breaking news
South India
-
పవర్ఫుల్ సెయాన్
శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమాకు ‘సెయాన్’ టైటిల్ ఖరారైంది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా పతాకాలపై కమల్హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్నారు. ‘అమరన్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థలో శివ కార్తికేయన్ చేస్తున్న రెండో సినిమా ఇది.సోమవారం ‘సెయాన్’ సినిమా టైటిల్ని ప్రకటించి, శివ కార్తికేయన్ ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘రూరల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రం ‘సెయాన్’. పవర్ఫుల్ అండ్ డైనమిక్ క్యారెక్టర్లో శివ కార్తికేయన్ కనిపిస్తారు. కమర్షియల్ మాస్ అంశాలు, భావోద్వేగాలు, వినోదం.. వంటి అంశాల మేళవింపుతో ఈ సినిమా కథనం సాగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: సంతోష్ నారాయణన్. -
సినిమాలను వదిలేద్దామనుకున్నా.. కానీ.. : అర్జున్ సర్జా
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో యాక్షన్ కింగ్గా ప్రత్యేక స్థానం సంపాదించిన అర్జున్ సర్జా, సినీమాల్లోకి రాకముందు ఓ పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అనుకున్నారట. తన తండ్రి తనకోసం ఒక డాక్టర్ సీటు ఎలాగైనా సంపాదించి ఇస్తాను నువ్వు చదివి డాక్టర్ కావాలి అన్నారట. అయితే తనకు డాక్టర్ అవ్వాలని లేదు. అయితే అనుకోకుండా తను సినిమాల్లోకి వచ్చానని. తనకి సినీ హీరో అవుతాడని తెలియదని, తనని సినీమాల్లోకి ఎవరో తోసేశారని అర్జున్ అన్నారు. అర్జున్ సర్జా తాజాగా తన సినీ ప్రయాణంలోని పలు ఆసక్తికర సంఘటనలను మీడియాతో పంచుకున్నారు. వరుస పరాజయాలతో నిరాశలో ఉన్న సమయంలో సినిమాలను వదిలేయాలని కూడా ఆలోచించినట్లు ఆయన వెల్లడించారు. ఆ సమయంలో శంకర్ తన వద్దకు వచ్చాడు. కానీ అప్పటికి తను కొత్త వాడు కావడంతో మొదట రిజెక్ట్ చేశాను. అయితే దర్శకుడు శంకర్ వెంటపడి మరీ ‘జెంటిల్మెన్’ కథ వినిపించారు. కాగా అందులోని సామాజిక సందేశం తనను ఆకట్టుకుంది. దాంతో ఆ చిత్రానికి ఓకే చెప్పాను.అయితే ‘జెంటిల్మెన్’ చిత్రం తన జీవితాన్నే మార్చేసిందని అర్జున్ గుర్తుచేసుకున్నారు. ఆ చిత్రం కథలోని సామాజిక సందేశం, పాత్ర బలం నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఇంత మంచి కథను వదిలేస్తే నాకంటే తెలివితక్కువ వాడు ఉండడు అనిపించింది. 1993లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. కల్ట్ క్లాసిక్గా నిలిచింది. శంకర్ టేకింగ్, ఏఆర్ రెహమాన్ సంగీతం, అర్జున్ నటన అన్నీ కలిసి ‘జెంటిల్మెన్’ సినిమాను బ్లాక్బస్టర్ హిట్గా నిలబెట్టాయి. ఆ చిత్రంతో ఆయన స్టార్ హీరోగా మారారు. ఆ తరువాత యాక్షన్ కింగ్గా ఎన్నో హిట్లు తన కెరీర్లో సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నారు. తాజాగా అర్జున్ దర్శకత్వంలో వచ్చిన ‘సీతా పయనం’ వాలెంటైన్స్ డే కానుకగా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి టాక్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ కథానాయికగా నటించడం విశేషం. కుటుంబ విలువలతో పాటు ప్రేమ, రోడ్ జర్నీ అంశాలను మేళవించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ పొందుతోంది. అర్జున్ సర్జా చెప్పినట్లుగా ఒక్క నిర్ణయం జీవితాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లగలదు. అర్జున్ సర్జా కెరీర్లో ‘జెంటిల్మెన్’ అలాంటి మలుపు. -
లేటేస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ.. మణిరత్నం రివ్యూ
శనయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లర్ మూవీ తూ యా మైన్. సర్వైవల్ థ్రిల్లర్ చిత్రానికి ప్రముఖ దర్శకుడు బిజోయ్ నంబియార్ వహించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో . ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.తాజాగా ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం వీక్షించారు. ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ఆయన ఈ సందర్భంగా తు యా మైన్ చిత్రబృందాన్ని అభినందించారు. మణిరత్నం మాట్లాడుతూ.. " ఈ మూవీతో బిజోయ్ నంబియార్ ఒక కైనెటిక్ ఎనర్జీని తీసుకొచ్చారు. ఇది థియేటర్లలో ప్రేక్షకుల మధ్య కూర్చొని పెద్ద తెరపై చూసినప్పుడే ఆ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించగలం" అని ప్రశంసించారు.ప్రత్యేక ప్రదర్శన అనంతరం ప్రేక్షకులు సైతం సినిమాపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొందరు అద్భుతమైన సినిమాగా అభివర్ణించగా.. మరికొందరు ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, స్టోరీ టెల్లింగ్ కొత్త అనుభూతి ఇచ్చాయని పేర్కొన్నారు. మణిరత్నం వంటి లెజెండరీ డైరెక్టర్ నుంచి ప్రశంసలు లభించడం సినిమా విజయంపై మరింత ధీమాగా ఉందన్నారు.కాగా.. ఈ మూవీని కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్ బ్యానర్లపై ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, వినోద్ భానుశాలి, కమలేష్ భానుశాలి సంయుక్తంగా నిర్మించారు. యువతను లక్ష్యంగా చేసుకుని.. మునుపెన్నడూ చూడని ఎమోషన్స్, థ్రిల్లర్ అంశాలతో రూపొందించారు. -
సౌత్ హీరోలను కలవాలంటే కండీషన్స్? సెంథిల్ ఆన్సరిదే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాలని, ఆ రూల్స్ ఇవేనంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే అదంతా ఫేక్ అని, బన్నీని అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ నకిలీ జాబితా స్పష్టం చేశారని తర్వాత తేలిపోయింది. కానీ సినీ ఇండస్ట్రీలో మాత్రం సౌత్ స్టార్స్ ఇలాంటి నిబంధనలు పెట్టారా? అని చర్చ జరిగింది. అలాంటిదేం లేదుతాజాగా ఈ వివాదంపై సౌత్ స్టార్ సినిమాటోగ్రాఫర్ కేకే. సెంథిల్ కుమార్ స్పందించాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన రూల్స్ అంటూ ఏమీ లేవు. నేనెప్పుడూ అటువంటి అనుభవాన్ని ఎదుర్కోలేదు. దక్షిణాదిన ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి పని చేశాను. కానీ, ఎప్పుడూ ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని ఎటువంటి ఆంక్షలు విధించలేదు. హీరోలు చాలా గౌరవప్రదంగా ఉంటారు. నిజం చెప్పాలంటే వారిని కలిస్తే స్నేహితులను కలిసినట్లే ఉంటుంది.చాలా సంతోషంనా విషయానికి వస్తే.. టెక్నీషియన్గా నేను పని చేసిన సినిమాలకు ఎంతో గుర్తింపు వచ్చింది. అందుకు చాలా సంతోషంగా ఉంది. నేను బయటకు వెళ్లినప్పుడు కూడా జనం గుర్తుపట్టి మాట్లాడుతుంటారు. మా టాలెంట్ గురించి మాట్లాడుతూ మమ్మల్ని జనానికి పరిచయం చేస్తున్న మీడియా, సోషల్ మీడియాకు కృతజ్ఞతలు చెప్పాల్సిందే! పైగా ఈ జనరేషన్లో పని చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీ. దేవుడికి థాంక్స్ఎందుకంటే అనేకమంది ప్రతిభావంతమైన సాంకేతిక నిపుణులు సినిమాకోసం ఎంతో కష్టపడ్డారు. కానీ, వారికి అంత గుర్తింపు లభించలేదు. ఈలెక్కన నాకు వచ్చిన గుర్తింపునకుగానూ ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. సెంథిల్ కుమార్.. సై, ఛత్రపతి, యమదొంగ, మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి పలు బ్లాక్బస్టర్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా పని చేశాడు. ప్రస్తుతం స్వయంభు సినిమాకు పనిచేస్తున్నాడు. ఈ మూవీ ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది.చదవండి: ఏం కావాలి? ఏది వద్దో నాకు బాగా తెలుసు: శోభిత ధూళిపాళ -
నాకు ఏం కావాలి? ఏం వద్దో బాగా తెలుసు: శోభిత
కొంతమంది సెలబ్రిటీలు ఎప్పుడూ వార్తల్లో ఉండాలనుకుంటారు. ఏదో ఒకరకంగా తమ గురించే మాట్లాడుకోవాలని, అందరి నోళ్లలో నానుతూ ఉండాలని తహతహలాడతారు.అలా పబ్లిసిటీ కోసం పీఆర్ టీమ్లను పెట్టుకుంటారు. కానీ తనకు అలాంటివేవీ ఇష్టం లేదని, పీఆర్ టీమ్ అసలే లేదని చెప్తోంది హీరోయిన్ శోభిత ధూళిపాళ.24 గంటలు కనిపించాలా?తాజాగా ఓ ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ.. గతంలో నేను పీఆర్ ఏజెన్సీలతో పని చేశాను. కానీ, నా వ్యక్తిత్వానికి ఆ పద్ధతులు సెట్ అవవు అని అర్థమైంది. 24 గంటలు అందరికీ కనిపించాలి, అందరూ నాకోసం మాట్లాడుకోవాలి అని నేను అనుకోవడం లేదు. అది నాకు ఏమాత్రం ఉపయోగపడదు, దానిపై నాకు ఆసక్తి అసలే లేదు.అదైతే తెలుసునాకు పీఆర్ లేదు, కానీ కొందరికి అది బానే పని చేస్తుంది. నేను సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు, నాది ముంబై కూడా కాదు. వైజాగ్ నుంచి వచ్చి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నేను ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ ముందుకు సాగాను. నాకు ఏం కావాలి? ఏం వద్దనే విషయాలపై క్లారిటీ ఉంది. రూల్స్తో సంబంధం లేకుండా నా దారిలో వెళ్లడమే నాకిష్టం. జనాలకు ఏదిష్టం, వాళ్లేం కోరుకుంటున్నారు? అనేది నాకు తెలియదు. కానీ నా గురించి నాకు బాగా తెలుసు అని చెప్పుకొచ్చింది.సినిమాశోభిత ధూళిపాళ తెలుగమ్మాయే అయినప్పటికీ బాలీవుడ్లో ఎక్కువ పాపులర్ అయింది. గూఢచారి, మేజర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరైంది. ఇటీవలే చీకటిలో సినిమాతో మరోసారి అలరించింది.చదవండి: అప్పుడు రూ.500 అప్పు.. రూ.90 కోట్ల కలెక్షన్స్ -
'నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా'.. హీరోయిన్ త్రిషకు క్షమాపణలు
హీరోయిన్ త్రిషకు బీజేపీ నేత నాగేంద్రన్ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవల విజయ్పై రాజకీయ విమర్శలు చేస్తూ మధ్యలో త్రిష పేరును ప్రస్తావించారు. త్రిషతో బంధం నుంచి విజయ్ బయటికి రావాలని నాగేంద్రన్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై త్రిష కూడా స్పందించింది. ఈమె తరఫున లాయర్ ఓ ప్రకటన విడుదల చేశారు.స్పందించిన త్రిష..'ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని నా క్లయింట్(త్రిష) ఎప్పుడూ ఊహించలేదు. త్రిష ఎలాంటి రాజకీయ పార్టీకి అనుబంధంగా లేరు. భవిష్యత్తులో కూడా అలాంటి ఉద్దేశం లేదు. రాజకీయ అంశాల్లో ఎప్పుడూ తటస్థ వైఖరినే పాటిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం సరికాదు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్లు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాం. వ్యక్తిగత విషయాలని పబ్లిక్గా చర్చించడం తగదు. త్రిష పేరుని సంబంధం లేని విషయాల్లోకి లాగకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం' అని లాయర్ నిత్యేష్ నటరాజ్ ప్రకటన విడుదల చేశారు.అసలేం జరిగిందంటే..అయితే ఇటీవల తమిళనాడు బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రన్.. హీరో విజయ్ని విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. విజయ్కి రాజకీయాలు తెలియవు.. ముందు త్రిషతో ఉన్న బంధం నుంచి బయటకు రావాలి. అప్పుడే తమిళనాడులోని గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది అని నేరుగా కామెంట్స్ చేశారు. దీంతో పెద్ద వివాదానికి దారితీసింది. అధికార డీఎంకే నేతలు, విజయ్ టీవీకే పార్టీకి చెందిన పలువురు ఈ వ్యాఖ్యలను ఖండించారు. నాగేంద్రన్ ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. -
బీజేపీ నేత దారుణ కామెంట్స్పై స్పందించిన త్రిష
ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఈ మధ్యనే తమిళనాడు బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రన్.. విజయ్ని విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. విజయ్కి రాజకీయాలు తెలియవు, ముందు త్రిషతో ఉన్న బంధం నుంచి బయటకు రావాలి. అప్పుడే తమిళనాడులోని గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది అని నేరుగా అనేశాడు. దీంతో పెద్ద చర్చే నడిచింది. అధికార డీఎంకే నేతలు, విజయ్ టీవీకే పార్టీకి చెందిన పలువురు.. ఈ విషయాన్ని ఖండించారు. నాగేంద్రన్ ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. ఇప్పుడు త్రిష కూడా స్పందించింది. ఈమె తరఫున లాయర్ ఓ ప్రకటన విడుదల చేశారు.(ఇదీ చదవండి: అలాంటి కంటెంట్కి లేని సమస్య.. టైటిల్స్కి ఎందుకు?)'ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని నా క్లయింట్(త్రిష) ఎప్పుడూ ఊహించలేదు. త్రిష ఎలాంటి రాజకీయ పార్టీకి అనుబంధంగా లేరు. భవిష్యత్తులో కూడా అలాంటి ఉద్దేశం లేదు. రాజకీయ అంశాల్లో ఎప్పుడూ తటస్థ వైఖరినే పాటిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం సరికాదు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్లు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాం. వ్యక్తిగత విషయాలని పబ్లిక్గా చర్చించడం తగదు. త్రిష పేరుని సంబంధం లేని విషయాల్లోకి లాగకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం' అని లాయర్ నిత్యేష్ నటరాజ్ ప్రకటన విడుదల చేశారు.దళపతి విజయ్, త్రిష పలు సినిమాల కోసం కలిసి పనిచేశారు. చివరగా విజయ్ హీరోగా నటించిన 'గోట్' మూవీలో త్రిష, ఓ స్పెషల్ సాంగ్ చేశారు. అయితే వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారనే రూమర్స్ చాన్నాళ్లుగా కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే వీటిని విజయ్పై విమర్శల చేయడానికి ఉపయోగించడమే ఈ మొత్తం వివాదానికి కారణమైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)Disrespect should and always will be called out. pic.twitter.com/FmXdIBvAJ6— Trish (@trishtrashers) February 16, 2026 -
అప్పుడు రూ.500 అప్పు.. ఇప్పుడు రూ.90 కోట్ల కలెక్షన్స్!
ఏదో ఒక కథ రాసుకున్నామా? పెద్ద హీరోను పెట్టామా? రెండు ఫైట్ సీన్లు, రెండు లవ్ సాంగ్స్తో మమ అనిపించేశామా? అంటే కుదరదు. ఈరోజుల్లో ప్రేక్షకులను థియేటర్కు రప్పించాలంటే వారి మనసును కదిలించేలా సినిమా ఉండాలి. వారు పెట్టిన డబ్బుకు సంతృప్తినిచ్చేదై ఉండాలి. అలాగైతేనే జనం సినిమాకు ఓటేస్తున్నారు, లేదంటే మూవీ చిన్నదైనా, పెద్దదైనా జనం ముఖం చాటేస్తున్నారు.ఫస్ట్ సినిమాతోనే హిట్అలాంటిది తొలి సినిమాతోనే టాలెంట్ చూపించాడు తమిళ దర్శకుడు అభిషన్ జీవింత్. యూట్యూబర్గా కెరీర్ మొదలు పెట్టిన అతడు టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు అభిషన్. శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ గతేడాది మే 1న విడుదలవగా ప్రేక్షకులను నవ్విస్తూనే హృదయాలను కదిలించింది. సుమారు రూ.7 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం రూ.90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ప్రేమ వివాహంపెద్ద డైరెక్టర్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేయకపోయినప్పటికీ సొంత టాలెంట్తో గొప్ప సినిమా తీసి అందరి మన్ననలు పొందాడు. రజనీకాంత్, సూర్య, రాజమౌళి, నాని.. ఇలా ఎందరో ప్రముఖులు ఆయన ప్రతిభను ప్రశంసించారు. ఈ ఆనందంలోనే అభిషన్.. ప్రియురాలిని పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ వివాహానికి టూరిస్ట్ ఫ్యామిలీ నిర్మాత మగేశ్ రాజు హాజరై బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్ ఇచ్చాడు. హీరోగానూ టాలెంట్ఇక దర్శకుడిగా నెక్స్ట్ ఏం సినిమా చేస్తాడు? అనుకుంటే హీరోగా మారాడు. విత్ లవ్ మూవీతో కథానాయకుడిగానూ విజయం సాధించాడు. అయితే ఒకప్పుడు అభిషన్ రోజూవారీ ఖర్చుల కోసం రూ.500 స్నేహితుడిని అప్పడిగాడు. అలాంటి స్థాయి నుంచి ఇప్పుడు బాక్సాఫీస్పై కోట్లు కురిపించే సినిమాలు తీసే రేంజ్కు ఎదిగాడు. 26 ఏళ్ల వయసులోనే ఇంత సక్సెస్ చూస్తున్న అభిషన్ మున్ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిద్దాం!చదవండి: ఆ హీరోయిన్కు ఫోన్ చేసి సారీ చెప్పా: రవీనా టండన్ -
మాజీ ఎంపీ కూతురితో యువ హీరో నిశ్చితార్థం.. పెళ్లెప్పుడంటే?
గత నెలలో 'గత వైభవం' అనే కన్నడ డబ్బింగ్ సినిమా రిలీజైంది. ఇదే మూవీతో హీరోగా పరిచయమైన దుష్యంత్ ఇప్పుడు శుభవార్త చెప్పేశాడు. రచనతో నిశ్చితార్థం చేసుకున్నాడు. తాజాగా ఈ వేడుక జరగ్గా.. ఈ నెల 26న గ్రాండ్గా పెళ్లి జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ పెళ్లి పిలుపులు.. ముఖ్యమంత్రికే తొలి ఆహ్వానం)కర్ణాటకలోని గుబ్బి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న ఎస్ఆర్ శ్రీనివాస్ కుమారుడే దుష్యంత్. దాదాపు ఎనిమిదేళ్లుగా నటుడిగా శిక్షణ తీసుకున్నాడు. రీసెంట్గానే థియేటర్లలోకి 'గత వైభవ' అనే కన్నడ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. కన్నడలో ఇది పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నప్పటికీ తెలుగులో మాత్రం ఫ్లాప్ అయింది. ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్.ఇకపోతే ఎమ్మెల్యే కొడుకు అయిన దుష్యంత్.. తమ రాష్ట్రానికే చెందిన మాజీ ఎంపీ ఎస్పీ మద్దెహనుమగౌడ కుమార్తె రచనతో తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. మరో పదిరోజుల్లో వీళ్లిద్దరూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నెల 26నే టాలీవుడ్కి చెందిన విజయ్ దేవరకొండ-రష్మిక కూడా పెళ్లి చేసుకోనున్నారు. రాజస్థాన్ వేదికగా ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. కాకపోతే ఇప్పటివరకు ఈ విషయాన్ని అధికారికంగా అయితే ప్రకటించలేదు.(ఇదీ చదవండి: బ్రిటీష్ వ్యక్తిని పెళ్లాడిన మలయాళ నటి) View this post on Instagram A post shared by Dushyanth Servegara Srinivas (@dushyanth_official) -
బ్రిటీష్ వ్యక్తిని పెళ్లాడిన మలయాళ నటి
మలయాళ నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గాయత్రి గోపి పెళ్లిపీటలెక్కింది. బ్రిటీష్ అబ్బాయి జాకబ్ను పెళ్లాడింది. గతేడాది ఇంగ్లాండ్లో వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. తాజాగా ఇండియాలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 15న ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహ తంతు జరిగింది. ఏడాదిన్నరగా క్లోజ్..అందుకు సంబంధించిన వీడియోను గాయత్రి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఇతడు ఇంగ్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. నేను అక్కడే నెట్వర్క్ రైల్వేస్ సంస్థలో టీమ్ లీడర్గా పని చేస్తున్నాను. ఓ కేర్ హోమ్ సెంటర్లో మూడున్నరేళ్ల క్రితం మేమిద్దరం కలుసుకున్నాం. ఏడాదిన్నరగా బాగా క్లోజ్ అయ్యాం. మా పెళ్లి పట్ల ఇరు కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి.పాదాలు తాకినప్పుడు..జాకబ్కు మన సంస్కృతి, సంప్రదాయాలపై కొంత అవగాహన ఉంది. అతడికి మలయాళ భాష కూడా వచ్చు. మేమిద్దరం ఇంగ్లాండ్లోనే అక్టోబర్ 17న పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మన ఆచారం ప్రకారం మరోసారి వివాహం చేసుకున్నాం. నేను అతడి పాదాలు తాకినప్పుడు అతడు కూడా నా కాళ్లకు నమస్కరించాడు. ఇది పరస్పర గౌరవాన్ని, ప్రేమను సూచిస్తుంది అని గాయత్రి చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Gayathri Gopi (@gayathrigopi_) చదవండి: ఆ హీరోయిన్కు ఫోన్ చేసి సారీ చెప్పా: రవీనా టండన్ -
టాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్కు బ్రేక్?
ఒకప్పుడు సినిమా చివర్లో పార్ట్-2 త్వరలో అనే టైటిల్ కార్డు పడితే, ప్రేక్షకుల్లో ఉత్సాహం పెరిగేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్కు బ్రేక్ పడుతున్నట్టుంది. కొన్ని సినిమాలకు రెండో భాగం ప్రకటించినా, ఆ స్థాయిలో వర్కవుట్ కాలేదు. తల బొప్పికట్టే రేంజ్లో కొన్ని సినిమాలు చుక్కలుచూపించడంలో పార్ట్-2 అనేది దండగ అనే ఫీలింగ్కు వచ్చారు మేకర్స్. కథ డిమాండ్ లేకుండా సీక్వెల్స్ తీయడం అనవసరమని నిర్మాతలు భావిస్తున్నారు. బడ్జెట్ పెంచడం లేదా హైప్ క్రియేట్ చేయడం కోసం పార్ట్-2లు తీయడం సరైన పద్ధతి కాదని స్పష్టంగా చెబుతున్నారు. అసలు సీక్వెల్ ట్రెండ్ను మొదలుపెట్టిన రాజమౌళి కూడా ఇప్పుడు దానికి దూరమయ్యాడు. తను మహేష్బాబుతో చేస్తున్న తాజా చిత్రం “వారణాసి” ఒక్క భాగమే అని స్పష్టం చేశాడు. అంతేకాక సినిమా చివర్లో పార్ట్-2 కార్డులు పడవని ఆయన ఓ ఇంటర్వ్యూలో ప్రకటించాడు. నాని నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్ర యూనిట్ కూడా సీక్వెల్ ఉండదని ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చింది. దర్శకుడు ప్రశాంత్ నీల్, జూ.ఎన్టీఆర్తో చేస్తున్న “డ్రాగన్” సినిమాను సింగిల్ మూవీగానే తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.ఇప్పుడు వచ్చే ఏ సినిమాకైనా పార్ట్-2 ఉందని ప్రకటిస్తే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పార్ట్-2 ఉంది అనగానే దానికి వచ్చే హైప్ కంటే ట్రోలింగ్నే ఎక్కువగా జరుగుతోంది. తర్వాత వచ్చే పెద్ద సినిమాలు కూడా ఒక్క భాగంలోనే కథను ముగించాలనే నిర్ణయానికి వస్తున్నాయి. చూస్తుంటే రానున్న కాలంలో వచ్చే చిత్రాలకు ఈ పార్ట్-2 గోల తగ్గేలానే కనిపిస్తోంది. -
డ్యాన్స్తో దుమ్మురేపిన సునీల్.. 'కూలీ' మోనికాని మించి
లోకేష్ కనగరాజ్ తీసిన 'కూలీ' చూసినవారెవ్వరూ అందులోని మోనికా పాటని మర్చిపోలేరు. నిజానికి చూడనివారినీ వదలకుండా రకరకాల సామాజిక మాధ్యమాల్లో కవర్ సాంగ్గా ఆ పాట చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అప్పటికి ఎన్నో సినిమాల్లో నటించినా రాని గుర్తింపును ఆ ఒక్క పాటతో దక్కించుకున్నాడు మళయాళ నటుడు సౌబిన్ షాహిర్. ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేడుకల్లో ఆ పాట సందడి చేస్తూనే ఉంది.ఈ నేపధ్యంలో మన టాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ ఆ పాట క్రేజ్కి చెక్ పెట్టేలా ఉన్నాడు. త్వరలో విడుదల కానున్న 'కాటలన్' అనే మళయాళ చిత్రంలో మోనికా పాటని మించేలా డ్యాన్స్ ఊపేశారు. ఈ విషయం తాజాగా ఆ సినిమా టీజర్ లాంచ్తో వెల్లడైంది. పాల్ జార్జ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆంటోనీ వర్గీస్ పెపే, దుసర విజయన్, కబీర్ సింగ్లతో పాటు సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే చిత్ర నిర్మాతలు తమ చిత్రం మొదటి లిరికల్ వీడియోని విడుదల చేశారు. 'మజాకో మల్లికా' అంటూ సాగే ఈ పాట విడుదలైన కాసేపట్లోనే వైరల్గా మారింది. ముఖ్యంగా సునీల్ స్టెప్స్కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)'మజాకో మల్లికా'లో సునీల్ డ్యాన్స్లో ఈజ్ని అనేక మంది ప్రశంసిస్తున్నారు. అంతేకాక ఈ పాటను చాలామంది మోనికా పాటతో పోలుస్తున్నారు. ఓ చేత్తో సిగిరెట్ పట్టుకుని స్మోక్ చేస్తూ ఒకే కాలితో సునీల్ వేసిన స్టెప్స్ని చూసి ఒక నెటిజన్.. 'నటుడు సునీల్ డ్యాన్స్ నెక్ట్స్ లెవల్' అని వ్యాఖ్యానించారు. తెలుగు ప్రేక్షకులకు సునీల్ డ్యాన్స్ బాగా పరిచయం అయినప్పటికీ... దక్షిణాది మొత్తానికి ఇప్పుడు పరిచయం అయిందని చెప్పొచ్చు.ఈ పాటకు సంగీతాన్ని ప్రముఖ కన్నడ సంగీతకారుడు అజనీష్ లోక్నాథ్ స్వరపరిచారు, ఇతను 'కాంతారా చాప్టర్ 2' కు వర్క్ చేయడం విశేషం. ఈ పాటను ఆనంద్ శ్రీరాజ్ భద్ర పాడారు, వినాయక్ శశికుమార్ సాహిత్యం రాశారు. కూలీ సినిమాలో సౌబిన్ లాగే ఈ సినిమాలో కూడా సునీల్ విలన్గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాటలన్ చిత్రం విడుదల తర్వాత సునీల్ సాంగ్.. మోనికా రేంజ్లో హిట్ కొడితే ఇక దక్షిణాది సినిమాల్లో హీరోలతో పాటుగా విలన్ పాటల ట్రెండ్ మొదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అత్యంత హింసాత్మక చిత్రంగా పేరొందిన మార్కో సినిమాను అందించిన క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అందిస్తున్న ఈ యాక్షన్ సినిమా మే నెలలో విడుదల కానుంది.(ఇదీ చదవండి: పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ?) -
రూ.10 కోట్లు పెట్టినా రాదు: మృణాల్ ఠాకూర్
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మృణాల్ ఠాకూర్ పెళ్లి వార్తలే. వాలంటైన్స్ డే (ప్రేమికుల రోజు) నాడు మృణాల్.. హీరో ధనుష్ను పెళ్లాడబోతుందని తెగ ప్రచారం జరిగింది. అందులో ఏమాత్రం నిజం లేదని చెప్పినా ఎవరూ నమ్మలేదు. చివరకు వాలంటైన్స్ డేరోజు చడీచప్పుడు లేకపోయేసరికి ఇదంతా గాలిప్రచారమే అని తేలిపోయింది.లైఫ్లో సెటిలవాలిప్రస్తుతం మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన దో దీవానే షెహర్ మే సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. అక్కడ యాంకర్.. పెళ్లి గురించి ఇంట్లో ఏమైనా ఒత్తిడి ఉందా? అని ప్రశ్నించగా మృణాల్ ఇలా స్పందించింది. మా ఇంట్లో వాళ్లు ముందు లైఫ్లో సెటిలవమంటున్నారు. అటు వ్యక్తిగత జీవితాన్ని, ఇటు సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఎంత కష్టమో ఇంట్లోవాళ్లకు తెలుసు.సన్యాసి జీవితమే..యాక్టర్గా ఉండటం అంటే సన్యాసిగా ఉండటంలాంటిదే! తిండి, నిద్ర.. ఇలా అన్నింటినీ వదులుకోవాలి. ఎప్పుడూ ఫోకస్డ్గా ఉండాలి. ఇప్పటివరకు నాకు ఎటువంటి పీఆర్ టీమ్ లేదు. కాకపోతే నా ఇంటి అడ్రస్ అందరికీ తెలుసు కాబట్టి అక్కడ పరిస్థితులు అదుపులో ఉంచేందుకు ఒక టీమ్ పని చేస్తుంది. బయటకు వెళ్లినప్పుడు నా సేఫ్టీ కోసం ఇంకో టీమ్ ఉంది. కానీ నాపై రూమర్స్ నాకు ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెట్టింది. అందులో డౌటే లేదురూ.3 కోట్లు, రూ.6 కోట్లు, రూ.10 కోట్లు పెట్టినా కూడా ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు. కాకపోతే నా జీవితంలో ఏది జరిగినా అది మీ అందరితో షేర్ చేసుకుంటాను. అందులో డౌటే లేదు. నాపై వచ్చే రూమర్స్ను పట్టించుకుంటూ పోతే కెరీర్పై ఫోకస్ చేయలేను అని మృణాల్ చెప్పుకొచ్చింది. 'దో దీవానే షెహర్మే' మూవీ ఫిబ్రవరి 20న విడుదల కానుంది.చదవండి: మెగా ఫ్యామిలీకి తొలి పెళ్లి పత్రిక.. చిరంజీవికి ఏమైంది? -
సోదరుడు లాంటి వ్యక్తి చనిపోయాడని రజనీకాంత్ సంతాపం
సూపర్స్టార్ రజనీకాంత్ చేసిన సినిమాల్లో 'బాషా'కి ప్రత్యేక స్థానముంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ చిత్ర నిర్మాత మరణించారు. వృద్ధాప్య సమస్యలతో నిర్మాత తమిళగన్ తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే ఆయన మృతి పట్ల.. రజనీ సంతాపం వ్యక్తం చేశారు. బాధపడుతూ ట్వీట్ చేశారు.(ఇదీ చదవండి: హీరో నిఖిల్ కౌంటర్ ఎవరికి? ఎందుకీ కామెంట్స్)'సోదరుడు లాంటి అళగన్ మృతి నాకు అత్యంత బాధాకరమైన విషయం. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన కుటుంబానికి నా సానుభూతి' అని రజనీకాంత్ ట్వీట్ చేశారు. నేటి సాయంత్రం (ఫిబ్రవరి 15) తమిళగన్ అంత్యక్రియలు జరగనున్నాయి. రజనీ హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'బాషా' చిత్రాన్ని తమిళగన్, తన తల్ల రాజమ్మాళ్తో కలిసి నిర్మించారు. ఇతడి తండ్రి ఆర్ఎం వీరప్పన్ సమర్పకుడిగా వ్యవహరించారు. దీనితోపాటే మూండ్రు ముగం, పణక్కారన్, రాణువ వీరన్ కూడా తమిళగన్ నిర్మించారు. మందిరపున్నగై, నిలా పెన్నే చిత్రాలకు దర్శకుడిగానూ వ్యవహరించారు.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)மதிப்பிற்குரிய அமரர் ஆர்.எம். வீரப்பன் அவர்களின் புதல்வர், எனது அன்புத் தம்பி தமிழழகன் அருமையான மனிதர். அவரது திடீர் மறைவு எனக்கு மிகுந்த வேதனையளிக்கிறது. அவருடைய ஆத்மா சாந்தியடையட்டும். குடும்பத்தாருக்கு என் ஆழ்ந்த அனுதாபங்கள்.— Rajinikanth (@rajinikanth) February 15, 2026 -
ప్రియుడిని పెళ్లాడిన 'సార్ మేడమ్' నటి
తమిళ నటి రోషిణి హరిప్రియణ్ పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు కేఎస్ సుందర మూర్తిని ఆదివారం (ఫిబ్రవరి 15న) వివాహం చేసుకుంది. ఇరు కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.సినిమాకాగా రోషిణి హరిప్రియణ్ భారతి కన్నమ్మ సీరియల్తో పాపులర్ అయింది. ఆ తర్వాత 'కూకు విత్ కోమలి' రియాలిటీ షో మూడో సీజన్లోనూ పాల్గొంది. అనంతరం సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. గరుడన్, మద్రాస్ మ్యాట్నీ మూవీస్ చేసింది. చివరగా 'తలైవా తలైవి' సినిమాలో నటించింది. ఈ చిత్రం తెలుగులో 'సార్ మేడమ్' పేరిట రిలీజైంది. Bharathi Kannama serieal fame #RoshniHariPriyan getting married. pic.twitter.com/MRKxSFH4NG— CineFriday (@Cine_Friday) February 15, 2026 చదవండి: అది నా దురదృష్టం: రణ్బీర్ కపూర్ -
ధనుశ్ వల్లే భారీ నష్టం.. రూ.20 కోట్లు చెల్సించాల్సిందే..!
కుబేరా, ఇడ్లీకడై, ఇష్క్ తేరే మే వంటి చిత్రాల తరువాత ధనుష్ నటిస్తోన్న తాజా చిత్రం కర. ఈ మూవీ టైటిల్ను పొంగల్ సందర్భంగా ప్రకటించారు. ఆయన కెరీర్లో ఇది 54వ చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాలో మమతా బైజు హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేష్ రాజా కథ, దర్శకత్వం వహిస్తున్నారు.ఇక ఈ సినిమా సంగతి పక్కనపెడితే తాజాగా ధనుశ్ ఓ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 2016లో ప్రకటించిన ఓ ప్రాజెక్ట్ పూర్తి చేయకపోవడంతో నిర్మాణ సంస్థ ఆయనపై లీగల్ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఆగిపోవడం వల్ల రూ.20 కోట్ల పరిహారం కోరుతూ ధనుశ్కు.. తేనాండల్ ఫిల్మ్స్ లీగల్ నోటీసు పంపినట్లు తెలుస్తోంది.2016లో నాన్ రుద్రన్ అనే సినిమాను దర్శకత్వం వహించడంతో పాటు నటించడానికి ధనుష్ అంగీకరించారని తేనాండల్ ఫిల్మ్స్ తెలిపింది. అయితే ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని నిర్మాణ సంస్థ పేర్కొంది. అయితే ఈ సినిమా ఆగిపోవడంతో.. తమకు మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చారని తేనాండల్ ఫిల్మ్స్ ఆరోపిస్తోంది. చివరికీ ఆ సినిమా నుంచి కూడా ధనుశ్ తప్పుకున్నారని అంటోంది.ఈ మూవీ కోసం ముందస్తు చెల్లింపులు, ప్రీ-ప్రొడక్షన్ ఖర్చులకు గానూ దాదాపు రూ.20 కోట్ల నష్టాలు వచ్చాయని తేనాండల్ ఫిల్మ్స్ తెలిపింది. ఆ సమయంలో ఈ ప్రాజెక్టులో భాగమైన టాలీవుడ్ హీరో నాగార్జున, ఎస్జే సూర్య లాంటి స్టార్ నటులకు చెల్లించిన పారితోషికం కూడా ఇందులో భాగమని తెలుస్తోంది. ముఖ్యంగా ధనుష్ పూర్తి స్క్రిప్ట్ సమర్పించడంలో విఫలమవడం.. ఇతర ప్రొఫెషనల్ కమిట్మెంట్లకు ప్రాధాన్యత ఇవ్వడంతోనే మా సినిమా ఆగిపోయిందని.. దీనివల్ల తమకు తీవ్ర నష్టం జరిగిందని నిర్మాణ సంస్థ ఆరోపిస్తోంది. అందువల్లే చట్టపరమైన చర్యలకు దిగినట్లు తేనాండల్ ఫిల్మ్స్ ప్రకటించింది. -
సూర్య- జ్యోతిక ప్రేమను ఒప్పుకోలేదు!: హీరో తండ్రి
ప్రేమించడం ఈజీయేమో కానీ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం మాత్రం కొంత కష్టమైన పనే! కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య- జ్యోతిక ప్రేమాయణం హీరో తండ్రి, నటుడు శివకుమార్కు ఏమాత్రం ఇష్టం లేదట. కానీ సూర్య పట్టుపట్టి సాధించి, ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఆ విశేషాలను శివకుమార్ తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.జీవితాంతం ఒంటరిగానే..శివకుమార్ మాట్లాడుతూ.. మొదట్లో సూర్య ప్రేమను నేను ఒప్పుకోలేదు. పెళ్లంటూ చేసుకుంటే జ్యోతికనే చేసుకుంటానని, లేదంటే జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతానన్నాడు. వెంటనే నాకు నేను నటించిన 150 సినిమాలు కళ్లముందు కదిలాయి. అందులో చాలావరకు ప్రేమకథలే ఉన్నాయి. దీంతో వెంటనే అతడి ప్రేమను అంగీకరించాను.ఎలా ఉండేవాడు?వాడు మొదట్లో చాలా బిడియంగా ఉండేవాడు. రాధికా శరత్కుమారే వాడిని జ్యోతికతో మాట్లాడించింది. అలా మొదలైన మాటలు తర్వాత ప్రేమకు దారితీశాయి. ఎంతో మొహమాటంతో ఉండే వీడేనా ఈరోజు ఇద్దరు పిల్లలను చూసుకుంటున్నాడు అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని శివకుమార్ సరదాగా చెప్పుకొచ్చాడు.ప్రేమ- పెళ్లిసూర్య, జ్యోతిక అనేక సినిమాల్లో కలిసి నటించారు. 'పూవెల్లం కేట్టుప్పార్' మూవీ షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ 2006 సెప్టెంబర్ 11న పెళ్లితో మరింత బలపడింది. ఈ దంపతులకు కూతురు దియా, కుమారుడు దేవ్ సంతానం. సినిమాల విషయానికి వస్తే.. సూర్య ప్రస్తుతం 'కరుప్పు' సినిమా చేస్తున్నాడు. త్రిష కథానాయికగా నటిస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వేసవిలో విడుదల కానుంది. అలాగే హీరోయిన్ నజ్రియాతో సూర్య మరో సినిమా చేస్తున్నాడు.చదవండి: కొడుకు- కోడల్ని అభినందించిన మెగాస్టార్ -
లోకేశ్ హీరోగా 'డీసీ'.. వాలంటైన్స్ స్పెషల్ గ్లింప్స్
దర్శకులందరూ హీరోలవుతున్నారు. అలా తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కూడా 'డీసీ' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి హీరోయిన్గా నటిస్తోంది. ఈ విషయాన్ని గతేడాది ప్రకటించారు. నేడు (ఫిబ్రవరి 14) ప్రేమికుల రోజు సందర్భంగా.. బ్లడీ వాలంటైన్ అంటూ డీసీ గ్లింప్స్ వదిలారు. అందులో ప్రేమ కన్నా రక్తపాతమే ఎక్కువ చూపించారు. లోకేశ్ పీకలు కోస్తూ కనిపించాడు. చివర్లో కారుపై కూడా రక్తమే కనిపిస్తోంది. చిన్న వీడియోలోనే ఇంత వయొలెన్స్ ఉంటే సినిమాలో ఎంతుంటుందో చూడాలి!డీసీ విషయానికి వస్తే.. లోకేశ్ దేవదాస్గా, వామిక గబ్బి.. చంద్ర పాత్రలో కనిపించనున్నారు. వీరి పేర్ల కలయిక ఆధారంగానే డీసీ (దేవదాస్ + చంద్ర) అని టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకతత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది వేసవిలో ఈ మూవీ రిలీజ్ చేయనున్నారు. కాగా ఖైదీ, విక్రమ్, కూలీ సినిమాలతో దర్శకుడిగా క్రేజ్ అందుకున్న లోకేశ్ హీరోగా ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి! చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివ జ్యోతి -
రాజాసాబ్లో డూప్? క్లారిటీ ఇచ్చిన మాళవిక
ప్రభాస్- మారుతి కాంబినేషన్లో 'ది రాజాసాబ్' సినిమా ప్రకటించినప్పటి నుంచి విమర్శలు వెంటాడుతూనే ఉన్నాయి. తీరా సినిమా రిలీజయ్యాక కూడా ట్రోలింగ్స్ మరింత పెరిగాయే తప్ప ఆగలేవు. ముఖ్యంగా ప్రభాస్కు చాలాచోట్ల డూప్ ఉపయోగించడంపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఓ ఫైట్ సీన్ కోసం హీరోయిన్ మాళవిక మోహనన్కు కూడా డూప్ ఉపయోగించడంతో తనను కూడా ట్రోల్ చేశారు.ట్రోలింగ్పై స్పందించిన హీరోయిన్తాజాగా ఈ వివాదంపై మాళవిక మోహనన్ స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది. ది రాజాసాబ్ సినిమాలో నేనే స్వతాహాగా స్టంట్స్ చేశానని చెప్పుకున్నాను. అయితే నా బాడీ డబుల్ (డూప్) యాక్షన్ సీన్లో ఉన్నట్లుగా ఓ ఫోటో వైరలవుతోంది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి స్టంట్ ఆర్టిస్ట్.. అలాగే నా డూప్ కూడా!చిన్నతనం నుంచే..ముందుగా నేను చెప్పొచ్చేదేంటంటే.. నాకు యాక్షన్ అంటే ఇష్టం. ఫైట్ సన్నివేశాల్లో పాల్గొనడాన్ని ఆస్వాదిస్తాను. చిన్నతనం నుంచే నేను స్పోర్టివ్ అమ్మాయిని. కొత్త విషయాలు నేర్చుకోవడం, శరీరాన్ని ఛాలెంజ్ చేయడం అంటే చాలా ఇష్టం. రెండో విషయం.. సెట్లో ఎప్పుడూ స్టంట్ డబుల్స్ సిద్ధంగా ఉంటారు. నటీనటులు సొంతంగా యాక్షన్ సీన్స్ చేసినా సరే వారు అందుబాటులోనే ఉంటారు.రిస్కీ షాట్స్ మాత్రం..వారు అనుభవజ్ఞులు కాబట్టి.. యాక్షన్ డైరెక్టర్ వారిని ఫైట్ రిహార్సల్స్ చేయమని చెప్తాడు. ఫైనల్ షాట్ మాత్రం మాపై చిత్రీకరిస్తారు. అయితే కొన్ని సన్నివేశాలు చాలా ప్రమాదకరం అని భావించినప్పుడు నటులకు బదులుగా స్టంట్ డబుల్ను సీన్ పూర్తిచేయమని అడుగుతారు. ఎందుకంటే ప్రొఫెషనల్స్ అయితే ఏ సమస్యా లేకుండా వాటిని ఈజీగా చేయగలరు.వివరణ అక్కర్లేదుఫైనల్గా.. నేను ఫైట్ సీన్స్ సమర్థవంతంగా చేసేందుకు నా స్టంట్ డబుల్ ఎంతగానో తోడ్పడింది అంటూ వీడియోలు షేర్ చేసింది. ఒక్క ట్వీట్ ద్వారా యాక్షన్ సీన్స్ తానే చేసినట్లు క్లారిటీ ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు నువ్వు టాలెంటెడ్ అని మాకు తెలుసు.. నువ్వు ఎలాంటి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. ప్రస్తుతం రాజాసాబ్ హాట్స్టార్లో అందుబాటులో ఉంది. Been seeing a lot of tweets and articles about how I claimed to do my own stunts for ‘The Rajasaab’ but a body double did it as there’s a photo circulating online of a stunt artist who was my stunt double on the film.Firstly, I do action because I really enjoy doing action.… pic.twitter.com/9ePwlLpti4— Malavika Mohanan (@MalavikaM_) February 13, 2026 చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి -
చిన్నతనం నుంచే నాకు గుర్తింపు లేదు: సింగర్
గాయని కెనిషా పేరు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కర్లు కొడుతోంది. ఈమె మల్టీ టాలెంటెడ్ బ్యూటీ. గాయని, గీత రచయిత, డాన్సర్, నటి ఇలా పలు టాలెంట్స్ కలిగిన బెంగళూరు భామ కెనిషా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇటీవల నటుడు రవిమోహన్ స్నేహితురాలిగా వార్తల్లో నానుతున్న గాయని ఈమె. అంతే కాదు నటుడు రవిమోహన్కు ఆయన భార్యకు మధ్య మనస్పర్థలకు, వారు విడిపోవడానికి కారణం ఈమె అనే ప్రచారం జరుగుతోంది. వీటన్నింటికి బలం చేకూర్చే విధంగా రవిమోహన్, కెనిషా జంటగా తిరున్నారు.రవి మోహన్పై పొగడ్తలుఇలాంటి పరిస్థితుల్లో నటి కెనిషా సందర్భం వచ్చినప్పుడల్లా రవిమోహన్పై పొగడ్తల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇటీవల శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన పరాశక్తి చిత్రంలో రవిమోహన్ ప్రతినాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో రవిమోహన్ హీరో అయినా విలన్ అయినా ఆయన వల్లే ఈ చిత్రం ఆడుతోంది. ఎవర్ గ్రీన్ రవిమోహన్ ముందు తన కళ్లకు ఎవరు కనిపించలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. రవితో బర్త్డే సెలబ్రేషన్స్రవిమోహన్కు నీడలా ఉంటున్న కెనిషా గత 7వ తేదీన తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోగా రవిమోహన్ హాజరై పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇటీవల ఈ గాయని తన ఎక్స్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అందులో తనకు చిన్న వయసులోనుంచే గుర్తింపు లేదంది. ప్రపంచమే మారిపోయిందితాను ఇతరుల నుంచి చిన్న గుర్తింపు, ప్రేమనే ఆశించానని తెలిపింది. అలాంటిది రవిమోహన్ వచ్చిన తర్వాత తన ప్రపంచమే మారిపోయిందని, తన ఆలోచనలు, భావాలు, ప్రేమ తదితర విషయాలు కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయంది. ఎవరేమనుకున్నా తాను బాధ పడనని, తాము నిజంగా చాలా ప్రశాంతంగా ఉన్నామంది. ఈ విషయం తమను అర్థం చేసుకున్న వారికి తెలుసని, కష్టాల్లో అండగా నిలబడినవారికి, రవిమోహన్కు ధన్యవాదాలని కెనిషా పేర్కొంది. -
Mrunal Thakur: ధనుష్తో పెళ్లి..? మృణాల్ ఠాకూర్ క్లారిటీ
సినీ ఇండస్ట్రీలో ఈ మద్య కాలంలో తరచూ వినిపించే ఓ వార్త ఏమిటంటే.. హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్నది. అయితే ఈ వార్తలు కొత్తవి కావు. గతంలో ఒక ఫంక్షన్లో వీరిద్దరూ క్లోజ్గా కనిపించడంతో ఈ ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి. కొంతమంది మేధావులు ఫిబ్రవరి 14న వీరి వివాహం జరుగుతుందని కథనాలు ప్రచారం చేశారు. అయితే తాజాగా మృణాల్ ఠాకూర్ ఈ పుకార్లపై స్పందింది. “ఫిబ్రవరి 14 కాస్తా ఏప్రిల్ 1గా మారినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ 1 ఫూల్స్ డే కదా. ఇదంతా ఎవరు మొదలుపెడుతున్నారో అర్థం కావడం లేదు. నేను అధికారికంగా చెప్పినట్టు కొంతమంది ఇలాంటి గాసిప్స్ వ్యాపింపజేస్తున్నారు. ఇది తనకు చాలా భయంకరంగా ఉందని వ్యాఖ్యానించింది. ఇంతకుముందు పలుమార్లు ఈ విషయంపై ఆమె స్పందించినప్పటికీ, ఆ మాటలు పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్టే అయ్యాయి. ఈసారి మాత్రం మృణాల్ స్పష్టంగా తనకు ధనుష్తో ఎలాంటి సంబంధం లేదని ఖండించింది. అయితే ఆమె ఇచ్చిన క్లారిటీతో ఈ గాసిప్స్కు ముగింపు లభిస్తాయేమో చూడాలి. మొత్తానికి ధనుష్తో వస్తున్న పెళ్లి వార్తలు కేవలం పుకార్లేనని మృణాల్ ఠాకూర్ తేల్చి చెప్పింది. -
యశ్ టాక్సిక్.. రిలీజ్కు ముందే మరో వివాదం..!
