South India
-
కమల్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ వద్ద థగ్ లైఫ్ కష్టాలు!
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్. ఈ యాక్షన్ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీరిద్దరు కాంబోలో వచ్చిన సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈనెల 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఊహించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఈ మూవీ రిలీజైన మూడు రోజుల్లో ఇండియా వ్యాప్తంగా కేవలం రూ.29 కోట్లకు పైగా నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది.తొలి రోజు రూ.15 కోట్లకు పైగా రాబట్టిన థగ్ లైఫ్.. రెండో రోజే ఏకంగా సగానికి పడిపోయింది. అయితే మూడో రోజు వీకెండ్ కావడంతో శనివారం రూ. 7.5 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించింది. దేశీయ బాక్సాఫీస్ వద్ద మొదటి మూడు రోజుల్లోనే రూ. 30 కోట్ల మార్కును దాటలేకపోవడంతో కమల్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే 'థగ్ లైఫ్' 3వ రోజు దాదాపు రూ. 60 నుంచి 65 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. మణిరత్నం గత విజయాలతో పోలిస్తే ఈ వసూళ్లు చాలా తక్కువ. 'పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 మరియు పార్ట్ 2', రెండూ ప్రపంచవ్యాప్తంగా రూ. 300 నుంచి 400 కోట్లకు పైగా వసూలు చేశాయి. థగ్ లైఫ్ వసూళ్ల పరంగా రాణించకపోవడంతో కమల్ ఖాతాలో ఈ మూవీ డిజాస్టర్గానే మిగలిపోయేలా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, శింబు, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, అలీ ఫజల్ కీలక పాత్రల్లో నటించారు. -
చెట్టు వెనక్కెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు.. అప్పుడు బిగ్బీ..
మలయాళ సీనియర్ హీరోయిన్ శోభన (Shobana) 'కల్కి 2898 ఏడీ' సినిమా (Kalki 2898 AD Movie)తో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. ఈ మధ్యే వచ్చిన తుడరుమ్ సినిమాలోనూ యాక్ట్ చేసింది. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఫ్యాన్స్తో ముచ్చటించింది. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్తో కలిసి పని చేసిన అనుభవాలను గుర్తు చేసుకుంది.అమితాబ్తో పాట షూటింగ్బచ్చన్ సర్ అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉన్నాడు. నాతో కలిసి పనిచేసినవారిలో ఎంతో వినయ విధేయతలతో నడుచుకునే ఆర్టిస్ట్ ఆయన. గొప్ప ఆర్టిస్టుల్లో సాధారణంగా కనిపించే అంశం విధేయత. బచ్చన్ (Amitabh Bachchan) సర్ గురించి మీకో విషయం చెప్తాను. కొన్నేళ్ల క్రితం అహ్మదాబాద్లో ఆయనతో కలిసి ఓ పాట షూటింగ్లో పాల్గొన్నాను. నేను ఎన్నో దుస్తులు ఒకదానిపై ఒకటి వేసుకుని ఉన్నాను. బచ్చన్ సర్ దగ్గర కారవాన్ ఉంది. కానీ చాలామంది షూట్ చూసేందుకు రావడంతో ఆ ప్రాంతమంతా స్థంభించిపోయింది.చెట్టు వెనకాల..నా దుస్తులు మార్చుకునేందుకు నా కారవాన్ ఎక్కడుందని అడిగాను. ఇంతలో ఒకరు.. తను మలయాళ సినిమా నుంచే కదా వచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోతారు. చెట్టు వెనకాల దుస్తులు మార్చుకుంటుందిలే అని కామెంట్ చేశారు. బచ్చన్ సర్ దగ్గరున్న వాకీటాకీలో ఆ మాటలు వినిపించాయి. వెంటనే ఆయన నేనున్న చోటుకు వచ్చి ఎవరా మాట అంది? అని ఆగ్రహించాడు. నన్ను ఆయన కారవాన్లోకి తీసుకెళ్లాడు. నన్ను దుస్తులు మార్చుకోమని చెప్పి బయటకు వెళ్లిపోయాడు.కల్కి 2898 ఏడీలో..కల్కి సినిమాలో కూడా ఆయన ఎక్కువ బరువున్న దుస్తులు వేసుకున్నాడు. భారీ ప్రోస్తటిక్స్ (హెవీ మేకప్) వాడాడు. అంత బరువు మోస్తున్నా కూడా ఎవరైనా వస్తే లేచి నిల్చుని పలకరించేవాడు అని చెప్పుకొచ్చింది. కల్కి 2898 ఏడీ సినిమా విషయానికి వస్తే నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటించాడు. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, శోభన మరియంగా, దీపికా పదుకొణె సుమతిగా, కమల్ హాసన్ యాస్కిన్గా నటించారు. ఈ చిత్రం గతేడాది జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం వెయ్యికోట్లపైనే వసూళ్లు రాబట్టింది. కల్కి సీక్వెల్ ఈ ఏడాది డిసెంబర్లో పట్టాలెక్కనుంది. చదవండి: ఈ జర్నీ అంత ఈజీ కాదు.. కలిసి ముందుకెళ్దాం.. నటి పెళ్లి ప్రపోజల్ -
ఈ జర్నీ అంత ఈజీ కాదు.. కలిసి ముందుకెళ్దాం.. నటి పెళ్లి ప్రపోజల్
బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ (Priyanka Jain), బుల్లితెర నటుడు శివకుమార్ (Shivakumar) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేనంత గాఢంగా ప్రేమలో మునిగారు. కొంతకాలంగా కలిసే ఉంటున్న వీరిద్దరూ ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. శనివారం (జూన్ 8న) శివకుమార్ బర్త్డే. ఈ సందర్భంగా అండమాన్- నికోబార్లో అతడి పుట్టినరోజు వేడుకలు జరిపిన ప్రియాంక.. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని మోకాలిపై కూర్చుని ప్రపోజల్ చేసింది.బీచ్లో ప్రపోజల్..నెచ్చెలి ఎదురుగా వచ్చి చేయందుకోమన్నాక ఎవరైనా ఎలా ఆగుతారు. శివ్ కూడా అంతే.. సంతోషంతో గంతేశాడు. తప్పకుండా అని అంగీకారంగా హత్తుకున్నాడు. అప్పుడు ప్రియాంక సగం పెళ్లి అయిపోనట్లే అన్నట్లుగా ఓ ఉంగరాన్ని అతడి వేలికి తొడిగింది. నా జీవిత భాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడు అధికారికంగా నువ్వు నావాడివి. ఎప్పటికీ నాతోనే ఉండాలి. మనం జంటగా ఎన్నో సాహసాలు చేద్దాం. కలిసి ఎదుగుదాం..ఇక్కడివరకు మన ప్రయాణం అంత సులువుగా జరగలేదు. తర్వాత కూడా అంత ఈజీగా ఉండకపోవచ్చు. కానీ మనం ప్రతిరోజు దాన్ని ఉత్తమంగా మార్చుకునేందుకు ప్రయత్నిద్దాం. ఏయేటికాయేడు కాలాన్ని వృథా చేయకుండా జ్ఞాపకాలు కూడబెట్టుకుందాం. కలిసి ముందుకుసాగుదాం అని రాసుకొచ్చింది. ఇది చూసిన బుల్లితెర తారలు, అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సీరియల్స్తో పాపులర్కర్ణాటకలో పుట్టి పెరిగిన ప్రియాంక.. జానకి కలగనలేదు, మౌనరాగం వంటి సీరియల్స్తో పాపులర్ అయింది. మౌనరాగం సీరియల్లో శివకుమార్కు జంటగా నటించింది. అక్కడ మొదలైన పరిచయమే తర్వాతి కాలంలో ప్రేమగా మారింది. ప్రస్తుతం ఒకే ఇంట్లో ఉంటున్న వీళ్లిద్దరూ పెళ్లెప్పుడు చేసుకుంటారని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బిగ్బాస్ అయిపోగానే వివాహం చేసుకోవాలనుకున్నారు. గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలని ప్లాన్కాకపోతే అంగరంగ వైభవంగా, కొన్నిరోజులపాటు పెళ్లి వేడుకలు జరుపుకోవాలని ప్లాన్ చేసుకుందట ప్రియాంక. అందుకు చాలా డబ్బు అవసరం అవుతుందని, అది సంపాదించుకున్నాకే పెళ్లి చేసుకుంటామని గతేడాది శివకుమార్ బయటపెట్టాడు. ఇప్పుడా సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. ఈ ఏడాదే వీరి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) చదవండి: చిన్నతనంలో చేదు అనుభవాలు.. అబ్బాయిల్ని నమ్మాలంటేనే.. -
మహేశ్ సినిమాలో..?
మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో హీరోయిన్ ప్రియాంకా చోప్రా, హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలుపోషిస్తున్నారు. తాజాగా ఈ టీమ్లోకి మాధవన్ కూడా చేరినట్లు ఫిల్మ్నగర్ సమాచారం. ఆయన ఓ కీలకపాత్రలో కనిపించనున్నారని టాక్. ఈ మేరకు మాధవన్తో చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే ఆయన సెట్స్లో అడుగు పెట్టబోతున్నారని భోగట్టా.మరి... ఈ చిత్రంలో మాధవన్ భాగం అవుతారా? లేదా అనే విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఇండియానా జోన్స్ స్టైల్ కథతో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్ని ఈ నెలలోనే మొదలు పెట్టనున్నారట. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ ఈ అడ్వెంచరస్ ఫిల్మ్ను దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్తోపాన్ వరల్డ్ రేంజ్లో నిర్మిస్తున్నారనే టాక్ నడుస్తోంది. తెలుగులో ఇదే అత్యధిక బడ్జెట్ ఫిల్మ్ అని టాక్. -
సూపర్ హీరోలు వస్తున్నారోచ్
ఐరన్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, హల్క్... ఇలా హాలీవుడ్ సూపర్ హీరో కథలను భారతీయ ప్రేక్షకులు వీక్షించారు. అబ్బురపరచే వారి సాహసాలను శభాష్ అన్నారు. అయితే ఇప్పుడు మన ఇండియన్ సినిమా సూపర్ హీరోస్ కూడా వస్తున్నారోచ్. వెండితెరపై ఆడియన్స్ను ఆశ్చర్యపరచే అద్భుత విన్యాసాలు, సాహసాలతో ఆడియన్స్ వావ్ అనేలా కష్టపడటానికి రెడీ అవుతున్నారు. ఇక మన సూపర్ హీరో వివరాలపై ఓ లుక్ వేయండి.విశ్వంభర ప్రపంచంలో... ‘విశ్వంభర’ సినిమాలో సూపర్ హీరో మాదిరి యాక్షన్ చేయనున్నాడట దొరబాబు. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ అడ్వెంచరస్ అండ్ యాక్షన్ మూవీ ‘విశ్వంభర’. కాగా ఈ చిత్రంలో ఆంజనేయస్వామి భక్తుడు దొరబాబుపాత్రలో చిరంజీవి కనిపిస్తారని, దొరబాబుగా విశ్వంభర ప్రపంచంలో సాగే కొన్ని సన్నివేశాల్లో సూపర్ హీరోలా యాక్షన్ సన్నివేశాలు చేస్తారని ఫిల్మ్నగర్ సమాచారం. పంచభూతాల (గాలి, నీరు, భూమి, ఆకాశం, నిప్పు) నేపథ్యం, విశ్వంభర అనే బుక్, సిస్టర్స్ సెంటిమెంట్తో ఈ సినిమా కథనం సాగుతుందని సమాచారం.యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. కాక΄ోతే వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా సినిమా విడుదల ఆలస్యమౌతోందని తెలుస్తోంది. ఈ వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ‘విశ్వంభర’ సినిమా విడుదల తేదీపై ఓ క్లారిటీ రానుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, ఇతర ప్రధానపాత్రల్లో ఆషికా రంగనాథ్, బాలీవుడ్ యాక్టర్ కునాల్ కపూర్ కనిపిస్తారు. కీలకపాత్రల్లో సురభి, ఇషా చావ్లా, ప్రవీణ్ కనిపిస్తారని తెలిసింది.వచ్చే ఏడాది స్టార్ట్ ‘ఖైదీ, విక్రమ్, లియో’ వంటి మాస్ సినిమాలు తీసిన తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఓ సూపర్ హీరో కథను రెడీ చేశారు. లోకేశ్ కనగరాజ్ కథలోని సూపర్ హీరోగా బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కనిపించనున్నారు. ఈ సూపర్ హీరో సినిమాను ఇటీవల ఆమిర్ ఖాన్ ఓ సందర్భంలో కన్ఫార్మ్ చేశారు. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తనకు ఓ సూపర్ హీరో కథ చెప్పారని, లోకేశ్తో తాను ఈ సూపర్ హీరో మూవీ చేయనున్నానని, వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభిస్తామని ఆమిర్ ఖాన్ చెప్పారు.ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందనే టాక్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తాను హీరోగా నటించిన ‘సితారే జమీన్ పర్’ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు ఆమిర్ ఖాన్. ఈ సినిమా తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్లో ఆమిర్ ఖాన్ నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈలోపు కార్తీతో ‘ఖైదీ 2’ సినిమా చేసేస్తారు లోకేశ్ కనగరాజ్. ఇలా... ఆమిర్–లోకేశ్ల ఇతర కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్లోని సినిమా సెట్స్కు వెళ్తుందని ఊహించవచ్చు. అలాగే లోకేశ్ దర్శకత్వంలోని తాజా చిత్రం ‘కూలీ’లో ఆమిర్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ హీరోగా, నాగార్జున, శ్రుతీహాసన్, సత్యరాజ్, ఉపేంద్ర ఇతర కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది.ఆన్ ద వే! సిల్వర్ స్క్రీన్పై రవితేజను ఓ సూపర్ హీరోగా చూపించనున్నారు ‘మ్యాడ్’ డైరెక్టర్ కల్యాణ్ శంకర్. ‘మ్యాడ్, మ్యాడ్ 2’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న ఈ దర్శకుడు కొన్ని రోజుల క్రితమే ఓ సూపర్ హీరో స్క్రిప్ట్ను రెడీ చేసుకున్నారు. ఈ కథను రవితేజకు వినిపించగా, ఈ హీరో ప్రాథమికంగా అంగీకారం తెలిపారట. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్కు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారట కల్యాణ్ శంకర్. ఈ స్క్రిప్ట్, ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ ఓ కొలిక్కి వచ్చి, రవితేజకు కల్యాణ్ శంకర్ ఫైనల్ నరేషన్ ఇచ్చి, రవితేజ ఈ సినిమాకు ఓకే చెబితే, మూవీ సెట్స్పైకి వెళ్లినట్లే. అయితే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లడానికి మాత్రం కాస్త సమయం పట్టవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నూతన దర్శకుడు భాను భోగవరపుతో ‘మాస్ జాతర’ అనే మూవీ చేస్తున్నారు రవితేజ.ఆగస్టు 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అలాగే కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘అనార్కలి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ కూడా చేస్తున్నారు రవితేజ. ‘మాస్ జాతర’ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ‘అనార్కలి’ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. పైగా ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఆల్రెడీ రవితేజ ప్రకటించారు. సో... ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే కల్యాణ్ శంకర్తో సూపర్ హీరో తరహా సినిమా చేసే ఆలోచన చేయవచ్చు రవితేజ. ఇక ఈ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘మ్యాడ్, మ్యాడ్ 2’ చిత్రాలు, రవితేజ ‘మాస్ జాతర’ సినిమాలను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థనే కల్యాణ్ శంకర్–రవితేజల సూపర్ హీరో సినిమాను నిర్మించనుందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. సో... సూపర్ హీరో ఆన్ ద వే అన్నమాట.సరికొత్త ప్రపంచంలోకి... ఆడియన్స్ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నారు హీరో అల్లు అర్జున్. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ అంతర్జాతీయ స్థాయి సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టిస్తున్నారట దర్శకుడు అట్లీ. ఈ సినిమాలో ఊహకందని లొకేషన్స్, వినూత్నమైన జీవరాసులు ఉంటాయట. పైగా ఈ చిత్రంలో అల్లు అర్జన్ త్రిపాత్రాభినయం చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అయితే ఈ మూడుపాత్రల్లో ఒకపాత్ర సూపర్ హీరో తరహాలో ఉంటుందని ఫిల్మ్నగర్ సమాచారం. ఆల్రెడీ ఈపాత్రకు సంబంధించి విదేశీ సాంకేతిక నిపుణులు, ఫైటర్స్ నేతృత్వంలో అల్లు అర్జున్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారని తెలిసింది.ఇక ఈ చిత్రంలో కథ రీత్యా ఐదుగురు హీరోయిన్స్ ఉంటారనే టాక్ వినిపిస్తోంది. ఓ హీరోయిన్గా దీపికా పదుకోన్ నటించనున్నారు. దీపికపాత్రకు యాక్షన్ సీక్వెన్స్లు కూడా ఉన్నాయి. ఈ చిత్రంలో ఓ వారియర్ తరహాపాత్రలో కనిపిస్తారామె. ఇంకా ఈ చిత్రంలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్ భాగమయ్యారని, ఈ విషయంపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ ఏడాదిలోనే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. భారీ బడ్జెట్తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. వీలైనంత తొందరగా ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసి, 2027 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలన్నది చిత్రయూనిట్ ΄్లాన్ అని భోగట్టా.ఇటు అధీర... అటు మహాకాళి! ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా కొన్ని సూపర్ హీరో తరహా సినిమాలు రూపొందుతున్న సంగతి తెలిసిందే. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హను–మాన్’ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో తేజ సజ్జా సూపర్ హీరో పవర్స్ ఉన్న యువకుడు హనుమంతుపాత్రలో కనిపించి, ఆడియన్స్ను మెప్పించారు. ఈ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్’ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి మెయిన్ లీడ్ రోల్ చేస్తారు. అయితే ఈ చిత్రంలోనూ హనుమంతుపాత్ర ఉంటుందట. ఇంకా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగానే ‘అధీర’ అనే సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది.ఈ సూపర్ హీరో సినిమాలో నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు కల్యాణ్ దాసరి హీరోగా నటిస్తారు. ఇంకా ప్రశాంత్ వర్మ యూనివర్స్లో భాగంగానే ‘మహాకాళి’ అనే మూవీ రానుంది. విశేషం ఏంటంటే... ఇది ఫీమేల్ సూపర్ హీరో మూవీ అన్నమాట. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో ఆర్కేడీ స్టూడియోస్ పతాకంపై ఆర్కే దుగ్గల్ సమర్పణలో రివాజ్ రమేశ్ దుగ్గల్ ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాలో ఎవరు మెయిన్ లీడ్ చేస్తారన్నది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కాగా ప్రశాంత్ వర్మ షో రన్నర్గా ఉన్న ‘మహాకాళి’ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ఓ కీలకపాత్రలో నటిస్తారు. గత ఏడాది దసరా పండగ సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు ప్రశాంత్వర్మ. ఈపోస్టర్పై మోస్ట్ ఫెరోషియస్ సూపర్ హీరో ఇన్ ది యూనివర్స్ అని ఉండటం విశేషం.పీపుల్స్ సూపర్ హీరో పీపుల్స్ సూపర్ హీరోగా చెప్పుకునే శక్తిమాన్ సరికొత్త పవర్స్తో వెండితెరపైకి రానున్నాడు. మూడు సంవత్సరాల క్రితమే ఈ ‘శక్తి మాన్’ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో శక్తి మాన్గా రణ్వీర్ సింగ్ నటిస్తారని, మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ దర్శకత్వం వహిస్తారని, హీరోయిన్గా వామికా గబ్బి కనిపిస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే ‘శక్తి మాన్’ సినిమాలోని నటీనటులపై ఇంకా పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సిని మాలో రణ్వీర్ సింగ్ నటించడం లేదని, ఈ సినిమాకు ఓ నిర్మాతగానే ఆయన ఉంటారనే ప్రచారం కూడా బాలీవుడ్లో వినిపించింది. మరి... శక్తి మాన్గా ఎవరు కనిపిస్తారనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.సూపర్ యోధ ‘హను–మాన్’ ఫేమ్ తేజ సజ్జా హీరోగా రూపొందుతున్న అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా మూవీ ‘మిరాయ్’. రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో తేజ సజ్జా సూపర్ హీరో తరహాలో కనిపిస్తారు. ఇటీవల విడుదలైన, ఈ ‘మిరాయ్’ గ్లింప్స్ వీడియోతో ఈ విషయం స్పష్టమౌతోంది. అడ్వెంచరస్తోపాటు కొన్ని మైథలాజికల్ అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు ఈ చిత్రదర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ ముంబైలోని చారిత్రక గుహల్లో ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ ‘మిరాయ్’ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. అలాగే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది.మల్టీవర్స్ మన్మథన్ మలయాళ నటుడు నివిన్ పౌలీ ఓ సూపర్ హీరో ఫిల్మ్ చేస్తున్నారు. ‘మల్టీవర్స్ మన్మథన్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఆదిత్యన్ చంద్ర శేఖర్ దర్శకత్వం వహించనున్నారు. ఆనంద్, నితీరాజ్ ఈ సినిమాకు కో రైటర్స్గా పని చేస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా ప్రక టించారు. ‘‘ఇండియాస్ ఫస్ట్ మల్టీవర్స్ సూపర్ హీరో సినిమా ఇది’’ అని ఈ సినిమా అనౌన్స్మెంట్ సమయంలో నివిన్ పౌలీ ‘ఎక్స్’పోస్ట్లో పేర్కొన్నారు. అయితే ఈ సూపర్ హీరో ఫిల్మ్ మూడు నాలుగు భాగాలుగా రానుందని, తొలి భాగంగా ‘మన్మథన్ రైజింగ్’ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం మలయాళ, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.కల నిజమైంది నటుడిగా ఉన్ని ముకుందన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ‘భాగమతి, కిలాడి, యశోద’ వంటి సినిమాల్లో ఉన్ని ముకుందన్ నటన తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ మలయాళ నటుడు ఓ సూపర్ హీరో సినిమాతో దర్శకుడిగా మారనున్నారు. ఆ మధ్య ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఉన్ని ముకుందన్. తాను చిన్నప్పట్నుంచి సూపర్ హీరో కథలు, వీరోచితపోరాటాలు చూస్తూ పెరిగానని, తన కలలో కొందరు సూపర్ హీరోస్ ఉన్నారని, వారిని వెండి తెరపైకి తీసుకువచ్చేందుకు తొలిసారి దర్శకత్వం వహించనున్నానని ఉన్ని ముకుందన్ పేర్కొన్నారు. మిథున్ మాన్యువేల్ థామస్ కథ అందిస్తున్న ఈ సినిమాను గోకులమ్ గోపాలన్ నిర్మించనున్నారు. ఈ ఏడాదే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు ఉన్ని ముకుందన్. ఈ కోవలో మరికొంతమంది సూపర్ హీరోలు వెండితెరపైకి రానున్నారు. – ముసిమి శివాంజనేయులు -
పాన్ వరల్డ్ హీరోయిన్ రీఎంట్రీ..
మలయాళంలో హీరోయిన్గా రంగప్రవేశం చేసి, టాలీవుడ్, కోలీవుడ్లను దాటి ఉత్తరాది భాషల్లోనూ తన కంటూ స్టార్ ఇమేజ్ను సంపాదించుకున్న తెలుగింటి ఆడపడుచు రంభ. సర్గం (1992) అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ అదే ఏడాదిలో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చేశారు. ఆపై తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ, బోజ్పురి, ఆంగ్లం మొదలగు 8 భాషల్లో నటించి అప్పట్లోనే పాన్ వరల్డ్ కథానాయకిగా వెలిగారు. అలా రెండు దశాబ్దాలకు పైగా అగ్ర కథానాయకిగా రాణించిన రంభ చివరిగా తమిళంలో పెణ్ సింగం (2010) అనే చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. అలా 100కు పైగా చిత్రాల్లో నటించిన ఈమె 2010లో కెనడాకు చెందిన ఇంద్రకుమార్ పద్మనాధన్ అనే పారిశ్రామిక వేత్తను పెళ్లాడారు. ఆ తరువాత కూడా కొన్ని చిత్రాల్లో నటించిన రంభ 2017 తరువాత నటనకు దూరమయ్యారు. కాగా 49 ఏళ్ల రంభ ఇప్పుడు చెన్నైకి మకామ్ మార్చి మళ్లీ సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ నటించాలా, నిర్మాతగా చిత్రాలు నిర్మించాలా అనే సందిగ్ధంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె ఇంతకుముందు చిత్ర నిర్మాణం ప్రారంభించి త్రీ రోజెస్ అనే చిత్రాన్ని నిర్మించారన్నది తెలిసిందే. అయితే, ఆ చిత్రం రంభను నిరాశపరచింది. కొందరు దర్శకులు మాత్రం రంభ నిర్మించే చిత్రాలకు పనిచేయాలని ఆశపడుతున్నట్లు టాక్.. కారణం ఆమె భర్త వేల కోట్లకు అధిపతి కావడమేననే టాక్ మరో పక్క సామాజక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇకపోతే ఒక తమిళ చిత్రంలో పార్థిబన్, రంభ కలిసి నటించారు. అలా షూటింగ్కు వచ్చిన ఆమెను చూసిన పార్థిబన్తో పాటు తదితర సినీ ప్రముఖులు రంభ సార్ అంటూ ఆమెను తెగ అభిమానిస్తూ చుట్టుముట్టేశారు. అలాంటి రంభ ఇప్పుడు మళ్లీ నటించడానికి సిద్ధం అవుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఫొటో షూట్ నిర్వహించి ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. -
రెండో పెళ్లి చేసుకున్న హీరో.. పోస్ట్ వైరల్
ప్రముఖ తమిళ నటుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇదివరకే 2014లో ఓసారి కైవల్య అనే అమ్మాయిని వివాహం చేసుకోగా.. ఇప్పుడు మరోసారి కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు నటుడు కృష్ణ కులశేఖరన్ ప్రకటించాడు. దీంతో వరలక్ష్మీ శరత్ కుమార్తోపాటు పలువురు నటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇంతకీ ఎవరీ నటుడు? టాలీవుడ్తో ఏమైనా సంబంధం ఉందా?(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?)తమిళంలో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టిన కృష్ణ.. తర్వాత హీరోగానూ పలు సినిమాలు చేశాడు. ప్రస్తుతం వెబ్ సిరీసుల్లో సహాయ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నాడు. రీసెంట్ టైంలో ఝాన్సీ, పారాచూట్ లాంటి తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సిరీసుల్లో కనిపించాడు. ఇతడు వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 'పంజా' దర్శకుడు విష్ణువర్ధన్ ఇతడికి స్వయానా అన్నయ్య అవుతాడు.2014లోనే కైవల్య అనే అమ్మాయిని కృష్ణ పెళ్లి చేసుకున్నాడు. ఈ వేడుకకు తమిళ హీరో ఆర్యతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. కొన్నాళ్ల తర్వాత భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు మరోసారి పెళ్లి చేసుకున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. అయితే అమ్మాయి ఎవరు? యాక్టరా కాదా అనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.(ఇదీ చదవండి: సైలెంట్గా పెళ్లి చేసుకున్న 'ఆరెంజ్' హీరోయిన్) View this post on Instagram A post shared by Krishna kulasekaran (@krishnakulasekaran) -
తొలిరోజే నెగిటివ్ టాక్.. 'థగ్ లైఫ్' కలెక్షన్స్ ఎంత?
కమల్ హాసన్ దిగ్గజ నటుడు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ 'విక్రమ్' తప్పితే ఆయన కెరీర్లో గత కొన్నేళ్లలో సరైన హిట్ అన్నది లేదు. దీంతో 'థగ్ లైఫ్' సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. భాష వివాదం వల్ల కర్ణాటకలో పూర్తిగా ఈ మూవీని రిలీజ్ చేయనని తెగేసి చెప్పాడు. దీంతో తెలుగు-తమిళ భాషల్లో నిన్న(జూన్ 5) ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ దీనికి తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయ్? సోషల్ మీడియాలో టాక్ ఏం నడుస్తోంది?కమల్ హాసన్-మణిరత్నం కాంబోలో మూడు దశాబ్దాల క్రితం 'నాయకుడు' అనే సినిమా వచ్చింది. గ్యాంగ్స్టర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. క్లాసిక్గా నిలిచిపోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే హీరో-దర్శకుడు కలిసి ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారనేసరికి హైప్ ఏర్పడింది. 'థగ్ లైఫ్' ట్రైలర్ కూడా బాగుండేసరికి కమల్ హిట్ కొట్టడం గ్యారంటీ అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ తర్వాత పూర్తిగా టాక్ మారిపోయింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?)తెలుగు, తమిళంలో ఎక్కడా కూడా కమల్ 'థగ్ లైఫ్' చిత్రానికి పాజిటివ్ టాక్ రాలేదు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. అయినా సరే తొలిరోజు ఓ మాదిరి కలెక్షన్స్ వచ్చాయి. దేశవ్యాప్తంగా రూ.17 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు రూ.కోటి షేర్ కూడా రాలేదని అంటున్నారు. కమల్-మణిరత్నం కాంబోకి ఇది చాలా తక్కువ మొత్తం అని చెప్పొచ్చు. కొన్నాళ్ల క్రితం వచ్చిన కమల్ హాసన్ 'ఇండియన్ 2' ఘోరమైన ఫ్లాప్. కానీ ఈ చిత్రానికి తొలిరోజు రూ.25 కోట్ల వరకు వచ్చాయి. 'థగ్ లైఫ్'కి మాత్రం వసూళ్లు ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించట్లేదు.'థగ్ లైఫ్' విషయానికొస్తే.. రంగరాయ శక్తిరాజు (కమల్ హాసన్) ఓ గ్యాంగ్స్టర్. తల్లిదండ్రులు కోల్పోయిన అమర్ (శింబు) అనే కుర్రాడిని పెంచుకుంటాడు. తన నేర సామ్రాజ్యానికి కీలకంగా మారుస్తాడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల శక్తిరాజు-అమర్ మధ్య గొడవలు వస్తాయి. ఒకరిని ఒకరు చంపుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంతకీ ఇలా జరగడానికి కారణాలేంటి? ఈ కథలో త్రిష పాత్రేంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పవన్ 'ఓజీ' కంటే కన్నప్ప బడ్జెట్ ఎక్కువ: మంచు విష్ణు) -
స్టార్ హీరోయిన్ కుమారుడి గ్రాడ్యుయేషన్ పూర్తి.. ఫోటో వైరల్
ఒక నాటి మేటి నటి సిమ్రాన్ సౌత్ ఇండియాలోని అన్ని భాషలలో నటించి చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు. 2003లో తన వివాహం తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చేశారు. కానీ, ఏదైన కథ నచ్చితే అడపాదడపా పలు సినిమాల్లో నటించారు. అయితే, ఇప్పుడు తన కుమారుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడని సంతోషంతో సోషల్మీడియాలో ఆమె పంచుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ముంబైకి చెందిన సిమ్రాన్ పెళ్లి తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు. 2003లో తన చిన్ననాటి స్నేహితుడు దీపక్ బగ్గాను ప్రేమించి ఆమె పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థలో దీపక్ ఉద్యోగం చేసేవాడు. సిమ్రాన్తో పెళ్లి తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు. అందులో సీరియల్స్తో పాటు పలు చిన్న బడ్జెట్ సినిమాలు నిర్మించారు. ఆపై దీపక్ కూడా సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నించాడు. కానీ, అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ దంపతులకు అధీప్, ఆదిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, ఇప్పుడు అధీప్ గ్రాడ్యేషన్ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా తన కుమారుడి గురించి సిమ్రాన్ ఇలా చెప్పుకొచ్చారు. ' చిన్ని చిన్ని చేతులతో మా ముందు నిల్చోని ఉన్న రోజులు గుర్తు ఉన్నాయి. ఇప్పుడు నిన్ను గ్రాడ్యుయేషన్ గౌనులో మా కంటే ఎత్తుగా నిలబడటం వరకు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నువ్వు ఏదిగే తీరును చూసి మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. నీకు అభినందనలు ఓడో, నువ్వు మమ్మల్ని ఎల్లప్పుడు చాలా గర్వపడేలా చేస్తావు.' అని సిమ్రాన్ పేర్కొన్నారు.సీనియర్ స్టార్ హీరోయిన్ సిమ్రాన్.. 1976లో ముంబైలో రిషిబాలా నావల్లో జన్మించిన ఆమె 1995లో హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సిమ్రాన్.. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 1996లో అబ్బాయిగారి పెళ్లి చిత్రం ద్వారా టాలీవుడ్లో అడుగుపెట్టింది. 1997లో విడుదలైన నేరుక్కు నెర్ సినిమా తమిళంలో ఫుల్ క్రేజ్ తీసుకువచ్చింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. సౌత్లో చిరంజీవి,రజనీకాంత్,కమల్ హాసస్, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల అందరి సరసన హీరోయిన్గా మెప్పించింది. View this post on Instagram A post shared by Simran Rishi Bagga (@simranrishibagga) -
విందులో విజయ్ ఎమోషనల్.. ఇక గుడ్బై
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పేరు వింటే చాలు తమిళనాడు ఊగిపోతుంది. ఇక రాబోయే రోజుల్లో ఈ పేరు సినిమా రంగంలో ట్రెండింగ్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే విజయ్ కథానాయకుడుగా నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్ అని తెలిసిందే. గతేడాదిలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన విజయ్ రానున్న శాసనసభ ఎన్నికల్లో (2026) పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో జననాయకన్ తన చివరి చిత్రమని ఆయనే స్వయంగా ప్రకటించారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి గ్రిప్పింగ్స్ ఇప్పటికే విడుదలై చిత్ర అంచనాలను పెంచేశాయి. కాగా జననాయకన్ చిత్ర టీజర్ను విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 22న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందులో విజయ్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేవిధంగా చిత్ర ఓటీటీ హక్కులను ఒక సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం పొంగల్ సందర్భంగా జనవరి 2026లో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా జననాయకన్ చిత్ర షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులందరికీ బిరియానీ విందును ఇచ్చిన విజయ్ భావోద్రేకానికి గురైనట్లు సమాచారం. అప్పట్లో రాజకీయ రంగప్రవేశం చేసిన ఎంజీఆర్ నటించిన చివరి చిత్రం మదురై మీట్ట సుందరపాండియన్. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. జననాయకన్ చిత్రం విజయ్ జీవితాన్ని ఎలా మారుస్తుందో అనే ఆసక్తి ఇరాన్ అభిమానుల్లో నెలకొంది. -
చాకో కారుకు ప్రమాదం.. ‘దసరా’ విలన్ ఇంట తీవ్ర విషాదం!
కోలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. తమిళ నటుడు షైన్ టామ్ చాకో కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో చాకో తండ్రి మృతి చెందగా, తల్లి, సోదరుడు, డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడులోని ధర్మపురి జిల్లా పాలకోట్టై సమీపంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో చాకో కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చాకో కుటుంబం ఎర్నాకులం నుంచి బెంగళూరుకు కారులో ప్రయాణిస్తుండగా, పాలకొట్టై సమీపంలో ఆగి ఉన్న లారీని వారి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చాకో తండ్రి మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చాకో కుడి చేతికి గాయం అయింది. అతని తల్లి, సోదరుడు, డ్రైవర్కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. షైన్కు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారు.ప్రమాదం జరిగిన వెంటనే గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారుషైన్ టామ్ చాకో మలయాళ చిత్రసీమలో ప్రముఖ నటుడు మాత్రమే కాకుండా, తెలుగు చిత్రం దసరాలో విలన్ పాత్రతో టాలీవుడ్లో కూడా గుర్తింపు పొందారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ఈ చిత్రంలో షైన్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. -
విడాకులు కోర్టులో ఉండగా హీరో పెళ్లి? అసలు విషయమిదే!
కోలీవుడ్ జంట రవి (Jayam Ravi)- ఆర్తి విడాకులు దాదాపు ఖరారైనట్లే! మూడో వ్యక్తి ప్రమేయం వల్లే విడిపోవాల్సి వస్తోందని ఆర్తి భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఆ మూడో వ్యక్తి మరెవరో కాదని, సింగర్ కెనీషా అన్న ప్రచారం మొదలైంది. రవి.. సింగర్ కెనీషా (Keneeshaa)తో ప్రేమలో ఉన్నాడని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా వీరిద్దరూ పూలదండలతో ఉన్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. పూలదండలతో కోలీవుడ్ జంటఇది చూసిన నెటిజన్లు అదేంటి? అప్పుడే వీరి పెళ్లి జరిగిపోయిందా? అని షాకవుతున్నారు. అసలు విషయమేంటంటే.. తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న కుండ్రతుర్ మురుగన్ దేవాలయాన్ని రవి, కెనీషా సందర్శించారు. దర్శనం అనంతరం అర్చకులతో కలిసి ఇలా ఫోటో దిగారు. జయం సినిమాతో రవి విపరీతమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ చిత్రంతోనే అతడు జయం రవిగా స్థిరపడిపోయాడు. కానీ ఇటీవలే తనను జయం రవి అని పిలవొద్దని కేవలం రవి అని మాత్రమే పిలవాలని సూచించాడు. 15 ఏళ్ల బంధానికి ఫుల్స్టాప్!ఇకపోతే ఇతడు నిర్మాత సుజాత విజయకుమార్ కూతురు ఆర్తిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య ఇటీవల భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో 15 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు చెన్నై ఫ్యామిలీ కోర్టులో నడుస్తోంది. తనకు భర్త నుంచి నెలకు రూ.40 లక్షల భరణం కావాలని డిమాండ్ చేస్తోంది.చదవండి: 'దీపికాతో రెండేళ్ల ప్రేమ..' కుక్కలా హీనంగా చూసేది..: హీరో -
టూర్ బాగా జరిగిందా..?
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’(Tourist Family) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మన ఇరుగు పొరుగు ఎవరున్నారో, ఏం చేస్తున్నారో అని తెలుసుకునే అవకాశం, తీరిక లేని బిజీ రోజుల్లో గడుపుతున్నాం. మన పొరుగింట్లో దొంగ దూరినా లేదా దొర వచ్చినా మనకు తెలిసే సమయానికి తెల్లారిపోతుంది. కానీ అదే ఇరుగు పొరుగు వారి కోసం ఓ కాలనీ వాళ్ళు ఏం చేశారన్నదే ఈ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’(Tourist Family) సినిమా. జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాకు ప్రముఖుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ కూడా బాగా దక్కింది. మరీ ముఖ్యంగా మన ప్రపంచ స్థాయి దర్శక జక్కన్న రాజమౌళి ఈ సినిమాని ప్రశంసించడం విశేషం. అంతలా ఏముందీ సినిమాలో ఓసారి చూద్దాం.శ్రీలంక దేశం నుండి ధర్మాన దాస్ కుటుంబం అక్రమంగా సముద్ర మార్గాన భారత్లోని తమిళనాడు తీర ప్రాంతానికి చేరుకుంటుంది. ధర్మాన దాస్ సతీమణి వాసంతి. వాళ్ళకిద్దరు పిల్లలు నితూషన్, ముల్లి. శ్రీలంకలో సంక్షోభం వల్ల భారత్లో సంపాదించడానికి వాసంతి సోదరుడు ప్రకాశ్ సహాయంతో కుటుంబం అంతా రామేశ్వరానికి వస్తారు. అదే ఊర్లో ఉన్న కేశవనగర్ కాలనీలో ఓ ఇంట్లోకి అద్దెకి చేరతారు. ఆ కాలనీ చాలా విచిత్రమైనది. ఎవ్వరి మార్గం వాళ్ళది అన్నట్టుగా ఉంటారు. ధర్మాన దాస్ తమ శ్రీలంక ఉనికి ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడుతుంటాడు. ఈ లోపల అదే ఊరిలోని ఓ చెత్త కుప్పలో భారీ బాంబు పేలుడు సంభవిస్తుంది. అంతకుముందే ధర్మాన దాస్ ఆ చెత్త తొట్టిలో తాము తిన్న పదార్థాల కవర్ వేస్తాడు. అది కాస్తా సీసీ టీవీలో రికార్డు అవుతుంది. దాంతోపోలీసులు ధర్మాన దాస్ కుటుంబం కోసం గాలిస్తుంటారు. ఓ పక్క తమ శ్రీలంక ఐడెంటీటీ ఇతరులకు తెలియనివ్వకుండా, మరో పక్క ఈపోలీస్ కేసును దర్మాన దాస్ కుటుంబం ఎలా ఎదుర్కొంటుందో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాలోనే చూడాలి. ఈ సినిమా ఓ ఫ్యామిలీ ఓరియంటెడ్ కామెడీ థ్రిల్లర్ అని చెప్పవచ్చు.ఈ సినిమాకి మూల కథ రాసుకుని అభిషన్ జీవింత్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు శశికుమార్ హీరో పాత్రలో నటించగా, ప్రముఖ నటి సిమ్రాన్ హీరోయిన్గా నటించి అలరించారు. ముఖ్యంగా ధర్మాన దాస్ చిన్న కొడుకు ముల్లి పెట్టే గిలిగింతలు మామూలుగా ఉండవు. సినిమా మంచి ఎంటర్టైనర్. హాట్ స్టార్లో తెలుగులోనూ లభ్యమవుతోంది. ఇంకెందుకు ఆలస్యం... ఈ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’తో ఈ వారం టూర్కి వెళ్ళండి. – హరికృష్ణ ఇంటూరు -
ఇక షురూ
తమిళనాడులోని పళని దేవాలయానికి హీరో సూర్య అండ్ టీమ్ వెళ్లారు. సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. మమితా బైజు హీరోయిన్గా నటించనున్న ఈ చిత్రంలో రవీనా టాండన్, రాధికా శరత్కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ నెల 9న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది.ఈ సందర్భంగా పళని దేవాలయంలో మురుగన్ని దర్శించుకుని, పూజలు నిర్వహించి, ‘‘ఓ మేజర్ స్టెప్ వేసేందుకు సన్నద్ధమౌతున్నాం. దేవుడి ఆశీర్వాదం కోసం పళని దేవాలయానికి వచ్చాం’’ అని యూనిట్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించనున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్. -
విద్యార్థులకు 'విజయ్' కానుకలు.. రాజకీయాలు వద్దంటూ సూచన
కోలీవుడ్ హీరో, తమిళగ వెట్రి కళగం నేత విజయ్ విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ప్రతి ఏడాది మాదిరే ఈసారి కూడా తమిళనాడు విద్యార్థులకు కానుకలు అందించారు. 2026 ఎన్నికల్లో మార్పు తథ్యమంటూ నినాదాలు హోరెత్తిస్తూనే.. చదువుకునే పిల్లలు రాజకీయ అంశాల గురించి తెలుసుకోవాలని చెప్పిన ఆయన తమ గోల్స్ పూర్తి అయ్యే వరకు వాటికి దూరంగా ఉండాలని వారించారు. ఇందుకు మహాబలిపురంలో మలివిడతగా జరిగిన విద్యా ప్రోత్సాహక కార్యక్రమం వేదికగా మారింది. పది, ప్లస్టూలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను విజయ్ సత్కరిస్తూ, ప్రోత్సాహాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. మలివిడతగా మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో 75 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 500 మంది విద్యార్థులను సత్కరించి, ప్రోత్సాహాన్ని అందించారు. రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను వేదికపైకి పిలిచి సత్కరించడమే కాకుండా, వారితో గ్రూప్ ఫొటోలను విజయ్ దిగారు. అదే సమయంలో మైక్ అందుకున్న విద్యార్థులు విజయ్ తమలో మరింత ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. 2026 ఎన్నికల్లో విజయ్ రూపంలో మార్పు తథ్యమని నినదించారు. అదే సమయంలో మైక్ అందుకున్న విజయ్ రాజకీయాలు వద్దు, విద్యాపరంగా ముందుకెళ్దామని సూచించారు. విద్యార్థులెవరూ రాజకీయాలు మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారు. రాష్ట్ర స్థాయిలోని టాపర్లకు బంగారు ఉంగరాలను విజయ్ అందజేశారు. మలి విడతగా ఈనెల 13న మరో 71 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన టాపర్లను విజయ్ సత్కరించేందుకు నిర్ణయించారు. -
30 శాతం వడ్డీతో డబ్బు చెల్లించండి.. విశాల్కు కోర్టు హెచ్చరిక
కోలీవుడ్ హీరో విశాల్, ప్రముఖ నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions)కు మధ్య కొన్నేళ్లుగా డబ్బు విషయంలో విభేదాలు ఉన్నాయి. తాజాగా ఈ కేసులో విశాల్కు మద్రాస్ కోర్టు షాకిచ్చింది. లైకా ప్రొడక్షన్స్కు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. న్యాయపరమైన ఖర్చులతో సహా లైకా ప్రొడక్షన్స్ వారికి డబ్బు తిరిగి ఇవ్వాలని కోర్టు తెలిపింది.సినిమా తీస్తానని తమ వద్ద విశాల్ రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకుని ఒప్పందం ప్రకారం ఎలాంటి సినిమా చేయలేదని లైకా ప్రొడక్షన్స్ తెలిపింది. ఆపై డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో 2022 లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఆ సమయంలోనే లైకా ప్రొడక్షన్స్కు విశాల్ రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని కోర్టు సూచించింది. తన ఆస్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అంతవరకు ఆయన నటించి, నిర్మించిన ఎలాంటి సినిమాలు థియేటర్స్, ఓటీటీల్లో విడుదల చేయకూడదంటూ స్టే విధించింది. అయితే, కోర్టు తీర్పును విశాల్ ఉల్లంఘించారని లైకా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆపై విశాల్ మీద కోర్టు ధిక్కరణ కేసు ఫైల్ చేసింది. దీంతో న్యాయస్థానం విశాల్ను మందలించింది. లైకాకు చెల్లించాల్సిన 21.29 కోట్ల రూపాయలను 30 శాతం వడ్డీ, న్యాయపరమైన ఖర్చులతో సహా చెల్లించాలని మద్రాస్ హైకోర్టు నటుడు విశాల్ను ఆదేశించింది. విశాల్ తన ఆస్తుల వివరాలను కోర్టుకు దాఖలు చేశాడు. తన వద్ద 3 కార్లు, ఒక బైక్తో పాటు రెండు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పత్రాలను కోర్టుకు అందించారు. తన ఇంటిపై తీసుకున్న రుణానికి సంబంధించిన వివరాలను కూడా ఆయన అందించారు. -
స్టార్ హీరోతో 'లోకేష్ కనగరాజ్' కొత్త సినిమా ప్రకటన
బాలీవుడ్ అగ్ర హీరో ఆమిర్ ఖాన్ , తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈమేరకు తాజాగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది. కోలీవుడ్లో విక్రమ్, లియో, ఖైదీ, మాస్టర్ వంటి సినిమాలతో టాప్ దర్శకుడిగా దేశవ్యాప్తంగా లోకేష్ కనగరాజ్ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన తొలిసారి ఒక బాలీవుడ్ సినిమాను తెరకెక్కించనున్నారు.ఆమిర్ ఖాన్ (Aamir Khan) తన కొత్త సినిమా ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par) ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేశ్ కనగరాజ్తో తాను ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే చర్చలు కూడా పూర్తి అయ్యాయి అని తెలిపారు. అత్యంత భారీ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ ఇందులో ఉంటాయని ఆయన అన్నారు. సూపర్హీరో జానర్లో స్టోరీ ఉంటుందని హింట్ ఇచ్చారు. అయితే, వచ్చే ఏడాది జూన్లో ఈ చిత్రం ప్రారంభం అవుతుందని తెలిపారు. రెండేళ్ల తర్వాత ఈ సినిమా గురించి చర్చించుకుందామని ఆమిర్ ఖాన్ సూచించారు.‘పీకే 2’ సినిమా గురించి సోషల్మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమిర్ ఖాన్ అన్నారు. పీకే2 సినిమా చేయాలనే ఆలోచన లేదని ప్రకటించారు. అయితే, 'దాదా సాహెబ్ ఫాల్కే'పై సినిమా చేస్తున్నామని, రాజ్ కుమార్ హిరాణీతో చర్చలు జరుగుతున్నాయిని చెప్పారు. ‘మహాభారతం’పై సినిమా చేయాలనేది తన 25 ఏళ్ల డ్రీమ్ అంటూ ఆమిర్ ఖాన్ తెలిపారు. అదొక యజ్ఞంలా చేయాలనే ఆలోచన ఉంది. చర్చలు అయితే జరుగుతున్నాయి. త్వరలో మరిన్ని విషయాలు చెబుతానని ఆమిర్ అన్నారు.ఇదిలా ఉంటే.. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ చిత్రంలో ఆమిర్ ఖాన్ ఓ అతిథి పాత్ర చేస్తున్నారనే టాక్ కూడా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ తర్వాత లోకేష్ మరో కొద్దిరోజులు గ్యాప్ తీసుకుని ఆమిర్ సినిమా చేయనున్నారు. -
కాశ్మీర్లో స్టార్ హీరోయిన్ పేరుతో ఒక గ్రామం.. వైరల్ అవుతున్న ఫోటో
కోలీవుడ్ నటి త్రిషకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తన పేరే ఒక బ్రాండ్ అనే రేంజ్కు ఒక హీరోయిన్గా ఆమె ఎప్పుడో చేరిపోయారు. అయితే అంతకుమించి అనే విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సాధారణంగా సినిమా కథానాయికలు పదేళ్లు అగ్ర కథానాయికలుగా రాణించడం కష్టతరం. అలాంటిది త్రిష ఏకంగా 20 ఏళ్లకు పైగా క్రేజీ స్టార్గా వెలిగిపోతుండడం విశేషం. పెరగని వయసు, తగ్గని గ్లామర్ త్రిష సొంతం. ఈమె తాజాగా అజిత్ సరసన నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం విడుదలై కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకున్నారు. మరోవైపు మణితర్నం దర్శకత్వంలో కమలహాసన్ సరసన నటించిన థగ్లైఫ్ చిత్రం జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చేసింది. సూర్యకు జోడీగా నటిస్తున్న మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అదేవిధంగా తెలుగులో చిరంజీవికి జంటగా నటించిన విశ్వంభర చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. మలయాళం, కన్నడం భాషల్లోనూ నటిస్తూ దక్షిణాది భాషల్లో తగ్గేదేలే అంటూ తన జోరు సాగిస్తున్నారు. త్రిషకు చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మొదట్లోనే మిస్ చైన్నె కిరీటాన్ని గెలుచుకున్న త్రిషను ఇప్పటివరకూ ఒక బ్రాండ్ అనే అనుకున్నాం. అంతకుమించి అని ఇప్పుడు తెలిసింది. ఈ బ్యూటీ పేరుతో ఒక ఊరే ఉండడం విశేషం. అది ఎక్కడో తెలుసా లడక్లో, అవును ఆక్కడ త్రిష పేరుతో ఒక ఊరు ఉంది. ఆ ఊరు పేరుతో ఉన్న బోర్డును ఒక అభిమాని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. అందులో త్రిష.. మీ పేరుతో లడక్లో ఒక ఊరు ఉంది. మీకు తెలుసా? తెలిస్తే మీరు వెంటనే ఆ ఊరుకు వస్తారు’ అని అతను పేర్కొన్నాడు. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
కమల్ హాసన్ అంటే ఎంత ప్రేమో.. 42 కి.మీ ప్రయాణించి మరీ..!
కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్లో 1987లో వచ్చిన నాయకన్ (నాయకుడు) మూవీ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సినిమా వచ్చిన 38 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ నాయకుడు సినిమాకు ప్రత్యేక అభిమానులున్నారు. ఇన్నేళ్ల తర్వాత కమల్-మణిరత్నం కాంబోలో థగ్ లైఫ్ సినిమా రూపుదిద్దుకుంది. శింబు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కన్నడలో ప్రదర్శితం కాని థగ్ లైఫ్అయితే కమల్ కన్నడ భాషపై చేసిన కామెంట్లతో పెద్ద వివాదం రాజుకుంది. తమిళం నుంచే కన్నడ పుట్టిందనడంతో కర్ణాటకలో సినిమాపై నిషేధం విధించారు. అయినప్పటికీ కమల్ క్షమాపణ చెప్పేందుకు ఒప్పుకోలేదు. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, కన్నడ ప్రజలంటే ఎంతో ప్రేమ అని సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో అతడు కూడా తన సినిమాను కర్ణాటకలో విడుదల చేయడం లేదని ప్రకటించాడు. కానీ అక్కడి అభిమానులు థగ్ లైఫ్ చూడకుండా ఉండలేకపోయారు.అభిమానంఓ ఫ్రెండ్స్ గ్రూప్ 42 కి.మీ. ప్రయాణించి తమిళనాడులోని హోసూర్లో థగ్ లైఫ్ ప్రదర్శితమవుతున్న థియేటర్కు చేరుకున్నారు. మరో అభిమానైతే.. కమల్కు నేను వీరాభిమానిని. సినిమా చూసేందుకు బైక్పై హోసూర్ రావడం సురక్షితమేనా? లేదంటే అక్కడకు వచ్చాక కర్ణాటకవాసినని నా బైక్ టైర్లు పంక్చర్ చేసి, పాడు చేయరు కదా? అని ప్రశ్నించాడు. అందుకు కొందరు.. అలా ఏం జరగదు. నిరభ్యంతరంగా వచ్చి సినిమా చూడొచ్చు. హోసూర్లో కర్ణాటకలో రిజిస్టర్ అయిన వాహనాలు ఎన్నో తిరుగుతాయి. భయపడాల్సిన పని లేదని భరోసా ఇచ్చాడు.చదవండి: చాలా హర్టయ్యా.. జీవితంలో అలా మాట్లాడను: రాజేంద్రప్రసాద్ -
‘థగ్ లైఫ్’ మూవీ రివ్యూ
38 ఏళ్ల క్రితం ‘నాయకుడు’తో బాక్సాఫీస్ని షేక్ చేశారు దర్శకుడు మణిరత్నం, హీరో కమల్ హాసస్. ఆ తర్వాత ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రమే ‘థగ్ లైఫ్’(Thug Life Review). ఈ హై ఓల్టేజ్ గ్యాంగ్స్టర్ డ్రామాలో శింబు కీలక పాత్ర పోషించారు. త్రిష, అభిరామి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 5) ఈ చిత్రం రిలీజైంది. దాదాపు 38 ఏళ్ల తర్వాత మణిరత్నం-కమల్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.‘థగ్ లైఫ్’ కథేంటంటే..?ఢిల్లీకి చెందిన రంగరాయ శక్తిరాజు(కమల్ హాసన్) ఒక గ్యాంగ్స్టర్. తన అన్న మాణిక్యం(నాజర్)తో కలిసి మరో గ్యాంగ్స్టర్ సదానందం(మహేశ్ మంజ్రేకర్)తో ఒక సెటిల్మెంట్కి వెళ్తాడు. అక్కడికి పోలీసులు రావడంతో కాల్పులు జరుగుతాయి. దీంతో రంగరాయ శక్తిరాజు అమర్(శింబు) అనే చిన్నారిని అడ్డుపెట్టుకొని అక్కడి నుంచి తప్పించుకుంటాడు. తన ప్రాణాలను కాపాడినందుకు అమర్ని పెంచి పెద్ద చేస్తాడు. తన నేర సామ్రాజ్యానికి అమర్ని కీలక శక్తిగా మారుస్తాడు. కొన్నాళ్ల తర్వాత అమర్నే అనుమానిస్తాడు రంగరాయ శక్తిరాజు(Thug Life Review). అదే సమయంలో రంగరాయ శక్తిరాజే తన తండ్రిని చంపాడని అమర్కి తెలుస్తుంది. దీంతో రంగరాయ శక్తిరాజును చంపేందుకు ప్రయత్నిస్తాడు. మరి అమర్ ప్రయత్నం ఫలించిందా? సొంత అన్న మాణిక్యం కూడా రంగరాయ శక్తిరాజుని చంపేందుకు ఎందుకు ప్రయత్నించారు? అసలు అమర్ తండ్రిని చంపిందెవరు? చిన్నప్పుడే తప్పిపోయిన చెల్లెలు చంద్ర(ఐశ్వర్య లక్ష్మీ) మళ్లీ అమర్ని కలిసిందా? సొంత తమ్ముడిలా పెంచిన అమరే తన ప్రాణాలను తీసేందుకు కుట్ర చేశాడనే విషయం తెలిసిన తర్వాత రంగరాయ శక్తిరాజు ఏం చేశాడు? భార్య లక్ష్మీ(అభిరామి), కూతురు మంగ(సంజన) కోసం శక్తిరాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఈ కథలో త్రిష పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మణిరత్నం-కమల్ కాంబినేషన్లో ఓ సినిమా అంటే అంచనాలు పెరగడం సర్వ సాధారణం. అందుకే ‘థగ్ లైఫ్’పై కమల్ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులు కూడా మొదటి నుంచి భారీ ఆశలు పెట్టుకున్నారు. దానికి తోడు ప్రమోషన్స్లో కమల్ ‘ఈ చిత్రం ‘నాయకుడు’ కంటే పెద్ద హిట్ అవుతుంది’ అని చెప్పడంతో సాధారణ ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతోనే సినిమాకు వెళ్లారు. వారి అంచనాలను అందుకోవడంలో మణిరత్నం సఫలం కాలేదనే చెప్పాలి. ఓ రొటీన్ గ్యాంగ్స్టర్ కథనే కమల్తో చెప్పించాడు. కథనంలో కూడా కొత్తదనం లేదు. సినిమా చూస్తున్నంతసేపు మణిరత్నం తెరకెక్కించిన ‘నవాబ్’ చిత్రమే గుర్తుకొస్తుంది. అందులో వచ్చే ట్విస్టులు కొంతమేర ఆకట్టుకుంటాయి. ఇందులో అదీ కూడా ఉండదు. ఓ సాధారణమైన గ్యాంగ్స్టర్ కథకి ఫ్యామిలీ ఎమోషన్స్ని యాడ్ చేసి ‘థగ్ లైఫ్’ ని తీర్చిదిద్దాడు మణి. సాధారణ కథనైనా తెరపై ఎంతో అద్భుతంగా చూపించే సత్తా ఉన్న మణిరత్నం.. ఈ కథ, అందులో రాసుకున్న పాత్రలు, వాటిని తీర్చిదిద్దిన విధానం చూస్తే నిజంగానే ఇది మణి సినిమానేనా అనే అనుమానం కలుగుతుంది. కమల్తో పాటు ఏ ఒక్కరి పాత్రను కూడా బలంగా రాసుకోలేకపోయాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎక్కడా ట్విస్టులూ ఉండవు. ఊహకందేలా కథనం సాగుతుంది. అయితే ఎప్పటి మాదిరే నిజాయితీగా కథను చెప్పే ప్రయత్నం చేశాడు. ‘ఇది యముడికి నాకు జరిగే కథ’ అని కమల్ పాత్రలో చెప్పిస్తూ సినిమాను ప్రారంభించారు దర్శకుడు. కీలక పాత్రల పరిచయం వరకు కథనం ఆసక్తికరంగానే సాగుతుంది. తన అన్న మాణిక్యం కూతురు ఆత్మహత్య చేసుకోవడం.. దానికి కారణమైన వ్యక్తిని కాల్చి చంపి శక్తిరాజు జైలుకు వెళ్లిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. అమర్ మారిపోవడం.. ఆధిపత్య పోరుతో శక్తిరాజుని చంపేందుకు చేసే కుట్ర ఇవ్వన్నీ రొటీన్గా ఉన్నా.. మధ్యలో వచ్చే ఫ్యామిలీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కమల్-అభిరామి మధ్య వచ్చే సన్నివేశాలను రొటీన్ కథనంతో విగిసిపోతున్న ప్రేక్షకులకు ఉపశమనం కలిగిస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై కాస్త ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం మరింత రొటీన్గా సాగుతుంది. రివేంజ్ డ్రామా అంత ఆస్తికరంగా అనిపించదు. క్లైమాక్స్ కూడా రొటీన్గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. కమల్ నటన గురించి ఎం చెప్పగలం. ఎలాంటి పాత్రల్లోనైనా జీవించగలడు. రంగరాయ శక్తిరాజు పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. అయితే కమల్ గతంలో అలాంటి పాత్రలు చాలా చేడయంతో తెరపై చూసినప్పుడు కొత్తగా అనిపించదు. అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా కమల్ పాత చిత్రాలను గుర్తుకు చేస్తాయి. అమర్ పాత్రకు శింబు న్యాయం చేశాడు. అయితే ఆ పాత్రని మరింత బలంగా తీర్చిదిద్దితే బాగుండేదేమో. మాణిక్యంగా నాజర్ రొటీన్ పాత్రే చేశాడు. ఇక శక్తిరాజు భార్య లక్ష్మీగా అభిరామి ఉన్నంతలో బాగానే నటించింది. త్రిష పాత్రకు అంతగా ప్రాధాన్యత ఉండదు. మణిరత్నం- కమల్ సినిమా కాబట్టే ఆ పాత్ర చేయడానికి త్రిష ఒప్పుకుందేమో. పోలీస్ ఆఫీసర్గా అశోక్ సెల్వరాజ్, శక్తిరాజు టీంలో కీలక వ్యక్తి పత్రాస్గా జోజు జార్జ్ తో పాటు తనికెళ్ల భరణి, ఐశ్వర్య లక్ష్మీ, మహేశ్ మంజ్రేకర్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఈ సినిమాకు ప్రధాన బలం ఏఆర్ రెహమాన్. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. యాక్షన్ సన్నివేశాలకు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం అదిరిపోయింది. పాటలు పర్వాలేదు. రవి.కె.చంద్రన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో కట్ చేయాల్సిన సీన్లు చాలా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
ప్రతీది రాజకీయమే.. కమల్ 'కన్నడ' వివాదంపై రానా రియాక్షన్
'తమిళ భాష నుంచే కన్నడ పుట్టింది' అని కమల్ హాసన్ (Kamal Haasan) చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. మా భాషను తక్కువ చేసి మాట్లాడతావా? అని ఆయన నటించిన థగ్ లైఫ్ సినిమా (Thug Life Movie)పై కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ) నిషేధం ప్రకటించింది. అప్పటికీ కమల్ వెనక్కుతగ్గలేదు. తన సినిమా కర్ణాటకలో రిలీజ్ చేయాలని కోర్టుకెళ్లాడు. అసలు ఏ ఆధారంతో అటువంటి కామెంట్లు చేశారు? సారీ చెప్తే అయిపోతుందిగా అని న్యాయస్థానం చీవాట్లు పెట్టింది.ఏది మాట్లాడినా వివాదమే..అప్పటికీ కమల్ క్షమాపణ చెప్పడం కాదుకదా.. అసలు కర్ణాటకలో సినిమా విడుదల చేయట్లేదని ప్రకటించాడు. తాజాగా ఈ వ్యవహారం హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati)కి వద్ద ప్రస్తావనకు వచ్చింది. రానా నాయుడు- రెండో సీజన్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో కమల్- కన్నడిగుల మధ్య రాజుకున్న వివాదం గురించి రానా మాట్లాడుతూ.. అభిప్రాయాలు వ్యక్తం చేసే ప్లాట్ఫామ్గా సోషల్ మీడియా మారిపోయింది. మొదట్లో ఇలాంటి మాధ్యమాలన్నీ ఏం లేవు. ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదాస్పదమవుతోంది. ప్రతీది రాజకీయం చేస్తున్నారు అన్నాడు. ఇకపోతే రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన రానా నాయుడు రెండో సీజన్ జూన్ 13 నుంచి నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది.చదవండి: మరో ఓటీటీకి వచ్చేస్తోన్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్! -
మరో ఓటీటీకి వచ్చేస్తోన్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్!
ఓటీటీల్లో థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టపడని వారు దాదాపు ఉండరు. ముఖ్యంగా హారర్ మూవీలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి వారికోసమే మరో సూపర్ హిట్ థ్రిల్లర్ వచ్చేస్తోంది. మలయాళంలో ఇప్పటికే అభిమానులను మెప్పించిన చిత్రం వడక్కన్. ఈ సూపర్ థ్రిల్లర్ మూవీ మార్చి 7, 2025న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ కిశోర్, శృతి మీనన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సజీద్ ఎ దర్శకత్వం వహించారు.ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోనూ సందడి చేస్తోంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం మలయాళం, కన్నడ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే తాజాగా ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.ఈ శుక్రవారం అంటే జూన్ 6వ తేదీ నుంచి నుంచి ఆహాలో స్ట్రీమింగ్కు రానుంది. ఆహాలో తెలుగు, తమిళం భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఇక కథ విషయానికొస్తే అతీంద్రీయ శక్తుల గురించి శోధించే ఇద్దరు వ్యక్తులు కేరళలోని ఓ చోట జరిగిన కొన్ని అంతు చిక్కని మరణాల గురించి తెలుసుకోవడానికి వస్తారు. అక్కడ వాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్నదే వడక్కన్ స్టోరీ. Mattrum oru thriller🔥🔥on the way makkaley😉#Vadakkan premieres from June6 on @ahatamil @OffbeetStudios #Vadakkanonaha #ahatamil pic.twitter.com/OAobkRgUyB— aha Tamil (@ahatamil) June 3, 2025 -
ఆరేళ్ల తర్వాత ఓటీటీకి దుల్కర్ సల్మాన్ సినిమా.. ఎక్కడ చూడాలంటే?
గతేడాది లక్కీ భాస్కర్తో సూపర్ హిట్ కొట్టిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన చిత్రం 'ఓరు యమండన్ ప్రేమకథ'. ఈ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్కు బీసీ నౌఫల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. 2019లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మలయాళంలో అప్పట్లో సూపర్ హిట్గా నిలిచింది.తాజాగా ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో ఒక యముడి ప్రేమకథ టైటిల్తో ఓటీటీలో రిలీజ్ చేశారు. అయితే దాదాపు ఆరేళ్ల తర్వాత రావడంతో ఓటీటీ ప్రియులు ఆదరిస్తారో లేదో వేచి చూడాల్సిందే. -
బెంగళూరు విషాదం.. కమల్ హాసన్ ట్వీట్!
బెంగళూరులో జరిగిన విషాదంపై కమల్ హాసన్ ట్వీట్ చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని పోస్ట్ చేశారు. ఈ ఘటన హృదయ విదారకంగా అనిపించిందని.. తీవ్రమైన బాధలో ఉన్నానని రాసుకొచ్చారు. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు.కాగా.. ఐపీఎల్ విజేతగా నిలిచిన ఆర్సీబీ నిర్వహించిన పరేడ్ విషాదంగా మారింది. చిన్నస్వామి స్టేడియంలోకి ఒక్కసారిగా అభిమానులు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పదిమందికి పైగా మృతి చెందారు. చాలామంది ఫ్యాన్స్ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ బాధితులకు అండగా నిలవాలంటూ ట్వీట్ చేశారు.మరోవైపు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్ ఇవాళే థియేటర్లలో విడుదలైంది. అయితే కన్నడ భాషపై ఆయన కామెంట్స్ వివాదానికి దారి తీయడంతో కర్ణాటకలో రిలీజ్ చేయలేదు. ఇప్పటికే థగ్ లైఫ్ మూవీ కన్నడ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. Heart wrenching tragedy in Bangalore. Deeply distressed and my heart reaches out to the families of the victims in this moment of grief. May the injured recover soon.— Kamal Haasan (@ikamalhaasan) June 4, 2025 -
కమల్ హాసన్ థగ్ లైఫ్.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం 'థగ్ లైఫ్'. ఈ మూవీకి మణిరత్న దర్శకత్వం వహించారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీరిద్దరు జతకట్టారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.ఈ నేపథ్యంలోనే అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ హాఫ్ సూపర్ ఎంగేజింగ్గా ఉందని చెబుతున్నారు. మణిరత్నం డైరెక్షన్ అద్భుతంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. ఈసినిమాలో కమల్ హాసన్ లుక్ అదిరిపోయిందని మరికొందరు రాసుకొచ్చారు. మరికొందరేమో ఇండియన్-2 కంటే వరస్ట్గా ఉందని.. కమల్ హాసన్ ఫర్మామెన్స్ అస్సలు బాగాలేదని పోస్ట్ చేశారు. శింబు రోల్కు పెద్దగా ప్రాధాన్యత లేదని.. కథ చాలా బోరింగ్గా ఉందంటున్నారు. థగ్ లైఫ్ సినిమాలో కమల్ నటన బాగానే ఉందని.. కానీ అతని నాన్ స్టాప్ డైలాగ్స్ బోరింగ్గా అనిపించాయని ఓ నెటిజన్స్ ట్వీట్ చేశారు. శింబు తన పాత్రను చక్కగా చేశాడు.. కానీ అది కూడా చాలా నార్మల్గా ఉందని.. సాగే సెకండ్ హాఫ్ స్లోగా ఉండడంతో బోరింగ్గా ఉందంటూ..ఈ చిత్రంలో మణిరత్నం స్పార్క్ కనిపించలేదని పోస్ట్ చేశాడు. అయితే ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. వీటితో సాక్షికి ఎలాంటి సంబంధం లేదు. #ThugLife had potential but turns into a drag. Kamal acted well, but his nonstop dialogues get tiring. Simbu did his role neatly, but even that couldn’t save the flat, slow-paced second half. No Mani Ratnam spark.Below average 👍#ThugLife #KamalHaasan #ThugLifeFDFS pic.twitter.com/I5wQlxoBO7— The Flicks (@Flicks_rithick) June 5, 2025 #ThugLifeReview Kindly tighten the security & don’t let him enter this street, if he is coming with a story for a new movie.🙏 #ThugLife pic.twitter.com/8n9QZyWd8D— Kingsley (@CineKingsley) June 5, 2025 #ThugLife Mani sir what were u thinking? Worse than #Indian2 #KamalHaasan𓃵 is aged and gives the weakest perf. #SilambarasanTR is wasted in a role with 0 scope. #Trisha is in a dummy role. Slow boring and hard to sit through this bad gangster drama. Semma mokka! 1.25/5 pic.twitter.com/tPQkbHaFB4— AllAboutMovies (@MoviesAbout12) June 5, 2025 #FDFS Never Miss!! #KamalHaasan𓃵 So it Beginsssss 😘♥️ #ThugLife #Malaysia ♥️ pic.twitter.com/pdWBRCuAZQ— 𝓡𝓲𝓓𝓓𝓲𝓜 (@RiDDiM04) June 5, 2025 Thug life review: first half 🇨🇦 - super engaging 🏆🏆Mani ratnam aesthetics >>>>>🧨🧨🧨🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩Hoping for a better second half .Mani ratnam is the Hayao Miyazaki of Indian Cinema ✨✨✨❤️❤️#ThugLife #KamalHaasan𓃵 #ThugLifeBlockbuster #Thuglifereview pic.twitter.com/UtFcICxImv— juice9 (@Georgej39718648) June 5, 2025 -
'థగ్ లైఫ్' మేకింగ్ వీడియో.. ఇంత కష్టపడ్డారా?
గత కొన్నిరోజుల నుంచి తమిళ హీరో కమల్ హాసన్ వార్తల్లో ఉంటూనే ఉన్నారు. దీనికి కారణం 'థగ్ లైఫ్' సినిమా. కొన్నిరోజుల క్రితం జరిగిన చిత్ర ఈవెంట్లో మాట్లాడుతూ కన్నడ భాష.. తమిళం నుంచే పుట్టిందని అన్నాడు. దీంతో కర్ణాటక వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. కమల్ వేసిన పిటిషన్ వల్ల ఈ వివాదంలోకి కర్ణాటక హైకోర్ట్ కూడా ఎంటరైంది. సారీ చెబితే సరిపోతుంది కదా అని చివాట్లు పెట్టింది.(ఇదీ చదవండి: చాలా హర్టయ్యా.. జీవితంలో అలా మాట్లాడను: రాజేంద్రప్రసాద్)ఇలా కాంట్రవర్సీతో వార్తల్లో నిలిచిన కమల్ హాసన్.. మరోవైపు 'థగ్ లైఫ్' చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయనని క్లారిటీ ఇచ్చాడు. ఇకపోతే ఈ మూవీ రేపు అనగా జూన్ 05న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా మూవీ మేకింగ్ వీడియోని విడుదల చేశారు. ఎలాంటి లొకేషన్స్లో మూవీని చిత్రీకరించారో చూపించారు. ఈ వీడియోకి ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా డిఫరెంట్గా ఉంది.దాదాపు 38 ఏళ్ల తర్వాత కమల్ హాసన్-మణిరత్నం కలిసి చేసిన సినిమా ఇది. వీళ్లే నిర్మాతలగానూ వ్యవహరించారు. మరి కమల్ కావాలనే కన్నడ ప్రేక్షకులతో ఈ గొడవ పెట్టుకున్నాడా? అనిపిస్తుంది. ఎందుకంటే సారీ చెప్పనని లెటర్ రిలీజ్ చేయడం లాంటివి చూస్తుంటే భవిష్యత్తులో తమిళ మూవీస్కి సెగ తప్పదేమో అనిపిస్తుంది. మరి చూడాలి కమల్ 'థగ్ లైఫ్'తో ఏం చేస్తాడో?(ఇదీ చదవండి: 'థగ్లైఫ్' కమల్ దెబ్బ.. జన నాయకన్ విజయ్కి తగిలింది) -
'థగ్లైఫ్' కమల్ దెబ్బ.. జన నాయకన్ విజయ్కి తగిలింది
ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టు.. కమల్కి కన్నడిగులకు మధ్య నెలకొన్న వివాదం కాస్త.. దీనితో ఏ సంబంధం లేని తమిళ సినీ నటుడు విజయ్ మీద పడనుందా? అంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. కన్నడ భాష మీద ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం చెలరేగి థగ్లైఫ్ సినిమాని నిషేధించాలనే వరకూ దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ఇరు పక్షాలూ తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తుండడంతో థగ్లైఫ్ సినిమా విడుదల అనంతరం పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.ఈ నేపధ్యంలో ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్కు చుట్టుకోనుంది. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో అడుగుపెట్టడానికి ముందుగా విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయకన్', ఇప్పుడు 'థగ్ లైఫ్' వివాదంతో ఇది పెనవేసుకుని పెను వివాదంలో చిక్కుకుంది. దీనికి కారణం జననాయకన్ చిత్రాన్ని నిర్మిస్తోంది బెంగళూరు కేంద్రంగా ఉన్న నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ కావడమే.వచ్చే ఏడాది జనవరి 9న తమిళ పొంగల్ సందర్భంగా విడుదల కావల్సిన ఈ సినిమా.. విజయ్ రాజకీయ ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల సమరాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందింది. దీనిని సమయోచితంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే వీరి ప్లాన్స్ను థగ్లైఫ్ దుమారం పెద్ద దెబ్బ కొట్టే ప్రమాదం కనిపిస్తోంది. థగ్ లైఫ్ని బ్యాన్ చేయాలనే ప్రచారం ఊపందుకోవడంతో పాటే సామాజిక మాధ్యమాల్లో 'బ్యాన్ జననాయకన్' అనే కొత్త క్యాంపెయిన్ మొదలైంది.థగ్ లైఫ్ సినిమాని కర్ణాటకలో నిషేధిస్తే, కన్నడ సినిమాలు తమిళనాడులో నిషేధించాలి. విజయ్ తన జననాయకన్ సినిమాని ఇక వదులుకోవాలి అంటూ ఎక్స్ వేదికగా రాజేష్ లింగేష్ అనే వ్యక్తి చేసిన ప్రకటనకు అనేక మంది మద్దతు తెలుపుతూ, జననాయకన్ కూడా బ్యాన్ చేయాలి అంటూ పోస్ట్లు చేస్తుండడం ఎక్కువైంది. తమిళ, కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ భాషలలో విడుదల కానున్న జననాయకన్ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ పెట్టిన రాజకీయ పార్టీ తమిళక వెట్రి కజగం.. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న పరిస్థితుల్లో... ఈ చిత్రం విడుదల, విజయం కూడా ఆ పార్టీకి చాలా కీలకం.దీంతో విజయ్ అభిమానులు ఈ ప్రచారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సినిమాని విజయ్కు అత్యంత నమ్మకస్తుడైన జగదీష్ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతోంది. కేవలం కన్నడ సంస్థ నిర్మిస్తున్నందుకు సినిమా నిషేధించడం న్యాయం కాదు. జననాయకన్ విడుదల కోసం భాషా బేధాలకు అతీతంగా అందరూ ఎదురు చూస్తున్నారు అంటూ వారు అంటున్నారు. మరోవైపు విజయ్ రాజకీయ ప్రత్యర్ధులు కూడా ఈ ప్రచారాన్ని ఎగదోస్తున్నారంటూ మరికొందరు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా నేడు థగ్లైఫ్.. కర్ణాటకలో ఎదుర్కోబోయే పరిస్థితులు రేపటి జననాయకన్ భవితవ్యాన్ని నిర్ణయించే అవకాశాలు మెండుగా ఉన్నాయనేది సుస్పష్టం. -
తీవ్ర దుఃఖంలో శోభన.. మాటలు రావడం లేదంటూ..
సీనియర్ హీరోయిన్ శోభన (Shobana) చిన్ననాటి స్నేహితురాలిని కోల్పోయింది. తనకు ఎంతో ఇష్టమైన మిత్రురాలు అనిత మీనన్ ఇక లేదన్న విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. సోషల్ మీడియా వేదికగా మిత్రురాలి మృతికి సంతాపం ప్రకటించింది. నా ప్రియమైన స్నేహితురాలి ఆత్మకు శాంతి చేకూరాలి. ఇంతకుమించి ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. బాబూ అంకుల్, సూ ఆంటీ, సతీశ్ మీనన్, అవీషా, అనీషా.. మీ అందరికీ నా ప్రగాఢ సానుభూతి అంటూ స్నేహితురాలు అనితతో కలిసున్న చిన్ననాటి ఫోటోలను షేర్ చేసింది.చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్చెన్నైలోని మైలపోర్లో శోభన ఇంటి పక్కనే అనిత మీనన్ కుటుంబం నివాసముండేది. శోభన కంటే అనిత మూడేళ్లు చిన్నది. ఇరుగుపొరుగు కుటుంబాలు కావడంతో వీరిద్దరూ ఎప్పుడూ క్లోజ్ ఫ్రెండ్స్గా కలిసుండేవారు. శోభన హీరోయిన్గా వెండితెరపై బిజీగా ఉన్నప్పటికీ అనితతో తన స్నేహాన్ని కొనసాగించింది. ఇకపోతే శోభన.. ఇటీవలే వెండితెరపైకి రీఎంట్రీ ఇచ్చింది. తుడరుం సినిమాలో మోహన్లాల్ భార్యగా నటించింది. 1990లో వీరిద్దరి కాంబినేషన్లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. సినిమాలు‘మంగళ నాయగి’ సినిమాతో ఉత్తమ బాలనటి అవార్డు అందుకున్న నాలుగేళ్లకే, ‘ఏప్రిల్ 18’ అనే మలయాళ చిత్రంతో హీరోయిన్గా మారింది. మలయాళంలో మణిచిత్రతారు అనే సినిమాలో ద్విపాత్రాభినయంతో మెప్పించి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. మిత్ర్ - మై ఫ్రెండ్ అనే సినిమాకుగానూ మరోసారి జాతీయ పురస్కారం గెల్చుకుంది. నటిగానే కాకుండా క్లాసికల్ టీచర్గా సేవలందిస్తున్న శోభనను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్తో సత్కరించింది. View this post on Instagram A post shared by Shobana Chandrakumar (@shobana_danseuse) చదవండి: ఆ మందులు వాడమన్న సమంత.. భగ్గుమన్న డాక్టర్ -
లోకేష్ యూనివర్స్లోకి కొత్త విలన్.. 'రోలెక్స్' అంత లేదు గానీ
ప్రస్తుత తరంలో సినిమాటిక్ యూనివర్స్ అనగానే ముందుగా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గుర్తొస్తాడు. ఖైదీ, విక్రమ్ సినిమాలతో ఈ తరహా యూనివర్స్ సృష్టించాడు. ఇందులో భాగంగా త్వరలో ఖైదీ 2, రోలెక్స్, విక్రమ్ 2 సినిమాలు రాబోతున్నాయని స్వయంగా లోకేశ్.. పలు ఇంటర్వ్యూల్లో చెబుతూనే ఉన్నాడు. ఇప్పుడు లోకేష్ యూనివర్స్లోకి కొత్త విలన్ వచ్చిచేరాడు.లోకేశ్ దర్శకుడిగా ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు పలు చిత్రాలకు కథలు అందిస్తూ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. అలాంటి ఓ మూవీనే 'బెంజ్'. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ వయలెంట్ యాక్షన్ మూవీలో ఇప్పుడు మలయాళ నటుడు నివిన్ పౌలీ విలన్గా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అతడి పాత్ర ప్రోమో వీడియోని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: రామ్ చరణ్ అత్తకు ఇంత టాలెంట్ ఉందా?) 'విక్రమ్' మూవీ చివర్లో వచ్చే రోలెక్స్ పాత్రని స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో గానీ.. 'బెంజ్' విలన్ చూస్తుంటే సూర్యనే గుర్తొచ్చాడు. ఒళ్లంతా బంగారు చైన్స్, వాచ్, చివరకు బంగారు పళ్లతో నివిన్ పౌలీ కనిపించిన విధానం.. చివర్లో తన పేరు వాల్టర్ అని చెప్పడం ఇదంతా కూడా రోలెక్స్ పాత్రనే ఫాలో అయిపోయినట్లు అనిపించింది. ఇందులో వాల్టర్ అనే విలన్గా నివిన్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ వీడియోలోనే.. ఈ సినిమా లోకేశ్ యూనివర్స్లో భాగమని క్లారిటీ ఇచ్చారు. మరి ఏ సినిమాలో ఈ పాత్రని లింక్ చేస్తారో చూడాలి?బెంజ్ సినిమాకు భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు కాగా.. యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన వీడియోకు కూడా డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చి ఆకట్టుకున్నాడు. విలన్గా చేస్తున్న నివిన్ పౌలీ విషయానికొస్తే.. మలయాళంలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సాయిపల్లవికి ఎంతో పేరు తెచ్చిన 'ప్రేమమ్'లో హీరో ఇతడే. మరి ఇప్పుడు విలన్గా ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి?(ఇదీ చదవండి: తెలుగు డైరెక్టర్.. నా థైస్ కొలతలు అడిగాడు: మౌనీషా చౌదరి) -
బెంగళూరు గెలుపు.. పూనకంతో ఊగిపోయిన స్టార్ డైరెక్టర్
ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ గెలవడంతో ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. రోడ్లపైకి వచ్చిన విక్టరీని ఎంజాయ్ చేశారు. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సైతం బెంగళూరు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. మ్యాచ్ ముగిసిన వెంటనే డ్యాన్స్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. కేజీఎఫ్తో బ్లాక్బస్టర్ హిట్స్ కొట్టిన ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం మన యంగ్ టైగర్తో సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీని ఎన్టీఆర్-నీల్ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. Director #PrashanthNeel is overjoyed as he celebrates #RCB’s victory in IPL 2025🏆#IPL2025Final #TeluguFilmNagar pic.twitter.com/tnXGeqqkem— Telugu FilmNagar (@telugufilmnagar) June 3, 2025 -
దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: తమిళ నిర్మాతల సంఘం వినతి
కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమా నిషేధంపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు లేఖ రాసింది. ఈనెల 5న విడుదలకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అయితే కమల్ హాసన్ కన్నడ భాషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో థగ్ లైఫ్ను బ్యాన్ చేస్తూ కేఎఫ్సీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తమ లేఖలో రాస్తూ..' ఎన్నో ఏళ్లుగా కన్నడ, తమిళ సినీ పరిశ్రమలు కలిసి పనిచేస్తున్నాయి. శివరాజ్కుమార్, ఉపేంద్ర, సుదీప్ లాంటి కన్నడ హీరోలు తమిళ సినిమాల్లో నటించారు. కోలీవుడ్ నిర్మాతలు, దర్శకులు సైతం కన్నడ చిత్రాలు తీశారు. కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం ఇద్దరిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రతి భాషకు ఓ చరిత్ర ఉంది. ప్రత్యేకత ఉంది. ఈ సినిమా ఈవెంట్లో కమల్హాసన్ ప్రేమతో మాట్లాడారు. అంతేకానీ మీ భాషను తక్కువ చేయాలని కాదు. కన్నడ చిత్ర పరిశ్రమకు కమల్ ఎంతో సహకారం అందించారు. కన్నడ చిత్ర దర్శకులంటే ఆయన గౌరవం. థగ్ లైఫ్ వాయిదా వేసినా.. బ్యాన్ చేసినా భవిష్యత్తులో ఇండస్ట్రీల మధ్య రిలేషన్ దెబ్బతింటుంది.' ' అని ప్రస్తావించారు.కాగా.. థగ్ లైఫ్ ఆడియో లాంఛ్ ఈవెంట్లో కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. తమిళం నుంచే కన్నడ పుట్టిందని ఆయన కామెంట్స్ చేయడంతో పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు కన్నడిగులు. ఈ నేపథ్యంలోనే కేఎఫ్సీసీ ఆయన సినిమా థగ్ లైఫ్ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కమల్ హాసన్ తాను క్షమాపణ చెప్పేది లేదని స్పష్టం చేశారు. -
కన్నడ భాష వివాదం వేళ.. తమిళంలో కమల్ హాసన్ ట్వీట్ వైరల్!
కమల్ హాసన్ చేసిన కామెంట్స్తో కర్ణాటక వ్యాప్తంగా పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని కమల్ అనడంపై కన్నడిగులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కమల్ లేటేస్ట్ మూవీ థగ్ లైఫ్పై ఏకంగా బ్యాన్ విధించారు. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ థగ్ లైఫ్ను నిషేధిస్తూ ప్రకటన విడుదల చేసింది. కమల్ క్షమాపణ చెబితేనే రిలీజ్ గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు.అయితే కమల్ హాసన్ తన వ్యాఖ్యలపై తగ్గేదే లేదని అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. తప్పు చేస్తేనే క్షమాపణ చెబుతానని స్పష్టం చేశారు. అంతేకాకుండా తన మూవీని కర్ణాటకలో విడుదల చేయడం లేదంటూ వెల్లడించారు. భాషా వివాద నేపథ్యంలో.. కన్నడ ప్రజలకు క్షమాపణ చెప్పమన్న కర్ణాటక హైకోర్టు కమల్ హాసన్ను ఆదేశించింది.అయితే ఈ వివాదం నేపథ్యంలో కమల్ మరోసారి చేసిన ట్వీట్ హాట్ టాపిక్గా మారింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎం.కరుణానిధి జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ పోస్ట్ చేశారు. 'ఆయన తన జీవితాంతం తమిళ భాష, తమిళ కళలకు, తమిళనాడు అభివృద్ధికి, తమిళ కళల సంక్షేమానికి అంకితం చేసిన అసమాన నాయకుడు కలైంగర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడానికి నేను సంతోషిస్తున్నా' అంటూ కరుణానిధితో దిగిన ఫోటోను పంచుకున్నారు.(ఇది చదవండి: కమల్ హాసన్ థగ్ లైఫ్లో మీర్జాపూర్ నటుడు.. క్లారిటీ ఇదే!)థగ్ లైఫ్ వివాదం వేళ కమల్ హాసన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కర్ణాటకలో థగ్ లైఫ్ నిషేధించాలని కోరుతూ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైకోర్టును ఆశ్రయించగా.. ఉన్నత న్యాయస్థానం కమల్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణ చెబితే సరిపోయేది కదా ఆంటూ వ్యాఖ్యానించింది. ఆ తర్వాత తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని కేఎఫ్సీసీకి కమల్ లేఖ రాశారు కానీ క్షమాపణ మాత్రం చెప్పకపోవడం విశేషం.தமிழ் மொழிக்கும் தமிழ்க் கலைக்கும் தமிழ்நாட்டின் வளர்ச்சிக்கும் தமிழர்தம் நலனுக்கும் தன் மொத்த வாழ்வையும் அர்ப்பணித்துச் செயலாற்றிய ஒப்பற்ற தலைவர் கலைஞரை அவர்தம் பிறந்த நாளில் போற்றுவதில் மகிழ்கிறேன். pic.twitter.com/wnR0lOhfKS— Kamal Haasan (@ikamalhaasan) June 3, 2025 -
వెనక్కి తగ్గని కమల్..సారీ చెప్పను- రిలీజ్ చేయను
ప్రస్తుతం కమల్ హాసన్, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ మధ్య చిన్నపాటి వివాదం నడుస్తోంది. కొన్నిరోజుల క్రితం 'థగ్ లైఫ్' ఈవెంట్లో మాట్లాడుతూ.. కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని కమల్ కామెంట్ చేశాడు. దీనిపై కర్ణాటక అధికార, విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సినిమాని తమ దగ్గర నిషేధిస్తున్నట్లు స్వయంగా కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ప్రకటన చేసింది. ఇప్పుడు ఈ విషయమై కమల్ లేఖ విడుదల చేశారు.(ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. ఇళయరాజా రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?)కన్నడ సూపర్స్టార్ రాజ్ కుమార్ కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడిన కమల్.. 'కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యల్ని అక్కడి వారు అపార్థం చేసుకోవడం బాధగా ఉంది. మనదంతా ఒకే కుటుంబం అని చెప్పడమే తన ఉద్దేశమని, ఆ భాషని తక్కువ చేయడం కాదు' అని కమల్ చెప్పారు. ఈ మేరకు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ నరసింహులుకు లేఖ రాశారు.కర్ణాటకలో 'థగ్ లైఫ్' నిషేధించాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకోవడంతో కమల్ హాసన్.. కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా కమల్కి చివాట్లు పెట్టింది. మీరేమైనా చరిత్రకారులు అనుకుంటున్నారా? ఏ ఆధారంతో ఈ కామెంట్స్ చేశారు, సారీ చెబితే సరిపోతుంది కదా అని తీర్పు ఇచ్చింది. అయినా సరే కమల్ వెనక్కి తగ్గలేదు. క్షమాపణ చెప్పలేదు సరికదా.. కర్ణాటకలో 'థగ్ లైఫ్' రిలీజ్ చేయట్లేదని తన లేఖలో పేర్కొన్నారు.(ఇదీ చదవండి: 'హరిహర వీరమల్లు' మళ్లీ వాయిదా?) -
బర్త్ డే స్పెషల్.. ఇళయరాజా రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
మ్యాస్ట్రో ఇళయరాజా.. ఈ పేరు చెప్పగానే సంగీత ప్రియులు పరవశించిపోతారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో పెద్దగా ఈయన మార్క్ కనిపించట్లేదు గానీ 80-90ల్లో ఈయన ఓ సినిమా చేస్తున్నారంటే చాలు సూపర్ హిట్ గ్యారంటీ అనేలా ఉండేది. మరి ఇళయరాజా ఇప్పుడేం చేస్తున్నారు? ఒక్కో చిత్రానికి రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారు?(ఇదీ చదవండి: కమల్ హాసన్కి చివాట్లు పెట్టిన హైకోర్ట్)తమిళనాడులో 1943లో ఇదే రోజున(జూన్ 03) పుట్టిన ఇళయారాజా.. చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. కర్ణాటిక్, వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్న ఈయన.. 1976లో 'అనార్కలి' అనే తమిళ మూవీతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో డిఫరెంట్గా క్రియేట్ చేసిన సౌండ్.. ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేసింది. ఇక అప్పటి నుంచి ఈయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.తెలుగు, తమిళ, హిందీ.. ఇలా పలు భాషల్లో 1000కి పైగా సినిమాలకు ఇళయారాజా పనిచేశారు. 7000 పైచిలుకు పాటల కంపోజ్ చేశారు. నాయగన్, దళపతి చిత్రాలు ఈయన కెరీర్లోనే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అని చెప్పొచ్చు. ఇకపోతే ఇప్పటికీ సినిమాలకు సంగీతమందిస్తున్న ఇళయరాజా.. ఒక్కో సినిమాకు రూ.3-4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఒకప్పటిలా తన సంగీతంతో ప్రభావం చూపించలేకపోతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: రానా నాయుడు 2 ట్రైలర్ వచ్చేసింది)ఇళయరాజా వ్యక్తిగత జీవితానికొస్తే.. జీవా అనే మహిళని పెళ్లి చేసుకున్నారు. ఈమె 2011లో చనిపోయింది. వీళ్లకు ముగ్గురు పిల్లలు. కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా, భవతరిణి. ఈ ముగ్గురు కూడా మ్యూజిక్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. యువన్ రాజా.. తండ్రిలానే సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇళయరాజా ఆస్తి విషయానికొస్తే.. గ్రాండ్ చెన్నై బంగ్లాతో పాటు పలు స్టూడియోలు, అత్యాధునిక సంగీత పరికరాలు ఈయన సొంతం. అలానే దాదాపు రూ.800 కోట్లకు పైగా ఆస్తి ఈయనకు ఉన్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఇళయరాజా సేవలకు మెచ్చి భారత ప్రభుత్వం.. 2010లో పద్మ భూషణ్, 2018లో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. కొన్నాళ్ల ముందు వరకు ఈయన అంటే అందరికీ గౌరవం ఉండేది. కానీ రీసెంట్ టైంలో మాత్రం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పలువురు దర్శక నిర్మాతలపై కాపీ రైట్ కేసులు పెడుతున్నారు. కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇళయరాజా ఎందుకిలా చేస్తున్నారా అని అందరూ మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో 'జాట్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?) -
సారీ చెప్పాల్సిందే.. కమల్ హాసన్పై హైకోర్ట్ ఆగ్రహం
కమల్ హాసన్ చేసిన 'కన్నడ' కామెంట్స్ వల్ల 'థగ్ లైఫ్' సినిమా వివాదంలో చిక్కుకుంది. కర్ణాటకలో ఈ మూవీపై నిషేధం విధించారు. దీంతో కమల్.. కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు. ఈ మేరకు తన చిత్ర విడుదల విషయమై పిటిషన్ వేశారు. ఇప్పుడు దీనిపై స్పందించిన న్యాయస్థానం.. కమల్ హాసన్కి చివాట్లు పెట్టింది. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసింది.(ఇదీ చదవండి: అలా చేసుంటే సత్య సినిమా సర్వనాశనమయ్యేది: ఆర్జీవీ)కమల్ పిటిషన్పై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్ట్.. 'మీరేమైనా చరిత్రకారుడా లేదా భాష పండితుడా? కన్నడ అనేది తమిళ నుంచి పుట్టిందని మీరు ఏ ఆధారంతో చెప్పారు? మీ మాటల వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి మీరు క్షమాపణ చెప్పింది. సమస్య పరిష్కారమవుతుంది' అని తీర్పు ఇచ్చింది.వివాదం విషయానికొస్తే.. కొన్నిరోజుల క్రితం 'థగ్ లైఫ్' ఈవెంట్లో మాట్లాడుతూ కన్నడ భాష తమిళ నుంచి పుట్టిందని కమల్ చెప్పారు. దీంతో కర్ణాటకలోని అధికార, విపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్.. తమ రాష్ట్రంలో ఈ చిత్రాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరో దారిలేక కమల్.. కర్ణాటక హైకోర్ట్ని ఆశ్రయించారు. ఇప్పుడు తీర్పు కమల్కి వ్యతిరేకంగా వచ్చింది. మరి ఇప్పటికైనా కమల్ సారీ చెబుతారా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: రానా నాయుడు 2 ట్రైలర్ వచ్చేసింది) -
రెండో భర్త మరణం.. చిన్ననాటి క్రష్తో ఐదేళ్లుగా కాపురం: హీరోయిన్
అంజు అరవింద్ (Anju Aravind).. నటి మాత్రమే కాదు డ్యాన్సర్ కూడా! అప్పట్లో మలయాళ సినిమాల్లో టాప్ హీరోయిన్గా రాణించిన ఆమె కన్నడ, తమిళ భాషల్లోనూ యాక్ట్ చేసింది. తెలుగులో రథయాత్ర అనే ఏకైక సినిమాలో నటించింది. అరుణాచలం సినిమాలో రజనీకాంత్ సోదరిగానూ కనిపించి ఆకట్టుకుంది. తాజాగా ఓ తమిళ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను గురించి వెల్లడించింది.రెండు పెళ్లిళ్లు విషాదాంతం..అంజు అరవింద్ మాట్లాడుతూ.. మొదటి పెళ్లి విడాకులతో ముగిసిపోయింది. రెండో పెళ్లి చేసుకున్నాక భర్త మరణించాడు. ఇప్పుడు నేను నా చిన్ననాటి క్రష్తో కలిసి జీవిస్తున్నాను. సంజయ్ అంబలపరంబత్తో ఐదేళ్లుగా కలిసుంటున్నాను. నన్ను డ్యాన్స్ టీచర్గా నిలబెట్టి, బెంగళూరులో సెటిలవడానికి సాయం చేసింది సంజయే.. చిన్నప్పుడు ఒక డ్యాన్స్ స్కూల్లో కలుసుకున్నాం. అప్పుడు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను. అప్పుడతడే నా ఫస్ట్ క్రష్. మా ప్రేమకథతో సినిమా తీయొచ్చుడ్యాన్స్ స్కూల్ అయిపోయాక మా జీవితాలు వేరయ్యాయి. చివరకు ఇలా విచిత్రంగా కలుసుకుని ఒక్కటయ్యాం.. మా కథ చెప్పాలంటే ఓ సినిమానే తీయొచ్చు అని చెప్పుకొచ్చింది. డ్యాన్సర్ అయిన సంజయ్ మొదట్లో ఐటీ నిపుణుడిగా పని చేశాడు. ప్రేయసి కోసం బెంగళూరులో అంజు అరవింద్ అకాడమీ ఆఫ్ డ్యాన్స్ సంస్థను నెలకొల్పాడు. మలయాళంలో బోలెడన్ని సినిమాలు చేసిన అంజు అరవింద్.. తర్వాతి కాలంలో బుల్లితెరపైనా సందడి చేసింది. పలు సీరియల్స్లో కీలక పాత్రలు పోషించింది. చదవండి: క్యాన్సర్తో పోరాటం.. ట్రీట్మెంట్ పనిచేయక నటుడు మృతి -
'థగ్ లైఫ్ ఆడకూడదు అంటూ వార్నింగ్'
తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు కమల్ హాసన్పై కర్ణాటక వ్యాప్తంగా వ్యతిరేకత అధికమవుతోంది. ఆయన నటించిన కొత్త సినిమా థగ్ లైఫ్ను కర్ణాటకలో విడుదల చేయకండి అంటూ కన్నడ సంఘాలు హెచ్చరించాయి. ఒక్క థియేటర్లో సినిమా ఆడినా బెంగళూరును బంద్ చేస్తామని కర్ణాటక రక్షణా వేదిక నాయకులు తెలిపారు. ఈ సినిమా జూన్ 5న దేశమంతటా విడుదల అవుతోంది. కమల్ క్షమాపణ చెప్పకపోవడంతో కన్నడ సంఘాలు భగ్గుమంటున్నాయి. సినిమా ఆడిస్తే థియేటర్ లోపలికి చొరబడి ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. కన్నడ సంఘాలన్ని ఏకమై ఈ తీర్మానం చేసినట్లు నేతలు తెలిపారు. కమల్ సినిమా ఎట్టిపరిస్థితిల్లోనూ ఇక్కడ రన్ చేసేది ఉండదని వారు పేర్కొన్నారు. కమల్ని అరెస్టు చేయాలి కమల్ హాసన్ను వెంటనే అరెస్టు చేయాలని మైసూరులో కన్నడ చళువళి పోరాటదారుడు వాటాల్ నాగరాజు, సంఘాల నేతలు కమల్ చిత్రానికి నిప్పుపెట్టారు. కమల్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాటాల్ మాట్లాడుతూ కర్ణాటకలో కమల్ హాసన్ సినిమాలను పూర్తిగా బహిష్కరణ చేయాలని అన్నారు. కన్నడ ప్రజలు కమల్ సినిమాలను వ్యతిరేకించాలని చెప్పారు. -
ఇక్కడే ఇంజినీరింగ్ కళాశాలలో చదివాను: నాగార్జున
ధనుష్, నాగార్జున, నటి రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన ద్విభాషా (తమిళం, తెలుగు) చిత్రం కుబేర( Kuberaa). శ్రీవెంకటేశ్వర ఫిలింస్, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 20వ తేదీన తమిళం, తెలుగు, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ఒక ప్రైవేట్ కళాశాలలో నిర్వహించారు. ఈ వేడుకలో నటుడు ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, దర్శకుడు శేఖర్ కమ్ములతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నటి రష్మిక మందన్న( Rashmika Mandanna) మాట్లాడుతూ తనను ఈ చిత్రంలోకి ఆహ్వానించినందుకు దర్శకుడు శేఖర్ కమ్ములకు కృతజ్ఞతలు తెలిపారు. నటుడు ధనుష్తో మళ్లీ కలిసి నటించాలని కోరుకుంటున్నాననీ, అయితే ఈ సారి పూర్తి ప్రేమ కథా చిత్రంలో నటించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు, గీత రచయిత తదితర బహుముఖ ప్రజ్ఞాశాలి నటుడు ధనుష్ అంటూ ప్రశంసించారు. కుబేర అద్భుతమైన చిత్రం అని పేర్కొన్నారు. నటుడు నాగార్జున(Akkineni Nagarjuna) మాట్లాడుతూ అడయార్లో పుట్టి, గిండీలోని ఇంజినీరింగ్ కళాశాలలో చదివి, చెన్నైకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే జీవితాన్ని ప్రారంభించానని పేర్కొన్నారు. చెన్నై ప్రేక్షకులు తనకు అందిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అని అన్నారు. కుబేర చిత్రం తరువాత రజనీకాంత్తో కలిసి నటించిన కూలీ చిత్రం ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించడానికి ఎదురు చూస్తోందని నాగార్జున పేర్కొన్నారు. నటుడు ధనుష్(Dhanush) మాట్లాడుతూ ఇది కలికాలం అనీ, వ్యతిరేకత, అసూయ పడేవారి కాలం అనీ, చెడు మంచి కంటే పెట్రేగిపోతోందని అన్నారు. పరలోకం నుంచి వచ్చిన దేవత మాదిరి స్వచ్ఛమైన మనసు కలిగిన దర్శకుడు శేఖర్ కమ్ములతో కలిసి పని చేసే అవకాశం కలిగినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాతలు సునీల్ నారంగ్, జాన్వీ నారంగ్ కథపై అపార నమ్మకంతో ఈ చిత్రాన్ని బ్రహా్మండంగా నిర్మించారని పేర్కొన్నారు. -
మనసు నీకై రథమయ్యే రారా...
