South India
-
ది గోట్ లైఫ్ను దాటేేసిన చిన్న సినిమా.. ఏకంగా టాప్-6లో..!
ఇటీవల విడుదలైన మలయాళ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సవిన్ దర్శకత్వంలో వచ్చిన వాళా-2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్ మూవీ రిలీజైన పది రోజుల్లోనే టాప్-6లో నిలిచింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ఆరో స్థానం సాధించింది. ఏప్రిల్ 2న రిలీజైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 163.50 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్స్తో ప్రముఖ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' మూవీని అధిగమించింది. 2024లో వచ్చిన ది గోట్ లైఫ్ రూ. 158.50 కోట్ల ఆల్ టైమ్ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.యూత్ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. కేరళ బయట సైతం ఈ మూవీకి క్రేజ్ వస్తోంది. పాఠశాల జీవితం, ఫ్రెండ్స్ కాన్సెప్ట్తో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా చూస్తే వసూళ్లపరంగా రూ. 89.75 కోట్ల గ్రాస్ సాధించింది. ఓవర్సీస్ మార్కెట్లో రూ. 73.75 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. ఇండియాలో రూ. 77.50 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో హషీర్, అలన్, వినాయక్, అజిన్, బిజు కుట్టన్, అల్ఫోన్స్ పుత్రేన్, విజయ్ బాబు, అజు వర్గీస్, అమీన్, ఏంజెల్ కీలక పాత్రల్లో నటించారు.హిట్ మూవీకి సీక్వెల్.. 2024లో వచ్చిన వాళా చిత్రానికి సీక్వెల్గా 'వాళా 2' వచ్చింది. 'బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్' అనేది ఉపశీర్షిక. ఈ రెండు భాగాలకు కథ అందించింది విపిన్ దాస్ ఒక్కరే అయినా.. దర్శకులు మాత్రం మారారు. మొదటి భాగానికి ఆనంద్ మీనన్ దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని సవిన్ డైరెక్ట్ చేశాడు. సీక్వెల్కు రూ.10 కోట్ల బడ్జెట్ కేటాయించారు. తెలుగు నిర్మాత సాహు గారపాటి ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు. -
రూ.50 లక్షల సాయం.. ఆ హీరో వల్లే నా కొడుకు ఇలా
ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్లోనూ అప్పుడప్పుడు కొందరు యాక్టర్స్, హీరోలు అనిపించుకుంటుంటారు. తమిళ హీరో శివకార్తికేయన్ కూడా అలాంటి ఓ పని చేశాడు. కాకపోతే ఇది చాన్నాళ్ల క్రితం జరిగినప్పటికీ సాయం పొందిన నటుడు ఇప్పుడా విషయం బయటపెట్టడంతో అదికాస్త వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)తమిళ హీరో శివకార్తికేయన్ చేసిన 'హీరో' సినిమాలో నటుడు ప్రేమ్ కుమార్ కూడా చేశాడు. అయితే ఈ చిత్రం చేస్తున్న టైంలోనే తన కొడుకు చదువు కోసం నెదర్లాండ్స్ వెళ్లాలని, సమయానికి చేతిలో డబ్బుల్లేవని.. పోని ఇల్లు తాకట్టు పెడదామా అంటే అది ఈఎమ్ఐలో ఉండటంతో బ్యాంకులు అప్పు ఇచ్చేందుకు నిరాకరించాయని ప్రేమ్ అన్నాడు. ఈ విషయం శివకార్తికేయన్కి చెప్పగా బ్యాంకులో తన పేరిట పూచీకత్తుగా రూ.50 లక్షలు ఇప్పించాడని.. అలా తనకు సాయం చేయడంతో ఇప్పుడు తన కొడుకు నెలకు రూ.4-5 లక్షలు సంపాదిస్తున్నాడని, దీనంతటికీ శివకార్తికేయన్ కారణమని ప్రేమ్ కుమార్ చెప్పుకొచ్చాడు.ప్రేమ్-శివకార్తికేయన్ కలిసి ఓ సినిమాకు మాత్రమే పనిచేశారు. పరిచయం కూడా కొన్నాళ్లముందే జరిగింది. అయినా సరే తనని శివకార్తికేయన్ ఆదుకున్నాడని ప్రేమ్ చెప్పారు. హీరో, నిర్మాతగా బిజీగా ఉన్న శివకార్తికేయన్.. 'సెయాన్' అనే సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది ద్వితియార్థంలో ఇది థియేటర్లలోకి రానుంది. రీసెంట్గా 'తాయ్ కిళవి' మూవీతో నిర్మాతగానూ ఈ హీరో సూపర్ హిట్ కొట్టారు.(ఇదీ చదవండి: ఎట్టకేలకు 'దేవర' నిర్మాత కొత్త సినిమా)#Sivakarthikeyan helped with my son’s education in Netherlands.We didn’t get any loan as I only had my house 🏡. He gave me ₹50 lakhs as collateral in bank. Today, my son is earning ₹4–5 lakhsall because of him.- Actor #Premkumar pic.twitter.com/47KW1hGdwE— Movies Singapore (@MoviesSingapore) April 13, 2026 -
'వారణాసి'లో ఆ సాధువులంతా క్రిమినల్స్: తమిళ హీరో
తమిళ హీరో ఆర్య సంచలన వ్యాఖ్యలు చేశాడు. వారణాసిలోని కొందరు సాధువులు నకిలీ అని, వాళ్లంతా తీవ్రమైన నేరాలు చేసిన వాళ్లని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ తాను ఓ మూవీ షూటింగ్ సందర్భంగా తెలుసుకున్నానని చెప్పాడు. ఇతడు హీరోగా నటించిన 'మిస్టర్ ఎక్స్' మూవీ విడుదలకు సిద్ధమైంది. దీని ప్రమోషన్లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని పంచుకున్నాడు.(ఇదీ చదవండి: రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. కంగారుపడ్డా: కాయదు లోహర్)'నాన్ కడవులే(నేనే దేవుడిని) షూటింగ్ కోసం వారణాసి వెళ్లాం. అయితే అక్కడ కనిపించేవారిలో చాలామంది నకిలీ సాధువులే. అలాంటి వాళ్లు 40 శాతం మంది ఉంటారు. వీరిలో కొందరు తీవ్రమైన నేరాలు చేసినవాళ్లు. ఇక్కడికి వచ్చి వేషం మార్చి దాక్కుంటారు. నా వరకు నిజమైన సాధువులు 60 శాతమే ఉంటారు. ఈ నకిలీ స్వాములందరూ తమ అసలు పేర్లు చెప్పారు. స్వామి అని మాత్రమే చెప్పుకొంటారు. వారిలో చాలామందికి రేషన్ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లాంటి గుర్తింపు పత్రాలు ఉండవు. కొంతకాలం అక్కడ దాక్కుని తర్వాత వెళ్లిపోతారు' అని ఆర్య తన అభిప్రాయాన్ని చెప్పాడు.కుంభమేళా జరుగుతున్నప్పుడు కూడా షూటింగ్ వెళ్తే, పోలీసులు తమని ప్రత్యేకంగా హెచ్చరించిన విషయాన్ని ఆర్య బయటపెట్టాడు. పోలీసులు ఇక్కడ పరిమిత సంఖ్యలో మాత్రమే ఉన్నారు. తమ వద్ద సాధారణ తుపాకీలు మాత్రమే ఉన్నాయని, కానీ జనసమూహంలోని కొందరి దగ్గర ఏకే-47 లాంటి ప్రమాదకర ఆయుధాలు ఉన్నాయని తమని పోలీసులు హెచ్చరించిన విషయాన్ని కూడా బయటపెట్టాడు.ఆర్య వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇతడి మతాన్ని బయటకు తీస్తున్నారు, ఆర్య అసలు పేరు జంషద్ షీర్ అలీ అని, ఇతడో ముస్లిం కావడం వల్లే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో ఏంటో?(ఇదీ చదవండి: ఇన్ స్టాలో అసభ్యకర కంటెంట్.. యాంకర్ విష్ణుప్రియపై కేసు) -
రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. నిద్రలేకుండా రిహార్సల్స్
రీసెంట్ టైంలో దక్షిణాదిలో ఓవర్ నైట్ స్టార్డమ్ సంపాదించిన హీరోయిన్ ఎవరంటే చాలామంది కాయదు లోహర్ అని చెబుతారు. ఎందుకంటే ప్రదీప్ రంగనాథన్తో చేసిన 'డ్రాగన్' మూవీ ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. కానీ అంతకుముందే తెలుగులో ఓ మూవీ చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ప్రస్తుతం నాని 'ప్యారడైజ్'లో హీరోయిన్గా చేస్తోంది. ఈమె నటించిన తొలి మలయాళ మూవీ 'పల్లి చట్టంబి' ఈ వీకెండే థియేటర్లలోకి వచ్చింది. దీని ప్రమోషన్లలో భాగంగానే తాను చేసిన తొలి ఆల్బమ్ సాంగ్ గురించి, అందులో అవకాశం రావడం గురించి కూడా మాట్లాడింది.(ఇదీ చదవండి: శివాజీ సృష్టించిన చీర అంటూ అనసూయ కౌంటర్)'డ్యూడ్' మూవీతో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న సాయి అభ్యంకర్.. మరోవైపు ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తున్నాడు. అలా ఇతడి నుంచి 'పవళ మల్లి' పేరుతో గత నెలలో ఓ సాంగ్ వచ్చింది. ఇందులోనే సాయికి జోడీగా కాయదు కనిపించింది. యూట్యూబ్లో హిట్ అయిన ఈ పాటకు ఇప్పటివరకు 8 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇందులో అవకాశం ఎలా వచ్చిందో కాయదు తాజాగా బయటపెట్టింది.'పవళ మల్లి' పాటలో అనుకోకుండానే నాకు అవకాశమొచ్చింది. ఓ రోజు అర్థరాత్రి 2 గంటలకు సంగీత దర్శకుడు సాయి నుంచి నాకు కాల్ వచ్చింది. ఈ టైంలో ఫోన్ చేసేసరికి కంగారుపడ్డా. ఏమైందని అడిగితే.. తాను ఓ పాట కంపోజ్ చేశానని, చాలా బాగా వచ్చిందని చెప్పాడు. అందులో కచ్చితంగా ఉండాలని నన్ను అడిగాడు. తర్వాత పాట విన్నా, బాగా నచ్చేసరికి వెంటనే ఓకే చెప్పేశా. ఎంజాయ్ చేస్తూనే ఆ పాట పూర్తిచేశాం. ఇందుకోసం 2 రోజులు నిద్రలేకుండా రిహార్సల్స్ చేశాం. ఆడియెన్స్ కూడా పాటని ఎంజాయ్ చేస్తున్నందుకు మాకు సంతోషంగా అనిపించింది' అని కాయదు చెప్పుకొచ్చింది. ఈ పాటని సాయి, శ్రుతి హాసన్ కలిసి పాడారు.(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)#KayaduLohar Recent- #Sai called me at 2 AM and said, #Kayadu, we have a beautiful song, and I really want you to be a part of it.- I think it’s going to be a blast, and you’re the perfect one. When I heard it, I immediately fell for it.pic.twitter.com/UHWoT6824v— Movie Tamil (@_MovieTamil) April 11, 2026 -
రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు
తమిళ సినిమా: సినీనటులు రజనీకాంత్, ధనుష్ ఇళ్లల్లో బాంబులు పెట్టినట్లు వచి్చన ఫోన్ కాల్ అలజడి రేపింది. పోలీసులను పరుగులు పెట్టించింది. చివరికి ఎలాంటి అనుమానిత వస్తువులు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆగంతకుడి నుంచి వచి్చన ఫోన్ కాల్ బెదిరింపేనా.. కుట్ర ఏమైనా దాగి ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. రజనీకాంత్, ధనుష్ ఇళ్లల్లో బాంబులు పెట్టినట్టు శనివారం ఉదయం చెన్నై కమిషనర్ కార్యాలయం సమీపంలోని పోలీస్బూత్కు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో తేనాంపేట పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో పోయెస్ గార్డెన్లోని నటులు రజనీకాంత్, ధనుష్ ఇళ్లలో తనిఖీలు చేశారు. వారి ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో అనుమానించదగ్గ వస్తువులు ఏమీ లభించలేదు. బెదిరింపు కాల్ చేసిన అగంతుకుడి గురించి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నటులు రజనీకాంత్, ధనుష్ ఇళ్లలో ఒకేసారి బాంబు బెదిరింపులు రావడం సినీ వర్గాల్లో కలకలం రేపింది. -
చరణ్ సినిమా.. ఆదిత్య ధర్–భన్సాలీ పేర్ల హడావిడి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లైనప్పై బాలీవుడ్ నుంచి వరుసగా లీకులు వస్తున్నాయి. ఇప్పటివరకు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉందనే క్లారిటీ ఉండగా, తాజాగా ఆదిత్య ధర్ – సంజయ్ లీలా భన్సాలీ పేర్లు వినిపించడం ఆసక్తికరంగా మారింది. ధురంధర్-2 వంటి సూపర్ హిట్ తర్వాత ఆదిత్య ధర్ ఒక మల్టీస్టారర్ కథను సిద్ధం చేస్తున్నాడని, అందులో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కథ చాలా కాలంగా పెండింగ్లో ఉంది. అయితే ఇప్పుడు చరణ్ పేరు మరోసారి తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ – చరణ్ కాంబోపై కూడా వార్తలు వస్తున్నాయి. అటవీ నేపథ్యంలో హిస్టారికల్ అడ్వెంచర్ కథను భన్సాలీ తెరకెక్కించే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. గతంలో ‘మహారాజా సుహేల్ దేవ్’ అనే ప్రాజెక్ట్పై వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. అయితే అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోపై చర్చ మొదలవడంతో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే దర్శకుడు సుకుమార్, చరణ్తో చేయాల్సిన సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం వల్లే ఈ గాసిప్పులు ఎక్కువయ్యాయి. చరణ్ బర్త్డే సందర్భంగా ఏదైనా ప్రకటన వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దాంతో బాలీవుడ్ వైపు నుంచి వరుసగా ఇలాంటి లీకులు వస్తున్నాయి. -
సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బూతు కంటెంట్.. క్లారిటీ ఇచ్చిన నటి
ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ గోల ఎక్కువైపోయింది. చాలామంది సబ్స్క్రిప్షన్ అనగానే అక్కడేదో బూతు కంటెంట్ ఉంటుందని భావిస్తున్నారు. తన దగ్గర మాత్రం అలాంటివి ఆశించొద్దంటోంది మలయాళ నటి అన్నా రేష్మ రాజన్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. నా అకౌంట్లో సబ్స్క్రిప్షన్ మోడల్ను రెండేళ్ల క్రితమే ప్రారంభించాను. దాని ద్వారా మీ అందరితో కనెక్ట్ అయ్యాను. సబ్స్క్రిప్షన్ వల్ల నా రీల్స్, ఫోటోలు మీకు ముందుగానే వస్తాయి. ఏదో ఊహించొద్దుఅలాగే మీరు నాతో కాస్త ఎక్కువగా కనెక్ట్ అవొచ్చు. అంతే తప్ప సబ్స్క్రిప్షన్ అంటే అక్కడేదో బూతు కంటెంట్ ఉంటుందని కాదు. కేవలం క్వాలిటీ, సృజనాత్మకత, గౌరవప్రదమైన సంభాషణలు మాత్రమే ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు ఏదో ఊహించి రాకండి. కేవలం వృత్తిపరమైన విషయాలు మాత్రమే ఉంటాయని మీకు క్లియర్గా చెప్తున్నా అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు మంచి పని చేశావని మెచ్చుకుంటున్నారు. సినిమాకొందరు నెటిజన్లు మాత్రం.. నీ రీల్స్, ఫోటోలు ముందుగా చూడటానికి సబ్స్క్రిప్షన్ దేనికో? అని సెటైర్లు వేస్తున్నారు. కాగా నటి అన్నా రాజన్.. 2017లో 'అంగమలి డైరీస్' మూవీలో మలయాళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రంలో పృథ్వీరాజ్ భార్యగా నటించింది. మలయాళంలో పలు సినిమాలు చేసిన ఈ నటి ప్రస్తుతం జైలర్ 2లో నటిస్తోంది. తమిళంలో ఇదే తన తొలి సినిమా కావడం విశేషం! View this post on Instagram A post shared by Anna raajan (@annaspeeks) చదవండి: మైండ్ బ్లాక్ అయ్యే సిరీస్.. ఓటీటీలో ఎప్పుడంటే? -
ఆ బాధ నాకే ఎక్కువ తెలుసు..: విజయ్ దేవరకొండ
ఒక సినిమా రూపుదిద్దుకోవడం వెనక వందలాది మంది కష్టం దాగి ఉంటుంది. ఆ మూవీ రిలీజై ఆదరణ పొందినప్పుడు వారి శ్రమకు తగ్గ ఫలితం దక్కినట్లు లెక్క! కానీ రిలీజ్కు ముందే పైరసీ బారిన పడితే వారి కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఈ పైరసీ అతిపెద్ద భూతంగా మారింది. తాజాగా విజయ్ చివరి మూవీ జననాయగణ్ సినిమాకు లీకుల బెడద తప్పలేదు.జననాయగణ్ లీక్థియేటర్లలో విడుదలవడానికి ముందే ఈ చిత్రంలో అనేక సన్నివేశాలను ఆన్లైన్లో లీక్ చేశారు. దీనిపై చిత్రనిర్మాణ సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరైనా ఆ పైరసీ వీడియోలు చూసినా, షేర్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామంది. ఇక ఎంతోమంది సెలబ్రిటీలు జన నాయగణ్కు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా గళం విప్పుతున్నారు.ఆ బాధ అనుభవించా..తాజాగా హీరో విజయ్ దేవరకొండ సైతం ఈ విషయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. 'జననాయగణ్ సినిమా లీక్ అయిందన్న విషయం తెలిసి నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే సినిమా లీకైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు.. కెరీర్ తొలినాళ్లలోనే ఆ బాధను, నష్టాన్ని చవిచూశాను. మనల్ని టార్గెట్ చేయడంతో మన ఆశలన్నీ అడియాసలైపోతాయి. నేను కేవలం నా గురించి మాత్రమే చెప్పడం లేదు. నటులు, దర్శకులు, నిర్మాతలు.. ఇలా సినిమాలో భాగమైన ఎంతోమందికి ఇదే వర్తిస్తుంది.ఎంత దిగజారుతున్నారు?ప్రస్తుత సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలి. అలాగే దీని వెనక ఉన్న వ్యక్తులను గుర్తించాలి. అది గనక చేయలేకపోతే అది వ్యవస్థ వైఫల్యమే అవుతుంది. అవతలివారికి హాని చేయడానికి మనుషులు ఎంత దిగజారుతున్నారు? అనేదానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం. ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న జననాయగణ్ మూవీ టీమ్కు నా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది' అని ట్వీట్ చేశాడు.టాక్సీవాలాకాగా విజయ్ దేవరకొండ కెరీర్ తొలినాళ్లలో టాక్సీవాలా సినిమా చేశాడు. ఈ మూవీ కూడా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగానే లీక్ అయింది. అది చూసి విజయ్ మానసిక క్షోభ అనుభవించాడు. తన పనైపోయిందని గదిలో కూర్చుని ఏడ్చాడు. ఏదైతే అదైందని, సినిమా రిలీజ్ చేద్దామని పట్టుబట్టాడు. అలా పైరసీ జరిగిన సినిమాను థియేటర్లలో విడుదల చేసి మరీ హిట్టు కొట్టాడు. The #JanaNayagan leak makes me angry.I’ve experienced personally the pain and sense of loss when something like this happens, early in my career. You feel like a target, you feel a loss of hope, it’s not just about me, there are co-actors, directors, producers, and so many who…— Vijay Deverakonda (@TheDeverakonda) April 11, 2026 చదవండి: డెకాయిట్కు ఊహించని కలెక్షన్స్.. తొలిరోజు ఎంతంటే? -
'జన నాయగణ్' లీక్.. కావాలనే చేశారు: కమల్ హాసన్
దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగణ్. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ సెన్సార్ సమస్య కారణంగా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. దీంతో ఓటీటీ డీల్ కూడా రద్దయింది. ఈ క్రమంలో జననాయగణ్ సినిమా సోషల్ మీడియాలో లీకవడం సంచలనంగా మారింది. ప్రారంభ సన్నివేశాలు సహా సినిమాలోని అనేక సీన్స్ ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి.అందుకే ఇలా..ఈ ఘటనపై శివకార్తికేయన్, చిరంజీవి సహా ఎంతోమంది సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరసీని అరికట్టాలని, తమ కష్టాన్ని గౌరవించాలని కోరారు. తాజాగా ఈ వ్యవహారంపై లోకనాయకుడు కమల్ హాసన్ స్పందించారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదని, వ్యవస్థ వైఫల్యం వల్లే ఇలా జరిగిందని మండిపడ్డారు. సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో సకాలంలో రిలీజ్ అవలేదని, ఈ కారణం వల్లే పైరసీకి అవకాశం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ఎవరు కాపాడతారు?ఇది కళ, కళాకారుడిపై జరిగిన దాడి అని అభివర్ణించారు. ఇలాంటి చర్యలు వందలాది కళాకారులు, సాంకేతిక నిపుణులు, థియేటర్ ఓనర్లు, నిర్మాతలను ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించారు. వ్యవస్థ విఫలమైనప్పుడు సినిమాను ఎవరు కాపాడతారని ప్రశ్నించారు. సినీ ప్రియులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి పైరసీ చేసేవాళ్లకు గట్టి సమాధానమివ్వాలని కోరారు. గతంలో తనకు మద్దతుగా నిలబడినట్లే జననాయగణ్ సినిమాకు సైతం అంతే అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రజనీ రియాక్షన్ఈ ఘటనపై రజనీకాంత్ సైతం స్పందిస్తూ.. 'ఇంటర్నెట్లో జననాయగణ్ రిలీజైందన్న విషయం తెలిసి షాకయ్యాను. సినిమా సంఘాలు ఇటువంటి విషయాలపై తీవ్రంగా స్పందించాలి. ప్రభుత్వం పైరసీకి పాల్పడ్డ వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదు' అని ట్వీట్ చేశారు. The leak of #Jananayagan is not an accident - it is the result of systemic failure. Had due process been timely, we would not be here. Inordinate delays in certification created fertile ground for piracy. When legal access is stalled, illegitimate channels take over.Piracy is…— Kamal Haasan (@ikamalhaasan) April 10, 2026ஜனநாயகன் திரைப்படம் இணையத்தில் யாராலோ வெளியிடப்பட்டிருப்பது அதிர்ச்சியையும்,வேதனையையும் அளிக்கிறது. திரை அமைப்புகள் இதற்கு எதிராகக் குரல் எழுப்பி, அரசு இதைச் செய்தவர்களைக் கண்டுபிடித்து கடுமையான தண்டனை அளிக்க வேண்டும். இது போன்ற குற்றம் இனியும் தொடரக்கூடாது.— Rajinikanth (@rajinikanth) April 10, 2026 చదవండి: మా సినిమాను ధురంధర్తో పోల్చకండి: దర్శకుడు -
మా సినిమాను ధురంధర్తో పోల్చకండి: దర్శకుడు
ఆర్య హీరోగా నటించిన తాజా చిత్రం మిస్టర్ ఎక్స్. గౌతమ్ రామ్ కార్తీక్, శరత్ కుమార్, మంజు వారియర్ ప్రధాన పాత్రలు పోషించారు. అనగా, అతుల్య రవి, రైసా విల్సన్, సంజనా సింగ్, కాళీ వెంకట్, జయప్రకాశ్ కీలక పాత్రల్లో నటించారు. ఎఫ్ఐఆర్ ఫేమ్ మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 17న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ గురువారం (ఏప్రిల్ 9న) ప్రీరిలీజ్ కార్యక్రమం నిర్వహించింది.ఈ సందర్భంగా మంజు వారియర్ మాట్లాడుతూ.. స్పై థ్రిల్లర్ కథా చిత్రంలో నటించడం తన అదృష్టమని పేర్కొంది. గౌతమ్ రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. ఇది 70 శాతం యాక్షన్ సన్నివేశాలతో కూడిన సినిమా అన్నారు. దర్శకుడు మను ఆనంద్.. ఈ మూవీ ప్రపంచంలో ఏడు చోట్ల జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా అని తెలిపారు. హిందీ మూవీ ధురంధర్ కూడా వాస్తవ సంఘటనలతో రూపొందినా.. ఆ చిత్రాన్ని మిస్టర్ ఎక్స్తో పోల్చరాదని పేర్కొన్నారు. -
కాంతార వివాదం.. అలా చేసేందుకు ఒప్పుకున్న రణ్వీర్ సింగ్
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కాంతార వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ వివాదంపై ఇప్పటికే దురంధర్ హీరో క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ ఇంకా కోర్టులో ఇంకా నడుస్తోంది. రణ్వీర్ సింగ్ సోషల్ మీడియాలో చెప్పిన సారీ సరిపోదంటూ బెంగళూరుకు చెందిన న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాతపూర్వకంగా క్షమాపణ చెప్పడంతో పాటు కర్ణాటకలోని చాముండి ఆలయాన్ని సందర్శించాలని కోర్టు ఆదేశించింది.దీనిపై తాజాగా రణ్వీర్ సింగ్ న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు. మరోసారి క్షమాపణ పత్రాన్ని సమర్పిస్తామని రణ్వీర్సింగ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ముంబైలోని సింధీ కుటుంబంలో పెరగడం వల్ల తనకు ఇక్కడి ఆచారాలు, వాటి సున్నితత్వం గురించి అవగాహన లేదని తన క్షమాపణ పత్రంలో పేర్కొన్నారు. సరైన సమయంలో చాముండి ఆలయాన్ని సందర్శించి.. తన భక్తిని చాటుకుంటానని కోర్టుకు లిఖితపూర్వకంగా అందజేశారు.అసలు వివాదం ఎంటంటే?గతేడాది గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో కాంతార మూవీని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. 'కాంతార: చాప్టర్ 1' చిత్రంలోని ఒక కీలక సన్నివేశాన్ని అనుకరించారు. రిషబ్ నటనను ప్రశంసించే సందర్భంలో రిషబ్ అద్భుతమైన నటించారు.. ముఖ్యంగా ఆడ దెయ్యం(చాముండి దైవం) మీ శరీరంలోకి ప్రవేశించే షాట్ అమోఘం అంటూ వేదికపై యాక్షన్ చేస్తూ చూపించారు. ఇదంతా తమ దైవాన్ని కించపరిచేలా రణ్వీర్ ఇమిటేట్ చేశారంటూ పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. పవిత్రమైన దైవాన్ని దెయ్యంగా సంభోధించడం కరెక్ట్ కాదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తీవ్రమైన వ్యతిరేకత రావడంతో రణ్వీర్ సింగ్ బహిరంగంగా క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ ఈ వివాదంకర్ణాటక హైకోర్టుకు చేరింది. -
చిన్న సినిమా ఘన విజయం.. వారం రోజుల్లోనే సెంచరీ
మలయాళంలో రెండేళ్ల క్రితం సంచలన విజయం సాధించిన చిత్రాల్లో "వాళా" ఒకటి. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ.40 కోట్లు వసూలు చేసింది. వాళా అంటే మలయాళంలో అరటి మొక్క అని అర్థం. అలాగే పనీపాటా లేకుండా తిరిగే సోమరులని కూడా అదే పేరుతో పిలుస్తారు. వాళా చిత్రానికి 'బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్' అనేది ట్యాగ్లైన్ ఇచ్చారు.మలయాళంలో హిట్ కొట్టిన తెలుగు డైరెక్టర్2024లో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్గా 'వాళా 2' వచ్చింది. 'బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్' అనేది ఉపశీర్షిక. ఈ రెండు భాగాలకు కథ అందించింది విపిన్ దాస్ ఒక్కరే అయినా.. దర్శకులు మాత్రం మారారు. మొదటి భాగానికి ఆనంద్ మీనన్ దర్శకత్వం వహించగా రెండో భాగాన్ని సవిన్ డైరెక్ట్ చేశాడు. సీక్వెల్కు రూ.10 కోట్ల బడ్జెట్ కేటాయించారు. తెలుగు నిర్మాత సాహు గారపాటి ఈ సినిమా నిర్మాతల్లో ఒకరిగా ఉన్నాడు. సెంచరీ కొట్టిన వాళా 2ఏప్రిల్ 2న విడుదలైన ఈ చిత్రం ఏకంగా సెంచరీ కొట్టింది. కేవలం వారం రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోవడం విశేషం. ఈ ఏడాది మన శంకరవరప్రసాద్గారుతో హిట్ అందుకున్న సాహు గారపాటి.. మూడు నెలల్లో వాళా 2తో మరో బ్లాక్బస్టర్ అందుకున్నాడు. కాగా వాళా మొదటి భాగం హాట్స్టార్లో మలయాళంతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది. View this post on Instagram A post shared by Vaazha-2 Movie (@vaazhamovie) చదవండి: గాయపర్చుకున్న హీరో.. కదల్లేని స్థితిలో ఉంటే.. -
లోక మూవీ.. నన్ను మోసం చేశారు: మమ్ముట్టి
గతేడాది బ్లాక్బస్టర్ విజయాలు సాధించిన చిత్రాల్లో లోక మూవీ ఒకటి. ఈ మలయాళ చిత్రం తెలుగులో 'కొత్త లోక: చాప్టర్ 1 చంద్ర' గా రిలీజైంది. కల్యాణి ప్రియదర్శన్, నజ్లీన్, సాండీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నిర్మించాడు. అయితే ఈ చిత్రంలో మూతన్ పాత్ర కోసం దుల్కర్ తండ్రి మమ్ముట్టి వాయిస్ను ఉపయోగించారు.దుల్కర్ అడగలేదుమరి సీక్వెల్లో మమ్ముట్టి గొంతు మాత్రమే వినిపిస్తుందా? లేక ఆయన కనిపిస్తాడా? అని సినీ ప్రేక్షకులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ ఊహాగానాలపై తాజాగా మమ్ముట్టి స్పందించాడు. 'సినిమాలో నా ప్రమేయం ఉంటుందని చిత్రయూనిట్ నాకసలు చెప్పనేలేదు. మొదటిభాగం సమయంలోనూ దుల్కర్ నన్ను సంప్రదించలేదు, అతడి మేనేజర్, ఫ్రెండ్ వచ్చి.. నా గొంతు అరువివ్వమని అడిగారు. ఆ చేయి కూడా నాదేనట!మొదట తిరస్కరించినప్పటికీ చివరకు ఆ ఒక్కసాయం చేశాను. తీరా మూవీ రిలీజయ్యాక.. నేను వాయిస్ ఇచ్చిన పాత్ర నాదేనని, అందులో కనిపించే చేయి కూడా నాదేనని చెప్పారు. ఇది మోసం చేయడం కాక ఇంకేమవుతుంది? వాళ్లు చేసిన పని వల్ల ఇప్పుడు సీక్వెల్లో ఆ పాత్రలో నటించాల్సిన బాధ్యత నాపై పడింది. అయితే రెమ్యునరేషన్ తీసుకునే యాక్ట్ చేస్తాను. నేనడిగినంత ఇస్తే సినిమాలో భాగం అవుతాను' అని చెప్పుకొచ్చాడు.సినిమాకాగా డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన లోక మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో మమ్ముట్టి వాయిస్ ఓవర్ ఇచ్చిన మూతన్ పాత్ర తెరపై వినిపించిందే తప్ప కనిపించలేదు. సీక్వెల్లో ఆ పాత్ర కనిపించే అవకాశం ఉంది.చదవండి: మొదటి భార్యతో విడాకులు.. ఎంత దిగజారిపోయానంటే: ఆమిర్ ఖాన్ -
నా ఇంట్లో కోట్లు లేవు, రూ.40 వేలే ఉన్నాయి: నిర్మాత
మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయి ఈ మధ్యనే బెయిల్పై విడుదలయ్యారు నిర్మాత జాఫర్ సాదిక్. ఈయన నిర్మిస్తున్న మంగై, ఇరైవన్ మిగ పెరియవన్ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. కాగా ఏప్రిల్ 6న ఐటీ అధికారులు, ఎన్నికల స్క్వాడ్ అధికారులు చెన్నైలో జాఫర్ సాదిక్కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై జాఫర్ స్పందించారు.ఆ ప్రచారంలో నిజం లేదుఅధికారులు తన ఇళ్లలో సోదాలు నిర్వహించిన విషయం వాస్తవమేనని, అయితే పలు కోట్ల రూపాయలు, ఇతర డాక్యుమెంట్లు పట్టుబడినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. 5వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సోదాలు నిర్వహించారని, ఎలాంటి అనధికారిక డబ్బుకానీ, ఇతర డాక్యుమెంట్స్ గానీ లభించలేదని చెప్పి పత్రాలపై సంతకం చేయించుకుని వెళ్లిపోయారన్నారు.ఇంట్లో అంతే ఉందితన ఇంట్లో ఒక సాధారణ కుటుంబ ఖర్చులకు సరిపోయే రూ.40 వేలు మాత్రమే ఉన్నాయన్నారు. అదేవిధంగా ఇంతకుముందు కూడా పలు శాఖలకు చెందిన అధికారులు తన ఇళ్లల్లో తనిఖీలు చేశారని, అయితే ఐటీ అధికారులు మాత్రమే కరెక్ట్గా సోదాలు నిర్వహించారన్నారు. ఏదేమైనా ఈ వ్యవహారంలో తన గురించి అసత్య ప్రచారం చేయకూడదన్నారు. తాను ప్రశాంతంగా జీవించాలని భావిస్తున్నట్లు తెలిపారు. తను నిర్మిస్తున్న సినిమాలు రిలీజ్ చేసే పనిలో నిమగ్నమైనట్లు పేర్కొన్నారు. -
5 నిమిషాల క్లిప్ కాదు.. మొత్తం సినిమానే లీక్!
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న స్టార్ హీరో, దళపతి విజయ్కి లీకువీరులు పెద్ద షాకిచ్చారు. రిలీజ్కు రెడీగా ఉన్న 'జన నాయగణ్' సినిమా మొత్తాన్ని సోషల్ మీడియాలో లీక్ చేశారు. తొలుత 5 నిమిషాల సీన్స్ అని అంతా అనుకున్నారు. అయితే.. టోటల్గా మూవీ మొత్తం పార్టు పార్టులుగా సోషల్ మీడియాలో కనిపించేసరికి అభిమానులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ట్విటర్, ఇన్ స్టా, ఫేస్బుక్ ఈ చిత్రం గురించే పెద్ద చర్చ నడుస్తోంది. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన విజయ్, 'జన నాయగణ్' తన చివరి సినిమా అని ప్రకటించారు. లెక్క ప్రకారం ఈ ఏడాది సంక్రాంతికే థియేటర్లలోకి వచ్చేలా ప్లాన్ చేశారు. కానీ సెన్సార్ సమస్యల కారణంగా, కోర్టు కేసుల్లో ఇరుక్కుని ఇప్పటికీ అలానే ఉండిపోయింది. ఎట్టకేలకు తమిళనాడు ఎన్నికలు జరిగిన తర్వాత రిలీజ్ చేస్తారని నిర్మాతలు అనుకుంటున్నట్లు కొన్ని వార్తలొచ్చాయి. ఇంతలోనే నష్టం జరిగిపోయింది. దాదాపు మూడు గంటల నిడివి ఉన్న మూవీ మొత్తం పైరసీకి గురైనట్లు ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.'జన నాయగణ్' సినిమా.. తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి'కి రీమేక్గా తెరకెక్కించారు. విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ కాగా.. తెలుగులో శ్రీలీల చేసిన పాత్రని తమిళంలో మమిత బైజు చేసింది. అయితే సినిమాని లీక్ చేసింది ఎవరా అని ప్రస్తుతం డిస్కషన్ నడుస్తోంది. మూవీ టీమ్ నుంచి ఎవరైనా లీక్ చేశారా? లేదంటే ప్రత్యర్థి పార్టీలు విజయ్పై ఇలా కుట్ర చేస్తోందా? అని అనుకుంటున్నారు. -
ఓటీటీకి సూపర్ హిట్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఇంట్లోనే ఎంచక్కా నచ్చిన సినిమాలు తెగ చూసేస్తున్నారు. మరీ ముఖ్యంగా క్రైమ్ స్టోరీస్, హారర్, థ్రిల్లర్ చిత్రాలకు ఓటీటీలో ఫుల్ డిమాండ్ ఉంటోంది. వీటితో పాటు మలయాళ మూవీస్ సైతం ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అక్కడ హిట్ అయినా సినిమాలు డబ్బింగ్ చేసి తెలుగులోనూ స్ట్రీమింగ్ చేస్తున్నారు. తాజాగా మరో మలయాళ క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన సంభవం అధ్యాయం ఒన్ను ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. జియో హాట్స్టార్ వేదికగా ఏప్రిల్ 15వ తేదీ నుంచి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ చిత్రాన్ని టైమ్లూప్ కాన్సెప్ట్తో తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమాకు జీతూ సతీషన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అస్కర్ అలీ, వినీత్ కుమార్, అస్సిమ్ జమాల్, సిద్ధార్థ్ భరత్ కీలక పాత్రల్లో నటించారు. మార్చి మొదటివారంలో మలయాళంలో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ఈ మిస్టరీ హారర్కు తోడు టైమ్ ట్రావెల్ పాయింట్ కథతో తీర్చిదిద్దడంతో ఆడియన్స్ ఫిదా అయ్యారు. -
హన్సిక మాజీ వదినకు షాక్.. ఏకంగా రూ.2 కోట్లకు..!
దేశముదురు చిత్రంలో తనదైన నటనతో మెప్పించిన బ్యూటీ హన్సిక. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత బాలీవుడ్లోనూ నటించిన ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇదిలా ఉండగానే 2022లో సోహైల్ను పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. కానీ నాలుగేళ్లకే వీరి బంధం పటాపంచలైంది. ఈ ఏడాది మార్చి 11న ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది.ఆ తర్వాత హన్సిక తీరుపై మాజీ వదిన ముస్కాన్ నాన్సీ జేమ్స్ విమర్శలు చేసింది. హన్సిక విడాకులను ఉద్దేశించి అంతా ఫేక్ ప్రపంచం అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. వాస్తవానికి హన్సికకు, ముస్కాన్కు గతంలోనే విభేదాలు ఉన్నాయి. హన్సిక వల్లే తన సంసార జీవితం నాశనం అయిందని ముస్కాన్ ఆరోపించింది. 2020లో హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీతో ముస్కాన్ పెళ్లి జరిగింది. వివాహమైన కొంతకాలానికే డబ్బు, ఖరీదైన బహుమతులు కావాలని అత్త, ఆడపడుచు హన్సిక వేధించారని ముస్కాన్ అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.తాజాగా హన్సిక మాజీ వదినపై పరువునష్టం దావా వేసింది. తన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తోందని ముస్కాన్పై రూ.2 కోట్లకు పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాకుండా ముస్కాన్.. తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పిటిషన్లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన ముంబై సెషన్స్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై హన్సికకు వ్యతిరేకంగా ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్స్ చేయకూడదని ముస్కాన్ నాన్సీ జేమ్స్కు సూచించింది. ఇటీవలే విడాకులు తీసుకున్న హన్సిక తాజాగా మరోసారి వివాదంతో వార్తల్లో నిలిచింది. ఈ టాపిక్ కాస్తా సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.సినిమా కెరీర్.. హన్సిక హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. దేశముదురు అనే తెలుగు చిత్రంతో హీరోయిన్గా మారింది. తొలి సినిమాకే విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది. కంత్రి, మస్కా, కందిరీగ, ఓ మై ఫ్రెండ్, దేనికైనా రెడీ, పవర్.. ఇలా అనేక సినిమాలు చేసింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ మూవీస్ చేసింది. -
తిరుమల శ్రీవారి సేవలో నయన్ దంపతులు.. వీడియో వైరల్..!