కేజీఎఫ్ హీరో నటించిన ఫుల్ యాక్షన్ మూవీ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్. ఈ సినిమా రిలీజ్కు ముందే వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. టీజర్ రిలీజ్ తర్వాత బోల్డ్ సీన్పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఆ సీన్ విషయంలో కొందపు ఏకంగా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్పై మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్కు ముందే మరో కొత్త వివాదానికి దారితీసింది. ఈ సినిమాలో మతపరమైన విశ్వాసాలను కించపరిచేలా చిత్రీకరించారని ఓ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమాలోని కొన్ని దృశ్యాలు తమ మత విశ్వాసాలను అగౌరవపరిచేలా ఉన్నాయంటూ నేషనల్ క్రిస్టియన్ ఫెడరేషన్ సంబంధిత అధికారులకు లేఖ రాసింది. తమ మతంలో ప్రధాన దేవదూత అయిన సెయింట్ మైఖేల్ చిత్రీకరణపై ఈ బృందం ప్రత్యేకంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. సెయింట్ను అభ్యంతరకరమైన రీతిలో చిత్రీకరించారని.. ఇది తమ మనోభావాలను దెబ్బతీసిందని నేషనల్ క్రిస్టియన్ ఫెడరేషన్ ఆరోపిస్తోంది.అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాడని ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ అధికారులను కోరారు. వివాదాస్పద దృశ్యాలను, ఆన్లైన్ వీడియోలను కూడా తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా అదనంగా చిత్రనిర్మాతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై మూవీ మేకర్స్ స్పందించాల్సి ఉంది. దీనిపై ఇప్పటి వరకు చిత్రనిర్మాతలు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. కాగా.. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ ధురంధర-2తో పోటీ పడనుంది. -
డబుల్ థమాకా.. గతంలో బాలయ్య, నాని.. ఇప్పుడు శ్రీవిష్ణు
గతంలో ఒకసారి నందమూరి బాలకృష్ణ నటించిన నిప్పు రవ్వ , బంగారు బుల్లోడు చిత్రాలకు.. మరోసారి హీరో నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం, జండాపై కపిరాజు చిత్రాలకు ఇలాంటి సమస్యనే ఎదురైంది. తమ సినిమాల విడుదల విషయం తమ చేతిలో లేకపోవడం. ఒకేసారి రెండు సినిమాలు విడుదల చేయాల్సిన పరిస్థితి రావడం. ఇప్పుడు శ్రీవిష్ణుకి కూడా అదే పరిస్థితి ఎదురైంది. టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ఈ నెల చివర్లో ఓ ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. తను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల కానున్నాయి. బాలయ్య రెండు చిత్రాలు ఒకేరోజు (1993 సెప్టెంబర్ 3) విడులైయ్యాయి. అలాగే నాని నటించిన రెండు చిత్రాలు 2015 మార్చి 21న విడుదలయ్యాయి.అయితే ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. శ్రీవిష్ణు నటించిన మృత్యుంజయ్ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ తీసుకుంది. కానీ స్లాట్ ఈ నెలలోనే ఇచ్చింది. అయితే అదే శ్రీవిష్ణు నటించిన విష్ణు విన్యాసం సినిమాను మరో ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ తీసుకుంది. ఆ సంస్థ కూడా ఇదే నెలకు డేట్ ఇచ్చింది. ఈ విషయంపై చర్చలు జరిగాయి కానీ నో యూజ్. ఇద్దరూ ఒకే తేదీపై పట్టుబడటంతో నిర్మాతలు, హీరో శ్రీవిష్ణు కూడా ఏం చేయలేని పరిస్థితి. రెండు సినిమాలు తనవే కావడంతో, రెండింటినీ సమానంగా ప్రమోట్ చేయాల్సిన బాధ్యత శ్రీవిష్ణుపై పడింది. ఇప్పటికే మృత్యుంజయ్ టీజర్ విడుదలైంది. మరో రెండు రోజుల్లో విష్ణు విన్యాసం టీజర్ కూడా రానుంది. ఆ వారం ఈ రెండు సినిమాలు తప్ప మరే పెద్ద రిలీజ్ లేకపోవడం శ్రీవిష్ణు అదృష్టమే. రెండు సినిమాలు ఒకేసారి రావడం వల్ల ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ లభించనుంది. అయితే ఏదో ఒకటి ఎడ్జ్ తీసుకునే అవకాశం ఉంది. కానీ కంటెంట్ బలంగా ఉంటే మాత్రం రెండూ హిట్ అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితి శ్రీవిష్ణుకు ఒకవైపు ఎంబ్రాసింగ్, మరోవైపు ఎక్సైటింగ్ కూడా. ఎందుకంటే ఒకేసారి రెండు సినిమాలు తనవే అని చెప్పుకోవడం అరుదైన విషయం. చూడాలి మరి చివరికి ఏమౌతుందో. విష్ణు విన్యాసం టీజర్ రిలీజైతే ఈ విషయంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
ఇన్నాళ్లు అక్కడే నలిగిన జ్ఞాపకం.. ఇంతకాలానికి!
నటి షామ్నా ఖాసిం అలియాస్ పూర్ణ రెండోసారి తల్లి కాబోతోంది. గతేడాది ఆగస్టులో తను రెండోసారి గర్భం దాల్చిన విషయాన్ని వెల్లడించింది. తాజాగా ఆమె తన బేబీ షవర్ ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అందులో భర్త, కుమారుడితో కలిసి దిగిన పిక్స్ జత చేసింది. వీటిలో పూర్ణ లైట్ పింక్ కలర్ గౌన్లో అందంగా ముస్తాబైంది.గర్వంగా ఉందిఅయితే ఈ డ్రెస్ వెనక ఓ స్టోరీ ఉందని చెప్పింది. అతడు (పూర్ణ భర్త) నాకు తొలిసారి ఐ లవ్యూ చెప్పినరోజు ఈ గౌన్ గిఫ్ట్ ఇచ్చాడు. ఏళ్ల తరబడి ఈ డ్రెస్ కప్బోర్డులో అలాగే నలిగిపోతూ ఉంది. ఒక మంచిరోజుకోసం ఇన్నేళ్లుగా ఎదురు చూస్తోంది. ఇంతకాలానికి ఆ మంచి రోజు రానే వచ్చింది. మాతృత్వాన్ని సెలబ్రేట్ చేసుకునేరోజు దాన్ని ధరించాను. నా భర్త ఈ సెలబ్రేషన్స్ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా అద్భుతంగా మలిచాడు. నా మనసు సంతోషం, ప్రేమతో ఉప్పొంగిపోతోంది. అలాగే నా డ్యాన్స్ స్కూల్లో పిల్లలు ఒక్కో స్టెప్పు వేస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది అని రాసుకొచ్చింది.సినిమామలయాళ నటి పూర్ణ తెలుగులో.. శ్రీ మహాలక్ష్మి, సీమ టపాకాయ్, అవును, నువ్వలా నేనిలా, రాజుగారి గది, మామ మంచు అల్లుడు కంచు, సుందరి, అఖండ 2 వంటి పలు సినిమాలు చేసింది. గుంటూరు కారం మూవీలో కుర్చీ మడతపెట్టి పాటలో కనిపిస్తుంది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, కన్నడ భాషల్లోనూ యాక్ట్ చేసింది. 2022లో వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పెళ్లాడింది. ఆ మరుసటి ఏడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) చదవండి: ఆ సంతోషం, భావోద్వేగం మాటల్లో వర్ణించలేను: చిరంజీవి -
నటితో విడాకులు.. చాలా హ్యాపీగా అనిపించింది: డైరెక్టర్ కామెంట్స్
కోలీవుడ్ డైరెక్టర్ ఆర్ పార్తీబన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన వ్యక్తిగత లైఫ్ గురించి తాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నటి సీతను పెళ్లాడిన ఆయన.. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆమెతో విడిపోయారు. ఈ సందర్భంగా తమ వైవాహిక బంధం, విడాకుల గురించి చెప్పుకొచ్చారు. సీతతో విడిపోయినందుకు తానెప్పుడు బాధపడలేదని అన్నారు. నిజం చెప్పాలంటే ఆమెతో విడాకుల తర్వాత చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. అయితే తనతో ఉన్న 12 సంవత్సరాల నా జీవితం అత్యంత మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయిందని వెల్లడించారు. ఎందుకంటే ఈ రోజుల్లో పురుషులు, మహిళలు వివాహం కంటే స్వతంత్రంగా ఉండటాన్నే ఇష్టపడతారని పార్థీబన్ అన్నారు. ఏ స్త్రీ కూడా వివాహం పేరుతో పరిమితులు ఉండే జీవితాన్ని కోరుకోదని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటారని ఆర్ పార్థీబన్ పేర్కొన్నారు. ఈ కామెంట్స్ఆర్ పార్తీబన్ కెరీర్..కాగా.. ఆర్ పార్తీ బన్ 1990లో నటి సీతను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. ఒక కుమారుడిని దత్తత తీసుకున్నారు. 2001లో పార్తీబన్- సీత విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి పార్తీబన్ ఒంటరిగానే ఉంటున్నాడు. సీత మరొకరిని పెళ్లి చేసుకోగా తర్వాతి కాలంలో ఆయనకు సైతం విడాకులు తీసుకుంది. ఇక ఆర్ పార్తీబన్ సినిమాల విషయానికి వస్తే.. యుగానికి ఒక్కడు, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్ 1, పొన్నియన్ సెల్వన్ 2 వంటి పలు చిత్రాల్లో నటించాడు. అంతేకాకుండా సుడల్ 1 వెబ్ సిరీస్లోనూ యాక్ట్ చేశాడు. I have never worried about separation with my ex wife Seetha, to be honest I'm very happy about it. The 12 years with her is the Sweetest memory of my life.These days men & women prefer independence over Marriage. No woman wants a restricted life in the name of Marriage.… pic.twitter.com/LfgirOi8Eh— Kolly Censor (@KollyCensor) February 10, 2026 -
కర్ణాటకలో 'సబ్బు' పాలిటిక్స్.. తమన్నా తప్పితే ఇంకెవరు లేరా?
మైసూర్ శాండల్ సబ్బు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 100 ఏళ్లకు పైగానే చరిత్ర కలిగిన ఈ సబ్బు.. కర్ణాటకలో తయారవుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి బ్రాండ్ అంబాసిడర్గా హీరోయిన్ తమన్నాని ఎంపిక చేశారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడీ విషయం కర్ణాటకలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలోనూ ట్రోల్స్ గట్టిగానే వస్తున్నాయి.కర్ణాటకకు చెందిన సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ బ్రాండ్ అంబాసిడర్గా తమన్నాని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వచ్చే రెండేళ్ల పాటు మైసూర్ శాండల్ సబ్బు, ఇతర ఉత్పత్తులకు ఈమె ప్రచారం చేయనున్నారు. ఈ విషయం గురించి మాట్లాడిన కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్.. మైసూర్ శాండల్ సబ్బుని మార్కెట్లోకి రీలాంచ్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో 3 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న తమన్నాని బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేయడం ద్వారా ఉత్తర భారత మార్కెట్లో తమ కంపెనీ ఉత్పత్తులు డిమాండ్ పెంచడమే లక్ష్యమని అన్నారు.కన్నడ భామలైన రష్మిక, రుక్మిణి వసంత్, దీపికా పదుకొణె లాంటి వాళ్లని కాదని తమన్నాని బ్రాండ్ అంబాసిడర్ చేయడం ఏంటని పలువురు నెటిజన్లు, పలు కన్నడ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ కె.సుధాకర్.. కాంగ్రెస్, కన్నడ వ్యతిరేక మనస్తత్వం కలిగిన ప్రభుత్వమని విమర్శించారు. కన్నడలో చాలామంది తారలున్నప్పటికీ.. వేరే రాష్ట్రం, వేరే భాషకు చెందిన సినీ నటిని నియమించింది. అంతేకాక ఆమెకు కోట్లాది రూపాయలు చెల్లించింది. ఇదే కాంగ్రెస్ పార్టీ.. కన్నడ వ్యతిరేక మనస్తత్వానికి మరో నిదర్శనం అని ట్వీట్ చేశారు. ఇప్పుడీ విషయం కన్నడ నాట హాట్ టాపిక్ అయిపోయింది.As a Government of Karnataka PSU competing successfully with leading corporate FMCG players, KSDL stands as a strong example of public sector excellence.In 2024–25, KSDL recorded a turnover of ₹1,787 Cr with a net profit of ₹451 Cr, delivering over 43,000 metric tonnes of… pic.twitter.com/cYuN59CkZm— M B Patil (@MBPatil) February 10, 2026ನಾಡದ್ರೋಹಿ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರಕ್ಕೆ ಕನ್ನಡದ ಸಿನಿತಾರೆಗಳು ಕಣ್ಣಿಗೆ ಕಣ್ಣುತ್ತಿಲ್ಲವೇ?ಕರ್ನಾಟಕದ ಸುಪ್ರಸಿದ್ಧ ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಬ್ರ್ಯಾಂಡ್ ಮೈಸೂರು ಸ್ಯಾಂಡಲ್ ಸೋಪ್ ಗೆ ಬ್ರಾಂಡ್ ಅಂಬಾಸಿಡರ್ ನೇಮಿಸಲು ನಮ್ಮದೇ ಕನ್ನಡ ನಾಡಿನ ಅನೇಕ ತಾರೆಗಳು ಇದ್ದರೂ ಪರರಾಜ್ಯದ, ಅನ್ಯಭಾಷೆಯ ಸಿನಿಮಾ ನಟಿಯೊಬ್ಬರನ್ನು ಕೋಟ್ಯಂತರ ರೂಪಾಯಿ ಪೇಮೆಂಟ್ ಕೊಟ್ಟು… pic.twitter.com/bJqmXaPVo9— Dr Sudhakar K (@DrSudhakar_) February 10, 2026 -
టాలీవుడ్లో విఎఫ్ఎక్స్ సినిమాలకు కష్టకాలం?
టాలీవుడ్లో విఎఫ్ఎక్స్ ఆధారిత సినిమాలు వరుసగా రెడీ అవుతున్నాయి. కానీ ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు నిర్మాతలకు తలనొప్పిగా మారాయి. ఒకవైపు ఓటిటి సంస్థలు ఇలాంటి సినిమాలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఫైనల్ కాపీ చూపించకపోతే ఒప్పందాలు కుదిరే పరిస్థితి లేదు. గతంలో వచ్చిన పలు విఎఫ్ఎక్స్ చిత్రాలు నాసిరకమైన గ్రాఫిక్స్ కారణంగా ప్రేక్షకుల నిరాకరణకు గురైన విషయం తెలిసిందే. ఆ అనుభవం వల్లే ఇప్పుడు ఓటిటి సంస్థలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. సినిమా ఫైనల్ వెర్షన్ చూపిస్తేనే రేటు నిర్ణయిస్తామని ఓటిటిలు స్పష్టంగా చెబుతున్నాయి.మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర, నిఖిల్ స్వయంభు, నాగ్ చైతన్య వృషకర్మ వంటి భారీ విఎఫ్ఎక్స్ ప్రాజెక్టులు ఓటిటి డీల్స్ కోసం వెయిటింగ్లో ఉన్నాయి. అయితే ఇప్పటికే పూర్తయిన సినిమాలు మాత్రం సులభంగానే అమ్ముడవుతున్నాయి. కానీ ఇంకా మేకింగ్ దశలో ఉన్నవాటికి ఫైనల్ కాపీ చూపించకపోతే ఒప్పందాలు ముందుకు సాగట్లేదు. ఇలాంటి వాటిలో పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ కాంబినేషన్లు కూడా ఉన్నాయి. కానీ నిర్మాతలు మాత్రం కొత్తగా విఎఫ్ఎక్స్ సినిమాలు ప్లాన్ చేయడంలో ముందుకు వెనుకకు ఆలోచిస్తున్నారు. ఓటిటి మార్కెట్ బలహీనంగా ఉండటం వల్ల రిస్క్ ఎక్కువగా కనిపిస్తోంది. -
డిఫరెంట్ రోల్లో రాధిక.. మేకప్ తీయడానికే రెండు గంటలా?
సీనియర్ నటి రాధిక శరత్కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆమె తాయ్ కిజావి అనే మూవీలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఇంతకు ముందెన్నడు చేయని రోల్లో కనిపించనుంది. ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్స్ చూస్తుంటే.. అస్సలు రాధికను గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఈ మూవీ కోసం తన లుక్ను పూర్తిగా మార్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధిక ఈ పాత్ర గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.ఈ సినిమాలో నా కొత్త లుక్ కోసం నటుడు కమల్హాసన్ నుంచి సలహాలు తీసుకున్నానని రాధిక తెలిపారు. రోజూ మేకప్ వేసుకునేందుకు 5 గంటలు.. దానిని తీసేందుకు 2 గంటల సమయం పట్టిందని వెల్లడించారు. మొదట తాను ఈ సినిమాలో ఆ పాత్ర చేసేందుకు ఆసక్తిగా చూపలేదని అన్నారు. తనకు ఇష్టం లేదని చెప్పినా.. దర్శకుడు శివకుమార్ మురుగేశన్ దాదాపు రెండేళ్ల పాటు నా చుట్టే తిరిగారని రాధిక పేర్కొన్నారు. అంతే కాకుండా తన భర్త శరత్కుమార్ సలహాతోనే ఈ మూవీలో నటించానని చెప్పారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఫిబ్రవరి 20న థియేటర్లలో సందడి చేయనుంది. A story I believed in.A film I’m proud to present.#ThaaiKizhavi — https://t.co/ewdDBtXOevIntroducing @Dir_SivakumarM.@realradikaa Ma’am in a never-before-seen role.A fun ride awaits you in theatres worldwide from 20 February, 2026 😊👍@KalaiArasu_ @Sudhans2017… pic.twitter.com/IOINaiJZzc— Sivakarthikeyan (@Siva_Kartikeyan) December 24, 2025 -
ఒకే ఒక్కడు మూవీ షూటింగ్.. నాకోసం పది నిమిషాల్లోనే..!
హీరో అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య, నిరంజన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీకి అర్జున్ దర్శకత్వం వహించడంతో పాటు అతిథి పాత్రలో నటించారు. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 14న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ సినీ ప్రియులను ఆకట్టుకుంది.మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు అర్జున్, ఆయన కూతురు ఐశ్వర్య. తండ్రి, కూతురు తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు ఐశ్వర్య అర్జున్. తాను చెన్నైలో స్కూల్లో చదివే సమయంలో కడుపునొప్పిగా ఉందని డాడీకి కాల్ చేశానని తెలిపింది. అప్పుడు నాన్న ఒకే ఒక్కడు సినిమా షూటింగ్లో ఉన్నారు. దాదాపు నాకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ నేను చెప్పగానే నాకోసం హుటాహుటిన స్కూల్కు వచ్చేశారని ఐశ్వర్య అర్జున్ వెల్లడించారు. ఆ రోజు నేను చాలా వేగంగా డ్రైవ్ చేస్తూ వచ్చానని అర్జున్ సర్జా తెలిపారు. ఆ రోజు నా డ్రైవింగ్ చూసి చాలామంది తిట్టుకుని ఉంటారని అన్నారు. వీరిద్దరి బాండింగ్ చూస్తుంటే కూతురంటే అర్జున్కు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాశ్రాజ్, కోవై సరళ, అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా కీలక పాత్రలు పోషించారు. -
యశ్ టాక్సిక్.. రిలీజ్కు ముందే రికార్డ్స్.. మరో బిగ్ డీల్..!
శాండల్వుడ్ హీరో యశ్ నటిస్తోన్న మోస్ట్ అవేటేడ్ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్. కేజీఎఫ్-2 తర్వాత రాకింగ్ స్టార్ ఈ మూవీతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ముఖ్యంగా బోల్డ్ సీన్ పెట్టడంపై దర్శకురాలిపై విమర్శలు చేశారు. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహంచారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర డిస్ట్రిబ్యూటర్స్ దక్కించుకుంది. దాదాపు రూ.120 కోట్ల డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.అయితే తాజాగా ఈ మూవీకి మరో బిగ్ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్లో ఇండియన్ లాంగ్వేజేస్కి దాదాపు రూ.105 కోట్లకు బిజినెస్ ఓకే అయినట్లు సమాచారం. ప్రముఖ విదేశీ పంపిణీదారు అయిన ఫార్స్ ఫిల్మ్స్తో ఈ డీల్ చేసుకుంది. దీంతో ఒక ఇండియన్ సినిమాకు అత్యధిక డీల్ సాధించిన చిత్రంగా టాక్సిక్ నిలవనుంది. రూ. 105 కోట్ల విదేశీ డీల్ రావడం భారతీయ సినిమాకు దక్కిన ఘనతగా భావిస్తున్నారు.ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్తో ఓవర్సీస్లో ఇండియన్ భాషల్లో ఫార్స్ ఫిల్మ్ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఈ బిగ్ డీల్ భారతీయ చిత్రానికి ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అంతర్జాతీయ విడుదల అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం నేపాల్, జపాన్, చైనా మినహా దాదాపు అన్ని ప్రపంచ దేశాల్లో విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రాన్ని ఓకేసారి కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రీకరించారు. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. -
'పుష్ప' తరహాలో.. చరణ్-సుక్కూ కాంబో రెడీ.. ఆమె సంగతేంటి?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. రంగస్థలం తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న కొత్త సినిమా కథ ఇప్పటికే ఫైనల్ అయింది. పుష్ప తరహాలోనే ఇది కూడా రెండు భాగాలుగా తెరకెక్కుతుందనే టాక్ వినిపిస్తోంది. వచ్చే నెలలో అధికారిక ప్రకటన వెలువడనుంది.ఇక హీరోయిన్ విషయంలో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. రంగస్థలం సమయంలో మొదట అనుపమ పరమేశ్వరన్ను హీరోయిన్గా తీసుకున్నారు. కానీ తర్వాత ఆమెను తప్పించి సమంతను తీసుకున్నారు. సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. ఆ సమయంలో నిరాశ చెందిన అనుపమకు తప్పకుండా మరో చిత్రంలో ఒక మంచి పాత్రకు తీసుకుంటానని సుకుమార్ మాటిచ్చాడు.ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చింది. చరణ్-సుక్కూ కాంబో మళ్లీ కలిసింది. అనుపమ కూడా ఇంకా లైమ్లైట్లోనే ఉంది. ఈసారి ఆమెకు ఛాన్స్ వస్తుందా అన్నది హాట్ టాపిక్గా మారింది. తన కెరీర్లో అనుపమ కొన్ని మంచి సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా తనకు మంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ తనకు ఇప్పటి వరుకు స్టార్ హీరోల రేంజ్లో మాత్రం ఆమెకు పెద్ద బ్రేక్ రాలేదు. నటనలో మాత్రం అనుపమను తక్కువ చేయలేం. మరి ఈసారైనా ఆమెకు సుకుమార్ ఛాన్స్ ఇస్తాడా?సుకుమార్ ఈసారి రాసుకున్న హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉందో, దానికి అనుపమ సరిపోతుందో లేదో చూడాలి. లేకపోతే మరో స్టార్ హీరోయిన్ను తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి చరణ్-సుక్కూ సినిమా అధికారిక ప్రకటన వచ్చే నెలలో వస్తుంది. హీరోయిన్ ఎవరన్నది అప్పటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
దృశ్యం నటి.. ఒకే ఒక్క సీరియల్తో సినిమా ఛాన్స్..!
సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రాల్లో దృశ్యం-3 ఒకటి. గతంలో విడుదలైన రెండు పార్టులు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించారు. ఈ ఫ్రాంచైజీలో వస్తోన్న దృశ్యం 3 ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల కానుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరోసారి ఆడియన్స్ను అలరించనుంది.అయితే ఈ సినిమాలో ఐజీ గీతా ప్రభాకర్ పాత్రలో మెప్పించిన నటి ఆశా శరత్. తాజాగా ఆమె ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. గత రెండు చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో క్లైమాక్స్ అదిరిపోతుందని తెలిపింది. మిమ్మల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుందని పేర్కొంది. ఈ క్లైమాక్స్ చూస్తే మీరంతా కచ్చితంగా షాకవుతారని చెప్పుకొచ్చింది.అసలు ఎవరీ ఆశా శరత్?దృశ్యం ఫ్రాంచైజీలో ఛాన్స్ కొట్టేసిన ఆశా శరత్ ఎవరనే విషయంపై నెట్టింట చర్చ మొదలైంది. అసలు ఆమె సినిమాల్లో ఎలా వచ్చిందనే దానిపై సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. తాజాగా ఆశా శరత్కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. మలయాళ బుల్లితెరపై కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఓకే ఒక్క సీరియల్తో మూవీస్లో అడుగుపెట్టింది.స్వతహాగా డ్యాన్సర్ అయినా ఆశా శరత్.. మలయాళంలో 'కుంకుమ పువ్వు' అనే సీరియల్తో నటనారంగ ప్రవేశం చేసింది. ఇందులో లీడ్ రోల్ అయినా ప్రొఫెసర్ జయంతి పాత్ర పోషించింది. ఈ క్యారెక్టర్తోనే మలయాళ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. అలా తనకు కుంకుమ పువ్వు సీరియల్లో నటిస్తున్నప్పుడే దృశ్యం సినిమాలో అవకాశం వచ్చిందని వెల్లడించింది. ఆ తర్వాత ఆమె ఫ్రైడే, కర్మయోధ, అర్ధనారి, జకరియాయుడే గర్భిణికల్ వంటి సినిమాల్లో నటించింది. కానీ దృశ్యం సినిమానే ఆమె కెరీర్ను మలుపు తిప్పింది. మలయాళంలోనే కాకుండా కన్నడ, తమిళ వెర్షన్లలో కూడా అదే పాత్రను పోషించింది.ఆశా శరత్ మాట్లాడుతూ.. "నాకు ఈ ఆఫర్ వచ్చినప్పుడు ఆందోళన ఉండేది. సీరియల్లో జయంతి పాత్ర అనేది ఎమోషనల్తో కూడుకున్నది. ఒకవేళ ప్రేక్షకులు గీతా ఐపీఎస్ కూడా పోలీసు యూనిఫాంలో ఉన్న జయంతి లాగే ఉందని భావిస్తే ఎలా? అది సినిమాపై, నాపై కూడా ప్రభావం చూపుతుందని ఆందోళన చెందా. కానీ వారి స్పందన నన్ను ఆశ్చర్యపరిచింది. మలయాళీలు చాలా తెలివైనవారు. పాత్రల మధ్య తేడాను ఎలా గుర్తించాలో వారికి బాగా తెలుసు' అని గతంలోనే చెప్పుకొచ్చింది. కాగా.. ఈ చిత్రంలో మోహన్లాల్, మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్, ఆశా శరత్, మురళి గోపి, సిద్ధిక్ కీలక పాత్రలు పోషించారు. -
'నా సూపర్ పవర్ నువ్వే.. సతీమణికి కాంతార హీరో స్పెషల్ విషెస్'
కాంతార మూవీతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి. ఈ సినిమా తర్వాత రిషబ్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. గతేడాది కాంతార-2 ప్రీక్వెల్తో మరో సూపర్ హిట్ కొట్టేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో కనిపించారు.ఇక సినిమాల సంగతి పక్కన పెడితే రిషబ్ శెట్టి.. కాస్ట్యూమ్ డిజైనర్ ప్రగతి శెట్టిని పెళ్లాడారు. 2017లో పిబ్రవరి 9న వీరిద్దరి పెళ్లి గ్రాండ్గా జరిగింది. వీరి పెళ్లి జరిగి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా తన సతీమణికి స్పెషల్ విషెస్ చెప్పారు రిషబ్ శెట్టి. ట్విటర్ వేదికా వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలిపారు.రిషబ్ శెట్టి తన ట్వీట్లో రాస్తూ..'ఈరోజుతో అందమైన, ప్రేమపూర్వక వివాహానికి తొమ్మిదేళ్లు. ఈ ప్రయాణంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నీతో కలిసి గడిపిన ప్రతి క్షణం మధురమైన జ్ఞాపకాల నిధి. ఇందులో ఆనందం, బాధ, నవ్వు, ఉత్సాహం ప్రతిది ఉన్నాయి. అన్నింటినీ మించి అంతులేని ప్రేమ ఉంది. ప్రేమ ప్రసరింపజేసే వెలుగు, అది తెచ్చే శాంతి, అది నింపే ఆత్మవిశ్వాసమే నన్ను ఈ రోజు ఇలా మార్చాయి. నా భార్య, నా సహచరురాలు, అదృష్ట దేవత, నా జీవితాన్ని సముద్రమంత విశాలంగా మార్చేసిన నీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.' అంటూ పోస్ట్ చేశారు. అంతే కాకుండా నా సూపర్ పవర్, నన్ను నడిపించే శక్తి, నా బలానికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. నువ్వు నా చేయి పట్టుకున్నప్పుడు జీవితం మరింత బాగుంటుందని తన పోస్ట్లో రాసుకొచ్చారు. ఇది చూసిన రిషబ్ అభిమానులు తమ అభిమాన హీరో జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ಬಂಧ ಬೆಸೆದು, ಚಂದ ಹೊಸೆದು ಒಂದಾದ ಒಲವಿನ ದಾಂಪತ್ಯಕ್ಕಿಂದು ಒಂಭತ್ತು ತುಂಬಿದೆ. ಹಿಂದೆ ನೋಡಿದರೆ ಜೊತೆ ಕಳೆದ ಪ್ರತಿ ಗಳಿಗೆಯೂ ಸಿಹಿ ನೆನಪಿನ ನಿಕ್ಷೇಪಗಳಾಗಿವೆ. ಅಲ್ಲಿ ನಲಿವಿದೆ, ನೋವಿದೆ, ನಗುವಿದೆ, ಸರಸವಿರಸಗಳಿವೆ.. ಎಲ್ಲವನ್ನು ತೂಗುವ ಸಮರಸವಿದೆ.. ಎಲ್ಲಕ್ಕೂ ಮಿಗಿಲಾಗಿ ಕೊನೆಯಾಗದ ಒಲವಿದೆ.. ಅ ಒಲವು ಬೀರಿದ ಬೆಳಕು, ತಂದ ನೆಮ್ಮದಿ,… pic.twitter.com/lBbongYlA9— Rishab Shetty (@shetty_rishab) February 9, 2026 -
రచయితలకు ప్రాధాన్యం పెరగాలి..!
తమిళసినిమా: సంగీత దర్శకుడు విజయ్ఆంటోని పలు విజయవంతమైన చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. తాజాగా ఆయన తన సోదరి కొడుకు అజయ్ దిశన్ హీరోగా రూపొందించిన చిత్రం పుక్కీ. నటి ధనుషా నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ఛాయాగ్రహకుడు గణేశ్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విజయ్ఆంటోని ఫిలిం కార్పోరేషన్ పతాకంపై మీరా విజయ్ ఆంటోని సమర్పణలో ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రానికి నటుడు విజయ్ ఆంటోని సంగీతం, కూర్పు బాధ్యతలను నిర్వహించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న పుక్కీ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయ్ ఆంటోని మాట్లాడుతూ గణేశ్ చంద్రను ఇంతకు ముందు తానే ఛాయాగ్రహకుడిగా పరిచయం చేశానని, ఇప్పుడు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆయన శ్రమ చాలా క్లియర్గా తెలుస్తుందన్నారు. ఈ రొమాంటిక్ ప్రేమ కథా చిత్రాన్ని గణేశ్ చంద్ర చాలా చక్కగా తెరపై ఆవిష్కరించారని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని పత్రికల వారు ప్రశంచిస్తారన్నారు. మలయాళ సినిమాలో మాదిరిగా తమిళ చిత్ర పరిశ్రమలోనూ కథారచయితలకు ప్రాముఖ్యత పెరగాలన్నారు. ఆ విధంగా పుదియ భారతి ముఖ్యమైన కథా రచయిత అని పేర్కొన్నారు. ఈ చిత్రం తరువాత ఆయన ఉన్నత స్థాయికి చేరుకుంటారనే నమ్మకం తనకు ఉందన్నారు. నటుడు అజయ్ విషయానికి వస్తే తను చాలా మంచి వ్యక్తి అని, నిజాయితీగా పని చేస్తారని అన్నారు. నటి ధనుషా చాలా తెలివైన, ప్రతిభావంతురాలైన నటి అని పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు అజయ్ దిశన్ మాట్లాడుతూ ఈ చిత్రం తనకు చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. తన జీవితంలో ఎంతో అనుభవాన్నిచ్చిన చిత్రం అని అన్నారు. తాను ఊహించని పలు విషయాలను నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు గణేశ్ చంద్ర మాట్లాడుతూ ఇప్పటి వరకూ కెమెరా వెనుక ఉన్న తనను కెమెరా ముందుకు తీసుకొచ్చి యాక్షన్ అని చెప్పేలా చేసిన విజయ్ఆంటోనికి ధన్యవాదాలు తెలిపారు. తనపై ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని భావిస్తుస్తున్నట్లు పేర్కొన్నారు. -
క్లైమాక్స్లో 'ఆకాశంలో ఒక తార'
దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి హీరో హీరోయిన్లుగా, శ్రుతీహాసన్ ఓ కీలకపాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆకాశంలో ఒక తార’. ఈ సినిమా తాజా షెడ్యూల్ నేడు (సోమవారం) రాజమండ్రిలో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్లుపాల్గొనగా క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.ఈ షెడ్యూల్తో ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంటుంది. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో పవన్ సాధినేని దర్శకత్వంలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. -
Prabhas Kalki 2 Update: కమల్.. అమితాబ్ రెడీ.. మరి ప్రభాస్?
పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు పెంచుకున్న కల్కి సినిమా మొదటి భాగం సూపర్ హిట్ అయింది. దాంతో త్వరలో రానున్న రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ముగింపు దగ్గర మైథలాజికల్ టచ్ ఇవ్వడంతో కర్ణుడు, అర్జునుడు ఎంట్రీ ఇచ్చారు. దీంతో కల్కి 2లో కథ ఎలా మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ పెరిగింది. ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్', హనుతో 'ఫౌజీ' సినిమాల పనిలో బిజీగా ఉన్నారు. ఫౌజీ చిత్రం ఈ ఏడాది దసరాకు, స్పిరిట్ వచ్చే ఏడాది సమ్మర్లో విడుదలకు రెడీ అవుతున్నాయి. కల్కి 2కు ప్రభాస్ డేట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాతే ఆయన పాత్రకు సంబంధించిన షూట్ జరుగుతుంది. దాంతో ప్రభాస్ లేని కాంబినేషన్ సీన్లను ముందుగా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెలలోనే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తమ డేట్స్ను కేటాయించారు. దీంతో కల్కి 2 షూటింగ్ వర్క్ త్వరలోనే మొదలుకానుంది. హీరో ప్రభాస్ షెడ్యూల్స్, ఇతర ప్రాజెక్టుల విడుదలల మధ్య గ్యాప్ను కూడా దృష్టిలో పెట్టుకుని కల్కి 2 విడుదల 2027 దసరా సమయంలో జరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
అర్ధరాత్రి రజనీతో బైక్ రైడ్.. అనిరుధ్ తండ్రి మమ్మల్ని అడ్డుకుని!
దక్షిణాదిన ఎంతోమంది స్టార్ హీరోలతో జోడీ కట్టిన రాధికా శరత్కుమార్ ఈసారి చాలా డిఫరెంట్ పాత్రలో కనిపించనుంది. తను ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ "తాయి కిళవి". ఈ చిత్రంలో తను ఊరిలో రుణాలిచ్చే వృద్ధురాలి పాత్రలో కనిపించనుంది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హీరో శివకార్తికేయన్ నిర్మించాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 20న విడుదల కానుంది.బైక్పై తిరిగాంఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాధిక ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ఒకరోజు రజనీకాంత్, నేను బైక్పై చెన్నై అంతా తిరిగాం. నేను ఇక్కడే తిన్నాను, ఇక్కడే నిద్రపోయాను, ఇక్కడే కొన్నాళ్లు ఉన్నానంటూ రజనీ తను తిరిగిన ప్రదేశాలన్నీ నాకు చూపించాడు. రజనీ లైఫ్ స్టోరీ తన నోటి నుంచి వింటున్నప్పుడు చలించిపోయాను.జీవితంలో అనేక కష్టాలుఇన్ని కష్టాలు పడ్డాడా? అని ఫీలయ్యాను. చాలామంది జీవితంలో అనేక కష్టాలు చూసుండొచ్చు. కానీ, రజనీకాంత్ తన బాధ, కష్టం, శ్రమ.. ఇలా అన్నింటినీ ఓర్చుకుని అట్టడుగు స్థాయి నుంచి తారాస్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఇకపోతే మేము అలా బైక్పై తిరుగుతూ ఉంటే సడన్గా ఒక కారు మమ్మల్ని చేజ్ చేసుకుంటూ వచ్చి మా ముందు ఆగింది. నాకు ఒక్కసారిగా భయమేసింది. సీక్రెట్ షికారు అనుకుని..అయితే వచ్చింది మరెవరో కాదు, రజనీకాంత్ భార్య లత సోదరుడు, నటుడు రాఘవేంద్ర. రజనీకాంత్ అర్ధరాత్రి ఒక మహిళను వెంటేసుకుని రహస్యంగా షికార్లు చేస్తున్నాడని భావించి మమ్మల్ని ఆపేందుకు వచ్చాడు. కానీ.. రజనీ, నేను షికారుకు వెళ్లామని లతకు ముందే తెలుసు. దీంతో అతడి ఆందోళన నీరుగారిపోయింది అని చెప్పుకొచ్చింది. కాగా రజనీకాంత్ భార్య, నిర్మాత, సింగర్ లత తమ్ముడే నటుడు రవి రాఘవేంద్ర. ఈయన కుమారుడు అనిరుధ్ రవిచందర్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా రాణిస్తున్నాడు.చదవండి: సంతోషంగా లేను, మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు: శ్రీజ దమ్ము -
సినిమా బాగుంది, నీకు మంచి భవిష్యత్తుంది బ్రదర్!
'టూరిస్ట్ ఫ్యామిలీ'తో దర్శకుడిగా సత్తా చాటిన అభిషన్ జీవింత్ 'విత్ లవ్' మూవీతో హీరోగా మారాడు. అనస్వర రాజన్ కథానాయికగా నటించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 6న విడుదలయింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్న ఈ సినిమాపై తెలుగు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రశంసలు కురిపించాడు.విత్ లవ్పై ప్రశంసలువిత్ లవ్ సినిమాను చాలా ఎంజాయ్ చేశాను. ఇటీవలి కాలంలో వచ్చిన ఆహ్లాదకరమైన సినిమా ఇది. ముఖ్యంగా తెలుగు డైలాగులు సందర్భోచితంగా, నీట్గా ఉన్నాయి. అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. షాన్ రోల్డన్ సంగీతం సినిమాకు చాలా చక్కగా కుదిరింది.మంచి భవిష్యత్తుతొలి సినిమాకే ఇంతమంచి ప్రతిభ చూపించిన దర్శకుడు మధన్ను మెచ్చుకుని తీరాల్సిందే! సోదరా.. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ క్యూట్ మూవీ నిర్మించిన సౌందర్య రజనీకాంత్, మగేశ్కు శుభాకాంక్షలు. అలాగే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన రానా దగ్గుబాటికి ప్రత్యేక అభినందనలు అని ట్వీట్ చేశాడు.దర్శకుడి నుంచి హీరోగా..అభిషన్ జీవింత్ యూట్యూబర్గా కెరీర్ మొదలుపెట్టాడు. టూరిస్ట్ ఫ్యామిలీ మూవీతో డైరెక్టర్గా మారాడు. తొలి సినిమాకే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఓ పాత్ర పోషించాడు. ఇకపోతే గతేడాది అతడు ప్రేయసి అఖిల మెడలో మూడు ముళ్లు వేశాడు. ఈ పెళ్లికి హాజరైన టూరిస్ట్ ఫ్యామిలీ నిర్మాత మగేశ్ రాజ్.. అభిషన్కు కారు గిఫ్ట్ ఇచ్చాడు. Truly enjoyed watching #WithLove 🩶A breezy, well-made rom-com in recent times with very apt and neatly penned Telugu dialogues.@Abishanjeevinth & #AnaswaraRajan feels spot on, and @RSeanRoldan’s music works beautifully.Kudos to @madhann_n on a fantastic debut. Long way to…— Anil Ravipudi (@AnilRavipudi) February 8, 2026 చదవండి: సర్వం మాయ హిట్.. తండ్రికి దర్శకుడి విలువైన కానుక -
'సర్వం మాయ' ఘన విజయం.. తండ్రికి విలువైన కానుక
హారర్ సినిమా అనగానే వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటుందనుకునేరు, కానే కాదు.. దెయ్యంతోనే ప్రేమలో పడేలా ఉంటుంది. అదే సర్వం మాయ మూవీ. మలయాళ దర్శకుడు అఖిల్ సత్యన్ తెరకెక్కించిన ఈ మూవీ 2025 డిసెంబర్ 25న థియేటర్లో విడుదలవగా బ్లాక్బస్టర్ విజయం సాధించింది. ఏకంగా రూ.150 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. 'ప్రేమమ్' ఫేమ్ నివిన్ పౌలీ హీరోగా నటించిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది. కారు బహుమతిఅటు థియేటర్లో, ఇటు ఓటీటీలోనూ సూపర్ హిట్ టాక్ అందుకున్న సందర్భంగా దర్శకుడు అఖిల్ సత్యన్ కారు కొన్నాడు. తన తండ్రి, గురువు, దర్శకుడు సత్యన్ అంతికడ్కు కారు గిఫ్టిచ్చాడు. వోల్వో XC 60 లగ్జరీ ఎస్యూవీని తండ్రికి కానుకగా ఇచ్చాడు. ఈ మోడల్ గతేడాది ఆగస్టులోనే ఇండియాలో లాంచ్ అయింది. ఈ కారు విలువ దాదాపు రూ.70 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. మలయాళంలో ఎన్నో హిట్ సినిమాలు తెరకెక్కించిన అంతికడ్ చివరగా హృదయపూర్వం అనే సినిమాతో విజయాన్ని అందుకున్నాడు.సర్వం మాయ కథహీరో ప్రబేందు (నివిన్ పౌలీ) నాస్తికుడు. కానీ, కుల వృత్తి ప్రకారం బలవంతంగా అర్చకాలు, పూజా పునస్కారాలు చేస్తుంటాడు. ఓరోజు ప్రబేందుకు బంధువు రూపేష్ బలవంతం చేయడంతో దెయ్యం వదిలించే పూజ ఒప్పుకుంటాడు. ఆ పూజలో తాను వదిలించిన దెయ్యం తననే పట్టుకుంటుంది. ఆ దెయ్యం పేరు డెలలూ. తను చాలా క్యూట్గా ఉంటుంది.దెయ్యం చేసే అల్లరి, చిలిపితనం భలే బాగుంటుంది. డెలలూ.. తాను ఎవరు? ఎందుకు చనిపోయి దెయ్యం అయిందన్న సమాధానం కోసం వెతుకుతుంటుంది. మరి డెలలు ఆచూకీ ప్రబేందు కనిపెట్టాడా? చివరకు ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే హాట్స్టార్లో సర్వం మాయ చూడాల్సిందే! Director akhil sathyan gifted a New Volvo XC60 luxury SUV to his father, veteran director sathyan anthikad, following the grand success of his movie sarvam Maya.#sarvamMaya #akhilsathyan #sathyananthikad #anoopsathyan pic.twitter.com/rXNbK253iY— VARUNP (@VARUNP29887116) February 7, 2026 చదవండి: 2026: టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్లు -
పూజా హెగ్డే మోనికా సాంగ్.. ఐదేళ్ల బుడ్డోడు అదుర్స్..!