కమల్హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘థగ్ లైఫ్’. శింబు, త్రిష, అభిరామి, నాజర్ ఇతర ప్రధానపాత్రలు పోషించారు. రాజ్కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రం ఈ నెల 5నపాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్పై ఎన్. సుధాకర్ రెడ్డి రిలీజ్ చేస్తున్నారు.ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘విశ్వద నాయక...’ అంటూ సాగే నాలుగోపాటని విడుదల చేశారు. ‘విశ్వద నాయక.. విహిత వీరా... మనసు నీకై.. రథమయ్యే రారా...’ అంటూ ఈపాట సాగుతుంది. ‘‘ఈపాటలో కమల్హాసన్ క్యారెక్టర్ నేచర్, అభిరామి, త్రిషపాత్రల్లోని డైనమిక్స్ని లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ప్రశాంత్ వెంకట్ రాసిన ర్యాప్ ఈపాటకు మరో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. అలెగ్జాండ్రా జాయ్ వండర్ ఫుల్ వోకల్స్ ఎమోషన్ని నావిగేట్ చేయగా, ఏఆర్ అమీన్ ర్యాప్ ఎనర్జీని మరింతగా పెంచింది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
రజనీకాంత్ ఒడిలో బాలుడు.. ఏడేళ్ల నాటి స్టోరీ ఇప్పుడు వైరల్
సోషల్మీడియాలో కొద్దిరోజులుగా ఒక ఫోటో వైరల్ అవుతుంది. రజనీకాంత్ ఒడిలో ఒక బాలుడు కూర్చొని ఉన్న ఫోటో గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే, అది ఎంతవరకు నిజం అని చాలామంది తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆ ఫోటో వెనుక దాగి ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకుందాం.ఈ ఫోటో 2018 నాటిది. రజనీకాంత్ ఒడిలో కూర్చున్న ఆ బాలుడి పేరు మహమ్మద్ యాసిన్. ఏడేళ్ల వయసులో ఆ బాలుడు చేసిన పనితో తమిళనాడులో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమయ్యాడు. ఈరోడ్లో ఉన్న తన పాఠశాల సమీపంలో యాసిన్కు రూ. 50 వేలు దొరికింది. ఇంటి నుంచి తన పాఠశాలకు వెళ్తున్నప్పుడు రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ దగ్గర ఒక పర్సును చూశాడు. ఆ పర్సులో రూ.100, రూ.500 నోట్లు మొత్తం రూ.50,000 ఉన్నాయి. అప్పుడు ఆ బాలుడు నేరుగా తన స్కూల్ ప్రిన్సిపాల్ సాయంతో పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆ డబ్బును పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) 'శక్తి'కి ఇచ్చాడు. అప్పుడు ఆ పోలీస్ అధికారి ఆ పిల్లవాడిని ఈ డబ్బును నువ్వు ఎందుకు ఉంచుకోలేదు, మీ ప్రిన్సిపాల్కు చెప్పకుండా నువ్వే తీసుకోవచ్చు కదా అని అడిగారు. దానికి యాసిన్ తిరిగి ఇలా సమాధానం ఇచ్చాడు. 'ఈ డబ్బు ఎవరో కష్టపడి సంపాదించి ఉంటారు. ఈ డబ్బు నాది కాదు. అలాంటప్పుడు దానిని నా దగ్గర ఎలా ఉంచుకోగలను. ఈ డబ్బు ఎవరిదో వారికే ఇవ్వండి' అంటూ తిరిగి బదులిచ్చాడు. బాలుడి నిజాయితీని మెచ్చిన ఏస్పీ నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు చేస్తానని మాట ఇచ్చారు. అప్పుడు వెంటనే ఆ బాలుడు నాకు సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth) అంటే చాలా ఇష్టం. ఆయన్ను కలవాలనే కోరిక ఉందని చెప్పాడు. దీంతో వెంటనే పోలీసులు జరిగిన విషయాన్ని రజనీకాంత్కు తెలిపారు. అందుకు స్పందించిన రజనీ.. యాసిన్తో పాటు తన కుటుంబ సభ్యులను కూడా తీసుకు రమ్మని తెలిపారు. రజనీకాంత్ ఆ పిల్లవాడి నిజాయితీని ప్రశంసించి, అతని చదువుకు స్పాన్సర్ చేస్తానని ప్రకటించారు. ఆపై యాసిన్, అతని కుటుంబాన్ని పోయెస్ గార్డెన్లోని తన నివాసానికి ఆహ్వానించి వారితో కలిసి భోజనం చేశారు. బాలుడికి సరైన దుస్తులు, కావాల్సిన బుక్స్ వంటివి తీసుకోవాలని అతని తల్లిదండ్రులకు రూ. 50వేలు రజనీ ఇచ్చారు. ఆపై యూసిన్ చదువులకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని రజనీ మాట ఇచ్చారు. 'రూ.100 నోటు కోసం కూడా మోసం, దొంగతనం, హత్య చేసే ఈ కాలంలో, అతను (యాసిన్) ఇది నా డబ్బు కాదని చెప్పి దానిని అప్పగించాడు. నిజంగా ఎంత నిజాయితీ. ఇది గొప్ప గుణం' అంటూ యాసిన్ను రజనీకాంత్ మెచ్చుకున్నారు. ఆ బాలుడు ఈ ఏడాది 10వ తరగతి చదువుతున్నాడు.This child sitting on the lap of superstar Rajnikanth became an example of honesty in Tamil Nadu. Mohammad Yasin found 50 thousand rupees on the road. He went straight to the police station and gave the money to the police officer and said "I found this money on the road.… pic.twitter.com/Vy4wrozbzO— Gabbar (@Gabbar0099) June 1, 2025 -
అందరిని మెప్పించేలా 'కుబేర' కొత్త సాంగ్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోలుగా నటించిన చిత్రం ‘కుబేర’. తాజాగా ఈ మూవీ నుంచి రెండో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల 20న కుబేర చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు. తాజాగా విడుదలైన 'అనగనగా కథ' పాటను చంద్రబోస్ రచించారు. హైడ్ కార్తీ, కరీముల్లా ఆలపించారు. -
అలాంటి సినిమాలే చేస్తున్నావని నాపై ట్రోల్స్: యంగ్ హీరో
ఇండస్ట్రీలో కొందరు హీరోలు కొన్ని జానర్ సినిమాలతో ఫేమస్ అవుతారు. అలా కొన్నాళ్ల పాటు సదరు హీరో నుంచి ఒకే తరహా మూవీస్ వస్తాయి. విసుగెత్తిపోయిన ప్రేక్షకులు విమర్శించడం లాంటివి చేస్తే రూట్ మారుస్తారు. ఇప్పుడు సేమ్ అలాంటి అనుభవమే తనకు ఎదురైందని ఓ యంగ్ హీరో చెప్పుకొచ్చాడు. మిడిల్ క్లాస్ మూవీస్ చేసిచేసి బోర్ కొట్టేసిందని అంటున్నారు. ఇంతకీ ఎవరా హీరో? ఏంటి సంగతి?తమిళ ఇండస్ట్రీలో రైటర్గా కెరీర్ మొదలుపెట్టిన మణికందన్.. 'విక్రమ్ వేద', 'జై భీమ్' లాంటి హిట్ సినిమాల్లో నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు హీరోగా ప్రమోషన్ కొట్టేశాడు. అలా గత మూడేళ్లలో చూసుకుంటే 'గుడ్ నైట్', 'లవర్'తో రీసెంట్గా 'కుడుంబస్థాన్' సినిమాతో వరస హిట్స్ కొట్టేశాడు. అయితే ఇవన్నీ మిడిల్ క్లాస్ బ్యాక్ డ్రాప్ స్టోరీలతో తీసినవే. దీంతో ఒకే తరహా చిత్రాలు చేస్తున్నాడనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వాటిపై స్పందించాడు.(ఇదీ చదవండి: తొలిప్రేమ తోపు కాదు.. ఇంట్రెస్టింగ్ 'చెన్నై లవ్ స్టోరీ')తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మణికందన్.. మిడిల్ క్లాస్ సినిమాలు చేసి తనకు బోర్ కొట్టేసిందని అన్నాడు. గత మూడు చిత్రాలు హిట్ అయినప్పటికీ.. ప్రేక్షకుల నుంచి ట్రోల్స్ కూడా వచ్చాయనే విషయాన్ని గుర్తుచేశాడు. ఈ ఏడాది ఓ మూడు సినిమాలు చేస్తున్నానని, వచ్చే ఏడాది మరో మూడు చిత్రాల్లో నటిస్తానని.. ఇవన్నీ కూడా తన గత చిత్రాలతో పోలిస్తే ప్రత్యేకంగా ఉంటాయని హామీ ఇచ్చాడు.మణికందన్ గత మూడు చిత్రాలు నేరుగా తెలుగులో రిలీజ్ కానప్పటికీ.. ఓటీటీ డబ్బింగ్తో తెలుగు ఆడియెన్స్ని కూడా ఆకట్టుకోవడం విశేషం. 'గుడ్ నైట్' విషయానికొస్తే.. గురక సమస్యతో ఇబ్బందిపడే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు, పెళ్లి తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేదే స్టోరీ. లవర్ విషయానికొస్తే.. ప్రస్తుత సమాజంలోని ప్రేమ, అతిప్రేమ లాంటి అంశాలతో తీసిన సినిమా. కుడుంబస్థాన్ విషయానికొస్తే.. మధ్య తరగతి యువకుడు ఓవైపు జాబ్ చేస్తున్నప్పటికీ ఆర్థికంగా ఎలాంటి కష్టాలు అనుభవించాడనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' రివ్యూ)"I am bored of doing Middleclass films as it's happening on packed House for Goodnight, Lover & Kudumbasthan. Audience is also criticizing the same🙁. I'll be filming 3 Films this year & 3 Films next year. All those films will be different🫰"- #Manikandanpic.twitter.com/r7HPnbWTFk— AmuthaBharathi (@CinemaWithAB) June 2, 2025 -
కోలీవుడ్ పాన్ ఇండియా మూవీ 'ఫ్రీడమ్' టీజర్
కోలివుడ్ నుంచి తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'ఫ్రీడమ్' (Freedom) నుంచి తాజాగా టీజర్ను విడుదల చేశారు. ఇందులో శశికుమార్ (Sasikumar), లిజోమోల్ జోస్ (Lijomol Jose) జోడీగా నటించారు. తాజాగా విడుదలైన తెలుగు టీజర్ ఆసక్తిగానే ఉంది. విజయ గణపతి పిక్చర్స్ బ్యానర్పై పాండియన్ పరశురామన్ దీనిని నిర్మిస్తున్నారు. సత్యశివ దర్శకత్వం వహిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ జులై 10న ప్రపంచవ్యాప్తంగా తమిళ్తో పాటు తెలుగు, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది. -
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఈ వారం ఏకంగా 22 చిత్రాలు!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఈ నెలలోనే పెద్ద సినిమాలన్నీ థియేటర్లకు క్యూ కడుతున్నాయి. ఈ వారం బాక్సాఫీస్ సందడి చేసే వాటిలో కమల్ హాసన్ థగ్ లైఫ్ ఒక్కటే కాస్తా బజ్ ఉన్న సినిమా. ఆ తర్వాత తెలుగులో వస్తోన్న శ్రీ శ్రీ రాజావారు, గ్యాంబ్లర్స్, బద్మాషులు లాంటి చిత్రాలు ఆసక్తిగా పెంచుతున్నాయి. బాలీవుడ్ నుంచి హౌస్ఫుల్-5 కూడా థియేటర్లలోకి వస్తోంది. ఈ ఐదు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి.అయితే ఈ వారం ఓటీటీల విషయానికొస్తే రజినీకాంత్ లాల్ సలామ్, జింఖానా, టూరిస్ట్ ఫ్యామిలీ లాంటి వచ్చేస్తున్నాయి. తెలుగులో తెరకెక్కించిన వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ వచ్చేస్తోంది. ఈ సిరీస్లో రీతూ వర్మ, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇవీ మినహయిస్తే ఓటీటీల్లో అంతగా చెప్పుకొదగ్గ సినిమాలేవీ రావడం లేదు. బాలీవుడ్, హాలీవుడ్తో పాటు దాదాపు 18 సినిమాలు, వెబ్ సిరీస్లు ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్..ది మార్టిషియన్- డాక్యుమెంటరీ చిత్రం- జూన్ 02క్రిమినల్ కోడ్- సీజన్ 4- జూన్ 04వన్ ఆఫ్ దెమ్ డేస్- (హాలీవుడ్ మూవీ) - జూన్ 04జిన్నీ అండ్ జార్జియా- సీజన్-3 - జూన్ 05టైర్స్ - సీజన్-2- జూన్ 05జాట్ (హిందీ మూవీ) - జూన్ 05 (రూమర్ డేట్)మెర్సీ ఫర్ నన్- హాలీవుడ్ మూవీ- జూన్ 06స్ట్రా- హాలీవుడ్ మూవీ- జూన్ 06ది సర్వైవర్స్- వెబ్ సిరీస్- జూన్ 06అమెజాన్ ప్రైమ్స్టోలెన్- జూన్ 04సన్ నెక్ట్స్లాల్ సలామ్- జూన్ 06జియో హాట్స్టార్టూరిస్ట్ ఫ్యామిలీ(తమిళ మూవీ)- జూన్ 02గజానా (హిందీ) - జూన్ 02దేవిక అండ్ డానీ- (తెలుగు వెబ్ సిరీస్)- జూన్ 06జీ5చాట్ కపట్- ది డిసెప్షన్ (హిందీ)- జూన్ 06సోనీ లివ్..అల్లప్పుజా జింఖానా- జూన్ 05మహారాణి- సీజన్-4- జూన్ 06లయన్స్గేట్ ప్లేరెడ్-2- అడ్వంచర్ మూవీ- జూన్ 0612 స్ట్రాంగ్- హాలీవుడ్ మూవీ- జూన్ 06హై ఫోర్సెస్- హాలీవుడ్ మూవీ- జూన్ 06కోడ్ 8- హాలీవుడ్ మూవీ- జూన్ 06యాపిల్ టీవీ ప్లస్స్టిక్- కామెడీ వెబ్ సిరీస్- జూన్ 04 -
హైదరాబాద్ ఇల్లు గిఫ్ట్!.. నాన్న భరించలేకపోయాడు: రకుల్ ప్రీత్సింగ్
సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాల నుంచి మొదలుపెడితే సెలబ్రిటీల పర్సనల్ విషయాల వరకు అన్నింటిపైనా ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. కొందరు వాటిని లైట్ తీసుకుంటే మరికొందరేమో వాటిపై స్పందించి నిజానిజాలు ప్రేక్షకులకు తెలియజేస్తుంటారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల రిలేషన్స్ గురించి ఎన్నో పుకార్లు వస్తుంటాయి. వారిచ్చిపుచ్చుకునే కానుకల గురించైతే చెప్పనక్కర్లేదు.హైదరాబాద్ ఇల్లు గిఫ్ట్?అలా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) గురించి కూడా ఓ గాలి వార్త అప్పట్లో బాగా వైరల్ అయింది. హైదరాబాద్లో ఆమె ఉంటున్న ఇల్లు తను సంపాదించింది కాదని, ఎవరో రాజకీయ నాయకుడు ఆమెకు కానుకగా ఇచ్చాడన్నది సదరు వార్త సారాంశం. ఈ రూమర్ గురించి రకుల్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది. 'హైదరాబాద్లోని ఇల్లు ఎవరో నాకు గిఫ్ట్ ఇచ్చారన్న వార్త చూసి మా నాన్న చాలా ఆగ్రహానికి గురయ్యాడు. నా కష్టార్జితం..నిజానికి ఆ ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనులన్నీ నాన్నే స్వయంగా చూసుకున్నాడు. అలాంటిది ఆ ఇల్లు మా సొంతం కాదన్న వార్త చూడగానే భరించలేకపోయాడు. ఏంటిది? నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొన్న ఇల్లు ఎవరో బహుమతిగా ఇచ్చారని ఎలా అంటారు? అని అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఇలాంటి పనికిరాని పుకార్లకు మనం స్పందించాల్సిన అవసరం లేదని నచ్చజెప్పాను. నాన్నేమో.. రిప్లై ఇవ్వాల్సిందే అంటాడు. ఇలాంటి చెత్త రూమర్లను పట్టించుకోనక్కర్లేదని నాన్నను ఎలాగోలా సముదాయించాను' అని రకుల్ చెప్పుకొచ్చింది.సినిమారకుల్ ప్రీత్.. 'కెరటం' సినిమాతో తెలుగులో తన ప్రయాణాన్ని ఆరంభించింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, పండగ చేస్కో, కిక్ 2, సరైనోడు, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం, నాన్నకు ప్రేమతో.., జయ జానకి నాయక, చెక్, ఇండియన్ 2 వంటి పలు సినిమాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ యాక్ట్ చేసింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా బాలీవుడ్పైనే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఇండియన్ 3, దేదే ప్యార్ దే 2 చిత్రాల్లో నటిస్తోంది.చదవండి: అలాంటి వారు పక్కకెళ్లి ఆడుకోండి.. హేటర్స్కు ధనుశ్ స్ట్రాంగ్ కౌంటర్ -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. బస్సు ఎక్కుతూ దర్శకుడు కన్నుమూత
కోలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు విక్రమ్ సుగుమారన్ కన్నుమూశారు. మధయనాయక్ కూట్టం, రావణ కొట్టం చిత్రాలకు ప్రసిద్ధి చెందిన విక్రమ్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తమిళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. మధురైలో బస్సు ఎక్కుతుండగా ఒక్కసారిగా హార్ట్ అటాక్ రావడంతో మరణించారు.శంతను భాగ్యరాజ్, ప్రభు, కతీర్తో సహా అనేక మంది ప్రముఖ నటులతో కలిసి విక్రమ్ సుగుమారన్ పనిచేశారు. డైరెక్టర్ మరణం పట్ల నటుడు శాంతను భాగ్యరాజ్ సంతాపం వ్యక్తం చేశారు. మీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. సోదరుడిలా భావించే నీ నుంచి తాను ఎంత నేర్చుకున్నాననని అన్నారు. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచకుంటానని పోస్ట్ చేశారు. చాలా త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లిపోయావ్.. మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉందంటూ ట్వీట్ చేశారు. దర్శకుడు మరణవార్త తెలుసుకున్న అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.కాగా.. విక్రమ్ సుకుమారన్ 2013లో మధయనాయక్ కూట్టం చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రంలో కథిర్, అంజు జంటగా నటించారు. అంతకుముందు విక్రమ్.. బాలు మహేంద్ర దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. పొల్లాధవన్, కోడివీరన్ వంటి చిత్రాల్లో కూడా నటించారు. 2023లో వచ్చిన 'రావణ కొట్టం'తో సూపర్ హిట్ కొట్టారు. ఆడుకాలం మూవీకి మాటల రచయితగా కూడా పనిచేశారు. ఆయన చివరిసారిగా 'థెరం బోరం' చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదని సమాచారం. #Rip dearest brother @VikramSugumara3 I’ve learnt so much from you & will always cherish every moment Gone too soonYou will be missed #RIPVikramSugumaran pic.twitter.com/U78l3olCWI— Shanthnu (@imKBRshanthnu) June 1, 2025 -
'అలాంటి వారు పక్కకెళ్లి ఆడుకోండి'.. హేటర్స్కు ధనుశ్ స్ట్రాంగ్ కౌంటర్!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ ప్రస్తుతం కుబేరా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో నాగార్జున కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్గా రష్మిక మందన్నా కనిపించనుంది. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు.ఇకపోతే ఈ మూవీ రిలీజ్కు సమయం దగ్గర పడడంతో ప్రమోషన్లతో బిజీ అయిపోయారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే చెన్నైలో ఆడియో లాంఛ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన ధనుశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కోలీవుడ్లో తనపై వస్తున్న నెగెటివ్ ప్రచారంపై ధనుశ్ స్పందించారు.తన రాబోయే సినిమాపై వస్తున్న నెగెటివ్ ప్రచారాన్ని, రూమర్స్ను హీరో ధనుశ్ ఖంండిచారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం చేసే ఇలాంటి కుట్రపూరిత ప్రచారం తనను ఎలాంటి ప్రభావితం చేయదని అన్నారు. ఎవరెన్ని చేసినా తనను ఏం చేయలేరని.. నా రియల్ అభిమానులు తనపై వచ్చిన ప్రతికూలతను హ్యాండిల్ చేస్తారని స్పష్టం చేశారు. నా సినిమా రిలీజ్కు నెల రోజులు ఉండగానే మీరు ఎంత నెగెటివ్ ప్రచారం చేసినా ఏం చేయలేరంటూ ఎమోషనల్గా మాట్లాడారు.(ఇది చదవండి: శేఖర్ కమ్ముల కుబేర.. టీజర్ వచ్చేసింది!)ధనుష్ మాట్లాడుతూ.. "మీరు నాపై ఎంత నెగెటివ్ ప్రచారమైనా చేసుకోండి. కానీ నా సినిమా విడుదలకు ముందు దేనినీ ఆపలేరు. ఎందుకంటే నా అభిమానులు నాతో ఉన్నారు. నా గురించి నెగెటివ్ వ్యాఖ్యలు చేసే మీరు.. దయచేసి పక్కకెళ్లి ఆడుకోండి. ఎందుకంటే మాకు ఇలాంటి సర్కస్ వద్దు. ఇక్కడి ప్రజలు.. కేవలం నా అభిమానులు మాత్రమే కాదు.. వారు నా సహచరులు.. 23 సంవత్సరాలుగా నాతో ఉన్న నా సహచరులు. నాపై రూమర్స్ ప్రచారం చేసిన నన్ను అడ్డుకుంటామని మీరు అనుకుంటే.. అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. అభిమానులారా.. మీరు కోరుకున్న విధంగా జీవితాన్ని గడపండి. గతంలో నేను చాలా ఇబ్బందులు పడ్డా. ఈ రోజు మంచి స్థితిలో ఉన్నా. పరిస్థితి ఎలా ఉన్నా నేను సంతోషంగా ఉంటాను. ఈ ప్రపంచానికి 'కుబేర' లాంటి సినిమా అవసరం. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని పూర్తి నమ్మకం ఉంది. 'అంటూ భావోద్వేగ కామెంట్స్ చేశారు.Never seen this D in these Years @dhanushkraja 🛐❤️🔥Cut & Right Reply To The Haters !!!#KuberaaAudioLaunch #Kuberaa pic.twitter.com/eqxDzMPcv0— Dhanush Thambinga Da (@dtd_team) June 1, 2025 -
హీరోతో ప్రేమ? క్లారిటీ ఇచ్చేసిన నిధి అగర్వాల్
సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమలో ఉన్నారని రూమర్స్ రావడం సహజం. కలిసి సినిమా చేస్తున్న టైంలో ఇలాంటివి ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇటీవల కాలంలో అయితే శ్రీలీల.. బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్తో డేటింగ్ చేస్తుందని టాక్ వినిపించింది. ఇందులో నిజానిజాల సంగతి పక్కనబెడితే ఇప్పుడు మరో హీరోయిన్.. తనపై వస్తున్న గాసిప్స్ గురించి క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: స్టేజీపై రాజేంద్ర ప్రసాద్ 'బూతు' పురాణం.. అలీని ఏకంగా)'ఇస్మార్ట్ శంకర్'తో పాటు తెలుగులో పలు సినిమాలు చేసిన నిధి అగర్వాల్.. ప్రభాస్తో 'రాజాసాబ్', పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రాల్లో నటించింది. పవన్ మూవీ.. ఈ నెల 12న థియేటర్లలోకి రాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో పాల్గొన్న నిధికి.. తమిళ హీరో శింబుతో రిలేషన్ అంటూ వచ్చిన రూమర్స్పై ప్రశ్న ఎదురైంది. దీనికి సవివరంగా క్లారిటీ ఇచ్చేసింది.'సినిమాల్లో నటించిన హీరోయిన్ల గురించి చాలా పుకార్లు వస్తాయి. మరీ ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితం గురించి అందరూ ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఏది అనిపిస్తే అది బయటకు అనేస్తారు. ఇదంతా చాలా కామన్. ఎందుకంటే జనాలకు నిజాల కంటే రూమర్లపైనే ఎక్కువ ఇంట్రెస్ట్. అందుకే నేను వాటిని పెద్దగా పట్టించుకోను. నా గురించి ఎప్పుడూ ఏదో ఒకటి ఇలాంటివి వినిపిస్తూనే ఉంటాయి' అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: శ్రీలీల పెళ్లి కాదు.. అసలు నిజం ఇది) -
శంకర్ కూతురు ఆ తెలుగు డైరెక్టర్ను అంతమాట అనేసిందేంటి!
అభిమాన హీరో కళ్ల ముందు కనిపిస్తే చాలు సెల్ఫీలంటూ ఎగబడతారు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతుళ్లు అదితి, ఐశ్వర్య కూడా అదే పని చేశారు. తండ్రితో కలిసి షూటింగ్కు వెళ్లినప్పుడు ఓ హోటల్ దగ్గర ఆగారు. అక్కడ మహేశ్బాబు (Mahesh Babu)ను చూడగానే సెల్ఫీ అంటూ అతడి ముందు వాలిపోయారు. అయితే వీళ్లు శంకర్ కూతుర్లని తెలీక.. ఫ్యామిలీతో ఉన్నాను.. ఇప్పుడు సెల్ఫీ ఇవ్వడం కుదరదని పంపేశాడు.అదితితో సెల్ఫీకి నో చెప్పిన మహేశ్దీంతో వాళ్లు నిరాశగా వెనుదిరిగారు. ఇదంతా చూసిన డైరెక్టర్ మెహర్ రమేశ్ (Meher Ramesh).. వెంటనే హీరో దగ్గరకు వెళ్లి.. ఆ అమ్మాయిలు ఎవరన్న విషయం చెప్పడంతో అతడు నాలుక్కరుచుకున్నాడు. శంకర్ దగ్గరకు వెళ్లి.. మీ కూతుర్లని తెలీక అలా చేశానని మహేశ్ సారీ చెప్పాడు. అందుకు శంకర్.. హీరోలంటే ఎలా ఉండాలో వాళ్లక్కూడా తెలియాలి కదా అని రిప్లై ఇచ్చాడు. శంకర్ కూతుర్లు చాలా సింపుల్గా ఉంటారంటూ మహేశ్బాబు ఈ సంఘటనను అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో వెల్లడించాడు.మహేశ్కు సారీ చెప్పిన శంకర్ కూతుర్లుతాజాగా ఇదే సంఘటనను అదితి శంకర్ (Aditi Shankar) ఓ యూట్యూబ్ ఛానల్లో గుర్తు చేసుకుంది. నాన్న సినిమా కోసం మేమందరం ఓ చోటుకు వెళ్తున్నాం. దారిలో ఓ హోటల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం. అక్కడ మహేశ్బాబు ఉన్నారు. నేను, నా సోదరి ఆయనకు అభిమానులం. మేము తన దగ్గరకు వెళ్లి ఓ ఫోటో అడిగాం. అందుకాయన.. ఇప్పుడు ఇవ్వలేనమ్మా అని తిరస్కరించారు. డిస్టర్బ్ చేసినందుకు సారీ చెప్పి వెళ్లిపోయాం. వీడియో వైరల్అప్పుడు మహేశ్ బాడీగార్డ్ వెళ్లి.. మేము శంకర్ కూతుర్లమని చెప్పాడు. దాంతో ఆయన మేమున్న టేబుల్ దగ్గరకు వచ్చి మీ కూతుర్లని తెలీదు సర్ అని వివరణ ఇచ్చుకున్నాడు. పర్లేదు.. హీరో ఎలా ఉంటారో వారికి తెలియాలి. అయినా వాళ్లకు ఫోటో కావాలంటే నీ దగ్గరకు వచ్చి అడుగుతారు. ఇస్తావా? లేదా? అనేది నీ నిర్ణయం అని నాన్న అన్నాడు. ఏదో తెలీక నో చెప్పానంటూనే మహేశ్ మాతో ఫోటో దిగాడు అని అదితి చెప్పుకొచ్చింది. ఈ వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన జనాలు.. పాపం, మెహర్ రమేశ్ను మహేశ్కు బాడీగార్డ్ను చేసేసిందని కామెంట్లు చేస్తున్నారు. Finally hearing from @shankarshanmugh daughter about her funny experience with @urstrulyMahesh.Papam @MeherRamesh ni body guard anukundi 😂😂#MaheshBabu #Khaleja4K #ssmb29 pic.twitter.com/TfzfBLePGo— 👌🌟Ⓜ️🅱️2️⃣9️⃣ (@SPYderLoading) May 31, 2025 చదవండి: కమెడియన్ అలీకి చిరంజీవి గిఫ్ట్.. ఈసారి స్పెషల్గా..! -
సినిమా హిట్టయినా అవకాశాలు నిల్.. దానిపైనే ఫోకస్ పెట్టిన బ్యూటీ
కృతి శెట్టి అంటే చటుక్కున గుర్తు రాకపోవచ్చు. కాని, బేబమ్మ అంటే ‘సి’ సెంటర్ ప్రేక్షకుడు కూడా గుర్తు పట్టేస్తాడు. పక్కించి అమ్మాయిలా కనిపించే కృతి చెప్పిన ముచ్చట్లు కొన్ని మీకోసం... తెలుగులో కృతి శెట్టి (Krithi Shetty) మొదటి సినిమా ‘ఉప్పెన’లో బేబమ్మగా అందరినీ మైమరపింపజేసింది. ఆ తర్వాత వరుసగా ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ సినిమాల సక్సెస్తో హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది. లక్ ఫ్యాక్టర్ ఎంతోకాలం పని చేయలేదు. రామ్ పోతినేనితో నటించిన ‘వారియర్’, నితిన్తో నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’, నాగ చైతన్యతో నటించిన ‘కస్టడీ’ అన్నీ డిజాస్టర్ అయ్యాయి. దీంతో అవకాశాలు తగ్గాయి. మాతృ భాష ఏదంటే?అనుష్క శెట్టి, ఐశ్వర్యా రాయ్, పూజా హెగ్డేలాంటి అందాల భామలు వచ్చిన మంగుళూరు ప్రాంతం నుంచే కృతి శెట్టి కూడా వచ్చింది. తుళు ఆమె మాతృభాష. కృతి శెట్టి తెలుగు ఆడియన్స్కు మరింత దగ్గర కావడానికి పట్టుదలతో తెలుగు నేర్చుకుంటోంది. తెలుగు భాష మీద గ్రిప్ సంపాదిస్తే, క్యారెక్టర్ని ఇంకా బాగా పండించవచ్చని కృతి శెట్టి నమ్ముతుంది.ఆచితూచి..‘ఉప్పెన’ సూపర్ హిట్ తర్వాత రెమ్యునరేషన్ విపరీతంగా పెంచిన కృతి శెట్టి – ఇప్పుడు మాత్రం ఆచి తూచి అడుగేస్తోంది. ‘లవ్ టు డే’, ‘డ్రాగన్’ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి కూడా చేరువ అయిన ప్రదీప్ రంగనాథన్ సరసన నటిస్తున్న– ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా మీదే కృతి శెట్టి ఆశలన్నీ పెట్టుకుంది. నయనతార ఈ సినిమాకి నిర్మాత కాగా, ఆమె భర్త విఘ్నేశ్ శివన్ డైరెక్టర్. అయితే ఈ సినిమా రిలీజ్, రిజల్ట్ కోసం ఇంకో నాలుగు నెలలు ఆగాల్సిందే!హిట్ అయినా అవకాశాలు నిల్మలయాళంలో టొవినో థామస్తో చేసిన ‘ఎఆర్ఎమ్’ హిట్ అయినా, మలయాళంలో అవకాశాలు రాలేదు. తనతో జీవితం పంచుకునేవాడిలో నిజాయితీ, దయ ఉండాలని, అన్ని విషయాల్లో పాజిటివ్గా ఆలోచించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. భరించరాని ఒత్తిడికి లోనయినప్పుడు, ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు నిద్రపోతానని, ఏ ఆర్టిస్టుకి అయినా తగినంత గాఢ నిద్ర అవసరం అని చెప్పింది. మోహన్లాల్ కుమారుడు ప్రణవ్ యాక్ట్ చేసిన ‘హృదయం’లోని ‘దర్శనా’ సాంగ్ అంటే పిచ్చి. కారులో ట్రావెల్ అవుతున్నంత సేపు అదే పాట వింటూ ఉంటానంది.చదవండి: కుమారుడి కోసం కలిసొచ్చిన ధనుష్-ఐశ్వర్య.. రజనీ ఏమన్నారంటే? -
కుమారుడి కోసం కలిసొచ్చిన ధనుష్-ఐశ్వర్య.. రజనీ ఏమన్నారంటే?
మాజీ భార్యాభర్తలు మళ్లీ కలిశారు. కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ జంటగా విడిపోయినా తల్లిదండ్రులుగా మాత్రం బాధ్యతగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమ కుమారుడు యాత్ర గ్రాడ్యుయేషన్ వేడుకలకు వీరిద్దరూ హాజరయ్యారు. అతడిని మనసారా హత్తుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ధనుష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. యాత్ర తల్లిదండ్రులుగా గర్వంగా ఉందని క్యాప్షన్ ఇచ్చాడు. అటు రజనీకాంత్ సైతం అదే ఫోటోను ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేస్తూ నా మనవడు తొలి మైలురాయిని దాటాడు. కంగ్రాట్స్ యాత్ర కన్నా.. అని రాసుకొచ్చాడు.20 ఏళ్లకు విడాకులుసూపర్స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను హీరో ధనుష్ 2004లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి యాత్ర, లింగ అని ఇద్దరు కుమారులు సంతానం. ఎంతో ఆదర్శవంతంగా ఉండే ఈ జంట 2022లో విడిపోతున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి వీరు వేర్వేరుగానే జీవిస్తున్నారు. భార్యాభర్తలన్నాక చిన్నపాటి గొడవలు మామూలే, మళ్లీ కలిసిపోతారులే అనుకున్న అభిమానులకు షాకిస్తూ విడాకులు కావాలంటూ కోర్టుకెక్కారు. రజనీకాంత్ రంగంలోకి దిగినా ప్రయోజనం లేకపోయింది. చివరకు చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టు వీరికి గతేడాది నవంబర్లో విడాకులు మంజూరు చేసింది. సినిమాల విషయానికి వస్తే ధనుష్.. కుబేర, ఇడ్లీ కడై సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో ఇడ్లీ కడై సినిమాలో నటించడంతో పాటు దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. View this post on Instagram A post shared by Dhanush (@dhanushkraja) First milestone crossed my lovable grandson 💐 congratulations yathra kanna ! ❤️❤️ pic.twitter.com/D15JexNw4g— Rajinikanth (@rajinikanth) May 31, 2025 చదవండి: ఈజీగా టచ్ చేయడానికి మేం ఆట బొమ్మలమా? : నిత్యామీనన్ ఫైర్ -
కర్ణాటకలో బ్యాన్.. తమిళనాడులో గుడ్న్యూస్.. థగ్ లైఫ్కు బిగ్ రిలీఫ్!
కమల్ హాసన్ నటించిన మోస్ట్ అవైటేడ్ చిత్రం థగ్ లైఫ్. ఈ సినిమాకు మణిరత్న దర్శకత్వం వహించారు. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నాయకుడు (1987) సినిమా తర్వాత కమల్ హాసన్, మణిరత్నం చేస్తున్న చిత్రమిదే కావడం విశేషం. జూన్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీని రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మించాయి. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో శింబు, త్రిష, అభిరామి, నాజర్ ముఖ్య పాత్రలు పోషించారు.తాజాగా ఈ మూవీకి తమిళనాడు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ విధిస్తోన్న వినోద పన్నును భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తమిళ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా థగ్ లైఫ్ పన్నులు తగ్గించాలని కమల్ హాసన్ ప్రభుత్వాన్ని కోరారు. కొవిడ్-19 తర్వాత తమిళ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల వల్ల పన్ను తగ్గించాలని కమల్ విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం వినోద పన్ను 8.6 శాతం నుంచి 4 శాతానికి పన్ను తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (FEFSI) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, సమాచార మంత్రి తిరు ఎంపీ సామినాథన్కు కూడా ధన్యవాదాలు తెలిపింది. చాలా మంది నిర్మాతలు, పంపిణీదారులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు కాగా.. ఇటీవల కన్నడ భాషపై కమల్ హాసన్ కామెంట్స్తో పెద్ద వివాదం మొదలైన సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటకలో థగ్ లైఫ్ను సినిమాపై నిషేధం విధించారు. -
ఈ సినిమాను సెన్సార్ కట్ లేకుండా చూస్తేనే!: రాధికా ఆప్టే
హీరోయిన్ రాధికా ఆప్టే ఇటీవలే సిస్టర్ మిడ్నైట్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో ఇంతకు ముందెన్నడు చేయని డిఫరెంట్ రోల్లో నటించింది. ఈ మూవీని ఇటీవలే కాన్స్ ఫెస్టివల్లోనూ ప్రదర్శించారు. అక్కడ ఈ సినిమాపై పలువురు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. మే 23న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూకు హాజరైంది.ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.ఈ చిత్రం ఇండియాలో విడుదలకు ముందు సెన్సార్ గురించి ఆందోళన ఉండేదని రాధికా తెలిపింది. ఎలాంటి కట్ లేకుండా సెన్సార్ ఇస్తేనే బాగుంటుందని భావించినట్లు పేర్కొంది. ఎందుకంటే ఈ చిత్రం కట్ చేయకుండా ప్రదర్శిస్తేనే అర్థమవుతుందని వెల్లడించింది. అనుకున్నట్లే ఈ సినిమా ఎలాంటి కట్స్ లేకుండానే సెన్సార్ వచ్చిందని రాధికా ఆప్టే పంచుకుంది.రాధికా ఆప్టే మాట్లాడుతూ.. 'స్క్రిప్ట్ను తాను ఇంతకు ముందు చేసిన వాటికి భిన్నంగా ఉంది. ఇది చాలా విచిత్రమైన సినిమా. ఇది ఒక క్రేజీ సినిమా. అది నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చాలా ఉత్సాహంగా ఉన్నా. ఎవరికైనా నటనలో పూర్తి స్వేచ్ఛ లభిస్తే అది చాలా మంచి సినిమా అవుతుంది. లేకపోతే అది ఒక డిజాస్టర్గా మిగులుతుంది. ప్రతి సృజనాత్మక నిర్ణయం వెనుక డైరెక్టర్ కాంధారి ఉన్నారని రాధికా ఆప్టే చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ ఫెస్టివల్ సర్క్యూట్లో మా సినిమా విజయం సాధించడం నమ్మకాన్ని మరింత పెంచిందని ఆమె చెప్పింది. -
అది మూడు సెకన్ల సీన్.. ఇంత గోల ఏంటి: నటి
'థగ్ లైఫ్' సినిమా ట్రైలర్ విడుదల తర్వాత మూడు సెకన్ల సీన్పై పెద్ద చర్చే జరిగింది. 70 ఏళ్ల కమల్ హాసన్, 42 ఏళ్ల అభిరామి మధ్య లిప్ లాక్ సన్నివేశాలు ట్రైలర్లో కనిపించడంతో చాలా విమర్శలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో, జాతీయ వార్తా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి అభిరామి తొలిసారి మాట్లాడింది. ట్రైలర్లోని సన్నివేశం కేవలం మూడు సెకన్ల నిడివి మాత్రమే ఉందని, దాని గురించి ఇంత వివాదం సృష్టించడం అనవసరమని నటి అభిరామి పేర్కొంది.థగ్ లైఫ్ ప్రమోషన్స్లతో బిజీగా ఉన్న అభిరామి ఆ సీన్ గురించి ఇలా చెప్పింది. 'ఈ రోజుల్లో ఏదైనా క్షణాల్లోనే వివాదంగా మారవచ్చు. మనం దాని నుంచి తప్పించుకోలేము. దర్శకులు మణిరత్నం సార్ నన్ను ఆ పాత్రకు ఎందుకు ఎంచుకున్నారో నేను ఆయన్ను ప్రశ్నించను. సినిమా విషయంలో వారి నిర్ణయం ఏదైనా సరే నేను దానిని అంగీకరిస్తున్నాను. పూర్తి నా ఇష్టంతోనే ఆ సీన్ తీశారు. ఇది కేవలం మూడు సెకన్ల దృశ్యం. కానీ, ట్రైలర్ వల్ల కొన్ని అపార్థాలు ఏర్పడ్డాయి. సినిమాలోని ఆ సన్నివేశంతోనూ, లిప్లాక్కు దారితీసే విషయాలతోనూ చాలా లింక్ ఉంటుంది. మూవీ చూసిన తర్వాత ఎవరూ అలాంటి కామెంట్లు చేయరని అనుకుంటున్నాను. అది ఆ సన్నివేశానికి బాగా సరిపోతుందనే చేశాం. దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. వారు ముందు సినిమా చూడాలని నేను అభ్యర్థిస్తున్నాను' అని అభిరామి అన్నారు.కమల్ హాసన్-మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతున్న 'థగ్ లైఫ్' సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ట్రైలర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంది. ఈ చిత్రంలో శింబు, జోజు జార్జ్, త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, నాసర్, అశోక్ సెల్వన్,అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్, ఆర్ మహేంద్రన్, శివ అనంత్ నిర్మించారు.కమల్ హాసన్, మణిరత్నం 37 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న ఈ చిత్రం జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
కమల్ హాసన్ వివాదాస్పద కామెంట్స్.. మద్దతుగా సౌతిండియా ఆర్టిస్ట్స్ అసోసియేషన్!
