breaking news
Kollywood
-
స్టార్ హీరో రెమ్యునరేషన్ ఎగ్గొట్టిన ప్రముఖ నిర్మాత
తమిళ ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా మరో వివాదంలో చిక్కుకున్నారు. కొన్నిరోజుల క్రితం ఈయన నిర్మించిన కొత్త సినిమా 'వా వాతియర్'.. సరిగ్గా రిలీజ్కి మరికొన్ని గంటలు ఉందనగా కోర్టు ఉత్తర్వులతో నిలిచిపోయింది. దీనికి చేసిన అప్పులు తీర్చకపోవడమే కారణం. అర్జున్ లాల్ సుందర్ దాస్ అనే వ్యక్తికి ఈయన రూ.20 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ సమస్య ఓవైపు ఉండగానే ఇప్పుడు తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ కూడా జ్ఞానవేల్పై చెన్నై కోర్టులో పిటిషన్ వేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. మరి థియేటర్లలో?)శివకార్తికేయన్ హీరోగా జ్ఞానవేల్ నిర్మాతగా 2019లో 'మిస్టర్ లోకల్' అనే సినిమా వచ్చింది. దీనికిగానూ హీరోకి రూ.15 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. కానీ తనకు రూ.11 కోట్లు మాత్రమే ఇచ్చి మిగతా రూ.4 కోట్లు బకాయిలు ఇప్పటివరకు చెల్లించలేదని శివకార్తికేయన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. నిర్మాత.. తనకిచ్చిన పారితోషికంపై టీడీఎస్ చెల్లించకపోవడంతో తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.90 లక్షల మొత్తాన్ని ఐటీ శాఖ కట్ చేసుకుందని పేర్కొన్నాడు.తనకు బాకీ ఉన్న మిగతా రెమ్యునరేషన్ చెల్లించేవరకు జ్ఞానవేల్ నిర్మిస్తున్న సినిమాలు.. విడుదల కాకుండా నిలుపుదల చేయాలని శివకార్తికేయన్, చెన్నై కోర్టుని కోరారు. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్లో చర్చనీయాంశమైంది. ఎందుకంటే జ్ఞానవేల్ రాజా.. హీరోల సూర్య, కార్తీలకు దగ్గర బంధువే. అయితే గతేడాది ఈయన నిర్మించిన తంగలాన్, కంగువ, బడ్డీ, రెబల్ సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫ్లాప్స్ అయ్యాయి. సరే కార్తీ హీరోగా తీసిన సినిమా రిలీజ్ చేద్దామంటే తిరిగివ్వాల్సిన అప్పులు మెడకు చుట్టుకున్నాయి. మరి ఈ విషయంలో జ్ఞానవేల్ ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: పెళ్లిలో తెలుగు స్టార్ హీరో భార్యతో కీర్తి సురేశ్ డ్యాన్స్) -
పదేళ్ల తర్వాత అబ్బాస్ రీఎంట్రీ.. వీడియో చూశారా?
ఇటీవల ఒక్క మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కథానాయకులలో జీవీ ప్రకాశ్ కుమార్ ఒకరని చెప్పవచ్చు. ప్రముఖ సంగీత దర్శకుడిగా రాణిస్తున్న ఈయన ఇప్పటికే శత చిత్రాలకు చేరుకున్నారు. పరాశక్తి జీవీ.ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న 100వ చిత్రం. అదేవిధంగా సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకున్న ఈయన హీరోగానూ నటిస్తున్న విషయం తెలిసిందే. డార్లింగ్, బ్యాచిలర్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించారు. హ్యాపీరాజ్మూవీఅయితే ఇటీవల ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోతున్నాయి. చివరగా ఈయన నటించిన బ్లాక్ మెయిల్ చిత్రం పర్వాలేదు అనిపించుకుంది. తాజాగా హ్యాపీరాజ్మూవీలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ శిష్యుడు ఇళంసెళియన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గౌరీప్రియ హీరోయిన్. ఈ చిత్రంలో ప్రేమదేశం హీరో అబ్బాస్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. పదేళ్ల తర్వాత రీఎంట్రీగతంలో హీరోగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించిన ఈయన చాలా కాలం క్రితమే దుబాయిలో సెటిల్ అయ్యారు. తాజాగా హ్యాపీరాజ్ ద్వారా దాదాపు పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. బియాండ్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ చిత్ర ప్రోమో వీడియోను శనివారం విడుదల చేశారు. ఇందులో అబ్బాస్ ఐయామ్ బ్యాక్ అంటూ బరిలోకి దిగాడు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
సెట్లో నేనొక్కదాన్నే మహిళని.. 'సైజ్' అని ఇబ్బంది పెట్టారు: రాధిక ఆప్టే
ఇండస్ట్రీలోని చాలామంది హీరోయిన్లు.. చాలా విషయాల్లో స్ట్రెయిట్గా చెప్పలేరు. తమకు ఎదురైన చేదు అనుభవాల్ని కూడా బయటపెట్టేందుకు ఇష్టపడరు. కానీ రాధికా ఆప్టే మాత్రం ధైర్యంగా చెబుతుంది. ఇప్పుడు కూడా దక్షిణాదిలో తనకు ఎదురైన షాకింగ్ అనుభవాన్ని రివీల్ చేసింది. రీసెంట్గా 'సాలీ మహబ్బత్' అనే ఓటీటీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఈ వాఖ్యలు చేసింది.'ఇండస్ట్రీలో పెద్ద సినిమాల్లో అవకాశాలు రావాలంటే కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. చాలా గుర్తింపు ఉన్న వ్యక్తుల నుంచి ఆఫర్స్ వచ్చినప్పుడు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. పైకి హుందాగా కనిపిస్తారు. కానీ కలిసిన తర్వాత వాళ్ల నిజస్వరూపాలు ఏంటనేవి అర్థమయ్యాయి. బాలీవుడ్, సౌత్.. ఇలా ప్రతి ఇండస్ట్రీలోనూ ఇలాంటివి ఉన్నాయి. నేను గతంలో కొన్ని సౌత్ మూవీస్ చేశారు. ఓ సినిమా సెట్లో అయితే చాలా ఇబ్బంది పడ్డాను.''ఓ మారుమూల పల్లెలో షూటింగ్ చేస్తున్నం. చూస్తే నేనొక్కదాన్నే మహిళని. వాళ్లకు నా బ్యాక్, రొమ్ము పెద్దగా కనిపించాలి. దీంతో 'అమ్మ ప్యాడింగ్ చేయండి.. ఇంకా ప్యాడింగ్ చేయండి' అని విసిగించారు. నాకా చాలా కోపం వచ్చింది. నా స్థానంలో మీ అమ్మో, చెల్లిలో ఉంటే ఇలానే చెబుతావా.. ప్యాడింగ్ చెయ్ ప్యాడింగ్ చెయ్ అని అంటావా' అని అరిచేశాను. అలా ఏం చేయనని చెప్పేశాను. ఆ రోజు నాకు మేనేజర్ లేడు, ఏజెంట్ లేడు. నాకంటూ ఓ టీమ్ లేదు.. ఆ అనుభవం తర్వాత మళ్లీ సౌత్ సినిమాలు చేయాలంటేనే భయం వేసింది' రాధిక ఆప్టే చెప్పింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాధిక ఆప్టే.. ఓ దక్షిణాది సీనియర్ హీరో కూడా గతంలో తనతో సెట్స్లో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. డబ్బుల కోసం ఆ హీరోతో మరో సినిమా చేయాల్సి కూడా వచ్చిందని చెప్పుకొచ్చింది. రాధిక సౌత్ మూవీస్ విషయానికొస్తే.. 'రక్తచరిత్ర'తో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించింది. తమిళంలో 'కబాలి'తో పాటు పలు సినిమాలు చేసింది.I remember a South film where I was the only woman, they wanted to add more padding on my bum & my breast. They were like, 'Amma, more padding' 😮— #RadhikaApte Which South movie is she referring to❓Kabali, Azhagu Raja or Balayya's Lion❓👀 pic.twitter.com/wm5Ne7Na4R— VCD (@VCDtweets) December 20, 2025 -
పరాశక్తిలో యాక్ట్ చేసేందుకు సంకోచించా: నటుడు
చెన్నై: శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ పరాశక్తి. ఇది ఆయన హీరోగా యాక్ట్ చేసిన 25వ చిత్రం. రవిమోహన్ ప్రతినాయకుడిగా నటించిన ఇందులో అధర్వ కీలక పాత్ర పోషించారు. శ్రీలీల కథానాయిక. డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ కథా చిత్రానికి సుధాకొంగర కథ, దర్శకత్వం బాద్యతలను నిర్వహిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం 2026 జనవరి 14న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.గురువారం సాయంత్రం చిత్ర ప్రత్యేక కార్యక్రమాన్ని చెన్నైలోని వళ్లువర్కొట్టంలోని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరాశక్తి సినిమాకు సంబంధించిన ఫోటోలు, ఇతర వస్తువులతో ఎగ్జిబిషన్ను 'వరల్డ్ ఆఫ్ పరాశక్తి' పేరుతో ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ నాలుగు రోజులదాకా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.శివకార్తికేయన్ మాట్లాడుతూ.. పరాశక్తి సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్కు 100వ సినిమా అన్నారు. తన 25వ చిత్రాన్ని వేరే కథతో చేయాలని భావించానన్నారు. అయితే నిర్మాత ఆకాశ్ భాస్కర్ పరాశక్తి కథను చేయండి అని చెప్పారన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ మనల్ని 1960 కాలానికి తీసుకెళ్తుందన్నారు.తానీ చిత్రం చేయడానికి కారణం దర్శకురాలు సుధా కొంగరనేనన్నారు. ఆమె 4 ఏళ్ల పాటు పరిశోధనలు చేసి ఈ చిత్రకథ రాశారన్నారు. ఈ సినిమా చేయడమన్నది సవాల్తో కూడుకుందన్నారు. శ్రీలీల మాట్లాడుతూ.. పరాశక్తి తనకు చాలా ముఖ్యమైన సినిమా అన్నారు. రవిమోహన్ మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి ఊరే మాట్లాడోతుందన్నారు. ఇందులో నటించడానికి ముందు సంకోచించానని, అయితే అందరూ ఎంతో శ్రమ పెట్టి పనిచేశారన్నారు. -
నా కూతురిని హీరోయిన్ చేస్తా: దేవయాని
తమిళ చిత్ర పరిశ్రమలో మరో వారసురాలు కథానాయకిగా పరిచయం అవ్వడానికి సిద్ధం అవుతున్నారా అన్న ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. కోలీవుడ్ సక్సెస్ఫుల్ దంపతులుగా రాణిస్తున్న అతి కొద్ది జంటల్లో దర్శకుడు రాజకుమార్, దేవయాని. నటి దేవయాని గురించి పరిచయ వ్యాఖ్యలు అవసరం ఉండదు. తమిళంలోనే కాకుండా తెలుగు తదితర భాషల్లోనూ కథానాయకిగా రాణించారు. ఈమె దర్శకుడు రాజకుమార్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు పేరు ఇనియ, చిన్న కూతురు పేరు ప్రియాంక. కాగా దర్శకుడు రాజకుమార్ అజిత్, పార్తీపన్, దేవయాని ప్రధాన పాత్రలు పోషించిన నీ వరువాయా ఎన్నా అనే సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించి గుర్తింపు పొందారు. ఆ తరువాత కూడా కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆపై దర్శకుడిగా చిత్రాలు చేయకపోయినా నటిస్తున్నారు. ఈయన తన పెద్ద కూతురు ఇనియను కథానాయకిగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై ఆయన ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ తన పెద్ద కూతురు ఇనియను హీరోయిన్గా పరిచయం చేయనున్నట్లు చెప్పారు. అయితే అందులో నటుడు విజయ్ వారసుడు జెసన్ సంజయ్ను హీరోగా నటింపజేస్తానని చెప్పారు. నటుడు విజయ్తో చిత్రం చేసే అవకాశం రాలేదు అనీ, ఆయన వారసుడితోనైనా చిత్రం చేస్తానని చెప్పారు. జెసన్ సంజయ్, ఇనియ జంటగా నటించే చిత్రం కథను రెడీ చేసినట్లు చెప్పారు. అది నీరులా ఎన్పా చిత్రానికి సీక్వెల్ అని రాజకుమార్ చెప్పారు. జెసన్ సంజయ్ ప్రస్తుతం దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. మరి రాజకుమార్ కల ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. -
పిల్లాడికి బంగారు చైన్ బహుమతిచ్చిన సూర్య
అభిమాన హీరో ఆటోగ్రాఫ్ ఇస్తే ఆనందంలో మునిగి తేలుతారు. సెల్ఫీ ఇస్తే సంతోషంతో ఉప్పొంగిపోతారు. కానీ, ఆ హీరో ఏకంగా తమ ఫ్యామిలీ సెలబ్రేషన్స్లో భాగమైతే.. ఇంకేమైనా ఉందా? అది జీవితంలో మర్చిపోలేని బహుమతి అవుతుంది. నటుడు చరణ్కు ఇలాంటి సర్ప్రైజే ఇచ్చాడు హీరో సూర్య. చరణ్ కుమారుడి చర్విక్ మొదటి బర్త్డేను వారి కుటుంబానికి లైఫ్లాంగ్ను గుర్తుండిపోయేలా చేశాడు. బుడ్డోడిని ఎత్తుకుని ఆడించాడు. అంతేకాకుండా ఎవరూ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు.బంగారు గొలుసు కానుకపిల్లవాడి మెడలో బంగారు గొలుసును వేశాడు. చర్విక్ను అతడి తల్లి ఎత్తుకుని ఉండగా సూర్య ఎంతో ఉత్సాహంగా గోల్డ్ చైన్ను బహుకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. లెజెండరీ యాక్టర్ సూర్య ఇచ్చిన సర్ప్రైజ్ చూసి మా దిమ్మ తిరిగిపోయింది. మా బాబు చర్విక్ ఫస్ట్ బర్త్డే పురస్కరించుకుని బంగారు చైన్ను గిఫ్టిచ్చాడు. ఇది కేవలం బహుమతి మాత్రమే కాదు, ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ మధురమైన జ్ఞాపకం అని చరణ్ ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చాడు.తెలుగులో సినిమాఇకపోతే సూర్య చివరగా రెట్రో మూవీలో కనిపించాడు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. ఒకటి (#Suriya46) ఆయన తెలుగులో స్ట్రయిట్ సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మమిత బైజు హీరోయిన్. రవీనా టండన్, రాధికా శరత్కుమార్ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. సూర్య 47వ మూవీసితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే వేసవిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి 'విశ్వనాథన్ అండ్ సన్స్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే సూర్య.. రోమాంచమ్, ఆవేశం సినిమాల ఫేమ్ జీతూ మాధవన్ డైరెక్షన్లో ఓ సినిమా (#Suriya47) చేస్తున్నాడు. ఇందులో నజ్రియా హీరోయిన్గా నటిస్తోంది. What an incredible surprise from the legendary Actor *Suriya* himself, such a kind gesture — gifted my baby boy *Charvik* a gold chain for his 1st Birthday! Thank you, *Suriya* sir—we’re forever grateful! 🙏✨@SuriyaFansClub #suriya46 @ActorSuriyaoff pic.twitter.com/grbI6DCngR— Charan (@Charanmaveric) December 17, 2025 -
హీరో ప్రదీప్ కాళ్ల దగ్గర.. ఆ పని ఎలా చేశావ్?
ఈ ఏడాది సెంచరీ దాటేసిన సినిమాల్లో డ్యూడ్ కూడా ఉంది. తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్గా యాక్ట్ చేసింది. హీరోయిన్ తండ్రిగా, హీరోకి మామగా, రాజకీయ నాయకుడిగా శరత్ కుమార్ కీలక పాత్రలో నటించాడు. అయితే అతడి కుల పిచ్చి ఎక్కువ.దేవయాని ఫోన్సినిమా చివర్లో హీరో అతడి కళ్లు తెరిపిస్తాడు. ఈ క్రమంలో ఓ సన్నివేశంలో హీరో కాళ్ల దగ్గరపడి ఏడుస్తాడు శరత్ కుమార్. ఈ సీన్ చూసి సీనియర్ నటి దేవయాని ఆశ్చర్యపోయిందట! ఈ విషయాన్ని తాజాగా బిహైండ్వుడ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శరత్ కుమార్ గుర్తు చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. డ్యూడ్ సినిమా చూసి దేవయాని నాకు ఫోన్ చేసింది. ఆ సీన్ చూసి షాక్చాలా బాగా చేశానని మెచ్చుకుంది. అలాగే నేను ప్రదీప్ కాళ్ల దగ్గర కూర్చుని చేసిన ఎమోషనల్ సీన్ చూసి షాకైంది. ఆ సన్నివేశం ఎలా చేయగలిగావ్? అని అడిగింది. అప్పుడు నేనొక్కటే చెప్పాను. నేను హీరో ప్రదీప్ దగ్గర కూర్చుని ఏడవలేదు. నా చెల్లెలి కొడుకు దగ్గర కన్నీళ్లుపెట్టుకున్నాను (సినిమాలో ప్రదీప్ తన మేనల్లుడిగా నటించాడు). తప్పేముంది?అందులో తప్పేముంది. ఒక నటుడిగా ఆ సీన్ చేసేటప్పుడు నాకెటువంటి హద్దులు, భయాలు ఉండకూడదు అని చెప్పాను అని వెల్లడించాడు. డ్యూడ్ (Dude Movie) విషయానికి వస్తే.. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2025 అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ రివ్యూస్తోనే అవలీలగా రూ.100 కోట్లు దాటేసింది. -
హాట్స్పాట్ మూవీకి సీక్వెల్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
విష్ణు విశాల్ స్టూడియోస్ సంస్థ సమర్పణలో కే.జే.బి టాకీస్ పతాకంపై నటుడు, నిర్మాత కేజే.బాలమణిమార్బన్ నిర్మిస్తున్న చిత్రం హాట్ స్పాట్ టూమచ్. ఇంతకుముందు వచ్చిన హాట్ స్పాట్ చిత్రానికి ఇది సీక్వెల్ కావడం గమనార్హం. హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఇందులో నటుడు ఎమ్మెస్ భాస్కర్, తంబి రామయ్య, అశ్విన్ కుమార్, ఆదిత్య భాస్కర్, రాక్షసన్, భవాని శ్రీ, బ్రిగిడా సగా, రంజన తివారి, ఆదిత్య ఖదీర్, విజయ్ టీవీ అమర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జగదీష్ రవి, జోసెఫ్ పాల్ ద్వయం ఛాయాగ్రహణం, సతీష్ రఘునాథన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి నటుడు విగ్నేష్ కార్తీక్ దర్శకత్వం వహిస్తూ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ ను గురువారం విడుదల చేశారు. చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు పేర్కొంటూ ఇంతకుముందు రూపొందించిన హాట్ స్పాట్ చిత్రం నాలుగు కథలతో ఆంథాలజీగా ఉందని, హాట్ స్పాట్ టూమచ్ చిత్రం మూడు వేర్వేరు కథలతో సాగుతుందని చెప్పారు. ఇది అన్ని వర్గాలకు నచ్చే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందన్నారు. చిత్ర ఆడియో, టీజర్, ట్రైలర్ విడుదలకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు. Happy to present the stars reveal of #HotSpot2Much!https://t.co/WiuitAv3dfComing soon to cinemas near you ♨️@KJB_Talkies @KJB_iamBala @a2e_cinemasco @aneelkreddy @VVStudioz @vikikarthick88 @priya_Bshankar @i_amak @AadhityaBaaskar @RakshanVJ @Brigidasagaoffl @BhavaniSre… pic.twitter.com/C0QbtOhURp— VISHNU VISHAL - VV (@TheVishnuVishal) December 15, 2025The squad is pakka set 😎Welcome to the World of #HotSpot2Much da boys and girls !Hitting Theatres Sooon 🔥Stars Reveal 🔗 https://t.co/gEHcIbl881@KJB_Talkies @KJB_iamBala @a2e_cinemasco @aneelkreddy @VVStudioz @thevishnuvishal @vikikarthick88 @priya_Bshankar @i_amak… pic.twitter.com/u7IsPvh0FD— Ramesh Bala (@rameshlaus) December 17, 2025 -
చతికిలపడుతున్న తమిళ సీనియర్ హీరోలు..
సినిమా అనే ప్రపంచంలో ఎప్పుడూ రేసు కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ ఎవరు ఎలాంటి కథలతో చిత్రాలు చేసినా అంతిమ లక్ష్యం విజయం సాధించడమే. తద్వారా ఆర్థికపరమైన లాభాలు ప్రధానాంశంగా మారతాయి. సినిమా శతాబ్ది వేడుకను జరుపుకున్నా ఇప్పటికీ ఈ ఫార్ములాలో ఎలాంటి మార్పులేదు. ఉండదు కూడా. వైవిధ్యం అనేది దర్శకుడి సృజనాత్మకతపైనే ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రేక్షకులు మోనాటమిని అసలు ఇష్టపడడం లేదు. అది ఏ సూపర్స్టార్ హీరోగా నటించినా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ సీనియర్ హీరోల సినిమాలకు గడ్డుకాలం ఏర్పడింది.ఇందుకు చిన్న ఉదాహరణ ఇటీవల రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన వేట్టయన్, కూలీ మూవీతో పాటు కమలహాసన్ నటించిన థగ్ లైఫ్, విజయ్ నటించిన లియో, గోట్, అజిత్ నటించిన విడాముయర్చి , సూర్య నటించిన రెట్రో, కంగువ వంటి చిత్రాలే. అదేవిధంగా జయాపజయాలు ఎవరి చేతిలోనూ ఉండవన్నది జగమెరిగిన సత్యం. సినిమా, జయాపజయాలు అన్నవి నిరంత ప్రక్రియ. అయితే, ప్రస్తుతం కోలీవుడ్ సీనియర్లు చతికిలపడుతున్నారా అనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో తమిళ ఇండస్ట్రీలో ఇటీవల యంగ్ హీరోలు, కొత్త దర్శకులు దూకుడు చూపుతున్నారు. వారు చేసిన చిన్న చిత్రాలకు ప్రేక్షకుల మధ్య ఆదరణ లభిస్తుంది. పెద్ద హీరోల సినిమాలకు ప్రచారం ఎక్కువ. కానీ, కలెక్షన్స్ మాత్రం ఆ రేంజ్లో ఉండటం లేదు.సినియర్ నటి సిమ్రాన్ కుడా ప్రస్తుతం సినిమాల విషయంలో జరుగుతున్న ఫాల్స్ ప్రచారాన్ని ఎండగట్టారు. ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఇటీవల టూరిస్ట్ ఫ్యామిలీ, డ్రాగన్, 3బీహెచ్కే వంటి చిత్రాలు మంచి ప్రశంసలు అందుకొవడంతో పాటు , రెండు వారాలు దాటిన తరువాత కూడా థియేటర్లకు వెళ్లినా ప్రేక్షకులు అధిక సంఖ్యలో ఉన్నారన్నారు. అయితే పెద్ద పెద్ద స్టార్స్ నటించిన చిత్రాలే పలు కోట్ల రూపాయలు వసూళ్లు అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారాల మోత మోగుతోందన్నారు. అయితే అలాంటి చిత్రాలు విడుదలైన వారం తరువాత వెళితే థియేటర్లలో ప్రేక్షకులే ఉండడం లేదన్నారు. అయినప్పటికీ అంత వసూలు, ఇంత వసూలు అని ఎందుకు ప్రచారం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని సిమ్రాన్ పేర్కొన్నారు. -
నటి బ్లౌజుపై వెకిలి కామెంట్.. హీరోలనూ వదల్లేదు!
ప్రశ్న.. తికమక పెట్టేదిగా ఉండొచ్చు, సూటిగా బాణం వదిలినట్లుగా ఉండొచ్చు, కానీ ఎదుటివారిని చులకన చేసేదిగా ఉండకూడదు. తలదించుకునేలా అసలే ఉండకూడదు. కానీ ఇప్పుడేం జరుగుతోంది.. అన్నీ వెకిలి ప్రశ్నలు.. సెన్సేషన్ కోసం అడ్డదిడ్డమైన కామెంట్లు.. నవ్వులపాలవుతున్నా సరే దులిపేసుకుని మరీ మళ్లీ అలాంటి పిచ్చి ప్రశ్నలే అడుగుతున్నారు.సినిమా ఈవెంట్స్లో నిత్యం ఇదే జరుగుతోంది. హద్దులు మీరి ప్రశ్నలడగడం కాదు ఏకంగా కించపరిచేలా మాట్లాడుతున్నారు. సినిమాల గురించి పక్కనపెట్టి మీరు సింగిలా? మింగిలా? ఎన్ని పుట్టుమచ్చలున్నాయి? బరువెంత? హీరో మెటీరియల్ కాదు.. ఇదిగో ఇలాంటివే వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సెలబ్రిటీలకు ఎదురైన ఆ చేదు సంఘటనలను కొన్నిక్కడ చూద్దాం...ఛీ కొట్టే ప్రశ్న'తెలుసు కదా' ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డను ఓ మహిళా విలేకరి మీరు ఉమెనైజరా? అని అడిగింది. అందుకాయన వస్తున్న కోపాన్ని తమాయించుకుని ఇది సినిమా ఇంటర్వ్యూనా? నా పర్సనల్ ఇంటర్వ్యూనా? అని సమాధానం దాటవేశాడు. ఎక్కువమంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకునేవారిని ఉమెనైజర్ అంటారు. అలాంటిది ఓ హీరోను పట్టుకుని మీరు ఉమెనైజరా? అని అడగడం ఎంత నీచమో గ్రహించలేకపోవడం ఆమె స్థాయికి నిదర్శనం!హీరో మెటీరియల్ కాదా?దీనికంటే ముందు డ్యూడ్ సినిమా ప్రమోషన్స్లో కూడా.. ప్రదీప్ రంగనాథన్ను మీరు చూడటానికి హీరో మెటీరియలే కాదు, రెండు సినిమాలకే ఇంత సక్సెస్ అంటే అది హార్డ్ వర్కా? అదృష్టమా? అని అడిగింది. హీరో అంటే ఫలానా హైట్ ఉండాలి.. ఈ రంగుండాలి.. అని ఏ పుస్తకంలో రాశారో తనకే తెలియాలి! పాపం ఆమె ప్రశ్నకు ప్రదీప్ బిక్కచచ్చిపోయి చూస్తుంటే శరత్ కుమార్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేశాడు.బుద్ధి చెప్పిన మంచు లక్ష్మిహీరో మెటీరియల్ కాదని మీరెలా జడ్జ్ చేస్తారు.. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ హీరో మెటీరియలే అని గూబ గుయ్యిమనేలా ఆన్సరిచ్చాడు. కిరణ్ అబ్బవరం కూడా.. పక్క రాష్ట్రం నుంచి వచ్చినవాళ్లను కించపరిచే ప్రశ్నలు అడగొద్దని వేడుకున్నాడు. మంచు లక్ష్మికి కూడా ఇలాంటి అభ్యంతకర ప్రశ్నలు ఎదురయ్యాయి. ఓ యాంకర్.. ఇంటర్వ్యూలో ఆమె వయసు, డ్రెస్సింగ్కు లింక్ చేసేలా ప్రశ్న అడగడంతో నీకెంత ధైర్యం అని అక్కడే కడిగిపారేసింది. అంతేకాకుండా అతడు బహిరంగ క్షమాపణలు చేప్పేవరకు వదల్లేదు.స్లీవ్లెస్ బ్లౌజ్ గురించి వెకిలి కామెంట్ఈ ఏడాది మేలో జరిగిన యోగిదా అనే తమిళ సినిమా ఈవెంట్కు ఐశ్వర్య రఘుపతి హాజరైంది. వేసవికాలంలో ఎండను తట్టుకునేందుకు జాగ్రత్తలు తీసుకోమని మీడియాను కోరింది. దానికి ప్రతిస్పందనగా ఓ వ్యక్తి.. వేడిని తట్టుకునేందుకే స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొచ్చారా? అన్నాడు. ఒక క్షణం పాటు షాక్లో ఉండిపోయిన ఆమె సినిమా ఈవెంట్లో నా దుస్తులపై చర్చ ఎందుకంటూ తిరిగి ప్రశ్నించింది.మీ బరువెంత?గత నెలలో జరిగిన తమిళ చిత్రం అదర్స్ ఈవెంట్లో హీరోయిన్ గౌరీ కిషన్ను ఓ వ్యక్తి మీ బరువెంత అని అడిగాడు. నా బరువు తెలుసుకుని ఏం చేస్తారు. ఇదే ప్రశ్న హీరోలను అడుగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపోతే మూడేళ్ల క్రితం డీజే టిల్లు ప్రెస్మీట్లో ఓ విలేకరి.. హీరోయిన్కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో తెలుసా? అని సిద్ధు జొన్నలగడ్డను అడగడం ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే! మరి వీళ్లంతా వైరల్ అవడానికి ఇదంతా చేస్తున్నారా? ఏంటనేది వారికే తెలియాలి. ఇలాంటి దిగజారుడు ప్రశ్నలడిగి జర్నలిజం పరువు తీయడంతోపాటు ఇండస్ట్రీని నవ్వులపాలు చేస్తున్నారు. ఈ పరిస్థితులు ఎప్పుడు మారుతాయో? ఏంటో! -
జైలర్ 2లో ఐటం సాంగ్!
సినిమాలో ఎంత పెద్ద హీరోలు ఉన్నా ఐటమ్ సాంగ్స్ తప్పనిసరిగా మారుతోంది. కథ, కథనాలు ఎంత బాగున్నా, ఆ చిత్రాలకు ఎక్కువ మైలేజ్ ఇస్తున్నవి ఐటమ్ సాంగ్స్నే అంటున్నారు సీనీ పండితులు. అలా ఐటమ్ సాంగ్స్కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిన అతి కొద్దిమంది స్టార్ హీరోయిన్లలో తమన్నా పేరు ముందు ఉంటుంది. రజనీ నటించిన జైలర్ మూవీలో తమన్నా అందాలు ఆరబోసిన నువ్వు కావాలయ్యా పాట ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. జైలర్ 2లో ఐటం సాంగ్అదేవిధంగా కూలీ చిత్రంలో పూజాహెగ్డే స్టెప్పేసిన మోనికా సాంగ్ కూడా ఈచిత్రానికి కొంత మైలేజ్ను తీసుకొచ్చింది. తాజాగా రజనీ నటిస్తున్న జైలర్–2 చిత్రంలోనూ ఐటమ్సాంగ్ ఉంటుందని సమాచారం. కాకపోతే ఈ సారి మిల్కీ బ్యూటీ తమన్నాకు బదులుగా బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేసే ప్లాన్లో ఉన్నారట! ఆమె ఎవరో కాదు నోరా ఫతేహి.స్టెప్పేయనున్న నోరా ఫతేహి?మోడలింగ్ రంగంలో రాణించిన ఈ క్రేజీ భామ హిందీ బిగ్బాస్ రియాలిటి గేమ్షోలోనూ పాల్గొంది. అనంతరం పలు హిందీ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ బాహుబలి వంటి కొన్ని చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్లో నటించి గుర్తింపు పొందింది. ఇప్పుడు జైలర్–2 మూవీలో ఐటమ్ సాంగ్ చేయనుందని తెలుస్తోంది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే! -
సత్యజ్యోతి సంస్థతో పనిచేయడం గర్వకారణం
తమిళసినిమా: నటుడు కిచ్చా సుదీప్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మార్క్. నటుడు నవీన్ చంద్ర, విక్రాంత్, యోగిబాబు, దీప్షిక, రోష్నీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి విజయ్ కార్తికేయన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని నటుడు కిచ్చ సుదీప్ సత్య జ్యోతి ఫిలిమ్స్ తో కలిసి తన కిచ్చా క్రియేషనన్స్ సంస్థపై నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలు చేసుకున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రం ఈనెల 25వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్ర యూనిట్ చైన్నెలోని ఓ హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న దర్శకుడు విజయ్ కార్తీక్ మాట్లాడుతూ తాను ఈ వేదికపై నిలబడ్డటానికి ముఖ్య కారణం నటుడు కిచ్చా సుదీప్ అని పేర్కొన్నారు. అంత పెద్ద హీరోతో కలిసి రెండో చిత్రం చేయడం సాధారణ విషయం కాదన్నారు. ఇంతకు ముందు మాక్స్ సినిమా చేశామని, తాజాగా మార్క్ చిత్రం చేసే అవకాశాన్ని కిచ్చ సుదీప్ కల్పించారని చెప్పారు. నటుడు నవీన్ చంద్ర మాట్లాడుతూ తాను చాలా సంవత్సరాలుగా తమిళం ,తెలుగు భాషల్లో నటిస్తున్నానని, అయితే కన్నడ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే పాత్ర కోసం ఎదురుచూశానని, మార్క్ చిత్రంలో అలాంటి అవకాశం కలగడం సంతోషంగా ఉందన్నారు. చిత్ర కథానాయకుడు కిచ సుదీప్ మాట్లాడుతూ సత్యజ్యోతి ఫిలిమ్స్ వంటి గొప్ప సంస్థతో కలిసి మార్క్ వంటి సినిమాను చేయడం ఘనంగా ఉందన్నారు. కథ చెప్పే విధానం, కొత్త సన్నివేశాలు, వ్యాపారం, నటీనటుల ప్రదర్శన వంటి విషయాల్లో ప్రేక్షకులు కొత్తదనాన్ని, వైవిధ్యాన్ని ఆశిస్తారన్నారు. అవన్నీ ఈ చిత్రంలో చేసామని నమ్ముతున్నామన్నారు. దర్శకుడు విజయ్ కార్తికేయన్ దర్శకత్వం అంటే తనకు ఇష్టం అన్నారు అందుకే మళ్లీ ఆయనతో కలిసి ఈ చిత్రం చేశానని చెప్పారు తన చెట్లు అత్యంత బిజీగా ఉండే నటుడు యోగిబాబు అని, ఆయన ఈ చిత్రం కోసం విడతల వారీగా వచ్చి నటించారని చెప్పారు. అదేవిధంగా ఈ చిత్రం కోసం దర్శకుడు, ఛాయాగ్రకుడు రాత్రింబవళ్లు కష్టపడినట్లు తెలిపారు. -
ఈ హీరో 15 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో.. ఇప్పుడూ అలాగే!
అరుణ్ విజయ్ కథానాయకుడిగా ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం రెట్ట తల. సిద్ధి ఇద్నాని హీరోయిన్గా నటించిన ఇందులో తాన్యా రవిచంద్రన్, హరీష్ పేరడీ, యోగేష్ స్వామి, జాన్ విజయ్, బాలాజీ మురుగదాస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. బీటీజీ యూనివర్సల్ పతాకంపై బాబీ బాలచందర్ నిర్మించిన ఈ చిత్రానికి మాన్ కరాటే చిత్రం ఫేమ్ క్రిష్ తిరుకుమరన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందించారు.ప్రీరిలీజ్ ఈవెంట్నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్, వడివళగన్, ముత్తయ్య, కిషోర్ ముత్తుస్వామి, బాలాజీ వేణుగోపాల్, గోకుల్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నా శిష్యుడేఈ సందర్భంగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు తన శిష్యుడని.. గజిని, తుపాకీ చిత్రాలకు పనిచేశారని పేర్కొన్నారు. ఈ మూవీ టైటిల్ కూడా తనదేదని, తనను అడగ్గానే ఇచ్చానని చెప్పారు. నటుడు అరుణ్ విజయ్ 15 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో, ఇప్పుడు కూడా అలాగే ఉండటం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. ఆయన శ్రమజీవి అని.. మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారనే నమ్మకం ఉందన్నారు.ఛాలెంజింగ్ పాత్రఅరుణ్ విజయ్ మాట్లాడుతూ.. దర్శకుడు కథ చెప్పగానే తనను బాగా ఆకట్టుకుందన్నారు. అదే సమయంలో ఇందులో నటించడం ఛాలెంజ్గా అనిపించిందన్నారు. అందుకే ఈ చిత్రంలో నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. క్లైమాక్స్ కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని, ఇందులో హీరో ధనుష్ ఒక పాట పాడటం విశేషమని పేర్కొన్నారు. -
మళ్లీ మెగాఫోన్ పట్టనున్న డ్రాగన్ హీరో!
రవి మోహన్ కథానాయకుడిగా నటించిన కోమాలి చిత్రంతో ప్రదీప్ రంగనాథన్ వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ వెంటనే హీరోగా మారాడు. స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా లవ్టుడే సినిమా చేశాడు. యూత్ఫుల్ ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించింది. నాలుగు సినిమాలకేఆ తర్వాత ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన డ్రాగన్ మూవీ సంచలన విజయం అందుకుంది. అలాగే ఈయన హీరోగా నటించిన డ్యూడ్ కూడా బ్లాక్బస్టర్గా నిలిచింది. అలా దర్శకుడిగా, హీరోగా అపజయం అనేదే లేకుండా నాలుగు సినిమాలతోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రంలో నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. నెక్స్ట్ ఏంటి?దీంతో ఈయన నెక్స్ట్ సినిమా ఏంటన్న ఆసక్తి నెలకొంది. అయితే ప్రదీప్.. మరోసారి మెగా ఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఈయన కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈసారి ప్రదీప్ రంగనాథన్ సైన్స్ ఫిక్షన్ కథను తెరకెక్కించనున్నాడట! దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరికొద్దిరోజుల్లో వెలువడే అవకాశం ఉంది. -
రెండోసారి విడాకులు తీసుకోబోతున్న డైరెక్టర్!
తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ రెండోసారి విడాకులు తీసుకోబోతున్నాడంటూ కోలీవుడ్లో ప్రచారం ఊపందుకుంది. అందుకు కారణం లేకపోలేదు. భార్య, దర్శకురాలు గీతాంజలి.. తన సోషల్ మీడియా ఖాతాలో భర్తతో దిగిన ఫోటోలను డిలీట్ చేసింది. పెళ్లయిన దాదాపు 14 ఏళ్లకు ఇలా ఫోటోలన్నీ సడన్గా తీసేయడంతో వీళ్ల మధ్య గొడవలు తలెత్తాయని కోలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలే ఈ కాలంలో విడాకులు తీసుకునేముందు ఒకరినొకరు అన్ఫాలో చేసుకుని ఇలా ఫోటోలు డిలీట్ చేసుకుంటున్నారు. దీంతో ఈ జంట కూడా విడిపోయిందేమోనని పలువురు అనుమానిస్తున్నారు. ఈ ప్రచారంపై గీతాంజలి, సెల్వరాఘవన్.. ఎవరో ఒకరు స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.రెండు పెళ్లిళ్లుసెల్వరాఘవన్ (Selvaraghavan).. కాదల్ కొండేన్ అనే తమిళ చిత్రంతో వెండితెరపై దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించాడు. ఇందులో సెల్వ తమ్ముడు ధనుష్ హీరోగా నటించాడు. సోనియా అగర్వాల్ను హీరోయిన్గా బిగ్స్క్రీన్కు పరిచయం చేశారు. సెల్వ నెక్స్ట్ మూవీ 7/G రెయిన్బో కాలనీ (7/G బృందావనం) మూవీలోనూ సోనియానే హీరోయిన్! ధనుష్- సోనియాను జంటగా పెట్టి మూడో సినిమా తీశాడు. ఈ మధ్యకాలంలో సోనియాతో సాన్నిహిత్యం ప్రేమగా మారడంతో 2006లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.కానీ భార్యాభర్తలుగా ఎంతోకాలం కలిసుండలేకపోయారు. 2010లో సెల్వ- సోనియా విడాకులు తీసుకున్నారు. ఆ మరుసటి ఏడాది సెల్వ.. దర్శకురాలు గీతాంజలి (Gitanjali Raman)ని రెండో పెళ్లి చేసుకున్నాడు. 14 ఏళ్లుగా ఎంతో బాగా కలిసున్న ఈ దంపతులు ఇప్పుడిలా విడిపోతున్నారన్న వార్త అభిమానులను కలిచివేస్తోంది. అటు సెల్వ తమ్ముడు ధనుష్ కూడా ఐశ్వర్య రజనీకాంత్తో విడాకులు తీసుకోవడం గమనార్హం!చదవండి: మ్యాచ్ చూసేందుకు వచ్చి మెస్సీ అంటే ఇష్టం లేదన్న అర్హ -
96 మ్యాజిక్ రిపీట్ అవుతుందా!
96 చిత్రం ద్వారా ఆదిత్య భాస్కర్, గౌరీకిషన్ వెండితెరకు పరిచయమయ్యారు. 96 చిత్రంలో హీరోహీరోయిన్ల చిన్ననాటి పాత్రల్లో నటించారు. ఆ మూవీ విజయంతో వీరికి మంచి గుర్తింపు వచ్చింది. ఆదిత్య భాస్కర్ ఇటీవల జాతీయ అవార్డును గెలుచుకున్న ఎంఎస్.భాస్కర్ వారసుడు అన్నది గమనార్హం. తాజాగా ఆదిత్య భాస్కర్, గౌరికిషన్ హీరో హీరోయిన్లుగా జత కట్టారు. ఈ చిత్రాన్ని ఆర్జిన్ స్టూడియోస్ పతాకంపై కన్నదాసన్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిఈ మూవీ ద్వారా రాజ్కుమార్ రంగసామి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సరస్వతి మీనన్, దర్శకుడు కె.భాగ్యరాజ్, రెడిన్ కింగ్స్లీ, డీఎస్ఆర్ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ వర్గాలు వెల్లడించాయి. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న కథా చిత్రం అని చెప్పారు. 96 మ్యాజిక్ రిపీట్!జనరంజకమైన అంశాలతో కుటుంబ సమేతంగా చూసి ఆనందించే విధంగా ఈ మూవీ కథ ఉంటుందన్నారు. 96 చిత్రం ఫేమ్ ఆదిత్య భాస్కర్, గౌరీకిషన్ల మ్యాజిక్ ఈ చిత్రంతో మరోసారి వర్కౌట్ అవుతుందని అన్నారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని త్వరలోనే చిత్ర టైటిల్ను ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఎస్.రామచంద్రన్ చాయాగ్రహణం, ఎంఎస్.జోన్స్ రాబర్ట్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
భర్తతో గొడవ.. నిద్రమాత్రలు మింగిన బుల్లితెర నటి
బుల్లితెర నటి రాజేశ్వరి (39) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. స్థానిక సైదాపేటకు చెందిన రాజేశ్వరి ప్రస్తుతం ఒక టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న సిరకడిక్క ఆశై సీరియల్లో తల్లి పాత్రలో నటిస్తున్నారు. అంతకుముందు భాగ్యలక్ష్మి, పనివిళుమ్ మలర్వనమ్.. ఇతర సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు పొందారు. అదే విధంగా సినిమాల్లోనూ చిన్న పాత్రలు పోషించారు.నిద్రమాత్రలు మింగి పెళ్లయిన తర్వాత భర్తతో కలిసి స్థానిక ముత్తియల్పేటలో నివసిస్తూ వచ్చారు. అయితే ఈమెకు, భర్తకు మధ్య చాలాకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. దీంతో రాజేశ్వరి ఇటీవల సైదాపేటలోని తన తల్లి ఇంటికి వచ్చి అక్కడి నుంచే షూటింగ్లకు వెళ్తుండేవారు. ఇటీవల భర్తతో మరోసారి గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన నటి గురువారం రాత్రి అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకుని స్పృహ కోల్పోయారు. చికిత్స పొందుతూ మృతితొలుత ఆమెను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి స్థానిక కీల్పాక్కమ్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే సైదాపేట పోలీసులు కీల్పాక్కమ్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.గమనిక:ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
అసలేంటి తలైవా.. ఈ వయసులో కూడా ఇంత సాహసమా?
సూపర్ స్టార్ రజినీకాంత్..ఈ పేరు వింటే చాలు అభిమానులకు ఆ డైలాగ్ తప్పకుండా గుర్తుకొస్తుంది. 'ఆడదంటే అణకువగా ఉండాలి.. తొందర పడకూడదు. చదువు ఉండాలి సంస్కారం మరిచి పోకూడదు. అధికారం ఉండాలి.. అహంకారం ఉండకూడదు.. క్రమశిక్షణ ఉండాలి బరి తెగించకూడదు.. భయభక్తులు ఉండాలి.. బజారు మనిషిలా ప్రవర్తించకూడదు. మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి. అతిగా ఆవేశపడే ఆడది అతిగా ఆశపడ్డ మగవాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు' అంటూ నరసింహ చిత్రంలో రమ్యకృష్ణను ఉద్దేశించి చెప్పిన డైలాగ్ ఎప్పటికీ అభిమానుల్లో గుండెల్లో నిలిచిపోయింది.1999లో వచ్చిన విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఇవాళ తలైవా బర్త్ డే కావడంతో మరోసారి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నేటితో రజినీకాంత్ 75 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా తలైవాకు సినీతారలు, రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. వయసు పెరుగుతున్నప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది కూలీతో అభిమానులను అలరించిన సూపర్ స్టార్.. జైలర్ సీక్వెల్తో ఫుల్ బిజీగా ఉన్నారు. అంతేకాకుండా ఈ సినిమా కోసం డేరింగ్ స్టంట్స్ కూడా చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ సంగతి ఏంటో తెలుసుకుందాం.జైలర్-2లో సాహసం చేస్తోన్న తలైవా..ప్రస్తుతం రజినీకాంత్ జైలర్-2తో బిజీగా ఉన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సీక్వెల్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. 75 ఏళ్ల వయసులోనూ యాక్షన్ సినిమాలు చేస్తోన్న తలైవా.. ఈ మూవీ కోసం చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ కోసం రజినీకాంత్ సాహసం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.ఈ వయసులో ఫైట్ సీన్ కోసం..ఇటీవలే జైలర్-2 షూటింగ్కు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. రజినీకాంత్తో ఓ ఫైట్ సీన్ కోసం బరువైన వస్తువులు ఎత్తాల్సి ఉంది. ఈ ఫైట్ సీన్ కోసం తలైవా బరువైన వస్తువును ఎత్తి తలకిందులుగా పెట్టాలి. ఈ కష్టమైన సీన్కు డూప్ను ఏర్పాటు చేశారు దర్శకుడు నెల్సన్. కానీ రజినీకాంత్ వద్దని చెప్పారట. ఆయనే డూప్ లేకుండా ఆ బరువును ఎత్తడానికి ప్రయత్నించారట. ఈ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఈ వయసులో ఇంత రిస్క్ చేయడం అవసరమా? అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఈ వయసులో ఇంత సాహసం చేయడం తలైవాకే సాధ్యమంటూ మరికొందరు ప్రశంసిస్తున్నారు. కాగా.. జైలర్-2 చిత్రంలో ఎస్జే సూర్య, యోగిబాబు, రమ్యకృష్ణ, మిర్ణా మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2026 జూన్ 12న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది డిసెంబర్లోనే పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
సౌత్ టు నార్త్.. స్టార్ హీరోయిన్.. ఇప్పుడేం చేస్తోంది?