గతేడాది సూపర్స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'కూలీ'. ఈ మూవీలో పూజా హెగ్డే ఓ ప్రత్యేక సాంగ్కో మెరిసింది. మోనికా అంటూ అభిమానులను ఓ రేంజ్లో ఊపేసింది. పూజా హెగ్డే చేసిన ఈ స్పెషల్ పాటకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అంతలా ఈ సాంగ్ సినీ ప్రియులను మెప్పించింది. ఈ పాటను అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు. ఈ పాటకు పూజా హెగ్డేతో పాటు సౌబిన్ షాహిర్ డ్యాన్స్తో మెప్పించాడు.అయితే తాజాగా ఈ పాటకు ఓ బుడ్డోడు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ మూవీ ఈవెంట్లో మోనికా సాంగ్కు చిచ్చరపిడుగులా అదరగొట్టేశాడు. ఈ బుడ్డోడి స్టెప్పులు చూసిన నెటిజన్స్ పూజా హెగ్డే, సౌబిన్ షాహిర్ను మించిపోయేలా చేశాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అబ్బాయి ఎనర్జీ చూసి ఫిదా అయిపోతున్నారు.కాగా.. రజినీకాంత్ నటించిన కూలీ ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో రజినీతో పాటు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. Yaara nee 🤯🔥 pic.twitter.com/YH1heMRynH— OTT Trackers (@OTT_Trackers) February 8, 2026 -
అమ్మ కూతురి పెళ్లిలో రఘువరన్ బీటెక్.. ఫోటోలు వైరల్
ప్రముఖ నటి శరణ్య కూతురు రిసెప్షన్ గ్రాండ్గా జరిగింది. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో కోలీవుడ్ సినీతారలంతా పాల్గొన్నారు. హీరో కార్తీ, ధనుశ్తో పాటు పలువురు నటులు రిసెప్షన్ వేడుకలో సందడి చేశారు. ఈ ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కాగా.. శరణ్య పొన్నవన్.. ధనుశ్ హీరోగా నటించిన రఘువరన్ బీటెక్ చిత్రంలో నటించారు. ఈ మూవీలో ధనుశ్కు అమ్మగా కనిపించారు. అమాయకపు తల్లి పాత్రలో మెప్పించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అంతే కాకుండా శరణ్య రఘువరన్ బీటెక్తో పాటు 24, వేదం, గ్యాంగ్ లీడర్, మహాసముద్రం, ఖుషి లాంటి సినిమాల్లోనూ కనిపించారు. Karthi at Saranya Ponvannan’s daughter marriage reception.💥pic.twitter.com/aWA2Ag3hN4— Christopher Kanagaraj (@Chrissuccess) February 7, 2026 .@dhanushkraja sir at Saranya Ponvannan Daughter Wedding Function! @theSreyas pic.twitter.com/Z3egrQzMTI— Chowdrey (@Chowdrey_Pro) February 7, 2026 -
తెలుగు తెరపై కొత్తందం
ప్రతి ఏడాది తెలుగు తెరపై కొత్త అమ్మాయిలు మెరుస్తుంటారు. కొత్త కథానాయికలు ఎందరొచ్చినా అందరికీ తెలుగు తెర చోటు కల్పిస్తూనే ఉంటుంది. ఈ ఏడాది వెండితెరను మెరిపించేందుకు, తమలోని నటనా నైపుణ్యంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కొంతమంది కథానాయికల వివరాలపై ఓ లుక్ వేద్దాం.లక్కీ చాన్స్ ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్తో తొలి సినిమా అంటే ఏ హీరోయిన్కు అయినా లక్కీ చాన్స్ అనే చెప్పోచ్చు. ఈ లక్కీ చాన్స్ ఇమాన్వీ ఇస్మాయిల్కు దక్కింది. ‘సీతారామం’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ సినిమా ‘ఫౌజి’. ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఇమాన్వీ హీరోయిన్గా చేస్తున్నారు. దేశభక్తి, ప్రేమ, కర్తవ్యం వంటి అంశాల మేళవింపుతో 1940 నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.తొలి సినిమాయే ప్రభాస్ వంటి టాప్ హీరోతో నటిస్తుండటం, పైగా జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ వంటి సీనియర్ నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే ఇమాన్వీకి కెరీర్ పరంగా ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవచ్చు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘ఫౌజి’ చిత్రం ఈ దసరాకు విడుదల కానుంది. ఈ సినిమాకు సహ– నిర్మాతగా శివ చనన వ్యవహరిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.వెల్కమ్ జోయా రణ్బీర్ కపూర్ హీరోగా సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలోని ‘యానిమల్’ చిత్రం 2023లో విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో గీతాంజలి పాత్రలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించగా, కథలో కీలకమైన జోయా పాత్రధారిగా త్రిప్తీ దిమ్రి నటించారు. జోయా పాత్రలో త్రిప్తి నటనకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ ‘యానిమల్’ సినిమా తెలుగులో కూడా విడుదల కావడంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిలో కూడా పడ్డారు త్రిప్తి. అప్పట్నుంచి ఈ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ ఫలానా హీరోతో ఉంటుందనే ప్రచారం సాగింది.కానీ ఫైనల్గా ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘స్పిరిట్’ చిత్రంతో త్రిప్తీ దిమ్రి టాలీవుడ్కు వస్తున్నారు. ఈ యంగ్ బ్యూటీ చేస్తున్న తొలి స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ ‘స్పిరిట్’ కావడం విశేషం. అంతేకాదు... ‘యానిమల్’ సినిమాతో త్రిప్తీకి పాపులారిటీ తెచ్చిపెట్టిన సందీప్ రెడ్డివంగాయే ‘స్పిరిట్’ చిత్రానికీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ కానుంది.తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ వంటి భారతీయ భాషలతో పాటు జపాన్ వంటి విదేశీ భాషల్లోనూ ‘స్పిరిట్’ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారిపోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. డాక్టర్ పాత్రలో నటిస్తున్నారట త్రిప్తీ దిమ్రి. ప్రభాస్, త్రిప్తి ఈ చిత్రంలో భార్యాభర్తలుగా నటిస్తున్నారని సమాచారం. ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ప్రకాశ్రాజ్, కాంచన, వివేక్ ఓబెరాయ్ ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.సీతా పయనం యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్యా అర్జున్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అర్జున్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటించిన బహుభాషా చిత్రం ‘సీతా పయనం’ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ చిత్రంలోనే ఐశ్వర్యా అర్జున్ హీరోయిన్గా నటించారు. ఐశ్వర్యకు తొలి తెలుగు స్ట్రయిట్ ఫిల్మ్ ఇదే. ఇలా తన తండ్రి డైరెక్షన్ వహించి, నటించిన సినిమాతో ఐశ్వర్య తెలుగులోకి వస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాశ్రాజ్, కోవై సరళ ఇతర ప్రధాన పాత్రల్లో నటించగా, ధ్రువ సర్జా గెస్ట్ రోల్ చేశారు.ఆకాశంలో ఒక తార ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో సినీ తారగా తెలుగుకి వస్తున్నారు సాత్విక వీరవల్లి. ఈ సినిమాలో ఓ చాలెంజింగ్ రోల్ చేస్తున్నారు సాత్విక. ఓ మారుమూల పల్లె నుంచి వచ్చి, తన కలలను సాకారం చేసుకోవాలని తాపత్రయపడే అమ్మాయి పాత్రలో సాత్విక నటిస్తున్నారని తెలిసింది. ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తుండగా, సాత్విక వీరవల్లి హీరోయిన్గా చేస్తున్నారు. మరో హీరోయిన్ శ్రుతీహాసన్ ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో పవన్ సాధినేని దర్శకత్వంలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ 80 శాతం పూర్తయింది. ఈ వేసవిలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ పీరియాడికల్ ఎమోషనల్ అండ్ ఫీల్ గుడ్ మూవీకి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం అందిస్తున్నారు.శ్రీను–మంగల లవ్స్టోరీ బాలీవుడ్లో వన్నాఫ్ ది టాప్ హీరోయిన్స్ అయిన రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ టాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. ‘ఆర్ఎక్స్ 100, మంగళవారం’ వంటి సినిమాలను తెరకెక్కించిన అజయ్ భూపతి డైరెక్షన్లో రానున్న ఇంటెన్స్ లవ్స్టోరీ సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. సూపర్స్టార్ కృష్ణ, మహేశ్బాబుల నటవారసత్వాన్ని కొనసాగిస్తూ, జయకృష్ణ ఘట్టమనేని ఈ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నారు.ఈ సినిమాలోనే రషా తడానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ పీరియాడికల్ లవ్స్టోరీ చిత్రంలో శ్రీను పాత్రలో జయకృష్ణ ఘట్టమనేని నటిస్తుండగా, మంగ పాత్రలో రషా తడానీ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి మంగ ఫస్ట్ లుక్పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా రెండో షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది. సి. అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు పతాకంపై పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుందని తెలిసింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్కుమార్ స్వరకర్త.లెగసీ ‘లెగసీ’ అనే ΄పొలిటికల్ మూవీతో టాలీవుడ్కి వస్తున్నారు కన్నడ హీరోయిన్ ఏక్తా రాథోడ్. విశ్వక్ సేన్ హీరోగా సాయికిరణ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ΄పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘లెగసీ’. ‘పాలిటిక్స్ ఈజ్ పర్సనల్’ అనేది ఉపశీర్షిక. ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంతోనే ఏక్తా రాథోడ్ టాలీవుడ్కి పరిచయం అవుతున్నారు. గతంలో ‘సిలికాన్ సిటీ, మాస్టర్ పీస్’ వంటి చిత్రాల్లో నటించారు ఏక్తా రాథోడ్. విశ్వక్ సేన్ రాజకీయ నాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.తెలుగు అమ్మాయి హరికృష్ణ మనవడు, జానకి రామ్ తనయుడు నందమూరి తారక రామారావు హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ‘సీతయ్య, దేవదాసు, లాహిరి లాహిరి లాహిరిలో, యువరాజు’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన వైవీఎస్ చౌదరి కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు అమ్మాయి వీణా రావు హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. వీణ మంచి కూచిపూడి డ్యాన్సర్ కూడా. నటనలో దాదాపు ఏడాదిన్నర కాలం శిక్షణ తీసుకున్న తర్వాత హీరోయిన్గా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్లుగా వీణ చెప్పారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ, రిలీజ్ వంటి అంశాలపై అప్డేట్ రావాల్సి ఉంది. ⇒ పదేళ్ల క్రితం రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్లో నటించిన ‘దాగుడు మూత దండాకోర్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు సారా అర్జున్. అయితే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘΄పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో నందిని (నందిని రోల్ను ఐశ్వర్యా రాయ్ చేయగా, ఈ రోల్ యంగ్గా ఉన్నప్పటి సీన్స్లో సారా అర్జున్ నటించారు) పాత్రలో నటించి, యంగ్ యాక్టర్గా పాపులర్ అయ్యారు సారా. కాగా ఈ ఫిబ్రవరి 6న థియేటర్స్లో విడుదలైన ‘యుఫోరియా’ సినిమాతో ఓ లీడ్ యాక్టర్గా తెలుగు చిత్రపరిశ్రమకు సారా అర్జున్ పరిచయం అయ్యారు.గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రంలోని సారా నటన తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తోంది. అలాగే సారా అర్జున్ ఓ లీడ్ రోల్లో నటించిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘మ్యాజిక్’ విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాకు ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఇంకా రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’ సినిమా గత ఏడాది డిసెంబరులో విడుదలై, ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్ర యాలినా జమాలిగా సారా నటించారు. హీరోయిన్గా హిందీలో సారా అర్జున్కు ఇది తొలి చిత్రం కావడం విశేషం.⇒ ‘ది రాజాసాబ్’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టారు హీరోయిన్ మాళవికా మోహనన్. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రంలో భైరవి అనే పాత్రలో కనిపించారు మాళవిక. ఈ చిత్రంలో భైరవిగా ఓ యాక్షన్ సీక్వెన్స్ కూడా చేశారు మాళవిక. టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సంగతి ఇలా ఉంచితే... ‘ది రాజాసాబ్’ సినిమా కంటే ముందే మాళవికా మోహనన్ ఎంట్రీ తెలుగులో జరగాల్సింది. విజయ్ దేవరకొండ, మాళవికా మోహనన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కాల్సిన ఓ సినిమా క్యాన్సిలైంది. ఆ తర్వాత ప్రభాస్ ‘సలార్’ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం మాళవికా మోహనన్ పేరును ఈ చిత్రదర్శకుడు ప్రశాంత్ నీల్ పరిశీలించారు. కానీ ఈప్రాజెక్ట్లో మాళవిక పేరు ఫైనలైజ్ కాలేదు. ఈ చాన్స్ శ్రుతీహాసన్కు దక్కింది. ఇలా... మాళవిక టాలీవుడ్ రాక కాస్త ఆలస్యమైంది. ఇలా ఈ ఏడాది తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం కానున్న హీరోయిన్లు మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
ధనుష్-సాయిపల్లవి-శ్రీలీల సినిమా షురూ
ధనుష్ హీరోగా నటిస్తున్న ‘డీ 55’ (వర్కింగ్ టైటిల్) చిత్రానికి శనివారం క్లాప్ కొట్టారు. రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ధనుష్ వండర్బార్ ఫిల్మ్స్ ఆర్ టేక్ స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్నాయి.చెన్నైలో జరిగిన ఈ మూవీ ప్రారంభోత్సవానికి దర్శకుడు శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘మారి 2’ (2018) చిత్రంలో ధనుష్, సాయిపల్లవి జోడీగా నటించిన సంగతి తెలిసిందే. ‘డీ 55’తో ఈ జోడీ రిపీట్ అవుతోంది. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘పరాశక్తి’ మూవీ ద్వారా తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకి ‘డీ 55’ రెండో సినిమా. పీరియాడిక్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది. -
శరణ్య కూతురి రిసెప్షన్.. హాజరైన స్టార్ హీరోలు
ప్రముఖ నటి శరణ్య ఇంట పెళ్లి బాజాలు మోగాయి. నటి శరణ్య- దర్శకనటుడు పొన్వన్నన్ దంపతుల చిన్న కూతురు చాందిని పెళ్లి పీటలెక్కింది. ఫిబ్రవరి 2న వివాహం జరగ్గా శుక్రవారం చెన్నైలో ఎంతో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ ఫంక్షన్కు తమిళ స్టార్ హీరోలు ధనుష్, కార్తీ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఇద్దరూ డాక్టర్సే..చాందిని డాక్టర్ కాగా, అతడి భర్త ఫిలిప్ కూడా డాక్టర్ అని తెలుస్తోంది. 2025 డిసెంబర్లోనే వీరి నిశ్చితార్థం జరగ్గా ఇప్పుడు వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. ఇకపోతే నటి శరణ్య.. తల్లి, అత్తమ్మ పాత్రలతో పేరు తెచ్చుకుంది. ఎంతోమంది స్టార్ హీరోలకు వెండితెరపై అమ్మగా కనిపించింది. గ్యాంగ్ లీడర్, రఘువరన్ బీటెక్, 24.. ఇలా అనేక సినిమాలు చేసింది. ఈవిడ దర్శకుడు పొన్వన్నన్ను పెళ్లి చేసుకోగా వీరికి ప్రియదర్శిని, చాందిని సంతానం. కూతుర్లిద్దరూ డాక్టర్స్గా స్థిరపడ్డారు. Karthi at Saranya Ponvannan’s daughter marriage reception.💥pic.twitter.com/aWA2Ag3hN4— Christopher Kanagaraj (@Chrissuccess) February 7, 2026Dhanush at Saranya Ponvannan’s Daughter Wedding Reception💥pic.twitter.com/Ox0Yn0hpgt— Christopher Kanagaraj (@Chrissuccess) February 7, 2026 చదవండి: నా కొడుకు చేసింది తప్పే.. క్షమించండి: ప్రభాకర్ -
ఆవేశంతో చితక్కొట్టా.. దర్శకుడు, హీరో ఆపారు: విశాల్ ప్రేయసి
సెట్లో ఒకసారి ఓ వ్యక్తిని చితకబాదానంటోంది హీరోయిన్ సాయి ధన్సిక. ఆవేశం పట్టలేక అతడిని కొడుతూ ఉంటే అది చూసి దర్శకుడు, హీరో తనను ఆపారంటోంది. సాయిధన్సిక ప్రధాన పాత్రలో నటించిన సినిమా యోగి డా. ఫిబ్రవరి 6న ఈ సినిమా రిలీజైంది. ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఓ తమిళ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చింది.ఫోటో అడిగితే..అందులో సాయి ధన్సిక మాట్లాడుతూ.. కేరళలో ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఓ వ్యక్తి నాతో ఫోటో దిగాలని మా అంకుల్(నా పర్యవేక్షకుడు)ని అడిగాడు. అయితే అతడు తాగి ఉన్నాడని గమనించి ఫోటో ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. వెంటనే ఆ తాగుబోతు మా అంకుల్ను కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అదంతా చూసి నాలో కోపం కట్టలు తెచ్చుకుంది.చితకబాదా..ఆత్మరక్షణ కోసం నేను ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. ఆ టాలెంట్ అంతా అప్పుడు ఉపయోగించాను. వాడ్ని పరిగెత్తి వెళ్లి మరీ పట్టుకుని చితకబాదాను. పదినిమిషాలు కొడుతూనే ఉన్నాను. డైరెక్టర్, హీరో నా చేతులు పట్టుకుని నన్ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. నా మనుషుల్ని ఏదైనా అంటే నేను చూస్తూ ఊరుకోలేను. అందుకే విచక్షణారహితంగా కొట్టాను అని సాయి ధన్సిక చెప్పుకొచ్చింది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులో షికారు సినిమాలో నటించింది.పెళ్లిఇకపోతే సాయిధన్సిక, హీరో విశాల్ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే! గతేడాది ఆగస్టు 29న (విశాల్ పుట్టినరోజున) వీరి వివాహం జరగాల్సింది. కానీ నడిగర్ సంఘం భవనం ఇంకా పూర్తి కాకపోవడంతో పెళ్లి వాయిదా వేసుకుని ఎంగేజ్మెంట్తో సరిపెట్టుకున్నారు. మరి ఈ ఏడాది ఆగస్టు 29కైనా సాయి ధన్సిక మెడలో విశాల్ మూడు ముళ్లు వేస్తాడో, లేదో చూడాలి!చదవండి: నా సినిమా ఎఫెక్ట్ అవుతుందని భయపడ్డా: ఏడ్చేసిన చంద్రహాస్ -
అల్లు అర్జున్ నుదురుపై డైలాగ్ పేపర్.. అదీ కారణం
టాలీవుడ్ సినిమాల్లో ఒకప్పుడు దాదాపుగా తెలుగు నటీనటులు మాత్రమే కనిపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా కల్చర్ పెరిగిపోయిన తర్వాత భాషతో సంబంధం లేకుండా ఎక్కడెక్కడి వాళ్లో తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. గత కొన్నేళ్లలో చూసుకుంటే కీలకమైన సహాయ పాత్రల్లో ఎక్కువగా తమిళ, మలయాళ యాక్టర్స్ దర్శనమిస్తున్నారు. అందులో జయరామ్ ఒకరు. ఈయన అల్లు అర్జున్తో కలిసి 'అల వైకుంఠపురములో' మూవీలో నటిస్తున్నప్పుడు జరిగిన ఓ సరదా అనుభవం గురించి ఇన్నాళ్లకు బయటపెట్టారు. అది ఆసక్తికరంగా అనిపించింది.'నాకు తెలుగు తెలియదు. డైలాగ్ ఎన్నిసార్లు చదివినా సరే గుర్తుండట్లేదు. చివరకు డైలాగ్ని ఓ కాగితంపై రాసి ఎదురుగా ఉన్న అల్లు అర్జున్ నుదురు, ఛాతీపై అంటించి, దాన్ని చూస్తూ డైలాగ్ చెప్పేశాను' అని జయరామ్.. తాజాగా మలయాళ ఎఫ్ఎమ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.స్వతహాగా మలయాళ నటుడు అయిన జయరామ్.. 2018లో అనుష్క 'భాగమతి'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, ధమాకా, ఖుషీ, హాయ్ నాన్న, గుంటూరు కారం, గేమ్ ఛేంజర్, మిరాయ్ సినిమాల్లో కీలక పాత్రలు చేశారు. తనదైన యాక్టింగ్తో ఆకట్టుకున్నారు. సాధారణంగా డైలాగ్స్ విషయంలో నంబర్స్ చదువుతారు, లేదంటే పక్కనున్న వ్యక్తులు ప్రాంప్ట్ ఇస్తుంటారు. కానీ జయరామ్ మాత్రం అలా కాకుండా ఏకంగా బన్నీ నుదురుపైనే డైలాగ్ పేపర్ పెట్టి చెప్పడం అంటే కాస్త విశేషమే అని చెప్పొచ్చు. -
డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి అరెస్ట్.. అసిస్టెంట్ డైరెక్టర్ కూడా..!
గతంలో డ్రగ్స్ మహమ్మారి టాలీవుడ్ను ఇండస్ట్రీని కుదిపేసింది. ఎంతో సినీ ప్రముఖులు సైతం విచారణ ఎదుర్కొన్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా చెన్నైలో మలయాళ నటి అంజు కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. మలయాళ, తమిళ చిత్రాల్లో నటించిన ఆమెను డ్రగ్స్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సినీ రంగంలో ఈ డ్రగ్స్ దందా మరోసారి హాట్ టాపిక్గా మారింది.చెన్నై నగరంలో డ్రగ్స్ సరఫరా జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పోలీసులు భారీ మొత్తంలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. విఘ్నేశ్వరన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు ఇచ్చిన సమాచారంతో వెంకటేశ్ అనే మరో వ్యక్తితో పాటు నటి అంజు కృష్ణ, అసిస్టెంట్ డైరెక్టర్ విన్సీ నివేతను కూడా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 9 మొబైల్ ఫోన్లు, ఒక కారును సీజ్ చేశారు.కాగా.. కేరళలోని త్రిసూర్కు చెందిన అంజు కృష్ణ మోడలింగ్తో తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత మలయాళం, తమిళ సినిమాల్లో నటించింది. జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన 'ఆరో' (Aaro) సినిమాతో ఆమె గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా మలయాళంలో 'సుమేశ్ రమేశ్', ఆకాశం కడన్'లాంటి చిత్రాల్లో నటించింది. తమిళంలో 'వెల్లిమలై' అనే చిత్రంలో మెరిసింది. తాజాగా అంజు కృష్ణ డ్రగ్స్ కేసులో దొరకడం అభిమానులను షాకింగ్కు గురి చేస్తోంది. -
హీరోకి వాచ్ గిఫ్ట్ ఇచ్చిన 'పుష్ప' నటుడు
'పుష్ప' సినిమా ఫేమ్ డాలి ధనంజయ నటుడు మాత్రమే కాదు నిర్మాత కూడా! అతడికి డాలి పిక్చర్స్ అని ఓ బ్యానర్ ఉంది. ఆ బ్యానర్ కింద తెరకెక్కిన తాజా చిత్రం జేసీ. ద యూనివర్సిటీ అన్నది ఉపశీర్షిక. సూర్య ప్రఖ్యాత్, భావన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కన్నడ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 6న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రీమియర్స్లో వాచీ గిఫ్ట్అయితే ఒకరోజు ముందు ప్రీమియర్స్ వేశారు. ఈ సందర్భంగా అందరినోటా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో డాలి ధనంజయ సంతోషపడిపోయాడు. దీంతో థియేటర్లోనే సూర్య ప్రఖ్యాత్ను హత్తుకుని అతడిపై ముద్దుల వర్షం కురిపించాడు. అంతేకాదు, వెంటనే తన చేతికున్న వాచీని అతడికి బహుకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సినిమాడాలి ధనంజయ (Daali Dhananjaya) విషయానికి వస్తే.. ఈయన చివరగా తమిళంలో పరాశక్తి సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం కన్నడలో నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ఈయన అప్పుడప్పుడు వార్తాపత్రికల్లో కథనాలు కూడా రాస్తుంటాడు. View this post on Instagram A post shared by 𝐊𝐚𝐧𝐧𝐚𝐝𝐚 𝐍𝐞𝐰𝐬 𝐀𝐧𝐝 𝐊𝐅𝐈 𝐈𝐧𝐬𝐢𝐝𝐞𝐫 | 𝐆𝐮𝐛𝐛𝐢 (@kannadanews_kfiinsider) చదవండి: ఒక్కమాటతో తారక్పై గౌరవం మరింత పెరిగింది: పూజా బేడీ -
అడ్జస్ట్మెంట్ తప్పదు.. అమ్మతో చెప్పేసరికి!: స్పైడర్ నటి
మలయాళ నటి కని కుస్రుతి సొంత భాషతో పాటు తమిళ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ చిత్రాల్లోనూ నటించింది. తెలుగులో స్పైడర్ మూవీలో విలన్ తల్లిగా యాక్ట్ చేసింది. తాజాగా ఈ నటి అస్సి అనే హిందీలో సినిమా యాక్ట్ చేసింది. ఇందులో అత్యాచార బాధితురాలిగా కనిపించనుంది. ఈ మూవీ ఫిబ్రవరి 20న విడుదల కానుంది.అంత ఈజీ కాదుఅయితే కుస్రుతి ఒకానొక సమయంలో సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలనుకుంది. గతంలో ఈ విషయం గురించి కని మాట్లాడుతూ.. నేను సినిమా ఇండస్ట్రీలో మంచి యాక్టర్ అవ్వాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. తీరా ఇక్కడికి వచ్చాక అదంత ఈజీ కాదని తెలుసుకున్నాను. కొందరు దర్శకనిర్మాతలు లైంగిక వాంఛలు తీర్చితే అవకాశాలిస్తామన్నారు. ఓపక్క అడ్జస్ట్ అవమని ఒత్తిళ్లు, మరోపక్క నటిగా పరిమితులు విధించేవారు. అమ్మతోనూ అదేమాటకొందరైతే నేరుగా మా అమ్మతో మాట్లాడారు. ఫలానా సినిమాలో మీ కూతురు కనిపించాలంటే తను అడ్జస్ట్ అవ్వాల్సిందే అన్నారు. ఇవన్నీ భరించలేకపోయాను. ఈ ఇండస్ట్రీలో బతకడం కష్టమని వెనక్కు వచ్చేశాను. థియేటర్ డ్రామాలు చేసుకుంటూ పోయాను. కానీ, ఆర్థిక పరిస్థితుల కారణంగా మళ్లీ సినిమాల్లోకి రావాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది.సినిమాకని కుస్రుతి సినిమాల విషయానికి వస్తే.. 2003లో అన్యర్ మూవీతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. బిర్యానీ, కేరళ కేఫ్, గర్ల్స్ విల్ బి గర్ల్స్, ఆల్ వి ఇమాజిన్ ఆజ్ లైట్ వంటి పలు చిత్రాల్లో నటించింది. కిల్లర్ సూప్, పోచర్, నాగేంద్రాస్ హనీమూన్ వెబ్ సిరీస్లలోనూ యాక్ట్ చేసింది.చదవండి: నా కొడుకు దుబారా ఖర్చు చేస్తున్నాడా? బిల్లు చూపించు: సునీల్ శెట్టి -
'మూడేళ్లుగా వేధింపులు.. తట్టుకోలేకపోతున్నా': నటి ఆవేదన
'లవ్ టుడే', 'మామన్నన్' లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి రవీనా రవి. అంతేకాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫేమస్ అయింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ,మలయాళం సినిమాలకు ఆమె తన వాయిస్ ఇచ్చింది. తెలుగులో ఓకే బంగారం, ప్రేమమ్, 2.0, నవాబ్ వంటి సినిమాల్లో హీరోయిన్లకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేసింది. చెన్నైకి చెందిన రవీనా రవి మొదట డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ పలు సినిమాల్లో కూడా నటించింది.అయితే తాజాగా తాను వేధింపులకు గురైనట్లు రవీనా వెల్లడించింది. సోషల్ మీడియాలో మూడేళ్లుగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనతో పాటు కుటుంబ సభ్యులను, స్నేహితులను వేధిస్తున్న వ్యక్తుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రాస్తూ.. "ప్రజలందరికీ అవగాహన కోసమే చెబుతున్నా.. దయచేసి ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దు. మూడేళ్లుగా మమ్మల్ని వేధిస్తున్నాడు. నా కుటుంబాన్ని, స్నేహితులను, నన్ను నేను రక్షించుకోవడానికి ఈ పోస్ట్ చేస్తున్నా. పోలీసు ఫిర్యాదులు, హెచ్చరికలతో ఇదంతా ఆగిపోతుందని ఆశించి ఇప్పటి వరకు మౌనంగా ఉన్నా. కానీ సబరీష్, అతని సోదరుడు నాపై, నా కుటుంబంపై వేధింపులు కొనసాగిస్తున్నారు. అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నారు. నన్ను మాత్రమే కాకుండా నాకు దగ్గరగా ఉన్నవారిని కూడా టార్గెట్ చేసుకుంటున్నారు. నా వల్ల ఈ పరిస్థితిని వచ్చినందుకు నా స్నేహితులుస, కుటుంబ సభ్యులకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. మేము చట్టపరమైన మార్గాలను ప్రయత్నించాము, కానీ వేధింపులు ఆగలేదు" అని ఆవేదన వ్యక్తం చేసింది.అతను పలు నకిలీ ఖాతాల నుంచి నన్ను మాత్రమే కాకుండా.. ఇతర మహిళా నటీమణులను, ఆర్టిస్టులను కూడా వేధిస్తున్నాడని రవీనా రవి ఆరోపించింది. మేము ఇప్పటికే కలిశాం..మాకు పెళ్లి కుదిరింది అంటూ వంటి కల్పిత కథలను సృష్టిస్తున్నాడని తెలిపింది. ఈ నీచుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ అందరూ కూడా బ్లాక్ చేయాలని సన్నిహితులకు విజ్ఞప్తి చేసింది. చెన్నై నగరం మహిళలకు అత్యంత సురక్షితమైందిగా భావిస్తారని.. ఇది నిరూపించాలంటే ఈ నీచులపై అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానంటూ తన పోస్ట్లో రాసుకొచ్చింది. అంతేకాకుండా సీఎం స్టాలిన్తో పాటు చెన్నై పోలీసులకు ట్యాగ్ చేసింది. ఇది ప్రస్తుతం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.కాగా...రవీనా రవి జవాన్ సినిమాలో దీపికా పదుకోన్కు తెలుగు వాయిస్ అందించింది. లవ్ టుడే, మామన్నన్ వంటి సినిమాల్లో కీలకమైన పాత్రలలో మెరిసింది. నయనతార, త్రిష,నిధి అగర్వాల్.మాళవిక మోహన్,శ్రీనిధి శెట్టి, అమలా పాల్,రాశీ ఖన్నా,కాజల్ అగర్వాల్, సమంత వంటి స్టార్ హీరోయిన్లకు వివిధ భాషలలో డబ్బింగ్ చెప్పింది. View this post on Instagram A post shared by Raveena Ravi (@raveena1166) -
ఓటీటీకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో మలయాళ చిత్రాలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ మూవీ సర్వం మాయ అభిమానుల ఆదరణ దక్కించుకుంటోంది. దీంతో మలయాళ చిత్రాల కోసం ఓటీటీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. ఇక క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో మరో మలయాళ థ్రిల్లర్ మూవీ అభిమానులను అలరించేందుకు వచ్చేస్తోంది. ఇంతకీ ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.నివిన్ పౌలీ హీరోగా నటించిన చిత్రం బేబీ గర్ల్. ఈ సినిమా థియేటర్లలో రిలీజై మలయాళ ఫ్యాన్స్ను అలరించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ మూవీ ఫిబ్రవరి 12 నుంచి సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఈ మూవీ ట్రైలర్ను కూడా విడుదల చేసింది. ఈ చిత్రానికి అరుణ్ వర్మ దర్శకత్వం వహించారు. కాహా.. ఆస్పత్రి నుంచి ఓ చిన్నారి ఎలా అదృశ్యమైందన్న పాయింట్తో ఈ సినిమా రూపొందించారు. ఈ మూవీలో లిజోమోల్, సంగీత్ ప్రతాప్ ప్రధాన పాత్రలు పోషించారు. A missing baby girl. An attendant on the run. A truth darker than the crime.Nivin Pauly, Lijomol, and Sangeeth Pratap headline this high-tension thriller.Watch #BabyGirl, streaming from 12th February, only on Sony LIV.@NivinOfficial pic.twitter.com/WnyS2vnXHG— Sony LIV (@SonyLIV) February 5, 2026 -
'360 గ్రాముల బంగారం'.. పాదపూజ చేసిన నటుడు
'మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు! మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు! నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు..' నిజమే కదా.. పాటలో చెప్పినట్లుగా ఈరోజుల్లో మానవత్వం అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. పేరాశతో దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు చేసిన పని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె నిజాయితీకి యావత్ దేశం చప్పట్లు కొడుతోంది.నిజాయితీజనవరి 11న చెన్నైలోని టీ నగర్లో పద్మ అనే మహిళ రోజూలాగే రోడ్డు శుభ్రం చేస్తోంది. చెత్త ఊడుస్తుండగా ఆమెకు ఓ బ్యాగు దొరికింది. అందులో రూ.45 లక్షలు విలువ చేసే 45 సవర్ల బంగారు ఆభరణాలు ఉండటంతో నేరుగా పోలీస్ స్టేషన్లో అప్పగించి తన నిజాయితీ చాటుకుంది. అది తెలుసుకున్న రజనీకాంత్ ఆమెను నేరుగా ఇంటికి పిలిచి మరీ బంగారు గొలుసు కానుకగా ఇచ్చాడు.ఘనంగా సన్మానంఅప్పటినుంచి పద్మ పేరు మారుమోగుతూనే ఉంది. తాజాగా దర్శకనటుడు పార్తీబన్ (R Parthiban) ఓ కాలేజీలో జరుగుతున్న ఈవెంట్కు వెళ్లాడు. పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను కూడా ఆహ్వానించాడు. స్టేజీపై అందరిముందు ఆమెను ఘనంగా సన్మానించాడు. ఆమెకు చెప్పులు తొడిగి, కాళ్లకు నమస్కరించి చీర కానుకగా ఇచ్చాడు. అలాగే నెత్తిన కిరీటం పెట్టాడు. ఈ వీడియోను ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేశాడు.అందుకే పాదపూజ చేశా..బంగారం విలువ పెరిగేకొద్దీ మానవత్వం తగ్గిపోతుంది. ఒక గ్రాము లక్ష రూపాయలకు చేరుకుంటున్నప్పుడు దానికోసం వేలాది మంది ప్రాణాలే పోవచ్చు. కానీ, పద్మ అనే మహిళ బంగారం కన్నా మానవత్వమే గొప్ప అని నిరూపించింది. సంవత్సరంలో 360 రోజులు పనిచేసే ఆమె 360 గ్రాముల బంగారం దొరికితే దాన్ని యజమానికి తిరిగిచ్చేసింది. అందుకే నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన కాలేజీ ఫంక్షన్కు తననూ తీసుకెళ్లాను. తనకు పాదపూజ చేసి కృతజ్ఞతలు చెప్పాను అని రాసుకొచ్చాడు. సినిమాఇది చూసిన నెటిజన్లు మీరు నిజంగా గొప్పవారు అని కొనియాడుతున్నారు. తమిళ నటుడు ఆర్.పార్తీబన్ నటుడు మాత్రమే కాదు, దర్శకుడు నిర్మాత కూడా! సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఈయన వందకు పైగా చిత్రాల్లో యాక్ట్ చేశాడు. యుగానికి ఒక్కడు, రచ్చ, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్, ఇడ్లీ కొట్టు వంటి పలు చిత్రాల్లో నటించాడు. సుడల్ వెబ్ సిరీస్లోనూ కనిపించాడు. தங்கத்தின் மதிப்பு ஏற ஏற, மனிதத்தின் மரியாதை குறைந்துகொண்டே போய், ஒரு கிராம் ஒரு லட்ச ரூபாயை நெருங்கும்போது, லட்சக்கணக்கான உயிர்கள் கொல்லப்படுவது உறுதியாகிவிடும்.வருடத்தில் 360 நாளாவது உழைக்கும் துப்புரவு பணியாளர் திருமதி பத்மா அவர்கள், குப்பையில் கிடந்த 360 கிராம் நகையை… pic.twitter.com/tTRtd6gLWP— Radhakrishnan Parthiban (@rparthiepan) February 4, 2026 చదవండి: ఆరుసార్లు రక్తమార్పిడి.. మూడున్నర నెలలు ఆస్పత్రిలో.. నిక్ ఎమోషనల్ -
'వారణాసి' ఓటీటీ డీల్ 650 కోట్లా..? హాట్ గాసిప్
దర్శకుడు రాజమౌళి సినిమాలకు పబ్లిసిటీ ఎలా తెచ్చుకోవాలో బాగా తెలుసు. రూపాయి ఖర్చు లేకుండా సోషల్ మీడియాలో హడావుడి చేయడం ఆయన స్టైల్. తాజాగా వారణాసి టైటిల్ అనౌన్స్మెంట్, గ్లింప్స్ రిలీజ్ తర్వాత కేవలం రెండు ఫ్లెక్సీలు వారణాసిలో కట్టడం ద్వారా సోషల్ మీడియాలో భారీ చర్చ రేపారు. విడుదల ఇంకా ఏడాది దూరంలో ఉన్నప్పటికీ, ఇప్పటికే ఓటీటీ అమ్మకాలపై మార్కెటింగ్ మొదలైంది. ఈ ప్రాజెక్ట్ చిన్నది కాదు. వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోంది. సినిమాకు మాక్సిమమ్ రాబడి ఓటీటీ రైట్స్ ద్వారానే వస్తుంది. వరల్డ్ వైడ్ రైట్స్ రూపంలో అమ్మకం జరిగాలి. దానికి నెట్ఫ్లిక్స్ వంటి సంస్థలే ఆ స్థాయి డీల్ క్లోజ్ చేయగలవు. లేదా బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలనే ఉద్దేశంతో జియో, హాట్స్టార్ వంటి సంస్థలు ముందుకు రావచ్చు. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ డౌన్లో ఉంది. ఏడాది క్రితం అయితే భారీ రేటు సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టైటిల్ అనౌన్స్మెంట్, గ్లింప్స్ రిలీజ్ సమయంలోనే డీల్ క్లోజ్ కావాల్సింది. కానీ అది జరగలేదు. నెలలు గడిచిన తర్వాతే రిలీజ్ డేట్ ప్రకటించారు. అంతేకాక రాజమౌళి ఇంటర్నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఓటీటీ డీల్ కోసం జరుగుతోందని అనుకోవాల్సి వస్తోంది. సోషల్ మీడియాలో వారణాసి ఓటీటీ రైట్స్ 600 కోట్లకు పైగా ఉంటాయని వార్తలు వస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ప్రభాస్ నటించిన స్పిరిట్ ఓటీటీ డీల్ 170 కోట్లుగా టాక్ ఉంది. అది కూడా పాన్ ఇండియా లెవల్లో క్రేజీ ప్రాజెక్ట్. కానీ పాన్ వరల్డ్ స్థాయికి చేరలేదు. సందీప్ వంగా దర్శకత్వం వహించిన ఆ సినిమా క్రేజ్ వేరే. రాజమౌళి సినిమాల స్పాన్ వేరే అయినప్పటికీ లెక్కలు వేసుకుంటే 340–440 కోట్ల మధ్యే డీల్ సాధ్యపడొచ్చని అంచనా.650 కోట్ల రేంజ్లో ఓటీటీ డీల్ క్లోజ్ అయిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు. అవి కేవలం క్రేజ్ కోసం పుట్టినవే. నిజంగా అలాంటి హెవీ డీల్ జరిగితే, అమౌంట్ బయటకు రాకపోయినా, డీల్ ఫైనల్ అయిన వార్త మాత్రం ముందుగానే బయటకు వచ్చేది. డీల్ క్లోజ్ అయితే సినిమా చకచకా ఫినిష్ చేయడంపై టీమ్ దృష్టి పెట్టేది. ప్రస్తుతం వారణాసి ఓటీటీ రైట్స్ 600–650 కోట్ల రేంజ్లో క్లోజ్ అయ్యాయని చెప్పడానికి ఆధారాలు లేవు. ఇది సోషల్ మీడియా హైప్ మాత్రమే. వాస్తవానికి, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో 400 కోట్ల వరకు డీల్ క్లోజ్ అయితే అదే పెద్ద డీల్ అని చెప్పొచ్చు. -
జెనీలియా వేగన్గా ఎందుకు మారిపోయిందో తెలుసా?
జెనీలియా.. ఈ పేరు చెప్పగానే చాలామందికి హ..హ.. హాసిని అన్న డైలాగ్ గుర్తుకొస్తుంది. సై, హ్యాపీ, బొమ్మరిల్లు, రెడీ వంటి పలు సినిమాలతో తెలుగులో టాప్ హీరోయిన్గా రాణించింది. తర్వాత హిందీ, మరాఠి సినిమాలతో బిజీ అయిపోయింది. అయితే గతేడాది జూనియర్ మూవీతో టాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చింది.సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబానికి తప్పకుండా టైం కేటాయిస్తుంది. భర్త రితేశ్, పిల్లలు రియాన్, రాహుల్తో సరదాగా గడుపుతుంది. అయితే కొడుకు అడిగిన ఒకే ఒక్క ప్రశ్నతో జెనీలియా పూర్తి శాకాహారిగా మారిపోయిందన్న విషయం మీకు తెలుసా?కొడుకు అమాయక ప్రశ్నజెనీలియా (Genelia D'souza) జంతు ప్రేమికురాలు. కానీ చిన్నప్పటినుంచి పుష్టిగా మాంసం లాగించేది. ఒకరోజు ఆమె పెద్ద కొడుకు రియాన్ స్కూల్ నుంచి రాగానే తల్లిని ఓ ప్రశ్న అడిగాడు. అమ్మా.. నువ్వు మన ఫ్లాష్ (కుక్క)ను ప్రేమిస్తావు, కానీ కోడిని మాత్రం తింటావు. రెండింటికి మధ్య తేడా ఏముంది? రెండూ జంతువులే కదా? అని అడిగాడు. ఆ ఒక్క ప్రశ్న ఆమెను ఆలోచనలో పడేసింది. మాంసాహారానికి దూరంగా ఉండాలన్న ఆలోచనవైపు నడిపించింది. భార్యాభర్తలిద్దరూ..అలా జెనీలియా 2017లో శాకాహారిగా మారింది. నాన్వెజ్కు దూరంగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్తోంది. అయితే మొదట్లో కోడిగుడ్లు, చీజ్, ఇతరత్రా డెయిరీ పదార్థాలు మాత్రం ఆహారంలో తీసుకునేది. శాఖాహారం తీసుకున్నప్పుడు తన శరీరంలో పాజిటివ్ మార్పులు వచ్చాయని సంతోషించింది. జెనీలియా భర్త రితేశ్ దేశ్ముఖ్ కూడా ఒకప్పుడు మాంసప్రియుడే. కానీ ఒకానొక సమయంలో అది కరెక్ట్ కాదనిపించడంతో 2016లో నాన్వెజ్ తినడం మానేశాడు.వేగనిజం2020లో కరోనా తాండవిస్తున్న సమయంలో దంపతులిద్దరికీ ఇంట్లో బోలెడంత సమయం దొరికింది. అప్పుడే వీరిద్దరూ నెమ్మదిగా డెయిరీ పదార్థాలకు కూడా స్వస్తి పలికి వేగన్కు జై కొట్టారు. వేగన్ అంటే.. జంతు సంబంధిత ఆహారాలకు (మాంసంతో పాటు పాలు, గుడ్లు, నెయ్యి వంటివి) దూరంగా ఉంటూ మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎంచుకోవడం. దీన్నే వేగనిజం అని కూడా అంటారు.చదవండి: బుల్లెట్ సునీల్గా రాజశేఖర్.. గ్లింప్స్ చూశారా? -
పెద్దమ్మ తల్లి ఆలయంలో ఛార్మి, పూరి పూజలు.. వీడియో వైరల్
జూబ్లీహిల్ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని హీరోయిన్ ఛార్మి, డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శించుకున్నారు. వీరిద్దరు హైదరాబాద్లోని పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దమ్మ దర్శనం అనంతరం వీరిద్దరు బయటికొస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. టాలీవుడ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విజయ్ సేతుపతి బర్త్డే సందర్భంగా నేడు(జనవరి 16) ఈసినిమా టైటిల్తో పాటు ఫస్ట్లుక్ని విడుదల చేశారు. ఈ చిత్రానికి స్లమ్ డాగ్ అనే టైటిల్ని ఖరారు చేశారు. 33 టెంపుల్ రోడ్ అనే ట్యాగ్లైన్ తో వస్తున్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో విజయ్ సేతుపతి బిచ్చగాడిలా చిరిగిన దుస్తులు ధరిస్తూనే.. చేతిలో కత్తి పట్టుకొని కళ్లజోడుతో పవర్ఫుల్గా కనిపించాడు.కాగా.. ఈ పాన్ ఇండియా చిత్రంలో సంయుక్త హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. Director #PuriJagannadh & #CharmyKaur Spotted At Shri Peddamma Talli Temple pic.twitter.com/ofas8ZxFfC— idlebrain.com (@idlebraindotcom) February 4, 2026 -
'పిల్లలందరికీ తండ్రులే హీరోలురా'.. ఆసక్తిగా గ్లింప్స్
బిజినెస్మేన్గా కెరీర్ ప్రారంభించి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అరుల్ శరవణన్. ది లెజెండ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆయన లెజెండ్ శరవణన్గా ప్రేక్షకుల మనసుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తోన్న చిత్రం లీడర్. ఈ మూవీకి దురై సెంథిల్కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఫైట్ సీన్స్ చూస్తుంటే కూతురి కోసం తండ్రి ఎంతవరకైనా వెళ్తాడనే కాన్సెప్ట్తో ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్ చివర్లో పిల్లలందరికీ తండ్రులే హీరోలురా అంటూ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ను అలరిస్తోంది. కాగా.. ఈ సినిమాకు జీబ్రాన్ సంగీతమందిస్తున్నారు. -
అందుకే పిల్లలు వద్దనుకున్నా: నటి
ఓ వయసుకు రాగానే పెళ్లి చేసుకోవం, పిల్లల్ని కనడం అనేది ఒక రూల్లా అయిపోయింది. కానీ, పెళ్లయ్యాక తప్పకుండా పిల్లల్ని కనాల్సిన అవసరం లేదంటోంది మలయాళ నటి లీనా. బాధ్యతగా ఉంటామనుకుంటే తప్ప పిల్లల జోలికి వెళ్లకూడదని చెప్తోంది. లీనా మాట్లాడుతూ.. సంతానం వద్దని నేను బలంగా నిర్ణయించుకున్నాను. ఎందుకంటే పిల్లల్ని కనడానికి ముందు వాళ్లను ఎలా చూసుకోవాలి? ఎలా పెంచాలి? అన్న ప్లానింగ్ ఉండాలి. బాధ్యత అవసరంతల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా పిల్లల్ని పెంచాలి. పెళ్లవగానే పిల్లల్ని కనాలంటారు. దానికి నేను వ్యతిరేకం. చిన్న వయసులోనే పిల్లల్ని కనాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. కిడ్న్ను హ్యాండిల్ చేసే మెచ్యూరిటీ కూడా ఆ వయసులో ఉండదు. నా చిన్నప్పుడు పేరెంట్స్ నన్ను సరిగా పెంచలేదని అనుకుంటూ ఉండేదాన్ని. నాపై ఇంకాస్త ఫోకస్ చేయాల్సిందని ఫీలయ్యేదాన్ని. కొన్నిసార్లు స్వేచ్ఛ కోసం పోరాడేదాన్ని. సంతానం వద్దనుకున్నా..మరికొన్నిసార్లు నా పనులన్నీ నన్నే చేసుకోమంటున్నారని కోప్పడేదాన్ని. ఒక్కోసారేమో నాకు ఎవరూ సపోర్ట్ చేయలేడం లేదు, ప్రతిసారి ఒంటరిగా వదిలేస్తున్నారని బాధపడేదాన్ని. ఇలా ఎప్పుడూ ఏదో ఒకరకమైన విచారంలో బతికేదాన్ని. నాలాంటి పరిస్థితి ఇంకొకరికి రాకూడదనే పిల్లల్ని కనాలన్న ఆలోచన కూడా రానివ్వడం లేదు. పైగా నేను ఎంచుకుంది యాక్టింగ్ కెరీర్. కెరీర్ఇక్కడ కుటుంబం, కెరీర్.. రెండూ చూసుకోవడం అంటే కష్టం. తల్లిదండ్రులిద్దరూ కెరీర్ అని పరుగులు పెడితే పిల్లల్నెవరు చూసుకుంటారు. అందుకే పిల్లల్ని ప్లాన్ చేయలేదు అని చెప్తోంది. మలయాళంలో అనేక సినిమాలు చేసిన లీనా తెలుగులో డాక్టర్ చక్రవర్తి మూవీలో కనిపించింది. షైతాన్ అనే తెలుగు వెబ్ సిరీస్లోనూ అలరించింది. కాగా లీనా 2004లో అభిలాష్ కుమార్ను పెళ్లి చేసుకుంది. వైవాహిక జీవితంలో విభేదాలు రావడంతో 2013లో విడాకులు తీసుకున్నారు. తర్వాత గగన్యాన్ వ్యోమగామి ప్రశాంత్ నాయర్ను వివాహం చేసుకుంది.చదవండి: అందువల్లే 4 ఏళ్లు సినిమాలకు బ్రేక్: మాధవన్ -
అతడి వల్లే 4 ఏళ్లు సినిమాలకు దూరమయ్యా: మాధవన్
ఒకతను చేసిన చిన్న పని వల్ల నాలుగేళ్లు సినిమాలకే దూరంగా ఉన్నానంటున్నాడు ప్రముఖ నటుడు ఆర్.మాధవన్. సాలా ఖడూస్ (2016) సినిమాకు ముందు బ్రేక్ తీసుకున్నానని, అది తనకెంతో పనికొచ్చిందంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్లో ఓ తమిళ పాట చిత్రీకరణ కోసం ఆరెంజ్ ప్యాంట్, గ్రీన్ షర్ట్ ధరించి రోడ్డు మధ్యలో నిల్చున్నాను. నేనెవరో చూపిస్తా అన్నంత కోపంఅక్కడే కూర్చున్న ఓ రైతు నన్ను నిర్లక్ష్యంగా ఓ చూపు చూశాడు. అది నాకసలు నచ్చలేదు. చెన్నైకి రా.. నేనెవరో నీకు చూపిస్తా అని మనసులో అనుకున్నాను. కానీ ఎందుకో ఆ చూపు నన్ను వెంటాడింది. నన్ను ఆలోచింపజేసేలా చేసింది. నిజంగానే అసలు నేనేం చేస్తున్నాను అని అంతర్మథనానికి లోనయ్యాను. అందుకే బ్రేక్ తీసుకున్నాను. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాను. అదిప్పటికీ పనికొస్తోందిసినిమాలు మానేసి ప్రదేశాలు తిరగడం మొదలుపెట్టాను. రిక్షా తొక్కేవారి దగ్గరి నుంచి చాలామందితో మాట్లాడాను. వారి జీవనశైలి, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నాను. ఇలా అన్నింటినీ పరిశీలించాను. ఆ పర్యటన నాకెన్నో పాఠాలు నేర్పింది. ఎలాంటి పాత్రలు చేయాలి? ఎలాంటి సినిమాల్లో కనిపించాలన్నదానిపై స్పష్టత వచ్చింది. ఆ నాలుగేళ్లలో నేర్చుకున్నదాని ఫలితాన్ని ఇప్పటికీ అనుభవిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. మాధవన్ చివరగా ధురంధర్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ధురంధర్ 2తో పాటు తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాడు.చదవండి: నాకు స్టార్డమ్ తెచ్చిన మూవీ అదే.. : మహేశ్బాబు -
ఐదు భాషల్లో పళ్లి చట్టంబి
‘2018’ మూవీ ఫేమ్ టొవినో థామస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పళ్లి చట్టంబి’. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్నారు. వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 9న తెలుగు, మలయాళ, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.కాగా మంగళవారం కయాదు లోహర్ ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు. ‘‘1950, 1960 దశకాల నేపథ్యంలో సాగే పీరియాడిక్ మూవీ ‘పళ్లి చట్టంబి’. భారీ బడ్జెట్తో రూ పొందుతోన్న ఈ మూవీలో ఇప్పటివరకూ చూడని సరికొత్త పాత్రలో టొవినో థామస్ కనిపించనున్నారు. ‘డ్రాగన్’ మూవీ సక్సెస్ తర్వాత కయాదు లోహర్కి ప్రేక్షకుల్లో పెరిగిన క్రేజ్ మా సినిమాకి ప్లస్ కానుంది.ఇటీవలే ఐదు భాషల్లో రిలీజ్ చేసిన ‘పళ్లి చట్టంబి’ మోషన్ పోస్టర్కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి’’ అని మేకర్స్ తెలి΄ారు. విజయ రాఘవన్, సుధీర్ కరమన, బాబురాజ్, వినోద్ కేదమంగళం, ప్రశాంత్ అలెగ్జాండర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా: టిజో టోమీ, సంగీతం: జేక్స్ బిజోయ్, అసోసియేట్ ప్రోడ్యూసర్స్: మేఘ శ్యామ్, తంజీర్. -
వన్స్ మోర్
చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కొనసాగుతుంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ... ఇలా ఏ ఇండస్ట్రీ చూసుకున్నా ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే ఈ ట్రెండ్ తెలుగులో ఇంకాస్త ఎక్కువగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో సూపర్ హిట్గా నిలిచిన మూవీస్ని ‘వన్స్ మోర్’ అంటూ మళ్లీ చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఉత్సాహంగా ఉంటున్నారు. ఈ కారణంగా తమ సినిమాలను మరోసారి విడుదల చేసేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు.హీరోల పుట్టినరోజు కావచ్చు... లేదా ఆ సినిమాకి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన రోజు కావచ్చు.. అదీ కాకుంటే ఆ సినిమాకి ఆడియన్స్లో ఉన్న ప్రత్యేకమైన క్రేజ్... ఇలా సందర్భాలను బట్టి తమ సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. పైగా హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తుండటంతో ఆయా హీరోల అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా మరోసారి చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఈ కారణంగానే రీ రిలీజ్లో కూడా ఆయా సినిమాలు భారీగానే వసూలు చేస్తున్నాయి. పైగా గత చిత్రాలను 4కె క్వాలిటీకి మార్చి అందిస్తుండటంతో ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ధనుష్ నటించిన ‘3’ సినిమా, రామ్చరణ్ నటించిన ‘ఆరెంజ్’, రాఘవ లారెన్స్ ‘కాంచన’, నాగచైతన్య ‘లవ్ స్టోరీ’, ‘ఏమాయ చేసావె’, ఉదయ్ కిరణ్ ‘మనసంతా నువ్వే’ వంటి అరడజను సినిమాలు రీ రిలీజ్కి ముస్తాబవుతున్నాయి. ఆ వివరాలు, విశేషాలు తెలుసుకుందాం.పదమూడేళ్ల తర్వాత... ధనుష్ హీరోగా నటించిన చిత్రం ‘3’. ఆయన సతీమణి ఐశ్వర్య (ఐశ్వర్యా రజనీకాంత్) ఈ మూవీతో డైరెక్టర్గా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. ప్రభు, భానుప్రియ, రోహిణి ఇతర పాత్రలు పోషించారు. కె. విమలాగీత, ధనుష్ నిర్మించిన ఈ సినిమా 2012 మార్చి 30న విడుదలైంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా హిట్గా నిలిచింది. ప్రధానంగా ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ప్రత్యేకించి.. ధనుష్ పాడిన ‘వై దిస్ కొలవెరి డి...’ పాట యూత్ని ఉర్రూతలూగించింది. ‘కొలవెరి డి...’ పాటతో రిలీజ్కు ముందే ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు జనాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ మూవీ అదే స్థాయిలో ఓపెనింగ్స్ని రాబట్టింది. తొలి భాగం అందమైన ప్రేమకథను ఆవిష్కరించిన ఈ చిత్రం సెకండాఫ్లో మాత్రం విషాదాంత ప్రేమ కథగా మిగిలింది. ఈ చిత్రంలో రామ్ పాత్రలో ధనుష్, జనని పాత్రలో శ్రుతీహాసన్ అద్భుతంగా నటించారు. తమిళ, తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా పదమూడేళ్ల తర్వాత ఈ నెల 6న మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది.పదిహేనేళ్ల తర్వాత... ‘మగధీర’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం ‘ఆరెంజ్’. ‘బొమ్మరిల్లు’ మూవీ ఫేమ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా కథానాయికగా నటించారు. ప్రకాశ్రాజ్, షాజాన్ పదంసీ, ప్రభు, బ్రహ్మానందం, శ్రీనివాస్ అవసరాల, మధురిమ, మంజుల, సంజయ్, సమీర్, పవిత్రా లోకేష్, వెన్నెల కిషోర్, సంచిత, నాగబాబు ఇతర పాత్రలు పోషించారు. నాగబాబు నిర్మించిన ఈ సినిమా 2010 నవంబరు 26న విడుదలైంది. ‘మగధీర’ సినిమాతో బ్లాక్బస్టర్ అందుకోవడంతో పాటు వందకోట్లకు పైగా వసూళ్లు సాధించారు రామ్చరణ్. ఆ మూవీ తర్వాత పూర్తి లవర్ బాయ్ లుక్లో నటించిన చిత్రం ‘ఆరెంజ్’.భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక΄ోయింది. కానీ, ఈ మూవీ బుల్లితెరపై మాత్రం సూపర్హిట్గా నిలిచింది. ప్రత్యేకించి హారిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ మూవీలోని పాటలు యూత్ని ఆకట్టుకున్నాయి. ఆస్ట్రేలియా నేపథ్యంలో సాగే ఈ కథలో రామ్ పాత్రలో రామ్చరణ్, జాను క్యారెక్టర్లో జెనీలియా తమదైన నటనతో ఆకట్టుకున్నారు. పదిహేనేళ్ల తర్వాత మరోసారి ఈ నెల 7న ‘ఆరెంజ్’ సినిమా రీ రిలీజ్ అవుతుండటం విశేషం. పద్నాలుగేళ్ల తర్వాత... ‘ముని’ సినిమాతో తనదైన నటనతో ప్రేక్షకులను భయపెట్టారు రాఘవ లారెన్స్. ఆ సినిమాకి సీక్వెల్గా ఆయన లీడ్ రోల్లో నటించడంతో పాటు దర్శకత్వం వహించిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘కాంచన’. ఈ సినిమాలో రాయ్లక్ష్మి హీరోయిన్గా నటించారు. శరత్కుమార్, కోవై సరళ, దేవదర్శిని, శ్రీమాన్ ఇతర పాత్రల్లో నటించారు. రాఘవ లారెన్స్, ఎన్. రాధ నిర్మించిన ఈ సినిమా 2011 జూలై 15న విడుదలైంది. ఈ సినిమాని తెలుగులో నిర్మాత బెల్లంకొండ సురేష్ రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మరోసారి భయపెట్టింది. ముఖ్యంగా రాఘవ లారెన్స్, శరత్ కుమార్ నటన హైలెట్గా నిలిచింది. ప్రత్యేకించి శరత్కుమార్ ఈ మూవీలో హిజ్రా పాత్రలో అద్భుతంగా నటించారు. రాయ్లక్ష్మి తనదైన గ్లామర్తో కుర్రకారుని అలరించారు. కోవై సరళ, దేవదర్శిని, శ్రీమాన్ పాత్రలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. పతాక సన్నివేశాల్లో వచ్చే పాటలో లారెన్స్ నటన, హావభావాలు అద్భుతంగా పండించారు. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం ఈ మూవీకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. పద్నాలుగేళ్ల తర్వాత ‘కాంచన’ చిత్రాన్ని ఈ నెల 13న మళ్లీ విడుదల చేస్తున్నారు మేకర్స్. ప్రేమికుల దినోత్సవం కానుకగా... రేవంత్–మౌనికల ప్రేమకథ మరోసారి సిల్వర్ స్క్రీన్పై కనిపించనుంది. ఈ లవ్స్టోరీ సరిగ్గా ప్రేమికుల దినోత్సవానికి రానుంది. రేవంత్గా నాగచైతన్య, మౌనికగా సాయి పల్లవి నటించిన చిత్రం ‘లవ్ స్టోరి’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ పతాకంపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. 2020లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ కారణంగా వాయిదా పడి, 2021 సెప్టెంబరు 24న విడుదలైంది. శేఖర్ కమ్ముల తనదైన శైలిలో సహజత్వానికి దగ్గరగా తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రానికి అద్భుత స్పందన లభించింది.తెలంగాణ బ్యాక్డ్రాప్లో సాగే ఈ చిత్రంలో నాగచైతన్య, సాయి పల్లవి తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ అందించిన పాటల్లో ‘నీ చిత్రమ్ చూసి...’, ‘సారంగ దరియా...’ పాటలకు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. అందమైన ప్రేమకథా చిత్రంగా రూ పొందిన ‘లవ్ స్టోరి’ని ప్రేమికుల దినోత్సవం కానుకగా ఈ నెల 14న మళ్లీ విడుదల చేస్తోంది చిత్రయూనిట్. సో... నాలుగున్నరేళ్ల తర్వాత ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రేవంత్–మౌనిక తమ ప్రేమకథతో మరోసారి అలరించనున్నారన్న మాట. పదిహేనేళ్ల తర్వాత... కార్తీక్, జెస్సీలు తమ ప్రేమకథతో వెండితెరపై ప్రేక్షకులను మాయ చేశారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా మరోసారి మాయ చేసేందుకు వస్తున్నారు ఈ ప్రేమికులు. నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం ‘ఏమాయ చేసావె’. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా సమంత తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. కృష్ణుడు, తాన్య, సురేఖా వాణి, సంజయ్ స్వరూప్, దేవన్, లక్ష్మి, త్రిష అలెక్స్ ఇతర పాత్రలు పోషించారు. ఇందిరా ప్రోడక్షన్స్పై మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్ నిర్మించారు. ఈ సినిమా 2010 ఫిబ్రవరి 26న విడుదలైంది.లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూ పొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఈ మూవీలో కార్తీక్ పాత్రలో నాగచైతన్య, జెస్సీగా సమంత తమదైన నటనతో ఆకట్టుకున్నారు. తన రెండవ సినిమాతోనే నాగచైతన్య తన నటనలో పరిణితి చూపించారనే ప్రశంసలు దక్కాయి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ తనదైన శైలిలో ఈ అందమైన ప్రేమకథని తెరపైకి తీసుకొచ్చారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. మనోజ్ పరమహంస విజువల్స్ కూడా అద్భుతంగా నిలిచాయి. చివరి సన్నివేశంలో త్రిష, శింబు కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పదిహేనేళ్ల తర్వాత ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న ఈ మూవీ రీ రిలీజ్ అవుతోంది. 24 ఏళ్ల తర్వాత... ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన అందమైన ప్రేమకథా చిత్రం ‘మనసంతా నువ్వే’. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రీమా సేన్ హీరోయిన్గా నటించారు. తనూ రాయ్, పరుచూరి వెంకటేశ్వరరావు, చంద్ర మోహన్, తనికెళ్ల భరణి, శివ పార్వతి, బ్రహ్మానందం, సునీల్, సుధ, దేవదాస్ కనకాల, శివారెడ్డి, పావలా శ్యామల ఇతర పాత్రలు పోషించారు. సుమంత్ ఆర్ట్స్ ప్రోడక్షన్స్పై ఎంఎస్ రాజు ఈ మూవీ నిర్మించారు. అంతేకాదు... ఈ చిత్రానికి ఆయనే కథ అందించడం విశేషం. ఈ చిత్రంలో వేణుగా ఉదయ్ కిరణ్, రేణు పాత్రలో రీమా సేన్ కనిపిస్తారు.బాల్య స్నేహితులైన వీరి మధ్య ప్రేమని ఎంతో అందంగా, అద్భుతంగా తెరకెక్కించారు వీఎన్ ఆదిత్య. ఈ సినిమాకి ఆర్పీ పట్నాయక్ సంగీతం, నేపథ్య సంగీతం ఎంతో ప్లస్ అయ్యాయి. 2001 అక్టోబరు 19న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ప్రత్యేకించి యువతరం ఈ మూవీని విపరీతంగా చూశారు. 24 ఏళ్ల తర్వాత ఈ సినిమాని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న రీ రిలీజ్ చేస్తున్నారు. పైన పేర్కొన్న సినిమాలే కాదు.. ఇప్పటికే మరికొన్ని సినిమాలు రీ రిలీజ్ కాగా ఇంకొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
రాజమౌళి, మహేష్ బాబు ‘వారణాసి’ రెండు భాగాలుగా?