కమల్ హాసన్ కామెంట్స్పై పెద్దఎత్తున వివాదం నడుస్తోంది. కన్నడ భాషను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై కన్నడిగులు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే ఆయన నటించిన థగ్ లైఫ్ మూవీ అడ్డుకుంటామని హెచ్చరించారు. మరోవైపు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైతం కమల్ హాసన్కు గట్టి షాకిచ్చింది. క్షమాపణలు చెప్పకపోతే థగ్ లైఫ్పై బ్యాన్ విధిస్తామని ఇప్పటికే ప్రకటించింది. దీంతో కమల్ హాసన్కు ఇచ్చిన డెడ్ లైన్ పూర్తి కాగానే థగ్ లైఫ్ను నిషేధించనున్నట్లు ప్రకటన విడుదల చేశారు.అయితే ఈ వివాదం మరింత ముదురుతున్న వేళ.. కమల్ అండగా ఓ ప్రకటన విడుదలైంది. కమల్ హాసన్కు మద్దతుగా సౌతిండియా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిలిచింది. కమల్ హాసన్పై ప్రస్తుతం వస్తున్న వ్యతిరేకత సినీ ఇండస్ట్రీలో ఓ చీకటికోణంగా నిలుస్తుందని తెలిపింది. కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక ప్రజలు, కన్నడ చిత్ర పరిశ్రమ ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న నిజమైన ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలని కోరింది. ప్రాంతీయ, భాషా రంగాలకు అతీతంగా ఐక్యతను ప్రోత్సహించిన కమల్ హాసన్ లాంటి వ్యక్తిని తప్పుగా చిత్రీకరించడం అన్యాయమని అసోసియేషన్ ప్రకటనలో వెల్లడించింది. కమల్ హాసన్ను కన్నడ భాష వ్యతిరేకిగా చిత్రీకరించడాన్ని అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.అయితే తాను చేసిన కామెంట్స్పై కమల్ హాసన్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. ఇది ప్రజాస్వామ్యం, నాకు చట్టం, న్యాయంపై నమ్మకముంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కేరళ పట్ల నాకున్న ప్రేమ నిజమైందన్నారు. నన్ను ఇంతకు ముందు కూడా ఇలానే బెదిరించారు.. నేను తప్పు చేస్తే క్షమాపణలు చెబుతా.. తప్పు చేయకపోతే క్షమాపణలు చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు. కాగా.. ఇప్పటికే కమల్ హాసన్ రాబోయే చిత్రం 'థగ్ లైఫ్'ను కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ నిషేధించింది. Nadigarsangam Press Release:#kamalhaasan #NadigarSangam #ns #siaa@actornasser @VishalKOfficial @Karthi_Offl @PoochiMurugan @karunaasethu @johnsoncinepro pic.twitter.com/OhUYqzZIkY— nadigarsangam pr news (@siaaprnews) May 30, 2025 -
కూతురు గ్రాడ్యుయేషన్ వేడుకల్లో హీరో సూర్య
స్వతహాగా తమిళ హీరో అయినప్పటికీ సూర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ టైంలో మాత్రం 'కంగువ', 'రెట్రో' చిత్రాలతో నిరాశపరిచాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరితో ఓ మూవీ చేస్తున్నాడు. ఇవన్నీ పక్కనబెడితే కొన్నాళ్ల క్రితం సూర్య ఫ్యామిలీ గురించి అనుకోని కామెంట్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు కూతురు గ్రాడ్యుయేషన్తో వాటన్నింటికీ చెక్ పెట్టినట్లయింది.తమిళంలో చాన్నాళ్లుగా సినిమాలు చేస్తున్న సూర్య.. తనతో పాటు కలిసి నటించిన జ్యోతికని 2006లో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఈమె పూర్తిగా సినిమాలకు దూరమైంది. కూతురు దియా, కొడుకు దేవ్ కాస్త పెద్దోళ్లు అయిన తర్వాత నటిగా రీఎంట్రీ ఇచ్చింది. కొన్నాళ్ల క్రితం పిల్లల్ని పట్టుకుని జ్యోతిక.. ముంబైలోని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోయింది. దీంతో లేనిపోని రూమర్స్ వచ్చాయి.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)జ్యోతిక ముంబైలో, సూర్య చెన్నైలో ఉంటున్నారని.. ఇరువురి మధ్య మనస్పర్థలు వచ్చాయనే కామెంట్స్ వినిపించాయి. కానీ తాజాగా కూతురు దియా గ్రాడ్యుయేషన్ వేడుకల్లో అటు సూర్య తల్లిదండ్రులు, ఇటు జ్యోతిక పేరెంట్స్ పాల్గొన్నారు. అందరూ ఒక్కచోట కనిపించడంతో ఇప్పటివరకు వినిపించిన మాటలన్నీ రూమర్స్ అని క్లారిటీ వచ్చేసింది.సూర్య కూతురు దియా వయసు ప్రస్తుతం 17 ఏళ్లు. ప్రస్తుతం ఇంటర్మీడియట్(ప్లస్ టూ) పూర్తి చేసింది. త్వరలో పై చదువుల కోసం విదేశాలకు వెళ్తుంది. మరి తల్లిదండ్రుల్లా దియా కూడా ఇండస్ట్రీలోకి వస్తుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం చూడటానికి మాత్రం హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోనంత అందంగా ఉంది. మరి జ్యోతిక.. తన కూతురి గురించి ఏం ఆలోచిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: విష్ణుని రెచ్చగొట్టేలా మంచు మనోజ్ మరో పోస్ట్!) -
కమల్ హాసన్ కామెంట్స్.. కర్ణాటకలో థగ్ లైఫ్కు బిగ్ షాక్!
కన్నడ భాషపై కమల్ చేసిన కామెంట్స్పై వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే క్షమాపణ చెప్పాలని కమల్కు డెడ్లైన్ విధించిన కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కమల్ కామెంట్స్పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేఎఫ్సీసీ కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమాను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఇచ్చిన గడువులోగా క్షమాపణలు చెప్పకపోతే నిషేధం అమల్లోకి వస్తుందని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధి సారా గోవిందు స్పష్టం చేశారు. కర్ణాటక రక్షణ వేదిక, ఇతర కన్నడ అనుకూల సంస్థల డిమాండ్లకు కూడా తమ మద్దుతు ఉంటుందని ఆయన తెలిపారు.కాగా.. ఇటీవల బెంగళూరులో జరిగన థగ్ లైఫ్ ఆడియో లాంఛ్ ఈవెంట్లో కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. తమిళం నుంచి కన్నడ పుట్టిందని ఆయన వ్యాఖ్యానించడం తీవ్రమైన వ్యతిరేకతకు కారణమైంది. ఆయన వ్యాఖ్యలపై కన్నడ భాష సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కమల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. లేనిపక్షంలో కమల్ సినిమాను అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) 'థగ్ లైఫ్' సినిమాను కర్ణాటకలో నిషేధించింది. ఇప్పటికే కన్నడిగుల మనోభావాలను దెబ్బతీశారని కమల్ హాసన్పై కర్ణాటక రక్షణ వేదిక ఫిర్యాదు చేసింది. -
నటుడు రవిమోహన్కు అత్త నోటీసులు
నటుడు రవిమోహన్ (జయం రవి), భార్య ఆర్తీల విడాకుల వ్యవహారం సీరియల్గా సాగుతోందనే చెప్పాలి. ముందు రవిమోహన్, ఆర్తీ ఒకరిపై ఒకరు విమర్శించుకున్నారు. తమ జీవితంలో వివాదం తలెత్తడానికి కారణం గాయని కెనిషానే కారణం అని ఆర్తిపై విమర్శలు చేశారు. అయితే మీ వివాదంలోకి తనను లాగొద్దని కెనిషా గట్టిగానే హెచ్చరించారు. కాగా రవిమోహన్, ఆర్తి విడాకుల వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. కాగా తనపై చేసిన ఆరోపణలను 24 గంటల్లో సామాజిక మాధ్యమాల్లో తొలగించాలని రవిమోహన్ ఆయన భార్య ఆర్తికి, అత్త సుజాతలకు నోటీసుల పంపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్తి తల్లి సినీ,టీవీ సీరియళ్ల నిర్మాత సుజాత తన న్యాయవాది ద్వారా రవిమోహన్కు ఒక నోటీస్ పంపారు. తమపై చేసిన తప్పుడు ఆరోపణలను ఉపసంహరించుకోవాలని సూచించారు. ఇకపై సోషల్మీడియాలో తప్పుడు పోస్ట్లను షేర్ చేయవద్దన్నారు. అదే నోటీస్ను మీడియాకు రిలీజ్ చేశారు. అందులో రవిమోహన్, ఆర్తీల వ్యవహారం గురించి, వారి వివాహ సమస్యల గురించిన ప్రసారాన్ని అన్ని సామాజిక మాధ్యమాల్లో తొలగించాలని న్యాయస్థానం ఆదేశించిందన్నారు. అదేవిధంగా రవిమోహన్, ఆర్తి, ఆమె తల్లి సుజాతలకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రచారం చేయకూడదని పేర్కొన్నారన్నారు. వీరి వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి. -
కమల్ హాసన్కు స్ట్రాంగ్ వార్నింగ్.. క్షమాపణలు చెప్పకపోతే!
కమల్ హాసన్ చేసిన కామెంట్స్పై వివాదం మరింత ముదురుతోంది. ఆయన క్షమాపణలు చెప్పేది లేదని స్పష్టం చేయడంపై కన్నడ సినీ పరిశ్రమ ఆగ్రహం వ్యక్తం చేసింది. కమల్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పకపోతే థగ్ లైఫ్ మూవీ కర్ణాటకలో విడుదల కానివ్వని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కమల్ హాసన్ సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో థగ్ లైఫ్ రిలీజ్ను కన్నడలో అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. ఇప్పటికే పలు కన్నడ సంఘాలు కమల్ హాసన్ కామెంట్స్పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. కమల్ సినిమాను కర్ణాటకలో పూర్తిగా నిషేధించాలని కోరుతున్నాయి.కమల్ హసన్ కామెంట్స్పై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఘాటుగా స్పందించింది. ఈనెల 30లోగా ఆయన క్షమాపణలు చెప్పకపోతే థగ్ లైఫ్ మూవీని విడుదల కానివ్వమని కేఎఫ్సీసీ స్పష్టం చేసింది. కమల్ హాసన్పై తమకు ఎలాంటి సానుభూతి లేదని.. కన్నడ సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించింది. మరోవైపు రేపటిలోగా కమల్ హాసన్ బహిరంగ క్షమాపణ చెప్పకుంటే.. థగ్ లైఫ్ సినిమాను విడుదల కానివ్వమని కేఎఫ్సీసీ మాజీ అధ్యక్షుడు గోవిందు వార్నింగ్ ఇచ్చారు.కర్ణాటక కేఎఫ్సీసీ అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ..' కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమాను నిషేధించాలని కన్నడ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకే ఈ విషయంపై ఇప్పటికే సమావేశమై చర్చించాం. కమల్ తప్పు చేశారని నిర్ధారించాం. తన వ్యాఖ్యలపై కమల్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిందే. ఇదే అంశంపై ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాం' అని అన్నారు. ఈ విషయాన్ని కేఎఫ్సీసీ మాజీ అధ్యక్షుడు గోవిందు వెల్లడించారు. కాగా.. ఇటీవల ఆయన నటించిన థగ్ లైఫ్ సినిమా ఈవెంట్లో కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని ఆయన అన్నారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్పై కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై కన్నడ సంఘాలు పెద్దఎత్తున నిరసన చేపట్టాయి. అయితే ఈ విషయంలో తాను క్షమాపణ చెప్పేది లేదని కమల్ హాసన్ స్టేట్మెంట్ ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది. -
కన్నడ భాషపై కమల్ కామెంట్స్.. పోలీసులకు ఫిర్యాదు!
కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వివాదానికి దారి తీశాయి. థగ్ లైఫ్ సినిమా ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపై కన్నడ నాయకులతో పాటు పలువురు మండిపడుతున్నారు. కమల్ హసన్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కన్నడ భాషను ఉద్దేశించిన కమల్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు తాను మాత్రం క్షమాపణ చెప్పేది లేదని కమల్ కౌంటరిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని కర్ణాటక రక్షణ వేదిక బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బెంగళూరులోని ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన కన్నడిగుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా.. తమిళులకు, మాకు విష బీజాలు నాటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమిళ సినిమా విడుదలైన ప్రతిసారీ కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. కాగా.. థగ్ లైఫ్ ఆడియో లాంచ్ సందర్భంగా తమిళం నుంచే కన్నడ పుట్టిందని కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదానికి కారణమయ్యాయి. అయితే ఈ ఫిర్యాదుపై ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.కాగా.. కమల్ హాసన్ వ్యాఖ్యలతో అనేక కన్నడిగుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. బెళగావి, మైసూరు, హుబ్బళ్లి, బెంగళూరుతో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో కమల్కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. బెళగావి మరికొన్ని ప్రదేశాలలో కార్యకర్తలు కమల్ పోస్టర్లను తగలబెట్టి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రంలో ఆయన సినిమా థగ్ లైఫ్ ప్రదర్శనను అడ్డుకుంటామని కూడా బెదిరించారు. -
ప్రముఖ హీరో మృతి.. సంతాపం తెలిపిన రజనీకాంత్
తమిళ చత్రి పరిశ్రమలో విషాదం నెలకొంది. సుమారు ఐదు దశాబ్దాల పాటు కోలీవుడ్లో రాణించిన నటుడు రాజేష్ (75) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా చెన్నైలో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో చిత్ర పరిశ్రమలోని ఆయన సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఆయన సతీమణి జోన్ సిల్వియా గతంలోనే మరణించారు. వారికి దివ్య, దీపక్ పిలల్లు ఉన్నారు.1974లో దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన ‘అవల్ ఒరు తొడరకథై’ (అంతులేని కథ) చిత్రంతో ఆయన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆయనకు వరుస ఛాన్సులు దక్కాయి. తమిళ్తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో 150కి పైగా చిత్రాల్లో నటించారు. పోతురాజు, మహానది, సత్య, కన్ని పరువతిలే వంటి సినిమాల్లో నటించారు. ఆయన హీరో నుండి క్యారెక్టర్ యాక్టర్ వరకు వివిధ పాత్రలు పోషించాడు . 1985లో చెన్నైలోని కె.కె. నగర్ సమీపంలో సినిమా షూటింగ్ కోసం ఒక బంగ్లాను నిర్మించిన తొలి తమిళ నటుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఆ ఇంట్లో అనేక తమిళ, మలయాళ మరియు హిందీ సినిమా షూటింగ్లు పూర్తయ్యాయి. సినిమాలతో పాటు ఆయన హోటల్, నిర్మాణ వ్యాపారాన్ని ప్రారంభించాడు. తెలుగులో బంగారు చిలక, చాదస్తపు మొగుడు, మా ఇంటి మహారాజు సినిమాల్లో నటించారు. ఆయన మరణం పట్ల సూపర్స్టార్ రజనీకాంత్ సంతాపం తెలిపారు. ఇలాంటి సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు మరింత ధైర్యాన్ని ఆ దేవుడు అందించాలని కోరారు. రాజేష్తో తనకు ప్రత్యేకమైన అనుభంధం ఉందని గుర్తుచేసుకున్నారు. -
దీపికా పదుకొణెకు సపోర్టుగా తమన్నా.. నెటిజన్ల రచ్చ
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా చేసిన ట్వీట్తో రెండు రోజులుగా దీపికా పదుకొణె( Deepika Padukone) పేరు సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. తను తీయబోతున్న సినిమా కథను ఒక స్టార్ హీరోయిన్ లీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ సోషల్మీడియాలో ఆయనొక పోస్ట్ చేశారు. సందీప్ చేసిన కామెంట్స్ దీపికను ఉద్దేశించే అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.సందీప్ కామెంట్ చేసిన కొన్ని గంటల్లోనే దీపిక కూడా పరోక్షంగా స్పందించింది. ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆమె అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'జీవితంలో బ్యాలెన్స్డ్గా ఉండాలంటే నిజాయతీ ముఖ్యం. నేను దానికే ప్రాధాన్యం ఇస్తాను. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నా మనసు చెప్పిందే వింటాను. తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాను. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాను' అని చెప్పుకొచ్చింది. ఆ వీడియోతో పాటు దీపికకు చెందిన ఒక పాత వీడియోను ఆమె అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అగౌరవం, పురుషులు, లింగ వివక్షత, లింగ వేతన వ్యత్యాసం, ఓవర్ టైం పని, వృత్తి నైపుణ్యం లేకపోవడం, స్త్రీ ద్వేషం, ద్వంద్వ ప్రమాణాలు అంటూ చెప్పిన ఆమె మాటలను ఇప్పుడు మళ్లీ వైరల్ చేశాడు. దానిని తమన్నా లైక్ చేశారని కొందరు నెటిజన్లు చెప్పుకొచ్చారు. అది కాస్త నెట్టింట వైరల్ అయిపోయింది. దీపికాకు తమన్నా సపోర్ట్ చేస్తుందంటూ పేర్కొన్నారు. అయితే, తాజాగా తమన్నా వివరణ ఇచ్చింది. తాను ఎవరి పోస్ట్కు లైక్ కొట్టలేదని తెలిపింది. కొందరు కావాలనే ఇలాంటి వార్తలు క్రియేట్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. లైక్ కొట్టలేదని ఇన్స్టాగ్రామ్ చెప్పినా నమ్మలేని స్థితిలో కొందరు ఉన్నారని పేర్కొంది. తనకు తానుగా పోస్ట్లను ఇన్స్టాగ్రామ్ ఎలా లైక్ చేస్తుందో చెబితే బాగుంటుందని ఆమె తెలిపింది. దయచేసి దీనిని ఇంతటితో వదిలేయండి చాలా పనులు ఉన్నాయంటూ ఆమె వెళ్లిపోయింది. -
నా చిత్రాల్లో నటించాకే వారందరూ రాజకీయాల్లోకి ఎంట్రీ: ఏఎం.రత్నం
నా చిత్రాల్లో నటించిన తరువాత కథానాయకులు రాజకీయాల్లోకి వెళ్లారని నిర్మాత ఏఎం.రత్నం అన్నారు. ఇంతకుముందు కోలీవుడ్లో ఆయన ఇండియన్ (భారతీయుడు), ఆరంభం, ఎన్నై అరిందాల్ (ఎంతవాడు గాని), వేదాళం వంటి పలు భారీ చిత్రాలను నిర్మించారు. ఈయన తాజాగా నిర్మించిన చిత్రం హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu). పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ఇందులో నిధిఅగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునిల్, కింగ్స్లీ ముఖ్యపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతాన్ని, మనోజ్ పరమహంస చాయాగ్రహణం అందించారు. రవికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో జూన్ 12న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ఆ చిత్రంలోని తార తార అనే పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ఒక స్టార్ హోటల్లో నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు కేఎస్.రవికుమార్, కేఆర్ పాల్గొని చిత్రం మంచి విజయం సాధించాలని శుభాకాంక్షలు అందించారు. ఏఎం రత్నం మాట్లాడుతూ చిత్రం బాగా వచ్చిందని, హరిహర వీరమల్లు చిత్రానికి రెండవ భాగం చేస్తానని చెప్పారు. ఈ చిత్రానికి తన కొడుకు రవికృష్ణ దర్శకత్వం వహించడం సంతోషంగా ఉందన్నారు. కాగా తన చిత్రాల్లో నటించిన తరువాత ఆయా చిత్రాల కథానాయకులు రాజాకీయాల్లోకి ప్రవేశించారని చెప్పారు. నటుడు శరత్కుమార్, విజయ్కాంత్, విజయ్, విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లారని, పవన్కల్యాణ్ ఉపముఖ్యమంత్రి అయ్యారని ఇది యాదృఛ్చకంగా జరిగిందో ఏమో తెలియదని ఆయన పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు రవికృష్ణ మాట్లాడుతూ తాను ఏడెనిమిది ఏళ్ల తరువాత దర్శకత్వం వహించిన చిత్రం హరిహరవీరమల్లు అని పేర్కొన్నారు. అదేవిధంగా పవన్కల్యాణ్ పిలిచి తనకు చాలా మంది అభిమానులు ఉన్నారని, తాను మాత్రం మీ తండ్రికి అభిమానినని, ఆయన బాగుండాలని, ఆయన లెగసీని నువ్వు కొనసాగించాలని చెప్పారని రవికృష్ణ పేర్కొన్నారు. -
కొలంబోలో అనసూయ చిల్.. ఎల్లో శారీలో రష్మిక హోయలు!
బ్లాక్ అవుట్ఫిట్లో బాలీవుడ్ భామ మలైకా అరోరా..కొలంబోలో అనసూయ చిల్..సెల్ఫీ ఫోజులో మహేశ్ బాబు కూతురు సితార..ఎల్లో శారీలో రష్మిక మందన్నా హోయలు..కాన్స్ ఫెస్టివల్ మూడ్లోనే ప్రణీత సుభాశ్.. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Karishma Patidar (@stylebykarishmaa) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by shreyaghoshal (@shreyaghoshal) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
విజయ్ ఆంటోని మిస్టరీ థ్రిల్లర్.. తెలుగు ట్రైలర్ చూశారా?
బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం మార్గన్. ఈ సినిమాకు కోలీవుడ్లో పలు చిత్రాలకు ఎడిటర్గా పనిచేసిన లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతోనే డైరెక్టర్గా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. మర్టర్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్లో నిర్మించారు.ఇటీవల మార్గన్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్ను విలన్గా కనిపించనున్నారు. ఈ సినిమాకు రిలీజ్కు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇప్పటికే తమిళ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా తెలుగు ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ ఈవెంట్కు హీరో విజయ్ ఆంటోనీ హాజరయ్యారు. అయితే మూవీ పాత్రకు సంబంధించిన గెటప్లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.ఈ సందర్భంగా మీ గెటప్ గురించి ఏమైనా రివీల్ చేస్తారా? అని యాంకర్ ప్రశ్నించగా.. విజయ్ ఆసక్తికర సమాధానమిచ్చారు. మీకు సినిమా మొత్తం ఇక్కడే చూపిస్తామని నవ్వుతూ మాట్లాడారు. ఒకవేళ ఇండియాలో నేనే గనక రిచ్ అయ్యుంటే.. నా సినిమాలన్నీ ఉచితంగా ప్రదర్శించేవాడినని విజయ్ అన్నారు. ఇది విన్న అభిమానులు విజయ్ ఆంటోనీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.మార్గన్ ట్రైలర్ చూస్తుంటే ఫుల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ మూవీని జూన్ 27న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ట్రైలర్లోనే ప్రకటించారు. ఈ సినిమాలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, అర్చన, కనిమొళి, నటరాజన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఏడాది తర్వాత ఓటీటీకి వస్తోన్న మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలో క్రైమ్ జోనర్ చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. ముఖ్యంగా క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. అందువల్లే అభిమానుల అభిరుచికి తగినట్లుగానే అలాంటి సినిమాలే ఎక్కువ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక మలయాళ సినిమాలకు ఓటీటీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అందుకే మాలీవుడ్ సినిమాలు ఓటీటీల్లో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటున్నాయి.తాజాగా మరో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఈ నెలలోనే ఓటీటీలో సందడి చేయనుంది. బినో అగస్టీన్ దర్శకత్వం వహించిన బిగ్బెన్ మూవీ ఈనెల 30 నుంచే సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ థ్రిల్లర్ సినిమాలో అనుమోహన్, వినయ్ పోర్ట్, అదితి రవి, మియా జార్జ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు.కాగా.. ఈ ఏడాది మార్చిలోనే ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు సన్ నెక్స్ట్ ప్రకటించింది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. చివరికీ ఈ శుక్రవారం బిగ్బెన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. గత ఏడాది జూన్ నెలాఖరున ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో హీరోయిన్గా నటించిన మియా జార్జ్ తెలుగులోనూ నటించింది. ఉంగరాల రాంబాబు మూవీలో సునీల్కు జోడీగా కనిపించింది. ఆమె నటించిన పలు తమిళ, మలయాళ సినిమాలు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చాయి. A ticking clock. ⏰A missing child.And a truth that may shatter everything.Find out what else unravels when a botched kidnapping brings everything to light!!Big Ben - Coming soon, on SunNXT !#SunNXT #BigBenOnSunNXT #Mollywood pic.twitter.com/tDyPGQY9TN— SUN NXT (@sunnxt) May 27, 2025 -
ఉన్ని ముకుందన్పై ఆరోపణలు.. అసలు విషయం బయటపెట్టిన హీరో!
మార్కోతో మోస్ట్ వయొలెన్స్ను అభిమానులకు పరిచయం చేసిన హీరో ఉన్ని ముకుందన్. గతేడాది థియేటర్లలో విడుదలైన మార్కో మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ సినిమాలో విపరీతమైన వయోలెన్స్ ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్కు దూరమైంది. కొత్త ఏడాదిలో గెట్ సెట్ బేబీ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. తెలుగులో జనతా గ్యారేజ్, ఖిలాడి, యశోద చిత్రాల్లో ఆయన నటించారు. తెలుగులోనూ ఉన్ని ముకుందన్కు ఫ్యాన్స్ ఉన్నారు.అయితే తాజాగా ఉన్ని ముకుందన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై మాజీ మేనేజర్ విపిన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.చాలా కాలంగా ఉన్ని ముకుందన్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పోలీసులకు తెలిపారు. తనపై నటుడు ఉన్ని ముకుందన్ దాడి చేయించారని విపిన్ కుమార్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.అన్నీ అవాస్తవాలే..తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై ఉన్ని ముకుందన్ స్పందించారు. అతను చేసేవన్నీ అసత్య ఆరోపణలేనని అన్నారు. అతనిపై ఎలాంటి భౌతిక దాడి జరగలేదని వెల్లడించారు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. అసలు దాడి చేసినట్లు చెబుతున్న విపిన్ కుమార్ను తన మేనేజర్గా కూడా నియమించలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. తాను దాడి చేయించానని వస్తోన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు.ఉన్ని ముకుందన్ తన పోస్ట్లో రాస్తూ.. "2018లో నా సొంత నిర్మాణంలో నా మొదటి చిత్రాన్ని నిర్మించబోతున్నప్పుడు విపిన్ కుమార్ నన్ను సంప్రదించాడు. ఆయనను నా వ్యక్తిగత మేనేజర్గా ఎప్పుడూ నియమించలేదు. అతను చెప్పినట్లుగా ఎలాంటి భౌతిక దాడి జరగలేదు. అతను చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం, అవాస్తవం. మేమున్న ప్రదేశమంతా సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయని' రాసుకొచ్చారు.అతని పరిశ్రమలోని కొంతమంది స్నేహితుల మద్దతు ఉందని చెబుతున్నారు.. నా డేటా అంతా అతని వద్ద ఉండటంతో.. నేను ఆయనను లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పమని అభ్యర్థించానని ఉన్ని ముకుందన్ తెలిపారు. కానీ అతని నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.. కానీ నాపై న్యూస్ పోర్టల్స్, సోషల్ మీడియాలో పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఉన్ని ముకుందన్ వెల్లడించారు. -
జయం రవి విడాకుల కేసు.. అన్ని పోస్టులు డిలీట్ చేసిన భార్య!
కోలీవుడ్ హీరో జయం రవి ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల కొద్ది రోజులుగా ఆయన భార్య, జయం రవి ఒకరిపై ఒకరు పెద్దఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు. తనను వేధింపులకు గురి చేశారంటూ జయం రవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆ తర్వాత ఆయన భార్య ఆర్తి సైతం మూడో వ్యక్తి ప్రమేయం వల్లే విడాకులకు దారితీసిందని ఆరోపించింది. విడాకుల విషయంలో ఇప్పటికే వీరిద్దరు కోర్టుకు కూడా హాజరవుతున్నారు.ఈ నేపథ్యంలోనే జయం రవి భార్య ఆర్తి ఓ బిగ్ షాకిచ్చింది. ఈ వివాదం గురించి చేసిన పోస్టులన్నింటినీ తన సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించింది. దంపతులు ఒకరిపై ఒకరు పరువు నష్టం కలిగించే పోస్టులను పెట్టవద్దని హైకోర్టు ఆదేశించండంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రవి తన భార్య ఆర్తితో పాటు అత్త సుజాతకు నోటీసులు పంపారు. తమ విభేదాల గురించి మాట్లాడటం మానేయాలని వారిద్దరికీ లీగల్ నోటీసు పంపారు. అంతేకాకుండా నటుడికి పరువు నష్టం కలిగించే పోస్టులను తొలగించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పంపించారు.అదేవిధంగా ఆర్తి సైతం.. రవి మోహన్కు లీగల్ నోటీసులు పంపింది. ఆర్తితో పాటు అత్త సుజాతపై పోస్టులు చేయకుండా ఆపేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆర్తి హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపింది. న్యాయ వ్యవస్థ పరువు నష్టం నుంచి రక్షణ కల్పించడం.. అన్నింటికంటే ముఖ్యంగా న్యాయాన్ని కాపాడిందని ఆమె పోస్ట్కు క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. కాగా.. జయం రవి, ఆర్తి 16 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్ ఉన్నారు. -
రజినీకాంత్ కూలీ.. పారితోషికం ఏకంగా అన్ని కోట్లా?
రజనీకాంత్(Rajinikanth) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతీహాసన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ కెరీర్లో ఇది 171వ చిత్రంగా నిలవనుంది. లియో చిత్రం తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని రూ. 350 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.ఈ మూవీ బడ్జెట్తో పాటు తలైవా రజినీకాంత్ పారితోషికం సైతం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కోలీవుడ్లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఆయనకు ఏకంగా రూ.150 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో రజినీకాంత్ కెరీర్లో కూలీ మూవీ అత్యధిక పారితోషికం చెల్లించిన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. అంతేకాకుండా ఈ చిత్రానికి డైరెక్టర్ కనగరాజ్ సైతం రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. మిగిలిన రూ.150 కోట్లతో సినిమా బడ్జెట్, ఇతర నటీనటులకు ఖర్చు చేయనున్నారు. ఇది కాకుండా నిర్మాతలు పబ్లిసిటీ కోసం దాదాపు రూ. 25 కోట్లు పక్కన పెట్టారని సమాచారం. ఇవన్నీ కలిపితే కూలీ బడ్జెట్ రూ.375 పైగానే ఉండనుంది.భారీ ధరకు కూలీ ఓటీటీ రైట్స్..ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.120 కోట్లకు ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసినట్లు కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు శాటిలైట్ హక్కులు రూ. 90 కోట్లు, మ్యూజిక్ రైట్స్ రూ. 20 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాన్-థియేట్రికల్ బిజినెస్ రూ. 240 కోట్లకు చేరుకుంది. ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ తర్వాత రజనీకాంత్ నెల్సన్ దిలీప్కుమార్తో 'జైలర్ 2లో నటించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. -
మరో వివాదంలో గుడ్ బ్యాడ్ అగ్లీ.. లీగల్ యాక్షన్ తీసుకుంటానన్న స్టార్ హీరో తండ్రి
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన సూపర్ హిట్ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా అభిమానులను మెప్పించింది. గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు.అయితే తాజాగా ఈ మూవీపై మరో వివాదం మొదలైంది. తన అనుమతి లేకుండా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలో మూడు పాటలను ఉపయోగించడంపై నటుడు ధనుశ్ తండ్రి, చిత్రనిర్మాత కస్తూరి రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పాటలను అనుమతి లేకుండా సినిమాల్లో ఉపయోగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన కస్తూరి రాజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన చిత్రాల్లోని మూడు పాటలు - పంజు మిట్థై, ఓథా రూబా థారెన్, తూటువలై ఇలై అరాచి లాంటి పాటలు వినియోగించారని ఆరోపించారు. తన అనుమతి లేకుండా వినియోగించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుత తరం చిత్రనిర్మాతలు, సంగీత దర్శకులు తమ వాస్తవికతను కోల్పోయారని ఆయన విమర్శించారు.కస్తూరి రాజా మాట్లాడుతూ.. 'ఇళయరాజా, దేవా వంటి దిగ్గజాల స్ఫూర్తితో సంగీతాన్ని సృష్టించాలి. కానీ ఈ రోజుల్లో సంగీత స్వరకర్తలు ఆవిష్కరణ కంటే ఉన్నవాటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. పాత ట్రాక్లను ఉపయోగించడం సమస్య కాదు. కానీ అసలు సృష్టికర్తల నుంచి అనుమతి తీసుకోవాలి. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఎవరూ అలా చేయడం లేదు. త్వరలోనే చట్టపరమైన చర్య తీసుకుంటా' అని తెలిపారు.(ఇది చదవండి: ఇళయరాజా నోటీసులు.. రూ.5 కోట్లు డిమాండ్)ఇళయరాజా రూ.5 కోట్ల డిమాండ్..కాగా.. గుడ్ బ్యాడ్ అగ్లీలో ఓథా రూబా థారెన్ పాటను ఉపయోగించారు. సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఇళయరాజా తన మూడు పాటలను సినిమాలో అనుమతి లేకుండా ఉపయోగించుకున్నందుకు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్కు లీగల్ నోటీసులు పంపారు. రూ. కోట్ల పరిహారం డిమాండ్ చేశారు. అంతేకాకుండా సినిమా నుంచి తన పాటలను తొలగించాలని కోరారు. మరోవైపు గుడ్ బ్యాడ్ అగ్లీలో ఇళయరాజా పాటలను ఉపయోగించినప్పుడు తాము ఎటువంటి తప్పు చేయలేదని చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత యలమంచిలి రవిశంకర్ అన్నారు. మేము సినిమాలో ఉపయోగించిన పాటలకు అవసరమైన అన్ని రకాల అనుమతి తీసుకున్నామని తెలిపారు. అయితే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో చాలా వరకు పాత పాటల్ని.. వింటేజ్ ఫీల్ కోసం ఉపయోగించారు. -
విజయ్ ఆంటోని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. ఆసక్తిగా ట్రైలర్
బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ నటిస్తోన్న తాజా చిత్రం మార్గన్. కోలీవుడ్లో పలు చిత్రాలకు ఎడిటర్గా పనిచేసిన లియో జాన్ పాల్ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను మర్టర్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కించారు. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్లో నిర్మించారు.ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్ను విలన్గా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన విజయ్ ఆంటోనీ ఫస్ట్ లుక్ పోస్టర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ మర్డర్ మిస్టరీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ మూవీని జూన్ 27న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ట్రైలర్లోనే ప్రకటించారు. ఈ సినిమాలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, అర్చన, కనిమొళి, నటరాజన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ప్రముఖ సీరియల్ నటుడు కన్నుమూత
ప్రముఖ సీరియల్ నటుడు శ్రీధర్(47) హఠాన్మరణం చెందారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయనకు.. చాన్నాళ్లుగా చికిత్స అందిస్తున్నారు. కానీ అదేది కూడా ఈయనని మరణం నుంచి తప్పించలేకపోయింది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి 10 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో తోటి నటీనటులు, స్నేహితులు.. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: బ్లౌజ్ లేకుండా సినిమా మొత్తం నటించా..: సీనియర్ హీరోయిన్ అర్చన)పారు, వధు తదితర సీరియల్స్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీధర్.. 'మ్యాక్స్' అనే కన్నడ చిత్రంలోనూ నటించాడు. కేవలం నటుడిగానే కాకుండా మేకప్ ఆర్టిస్ట్, యాంకర్, వాయిస్ ట్రైనర్, థియేటర్ ఇన్స్ట్రక్టర్ తదితర విభాగాల్లోనూ తనదైన ప్రతిభతో రాణించాడు.అయితే కొన్నాళ్ల క్రితం తీవ్ర అనారోగ్యం బారినపడ్డ శ్రీధర్ నాయక్.. కొన్నిరోజులకే గుర్తుపట్టలేనంతగా బక్కచిక్కిపోయాడు. అప్పుడు తోటి నటీనటులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ పరిస్థితి మరీ విషమించడంతో సోమవారం రాత్రి కన్నుమూశారు. దహన సంస్కారాలు కూడా మంగళవారం పూర్తయ్యాయి.(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' కాజల్) -
బ్లౌజ్ లేకుండా సినిమా మొత్తం నటించా.. దర్శకుడి మీద నమ్మకం వల్లే: అర్చన
'ఆకాశం ఏనాటిదో.. అభిమానం ఆనాటిది' అంటూ నిరీక్షణ (1982) సినిమాతో తొలిసారి వెండితెరపై హీరోయిన్గా 'అర్చన' మెరిశారు. ఈ సినిమాతో మొదలైన ఆమె ప్రయాణం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. మొదట రంగు తక్కువ అంటూ నటిగా తిరస్కరణకు గురైన ఆమె... ఆ తర్వాత వరుసగా రెండు సార్లు జాతీయ అవార్డు సొంతం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. తెలుగు కుటుంబానికి చెందిన అర్చన.. తమిళ అమ్మాయిగా స్థిరపడిపోయారు. ఆమెకు నటనలో శిక్షణ ఇచ్చిన గురువు బాలుమహేంద్రనే నిరీక్షణ సినిమాతో హీరోయిన్ను చేశారు. గిరిజన యువతి పాత్రలో బ్లౌజ్ లేకుండా నటించడంపై ఆమె తొలిసారి స్పందించారు.సుమారు 20 ఏళ్ల తర్వాత 'షష్టి పూర్తి' సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను నటి అర్చన పలకరించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆమె నటించిన తొలి సినిమా గురించి ఇలా చెప్పారు. 'నిరీక్షణ సినిమాలో గిరిజన యువతి పాత్రలో నటించడం పెద్ద సాహసమనే చెప్పాలి. ఆరోజుల్లోనే బ్లౌజ్ లేకుండా సినిమా అంతా నటిస్తున్నానని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. నేను నా దర్శకుణ్ని నమ్మాను. అప్పటికే ఆయన చిత్రీకరించిన ఏ సినిమాలోనూ అశ్లీలతతో పాటు గ్లామర్ను ప్రదర్శించడం అనేది లేదు. అందుకే, ఏమీ ఆలోచించకుండా నిరీక్షణలో నటించాను. నా జీవితంలోనే ప్రత్యేకమైన సినిమా ఇదే. మలయాళంలో మమ్ముట్టి, శోభనలతో బాలుమహేంద్రనే తెరకెక్కించారు. తెలుగులో నేను, భానుచందర్ నటించాం. దర్శకుడి మీద నమ్మకంతోనే బ్లౌజ్ లేకున్నా సరే నటిస్తానని చెప్పాను. అనుకున్నట్లుగానే ఆయన చాలా పవిత్రంగానే ఆ పాత్రను ప్రేక్షకులకు చూపించారు. నిరీక్షణ సినిమాతో నాకు ఒక అన్నయ్య (భానుచందర్) దొరికాడు. ఆ బంధం ఇప్పటికీ ఉంది.' అని ఆమె అన్నారు.నిరీక్షణ సినిమాలో భాను చందర్ .. అటవీశాఖాధికారిగా నటించగా అర్చన గిరిజన్ యువతి పాత్రలో మెప్పించింది. ఇప్పటికే ఈ చిత్రం చాలామందికి ఎవర్గ్రీన్ అని చెప్పవచ్చు. ఈ మూవీ విడుదల తర్వాత అర్చనకు భారీ అవకాశాలు వచ్చాయి. వీడు (1987), దాసి (1988) చిత్రాలకు గాను రెండుసార్లు జాతీయ ఉత్తమ నటిగా అర్చన అవార్డు అందుకున్నారు. -
'మార్కో' హీరో ఉన్ని ముకుందన్పై ఫిర్యాదు
మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్(Unni Mukundan)పై పోలీసులకు ఫిర్యాదు అందింది. తన మాజీ మేనేజర్ విపిన్ కుమార్ కొచ్చిలోని ఇన్ఫోపార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చాలా కాలంగా ఉన్ని ముకుందన్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆయన పోలీసులకు తెలిపారు. అయితే, ఉన్ని ముకుందన్ వాంగ్మూలం కూడా తీసుకున్న తర్వాతే అతనిపై కేసు నమోదు చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి. ఉన్ని ముకుందన్ రీసెంట్గా మార్కో సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందారు. తెలుగులో జనతా గ్యారేజ్, ఖిలాడి, యశోద చిత్రాల్లో ఆయన యాక్ట్ చేశాడు.విపిన్ కుమార్ ఒకప్పుడు ఉన్ని ముకుందన్ వద్ద మేనేజర్గా పనిచేశాడు. ఆయన సినిమాకు సంబంధించిన అన్ని షెడ్యూల్స్తో పాటు తన రెమ్యునరేషన్ వంటి వివరాలను కూడా ఆయనే చూసుకునే వాడు. అయితే, కొద్దిరోజుల క్రితం పల కారణాల వల్ల విపిన్ను మేనేజర్గా నటుడు ముకుందన్ తొలగించాడు. అయితే, తనపై నటుడు ఉన్ని ముకుందన్ దాడి చేపించారని విపిన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'నటుడి అనుచరులు నా ఫ్లాట్ వద్దకు వచ్చారు. నన్ను పార్కింగ్ ఏరియాకు పిలిపించి దాడి చేశారు. వారు నా ఇంటి అద్దాలను కూడా పగలగొట్టారు. తన వరుస సినిమాలు పరాజయం పాలవడంతో ఉన్ని నిరాశలో ఉన్నాడు. ఆ బాధను చాలా మందిపై మోపుతున్నాడు. నేను కూడా ఒక చిత్రనిర్మాతను అనే విషయం మరిచిపోతున్నాడు. ఆయన చాలా సినిమాలకు నేను పనిచేశాను. అతని కొత్త సినిమా 'నరివెట్ట' గురించి నేను మాట్లాడినందుకే దాడి చేశారు. అతని(ఉన్ని ముకుందన్) గురించి చెప్పడానికి నా వద్ద చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ తర్వాత చెబుతాను.' అని పోలీసుల వాంగ్మూలంలో విపిన్ తెలిపారు. కానీ, ఉన్ని ముకుందన్పై సోషల్మీడియాలో చాలా నీచమైన పోస్టులను విపిన్ కుమార్ షేర్ చేశారని, అందుకే ఆయన అభిమానులు దాడి చేశారని కొందరు చెబుతున్నారు. ఈ కేసు గురించి హీరో కానీ అతని పీఆర్ టీమ్ గానీ స్పందించలేదు. -
విజయ్ ఆంటోనీ... మరో డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ
స్వతహాగా మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ గత కొన్నేళ్లుగా హీరోగా వరస సినిమాలు చేస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులకైతే 'బిచ్చగాడు' హీరోగా మాత్రమే తెలుసు. ఇప్పుడు మరో క్రేజీ కాన్సెప్ట్ మూవీతో జనాల్ని పలకరించబోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 14 సినిమాలు రిలీజ్)ప్రస్తుతానికి తమిళ వెర్షన్ ట్రైలర్ మాత్రమే విడుదల చేశారు. త్వరలో తెలుగు డబ్బింగ్ రిలీజ్ కూడా క్లారిటీ ఇస్తారేమో. సాధారణంగా మనం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ చూస్తుంటాం కదా. ఇది ఆ కోవలోకే వస్తుంది. స్విమ్మర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఓ కుర్రాడు.. అమ్మాయిలకు ఓ రకమైన డ్రగ్ ఇచ్చి చంపుతుంటాడు. దీని వల్ల శరీరమంతా నల్లగా మారి చనిపోతుంటారు.హీరో అయిన పోలీస్ కూడా దీని బారిన సగం పడతాడు. అంటే సగం శరీరం నల్లగా మారి ఉంటుంది. సదరు పోలీసు.. దొంగని ఎలా పట్టుకున్నాడు? అసలు అతడు హత్యలు ఎందుకు చేస్తున్నాడనే కారణాన్ని కనిపెట్టాడా లేదా? అనేదే స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్ మాత్రం మంచి క్రేజీగా ఉంది. మరి ఈ మూవీ థియేటర్లలో సక్సెస్ అవుతుందా? ఓటీటీలోకి వచ్చిన తర్వాత గుర్తింపు తెచ్చుకుంటుందా? అనేది చూడాలి? జూన్ 27న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇందులో విలన్గా చేసిన అజయ్ దిశాన్.. విజయ్ ఆంటోనికి సొంత మేనల్లుడే కావడం విశేషం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మోహన్ లాల్ రీసెంట్ హిట్ మూవీ) -
తమన్నాను నియమించడం మమ్మల్ని నిరాశకు గురిచేసింది: నటి రమ్య
కన్నడ సోప్ బ్రాండ్కు మిల్కీ బ్యూటీ తమన్నాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించడంపై ప్రముఖ నటి రమ్య స్పందించింది. ఇప్పటికే కన్నడ భాషపై కర్ణాటకలో ఉద్యమం కూడా మొదలైంది. దీంతో కన్నడ భాష వివాదం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే కన్నడ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోన్న మైసూర్ శాండల్ సోప్కు బ్రాండ్ అంబాసిడర్గా తమన్నా భాటియా నియామకంపై పెద్దఎత్తున వ్యతిరేకత వస్తోంది. ఈ సందర్భంగా నటి రమ్య కూడా స్పందించడం శాండల్వుడ్లో ఆసక్తికరంగా మారింది. కన్నడ భాష మనం కోసం పోరాడుతున్న సమయంలో తమన్నా భాటియాను అంబాసిడర్గా నియమించడాన్ని రమ్య ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె నిలదీశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసింది.రమ్య తన సోషల్ మీడియాలో రాస్తూ..'కేఎస్డీఎల్ని పునరుద్ధరించాలనే ఉద్దేశ్యాన్ని అభినందిస్తున్నా. కానీ ఇది కేవలం కంటితుడుపు చర్యలా అనిపిస్తోంది. ఎందుకంటే మైసూర్ శాండల్ సబ్బుకు ఐకానిక్ గుర్తింపు ఉంది. దానికి బ్రాండ్ అంబాసిడర్ అవసరం లేదు (అమూల్, ఆపిల్, డవ్, అమెజాన్ లాగా). ఉత్తరాది వినియోగదారుల మార్కెట్ను లక్ష్యంగా చేసుకోవడానికి కన్నడిగేతరులను బ్రాండ్ అంబాసిడర్గా తీసుకోవడంతో స్థానిక కన్నడిగులను దూరం చేసుకున్నారు. ముఖ్యంగా మన కన్నడ భాష గర్వం కోసం మనం పోరాడుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయం మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. మైసూర్ శాండల్ అనేది కేవలం సబ్బు మాత్రమే కాదు. ఇది కర్ణాటక ప్రజల సెంటిమెంట్' అని ట్విటర్లో రాసుకొచ్చింది.ఈ విషయంలో తాను తమన్నాకు వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. ఆమె కేవలం సెలబ్రిటీ మాత్రమేనని తెలిపింది. కాగా.. గత వారం తమన్నా కర్ణాటక ప్రభుత్వంతో రూ.6.2 కోట్ల ఒప్పందాన్ని రెండేళ్లపాటు మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయడానికి ఒప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నిర్ణయంపై భారీ వ్యతిరేకత వస్తోంది. ఆ పాత్ర కోసం కన్నడ స్టార్ను ఎందుకు తీసుకోలేదని చాలామంది ప్రశ్నించారు. అయితే కర్ణాటకకు వెలుపల మార్కెట్లలోకి చొచ్చుకుపోవడానికి ఆమెను రంగంలోకి దించాలనే నిర్ణయం తీసుకున్నామని కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ పేర్కొన్నారు.Appreciate the intent to revive KSDL but the execution seems like an eyewash. Even from a business point of view especially when the company is dwindling imho Mysore sandal soap is iconic and carries huge legacy it doesn’t need a brand ambassador (Amul, Apple, Dove, Amazon) By… pic.twitter.com/5f5Pz6vXWd— Ramya/Divya Spandana (@divyaspandana) May 26, 2025 -
జయం రవి విడాకుల కేసు.. చట్టపరమైన చర్యలకు సిద్ధమైన సింగర్!
