (ఇదీ చదవండి: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. మేకర్స్కి తమిళ నేత వార్నింగ్) -
హనుమత్ సుందరకాండ
ఇండియన్ యానిమేషన్ సినిమా ‘మహావతార్ నరసింహా’ బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో యానిమేషన్ చిత్రాల మేకింగ్పై కొందరు దర్శక–నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’, ‘వాయుపుత్ర’ వంటి సినిమాల ప్రకటనలు వచ్చాయి. తాజాగా యానిమేషన్ సినిమా ‘హనుమత్ సుందరకాండ’ ప్రకటన వచ్చింది.‘ఫ్రమ్ ది ఎటర్నల్ రామాయణ’ అనేది క్యాప్షన్. ఈ 3డీ యానిమేషన్ సినిమాని అరుణ్కుమార్ రాపోలు దర్శకత్వంలో నిశ్చిత సేతు, హరినాథ్ దేవర నిర్మిస్తున్నారు. హాలీవుడ్ సినిమాల్లో వినియోగించే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీని ఈ ‘హనుమత్ సుందరకాండ’ చిత్రానికి ఉపయోగిస్తున్నట్లుగా యూనిట్ పేర్కొంది. యానిమేషన్ సినిమాల్లోని పాత్రల హావభావాలు, కదలికలు స్క్రీన్పై రియలిస్టిక్గా కనిపించేందుకు ఈ సాంకేతికతను ఫిల్మ్ మేకర్స్ వినియోగిస్తుంటారు. -
లెనిన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. యాంకర్ సుమకు బ్రహ్మాజీ ఫన్నీ వార్నింగ్
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘లెనిన్’ జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మనం ఎంటర్ప్రైజెస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు.తిరుపతిలో ఆదివారం సాయంత్రం జరిగిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నాగార్జున, అఖిల్, భాగ్యశ్రీ, నాగవంశీ, సునీల్, బ్రహ్మాజీ, శివాజీ తదితరులు పాల్గొన్నారు. హోస్ట్గా వ్యవహరించిన యాంకర్ సుమ కనకాల తనదైన శైలిలో సరదా మాటలతో వేదికను కాసేపు నవ్వుల పండుగగా మార్చారు.ఈవెంట్లో సుమ తరచుగా చేసేలా బ్రహ్మాజీపై జోకులు వేస్తూ, ఆయన వయసు గురించి సెటైర్లు వేశారు. బ్రహ్మాజీ తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో కుంటి దామోదరం అనే నెగిటివ్ రోల్ పోషించానని చెప్పారు. స్టేజ్పైనే కుంటుకుంటూ తన నటనను ప్రదర్శించారు. దానికి సుమ వావ్.. బ్యూటిఫుల్.. మీరు నటించాల్సిన అవసరం లేదు.. జీవిస్తున్నారంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దానికి ప్రతిస్పందనగా బ్రహ్మాజీ స్టేజ్పైనే సీరియస్ ఫేస్ పెట్టి, కమ్ టు మై రూమ్ అంటూ సుమ వైపు వేలు చూపించారు. దాంతో ఒక్కసారిగా షాక్ అయిన సుమ వెంటనే అన్నయ్యా.. అంటూ కవర్ చేశారు. తన ఉద్దేశ్యం అది కాదని ప్రభాస్ పాపులర్ మీమ్ను గుర్తు చేశారు. 'ఆదిపురుష్' సినిమా టైంలో కమ్ టు మై రూమ్ అంటూ రెబల్ స్టార్ ప్రభాస్ ఆ చిత్ర దర్శకుడు ఓం రౌత్ను పిలవడం అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అదే డైలాగ్ను ఇప్పుడు బ్రహ్మాజీ సరదాగా సుమపై వాడటంతో ఈవెంట్లో నవ్వులు పూశాయి. -
శుభవార్త చెప్పిన 'ప్రేమలు' కమెడియన్
ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అలానే పలువురు సెలబ్రిటీలు శుభవార్తలు కూడా చెప్పేస్తున్నారు. కొన్నిరోజుల క్రితమే దర్శకుడు నాగ్ అశ్విన్ మరోసారి తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు 'ప్రేమలు' కమెడియన్ కూడా ఇలాంటి గుడ్ న్యూస్ చెప్పేశాడు. తన భార్య ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉందని పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: పెళ్లిరోజు గిఫ్ట్గా విడాకుల నోటీసులు: హీరోయిన్)స్వతహాగా ఎడిటర్ అయిన సంగీత్ ప్రతాప్.. 2019 నుంచి మలయాళ ఇండస్ట్రీలో ఉన్నాడు. అయితే 2022లో వచ్చిన 'హృదయం' మూవీలో చిన్న పాత్రలో నటించాడు. అయితే తెలుగులోను డబ్బింగ్ అయిన 'ప్రేమలు' చిత్రం సంగీత్ కెరీర్ మలుపు తిప్పింది. ఇందులో అమూల్ డేవిస్ అనే పాత్రలో తెగ నవ్వించాడు. అలా నటుడిగా స్థిరపడిపోయాడు.2023 నవంబరులో ఆన్సీని పెళ్లి చేసుకున్న సంగీత్ ప్రతాప్.. ప్రస్తుతం ఫ్యామిలీ, కెరీర్ పరంగా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు తాను తండ్రి కాబోతున్న సంగతి ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేసి ప్రకటించాడు. దీంతో మమిత బైజు, నస్లేన్ తదితరులు ఇతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ప్రియురాలితో అమిర్ ఖాన్ మూడో పెళ్లి) View this post on Instagram A post shared by Sangeeth Prathap (@sangeeth.prathap) -
స్టార్ కమెడియన్ సాహసం.. కమల్ హాసన్ రికార్డ్ బ్రేక్..!
గతంలో దివంగత నటుడు శివాజీ గణేషన్ నవరాత్రి చిత్రంలో తొమ్మిది పాత్రల్లో నటిస్తే.. కమలహాసన్ ఏకంగా దశావతారం చిత్రంలో పది పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఈ రికార్డ్ను ప్రముఖ స్టార్ కమెడియన్ యోగిబాబు బ్రేక్ చేయనున్నారు. ఆయన ఏకంగా 11 పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రం ద్వారా ఆర్ కిషోర్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు మోహన్ రాజా శిష్యుడు కాగా.. ఈ చిత్రాన్ని 9 లైట్స్ పతాకంపై సురేష్ ముత్తు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ను పూర్తి చేస్తుంది. ఈ మూవీలో మలయాళ నటి అతిథి రవి హీరోయిన్గా నటిస్తున్నారు.యోగి బాబు 11 పాత్రలు నటిస్తున్న కామెడీ యాక్టర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఇందులో హీరో,విలన్, కమెడియన్ పాత్రల్లో యోగిబాబు నటిస్తున్నట్లు చెప్పారు .అదే విధంగా ఇందులో కవల పిల్లల పాత్రలు కూడా ఉంటాయని చెప్పారు. ఒక సైనిక హెలికాప్టర్ ప్రమాదానికి గురవుతుందని అందులోని బ్లాక్ బాక్స్ కనుగొనే ప్రయత్నం అన్నారు. ఈ ప్రమాదానికి కారణాలను కనుగొనడానికి బయలుదేరిన హీరో ఎదుర్కొని సవాళ్లను వినోదం, యాక్షన్ అంశాలతో తెరకెక్కిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ ఇంగ్లాండ్, కెన్యా దేశాల్లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. కాగా.. ఈ చిత్రంలో రెడిన్ కింగ్స్ లీ,వీటీవీ గణేశ్, పంజు సుబ్బు, ఏ.వెంకటేశ్ ముఖ్యపాత్రులు పోషిస్తున్నారు. -
అమాయకుడా? నేరస్థుడా?
సాధారణ బ్యాంకు ఉద్యోగి రాజు భారీ బ్యాంకు దోపిడీకి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటాడు. అతను తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి అనుకోకుండా హింసాత్మక మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. అసలు రాజు నేరస్థుడేనా? లేక పరిస్థితుల బారిన పడిన అమాయకుడా? అనే కథాంశంతో రూ పొందిన మలయాళ చిత్రం ‘ఐ, నోబడీ’. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి నిస్సాం బషీర్ దర్శకత్వం వహించారు.పార్వతి తిరువోతు మరో లీడ్ రోల్లో నటించారు. ఈ నెల 9న మలయాళంలోనూ, 10న తెలుగులోనూ ఈ చిత్రం విడుదల కానుంది. శ్రీ స్రవంతి మూవీస్, మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని తెలుగులో ఇదే టైటిల్తో విడుదల చేయనున్నాయి.‘‘ఉత్కంఠభరితమైన కథ, స్క్రీన్ప్లే, సస్పెన్స్, యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చేలా ఉంటుంది. పృథ్వీరాజ్కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ ‘ఐ, నో బడీ’కి మంచి క్రేజ్ ఉండడంతో ఈ నెల 9న పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం’’ అని తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాణ సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. -
పదిహేనేళ్ల తర్వాత రీ ఎంట్రీ: సిస్టర్ నివేదితగా సెలీనా
హీరోయిన్ సెలీనా జైట్లీ పదిహేనేళ్ల తర్వాత తిరిగి చిత్ర పరిశ్రమలో రీ ఎంట్రీ ఇస్తున్నారు. మంచు విష్ణు హీరోగా వి. సముద్ర దర్శకత్వం వహించిన ‘సూర్యం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సెలీనా జైట్లీ సుపరిచితురాలే. 2004 డిసెంబరు 2న ఆ మూవీ విడుదలైంది. ఆ చిత్రం తర్వాత ఆమె తెలుగులో మరో సినిమా చేయలేదు కానీ బాలీవుడ్లో మాత్రం వరుస సినిమాలు చేశారు.సెలీనా హీరోయిన్గా నటించిన చివరి చిత్రం ‘శ్రీమతి’. ఉపేంద్ర హీరోగా నటించిన ఈ కన్నడ సినిమా 2011 జూలై 8న విడుదలైంది. అదే ఏడాది ఆమె పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సెలీనా తాజాగా బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. స్వామి వివేకానంద శిష్యురాలైన సిస్టర్ నివేదిత బయోపిక్లో ఆమె నటించనున్నారు. ఈ మూవీకి రామ్కమల్ ముఖర్జీ దర్శకుడు.‘‘సిస్టర్ నివేదిత సేవల గురించి నా చిన్నతనంలో మా అమ్మ నుంచి తెలుసుకున్నాను. ఇప్పుడు ఆమె బయోపిక్లో కనిపించనుండటం మరపురాని అనుభవం. పదిహేనేళ్లు ఐరో పాలో గడిపిన నేను మళ్లీ మూలాలను వెతుక్కుంటూ మాతృదేశానికి తిరిగి వచ్చి, సనాతన ధర్మంతో అనుసంధానం కావడం హ్యాపీగా ఉంది’’ అని సెలీనా జైట్లీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... 1867లో ఐర్లాండ్లో జన్మించిన సిస్టర్ నివేదిత అసలు పేరు మార్గరెట్ నోబెల్. 1898లో వివేకానందుడి శిష్యరికాన్ని స్వీకరించి సిస్టర్ నివేదితగా పేరు మార్చుకున్నారు. 1911లో 43 ఏళ్ల వయసులోనే ఆమె కన్నుమూశారు. -
కొత్త ఆరంభాలకు స్వాగతం
హీరోయిన్ సమంత ఫుల్ జోష్లో ఉన్నారు. ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి.. ఆమె లీడ్ రోల్లో నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా జూన్ 19న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. రెండోది... తాను తల్లి కానున్నట్లు ప్రకటించారామె. ఈ నేపథ్యంలో తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్కి సై అన్నారు సమంత. సోనీ లివ్ తమిళంలో తెరకెక్కించనున్న ఓ ప్రాజెక్ట్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారామె.‘‘ఒకవైపు సినిమాలు, మరోవైపు వ్యా పారాలు, నిర్మాణ రంగంలో సమంత విజయవంతంగా దూసుకెళుతున్నారు. కొత్తగా ఆలోచించడం, పాత్ బ్రేకింగ్ నిర్ణయాలు తీసుకోవడం ఆమెకు అలవాటే. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్ట్తో సమంత కొత్త హిస్టరీ సృష్టించబోతున్నారు’’ అని సోనీ లివ్ ప్రతినిధులు పేర్కొన్నారు.ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ– ‘‘మార్పును స్వీకరించడం, ప్రయాణాన్ని నమ్మడం, కొత్త ఆరంభాలకు స్వాగతం పలకడం వంటి విషయాలను ఈ ఏడాది నాకు గుర్తు చేసింది. సోనీ లివ్ తమిళ్తో కలిసి ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. మేం ఆసక్తికరమైన ఒక విషయంపై వర్క్ చేస్తున్నాం. ఆ విషయం గురించి త్వరలో అందరితో పంచుకుంటాను’’ అని పేర్కొన్నారు. -