బాహుబలి ఫ్రాంచైజీతో తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త ట్రెండ్ను ప్రారంభించిన దర్శకధీరుడు రాజమౌళి, మళ్లీ అదే పద్ధతిలోకి అడుగుపెడుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి తర్వాత ఆయన ఆర్ఆర్ఆర్ను సింగిల్ మూవీగా తెరకెక్కించినా, ఇప్పుడు మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారనే టాక్ ఫిల్మ్ నగరంలో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్లో ఇంత త్వరగా సినిమా వస్తోందంటే అది పార్ట్-1 అయి ఉంటుందనే వాదన మొదలైంది. దీంతో నెటిజన్లు టైటిల్స్ కూడా ఊహించేశారు. వారణాసి పార్ట్-1: గ్లోబ్ ట్రోటర్, వారణాసి పార్ట్-2: టైమ్ ట్రోటర్ అనే పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఊహాగానాలపై యూనిట్ ఇంకా స్పందించలేదు. ఐమ్యాక్స్ ఫార్మాట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి ఆఫ్రికా, ఐరోపా దేశాలను కూడా టార్గెట్ చేస్తూ భారీ ప్రమోషన్కు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ‘వారణాసి’ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో ఓ ఎపిసోడ్లో మహేష్ బాబు శ్రీరాముడి రూపంలో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. ‘వారణాసి’ రాజమౌళి కెరీర్లోనే మరో మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ వెంకటేశ్ ఇవాళ కన్నుమూశారు. గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న మలయాళ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా మలయాళ సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్గా రాణించారు. ఆయన మృతిపట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం తెలిపారు. ఆయన మరణం కేరళ సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని అభివర్ణించారు1980- 1990లలో మలయాళ సినిమాకు వెంకటేశ్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. మలయాళ సినిమా రంగంలో అత్యంత ప్రభావవంతమైన మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్పీ వెంకటేశ్ ఒకరు. మలయాళ సినీ ఇండస్ట్రీలో దశాబ్దాల పాటు కొనసాగారు. 1980వ దశకంలో అత్యంత ఫేమస్ అయ్యారు. తన సూపర్ హిట్ పాటలతో, సినిమాల భావోద్వేగ లోతును పెంచే శక్తివంతమైన నేపథ్య సంగీతానికి కేరాఫ్ అడ్రస్గా మారారు. రాజవింటే మకన్, జానీ వాకర్, పైతృకం, సోపానం, హైవే వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలకు వెంకటేశ్ సంగీతం అందించారు. -
నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. మెగాస్టార్పై స్టాలిన్ నటి ప్రశంసలు
మెగాస్టార్ మూవీపై నటి ఖుష్బు సుందర్ ప్రశంసలు కురిపించారు. లాజిక్ లేదు.. కేవలం మ్యాజిక్ మాత్రమేనంటూ కొనియాడారు. మనశంకర వరప్రసాద్గారు సినిమా చాలా అద్భుతంగా ఉందన్నారు. సూపర్ డూపర్ హిట్ అందించిన అనిల్ రావిపూడికి హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.చిరంజీవి తాను ప్రేమించే అభిమానుల కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం చూసి గర్వపడుతున్నానని రాసుకొచ్చారు. మరింతకాలం మమ్మల్ని అలరిస్తూ ఉండటానికి మీకు మరింత ఉత్సాహం, శక్తి, మంచి ఆరోగ్యం లభించాలని కోరుకుంటున్నానని పోస్ట్ చేశారు. అమ్మ ఆశీస్సులు.. ఆ భగవంతుని దయ ఎల్లప్పుడూ మీతోనే ఉండాలి సార్ అంటూ ఖుష్బు ట్వీట్ చేశారు. ఈ మూవీలో నటించిన వెంకటేశ్ గురించి ఓకే మాటలో చెప్పాలంటే ఐ లవ్ యూ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఎప్పటిలాగే తన అందం, గాంభీర్యంతో అలరించిన నయనతార నటనకు ఫిదా అయ్యానంటూ ఖుష్బు పోస్ట్ చేసింది.కాగా.. కోలీవుడ్ నటి ఖుష్బు సుందర్ తెలుగులోనూ పలు సినిమాలు చేశారు. మెగాస్టార్ హీరోగా నటించిన స్టాలిన్ చిత్రంలో నటించారు. ఈ సినిమాలో చిరంజీవికి అక్క పాత్రలో మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ త్రిష హీరోయిన్గా కనిపించింది. కాగా.. మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా మనశంకర వరప్రసాద్ గారు. జనవరి 12న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. What an entertainment. #ManaShankaraVaraPrasadGaru . I loved it. No logic, only magic. My heartiest congratulations to the director, @AnilRavipudi who has proved to be a super duper entertainment king. Proud to see @KChiruTweets gaaru giving his best to the people who love… pic.twitter.com/7sZfZySpDP— KhushbuSundar (@khushsundar) February 2, 2026 -
తలైవా మెచ్చిన కార్మికురాలు.. నిజాయితీలో బంగారం..!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తన గొప్ప మనసు చాటుకున్నారు. నిజాయితీ గల పారిశుద్ధ్య కార్మికురాలిని ఆయన అభినందించారు. చెన్నై మహానగర పాలకసంస్థలో కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మను ఇంటికి పిలిచి మరీ సత్కరించారు. ఆమె నిజాయతీని సూపర్ స్టార్ రజనీకాంత్ మెచ్చుకోవడంతో పాటు బంగారు గొలుసును బహుకరించారు.అసలేం జరిగిందంటే..చెన్నై నగరంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మకు 45 తులాల బంగారం దొరికింది. తనకు దొరికిన ఆ బంగారాన్ని వెంటనే పోలీసులకు అప్పగించింది. దీంతో తనకు రోడ్డుపై దొరికిన 45 తులాల బంగారాన్ని పోలీసులకు అప్పగించడంపై ఆమె ప్రశంసలు వర్షం కురిసింది. ఆమె నిజాయితీని ప్రతి ఒక్కరు ప్రశంసించారు. ఈ విషయం తెలుసుకున్న తలైవా ఆమెను ఇంటికి పిలిచి సన్మానించారు. ఆప్యాయంగా మాట్లాడిన రజనీకాంత్.. ఆమెకు ఒక బంగారపు గొలుసు గిఫ్ట్గా అందించారు. దీంతో ఆమె ముఖంలో ఆనందంతో నిండిపోయింది.అంతేకాకుండా పద్మకు భారత తపాలా శాఖ ఇటీవలే అరుదైన గౌరవాన్ని అందించింది. ఆమె ఫొటోతో కూడిన ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆమెకు రూ.15 లక్షల ప్రమాద బీమా పాలసీని కూడా అందించింది. అంతేకాకుండా తమిళనాడు ప్రభుత్వం ఆమెను అభినందిస్తూ రూ.లక్ష నగదు బహుమతిని చెక్కు రూపంలో ఇచ్చింది. పరుల సొమ్ము తనకు వద్దని పోలీసులకు అప్పగించిన పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ⭐ A Heartwarming Gesture by #SuperstarRajinikanth ⭐Superstar #Rajinikanth personally called Padmaa and honoured her with a gold chain 👑✨Padmaa, a frontline worker, earned widespread appreciation after she recovered 45 sovereigns of gold jewellery found on the road and… pic.twitter.com/1vHv6NBF7u— Danishkumar Sankaran (@S_Danishkumar) February 3, 2026 -
ముంబైకి ముత్తువేల్ పాండ్యన్
ముంబై వెళ్లానున్నారట ముత్తువేల్ పాండ్యన్ . హీరో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా ‘జైలర్’. 2023లో విడుదలైన ఈ మూవీ సూపర్హిట్గా నిలిచింది. వీరి కాంబినేషన్ లోనే ‘జైలర్’కి సీక్వెల్గా ‘జైలర్ 2’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ముత్తువేల్ పాండ్యన్ పాత్రలో నటిస్తున్నారు రజనీకాంత్. రమ్యకృష్ణ, యోగిబాబు, ఎస్జే సూర్య, విజయ్సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ అతి త్వరలోనే ముంబైలో ప్రారంభం కానుందని కోలీవుడ్ సమాచారం.రజనీకాంత్–షారుక్ఖాన్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట నెల్సన్ దిలీప్ కుమార్. ఈ సినిమాలో రజనీకాంత్ స్నేహితుడు పాత్రలో షారుక్ఖాన్ నటిస్తున్నారని సమాచారం. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘జైలర్ 2’ ఈ జూన్లో విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... రజనీకాంత్ 173వ సినిమాకు సిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నారు. అయితే ఆయన 174వ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్, 175వ మూవీకి అట్లీ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ చిత్రా లపై అధికారిక ప్రకటన రావాలి. -
జోడీ రిపీట్
ధనుష్, సాయిపల్లవి జోడీ రిపీట్ అవుతోంది. ధనుష్ హీరోగా ‘అమరన్ ’ ఫేమ్ రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో ‘డీ 55’(వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కనుంది. వండర్బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ సంస్థలు నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మూవీలో ఓ హీరోయిన్ గా శ్రీలీల నటించనున్న విషయం తెలిసిందే.మరో హీరోయిన్ గా సాయిపల్లవి నటించనున్నట్లుగా సోమవారం ప్రకటించారు మేకర్స్. గతంలో ‘మారి 2’ (2018) చిత్రంలో ధనుష్, సాయిపల్లవి జోడీగా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలోని ‘రౌడీ బేబీ...’ సాంగ్ కూడా అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది.అలాగే ‘అమరన్ ’ వంటి హిట్ మూవీ తర్వాత దర్శకుడు రాజ్కుమార్ పెరియ సామితో సాయిపల్లవి చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారట ధనుష్ అండ్ టీమ్. ఈ సినిమాకు సంగీతం: సాయి అభ్యంకర్. -
"ది ప్యారడైజ్" రిలీజ్పై క్లారిటీ.."పెద్ది" ఇంకా సస్పెన్స్లోనే!
నాని, రామ్ చరణ్ సినిమాలు అనధికారికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రేక్షకులు కొత్త రిలీజ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో "ది ప్యారడైజ్" సినిమాపై దాదాపు స్పష్టత వచ్చింది. మార్చి నుంచి తప్పుకున్న ఈ సినిమాను జూన్ చివర్లో విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించింది. షూటింగ్తో పాటు గ్రాఫిక్స్ పనులకు కూడా ఓ డెడ్లైన్స్ పెట్టి, ఆ గడువులోగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇవి కేవలం యూనిట్ నిర్ణయించిన తేదీలు మాత్రమే. పూర్తిగా క్లారిటీ వచ్చాకనే అధికారికంగా రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు కాస్త ఎక్కువ టైమ్నే తీసుకుంటున్నారు. మరోవైపు రామ్ చరణ్ "పెద్ది" సినిమా రిలీజ్ విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. ప్యారడైజ్తో పోలిస్తే పెద్ది షూటింగ్ ముందే పూర్తి అవుతోంది. మొన్నటి వరకూ మే 1న రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ తేదీపై కూడా యూనిట్ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన "చికిరి" సాంగ్ పెద్ద హిట్ అయింది. త్వరలోనే సెకండ్ సింగిల్ అప్డేట్ ఇవ్వబోతున్నారు. ఇక అదే సమయంలో రిలీజ్ డేట్ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. -
బాయ్ఫ్రెండ్తో బ్రేకప్.. అదే కారణం: సీతారామం బ్యూటీ
సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. సినిమాల కంటే పర్సనల్ లైఫ్పై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ ధనుశ్ను ఆమె పెళ్లాడనుందని వార్తలొచ్చాయి. వీటిపై తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ధనుశ్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే కాదు.. ఒక అన్నలాంటి వాడని చెప్పుకొచ్చింది. ఆమె నటించిన దో దివానే శహర్ మే అనే మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న మృణాల్ ఠాకూర్ ఈ విషయంపై స్పందించింది.అంతేకాకుండా తన బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ గురించి మృణాల్ చెప్పేసింది. నేను యాక్టింగ్ చేయడం అతనికి నచ్చలేదని.. మేము విడిపోవడానికి అదే కారణమని తెలిపింది. నాకు దూకుడు ఎక్కువని నాతో ఉండలేనని అతనే బ్రేకప్ చెప్పేశాడని వెల్లడించింది. ఈ విషయంలో తనకు ఎలాంటి బాధ లేదని.. అలాంటి వాడితో కొనసాగడం కష్టంగా అనిపించిందని పేర్కొంది. అందుకే అతనితో విడిపోవాల్సి వచ్చిందని మృణాల్ చెప్పుకొచ్చింది. బ్రేకప్ తర్వాత అతని గురించి జాలిపడ్డానని తెలిపింది. కాగా.. మృణాల్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం దో దివానే శహర్ మే. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 20న థియేటర్లలోకి రానుంది. అంతే కాకుండా టాలీవుడ్ హీరో అడివి శేష్ సరసన డకాయిట్లో మృణాల్ నటిస్తోంది. ఈ సినిమా మార్చి 19న రిలీజ్ కానుంది. -
సీసీఎల్ విజేతగా కర్ణాటక.. రోహిత్ శర్మ స్టైల్లో కిచ్చా సుదీప్ ఎంట్రీ..!
సెలబ్రిటీ క్రికెట్ లీగ్-2026 విజేతగా కర్ణాటక బుల్డోజర్స్ నిలిచింది. ఫైనల్లో బెంగాల్ టైగర్స్ను ఓడించిన కిచ్చా సుదీప్ సేన టైటిల్ ఎగరేసుకుపోయిది. ఇది కర్ణాటక బుల్డోజర్స్కు మూడో టైటిల్ కావడం విశేషం. దాదాపు 12 ఏళ్ల గ్యాప్ తర్వాత సీసీఎల్ కప్ను కర్ణాటక గెలుచుకుంది. ఈ మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. కోయంబత్తూరులోని ఎస్ఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో ఈ ఫైనల్ పోరు జరిగింది.అయితే ఈ కప్ గెలిచాక కర్ణాటక బుల్డోజర్స్ సంబురాలు చేసుకుంది. మ్యాచ్ గెలిచిన కప్ అందుకునేందుకు వెళ్లిన కెప్టెన్ కిచ్చా సుదీప్ డిఫరెంట్ స్టైల్లో అలరించాడు. 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా రోహిత్ శర్మ రోబో వాక్ స్టైల్లో వెళ్లి కప్ అందుకున్నారు. తాజాగా సీసీఎల్లోనూ అదే సీన్ రిపీట్ చేశాడు కిచ్చా సుదీప్. రోహిత్ శర్మ స్టైల్లోనే రోబో వాక్ చేస్తూ సీసీఎల్ ట్రోఫీని అందుకున్నాడు. ఈ వీడియో నెట్టింట కాస్తా వైరల్ కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో అభిమానులు కిచ్చా సుదీప్ ట్రోఫీ వాక్ వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఫైనల్లో కర్ణాటక బుల్డోజర్స్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో బెంగాల్ టైగర్స్ను 129 పరుగులకే పరిమితం చేశారు. ఆ తర్వాత బరిలోకి దిగిన కర్ణాటక బుల్డోజర్స్ ఓపెనర్ రాజీవ్ హను కేవలం 35 బంతుల్లో 69 పరుగులు చేసి పరుగులు చేయడంతో సునాయాసంగా విజయం సాధించింది. ఇంకా మూడు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో కర్ణాటక టీమ్ ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. ఈ సీజన్లో బెంగాల్ టైగర్స్ రన్నరప్గా నిలిచింది.ఇక కిచ్చా సుదీప్ సినిమాల విషయానికొస్తే కన్నడ యాక్షన్ ఎంటర్టైనర్ మార్క్తో అలరించాడు. ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. సుదీప్ ఇటీవల సినిమాల్లో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఇది మూడు దశాబ్దాల స్ఫూర్తిదాయకమైన ప్రయాణం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. Kiccha Sudeep replicated the iconic Rohit Sharma's victory walk. ❤️🏆 pic.twitter.com/G5taR1D2kw— AdityaVarma (@AdityaVarma45_) February 2, 2026 -
శ్రియా శరణ్ మూవీ.. రిలీజ్ కాకుండానే మూడు అవార్డులు..!
ఏదైనా సినిమా రిలీజై హిట్ అయితే ప్రశంసలు కురిపిస్తారు. అలాగే అవార్డులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కథ బాగుండి సూపర్ హిట్ అయిన సినిమాలకు ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహకంగా అవార్డులు ఇస్తుంటారు. కానీ రిలీజ్ కానీ సినిమాకు అవార్డ్స్, రివార్డ్స్ ఇవ్వడం మీరెక్కడైనా చూశారా? కానీ సరిగ్గా అదే జరిగింది. ఐదేళ్ల క్రితమే షూటింగ్ పూర్తయి రిలీజ్ కావాల్సిన మూవీ ఇప్పటివరకు థియేటర్లలోకి రాలేదు. కానీ తాజాగా అవార్డుల వేడుకలో మాత్రం ఏకంగా మూడింటిని సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ స్టోరేంటో తెలుసుకుందామా? విమల్, శ్రియా శరణ్ జంటగా నటించిన చిత్రం 'సందకరి'. తాజాగా ఈ చిత్రం మూడు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ఏడాది జనవరి 29న తమిళనాడు ప్రభుత్వం 2016 నుంచి 2022 సంవత్సరాల వరకు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులలో చాలా మంది అగ్రశ్రేణి నటీనటులు, చిత్రాలు, సాంకేతిక నిపుణులను ప్రభుత్వం గుర్తించి అవార్డులు అందించింది.అయితే 'సందకరి' అనే సినిమారు 2020 ఏడాదిగానూ మూడు అవార్డులను గెలుచుకుంది. ఇదే ఇప్పుడు ఆడియన్స్ను షాక్కు గురిచేసింది. అసలు ఈ సినిమా విడుదల కాలేదని.. మరి ఇలాంటి చిత్రానికి అవార్డులకు ఎలా ఇచ్చారని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ మూవీ ఉత్తమ చిత్రం (మూడవ బహుమతి) అవార్డును గెలుచుకోగా.. ఉత్తమ నేపథ్య గాయకుడు అమ్రిష్ (మేల్), అయ్యప్పన్ ఉత్తమ కళా దర్శకుడిగా అవార్డులకు ఎంపికయ్యారు. రిలీజ్ కానీ సినిమాకు అవార్డులు రావడమేంటని కోలీవుడ్ ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.అయితే తమిళనాడు రాష్ట్ర అవార్డులకు అర్హత పొందాలంటే ఆ చిత్రం థియేటర్లలో విడుదల అయి ఉండాలని నివేదికలు చెబుతున్నాయి. అంతే కాకుండా అవార్డుల కోసం ఆ ఏడాదిలో రిలీజైన ఎన్నో చిత్రాలు ఉండనే ఉన్నాయి. అవన్నీ కాదని.. ఒక మలయాళ రీమేక్కు మూడు అవార్డులు ఇవ్వడంపై నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు ఆశ్చర్య వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.కాగా.. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ మూవీ 'మై బాస్'కు రీమేక్గా సందకారిని తెరకెక్కించారు. ఈ చిత్రంలో దిలీప్, మమతా మోహన్దాస్ నటించారు. ఈ తమిళ వర్షన్లో విమల్, శ్రియా శరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్ మదేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2020లో థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే అనేక కారణాలతో ఇప్పటికీ విడుదల కాలేదు. -
సంక్రాంతి 2027.. సీనియర్ హీరోల పోటీ?
మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి ఘన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆయన తదుపరి చిత్రం బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకోనుంది. మార్చిలో షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉన్నప్పటికీ, విడుదలను నేరుగా 2027 సంక్రాంతికి లక్ష్యంగా పెట్టుకున్నారని సమాచారం. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. చిరంజీవి సరసన ప్రియమణి భార్య పాత్రలో నటించనున్నారు. కూతురి పాత్రకు కీర్తి సురేష్ను పరిశీలిస్తున్నారు. కానీ మరో ఆప్షన్ కూడా పరిశీలనలో ఉంది. ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ఉండటంతో షూటింగ్ షెడ్యూల్ ప్లానింగ్ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. జనవరిలో మన శంకర వరప్రసాద్ విడుదల కాగా, జూలైలో విశ్వంభర థియేటర్లలోకి రానుంది. ఈ రెండు సినిమాల మధ్య కనీసం ఆరు నెలల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేశారు. 2027 సంక్రాంతికి బరిలో దింపాలని చూస్తున్నారు. అయితే అదే సంక్రాంతికి వెంకటేష్, అనిల్ రావిపుడి కాంబినేషన్ సినిమా ఉంది. బాలయ్య చిత్రం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక నాగార్జున కూడా రంగంలోకి దిగితే 2027 సంక్రాంతి సీనియర్ల సంక్రాంతి అయిపోతుంది. ప్రస్తుతాకి ఇవన్నీ అధికారికంగా ప్రకటించలేదు కానీ వచ్చే సంక్రాంతికి మాత్రం సీనియర్ల మద్య పోటీ ఉండే అవకాశం ఉంది. -
ఓటీటీకి మరో సంక్రాంతి సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమిళ నటుడు శివకార్తికేయన్కు తెలుగు ఆడియన్స్లోనూ మంచి గుర్తింపు ఉంది. తాను నటించిన లేటెస్ట్ మూవీ 'పరాశక్తి' చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. పీరియాడికల్ స్టోరీతో తీసిన ఈ చిత్రం జనవరి 10న థియేటర్లలో రిలీజైంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం అభిమానలను అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహించారు.తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 7వ తేదీ నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్సయిన వారు ఓటీటీలో చూసేయండి.ఈ మూవీని 1964లో తమిళనాడులో ఓ ఊరిలో జరిగిన ఉద్యమం ఆధారంగా తెరకెక్కించారు. హిందీని జాతీయ భాషగా ప్రకటించిన తర్వాత మధురైలోని ఓ ఊరిలో విద్యార్థులకు, ఓ ఊరివాళ్లకు.. ఓ పోలీస్తో ఎలాంటి గొడవ జరిగింది? చివరకు ఏమైంది అనే పాయింట్తో మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో పలు అభ్యంతరకరమైన డైలాగ్స్ ఉండటంతో సెన్సార్ బోర్డ్ భారీ కట్స్ చెప్పింది. ఏకంగా 20కి పైగా కట్స్ సూచించింది. సెన్సార్ వివాదం ముగిసిన తర్వాత థియేటర్లలో రిలీజ్ చేశారు. #Parasakthi to stream from Feb 7 on Z5🍿💥 pic.twitter.com/Sc60QAOECs— Christopher Kanagaraj (@Chrissuccess) January 31, 2026 -
30 ఏళ్ల జర్నీ.. ఆ ఒక్కటి నేర్చుకున్నా!: కిచ్చా సుదీప్
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 30 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా మూడు దశాబ్దాల ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. సినీ ప్రపంచంలో నా మూడు దశాబ్దాల జర్నీని చూసుకుంటే మనసు సంతోషంతో నిండిపోతోంది. ఎన్నో కలలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నేను ఈ స్థాయికి చేరుకుంటానని కలలో కూడా ఊహించలేదు.మీ వల్లే సాధ్యంఇదంతా మీ వల్లే సాధ్యమైంది. అభిమానులు.. మీరే నా బలం. నన్ను ముందుకు నడిపించింది మీరే! దర్శకరచయితలు.. మీ కథలకు నేను సరిపోతానని నన్ను నమ్మినందుకు థాంక్యూ. నిర్మాతలు.. మీ ధైర్యం, నాపై ఉంచిన నమ్మకం వల్లే కలలు సాకారమయ్యాయి. సహనటులు, ప్రతి టెక్నీషియన్స్కు చెప్పొచ్చేదేంటంటే.. సినిమా అంటేనే టీమ్ వర్క్. సమిష్టి కృషిలైట్ బాయ్ నుంచి కెమెరామెన్ వరకు, ఆర్ట్ టీమ్ నుంచి కాస్ట్యూమ్ డిజైనర్ వరకు, స్పాట్ బాయ్ నుంచి ఎడిటర్స్ వరకు.. మీ అందరి కష్టం సినిమాలో దాగుంది. టీవీ, మీడియా.. ఈ రెండూ నా ఎదుగుదలకు తోడ్పడ్డాయి. కన్నడ చిత్ర పరిశ్రమ.. నాకంటూ పేరుప్రఖ్యాతలు, గుర్తింపునిచ్చిందే ఈ ఇండస్ట్రీ. 30 ఏళ్లలో..కన్నడ సినిమా ఎప్పటికీ నా గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నా కుటుంబసభ్యులు, స్నేహితులు.. మీరందరూ నన్ను మంచి మనిషిగా తీర్చిదిద్దారు. ఈ 30 ఏళ్లలో నేను నేర్చుకున్నది ఒక్కటే.. విధేయత. ఎంత సక్సెస్ వచ్చినా సరే మరింత విధేయతతో, కష్టపడి పని చేయాలి. నాకెంతో ఇచ్చిన ఈ సినిమాకు ఎంతో కొంత తిరిగిచ్చేయాలి అని రాసుకొచ్చాడు.సినిమాతయ్యావా (1997) అనే కన్నడ సినిమాతో నట ప్రయాణాన్ని ఆరంభించాడు. ఇందుడో సైడ్ క్యారెక్టర్లో నటించాడు. 2000వ సంవత్సరంలో స్పర్శ మూవీతో హీరోగా మారాడు. హచ్చ (2001) చిత్రంతో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు. నంది, హచ్చ, స్వాతిముత్తు, మై ఆటోగ్రాఫ్, కెంపె గౌడ, ఈగ.. ఇలా అనేక సినిమాలతో స్టార్డమ్ సంపాదించుకున్నాడు. చివరగా మార్క్ సినిమాతో అలరించాడు. మై ఆటోగ్రాఫ్ సహా పలు సినిమాలకు ఈయనే స్వయంగా దర్శకత్వం వహించాడు. 30 years. Infinite gratitude. 🎬❤️Standing here after three decades in this crazy, beautiful film world, my heart is just… full. From a boy with dreams, doubts and wild hope to whatever this has become — it’s bigger than I ever imagined because of YOU. Fans — you’re my… pic.twitter.com/4gipzvWKeg— Kichcha Sudeepa (@KicchaSudeep) January 31, 2026 చదవండి: నిజం పెళ్లాన్ని అడిగినట్లే అడిగారు: శ్రీలీల -
మెగా ఫ్యామిలీలో ట్విన్స్.. కవలలు పుట్టిన సినీ దంపతులు వీళ్లే
టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ మరోసారి తండ్రయ్యారు. తాజాగా ఆయన సతీమణి ఉపాసన కొణిదెలకు కవలలు పుట్టారు. హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో ఓ బాబు, పాపకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీలో సంబురం నెలకొంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నారని ట్వీట్ చేశారు.అయితే ఈ శుభ సందర్భంలో సినీ ఇండస్ట్రీలో కవలలు ఎవరెవరికీ పుట్టారనే విషయంపై నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. దక్షిణదితో పాటు బాలీవుడ్లోనూ కొందరు సెలబ్రిటీలకు ట్విన్స్ పుట్టారు. ఆ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారనే విషయంపై నెటిజన్స్లో ఆసక్తి నెలకొంది. ఇంతకీ కవల పిల్లలతో డబుల్ ఆనందం పొందిన సెలబ్రిటీలు ఎవరో తెలుసుకుందాం. మంచు విష్ణు దంపతులకు ట్విన్స్..టాలీవుడ్ హీరో మంచు విష్ణు దంపతులకు కవలలు జన్మించారు. ఈ ట్విన్స్కు ఆరియానా- వివియానా అనే పేర్లు పెట్టారు. ఇటీవల కన్నప్ప చిత్రంలో వీరిద్దరు నటించారు. ఓ ప్రత్యేక సాంగ్లోనూ అరియానా- వివియానా కనిపించారు.నయనతార- విఘ్నేశ్ శివన్ దంపతులు..కోలీవుడ్ భామ నయనతార- విఘ్నేశ్ శివన్ దంపతులకు ట్విన్స్ జన్మించారు. వీరికి 2022లో సరోగసీ ద్వారా ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. వీరిద్దిరకి ఉయిర్, ఉలగం అనే పేర్లు పెట్టుకున్నారు.బాలీవుడ్ నటి ప్రీతి జింటా..బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటాకు ట్విన్స్ జన్మించారు. ఆమె 2021లో సరోగసీ ద్వారానే పిల్లలకు జన్మనిచ్చారు. వీరిది జై, జియా అనే పేర్లు పెట్టారు. ప్రీతి జింటా హీరోయిన్గా దక్షిణాదితో పాటు బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది. సంజయ్ దత్ దంపతులకు ట్విన్స్..బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ -ఆయన భార్య మాన్యతా దత్కు ట్విన్స్ జన్మించారు. 2010లో వీరికి కవలలు పుట్టగా షహ్రాన్, ఇక్రా అనే పేర్లు పెట్టారు. సంజయ్ దత్ బాలీవుడ్తో పాటు దక్షిణాదిలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.సెలీనా జైట్లీకి కవలలు..బాలీవుడ్ భామ సెలీనా జైట్లీ సైతం కవలలకు జన్మనిచ్చింది. 2011లో వ్యాపారవేత్త పీటర్ హాగ్ను వివాహం చేసుకున్న స్కు 2012లో ట్విన్స్ పుట్టారు. ఇద్దరు అబ్బాయిలకు విన్స్టన్, విరాజ్ అని పేర్లు పెట్టారు.శతృఘ్న సిన్హా దంపతులకు ట్విన్స్..బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా- పూనమ్ సిన్హా దంపతులకు కవలలు జన్మించారు. వీరిద్దరి కుమారులకు లవ్ సిన్హా, కుష్ సిన్హా అనే పేర్లు పెట్టారు. శతృఘ్న సిన్హాకు సోనాక్షి సిన్హా అనే మరో కూతురు ఉన్నారు. ఆమె ప్రస్తుతం బాలీవుడ్తో పాటు దక్షిణాదిలోనూ నటిస్తోంది. సన్నీ లియోన్ దంపతులకు ట్విన్స్..బాలీవుడ్ నటి సన్నీ లియోన్- ఆమె భర్త డేనియల్ దంపతులకు ట్విన్స్ పట్టారు. 2018లో వీరికి కవలలు పుట్టగా.. నోవా, ఆషర్ అనే పేర్లు పెట్టుకున్నారు. అంతకు ముందే సన్నీ లియోన్ నిషా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో సినిమాలు బిజీగా ఉంది. -
సీఎంను సామాన్యుడు కిడ్నాప్ చేస్తే?.. భ.. భ.. బ మూవీ రివ్యూ
టైటిల్: భ.. భ.. బ..(భయం .. భక్తి .. బహుమానం)విడుదల తేదీ: 2026-01-27నటీనటులు: దిలీప్, మోహన్లాల్, వినీత్ శ్రీనివాస్, ధ్యాన్ శ్రీనివాసన్, బైజు సంతోష్, శాండీ తదితరులుదర్శకుడు: ధనంజయ్ శంకర్నిర్మాణం సంస్థ: శ్రీ గోకులం మూవీస్సంగీతం: గోపీ సుందర్ఓటీటీ: జీ5ఓటీటీల్లో మలయాళ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటోంది. అందుకే అక్కడ హిట్ సినిమాలను తెలుగు ఆడియన్స్ కోసం డబ్ చేసి వదులుతున్నారు. ముఖ్యంగా మోహన్ లాల్కు టాలీవుడ్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అందువల్లే ఆయన కీలక పాత్రలో మెప్పించిన భా భా బ అనే మూవీని తెలుగులోనూ స్ట్రీమింగ్కు తీసుకొచ్చారు. ఆ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.అసలు కథేంటంటే..ఒక పిల్లవాడు తన చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోతాడు. తన తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో సీఎం కాన్వాయ్ వల్ల ఆలస్యమై ప్రాణాలు పోతాయి. అప్పటి నుంచే సీఎంపై కక్ష పెంచుకున్న పిల్లవాడు.. పెద్దయ్యాక తన రివేంజ్ తీర్చుకున్నాడా? ఎలాంటి ఆధారం లేని ఆ పిల్లవాడు సీఎంను ఏం కిడ్నాప్ చేశాడా? తన పగ తీర్చుకున్నాడా? అన్నదే భా.. భా.. భా.. కథ.ఎలా ఉందంటే..ఒక సీఎం కాన్వాయ్ వల్ల తన తండ్రి కోల్పోయిన రాడార్ (దిలీప్) తన రివేంజ్ కోసం ముఖ్యమంత్రి జోసెఫ్ (బైజు సంతోష్)నే కిడ్నాప్ చేస్తాడు. అయితే సీఎం కుమారుడైన నోబుల్ (వినీత్ శ్రీనివాసన్) ఎన్ఐఏ ఎజెంట్గా పనిచేస్తుంటాడు. తన తండ్రి కోసం కుమారుడే రంగంలోకి దిగుతాడు. అయితే ఈ కథను డైరెక్టర్ చిన్న పిల్లలతో ప్రారంభించాడు. రెండు చిన్న పిల్లల క్రికెట్ టీమ్ల మధ్య మాటలతో కథ బ్యాక్డ్రాప్లోకి తీసుకెళ్లాడు. ఆడియన్స్లో ఆసక్తి పెంచేందుకు అయితే సీఎం ఓ సభకు హాజరు కాగా.. రాడార్ చాలా సులువుగా కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత కథ చాలా ఫన్నీగా సాగుతుంది. రాడార్ ఎవరికీ దొరక్కుండా తప్పించుకునే సీన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. తన తండ్రి కిడ్నాప్ చేసిన వారిని పట్టుకునేందుకు నోబుల్ (వినీత్ శ్రీనివాసన్) విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. అలా ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.అయితే తన తండ్రిని కిడ్నాప్ చేసింది 'రాడార్' (దిలీప్) అనే విషయం నోబుల్కి తెలుస్తుంది. ఆ తర్వాత కథనం స్పీడ్గా వెళ్తుంది. అంతేకాకుండా రాడార్కి.. ఢిల్లీ బాల (మోహన్ లాల్)తో సంబంధాలు ఉన్నాయనే విషయం కూడా తెలుస్తుంది. మోహన్ లాల్ ఎంట్రీతో కథ చాలా ఇంట్రెస్టింగ్ మారుతుంది. మోహన్ లాల్, రాడార్ కలిసి చేసే ఫైట్స్ ఆడియన్స్ను అలరిస్తాయి. క్లైమాక్స్ సీన్ అద్భుతంగా అనిపిస్తుంది. అడవుల్లో ఫైరింగ్ స్టంట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. చివరి అరగంట మాత్రమే ఆడియన్స్ను కుర్చీలో కట్టిపడేలా చేస్తుంది. ఓ సామాన్యుడు తలచుకుంటే సీఎంను కూడా ముప్పు తిప్పలు పెట్టగలడు అనేది డైరెక్టర్ ఈ చిత్రంలో చూపించారు. కాన్సెప్ట్ బాగుంది కానీ.. అందుకు తగినట్లుగా క్యూరియాసిటీ పెంచడంతో డైరెక్టర్ ఫెయిలయ్యాడనే చెప్పాలి. ఎప్పటికప్పుడు అన్నీ రివీల్ చేస్తూ వెళ్లడం మైనస్. కథలో ట్విస్ట్లు లేకపోవడంతో ప్రేక్షకుడికి ఇంట్రెస్టింగ్గా అనిపించదు.అంతేకాకుండా మోహన్ లాల్ స్థాయికి ఈ కథ సెట్ అవ్వలేదని చెప్పాలి. ఎందుకంటే ఓ స్టార్ హీరో సినిమా మధ్యలో ఎంట్రీ ఇవ్వడం అంతగా ఆసక్తిగా అనిపించకపోవచ్చు. స్టార్ ఇమేజ్కు తగినట్లుగా కథ లేకపోవడం ఇందులో పెద్ద మైనస్. దిలీప్, మోహన్ లాల్ లాంటి స్టార్స్ ఇలాంటి కథను చేయడం ఆడియన్స్కు ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పొచ్చు. ఈ వీకెండ్లో ఓ రివేంజ్ స్టోరీ చూడాలనుకుంటే భ.. భ.. బ ట్రై చేయొచ్చు. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో దిలీప్ పాత్రనే ఎక్కువ. మూవీ మొత్తం దిలీప్ తన నటనతో ఏ మాత్రం తగ్గకుండా చేశాడు. బైజు సంతోష్ సీఎం పాత్రలో ఒదిగిపోయారు. మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనలేదు. సినిమా మధ్యలో ఎంట్రీ ఇచ్చినా తన నటనతో మరోసారి ఆడియన్స్ను మెప్పించాడు. సంగీతం ఫర్వాలేదు. సినిమాటోగ్రఫీ పరంగా చూస్తే విజువల్స్ కథకు తగ్గట్టుగానే గ్రాండ్గా ఉన్నాయి. ఎడిటింగ్లో ఇంకాస్తా కట్ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
సినిమాలు వర్కవుట్ కాకపోతే సీరియల్స్? చంద్రహాస్ ఆన్సరిదే!