కోలీవుడ్ హీరో జయం రవి తన భార్యతో విడాకులకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు ఇప్పటికే కోర్టులో హాజరయ్యారు. అయితే ఇటీవలే జయం రవి భార్య ఆర్తి పలు ఆరోపణలు చేసింది. మూడో వ్యక్తి ప్రమేయం వల్లే తామిద్దరం విడిపోవాల్సి వస్తోందని ఓ లేఖను విడుదల చేసింది. ఎందుకంటే జయం రవి ప్రముఖ సింగర్ కెనీషాతో రిలేషన్లో ఉన్నట్లు ఎంతోకాలంగా ప్రచారం జరుగుతోంది.అయితే ఇటీవల తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి అత్యాచార బెదిరింపులు వస్తున్నాయంటూ కెనీషా సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తనకు అలాంటి సందేశాలు పంపుతున్న వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైనట్లు ఆమె టీమ్ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.కెనీషా పరువుకు భంగం కలిగించేలా సందేశాలు పంపినా, బెదిరించినా తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె టీమ్ పేర్కొంది. సోషల్ మీడియాలో వచ్చే అసభ్యకరమైన సందేశాల వల్ల ఆమె మానసికంగా దెబ్బతిన్నట్లు తెలిపింది. అలాంటి మెసేజ్లు పంపితే ఆ స్క్రీన్షాట్లను ఆధారంగా చేసుకొని నోటీసులు పంపుతామని వెల్లడించింది. ఇలాంటి పనులు ఆపకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ పంపే నోటీసులను సింగర్ తన ఇన్స్టాలో షేర్ చేశారు. View this post on Instagram A post shared by KENEESHAA (@keneeshaa1) -
పవర్ఫుల్ సర్దార్
హీరో కార్తీ, దర్శకుడు పీఎస్ మిత్రన్ కాంబినేషన్లో రూపొందుతోన్న తాజా చిత్రం ‘సర్దార్ 2’. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆదివారం (మే 25) కార్తీ బర్త్ డే.ఈ సందర్భంగా ‘సర్దార్ 2’ నుంచి కార్తీ కొత్తపోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో 2022లో ‘సర్దార్’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేశారు. తండ్రిపాత్ర పేరు సర్దార్ అనే సంగతి గుర్తుండే ఉంటుంది. -
బాలకృష్ణ–గోపీచంద్ సినిమా ప్రకటన ఎప్పుడంటే..?
నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna) మరోసారి దర్శకుడు గోపీచంద్ మలినేనికి ఛాన్స్ ఇవ్వనున్నాడు. 2023లో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి బ్లాక్బస్టర్గా నిలిచింది. దీంతో మరోసారి వారిద్దరూ కలిసి ఒక భారీ యాక్షన్ ప్యాక్డ్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గా డాకు మహారాజ్తో విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అయిపోతున్నాడు. అయితే, మాస్ సినిమాలకు తనదైన మార్క్ చూపించే బాలయ్య మళ్లీ అదే ఫార్ములాను నమ్ముకున్నాడు. దీంతో బాలకృష్ణతో మరో యాక్షన్ మూవీనిప్లాన్ చేశారట గోపీచంద్.ఇటీవల బాలకృష్ణకు గోపీచంద్ ఓ కథ చెప్పగా, ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే. ఈ సందర్భంగా బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబినేషన్లోని సినిమా అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీనుతో ‘అఖండ 2’ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఈ ఏడాది సెప్టెంబరు 25న ఈ సినిమా రిలీజ్ కానుంది. దీంతో ‘అఖండ 2’ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లోని సినిమా చిత్రీకరణ ప్రారంభం కావొచ్చని ఊహించవచ్చు. ఈ సినిమాను కేవీఎన్ ప్రోడక్షన్స్ లేదా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు నిర్మించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. -
24ఏళ్ల తర్వాత ఆ హీరో కోసం రీఎంట్రీ ఇస్తున్న బ్యూటీ
బాలీవుడ్ హీరోయిన్స్ ఇప్పుడు మెల్లిగా సౌత్ ఇండియా పరిశ్రమైపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ టాప్ నటీనటులు ఇక్కడికి షిఫ్ట్ అయిపోతున్నారు. అయితే, 24ఏళ్ల క్రితమే కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్( Raveena Tandon). మళ్లీ తమిళ సినిమాపై ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్లో హీరోయిన్గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సత్తా చాటారు. అంతేకాకుండా బెంగాలీ, కన్నడం, తెలుగు భాషల్లోనూ పలు చిత్రాల్లో కథానాయకిగా నటించారు. తమిళంలో అర్జున్కు జంటగా సాదు అనే చిత్రంతో 1994లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2001లో కమలహాసన్కు జంటగా ఆళవందాన్ "అభయ్" చిత్రంలో నటించారు. కాగా ఇటీవల కాలంలో కన్నడ హీరో యష్ కథానాయకుడిగా నటించిన సూపర్ హిట్ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రంలో ముఖ్య భూమికను పోషించారు. తెలుగులోనూ అడపా దడపా నటిస్తున్న రవీనా టాండన్ తాజాగా కోలీవుడ్ ప్రేక్షకులను మరోసారి పలకరించడానికి సిద్ధమవుతున్నారు. నటుడు, సాంకేత దర్శకుడు విజయ్ ఆంటోని ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. కాగా తాజాగా లాయర్ అనే చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి జాషువా సేతురామన్ కథా,దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నారు. కాగా విజయ్ ఆంటోనీ తన విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుంది. ఇందులో విజయ్ ఆంటోనికి దీటైన పాత్రలో ఒక ప్రముఖ నటి నటించబోతున్నట్లు దర్శకుడు ఇదివరకే చెప్పారు. కాగా ఆమె ఎవరని చిత్ర వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఆమే నటి రవీనా టాండన్. దీని గురించి దర్శకుడు తెలుపుతూ నటి రవీనా టాండన్ 1999లో నటించిన శూల్ చిత్రంలో ఆమె నటన తనకు ఎంతగానో నచ్చిందన్నారు. అలాంటి నటి తమ చిత్రానికి అవసరం అనిపించిందన్నారు. లాయర్ చిత్రంలో రవీనా టాండన్ పాత్ర నటుడు విజయ్ ఆంటోని పాత్రకు దీటుగా ఉంటుందన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
'థగ్ లైఫ్' సాంగ్స్.. దుమ్మురేపిన టాప్ సింగర్స్
నాయకుడు (1987) సినిమా తర్వాత కమల్ హాసన్, మణిరత్నం చేస్తున్న 'థగ్ లైఫ్'.. జూన్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో తాజాగా తెలుగు వర్షన్ సాంగ్స్ అన్ని ఒకే వీడియోతో షేర్ చేశారు. ఎ. ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. ఇందులో శింబు, త్రిష, అభిరామి, నాజర్ ముఖ్య పాత్రలు పోషించారు. రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మించాయి. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. విక్రమ్ తర్వాత కమల్ హాసన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. కమల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా థగ్ లైఫ్ నిలుస్తుందని దర్శకుడు మణిరత్నం అన్నారు. ప్రస్తుతం విడుదలైన పాటలు కూడా ప్రేక్షకులకు సులువుగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. అయితే, టాప్ సింగర్ చిన్మయి ఈ సినిమాలో అదిరిపోయే సాంగ్ను పాడారు. ట్రాక్ మూడో వరుసలో ఉన్న 'ముద్దు వాన' సాంగ్ను ఆమె పాడారు. సింగర్ మంగ్లీ కూడా ఈ చిత్రంలో సూపర్ హిట్ పాటను ఆలపించారు. థగ్ లైఫ్ పాటల ప్రారంభంలోనే 'జింగుచ్చా' అంటూ ఆమె దుమ్మురేపారు. ఈ సినిమా కోసం ప్రముఖ గాయకుడు కె.జె. యేసుదాస్ కుమారుడు విజయ్ ఒక పాట, ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్ ఒక పాటతో మెప్పించారు. -
విశాల్ పెళ్లి ఇంత ఆలస్యం కావడానికి కారణం ఎవరు..?
ప్రస్తుతం తమిళ నటుడు విశాల్ వయసు 50కి చేరువవుతోంది. నిజానికి అన్ని విధాలుగా బాగున్న ఓ వ్యక్తి అంత కాలం పాటు వివాహం కోసం ఆగడం అసాధారణమేననాలి. అందునా విశాల్... ఏ వయసుకా ముచ్చటను అచ్చంగా ఫాలో అయే అచ్చ తెలుగు సంప్రదాయ కుటుంబానికి చెందిన వాడు అనేది కూడా తెలిసిందే. పోనీ సినీనటుడిగా పరిగణనలోకి తీసుకున్నా, 40ఏళ్లకు కాస్త అటూ ఇటూగా పెళ్లి చేసుకోవడం రివాజు. మరోవైపు విశాల్, ధన్షికల మధ్య ప్రేమ ప్రయాణం కూడా ఈ నాటిది కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో... విశాల్ తన పెళ్లిని ఎందుకు ఇన్నేళ్ల పాటు వాయిదా వేశాడు?అయితే విశాల్ పెళ్లి ఆలస్యం కావడానికి ఆయన తీసుకున్న నిర్ణయమే కారణం. అది వ్యక్తిగత సమస్యల వల్ల కాదు, ఎవరిపైనా ప్రేమ లేకపోవడం వల్ల కూడా కాదు. అది ఒక భవన నిర్మాణంతో ముడిపడింది. ఆయన చేసుకున్న ప్రతిజ్ఞ తో ముడిపడింది. నడిగర్ సంఘం (దక్షిణ భారత కళాకారుల సంఘం)కు తమ భవన నిర్మాణం ఓ కల. ఎందరో కళాకారులకు, సాంకేతిక నిపుణులకు నిలయమైన తమిళనాట అందరికీ ఉపయుక్తమైన ఒక భవనం లేకపోవడం అనే లోటు తీరేందుకు ఓ విశాలమైన వసతి కావాలని ఎందరో కోరుకున్నారు. చాలా సార్లు ఆ భవన నిర్మాణం ప్రతిపాదనలు వచ్చినా రకరకాల కారణాల వల్ల పట్టాలెక్కలేదు.ఈ నేపధ్యంలోనే కొత్త నడిగర్ సంఘంకు ప్రధాన కార్యదర్శిగా విశాల్ ఎంపికయ్యాడు. అంతేకాదు భవనం పూర్తయ్యే వరకు తాను విశ్రమించబోనని ఆయన హామీ ఇచ్చాడు.నడిగర్ సంఘం భవన నిర్మాణ ప్రాజెక్టు తమిళ చిత్ర పరిశ్రమలో సినీ కార్యక్రమాలు కళాకారుల సమావేశాలకు ప్రత్యేక స్థలo లేకపోవడంతో ఈ భవనం నిర్మాణం చాలా ముఖ్యమైనదిగా మారింది. ఎట్టకేలకు కళాకారులకు ఉపయుక్తంగా ఉండే ఆధునిక సౌకర్యాలతో కూడిన ఒక అత్యుత్తమ భవన నిర్మాణానికి 2017లో శ్రీకారం చుట్టుకుంది. పరిశ్రమ దిగ్గజాలు రజనీకాంత్ కమల్ హాసన్ దీనికి పునాదిరాళ్లు వేశారు. విజయ్ కమల్ హాసన్ లు తమ వ్యక్తిగత నిధుల నుంచి రూ.1 కోటి చొప్పున విరాళంగా ఇచ్చారు, అలాగే మరో హీరో, నటుడు కార్తీ నిర్మాణాన్ని పర్యవేక్షించడంలో చురుకుగా పాల్గొన్నాడు, ఇలా ఎందరో ప్రముఖుల సహాయ సహకారాలు ఉన్నప్పటికీ... ఈ భవనం పదేపదే నిర్మాణ జాప్యాలను ఎదుర్కొంది. వ్యక్తిగతంగా భావోద్వేగాలను సైతం హీరో విశాల్ ఈ ప్రాజెక్ట్లో పెట్టుబడిగా పెట్టాడని చెప్పొచ్చు. ఈ భవనం సాకారమయే వరకు తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టాలని కూడా అతను నిర్ణయించుకున్నాడు. అప్పుడే ఆయన తమందరి కల నెరవేరేదాకా పెళ్లి చేసుకోనని శపధం చేశాడు. ఏమైతేనేం.. చెన్నై నడిబొడ్డున టి. నగర్, హబీబుల్లా రోడ్లో ఈ భవనాన్ని చలనచిత్ర పరిశ్రమ వివిధ రకాల అవసరాలను తీర్చగల బహుళార్ధక సాధక సినీ కేంద్రంగా భవనం రూపుదిద్దుకుంది. ఇందులో అవార్డు ఫంక్షన్ల కోసం 1000 సీట్ల ఆడిటోరియం, 800 సీట్ల వివాహ మందిరం, 300 సీట్ల చిన్న చిన్న సమావేశ మందిరాలు డిజైన్ చేశారు. భవనం దాదాపుగా సిద్ధమై ప్రతిజ్ఞ నెరవేరడంతో, విశాల్ పెళ్లికి సిద్ధమ్యాడు. నటి సాయి ధన్షికతో తన వివాహాన్ని ప్రకటించాడు, ఇది అన్ని రకాల ఊహాగానాలకు ముగింపు పలికింది. అయితే ఈ ప్రకటన వారి సన్నిహితులెవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే.. వారిద్దరూ 15 సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసనీ, బలమైన స్నేహ బంధాన్ని ప్రేమ గా మార్చుకున్నారని కూడా తెలుసు. ముఖ్యంగా తన జీవితంలోని కష్ట సమయాల్లో విశాల్ చూపిన అచంచలమైన మద్దతు తోడ్పాటును ధన్షిక చాలా కాలంగా ఆరాధించింది. పెళ్లి ప్రకటన సందర్భంగా విశాల్ తమ ఇద్దరి ప్రయాణం గురించి మాట్లాడాడు. తాను చేసిన ప్రతిజ్ఞను ప్రస్తావిస్తూ వివాహం గురించిప ఆలోచనను నడిగర్ సంఘం భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలనే ఆలోచన ఆపిందని ఆయన అంగీకరించాడు తనను నిజంగా అర్థం చేసుకున్న వ్యక్తిగా ధన్షికను అభివర్ణించాడు ఇంత కాలం వేచి ఉన్నందుకు కృతజ్ఞతలు కూడా తెలిపాడు. -
విక్రమ్ సరసన క్రేజీ హీరోయిన్కు గోల్డెన్ ఛాన్స్
చిత్రపరిశ్రమలో వైవిధ్య భరిత కథాచిత్రాలకు కేరాఫ్ చియాన్ విక్రమ్. ఈయన తాను నటించే ప్రతి చిత్రంలోనూ కొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు. అలా ఇటీవల తంగలాన్, వీర ధీర సూరన్ చిత్రాల్లో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కాగా తాజాగా విక్రమ్ తన 63వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి మడోనా అశ్విన్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు మండేలా, మావీరన్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం. కాగా ఈ క్రేజీ చిత్రాన్ని శాంతి పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ సంస్థ ఇంతకుముందు శివకార్తికేయన్ కథానాయకుడిగా మావీరన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిందన్నది గమనార్హం. కాగా తాజాగా విక్రమ్ హీరోగా నిర్మించే చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇందులో విక్రమ్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే నటి ప్రియాంక మోహన్, అలాగే శ్రీనిధిశెట్టిలలో ఒకరు నటింపజేసే ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. కాగా తాజాగా లక్కీ కథానాయకి మీనాక్షి చౌదరిని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ కన్నడ బ్యూటీ ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో మంచి రేసింగ్లో ఉన్నారు. ఈమె ఇంతకు ముందు తమిళ్, తెలుగు భాషల్లో దుల్కర్ సల్మాన్కు జంటగా నటించిన లక్కీ భాస్కర్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అలాగే వెంకటేష్ సరసన నటించిన తెలుగు చిత్రం సంక్రాంతికి వస్తున్నాం కూడా సూపర్ హిట్ అయింది. దీంతో ప్రస్తుతం ఈమె క్రేజీ కథానాయకిగా వెలుగొందుతున్నారు. కాగా మరోసారి తమిళంలో విక్రమ్తో జత కట్టడానికి రెడీ అవుతారా? అన్నది వేచి చూడాలి. -
జయం రవి విడాకుల వివాదం.. సింగర్కు హత్య బెదిరింపులు!
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి(Ravi Mohan), సింగర్ కెనీషా(kenishaa) డేటింగ్లో ఉన్నారనే వార్తలు గతకొంత కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అధికారికంగా వీరిద్దరు ప్రకటించనప్పటికీ.. జయం రవి తన భార్య ఆర్తికి దూరంగా ఉండడం.. విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంతో ఇది నిజమనే అంతా అనుకుంటున్నారు. ఇటీవల ఓ ఈవెంట్కి కెనీషాతో కలిసి వెళ్లడంతో మరోసారి వీరిద్దరి ప్రేమ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో జయం రవి సతీమణి ఆర్తి సోషల్ మీడియా వేదికగా విడాకులపై స్పందించడం, మూడో వ్యక్తికారణంగానే విడిపోవాల్సి వస్తుందని చెప్పడంతో.. కెనీషానే వీరిద్దరి కాపురంలో చిచ్చు పెట్టిందని కొంతమంది నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు కెనీషాను చంపేస్తామంటూ సందేశాలు కూడా పంపుతున్నారట. ఈ విషయాన్ని కెనీషానే సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ.. తనను బెదిరిస్తూ పంపిన సందేశాలకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేయలేదు. ఏ విషయాన్ని దాచడం లేదు. ఎటూ పారిపోవడం లేదు. నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఉంది. ఏ విషయాన్ని అయినా నా ముఖంపైనే అడగండి. మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నిజానిజాలు చెప్పడం నాకు కూడా సంతోషమే. ఇప్పుడు నా చుట్ట జరుగుతున్న కొన్ని విషయాలకు నేనే బాధ్యురాలు అని మీకు అనిపిస్తే.. కోర్టుకు అప్పగించండి. అంతేకానీ ఇలా శాపాలు పెడుతూ కామెంట్ చేయడం వల్ల నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలుసా? కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. మీరంతా నన్ను నిందిస్తున్నారు. కానీ నిజానిజాలు ఏంటనేది బయటకు వచ్చాక మీరు కూడా ఇలాంటి బాధను అనుభవించాలని నేను కోరుకోవడం లేదు. మీలో చాలామందికి నిజం తెలియకపోవడం వల్ల ఇలాంటి కామెంట్స్ పెట్టి నన్ను నిందిస్తున్నారు. మీ అందరి భావాలను నేను అర్థం చేసుకోగలను. కానీ, త్వరలోనే నిజం బయటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నేను తప్పు చేస్తే.. చట్టం వేసే శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. అప్పటివరకూ నన్ను ద్వేషించకండి. ప్రశాంతంగా బతకనివ్వండి’ అని కెనీషా రాసుకొచ్చింది. -
నేను ద్రోణాచార్య కాదు.. విద్యార్థినే: కమల్హాసన్
‘‘నేను మనసు పెట్టి చేసిన ప్రతి సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. ‘థగ్ లైఫ్’ కూడా మనసుపెట్టి చేసిన సినిమా. అద్భుతమైన టీమ్తో పని చేశాను. గొప్పగా సెలబ్రేట్ చేసుకునే ఇలాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదు. మణిరత్నంగారు, నా కాంబినేషన్లో వచ్చిన ‘నాయకుడు’ చిత్రం కంటే ‘థగ్ లైఫ్’ పెద్ద విజయం సాధిస్తుంది... ఇది నాప్రామిస్’’ అని కమల్హాసన్ చెప్పారు. మణిరత్నం దర్శకత్వంలో కమల్హాసన్ హీరోగా నటించిన చిత్రం ‘థగ్ లైఫ్’. శింబు, త్రిష, అభిరామి, నాజర్ ముఖ్య పాత్రలుపోషించారు.రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రం జూన్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా మీట్లో కమల్హాసన్ మాట్లాడుతూ– ‘‘నన్ను ద్రోణాచార్యతోపోల్చారు. కానీ, కాదు... ఇప్పటికీ విద్యార్థినే. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. మణిరత్నంగారి సినిమాలో నేను యాక్ట్ చేయను... జస్ట్ బిహేవ్ చేస్తాను. మేమంతా సినిమా అభిమానులం.సినిమాని ఎప్పుడు కూడా భుజాలపై మోస్తాం. నేను తెలుగులోనే స్టార్గా ఎదిగాను. అందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు. మణిరత్నం మాట్లాడుతూ– ‘‘నాయకుడు’ తర్వాత ఇన్నేళ్లకు కమల్గారితో ‘థగ్ లైఫ్’ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. దర్శకుడికి సపోర్ట్ చేసే హీరో ఆయన’’ అని తెలిపారు. ‘‘నేను ఇక్కడికి వస్తే పుట్టింటికి వచ్చిన అనుభూతి కలుగుతుంది.‘థగ్ లైఫ్’ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని నటి సుహాసినీ మణిరత్నం పేర్కొన్నారు. ‘‘మణిరత్నంగారి క్రమశిక్షణ, టైమింగ్ అద్భుతం. కమల్గారితో వర్క్ చేయడం గొప్ప అనుభూతి’’ అన్నారు శింబు. ‘‘మణిరత్నం, కమల్హాసన్గార్లతో పని చేసే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను’’ అని త్రిష చెప్పారు. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ చూసిన తర్వాత కమల్ సార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందనే నమ్మకం కలిగింది’’ అన్నారు. -
మన దేశానికి వచ్చేస్తున్న యూనివర్సల్ స్టూడియోస్, ఆ ప్రాంతం ఇక సరికొత్త సినిమా క్యాపిటల్, ఎక్కడంటే?
హాలీవుడ్ సినిమాలతో బాగా అనుబంధం ఉన్నవారికి యూనివర్సల్ స్టూడియోస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన ఎన్నో హాలీవుడ్ సినిమాలు రూపుదిద్దుకున్నది యూనివర్సల్ స్టూడియోలోనే. ప్రపంచ సినీరంగానికి యూనివర్సల్ స్టూడియో అనేది ఒక డ్రీమ్ మేకింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయంగా పేరు తెచ్చుకోవాలనుకున్న ప్రతీ టెక్నీషియన్ కల యూనివర్సల్ స్టూడియో. ఈ నేపధ్యంలో భారతీయ సినిమా రంగానికి సినీ అభిమానులకు చెప్పుకోదగ్గ శుభవార్త ఏమిటంటే, మన దగ్గర త్వరలో యూనివర్సల్ స్టూడియోస్ థీమ్ పార్క్ ఏర్పాటు కానుంది. అవును...నిజం...భారతదేశం త్వరలో యూనివర్సల్ స్టూడియోస్ థీమ్ పార్క్ను స్వాగతించబోతోంది. ఈ ప్రపంచ వినోద దిగ్గజం త్వరలో ప్రపంచ స్థాయి థీమ్పార్క్తో సహా భారతదేశంలోకి అడుగుపెట్టనుంది. త్వరలోనే సినీ రూపకర్తల కల సాకారం కానుంది. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో యూనివర్సల్ స్టూడియోస్ పార్క్ ఉన్న కొన్ని దేశాలలో ఒకటిగా అవతరించనుంది. ప్రస్తుతం ఈ థీమ్ పార్క్ యునైటెడ్ స్టేట్స్, జపాన్, సింగపూర్, చైనా దేశాల్లో మాత్రమే ఉంది.అందుతున్న సమాచారం ప్రకారం, భారతదేశంలో యూనివర్సల్ స్టూడియోస్ థీమ్ పార్క్ త్వరలో హర్యానాలోని ద్వారక ఎక్స్ప్రెస్వే సమీపంలో ఢిల్లీ నుంచి కొంచెం దూరంలో నెలకొల్పనున్నారు. ఇటీవల హర్యానా ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకారం, ఈ పార్క్ గురుగ్రామ్ రూపురేఖల్ని మార్చేయనున్న ప్రాజెక్ట్ కానుంది. హర్యానా రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (హెచ్ఎస్ ఐఐడిసి) ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తుంది. వాస్తవానికి, ఇప్పటికే సైట్ చుట్టూ మౌలిక సదుపాయాల ప్రణాళికల అమలు కూడా ప్రారంభించింది. ఇది రాబోయే 3 మిలియన్ చదరపు అడుగుల మాల్ లోపల అభివృద్ధి చేయబడిన ఇండోర్ థీమ్ పార్క్ అవుతుంది. మీడియా నివేదికల ప్రకారం, వినోద ఉద్యానవనాన్ని నిర్మించడానికి భారతి ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ ఇక్కడ 300,000 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంటుందని తెలుస్తోంది. భారతదేశంలో ప్రారంభమవుతున్న ఈ అత్యంత భారీ పార్క్లో ఒసాకా హాలీవుడ్లో ఉన్నట్లుగా థీమ్ , రైడ్లు, షోలు కుటుంబ సమేతంగా సందర్శించదగ్గ ఆకర్షణలు ఉంటాయి. మన దేశానికి యూనివర్సల్ స్టూడియోస్ రాక ఉపాధి రంగానికి కూడా ఊతమిచ్చే శుభవార్త అనే చెప్పాలి. ఈ పార్క్ అనేక రకాల ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. దీని చుట్టుపక్కల ప్రాంతంలో హోటళ్ళు, రవాణా సేవలు షాపింగ్ కేంద్రాలు తదితర వాణిజ్య కార్యకలాపాలు ముమ్మరం అవుతాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతం సరికొత్త సినిమా క్యాపిటల్గా అవతరించినా ఆశ్చర్యం లేదు. గురుగ్రామ్లోని ఈ స్థలం అటు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ మెట్రో మార్గాలు ఇటు మరి కొన్ని ప్రధాన రహదారులకు సులభమైన కనెక్టివిటీని అందిస్తుంది. నిజానికి యూనివర్సల్ స్టూడియోస్ భారతదేశంలో తన తొలి అడుగు వేసేందుకు ఈ ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ఇదీ ఒక కారణమే. -
అబ్దుల్ కలామ్ బయోపిక్లో ధనుష్.. పోస్టర్ విడుదల
జాతీయ అవార్డు గ్రహీత, మల్టీ టాలెంటెడ్ ధనుష్ మరోసారి తన నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈసారి ధనుష్ భారతదేశ ప్రియతమ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్లో నటించనున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ప్రతిష్ఠాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆవిష్కరించబడింది. ఈ చిత్రానికి ‘కలాం’ అనే టైటిల్తో పాటు "ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా" అనే ట్యాగ్లైన్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని ‘తానాజీ: ది అన్సంగ్ వారియర్’, ‘ఆదిపురుష్’ లాంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్నారు.ఈ భారీ ప్రాజెక్ట్ను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లతో అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, కృషన్ కుమార్, గుల్షన్ కుమార్, తేజ్ నారాయణ్ అగర్వాల్, నిర్మిస్తున్నారు. డాక్టర్ కలాం జీవితం, భారత అంతరిక్ష, రక్షణ కార్యక్రమాలకు ఆయన చేసిన అమూల్యమైన సేవను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆవిష్కరించిన ‘కలాం’ సినిమా టైటిల్ పోస్టర్ అందరినీ ఆకర్షించింది. డాక్టర్ కలాం సిల్హౌట్తో పాటు, ఒక మిస్సైల్ చిత్రం ఆవిష్కరణాత్మకంగా రూపొందించబడింది, ఇది ఆయన భారత మిస్సైల్ టెక్నాలజీకి చేసిన కృషిని సూచిస్తుంది.భారతీయ సినిమాలో మోస్ట్ టాలెంటెడ్ నటులలో ఒకరిగా గుర్తింపు పొందిన ధనుష్, డాక్టర్ కలాం పాత్రను పోషించేందుకు చాలా ఫిజికల్ బాడీ ట్రాన్స్ ఫర్ మిషన్ అయ్యాడు. ప్రస్తుతం ఈ చిత్రంలో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించినా ఇతర తారాగణం, సాంకేతిక బృందం వివరాలు త్వరలో ప్రకటించబడనున్నాయి. ఈ చిత్రం డాక్టర్ కలాం జీవితాన్ని, ఆయన స్ఫూర్తిదాయకమైన జీవన ప్రయాణాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక గొప్ప సినిమాగా రూపొందనుంది. -
మైసూర్ శాండల్తో తమన్నా ఢీల్పై విమర్శలు.. మంత్రి వివరణ
నటి తమన్నా భాటియాను ప్రభుత్వ రంగ సంస్థ కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) ఉత్పత్తి చేసే ఐకానిక్ మైసూర్ శాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. అయితే, ఈ ప్రకటన సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. కర్ణాటక బ్రాండ్గా ఉన్న మైసూర్ శాండల్ సబ్బుకు ప్రాతినిధ్యం వహించడానికి స్థానిక నటుడిని ఎందుకు ఎంపిక చేయలేదని కన్నడిగులు ప్రశ్నించారు.ఈ వ్యతిరేకతను ప్రస్తావిస్తూ.. కర్ణాటక భారీ, మధ్య తరహా పరిశ్రమల మంత్రి ఎం.బి. పాటిల్ రియాక్ట్ అయ్యారు. ప్రస్తుత మార్కెట్లో పలు వ్యూహాత్మక కారణాలు ఉన్నాయంటూ.. ఈ నిర్ణయాన్ని సమర్థించారు. కన్నడ చిత్ర పరిశ్రమపై తమకు అత్యంత గౌరవం ఉందన్నారు. కానీ, కెఎస్డిఎల్ సంస్థ కర్ణాటకను దాటి తన ఉనికిని దేశవ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందుకే తాము పాన్-ఇండియా సెలబ్రిటీని ప్రచారకర్తగా ఎంపిక చేశామన్నారు.తమన్నా ఎందుకు?మైసూర్ శాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్గా తమన్నాను ఎంచుకోవడం వెనుక నాలుగు ముఖ్య కారణాలను మంత్రి వివరించారు.పాన్-ఇండియా రేంజ్లో గుర్తింపు: తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ చిత్రాలలో నటించారు. జాతీయ స్థాయి మార్కెట్లో ఆమెకు గుర్తింపు ఉంది. అలాంటి వ్యక్తి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే మరింతగా విస్తరించవచ్చు.మార్కెట్ విస్తరణ: KSDL కర్ణాటకేతర ప్రాంతాలలో, ముఖ్యంగా ఉత్తర, తూర్పు భారతదేశంలో వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది.ప్రొఫెషనల్ బ్రాండింగ్ అనుభవం: తమన్నాకు హై-ప్రొఫైల్ బ్యూటీ, స్కిన్కేర్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడిర్గా పనిచేశారు. ఆమెకు ఈ విషయంలో అనుభవం ఉంది. ఆమె ద్వారా సులువుగా దక్షిణాది రాష్ట్రాలకు వ్యాప్తి చెందొచ్చు.బోర్డు ఆమోదం: తమన్నా ఎంపికను మార్కెటింగ్ నిపుణుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా మాత్రమే తీసుకున్నారు. అందుకు PSU డైరెక్టర్ల బోర్డు కూడా ఆమోదించింది.రూ. 6.2 కోట్ల డీల్కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) తయారు చేస్తున్న మైసూరు శాండల్ సబ్బులతో పాటు ఇతర ఉత్పత్తులకు తమన్నా బ్రాండ్ అంబాసిడర్గా అధికారికంగా నియమించబడ్డారు. ఈ ఒప్పందం రెండేళ్ల పాటు ఉంటుంది. ఇందుకోసం ఆమెకు రూ. 6.2 కోట్ల భారీ మొత్తం కర్ణాటక చెల్లించనున్నట్లు సమాచారం.కర్ణాటకకు గుర్తింపుగా ఉన్న మైసూరు శాండల్ సోప్కు ఒక కన్నడ స్టార్ను ఎంపికి చేసుంటే బాగుండేదని విమర్శలు వస్తున్నాయి. ప్రాతీయ గుర్తింపును ప్రోత్సహించడంలో విఫలం అయ్యారని చెబుతున్నారు. కర్ణాటకతో వందేళ్ల అనుబంధం ఉన్న ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా కన్నడ నటిని కాకుండా మరొక ప్రాంత నటిని తీసుకోవడం ఏంటి అంటూ విమర్శలు చేస్తున్నారు. ప్రతిస్పందనగా, ప్రభుత్వం ఈ నిర్ణయం పూర్తిగా వ్యాపార లక్ష్యాలను అందుకునే వ్యూహాత్మకతలో భాగమని పేర్కొంది. KSDL has deepest respects and regards for Kannada Film Industry. Some Kannada Movies are giving competition to even Bollywood movies. Mysore sandal has a very good brand recall within Karnataka. Which shall be strengthened. However the intent of Mysore Sandal is to also… https://t.co/qnXe3MyJYn— M B Patil (@MBPatil) May 22, 2025 -
నటీ నటుల కోసం రూమ్స్, డ్రగ్స్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
డ్రగ్స్ వినియోగం ఆరోపణలతో మలయాళ చిత్రపరిశ్రమ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడి నటుడు షైన్ టామ్ చాకోతో పాటు జింఖానా సినిమా దర్శకుడు ఖలీద్ రెహ్మాన్ ఈ కేసులో అరెస్టై బయటకు వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా నిర్మాత సాండ్రా థామస్(Sandra Thomas) మాలీవుడ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ వాడడం కోసం సినిమా సెట్లో ప్రత్యేకమైన గదులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ స్పాట్సే ఇప్పుడు డ్రగ్స్ అడ్డాగా మారిపోయానని, ఈ విషయం చాలా మందికి తెలిసినా..తెలియనట్లుగా ఉంటున్నారని మండిపడ్డారు.‘గత ఐదారేళ్ల క్రితమే మాలీవుడ్లో డ్రక్స్ వాడకం ఎక్కువైంది. దీనిని అరికట్టేందుకు అప్పుడు అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకుని ఉండాల్సింది. కానీ ఆ పని చేయలేదు. ఇప్పుడు సినిమా సెట్స్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అక్కడ ఏం జరుగుతుంది? అనేది అందరికి తెలిసినా.. ఎవరూ మాట్లాడలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆయా నటీనటులతో సినిమాలు చేయాలనుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డ్రగ్స్ అలవాటు చేసుకున్నారు. డ్రగ్స్ వాడకం కోసమే ప్రత్యేక బడ్జెట్, గదులను కేటాయిస్తున్నారు. ఈ విషయాలన్ని అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ) సభ్యులకు తెలియదా? సెట్స్కి వెళితే డ్రగ్స్ దొరుకుతుందని తెలియదా? తెలిసినా వారు పట్టించుకోవడం లేదు’ అని ఆమె ఆరోపించారు.సాండ్రా థామస్ విషయానికొస్తే.. మలయాళంలో నటిగా కెరీర్ని ఆరంభించిన ఆమె..ఇప్పుడు నిర్మాతగానూ రాణిస్తోంది. ‘ఫ్రైడే’, ‘ఫిలిప్స్ అండ్ ది మంకీ పెన్’, ‘ఆడు’ సినిమాలతో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. -
వెయ్యి కోట్ల స్కామ్.. వాళ్ల 'నైట్ పార్టీలకు' వెళ్లిన కయాదు లోహర్
అస్సాం బ్యూటీ కయాదు లోహర్ చిక్కుల్లో పడేలా ఉంది. డ్రాగన్ సినిమా విజయంతో తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో రాత్రికి రాత్రే సూపర్స్టార్ అయిపోయిన ఆమెకు ఈడీ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో సంచలనంరేపిన టాస్మాక్ కుంభకోణంలో పాల్గొన్న వారు నిర్వహించిన 'నైట్ పార్టీ'కి ఆమె వెల్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ పార్టీలో ఆమె పాల్గొనేందుకు రూ. 35 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. టాస్మాక్ కుంభకోణం విషయంలో తమిళనాడు వ్యాప్తంగా కొద్దిరోజులుగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కయూదు లోహర్ పేరు తెరపైకి వచ్చింది.టాస్మాక్ కుంభకోణంతో సంబంధం ఉన్న వారిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ సమయంలో లోహర్ పేరు బయటకు వచ్చిందని తెలుస్తోంది. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నవారు నిర్వహించిన నైట్ పార్టీలకు వచ్చినందుకుగాను నటికి రూ.35 లక్షలు చెల్లించినట్లు ఒప్పుకున్నారట. అందుకు సంబంధించిన అధారాలు కూడా అందించారట. తమిళనాడు మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త అక్కడి చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ఈ ఆరోపణలపై కయాదు లోహర్ ఇంకా స్పందించలేదు.రూ. 1000 కోట్ల స్కామ్తమిళనాడులో సుమారు రూ. 1000 కోట్లకు పైగా మద్యం స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈడీ అధికారులు విచారణకు ఎంట్రీ ఇచ్చారు. అయితే, టాస్మాక్ అధికారులు అందుకు సహకరించకపోవడంతో వారి ఇళ్లో సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే నటి కయాదు లోహర్ పేరు తెరపైకి వచ్చిందని సమాచారం. చెన్నైలోని టాస్మాక్ ప్రధాన కార్యాలయంతో పాటు ప్రైవేటు మద్యం ఫ్యాక్టరీలు, ప్రభుత్వ ముఖ్య అధికారులు వంటి చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. ఆపై టాస్మాక్లో రూ.1000 కోట్లు అక్రమాలు జరిగినట్లు ఈడీ తెలిపింది.సినీ నిర్మాత నివాసంలో సోదాలుప్రముఖ సినీ నిర్మాత ఆకాష్ భాస్కరన్ ఇంట్లో కొద్దిరోజుల క్రితమే ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ స్కామ్లో సినిమా పరిశ్రమకు కూడా లింకులు ఉన్నట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. డాన్ పిక్చర్స్ బ్యానర్పై భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్న ఆకాష్ భాస్కరన్ సహాయ డెరెక్టరుగా కూడా కొన్ని సినిమాలకు పనిచేశారు. అలా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అయితే, భాస్కరన్కు ఉదయనిధికి మధ్య మంచి స్నేహం ఉందని తమిళ మీడియా పేర్కొంటుంది. -
కాన్స్ ఫెస్టివల్లో సతీమణి.. భార్యను చూసి మురిసిపోతున్న హీరో!
ఫ్రాన్స్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో హీరో సిద్ధార్థ్ సతీమణి అదితి రావు హైదరీ సందడి చేసింది. ఎరుపు రంగు చీరలో కనిపించి అభిమానులను మెప్పించింది. నుదుటన సిందూరం ధరంచి శారీ లుక్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. తన భార్యను అలా చూసిన సిద్ధార్థ్ ప్రశంసలు కురిపించారు. మై లవ్ ఎట్ కేన్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఫోటోను షేర్ చేశారు. ఫ్రెంచ్ రివేరాలో జరిగిన ప్రతిష్టాత్మక వేడుకలో అదితిరావు హైదరీ ప్రత్యేకమైన శారీలో అందరి దృష్టిని ఆకర్షించింది.సిద్ధార్థ్ తన సతీమణి ఫోటోను పోస్ట్ చేసి అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. ఆమె ధరించిన 'సిందూర్'ను కూడా ప్రస్తావించాడు. సిందూర్ అంటూ హైలెట్ చేశాడు. సిద్ధార్థ్ను వివాహం చేసుకున్న తర్వాత అదితి కేన్స్లో కనిపించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కాగా.. ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మన కేంద్రం ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ పేరిట ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. కేన్స్ ఫెస్టివల్లో సినీ తారలు ఆపరేషన్ సిందూర్కు మద్దతు ప్రకటిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ సైతం నదుటన సిందూరం ధరించిన వైట్ శారీలో మెరిసింది.కాగా.. హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితరావు హైదరీతో కలిసి 2021లో మహా సముద్రం చిత్రంలో నటించారు. ఈ మూవీ సెట్స్లోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత దాదాపు మూడు సంవత్సరాలుగా డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత వారు తెలంగాణ వనపర్తిలోని ఒక ప్రాచీన ఆలయంలో వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
'పూరి అంటే చాలా రెస్పెక్ట్'.. అది ఎవరో క్రియేట్ చేశారు: విజయ్ సేతుపతి
కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి మరో మూవీ రెడీ అయిపోయారు. విడుదల-2 తర్వాత ఆయన నటించిన ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ఏస్. ఈ మూవీ హీరోయిన్గా రుక్మిణీ వసంత్ నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 23న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు హాజరైన హీరో విజయ్ సేతుపతి పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్తో చేస్తున్న సినిమా టైటిల్పై ప్రశ్నించగా.. విజయ్ సేతుపతి స్పందించారు. ఇంకా మేము టైటిల్ ఫిక్స్ చేయలేదని ఆయన అన్నారు. ఏఐతో ఎవరో పోస్టర్ చేశారని.. అది మనది కాదని తెలిపారు. పూరి జగన్నాథ్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉందని విజయ్ సేతుపతి అన్నారు. ఆయన సినిమాలు కూడా చూశానని.. స్క్రిప్ట్ అద్భుతంగా ఉంటుందని ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా విశాల్తో ఎయిర్పోర్ట్లో కలవడంపై మాట్లాడారు. ఆయనతో కేవలం పెళ్లి గురించి మాత్రమే చర్చించానని వెల్లడించారు. రాజకీయాల్లోకి వస్తారా? అని కూడా విశాల్ను అడిగానని తెలిపారు. నేను మాత్రం రాజకీయాల్లోకి రానని విజయ్ సేతుపతి ఫుల్ క్లారిటీ ఇచ్చారు.విజయ్ సేతిపతి మాట్లాడుతూ.. 'మేము టైటిల్ ఖరారు చేయలేదు. బెగ్గర్ అని టైటిల్ మీరే ఫిక్స్ చేశారా? పూరి జగన్నాథ్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఆయన సినిమాలు చాలా చూశా. స్క్రిప్టు వినడానికి రెండు, మూడు రోజులు పడుతుందేమో అనుకున్నా. కానీ కొన్ని గంటల్లోనే పూర్తి చేశారు. జూన్లో షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఆడియన్స్ కంటే ఎక్కువ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని అన్నారు. -
మంగళవారం రోల్ ఇక మర్చిపోండి: నటి రిక్వెస్ట్
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి , రుక్మిణీ జంటగా నటించిన తాజా చిత్రం 'ఏస్'. అరుముగ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. 7సీఎస్ ఎంటర్టైన్మెంట్స్పై అరుముగ కుమార్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 23న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్కు హాజరైన నటి దివ్య పిళ్లై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను మంగళవారం సినిమాలో చేసిన రోల్ ఫ్యాన్స్కు ఎప్పటికీ గుర్తుంటుందని తెలిపింది. కానీ ఈ సినిమాతోనే నన్ను ఎక్కువగా గుర్తు పెట్టుకున్నారని వెల్లడించింది. అందరూ ఆ పాత్ర గురించే మాట్లాడుతున్నారని సంతోషం వ్యక్తం చేసింది. మంగళవారం సినిమాలో విలన్ పాత్ర కావడంతో అది అంతా మర్చిపోవాలని కోరింది. ఈ మూవీలో అద్భుతమైన పాత్రలో కనిపిస్తానని నటి దివ్య పిళ్లై అంటోంది. ఇటీవలే ఏస్ మూవీ తెలుగు ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్ ఫుల్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు విడుదల హక్కుల్ని శ్రీ పద్మిణి సినిమాస్ దక్కించు కుంది. పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్పై బి.శివప్రసాద్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. దీంతో తమిళంతో పాటు తెలుగులోనూ ఓకే రోజు థియేటర్లలో విడుదల కానుంది.ఇక దివ్య పిళ్లై విషయానికొస్తే.. దుబాయికి చెందిన మలయాళీ ఫ్యామిలీలో పుట్టింది. 2015లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సహాయ పాత్రలు చేస్తూ క్రేజ్ సంపాదించింది. గతేడాది సూపర్ హిట్ కొట్టిన 'మంగళవారం' మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'తగ్గేదే లే' అని మరో మూవీ కూడా చేసింది. -
'ఇది చాలా ప్రత్యేకం.. నా అభిమానులకు అంకితమిస్తున్నా': మోహన్ లాల్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తోన్న తాజా చిత్రం వృషభ. ఎంపురాన్-2, తుడురుమ్ సూపర్ హిట్స్ తర్వాత వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడంతో మోహన్ లాల్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. యోధుడి లుక్లో ఉన్న పోస్టర్ మోహన్ లాల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పెద్ద కత్తిని చేతిలో పట్టుకుని కనిపిస్తోన్న ఈ పోస్టర్ చూస్తుంటే పౌరాణిక చిత్రంగానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని మోహన్ లాల్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. 'ఇది చాలా ప్రత్యేకమైనది.. నా అభిమానులందరికీ దీన్ని అంకితం చేస్తున్నా.. మీ నిరీక్షణ ఇక్కడితో ముగుస్తుంది. తుఫాను మేల్కోనుంది. గర్వం, శక్తితో వృషభ ఫస్ట్ లుక్ను ఆవిష్కరిస్తున్నా. ఇది మీ ఆత్మను మండించే కథగా కాలక్రమేణా ప్రతిధ్వనిస్తుంది. నా పుట్టినరోజున ఈ పోస్టర్ ఆవిష్కరించడం మరింత అర్థవంతంగా ఉండనుంది. మీ ప్రేమ ఎల్లప్పుడూ నాకు గొప్ప బలం' అంటూ పోస్ట్ చేశారు. ఈ సినిమాను అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మోహన్ లాల్ వెల్లడించారు. This one is special — dedicating it to all my fans.The wait ends. The storm awakens.With pride and power, I unveil the first look of VRUSSHABHA – a tale that will ignite your souland echo through time.Unveiling this on my birthday makes it all the more meaningful - your love… pic.twitter.com/vBl1atqY3Z— Mohanlal (@Mohanlal) May 21, 2025 -
కమల్ హాసన్ థగ్ లైఫ్.. 'షుగర్ బేబీ' వచ్చేసింది..!