రతి అగ్నిహోత్రి.. ఒకప్పుడు టాప్ హీరోయిన్. కమల్ హాసన్, చిరంజీవి వంటి స్టార్స్తో కలిసి నటించింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఉర్దూ భాషల్లో హీరోయిన్గా యాక్ట్ చేసింది. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఆమె జీవితంలో మాత్రం ఎన్నో చీకటి రోజుల్ని చూసింది. ఇటీవలే ఆమె (డిసెంబర్ 10) 65వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా తన గురించి నేటి ప్రత్యేక కథనం.స్టార్ హీరోయిన్భారతీరాజా పుతియ వార్పుగల్ (1979) మూవీతో రతి అగ్నిహోత్రిని బిగ్ స్క్రీన్కు పరిచయం చేశాడు. ఫస్ట్ సినిమాకే విజయం కైవసం చేసుకున్న ఈ బ్యూటీకి అవకాశాలు వెల్లువెత్తాయి. ఏడాదికి 8 నుంచి 10 సినిమాలు చేసుకుంటూ పోయింది. దీంతో ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హిందీలో ఏక్ దుజే కే లియే, కూలీ వంటి సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది.తెలుగులో సినిమాలుతెలుగులో చిరంజీవి పున్నమినాగు, శోభన్బాబు జీవిత రథం, ఎన్టీఆర్తో తిరుగులేని మనిషి, కలియుగ రాముడు, వయ్యారి భామలు-వగలమారి భర్తలు, వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర.. ఇలా అనేక సినిమాలు చేసింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత నందమూరి బాలకృష్ణ డిక్టేటర్ మూవీలో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది.వైవాహిక బంధంలో సమస్యలుబ్రాహ్మణ కుటుంబానికి చెందిన రతి అగ్నిహోత్రికి పెళ్లిపై ప్రగాఢ విశ్వాసం. అందుకే వైవాహిక బంధంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చాలవరకు భరించింది. ఓపిక నశించిన సమయంలో పోలీసు స్టేషన్ మెట్లెక్కింది. కానీ విడాకులు మాత్రం తీసుకోలేదు. ఈమె 1985లో ఆర్కిటెక్ట్ విర్వానీని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు కుమారుడు తనూజ్ సంతానం. ఇతడు ప్రస్తుతం బాలీవుడ్లో, హిందీ సిరియల్స్లో నటుడిగా కొనసాగుతున్నాడు.30 ఏళ్లు నరకంఓ ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం గురించి చెప్తూ ఎమోషనలైంది రతి అగ్నిహోత్రి. ఆమె ఏమందో తన మాటల్లోనే చూద్దాం.. పెళ్లిని ఎంతో పవిత్రంగా భావిస్తాను. అందుకే ఇంట్లో ఏం జరిగినా పైకి మాత్రం నవ్వుతూ కనిపించాను. 30 ఏళ్లు నరకం అనుభవించినా ఏనాడూ దాన్ని పైకి కనబడనివ్వలేదు. కొడుకు పుట్టాక వాడే నా మొదటి ప్రాదాన్యత. ఏదో ఒకరోజు ఈ పరిస్థితి మారుతుందన్న ఆశతో ఎదురుచూశాను. భరించడం నా వల్ల కాక..ఎవరికీ చెప్పుకోలేని చోట కొట్టేవాడు. ఆ గాయాలు ఎవరికీ కనబడేవి కావు. 54 ఏళ్ల వయసులో కూడా నాపై దాడి జరిగింది. అప్పుడు నాకో విషయం అర్థమైంది. నాకు వయసు మీదపడుతోంది, నేను ఇంకా బలహీనమవుతున్నాను. ఇలాగే భరిస్తూ పోతే ఏదో ఒకరోజు నా చావు తథ్యం అనిపించింది. అప్పుడు ధైర్యం కూడదీసుకుని 2015లో పోలీసులకు ఫిర్యాదు చేశాను. గృహ హింసను భరించాల్సిన అవసరం లేదని ఆలస్యంగా తెలుసుకున్నాను అంది. ఏం చేస్తోందంటే?ఈ విషయంలో కుమారుడు తల్లి పక్షానే నిలబడ్డాడు. కాకపోతే కొన్నాళ్లకు తల్లిదండ్రులను కలిపే ప్రయత్నం చేశాడు. విడాకులైతే అవలేదు, కానీ ఇద్దరూ కలిసి మాత్రం ఉండటం లేదు. ప్రస్తుతం రతి ఎక్కువగా పోలాండ్లోనే ఉంటుంది. అక్కడ తన సోదరి అనితతో కలిసి రెస్టారెంట్ నడుపుతోంది. యాక్టింగ్ కన్నా వంట చేయడం బాగా వచ్చంటోంది. -
ధనుష్ రిజెక్ట్ చేసిన మూవీ.. హీరోగా రెట్రో నటుడు
ధనుష్ నటించాల్సిన చిత్రం వర్దమాన నటుడు విదూను వరించింది. ఎస్.కార్తికేయన్కు చెందిన స్టోన్ బెంచ్ స్టూడియోస్, దర్శకుడు లోకేశ్ కనకరాజ్కు చెందిన స్క్వాడ్ స్టూడియో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 29 అనే టైటిల్ను నిర్ణయించారు. ఈ చిత్రానికి రత్నకుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు పేట, జిగర్తాండ డబుల్ ఎక్స్ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో మెరిసిన విదూ ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయనకు జంటగా ప్రీతీ అస్రాణి నటిస్తున్నారు. ఏడేళ్ల తర్వాతశ్యాన్ రోల్డణ్ సంగీతాన్ని, మహేశ్ మాణిక్యం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత కార్తికేయన్ మాట్లాడారు. తమ చిత్ర నిర్మాణ సంస్థను 2017 ప్రారంభించి తొలి ప్రయత్నంగా మేయాదమాన్ చిత్రాన్ని నిర్మించామన్నారు. ఆ తరువాత 17 చిత్రాలు చేశామని చెప్పారు. దర్శకుడు రత్నకుమార్తో సుమారు 7 ఏళ్ల తరువాత ఇప్పుడు 29 చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. 30లోకి అడుగుపెడితే..కొంత కాలం క్రితం ఆయన ఈ కథ చెప్పగా దయచేసి ఈ చిత్రాన్ని తమ సంస్థలోనే చేయాలని కోరానన్నారు. చిత్ర షూటింగ్ 85 శాతం పూర్తి అయ్యిందనీ, మరో నాలుగు రోజులు షూటింగ్ నిర్వహిస్తే పూర్తి అవుతుందన్నారు. చిత్ర దర్శకుడు రత్నకుమర్ మాట్లాడుతూ.. మనిషి వయసు 29 పూర్తి అయ్యి 30లోకి అడుగు పెడితే జాతకం మారిపోతుందన్నారు. అలాంటి ఒక యువకుడి ఇతివృత్తంతో తెరెకెక్కిస్తున్న చిత్రం 29 అని చెప్పారు. ధనుష్ రిజెక్ట్దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ.. ఈ కథను మేయాదమాన్ చిత్రం పూర్తి అయిన తరువాత దర్శకుడు రత్నకుమార్ తనకు చెప్పారన్నారు. దీన్ని నటుడు ధనుష్కు చెప్పగా ఆయని చాలా బాగుందన్నారు, కాకపోతే తాను ఇప్పుడు యాక్షన్ కథా చిత్రాల్లో నటించడం వల్ల ఇందులో నటించలేనన్నారు. యువ నటుడు నటిస్తే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారన్నారు. హీరోగాఅలా ఈ చిత్రంలో నటించడానికి దర్శకుడు రత్నకుమార్.. విదూతో ఆడిషన్ నిర్వహించారన్నారు. జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రానికి ముందయితే ఈ మూవీలో విదూని హీరోగా తాను అంగీకరించేవాడిని కాదన్నారు. జిగర్తాండ డబుల్ ఎక్స్, రెట్రో చిత్రంలో నటించి అతను తన నటనా ప్రతిభను నిరూపించుకున్నారని చెప్పారు. -
ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా? ఎలా మారిపోయిందో!
సినిమా రంగుల ప్రపంచం. ఇక్కడ తారలు అందాన్ని కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు డైటింగ్ పేరుతో నచ్చింది తినలేరు. శరీరాకృతిని నియంత్రించుకోవడానికి, వీలైతే జీరో సైజ్కు మారడానికి కసరత్తులు చేస్తుంటారు. ఎక్కువ సమయం జిమ్, స్విమ్మింగ్పూల్లో గడుపుతుంటారు. కొందరు యోగా కూడా చేస్తుంటారు. ఇన్ని చేసినా, అందరూ స్టార్ హీరోయిన్లు అవుతారా ? అంటే అది వారి అదృష్టంపైనే ఆధారపడి ఉంటుంది.పెళ్లి తర్వాత సినిమాలకు దూరంఅలా అందం, అభినయంతో ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలిగింది అలనాటి నటి రాధ. ఈమె సోదరి అంబిక కూడా హీరోయిన్గా రాణించారు. అయితే రాధ వివాహానంతరం నటనకు స్వస్తి పలికారు. ఆమెకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కూతుళ్లు ఇద్దరూ తల్లి బాటలోనే పయనించే ప్రయత్నం చేశారు. పెద్ద కూతురు కార్తీక.. జీవాకు జంటగా నటించిన కో చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అయితే తొలి చిత్రం తరువాత మంచి విజయాలు లేక కనుమరుగయ్యారు. అలా కనిపించి ఇలా కనుమరుగురాధ రెండవ కూతురు తులసి 14 ఏళ్ల వయసులోనే మణిరత్నం దర్శకత్వం వహించిన కడల్ చిత్రం ద్వారా కథానాయికగా రంగప్రవేశం చేశారు. అయితే తొలి చిత్రంతోనే అపజయాన్ని చవి చూసింది. దీంతో ఈమె కూడా తిరుగు టపా కట్టాల్సి వచ్చింది. ఇలా ఒక స్టార్ హీరోయిన్ వారసురాళ్లు సినిమా రంగంలో నిలదొక్కుకోకపోవడం ఆశ్చర్యమే. ఆ మధ్య కార్తీక వివాహం జరిగింది. ఆ సమయంలో తులసి రూపం చూసి తనేనా? అని ఆశ్యర్యపోయారు. బొద్దుగా తులసితాజాగా భారీకాయంతో ఉన్న తులసి ఫొటోలిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఇంకా పెళ్లి కాని ఈ అమ్మడి వయసు 28 ఏళ్లే. నటి రాధ వివాహానంతరం బరువు పెరిగితే, ఆమె కూతురు పెళ్లికి ముందే ఇలా బరువు పెరగడంతో తనకేమైందని అభిమానులు ఆరా తీస్తున్నారు. Tulasi Nair ( Radha 's Daughter & Kadal Movie Heroine ) Now And Then ! pic.twitter.com/EOassELTJ2— TamilaninCinema Akilan (@TamilaninCinema) December 8, 2025 -
మన సినిమా ప్రాంతీయం కాదు... జాతీయం!.. అగ్ర నటుడు కమల్ హాసన్
అరచేతిలోని స్మార్ట్ ఫోన్లోనే అన్ని భాషల, ప్రాంతాల సినిమాలు, సీరియళ్ళు, ఓటీటీలు అందుబాటులోకి వచ్చేసిన నేపథ్యంలో... ప్రపంచం అక్షరాలా ఓ కుగ్రామమైంది. విభజనలు, సరిహద్దులు చెరిగిపోయి వినోద పరిశ్రమలో ఎన్నడూ లేని మార్పులు వస్తున్నాయి. ప్రముఖ సినీ నటుడు, పార్లమెంటు సభ్యుడు, ‘పద్మభూషణ్’ కమల్ హాసన్ ఆ సంగతే మరోసారి స్పష్టం చేశారు.“ప్రాంతీయ సినిమా ఇవాళ ఎంతో మారిపోయింది. నిజం చెప్పాలంటే, ప్రాంతీయ సినిమా... ఇప్పుడు సరికొత్త జాతీయ స్థాయి సినిమాగా అవతరించింది. అలాగే, స్థానిక సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఆ ప్రాంతపు మట్టి నుంచి పుట్టి, స్థానిక మూలాలపై తీస్తున్న సినిమా... నూతన అంతర్జాతీయ సినిమాగా మారిపోయింది. ఇవాళ మచిలీపట్నం, మదురై, మళప్పురమ్, మాండ్య... ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో పుట్టిన కథలు సైతం కేవలం ప్రాంతీయ సినిమాలుగా మిగిలిపోవడం లేదు. అవి జాతీయస్థాయి సాంస్కృతిక సంరంభాలుగా మారుతున్నాయి” అని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు.బడ్జెట్ కాదు... నిజాయతీ ముఖ్యం!కర్ణాటకలోని కోస్తా ప్రాంత్రంలోని స్థానిక సంస్కృతికి అద్దంపడుతూ, ‘భూతకోల’ సంప్రదాయం ఆధారంగా అల్లుకున్న ఓ జానపద కథ లాంటి సినిమా ‘కాంతార’ ఇవాళ దేశమంతటినీ ఊపేయడం అందుకు ఓ ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. అలాగే, కుటుంబాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఓ సాధారణ వ్యక్తి అసాధారణ రీతిలో సాగిన మలయాళ చిత్రకథ ‘దృశ్యం’ భాషలు, ప్రాంతాల సరిహద్దులు దాటేసిన సంగతి కమలహాసన్ గుర్తు చేశారు.‘‘తెలుగులో వచ్చిన ‘బాహుబలి’, ‘పుష్ప’ లాంటివి ఇవాళ ముంబయ్ నుంచి మలేసియా దాకా ప్రతి ఒక్కరి దైనందిన జీవిత భాషలో భాగమైపోయాయి. తమిళం నుంచి వచ్చిన ‘విక్రమ్’, ‘అమరన్’ లాంటి చిత్రాలు సరిహద్దులు దాటి విజయం సాధించాయి. ఈ విజయాలకి కారణం సింపుల్... కథలు మన మట్టిలో నుండి పుట్టడమే. ఇవాళ బడ్జెట్ కాదు... స్థానికతను బలంగా చూపిస్తూనే సార్వత్రికంగా అందరినీ కదిలించే నిజాయతీతో కూడిన కథలు కీలకం. అవే భాషలు, ప్రాంతాల సరిహద్దుల్ని దాటేస్తాయి. ప్రామాణికత అనేది ఎప్పటికీ మురిగిపోని, ఎక్కడైనా చెల్లుబాటయ్యే కరెన్సీ లాంటిదని ఇది నిరూపిస్తోంది’’ అంటూ జాతీయ స్థాయిలో మన దక్షిణాది సినిమా కథలు సృష్టిస్తున్న సంచలనంపై ఆయన తన విశ్లేషణ అందించారు.ఆ తేడా పోయింది..! ఇప్పుడు తెర కాదు... కథ కీలకం!!దక్షిణాది వినోద మార్కెట్పై దృష్టి కేంద్రీకరిస్తూ, ‘జియో – హాట్ స్టార్’ నాలుగు దక్షిణాది భాషల్లో సరికొత్త సొంత కంటెంట్తో ముందుకొస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరిగిన ‘సౌత్ అన్ బౌండ్’ వేడుకలో ఈ అగ్రేసర దక్షిణాది నటుడు మాట్లాడుతూ, “భారతీయ వినోద రంగం అభివృద్ధి చెందడమే కాదు... ఓటీటీ సహా అనేక వాటితో సమూలంగా మారిపోతోంది. ఇవాళ ఏ కథ, ఏ తెర మీద చూస్తున్నామనే తేడా పోయింది. వినోద రంగంలో తొలిసారిగా ప్రేక్షకులే ఫ్లాట్ ఫాంగా మారుతున్న రోజులివి. కథలనేవి ఇక తెరకు మాత్రమే పరిమితం కాదు. ప్రజలు, ప్రేక్షకులతో కథలు ప్రయాణం చేయాలి. మన మూలాలతో కూడిన కథలను అందరికీ అందించేందుకు కృషి చేయాలి’’ అని కమల్ పేర్కొన్నారు. “అలాగే, తెరపై కథలను అందంగా చెప్పడం ప్రతిభతో ఆగిపోకూడదు. ఈ కథలను అత్యధిక మందికి చేరువ చేయడానికి సరైన నాయకత్వం అవసరం. ఈ విషయంలో జియో -హాట్ స్టార్ కీలక పాత్ర పోషిస్తుందని నమ్ముతున్నాను. వారు దక్షిణాదిని ఒక మార్కెట్ గా కాకుండా, క్రియేటివ్ గ్రావిటీగా చూడడం హర్షించదగ్గ విషయం’’ అని కమల్ అభినందించారు.“ప్రపంచ సినిమా ఇప్పుడు భారతదేశం వైపు చూస్తోంది. మన భారతీయ మూలాలతో కూడిన కథలను ప్రపంచానికి అందించడానికి ఇది సరైన సమయం. యువతకు నేను చెప్పేది ఏమిటంటే, ప్రపంచ సినిమాలో మన కళాకారులు సత్తా చాటాలి. అదే నా కోరిక” అని ఆయన అన్నారు. -
అజిత్ ఆశీర్వాదం తీసుకున్న హీరో శింబు
సినిమా హీరోలకు అభిమానులు ఉండడం సహజమే. అయితే ఒక నటుడికి మరో నటుడు అభిమానం కావడం కాస్త అరుదు. అలా సినీ పరిశ్రమలో వివాదరహితుడిగా పేరు గాంచిన స్టార్ హీరో అజిత్కు శింబు వీరాభిమాని కావడం విశేషం. ఈ విషయాన్ని శింబు బహిరంగంగానే పలు వేదికలపై చెప్పారు. ఒక నటుడిగా తనకు అజిత్ మార్గదర్శి అని చెప్తూ ఉంటారు. తాజాగా శింబు.. అజిత్పై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఫేవరెట్ హీరోను కలిసిన శింబుఅజిత్ సినిమాలతోపాటు కార్ రేస్లపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు అంతర్జాతీయ కార్ రేసుల్లో పోటీ చేసి పథకాలను పొందారు. తాజాగా మలేషియాలో జరుగుతుననన్న కార్ రేస్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఓ ఈవెంట్ కోసం మలేషియా వెళ్లిన శింబు ప్రత్యేకంగా అజిత్ను కలిసి ఆయనకు తన మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన అజిత్ జట్టు కోసం చేసిన జెర్సీ ధరించడం విశేషం.ఆశీర్వాదంశింబు తాజాగా వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ అనే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని అజిత్కు తెలిపి, ఆయన ఆశీస్సులు అందుకున్నారు. దాదాపు 20 ఏళ్ల తరువాత ఇలా అజిత్, శింబు కలుసుకోవడం మరో విశేషం. అజిత్తో కలిసి శింబు దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆ డైరెక్టర్తో వన్స్ మోర్అజిత్ మలేషియాలో జరుగుతున్న కార్ రేస్ ముగిసిన తరువాత తన తర్వాతి చిత్రంలో నటించడానికి సిద్ధమవుతారని తెలిసింది. ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. వీరి కాంబోలో ఇంతకుముందు గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రం వచ్చిందన్న విషయం తెలిసిందే! #SilambarasanTRமலேசியா Racing Circuitல் அஜித் குமாரை சந்தித்த சிம்பு#Simbu #Silambarasan #AK #Ajithkumar #AjithKumarRacing #Ajith #Malaysia #STR #Atman pic.twitter.com/OqE9vo7ptB— Actor Kayal Devaraj (@kayaldevaraj) December 6, 2025 -
'తెలుగు ఇండస్ట్రీకి లేని భయం మనకెందుకు'.. హీరో కార్తీ ఆసక్తికర కామెంట్స్..!
కోలీవుడ్ స్టార్ కార్తీ ప్రస్తుతం వా వాతియార్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ మూవీకి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ చిత్రాన్ని అన్నగారు వస్తారు అనే టైటిల్తో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చెన్నైలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన హీరో కార్తీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగు, మలయాళ ఇండస్ట్రీలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించారు. తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి భయం లేకుండా భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారని అన్నారు. అలాగే మలయాళ ఇండస్ట్రీలోనూ ప్రత్యేకమైన కథలు వస్తున్నాయని కార్తీ కొనియాడారు.మరి కోలీవుడ్ ఇండస్ట్రీకి ప్రత్యేక గుర్తింపు ఎక్కడ? అని కార్తీ ప్రశ్నించారు. వాళ్లలాగా మనం అద్భుతాలు ఎందుకు చేయలేకపోతున్నామో ఆలోచించాలని హితవు పలికారు. మనకంటూ ప్రత్యేక గుర్తింపు రావాలంటే.. భయానికి దూరంగా ఉండాలన్నారు. అప్పుడే మనం కొత్త ఆవిష్కరణలు చేయడానికి వీలవుతుందని సూచించారు. సరిహద్దులు చెరిపేసి తమిళ సినిమాను ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని కార్తీ వెల్లడించారు.(ఇది చదవండి: భారీ ధరకు ది రాజాసాబ్ ఓటీటీ డీల్.. ఎన్ని కోట్లంటే?)అంతేకాకుండా ఓ నటుడిగా వా వాతియార్ తనకు రిస్కీ సబ్జెక్ట్ అని కార్తీ అన్నారు. ఈ సినిమా కత్తితో సావాసం చేయడం లాంటిదని.. తమిళ నటుడు దివంగత ఎంజీఆర్ను అనుకరించడాన్ని ఉద్దేశించి కార్తి మాట్లాడారు. దర్శకుడు నలన్ కుమారస్వామి కథ చెప్పినప్పుడు నటించేందుకు సందేహించా.. కానీ తర్వాత ఓకే చెప్పానని తెలిపారు."I always think that Telugu makers are doing big films & Malayalam makers are doing different films.. What's the identity of Tamil films..? We can't do new things if we are scared to try.. We need to break the barriers.."- #Karthi at #VaaVaathiyaar Event pic.twitter.com/5QIyqfr14L— Laxmi Kanth (@iammoviebuff007) December 8, 2025 -
ప్రియుడితో బ్రేకప్! పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్!
ఐదేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతోంది హీరోయిన్ నివేదా పేతురాజ్. మధురైలో పుట్టి దుబాయ్లో పెరిగిన ఈ బ్యూటీ ఈ ఏడాది ఆగస్టులో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. దుబాయ్కు చెందిన వ్యాపారవేత్త రజిత్ ఇబ్రాన్తో రిలేషన్లో ఉన్నట్లు వెల్లడించింది. ఇంట్లో పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని, వచ్చే ఏడాది జనవరిలో పెళ్లి చేసుకోబోతున్నామని గుడ్న్యూస్ చెప్పింది.బ్రేకప్కానీ ఈ పెళ్లి పట్టాలెక్కేట్లు కనిపించడం లేదు. వీరిద్దరూ జంటగా కలిసున్న ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించారు. అంతేకాదు, నివేదా, రజిత్ ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసుకున్నారు. దీంతో క్రికెటర్ స్మృతి మంధానలాగే వీరి పెళ్లి కూడా రద్దయినట్లే అని నెటిజన్లు భావిస్తున్నారు. దీనిపై నివేదా పేతురాజ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.సినిమానివేదా పేతురాజ్.. ఒరు నాల్ కూతు అనే తమిళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మెంటల్ మదిలో మూవీతో తెలుగులో రంగప్రవేశం చేసింది. చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, పాగల్, దాస్ కా ధమ్కీ, బూ వంటి చిత్రాల్లో నటించింది. ఓటీటీలో పరువు, కాలా అనే వెబ్ సిరీస్లలో యాక్ట్ చేసింది. ఒకానొక సమయంలో కాల్షీట్స్ సమస్య కారణంగా జూనియర్ ఎన్టీఆర్తో నటించే ఛాన్స్ చేజార్చుకుంది.చదవండి: పవన్ కల్యాణ్ అసలు ఆర్మీ జవానే కాదు: సైనికుడు -
బయోపిక్లో తమన్నా.. ఫస్ట్లుక్ పోస్టర్ విడుదల
దక్షిణాదితో పాటు బాలీవుడ్లో కూడా తమన్నా భాటియా సత్తా చాటుతుంది. తాజాగా ఆమె ఒక బయోపిక్లో హీరోయిన్గా ఎంపికైంది. ఈమేరకు ఒక పోస్టర్ను షేర్ చేశారు. ప్రముఖ దర్శక–నిర్మాత, నటుడు, స్క్రీన్ రైటర్, ఎడిటర్ వి.శాంతా రామ్ జీవితం వెండితెరపైకి రానున్న విషయం తెలిసిందే. ‘వి.శాంతారామ్: ది రెబల్ ఆఫ్ ఇండియన్ సినిమా’ టైటిల్తో ఈ బయోపిక్ రానుంది. సిద్ధాంత్ చతుర్వేది ఆయన పాత్రలో నటించనున్నారు. ఈ బయోపిక్లో తమన్నా భాగమైంది.అభిజీత్ శిరీష్ దేశ్పాండే దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను రాహుల్ కిరణ్ శాంతారామ్, సుభాష్ కాలే, సరితా అశ్విన్ వర్దే నిర్మించనున్నారు. వి.శాంతారామ్ సతీమణి జయశ్రీ పాత్రలో తమన్నా కనిపించనున్నారు. 1921లో నటుడిగా చిత్రరంగప్రవేశం చేసిన శాంతారామ్ మూకీ, టాకీలు అన్నీ కలిపి 25 చిత్రాల్లో నటించగా.. సుమారు 90 సినిమాలు నిర్మించారు. చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ, 1985 లో కేంద్ర ప్రభుత్వం ‘దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంను బహూకరించింది. ఆయన అక్టోబరు 18, 1990 వ సంవత్సరంలో మరణించారు.The star of an era ✨The strength behind a legacy 🎞️A chapter returning to history. 🌟@SiddyChats #SubhashKale @unbollywood @rajkamalent @SaritaTanwar #VShantaram #TheRebelOfIndianCinema pic.twitter.com/YtEdBiSAGr— Tamannaah Bhatia (@tamannaahspeaks) December 9, 2025 -
గాయపడిన సినీ నటుడు రాజశేఖర్
ప్రముఖ సినీ హీరో రాజశేఖర్ మూవీ షూటింగ్లో గాయపడ్డారు. నవంబర్ 25న కొత్త సినిమా సెట్స్లో చిత్రీకరణ జరుగుతుండగా ఆయన ప్రమాధానికి గురయ్యారు. మేడ్చల్ దగ్గరలో యాక్షన్ సీక్వెన్స్లో పాల్గొన్న ఆయన కాలికి గాయలయ్యాయి. తన కుడి కాలి మడమ దగ్గర గాయమయినట్లు తెలిసింది. అయితే, వెంటనే రాజశేఖర్ను ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్స చేయించినట్లు తన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే శస్త్ర చికిత్స విజయవంతమైందని సినీ యూనిట్ వెల్లడించింది.రాజశేఖర్ కు కొన్ని నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తమిళ రీమేక్ మూవీ ‘లబ్బర్ పందు‘లో నటిస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్లో భాగంగానే రాజశేఖర్ గాయపడినట్టు సమాచారం. శర్వానంద్ బైకర్ మూవీలో కూడా ఆయన కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. -
క్లిష్ట పరిస్థితుల్లో తమిళ సినిమా .. అలాంటి నిర్మాతలే లేరు
పెద్ద చిత్రాలు ఆడడం లేదు, చిన్న సినిమాలకు థియేటర్లు లభించడం లేదని, నిర్మాతలకు పెట్టుబడి కూడా రావడం లేదని, ఓటీటీ సంస్థలు చిత్రాలను కొనుగోలు చేయకపోవడంతో తమిళసినిమా చాలా క్లిష్ట పరిస్దితుల్లో ఉందని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ , తమిళనాడు థియేటర్ల సంఘం అధ్యక్షుడు తిరుపూర్ సుబ్రమణియమ్ పేర్కొన్నారు. ఈయన సినిమాల వసూళ్లు, నిర్మాతల పరిస్థితి, థియేటర్ల కష్టాలు, డిస్ట్రిబ్యూటర్ల భారం తదితర విషయాలపై వాస్తవాలను చెప్పగలిగిన అనుభజ్ఞుడు. ఆయన ఆదివారం తమిళసినిమా పరిస్థతులపై ఒక వీడియోను విడుదల చేశారు. అందులో నిర్మాతలు, థియేటర్ల యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్ల విషయంలో గత రెండు నెలలుగా సినిమా పరిస్థితులు దారుణంగా మారాయని తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో కొన్ని పెద్ద చిత్రాలు విడుదల కానున్నాయని, ఆ తరువాత శాసన సభ ఎన్నికలు జరగనున్నాయని వివరించారు. ఆపై భారీ చిత్రాలు లేవని, ముఖ్యంగా చిత్ర నిర్మాణ సంఖ్య తగ్గిపోతోందన్నారు. ఇందుకు కారణం నిర్మాతలు తమ చిత్రాలను వెంటనే ఓటీటీకి ఇవ్వడమేనన్నారు. దీంతో థియేటర్ల యాజమాన్యం బాధింపులకు గురవుతోందన్నారు. ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గుతోందన్నారు. ఒక చిత్రం విడుదలైన 8 వారాల తరువాత ఓటీటీల్లో స్ట్రీమింగ్ చూడండని ఎంతగా చెబుతున్నా ఎవరూ వినడం లేదన్నారు. యాక్టివ్ నిర్మాతల సంఘంలోని కొందరి మొండితనం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని, ఆ నలుగురైదుగురి కారణంగానే సినిమా పరిస్థితి క్లిష్టంగా మారుతోందన్నారు. అయితే ఇప్పుడు వారి చిత్రాలనే ఓటీటీ సంస్థలు కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నాయని తెలిపారు. ఇతర చిత్ర పరిశ్రమల కంటే తమిళసినిమా పరిస్థితి చాలా దారుణంగా మారుతోందని, ప్రముఖ నటులకు భారీ పారితోషకాలు ఇచ్చే నిర్మాతలు లేరని తెలిపారు. ఎదుగుతున్న నటీనటులు అధిక పారితోషికాలు డిమాండ్ చేస్తున్నారని, అందువల్ల చాలా మంది నిర్మాతలు ముఖ్య నగరాల్లోనే తమ చిత్రాలను విడుదల చేస్తున్నారని తెలిపారు. చిన్న గ్రామాలకు సినిమాలు రావడం లేదని, థియేటర్లు మూత బడుతున్న పరిస్థితి ఉందన్నారు. అధిక ప్రింట్స్ వేస్తే అధిక ఖర్చు, ఆదాయం రావడం లేదని నిర్మాతలు అంటున్నారని తెలిపారు. ఈ సమస్యలపై చర్చించడానికి మంగళవారం ఆన్లైన్ మీటింగ్ను నిర్వహిస్తున్నామని డి్రస్టిబ్యూటర్ తిరుపూర్ సుబ్రమణియమ్ పేర్కొన్నారు. -
ఆస్తి మొత్తం తిరుమలకు ఇచ్చిన నటి.. ఇప్పుడు ఆటోలోనే ప్రయాణం
అలనాటి సినీ నటి కాంచన(86) అసలు పేరు వసుంధర.. చాలారోజుల తర్వాత చెన్నైలో కనిపించారు. ఏవీఎం స్టూడియో అధినేత శరవణన్ మరణించడంతో నివాళి అర్పించేందుకు ఆమె వచ్చారు. అత్యంత సాధారణంగా ఆటో నుంచి దిగిన ఆమె అంతే సింపుల్గా తిరిగి మరో ఆటోలో వెళ్లిపోయారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న అందరికీ నమస్కరిస్తూ… ఒక్కతే తిరుగు పయణమయ్యారు. ఇప్పుడు సోషల్మీడియాలో అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.బ్రహ్మచారిణిగా..60, 70వ దశకంలో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు కాంచన. ఎయిర్ హోస్టెస్గా ఉద్యోగం చేసే ఆమె సినిమాల దిశగా అడుగులు వేసి సక్సెస్ అయ్యారు. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించిన ఆమె పలువురు స్టార్ హీరోలతో జోడీ కట్టారు. హుషారైన పాత్రలు చేసి ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు. ప్రేమనగర్, శ్రీకృష్ణావతారం , ఆనంద భైరవి, అర్జున్ రెడ్డి వంటి సినిమాల్లో నటించారు. బ్రహ్మచారిణిగా తన జీవితాన్ని గడిపారు. ఆమెది తెలుగు కుటుంబమే.. కానీ, పుట్టింది చెన్నైలో ఎయిర్ హోస్టెస్గా ఉద్యోగం చేస్తూ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఎన్నో హిట్స్ ఇచ్చారు.ఆమె జీవితం గురించి తెలుసుకుంటే నూటికో కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారనిపిస్తుంది. చెన్నైలో ఒకప్పుడు దర్జాగా బతికిని ఆమె ప్రస్తుతం బెంగుళూరు శివారు ప్రాంతంలో చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు. తన ఇంటికి దగ్గరలో ఉన్న ఒక గుడిలో ఆధ్యాత్మిక సేవలో అత్యంత సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్నారు.తల్లిదండ్రులే శత్రువులయ్యారుతన తల్లిదండ్రుల గురించి కాంచన ఇలా చెప్పారు.. 'జీవితంలో ఎన్నో పరుగులు తీశాను.. చివరికి ఒంటరిదాన్నయ్యాను. నా తల్లిదండ్రులు పిన్ని కొడుకుపై ఎక్కువ మక్కువ చూపేవారు. వాడు చెప్పినట్లు అమ్మానాన్న ఆడేవారు. వాడు నేను సంపాదించిన ఆస్తి మొత్తం దక్కించుకోవాలని చూశాడు. ఇప్పటికే చాలావరకు వాడుకున్నాడు. 1996 డిసెంబర్లో ఇంట్లో నుంచి బయటకు వచ్చేశా. అమ్మానాన్న మారుతారేమోనని ఎదురుచూశా. కానీ వాడిని నమ్మి నన్నే మోసం చేశారు. ఆస్థి కోసం ఇప్పటికీ కోర్టులో పోరాడుతూనే ఉన్నాను. జీవితంలో నాకంటూ ఎవరూ లేరని బాధపడను. నాకు భగవంతుడు తోడున్నాడు' అని కన్నీళ్లు పెట్టుకున్నారు కాంచన. తన తల్లిదండ్రులు, దాయాదుల వల్లే సినిమాలు చేయడం ఆపేశానన్నారు. 1983లోనో 84లోనే ఇండస్ట్రీని కాంచన వదిలేశారు.అర్జున్రెడ్డి కోసం 40 ఏళ్ల తర్వాత..సుమారు 40 ఏళ్లతర్వాత ఆమె అర్జున్ రెడ్డిలో కనిపించారు. సందీప్ రెడ్డి, విజయ్ దేవరకొండ ఒకరోజు తనను చూడ్డానికి వెళ్లారు. ఆ సమయంలోనే ఆమెతో సినిమా గురించి చెప్పారు. అర్జున్రెడ్డివలో నానమ్మగా చేయాలని కోరారు. కథ బాగుందని ఆమె ఓకే చేశారు. సినిమాలపై వారిద్దరూ చాలా ఉత్సాహంగా కనిపించారని, అందుకే ఇన్నేళ్ల తర్వాత నటిస్తున్నట్లు ఆమె చెప్పారు.తిరుమల శ్రీనివాసుడికి రూ. 100 కోట్లుజీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన కాంచన.. అన్నీ ఉండి కూడా ఏమీ లేని వ్యక్తిలా మిగిలిపోయారు. 1983లో దాయాదులు తన అస్తి లేకుండా చేశారు. అయినా కూడా ఆమె మళ్లీ నిలదొక్కుకున్నారు. చెన్నైలో కలియుగ దైవం వేంకటేశ్వరుడికి కోట్ల విలువ చేసే స్థలం ఇచ్చారు. 2010లో టీటీడీకి మరో రూ. 15 కోట్లు విరాళం ఇచ్చారు. ఇప్పుడు వాటి విలువ రూ. 100 కోట్ల పైమాటేనని ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. తన మదిలో ఎప్పుడూ వేంకటేశ్వరున్ని ధ్యానిస్తూనే ఉంటానని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.ప్రస్తుతం ఎవరు చూసుకుంటున్నారు?కాంచనను ప్రస్తుతం తన చెల్లెలు చూసుకుంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన చెల్లెలు, మరిది వాళ్లంతా అండగా ఉన్నారని చెప్పారు. చాలామంది ఊహించుకుంటున్నట్లు దయనీయ స్థితిలో లేనని, దేవుడి దయ వల్ల చాలా బాగున్నానని ఆమె పంచుకున్నారు. ప్రశాంతంగా పూజ చేసుకుంటూ.. నిత్యం భగవంతుడి ధ్యానంలోనే ఉంటానని తెలిపారు. View this post on Instagram A post shared by Thirumala_thirupathi (@thirumalahills_thirupathi) -
నాకు పెళ్లి ఎప్పుడో అయిపోయింది: శింబు
నాలుగు పదులు దాటినా ఇంకా పెళ్లి ఊసెత్తని హీరోల్లో శింబు ఒకరు. ఈ తమిళ హీరో గతంలో నయనతార, హన్సిక వంటి హీరోయిన్లతో ప్రేమలో పడ్డాడు కానీ ఆ ప్రేమ పెళ్లి పట్టాలెక్కకముందే బ్రేకప్ అయింది. ప్రస్తుతం సినిమాలపైనే ఫోకస్ పెట్టిన ఈ హీరో ప్రేమ, పెళ్లిని కాస్త సైడ్కు నెట్టేశాడు. ఇదే విషయాన్ని తాజాగా ఓ ఈవెంట్లోనూ కాస్త ఫన్నీగా చెప్పాడు.అందరి నోటా ఒకటే ప్రశ్నమలేషియాలో ఓ కార్యక్రమానికి హాజరైన శింబుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీ పూలమాలతో సాదరంగా ఆహ్వానించారు. తర్వాత అక్కడే ఉన్న ఓ యాంకర్.. సర్, అందరూ ఒకటే అడుగుతున్నారు.. అదే మీ పెళ్లెప్పుడు? అని మెల్లిగా కూపీ లాగింది. ఆల్రెడీ అయిపోయిందిగా!అందుకు శింబు నవ్వుతూ.. అదేంటి, నాకు ఆల్రెడీ 120 సార్లు పెళ్లయిపోయిందిగా! అని జోక్ చేస్తూనే జీవితంలో ఎప్పుడు ఏది జరగాలనుంటే అది జరుగుతుంది అని బదులిచ్చాడు. లైఫ్లో ఒంటరిగా ఉన్నామా? ఒకరితో బంధాన్ని కలుపుకున్నామా? అన్నది ముఖ్యం కాదు. మనం మంచిగా ఉంటే అంతే చాలు అన్నాడు. అరసన్ మూవీతర్వాత అభిమానుల కోరిక మేరకు ఓ తమిళ పాటను ఆలపించాడు. ఇకపోతే ప్రస్తుతం శింబు 'అరసన్' (తెలుగులో సామ్రాజ్యం) సినిమా చేస్తున్నాడు. వేట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ రేపోమాపో ప్రారంభం కానుంది. ఇందులో విజయ్ సేతుపతి, సముద్రఖని, కిషోర్, ఆండ్రియా జెర్మియా తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు.చదవండి: రీతూ ఎలిమినేషన్కు కారణాలివే! -
వైకల్యం, అవమానాలు అధిగమించి గీత రచయితగా..
ఒక పాటలో కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు అన్నారో కవి. అది పాటకే పరిమితం కాదు, వాస్తవం. ప్రపంచంలో చాలా మంది తమలోని వైకల్యాన్ని అధిగమించి అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. పలు అవమానాలను, అవహేళనలను దాటుకుని అకుంఠిత దీక్షతో ఎదిగిన వారెందరో.. అలాంటి స్ఫూర్తిదాయకులు అన్ని రంగాల్లోనూ ఉంటారు. అలా తన వైకల్యాన్ని అధిగమించి గీత రచయితగా రాణిస్తున్న కవి కరుణాకరన్. ఆత్మస్థైర్యం ఎక్కువఈయనకు రెండు కాళ్ళు పని చేయవు. వీల్చైర్లోనే కూర్చుంటారు. బాహ్య ప్రపంచాన్ని చూడాలంటే ఒక వ్యక్తి సాయం అవసరం. అయితే కరుణాకరన్కు ఆత్మస్థైర్యం ఎక్కువ. అందుకు కారణం తనకున్న ప్రతిభ. ముఖ్యంగా సినీ సాహిత్యంపై మంచి పట్టు ఉన్న రచయిత. అయితే ప్రతిభ ఉన్నంత మాత్రాన అవకాశాలు రావు. అందుకోసం నిరంతర శ్రమ, పట్టుదల, ప్రయత్నం అవసరం. ఈయన పాటలు ఏం రాస్తారులే?అంగవైకల్యం అనే లోపం వల్ల చాలా అవమానాలను, అవహేళనలను ఎదుర్కొన్నానని అంటున్న కరుణాకరన్ ఇప్పుడు ప్రముఖ సినీ గీతా రచయితగా రాణిస్తున్నారు. పోరాడే గుణం మాత్రమే అపజయాలను చెదరగొడుతుంది అంటున్న ఈయన తన సినీ ప్రయాణమే ఒక పోరాటం అన్నారు. దివ్యాంగుడైన ఈయన పాటలు ఏం రాస్తారులే అని పలువురు పరిహాసం చేశారన్నారు. అలా సినీ ఎంట్రీఅలా తన ఆత్మవిశ్వాసంపై దెబ్బ కొట్టిన ఘటనలను అధిగమించి, పలువురు తనపై ఉంచిన నమ్మకంతో, ఆత్మస్థైర్యంతోను ఈ స్థాయికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. భగవంతుడు, దివంగత ప్రఖ్యాత గీత రచయిత కన్నదాసన్ మార్గ దర్శకత్వం, తన అన్వేషణ, ప్రతిభ, ప్రయత్నాలతోనే సినీ రంగ ప్రవేశం చేశానన్నారు. వల్లభ ఫస్ట్ మూవీదివంగత ప్రముఖ గీత రచయిత వాలి తనకు గొప్ప శక్తి అని పేర్కొన్నారు. తనను ఆదరిస్తున్న దర్శకులకు, సంగీత దర్శకులకు, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. హీరో శింభు నటించిన వల్లభ చిత్రం ద్వారా ఈయన గీత రచయితగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు అవరోధాలను అధిగమించి పలు చిత్రాలకు పాటలు అందించారు. మంచి పేరుఇటీవల విడుదలైన నిర్వాకం పొరుప్పల్ల, కిణరు చిత్రాలకు ఈయన రాసిన పాటలకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం విశాల్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న మకుటం చిత్రం, వెబ్ టుడే తదితర చిత్రాలకు కరుణాకరం పాటలను రాస్తున్నారు అదేవిధంగా తెలుగు, మలయాళం, హిందీ ఇతర భాషల నుంచి అనువాదం అవుతున్న చిత్రాలకు ఈయన మాటలు, పాటలు అందిస్తున్నారు. -
25 ఏళ్ల తరువాత మళ్లీ తెరపైకి పడయప్పా
తమిళసినిమా: గతంలో మంచి విజయాన్ని సాధించిన చిత్రాలు ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ అవుతున్నాయి. అలా తాజాగా నటుడు రజినీకాంత్ నటించిన పడియప్పా చిత్రం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈనెల 12వ తేదీన రీ రిలీజ్ కానుంది. దివంగత నటుడు శివాజీ గణేషన్ ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రంలో సౌందర్య, రమ్యకృష్ణ, సెంథిల్ , మణివన్నన్, అబ్బాస్ తదితరులు పోషించారు. కే ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. 1999 ఏప్రిల్ పదవ తేదీన విడుదలైన ఈ చిత్రం రజనీకాంత్ వజ్రోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఈనెల 12వ తేదీన 4కె సౌండ్ ట్రాక్ లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీ రిలీజ్ కానుంది. కాగా ఇంతకుముందు సంచలన విజయాలు సాధించిన కమలహాసన్ హీరోగా నటించిన నాయకన్, చేరన్ నటించిన ఆటోగ్రాఫ్, విజయ్ సూర్య కలిసి నటించిన ఫ్రెండ్స్ వంటి కొన్ని చిత్రాలు రీ రిలీజ్ అయ్యి పెద్దగా వసూళ్లను సాధించలేకపోయాయి. కాగా కోలీవుడ్లో ఎంజీఆర్, శివాజీ గణేషన్ నటించిన చిత్రాల రీ రిలీజ్ కే ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. అలాంటిది ఇప్పుడు రజినీకాంత్ నటించిన పడయప్పా చిత్రం రీ రిలీజ్ ఏ మేరకు వసూళ్లను సాధిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. -
మనస్సాక్షి లేదా? ప్రజలంటే అంత చులకనా?