ప్రభాకర్ బుల్లితెరపై స్టార్ యాక్టర్గా రాణిస్తుంటే అతడి కొడుకు చంద్రహాస్ సినిమాల్లో తన అదృష్టాన్ని వెతుక్కుంటున్నాడు. రామ్నగర్ బన్నీ మూవీతో హీరోగా పరిచయమైన అతడు తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ మూవీయే బరాబర్ ప్రేమిస్తా. సంపత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది.అది నా లక్ష్యం కాదుఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చంద్రహాస్ సీరియల్స్పై ఆసక్తి ఉందా? లేదా? అన్న విషయంపై క్లారిటీ ఇచ్చాడు. చంద్రహాస్ మాట్లాడుతూ.. నేను సీరియల్స్ చేస్తాననాలే కానీ నాన్న ఇప్పటికిప్పుడు నాలుగైదు సీరియల్స్లో నన్నే హీరోగా పెట్టేస్తాడు. డబ్బు సంపాదించాలంటే సీరియల్స్ బెటర్. నాకు డబ్బు సంపాదించడం లక్ష్యం కాదు. ఒకవేళ 5, 10 ఏళ్ల తర్వాత నాకు సినిమాలు వర్కవుట్ కావడం లేదంటే టీవీకి వెళ్లిపోవచ్చు. యాంకర్గా రెండు షోలు ఇప్పిస్తాడు లేదంటే సీరియల్స్లో హీరోగా చేయిస్తాడు.టీవీ చాలా ఈజీనాన్న వల్ల టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టడం, అవకాశాలు సంపాదించడం నాకు చాలా ఈజీ.. ఇది ఎప్పటికైనా నాకు బ్యాకప్లా పనిచేస్తుంది. కానీ, అంతవరకు రానివ్వను. టీవీని నేను లైట్ తీసుకుంటాను. ఎందుకంటే నాకు డబ్బుపై అంత ఆసక్తి, ఆశ లేదు. నాన్న బాగానే సంపాదించాడు. నేనేం పని చేయకపోయినా అది నాకు సరిపోతుంది అని చంద్రహాస్ చెప్పుకొచ్చాడు.చదవండి: చిరంజీవి ఫేవరెట్ హీరో ఎవరంటే? -
రాజమౌళి సార్ అలా చేస్తారని ఊహించలేదు: టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్
టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషన్ జీవింత్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం విత్ లవ్. ఈ చిత్రంలో ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇవాళ హైదరాబాద్లో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో హీరో అభిషన్ జీవింత్ మాట్లాడారు.టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ గురించి అభిషన్ జీవింత్ కామెంట్స్ చేశారు. నా సినిమాకు రాజమౌళి సార్ ట్వీట్ చేస్తారని అస్సలు ఊహించలేదన్నారు. ఆయన వల్లే నా సినిమా తెలుగు ఆడియన్స్కు మరింత దగ్గరైందని అన్నారు. టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం గురించి ట్వీట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్ అంటూ మాట్లాడారు. మీ వల్లే ఆ సినిమా నాకు ప్రత్యేకంగా గుర్తుండి పోతుందని అభిషన్ ఆనందం వ్యక్తం చేశారు.కాగా.. అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ జంటగా నటించిన చిత్రం విత్ లవ్. ఈ మూవీకి మదన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న తెలుగులోనూ రిలీజ్ కానుంది.రాజమౌళి గారు టూరిస్ట్ ఫ్యామిలీ గురించి ట్వీట్ చేస్తారని అస్సలు ఊహించలేదు..ఆయన ట్వీట్ తర్వాత నా సినిమా తెలుగు ఆడియన్స్ కి చేరువైంది#AbishanJeevinth #AnaswaraRajan #SoundaryaRajinikanth #Madhan #WithLove pic.twitter.com/JaWNxhAI2o— Filmy Focus (@FilmyFocus) January 30, 2026 -
రజినీకాంత్ పొలిటికల్ నిర్ణయం.. కుమార్తె ఏమన్నారంటే?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ పాలిటిక్స్లోకి రానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదన్నారు. తాజాగా తండ్రి నిర్ణయంపై ఆయన కుమార్తె సౌందర్య రజినీకాంత్ స్పందించారు. విత్ లవ్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. తన తండ్రి నిర్ణయం పట్ల తమకెలాంటి బాధ లేదన్నారు. ఆయనకు ఏది నచ్చితే కుటుంబమంతా మద్దతుగా ఉంటుందని తెలిపారు.అంతేకాకుండా రజనీ- కమల్హాసన్ సినిమాపై జరుగుతున్న ప్రచారంపై కూడా స్పందించారు. ఈ కాంబినేషన్ మూవీకి సంబంధించిన చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. అవీ ఓకే అయితే త్వరలోనే వివరాలను ప్రకటిస్తామన్నారు. కాగా.. అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ జంటగా నటించిన చిత్రం విత్ లవ్. ఈ మూవీకి మదన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న తెలుగులోనూ రిలీజ్ కానుంది.నాన్నగారి రాజకీయ ప్రస్థానం విషయంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు - సౌందర్య రజనీకాంత్#AbishanJeevinth #AnaswaraRajan #Madhan #WithLove #SoundaryaRajinikanth pic.twitter.com/BXkhJE02Z4— Filmy Focus (@FilmyFocus) January 30, 2026 -
అమ్మానాన్న ఏడ్చేశారు.. ఎన్నటికీ మర్చిపోలేను: సారా
ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ బాలీవుడ్ మూవీ 'ధురంధర్'తో హీరోయిన్గా మారింది. యలీనా జమైల్ పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పుడు 'యుఫోరియా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 6న విడుదల కానుంది.ఆరోజు మర్చిపోలేనుసినిమా ప్రమోషన్స్లో భాగంగా సారా అలీ ఖాన్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. ఈ సందర్భంగా తను హీరోయిన్ అయ్యాక పేరెంట్స్ రియాక్షన్ గురించి చెప్పుకొచ్చింది. ధురంధర్ సినిమాలో నన్ను చూసి అమ్మానాన్న సంతోషంతో ఏడ్చేశారు. ఆ రోజు నేనెప్పటికీ మర్చిపోలేను. ఆ సంఘటన నా జీవితంలోనే ప్రత్యేకమైనది అని చెప్పుకొచ్చింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. పొన్నియన్ సెల్వన్ మూవీ తర్వాత విదేశాల్లో యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో చేరాలనుకున్నాను. ధురంధర్అంతలోనే యుఫోరియా సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ధురంధర్ సినిమాకు సంతకం చేశాను. కానీ అదే మొదటగా రిలీజైంది అని తెలిపింది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ మూవీ బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. ఈ మూవీకి సీక్వెల్గా ధురంధర్ 2 తెరకెక్కుతోంది. ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది.చదవండి: ఓటీటీలో నారీ నారీ నడుమ మురారి మూవీ.. ఎక్కడంటే? -
ది కేరళ స్టోరీ సీక్వెల్.. టీజర్తో పాటు రిలీజ్ డేట్ ఫిక్స్
ఆదా శర్మ ప్రధాన పాత్రలో చిత్రం ది కేరళ స్టోరీ. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అంతేకాకుండా ఏకంగా రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు గెలిచింది. ఈ చిత్రానికి గానూ సుదీప్తో సేన్కు ఉత్తమ దర్శకుడిగా అవార్డ్ అందుకున్నారు. ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలోనూ అవార్డ్ వరించింది.తాజాగా ఈ మూవీకి సీక్వెల్గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ది కేరళ స్టోరీ 2 - గోస్ బియాండ్' అనే పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా సీక్వెల్గా వస్తున్న ఈ సినిమా టీజర్నువిడుదల చేశారు. పార్ట్-2కు కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉల్కా గుప్తా, ఐశ్వర్య ఓజా, అదితి భాటియా కీలక పాత్రల్లో నటించారు. ఈ టీజర్ చూస్తుంటే ముగ్గురు హిందూ అమ్మాయిల జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురు మహిళలు ఎలా మోసపోయారనే కోణంలో ఈ సినిమా ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని విపుల్ అమృత్లాల్ షా నిర్మించారు.కాగా.. 2023లో విడుదలైన 'ది కేరళ స్టోరీ' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో అదా శర్మ, సిద్ధి ఇద్నాని, యోగితా బిహాని, సోనియా బలాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ కేరళకు చెందిన కొంతమంది మహిళలు ఇస్లాంలోకి ఎలా మారారు అనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు. కేరళలో కొన్నేళ్లుగా మహిళలు లవ్ జిహాద్ ఉచ్చులో చిక్కుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వారు అదృశ్యమైనట్లు వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో దర్శకుడు సుదీప్తో సేన్ 'ద కేరళ స్టోరీ'ని తెరకెక్కించారు. -
సినిమాలో 14 మంది హీరోలు.. 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు థియేటర్లలో రిలీజ్
ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకు అయినా కష్టాలు తప్పవు. కొన్నిసార్లు అలా జరిగిపోతుంటాయంతే. రీసెంట్గా ఓ వార్త చదివే ఉంటారు. రజనీకాంత్ హీరోగా చేసిన ఓ హిందీ మూవీ దాదాపు 40 ఏళ్ల తర్వాత రిలీజ్ కానుంది. ఇందులో అప్పటి హిందీ స్టార్ యాక్టర్స్ నటించారు. అయినా సరే పలు కారణాల వల్ల ఇన్నాళ్లకు బిగ్ స్క్రీన్పై విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు ఇలానే దాదాపు 19 ఏళ్ల తర్వాత ఓ కన్నడ చిత్రానికి మోక్షం లభించింది.(ఇదీ చదవండి: మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ))కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అప్పట్లో హీరోగా అలరించాడు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడపాదడపా పలకరిస్తునే ఉన్నాడు. ఇతడు హీరోగా 2007లో మొదలైన కన్నడ చిత్రం 'రక్త కాశ్మీర'. రమ్య హీరోయిన్. కమర్షియల్ కథతోనే దీన్ని తెరకెక్కించారు. దీని విషయంలో మూవీని మించిన డ్రామా అయితే ఉంది. ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయనే చెప్పొచ్చు.ఈ సినిమాలోని ఓ పాటలో ఏకంగా 14 మంది హీరోలు కనిపించారు. ఇప్పుడు సినిమా రిలీజయ్యే సమయానికి అందులో ముగ్గురు హీరోలు (పునీత్ రాజ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్) మరణించారు. మరో హీరో దర్శన్ జైలులో ఉన్నాడు. హీరోయిన్ రమ్య అయితే ఇండస్ట్రీకే దూరమైపోయారు. విచిత్రం ఏంటంటే కన్నడలో ఈ సినిమా ఈ రోజు (జనవరి 30) థియేటర్లలో రిలీజైంది. కానీ ఇదొచ్చిన సంగతి హీరో ఉపేంద్ర కూడా తెలియదని టాక్ అయితే వినిపిస్తుంది. మరి అలాంటప్పుడు ఎందుకు రిలీజ్ చేశారో? ఏంటో?(ఇదీ చదవండి: ఓటీటీలోకి ప్రభాస్ 'రాజాసాబ్'.. అధికారిక ప్రకటన) -
మా నాన్న స్వీయ చరిత్ర ఓ సంచలనం: సౌందర్య రజనీకాంత్
బస్ కండ్టర్ నుంచి సినీ సూపర్ స్టార్గా ఎదగడం వరకూ రజనీకాంత్ జీవితంలో ఎన్నో కష్టాలు... మలుపులు. అందుకే ఆయన జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. ముఖ్యంగా రజనీకాంత్ అభిమానులు ఈ హీరో బయోపిక్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే సిల్వర్ స్క్రీన్పైకి సూపర్ స్టార్ లైఫ్ ఎప్పుడు వస్తుందో కానీ ప్రస్తుతానికి అయితే ఆయన జీవితం పుస్తక రూపంలో రానుందని రజనీ రెండో కుమార్తె, దర్శక–నిర్మాత సౌందర్య రజనీకాంత్ పేర్కొన్నారు.ఆమె నిర్మించిన ‘విత్ లవ్’ అనే చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి ఆటోబయోగ్రఫీ గురించి మాట్లాడారు సౌందర్య. ‘‘మా నాన్న తన జీవిత విశేషాలతో ‘ఆటోబయోగ్రఫీ’ రాస్తున్నారు. కర్ణాటకలో బస్ కండక్టర్గా ఆరంభించి, కోలీవుడ్లో సూపర్ స్టార్గా ఎదిగిన వరకూ మా నాన్న జీవితంలో ఎన్నో కష్టాలు, మలుపులున్నాయి.ఎవరికీ తెలియని విశేషాలన్నీ ఈ పుస్తకంలో ఉంటాయి. మా నాన్న స్వీయచరిత్ర సంచలనం అవుతుంది’’ అని పేర్కొన్నారు సౌందర్య. కాగా... పుస్తకం మాత్రమే కాదు... రజనీ జీవితంతో సినిమా నిర్మించే ప్లాన్లో సౌందర్య ఉన్నారు. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం అవుతుందని ఆమె ఆ ఇంట ర్వ్యూలో పేర్కొన్నట్లు తెలిసింది. -
సలార్-2 ఆగిపోయిందా?.. మేకర్స్ లేటేస్ట్ పోస్ట్ వైరల్..!
ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ చిత్రం సలార్(పార్ట్ 1 – సీజ్ఫైర్). 2023లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ను షేర్ చేసింది. ఖాన్సార్ అనే ప్రాంతం నేపథ్యంగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ మూవీ హిట్ కావడంతో మేకర్స్ పార్ట్-2 కూడా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు.అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్పై కొద్ది రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా సలార్ 2 స్క్రిప్ట్ను పూర్తిగా మార్చాలని ప్రశాంత్ నీల్, ప్రభాస్ నిర్ణయించారనే మరో టాక్ వినిపిస్తోంది. అందువల్లే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ వార్తలొచ్చాయి.ఇలాంటి రూమర్స్ నేపథ్యంలో సలార్ టీమ్ క్లారిటీ ఇచ్చేసింది. ప్రభాస్, శృతి హాసన్తో షూటింగ్ సమయంలో తీసిన స్టిల్ను విడుదల చేసింది. ఈ ప్రాజెక్ట్పై రూమర్స్ నిజం కాదని ఈ ఫోటోను షేర్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్కు స్పష్టత ఇచ్చేశారు. శృతి హాసన్ బర్త్ డే సందర్భంగా ఈ పోస్టర్ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సలార్ 2లో తనకు ఏమి జరుగుతుందో దేవకు ఆద్య చూపిస్తోంది!! అది ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు?" అని క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. Aadya showing Deva what happens to her in #Salaar2!!What do you think it is? pic.twitter.com/lCSrbA0TSb— Salaar (@SalaarTheSaga) January 28, 2026 -
సెట్స్ పైకి ప్రభాస్.. హీరోయిన్ పై సస్పెన్స్
ప్రభాస్ నటిస్తున్న కల్కి-2 సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. వచ్చే నెల నుంచి ప్రభాస్ సెట్స్ పైకి అడుగుపెట్టనున్నాడని, దాదాపు 10 రోజుల కాల్షీట్లు కేటాయించాడని సమాచారం. ఈ వార్తలు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారాయి. కల్కి ఫ్రాంచైజీ నుంచి దీపికా పదుకోన్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆమె పోషించిన సుమతి పాత్ర కథలో చాలా కీలకమైనది. కల్కి పార్ట్-2 మొత్తం ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. కానీ అలాంటి ముఖ్యమైన పాత్ర నుంచి దీపిక తప్పుకోవడంతో కొత్త హీరోయిన్ ఎవరనే ప్రశ్న అభిమానులను ఉత్కంఠకు గురి చేస్తోంది. ప్రస్తుతం నెట్టింట సాయిపల్లవి పేరు బలంగా వినిపిస్తోంది. కల్కి చిత్ర యూనిట్ కూడా ఆమెను ఈ పాత్రకు అనుకూలంగా భావిస్తోందని టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే నిజంగానే సాయిపల్లవినే ఫైనల్ చేశారా లేదా ఊహించని విధంగా మరో నటిని పరిచయం చేస్తారా అనేది ఇంకా సస్పెన్స్గానే మిగిలింది. దాంతో ఈ విషయంపై అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సిందే. దీపికను పార్ట్-1లో చూసిన ప్రేక్షకులు, అదే పాత్రలో మరో హీరోయిన్తో కనెక్ట్ అవ్వగలరా అనేది పెద్ద ప్రశ్న. ఈ సవాల్ను దర్శకుడు నాగ్ అశ్విన్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. -
బోల్డ్ లుక్లో నటాషా స్టాంకోవిచ్.. ప్రకృతి రాణిలా ప్రగ్యా జైస్వాల్..!
వైట్ డ్రెస్లో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ అందాలు..బోల్డ్ లుక్లో నటి నటాషా స్టాంకోవిచ్..బెస్ట్ ఫ్రెండ్తో హీరోయిన్ నేహా శెట్టి చిల్..ప్రకృతి ఒడిలో కలిసిపోయిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్..బ్లూ శారీలో యాంకర్ రష్మీ గౌతమ్ హోయలు.. View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
అప్పుడు ఐదో నెల ప్రెగ్నెంట్.. నాపై భర్త అఘాయిత్యం!
కేరళలో ఇటీవల విషాదకర ఘటన జరిగింది. బస్సులో దీపక్ అనే వ్యక్తి తనను అసభ్యంగా తాకాడంటూ ఓ యువతి చేసిన వీడియో కారణంగా అతడు తనువు చాలించాడు. ఏ తప్పూ చేయకపోయినా తన పరువు తీసిందని మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై మలయాళ బిగ్బాస్ కంటెస్టెంట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శ్రీదేవి గోపీనాథ్ స్పందించింది.కఠిన శిక్ష విధించాలి'దీపక్ చావుకు కారణమైన అమ్మాయిని అరెస్టు చేసినందుకు సంతోషంగా ఉంది. తనకు కఠిన శిక్ష విధించాలని కోరుకుంటున్నాను. అయితే ఈ ఒక్క ఘటన కారణంగా ఆడజాతి మొత్తాన్ని తిడుతున్నారు. ఆడవారికి, మగవారికి విడివిడిగా బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు అట్టముక్కలతో, వైర్లు చుట్టుకుని బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అందరు మగవాళ్లు చెడ్డవారు కాదు, అలాగే అందరు ఆడవాళ్లు చెడ్డవారు కాదు! ఆడవాళ్లకు రక్షణేది?ఈ ఘటన జరగడానికి రెండు రోజుల ముందు పదహారేళ్ల అబ్బాయి 14 ఏళ్ల అమ్మాయిని హత్యాచారం చేశాడు. అలా అని దీపక్ చావును నేను తక్కువ చేయడం లేదు. అతడికి జరిగింది మరెవరికీ జరగకూడదు. కానీ ఆడవాళ్లకు కూడా రక్షణ ఎక్కడుంది? తండ్రులు, సవతి తండ్రులు, అంకుల్స్, ఫ్రెండ్స్, సమాజంలోని ఎంతోమంది చేతిలో మహిళలు అత్యాచారానికి గురవుతూనే ఉన్నారు. ఈ రాక్షసులు చిన్న పిల్లల్ని కూడా వదలడం లేదు.ఐదు నెలల గర్భిణీగా ఉన్నప్పుడు..దీపక్ కేసులో అరెస్టయిన అమ్మాయిని కూడా అత్యాచారం చేయాలని ఓ ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నాడు. అది అతడి మానసిక స్థితిని తెలియజేస్తుంది. నేను ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు నా భర్త నాపై అత్యాచారం చేశాడు. దయచేసి ఎవరూ నోటికొచ్చినట్లు మాట్లాడకండి.. ఏదైనా అనేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఆడవాళ్లందరినీ రాక్షసులుగా చిత్రీకరించకండి' అని శ్రీదేవి కోరింది.చదవండి: 2009లో ఇండస్ట్రీలో.. ఇన్నాళ్లకు నటిగా లాంచ్: స్రవంతి -
ది గర్ల్ఫ్రెండ్ హీరో కొత్త సినిమా.. ఆసక్తిగా టీజర్
కన్నడ హీరో దీక్షిత్శెట్టి నటిస్తోన్న తాజా చిత్రం శబర. ఈ మూవీకి కిలారు ప్రేమ్ చంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మిషా నారంగ్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే బంగారం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ఓ ప్రపంచమంతా బంగారమే ఉందని తెలిసినప్పుడు.. ఎన్ని యుద్ధాలు జరిగి ఉంటాయ్? ఎన్ని ప్రాణాలు పోయింటాయి? ఈ నేల ఎంత రక్తాన్ని చూసి ఉంటుంది? అనే డైలాగ్స్ ఈ సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. రక్తం చూడని యుద్ధం ఉంటుందా? అనే డైలాగ్, విజువల్స్తో టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో మోహన్ భగత్, రాజీవ్ గోవింద పిళ్లై, కృతికా సింగ్ యాదవ్, భూషణ్ కళ్యాణ్, ఆరుష్, ప్రమోదిని, శుభం తోమర్, శ్రీకాంత్, అనిరుధ్ అరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి మిధున్ ముకుందన్ సంగీతమందిస్తున్నారు. -
హీరోయిన్ని పెళ్లి చేసుకోబోతున్నారా? తమిళలోనూ అదే తంతు
గత కొన్నాళ్లలో ప్రెస్మీట్స్ అంటే తెలుగు సినిమా హీరోహీరోయిన్లు చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే చిత్రవిచిత్రమైన ప్రశ్నలు, కొన్నిసార్లయితే మరీ దారుణమైనవి అడుగుతూ సదరు సెలబ్రిటీలని పలువురు రిపోర్టర్లు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు తమిళంలోనూ ఒకరిద్దరు రిపోర్టర్లు ఇలానే తయారైనట్లు కనిపిస్తున్నారు. తాజాగా లోకేశ్ కనగరాజ్కి ఇలాంటి ఓ ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది.(ఇదీ చదవండి: రవితేజ 'ఇరుముడి'పై రీమేక్ రూమర్స్)గతేడాది 'కూలీ'తో వచ్చిన లోకేశ్ కనగరాజ్.. ప్రస్తుతం హీరోగా ఓ మూవీ చేస్తున్నాడు. అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమాకు దర్శకత్వం చేయనున్నాడు. రెండు వారాల క్రితం దీని ప్రకటన వచ్చింది. వీటి గురించి చెప్పేందుకు చెన్నైలో ఆదివారం ప్రెస్మీట్ పెట్టాడు. తన గత, ప్రస్తుత చిత్రాల గురించి వివరాలు వెల్లడించాడు. అలానే 'ఖైదీ 2' ఎప్పుడు ఉండబోతుంది? ఎల్సీయూ గురించి కూడా క్లారిటీ ఇచ్చేశాడు.ఇదే ప్రెస్మీట్లో ఓ రిపోర్టర్.. దర్శకుడు లోకేశ్ని ఇబ్బందికర రీతిలో ప్రశ్నించాడు. మీరు ఓ హీరోయిన్తో ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి? మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? అని సదరు రిపోర్టర్ అడగ్గా.. లేదు సర్ నాకు కుటుంబం ఉంది అని లోకేశ్ సమాధానమిచ్చాడు. అయినా సరే రిపోర్టర్ వదలకుండా.. రెండో ఫ్యామిలీ వద్దా? అన్నట్లు అడిగాడు. దీనికి ఆన్సర్ ఇవ్వని లోకేశ్.. ప్రెస్మీట్ అక్కడితో ముగించేశాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో సదరు రిపోర్టర్పై నెటిజన్లు రెచ్చిపోతున్నారు. చీప్ బిహేవియర్ అని కామెంట్స్ చేస్తున్నారు. లోకేశ్ కనగరాజ్.. 2012లో ఐశ్వర్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ 'అనకొండ'.. తెలుగులోనూ)Loki-Enaku already family irukanga sirReporter-2nd family 🤮Poi un wife ta kelu da 2nd family venuma nu 😡 pic.twitter.com/uOSKTiMpXp— Shyam (@Shyam_1200) January 26, 2026 -
టాలీవుడ్లో మరోసారి విడుదల తేదీల గందరగోళం
టాలీవుడ్లో మరోసారి విడుదల తేదీల గజిబిజి మొదలైంది. ఇప్పటికే ఏ నెలలో ఏ సినిమా వస్తుందో లెక్కలు వేసుకుని, హీరోల అభిమానులు కౌంట్డౌన్ పోస్టర్లు, సోషల్ మీడియాలో ట్రెండింగులు కూడా మొదలుపెట్టారు. కానీ ముందు అనుకున్నట్టుగా కాకుండా వరుసగా సినిమాలు వాయిదా పడుతుండటంతో పరిశ్రమలో గందరగోళం నెలకొంది. ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన స్వయంభు ఏప్రిల్కు వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా వాయిదా పడినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. మార్చి చివర్లో విడుదల కావాల్సిన రామ్ చరణ్ 'పెద్ది' మే నెలాఖరుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రచారం కోసం అదనపు సమయం తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ మార్చి నుంచి వాయిదా పడుతూ మే 1న విడుదల చేస్తారనే ప్రచారం ఉంది. ఏప్రిల్లో విడుదల కావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి నెలకే ముందుకు జరిపే అవకాశం ఉందని టాక్. గూఢచారి 2 మే 1న రిలీజ్ అవుతుందని ముందుగా ప్రకటించారు. కానీ అదే తేదీకి ది ప్యారడైజ్ కూడా వస్తుందనే గాసిప్పులు వినిపిస్తున్నాయి. విశ్వంభర జూన్లో విడుదల చేయాలనే ప్లాన్ ఉంది. కానీ అప్పటికే వాయిదా పడిన సినిమాలు జూన్లో స్లాట్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. ఈ వరుస వాయిదాలతో టాలీవుడ్లో రిలీజ్ షెడ్యూల్ పూర్తిగా గందరగోళంగా మారింది. ఒక సినిమా వాయిదా పడితే దాని ప్రభావం మరో సినిమాపై పడుతోంది. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులు అందరూ అయోమయంలో ఉన్నారు. మరో 10 రోజుల్లో ఈ సినిమాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దాంతో అభిమానులు అధికారిక ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
డబ్బులెక్కువిచ్చారని 'ఖైదీ 2' డ్రాప్.. ఎట్టకేలకు నోరు విప్పిన లోకేశ్
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.. అల్లు అర్జున్తో రెండు వారాల క్రితం కొత్త సినిమాని ప్రకటించాడు. దీంతో ఈ దర్శకుడిపై లెక్కలేనన్ని విమర్శలు వచ్చాయి. రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చేసరికి 'ఖైదీ 2' వదిలేశాడు, LCU(లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్) ఆగిపోయింది అని రకరకాల రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిపై లోకేశ్ స్వయంగా స్పందించాడు. చెన్నైలో సోమవారం ఉదయం జరిగిన ఓ ప్రెస్మీట్లో తనపై వస్తున్న అన్ని పుకార్లకు సమాధానమిచ్చాడు.'గత వారం నుంచి ఎల్సీయూ క్లోజ్ అయిపోయిందని అన్నారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదు. ఖైదీ 2 కూడా ఆగిపోయిందంటున్నారు. ఇది కూడా నిజం కాదు. అల్లు అర్జున్తో చేస్తున్న మూవీ పూర్తవగానే 'ఖైదీ 2' చేస్తా. తర్వాత విక్రమ్ 2, రోలెక్స్ చిత్రాలు వరసగా వస్తాయి. లారెన్స్తో చేస్తున్న 'బెంజ్' కూడా ఎల్సీయూలో భాగమే. దయచేసి రూమర్స్ నమ్మకండి'(ఇదీ చదవండి: తమిళ బ్లాక్బస్టర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)'ఖైదీ 2 ఆలస్యం కావడానికి పారితోషికం కారణం కాదు. వేరే నిర్మాతలు డబ్బులు ఎక్కువ ఇచ్చారని దీన్ని వదిలేయలేదు. ఇతర ప్రాజెక్టుల వల్లే ఇంత గ్యాప్ వచ్చింది. 'కూలీ' తర్వాత రజనీకాంత్-కమల్ హాసన్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ సినిమాకు దర్శకత్వం చేయమన్నారు. దీంతో ఒకటిన్నర నెలలు స్క్రిప్ట్ వర్క్ చేశాను. వరసగా యాక్షన్ మూవీస్ చేస్తుండటంతో ఒక సింపుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ చేద్దామన్నారు. దాన్ని ఎలా డీల్ చేయాలో తెలీక ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేశాను''అల్లు అర్జున్తో సినిమా కోసం మైత్రీ మూవీస్ సంస్థతో చాలా ఏళ్లుగా ట్రావెల్ అవుతున్నాయి. అది ఇప్పటికి కుదిరింది. అందుకే బన్నీ మూవీ ఇప్పుడు చేస్తున్నాను తప్పితే 'ఖైదీ 2' వదిలేసి చేయట్లేదు. అలానే దళపతి విజయ్ 'జన నాయగణ్'లో అతిథి పాత్ర చేశా' అని లోకేశ్ కనగరాజ్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)#LokeshKanagaraj about UpComing #LCU Film- After my film with #AlluArjun sir, my very next project will be #Kaithi2, #Vikram2, and the #Rolex standalone film are all commitments I’ve made, and I will complete every one of them.#AA23pic.twitter.com/de7CqnwckD— Movie Tamil (@_MovieTamil) January 26, 2026 -
ప్రతిభకు పద్మం
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. ధర్మేంద్రను పద్మ విభూషణ్, మమ్ముట్టి, అల్కా యాగ్నిక్లను పద్మ భూషణ్, మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, మాధవన్లను పద్మశ్రీ అవార్డులు వరించాయి.ఆల్ రౌండర్పంజాబ్లోని ఫాగ్వారా గ్రామం నుంచి ముంబై నగరానికి చేరుకుని సినీ రంగంలో ‘స్టార్’గా ఎదిగిన ఘనత ధర్మేంద్ర సొంతం. ఆరు దశాబ్దాలకు పైగా చేసిన చిత్రాలతో ‘రొమాంటిక్ హీరోగా, యాక్షన్ హీరోగా’ ప్రశంసలు పొంది, ‘హీ మ్యాన్’గా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ధర్మేంద్ర. 2012లో కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్రను ‘పద్మ భూషణ్’ పురస్కారంతో సత్కరించింది. సినీ రంగానికి చేసిన సేవలకు గాను తాజాగా ‘పద్మ విభూషణ్’ (మరణానంతరం) ప్రకటించింది. నాటకాల నుంచి సినిమాల వరకూ...ధర్మేంద్ర అసలు పేరు ధర్మేంద్ర కెవల్ క్రిషన్ డియోల్. 1935 డిసెంబర్ 8న పంజాబ్లోని ఫాగ్వారాలో ఆయన జన్మించారు. ధర్మేంద్ర తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో తనయుడు ప్రోఫెసర్ కావాలని కోరుకున్నారు. అయితే ధర్మేంద్ర మెరిట్ స్టూడెంట్ కాదు. పైగా నాటకాలంటే ఇష్టం. స్కూల్ డేస్లో నాటకాల్లో నటించారు. నటనపై ఉన్న ఇష్టం సినిమాల వరకూ వచ్చేలా చేసింది. కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు ఫిల్మ్ఫేర్ మేగజీన్ నిర్వహించిన కార్యక్రమంలో విజేతగా నిలిచి, ముంబై చేరుకున్నారు ధర్మేంద్ర. అప్పటికే ఆయనకు ప్రకాశ్ కౌర్తో వివాహం (1954) జరిగింది. వారికి కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్, కుమార్తెలు విజిత, అజిత ఉన్నారు రెండో సినిమాతో తొలి విజయం‘దిల్ బీ తేరా హమ్ బీ తేరే’ (1960) సినిమాతో బాలీవుడ్లో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు ధర్మేంద్ర. అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో పాటు ధర్మేంద్రకు గుర్తింపు తెచ్చిపట్టలేదు. ఆ తర్వాత చేసిన ‘షోలా ఔర్ షబ్నమ్’తో తొలి విజయం అందుకున్నారు. వరుసగా ‘అన్పద్, బందినీ’ (ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు సాధించింది) వంటి చిత్రాల్లో నటించారు. ‘ఆయీ మిలన్ కీ బేలా’ (1964) చిత్రంతో బాగా పాపులర్ అయ్యారు. ఈ చిత్రంలో ధర్మేంద్ర నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేశారు. అదే ఏడాది ఆయన లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘హకీకత్’. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చైనా–ఇండియా యుద్ధం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. 1965లో చేసిన రొమాంటిక్ చిత్రం ‘కాజల్’తో మరో భారీ విజయాన్ని అందుకున్నారు ధర్మేంద్ర. ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేనంతగా బిజీ అయ్యారు.సేలబుల్ స్టార్గా... ధర్మేంద్రకు సేలబుల్ స్టార్ అని పేరు తెచ్చిన చిత్రం ‘ఫూల్ ఔర్ పత్తర్’. 1966లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నమోదు అయింది. అదే ఏడాది చేసిన ‘మమత, దేవర్, అనుపమ, ఆయే దిన్ బహర్ కే’ చిత్రాలు ఆ విజయాన్ని కొనసాగించాయి. ‘మేరా గావ్ మేరా దేశ్’ (1971)తో తనలో మంచి యాక్షన్ హీరో ఉన్నాడని నిరూపించుకున్న ధర్మేంద్రకు, ‘రాజా జానీ’ (1972), ‘జుగ్ను’ (1973) వంటి చిత్రాలు ఆ ఇమేజ్ని బలపరిచాయి. అయితే అంతకు ముందు చేసిన ప్యార్ హి ΄్యార్’ (1966), ‘ఆయా సావన్ ఝూమ్ కే’ (1969), ‘మేరే హమ్దమ్ మేరే దోస్త్’ (1968)... వంటి చిత్రాలతో ధర్మేంద్ర రొమాంటిక్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ధర్మేంద్ర కెరీర్లో ‘షోలో’ (1975) చిత్రం కీలకం. అమితాబ్ బచ్చన్ కాంబినేషన్లో చేసిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. తెరవెనకా హిట్ పెయిర్: అప్పట్లో బాలీవుడ్లో హిట్ పెయిర్ అనిపించుకున్నవారిలో ధర్మేంద్ర–హేమ మాలిని’లది ప్రత్యేకమైన స్థానం. 1970లలో ఈ ఇద్దరూ ‘తుమ్ హసీన్ మే జవాన్, షరాఫత్, సీతా ఔర్ గీతా, రాజా జానీ, జుగ్ను, ప్రతిజ్ఞ, షోలే, చరస్, ఆజాద్’ వంటి చిత్రాలు బ్లాక్బస్టర్గా నిలిచాయి. ఇలా తెరపై హిట్ జోడీ అనిపించుకున్న ఈ ఇద్దరూ తెరవెనకా హిట్ పెయిర్. డ్రీమ్ గర్ల్ అనిపించుకున్న హేమ మాలిని, హీ మ్యాన్గా పేరు తెచ్చుకున్న ధర్మేంద్ర వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు. 1980లో వివాహం చేసుకుని రియల్ లైఫ్ జోడీగా మారారు. వీరికి కుమార్తెలు ఈషా డియోల్, అహనా డియోల్ ఉన్నారు.క్యారెక్టర్ ఆర్టిస్ట్గా... ఒకవైపు భారీ మాస్ కమర్షియల్ మూవీ ‘షోలే’లో నటించిన ధర్మేంద్ర మరోవైపు ‘సత్యకామ్’వంటి ఆఫ్బీట్ చిత్రాలకు జీవం పోశారు. కామెడీ పాత్రల నుంచి యాక్షన్ పాత్రల వరకు... ‘చుప్కే చుప్కే’లోని హాస్య పాత్ర నుంచి ‘ఫూల్ ఔర్ పత్తర్’లోని యాక్షన్ హీరో ఇమేజ్ వరకు ఆయన ‘ఆల్ రౌండర్’ అనిపించుకున్నారు. 1973లో ఎనిమిది హిట్స్, 1987లో వరుసగా ఏడు హిట్స్తో పాటు అదే ఏడాది తొమ్మిది విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఘనత ఆయన సొంతం చేసుకున్నారు. 1983లో విజయా ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి, తన పెద్ద కుమారుడు సన్నీ డియోల్ హీరోగా ‘ఘాయల్’ వంటి సూపర్హిట్ మూవీని నిర్మించారు.. తన కుమారులు బాబీ డియోల్, సన్నీ డియోల్లతో కలిసి ‘అప్నే, యమాల పగ్లా దీవానా’ వంటి సినిమాల్లో నటించారు ధర్మేంద్ర. 1995 తర్వాత ధర్మేంద్ర క్యారెక్టర్ నటుడిగా మారారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ధర్మేంద్ర నటించిన ఆఖరి చిత్రం ‘ఇక్కీస్’ (2025).రాజకీయాల్లోనూ... భారతీయ జనతా పార్టీ 2004లో చేపట్టిన ‘షైనింగ్ ఇండియా’ ప్రచారం ధర్మేంద్రను బాగా ప్రభావితం చేసింది. ధర్మేంద్రని రాజస్థాన్ లోని బికనీర్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టింది బీజేపీ. కాంగ్రెస్ అభ్యర్థి రామేశ్వర్ లాల్ దూడీని దాదాపు 60 వేల ఓట్ల తేడాతో ఓడించి, ఎంపీగా ఘనవిజయం సాధించారు ధర్మేంద్ర. నటుడిగా ఎన్నో విజయాలు చవిచూసిన ధర్మేంద్ర రాజకీయాల్లోనూ సక్సెస్. 2004 నుండి 2009 వరకు ఆయన బికనీర్కి ప్రాతినిధ్యం వహించారు. 2009లో తన పదవీకాలం ముగిసిన అనంతరం ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 2012లో పద్మభూషణ్: 1991లో ‘ఘాయల్’ సినిమాకుగానూ ధర్మేంద్ర నిర్మాతగా జాతీయ అవార్డు అందుకున్నారు. కళామతల్లికి ధర్మేంద్ర చేసిన సేవలకుగానూ 2012లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇప్పుడు పద్మ విభూషణ్ ప్రకటించింది.ఎవర్గ్రీన్డిఫరెంట్ జానర్స్లో నటించిన విలక్షణమైన నటుడు మమ్ముట్టి. ఏడు పదుల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీ. అందుకే మమ్ముట్టి ఎవర్గ్రీన్ స్టార్. సినీ పరిశ్రమకు మమ్ముట్టి చేసిన సేవలకు గుర్తింపుగా పద్మభూషణ్ అవార్డు వరించింది. మమ్ముట్టి పూర్తి పేరు ముహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్. ఇస్మాయిల్, ఫాతిమా దంపతులకు 1951 సెప్టెంబర్ 7న కేరళలోని అలప్పుళ జిల్లా చండీరూర్లో ఆయన జన్మించారు. పెరిగింది మాత్రం కేరళలోని కొట్టాయం జిల్లాలో. మమ్ముట్టిది మధ్యతరగతి ముస్లిం కుటుంబం. ఇద్దరు తమ్ముళ్ళు, ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. ఎర్నాకులంలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ డిగ్రీ పట్టా పొందారు మమ్ముట్టి. ఆ తర్వాత రెండేళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. మరోవైపు సినిమాల్లో నటించే ప్రయత్నాలు చేశారు. చిన్న రోల్స్తో ప్రారంభం: 1971లో ’అనుభవంగళ్ పాలిచకల్’ చిత్రంలో ఓ చిన్న పాత్రతో నటన ప్రారంభించారు మమ్ముట్టి. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చారు. వాసుదేవ్ నాయర్ తన డైరెక్షన్లోని ‘విల్కన్ ఉండూ స్వప్నంగళ్’లో మమ్ముట్టిని మెయిన్ లీడ్గా ఎంచుకున్నారు. ఈ చిత్రంతో మమ్ముట్టికి మంచి గుర్తింపు లభించింది. 1971– 1982 మధ్యకాలంలో మమ్ముట్టి ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్, కీలక పాత్రల్లో నటించారు. త్రిష్ణ (1981), అహింస (1981) చిత్రాల్లో లీడ్ రోల్స్ చేశారు.ఏడాదికి ఇరవైకి పైగా చిత్రాలు.. జోషియ్ డైరెక్షన్లో 1987లో వచ్చిన ‘న్యూ ఢిల్లీ’ సినిమా మమ్ముట్టి కెరీర్లో ఓ బ్లాక్బస్టర్గా నిలిచింది. పౌరాణిక చిత్రం ‘ఒరు వడక్కన్ వీరగాథ’ చిత్రంతో మమ్ముట్టికి తొలి జాతీయ అవార్డు వచ్చింది. ఏడు పదుల వయసులో ‘కన్నూర్ స్వా్కడ్’, ‘భ్రమయుగం’, ‘టర్బో’, ‘కలంకావల్’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ‘భ్రమయుగం’, ‘కలంకావల్’ చిత్రాల్లో మమ్ముట్టి నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేయడం విశేషం. తెలుగు ప్రేక్షకులు మెచ్చిన హీరో ఇక టాలీవుడ్తో మమ్ముట్టికి ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పవచ్చు. కె. విశ్వనాథ్ డైరెక్షన్లో మమ్ముట్టి నటించిన ‘స్వాతి కిరణం’ సినిమా 1992లో విడుదలై, ఎంతటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా రూపొందిన ‘యాత్ర’ (2019) సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇందులో రాజశేఖర రెడ్డి పాత్రలో నటించారు మమ్ముట్టి.అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ‘యాత్ర 2’ చిత్రంలోనూ మమ్ముట్టి నటించారు. 2024 ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం సూపర్హిట్గా నిలిచింది. ఈ రెండు చిత్రాలకూ (యాత్ర, యాత్ర 2) మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించారు. గతంలో కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన ‘రైల్వే కూలి’ (2001) చిత్రంలో మమ్ముట్టి హీరోగా నటించారు. హిందీ హిట్ ఫిల్మ్ ‘దివార్’కు ఇది రీమేక్గా రూపొందింది. తండ్రికి తగ్గ తనయుడిగా... 1979లో సుల్ఫత్ను వివాహం చేసుకున్నారు మమ్ముట్టి. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. ఈ దంపతులకు కుమార్తె సురుమి, కుమారుడు దుల్కర్ సల్మాన్ ఉన్నారు. నటుడిగా–నిర్మాతగా దుల్కర్ సల్మాన్ తండ్రికి తగ్గ తనయుడిగా దుల్కర్ దూసుకెళుతున్నారు. ‘మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్, కాంత’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు దుల్కర్.పలు అవార్డులు..మమ్ముట్టికి మూడు జాతీయ అవార్డులు (ఒరు వడక్కన్ వీరగాథ, పొంతన్ మదా అండ్ విధేయన్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రాలకుగాను) సాధించారు. 1998లో ఆయన్ను పద్మశ్రీ అవార్డు వరించగా, ఈ ఏడాది పద్మభూషణ్ అవార్డు దక్కింది.మధుర గానంసంగీత ప్రపంచంలో తన మధుర గాత్రంతో శ్రోతలను మైమరిపిస్తున్న ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్ను పద్మభూషణ్ అవార్డు వరించింది. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైన కెరీర్లో నేపథ్య గాయనిగా తనదైన ముద్ర వేశారు. హిందీ, గుజరాతీ, ఒరిస్సా, మణిపురి, నేపాలీ, రాజస్థానీ... ఇలా దాదాపు పాతిక భాషల్లో వెయ్యికి పైగా చిత్రాల్లో పాడారు. సంగీత ప్రపంచానికి యాగ్నిక్ చేస్తున్న సేవలను గుర్తించి, కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. ధర్మేంద్ర శంకర్, శుభా దంపతులకు 1966 మార్చి 20న కోల్కతాలో అల్కా యాగ్నిక్ జన్మించారు. అల్కా యాగ్నిక్ తల్లి శుభా భారతీయ శాస్త్రీయ సంగీత గాయకురాలు. అలా తల్లి బాటలోనే అల్కా నడిచారు. తన ఆరో సంవత్సరంలోనే ఆమె కోల్కతాలోని ఆల్ ఇండియా రేడియో కోసం పాట పాడారు. పదేళ్ల వయసులో అల్కా యాగ్నిక్ ముంబైలో అడుగు పెట్టారు. ఆ సమయంలో కోల్కతాలోని ఓ సినిమా డిస్ట్రిబ్యూటర్ యాగ్నిక్ గురించి రాజ్ కపూర్కు ఓ లేఖ రాయగా, రాజ్ కపూర్ ఆమె స్వరం విని, మ్యూజిక్ డైరెక్టర్ లక్ష్మీకాంత్కు లేఖ రాశారట. అలా లక్ష్మీకాంత్ ఆమెకు వరుస అవకాశాలు కల్పించడంతో యాగ్నిక్ తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఇక ఆమిర్ ఖాన్ నటించిన ‘హమ్ హై రహీ ΄్యార్ కే’ సినిమాలోని ‘ఘూంఘట్ కి ఆద్ సే’, షారుక్ ఖాన్ నటించిన ‘కుచ్ కుచ్ హోతా హై’ చిత్రంలోని ‘కుచ్ కుచ్ హోతా హై’ పాటలకుగాను యాగ్నిక్ను జాతీయ అవార్డులు వరించాయి. హిందీ చిత్రపరిశ్రమలో ప్రఖ్యాత గాయణీమణులు లతా మంగేష్కర్, ఆశా భోంస్లేల తర్వాత ఎక్కువ పాటలు పాడిన మహిళా గాయనిగా అల్కా యాగ్నిక్ పేరును ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అలాగే ‘రైజింగ్ స్టార్, సూపర్స్టార్ సింగర్, ఇండియన్ ఐడల్’ టీవీ రియాలిటీ షోలకు అల్కా న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. షిల్లాంగ్కు చెందిన వ్యాపారవేత్త నీరజ్ కపూర్ను 1989లో వివాహం చేసుకున్నారామె. ఈ దంపతులకు సాయేషా అనే కుమార్తె ఉన్నారు. గాయనిగా పలు అవార్డులు పొందిన అల్కా యాగ్నిక్ మధుర స్వరానికి ‘పద్మ భూషణం’ ఓ ఆభరణం.ఏ పాత్ర అయినా ఓకేహీరోగా కెరీర్ ఆరంభించి, ఆ తర్వాత క్యారెక్టర్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళీమోహన్ నిర్మాతగా కూడా సక్సెస్ఫుల్. 50 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులు పొందిన ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. 1940 జూన్ 24 పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రు గ్రామంలో జన్మించారు మురళీమోహన్. అసలు పేరు మాగంటి రాజబాబు. మురళీమోహన్ విద్యాభ్యాసం ఏలూరులో గడిచింది. ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీలో డిగ్రీ విద్యాభ్యాసం చేశారు. 1963లో ఎలక్ట్రికల్ మోటార్లు, ఆయిల్ ఇంజన్ల వ్యాపారం ఆరంభించారు. వ్యాపారం చేస్తూనే నాటకాల్లో నటించేవారు. అలాగే వ్యాపారంలో భాగంగా మదరాసు (చెన్నై) వెళ్లేవారు. ‘జగమే మాయ’తో... అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించాలనుకున్న ‘జగమే మాయ’ (1973)లో నటించే అవకాశం మురళీమోహన్కి దక్కింది. ఆ చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేశారు. 1974లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో నటించిన ‘తిరుపతి సినిమాతో మురళీమోహన్కి గుర్తింపు వచ్చింది. ఒకవైపు హీరోగా నటిస్తూనే... మరోవైపు ఏ పాత్ర వస్తే అది కాదనుకుండా చేశారు మురళీమోహన్. ‘పొట్టేలు పున్నమ్మ’తో భారీ విజయం: హీరోగా మురళీమోహన్ కెరీర్లో భారీ విజయవంతమైన చిత్రం ‘పొట్టేలు పున్నమ్మ’. 1978లో విడుదలైన ఈ చిత్రం ఆ ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రంగా నమోదు అయింది. 50 ఏళ్ల కెరీర్ దాదాపు 350 చిత్రాల్లో నటించారు. నిర్మాతగా జయభేరి: మురళీమోహన్ తన సోదరుడు కిశోర్తో కలిసి ‘జయభేరి ఆర్ట్స్’ని ఆరంభించారు. ఈ బేనర్పై రూపొందిన తొలి చిత్రం ‘రామదండు’ (1981). ఈ చిత్రంలో మురళీమోహన్ హీరోగా నటించారు. అదే ఏడాది ఈ సంస్థ నిర్మించిన ‘వారలబ్బాయ్’లోనూ హీరోగా నటించారు. నటుడిగా ఇది మురళీమోహన్కు నూరవ చిత్రం. జయభేరి ఆర్ట్స్పై రూపొందిన చిత్రాల్లో మహేశ్బాబు హీరోగా నటించిన ‘అతడు’ (2005) ఒకటి. ఈ నిర్మాణ సంస్థలో దాదాపు 25 చిత్రాలు వచ్చాయి.పలు బాధ్యతలతో... నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లలో వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వర్తించారు మురళీమోహన్. 2015 వరకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు గౌరవాధ్యక్షునిగా చేశారు. రాజకీయ రంగంలో... 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ 2014లో రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. మురళీమోహన్కు భార్య విజయలక్ష్మి, కుమార్తె మధు బిందు, కుమారుడు రామ్మోహన్ ఉన్నారు. ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్లో 85 శాతం పొందిన పేద విద్యార్థులను మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చదివిస్తున్నారు. ఇక ఉత్తమ నటుడిగా ‘ఓ తండ్రి తీర్పు’ (1985)కి, ఉత్తమ సహాయ నటుడిగా ‘ప్రేమించు’ (2001), ‘వేగు చుక్కలు’ (2003) చిత్రాలకు గాను మురళీమోహన్ నంది అవార్డులు అందుకున్నారు. తాజాగా ఆయన అవార్డుల జాబితాలో ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు చేరింది.కీర్తి కిరీటంలో పద్మంనట కిరీటి అనిపించుకున్న రాజేంద్రప్రసాద్ కీర్తి కిరీటంలో పద్మశ్రీ అవార్డు చేరింది. కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో గద్దె నారాయణ, విజయ చాముండేశ్వరీ దంపతులకు 1956 జూలై 19న రాజేంద్రప్రసాద్ జన్మించారు. నిమ్మకూరు గ్రామంలోని ఎన్టీఆర్ నివాసంలోనే ఉండేవారు నారాయణ. ఆ గ్రామంలోని నందమూరి హరికృష్ణ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించేవారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు రాజేంద్రప్రసాద్కు చిన్న నాటి నుంచి మంచి అనుబంధం ఉంది. కాగా రాజేంద్రప్రసాద్ సిరామిక్ ఇంజనీరింగ్లో డిపొ్లమా పట్టభద్రుడయ్యాడు. ఓ కంపెనీలో ఉద్యోగానికి చేరినప్పటికీ వయసు చిన్నది కావడంతో రాజీనామా చేయాల్సిన పరిస్థితి. ‘తాతమ్మ కల’ షూటింగ్ చూసిన తర్వాత రాజేంద్రప్రసాద్కి సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు ఎన్టీఆర్, ఆయన సోదరుడు త్రివిక్రమ రావు సూచన మేరకు నటనలో శిక్షణ తీసుకున్నారు. ‘స్నేహం’తో... బాపు దర్శకత్వంలో రూపొందిన ‘స్నేహం’ (1977) నటుడిగా రాజేంద్రప్రసాద్ తొలి చిత్రం. ఆ తర్వాత ‘మంచుపల్లకి, ఈ చరిత్ర ఏ సిరాతో, పెళ్ళి చూపులు, రామరాజ్యంలో భీమరాజు’ తదితర చిత్రాల్లో చేసిన పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ప్రేమించు పెళ్లాడు’ సినిమాతో రాజేంద్రప్రసాద్ని హీరోగా పరిచయ చేశారు దర్శకుడు వంశీ. ఆ తర్వాత వంశీ దర్శకత్వంలోనే చేసిన ‘లేడీస్ టైలర్’తో రాజేంద్రప్రసాద్కి హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. జంధ్యాల దర్శకత్వంలో హీరోగా నటించిన ‘అహ నా పెళ్ళంట’ స్టార్ని చేసింది. ‘క్విక్ గన్ మురుగన్’ అనే హాలీవుడ్ చిత్రంలో నటించారు.‘మేడమ్ ’ సినిమాలో ప్రయోగాత్మకంగా మహిళ పాత్ర పోషించి, తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇంకా ‘ఆ నలుగురు, ఓనమాలు, మీ శ్రేయోభిలాషి’ వంటి చిత్రాల్లో నటుడిగా ప్రేక్షకులు మనసులను తాకారు రాజేంద్రప్రసాద్. అవార్డులు: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు 2015లో అధ్యక్షుడిగా చేశారు రాజేంద్రప్రసాద్. అవార్డుల విషయానికొస్తే... ‘ఎర్ర మందారం’ (1991)తో ఉత్తమ నటుడిగా, ‘మేడమ్’ (1994)కి స్పెషల్ జ్యూరీ, ‘ఆ నలుగురు’ (2004)కి ఉత్తమ నటుడిగా, ‘టామీ’ (2014)కి ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు రాజేంద్రప్రసాద్. తాజాగా పద్మశ్రీ వరించింది.విలక్షణ నటుడు హీరో, విలన్, క్యారెక్టర్ ఆరిస్టు... ఇలా భిన్న కోణాల్లో నిరూపించుకున్న మాధవన్ను పద్మశ్రీ పురస్కారం వరించింది. మాధవన్ అసలు పేరు రంగనాథన్ మాధవన్. 1970లో జూన్ 1న జంషెడ్పూర్లోని ఓ తమిళ కుటుంబంలో జన్మించారు. మాధవన్ విద్యాభాసం కొల్హాపూర్లో సాగింది. చదువుకునే రోజుల్లో మాధవన్ సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా ఉండేవారు. చదువు పూర్తయ్యాక ముంబైకి రావడం, టీవీ ఇండస్ట్రీలో అవకాశం దక్కడం జరిగింది.పాటతో ప్రయాణం: తొలుత ‘ఇస్ రాత్ కీ సుబా నహీ’ అనే హిందీ చిత్రంలోని ఓ పాట పాడి, ఇదే పాటలో గెస్ట్గా కనిపించారు మాధవన్. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘అలై పాయుదే..’ (2000) చిత్రంతో మాధవన్కి నటుడిగా బ్రేక్ వచ్చింది. ‘మిన్నలే, డుమ్ డుమ్ డుమ్’ చిత్రాలూ మాధవన్కు గుర్తింపును తెచ్చిపెట్టాయి. కానీ 2002లో ‘రన్’ సినిమా మాధవన్కు మంచి కమర్షియల్ సక్సెస్ను తెచ్చిపెట్టింది. ‘రెహ్నా హై తేరే దిల్ మే’ (‘మిన్నలే’ సినిమాకు రీమేక్) హిందీలో మాధవన్కు తొలి చిత్రం.ఆ తర్వాత ‘రంగ్ దే బసంతి, గురు, త్రీ ఇడియట్స్, తను వెడ్స్ మను, సైతాన్, ధురంధర్’ చిత్రాల్లో నటించారు. తెలుగులో ప్రకాశ్ దంతులూరి డైరెక్షన్లో నవదీప్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ‘ఓం శాంతి’ చిత్రంలో నటించారు. నాగచైతన్య ‘సవ్వసాచి’లో మాధవన్ విలన్గా నటించి, మెప్పించారు. మాధవన్∙నటించి, స్వీయదర్శకత్వంలో నిర్మించిన బయోగ్రాఫికల్ డ్రామా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా జాతీయ అవార్డు దక్కింది. నటుడిగా–దర్శకుడిగా మాధవన్ ప్రతిభకు ఇప్పుడు పద్మశ్రీ పురస్కారం దక్కింది. -
ప్రభాస్ బాటలో బన్నీ.. స్ట్రాటజీ రిపీటు
టాలీవుడ్లో పెద్ద హీరోల్లో వరుసగా సినిమాలు ప్రకటిస్తూ అంతే వేగంగా షూటింగ్లు పూర్తి చేసే హీరోగా ప్రభాస్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభాస్ ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులు లాక్ చేస్తారు. వాటికి బ్యాక్ టు బ్యాక్ కాల్షీట్లు ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ప్రభాస్ బాటలో నడుస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు అట్లీతో బన్నీ ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే లోకేశ్ కనగరాజ్తో మరో సినిమా ప్రకటించాడు. ఈ రెండు సినిమాలపై చర్చలు కొనసాగుతుండగానే తాజాగా మరో ప్రాజెక్ట్ను లైన్లో పెట్టాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్నాడని టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. తమ బ్యానర్పై వంగా దర్శకత్వంలో బన్నీ సినిమా ఉంటుందని ఆయన స్పష్టంగా తెలిపారు. నిజానికి ఈ కాంబినేషన్ కొత్తది కాదు. దాదాపు మూడు సంవత్సరాల క్రితమే వంగా-బన్నీ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిగాయి. కానీ అనుకోని కారణాల వల్ల అప్పట్లో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లాక్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమా వెంటనే మొదలయ్యే అవకాశం లేదు. అట్లీ, లోకేశ్ కనగరాజ్ సినిమాలు పూర్తి చేసిన తర్వాతనే బన్నీ వంగా ప్రాజెక్ట్ వైపు వస్తాడు. మరోవైపు సందీప్ రెడ్డి కూడా స్పిరిట్, యానిమల్ పార్క్ సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ప్రభాస్ ఒకేసారి 2-3 సినిమాలు ప్రకటించే ట్రెండ్ను మొదలుపెట్టాడు. సలార్, కల్కి, రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ వంటి ప్రాజెక్టులు ఇప్పటికే ప్రకటించారు. వీటికి అదనంగా సలార్-2, కల్కి-2 కూడా లైన్లో ఉన్నాయి. ఇప్పుడు బన్నీ కూడా అదే తరహాలో ముందు ప్రాజెక్టులు లాక్ చేసి ఆ తర్వాత డేట్స్ కేటాయించే స్ట్రాటజీని అనుసరిస్తున్నాడు. టాలీవుడ్లో ఈ కొత్త ట్రెండ్ స్టార్ హీరోల అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
బాలీవుడ్పై ప్రకాశ్ రాజ్ విమర్శలు
సౌత్ టు నార్త్.. అన్ని భాషా సినిమాల్లో నటించాడు ప్రకాశ్ రాజ్. దాదాపు 38 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాడు. ప్రస్తుతం తమిళ, మలయాళ ఇండస్ట్రీయే బలమైన సినిమాలు చేస్తోందని.. హిందీ సినిమా తన మూలాలు కోల్పోయిందంటున్నాడు. శనివారం నాడు కోజికోడ్లో కేరళ లిటరేటర్ ఫెస్టివల్కు ప్రకాశ్ రాజ్ హాజరయ్యాడు. సహజత్వం లేదుఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. తమిళం, మలయాళంలో బలమైన సినిమాలు తీస్తున్నారు. కానీ హిందీలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. అక్కడి సినిమాలు ఆత్మను, సహజత్వాన్ని కోల్పోయాయి. పైకి అద్భుతంగా కనిపిస్తుంది. కాకపోతే అంతా ప్లాస్టిక్లా ఉంటుంది.. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోని విగ్రహాలలాగా! కానీ దక్షిణాదిలో ఇప్పటికీ చెప్పడానికి బోలెడన్ని కథలున్నాయి. ఫోకస్ అంతా దానిపైనేదళితుల సమస్యలను తమిళ యంగ్ డైరెక్టర్స్ తెరపై చాలా చక్కగా చూపిస్తున్నారు. మల్టీప్లెక్స్లు వచ్చాక బాలీవుడ్ కేవలం వాటికి అనుగుణంగా సినిమాలు తీయడంపైనే శ్రద్ధ పెట్టింది. ఈ క్రమంలోనే ప్రాంతీయతను కోల్పోయింది. కేవలం డబ్బు, లుక్స్, రీల్స్, ప్రమోషన్స్.. వీటిపైనే ఫోకస్ చేసింది. దానివల్లే హిందీ చిత్రపరిశ్రమ ప్రేక్షకులకు కాస్త దూరమైంది అని చెప్పుకొచ్చాడు.చదవండి: కూతురి చిన్ననాటి కోరిక.. రూ.50 లక్షల గిఫ్ట్ ఇచ్చిన నటి -
పరోటా మాస్టర్కి గోల్డ్ చెయిన్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్
సూపర్స్టార్ రజనీకాంత్.. ఎప్పటికప్పుడు గోల్డ్ చెయిన్స్ గిఫ్ట్ ఇస్తుంటారు. వీటిని అందుకున్న వాళ్లలో సెలబ్రిటీలే ఎక్కువగా ఉంటుంటారు. ఏదైనా సినిమా నచ్చితే.. హీరో లేదా దర్శకుడిని పిలిచి రజనీ.. బంగారు చెయిన్స్ ఇస్తుంటారు. ఈసారి మాత్రం పరోటాలు చేసే ఓ వ్యక్తికి ఇచ్చారు. అతడి కుటుంబాన్ని తన ఇంటికి పిలిపించుకుని ఈ బహుమానం అందజేశారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: సిరై రివ్యూ: కంటతడి పెట్టించే సినిమా.. పోలీస్ ఇలానే ఉంటాడు)తమిళనాడులోని మధురైలో శేఖర్ అనే వ్యక్తి.. పరోటా షాప్ నడుపుతున్నాడు. గత 13 ఏళ్ల నుంచి 5 రుపాయలకే పరోటా అమ్ముతున్నాడు. గతంలో ఇతడికి సంబంధించిన పలు వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. ఇతడి పేరు శేఖర్ అయినప్పటికీ అందరూ రజనీకాంత్ శేఖర్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే తలైవర్కి అంత వీరాభిమాని కాబట్టి. ఈ క్రమంలోనే తాజాగా రజనీ నుంచి శేఖర్ కుటుంబానికి పిలుపు వచ్చింది. తాజాగా శేఖర్ని ఇంటికి పిలిపించుకున్న రజనీకాంత్.. అతడికి బంగారు చెయిన్ బహుమతిగా ఇచ్చారు. (ఇదీ చదవండి: 'హుక్ స్టెప్' అలా పుట్టింది: కొరియోగ్రాఫర్ ఆట సందీప్) -
విడాకులు తీసుకున్న బుల్లితెర జంట
బుల్లితెర నటి అనూష హెగ్డే భర్త, నటుడు ప్రతాప్ సింగ్తో చాలాకాలం దూరంగా ఉంటోంది. వీరిద్దరికీ విడాకులయ్యాయా? అన్న అనుమానాలకు ఒక్క పోస్ట్తో క్లారిటీ ఇచ్చింది అనూష. నా వైవాహిక జీవితంలో 2023 తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో మీ అందరికీ తెలుసు. మేమిద్దరం చట్టపరంగా 2025లోనే విడిపోయాం అని తెలియజేయడానికే ఈ పోస్ట్..అధ్యాయం ముగిసిందిదీనిపై ఎటువంటి చర్చ పెట్టొద్దని కోరుతున్నాను. మీ ప్రేమాభిమానాలకు, అందిస్తున్న సపోర్ట్కు కృతజ్ఞతలు అని పేర్కొంది. పరస్పర అంగీకారంతోనే తన జీవితంలో ఈ అధ్యాయం ముగిసిందని తెలిపింది. ప్రస్తుతం తన కుటుంబం, కెరీర్, మానసిక ప్రశాంతతపైనే దృష్టిపెట్టినట్లు రాసుకొచ్చింది.సీరియల్లో జంటగా..అనూష హెగ్డే, ప్రతాప్ సింగ్ 'నిన్నే పెళ్లాడతా' సీరియల్లో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో 2020 ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అదే నెలలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య కొంతకాలంగా విభేదాలు మొదలయ్యాయి. చివరకు దంపతులిద్దరూ విడిపోవడానికే నిర్ణయించుకున్నారు.సీరియల్, సినిమాతెలుగు నటుడు ప్రతాప్ సింగ్.. శశిరేఖ పరిణయం, కుంకుమ పువ్వు, తేనె మనసులు ఇలా పలు సీరియల్స్ చేశాడు. ముద్దపప్పు ఆవకాయ వెబ్ సిరీస్లో నిహారికకు జోడీగా యాక్ట్ చేశాడు. బేవర్స్ సినిమాలోనూ నటించాడు. అనూష హెగ్డే విషయానికి వస్తే సూర్యకాంతం సీరియల్లో యాక్ట్ చేసిన ఈ నటికి తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కన్నడ బుల్లితెరపై సెటిలైంది. View this post on Instagram A post shared by Aɴᴜsʜᴀ Hegde (@anushahegde__official) చదవండి: ఓటీటీలో ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించే మూవీ.. సిరై రివ్యూ -
సిరై రివ్యూ: ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించే మూవీ
ప్రేమ గుడ్డిది. రంగు, ఆస్తి, కులమతాలు దానికి కనిపించవు. ఎప్పుడు ఏ రెండు మనసుల్ని కలుపుతుందో దానికే తెలీదు. కానీ, ఎన్నో అవాంతరాలు దాటుకుని ఆ ప్రేమ సుఖాంతం అవడం చాలా కష్టం. ఈ క్రమంలో అది పెట్టే పరీక్షలు, కష్టాలు అనుభవించినవారికే ఎరుక. సిరై సినిమాలో అదే చూపించారు. ఆ మూవీ రివ్యూ ఓసారి చూసేద్దాం...కథవిక్రమ్ ప్రభు పోలీస్ కానిస్టేబుల్గా నటించాడు. ఓరోజు ఖైదీ అబ్దుల్ (అక్షయ్ కుమార్)ను కోర్టు విచారణకు తీసుకెళ్లే డ్యూటీకి వెళ్తాడు. ఆ సమయంలో ఖైదీ తప్పించుకుంటాడు. దీంతో దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్తే అక్కడ ఖైదీ ఉంటాడు. కానీ అతడిని అప్పగించేందుకు ఆ స్టేషన్ హెడ్ ఒప్పుకోడు. పైగా విక్రమ్తో పాటు ఉన్న మరో ఇద్దరు కానిస్టేబుల్స్ తాగి ఉన్నాడని గుర్తిస్తాడు. మరి ఖైదీని వీళ్లు విచారణకు తీసుకెళ్లారా? డ్యూటీ సరిగా చేయనందుకు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు. తప్పించుకున్న నేరస్తుడు మళ్లీ ఎందుకు లొంగిపోయాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!ఎలా ఉందంటే?పోలీస్ డ్యూటీ అంటే ఆషామాషీ ఏం కాదు. ఏమాత్రం పొరపాటు జరిగినా వాళ్ల ఉద్యోగాలు ఊడిపోతాయి. దుండగులు కత్తులతో దాడిచేస్తే ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపినా ఖైదీలా విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది. అది చూసి మనకే జాలేస్తుంది. ఇక ఖైదీ అబ్దుల్.. చిన్నప్పటినుంచే అతడికో లవ్స్టోరీ ఉంది. స్కూల్డేస్ నుంచే ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ మతాలు వేరు. మనసును కదిలిస్తుందిఅందులోనూ అతడికి తల్లి తప్ప తండ్రి లేడు. ఈ ప్రేమ వర్కవుట్ కాదని అర్థమై ప్రియురాలిని దూరంగా ఉండమని చెప్తాడు. కానీ, ఆమె మాత్రం అతడి చేయి వదలదు. ఓ హత్య కేసులో జైలుకు వెళ్లిన అతడి కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. ఇక్కడ వారి స్వచ్ఛమైన ప్రేమ మనసుల్ని కదిలిస్తుంది. అతడు జైలు నుంచి విడుదలవుతాడునుకున్న సమయంలో ఓ ట్విస్ట్ వస్తుంది. ఓటీటీలోఅప్పుడు ప్రేక్షకులు కళ్లలో నీళ్లు తిరగడం ఖాయం. దర్శకుడు సురేశ్ రాజకుమారి సిరై సినిమాలో సమాజంలో పెరుగుతోన్న మతవివక్షను, న్యాయస్థానంలో కేసుల విచారణలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని చూపించారు. స్వచ్ఛమైన ప్రేమకథతో మనసును హత్తుకున్నారు. యాక్టర్స్ అందరూ బాగా నటించారు. ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్టైటిల్స్ ఉన్నాయి. మిస్ అవకుండా చూసేయండి.. -
ప్రభాస్ ‘స్పిరిట్’పై క్రేజీ గాసిప్.. గోపీచంద్ కీలక పాత్ర?
ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా చుట్టూ పుకార్లు ఆగడం లేదు. ఏడాదిన్నరగా ఈ ప్రాజెక్ట్పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కొన్ని రూమర్లకు క్లారిటీ ఇచ్చినా, మరికొన్ని మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో క్రేజీ గాసిప్ ఫిల్మ్ నగరంలో హాట్ టాపిక్గా మారింది. ప్రభాస్తో పాటు ఈ సినిమాలో హీరో గోపీచంద్ కూడా నటించబోతున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి. ‘స్పిరిట్’లో ఓ కీలక పాత్ర కోసం ఆయనను ఎంపిక చేశారట. అయితే అది పాజిటివ్ క్యారెక్టరా లేక నెగెటివ్ క్యారెక్టరా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ప్రభాస్, గోపీచంద్ మంచి స్నేహితులు. తనకు అవకాశం దొరికితే ప్రభాస్ సినిమాలో తప్పకుండా నటిస్తానని గోపీచంద్ గతంలోనే పలుమార్లు ప్రకటించారు. ఇప్పుడు ‘స్పిరిట్’తో ఆ అవకాశం నిజమవుతుందనే చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో సరైన విజయాలు అందుకోలేకపోయిన గోపీచంద్ మార్కెట్ కొంత డల్ అయింది. అలాంటి సమయంలో ప్రభాస్ సినిమా వంటి భారీ ప్రాజెక్ట్లో కీలక పాత్ర చేయడం ఆయన కెరీర్కు మళ్లీ బూస్ట్ ఇవ్వొచ్చని అభిమానులు భావిస్తున్నారు. విలన్ పాత్రపై గాసిప్ ఇప్పుడు నాకు విలన్ పాత్రలు చేయాలని లేదు. కానీ ఆ పాత్రలో డెప్త్ ఉంటే మాత్రం చేస్తాను. ప్రభాస్ సినిమాలో విలన్ రోల్ వస్తే తప్పకుండా చేస్తానని గోపీచంద్ గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. సందీప్ వంగ సినిమాల్లో విలన్ పాత్రలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయో ‘యానిమల్’ చూసినవారికి తెలిసిందే. అందుకే ‘స్పిరిట్’లో గోపీచంద్ను విలన్గా చూపించబోతున్నారనే గాసిప్స్ ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తలపై సినిమా యూనిట్ మాత్రం స్పందించలేదు. గోపీచంద్ నిజంగా ‘స్పిరిట్’లో నటిస్తున్నారా? ఆయన పాత్ర ఏదీ? అన్నది మాత్రం అధికారిక ప్రకటన వెలువడే వరకు మిస్టరీనే. -
#AA23.. సీక్రెట్ చెప్పేసిన లోకేశ్ కనగరాజ్
'పుష్ప 2' తర్వాత ఆచితూచి సినిమాలు ప్లాన్ చేస్తున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి పనిచేస్తున్నాడు. దీని షూటింగ్ ఇప్పటికే జరిగింది. వచ్చే ఏడాది ఇది రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్తో బన్నీ కొత్త మూవీ చేయబోతున్నాడని వారం పదిరోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి స్వయంగా లోకేశ్ మాట్లాడాడు. ఓ సీక్రెట్ చెప్పేశాడు.తాజాగా ఓ మూవీ ఈవెంట్లో పాల్గొన్న లోకేశ్ కనగరాజ్కి యాంకర్ నుంచి ప్రశ్న ఎదురైంది. ప్రేక్షకుల అంచనాలు లేకుండా మీ డ్రీమ్ ప్రాజెక్ట్ తీయాలనుకుంటే అది ఎలా ఉండబోతుంది? అని యాంకర్ అడగ్గా.. నా తర్వాతి సినిమా(#AA23) అలానే ఉండబోతుంది అని లోకేశ్ క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఎందుకంటే లోకేశ్ గతంలో ఖైదీ, విక్రమ్ లాంటి స్టైలిష్ మూవీస్ తీశాడు. డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే వాటిని మించే ఉండొచ్చు.(ఇదీ చదవండి: ట్రెండింగ్లో 'ఒంటరి పెంగ్విన్'.. ఇంతకీ ఏంటి దీని స్టోరీ?)చాన్నాళ్ల క్రితమే లోకేశ్ ఓ సూపర్ హీరో తరహా స్టోరీ అనుకున్నాడు. ఇందులో హీరోకి ఓ చేయి ఉండదు. బదులుగా ఓ ఐరన్ హ్యాండ్ అమర్చుతారు. అప్పటినుంచి సదరు హీరోకి సూపర్ పవర్స్ వస్తాయి. ఇదే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పలు సందర్భాల్లో లోకేశ్ చెప్పాడు. తొలుత హీరో సూర్యతో ఇది చేద్దామనుకున్నాడు. గతేడాది ఆమిర్ ఖాన్ పేరు వినిపించింది. కానీ ఇప్పుడదే ప్రాజెక్ట్ అల్లు అర్జున్తో చేస్తున్నాడా? అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే బన్నీతో చేస్తున్న మూవీ కోసం అనౌన్స్ చేసిన వీడియోలో.. సినిమా అడవి బ్యాక్డ్రాప్లో ఉండబోతుందని మరి అది ఇది ఒకటేనా అనేది తెలియాల్సి ఉంది.మరోవైపు అల్లు అర్జున్ మూవీ కోసం లోకేశ్ కనగరాజ్.. ఇప్పటికే హైదరాబాద్లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టేశాడు. కేవలం నాలుగు నెలల్లోనే మూవీ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అట్లీ ప్రాజెక్ట్ నుంచి కాస్త ఫ్రీ అయిన వెంటనే అల్లు అర్జున్ దీన్ని చేస్తాడని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ) #AA23xLK7Biggest movie in @Dir_Lokesh career... 😳🥵💥The Madness doubled now onwards...🥵☠️#AlluArjun#LokeshKanagaraj#AnirudhRavichanderpic.twitter.com/H32nHFQrtB— Allu Arjun fan ikkadaa (@AAFanIkkadaa) January 24, 2026 -
నా కంటే ముందు చాలామందితో డేటింగ్ చేశాడు.. కాకపోతే: హీరోయిన్
సాధారణంగా హీరోయిన్లు ప్రేమలో ఉన్నాసరే దాన్ని బయటపెట్టరు. చాలా రహస్యంగా ఉంచుతారు. టాలీవుడ్లో అయితే రష్మిక-విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు టాక్. అయినా సరే తమ బంధాన్ని రివీల్ చేయట్లేదు. కానీ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ మాత్రం పదేళ్లుగా ఓ వ్యక్తిని ప్రేమిస్తోంది. ఆ విషయాన్ని ఎప్పుడో బయటపెట్టింది. తాజాగా ఈమె తన ప్రియుడి గురించి చెబుతున్న ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో రిలేషన్షిప్ గురించి ఓ విలువైన సలహా కూడా ఇచ్చింది.న్యూస్ యాంకర్గా కెరీర్ మొదలుపెట్టిన ప్రియా భవానీ శంకర్.. తమిళంలో మిడ్ రేంజ్ సినిమా హీరోయిన్గా అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉంది. తాజాగా ఈమె లీడ్ రోల్ చేసిన 'హాట్ స్పాట్ 2' థియేటర్లలోకి వచ్చింది. అయితే కొన్నిరోజుల క్రితం ఈమె, తన బాయ్ఫ్రెండ్తో విడిపోయిందనే రూమర్స్ వచ్చాయి. కానీ అవన్నీ ఫేక్ అని వీళ్లిద్దరూ కలిసి చేసిన పోస్టుతో క్లారిటీ వచ్చేసింది. ప్రియ.. తన కాలేజీ మేట్ రాజ్ వేల్తో గత పదేళ్లుగా ప్రేమలో ఉంది. గతేడాదే వీళ్లు పెళ్లి చేసుకుంటారని సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. కానీ ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన వీళ్లిద్దరికీ లేనట్లే కనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ)తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ప్రియా భవానీ శంకర్ ఏం చెప్పిందంటే.. 'నాకు మొదటి, చివరి బాయ్ఫ్రెండ్ అతడు, ఎంతో బాధతో ఈ విషయాన్ని చెబుతున్నా(నవ్వుతూ). నాతో రిలేషన్ మొదలుపెట్టకముందు కాలేజీ టైంలో అతడు చాలామంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడు. నేను చెప్పేదేంటంటే మీ విధేయత చూపించడానికి ఎక్కువ కాలం రిలేషన్లో ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ టాక్సిక్ రిలేషన్షిప్ అనిపిస్తే వెంటనే బ్రేకప్ చెప్పేసి బంధం నుంచి బయటకొచ్చేయండి' అని చెప్పుకొచ్చింది.తెలుగులో ఈమె.. కల్యాణం కమనీయం, భీమా, జీబ్రా సినిమాల్లో హీరోయిన్గా చేసింది. ఇవన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ కావడంతో టాలీవుడ్లో ప్రియకు పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతానికైతే తమిళంపైనే ఫోకస్ చేసింది.(ఇదీ చదవండి: ట్రెండింగ్లో 'ఒంటరి పెంగ్విన్'.. ఇంతకీ ఏంటి దీని స్టోరీ?)I am sad to say that he's my first & last boyfriend. But he dated many girls before our relationship. I would say that, you don't have to be in long relationship only to show your loyalty. If you feel it's toxic, come out of it 👏🏽— #PriyaBhavaniShankar pic.twitter.com/GFiEZovQxl— VCD (@VCDtweets) January 24, 2026 -
స్టార్ హీరోకు తల్లిగా.. నో చెప్పా కానీ..: మీనా
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది అందాల తార మీనా. అప్పటికీ, ఇప్పటికీ మంచి పాత్రలు ఎంపిక చేసుకుంటూ వెండితెరపై వెలుగులీనుతోంది. సీనియర్ హీరోలతో జోడీ కడుతూనే ఆచితూచి సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం మీనా మలయాళంలో దృశ్యం 3, తమిళంలో రౌడీ బేబి సినిమాలు చేస్తోంది.సూపర్ హిట్ సినిమాలు మిస్తాజాగా మీనా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. మోహన్లాల్-మమ్ముట్టిల 'హరికృష్ణన్స్', కమల్ హాసన్-శివాజీ గణేశన్ల 'తేవర్ మగన్' (క్షత్రియ పుత్రుడు), రజనీకాంత్ 'పడయప్ప' (నరసింహ) సినిమాల్లో నేను నటించాల్సింది. కానీ డేట్స్ కుదరకపోవడంతో ఈ ఆఫర్స్ తిరస్కరించాల్సి వచ్చింది. అన్నీ మనమే చేయలేంఇవే కాదు, ఇలా చాలా సినిమాలు ఇలాగే పోగొట్టుకున్నాను. అన్ని సినిమాలు మనమే చేయడం అసాధ్యం కదా! అయితే చేజారిన సినిమాలు సూపర్ హిట్ అయినప్పుడు కాస్త బాధగా అనిపించేది. అరె, మంచి మూవీస్ మిస్ చేసుకున్నానే అని ఫీలయ్యేదాన్ని. వాటిలో యాక్ట్ చేసుంటే నేను కూడా ఆ సక్సెస్లో భాగమయ్యేదాన్ని అనిపించేది. హీరోకు తల్లిగా..ఇకపోతే నాకు బ్రో డాడీ సినిమా ఆఫర్ చేసినప్పుడు నా పాత్ర గురించి తెలుసుకోవాలని తహతహలాడాను. తీరా అందులో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్కు తల్లిగా చేయాలని చెప్పారు. అది విని నేను షాకయ్యాను. అతడు నాకంటే కేవలం ఆరేళ్లు మాత్రమే చిన్నవాడు.. అలాంటిది అతడికి తల్లిగా నటించడం కష్టమని అభ్యంతరం చెప్పాను.మెచ్చుకోవాల్సిందే!దాంతో వాళ్లు నాకు నచ్చజెప్పారు. కథ బాగుండేసరికి నేను కూడా చివరకు ఒప్పుకుని చేశాను. సినిమా రిలీజయ్యాక జనం నా పాత్రపై ప్రశంసలు కురిపించారు. మా మధ్య వయసు వ్యత్యాసం తెరపై ఎక్కడా కనిపించలేదు. ఈ విషయంలో పృథ్వీరాజ్ను మెచ్చుకుని తీరాల్సిందే! ఎంతో అంకితభావం, నిబద్ధత ఉన్న వ్యక్తి. అందుకే గొప్ప నటుడితో పాటు మంచి దర్శకుడు కూడా అయ్యాడు అని మీనా చెప్పుకొచ్చింది.చదవండి: ఆ పాటలకు ఒక్క పైసా ఇవ్వలేదు: బాలీవుడ్ సింగర్ -
మృణాల్-ధనుష్ పెళ్లి చేసేశారు.. వీడియో వైరల్
తమిళ స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకుర్ ప్రేమలో ఉన్నారని.. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే కానుకగా పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కొన్నిరోజుల ముందు షాకింగ్ రూమర్స్ వచ్చాయి. ఇవి నిజమని చాలామంది నమ్మేశారు కూడా. కానీ వీటిలో ఎలాంటి నిజం లేదని స్వయానా మృణాల్ టీమ్ క్లారిటీ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. దీంతో రిలాక్స్ అవుతారనుకుంటే ఇప్పుడు ఏకంగా ధనుష్-మృణాల్ పెళ్లి చేసేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయిపోతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులో స్ట్రీమింగ్)రీసెంట్ టైంలో ఏఐ(కృత్రిమ మేధ) వినియోగం చాలా పెరిగిపోయింది. తమకు నచ్చిన ఫొటోలు, వీడియోలని యూజర్స్ తయారు చేసుకుంటారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఓ నెటిజన్.. ఇలానే ధనుష్-మృణాల్ పెళ్లి జరిగినట్లు, ఈ కార్యక్రమానికి తమిళ ఇండస్ట్రీకి చెందిన దళపతి విజయ్, అజిత్, త్రిష, అనిరుధ్, శ్రుతి హాసన్, దుల్కర్ సల్మాన్ తదితరులు హాజరైనట్లు కూడా సృష్టించారు. ఇది ఫేక్ వీడియోనే అయినప్పటికీ యూజర్స్ని ఎంటర్టైన్ చేస్తుండటం విశేషం.ఈ పెళ్లి రూమర్స్ రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. రజనీకాంత్ కూతురు ఐశ్వర్యని ధనుష్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు. కానీ వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతానికైతే ధనుష్ ఒంటరిగానే ఉంటున్నాడు. రీసెంట్ టైంలో మృణాల్ చేసిన సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ జరిగితే వీటిలో ధనుష్ కనిపించడం, డేటింగ్ రూమర్స్ రావడానికి కారణమైంది. ఈ క్రమంలోనే పెళ్లి గాసిప్స్ కూడా వచ్చాయి. అవి అబద్ధమని తెలిసినప్పటికీ సోషల్ మీడియాలో ఈ ఏఐ వీడియోలు వైరల్ అయిపోతున్నాయి.(ఇదీ చదవండి: మెగా హీరో పాన్ ఇండియా సినిమాలో మృణాల్ ఐటమ్ సాంగ్?)Dey 😂😂😂Wedding 🙏🏻🙏🏻🙏🏻🙏🏻#MrunalThakur #Dhanush pic.twitter.com/tCWx7bTVcE— Swaasthi (@swaasthi) January 24, 2026 -
చెప్పు విసిరిన ఘటన.. 'నన్ను నేను మర్చిపోయా!'
సినీగేయరచయిత వైరముత్తుపై ఓ మహిళ చెప్పు విసిరిన ఘటన ఇటీవల కలకలం రేపింది. తమిళనాడులోని తిరుప్పూర్లో కొంగు కళ, సాహిత్య సంస్కృతి మండలి ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకలో పాల్గొనేందుకుగానూ తిరుప్పూర్ కలెక్టరేట్కు రాగా అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో అక్కడున్న ఓ మహిళ చెప్పు విసిరింది. తొలి పోస్ట్అయితే అది వైరముత్తుపై కాకుండా మరోవైపు పడింది. వెంటనే పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. తనకు మతిస్థిమితం సరిగా లేదని తెలిపారు. ఈ ఘటన తర్వాత వైరముత్తు సోషల్ మీడియలో తొలిసారి ఓ పోస్ట్ పెట్టాడు. తిరుప్పూర్లో తను హాజరైన మరో కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. రెండువేలమంది విద్యార్థులు ఒక్కచోట చేరి చప్పట్లు కొడుతుంటే తనను తాను మర్చిపోయానన్నాడు.గతంలో ఆరోపణలుకాగా వైరముత్తు గతంలో మీటూ ఉద్యమ సమయంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. చాలామంది మహిళలతో వైరముత్తు అసభ్యంగా నడుచుకున్నారంటూ సింగర్ చిన్మయి శ్రీపాద సంచలన ఆరోపణలు చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ ఆరోపణలను వైరముత్తు కొట్టిపారేశాడు. திருப்பூரில்வெற்றித் தமிழர் பேரவை ‘வள்ளுவர் மறை வைரமுத்து உரை’கையொப்பத் திருவிழாவைநிகழ்த்தியதுஏ.வி.பி அரங்கு முழுக்கஆயிரத்துக்கு மேற்பட்டபள்ளிப் பிள்ளைகள்;கல்லூரிக் கண்மணிகள்வெற்றித் தமிழர் பேரவையின்அவைத் தலைவர்ராம்ராஜ் நாகராஜன்அற்புதமான அறவுரை ஆற்றினார்… pic.twitter.com/Sjx88vuwvL— வைரமுத்து (@Vairamuthu) January 23, 2026 చదవండి: ప్రెగ్నెన్సీ అనుమానాలపై క్లారిటీ ఇచ్చిన బిగ్బాస్ శివజ్యోతి -
పాటల రచయితపై చెప్పు విసిరిన మహిళ.. వీడియో వైరల్
తమిళ సినీ గేయ రచయిత వైరముత్తుపై ఓ మహిళ చెప్పు విసిరిన ఘటన ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.గత బుధవారం తిరుప్పూర్లో జరిగిన కొంగు కళ, సాహిత్య, సంస్కృతి మండలి ప్రారంభోత్సవానికి వైరముత్తుకి ఆహ్వానం అందింది. ఇందులో పాల్గొనేందుకు వైరముత్తు తిరుప్పూర్ కలెక్టరేట్కు వచ్చినప్పుడు ఎవరో చెప్పు విసిరారు. అయితే ఆ చెప్పు ఆయనపై కాకుండా మరో వ్యక్తిపై పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. చెప్పు విసిరిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. కోలీవుడ్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. చెప్పు విసిరిన మహిళ పేరు జయ. 45 ఏళ్ల వయసు ఉన్న ఆ మహిళకు మతిస్థిమితం లేదు. కలెక్టర్ ఆఫీస్తో పాటు కోర్టు దగ్గర కూడా పలుసార్లు ఇలానే చెప్పులు విసిరిందట. ఈ విషయాన్ని పోలీసులు మీడియాకు తెలియజేస్తూ..ఆమెను అరెస్ట్ చేసినట్లుగా అధికారికంగా వెల్లడించారు. பாடல் ஆசிரியர் வைரமுத்துவை நோக்கி காலணிகள் வீச்சு..! என்ன காரணம்..? திருப்பூரில் பரபரப்பு..#tiruppur | #vairamuthu | #polimernews pic.twitter.com/I5EscQ5cWv— Polimer News (@polimernews) January 22, 2026ఈ ఘటన జరిగిన తర్వాత వైరముత్తు తొలిసారిగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. తాజాగా ఆయన తిరుప్పూర్ లో విక్టోరియస్ తమిళ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ విద్యార్థులతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. ‘రెండు వేల మంది యువకులు ఏకగ్రీవంగా చప్పట్లు కొట్టడం చూసి, నన్ను నేను మర్చిపోయాను’ అంటూ రాసుకొచ్చాడు. చెప్పు విసిరిన ఘటనపై ఆయన స్పందించపోవడం గమనార్హం. అయితే ఆమెకు మతి స్థిమితం లేదనే విషయం తెలిసి.. వైరముత్తు ఆ ఘటనను లైట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వైరముత్తు వరుస వివాదాలతో వార్తల్లో ఉంటున్నారు. 2018లో, మీటూ ఉద్యమం సమయంలో, గాయని చిన్మయి శ్రీపాద భువన శేషన్ ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అయితే వైరమత్తు మాత్రం ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. திருப்பூரில்வெற்றித் தமிழர் பேரவை ‘வள்ளுவர் மறை வைரமுத்து உரை’கையொப்பத் திருவிழாவைநிகழ்த்தியதுஏ.வி.பி அரங்கு முழுக்கஆயிரத்துக்கு மேற்பட்டபள்ளிப் பிள்ளைகள்;கல்லூரிக் கண்மணிகள்வெற்றித் தமிழர் பேரவையின்அவைத் தலைவர்ராம்ராஜ் நாகராஜன்அற்புதமான அறவுரை ஆற்றினார்… pic.twitter.com/Sjx88vuwvL— வைரமுத்து (@Vairamuthu) January 23, 2026 -
అనుపమ సస్పెన్స్ థ్రిల్లర్.. ఎట్టకేలకు రిలీజ్ డేట్
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ లాక్ డౌన్. ఈ చిత్రానికి ఏఆర్ జీవా దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా గతేడాది విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుందని లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్ను పంచుకుంది. లాక్డౌన్లో చిక్కుకుపోయి కష్టాలు పడిన ఓ యువతి జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమాలో అనిత అనే పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. ఈ చిత్రంలో చార్లీ, నిరోషా, ప్రియా వెంకట్, లివింగ్స్టన్, ఇందుమతి, రాజ్కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఎన్ఆర్ రఘునందన్, సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందించారు. Every pause had a purpose. 🎬 #Lockdown in cinemas Jan 30. 🗓️#LockdownInCinemasJan30@anupamahere #ARJeeva @LycaProductions #Subaskaran @gkmtamilkumaran #PriyaaaVenkat @shakthi_dop @NRRaghunanthan @sidvipin @EditorSabu @sherif_choreo #SriGirish #OmSivaprakash… pic.twitter.com/hqNtUX8qxl— Lyca Productions (@LycaProductions) January 23, 2026 -
మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి హీరోగా.. అదే అతి పెద్ద బాధ!
సూర్యుడు అస్తమించాకే చంద్రుడు వస్తాడు.. చంద్రుడు వెళ్లిపోయాకే సూర్యుడు ఉదయిస్తాడు.. నటుడు జయరామ్ కెరీర్ కూడా అంతే! హిట్లు వచ్చిన వెంటనే ఫ్లాపులు వస్తాయి.. ఆ వరుస ఫ్లాపులు వచ్చాకే మళ్లీ హిట్లు కరుణిస్తాయి. తన కెరీర్ అంతా ఇలాగే కొనసాగుతోందంటున్నాడు జయరామ్. ఆయన కెరీర్ను, స్ట్రగుల్స్ను ఓసారి చూసేద్దాం..మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి హీరోగా..జయరాం సుబ్రహ్మణ్యం.. కాలేజీ అయిపోయిన వెంటనే మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేశాడు. తర్వాత కళాభవన్ సంస్థలో చేరి మిమిక్రీ నేర్చుకున్నాడు. ఆ మిమిక్రీయే అతడిని నటనవైపు అడుగులు వేసేలా చేసింది. 22 ఏళ్లకే అపరన్ అనే మలయాళ మూవీతో హీరోగా మారాడు. 'మెలెపరంబిల్ ఆన్వీడు' చిత్రంతో మలయాళ స్టార్గా ఎదిగాడు. మూడు దశాబ్దాలపాటు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశాడు. అయితే జయాపజయాలు ఒకదాని వెంట ఒకటి వచ్చేసరికి తడబడ్డాడు. తడబాటుహీరోగా మూడుసార్లు ఫిలింఫేర్ అవార్డు గెలిచిన జయరామ్ మలయాళ భాషకే పరిమితం కాకుండా తమిళ, తెలుగు చిత్రాల్లోనూ నటించాడు. దాదాపు 200కి పైగా చిత్రాల్లో యాక్ట్ చేశాడు. కాకపోతే ఇతర భాషల్లో సహాయక పాత్రలు, విలన్ పాత్రలు చేసుకుంటూ వస్తున్నాడు. ఈయన తెలుగులో భాగమతి, అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, ధమాకా, ఖుషి, హాయ్ నాన్న, గుంటూరు కారం సినిమాలు చేశాడు. గతేడాది తెలుగులో గేమ్ ఛేంజర్, మిరాయ్.., తమిళంలో రెట్రో, కన్నడలో కాంతార: చాప్టర్ 1 సినిమాల్లో కనిపించాడు.సక్సెస్ వెంటనే ఫెయిల్యూర్జయరామ్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. అదేంటో కానీ నేను రెండుమూడు విజయవంతమైన సినిమాలు చేసినవెంటనే కచ్చితంగా రెండు మూడు ఫ్లాపులు వస్తుంటాయి. దాంతో మళ్లీ లేచి నిలబడటానికి ప్రయత్నించేవాడిని. గత 38 ఏళ్లుగా ఇదే జరుగుతోంది. కెరీర్ ప్రారంభంలో పెద్దపెద్ద దర్శకులతో హీరోగా అనేక సినిమాలు చేశాను. కానీ అంతలోనే మళ్లీ అపజయాలు ఎదురయ్యేవి. వాటిని తట్టుకుని నిలబడటం కష్టంగా ఉండేది. కొందరైతే నా మీద ఆశలు వదిలేసుకున్నారు. నా పనైపోయిందన్నారు.అదే ఎక్కువ బాధఅన్నింటికన్నా బాధేంటో తెలుసా? సక్సెస్ అయినప్పుడు అందరూ పొగుడుతారు. కానీ కెరీర్ ఒడిదుడుకులకు లోనైనప్పుడు చిన్నచిన్న తప్పుల్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తారు, ఏదో ఒక రకంగా నిందిస్తారు, దూరం పెడతారు. అది చాలా బాధేస్తుంది. కానీ ఈ అనుభవాల వల్ల చాలా నేర్చుకున్నాను అంటున్నాడు. ప్రస్తుతం జయరామ్ ఆశకల్ ఆయిరామ్ సినిమా చేస్తున్నాడు. ఇందులో ఆయన కుమారుడు కాళిదాసు కూడా నటించాడు. జి.ప్రజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది.చదవండి: ఆ హీరోకు యాక్టింగే రాదు, ఏదో కవర్ చేస్తాడంతే! -
కీర్తి సురేశ్ హోంటూర్.. ఇల్లులానే లేదు!
సెలబ్రిటీలు ప్రేమలో ఉంటే ఇట్టే తెలిసిపోతుంది. కానీ, హీరోయిన్ కీర్తి సురేశ్ మాత్రం తన ప్రేమను సీక్రెట్గా ఉంచింది. ఒకటీరెండేళ్లు కాదు, ఏకంగా 15 ఏళ్లు! పన్నెండో తరగతిలోనే ఆంటోని తటిల్తో లవ్లో పడ్డ కీర్తి.. స్టార్ హీరోయిన్ అయ్యాక కూడా ఆ రిలేషన్ను కొనసాగించింది. మనసుపడ్డవాడినే మనువాడింది. 2024లో హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయల ప్రకారం వీరి పెళ్లి జరిగింది.ఇంటి పేరుతాజాగా ఈ దంపతులు తమ హోమ్ టూర్ వీడియోతో వార్తల్లోకెక్కారు. కొచ్చిలో వాళ్లుంటున్న ఇంటిని చూపించారు. ఆ భవంతికి హౌస్ ఆఫ్ ఫన్ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. ఫ్యామిలీ ఫోటోలు, పెళ్లి ఫోటోలు, మహానటి సినిమాకుగానూ జాతీయ అవార్డు అందుకున్నప్పుడు తనపై వచ్చిన వార్తల కథనాల క్లిప్పింగ్స్ను కీర్తి చూపించింది. ముఖ్యంగా తన జ్ఞాపకాలకు, అనుభవాలకు వేదికైన మెమొరీ వాల్ అన్నింటికంటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఇల్లులా లేదుతన పెంపుడు కుక్కలు నైక్, కెన్నీ కోసం స్పెషల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. సాంప్రదాయాన్ని, మోడ్రన్ను మిక్స్ చేసేలా ఇంటీరియర్ డిజైన్ ఉంది. బాల్కనీ మాత్రం మొక్కలతో పచ్చదనం పరుచుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ భవంతి చూసిన నెటిజన్లు.. ఇది వారి ఇల్లులా కనిపించట్లేదు, కెఫెలా ఉందని, బాగుందని కామెంట్లు చేస్తున్నారు. సినిమాహీరోయిన్గా కీర్తి సురేశ్ సూపర్ సక్సెస్.. అటు కమర్షియల్ సినిమాలతో పాటు ఇటు లేడీ ఓరియంటెడ్ సినిమాలూ చేస్తోంది. అయితే భవిష్యత్తులో దర్శకురాలిని అవ్వాలని ఉందని ఆ మధ్య మనసులోని మాట బయటపెట్టింది. గత ఐదారేళ్లుగా తనకు వచ్చిన ఐడియాలను రాసిపెట్టుకున్నట్లు తెలిపింది. మహానటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్దన సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళ, మలయాళంలోనూ ఒక్కో సినిమా చేస్తోంది.చదవండి: నా ఫోటోలు చూసి అమ్మ ఒకటే ఏడుపు: హీరోయిన్ -
నా ఫోటోలు చూసి అమ్మ ఏడ్చేసింది: దివ్య భారతి
అనుకోకుండా సినిమాల్లోకి వచ్చినవారిలో హీరోయిన్ దివ్య భారతి ఒకరు. బ్యాచిలర్ అనే తమిళ చిత్రంతో హీరోయిన్గా వెండితెరకు పరిచయమైంది. చివరగా కింగ్స్టన్ మూవీతో పలకరించింది. ప్రస్తుతం తెలుగులో గోట్ సినిమా చేస్తోంది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకుంది.అమ్మ సింగిల్ పేరెంట్దివ్య భారతి మాట్లాడుతూ.. మా అమ్మకు హీరోయిన్ దివ్యభారతి అంటే ఇష్టం. ఆమె చనిపోయినప్పుడు తనపై ఇష్టంతో నాకు ఆ పేరు పెట్టారు. మా అమ్మ సింగిల్ పేరెంట్. చాలా స్ట్రిక్ట్గా ఉండేది. నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడు పేరెంట్స్ విడిపోయారు. చిన్నప్పుడు స్కూల్కు హాలీడేస్ వస్తే నన్ను, తమ్ముడిని.. అమ్మ ఇంట్లో పెట్టి తాళం వేసి పనికి వెళ్లేది. ఒకరోజు మేము తప్పించుకుని బయటకు వెళ్లి ఆడుకున్నాం. అమ్మ అది చూసి గోడకుర్చీ వేయించింది.ప్రొఫెసర్తో లవ్ప్రేమ విషయానికి వస్తే.. అలాంటి స్టోరీలేం లేవు. కాకపోతే బీటెక్ ఫైనలియర్ చదువుతున్నప్పుడు ఓ అబ్బాయిని చూసి ఇష్టపడ్డాను. తర్వాతి రోజు ప్రొఫెసర్ ఫోన్ చేసి.. నువ్వు చూసింది నన్నే అన్నాడు. అలా ఆయన ప్రొఫెసర్ అని తెలిసి సారీ చెప్పాను. కానీ, తర్వాత కూడా ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. కాలేజీ అయిపోయాక మా అమ్మ.. నువ్వు చూడాల్సిన జీవితం చాలా ఉంది. ఇక్కడే ఆగిపోకు అంది. అలా ఇద్దరం ఎవరిదారి వారు చూసుకున్నాం.అమ్మ ఒకటే ఏడుపునా బాల్యం, చదువు అంతా కోయంబత్తూరులోనే జరిగింది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు కోసం 2014లో చెన్నై వచ్చాను. అప్పుడు మోడలింగ్ గురించి పరిచయం ఏర్పడింది. అప్పటివరకు నేను మోడ్రన్ డ్రెస్ వేసిందే లేదు. ఫ్యాషన్ షోలో తొలిసారి పాల్గొన్నాను. కాస్త నడుము కనిపించేలా లెహంగా వేసుకున్నాను. ఆ ఫోటోలు చూసి అమ్మ ఫోన్ చేసి ఏడ్చేసింది. ఎందుకిలాంటి డ్రెస్లు!నేను నిన్ను ఇలా పెంచలేదు, ఎందుకిలాంటి డ్రెస్లు వేసుకుంటున్నావు? అని బాధపడింది. అలాంటి అమ్మ ఇప్పుడు నేను హీరోయిన్గా చేస్తుంటే సపోర్ట్గా నిలబడింది. మోడలింగ్ చేస్తున్నప్పుడు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. కాకపోతే జనాలు నన్ను ఇష్టపడతారా? అని నాపై నాకే అనుమానం ఉండేది. అందుకే చాలా కథలకు నో చెప్పుకుంటూ వచ్చాను. అలా బ్యాచిలర్ సినిమాకు సైతం నో చెప్పాను. ఏడాది తర్వాత మళ్లీ అడిగారు. కథ నచ్చి ఓకే చేశాను. అలా సినీ ఎంట్రీ జరిగింది అని దివ్య భారతి చెప్పుకొచ్చింది.చదవండి: రజనీకాంత్ సినిమాలు చూడలేం, చిరంజీవి కూడా అంతే!: అనిల్ -
అలా రజనీకాంత్ సినిమాలు చూడలేం, చిరంజీవి కూడా అంతే!