కమల్హాసన్ , త్రిష జంటగా నటిస్తోన్న తాజా చిత్రం థగ్ లైఫ్. ఈ సినిమాకు మణిశర్మ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 36 సంవత్సరాల తర్వాత స్టార్ డైరెక్టర్ మణిరత్నంతో కమల్ హాసన్ జతకట్టారు. దీంతో వీరిద్దరి కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ను మేకర్స్ విడుదల చేశారు. షుగర్ బేబీ అంటూ సాగే సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను అలెగ్జాండ్ర జాయ్, శుభ, నకుల్ అభ్యంకర్ ఆలపించారు. (ఇది చదవండి: కమల్ హాసన్ 'థగ్ లైఫ్' ట్రైలర్ రిలీజ్)కాగా..ఈ సినిమా జూన్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో శింబు కీలక పాత్రలో కనిపించనున్నారు. శింబు సరసన సన్య మల్హోత్రా నటించింది. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ, జోజూ జార్జ్, నాజర్, గౌతమ్ కార్తీక్, అశోక్ సెల్వన్, అభిరామి, మహేష్ మంజ్రేకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
లెజెండ్కు నివాళులర్పించిన కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాతో మరో బ్లాక్బస్టర్ను తన ఖాతాలో వేసుకున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ చిత్రంలో అజిత్ సరసన హీరోయిన్గా త్రిష మెప్పించింది.అయితే అజిత్ కుమార్ కేవలం సినిమాలే కాదు.. కారు రేసింగ్లోనూ ఆయన దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన టీమ్ వరుసగా మూడు దేశాల్లో కప్లు కొట్టింది. తన చిన్నప్పటి నుంచి రేసర్ కావాలనేది ఆయన కోరిక అని.. యాక్సిడెంటల్గా సినిమాల్లోకి వచ్చానని గతంలోనే వెల్లడించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా సినిమాల్లోకి వచ్చానని అజిత్ కుమార్ తెలిపారు. రేసింగ్ పట్ల తన అభిమానాన్ని ఏదో ఒక సందర్భంలో చాటుకుంటూనే ఉన్నారు.తాజాగా అజిత్ కుమార్ ఇటలీలోని ఇమోలాలో ఉన్న ఫార్ములా వన్ లెజెండ్ అయర్టన్ సెన్నా స్మారక చిహ్నాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. అజిత్ స్వయంగా 1994 శాన్ మారినో గ్రాండ్ ప్రిక్స్ సందర్భంగా ఎఫ్వన్ రేసులో ప్రాణాలు కోల్పోయిన ప్రదేశంలో ఉన్న సెన్నా విగ్రహాన్ని ముద్దాడారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది.Ajith Sir paying tribute to Ayrton Senna at the Imola circuit. | #AK #Ajith #Ajithkumar | #GoodBadUgly | #AjithKumarRacing | #24HSeries | #AKRacing | #AyrtonSenna | pic.twitter.com/bWUJacUPSR— Ajith (@ajithFC) May 20, 2025 ThalaAjith pays respect to his Idol #AyrtonSenna 👏👏👏👏👏 pic.twitter.com/xU2t8yXG9l— Joker (@joker28_joker) May 20, 2025 -
మీ కుమారుడితో సినిమా తీస్తారా?.. కేజీఎఫ్ హీరో యశ్ తల్లి ఆసక్తికర సమాధానం..!
కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన హీరో యశ్. శాండల్వుడ్ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా యశ్కు గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాయి. కేజీఎఫ్, కేజీఎఫ్-2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో యశ్కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో పెరిగిపోయింది. ప్రస్తుతం యశ్ టాక్సిక్ మూవీలో నటిస్తున్నారు.అయితే ఈ కన్నడ హీరో మాతృమూర్తి పుష్ప అరుణ్ కుమార్ నిర్మాతగా రాణిస్తున్నారు. ఆమె తాజాగా నిర్మించిన చిత్రం కోతలవాడి. ఈ మూవీకి శ్రీరాజ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన యశ్ తల్లి పుష్పకి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ కుమారుడితో మూవీ తీయాలనుకుంటే ఎలాంటి సినిమా తీస్తారు? అని ఆమెను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.అయితే దీనికి ఆమె చెప్పిన సమాధానం అందరికీ నవ్వులు తెప్పించింది. అసలు నేను యశ్తో సినిమా చేయనని షాకింగ్ సమాధానమిచ్చింది. ఎందుకంటే అన్నం లేనివాడికి పెట్టాలి కానీ.. అన్నీ ఉన్నవాడికి పెడితే వాటి విలువ తెలియదంటూ ఆమె మాట్లాడింది. నేను చెప్పేది నిజమా? కాదా? అంటూ అక్కడున్నవారిని అడిగింది. వాడికి అన్నీ ఉన్నాయి.. సినిమా కావాలనుకుంటే వాడే తీసుకుంటాడు.. నేను యశ్తో ఎలాంటి సినిమా చేయనంటూ ఖరాఖండిగా చెప్పేసింది ఆయన మాతృమూర్తి పుష్ప అరుణ్కుమార్. దీనికి అక్కడున్నవారంతా కాస్తా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే కన్నడకు చెందిన ఆమె అయినప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడడం విశేషం. -
మోహన్ లాల్ బర్త్ డే.. అలాంటి పిల్లల కోసం కీలక నిర్ణయం!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ రోజుతో 65 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మలయాళంలో మాత్రమే కాదు.. టాలీవుడ్లోనూ ఫ్యాన్స్ను సొంతం చేసుకున్న హీరో మోహన్ లాల్ ప్రస్తుతం కన్నప్ప మూవీలో నటిస్తున్నారు. తాజాగా ఆయన బర్త్ డే కావడంతో స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే టాలీవుడ్ హీరో మంచు విష్ణు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.మోహన్ లాల్ బర్త్ డే సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. సూపర్ స్టార్ మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్, నివిన్ పౌలీ, నిర్మాత ఆంటోనీ సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మే 21, 1960న జన్మించిన మోహన్లాల్ నాలుగు దశాబ్దాలుగా మలయాళ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో కలిపి దాదాపు 400 కి పైగా చిత్రాలలో నటించారు. ఐదుసార్లు జాతీయ అవార్డు పొందిన మోహన్లాల్కు 2019లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ను ప్రదానం చేసింది.తాజాగా ఇవాళ తన బర్త్డే సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా రెండు గొప్ప కార్యక్రమాలను ప్రకటించారు. బేబీ మెమోరియల్ హాస్పిటల్తో కలిసి ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన అర్హులైన పిల్లలకు తక్కువ ధరకే కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను అందించనున్నట్లు తెలిపారు. కేరళలో చాలా మంది పిల్లలు కాలేయ వ్యాధులతో బాధపడుతున్నారని.. వారికి కాలేయ మార్పిడి అవసరమని తెలిపారు. ఈ ప్రకటనతో అలాంటి కుటుంబాలకు సహాయం చేయడమే లక్ష్యమని మోహన్ లాల్ అన్నారు. అంతేకాకుండా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'బి ఎ హీరో' అనే పేరుతో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. కాగా.. 2015లో మోహన్లాల్ విశ్వశాంతి ఫౌండేషన్ స్థాపించారు. పేదల ఆరోగ్య సంరక్షణ, విద్య, సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. -
జయం రవి విడాకుల కేసు.. ఆయన భార్య ఆర్తి మరో పిటిషన్
కోలీవుడ్ స్టార్ జయం రవి, ఆయన భార్య ఆర్తి విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుతుతోంది. ప్రస్తుతం వీరిద్దరి పంచాయతీ కోర్టులో ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మాత్రం ఆగడం లేదు. ఇటీవల ఓ పెళ్లిలో జయంరవి.. ఆయన గర్ల్ఫ్రెండ్గా భావిస్తోన్న సింగర్ కెన్నీషా హాజరు కావడంతో వీరి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. జయం రవి తాను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానని.. పంజరం నుంచి బయటపడ్డానని చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు.తాజాగా ఆయన భార్య సైతం తామిద్దరం మూడో వ్యక్తి వల్లే విడిపోవాల్సి వచ్చిందని మూడు పేజీల లేఖను విడుదల చేసింది. మా ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి ప్రమేయం ఉందనడానికి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపింది.ఒకవైపు వీరిద్దరు విడాకుల కోసం కోర్టుకు తిరుగుతూనే ఉన్నారు. అంతలోనే ఆర్తి మరో కీలక నిర్ణయం తీసుకుంది. తనకు నెలకు రూ.40 లక్షల భరణం చెల్లించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆమె పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే వీరిద్దరు ఇటీవల విడాకుల కేసులో కోర్టుకు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆర్తి భరణం కోరుతూ పిటిషన్ వేయడంతో కోలీవుడ్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది -
నా రేస్ కోరిక.. నాన్న ఇచ్చిన సలహా : అజిత్
స్టార్ కథానాయకుడిగా రాణిస్తున్న నటుడు అజిత్ జీవన విధానమే ప్రత్యేకం. తనూ, తన కుటుంబం, నటన, తన కారు పందేలు ఇవే ఆయన లోకం. ఇతర విషయాల గురించి పట్టించుకోరు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో జరిగే సంఘటనలపై అస్సలు జోక్యం చేసుకోరు. మొదట్లో తరచూ పత్రికల వారిని కలుసుకునే అజిత్ ఆ తర్వాత పూర్తిగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. సినిమా రంగానికి ఇలా చేసిన సేవలుగాను ఇటీవల రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసింది. అలాగే కార్ రేస్లో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా అజిత్ ఇటీవల ఎక్కువగా మీడియాతో ముచ్చటిస్తుండటం విశేషం. అలా ఒక భేటీలో తన కార్ రేస్ పై ఆసక్తి గురించి పేర్కొంటూ తనకు చిన్నతనం నుంచి కారు రేసులంటే చాలా ఆసక్తి అని చెప్పారు. తన తల్లిదండ్రులు కూడా చాలా ప్రోత్సహించారన్నారు. ఆ విధంగా తాను చాలా అదృష్టవంతుడిని పేర్కొన్నారు. అయితే అప్పట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా తన తండ్రి చాలా నిజాయితీగా ఒక సలహా ఇచ్చారన్నారు. కార్ రేస్ అనే క్రీడా చాలా ఖర్చుతో కూడిందని, అందువల్ల తాము నీకు తగిన సపోర్టును ఇవ్వలేకపోవచ్చని చెప్పారన్నారు. అయితే నువ్వు స్పాన్సర్స్ను కనుగొని నీ లక్ష్య సాధనలో ముందుకు సాగాలని చెప్పారన్నారు. అలాగే తాను పాఠశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులు ఒక విషయంలో మాత్రం చాలా స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారన్నారు. నువ్వు చదువు పూర్తి చేసి పట్టా అందుకోవాలన్నారు. లేదా ఏదైనా ఉద్యోగం చేయాలన్నారు. అంతేకానీ సమయాన్ని మాత్రం వృథా చేయకూడదని సలహా ఇచ్చారన్నారు. అప్పుడే తాను ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నానని నటుడు అజిత్ చెప్పారు. -
విశాల్ జీవితంలో ఆ నలుగురు అమ్మాయిలు!
సినిమా రంగంలో నటీ నటుల మధ్య అనుబంధాలు ఎంత సహజమో...బ్రేకప్స్ కూడా అంతే సాధారణం. అలాగే అలాంటి అనుబంధాలను గురించిన పుకార్లు షికార్లు చేయడం అంతకు మించి సర్వసాధారణం. అందుకు తమిళ స్టార్ హీరో, యాక్షన్ సినిమాలకు పేరొందిన విశాల్ కూడా అతీతుడేమీ కాదు. అయితే చాలా సార్లు అలాంటి రూమర్లు నిజమవుతుంటాయి కూడా. తాజాగా సాయి ధన్షికను పెళ్లి చేసుకోనున్నట్టు విశాల్ ప్రకటించడం తెలిసిందే. వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ గురించి గత కొంత కాలంగా వార్తలు వస్తున్న వార్తలు నిజమేనని వీరిద్దరూ తమ పెళ్లి ప్రకటనతో ధృవీకరించినట్టయింది.(చదవండి: ఆ నటుడి వల్ల కన్నీటి పర్యంతం.. అండగా విశాల్, అదే సాయి ధన్సిక ప్రేమకు కారణం)పెళ్లితో ఒక ఇంటి వాడు కాబోతున్న సందర్భంగా ఇక విశాల్ మీద ఇలాంటి అఫైర్ల వార్తలు పెద్దగా రాకపోవచ్చునని అనుకోవచ్చు. ఈ సందర్భంగా గతంలో హీరో విశాల్ కు మరికొందరు సహ నటీమణులతో అఫైర్స్ ఉన్నట్టు వచ్చిన వార్తలు ఒకసారి ప్రస్తావించుకుంటే.... అలాంటి వార్తల్లో తమిళ, తెలుగు అని లేకుండా దక్షిణాది సినిమాల్లో స్పెషల్ అట్రాక్షన్గా మారిన వరలక్ష్మి శరత్ కుమార్ తో విశాల్ డేటింగ్ వార్త కూడా ఒకటి. వీరిద్దరి మధ్య సంబంధం గురించి కొంత కాలం పాటు పుకార్లు షికారు చేశాయి. అయితే వీటిని కొన్నాళ్లు కొనసాగనిచ్చాక... తాము ఇద్దరూ ప్రేమికులం కామని వీరిద్దరూ స్పష్టంగా ఖండించారు తాము సన్నిహిత స్నేహితులమని స్పష్టం చేశారు. అప్పటికీ అవి ఆగకపోవడంతో... విశాల్ తనకు మంచి మిత్రుడు మాత్రమేనని అతను పెళ్లి చేసుకుంటానంటే.. తగిన వధువును తానే కనుగొని సూచిస్తానని అతనిపెళ్లి విషయంలో తాను సంతోషంగా సహకరిస్తానని అంటూ వరలక్ష్మి బహిరంగంగా పేర్కొంది. విశాల్ కూడా ఈ పుకార్లను ఖండించాడు. తాము చిన్ననాటి స్నేహితులమని తన పెళ్లి విషయంపై నిర్ణయం జరిగినప్పుడు తనే తన వివాహాన్ని ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశాడు. ఆ తర్వాత వరలక్ష్మి శరత్కుమార్ వ్యాపారవేత్త నికోలాయ్ సచ్దేవ్ను వివాహం చేసుకుంది. అదే విధంగా విశాల్ పేరుతో ముడిపడిన మరో నటి అభినయ.. అభినయ నటుడు విశాల్ మధ్య ప్రేమ సంబంధం గురించి పుకార్లు కొనసాగుతున్నంత కాలం అభినయ వాటిని నిరంతరం ఖండిస్తూ వచ్చింది, విశాల్ కేవలం తనకు ఒక నమ్మకమైన స్నేహితుడు మాత్రమే అని ఆమె పేర్కొంది. నటుడు విశాల్తో ప్రేమ సంబంధం గురించి పుకార్లను తోసిపుచ్చే క్రమంలో తన చిన్ననాటి స్నేహితుడితో తనకు ఉన్న అనుబంధాన్ని కూడా ఆమె వెల్లడించింది. చివరకు అభినయ గత ఏప్రిల్ 16న హైదరాబాద్లో అందరి ఆశీస్సులతో అతన్ని వివాహం చేసుకుంది. 2018లో విడుదలైన తమిళ చిత్రం ఇరుంబు తిరల్ లో కలిసి నటించిన అభిరామి తో కూడా విశాల్కు సంబంధం ఉన్నట్టు కొన్ని పుకార్లు వచ్చినప్పటికీ... అవి ఎక్కువ కాలం కొనసాగకపోవడంతో ఖండించాల్సిన అవసరం కూడా వీరికి రాలేదు. హీరో విశాల్తో సంబంధాలు అంటకట్టబడిన వారందరూ ఇప్పటికే పెళ్లి చేసుకుని హాయిగా సంసారాలు చేసుకుంటూ ఉండగా, ఎట్టకేలకు తన చివరి అఫైర్..వార్తల్ని మాత్రం నిజం చేస్తూ విశాల్ త్వరలోనే ఓ ఇంటి వాడు కానున్నాడు. -
లాయర్గా విజయ్ ఆంటోని.. విలన్గా మేనల్లుడు
కోలీవుడ్ నటుడు, సంగీత దర్శకుడు, నిర్మాత విజయ్ ఆంటోని వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. ఈయన ఇప్పటికే నాలుగైదు చిత్రాలు చేస్తున్నారు. ఈయన నటిస్తున్న అగ్ని సిరైగల్, వళ్లి మయిల్, ఖాకీ, మార్గన్, శక్తి తిరుమగన్ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కాగా తాజాగా మరో నూతన చిత్రానికి సిద్ధమవుతున్నారు . దీనికి లాయర్ అనే టైటిల్ ను నిర్ణయించారు. దీనికి సంబంధించిన పోస్టర్ని సోమవారం విడుదల చేశారు. దీన్ని విజయ్ అంటాని ఫిలిం కార్పొరేషన్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రానికి జెంటిల్ ఉమెన్ చిత్రం ఫేమ్ జోశ్వా సేతురామన్ కథా, దర్శకత్వం బాధ్యతలను వహించనున్నారు. ఇది న్యాయస్థానం నేపథ్యంలో సాగే వైద్య భరిత కథాచిత్రంగా ఉంటుందని చిత్రవర్గాలు పేర్కొన్నారు. న్యాయస్థానంలో ఒక విభిన్నమైన కేసు ఇతి వృత్తంతో సాగే కథను దర్శకుడు రాశారని నిర్మాతలు తెలిపారు. ఇంతవరకు తెరపై చూడనటువంటి న్యాయస్థానాన్ని , దాని విధి విధానాలను సరికొత్తగా తెరపై ఆవిష్కరించే కథా చిత్రంగా ఇది ఉంటుందని పే ర్కొన్నారు. ఇందులో నటుడు విజయ్ ఆంటోనికి వ్యతిరేక పాత్రలో ఇండియాలోనే పాపులర్ అయిన ఓ నటి నటించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి అయినట్లు, త్వరలోనే చిత్ర షూటింగ్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను అతి త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నారు. ఈ మూవీని తమిళ, తెలుగు, కన్నడ, హిందీ నాలుగు భాషల్లో విడుదల చేయనున్నారు. విజయ్ ఆంటోనీ మేనల్లుడు విలన్గా నటించనున్నారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ మార్గన్లో విజయ్కు పోటీగా అజయ్ దీషన్ విలన్గా చేస్తున్నాడు. ఈ సినిమాతోనే తన మేనల్లుడుని విజయ్ ఆంటోనీ పరిచయం చేస్తున్నాడు. -
అతని కాలి బూట్లకు ముద్దు పెట్టిన హీరో అజిత్.. వీడియో వైరల్
సినిమా హీరోలను దేవుడిలా అభిమానులు పూజిస్తారు. మరి ఆ హీరోలే మరోకరిని తమ జీవితానికి ఆదర్శంగా తీసుకుంటే అతనెంత గొప్పవాడై ఉంటాడో అని ఆలోచిస్తాం. సరిగ్గా అలాంటి సన్నివేశమే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ లైఫ్లో ఒకటి ఉంది. అజిత్ తాజాగా తన అభిమాన కార్ రేసర్కు నివాళులు అర్పించారు. ఆయనపై తన అభిమానం ఏపాటిదో వీడియోతో చూపాడు. దానిని చూసిన అజిత్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.అజిత్ తాజాగా ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్ అయర్టన్ సెన్నాకు నివాళులర్పించారు. ఇటలీ పార్క్లో ఉన్న ఆయన విగ్రహం పాదాలకు ముద్దు పెట్టి తన అభిమానం ఎలాంటిదో చూపాడు. అయర్టన్ సెన్నా విగ్రహాన్ని కొంత సమయం పాటు అలా చూస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో ఆయన చాలా ఎమోషనల్ అయ్యాడు. బ్రెజిల్ దేశానికి చెందిన అయర్టన్ సెన్నా మూడు సార్లు(1988,1990,1991) ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్గా గెలిచి రికార్డ్ క్రియేట్ చేశాడు. వరుసగా మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ సెట్ చేశాడు. 1994 కార్ రేసింగ్లో జరిగిన ప్రమాదంలో ఆయన మరణించారు.అజిత్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ రేసర్గానూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది. షూటింగ్స్లకు కాస్త విరామం దొరికితే చాలు రేసింగ్ బైక్స్, కార్లలో చక్కర్లు కొడుతుంటారు. అంతర్జాతీయ కార్ రేసింగ్లలో కూడా ఆయన పాల్గొని సత్తా చాటారు. ఆపై తన రేసింగ్ టీమ్ను కూడా కొద్దిరోజుల క్రితమే ఆయన ప్రకటించారు. ‘అజిత్ కుమార్ రేసింగ్’ పేరుతో టీమ్ను ఏర్పాటు చేశారు. View this post on Instagram A post shared by Ajith Kumar Racing Team (@ajithkumarracing) -
తమన్నాకు ఛాన్సులు తగ్గడం వెనుక కారణం ఇదేనా..?
పాన్ ఇండియా కథానాయకి నటి తమన్న. తన 15వ ఏటనే నటిగా రంగ ప్రవేశం చేసిన ఈమె తొలుత హిందీ చిత్రంలో నటించారు. ఆ వెంటనే తెలుగు, తమిళం భాషల్లో అవకాశాలు వరుసకట్టాయి. అయితే మొదట్లో గ్లామర్నే నమ్ముకున్న ఈ బ్యూటీ చివరి వరకూ ఆ గ్లామర్తోనే తమన్నాను స్టార్ హీరోయిన్ను చేసింది. మధ్యలో తనలోని నటనకు పదును పెట్టే పాత్రలు వచ్చినా అవి చాలా తక్కువగా పరిమితం అయ్యాయి. తమన్నా కూడా వాటి గురించి పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ఇక అప్పుడప్పుడూ ఐటమ్ సాంగ్స్తో అందాలను వెండితెరపై ఆరబోస్తూ కుర్రకారు హాట్ బీట్ను పెంచేస్తూ తన క్రేజ్ను మరింతగా పెంచుకున్నారు. అలా ఐటమ్ సాంగ్స్కు స్పెషలిస్ట్గా ముద్ర వేసుకున్నారు. ఐతే కథానాయకిగా తమన్నా రెండు దశాబ్దాల మైలు రాయిని అవలీలగా టచ్ చేశారు. ఇప్పటికి ఈ బ్యూటీ వయసు జస్ట్ 35 ఏళ్లే. మొన్న జైలర్ చిత్రం, ఆ తరువాత హిందీ స్త్రీ2 వంటి చిత్రాలలో తమన్నా స్పెషల్ సాంగ్స్తో ఇరగదీశారు. అలాంటిది ఇప్పుడు దక్షిణాదిలో ఈ భామకు ఒక్కటంటే ఒక్క సినిమా లేక పోవడం నిజంగా ఆశ్చర్యమే. ఇటీవల సుందర్ సీ దర్శకత్వంలో నటించిన అరణ్మణై – 4 చిత్రం కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత కోలీవుడ్లో మరో అవకాశం రాలేదు. ఇదే విధంగా తెలుగులో విభిన్న పాత్రలో నటించిన ఓదెల – 2 చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో అక్కడ మరో అవకాశం రాలేదు. అలా దక్షిణాది చిత్ర పరిశ్రమ తమన్నాను పూర్తిగా పక్కన పెట్టేసిందా? అన్న చర్చ జరుగుతోంది.ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమనే నమ్ముకున్నారీ భామ. అక్కడ ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా తమన్నా కన్నా వయసులో పెద్దవారైన నయనతార, త్రిష వంటి తారలు నాలుగు పదుల వయసు దాటేసినా ఇప్పటికీ అగ్ర కథానాయకిలుగా రాణిస్తున్నారు. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. కాగా ఇటీవల నటి తమన్నా విజయ్ వర్మ అనే హిందీ నటుడి ప్రేమలో పడడం, అది కొద్ది కాలానికే వికటించడం వంటి ఘటనలు ఈమె కెరీర్ కు ఎఫెక్ట్ అయ్యాయా? అనే చర్చ కూడా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఏదేమైనా మిల్కీ బ్యూటీ మళ్లీ అవకాశాల వేటలో పడ్డారు. తన గ్లామరస్ ఫొటోలతో నెట్టింట్లో సందడి చేస్తున్నారు. -
మలయాళ సూపర్ స్టార్ బర్త్ డే.. జాక్ ఫ్రూట్తో ప్రేమ చాటుకున్న అభిమాని!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాలీవుడ్లో మాత్రమే కాదు.. టాలీవుడ్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా ఓ అభిమాని ఆయనపై ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు. ఈనెల 21న మోహన్ లాల్ పుట్టినరోజు కావడంతో ఒక రోజు ముందుగానే ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. జాక్ ఫ్రూట్స్తో ఆయన చిత్రపటాన్ని రూపొందించాడు.జాక్ ఫ్రూట్ భాగాలను ఉపయోగించి డా విన్సీ సురేశ్ అనే ఆర్టిస్ట్ మోహన్ లాల్ చిత్రపటాన్ని రూపొందించాడు. దాదాపు 65 రకాల జాక్ ఫ్రూట్లతో ఈ చిత్రపటాన్ని తయారు చేశారు. ఆకుపచ్చ, పసుపు, నారింజ షేడ్స్ లో జాక్ ఫ్రూట్ ఆకులతో మోహన్ లాల్ ఫోటోను అలంకరించారు. ఈ చిత్రపటాన్ని త్రిస్సూర్ వేలూర్లోని ఆయుర్ జాక్ ఫ్రూట్ ఫామ్లో రూపొందించారు. దాదాపు ఎనిమిది అడుగుల వెడల్పు, రెండు అడుగుల ఎత్తుతో ఈ చిత్రపటాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. దీని కోసం దాదాపు ఐదు గంటల సమయం పట్టినట్లు తెలుస్తోంది.కాగా.. ఈ ఏడాది మోహన్ లాల్ ఎంపురాన్-2 మూవీతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత మోహన్ లాల్, శోభన జంటగా తుడురుమ్ అనే మూవీ కూడా విడుదలైంది. ఈ సినిమాకు సైతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. -
'నా దుస్తులతో మీకేం పని?': రిపోర్టర్కు ఇచ్చిపడేసిన నటి ఐశ్వర్య
తమిళ నటి, ప్రముఖ యాంకర్ ఐశ్వర్య రఘుపతి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో ఆమె దుస్తులను ఉద్దేశించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంపై ఇప్పటికే ఓ నోట్ రిలీజ్ చేసింది. అయితే మరోసారి తాజాగా జరిగిన ఈవెంట్లోనూ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె స్లీవ్లెస్ దుస్తులపై ఓ రిపోర్టర్ ప్రశ్నించడంతో ఐశ్వర్య ఆగ్రహం వ్యక్తం చేసింది.తాజాగా సాయిధన్సిక మూవీ యోగిదా ఈవెంట్కు హాజరైన ఐశ్వర్య.. వేసవికాలంలో వేడిని తట్టుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని మీడియాను కోరారు. అయితే దీనికి ప్రతిస్పందనగా.. ఒక రిపోర్టర్ ఆమెను ప్రశ్నిస్తూ.. మీరు ధరించిన స్లీవ్లెస్ బ్లౌజ్ కూడా వేడిని తట్టుకునే ప్రణాళికలో భాగమేనా అని అడిగారు. దీనికి ఆశ్చర్యపోయిన ఐశ్వర్య.. ఒక సినిమా కార్యక్రమంలో తన దుస్తులపై చర్చ ఎందుకంటూ అతన్ని ప్రశ్నించింది. ప్రస్తుతానికి ఎలా స్పందించాలో తనకు అర్థం కావడం లేదని తెలిపింది. ఐశ్వర్య దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.గత వారంలో ఐశ్వర్య రఘుపతి ఈ సమస్యను ప్రస్తావిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. నేటికి కూడా మన సమాజంలో చాలా మంది పురుషులు అహంకారం, దురభిమాన భావనను కలిగి ఉండటం నిరాశ కలిగించే అంశమని తెలిపింది. ఒక రిపోర్టర్ లాంటి వ్యక్తి నుంచి అలాంటి ప్రవర్తన వచ్చినప్పుడు మరింత నిరాశకు గురి చేసిందన్నారు. ఈ విషయాన్ని మీరు గ్రహించాలని ఐశ్వర్య తన ప్రకటనలో రాసుకొచ్చింది.ఇలా వేదికలపై తాను ఇలాంటి అసౌకర్య క్షణాలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు.. గతంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ నటుడు తనకు దండలు వేయడానికి ప్రయత్నించేటప్పుడు హద్దులు మీరి వ్యవహరించాడని.. ఆ సంఘటన తన మానసికంగా ప్రభావితం చేసిందని ఐశ్వర్య చెప్పింది. కాగా.. ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రంలో ఐశ్వర్య రఘుపతి కనిపించింది. View this post on Instagram A post shared by Aishwarya Ragupathi (@aishwarya_ragupathi) -
గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా ‘జూనియర్’.. సాంగ్ రిలీజ్
కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘జూనియర్’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించగా, జెనీలియా కీలక పాత్ర పోషించారు. వారాహి చిత్రం బ్యానర్పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూన్ 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘లెట్స్ లివ్ దిస్ మూమెంట్... లెట్స్ లవ్ దిస్ మూమెంట్..’ అనే సాంగ్ లాంచ్ ఈవెంట్ను బెంగళూరులో నిర్వహించారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ స్వరకల్పనలో శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను జస్ప్రీత్ జాజ్ పాడారు. విజయ్ పొలాకి నృత్య రీతులు సమకూర్చారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో హీరో కిరిటీ రెడ్డి మాట్లాడుతూ– ‘‘చాలా మంచి సినిమా తీశాం. ‘జూనియర్’లోని ప్రతి మూమెంట్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా షూటింగ్ టైమ్లో నాకు గాయమైంది. దాంతో కోలుకోడానికి ఏడాది పట్టింది. ఈ కారణంగా ఈ సినిమా రిలీజ్ ఆలస్యమైంది. లెజెండరీ యాక్టర్ వి. రవిచంద్రన్గారు మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు ఈ సినిమాలో నటించారు’’ అని తెలిపారు. ‘‘మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా కోసం కిరీటి చాలా హార్డ్ వర్క్ చేశాడు’’ అని తెలిపారు వి. రవిచంద్రన్. ‘‘రవిచంద్రన్, సెంథిల్, దేవిశ్రీప్రసాద్గార్లు వంటి సీనియర్స్ ఉండటం వల్ల మా ‘జూనియర్’ సినిమా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుందని నమ్ముతున్నాను’’ అని చెప్పారు రాధాకృష్ణ. ‘‘కిరీటి యాక్షన్, డ్యాన్సింగ్ స్కిల్స్ చాలా సర్ప్రైజ్ చేశాయి. నటుడిగా అతనికి గొప్ప భవిష్యత్ ఉంది’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. ఈ వేడుకలో కొరియోగ్రఫర్ విజయ్ ΄ోలాకి, ఛాయాగ్రాహకుడు సెంథిల్ కుమార్ మాట్లాడారు. -
కలెక్టర్ కావాలనుకున్న పేద విద్యార్థినికి కమల్ సాయం
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ తను చేసిన సాయాన్ని బయటిప్రపంచానికి పెద్దగా చెప్పుకోడు. అయితే, కొన్ని సందర్భాల్లో ఆ సాయం పొందిన వారు ఏదో వేదిక మీద చెప్పిన తర్వాత వైరల్ అవుతుంటుంది. ఈయన ఇప్పటికే కమల్ సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేసి వందల మందికి విద్యాదానం చేస్తున్నారు. తాజాగా ఒక పేద విద్యార్థిని ఉన్నత విద్యకు సాయం అందించారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా, పాంబన్ సమీపంలోని తెర్కువాడి మత్స్యకార గ్రామానికి చెందిన శోభన అనే విద్యార్ధిని ప్లస్ –2 పరీక్షల్లో 562 మార్కులు సాధించింది. ఈమె తండ్రి మత్స్యకారుడు. తల్లి పీతలు ఎగుమతి కంపెనీలో రోజువారీ కూలీ. కాగా తాను చదివిన ప్రభుత్వ పాఠశాలలోనే అత్యధిక మార్కులు సాధించిన విధ్యార్ధిని శోభన. ఈమెకు ఉన్నత విద్యను అభ్యసించి సివిల్ సర్వీస్ పరీక్షలు రాయాలన్నది ఆశ. అయితే కుటుంబ ఆర్థిక స్థోమత లేకపోవడంతో శోభన చదువు మానేసి ఒక బట్టల దుకాణంలో పనికి చేరింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కమలహాసన్ విద్యార్ధిని శోభనను తన కార్యాలయానికి పిలిపించి కమల్ సాంస్కృతి కేంద్రం ద్వారా ఆమె ఉన్నత విద్యకు అయ్యే ఖర్చులకు సాయం చేశారు. తను సివిల్ సర్వీస్ పరీక్షలు రాసేవరకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. తన సంరక్షణలోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆపై సివిల్ సర్వీస్కు కావాల్సిన వనరులు ఏర్పాటు చేస్తానని శోభనకు ఆయన మాట ఇచ్చారు. దీంతో శోభన కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. కమల్ సార్ చేసిన సాయాన్ని ఎట్టిపరిస్థితిల్లోనూ వృధా కానివ్వనని శోభన చెప్పింది. తాను సివిల్ సర్వీస్ సాధించి తప్పకుండా సమాజ శ్రేయస్సు కోసం పాటు పడుతానని మాటిచ్చింది. -
'అనుకున్నదే అయింది.. విశాల్తో పెళ్లిపై హీరోయిన్ అఫీషియల్ ప్రకటన'
కోలీవుడ్ స్టార్ విశాల్, హీరోయిన్ సాయి ధన్సిక పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. తాజాగా విశాల్ పెళ్లిపై మరోసారి రూమర్స్ రావడంతో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ సాయి ధన్సిక అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తన మూవీ యోగిదా ఈవెంట్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. తాను విశాల్ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వేదికపై వెల్లడించింది.అవును.. నేను, విశాల్ మంచి స్నేహితులం.. మేమిద్దరం కలిసి నడవబోతున్నాం.. ఈ ఏడాది ఆగస్టు 29న పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నాం అంటూ సంతోషం వ్యక్తం చేసింది సాయి ధన్సిక. ఈ ప్రకటనతో అటు విశాల్ ఫ్యాన్స్.. ఇటు సాయి ధన్సిక అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు విశాల్కు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. కోలీవుడ్కు చెందిన సాయి ధన్సిక తెలుగులో తెరకెక్కిన షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించారు.ఇటీవలే హింట్ ఇచ్చిన విశాల్..ఇటీవల నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం కూడా పూర్తయింది. ఇటీవల ఓ సమావేశంలో తన పెళ్లి గురించి మాట్లాడారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని తెలిపారు. నాది ప్రేమ వివాహమేనని.. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తానని విశాల్ వెల్లడించారు. కాగా.. విశాల్కు గతంలో అనీషా అనే నటితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత వీరి నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. Official Actor #Vishal is going to marry #SaiDhanshika on August 29, 2025 💍♥️pic.twitter.com/ePWoIljAuA— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) May 19, 2025 -
'డ్రాగన్' షూటింగ్ లో ప్రేమ.. ఇప్పుడు ఏకంగా పెళ్లి
ప్రేమ.. ఎప్పుడు ఎవరిపై ఎందుకు పుడుతుందో చెప్పడం కష్టం. అలా ప్రేమలో పడ్డ వాళ్లు కొందరు సులభంగా పెళ్లిపీటలు ఎక్కుతారు. మరికొందరు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొని ఒక్కటవుతుంటారు. అలా ఇప్పుడు నిజంగా జరిగిన ఓ ప్రేమకథని దర్శకుడు అశ్వత్ మారిముత్తు బయటపెట్టాడు. రీసెంట్ గా 'రిటర్న్ ఆఫ్ డ్రాగన్' సినిమా తీసింది ఇతడే.(ఇదీ చదవండి: ఆ హీరోయిన్తో విశాల్ పెళ్లి.. త్వరలోనే ముహుర్తం ఫిక్స్!)'ఓ మై కడవులే' అనే తమిళ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అశ్వత్.. దీన్ని తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా 'ఓరి దేవుడా' పేరుతో రీమేక్ చేశారు. అలా తెలుగులోనూ అశ్వత్ మూవీ తీశాడు. రీసెంట్ గా ప్రదీప్ రంగనాథన్ హీరోగా 'రిటర్న్ ఆఫ్ డ్రాగన్' తీసి సూపర్ హిట్ కొట్టేశాడు. అయితే ఈ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసిన విక్కీ .. ఇదే మూవీకి మేకప్ ఆర్టిస్టుగా పనిచేసిన పవిత్ర రుక్మిణి ఆదివారం నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకు హాజరైన అశ్వత్.. వీళ్లిద్దరి ప్రేమకథ గురించి చెప్పాడు.'నిన్న నాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే నా అసిస్టెంట్ డైరెక్టర్ విక్కీ.. పవిత్రతో నిశ్చితార్థం చేసుకున్నాడు. 'ఓ మై కడవులే' సినిమా కోసం విక్కీ నా దగ్గర అసిస్టెంట్ గా చేరాడు. 'డ్రాగన్'కి చీఫ్ అసోసియేట్ దర్శకుడిగా పనిచేశాడు. నాతో పాటే కలిసి ఉండేవాడు. కానీ కొన్నిసార్లు జీవితం మనల్ని సర్ ప్రైజ్ చేస్తూ ఉంటుంది. అలా విక్కీ.. 'డ్రాగన్' సెట్ లో మేకప్ ఆర్టిస్ట్ పవిత్రని కలిశాడు. చూడగానే ప్రేమలో పడిపోయాడు''ప్రతి గొప్ప ప్రేమకథ.. నో చెప్పడంతోనే మొదలవుతుంది. వీళ్లది కూడా అంతే. బ్రేకప్ సీన్ తీస్తున్న టైంలో విక్కీ ఏడుస్తూ కనిపించాడు. ఏమైందని అడిగితే.. తను నో చెప్పింది, మాట్లాడొద్దని కూడా చెప్పిందని అన్నాడు. ఓ అన్నగా నేను కొన్ని సలహాలు ఇచ్చా. కానీ పాట తీస్తున్న టైంకల్లా వాళ్ల గాఢమైన ప్రేమలో ఉన్నారు. రీసెంట్ గా నా దగ్గరకొచ్చి.. మేం పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పడంతో నేను షాకయ్యాను' అని అశ్వత్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) -
ఆ హీరోయిన్తో విశాల్ పెళ్లి.. త్వరలోనే ముహుర్తం ఫిక్స్!