కోలీవుడ్ స్టార్ కపుల్ విఘ్నేష్ శివన్, హీరోయిన్ నయనతార తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఈ జంటకు పండితులు ఆశీర్వచనాలు అందించారు. సంప్రదాయ దుస్తుల్లో వెళ్లిన నయన్ దంపతులు తిరుమల స్వామివారికి మొక్కులు చెల్లించకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ జంట దర్శనం అనంతరం అభిమానులతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. నయన్ భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన లేటేస్ట్ మూవీ ఎల్ఐకే(లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) ఏప్రిల్ 10న రిలీజవుతోంది. ఈ నేపథ్యంలోనే మూవీ తిరుమలలో పూజలు చేశారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించారు. ఈ మూవీలో ఎస్జే సూర్య ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించగా. నయనతార, విఘ్నేష్ శివన్, ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మించారు. -
నాకు నచ్చిందంటే నా భార్య వద్దన్నా వినను: హీరో
దివంగత నటుడు ముత్తరామన్ మనవడిగా, ప్రముఖ నటుడు కార్తీక్ కుమారుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్ రామ్ కార్తీక్. మణిరత్నం దర్శకత్వం వహించిన కడల్ అనే చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమవగా, తొలి చిత్రంతో మంచి గుర్తింపు పొందాడు. ఆ తరువాత వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోయాడు. 2022లో నటి మంజిమ మోహన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఇతడు క్రిమినల్, మిస్టర్ ఎక్స్, రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్, లెగసీ వంటి పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.ఆయనతో నటించడం..తాజాగా అతడు మాట్లాడుతూ.. లెగసీ చిత్రంలో నటుడు మాధవన్తో కలిసి నటించడం మంచి అనుభవం అన్నాడు. ఆయన తనకు చాలా సూచనలు ఇచ్చారన్నాడు. ఈ చిత్రంలో తనది కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అనీ, అయితే అలా ఎందుకు ప్రవర్తిస్తాను? అన్న దానికి కారణం కూడా ఉంటుందన్నాడు. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలన్నీ యాక్షన్ కథా చిత్రాలేనని, మంచి రొమంటిక్ కామెడీ కథా చిత్రాలు చేయాలని కోరుకుంటున్నానని చెప్పాడు. తాను అంగీకరించే కథల గురించి తన భార్య మంజిమ మోహన్తో చర్చిస్తానని తెలిపాడు. భార్య చెప్పినా విననుఆమె నటి కాబట్టి సలహాలు తీసుకుంటానన్నాడు. అయితే ఒక్కోసారి ఆమె వద్దని చెప్పినా, తాను ఆ పాత్రకు న్యాయం చేయగలనని అనిపిస్తే నటించడానికి అంగీకరిస్తానన్నాడు. తన తండ్రి కార్తీక్తో కలిసి నటించడానికి తానెప్పుడూ సిద్ధమేనని, కాకపోతే అందుకు తగ్గ మంచి కథ కుదరాలన్నాడు. భార్య మంజిమ మోహన్తో నటించరా? అని అడుగుతున్నారని, ఆమెతో నటించడానికి ఎప్పుడూ రెడీనే అని, మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. -
హీరో విజయ్ ర్యాలీలో ప్రమాదాలు.. యువతను హెచ్చరించిన రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్–2 మూవీ షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం సిబి చక్రవర్తి దర్శకత్వంలో కమల్హాసన్తో కలిసి రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న చిత్ర షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ బుధవారం ఉదయం చైన్నె విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. విజయ్ నటించిన జననాయకన్ చిత్ర విడుదలకు ఆటంకాలు కలగజేయడం, విజయ్ కారు వెంటపడి యువత ప్రమాదాలకు గురవడం, కమల్హాసన్తో నటించడం వంటి పలు విషయాల గురించి విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించారు.చదువుకోండికాగా విజయ్ నటించిన జననాయకన్ సినిమాపై స్పందించేందుకు రజనీకాంత్ ఇష్టపడలేదు. అయితే నటుల వాహనాల వెనక పడి యువత ప్రమాదాలకు గురవుతున్నారని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. చదువుకునే వయసులో విద్యపైనే పూర్తిగా శ్రద్ధ పెట్టాలని, చదువుకునే సమయాన్ని అశ్రద్ధ చేస్తే జీవితంలో చాలా కష్టపడాల్సి ఉంటుందన్నారు. దూరంగా ఉండండిఅదేవిధంగా యువత మద్యానికి, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు బానిస కాకూడదన్నారు. అలాంటి దురలవాట్లు కలిగిన ఫ్రెండ్స్ను దూరం పెట్టాలన్నారు. ఇకపోతే తాను, కమల్ హాసన్ కలిసి నటించనున్న చిత్రం ఆగస్టులో ప్రారంభం అవుతుందని రజనీకాంత్ తెలిపారు. విజయ్ ప్రచార కార్యక్రమాలకు యువత భారీ సంఖ్యలో హాజరవుతున్న తరుణంలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. -
రష్మిక ఊర్లో రిసెప్షన్.. మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన తండ్రి
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. ఇద్దరూ స్టార్ సెలబ్రిటీలే.. కానీ ఇద్దరి మధ్య ఎక్కడా కించిత్తు గర్వం కనిపించదు. ప్రేమ, అనురాగానికి తప్ప మరోదానికి చోటు లేదు అన్నట్లుగానే కనిపిస్తారు. వారి పెళ్లి వేడుకలు కూడా అలాగే చేసుకున్నారు. కేవలం వారికి మాత్రమే గుర్తుండిపోయేలా కాకుండా నలుగురూ గుర్తుపెట్టుకునేలా, నాలుగు కాలాలపాటు మాట్లాడుకునేలా సెలబ్రేషన్స్ జరిపారు. కొడవ పద్ధతిలో రిసెప్షన్అభిమానులకు స్వీట్లు పంచడం, ఊర్లోని మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు ప్రకటించడం, ఊరందరికీ భోజనాలు పెట్టడం.. ఇలా వారు చేసిన ప్రతీ పని మెచ్చుకోదగినదే! అయితే రష్మికను తెలుగింటి కోడలిగా పరిచయం చేస్తూ విజయ్ ఇక్కడ రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. అచ్చం అలాగే రష్ పేరెంట్స్ కూడా బంధువులకు, స్థానికులకు విజయ్ను అల్లుడిగా పరిచయం చేస్తూ తమ సొంతూరైన విరాజ్పేటలో రిసెప్షన్ నిర్వహించారు. మర్చిపోలేని కానుకకొడవ సాంప్రదాయం ప్రకారమే ఈ వేడుక జరిపారు. ఈ సందర్భంగా రష్మిక తండ్రి మదన్ మందన్నా కూతురికి విలువైన కానుక ఇచ్చాడు. పెళ్లయ్యాక అత్తారింటికి సాగనంపిన కూతురి కోసం కలకాలం గుర్తుండిపోయే బహుమతిచ్చాడు. విరాజ్పేట సమీపంలో సెరెనిటీ పేరుతో ఉన్న ఓ బంగ్లాను కూతురికి రాసిచ్చాడు. తండ్రిచ్చిన గిఫ్ట్తో రష్మిక భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది.సినిమాకాగా రష్మిక మందన్నా- విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో పెళ్లి చేసుకున్నారు. వీరు గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించారు. ప్రస్తుతం రణబాలి సినిమాలో జంటగా యాక్ట్ చేస్తున్నారు.చదవండి: ఆగిపోయిన డ్రాగన్ షూటింగ్? స్పందించిన ప్రశాంత్ నీల్ టీమ్ -
అల్లు అర్జున్- అట్లీ మూవీ టైటిల్ ఇదే.. రాక్షసుడిగా బన్నీ లుక్!
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. అప్పటివరకు సౌత్లో ఫాలోయింగ్ తెచ్చుకున్న అతడు పుష్ప తర్వాత పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. నేషనల్ లెవల్లోనే కాదు ఇంటర్నేషనల్ లెవల్లోనూ గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ సినీ మ్యాగజైన్ ది హాలీవుడ్ రిపోర్టర్ కవర్ పైజీపైనా స్థానం సంపాదించుకున్నాడు. సినిమా కోసం ఎంతదూరమైనా వెళ్లే బన్నీ.. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు.రాకాఈ మూవీకి లెగసీ, అయాన్, స్పార్క్.. ఇలా రకరకాల టైటిల్స్ పరిశీలించగా చివరాఖరకు ఓ మంచి టైటిల్ను ఫైనల్ చేశారు. నేడు (ఏప్రిల్ 8న) అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఈ చిత్రానికి "రాకా" టైటిల్ను ప్రకటించారు. అలాగే పోస్టర్ కూడా వదిలారు. ఇందులో బన్నీ అరగుండుతో, తోడేలు వంటి చేయితో నెగెటివ్ లుక్లో కనిపిస్తున్నాడు. ఇది చూసిన అభిమానులు పోస్టర్ చాలా వైవిధ్యంగా ఉందని, బన్నీ లుక్తో తమ కడుపు నింపేశారని చిత్రయూనిట్ను కొనియాడుతున్నారు.సినిమారాకా సినిమా విషయానికి వస్తే.. ఇది పునర్జన్మల కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న చిత్రమని సమాచారం. ఇందులో బన్నీ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ముందునుంచి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నేడు రాక్షసుడిగా బన్నీ లుక్ను వదిలినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. అలాగే మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఇందులో భాగం కానున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. #AA22xA6 is now #Raaka ⚔️Prepare yourself for a vision beyond limits ✨@alluarjun @Atlee_dir @deepikapadukone⁰#राका | #రాకా | #ರಾಕಾ | #ராக்கா | #രാക്ക | #রাকা | راکا# pic.twitter.com/ymTBHoOfpI— Sun Pictures (@sunpictures) April 8, 2026 చదవండి: నయన్ సడన్ సర్ప్రైజ్.. స్టేజ్పై భర్త ఎమోషనల్ -
శింబు కోసం రాలేదు, కానీ ఒక్కటి అడుగుతా..: హీరో తండ్రి
కోలీవుడ్ హీరో శింబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'అరసన్'. వెట్రిమారన్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ రెండో షెడ్యూల్ చైన్నెలో జరుపుకుంటోంది. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ షూటింగ్ను తమిళ సినీ నిర్మాతల మండలి, పెప్సీ కలిసి నిలిపేసినట్లు సమాచారం. ఈ విషయంపై శింబు తండ్రి, దర్శక నిర్మాత టి.రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అరసన్ చిత్రం కోసమో, శింబు కోసమో వాదించడానికి నేను రాలేదు. ఆ గొడవ ఎప్పుడో అయిపోయిందితమిళ చిత్ర నిర్మాతల మండలి, దానికి సహకరిస్తున్న దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య అధర్మంగా ప్రవర్తించకూడదని చెప్పడానికే నేను వచ్చాను. ఇంతకు ముందు శింబు నటించిన 'వెందు తనిందదు కాడు' చిత్ర నిర్మాత ఐసరి గణేష్.. శింబుకు వ్యతిరేకంగా చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన తర్వాతి సినిమా కోసం రూ.5 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు కానీ ఆ మూవీ పట్టాలెక్కలేదు. అయితే ఈ కేసులో శింబు సరసన చట్టపరంగా నేను పోరాడి గెలిచాను. నిర్మాత ఇచ్చిన అడ్వాన్స్ శింబుకే చెందుతుంది అని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆ నకళ్లు నా చేతిలోనే ఉన్నాయి. నటుడికి మద్దతుగా నిలబడరా?ఇలాంటి పరిస్థితుల్లో ఆ పాత కేసును దృష్టిలో పెట్టుకుని నిర్మాతల మండలి, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య.. ఈ రోజు అరసన్ చిత్ర షూటింగ్ను నిలిపివేసినట్లు తెలిసింది. ఈ విషయంలో నేడు అడగదలచుకున్నది ఒక్కటే. ఒక నిర్మాత కోసం నిర్మాతల సంఘం, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య పోరాడుతుంటే ఒక నటుడికి దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఎందుకు మద్దతుగా నిలబడడం లేదు. ఈ సంఘం నటుడికి మద్దతుగా నిలబడాలి. అతడికి న్యాయం చేయాలి. మంచి పరిష్కారాన్ని చూపాలి అని టి.రాజేంద్రన్ పేర్కొన్నారు.చదవండి: నయనతార సర్ప్రైజ్.. ఎమోషనలైన విఘ్నేశ్ శివన్ -
నయనతార సడన్ సర్ప్రైజ్.. స్టేజ్పై భర్త ఎమోషనల్
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార సినిమాలు చేస్తుంది, కానీ ప్రమోషన్స్పై పెద్దగా ఆసక్తి చూపదు. సినిమాల్లో నటించడం వరకే తన పని అన్నట్లుగా తన పనేదో తాను చేసుకుంటూ పోతుంది. అయితే ఇటీవల చిరంజీవి 'మన శంకరవరప్రసాద్గారు' మూవీ కోసం మాత్రం ఆ రూల్ బ్రేక్ చేసింది. ప్రమోషనల్ వీడియోలో కనిపించడంతో పాటు సక్సెస్మీట్లోనూ పాల్గొని సందడి చేసింది.సర్ప్రైజ్తాజాగా మరోసారి ప్రమోషన్స్లో కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. నయనతార నిర్మిస్తున్న తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఆమె భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ మంగళవారం (ఏప్రిల్ 7న) గ్రాండ్గా జరిగింది. విఘ్నేశ్ మాట్లాడుతున్న సమయంలో నయన్ సడన్గా స్టేజీపై ఎంట్రీ ఇచ్చి అందర్నీ సర్ప్రైజ్ చేసింది. ఆమె రాకను చూసి విఘ్నేశ్ భావోద్వేగానికి లోనయ్యాడు. వీడియో వైరల్భార్యను కొద్ది క్షణాల పాటు హత్తుకుని షాక్లో ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భర్త కోసమే నయన్ ఈ ఈవెంట్కు వచ్చినట్లు తెలుస్తోంది. ఎల్ఐకే (Love Insurance Kompany Movie) విషయానికి వస్తే.. లవ్టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించాడు. ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి కథానాయికగా యాక్ట్ చేసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీ ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.#LIK -;#Nayanthara appears for an Audio Launch function, after a long time, just because for #VigneshShivan ❤️ pic.twitter.com/R6cdrCWE3J— AmuthaBharathi (@CinemaWithAB) April 7, 2026 -
కీర్తి సురేశ్కు మందు అలవాటు లేదు కానీ..: సమంత
మాతృభాష మలయాళంలో బాలనటిగా రంగ ప్రవేశం చేసి ఆ తరువాత కథానాయికగా పరిచయం అయింది కీర్తి సురేష్. ఆ వెంటనే తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్గా నటిస్తూ క్రేజ్ సంపాదించుకుంది. మహానటి చిత్రంతో సత్తా చాటింది. ఈ మధ్య బేబీ జాన్ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ హిందీ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఏదేమైనా ఇటీవల ఈమె నటించిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేదు.సినిమాకీర్తి చివరిగా నటించిన హిట్ చిత్రం మామన్నన్. ఈమె ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవర కొండకు జంటగా రౌడీ జనార్ధన్ చిత్రంలో నటిస్తోంది. తమిళంలో ఈమె నటించిన కన్నివెడి చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఇకపోతే కీర్తి సురేష్, హీరోయిన్ సమంత మంచి స్నేహితురాళ్లు అన్నది తెలిసిందే. కాగా నటి కీర్తి సురేష్కి మద్యం తాగే అలవాటు ఉందని ప్రచారం జరుగుతోంది. ఆ అలవాటు లేదు కానీ..దీని గురించి సమంత స్పందిస్తూ.. కీర్తి సురేష్కు మద్యం అలవాటు లేదు కాని ఒక్క అలవాటు మాత్రం ఉందని చెప్పింది. అదేమిటంటే హైపర్ మ్యాక్ అనే అధికంగా నవ్వించే గుణం ఉందని తెలిపింది. అర్ధరాత్రి వరకు మాట్లాడుతూ నవ్విస్తూనే ఉంటుందని పేర్కొంది. అదే విధంగా అతి వేగంగా రైమింగ్ మాటలతో ఇతరులను ఆటపట్టిస్తుందని సమంత చెప్పుకొచ్చింది. -
వెండితెరపై ఆధ్యాత్మిక శోభ
సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రేమకథలు, యాక్షన్, థ్రిల్, పొలిటికల్, హారర్... ఇలా అన్నమాట. అయితే ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఆధ్యాత్మిక ట్రెండ్ బాగా నడుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా నడుస్తోందని చెప్పవచ్చు. భక్తి, హిందుత్వం, మైథలాజీ, ధర్మం ఆధారంగా రూపొందుతోన్న చిత్రాలకు ప్రేక్షకాదరణ కూడా బాగా ఉంటోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా అద్భుతంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వెండితెరపై ప్రేక్షకులకు ఆధ్యాత్మిక శోభ చూపించేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు.భక్తి నేపథ్యంలో రూపొందే సినిమాల్లో నటించేందుకు స్టార్ హీరోల నుంచి యువ హీరోల వరకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా ‘విశ్వంభర’, రవితేజ ‘ఇరుముడి’, మహేశ్బాబు ‘వారణాసి’, రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’, రణ్బీర్ కపూర్ ‘రామాయణ’, నిఖిల్ ‘స్వయంభు’, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘హైందవ’ సినిమాలతో పాటు ‘మహావతార్ నరసింహా, వాయుపుత్ర’ వంటి యానిమేషన్ మూవీస్ కూడా రూపొందుతున్నాయి. ఆయా సినిమాల వివరాలేంటో ఓ లుక్కేద్దాం.హనుమంతుడు తోడుగా... ఆంజనేయస్వామికి హీరో చిరంజీవి ఎంత పెద్ద భక్తుడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపైనా హనుమంతుడి పట్ల తన భక్తి భావాన్ని ప్రదర్శిస్తుంటారాయన. ఈ నేపథ్యంలోనే ఆయన నటించిన తాజా చిత్రం ‘విశ్వంభర’లోనూ మరోసారి హనుమంతుడి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఉండనున్నాయి. తొలి చిత్రం ‘బింబిసార’తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహించిన చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. సోషియో ఫ్యాంటసీ, పురాణాల నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది.చిరంజీవి హీరోగా నటించిన బ్లాక్బస్టర్ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ లాంటి ఒక అద్భుతమైన సోషియో ఫ్యాంటసీ కథతో రూపొందిన ‘విశ్వంభర’ మూవీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కీలకమైన ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ వద్ద 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని నెలకొల్పారు మేకర్స్. అక్కడ ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ ఆధ్వర్యంలో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి ఓ హైలెట్గా నిలుస్తాయని టాక్. ఆ మధ్య విడుదలైన టీజర్ చూస్తే విలన్లను రఫ్ఫాడిస్తున్న చిరంజీవి వెనక నిలువెత్తు హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది. వాస్తవానికి ‘విశ్వంభర’ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడిన సంగతి తెలిసిందే.ఈ మూవీని విజువల్ వండర్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గ్రాఫిక్స్, సీజీ వర్క్ కోసం భారీ సమయాన్ని వెచ్చిస్తున్నారు మేకర్స్. గత ఏడాది తన పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా చిరంజీవి స్వయంగా ఓ వీడియో విడుదల చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ‘‘చందమామ కథలా ‘విశ్వంభర’ ఉంటుంది. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ వండర్ని అందించేందుకు సమయం పడుతోంది. 2026 వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది’’ అంటూ చిరంజీవి ఆ వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి.అయితే గ్రాఫిక్స్కి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతోందట. ఈ కారణంగా ఈ మూవీ గురించి ఎలాంటి కొత్త అప్డేట్ ఇవ్వడం లేదట చిత్రయూనిట్. ముందుగా అనుకున్నట్లు ‘విశ్వంభర’ ఈ వేసవి ముగిసేలోపు ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేకుంటే మరోసారి వాయిదా పడుతుందా? అనే చర్చ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో జరుగుతోంది. ఏది ఏమైనా ఈ సినిమా రిలీజ్ గురించి చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు.అయ్యప్ప మాలధారిగా... వరుస కమర్షియల్ సినిమాలతో దూసుకెళుతుంటారు రవితేజ. అయితే ఈసారి ఆయన రూట్ మార్చి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టారు. రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ఆయన కెరీర్లో 77వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర చేస్తోంది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అయ్యప్ప మాలధారిగా కనిపించనున్నారు రవితేజ.‘‘ఇరుముడి’ చిత్రంలో యాక్షన్ ప్రధాన ఆకర్షణగా ఉన్నప్పటికీ అద్భుతమైన కథ, కాన్సెప్ట్ ఉంటాయి. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. రవితేజ ఇంతకు ముందెన్నడూ పోషించని విభిన్నమైన పాత్రను ‘ఇరుముడి’లో పోషిస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్కు అవసరమైన అన్ని అంశాలను, బలమైన భావోద్వేగాలను సమతుల్యం చేస్తూ అద్భుతంగా రూపొందిస్తున్నారు శివ నిర్వాణ. ఈ సినిమా కోసం రవితేజ కంప్లీట్గా మేకోవర్ అయ్యారు. ఇందులో తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే బలమైన భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ‘ఇరుముడి’ షూటింగ్ ఇప్పటికే 50 శాతానికి పైగా పూర్తయింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. జై హనుమాన్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన బ్లాక్బస్టర్ మూవీ ‘హనుమాన్’. తేజ సజ్జ, అమృతా అయ్యర్ జోడీగా నటించారు. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ‘హనుమాన్’ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజై, పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ సాధించి, అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. ‘హనుమాన్’కి కొనసాగింపుగా ‘జై హనుమా న్ ’ మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (‘కాంతారా’ మూవీ ఫేమ్) నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి రాముడి విగ్రహాన్ని హత్తుకుని ఉన్న హనుమంతుడిగా విడుదలైన ఆయన ఫస్ట్ లుక్కి అద్భుతమైన స్పందన వచ్చింది.ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘హనుమాన్’ మూవీ బ్లాక్బస్టర్గా నిలవడంతో ఆ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న ‘జై హనుమాన్’పై భారీ అంచనాలున్నాయి. పైగా ‘కాంతారా, కాంతారా చాప్టర్ 2’ మూవీస్తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో టైటిల్ రోల్లో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్పై ట్రేడ్ వర్గాల్లోనూ మరింత క్రేజ్ నెలకొంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో ఈ చిత్రం రూపొందుతోంది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన వాగ్దానం చుట్టూ తిరిగే ఈ కథాంశం ప్రేక్షకులను సరికొత్త ఆధ్యాత్మిక, సాహసోపేత ప్రపంచంలోకి తీసుకెళ్లనుందట. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ సైలెంట్గా, పక్కా ప్రణాళికతో కొనసాగుతోంది. ‘హనుమాన్’ మూవీలో తనదైన నటనతో మెప్పించిన తేజ సజ్జా ఈ సీక్వెల్లోనూ నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుందని ఫిల్మ్నగర్ టాక్. శ్రీరాముడు–రుద్ర ‘బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో తెలుగు సినిమా సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాలో మహేశ్బాబు హీరోగా నటిస్తున్నారు. ప్రియాంకా చొప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు మహేశ్బాబు. వారణాసి నేపథ్యంలో భక్తి బ్యాక్డ్రాప్లో రూపొందుతోన్న ఈ సినిమాలో మహేశ్బాబు మునుపెన్నడూ చూడని విధంగా శ్రీరాముడు, రుద్ర అనే రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు.ఈ సినిమా చిత్రీకరణని జార్జియాతో పాటు పలు అంతర్జాతీయ ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నారు రాజమౌళి. అంతేకాదు... ఈ మూవీ కోసం హైదరాబాద్ శివారులో వారణాసిని సృష్టించారు. అచ్చం వారణాసిలా తీర్చిదిద్దిన సెట్లో సినిమాలోని కీలకమైన సన్నివేశాలను రూపొందిస్తున్నారు. బిగ్ స్క్రీన్ మీద ఒక గొప్ప అనుభూతినిచ్చేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు మేకర్స్. ఈ విజువల్ వండర్ను చూడటానికి తెలుగు సినిమా ప్రేక్షకులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘‘వారణాసి’ నా కలల ప్రాజెక్ట్. ఈ చిత్రం అందర్నీ గర్వపడేలా చేస్తుంది’ అని మహేశ్బాబు చెప్పడంతో ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్నంటాయి.ఈ మూవీ భారతదేశంలోనే కాకుండా ‘గ్లోబ్ట్రోటర్, టైమ్ట్రోటర్’ అనే ట్యాగ్లై న్ లతో అంతర్జాతీయ వేదికపై కూడా సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. మహేశ్బాబు, ప్రియాంకా చొప్రా, పృథ్వీరాజ్లపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయిందని సమాచారం. జూన్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని రాజమౌళి ΄్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2027 ఏప్రిల్ 7న గ్లోబల్ స్థాయిలో ‘వారణాసి’ విడుదల కానుంది. మహేశ్బాబు– రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీపై గ్లోబల్ స్థాయిలో ఫుల్ బజ్ నెలకొంది. స్వయంభు కోసం... ‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియన్ హిట్ మూవీ తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో విడుదల కానుంది. నిఖిల్ నటిస్తున్న 20వ చిత్రం ‘స్వయంభు’. ఇది పూర్తిగా పురాణ, భారతీయ యోధుల చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. దర్శకుడు భరత్ కృష్ణమాచారి ఈ చిత్రాన్ని స్టైలిష్, హిస్టారికల్ యాక్షన్ మైథలాజికల్గా రూపొందిస్తున్నారు. నిఖిల్ వేషధారణ, యాక్షన్ లుక్ ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి రేపాయి.తన పాత్ర కోసం నిఖిల్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అవడంతో పాటు ఇంటె న్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా వీఎఫ్ఎక్స్ పనుల వల్ల ఆలస్యం అవుతోందట. ఇండియాలోని టాప్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాయని తెలిసింది. ఈ విజువల్ వండర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం కావాల్సినంత సమయం తీసుకొని, వరల్డ్ క్లాస్ ఔట్పుట్ అందించేందుకు మేకర్స్ పూర్తి కమిట్మెంట్తో పని చేస్తున్నారు. నిఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీగా ‘స్వయంభు’ రూపొందుతోంది.‘‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియా విజయం తర్వాత అంతకంటే అద్భుతమైన ప్రాజెక్ట్తో రావాలని ఇన్ని రోజులు ఆగాను. చాలా శ్రద్ధతో, భయంతో అన్ని జాగ్రత్తలతో చేసిన సినిమా ‘స్వయంభు’. ఈ చిత్రం చూసిన తర్వాత నిఖిల్ మావాడు అని చెప్పడానికి మీరంతా చాలా సంతోషపడతారు’’ అని ఇటీవల జరిగిన ప్రెస్మీట్లో నిఖిల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దశావతార ఆలయం నేపథ్యంలో... హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హైందవ’. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో సంయుక్త హీరోయిన్గా నటిస్తున్నారు. శివన్ రామకృష్ణ సమర్పణలో మూన్షైన్ పిక్చర్స్పై మహేశ్ చందు నిర్మిస్తున్న ఈ సినిమా కూడా భక్తి నేపథ్యంలో రూపొందుతోంది. జనవరి 3న సాయి శ్రీనివాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిత్రయూనిట్ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ‘అతను ఒంటరివాడు కాదు... అతనికి అండగా ఆ దశావతారాలే ఉన్నాయి’ అంటూ ఈ పోస్టర్లో ఇచ్చిన క్యాప్షన్ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.అలాగే టైటిల్ టీజర్కి కూడా మంచి స్పందన వచ్చింది. శతాబ్దాల నాటి దశావతార ఆలయం నేపథ్యంలో ఈ కథాంశం యాక్షన్, ఆధ్యాత్మికతలను మేళవిస్తుంది. సర్పదేవత పచ్చబొట్టుతో పాటు పవిత్రమైన విష్ణు నామాలు వంటి చిహ్నాలు కూడా టీజర్లో కనిపిస్తాయి. దుండగుల బారి నుంచి దశావతార ఆలయాన్ని హీరో ఎలా కాపాడాడు? అన్నది ఆసక్తిగా ఉంటుంది. పురాణాలకు, ప్రస్తుత కాలానికి ముడిపడి ఉన్న సాలిడ్ థ్రిల్లర్గా, భారతీయ ధర్మం, ఆచారాలపై ఆధారపడిన పౌరాణిక యాక్షన్ డ్రామాగా ‘హైందవ’ చిత్ర కథాంశం ఉండనుందట. ఈ మూవీలో ఓ ధార్మిక యోధుడి పాత్రలో కనిపించనున్నారట సాయి శ్రీనివాస్.నాగబంధం ‘పెద కాపు’ మూవీ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటించిన చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లు. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. అహ్మద్ షా అబ్దాలి భారతదేశంపై జరిపిన చారిత్రక దాడుల నేపథ్యంలో భారతీయ ఆధ్యాత్మిక మూలాలను మేళవిస్తూ అభిషేక్ నామా తెరకెక్కించారు.మహా శివరాత్రి సందర్భంగా హీరో మహేశ్బాబు ‘నాగబంధం’ టీజర్ని విడుదల చేసి, ‘‘టీజర్ అద్భుతంగా ఉంది, సినిమా కోసం ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. హిమాలయ శిఖరాల్లో దాగి ఉన్న ఒక అంతు చిక్కని రహస్యం, కాలానికే అందని ఒక పురాతన శక్తి నేపథ్యంలో అల్లుకున్న సస్పె న్స్ బ్యాక్డ్రాప్లో ‘నాగబంధం’ని రూపొందించారని సమాచారం. ఇందులో విరాట్ కర్ణ శక్తిమంతమైన యోధుడిగా నటించారు. ఈ చిత్రంలో నాగబంధం, శివ తంత్ర విద్య, నాగబంధం ఆలయం వెనక ఉన్న గుప్తనిధులు వంటి అంశాలు కథలో హైలెట్ కానున్నాయట. ఈ సినిమా ఈ వేసవిలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయనే చర్చ నడుస్తోంది. గదాధారి హనుమాన్... రవి కిరణ్ హీరోగా నటించిన చిత్రం ‘గదాధారి హనుమాన్’. రోహిత్ కొల్లి దర్శకత్వం వహించారు. విరభ్ స్టూడియో బ్యానర్పై రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇటీవల ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ని హైదరాబాద్లో నిర్వహించారు. ‘‘మైథలాజికల్ జానర్లో భారీ బడ్జెట్తో రూపొందిన చిత్రం ‘గదాధారి హనుమాన్’.ఈ సినిమా కథ చాలా బలమైనది. అందుకే ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు మా సినిమా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోష న్స్ను అద్భుతంగా పండించాం. ఈ మూవీ గ్లింప్స్, టీజర్లోనూ గదనే ఎక్కువగా చూపించాం. గద ఎంత పవర్ఫుల్ అన్న దానిపై ఓ సీక్వె న్స్ కూడా మా చిత్రంలో అద్భుతంగా ఉంటుంది. మా సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని రవికిరణ్ తెలిపారు.యానిమేషన్ కూడా... ఇదిలా ఉంటే... రెగ్యులర్ ఫీచర్ ఫిల్మ్స్తో పాటు ‘మహావతార్ నరసింహా’, ‘వాయుపుత్ర’ వంటి యానిమేటెడ్ సినిమాలు కూడా రానున్నాయి. అశ్విన్కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ‘మహావతార్ నరసింహా’ యానిమేటెడ్ చిత్రం సూపర్ హిట్గా నిలవడంతో పాటు భారీ వసూళ్లు రాబట్టింది. 2037 వరకు ఏడు భాగాలుగా ఈ సినిమాను తీసుకురానున్నట్లు హోంబలే ఫిల్మ్స్ ఇప్పటికే ప్రకటించింది. ఇక చందు మొండేటి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న యానిమేటెడ్ ఫిల్మ్ ‘వాయుపుత్ర’ పైనా మంచి అంచనాలున్నాయి.రామాయణం హిందీ చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘రామాయణ’. ఈ మూవీలో శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్షణుడిగా రవీ దూబే నటిస్తున్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ, యశ్ మాన్స్టర్మైండ్ క్రియేష న్న్స్ సహకారంతో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, పరశురాముడిగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై పాన్ ఇండియా స్థాయిలో ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ‘రామాయణ’ చిత్రం తొలి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి.– డేరంగుల జగన్ మోహన్ -
సుప్రియను వెక్కిరించడానికే వచ్చా.. నాగవంశీ ర్యాగింగ్
‘డెకాయిట్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో నిర్మాత నాగవంశీ, సహ నిర్మాత సుప్రియపై సరదాగా ర్యాగింగ్ చేశారు. సినిమాలు ఎక్కువ రోజులు తీస్తున్నామని ఎప్పుడూ తమకు క్లాస్ పీకే సుప్రియ ఇప్పుడు రెండు సంవత్సరాలు కష్టపడి ‘డెకాయిట్’ పూర్తి చేసిందనిక వెక్కిరిస్తూ మాట్లాడారు. మమ్మల్ని సినిమాలు ఎందుకు ఇన్ని రోజులు తీస్తున్నారంటూ సుప్రియ ఎప్పుడూ తిట్టేవారు. కానీ ఇప్పుడు ఆమె రెండు సంవత్సరాలు కష్టపడి 147 వర్కింగ్ డేస్లో సినిమా తీశారు. ఇకపై మమ్మల్ని తిట్టే హక్కు ఆమెకు లేదని ఆటపట్టించారు. నిర్మాత కష్టాలు ఎలా ఉంటాయో సుప్రియకు చూపించినందుకు అడివి శేష్కు థ్యాంక్స్ చెప్పారు. అలాగే, “హీరోల్ని నెత్తిన ఎక్కించుకున్నామని ఎప్పుడూ క్లాస్ పీకే సుప్రియ, ఇప్పుడు తొలిసారి బయట హీరోతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అనుభవించారు. ఇంతకు ముందు తన ఫ్యామిలీ హీరోలతోనే సినిమాలు తీసిన సుప్రియకు ఈ అనుభవం చాలా ఉపయోగపడుతుంది. డెకాయిట్ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. మరింత మంది హీరోలతో సుప్రియ సినిమాలు చేసి తమలాగే కష్టపడాలని చమత్కరించారు. ఓ వైపు నాగవంశీ సరదాగా ర్యాగింగ్ చేస్తుంటే, పక్కనే ఉన్న సురేశ్ బాబు నవ్వుతూ ఎంజాయ్ చేయడం వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
ఓ సారి బ్రేకప్.. అమ్మకు కూడా తెలుసు: ఉప్పెన బ్యూటీ
ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా వస్తోన్న ఈ ప్రేమకథా చిత్రంలో హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది.ఎల్ఐకే రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. హీరోయిన్ కృతిశెట్టి సైతం ప్రమోషన్స్లో పాల్గొన్నారు. ప్రేమకథా చిత్రం కావడంతో కృతి శెట్టి కూడా ప్రేమ, బ్రేకప్ గురించి మాట్లాడారు. తాను ప్రస్తుతం సింగిల్గానే ఉన్నానని తెలిపింది. అయితే ఓసారి బ్రేకప్ అయిందన్న విషయాన్ని రివీల్ చేసింది. ఈ విషయం మా అమ్మకు కూడా తెలుసని కృతి శెట్టి చెప్పుకొచ్చింది. నా గురించి సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం చేస్తే అలాంటి వారిని మాత్రమే బ్లాక్ చేస్తానని వెల్లడించింది ఉప్పెన బ్యూటీ. #PradeepRanganathan - I prefer to say I’m single. I’ve gone through many break-ups💔. I have not blocked anyone, but people have blocked me, and I used to reply faster than even ChatGPT during my college days itself😂#KrithiShetty - I’m single & I’ve gone through 1 break-up. My… pic.twitter.com/IUiPpHhx8A— AmuthaBharathi (@CinemaWithAB) April 7, 2026 -
ఊరు మాత్రమే కదా మారుతోంది!
‘తను భూమిపై తిరిగి హక్కును దక్కించుకోవడానికి వస్తాడు సార్.. ఈ గడ్డ నరనరాన్ని అతడు తెంచేస్తాడు..ఆ నేల అసలైన యజమాని’ అనే డైలాగులతో ‘పళ్లిచట్టంబి’ ట్రైలర్ ఆరంభం అయింది. టొవినో థామస్ హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘పళ్లి చట్టంబి’. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మించారు.ఈ సినిమా ఏప్రిల్ 10న తెలుగు, మలయాళ, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ని రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఏంటి మై డియర్ రౌడీగారు కొంచెం నవ్వొచ్చుగా’, ‘నువ్వు భలేరౌడీవే.. మా ఊరి వాళ్లందర్నీ బాగానే మాయ చేసేశావ్(కయాదు లోహర్)’, ‘ఊరు మాత్రమే కదా మారుతోంది.. మట్టి, మనుషులు అందరికీ ఒక్కటే కదా’ అంటూ టొవినో థామస్ చెప్పే డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: టిజో టోమీ, సంగీతం: జేక్స్ బిజోయ్. -
'అశ్వత్థామ'గా రామ్చరణ్.. ఆదిత్య ధర్తో చర్చలు?
బాలీవుడ్లో రాబోయే భారీ ప్రాజెక్టులపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ‘యూరి: ది సర్జికల్ స్ట్రైక్’తో బిగ్ హిట్ అందుకున్నాడు దర్శకుడు ఆదిత్య ధర్. కొంతకాలం క్రితం ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అనే కథను తెరపైకి తీసుకురావాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో జియో స్టూడియోస్తో ఒప్పందం కుదుర్చుకుని, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. అయితే ఆ సమయంలో కొన్ని అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఆ ప్రాజెక్టుకు రామ్చరణ్ పేరు బలంగా వినిపించింది. అప్పుడే ‘ఆర్ఆర్ఆర్’ విజయంతో ఆయనపై బాలీవుడ్ దృష్టి పడింది. అశ్వత్థామ పాత్రకు చరణ్ సరైన ఎంపిక అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ ఈ కథపై చర్చలు మొదలయ్యాయి. దానికి కారణం.. ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్’ ఫ్రాంచైజీ. ధురంధర్ చిత్రం రెండు భాగాలతో భారీ విజయాన్ని సాధించిన ఆదిత్య ధర్పై నిర్మాణ సంస్థలు నమ్మకం పెంచుకున్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ‘ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మెగా ఫ్యాన్స్ మాత్రం అప్పటి పుకారు ఇప్పుడు నిజమవ్వాలని కోరుకుంటున్నారు. రామ్చరణ్ ఈ ప్రాజెక్టులో భాగమైతే, బాలీవుడ్లో మరో భారీ అడుగు వేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. -
కోర్ట్ రీమేక్.. స్టార్ నటి వారసురాలి ఎంట్రీ..!
తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన మూవీ కోర్ట్. రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ కీలక పాత్రలో మెప్పించారు. ఇక్కడ సూపర్ హిట్ అయిన మూవీని కోలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. త్యాగరాజన్ డైరెక్షన్లో రంజన్ పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీతో సీనియర్ హీరోయిన్, నటి దేవయాని వారసురాలు ఎంట్రీ ఇస్తోంది. దేవయాని కుమార్తె ప్రియాంక ఈ సినిమాతో కోలీవుడ్లో అరంగేట్రం చేస్తోంది. ఈ సందర్భంగా మూవీ లాంఛ్కు హాజరైన దేవయాన్ని ఈ విషయాన్ని ప్రకటించింది. తన కూతురికి అవకాశమిచ్చిన త్యాగరాజన్కు ధన్యవాదాలు తెలిపింది. తన కూతురు సినీ ఇండస్ట్రీలో రాణిస్తుందని దేవయాని ధీమా వ్యక్తం చేసింది.కాగా.. నటి దేవయాని గురించి పరిచయం అవసరం లేదు. తమిళంలోనే కాకుండా తెలుగు తదితర భాషల్లోనూ హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత దర్శకుడు రాజకుమార్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు పేరు ఇనియ, చిన్న కూతురు పేరు ప్రియాంక. ప్రస్తుతం తన చిన్న కుమార్తెను ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది. కాగా.. గతేడాది విడుదలైన 3 బీహెచ్కే సినిమాలో సిద్ధార్థ్ తల్లిగా దేవయాని కనిపించిన విషయం తెలిసిందే. #Devayani தியாகராஜன் சார் வந்து இந்தப் படத்துல என்னோட மகள் பிரியங்கா ராஜ்குமார், அதுக்கப்புறம் ஹரி கதிரேசன், இரண்டு பேரையும் லான்ச் பண்றாங்க.கண்டிப்பா இவங்க உங்க பேரை காப்பாத்துவாங்க, நல்லா நடிப்பாங்க, சினிமால ரொம்ப நாளா இருப்பாங்க. pic.twitter.com/8U6AeTw7aT— KUDALINGAM MUTHU (@KUDALINGAM49671) April 6, 2026 -
సినిమాలకు పూర్తిగా గుడ్ బై.. నటుడి కామెంట్స్ వైరల్..!
ఇటీవల స్టార్ హీరోయిన్ త్రిష పేరు ఎక్కువగా వినిపిస్తోంది. విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. విజయ్తో ఆమెకు రిలేషన్ ఉందని రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత వీరిద్దరు ఓ పెళ్లికి హాజరు కావడంతో వాటి మరింత బలం చేకూరింది. ఆ తర్వాత కోలీవుడ్లో ఈ టాపిక్ మరింత చర్చనీయాంశంగా మారింది.ఈ సంగతి పక్కన పెడితే తాజాగా కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు చిత్రా లక్ష్మణన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. త్రిష త్వరలోనే సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పనున్నారని మాట్లాడారు. యూట్యూబ్ వేదికగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం చిత్రా లక్ష్మణన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు త్రిష టీమ్ నుంచి ఎలాంటి స్పందనైతే రాలేదు. ఇదే నిజమైతే వెండితెరపై త్రిషను చూడాలనుకున్న ఫ్యాన్స్కు నిరాశ తప్పేలా లేదు. చిత్ర లక్ష్మణన్ చేసిన కామెంట్స్ నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
ఆరు రోజుల్లో బర్త్ డే.. బుల్లితెర నటి బలవన్మరణం
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ కోలీవుడ్ బుల్లితెర నటి సుభాషిణి బాలసుబ్రమణ్యం బలవన్మరణానికి పాల్పడింది. తన భర్తతో వీడియో కాల్ మాట్లాడిన నటి అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనతో కోలీవుడ్ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది. కుటుంబ కలహాల కారణంగానే సూసైడ్ చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ సంఘటనపైగు సమాచారం అందుకున్న వెంటనే, పోలీసులు ఆమె మృతదేహాన్ని వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సహనటులు సోషల్ మీడియా ద్వారా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.తమిళంలో ప్రముఖ సీరియల్ కాయల్లో తన పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది. 2012లో 'ఇని అవన్' అనే చిత్రంతో ఆమె సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. అంతేకాకుండా షార్ట్ ఫిల్మ్స్లో కూడా నటించారు. శ్రీలంక మూలాలు కలిగిన నటి చెన్నైలోని అయ్యప్పంతంగల్లో ఉన్న ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. తన పుట్టినరోజుకు కేవలం కొన్ని రోజుల ముందుగానే ఆమె మరణించడంతో అభిమానులు షాకవుతున్నారు. ఏప్రిల్ 12న ఆమె తన పుట్టినరోజును జరుపుకోవాల్సి ఉంది. ఇదే నెలలో ఏప్రిల్ 21న ఆమె వివాహ రెండవ వార్షికోత్సవం కూడా రాబోతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సుభాషిణికి ఇన్స్టాగ్రామ్లో 4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. -
హీరోయిన్కు బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో వైరల్
మలయాళ హీరోయిన్ మంజు వారియర్కు చేదు అనుభవం ఎదురైంది. కేరళలోని పాలక్కాడ్లో ఓ ఈవెంట్కు హాజరైన మంజు వారియర్ను ఓ మహిళా అభిమాని బలవంతంగా ముద్దు పెట్టుకుంది. అది చూసిన అక్కడి యాంకర్ ఇలా ప్రవర్తించడం సరికాదని విమర్శించింది. అయితే సదరు మహిళ మాత్రం.. నాకు మంజు అక్క అంటే చాలా ఇష్టం.. అందుకే ముద్దు పెట్టుకున్నా అని బదులిచ్చింది.ఓపికగా సెల్ఫీలుఇంత జరిగినప్పటికీ మంజు వారియర్ కోపగించుకోలేదు. ఎంతో సహనంతో మిగతా అభిమానులతో సరదాగా మాట్లాడుతూ వారితో సెల్ఫీలు దిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంజు వారియర్ విషయానికి వస్తే.. ఈమె నటి మాత్రమే కాదు. డ్యాన్సర్, రైటర్, ప్రొడ్యూసర్, సోషల్ యాక్టివిస్ట్ కూడా! సాక్ష్యం అనే మలయాళ చిత్రంతో కథానాయికగా వెండితెరపై అరంగేట్రం చేసింది. సినిమాఈ పుళయం కాదన్ను, అసురన్, పాత్రం, కలియట్టం ఇలా అనేక సినిమాలు చేసింది. కన్నెళుతి పొట్టుం తొట్టు (1999) చిత్రానికిగానూ జాతీయ అవార్డు పొందింది. అయితే ఈ సినిమా తర్వాత బ్రేక్ తీసుకుంది. హౌ ఓల్డ్ ఆర్ యూ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. చివరగా ఎల్ 2: ఎంపురాన్ చిత్రంలో కనిపించింది. చతుర్ముఖం చిత్రంతో నిర్మాతగా మారింది. సల్లాపం అనే పుస్తకం రాసి తనలో రచయిత్రి కూడా దాగి ఉందని నిరూపించింది. అలాగే ఈమెకు వీణ వాయించడం కూడా వచ్చు. A lady fan kissed Malayalam Actress #ManjuWarrier in a public function 🤯 pic.twitter.com/y1PAFXZUju— 000009 (@ui000009) April 6, 2026 చదవండి: పెద్దిలో ఐటం సాంగ్.. భలే తప్పించుకుందే! -
ప్రియదర్శన్ విడాకులకు, భార్యతో కలిసిపోవడానికి ఒక్కటే కారణం!
కొన్ని బంధాలు ఎప్పుడు జతకలుస్తాయో, ఎప్పుడు విడిపోతాయో అర్థం కాదు. మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ కెరీర్ ప్రారంభించిన కొంతకాలానికే హీరోయిన్ లిస్సీతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ ప్రేమను పెళ్లి బంధంగా మార్చాలనుకున్నారు. 1990 డిసెంబర్ 13న వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత లిస్సీ తన పేరును లక్ష్మిగా మార్చుకుంది. అలాగే సినిమాలకు సైతం గుడ్బై చెప్పేసి ఇంటికే పరిమితమైపోయింది. 2016లో విడాకులుఈ దంపతులకు కుమారుడు సిద్దార్థ్, కూతురు కల్యాణి సంతానం. ప్రియదర్శన్- లిస్సీ దంపతులు ఎంతో అన్యోన్యంగానే ఉండేవారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు బాగానే ఉన్న ఈ జంట తర్వాత సడన్గా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అలా అని వీరిమధ్య పెద్ద గొడవలు కూడా జరిగన దాఖలాలు లేవు. 2014లో లిస్సీ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. 2016 సెప్టెంబర్లో వీరికి అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. ఇటీవలే కలిసిపోయిన జంటఅప్పటినుంచి వీరు విడివిడిగానే జీవిస్తున్నారు. అయితే విచిత్రంగా పదేళ్ల తర్వాత ఇద్దరూ మళ్లీ కలిసిపోయారు. ఈ విషయాన్ని ప్రియదర్శనే స్వయంగా వెల్లడించాడు. ప్రస్తుతం కలిసే ఉంటున్నామని, కాకపోతే మళ్లీ పెళ్లి చేసుకోలేదన్నాడు. మరి అసలు ఈ జంట అప్పట్లో ఎందుకు విడిపోయింది? అన్నది చాలామంది అర్థం కాని ప్రశ్న!ఆ విషయం గురించి ప్రియదర్శన్ మాట్లాడుతూ.. పెళ్లయిన కొన్నేళ్లకు జీవితం బోరింగ్గా అనిపించింది. మా ఇద్దరి మధ్య ఇగో కూడా పెరిగింది. అసలు కారణమిదే!దానివల్లే పరిస్థితులు కొంత క్లిష్టంగా మారాయి. దాన్ని మరీ తెగేవరకు లాగకుండా విడిపోవడమే మంచిదని ఓ నిర్ణయానికి వచ్చాం, విడిపోయాం. కానీ కొన్నేళ్ల తర్వాత మేము ఒకరినొకరం మిస్ అయ్యాం, భాగస్వామి లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది. తోడు కావాలనిపించింది. అందుకే కలిసిపోయాం. అంతే..! అని సింపుల్గా బదులిచ్చాడు. అంటే అప్పుడు బోర్ కొట్టిందని విడిపోయారు.. ఇప్పుడు సింగిల్గా ఉంటే బోర్ కొడుతోందని మళ్లీ కలిసిపోయారన్నమాట!చదవండి: ఆ సమస్య వల్ల పాటలకు దూరమైన స్టార్ సింగర్ -
ఆ సమస్య వల్ల 5 ఏళ్లుగా పాడటమే మానేశా: స్టార్ సింగర్
సుజాత మోహన్.. సౌత్ ఇండస్ట్రీలో పేరుమోసిన గాయని. మలయాళ, తెలుగు, తమిళ, కన్నడతో పాటు హిందీ, మరాఠి భాషల్లోనూ అనేక పాటలు పాడింది. దాదాపు 20 వేల పాటలు ఆలపించింది. టాలీవుడ్కు అనేక హిట్స్ ఇచ్చింది. అయితే కొంతకాలంగా ఆమె పాటలు పాడటమే మానేసింది. అందుకు గల కారణాన్ని తాజాగా ఓ వేదికపై బయటపెట్టింది.ఐదేళ్లుగా పాటల్లేవ్సుజాత మోహన్ మాట్లాడుతూ.. నేను గొంతు సమస్యతో బాధపడుతున్నాను. దానివల్ల మునుపటిలా పాడలేకపోతున్నాను. అందుకే ఐదేళ్లుగా ఎక్కడా ఒక్క పాట కూడా పాడలేదు అని తెలిపింది. ఇది విని ఆమె అభిమానులు షాకవుతున్నారు. తను త్వరగా కోలుకుని మళ్లీ తన గాత్రంతో అలరించాలని ఆకాంక్షిస్తున్నారు. దీనిపై సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సోదరి ఏఆర్ రెహానా స్పందిస్తూ.. గతంలో సుజాతకు కోరస్గా పాడాను. గొంతు సమస్యఅప్పుడు ఆమె దగ్గరినుంచి చాలా నేర్చుకున్నాను. తన గొంతు తనకు తిరిగి రావాలని కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న డాక్టర్స్ ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయండి అని కోరింది. కాగా గతంలోనూ సుజాత గొంతు సమస్యతో బాధపడింది. 2010వ దశకంలో మాట్లాడేందుకు సైతం ఇబ్బందిపడింది. మూడేళ్లపాటు తన గొంతును తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. చివరకు మంచి చికిత్స ద్వారా కోలుకుని మళ్లీ పాటలు పాడింది.పాటలుసుజాత మోహన్ తెలుగులో అనేక హిట్ సాంగ్స్ పాడింది. తెలుగులో పరువం వానగా, నా చెలి రోజావే.. (రోజా మూవీ), ఓ చెలియా.. (ప్రేమికుడు), రూప్ తేరా మస్తానా (రిక్షావోడు), మూసిన ముత్యాలకే.., ఏలే ఏలే మరదలా (అన్నమయ్య).. ఓ వానా పడితే (మెరుపు కలలు), సారీ సారీ (బావగారు బాగున్నారా), పూవుల్లో దాగున్న (జీన్స్), అందాల ఆడబొమ్మ (సమరసింహారెడ్డి), చెప్పవే చిరుగాలి (ఒక్కడు) ఇలా అనేకానేక పాటలతో తెలుగు సంగీత ప్రియులను అలరించింది.చదవండి: మంచివాళ్లకే మంచివాడిని.. నావాళ్ల జోలికొచ్చారంటే: పవన్ -
ఏడేళ్లుగా ప్రేమలో.. పెళ్లి చేసుకున్న కన్నడ హీరో
కన్నడ హీరో సుముఖ బ్యాచిలర్ లైఫ్కు గుడ్బై చెప్పేశాడు. ప్రియురాలు మైత్రీ ఉకతో ఏడడుగులు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. దాదాపు ఏడేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ లవ్బర్డ్స్ రిషికేశ్లో గంగానదీ తీరంలో పెళ్లి చేసుకున్నారు. ఇరుకుటుంబాలు సహా అతి దగ్గరి బంధువుల సమక్షంలోనే ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. వీరి పెళ్లి ఫోటోలు చూసిన అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సినిమాకాగా సుముఖ.. కన్నడ ఇండస్ట్రీలో నటుడిగా రాణిస్తున్నాడు. యానా మూవీలో ముఖ్య పాత్ర పోషించిన ఇతడు ఫిజిక్స్ టీచర్, మానాడ కథలు చిత్రాల్లో కథానాయకుడిగా యాక్ట్ చేశాడు. ప్రస్తుతం రాజస్థాన్ డైరీస్ సహా మరో సినిమా చేస్తున్నాడు. ఇకపోతే ఫిజిక్స్ టీచర్లో మూవీలో నటించడంతో పాటు ఈ చిత్రంతో దర్శకుడిగానూ మారాడు. సుముఖ తల్లి నందిత యాదవ్ కూడా దర్శకురాలే కావడం విశేషం. సుముఖ భార్య మైత్రీ ఇంటీరియర్ డిజైనర్గా రాణిస్తోంది. View this post on Instagram A post shared by Ivory Films | Wedding Photography (@ivoryfilms.in) చదవండి: 10 ఏళ్లుగా ట్రోలింగ్.. నయన్ను కాదు, నన్ను ఆడేసుకుంటున్నారు -
10 ఏళ్లుగా ట్రోలింగ్.. ధోనికే తప్పలేదు, ఇంకేం చేస్తాం!: విఘ్నేశ్
చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో అభిమానులతో నిత్యం టచ్లో ఉంటారు. కానీ కొందరు మాత్రం తమ పనేదో తాము చేసుకుని పోతారు, సామాజిక మాధ్యమాలకు వీలైనంత దూరంగా ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో ఆన్లైన్లో తాము పెట్టే ఫోటోలు చూసి సంతోషపడేవారి కన్నా తిట్టుకునేవారే ఎక్కువయ్యారంటున్నాడు దర్శకుడు విఘ్నేశ్ శివన్.నా ఆన్సరేంటంటే..ఇతడు దర్శకత్వం వహించిన తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ప్రదీప్ రంగనాథన్, కృతీ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా విఘ్నేశ్ శివన్ ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాడు. మన పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడితే ఏం వస్తుందని కొందరు ప్రశ్నిస్తుంటారు. దానికి నా సమాధానమేంటంటే.. ఇప్పుడు నేను, నయనతార, మా పిల్లలతో కలిసి ఓ ప్రదేశంలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేశామనుకోండి. అంతా మారిపోయింది!కాస్త దిగులుగా, డల్గా ఉన్నవాళ్లు ఆ పిక్స్ చూసినప్పుడు కాస్త ప్రశాంతంగా ఫీల్ అవొచ్చు. కానీ ఇప్పుడంతా మారిపోయిందిలెండి. ప్రతీదాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ అనేది సర్వసాధారణమైపోయింది. నన్నయితే 10 ఏళ్లుగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయినా ఎంఎస్ ధోనిలాంటివారికే ఈ విమర్శలు తప్పలేవు. గతంలో ఐపీఎల్లో సరిగా ఆడనప్పుడు ఆయన్ని ఎంత విమర్శించారో! ఇది చాలా బాధాకరం.. కానీ మనమేం చేయగలం?నన్ను ఆడేసుకుంటున్నారుఇలాంటి కామెంట్లను లైట్ తీసుకోవడం తప్ప ఇంకేం చేయలేం. అప్పుడప్పుడూ ఈ ట్రోల్స్ గురించి నయన్, నేను సరదాగా మాట్లాడుకుంటాం. నిన్ను పెద్దగా ఏమీ అనట్లేదు కానీ నన్నయితే ఆడేసుకుంటున్నారు అని చెప్తుంటాను. ఇలా ట్రోల్స్ చేసేవారు ఎలాగో మారరు, కాబట్టి మనమే వాటిని తేలికగా తీసుకుని ముందుకు సాగాలి అని చెప్పుకొచ్చాడు.ప్రేమ- పెళ్లికాగా విఘ్నేశ్ శివన్ నానుమ్ రౌడీ ధాన్ (నేనూ రౌడీనే) సినిమాతో దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఈ మూవీలో నయనతార కథానాయికగా నటించింది. ఈ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. 2022 జూన్లో వీరు పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది సెప్టెంబర్లో సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారు.చదవండి: నేను మంచివాళ్లకే మంచివాడిని.. అనవసరంగా నాలో రాక్షసుడిని నిద్రలేపొద్దు: బిగ్బాస్ పవన్ -
జరిగిన దానికి సిగ్గుపడుతున్నా.. కూర్చుని మాట్లాడుకోవాల్సింది
తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్, హీరో ధనుష్ ఒకప్పుడు కలిసి సినిమాలు తీశారు. కానీ ఇప్పుడు వీళ్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత కోపం మాత్రమే ఉంది. దానికి కారణం నయనతార పెళ్లి డాక్యుమెంటరీ. ఇది రిలీజైన టైంలో జరిగిన హంగామా ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నయన్తో పాటు ఈమె భర్త విఘ్నేశ్ శివన్.. ధనుష్ని టార్గెట్ చేస్తూ చాలా విమర్శలు చేశారు. ఇప్పుడు చాన్నాళ్లకు వాటిపై విఘ్నేశ్ శివన్ స్పందించాడు. ధనుష్తో స్నేహం చెడిపోవడం తన జీవితంలోనే అతిపెద్ద పశ్చాత్తాపం అని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: యాప్ చెప్పిందని బ్రేకప్.. ఫన్నీగా LIK ట్రైలర్)'ధనుష్ అంటే చాలా ఇష్టం. జూలై 28న ఆయన పుట్టినరోజు. అదేరోజు మా నాన్న చనిపోయారు. దీంతో ధనుష్లో నాన్నని చూసుకున్నాను. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, ఇలాంటి జీవితం గడుపుతున్నానంటే దానికి ముఖ్య కారణం ఆయనే. వీఐపీ (రఘువరన్ బీటెక్) సినిమా షూటింగ్ టైంలో రెండేళ్లు ఆయనతోనే ఉన్నాను. ఆయన తిన్న తర్వాతే తినేవాడిని. ఒకప్పుడు మా మధ్య అంత అనుబంధం ఉండేది. కాకపోతే ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ లేదు. జరిగిన దానికి చాలా సిగ్గుపడుతున్నాను. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకుంటే సరిపోయేది. కానీ అలాంటిదేం జరగలేదు. దూరం ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. ధనుష్తో స్నేహం కోల్పోవడం నా జీవితంలో పెద్ద పశ్చాత్తాపం' అని తాజా ఓ ఇంటర్వ్యూలో విఘ్నేశ్ శివన్ తన మనసులోని బాధని బయటపెట్టాడు.అసలేంటి వివాదం?విఘ్నేశ్ శివన్ తీసిన రెండో సినిమా 'నానుమ్ రౌడీ దాన్'కి ధనుష్ నిర్మాత. విజయ్ సేతుపతి, నయనతార ఇందులో హీరోహీరోయిన్లుగా నటించారు. తెలుగులోనూ నేను రౌడీనే' పేరుతో దీన్ని రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ షూటింగ్ టైంలో విఘ్నేశ్, నయనతార ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని 2022లో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ, పెళ్లిని చూపిస్తూ 'నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్' పేరుతో ఓ డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. అయితే ఈ డాక్యుమెంటరీ.. తన నిర్మించిన 'నానుమ్ రౌడీ దాన్' సీన్స్ ఉండటంపై ధనుష్ టీమ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.నిర్మాత అనుమతి లేకుండా సీన్స్ ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నిస్తూ పిటిషన్ వేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నయనతార ఓ లెటర్ రిలీజ్ చేసింది. డాక్యుమెంటరీలో కేవలం మూడు సెకన్ల ఫుటేజీ ఉపయోగించినందుకు ధనుష్ ఏకంగా రూ.10 కోట్ల పరిహారం డిమాండ్ చేశాడని చెప్పుకొచ్చింది. ఇది ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించింది. ఇది జరుగుతున్న టైంలో విఘ్నేష్ శివన్ కూడా ధనుష్ని విమర్శిస్తూ ఇన్ స్టాలో పలు పోస్టులు పెట్టాడు. తర్వాత వాటిని డిలీట్ చేశాడు. ఇది జరిగిన తర్వాత విఘ్నేశ్-ధనుష్ స్నేహం బ్రేక్ అయింది. ఇప్పుడు ఇన్నాళ్లకు అప్పటి సంగతులని గుర్తుచేసుకున్న విఘ్నేశ్.. పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'.. ఈ శుక్రవారమే(ఏప్రిల్ 10) థియేటర్లలోకి రానుంది. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. నయనతార ఓ నిర్మాతగా వ్యవహరించింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగానే ధనుష్తో వివాదం గురించి స్పందించాడు.(ఇదీ చదవండి: తక్కువ టైంలో చాలామందిని కోల్పోయా.. భరించడం నా వల్ల కాలేదు: యాంకర్ రష్మి) -
వామ్మో జ్యోతిక.. ఆ జిమ్ వర్కవుట్స్ ఏంటి?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సతీమణి జ్యోతిక గురించి పరిచయం అక్కర్లేదు. 1997లో హిందీ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అజిత్ హీరోగా నటించిన వాలి చిత్రంతో కోలీవుడ్లో అడుగుపెట్టింది. తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత వరుస సినిమాలతో మెప్పించింది. తమిళంతో పాటు తెలుగు,హిందీ సినిమాల్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. రెండు దశాబ్దాలకు పైగా నటిస్తూ ఎవర్ గ్రీన్ హీరోయిన్గా తన కెరీర్లో దూసుకెళ్లింది. ఆ తర్వాత 2006లో సూర్యను పెళ్లాడింది ఈ ముద్దుగుమ్మ. సూర్య, జ్యోతిక దంపతులకు దేవ్ అనే కొడుకు, దియా అనే కూతురు ఉన్నారు. ప్రస్తుతం వీరి పిల్లలు ముంబయిలో చదువుతున్నారు.ప్రస్తుతం సినిమాలేవీ చేయకపోయినా.. జ్యోతిక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది. తాజాగా తన జిమ్ వర్కవుట్ వీడియోను ఇన్స్టాలో వీడియో షేర్ చేసింది. ఇందులో పలు రకాల కసరత్తులు చేస్తూ జ్యోతిక కనిపించింది. ఈ స్టన్నింగ్ వర్కవుట్స్ చూస్తుంటే జ్యోతిక ఫిట్నెస్పై ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన అభిమానులు వావ్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం జ్యోతిక రెండు వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
టోవినో థామస్ కొత్త సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్
మలయాళ స్టార్ టోవినో థామస్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ పల్లి చట్టంబి. ఈ సినిమాకు డీజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా పల్లి చట్టంబి ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రాన్ని పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 1950 దశకంలో కేరళలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. -
సోషల్ మీడియాలో ధురంధర్-3.. కథ-స్క్రీన్ ప్లే రెడీ
గత నెల రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్-2 దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్టయిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండో భాగం (ధురంధర్-2) ఎలా ముగిసిందో సినిమా చూసిన వాళ్లందరికీ తెలిసే ఉంటుంది. భార్య, కొడుకును వదిలి ఇండియా వచ్చేస్తాడు హీరో. ఆ తర్వాత ‘RAW’ కనుసన్నల నుంచి తప్పించుకొని నేరుగా తన ఇంటికి వెళ్తాడు. అయితే దూరం నుంచే తన తల్లిని, చెల్లిని చూసి తిరిగి వెనుదిరుగుతాడు. ఇలా సాగిన ధురంధర్-2 క్లయిమాక్స్ నుంచి ధురంధర్-3 కథను అల్లేస్తున్నారు సోషల్ మీడియాలోని కొంతమంది జనం. అయితే హీరో మరోసారి రా ఏజెంట్గా పాకిస్థాన్లో అడుగుపెడతాడని, కొత్త గెటప్లో పాకిస్టాన్లో మరోసారి అడుగుపెట్టి తన భార్య, కొడుకును కలుస్తాడంటూ ఎవరికివారు కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా అల్లేస్తున్నారు. ఇలా ధురంధర్ ఫ్రాంచైజీపై ఓ కొత్త చర్చ జరుగుతోంది. అయితే నిజానికి ధురంధర్-3పై దర్శకుడు ఆదిత్య ధర్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఇటీవల ఇదే ప్రశ్న ఆదిత్య ధర్కి ఎదురైంది. దానికి 'ఏమో చెప్పలేం' అన్నట్టు మాత్రమే ఆయన స్పందించాడు. అంతేకానీ ధురంధర్-3 తప్పకుండా తీస్తానని ఆదిత్య ధర్ అనలేదు.కానీ సోషల్ మీడియాలో వస్తున్న కథలని నిజానికి ఓసారి పరిశీలిస్తే ఈ దర్శకుడికి కచ్చితంగా పార్ట్-3కి ఓ లైన్ దొరికే అవకాశం ఉందనే అంటున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు. -
యాప్ చెప్పిందని బ్రేకప్.. ఫన్నీగా LIK ట్రైలర్
డ్యూడ్, డ్రాగన్, లవ్ టుడే సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్లు అందుకున్న తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్.. తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'(Lik). కృతి శెట్టి హీరోయిన్ కాగా విఘ్నేశ్ శివన్ దర్శకుడు. నయనతార ఓ నిర్మాత. రాబోయే శుక్రవారం(ఏప్రిల్ 10) మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: సైలెంట్గా వైష్ణవిని పెళ్లి చేసుకున్న షన్ను.. ఫొటోలు వైరల్)ట్రైలర్ బట్టి చూస్తే సమ్థింగ్ ఇంట్రెస్టింగ్ అనేలా ఉంది. అది 2040. ప్రేమకు కూడా ఇన్సూరెన్స్ ఉండాలన, Lik అనే యాప్ని సృష్టిస్తారు. ఈ కంపెనీకి ఓనర్ (ఎస్జే సూర్య). ఈ యాప్లో వాయిస్ ఆర్టిస్టుగా పనిచేసే వైబ్ వాసు (ప్రదీప్ రంగనాథన్).. దీన్ని అసలు నమ్మడు. ప్రేమంటే మనసులో నుంచి పుట్టాలని అనుకుంటాడు. అందుకు తగ్గట్లే ధీమా(కృతిశెట్టి) అనే అమ్మాయిని కలుస్తాడు. కానీ ఆమె ఏమో చిన్నప్పటి నుంచి ఫోన్ని చూస్తూ పెరుగుతుంది. ఏ పనైనా ఫోన్తోనే చేస్తుంది. చివరకు ప్రేమని కూడా ఫోన్లోని Lik యాప్ ద్వారానే వెతుక్కుంటుంది. అయితే ఈ యాప్ చెప్పిందని హీరోకి బ్రేకప్ చెప్పేస్తుంది. మరి చివరకు హీరోహీరోయిన్ ఎలా కలిశారు అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఇండస్ట్రీ టాప్ స్టార్స్ నటించిన సినిమా.. ట్రైలర్ రిలీజ్) -
ఇండస్ట్రీ టాప్ స్టార్స్ నటించిన సినిమా.. ట్రైలర్ రిలీజ్
మలయాళ సినీ ఇండస్ట్రీ అనగానే చాలామంది మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్ తదితరుల పేర్లు గుర్తొస్తాయి. వీళ్ల మూవీస్ ఎప్పటికప్పుడు డబ్బింగ్ల రూపంలో పలకరిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ల ముగ్గురితోపాటు నయనతార, రేవతి, కుంచకో బోబన్, దర్శన రాజేంద్రన్ లాంటి స్టార్స్ అంతా కలిసి నటించిన మూవీ 'పేట్రియాట్' మరో నెల రోజుల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బైకర్, రాకాస.. తొలిరోజు వసూళ్లు ఎవరికెన్ని కోట్లు?)స్పై థ్రిల్లర్ స్టోరీతో తీసిన ఈ సినిమాకు మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహించాడు. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది. సరికొత్త థ్రిల్లర్ చూడబోతున్నామనేలా అనిపించింది. యాక్టింగ్ గానీ సీన్స్ గానీ సమ్థింగ్ డిఫరెంట్ అనేలా ఉన్నాయి. మే 01న పాన్ ఇండియా రేంజులో ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతానికి మలయాళ ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేశారు. త్వరలో తెలుగు వెర్షన్ కూడా తీసుకురానున్నారు.(ఇదీ చదవండి: సైలెంట్గా వైష్ణవిని పెళ్లి చేసుకున్న షన్ను.. ఫొటోలు వైరల్) -
అరుణాచలంలో అన్నదానం చేసిన హీరోయిన్
హీరోయిన్ మృణాళిని రవి మంచి మనసు చాటుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరుణాచలంలో అన్నదానం చేసింది. దాదాపు వెయ్యిమంది భక్తులకు భోజనం పెట్టింది. మృణాళిని రవి మాట్లాడుతూ.. ఆకలితో ఉన్నవారికి కడుపు నింపాలన్న సేవాతత్వాన్ని మా నాన్న నేర్పించాడు. వీలైనప్పుడల్లా ఇతరులకు సాయం చేసేలా నా పేరెంట్స్ నన్ను ప్రోత్సహించారు. అన్నిదానాల్లోకెల్లా అన్నదానమే గొప్పదని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను. అందుకే నాకు తోచినంత చేశాను అని చెప్పుకొచ్చింది.సినిమాసినిమాల విషయానికి వస్తే.. మృణాళిని రవి 'సూపర్ డీలక్స్' చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. 'గద్దలకొండ గణేశ్' మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. 'ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు', 'మామా మశ్చీంద్ర' సినిమాల్లో మెరిసింది. తెలుగులో కన్నా తమిళంలోనే అనేక సినిమాలు చేసింది. చివరగా 'రోమియో' అనే తమిళ చిత్రంలో తళుక్కుమంది.చదవండి: ఈ ధురంధర్ నటుడికి టిఫిన్ చేసే అలవాటే లేదు -
భానుప్రియ మతిస్థిమితం బాగోలేదా? సోదరి ఏమందంటే?
ఆకట్టుకునే ఆహార్యం, అద్భుతమైన నటన, నెమలిలా నాట్యం చేస్తూ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది హీరోయిన్ భానుప్రియ. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అనేక సూపర్ హిట్ సినిమాలు చేసింది. అయితే భర్త మరణించాక తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిన ఆమె డిమెన్షియా అనే వ్యాధి బారిన పడింది. డిమెన్షియా అంటే జ్ఞాపకశక్తిని కోల్పోవడం!భానుప్రియ గురించి దుష్ప్రచారంఈ వ్యాధి వల్ల డ్యాన్స్ స్కూల్ పెట్టాలన్న ఆలోచన కూడా విరమించుకుంది. కొద్దిరోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితి బాలేదని, మతిస్థిమితం కోల్పోయిందంటూ దుష్ప్రచారం జరుగుతోంది. దీనిపై భానుప్రియ సోదరి, హీరోయిన్ శాంతిప్రియ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ.. మా అక్క కొంతకాలంగా తీవ్ర మనోవేదన అనుభవిస్తోంది. ఆమెకు పెద్ద సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. తీరా చిత్రీకరణ సమయానికి ఆ పాత్రలో అనేక మార్పుచేర్పులు చేస్తున్నారు.ఇలా మోసం చేయడం సరికాదుఅది ఆమెను బాధిస్తోంది. ముందొకటి చెప్పి.. తీరా సెట్కు వెళ్లాక మాట మార్చేయడం పట్ల ఆమె ఎంతగానో కలత చెందింది. దాదాపు 280 సినిమాలు చేసి, ఎన్నో అవార్డులు గెలిచిన వ్యక్తి పట్ల ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఇలాంటి పరిస్థితిలో నా సోదరిని చూడలేకపోతున్నాను. భర్త చనిపోయాక అక్క మానసికంగా కుంగిపోయింది. ఎక్కడికీ వెళ్లకుండా ఇంటికే పరిమితమైంది. తనను కనీసం 80's స్టార్స్ రీయూనియన్కు కూడా ఎవరూ ఆహ్వానించరు.రీయూనియన్కి పిలవరుదీని గురించి మాట్లాడొద్దని అక్క నన్ను హెచ్చరించింది, అయినా సరే నిర్మొహమాటంగా చెప్తున్నా.. తనను ఎవరూ రీయూనియన్ పార్టీకి పిలవట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు.. పోనీ తన నెంబర్ మీ దగ్గర లేకపోతే నాకు లేదా మా అన్నయ్యకు ఫోన్ చేయొచ్చుగా.. ఇండస్ట్రీలో అందరికీ మా అన్నయ్య తెలుసు. కానీ ఎవరూ సంప్రదించరు. ఇకపోతే అక్క ఇకపై సినిమాలు చేయదు. నేను మాత్రం సినిమాల్లో కొనసాగుతాను. నాకోసం డబ్బింగ్బ్యాడ్ గర్ల్ సినిమాలో అక్క నాకోసం డబ్బింగ్ చెప్పింది. తన మానసిక స్థితి చెడిపోలేదు. బాగానే ఉంది. దయచేసి సోషల్ మీడియాలో అక్క గురించి అసత్య ప్రచారం వ్యాప్తి చేయొద్దు. యూట్యూబ్లో ముందూవెనకా ఆలోచించకుండా, ఏదీ తెలుసుకోకుండా అక్క గురించి నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. ఇది చాలా పెద్ద తప్పు అని మండిపడింది. కాగా భానుప్రియ.. సితార చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. బంగారు చిలక, అన్వేషణ, ఆలాపణ, అపూర్వ సహోదరులు, చక్రవర్తి, దొంగ మొగుడు, స్వర్ణకమలం, పెదరాయుడు, అన్నమయ్య, జయం మనదేరా.. ఇలా అనేక సినిమాలు చేసింది. పర్సనల్ లైఫ్చివరగా అయలాన్ మూవీలో హీరో తల్లిగా కనిపించింది. వ్యక్తిగత విషయానికి వస్తే.. భానుప్రియ 1998లో గ్రాఫిక్స్ ఇంజనీర్ ఆదర్శ్ కౌశల్ను పెళ్లాడింది. వీరికి 2002లో కూతురు పుట్టింది. ప్రస్తుతం ఆమె లండన్లో చదువుకుంటోంది. పెళ్లయిన ఏడేళ్లకే దంపతులిద్దరూ విడివిడిగా జీవించడం మొదలుపెట్టారు. కానీ విడాకులు తీసుకోలేదు. 2018లో ఆదర్శ్ గుండెపోటుతో మరణించాడు.చదవండి: నేను కాలితో తన్నడం వల్ల అనుష్కకు గాయం: అడివి శేష్ -
కాలితో తన్నా.. నావల్ల అనుష్క నొప్పితో బాధపడింది!
ఏదో హడావుడిగా కాకుండా తాపీగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు అడివి శేష్. ఈయన కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం హిట్:ద సెకండ్ కేస్. ఈ సినిమా వచ్చి నాలుగేళ్లవుతోంది. ఇంతకాలం గ్యాప్ తర్వాత అతడు డెకాయిట్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యాడు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది.బాహుబలి జ్ఞాపకాలుఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా అడివి శేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా 'బాహుబలి' సినిమాలో అనుష్కను హీనంగా చూసే ఓ సీన్ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. అడివి శేష్ మాట్లాడుతూ.. అనుష్క చాలా మంచి వ్యక్తి. స్వీటీ.. ఆ పేరులోనే తెలిసిపోతోంది. ఖైదీగా పడి ఉన్న అనుష్కను కట్టెతో తడుతూ నిద్రలేపాలి. ఆ సన్నివేశం చిత్రీకరణ అయిపోగానే నీకు ఏం తగల్లేదు కదా? అని అడిగాను.బలంగా తన్నడంతో..ఎందుకంటే అప్పటికే నావల్ల ఒకసారి తనకు దెబ్బ తగిలింది. నేను కాలితో తన్నడం వల్ల ఆమె మెడ నొప్పితో బాధపడింది. నిజానికి ముందు నేను సున్నితంగానే తన్నాను. కానీ రాజమౌళి సర్ అది సరిపోదన్నాడు. దాంతో నేను బలంగా తన్నాల్సి వచ్చింది. దానివల్ల ఆమెకు దెబ్బ తగిలింది. అప్పుడే తొలిసారి తనతో మాట్లాడాను అని అడివి శేష్ తెలిపాడు. కాగా బాహుబలి మొదటి భాగంలో భళ్లాల దేవ (రానా దగ్గుబాటి) కొడుకు భద్రుడిగా శేష్ నటించాడు.చదవండి: ధురంధర్లో విలన్ రోల్.. ముగ్గురు రిజెక్ట్ చేశారు: కాస్టింగ్ డైరెక్టర్ -
ధురంధర్లో విలన్గా.. ముగ్గురు రిజెక్ట్ చేశారు: కాస్టింగ్ డైరెక్టర్
కొన్ని సినిమాల్లో హీరోతో పాటు ఇతర పాత్రలు కూడా బాగా ఎలివేట్ అవుతుంటాయి. అలా ధురంధర్ మూవీలో కథానాయకుడు రణ్వీర్ సింగ్తో పాటు మిగతా అన్ని పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా విలన్గా అక్షయ్ ఖన్నా పోషించిన రెహ్మాన్ డకైత్ పాత్ర అయితే విపరీతంగా హైలైట్ అయింది. అక్షయ్ హావభావాలు, మేనరిజం, డ్యాన్స్.. ఇలా అన్నీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. అయితే ఈ విలన్ పాత్ర కోసం అక్షయ్ కంటే ముందు పలువురు నటీనటులను సంప్రదించగా నిరభ్యంతరంగా తిరస్కరించారట! ముగ్గురు రిజెక్ట్ఈ విషయాన్ని కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ చాబ్రా వెల్లడించాడు. బాలీవుడ్ హంగామాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. డకైత్ పాత్రను ముగ్గురు యాక్టర్స్ రిజెక్ట్ చేశారు. అందులో ఒకరు దక్షిణాదికి చెందిన ప్రముఖ నటుడు కాగా మరో ఇద్దరు బాలీవుడ్ యాక్టర్స్. వాళ్లు చెప్పిన కారణమేంటంటే.. ఇందులో చాలా ఎక్కువమంది యాక్టర్స్ పని చేస్తున్నారు. పైగా ఇది పూర్తిగా రణ్వీర్ సినిమా అని ఆఫర్ను తిరస్కరించారు. ఆయన తప్ప అందరూ..వారి పేర్లు ఇప్పుడు బయటకు చెప్పలేను కానీ ఆ పాత్రను తిరస్కరించినందుకు వాళ్లు కచ్చితంగా బాధపడే ఉంటారు. ధురంధర్లో నటించేందుకు మొదట అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కూడా కాస్త తటపటాయించారు. ఆర్.మాధవన్ ఒక్కరే వెంటనే ఓకే చెప్పారు, మిగతా అందరూ కాస్త సమయం తీసుకున్నారు. దర్శకుడు ఆదిత్య, నేను.. ఇలా ఎంతోమంది స్టార్స్ను ఈ సినిమాలో భాగం చేయాలని ముందుగానే అనుకోలేదు. కానీ, అలా జరిగిపోయింది అని చెప్పుకొచ్చాడు.సినిమాఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురంధర్ చిత్రం గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన ధురంధర్: ద రివేంజ్ ఇప్పటివరకు రూ.1500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది.చదవండి: ఐశ్వర్య ఇంట్లో ఉండాలి.. అంత ఇగో లేదు: అభిషేక్ బచ్చన్ -
మే 14న వీరభద్రుడు
సూర్య హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం ‘కరుప్పు’. త్రిష హీరోయిన్గా నటించారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ప్రకాశ్బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ చిత్రం మే 14న విడుదల కానుంది.కాగా, ఈ సినిమాకు తెలుగులో ‘వీరభద్రుడు’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లుగా వెల్లడించి, ఈ సినిమా కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో కత్తి పట్టుకుని మాస్ లుక్లో కనిపిస్తున్నారు సూర్య. ఈ సినిమాకు సంగీతం: సాయి అభ్యంకర్. -
ఆయనతో నావల్ల కాదు.. ఆ సినిమా చేయను: ఆండ్రియా
కొన్ని సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వాటిని రీరిలీజ్ చేసినా, సీక్వెల్ తీసినా చూసేందుకు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలా యుగానికి ఒక్కడు (ఆయిరత్తిల్ ఒరువన్) సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కార్తీ హీరోగా, ఆండ్రియా జెర్మియా, రీమా సేన్ హీరోయిన్లుగా నటించారు. ధనుష్ సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించాడు. 2010లో విడుదలైన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే దర్శకుడు ప్రకటించాడు. ఆషామాషీ కాదుకానీ ఏళ్లు గడుస్తున్నా ఆ దిశగా పనులు జరగలేదు. గతేడాది చివర్లో మరోసారి సీక్వెల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సెల్వ. ధనుష్, కార్తీతో కలిసి సీక్వెల్ తీస్తానని, కాకపోతే ఏడాదిపాటు వారు కాల్షీట్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నాడు. ఇప్పటికే చేతిలో సినిమాలతో బిజీగా ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు ఏడాదిపాటు డేట్స్ ఇవ్వాలంటే ఆషామాషీ కాదు. అదెప్పుడు సాధ్యమవుతుందో చూడాలి!సీక్వెల్లో నేనుండనుఇకపోతే యుగానికి ఒక్కడు సీక్వెల్పై నటి, సింగర్ ఆండ్రియా జెర్మియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. యుగానికి ఒక్కడు సినిమా చేయడం ఒక అద్భుతమైన అనుభవం. ఆ మూవీ నటిగా ఎదిగేందుకు తోడ్పడింది. అయితే రెండో భాగంలో నేను ఉంటానని మాత్రం ఊహించకండి. యుగానికి ఒక్కడు సీక్వెల్ తెరకెక్కితే సంతోషమే కానీ నేను మాత్రం అందులో చేయలేను.ఆయనతో పని చేయడం కష్టంఎందుకంటే మొదటి భాగమే 200 రోజులు తెరకెక్కించారు. అన్ని రోజులు పని చేయడమంటే మాటలు కాదు. అక్కడ అంత కష్టపడ్డాను గనుకే తర్వాత చేసిన సినిమాలు ఎంతో సులువుగా అనిపించాయి. ఏదేమైనా దర్శకుడు సెల్వరాఘవన్తో కలిసి పని చేయడం చాలా కష్టం అని పేర్కొంది. ప్రస్తుతం ఆండ్రియా చేతిలో మనుషి, పిశాచి 2, నో ఎంట్రీ సినిమాలున్నాయి.చదవండి: బండ్ల గణేశ్ ఇంట శుభకార్యం.. కూతురి పెళ్లి వేడుక -
శింబుతో జోడీ కట్టనున్న కాంతార హీరోయిన్!
హిట్ఫ్లాప్లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటాడు తమిళ హీరో శింబు. నిజానికి ఆయన సరైన హిట్ చూసి చాలాకాలమే అయింది. అదే విధంగా సినిమాలు చేయడంలో కాస్త వెనకబడ్డ శింబు ఆ మధ్య మణిరత్నం డైరెక్షన్లో థగ్లైఫ్లో నటించగా అది పూర్తిగా నిరాశపర్చింది. ప్రస్తుతం ఇతడు వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ మూవీ చేస్తున్నాడు. డ్రాగన్ డైరెక్టర్తో..విజయ్ సేతుపతి పోలీస్ అధికారికగా కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీ ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్స్ కథాంశంతో రూపొందుతోంది. ఇప్పుడు శింబు మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఓమై కడవులే మూవీతో దర్శకుడిగా పరిచయమైన అశ్వద్ మారిముత్తు డ్రాగన్తో సంచలన సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు శింబును డైరెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడట! ఈ మూవీని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుందని తెలుస్తోంది. కాంతార బ్యూటీసంతానం ముఖ్య పాత్ర పోషించనున్నాడు. చాలా గ్యాప్ తర్వాత శింబు, సంతానం కలిసి నటించనున్న చిత్రం ఇదే! ఈ మూవీలో శింబుకు జంటగా కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ సినిమాకు గాడ్ లవ్ అనే టైటిల్ను ఫిక్స్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం! -
దేవుడిని నమ్మనంటూ చర్చిలో ప్రకాశ్రాజ్.. విమర్శలపై కౌంటర్!
తల్లిని కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్పై కొద్దిరోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కారణం.. ఆయన తల్లి సువర్ణలత అంత్యక్రియలను క్రైస్తవ ఆచారం ప్రకారం నిర్వహించడమే! దేవుడినే నమ్మనని చెప్పే ఆయన తల్లి భౌతికకాయాన్ని చర్చిలో పెట్టి ప్రార్థనలు, కీర్తనలు ఎందుకు చేయించాడని పలువురూ విమర్శలు గుప్పించారు.నేను నమ్మనుఈ ట్రోలింగ్పై తాజాగా ప్రకాశ్ రాజ్ స్పందించాడు. అవును, నేను దేవుడిని నమ్మను, కానీ మా అమ్మ నమ్మేది. తన విశ్వాసాల ప్రకారం అంతిమసంస్కారాలు పొందే హక్కును కాదనడానికి నేనెవర్ని? ఇది తనకు నేనిచ్చే కనీస గౌరవం. ఒంటినిండా ద్వేషాన్ని నింపుకున్న రాక్షసులకు ఇదేం అర్థమవుతుంది? అని ట్వీట్ చేశాడు.నాస్తికుడిగా ప్రయాణంఇది చూసిన కొందరు తల్లి నమ్మకాల్ని గౌరవించి, ఆమెకు నచ్చినట్లుగానే అంతిమయాత్ర చేసిన ప్రకాశ్రాజ్ను సమర్థిస్తున్నారు. మరికొందరు మాత్రం.. మీ తల్లి నమ్మకాన్ని గౌరవిస్తున్నావు, బాగానే ఉంది.. మరి మా నమ్మకాల్ని ఎందుకు హేళన చేస్తావు? ఎందుకు ద్వేషిస్తావు? అని ప్రశ్నిస్తున్నారు. కాగా ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణలత క్రైస్తవురాలు కాగా తండ్రి మంజునాథ్ రాయ్ హిందువు. భిన్నమైన మతాల నేపథ్యంలో పెరిగినప్పటికీన ఆయన ఏ మతంవైపూ అడుగు వేయలేదు. తనను తాను నాస్తికుడిగా ప్రకటించుకున్నాడు. Yes. I don’t believe in god .. but my mother believed in her god . Who am i to deny her .. the right to be buried according to her belief. This is the basic respect we give one another. Will you Hate mongering monsters understand this #justasking https://t.co/vD1GhySf3M— Prakash Raj (@prakashraaj) April 2, 2026 చదవండి: అచ్చం ఓయ్ హీరోయిన్లా ఉందే.. ఎవరీ మానస శర్మ? -
భార్య ఉండగా నటుడి రెండో పెళ్లి.. DNA రిపోర్ట్తో నిజం బయటకు!
ప్రముఖ చెఫ్, నటుడు మాధంపట్టి రంగరాజ్ కాస్ట్యూమ్ డిజైనర్ జాయ్ క్రిజిల్డాను ఏడాదిన్నర క్రితం సీక్రెట్గా రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే ప్రియురాలి మెడలో తాళి కట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కానీ వీరి బంధం మూణ్నాళ్ల ముచ్చటే అయింది. దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. రంగరాజ్.. ఆమెను పట్టించుకోవడం మానేశాడు. దీంతో జాయ్.. తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాకుండా తాను ఆరోనెల గర్భిణీ అని ప్రకటించింది. అయితే కడుపులో బిడ్డకు, తనకు సంబంధం లేదని పారిపోయే ప్రయత్నం చేశాడు నటుడు.DNA టెస్ట్దీంతో బిడ్డ పుట్టకముందే వదిలేసి వెళ్లిపోయావ్.. నువ్వేం తండ్రివి అని భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగరాజ్ మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. డీఎన్ఏ టెస్టులో బాబుకు తనే తండ్రినని తేలితే దేనికైనా రెడీ అని సవాలు విసిరాడు రంగరాజ్. ఈ క్రమంలో కోర్టు సమక్షంలో వీరికి డీఎన్ఏ టెస్టు నిర్వహించారు. తాజాగా వాటి ఫలితాలు తనకు అనుకూలంగా వచ్చాయంటోంది జాయ్. డీఎన్ఏ రిపోర్టులో తన బిడ్డకు తండ్రి రంగరాజే అని తేలిందని వెల్లడించింది.పోస్ట్ డిలీట్ఇలా ఎన్ని టెస్టులు చేసినా విజయం ఎప్పుడూ తల్లిదేనని రాసుకొచ్చింది. ఈ పోరాటంలో తనకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. గర్భం దాల్చినప్పటి నుంచి రాఘ పుట్టేవరకు ఎన్నో కష్టాలు చూశాను. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాను. నా కొడుకు కోసం ధృడంగా నిలబడ్డాను. నా బిడ్డ అన్యాయమైపోకూడదని న్యాయ పోరాటం చేశాను. ఈరోజు నేను గెలిచాను అని పేర్కొంది. కానీ కాసేపటికే ఈ పోస్టును డిలీట్ చేసింది.సినిమాకాగా రంగరాజ్.. కూకు విత్ కోమలి రియాలిటీ షో జడ్జిగా పాపులర్ అయ్యాడు. మెహందీ సర్కస్, పెంగ్విన్ సినిమాల్లో నటించాడు. ఇతడు లాయర్ శృతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. జాయ్ క్రిజిల్డా విషయానికి వస్తే దాదాపు పాతిక సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్గా పని చేసింది. విజయ్, శివకార్తికేయన్, ప్రభుదేవా, అనిరుధ్ రవిచందర్, రెజీనా.. ఇలా ఎందరో సెలబ్రిటీల దగ్గర స్టైలిస్ట్గా వర్క్ చేసింది. జాయ్.. 2018లో జేజే ఫ్రెడరిక్ను పెళ్లి చేసుకోగా వీరు 2023లో విడాకులు తీసుకున్నారు. కొన్నేళ్ల కిందట రంగరాజ్, జాయ్ క్రిజిల్డా ప్రేమలో పడ్డారు. దీంతో భార్య ఉండగానే జాయ్ మెడలో మూడు ముళ్లు వేశాడు. అయితే ఆమె పర్సనల్ ఫోటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించడం వల్లే పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. Madhampatty Ragha Rangaraj 🧿@MadhampattyRR #madhampattyrangaraj #chefrangaraj #chefmadhampattyrangaraj #joycrizildaa #ragharangaraj pic.twitter.com/kvcT4uqyud— Joy Crizildaa (@joy_stylist) March 12, 2026 చదవండి: ఏడాదిగా ట్రెండింగ్లో తమిళ్ సాంగ్.. తెలుగు వర్షన్ రిలీజ్ -
కేరళలో ఎస్పీ బాలు విగ్రహం.. చరణ్ భావోద్వేగం
సంగీత ప్రపంచంలో రారాజుగా వెలుగొందిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి గొప్ప గౌరవం దక్కింది. కేరళలోని పాలక్కాడ్లో ఆయన 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎస్పీ బాలు విగ్రహాన్ని ప్రముఖ శిల్పి ఉన్ని కణయ్ తయారు చేశారు. అలాగే ఎస్పీబీ స్మారక ఉద్యానవనాన్ని సింగర్ హరిహరన్, సింగర్ చిత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాలు కుటుంబసభ్యులతో పాటు పలువురు మలయాళ సినీ ప్రముఖులు హాజరై బాలు విగ్రహానికి నివాళులర్పించారు.ఎస్పీ చరణ్ భావోద్వేగంఈ కార్యక్రమం గురించి చెప్తూ ఎస్పీ బాలు కుమారుడు, సింగర్ ఎస్పీ చరణ్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఒక లెజెండ్ కోసం మిగతా లెజెండ్స్ అందరూ కలిసి వచ్చారు. పాలక్కాడ్లో నాన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొన్ని స్వరాలు ఎప్పటికీ మూగబోవు.. అవి శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ విగ్రహావిష్కరణ అనేది కేవలం కార్యక్రమం మాత్రమే కాదు మా కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే ఓ అందమైన అనుభూతి అంటూ సోషల్ మీడియాలో పలు ఫోటోలను షేర్ చేశాడు. View this post on Instagram A post shared by S.P.Charan (@spbcharan) -
ఏడాదిగా ట్రెండింగ్లో తమిళ్ సాంగ్.. తెలుగు వర్షన్ రిలీజ్
గత ఏడాదిగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడ చూసినా ఓ పాట తెగ వైరలయింది. అదే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాలోని ధీమా పాట. ప్రదీప్ రంగనాథన్ హీరోగా, కృతీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. డైరెక్టర్ విఘ్నేశ్యే ఈ ధీమా పాటకు సైతం లిరిక్స్ అందించాడు. అనిరుధ్ తన గాత్రంతో దాన్ని మరింత అందంగా ఆలపించాడు. 'ధీమా' తెలుగు సాంగ్ రిలీజ్ఈ పాట రిలీజ్ చేసినప్పటినుంచి చాలామందికి ఇది ఫేవరెట్ అయిపోయింది. తాజాగా ఈ పాట తెలుగు వర్షన్ వదిలారు. హృదయపు కోటే.. దోచేశావే.. ఇకపై నువ్వే నాకు మహారాణివే.. అంటూ పాట మొదలవుతుంది. ఇది చూసిన అభిమానులు.. లేటుగానైనా సరే తెలుగులో రిలీజ్ చేసినందుకు థ్యాంక్స్ అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ పాటను మీరూ వినేయండి..సినిమాలవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (Love Insurance Kompany Movie) విషయానికి వస్తే.. విఘ్నేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆయన సతీమణి, స్టార్ హీరోయిన్ నయనతార నిర్మిస్తోంది. ఇందులో ఎస్జే సూర్య, యోగిబాబు, గౌరీ కిషన్, మాళవిక కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఈ మూవీ తమిళ, తెలుగు భాషల్లో ఏప్రిల్ 10న విడుదల కానుంది. #Dheema Telugu version is out now :) #LIK from April 10 ❤️ https://t.co/KQQII9rAK7 pic.twitter.com/NwF5w1LUrP— Anirudh Ravichander (@anirudhofficial) April 2, 2026 -
32 ఏళ్ల తర్వాత కాంబినేషన్ రిపీట్
ఒక సూపర్హిట్ కాంబో 32 ఏళ్ల తరువాత మళ్లీ కలసి పనిచేస్తోంది. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ అధినేత టీజీ.త్యాగరాజన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంజీఆర్, రజనీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్ వంటి ప్రముఖ హీరోలతో పలు సూపర్ చిత్రాలను నిర్మించిన నిర్మాత ఈయన. ఇప్పటికీ ఈ తరం నటీనటులతో చిత్రాలు చేస్తున్నారు. అదేవిధంగా సంగీత జ్ఞాని ఇళయరాజా గురించి అందరికీ తెలిసిందే!32 ఏళ్ల తర్వాత రిపీట్కాగా సత్యజ్యోతి ఫిలింస్ త్యాగరాజన్, ఇళయరాజాలది సూపర్హిట్ కాంబినేషన్. వీరి కాంబినేషన్లో పలు అద్భుతమైన చిత్రాలు రూపొందాయి. అలాంటి సూపర్ హిట్ కాంబో 32 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి పని చేస్తున్న చిత్రం లెనిన్ పాండియన్. సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై టీజీ.త్యాగరాజన్ సమర్పణలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. దివంగత నటుడు శివాజీగణేషన్ మనవడు దర్శన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు.వీడియో వైరల్సీనియర్ దర్శకుడు, సంగీత దర్శకుడు గంగై అమరన్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా ఆయన సరసన ప్రముఖ నటి రోజా నటించడం విశేషం. దీనికి డీడీ బాలచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇకపోతే టీజీ త్యాగరాజన్, ఇళయరాజా తమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్న వీడియోను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Sathya Jyothi Films (@sathyajyothifilms) -
విజయ్ని, అతడి పార్టీని విమర్శించను.. ఎందుకంటే?
తమిళనాడులో ప్రస్తుతం హడావుడి నెలకొంది. ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రజల మనసు గెలుచుకుని అధికారం దక్కించుకునేందుకు బోలెడన్ని పార్టీలు పోటీపడుతున్నాయి. హీరో దళపతి విజయ్ కూడా టీవీకే పార్టీ తరఫున బరిలో నిలిచాడు. మరోవైపు తమిళ దర్శకుడు సుందర్.సి కూడా ఇదే ఎలెక్షన్స్లో మధురై సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు. తాను బరిలో ఉన్నప్పటికీ విజయ్ని, అతడి పార్టీని విమర్శించనని చెబుతూ అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించాడు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న బిగ్బాస్ ఫేమ్ ట్రాన్స్జెండర్ తమన్నా)హీరో విజయ్ రాజకీయాల్లోకి రావడంపై స్పందించిన సుందర్.. తమ ఇద్దరి మధ్య పరస్పర గౌరవం ఉందని, తన భార్య ఖుష్బూ.. విజయ్ని తమ్ముడిలా భావిస్తుందని అందుకే విజయ్ లేదా అతడి పార్టీపై విమర్శలు చేయనని స్పష్టం చేశాడు. ఇప్పటివరకు సినిమాలతో ప్రేక్షకులని అలరించిన తాను.. రాజకీయాల్లో కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నానని అన్నాడు. తన సినీ ప్రయాణంలో ఎలా ఆదరించారో, ఇక్కడ కూడా అలాగే మద్ధతు ఇవ్వాలని ప్రజలని కోరాడు.ఎన్డీఏ కూటమిలో భాగంగా సుందర్.. పుతియ నీది కచ్చి పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అయితే మధురై సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధాన పోటీ ఏఐఏడీఎంకే, డీఎంకే మధ్యనే ఉంటుందని.. ఇక్కడ విజయ్ పార్టీ ప్రభావం తక్కువగా ఉంటుందని సుందర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.కెరీర్ విషయానికొస్తే.. గతేడాది 'గ్యాంగర్స్' సినిమాలో నటించి దర్శకత్వం వహించిన సుందర్, ప్రస్తుతం విశాల్ హీరోగా 'మగాడు' అనే మూవీ చేస్తున్నారు. నయనతారతో 'ముక్తి అమ్మన్ 2' కూడా తీస్తున్నారు.(ఇదీ చదవండి: 'పెద్ది' విడుదలపై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్) -
ధురంధర్ 2 కథ నాది.. కాపీ కొట్టారు: కన్నడ దర్శకుడు
పాన్ ఇండియా స్థాయిలో మార్మోగిపోతున్న పేరు ధురంధర్ 2. ఆదిత్య ధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ధురంధర్ లైఫ్టైమ్ కలెక్షన్స్ను రెండో భాగం ఈపాటికే దాటేసింది. ఒకటీరెండు రోజుల్లో రూ.1500 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ధురంధర్ 2 కథ తనదంటూ మీడియా ముందుకు వచ్చాడు కన్నడ దర్శకుడు సంతోష్ కుమార్ ఆర్ఎస్.కష్టపడి కథ రాసుకున్నా..ఆయన మాట్లాడుతూ.. ధురంధర్ 2 మీరంతా చూసే ఉంటారు. ఈ సినిమాకు అంతటా మంచి స్పందన లభిస్తోంది. అయితే ఆ కథ నాది. సినిమా చూసిన తర్వాత నా కథ కాపీ కొట్టారన్న విషయం అర్థమైంది. 2023లోనే ఎంతో కష్టపడి ఈ కథ రాసుకున్నాను. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను. పెద్ద నటీనటులు ఈ మూవీలో భాగం కావాలంటే బడా సంస్థ అండగా ఉండాలన్నారు. 2023లోనే రిజిస్టర్ చేయించా..అందుకే జీ స్టూడియోస్, టీ సిరీస్, ధర్మ ప్రొడక్షన్స్, సోనీ పిక్చర్స్.. ఇలా అనేక పెద్ద నిర్మాణ సంస్థలను సంప్రదించాను. చాలామందికి నా కథ పంపాను. ఆదిత్య రాయ్ కపూర్ని హీరోగా పెట్టి మూవీ తీయాలనుకున్నాను. 2023 నవంబర్లోనే ఈ కథ రిజిస్టర్ కూడా చేయించాను. అందుకు సంబంధించిన సాక్ష్యాలు నా దగ్గరున్నాయి. వీటి ఆధారంగా ధురంధర్ 2 మూవీ యూనిట్పై కేసు వేయాలనుకుంటున్నాను.అదే బాధగా ఉందివాళ్లు నా కథను చెడగొట్టారు. నేను వినోదం కోసం కథ రాస్తే దాన్ని రాజకీయ దుర్వినియోగం చేశారు. అదే నాకు మరింత బాధ కలిగిస్తోంది. నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదు అని ఆవేదన వ్యక్తం చేశాడు. సంతోష్ కుమార్.. క్యాంపస్ క్రాంతి అనే కన్నడ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం యువన్ రాబిన్హుడ్ మూవీ చేస్తున్నాడు.చదవండి: నీ ముఖానికి గోల్డ్ చైన్ వేసుకునేంత సీన్ ఉందా? నటి ఆవేదన -
'నీ ముఖానికి గోల్డ్ చైన్ ఉందా'.. తట్టుకోలేకపోయా: నటి
రంగుల ప్రపంచంలో రాణించాలని ఎంతోమందికి ఉంటుంది. కానీ, కొందరే ఎన్నో కష్టాలను అధిగమించి, ముళ్లదారిపై నడిచి చివరకు అవకాశాలు సాధిస్తారు. నువ్వు యాక్టరేంటి? నీకంత సీన్ లేదు? అని హేళన చేసేవారికి సీరియల్, సినిమా ఛాన్సులతోనే తగిన బుద్ధి చెప్తారు. అలా తాను కూడా కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు పడ్డానంటోంది కన్నడ నటి, బిగ్బాస్ బ్యూటీ రాశిక శెట్టి.సూటిపోటి మాటలురాశిక మాట్లాడుతూ.. నా జర్నీ ప్రారంభంలో ఆడిషన్స్ చాలా కష్టంగా ఉండేవి. ప్రోత్సహించడం పక్కనపెట్టి సూటిపోటి మాటలతో విమర్శలు ఎక్కుపెట్టేవారు. చాలామాటలనేవారు. అవకాశాలిచ్చేవారు కాదు. ఒకసారైతే.. నీ ముఖానికి నిజమైన బంగారు గొలుసు వేసుకునేంత సీన్ ఉందా? అని ముఖం మీదే అన్నారు. చాలా బాధపడ్డాను, ఆత్మస్థైర్యాన్ని కోల్పోయాను.ఆ నమ్మకంతోనే..నావల్ల అవుతుందా? అని నాలో నేనే మథనపడ్డాను. అవకాశాలు రాకపోయేవి, వచ్చిన ఒకటీరెండు కూడా చివరి నిమిషంలో చేజారేవి. అప్పుడు మరింత కుంగిపోయాను. అయినా సరే వెనకడుగు వేయాలనుకోలేదు. నాకంటూ ఓ రోజు వస్తుందని ఎదురు చూశాను. ఆ నమ్మకం, ఆశతోనే ఇండస్ట్రీలో అడుగులు వేశాను అని చెప్పుకొచ్చింది. రాశిక శెట్టి.. కన్నడ బిగ్బాస్ 12వ సీజన్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. కన్నడలో రెండు సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులో సందేహం చిత్రంలో యాక్ట్ చేసింది.చదవండి: రామాయణ సినిమా రిజెక్ట్ చేశా: రణ్బీర్ కపూర్ -
దుల్కర్తో విభేదాలు? అందుకే దూరం పెట్టారా? హీరో ఆన్సరిదే!
గతేడాది విడుదలైన మలయాళ మూవీ 'లోక' (తెలుగులో కొత్త లోక చాప్టర్:1 పేరిట రిలీజైంది) బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది. కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మలయాళ హీరోలు దుల్కర్ సల్మాన్, టొవినో థామస్ అతిథి పాత్రల్లో మెరిశారు. దీనికి త్వరలోనే సీక్వెల్ కూడా రాబోతోంది.దుల్కర్తో విభేదాలు?అయితే ఫస్ట్ పార్ట్ ప్రమోషన్స్లో టొవినో థామస్ గురించి ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. దాంతో అతడికి, దుల్కర్కు మధ్య ఏమైనా విభేదాలు తలెత్తాయా? అని ప్రేక్షకుల్లో సందేహం తలెత్తింది. తాజాగా ఈ అనుమానాన్ని టొవినో నివృత్తి చేశాడు. టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం పళ్లిచట్టంబి. ఈ చిత్రం ఏప్రిల్ 10న తెలుగు, మలయాళ, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఫోన్ చేయమంటారా?సినిమా ప్రమోషన్స్లో భాగంగా చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అతడికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. లోక ఈవెంట్స్లో ఎవరూ మీ గురించి మాట్లాడలేదు. మీకు, దుల్కర్కు మధ్య ఏదైనా సమస్య ఉందా? అని ఓ విలేకరి ప్రశ్నించాడు. అందుకు టొవినో థామస్ స్పందిస్తూ.. నేనిప్పుడు అతడికి ఫోన్ చేసి అడగనా? (నవ్వుతూ) మామధ్య అలాంటి గొడవలేం లేవు. మేము ఒకరికొకరం చాలాకాలంగా తెలుసు. నేను అతడి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాను. అప్పుడు అడగండి!తర్వాత తన సినిమాలో విలన్గా నటించాను. అప్పటి నుంచి ఇప్పటివరకు మేమిద్దరం చాలా బాగున్నాం. కావాలంటే నేను మీకు మా వాట్సాప్ చాట్స్ కూడా చూపిస్తాను. మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడీ వీడియో క్లిప్పింగ్ తనకు చూపించి ఇద్దరం నవ్వుకుంటాం. ఈ రూమర్స్ సృష్టించడం చాలా ఈజీ. లోక 2 వచ్చినప్పుడు మేమందరం కలిసొస్తాం. అప్పుడు ఈ ప్రశ్న అడగండి, నా గురించి వాళ్లే మాట్లాడతారు అని టొవినో థామస్ చెప్పుకొచ్చాడు.చదవండి: రామాయణ సినిమా ఫస్ట్ రిజెక్ట్ చేశా: రణ్బీర్ కపూర్ -
సూరి సినిమాలో హీరోయిన్గా 'డ్యూడ్' బ్యూటీ!
సినిమా ఎవరిని ఎప్పుడు? ఏ స్థాయిలో నిలబెడుతుందో చెప్పలేం. అప్పటివరకు ప్రయత్నలోపం లేకుండా శ్రమిస్తూనే ఉండాలి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సహాయనటుడి నుంచి హాస్యనటుడిగా ఎదిగి ఇప్పుడు సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్నాడు నటుడు సూరి. విడుదలై మూవీతో హీరోగా ట్రాక్ ఎక్కిన ఈయన ఇటీవల విడుదలైన మామన్ మూవీ వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.కమెడియన్ నుంచి హీరోగా..ప్రస్తుతం ఇతడు మండాడి సినిమా చేస్తున్నాడు. సముద్రతీరంలో జాలర్ల పడవల పోటీ నేపథ్యంలో రూపొందుతున్న కథా చిత్రమిది. మదిమారన్ పుహళేంది కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఈ మూవీ తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతోంది. ఇది నిర్మాణంలో ఉండగా మరో సినిమాకు కమిటయ్యాడు సూరి.రియల్ స్టోరీ ఆధారంగా మూవీరవికుమార్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ నిర్మించనుంది. 2015లో చెన్నైలో బీభత్సం సృష్టించిన వరదల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని సమాచారం. ఈ మూవీ త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది. ఇందులో సూరికి జంటగా మమిత బైజు హీరోయిన్గా నటించనున్నట్లు వినికిడి. ప్రేమలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ డ్యూడ్ సినిమాతో మరో హిట్ అందుకుంది. హీరోయిన్ ఎవరంటే?విజయ్ హీరోగా నటించిన జననాయకన్లోనూ కీలక పాత్ర పోషించింది. సూర్యకు జంటగా విశ్వనాథ్ అండ్ సన్స్, ధనుష్తో కర సినిమాలు చేసింది. ఇవన్నీ త్వరలోనే రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం సూరితో మమిత బైజు జోడీ కట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే! -
నయనతార.. ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్
పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్కి నిజమైన అర్హత సాధించిన నటి నయనతార. ఒక్కో భాషలో ఒక్కో సినిమా చేస్తూ, ఐదు భాషల్లో ఒకేసారి సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం నయనతార తెలుగులో ఒక సినిమా షూటింగ్ దశలో ఉంది. మలయాళంలో రెండు సినిమాలు సెట్స్పై కొనసాగుతున్నాయి. తమిళంలో రెండు సినిమాలు రెడీ అయ్యాయి. మరో సినిమా షూటింగ్లో ఉంది. కన్నడలో ఆమె నటించిన టాక్సిక్ సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఇక హిందీ బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సరసన నటించేందుకు సైన్ చేసింది. ఇంతకుముందు షారూక్ ఖాన్తో కలిసి జవాన్ చిత్రంలో నయనతార నటించింది. ఇప్పుడు సల్మాన్తో కలిసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్లో కీలక పాత్ర పోషించనుంది. ఇందులో కూడా ఆమె పాత్రకు యాక్షన్ టచ్ ఉండనుందని సమాచారం. ఇలా ఒకేసారి ఐదు భాషల్లో సినిమాలు చేస్తూ నిజమైన పాన్ ఇండియా హీరోయిన్గా నిలుస్తోంది నయనతార. నయనతార ఈ స్థాయికి రావడానికి గల కారణాల్లో ఆమె సినిమాల ఎంపికలో చూపే వైవిధ్యం ఒకటి. తన నటనతో ఇప్పటికే దక్షిణాది భాషల్లో బలమైన స్థానం సంపాదించుకున్న ఈ నటి ఇప్పుడు బాలీవుడ్లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకునే ప్రయత్నంలో ఉంది. -
రిషబ్ శెట్టి అన్ ఫాలో వివాదం.. మంచిపని చేశాడు..!
కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి ప్రస్తుతం జై హనుమాన్ మూవీలో నటిస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో అలరించనున్నారు. ప్రస్తుతం ఈ మూ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా షూట్ లాంఛనంగా ప్రారంభమైంది. ఇప్పటికే రిలీజైన హనుమాన్ పోస్టర్ చూస్తే రిషబ్ శెట్టి లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే తాజాగా రిషబ్ శెట్టి చేసిన ఓ పని వివాదానికి దారి తీసింది. ఆయన పని చేసిన కాంతార టీమ్ నటీనటులను ఇన్స్టాలో అన్ ఫాలో చేయడం కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. రెండు రోజుల క్రితం హోంబలే ఫిల్మ్స్ ఖాతాను అన్ ఫాలో చేసిన రిషబ్.. హీరోయిన్ రుక్మిణి వసంత్తో పాటు రాజ్ .బి.శెట్టిని కూడా అన్ ఫాలో చేశాడు. దీంతో రిషబ్కు.. నిర్మాణ సంస్థతో ఏమైనా విభేదాలు వచ్చాయా అని డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం హోంబలే ఫిల్మ్స్ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ను మాత్రం రిషబ్ ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు.ఈ వివాదం నేపథ్యంలో రిషబ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హోంబలే ఫిల్మ్స్ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ను కూడా అన్ ఫాలో చేసేశారు. తాను ఫోలో అవుతున్న ఇన్స్టా లిస్ట్లో ఉన్న అందరినీ అన్ ఫాలో చేసి క్లియర్ చేశారు. రిషబ్ ఇప్పుడు కేవలం మూడు ఖాతాలను మాత్రమే ఫాలో అవుతున్నారు.. అందులో ఒకటి తన భార్య ప్రగతి శెట్టి.. మరొకటి తన ప్రొడక్షన్ హౌస్తో పాటు రిషబ్ శెట్టి ఫౌండేషన్ను ఫాలో చేస్తున్నారు. ఈ చర్యతో రిషబ్ శెట్టి వ్యవహారం శాండల్వుడ్లో మరోసారి చర్చకు దారితీసింది. అయితే దీనిపై రిషబ్ శెట్టి గానీ.. హోంబలే ఫిల్మ్స్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అసలేం జరిగిందన్ననది తెలియాలంటే నిర్మాణ సంస్థ కానీ.. రిషబ్ శెట్టినో క్లారిటీ ఇవ్వాల్సిందే. కాగా.. కాంతార సినిమాతో కన్నడ హీరో రిషబ్ శెట్టికి గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ను అన్ఫాలో చేసిన రిషబ్ శెట్టి) View this post on Instagram A post shared by PragathiRishabShetty (@pragathirishabshetty) -
బిర్యానీ వండిన స్టార్ హీరో.. వీడియో వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. కాస్తా గ్యాప్ దొరికితే కార్ రేసింగ్లో దిగిపోతుంటారు. తాజాగా అజిత్ కుమార్ చెన్నైలోని ఓ ఈవెంట్కు హాజరయ్యారు. తన భార్య షాలినితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెన్నైకి చెందిన ఫుట్బాల్ క్లబ్ ఎఫ్సీ మద్రాస్ నిర్వహించిన ఈవెంట్లో అజిత్, షాలిని సందడి చేశారు. ఈ సందర్భంగా అజిత్ బిర్యానీ వండుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఈ వీడియోలో షాలిని.. తన భర్తను ఆటపట్టించారు. నేను చెప్పినట్లుగా చేసావా? అంటూ అజిత్ను సరదాగా అడిగింది. ఆ తర్వాత అజిత్ దంపతులకు తాము అతిథ్యమివ్వడం అదృష్టంగా భావిస్తున్నామని ఎఫ్సీ మద్రాస్ పేర్కొంది. మనదేశానికి మోటార్స్పోర్ట్స్.. అలాగే దేశాన్ని ప్రపంచ రేసింగ్ పటంలో నిలపాలన్న అజిత్ కుమార్ దార్శనికత నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడారు. క్రీడలకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ ఛాంపియన్లను తయారు చేయడంలో.. భారతదేశంలో క్రీడాకారులను తీర్చిదిద్దడంలో అజిత్తో కలిసి పనిచేస్తామని ఎఫ్సీ మద్రాస్ ప్రకటించింది.ఇక అజిత్ సినిమాల విషయానికొస్తే దర్శకుడు అధిక్ రవిచంద్రన్తో మరోసారి జత కట్టనున్నారు. ఇంకా ఈ మూవీ పనులు ప్రారంభించలేదు. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ గ్యాప్లోనే అజిత్ కుమార్ మోటార్ రేసింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటున్నారు. Shalini mam - naa sona Mari paniyacha 😁Ajith enga paru 🤩 Pookie couples 😁#AjithKumar #ShaliniAjithKumar #AK pic.twitter.com/G95wNgI9tS— AJITH FANS COMMUNITY (@TFC_mass) March 30, 2026 -
సైలెంట్గా పెళ్లి చేసుకున్న హీరోయిన్
హీరోయిన్గా తమిళంలో సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ జనని అయ్యర్ (Janani Iyer) ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. గతేడాది ఏప్రిల్లో నిశ్చితార్థం చేసుకోగా.. దాదాపు పదకొండు నెలల తర్వాత ఇప్పుడు పైలట్ సాయి రోషన్తో ఏడడుగులు వేసింది. తమిళ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని జనని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)2011లో వచ్చిన విశాల్-ఆర్య 'వాడు-వీడు' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన జనని.. తర్వాత మలయాళ, తమిళంలో వరస మూవీస్ చేస్తూనే ఉంది. చివరగా 2024లో 'హాట్ స్పాట్'లో ఓ కథానాయికగా నటించింది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు చిత్రాలున్నాయి. అలానే తమిళ బిగ్బాస్ రెండో సీజన్లోనూ పార్టిసిపేట్ చేసింది గానీ 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంది. తర్వాత కూడా నటిగా కొనసాగుతుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: తెలుగు వాళ్లకు నచ్చితే ఈ సినిమాకు రూ.1000 కోట్లు) -
తెలుగు వాళ్లకు ఈ సినిమా నచ్చితే రూ.1000 కోట్లు
సినిమా నటీనటులు కొన్నిసార్లు మాట్లాడే మాటలు అతిశయోక్తిలా అనిపిస్తుంటాయి. ఆ విషయం వాళ్లకు కూడా తెలుసు. అయినా సరే హీరోలని పొగిడే క్రమంలో ఇలాంటి చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పుడు ఫేమస్ కమెడియన్ ఇలాంటి కామెంట్స్ చేశాడు. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)తమిళనాడులో వస్త్రదుకాణాలతో గుర్తింపు తెచ్చుకున్న శరవణనన్.. నాలుగేళ్ల క్రితం 'లెజెండ్' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సదరు హీరో యాక్టింగ్పై అప్పట్లో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ఇప్పుడు 'లీడర్' అనే మూవీతో వస్తున్నాడు. ఏప్రిల్ 3న తెలుగు, తమిళంలో థియేటర్లలో రిలీజ్ కానుంది. దీని ఆడియో-ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం చెన్నైలో జరిగింది. ఇందులోనే కమెడియన్ వీటీవీ గణేశ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా గనక నచ్చితే సులభంగా రూ.1000 కోట్లు వచ్చేస్తాయని అనడం చిత్రంగా అనిపించింది.రజనీకాంత్, విజయ్ లాంటి స్టార్ హీరోలే ఇప్పటివరకు రూ.1000 కోట్ల మార్క్ని అందుకోలేకపోయారు. అలాంటిది లెజెండ్ శరవణనన్ సినిమాకు ఇన్ని కోట్ల వసూళ్లు వస్తాయని కమెడియన్ పొగడటం కాస్త అతిలా ఉంది. దీని గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వస్తున్నాయి. తొలి చిత్రంతో తీవ్రంగా నష్టపోయిన శరవణనన్.. ఈసారి 'లీడర్'తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. ఇందులో పాయర్ రాజ్పుత్ హీరోయిన్ కాగా ఆండ్రియా, శ్యామ్, లాల్ తదితర స్టార్స్ ఉన్నారు. (ఇదీ చదవండి: రూమర్స్ నిజమయ్యాయి.. తెలుగు దర్శకుడితోనే సల్మాన్) -
ప్రభాస్, మహేశ్, తారక్ సినిమాలు చూస్తా.. అవన్నీ కూడా!
స్టార్ హీరోయిన్ రవీనా టండన్ కూతురు రాషా తడానీ అప్పుడే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. చేసింది ఒక్క సినిమా (ఆజాద్)నే అయినా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఆజాద్ మూవీలో ఉయి అమ్మా పాటలో డ్యాన్స్తో ఇరగదీసి సెన్సేషన్ అయింది. ఈ బ్యూటీ శ్రీనివాస మంగాపురం మూవీతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. సూపర్స్టార్ కృష్ణ నటవారసత్వాన్ని కొనసాగిస్తూ ఘట్టమనేని జయకృష్ణ (రమేశ్బాబు తనయుడు) వెండితెరకు హీరోగా పరిచయం కాబోతున్నాడు.సౌత్ సినిమాలంటే ఇష్టంఈ మూవీలో రాషా తడానీ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. నాకు దక్షిణాది సినిమాలు చూడటమంటే చాలా ఇష్టం. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్బాబు.. ఇలా అందరి సినిమాలు చూస్తుంటాను. వాళ్ల సినిమాలన్నీ కొత్త అనుభూతినిస్తాయి. ఇప్పుడదే ఇండస్ట్రీలో భాగం కావడం సంతోషంగా ఉంది. దీన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను.హీరోయిన్స్ కూడా..హీరోలే కాదు, అక్కడ హీరోయిన్స్ రష్మిక మందన్నా, శ్రీలీల.. ఇలా అందరూ స్ఫూర్తిదాయకంగా ఉంటారు. అలాంటి సినీ ప్రపంచంలో భాగమయ్యే అవకాశం లభించినందుకు గర్వంగా ఉంది. నా జర్నీ చక్కగా ముందుకు సాగుతుందనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. శ్రీనివాస మంగాపురం విషయానికి వస్తే.. ఆర్ఎక్స్ 100, మంగళవారం ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది. మరోవైపు రాషా.. లైకే లైకా అని ఓ హిందీ మూవీ కూడా చేస్తోంది.చదవండి: బాలీవుడ్ అంటే భయపడుతున్న నాగచైతన్య? నిజమిదే! -
అది నిజం కాదు, ఎవరూ నమ్మకండి: ఖుష్బూ
చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా అంటే తమను జనాలతో కలిపే వారధిగా భావిస్తారు. వ్యక్తిగత, వృత్తిపర విషయాలను పంచుకుంటూ ఉంటారు. మరికొందరు ఎప్పుడో ఒకసారి కానీ పోస్టులు పెట్టరు. అయితే సెలబ్రిటీల పేరుతో కొందరు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తుంటారు. ఇప్పుడదే జరిగింది. ఎక్స్ (ట్విటర్)లో ఖుష్బూ భర్త, దర్శకుడు సుందర్ సి పేరిట ఓ అకౌంట్ ఉంది. త్వరలోనే కొత్తది..దానికి సంబంధించిన స్క్రీన్షాట్ను ఖుష్బూ షేర్ చేస్తూ.. అది ఫేక్ అకౌంట్ అని స్పష్టం చేసింది. తన భర్త ఎటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో లేడని వెల్లడించింది. కాబట్టి సుందర్.సి పేరుపై కనిపించే ఖాతాలను నమ్మవద్దని కోరింది. త్వరలోనే అతడికి ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేయనున్నట్లు తెలిపింది. ఇకపోతే ఒకప్పుడు హీరోయిన్గా అలరించిన ఖుష్బూ.. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంది. మొదట్లో డీఎంకేలో చేరింది. నాలుగేళ్లకే ఆ పార్టీని వదిలి కాంగ్రెస్లో అడుగుపెట్టింది. రాజకీయ ప్రవేశంఆరేళ్లకే కాంగ్రెస్ను సైతం వీడి బీజేపీలో చేరింది. 2025లో ఆమె తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితురాలైంది. ఇదిలా ఉంటే త్వరలో ఎన్నికలు రానున్న తరుణంలో ఖుష్బూ భర్త సుందర్. సి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది. ఎన్డీయే కూటమి మిత్రపక్షమైన పుతియ నీది కట్చి (Puthiya Neethi Katchi (PNK) పార్టీ నుంచి అసెంబ్లీ బరిలో దిగుతున్నాడు. మధురై నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నాడు. This is a fake account of Director #SundarC . He is not not any social media platform as on date. Pls do not follow this or interact on this or any other similar account on any social platform. . Shall be creating a new and verified account for him soon. 🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/9P1VYV67U7— KhushbuSundar (@khushsundar) March 30, 2026 చదవండి: ప్రేమిస్తే ఛాన్స్ మిస్ అయ్యేది.. ముఖానికి గ్రీజు పూసుకోవడంతో..: హీరో -
'ప్రేమిస్తే' ఆడిషన్కు గ్రీజు పూసుకుని వెళ్లా.. అప్పుడుకానీ..!
తమిళ హీరో భరత్.. బాయ్స్, ప్రేమిస్తే, స్పైడర్, హంట్ సినిమాలతో తెలుగువారికి సుపరిచితుడు. ప్రస్తుతం ఇతడు 'కాళిదాస్ 2' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన అతడు కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఓ అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. భరత్ మాట్లాడుతూ... దర్శకుడు బాలాజీ శక్తివేల్ నాకు కాదల్ (తెలుగులో ప్రేమిస్తే పేరిట డబ్ అయింది) కథ చెప్పాడు. హీరో ఎంపిక కరెక్టేనా?చిన్న టౌన్లో మెకానిక్ పనిచేసుకునే అబ్బాయిగా నటించాల్సి ఉంటుందని పాత్ర పరిచయం చేశాడు. నేను కూడా ఒప్పుకున్నాను. తీరా దర్శకుడు హీరోగా నేను కరెక్టేనా? అన్న డైలమాలో పడ్డాడు. నా రంగు, మాటతీరు.. అన్నీ సిటీ అబ్బాయి లక్షణాలే ఉన్నాయి.. పక్కా పల్లెటూరి భాష మాట్లాడే మెకానిక్ రోల్కు సెట్ అవుతానా? లేదా? అన్న అనుమానం ఆయన మెదడును తొలిచేసింది.అదే వీధిలో ఇల్లు కొన్నా..నేనేమో ఎలాగైనా ఈ సినిమా చేయాలనుకున్నాను. ముఖానికి గ్రీజు పూసుకుని ఆడిషన్కు వెళ్లాను. పైగా దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. వారిలాగే మాట్లాడాను. నా తాపత్రయం నిర్మాత ఎస్.శంకర్కు అర్థమైంది. ఆయన ఆఫీసులోనే స్క్రీన్ టెస్ట్ చేసి ఫైనల్ చేశారు. అలా కాదల్ మూవీ చేయగా, మంచి గుర్తింపు లభించింది. తర్వాత ఆ ఆఫీస్ ఉన్న వీధిలోనే నేను ఇల్లు కొనుక్కున్నాను. అదెంతో గర్వకారణంగా అనిపించింది అని భరత్ చెప్పుకొచ్చాడు.చదవండి: నేను సినిమాలు చూడను: ఆమిర్ ఖాన్ -
తమిళనాట ఎన్నికల హీట్.. విజయ్కే నా ఓటు అంటోన్న హీరోయిన్..!
ఈ మండు వేసవిలో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల హీట్ నడుస్తోంది. సినిమా రంగంలోనూ ఆ ప్రభావం కనిపిస్తోంది. సినీ తారలు తమకు నచ్చిన వారికి సపోర్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి వాణిభోజన్ తన మద్దతు టీవీకే ఛీఫ్ విజయ్కే అని ప్రకటించారు. బుల్లితెర నుంచి వెండి తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. ఓమై కడవుల్ చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత మహాన్, మిరన్ వంటి పలు చిత్రాల్లో వాణి భోజన్ నటించారు. కొన్ని వెబ్ సిరీస్ల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ హీరోయిన్గా ఆశించిన స్థాయికి చేరుకోలేదనే చెప్పాలి. కాగా ఇటీవల తమిళనాడులోని కుంభకోణంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న వాణి భోజన్ పలు విషయాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా ఏ హీరోతో నటించాలని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు తాను నటుడు విజయ్కు వీరాభిమానినని.. ఆయనకు జంటగా నటించాలన్న కోరిక ఉందని తెలిపింది. అయితే విజయ్ నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగప్రవేశం చేయడంతో ఆ కోరిక నెరవేరే అవకాశం లేదని పేర్కొంది. అయితే విజయ్ రాజకీయ రంగప్రవేశం చేయడాన్ని తాను స్వాగతిస్తున్నాని వెల్లడించింది.విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రారంభించడం సంతోషమని అన్నారు. మీకు ఆ పార్టీలో చేరే ఆలోచన ఉందా ? అన్న ప్రశ్నకు కచ్చితంగా ఉందన్నారు. ఈ విషయం గురించి చాలా మంది అడుగుతున్నారని, అయితే దాని గురించి తరువాత చెబుతానని అన్నారు. ఈ ఎన్నికల్లో తన మద్దతు మాత్రం విజయ్కే నని తెలిపింది. కాగా ప్రస్తుతం తాను ఈ భామ ప్రస్తుతం వలై అనే చిత్రంలో అధర్వకు జంటగా నటిస్తున్నట్లు వెల్లడించారు. -
సూపర్ హిట్ కాంబో రిపీట్.. ఆ మూవీకి సీక్వెల్ రానుందా?
మంగాత్తా చిత్ర కాంబో రిపీట్ కానుందా? అంటే కోలీవుడ్లో అవుననే టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరో అజిత్, దర్శకుడు వెంకట్ ప్రభులది హిట్ కాంబినేషన్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబోలో 2010లో తెరకెక్కిన మంగాత్తా చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఆ చిత్రంలో నటుడు అజిత్ను విలనిజంతో కూడిన స్టైలిష్ పాత్రలో చూపించి సక్సెస్ అయ్యారు డైరెక్టర్.దీంతో వీరి కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం ఇప్పుడు రానుంది. దర్శకుడు వెంకట్ ప్రభు.. శివకార్తికేయన్ హీరోగా చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని నటుడు శివకార్తికేయన్ కూడా తెలిపారు. అయితే ఈ చిత్రం ప్రారంభంలో ఆలస్యం జరగనున్నట్లు తెలిసింది. దీంతో దర్శకుడు వెంకట్ ప్రభు ఇటీవల నటుడు అజిత్ను కలిసి కథ వినిపించినట్లు సమాచారం.అది ఆయనకు నచ్చడంలో అందులో నటించడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కాగా అజిత్ 2027 జనవరి వరకు చిత్రాల్లో నటించనని ఇంతకు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఆయన 64వ చిత్రాన్ని గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. దీంతో వెంకట్ ప్రభు దర్శకత్వంలో అజిత్ నటించే చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? దానికి సంబంధించిన వివరాలు ఏమిటి? అన్నది తెలియాలంటే మరికొద్ది కాలం ఆగాల్సిందే. ఇకపోతే ఇది మాంగాత్తాకు సీక్వెల్గా ఉంటుందా? లేక కొత్త కథా చిత్రంగా ఉంటుందా? అనే ఆసక్తి నెలకొంది. -
సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న బెస్ట్ ఫ్రెండ్స్
ఇప్పటి హీరోలు క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడ్డానికైనా సిద్దంగా ఉంటారు. తమ మేకోవర్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. రీసెంట్గా వచ్చిన ఇద్దరు హీరోల లుక్స్ చూస్తే ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తుంది. ఆ ఇద్దరు హీరోల్లో ఒకరు మెగా పవర్స్టార్ రామ్ చరణ్, మరొకరు అతడి బెస్ట్ ఫ్రెండ్ శర్వానంద్.వీరిద్దరూ తమ మేకోవర్స్తో టోటల్ ఇండస్ట్రీని ఆకర్షిస్తున్నారు. ముందుగా రామ్ చరణ్ విషయానికొస్తే, తాజాగా తన పుట్టినరోజు నాడు రిలీజైన 'పెద్ది' సినిమా రెండో గ్లింప్స్ లో అందర్నీ ఆకట్టుకున్న అంశం చరణ్ బాడీ. ఆ పహిల్వాన్ లుక్ కోసం చరణ్ ఎంత కష్టపడ్డాడో ఆ లుక్ చూస్తుంటే ఇట్టే అర్థమైపోతుంది.చరణ్ ఈ లుక్ కోసం కొన్ని నెలల పాటు మాంసాహారం మానేశాడని సమాచారం. ఓవైపు అయ్యప్ప దీక్షలో ఉంటూనే, మరోవైపు పహిల్వాన్ లుక్ కోసం కసరత్తులు చేశాడు. పహిల్వాన్ లుక్ కోసం నిజమైన పహిల్వాన్లు చేసే కసరత్తులనే చరణ్ చేశాడు. అలా దాదాపు 8 నెలల పాటు ఎంతో కష్టపడి మరీ ఈ కండలు తిరిగే దేహాన్ని చరణ్ సొంతం చేసుకున్నాడు.అయితే శర్వానంద్ బైకర్ రోల్ కోసం మరింత స్ఫూర్తిదాయకమైన ప్రయాణం చేశాడు. ఆ రోల్ కోసం ఇతడు పడిన కష్టం అంతా ఇంతా కాదనే చెప్పాలి. బైకర్ చిత్ర దర్శకుడు శర్వాను 6-8 కిలోలు తగ్గితే చాలన్నాడట. కానీ శర్వానంద్ మాత్రం అంతకుమించి కష్టపడ్డాడు. అక్షరాలా రోజుకు 32 కిలోమీటర్లు పరుగెత్తేవాడని సమాచారం.42 సంవత్సరాల శర్వానంద్ 18 ఏళ్ల బైక్ రేసర్గా కనిపించేందుకు తన శరీరంలోని ప్రతి అణువునూ కరిగించేలా కసరత్తు చేశాడట. ప్రస్తుతం తన ఒంట్లో ఏమాత్రం కొవ్వు లేనంత బక్కపల్చగా తయారయ్యాడు. ఇలా టీనేజర్ గా కనిపించడం కోసం శర్వానంద్ ఏకంగా రెండేళ్లు కష్టపడ్డాడు. ఇక బైకర్ ట్రయిలర్ ఎంత క్లిక్ అయిందో, అందులో శర్వా లుక్ అంతకంటే ఎక్కువగా అందరి ప్రశంసలు పొందింది. -
వివాదంలో మురుగ.. రూ.10 కోట్ల డిమాండ్.. చివరకు ఫ్రీగా
ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా వెలుగువెలిగిన ఏఆర్ మురుగదాస్.. ఇప్పుడు కెరీర్ పరంగా పూర్తిగా డౌన్ అయిపోయాడు. చేసిన సినిమాలు చేసినట్లు అట్టర్ ఫ్లాప్ అయ్యేసరికి ఒక్కరూ కూడా ఇతడిని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇది చాలదన్నట్లు ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. టాలీవుడ్ నిర్మాత.. తాజాగా ఫిర్యాదు చేయడంతో ఇది కాస్త వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలు ఏమైంది?(ఇదీ చదవండి: చిరంజీవి-ప్రభాస్ సినిమాలు.. అదొక్కటే సమస్య?)గతేడాది మురుగదాస్ నుంచి రెండు మూవీస్ వచ్చాయి. వాటిలో సల్మాన్ ఖాన్తో చేసిన 'సికందర్' ఒకటి కాగా శివకార్తికేయన్తో చేసిన 'మదరాశి' ఒకటి. ఇవి రెండు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. 'మదరాశి' చిత్ర నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఇప్పుడు తమిళ దర్శకులు, నిర్మాతల కౌన్సిల్లో ఏఆర్ మురుగదాస్పై ఫిర్యాదు చేశారు. తొలుత రూ.115 కోట్ల బడ్జెట్ అని చెప్పి షూటింగ్ పూర్తయ్యేసరికి రూ.170 కోట్ల మేర ఖర్చు చేశాడని తన కంప్లైంట్లో పేర్కొన్నారు.అయితే బడ్జెట్ పెరగడానికి మురుగదాస్కి సరైన ప్లానింగ్ లేకపోవడం, దీనితో పాటు 'సికందర్' సమాంతరంగా చేయడమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. తమకు జరిగిన నష్టానికిగానూ రూ.10 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇరువర్గాల మధ్య చర్చ జరగ్గా.. అంతిమంగా కౌన్సిల్ ఓ నిర్ణయం తీసుకుంది.దీని ప్రకారం.. ఏఆర్ మురుగదాస్, తన రమణ 2(ఠాగుర్ సీక్వెల్) స్టోరీని సదరు నిర్మాణ సంస్థకు ఉచితంగా ఇచ్చేందుకు అంగీకారం తెలిపాడట. అలా ఈ వివాదానికి ఓ పరిష్కారం దొరికిందని కోలీవుడ్లో మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతానికైతే మురుగదాస్ చేతిలో కొత్త ప్రాజెక్ట్ ఏం లేదు. ఈ వివాదం జరిగిన తర్వాత వస్తుందా అనే నమ్మకం కూడా కలగట్లేదు!(ఇదీ చదవండి: అందాల 'చిచ్చుబుడ్డి'.. ఎవరీ జోనితా గాంధీ?) -
హవ్వ, పెళ్లి కాలేదా? ప్రియురాలి కోసం అబద్ధమాడిన హీరో!
తమిళ హీరో రవి మోహన్ ఓపక్క విడాకుల వ్యవహారం, మరోపక్క సింగర్ కెనీషా ఫ్రాన్సిస్తో డేటింగ్ రూమర్స్తో వార్తల్లో ఉంటున్నాడు. విడాకులు మంజూరవకముందే సింగర్తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చాలాసార్లు విమర్శలపాలయ్యాడు. అయితే ఏకంగా అతడికి అసలు పెళ్లే కాలేదని చెప్తూ ప్రియురాలి కోసం ల్యాండ్ కొన్నట్లు ఓ వార్త కోలీవుడ్ టౌన్లో వైరల్గా మారింది.ఇంకా పెళ్లవలేదు!రవి మోహన్, కెనీషా ప్రాన్సిస్ గోవాలో భూమి కొనుగోలు చేశారట. ఈ ప్రాపర్టీ ఖరీదు రూ.40-42 లక్షలని తెలుస్తోంది. అయితే రిజిస్ట్రేషన్ సంబంధిత పత్రాల్లో రవి మోహన్.. అన్ మ్యారీడ్ అంటూ తనకింకా పెళ్లవలేదని పేర్కొన్నాడట! విడాకులు మంజూరు కాకముందే సింగిల్ అని ఎలా పేర్కొంటారని పలువురు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరేమో.. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సిబ్బంది పొరపాటున అన్మ్యారీడ్ సెలక్ట్ చేసి ఉంటారని భావిస్తున్నారు.పేరు మార్పుకాగా రవి మోహన్.. ప్రముఖ నిర్మాత సుజాత విజయ్కుమార్ కూతురు ఆర్తిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్ సంతానం. 2024లో రవి మోహన్, ఆర్తి విడిపోయారు. అయితే చట్టపరంగా ఇంకా విడాకులు మంజూరు కాలేదు. ఇకపోతే జయం మూవీతో బ్రేక్ అందుకుని జయం రవిగా కొనసాగుతున్న ఆయన.. గతేడాది జనవరిలో తన పేరు మార్చుకున్నాడు. ఇకపై జయం రవి కాకుండా రవి మోహన్ అనే పిలవాలని కోరాడు. చివరగా పరాశక్తి సినిమాలో విలన్గా నటించాడు.చదవండి: నిన్ను నా అంతగా ఇంకెవరూ ప్రేమించలేరు: విజయ్ ఆంటోని -
నా అంతగా ఎవరూ ప్రేమించలేరు, అదే నీకిచ్చే గిఫ్ట్: విజయ్ ఆంటోని
విజయ్ ఆంటోనీ సంగీత దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత అతడు హీరోగా మారాడు. కొన్ని సినిమాలకు తనే ఎడిటర్గానూ వ్యవహరించాడు. లిరిసిస్ట్గా, సింగర్గానూ టాలెంట్ చూపించాడు. అయితే విజయ్ ఆంటోని వైవాహిక జీవితం మొదలుపెట్టాకే హీరోగా ప్రస్థానం ప్రారంభించాడు. 2006లో ఫాతిమాను పెళ్లి చేసుకున్నాడు.నువ్వే నా ప్రపంచంఅన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఎంతో అందంగా ఉంటుందీ జంట. నేడు (మార్చి 29న) ఫాతిమా పుట్టిన రోజు. ఈ సందర్భంగా భార్య కోసం స్పెషల్ పోస్ట్ పెట్టాడు విజయ్. మిసెస్ విజయ్ ఆంటోని.. మై డియర్ లవ్, నువ్వే నా ప్రపంచం, నువ్వే నా యజమానివి. మై డియర్ పట్టు.. ఈరోజు నేను చేస్తున్న వాగ్ధానమే నీకిచ్చే బహుమతి. నీ జీవితంలో నేను నిన్ను ప్రేమించినంతగా ఇంకెవరూ ప్రేమించలేరు. ఆఖరికి భగవంతుడు కూడా నీ జీవితంలో నా అంత ప్రేమను పంచలేడు.సినిమానువ్వు నా సహచరివి, సర్వస్వానివి, నా జీవితానికే పరమార్థానివి.. ఐ లవ్యూ అని రాసుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం విజయ్ ఆంటోని నూరు సామి సినిమా చేస్తున్నాడు. ఇది తెలుగులో వంద దేవుళ్లు పేరిట రిలీజ్ కానుంది. బిచ్చగాడు డైరెక్టర్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.చదవండి: సినిమాలు మానేయాలని కండీషన్.. హీరోతో పెళ్లి రిజెక్ట్ చేశా: హీరోయిన్ -
ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని తీయాలి: శర్వానంద్
కెన్ కరునాస్, అనిష్క అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షీ యాదవ్, మీనాక్షీ దినేష్ ప్రధాన నటించిన తమిళ సినిమా ‘యూత్’. కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళనాడులో ఈ నెల 19న విడుదలైంది. ఈ చిత్రాన్ని ఈ2సీ పతాకంపై హౌస్ఫుల్ వినీత్, సందీప్ ఈ నెల 27న తెలుగులో రిలీజ్ చేశారు. తెలుగులో ‘యూత్’ చిత్రానికి మంచి స్పందన లభిస్తోందని యూనిట్ పేర్కొంది.శనివారం జరిగిన ఈ సినిమా సక్సెస్మీట్కు ముఖ్య అతిథిగా హాజరైన శర్వానంద్ మాట్లాడుతూ–‘‘యూత్’ సినిమాలో ఒక 23 ఏళ్ల అబ్బాయి హీరోగా నటించడంతోపాటు దర్శకత్వం వహించి సూపర్ హిట్ కొట్టాడంటే నమ్మలేకపోయాను. ఇలాంటి మంచి మూవీస్ మరిన్ని చేయాలి’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాలో నేను ప్రభాస్గారి ఫ్యాన్గా నటించాను. ఆయన ఫ్యాన్స్ మా సినిమాను సపోర్ట్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు కంటెంట్ ముఖ్యమని మరోసారి నిరూపించారు. మీ ఫ్యామిలీతో ఈ సినిమా చూడండి’’ అన్నారు కెన్ కరునాస్.‘‘మా మార్కెటింగ్ సంస్థ పేరు హౌస్ఫుల్. ఇప్పుడు మా సినిమాకు హౌస్ఫుల్ బోర్డులు చూస్తుండటం సంతోషంగా ఉంది. పిల్లలు తమ తల్లిదండ్రుల్ని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని అర్థం చేసుకోవాలనే కాన్సెప్ట్తో తీసిని సినిమా ఇది’’ అన్నారు సందీప్. ‘‘మా సినిమాను సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు వినీత్. ఎగ్జిక్యూటివ్ ్రపొడ్యూసర్ సతీష్, దర్శకుడు వశిష్ట, నిర్మాత – డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడారు. -
గాయంతో తిరిగి సెట్స్పైకి రామ్ చరణ్
టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. ఆయన ఎడమ కంటికి తగిలిన దెబ్బ కారణంగా చిన్నపాటి సర్జరీ చేయాల్సి వచ్చింది. యూనిట్ ఈ గాయం పెద్దది కాదని ప్రకటించినప్పటికీ, తన అభిమానులు మాత్రం కొంత ఆందోళన చెందారు. అయితే గాయమైన గంటల వ్యవధిలోనే చరణ్ తిరిగి సెట్స్పైకి వచ్చాడు. గురువారం 'పెద్ది' చిత్ర షూటింగ్లో పాల్గొన్నాడు. దాంతో వందల సంఖ్యలో మెగా అభిమానులు సెట్స్కు చేరుకుని ఆయనను కలుసుకున్నారు. చరణ్ వారందరితో మాట్లాడి, సెల్ఫీ వీడియో కూడా దిగాడు. ఆ వీడియోను యూనిట్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో చరణ్ స్వయంగా తన గాయంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు. చరణ్కు సుధాకర్ ప్రసాద్ అనే వైద్యుడు మైనర్ సర్జరీ చేసినట్లు చిరంజీవి స్వయంగా వెల్లడించారు. డాక్టర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇక మార్చి 27 (శుక్రవారం) రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 9.45 గంటలకు పెద్ది నుంచి సర్ప్రైజ్ రాబోతోందని యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఏప్రిల్ 30న సినిమా రిలీజ్ అవుతుందని మరోసారి ధృవీకరించారు. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు ఈఏ రాజేంద్రన్ తీవ్ర అనారోగ్యంతో (71) కన్నుమూశారు. కేరళలోని కొల్లాం జిల్లా పట్టతానంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నాటకరంగంతో పాటు సినిమా, టీవీ రంగాల్లో సేవలందించారు. ఆయన చేసిన సేవలకు గాను రాజేంద్రన్ మలయాళ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు.తన కళా జీవితాన్ని నాటకరంగంలో ప్రారంభించిన రాజేంద్రన్.. సినిమాల్లోకి రాకముందు రంగస్థల నటుడిగా మంచి పేరు సంపాదించారు. తన కెరీర్లో దాదాపు 60 చిత్రాలలో నటించారు. విలన్గా, సహాయ పాత్రలతో అభిమానులను మెప్పించారు. పలు సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యారు. కేరళ త్రిస్సూర్ జిల్లాలోని త్రితల్లూరులో గల ఎంగూర్ తారవాడులో అయ్యప్పన్, సుమతి దంపతులకు రాజేంద్రన్ జన్మించారు. చిన్న వయసులోనే కళలపై ఆసక్తి కనబరిచారు. పూణేలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో టెలివిజన్ కోర్సు అభ్యసించిన ఆయన.. ప్రముఖ నటుడు మాధవన్ కుమార్తె సంధ్యను వివాహం చేసుకున్నారు.వీఆర్ గోపీనాథ్ దర్శకత్వం వహించిన గ్రీష్మం చిత్రంతో రాజేంద్రన్ తొలిసారిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ తర్వాత రాజేంద్రన్కు సినిమారంగంలో అవకాశాలొచ్చాయి. జయరాజ్ దర్శకత్వం వహించిన కాళియాట్టం చిత్రంలోనూ నటించారు. అంతేకాకుండా ప్రణయ వర్ణంగల్, దయ, పట్టాభిషేకం వంటి మూవీస్లో కూడా కనిపించారు. అంతేకాకుండా రాష్ట్ర ఉద్యానవన సంస్థ అధ్యక్షుడిగానూ రాజేంద్రన్ సేవలందించారు. -
చరణ్కు గాయం.. 'పెద్ది' నుంచి ప్రత్యేక గ్లింప్స్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు ఇటీవల ప్రమాదవశాత్తూ గాయపడ్డారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా నుంచి రాబోయే అప్డేట్ ఆలస్యమవుతుందేమోనని అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. అయితే యూనిట్ తాజాగా ఇచ్చిన స్పష్టతతో ఆ అనుమానాలన్నీ తొలగిపోయాయి. చరణ్ ఎడమ కంటికి చిన్నపాటి గాయం మాత్రమే జరిగింది. దానికి వెంటనే ట్రీట్మెంట్ జరిగిందని 'పెద్ది' టీమ్ తెలిపింది. రేపట్నుంచే ఆయన తిరిగి సెట్స్లో పాల్గొనబోతున్నారని కూడా ప్రకటించింది. ఇక అభిమానులకు గుడ్ న్యూస్ ఏమిటంటే.. చరణ్ పుట్టినరోజు కానుకగా 'పెద్ది' నుంచి ప్రత్యేక గ్లింప్స్ రాబోతోంది. మార్చి 27 ఉదయం 11:07 గంటలకు దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే రెడీ చేసిన టీజర్ విడుదల కానుంది. ఇప్పటికే చరణ్ చేసిన బ్యాట్ విన్యాసం సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయింది. అదే తరహాలో ఈ బర్త్డే టీజర్ కూడా భారీ విజయాన్ని సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అంటే రామ్ చరణ్ గాయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. పెద్ది సినిమాకు సంబంధించిన అప్డేట్స్, సంబరాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ పెద్ది టీమ్ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. -
కేడీ సాంగ్ వివాదం.. నాకు అర్థం కాదన్న డైరెక్టర్..!
కన్నడలో తెరకెక్కుతోన్న లేటేస్ట్ మూవీ కేడీ ది డెవిల్. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో రేంజ్లో విడుదల చేస్తున్నారు. ఈ మూవీలో ధ్రువ్ సర్జా హీరోగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి సర్కే చునార్ తేరీ సర్కే అనే సాంగ్ను విడుదల చేశారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఈ పాటను రిలీజ్ చేశారు. కానీ ఊహించని విధంగా హిందీ లిరిక్స్ వర్షన్పై తీవ్ర విమర్శలొచ్చాయి. ఆ తర్వాత వెంటనే హిందీ వర్షన్ సాంగ్ను యూట్యూబ్ నుంచి తొలగించారు.ఈ నేపథ్యంలో హిందీ లిరిక్స్ వివాదానికి దారి తీయడంపై డైరెక్టర్ ప్రేమ్ స్పందించారు. హిందీ భాషపై తనకు పట్టులేదని.. ఆ లిరిక్స్ అర్థం కూడా తనకు తెలియదన్నారు. నేను కన్నడలో మాత్రమే లిరిక్స్ రాశానని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని.. ఒకవైపు యుద్ధం.. మరోవైపు గ్యాస్ కొరత ఉందని.. వాటిపై చర్చించాలని అన్నారు. అంతేకానీ ఈ పాటను వివాదం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆ పాట కేవలం ఒక పార్టీలో భాగంగా సరదా కోసమే ఉంచామని వెల్లడించారు. కాగా.. ఈ మూవీలో నోరా ఫతేహి, సంజయ్దత్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల కానుంది. -
దురంధర్, బోర్డర్-2 కాదు.. ఆ చిన్న సినిమానే నంబర్వన్..!
ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ఓటీటీ చిత్రం మేడ్ ఇన్ కొరియా. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చేసింది. తన కోరికతో కొరియా వెళ్లిన యువతి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందన్న కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీపై పలువురు సౌత్ స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రియాంక మోహన్ నటనను కొనియాడుతున్నారు.ఈ మూవీ ఓటీటీకి వచ్చిన తొలివారంలోనే నంబర్ ప్లేస్లో ట్రెండింగ్లోకి వచ్చేసింది. రెండు వారాలు పూర్తి అయినా కూడా ఈ సినిమాకు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. నెట్ఫ్లిక్స్లో నానా-ఇంగ్లీష్ కేటగిరీలో బోర్డర్-2, దురంధర్ చిత్రాలను వెనక్కి నెట్టి మొదటిస్థానంలో కొనసాగుతోంది. ఈ విషయాన్ని డైరెక్టర్ కార్తీక్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.వరుసగా రెండవ వారం కూడా మేడ్ ఇన్ కొరియా ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవ్వడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. మొట్టమొదటిసారిగా ఒక దక్షిణాది చిత్రం ఇటువంటి ప్రపంచ స్థాయి గుర్తింపును సాధించడం మరింత ప్రత్యేకంగా నిలిచిందని రాసుకొచ్చారు. ఈ మూవీకి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన మీ ప్రేమకు, సందేశాలకు, ఫోన్ కాల్స్కు ధన్యవాదాలు.. మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. ఓ మహిళా ఓరియంటెడ్ మూవీ ఇంతటి ఆదరణను పొందడం మాకు ఎంతో గర్వకారణమన్నారు. ప్రియాంక మోహన్.. నీ నీ కృషికి తగిన ఫలితం రావడం నాకు చాలా సంతోషంగా ఉందని రాసుకొచ్చారు. కాగా.. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. Really happy to share that #madeinkorea is trending globally NO 1 for the 2nd week in the Non-English Movies category on Netflix 🌍For the first time, a South Indian film has reached this kind of global scale and to sustain it into the second week makes it even more special ❤️… pic.twitter.com/3LNAdVkxpM— Ra.Karthik (@Rakarthik_dir) March 25, 2026 -
న్యూ లుక్... ఫ్యాన్స్కి కిక్
రజనీకాంత్ హీరోగా సిబీ చక్రవర్తి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ కెరీర్లోని ఈ 173వ సినిమాను కమల్హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించనున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ను మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఈ సినిమాలోని ఇతర నటీనటుల ఎంపిక, లుక్ డిజైనింగ్ వంటి అంశాలపై సిబీ ఫోకస్ పెట్టారు. ఈ చిత్రంలో రజనీకాంత్ను సరికొత్తగా చూపించేందుకు దాదాపు 80 రకాల లుక్స్ను పరిశీలించారట సిబీ. ఈ లుక్స్లో మూడు లుక్స్ను ఎంపిక చేసి, వీటిలో రజనీకాంత్ మెచ్చిన లుక్ను ఫైనలైజ్ చేయనున్నారని సమాచారం. ఈ లుక్ రజనీ ఫ్యాన్స్కి కిక్ ఇచ్చేలా ఉంటుందని కోలీవుడ్ టాక్. -
కాంతార ఇమిటేషన్.. దురంధర్ హీరో అలా చేయాల్సిందే..!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ప్రస్తుతం దురంధర్-2 సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. దురంధర్ మూవీకి సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో పార్ట్-2 కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదలైంది. ఈ చిత్రంపై సౌత్ స్టార్స్ అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీని కాంతార హీరో రిషబ్ శెట్టి సైతం కొనియాడారు. అద్బుతంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. కాంతార ఇమిటేషన్ కేసులో ఊరట..అయితే గతంలో రణ్వీర్ సింగ్ కాంతార మూవీ దేవతను ఇమిటేట్ చేయడం వివాదానికి దారితీసింది. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రణ్ వీర్ సింగ్ ఇమిటేట్ చేశారు. ఆ తర్వాత తన ప్రవర్తనపై రణ్వీర్ క్షమాపణలు కూడా చెప్పారు. ప్రజల భక్తి, సెంటిమెంట్ కావడంతో రణ్వీర్ సింగ్ తీరుపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. కాగా.. చాముండి దేవత పాత్రలో రిషబ్ శెట్టి నటించారు. అయితే దైవాంశమైన పాత్రలను రణవీర్ సింగ్ కామెడీగా ఇమిటేట్ చేశారని ఆరోపిస్తూ గత డిసెంబర్లో ప్రశాంత్ మితల్ అనే న్యాయవాది బెంగళూరులోని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో చెప్పిన క్షమాపణ సరిపోదని.. ప్రత్యక్షంగా వచ్చి సారీ చెప్పాలని పిటిషన్లో కోరారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు రణ్వీర్ సింగ్కు ఊరటనిచ్చింది. చాముండి ఆలయాన్ని సందర్శించి క్షమాపణ చెప్పాలంటూ రణ్వీర్ సింగ్ను ఆదేశించింది. ఫిర్యాదుదారుడు క్షమాపణ కోసం కోర్టుకు హాజరు కావాలని కోరితే.. అందుకు అంగీకరించాలని కోర్టు సూచించింది.దీనిపై క్షమాపణ అఫిడవిట్ దాఖలు చేస్తామని.. రణ్వీర్ సింగ్ త్వరలోనే ఆలయాన్ని సందర్శిస్తారని హీరో తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణ ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ విచారణ సమయంలో రణవీర్ సింగ్ తండ్రి హాజరయ్యారు. కోర్టు సూచనలతో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ కోర్టులో క్షమాపణ చెప్పి.. చాముండి ఆలయాన్ని సందర్శించనున్నారు.కాగా.. గతేడాది పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన కాంతారా చాప్టర్-1 మూవీ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. 2022లో విడుదలైన కాంతారా చిత్రానికి ఇది ప్రీక్వెల్గా కాంతారా చాఫ్టర్-1 విడుదలైంది. -
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ మధ్య సూపర్ హిట్ సినిమాలు కూడా నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. థియేటర్స్లో రిలీజ్కు ముందే ఓటీటీ రైట్స్ని అమ్మేసుకొని.. టాక్తో సంబంధం లేకుండా నెలలోపే ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. కానీ ఓ హారర్ చిత్రం మాత్రం రిలీజ్ అయినా ఏడాది తర్వాత ఓటీటీలోకి దర్శనం ఇచ్చింది. అది కూడా తమిళ్ భాషలోనే స్ట్రీమింగ్ అవ్వడంతో తెలుగు ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. ఇంతకీ ఏ సినిమా? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది?'వైశాలి’తో సూపర్ హిట్ అందుకున్న హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం ‘శబ్దం’. గతేడాది ఫిబ్రవరిలో తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కథ, కథనం రొటీన్గా ఉన్నా, టైటిల్కి తగ్గట్టే డిఫరెంట్ శబ్దాలతో ప్రేక్షకులను భయపెట్టారనే టాక్ని సంపాదించుకుంది కానీ, కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. అన్ని సినిమాల మాదిరే నాలుగు వారాల్లో ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని అంతా భావించారు. కానీ, ఊహించని విధంగా ఏడాది తర్వాత ఇప్పుడు జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. అది కూడా కేవలం తమిళ భాషలో మాత్రమే ఈ సినిమా అందుబాటులోకి రావడం తెలుగు ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. తెలుగు స్ట్రీమింగ్కు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.శబ్దం కథేమింటి?కేరళలోని ఓ మెడికల్ కాలేజీలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటారు. శృతి అనే వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. విద్యార్థుల మరణం వెనుక దెయ్యాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. దీంతో యాజమాన్యం ఆహ్వానం మేరకు మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఛేదించేందుకు ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ వ్యోమ వైద్యలింగం(ఆది పినిశెట్టి) రంగంలోకి దిగుతాడు. ఇన్వెస్టిగేషన్లో వ్యోమ వైద్యలింగంకి తెలిసిన నిజాలు ఏంటి? కాలేజీ లెక్చరర్ అవంతిక(లక్ష్మీ మీనన్) ఎందుకు అనుమానస్పదంగా ప్రవర్తిస్తుంది? డయానా(సిమ్రాన్) ఎవరు? కాలేజీలో జరుగుతున్న మరణాలతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? నాన్సీ(లైలా) ఎవరు? కాలేజీలో ఉన్న లైబ్రరీ నేపథ్యం ఏంటి? మరణాల వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? 42 దెయ్యాల స్టోరీ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
అలనాటి హీరోయిన్ భానుప్రియ ఇంట తీవ్ర విషాదం
అలనాటి హీరోయిన్లు భానుప్రియ, శాంతిప్రియ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వారి తల్లి ఎం. లక్ష్మి (83) ఆదివారంనాడు గుండెపోటుతో కన్నుమూశారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు చెన్నైలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఎం.లక్ష్మికి భానుప్రియ, శాంతిప్రియతో పాటు గోపాలకృష్ణ అనే కుమారుడు ఉన్నాడు. ఇద్దరు కూతుర్లను సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా తీర్చిదిద్దారు లక్ష్మి. భానుప్రియకాగా భానుప్రియ 1998లో ఆదర్శ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. వీరికి కూతురు అభినయ సంతానం. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. దీంతో 2005లో అతడి నుంచి విడిపోయి కూతుర్ని తీసుకుని చెన్నైకి వచ్చి తల్లితోనే కలిసి ఉంటోంది. 2018లో నటి మాజీ భర్త ఆదర్శ్ కౌశల్ గుండెపోటుతో మరణించాడు. శాంతిప్రియభానుప్రియ చివరగా అయాలన్ అనే తమిళ సినిమాలో కనిపించింది. శాంతిప్రియ విషయానికి వ్తే.. ఈమె ప్రముఖ దర్శకుడు వి.శాంతారాం మనవడు, నటుడు సిద్దార్థ్ రాయ్ను పెళ్లి చేసుకుంది. 1992లో వీరి వివాహం జరగ్గా ఈ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. 2004లో సిద్దార్థ్ కూడా గుండెపోటుతోనే కన్నుమూశాడు. -
భర్త లేకుండా బతకలేనని ఏడ్చా.. చివరకు విడిపోయాం: నటి
మలయాళ ఇండస్ట్రీలో దశాబ్దకాలంగా సహాయ నటిగా రాణిస్తోంది నటి మంజు పాత్రోస్. వెండితెరతో పాటు బుల్లితెరపైనా పలు సీరియల్స్ చేస్తోంది. కొంతకాలంగా ఆమె తన వర్క్ గురించి కాకుండా పర్సనల్ లైఫ్ గురించి వార్తల్లో నిలుస్తోంది. భర్త సునిచన్తో విడిపోయిందని ప్రచారం జరుగుతోంది.అవును, విడిపోయాంతాజాగా ఈ వ్యవహారంపై మంజు పాత్రోస్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. చట్టపరంగా విడిపోలేదు కానీ కొంతకాలంగా వేర్వేరుగానే జీవిస్తున్నాం. సునిచన్తో నేను మాట్లాడటం లేదు. ఎప్పుడైనా ఒకసారి ఫోన్ చేసి నా కొడుకుతో మాట్లాడుతుంటాడు. వాడిని చూసేందుకు అప్పుడప్పుడు వస్తుంటాడు కూడా! దాన్ని నేనేమీ అడ్డుకోను. మేమింకా చట్టపరంగా విడిపోలేదు. అలా అని మళ్లీ కలిసే ఆలోచనలు కూడా చేయడం లేదు.ఎంతో ఏడ్చా..ఇతరులకు నచ్చినట్లుగా ఎక్కువకాలం బతకలేం. మనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలుంటాయి. వాటిని కూడా గౌరవించాలికదా! ఇకపోతే ఇలా విడిపోతామని ఎన్నడూ అనుకోలేదు. నా భర్త లేకుండా ఎలా బతకాలని ఎంతగానో ఏడ్చాను. ఒంటరిగా ఎలా జీవిస్తానని భయపడ్డాను. కానీ, ఇప్పుడా భయం పోయింది.. చేతిలో డబ్బుంది కాబట్టి నిర్భయంగా జీవిస్తున్నారని మీరంటారేమో! ఇక్కడ విషయం డబ్బు కాదు.. అలాగైతే నా అకౌంట్లో ఇప్పటికీ చాలా తక్కువ మొత్తమే ఉంది. చిల్లి గవ్వ లేని స్థితిలో..ఓపక్క అప్పు తీరుస్తున్నాను, మరోపక్క కొడుకును చదివిస్తున్నాను. ఒకానొక సమయంలో ముక్కుపుడక తప్ప నా చేతిలో ఏమీ లేని నిస్సహాయ స్థితికి వెళ్లిపోయాను. అప్పుడు నా చుట్టూ ఉండేవాళ్లు నాకు మద్దతుగా నిలబడ్డారు, సాయం చేశారు అని చెప్పుకొచ్చింది. మంజు మలయాళంలో జిలేబి, కమ్మటిపాదం, స్కూల్ బస్, కల్యాణం, ప్రేమసూత్రం, తోటప్పన్, మై సాంటా, హెవెన్, క్వీన్ ఎలిజబెత్, ఎఎమ్ఐ, భూతకాలం వంటి పలు సినిమాల్లో నటించింది. మలయాళ బిగ్బాస్ రెండో సీజన్లోనూ పాల్గొంది.చదవండి: జూన్లో ధురంధర్ 3? నిజమెంత? -
కరుప్పు ఫస్ట్ విజయ్కే చెప్పా.. ఆయనకు నచ్చింది.. కానీ!
స్టార్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రాల్లో కరుప్పు ఒకటి. అయితే ఈ ప్రాజెక్ట్ సూర్య కంటే ముందు దళపతి విజయ్ చేతికి వెళ్లిందట. ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రజనీకాంత్ కెరీర్లో భాష, ముత్తు, పడయప్ప (నరసింహ) వంటి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇప్పటికీ చాలామంది జనాలు వీటిని మళ్లీ మళ్లీ చూస్తుంటారు. 2023లోనే..అలాంటి ఒక ఫుల్ ఎంటర్టైనర్ సినిమాని తీయాలని నా కోరిక. యాక్టింగ్ అంటే గట్టిగా అరవడం, ఏడవడం కాదు. అన్ని రకాల ఎమోషన్స్ను సమపాళ్లలో పండించాలి. అది సూర్యకు వెన్నతో పెట్టిన విద్య.. తను బాగా డ్యాన్స్ చేస్తాడు, అద్భుతంగా నటిస్తాడు, ఏదైనా సింపుల్గా చేసేస్తాడు. తన స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంటుంది. నిజానికి 2023లో కరుప్పు కథ రాయడం మొదలుపెట్టాను. విజయ్కు కథ చెప్పా..ఈ కథకు బలమైన స్టార్ ఉంటే బాగుంటుందనిపించింది. అలా హీరో విజయ్ను కలిశాను.. పైగా ఆయన 2021లోనే ఏదైనా కథ ఉంటే చెప్పమని అడిగాడు. ఈ రెండు కారణాల వల్ల తనను కలిశాను. కరుప్పు విజయ్కు చాలా బాగా నచ్చింది. ఇది భారీ సినిమా.. వెంటనే మొదలుపెడదాం అన్నారు. కానీ విజయ్ వంటి స్టార్ హీరోతో సినిమా తీయడం అంటే పెద్ద బాధ్యత.. నచ్చింది కానీ..అలా హడావుడిగా మొదలుపెట్టలేనని చెప్పాను. తర్వాత కొన్నిసార్లు కలిశాం, మాట్లాడుకున్నాం.. కానీ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆయన నా నుంచి కుటుంబ కథా చిత్రం ఆశించాడు. అయినప్పటికీ ఈ కథ తనకెంతో నచ్చింది.. అదే సంతోషం అని ఊరుకున్నాను. తర్వాత సూర్యను సంప్రదించగా ఆయన ఓకే చెప్పాడు అని తెలిపాడు.సినిమాకరుప్పు విషయానికి వస్తే.. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తోంది. స్వాశిక, ఇందిరన్స్, యోగిబాబు, శివదా, సుప్రీత్ రెడ్డి, అనకా, మాయారవి, నట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ఆర్. ప్రకాశ్బాబు, ఎస్ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. రిలీజ్ డేట్ ప్రకటించాల్సి ఉంది.చదవండి: ధురంధర్ 2 ప్రభంజనం.. 28 ఏళ్ల కిందటి లేఖ వైరల్ -
తమిళ సాంగ్ రిలీజ్.. స్టెప్పులేసిన రోజా
మిలియన్ డాలర్స్ స్టూడియోస్, నీయో కాస్టిల్స్ క్రియేషన్స్ సంస్థల అధినేతలు సత్య కరికాలన్, యువరాజ్ గణేశన్ కలిసి నిర్మిస్తున్న చిత్రం అన్బే డయానా. జమా చిత్రం ఫేమ్ పారి ఇళవళగన్ కథానాయకుడిగా నటిస్తుండటంతో పాటు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయనకు జంటగా రమ్య రంగనాథన్ నటిస్తోంది.సాంగ్ రిలీజ్తమిళనాడులోని ఒక గ్రూప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ.. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి సింగిల్ సాంగ్ను విడుదల చేశారు. ఇందులో హీరోహీరోయిన్లతో పాటు నటి రోజా కూడా స్టెప్పులేశారు. జెస్సీ గిఫ్ట్ ఆలపించిన ఈ పాటను ఇప్పుడు సంగీత ప్రియులు రిపీట్ మోడల్ వింటున్నారు. సినిమారొమాంటిక్ వైబ్తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సాగే అన్బే డయానా ఆడియో, ట్రైలర్ లాంచ్ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. నటుడు చేతన్, వైరల్ యూట్యూబర్ పరితాపంగల్ గోపి, ఇస్మత్ భాను, సుదర్శన్ గాంధీ, సెల్ మురుగన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతాన్ని, షెల్లీ గెలిస్ట్ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. -
పిడుగులాంటి వార్త.. నిస్సహాయస్థితిలో నటుడు
మలయాళ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కన్నన్ సాగర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తనకు వీలైనంత త్వరగా బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. అయితే ఆపరేషన్ చేయించుకునే స్థోమత తనకు లేదని, దాతలు సాయం చేయాలని కోరుతున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ నోట్ వదిలాడు.కుటుంబ బాగోగులు ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కోనివారు ఈ ప్రపంచంలో ఉండరు. అలాగే సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతని ఎవరు కాదనగలరు? మన సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తాం, పిల్లల్ని చదివిస్తాం.. వాళ్ల బాగోగులు చూసుకుంటాం. అలాగే మనకున్నదాంట్లోనే పక్కవాళ్లకు కూడా సంతోషాన్ని పంచే ప్రయత్నం చేస్తాం.పిడుగులాంటి కుదుపుకానీ సడన్గా అనారోగ్యం అనే ఓ పిడుగులాంటి వార్త మన జీవితాలను కుదిపేస్తుంది. మోయలేనంత భారాన్ని, బాధను తీసుకొస్తుంది. మన దారుల్ని మూసేస్తుంది.. ఇప్పుడెలా ముందుకెళ్తావని ప్రశ్నిస్తుంది. దృడ సంకల్పంతో దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా ఆర్థిక అంశాలు వెనక్కులాగుతాయి. అప్పుడే మన నిస్సహాయ స్థితి అర్థమై.. ఇతరుల సాయం కోసం వెతకడం మొదలుపెడతాం. గుండె సమస్యఇలా సాయం కోసం అర్థించడం బలహీనత అని నేననుకోను. ఎందుకంటే మన పరిస్థితి గురించి తెలిసినప్పుడే మంచి మనసున్నవారు మనకు సాయం చేసేందుకు ముందుకు వస్తారు. కొద్ది రోజులుగా నేను ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాను. నిన్ననే యాంజియోగ్రామ్ చేయించుకున్నాను. గుండె రక్తనాళాల్లో పూడిక ఉందని తెలిసింది. ఓదారుస్తున్నాతక్షణమే బైపాస్ సర్జరీ చేయాలన్నారు. ఈ విషయం తెలిసినప్పటినుంచి నా భార్యాపిల్లలు బాధతో ఏడుస్తూనే ఉన్నారు. వారిని ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నాను. కానీ, ఆపరేషన్ చేయించుకునేంత స్థోమత నాకు లేదు. సాయం కోసం చూస్తున్నా అన్నాడు. కన్నన్ సాగర్.. మలయాళంలో చార్లీ, అన్వేషిప్పిన్ కండేతుమ్, కర్ణన్ నెపోలియన్ భగత్ సింగ్ సినిమాల్లో నటించాడు.చదవండి: లాభాల్లో 70% వాటా డిమాండ్ చేస్తున్న స్టార్ హీరో -
లాభాల్లో 70% వాటా డిమాండ్ చేస్తున్న హీరో
అమరన్ సినిమా తర్వాత శివకార్తికేయన్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తన సినిమాలకు మార్కెట్ వాల్యూ కూడా పెరిగింది. అది దృష్టిలో పెట్టుకున్న హీరో కేవలం పారితోషికం కాకుండా లాభాల్లో వాటా అడుగుతున్నాడు. మదరాసి, పరాశక్తికి ఇదే రూల్ ఫాలో అయ్యాడట.. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాకు కూడా ఇదే విధానం అమలు చేయనున్నాడంటూ కోలీవుడ్లో తెగ ప్రచారం జరుగుతోంది.సెయాన్ అంటే..శివకార్తికేయన్ ప్రస్తుతం సెయాన్ సినిమా చేస్తున్నాడు. స్టార్ హీరో కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు. అమరన్ వంటి బ్లాక్బస్టర్ తర్వాత రాజ్కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్పై శివకార్తికేయన్ చేస్తున్న రెండో చిత్రమిది. ఈ మూవీతోనే శివకుమార్ మురుగేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సెయాన్ అంటే కుమారస్వామికి మరో పేరు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.లాభాల్లో వాటాఈ మూవీకి శివకార్తికేయన్ భారీ పారితోషికాలు గట్రా అడగలేదట! లాభాల్లో వాటా అడిగాడట! ఇప్పటికే రూ.10 కోట్ల అడ్వాన్స్ తీసుకున్న హీరో సినిమా రిలీజయ్యాక 70% లాభాలను డిమాండ్ చేశాడని తెలుస్తోంది. అంటే మిగిలిన 30% మాత్రం కమల్ హాసన్ బ్యానర్కు వెళ్తాయి. సెయాన్ బడ్జెట్ రూ.35 కోట్లని తెలుస్తోంది. మరి ఈ చిత్రానికి ప్రీరిలీజ్ బిజినెస్ ఎంత జరగనుంది? బాక్సాఫీస్ వద్ద ఎంత రాబడుతుంది? అన్నది చూడాలి!చదవండి: 50 ఏళ్ల వయసులో తండ్రయిన బాలీవుడ్ నిర్మాత -
పిచ్చి రీల్స్ పంపుతాడు.. ఆంటీ బాలేదు నాన్న అనగానే..
బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇండస్ట్రీలో ఎంట్రీ ఈజీ అవుతుందని చాలామంది వాదన. ఆ విషయం తాను కూడా అంగీకరిస్తానంటోంది హీరోయిన్ శృతి హాసన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నెపోకిడ్ వంటి అంశాల గురించి ఎవరైనా మాట్లాడుతుంటే నేనస్సలు ఫైట్ చేయను. ఎందుకంటే నాకు తొలిసారి పాట పాడే అవకాశం చాలా ఈజీగా లభించింది. నా గొంతు ఇబ్బందిఇళయారాజా సర్ సంగీత దర్శకత్వంలో నాన్న సినిమాలోనే తొలిసారి పాట పాడాను. నా వాయిస్ గంభీరంగా ఉంటుందని ఇళయరాజా అంటుండేవారు. ఒకసారి ఆయన ఇంటికి వచ్చినప్పుడు నేను మా పేరెంట్స్పై అరుస్తున్నాను. అప్పుడాయన నీ గొంతులో మంచి రేంజ్ ఉందన్నారు. అయితే ఆయన్ని ఇంప్రెస్ చేసిన నా గొంతు చాలామందికి మాత్రం డామినెంట్గా అనిపించింది.నాన్న సలహా తీసుకోనునేను చిన్నప్పుడే పండిత్ మనోహర్ కులకర్ణి, సురేశ్ వాడక్కర్ వంటి మహామహుల వద్ద సంగీతం నేర్చుకున్నాను. అలా నాకు మంచి గురువులు లభించారు. కెరీర్లో ఏం చేయాలి? ఎటువైపు అడుగులు వేయాలి? అనే విషయంలో ఎన్నడూ నాన్న సలహా తీసుకోలేదు. అలాగే రజనీకాంత్ను కూడా సలహా అడగలేదు. కాకపోతే వాళ్లిద్దరూ చాలా కష్టపడతారు. పిచ్చి రీల్స్ దాన్ని ఇబ్బందిగా ఫీలవకుండా ఇష్టంగా, నిశ్శబ్ధంగా కష్టపడతారు. సినిమా కోసం ప్రాణాలైనా ఇస్తారు.. ఇద్దరూ పని రాక్షసులు. అటు ఆఫీసును, ఇటు ఇంటిని చక్కగా నిర్వహిస్తారు. నాన్నయితే ఇన్స్టాగ్రామ్లో కనిపించే పిచ్చి రీల్స్ ఏవేవో పంపుతాడు. అది చూసినప్పుడు ఈ ఆంటీ ఫన్నీగా ఏం లేదు నాన్నా అంటుంటాను. అప్పుడాయన కొన్ని మంచి రీల్స్ పంపుతాడు.. అలాంటి వీడియోలు ఇష్టంచిన్న పాప అందంగా పాడుతున్నట్లు, గ్రామాల్లో వంట చేసే వీడియోలు.. ఇలాంటివి చూసి ఆయనెంతగానో సంతోషిస్తూ ఉంటాడు అని చెప్పుకొచ్చింది. కాగా ఐదేళ్లకే సింగర్గా పరిచయమైంది శృతి హాసన్. తేవార్ మగన్ (1992) మూవీలో పొట్రి పాడది పొన్నె అనే పాట ఆలపించింది. తర్వాత హీరోయిన్గా ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం సింగర్గా, హీరోయిన్గా రాణిస్తోంది.చదవండి: మహేశ్బాబు సెట్లో ఎలా ఉంటారంటే?: బాలీవుడ్ నటి -
ఆ మాత్రం దానికి పెళ్లి ఎందుకు?, 34 ఏళ్ల నటి షాకింగ్ కామెంట్స్
ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకోమనే చెబుతున్నారు. మరికొంతమంది అయితే తనకు నచ్చిన అబ్బాయి దొరికితే చేసుకుంటా..లేదంటే సింగిల్గానే ఉంటామని అంటున్నారు. తాజాగా కన్నడ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి కూడా అదే కామెంట్ చేసింది. జీవితంలో పెళ్లి అనేది తప్పనిసరి కాదని, తోడు కావాలనుకుంటే సహజీవనం బెటర్ అని చెబుతోంది ఈ 34 ఏళ్ల సుందరి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘గత 30 ఏళ్ల నా జీవితంలో పెళ్లి చేసుకున్న జంటలను ఎన్నో చూశా. వారిలో సంతోషంగా జీవితం గడుపుతున్నవారు చాలా తక్కువ. పెళ్లి తర్వాత భాగస్వామి కెరియర్లో ఆటంకాలు కలగడం నన్ను ఆలోచింపజేశాయి. ఒకప్పుడు అందరి అమ్మాయిల్లాగానే నేను కూడా పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాను. నా ఫ్రొఫైల్ని మ్యాట్రిమోనీ వెబ్సైట్లోనూ పెట్టాను. అయితే నా ఫోటో చూసి ఫేక్ ప్రొఫెల్ అనుకున్నారు. అదే సమయంలో నాకు పెళ్లి వ్యవస్థపై నమ్మకం పోయింది.నా ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య మనశ్శాంతి, తృప్తి ఉండాలి. అయితే అది పెళ్లితోనే సాధ్యం కాదని అర్థమైంది. నాకు కూడా తోడుగా ఉండే భాగస్వామి కావాలి. కానీ ఆ బంధం నిలబడడానికి పెళ్లి అనే ట్యాగ్ అవసరం లేదు. ఇద్ధరి మధ్య మంచి అవగాహన, గౌరవం ఉంటే.. సహజీవనం చేయడం బెటర్. పెళ్లి చేసుకుని విడిపోవడం కంటే పెళ్లి కంటే ముందే సహజీవనం చేయడమే మంచిది.’ అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది.ఐశ్వర్య లక్ష్మి సినీ కెరీర్ విషయానికొస్తే.. ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ అయ్యాక 2017లో నందలవర నాడు నాడ్ ఒరు ఆవాలా సినిమాతో తన సినీ కెరీర్ని ప్రారంభించింది. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం రోహిత్ కెపి దర్శకత్వంలో వస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాలో సాయి ధరమ్ తేజ్కి జోడీగా నటిస్తోంది. -
దురంధర్-2 రిలీజ్.. టాక్సిక్ సేఫ్.. మరి ఉస్తాద్ సంగతేంటి?
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా దురంధర్ పేరే వినిపిస్తోంది. గతేడాది రిలీజైన దురంధర్ బాక్సాఫీస్ను షేక్ చేయడంతో సీక్వెల్గా భారీ హైప్ క్రియేట్ చేసింది. అందుకు తగ్గట్టుగానే మార్చి 19న రిలీజైన దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రెండు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లోనూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా నార్త్ అమెరికాలోనూ 3.95 మిలియన్ల ఓపెనింగ్ వసూళ్లు సాధించింది. అడ్వాన్స్ బుకింగ్స్తో కలిపి ఇప్పటికే 10.5 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసినట్లు తెలుస్తోంది. టాక్సిక్ టీమ్ సేఫ్.. మరీ ఉస్తాద్ సంగతేంటి?యశ్ హీరోగా వచ్చిన టాక్సిక్ మార్చి 19న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ దురంధర్ క్రేజ్ చూసి మేకర్స్ తెలివిగా తప్పుకున్నారు. ఈ లెక్కన చూస్తే టాక్సిక్ టీమ్ చేసిన పని కరెక్టే అనిపిస్తోంది. కానీ తెలుగు హీరో పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం బాక్సాఫీస్ పోటీకి దిగింది. దురంధర్-2 మానియాకు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయిందన్న విషయం కూడా చాలామంది సినీ ప్రియులకు తెలియడం లేదు. దురంధర్ దెబ్బకుఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా రిలీజ్ అయిందా? అని కొంతమంది ఆడియన్స్ అడుగుతున్నారు. మరోవైపు చాలా థియేటర్లలో దురంధర్-2 మూవీకి టికెట్స్ కూడా దొరకడం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లు మాత్రం ఖాళీగా దర్శనమిస్తున్నాయి.ఇంత భారీ హైప్ ఉన్న మూవీ రిలీజ్ అయ్యే సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ కాస్తా ఆలోచించి ఉండాల్సిందనే ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా దురంధర్-2 బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గతేడాది డిసెంబర్ 5న కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సీక్వెల్ మూవీ క్రేజ్ చూస్తుంటే రూ.2 వేల కోట్ల మార్క్ చేరుకోవడం పక్కా అని తెలుస్తోంది. ఈ చిత్రాలను బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించారు. -
'ఐటమ్ సాంగ్లో ఛాన్స్.. అలా అడుగుతారని భయపెట్టారు'
దక్షిణాదిలోనే కాదు, ఇండియన్ సినిమాలోనే నటి నయనతార ప్రత్యేక జీవితం అని చెప్పక తప్పదు. కేరళ రాష్ట్రంలోని మారు మూల గ్రామానికి చెందిన ఈ మలయాళీ కుట్టి తనను నటిగా మలచుకోవడానికి చాలానే శ్రమించారు. పలు అవమానాలను, అవరాధాలను ఎదుర్కొని అగ్ర కథానాయకి స్థాయికి చేరుకున్నారు. కోలీవుడ్లో హరి దర్శకత్వంలో శరత్కుమార్ హీరోగా నటించిన అయ్యారు. ఈ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యి తొలి చిత్రంతోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖ చిత్రంలో నటించి దక్షణాది వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అలా వరుసగా విజయాలను అందుకుంటూ అందాల ప్రదర్శనలతోనూ, అభినయంతోనూ అందరినీ మెప్పిస్తూ, ఉమెన్స్ సెంట్రిక్ కథాపాత్రల్లో నటిస్తూ లేడీ సూపర్స్టార్గా గుర్తింపు పొందారు.ఆ తర్వాత నటుడు శింబు, ప్రభుదేవాతో ప్రేమాయణం బెడిసి కొట్టడంతో సింగిల్గానే జీవితాన్ని గడపాల్సిందే అని అనుకుంటున్న సమయంలో నానురౌడీదాన్ చిత్ర షూటింగ్లో ఆ చిత్ర దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమలో పడ్డారు. కొంతకాలం సహజీవనం తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి చెన్నైలో చాలా గ్రాండ్గా జరిగింది. ఆ వెంటనే ఈ దంపతులు సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. ఈ విషయంలోనూ పలు సమస్యలను ఎదుర్కొని సురక్షితంగా బయటపడ్డారు.స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న తరుణంలోనూ ప్రత్యేక పాటల్లో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇటీవల తన గతంలో జరిగిన ఒక సంఘటన గురించి నయతార గుర్తు చేసుకుంటూ విజయ్ హీరోగా నటించిన శివకాశీ చిత్రంలో ప్రత్యేక పాటలో నటించే అవకాశం రావడంతో తాను అందుకు సమ్మతించానన్నారు. అయితే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ పలువురు తనను ప్రశ్నించారన్నారు. ఇకపై అందరూ అలాంటి పాటల్లోనే నటించమని అడుగుతారని భయపెట్టారన్నారు. అయితే స్పెషల్ పాట అయితే స్పెషలేగా అని.. ఏదో ఒక ఇమేజ్ ఉంటేనే తనకు స్పెషల్ సాంగ్లో నటించే అవకాశం వచ్చిందని దాని ద్వారా పలు విషయాలు నేర్చుకోవచ్చని భావించానన్నారు. అలా తాను నటించిన రెండు స్పెషల్ సాంగ్స్తో చాలా విషయాలు నేర్చుకోగలిగానని నయనతార తెలిపారు. -
3D టెక్నాలజీతో పాన్ ఇండియా సినిమా 'కొరగజ్జ'
కర్ణాటకలోని తులునాడు ప్రాంతంలో అత్యంత పవిత్రంగా పూజించే కొరగజ్జ దైవం కథ ఆధారంగా ఓ సినిమా రాబోతోంది. 'కొరగజ్జ' పేరుతో తీస్తున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్లపై త్రివిక్రమ్ సాపల్య నిర్మిస్తున్నారు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని రీసెంట్గా విడుదల చేయాలని అనుకున్నారు కానీ చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని మార్చుకుని వాయిదా వేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)'కొరగజ్జ' చిత్రాన్ని చూసిన అంతర్జాతీయ బృందం ఇచ్చిన సలహా మేరకే వాయిదా వేశారట. ఈ మూవీని త్రీడీ ఫార్మాట్లోకి మార్చితే ఇంకా ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని, మరింతమందికి రీచ్ అవుతుందని చెప్పారట. దీంతో సినిమాని 2డీ నుంచి 3డీకి మార్చేందుకు టీంకి చాలా టైం కావాల్సి వస్తోంది.ఈ అప్గ్రేడ్పై దర్శకుడు సుధీర్ అత్తవర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం దాదాపు 40 మంది నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక బృందం ఈ త్రీడీ ఫార్మాట్ కోసం పనిచేస్తోంది. క్లైమాక్స్ను నీటి అడుగున తిరిగి తీశారు. ఈ సన్నివేశాన్ని కేరళలోని తిరువనంతపురంలో ఉన్న మలయాళ స్టార్ మోహన్లాల్కు చెందిన 'విస్మయ' స్టూడియోలో చిత్రీకరించారు.(ఇదీ చదవండి: క్రికెట్ రాజకీయాలకు బలైన 'ధురంధర్' దర్శకుడు) -
ఐశ్వర్యరాయ్కు సారీ చెప్పిన హీరోయిన్, ఎందుకంటే?
పిల్లి కళ్ల హీరోయిన్ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చే పేరు ఐశ్వర్యరాయ్.. ఆ తర్వాత కాస్త అటూఇటుగా ఐష్లాగే కనిపించే స్నేహా ఉల్లాల్ గుర్తొస్తుంది. తను కూడా హీరోయిన్ అయినప్పటికీ తనను ఐశ్వర్యతో పోల్చినందుకు తెగ సంబరపడిపోయింది. అదే సమయంలో ఒకసారి ఆమెను నేరుగా కలిసి క్షమాపణలు కూడా చెప్పింది.. అదెందుకో ఓసారి చూసేద్దాం..సినిమా'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది స్నేహా ఉల్లాల్. అప్పటికే 'లక్కీ: నో టైం ఫర్ లవ్' (2005) చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అలా ఓపక్క హిందీ సినిమాలు చేస్తూ మరోపక్క తెలుగు చిత్రాల్లో నటించింది. మధ్యలో కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇవ్వగా ఆ తర్వాత అడపడాదడపా సినిమాల్లో కనిపిస్తోంది.సల్మాన్ ఎలాంటివాడంటే?తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్నేహ తన కెరీర్ తొలినాళ్ల గురించి ఓపెన్ అయింది. ఆమె మాట్లాడుతూ.. లక్కీ మూవీతో నా సినీరంగ ప్రవేశం జరిగింది. చిత్రీకరణ సమయంలో హీరో సల్మాన్ ఖాన్ నాకెంతో సపోర్ట్ చేశాడు. ఎప్పుడూ ఓపిక, సహనంతో మెదిలేవాడు. తానో పెద్ద హీరో అని ఎన్నడూ యాటిట్యూడ్ చూపించలేదు.అలా ఫేమస్నిజానికి నేను సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ కిరీటం అందుకుంది. చూడటానికి నేను ఐశ్వర్యరాయ్లాగే ఉంటానని చాలామంది అంటుంటారు. అలా ఆమె మిస్ వరల్డ్ కిరీటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకుంటే నా చుట్టూ ఉన్న చిన్నప్రపంచంలో నేను సెలబ్రిటీ అయిపోయాను.ఐశ్వర్యకు సారీనేను ఒకే ఒక్కసారి ఐశ్వర్యను కలిశాను. నన్ను చూడగానే ఆమె 'వెల్కమ్ టు ద ఫ్యామిలీ.. బాలీవుడ్కు స్వాగతం' అని సాదరంగా ఆహ్వానించింది. అప్పుడు వెంటనే నేను ఆమెకు సారీ చెప్పాను. మీడియాలో పదేపదే నన్ను ఐష్తో పోలుస్తూనే ఉన్నారు. దాని గురించే చెప్తూ నన్ను క్షమించండి, దయచేసి నన్ను ద్వేషించకండి అన్నాను. మరి ఆమె దాన్ని ఎలా తీసుకుందో నాకు తెలీదు అని స్నేహా ఉల్లాల్ పేర్కొంది.చదవండి: ప్రియుడిని పెళ్లి చేసుకున్న పునర్నవి -
కాంబినేషన్ ఫిక్స్
విజయ్ సేతుపతి, సాయిపల్లవి కాంబినేషన్ ఫిక్స్ అయ్యింది. ఈ ఇద్దరూ జోడీగా నటించనున్న సినిమా ఖరారైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్నారు. సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రోడక్షన్స్, మద్రాస్ టాకీస్, ఇండియా టాకీస్ సంస్థలు నిర్మించనున్న ఈ సినిమాని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.సోని మ్యూజిక్ సంస్థ ఈ మూవీ ఆడియో హక్కులను పొందింది. ఇక ఈ ఏడాదిలోనే ఈ సినిమా చిత్రీకరణను ఆరంభించి, వచ్చే ఏడాది ప్రారంభంలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. కాగా, మణిరత్నం దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘చెక్క చివంద వానమ్’లో (తెలుగులో ‘నవాబ్’ టైటిల్తో విడుదలైంది) విజయ్ సేతుపతి ఓ లీడ్ రోల్లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
చండీగఢ్లో జైలర్
చండీగఢ్లో ల్యాండ్ అయ్యారట ముత్తువేల్ పాండ్యన్ . రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘జైలర్ 2’. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ఎస్జే సూర్య, యోగిబాబు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిథున్ చక్రవర్తి, మోహన్ లాల్, శివరాజ్కుమార్, విజయ్సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నట్లుగా తెలిసింది. జైలర్ ముత్తువేల్ పాండ్యన్గా నటిస్తున్నారు రజనీకాంత్.ఇందులోని మరో కీలకమైన పోలీస్ పాత్రలో హీరో షారుక్ఖాన్ నటించనున్నారని సమాచారం. ‘జైలర్ 2’ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ప్రస్తుతం చండీగఢ్లో జరుగుతోందని కోలీవుడ్ టాక్. ఈ షెడ్యూల్లో రజనీకాంత్, షారుక్ఖాన్ లపై ఓ యాక్షన్ సీక్వెన్స్ను తీస్తున్నారట నెల్సన్ అండ్ టీమ్. కార్ క్రషింగ్ ఫ్యాక్టరీలో ఈ యాక్షన్ సీక్వెన్స్ను తీస్తున్నారట. ఈ షెడ్యూల్తో ‘జైలర్ 2’ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంటుందని సమాచారం. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్లో రిలీజ్ కానుంది. -
'దురంధర్-2 చెత్త సినిమా.. థియేటర్కు అస్సలు వెళ్లకండి'.. నటి షాకింగ్ రివ్యూ
కన్నడ నటి, రాజకీయ నాయకురాలు దివ్య స్పందన గురించి పరిచయం అక్కర్లేదు. గతేడాది హీరో దర్శన్పై కామెంట్స్ చేసిన ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఓ అభిమానిని హీరో దర్శన్ హత్య చేయడంపై దివ్య స్పందన మండపడింది. దర్శన్.. తన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాడని నటి రమ్య గతంలో పేర్కొంది. ఆ తర్వాత దర్శన్ ఫ్యాన్స్ దివ్యపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు.తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈనెల 19న రిలీజైన రణ్వీర్ సింగ్ దురంధర్-2పై అభిప్రాయాన్ని తెలిపింది. ఈ మూవీ తనను తీవ్రంగా నిరాశపర్చిందని.. చూస్తున్నంతసేపు నిద్ర వచ్చిందని ఎద్దేవా చేసింది. అసలు ఇది థియేటర్స్లో చూసే సినిమానే కాదంటూ ట్వీట్ చేసింది.మొదటి పార్ట్లో ఉన్న సాంకేతిక విలువలు ఈ సినిమాలో కొరవడ్డాయాని దివ్య స్పందన విమర్శించారు. దర్శకత్వం, డైలాగ్స్, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, నటనలో దురంధర్-2 పూర్తిగా తేలిపోయిందని దివ్య స్పందన కామెంట్స్ చేసింది. మార్చి 19న విడుదల ఉందని వారికి ఎవరూ చెప్పలేదేమోనని మేకర్స్ను ఉద్దేశించిన వ్యంగ్యంగా మాట్లాడింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చకు దారితీశాయి. దివ్య తన ట్వీట్లో రాస్తూ..' ఇప్పుడే ధురందర్ 2 చూశాను. మన సహనానికి పరీక్షలా ఉంది. దయచేసి థియేటర్లో మీ సమయాన్ని, డబ్బును వృధా చేసుకోకండి. ఇది ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో చూసే మూవీ. దర్శకత్వం, సంభాషణలు, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, నటన అన్నీ చెత్తగా ఉన్నాయి. మార్చి 19న విడుదల ఉందని వాళ్లకు ఎవరూ చెప్పలేదేమోనని అనిపించింది. పార్ట్-1 ఫర్వాలేదు కానీ.. సింపుల్గా చెప్పాలంటే ధురందర్ 2 ప్రేక్షకుడిని పూర్తిగా నిరాశపర్చే సినిమా. మరీ అంతంత మాత్రంగానే ఉంది. ఇది ప్రేక్షకుడిని నిద్రపుచ్చే ఓ కామెడీ సినిమా. అసలు ఈ సినిమా 'ఎందుకని మనల్ని ప్రశ్నించేలా చేస్తుంది. రణ్వీర్.. నువ్వు ఇంతకంటే బాగా చేయగలవు. ఆదిత్య ధర్.. జాతీయవాదం, ప్రాపగండ నుంచి మీరు బయటికి రండి.' అంటూ రాసుకొచ్చింది. Just watched Dhurandhar 2 and wow! what a masterclass in how to turn something promising into an endurance test.It’s like reading a textbook of the most boring subject with never-ending chapters and at some point, your brain just gives up and starts laughing out of sheer despair…— Ramya/Divya Spandana (@divyaspandana) March 20, 2026 -
తమిళ హీరోలతో రొమాన్స్.. తెలుగు హీరోలపై కోపం?
తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం హ్యాపీ రాజ్. శ్రీగౌరీ ప్రియ హీరోయిన్గా నటించింది. ఒకప్పటి హీరో అబ్బాస్ దాదాపు పదేళ్ల తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్నాడు. లవ్టుడే సినిమాకు ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియ రాజ్ (మరియ ఇళంజెళియన్) దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.తెలుగు హీరోలపై కోపం?ఈ క్రమంలో శుక్రవారం నాడు హ్యాపీరాజ్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రీ గౌరీప్రియకు వింత ప్రశ్న ఎదురైంది. మీరు సినిమాల్లో తమిళ హీరోలతో రొమాంటిక్గా ప్రవర్తిస్తారు.. అదే తెలుగు హీరోలతో యారొగెంట్గా ప్రవర్తిస్తున్నారు, అంటే వాళ్లను కొడతారు. తెలుగు హీరోలపై ఎందుకంత కోపం? అని ఓ విలేకరి ప్రశ్నించాడు.నేనేమైనా కంకణ కట్టుకున్నానా?ఆ ప్రశ్న విని గౌరీప్రియ అవాక్కయింది. నేను ఒక్క సినిమాలోనే హీరోను కొట్టాను.. నేనేమైనా హీరోలను కొట్టాలని కంకణం కట్టుకున్నానా? అసలు నాకు ఎవరి మీదా కోపం లేదు. ఆ లెక్కన చూస్తే.. నేను అన్ని సినిమాల్లో ఏడుస్తానని అంటారు. తమిళ సినిమాల్లో ఏడుస్తుంది, తెలుగు మూవీస్లో మాత్రం సంతోషంగా నవ్వుతుందంటారు. అవేవీ నిజం కాదు.. సినిమాలో నా పాత్ర అలా డిజైన్ చేస్తున్నారు అని బదులిచ్చింది.సినిమాతెలుగమ్మాయి అయిన శ్రీ గౌరీ ప్రియ.. లవర్, మ్యాడ్, మెయిల్ వంటి సినిమాల్లో నటించింది. మ్యాడ్ మూవీలో ఈమె.. హీరో రామ్ నితిన్ చెంప చెళ్లుమనిపిస్తుంది. ఆ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో తెగ వైరలయింది. ప్రస్తుతం ఆమె చేతిలో వింటారా సరదాగా, చెన్నై లవ్స్టోరీ చిత్రాలున్నాయి.చదవండి: 10 ఏళ్ల కిందట విడాకులు.. కలిసిపోయిన స్టార్ కపుల్ -
మళ్లీ పెళ్లి చేసుకోలేదు, కానీ కలిసిపోయాం: స్టార్ డైరెక్టర్
మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్, హీరోయిన్ లిస్సీ 2016లో విడాకులు తీసుకున్నారు. 26 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోయారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో వీరిద్దరూ ఓ పెళ్లిలో జంటగా కనిపించారు. దీంతో ప్రియదర్శన్-లిస్సీ కలిసిపోయారా? అన్న ప్రచారం మొదలైంది. అది మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చెవిలో పడింది.సంతోషంలో మమ్ముట్టిమమ్ముట్టి.. ప్రియదర్శన్ డైరెక్షన్లో, అలాగే లిస్సీతో కలిసి సినిమాలు చేశాడు. అలా ఇద్దరూ తనకెంతో సన్నిహితులు. వారు కలిసిపోవడంతో మమ్ముట్టి చెన్నైలోని ప్రియదర్శన్ స్టూడియోకి ఇద్దర్ని రమ్మని పిలిచాడట! మీ ఇద్దరినీ ఇలా జంటగా చూడటం సంతోషంగా ఉందని వారితో చెప్పాడట! విడిపోయిన పదేళ్ల తర్వాత ఈ దంపతులు మళ్లీ కలవడానికి వారి పిల్లలు కల్యాణి, సిద్దార్థ్ ప్రధాన కారణమని తెలుస్తోంది. పెళ్లిఅయితే వారు కలిసిపోయారు కానీ పెళ్లి చేసుకునే ఆలోచన మాత్రం చేయడం లేదు. మ్యారేజ్ అనేది కేవలం సర్టిఫికెట్ అని.. తమ మధ్య స్నేహం, అన్యోన్యత, ప్రేమ ముఖ్యం అని చెప్తున్నారట! దీనిపై ప్రియదర్శన్ సైతం స్పందిస్తూ.. అవును, మేము కలిసే ఉంటున్నాం అని ధ్రువీకరించాడు.సినిమాకాగా ప్రియదర్శన్, లిస్సీ.. 1990 డిసెంబర్ 13న పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు కల్యాణి, కుమారుడు సిద్ధార్థ్ సంతానం. కల్యాణి ప్రియదర్శన్ లోక సినిమాతో ఇటీవలే సెన్సేషన్ సృష్టించింది. ప్రియదర్శన్.. హిందీలో అక్షయ్కుమార్ హీరోగా భూత్ బంగ్లా సినిమా చేశాడు. ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది.చదవండి: నడిరోడ్డుపై వేధింపులు.. పోలీసులకు నటి ఫిర్యాదు -
విజయ్- సాయిపల్లవితో మణిరత్నం కొత్త మూవీ
సాయిపల్లవికి పెద్ద అభిమానిని అని చెప్పుకునే మణిరత్నం తనతో సినిమా ప్రకటించాడు. థగ్ లైఫ్ డిజాస్టర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన ఓ ప్రేమకథతో కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే శుక్రవారం తన కొత్త సినిమాను ప్రకటించాడు. ఇందులో విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా నటించనున్నారు.అదిరిన కాంబినేషన్లైకా ప్రొడక్షన్స్, మణిరత్నంకు చెందిన మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ కాంబో చూస్తుంటే సినిమా ఓ రేంజ్లో ఉండబోతుందని అభిమానులు అప్పుడే ఆశలు పెట్టేసుకుంటున్నారు. రూమర్స్నిజానికి ఈ సినిమాలో మొదటగా ధ్రువ్ విక్రమ్, రుక్మిణి వసంత్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, తర్వాత వారి స్థానంలో విజయ్ సేతుపతి, సాయిపల్లవిని తీసుకున్నట్లు రూమర్స్ రాగా.. చివరకు అదే నిజమైంది. అలాగే సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నట్లు రూమర్స్ రాగా.. చివరకు ఆయన స్థానంలో రెహమాన్ను తీసుకున్నారు.సినిమాకాగా విజయ్ సేతుపతి స్లమ్డాగ్, జైలర్ 2 సహా మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు. అటు సాయిపల్లవి హిందీలో రామాయణ, ఏక్ దిన్ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. విలక్షణ నటులుగా పేరు తెచ్చుకున్న వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి మరి! View this post on Instagram A post shared by Madras Talkies (@madrastalkies) -
రెండు ఫ్లాట్లు అమ్మేసిన ప్రభుదేవా.. ఇంత తక్కువ లాభమా?
కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా రెండు ఫ్లాట్లు అమ్మేశాడు. దక్షిణ ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలోని మినర్వా బిల్డింగ్లోని ఫ్లాట్లను తక్కువ లాభానికే వదిలేసుకున్నాడు. సుమారు రూ.14.80 కోట్లకు ఈ ఫ్లాట్స్ అమ్మేశాడు. మార్చి 13న ఈ లావాదేవీ జరిగినట్లు తెలుస్తోంది.అప్పట్లో..కాగా వీటిని ప్రభుదేవా 2012లో రూ.14.45 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు. ఒక ఫ్లాట్ 32వ అంతస్తులో ఉండగా, మరొకటి 33వ అంతస్తులో ఉంది. ఒక్క ఫ్లాట్ సుమారు 1295 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగుంది. పద్నాలుగు సంవత్సరాల తర్వాత వాటిని అమ్మితే ప్రభుదేవాకు కేవలం రూ.35 లక్షలు మాత్రమే లాభం వచ్చింది. ఇది చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు.చదవండి: సూర్య అడుగుజాడల్లో చిరంజీవి.. త్వరలోనే.. -
కేడీ సాంగ్ వివాదం.. సింగర్ మంగ్లీ పోస్ట్ వైరల్
కేడీ మూవీ సాంగ్ వివాదం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. హిందీ వర్షన్ లిరిక్స్పై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో ఏకంగా సాంగ్నే యూట్యూబ్ నుంచి తొలగించారు. కన్నడ హీరో ధృవ సర్జా హీరోగా కేడీ చిత్రానికి సంబంధించి సర్కే చునార్ తేరి సర్కే అనే పాటను ఇటీవలే రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ను సింగర్ మంగ్లీ పాడారు. తాజాగా ఈ సాంగ్ వివాదంపై సింగర్ మంగ్లీ స్పందించారు. ప్రజల మనోభావాలను తాను ఎప్పుడు గౌరవిస్తానని అన్నారు. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు కోరుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ వివాదం పట్ల బాధగా ఉందని.. ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదన్నారు. లిరిక్స్లో మార్పు చేశారని.. అప్డేట్ అయిన సాంగ్ త్వరలో విడుదల చేస్తారని మంగ్లీ రాసుకొచ్చారు. మరోసారి ఇలాంటి పొరపాటు జరగదని హామీ ఇస్తున్నా తన నోట్లో ప్రస్తావించారు.కేడీ: ది డెవిల్ మూవీ సాంగ్ను అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. అయితే కేవలం హిందీ వర్షన్ లిరిక్స్పై మాత్రమే తీవ్ర అభ్యంతరాలొచ్చాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో రేంజ్లో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ వివాదం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. View this post on Instagram A post shared by Mangli 🎙️ (@iammangli) -
'యూత్' ట్రైలర్: హీరో వెనక పడుతున్న ముగ్గురమ్మాయిలు
తమిళ నటుడు కరుణాస్ వారసుడు కెన్ కరుణాస్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం యూత్. ఈ మూవీకి కెన్ కరుణాస్ స్వీయ దర్శకత్వం వహించడం విశేషం. జీవీ ప్రకాశ్ కుమార్ పైసా పారితోషికం తీసుకోకుండా ఫ్రీగా సంగీతం అందించాడు. ఇటీవలే తమిళ ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది. తాజాగా యూత్ తెలుగు ట్రైలర్ వదిలారు. యూత్ తెలుగు ట్రైలర్'మీకు పుట్టినవాడు సాధారణమైన అబ్బాయి కాదు మేడమ్.. ఆ దేవుడే మీకు బిడ్డగా పుట్టాడు. వాడిని బ్యాడ్ బాయ్స్తో చేరనివ్వకండి' అన్న సంభాషణతో వీడియో మొదలవుతుంది. తీరా హీరో.. తనను ముగ్గురమ్మాయిలు ప్రేమిస్తున్నారని తెగ సంబరపడిపోతాడు. ఫైటింగ్, లవ్, కామెడీకి ఏమాత్రం కొదవ లేనట్లుగా చూపించారు. ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనేలా ట్రైలర్ కట్ చేశారు. ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది. -
నోరు జారా.. క్షమించండి: ఉస్తాద్ భగత్ సింగ్ నటుడు
అడుసు తొక్కనేల.. కాలు కడగనేల! గడిచిన పది రోజుల్లో రెండుసార్లు సారీ చెప్పాడు తమిళ దర్శకుడు, నటుడు ఆర్.పార్తీబన్. ఓపక్క హీరో విజయ్ విడాకుల వ్యవహారం కోర్టులో కొనసాగుతుండగా త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లాడీ హీరో. దీంతో కొన్నాళ్లపాటు త్రిష బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటే బాగుంటుందని పార్తిబన్ కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగగా.. క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం ముగిసింది.కుల ప్రస్తావనఇంతలోనే మరో వివాదంలో ఇరుక్కున్నాడు పార్తిబన్. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన కులం గురించి ప్రస్తావిస్తూ స్పీచ్ మొదలుపెట్టాడు. స్టేజీపై కులం ప్రస్తావన తేవడంపై విమర్శలు వచ్చాయి. దీంతో మరోసారి క్షమాపణలు చెప్తూ పోస్ట్ పెట్టాడు. నేను ఎలాంటి తప్పునైనా సరే వెంటనే సరిదిద్దుకునే వ్యక్తిని. నిజం చెప్తున్నా.. ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదు. ఇదే మొట్టమొదటిసారిఏదో నోరు జారాను. ఇన్నేండ్ల అనుభవంలో కుల ప్రస్తావన తేవడం ఇదే మొట్టమొదటిసారి. కానీ, కులానికి ప్రాధాన్యతనిచ్చేవారిని నేను అస్సలు ఇష్టపడను. కుల వ్యవస్థను తప్పుపడుతూ ఎన్నో సినిమాలు చేశాను. అనుకోకుండా పొరపాటు జరిగింది. అందుకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను. నా వ్యాఖ్యలతో ఎంతోమందిని బాధపెట్టానని అర్థమైంది.క్షమించండినేను కేవలం నా ప్రతిభను నమ్ముకుంటానే తప్ప కులాన్ని వాడుకునే వ్యక్తిని కాను. ఇంకెప్పుడూ ఇలాంటి పొరపాటు జరగదని మాటిస్తున్నాను. వాస్తవానికి ఈ విషయం గురించి మీకంటే నేనే ఎక్కువ బాధపడుతున్నాను. నా వల్ల బాధపడ్డ ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక క్షమాపణలు. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోయి ఎప్పటిలాగే నన్ను ప్రోత్సహించండి. సినిమామీరు నాపై ఉంచిన ప్రేమను, నమ్మకాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తాను అని ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీ మార్చి 19న విడుదల కానుంది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా యాక్ట్ చేశారు.చదవండి: పీలింగ్స్ సాంగ్ బానే చూశారుగా.. ఈ పాటకెందుకంత రాద్ధాంతం? -
పీలింగ్స్ చూశారుగా, ఈ పాటకే అంత రాద్ధాంతమా?
'కేడీ: ద డెవిల్' సినిమా నుంచి రిలీజైన ఐటం సాంగ్ సర్కే చునర్ వివాదాస్పదమైంది. సంజయ్ దత్, నోరా ఫతేహి డ్యాన్స్ చేసిన ఈ సాంగ్లోని లిరిక్స్ డబుల్ మీనింగ్ డైలాగులతో నిండి ఉంది. దీంతో వెంటనే ఆ పాటను తొలగించాలని కేంద్రం ఆదేశించింది. దాంతో హిందీ వర్షన్ను యూట్యూబ్ నుంచి తొలగించారు. ఈ పరిణామాలపై కేడీ సినిమా డైరెక్టర్ ప్రేమ్ భార్య, నటి రక్షిత సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది.పీలింగ్స్ అప్పుడు ఓకేనేనంతా చూస్తూనే ఉన్నాను. మీరందరూ రకరకాల పోస్టులకు నన్ను ట్యాగ్ చేస్తూనే ఉన్నారు. ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. పీలింగ్స్.., డ్రీమమ్ వేకపమ్.., చోలీకే పీచే క్యా హై.. ఇలాంటి వందలాది పాటలు బయటకు వచ్చినప్పుడు అందరికీ బాగానే అనిపించాయి. శృంగారమే ప్రధానంగా సినిమాలు వచ్చినప్పుడు కూడా అందరూ బానే ఉన్నారు. ఎవరికీ ఏ ఇబ్బంది కలగలేదు. చెత్త రచయిత అయిపోడుకానీ ఇప్పుడు ఒక్క పాట విషయంలో మాత్రం పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. అదెందుకో నాకర్థం కావడం లేదు. అలా అని నేను ఈ పాటను సమర్థించడం లేదు. కాకపోతే ఈ వివక్షను అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఒక్క పాట సరిగా లేనంత మాత్రాన ఆయనను చెత్త రచయిత అయిపోడు. తను ఇదంతా కావాలని చేస్తున్నారని అనడం కూడా తప్పే! కొన్ని సినిమాలు ఆడనంత మాత్రాన ఆయన్ని మంచి దర్శకుడు కాదని అనలేం. మీకు ఆయన్ని ప్రశ్నించే హక్కుంది, కానీ దూషించే హక్కు ఎవరికీ లేదు.ప్రశ్నించే హక్కుందిఈరోజుల్లో మంచి, చెడు అన్నిరకాల పాటలు నిత్యం వస్తూనే ఉన్నాయి. రక్తపాతం, లైంగికతకు సంబంధించిన సినిమాలను జనాలు ఓపెన్గా చూస్తున్నారు. ప్రేమ్ కన్నడిగుడు. అతడిపై మీకు పూర్తి హక్కులున్నాయి. ఏది తప్పు? ఏది ఒప్పు? అని ప్రశ్నించే హక్కుంది. కానీ అతడి పనితీరును తప్పుపడుతున్నారు. ఒక కన్నడ డైరెక్టర్కు సినిమాను ఓటీటీలో అమ్మడమనేది ఎంత పెద్ద ఛాలెంజో మీకు తెలుసా? అలాగే జనాల్ని థియేటర్కు రప్పించడం కూడా సవాలుగానే మారింది. కొంచెం సమయం ఇవ్వండిఇది కేవలం మా ఒక్క కథే కాదు, కన్నడ చిత్రపరిశ్రమలోని ప్రతి సినిమా కథ ఇంతే! రాబోయే రోజుల్లో అంతా సర్దుకుంటుందన్న నమ్మకం ఉంది. కొంచెం సమయం ఇవ్వండి. కేడీ మాకు బిడ్డలాంటిది. దానికి ఏది సరైనదో చివరకు అదే చేస్తాం. మమ్మల్ని నమ్మండి అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వరుస పోస్టులు పెట్టింది. ప్రేమ్ దర్శకత్వంలో ధ్రువ సర్జా హీరోగా నటించిన కేడీ మూవీ ఏప్రిల్ 30న విడుదల కానుంది.చదవండి: చికిరి చికిరి నేనే రాశా.. ఈ పాటకు మాత్రం అవమానం: గేయరచయిత -
ఆ 'చికిరి చికిరి' పట్టించుకోలేదు.. ఈ పాట వల్ల తీవ్ర అవమానం!
తమిళ హీరో ధ్రువ సర్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "కేడీ: ద డెవిల్". బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, శిల్పాశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో నోరా ఫతేహి ఐటం సాంగ్లో మెరిసింది. ఇటీవలే కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఆ ఐటం సాంగ్ను విడుదల చేశారు.బూతు పాటఅయితే హిందీలో ఆ పాట లిరిక్స్ పచ్చిబూతులతో అసభ్యంగా ఉంది. డ్యాన్స్ కూడా అశ్లీలంగా ఉండేసరికి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో కేంద్రం.. ఈ పాటను తొలగించాలని ఆదేశించింది. అలా హిందీ వర్షన్ను యూట్యూబ్ నుంచి తీసేశారు. తాజాగా ఈ వివాదంపై హిందీలో 'సర్కే చునర్' పాటకు లిరిక్స్ అందించిన గేయరచయిత రఖీబ్ ఆలం స్పందించాడు. నేను సొంతంగా రాయలేదుఆ లిరిక్స్ సొంతంగా తాను రాసినవి కావన్నాడు. కన్నడలో దర్శకుడు ప్రేమ్ రాసిన లిరిక్స్నే యథాతథంగా హిందీలో అనువదించాను. నిజానికి ఈ పాటను హిందీలో రాయమన్నప్పుడే నేను తిరస్కరించాను. ఇలాంటివి సెన్సార్ ఒప్పుకోవు, వర్కవుట్ కాదన్నాను. కన్నడ వర్షన్ను అచ్చుగుద్దినట్లుగా హిందీలో మార్చమని అప్పగించారు. చాలా డబుల్ మీనింగ్ లైన్స్ ఉన్నాయి. కానీ అదంతా ఒక మద్యం సీసా గురించి అని వారు చిట్టచివర్లో బయటపెట్టారు. అవేవీ గుర్తించలేదుఅయితే అది తెలిసేవరకు ఆ లైన్స్ అన్నీ అసభ్యకరంగానే అనిపిస్తాయి. అదే విషయం నేనూ చెప్పాను. అసలు ఇలాంటి పాటలు రాయాల్సిన అవసరం నాకేంటి? నేను మంచి పాటలు రాసినప్పుడు ప్రజలు వాటిని పట్టించుకోరు. రామ్చరణ్ పెద్ది సినిమాలోని చికిరి చికిరి పాటకు హిందీలో నేనే సాహిత్యాన్ని అందించాను. పుష్ప మూవీలోని అన్ని పాటలు హిందీలో నేనే రాశాను. అవేవీ గుర్తించలేదు.. కొత్త వర్షన్ వస్తుందికానీ సర్కే చునర్ సాంగ్ వల్ల అభాసుపాలయ్యాను, ఎంతో అవమానకరంగా ఉంది. నేను చెప్పినట్లే పాటపై అభ్యంతరాలు వచ్చాయి. దాంతో మేకర్స్ ఎటువంటి అసభ్యతకు చోటు లేకుండా కొత్త వర్షన్ రాయమని అడిగారు. అది ఆల్రెడీ రాసి పంపాను. త్వరలోనే చిత్రయూనిట్ క్షమాపణలు చెప్పి కొత్త లిరిక్స్తో ఉన్న పాట రిలీజ్ చేస్తుంది అని రఖీబ్ చెప్పుకొచ్చాడు.చదవండి: సినిమాపై భయం.. అబ్బాస్కు మంచి కమ్బ్యాక్: జీవీ ప్రకాశ్ కుమార్ -
సినిమాపై భయం.. అబ్బాస్కు మంచి కమ్బ్యాక్!: హీరో
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం హ్యాపీ రాజ్. నటి శ్రీగౌరి హీరోయిన్గా నటించిన ఈ మూవీ ద్వారా నటుడు అబ్బాస్ రీఎంట్రీ ఇస్తున్నాడు. మరియరాజు ఇళంజెలియన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. బియాండ్ పిక్చర్స్ పతాకంపై జయవర్ధ నిర్మించిన ఈ మూవీకి జయకాంత్ సురేశ్ సహనిర్మాతగా వ్యవహరించాడు.దేనికీ భయపడని వ్యక్తి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించిన ఈ మూవీ నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని ఈ నెల 27న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చెన్నైలో నిర్వహించిన ప్రీరిలీజ్ కార్యక్రమంలో జీవీ ప్రకాశ్ కుమార్ మాట్లాడుతూ.. దర్శకుడు మరియరాజు దేనికీ భయపడని వ్యక్తి అన్నారు. ఆయన చెప్పిన కథ నచ్చిందని, అయితే మంచి నిర్మాత కోసం ఎదురుచూస్తున్న సమయంలో జయకాంత్, జయవర్ధ ఈ సినిమా చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. మధ్యలోనే వదిలేస్తారా?కొత్త దర్శకుడు, కొత్త నిర్మాతలు కావడంతో ఈ మూవీని పూర్తి చేస్తారా? మధ్యలోనే వదిలేస్తారా? అన్న భయం కలిగిందన్నారు. ఇదే విషయాన్ని వారిని అడిగానన్నారు. అయితే వారు ఈ సినిమాను చాలా బాగా రూపొందించి, బిజినెస్ పూర్తి చేసి రిలీజ్కు సిద్ధమవడం సంతోషంగా ఉందన్నారు. హ్యాపీరాజ్ చిత్రం తనకు చాలా సంతోషం కలిగించిందన్నారు. అందరికీ ఏమో కానీ అబ్బాస్కు కచ్చితంగా ఈ మూవీ కంబ్యాక్గా నిలవాలని ఆకాంక్షించారు. ఆయన అంత బాగా నటించారని కితాబిచ్చారు. -
మార్చిందిరా...
సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హ్యాపీ రాజ్’. ఈ చిత్రంలో శ్రీగౌరీ ప్రియ హీరోయిన్గా నటించారు. దర్శక–నటుడు ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన రాజా ఇళంజెళియన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని జైవర్ద నిర్మించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ ద్వారా ఈ నెల 27న ఈ ‘హ్యాపీ రాజ్’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది.మంగళవారం ఈ చిత్రంలోని ‘అద్దిరా లెక్క..’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘పక్షిలాగా ఉండే నన్ను చెట్టు లాగా మార్చింది రా... సాదాసీదా పిల్లోణ్ణి నేను... మహాస్మార్టుగా చేసేసిందిరా..’ అంటూ ఈ పాట సాగుతుంది. సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ స్వరకల్పనలో ఈ పాటకు రెహమాన్ సాహిత్యం అందించగా, గోవింద్ ప్రసాద్ ఆలపించారు. -
అనిరుధ్తో జట్టుకట్టిన యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా
యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్నకు చెందిన యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా.. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఇటీవల ప్రారంభించిన స్వతంత్ర రికార్డ్ లేబుల్ అల్బుక్వెర్క్ రికార్డ్స్తో ప్రత్యేక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా, అల్బుక్వెర్క్ రికార్డ్స్, అనిరుధ్ రూపొందించే పాప్, హిప్-హాప్ సంగీతాన్ని విడుదల చేయనున్నారు. ఈ లేబుల్ ద్వారా విడుదలయ్యే తొలి సంగీత ప్రాజెక్ట్లో అనిరుధ్ పాల్గొనగా, వచ్చే నెల ప్రారంభంలో దీన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్)2012లో అరంగేట్రం చేసిన అనిరుధ్.. 'వై దిస్ కొలవెరి డి' ద్వారా విపరీతమైన గుర్తింపు సంపాదించాడు. తర్వాత విడుదలైన తన 770కి పైగా పాటల ద్వారా మొత్తం 13 బిలియన్కు పైగా ఆడియో స్ట్రీమ్స్ సాధించాడు. దీంతో మొత్తం స్ట్రీమ్స్ పరంగా స్పాటిఫైలో అత్యధిక స్ట్రీమ్స్ పొందిన దక్షిణ భారతీయ కళాకారుడిగా అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. తమిళ ఒరిజినల్ సౌండ్ట్రాక్ (ఓఎస్టీ) రంగంలో ఎక్కువగా కోరుకునే సంగీత దర్శకుల్లో ఇతడొకరు. హుకుమ్, వాతీ కమింగ్, అరబిక్ కుతు, మోనికా, ఏ23 థీమ్, ఆజా రాజా, అయా షేర్ తదితర గ్లోబల్ హిట్లు ఇతడి ఖాతాలో ఉన్నాయి.(ఇదీ చదవండి: బూతు పాటపై కేంద్రం సీరియస్) -
నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్
తమిళనాడులో ఎన్నికల సంగతేమో గానీ పలువురు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు.. స్టార్ హీరోయిన్లని అవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం నైనర్ నాగేంద్రన్ అనే నాయకుడు.. విజయ్ని విమర్శిస్తూ, ముందు నువ్వు త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి అని అనేశాడు. తర్వాత త్రిష సీరియస్ కావడంతో సదరు నాయకుడు క్షమాపణ చెప్పాడు. ఇప్పుడు ఏకంగా ఓ ఎంపీ.. నయనతారని ఉద్దేశిస్తూ చీప్ కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: చిరంజీవితో సినిమా.. హరీశ్ శంకర్ ఆశ పెద్దదే!)మహిళల భద్రత, గౌరవం కోసం అన్నాడీఎంకే(AIADMK) పార్టీ.. మంగళవారం చెన్నైలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఇందులోనే ఆ పార్టీకి చెందిన ఎంపీ సీవీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు అంతటా పెను దుమారాన్ని రేపుతున్నాయి. హీరోయిన్ నయనతారని ఉద్దేశిస్తూ అసభ్యకర రీతిలో మాట్లాడేసరికి విమర్శలు గట్టిగానే వస్తున్నాయి.అసలు విషయానికొస్తే.. కొన్నిరోజుల క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ప్రజలని ఉద్దేశిస్తూ మాట్లాడారు. తమ కలలని పంచుకోవాలని, వాటిని ప్రభుత్వం నెరవేర్చేందుకు కృషి చేస్తుందని పిలుపునిచ్చారు. వీటి గురించి మాట్లాడిన అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగం.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలం, నయనతార పేర్లని ప్రస్తావిస్తూ అసభ్యకర కామెంట్స్ చేశారు.'అబ్దుల్ కలాం గారు మనల్ని కలలు కనమన్నారు. స్టాలిన్ కూడా తనతో కలలు పంచుకోమంటున్నారు. ఒకవేళ నాకు నయనతార కావాలని కల వస్తే.. నా కోరికని స్టాలిన్ తీరుస్తారా? ఎవరైనా వెళ్లి నయనతారతో తమకు పెళ్లి చేయమని అడిగితే.. ఆ కల కూడా నెరవేరుస్తారా?' అని ఎంపీ అన్నారు. అయితే ఈయన ఇలా మాట్లాడుతున్నప్పుడు పక్కనే నిలుచుని ఉన్న పార్టీ నేతలు.. వారించాల్సింది పోయి, నవ్వుతుండేసరికి విమర్శలు గట్టిగా వస్తున్నాయి. మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి?(ఇదీ చదవండి: త్వరలోనే విజయ్తో పెళ్లి.. ఇలా హింట్ ఇచ్చిన త్రిష తల్లి!)‘எனக்கு நயன்தாரா வேண்டும்’சி.வி.சண்முகம் அநாகரீக பேச்சு#ADMK #CVShanmugam #SPARK pic.twitter.com/dFBcCXmGjj— Spark+ (@SparkPluz_) March 17, 2026 -
విజయ్- త్రిష ఎపిసోడ్పై మరో కొత్త పుకారు!
కోలీవుడ్లో విజయ్- త్రిష ఎపిసోడ్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. విజయ్ భార్య సంగీత విడాకులకు దరఖాస్తు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఈ వివాదంపై పలువురు నటీనటులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాదం తర్వాత విజయ్- త్రిష జంటగా పెళ్లిలో కనిపించడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ వరుస కథనాలొచ్చాయి.అయితే అందరూ అనుకుంటున్నట్లుగానే ఈ జంట పెళ్లి చేసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం త్రిష తల్లి ఉమా కృష్ణన్ అలా చేయడంతో ఈ రూమర్స్కు మరింత బలం చేకూరుతోంది. విజయ్- త్రిష కృష్ణన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పేర్కొంటూ అభిమానులు ఓ రీల్ రూపొందించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఆసక్తిగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక భారీ ప్రకటన వెలువడుతుందని వీడియోను పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చూసిన త్రిష మదర్ ఉమా కృష్ణన్ ఆ వీడియోను లైక్ కొట్టింది.ఈ రీల్కు త్రిష తల్లి ఉమా కృష్ణన్ లైక్ కొట్టడంతో వీరిద్దరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్రిష, విజయ్ల బంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఉమా కృష్ణన్ కూడా ఆసక్తిగా ఉన్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది చూసిన కొందరు త్రిష అభిమానులు సైతం ఉమా కృష్ణన్ పొరపాటున ఈ రీల్కు లైక్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. గతంలో కూడా త్రిష మదర్ 'థగ్ లైఫ్' మూవీ రిల్స్కు లైక్స్ కొట్టారని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా విజయ్- త్రిష పెళ్లిపై క్లారిటీ రావాలంటే తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే. -
'ఇతరుల జీవితాల్లోకి చూడడమే వారి పని'.. త్రిష వ్యవహారంపై ఖుష్బు కామెంట్స్
కోలీవుడ్లో విజయ్- త్రిష వ్యవహారం హాట్టాపిక్గా మారింది. విజయ్ భార్య విడాకుల పిటిషన్ తర్వాత అందరి దృష్టి ఒక్కసారిగా త్రిషపై పడింది. అంతేకాకుండా వీరిద్దరు జంటగా ఓ వివాహా వేడుకకు హాజరు కావడంతో మరించ చర్చకు దారితీసింది. ఆ తర్వాత తమిళ నటుడు, దర్శకుడు పార్తీబన్ త్రిషను ఉద్దేశించి అనుచిత కామెంట్స్ చేశారు. అతని కామెంట్స్పై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ తర్వాత క్షమాపణలు కోరాడు. అయితే తాజాగా విజయ్, త్రిషలపై వస్తోన్న వార్తలపై నటి ఖుష్బూ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె త్రిష గురించి మాట్లాడారు. ఆమె చాలా హుందాగా ఉంటుందని తెలిపారు. త్రిష గురించి తెలియనివారు చేసే కామెంట్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి వారికి మనం స్పందించాల్సిన పనిలేదని తెలిపారు. నాకు త్రిష గురించి బాగా తెలుసని.. తను చాలా సెన్సిటివ్ పర్సన్ అని ఖుష్బూ వెల్లడించారు. దురదృష్టవశాత్తూ మనం తుమ్మినా కూడా నిందించే రోజుల్లో ఉన్నామని అన్నారు. తనకు తెలిసిన వారిలో త్రిష అత్యంత సౌమ్యురాలైన వ్యక్తి అని ఖుష్బూ తెలిపారు. పెళ్లికి కలిసి వెళ్లడం అనేది వారి వ్యక్తిగతమని.. దానివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగదని ఆమె అన్నారు.ఖుష్బూ మాట్లాడుతూ.. 'దురదృష్టవశాత్తు మనం తుమ్మినా కూడా నిందను మరొకరిపై వేయాలనుకునే కాలంలో ఉన్నాం. నాకు తెలిసినంత వరకు త్రిష అత్యంత హుందాగా ఉండే మహిళ. అత్యంత సౌమ్యురాలైన వ్యక్తి. కొందరు తమ సమస్యలను పట్టించుకోకుండా.. ఇతరుల జీవితాల్లోకి తొంగి చూసి ఆనందించే వ్యక్తులు ఉంటారు. ఇతరులపై కామెంట్స్ చేస్తూ ఒక రకమైన వికృత ఆనందాన్ని పొందుతారు. వారిలో 99.9 శాతం మంది ఎవరో కూడా మనకు తెలియదు. ఎవరైనా సరే ఇతరులు చేసే వ్యాఖ్యలకు మనం బాధ్యులు కాదు. వాటికి స్పందిస్తూ మన సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. ఎయిర్పోర్టుల్లో ఫోటోగ్రాఫర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కల్చర్ ముంబయిలో మాత్రమే ఉండేదని.. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు చెన్నైకి కూడా పాకిపోయింది" అని అన్నారు.Trisha is most DIGNIFIED WOMEN I've ever met & most GENTLEST SOUL:- Actress #Kushboo #Trisha #Trishakrishnan pic.twitter.com/BVZHqZPYJK— Milagro Movies (@MilagroMovies) March 17, 2026 -
సాయి పల్లవి మొదటి సినిమా.. అందుకేనా టెన్షన్..!
ఎవరికైనా తొలి చిత్రం రిజల్ట్స్ కోసం ఆసక్తి ఉంటుంది. ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన నటీనటులకు కూడా తమ కొత్త సినిమాకు ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో లేదో అన్న టెన్షన్ ఉంటుంది. నటి సాయిపల్లవి కూడా ఇప్పుడు అలాంటి టెన్షన్లోనే ఉన్నట్లు సమాచారం. ఏమిటీ తొలి చిత్రం అని ఆశ్యర్యంగా ఉందా? డాక్టర్ అయ్యి యాక్టర్ అయిన తమిళనాడు, నీలగిరి ప్రాంతానికి చెందిన భామ సాయిపల్లవి.నటనపై ఆసక్తితో నాట్యాన్ని కూడా నేర్చుకున్న ఈమె మొదట్లో కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. అలా మలయాళంలో నటించిన ప్రేమలు చిత్రం సాయిపల్లవి దశను మార్చేసింది. ఆ చిత్ర విజయం ఈ అమ్మడిని దక్షిణాది చిత్రపరిశ్రమలో పాపులర్ చేసింది. అలా తెలుగులో నటించిన పలు చిత్రాలు హిట్ అవ్వడం, తమిళంలోనూ అవకాశాలు రావడంతో స్టార్ హీరోయిన్ అయ్యారు.ఇటీవల సాయిపల్లవి తమిళంలో శివకార్తికేయన్కు జంటగా నటించిన అమరన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఇందులో సాయిపల్లవి నటన పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తమిళంలో ధనుష్కు జంటగా నటించడానికి సిద్ధం అవుతున్నారు.ఈ విషయాన్ని పక్కన పెడితే పక్కింటి అమ్మాయి ఇమేజ్ను తెచ్చుకున్న సాయిపల్లవి ఏక్దిన్ అనే చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. దీని తరువాత రామాయణం ఇతిహాసంతో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో సీతగా నటిస్తున్నారు. ఏక్ దిన్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే నెలలో తెరపైకి రానుంది. ఇది థాయ్లాండ్ భాషలో రూపొందిన ఒన్ డే చిత్రానికి రీమేక్ అని తెలిసింది. ఇందులో అమీర్ఖాన్ వారసుడు జునైద్ఖాన్ హీరోగా నటించారు.జునైద్ ఖాన్ ఈయన ఇంతకు ముందు కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ.. అవీ పెద్దగా ఆశించిన విజయాలను అందుకోలేదు. దీంతో ఏక్దిన్ నటి సాయిపల్లవికి.. నటుడు జునైద్ఖాన్లకు చాలా ముఖ్యమైన చిత్రంగా నిలవనుంది. వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్ర ఫలితాలపై నటి సాయిపల్లవి చాలా ఆతృతగా ఉన్నట్లు సమాచారం. ఈ చిత్ర ఫలితం తన కెరీర్పై చాలా ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. -
ఊహించని కాంబో.. స్టార్ డైరెక్టర్తో రానా దగ్గుబాటి..!
సినీ ఇండస్ట్రీలో ఒక రేర్ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ వైవిద్య భరితమై కథా చిత్రం తెరకెక్కింది. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి తరువాత ఈయన పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ప్రస్తుతం రానా కేవలం నటుడు మాత్రమే కాకుండా నిర్మాత కూడా రాణిస్తున్నారు. ఈయన 2005లోనే స్పిరిట్ మీడియా పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి పలు చిత్రాలను నిర్మించారు. ఇటీవలే దుల్కర్ సల్మాన్తో కలిసి కాంత చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.అయితే కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ గురించి తెలియని వారు ఉండరు. పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా నటుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా.. కార్తీక్ సుబ్బరాజ్కు చెందిన స్టోన్బెంట్ సంస్థ కలిసి నీళిరా అనే వైవిధ్యభరిత కథా చిత్రాన్ని నిర్మించాయి. దీనికి శ్రీలంక తమిళుడు సోమిధరన్ దర్శకత్వం వహించారు. ఇందులో నటుడు నవీన్ చంద్ర, విదూ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3వ తేదీన విడుదల చేయనున్న ట్లు యూనిట్ వర్గాలు ఎక్స్ మీడియాలో పేర్కొ న్నారు. ఆ చిత్ర టైటిల్తో కూడిన పోస్టర్ను పోస్ట్ చేశారు. -
శారీలో బుల్లితెర భామ మౌనీ రాయ్.. హల్దీ పిక్స్ షేర్ చేసిన రష్మిక
ఆస్కార్ వేడుక పిక్స్ షేర్ చేసిన ప్రియాంక చోప్రా..శారీలో బుల్లితెర భామ మౌనీ రాయ్ అందాలు..బ్లూ డ్రెస్లో టాలీవుడ్ నటి వితికాశేరు పిక్స్..ఈవెంట్లో మెరిసిన టాలీవుడ్ భామ మెహరీన్..హల్దీ పిక్స్ షేర్ చేసిన రష్మిక మందన్నా.. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ప్రియుడితో పెళ్లి.. మెసేజ్ పెట్టిందన్న హీరోయిన్ తండ్రి
మలయాళ హీరోయిన్ అహానా కృష్ణ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. ప్రియుడు నిమిష్ రవితో ఏడడుగులు వేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తండ్రి, నటుడు కృష్ణ కుమార్ ధ్రువీకరించాడు. వెరైటీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూతురి పెళ్లి గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.మా ఇంటిక్కూడా..అతడు మాట్లాడుతూ.. అహానా పెళ్లి చేసుకుంటానని నాకు మెసేజ్ పెట్టింది. ఆ అబ్బాయిని మాకు ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతడు మా ఇంటికి ఎన్నోసార్లు వచ్చి వెళ్తుంటాడు. నేను కుర్రవయసులో ఉన్నప్పుడు కూడా అచ్చం నా కూతురిలాగే ఉండేవాడిని. ఏమాత్రం మొహమాటం లేకుండా నా భార్య సింధును పెళ్లికి ముందే ఇంటికి తీసుకెళ్లేవాడిని. దానివల్ల నేనెవర్ని పెళ్లి చేసుకోబోతున్నాను? వాళ్లు ఎలాంటివాళ్లు? అనేది అందరికీ ముందే తెలుస్తుంది. ఏ టెన్షన్ లేకుండా పెళ్లి ప్రశాంతంగా సాగిపోతుంది.30 ఏళ్లుగా తెలుసునిమిష్ తండ్రి, నిర్మాత రవి నాకు 30 ఏళ్లుగా తెలుసు. వాళ్ల కుటుంబంలో ఏ అవసరం వచ్చినా నేను చనువుతో సలహాలు ఇస్తుంటాను. అహానా, నిమిష్ ఓ షార్ట్ ఫిలింలో కలిసి పని చేసినప్పుడు అతడిని కలిశాను. తను చాలా సింపుల్గా ఉంటాడు. అతడి ఎదుగుదల చూస్తుంటే ముచ్చటేస్తేంటుంది. అతడి తండ్రికి ఎన్నో కలలుండేవి. సినిమాకోసం ఎంతో ఖర్చుపెట్టాడు.. ఈ క్రమంలో చాలా కోల్పోయాడు. కానీ దేవుడు అతడి త్యాగాలకు.. పిల్లల రూపంలో ప్రతిఫలాన్ని ఇచ్చాడు అని చెప్పుకొచ్చాడు.సినిమాకాగా అహానా కృష్ణ సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవితో ప్రేమలో ఉన్నట్లు కొన్నేళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అహానా తండ్రి మాటల్ని బట్టి వీరిద్దరూ తమ ప్రేమను నెక్స్ట్ స్టెప్కు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ విషయాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి! నిమిష్ రవి.. చివరగా లోక:చాప్టర్ 1 సినిమాతో పెద్ద హిట్ అందుకున్నాడు. అహానా.. ఎంజన్, స్టీవ్ లోపెజ్, లూకా, పతినేట్టం పది, ఆడి, నాన్సీ రాణి వంటి మలయాళ చిత్రాలతో గుర్తింపు పొందింది.చదవండి: ఆస్కార్ గెలిచిన సినిమాలు.. ఏయే ఓటీటీలో ఉన్నాయంటే? -
అజిత్ కేరవాన్లో వంట చేసిపెట్టాడు: తమన్నా
సినిమారంగంలో భాషాబేధాలకు తావుండదు. ప్రతిభే కొలమానం. అలా స్వశక్తితో ఎదిగిన నటీమణుల్లో మిల్కీబ్యూటీ తమన్నా భాటియా ఒకరు. ఈ ఉత్తరాది బ్యూటీ దక్షిణాదిలో అగ్ర హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. కథానాయికగా సత్తా చాటుతూనే మరోపక్క ఐటమ్ సాంగ్స్లో నటిస్తూ అలరిస్తోంది. అలా ప్రత్యేక పాటల కోసం తమన్నా దాదాపు రూ.6 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్!ఆ మూవీ ఎంతో స్పెషల్ఇకపోతే ఈ హీరోయిన్ ఇటీవల చెన్నైలోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను తమిళంలో కల్లూరి చిత్రంలో నటించానని, అది తన సినీజీవితంలో చాలా ముఖ్యమైనదని పేర్కొంది. ఆ సినిమాలోలాగే కాలేజీ లైఫ్ను విద్యార్థులు ఎంజాయ్ చేయాలంది. కాలేజీడేస్ మళ్లీ తిరిగిరావంది.స్వయంగా వంట చేసి..తాను సినీ పరిశ్రమలో 21 ఏళ్లుగా కొనసాగుతున్నానని, ఇంతలా ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు అని సంతోషం వ్యక్తం చేసింది. తమిళంలో విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోల సరసన నటించినట్లు తెలిపింది. నటుడు విజయ్ చాలా నిరాడంబరుడు, మంచి మనసు కలవాడంది. విజయ్, జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్స్ అని కితాబిచ్చింది. అజిత్ గురించి చెప్పాలంటే వీరం సినిమా సమయంలో తనకు ఆయన కేరవాన్లో ఇడ్లీ వండిపెట్టారని గుర్తు చేసుకుంది. ఆయనకు వంట చేయడం చాలా ఇష్టమని, మంచి కుటుంబ సభ్యుడిలా ఉంటాడని పేర్కొంది.చదవండి: ఆస్కార్ పండగ.. అత్యధికంగా ఆ చిత్రానికే ఎక్కువ అవార్డులు -
ఆ సినిమాలన్నీ ఫ్లాప్.. లాభమే లేదు: విజయ్ సేతుపతి
సినిమాలు తీయడమంటే ఆషామాషీ కాదు. ఏమాత్రం తేడా వచ్చినా బాక్సాఫీస్ వద్ద వైఫల్యం మూటగట్టుకోవడం తథ్యం. దీనివల్ల ఎక్కువ నష్టపోయేది నిర్మాతలే.. కొడితే కుంభస్థలాన్ని కొడతారు.. లేదంటేనేమో తీవ్ర నష్టాలు చూస్తారు. అలా తాను నిర్మాతగా తెరకెక్కించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదంటున్నాడు తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి.ఆ నాలుగు ఫ్లాప్తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. నా బ్యానర్లో సంగుతేవన్ అనే సినిమా స్టార్ట్ చేశాను. కానీ, అది మధ్యలోనే ఆగిపోయింది. దానివల్ల రూ.1.75 కోట్ల నష్టం వాటిల్లింది. ఆ తర్వాత నాలుగు సినిమాలు తీశాను. అవే.. ఆరెంజ్ మిఠాయి, మేకు తొడర్చి మలై, జుంగ, లాభం. వీటిలో ఒక్కటి కూడా నాకు లాభాల్ని తెచ్చిపెట్టలేదు. కనీసం పెట్టిన పెట్టుబడి వెనక్కు తీసుకురావడంలో కూడా విఫలమయ్యాయి. సినిమాబాక్సాఫీస్ లెక్కలపరంగా అవి ఫ్లాప్ అయినప్పటికీ నాకు మాత్రం ఆ సినిమాలన్నీ ఇష్టం. కాబట్టి వాటిని నిర్మించినందుకు నేనేం బాధపడటం లేదు అన్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి నటుడిగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. తమిళంలో మిస్కిన్ దర్శకత్వంలో ట్రైన్ మూవీ చేస్తున్నాడు. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో స్లమ్డాగ్: 33 టెంపుల్ రోడ్ చేస్తున్నాడు. ఇది కాకుండా పాకెట్ నోవెల్, జైలర్ 2, అరసన్తో పాటు మణిరత్నం మూవీ ఒకటి ఆయన చేతిలో ఉన్నాయి.చదవండి: నాగార్జున వల్లే నా కూతురు సినిమాల్లోకి: ప్రియదర్శన్ -
నా కూతుర్ని సినిమాల్లో ఊహించలేదు.. నాగార్జున వల్లే..
మలయాళ టాప్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు కల్యాణి తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. 2017లో తెలుగు సినిమా హలోతో ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కొద్దికాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ సినిమాలు చేసింది. గతేడాది లోక చాప్టర్ 1 చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించింది.కలలో కూడా అనుకోలేఅయితే ఆమె హీరోయిన్ అవడానికి కింగ్ నాగార్జునే ప్రధాన కారణం అంటున్నాడు ప్రియదర్శన్. పింక్విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నా కూతురు కెమెరా ముందుకు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే సినిమా సెట్కు రావడానికి తనెప్పుడూ ఇష్టపడలేదు. తను ఆర్కిటెక్చర్ చదివింది. ఆర్కిటెక్ట్ అవ్వాలనుకుంది. నాగార్జున ఫోన్ చేయడంతో..కానీ, సడన్గా ఒకసారి నాగార్జున ఫోన్ చేసి కల్యాణిని సినిమాలో తీసుకోవాలనుకుంటున్నాం అన్నాడు. తనకు నటించడం రాదని చెప్పాను. కానీ నా కూతురు ఒకసారి ట్రై చేస్తే పోలా అంది. ఇక్కడ నేను కోల్పోయేదేం లేదు, నాకు సినిమాలు సెట్టవకపోతే మళ్లీ ఆర్కిటెక్చర్ వైపు వెళ్లిపోతానంది. అలా తను సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తండ్రిగా తన సినీజర్నీ చూస్తుంటే సంతోషంగా ఉంది. కాకపోతే నా సినిమాల గురించి తనతో మాట్లాడను. తను చేసే ప్రాజెక్టుల గురించి నాతో చర్చించదు. సినిమా తప్ప..ఎందుకంటే తను ఇప్పటి జెనరేషన్ అమ్మాయి. ఈతరం వాళ్లు సినిమాను ఒకలా చూస్తారు. నేనేమో పాత స్కూల్కు చెందినవాడిని. మేమిద్దరం సినిమా తప్ప అన్నింటిగురించి మాట్లాడుకుంటాం అని ప్రియదర్శన్ చెప్పుకొచ్చాడు. కాగా హలో మూవీతో కింగ్ నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ హీరోగా పరిచయమయ్యాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతోనే కల్యాణి ప్రియదర్శన్ కూడా కథానాయికగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది.చదవండి: దేవుడు నాకిలా రాసిపెట్టాడు: డిమాన్ పవన్ -
పురుషులే అసలైన బాధితులు.. హీరో భార్య కౌంటర్
ఇటీవలి కాలంలో విడాకుల సంఖ్య పెరుగుతోంది. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి దూరడం వల్లే ఈ విడాకులు ఎక్కువవుతున్నాయి. తమ విడాకుల వ్యవహారానికి కూడా మూడో మనిషే (సింగర్ కెనీషా ఫ్రాన్సిస్) కారణమని తీవ్రమైన ఆరోపణలు చేసింది ఆర్తి. తమిళ స్టార్ జంట రవి మోహన్- ఆర్తి 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ గతేడాది విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వీరి విడాకుల కేసు చెన్నై ఫ్యామిలీ కోర్టులో కనసాగుతోంది.పురుషులే అసలైన బాధితులుఇదిలా ఉంటే రవి ఇటీవల ఓ పోస్ట్ పెట్టాడు. అందులో మహిళలే కరెక్ట్ అని అందరూ అనుకుంటారు, కానీ పురుషులే అసలైన బాధితులు. అది మన న్యాయవ్యవస్థకు కూడా అర్థమవుతోంది. నేను ప్రేమించినవారికోసం ఏం చేశాను? నా మనసేంటి? అనేది ఏదో ఒకరోజు మీక్కూడా అర్థమవుతుంది. దయచేసి ప్రశాంతంగా బతకనివ్వండి.. మీ వికారమైన ఆలోచనలను మీదగ్గరే ఉంచుకోండి అని రాసుకొచ్చాడు.పిల్లల్ని ఎవరు పెంచారు?అతడి వ్యాఖ్యలపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కరుత్తు కన్నమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. విడాకులు మంజూరవకముందే మరో అమ్మాయితో తిరుగుతున్న ఈయన సుద్దపూసలా మాట్లాడుతున్నాడు. ఇంతకూ పిల్లల్ని నువ్వే పెంచావా? లేదా ఆ బాధ్యతను ఆర్తిపై వేశావా? న్యాయవ్యవస్థ గురించి మాట్లాడేముందు పిల్లల్ని ఎవరు పెంచారో చెప్పు.. భరణం గురించి కాదు!ఎందుకీ దొంగ ఏడుపు?నువ్వేమో మరో అమ్మాయితో దర్జాగా తిరుగుతున్నావు. నీ భార్య మాత్రం నీ పిల్లలను చూసుకోవడంలోనే మునిగిపోయింది. పైగా నువ్వే అసలైన బాధితుడివి అని ఏడుస్తున్నావ్. నువ్వు చేసిన పని నీ భార్య చేసుంటే? విడాకులు ఫైనలైజ్ కాకముందే మరో మగాడితో ఆర్తి బయట తిరుగుతే ఈ ప్రపంచం ఊరుకుంటుందా? అదే పని ఆర్తి చేస్తే..ఒకవేళ తిరిగిన తర్వాత కూడా నేనే అసలైన బాధితురాలిని అని చెప్తే అందరూ నమ్ముతారా? లేదు కదా.. నువ్విలా విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం చాలా చెండాలంగా ఉంది అని ఆగ్రహించింది. ఈ పోస్ట్ను ఆర్తి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. నిశ్శబ్ధంగా ఉండటానికి బదులుగా నిజాయితీగా గొంతెత్తి ప్రశ్నించినందుకు గర్వంగా ఉంది.. అంటూ చేతులెత్తి నమస్కరిస్తున్న ఎమోజీని జత చేసింది. View this post on Instagram A post shared by Karuththu Kannammaa (@karuththu_kannammaa2015) చదవండి: వారి కాళ్లకు నమస్కరించడం తప్ప ఏం చేయగలం?: మోహన్బాబు -
హన్సిక విడాకులు.. మాజీ వదిన షాకింగ్ పోస్ట్!
దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకున్న బ్యూటీ హన్సిక మోత్వానీ వ్యక్తిగత జీవితంపై ఇప్పుడు నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తన భర్త సోహైల్ నుంచి ఆమె విడాకులు తీసుకోవడమే ఈ చర్చకు కారణం. 2022లో సోహైల్ను పెళ్లి చేసుకున్న ఆమె నాలుగేళ్ల పాటు కలిసి కాపురం చేసి..ఇటీవల విడిపోయారు. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత హన్సిక పర్సనల్ లైఫ్పై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హన్సిక మాజీ వదిన ముస్కాన్ నాన్సీ చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అదంతా ఒక నకిలీ ప్రపంచం అంటూ చేసిన వ్యాఖ్యలపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.ముస్కాన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చింది. ‘దయచేసి నన్ను ఇతరుల జీవితాల్లో జరిగే డ్రామాల్లోకి లాగవద్దు. నాకు ఎలాంటి పెయిడ్ పీఆర్ టీమ్స్ లేవు. ఎవరిదో ఫేక్ ప్రపంచంతో నన్ను ముడిపెట్టడం ఆపేయండి. కాలమే అన్ని నిజాలను బయటపెడుతుంది. అంతా సమయమే నిర్ణయిస్తుంది. సబ్ సమయ్ కా ఖేల్ హై. పీస్, లవ్ అండ్ కర్మ’ అని ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఎవరి పేరు నేరుగా చెప్పకపోయినా, ఈ పోస్ట్ హన్సిక విడాకులను ఉద్దేశించేనని నెటిజన్లు అంటున్నారు.వాస్తవానికి హన్సికకు, ముస్కాన్కు మధ్య గతంలోనే విభేదాలు ఉన్నాయి. హన్సిక వల్లే తన సంసార జీవితం నాశనం అయిందని ముస్కాన్ ఆరోపించింది. 2020లో హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీతో ముస్కాన్ పెళ్లి జరిగింది. వివాహమైన కొంతకాలానికే డబ్బు, ఖరీదైన బహుమతులు కావాలని అత్త, ఆడపడుచు హన్సిక వేధించారని ముస్కాన్ అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.వీరిద్దరి జోక్యం వల్లే తన కాపురం కూలిపోయిందని, మానసిక ఒత్తిడి కారణంగా తనకు 'బెల్స్ పాల్సీ' కూడా వచ్చిందని ఆమె గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులోనే ఉంది.ఈ కేసును కొట్టివేయాలని హన్సిక వేసిన పిటిషన్ను గత సెప్టెంబర్లో బాంబే హైకోర్టు తిరస్కరించడం గమనార్హం.ముస్కాన్ నాన్సీ విషయానికొస్తే.. ఈమె ఒక బుల్లితెర నటి. తొడి ఖుషి తొడె ఘమ్ సీరియల్లో సహాయక నటిగా యాక్ట్ చేసింది. ఈ ధారావాహికతో విశేష గుర్తింపు తెచ్చుకున్న నాన్సీకి మాతా కీ చౌకి సీరియల్ ఆఫర్ వచ్చింది. ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. అదాలత్, ఫియర్ ఫైల్స్, క్రైమ్ పెట్రోల్ షోలలో పాల్గొంది. భారత్ కా వీర్ పుత్ర: మహారాణ ప్రతాప్, ఏజెంట్ రాఘవ్- క్రైమ్ బ్రాంచ్ షోలలో నటించింది. 2020లో హన్సిక సోదరుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొద్ది రోజులకే విబేధాలు రావడంతో విడి విడిగా ఉంటున్నారు. గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంటోంది. -
వివాదాస్పద లిరిసిస్ట్పై ప్రశంసలు.. కమల్ హాసన్కు చిన్మయి చురకలు..!
వివాదాస్పద లిరిసిస్ట్ వైరముత్తును ఏకంగా జ్ఞానపీఠ్ అవార్డు వరించింది. దీంతో ఆయనకు తమిళనాడు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలతో ముంచెత్తుతున్నారు. సీఎం స్టాలిన్, హీరో కమల్ హాసన్ సైతం వైరముత్తుకు అభినందనలు తెలిపారు. దేశంలోని సాహిత్య రంగంలో అందించే అత్యున్నత పురస్కారమే జ్ఞానపీఠ్ అవార్డు. ఈ అవార్డ్తో జ్ఞాన్పీఠ్ అవార్డ్ అందుకున్న మూడో తమిళ వ్యక్తిగా వైరముత్తు నిలిచాడు.చిన్మయి చురకలు..వైరముత్తుకు జ్ఞాన్పీఠ్ అవార్డ్ రావడంపై సింగర్ చిన్మయి స్పందించింది. కమల్ హాసన్ వైరముత్తును ప్రశంసించడంపై ట్విటర్ వేదికగా మండిపడింది. కమల్ హాసన్ కూడా వైరముత్తును అభినందించారని ఎద్దేవా చేసింది. సినిమాల్లో ఉన్న మగవాళ్లు రాజకీయాలకు మారడం, తన మామ-గురువు తమను లైంగికంగా వేధించాడని చెప్పిన మహిళలను పూర్తిగా పట్టించుకోకపోవడం ఆయనకే చెల్లుతుందని పోస్ట్ చేసింది. పురుషులు ఎప్పటికీ మన వైపు ఉండరని ఓటు వేసే మహిళలు గుర్తు పెట్టుకోవాలని సూచించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తన సొంత పార్టీలోని మహిళ బహిరంగంగా కవి పేరును ప్రస్తావించినా పట్టించుకోకపోవడం మరి దారుణమని చిన్మయి తెలిపింది. చివరగా పురుషులు కేవలం సోదరులు, మామలు, నాన్నలు, స్నేహితులు, సలహాదారులకు మాత్రమే అండగా నిలుస్తారని.. మహిళలను ఎవరు పట్టించుకోరని వ్యంగ్యంగా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆయనపై గతంలో సింగర్ చిన్మయి శ్రీపాద ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే వైరముత్తుకు భారతీయ సాహిత్యానికి చేసిన కృషికి జ్ఞానపీఠ్ అవార్డు రావడంపై సింగర్ చిన్మయి తనదైన శైలిలో ఇచ్చిపడేసింది. For God’s sake 🤦🏽♀️🤦🏽♀️🤦🏽♀️🤦🏽♀️🤦🏽♀️P.S.: Men in such power in cinema transitioning to politics completely turning a deaf ear to women who come on record to say they were molested by “his uncle-mentor” must remind women who vote - that men will never be on our side.The weirdest thing -… https://t.co/KB7VNAevu5— Chinmayi Sripaada (@Chinmayi) March 14, 2026 -
సూర్య లేటేస్ట్ మూవీ.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేయగా ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంది. పోస్టర్ చూస్తే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈనెల 16న సాయంత్రం 04:06 నిమిషాలకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ను సితార ఎంటర్టైన్మెంట్స్ పోస్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ మూవీలో ప్రేమలు హీరోయిన్ మమిత బైజు కథానాయికగా నటిస్తోంది. రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. A journey filled with heart. ❤️The teaser of #VishwanathAndSons is on its way.🥳Sanjay Vishwanath arrives on March 16th @ 04:06 PM! 😎In cinemas from this JULY 2026. 🤩@Suriya_offl #VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena @gvprakash @vamsi84 @NavinNooli… pic.twitter.com/FKoOht3Oz0— Sithara Entertainments (@SitharaEnts) March 14, 2026 -
ఆ జంట పతనం కోసం అందరు వెయిటింగ్: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దురంధర్ మూవీ హిట్ కావడం చాలామందిని భయపెట్టిందన్నారు. ఆదిత్య ధర్కు ఆదరణ పెరగడం కొందరికీ నచ్చడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అతన్ని చూసి చాలామంది అసూయ పడుతున్నారని అన్నారు. ఆదిత్య ధర్, ఆయన సతీమణి యామీ గౌతమ్ పతనం కోసం సినీ పరిశ్రమలో ఎంతోమంది ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆర్జీవీ దురంధర్ డైరెక్టర్పై ప్రశంసలు కురిపించారు. ఈ స్పై థ్రిల్లర్ మూవీ భారతీయ సినిమా గతిని మార్చిందని అన్నారు. ఆయన వల్ల సినీ ఇండస్ట్రీలో మిగిలిన వాళ్లంతా పునరాలోంచించేలా చేసిందని తెలిపారు. ఇలాంటి సమయంలో ఆదిత్య ధర్, యామి గౌతమ్ మరింత జాగ్రత్తగా ముందడుగు వేయాలని సూచించారు.ఆర్జీవీ మాట్లాడుతూ..' తెరపై కథ చెప్పే విధానం, మేకింగ్ స్టైల్ ఆదిత్య ధర్ పూర్తిగా మార్చేశారు. మన సినిమాలు ఎప్పటికీ ఒకేలా ఉండవు. ఇక్కడ నేను హిందీ మాత్రమే కాకుండా అన్ని భాషల గురించి మాట్లాడుతున్నా. తెలుగులో రాబోయే అనేక పెద్ద-బడ్జెట్ యాక్షన్ చిత్రాలు భారీ రీ షూటింగ్కు రెడీ అవుతున్నాయి. దీనివల్ల నిర్మాతలపై అదనపు భారం తప్పదు. ఆదిత్య ధర్ వల్లే ఇలా చేయాల్సి రావడం పరిశ్రమలోని కొందరికి నచ్చడం లేదు. అందుకే వారంతా అతన్ని ద్వేషిస్తారు. ఆయన అందరిని కంఫర్ట్ జోన్ల నుంచి బయటకు తీసుకొచ్చేలా చేశాడు. అందుకే ఆదిత్య ధర్ ఫెయిల్యూర్ కోసం అందరూ ఆసక్తిగా ఉన్నారని' అన్నారు. కాగా.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వస్తోన్న దురంధర్-2 ఈనెల 19న థియేటర్లలో సందడి చేయనుంది. -
సెన్సార్ బోర్డ్ కీలక నిర్ణయం.. ఇకపై అవీ తప్పనిసరి..!
ఇండియన్ సినిమాలపై సెన్సార్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సబ్ టైటిల్స్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నెల 15 నుంచి అన్ని ఇండియన్ చిత్రాలకు సబ్ టైటిల్స్ ఉండాలని సూచించింది. ఈ నిర్ణయంతో వినికిడి లోపం ఉన్నవారికి సినిమా అర్థం చేసుకునేందుకు వీలవుతుందని తెలిపింది. అయితే ఈ మార్పులు థియేటర్లలో ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై నెట్టింట చర్చకు దారితీసింది.ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు..సెన్సార్ బోర్డ్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాను అన్ని రకాల ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ నిర్ణయం మొదటి అడుగుగా భావిస్తున్నారు. అయినప్పటికీ ఇలాంటి నిర్ణయాలతో సినిమాపై ప్రేక్షకుడి దృష్టిని మరల్చినట్లు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఓకే కానీ.. మన హిందీ చిత్రాలకు సబ్ టైటిల్స్ ఎందుకని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. కింద ఉన్న పదాలు ప్రేక్షకుడి దృష్టిని మరల్చడం, కొన్నిసార్లు నటీనటులు మాట్లాడనప్పుడు కూడా సబ్ టైటిల్స్ వస్తే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ కొత్త నియమం అన్ని భారతీయ భాషలు, ప్రాంతాలలోని చిత్రాలకు వర్తిస్తుందని సెన్సార్ బోర్డ్ స్పష్టం చేసింది. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ
నటి షామ్నా ఖాసిం అలియాస్ పూర్ణ రెండోసారి తల్లయింది. గతేడాది ఆగస్టులో గర్భం దాల్చిన ఆమె మార్చి 14న ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దేవుడి ఆశీస్సులతో ఈరోజు ఉదయం 4 గంటల 25 నిమిషాలకు పాప పుట్టింది. తను మాకు లభించిన అపురూపమైన కానుక.సాఫీగా డెలివరీఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా డెలివరీ అయినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆస్పత్రి బృందానికి కూడా ధన్యవాదాలు అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు పూర్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా పూర్ణ 2022లో వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకుంది. ఈ దంపతుల ప్రేమకు గుర్తుగా 2023లో బాబు పుట్టాడు.సినిమాపూర్ణ మలయాళ నటి. సీమటపాకాయ్, అవును సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. శ్రీ మహాలక్ష్మి, నువ్వలా నేనిలా, రాజుగారి గది, అఖండ 2 ఇలా పలు చిత్రాల్లో నటించింది. మహేశ్బాబు గుంటూరు కారం సినిమాలో 'కుర్చీ మడతపెట్టి..' పాట ప్రారంభంలో కనిపిస్తుంది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, కన్నడ భాషల్లోనూ మూవీస్ చేసింది. View this post on Instagram A post shared by DrShanid Thalekoden (@dr.shanid_asifali) చదవండి: గోటీల ఫ్యాక్టరీ.. స్పందించిన జీవిత -
పైసా తీసుకోని మ్యూజిక్ డైరెక్టర్.. మెచ్చుకున్న హీరో
సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు కరుణాస్ వారసుడు కెన్ కరుణాస్. అసురన్, విడుదలై వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి గుర్తింపు పొందాడు. అలాగే హీరో ధనుష్, దర్శకుడు వెట్రిమారన్ దృష్టిలో పడ్డాడు. అంతేకాకుండా వెట్రిమారన్ సహాయ దర్శకుడిగానూ మారాడు. అలాంటి కెన్ తాజాగా ఒకేసారి హీరోగా, దర్శకుడిగా అవతారమెత్తి చేసిన మూవీ యూత్. రిలీజ్ ఎప్పుడంటే?పర్వతా ఎంటర్టైన్మెంట్ పతాకంపై కరుప్పయ్య సి.రామ్, కౌసల్యకుమార్ నిర్మించిన ఈ చిత్రంలో అనిష్మా, మీనాక్షి, ప్రయాన్సీ, ప్రియదర్శిని యాదవ్ హీరోయిన్లుగా నటించారు. నళిని, దేవదర్శిని, సురాజ్ వెంజారముడు ముఖ్యపాత్రలు పోషించారు. జీవీ.ప్రకాశ్కుమార్ సంగీతాన్ని, విక్కీ చాయాగ్రహణం అందించారు. కళాశాల నేపథ్యంలో సాగే ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ కథా చిత్రం ఈనెల 19వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. వాళ్లే కారణంశుక్రవారం ఉదయం చైన్నెలోని సత్యం థియేటర్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో దర్శకుడు వెట్రిమారన్, ధనుష్ పాల్గొన్నారు. తాను నటుడిగా, దర్శకుడిగా మారడానికి వెట్రిమారన్, ధనుష్లే కారణం అని కెన్ కరుణాస్ ఈ వేదికపై పేర్కొన్నారు. ధనుష్ మాట్లాడుతూ.. కెన్ ఈ స్థాయికి చేరుకోవవానికి కారణం ఆయన తల్లి దండ్రులేనన్నారు. జీవీ ప్రకాశ్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం అని పేర్కొన్నారు. ఆయన ఈ చిత్రానికి పారితోషికం తీసుకోకుండా పనిచేయడం విశేషం అన్నారు. -
రిచ్ కావాలంటే...
సముద్ర ఖని ప్రధాన పాత్రలో, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కార్మేని సెల్వం’. రామ్ చక్రి దర్శకత్వంలో అరుణ్ రంగరాజులు తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించి, తెలుగు టీజర్ను విడుదల చేశారు మేకర్స్. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ మూవీ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్లో భాగస్వామిగా ఉంది.‘డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి’ అంటూ సముద్ర ఖని చెప్పే డైలాగ్తో టీజర్ ప్రారంభం అవుతుంది. ‘రిచ్ కావాలంటే రిచ్ మనిషిలా ఖర్చు చేయడం నేర్చుకోవాలి. డబ్బు లేకపోతే అప్పు తీసుకుని ఖర్చు చేయాలి’ అంటూ సముద్ర ఖని చెప్పే డైలాగ్స్ కూడా టీజర్లో ఉన్నాయి. -
అలాంటి సినిమాలు తీస్తే జోకర్లా చూస్తారు: డైరెక్టర్
మలయాళ స్టార్ దర్శకుడు ప్రియదర్శన్ సొంత భాషలోనే సెటిలైపోకుండా బాలీవుడ్లోనూ అనేక సినిమాలు చేశాడు. హీరా ఫెరి, హంగామా, భూల్ భులయ్యా వంటి పలు చిత్రాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా హారర్ కామెడీ మూవీ భూత్ బంగ్లా చేస్తున్నాడు. ఇది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇష్టం లేదుఅయితే తనకు కామెడీ చిత్రాలకంటే సీరియస్ సినిమాలు చేయడమే ఇష్టం అంటున్నాడు తాజాగా పింక్విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియదర్శన్ మాట్లాడుతూ.. సీరియస్ చిత్రాలు తెరకెక్కించడమంటే నాకు చాలా ఇష్టం. కామెడీ మూవీస్ చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. కానీ నాకు వేరే ఆప్షన్ లేక కామెడీ జానర్లో సినిమాలు చేయాల్సి వస్తోంది.ఎందుకు చూడరు?సీరియస్ సినిమాలు చేస్తున్నప్పుడు ఇండస్ట్రీలో ప్రత్యేక గౌరవం చూపిస్తారు అదే కామెడీ జానర్లో ఉంటే మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఒక మంచి దర్శకుడిగా పరిగణించరు. ఈ విషయంలో నాకు చాలా బాధేస్తుంది. కామెడీ సినిమాలు తీసేవాళ్లను మంచి దర్శకులుగా ఎందుకు చూడరు? మనదగ్గరే కాదు, ప్రపంచమంతటా అలాగే ఉంది. హాస్యభరిత చిత్రాలు చేసేవారిని జోకర్లా చూస్తున్నారు. కామెడీ సినిమాలకు ఆస్కార్ రావడం కూడా చాలా అరుదు. ఇది నిజంగా బాధాకరం.. కానీ ఇదే జరుగుతోంది అని ప్రియదర్శన్ చెప్పుకొచ్చాడు. -
MGRపై చౌకబారు వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
తెలుగు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పాడు. తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానన్నాడు. అవి ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని, అనుకోకుండా దొర్లాయని విచారం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తమిళంలో క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇంకెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయనని తెలిపాడు.కొద్దిగా నోరు జారా..ఆ వీడియోలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. తమిళ సినీ ప్రేక్షకులు ఎంజీఆర్ను దైవంలా భావిస్తారు. నేను కూడా ఆయన్ను దేవుడిలాగే భావిస్తాను. తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో కొద్దిగా నోరు జారాను. అది కావాలని అనలేదు. కొందరు దీన్ని పెద్దది చేశారు. ఆయనపై కామెంట్స్ చేసేంత ధైర్యం నాకెక్కడిది? నేను చెన్నై ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము నటిస్తుంటే వచ్చి చూసేవారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి నేను తప్పుగా మాట్లాడతానా? ఏదేమైనా నా మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి. భవిష్యత్తులో ఇంకెప్పుడూ అలాంటి కామెంట్స్ చేయను అని క్షమాపణలు తెలిపాడు.ఏం జరిగింది?కాగా ఇటీవల ఓ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ కాస్త నోరు జారాడు. తెలుగు నటుడు కాంతారావును పొగిడే క్రమంలో ఎంజీఆర్పై చులకన వ్యాఖ్యలు చేశాడు. కాంతారావును చూసి ఎంజీఆర్ ప్యాంటు తడుపుకునేవాడని కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై కోలీవుడ్ సెలబ్రిటీలు విశాల్, నాజర్ మండిపడ్డారు. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు ప్రతి తమిళుడి మనసును నొచ్చుకునేలా ఉన్నాయన్నారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరాడు. வருத்தம் தெரிவித்த நடிகர் ராஜேந்திர பிரசாத்!#ActorRejendraprasad #mgr #nadigarsangam #nasser#vishal pic.twitter.com/8dpyBRPW5Z— FridayCinema (@FridayCinemaOrg) March 13, 2026 -
గుండె ముక్కలైందన్న హీరో! బ్రేకప్ పోస్ట్?
తమిళ హీరో అర్జున్దాస్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఎప్పుడూ సినిమా అప్డేట్స్ తప్ప పర్సనల్ విషయాలను పెద్దగా ఫ్యాన్స్తో పంచుకోడు. అలాంటిది ఆయన హార్ట్ బ్రేక్ అయినట్లు ఓ పోస్ట్ పెట్టడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు.అంతలా ప్రేమిస్తే..ఇంతకీ ఆ పోస్ట్లో ఏముందంటే.. మనం ఎవర్నైనా గాఢంగా ప్రేమిస్తే.. వాళ్లు మనల్ని వదిలేసి వెళ్లిపోతారు. అసలు ఒక మనిషి ఇంత సులభంగా ఎలా మూవ్ ఆన్ అవుతారు? అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. దీనికి హృదయం ముక్కలైన ఎమోజీని జత చేశాడు. అర్జున్దాస్కు బ్రేకప్ఇది చూసిన అభిమానులు అర్జున్దాస్కు బ్రేకప్ అయిందా? అని చర్చిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇదేదో కొత్త సినిమా ప్రమోషన్స్ అయుంటుంది, అంతా పబ్లిసిటీ స్టంట్ అని భావిస్తున్నారు. మరి ఈ పోస్ట్ వెనక మర్మమేంటో అర్జున్ దాసే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.సినిమాకాగా అర్జున్ దాస్ గతంలో ఐశ్వర్య లక్ష్మితో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని, తాము స్నేహితులం మాత్రమేనని ఐశ్వర్య క్లారిటీ ఇచ్చింది. అటు అర్జున్ కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటారా? పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా? అన్న ప్రశ్నకు పెళ్లే చేసుకోను అని బదులిచ్చాడు. ఇకపోతే ఇతడు చివరగా ఓజీ సినిమాలో యాక్ట్ చేశాడు. ప్రస్తుతం కాన్ సిటీ సినిమా చేస్తున్నాడు.చదవండి: ఆశను కోల్పోవద్దు.. విడాకుల తర్వాత హన్సిక ఫస్ట్ పోస్ట్ -
ప్రేమ్ రక్షిత్పై మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ ప్రశంసలు
ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్, కింగ్ ఆఫ్ పాప్ 'మైఖేల్ జాక్సన్'కు లెజెండరీ కొరియోగ్రాఫర్ 'విన్సెంట్ ప్యాటర్సన్' ఐకానిక్ డాన్స్ స్టెప్స్ కంపోజ్ చేశారు. అమెరికన్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ అయిన విన్సెంట్.. మైఖేల్ జాక్సన్, మడోన్నా వంటి సూపర్ స్టార్లతో కలిసి పనిచేశారు. ప్రసిద్ధ మ్యూజిక్ ఆల్బమ్స్, సినిమాలు, బ్రాడ్వే, కచేరీలను విన్సెంట్ రూపొందించారు. అలాంటి ప్రముఖ వ్యక్తి.. భారతీయ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ టాలెంట్ను ప్రశంసించడం ఆసక్తికరంగా మారింది. వీడియో వైరల్ప్రపంచ స్థాయి కొరియోగ్రాఫర్ ప్రశంసించడం భారతీయ డాన్స్ టాలెంట్కు గ్లోబల్ గుర్తింపు లభించడమే అని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల ప్రేమ్ రక్షిత్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేయగా.. అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో ప్రేమ్ ప్రతిభకు విన్సెంట్ పాటర్సన్ ఫిదా అయ్యారు. 'హలో ప్రేమ్.. నేను విన్సెంట్ ప్యాటర్సన్. నేను అమెరికన్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్. ఏదో ఒక రోజు కలుస్తా..చాలా ఏళ్లు మైఖేల్ జాక్సన్తో కలిసి పనిచేశా. నేను మీకు ఓ విషయం చెప్పాలి. నేను మిమ్మల్ని నిజంగా అభినందిస్తున్నా. మీ కొరియోగ్రఫీ అద్భుతం. మీరు అకాడమీ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సభ్యుడిగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇండియాలో యంగ్ కొరియోగ్రాఫర్లు ఉన్నారు. వారి కలలు సాధించుకుంటున్నారు. ఏదో ఒక రోజు నిన్ను కలుస్తా రక్షిత్' అంటూ విన్సెంట్ వీడియోలో చెప్పారు.ఎంతో ప్రత్యేకం'నేను చిన్నప్పటి నుంచే స్మూత్ క్రిమినల్ పాటకు పెద్ద అభిమానిని. మైఖేల్ జాక్సన్తో కలిసి పనిచేసిన ఒక లెజెండ్ నుంచి అభినందనలు అందుకోవడం కొరియోగ్రాఫర్గా ఎంతో ప్రత్యేకమైన విషయం. థాంక్స్ డియర్ విన్సెంట్ సర్' అని ప్రేమ్ రక్షిత్ రిప్లై ఇచ్చారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన నాటు నాటు పాటకు ఆస్కార్ వరించిన విషయం తెలిసిందే. దాంతో ఆయన అంతర్జాతీయ ఖ్యాతి పొందారు. చెన్నైలో పెరిగిన రక్షిత్.. ప్రభాస్'ఛత్రపతి'తో ప్రయాణం మొదలుపెట్టి.. 'బాహుబలి' వంటి అనేక పెద్ద చిత్రాలకు పనిచేశారు. తెలుగు, తమిళంలో దాదాపు 200కి పైగా చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. View this post on Instagram A post shared by Prem Rakshith (@premrakshith_choreographer) -
8 ఏళ్లు ఎంత బాధపెట్టినా మౌనంగా భరించా.. ఇకనావల్ల కాదు!
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా మనసుపడ్డవాడిని పెళ్లి చేసుకుని కొత్త జీవితానికి నాంది పలికింది. ఫిబ్రవరి 26ప ఉదయ్పూర్లో తెలుగు హీరో విజయ్దేవరకొండను పెళ్లాడింది. ఈ సంతోషకర సమయంలో ఆమె తల్లి సుమన్ మందన్నాకు సంబంధించిన ఓ పాత ఆడియో క్లిప్ కటి నెట్టింట తెగ వైరలవుతోంది. దీన్ని ఆధారంగా చేసుకుని చాలామంది రష్మిక గురించి, ఆమె కుటుంబం గురించి సోషల్ మీడియాలో అసత్యప్రచారాలు చేస్తున్నారు. ఈ విషయంపై రష్మిక ఆగ్రహం వ్యక్తం చేసింది.అన్నీభరించా..ఒక మీడియా వర్గం ఎనిమిదేళ్లుగా నాపై అసత్యప్రచారం చేస్తూ, నన్ను టార్గెట్ చేస్తూ వేధిస్తూనే ఉంది. వాళ్ల వ్యూస్, రీచ్ కోసం నేను అనని మాటల్ని కూడా అన్నట్లుగా తప్పుడు కథనాల్ని రాసింది. అది నన్నెంతో బాధపెట్టినా నేను మౌనంగా ఉన్నాను. కానీ గడిచిన 24 గంటల్లో వారు హద్దులు దాటి నాపై తీవ్ర దుష్ప్రచారం చేశారు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ ప్రైవేటు సంభాషణలోని కొంత భాగాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారు. ఎంతదూరం వెళ్తారు?ఇప్పుడు నా జీవితంలో మార్పు చేసుకున్న పరిణామాల కారణంగా కావాలనే వాటిని వైరల్ చేస్తున్నారు. ఇంకా ఎంతదూరం వెళ్తారు? మీరిలా చేయడం వల్ల నా కుటుంబసభ్యులే కాకుండా నాకు సంబంధం ఉన్న వ్యక్తుల్ని కూడా ఇబ్బందిపెడుతున్నారు. ఇది నా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేకాదు, నా ప్రతిష్టను దిగజార్చడమే అవుతుంది. మేమిద్దరం (రక్షిత్, నేను) ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నాం. 24 గంటల్లో డిలీట్అయినా సరే కొందరు కావాలని వివాదం సృష్టిస్తున్నారు, విషాన్ని చిమ్ముతున్నారు. ఎనిమిదేళ్లుగా మీరేం చేసినా మౌనంగా ఉన్నాను. కానీ, ఈరోజు మిగతావారిని కూడా ఇందులోకి లాగుతూ హద్దులు దాటి ప్రవర్తించారు. ఇక నేను సహనంగా ఉండలేను. మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వెంటనే తప్పుడు కథనాల్ని తొలగించండి. మీకు 24 గంటలు టైం ఇస్తున్నా.. ఆలోపు వాటిని తొలగించకపోతే రేపటి నుంచి సంబంధిత వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.వివాదం ఏంటి?2016లో కిరిక్ పార్టీ మూవీ షూటింగ్లో రష్మిక, రక్షిత్ శెట్టి ప్రేమలో పడ్డారు. ఆ మరుసటి ఏడాది నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ, ఆ ప్రేమ పట్టాలెక్కకముందే 2018లో ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే ఆ సమయంలో రష్మిక ఎదుర్కొన్న వేధింపుల గురించి ఆమె తల్లి మాట్లాడినట్లుగా ఓ ఆడియో వైరలవుతోంది. దాదాపు ఎనిమిదేళ్ల కిందటి సంభాషణను ఇప్పుడు రష్మిక పెళ్లి జరిగిన సమయంలో బయటపెట్టడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. 🙏🏻 pic.twitter.com/DdJwFIjeP3— Rashmika Mandanna (@iamRashmika) March 12, 2026 -
డబ్బులిచ్చి మరీ నాపై ట్రోలింగ్.. స్టార్ హీరోయిన్ ఆవేదన
దక్షిణాది చిత్ర పరిశ్రమలో వేగంగా ఎదిగిన కథానాయకి ప్రియాంక మోహన్. ఈ కన్నడ భామ డాక్టర్ చిత్రం ద్వారా కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత సూర్య, ధనుష్ వంటి స్టార్ హీరోలతో జతకట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ధనుష్ దర్శకత్వం వహించిన నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం చిత్రంలో ప్రత్యక పాటలో మెరిసి ప్రేక్షకులను అలరించారు. ఇటీవల ఆమెకు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి.కాగా ఈమె తాజాగా నటించిన మేడిన్ కొరియా చిత్రం శుక్రవారం నుంచి నేరుగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో తాను చాలా విషయాలను ఎదుర్కొంటున్నానని ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక మోహన్ పేర్కొన్నారు. విమర్శలతో పాటూ చాలా ట్రోలింగ్లు చేయడానికే ఓ టీమ్ పని చేస్తోందని ఆవేదనను వ్యక్తం చేశారు. తనపైనే కాకుండా పెద్ద పెద్ద హీరో హీరోయిన్లు గురించి ట్రోలింగ్ చేస్తున్నారన్నారు. డబ్బులిచ్చి మరీ ఇలా ట్రోలింగ్ ఎందుకు చేయిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.తాను జీవితంలో చాలా విషయాలు జరిగాయని, వాటి గురించి ఇప్పుడు పూర్తిగా వివరించడం ఇష్టం లేదన్నారు. అయితే అలాంటి విషయాలతో చాలా నేర్చుకుంటూ, తనను తాను మెరుగుపరచుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు. తనవరకు అయితే సినిమా ఇండస్ట్రీ అనేది స్థిరత్వం లేని పరిశ్రమ అన్నారు. ఇక్కడ ఏదైనా, ఎవరికై నా జరుగుతుందన్నారు. ఇక్కడ అణగదొక్కడానికి కొందరు ఉంటారని, అయితే జీవితంలో కిందపడితే అది ఒక మెట్టు పైకి ఎక్కడానికే అని తాను భావిస్తానని అన్నారు. ఇలా చాలా విషయాలను నేర్చుకుంటూ దాన్ని తన పనిలోనూ, జీవితంలోనూ ఉపయోగించుకుంటున్నానని ప్రియాంక మోహన్ పేర్కొన్నారు. -
ధురందర్ 2 టికెట్ రేటు రూ. 3100
భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన ధురంధర్-2 సినిమా టికెట్ ధరల విషయంలో కొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధిక టికెట్ ధరగా రూ.3100ను ఢిల్లీలోని ఐనాక్స్ మెగాప్లెక్స్లోని ఒక ప్రత్యేక స్క్రీన్లో ఫిక్స్ చేశారు. కేవలం 42 సీట్లు మాత్రమే ఉన్న ఈ స్క్రీన్లో ప్రీమియర్స్ కోసం ఈ రేటు అమలు చేస్తున్నారు. బుక్ మై షో చార్జీలతో కలిపితే ధర రూ.3145కి చేరుతుంది. ప్రస్తుతం అదే స్క్రీన్లో ప్రదర్శితమవుతున్న ది కేరళ స్టోరీ-2 టికెట్ ధర కేవలం రూ.500 మాత్రమే. అయితే ధురంధర్-2 క్రేజ్ కారణంగా ప్రీమియర్ షోలకు టికెట్ ధరను అమాంతం పెంచేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటికే సగానికి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. దేశవ్యాప్తంగా ఒక రోజు ముందే పెయిడ్ ప్రివ్యూలు ప్లాన్ చేశారు. బెంగళూరులో కొన్ని స్క్రీన్లలో టికెట్ ధరలు రూ.800 వరకు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఎప్పటిలాగే రేట్లు పెంచారు. సాయంత్రం 5 గంటలకే అన్ని ప్రాంతాల్లో ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా సాగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. -
ఇప్పటికీ భార్యనే డబ్బు అడుగుతా: శివకార్తికేయన్
తనకు డబ్బు కావాల్సి వస్తే భార్య దగ్గర చేయి చాస్తానంటున్నాడు తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్. తన బ్యాంకులో ఎంత డబ్బుందన్న విషయం కూడా తనకు తెలియదని చెప్తున్నాడు. ఈయన నిర్మాతగా వ్యవహరించిన 'తాయ్ కిళవి' బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. రాధికా శరత్కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం రూ.50 కోట్ల మైలురాయిని దాటేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో శివకార్తికేయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.చేయి చాచి అడుగుతాఆయన మాట్లాడుతూ.. పెళ్లయినప్పటి నుంచి నా ఆర్థిక వ్యవహారాలన్నీ భార్య ఆర్తియే చూసుకుంటోంది. నా అకౌంట్లో ఎంత డబ్బుందన్న విషయం కూడా నాకు తెలీదు. నేను ఎప్పుడు, ఏ ఖర్చు పెట్టాలన్నా తనను అడిగి తీసుకుంటాను. ఒక టికెట్ కొనాలన్నా కూడా తనను చేయి చాచి మనీ అడుగుతాను. అందుకు నేను ఏమీ బాధపడను, పైగా గర్వపడుతున్నాను. తన ముందుచూపు, దూరదృష్టి, పొదుపు చేసే వైఖరి వల్లే ఈరోజు నేను నిర్మాతగా సినిమాలు తీయగలుగుతున్నాను. వాళ్లందరికీ సినిమా అంకితంతను అవన్నీ చూసుకోకపోయుంటే ఇవేవీ సాధ్యమయ్యేవి కావు. రేపటికోసం జాగ్రత్తపడే ప్రతి మహిళకు మా సినిమా అంకితం. సంపాదన ఎంతున్నా సరే దానిలో ఎంతో కొంత వెనకేయాలనే ఆడవారు ఆలోచిస్తారు అని చెప్పుకొచ్చాడు. కాగా కొత్త డైరెక్టర్ శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించిన తాయ్ కిళవి ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సింగం పులి, అరుళ్ దాస్, బాల శరవణన్, ముత్తుకుమార్, రేచల్ రెబెకా, జార్జ్ మరియణ్ ప్రధాన పాత్రలు పోషించారు. నివాస్ కె.ప్రసన్న సంగీతం అందించాడు.చదవండి: భర్తకు విడాకులిచ్చిన హీరోయిన్ హన్సిక -
భర్తకు హన్సిక విడాకులు.. భరణం ఆశించని హీరోయిన్
హీరోయిన్ హన్సిక మొత్వానీ నాలుగేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికింది. భర్త, వ్యాపారవేత్త సోహెల్ ఖతూరియా నుంచి విడాకులు తీసుకుంది. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామంటూ హన్సిక బాంద్రా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం వీరికి విడాకులు మంజూరు చేసింది. భర్త నుంచి ఎలాంటి భరణం అడగకుండానే హన్సిక విడాకులు కోరడం గమనార్హం!రెండేళ్ల నుంచే వేర్వేరుగాతమ మధ్య చిన్న విషయాలు కూడా తగాదాలుగా మారుతున్నాయని, ఒకే ఇంట్లో ఉండటం కూడా కష్టంగా ఉందని హన్సిక పిటిషన్లో పేర్కొంది. 2024 జూలై 2 నుంచే వీరు విడివిడిగా జీవిస్తున్నట్లు హన్సిక తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. కాగా హన్సిక 2022 డిసెంబర్ 4న సోహెల్ను పెళ్లాడింది. ఇది హన్సికకు మొదటి పెళ్లి కాగా అతడికి రెండోది కావడం గమనార్హం! హన్సిక - సోహెల్ వివాహ వేడుకకు రాజస్థాన్లోని జైపూర్ ప్యాలెస్ వేదికగా నిలిచింది. పెళ్లయి రెండేళ్లు కూడా కాకముందే దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో చాలాకాలంగా వేర్వేరుగా జీవిస్తున్న వీరు ఇప్పుడు విడాకులతో దూరమయ్యారు.సినిమాహన్సిక హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. దేశముదురు అనే తెలుగు చిత్రంతో హీరోయిన్గా మారింది. తొలి సినిమాకే విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది. కంత్రి, మస్కా, కందిరీగ, ఓ మై ఫ్రెండ్, దేనికైనా రెడీ, పవర్.. ఇలా అనేక సినిమాలు చేసింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ మూవీస్ చేసింది.చదవండి: సర్జరీ ఫెయిల్, దేవుడి ముందు మోకరిల్లి: కమెడియన్ -
నాన్న చితికి అల్లుడి స్థానంలో నిలబడి నిప్పు పెట్టాడు: సింగర్
మలయాళ సింగర్ అమృత సురేశ్కు ప్రేమ కలిసి రావడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త (నటుడు బాల) కూతురు పుట్టాక విడాకులు తీసుకున్నాడు. ఆ సమయంలో ఒంటరితనంతో కుమిలిపోతున్న తనకు మ్యూజిక్ కంపోజర్ గోపీ సుందర్ దగ్గరయ్యాడు. కానీ, ఇది కూడా మూణ్నాళ్ల ముచ్చటే అయింది. ఈ జంట కొంతకాలానికే బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే గోపీ సుందర్ తాను జీవితంలో మర్చిపోలేని ఓ పని చేశాడంటోంది.ప్రియుడి తల్లిని..అమృత సురేశ్ మాట్లాడుతూ.. కొన్నేళ్లపాటు నరకం, బాధ అనుభవించిన సమయంలో గోపీ సుందర్ నాకు సపోర్ట్గా నిలబడ్డాడు. మేము ఎంతో బాగా కలిసిపోయాం. ఎంతలా అంటే అతడి తల్లిని కూడా నేను నా తల్లిగానే భావించాను. అంతలా ఆ కుటుంబాన్ని ప్రేమించాను. ఇప్పటికీ అతడి కుటుంబంపై ప్రేమ అలాగే ఉంది. మా రిలేషన్షిప్ ఎప్పటికీ ఇలాగే కొనసాగాలనుకున్నాం. కానీ, అది జరగలేదు. అలా అని అతడెప్పుడూ నన్ను బాధపెట్టలేదు. అల్లుడి స్థానంలో నిలబడిమా నాన్న చనిపోయినప్పుడు ఒక కొడుకులా ముందు నిలబడి అంత్యక్రియలు జరిపించాడు. మా నాన్న చితికి అల్లుడి స్థానంలో నిలబడి నిప్పు పెట్టాడు. అది నేనెప్పటికీ మర్చిపోలేను. కానీ రానురానూ మేము కలిసి ఉండటం కష్టమని అర్థమైంది. గొడవపడుతూ కలిసుండటం కన్నా అర్థం చేసుకుని విడిపోవడమే మంచిదని భావించాం. ఇద్దరం విడిపోయాం. బర్త్డే, పండగల సమయంలో మాత్రం ఒకరినొకరం విష్ చేసుకుంటాం అని చెప్పుకొచ్చింది.పెళ్లిఅమృత సురేశ్ గతంలో నటుడు బాలాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2010లో వివాహం చేసుకున్న వీరిద్దరికీ 2012లో కూతురు అవంతిక జన్మించింది. 2015లో భార్యాభర్తలిద్దరూ విడివిడిగా జీవిస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. చివరకు అవే నిజం చేస్తే 2019లో వీరు విడాకులు తీసుకున్నారు.చదవండి: చేసిన రెండు మూవీస్ ఫ్లాప్.. అయినా మరో బంపరాఫర్ -
విజయ్-త్రిష వ్యవహారం.. ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు
గతకొన్ని రోజులుగా నటుడు, టీవీకే అధినేత విజయ్ , నటి త్రిషకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ కలిసి ఓ కార్యక్రమానికి వెళ్లడంతో ఆ వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా ఈ అంశంపై సీనియర్ నటి,రాజకీయ నాయకురాలు ఖుష్భూ సుందర్ స్పందించారు. అది వాళ్ల పర్సనల్ విషయం అని, అది ప్రజలను ప్రభావితం చేయనంతవరకు ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తాజాగా ఆమె ఓ మీడియా ఏజెన్సీతో మాట్లాడుతూ.. ‘ఈ అంశం(త్రిష-విజయ్ల రిలేషన్)తో ప్రజలకు ఏమి సంబంధం ఉందో నాకు అర్థం కావడం లేదు. ఇది వారి వ్యక్తిగత జీవితం. అది ప్రభావితం చేస్తే, మనం దాని గురించి మాట్లాడవచ్చు. వారి వ్యక్తిగత జీవితానికి ప్రజలతో సంబంధం లేదు. ప్రజలు దీనిని ఎందుకు పెద్ద విషయంగా చూస్తున్నారు? వారు తమకు నచ్చినట్లుగా జీవితాన్ని కొనసాగిస్తారు. దాని వల్ల ప్రజలు ఏ విధంగానూ ప్రభావితం కారు’ అని ఖుష్భూ అన్నారు.త్రిష అంశం విజయ్ రాజకీయ జీవితంపై ప్రభావితం చూసే అవకాశం ఉందా అనే ప్రశ్నలు బదులుగా.. ‘ప్రజలు తెలివైన వాళ్లు. ఎవరికి, ఎందుకు ఓటు వేయాలో వాళ్లకు బాగా తెలుసు. పర్సనల్ లైఫ్ దానిని ప్రభావితం చేస్తుందని నేను అనుకోను. ఆయన నాయకుడైనా కాకపోయినా.. మనలాగే ఒక మనిషి. ప్రజల వ్యక్తిగత జీవితంతో అతనికి కూడా ఎలాంటి సంబంధం ఉండదు’ అని ఖుష్భూ చెపుకోచ్చింది. -
ఓటీటీకి మలయాళ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ చిత్రాలకు ఓటీటీలో ఫుల్ డిమాండ్ ఉంటోంది. అక్కడ సూపర్ హిట్ అయినా సినిమాలను డబ్ చేసి అన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాజాగా మరో మలయాళ హిట్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన మూవీ పెన్నుమ్ పోరాట్టమ్.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ చిత్రం మార్చి 13 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.ఈ సినిమాకు రాజేశ్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రాజేశ్ మాధవన్, రైనా రాధాకృష్ణన్, సుభాష్ చంద్రన్ కీలక పాత్రలు పోషించారు. కేరళలోని ఓ గ్రామం చుట్టూ తిరిగే కథాంశంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ గ్రామంలోని రూల్స్ను ఓ యువతి, ఓ కుక్క ఎలా బ్రేక్ చేశారనే కోణంలో సెటైరికల్గా తెరకెక్కించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. Watch Pennum Porattum on Netflix, out 13 March, in Malayalam, Hindi, Tamil, Telugu and Kannada#PennumPorattumOnNetflix@dawn1720 @ArunCThampi22 @stkframes @binugeorgealex@akhilvishnu_vs— Netflix India South (@Netflix_INSouth) March 10, 2026 -
ఆయన్ని తట్టుకోలేను.. అందుకే 16 సినిమాలు తిరస్కరించా
ఇండస్ట్రీలో నటీనటులు అందరూ ఒకేలా ఉండరు. కొందరు వచ్చామా పనిచేశామా వెళ్లిపోయామా అన్నట్లు ఉంటారు. మరికొందరు మాత్రం తమ చర్యలతో తోటి నటీనటుల్ని చాలానే ఇబ్బందులు పెడుతుంటారు. తాజాగా తమిళ నటి సోనా.. ప్రముఖ కమెడియన్ వడివేలు గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయన వల్ల నరకం చూశానన చెప్పుకొచ్చింది. అందుకే 16 సినిమాల్లో ఆయనకు జంటగా నటించే అవకాశమొచ్చినా తిరస్కరించినట్లు మరోసారి స్పష్టం చేసింది.(ఇదీ చదవండి: మరోసారి నోరుజారిన రాజేంద్ర ప్రసాద్)'కుశేలన్ (తెలుగులో 'కథానాయకుడు') తర్వాత వడివేలుతో కలిసి నటించమని నాకు 16కు పైగా సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. అయితే వాటిని మర్యాదపూర్వకంగా తిరస్కరించాను. ఎందుకంటే నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం నాకు ముఖ్యం. నిజాయితీగా చెప్పాలంటే ఆయనని నేను తట్టుకోలేనేమో అనిపించింది. ఓ రకంగా నరకం చూశాను. అందుకే ఆయనతో కలిసి నటించకూడదని నిర్ణయించుకున్నాను. దీని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడకపవడమే మంచిదని అనుకుంటున్నాను' అని సోనా చెప్పుకొచ్చింది.తమిళంలో నటి, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న సోనా.. ఎక్కువగా శృంగార తరహా పాత్రలే చేసింది. రజనీకాంత్ హీరోగా నటించిన కుశేలన్ చిత్రం తెలుగులో కథానాయకుడు పేరుతో రిలీజైంది. మూవీ ఇక్కడ ఫ్లాప్ అయినప్పటికీ.. ఇందులో కొన్ని సీన్స్ బాగానే ఉంటాయి. సోనా-వడివేలు కాంబినేషన్లోని కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. అయితే సెట్లో సోనాని వడివేలు ఎంతలా ఇబ్బంది పెట్టాడో ఏమో గానీ ఇలా ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. వడివేలుపై గతంలోనూ పలువురు నటీనటులు ఇలాంటి ఆరోపణలే చేశారు. అందుకే చాన్నాళ్ల పాటు సినిమాలకు దూరమయ్యాడు. కొన్నాళ్ల క్రితమే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. అడపాదడపా మూవీస్ చేస్తున్నారు. మళ్లీ ఇలాంటి టైంలో సోనా, వడివేలుపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. సోనా తెలుగులోనూ ఆయుధం, వీడే, విలన్, ఆంధ్రావాలా తదితర సినిమాలు చేసింది. ప్రస్తుతానికైతే తమిళ, మలయాళ మూవీస్లోనే కనిపిస్తోంది.(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు.. టాలీవుడ్ హీరోయిన్ ఆవేదన) -
పర్సనల్ లైఫ్ జడ్జ్ చేయడానికి మీరెవరు?.. విజయ్- త్రిష వివాదంపై స్టార్ డైరెక్టర్
కోలీవుడ్లో విజయ్- త్రిష పేర్లే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా త్రిష పేరు తెరపైకొచ్చింది. ఇటీవల వీరిద్దరు జంటగా ఓ వివాహానికి కూడా హాజరు కావడంతో మరింత హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే త్రిషపై కోలీవుడ్ దర్శకుడు పార్తిబన్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాత దర్శకుడు తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.తాజాగా విజయ్- త్రిష వివాదంపై ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ భట్ స్పందించారు. మనం కేవలం నటీనటుల సినిమాల గురించి మాత్రమే చర్చించాలని సూచించారు. వారి వ్యక్తిగత జీవితాలపై చర్చించే హక్కు.. వారిని జడ్జ్ చేసే రైట్ మనకు లేదన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా ఈ వివాదం కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ హాట్ టాపిక్గా మారింది..విక్రమ్ భట్ తన పోస్ట్లో రాస్తూ.. ' విజయ్- త్రిషల వ్యక్తిగత జీవితాలపై చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వస్తోన్న రూమర్స్ నిజమో, కాదో నాకు తెలియదు. ఒకవేళ అవి నిజమైతే నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. వారిద్దరూ ఎంతో హుందాగా ఉన్నారు. ఏ విషయాన్ని దాచిపెట్టడం లేదు. ఇప్పుడు వాళ్లను ఎంతోమంది జడ్జ్ చేస్తున్నారు. ఆ ఇద్దరి గురించి మాట్లాడేవారంతా ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. నటీనటుల సినిమాలు మాత్రమే మనం చూడాలి. వారి పర్సనల్ లైఫ్ గురించి మనకు అవసరం లేదు' అని రాసుకొచ్చారు.కాగా.. ఇటీవల రూ.30కోట్ల చీటింగ్ కేసు విషయంలో విక్రమ్ భట్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విక్రమ్, అతడి భార్య శ్వేతాంబరి భట్లకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ దంపతులు దాదాపు రూ.30 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
'ఆర్ఆర్ఆర్'కి నాటునాటు.. 'వారణాసి'కి లాటిన్ స్టయిల్!
ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు-నాటు' పాట అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆస్కార్ వేదికపై కూడా మెరిసింది ఈ పాట. అది తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైంది. అయితే ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి మరోసారి అలాంటి మ్యాజిక్ను రిపీట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడట. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసిలో ఓ ప్రత్యేకమైన డాన్స్ నంబర్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ పాటను లాటిన్ స్టయిల్లో తెరకెక్కించాలని ఆయన భావిస్తున్నారని సీనియర్ కొరియోగ్రాఫర్ శంకర్ వెల్లడించారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటపై తెరకెక్కనున్న ఈ పాట కోసం వందలమంది లాటిన్ డాన్సర్లను తీసుకురావాలని రాజమౌళి ఆలోచిస్తున్నాడట.నాటు-నాటు తరహాలోనే, వారణాసిలో లాటిన్ స్టయిల్లో సాగే ఈ పాట కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. ఇప్పటికే వారణాసి టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా కొరియోగ్రాఫర్ వ్యాఖ్యలతో అంచనాలు మరింత పెరిగాయి. జార్జియాలోని షెడ్యూల్ను పూర్తి చేసుకొని మహేష్ బాబు హైదరాబాద్కి తిరిగొచ్చాడు. ఎయిర్పోర్టులో ఆయన కొత్త లుక్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే అంటార్కిటికాలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. హీరోయిన్ ప్రియాంక చోప్రా స్వయంగా ఈ విషయం వెల్లడించింది. వారణాసి అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకోనున్న తొలి తెలుగు చిత్రంగా గుర్తింపు పొందనుంది. -
మిషన్ నొక్కితే డబ్బే డబ్బు.. కాన్ సిటీ టీజర్ చూశారా?
డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? అన్న డైలాగ్ ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. ఆ మాట నిజమైతే బాగుండు అనుకునేవాళ్లూ లేకపోలేదు. దాదాపు అలాంటి కాన్సెప్ట్తో వస్తున్న తమిళ సినిమా "కాన్ సిటీ". కాకపోతే ఇక్కడ డబ్బులు చెట్లకు కాకుండా ఓ మిషన్కు కాస్తున్నాయి. అవును, బటన్ నొక్కితే చాలు లిమిట్ అనేదే లేకుండా ఎన్నిసార్లంటే అన్నిసార్లు డబ్బులు ప్రింట్ చేస్తూనే ఉంది.డబ్బులు ప్రింట్ చేసే మిషన్సోమవారం సాయంత్రం కాన్సిటీ తెలుగు టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో.. డబ్బులు ఎప్పుడు తిరిగిస్తావని ఓ గంభీర స్వరం ఫోన్లో హీరోను నిలదీస్తుంది. దాంతో అసహనానికి లోనైన హీరో వస్తువులన్నింటినీ కిందపడేస్తాడు. అప్పుడే ఒక మిషన్ను సైతం కిందపడేయబోతాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పిడుగు పడి యంత్రం ఆన్ అవుతుంది, అందులో నుంచి రూ.500 నోటు బయటకు వస్తుంది. ఇంకేముంది.. నొక్కిన ప్రతిసారి నోట్ల వర్షం కురుస్తూనే ఉంటుంది.చేతులు మారిన యంత్రందాంతో ఆ డబ్బంతా బ్యాగులో సర్దుకున్న హీరో ఆ యంత్రాన్ని జాగ్రత్తగా అల్మారాలో పెడతాడు. కట్ చేస్తే బట్టలు సర్దే సమయంలో భార్యకు ఆ మిషన్ కనిపిస్తుంది. బటన్ నొక్కితే డబ్బు వస్తుండటంతో దాన్ని తీసుకెళ్లి వంటగదిలో దాచేస్తుంది. అక్కడి నుంచి అది హీరో తల్లి చేతికి వెళ్తుంది. ఆమె దాన్ని పూజగదిలో దేవుడి ఫోటో వెనకాల భద్రపరుస్తుంది. తర్వాత సడన్గా మిషన్ కనిపించకుండా పోతుంది. వీధిలో నోట్ల వర్షంఇంటిల్లిపాది అంతా వెతుకుతారు. తీరా చూస్తే హీరో కొడుకు ఆ యంత్రంతో బాల్కనీలో ఆడుకుంటాడు. ఇంకేముంది, నడిరోడ్డులో డబ్బుల వర్షం.. దాన్ని దక్కించుకునేందుకు వీధిలో జనం ఎగబడుతుంటారు. మరిం తర్వాతేం జరిగిందో తెలియాలంటే కాన్ సిటీ చూడాల్సిందే! హరీశ్ దురైరాజ్ దర్శకత్వం వహించిన ఈ డిఫరెంట్ మూవీకి సేన్ రోల్డన్ సంగీతం అందించాడు. అర్జున్ దాస్, అన్నాబెన్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తమిళ చిత్రాన్ని టీ సిరీస్ తెలుగులో తీసుకురానుంది. -
రూ.50 కోట్లు కొల్లగొట్టిన రాధిక శరత్ కుమార్ మూవీ
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా అలరించిన రాధిక శరత్కుమార్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. అయితే 'తాయ్ కిళవి' కోసం ఆమె ముసలమ్మగా నటించింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటినుంచి మంచి బజ్ క్రియేట్ చేసింది. 75 ఏళ్ల బామ్మగా రాధిక నటించడం, హీరో శివకార్తికేయన్ నిర్మాతగా వ్యవహరించడంతో సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడింది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.హాఫ్ సెంచరీపాజిటివ్ రివ్యూలతో తొలిరోజు నుంచే బాక్సాఫీస్పై మంచి పట్టు సాధించింది. కేవలం పది రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా తాయ్ కిళవి రూ.50 కోట్లు వసూలు చేసిందంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక సినిమా రిలీజైనప్పటినుంచి టాప్ హీరోలు, దర్శకుడు, హీరోయిన్లు అందరూ సినిమాను, ముఖ్యంగా రాధికను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నారు. #ThaaiKizhavi crosses ₹50 Crore Worldwide GBOC in just 10 days! 💥Overwhelmed by the incredible love and support from everywhere. Thank you for making it a #MegaBlockbusterThaaiKizhavi ❤️#MorattuVasool@Siva_Kartikeyan @Sudhans2017 @KalaiArasu_ @SKProdOffl… pic.twitter.com/4aKJASW3hg— Sivakarthikeyan Productions (@SKProdOffl) March 9, 2026 చదవండి: వానిటీ వ్యాన్స్, వాష్రూమ్స్ ఏవీ లేవు: నటి -
జన నాయగన్కు మరో షాక్.. స్క్రీనింగ్ వాయిదా..!
కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వస్తోన్న మూవీ జన నాయగన్. పొలిటికల్ ఎంట్రీ తర్వాత విజయ్ నటించిన చివరి చిత్రం ఇదే. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. సెన్సార్ బోర్డ్ వివాదంతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికీ ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ రివైజింగ్ కమిటీ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో జన నాయగన్ రిలీజ్ మరింత ఆలస్యమవుతోంది. అయితే తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రివైజింగ్ కమిటీ ఈ మూవీని సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రివ్యూ చేయాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా జన నాయగన్ రివైజింగ్ కమిటీ స్క్రీనింగ్ వాయిదా పడింది. కమిటీలోని ఓ సభ్యుడు అనారోగ్యానికి గురి కావడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. చివరి నిమిషంలో ప్రదర్శన రద్దు చేశారు. దీని వల్ల సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వస్తోన్న జన నాయగన్ మేకర్స్కు మరోసారి నిరాశే ఎదురైంది. అయితే దీనిపై సెన్సార్ బోర్డ్ సభ్యులు మరింత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే స్క్రీనింగ్ కోసం మరో తేదీని కేటాయిస్తారో? లేదో తెలియాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రంలో మమిత బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, పూజా హెగ్డే, నరైన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జనవరి 9న విడుదల కావాల్సిన ఉన్నా వాయిదాల పర్వం కొనసాగుతోంది. అయితే గతేడాది రివ్యూ చేసిన సెన్సార్ బోర్డ్ కొన్ని సవరణలు సూచించింది. అయినప్పటికీ కొన్ని మతపరమైన అంశాలు, సాయుధ దళాల లోగోలను ఉపయోగించడంపై సెన్సార్ కమిటీ సభ్యుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ మూవీని మరోసారి సెన్సార్ చేయాలని రివైజింగ్ కమిటీ స్క్రీనింగ్కు పంపారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది. -
లైంగిక వేధింపుల కేసు.. మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్కు ఊరట
మలయాళ సూపర్ హిట్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరానికి ఊరట లభించింది. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఆయన బెయిల్ లభించింది. కొన్ని కఠినమైన షరతులతో ఎర్నాకుళం జిల్లా సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 2022లో దర్శకుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్పై ఎర్నాకుళం పోలీసులు కేసు నమోదు చేశారు. 2022లో కొచ్చిలోని ఒక అపార్ట్మెంట్లో చిత్రనిర్మాత తనతో అనుచితంగా ప్రవర్తించాడని మహిళ తన ఫిర్యాదులో ఆరోపించింది అయితే చిదంబరం మంజుమ్మెల్ బాయ్స్ తెరకెక్కించే సమయంలో ఆమెను కలిశానని.. కేవలం ఆమెను ఒక పాత్ర కోసం మాత్రమే పరిగణించారని చెప్పారు. ఆమె ప్రవర్తన తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని తన పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో చిదంబరం తరఫున వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. -
ఆమె గొప్ప హీరోయిన్.. ఇలా సినిమాల్ని వదిలేయడం బాధాకరం!
బాలనటిగా వెండితెరకు పరిచయమైంది. నేరం అనే ద్విభాషా(తమిళ, మలయాళ) చిత్రంతో హీరోయిన్గా మారింది. రాజా రాణి సినిమాతో ఎక్స్ప్రెషన్స్ క్వీన్గా పేరు తెచ్చుకుంది నజ్రియా నజీమ్. ఈ ఒక్క మూవీతో సౌత్లో సెన్సేషన్ అయిపోయింది. ఆ క్రేజ్తోనే వరుసగా సినిమాలు చేసింది. 2014వ సంవత్సరంలో నాలుగు మలయాళ మూవీస్లో మెరిసింది.పెళ్లి తర్వాత సినిమాలకు దూరం!అదే ఏడాది ఆగస్టులో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ను పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. పన్నెండేళ్ల కాలంలో మలయాళంలో కేవలం నాలుగంటే నాలుగే సినిమాలు చేసింది. అందులోనూ ఒకటి గెస్ట్ రోల్! నజ్రియా మలయాళంలో అదే స్పీడుతో సినిమాలు చేసుంటే బాగుండేదంటోంది సీనియర్ నటి ఊర్వశి.ఫహద్ గొప్ప యాక్టర్తాజాగా ఊర్వశి మాట్లాడుతూ.. నా ఫేవరెట్ యాక్టర్ ఫహద్ ఫాజిల్. అతడెప్పుడూ హీరోయిజం చూపించే పాత్రలు చేయడు. తన గుండును విగ్గుతో కవర్ చేయడానికీ ప్రయత్నించడు. తను తనలాగే ఉంటాడు. ఏ పాత్ర ఇచ్చినా అద్భుతంగా చేస్తాడు. ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా నటిస్తాడు. ఇంకాస్త గట్టిగా కష్టపడితే తనకు మంచి కెరీర్ ఉంది. బసిల్ జోసెఫ్ కూడా గొప్ప నటుడే!నజ్రియా గొప్ప నటిహీరోయిన్స్ విషయానికి వస్తే మీరా జాస్మిన్, నవ్య నాయర్.. ఇలా చాలా మంది మంచి పర్ఫామెన్స్ ఇస్తారు. కానీ, నజ్రియా సినిమాల్లో యాక్టివ్గా ఉండుంటే తనంత గొప్ప నటి మరొకరు ఉండేవారు కాదు. పల్లెటూరి అమ్మాయి, మోడ్రన్ గర్ల్, తెలివైన యువతి.. ఇలా అన్ని రకాల పాత్రలు ఇట్టే చేయగలదు. తనకు మంచి టాలెంట్ ఉంది.. అయినా ఇలా సినిమాలను వదిలేయడం కాస్త విచారకరంగా అనిపిస్తుంది అని ఊర్వశి చెప్పుకొచ్చింది. నజ్రియా అంటే సుందరానికి సినిమాతో టాలీవుడ్లో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది.చదవండి: ధురంధర్ 2 తర్వాత ఆ సినిమాకు సంతకం చేసిన సారా అర్జున్?