సక్సెస్ అందుకోవడం కన్నా దాన్ని కొనసాగించడం చాలా కష్టం. కానీ, కెరీర్ మొదలైనప్పటినుంచి అపజయమనేదే ఎరుగకుండా విజయాల పరంపరతో దూసుకెళ్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అతడు డైరెక్ట్ చేసిన 9వ సినిమా మన శంకరవరప్రసాద్గారు బ్లాక్బస్టర్ విజయం సాధించింది. ఇందులో చిరు స్టైల్, డ్యాన్స్, కామెడీ చూసి ఫ్యాన్స్ కడుపు నిండిపోయింది.రజనీకాంత్ను అలా ఊహించుకోగలమా?అయితే కొందరు మాత్రం చిరంజీవి వయసుకు తగ్గ పాత్రలు చేయాలని, తాతగా నటిస్తే బెటర్ అని విమర్శిస్తున్నారు. ఈ ట్రోలింగ్కు గట్టి కౌంటరిచ్చాడు అనిల్ రావిపూడి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ప్రతి హీరోకు కొన్ని బలాలుంటాయి. వాటిని వదిలేసి మనమెప్పుడూ ప్రయోగాలు చేయకూడదు. రజనీకాంత్గారిని తన వాకింగ్ స్టైల్ లేకుండా ఒక సినిమా చేయమనండి, మనం చూడగలమా? అలాగే చిరంజీవి కూడా..ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా రజనీకాంత్గారి సినిమా ఊహించుకోగలమా? అది రజనీకాంత్గారి స్టైల్. అలాంటి రజనీకాంత్తో పర్ఫామెన్స్ ఓరియంటెడ్ సినిమా చేస్తే జనాలు ఒప్పుకోరు. ఆయనకు తగ్గ ఎలిమెంట్స్ ఆయన సినిమాలో కచ్చితంగా ఉండాలి. అలాగే చిరంజీవికి తగ్గ అంశాలు ఆయన మూవీలో ఉండాలి. చిరంజీవిగారు అనగానే మనకు గుర్తొచ్చేవి డ్యాన్సు, ఫైట్లు, పాటలు, కామెడీతో పాటు మంచి పర్ఫామెన్స్ లేదా కథాబలం.నేను చేసి చూపించా..ఆయన ఈ వయసులో ఇలాంటి సినిమాలు చేయాలా? అంటే దానికి తగ్గట్లుగా కథ రాస్తే చేయొచ్చు. నేను తీసి చూపించానుగా! చిరంజీవి- నయనతార మధ్య లవ్స్టోరీ పెట్టాను. ఎక్కడా ఓవర్గా చూపించలేదు. ఆయన వయసుకు తగ్గట్టుగా చాలా హుందాగా ఉంది. ఇలాంటి ప్రయోగాలు మనం చేయొచ్చు. ప్రేక్షకులు ఆ ఎపిసోడ్ ఎంజాయ్ చేశారు. హీరో బలాలను వాడుకుంటేనే సినిమాలు అద్భుతంగా ఆడతాయి. మరో విషయం.. చిరంజీవిగారు తన లుక్స్ మెయింటైన్ చేస్తారు. తాత పాత్రలెందుకు చేయాలి?అలుపు, ఆయాసం లేకుండా హుషారుగా హుక్ స్టెప్ సాంగ్లో డ్యాన్స్ చేశారు. ఆయన అలాగే ఉండాలని కోరుకుంటాను. ఒక మనిషి అంత ఆరోగ్యంగా, ఫిట్గా ఉన్నప్పుడు మనమెందుకు ఆయన తండ్రి, తాత పాత్రలు మాత్రమే చేయాలని రుద్దాలి? కావాలని ఒక వ్యక్తిని తగ్గించడానికే కొందరు ఇలా మాట్లాడుతున్నారు. చిరంజీవి.. గాడ్ఫాదర్, సైరా నరసింహారెడ్డి అని మధ్యమధ్యలో ప్రయోగాలు చేశారు.. కానీ ఈ సినిమాకే ఎందుకింత పెద్ద ఫలితం వచ్చిందంటే జనాలు ఆయన్ను పాత చిరంజీవిగా చూడాలనుకున్నారు అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.చదవండి: శశిరేఖ.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది -
మమ్ముట్టి 'పాదయాత్ర'.. అధికారిక ప్రకటన
మమ్ముట్టి 'పాదయాత్ర' చేసేందుకు రెడీ అయిపోయారు. స్వతహాగా ఈయన మలయాళ హీరోనే అయినప్పటికీ తెలుగులోనూ బోలెడంత ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ ఓటీటీల్లో డబ్బింగ్ చిత్రాల రూపంలో అప్పుడప్పుడు పలకరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు 'పాదయాత్ర' గురించి అనౌన్స్మెంట్ ఇచ్చారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా గతంలో తీసిన 'యాత్ర' సినిమాలో మమ్ముట్టి టైటిల్ రోల్ పోషించారు. వైఎస్ఆర్గా అద్భుతమైన యాక్టింగ్ చేసి ఆకట్టుకున్నారు. రీసెంట్ టైంలో అయితే తన నిర్మాణంలోనే కన్నూర్ స్క్వాడ్, కలంకావళ్ అనే చిత్రాలతో వావ్ అనిపించారు. కలంకావళ్ చిత్రంలో అయితే మహిళల్ని చంపే సైకో పాత్రలో అలరించారు. ఇప్పుడు తన నిర్మాణంలోనే 'పాదయాత్ర' అనే మూవీని ప్రకటించారు.(ఇదీ చదవండి: మమ్ముట్టి సైకో కిల్లర్ 'కలాం కావల్' మూవీ రివ్యూ..)సాధారణంగా 'పాదయాత్ర' అంటే రాజకీయ పరిభాషలోనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మరి మమ్ముట్టి ఇప్పుడు తీయబోయేది కూడా పొలిటికల్ సినిమాయేనా? లేదంటే ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి అదూర్ గోపాలకృష్ణన్ దర్శకుడు. 84 ఏళ్ల ఈ డైరెక్టర్తో మమ్ముట్టి.. 32 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి పనిచేయనుండటం విశేషం. గతంలో వీళ్లిద్దరూ 'విధేయన్' అనే మూవీ చేశారు. దానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా జాతీయ అవార్డ్ కూడా వచ్చింది.అదూర్ గోపాలకృష్ణన్ విషయానికొస్తే.. 1965 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఎక్కువగా డాక్యుమెంటరీలు తీశారు. కొన్ని ఫీచర్ ఫిల్మ్స్ కూడా తెరకెక్కించారు. 1972లో ఈయన తీసిన 'స్వయంవరం' చిత్రానికి ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విభాగాల్లో జాతీయ అవార్డులు వచ్చాయి. తర్వాత కాలంలోనూ 'కొడియట్టం', విధేయన్, మథిలుకళ్, అనంతరం, ముఖాముఖం, ఎలిపత్యం, కథాపురుషన్, నిళల్ కుతు, నాళ్ పెన్నుంగళ్ తదితర మూవీస్తోనూ ఈయన జాతీయ అవార్డులు దక్కించుకున్నారు. చివరగా 2016లో ఓ సినిమా చేసిన ఈయన.. ఇన్నాళ్లకు మమ్ముట్టి కలిసి పనిచేయబోతుండటం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఈసారి 'పాదయాత్ర'తో మరో జాతీయ అవార్డ్ కొడతారేమో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఒక్క రోజే 15 సినిమాలు.. ఆ రెండే స్పెషల్..!)'പദയാത്ര' ആരംഭിക്കുന്നു...Proudly Presenting The Title Poster of Our Production No.8 "Padayaatra" Directed by Adoor Gopalakrishnan.#Mammootty #AdoorGopalakrishnan #Padayaatra #MammoottyKampany #WayfarerFilms pic.twitter.com/XwCF2oERUd— MammoottyKampany (@MKampanyOffl) January 23, 2026 -
ఆస్కార్ నామినేషన్స్లో ‘సిన్నర్స్’ సంచలనం
ఆస్కార్ అవార్డుల చరిత్రలో ‘సిన్నర్స్’ సినిమా సరికొత్త రికార్డును సృష్టించింది. రేయాన్ కూగ్లర్ దర్శకత్వంలో రూపొందిన ఈ అమెరికన్ పీరియాడికల్ హారర్ సినిమా 98వ ఆస్కార్ అవార్డ్స్లో ఏకంగా 16 నామినేషన్స్ దక్కించుకుని, ఆస్కార్ నామినేషన్స్లో ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకుంది. 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాది మార్చి 15న (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16) అమెరికాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నటులు డానియల్ బ్రూక్స్, లూయిస్ ఫుల్మన్ నామినేషన్లను ప్రకటించారు.పలు విభాగాల్లో (ఉత్తమ చిత్రం, నటుడు, సపోర్టింగ్ యాక్ట్రస్, దర్శకుడు, ఒరిజినల్ స్క్రీన్ప్లే వంటి విభాగాలు) నామినేషన్స్ దక్కించుకుని, ‘సిన్నర్స్’ టాక్ ఆఫ్ ది వరల్డ్ అయింది. గతంలో ‘ఆల్ అబౌట్ ఈవ్’ (1950), ‘టైటానిక్’ (1997), ‘లా లా ల్యాండ్’ (2016) చిత్రాలు 14 నామినేషన్స్ను దక్కించుకున్న రికార్డును తాజాగా ‘సిన్నర్స్’ చిత్రం అధిగమించింది. ఇక ‘సిన్నర్స్’ తర్వాత ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రానికి 13 నామినేషన్స్ దక్కాయి. ‘ఫ్రాకింగ్స్టన్’, ‘మార్టీ సుప్రీం’, ‘సెంటిమెంటల్ వాల్యూ’ చిత్రాలు తొమ్మిది నామినేషన్స్ను దక్కించుకోగా, ‘హ్యామ్నెట్’ సినిమాకు 8 నామినేషన్స్ దక్కాయి. అలాగే ఈ ఏడాది కొత్తగా ‘క్యాస్టింగ్ డైరెక్టర్’ విభాగాన్ని ప్రవేశపెట్టి, ఈ విభాగంలో నామినేషన్స్ను ప్రకటించారు. ⇒ ఉత్తమ చిత్రం విభాగంలోని అవార్డు కోసం ‘సిన్నర్స్, ఎఫ్1, ది సీక్రెట్ ఏజెంట్, బగోనియా, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’... ఇలా పది చిత్రాలు పోటీ పడుతున్నాయి. దర్శకత్వం విభాగంలో రేయాన్ కూగ్లర్ (సిన్నర్స్), క్లోయి జావ్ (హ్యామ్నెట్), జాష్ షాఫ్డీ (మార్టీ సుప్రీం),పాల్ థామస్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్), ట్రియర్ (సెంటిమెంటల్ వాల్యూ), యాక్టర్స్ విభాగంలో తిమోతి చాలమేట్, లియోనార్డో డికాప్రియో, ఈథన్ హాక్, మైఖేల్ బి జోర్డాన్, వాగ్నర్ మౌరాలు, యాక్ట్రస్ విభాగంలో ‘ఎమ్మా స్టోన్, కేట్ హడ్సన్, రోజ్ బర్న్, జస్సీ బక్లీ, రెనాటా’ పోటీ పడుతున్నారు. ⇒ యాక్టింగ్ విభాగంలో అతి పిన్న వయసు (30 ఏళ్లు)లో మూడు నామినేషన్స్ దక్కించుకున్న వ్యక్తిగా తిమోతి చాలమేట్ నిలిచారు. ∙బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ‘సిన్నర్స్’కుగాను రూత్ ఈ. కార్టర్ నామినేషన్ దక్కించుకున్నారు. ఇది ఆమెకు ఐదో నామినేషన్. ఆస్కార్ చరిత్రలో ఐదు నామినేషన్స్ దక్కించుకున్న బ్లాక్ ఉమన్గా కార్టర్ నిలిచారు. ∙ఇదే సినిమాలోని నటనకు గాను 73 ఏళ్ల డెల్రోయ్ లిండోకి ఆస్కార్ నామినేషన్ దక్కింది. ఇది డెల్రోయ్కి తొలి ఆస్కార్ నామినేషన్ కావడం విశేషం. ∙యాక్టింగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ (‘ది సీక్రెట్ ఏజెంట్’ సినిమా) దక్కించుకున్న తొలి బ్రెజిలియన్ నటుడిగా వాగ్నర్ మౌరా రికార్డు సాధించారు.⇒ వార్నర్ బ్రదర్స్ స్టూడియో సంస్థ నిర్మాణంలోని సినిమాలకు 30 ఆస్కార్ నామినేషన్స్ దక్కడం విశేషం. భారతీయ సినిమాకి నిరాశ: ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హిందీ చిత్రం ‘హోమ్ బౌండ్’ను ఇండియా తరఫున పంపించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నామినేషన్ దక్కించుకోలేకపోయింది. ∙ఆస్కార్ కన్సిడరేషన్ కోసం ఓటింగ్ పోటీలో నిలిచిన భారతీయ చిత్రాలు ‘కాంతార: చాప్టర్1, మహావతార్ నరసింహా, తన్వీ: ది గ్రేట్, టూరిస్ట్ ఫ్యామిలీ, సిస్టర్ మిడ్నైట్’ చిత్రాలకూ నామినేషన్ దక్కకపోవడం నిరాశపరిచే విషయం. -
టాప్ హీరోల ఫోకస్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలే
ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మహేష్ బాబు సినిమా వారణాసి. ఈ ప్రాజెక్ట్ను పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందించేందుకు రాజమౌళి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఇప్పుడు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాల తరువాత మహేష్ బాబు, రామ్ చరణ్ ఇద్దరూ మళ్లీ పాన్ వరల్డ్ సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ రామ్ చరణ్ కోసం దర్శకుడు సుకుమార్ ఇప్పటికే స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నారు. ఈసారి ఆయన రూపొందిస్తున్న కథ పాన్ వరల్డ్ స్థాయిలో యూనివర్సల్ అపీల్ కలిగిన జానర్లో ఉంటుందని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇంకా హీరోకు నెరేషన్ ఇవ్వలేదు. బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిన తరువాతే చరణ్ను కలసి కథ వినిపించనున్నారు. ప్రస్తుతం సుకుమార్, ఆయన టీమ్ ఈ పనిపైనే దృష్టి సారించారు. మహేష్ బాబు స్వంత బ్యానర్లో కొత్త ప్రాజెక్ట్ మహేష్ బాబు తన తదుపరి సినిమాను స్వంత బ్యానర్ జిఎంబిలో చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన మొదట్లో డొమెస్టిక్ మార్కెట్కు సరిపడే సినిమా చేయాలని ఆలోచించారు. కానీ ఇప్పుడు ఒక దర్శకుడు చెప్పిన లైన్ మహేష్ను ఆకట్టుకున్నట్లు సమాచారం. ఆ కథ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందనుంది. జిఎంబితో పాటు మరో బ్యానర్ ఈ ప్రాజెక్ట్లో భాగమవుతుందని సమాచారం. ఇకపై పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలే చరణ్, బన్నీ, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ వంటి టాప్ హీరోలు ఇకపై కేవలం మన మార్కెట్కు సరిపడే కమర్షియల్ సినిమాలు చేయడం లేదు. వారి దృష్టి మొత్తం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయి ప్రాజెక్టులపైనే ఉంది. టాలీవుడ్లో ఇకపై ప్రతి పెద్ద సినిమా గ్లోబల్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని రూపొందనుందనే చెప్పాలి. -
'పదే పదే కంగారుగుంటది'.. అదితి-విజయ్ సేతుపతి మెలోడి సాంగ్..!
విజయ్ సేతుపతి, అదితి రావు హైదరీ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం గాంధీ టాక్స్. ఈ సినిమాకు కిశోర్ పాండురంగ్ బెలేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే క్రేజీ మెలోడీ వీడియో సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.పదే పదే కంగారుగుంటది.. అంటూ సాగే ఈ మెలోడి లవ్ సాంగ్ విజయ్ సేతుపతి ఫ్యాన్స్ను అలరిస్తోంది. ఈ పాటకు రాకేందు మౌళి లిరిక్స్ అందించగా.. నయన్సీ శర్మ, శిబి శ్రీనివాసన్ ఆలపించారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ సినిమాలో అరవింద్ స్వామి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 30న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. -
హీరోయిన్కు పెళ్లి ప్రపోజల్.. ముందు కెరీర్పై ఫోకస్ చేయ్!
సెలబ్రిటీకు ప్రపోజల్స్ రావడం అనేది చాలా కామన్. అయితే చిన్నపిల్లలు కూడా ప్రపోజ్ చేస్తున్నారని, అదే కాస్త ఆశ్చర్యంగా ఉందంటోంది హీరోయిన్ అవంతిక మోహన్. టీనేజ్ పిల్లలు పెళ్లి చేసుకోమని అడుగుతున్నారని చెప్తోంది. ఈ మేరకు కొన్ని స్క్రీన్షాట్స్ షేర్ చేసింది. అందులో ఓ అబ్బాయి.. కేరళలో చాలామంది నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. వారిలో నేనూ ఒకడిని అన్నాడు. చిన్న వయసులో ఎంత ధైర్యమో..ఆ మెసేజ్కు అవంతిక స్పందిస్తూ.. ఈ పిల్లాడిని చూడండి.. అంత చిన్నవయసులోనే ఎంత ధైర్యమో! చిన్నోడా.. నేను చెప్పేదేంటంటే నాకు ఆల్రెడీ పెళ్లయిపోయింది. కాబట్టి నా గురించి ఆలోచించకుండా వెళ్లి నీ హోమ్వర్క్ చేసుకో.. నా జీవితంలో కొత్త హీరో ఎంట్రీకి ఛాన్స్ లేదు. నీ కెరీర్ మీద ఫోకస్ చేయు అని చెప్పుకొచ్చింది.నిన్ను పెళ్లి చేసుకోవచ్చా? మరో స్క్రీన్షాట్లో ఓ యువకుడు నేను నిన్ను పెళ్లి చేసుకోవచ్చా? అని అడిగాడు. అది చూసిన అవంతికకు కోపం రాలేదు, నవ్వొచ్చింది. నీ మెసేజ్ చూడగానే నాకు నిజంగా నవ్వొచ్చింది. నీకు దాదాపు 20 ఏళ్లు ఉంటాయనుకుంటా.. చాలా రాంగ్ టైమ్ ఇది! అయినా సరే నీ ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే!సినిమాసరైన సమయం వచ్చినప్పుడు కరెక్ట్ పర్సన్ నీ జీవితంలోకి వస్తారు.. అప్పటివరకు జీవితాన్ని ఆస్వాదించు అని రిప్లై ఇచ్చింది. అవంతికకు ఇలాంటి ప్రపోజల్స్ గతంలోనూ వచ్చాయి. సినిమాల విషయానికి వస్తే.. అవంతిక యక్షి: ఫేత్ఫుల్లీ యువర్స్, నీలాకాశం పచ్చకాదల్ చువన్న భూమి, క్రొకొడైల్ లవ్ స్టోరీ వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఉందిలే మంచి కాలం ముందు ముందున సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసింది.చదవండి: నన్ను వాడుకుని వదిలేశారు: శర్వానంద్ -
ఫేవరేట్ డైరెక్టర్తో విశాల్ కొత్త మూవీ.. టాలీవుడ్ డిజాస్టర్ టైటిల్తోనే..!
కోలీవుడ్ స్టార్ విశాల్ చాలా రోజుల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తన ఫెవరేట్ డైరెక్టర్ సుందర్ సితో మరోసారి జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి పురుషన్ అనే టైటిల్ ఖరారు చేశారు. తెలుగులో మొగుడు పేరుతో రిలీజ్ చేయనున్నారు. టైటిల్ రివీల్ చేస్తూ ఏకంగా ఐదు నిమిషాల వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా కనిపించనుంది. ఈ వీడియో యోగిబాబుతో తమన్నా చేసే కామెడీ ఫుల్గా నవ్వులు తెప్పిస్తోంది. ఆ తర్వాత వంటగదిలో విశాల్ చేసే ఫైట్ వేరే లెవెల్లో ఉంది. ఇది చూసిన యోగిబాబు రియాక్షన్ చూస్తే సీరియస్ సీన్లో కామెడీ చేయడం అద్భుతంగా అనిపిస్తోంది. 'మొగుడులా ఉండటం ముఖ్యం కాదు.. మొగుడు మొగుడులా ఉండటమే ముఖ్యం. అర్థమైందా అత్తయ్యా..' అంటూ యోగిబాబు చెప్పే డైలాగ్లు నవ్వులు తెప్పిస్తున్నాయి.గోపిచంద్ టైటిల్నే..అయితే ఈ మూవీ టైటిల్ మొగుడు కావడం చర్చనీయాంశంగా మారింది. గతంలో తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో గోపిచంద్, తాప్సీ జంటగా వచ్చిన మూవీ టైటిల్ మొగుడు కావడం విశేషం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలిపోయింది. 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ఇప్పుడు అదే టైటిల్తో విశాల్ ప్రయోగం చేయడం కలిసొస్తుందా? డిజాస్టర్ అవుతుందా? వేచి చూడాల్సిందే. Well well well…#KushbuPurushan da wishing my darling brother a very very happy entertaining and fun filled t birthday of my favourte director #SundarC, i am supa happy to kickstart my next film #Vishal36 titled as #Purushan with him for the 4th time after the grand success of…— Vishal (@VishalKOfficial) January 21, 2026 -
తెలుగు హీరోయిన్లపై రాజాసాబ్ బ్యూటీ విమర్శలు
మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్.. మలయాళంతోపాటు సమానంగా తమిళంలోనూ సినిమాలు చేసింది. కోలీవుడ్లో తను నటించిన మాస్టర్, పేట, తంగలాన్ చిత్రాలు తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇటీవల ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం కార్తీ హీరోగా నటిస్తున్న సర్దార్ 2 మూవీలో యాక్ట్ చేస్తోంది.డైలాగులు బేఖాతరుతాజాగా ఓ ఇంటర్వ్యూలో మాళవిక చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఆమె మాట్లాడుతూ.. చాలాకాలం కిందట సంగతి ఇది. తెలుగు, తమిళంలో కొందరు హీరోయిన్లు డైలాగులను అసలు పట్టించుకునేవారే కాదు. ఒక సన్నివేశంలో బాధగా కనిపించాలంటే ఏడుపు ముఖం పెట్టి ఒకటి, రెండు, మూడు, నాలుగు అని లెక్కపెట్టేవారు. అంతే..! ఆవేశం, కోపం కలగలిపిన సీన్లలో ఏబీసీడీ అనే అక్షరాలను చదువుతూ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవారు. మమ అనిపించేవారుఏబీసీడీ అన్న అక్షరాలను పదేపదే చదువుతూ ఉంటే పెదాలు కలుస్తూ ఉంటాయి. ఆ లిప్ సింక్ వల్ల డబ్బింగ్లో చెప్పే డైలాగ్స్కు సరిగ్గా సరిపోయేవి. కెరీర్ మొత్తం వాళ్లిలాగే నెట్టుకొచ్చారు. నేనైతే వారిలా అస్సలు చేయలేను అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్పై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర భాషా నటుల్ని తీసుకొచ్చి పెడితే ఇలాగే ఉంటుందని కొందరు అంటుంటే.. మాస్టర్ మూవీలో నిన్ను ట్రోల్ చేసిందెందుకో మర్చిపోయావా? అని మరికొందరు మాళవికపై సెటైర్లు వేస్తున్నారు. #MalavikaMohanan Acting in Master was trolled by all with her expression But She Commenting on others pic.twitter.com/tASuISbGrh— SillakiMovies (@sillakimovies) January 21, 2026 చదవండి: మమ్ముట్టి సినిమాలు రిజెక్ట్ చేశా..: హీరోయిన్ భావన -
మమ్ముట్టి సినిమాలు సైతం రిజెక్ట్ చేశా..: భావన
హీరోయిన్ భావన పెళ్లయిన కొత్తలో మలయాళ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. దాదాపు ఐదేళ్లపాటు (2018-2022) మాలీవుడ్లో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఎంతోమంది పెద్ద పెద్ద సినిమా ఛాన్సులు ఇచ్చినా వాటిని నిర్మహమాటంగా తిరస్కరించింది. దాని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.ఏదీ ప్లాన్ చేయలేదుభావన మాట్లాడుతూ.. నేను ఏదీ ముందుగా ప్లాన్ చేయలేదు. ఎందుకో సడన్గా మలయాళ సినిమాలకు దూరంగా ఉండాలనిపించింది. పెళ్లి చేసుకున్నాక నేను బెంగళూరు షిఫ్ట్ అయ్యాను. కుటుంబంతో సరదాగా గడిపాను. ఆ సమయంలో అలా ఉండటమే నాకు నచ్చింది. మాలీవుడ్కు వెళ్లి అక్కడ బిజీ నటిగా ఉండాలనిపించలేదు.కథ వినకుండానే రిజెక్ట్ చేశా..నా ఇష్టప్రకారమే సినిమాలకు బ్రేక్ తీసుకున్నాను. అయినప్పటికీ ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది సన్నిహితులు ఈ సినిమా చేయు, బాగుంటుంది.. ముందు కథ విను, నచ్చకపోతే నో చెప్పు అనేవారు. అయినా సరే కథ వినకుండానే చాలా సినిమాలు రిజెక్ట్ చేశాను. కథ నచ్చాక కూడా నో చెప్పడం బాగోదనే అలా చేశాను. ఆషిఖ్ అబు, పృథ్వీరాజ్ సుకుమారన్, జయసూర్య, మమ్ముట్టి సినిమాలను సైతం తిరస్కరించాను. ఎందుకలా చేశావు? దీనివల్ల ఏం సాధిస్తావు? అని నన్నడిగితే నా దగ్గర సమాధానం లేదు. సమాధానం లేదుఅప్పుడు నాకు మలయాళ సినిమాలకు విరామం ఇవ్వాలనిపించిందంతే! హ్యాపీగా బెంగళూరులో కుటుంబంతో గడపాలనుకున్నాను. ఈ లైఫ్స్టైల్ను బ్రేక్ చేసి మళ్లీ కేరళ వెళ్లిపోయి హడావుడిగా సినిమాలు చేయాలనుకోలేదు అని చెప్పుకొచ్చింది. భావన.. కన్నడ నిర్మాత నవీన్ను 2017లో ఎంగేజ్మెంట్ చేసుకోగా 2018లో పెళ్లాడింది. పెళ్లయిన ఐదేళ్లపాటు మాలీవుడ్ను పూర్తిగా పక్కనపెట్టేసింది. కేవలం కన్నడ భాషలో మాత్రమే వరుసగా సినిమాలు చేసింది. ఇకపోతే భావన.. ఒంటరి, హీరో, మహాత్మ సినిమాలతో తెలుగువారికి సైతం దగ్గరయింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ అనోమి ఫిబ్రవరి 6న విడుదలవుతోంది. -
ప్రముఖ నటి ఊర్వశి ఇంట విషాదం
చెన్నై: ప్రముఖ నటి ఊర్వశి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె సోదరుడు, నటుడు కమల్ రాయ్ (54) చెన్నైలో కన్నుమూశారు. కమల్ రాయ్ మృతి పట్ల దర్శకుడు వినాయన్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఊర్వశి, కల్పన, కలారంజినిల సోదరుడే కమల్ రాయ్. ఈయన కల్యాణసౌగంధికం సినిమాలో విలన్గా నటించాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని దేవుడిని ప్రార్థించాడు.నటులు చావర వీపీ నాయర్- విజయలక్ష్మిల సంతానమే కమల్ రాయ్. అతడికి ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. వారే ఊర్వశి, కళారంజిని, కల్పన. ఈ ముగ్గురు కూడా యాక్టర్స్గా సుపరిచితులే. వీరితో పాటు ఓ సోదరుడు కూడా ఉండేవాడు. అతడి పేరు ప్రిన్స్. చిన్నవయసులోనే అతడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.కమల్ రాయ్ విషయానికి వస్తే.. సాయుజయం, కొల్లైలక్కం, మంజు, కింగిని, కల్యాణ సౌగంధికం, వచలం, శోభనం, ద కింగ్ మేకర్, లీడర్ వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించారు. మోహన్లాల్, ఊర్వశి హీరోహీరోయిన్గా నటించిన యువజనోల్సవం మూవీలో విలన్గా యాక్ట్ చేశారు. తమిళ సినిమాల్లోనూ నటించారు. బుల్లితెరపై కొన్ని సీరియల్స్లోనూ మెరిశారు.చదవండి: భారత్లో బిజినెస్ చేయలేక దుబాయ్కు చెక్కేసిన హీరోయిన్ -
'ఇంకా నిద్రపోతున్నారా?'.. హీరోను అవమానించేలా ప్రశ్న
తమిళ హీరో అశ్విన్ కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. తను ప్రధాన పాత్రలో నటించిన హాట్స్పాట్ 2 మచ్ మూవీ త్వరలో రిలీజవుతోంది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన సినిమా ప్రెస్మీట్లో ఓ రిపోర్టర్ అతడిని అవమానించేలా ప్రశ్న అడిగాడు. మీకు కథలు చెప్పేటప్పుడు నిద్రపోతున్నారా? లేదా మెలకువతో ఉండి వింటున్నారా? అని ప్రశ్నించాడు. అది విని అశ్విన్ అసహనానికి లోనయ్యాడు.హీరో కౌంటర్మీరెప్పుడూ సినిమా చూసేటప్పుడు థియేటర్లో నిద్రపోలేదా? అని తిరిగి ప్రశ్నించాడు. అప్పుడేదో 40 కథలు చెప్పేసరికి నిద్రపోయానన్నాను. బహుశా ఆ సంఖ్య 40 కన్నా ఎక్కువే ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. అయినా దానిపై గతంలోనే క్లారిటీ ఇచ్చాను. అయినప్పటికీ మళ్లీ మళ్లీ అదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు? నన్ను అవమానించడానికా? అని కోప్పడ్డాడు.గతంలో ఏం జరిగింది?2022లో ఎన్న సొల్ల పోగిరై మూవీ ఆడియో లాంచ్లో అశ్విన్ కుమార్ మాట్లాడాడు. ఒకేరోజు దాదాపు 40 కథలు విన్నానని, అవి చాలా చప్పగా ఉండటంతో సగంలోనే నిద్రపోయానన్నాడు. ఆయన కామెంట్స్పై నెట్టింట తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన.. ఎవరినీ బాధపెట్టాలన్న ఉద్దేశం తనకు లేదంటూ క్షమాపణలు చెప్పాడు. అక్కడితో ఆ వివాదం సమసిపోయింది.హాట్స్పాట్ 2 మచ్ విషయానికి వస్తే.. ఇది 2024లో వచ్చిన హాట్స్పాట్ మూవీకి సీక్వెల్గా తెరకెక్కింది. విఘ్నేశ్ కార్తీక్ దర్శకత్వం వహించాడు. అశ్విన్ కుమార్తో పాటు ప్రియ భవానీ శంకర్, ఆదిత్య భాస్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ తమిళ చిత్రం జనవరి 23న విడుదలవుతోంది. కాగా సీరియల్స్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అశ్విన్ కుమార్ (Ashwin Kumar Lakshmikanthan).. తెలుగులో అన్నీ మంచి శకునములే సినిమాలోనూ యాక్ట్ చేశాడు. #Reporter: Are you sleeping now listening to stories or you woke up❓#AshwinKumar: 40 is the number which I said generally, it could be more or less. Have you never slept while watching films in theatres? Why are you bringing this question now & degrading me? It was not to hurt… pic.twitter.com/RPhtEoSfo0— AmuthaBharathi (@CinemaWithAB) January 20, 2026 చదవండి: రాజాసాబ్ ఫ్లాప్.. ప్రభాస్ రియాక్షన్ ఏంటో చెప్పిన నిధి అగర్వాల్ -
14 ఏళ్లకే మద్యం.. ఇప్పుడు గ్రీన్ టీతో పార్టీలు: నిధి అగర్వాల్
సినీ ఇండస్ట్రీలో తన అందం, నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటి నిధి అగర్వాల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇటీవల వెల్లడించింది. చిన్న వయసులోనే మద్యం సేవించడం ప్రారంభించినప్పటికీ, ఆ అలవాటును పూర్తిగా విడిచిపెట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకున్నట్లు ఆమె తెలిపింది. నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. తాను 14 ఏళ్ల వయసులోనే తొలిసారి మద్యం సేవించాను. ఆ సమయంలో ఫ్రెండ్స్తో కలిసి తాగడం సరదాగా అనిపించేది. అప్పట్లో అది ఫన్గా అనిపించింది. కానీ కాలక్రమేణా మద్యం నాకు సరిపడదని అర్థమైంది. తాగిన తర్వాత తనకు అసౌకర్యంగా, కొన్నిసార్లు భయంగా కూడా అనిపించేది.ఆ అనుభవాలే నన్ను ఆలోచనలో పడేశాయి. చివరకు మద్యం పూర్తిగా మానేయాలనే నిర్ణయం తీసుకున్నాను. నేను చివరిసారి మద్యం తాగి దాదాపు ఆరేళ్లు పూర్తయింది. ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదని ఆలస్యంగా అయినా గ్రహించాను. నా శరీరం కూడా ఆల్కహాల్ను అంగీకరించడం లేదని అర్థమైంది. అందుకే వెంటనే మానేశాను.ప్రస్తుతం పార్టీలకు వెళ్లినప్పటికీ మద్యం జోలికి మాత్రం వెళ్లడం లేదు. అయితే దాని బదులు గ్రీన్ టీతో ఎంజాయ్ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్లో కొంతమంది ఆల్కహాల్ తాగుతారు. కానీ నేను మాత్రం తాగను. మద్యం లేకుండానే పార్టీల్లో బాగా ఎంజాయ్ చేయొచ్చని నిధి స్పష్టం చేసింది. -
టాలీవుడ్లో ట్రెండ్ మారుతోందా?
టాలీవుడ్లో ప్రతి సీజన్కి ఒక ప్రత్యేకమైన ట్రెండ్ ఉంటుంది. ఒకప్పుడు హారర్ కామెడీ చిత్రాలు వరుసగా వచ్చాయి. అంతకంటే ముందు ప్రేమకథలు హవాను కొనసాగించాయి. ఇటీవల వరకూ యాక్షన్ సినిమాలు, లార్జర్ దేన్ లైఫ్ కథలు సిల్వర్ స్క్రీన్పై ఆధిపత్యం చెలాయించాయి.అయితే ఇప్పుడు పరిస్థితి మరోసారి మారుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలను గమనిస్తే ప్రేక్షకుల అభిరుచి మారినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ‘రాజాసాబ్’ మినహా మిగతా అన్ని సినిమాల్లో ప్రధాన ఎలిమెంట్ కామెడీనే. మన శంకరవరప్రసాద్,అనగనగ ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి ఈ సినిమాలన్నింటిలోనూ కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ వసూళ్లు ఎలా ఉన్నా థియేటర్లలో ఆడియన్స్ ఎక్కువగా ఎంజాయ్ చేసినవి కామెడీ పోర్షన్లే. ఇది కేవలం సంక్రాంతి సినిమాల వరకే పరిమితమా? లేక టాలీవుడ్ ట్రెండ్ నిజంగానే మారుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో మరో 2-3 కామెడీ సినిమాలు హిట్ అయితే మాత్రం టాలీవుడ్ పూర్తిగా కామెడీ వైపు మలుపు తిరిగిందని చెప్పవచ్చు. ఇప్పటివరకు ప్రేక్షకులు కేజీఎఫ్, బాహుబలి, పుష్ప, కాంతార, సలార్ లాంటి భారీ యాక్షన్ సినిమాల కోసం మాత్రమే థియేటర్లకు వస్తారనే భావన ఉండేది. ఓ మోస్తరు బడ్జెట్ సినిమాలపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపరని అనుకునేవారు. ఆ విషయాన్ని పలువురు దర్శకులు, నిర్మాతలు కూడా బహిరంగంగానే అంగీకరించారు. ప్రస్తుతం మన స్టార్ హీరోలు కూడా భారీ యాక్షన్ కథలనే ఎంచుకుంటున్నారు. దాంతో ఒక్కో సినిమాకు ఏడాది పైగా సమయం పడుతోంది. కానీ కామెడీ ట్రెండ్ బలపడితే మాత్రం ఇది శుభపరిణామంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే దానివల్ల స్టార్ హీరోల సినిమాల సంఖ్య పెరుగుతుంది. పాన్ ఇండియా హంగులు తగ్గుతాయి. నిర్మాతలకు భారీ బడ్జెట్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. టాలీవుడ్లో కామెడీ చిత్రాల ట్రెండ్ మొదలైనట్లు సంక్రాంతి సినిమాలు సూచిస్తున్నాయి. రాబోయే నెలల్లో ఈ ట్రెండ్ బలపడితే, ఇండస్ట్రీలో కొత్త మార్పులు తప్పవు. -
ఏనుగు దత్తత తీసుకున్న స్టార్ హీరో
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తన గొప్ప మనసును చాటుకున్నారు. వండలూర్ జూ పార్క్లోని ఏనుగును దత్తత తీసుకున్నారు. ఆరునెలల పాటు ఆ ఏనుగు సంరక్షణ బాధ్యతలను హీరోనే చూసుకోనున్నారు. ప్రకృతి అనే పేరు గల ఏనుగు సంరక్షణను శివ కార్తికేయన్ పర్యవేక్షించనున్నారు. ఈ విషయాన్ని జూ పార్క్ అధికారులు అఫీషియల్గా ప్రకటించారు. ఇది చూసిన హీరో ఫ్యాన్స్.. అన్న గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. శివ కార్తికేయన్ ఇటీవలే పరాశక్తి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. పొంగల్ కానుకగా ఈ మూవీ రిలీజైంది. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ మూవీపై కొందరు విమర్శలు చేశారు. ఈ సినిమాను పాలిటిక్స్తో లింక్ చేయడంతో వివాదానికి దారితీసింది. కాగా.. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా కనిపించింది. Actor Thiru.D.Sivakarthikeyan has adopted an elephant named Prakruthi in #AAZP for a period of six months. #ArignarAnnaZoologicalPark #AAZPChennai #VandalurZoo #AnimalAdoption #ZoologicalPark@Siva_Kartikeyan pic.twitter.com/5v33XghiDM— Vandalur Zoo @Arignar Anna Zoological Park Chennai (@VandalurZoo) January 20, 2026 -
బన్నీ సినిమాతో బిజీ.. ఇప్పుడు మరో గుడ్ న్యూస్
తమిళంలో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి.. బాలీవుడ్ వరకు వెళ్లి.. ఇప్పుడు అల్లు అర్జున్తో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న దర్శకుడు అట్లీ.. గుడ్ న్యూస్ చెప్పేశాడు. తన భార్య మరోసారి ప్రెగ్నెన్సీతో ఉందనే విషయాన్ని బయటపెట్టాడు. అందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకున్నారు.(ఇదీ చదవండి: క్యారవాన్లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే)తమిళ డైరెక్టర్ శంకర్ దగ్గర సహాయకుడిగా పనిచేసిన అట్లీ.. 'రాజారాణి' మూవీతో దర్శకుడిగా మారాడు. తర్వాత దళపతి విజయ్తో తెరి, బిగిల్, మెర్సల్ లాంటి హ్యాట్రిక్ మూవీస్ తీశాడు. 2023లో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్తో తీసిన 'జవాన్'.. అదిరిపోయే సక్సెస్ అయింది. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్తో అట్లీ ఓ మూవీ చేస్తున్నాడు.అట్లీ వ్యక్తిగత విషయాలకొస్తే.. నటి ప్రియని 2014లో పెళ్లి చేసుకున్నాడు. 2023లో ఈమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడికి మీర్ అని పేరు పెట్టారు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత ప్రియ మరోసారి తల్లి కానుంది. చూస్తుంటే బన్నీతో మూవీ రిలీజయ్యేలోపే అట్లీ తండ్రి కాబోతున్నాడు. ఈ మేరకు ప్రియ బేబీ బంప్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు) -
మరోసారి స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ వార్..
కోలీవుడ్లో కమల్ హాసన్, రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి కథానాయకులుగా రాణిస్తున్న నటులు విజయ్, అజిత్. వీరిద్దరి మధ్య మంచి మిత్రభావం ఉంది. అయితే వీరి అభిమానులు మధ్య మాత్రం ఎప్పటినుంచో పోటీ తత్వం నెలకొంది. ముఖ్యంగా అజిత్, విజయ్ నటించిన చిత్రాలు ఒకేరోజు విడుదలైతే ఆ సమయాల్లో వారి అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు.30 ఏళ్లుగా..రెండు చిత్రాల్లో ఏ ఒక్కటి విజయం సాధించినా మరో హీరోపై విమర్శల దాడి జరుగుతుంటుంది. అలా గత 30 ఏళ్లకు పైగా విజయ్, అజిత్ మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటూ వస్తోంది. ఇకపోతే విజయ్ నటించిన చివరి మూవీ జననాయకన్ ఈ నెల 9వ తేదీన విడుదల కావాల్సింది. కానీ, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో ఇతర చిత్రాల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. రీరిలీజ్అదేవిధంగా గతంలో విడుదలైన కొన్ని చిత్రాలు ఇప్పుడు రీ రిలీజ్ అవుతున్నాయి. అలాంటి వాటిలో నటుడు విజయ్ నటించిన తెరి, అజిత్ నటించిన మంగాత్తా చిత్రాలు కూడా చోటు చేసుకోవడం విశేషం. గతంలో మంచి విజయాలను సాధించిన ఈ రెండు చిత్రాలు ఈ నెల 23వ తేదీన రీరిలీజ్ కావడం మరో విశేషం. దీంతో ఈ చిత్రాలు సాధించే వసూళ్లపై ఆసక్తి నెలకొంది.1996 సంక్రాంతికి మొదలుఇకపోతే విజయ్, అజిత్ గతంలో నటించిన చిత్రాలు ఒకేసారి విడుదలైన సందర్భాలను పరిశీలిస్తే 1996 సంక్రాంతి సమయంలో విజయ్ నటించిన కోయంబత్తూర్ మాప్పిళై, అజిత్ నటించిన వాన్మతి చిత్రాలు రిలీజయ్యాయి. అదే ఏడాది ఫిబ్రవరిలో విజయ్ నటించిన పూవే ఉనకాగా, అజిత్ నటించిన కల్లూరి వాసన్ చిత్రాలు మూడు రోజుల గ్యాప్తో విడుదలయ్యాయి. 1997లో విజయ్ నటించిన కాలమేల్లామ్ కార్తిరుప్పేన్ , అజిత్ నటించిన నేశం చిత్రాలు, అదే ఏడాది విజయ్ నటించిన కాదలుక్కు మర్యాదై, అజిత్ నటించిన రైట్టె జెండాపై వయసు చిత్రాలు వచ్చాయి.స్టార్ హీరోల సినిమాలు రిలీజ్1999లో విజయ్ నటించిన తుల్లాద మనం తుళ్ళుమ్ ,అజిత్ నటించిన ఉన్నైతేడి చిత్రాలు, 2000వ సంవత్సరంలో అజిత్ నటించిన ఉన్నై కొడు ఎన్నై తరువేన్ విజయ్ నటించిన ఖుషి చిత్రాలు, 2001లో విజయ్ నటించిన ఫ్రెండ్స్, అజిత్ నటించిన దీనా చిత్రాలు, 2002లో విజయ్ నటించిన భగవతి, అజిత్ నటించిన విలన్ చిత్రాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇప్పుడు మరోసారి..2003లో విజయ్ నటించిన తిరుమలై , అజిత్ నటించిన ఆంజనేయ చిత్రాలు, 2006లో విజయ్ నటించిన ఆది ,అజిత్ నటించిన పరమశివం.., 2007లో విజయ్ నటించిన పోకిరి , అజిత్ నటించిన ఆల్వార్ .., 2014లో విజయం నటించిన జిల్లా, అజిత్ నటించిన వీరం చిత్రాలు, 2023లో అజిత్ నటించిన తుణివు, విజయ్ నటించిన వారిసు చిత్రాలు ఒకేసారి రిలీజయ్యాయి. ఇప్పుడు మరోసారి ఈ స్టార్ హీరోల తేరి, మంగాత్తా సినిమాలు ఒకేసారి రీ రిలీజ్ అవుతున్నాయి. -
నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: ఏఆర్ రెహమాన్
కొన్నిసార్లు మన అభిప్రాయాలు ఇతరులకు తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉందనే విషయాన్ని అర్థం చేసుకున్నాను అంటున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఇండస్ట్రీలో ఎనిమిదేళ్లుగా పవర్ షిఫ్ట్ నెలకొందని, సృజనాత్మక లేనివారే క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారని, ఇందుకు మతపరమైన అంశం కూడా కారణం కావొచ్చని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు రెహమాన్. అర్థం చేసుకున్నారుఅంతేకాకుండా ఆ ప్రభావం తనపై పడినట్లు తనకు అనిపించలేదు కానీ, పడిందన్నట్లుగా కొందరు గుసగుసలాడుకున్నట్లు తెలిసిందని కూడా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను పలువురు నటీనటులు, రాజకీయ నాయకులు తప్పుపట్టారు. తాజాగా ఈ వివాదంపై ఏఆర్ రెహమాన్ స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. భారతదేశం నా ఇల్లు.. నా గురువు.. నాకు స్ఫూర్తి. కొన్నిసార్లు మన అభిప్రాయాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని తెలుసుకున్నాను. బాధ పెట్టాలనుకోలేదుకానీ, నా ఆలోచన మాత్రం ఎప్పుడూ సంగీతం గౌరవించబడటమే.. సంగీతానికి సేవ చేయడమే.. అలాగే నేను ఎవర్నీ బాధపెట్టాలనుకోవడం లేదు. నా నిజాయితీని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కలిగిన భారతదేశంలో నేను భారతీయుడిగా ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. కృతజ్ఞతతో ఉంటా..అలాగే గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో వేవ్స్ సమ్మిట్ -2025లో ఝాలా ప్రదర్శన, రూహ్- ఎ-నూర్, సన్ షైన్ ఆర్కెస్ట్రాకు మార్గదర్వకత్వం వహించడం, ఇండియాస్ ఫస్ట్ మల్టీకల్చరల్ వర్చ్యువల్ బ్యాండ్ 'సీక్రెట్ మౌంటైన్'ను బిల్డ్ చేయడం, హన్స్ జిమ్మర్తో కలిసి రామాయణ సినిమాకు సంగీతం అందిస్తుండటం.. ఇలా ప్రతీది నా జర్నీని బలోపేతం చేస్తుందనుకుంటున్నాను. ఈ దేశానికి కృతజ్ఞతతో ఉంటాను. జై హింద్, జయహో.. అంటూ వీడియోలో మాట్లాడారు రెహమాన్. మా తుఝే సలామ్, వందేమాతరం అంటూ ఓ స్టేడియంలో ఆడియన్స్ పాడుతున్న విజువల్స్ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. View this post on Instagram A post shared by AR Rahman: Official Updates (@arrofficialupdates) చదవండి: 20 ఏళ్ల వయసులో తమన్నాకు చేదు అనుభవం -
ఆ ఇద్దరే బిగ్బాస్ షో విజేతలు! మరో సర్ప్రైజ్ ఏంటంటే?
బిగ్బాస్ షోకు ఒకేసారి రెండు భాషల్లో శుభం కార్డు పడింది. ఆదివారం (జనవరి 18న) నాడు అటు తమిళ బిగ్బాస్ 9, ఇటు కన్నడ బిగ్బాస్ 12వ సీజన్ ముగిసింది. తమిళ బిగ్బాస్ షోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన దివ్య గణేశ్ విజేతగా నిలిచింది. తమిళ బిగ్బాస్ తొమ్మిదో సీజన్ అక్టోబర్ 5న మొదలైంది. విజయ్ సేతుపతి హోస్ట్గా వ్యవహరించిన ఈ సీజన్లో మొత్తం వైల్డ్కార్డ్స్తో కలిపి 20 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. రూ.50 లక్షల ప్రైజ్మనీదివ్య గణేశ్, శబరీనాథన్, విక్కాల్స్ విక్రమ్, అరోరా సిన్క్లయర్.. నలుగురే ఫైనలిస్టులుగా నిలిచారు. ఉత్కంఠగా జరిగిన ఈ సీజన్లో అందర్నీ వెనక్కు నెట్టి దివ్య గణేశ్ లేడీ విన్నర్గా నిలిచింది. బిగ్బాస్ ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్మనీ గెలుచుకుంది. అలాగే ఒక కారును సైతం గెలుపొందింది.కన్నడ బిగ్బాస్కన్నడ బిగ్బాస్ 12వ సీజన్ విషయానికి వస్తే.. గతేడాది సెప్టెంబర్ 28న ప్రారంభమైంది. వరుసగా పన్నెండవ సారి కూడా హీరో కిచ్చా సుదీప్ ఈ సీజన్కు హోస్టింగ్ చేశాడు. ఈ సీజన్లో కమెడియన్ గిల్లి నాట (నటరాజ్), రక్షిత, అశ్విని, కావ్య, రాఘవేంద్ర, ధనుష్ టాప్ 6గా ఫైనల్స్లో అడుగుపెట్టారు.హోస్ట్ సర్ప్రైజ్వీరిలో అందర్నీ వెనక్కునెడుతూ గిల్లి నాట టైటిల్ విజేతగా నిలిచాడు. ఇతడు రూ.50 లక్షల ప్రైజ్మనీతో పాటు ఒక ఎస్యూవీ కారును సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, హీరో కిచ్చా సుదీప్ అతడికి మరో రూ.10 లక్షలు గిఫ్ట్ ఇస్తూ ఆ గెలుపును మరింత స్పెషల్గా మార్చేశాడు. View this post on Instagram A post shared by Vijay Television (@vijaytelevision) View this post on Instagram A post shared by Colors Kannada Official (@colorskannadaofficial) -
దర్శకుడు ఒత్తిడి చేసినా రిజెక్ట్ చేశా.. అందరిముందే అరిచాడు!
సెలబ్రిటీల జీవితం అద్దాల మేడలాంటిదంటారు. నిజమే, ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత వారిది ఆడంబర జీవితమే.. అయితే ఆ స్థాయికి ఎదిగేవరకు ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా తమ జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను చాలామంది నటీమణులు బహిరంగంగానే వెల్లడించిన సందర్భాలున్నాయి. హీరోయిన్ తమన్నా కూడా ఇందుకు అతీతం కాదు.బాలీవుడ్లో బిజీఒక్క పాటకు డ్యాన్స్ చేయడానికి సుమారు రూ.6 కోట్లు పారితోషికం తీసుకుంటున్న ఈ అందాల రాశి 2 దశాబ్దాలుగా పలు భాషల్లో హీరోయిన్గా రాణిస్తోంది. ముఖ్యంగా ఐటం సాంగ్స్లో తన ప్రత్యేకతను చాటుకుంటున్న తమన్నాకు ప్రస్తుతం దక్షిణాదిలో పెద్దగా అవకాశాలు లేకపోయినా హిందీలో చేతినిండా సినిమాలతో బిజీగానే ఉంది.దర్శకుడు ఒత్తిడిఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ 20 ఏళ్ల వయసులోనే చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు పేర్కొంది. ఒక సినిమాలోని ఓ సీన్లో హీరోతో కలిసి చాలా సన్నిహితంగా నటించాలని దర్శకుడు ఒత్తిడి చేశాడంది. అయితే ఆ సీన్లో నటించేందుకు తనకు అసౌకర్యంగా ఉందని చెప్పి నిరాకరించానంది. హీరోయిన్ను మార్చండిదీంతో సెట్లో అందరూ ఉండగా హీరోయిన్ను మార్చండి అని ఆ దర్శకుడు గట్టిగా అరిచాడంది. అలా ఆ సన్నివేశంలో నటించాల్సిందేనని దర్శకుడు పట్టుబట్టడంతో తాను తగ్గకుండా ఏం జరిగినా పర్వాలేదు అనే నిర్ణయానికి వచ్చానని చెప్పింది. చివరకు ఆ దర్శకుడు క్షమాపణ చెప్పారంది. అయితే అది ఏ సినిమా? ఆ దర్శకుడు ఎవరు? అన్న విషయాలు మాత్రం బయటపెట్టలేదు. -
సైన్స్ ఫిక్షన్లో...
‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ (తెలుగులో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’), ‘డ్యూడ్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు దర్శక–నటుడు ప్రదీప్ రంగనాథన్. తాజాగా ప్రదీప్ ఓ సైన్స్ ఫిక్షన్ కథను రెడీ చేశారు. ఈ సినిమా షూటింగ్ను ఈ ఏడాదిలోనే ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వర్తించనున్నారు ప్రదీప్. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రంలోని నటీనటుల ఎంపికపై ప్రదీప్ దృష్టి పెట్టారట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్కు చాన్స్ ఉందని, ఒక హీరోయిన్గా శ్రీలీల నటించనున్నారని, మరో హీరోయిన్గా మీనాక్షీ చౌదరి కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా కథను శ్రీలీల, మీనాక్షీలకు ప్రదీప్ వినిపించారని సమాచారం మరి... ఈ సైన్స్ ఫిక్షన్స్ సినిమాకు శ్రీలీల, మీనాక్షీ చౌదరి ‘సై’ అన్నారా? లేదా అనేది తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. -
ఏప్రిల్లో స్టార్ట్
‘తలైవర్ 173’ సినిమా చిత్రీకరణ వేసవిలో ప్రారంభం కానుంది. రజనీకాంత్ హీరోగా సిబీ చక్రవర్తి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘తలైవర్ 173’ (వర్కింగ్ టైటిల్). కమల్హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి.కమర్షియల్ ఎంటర్టైనర్ జానర్లో ఈ సినిమా కథనం సాగుతుందని ఇటీవల ఓ సందర్భంలో రజనీకాంత్ పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని 2027 పొంగల్ పండగ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రస్తుతం ‘జైలర్ 2’ చిత్రీకరణతో బిజీగా ఉంటున్నారు రజనీకాంత్. ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ వచ్చే వారంలో ప్రారంభం కానుందని కోలీవుడ్ సమాచారం. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘జైలర్ 2’ ఈ ఏడాది జూన్లో విడుదల కానుంది. -
ప్రభాస్ vs సల్మాన్ ఖాన్.. బాక్సాఫీస్ పోటీ?
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మరోసారి బాలీవుడ్ సూపర్స్టార్తో బాక్సాఫీస్ పోటీకి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఒకసారి బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్తో ప్రభాస్ పోటీ పడ్డారు. ఇప్పుడు కండల వీరుడు సల్మాన్ ఖాన్తో కూడా తలపడే అవకాశం కనిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాను 2027 మార్చి 5న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ తేదీ వీకెండ్తో పాటు ఈద్ పండుగ సీజన్కి దగ్గరగా ఉండటంతో భారీగా కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక సల్మాన్ ఖాన్ హీరోగా ప్రముఖ దర్శక ద్వయం రాజ్-డీకేతో కొత్త సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాను 2027 రంజాన్ సీజన్లో విడుదల చేయాలనే ప్లాన్ జరుగుతోంది. సల్మాన్ ఖాన్కు రంజాన్ సీజన్పై ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. గతంలో అనేక సినిమాలను ఆయన ఈ సీజన్లో విడుదల చేసి విజయాలు సాధించాడు. అందుకే రాజ్-డీకే సినిమా కూడా అదే టైమ్లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే ప్రభాస్ స్పిరిట్ సినిమాతో ఆ సీజన్ను లాక్ చేసుకున్నాడు. అదే సమయంలో సల్మాన్ సినిమా కూడా సిద్ధమవుతుందనే ప్రచారం నడుస్తోంది. రాజ్-డీకే ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించిన వెంటనే ఈ రెండు భారీ సినిమాల మధ్య పోటీపై స్పష్టత వస్తుంది. బాలీవుడ్లో ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసినప్పుడే రిలీజ్ డేట్ కూడా ప్రకటించడం ఆనవాయితీ కావడంతో ఈ పోటీపై ఫ్యాన్స్లో ఆసక్తి పెరిగింది. 2027 రంజాన్ బాక్సాఫీస్లో ప్రభాస్ స్పిరిట్ vs సల్మాన్ ఖాన్ – రాజ్-డీకే సినిమా పోటీ ఒకవేళ నిజమైతే ఇది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత పెద్ద క్లాష్గా నిలిచే అవకాశం ఉంది. -
ధనుశ్తో పెళ్లి రూమర్స్.. మృణాల్ ఠాకూర్ పోస్ట్ వైరల్..!
ఇటీవల కొద్దికాలంగా మృణాల్ ఠాకూర్ పెళ్లి రూమర్స్ తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో చాలా సార్లు వీరిద్దరు ఈవెంట్స్లో కనిపించడంతో త్వరలోనే వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారని వార్తలొచ్చాయి. వచ్చేనెల ఫిబ్రవరిలోనే వీరి పెళ్లి అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే వీటిపై ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు.అయితే తనపై పెళ్లి రూమర్స్ వస్తున్న వేళ సీతారామం బ్యూటీ ఫుల్గా చిల్ అవుతోంది. వీటిని అస్సలు పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తోంది. అయితే ఆమె సన్నిహితుల్లో ప్రస్తుతం ఆమైపై వస్తున్న పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. ఇలాంటి సమయంలో ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. మృణాల్ సముద్రంలో విహరిస్తూ చిల్ అవుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.కాగా.. గతేడాది మృణాల్, ధనుశ్లపై ఆగస్టు 2025లో మొదటిసారి డేటింగ్ రూమర్స్ వినిపించాయి. ఆ సమయంలో చిత్రం 'సన్ ఆఫ్ సర్దార్ 2' ప్రీమియర్లో వారిద్దరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. అది కాస్తా నెట్టింట వైరల్ కావడం.. అంతకు ముందు, మృణాల్ ధనుశ్ ప్రాజెక్ట్ 'తేరే ఇష్క్ మే' ముగింపు పార్టీలో కనిపించడంతో వీరిద్దరి రిలేషన్పై ఊహగానాలు మొదలయ్యాయి. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
బ్రెయిన్ స్ట్రోక్.. మూతి వంకర.. అవే చివరి క్షణాలనుకున్నా!
రెండేళ్ల క్రితం చావును దగ్గరి నుంచి చూశానంటోంది మలయాళ నటి, దర్శకురాలు, యాంకర్ రంజిని మీనన్. లైఫ్ సజావుగా సాగుతున్న సమయంలో స్ట్రోక్ వచ్చిందంటూ ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. 2024 నవంబర్ 18.. ఎర్నాకుళంలోని టీడీఎమ్ హాల్లో నేను మాట్లాడాల్సి ఉంది. అయితే స్పీచ్ ఇవ్వడానికి వెళ్లేముందు నా భర్త రాజగోపాల్తో కలిసి కాఫీ తాగాలనుకున్నాను. మూతి వంకరకానీ కాఫీ తాగుతుంటే కిందపడుతోంది. నా మాటలు కూడా వంకరపోతున్నాయి. అది చూసి నా కొడుకు ఆటపట్టిస్తుంటే లైట్ తీసుకున్నాను. నా భర్త నన్ను గమనించి హాస్పిటల్కు వెళ్దామన్నాడు. లేదు, ఈవెంట్కు అర్జంట్గా వెళ్లాలని చెప్పాను. ఫోన్లో టైప్ చేయడానికి కూడా నా శరీరం సహకరించలేదు. తీరా హాల్కు వెళ్లేసరికి నా పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. బ్రెయిన్ స్ట్రోక్తో పాటు గుండెపోటునా మాట పూర్తిగా మారిపోయింది. అది గమనించి చక్కెర కలిపిన నీళ్లు ఇచ్చారు. అది తాగగానే హఠాత్తుగా కింద పడిపోయాను. ఆస్పత్రికి తీసుకెళ్లగా నాకు బ్రెయిన్ స్ట్రోక్తో పాటు గుండెపోటు వచ్చిందన్నారు. నా మెదడులో ఒకచోట రక్తం గడ్డకట్టింది. దానివల్ల కుడివైపు శరీరం బలహీనంగా మారిపోయింది. కొన్ని జ్ఞాపకాలు చెదిరిపోయాయి. ఇక అవే నా చివరి క్షణాలనుకున్నాను. ఐసీయూలో కొన్నిరోజులపాటు ఉంచారు. ఐసీయూలో ఒక్కరోజు ఉన్నా సరే అది మనకు జీవితమంటే ఏంటో నేర్పిస్తుంది.మళ్లీ నడక నేర్చుకున్నా..నాకు జ్ఞాపకశక్తి ఉందా? కోల్పోయానా? అని తెలుసుకునేందుకు లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం చదివేవాన్ని. నాలుగురోజులకు నన్ను డిశ్చార్జ్ చేశారు. ఐదో రోజు వీల్చైర్లోనే టీడీఎమ్ హాల్కు వెళ్లాను. తర్వాత ఆయుర్వేద ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాను. అక్కడే మళ్లీ నడక నేర్చుకున్నాను. మామూలు మనిషినయ్యాను. మన గురించి మనం పట్టించుకోకుండా పరుగులు పెట్టడం ఎంత తప్పో అప్పుడు నాకర్థమైంది అని రంజిని చెప్పుకొచ్చింది.చదవండి: నన్ను తిడుతూ సినిమా మధ్యలో వెళ్లిపోతారు: గుణశేఖర్ -
ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి: రెహమాన్పై కంగనా ఫైర్
లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన మతపర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. తన మతం వల్లే ఎనిమిదేళ్లుగా అవకాశాలు రాలేదంటూ ఆయన చేసిన కామెంట్స్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో రెహమాన్ను తీవ్రంగా దుయ్యబట్టింది హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్.మీలాంటి మనిషిని చూడలేఈ మేరకు కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఓ నోట్ షేర్ చేసింది. ప్రియమైన ఏర్ రెహమాన్.. నేను ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్నందుకు ఇండస్ట్రీలో నాపై ఎంతో వివక్ష చూపించారు. కానీ, మీకంటే ఎక్కువ పక్షపాతం, ద్వేషం చూపించిన వ్యక్తిని నేనింతవరకు చూడలేదు. నేను దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సినిమాకు సంగీతం అందించమని కోరేందుకు మిమ్మల్ని సంప్రదించాలని ప్రయత్నించాను. కనీసం కథ చెప్పే అవకాశం కూడా మీరు ఇవ్వలేదు. ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయినా సినిమా ఒక ప్రొపగాండా అన్న భావనతో మీరు దానికి దూరంగా ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? ఎమర్జెన్సీ సినిమాను విమర్శకులు కూడా మెచ్చుకున్నారు. ప్రతిపక్ష నాయకులు కూడా నన్ను అభినందిస్తూ లేఖలు పంపారు. కానీ మీకు మాత్రం ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి అని మండిపడింది. ఇదే క్రమంలో ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాపై కూడా కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది.చీరలో వెళ్లేందుకు నోతన బ్రాండ్ ప్రమోషన్స్ కోసం నన్ను వాడుకుంది. కానీ, ఓ రోజు అయోధ్య రామజన్మభూమికి వెళ్లేటప్పుడు మాత్రం తన చీర ఇచ్చేందుకు మసాబా నిరాకరించింది. అప్పుడు అవమానభారంతో కారులోనే ఏడ్చేశాను. ఓపక్క వీళ్లే ఇలా చేస్తుంటే ఏఆర్ రెహమాన్ మాత్రం మొసలి కన్నీళ్లు కారుస్తున్నాడు అని కంగనా మండిపడింది.చదవండి: ఒక్కడు మూవీలో ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో తెలుసా? -
మార్చి రిలీజ్లపై సందేహాలు.. ఏవి వస్తాయి? ఏవి వాయిదా?
సినీ పరిశ్రమలో ప్రస్తుతం పెద్ద చర్చగా మారింది మార్చి నెల రిలీజ్లు. ఇప్పటికే ప్రకటించిన సినిమాలు పెద్ది, పారడైజ్, దురంధర్ 2 – నిజంగా ఆ టైమ్లో వస్తాయా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. నాని హీరోగా వస్తున్న పారడైజ్ సినిమాకు ఇంకా చాలా వర్క్ మిగిలి ఉంది. అందువల్ల మార్చిలో రిలీజ్ అవ్వడం కష్టమేనని టాక్ వినిపిస్తోంది. పెద్ది సినిమాకు ఇంకా ముప్పై రోజుల షూట్ మిగిలి ఉంది. సంక్రాంతి తర్వాత నాన్స్టాప్గా షూట్ చేసినా, రిలీజ్కు కావాల్సిన పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ టైమ్ ఒక్క నెలలో పూర్తవడం కష్టమే. కానీ ఇటీవల రిలీజ్ చేసిన రామ్ చరణ్ పోస్టర్లలో మాత్ర మార్చి నెల రిలీజ్ అంటూ ప్రకటించారు. చూడాలి ఆ టైమ్కు పెద్ది రిలీజ్ అవుతుంతో లేదో. ఇక ఇటీవలే రిలీజ్ డేట్ ప్రకటించిన దురంధర్ 2 మాత్రం బాలీవుడ్ స్టైల్లో డేట్ ఫిక్స్ చేస్తే ఎక్కువగా వాయిదా లేకుండా వస్తుందని అంచనా. అయితే మార్చి నెల ఎగ్జామ్స్ సీజన్. దాంతో ఆ టైమ్లో రిలీజ్ చేస్తారా.. లేదా అనే సందేహం ఉంది. దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కిస్తున్న ప్రభాస్ సినిమా 2027 మార్చికి ప్లాన్ చేశారు. ఇది పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు కలిగిస్తోంది. రాజమౌళి వారణాసి ప్రాజెక్ట్ కూడా అదే టైమ్లో వస్తుందని టాక్ ఉంది. కానీ అధికారిక డేట్ మాత్రం ఇంకా రాలేదు. సంక్రాంతి రిలీజ్ల మాదిరిగానే ప్రీ సమ్మర్ రిలీజ్లు కూడా ఇప్పుడు మంచి ఆప్షన్గా మారుతున్నాయి. ఎగ్జామ్స్ సీజన్ ఉన్నా, పెద్ద సినిమాలు వేసవి హాలిడేలకు దగ్గరగా రిలీజ్ అవ్వడం వల్ల బాక్సాఫీస్లో మంచి కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి మార్చి 2026లో ప్రకటించిన సినిమాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ 2027 మార్చి మాత్రం పాన్ ఇండియా లెవెల్లో భారీ సినిమాలతో హాట్గా మారనుంది. -
ధనుష్తో మృణాల్ ఠాకూర్ పెళ్లి? అసలు నిజమిదే!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ రూమర్ తెగ వైరలవుతోంది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇది చూసిన అభిమానులు ఏంటి.. నిజమేనా? అని ఆశ్చర్యపోతున్నారు.ఇంత సడన్గా పెళ్లేంటి?అయితే ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. వచ్చే నెలలో మృణాల్ పెళ్లి అంటూ వస్తున్న వార్తలు ఉట్టి రూమర్సేనని హీరోయిన్ టీమ్ కొట్టిపారేసింది. ఫిబ్రవరిలో ఆమె సినిమా రిలీజ్ ఉంది, మార్చిలో మరో తెలుగు మూవీ వస్తోంది.. సినిమాలతో అంత బిజీగా ఉంటే ఇప్పుడింత సడన్గా పెళ్లెందుకు చేసుకుంటుందని ఆమె టీమ్ తిరిగి ప్రశ్నించింది. తనకసలు ఇప్పట్లో వివాహం చేసుకోవాలన్న ఆలోచనే లేదని, అనవసరంగా దీన్ని ఎవరో సృష్టించారని చెప్తోంది. దీంతో మృణాల్ పెళ్లి రూమర్స్కు ప్రస్తుతానికి ఫుల్స్టాప్ పడ్డట్లే కనిపిస్తోంది.సినిమాసినిమాల విషయానికి వస్తే.. ధనుష్ చివరగా తేరే ఇష్క్ మే మూవీతో పలకరించాడు. బాక్సాఫీస్ వద్ద రూ.160 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సూపర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం కార మూవీ చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ చివరగా సన్ ఆఫ్ సర్దార్ మూవీతో పలకరించింది. ప్రస్తుతం హిందీలో మూడు సినిమాలు చేస్తోంది. తెలుగులో హీరోయిన్గా నటించిన డెకాయిట్ మార్చిలో విడుదల కానుంది. అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ కథానాయికగా యాక్ట్ చేస్తోంది.చదవండి: నావల్లే డబ్బు పోయిందని ఇంతవరకు.. :శర్వానంద్ -
కోలీవుడ్ స్టార్స్ సంక్రాంతి సెలబ్రేషన్స్
సంక్రాంతి వచ్చిందంటే ఆనందాల సందళ్లు తెచ్చినట్లే. ప్రతి ఇంటా సంబరాలు వెల్లి విరుస్తాయి. పేద ,గొప్ప అన్న తేడా లేకుండా తమకు తోచిన విధంగా అందరూ సంక్రాంతి పండగను జరుపుకుంటారు. రంగవళ్లుల లోగిళ్లు, పిండివంటల ఘుమఘుమలు, ఆత్మీయుల నవ్వుల పలకరింతలు, అనుబంధాలు, అనురాగాలతో, సంతోషాలతో ఆనందంగా గడుపుతారు. పొంగల్ వేడుకపల్లెటూరల్లో అయితే ఈ వేడుకల మోత మోగుతుంది. కోడిపందేలు, ఎద్దుల పోటీలు, ఇంకా కాయ్ రాజా కాయ్ అంటూ అనేక క్రీడలు ఆడతారు. సినిమా వాళ్ల విషయానికి వస్తే సంక్రాంతి పండగను కుటుంబ సభ్యులతో ఆడంబరంగా, ఆనందంగా జరుపుకుంటారు. అదే విధంగా కోలీవుడ్లో మన తారలు పొంగల్ వేడుకను భక్తిశ్రద్ధలతో వేడుకగా సెలబ్రేట్ చేసుకుంటారు.ఫ్యామిలీతో రజనీకాంత్అలా రజనీకాంత్ నుంచి దర్శకుడు మారిసెల్వరాజ్ వరకు పలువురు పొంగల్ సంబరాలు చేసుకున్నారు. రజనీకాంత్ తన కుటుంబ సభ్యులతో పొంగల్ వేడుకలను జరుపుకున్నారు. అనంతరం తనను కలవడానికి వచ్చిన అభిమానులను సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి వారి కళ్లలో ఆనందాన్ని నింపారు. ఈ పండగ అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.సెలబ్రిటీల సంక్రాంతిహీరోయిన్ నయనతార ఈ పొంగల్ వేడుకలను తన భర్త ,దర్శకుడు విఘ్నేశ్ శివన్, ఇద్దరు పిల్లలతో కలిసి విశేషంగా జరుపుకున్నారు. పిండివంటలు, రకరకాల తీపి పదార్థాలు, పళ్లు, చెరుకు గడలు ఏర్పాటు చేసి, పాలు పొంగించారు. హీరో కార్తీ కూడా ఇంటి ముంగిట్లో పాలు పొంగించి పొంగల్ను వేడుకగా నిర్వహించారు. అదేవిధంగా శివకార్తికేయన్ తన కుటుంబ సభ్యుల సమేతంగా పొంగల్ వేడుకను జరుపుకున్నారు. నటుడు అరుణ్ విజయ్, నటుడు అశోక్ సెల్వన్, కీర్తి పాండియన్ దంపతులు, దర్శకుడు మారిసెల్వరాజ్ తదితర సినీ ప్రముఖులు సంక్రాంతిని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. Thalaivar waiting to eat Pongal just like us @rajinikanth 😃😃❤️✨️#SuperstarRajinikanth #Rajinikanth #Jailer2 #Thalaivar173 pic.twitter.com/8ARzjZPmXW— Achilles (@Searching4ligh1) January 15, 2026இனிய பொங்கல் திருநாள் நல்வாழ்த்துக்கள் 🍚🌾🎋 తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు #MegaBlockBusterPongal pic.twitter.com/9aHE3KdODI— Nayanthara✨ (@NayantharaU) January 15, 2026 View this post on Instagram A post shared by Sivakarthikeyan Doss (@sivakarthikeyan) -
ధనుష్ కొత్త సినిమా టైటిల్ ఇదే..
కుబేరా, ఇడ్లీకడై, ఇష్క్ తేరే మే వంటి విజయవంతమైన చిత్రాల తరువాత ధనుష్ నటిస్తున్న తాజా చిత్రానికి పొంగల్ పండగ సందర్భంగా టైటిల్ వెల్లడించారు. ఈయన నటిస్తున్న 54వ చిత్రం ఇది. దీనికి కర అనే టైటిల్ను అధికారికంగా ప్రకటించారు. దీనితో పాటు ఫస్ట్లుక్ పోస్టర్ను, ఓ వీడియోను విడుదల చేశారు. మమితా బైజు హీరోయిన్గా నటిస్తున్న నటిస్తున్న ఇందులో దర్శకుడు కేఎస్ రవికుమార్, జయరామ్, సురాజ్ వెంజురముడు, కరుణాస్, పృథ్వీ పాండిరాజన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ అధినేత ఐసరి గణేశ్.. థింక్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేష్ రాజా కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దీనికి జీవీ ప్రకాష్కుమార్ సంగీతాన్ని, తేనీ ఈశ్వర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా కర చిత్రంలో ధనుష్ పేరు కరసామి అని వీడియోలో పేర్కొన్నారు. ధనుష్ను మాస్ గెటప్లో చూపించారు. ఈ మూవీని సమ్మర్ స్పెషల్గా తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొంది. -
యాక్షన్ మూవీ 'కటాలన్' టీజర్ రిలీజ్
మలయాళ నటుడు ఆంటోని వర్గీస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కటాలన్. దుషారా విజయన్ కథానాయిక. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్లో.. మలయాళ మూవీ చరిత్రలో మునుపెన్నడూ చూడని మాస్ అవతార్లో ఆంటోనీ వర్గీస్ను పరిచయం చేశారు. శుక్రవారం (జనవరి 16న) ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.నూతన దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం వహించగా షరీఫ్ మహమ్మద్ నిర్మించాడు. ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలను థాయ్లాండ్లో, ఓంగ్-బాక్ సిరీస్తో సహా అంతర్జాతీయ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రసిద్ధి చెందిన ప్రపంచ ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్ కేచా ఖంఫక్డీ, అతని బృందం ఆధ్వర్యంలో చిత్రీకరించారు. ఓంగ్-బాక్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన "పాంగ్" అనే ఏనుగు కూడా ఈ సినిమాలో కనిపించనుంది. అజనీష్ సంగీతం అందించిన ఈ మూవీలో సునీల్, కబీర్ దుహాన్ సింగ్, రాజ్ తిరందాసు, పార్థ్ తివారి తదితరులు కీలక పాత్రల్లో నటింనున్నారు. కటాలన్ మూవీ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో మే 14న విడుదల కానుంది. -
మల్టీస్టారర్ మూవీ.. నెలరోజుల్లోనే ఓటీటీలోకి..
కన్నడ స్టార్ హీరోలు శివరాజ్కుమార్, ఉపేంద్ర, రాజ్.బి శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 45. సంగీత దర్శకుడు అర్జున్ జన్య దర్శకత్వం వహించిన ఈ మూవీ కన్నడలో డిసెంబర్ 25న విడుదలైంది. అయితే తెలుగులో మాత్రం కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ చిత్రం నెలరోజుల్లోనే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. జీ5లో జనవరి 23న రిలీజ్ అవుతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.కథవినయ్ (రాజ్. బి శెట్టి) ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఓ రోజు అనుకోకుండా అతడి బైక్ ఢీ కొట్టి రోసీ అనే కుక్క చనిపోతుంది. ఆ కుక్క రాయప్ప(ఉపేంద్ర) అనే డాన్కు చెందినది. ప్రాణంగా చూసుకునే కుక్క చావుకు కారణమైన వినయ్ను 45 రోజుల్లో చంపాలనుకుంటాడు. అప్పటినుంచి అతడి జీవితం అయోమయంగా మారుతుంది. ఆ సమయంలో వినయ్ జీవితంలోకి శివ (శివ రాజ్కుమార్) వస్తాడు. అసలు ఈ శివ ఎవరు? రాయప్ప వినయ్ను చంపేశాడా? చివరకు ఏం జరిగిందనేది తెలియాలంటే 45 సినిమాను ఓటీటీలో చూడాల్సిందే! 45 The Biggest Movie Of 202545 Streaming On Jan 23rd In Kannada Zee5#45TheMovie #KannadaZEE5 #45OnZEE5 #ZEE5Cinemas #ZEE5 pic.twitter.com/uUFZWCE04Y— ZEE5 Kannada (@ZEE5Kannada) January 16, 2026 చదవండి: ది రాజాసాబ్ కలెక్షన్స్.. ఫస్ట్ వీక్ ఎంతంటే? -
టాక్సిక్ టాక్స్: ట్రైలర్తో వైరల్ అయిన లేడీ డైరెక్టర్
‘కేజీఎఫ్’ వంటి చారిత్రక విజయం తర్వాత రాకింగ్ స్టార్, దక్షిణాది క్రేజీ హీరో యష్ నటించిన ‘టాక్సిక్’ ట్రైలర్ తోనే సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. హీరో యష్ తన స్వంత బ్యానర్ మాన్స్టర్ క్రియేషన్స్ ద్వారా సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్న పీరియాడికల్ గ్యాంగ్స్టర్ మూవీ టాక్సిక్. ఇందులో యష్ అత్యంత క్రూరమైన గ్యాంగ్ లీడర్ ‘రాయా’ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ‘ది టీజ్’ తోనే ఈ మూవీ భారీ అంచనాలు పెంచి సంచలనాలు కూడా రేపింది. కెమెరా టేకింగ్ యాక్టింగ్ వగైరాలన్నీ సినీ సాంకేతిక నిపుణుల మధ్య చర్చనీయాంశంగా మారి పలు ప్రశంసలు కూడా అందుకుంటుంటే... మరోవైపు నీలిచిత్రాల స్థాయిలో ఉన్న సన్నివేశం సంప్రదాయవాదుల కన్నెర్రకు కారణమైంది. ఈ నేపధ్యంలోనే ఆ సినిమాకు దర్శకత్వం వహించింది ఎవరు?తన నేపధ్యం ఏమిటి? అంటూ కన్నడేతర భాషా ప్రేక్షకుల్లో చర్చ కూడా జోరుగా సాగుతోంది. మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే షాకింగ్ సీన్లను జోడిస్తూ రూపొంది త్వరలోనే వెండితెరపై సందడి చేయబోతున్న ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్–అప్స్’.చిత్రం∙దర్శకురాలి పేరు గీతూ మోహన్దాస్.యాక్షన్ టూ డైరెక్షన్...ఆమె ఒక సెన్సేషన్...పాన్ ఇండియా యాక్షన్ చిత్రాలకు అలవాటైన దర్శకుల నుంచి కాకుండా, యష్ పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు.దానికి తగినట్టుగా ఆయనకు కనిపించారు దర్శకురాలు గీతూ మోహన్దాస్. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించి, తరువాత ఆస్కార్ స్థాయికి ఎదిగిన ప్రతిభావంతురాలైన దర్శకురాలిగా పేరొందారు. సాధారణ వాణిజ్య చిత్రాలకు పూర్తి భిన్నం గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘లైయర్స్ డైస్’ (2013). ప్రముఖ నటీనటులు నవాజుద్దీన్ సిద్ధిఖీ, గీతాంజలి థాపాలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, హిమాలయాల్లోని ఓ గ్రామం నుంచి ఢిల్లీ వరకు తన భర్త కోసం ఒక మహిళ చేసే ప్రమాదకర ప్రయాణాన్ని భావోద్వేగ సహితంగా చూపిస్తుంది.ఈ చిత్రం సండాన్స్ రోటర్డామ్ వంటి అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ ప్రశంసలు అందుకోవడంతో పాటు 87వ ఆస్కార్ అవార్డ్స్కు భారతదేశం తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైన ఘనత దక్కించుకుంది. అంతేకాదు 61వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈ చిత్రం ఉత్తమనటి, ఉత్తమ సినిమాటోగ్రఫీలకు గాను రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి గీతూ మోహందాస్ భర్త కావడం. ఆయన అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’ కు తన రఫ్ అండ్ రియలిస్టిక్ విజువల్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చి విజువల్ మాస్టర్గా పేరు తెచ్చుకున్నారు. గీతూ మోహన్దాస్ వైవిధ్యభరిత లైన్స్కు తెరపై జీవం పోసే లెన్స్ రాజీవ్ రవి అని చెప్పొచ్చు. అలాగే దేవ్ డి, చాందినీ బార్, ఉడ్తా పంజాబ్ వంటి వైవిధ్యభరిత సినిమాలు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి.‘టాక్సిక్’ కోసం గీతూనే ఎందుకు?‘కేజీఎఫ్’ లాంటి మాస్ బ్లాక్బస్టర్ తర్వాత, యష్ గీతూ మోహన్దాస్ లాంటి ఆలోచనాత్మక చిత్రాలకు పేరొందిన దర్శకురాలిని ఎంపిక చేయడం ఇండస్ట్రీలో ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ ఆమె రెండో చిత్రం ‘మూతోన్’ (సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్లోబల్ ఫిల్మ్ మేకింగ్ అవార్డు విజేత) చూసినవారికి ఈ నిర్ణయం ఎంత సరైనదో అర్థమవుతుంది. గీతూ కథనాల్లో ఉండే డార్క్ రియలిజం, అంతర్జాతీయ టచ్ – యశ్ మాస్ ఇమేజ్తో కలిసినప్పుడు, ఒక కొత్త తరహా భారతీయ బ్లాక్బస్టర్ రూపుదిద్దుకోబోతోందన్న అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రంలో యష్తో పాటు నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏదేమైనా... భారతీయ చిత్రాల్లో కామసూత్ర తీసిన మీరానాయర్ ఎంత వివాదాస్పదం అయ్యారో తెలిసిందే. అయితే సబ్జెక్ట్ పరంగా అవసరం కాబట్టి తీశానంటూ ఆమె సమర్ధవంతంగా తిప్పికొట్టగలిగారు. మరి కేవలం ఒకే ఒక్క టీజర్ ద్వారా సంప్రదాయవాదుల దాడులతో పాటుగా న్యాయ వివాదాలు కూడా ఎదుర్కుంటున్న గీతూ మోహన్...పూర్తి సినిమా విడుదల తర్వాత ఏవేం వివాదాలు ఎదుర్కోనున్నారో వేచి చూడాలి. -
మలయాళ యాక్షన్ మూవీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది
మలయాళంలో తెరకెక్కించిన యాక్షన్ సినిమా చతా పచ్చ.. ది రింగ్ ఆఫ్ రౌడీస్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, విశాక్ నాయర్, ఇషాన్ షౌకత్ కీలక పాత్రల్లో నటించారు. అద్వైత్ నాయర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 22న థియేటర్లో సందడి చేయనుంది.ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తేనే రెజ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాస్ట్యూమ్ రెజ్లింగ్ అనే కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ట్రైలర్లో రెజ్లింగ్, కుస్తీ ఫైటింగ్ సీన్స్ ఈ మూవీపై ఆసక్తిని మరింత పెంచేస్తున్నాయి. ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. -
'గిర గిర గింగిరాగిరే.. తుర్రు తుర్రు తోకపిట్టవే'.. ఫుల్ వీడియో సాంగ్ చూశారా?
శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పీరియాడికల్ యాక్షన్ మూవీ ఛాంపియన్. గతేడాది క్రిస్మస్ కానుకగా రిలీజై సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. తెలంగాణలోని బైరాన్ పల్లి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఛాంపియన్లో తన నటనతో రోషన్ మంచి మార్కులు కొట్టేశారు.బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన ఈ మూవీలో ఓ సాంగ్ సినీ అభిమానులను ఊపేసింది. గిర గిర గింగిరాగిరే అంటూ కుర్రకారును ఊర్రూతలూగించింది. రామ్ మిరియాల ఆలపించిన ఈ పాట సోషల్ మీడియాలో ఊపేసింది. తాజాగా ఈ సూపర్ హిట్ ఫుల్ వీడియో సాంగ్ను సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. ఈ సాంగ్లో రోషన్- అనస్వర రాజన్ తమ డ్యాన్స్తో అదరగొట్టేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఫుల్ వీడియో సాంగ్ను మీరు కూడా చూసేయండి.కాగా.. ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. ఈ మూవీని భారీ బడ్జెట్తో ప్రియాంక దత్, జీకే మోహన్, జెమిని కిరణ్ నిర్మించారు. ఇందులో సంతోష్ ప్రతాప్, అవంతిక, కృతి కంజ్ సింగ్ రాథోడ్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా రిలీజైన మూడురోజుల్లోనే రూ.9 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. -
సూపర్ హిట్ మూవీ సీక్వెల్... ఆసక్తిగా ప్రోమో
ఆది హీరోగా వచ్చిన గతంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం మరగద నానయం. ఈ సినిమాకు ఏఆర్కే శరవణ్ దర్శకత్వం వహించారు. 2017లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీని తెలుగులో మరకతమణి పేరుతో రిలీజ్ చేశారు.తాజాగా ఈ మూవీకి సీక్వెల్ను ప్రకటించారు. సంక్రాంతి కానుకగా ఈ విషయాన్ని రివీల్ చేశారు. ఈ కొత్త మూవీకి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. పార్ట్-1లో నిక్కీ గల్రానీ హీరోయిన్గా నటించగా..ఇప్పుడు మాత్రం ప్రియా భవానీ శంకర్ కనిపించనుంది. ఈ చిత్రంలో సత్యరాజ్, నిక్కీ గల్రానీ, మునిష్కాంత్, ఆనందరాజ్, డానీ. అరుణ్రాజా కామరాజ్, మురుగానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
త్వరలో ధనుశ్ -మృణాల్ పెళ్లి.. తేదీ కూడా ఫిక్స్..!
సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ ఎంట్రీతోనే సూపర్ హిట్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం అడివి శేష్ హీరోగా వస్తోన్న డకాయిట్ చిత్రంలో మెప్పించనుంది. ఈ సినిమా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక సినీ కెరీర్ సంగతి పక్కన పెడితే.. మృణాల్ వ్యక్తిగత జీవితంపై గత కొన్ని నెలలుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఆమె కోలీవుడ్ స్టార్ ధనుశ్తో డేటింగ్లో ఉన్నారని వార్తలొచ్చాయి. అయితే వీటిపై ఇద్దరు కూడా స్పందించలేదు. ఆ తర్వాత మృణాల్ ధనుష్ సిస్టర్స్ డాక్టర్ కార్తీక కృష్ణమూర్తి, విమల గీతలను ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావడంతో ఆ రూమర్స్కు మరింత బలం చేకూరింది. అంతేకాకుండా వారిద్దరు కూడా మృణాల్ను ఫాలో అయ్యారు. ఇక ఈ జంట డేటింగ్ కన్ఫామ్ అని చాలామంది ఫిక్సయిపోయారు.తాజాగా ఈ జంటపై మరో రూమర్ నెట్టింట వైరలవుతోంది. వీరిద్దరు త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని లేటేస్ట్ టాక్. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం వచ్చేనెల 14న మృణాల్- ధనుశ్ ఒక్కటి కాబోతున్నారని సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే ఈ పెళ్లికి కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు కూడా తమ పర్సనల్ లైఫ్లో ఎల్లప్పుడూ గోప్యతను పాటిస్తారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్తలపై మృణాల్ ఠాకూర్ కానీ, ధనుశ్ స్పందించలేదు. ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తేనే ఈ రూమర్స్కు చెక్ పడనుంది.కాగా.. గతేడాది ఆగష్టు 1న మృణాల్ పుట్టినరోజు వేడుకలో ధనుశ్ పాల్గొన్నారు. పార్టీ వీడియోలో ధనుష్ ఆమె చేతిని పట్టుకుని ఆత్మీయంగా మాట్లాడుతున్న దృశ్యం ఒకటి వైరలైంది. ఆపై మృణాల్ ఠాకూర్ నటించిన కొత్త సినిమా 'సన్ ఆఫ్ సర్దార్ 2' స్పెషల్ స్క్రీనింగ్కు ధనుష్ ప్రత్యేకంగా ముంబయికి వెళ్లారు. స్క్రీనింగ్ సమయంలో ధనుష్ చెవిలో మృణాల్ ఏదో గుసగుసలాడటం కనిపించింది. అంతకుముందు ధనుశ్ మూవీ 'తేరే ఇష్క్ మే' పార్టీకి మృణాల్ కూడా హాజరయ్యారు. అక్కడ కూడా వీరిద్దరూ కలిసి కనిపించారు. అప్పటి నుంచి వారిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. -
ఫస్ట్ సినిమా హీరోతో అలనాటి హీరోయిన్.. 37 ఏళ్లకు!
ముఖానికి ఇంత మేకప్ వేసుకున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? ఒకప్పటి అందాల తార కనక. తమిళ సినీ ప్రపంచంలో అగ్ర కథానాయికగా వెలుగొందిన దేవిక కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తమిళ, మలయాళ భాషల్లో టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత సడన్గా వెండితెరపై కనిపించకుండా పోయింది. వివాదాలతో వార్తల్లో..దాదాపు రెండున్నర దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆ మధ్యలో కనకకు క్యాన్సర్ అని, చనిపోయిందని రూమర్స్ రాగా అవన్నీ ఉట్టివే అని తేలిపోయాయి. తండ్రితో వివాదం కారణంగానూ వార్తల్లో నిలిచింది. కనక మానసిక పరిస్థితి సరిగా లేదని తండ్రి కూడా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. కనక చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు దేవిక, దర్శకుడు దేవదాస్ విడిపోయారు. ఫస్ట్ సినిమా హీరోతల్లీకూతురు ఒంటరిగా ఉండేవారు. తల్లి చనిపోయాక కనక మరింత ఒంటరితనం అనుభవించింది. ఇల్లు దాటి బయటకు రాకుండా లోపల తాళం వేసుకుని జీవించేది. వివాదాలతోనే జీవితాన్ని గడిపిన కనక తాజాగా తన మొదటి హీరోను కలిసింది. కరకట్టక్కరన్ అనే తమిళ చిత్రం ద్వారా కనక హీరోయిన్గా వెండితెరకు పరిచయమైంది. రామరాజన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏడాదిపాటు విజయవంతంగా ఆడింది. 37 ఏళ్ల తర్వాత కలయికతాజాగా హీరో రామరాజన్ను కలిసింది కనక. వీరివెంట మ్యూజిక్ డైరెక్టర్ దరన్ కుమార్ కూడా ఉన్నాడు. 37 ఏళ్ల తర్వాత కలయిక అంటూ ఈ రీయూనియన్ ఫోటోను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు వాటే సర్ప్రైజ్ అని ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో కనకకి మేకప్ కొంచెం ఎక్కువైందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. కనక.. తెలుగులో బ్రహ్మర్షి విశ్వామిత్ర, వాలు జడ తోలు బెల్టు సినిమాలు చేసింది. View this post on Instagram A post shared by Dharan Kumar (@dharankumar_c)చదవండి: జైలర్ 2లో యాక్ట్ చేశా.. రజనీకాంత్ కోసమే.. -
సుప్రీం కోర్టులో విజయ్ సినిమాకు భారీ ఎదురు దెబ్బ
తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్ విజయ్ నటించిన చివరి సినిమా ‘జన నాయగన్’(Jana nayagan) కి సుప్రీం కోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది. సెన్సార్ సర్టిఫికెట్ జారీకి స్టే విధించిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ సినిమా నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్ని విచారించకుండానే హైకోర్టు డివిజన్ బెంచ్కు తిరిగి పంపింది. ఈ నెల 20వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని మద్రాసు హైకోర్టుకు సూచించింది. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ బోర్డ్ (CBFC) సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో ఆలస్యమైంది. సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో, నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సినిమాకు వెంటనే సెన్సార్ సర్టిఫికెట్ను ఇవ్వాల్సిందిగా 9వ తేదీన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం సీబీఎఫ్సీని ఆదేశించింది. అనంతరం, కొద్ది గంటల్లోనే సీబీఎఫ్సీ వినతిపై స్పందించిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ తీర్పుపై మధ్యంతర స్టే విధించింది. దీంతో చిత్ర నిర్మాతలు ఈ నెల 12న సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. అయితే, సుప్రీం కోర్టు ఈ పిటిషన్ను ఎంటర్టైన్ చేయకుండా, హైకోర్టు డివిజన్ బెంచ్కు తిరిగి పంపింది. హైకోర్టు జనవరి 20లోపు ఫైనల్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. -
నేరుగా ఓటీటీలో విడుదలైన అనంత.. ఎక్కడంటే?
భక్తిరస కథాచిత్రాలు అరుదుగా ఉంటాయి. ఈ మధ్య విడుదలైన యానిమేషన్ మూవీ 'మహావతార్ నరసింహ' దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా అనంత అనే భక్తిరస కథాచిత్రం సంక్రాంతి సందర్భంగా మంగళవారం నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతోంది. ఇది పుట్టపర్తి సాయిబాబా దైవలీలల గురించి చెప్పే సినిమా.అనంత సినిమాఇంతకుముందు బాషా, అన్నామలై వంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన సురేశ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాను గిరీశ్ కృష్ణమూర్తి నిర్మించారు. జగపతిబాబు, సుహాసిని, వైజీ.మహేంద్రన్, నిగల్గళ్ రవి, తలైవాసల్ విజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దేవా సంగీతాన్ని, గీత రచయిత స్నేషన్ మాటలు, పాటలు అందించారు.జీవిత చరిత్ర కాదుఇది సాయిబాబా జీవిత చరిత్ర కాదని, ఆయన మహిమలతో కూడిన భక్తిరస కథా చిత్రం అని దర్శకుడు తెలిపారు. పూర్తి విశ్వాసంతో బాబాను నమ్మితే ఫలితాలెలా ఉంటాయన్నది చెప్పే సినిమాయే అనంత అన్నారు. ఇందులో అందరూ అద్భుతంగా నటించారన్నారు. దేవా సంగీతం సినిమాకు పెద్ద బలం అని తెలిపారు.ఓటీటీలో నేరుగా రిలీజ్సినిమా చూసిన పలువురు ప్రముఖులు థియేటర్లలో విడుదల చేయమని కోరారన్నారు. అయితే ఓటీటీ సంస్థ కమిట్ అవడంతో హాట్స్టార్కు స్ట్రీమింగ్ హక్కులు ఇచ్చామన్నారు. ఈ సినిమా మంగళవారం అంటే జనవరి 13 నుంచి ఓటీటీలో ప్రసారం అవుతోందని, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తోందని దర్శకుడు పేర్కొన్నారు.చదవండి: రజనీకాంత్ కోసమే జైలర్ 2లో నటించా: విజయ్ సేతుపతి -
జైలర్ 2లో యాక్ట్ చేశా.. రజనీకాంత్ కోసమే..
తమిళ స్టార్ విజయ్ సేతుపతి.. హీరోగా, విలన్గా సినిమాలు చేస్తున్నాడు. అవసరమైతే అతిథి పాత్రలో కనిపించేందుకు కూడా సిద్ధమే అంటున్నాడు. తాజాగా ఆయన రజనీకాంత్ జైలర్ 2 మూవీలో యాక్ట్ చేసినట్లు ప్రకటించాడు. ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. జైలర్ 2లో నేను అతిథి పాత్రలో కనిపిస్తాను. నాకు రజనీకాంత్ అంటే ఎంతో ఇష్టం. అలాంటి రోల్స్ చేయనుఇండస్ట్రీలో ఎన్నో దశాబ్దాలుగా సూపర్స్టార్గా రాణిస్తున్నవారి దగ్గరినుంచి నేర్చుకోవడానికి చాలా ఉంది. అలా జైలర్ 2లో ఆయన దగ్గరి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నన్ను చాలామంది విలన్ పాత్రల కోసం సంప్రదిస్తున్నారు. అయితే అవన్నీ రొటీన్గా ఉంటున్నాయి. హీరోను ఎలివేట్ చేసే విలన్ పాత్రలు చేయడం నాకెంతమాత్రమూ ఇష్టం లేదు.మూకీ సినిమాతో..కథను ముందుకు నడిపిస్తూ ప్రేక్షకులకు థ్రిల్ పంచే విలన్ పాత్రల్ని మాత్రమే చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం 'గాంధీ టాక్స్'. మూకీ (మాటలు లేని) సినిమాగా తెరకెక్కిన గాంధీ టాక్స్ జనవరి 30న విడుదలవుతోంది. ఈ మూవీలో అరవింద్ స్వామి, అదితిరావు హైదరి, సిద్దార్థ్ జాదవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కిషోర్ పాండురంగ్ బేలేకర్ దర్శకత్వం వహించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.చదవండి: మహేశ్బాబు గుడ్న్యూస్.. ఆరోజే ఓపెనింగ్ -
హీరో నో రెమ్యునరేషన్.. హీరోయిన్ చేయనంది..
ద్రౌపది 2 మూవీలో నటించేందుకు హీరో రిచర్డ్ రిషి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చిత్ర దర్శకుడు మోహన్ జి పేర్కొన్నారు. ఈయన ఇంతకుముందు దర్శకత్వం వహించిన ద్రౌపది సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో దానికి సీక్వెల్గా ద్రౌపది 2 తెరకెక్కిస్తున్నాడు.ఈ నెలలో రిలీజ్నేతాజీ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత చోళ చక్రవర్తి జీఎం ఫిలిం కార్పొరేషన్ సంస్థతో కలిసి నిర్మించాడు. రక్షణ హీరోయిన్గా నటించిన ఇందులో నట్టి నటరాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 23న విడుదల కానుంది.నెల రోజుల్లో షూటింగ్ పూర్తిఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్మాత చోళ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంచి కథతో సినిమా చేద్దామని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు మోహన్ జి ఈ కథతో వచ్చారన్నాడు. సినిమా షూటింగ్ను 31 రోజుల్లో పూర్తి చేశారని తెలిపాడు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు షూటింగ్ నిర్వహించేవారని పేర్కొన్నాడు.ఆయన లేకపోతే ఈ సినిమా లేదుదర్శకుడు మోహన్ జీ మాట్లాడుతూ.. ఇది పీరియాడికల్ కథా చిత్రం అని చెప్పాడు. ద్రౌపది సినిమాలాగే ఈ మూవీకి కూడా అంతే సిన్సియర్గా పని చేశామన్నాడు. హీరో రిచర్డ్ రిషి లేకపోతే ఈ సినిమా లేదన్నాడు. ఈ సినిమా కోసం ఆయన ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదని వెల్లడించాడు. అంతేకాకుండా గుర్రపు స్వారీ, కత్తి పోరాటాలలో శిక్షణ కోసం ఆయన రోజుకు 16 గంటల చొప్పున ఏడాది పాటు శ్రమించారని గుర్తు చేశారు. బడ్జెట్ దాటిపోయిందిముందు అనుకున్న బడ్జెట్ను దాటిపోయినా సరే కథపై నమ్మకంతో సపోర్ట్ చేసిన నిర్మాతకు కృతజ్ఞతలు తెలిపాడు. ద్రౌపది మొదటి భాగంలో నటించిన హీరోయిన్ సీక్వెల్ చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో 25 మంది హీరోయిన్లను ఆడిషన్ చేసి చివరకు రక్షణను ఎంపిక చేశామన్నాడు. ఆమె చాలా ధైర్యవంతురాలని, మంచి ప్రతిభ ప్రదర్శించారన్నాడు. రక్షణకు మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నాడు. -
రెడ్ డ్రెస్లో అదితిరావు హైదరీ.. బీచ్లో బ్యూటీ హీరోయిన్..!
రెడ్ డ్రెస్లో అదితి రావు హైదరీ అందాలు..సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతోన్న మెహరీన్..చికిరి చికిరి సాంగ్ వైబ్లో టాలీవుడ్ భామ సాహితి..బీచ్లో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర చిల్..ప్రకృతిని ఆస్వాదిస్తోన్న హీరోయిన్ సదా...ఫ్యామిలీతో బాలీవుడ్ భామ బిపాసా బసు చిల్.. View this post on Instagram A post shared by Bipasha Basu (@bipashabasu) View this post on Instagram A post shared by Sadaa | Wild Stories (@sadaa_wildlifephotography) View this post on Instagram A post shared by Nilakhi patra (@__officialnilakhipatra__) View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
సూపర్ హిట్ సిరీస్ మూవీ.. దృశ్యం-3 రిలీజ్ ఎప్పుడంటే?
మలయాళ స్టార్ హీరో మోహన్లాల్ నటించిన దృశ్యం సిరీస్ సినిమాలకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. రెండు పార్ట్స్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మూడో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మలయాళంలో తెరకెక్కించిన ఈ చిత్రాలను తెలుగు, హిందీలోనూ డబ్ చేసి రిలీజ్ చేయగా సూపర్ హిట్గా నిలిచాయి. తెలుగులో వెంకటేశ్, హిందీ అజయ్ దేవగణ్ ఈ చిత్రాల్లో నటించారు.జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వస్తోన్న దృశ్యం-3 రిలీజ్ తేదీని ప్రకటించారు. ఓ వీడియోను షేర్ చేసిన మోహన్లాల్.. ఏప్రిల్ 02న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా.. ఈ సమ్మర్లో సినీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. కాగా.. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరంబవూర్ నిర్మించారు. ఈ మూవీని మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ తెరకెక్కించారు. ఈ సినిమాను మలయాళం, హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తామని గతంలో దర్శకుడు జీతూ జోసెఫ్ చెప్పారు.Years passed. The past didn’t.#Drishyam3 | Worldwide Release | April 2, 2026@jeethu4ever @antonypbvr @KumarMangat @jayantilalgada @AbhishekPathakk #MeenaSagar@aashirvadcine@PanoramaMovies @PenMovies @ram_rampagepix @Rajeshmenon1969 @Abh1navMehrotra @drishyam3movie pic.twitter.com/uqEaPvqMyv— Mohanlal (@Mohanlal) January 14, 2026