ఈ ఏడాది జరిగిన అత్యంత విషాదకర ఘటనల్లో కరూర్ తొక్కిసలాట ఒకటి. హీరో, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ తమిళనాడులోని కరూర్లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. ఎంతోమంది గాయపడ్డారు. ఈ విషాదంపై సినీనటులు, రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విజయ్తో కలిసి జిల్లా మూవీలో యాక్ట్ చేసిన వినోదిని.. విజయ్కు నటుడిగా సపోర్ట్ చేస్తానని, కానీ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడని ప్రశ్నించింది.జనాలను పట్టించుకోవడం దండగఈమధ్య ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. జనాలను పట్టించుకోవడం దండగ అని ఈ మధ్యే అర్థమైంది. వాళ్లకోసం మాట్లాడి ఉపయోగం లేదు. వాళ్లతో మాట్లాడినప్పుడు ఆ విషయం నాకు మరోసారి స్పష్టంగా అర్థమైంది. ఉదాహరణకు కరూర్ తొక్కిసలాటనే తీసుకోండి.. 41 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వాళ్ల కుటుంబాలు కూడా అదంతా మర్చిపోయి మామూలుగా ఉన్నారు. అలాంటివారి కోసం నేనెందుకు నిలబడాలి? అని మాట్లాడింది. నటి ఆగ్రహంఈ వ్యాఖ్యలపై బిగ్బాస్ బ్యూటీ, నటి సనం శెట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల బాధను ఎందుకని అవమానిస్తున్నారు? మీకు మనస్సాక్షి అనేదే లేదా? మీరేమైనా కరూర్ బాధితులను నేరుగా కలిశారా? మాట్లాడారా? వాళ్ల సమస్యలేంటో అడిగి తెలుసుకున్నారా? సమస్యను అర్థం చేసుకోవడం పక్కనపెట్టి విజయ్ సర్ను అరెస్ట్ చేయలేదని ఎక్కువ ఫీలవుతున్నట్లున్నారు.బీపీ వచ్చిందిజయలలిత లాంటి నాయకురాలు రాజకీయాల్లో మళ్లీ కనిపించరా? అని అడుగుతుంటారు కదా! ఇదే దానికి సమాధానం. ప్రజలకు విలువ ఇవ్వని నాయకులు ఎక్కడ ఎదుగుతారు? ఆమె మాటలు విన్నాక నాకు బీపీ ఒక్కసారిగా పెరిగిపోయింది. నేను కరూర్ బాధితులను నేరుగా కలిశాను. నేను మీలా రాజకీయ నాయకురాలిని కాదు. ఏ పార్టీని సపోర్ట్ చేయను. అయినా వారి బాధ నేను అర్థం చేసుకోగలను. జనం పనికిరానివాళ్లా?వాళ్లకోసం నేను పెద్దగా ఏమీ చేయకపోవచ్చేమో! కానీ, అండగా నిలబడటం నా బాధ్యత. జరిగినదాంట్లో విజయ్ సర్ తప్పు లేదని బాధితులే స్వయంగా చెప్పారు. కానీ, మీరు మాత్రం దాన్ని ఒప్పుకోరు. పైగా అలా అన్నందుకు మీ దృష్టిలో ఆ అమాయక జనం పనికిరానివాళ్లుగా మారిపోయారు. మీరు పార్టీకి రాజీనామా చేసి మంచి పని చేశారు. మీరు ఇంట్లో ఉంటేనే మంచిది. మీ సేవలు మాకు అక్కర్లేదు అని మండిపడింది. కాగా వినోదిని.. మక్కల్ నీది మయ్యం పార్టీకి ఈ ఏడాది జనవరిలో రాజీనామా చేసింది. తమిళ బిగ్బాస్ నాలుగో సీజన్లో పాల్గొన్న సనం శెట్టి.. తెలుగులో శ్రీమంతుడు, సింగం 123, ప్రేమికుడు చిత్రాల్లో నటించింది.చదవండి: తనూజకు క్లాస్ పీకిన నాగ్.. ఆ ముగ్గురికే ట్రోఫీ గెలిచే అర్హత -
15 ఏళ్లుగా పోరాటం.. గ్లామర్ ఉన్నా నో లక్!
పదిహేనేళ్లుగా స్టార్ హీరోయిన్ స్టేటస్ కోసం కష్టపడుతోంది గ్లామర్ బ్యూటీ వాణి భోజన్. 2010లో వచ్చిన తమిళ చిత్రం ఒర్ ఎరవుతో వెండితెరకు పరిచయమైంది. తర్వాత తననెవరూ గుర్తించకపోయేసరికి బుల్లితెరకు షిఫ్ట్ అయింది. ఆహా, మాయ సీరియల్స్ చేసింది. 2013-2018 వరకు ప్రసారమైన దైవమగళ్ సీరియల్తో ఆమె కెరీర్ టర్న్ అయిపోయింది. ఇందులో వాణి అందం, నటన చూసి సినిమా అవకాశాలు రావడం మొదలైంది. అలా 2019లో తెలుగులో ఏకైక మూవీ 'మీకు మాత్రమే చెప్తా'లో హీరోయిన్గా చేసింది.సీన్స్ కట్ఆ మరుసటి ఏడాది తమిళంలో చేసిన ఓ మై కడవులే పెద్ద విజయం సాధించింది. దీంతో తమిళంలో వరుస సినిమాలు చేసుకుంటూ పోయింది. మహాన్లో కీలక పాత్రలో నటించినప్పటికీ చివర్లో ఆమె నటించిన సీన్స్ అన్నీ ఎత్తేశారు. సినిమాలు చేస్తుందే కానీ అనుకున్నంత గుర్తింపయితే రాలేదు. ఆ మధ్యలో తమిళ్ రాకర్స్, సెంగళం, చట్నీ సాంబార్ అని వెబ్ సిరీస్లలోనూ యాక్ట్ చేసింది.వివాదంవాణి భోజన్.. నటుడు జైతో సహజీవనం చేస్తోందని గతంలో పుకార్లు వచ్చాయి. ఇదంతా తప్పుడు ప్రచారమని వాణి ఖండించింది. కష్టపడి బ్యాంకు లోను తీసుకుని ఇల్లు కట్టుకుంటే సొంత ఇంట్లో కాకుండా ఎవరో ఒకరి ఇంట్లో అతడితో కలిసున్నానని రాయడం చాలా చీప్ అని ఆవేదన వ్యక్తం చేసింది. కోరికసెంగళం అనే వెబ్ సిరీస్లో రాజకీయ నాయకురాలి పాత్ర పోషించిన ఈ బ్యూటీకి రాజకీయాలపై ఆసక్తి ఉంది. భవిష్యత్తులో పాలిటిక్స్లో అడుగుపెడతానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. అలాగే గంగూభాయ్ కథియావాడి వంటి ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేయాలని ఆశపడుతోంది. మరి వాణి భోజన్ (Vani Bhojan)కు అలాంటి ఆఫర్స్ ఎప్పుడొస్తాయో, తెలుగులో మళ్లీ ఎప్పుడు కనిపిస్తుందో చూడాలి! View this post on Instagram A post shared by Prashun Prashanth Sridhar (@prachuprashanth) -
సినిమాలో అన్ని పాటలు పాడిన రెహమాన్
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, నటుడు, నృత్య దర్శకుడు ప్రభుదేవాలది హిట్ కాంబినేషన్. మొదట్లో వీరి కాంబోలో రూపొందిన కాదలన్ వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దాదాపు 27 ఏళ్ల తర్వాత ప్రభుదేవా, రెహమాన్ కాంబోలో చిత్రం రూపొందుతోంది. అంతేకాదు, ఈ చిత్రంలోని ఐదు పాటలకు బాణీలు కట్టి పాడింది రెహమానే కావడం విశేషం. ఇలా తన ఆల్బమ్లో అన్ని పాటలు పాడటం రెహమాన్కు ఇదే మొదటిసారి!అది రిపీట్ అవాలని..ఈ సినిమా పేరు మూన్ వాక్ (Moon Walk Movie). దీన్ని బిహైండ్స్ వుడ్స్ సౌత్ నిర్మిస్తోంది. ఈ సంస్థ వ్యవహస్థాపకుడు, సీఈఓ మనోజ్ నిర్మల శ్రీధర్ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తాను ఎంతో ఇష్టపడిన జెంటిల్మన్, కాదలన్ అనుభవాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావాలని భావించానన్నారు. ఆ ప్రయత్నమే మూన్ వాక్ అన్నారు. రెండు వారాల రిహార్సల్స్ఇందులో సంగీతానికి, డ్యాన్స్కు కొరతే ఉండదన్నారు. ఈ మూవీలోని ప్రతి పాటకు ప్రభుదేవా రెండు వారాలు రిహార్సల్స్ చేసి నటించారని చెప్పారు. గత మూడేళ్లుగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని 2026లో సమ్మర్ స్పెషల్గా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది పూర్తిగా వినోదభరిత కథాచిత్రంగా ఉంటుందన్నారు.చదవండి: అప్పుడే తెలిసిపోయింది -
కేథరిన్ థ్రెసాతో స్టార్ హీరో వారసుడు స్టెప్పులు
నటుడు విజయ్ వారసుడు జేసన్ సంజయ్ తండ్రి బాటలోనే పయనిస్తారని అందరూ భావించారు. జేసన్ సంజయ్ సౌత్ కాలిఫోర్నియాలో నటన, దర్శకత్వం శాఖల్లో శిక్షణ పొందారు. దీంతో ఈయన నటనపై కాకుండా దర్శకత్వంపై మొగ్గు చూపారు. అలా జేసన్ సంజయ్ మెగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న తొలి చిత్రం సిగ్మా. ఇందులో నటుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా ప్రియా అబ్దుల్లా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో సిగ్మా చిత్రంపై ఆసక్తి నెలకొంటోంది. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాట చోటు చేసుకుంటుందని, దీన్ని ఇటీవల చిత్రీకరించినట్లు సమాచారం. ఈ పాటలో మెడ్రాస్ చిత్రం ఫేమ్ కేథరిన్ థ్రెసా(Catherine Tresa ) నటించినట్లు తెలిసింది. అంతే కాకుండా ఆమెతోపాటు దర్శకుడు జేసన్ సంజయ్ కూడా స్టెప్స్ వేసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఆ పాటలో ఈ వర్ధమాన దర్శకుడు ఇలా వచ్చి అలా కనిపించి వెళ్తారా లేక పూర్తిగా ఆ పాటలో కేథరిన్ థ్రెసాతో కలిసి నటించారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయంపై చిత్ర వర్గాల నుంచి క్లారిటీ వచ్చే వరకూ ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. అదే విధంగా ఈ చిత్రంలో ఒక్క పాటలో మెరిసే జేసన్ సంజయ్ ఆ తరువాత హీరోగా నటించే అవకాశాలు లేకపోలేదన్న ప్రచారం జరుగుతోంది. -
శంకర్ సినిమాలో హీరో సూర్య!
ఏ రంగంలోనైనా జయాపజయాలు సహజం. అయితే ఒకటీరెడు అపజయాలతో సినీ ప్రముఖుల పేరు తగ్గిపోదు. దర్శకుడు శంకర్ తొలి చిత్రం జెంటిల్మెన్తోనే ఘన విజయాన్ని సాధించారు. ఆ తర్వాత ముదల్వన్, బాయ్స్, ఇండియన్, రోబో, నన్బన్ (స్నేహితులు), అన్నియన్ (అపరిచితుడు), శివాజీ ఇలా వరుసగా బ్రహ్మాండమైన చిత్రాలతో తమిళ సినిమాను భారతీయ చిత్రాల స్థాయికి తీసుకెళ్లారు. బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్అయితే ఇటీవలి కాలంలో ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ నిరాశపర్చాయి. ఇకపోతే ఈసారి శంకర్ చారిత్రక కథను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. వేల్చారి అనే నవల ఆధారంగా శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారట. అందుకు సంబంధించిన ప్రీపొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. సూర్య గ్రీన్ సిగ్నల్?ఈ సినిమాలో హీరో సూర్య (Suriya) నటించే అవకాశం ఉన్నట్లు లేటెస్ట్ టాక్. ఈమేరకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సూర్య ఇంతవరకు శంకర్ దర్శకత్వంలో నటించనేలేదు. దీంతో వేల్చారి చిత్రంలో సూర్య నటిస్తే కచ్చితంగా ఈ చిత్రానికి మంచి క్రేజ్ రావడం ఖాయం. మరి ఈ ప్రచారంలో నిజమెంతో చూడాలి! ప్రస్తుతం సూర్య నటించిన కరుప్పు త్వరలో రిలీజ్ కానుంది. అలాగే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత మలయాళ దర్శకుడితో ఓ మూవీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
పోలీస్ ఆఫీసర్గా కార్తీ.. వివాదంలో సినిమా..!
కోలీవుడ్ హీరో కార్తీ నటించిన తాజా చిత్రం వా వాతియార్. ఈ మూవీకి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో పోలీస్ అధికారి పాత్రలో కార్తీ నటించారు. ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్గా కనిపించనుంది. అన్నగారు వస్తారు అనే పేరుతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే తాజాగా ఈ చిత్రం ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఆర్థిక లావాదేవీల విషయంలో నిర్మాత జ్ఞానవేల్రాజాతో విభేదాలు తలెత్తడంతో ఫైనాన్షియర్ అర్జున్లాల్ సుందర్దాస్ చెన్నై హైకోర్ట్ను ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం వావాతియార్ విడుదలపై మధ్యంతర స్టే విధించింది. రూ.21.78 కోట్ల రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించకుండా సినిమాను విడుదల చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు రిలీజ్పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. Interim Ban on ‘#VaaVaathiyaar’The Madras High Court has issued an interim stay on the release of the film Vaa Vaathiyaar, starring #Karthi and produced by Studio Green.In a case filed by Arjunlal Sundardas against Gnanavel Raja, the court ordered that the film should not be… pic.twitter.com/tOo456lm1I— Movie Tamil (@_MovieTamil) December 4, 2025 -
సింగర్ తల్లి నోట పాట.. వీడియో వైరల్
హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం వా వాద్దియార్ (తెలుగులో 'అన్నగారు వస్తారు' పేరిట రిలీజవుతోంది.). కృతిశెట్టి హీరోయిన్గా నటించిన ఇందులో సత్యరాజ్, రాజ్కిరణ్, జీఎం సుందర్, శిల్పామంజునాథ్, ఆనంద్రాజ్, కరుణాకరన్, రమేష్ తిలక్, పీఎల్ తేనప్పన్ ముఖ్యపాత్రలు పోషించారు. స్టూడియో గ్రీన్ ప్రతాపంపై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని, జార్జ్ విలియమ్స్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం డిసెంబర్ 12న తెరపైకి రానుంది.ఈ చిత్రంలోని రెండు పాటలను ఇప్పటికే విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా మూడో పాటను సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ తన తల్లితో కలిసి పాడడం విశేషం. ఈ పాట వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇది గతంలో ఎంజీఆర్ చిత్రంలోని 'రాజా విన్ పార్ర్వై రాణి ఇన్ పక్కం..' పాటకు రీమిక్స్ అన్నది గమనార్హం. ఈ పాటను పాడిన సంతోష్ నారాయణన్ తల్లికి కార్తీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాటకు పలువురు నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. కృతి శెట్టి వావ్ సూపర్.. అంటూ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అదేవిధంగా సిద్ధార్థ్, అతిథిరావ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, గాయకుడు విజయ్ ఏసుదాస్ వంటి ప్రముఖులు శుభాకాంక్షలు అందించారు. ఈ చిత్రంలో కార్తీ ఎంజీఆర్ వీరాభిమానిగా నటించినట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్ర ట్రైలర్, ఆడియోలను ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహించనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. View this post on Instagram A post shared by Santhosh Narayanan (@musicsanthosh) -
దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత
దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్ (85) ఇక లేరు. వయో భారం.. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళంలో చిత్రాలు నిర్మించారాయన. ఎంజీఆర్, శివాజీ, జెమిని గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్లతో వంటి లెజెండరీలు.. విక్రమ్, రానాలాంటి తారలు ఈ ప్రతిష్టాత్మక బ్యానర్లో నటించారు. ఏవీఎం అంటే అర్థం.. ఏవీ మేయప్పన్. ఆయన శరవణన్ తండ్రి. మద్రాస్(నేటి చెన్నై) కేంద్రంగా ఈ బ్యానర్ తొలినాళ్లలో సరస్వతి సౌండ్ ప్రొడక్షన్స్గా..ఆ తర్వాత ప్రగతి పిక్చర్స్ లిమిటెడ్, ప్రగతి స్టూడియోస్.. మేయప్పన్( ఏవీ మేయ్యప్ప చెట్టియార్) తన భాగస్వాములతో కలిసి నడిపించారు. 1945లో AVM Productionsగా మారింది. అప్పటి నుంచి ఈ బ్యానర్లో ఎన్నో గొప్ప చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. తండ్రి ఏవీ మేయప్పన్ తర్వాత శరవణన్ ఆ ప్రొడక్షన్ హౌజ్ను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు. వివిధ భాషల్లో 176 సినిమాలతో పాటు తెలుగు, తమిళ్, మలయాళంలో సీరియల్స్ను ఏవీఎం బ్యానర్లో నిర్మించారు. భూకైలాస్(1940), శివాజీ ది బాస్, మెరుపుకలలు, జెమినీ, లీడర్, సంసారం ఒక చదరంగం.. ఇలా ఎన్నో మరుపురాని హిట్స్ అందించారు. ఏవీఎం బ్యానర్లో వచ్చిన చివరి చిత్రం ఇదువుమ్ కదాందు పొగుమ్(2014). 2022లో అరుణ్ విజయ్ లీడ్ రోల్లో తమిళ్రాకర్స్ అనే వెబ్సిరీస్ కూడా నిర్మించారు. ఈయన కుమారుడు ఎమ్ఎస్ గుహాన్ కూడా నిర్మాతగా రాణిస్తున్నారు. శరవణన్ మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరగనున్నాయి. -
భారీగా డిమాండ్ చేస్తున్న సాయిపల్లవి!
డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయినవారిలో హీరోయిన్ సాయిపల్లవి ఒకరు. చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగింది. ఈమె మలయాళంలో నటించిన ప్రేమమ్ అనూహ్య విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఈ నేచురల్ బ్యూటీకి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు ఎర్ర తివాచీ పరిచాయి. మంచి క్లాసికల్ డ్యాన్సర్ అయిన సాయిపల్లవి మొదటినుంచి గ్లామర్ను దరి చేరనీయకుండా జాగ్రత్త పడుతూ పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకుంది.అంతేకాకుండా ఈమె నటించిన చిత్రాలు మంచి విజయాన్ని సాధిస్తుండటంతో బోలెడంత క్రేజ్ వచ్చింది. తెలుగులో నాగచైతన్యకు జంటగా నటించిన తండేల్, తమిళంలో శివకార్తికేయన సరసన నటించిన అమరన్ ఘన విజయాలు సాధించడంతో ఆమె రేంజ్ మరింత పెరిగింది. దీంతో ఈమె బాలీవుడ్లోనూ అడుగుపెట్టింది. అక్కడ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో సీతగా నటిస్తోంది. దాంతో పాటు మరో హిందీ చిత్రంలోనూ నటించే అవకాశం వరించిందని సమాచారం. కొంత గ్యాప్ తర్వాత దక్షిణాది చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతోంది సాయిపల్లవి (Sai Pallavi). రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో సాయిపల్లవి నటించనున్నారని లేటెస్ట్ టాక్. ఈ మూవీలో నటించేందుకు ఆమె అత్యధికంగా రూ.15 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. -
హీరోయిన్తో విడాకులు.. రూ.100 కోట్ల ఆస్తి ఎవరికంటే?
దివంగత నటి దేవిక మాజీ భర్త, దర్శకుడు దేవదాస్ (88) కన్నుమూశారు. వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం (నవంబర్ 30) రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఈయన తర్వాతి కాలంలో మాత్రం కనిపించకుండా పోయారు. చాలాకాలంగా ఒంటరిగానే బతుకీడుస్తూ వచ్చారు. ఆయన వ్యక్తిగత జీవితంపై ఈ ప్రత్యేక కథనం..పెళ్లి చేసుకోమని బలవంతంసినీ నిర్మాత ఎస్ఎంఎస్ సుందరరామన్ కుమారుల్లో దేవదాస్ ఒకరు. సినిమాలపై ఆసక్తితో దివంగత ప్రఖ్యాత దర్శకుడు భీంసింగ్ వద్ద పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు. ఆ తర్వాత తమిళంతో పాటు తెలుగు భాషల్లోనూ పలు చిత్రాలు నేరుగా డైరెక్ట్ చేశారు. దేవదాస్.. వేగుళి పెన్, మని కోయ కురుప్, రాఖీ వంటి సినిమాలు తెరకెక్కించారు. వేగుళి పెన్ మూవీ సమయంలో హీరోయిన్ దేవిక ఆయనతో ప్రేమలో పడింది. దేవిక, దేవదాస్పెళ్లితో జీవితం తలకిందులుఅయితే దేవికయే తన వెంటపడిందని, పెళ్లి చేసుకోమని కాళ్ల మీద పడి బతిమాలిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మనిద్దరికీ సెట్టవదని దేవదాసు చెప్పినా ఆమె వినిపించుకోలేదట! పెళ్లికి ఒప్పుకోకపోతే చచ్చిపోతానని బెదిరించింది! దీంతో ఆమె మాటకు తలొగ్గాల్సి వచ్చింది. అలా ఇద్దరూ తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. వీరికి కనక అనే కూతురు జన్మించింది. కనక.. తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్యనాయుడుకు ముని మనవరాలవుతుంది. కానీ కేవలం డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకుందని దేవదాస్కు నెమ్మదిగా అర్థమైంది. ఆయన్ను తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూసింది. దశాబ్దాల తరబడి కోర్టులోఅందుకు ఆయన ఒప్పుకోకపోయేసరికి ఒకరోజు తాళి బొట్టు ఆయన మొహాన విసిరికొట్టింది. అంతేకాదు, భర్తను చంపించాలని ప్రయత్నించిందట. ఈ విషయంపై దేవదాస్ పోలీసులను ఆశ్రయించగా దాదాపు 32 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగారు. పెళ్లయిన మూడేళ్లకే దంపతులిద్దరూ విడిపోయారు. కోర్టు కూతురును తల్లికే అప్పగిస్తుంది. అలా కనక తండ్రికి దూరమైంది. కూతురి కోసం ఇంటికెళ్తే...కాదు, దేవికయే కూతుర్ని తనకు దూరం చేసిందంటారు దేవదాస్.. ఆమె వేసిన నిందలకు అందరూ తనను శత్రువులా చూశారని బాధపడ్డారు. కనక మానసిక స్థితి సరిగా ఉండదని, ఒకరోజు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు వార్త వస్తే ఇంటికి వెళ్లి చూశారు. కనక బతికే ఉండటంతో అది తప్పుడు వార్త అని క్లారిటీ ఇచ్చారు. కనక ఇంటి బయట అంతా శుభ్రం చేశారు. అయినా తండ్రిని ఆమె లోనికి రానివ్వలేదు. చారిటీకి ఆస్తిఅలా భార్య, కూతురి ప్రవర్తన వల్ల జీవితాంతం నరకం అనుభవించారు దేవదాసు. దేవికను పెళ్లి చేసుకోవడమే తాను జీవితంలో చేసిన పెద్ద తప్పు అని పశ్చాత్తాపపడ్డారు. తన గురించి పట్టించుకోనివారి కోసం ఆలోచించి సమయం వృథా చేయాలనుకోలేదు. అందుకే తన మరణానంతరం రూ.100 కోట్ల ఆస్తి ట్రస్టుకు చెందాలని వీలునామా రాశారు. ఇప్పుడిక సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దేవిక తెలుగులో పెండ్లి పిలుపు, అన్నా చెల్లెలు, గాలిమేడలు, రక్త సంబంధం, మంగళసూత్రం, నిండు మనసులు, గండికోట రహస్యం, పాపం పసివాడు, శ్రృ కృష్ణాంజనేయ యుద్ధం, నిప్పులాంటి మనిషి, శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర వంటి పలు తెలుగు చిత్రాల్లో నటించింది.చదవండి: సాయిపల్లవి వల్ల నా జీవితమే మారిపోయింది: మ్యూజిక్ డైరెక్టర్ -
నన్ను కాదు, వాళ్లను ఆరాధించండి: హీరో
కోలీవుడ్లో స్టార్ హీరోలుగా రాణిస్తున్నవారిలో శివకార్తికేయన్ ఒకరు. వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్న ఈయన ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పరాశక్తి. ఈ చిత్రం 2026లో పొంగల్ సందర్భంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం చెన్నైలో జరిగిన ఫ్యాన్లీ ఎంటర్టైన్మెంట్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో శివకార్తికేయన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వాస్తవాలు మాత్రమే ప్రచారంఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన పేరుతో ఇన్స్టాగ్రామ్, ఎక్స్, టెలిగ్రామ్లో చాలా సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయని, వాటిని ఎవరెవరు నిర్వహిస్తున్నారో కూడా తెలియదన్నారు. సామాజిక మాధ్యమాల్లో వాస్తవాలకు బదులుగా అసత్య ప్రచారాలే ఎక్కువ వైరలవుతున్నాయన్నారు. ఇలాంటి తరుణంలో ఫ్యాన్లీ ఎంటర్టైన్మెంట్ యాప్ ప్రారంభించడం స్వాగతించదగిన విషయమని, ఇది వాస్తవాలను మాత్రమే ప్రచారం చేస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాంటివారే ఇష్టంతనకే మంచి మేధాశక్తి ఉంటే దర్శకులను విసిగించేవాడినని అన్నారు. అదేవిధంగా తనను ఆరాధించే అభిమానులు వద్దని, వారి తల్లిదండ్రులను, దైవాన్ని ఆరాధించేవారంటే ఇష్టమని పేర్కొన్నారు. తనను ఒక స్నేహితుడిగా, సోదరుడిగా భావించే అభిమానులే తనకు కావాలన్నారు. అలాంటి ఫ్యాన్స్ను తన కుటుంబ సభ్యులుగా భావిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ బ్యాడ్మింటన్ శిక్షకుడు, పద్మ భూషణ్ పుల్లెల గోపీచంద్, ప్రపంచ చెస్ ఛాపింయన్ గుకేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ యాప్ నటీనటులకు, అభిమానులకు మధ్య అనుసంధానంగా నిలిచే యాప్ అని నిర్వాహకులు పేర్కొన్నారు. -
విజయ్కు సలహాలివ్వను: కమల్ హాసన్
హీరో విజయ్కు తాను సలహాలిచ్చే స్థితిలో లేనంటున్నారు హీరో, మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్. అనుభవమే అన్నీ నేర్పుతుందంటున్నారు. కేరళలో జరిగిన హార్టస్ ఆర్ట్ అండ్ లిటరేటర్ ఫెస్టివల్కు కమల్ హాసన్, మంజువారియర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమ్లకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అదే నా శత్రువుతమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపించిన విజయ్.. అధికార డీఎమ్కే పార్టీయే తమ రాజకీయ ప్రత్యర్థి అన్నారు. మరి మీరు ఎవర్ని ప్రత్యర్థి/ శత్రువుగా భావిస్తున్నారు? అని అడిగారు. అందుకు కమల్.. నాకు పార్టీల కన్నా పెద్ద శత్రువు కులతత్వం. దాన్ని అంతమొందించడమే నా ప్రధాన లక్ష్యం. కులమే నాకు పెద్ద శత్రువు అని బదులిచ్చారు.అదే గొప్ప గురువు2026లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విజయ్ (Vijay)కు ఏమైనా సలహాలిస్తారా? అన్న ప్రశ్నకు నేను సలహాలిచ్చే స్థాయిలో లేను. నా సోదరుడు విజయ్కు సలహాలిచ్చేందుకు ఇది సరైన సమయం కూడా కాదు. అనుభవమే అన్నింటికంటే గొప్ప గురువు. మనుషులు పక్షపాతంగా ఉంటారేమో కానీ అనుభవానికి అటువంటి హద్దులు ఉండవు. సినిమాఅనుభవమే అన్ని పాఠాలు నేర్పిస్తుంది అన్నారు. మొత్తానికి విజయ్తో శత్రుత్వం లేదని తన మాటల ద్వారా చెప్పకనే చెప్పారు. కమల్ హాసన్ (Kamal Haasan) చివరగా మణిరత్నం థగ్ లైఫ్ సినిమాలో కనిపించారు. విజయ్ విషయానికి వస్తే ఆయన గతేడాది గోట్ మూవీతో పలకరించారు. తర్వాత అతడు ప్రధాన పాత్రలో నటించిన జన నాయగన్ 2026 సంక్రాంతికి విడుదలవుతోంది.చదవండి: నేడు సమంత పెళ్లి? బరి తెగించారంటూ ఆమె పోస్ట్ -
60% భగవంత్ కేసరి కథే!
విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి సినిమా జననాయకన్. ఇది ఆయన నటిస్తున్న 69వ సినిమా. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తుండగా మమితా బైజు ముఖ్య పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా యాక్ట్ చేస్తున్నారు. కేవీఎన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ కథా చిత్రానికి ముందు దర్శకుడు వినోద్.. కమల్ హాసన్ కోసం ఒక కథ సిద్ధం చేశారు. మొదట్లో కాదన్నారు.. కానీ!అయితే ఆ కథలో కమల్ నటించలేదు. దీంతో అదే కథతో విజయ్ను హీరోగా పెట్టి సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. తర్వాత.. బాలకృష్ణ తెలుగులో నటించిన భగవంత్ కేసరి కాపీనీ కొడుతున్నారని వార్తలు వైరలయ్యాయి. ఈ ప్రచారాన్ని దర్శకుడు ఖండించాడు. ఇదిలా ఉంటే జననాయకన్ సినిమా నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. 2026 జనవరి 9న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో..ఈ క్రమంలో కొన్ని ముఖ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదేమిటంటే.. నేలకొండ భగవంత్ కేసరి చిత్రానికి చెందిన 60 శాతం జననాయకన్ చిత్రంలో ఉంటుందని, మిగతా భాగాన్ని దర్శకుడు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారట. విజయ్ (Vijay) రాజకీయ పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం అన్న విషయం తెలిసిందే.. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విజయ్ ఇందులో నటించాడు. సమకాలీన రాజకీయ అంశాలు సినిమాలో ఉండబోతున్నాయి. -
బన్నీ కోలీవుడ్ ఎంట్రీతో మార్కెట్ షేక్ అవుతుందా?
-
అందాల ఆరబోత.. నేను చేయట్లేదా?: రకుల్
ఒకప్పటి హీరోయిన్లను ఇప్పటి తరానికి చాలా తేడా ఉందని చెప్పక తప్పదు. పాతతరం కథానాయికలు బొద్దుగా ఉండేవారు. ఈ తరం కథానాయికలు సైజ్ జీరోపై మక్కువ చూపుతారు. ఒకవేళ శరీర కొలతలు పెరిగితే దాన్ని తగ్గించుకోవడానికి నానా అవస్థలు పడుతుంటారు. డైటింగ్ పేరుతో నోళ్లు కట్టేసుకుంటారు. ఈ విషయంలో ఉత్తరాది హీరోయిన్లు ముందుంటారని చెప్పక తప్పదు. పెళ్లి తర్వాతఅలా వివాహం తర్వాత కూడా నాజూకుతనాన్ని మెయింటైన్ చేస్తున్న హీరోయిన్లలో రకుల్ ఒకరు. గతేడాది బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. కొందరు హీరోయిన్లు పెళ్లి తర్వాత స్లిమ్గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కారణం.. మళ్లీ నటించడానికి రెడీ అవడమే. హీరోయిన్ రకుల్ కూడా ఆ కోవలోకే వస్తుంది. ఈమె కోలీవుడ్లో చివరగా నటించిన ఇండియన్ 2 బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నిరాశపర్చింది. అది తప్పుఆ తర్వాత దక్షిణాదిలో తనకు అవకాశాలు రాలేదు. అయినప్పటికీ అందాలారబోతతో పలు ఫోటోషూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. దీని గురించి రకుల్ మాట్లాడుతూ.. సాధారణంగా పెళ్లయితే హీరోయిన్ల పని అయిపోయినట్లే అనే భావన ఉందని తెలిపింది. అయితే అది తప్పని, తన విషయంలో అలా జరగడం లేదని పేర్కొంది. తనకు సంబంధించినంతవరకు అందాల ఆరబోత అనేది వారి వారి ఇష్టాన్ని బట్టి ఉంటుందని తెలిపింది. అందం హద్దులను పెళ్లి చెరిపేయదని.. పైగా ప్రోత్సహించే నిచ్చెనలా పని చేస్తుందని చెప్పుకొచ్చింది. -
హీరోయిన్ ఎలా అయ్యానంటే..: కృతీ శెట్టి
ఒక్కోసారి అనుకోకుండా అదృష్టం వరిస్తుంది. అలా లక్తో హీరోయిన్ అయిన బ్యూటీ కృతీ శెట్టి. ఈ బెంగళూరు బ్యూటీ పుట్టింది మాత్రం ముంబైలో! తండ్రి వ్యాపారవేత్త, తల్లి ఫ్యాషన్ డిజైనర్. కృతీకి నటనపై ఆసక్తి ఉండటంతో తొలి ప్రయత్నంగా వాణిజ్య ప్రకటనల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అదే ఈమెను హీరోయిన్ను చేసింది.ఉప్పెనతో హీరోయిన్గా17 ఏళ్ల వయసులో ఉప్పెన మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. అలా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం, ది వారియర్, కస్టడీ వంటి పలు చిత్రాల్లో నటించింది. వీటిలో ఒకటీరెండు సినిమాలు మాత్రమే హిట్టవడంతో అమ్మడి క్రేజ్ అమాంతం తగ్గిపోయింది.తమిళ సినిమాలుదీంతో కేవలం టాలీవుడ్నే నమ్ముకోకుండా తమిళ, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. తాజాగా తమిళంలో జీనీ, వా వాద్దియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాల్లో నటిస్తోంది. కృతీ కెరీర్కు ఈ మూడు సినిమాల ఫలితాలు చాలా కీలకంగా మారనున్నాయి. వా వాద్దియార్లో కార్తీతో జత కట్టగా జీనీలో రవిమోహన్ సరసన నటిస్తోంది. లవ్ ఇన్సూరెన్స్లో ప్రదీప్ రంగనాథన్తో కలిసి నటించింది.హీరోయిన్ ఎలా అయ్యానంటే?వా వాద్దియార్ త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ఓ భేటీలో పాల్గొన్న కృతీ శెట్టి.. తాను హీరోయిన్ ఎలా అయ్యానన్నది వెల్లడించింది. ఒక వాణిజ్య ప్రకటనలో నటించేందుకు ఆడిషన్స్కు వెళ్లానని, అది ముగిసిన తర్వాత తనను తీసుకెళ్లడానికి తండ్రి రావడం ఆలస్యమైందని పేర్కొంది. దీంతో సమీపంలో ఒక స్టూడియో కనిపిస్తే అక్కడికి వెళ్లగా, అక్కడ ఒక చిత్రం కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయంది. దర్శకుడు ఫోన్ చేసి..వాళ్లు తనను చూసి సినిమాలో నటించేందుకు ఆసక్తి ఉందా? అని అడిగారని గుర్తు చేసుకుంది. దీంతో తన తల్లి ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చేశానంది. ఆ తర్వాత దర్శకుడు చిట్టిబాబు ఫోన్ చేసి మాట్లాడారని, అలా తెలుగులో ఉప్పెన మూవీలో హీరోయిన్గా నటించానంది. తమిళంలో కార్తీ సరసన, ప్రదీప్ సరసన నటించడం సంతోషంగా ఉందని కృతీ శెట్టి పేర్కొంది. -
రజనీకాంత్ సినిమాలో సాయిపల్లవి?
తమిళ సినిమా మూలస్తంభాలైన కమల్ హాసన్, రజనీకాంత్ల కాంబినేషన్లో ఇంతకుముందు దాదాపు 11 సూపర్ హిట్ చిత్రాలు రూపొందాయి. ఆ తర్వాత సూపర్స్టార్ ఇమేజ్ కారణంగా ఇద్దరూ వేర్వేరుగా నటిస్తూ వచ్చారు. అలాంటిది సుదీర్ఘకాలం తర్వాత ఈ లెజెండ్స్ ఇద్దరూ కలిసి నటించడానికి సిద్ధమయ్యారు. రజనీ హీరోగా, కమల్ నిర్మాతగాఅయితే దీనికంటే ముందు కమల్హాసన్(Kamal Haasan) తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో రజనీకాంత్ హీరోగా (#Thalaivar 173) నటించనున్నారు. దీనికి సుందర్ సి దర్శకత్వం వహించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. కానీ, తర్వాత అనూహ్యంగా సుందర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి వైదొలగుతున్నట్లు మీడియా ద్వారా ఒక లేఖను విడుదల చేసి షాకిచ్చారు. దీంతో ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే ఆసక్తి నెలకొంది.సాయిపల్లవి?పార్కింగ్ చిత్రంతో జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు పొందిన రామ్కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించబోతున్నారనేది లేటెస్ట్ టాక్. ఈ భారీ బడ్జెట్ మూవీలో సాయిపల్లవి నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే మరో నటుడు ఖదీర్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
కొడుకు సమక్షంలో బిగ్బాస్ బ్యూటీ మరో పెళ్లి
ప్రముఖ నటి, తమిళ బిగ్బాస్ ఫేమ్ సంయుక్త షణ్ముగనాథన్ మరో పెళ్లి చేసుకుంది. దిగ్గజ క్రికెటర్ క్రిష్ణమాచారి కొడుకు అనిరుధ్ శ్రీకాంత్తో ఏడడుగులు వేసింది. చెన్నైలో గురువారం ఉదయం చాలా సింపుల్గా ఈ శుభకార్యం జరిగింది. తన కొడుకు సమక్షంలోనే సంయుక్త ఈ వివాహం చేసుకోవడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.సంయుక్త విషయానికొస్తే.. తమిళంలో నటి-మోడల్గా కెరీర్ ఆరంభించింది. వరిసు, మై డియర్ భూతం, కారీ, తుగ్లక్ దర్బార్ తదితర సినిమాలు చేసింది. చంద్రముఖి సీరియల్లోనూ చేసింది. తమిళ బిగ్బాస్ 4వ సీజన్లో పాల్గొని మంచి ఫేమ్ తెచ్చుకుంది. గతంలో కార్తీక్ శంకర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ కొడుకు కూడా పుట్టాడు. తన భర్తతో మరో మహిళతో సంబంధం ఉందని తెలిసి సంయుక్త విడాకులు తీసుకుంది.(ఇదీ చదవండి: ప్రియురాలిని పెళ్లాడిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్)అనిరుధ్ శ్రీకాంత్ విషయానికొస్తే.. తండ్రి క్రిష్ణమాచారి శ్రీకాంత్లానే క్రికెట్ని కెరీర్లా ఎంచుకున్నాడు. తమిళనాడు తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఐపీఎల్లో 2008-13 వరకు సీఎస్కే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2014లో సన్రైజర్స్ హైదరాబాద్కి ఆడాడు. 2019 తర్వాత నుంచి పెద్దగా క్రికెట్ ఆడట్లేదు. ఇతడు 2012లో మోడల్ ఆర్తి వెంకటేశ్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ మనస్పర్థల కారణంగా రెండేళ్లకే విడిపోయారు.ఈ ఏడాది దీపావళి సందర్భంగా సంయుక్త-అనిరుధ్ కలిసి ఫొటోలు పోస్ట్ చేశాడు. దీంతో ఏమై ఉంటుందా అని నెటిజన్లు మాట్లాడుకున్నారు. ఇప్పుడు అందుకు తగ్గట్లే పెళ్లి చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ జంటకు పలువురు నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లి ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Samyuktha Shanmughanathan (@samyuktha_shan) -
కలిసిరాని సినిమాలు.. స్టార్ హీరోయిన్ అయ్యేదెప్పుడో?
కొన్నిసార్లు అన్నీ అనుకున్నట్లు జరగవు.. హీరోయిన్ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) పరిస్థితి కూడా ఇదే! బెంగళూర్కు చెందిన ఈ మూడు పదుల భామ 2019లో మాతృభాష (కన్నడం)లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత టాలీవుడ్పై బ్యూటీ దృష్టి పడింది. అలా నాని గ్యాంగ్లీడర్ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఆ చిత్రం విజయంతో శ్రీకారం అనే చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కానీ, ఈ మూవీ నిరాశ పరిచింది.బ్రేక్అయినా ప్రియాంక మోహన్ను లక్కు వదలలేదు. వెంటనే శివకార్తికేయన్కు జంటగా డాక్టర్ అనే చిత్రంతో కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం హిట్ అవ్వడంతో అదే హీరోతో డాన్ అనే మరో చిత్రం చేసింది. అది సూపర్హిట్ అయ్యింది. ఆ తరువాతనే బ్రేక్ పడింది. సూర్యకు జంటగా నటించిన ఎదర్కుం తునిందవన్ చిత్రం నిరాశ పరచింది. ఆ తరువాత సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఈ అమ్మడికి తెలుగులో సరిపోదా శనివారం చిత్రం విజయం కాస్త ఊరటనిచ్చింది. ఉపయోగపడని ఓజీపవన్కల్యాణ్కు జంటగా ఓజీ చిత్రంలో నటించే అవకాశం రావడంతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ వస్తుందని తెగ సంబరపడిపోయిందనే చెప్పాలి. అయితే ఆ చిత్రం హిట్ అనిపించుకున్నా, ప్రియాంక మోహన్ కెరీర్కు ఏమాత్రం ఉపయోగపడలేదు. అంతే కాదు తెలుగులో ఇప్పటి వరకూ మరో అవకాశం రాలేదు. తమిళంలో జయంరవికి జంటగా నటించిన బ్రదర్ చిత్రం బోల్తా పడింది. ఆ తరువాత నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం చిత్రంలో గోల్డెన్ స్పారో అనే ప్రత్యేక పాటలో యాక్ట్ చేసింది. ఆ చిత్రం ఈమె కెరీర్కు ఉపయోగపడలేదు. ఈ సినిమాలపైనే ఆశలుకాగా ప్రస్తుతం కెవిన్కు జంటగా ఒక చిత్రం, మేడ్ ఇన్ కొరియా అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. వీటిలో ఏదైనా హిట్ అయితేనే ప్రియాంకమోహన్కు మరిన్ని అవకాశాలు వస్తాయనే టాక్ స్ప్రెడ్ అవుతోంది. కాగా సుమారు ఐదేళ్ల తరువాత మాతృభాషలో నటించే అవకాశం ఆ బ్యూటీని వరించింది. ఇలా తమిళం, తెలుగు, కన్నడం, భాషల్లో గత ఆరేళ్లుగా నటిస్తున్నా ఇంకా స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతోంది. -
అమ్మను కారులో ఎక్కనివ్వకుండా అవమానించి...
చిత్రపరిశ్రమలో కష్టపడి పైకొచ్చిన వారు చాలామంది. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కూడా ఈ కోవకు చెందిన వారే! ఈ విషయాన్ని ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో స్వయంగా పేర్కొన్నారు. మరాఠి, హిందీ చిత్రాల్లో నటిస్తూ ఆ తరువాత సీతారామమ్ చిత్రంతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇక్కడ తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. మధ్య తరగతి అమ్మాయినిఅలా తెలుగులో వరుస అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలతో పాటు నాలుగు హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ భామ బెంజ్ కారు కొన్నారట. దీని గురించి మృణాల్ఠాకూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను చాలా మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిని అని చెప్పారు. అవమానంచిన్నతనంలో తల్లితో కలిసి బంధువుల వేడుకకు వెళ్లానని.. అక్కడ తమ బంధువులు కారులో వెళుతూ తన తల్లిని ఎక్కించుకోకుండా చాలా అవమానించారని పేర్కొన్నారు. అప్పుడే తాను ఒక కారు కొనాలని నిర్ణయించుకున్నానని, అది ఇప్పటికి నెరవేరిందని చెప్పారు. ఇప్పుడు తమ బంధువుల్లో బెంజ్ కారు ఉన్నది తమకు మాత్రమేనని మృణాల్ పేర్కొన్నారు. -
కుక్క కాటు పెద్ద మేటర్ కాదు.. టాలీవుడ్ హీరోయిన్పై విమర్శలు
స్వతహాగా తమిళ అమ్మాయి అయిన నివేదా పేతురాజ్ తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. వాటిలో మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, చిత్రలహరి, అల వైకుంఠపురములో ఉన్నాయి. ఈ ఏడాది తన ప్రియుడి గురించి బయటపెట్టింది. త్వరలో పెళ్లి కూడా చేసుకోనుంది. ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త మూవీస్ ఏం లేనట్లు ఉన్నాయి. సరే ఇదంతా పక్కనబెడితే వీధి కుక్కల గురించి మాట్లాడుతూ నివేదా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.చెన్నైలో సోమవారం.. వీధి కుక్కల సంరక్షణ కోసం కొందరు ర్యాలీ చేశారు. దీనిలో నివేదా పేతురాజ్ కూడా పాల్గొంది. తన అభిప్రాయాన్ని చెప్పింది. అయితే కుక్క కాటుని అందరూ భూతద్దంలో పెట్టి చూస్తున్నారని, అదేమంత పెద్ద విషయం కాదని చెప్పింది. దీంతో కొందరు ఈమెని సమర్థిస్తుంటే.. మరికొందరు మాత్రం ఈమెని దారుణంగా విమర్శిస్తున్నారు.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9.. మళ్లీ ఈ ట్విస్టులేంటి?)'కుక్క కాటుని మనం పెద్దదిగా చేసి ప్రజల్లో భయాన్ని సృష్టించకూడదు. మన కళ్లముందే చాలా క్రూరమైన ఘటనలు జరుగుతున్నాయి. వాటి గురించి ఒక్కరూ మాట్లాడరు. కుక్క కరిస్తే వచ్చే రేబిస్ చాలా ప్రమాదకర వ్యాధి అనేది నిజం. కానీ భయాన్ని వ్యాప్తి చేసే బదులు.. పరిష్కారం ఏంటో ప్రజలకు నేర్పించాలి. వీధి కుక్కల్ని చంపడం పరిష్కారం కాదు' అని నివేదా పేతురాజ్ చెప్పుకొచ్చింది.అయితే నివేదా.. కుక్క కాటుని చాలా తక్కువగా చేస్తోందని, ఓసారి వీధి కుక్కలు ఉండేచోట కారులో కాకుండా నడుచుకుని తిరిగితే అప్పుడు సమస్య ఏంటో తెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈమె త్వరలో దుబాయికి చెందిన బిజినెన్మ్యాన్ని పెళ్లి చేసుకోనుంది. తర్వాత ఈమె మన దేశంలో ఉండే అవకాశాలు కూడా తక్కువే. ఈ విషయాన్ని కూడా గుర్తుచేస్తున్న పలువురు నెటిజన్లు.. ఈమెని ట్రోల్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మాస్ జాతర'.. అధికారిక ప్రకటన)If a dog bites you, don't make a big deal out of it and create fear. — #NivethaPethurajpic.twitter.com/OFFw5YpQT2— Filmy Bowl (@FilmyBowl) November 24, 2025 -
వీరిద్దరి కాంబో సూపర్ హిట్.. మరోసారి గ్రీన్ సిగ్నల్!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఈ ఏడాది విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో అభిమానులను అలరించాడు. వీటిలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ సూపర్ హిట్గా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో అజిత్ మరోసారి ఆయనతో జతకట్టనున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ వెల్లడించారు.చెన్నైలో ఓ ఈవెంట్కు హాజరైన దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ గుడ్ న్యూస్ పంచుకున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయని వెల్లడించారు. మేము ఇప్పుడు లొకేషన్స్ ఖరారు చేస్తున్నామని.. ఫిబ్రవరి చివరి నాటికి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీంతో వీరిద్దరి కాంబోలో మరో చిత్రం రానుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశముంది.కాగా.. అజిత్ కుమార్ ఈ ఏడాది సినిమాలతో పాటు కార్ రేసింగ్లోనూ దూసుకెళ్తున్నారు. ఇటీవలే ఇటలీకి చెందిన మోటార్స్పోర్ట్స్ గ్రూప్ నుంచి 'జెంటిల్మన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డును గెలుచుకున్నారు. ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ప్రశంసలు అందుకుంది. -
హీరో అవుతానంటే కమెడియన్ అన్నారు: శివకార్తికేయన్
ఇప్పుడున్న ఎంతోమంది స్టార్ హీరోలు ఒకప్పుడు విమర్శలను ఎదుర్కొని, వాటిని దాటుకుంటూ వచ్చినవాళ్లే! వారిలో తమిళ స్టార్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) ఒకరు. బుల్లితెర నుంచి వెండితెర వరకు వచ్చిన ఇతడు తాజాగా ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నాడు.సినిమాల్లోకి వస్తావా?టీవీలో పనిచేసినప్పుడు ఓసారి దర్శకనిర్మాత కేఎస్.సినిశ్ ఆఫీస్కు వెళ్లాను. ఆయన నన్ను చూడగానే సినిమాల్లోకి వచ్చి ఏం చేస్తావ్? అన్నాడు. అప్పుడు నేను 'వేట్టయి మన్నన్' మూవీలో చిన్న కామెడీ రోల్ చేస్తున్నా.. హీరో అవ్వాలని నేనేమీ కలలు కనలేదు. కానీ, పైకి మాత్రం హీరో అవుతా అని చెప్పాను.కామెడీ పాత్రలే సెట్టు!ఇలాంటి పనికిమాలిన కలలు ఎందుకు కంటున్నావ్? అయినా నువ్వు కామెడీ బాగా చేస్తావ్.. అలాంటి పాత్రలు ట్రై చేయ్ అని చెప్పాడు. నేను ఒప్పుకోలేదు. ఏ.. నేను ఎందుకు హీరో కాకూడదు? అని అడిగాను. అందుకాయన ఓ డ్యాన్సర్ని చూపించి అతడు హీరో కాగలడేమోకానీ నేను కాదని కరాఖండిగా చెప్పాడు. తర్వాత అదంతా నేను మర్చిపోయాను కానీ, సినిశ్ మర్చిపోలేదు. నేను మర్చిపోయా.. కానీ!నేను హీరో అయ్యాక ఓసారి అతడు ఫోన్ చేసి.. నేనలా మాట్లాడినందుకు కోపంగా ఉందా? అని అడిగాడు. అప్పుడు నేను పనిలో బిజీగా ఉండటంతో సరిగా మాట్లాడలేకపోయాను. తర్వాత ఎప్పుడూ దానిగురించే మాట్లాడనేలేదు. బహుశా అతడిప్పటికీ అదే మాటపై నిలబడ్డాడేమో! అని సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ 'పరాశక్తి' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది.చదవండి: నా ముఖం చూస్తేనే లవ్ ఫెయిల్యూర్: ధనుష్ -
లవ్ ఫెయిల్యూర్.. అద్దం ముందు నిలబడి..: ధనుష్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush).. అప్పుడప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తుంటాడు. చివరగా బాలీవుడ్లో 'ఆత్రంగిరె' అనే స్ట్రయిట్ ఫిలిం చేశాడు. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత 'తేరే ఇష్క్ మే' సినిమాతో బాలీవుడ్లో సందడి చేయనున్నాడు. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 28న విడుదల కానుంది.లవ్ ఫెయిల్యూర్సినిమా ప్రమోషన్స్లో ధనుష్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఎప్పుడూ నన్ను లవ్ ఫెయిల్యూర్ పాత్రలోనే చూపిస్తారెందుకు? అని దర్శకుడిని అడిగాను. అందుకాయన లవ్ ఫెయిల్యూర్ అయినవాడిలా నా ముఖం ఉంటుందన్నాడు. అది విని నేను నవ్వుకున్నాను. ఆరోజు ఇంటికెళ్లాక అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకున్నాను. నా ముఖాన్ని జాగ్రత్తగా పరిశీలించాను. ఏదేమైనా ఫెయిల్యూటర్ పాత్రలు పోషించడం అంత ఈజీ అయితే కాదు. చాలా కష్టంఉదాహరణకు 'రాంజన' సినిమాలో కుందన్ పాత్ర చూడటానికి ఈజీగా అనిపించినా ఆ రోల్ చాలా కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే నేను ఏ చిన్న పొరపాటు చేసినా జనం నా పాత్రను ఇష్టపడరు. తేరే ఇష్క్ మే సినిమాలో శంకర్ పాత్ర కూడా చాలెంజెస్తో కూడుకున్నది. ఆ పాత్ర ఎంత వైవిధ్యమైనదో తెరపై మీరే చూస్తారు. ఇది నా అభిమానులకు కొత్త అనుభవాన్ని ఇస్తుందనుకుంటున్నాను అని చెప్పాడు. కాగా ధనుష్ హిందీలో నటించిన రాంఝన, ఆత్రంగిరే.. సినిమాలను సైతం ఆనంద్ ఎల్. రాయే తెరకెక్కించాడు.చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్కు రాజాసాబ్ డైరెక్టర్ క్షమాపణలు -
పోయి ముఖం కడుక్కుపో.. కమల్ వ్యాఖ్యలతో షాక్!
గోవాలో ఇఫీ (అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ఖుష్బూ (Kushboo).. గతంలో కమల్ హాసన్తో తనకు ఎదురైన ఓ సంఘటనను గురించి చెప్పుకొచ్చింది. వీరిద్దరూ మైకేల్ మదన కామరాజు (Michael Madana Kama Rajan Movie) అనే క్లాసిక్ మూవీలో జంటగా నటించారు. ఆ మూవీ షూటింగ్లో జరిగిన ఓ సంఘటనను ఖుష్బూ తాజాగా గుర్తు చేసుకుంది.బాగా రెడీ అయి వెళ్తే..'మైకేల్ మదన కామరాజు సినిమా సెట్కు నేను బాగా రెడీ అయి వెళ్లాను. హెయిర్ స్టైల్ చేసుకుని, ఐ షాడో పెట్టుకుని.. ఫుల్ మేకప్తో వెళ్లా.. నేను సెట్లో అడుగుపెట్టానో లేదో.. నన్ను చూడగానే కమల్ హాసన్ (Kamal Haasan) ఓ మాటన్నాడు. వెనకాల వాష్రూమ్ ఉంది. వెళ్లి ముఖం కడుక్కుని రాపో అన్నాడు. ఆ మాట విని షాకయ్యా.. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడేమో అనిపించింది. అర్థం చేన్నా..అంతలోనే కమల్.. నీ ముఖంపై కొంచెం కూడా మేకప్ ఉండకూడదు. నా షాలిని (మైకేల్ మదన కామరాజు మూవీలో హీరోయిన్ పాత్ర) సినిమాలో మేకప్ లేకుండానే ఉంటుంది అన్నాడు. ఆయన మాటల వెనక ఉన్న అర్థాన్ని గ్రహించి వెంటనే ముఖం కడుక్కుని మేకప్ తీసేశాను. ఆ తర్వాతే మాపై సీన్లు చిత్రీకరించారు. ఇక్కడ కమల్ సినిమాలో సహజత్వం కోరుకున్నాడు. దాన్ని మనం అర్థం చేసుకోగలగాలి' అని చెప్పుకొచ్చింది.కమల్ సినిమాలో ఐటం సాంగ్?ఇకపోతే ఇటీవల రజనీకాంత్-కమల్ హాసన్ కాంబినేషన్లో ఓ సినిమా రానుందని ప్రకటించారు. ఈ మల్టీస్టారర్కు ఖుష్బూ భర్త, దర్శకుడు సుందర్ సి దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు. కానీ, రెండురోజులకే ఆ మూవీ తాను డైరెక్ట్ చేయడం లేదన్నాడు సుందర్. ఖుష్బూను ఐటం సాంగ్ చేయమని డిమాండ్ చేశారని, అందుకే ఆమె భర్త సినిమా నుంచి తప్పుకున్నాడంటూ ట్రోలింగ్ జరిగింది. ఖుష్బూ కౌంటర్అలాంటి ఓ పోస్ట్కు ఖుష్బూ స్పందిస్తూ.. నన్ను ఐటం సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు. మీ కుటుంబంలో ఎవరినైనా చేయమన్నారేమో! అని కౌంటరిచ్చింది. సుందర్ మంచి కథ ఇవ్వకపోవడం వల్లే ఆయన పక్కకు తప్పుకున్నారన్న ప్రచారమూ జరిగింది. దాన్ని కూడా ఖుష్బూ తోసిపుచ్చింది. ఈ నిరాధారమైన వార్తలు బయటకు ఎలా వస్తాయో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇకపోతే కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై రజనీ-కమల్ మూవీ రానుంది.చదవండి: 23 ఏళ్లుగా సహజీవనం.. 47 ఏళ్ల వయసులో పెళ్లి -
సిక్స్ప్యాక్తో హీరో సెకండ్ ఇన్నింగ్స్..
మంగాత్త, జిల్లా, అన్బానవన్ అడంగాదవన్ అసరాదవన్, మానాడు వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన నటుడు మహత్ రాఘవేంద్ర (Mahat Raghavendra). కొన్ని సినిమాల్లో హీరోగానూ నటించారు. అయితే అవేవీ ఆశించిన విజయాలు సాధించలేదు. దీంతో చిన్నగ్యాప్ తీసుకున్న మహత్ రాఘవేంద్ర తాజాగా కొత్త లుక్కు తయారయ్యారు. ఫుల్ వర్కవుట్స్తో సిక్స్ ప్యాక్ బాడీతో సిద్ధంగా ఉన్నారు. ఇకపై తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం కాబోతుందన్నారు. పలు చిత్రాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తాజాగా మహత్ రాఘవేంద్ర ఓ సినిమాలో హీరోగా నటించనున్నారని సమాచారం.ఈ మూవీలో ఆయేనకు జంటగా ఐశ్వర్య రాజేశ్ నటించనున్నట్లు తెలుస్తోంది. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుందట! ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్ రెండో వారంలో ప్రారంభం కానుందని.. తమిళం, తెలుగు భాషల్లో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Raghavendra Mahat (@mahatofficial) -
నా శేష జీవితం వారితోనే: అజిత్
సినీ రంగంలో అజిత్ జీవన విధానమే ప్రత్యేకమని చెప్పడంలో అతిశయోక్తి ఉండదు. సినిమాలతో పాటు తన కుటుంబం అంటూ సాగుతున్న ఈయన జీవితంలోకి కొత్తగా క్రీడా పయనం వచ్చి చేరింది. దీంతో ఇప్పుడు దానికి కూడా ప్రాధాన్యతనిస్తున్నారు. దీనికి రైఫిల్ షూట్లోను, బైక్ రేసులు, కార్ రేసుల్లోనూ ప్రత్యేక ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే. అలా బెల్జియం, దుబాయి దేశాల్లో జరిగిన పలు అంతర్జాతీయ కార్ రేస్ పోటీల్లో పాల్గొని పథకాలను గెలుచుకున్నారు. అంతేకాకుండా సొంతంగా కార్ రేస్ పోటీల సంస్థ ప్రారంభించారు. తాజాగా అజిత్ కు జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్–2025 అనే బిరుదును ఎస్ఆర్ఓ మోటార్ స్పోర్ట్స్ సంస్థ ప్రధానం చేసి సత్కరించింది. బిరుదు ప్రధానోత్సవంలో అజిత్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇకపోతే అజిత్ తన శేష జీవితం గురించి ఆసక్తికరమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. తాను ఒక సినిమా పూర్తి అయిన తర్వాతే మరో చిత్రం చేస్తానన్నారు. అదేవిధంగా నెలలో 15 రోజులు సినిమాకు, 15 రోజులు కుటుంబానికి కేటాయిస్తానని క్లారిటీ ఇచ్చారు. 'నా విరామ జీవితం అంతా నా స్వీట్ హార్ట్ (శాలిని)కి, జూనియర్ అజిత్, శాలినిలకే. మంచి తండ్రిగా, మంచి ఉపాధ్యాయుడిగా, నిజమైన సేవకుడిగా సంపూర్ణ జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను.' అని పేర్కన్నారు. -
ఇఫీలో అమరన్ సినిమా
గోవాలో జరుగుతున్న 56 ఇండియన్ అంతర్జాతీయ చిత్రోత్సవ (IFFI–2025) వేడుకల్లో అమరన్ చిత్రం (Amaran Movie) ఇండియన్ పనోరమ విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది. స్టార్ హీరో కమల్హాసన్కు చెందిన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ, టెర్మరిక్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన చిత్రం అమరన్. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రాన్ని రాజ్కుమార్ పెరియస్వామి తెరకెక్కించారు. ఇఫీ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపిక కావడం అమరన్ చిత్ర యూనిట్కు గౌరవ మైలురాయి అయింది.ఇఫీలో అమరన్భారతీయ సినిమాల్లో అద్భుతమైన విజయాన్ని సాధించి, ప్రశంసలు పొందిన చిత్రాలే ఇండియన్ పనోరమ చిత్ర ఉత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికవుతాయి. అలా ఎంపికైన అమరన్ చిత్ర ప్రదర్శన శనివారం నాడు ఇండియన్ అంతర్జాతీయ చిత్రోత్సవాల వేడుకలో ప్రదర్శించారు. కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్, దర్శకుడు రాజకుమార్ పెరియస్వామి, శివకార్తికేయన్, సాయిపల్లవి వేడుకలో పాల్గొన్నారు.మేజర్ ముకుంద్ జీవితకథఅశోకచక్ర బిరుదు గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్రతో తెరకెక్కిన చిత్రం అమరన్. దేశభక్తిని, త్యాగాన్ని, ధైర్యాన్ని దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చూపించిన చిత్రం. మేజర్ ముకుంద్ దేశభక్తిని ,అత్యున్నత సేవలను ప్రదర్శించిన చిత్రం అమరన్. ఇందులో భారత సైనికుల వీరత్వాన్ని, ఘనతను ఆవిష్కరించారు. అలాంటి చిత్రం ఇండియన్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపిక కావడం ఆ చిత్ర యూనిట్ ప్రతిభకు నిదర్శనం. అంతేకాకుండా అమరన్ చిత్రం అంతర్జాతీయ గోల్డెన్ పికాక్ చిత్రోత్సవాల్లో నామినేషన్కు పంపడం గమనార్హం.చదవండి: ఒక్కరోజే ఇన్ని సినిమాలా? -
చెత్త రీల్స్ ఒక్కచోట చేర్చితే డ్యూడ్.. దర్శకుడి రిప్లై ఇదే!
దీపావళికి బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన సినిమా డ్యూడ్ (Dude Movie). ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఏకంగా రూ.100 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంతోనే కీర్తిశ్వరన్ అనే యువకుడు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇటీవల ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లోకి అందుబాటులోకి వచ్చింది.అది నార్మల్ కాదుదీంతో ఓటీటీలో సినిమా చూసిన జనాలు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా సినిమా గురించి నేరుగా దర్శకుడికే మెసేజ్ చేసింది. బ్రో.. మీ ఇంటర్వ్యూ క్లిక్ కూడా చూశాను. మమిత మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేసే సన్నివేశాన్ని నార్మలైజ్ చేశారు. అలాంటివి చాలా మామూలు విషయం అన్నట్లు చూపించకండి.చెత్త రీల్స్నిజమైన స్నేహితులెప్పుడూ అలా మాట్లాడుకోరు. సినిమా మొత్తం అర్థంపర్థం లేకుండా ఉంది. సన్నివేశాల మధ్య కనెక్షన్ మిస్ అయింది. చెత్త రీల్స్ను ఒకచోట చేర్చినట్లుగా ఉంది. ఇకనుంచైనా కాస్త మంచి సినిమాలు తీయు అని సలహాచ్చింది. దీనికి కీర్తిశ్వరన్ స్పందిస్తూ... నాకు మెసేజ్లు చేసే బదులు నీ బతుకేదో నువ్వు చూసుకో.. అని వెటకారంగా బదులిచ్చాడు. విమర్శించే హక్కుఈ చాటింగ్ను స్క్రీన్షాట్ తీసిన ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. డ్యూడ్ సినిమాతో పాటు దర్శకుడి ఇంటర్వ్యూ క్లిప్ చూశాను. నా జేబులో నుంచి డబ్బు ఖర్చు పెట్టి మరీ సినిమా చూసినప్పుడు దాన్ని విమర్శించే హక్కు నాకుంది. నా అభిప్రాయాన్ని దర్శకుడితో పంచుకున్నాను. కొత్త డైరెక్టర్.. నా విమర్శను స్వీకరిస్తాడనుకున్నాను.. కానీ, ఇదిగో ఇలా రిప్లై ఇచ్చాడు. దమ్ము లేదుఇక్కడే అతడి మైండ్సెట్ ఏంటో తెలిసిపోతుంది. ఫీడ్బ్యాక్ను తీసుకునే దమ్ము లేదని రుజువవుతోంది అని రాసుకొచ్చింది. ఈ వ్యవహారంపై నెటిజన్లు భిన్నవిధాలుగా స్పందిస్తున్నారు. డ్యూడ్ సినిమా ప్రదీప్తో కాకుండా వేరే హీరోతో చేసుంటే కచ్చితంగా ఫ్లాప్ అయ్యేది.. విమర్శలు తీసుకోవడం కూడా రావాలని దర్శకుడిని మందలిస్తున్నారు. మెజారిటీ జనాలు మాత్రం.. ఇది సినిమానా? చెత్త రీల్స్ అన్ని కలగలిసినట్లుగా ఉందని నానామాటలు అంటే ఇలాగే స్పందిస్తారని దర్శకుడిని వెనకేసుకొస్తున్నారు. Dude Director “ Keerthishwaran “ reply to a influencer question about the worst scene in movie. It’s just a Audacity way of response :( pic.twitter.com/EdQKaI50eI— Kolly Censor (@KollyCensor) November 21, 2025 చదవండి: చెల్లి పెళ్లయిన మూడున్నరేండ్లకు.. బుల్లితెర నటి ఎంగేజ్మెంట్ -
ఓటీటీలో లేటెస్ట్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమిళ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్యన్ (Aaryan Movie). తెలుగమ్మాయి మానస చౌదరి హీరోయిన్గా నటించింది. శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్ర పోషించింది. ప్రవీణ్.కె దర్శకత్వం వహించిన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ అక్టోబర్ 21న విడుదలైంది. ఈ చిత్రాన్ని హీరో నితిన్ తండ్రి, నిర్మాత సుధాకర్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేశారు. ఓటీటీలో ఆర్యన్వారం ఆలస్యంగా నవంబర్ 7న తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. సినిమాకు టాక్ బాగున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. నవంబర్ 28న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో విడుదలవుతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఆర్యన్ అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయినవారు ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు!కథేంటంటే?ఆత్రేయ (సెల్వ రాఘవన్) అనే వ్యక్తి ఓ న్యూస్ ఛానెల్కి వెళ్తాడు. తాను ఫెయిల్యూర్ రచయితనని చెప్తూ రాబోయే ఐదు రోజుల్లో ఐదు హత్యలు చేస్తానని చెప్తాడు. అంతలోనే గన్తో కాల్చుకుని చనిపోతాడు. ఈ కేసును పోలీసు అధికారి నంది (విష్ణు విశాల్)కి అప్పగిస్తారు. ఆత్రేయ బతికి లేకపోయినా హత్యలు జరుగుతుంటాయి? అదెలా సాధ్యం? అన్నది తెలియాలంటే ఓటీటీలో ఆర్యన్ చూడాల్సిందే! #Aaryan - thrilling your NETFLIX screens from 28th November!@TheVishnuVishal @VVStudioz @adamworx @selvaraghavan @ShraddhaSrinath @Maanasa_chou @GhibranVaibodha @dop_harish @Sanlokesh @silvastunt @PC_stunts @jayachandran46 @itshravanthi @prathool @Netflix_INSouth @SreshthMovies… pic.twitter.com/I2JRhlRKve— Vishnu Vishal Studioz (@VVStudioz) November 22, 2025 చదవండి: నిన్ను ఒక్కసారి ముట్టుకోవచ్చా? -
ఈ సినిమా హిట్టయితేనే పిశాచి 2 రిలీజ్!
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది నటి ఆండ్రియా (Andrea Jeremiah). ఈమె మంచి గాయని అన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ రచయితగా, నిర్మాతగా మారింది. ఈమె కథను అందించి ది షో మస్ట్ గో ఆన్ పతాకంపై నిర్మించిన చిత్రం మాస్క్. బ్లాక్ మెడ్రాస్ ఫిలింస్ సంస్థతో కలిసి ఆండ్రియా ఈ చిత్రాన్ని నిర్మించింది. రుహాని శర్మ హీరోయిన్గా నటించిన ఇందులో ఛార్లీ, రమేష్ తిలక్, కల్లూరి వినో, రెడిన్ కింగ్స్లీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మాస్క్ రిలీజ్వెట్రిమారన్ మార్గదర్శకత్వంలో వికర్ణన్ అశోక్ అనే యువ దర్శకుడు తెరకెక్కించాడు. జీవీ ప్రకాశ్కుమార్ సంగీతాన్ని, ఆర్డీ.రాజశేఖర్ ఛాయాగ్రహణం అందించారు. ఆండ్రియా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించగా హీరో కెవిన్ కథానాయకుడిగా నటించారు. యాక్షన్ ఎంటర్టైనర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం (నవంబర్ 21న) తెరపైకి వచ్చింది. అది హిట్టయితేనే..ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆండ్రియా.. మాస్క్ మూవీ విజయంపై చాలా ఆశలే పెట్టుకుంది. కాగా ఈమె నటించిన మరో చిత్రం పిశాచి 2. మిష్కిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చాలా కాలం అయ్యింది. అయితే కొన్ని ఆర్థికపరమైన సమస్యల కారణంగా విడుదల కాలేదు. ఆ చిత్రం గురించి నటి ఆండ్రియా వద్ద ప్రస్తావించగా.. తాను నిర్మించిన మాస్క్ మంచి విజయాన్ని సాధిస్తే ఆ తరువాత పిశాచి 2 చిత్రాన్ని తానే విడుదల చేస్తానంది. దీంతో మాస్క్ చిత్ర హిట్పై పిశాచి 2 చిత్ర విడుదల ఆధారడిందన్నమాట! -
కుటుంబం రోడ్డుమీదకు.. నాన్న గుండె ఆగిపోయింది!
సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు ఏఆర్ రెహమాన్ (AR Rahman). ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించిన ఆయన బాల్యంలో ఎన్నో కష్టాలు చూశాడు. వాటిని తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు నేను ఎన్నో కష్టాలు అనుభవించాను. నానమ్మ మరణం. నాన్న మరణం.. ఈ రెండూ మా జీవితాలను కుదిపేశాయి. నాన్న చనిపోయినప్పుడు నాకు తొమ్మిదేళ్లే! ఎన్నో అవమానాలుఒంటరి తల్లిగా అమ్మ ఎన్నో బాధలు భరిస్తూ మమ్మల్ని పెంచింది. ఎన్ని అవమానాలు ఎదురైనా సరే కుంగిపోకుండా మమ్మల్ని ముందుకు నడిపించింది. నా బాల్యం అంతా చెన్నైలోనే గడిచింది. నేను అక్కడే పుట్టాను. మా నాన్న అక్కడి స్టూడియోలలోనే పనిచేసేవారు. కోడంబాక్కం దగ్గర్లోనే మేముండేవాళ్లం. నా పేరెంట్స్ను వారి కుటుంబసభ్యులే ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. నడివీధిలో నిలబెట్టారు. మాకంటూ మంచి ఇల్లుండాలని నాన్న పగలూరాత్రి తేడా లేకుండా కష్టపడేవాడు. కోలుకోవడానికి చాలా ఏళ్లువిశ్రాంతి లేకుండా రోజులో మూడు ఉద్యోగాలు చేసేసరికి ఆయన గుండె అలిసిపోయి ఒకరోజు ఆగిపోయింది. ఈ విషాదం నుంచి కోలుకోవడానికి నాకు చాలా ఏళ్లు పట్టింది అని చెప్పుకొచ్చాడు. ఏఆర్ రెహమాన్ చివరగా ధనుష్-కృతీ సనన్ల 'తేరే ఇష్క్ మే' సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా నవంబర్ 28న విడుదల కానుంది. ప్రస్తుతం రామ్చరణ్ 'పెద్ది' మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా పని చేస్తున్నాడు. అలాగే రామాయణ: పార్ట్ 1, జీనీ వంటి పలు చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు.చదవండి: అమల అక్కినేని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసా? -
రాహేలు వీడియో సాంగ్.. గ్లామర్గా 'హనీ రోజ్'
మలయాళ నటి హనీరోజ్(Honey Rose) నటిస్తున్న కొత్త సినిమా ‘రాహేలు’.. డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా రోమాంటిక్ సాంగ్ను విడుదల చేశారు. దర్శకుడు ఆనందిని బాలా రివేంజ్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ ప్రముఖ నటులు రోషన్ బషీర్, రాధికా రాధాకృష్ణన్ కీలక పాత్రలో నటించారు. ‘వీరసింహారెడ్డి’ సినిమాతో బాగా పాపులర్ అయిన హనీరోజ్ .. చాలారోజుల తర్వాత సరికొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించగా తాజాగా విడుదలైన సాంగ్ హనీ గ్లామర్తో హీట్ పెంచేసింది. -
పక్కా ప్లాన్తో స్క్రిప్టు రాస్తున్నాను: కీర్తి సురేష్
ప్రస్తుతం దక్షిణాది క్రేజీ హీరోయిన్లలో కీర్తి సురేష్( Keerthy Suresh) ఒకరు. మలయాళం చిత్ర పరిశ్రమలో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత కథానాయకిగా ఎదిగి మలయాళం, తమిళం ,తెలుగు భాషల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా రాణిస్తున్నారు. ఆ మధ్య మేరిజాన్ అనే చిత్రంతో బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చారు. ఈఅమ్మడు నటిగా పుష్కరకాలాన్ని పూర్తి చేసుకున్నారు. గత ఏడాది వివాహ జీవితంలోకి కూడా అడుగు పెట్టారు. కీర్తిసురేష్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం రివాల్వర్ రీటా ఈనెల 28న తెరపైకి రానుంది. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు. వివాహానంతరం తాను నటించిన రివాల్వర్ రీటా చిత్రం విడుదల కానుందని పేర్కొన్నారు. తన భర్తతో కలిసి నటిస్తారని చాలామంది అడుగుతున్నారని ఆయనతో నటించే ఆలోచన లేదని చెప్పారు. అసలు ఆయన సినిమా అంటేనే పారిపోతున్నారని అన్నారు. కాగా రివాల్వర్ రీటా చిత్రాన్ని ఆయన తనతో కలిసి చూశారని చెప్పారు. అప్పుడు ఇకపై ఇలా చిత్రాలను ప్రత్యేకంగా చూడనని, థియేటర్లోనే చూస్తానని చెప్పారన్నారు. ఇది కోలమావు కోకిల(కోకో కోకిల) చిత్రానికి సీక్వెల్ కాదని స్పష్టం చేశారు. తమిళ చిత్రం తొడరిలో తన నటన గురించి ఎగతాళి కూడా చేశారన్నారు. అయితే ఆ చిత్రం చూసిన తర్వాతే మహానటి చిత్రంలో తనను ఎంపిక చేశారని చెప్పారు. ఆ చిత్రానికి జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చిందన్నారు. ఒక ప్రమాదకరమైన వీడియోలో తాను సమంత కలిసి ఉన్నట్లు సృష్టించారన్నారు. దాన్ని చూసి తాను భయపడ్డాను అన్నారు. విదేశాల్లో మహిళలకు కొంత వరకు రక్షణ ఉంటుందని, మన దేశంలో కూడా అలాంటి పరిస్థితి రావాలని, అందుకోసం చట్టాలు తీసుకురావాలని పేర్కొన్నారు. తనకు దర్శకత్వం వహించాలన్న ఆసక్తి ఉందని అందుకోసం స్క్రిప్టును రాస్తున్నట్లు కీర్తిసురేష్ చెప్పారు. జీవితంలో ఒక్క సినిమాకు అయినా సరే దర్శకత్వం వహించాలనే కోరిక ఉందన్నారు. -
నేరుగా ఓటీటీకి సీరియల్ కిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే ధోరణి పూర్తిగా మారిపోయింది. కంటెంట్ ఉన్న చిత్రాలను ఆడియన్స్ విపరీతంగా ఆదరిస్తున్నారు. చిన్న సినిమాలైనా ఓటీటీల్లో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా మలయాళ క్రైమ్, థ్రిల్లర్ జోనర్ చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. అందులో సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎక్కువగా ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే సరికొత్త సినిమాలతో ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి.తాజాగా ఓ సీరియల్ కిల్లర్ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది. స్టీఫెన్ పేరుతో తెరకెక్కించిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో సందడి చేయనుంది. ఈ సరికొత్త సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 5నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు పోస్టర్ను రిలీజ్ చేసింది.కాగా.. ఈ చిత్రంలో గోమతి శంకర్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని రివీల్ చేసింది. ఈ సినిమాకు మిథున్ దర్శకత్వం వహించగా.. జేఎం ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కించారు. If we have a serial killer on our hands, namma keka vendiya kelvi yaaru nu ah illa yen nu ah?Watch Stephen, out 5 December in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi, only on Netflix! #StephenOnNetflix pic.twitter.com/KHUg70WCrS— Netflix India South (@Netflix_INSouth) November 20, 2025 -
హీరో అభిమాని కుటుంబానికి నిర్మాత భారీ సాయం
బేబీ సినిమాతో టాలీవుడ్లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత ఎస్కేఎన్ (SKN).. సినిమా వేదికలపై తను చేసే వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో ఉంటారు. అయితే, తాజాగా ఆయన ఒక కుటుంబాన్ని ఆదుకున్నారు. సినీ హీరో మహేష్ బాబు అభిమాని రాజేష్ అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం చనిపోయారు. ఇదే విషయాన్ని చెబుతూ రమేష్ నాయక్ అనే నెటిజన్ వివరాలతో సహా ట్వీట్ చేశాడు. సోషల్మీడియాలో యాక్టివ్గా ఉండే ఎస్కేఎన్ కంట ఆ పోస్ట్ పడింది. దీంతో ఆ కుటుంబానికి సాయం చేసేందుకు ఆయన ముందుకు వచ్చారు.ఒక అభిమానిగా ఇంకొక అభిమాని ఎమోషన్ను తాను అర్థం చేసుకోగలుగుతానని ఎస్కేఎన్ అన్నారు. ఈ క్రమంలోనే చనిపోయిన రాజేష్ ఇంటికి వెళ్లిన ఆయన ఆ కుటుంబానికి రూ. 2లక్షలు సాయిం చేశారు. రాజేష్కు 10 సంవత్సరాల కుమారుడు, ఆరు సంవత్సరాలు కూతురు ఉండటంతో వారి చదువుల కోసం ఈ డబ్బు ఉపయోగించాలని కోరారు. రాజేష్ ఇంటికి వెళ్లి అతని కుమారుడికి రెండు లక్షల చెక్ను ఎస్కేఎన్ అందించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఎస్కేఎన్ను అభినందిస్తూ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by PRO Sreenu Suresh (@pro_sreenusuresh) -
‘ఐబొమ్మ వన్’ పేరుతో మరో వెబ్సైట్.. సోషల్మీడియాలో ట్రెండింగ్
సినిమా పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత ‘ఐబొమ్మ’ (Ibomma), ‘బప్పంటీవీ’ (Bappamtv) పూర్తిగా క్లోజ్ అయ్యాయి. దీంతో టాలీవుడ్ నిర్మాతలు, సినీ నటులు సీసీ సజ్జనార్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆపై ఇమ్మడి రవి లాంటి వారిని ఎన్కౌంటర్ చేయాలని నిర్మాత సీ కల్యాణ్ కామెంట్ కూడా చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఇంటర్నెట్లో కొత్తగా ‘ఐబొమ్మ వన్’ వెబ్సైట్ తెరపైకి వచ్చింది.గతంలో ఉన్న ఐబొమ్మ మాదిరిగానే కొత్త సినిమాలు అందులో ఉన్నాయి. సినిమాను చూసేందుకు క్లిక్ చేస్తే ‘మూవీరూల్స్’కు కనెక్ట్ కావడం గమనార్హం. అలా మళ్లీ తెరపైకి ఐబొమ్మ పేరు వచ్చేసింది. ఈ రకంగా పైరసీ ద్వారా సినిమాలు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఐబొమ్మ క్లోజ్ కావడంతో ఇండస్ట్రీ, పోలీసులు సంతోషంగా ఉన్న సమయంలో ఇలా ఐబొమ్మ వన్ తెరపైకి రావడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. -
హిట్ మూవీ దర్శకుడితో సాయిపల్లవి మరోసారి?
ఇండస్ట్రీలో ఏ సినిమాలోనైనా సాయిపల్లవి హీరోయిన్గా చేస్తే ఆ సినిమా గ్యారెంటీ హిట్టే అన్నంతగా టాక్ ఉంది. తమిళంలో ఈమె నటించిన 'అమరన్' గతేడాది రిలీజై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రత్యేకించి సాయిపల్లవి నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాంటి ఈమె.. ప్రస్తుతం హిందీలో తీస్తున్న 'రామాయణ' అనే భారీ పాన్ ఇండియా మూవీలో సీతగా చేస్తోంది. దీంతో ఇప్పటికైతే దక్షిణాదిలో కొత్తగా మూవీస్ ఏం చేయట్లేదు. కానీ త్వరలో తమిళంలో కమ్ బ్యాక్ ఇవ్వనుందనే టాక్ వినిపిస్తుంది.(ఇదీ చదవండి: నయనతార బర్త్ డే.. గిఫ్ట్గా ఖరీదైన రోల్స్ రాయిస్)సాయిపల్లవి గతంలో ధనుష్కు జోడీగా 'మారి 2' అనే సినిమా చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఇదే యావరేజ్ అనిపించింది. ఈ హీరో ప్రస్తుతం 'అమరన్' దర్శకుడు తీస్తున్న కొత్త మూవీలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇందులో హీరోయిన్గా మీనాక్షిచౌదరి, పూజాహెగ్డే పేర్లు పరిశీలించారు. కానీ ఇప్పుడు ఫైనల్గా సాయిపల్లవి అని ఫిక్సయ్యారట. ఈ మేరకు చర్చలు సాగుతున్నాయిప్రస్తుతం ధనుష్ 'పోర్ తొళిల్' సినిమా ఫేమ్ విఘ్నేష్ రాజా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది త్వరలో పూర్తవుతుంది. ఇంతలో తర్వాత మూవీలో సాయిపల్లవి నటిస్తుందా లేదా అనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశముంది. త్వరలో దీని గురించి అధికారిక ప్రకటన రావొచ్చు.(ఇదీ చదవండి: రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ట్రైలర్ రిలీజ్) -
రజనీ, చిరంజీవి యాక్టింగ్ గురువు కన్నుమూత
ఎన్నో కోట్లమంది అభిమానం సంపాదించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలకు నటనలో ఓనమాలు నేర్పించిన గురువు, డైరెక్టర్ కేఎస్ నారాయణస్వామి (92) మరణించారు. వయసు రీత్యా గత కొన్నాళ్ల నుంచి ఇబ్బంది పడుతున్న ఈయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా రజనీకాంత్ స్వయంగా నారాయణస్వామి ఇంటికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. సంతాపం వ్యక్తం చేశారు.ఈయన పేరు నారాయణ స్వామి అయినప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం ఈయన కేఎస్ గోపాల్ అనే పేరుతో ఫేమస్. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, మద్రాస్ దూరదర్శన్ కేంద్రానికి డైరెక్టర్గానూ పనిచేశారు. రజనీకాంత్కి యాక్టింగ్ నేర్పడంతో పాటు దిగ్గజ దర్శకుడు బాలచందర్కి రజనీని పరిచయం చేసింది ఈయనే. అలా రజనీ-బాలచందర్ కాంబోలో 'అపూర్వ రాగంగళ్' సినిమా వచ్చింది. దీంతో రజనీ కెరీర్ మారిపోయింది. అలాంటి నారాయణస్వామి ఇప్పుడు చనిపోవడంతో ఆయన సేవలు స్మరించుకుంటూ పలువురు ప్రముఖులు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, అగ్గిపుల్ల కాదేదీ త్రిషకు అనర్హం
సెలబ్రిటీలు ఏం చేసినా అది వార్తే అవుతుంది. అలా ఒక్కో సెలబ్రిటీకి ఒక్కో హాబీ ఉంటుంది. వీటిలో ఎక్కువగా పెట్ లవర్స్ ఉంటారు. అలా నటి త్రిష కృష్ణన్ కూడా సునక ప్రేమికురాలు అన్న విషయం తెలిసిందే. ఈమె ఇంటిలో పెట్ డాగ్స్ ఎక్కువగానే ఉంటాయి. అంతే కాకుండా తను ట్రావెలింగ్ చేస్తున్న దారిలో ఏదైనా కుక్క బాధింపులకు గురైతే దాన్ని ఇంటికి తీసుకొచ్చి వైద్యం చేయించి సంరక్షణ బాధ్యతలు చేపడతారు. ఇలా పెట్ అభిమాని అయిన త్రిష పెటా సమాఖ్యకు బ్రాండ్ అంబాసీడర్గానూ వ్యవహరించారు. ఇక తన పెట్ డాగ్ మరణిస్తే మనిషి మరణించినంతగా బాధ పడతారు. తాజాగా తన పెట్ కుక్క పిల్ల (ఐజీ కృష్ణన్) పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. తన పెంపుడు కుక్క మొదటి ఏడాది పుట్టిన రోజును నిర్వహించిన త్రిష, తన ఇంటిపెరట్లో కాగితపు తోరణాలు, బెలూన్లతో సుందరంగా డెకరేషన్ చేసి, తన కుక్కపిల్లకు ఇష్టమైన రకరకాల ఆహారాన్ని కేక్ చుట్టు ఏర్పాటు చేశారు. ఆ కుక్క పిల్ల తనకు చాలా ప్రత్యేకం. డాగ్ ఫుడ్కు సంబంధించి ప్రముఖ కంపెనీకి బ్రాండ్అంబాసిడర్గా ఆ కుక్క పిల్ల ఉన్నడం విశేషం. త్రిషకు ఎంతో ప్రత్యేకమైన తన డాగ్కు నూతన వ్రస్తాలు ధరింపజేసి ఒళ్లో కూర్చోపెట్టుకుని ముద్దాడి, దానికి బదులు తనే కేక్ కట్ చేసి ,తినిపించి పుట్టిన రోజు వేడుకను నిర్వహించారు. ఆ ఫొటోలను తన ఇన్స్టా గ్రామ్లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తన కుక్క పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా ఆమె ప్రారంభించడం విశేషం.ఇదంతా చూస్తుంటే మహాకవి శ్రీశ్రీ రాసిన కుక్కపిల్ల.. సబ్బుబిళ్ళ... అగ్గిపుల్ల కాదేదీ కవితకు అనర్హం అన్న అంశం గుర్తుకొస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల నటి త్రిషకు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అందుకు కారణం ఆమె నటించిన విడాముయర్చి, థగ్స్ లైఫ్ వంటి చిత్రాలు పూర్తిగా నిరాశపడటమే కావచ్చు. కాగా ప్రస్తుతం తమిళంలో ఈమె సూర్యకు జంటగా నటిస్తున్న కరుప్పు చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అదే విధంగా తెలుగులో చిరంజీవికి జంటగా నటించిన విశ్వంభర ఆపై మలయాళంలో రామ్ అనే చిత్రం మాత్రమే ఈమె చేతిలో ఉన్నాయి. అయితే కొత్త అవకాశాలేవీ లేవన్నది గమనార్హం. -
లాభాలతో పాటు గౌరవాన్ని తెచ్చిపెట్టిన సినిమా
రియోరాజ్, మాళవిక మనోజ్ జంటగా నటించిన తమిళ చిత్రం ఆన్పావం పొల్లాదదు (Aan Paavam Pollathathu Movie). ఆర్జే విగ్నేష్కాంత్, షీలా, జెన్సన్ దివాకర్ ముఖ్యపాత్రులు పోషించిన ఈ చిత్రం ద్వారా కలైయరసన్ తంగవేల్ దర్శకుడుగా పరిచయమయ్యారు. డ్రమస్టిక్ ప్రొడక్షన్స్ పతాకంపై వెడిక్కారన్పట్టి ఎస్ శక్తివేల్ నిర్మించిన ఈ చిత్రానికి టీకేటీ నందకుమార్, ఎంఎస్కే ఆనంద్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేసింది. బ్లాక్షిప్ ఫైండింగ్స్ సంస్థ సహకారంతో రెండు వారాల క్రితం విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్లో థాంక్స్ గివింగ్ సమావేశాన్ని నిర్వహించారు. ఆర్జే విఘ్నేశ్కాంత్ మాట్లాడుతూ.. నిన్నటి జ్ఞాపకాలను మధురంగానూ, నేటి జ్ఞాపకాలను అనుభవాలుగానూ, రేపటి కలలను నిజం చేసేలా తాము నాటిన ఈ విత్తనానికి ఆదరణ తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు కలైయరసన్ తంగవేల్ మాట్లాడుతూ.. ఈ విజయాన్ని కథా రచయిత శివకుమార్ మురుగేశన్తో కలిసి పంచుకుంటున్నానని అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ అందరూ ఒక కుటుంబం మాదిరి పని చేశారన్నారు. తాము ఇంతకుముందు నిర్మించిన కొన్ని చిత్రాలు విమర్శలను ఎదుర్కొన్నా, కమర్షియల్గా హిట్ అయ్యాయన్నారు. అయితే ఆన్పావం పొల్లాదదు చిత్రం లాభాలు తెచ్చిపెట్టడంతోపాటు తమ గౌరవాన్ని పెంచిందన్నారు. రియోరాజ్ మాట్లాడుతూ ఇకపై కూడా మీకు నచ్చే కథా చిత్రాలనే చేస్తానని అన్నారు. -
చిత్రపరిశ్రమలో విషాదం.. దర్శకుడు కన్నుమూత
సాక్షి, చెన్నై: సీనియర్ దర్శకుడు వి.శేఖర్ (72) శుక్రవారం సాయంత్రం చైన్నెలో అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈయన స్వగ్రామం తిరువణ్ణామలై సమీపంలోని నెయ్ వానత్తం. మొదట్లో ప్రభుత్వ ఉద్యోగం చేసిన వి.శేఖర్ సినిమాలపై ఆసక్తితో ఎడిటర్ లెనిన్ వద్ద కొంత కాలం పని చేశారు. ఆ తరువాత కె.భాగ్యరాజ్ శిష్యుడు గోవిందరాజ్ వద్ద చేరి కన్ను తొలక్కనుమ్ సామి చిత్రానికి సహాయ దర్శకుడిగా వ్యవహరించారు. ఆ తరువాత కె.భాగ్యరాజ్ వద్ద పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. సినిమా1990లో నిళల్గళ్ రవి హీరోగా నటించిన 'నీంగళుమ్ హీరోదాన్' అనే మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. తరువాత అదే నిళల్గళ్ రవిని హీరోగా పెట్టి నాన్ పుడిచ్చ మాప్పిళై మూవీ తీశారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇది తెలుగులో మామగారు పేరుతో రీమేక్ అయింది. దాసరి నారాయణరావు, వినోద్ కుమార్, యమున ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఆ తరువాత పలు కుటుంబ కథా చిత్రాలను రూపొందించారు.అవయవదానంనిర్మాతగానూ కొన్ని హిట్ చిత్రాలను నిర్మించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన వీ.శేఖర్ స్థానిక పోరూర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం ఆస్పత్రిలోనే తుది శ్వాస విడిచారు. స్థానిక కోడంబాక్కమ్, సుబ్బరాయన్ నగర్లోని సామియార్ మఠంలో నివసిస్తున్న ఈయనకు భార్య తమిళ్ సెల్వి, కూతురు మలర్కొడి, కొడుకు కారల్ మార్క్స్ ఉన్నారు. దర్శకుడు వి.శేఖర్ అవయవ దానం చేశారు. ఆ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఆయన భౌతిక కాయాన్ని శనివారం ఇంటికి తీసుకు వచ్చారు. వి.శేఖర్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.చదవండి: కోర్టు హీరోయిన్కు తమిళ్లో మరో ఛాన్స్ -
'కోర్టు' నటి శ్రీదేవికి తమిళ్ మరో ఛాన్స్
టాలీవుడ్లో'కోర్ట్' సినిమాతో నటి శ్రీదేవి పాపులర్ అయిపోయింది. అదే ఊపులో తమిళంలో ఒకటి, తెలుగులో ఒకటి రెండు చిత్రాలు చేస్తోంది. కొన్నిరోజుల క్రితమే సొంతంగా కారు కూడా కొనుక్కుంది. తమిళంలో కేజేఆర్ అనే నటుడు, నిర్మాత తీయబోతున్న కొత్త చిత్రంలో శ్రీదేవిని కథానాయికగా ఇప్పటికే ఎంచుకున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ప్రభుదేవా సహా పలువురు తమిళ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు మన శ్రీదేవి తమిళ్లో రెండో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.కోలీవుడ్లో వైవిధ్య భరిత కథాచిత్రాలను నిర్మిస్తున్న సంస్థ విజన్ సినిమా హౌస్. ఈ సంస్థ అధినేతలు డాక్టర్ అరుళానందు, మ్యాథ్యు అరుళానందు ప్రతిభావంతులైన నటీనటులను, సాంకేతిక వర్గాన్ని ప్రోత్సహించే విధంగా చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు శ్రీదేవికి వారు సినిమా ఛాన్స్ ఇచ్చారు. ఇదే బ్యానర్ నుంచి నిర్మించిన జో చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నటుడు 'ఏగన్'(Aegan)ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ శీను రామస్వామి దర్శకత్వంలో కోళి పన్నై చెల్లదురై అనే వైవిధ్యభరిత కథా చిత్రాన్ని నిర్మించి సక్సెస్ తో పాటు ప్రశంసలను అందుకున్నారు.తాజాగా తమ మూడో చిత్రాన్ని నిర్మించడానికి వారు సిద్ధమయ్యారు. ఇందులో జో, కోళిపన్నై చెల్లదురై చిత్రాలతో పాపులర్ అయిన నటుడు ఏకన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. కాగా ఇందులో కోర్ట్ ఫేమ్ శ్రీదేవి, మలయాళ చిత్రం బ్రూస్ లీ బిజీ ఫెమ్ ఫెమినా జార్జ్ హీరోయిన్లగా నటిస్తున్నారు. ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఆహా కళ్యాణం చిత్రం ఫేమ్ యువరాజ్ చిన్నస్వామి కథ దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. -
రజనీకి నచ్చలేదు అందుకే.. మరెందుకు తొందర?
సినిమా తీయడం అంటే ఆషామాషీ విషయం కాదు. లాంచింగ్ దగ్గర నుంచి థియేటర్లలో రిలీజ్ చేసేంత వరకు ఏదో టెన్షన్ ఉండనే ఉంటుంది. అయితే కొన్నిసార్లు మూవీ మొదలవకుండానే ఆగిపోయిన సందర్భాలు, లేదంటే దర్శకులు, హీరోలు మారిపోయిన పరిస్థితులు కనిపిస్తుంటాయి. రీసెంట్ టైంలో అయితే రజనీకాంత్-కమల్ హాసన్ ప్రాజెక్ట్ నుంచి దర్శకుడు సుందర్ తప్పుకోవడం చర్చనీయాంశమైంది.'కూలీ' తర్వాత రజనీ.. కొత్తగా ఏ సినిమా చేస్తారా అని అభిమానులు అనుకుంటున్న టైంలో ఈ ప్రాజెక్ట్ ప్రకటన వచ్చింది. రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాతగా, సుందర్.సి దర్శకుడిగా మూవీ అనౌన్స్ చేశారు. ఇది జరిగి వారం పదిరోజులు కూడా కాలేదు. సుందర్.. ఈ సినిమా నుంచి తప్పుకొన్నారు. ఈ మేరకు అధికారిక నోట్ కూడా రిలీజ్ చేశారు. అనివార్య కారణాల వల్లే ఇదంతా అని సుందర్ చెప్పారు. కానీ ఇప్పుడు అసలు కారణం ఏంటో కమల్ బయటపెట్టారు.(ఇదీ చదవండి: ప్రభాస్ కొత్త సినిమా.. టెన్షన్లో ఫ్యాన్స్!)తాజాగా మీడియాతో మాట్లాడిన కమల్.. స్టోరీ నచ్చకపోవడం వల్ల ప్రాజెక్ట్ నుంచి సుందర్ తప్పుకోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చేశారు. తాను నిర్మాత అని, తన మూవీలో హీరోకు స్టోరీ నచ్చేంతవరకు వెతుకుతూనే ఉంటామని కూడా అన్నారు. అయితే ఇదేదో ప్రాజెక్ట్ ప్రకటించకముందే చేసుంటే బాగుండేది కదా అని నెటిజన్లు అనుకుంటున్నారు. ఎందుకు అంత తొందరపడ్డారో అని మాట్లాడుకుంటున్నారు.ఈ సినిమాతో పాటు రజనీతో తాను నటించే మరో మూవీ కోసం కూడా స్టోరీ వెతుకుతున్నామని చెప్పి కమల్ హాసన్ చెప్పారు. మరి సుందర్ తప్పుకోవడంతో ఆ స్థానంలోకి వచ్చే దర్శకుడు ఎవరా అని ప్రస్తుతం డిస్కషన్ సాగుతోంది. టాలీవుడ్ వైపు కూడా కమల్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి తెలుగు యంగ్, సీనియర్ డైరెక్టర్స్ ఆయా చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరి రజనీ-కమల్ కాంబో మూవీ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'కాంత' సినిమా మొదటిరోజు భారీ కలెక్షన్స్)I’m an investor in this film and I will look for a story which my star will love. We’ll keep searching until we find it. - Kamal Haasan about #Thalaivar173 pic.twitter.com/4gjw3Q27MZ— LetsCinema (@letscinema) November 15, 2025 -
చాలామంది హీరోయిన్లు నన్ను రిజెక్ట్ చేశారు: హీరో
‘‘నేను హీరోగా నటిస్తున్న మూడవ చిత్రం రజనీ గ్యాంగ్. స్టార్ హీరో కావాలన్నది నా డ్రీమ్. అందుకోసం చాలా కథలు విన్నాను. అలాంటి సమయంలో దర్శకుడు రమేష్ భారతి మూడు కథలు చెప్పారు. రజనీ గ్యాంగ్ కథలో నటించమని ఆయనే సూచించారు. వినోదభరిత కథా చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని చెప్పారు. మొదట్లో ఈ చిత్రాన్ని నేను నిర్మించకూడదని భావించాను, అయితే ఆ తర్వాత నేనే నిర్మించడానికి సిద్ధమయ్యా.. చాలామంది రిజెక్ట్ఇందులో ప్రముఖ నటీనటులను ఎంపిక చేశాం. నాకు మాత్రం హీరోయిన్ సెట్ కాలేదు. నా సరసన నటించడానికి చాలామంది ప్రముఖ హీరోయిన్లు నిరాకరించారు. చివరిగా నటి దివిక వచ్చారు. నాకు జంటగా నటించడానికి అంగీకరించినందుకు ఆమెకు ధన్యవాదాలు. ఇందులో నటుడు మొట్టై రాజేంద్రన్, మునీష్ కాంత్, కూల్ సురేష్, కల్కీరాజా వదలకు పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. బబ్లూ అనే ఒక కుక్క కీలక పాత్రను పోషించింది. నవంబర్లోనే..చిత్రంలో మూడు పాటలున్నాయి. వాటిని సంగీత దర్శకుడు ఎంఎస్ జోన్స్ రూబర్ట్స్ జనరంజకంగా రూపొందించారు. ఎన్ఎస్ సతీష్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు. హారర్, కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం ‘‘ అని తమిళ హీరో, నిర్మాత రజిని కిషన్ పేర్కొన్నారు. మిశ్రీ ఎంటర్ ప్రైజస్ పతాకంపై ప్రముఖ దివంగత ఫైనాన్షియర్ ఎస్.సెయిన్ రాజ్ జైన్ దివ్య ఆశీస్సులతో రజనీ కిషన్ నిర్మించారు. -
స్వయంకృషితోనే ఛాన్స్ దక్కించికున్నా: జోషిణ
సినిమాల్లో కథానాయకిగా నటించడానికి కచ్చితంగా కొన్ని అర్హతలు ఉండాలి. అలాంటి అర్హతలను కలిగిన వర్ధమాన నటి జోషిణ. ఈమె భరతనాట్యంతో పాటు, డాన్సులోనూ శిక్షణ పొందారు. అదే విధంగా బైక్ రైడింగ్, కార్ డ్రైవింగ్, గుర్రపు స్వారి, కర్రసాము వంటి వాటిలో శిక్షణ పొందారు. అదేవిధంగా కూత్తుపట్టరై కలైరాణి వద్ద డబ్బింగ్ చెప్పడంలోనూ శిక్షణ పొందారు. తెలుగులో నటించాలన్న ఆసక్తితో తెలుగు భాషను నేర్చుకున్నట్లు చెప్పిన నటి జోషిణ ఇప్పుడు పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమె తన గురించి,నటనపై ఆసక్తి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ‘‘ మా కుటుంబానికి సినిమాకు ఎలాంటి సంబంధం లేదు . అదే విధంగా సినిమా రంగంలో తనకు తెలిసిన వారు ఎవరు లేరు. ఒక దశలో సినిమాపై నాకు ఆసక్తి ఏర్పడింది. దీంతో వెంటనే మరో ఆలోచన లేకుండా సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాను. అలా స్వయంకృతోనే నటిగా ప్రకాశించాలని భావించాను. అదృష్టం అనేది పరిచయం వరకే పని చేస్తుంది. ఆ తర్వాత నిలదొక్కుకోవాలంటే , ప్రతిభ, నిరంతర శ్రమ అవసరం అవుతుంది. అందుకు తగిన శిక్షణ అవసరం అవుతుంది’’ అని నటి జోషిణ పేర్కొన్నారు. ఈమె ప్రస్తుతం కిషోర్ మత్తురామలింగం దర్శకత్వంలో నటించిన మిడిల్ క్లాస్ చిత్రం ఈనెల 21వ తేదీన తెరపైకి రానుంది. ఇందులో నటుడు రాధా రవికి కూతురుగా నటించారు. అదేవిధంగా వెట్రి మహాలింగం దర్శకత్వంలో సూట్ కేస్ చిత్రంలోను నటిస్తున్నారు. ఇక నటుడు సెమ్మలర్ అన్నం దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలోనూ తాను కథానాయకిగా నటించబోతున్నట్లు జోషిణ చెప్పారు. -
రజనీకాంత్ 173వ సినిమా.. వారంలోనే తప్పుకొన్న దర్శకుడు
ఈ ఏడాది 'కూలీ'తో ప్రేక్షకుల్ని పలకరించిన రజనీకాంత్ నుంచి వారం క్రితం కొత్త సినిమా ప్రకటన వచ్చింది. తమిళ దర్శకుడు సుందర్తో కలిసి పనిచేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్టుని హీరో కమల్ హాసన్ నిర్మించనున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఇప్పడు అకస్మాత్తుగా ఈ మూవీ నుంచి సుందర్ తప్పుకొన్నారు. ఈ విషయమై ఇప్పుడు అధికారికంగా నోట్ కూడా రిలీజ్ చేశారు.'అనుకోని పరిస్థితుల కారణంగా #తలైవర్173 నుంచి తప్పుకొంటున్నాను. అయినా సరే రజనీకాంత్, కమల్ హాసన్లతో అనుబంధం అలానే కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా వాళ్లతో గడిపిన క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి' అని సుందర్.సి తన నోట్లో రాసుకొచ్చారు. కానీ ఎందుకు బయటకొచ్చేయాల్సి వచ్చింది? ఏమైంది? అనే విషయాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.(ఇదీ చదవండి: న్యూయార్క్లో అనిరుధ్-కావ్య మారన్.. ఏం జరుగుతోంది?)ఇకపోతే రజనీకాంత్-కమల్ హాసన్ కాంబో అనగానే చాలామంది కలిసి నటిస్తారని అనుకున్నారు. కానీ రజనీ హీరోగా, కమల్ నిర్మాత అనేసరికి కాస్త సంబరపడ్డారు. కానీ దర్శకుడిగా సుందర్ అనేసరికి చాలామంది అభిమానులు అసంతృప్తికి గురయ్యారు. దీనికి కారణముంది. గతంలో రజనీకాంత్కి 'అరుణాచలం' లాంటి హిట్ చిత్రాన్ని సుందర్ ఇచ్చినప్పటికీ.. రీసెంట్ టైంలో అయితే దెయ్యాల సినిమాలు తీస్తున్నాడు. వీటికి డబ్బులొస్తున్నాయి గానీ అంతంత మాత్రంగానే ఆడుతున్నాయి.ఇలాంటి దర్శకుడిగా రజనీకాంత్-కమల్ హాసన్.. అసలు ఎలా అవకాశమిచ్చారా అని.. అనౌన్స్మెంట్ వచ్చిన టైంలోనే చాలామంది అనుకున్నారు. ఇప్పుడు సుందర్ స్వచ్ఛందంగా తప్పుకోవడంతో, ఈయన స్థానంలోకి వచ్చే కొత్త దర్శకుడు ఎవరా అనేది సస్పెన్స్గా మారింది. అయితే సుందర్ నోట్ని, ఇతడి భార్య, నటి ఖుష్బూ తొలుత సోషల్ మీడియాలో పంచుకుంది. మరి ఏమైందో ఏమో గానీ వెంటనే డిలీట్ చేసింది.(ఇదీ చదవండి: ఎర్రకోట ఘటన.. 'పెద్ది' టీమ్ జస్ట్ మిస్!) -
న్యూయార్క్లో అనిరుధ్-కావ్య మారన్.. ఏం జరుగుతోంది?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. స్వతహాగా తమిళ వాడే అయినప్పటికీ అడపాదడపా మన దగ్గర కూడా మూవీస్ చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ టైంలో అయితే 'కింగ్డమ్'తో వచ్చాడు. కెరీర్ పరంగా మంచి ఫామ్లో ఉన్న అనిరుధ్.. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడా అనే సందేహం వస్తోంది. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో.. ఈ పుకార్లు నిజమేనేమో అనే హింట్ ఇస్తోంది.(ఇదీ చదవండి: ఓవైపు తల్లి పాత్రలు.. మరోవైపు ఐటమ్ సాంగ్స్.. శ్రియ తగ్గేదే లే)చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న అనిరుధ్.. ప్రస్తుతానికైతే సింగిల్గానే ఉన్నాడు. గతంలో హీరోయిన్ ఆండ్రియాతో రూమర్స్ వినిపించాయి. కానీ గత కొన్నేళ్ల మాత్రం ఇతడి పాటలు మాత్రమే వినిపించాయి. కానీ ఈ ఏడాది జూన్లో మాత్రం అనిరుధ్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ని పెళ్లి చేసుకోనున్నాడనే రూమర్స్ వచ్చాయి. వీటిపై స్పందించిన అనిరుధ్.. చిల్ గాయ్స్ అలాంటిదేం లేదని ట్వీట్తో క్లారిటీ కూడా ఇచ్చాడు. కానీ ఇప్పుడు కావ్యతోనే కనిపించడం కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది.యూకేకి చెందిన ఓ యూట్యూబర్.. న్యూయార్క్లో వ్లాగ్స్ తీశాడు. అయితే ఓ వీడియోలో అనిరుధ్-కావ్య జంటగా నడుస్తూ కనిపించారు. అంటే ఇద్దరూ కలిసి ట్రిప్ వేశారని నెటిజన్లు అంటున్నారు. దీంతో పెళ్లి వార్తలు నిజమేనా అని రూమర్స్ మళ్లీ మొదలయ్యాయి. త్వరలోనే అనిరుధ్.. కళానిధి మారన్కి అల్లుడు కాబోతున్నాడా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతానికి అటు అనిరుధ్, ఇటు కావ్య సింగిల్గానే ఉన్నారు. కెరీర్ పరంగా ఎవరి బిజీలో వాళ్లు ఉన్నారు. ఒకవేళ రూమర్స్ నిజమైతే మాత్రం పెళ్లి వార్త ఎప్పుడు చెబుతారో చూడాలి?(ఇదీ చదవండి: ఢిల్లీలో పేలుడు.. SSMB29 ఈవెంట్పై పడుతుందా..?)👋🏻 pic.twitter.com/kBrOCbivDQ— ranjii.in (@Ranjiiin) November 12, 2025 -
ఓవైపు తల్లి పాత్రలు.. మరోవైపు ఐటమ్ సాంగ్స్
సాధారణంగా వయసు పెరిగిన తర్వాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయని అంటుంటారు. చాలామంది విషయంలో ఇలా జరిగింది కూడా. కానీ కొందరు మాత్రం పెద్దవాళ్లు అవుతున్నా గ్లామర్ విషయంలో అస్సలు తగ్గట్లేదు. బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరాకు అయితే 50 ఏళ్లు దాటిపోయాయి. కానీ మొన్నీమధ్యే వచ్చిన 'థామా'లో ఐటమ్ సాంగ్ చేసింది.(ఇదీ చదవండి: ‘స్పిరిట్’లో చిరు, డాన్ లీ..? క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా)అసలు విషయానికొస్తే అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోల సరసన నటించిన శ్రియ.. 2018లో ఆండ్రూ కొశ్చివ్ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకుంది. తర్వాత ఈమెకు ఓ పాప కూడా పుట్టింది. ప్రస్తుతానికైతే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది. మరికొన్ని చిత్రాల్లో హీరోయిన్గా చేస్తోంది. రీసెంట్ టైంలో అయితే హిట్ మూవీ 'మిరాయ్'లో తల్లి పాత్రలో కనిపించింది. ఇప్పుడు ఓ తమిళ మూవీలో ఐటమ్ సాంగ్ చేసి ఆశ్చర్యపరిచింది.'నాన్ వయలెన్స్' పేరుతో తీస్తున్న ఓ సినిమాలో 'కనకం' అంటూ సాగే ఐటమ్ పాటలో శ్రియ డ్యాన్స్తో ఆకట్టుకుంది. ఈ ఏడాది రిలీజైన సూర్య 'రెట్రో'లోనూ ఐటమ్ సాంగ్ చేసింది గానీ ఎందుకనో అది పెద్దగా వైరల్ కాలేదు. ఇప్పుడొచ్చిన పాట మాత్రం శ్రియ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది. 43 ఏళ్ల వయసులోనూ ఈ రేంజ్ అందం మెంటైన్ చేస్తోందని నెటిజన్లు, ఆమె అభిమానులు అవాక్కవుతున్నారు.(ఇదీ చదవండి: ఢిల్లీలో పేలుడు.. SSMB29 ఈవెంట్పై పడుతుందా..?) -
రెండో పెళ్లి తర్వాత రీఎంట్రీ.. ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ
అమలాపాల్(Amala Paul).. ఆ పేరే ఒక సంచలనం అని చెప్పవచ్పు. వివాదాలకు కేరాఫ్ అనే చెప్పాలి. ఆదిలోనే చర్చనీయాంశమైన కథా పాత్రల్లో నటించిన అమలాపాల్.. 'మైనా' చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత ప్రముఖ హీరోలతో నటించే అవకాశాలు వరించడంతో స్టార్ హీరోయిన్గా రాణించారు. అలా విక్రమ్ హీరోగా నటించిన దైవతిరుమగళ్ (నాన్న).. విజయ్కు జంటగా తలైవా వంటి భారీ చిత్రాల్లో నటించారు. ఎక్కువగా తమిళ్లోనే కనిపించిన ఈ బ్యూటీ తెలుగులోనూ ఇద్దరమ్మాయిలతో, నాయక్ వంటి చిత్రాల్లో నటించి బహుభాషా నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, కథానాయకిగా బిజీగా ఉండగానే దర్శకుడు విజయ్తో 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహ బందం ఎక్కువ కాలం సాగలేదు. మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తరువాత చిత్రాల్లో నటించడం మొదలెట్టిన అమలాపాల్ నిర్మాతగానూ అవతారమెత్తి మలయాళంలో ఒక చిత్రం చేశారు. ఆ తరువాత జగత్ దేశాయ్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుని నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. వీరికి ఇళయ్ అనే మగబిడ్డ ఉన్నారు. దీంతో ఇప్పుడు మళ్లీ నటించడానికి సిద్ధం అవతున్నట్లు సమాచారం. అందుకోసం తీవ్రంగా కసరత్తు చేస్తూ.., కేరళ చికిత్స సాయంతో తన అందాలకు మెరుగు పెడుతున్నారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అంతే కాకుండా నటించడానికి కథలను వింటున్నట్లు తెలిసింది. దీంతో అమలాపాల్ సెకెండ్ ఇన్నింగ్ ఖాయం అంటున్నారు సినీ వర్గాలు. కాగా సమాచారంతో ఆమె అభిమానులను ఖుషీ అవుతున్నారు. View this post on Instagram A post shared by Amala Paul 🩷 (@amalapaul) -
తమన్నా అలాంటి ఇంజెక్షన్లు ఉపయోగిస్తుందా..?
సౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్లో కూడా తమన్నాకు ఫ్యాన్స్ ఉన్నారు. ఇండస్ట్రీకి వచ్చి తాను సుమారు 20 ఏళ్లు అవుతుంది. కెరీర్ ఆరంభంలో తన శరీరాకృతి ఎలా ఉండేదో ఇప్పుడు కూడా వెండితెరపై అలాగే కనిపిస్తుంది. ప్రస్తుతం 35 ఏళ్ల వయసుకు చేరుకున్న ఈ మిల్కీ బ్యూటీ ఫిట్నెస్ విషయంలో అస్సలు రాజీ పడదు. షూట్స్ ఉన్నా లేకున్నా క్రమం తప్పకుండా వర్కౌట్లు చేయడం.. ఆహారం విషయంలోనూ సరైన డైట్ ఫాలో అవుతుంది. అందుకే తనలో ఎలాంటి మార్పులు లేవు.కానీ, రీసెంట్గా తమన్నా కాస్త బరువు పెరిగారని, బెల్లీ ఫ్యాట్ కూడా వచ్చేసిందని బాలీవుడ్లో వార్తలు వచ్చాయి. దానిని కంట్రోలో చేసుకునేందుకు ఓజెంపిక్ వంటి బరువు తగ్గించే ఇంజెక్షన్లను ఉపయోగిస్తుండవచ్చని నెటిజన్లు ఊహించగా, మరికొందరు ఆమె రిఫ్రెష్, మెరిసే రూపాన్ని చూసి మెచ్చుకున్నారు. అయితే, ఈ రూమర్స్పై తమన్నా నేరుగా ప్రస్తావిస్తూ.. ఒక ఇంటర్వ్యూలో నిజాన్ని తెలిపింది.తన రూపం పూర్తిగా సహజమైనదని చెప్పని తమన్నా తన బరువును తగ్గించుకునేందుకు ఎలాంటి ఇంజెక్షన్లు ఉపయోగించలేదని ఇలా చెప్పింది. 'నాకు 15 సంవత్సరాల వయస్సు నుండి కెమెరా ముందు కనిపిస్తున్నాను. మొదట్లో నేను ఎలా ఉండేదానినో ఇప్పుడూ అలాగే ఉన్నాను. నా ఎదుగుదలను ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ దాచడానికి ఏమీ లేదు. నాకు 20 ఏళ్ల వయసప్పుడు సన్నని శరీరంతోనే ఉన్నాను. ఇప్పుడూ అలాగే ఉన్నాను. నేను సహజంగానే అలా ఉన్నాను. నేను ఇలాగే పెరిగాను. నాలో ఎలాంటి మార్పులు లేవు.'అని ఆమె చెప్పింది.వాల్ల దృష్టిలో బరువు పెరిగాను'నేను నటించిన హిందీ చిత్రాలను మాత్రమే చూస్తున్న ప్రేక్షకులు నా శరీరాకృతిలో మార్పులు వచ్చాయని కాస్త ఆశ్చర్యకరంగా భావిస్తారు. అందులో వారి తప్పులేదు.. ఎందుకంటే.., వారు నా సినీ ప్రయాణాన్ని రీసెంట్గా చూస్తున్నారు. నా తొలి దశలో వచ్చిన సినిమాలు చూడలేదు. కాబట్టి హిందీ ప్రేక్షకులకు నేను బరువు పెరిగినట్లు కొత్తగా అనిపిస్తుంది. కానీ, నేను 100 సినిమాలకు దగ్గరగా ఉన్నాననే విషయం వారందరికీ తెలయికపోవచ్చు. ప్రజలు నన్ను చాలా విభిన్న పాత్రలలో నా శరీరంలో వచ్చిన మార్పులు వివిధ దశలలో చూశారు.' అని ఆమె వివరించారు.స్త్రీ శరీరం ఎల్లప్పుడూ మారుతూనే ఉంటుంది'ఒక స్త్రీ శరీరం ఎల్లప్పుడూ మారుతూనే ఉంటుంది. ప్రతి ఐదు సంవత్సరాలకు కొన్ని మార్పులు కనిపిస్తాయి. మనం మనలోని విభిన్న వెర్షన్ను చూస్తాము. ముఖ్యంగా కోవిడ్ సమయంలో నా శరీరం చాలా దెబ్బతింది. నా 20 ఏళ్లలో ఉన్నట్లే నా శరీరాన్ని ఉంచుకోవడం ఆ సమయంలో చాలా కష్టమైంది. కాస్త బరువు పెరిగాను. దాంతో నా శరీరంలో ఎక్కువ మార్పులు వచ్చాయి. బరువు పెరిగి నా కడుపు కనిపిస్తోందా..? అని నేను అనుకునే సందర్భాలు చాలు ఉన్నాయి. ఆ సమయంలో చాలా బాధపడ్డాను. కానీ, ప్రతి స్త్రీ తన చక్రంలో తన శరీరం మారడాన్ని గుర్తిస్తుంది. దానికి నేను ఏమీ మినహాయింపు కాదు.' అని ఆమె చెప్పింది. -
మంచంపైనే నిద్రపోతున్నావా లేదా ఫ్రిజ్లో.. హీరోయిన్పై కామెంట్స్
సినిమా సెలబ్రిటీలు అప్పుడప్పుడు మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు అలానే విజయ్ సేతుపతి, ఓ హీరోయిన్ గురించి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారిపోయాయి. అయితే ఇక్కడ సేతుపతి.. ఆమె గురించి పాజిటివ్గానే మాట్లాడాడు. ఏదైతేనేం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'.. కామెడీగా గ్లింప్స్)తమిళంలో తొలుత హీరోయిన్గా సినిమాలు చేసిన ఆండ్రియా.. తెలుగులోనూ 'తడాఖా'తో పాటు వెంకటేశ్ 'సైంధవ్'లో నటించింది. అంతకంటే ముందు సింగర్గా అందరివాడు, బొమ్మరిల్లు, రాఖీ, దేశముదురు, కరెంట్, కింగ్, దడ తదితర సినిమాల్లో పాటలు పాడింది. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీగా ఉంది. ఈమె లేటెస్ట్ తమిళ మూవీ 'మాస్క్'. కవిన్ హీరోగా నటిస్తుండగా ఈమె విలన్గా చేసింది. రెండురోజుల క్రితం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. దీనికి అతిథిగా వచ్చిన విజయ్ సేతుపతి, ఆండ్రియా గ్లామర్ గురించి ఫన్నీ కామెంట్ చేశాడు.'నా చిన్నతంలో బీచ్ ఒడ్డున ఓ విగ్రహాన్ని చూశాను. అలానే నిన్ను కూడా చూశాను. అప్పటినుంచి మీ ఇద్దరూ అలానే ఉన్నారు. చాలా ఏళ్ల క్రితం నువ్వు నటించిన యాడ్లో ఉన్నట్లే ఇప్పుడు అలానే ఉన్నావ్. నేనే కాదు నా కొడుకు కూడా నిన్ను ఆశ్చర్యంగానే చూస్తాడు. ఇంతకీ నువ్వు మంచంపైనే నిద్రపోతున్నావా లేదంటే ఫ్రిజ్లో పడుకుంటున్నావో అర్థం కావట్లేదు' అని విజయ్ సేతుపతి తనదైన స్టైల్లో మాట్లాడాడు. సేతుపతి మాట్లాడుతున్నంతసేపు ఎదురుగా కూర్చున్న ఆండ్రియా పడిపడి నవ్వుతూ కనిపించింది. దిగువ వీడియోలో మీరు ఇదంతా చూడొచ్చు.(ఇదీ చదవండి: బాడీ షేమింగ్ ప్రశ్న.. సారీ చెప్పినా వదలని తమిళ హీరోయిన్)#VijaySethupathi about #Andrea..😅"I saw a statue in beach in childhood.. Then i saw Andrea.. Both look same even now..😄 You still look like from an Ad u did years back.. After me, my son will look u in awe.. Are u sleeping on bed or refrigerator..😁" pic.twitter.com/kamqJ9w7LZ— Laxmi Kanth (@iammoviebuff007) November 9, 2025 -
బాడీ షేమింగ్ ప్రశ్న.. సారీ చెప్పినా వదలని హీరోయిన్
తమిళ హీరోయిన్ గౌరీ కిషన్ని 'మీ బరువెంత?' అని ఓ యూట్యూబర్ అడగడం, దానికి గౌరీ రిటర్న్ కౌంటర్ ఇవ్వడం మీకు తెలిసే ఉంటుంది. మూడు నాలుగు రోజుల క్రితం ఈ వివాదం జరగ్గా.. గౌరీ ఓ నోట్ రిలీజ్ చేయడం, దీనికి ప్రతిగా సదరు యూట్యూబర్ కార్తీక్ క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేయడంతో సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. కానీ ఈ విషయాన్ని గౌరీ ఇంకా వదలట్లేదు. తాజాగా చేసిన ట్వీట్ ఇందుకు ఉదాహరణ.(ఇదీ చదవండి: తమిళ స్టార్ హీరోలు ఇకపై అదీ భరించాల్సిందే.. నిర్మాతల మండలి)'జవాబుదారీతనం లేని క్షమాపణ అసలు క్షమాపణే కాదు. మరీ ముఖ్యంగా.. ఆమె నా ప్రశ్నని తప్పుగా అర్థం చేసుకుంది. ఇది కేవలం సరదాగా అడిగాను. నేను ఎవరినీ బాడీ షేమింగ్ చేయలేదు' లాంటి మాటలు మాట్లడటం అస్సలు కరెక్ట్ కాదు. ఈ సారీని నేను అంగీకరించట్లేదు' అని గౌరీ కిషన్.. యూట్యూబర్ కార్తీక్ వీడియోని రీట్వీట్ చేసింది. ఇదంతా చూస్తుంటే సదరు యూట్యూబర్పై మూవీ అసోసియేషన్ ఏదైనా చర్య తీసుకునే వరకు గౌరీ విచిచిపెట్టదేమో అనిపిస్తుంది.గౌరీ కిషన్ విషయానికొస్తే.. '96' సినిమాలో బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్ర తెలుగు రీమేక్ 'జాను'లోనూ నటించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు మూవీస్లో హీరోయిన్గా చేస్తోంది. ఈ బాడీ షేమింగ్ వివాదం కూడా గౌరీ లేటెస్ట్ మూవీ 'అదర్స్' ప్రెస్ మీట్ సందర్భంగానే జరిగింది. (ఇదీ చదవండి: డైరెక్టర్గా తళపతి విజయ్ కొడుకు.. టైటిల్ పోస్టర్ రిలీజ్)An apology without accountability isn’t an apology at all.Especially when it’s brushed off with “she misunderstood the question — it was just a fun one,” or worse — “I didn’t body-shame anyone.”Let me be clear. I won’t accept performative remorse or hollow words. Do better, RS… https://t.co/OsIOegL9Hr— Gouri G Kishan (@Gourayy) November 10, 2025 -
మరణాన్ని ముందే ఊహించిన హీరో..
తమిళ హీరో అభినయ్ కింగర్ (44) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమవారం (నవంబర్ 10న) చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. తన మరణాన్ని ఆయన ముందుగానే అంచనా వేశారు. కేవలం ఏడాది లేదా ఏడాదిన్నర మాత్రమే బతుకుతానని డాక్టర్స్ చెప్పారంటూ ఇటీవల ఓ వీడియోలో మాట్లాడారు. అందులో అతడు బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఈ వీడియో బయటకు వచ్చిన మూడు నెలలకే అభినయ్ మరణించడం విషాదకరం!ఎవరీ అభినయ్?ప్రముఖ మలయాళ నటి టి.పి.రాధామణి కుమారుడే అభినయ్ కింగర్ (Abhinay Kinger). తుళ్లువదో ఇళమై అనే తమిళ సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమ్యారు. తమిళ చిత్రం 'జంక్షన్'తో హీరోగా మారారు. కానీ తర్వాత హీరోగా కంటిన్యూ కాలేకపోయారు. సక్సెస్, పొన్ మేఘలై, ఆరుముగం, సింగారా చెన్నై, ఆరోహణం వంటి పలు కోలీవుడ్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో కేవలం మూడే మూడు మూవీస్ చేశారు. చివరగా 2014లో వచ్చిన వల్లవణుక్కు పుళ్లం ఆయుధం సినిమాలో బిజినెస్మెన్గా కనిపించారు. అంతేకాకుండా మిలింద్ సోమన్, బాబు ఆంటోని, విద్యుత్ జమ్వాల్ వంటి నటులకు డబ్బింగ్ చెప్పారు. View this post on Instagram A post shared by Balan Akassh Balaiyan Jaganathan (@bjbala_kpy) చదవండి: 'పర్ఫామెన్స్ తక్కువ, డ్రామా ఎక్కువ'.. నామినేషన్స్లో ఎవరంటే? -
ఫ్లాప్ డైరెక్టర్తో సిద్దార్థ్ కొత్త సినిమా
హీరో సిద్ధార్థ్ (Siddharth) చివరగా 3 బీహెచ్కే సినిమాతో మెప్పించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఇతడు ఆపరేషన్ సఫేద్ సాగర్ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. పనిలో పనిగా తన నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. కార్తీక్ జీ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈయన దర్శకత్వంలోనే సిద్దార్థ్ గతంలో టక్కర్ సినిమా చేశాడు. ఈ మూవీ మంచి ఫలితాన్ని అందుకోలేకపోయింది. తాజాగా రెండోసారి వీరి కాంబినేషన్ రిపీట్ అవుతోంది. దీనికి రౌడీ అండ్ కో అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థ అధినేత సుదన్ సుదర్శన్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్ను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రానికి అయిలి వెబ్ సిరీస్ ఫేమ్ రేవా సంగీతాన్ని అందించనున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్గా తెరపైకి తీసుకురానున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.pic.twitter.com/XQzUi0Ll9p— KARTHIK G KRISH (@Karthik_G_Krish) November 8, 2025 -
స్టార్ హీరోలు ఇకపై అదీ భరించాల్సిందే.. నిర్మాతల మండలి
తమిళ నిర్మాతలు ఎట్టకేలకు ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్లపాటు సినిమాపై లాభమొచ్చినా నష్టమొచ్చినా దాన్ని నిర్మాత మాత్రమే భరించేవాడు. కానీ ఇకపై అలా కుదరదని, స్టార్ హీరోలందరూ పూర్తి రెమ్యునరేషన్ తీసుకోవడానికి వీల్లేదని పేర్కొన్నారు. బదులుగా నిర్మాతతో పాటు లాభనష్టాల్ని భరించాల్సి ఉంటుందని ఓ ప్రపోజల్ తీసుకొచ్చారు. ఈ మేరకు ఆదివారం జరిగిన సమావేశంలో తమిళ నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకున్నారు.తమిళ నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయం.. ఓ రకంగా స్టార్ హీరోలైన రజినీకాంత్, విజయ్, కమల్ హాసన్, సూర్య లాంటి వాళ్లకు నిజంగానే షాకింగ్. ఎందుకంటే ఇప్పటివరకు సినిమా ఫలితంతో సంబంధం లేకుండా పూర్తి పారితోషికం తీసుకునేవారు. లాభాలు వస్తే నిర్మాత ఇష్టం కొద్దీ కారు లాంటి బహమతులు ఇచ్చేవారు. అదే నష్టమొస్తే మాత్రం హీరోలు, నిర్మాతల్ని అస్సలు పట్టించుకోని సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం ఓ రకంగా నిర్మాతలకు మంచిదే. కానీ హీరోలు దీనికి ఒప్పుకొంటారా అనేది చూడాలి. ఇలాంటిది తెలుగులో ఇండస్ట్రీలోనూ ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి?(ఇదీ చదవండి: ఓవైపు లగ్జరీ కార్ల వివాదం.. కొత్త కారు కొన్న దుల్కర్)ఇదే సమావేశంలో ఓటీటీ డీల్స్ గురించి నిర్మాతల మండలి ఓ నిర్ణయం తీసుకుంది. స్టార్ హీరోల సినిమాలు కచ్చితంగా థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి రావాల్సి ఉంటుంది. మిడ్ రేంజ్ హీరోలైతే 6 వారాలు, చిన్న బడ్జెట్ చిత్రాలతే 4 వారాల రూల్ కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది తమిళంలో రిలీజయ్యే 250 చిత్రాలకు థియేటర్ల కేటాయింపు కోసం ప్రత్యేక పద్ధతి తీసుకురానున్నట్లు తెలిపారు.తమిళ నటీనటులు అందరూ ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ల కంటే థియేటర్లలోకి వచ్చే సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా నిర్మాతల మండలి కోరింది. ఇండస్ట్రీ బాగు కోసమే ఇలా చేయాలని పేర్కొంది. అయితే నిర్మాతల మండలి తీసుకున్న ప్రపోజల్స్ బాగానే ఉన్నాయి గానీ ఇవన్నీ ఇండస్ట్రీలో ఎంతవరకు అమల్లోకి వస్తాయనేది చూడాలి? (ఇదీ చదవండి: Bigg Boss 9 : నాకు బయటే నెలకు రూ.కోటి వస్తుంది: మాధురి) -
20 ఏళ్ల యువతిపై 'అనుపమ పరమేశ్వరన్' ఫిర్యాదు
ఇటీవల బైసన్, కిష్కింధపురి, ది పెట్ డిటెక్టివ్ చిత్రాలతో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ట్రెండింగ్లో ఉంది. అయితే, కొన్ని రోజులుగా తాను ఎదుర్కొంటున్న సమస్య గురించి చెబుతూ తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది. తమిళనాడుకు చెందిన ఒక యువతి తన ఫోటోలను మార్ఫింగ్ చేయడమే కాకుండా తన కుటుంబం గురించి అనుచితమైన పోస్టులు షేర్ చేస్తున్నట్లు ఆమె పేర్కొంది. దీంతో తాను పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపింది.అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఇలా పేర్కొంది. 'కొద్దిరోజులుగా ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా నా గురించి తప్పుగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటివి సర్వసాధారణమేనని మొదట పట్టించుకోలేదు. అయితే, నా ఫోటోలను మార్ఫింగ్ చేసి ఏకంగా నా కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, సహ నటీనటులకు కూడా ట్యాగ్ చేస్తున్నారు. దీంతో చాలా బాధపడ్డాను. ఆపై ఎలాంటి ఆధారాలు లేకుండానే నా గురించి తప్పుడు సమాచారం వైరల్ చేస్తున్నారు. వాటిని చూస్తుంటే ఎవరో కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నట్లు అర్థమైంది. దీంతో ఈ విషయం గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేశాను. ఒకే వ్యక్తి చాలా అకౌంట్లతో ఈ సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు ఫైనల్గా తెలిసింది. నేను ఏదైనా పోస్ట్ చేసినా కూడా ఫేక్ అకౌంట్ల నుంచి తప్పుడు కామెంట్లు చేస్తున్నారు. దీంతో వెంటనే కేరళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాను.' అని అనుపమ తెలిపింది.యువతి వివరాలు గోప్యంగా ఉంచండిసైబర్ క్రైమ్ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఆశ్యర్యపోయే విషయం వెలుగులోకి వచ్చిందని అనుపమ ఇలా చెప్పింది. ' ఇదంతా చేసింది తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల యువతి అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆమె వయసులో చాలా చిన్నది. తన భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఆమె ఐడెంటిటీని బయటి ప్రపంచానికి చెప్పదలుచుకోలేదు. అయితే, ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది. ఇప్పుడు కూడా ఈ ఘటన గురించి చెప్పాలని నాకు లేదు. కానీ, యువత మేలుకోవాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని చెబుతున్నాను. చేతిలో ఫోన్ ఉందని, సోషల్ మీడియా అకౌంట్ ఉందని ఒకరి పరువు తీసే హక్కు మీకు లేదు. ఇతరులను ద్వేషిస్తూ ఆన్లైన్లో మేరు చేసే ప్రతిదీ ట్రాక్ అవుతుంది. ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలి. సెలబ్రిటీలు అయినంత మాత్రానా మాకు కూడా సామాన్యులకు ఉండే హక్కులు ఉంటాయి. చట్టం అందరికీ సమానమే.' అని తెలిపారు. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
నాకు జాతీయ అవార్డు వస్తే అదే సంతోషం: నటి
తమిళ నటి గీత కైలాసం ప్రధాన పాత్రను పోషించిన చిత్రం అంగమ్మాల్. చరణ్, భరణి, ముల్లైయరసీ, తెండ్రల్ రఘునాథన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ సంస్థ సమర్పణలో ఎంజాయ్ ఫిలిమ్స్, ఫిరో మూవీ స్టేషన్ సంస్థల అధినేతలు ఫిరో రహీం, ఎంజాయ్ సామ్యువేల్ కలిసి నిర్మించారు. దీనికి విపిన్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహించారు. రచయిత పెరుమాళ్ మురుగన్ రాసిన కొడిమణి అనే కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం నవంబర్ 21న తెరపైకి రానుంది. ఓటీటీలో కాకుండా థియేటర్లో..ఈ క్రమంలో దర్శకుడు విపిన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. సత్యమంగళం అటవీ ప్రాంతంలో చిత్ర షూటింగ్ పూర్తి చేశామన్నారు. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రను గీత కైలాసం పోషించారని, ఆమె ఈ పాత్రలో ఒదిగిపోయారని ప్రశంసించారు. చిత్రాన్ని ఓటీటీలో కాకుండా థియేటర్లోనే విడుదల చేయాలన్న భావనతో.. అన్ని వర్గాల వారికి చేరాలన్న ఉద్దేశంతో జనరంజకంగా రూపొందించినట్లు చెప్పారు. అవార్డు వస్తే సంతోషంగీత కైలాసం మాట్లాడుతూ.. దర్శకుడు కథ చెప్పగానే తన పాత్ర కొత్తగా ఉందనిపించి నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. చిత్రాన్ని చూసిన పలువురు సినీ ప్రముఖులు తనకు జాతీయ అవార్డు వస్తుందని అన్నారని, అలాంటి అవార్డు వస్తే తనకు చాలా సంతోషమేనని అన్నారు. ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేస్తున్న సంస్థ అధినేతల్లో ఒకరైన సంతానం కార్తికేయన్ వీడియో ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంగమ్మాల్ చిత్రం జనరంజకంగా ఉంటుందని, ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.చదవండి: 40 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోతే.. 'ఆప్ జైసా కోయి' చూసేయండి! -
'మిడిల్ క్లాస్'తో రీఎంట్రీ ఇచ్చిన విజయలక్ష్మి
ఇటీవల మంచి కంటెంట్తో రూపొందుతున్న చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. మంచి కథ ఉంటే హీరో హీరోయిన్లు ఎవరైనా గానీ చిత్రాలు విజయం సాధిస్తున్నాయి. అలా పలు చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి పాపులర్ అయిన నటులలో మునీష్ కాంత్ ఒకరు. పలు చిత్రాల్లో క్యారెట్ ఆర్టిస్ట్ గానూ మెప్పించిన ఈయన తాజాగా హీరోగా అవతారం ఎత్తారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మిడిల్ క్లాస్. కాగా ఇంతకుముందు పలు చిత్రాల్లో కథానాయకిగా నటించి ఆ తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిన నటి విజయలక్ష్మి తాజాగా రీఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన దివంగత నిర్మాత ఢిల్లీబాబుకు చెందిన యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన తాజా చిత్రం మిడిల్ క్లాస్. కిషోర్ ముత్తు రామలింగం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది వినోదభరిత కథాచిత్రంగా అనిపించినా , ఒక సందర్భంలో థ్రిల్లర్ బాణీలో సాగుతుందన్నారు. ఇందులో నటుడు మునీష్ కాంత్ తన సొంత ఊరిలో స్థలం కొనుక్కుని సెటిల్ అవ్వాలని ప్రశాంతంగా జీవితాన్ని సాగించాలని కోరుకుంటాడన్నారు. అయితే ఆయన భార్య మాత్రం సిటీలో జీవించాలని ఆశపడుతుందన్నారు. అలా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తుందన్నారు. ఆ తర్వాత వారి సంతాన జీవితం ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంది అన్న పలు ఆసక్తికరమైన సంఘటనలతో చిత్ర కథ సాగుతుందన్నారు. ఇందులో నటుడు రాధారవి, వేల రామమూర్తి ముఖ్యపాత్రలు పోషించినట్లు చెప్పారు. -
ఇక చాలు ఆపండి, మీ కాళ్లు మొక్కుతా..: విశాల్
సాక్షి, తమిళనాడు: కోయంబత్తూర్ విమానాశ్రయం సమీపంలో ఓ కళాశాల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. స్నేహితుడితో కారులో ఉన్న విద్యార్థినిని ముగ్గురు యువకులు అపహరించి, ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఇకచాలు, ఆపండిఅయితే రాత్రిపూట ఆ విద్యార్థిని బయటకు ఎందుకెళ్లిందని ఎమ్మెల్యే ఈశ్వరన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అరాత్రి పురుషుడితో బయటకు వెళ్లడాన్ని సామాజిక పతనంగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లుఉవెత్తాయి. తాజాగా హీరో విశాల్ (Vishal) సైతం ఈ వ్యవహారంపై స్పందించాడు. ఆ సమయంలో ఆ ప్రదేశంలో బాధితురాలు ఎందుకు ఉందని నిందించడం ఆపండి. దేశంలో పెరిగిపోతున్న ఈ అత్యాచారాలను రాజకీయం చేయండి మానుకోండి.మీ కాళ్లు మొక్కుతా..న్యాయవ్యవస్థ ముందు మోకరిల్లి అడుగుతున్నా.. మీ కాళ్లు పట్టుకుంటా.. దయచేసి ఇంత దారుణమైన అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితులకు మరణశిక్ష వేయండి. గతంలో నిర్భయ ఉదంతాలను చూశాం. ఏడేళ్ల బాలికను అత్యాచారం చేయడంతో పాటు కన్న తల్లిని నిర్దాక్ష్యిణ్యంగా హత్య చేసిన వ్యక్తి సుదీర్ఘ విచారణ తర్వాత గత నెలలో నిర్దోషిగా బయటకు వచ్చాడు. వైఎస్సార్కు సెల్యూట్ఇలాంటివి సౌదీ అరేబియా వంటి దేశాల్లో సాధ్యమవుతాయా? ఎన్నటికీ దోషులుగా తేలమన్న ధైర్యం వల్లే నేరస్తులు మరింత రెచ్చిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి నేరాలు జరిగినప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి తీసుకున్న చర్యలు నిజంగా మెచ్చుకోదగినవి. ఆయనకు నేను సెల్యూట్ చేస్తున్నా.. అని విశాల్ ట్వీట్ చేశాడు. Stop blaming the victim for being at that place at that hour. Stop politicising this bloody gory recurring issue, rape in our country. High time atleast now I beg, bow and fall on your feet dear Judicial system and lawmakers. Kindly bring about captial punishment and death…— Vishal (@VishalKOfficial) November 7, 2025 చదవండి: ఏం మాట్లాడాలి? దివ్యపై భరణి ఉగ్రరూపం.. కప్పు తనూజదే! -
21 ఏళ్ల తర్వాత ఆటోగ్రాఫ్ మళ్లీ వస్తోంది..
ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. దర్శకుడు చేరన్ (Cheran). ఈయన దర్శకత్వం వహించిన ప్రతి చిత్రం ప్రజలకు ఏదో ఒక విషయాన్ని చెబుతుంది. అలా ఆయన దర్శకత్వం వహించిన ఆణిముత్యాల్లో ఆటోగ్రాఫ్ (Autograph Movie) అనే తమిళ చిత్రం ఒకటి. చేరన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి, కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం విడుదలై 21 ఏళ్లు అయ్యింది. ఇప్పటికీ ఇందులోని పాటలు చాలాచోట్ల వినిపిస్తూనే ఉంటాయి. ఆ పని చసుంటే ఎదిగేవాడ్ని..అలాంటి చిత్రం మళ్లీ డిజిటల్ ఫార్మెట్లో కొత్త హంగులతో నవంబర్ 14న విడుదల కానుంది. గురువారం సాయంత్రం చైన్నెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చేరన్తో పనిచేసిన నటీనటులు, సాంకేతిక వర్గం, ఇతర మిత్ర వర్గం పాల్గొని తమ అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. దర్శకుడు అమీర్, ఆరి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. చేరన్ మాట్లాడుతూ.. తాను మంచి కమర్షియల్ చిత్రాలు చేసుంటే ఆర్థికంగా ఎదిగి ఉండేవాడినేమో.. కానీ, ఆ తరువాత కనిపించకుండా పోయేవాడినేమోనని అన్నారు. 15 నిమిషాలు కట్ చేశాంఈ ఆటోగ్రాఫ్ చిత్ర నిడివిని 15 నిమిషాలు తగ్గించినట్లు చెప్పారు. డాల్బీ అట్మాస్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చామని చెప్పారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు విడుదల చేసి తాను సాధించేదేమీ లేదన్నారు. అయితే నేటి తరం ఎలా ఉందన్నది తెలుసు.. కాబట్టి ఇప్పుడు వారు ఈ చిత్రాన్ని చూస్తే వేరే ఆలోచన కలగవచ్చన్నారు. తాము విత్తనం మాత్రమే నాటగలమని, ఆటోగ్రాఫ్ చిత్రానికి ఆ అర్హత ఉందని భావించి మళ్లీ విడుదల చేస్తున్నట్లు చెప్పారు.చదవండి: రీల్స్ నుంచి హీరోయిన్.. లగ్జరీ కారు కొన్న బ్యూటీ -
ఈ ఫోన్ నంబర్ నాది కాదు: రుక్మిణి వసంత్
కాంతార చాప్టర్-1 విడుదల తర్వాత రుక్మిణి వసంత్ పేరు పాన్ ఇండియా రేంజ్లో పాపులర్ అయిపోయింది. దీంతో కొందురు కేటుగాళ్ళు తన పేరు చెప్పుకుని మోసాలు చేసేందుకు రెడీ అయిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) తాజాగా తన సోషల్మీడియా ఖాతాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. తన పేరు మీద జరుగుతున్న మోసాల గురించి ఆమె పేర్కొంది.నా పేరు చెబుతూ ఒక వ్యక్తి 9445893273 ఈ నంబర్తో వివిధ వ్యక్తులకు కాల్స్ చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. నాలాగే మాట్లాడుతూ ఇతరులను సంప్రదించి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెంబర్ నాది కాదు. ఈ విషయాన్ని అందరికీ స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈ నంబర్ నుంచి వచ్చే మెసేజ్లు, కాల్స్ పూర్తిగా నకిలీవని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. దయచేసి అలాంటి కాల్స్కు ఎవరూ స్పందించకండి. ఇలా ఒకరి పేరును ఉపయోగించుకుని మోసాలకు పాల్పడటం సైబర్ నేరం అవుతుందని గుర్తుచేస్తున్నాను. ఈ నెంబర్ నుంచి ఎవరికైనా ఫోన్ వస్తే.. డైరెక్ట్గా నన్ను లేదా నా టీమ్ను సంప్రదించండి. ఇలాంటి మోసపూరిత, తప్పుదారి పట్టించే కార్యకలాపాలలో పాల్గొన్న వారి పట్ల తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. ఆన్లైన్లో ఇలాంటి వారితో ఎప్పటికీ అప్రమత్తంగా ఉండాలి. 'అని ఆమె పేర్కొన్నారు.కాంతార చాప్టర్ 1 విజయం తర్వాత రుక్మిణి వసంత్ చేతిలో భారీగా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్లో ఆమె బిజీగా ఉంది. ఈ సినిమాతో పాటు మణిరత్నం- విజయ్ సేతుపతి ప్రాజెక్ట్ చేయబోతుంది. కన్నడ హీరో యశ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో కూడా రుక్మిణి నటిస్తుంది. ఈ మూవీని గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తున్నారు.🚨 Important Alert & Awareness Message 🚨It has come to my attention that an individual using the number 9445893273 is impersonating me and reaching out to various people under false pretenses.I want to clarify that this number does not belong to me, and any messages or calls…— rukmini (@rukminitweets) November 7, 2025 -
నటికి అభ్యంతరకర ప్రశ్న.. తప్పులో కాలేసిన ఖుష్బూ!
మలయాళ నటి గౌరీకిషన్ (Gouri G Kishan)కు చేదు అనుభవం ఎదురైంది. తను హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ అదర్స్. ఈ తమిళ సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్న ఆమెను ఓ జర్నలిస్టు అవమానకరమైన ప్రశ్నతో ఇబ్బందిపెట్టాడు. మీ బరువెంత? అని అడిగాడు. అది విని షాకైన గౌరీ కిషన్.. నా బరువుతో మీకేం అవసరం? ఇది చాలా చెత్త ప్రశ్న.. ఇలా అడగడం బాడీ షేమింగే అవుతుంది అని మండిపడింది. అది బాడీ షేమింగ్ కాదని జర్నలిస్ట్ వాదించాడు. అలా వీరిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్గా మారింది.హీరోను అడగ్గలరా?ఈ వ్యవహారంపై సీనియర్ నటి ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) ఘాటుగా స్పందించింది. జర్నలిజం విలువలు కోల్పోతోంది. కొందరు జర్నలిజాన్ని తప్పుగా వాడుతున్నారు. ఒకమ్మాయి బరువు గురించి వారికెందుకు? హీరోయిన్ను సూటిగా అడిగినప్పుడు మరి హీరో బరువు గురించి ఎందుకు అడగలేదు? ఇది నిజంగా సిగ్గుచేటు. యువ నటి గౌరీని ఈ విషయంలో అభినందించాల్సిందే! అభ్యంతరకర ప్రశ్న అడిగిన వ్యక్తికి అక్కడే ఇచ్చిపడేసింది. మీ ఇంట్లోవాళ్లను అడిగితే ఓకేనా?మేము ఎదురుతిరిగి మీ కుటుంబంలోని స్త్రీల గురించి అలాంటి చెత్త ప్రశ్నలు అడిగితే మీకు ఓకేనా? ముందు ఎదుటివారికి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి.. గౌరవం ఇచ్చిపుచ్చుకోండి అని ట్వీట్ చేసింది. అయితే ఇక్కడ ఓ చిన్న పొరపాటు చేసింది. నటి గౌరీకిషన్ పేరుకు బదులుగా గౌరీ శంకర్ అని హ్యాష్ట్యాగ్ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు, మేడమ్, ఆమె గౌరీ శంకర్ కాదు.. గౌరీ కిషన్ అని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Dhanya Rajendran (@dhanyarajendran) Journalism has lost its ground. The so called journos take journalism to the gutters. How much a woman weighs is none of their business. And asking the hero about it?? What a shame! Kudos to the young #GowriShankar who stood her ground and gave it back. Are the same men ok if…— KhushbuSundar (@khushsundar) November 7, 2025చదవండి: ప్రెస్మీట్లో ఇదేం ప్రశ్న.. ఫైర్ అయిన నటి -
ప్రెస్మీట్లో ఇదేం ప్రశ్న.. ఫైర్ అయిన నటి
తమిళ సినిమా '96'తో తెలుగువారికి పరిచయమైన గౌరీ కిషన్(Gouri Kishan )కు మీడియా సమావేశంలో చేదు అనుభవం ఎదురైంది. తను హీరోయిన్గా నటిస్తున్న కొత్త సినిమా అదర్స్ ప్రమోషన్స్లో భాగంగా మూవీ యూనిట్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అయితే, ఈ సమావేశంలో తన బరువు గురించి అవమానకరమైన ప్రశ్న అడిగినందుకు రిపోర్టర్కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఆపై తన ప్రశ్నను అతను సమర్థించుకునేందుకు ప్రయత్నం చేయడంతో గౌరీ కూడా ఫైర్ అయింది. దీంతో ఆమెకు నెటిజన్లు మద్ధతుగా నిలిచారు.తమిళ, మలయాళ చిత్రాలతో గౌరీ కిషన్ ఫుల్ బిజీగా ఉంది. అబిన్ హరికరణ్ దర్శకత్వంలో తను నటిస్తున్న కొత్త చిత్రం ‘అదర్స్’ త్వరలో విడుదల కానుంది. దీంతో ప్రచారంలో భాగంగా ప్రెస్మీట్ నిర్వహించారు. అయితే, ఈ సమావేశంలో ఒక జర్నలిస్ట్ ‘మీ బరువు ఎంత ఉంటుంది..?’ అని ప్రశ్నించాడు. సమాధానం చెప్పేందుకు గౌరీ అసహనం వ్యక్తం చేయడంతో ఆ జర్నలిస్ట్ కూడా తన ప్రశ్నను సమర్థించుకుంటూ మరోసారి అడిగాడు. ఈ ప్రశ్నకు గతంలో కొందరు స్టార్ హీరోయిన్లు కూడా సమాధానం చెప్పారని వాయిస్ పెంచాడు. నా బరువుతో మీకేంటి అవసరందీంతో గౌరీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. 'నా బరువు గురించి నాతో చర్చించే హక్కు దర్శకుడికి ఉంది. కానీ, ఒక జర్నలిస్ట్గా మీకేంటి అవసరం..? స్త్రీ శరీరం చాలా సంక్లిష్టమైనది, హార్మోన్ల అసమతుల్యతతో ఉంటుంది. నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలియకుండానే, నా బరువు గురించి అడగడానికి మీరు ఎవరు.. నా బరువు తెలుసుకొని మీరు ఏం చేస్తారు..? నా బరువు వల్ల సినిమాకు ఏమైనా నష్టం జరిగిందా..? ఇప్పటికి నేను చాలా సినిమాలు చేశాను. నా ప్రతిభ గురించి అడగండి. కనీసం ఇప్పటి వరకు నేను చేసిన పాత్రల గురించి అడగరెందుకు..' అని ఆమె ఫైర్ అయింది. ఆ జర్నలిస్ట్ కూడా తన తప్పును తెలుసుకుని ఆమెకు వెంటనే క్షమాపణ చెప్పాడు. ఆమెను బాడీ షేమింగ్ చేయలేదని క్లారిటీ ఇచ్చాడు.జర్నలిస్టుల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని గౌరీ కిషన్ చెప్పింది. తాను కూడా జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చానని తెలిపింది. కానీ, ఇలాంటి ప్రశ్నలు జర్నలిస్టిక్ నీతిని పాటించవని స్పష్టం చేసింది. ప్రెస్ మీట్ సందర్భంగా తనను ఇలా ఇబ్బంది పెట్టడం బాధ అనిపించినప్పటికీ వారి పట్ల తనకు ఎటువంటి ద్వేషం లేదని ఆమె స్పష్టం చేసింది.96 సినిమా త్రిష చిన్నప్పటి పాత్రలో గౌరీ కిషన్ నటించింది. ఇదే మూవీ తెలుగులో జాను పేరుతో విడుదలైంది. ఆమె ఇందులో కూడా నటించిది. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. ఇప్పుడు మాత్రం హీరోయిన్ గా బిజీగా అయిపోయింది. తెలుగులో 'శ్రీదేవి శోభన్ బాబు' అనే మూవీలో నటించింది గానీ అది ఫ్లాఫ్ అవడంతో ఇక్కడ ఈమెకు అవకాశాలు రాలేదు. దీంతో తమిళ, మలయాళంలో మాత్రమే చేస్తోంది.நடிகையிடம் அநாகரிக கேள்வி எழுப்பிய யூடியூபர்.. தனி ஆளாக தரமான பதிலடி கொடுத்த நடிகை கௌரி கிஷன்....!#Polimer | #Chennai | #Actress | #Movie | #GouriGKishan pic.twitter.com/4qkQqGVYyw— Polimer News (@polimernews) November 6, 2025 -
డాగ్ ట్రైనర్గా శ్రీకాంత్.. షూటింగ్ పూర్తి
నటుడు శ్రీకాంత్, శ్యామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ది ట్రైనర్. పూజిత పొన్నాడ (తెలుగు హీరోయిన్), అంజనా కీర్తి, జూనియర్ ఎంజీఆర్, వాగై చంద్రశేఖర్, సాయి దీనా తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ట్రాన్స్ ఇండియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నీలా నిర్మిస్తున్నారు. వేల్ మాణిక్యం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.ది ట్రైనర్ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. మంచి కంటెంట్తో కూడిన యాక్షన్, థ్రిల్లర్ కథా చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుందన్నారు. అలా మంచి గ్రిప్తో తెరకెక్కిస్తున్న చిత్రం ది ట్రైనర్ అన్నారు. ఇందులో నటుడు శ్రీకాంత్ డాగ్ ట్రైనర్గా నటించినట్లు చెప్పారు. ఆయనతో పాటు లీ అనే కుక్క కీలకపాత్రను పోషించినట్లు చెప్పారు. నటుడు శ్యామ్ పోలీసు అధికారిగా నటించారని చెప్పారు. షూటింగ్ పూర్తిఇది సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కోసం తమిళనాడు పోలీస్ డిపార్టుమెంట్ ఏర్పాటు చేసిన ది కావలన్ అనే యాప్ స్ఫూర్తితో రూపొందించిన కథా చిత్రం ఇదని చెప్పారు. చిత్రంలో హై యాక్షన్ సన్నివేశాలున్నాయన్నారు. మూవీ షూటింగ్ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి అరుణ్ మొళి చోళన్ చాయాగ్రహణం, కార్తిక్ రాజా సంగీతం అందిస్తున్నారు.చదవండి: ఐదేళ్లకు పేరెంట్స్గా ప్రమోషన్.. సంతోషంలో తెలుగు సీరియల్ నటి -
యాక్షన్ కింగ్తో ఐశ్వర్య రాజేశ్ మూవీ.. ఈ నెలలోనే రిలీజ్
యాక్షన్ కింగ్ అర్జున్, నటి ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) తొలిసారిగా కలిసి నటించిన చిత్రం తీయవర్ కులై నడుంగ. తెలుగులో మఫ్టీ పోలీస్గా రిలీజ్ కానుంది. జీఎస్ ఆర్ట్స్ పతాకంపై జీ.అరుళ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి దినేష్ లక్ష్మణన్ దర్శకత్వం వహించారు. బిగ్బాస్ ఫేమ్ అభిరామి వెంకటాచలం, ప్రవీణ్ రాజా, లోగు, రామ్ కుమార్, తంగదురై, బేబీ అనికా, ప్రాంక్ట్సర్ రాహుల్, ప్రియదర్శిని, జీకే రెడ్డి, పీఎల్ తేనప్పన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.ఈ నెలలోనే రిలీజ్ఈ చిత్రానికి భరత్ ఆశీగన్ సంగీతం, శరవణన్ అభిమన్యు చాయాగ్రహణం అందించారు. యాక్షన్, థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం నవంబర్ 21వ తేదీన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. చట్టాన్ని మించి న్యాయం ఉంటుందని, న్యాయాన్ని మించి ధర్మం ఉంటుందని, చివరికి గెలిచేది ధర్మమేనని చెప్పే ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం ఇదని చెప్పారు. చిత్రం టీజర్ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చిందన్నారు. త్వరలోనే చిత్రం ట్రైలర్, ఆడియోను విడుదల వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. చదవండి: The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ఫ్రెండ్’ మూవీ రివ్యూ -
శ్రీలీల క్రేజీ మూవీ.. రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్(Sivakarthikeyan) , శ్రీలీల(Sreeleela) హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం పరాశక్తి. ఈ మూవీకి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను డాన్ పిక్చర్స్ సంస్థ అధినేత ఆకాశ్ భాస్కర్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ను మేకర్స్ రిలీజ్ చేశారు. సింగారాల సీతాకోకవే అంటూ రొమాంటిక్ లవ్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కర భట్ల లిరిక్స్ అందించగా.. ఎల్వీ రేవంత్, ఢీ, సీ రోల్డాన్ ఆలపించారు. ఈ పాటను జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ మ్యూజికల్ లవర్స్ను తెగ అలరిస్తోంది. ఇందులో రవిమోహన్, అధర్వ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను పొంగల్ కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. -
హీరోలకే నా సలహా.. రెమ్యునరేషన్ తగ్గించండి: విష్ణు విశాల్
చాలామంది హీరోలు తమ ప్రతి సినిమాకు ఎంతోకొంత పారితోషికం పెంచుకుంటూ పోతారు. అందులోనూ హిట్టు పడిందంటే రెట్టింపు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటారు. అయితే ఎప్పుడూ మన జీతాల గురించే కాకుండా నిర్మాతల కోణంలోనూ ఆలోచించాలంటున్నాడు తమిళ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal). ఈయన హీరోగా నటించడంతోపాటు నిర్మించిన లేటెస్ట్ మూవీ ఆర్యన్ (Aaryan Movie). ఈ సినిమా తమళనాడులో అక్టోబర్ 31న విడుదలైంది. హీరోలకే నా సలహామిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కలెక్షన్లు పర్వాలేదన్నట్లుగా ఉన్నాయి. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ మంచి రేటుకే అమ్ముడవడంతో నిర్మాత గండం గట్టెక్కినట్లే కనిపిస్తోంది! ఇకపోతే ఈ సినిమా తెలుగులో ఆలస్యంగా నవంబర్ 7న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఓ ఈవెంట్లో విష్ణు విశాల్ మాట్లాడుతూ.. నేను నిర్మాతలకు ఎటువంటి సలహాలు ఇవ్వను. హీరోలకు, ఆర్టిస్టులకు మాత్రం ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. మీ రెమ్యునరేషన్ను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడం ఖాయంఅప్పుడే నిర్మాతలు సినిమాను మరింత క్వాలిటీగా తీయగలరు. లేదంటే చాలా సినిమాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఖాయం! అని చెప్పుకొచ్చాడు. చాలామంది హీరో అభిప్రాయాన్ని కొనియాడుతున్నారు. కోట్లకు పడగలెత్తిన హీరోలు ఓసారి విష్ణు చెప్పేది వింటే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. ఆర్యన్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి, సెల్వరాఘవన్ కీలక పాత్రలు పోషించారు. ప్రవీణ్ కె దర్శకత్వం వహించాడు.చదవండి: దెయ్యాలకే దడ పుట్టించిన రీతూ.. గేమ్ గెలిచింది మాత్రం! -
విష్ణు విశాల్ ఆర్యన్.. అర్థం లేని క్లైమాక్స్.. దెబ్బకు కట్!
కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ నటించిన లేటేస్ట్ మూవీ ఆర్యన్. శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇటీవలే తమిళనాడు థియేటర్లలో విడుదలైంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా దర్శకుడు కె ప్రవీణ్ తెరకెక్కించారు. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోన్న ఈ చిత్రానికి తొలి రోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా అంతగా రాణించలేకపోతోంది.అయితే ఈ మూవీలోని క్లైమాక్స్ సీక్వెన్స్పై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. ఈ మూవీ క్లైమాక్స్లో విలన్ సెల్వ రాఘవన్ ఆ నలుగురిని ఎందుకు చంపాడనేది ఈ సీన్తో సెట్ కాలేదని ప్రేక్షకులు సోషల్ మీడియాలో వేదికగా నిలదీశారు. ఆ సన్నివేశం స్క్రీన్ప్లేతో సరిపోలేదని ఆడియన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో ఆర్యన్ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీలో కీలకమైన క్లైమాక్స్ చివరి పది నిమిషాలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో ఆ సీన్లను తీసేసినట్లు తెలిపారు. ఈ రోజు నుంచి థియేటర్లలో సెల్వ రాఘవన్ క్లైమాక్స్ సీన్స్ కట్ చేసినట్లు వెల్లడించారు. కొత్త వెర్షన్ సోమవారం నుంచే థియేటర్లలోకి వస్తుందని ఆర్యన్ నిర్మాతలు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ చిత్రంలోని పది నిమిషాల క్లైమాక్స్ సీన్స్ తెలుగు వెర్షన్ నుంచి తొలగించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ అక్టోబర్ 31న విడుదల చేయాలని భావించారు. కానీ రవితేజ మాస్ జతార, ఎస్.ఎస్. రాజమౌళి బాహుబలి: ది ఎపిక్ రిలీజ్ కావడంతో వాయిదా వేసుకున్నారు. ఈ మూవీని నవంబర్ 7న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ మూవీని విష్ణు విశాల్ తన బ్యానర్లో నిర్మించారు. ఈ మూవీకి గిబ్రాన్ సంగీతమందించారు. #Aaryan - The suspense soars in theatres now, with solid audience response 💥A big opening weekend for the film all over!@TheVishnuVishal @VVStudioz @adamworx @selvaraghavan @ShraddhaSrinath @Maanasa_chou @GhibranVaibodha @dop_harish @Sanlokesh @silvastunt @PC_stunts… pic.twitter.com/Wa0lezNEaj— Vishnu Vishal Studioz (@VVStudioz) November 3, 2025 -
100 అడుగుల లోయలో పడిపోయిన హీరోహీరోయిన్
సినిమా షూటింగ్లో కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఆపదే అగరా షూటింగ్లో జరిగింది. ఎంపీ.నక్కీరన్, లిబియాశ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కేరళలోని పాలక్కాడు అట్టప్పాడి ప్రాంతాల్లో జరుగుతోంది. ఓ సీన్ చిత్రీకరస్తున్న సమయంలో హీరోహీరోయిన్లు కాలుజారి లోయలో పడిపోయారట! ఈ విషయాన్ని దర్శకుడు వెల్లడించాడు.100 అడుగుల లోయలో..జీవాభారతి మాట్లాడుతూ.. కేరళలోని అట్టప్పాడి కొండ ప్రాంతాల్లో హీరో హీరోయిన్లకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించాం. హీరోయిన్లు ఒకచోట నిలబడి మాట్లాడుకుంటున్న సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా లిబియాశ్రీ కాలుజారి 100 అడుగుల లోయలోకి పడిపోయారు. ఆమెని కాపాడే ప్రయత్నంలో హీరో నక్కీరన్ కూడా లోయలోకి పడిపోయారు. ఓ పొడవైన తాడును తీసుకొచ్చి వారిని పైకి తీసుకొచ్చాం. వాళ్లు పడ్డ ప్రాంతం పచ్చికతో నిండి ఉండడంతో అదృష్టవశాత్తూ చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. లిబియాశ్రీ ప్రథమ చికిత్స అనంతరం మళ్లీ షూటింగ్లో పాల్గొన్నారు అని తెలిపాడు.అగరా సినిమాను ఎంపీఎన్ మూవీస్ పతాకంపై ఎంపీ నక్కీరన్ నిర్మిస్తున్నారు. జీవాభారతి కథ, కథనం, మాటలు పాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నిశాంత్, జీవాభారతి, కోవై డాక్టర్ కె.కన్నన్, రంగరాజన్ సుబ్బయ్య, సెంథిల్ తంగవేల్, రమేష్రాజా, ఆర్.ప్రభు, జి.గణేష్కుమార్, సెంథిల్కుమార్, ఇనియన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి యూఎం.స్టీవెన్ సతీష్ సంగీతం, చాయాగ్రహణం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కోవై డాక్టర్ కె.కన్నన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
తెరపైకి ముత్తురామలింగ దేవర్ బయోపిక్..
తమిళనాడులో ఒక వర్గం దైవంగా భావించే నాయకుడు పసుమ్పొన్ ముత్తురామలింగదేవర్. సామాజిక సేవకుడిగా పేరు గాంచిన ఈయన తమిళనాడు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. తమిళనాడు రాజకీయాల్లో కింగ్ మేకర్గా పేరొందిన ముత్తురామలింగ దేవర్ పార్లమెంట్ సభ్యుడుగా దేశ రాజకీయాల్లోనూ రాణించారు. బ్రిటిష్ కాలంలోనే గాంధీజీ అహింసా వాదాన్ని వ్యతిరేకించి సుభాష్ చంద్రబోస్ సిద్ధాంతాన్ని ఆచరించి ఆయనతో పయనించారు. అలా సుభాష్చంద్రబోస్తో పాటు నిషేధాని ఎదుర్కొన్న నాయకుడు ముత్తురామలింగ దేవర్. తమిళనాడులో 1953 ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి కామరాజ్ను రాజకీయ నాయకుడిని చేసిన ఘనత ఇతనిది. ఆ తరువాత విభేదాలు కారణంగా కాంగ్రెస్ పార్టీని వీడి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి ప్రాతినిథ్యం వహించి ముత్తురామలింగదేవర్ అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ నిర్ణయాలనే విభేదించారు. నేరారోపణలు కారణంగా జైలు జీవితాన్ని అనుభవించి, న్యాయ విచారణలో నిర్దోషిగా తిరిగొచ్చి ప్రజాసేవలోనే గడిపిన ఆయన ఆజన్మ బ్రహ్మచారి అన్నది విశేషం. తన ఆస్తిని తన అనుచరులకు పంచిన ఘనత ఇతనిది. అలాంటి ప్రజాసేవకుడు పసుమ్పొన్ ముత్తురామలింగ దేవర్ జీవిత చరిత్ర ఇప్పుడు దేశీయ తలైవన్ పేరుతో చిత్రంగా రూపొందింది. ఎస్ఎస్ఆర్.సత్య పిక్చర్స్ పతాకంపై ఎస్ఎస్ఆర్ సత్య నిర్మించిన ఈ చిత్రానికి ఆర్.అరవింద్రాజ్ దర్శకత్వం వహించారు. ముత్తురామలింగ దేవర్ పాత్రలో బషీర్ నటించగా, దర్శకుడు భారతిరాజా, రాధారవి, వైగై చంద్రశేఖర్, ఎంఎస్ భాస్కర్ ముఖ్యపాత్రలు పోషించారు. దర్శకుడు అరవింద్రాజ్ కీలక పాత్రను పోషించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం దేవర్ 118వ జయంతి సందర్భంగా అక్టోమర్ 31న విడుదలైంది. -
హీరోగా టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్.. తొలి ప్రాధాన్యత దానికే!
సీనియర్లు, జూనియర్లు, కొత్త దర్శకులు ఎవరైనాగానీ కంటెంట్ కొత్తగా ఉంటేనే వారి చిత్రాలు సక్సెస్ సాధిస్తాయి. ఇందుకు ఉదాహరణ టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం. ఈ చిత్రం ద్వారా అభిషన్ జీవింత్ (Abishan Jeevinth) దర్శకుడుగా పరిచయమయ్యారు. అంతేకాకుండా కీలకపాత్రను పోషించారు. ఈయనకు ఎలాంటి దర్శకత్వం అనుభవం లేదన్నది గమనార్హం. అయినప్పటికీ టూరిస్ట్ ఫ్యామిలీ అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. హీరోగా సినిమాతాజాగా అభిషన్ జీవింత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్ర షూటింగ్ కూడా పూర్తి అయింది. దీనికి ఆయన శిష్యుడు మదన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే దర్శక, నటుడు అభిషన్ జీవింత్ తాజాగా ఓ ఇంటివాడయ్యారు. స్నేహితురాలు అఖిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం శుక్రవారం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈసందర్భంగా శనివారం ఉదయం ఈ నూతన దంపతులు చెన్నైలో మీడియాను కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. డైరెక్షన్కే ప్రాధాన్యతఅనంతరం అభిషన్ జీవింత్ మీడియాతో ముచ్చటిస్తూ తాను దర్శకత్వం వహించిన టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రాన్ని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తున్న చిత్ర షూటింగ్ పూర్తి అయిందని త్వరలోనే దానికి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. అయితే తనకు తగిన కథ లభిస్తేనే నటిస్తానని, తాను దర్శకత్వానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. త్వరలోనే తాను దర్శకత్వం వహించే చిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తానని అభిషన్ జీవింత్ తెలిపారు.చదవండి: ఒకప్పుడు హిట్ డైరెక్టర్స్.. కొత్త కబురెప్పుడు -
నిర్మాతగా యాక్టర్.. నెక్స్ట్ లెవల్ స్టార్ట్ అంటూ పోస్ట్
తమిళ నటుడు ఆరవ్ (Aarav) నిర్మాతగా మారారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఓ కాదల్ కణ్మణి చిత్రం ద్వారా ఆరవ్ నటుడిగా పరిచయం అయ్యారు. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన ఆ చిత్రంలో దుల్కర్ సల్మాన్కు మిత్రుడిగా నటించారు. ఆ తరువాత సైతాన్, విడాముయర్చి (పట్టుదల) వంటి కొన్ని చిత్రాల్లో నటించిన ఈయన మార్కెట్ రాజా, ఎంబీబీఎస్ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. బిగ్బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొని మరింత పాపులర్ అయిన ఆరవ్ ఇప్పుడు నిర్మాతగా అవతారమెత్తారు. ఆరవ్ స్టూడియోస్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. దీని గురించి తెలియజేస్తూ.. పలు ఏళ్లుగా ప్రేక్షకుల ప్రేమ, అంగీకారం లభించినందుకు చాలా గర్వంగా ఉందన్నారు. అందమైన సినీ పరిశ్రమలో తననూ ఒక భాగంగా మార్చిందన్నారు. ఇప్పుడు ఆ ప్రయాణాన్ని నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లడానికి ఆరవ్ స్టూడియోస్ సంస్థను ప్రారంభించినట్లు చెప్పారు. మంచి కథలను చెప్పాలనే తపన, ఆసక్తి నుంచి ఈ సంస్థ పుట్టిందన్నారు. ఈ విజువల్స్, క్రియేటివ్ ప్రపంచంలో ఇప్పటి వరకూ ఎవరూ చెప్పని సహజమైన కథలతో చిత్రాలు చేయాలన్న ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించినట్లు చెప్పారు. భగవంతుడి ఆశీస్సులు, సినీ ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి కథా చిత్రాలను నిర్మిస్తాననే నమ్మకంతో ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినట్లు ఆరవ్ తెలిపారు. View this post on Instagram A post shared by Arav (@actorarav) చదవండి: మహేశ్తో సందీప్ సినిమా? -
పెళ్లి చేసుకున్న 'టూరిస్ట్ ఫ్యామిలీ' డైరెక్టర్
సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటే పెళ్లి విషయంలో కాస్త ఆలస్యం చేస్తుంటారు. ఈ ఏడాది 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అభిషన్ జీవింత్ అనే కుర్రాడు.. ఇప్పుడు చిన్న వయసులోనే వివాహం చేసుకున్నాడు. చాన్నాళ్లుగా ప్రేమిస్తున్న అఖిల అనే అమ్మాయికి మూడు ముళ్లు వేశాడు. శుక్రవారం ఉదయం చెన్నైలోని పోయెస్ గార్డెన్లో ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించి ఓ ఫొటో కూడా బయటకొచ్చింది.(ఇదీ చదవండి: నటిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ చిన్న కూతురు)యూట్యూబర్గా కెరీర్ మొదలుపెట్టిన అభిషన్.. 'టూరిస్ట్ ఫ్యామిలీ'తో దర్శకుడిగా మారి అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. రూ.7 కోట్ల బడ్జెట్ పెడితే దాదాపు రూ.80-90 కోట్ల కలెక్షన్ ఈ మూవీకి వచ్చాయి. ఇదే చిత్రంలోనూ నటుడిగా ఆకట్టుకున్న ఇతడు.. రీసెంట్గా హీరోగా ఓ మూవీ పూర్తి చేశాడు. రజనీకాంత్ కూతురు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్.మరోవైపు అభిషన్కి రీసెంట్గానే 'టూరిస్ట్ ఫ్యామిలీ' నిర్మాత మగేశ్ రాజ్.. ఖరీదైన బీఎండబ్ల్యూ కారుని పెళ్లి బహుమతిగా ఇచ్చాడు. గురువారం చెన్నైలో రిసెప్షన్ జరగ్గా.. పలువురు తమిళ సినీ సెలబ్రిటీలు హాజరైన కొత్త జంటని దీవించారు. ఇప్పుడు పెళ్లి కూడా జరగడంతో నూతన వధూవరుల్ని కూడా ఆశీర్వదిస్తున్నారు. పెళ్లి వేడుకకు పెళ్లికొడుకు, పెళ్లి కూతురి కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ ఫాంటసీ రొమాంటిక్ సినిమా) -
వెబ్సిరీస్లో మాధవన్.. కథ ఏంటో చెప్పిన డైరెక్టర్
ఇప్పుడు ఓటీటీ (OTT) సంస్థలు వెండితెరకు ధీటుగా మారుతున్నాయి. ప్రముఖ నటీనటులు కూడా వెబ్ సిరీస్లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. అలా తాజాగా హీరో మాధవన్ (R Madhavan) లెగసీ అనే వెబ్ సిరీస్లో నటించారు. ఆయనకు జంటగా నిమిషా సజయన్ నటించారు. ఈ వెబ్ సిరీస్ను నెట్ఫ్లిక్స్ సంస్థతో కలిసి స్టోన్ బెంచ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. చారుకేశ్ శేఖర్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సిరీస్కు మాధవనే బలంతాజాగా దర్శకుడు మాట్లాడుతూ.. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందన్నారు. ఒక వ్యక్తి తన సామ్రాజ్యాన్ని, కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటమే లెగసీ అని చెప్పారు. మాధవన్ సిరీస్లో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. ఆయన నటన ఈ వెబ్ సిరీస్కు బలమన్నారు. ఈ వెబ్ సిరీస్ రూపకల్పనకు నెట్ఫ్లిక్స్, స్టోన్ బెంచ్ సంస్థలు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాయని పేర్కొన్నారు.నా ఫస్ట్ సిరీస్ ఇదేమాధవన్ మాట్లాడుతూ లెగసీ వెబ్ సిరీస్లో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి అద్భుతమైన పాత్రల్లో నటించే అవకాశం అరుదుగా వస్తుందన్నారు. మంచి ఫ్యామిలీ రిలేషన్ షిప్, ఎమోషనల్, గ్యాంగ్స్టర్స్ కథాంశంతో కూడిన చిత్రాలను నిర్మించే స్టోన్ బెంచ్ సంస్థ తాజాగా రూపొందించిన ఈ లెగసీ వెబ్ సిరీస్లో నటించడం సరికొత్త అనుభవం అని పేర్కొన్నారు. తాను నటించిన తొలి వెబ్ సిరీస్ ఇదని, అదేవిధంగా స్టోన్ బెంచ్ సంస్థలో ఇంతకు ముందు ఒక చిత్రంలో నటించానని, మళ్లీ ఈ వెబ్ సిరీస్లో నటించడం ఆనందంగా ఉందని నిమిషా సజయన్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) చదవండి: ఘనంగా నారా రోహిత్ వివాహం.. -
ఆ హీరో అలాంటివాడే.. ఆడిషన్ అని పిలిచి గదిలో..: హీరోయిన్
ప్రముఖ హీరో అజ్మల్ అమీర్ (Ajmal Ameer) అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడాడంటూ ఓ వీడియో క్లిప్ నెట్టింట వైరలయింది. హద్దులు దాటి సంభాషించాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఇదంతా ఏఐ మాయ అని.. వాటిని కొట్టిపారేశాడు. ఇలాంటి ఫేక్ వీడియోలతో నా కెరీర్ నాశనం చేయలేరు అని వీడియో రిలీజ్ చేశాడు. ఈ క్రమంలో తమిళ హీరోయిన్ నర్విని దేరి.. అజ్మల్ అలాంటి దుర్మార్గుడే అంటూ మీడియా ముందుకు వచ్చింది. హీరోయిన్ కోసం వెతుకులాటతమిళ యూట్యూబ్ ఛానల్ ట్రెండ్ టాక్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అజ్మల్కు వ్యతిరేకంగా మాట్లాడిన మొదటి వ్యక్తి నేనే! అజ్మల్ అరాచకాల గురించి గతంలో చెప్పాను. అసలేం జరిగిందంటే.. 2018లో చెన్నైలోని ఓ మాల్లో అజ్మల్ను తొలిసారి కలిశాను. అప్పటికే నేనో సినిమా చేస్తున్నాను. అజ్మల్ ఒక యాక్టర్ అని నా ఫ్రెండ్ వల్ల తెలిసింది. అజ్మల్.. తన నెక్స్ట్ సినిమాకు హీరోయిన్ కోసం వెతుకుతున్నట్లు చెప్పాడు. ఆడిషన్కు రమ్మని ఆహ్వానంనన్ను యాక్ట్ చేయమని అడిగాడు. అలా ఇద్దరం మాట్లాడుకుని, ఫోన్ నెంబర్లు తీసుకుని వెళ్లిపోయాం. తర్వాత నాకు వాట్సాప్లో ఆడిషన్కు రమ్మని పిలిచాడు. నేను ఆ మరుసటి రోజే డెన్మార్క్ వెళ్లాల్సి ఉంది, ఇప్పుడు రాలేనని చెప్పాను. నువ్వు వస్తే సినిమా టీమ్ అందరినీ కలుసుకోవచ్చని ఒప్పించాడు. అయినా ఆడిషన్, సెలక్షన్.. ఒకే రోజులో ఎలా పూర్తవుతాయని ప్రశ్నిస్తే తాను చూసుకుంటానన్నాడు. అక్కడికి వెళ్లగానే..సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇంకా సమయం ఉందని చెప్పాడు. ఆడిషన్కు వెళ్లేటప్పుడు నా ఫ్రెండ్స్ లేదా బంధువుల్లో ఎవరో ఒకర్ని వెంటపెట్టుకుని వెళ్తాను. కానీ, ఆరోజు సడన్గా వెళ్లాల్సి వచ్చేసరికి ఒంటరిగా వెళ్లాను. అజ్మల్ పంపిన లొకేషన్కు వెళ్లగానే కొంత అసౌకర్యంగా అనిపించింది. ఆయన చెప్పిన రూమ్ దగ్గరికెళ్లి డోర్ కొట్టగా అజ్మల్ తలుపు తీశాడు. మిగతావారేరి? అని అడిగితే అందరూ బయటకు వెళ్లారన్నాడు.రూమ్లో ఒక్కడే..వారు వచ్చేవరకు కింద వెయిట్ చేస్తానంటే ఆయన ఒప్పుకోలేదు. ఏదో తప్పు జరగబోతోంది అని నా మనసు కీడు శంకించింది. తినడానికి ఏదో ఇస్తే వద్దని తిరస్కరించాను. ఇంకో 20 నిమిషాల్లో నా నుంచి మెసేజ్ రాకపోతే వెంటనే ఫోన్ చేయ్ అని నా ఫ్రెండ్కు మెసేజ్ పెట్టాను. మరోవైపు అజ్మల్.. నా బ్యాగు తీసుకుని పక్కనపెట్టాడు. ఏం చేయాలో అర్థం కాక వాష్రూమ్కి వెళ్లి అక్కడే కాసేపు ఉండిపోయాను. బయటకు రాగానే పాటలు పెట్టి నా చేయి పట్టుకున్నాడు. అమ్మాయిలు నా వెంట పడతారుడ్యాన్స్ చేద్దామన్నాడు. వెంటనే అతడిని దూరం నెట్టి.. మీ ఉద్దేశం ఏంటో నాకర్థమైంది. నేను దానికోసమైతే రాలేదు అని ముఖం మీదే చెప్పాను. అందుకు అజ్మల్.. ఏం మాట్లాడుతున్నావ్? నేను హ్యాండ్సమ్.. నా వెనక ఎంతమంది అమ్మాయిలు పడతారో తెలుసా? అంటూ గొప్పలుపోయాడు. అయితే నాకేంటి? నాకిదంతా నచ్చదని కరాఖండి చెప్తూ ఉన్నా.. సడన్గా హత్తుకునేందుకు ప్రయత్నించాడు. నన్ను చంపాకే ముట్టునేను అడ్డు చెప్పాను. నన్నేదైనా చేయాలంటే అది నన్ను చంపాకే చేసుకో అన్నాను. అప్పుడే తనకు ఫోన్కాల్ వచ్చింది. వెంటనే నేను క్యాబ్ డ్రైవర్కు ఫోన్ చేసి రెడీగా ఉండమన్నాను. నాతోపాటు సిస్టర్స్ వచ్చారు, వారు కింద నాకోసం వెయిట్ చేస్తున్నారని అబద్ధం చెప్పాను. నేను వెళ్లకపోతే వారే నన్ను వెతుక్కుంటూ ఇక్కడివరకు వస్తారన్నాను. ఇంతలో రూమ్ బాయ్ కాలింగ్ బెల్ కొట్టాడు. అజ్మల్ డోర్ తలుపు తీయగానే వెంటనే అక్కడి నుంచి పారిపోయి తప్పించుకున్నాను. చాలామందితో ఇలాగేఇంత జరిగాక కూడా నాకు మెసేజ్ చేయడం మానలేదు. మళ్లీ కలుస్తావా? అని అడుగుతూ ఉంటాడు. అజ్మల్ చాలామంది అమ్మాయిలతో ఇలాగే ప్రవర్తించాడు. ఇదంతా జరిగినప్పుడు నా చదువు, జీవితంపైనే ధ్యాస పెట్టాను. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అని నర్విని చెప్పుకొచ్చింది. నర్విని.. ఉయిర్వారై ఇనింతాయి, సినంకోల్ అనే తమిళ సినిమాల్లో హీరోయిన్గా చేసింది.చదవండి: శ్రీజకు మళ్లీ అన్యాయం? 'మేమేం పాపం చేశాం? ఎందుకింత వివక్ష' -
'మహాకాళి'గా భూమి శెట్టి.. ఎవరో తెలుసా..?
టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)తో మరో కన్నడ బ్యూటీ బిగ్ ఛాన్స్ దక్కించుకుంది. పీవీసీయూలో వచ్చిన తొలి సినిమా ‘హనుమాన్’.. ఇదే యూనివర్స్లో ‘మహాకాళి’ మూవీ రానుంది. ఫీమేల్ సూపర్ హీరో సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్కు ప్రశాంత్ వర్మ కథ అందిస్తుండగా.. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. మహాకాళిగా కనిపించనున్న భూమి శెట్టి (27) గురించి తెలుసుకునేందుకు కొందరు నెటిజన్లు సోషల్మీడియాలో వెతుకుతున్నారు.ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి జన్మించిన కుందాపుర గ్రామమే భూమి శెట్టిది కూడా.. భాస్కర్, బేబీ శెట్టి దంపతులకు జన్మించిన భూమి కన్నడ, తెలుగు అనర్గళంగా మాట్లాడుతుంది. ఆమె చదువుకునే రోజుల్లో యక్షగానం (నృత్య, నాటక, సంగీత, వేష, భాష, అలంకారాల కలబోత) నేర్చుకుంది. కుందాపురలోనే తన పాఠశాల విద్యను భూమి పూర్తి చేసింది. దగ్గర్లోనే ఉన్న ఆర్.ఎన్. శెట్టి పి.యు. కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. తరువాత బెంగళూరులోని AMC ఇంజనీరింగ్ కళాశాల నుండి మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రురాలైంది.చిన్నప్పుడే యక్షగానంలో శిక్షణ పొందడంతో రంగస్థలంపై రాణించాలనే ఆసక్తి ఆమెలో ఉండేది. అలా మొదట కన్నడ సీరియల్ కిన్నరితో కెరీర్ ప్రారంభించిన భూమి... తెలుగు సీరియల్ నిన్నే పెళ్లాడతాలో ప్రధాన పాత్రలో మెరిసింది. అలా వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ కన్నడ సీజన్- 7 టాప్ ఫైవ్లో నిలిచింది. బిగ్బాస్తో వచ్చిన గుర్తింపుతో ఆమెకు సినిమా ఛాన్స్ వచ్చింది. కన్నడ చిత్రం ఇక్కత్ (2021)తో హీరోయిన్గా సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఏడాదిలో విడుదలైన కింగ్డమ్ చిత్రంలో సత్య దేవ్ సతీమణి గౌరి పాత్రలో కనిపించింది. ఇప్పుడు, మహాకాళితో భూమి శెట్టికి బిగ్ ఛాన్స్ వచ్చింది. View this post on Instagram A post shared by ಭೂMee🐚 (@bhoomi_shettyofficial) -
సినిమాలకు గుడ్ బై చెప్పిన రజనీకాంత్..!
-
2 వేలమంది కనుమరుగు... హీరోలే కాపాడాలి: దర్శకుడు
ఆరుపడై ప్రొడక్షన్స్ పతాకంపై శైల్కుమార్ నిర్మించిన చిత్రం వళ్లువన్. శంకర్ సారథి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సేతన్ శీను, నటి ఆస్నా జవేరి జంటగా నటించారు. మనోబాలా, సాయిదీనా, దీప, రామచంద్రన్, మీసై రాజేంద్రన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అశ్వత్ సంగీతం, సురేశ్బాల చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ల్యాబ్లో నిర్వహించారు. డైరెక్టర్ స్పీచ్ఈ కార్యక్రమంలో దర్శకుడు, ఫెఫ్సీ (దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య) అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి, ఆర్వీ ఉదయకుమార్, పేరరసు, కే.రాజన్ తదితర సినీ ప్రముఖలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శంకర్ సారథి మాట్లాడుతూ.. అమాయక ప్రజలను రక్షించేందుకు డా.అంబేడ్కర్ చట్టాలను తీసుకొచ్చారన్నారు. అయితే చట్టాల్లోని మంచి విషయాలను మరచి, అందులోని లొసుగులను అడ్డం పెట్టుకుని దుండగులు తప్పించుకుని తిరిగే పరిస్థితి నెలకొందన్నారు. 10 ఏళ్లలో 2500 సినిమాలుఅలా చట్టాన్ని చేతిలోకి తీసుకుని తప్పులు చేసే వారిని ఎవరు శిక్షిస్తారు? అన్న ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం వళ్లువన్ అని చెప్పారు. ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి మాట్లాడుతూ.. ట్రైలర్ చూస్తే కమర్శియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా అనిపించిందన్నారు. గత 10 ఏళ్లలో సుమారు 2,500 చిత్రాలు విడుదలయ్యాయని, వాటిలో 2వేల చిత్రాలను నిర్మిచింది చిన్న నిర్మాతలేనని పేర్కొన్నారు.2 వేల మంది నిర్మాతలు కనుమరుగుఅలా వాళ్లే తమకు అన్నం పెడుతున్నారన్నారు. అయితే ఇన్నేళ్లుగా మొదటి చిత్రాన్ని తీసిన 2 వేల మంది నిర్మాతలు కనిపించకుండాపోయారన్నారు. ఒక్క సంగీత దర్శకుడు కన్నుమూస్తే ఆయనకు కుటుంబానికి రాయల్టీ వస్తుందని, కానీ నిర్మాతలకు ఎలాంటి గ్యారెంటీ లేదన్నారు. అందువల్ల తమ ఉన్నతికి కారణం అయిన నిర్మాతలకు హీరోలు తమ ఆదాయంలో 5 లేదా 10 శాతం చెల్లించేలా ఒక సిస్టం తీసుకువస్తే బాగుంటుందనే అబిప్రాయాన్ని ఆర్కే.సెల్వమణి వ్యక్తం చేశారు.చదవండి: ప్రేక్షకులకు గుర్తుండిపోయే చిత్రం ఇది -
నటుడు ప్రభు ఇంటికి బాంబు బెదిరింపు
తమిళనాడులో ఉన్న అమెరికా రాయబారి కార్యాలయంతో పాటు సినీ నటుడు ప్రభు ఇంటికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈమేరకు డీజీపీ కార్యాలయానికి ఒక ఈ–మెయిల్ వచ్చింది. అందులో అన్నా ఫ్లైఓవర్ సమీపంలోని అమెరికా డిప్యూటీ కాన్సులేట్లో మరికాసేపట్లో బాంబు పేలుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత నటుడు ప్రభు ఇంట్లో ఒక బాంబు పేలుతుందని మెయిల్ ద్వారా హెచ్చరించారు. దీంతో వెంటనే చెన్నై పోలీసులు, బాంబు స్క్వాడ్, జాగిలాలు సహాయంతో అన్నిచోట్లా తనిఖీ చేశారు. తర్వాత అమెరికా కాన్సులేట్లో పనిచేస్తున్న అధికారుల ఇళ్లకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. అయితే, తనిఖీల్లో ఎలాంటి బాంబులు దొరకలేదు. ఇది కేవలం కావాలనే కొందరు ఆకతాయిలు చేసిన పని అని తేలింది. అదేవిధంగా నటుడు ఎస్.వి.శేఖర్ ఇల్లు, మైలాపూర్లో ఉన్న సుబ్రమణ్యస్వామి ఇళ్లలో బాంబులు పెట్టినట్లు తెలిపారు. వెంటనే తనిఖీ బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేసి బాంబు లేదని నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
ఎట్టకేలకు రజనీకాంత్ షాకింగ్ నిర్ణయం?
సూపర్స్టార్ రజనీకాంత్ షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారా? అంటే తమిళ మీడియాలో అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రస్తుతం ఈయన 'జైలర్ 2' చేస్తున్నారు. ఇది కాకుండా మరో రెండు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయని, వీటిని పూర్తి చేసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంత? అనేది ఇప్పుడు చూద్దాం.చెప్పాలంటే ఈ పాటికే రజనీకాంత్ రిటైర్మెంట్ ఇచ్చేసేవారేమో! ఎందుకంటే 2010లో 'రోబో' చేసిన తర్వాత సినిమాలైతే చేస్తూ వచ్చారు గానీ ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కాలేదు. మధ్యలో 'రోబో 2.0' కొంతమేర పర్వాలేదనిపించింది. అయితే 'జైలర్' బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం ఈయనకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్లుంది. దీంతో లాల్ సలాన్, వేట్టయాన్ చిత్రాలు చేశారు. కానీ ఇవి ఫ్లాప్ అయ్యాయి. ఈ ఏడాది 'కూలీ'తో ఏకంగా రూ.1000 కోట్ల మార్క్ కొట్టేస్తారని రిలీజ్కి ముందు అందరికీ అనిపించింది. కానీ రూ.500 కోట్ల దగ్గరకు వచ్చి ఆగిపోయింది.(ఇదీ చదవండి: కుటుంబంతో సహా చనిపోదామనుకున్నా.. ఆ హీరో వల్లే బతికా!)ప్రస్తుతానికైతే నెల్సన్ దర్శకత్వంలో రజనీ.. 'జైలర్ 2' చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత కమల్ హాసన్తో మల్టీస్టారర్ చేయబోతున్నారు. ఈ చిత్రం త్వరలో మొదలు కానుంది. అయితే ఈ మూవీకి కూడా నెల్సన్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. దీనితో పాటు సుందర్.సి దర్శకత్వంలోనూ రజనీ ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం. ఈ రెండు ప్రాజెక్టులు అయిపోయిన తర్వతా రజనీ.. రిటైర్మెంట్ ఇచ్చేస్తారట. ప్రస్తుతానికి ఈ రూమర్స్పై అధికారిక సమాచారం లేనప్పటికీ దాదాపు ఇదే కన్ఫర్మ్ అని ఆయన సన్నిహితులు అంటున్నారు.ఈ రెండు సినిమాలే రజనీకాంత్ చేసేటప్పటికీ ఎలా లేదన్నా 2027 అయ్యే అవకాశముంది. అప్పుడు వయసు కూడా కాస్త మీదపడుతుంది. మరి వినిపిస్తున్నట్లు రిటైర్మెంట్ ఇచ్చేస్తారా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: హీరోయిన్గా మహేశ్బాబు మేనకోడలు ఎంట్రీ) -
ఒక్క సినిమాతో తెలుగు, తమిళంలో విలన్గా క్రేజ్.. గుర్తుపట్టారా?
భారతీయ సినిమాల్లో పరాయి దేశ నటీనటులు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. అయితే వాళ్లలో క్రేజ్ తెచ్చుకున్న వాళ్లు మాత్రం చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో ఇతడు ఒకడు. చేసింది ఒక్కటే సౌత్ మూవీ అయినప్పటికీ. తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఇతడి ఫొటోలు వైరల్ అయ్యేసరికి సినీ ప్రేమికులు ఆశ్చర్యపోతున్నారు. ఇతడెవరో గుర్తుపట్టారా?(ఇదీ చదవండి: తెలుగు ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గకి తమిళంలో హీరోయిన్ ఛాన్స్)పైన ఫొటోలో కనిపిస్తున్న నటుడి పేరు జానీ ట్రింగ్యుయెన్. ఇలా చెబితే మీకు గుర్తురాకపోవచ్చు. డాంగ్లీ అని చెబితే ఇచ్చే కనిపెట్టేస్తారు. సూర్య హీరోగా చేసిన '7th సెన్స్' చిత్రంలో విలన్ ఇతడే. వియత్నాంలో పుట్టిన ఇతడు.. సొంత భాషతో పాటు హాలీవుడ్లోనూ పలు చిత్రాలు చేశాడు. మార్షల్ ఆర్ట్స్ గురువుగానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. 2017 వరకు పలు భాషల్లో నటించాడు. తర్వాత మాత్రం యాక్టింగ్ పక్కనబెట్టేశాడు.రీసెంట్గా సోషల్ మీడియాలో ఇతడు మాట్లాడుతున్న వీడియో ఒకటి వైరల్ అయ్యేసరికి.. డాంగ్లీ ఇంతలా మారిపోయాడేంటి అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. సూర్య సినిమా వచ్చి దాదాపు 14 ఏళ్లు అయిపోయింది. వయసు కూడా 50 ఏళ్లు దాటేసింది. దీంతో కాస్త వృద్ధాప్య ఛాయలు కూడా డాంగ్లీ ముఖంలో కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఒక్క సినిమాతో అటు తెలుగు, ఇటు తమిళంలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడనే చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్) View this post on Instagram A post shared by trippy[FX] (@trippy__reels) -
తెలుగు ఫోక్ డ్యాన్సర్కి తమిళంలో హీరోయిన్ ఛాన్స్
ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాలు మాత్రమే. ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది. యూట్యూబ్లోనూ పలు ఆల్బమ్ సాంగ్స్ మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. అందులో యాక్ట్ చేసిన వాళ్లు మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాంటి వాళ్లలో నాగదుర్గ ఒకరు. గత కొన్నేళ్లలో ఫోక్ సాంగ్స్ చేస్తూ పేరు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు ఏకంగా తమిళంలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి 'కాంతార-1')దారిపొంటత్తుండు, నా పేరు ఎల్లమ్మ, ఎర్ర రుమాల్, కాపోళ ఇంటికాడ తదితర సాంగ్స్తో ఈమె బోలెడంతమంది అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే 'కలివనం' అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా చేసినప్పటికీ ఇది రిలీజైందో, ఎప్పుడో రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. కొన్నిరోజుల క్రితం ఈమె.. తెలుగు బిగ్బాస్ 9వ సీజన్లోనూ పాల్గొంటుందని అన్నారు. కానీ అవి రూమర్స్ మాత్రమే అని తేలిపోయింది.అలాంటిది ఇప్పుడు తమిళ సినిమాలో నాగదుర్గకు అవకాశం దక్కింది. ప్రముఖ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్.. గతేడాది 'జాబిలమ్మ నీకు అంత కోపమా' అనే డబ్బింగ్ చిత్రంతో హీరోగా మారాడు. ఇప్పుడు ఈ కుర్రాడు కొత్త సినిమాలోనే నాగదుర్గ హీరోయిన్గా చేయనుంది. ఒకవేళ ఇది క్లిక్ అయితే తమిళంలో మరిన్ని అవకాశాలు రావొచ్చు. ఈమె కంటే ముందు శాన్వి మేఘన, గౌరీప్రియ లాంటి పలువురు తెలుగమ్మాయిలు తమిళ సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్నారు. బాగానే పేరు సంపాదించారు. ఎటొచ్చి టాలీవుడ్లోనే తెలుగమ్మాయిలు హీరోయిన్స్గా కనిపించట్లేదు!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్) -
బైసన్ మూవీ టీమ్పై సీఎం ప్రశంసలు
మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ్విక్రమ్ (Dhruv Vikram) కథానాయకుడిగా నటించిన చిత్రం బైసన్ (Bison Movie). అనుపమ పరమేశ్వరన్, రజీషా విజయన్, పశుపతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అప్లాస్ సంస్థతో కలిసి నీలం ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకుడు పా.రంజిత్ నిర్మించారు. నివాస్ కే ప్రసన్న సంగీతాన్ని అందించిన ఈ చిత్రం తమిళనాడులో అక్టోబర్ 17న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.బైసన్ టీమ్ను అభినందించిన సీఎంబైసన్ మూవీ చూసిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్.. ఆఫీసుకు పిలిచి మరీ మారిసెల్వరాజ్, ధ్రువ్విక్రమ్లను అభినందించారు. బైసన్ చిత్రం గురించి ఎక్స్లో ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ.. మారిసెల్వరాజ్ సినీమకుటంలో ఇది మరో వజ్రం. ప్రతిభను మాత్రమే నమ్ముకున్న ఒక యువకుడు అటు కబడ్డీ కోర్టులో, ఇటు బయట ఎదురైన సమస్యలను ఎదుర్కొని విజయం సాధించిన కథను చాలా గొప్పగా తీర్చిదిద్దారు. చక్కగా చూపించారుక్రీడలు నేపథ్యంగా చేసుకుని ఒక యువకుడు చేరుకోవాల్సిన మార్గాన్ని దర్శకుడు మారిసెల్వరాజ్ చక్కగా చూపించారన్నారు. అద్భుతమైన నటనతో మారిసెల్వరాజ్ కథకి ప్రాణం పోసిన నటుడు ధ్రువ్విక్రమ్, పశుపతి, అనుపమ పరమేశ్వరన్, రెజీషా విజయన్.. ఇతర నటినటులు, తెర వెనుక శ్రమించిన సాంకేతిక వర్గానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. సీఎం రివ్యూతో పొంగిపోయిన మారి సెల్వరాజ్ ఎక్స్ మీడియా ద్వారా స్టాలిన్కు కృతజ్ఞతలు తెలిపారు. #BisonKaalamaadan: மாரி செல்வராஜின் திரைமகுடத்தில் மற்றுமொரு வைரக்கல்!தன் திறமையை மட்டுமே நம்பி, கிராமத்தில் இருந்து சாதிக்கக் கிளம்பிய ஓர் இளைஞன், கபடிக் கோட்டுக்கு உள்ளேயும் வெளியேயும் சந்திக்கும் போராட்டங்களை எதிர்கொண்டு வெற்றி பெற்ற கதையை மிகச் சிறப்பான திரை அனுபவமாக… pic.twitter.com/q345pPYkxl— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) October 25, 2025 చదవండి: హిట్ మూవీలో వేశ్యగా నటించిన బ్యూటీ.. 'ప్రభాస్' ఫౌజీలో ఛాన్స్ -
ఈ పాన్ ఇండియా నటుడిని గుర్తుపట్టారా? బయోపిక్ కోసం ఇలా
ఇతడు అప్పట్లో హీరోగా పలు హిట్ సినిమాలు చేశాడు. అమ్మాయిలకు ఫేవరెట్ అయిపోయాడు. వయసు పెరిగి 50 ఏళ్లు దాటినా సరే కుర్రహీరోలు అసూయ పడేలా ఫిజిక్ మెంటైన్ చేస్తుంటాడు. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు ఓ మూవీ కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించాడు. ఎవరో కనిపెట్టారా? చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న నటుడి పేరు మాధవన్. అవును మీరు విన్నది నిజమే. 'సఖి' సినిమాతో అప్పట్లోనే తెలుగులోనూ అద్భుతమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఇతడు.. ఇప్పటికీ చకచకా మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. నంబీ నారాయణన్ అనే శాస్త్రవేత్త బయోపిక్లో నటించి మెప్పించిన ఈ నటుడు.. ఇప్పుడు మరో క్రేజీ బయోపిక్ చేస్తున్నాడు. ఆ మూవీ ఫస్ట్ లుక్కే ఇది.మాధవన్ చేస్తున్న లేటెస్ట్ బయోపిక్ మూవీ 'జీడీ నాయుడు'. బల్బ్ కనిపెట్టింది థామస్ అల్వా ఎడిసన్. జీడీ నాయుడుని.. ఎడిసన్ ఆఫ్ ఇండియా అని ముద్దుగా పిలుస్తారు. ఈయన పూర్తిపేరు గోపాలస్వామి దొరైస్వామి నాయుడు. తమిళనాడులోని కోయంబత్తూర్ ఈయన స్వస్థలం. మనం రోజూ ఉపయోగిస్తున్న ఎన్నో ఆవిష్కరణలు ఈయనుంచి వచ్చినవే. ఓటు రికార్డింగ్ మెషీన్, జ్యూస్ పిండే మెషీన్, కాయిన్తో పనిచేసే ఫొనోగ్రాఫ్, ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్, 16 ఎమ్ఎమ్ ప్రొజెక్టర్ లాంటివి రావడంలో ఈయన పాత్ర మరువలేనిది. అలానే దేశంలో తొలి పాలిటెక్నిక్ కాలేజీ పెట్టింది కూడా ఈయనే కావడం విశేషం.ఇలాంటి వ్యక్తి బయోపిక్లో మాధవన్ లీడ్ రోల్ చేస్తున్నాడంటే కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. ఎలా చూపిస్తారనేది తెలియాలంటే వచ్చే ఏడాది వేసవి వరకు ఆగాల్సిందే. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ చూస్తే ఫొటోలో ఉన్నది మాధవన్యేనా అనిపిస్తుంది. అంతలా మారిపోయి కనిపిస్తున్నాడు. మాధవన్ మూవీస్ విషయానికొస్తే.. తెలుగులో నిశ్శబ్దం, సవ్యసాచి అనే మూవీస్ మాత్రమే చేశాడు. ఇవి రెండు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. -
'కాంతార' హిట్.. మమ్నల్నే అంటారెందుకు?: 'కబాలి' డైరెక్టర్
రీసెంట్ టైంలో పాన్ ఇండియా రేంజులో 'కాంతార 1' సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇంకా వస్తూనే ఉంది. తమిళనాడులోనూ ఈ చిత్రాన్ని బాగానే ఆదరించారు. అయితే ఇలాంటి మూవీస్ హిట్ అయిన ప్రతిసారి మా ముగ్గురు దర్శకుల్నే కొందరు తమిళ ఫ్యాన్స్ ఎందుకు తిడుతున్నారో అర్థం కావట్లేదని ప్రముఖ డైరెక్టర్ పా. రంజిత్ అసహనం వ్యక్తం చేశాడు. 'బైసన్' సక్సెస్ మీట్లో ఈ వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్ హీరోల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)ఇంతకీ అసలేమైంది?''కాంతార' లాంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నప్పుడు.. కొందరు కోలీవుడ్ ఫ్యాన్స్ ముగ్గురు తమిళ దర్శకుల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. మేమే తమిళ ఇండస్ట్రీని చెడగొట్టామని విమర్శిస్తుంటారు. గత రెండేళ్లలో కోలీవుడ్లో 600కి పైగా మూవీస్ రిలీజ్ అయ్యాయి. మరి వీళ్లలో ఎంతమంది తమిళ సినిమా స్థాయిని పెంచగలిగారు?' అని పా. రంజిత్ ఫైర్ అయిపోయాడు.తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో కమర్షియల్, రూటెడ్ సినిమాలు వస్తున్నాయి. వందల వేల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. తమిళంలో మాత్రం ఏ దర్శకులు కూడా ఆ ఫీట్ సాధించలేకపోతున్నారు. దీంతో రీసెంట్ టైంలో కొందరు తమిళ నెటిజన్లు, రివ్యూయర్స్.. డైరెక్టర్స్ పా. రంజిత్, వెట్రిమారన్, మారి సెల్వరాజ్పై పడ్డారు. కులం, అణిచివేత సబ్జెక్ట్స్తో మాత్రమే వీళ్లు సినిమాలు తీస్తున్నారని, అందువల్లే తమిళ ఇండస్ట్రీ నాశనమైపోతుందని విమర్శించారు. ఆ కామెంట్స్కి హర్ట్ అయిన పా.రంజిత్.. ఇప్పుడు కౌంటర్ ఇచ్చాడు.ఇదే ఈవెంట్లో పా.రంజిత్ మాట్లాడుతూ.. 'సోషల్ మెసేజ్ ఉండే సినిమాలని అర్థం చేసుకోకుండా వాటిపై కులం అనే ముద్ర వేయొద్దు. ప్రేక్షకులు ప్రేమతో సినిమాల్ని చూస్తారు. కానీ ట్రోల్స్.. ఓ మూవీని చూడకముందే చాలామందికి ఓ అభిప్రాయాన్ని కలుగజేస్తున్నాయి' అని చెప్పుకొచ్చాడు.పా.రంజిత్ విషయానికొస్తే.. రజినీకాంత్తో కబాలి, కాలా లాంటి మూవీస్ తీశాడు. తమిళంలో వీటికి ఓ మాదిరి ఆదరణ వచ్చింది. తెలుగులో మాత్రం రెండు ఫ్లాప్ అయ్యాయి. గతేడాది 'తంగలాన్' అనే మూవీతో వచ్చాడు. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది.(ఇదీ చదవండి: 9 నెలల పిల్లాడు.. దెయ్యమై పగ తీర్చుకుంటే?) -
సెట్కు ఆలస్యం.. షాలిని తండ్రిని చితకబాది అవమానించారా?
'హీరోయిన్ షాలిని తండ్రి హోటల్లో గిన్నెలు కడిగేవాడు.. కూతురిని లేటుగా సెట్కు తీసుకెళ్లినందుకు ఓ డైరెక్టర్ చేతిలో తన్నులు తిన్నాడు.. ఒకప్పుడు పేదవాడిగా ఉండి ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు తమిళ దర్శకుడు అలెప్పీ అష్రఫ్. మీడియాకు దూరంగా ఉండే షాలిని తండ్రి బాబు... ఈ వ్యాఖ్యాలపై స్పందించాడు. అవన్నీ నిజం కాదని కొట్టిపారేస్తున్నాడు. నన్ను కొడుతుంటే షాలిని ఏడుస్తూ ఉందా?మనోరమ ఆన్లైన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబు మాట్లాడుతూ.. అలెప్పీ అష్రఫ్ (Alleppey Ashraf) నాకు చాలా ఏళ్లుగా తెలుసు. మా కుటుంబానికి చాలా క్లోజ్. మేమెలాంటివాళ్లమో తనకు బాగా తెలుసు. అయినప్పటికీ మా గురించి అలాంటి వీడియో ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు. పోనీ, చేసేముందు మాకో మాటైనా చెప్పలేదు. తను చెప్పినదాంట్లో దాదాపు అన్నీ అబద్ధాలే.. మలయాళ నటుడు కుంచకొ తండ్రి, దర్శకనటుడు బొబన్ నన్ను చెంపదెబ్బ కొట్టి.. చితకబాదుతుంటే నా కూతురు చూసి ఏడ్చిందట! అది పూర్తిగా అసత్యం. ఒకటి నిజంబొబన్ అలాంటివారు కానే కాదు. అయితే ఒకటి మాత్రం నిజం. Aazhi (1985) మూవీ సెట్కు సమయానికి వెళ్లలేకపోయాం. ఎందుకంటే బొబన్ సినిమాకు సంతకం చేయడానికి ముందే నా కూతురు షాలిని (Shalini) మరో సినిమా చేస్తోంది. ఆ మూవీ షూటింగ్ నిమిత్తం మేము విదేశాల్లో ఉన్నాం. దానివల్ల ఒకరోజు ఆలస్యంగా సెట్కు వచ్చాం. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది మాకంటే సినీ ఫ్యామిలీలో పుట్టిన బొబన్కే బాగా తెలుసు. అయినప్పటికీ మాపై కాస్త కోప్పడ్డాడు. షాలిని కుటుంబంఇది మరీ కామెడీ!పరిస్థితి ఇదీ.. అని మేము వివరించేసరికి తను కాస్త శాంతించాడు. అంతే తప్ప ఆయన నాపై చేయి ఎత్తలేదు. ఆయనే కాదు, ఎవరూ నన్ను కొట్టే పరిస్థితి నేను తెచ్చుకోలేదు. మేమెప్పుడూ ప్రేమగానే మసులుకునేవాళ్లం. అలాంటిది బొబన్ కొడితే ఆ దెబ్బకు నేను చెరువులో పడ్డానని, దెబ్బలు తగిలాయని, వేరేవాళ్లు నన్ను కాపాడారని చెప్తుంటే హాస్యాస్పదంగా ఉంది. పైగా నాకు ఈత వచ్చు. చెరువులోనే కాదు, సముద్రంలోనూ ఈత కొట్టగలను.అదేమైనా చేయకూడని పనా?అష్రఫ్ ఇంకా ఏమన్నారు.. షాలిని సినిమాల్లోకి రాకముందు హోటల్లో పని చేశానా? మురికివాడలో నివసించానా? నేను గిన్నెలు కడగడం, టేబుల్ క్లీన్ చేయడం అష్రఫ్ చూశాడా? ఎందుకీ అబద్ధాలో అర్థం కావడం లేదు. ముందుగా.. హోటల్లో పని చేయడం చిన్నతనమేమీకాదు. పొట్టకూటికోసం ఏదైనా చేసుకోవచ్చు. దేవుడి దయవల్ల నాకలాంటి అవసరం రాలేదు. నేను ఓ ఫ్యాన్సీ షాప్ రన్ చేసేవాడిని. మరో విషయం ఏమన్నాడు? నా భార్య జూనియర్ ఆర్టిస్టా? తనకసలు సినిమాలంటేనే ఆసక్తి లేదు. ఇల్లు వదిలి బయటకు రాదు. నా పిల్లలిద్దరికీ సినిమా ఛాన్సులు వచ్చినప్పుడు నేనే వాళ్లను పట్టుకుని తిరిగానే తప్ప తనెప్పుడూ మాతో రాలేదు. రమ్మని అడిగితే ఇంట్లోనే ఉంటాననేది. రూ.100 కోట్ల ఆస్తి?ఒకప్పుడు కటిక పేదరికం అనుభవించానని, ఇప్పుడు రూ.100 కోట్ల ఆస్తి ఉందన్నాడు. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలడో మరి? దేవుడి దయవల్ల మేము మంచి స్థాయిలోనే ఉన్నాం. ఇంకోటి.. అజిత్ (Ajith Kumar) రూ.180 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అవును, తన రేంజ్ను బట్టి ఎంతైనా తీసుకుంటాడు. దాని ప్రకారమే ట్యాక్స్ కూడా కరెక్ట్గా కడతాడు. మరింకేంటి సమస్య? అష్రఫ్ మీద నాకెలాంటి కోపం లేదు. మేమిద్దరం గల్ఫ్ దేశంలో ఓ స్కిట్ కూడా చేశాం. అదిప్పటికీ నాకు బాగా గుర్తు. మరి తనెందుకు ఇలా అనుచిత వ్యాఖ్యలు చేశాడో అంతు చిక్కడం లేదు అని బాబు చెప్పుకొచ్చాడు.సినిమాఎలైస్-బాబు దంపతులకు కూతుర్లు షాలిని, షామిలి, కొడుకు రిచర్డ్ సంతానం. ఈ ముగ్గురూ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. చైల్డ్ ఆర్టిస్ట్గా, హీరోయిన్గా అనేక సినిమాలు చేసిన షాలిని.. 2000వ సంవత్సరంలో అజిత్ను పెళ్లాడింది. వీరికి ఓ కూతురు, కుమారుడు సంతానం. వివాహం తర్వాత షాలిని మూవీస్కు గుడ్బై చెప్పింది.చదవండి: పసిబిడ్డను చంపేయమని అడిగా.. నాపై ఉమ్మేశారు!: కస్తూరి -
'బైసన్' కోసం ధ్రువ్ కష్టం.. మేకింగ్ వీడియో విడుదల
తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటించిన చిత్రం బైసన్.. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్ తనకు జోడీగా నటించింది. అయితే, కోలీవుడ్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలైంది. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. కబడ్డీ ఆటగాడిగా ధ్రువ్ పడిన కష్టం ఏంటి అనేది ఈ వీడియోలో కనిపిస్తుంది. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ మూవీని పా.రంజిత్కు చెందిన నీలం ప్రొడక్షన్స్, అప్లాజ్ ఎంటర్టెయిన్మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి నిర్మించాయి. ఈ సినిమాలో ధ్రువ్ నటన పట్ల విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటికే రూ. 45 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. -
కరూర్ ఘటన తర్వాత ప్రజల్లోకి విజయ్.. వేదిక ఫిక్స్
తమిళనాడులోని కరూర్ ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ నిర్ణయించారు. సుమారు 30 రోజుల తర్వాత విజయ్ బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. సెప్టెంబర్ 27న చెన్నై కరూర్లో టీవీకే నేత విజయ్ ప్రచార సమయంలో చోటు చేసుకున్న పెను విషాదం గురించి తెలిసిందే. మరణించిన 41 మంది బాధిత కుటుంబాలు, గాయపడ్డ 160 మందిని పరామర్శించేందుకు విజయ్ నిర్ణయించారు. బాధిత ఒక్కో కుటుంబానికి ఇప్పటికే రూ. 20 లక్షలు విజయ్ ప్రకటించారు. ఈ క్రమంలో బాధిత కుటుంబ సభ్యులందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చి పరామర్శించడమే కాకుండా, నష్ట పరిహారంతో పాటు వారిని దత్తత తీసుకునే విధంగా విజయ్ కసరత్తులలో ఉన్నట్టుగా సమాచారం ఉంది. కరూర్లో విజయ్ పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, భద్రత చర్యలు తీసుకోవాలని ఇప్పటికే టీవీకే వర్గాలు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అయితే, టీవీకే వర్గాలు ఎంపిక చేసిన వేదిక చిన్నదిగా ఉండడంతో ఏదేని కళాశాల మైదానాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచించారు. అలాగే ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర వివరాలను సమర్పించాలని సూచించారు. దీంతో పరామర్శలను వాయిదా వేసుకుంటూ వచ్చారు. చివరకు కరూర్లో అతి పెద్ద మైదానం, ఆడిటోరియంలేని దృష్ట్యా, బాధితులను చెన్నైకు తీసుకొచ్చి పరామర్శ ఏర్పాట్లు చేయడానికి టీవీకే వర్గాలు చర్యలు చేపట్టారు. ఇందుకోసం మహబలిపురం వద్ద అతి పెద్ద వేదికను ఎంపిక చేశారు. ఇక్కడకు బాధితులను తీసుకొచ్చి , వారికి అన్ని రకాల బస తదితర ఏర్పాట్లు చేయడానికి ఏర్పాట్లు చేపట్టారు. ఈమేరకు (27వ తేదీ)సోమవారం బాధితులను విజయ్ పరామర్శించి, నష్ట పరిహారం అందించనున్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. -
డాడా హీరో కొత్త మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?
డాడా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు హీరో కెవిన్ (Kavin). అయితే ఆ తర్వాత నటించిన బ్లడీ బెగ్గర్, ఇటీవల విడుదలైన కిస్ చిత్రాలు ఈయన్ని పూర్తిగా నిరాశపరిచాయి. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మాస్క్. ఆండ్రియా హీరోయిన్గా నటించారు. అంతేకాకుండా ఈమె చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం కావడం విశేషం. ఇందులో మరో హీరోయిన్గా రుహాని శర్మ కూడా నటించారు. చార్లీ, రమేష్ తిలక్, కల్లూరి విను, అర్చన చాందోక్ తదితరులు ముఖ్యపాత్రులు పోషించారు. దర్శకుడు వెట్రిమారన్ మెంటార్గా వ్యవహరిస్తున్న ఈ మూవీ ద్వారా విక్రమన్ అశోక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని, ఆర్డీ రాజశేఖర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 21వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్ర పోస్టర్ ఇటీవల దీపావళి సందర్భంగా విడుదల చేయగా మంచి స్పందన తెచ్చుకుంది. ఈ చిత్ర ఓటీటీ హక్కులను జీ 5 సంస్థ, ఆడియో హక్కులను టి సిరీస్ సంస్థ పొందినట్లు చెప్పారు. ఇది పూర్తిగా చెన్నై నేపథ్యంలో సాగే డార్క్ కామెడీ కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Kavin M (@kavin.0431) చదవండి: కొద్దిరోజులుగా మాస్క్తోనే రష్మిక.. కారణం ఇదేనా..? -
కమల్-రజనీ మూవీ.. శృతి హాసన్, సౌందర్య ఏమన్నారంటే?
స్టార్ హీరోలు కమల్ హాసన్ (Kamal Haasan), రజనీకాంత్ గతంలో పలు హిట్ చిత్రాల్లో కలిసి నటించారు. ఆ తరువాత ఇద్దరూ కావాలనే విడివిడిగా నటించడం మొదలెట్టారు. అలాంటిది దాదాపు 46 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కానుందన్న వార్త సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే! ఈ విషయాన్ని కమల్ హాసన్, రజనీకాంత్ కూడా నిజమేనని ధ్రువీకరించారు. రజనీ కూతురి రియాక్షన్అయితే ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుంది? దర్శకుడు ఎవరు? అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో అసలు ఈ చిత్రం తెరకెక్కుతుందా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య.. కమల్, రజనీల మల్టీస్టారర్ మూవీ కచ్చితంగా ఉంటుందని ఓ అవార్డుల ప్రదానోత్సవంలో పేర్కొన్నారు. తన తండ్రి రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించే చిత్రాన్ని కమల్హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తారని ఆమె స్పష్టం చేశారు. శ్రుతి హాసన్ ఏమందంటే?అదే వేడుకలో పాల్గొన్న హీరోయిన్ శ్రుతిహాసన్ (Shruti Haasan) కూడా కమల్, రజనీ మరోసారి కలిసి నటిస్తే చూడాలన్న ఆశ తనకూ ఉందన్నారు. దీంతో ఈ క్రేజీ కాంబోలో చిత్రం రావడం ఖాయం అనిపిస్తోంది. కాగా కెరీర్ తొలినాళ్ళలో ‘అపూర్వ రాగంగాళ్, మూండ్రు ముడిచ్చు, అంతులేని కథ’... ఇలా దాదాపు ఇరవైకి పైగా సినిమాల్లో కలిసి నటించారు రజనీకాంత్, కమల్హాసన్. 1979లో వచ్చిన ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ తర్వాత వీరు కలిసి నటించింది లేదు.చదవండి: పూజా హెగ్డేకు రూ. 5 కోట్లా..? -
డ్రగ్స్ కేసులో నటులు శ్రీకాంత్, కృష్ణలకు నోటీసులు
మత్తుపదార్థాల కేసులో కోలీవుడ్ నటులు శ్రీరామ్(శ్రీకాంత్), కృష్ణ బెయిల్పై ఇప్పటికే విడుదలయ్యారు. అయితే, తాజాగా వారిద్దరికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీచేసింది. ఈ ఏడాది జూన్లో మొదట ప్రదీప్కుమార్ అనే వ్యక్తి వద్ద మాదక ద్రవ్యాలు దొరికాయి. అతన్ని విచారిస్తే గనా దేశానికి చెందిన జాన్ అనే వ్యక్తి సరఫరా చేశాడని తేలడంతో వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే ఇదే కేసులో అన్నాడీఎంకే మాజీ నేత ప్రశాంత్తో పాటు సినీనటులు శ్రీరామ్, కృష్ణ మొదలైన వారిని అరెస్టు చేశారు. అయితే, పోలీసుల విచారణలో తమ తప్పును అంగీకరించిన శ్రీరామ్, కృష్ణ బెయిల్ కోసం చెన్నై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కోర్టు సూచనతో విడుదలయ్యారు. కానీ, తాజాగా ప్రత్యేక కోర్టు అనుమతితో పుళల్ జైల్లో ఉన్న ప్రశాంత్, జవహర్, ప్రదీప్కుమార్లను ఈడీ అధికారులు దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 28న నటుడు శ్రీరామ్, 29న నటుడు కృష్ణ విచారణకు రావాలని ఈడీ అధికారులు సమన్లు పంపారు.తప్పు చేశాను.. నా బిడ్డను చూసుకోవాలి డ్రగ్స్ ఉపయోగించి తప్పు చేశానని కోర్టులోనే శ్రీరామ్ ఇప్పటికే ఒప్పుకున్నారు. అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్ తనకు మత్తుపదార్థాలను అలవాటు చేసినట్లు పోలీసుల విచారణలో శ్రీరామ్ తెలిపారు. ఆయన నిర్మాతగా తెరకెక్కించిన ‘తీంగిరై’ అనే సినిమాలో నటించానని, ఆ ప్రాజెక్ట్కు సంబంధించి తనకు రూ.10 లక్షలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో డబ్బు అడిగినప్పుడల్లా ఆయన కొకైన్ ఇచ్చేవారని పేర్కొన్నారు. రెండుసార్లు వాడిన తర్వాత మూడోసారి తానే అడిగే పరిస్థితి ఏర్పడిందని పోలీసులకు శ్రీరామ్ వెల్లడించారు. అయితే, తప్పు చేశానని ఆయన ఒప్పుకున్నారు. తన కుమారుడిని చూసుకోవాల్సి ఉందని అందుకు బెయిల్ మంజూరు చేయాలని శ్రీరామ్ కోరారు. దీంతో కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్లు అప్పట్లో న్యాయస్థానం పేర్కొంది. -
కోలీవుడ్లో విషాదం.. మనోరమ కుమారుడు కన్నుమూత
దాదాపు వెయ్యికి పైగా చిత్రాల్లో మెప్పించిన నటి మనోరమ కుమారుడు కన్నుమూశారు. దివంగత నటి కుమారుడు భూపతి(70) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చైన్నైలోని త్యాగరాయ నగర్లోని తన ఇంట్లోనే మరణించినట్లు పీఆర్ఓ నిఖిల్ వెల్లడించారు. అతని మరణ వార్త విన్న కోలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.కాగా.. తమిళ సినిమా చరిత్రలో మనోరమ దాదాపు 1000 కి పైగా చిత్రాలలో నటించింది. ఆమె వృద్ధాప్య సమస్యలతో అక్టోబర్ 2015లోనే మరణించింది. మనోరమ ఏకైక కుమారుడు భూపతిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అతన్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడానికి మనోరమ అనేక ప్రయత్నాలు చేసింది. కానీ భూపతి చేసిన చిత్రాలు ఆశించిన విజయం సాధించలేకపోయాయి. అతను 'కుడుంబం ఓరు కదంబం' అనే మూవీలో నటించాడు. అయితే తీసిన సినిమాల్లో పెద్దగా గుర్తింపు రాలేదు. కాగా.. భూపతి అభిరామి (25) అనే కూతురు ఉన్నారు. కాగా.. నటి మనోరమను అప్పట్లో ‘లేడీ శివాజీ గణేశన్’ అని గుండెలకు హత్తుకున్నారు ప్రేక్షకులు. దాదాపు 1500 చిత్రాలలో నటించి గిన్నిస్ బుక్లోకి ఎక్కి ప్రపంచ చరిత్రను తిరగరాసింది. பிரபல நடிகை மனோரமா மகன் மற்றும் நடிகருமான பூபதி (வயது 70) இன்று (23.10.2025) காலை 10.40 மணிக்கு இயற்கை எய்தினார்.அவரின் உடலானது பொதுமக்கள் அஞ்சலிக்காக Door No. 9/5, நீலகண்ட மேத்தா தெரு, T Nagar இல்லத்தில் வைக்கப்படும். அவரின் இறுதி சடங்கு நாளை (24.10.2025) மதியம் 3 மணிக்கு… pic.twitter.com/jBkrC7zsUm— Nikil Murukan (@onlynikil) October 23, 2025 -
ముద్దు సన్నివేశం.. డిలీట్ చేయమన్న తెలుగు హీరోయిన్
కథ డిమాండ్ చేస్తే ఎలాంటి సన్నివేశంలోనైనా నటించేందుకు సిద్ధమే అంటుంటారు తారలు. కొందరు మాత్రం అసభ్యత, అశ్లీలతకు ఇసుమంత చోటు కూడా ఇవ్వని సినిమాలే చేస్తామంటారు. మరికొందరు మాత్రం మూడో కేటగిరీ.. ఫస్ట్ సీన్లో నటిస్తారు.. తర్వాత మళ్లీ మనసు మార్చుకుని అది లేకపోయుంటే బాగుండంటూ లోలోనే మథనపడుతుంటారు. వారి ఇబ్బందిని గమనించి ఆయా సీన్లను ఎత్తేసేవాళ్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు.హీరోయిన్ అభ్యంతరంహీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) ఇప్పుడదే పని చేశాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్యన్. శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. ఈ మూవీ అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ఈ మూవీలో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది. అందులో ఒక ముద్దు సన్నివేశం షూట్ చేశాం. అంతా అయిపోయాక దానిపై మానస (Maanasa Choudhary) అభ్యంతరం చెప్పింది. ఆ సీన్ను తీసయమని దర్శకుడిని కోరింది.కత్తిరించేశాంఅదే మాట డైరెక్టర్ నాకొచ్చి చెప్పాడు. తన ఇబ్బంది నాకర్థమైంది. సరే, ఆ సీన్ తీసేద్దాం.. అది లేకుండా డిఫరెంట్గా పాటను పూర్తి చేద్దాం అని చెప్పాను. సినిమా ఫైనల్ ఎడిటింగ్లో ఆ సన్నివేశాన్ని కత్తిరించేశాం అని చెప్పుకొచ్చాడు. మానస చౌదరి తెలుగమ్మాయి. చిత్తూరుకు చెందిన ఈ బ్యూటీ.. యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా నటించిన బబుల్గమ్ మూవీతో తెరంగేట్రం చేసింది. లక్కీ భాస్కర్ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. ఇప్పుడు ఆర్యన్తో కోలీవుడ్లో అడుగుపెట్టనుంది.చదవండి: ట్రెండింగ్లోకి 'ఇదేమిటయ్యా మాయా..'. ఆ హీరోయిన్ ఇప్పుడెలా? -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న బ్లాక్బస్టర్ డైరెక్టర్!
సూపర్ హిట్ చిత్రాలకు కేరాఫ్గా మారాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj). కార్తీతో ఖైదీ, విజయ్తో మాస్టర్, లియో, కమల్ హాసన్తో విక్రమ్, రజనీకాంత్తో కూలీ వంటి భారీ చిత్రాలను తెరకెక్కించారు. అయితే కూలీ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఈయన ట్రోలింగ్కు గురయ్యారు. ఇకపోతే కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి నటించనున్న చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదన్నది తాజా సమాచారం. ఇక కార్తీ హీరోగా తెరకెక్కనున్న ఖైదీ – 2 చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి!హీరోగా లోకేశ్అదేవిధంగా హిందీలో అమీర్ ఖాన్ హీరోగా చిత్రం చేయబోతున్నట్లు జరిగిన ప్రచారానికి కూడా ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు లోకేష్ కనకరాజ్ కథానాయకుడిగా అవతారమెత్తడం విశేషం. కెప్టెన్ మిల్లర్ చిత్రం ఫ్రేమ్ అరుణ్ మాదేశ్వరన్ (Arun Matheswaran) దర్శకత్వంలో హీరోగా నటించబోతున్నట్లు చాలా రోజులనుంచే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలు గురువారం జరిగినట్లు తెలిసింది. ఈ సినిమా కోసం లోకేష్ కనకరాజ్ ఫైట్స్, ఆత్మ సంరక్షణ విద్యల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందారట! అలా ఈ చిత్రం కోసం ఆయన తన బాడీ లాంగ్వేజ్ను పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది.చదవండి: తెలుసు కదా కొన్నేళ్లు మీతో ఉండి పోతుంది -
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు సబేష్ (68) ఇక లేరు (MC Sabesh). కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం 12.15 గంటల ప్రాంతంలో చైన్నెలో కన్నుమూశారు. ఈయన ప్రఖ్యాత సంగీత దర్శకుడు దేవా సోదరుడు. మరో సోదరుడు మురళితో కలిసి పలు చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అదేవిధంగా పలు సంగీత కచేరీలను నిర్వహించారు. వీరు సంగీతాన్ని అందించిన చిత్రాలలో సముద్రం, మాయాండి కుటుంబత్తార్, పొక్కిషం, తవమాయ్ తవమిరుందు వంటి విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి.నివాళులు అర్పించిన కార్తీసబేష్.. సినీ సంగీత కళాకారుల సంఘానికి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. స్థానిక వలసరవాక్కంలోని చౌదరినగర్లో నివసిస్తున్న సబేష్కు గీత, అర్చన అనే ఇద్దరు కూతుర్లు, కార్తీక్ అనే కొడుకు ఉన్నారు. ఈయన భార్య తార ఇంతకుముందే కన్నుమూశారు. సబేష్ భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. దక్షిణ భారత సినీ నటినటుల సంఘం (నడిగర్) కోశాధికారి, హీరో కార్తీ, ఉపాధ్యక్షుడు కరుణాస్ తదితరులు నివాళులు అర్పించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక బృందావన్ నగరంలోని శ్మశానవాటికలో సబేష్ అంత్యక్రియలు జరగనున్నాయి. చదవండి: తెలుసు కదా కొన్నేళ్లు మీతో ఉండి పోతుంది -
దీపికా పదుకొణెతో డ్యుయెట్కు నేను రెడీ!
ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం డ్యూడ్ (Dude Movie). శరత్ కుమార్, రోహిణి, సిద్ధూ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కీర్తీశ్వరన్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, వై రవి శంకర్ నిర్మించారు. సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందించారు. అక్టోబర్ 17వ తేదీన తమిళం, తెలుగు భాషల్లో విడుదల అయిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో దూసుకుపోతోంది. థాంక్స్ గివింగ్ మీట్ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం మధ్యాహ్నం చెన్నైలో థాంక్స్ గివింగ్ మీట్ నిర్వహించింది. చిత్ర నిర్మాతలు నవీన్ యేర్నేని, రవి శంకర్ మాట్లాడుతూ డ్యూడ్ చిత్రం తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటకలోనే కాకుండా, ఉత్తరాదిలో, అమెరికాలోనూ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది అని పేర్కొన్నారు. ఇంత మంచి విజయాన్ని అందించిన దర్శకుడు కీర్తీ శ్వరన్, ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు, శరత్ కుమార్ యూనిట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.దీపికాతో డ్యుయెట్కు రెడీడ్యూడ్ చిత్ర షూటింగ్కు వెళుతున్నామనగానే మనసులో సంతోషం కలిగేదని, అంత జాలీగా షూటింగ్ సాగిందని మమిత బైజు అన్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని ఇచ్చిన నిర్మాతలకు, దర్శకుడు, హీరోకు కృతజ్ఞతలు తెలిపారు. చక్కని సందేశంతో కూడిన యూత్ ఫుల్ లవ్ స్టొరీ డ్యూడ్ అని నటుడు శరత్ కుమార్ పేర్కొన్నారు. తాను ఇప్పుడు హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone)తో డ్యుయెట్ పాడటానికి కూడా రెడీ అన్నారు. చాలా సెన్సిబుల్ కథను నిర్మించడానికి ముందుకొచ్చిన నిర్మాతలకు అభినందనలు తెలియజేశారు.చదవండి: బ్రేకప్.. గుండెలోతులో బాధ.. : రష్మిక మందన్నా -
నటి గ్లామర్ పిక్స్ షేర్ చేసిన ఉదయనిధి స్టాలిన్.. ఎంత పనైపోయింది!
పొరపాట్లనేవి జరుగుతూ ఉంటాయి. కానీ, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అవి జరగకుండా జాగ్రత్తపడాలి. లేదంటే, ఇదిగో.. ఇలా ట్రోలింగ్ బారిన పడటం ఖాయం! బిగ్బాస్ కంటెస్టెంట్, నటి, మోడల్ నివాశియ్ని కృష్ణన్ (Nivaashiyni Krishnan) గ్లామర్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పోస్ట్ను హీరో, తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రీపోస్ట్ చేశారు.చిన్న తప్పిదం!ఇది గమనించిన కొందరు నెటిజన్లు వెంటనే దాన్ని స్క్రీన్షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. జరిగిన తప్పును గ్రహించిన ఉదయనిధి.. వెంటనే సదరు పోస్ట్ను డిలీట్ చేశారు. కానీ, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అటు నివాశి గ్లామర్ పోస్ట్కు కామెంట్లను ఆఫ్ చేసింది. అప్పటికీ నెటిజన్లు ఆగడం లేదు.. వేరే పోస్టుల కిందకు వెళ్లి మరీ కామెంట్స్ చేస్తున్నారు. మా అన్న ఎలా ఉన్నారు? డీఎంకే పార్టీలోకి స్వాగతం అంటూ సెటైర్లు వేస్తున్నారు.ఎవరా బ్యూటీ?అటు ఉదయనిధి అభిమానులు మాత్రం ఆయన్ను వెనకేసుకొస్తున్నారు. పొరపాటను ఉదయనిధి చేయి టచ్ అయి అలా రీపోస్ట్ అయిందని సమర్థిస్తున్నారు. నివాశి విషయానికి వస్తే.. తమిళనాడు మూలాలున్న నివాశి సింగపూర్లో మోడల్గా రాణిస్తోంది. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గానూ పని చేసినట్లు తెలుస్తోంది. తమిళ బిగ్బాస్ ఆరో సీజన్లో కామనర్గా పాల్గొంది. ఓహో ఎంతన్ బేబీ అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది. Udhaya Anna 🤣❤️🔥 Sunday rowdy time Monday Ena time ??? 🤣 pic.twitter.com/tTjI2UkpNT— விழுப்புரம் கிருபா (@Admk_Kiruba) October 21, 2025 చదవండి: నేను, ఎన్టీఆర్.. ఆయన్ని నమ్మాం.. దొరికిపోయాం!: నాగవంశీ -
కరుప్పు నుంచి ఊరమాస్ సాంగ్ రిలీజ్
స్టార్ హీరో సూర్య (Suriya) నుంచి సినిమా వస్తుందంటే ఆయన అభిమానుల్లో జోష్ పెరిగిపోతుంది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో కరుప్పు ఒకటి. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్. ప్రకాష్బాబు, ఎస్ఆర్. ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి స్వాశిక, ఇందిరన్స్, యోగిబాబు, శివదా, సుప్రీత్ రెడ్డి, అనకా, మాయారవి, నట్టి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. గాడ్ మోడ్..త్వరలోనే ఈ మూవీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీపావళి పండగ సందర్భంగా సాంగ్ గాడ్ మోడ్ అంటూ సాగే ఫస్ట్ సాంగ్ను దీపావళి పండగ సందర్భంగా విడుదల చేశారు. నల్లని దుస్తులు, చేతిలో కత్తితో సూర్య నటించిన ఊరమాస్ ట్యూన్స్తో రూపొందిన ఈ పాట ఇప్పుడు అబిమానులను విపరీతంగా అలరిస్తోంది. సినిమాపై అంచనాలను సైతం పెంచేస్తోంది. ఇకపోతే సూర్య ఈ చిత్రంతో పాటు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంనూలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చదవండి: టాప్ హీరోకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు! -
టాప్ హీరోకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు!
హీరో విశాల్ (Vishal) వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. అంతేకాదు అనూహ్యంగా మెగాఫోన్ పట్టడం విశేషం. ప్రస్తుతం మగుడం అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సూపర్గుడ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మొదట రవి అరసును దర్శకుడిగా అనుకున్నారు. ఏమైందో ఏమో కానీ, ఇప్పుడు ఈ చిత్ర దర్శకత్వం బాధ్యతలను విశాల్ తన భుజాన వేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన దీపావళి పండగ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అందులో ఇది అనుకోకుండా జరిగిన విషయం కాదని, ముందుగా నిర్ణయించుకున్న విషయమేనని పేర్కొన్నారు. నిర్మాణ సంస్థ సహకారంతోనే మగుడం చిత్రానికి దర్శకత్వం బాధ్యతలను చేపట్టినట్లు చెప్పారు. దర్శకుడిగా..ఈయన మొదట తుప్పరివాలన్– 2 చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉంది. దానికంటే ముందే మగుటం చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇకపోతే ఈ చిత్రం తరువాత సుందర్.సీ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించనున్నట్లు సమాచారం. ఇంతకు ముందు వీరి కాంబోలో 12 ఏళ్ల క్రితం మదగజరాజా తెరకెక్కింది. ఈ మూవీ ఎన్నో ఏళ్ల జాడ్యం తర్వాత ఈ ఏడాది విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా ఈ హిట్ కాంబో మరో చిత్రానికి సిద్ధం అవుతోంది. ఇద్దరు హీరోయిన్లుసుందర్.సీ చిత్రాల్లో కమర్షియల్ అంశాలు మెండుగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్ల అందాల ఆరబోత కచ్చితంగా ఉంటుంది. వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో విశాల్కు జంటగా మిల్కీబ్యూటీ తమన్నా, క్రేజీ బ్యూటీ కయాదు లోహర్ నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
నాకు ఒక ఛాన్స్ ఇచ్చి ఈ సినిమా చూడండి: విక్రమ్ వారసుడు
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ వారసుడు ధ్రువ్(Dhruv Vikram) నటించిన కొత్త సినిమా బైసన్(Bison Kaalamaadan) . ఇప్పటికే కోలీవుడ్లో విడుదలైన విషయం తెలిసిందే. ధృవ్కు జంటగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమాని మారి సెల్వరాజ్ తెరకెక్కించగా.. పా.రంజిత్ సమర్పించారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ కోసం ధ్రువ్ చాలానే కష్టపడ్డాడు. తమిళ్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న బైసన్ ఈనెల 24న తెలుగులో కూడా విడుదల కానుంది.ఈ నేపథ్యంలో బైసన్ మూవీ యూనిట్ హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్తో పాటు అనుపమ పరమేశ్వరన్ పాల్గొన్నారు. అయితే, టాలీవుడ్ ప్రేక్షకుల కోసం ధ్రువ్ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. 'మీతో మాట్లాడటానికి మూడేళ్లు వెయిట్ చేశాను.. ఈ సినిమా కోసం నేను ప్రొఫెషనల్ కబడ్డీ నేర్చుకున్నాను. మా నాన్న విక్రమ్ మాదిరే నేను చాలా కష్టపడతాను. నాకు ఒక ఛాన్స్ ఇచ్చి ఈ సినిమా చూడండి. నచ్చితే మాకు సపోర్ట్ చేయండి. నాకు తెలుగులో సినిమాలు చేయాలని ఉంది.. నాకు మీ అందరి సపోర్ట్ కావాలి.' అంటూ తెలుగులోనే స్పీచ్ అదరగొట్టారు. ఏదో ఒక రోజు నాకు కొడుకు పుట్టి ఇలాగే సూట్కేస్ కొనడానికి వెళ్తే షాప్ ఓనర్ మీ నాన్న #Dhruv అంటే నాకు చాలా ఇష్టం అనిపించుకోవాలి... రాసుకొచ్చి తెలుగులో ఎక్సలెంట్ స్పీచ్ ఇచ్చిన Hero #DhruvVikram 👌👏 pic.twitter.com/ZthsjHBCks— Rajesh Manne (@rajeshmanne1) October 21, 2025 -
అమ్మాయితో అసభ్య వీడియో కాల్స్? నా కెరీర్ నాశనం..!
ప్రముఖ నటుడు అజ్మల్ అమీర్ (Ajmal Ameer) అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడాడంటూ ఓ వీడియో క్లిప్పింగ్ నెట్టింట వైరల్గా మారింది. హద్దులు దాటి మాట్లాడటంతో పాటు చాటింగ్ కూడా చేశాడంటూ ప్రచారం జరిగింది. ఈ వివాదంపై అజ్మల్ స్పందించాడు. అవన్నీ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో సృష్టించిన ఫేక్ వీడియో కాల్స్ అని కొట్టిపారేశాడు.నాకు పీఆర్ లేదుఅజ్మల్ మాట్లాడుతూ.. ఈ కల్పిత కథలు, ఏఐ వాయిస్ ఇమిటేటింగ్, ఎడిటింగ్స్.. నన్ను కానీ, నా కెరీర్ను కానీ నాశనం చేయలేవు. దేవుడి దయ వల్ల రెండు పెద్ద (తెలుగు, తమిళ) ఇండస్ట్రీలలో నేనేంటో నిరూపించుకోగలిగాను. నాకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుని సినీ పరిశ్రమలో కొనసాగుతున్నాను. నా ఇమేజ్ను కాపాడేందుకు నాకెటువంటి మేనేజర్ లేడు, పీఆర్ అసలే లేదు. రెండురోజులుగా నా గురించి తప్పుడు ప్రచారం జరుగుతోంది.సినిమాఇలాంటి సమయంలో నాకు అండగా నిలబడ్డ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మీవల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. మీరే నా ధైర్యం అని వీడియో రిలీజ్ చేశాడు. అజ్మల్ విషయానికి వస్తే.. ఫిబ్రవరి 14 అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. రంగం మూవీతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. రచ్చ, అభినేత్రి 2, వ్యూహం, బడ్డీ, గోట్(The Greatest of All Time) వంటి పలు సినిమాలతో అలరించాడు. View this post on Instagram A post shared by Ajmal Amir (@ajmal_amir) చదవండి: నీకెందుకే అంత యాటిట్యూడ్? రీతూపై విషం కక్కిన ఆయేషా -
ప్రెగ్నెంట్ అని అబద్దం చెప్పాను: రెజీనా
నటి రెజీనా(Regina Cassandra) తెలుగులోనే కాదు తమిళ్, మలయాళం, కన్నడం, హిందీ తదితర భాషల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. పలు చిత్రాల్లో ఐటమ్స్ సాంగ్స్తో కూడా మెప్పించిన ఆమెకు అనుకున్నంత రేంజ్ విజయాలు దక్కకపోయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం భారీగానే ఉన్నారు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఒక సందర్భంలో తాను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చిందో సరదాగా పంచుకుంది.సుమారు పదేళ్ల క్రితం ఒకసారి బెంగళూరులో అర్ధరాత్రి 12 గంటల ప్రాంతలో స్నేహితురాళ్లతో కలిసి వెళుతుండగా తనకు లస్సీ తాగాలనిపించిందని గుర్తు చేసుకున్నారు. అప్పుడే మూస్తున్న ఒక షాప్ వద్దకు వెళ్లి లస్సీ కావాలని అడిగానన్నారు. అందుకు ఆ షాప్ యజమాని చిరాకుగా లస్సీ లేదు ఏమీలేదు వెళ్లు అని అన్నాడని తెలిపారు. వెంటనే తాను గర్భంతో ఉన్నాను. నాకు లస్సీ ఇస్తే ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని అన్నానన్నారు. దీంతో తన స్నేహితురాళ్లు షాక్కు గురయ్యారన్నారు.అయితే, ఆ షాప్ అతను ఎక్కడ రెజీనా గర్భవతి అని అందరికీ చెబుతారో అని తన ఫ్రెండ్స్ కూడా భయపడ్డారన్నారు. అదృష్టవశాతు అతను ఎవరికీ చెప్పలేదని తెలిపారు. ఇలాంటి తమాషాలు చాలా చేశానని, ఇప్పటికీ చేస్తుంటానని రెజీనా అన్నారు. అయితే, కొంత కాలం తర్వాత మీడియాలో మాత్రం ఇదే విషయంపై మరో విధంగా ప్రచారం జరిగిందని గుర్తుచేసుకున్నారు. -
హీరోయిన్ ను అలా టచ్ చేసిన సౌబిన్.. వీడియో వైరల్..
-
రివాల్వర్ రీటా.. హ్యాపీ బర్త్డే సాంగ్ రిలీజ్
మహానటి చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న కీర్తి సురేశ్ (Keerthy Suresh)కు 2024 పెద్దగా కలిసి రాలేదు. వృత్తిపరంగా వరుస అపజయాలను చవి చూసిన ఆమె వ్యక్తిగతంగా మాత్రం మధురమైన ఘట్టానికి చేరుకున్నారు. తన చిరకాల మిత్రుడు ఆంటోనితో పెళ్లి చేరుకున్నారు. అయితే సినిమాలకు మాత్రం కాస్త దూరం అయ్యారనే చెప్పాలి. ఈమె నటించిన రఘు తాత, హిందీ చిత్రం మేరీజాన్ చిత్రాలు నిరాశపరిచాయి. ఉప్పు కప్పరంబు అనే వెబ్సీరీస్లో నటించినా, అది ఓటీటీలో స్ట్రీమింగ్ కావడంతో పెద్దగా రీచ్ కాలేదు. అయితే వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బాగానే డబ్బు సంపాదించారు.సినిమాఇప్పుడు కీర్తి సురేశ్ మళ్లీ బిజీ అయ్యారు. ఇప్పటికే తెలుగులో రెండు కొత్త చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతకుముందు నటించిన రెండు చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. వాటిలో ఒకటి రివాల్వర్ రీటా (Revolver Rita Movie). ఉమెన్ సెంట్రిక్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి చంద్రు దర్శకుడు. ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ సంస్థలు నిర్వహించిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. శుక్రవారం (అక్టోబర్ 17) కీర్తిసురేష్ 34వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రివాల్వర్ రీటా చిత్ర యూనిట్ ఒక సాంగ్ విడుదల చేసింది. -
కొత్త దర్శకుడితో విక్రమ్ సినిమా ప్లాన్
పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసే అతికొద్ది మంది కథానాయకులలో నటుడు విక్రమ్ ఒకరు. ఈయన జయాపజయాలకు అతీతుడనే చెప్పాలి. విక్రమ్ చిత్రం వస్తుందంటేనే అభిమానుల్లో అంచనాలు వేరే లెవెల్లో ఉంటాయి. ఈయన ఇటీవల హీరోగా నటించిన వీర ధీర సూరన్ చిత్రం కమర్షియల్గా మంచి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా విక్రమ్ నటన, శారీరక భాషకు ప్రశంసలు లభించాయి. తదుపరి రెండు మూడు చిత్రాల్లో విక్రమ్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవన్నీ చర్చల దశలో ఉన్నాయి. కాగా ప్రస్తుతం శాంతి టాకీస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారని సమాచారం. కాగా తాజాగా విక్రమ్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. యువ దర్శకుడు విష్ణు ఎడవన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించనున్నారు. ప్రస్తుతం నయనతార, కెవిన్ కలిసి నటిస్తున్న హాయ్ చిత్రం ద్వారా విష్ణు ఎడవన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. దీన్ని జి.స్టూడియోస్, లలిత్ కుమార్, దర్శకుడు విఘ్నేష్ శివన్ కలిసి నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. తదుపరి విక్రమ్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి కె.గణేశ్ నిర్మించనున్నట్లు సమాచారం. హాయ్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత విక్రమ్ హీరోగా నటించే చిత్రానికి విష్ణు ఎడవన్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
సినీ ఇండస్ట్రీలో వివక్ష? ప్రేమలు బ్యూటీ ఆన్సరిదే!
హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకోవడం అంత సులభం కాదు. అలాగే ఏ మూవీ కెరీర్ను ఎటు మలుపు తిప్పుతుందో చెప్పలేని పరిస్థితి. మలయాళంలో అనేక సినిమాలు చేసిన మమిత బైజు (Mamitha Baiju) 'ప్రేమలు' అనే ఒక్క మూవీతో సెన్సేషన్ అయింది. ఈ ఒక్క చిత్రంతోనే తమిళంలో అవకాశాలు వచ్చాయి. అలా జి. ప్రకాష్ కుమార్ సరసన రెబల్ చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకుంది. కానీ, ఈ మూవీ పూర్తిగా నిరాశపరిచింది. సాధారణంగా తొలి చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోతే అవకాశాలు మందగిస్తాయి. కానీ, మమిత బైజు విషయంలో ఇది రివర్స్ అయిందనే చెప్పాలి. తమిళంలో అవకాశాలుప్రస్తుతం విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్లో ముఖ్య భూమిక పోషిస్తోంది. అదేవిధంగా క్రేజీ నటుడు ప్రదీప్ రంగనాథన్కు జంటగా డ్యూడ్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం శుక్రవారం రిలీజైంది. ఈ సందర్భంగా నటి నమిత బైజు మాట్లాడుతూ.. తమిళ సినిమాల్లో నటించాలని తాను ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదని తెలిపింది. అయినప్పటికీ తమిళంలో పలు వైవిద్యభరిత పాత్రల్లో నటించే అవకాశాలు వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేసింది. అలా వచ్చిన వాటిలో మంచి కథలను ఎంపిక చేసుకొని నటిస్తున్నట్లు చెప్పింది.తమిళం వచ్చేసిందిఇతర భాషా చిత్రాల్లో నటిస్తున్నప్పుడు వివక్ష ఎదుర్కొన్నారా ? అన్న ప్రశ్నకు.. అలాంటి పరిస్థితులు తనకు ఎదురవ్వలేదని స్పష్టం చేసింది. మొదట్లో తమిళ భాష మాట్లాడటం తనకు ఛాలెంజింగ్ అనిపించినా, తన యూనిట్లో మేకప్ మాన్, హెయిర్ స్టైలిస్ట్ వంటి వారు తమిళులు కావడంతో వారి మాటలే తాను తమిళం నేర్చుకోవడానికి హెల్ప్ అయ్యాయంది. ఇప్పుడు తాను తమిళ భాషలో మాట్లాడటం, రాయడం కూడా నేర్చుకున్నానంది. డ్యూడ్ చిత్రంలో నటుడు ప్రదీప్ రంగనాథన్తో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొంది. ఆయన ఫ్రెండ్లీగా ఉంటారని, ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని మమిత బైజు పేర్కొంది.చదవండి: ముచ్చటగా మూడోసారి! -
తమిళ సినిమాకు తెలుగులో క్రేజ్.. అడ్వాన్స్ బుకింగ్స్లో ఊహించని రికార్డ్!
డ్రాగన్ మూవీతో తెలుగు ఆడియన్స్లోనూ క్రేజ్ సంపాదించుకున్న కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఈ ఏడాదిలో రిలీజైన చిత్రం కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అదే ఊపులో మరో రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా వస్తోన్న లేటేస్ట్ సినిమా డ్యూడ్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీతో కీర్తీశ్వరన్ డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. తమిళంలో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది.అయితే ఈ మూవీ రిలీజ్కు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. మంగళవారం రాత్రి నుంచి టికెట్ బుకింగ్లు ఓపెన్ కావడంతో ఓవర్సీస్లో హాట్కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. తమిళ సినిమాకు తెలుగు ఆడియన్స్ ఎక్కువగా టికెట్స్ బుక్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అమెరికాలో ఇప్పటి వరకు తమిళ వర్షన్కు 27 వేల డాలర్లు రాగా.. తెలుగు వర్షన్కు 32 వేల డాలర్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. ఈ సినిమా విడుదలకు ముందే కలెక్షన్స్ జోరు చూస్తుంటే సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.ప్రదీప్ రంగనాథన్ గత చిత్రాలైన లవ్ టుడే (2022), డ్రాగన్ (2025) తెలుగు రాష్ట్రాల్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకున్నాయి. లవ్ టుడే తెలుగు వెర్షన్ రూ.11.81 కోట్ల నికర కలెక్షన్లు సాధించింది. ఓవరాల్గా ఈ మూవీ దేశవ్యాప్తంగా రూ.66.57 కోట్ల వసూళ్లు రాబట్టింది. తెలుగులో డ్రాగన్ చిత్రానికి రూ.18.68 కోట్లు రాగా.. ఇండియాలో రూ.101.34 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. కాగా.. ఇప్పటికే డ్యూడ్ భారతదేశంలో రూ.17.26 లక్షలు ముందస్తు బుకింగ్స్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నేహా శెట్టి, శరత్ కుమార్, హృదు హరూన్, రోహిణి కీలక పాత్రల్లో నటించారు. -
బెస్ట్ఫ్రెండ్ని పెళ్లాడిన బుల్లితెర నటుడు
ప్రముఖ సీరియల్ నటుడు దర్శన్ (Darshan K Raju) అలియాస్ సార్థక్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. బెస్ట్ ఫ్రెండ్ కాశిన్ను పెళ్లాడాడు. అక్టోబర్ 13న వీరి వివాహం జరిగింది. ఇరుకుటుంబ సభ్యులు సహా అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలోనే ఈ వేడుక జరిగింది. నూతన జంట వెడ్డింగ్ స్టిల్స్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సీరియల్స్ నుంచి సినిమాలుజీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించిన దర్శన్ జంటకు బుల్లితెర తారలు సహా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దర్శన్.. తమిళంలో 'కట్రుకెన్న వేలి' సీరియల్లో సూర్య మహదేవన్ పాత్రతో ఫేమసయ్యాడు. అవను మాతే శ్రావణి, అరణ్మనై కిలి వంటి పలు సీరియల్స్ చేశాడు. సౌత్ ఇండియన్ హీరో అనే కన్నడ సినిమాలోనూ హీరోగా నటించాడు. View this post on Instagram A post shared by Darshanraju_ExpressionKing (@darshanraju_expressionking)చదవండి: తొలి తెలుగు సింగర్ ఇక లేరు -
వివాదాలతో సతమతం.. అప్పుడే ఫుల్స్టాప్ అంటున్న హన్సిక
దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్గా రాణించినవారిలో హన్సిక మొత్వానీ (Hansika Motwani) ఒకరు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్డమ్ అందుకున్నారు. దాదాపు 50కిపైగా చిత్రాల్లో కథానాయికగా నటించిన హన్సిక.. 2022లో సోహైల్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే ఈమె పెళ్లి కూడా చాలామంది హీరోయిన్లలాగానే మనస్పర్థలతో ముగిసిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది.రెండు వివాదాల మధ్య హన్సికభర్తకు దూరంగా తన తల్లితోనే ఉండడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరుతోంది. మరోవైపు హన్సికపై ఆమె సోదరుని భార్య గృహహింస ఆరోపణలు చేసింది. ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి, మనశ్శాతి కోసం ఈ బ్యూటీ విహారయాత్రలు చేసి వచ్చినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ సినిమాలపైనే ఫుల్ ఫోకస్ చేయాలనే నిర్ణయానికి వచ్చిన హన్సిక తనపై వస్తున్న విమర్శలను తెలుసుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది.ఈ ఏడాది పూర్తయ్యేసరికి..దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన గురించి ఎవరేం అనుకుంటున్నారు? ఎలాంటి వదంతులు ప్రసారం అవుతున్నాయి? అని తన సన్నిహితుల ద్వారా వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరికల్లా తన సమస్యలు తొలగిపోతాయని తన అత్యంత సన్నిహితురాలు వద్ద హన్సిక అన్నట్లు తెలిసింది. ఈ విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. హన్సిక ఆ మధ్య నాలుగు సినిమాలు చేసింది. కానీ, అవింకా రిలీజ్ కాలేదు.చదవండి: పవన్ గురించి ప్రశ్న.. 'వద్దు' అని కిరణ్ అబ్బవరం -
పదేళ్ల తర్వాత ధనుష్తో పనిచేయనున్న స్టార్ సంగీత దర్శకుడు
సౌత్ ఇండియాలో ప్రస్తుతం క్రేజీ సంగీత దర్శకుడిగా వెలుగొందుతున్న అనిరుధ్ తన సంగీత పయనాన్ని ప్రారంభించింది నటుడు ధనుష్ కథానాయకుడిగా నటించిన 3 చిత్రంతోననే విషయం తెలిసిందే. ఈ చిత్రం పెద్దగా సక్సెస్ కాకపోయినా, అందులోని వై దిస్ కొలవెరి పాట ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింది. తరువాత 'రఘువరన్ బి.టెక్ , మారి, నవమన్మధుడు' చిత్రాల వరకూ ధనుష్ కోసం అనిరుధ్ సంగీతాన్ని అందించారు. వీరిద్దరి మధ్య బంధుత్వం కూడా ఉండటంతో అలా వారి జర్నీ కొనసాగింది. కానీ, వీరిద్దరి మధ్య బేధాబిప్రాయాలు వచ్చాయనే ప్రచారం కోలీవుడ్లో జరిగింది. కుటుంబ విషయంలో ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని కొందరు చెబితే... ఐశ్వర్యతో ధనుష్ విడాకులు తీసుకోవడం వల్ల అనిరుధ్ కాస్త దూరం జరిగాడని అంటారు. అయితే ఇందులో నిజం ఎంత అన్నది పక్కన పెడితే.. సుమారు పదేళ్లుగా వీరిద్దరి కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు. దీంతో ఈ హిట్ కాంబినేషన్లో చిత్రం కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అలాంటి సందర్భం ఇప్పుడు వస్తోందన్నది తాజా సమాచారం. ధనుష్ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అదే విధంగా అనిరుధ్ నటుడు రజనీకాంత్ చిత్రాలకు వరుసగా పని చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ధనుష్ హీరోగా లబ్బరు బంత్తు చిత్రం ఫేమ్ పచ్చుముత్తు తమిళరసన్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజం అయితే ధనుష్ అభిమానులకు ఖుషీనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
విక్రమ్ వారసుడి మూవీ.. ఆసక్తిగా ట్రైలర్
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం 'బైసన్ కాలమడాన్'. హిట్ చిత్రాల దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అప్లాస్ ఎంటర్టైన్మెంట్, నీలం స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధైర్యం, సాహసం కలిగిన ఒక యువ క్రీడాకారుడి అందమైన కథాచిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో నటుడు ధృవ్ విక్రమ్ వైవిధ్య భరిత కథా పాత్రలో నటించారు. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే ఫుట్బాల్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అక్టోబర్ 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో దర్శకుడు అమీర్, లాల్, పశుపతి నటి రజీషా విజయన్ ముఖ్యపాత్రలు పోషించారు. In a Land of Chaos, rises a Believer! #BisonKaalamaadan 🦬 காளமாடன் வருகை Trailer Out Now ▶️ https://t.co/mwDlHRrJqx 4 Days to go until his last Raid 🔥#BisonKaalamaadanFromDiwali #BisonKaalamaadanOnOct17 🎆@applausesocial @NeelamStudios_ #SameerNair @deepaksegal… pic.twitter.com/kDLfnFWBcQ— Anupama Parameswaran (@anupamahere) October 13, 2025 -
యూరిన్ తాగి 48 రోజులు బతికాడు: హీరో
కోలీవుడ్ హీరో హరీశ్ కల్యాణ్ (Harish Kalyan), అతుల్య రవి జంటగా నటించిన చిత్రం 'డీజిల్' (Diesel Movie). తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ 2022లోనే పూర్తయింది. ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్కు నోచుకుంది. దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 17న విడుదల కాబోతోంది. పార్కింగ్, లబ్బర్ పండు మూవీతో హిట్లు అందుకున్న హరీశ్.. ఈ సినిమాతో ముచ్చటగా మూడో హిట్ కొట్టాలని ఆశగా ఎదురుచూస్తున్నాడు.షూటింగ్కు ముందు ప్రిపరేషన్ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంభాషణ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముచ్చటించాడు. హరీశ్ కల్యాణ్ మాట్లాడుతూ.. డీజిల్ మూవీ షూటింగ్ ప్రారంభించడానికి ముందు రెండుమూడు రోజులు సముద్రతీరానికి వెళ్లాం. ఆ వాతావరణాన్ని అలవాటు చేసుకునేందుకు సముద్రంలోకి కూడా వెళ్లొచ్చాం. అప్పుడు 70 ఏళ్ల మత్య్సకారుడు నాకో విషయం చెప్పాడు. జీవితం విలువ తెలిసొచ్చిందికొన్నేళ్ల క్రితం ఓ తుపాను వల్ల అతడి పడవ సముద్రంలో నెల రోజులకు పైగా చిక్కుకుపోయింది. తర్వాత బంగ్లాదేశ్ సరిహద్దువైపు లాక్కొనిపోయింది. బక్కచిక్కిపోయి పీలగా మారినప్పటికీ ప్రాణాలతోనే బతికిబయటపడ్డాడు. సముద్రంలో ఉన్న 48 రోజులు అతడు తన యూరిన్ తాగి ప్రాణాలు కాపాడుకున్నాడు. సముద్రపు నీళ్లు తాగితే శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అందుకని ఆ పని చేశాడు. అతడు చెప్పింది విన్నాక జీవితం విలువ మరింత తెలిసొచ్చింది అని చెప్పుకొచ్చాడు. చదవండి: ఏయ్, ఎందుకు అరుస్తున్నావ్? ఫస్ట్రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి -
నా తండ్రి ఇప్పటికీ అక్కడే పనిచేస్తున్నారు: ప్రదీప్ రంగనాథ్
ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్ఫుల్ సినిమా ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్టోబరు 17న ఈ చిత్రం విడుదల కానుంది. కొద్దిరోజులుగా ప్రదీప్ రంగనాథన్ పేరు టాలీవుడ్లో వైరల్ అవుతుంది. ఆయన తండ్రి చేస్తున్న పని గురించి కొందరు చర్చించుకుంటే.. మరికొందరు మాత్రం అతనిపై ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుకుంటున్నారు. 'మీరు హీరో మెటీరియల్లా లేరు.. కానీ, రెండు సినిమాలకే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా అరుదు' అంటూ ఒక జర్నలిస్ట్ కామెంట్ చేశారు. దీంతో నెటిజన్లు కూడా ప్రదీప్కు మద్ధతుగా నిలిచారు. జర్నలిస్ట్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. రీసెంట్గా కిరణ్ అబ్బవరం కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి అంటూ సదరు జర్నలిస్ట్ను కోరారు.వెండితెరపై ప్రదీప్ రంగనాథ్ ఒక సాధారణ యువకుడిలా కనిపించడమే కాదు నిజ జీవితంలో కూడా అంతేనని చెప్పవచ్చు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినీ పరిశ్రమలోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో ఏళ్ల పాటు సరైన ఛాన్స్ కోసం ఆయన కష్టపడ్డారు. ఫైనల్గా విజయం సాధించారు. డబ్బు, పేరు అన్నీ ప్రదీప్కు వచ్చాయి. కానీ, ఇప్పటికీ ఆయన కుటుంబం సాధారణ జీవితమే గడుపుతుంది. ఇదే విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రదీప్ పంచుకున్నారు.నా తండ్రి చెన్నైలో సాధారణ జీవితమే గడుపుతున్నారు. ఒక జిరాక్స్ షాపు నడుపుతూనే మా కుటుంబాన్ని నాన్న పోషించారు. నాకు సినిమా ఛాన్సులతో పాటు పేరు, డబ్బు వచ్చింది. అయినప్పటికీ నాన్న మాత్రం జిరాక్స్ షాప్ నడుపుతూనే ఉన్నారు. ఎప్పటికీ మన మూలాలను మరిచిపోవద్దని ఆయన చెబుతుంటారు. రోజూ ఉదయాన్నే బస్సులోనే షాప్కు వెళ్తారు.. ఒక కారు కొనిస్తానని చెప్పినా సరే దానిని తిరస్కరించారు. ఇప్పటికీ బస్సులోనే ఆయన ప్రయాణం చేస్తారు. సింపుల్గా ఉండటమే నాన్నకు ఇష్టం.' అని ప్రదీప్ చెప్పారు.ప్రదీప్ రంగనాథ్ తన కాలేజీ రోజుల గురించి కూడా గుర్తు చేసుకున్నారు. ఇంటర్మీడియట్లో 98 శాతం మార్కులతో పాస్ అయ్యానని చెప్పారు. కానీ, తనకు ఎక్కువ సినిమాలంటే పిచ్చి అని కూడా తెలిపారు. దీంతో తన తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందే వారని గుర్తుచేసుకున్నారు. అయితే, చదువును అశ్రద్ధ చేయనని వారికి చెప్పాను. జయం రవితో కొమలి సినిమాను డైరెక్ట్ చేసిన తర్వాత పరిశ్రమలో ఫేమ్ దక్కిందన్నారు. ఆ తర్వాత లవ్ టుడేతో మరింత గుర్తింపు వచ్చిందన్నారు. ప్రదీప్ డైరెక్ట్ చేసిన ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.Reacting to the "Hero Material" Controversy, #KiranAbbavaram asks the media personnel to ask him anything but be gentle about the likes of #PradeepRanganathan terming him as our Guest from Other State! pic.twitter.com/xdQ3dATvTi— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) October 11, 2025 -
ర్యాప్ సింగర్ జీవిత ఇతివృత్తంతో బాటిల్
ఎలైట్ టాకీస్ పతాకంపై కే.భాస్కరన్ నిర్మిస్తున్న చిత్రం బాటిల్. 'తంగలాన్' ఫేమ్ అన్భుడన్ అర్జున్, 'గాంధీ కణక్కు' చిత్రంలో చిన్న వయసు అర్చనగా నటించిన ఆరాధ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నారాయణన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ఇటీవల విడుదలైన దండకారణ్యం చిత్రానికి సహాయ రచయితగానూ, దర్శకుడు శక్తివేల్ వద్ద కోడైరెక్టర్గా పని చేశారు. ఈ మూవీలో దర్శకుడు సుబ్రమణియం శివ, శరవణన్ సుబ్బయ్య, గాయత్రి, మునీశ్కాంత్, సురుళి, ఇడ్లీకొట్టు చిత్రంలో చిన్న వయసు ధనుష్గా నటించిన దిహాన్, దివ్యశ్రీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఆరు పాటలుదర్శకుడు నారాయణన్ మాట్లాడుతూ.. ఒక ర్యాప్ గాయకుడి పూర్తి జీవిత సంఘటనలతో తెరకెక్కుతున్న తొలి తమిళ చిత్రం ఇదే అన్నారు. ఆ గాయకుడు ఎదుర్కొనే సమస్యలతోపాటు ఒక ముఖ్య విషయాన్ని ఈ చిత్రంలో చెప్పబోతున్నట్లు తెలిపా. సరిగ్గా రెండు గంటల పాటు సాగే ఈ చిత్రంలో ఆరు పాటలు ఉంటాయన్నారు. ఈ చిత్రానికి జీవా సంగీతం, ప్రముఖ చాయాగ్రహకుడు సెళియన్ శిష్యుడు యువరాజ్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. బాటిల్ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేయగా విశేష స్పందన వస్తోందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.చదవండి: ఓటీటీలో హృతిక్ స్టార్మ్ -
శ్రీలీలకు గోల్డెన్ ఛాన్స్.. క్రేజీ హీరోతో రెండు సినిమాలు
ఇటీవల అమరన్ చిత్రంతో సంచలన విజయాన్ని అందుకుని మదరాసి చిత్రంతో కమర్షియల్ సక్సెస్ను సాధించిన నటుడు శివకార్తికేయన్. ఈయన తాజాగా సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ఈయన నటిస్తున్న 25వ చిత్రం అన్నది గమనార్హం. నటుడు రవి మోహన్ ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఇందులో నటుడు అధర్వ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. టాలీవుడ్లో క్రేజీ కథానాయకిగా గుర్తింపు పొందిన శ్రీలీల( Sreeleela) కోలీవుడ్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. ఈ చిత్రం ద్వారా నేరుగా తమిళ ప్రేక్షకులకు ఆమె పరిచయం అవుతున్నారు. కాగా రాజకీయ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన వెంటనే సిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించబోతున్నారని సమాచారం. ఇంతకు ముందే వీరిద్దరి కాంబినేషన్లో డాన్ వంటి సూపర్ హిట్ చిత్రం రూపొందిందన్నది గమనార్హం. ఈ చిత్రం నవంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు కోలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారట.టీ మూవీలో కూడా నటి శ్రీలీల కథానాయకిగా నటించనున్నట్లు గట్టిగానే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే లేదు. ఇదే గనుక నిజం అయితే ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ శివకార్తికేయన్తో సినిమాలు చేసిన హీరోయిన్గా గుర్తింపు పొందుతుంది. -
అందాల బ్యూటీ రాశి ఖన్నా.. రీ ఎంట్రీ ఇవ్వనుందా?
తన పేరులోనే రాశిని పొందుపరచుకున్న నటి రాశిఖన్నా. హీరోయిన్గానూ తన రాశి బాగానే ఉంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా రేంజ్కు ఎదిగిన భామ తమిళంలో ఇమైకా నొడికల్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. నయనతార ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రంలో అధర్వ కథానాయకుడిగా నటించారు. ఆ చిత్రం కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నటి రాశిఖన్నా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.రాశి ఖన్నా చివరిగా ధనుశ్, నిత్యామీనన్ జంటగా నటించిన తిరుచిత్రంబలం చిత్రంలో కీలకపాత్రను పోషించారు. ఆ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. అయినా ప్రస్తుతం రాశి ఖన్నా వరుసగా చిత్రాలు చేయడం లేదు. ఆమెకు అవకాశాలు రాకపోవడం లేక ఇతర భాషల్లో నటించడంతో సమయం సరిపోవడం లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉండే ఈ అమ్మడు అవసరమైతే అందాల ఆరబోతకు సై అంటున్నారు. అదేవిధంగా కోలీవుడ్లో మంచి చిత్రాల్లో నటించాలన్న కోరికను ఈ బ్యూటీ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక ఈవెంట్లో పాల్గొన్న రాశిఖన్నా తన భావాలను వ్యక్తం చేస్తూ అభిమానులు ఇష్టపడే కథానాయకగా సినిమాల్లో కొనసాగడం సంతోషంగా ఉందన్నారు. అయితే ఇంకా తన జీవితంలో పెద్ద కల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నట్లు రాశిఖన్నా తెలిపారు -
సినిమాల విషయంలో చిన్న, పెద్ద అని తేడా చూడను: హీరోయిన్
సినిమాల విషయంలో చిన్న, పెద్ద అని ఎటువంటి తారతమ్యం చూపనని సోనియా అగర్వాల్ (Sonia Agarwal) అన్నారు. ఈమె ప్రధాన పాత్ర పోషించిన తాజా చిత్రం విల్. ఫుడ్ స్టెప్స్ ప్రొడక్షన్స్, కొత్తారి మద్రాస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్లపై ఈ మూవీ తెరకెక్కింది. ఎస్.శివరామన్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించగా.. సోనియా అగర్వాల్ ప్రధాన పాత్ర పోషించారు. విక్రాంత్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా నటించారు. ఈ మూవీ శుక్రవారం (అక్టోబర్ 10న) రిలీజైంది. ఈ క్రమంలో గురువారం చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు శివరామన్ మాట్లాడుతూ.. ఇది కోర్టు నేపథ్యంలో సాగే వైవిధ్య భరిత కథాచిత్రంగా ఉంటుందన్నారు. చిన్న, పెద్ద అన్న బేధాలు చూడనుసోనియా అగర్వాల్ జడ్జిగా నటించగా, అలోకియా చిన్న వివాదాస్పద పాత్రలో కనిపించనున్నారని చెప్పారు. సోనియా అగర్వాల్ సోదరుడు సౌరబ్ అగర్వాల్ను సంగీత దర్శకుడుగా పరిచయం చేసినట్లు చెప్పారు. సోనియా అగర్వాల్ మాట్లాడుతూ.. శివరామన్ దర్శకత్వంలో తాను ఇంతకుముందు తనిమై అనే చిత్రంలో నటించానని, ఆ తర్వాత ఇప్పుడు విల్ చిత్రంలో నటించినట్లు చెప్పారు. తాను చిత్రాల విషయంలో చిన్న, పెద్ద అన్న తారతమ్యాన్ని చూడనని, ఇంతకుముందు రూ.కోటి వ్యయంతో రూపొందించిన కాదల్ కొండేన్ చిత్రం ఘనవిజయాన్ని సాధించిందన్న విషయాన్ని గుర్తు చేశారు.చదవండి: అప్పట్నుంచే తెలుగు నేర్చుకుంటున్నా!: శ్రీనిధి శెట్టి


