ఆది హీరోగా వచ్చిన గతంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం మరగద నానయం. ఈ సినిమాకు ఏఆర్కే శరవణ్ దర్శకత్వం వహించారు. 2017లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీని తెలుగులో మరకతమణి పేరుతో రిలీజ్ చేశారు.
తాజాగా ఈ మూవీకి సీక్వెల్ను ప్రకటించారు. సంక్రాంతి కానుకగా ఈ విషయాన్ని రివీల్ చేశారు. ఈ కొత్త మూవీకి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. పార్ట్-1లో నిక్కీ గల్రానీ హీరోయిన్గా నటించగా..ఇప్పుడు మాత్రం ప్రియా భవానీ శంకర్ కనిపించనుంది. ఈ చిత్రంలో సత్యరాజ్, నిక్కీ గల్రానీ, మునిష్కాంత్, ఆనందరాజ్, డానీ. అరుణ్రాజా కామరాజ్, మురుగానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు.