కోలీవుడ్ స్టార్, నిర్మాత విశాల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. గతంలోనే పలు సార్లు ఆయన పెళ్లిపై వార్లలొచ్చినా ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు. నడిగర్ సంఘం భవనం నిర్మించాకే తన పెళ్లి ఉంటుందని గతంలో విశాల్ ప్రకటించారు. అయినప్పటికీ ఆయన పెళ్లి చర్చ ఆగడం లేదు. తాజాగా ఆయన పెళ్లిపై కోలీవుడ్లో మరోసారి చర్చ మొదలైంది.విశాల్ త్వరలోనే హీరోయిన్ సాయి ధన్సికను పెళ్లాడబోతున్నారంటూ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కోలీవుడ్లో వార్త చక్కర్లు కొడుతోంది. అయితే తమపై వస్తున్న వార్తలపై ఇప్పటి వరకు సాయిధన్సిక కానీ.. విశాల్ కానీ స్పందిచంలేదు. దీనిపై వీరిద్దరిలో ఎవరో ఒకరూ స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది. కాగా.. కోలీవుడ్కు చెందిన సాయి ధన్సిక తెలుగులో తెరకెక్కిన షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించారు.ఇటీవల నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం కూడా పూర్తయింది. ఇటీవల ఓ సమావేశంలో తన పెళ్లి గురించి మాట్లాడారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని తెలిపారు. నాది ప్రేమ వివాహమేనని.. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తానని విశాల్ వెల్లడించారు. కాగా.. విశాల్కు గతంలో అనీషా అనే నటితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత వీరి నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. ఇవాళే ప్రకటిస్తాడా?..కోలీవుడ్లో రూమర్స్ వినిపిస్తోన్న వేళ విశాల్, సాయి ధన్షికతో వివాహం చేసుకోబోతున్నాడన్న వార్త నిజమేనని ఆయన సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి. సోమవారం సాయంత్రం జరగనున్న సాయి ధన్షిక నటించిన యోగి దా సినిమా కార్యక్రమానికి విశాల్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ ఈవెంట్లోనే తనతో సాయి ధన్సిక వివాహ ప్రకటన ఉండొచ్చనే వార్తలొస్తున్నాయి. -
'రెట్రో' కలెక్షన్స్ విడుదల.. సూర్య కెరీర్లో ఇదే టాప్
రెట్రో సినిమాతో సూర్య భారీ హిట్ అందుకున్నాడు. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ను మేకర్స్ విడుదల చేశారు. సూర్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రెట్రో రికార్డ్ క్రియేట్ చేసింది. గతేడాదిలో భారీ అంచనాలతో విడుదలైన ‘కంగువా’ చిత్రం సూర్య (Suriya)కు చేదు అనుభవాన్ని మిగిల్చినా రెట్రో మాత్రం ఆ లోటును తీర్చింది. అయితే, తెలుగులో అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ చిత్రంగా మే 1న రెట్రో విడుదలైంది. ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా నటించగా.. జోజూ జార్జ్, జయరామ్, నాజర్ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. యాక్షన్తో పాటు, ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ఒక గ్యాంగ్స్టర్గా సూర్య ఇందులో నటించాడు.రెట్రో సినిమా 18 రోజుల్లో రూ. 235 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో అత్యధికంగా తమిళనాడులోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. సూర్య కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా మొదటి స్థానంలో రెట్రో ఉంది. ఆ తర్వాత 24 మూవీ రూ. 157 కోట్లు, సింగం2 రూ. 122 కోట్లు, కంగువా రూ. 106 కోట్లు, 7th సెన్స్ రూ. 113 కోట్లు, సికిందర్ రూ. 95 కోట్లతో వరుసగా ఉన్నాయి. రెట్రో సినిమాకు 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ భారీగానే దెబ్బ కొట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం టాక్ బాగుండటంతో కోలీవుడ్లో మంచి కలెక్షన్స్ రాబట్టింది. లేదంటే రెట్రో కలెక్షన్స్ సులువుగా రూ. 300 కోట్లకు దగ్గర్లో ఉండేవని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.Dear Audience and #AnbaanaFans, we're humbled by your immense love and support for #TheOne ‼️ Grateful for the glory, it's all because of you ❤#RETRO@Suriya_Offl #Jyotika @karthiksubbaraj @hegdepooja @Music_Santhosh @prakashraaj @C_I_N_E_M_A_A @rajsekarpandian… pic.twitter.com/wScjYwaqu4— 2D Entertainment (@2D_ENTPVTLTD) May 18, 2025 -
'విజయ్ దేవరకొండ మొహంలా ఉంది'.. ఆసక్తిగా తెలుగు ట్రైలర్
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి , రుక్మిణీ జంటగా నటించిన తాజా చిత్రం 'ఏస్'. అరుముగ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. 7సీఎస్ ఎంటర్టైన్మెంట్స్పై అరుముగ కుమార్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 23న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు.ఇప్పటికే తమిళ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్ ప్రమోషన్ల జోరు పెంచారు. తాజాగా ఏస్ మూవీ తెలుగు ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్ ఫుల్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు విడుదల హక్కుల్ని శ్రీ పద్మిణి సినిమాస్ దక్కించు కుంది. పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్పై బి.శివప్రసాద్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. దీంతో తమిళంతో పాటు తెలుగులోనూ ఓకే రోజు థియేటర్లలో విడుదల కానుంది. ఇంకేందుకు ఆలస్యం తెలుగు ట్రైలర్ చూసేయండి. -
కోలుకున్న హీరో విశాల్.. విజయ్ సేతుపతితో కలిసి
సరిగ్గా ఓ వారం క్రితం తమిళ హీరో విశాల్.. ఓ ఈవెంట్ లో పాల్గొనేందుకు వెళ్లాడు. వచ్చిన వాళ్లతో మాట్లాడుతూ సడన్ గా కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో ఏమైందా అని అందరూ కంగారు పడ్డారు. కానీ శరీరంలో ఫుడ్ లేకపోవడంతో శక్తి లేకనే కళ్లు తిరిగి పడిపోయారని ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్) ఇది జరిగి ఎన్ని రోజులూ కాలేదు. తాజాగా విశాల్ ఆరోగ్యంగా కనిపించాడు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో విజయ్ సేతుపతితో దిగిన ఫొటోని పోస్ట్ చేశాడు. చాలారోజుల తర్వాత తన డార్లింగ్ ఫ్రెండ్ ని కలిశానని, కాసేపు తనతో మాట్లాడానని చెప్పుకొచ్చాడు. ఈ ఫొటోలో విశాల్ ని చూస్తుంటే బాగానే కనిపించాడు.కొన్నాళ్ల క్రితం కూడా ఇలానే ఓ ఈవెంట్ కి వచ్చిన విశాల్ గుర్తుపట్టలేనంతగా బక్కచిక్కి కనిపించాడు. ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఆరోగ్యం పర్వాలేదనిపించేలా ఉంది. ప్రస్తుతానికైతే విశాల్ చేతిలో 'తుప్పరివాలన్ 2' తప్పితే మరో ప్రాజెక్ట్ లేదు. ఇది కూడా చాన్నాళ్ల నుంచి తీస్తున్నారు. దర్శకుడు మిస్కిన్ తప్పుకోవడంతో హీరో, నిర్మాతగా విశాలే చేస్తున్నాడు. మరి దీన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి కల్యాణ్ రాణ్ కొత్త సినిమా) View this post on Instagram A post shared by Vishal (@actorvishalofficial) -
హీరోయిన్తో కమల్ ముద్దు సీన్.. ఏజ్ గ్యాప్పై విమర్శలు
కోలీవుడ్ స్టార్ హీరో హీరో కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. సోషల్మీడియాలో ట్రైలర్పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ గ్యాంగ్స్టర్ డ్రామా చిత్రంలో శింబు, త్రిషా కృష్ణన్, ఐశ్వర్యా లక్ష్మీ, జోజూ జార్జ్, అభిరామి ఇతర కీలక పాత్రల్లో నటించారు. కమల్హాసన్, ఆర్. మహేంద్రన్, మణిరత్నం, శివ అన్నాత్తే, ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. కమల్హాసన్ ‘విక్రమ్’, శివ కార్తికేయన్ ‘అమరన్’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఎన్. సుధాకర్రెడ్డి, ఈ ‘థగ్ లైఫ్’ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్పై తెలుగులో విడుదల చేస్తున్నారు.ముద్దు సీనుతో వైరల్‘థగ్ లైఫ్’ ట్రైలర్లో కమల్ హాసన్(70), అభిరామి (41) మధ్య లిప్లాక్ సీన్ కనిపిస్తుంది. వారిద్దరి మధ్య వయసు 30ఏళ్లు గ్యాప్ ఉంది. దీంతో కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఆపై త్రిషతో కమల్ చెప్పిన డైలాగ్ కూడా చాలా బోల్డ్గా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. కమల్కు భార్యగా అభిరామి నటించింది. ఇద్దరి మద్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండటం ఆపై రొమాంటిక్ సీన్ తెరకెక్కించడంతో ట్రైలర్పై మిశ్రమ స్పందన వస్తుంది.అయితే, కమల్ అభిమానులు కూడా వాటిని తిప్పికొడుతున్నారు. మొత్తం ట్రైలర్లో కేవలం ముద్దు సన్నివేశాలు,సన్నిహిత సన్నివేశాలను తీసుకొని వాటిపై దృష్టి పెట్టడం కరెక్ట్ కాదన్నారు. సినిమాల్లో ఇవన్నీ చాలా కామన్గానే ఉంటాయి. వాటిపైన దృష్టి పెట్టడం మానేయండి అంటూ చెప్పుకొస్తున్నారు. మరొక నెటిజన్ ఇలా వ్రాశాడు.., తన వయసులో దాదాపు సగం వయసున్న హీరోయిన్లతో అలాంటి సన్నివేశాలు చేయడం సాధారణ విషయం కాదని, వాటిని ఎలా సమర్ధిస్తారని కౌంటర్ ఇస్తున్నారు.అభిరామి ఎవరు..?కేరళకు చెందిన అభిరామి తెలుగులో 'చెప్పవే చిరుగాలి'(2004) సినిమాలో నటించింది. ఆ తర్వాత అమర్ అక్బర్ ఆంటోని, మహారాజ, సరిపోదా శనివారం, భలే ఉన్నాడే, వెట్టైయన్ వంటి సినిమాల్లో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు సినిమా తర్వాత 2004లో ఉన్నత చదువులకు అమెరికాకు వెళ్లిన ఆమె 2013లో తిరిగి వచ్చింది. 'విశ్వరూపం', 'విశ్వరూపం 2' సినిమాలలో హీరోయిన్ పూజా కుమార్కు తమిళ వెర్షన్లో డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడు మళ్లీ కమల్ సరసన అభిరామి ఛాన్స్ కొట్టేసింది. -
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన స్టార్ హీరో కూతురు
ప్రముఖ కన్నడ హీరో, దివంగత పునీత్ రాజ్కుమార్ కూతురు ధృతి అమెరికాలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె పెదనాన్న శివరాజ్ కుమార్ తన సోషల్మీడియా ద్వారా తెలిపారు. 2021లో చదువుకునేందుకు అమెరికాకు ధృతి వెళ్లింది. అత్యున్నతమైన మార్కులతో తన ఫ్యాషన్ డిజైనర్ కోర్సును ఆమె పూర్తి చేసిన ఆమె పట్టభద్రురాలైంది.ధృతి గురించి శివరాజ్ కుమార్ ఇలా చెప్పారు. 'హాయ్ టోటో (ముద్దుపేరు), నీకు అభినందనలు! ఈ రోజు మన కుటుంబానికి చాలా ప్రత్యేకమైనది, మనందరికీ చాలా గర్వకారణమైనది కూడా.. మీ నాన్నతో పాటు నన్ను కూడా చాలా గర్వపడేలా చేశావు. మీతో చాలా మంచి జ్ఞాపకాలు నా కళ్లముందు ఉన్నాయి. నువ్వు నవ్వినప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు, అప్పు(పునీత్ రాజ్కుమార్) వచ్చినట్లు ఉంటుంది. నువ్వు మీ నాన్నలాగే ఉన్నావు. అందుకే మా ప్రియమైన అప్పుకు మరోసారి అభినందనలు.' అని ఆయన అన్నారు. ధృతి తండ్రి పునీత్ రాజ్కుమార్ 2021లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.దింగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కుమార్తె ధృతి అమెరికాలోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి ఫ్యాషన్ డిజైనర్గా పట్టభద్రురాలైంది. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ డిజైన్ స్కూల్గా ఆ యూనివర్శిటికి గుర్తింపు ఉంది. 1896లో విలియం మెరిట్ చేజ్ స్థాపించిన ఈ కాలేజీ 1941లో ఫ్రాంక్ అల్వా పార్సన్స్గా పేరు మార్చబడింది. ఈ సంస్ధ ఐదు విభాగాలలో మాస్టర్స్, బ్యాచిలర్ డిగ్రీలను అందిస్తుంది. ఆర్ట్, కమ్యూనికేషన్ డిజైన్, ఫోటోగ్రఫీ, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్లలో శిక్షణ ఇస్తుంది. ఫ్యాషన్ డిజైన్ రంగంలో పేరుగాంచిన మార్క్ జాకబ్స్, డోనా కరణ్ వంటివారు ఇక్కడే విద్యను అభ్యసించారు.Hi ಟೋಟೊ, Congratulations! ಈ ದಿನ ಬಹಳ ವಿಶೇಷವಾದ ದಿನ, ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಬಹಳ ಹೆಮ್ಮೆಯ ದಿನ. You made me and dodappa very proud. Lots of good memories with ಅಪ್ಪು, ಅಶ್ವಿನಿ, you and ನುಕ್ಕಿ. ನೀನು ನಗುವಾಗ, ನಡೆಯುವಾಗ ಅಪ್ಪು ಬಂದಂತೆ, ನಿನ್ನಲಿಯೇ ಅಪ್ಪು. ನಮ್ಮೆಲ್ಲರ ಪ್ರೀತಿಯ ಅಪ್ಪುಗೆ. Congratulations once… pic.twitter.com/JZOw2mkZXW— DrShivaRajkumar (@NimmaShivanna) May 17, 2025 -
ఇది పనికిమాలిన చర్య.. మరోసారి చేయకండి: సూరి
తమిళ నటుడు సూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మామన్. నటి ఐశ్వర్య లక్ష్మి నాయకిగా నటించిన ఈ చిత్రం తాజాగా తమిళ్లో విడుదలైంది. మేనమామ, మేనల్లుడు అనుబంధం ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్ఫుల్గా ప్రదర్శింపబడుతోంది. ఇదిలా ఉంటే మామన్ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ సూరి అభిమానులు దేవాలయాల్లో పూజలు, అర్చనలు చేయిస్తున్నారు. అలా తిరుప్పాంగుడ్రంలో కుమారస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన సూరి అభిమానులు కొందరు మామన్ చిత్రం విజయం సాధించాలని మొక్కుకుని నేలపై భోజనం చేశారు. ఆపై వారు వందల సంఖ్యలో కొబ్బరికాయలు కొట్టారు. సినిమా కటౌట్లకు పాలతో అభిషేకం చేశారు. టపాసులు పేలుస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగించారు. ఈ విషయం తెలుకున్న సూరి తన అభిమానులపై ఫైర్ అయ్యారు. కథ, కథనం బాగుంటే సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్నారు. సినిమా చూసి కాస్త ప్రేమ చూపుతే చాలన్నారు. అంతే కానీ నేలపై భోజనం చేయడం పనికిమాలిన చర్య అని, సినిమా విడుదల సమయంలో ఇలా వృధాగా ఖర్చు చేయడం చాలా వేదన కలిగిస్తోందని అన్నారు. ఆ డబ్బుతో నలుగురికి భోజనం పెట్టించవచ్చని, నీళ్లు, మజ్జిగ వంటివి ఇచ్చి దాహం తీర్చవచ్చని అన్నారు. ఇలాంటి చెత్త పనులు చేసే వారు తన అభిమానులని చెప్పుకునే అర్హతే లేదని పేర్కొన్నారు. సూరి అభిప్రాయాన్ని ప్రముఖ గీత రచయిత వైరముత్తు ప్రశంసించారు. అభిమానుల అనైతిక చర్యలను ప్రతి నటుడు ఖండించాలని, తమ అభిమానులకు హిత వ్యాఖ్యలు చేయాలన్నారు. అప్పుడే సంస్కృతి సంప్రదాయాలు ఇంకా మెరుగు పడతాయనే అభిప్రాయాన్ని వైరముత్తు వ్యక్తం చేశారు. ( వీడియో సన్ న్యూస్ సౌజన్యంతో) -
తొలిసారి ఖాకీ డ్రెస్లో కనిపించనున్న నయనతార
సౌత్ ఇండియా స్టార్ నటి నయనతార మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయ్యింది. ఆ మధ్య హిందీలో షారుక్ఖాన్కు జంటగా నటించిన జవాన్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అయితే తమిళంలో ఈమె ఇటీవల నటించినా ఏ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అంతేకాదు నయనతారను ప్రేక్షకులు తెరపై చూసి చాలా కాలమే అయ్యింది. ఆ మధ్య ఉమన్స్ సెంట్రిక్ కథా పాత్రలో నటించినా అన్నపూరిణి చిత్రం, ఇటీవల మాధవన్, సిద్ధార్థ్తో కలిసి నటించిన టెస్ట్ చిత్రాలు ఓటీటీకే పరిమితం అయ్యాయి. అవి కూడా పూర్తిగా నిరాశ పరిచాయి. దీంతో ఆమెను వెండి తెరపై చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈమె చేతిలో ప్రస్తుతం అర డజన్కు పైగా చిత్రాలు ఉన్నా, ఇప్పట్లో ఏదీ తెరపైకి వచ్చేలా కనిపించడం లేదు. కాగా ప్రస్తుతం నయనతార నటిస్తున్న చిత్రాల్లో మూక్కుత్తి అమ్మన్ 2 (అమ్మోరు2) ఒకటి. సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు సుందర్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్నా రు. ఇది రూ.100 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రం అని సమాచారం. కాగా ఇంతకు ముందు మూక్కుత్తి అమ్మన్ చిత్రంలో నయనతార దేవతగా నటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దానికి సీక్వెల్గా రూపొందుతున్న మూక్కుత్తి అమ్మన్2 చిత్రంలో నయనతార ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. అందులో ఒకటి దేవత పాత్ర కాగా, మరొకటి పోలీస్ అధికారి పాత్ర అని తెలిసింది. దీంతో ఈమె తొలిసారిగా ఖాకీ డ్రెస్లో కనిపించబోతున్నారన్నమాట. ఇంతకుముందు హిందీ చిత్రం జవాన్లో పోలీస్ అధికారిగా నటించిన అందులో ఖాకీ దుస్తులు ధరించలేదు. అలాగే నయనతార ద్విపాత్రాభినయం చేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఐరా చిత్రంలో ద్విపాత్రాభియం చేశారు. కాగా మూక్కుత్తి అమ్మన్ 2 చిత్రంలో నయనతారతో పాటు ఇండియా యోగిబాబు సింగం పులి కన్నడ నటుడు దునియా విజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రంలో గ్రాఫిక్స్ సన్నివేశాలు మరో హైలెట్గా ఉంటాయని సమాచారం. -
జయం రవిని ఎప్పుడూ అల్లుడిలా చూడలేదు.. సీన్ లోకి ఎంటరైన అత్త
తమిళ హీరో జయం రవి విడాకుల పంచాయతీ రోజుకో టర్న్ తీసుకుంటోంది. ఇతడు గతేడాది తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత అంతా సైలెంట్. కానీ రీసెంట్ గా ఓ నిర్మాత కూతురి పెళ్లిలో సింగర్ కెనీషాతో ఈ హీరో కనిపించాడు. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారనే రూమర్స్ వచ్చాయి.(ఇదీ చదవండి: కమల్ హాసన్ 'థగ్ లైఫ్' ట్రైలర్ రిలీజ్) జయం రవి.. మరో అమ్మాయితో కనిపించేసరికి మాజీ భార్య ఆర్తికి ఎక్కడో మండింది. దీంతో తన భర్తకు అసలు బాధ్యత లేదని, పిల్లల్ని పట్టించుకోవట్లేదని పెద్ద పోస్ట్ పెట్టింది. దీని తర్వాత కెనీషా కూడా పరోక్షంగా ఆర్తిని కౌంటర్ చేస్తూ పోస్టులు పెట్టింది. ఇదే విషయమై స్పందించిన జయం రవి.. కెనీషా, ఆర్తి గురించి క్లారిటీ ఇచ్చేశాడు.ఇప్పుడు ఈ విడాకుల పంచాయతీలోకి జయం రవి అత్త, ఆర్తి తల్లి సుజాత విజయ్ కుమార్ ఎంటరైంది. తన అల్లుడు చాలా అబద్ధాలు మాట్లాడుతున్నాడని సంచలన ఆరోపణలు చేసింది. ఇతడితో సినిమాలు నిర్మించేందుకు ఏకంగా రూ.100 కోట్ల అప్పులు చేశానని చెప్పి షాకిచ్చింది.'జయం రవి ఎన్నో అబద్ధాలు చెబుతున్నారు. అందుకే నేను మాట్లాడాల్సి వస్తోంది. తను ఎంకరేజ్ చేయడం వల్లే నేను నిర్మాతగా మారాను. ఇతడు హీరోగా.. అడంగ మరు, భూమి, సైరన్ సినిమాల్ని నిర్మించాను. ఈ మూవీస్ కోసం రూ.100 కోట్లు అప్పుగా తెచ్చా. ఇందులో 25 శాతం రెమ్యునరేషన్ గా తనకే ఇచ్చాను. ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి'(ఇదీ చదవండి: 'చుట్టమల్లే' సాంగ్.. నాకు గుర్తింపు దక్కలేదు: కొరియోగ్రాఫర్) 'జయం రవిని నేను ఎప్పుడూ అల్లుడిలా చూడలేదు. కొడుకుగా భావించాను. అతడు ఎప్పుడూ బాధపడకూడదని అనుకున్నాను. అప్పుల వల్ల ప్రశాంతత లేని జీవితాన్ని గడిపాను. వడ్డీలు కట్టుకునేదాన్ని. ఈ క్రమంలోనే సాయం చేస్తానని మాటిచ్చాడు కానీ చేయలేదు''సానుభూతి పొందడం కోసం జయం రవి ఇప్పుడు చేసే ఆరోపణలు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. హీరో అనే భావన పోతోంది. అతడు ఎప్పుడూ ఓ హీరోగానే ఉండాలని కోరుకుంటున్నాను' అని సుజాత విజయ్ కుమార్ చెప్పుకొచ్చింది. మరి ఈ విషయంలో నెక్స్ట్ ఎవరి నుంచి రెస్పాన్స్ వస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
'సీతారామం' నటి కారులో భారీ చోరీ
'సీతారామం' సినిమాలో నటించిన రుక్మిణి విజయ్ కుమార్ కారులో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ.23 లక్షలు విలువైన వస్తువుల్ని దొంగిలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు.. అసలేం జరిగిందో కనుక్కొని డ్రైవర్ ముహమ్మద్ మస్తాన్ ని అదుపులోకి తీసుకున్నారు.ఇంతకీ ఏమైంది?ఈ నెల 11న మార్నింగ్ వాకింగ్ కోసం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంకి రుక్మిణి వెళ్లింది. ఓ గేట్ దగ్గర తన కారు పార్క్ చేసి లోపలికి వెళ్లిపోయింది. ఈ హడావుడిలో తన కారు లాక్ చేసుకోవడం మర్చిపోయింది. అదే కారులో ఖరీదైన హ్యండ్ బ్యాగ్స్, పర్స్, రెండు వజ్రపు ఉంగరాలు, రోలెక్స్ వాచ్ తదితర విలువైన వస్తువులు ఉన్నాయి.(ఇదీ చదవండి: రక్తం పంచుకుని పుట్టినోళ్లే నా పతనాన్ని.. ప్రభాస్ మాత్రం: మంచు విష్ణు)రుక్మిణి కారుకి లాక్ వేయని విషయాన్ని గమనించిన ట్యాక్సీ డ్రైవర్ మస్తాన్.. కారులోని రూ.23 లక్షలు విలువ చేసే వస్తువుల్ని దొంగిలించాడు. దీంతో నటి రుక్మిణి.. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. నిందితుడు మస్తాన్ ని అరెస్ట్ చేసి, దొంగిలించిన వాటిని స్వాధీనం చేసుకున్నారు.స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన రుక్మిణి.. తొలుత కొరియోగ్రాఫర్ గా కెరీర్ ఆరంభించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. 'సీతారామం'లో హీరోయిన్ ఫ్రెండ్ రేఖ పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.(ఇదీ చదవండి: 'చుట్టమల్లే' సాంగ్.. నాకు గుర్తింపు దక్కలేదు: కొరియోగ్రాఫర్) -
సినిమాలు, రేసింగ్.. హీరో అజిత్ కీలక నిర్ణయం!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్(Ajith)కి రేసింగ్ అంటే ఎంత ఇష్టం అందరికి తెలిసిందే. రేజింగ్లో పాల్గొని ఇప్పటికే పలుమార్లు ప్రమాదానికి గురైనా కూడా ఆయన దాన్ని వదలడం లేదు. సినిమాల కంటే రేసింగే ఎక్కువ ఇష్టమని గతంలో చాలా సార్లు చెప్పారు. అంతేకాదు తాను యాక్సిడెంటల్ హీరో అని కూడా చెప్పుకుంటారు. ఒకనొక దశలో సినిమాలకు గుడ్బై చెప్పి పూర్తిస్థాయిలో రేసింగ్పై ఫోకస్ పెట్టబోతున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. తాజాగా దీనిపై అజిత్ క్లారిటీ ఇచ్చాడు. సినిమాలు చేస్తూనే రేసింగ్లో పాల్గొంటానని, ఒకటి చేసేటప్పుడు మరోకదానికి బ్రేక్ ఇస్తానని చెప్పుకొచ్చాడు.‘రేసింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో పాల్గొనాలంటే చాలా ఫిట్గా ఉండాలి. సినిమాలు చేస్తూ రేసింగ్లో పాల్గొనడం చాలా కష్టమైన పని. కార్ల రేస్పై దృష్టిపెట్టినప్పుడు ముందు శారీరకంగా మారాలి. అందుకే సైక్లింగ్, స్విమ్మింగ్తో పాటు డైట్ ఫాలో అవుతా. గత ఎనిమిది నెలల్లో దాదాపు 42 కిలోల బరువు తగ్గాను. ఇలాంటి సమయంలో మళ్లీ సినిమాలు చేస్తే దానికి పూర్తి న్యాయం చేయలేకపోతున్నాను. అందుకే ఓ నిర్ణయం తీసుకున్నాను. ఇకపై రేసింగ్ సీజన్ ఉన్నప్పుడు సినిమాలకు కాస్త దూరంగా ఉంటా’అని ఆయన అన్నారు. ఇక రేసింగ్ సమయంలో ఆయనకు జరిగిన ప్రమాదాల గురించి మాట్లాడుతూ.. ‘సినిమాల్లో స్టంట్స్ చేసేటప్పుడు నాకు చాలా దెబ్బలు తగిలాయి.ఎన్నో సర్జరీలు జరిగాయి. అలా అని యాక్షన్ సినిమాలు వదిలేయలేం కదా? అదే విధంగా ప్రమాదాలు జరిగాయని రేసింగ్కు దూరం కాలేను. నా దృష్టిలో రెండు ఒక్కటే’ అన్నారు.ఇక సినిమాల విషయాలకొస్తే.. ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు అజిత్. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.త్వరలోనే తన 64వ సినిమా ప్రారంభం కాబోతుంది. దర్శకుడు ఎవరనేది ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ధనుష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్లో షూటింగ్ ప్రారంభం కానుంది. -
కేరళలో 'అల్లు అర్జున్'ను స్టార్గా చేసిన ఖాదర్ ఎవరో తెలుసా?
అల్లు అర్జున్కు మలయాళంలో కూడా భారీగా అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. అక్కడ మన బన్నీకి అంతలా గుర్తింపు రావడం వెనుక ఒక నిర్మాత ఉన్నారని మీకు తెలుసా..? ‘ఆర్య’ సినిమా తర్వాత అల్లు అర్జున్కు మలయాళంలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. మలయాళీలు ఆయన్ను మల్లు అర్జున్ అరి ముద్దుగా పిలుచుకుంటారు. టాలీవుడ్లో ఆయన సినిమాలు ఎంతలా అలరిస్తాయో.. అందుకు ఏమాత్రం తగ్గకుండా.. కేరళలోనూ ఆడుతుంటాయి. పుష్ప విడుదల సమయంలో అక్కడ ఏ సినిమా కూడా పోటీకి దిగలేదు అంతలా స్టార్డమ్ క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. అయితే, మలయాళీ గడ్డమీద మన బన్నీ అడుగులు ఎలా పడ్డాయో తెలుసా.అల్లు అర్జున్ను మలయాళ ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయాణం గురించి నిర్మాత ఖాదర్ హసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, వ్యూహాలతో పాటు కేరళలో అల్లు అర్జున్కు వచ్చిన ప్రజాదరణ గురించి ఆయన మాట్లాడారు. నేను పేరుకే నిర్మాతను. కానీ, నాకు దర్శకత్వం చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే అన్ని భాషల సినిమాలను చూస్తుంటాను. అలా 2002లో జెమిని టీవీలో 'నువ్వే నువ్వే' సినిమా చూశాను. అందులో 'ఐ యామ్ వెరీ సారీ' పాట నా దృష్టిని ఆకర్షించింది. వెంటనే ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ కేరళలో విడుదల చేయాలని హైదరాబాద్ వచ్చేశాను. నిర్మాత రవి కిషోర్ను కలిసి డబ్బింగ హక్కులను పొందాను. మలయాళంలో 'ప్రణయమయి' పేరుతో విడుదల చేశాను. అయితే, సినిమాకు పెద్దగా డబ్బులు రాలేదు. కానీ, మంచి పేరు వచ్చింది. అలా మొదటిసారి డబ్బింగ్ సినిమాలపై నా అడుగులు పడ్డాయి.'ప్రణయమయి' సినిమా తర్వాత మరోక ప్రాజెక్ట్ను కేరళలో విడుదల చేయాలని నిర్మాత ఖాదర్ హసన్ అనుకుంటున్న సమయంలో ఆర్య పాటలు ఆయన చెవున పడ్డాయి. 'ఆర్య సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ తప్పకుండా కేరళలో స్థానం దక్కించుకుంటాడని నాకు అనిపించింది. 2004లో మళ్లీ హైదరాబాద్ వెళ్లి దిల్రాజును కలిశాను. ఆర్య డబ్బింగ హక్కులు కావాలని అడిగాను. మొదట్లో ఆయన ఒప్పుకోలేదు. చాలాకష్టపడి ఆయన్ను ఒప్పించి కేరళలో ఆర్య సినిమాను విడుదల చేశాను. అప్పటికి తెలుగు సినిమాలకు ఇక్కడ పెద్దగా మార్కెట్ లేదు. డబ్బింగ్ సినిమాలు అంటేనే చిన్నచూపు చూసేవారు. దానిని నేను ఎలాగైనా సరే మార్చాలని అనుకున్నాను. మలయాళీలకు తగ్గట్టుగా ఆర్య కోసం మంచి సంభాషణలు రాయించాను. మిక్సింగ్, ఇతర సాంకేతిక అంశాలను చెన్నైలోని భరణి వంటి ప్రఖ్యాత స్టూడియోలలో చేపించాను. ఆర్య పాటలను ప్రముఖ మలయాళ గాయకులు పాడారు. ఈ సినిమా కోసం నేను వ్యక్తిగతంగా చాలా రిష్క్ చేశాను. అప్పటికీ నేను అల్లు అర్జున్ను కనీసం కలవలేదు' అని అన్నారు.ఆర్య విజయం కోసం..ఆర్య సినిమా బాగుంది. కానీ, మలయాళీలకు పరిచయం చేయాలని తాను చాలా కష్టపడ్డానని నిర్మాత ఖాదర్ హసన్ అన్నారు. 'ఈ సినిమా పాటలు, ట్రైలర్లను విస్తృతంగా ప్రసారం చేయడానికి మేము ఆసియానెట్ కేబుల్ వారితో కనెక్ట్ అయ్యాం. లోకల్ కేబుల్ టీవీ నెట్వర్క్లను కూడా సంప్రదించాము. ఆపై సినిమా చూడటానికి విద్యార్థులను ఆహ్వానిస్తూ కళాశాలల్లోని యూనియన్లను సంప్రదించాం. అల్లు అర్జున్ స్టిక్కర్స్ను పంపిణీ చేశాం. పిల్లలకు అవి బాగా నచ్చాయి. బన్నీ మాస్క్లను కూడా ఉచితంగానే ఇచ్చాం. వాటితో పాటు మేము 3డి ఫ్యాన్ కార్డ్ను విడుదల చేశాం. ఇలా ఎన్నో ఆర్య సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశాం' అని ఆయన అన్నారు.ఆర్యతో అనుకున్నది చేశాను: ఖాదర్ఆర్య విడుదల తర్వాత తాము అనుకున్నది సాధించామని ఖాదర్ హసన్ అన్నారు. ఎవరూ ఊహించలేనంతగా తమకు లాభాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని చోట్లు ఈ చిత్రం వందరోజులు కూడా రన్ అయినట్లు పేర్కొన్నారు. ఈ మూవీ తర్వాత తాము బన్నీ, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య2 ఇలా దాదాపు అన్ని సినిమాలు మలయాళంలో విడుదల చేశామన్నారు. ఆర్య విజయం తర్వాత కేరళ ప్రజలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఆ సమయంలో ఆయన మాట్లాడిన మాటలు మలయాళీలకు బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే ఇప్పటికీ ఆయనంటే అభిమానం చూపుతారు. 'ఈ ప్రయాణంలో, కేరళలో తన ఉనికిని స్థాపించడానికి నేను చేసిన ప్రయత్నాలకు అల్లు కృతజ్ఞతతో ఉన్నాడు. ఆయన మద్దతు మాపై ఎప్పటికీ ఉంటుంది. మలయాళీ ప్రజల పట్ల అల్లు అర్జున్ ఎప్పటికీ కృతజ్ఞతతోనే ఉంటాడు. ఇలా పరస్పర గౌరవం, అవగాహన వల్లే బన్నీతో వృత్తిపరమైన సంబంధాన్ని బలోపేతం చేసింది. నన్ను ఒక స్నేహితుడిగానే మల్లు అర్జున్ చూస్తాడు' అని ఖాదర్ అన్నారు. -
థగ్ లైఫ్ ట్రైలర్ రెడీ
హీరో కమల్హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ గ్యాంగ్స్టర్ డ్రామా చిత్రంలో శింబు, త్రిషా కృష్ణన్, ఐశ్వర్యా లక్ష్మీ, జోజూ జార్జ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. కమల్హాసన్, ఆర్. మహేంద్రన్, మణిరత్నం, శివ అన్నాత్తే, ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. కమల్హాసన్ ‘విక్రమ్’, శివ కార్తికేయన్ ‘అమరన్’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఎన్. సుధాకర్రెడ్డి, ఈ ‘థగ్ లైఫ్’ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్పై తెలుగులో విడుదల చేస్తున్నారు.కాగా ఈ సినిమా ప్రమోషనల్ ప్లాన్ను విడుదల చేశారు మేకర్స్. ఈ నెల 17న ట్రైలర్ను ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు. అలాగే ఈ నెల 24న హైదరాబాద్లో గ్రాండ్గా ఆడియో లాంచ్, 29న విశాఖపట్నంలో తెలుగు వెర్షన్ ప్రీ–రిలీజ్ ఈవెంట్ను నిర్వహించనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ రెండు ప్రమోషనల్ ఈవెంట్స్కు ముందు చెన్నైలోని సాయిరామ్ కాలేజీలో ఈ చిత్రం సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్తో, ‘థగ్ లైఫ్’ ఆడియో లాంచ్ ఈవెంట్ జరపనున్నట్లు మేకర్స్ తెలిపారు.అలాగే పాన్ ఇండియా స్థాయిలో ‘థగ్ లైఫ్’ సినిమా ప్రమోషన్స్ను నిర్వహించనున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. ఇదిలా ఉంటే... ‘నాయగన్’ (తెలుగులో ‘నాయకుడు’) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో కమల్హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో దాదాపు 38 సంవత్సరాల తర్వాత రానున్న ‘థగ్ లైఫ్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. -
'పంజరం నుంచి బయటపడ్డా'.., భార్య ఆర్తికి జయం రవి కౌంటర్
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే తన భార్య ఆర్తితో ఆయన విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి విడాకుల పంచాయితీ కోర్టులో ఉంది. అయితే జయం రవి కుటుంబానికి దూరంగా సింగిల్గానే ఉంటున్నారు. ఇటీవల ఓ పెళ్లి వేడుకలో జయం రవి సందడి చేశారు. అదే పెళ్లికి ఆయన గర్ల్ ఫ్రెండ్గా భావిస్తోన్న సింగర్ కెన్నీషా కూడా హాజరైంది. దీంతో మరోసారి వీరిద్దరి పంచాయతీ హాట్టాపిక్గా మారింది. ఇది చూసిన జయం రవి భార్య ఓ రేంజ్లో విమర్శలు చేసింది. తనని ఇంటి నుంచి బయటకు గెంటేశాడని.. పిల్లల్ని పట్టించుకోనివాడు అసలు తండ్రేనా అంటూ చాలా పెద్ద నోట్ రిలీజ్ చేసింది. దీనిపై తాజాగా నటుడు జయం రవి స్పందించారు. దీనిపై దాదాపు నాలుగు పేజీల లేఖ రిలీజ్ చేశాడు. భార్య ఆర్తిని వేధించానన్న ఆరోపణలను ఖండిస్తూ ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై మౌనంగా ఉండడం తన మనుగడ కోసం ఒక వ్యూహమని పేర్కొన్నాడు.రవి తన లేఖలో రాస్తూ.. "నా గత వివాహ బంధాన్ని వ్యక్తిగత లాభం కోసం, కీర్తి కోసం సానుభూతిగా మార్చుకోవడాన్ని నేను అనుమతించను. ఇదేం ఆట కాదు.. నా జీవితం. నేను చట్టపరమైన ప్రక్రియకు పూర్తిగా కట్టుబడి ఉన్నా. సరైన సమయంలో సత్యం గెలుస్తుందని నమ్ముతున్నా. ఈ విషయంలో నేను గౌరవంగా ముందుకు వెళ్తా. ఆర్తితో ఉన్నప్పుడు పంజరంలో ఉన్నట్లు అనిపించింది. చివరకు బయటకు వెళ్లడానికి నిర్ణయించుకున్నా. నేను శారీరక, మానసిక, భావోద్వేగ, ఆర్థిక వేధింపుల నుంచి బయటపడ్డాను. గతంలో నా తల్లిదండ్రులను కూడా కలవలేకపోయా. అయినప్పటికీ నా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించా. కానీ చివరికీ దూరంగా వెళ్లాలనేది తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు. చాలా బరువైన హృదయంతోనే ఇది రాస్తున్నా" అని ప్రస్తావించారు.(ఇది చదవండి: కుట్ర చేసి నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు.. స్టార్ హీరో భార్య సంచలన పోస్ట్)జయం రవి లేఖలో రాస్తూ..' నన్ను స్పష్టంగా చెప్పనివ్వండి. ఇలాంటి కల్పిత వాదనలను నేను ఖండిస్తున్నా. నేను ఎప్పటిలాగే నా మాటపై నిలబడతా. నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకముంది. ఆర్తి తన పిల్లలను సానుభూతి కోసం ఉపయోగించుకుంటోంది. ఆర్థిక లాభం కోసం, ప్రజల నుంచి సానుభూతిని పొందడానికి నా పిల్లలను ఒక సాధనంగా ఉపయోగించుకోవడం చాలా బాధగా ఉంది. అయితే మేము విడిపోయినప్పటి నుంచి ఉద్దేశపూర్వకంగా పిల్లలకు నన్ను దూరం చేసింది. ఇన్నేళ్లు నన్ను వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు ఏకంగా ఛాతిలో కత్తితో పొడిచినందుకు సంతోషంగా ఉంది. నా నుంచి ఇదే మొదటిది.. చివరిదీ కూడా. ప్రేమతో జీవించండి.. జయం రవిని జీవించనివ్వండి' అని వివరించారు.కాగా.. జయం రవి గతేడాది సెప్టెంబర్ 9న తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఆర్తితో తన బంధానికి ముగింపు పలకనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే ఆ తర్వాత తన అనుమతి లేకుండా ఎలా ప్రకటిస్తారని ఆర్తి ఖండించింది. తాజాగా సింగర్ కెనిషాతో రవి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి చర్చ మొదలైంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం కోలీవుడ్లో మరోసారి హాట్టాపిక్గా మారింది. View this post on Instagram A post shared by Ravi Mohan (@iam_ravimohan) -
రోజుకు రూ.20 జీతానికి పనిచేశా.. హీరో ఎమోషనల్ వీడియో
వారసత్వంతో వచ్చి హీరోలు, నటులు అయినవాళ్ల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏముండదు. కానీ కొందరు యాక్టర్స్ మాత్రం ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక్కో సినిమా చేసుకుంటా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో తమిళ నటుడు సూరి ఒకడు. ఇప్పుడు తన కొత్త సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యాడు.1998లో తమిళ ఇండస్ట్రీలోకి వచ్చిన సూరి.. దాదాపు ఆరేళ్ల పాటు గుర్తింపు దక్కని చాలా పాత్రలు చేశాడు. 2004 నుంచి ఆడపాదడపా పాత్రలు వచ్చాయి. అలా కమెడియన్ గా స్టార్ హీరోలందరితో చాలా సినిమాలు చేశాడు. 2022 వరకు అంటే దాదాపు 18 ఏళ్ల పాటు కామెడీ పాత్రలు చేశాడు. (ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు) అందరూ సూరిలో కమెడియన్ ని చూస్తే తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ మాత్రం అద్భుతమైన నటుడిని చూశాడు. అలా 'విడుదల పార్ట్ 1' మూవీతో సూరిని హీరోగా లాంచ్ చేశాడు. తర్వాత గరుడన్, కొట్టుక్కళి, విడుదల పార్ట్ 2, బడవ సినిమాలతో సూరి ఆకట్టుకున్నాడు. 'మామన్' చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన తొలి పని-జీతం, దాని ద్వారా నేర్చుకున్న జీవిత పాఠాల్ని చెప్పుకొచ్చాడు.'తిరుప్పుర్ లో నేను రోజు కూలీగా రూ.20 జీతానికి పనిచేశాను. వారమంతా కష్టపడితే రూ.140 వచ్చేది. అందులో సగం ఖర్చు పెట్టి, మిగతాది ఇంటికి పంపేవాడిని. జీవిత పాఠాల్ని నేను అప్పుడే నేర్చుకున్నాను' అని సూరి చెప్పుకొచ్చాడు. అప్పుడు రూ.20 జీతానికి పనిచేసిన ఇతడు.. ఇప్పుడు కష్టపడి నటుడిగా ఎదిగి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.(ఇదీ చదవండి: సాహసం చేసిన టాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ.. వీడియో వైరల్) "I stated as a daily Wager in Tiruppur & my wages was ₹20 per day. Weekly I get ₹140, I will spend ₹70 & send back ₹70 to my home. I got to learn about the life lessons there🫶"Growth of #Soori🫡♥️pic.twitter.com/2PflFhYz4o— AmuthaBharathi (@CinemaWithAB) May 14, 2025 -
స్టార్ హీరో మరో డీ గ్లామరస్ పాత్ర.. ఎవరో గుర్తుపట్టారా?
ఒకప్పటిలా రొటీన్ కమర్షియల్ సినిమాలు అంటే అస్సలు సక్సెస్ కావట్లేదు. ఒకవేళ హిట్ అని డప్పుకొట్టినా సరే ప్రేక్షకులు నమ్మే స్థితిలో లేరు. దీంతో స్టార్ హీరోలు, యంగ్ హీరోలు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఆ రూట్ లో ఓ స్టార్ హీరో వెళ్తున్నట్లు అనిపిస్తుంది.(ఇదీ చదవండి: తిరుమల శ్రీవారికి అవమానం? వివాదంపై స్పందించిన హీరో) పైన ఫొటోలో శరత్ కుమార్ తో ఉన్నది సిద్ధార్థ్. అప్పుడెప్పుడో బొమ్మరిల్లు సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత సరైన హిట్స్ పడలేదు. తమిళంలోనూ చాన్నాళ్లుగా సినిమాలు చేస్తున్నాడు గానీ సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. కొన్నాళ్ల క్రితం చిన్నా అనే మూవీతో అటు నటుడిగా మంచి పేరు వచ్చింది.ఇప్పుడు మళ్లీ ఆ తరహాలోనే 3 BHK అనే మూవీ చేస్తున్నాడు. గతంలో చిన్నా చిత్రంలో కాస్త డీ గ్లామర్ గా కనిపించారు. ఇప్పుడు ఈ చిత్రంలోనూ అలానే కనిపించబోతున్నాడు. ఇందులో శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మిడిల్ క్లాస్ కథతో తెరకెక్కిన ఈ సినిమా జూలై 4న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. మరి ఈసారి కూడా సిద్ధార్థ్ హిట్ కొడతాడేమో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్.. తెలుగులో నేరుగా రిలీజ్) -
తిరుమల శ్రీవారికి అవమానం? వివాదంపై స్పందించిన హీరో
తమిళ కమెడియన్ కమ్ హీరో సంతానం ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాడు. ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'డీడీ నెక్స్ట్ లెవల్'. ఈ శుక్రవారం (మే 16)న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాలో శ్రీనివాస గోవింద పాటని పేరడీ చేయడంతో హిందు సంఘాలు భగ్గుమంటున్నాయి. తాజాగా ఈ వివాదంపై స్వయంగా హీరోనే స్పందించాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్.. తెలుగులో నేరుగా రిలీజ్) శ్రీనివాస గోవింద అంటూ సాగే పాట తెలియని వారుండరు. అయితే ఈ గీతాన్ని 'డీడీ నెక్స్ట్ లెవల్' సినిమా కోసం పేరడీ చేశారు. పార్కింగ్ డబ్బులు గోవిందా.. పాప్ కార్న్ ట్యాక్స్ గోవిందా అంటూ సినిమా పదాలతో పేరడీ చేశారు. దీనిపై తమిళనాడులోని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాటని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి.ఇప్పుడు ఈ వివాదంపై స్వయంగా సంతానం స్పందించాడు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. 'తిరుమల శ్రీవారిని మేం అవమానించలేదు. సెన్సార్ బోర్డ్ నిబంధనల మేరకు సినిమా తీశాం. రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి మాట్లాడుతారు. వాటిని సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు' అని అన్నాడు. ఇప్పటికే సినిమా పాటపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మరి ఈ విషయంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన అనసూయ.. ఇంటికి పేరు కూడా) -
ఐపీఎల్లో నాకిష్టమైన జట్టు ఇదే: మీనాక్షీ
పంజాబీ బ్యూటీ మీనాక్షీ చౌదరి బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పొచ్చు. ఈమె సినిమాలతో పాటు రీసెంట్గా వైద్య విద్యను పూర్తి చేశారు. అదే విధంగా సిమ్మింగ్, బాడ్మింటన్ క్రీడాకారిణి కూడా. అంత కంటే పలు అందాల పోటీల్లో పాల్గొని రన్నర్గా నిలిచారు. చివరికి నటిగా స్థిరపడింది. తొలుత నటిగా బాలీవుడ్లో రంగప్రవేశం చేసినా, ఆ తరువాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అలా 2020లో ఇచ్చట వాహనాలు నిలుపరాదు అనే చిత్రంలో నటించి గుర్తింపు పొందారు. అయితే హిట్ ది సెకండ్ కేస్ చిత్రం ఈ బ్యూటీకి తొలి విజయానందాన్నిచ్చింది. అంతే కోలీవుడ్ నుంచి కాలింగ్ వచ్చింది. అక్కడ విజయ్ ఆంటోనితో కలిసి కొలై చిత్రంలో నటించారు. అది ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, విజయ్కి జంటగా గోట్ చిత్రంలో నటించి బాగా పాపులర్ అయ్యారు. దుల్కర్ సల్మాన్కు జంటగా లక్కీభాస్కర్ చిత్రంలో నటించి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తెలుగులో సక్సెస్ బాటలో పయనిస్తున్నారు. తాజాగా ఈ అమ్మడి బాలీవుడ్ ఎంట్రీ షురూ అయ్యింది. ఇంతకు ముందు స్త్రీ, మిమీ తదితర హిట్ చిత్రాలను నిర్మించిన దినేశ్ విజయ్ తాజాగా నిర్మిస్తున్న చిత్రంలో మీనాక్షీ నాయకిగా నటించనున్నట్లు సమాచారం. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ భామ ఇటీవల ఒక భేటీలో ఐపీఎల్ జట్లుల్లో మీకు నచ్చిన జట్టు ఏదని మీడియా అడిగిన ప్రశ్నకు తనకు ఐపీఎల్ జట్టులో ప్రత్యేకంగా నచ్చిన జట్లు అంటూ ఏమీ లేవన్నారు. అయితే ఎంఎస్.ధోని అంటే తనకు చాలా ఇష్టమన్నారు. ఆయన ఏ జట్టులో ఉంటే ఆ జట్టే తనకు నచ్చుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ధోని అంటే ఇష్టం ఏర్పడిన తరువాతనే తాను క్రికెట్ క్రీడను చూడడం మొదలెట్టానని ఈ 33 ఏళ్ల సుందరి చెప్పుకొచ్చారు. -
తెలుగులో నా ఎంట్రీకి సరైన సినిమా ఇదే: డైరెక్టర్ కూతురు
‘‘నేను తమిళంలో చేసిన తొలి చిత్రం ‘విరుమన్’ని విజయ్ కనకమేడలగారు చూశారు. ఆ తర్వాత నాకు కాల్ చేసి, ‘భైరవం’ (bhairavam)సినిమా గురించి చెప్పారు. కథ నచ్చడంతో నేను ఈ ప్రాజెక్టులోకి వచ్చాను. తెలుగులో ఇది నా తొలి చిత్రం. టాలీవుడ్లో నా ఎంట్రీకి ‘భైరవం’ సరైన సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. మంచి సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రావడం సంతోషంగా ఉంది’’ అని అదితీ శంకర్ తెలిపారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా, అదితీ శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో పెన్ స్టూడియోస్పై జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది.ఈ సినిమా ద్వారా తెలుగుకి పరిచయమవుతున్న అదితీ శంకర్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘మా నాన్నగారితో(డైరెక్టర్ శంకర్) కలిసి హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్స్కి వచ్చేదాన్ని. ఇప్పుడు నా సినిమాకి ఇక్కడికి వచ్చి షూటింగ్ చేయడం చూస్తే నా కల నిజం అయిందనిపిస్తోంది. నాన్నగారి ఇమేజ్ని ఒక గౌరవంగానే భావిస్తాను తప్ప ఎప్పుడూ ఒత్తిడిగా తీసుకోను. ‘భైరవం’లో బోల్డ్ అండ్ హానెస్ట్తోపాటు బబ్లీగా ఉండే క్యారెక్టర్లో కనిపిస్తాను. సాయి శ్రీనివాస్, మనోజ్, రోహిత్గార్లకు తమిళ్ మాట్లాడడం వస్తుంది. అందుకే ఈ ప్రయాణం చాలా సౌకర్యంగా అనిపించింది.సెట్స్లో షూటింగ్ని చాలా ఎంజాయ్ చేశాను. రాధామోహన్గారు చాలా మంచి వ్యక్తి. ప్రతిరోజు సెట్స్కి వచ్చేవారు. విజయ్ కనకమేడలగారు క్లారిటీ విజన్ ఉన్న డైరెక్టర్. శ్రీ చరణ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాకు ఇష్టమైన తెలుగు చిత్రం ‘మగధీర’. నేను థియేటర్లో చూసిన తొలి తెలుగు సినిమా అది. అలా రాజమౌళి, రామ్ చరణ్గార్లకు నేను బిగ్ ఫ్యాన్గా మారిపోయాను. నాకు హిస్టారికల్, పీరియాడిక్ సినిమాలతోపాటు సవాల్తో కూడినపాత్రలు చేయాలని ఉంది’’ అని చెప్పారు. -
అందరివాడు మన సూర్యకుమార్
‘అందనివాడు.. అందరివాడు.. మన సూర్యకుమార్’ అంటున్నారు హీరో రామ్. ఈ సూర్యకుమార్ ఎవరో కాదు.. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర. రామ్ హీరోగా పి. మహేశ్బాబు దర్శకత్వంలో ఓ పీరియాడికల్ ఫిల్మ్ తెరకెక్కుతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ . మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సూర్యకుమార్పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నారని వెల్లడించి, ‘అందనివాడు.. అందరివాడు... మన సూర్యకుమార్’ అంటూ ఉపేంద్ర ఫస్ట్లుక్ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ నెల 15న ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ రానుంది. కాగా ఈ సినిమాకు ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే టైటిల్ అనుకుంటున్నారని, సూపర్స్టార్ సూర్యకుమార్పాత్రలో ఉపేంద్ర కనిపిస్తారని తెలిసింది. ఈ సినిమాకు వివేక్– మెర్విన్ ద్వయం సంగీతం అందిస్తున్నారు. -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. కాంతార నటుడు మృతి
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ బుల్లితెర నటుడు రాకేష్ పూజారి కన్నుమూశారు. కేవలం 34 ఏళ్ల వయసులోనే ఆయన మరణించారు. గుండె పోటు రావడంతోనే రాకేశ్ మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం దక్కలేదని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఉడిపిలో జరిగిన ఓ మెహందీ వేడుకలో ఈ విషాదం చోటు చేసుకుంది.కాగా.. కన్నడలో ప్రముఖ రియాలిటీ షో కామెడీ కిలాడిగలు ద్వారా ఫేమస్ అయ్యారు. ఈ షోలో సీజన్-3 విన్నర్గా రాకేశ్ నిలిచారు. మరోవైపు రాకేశ్ ప్రస్తుతం కాంతారాకు ప్రీక్వెల్గా వస్తోన్న కాంతారా చాప్టర్-1లో నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. రిషబ్ శెట్టి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రాకేశ్ మృతి పట్ల పలువురు కన్నడ సినీతారలు సంతాపం తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.Always with a pure sweet hearted smile , ever loving , and extremely talented artist , you will always remain in our heart , deeply saddened , Rakesh we miss you! pic.twitter.com/Qx9Tx0bOOT— Pruthvi Ambaar (@AmbarPruthvi) May 12, 2025 -
'టూరిస్ట్ ఫ్యామిలీ'లో లిటిల్ ఎమర్జింగ్ స్టార్ గురించి తెలుసా..?