సినిమా సూపర్ హిట్.. కొత్త కారు కొన్న యంగ్ హీరో
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి ఫేమ్ వస్తుందో చెప్పలేం. అలా ఈ ఏడాది మలయాళంలో తెగ క్రేజ్ తెచ్చుకున్న నటుడు హసిర్. 'వాళా 2' మూవీతో హీరోగా మారిన ఇతడు.. స్వతహాగా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్. గతంలో చిన్నాచితకా పాత్రలు చేసినప్పటికీ 'వాళా 2' సక్సెస్ అయ్యేసరికి బోలెడంత క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలోనే కొత్త కారు కొనుగోలు చేశాడు.(ఇదీ చదవండి: నేను తెలుగోడినే.. టాలీవుడ్ పట్టించుకోలేదు)రీసెంట్ టైంలో 'అతిరథి' అనే మలయాళ సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన హసిర్.. ఇప్పుడు రెనాల్ట్ డస్టర్ కారుని కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇతడితో పాటు 'వాళా 2' యాక్టర్ అలన్ కూడా కనిపించాడు. ఇకపోతే ఈ డస్టర్ కారు రేటు మార్కెట్లో రూ.15-20 లక్షల వరకు ఉంది.(ఇదీ చదవండి: 'నాగబంధం' సినిమా.. ఒక్కరోజులోనే కట్ చేసిపడేశారు) View this post on Instagram A post shared by Hashir H (@hashireeeee) -
వాళ్లు పెద్దోళ్లు.. ఖుష్బూపై అలిగిన సీనియర్ నటుడు
ఒకప్పటి హీరోయిన్, నటి ఖుష్బూ కుమార్తె అవంతిక పెళ్లి.. కొన్నిరోజుల క్రితం గోవాలో జరిగింది. దీనికి తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన చిరంజీవి, నాగార్జున, త్రిష, తమన్నాతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా బయటకొచ్చాయి. అయితే ఈ వేడుకకు తనని పిలవకపోవడంపై సీనియర్ నటుడు రాధారవి అసంతృప్తి వ్యక్తం చేశారు. లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా)'ఖుష్బూ కూతురి పెళ్లికి నన్ను పిలవలేదు. అందుకే వెళ్లలేదు. ఇప్పుడు వాళ్ల స్థాయి చాలా పెద్దది అయిపోయిందో ఏమో నాకు తెలీదు. కనీసం సుందర్ అయినా పిలుస్తారని అనుకున్నాను. కానీ ఆయన కూడా ఆహ్వానించలేదు. వాళ్ల కుటుంబంతో ఎన్నో ఏళ్లుగా సన్నిహితంగా ఉంది కదా పెళ్లికి తప్పకుండా పిలుస్తారని అనుకున్నాను. సుందర్.. మధురై నుంచి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన బయలుదేరేముందు శుభాకాంక్షలు చెప్పింది నేనే. అయినా పెళ్లికి పిలవలేదు. బహుశా కొందరినే పిలవాలని నిర్ణయించుకుని ఉండొచ్చు. నన్ను పిలిచి ఉండే తప్పకుండా వెళ్లేవాడిని. ఎన్నికల టైంలో మాత్రం నా మద్ధతు అవసరమైంది. ఇప్పుడు అవసరం లేకపోయి ఉండొచ్చు' అని రాధారవి అన్నారు.రాధా రవికి ఖుష్బూ, సుందర్.సితో చాలా ఏళ్లుగా అనుబంధముంది. ఖుష్బూతో కలిసి చిన్న తంబి, అన్నామలై, మన్నన్ సినిమాల్లో ఈయన నటించారు. సుందర్ దర్శకత్వం వహించిన అరణ్మనై, అరణ్మనై 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. (ఇదీ చదవండి: నాగబంధం vs రావు బహదూర్.. తొలిరోజు ఎవరికి ఎన్ని కోట్లు?) -
ఇలా జరగడం మూడోసారి.. ‘జారా’పై త్రిష సీరియస్
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయనతో పాటు స్టార్ హీరోయిన్ త్రిష పేరు కూడా నెట్టింట మరింత వైరల్గా మారింది. ఆమె సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా క్షణాల్లో ట్రెండింగ్లోకి వచ్చేస్తోంది. తాజాగా త్రిష చేసిన ఒక పోస్ట్ నెటిజన్ల మధ్య తీవ్ర చర్చనీయాంశమైంది. ఒక అంతర్జాతీయ బ్రాండ్కు వ్యతిరేకంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.త్రిష తాజాగా ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ 'జారా' (Zara) లో ఒక డ్రెస్ను ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసింది. అయితే, డెలివరీ వచ్చిన పార్సిల్ను ఓపెన్ చేసిన ఆమెకు తీవ్ర నిరాశ, అసహనం ఎదురయ్యాయి. ఆ దుస్తుల నుంచి భరించలేనంతగా దుర్వాసన రావడమే ఇందుకు కారణం. ఈ చేదు అనుభవంపై త్రిష సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సదరు బ్రాండ్ను ట్యాగ్ చేస్తూ కొన్ని ఘాటు సూచనలు చేసింది.‘డియర్ జరా.. ఒక చిన్న విన్నపం. మేము మరోసారి హోమ్ డెలివరీ కోసం ఆర్డర్ చేసినప్పుడు, దుస్తుల నుంచి ఎలాంటి దుర్వాసన రాకుండా చూసుకోండి. ఇప్పటికే మూడు సార్లు ఆర్డర్ చేస్తే.. దుర్వాసన వస్తున్న దుస్తులనే పంపించారు. కనీసం ప్యాక్ చేసే ముందైనా ఆ దుస్తుల వాసనను ఒకసారి చూసి పంపించండి’ అంటూ త్రిష సలహా ఇస్తూనే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్ నుంచి ఇలాంటి క్వాలిటీ లేని సర్వీస్ రావడంపై త్రిష అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. -
పెద్ది నటుడి ఆపరేషన్ డ్రీమ్ థియేటర్.. తెలుగు టీజర్ చూశారా?
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్కుమార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్. ఈ మూవీకి హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను వైశాక్ జె ఫిల్మ్స్ బ్యానర్పై డా. వైశాక్ జె గౌడ నిర్మించారు. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.టాలీవుడ్ హీరో నాని చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. నాన్న ప్రతి కథకు ఏం కావాలని చెప్పారు? ఒక హీరో కావాలని అనే డైలాగ్తో టీజర్ ప్రారంభమైంది. ఈ టీజర్ చూస్తుంటే యాక్షన్ ఎంటర్టైనర్గానే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలీ పుష్ప ఫేమ్ డాలీ ధనంజయ, అదితి బాలన్, యష్ శెట్టి, అశోక్ శర్మ, కుశాల్ బికె, తక్ష వర్ధన్, అరవింద్, వరుణ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు చరణ్ రాజ్ సంగీతమందించారు. -
హీరోయిన్గా మాజీ డీజీపీ కూతురు.. సినిమా రెడీ
తమిళ ప్రముఖ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి నటించిన లేటెస్ట్ మూవీ కరాటే బాబు. 'డాడా' ఫేమ్ గణేష్ కె బాబు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఆగస్టు 28న థియేటర్లలోకి రాబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు. అయితే ఈ మూవీతో తమిళనాడు మాజీ డీజీపీ శంకర్ జివాల్ కూతురు హీరోయిన్గా పరిచయమవుతుండటం విశేషం.(ఇదీ చదవండి: ఈ సిగ్గులేని కక్షసాధింపు చర్యలెందుకు?.. ప్రకాశ్ రాజ్)మాజీ డీజీపీ కుమార్తె పేరు దౌదీ జివాల్. ఇకపోతే ఈ సినిమాలో కేఎస్ రవికుమార్, వీటివీ. గణేష్ తదితరులు ఇతర పాత్రలు చేశారు. సుందర్ ఆరుముగం నిర్మాత. ఇంతకుముందు ఈయన రవి మోహన్తో అఖిలన్, బ్రదర్ లాంటి మూవీస్ తీశారు. ఇది మాత్రం రాజకీయ నేపథ్యంలో పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందించారు.ఇంతకుముందు రాజకీయ నేపథ్యంలో చాలా చిత్రాలు వచ్చాయని అయితే వాటికి పూర్తి భిన్నంగా 'కరాటే బాబు' ఉంటుందని నిర్మాత పేర్కొన్నారు. రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితం, బంధాలు, అనుబంధాలను ఆవిష్కరించే కథ చిత్రంగా ఇది ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా శాసనసభ్యుడిలోని మరో కోణాన్ని ఆవిష్కరించే రాజకీయ థ్రిల్లర్గా తెరకెక్కించారట.శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, ఎళిల్ అరసు.కె ఛాయాగ్రహణం అందించారు.(ఇదీ చదవండి: సూపర్ ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్) -
సూపర్ ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్
హీరోయిన్లకు భాషతో సంబంధం లేదు. ఒక భాషకు చెందిన వారు మరొ దానిలో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. నయనతార స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తమిళంలో బోలెడంత గుర్తింపు తెచ్చుకుని చెన్నైలోనే సెటిల్ అయిపోయింది కూడా. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో మలయాళీ బ్యూటీ చేరేందుకు రెడీ అయింది. ఆమెనే రియా షిబు.మొదట నటిగా ఆకట్టుకున్న ఈమె.. నిర్మాతగా మారి తమిళంలో విక్రమ్తో 'వీర ధీర సూరన్' సినిమాని నిర్మించింది. తర్వాత కథానాయకగా అవతారమెత్తి 'సర్వం మాయ' అనే మలయాళ చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇలా పలు రంగాల్లో ప్రతిభ చాటుకుంటున్న రియా.. కోలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. విక్రమ్ హీరోగా చేస్తున్న కొత్త మూవీలో హీరోయిన్గా అవకాశం వరించింది. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అలా ఉండగానే ఇప్పుడు మరో అవకాశం తలుపు తట్టిందని సమాచారం.విజయ్ సేతుపతితో రియా కలిసి నటించడానికి సిద్ధమవుతోందని తెలిసింది. క్రితిక ఉదయనిది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మహిళ దర్శకురాలు ఈసారి కుటుంబ అనుబంధాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తీయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమై ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చిత్రీకరణను జరుపుకొంటున్నట్లు, మరో వారంలో తొలి షెడ్యూల్ పూర్తికాబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. -
ఓటీటీకి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీకి వచ్చేందుకు మరో సూపర్ హిట్ మూవీ సిద్ధమైంది. జయరామ్, ఊర్వశి నటించిన లేటేస్ట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'పరిమళ అండ్ కో'. ఈ సినిమాకు పండిరాజ్ దర్శకత్వం వహించారు. జూన్ 5న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో సంజన కృష్ణమూర్తి, అనంతిక సనీల్కుమార్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ మూవీ జూలై 10 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. థియేటర్లలో విడుదలైన దాదాపు నెల రోజుల తర్వాత ఓటీటీ ప్రియులను అలరించనుంది. ఈ మూవీలో మిస్కిన్, యోగి బాబు, శాండీ, సంతోశ్, శోభన్ కీలక పాత్రల్లో కనిపించారు.అసలు కథేంటంటే..ఈ చిత్రం ఒక హత్య మిస్టరీలో చిక్కుకున్న మధ్యతరగతి కుటుంబం చుట్టూ తిరుగుతుంది. వారి చిన్న కుమార్తెను వేధిస్తున్న ఒక స్థానిక గ్యాంగ్స్టర్ అనుమానాస్పద పరిస్థితులలో చనిపోతాడు. ఈ వార్త బయటకు రాగానే.. ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఒకరిపై ఒకరు అనుమానం పెంచుకుంటారు. అసలు ఈ హత్య ఎవరు చేశారు? ఆ కుటుంబానికి, గ్యాంగ్స్టర్కు మధ్య ఉన్న వైరమేంటి? అనేది తెలియాలంటే పరిమళ అండ్ కో మూవీ చూడాల్సిందే. ఈ స్టోరీ వింటుంటే అచ్చం దృశ్యం మూవీనే తలపిస్తోంది. #ParimalaAndCo (Tamil) Streaming from July 10 Zee5 🍿!!#OTT_Trackers pic.twitter.com/Ib7l44ORqd— OTT Trackers (@OTT_Trackers) July 2, 2026 -
జైలర్-2 రిలీజ్ డేట్ ఫిక్స్.. విశ్వంభరకు పోటీ తప్పదా?
తలైవా, సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ జైలర్-2. గతంలో సూపర్ హిట్గా నిలిచిన జైలర్ మూవీ సీక్వెల్గా తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ రానుంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.ఈ ఏడాది దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సన్ పిక్చర్స్ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించింది. దీంతో తలైవా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో మోహన్లాల్, శివ రాజ్కుమార్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.విశ్వంభరతో పోటీ?అయితే మెగాస్టార్ విశ్వంభర కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయినప్పటికీ పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. సమ్మర్లో రిలీజవుతుందని ఆశించినప్పటికీ అలా ఏం జరగలేదు. ఈ దసరాకే విశ్వంభర రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు మేకర్స్ ప్రకటించకపోయినా.. దసరాకు రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 16న మెగాస్టార్ మూవీని విడుదల చేయాలనే ప్లాన్లో ఉన్నారని టాలీవుడ్ టాక్. తాజాగా అక్టోబర్ 15న జైలర్-2 తేదీని ఫిక్స్ చేయడంతో విశ్వంభర రిలీజ్కు సాహసం చేస్తారా? మరోసారి వాయిదా వేయకతప్పదా? రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది. జైలర్-2తో మెగాస్టార్ పోటీకి దిగుతాడా లేదా అన్నది త్వరలోనే తెలుస్తుంది. Alappara Kelappurom! #Jailer2 storms into theatres worldwide on October 15 🔥 #Jailer2FromOct15 @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @vijaykartikdop @Nirmalcuts @ChethanDsouza @AlwaysJani @KiranDrk #PallaviSingh @valentino_suren @kabilanchelliah @RIAZtheboss pic.twitter.com/mY50qNOSQh— Sun Pictures (@sunpictures) July 2, 2026 -
ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు.. కాస్తా లేట్ అంతే..!
ప్రస్తుతం ఎక్కడ చూసిన పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. జూన్ నుంచే ముహుర్తాలు షురూ కావడంతో పెళ్లిళ్ల సందడి మొదలైంది. తాజాగా మరో నటుడు పెళ్లీపీటలెక్కారు. తమిళ, మలయాళ చిత్రసీమలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అరవింద్ ఆకాశ్ ఓ ఇంటివాడయ్యారు. ఈయన దాదాపు 50 ఏళ్ల వయసులో తన ప్రియురాలు సారాను పెళ్లాడారు. వీరిద్దరి పెళ్లి వేడుక మలేసియాలోని కౌలాలంపూర్లో గ్రాండ్గా జరిగింది. ఈ వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఈ పెళ్లి వేడుకలో దర్శకుడు వెంకట్ ప్రభు, నటుడు వైభవ్ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఎంగేజ్మెంట్ చేసుకున్న అరవింద్.. పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కాగా. అరవింద్ ఆకాశ్ కోలీవుడ్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. చెన్నై 600028, గోవా, సరోజ, మంకథ, బిర్యానీ, మాస్ ఎంగిర మసిలమణి, చెన్నై 600028 II, మానాడు, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రాల్లో కనిపించారు. అరవింద్ ఎక్కువగా వెంకట్ ప్రభు డైరెక్ట్ మూవీస్లో నటించడం విశేషం. తమిళంతో పాటు మలయాళ చిత్రసీమలోనూ అరవింద్ ఆకాశ్ మెప్పంచారు. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన 'నందనం' చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్రకు బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా మలయాళంలో కూట్టు, వాంటెడ్, వజ్రం, పొన్ముడిపుళయోరతు, మమ్మీ అండ్ మీ, ప్రజాపతి లాంటి సినిమాలు చేశారు. ఇటీవలే పృథ్వీరాజ్-బాసిల్ జోసెఫ్ నటించిన 'గురువాయూరంబాల నడయిల్' చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. కాగా.. అరవింద్ చివరిసారిగా 2024లో విజయ్ నటించిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రంలో నటించారు. Love wins at 50! 💍❤️Popular South actor #AravindAkash tied the knot with his partner Sarah in an intimate ceremony in Malaysia. The Chennai 600028 and Mankatha squad flew down to Kuala Lumpur to celebrate the mini-reunion! Slide to see Venkat Prabhu, Vaibhav, and Premgi… pic.twitter.com/2ustvzuvfi— Abhay Mani Diwakar (@theabhayd) July 2, 2026 -
పిల్లలను దూరంగా ఉంచండి!
‘కేజీఎఫ్’ మూవీస్ ఫేమ్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూ పొందిన ద్విభాషా (కన్నడ, ఇంగ్లీష్) చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్’.1940–1970 కాలంలో గోవా తీర్రపాంతం నేపథ్యంతో సాగే ఈ సినిమాలో యశ్ ద్విపాత్రాభినయం (రాయ, టికెట్) చేశారు. ఈ సినిమాలో గంగ పాత్రలో నయనతార, నాడియాగా కియారా అద్వానీ, ఎలిజబెత్గా హ్యూమా ఖురేషీ, రెబెక్కా పాత్రలో తారా సుతారియా, మెలిస్సా రోల్లో రుక్మిణీ వసంత్ నటిస్తున్నారు. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్పై వెంకట్ కె.నారాయణ, యశ్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 26న విడుదల కానుంది.కాగా ‘లేడీస్ అండ్ లేడీస్’ అంటూ ఈ సినిమా నుంచి బుధవారం ఓ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఉమెన్ వాయిస్ ఓవర్తో ఈ సినిమా కథనం సాగుతుంది. మహిళా ఫైటర్స్తో యశ్ చేసే యాక్షన్ సీక్వెన్స్, ఈ సినిమాలోని హీరోయిన్లు ఈ వీడియోలో కనిపించారు. ‘పిల్లలూ... దూరంగా ఉండండి. తల్లిదండ్రులూ... మీ పిల్లలను దూరంగా ఉంచండి. తాతలు, బామ్మలు... మీ మనవళ్లను కూడా దూరంగా ఉంచండి. ముత్తాతలు... మీ సొంత రిస్క్పై చూడండి‘ అనే డిస్క్లైమర్తో ఈ వీడియో ప్రారంభం అవుతుంది. ఇంటెన్స్, బోల్డ్, యాక్షన్ సన్నివేశాలు ఈ వీడియోలో కనిపిస్తాయి. -
ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీలు వచ్చాక కంటెంట్కు కొదువ లేకుండా పోయింది. ప్రతివారంలో సరికొత్త వెబ్ సిరీస్లు, సినిమాల ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. సూపర్ హిట్ అయిన సిరీస్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీజన్ల మీద సీజన్స్ అలా స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. ఇటీవలే తెలుగులో సేవ్ ది టైగర్స్ సీజన్-3 అభిమానుల ముందుకొచ్చింది. ఈ కామెడీ సిరీస్ ఓటీటీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.తాజాగా మరో సక్సెస్ఫుల్ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. రెండు సీజన్స్ సక్సెస్ఫుల్ కావడంతో పార్ట్-3 ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. కోలీవుడ్లో అభిమానుల ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్ హార్ట్ బీట్. ఓ ఆస్పత్రి నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్లో కుటుంబ అంశాలు, ప్రేమ, ఒక తల్లి ప్రేమ కోసం యువతి పడే ఆరాటం కథాంశంగా తెరకెక్కించారు. ఈ హార్ట్బీట్ ఓటీటీ ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అలా ఇప్పటికే రెండు సీజన్స్ రాగా.. ఆడియన్స్ ఆదరణ దక్కించుకున్నాయి.అదే ఊపుతో హార్ట్ బీట్ సీజన్-3 కూడా తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని ఫిక్స్ చేశారు. జూలై 30 నుంచి జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఈ సిరీస్కు దీపక్ సుందర రాజన్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్లో దీపా బాలు, అనుమోన్, యోగలక్ష్మీ, శర్వ, శబరీశ్, చారుకేశ్, రామ్, చంద్రశేఖర్, గిరి ద్వారకేశ్, రేయ ముఖ్య పాత్రలు పోషించారు.One world became two. But the heartbeat remains one. ❤️Hotstar Specials #HeartBeatSeason3 streaming from July 30 only on #JioHotstar #HBS3 #HBS3OnJHS #HeartBeatS3OnJioHotstar #HeartBeat3OnJioHotstar #HeartBeat3StreamingFromJuly30 #HeartBeatS3FirstLook #JioHotstarTamil… pic.twitter.com/RQFWVdi5uP— JioHotstar Tamil (@JioHotstartam) July 1, 2026 -
ఓటీటీకి మలయాళ హిట్ మూవీ.. రిలీజైన 8 నెలలకు..!
షేన్ నిగమ్, ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్, సెల్వరాఘవన్, ప్రేమమ్ డైరెక్టర్ ఆల్పాన్స్ పుదిరన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన యాక్షన్ మూవీ బాల్టీ . తమిళ, మలయాళం భాషల్లో సూపర్ హిట్గా నిలిచిన ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేశఆరు. ఉన్ని శివలింగం దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం.. గతేడాది అక్టోబర్ 10న టాలీవుడ్లో రిలీజైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.ఈ మూవీ విడుదలైన దాదాపు ఎనిమిది నెలలు పూర్తయినా ఇప్పటి వరకు ఓటీటీకి రాలేదు. ఈ సినిమా కోసం మలయాళ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు మేకర్స్. జూలై 10 నుంచి సోని లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. థియేటర్లలో విడుదలైన 8 నెలల తర్వాత ఓటీటీ ప్రియులను అలరించనుంది బాల్టీ. ఈ మూవీ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ చిత్రాన్ని కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమాలో రాజకీయాలు, గ్యాంగ్ స్టర్ కథతో కలిపి వైవిధ్యంగా రూపొందించారు. -
కన్నీళ్లు పెట్టిస్తున్న భాగ్యరాజ్ చివరి లెటర్
తమిళ ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె.భాగ్యరాజ్ రీసెంట్గా గుండెపోటుతో చనిపోయారు. అయితే మరణానంతరం ఈయన రాసినట్లు చెబుతున్న ఓ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులని కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇందులో తన కళ్లు దానం చేయాలనే చివరి కోరికతోపాటు తన కొడుకు శాంతనుకి అండగా నిలవాలని అభిమానులని ఆయన వేడుకుంటున్నట్లు ఉంది.(ఇదీ చదవండి: పదే పదే ఇబ్బంది పెట్టాడు.. రాయితో తల పగలగొట్టా: కాయదు లోహర్)లెటర్ లో ఏముందంటే?'మన చుట్టూ ఉన్నవాళ్లని సంతోషపెట్టడంలో నిజమైన ఆనందముంది. నాపై అపారమైన ప్రేమ చూపించిన అభిమానులకు, నన్ను ప్రోత్సాహించిన తల్లులకు, ఇండస్ట్రీలోని సహచరులకు కృతజ్ఞతలు. మీ ప్రేమతో నిండిన చూపుల కోసం నా కళ్లని సజీవంగా ఉంచాను. దయచేసి వాటిని జాగ్రత్తగా చూసుకోండి'కొడుకు, నటుడు శాంతను భాగ్యరాజ్ గురించి ప్రస్తావిస్తూ.. 'నా కోసం కొట్టిన చప్పట్లే నా కొడుకుకి కూడా ఆశీర్వాదంగా మారాలని కోరుకుంటున్నా. జీవితంతం నాకు అందించిన ప్రేమ, ఆదరణ ఇకపై శాంతనుకు కూడా అందించండి. నేను శారీరకంగా లేకపోయినప్పటికీ దానం చేసిన కళ్ల ద్వారా అభిమానులని చూస్తూనే ఉంటాను. ఈ శరీరం శాశ్వతం కాదు. ఒకరోజు భూమిలో కలిసిపోతుంది లేదా అగ్నికి ఆహుతి అవుతుంది. చివరకు మిగిలేది బూడిద కాదు. మనం పంచిన ప్రేమే అసలైన సంపద. నా జీవిత ప్రయాణంలో నన్ను ప్రేమించిన, నా కోసం కన్నీళ్లు పెట్టుకున్న ప్రతిఒక్కరికీ నేను రుణపడి ఉంటాను. మంచి సినిమాలు, కథలు, డైలాగ్స్, మానవత్వం ద్వారా చిరస్థాయిగా జీవిస్తాను' అని లెటర్లో రాసుకొచ్చారు.తమిళ చిత్రసీమలో భాగ్యరాజ్.. అత్యుత్తమ కథా రచయిత, దర్శకుడిగా గుర్తింపు పొందారు. 25కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు 75కి పైగా సినిమాల్లో నటించారు. ఈయనకు భార్య పూర్ణిమ, కొడుకు శాంతను, కుమార్తె శరణ్య ఉన్నారు.(ఇదీ చదవండి: స్టార్ హీరోలు గమనిస్తున్నారా? 95 శాతం ఫ్లాపులు, డిజాస్టర్లే) -
'96' జంట లవ్ అండ్ వార్
విజయ్ సేతుపతి, త్రిష నటించిన సూపర్ హిట్ సినిమా '96'లో బాలనటులుగా మెప్పించిన గౌరీ కిషన్, ఆదిత్య భాస్కర్ ప్రస్తుతం హీరోహీరోయిన్ అయిపోయారు. అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉన్నారు. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న కొత్త చిత్రానికి 'లవ్ అండ్ వార్' టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.రాజ్ కుమార్ రంగస్వామి దర్శకుడుగా పరిచయం అవుతుండగా.. కన్నన్ భాస్కర్ నిర్మిస్తున్నారు. హనీమూన్ వెళ్లిన యువ జంట.. చిన్న సమస్యను పరస్పరం చర్చించుకుని పరిస్కరించుకోవాల్సింది పోయి ఈగో కారణంగా మరింత పెద్దదిగా చేసుకుంటారు. చివరకు మరి ఒక్కటయ్యారా లేదా అనే కాన్సెప్ట్తో ఈ మూవీ తీస్తున్నారు. అనుబంధాలను కోల్పోకూడదు అని ఇందులో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చిత్ర షూటింగ్ పూర్తి అయిందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. రిలీజ్ డేట్ త్వరలోనే చెబుతామని వెల్లడించారు. -
రాఘవ లారెన్స్ ప్రకటన.. మరోసారి తెరపైకి త్రిష..!
తమిళనాడు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అక్కడి ప్రజలు వ్యవస్థ కంటే వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తారని మొన్న ఎన్నికల్లోనూ స్పష్టమైంది. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన దళపతి విజయ్ ఏకంగా సీఎం పీఠం ఎక్కేశారు. ఎంతలా ఓ వ్యక్తిని ద్రవిడ ప్రజలు అభిమానిస్తారో ఈ ఫలితాలే నిదర్శనం. ఇక విజయ్ సీఎం అయ్యాక చాలామంది సినీ స్టార్స్ సైతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. ధనుశ్, రాఘవ లారెన్స్, విశాల్ ఇలా చాలామంది స్టార్స్ పేర్లు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.ఇటీవలే ఎంట్రీ ఇస్తారని ఆశించిన రాఘవ లారెన్స్ సైతం తాను ఇప్పుడే రాజకీయాల్లోకి రానని ప్రకటించారు. అయితే భవిష్యత్తులో తప్పకుండా వచ్చే అవకాశముందని హింట్ ఇచ్చారు. మరోవైపు లారెన్స్.. విజయ్ గెలిచిన తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేస్తారనే ఊహగానాలొచ్చాయి. ఇవాల్టి ప్రకటనతో ఆయన ఎంట్రీ ఇవ్వడం లేదని క్లారిటీ వచ్చేసింది. మరి తిరుచ్చి స్థానంలో ఎవరు నిలబడతారనే విషయంపై మరోసార చర్చ మొదలైంది.ఈ నేపథ్యంలో అందరి చూపులు ఆమెవైపే చూస్తున్నాయి. తాను మరెవరో కాదు.. విజయ్ గెలిచాక ఒక్కసారిగా సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్గా మారిన త్రిష. విజయ్ సీఎం అయ్యాక.. త్రిష ఏకంగా హోం మినిస్టర్ కానుందని కథనాలొచ్చాయి. త్రిష బర్త్ డే రోజే ఎన్నికల ఫలితాలు రావడంతో మరింత హైలెట్గా నిలిచింది. తాజాగా రాఘవ లారెన్స్ తిరుచ్చిలో పోటీ చేయనంటూ ప్రకటించిన నేపథ్యంలోనే మరోసారి త్రిష పేరు వినిపిస్తోంది. ఆమె కోసమే రాఘవ లారెన్స్ పోటీ నుంచి తప్పుకున్నారా? అనే చర్చ కోలీవుడ్లో మొదలైంది. ఈ నేపథ్యంలో ఆమె పొలిటికల్ ఎంట్రీ ఖాయమని తెలుస్తోంది. అంతా సవ్యంగా జరిగితే తిరుచ్చి ఈస్ట్ నుంచి త్రిష పోటీ చేసే ఛాన్స్ ఉందని కోలీవుడ్లో టాక్ నడుస్తోంది. ఈ విషయంపై మరింత క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
కూతురి పెళ్లి.. కన్నీళ్లు పెట్టుకున్న ఖుష్బు
కోలీవుడ్ నటి ఖుష్బు సుందర్ కుమార్తె అవంతిక పెళ్లి ఇటీవలే గ్రాండ్గా జరిగింది. గోవాలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీతారలు సందడి చేశారు. చిరంజీవితో పాటు వెంకటేశ్, నాగార్జున, త్రిష, తమన్నా, రాధికా , సుహాసిని, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ ఈ పెళ్లికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. తన కూతురి మెడలో వరుడు తాళి కడుతున్న సమయంలో ఖుష్బు సుందర్ ఫుల్ ఎమోషనల్గా కనిపించింది. ఈ వీడియోలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురై ఏడ్చేసింది. వారి చిన్న కుమార్తె ఆనందిత కూడా అక్క పెళ్లిని చూసి ఎమోషనలైంది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా.. ఖుష్బు- సుందర్ల పెద్ద కూతురు అవంతిక సుందర్.. శ్రవణ్ శ్రీనివాసన్ను వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుక జూన్ 25న గ్రాండ్గా జరిగింది. View this post on Instagram A post shared by Spize Events (@spizeweddingsandevents) -
సంక్రాంతి సినిమా ఫ్లాప్.. పారితోషికం ఎగ్గొటేసిన నిర్మాత
ఈ ఏడాది సంక్రాంతికి తెలుగులో వచ్చిన సినిమాల్లో 'రాజాసాబ్' తప్పితే మిగిలిన నాలుగింటిలో చిరంజీవి సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ రాగా.. శర్వానంద్, నవీన్ పొలిశెట్టి, రవితేజ చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఉన్నంతలో వసూళ్లు రాబట్టాయి. మరోవైపు తమిళంలో స్టార్ హీరో శివకార్తికేయన్, జయం రవి, అధర్వ, శ్రీలీల లాంటి స్టార్స్ చేసిన 'పరాశక్తి' ఘోరమైన డిజాస్టర్ అయింది. గతంలో ఓ సందర్భంలో చిత్ర నిర్మాత దీని వల్ల వచ్చిన నష్టాల గురించి చెప్పగా.. ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది.(ఇదీ చదవండి: సీరియల్ నటికి నడిరోడ్డుపై వేధింపులు! వీడియో వైరల్)'పరాశక్తి' తీసిన దర్శకురాలు సుధా కొంగర.. నిర్మాతకు తనకు రూ.8.39 కోట్ల రెమ్యునరేషన్ బకాయి ఉన్నారని చెప్పి మద్రాసు హైకోర్టుని ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. ఈ మొత్తం చెల్లించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది. పలు కారణాలతో ఆలస్యమైన ఈ చిత్రం.. అన్ని సమస్యలు దాటుకుని సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు దర్శకురాలి రెమ్యునరేషన్ కారణంగా మరోసారి వార్తల్లో నిలిచింది.ఇక మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా.. జూలై 8న తదుపరి విచారణ జరిగే వరకు 'పరాశక్తి' శాటిలైట్ హక్కులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇదే నిర్మాత తీసిన 'ఇదయం మురళి' మూవీ వచ్చే నెల 10న థియేటర్లలో రిలీజ్ కావాలి. ఇది విడుదల కాకుండా ఆపాలని సుధా కొంగన తన పిటిషన్లో పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోలీవుడ్లో హాట్ టాపిక్ అయిపోయింది.సుధా కొంగర విషయానికొస్తే.. దర్శకుడు మణిరత్నం దగ్గర పనిచేసింది. 'సాలా ఖాదుస్' మూవీతో డైరెక్టర్ అయింది. దీన్ని తెలుగులో 'గురు' పేరుతో రీమేక్ చేయగా ఈ చిత్రానికి ఈమెనే దర్శకత్వం వహించింది. స్వతహాగా ఈమె తెలుగు ఆమెనే అయినప్పటికీ తమిళంలో సినిమాలు చేస్తోంది.(ఇదీ చదవండి: పిల్లలు కావాలన్నాడు.. విడాకులు ఇచ్చేశా: సీరియల్ నటి) -
ఇంట్లో మృతదేహం.. స్పందించిన హీరోయిన్
బిగ్బాస్(కన్నడ) ఫేం, నటి కృషి తపండ నివాసంలో ఆమె స్నేహితుడు, వ్యాపారవేత్త వైశాఖ్ ఆత్మహత్య చేసుకోవడం కర్ణాటక వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జూన్ 24న జరగగా.. అప్పటి నుంచి కృషి తపండపై నెట్టింట రకరకాల ప్రచారం జరుగుతోంది. వైశాఖ్ ఆత్మహత్య చేసుకోవడానికి ఆమే కారణం అన్నట్లుగా కొంతమంది పోస్టులు పెడుతున్నారు. దీనిపై తాజాగా కృషి తపండ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఒకరి మరణం ఆ వ్యక్తి కుటుంబానికి తీరని లోటు అని.. అలాంటి సమయంలో కూడా వ్యక్తిగత గ్యోప్యతకు భంగం కలిగించేలా ప్రవర్తించొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.‘ఇలాంటి పోస్ట్ చేయాల్సి వస్తుందని అస్సలు ఊహించేలేదు. నాపై వస్తున్న వదంతులకు సమాధానం ఇచ్చేందుకే ఈ పోస్ట్ పెడుతున్నా. కొన్ని రోజుల క్రితం నా జీవితం ఊహించని విధంగా మలుపు తిరిగింది. నా మనసుకు ఎంతో దగ్గరైన, నాకు అన్ని వేళలా అండగా ఉండే మిత్రుడిని కోల్పోయా. అతడి మరణం నాకు తీరని లోటు. ఈ బాధలో నేను ఉంటే.. అంతకంటే దారుణమైన సంఘటనలు ఎదురవుతున్నాయి. ఓ వ్యక్తి మరణిస్తే.. దానిపై వదంతులు, ఊహాగానాలతో కొందరు తమకు నచ్చిన కథలు సృష్టిస్తున్నారు. నేను కన్పిస్తే చాలు.. ‘మీ స్పందన ఏంటీ?’ అంటూ అర్థం లేకుండా అడుగుతున్నారు. అలాంటి వాళ్లని చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా. ఒకరి నష్టాన్ని మీ హెడ్లైన్గా మార్చుకోకండి. మేమంతా ఓ మంచి స్నేహితుడిని కోల్పోయాం. ఇలాంటి పరిస్థితుల్లో మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేలా ప్రవర్తించొద్దు. మీరు చేసే అసత్య ప్రచారాలు.. బాధలో ఉన్నవారికి మరింత నష్టం కలిగిస్తాయి. మీ వల్ల ఇతరులు సంతోషంగా ఉండకపోయినా ఫర్వాలేదు.. కానీ ఇంకొకరి కన్నీళ్లకు మీరు కారణం కావొద్దు. నా మిత్రుడి ఆత్మకు శాంతి కలిగేలా ప్రవర్తిస్తారని కోరుకుంటున్నా. ఇకనైనా ఇలాంటి ప్రచారాలు ఆపాలని వేడుకుంటున్నా’అని కృషి తపండ తన ఇన్స్టా ఖాతాలో రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Krishi Thapanda (@krishithapanda)