కోలీవుడ్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సినిమా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. మే 1న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు సుమారు రూ. 45 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కొత్త దర్శకుడు అభిషాన్ జీవింత్ దర్శకత్వంలో శశికుమార్, సిమ్రన్ జంటగా నటించారు. అయితే, ఈ చిత్రంలో నటించిన బాలనటుడు కమలేష్ జగన్ను తమిళ ప్రేక్షకులు అభినందిస్తున్నారు. సినిమాలో ఈ బాలుడే ప్రధాన ఆకర్షణగా ఉన్నాడంటూ మెసేజ్లు పెడుతున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఎవరీ కమలేష్ అంటూ నెట్టింట వెతుకుతున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితమే ఈ చిత్రాన్ని చూసిన హీరో శివకార్తికేయన్ చిత్రబృందాన్ని నేరుగా పిలిపించి అభినందించారు. ప్రత్యేకంగా కమలేష్ను మెచ్చుకున్నారు. తాజాగా రజనీకాంత్ కూడా ఈ చిత్రం సూపర్ అంటూ తెలిపారు.‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రంలో శశికుమార్, సిమ్రన్ల కుమారుడి పాత్రలో కమలేష్ నటించాడు. ఇందులో విజయ్ దళపతి అభిమానిగా కనిపించి తన నటనతో కోలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు. వాస్తవంగా కమలేష్ నటుడు కాదు.. ఒక సింగర్. 'స రే గ మ ప లిల్ చాంప్స్ సీజన్ 2'లో మొదటిసారి తెరపై మెరిశాడు. ఆ రియాలిటీ షోకు అతిథిలుగా త్రిష కృష్ణన్, నయనతార, అమలా పాల్ హాజరయ్యారు. ఆ సమయంలోనే తన టాలెంట్ను చూసి వారు ఫిదా అయ్యారు. అలా వారి నుంచి ప్రశంసలు అందుకున్న తర్వాత కాస్త గుర్తింపు వచ్చింది. అలా కమలేష్కు జ్యోతిక సినిమాలో మొదటిసారి ఛాన్స్ దక్కింది.జ్యోతిక నటించిన తమిళ చిత్రం ‘రాచ్చసి’లో కమలేష్ నటించాడు. ఇందులో ఒక స్కూల్ టీచర్ పాత్రలో ఆమె నటించగా.. కమలేష్ స్టూడెంట్గా కనిపించాడు. ఈ మూవీ తర్వాత నయనతార, సమంత, విజయ్ సేతుపతి నటించిన 'కణ్మనీ రాంబో ఖతీజా' చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్నాడు. విజయ్ దళపతి కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి సినిమాలో కూడా కమలేష్ నటిస్తున్నాడు. ఆపై కాంచన 4లో కూడా ఛాన్స్ కొట్టేశాడు.'జ్యోతిక మేడం బిర్యానీ పెట్టారు'రాచ్చసి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన గురించి కమలేష్ ఇలా చెప్పాడు. ' నా పుట్టినరోజు నాడు జ్యోతిక మేడమ్ సెట్స్లోని అందరికీ బిర్యానీ తెప్పించారు. తన సొంత కొడుకు మాదిరి ఆమె నాపై చూపిన ప్రేమ చూసి ఆశ్చర్యపోయాను. ఈ క్రమంలోనే ఒకరోజు సూర్య సార్ కూడా సెట్స్కి వచ్చారు. అప్పుడు ప్రత్యేకించి నన్ను పిలిపించుకొని మాట్లాడారు. జ్యోతిక మేడమ్ ప్రతిరోజు ఇంట్లో నా గురించి చెబుతుందని అన్నారు. ఇంతకీ నువ్వు ఏం చేశావ్ అంటూ సరదా పట్టించారు.' అని గుర్తుచేసుకున్నాడు. -
ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా.. విడుదలపై నయనతార ప్రకటన
ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి( Krithi Shetty) జంటగా నటిస్తున్న చిత్రం 'ఎల్ఐకే' (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) విడుదలపై ప్రకటన వచ్చేసింది. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో వరుస హిట్లు అందకున్న ప్రదీప రంగనాథన్ ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేశాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర నిర్మాత నయనతార (Nayanthara) ప్రకటించింది. విఘ్నేష్ శివన్( Vignesh Shivan) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ దీనికి స్వరాలు అందిస్తున్నారు.భారీ బడ్జెట్తో టైమ్ ట్రావెల్ నేపథ్యంలో 'ఎల్ఐకే' చిత్రం తెరకెక్కింది. సెప్టెంబర్ 18న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు నయనతార అధికారికంగా ప్రకటించింది. తమిళ్తో పాటు, తెలుగు, కన్నడ, మలయాలంలో తెరకెక్కుతున్నట్లు తెలిపారు. ప్రేమ కోసం మొబైల్ గాడ్జెట్ను ఉపయోగించి 2035 వరకు టైమ్ ట్రావెల్ చేసే వ్యక్తి పాత్రలో ప్రదీప్ రంగనాథన్ కనిపించనున్నారు. ఇందులో ఎస్జే సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు. సినిమా బడ్జెట్ భారీగా ఉండటంతో ఐదుగురు కలిసి ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. వారిలో నయనతార ఒకరు కావడం విశేషం. జీవితానికి ఇన్సూరెన్స్ ఉంటుందని అందరికీ తెలుసు. కానీ, ప్రేమకి ఉండే ఇన్సూరెన్స్ గురించి ఈ చిత్రంలో తెలుసుకుంటారని గతంలో దర్శకుడు తెలిపాడు. భవిష్యత్తు నేపథ్యంలో రాసుకున్న కథ కాబట్టి ఖర్చుతో పాటు సమయం కూడా ఎక్కువే పడిందని ఆయన అన్నాడు. -
నటుడు విశాల్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన టీమ్
కోలీవుడ్ నటుడు విశాల్ మరోసారి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యంపై తన పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. తమిళనాడులోని విల్లుపురంలో ఆదివారం రాత్రి జరిగిన ఈవెంట్లో హీరో విశాల్ స్పృహ తప్పి పడిపోవడంపై వారు వివరణ ఇచ్చారు. మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోవడం వలనే విశాల్ అస్వస్థతకు గురయ్యారని వారు చెప్పారు. దీంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం విశాల్ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని, అభిమానులు ఎవరూ ఆందోళ చెందాల్సిన అవసరం లేదన్నారు.తమిళనాడు విల్లుపురంలో ఉండే కూవాగం గ్రామంలో ఉన్న ఆలయంలో కొద్దిరోజులుగా చిత్తిరై (తమిళమాసం) వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో విశాల్ అతిథిగా పాల్గొన్నారు. ఆదివారం నాడు మిస్ కువాగం ట్రాన్స్జెండర్ బ్యూటీ కాంటెస్ట్ను నిర్వాహుకులు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న విశాల్ కొద్దిసేపట్లోనే ఉన్నట్టుండి వేదికపై స్పృహ తప్పి పడిపోయారు. ఈ క్రమంలోనే ఆయన్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. -
అతని సాయం వల్లే నా కూతురి పెళ్లి చేశాను: స్టార్ డైరెక్టర్
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్( Anurag Kashyap) నటుడిగానూ వెండితెరపై మెప్పిస్తున్నాడు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో తనకు ఎంతో పెరు తెచ్చిన మహారాజ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికీ రాని పేరు మహారాజ( Maharaja) సినిమాతో వచ్చిందన్నాడు. విజయ్ సేతుపతి( Vijay Sethupathi) చెప్పడం వల్లే తనకు ఈ చిత్రంలో అవకాశం వచ్చిందని గుర్తుచేసుకున్నారు. మూవీ విడుదలైన తర్వాత తనకు అవకాశాలు పెరిగాయన్నారు. ఈ క్రమంలో భారీగా డబ్బు వచ్చిందని, దాంతోనే తన కూమార్తె పెళ్లి చేశానని ఆయన పేర్కొన్నారు.విజయ్ సేతుపతి గురించి అనురాగ్ కశ్యప్ ఇలా చెప్పారు. 'దక్షణాది నుంచి నాకు చాలా సినిమా ఆఫర్స్ వచ్చాయి. కానీ, నాకు యాక్టింగ్పై పెద్దగా ఆసక్తి లేదు. దీంతో వాటిని వదులుకున్నాను. అయితే, నేను డైరెక్ట్ చేసిని కెన్నెడీ చిత్రం పనుల్లో భాగంగా విజయ్ సేతుపతిని కలిశాను. ఆ మూవీ గురించి ఆయన ద్వారా కొన్ని సలహాలు తీసుకున్నాను. అలా మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే నా కుమార్తె పెళ్లి గురించి ఆయనతో చెబుతూ.. వివాహం కోసం కావాల్సినంత డబ్బులేదన్నాను. క్షణం ఆలస్యం లేకుండా సాయం చేస్తానని మాట ఇచ్చారు. అప్పుడే మా ఇద్దరి మధ్య మహారాజు సినిమా గురించి చర్చ వచ్చింది. అందులోని రోల్ కోసం గతంలోనే నన్ను సంప్రదించాలని అనుకున్నట్లు తెలిపారు. మొదట ఆ సినిమాలో నటించలేనని చెప్పాను. కానీ, విజయ్ సేతుపతి చెప్పడం వల్లే ఓకే అనేశాను. అలా వచ్చిన డబ్బుతోనే నా కూతురి పెళ్లి చేశాను. ఆ సమయంలో విజయ్ నాకెంతో సాయం చేశారు. మహారాజ తర్వాత నాకు చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. 2028 వరకు నా డేట్స్ ఖాళీగా లేవు. ఇదంతా విజయ్ సేతుపతి వల్లే అని' అనురాగ్ కశ్యప్ తెలిపారు.గతేడాదిలో విడుదలైన ‘మహారాజ’ చిత్రంలో నెగటివ్ పాత్రలో అనురాగ్ కశ్యప్ నటించారు. నిథిలన్ స్వామినాథన్ రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్.. రైఫిల్ చిత్రంతో పాటు డకాయిట్ సహా పలు సినిమాలు చేస్తున్నాడు. డైరెక్టర్గా ఆయన చేతిలో ఐదు సౌత్ చిత్రాలు ఉన్నాయి. అందుకే ఆయన రీసెంట్గా బాలీవుడ్ వదిలేసి పూర్తిగా ఇక్కడే స్థిరపడిపోయాడు. -
హార్ట్ బీట్ పెంచే వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ వెబ్ ప్రపంచంలో హార్ట్బీట్ సిరీస్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆస్పత్రి నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్లో కుటుంబ అంశాలు, ప్రేమ, ఒక తల్లి ప్రేమ కోసం యువతి పడే ఆరాటం కనిపిస్తుంది. సెంటిమెంట్, పదవి కోసం పోరాటం అంటూ పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ సిరీస్ను తెరకెక్కించారు. జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అయినా హార్ట్బీట్ వెబ్ సిరీస్కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో దీనికి కొనసాగింపుగా సీజన్–2 రూపొందించారు మేకర్స్. ఈ సిరీస్కు దీపక్ సుందర రాజన్ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. రెజిమల్ సూర్య థామస్ ఛాయాగ్రహణం, చరణ్ రాఘవన్ సంగీతాన్ని అందించారు. ఏ టెలీ ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ పతాకంపై రాజవేలు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు.ఈనెల 22 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. తెలుగు, తమిళం, హిందీలో భాషల్లో అందుబాటులో ఉండనుందని ప్రకటించాకరు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పాటను విడుదల చేశారు. కాగా.. ఈ సిరీస్లో దీపా బాలు, అనుమోన్, యోగలక్ష్మీ, శర్వ, శబరీశ్, చారుకేశ్, రామ్, చంద్రశేఖర్, గిరి ద్వారకేశ్, రేయ ముఖ్య పాత్రలు పోషించారు. వీరితోపాటు అక్షిత, శివం, అబ్దుల్, అమైయ, టీఎం కార్తీక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. The wait ends with a beat.. Save the date May 22 ❤️❤️🩺#HotstarSpecials Heart Beat Season 2 Streaming from May 22 only on JioHotstar#HotstarSpecials #HeartBeatSeason2 #HeartBeatS2 #HB2 #HB2ComingSoon #LubDubOnHotstar #HeartBeatS2OnHotstar #HeartBeatS2onJioHotstar… pic.twitter.com/cLIci1QpOb— JioHotstar Tamil (@JioHotstartam) May 10, 2025 -
నేనేం RRR లాంటి సినిమా తీయట్లేదుగా..: లోకేశ్ కనగరాజ్
లోకేశ్ కనగరాజ్ పేరుకే తమిళ దర్శకుడు గానీ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఖైదీ, విక్రమ్ సినిమాలతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ తో 'కూలీ' చేస్తున్నాడు. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్. కానీ లోకేష్ ఇప్పటినుంచే ఇంటర్వ్యూలు ఇస్తూ మూవీని ప్రమోట్ చేస్తున్నాడు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వర్కింగ్ స్టైల్ గురించి మాట్లాడిన లోకేశ్ కనగరాజ్.. పలువురు పాన్ ఇండియా హీరోలు, డైరెక్టర్లపై పరోక్షంగా సెటైర్లు వేశాడా అనిపించింది. 'నేనేమి ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తీయట్లేదుగా మూడేళ్లు పట్టడానికి. 'కూలీ'ని 6-8 నెలల్లో పూర్తి చేశా. అలానే నా సినిమాలో చేసే నటీనటుల్ని ఎవరినీ మీ గెటప్ మార్చొద్దు. వేరే సినిమాలు చేసుకోవద్దు అని చెప్పను. సాధారణంగా నేను అలాంటి రకం కాదు. అవేం చెప్పకపోయినా సరే వాళ్లు నాతో సినిమాలు చేస్తున్నారు' అని లోకేశ్ అన్నాడు.(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమా) లోకేశ్ మాటల్ని బట్టి చూస్తే.. ప్రస్తుతం చాలామంది పాన్ ఇండియా హీరోలు ఒక్క సినిమాకే ఏళ్లకు ఏళ్లు గడిపేస్తున్నారు. లుక్ అది ఇది అని చాలా హడావుడి చేస్తున్నారు. కానీ లోకేశ్ మాత్రం స్టార్ హీరోలతో కూడా నెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. బహుశా తన వర్కింగ్ స్టైల్ ఇది అని చెప్పుకోవడానికే ఈ కామెంట్స్ చేసినట్లు అనిపిస్తుంది.కూలీ విషయానికొస్తే.. రజినీకాంత్ హీరో కాగా నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్ లాంటి స్టార్ నటీనటులు ఈ సినిమాలో ఉండటం విశేషం. రీసెంట్ గా రిలీజ్ కి మరో 100 రోజులే ఉందని ఓ వీడియో రిలీజ్ చేశారు. నటీనటుల తలవెనక షాట్స్ చూపించే హైప్ పెంచేశాడు. మరో నెల తర్వాత పూర్తిస్థాయి ప్రమోషన్స్ మొదలుపెడతారేమో?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'రాబిన్ హుడ్' సినిమా) “I’m not making a film like #RRR that takes 3 years. 'Coolie' will be shot in 6–8 months.I asked actors not to change getup or do other films. I don’t usually say that… but they still agreed.”— #LokeshKanagaraj | #Cooliepic.twitter.com/XC66jkJUv5— Whynot Cinemas (@whynotcinemass_) May 11, 2025 -
విజయ్ సేతుపతి మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్!
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన తాజా చిత్రం 'ఏస్'. ఈ సినిమాకు అరుముగకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సెవెన్ సీస్ ఎంటర్టైనర్మెంట్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. హీరో శివకార్తికేయన్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు.ఏస్ ట్రైలర్ చూస్తే మలేషియా బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో సీన్స్ చూస్తే జూదం, స్మగ్లింగ్, దోపిడీ నేపథ్యంలో కథను రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో బోల్డ్ కన్నన్ పాత్రలో విజయ్ సేతుపతి అభిమానులను అలరించనున్నారు. మూడు నిమిషాల నిడివి గల ట్రైలర్లో విజయ్ సేతుపతి యాక్షన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, దివ్య పిళ్లై, బబ్లూ పృథ్వీరాజ్, బి.ఎస్. అవినాష్, ముత్తు కుమార్, రాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 23న థియేటర్లలో సందడి చేయనుంది. -
భారీ ప్రాజెక్ట్.. 'మహావతార్: నరసింహ' గ్లింప్స్ విడుదల
హోంబలే ఫిల్మ్స్ సంస్ధ నిర్మిస్తున్న భారీ యానిమేటెడ్ చిత్రం 'మహావతార్: నరసింహ'.. తాజాగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదలైంది. ఆపై సినిమా రిలీజ్ తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. కేజీఎఫ్,సలార్,కాంతార వంటి భారీ ప్రాజెక్ట్లను నిర్మించిన ఆ సంస్థ దర్శకుడు అశ్విన్ కుమార్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రీమియర్ను గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(ఇఫ్ఫీ)లో ప్రదర్శించారు.పాన్ ఇండియా రేంజ్లో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో జులై 25న ఈ చిత్రం విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. సామ్ సీఎస్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్లు నిర్మిస్తున్నారు. మహావతార్ సిరీస్లో భాగంగా వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. అయితే, ఈ కథకు సీక్వెల్గా ఇతర అవతారాలతో పలు సినిమాలు రానున్నాయన మేకర్స్ హిట్ ఇచ్చారు. యానిమేషన్లో ఈ చిత్రం ఒక బెంచ్ మార్క్ను సెట్ చేస్తుందని దర్శకుడు తెలిపారు.ప్రహ్లాదుడి చరిత్ర, విష్ణువుకు, హిరణ్యకశిపునికి మధ్య జరిగిన యుద్ధాన్ని ఇందులో చూపిస్తున్నట్లు అశ్విన్ చెప్పారు. దీన్ని రూపొందించడానికి సుమారు నాలుగు సంవత్సరాలు పట్టింని ఆయన చెప్పారు. మహావతార్ సిరీస్లో రానున్న తొలి సినిమాగా 'మహావతార్: నరసింహ' తెరకెక్కింది. దీనికి కొనసాగింపుగా ఇతర అవతారాలతో మరో రెండు సినిమాలు రాబోతున్నట్లు తెలుస్తోంది. -
దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ
సినిమాలు ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూనే ఉంటాయి. కానీ కొన్ని చూసినప్పుడు మాత్రం దానిలో ఎమోషన్ మనసుల్ని తాకుతుంది. మనల్ని భావోద్వేగానికి గురిచేస్తుంది. అలాంటి చిత్రమే 'సత్యం సుందరం'. కార్తీ, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గతేడాది రిలీజైంది. దీనికి '96' ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకుడు.(ఇదీ చదవండి: సూర్యకు గిఫ్ట్ ఇచ్చిన 'రెట్రో' డిస్ట్రిబ్యూటర్..)గతేడాది సినిమా వచ్చింది. కమర్షియల్ గా హిట్ కాలేదు గానీ చాలామంది ప్రేక్షకులకు మాత్రం సినిమా నచ్చింది. సరే ఇప్పుడు ఈ విషయం ఎందుకా అంటారా? దర్శకుడు ప్రేమ్ కుమార్ కి ఇప్పుడు సూర్య-కార్తీ మర్చిపోలేని బహుమతి ఇచ్చారు. ఎందుకంటే ప్రేమ్ చాన్నాళ్ల నుంచి ఈ కారు కొనుక్కుందామని అనుకుంటుండగా.. ఇప్పుడు సూర్య-కార్తీ ఇతడి కల నెరవేర్చారు. ప్రేమ్ కుమార్ ఇన్ స్టా పోస్ట్ చూస్తే ఇది అర్థమైపోయింది.'మహీంద్ర థార్ నా డ్రీమ్ కారు. కొన్ని కారణాల వల్ల 5 డోర్స్ వెర్షన్ కోసం నేను ఎదురుచూస్తున్నాను. ప్రత్యేకంగా డిజైన్ చేసిన థార్ ఆర్ఓఎక్స్ఎక్స్ ఏఎక్స్ 5ఎల్ 4x4 మోడల్ లో వైట్ కలర్ కారు కొనాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. నా దగ్గర డబ్బులున్నా సరే కారు రావడానికి చాలారోజులు పట్టేస్తుంది. దీంతో రాజా సర్ సాయం అడిగా''ఒకానొక సందర్భంలో కారు కొనడం కంటే అవసరాలు ఎక్కువైపోయాయి. దీంతో కారు కోసం దాచుకున్న డబ్బులన్నీ ఖర్చుయిపోయాయి. కల చెదిరిపోయింది. ఇదంతా రాజా సార్ కి చెప్తే సైలెంట్ గా ఉండిపోయారు. కానీ నిన్న సూర్య అన్న నుంచి కారు ఫొటో మెసేజ్ వచ్చింది. నేను ఫస్ట్ షాకయ్యాను. వెంటనే రాజా సర్ కి ఫోన్ చేసి నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవని చెబితే.. ఆయన నవ్వి, ప్రేమ్ ఇది నీకు సూర్య సర్ ఇస్తున్న గిఫ్ట్ అని అన్నారు. దీంతో నాకు మాట రాలేదు. సూర్య సర్ ఇంటికి వెళ్లి కార్తీ అన్న చేతుల మీదుగా కారు అందుకున్నాను''ఇదంతా ఇంకా కలలానే అనిపిస్తుంది. నేను దీన్ని బహుమతిలా చూడటం లేదు. నేను దీన్ని అన్నయ్యలు తమ్ముడికి నెరవేర్చిన కలలా భావిస్తున్నాను. థ్యాంక్స్ సూర్య అన్న, థ్యాంక్స్ కార్తీ బ్రదర్, థ్యాంక్స్ రాజా సర్' అని ప్రేమ్ కుమార్ రాసుకొచ్చాడు. మార్కెట్ లో ప్రస్తుతం ఈ కారు ధర రూ.25 లక్షల వరకు ఉంది. ఇకపోతే ప్రేమ్ కుమార్ ఇప్పుడు '96' సీక్వెల్ స్క్రిప్ట్ రాస్తూ బిజీగా ఉన్నాడు.(ఇదీ చదవండి: రూ.10 కోట్లు దానం చేసిన హీరో సూర్య) View this post on Instagram A post shared by Premkumar Chandran (@prem_storytelling) -
సూర్యకు గిఫ్ట్ ఇచ్చిన 'రెట్రో' డిస్ట్రిబ్యూటర్..
నటుడు సూర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం రెట్రో.. నటి పూజా హెగ్డే ఇందులో నాయకిగా నటించారు. ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించారు. అయితే, సూర్య, కార్తీక్ సుబ్బరాజుకు చెందిన సొంత నిర్మాణ సంస్థలే రెట్రోను తెరకెక్కించాయి. మే 1న విడుదలైన ఈ మూవీ సక్సెస్ ఫుల్గా రన్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్తో ఉంది. అయితే, ఈ మూవీని శక్తి ఫిలిమ్ ఫ్యాక్టరీ సంస్థ అధినేత శక్తి వేలన్ తమిళనాడులో డిస్ట్రిబ్యూషన్ చేశారు. కాగా రెట్రో చిత్రం విజయాన్ని పురస్కరించుకొని ఆయన ఆనందంగా ఆ చిత్ర యూనిట్కు విలువైన బహుమతులను అందించారు.చెన్నైలో జరిగిన ఈ వేడుకలో చిత్ర కథానాయకుడు సూర్యకు కానుకగా వజ్రపుటుంగరాన్ని శక్తి వేలన్ అందించారు. అదేవిధంగా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్కు, చాయాగ్రహకుడు, సంగీత దర్శకుడు ఇతర చిత్ర యూనిట్ సభ్యులందరకి వజ్రపుటుంగరాలను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ సూర్య కథానాయకుడిగా నటించిన రెట్రో చిత్రం రూ.100 కోట్ల వసూళ్లను దాటి పరుగులు తీస్తోందన్నారు. ఈ ఏడాది విడుదల చిత్రాలలోనే అధిక లాభాలు తెచ్చి పెట్టిన చిత్రం ఇదేనన్నారు. ఉచిత డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశాన్ని తనకు కల్పించిన నటుడు సూర్య ,రాజశేఖర పాండియన్కు ధన్యవాదాలు తెలిపారు. తాను ఇంతకుముందు సూర్య నిర్మించిన కడైకుట్టి సింగం(చినబాబు ) చిత్ర సక్సెస్ వేడుక సందర్భంగా బంగారు గొలుసును, అదేవిధంగా విరుమాన్ చిత్ర విజయం సాధించిన సందర్భంగా బంగారు బ్రేస్లెట్ను సూర్యకు కానుకగా అందించగా ఆయన వాటిని మళ్లీ తనకే తిరిగి ఇచ్చారని గుర్తు చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా వజ్రపుటుంగరాన్ని తనకే ఇచ్చారని చెప్పారు. -
క్రేజీ సినిమా.. రూ. 600 కోట్ల కలెక్షన్స్.. ఛాన్స్ వదులుకున్న సాయిపల్లవి
ప్రతిభకు అదృష్టం తోడైతే అది నటి సాయి పల్లవి అవుతుంది. డాక్టర్ అయ్యి యాక్టర్ అయిన భామ ఈమె. సినిమాలపై ఆసక్తితో మొదట్లో ప్రయత్నాలు చేసిన ఆశించిన ఫలితం దక్కకపోవడంతో వైద్య విద్యపై పూర్తిగా దృష్టి సారించిన సాయి పల్లవి మధ్యమధ్యలో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ తన కలలబాటలో పయనించిన సాయి పల్లవికి మలయాళ చిత్రం ప్రేమమ్తో విజయం వరించింది. ఆ ఒక్క విజయం ఆమె కెరీర్నే మార్చేసింది వరుసగా అవకాశాలు రావడం, అందులో బలమైన, నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకొని నటించడంతో సాయి పల్లవి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలాంటి పాత్రలు తెలుగులోనే ఎక్కువగా రావడం విశేషం. కాగా ఇటీవల తమిళంలో శివకార్తికేయన్కు జంటగా నటించిన అమరన్ చిత్రంలో సాయి పల్లవి నటన మరోసారి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా తాజాగా ఈమె బాలీవుడ్ని కూడా టచ్ చేసింది. అక్కడ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న రామాయణం చిత్రంలో సీతగా నటిస్తోంది. ఈ సినిమాపై చాలా అంచనాలు నెలకొంటున్నాయి. ఇందులో సాయి పల్లవి నటించిన కొన్ని గ్లింప్స్ విడుదలై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కాగా ఈమె ఈ చిత్రానికి భారీ మొత్తంలో పారితోషకం పుచ్చుకుంటున్నట్లు, ఎంత అంటే ఇప్పటి వరకు ఏ దక్షిణాది హీరోయిన్ తీసుకోనంత అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఇకపోతే ఈమె కథ, తన పాత్ర నచ్చితే కానీ చిత్రాలను అంగీకరించరన్నది తెలిసిందే. ఇంతకు ముందు చిరంజీవితో నటించే అవకాశాన్ని తిరస్కరించింది. అదేవిధంగా తమిళంలో నటుడు విజయ్ సరసన లియో చిత్రంలో నటించే అవకాశం ముందు సాయిపల్లవికే వచ్చిందట. అందులో ఆమె నటించడం దాదాపు ఖరారు అయ్యిందని, అయితే అందులో పాత్ర తనకు సంతృప్తిని కలిగించకపోవడంతో నిరాకరించినట్లు తాజాగా ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.ఆ తరువాత ఆ పాత్రను నటి త్రిష పోషించింది. -
దేవగా ధనుష్
ధనుష్, నాగార్జున హీరోలుగా నటించిన చిత్రం ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.కాగా ఈ సినిమాలో దేవ అనే పాత్రలో ధనుష్ నటిస్తున్నట్లుగా వెల్లడించి, ‘కుబేర’ సినిమా కొత్తపోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ధనుష్ యాక్టర్గా కెరీర్ని మొదలు పెట్టి, శనివారం (మే 10)కి 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ‘కుబేర’ కొత్తపోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ‘కుబేర’ చిత్రం జూన్ 20న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: దేవి శ్రీ ప్రసాద్. -
హీరో భార్య- ప్రియురాలి మధ్య మాటల యుద్ధం!
తమిళ హీరో జయం రవి విడాకుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గతేడాది భార్య ఆర్తికి విడాకులు ఇచ్చేసినట్లు ప్రకటించిన ఇతడు.. ప్రసుత్తం సింగిల్ గానే ఉంటున్నాడు. కానీ శుక్రవారం ఉదయం చెన్నైలో నిర్మాత ఇషారీ గణేశ్ కూతురు పెళ్లికి మాత్రం సింగర్ కెనీషాతో కలిసి హాజరయ్యాడు. దీంతో భార్య ఆర్తి తట్టుకోలేకపోయింది.నిన్న సాయంత్రం జయం రవి పేరు నేరుగా ప్రస్తావించనప్పటికీ.. చాలా ఆరోపణలు చేసింది. తనని ఇంటి నుంచి బయటకు గెంటేశాడని, పిల్లల్ని పట్టించుకోనివాడు అసలు తండ్రేనా అంటూ చాలా పెద్ద నోట్ రిలీజ్ చేసింది. ఇప్పుడు దీని ప్రతిగా జయం రవితో కలిసి కనిపించిన కెనీషా కౌంటర్ ఇచ్చింది.(ఇదీ చదవండి: భార్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన డాక్టర్ బాబు) తన ఇన్ స్టా స్టోరీలో ఆర్తి పేరు ప్రస్తావించకుండా.. 'మగాడు ఎప్పుడూ ఎమోషన్స్ కి లొంగడు. ఏ మహిళ దగ్గర అయితే ప్రశాంతత ఉంటుందో వాళ్లకే తన హృదయాన్ని ఇస్తాడు. మంచిగా ఉన్నాను కదా అని లైట్ తీసుకోకు. అదే నిజమైన బలం' అనే కొటేషన్ ని కెనీషా షేర్ చేసింది.ప్రస్తుతానికి హీరో జయం రవి భార్య ఆర్తి వర్సెస్ రూమర్ ప్రియురాలు కెనీషా మధ్య పరోక్షంగా మాటల యుద్ధం నడుస్తోంది. మరి ఈ విషయంలో ఎవర ఒప్పు? ఎవరిది తప్పు అనేది తెలియాలంటే సదరు హీరో నోరు విప్పాల్సిందే. కోలీవుడ్ మీడియా ప్రకారం.. జయం రవి అత్త ఇతడి డేట్స్, మూవీస్ విషయంలో చాలా జోక్యం చేసుకుందని, అందుకే భార్యకు విడాకులు ఇచ్చేశాడనే టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకున్నా.. హీరోయిన్ అమలాపాల్) -
హీరో ఆఫర్లు వద్దని.. స్టార్గా మారిన శోభన్ బాబు మనవడు ...
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నట భూషణుడు శోభన్ బాబు(Sobhan Babu).. ఎన్టీయార్, కృష్ణ లాంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక ప్రేక్షకవర్గాన్ని సృష్టించుకున్నారు. ముఖ్యంగా మహిళాదరణలో ఆయనకు సాటిలేదు. తన సమకాలీకులైన మిగిలిన హీరోల్లా కాకుండా సినీరంగానికి దూరమైన తర్వాత ఆయన కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అసలు పబ్లిక్ లైఫ్ నుంచే అదృశ్యం అయిపోయారు. అంతేకాదు ఆయన వారసులను కూడా ఎవరినీ సినీ రంగంలోకి పరిచయం చేయలేదు. దాంతో ఆయన దివంగతులయాక ఆయన వారసులకు సంబంధించిన విశేషాలు కూడా ఎక్కడా పెద్దగా వెలుగు చూడలేదు. ఈ నేపధ్యంలో తాజాగా శోభన్ బాబు మనవడు డాక్టర్ సురక్షిత్ బత్తిన గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారంటూ వచ్చిన వార్తలు తెలుగు రాష్ట్రాలలో ఆసక్తి రేకెత్తించాయి. అలనాటి అందాల నటుడి రూపాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన మనవడు... పలు సినిమా ఆఫర్లు వచ్చినా తిరస్కరించిన సురక్షిత్...సార్ధక నామధేయుడిగా మారి ఎంచుకున్న రంగంలో స్టార్ అనిపించుకుంటున్నారు.(చదవండి: రీరిలీజ్లో ‘జగదేక వీరుడు..’ వసూళ్ల సునామీ.. ఎంతంటే?)తమిళనాడులో స్థిరపడ్డ ఆయన సినిమా రంగంలో కాకుండా వైద్య రంగంలో తాతకు తగ్గ మనవడుగా రాణిస్తుండడం అందర్నీ ఆకర్షిస్తోంది. దాదాపు 4.5 కిలోల గర్భాశయాన్ని అత్యాధునిక సాంకేతికత ద్వారా తొలగించి డాక్టర్ సురక్షిత్ బత్తిన వైద్యరంగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. తమిళనాడుకు చెందిన 44 ఏళ్ల మహిళకు గర్భాశయంలో భారీ కణితి ఏర్పడింది. ఇతర ఆస్పత్రులు ఓపెన్ సర్జరీ తప్ప మార్గం లేదని సూచించగా, డాక్టర్ సురక్షిత్ 3డీ ల్యాపరోస్కోపిక్ సాంకేతికతను ఉపయోగించి 8 గంటల పాటు శ్రమించి ఆ గర్భాశయాన్ని విజయవంతంగా తొలగించారు. అంతేకాదు 2019లో డాక్టర్ సురక్షిత్ గురువైన డాక్టర్ సిన్హా 4.1 కిలోల గర్భాశయాన్ని ల్యాపరోస్కోపీ ద్వారా తొలగించి సాధించిన గిన్నిస్ రికార్డును బద్దులు కొట్టి గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నారు.సేవాస్టార్..డాక్టర్ సురక్షిత్ చెన్నైలోని అన్నా నగర్లో 2016లో ఇండిగో ఉమెన్స్ సెంటర్ను స్థాపించారు. తన కెరీర్లో ఇప్పటివరకు 10,000కు పైగా శస్త్రచికిత్సలు నిర్వహించి, 40కి పైగా అవార్డులు అందుకున్నారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు శోభన్ బాబు పేరుతో వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. టెడెక్స్ స్పీకర్, ఫిట్నెస్ ఫ్రీక్ డిజిటల్ విద్యావేత్త అయిన డాక్టర్ సురక్షిత్ బత్తినకు సెలబ్రిటీల స్థాయిలో 1.65లక్షలకు పైగా ఇన్స్ట్రాగామ్ ఫాలోయర్స్ ఉండడం విశేషం. ఆయన శాస్త్రీయ విధానాలను సలహాలను వ్యాప్తి చేస్తున్నారు. ‘భారతదేశ సంతానోత్పత్తి రంగంలో ఆధిపత్యం చలాయిస్తున్న ఐవీఎఫ్ లాంటి కార్పొరేట్ సంస్కృతికి వ్యతిరేకం అయినప్పటికీ... వంధ్యత్వానికి మూల కారణాలకు చికిత్స చేయడం సహజ గర్భధారణను ప్రోత్సహించడం కోసం ప్రత్యేంగా కృషి చేస్తున్నాను‘ అని డాక్టర్ బత్తిన చెబుతున్నారు. -
ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకున్నా.. హీరోయిన్ అమలాపాల్
సాధారణంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే అబ్బాయి లేదా అమ్మాయి ఎవరు? వాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఏంటి? తదితర విషయాలు తెలుసుకుని పెళ్లి చేసుకుంటారు. కానీ హీరోయిన్ అమలాపాల్ జీవితంలో మాత్రం వీటికి రివర్స్ లో జరిగింది. ఈమె నటి అనే సంగతే భర్తకు తెలీదు, అలానే ప్రెగ్నెంట్ అయిన తర్వాత వీళ్లిద్దరూ వివాహం చేసుకున్నారు.అవును మీరు విన్నది కరెక్టే. తాజాగా జేఎఫ్ డబ్ల్యూ మూవీ అవార్డ్ వేడుక జరిగింది. ఇందులో ఉత్తమ నటిగా(క్రిటిక్స్) అమలాపాల్ అవార్డ్ గెలుచుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగత్ దేశాయ్ తో తన ప్రేమ, పెళ్లి ఎలా జరిగిందనే విషయాల్ని బయటపెట్టింది.(ఇదీ చదవండి: శ్రీవిష్ణు ‘సింగిల్’కి రికార్డు ఓపెనింగ్స్... తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?)'జగత్-నేను గోవాలో కలిశాం. అతడు గుజరాతీ కానీ గోవాలో సెటిలయ్యాడు. నాది కేరళ అని చెప్పాను. అతడు దక్షిణాది సినిమాలు చూడడు. దీంతో నేను నటి అనే విషయాన్ని చెప్పలేదు. తర్వాత కొన్నాళ్లకు నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం. గర్భంతో ఇంట్లో ఉన్నప్పుడు నా సినిమాలని ఒక్కొక్కటిగా చూస్తూ ఎంజాయ్ చేశాడు. నేను అవార్డ్స్ తీసుకున్న వీడియోలు చూసి తెగ మురిసిపోయాడు' అని అమలాపాల్ చెప్పుకొచ్చింది.తెలుగులో ఇద్దరమ్మాయిలతో, నాయక్ తదితర సినిమాలు చేసిన అమలాపాల్.. తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. గతంలోనే ఈమె డైరక్టర్ ఏఎల్ విజయ్ ని 2014లో పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా మూడేళ్లకే అంటే 2017లో విడిపోయారు. 2023లో బిజినెస్ మ్యాన్ జగత్ దేశాయ్ ని అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ కొడుకు పుట్టాడు.(ఇదీ చదవండి: ‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్!) -
'ఆపరేషన్ సిందూర్'పై బుద్దిలేని వ్యాఖ్యలు.. నటిపై భగ్గుమన్న నెటిజన్లు
ఆపరేషన్ సిందూర్ గురించి మలయాళ నటి చేసిన కామెంట్ విమర్శలకు దారి తీస్తుంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. అందులో సుమారు 100 మందికి పైగానే ఉగ్రవాదులు మరణించారు. దీంతో సోషల్ మీడియా అంతా భారత సైన్యానికి జేజేలు పలికింది. ‘భారత్ మాతా కీ జై’ అంటూ తాము ఆర్మీ వెంటే అంటూ నెటిజన్లు, ప్రముఖులు పోస్ట్లు పెట్టారు. అయితే, కేరళకు చెందిన నటి అమీనా నిజమ్.. ఆపరేషన్ సిందూర్ కోసం భారతదేశం 'సిగ్గుపడుతుందని' పోస్ట్ చేసింది.అమీనా తన సోషల్మీడియాలో ఇలా రాసుకొచ్చింది 'ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లోని ప్రజలను చంపడంపై నేను సిగ్గు పడుతున్నాను. చంపుకోవడం ఒక్కటే మార్గం కాదు. దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుంది. యుద్దం శాంతిని తీసుకురాదు, ప్రాణాలను తీస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పరిణామాన్ని ఎవరూ సపోర్ట్ చేయకండి. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని భావించే వ్యక్తులను మోసగిస్తున్నారు. మనం చేస్తున్న యుద్ధం వల్ల నష్టపోయేది పౌరులే. నేను నా ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే భారతీయురాలిని, అహం దెబ్బతిన్నప్పుడు మాత్రమే మాట్లాడేదానిని కాదు.' అంటూ ఆమె షేర్ చేసింది.నటి అమీనాపై నెటిజన్లు ఒక్కసారిగా విరుచుకు పడ్డారు.. అదే పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో అమాయకులైన ఇండియన్స్ కూడా చనిపోయారనే విషయం మీకు గుర్తుచేయాలా..? అంటూ ఫైర్ అవుతున్నారు. ఆమెను దేశ వ్యతిరేకి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి టైమ్లో పాకిస్తాన్ ఉగ్రవాదులను పాపం అనడం, వారిపై సానుభూతి చూపించడం ఏ మాత్రం మెచ్చుకోదగ్గ విషయం కాదని ఇది మీ కెరీర్కు కూడా అంత మంచిది కాదంటూ చిన్నపాటి వార్నింగ్లు కూడా నెటిజన్లు ఇస్తున్నారు.ఎవరీ అమీనా..?అమీనా నిజమ్ కేరళకు చెందిన నటి, ఆమె ప్రముఖ మలయాళ టీవీ రియాలిటీ షో అయిన నాయక నాయకన్ ద్వారా పరిశ్రమలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె అనేక సినిమాలతో పాటు పలు షోలలో తన నటనకు ప్రసిద్ధి చెందింది. శంకర్ రామకృష్ణన్ దర్శకత్వం వహించిన గ్యాంగ్స్ ఆఫ్ 18 (2018) సినిమాతో అలరించింది. ఆ తర్వాత ఆమె పతినేట్టం పడి, అంజామ్ పాతిర, పట్టాపాకల్, టర్కిష్ తర్కం, టర్బో వంటి సినిమాల్లో నటించింది. View this post on Instagram A post shared by KRISHNA | KOCHI BRIDAL MEHNDI ARTIST (@mehndibykrish) -
ఇది వేడుకలకు సమయం కాదు: కమల్హాసన్
కమల్హాసన్ హీరోగా నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా ఆడియో విడుదల వేడుక వాయిదా పడింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్యా లక్ష్మి, జోజు జార్జ్ తదితరులు ఇతర ప్రధానపాత్రలు పోషించారు. కమల్హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, శివ అనంత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 5నపాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ రిలీజ్ చేస్తోంది. ఈ నెల 16న ‘థగ్ లైఫ్’ ఆడియో విడుదల వేడుకని ఘనంగా నిర్వహించాలని చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. అయితే ప్రస్తుతం భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఈ వేడుక వాయిదా వేసినట్లు చిత్రబృందం తెలియజేసింది. ఈ మేరకు ‘ఆర్ట్ కెన్ వెయిట్–ఇండియా కమ్స్ ఫస్ట్’ అంటూ కమల్హాసన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘మన దేశ సరిహద్దుల్లో చోటు చేసుకున్న పరిణామాలు, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 16న నిర్వహించాల్సిన ‘థగ్ లైఫ్’ ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాం.మన దేశాన్ని రక్షించడంలో మన సైనికులు అప్రతిహత ధైర్యంతో ముందుండిపోరాడుతున్న వేళ వేడుకలకు సమయం కాదని భావిస్తున్నాం. ఇది సంఘీభావానికి సమయం అని నమ్ముతున్నాను. ఈ సమయంలో మన దేశాన్ని కాపాడుతూ అప్రమత్తంగా ఉన్న మన సైనికుల గురించి మనం ఆలోచించాలి. పౌరులుగా మనం సంయమనంతో, సంఘీభావంతో స్పందించాలి. ఆడియో రిలీజ్ కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అని కమల్హాసన్ పేర్కొన్నారు. -
కుట్ర చేసి నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు.. స్టార్ హీరో భార్య సంచలన పోస్ట్
తమిళ హీరో జయం రవి.. భార్య ఆర్తికి గతేడాది విడాకులు ఇచ్చేశాడు. దాదాపు 18 ఏళ్ల బంధాన్ని తెగదెంపులు చేసుకున్నాడు. కెన్నీషా అనే సింగర్ తో సదరు హీరో డేటింగ్ చేస్తున్నాడని, అందుకే భార్యకు విడాకులు ఇచ్చేశాడనే రూమర్స్ వచ్చాయి. తాజాగా నిర్మాత ఇషారీ గణేశ్ కూతురి పెళ్లి జరగ్గా.. జయం రవి కెన్నీషాతో కలిసి జంటగా వచ్చాడు.(ఇదీ చదవండి: బడా నిర్మాత కూతురి పెళ్లి.. ఇండస్ట్రీ మొత్తం అక్కడే) ఉదయం నుంచి జయం రవి-కెన్నీషా కలిసున్న ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. సరిగ్గా ఈ టైంలో మాజీ భార్య ఆర్తి చాలా పెద్ద పోస్ట్ పెట్టింది. జయం రవిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనని ఇంటి నుంచి తరిమేశారని, జయం రవికి అసలు పిల్లలు బాధ్యత అనేదే లేదని ఆవేదన వ్యక్తం చేసింది.'ఏడాది పాటు మౌనాన్ని కవచంలా మోస్తున్నాను. నా కొడుకులు ప్రశాంతంగా ఉండాలి కాబట్టే ఇవన్నీ భరిస్తున్నాను. నాపై లేనిపోని ఆరోపణలు చాలా చేశావ్. అయినా సరే నేను నోరు మెదపలేదు. ఎందుకంటే నా కొడుకులు.. తల్లిదండ్రులు విడిపోయారనే బాధని అనుభవించకూడదు కాబట్టి. అంతే తప్ప నా దగ్గర నిజం లేదని కాదు. ఇప్పుడు ప్రపంచమంతా ఫొటోలు చూస్తోంది. కానీ మా మధ్యలో జరిగింది వేరు. విడాకుల ప్రక్రియ ఇంకా నడుస్తోంది. నాతో పాటు 18 ఏళ్లు సంసారం చేసిన వ్యక్తి.. ప్రేమ, నమ్మకంతో పాటు ప్రామిస్ చేసిన ప్రతి బాధ్యతని పక్కనబెట్టి నన్ను వదిలి వెళ్లిపోయాడు. నా బాధ్యత అని చెప్పిన ఆ వ్యక్తి.. నాకు ఆర్థికంగా అండగా నిలబడం, మాట సాయం గానీ చేయట్లేదు''ప్రస్తుతం మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేశారు. నాతో కలిసి ఇదే ఇంటిని నిర్మించిన సదరు వ్యక్తి.. బ్యాంక్ అధికారులతో కలిసి నేను బయటకు వెళ్లిపోయేలా చేశాడు. నేను డబ్బుల కోసమే ఈ విడాకుల డ్రామా ఆడుతున్నానని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఎప్పుడో నా స్వార్థం చూసుకునేదాన్ని. కానీ నేను అలా చేయలేదు. ప్రేమని పంచాను. నమ్మకం చూపించాను. ఇప్పుడదే నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది''ప్రేమించినందుకు పశ్చాత్తాపపడట్లేదు గానీ దాన్ని ఓ బలహీనతలా ఉపయోగించుకున్నందుకు బాధపడుతున్నాను. నా కొడుకుల వయసు 10, 14 ఏళ్లు. వాళ్లకు ఇప్పుడు కావాల్సింది భద్రత.. షాక్ కాదు, నిశ్బబ్దం కాదు. ఈ చట్టాల గురించి అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లలు వాళ్లు. సమాధానం లేని కాల్స్, రద్దయిన మీటింగ్స్.. ఇవన్నీ నాకు తగిలిన గాయాలు. నేను ఈరోజు మాట్లాడేది భార్యగా కాదు. అలా అని స్త్రీకి అన్యాయం చేసిన దానిలా కూడా కాదు. పిల్లల శ్రేయస్సు కోసం ఆలోచించే తల్లిగా మాత్రమే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాట్లాడకపోతే ఎప్పటికీ ఫెయిల్యూర్ గానే మిగిలిపోతాను''నువ్వు ఏమైనా చేయొచ్చు గానీ నిజాన్ని తిరిగి రాయలేవు కదా. తండ్రి అంటే టైటిల్ కాదు అదో బాధ్యత. మా విడాకుల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నా పేరు వెనక రవి అని ఉంటుంది. మీడియా వాళ్లకు చెప్పేదేంటంటే నన్ను మాజీ భార్య అని సంభోదించొద్దు. మేం ఇంకా లీగల్ గా విడాకులు తీసుకోలేదు. ప్రతికారమో మరేదో కాదు,పిల్లల్ని కాపాడే తల్లిగా ఇది నా బాధ్యత. నేను ఏడవను. గట్టిగా అరిచి గోలపెట్టను. కానీ బలంగా నిలబడతా. నిన్ను ఇంకా నాన్న అని పిలుస్తున్న ఇద్దరబ్బాయిల కోసం నేను అస్సలు తగ్గను' అని ఆర్తి రవి రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్) View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi)