breaking news
	
		
	
  video
- 
      
                   
                                                       డిజిటల్ మ్యారేజ్!కవాసేరి గ్రామపంచాయతీలో తమ వివాహాన్ని వీడియో కేవైసీ ద్వారా నమోదు చేసుకున్న నవ దంపతులు లావణ్య, విష్ణు వార్తల్లో నిలిచారు. కేరళలోని డిజిటల్ గవర్నెన్స్ పురోగతికి అద్దం పట్టే సంఘటన ఇది. సంప్రదాయానికి సాంకేతికత కూడా తోడైతే ఎలా ఉంటుందో చెప్పే సంఘటన.లావణ్య, విష్ణు తమ వివాహ రిజిస్ట్రేషన్ను ఆన్లైన్లో పూర్తి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కేరళ ప్రభుత్వం తమ కె–స్మార్ట్ ΄్లాట్ఫామ్ ద్వారా డిజిటల్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించింది. ‘కె–స్మార్ట్’ అనేది ఇన్ఫర్మేషన్ కేరళ మిషన్(ఐకేఎం) అభివృద్ధి చేసిన ఇన్–హౌజ్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్తో ఆధార్ ఆధారిత ఓటీపి, ఇమెయిల్ ద్వారా వివాహ గుర్తింపు ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.వివాహం కాగానే ఈ నవదంపతులు డిజిటల్లీ వెరిఫైడ్ సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సరికొత్త డిజిటల్ ప్రక్రియ దూరాన్ని తగ్గిస్తోంది. కాలాన్ని ఆదా చేస్తోంది. ఈ డిజిటల్ మ్యారేజ్ ట్రెండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకోవడం విశేషం. అత్యధిక సంఖ్యలో వీడియో కేవెసీ రిజిస్ట్రేషన్లతో త్రిస్సూర్ ముందంజలో ఉంది. ఆ తరువాత స్థానంలో మలప్పురం, తిరువనంతపురం ఉన్నాయి.
- 
      
                   
                                                       నా లైఫ్లో ఇలా చేయాల్సి వస్తుందని ఊహించలేదు: రేణు దేశాయ్హీరోయిన్ రేణు దేశాయ్ ఇటీవలే తన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సమయంలో అందరూ పండుగను సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరింది. దయచేసి రాత్రి 9 గంటల తర్వాత ఎక్కువ శబ్దం వచ్చే క్రాకర్స్ను పేల్చవద్దని కూడా ఫ్యాన్స్కు విజ్ఞప్తి చేసింది. అయితే తాజాగా రేణు దేశాయ్ తన ఇన్స్టాలో మరో వీడియోను పోస్ట్ చేసింది. ఇటీవల దీపావళి ఇంటర్వ్యూలో సన్యాసం తీసుకోవడంపై తాను చేసిన కామెంట్స్పై మాట్లాడింది. రేణు దేశాయ్ సన్యాసం తీసుకుంటారని వచ్చిన వార్తలపై ఆమె స్పందించింది. నా జీవితంలో ఇలాంటి వీడియో ఒకటి చేయాల్సి వస్తుందని అనుకోలేదని తెలిపింది. నా లైఫ్లో నా పిల్లలే అన్నింటికంటే ముఖ్యమని తెలిపింది. వారి లైఫ్ సెటిల్ చేశాకే తాను ఏదైనా నిర్ణయం తీసుకుంటానని రేణు దేశాయ్ తెలిపింది. అంతే కానీ ఇప్పటికిప్పుడు తాను సన్యాసం తీసుకుంటానని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేసింది. దయచేసి ఇలాంటి వాటిపై కాకుండా.. మనదేశంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాలని మీడియావారిని కోరుతున్నట్లు వీడియో రిలీజ్ చేసింది.వీడియోలో రేణు దేశాయ్ మాట్లాడుతూ..'ఇలాంటి వీడియో చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఇటీవల దీపావళి ఇంటర్వ్యూలో యాంకర్ నెక్ట్స్ ఏంటి అని అడిగింది. దీనికి నేను సరదాగా సన్యాసం తీసుకుంటా అని చెప్పా. కానీ ఇప్పటికిప్పుడు తీసుకుంటానని ఎక్కడా చెప్పలేదు. ఇది చూసి పెద్ద సెన్సేషన్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం నా ఫ్రెండ్స్, బంధువులు కాల్ చేసి ఈ విషయం గురించి అడుగుతున్నారు. అసలు రేణుకు ఏమైంది? బాగానే ఉందా? అని అడుగుతున్నారు. నాకు ఇద్దరు పిల్లలున్నారు. ఆద్య టెన్త్ క్లాస్లో ఉంది. వారి బాధ్యత నాపై ఉంది. ఇప్పుడైతే నేను సన్యాసం తీసుకోను. నా వయసు 55 నుంచి 60 వచ్చినప్పుడు ఆలోచిస్తా. నాకిప్పుడు దేవుడి కంటే నా పిల్లలే ముఖ్యం' అని క్లారిటీ ఇచ్చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. రేణు దేశాయ్, పవన్ కల్యాణ్ బద్రి, జానీ చిత్రాల్లో జంటగా నటించారు. 2009లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ జంటకు అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఇద్దరి మధ్య రిలేషన్లో మనస్పర్థలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. ఆమె చివరిసారిగా రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కనిపించింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai)
- 
      
                   
                                                       సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ బాలికపై లైంగికదాడికొత్తపల్లి (కరీంనగర్): బాలికపై అత్యాచారం చేస్తూ.. సెల్ఫోన్లో చిత్రీకరించి ఆపై వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికను ఇద్దరు యువకులు ప్రేమపేరుతో నమ్మించారు. ఓ రోజు గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దారుణాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తేరుకున్న బాలిక బంధువులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్కుమార్ నేతృత్వంలో రంగంలోకి దిగిన కొత్తపల్లి సీఐ కోటేశ్వర్ యువకులు విశ్వతేజ (19), సన్నీ (21)లను అరెస్టు చేసి పోక్సో కింద కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండ్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
- 
      
                   
                                                       అన్ని చోట్లా నడిచినట్లు మునుగోడులో నడవనీయను: కోమటిరెడ్డినల్లగొండ జిల్లా: ఎక్సైజ్ పాలసీపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వీడియో రిలీజ్ చేశారు. వీడియోలో ఆయన మరోసారి ప్రభుత్వ ఎక్సైజ్ విధానాలను ఎత్తి చూపారు. ఎక్సైజ్ పాలసీని మార్చాల్సిందేనని.. ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే బదులు.. మెరుగు పరిచేలా ప్రభుత్వం పనిచేయాలి. వైన్ షాపుల విషయంలో మునుగోడులో తన సూచనలు పాటించాల్సిందేనంటూ తేల్చి చెప్పారు. పదవి ఉన్నా లేకున్నా ఒకటే.. అన్ని ప్రాంతాల్లో నడిచినట్లు మునుగోడులో నడవనీయనంటూ రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానించారు.మునుగోడులో ఎమ్మెల్యే నూతన నిబంధనలుమద్యం దుకాణాలకు ఈ నెలతో గడువు ముగియనుంది. దీంతో ప్రభుత్వం కొత్తగా టెండర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. అందుకు ఈ నెల 18 వరకు గడువు ఉంది. దీంతో ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి మునుగోడు నియోజకవర్గంలోని మద్యం దుకాణాల టెండర్లు వేయాలనుకునే వ్యాపారులు తాను సూచిస్తున్న నిబంధనలు పాటించాలని చెబుతున్నారు. ఈ విషయాన్ని టెండర్లు వేయకముందే చెబుతున్నానని పేర్కొంటున్నారు.అంతే కాకుండా నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలను నల్లగొండ ఎక్సైజ్ కార్యాలయానికి పంపి ఎమ్మెల్యే సూచనలకు సంబంధించిన వినతిపత్రాన్ని ఎకై ్సజ్ సూపరింటెండెంట్కు పంపారు. కార్యాలయం బయట ఆ సూచనల పోస్టర్ను ఏర్పాటు చేయించారు. తాను చేస్తున్నది ఎవ్వరి మీదనో కోపంతో కాదని.. అలా అని తాను మద్యానికి పూర్తిగా వ్యతిరేకం కూడా కాదని అంటున్నారు. కొందరు యువకులు, నడి వయస్సు వాళ్లు కుటుంబ పోషణ మరచి ఉదయం నుంచే మద్యం తాగి అనారోగ్యం బారిన పడుతున్నారని.. అలాంటి వారిని కాపాడేందుకే తాను ఈ నిర్ణయాలు తీసుకున్నాని రాజగోపాల్రెడ్డి చెబుతున్నారు.ఎమ్మెల్యే చేస్తున్న సూచనలు ఇవీ..మద్యం దుకాణాలు గ్రామ శివారులో ఏర్పాటు చేయాలి.మద్యం దుకాణంలో సిట్టింగ్ ఏర్పాటు చేయకూడదుబెల్ట్షాపులకు మద్యం విక్రయించవద్దుమద్యం వ్యాపారులు సిండికేట్ కావొద్దురోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయించాలికొత్తగా టెండర్లు వేసేవారు ఈ షరతులు పాటిస్తామంటేనే టెండర్లు వేయాలని, లేదంటే టెండర్లు వేసి నష్టపోవద్దని తమ నాయకులతో సోషల్ మీడియాతో వైరల్ చేయడంతోపాటు గొడలపై పోస్టర్లు ఏర్పాటు చేయించారు.
- 
      
                   
                                                       అవునా బొజ్జలా?రాజకీయాల్లో కొందరు నేతలు నైతిక విలువలను వదిలేస్తున్నారు. పదవుల కోసం ఎత్తులు వదిలేసి జిత్తులకు దిగుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోసం యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. చివరకు ప్రాణాలు తీసేందుకు సైతం దిగజారుతున్నారు. ఇదే కోవలో జనసేన మాజీ నేత కోట వినూతపై ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్రెడ్డి పలు కుట్రలకు తెగబడినట్లు సోషల్ మీడియాలోకి వచ్చిన ఓ వీడియో వైరల్గా మారింది. వినూత డ్రైవర్గా పనిచేసి హత్యకు గురైన రాయుడు తీసుకున్నట్టుగా చెబుతున్న సెల్ఫీ వీడియో జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. కోట దంపతులను టార్గెట్ చేసుకుని బొజ్జల తనకు డబ్బులు ఎరవేసినట్లు డ్రైవర్ స్పష్టంగా వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. అయితే నేతల నడుమ పోరులో చివరకు సదరు దళితుడు బలి కావడం విషాదంగా మిగిలింది. సాక్షి టాస్్కఫోర్స్ : జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్చార్జి కోట వినూత వద్ద డ్రైవర్గా పనిచేసిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు మాట్లాడినట్టుగా వచ్చిన ఓ సెల్ఫీ వీడియోలో ఎమ్మెల్యే బొజ్జల సుదీర్రెడ్డిపై పలు ఆరోపణలు వినిపించాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ కోసం కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వినూత రహస్య సమాచారం, కొన్ని వీడియోలు సేకరించి అధిష్టానానికి చేరవేసి సు«దీర్రెడ్డి టికెట్ సాధించినట్లు శ్రీకాళహస్తి వాసులు చర్చించుకుంటున్నారు. బొజ్జల సు«దీర్రెడ్డి కారణంగా కూటమిలోని అనేక మంది నేతలు రాజకీయంగా అణచివేతకు గురవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.రాష్ట్రంలో ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీలోని ముఖ్య నేతలు టికెట్లు దక్కించుకునేందుకు ఒకరిని ఒకరు వెన్నుపోట్లు పొడుచుకున్న విషయం తెలిసిందే. ప్రధానంగా శ్రీకాళహస్తి టికెట్ కోసం ఏకంగా హత్యా రాజకీయాలకు తెరతీశారనే ప్రచారం కోట వినూత డ్రైవర్ రాయుడు వీడియో ద్వారా గుప్పుమంది. శ్రీకాళహస్తి అసెంబ్లీ టికెట్ కోసం కూటమి పారీ్టలోని బొజ్జల సు«దీర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, సత్రవాడ మునిరామయ్య కుమారుడు, బీజేపీ నేత కోలా ఆనంద్, జనసేన నేత కోట వినూత పోటీ పడిన విషయం విధితమే. టికెట్ దక్కించుకునేందుకు ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలే చేశారు. ఈక్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేయడంతో పాటు.. ఆయా పార్టీల అధిష్టానాలకు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఒకానొక సందర్భంలో మీడియా ముఖంగా వీధికెక్కారు. నాడు టీడీపీ, జనసేన నేతల మధ్యే పోటీసార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి పారీ్టల సీట్ల కేటాయింపుకు సంబంధించి శ్రీకాళహస్తి టికెట్ టీడీపీ లేదా జనసేనలో ఒకరికి ఇస్తారని ముందుగానే తేలిపోయింది. దీంతో కోట వినూతను లక్ష్యంగా చేసుకుని ఆమె డ్రైవర్ని కోవర్టుగా బొజ్జల సుధీర్రెడ్డి ఎంపిక చేసుకున్నట్లు రాయుడి వీడియో ద్వారా బయటపడింది. ఒకరి విషయాలు ఒకరు తెలుసుకునేందుకు కూటమి నేతలు కోవర్టులను నియమించుకున్నారు. అందులో భాగంగా కోట వినూత విషయంలో బొజ్జల చాలా దూరంగా ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. అందుకే డ్రైవర్ రాయుడుకి రూ.60 లక్షలు ముట్టజెప్పేందుకు సిద్ధమైనట్లు వీడియో ద్వారా వెలుగు చూసింది. అలాగే అనేక మందిని పావుగా వాడుకున్నట్లు వీడియో ద్వారా వెల్లడైంది. చివరకు కోట వినూత దంపతులను యాక్సిడెంట్ ద్వారా హత్య చేసేందుకు సైతం రెండు పర్యాయాలు యతి్నంచినట్లు రాయుడు వీడియో ద్వారా బయటపెట్టాడు. రాజకీయ పోరులో దళితుడైన సీహెచ్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్యకు గురవడం అప్పట్లో సంచలనంగా మారింది. రాయుడు హత్యకు దారి తీసిన కారణాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆరోపణలు నిజమేనా? డ్రైవర్ రాయడు హత్య తర్వాత అరెస్ట్ అయిన కోట వినూత దంపతులు మీడియా సాక్షిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్రెడ్డి పేరును ప్రస్తావించారు. రాయుడి హత్య వెను ఎవరి పాత్ర ఉందని మీడియా ప్రశ్నించిన సమయంలో ఎమ్మెల్యే సు«దీర్రెడ్డి పేరును వెల్లడించడం నాడు కలకలం రేపింది. అన్ని విషయాలను త్వరలోనే బయటపెడతామని చెప్పినట్టే.. నేడు రాయుడి వీడియో వైరల్ కావటం పెద్ద దుమారమే రేపుతోంది. శ్రీకాళహస్తి ఆలయ పాలకమండలి అధ్యక్ష పదవిని కొట్టే సాయికి కట్టబెట్టడం వెనుక ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్రెడ్డి హస్తం ఉందని కోట వినూత లేఖ ద్వారా ఆరోపించింది. బొజ్జల సుదీర్రెడ్డికి టికెట్ కేటాయించడం వెనుక జనసేనలోని మరో నాయకుడు కొట్టేసాయి ఉన్నారని రాయుడు వీడియో ద్వారా తెలుస్తోంది. అదే విధంగా శ్రీకాళహస్తిలో పలువురు ప్రధాన భూమిక పోషించారని డ్రైవర్ వీడియో ద్వారా వెల్లడవుతోంది. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో ఇంకెన్ని వీడియోలు, వాయిస్ రికార్డులు బయటకు వస్తాయోనని కూటమి నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
- 
      
                   
                                                       ఫొటోలకు ప్రాణం పోసేలా వీడియో.. గ్రోక్ ఏఐ కొత్త ఫీచర్ఎక్స్ఏఐ (xAI) రూపొందించిన గ్రోక్ఏఐ (GrokAI) యాప్లో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టినట్లు ఎలాన్మస్క్ తెలిపారు. పాత, కొత్త ఫొటోలను అప్లోడ్ చేసి కేవలం 20 సెకన్లలో వాటిని వీడియోలుగా మార్చేయవచ్చని చెప్పారు. ఈ నూతన సాంకేతికత కృత్రిమ మేధ (Artificial Intelligence) ద్వారా కేవలం ఒక చిత్రాన్ని తీసుకొని దానికి కదలిక (Motion), అనుగుణమైన శబ్దం (Audio) జోడించి 20 సెకన్లలో 6 నుంచి 15 సెకన్ల నిడివి గల వాస్తవిక దృశ్యం (Photorealistic video)లాగా మార్చగలుగుతోంది. గ్రోక్ఏఐ ‘గ్రోక్ ఇమాజిన్’ (Grok Imagine) ఫీచర్ ద్వారా చారిత్రక చిత్రాలు, ఫ్యామిలీ ఫొటోలు లేదా కార్టూన్ పాత్రలను సజీవంగా మార్చవచ్చని కంపెనీ చెబుతుంది.Upload any photos from your phone or take a picture of an old photo and turn it into a video in 20 seconds with the Grok app! https://t.co/ouHoufWeqG— Elon Musk (@elonmusk) October 7, 2025బనానా ఏఐఫొటోలు అప్లోడ్ చేసి వీడియోలు మార్చే క్రమంలో గ్రోక్ఏఐ ముందున్నా, ఇదే తరహా కృత్రిమ మేధ సామర్థ్యాలను బనానా ఏఐ (Banana AI) కలిగి ఉంది. ఇది గూగుల్ జెమిని 2.5 ఫ్లాష్ ఇమేజ్ (Gemini 2.5 Flash Image) మోడల్కు చెందింది. బనానా ఏఐ ప్రధానంగా ఫోటోలను మెరుగుపరచడం, వాటిని మార్చడం, కొత్త చిత్రాలను సృష్టించడం (Text-to-Image) వంటి వాటికి ప్రసిద్ధి చెందింది.ప్రస్తుతం బనానా ఏఐ ఫోటో-టు-వీడియో ఫీచర్ కాకుండా ఫొటో ఎడిటింగ్ వంటి వాటిలో వినియోగదారులకు సహాయపడుతుంది. ఉదాహరణకు వినియోగదారులు తమ సాధారణ ఫొటోలను ‘రెట్రో చీరలు ధరించిన వింటేజ్ ఫొటోలు’గా మార్చడానికి దీన్ని వాడుతున్నారు. ఈ రెండు కంపెనీలు (గ్రోక్, గూగుల్) వేర్వేరు మార్గాల్లో కంటెంట్ సృష్టికి కొత్త దిశానిర్దేశం చేస్తున్నాయి.మానసిక స్వాంతనతమ పాత ఫొటోకు ప్రాణం పోసినప్పుడు నెజిజన్లకు అపూర్వమైన భావోద్వేగ అనుభూతి కలుగుతుంది. దశాబ్దాల నాటి కుటుంబ ఫొటోలు, గతించిపోయిన ప్రియమైన వారి చిత్రాలు వీడియోలుగా మారినప్పుడు గతాన్ని మళ్లీ అనుభూతి చెందే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల సంతోషం, సంతృప్తి, లోతైన భావోద్వేగ బంధం ఏర్పడతాయి. తమ ఊహలకు రూపం ఇచ్చేందుకు, పాత కథలకు దృశ్యరూపం కల్పించేందుకు ఈ ఫీచర్ వీలు కల్పిస్తుంది. ఈ సృజనాత్మకత ఒక విధమైన మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది.వ్యాపార అవకాశాలుఏఐ ఆధారిత ఫోటో-టు-వీడియో టెక్నాలజీ కేవలం వ్యక్తిగత భావోద్వేగాలకే పరిమితం కాకుండా కంపెనీలకు వ్యాపార అవకాశాలను సృష్టిస్తోంది. గ్రోక్ఏఐ ఈ అధునాతన ఫీచర్ను సాధారణంగా ‘సూపర్ గ్రోక్’ (Super Grok) వంటి పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ల్లో అందిస్తుంది. దీని ద్వారా వినియోగదారుల నుంచి స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. అధిక నాణ్యత (High-quality), ఎక్కువ నిడివి గల వీడియోల కోసం ప్రీమియం సబ్స్క్రిప్షన్ను తీసుకోవాల్సి ఉంటుంది.కంటెంట్ క్రియేటర్ల మార్కెట్నేటి సోషల్ మీడియా యుగంలో కంటెంట్ క్రియేటర్లకు వీడియో అత్యంత ముఖ్యమైన సాధనం. ఈ ఏఐ టూల్స్ ద్వారా నిమిషాల్లో ప్రొఫెషనల్ స్థాయి వీడియోలను సృష్టించవచ్చు. దీనివల్ల సోషల్ మీడియా మార్కెటింగ్, యాడ్స్, షార్ట్ ఫిల్మ్ల తయారీకి అయ్యే ఖర్చు, సమయం గణనీయంగా తగ్గుతుంది. ఈ విధంగా కంటెంట్ తయారీ ప్లాట్ఫామ్లు (FlexClip వంటివి) కూడా ఏఐ ఆధారిత ఫీచర్లను తమ వ్యాపారంలో భాగం చేసుకుంటున్నాయి.ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు..
- 
      
                   
                                                       నా రీల్స్ చూడటం తగ్గించండి సారూ.. ఢిల్లీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలుఢిల్లీ: తన రీల్స్ చూడటం ఆపండంటూ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwalపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా(Rekha Gupta) వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈవీఎంల(EVMs)పై రేఖా గుప్తా మాట్లాడుతున్నట్లుగా ఓ ఎడిటెడ్ వీడియోను సామాజిక మాధ్యమంలో నిన్న(ఆదివారం) కేజ్రీవాల్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన రేఖా గుప్తా.. తన వీడియోలు, రీల్స్ చూడటం తగ్గించి.. తన సొంత పార్టీపై దృష్టి పెట్టాలంటూ కేజ్రీవాల్కు చురకలు అంటించారు.ఎలక్ట్రిక్ బస్ డిపోకు శంకుస్థాపన చేసిన రేఖాగుప్తా.. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. "నేను కేజ్రీవాల్కు ఒకటి చెప్పాలనుకుంటున్నాను.. దయ చేసి నా వీడియోలు, ఇంటర్వ్యూలు, రీల్స్ చూడటం తగ్గించండి’’ అంటూ హితవు పలికారు. కేజ్రీవాల్ పంజాబ్ ప్రజలపై దృష్టి పెట్టాలి. అత్యంత ఘోరమైన వరద విపత్తును ఎదుర్కొన్న ఆ రాష్ట్రంలో బాధితులను ఆయన ఎప్పుడూ పరామర్శించలేదంటూ ఆమె విమర్శలు గుప్పించారు.ఇదీ చదవండి: బీహార్లో మూడు దశల్లో ఎన్నికలు.. ఎప్పుడంటే?‘‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించినందుకు మీరు సిగ్గుపడాలి. మీరు 11 సంవత్సరాలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఢిల్లీ అభివృద్ధిపై దృష్టి సారించి ఉంటే, ప్రజలు బాధలుపడేవారు కాదంటూ కేజ్రీవాల్పై రేఖాగుప్తా ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీపై కూడా ఢిల్లీ సీఎం తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ‘‘కాంగ్రెస్ గెలిస్తే అది ప్రజల తీర్పు, మేము గెలిస్తే ఈవీఎంలు హ్యాక్ అయ్యాయా? ఈ ఫార్ములా ఎక్కడ రాసుంది? అంటూ ఆమె ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే’’ అంటూ రేఖా గుప్తా మండిపడ్డారు.दिल्ली की सीएम ये क्या कह रही हैं … pic.twitter.com/ZEf8RQVuzE— Arvind Kejriwal (@ArvindKejriwal) September 21, 2025
- 
      
                   
                                                       ‘కలెక్టర్ అంటే ఇలా ఉండాలి’.. వీడియో వైరల్దాతియా: కలెక్టర్ అనగానే ఎవరికైనా హుందాగా ఉండే ఒక రూపం గుర్తుకువస్తుంది. ఉన్నత పదవిలో ఉన్న అతనితో మాట్లాడాలంటే కాస్త భయమేస్తుంది. అయితే అలాంటి కలెక్టర్ చిన్నారులతో కలసిపోయి, వారు చెప్పేది శ్రద్ధగా వింటూ, వారి సందేహాలకు సమాధానాలిస్తుంటే ఎవరికైనా చూడముచ్చటేస్తుంది. సరిగ్గా ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి, తెగ లైక్లు, షేర్లు దక్కించుకుంటోంది. This should go viral. ❤️Swapnil Wankhede a 2016 batch IAS officer currently posted as Collector and District Magistrate of Datia district in Madhya Pradesh.This video of his interacting with a small orphaned girl wins hearts. 1/n pic.twitter.com/SSteJkBReG— Gabbar (@Gabbar0099) September 15, 20252016 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, మధ్యప్రదేశ్లోని దాటియా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ వాంఖడే ఒక అనాథ బాలికతో ప్రేమతో హృదయపూర్వకంగా సంభాషిస్తున్న వీడియో అందరి హృదయాలను దోచుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ క్లిప్లో వాంఖడే ఆ బాలికతో మాట్లాడుతున్నప్పుడు.. ఆమెకు కనిపించేలా వంగి ఉండటం, శ్రద్ధగా మాటలను వింటూ, ఆమె ముఖంలో చిరునవ్వులు పూయించేందుకు చేస్తున్న ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకు వందలాది లైక్లు,షేర్లు దక్కుతున్నాయి. ఈ వీడియోను చూసివవారు వాంఖడే తీరును ప్రశంసిస్తున్నారు. మానవతా పాలన అంటే ఇదేనని ఒకరు వ్యాఖ్యానించగా, మరికొందరు ఆ చిన్నారి అభివృద్ధికి ఇది ప్రేరణగా నిలుస్తుందన్నారు. మరికొందరు కలెక్టర్ అంటే ఇలా ఉండాలని అంటున్నారు.
- 
      
                   
                                                       జూకీపర్ను చంపి పీక్కుతిన్న సింహాలుథాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో బుధవారం ఘోరం జరిగింది. అక్కడి ప్రముఖ జూలో పని చేసే వ్యక్తి(58)ని సింహాల గుంపు చంపి పీక్కుతింది. పర్యాటకులంతా చూస్తుండగానే ఇదంతా జరడం గమనార్హం. బ్యాంకాక్ పోస్ట్ కథనం ప్రకారం.. జియన్ రంగ్ఖరాసమీ అనే వ్యక్తి ఇరవై ఏళ్లుగా బ్యాంకాక్ సఫారీ వరల్డ్లో పని చేస్తున్నాడు. ఇది పేరుగాంచిన ఓపెన్ ఎయిర్ జూ. అందులో కొంతకాలంగా ఆయన సింహాల కేర్టేకర్(ఆహారం అందిస్తూ) విధులు నిర్వహిస్తున్నారు. అయితే.. బుధవారం సింహాల ఎన్క్లోజర్లో ఉండగా ఏమరపాటుగా ఆయన తన వాహనం నుంచి కిందకు దిగారు. అంతే సింహాలు ఒక్కసారిగా ఆయనపై ఎగబడ్డాయి.సుమారు 15 నిమిషాలపాటు అవి ఆయనపై దాడి చేశాయి. ఆ సమయంలో కొందరు పర్యాటకులు.. వాహనాల హారన్లు కొడుతూ, గట్టి గట్టిగా అరుస్తూ వాటిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆలస్యమైంది. జూకీపర్ శరీరంలో కొంత భాగాన్ని పీక్కుతిన్నాయి. ఎలాగాలో వాటి నుంచి ఆయన్ని లాగేసి.. ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే దారిలోనే ఆయన ప్రాణం పోయిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై Safari World Bangkok స్పందించింది. గత 40 ఏళ్లలో ఇలాంటి దాడి జరగడం ఇదేనని తెలిపింది. ఈ ఘటన నేపథ్యంలో భధ్రతా చర్యలను కఠినంగా అమలు చేస్తామని పేర్కొంది. కింది వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయొచ్చు.. A zookeeper on Wed was attacked and killed by a pack of #lions at a #Bangkok #zoo, as tourists witnessed the incident and tried to intervene to save him. The shocking attack lasted about 15 minutes, with visitors attempting to intervene by honking car horns and shouting to… pic.twitter.com/8ZzsKFwXU0— Shanghai Daily (@shanghaidaily) September 11, 2025సింహాలు మనుషుల్ని తింటాయా?.. సింహాలు మనుషుల్ని వేటాడడం.. అత్యంత అరుదుగా జరుగుతుంది. సాధారణంగా అవి మనుషుల్ని ఆహారంగా పరిగణించవు. జింకలు, జీబ్రాలు, అడవి దున్నలు.. ఇలా పరిమాణంలో పెద్దగా ఉండే జంతువులు వాటి సహజ ఆహారం. గాయపడిన సింహాలు, వయసైపోయిన సింహాలు వేటాడలేని స్థితిలో మనుషులపై దాడి చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే.. అడవుల్లో జంతువుల సంఖ్య తగ్గిపోయినా ప్రత్యామ్నాయంగా పశువులు, మనుషుల మీద దాడి చేయొచ్చు. ఈ క్రమంలో.. ఒకసారి సింహం మనిషిని వేటాడితే గనుక ఆ ప్రవర్తనను కొనసాగించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు.. కొన్నిసార్లు తన పిల్లలకూ మనుషుల్ని వేటాడడం నేర్పిస్తాయట. Tsavo Man-Eaters (1898).. కెన్యాలో రెండు సింహాలు 135 మంది రైల్వే కార్మికులను చంపినట్లు రికార్డులు ఉన్నాయి. అలాగే.. Njombe Man-Eaters (టాంజానియా) పేరిట కొన్ని సింహాలు తరతరాలుగా మనుషులపై వేటాడినట్లు ఆధారాలు ఉన్నాయి.
- 
  
      సారీ అమ్మ.. నిహారిక పోస్ట్ వైరల్..!
- 
      
                   
                                                       'ఓరేయ్.. నా ముందుకొచ్చి మాట్లాడరా?'.. మంచు లక్ష్మీ ఆగ్రహం!టాలీవుడ్ నటి మంచు లక్ష్మి దాదాపు ఐదేళ్ల తర్వాత వెండితెరపై కనిపించనుంది. ప్రస్తుతం ఆమె దక్ష (ది డెడ్లీ కాన్సిఫరిసీ) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ చిత్రం టీజర్ విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని తన సొంత బ్యానర్ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్లో తెరకెక్కించారు. ఈ సినిమాకు మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్న నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి వంశీకృష్ణ మల్ల దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది.అయితే ఇటీవల దుబాయ్లో జరిగిన సైమా అవార్డ్స్-2025 వేడులకు హాజరైంది. మంచు లక్ష్మీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అక్కడే మంచు లక్ష్మీ వేదిక వద్దకు వెళ్తుండగా ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. అదే సమయంలో ఓ అభిమాని అసభ్యకరంగా కామెంట్ చేయడంతో మంచు లక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడరా? మీకసలు సెన్స్ లేదు రాస్కెల్స్.. అంటూ మండిపడింది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ సైతం కామెంట్ చేస్తున్నారు. ఆ తర్వాత చాలామంది అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చింది మంచు లక్ష్మీ.కాగా.. మంచు లక్ష్మీ నటించిన యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్లో సముద్రఖని, మలయాళ నటుడు సిద్దిక్, చైత్ర శుక్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మోహన్ బాబు కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మంచు లక్ష్మీ పవర్పుల్ పాత్రలో కనిపించారు. లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ నుంచి పదేళ్ల తర్వాత దక్ష రూపంలో మరో చిత్రం విడుదల కానుంది. 2015లో మామ మంచు అల్లుడు కంచు మూవీ ఆ బ్యానర్ నుంచి చివరిగా విడుదలైంది. View this post on Instagram A post shared by KIO TV (@kiotv27)
- 
      
                   
                                                       భార్య అశ్లీల వీడియో ఫోన్లో పెట్టుకున్నాడని సహచరుడిని చంపేశాడు..!కర్ణాటక: తన భార్య అశ్లీల వీడియోను సేకరించిన సహ కార్మికున్ని ఇనుప రాడ్ కొట్టి చంపాడో వలస కార్మికుడు. మంగళూరు నగరంలో సూరత్కల్లో ఈ ఘోరం జరిగింది. వివరాలు.. పశ్చిమ బెంగాల్ చెందిన ముఖేశ్ మండల్ (27) హతుడు. ఇతడు లక్ష్మణ్ అలియాస్ లఖన్ (30) భార్య అశ్లీల వీడియోను తీసుకొని తన ముబైల్ ఫోన్లో పెట్టుకున్నాడు. ఈ విషయం లక్ష్మణ్కు తెలిసింది. ' దీంతో జూన్ 24న రాత్రి ఇద్దరూ బాగా మద్యం తాగారు. మత్తులో ఉండగా ఇనుప రాడ్ బాది హత్య చేసి, శవాన్ని ఓ సెప్టిక్ ట్యాంకులో పడేశాడు. ఆగస్ట్ 21న మృతదేహాన్ని కుళ్లిన స్థితిలో పోలీసులు కనుగొన్నారు. హంతకుడు లక్ష్మణ్ తమిళనాడులో దాగి ఉండగా సూరత్కల్ పోలీసులు వెతికి పట్టుకున్నారు.
- 
      
                   
                                                       ‘నన్ను చంపేస్తారేమో’.. ఎమ్మెల్యే వీడియో కలకలంహర్యానా: యాంటీ గ్యాంగ్స్టర్ టాస్క్ఫోర్స్ (ఏజీటీఎఫ్)తనని ఎన్కౌంటర్ చేస్తోందని ప్రాణ భయంతో పోలీసుల నుంచి తప్పించుకు తిరగానంటూ ఓ పార్టీ ఎమ్మెల్యే రహస్య ప్రాంతం నుంచి వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో తనని అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులపై దాడులకు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు.ఇంతకీ పోలీసుల్ని తప్పించుకున్న ఎమ్మెల్యే ఎవరు?. పోలీసులు తనని ఎన్కౌంటర్ చేస్తారేమోనని ఎందుకు భయపడ్డాడు.పంజాబ్లోని అధికార ఆప్కు చెందిన హర్మీత్ సింగ్ పఠాన్మజ్రా తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే హర్ప్రీత్పై జిరాక్పూర్కు చెందిన ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. భార్య నుంచి విడాకులు, 2011లో తనని వివాహం చేసుకోవడం, తర్వాత ప్రైవేట్ వీడియోలు తీసి బెదిరించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు హర్యానాలోని కర్నాల్ జిల్లా దబ్రి గ్రామంలోని నివాసంలో ఉన్న హర్మీత్ సింగ్ను అదుపులోకి తీసుకునేందుకు పటియాలా పోలీసు బృందం అక్కడికి చేరుకుంది.పోలీసుల రాకపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే హర్ప్రీత్ అజ్ఞాతంలోకి వెళ్లారు. వెళ్లే సమయంలో హరీప్రత్ గ్రామస్థులు, అతని అనుచరులు పోలీసులపైకి దాడికి పాల్పడ్డారనే ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలో అజ్ఞతం నుంచి ఎమ్మెల్యే హర్ప్రీత్.. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో పోలీసులు నన్ను ఎన్కౌంటర్ చేసేందుకు ప్లాన్ చేశారనే సమాచారం అందింది. నన్ను ఒక్కడిని ఎన్కౌంటర్ చేసేందుకు ఎనిమిదిమంది ఎస్పీలు, ఎనిమిదిమంది డీఎస్పీలు, ఐదుగురు ఎస్హెచ్ఓలు,ఎన్కౌంటర్ స్పెషలిస్టు బిక్రమ్ బ్రార్లు పట్టుకునేందుకు వచ్చారు. పోలీసులంటే నాకు అపారమైన గౌరవం ఉంది. నేను వాళ్లమీద ఎటువంటి దాడులకు పాల్పడలేదని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై పాటియాలా రేంజ్ డీఐజీ కుల్దీప్ చాహల్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే హర్ప్రీత్సింగ్ కోసం ఆయన స్వగ్రామానికి వెళ్లాం. మేం వస్తున్నామనే సమాచారంతో ఆయన అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే హర్ప్రీత్ సింగ్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.పాటియాలా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్ఛార్జ్ ప్రదీప్ బాజ్వా ఆప్ ఎమ్మెల్యే అరెస్టును ధృవీకరించారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దాడులకు పాల్పడ్డారు. రాళ్లు రువ్వారు. ప్రతిఘటించేందుకు గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలిపారు.
- 
      
                   
                                                       రోడ్డుపై చిల్ అయిన మాజీ ఉప ముఖ్యమంత్రి.. వైరల్ వీడియోలుపట్నా: బీహర్లో ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల్లో సత్తా చాటేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇదే సమయంలో బీహార్లో ప్రతిపక్షాలు ‘ఓటరు అధికార్ యాత్ర’ను చేపట్టాయి. దీనిలో పాల్గొన్న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ యాత్ర ముగియగానే చిల్ అవుతూ కనిపించారు. दिल तो बच्चा ही है जी ... मस्ती टाइम @ पटना मरीन ड्राइव@iHrithik pic.twitter.com/TxelXmsSPb— Rohini Acharya (@RohiniAcharya2) September 2, 2025పట్నాలోని మెరైన్ డ్రైవ్ ఎక్స్ప్రెస్వే వద్ద పలువురు యువకులతో పాటు తేజస్వి యాదవ్ నృత్యం చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను అతని సోదరి రోహిణి ఆచార్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. సింగపూర్ నుండి వచ్చిన తన మేనల్లుడితో కలిసి తేజస్వి యాదవ్ మెరైన్ డ్రైవ్లో డ్రైవ్ చేశారు. అనంతరం అక్కడ సోషల్ మీడియా కోసం రీల్స్ చేస్తున్న యువ కళాకారుల బృందాన్ని తేజస్వి చూశారు. వారి మధ్యకు చేరి ఉత్సాహంగా నృత్యం చేశారు. వారి నుంచి ట్రెండింగ్ డ్యాన్స్ మూవ్లను నేర్చుకున్నారు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సిగ్నేచర్ స్టెప్లను కూడా తేజస్వి అనుకరించారు. गर्मी, बारिश और उमस के बीच कल 16 दिनों तक चली वोटर अधिकार यात्रा समाप्त हुई। रात्रि में सिंगापुर से आए भांजे ने कहा ड्राइव पर चले।रास्ते में सड़क पर कुछ युवा साथी कलाकार मिले। वो गाना गा रहे थे, रील्स बना रहे थे। आग्रह करने लगे तो हमने भी हाथ-पैर आजमाए।हम सब सहजता, सरलता और… pic.twitter.com/buNCqKnA3G— Tejashwi Yadav (@yadavtejashwi) September 2, 2025 ఒక క్లిప్లో తేజస్వి ఆయన తన తండ్రి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ను గుర్తుచేసే భోజ్పురి పాట ‘లాలు బినా చాలు ఈ బీహార్ న హోయి’కి నృత్యం చేశారు. మరో వీడియోలో ఆయన పోలీసు అధికారులతో సంభాషించడం, యువ కళాకారులతో రోడ్డు పక్కన టీ తాగడం లాంటి దృశ్యాలు ఉన్నాయి. కాగా ఓటరు అధికార్ యాత్ర ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 1 వరకు బీహార్లో 16 రోజుల పాటు జరిగింది. దీనికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ నాయకత్వం వహించారు.
- 
      
                   
                                                       టీడీపీ ఎమ్మెల్యే...కోటంరెడ్డి కొత్త డ్రామాసాక్షి, అమరావతి: జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మెడకు చుట్టుకోవడంతో బయట పడేందుకు నానా తంటాలు పడుతున్నారు. నెల్లూరు నగరం, రూరల్ ప్రాంతాల్లోని రౌడీ షీటర్లను పెంచి పోషించిందే శ్రీధర్రెడ్డి అనే విషయం రాజకీయ నాయకులకు, పోలీసులకు తెలిసిందే. శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వాలంటూ సిఫార్సు చేసి అడ్డంగా దొరికిపోయిన శ్రీధర్రెడ్డి ఆ బురద కడుక్కునేందుకు ఎవరికైనా సిఫార్సు లేఖ ఇవ్వడం సాధారణమే అంటూ తప్పించుకునే యత్నం చేశారు. తాజాగా తన హత్యకు రౌడీషీటర్లు కుట్ర చేస్తున్నారనే వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయించి కొత్త డ్రామా ఆడుతూ, వైఎస్సార్సీపీ పైకి నెట్టివేసే కొత్త కుట్రలకు తెర తీశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన హత్యకు జీవిత ఖైదీ శ్రీకాంత్ సైన్యం కుట్ర పన్నారంటూ హడావుడి చేస్తుండడంతో నగర ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ ఏదో రకంగా కొత్త డ్రామాలు ఆడడం కోటంరెడ్డి అలవాటు.. ఇది ఆ కోవలోనిదే అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీడియోలోని వారంతా ఎమ్మెల్యే బ్రదర్స్, రూప్కుమార్ అనుచరులే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఎమ్మెల్యే కోటంరెడ్డి కీలక అనుచరుడు జగదీ‹Ù, కోటంరెడ్డి సోదరుడు గిరిధర్రెడ్డి అనుచరుడు మహేశ్, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్కుమార్ ముఖ్య అనుచరుడు దార్ల వినిత్తోపాటు మరో ఇద్దరు ఉన్నారు. కోటంరెడ్డి అనుచరులే ఆయన హత్యకు ఎలా కుట్ర చేస్తారని నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. ఆ రౌడీమూకల ద్వారానే నెల్లూరులో కోటంరెడ్డి సెటిల్మెంట్లు, దందాలు, రౌడీయిజాలు చేయించినట్లు ఇటీవల పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో కోటంరెడ్డి అండదండలున్నాయని వెలుగులోకి రావడం, అరుణ ఫోన్ సంభాషణల్లో నిగూఢ రహస్యాలు వెలుగులోకి వస్తుండడం, అన్నింట్లో కూడా ఎమ్మెల్యే అనుచరులు సెటిల్మెంట్ దందాలు చేసినట్లు ఉండడంతో పోలీసులు సైతం నివ్వెరపోయారు. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో అతన్ని కాపాడేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. రాష్ట్ర డీజీపీ కూడా నెల్లూరుకు వచ్చి పోలీసుల నుంచి ఎలాంటి లీకులు రాకూడదని ఆదేశాలిచ్చి వెళ్లారని తెలిసింది. ఈ వ్యవహారం డైవర్షన్లో భాగంగా రౌడీమూకలు హోటల్ గదిలో మద్యం తాగుతూ మాట్లాడుకున్న వీడియోను ముందస్తు వ్యూహంతోనే చిత్రీకరించి సోషల్ మీడియాలో లీకు చేయించారని తెలుస్తోంది. తద్వారా వైఎస్సార్సీపీకి అంట గట్టే యత్నాలను చూసి నెల్లూరు నగర వాసులు ఛీదరించుకుంటున్నారు. పెంచి పోషించిన వారే హత్య చేస్తారా? జీవిత ఖైదీ శ్రీకాంత్ ఆది నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరుడే. ఇటీవల అరుణ ఎల్లో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తనను 50 శాతం మాత్రమే ప్రేమిస్తున్నాడని, మిగిలిన 50 శాతం ఎమ్మెల్యే కోటంరెడ్డిని ప్రేమిస్తున్నాడని వెల్లడించిన విషయం విదితమే. నెల్లూరు సెంట్రల్ జైల్లో కూడా శ్రీకాంత్కు సకల సౌకర్యాలు కల్పించాలని సూపరింటెండెంట్ను ఆదేశించిన విషయం కూడా ఇటీవల వెలుగులోకి వచ్చింది. పెరోల్ రద్దయిన తర్వాత కూడా ములాఖత్ ఇవ్వకుంటే సాక్షాత్తు ఎమ్మెల్యే ఫోన్ చేసి ములాఖత్ ఇప్పించినట్లుగా జైలు శాఖ అధికారులు పోలీసులకు వివరించినట్లు సమాచారం. ప్రస్తుతం వీడియోలో ఉన్న రౌడీమూకలు సైతం ఎమ్మెల్యే వీరవిధేయులు. ఆయన కనుసన్నల్లోనే వారు పని చేస్తున్న విషయం బహిరంగమే. ఎమ్మెల్యే కీలక అనుచరులూ వీరి ద్వారానే సెటిల్మెంట్లు చేయిస్తున్నారే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ కార్పొరేటర్ భర్త సెటిల్మెంట్ చేసి రూ.కోటి విలువైన స్థలాన్ని బహుమానంగా తీసుకున్నారు. అందులోనే తన కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. గతంలో కూడా జరిగిన హత్యాయత్నాలు, ఇటీవల వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి నివాసాన్ని ధ్వంసం చేసిన వారిలో ఈ రౌడీషీటర్లు ఉన్నారనేది జగమెరిగిన సత్యమే. ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి కనుసన్నల్లో పని చేసే వారే ఆయన్ను హత్యకు కుట్ర చేస్తున్నారనే ప్రచారంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక పోలీసులే తేల్చాల్సి ఉంది.
- 
  
      టీడీపీ ఎమ్మెల్యే... కోటంరెడ్డి కొత్త డ్రామా
- 
      
                   
                                                       ‘ఎలక్షన్ చోరీ ఆయోగ్’న్యూఢిల్లీ: ఓట్ల చోరీపై విపక్ష కాంగ్రెస్ పార్టీ తమ పోరాటం ఉధృతం చేస్తోంది. పోలింగ్ బూత్లో ఒకరి బదులు ఇంకొకరు ఓటు ఎలా వేస్తున్నారో వివరిస్తూ ఒక వీడియోను పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం ‘మీ ఓటు చోరీ, మీ అధికారం చోరీ, మీ గుర్తింపు చోరీ’ అనే శీర్షికతో సోషల్ మీడియాలో చేశారు. ఓటర్ల జాబితాలో గోల్మాల్పై ప్రజలంతా గొంతు విప్పాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధ సంస్థలను బీజేపీ కబంధ హస్తాల నుంచి కాపాడుకోవాలని చెప్పారు. వీడియోలో ఏముంది?కాంగ్రెస్ విడుదల చేసిన వీడియోలో ఆసక్తిక రమైన సన్నివేశం కనిపిస్తోంది. ఇందులో ఓ కుటుంబం ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్తుంది. ఇద్దరు వ్యక్తులు ఆ కుటుంబానికి తారసపడతారు. మీ ఓట్లు మేమే వేశాం, ఇక మీరు వెళ్లిపోవచ్చు అని చెప్తారు. దొంగ ఓట్లు వేసిన ఆ ఇద్దరు వ్యక్తులు పోలింగ్ కేంద్రంలోని ఎన్నికల అధికారికి బొటన వేలు పైకెత్తి విజయం చిహ్నం చూపిస్తారు. ఆ అధికారి టేబుల్పై ‘ఎలక్షన్ చోరీ ఆయోగ్’ అనే నేమ్బోర్డు ప్రత్యక్షం అవుతుంది. నేడు దేశవ్యాప్తంగా ర్యాలీలు: ఓట్ల చోరీపై దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో గురువారం భారీ ర్యాలీలు నిర్వహించేందుకు కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.
- 
      
                   
                                                       'జడలు ముట్టుకుంటే వాడు సర్రుమంటాడు'.. ది ప్యారడైజ్ యాక్షన్ సీక్వెన్స్ వీడియో!నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న మాస్ యాక్షన్ థ్రిల్లర్ 'ది ప్యారడైజ్'. దసరాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే నాని ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ పోస్టర్లో ఇంతకు ముందెన్నడు కనిపించని విధంగా రెండు జడలతో కనిపించారు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. డిఫరెంట్ లుక్లో నాని కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్ వీడియోను పంచుకున్నారు మేకర్స్. ఈ సీక్వెన్స్ను జైల్లో తెరెకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ ఫైట్ సీక్వెన్స్లో నాని డిప్స్ కొడుతూ కనిపించారు. 'వాడి జడల్ని ముట్టుకుంటే వాడు సర్రుమంటాడు' అనే డైలాగ్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ది స్పార్క్ ఆఫ్ ప్యారడైత్ పేరుతో ఈ సీక్వెన్స్ రాప్ వీడియోను రిలీజ్ చేశారు.అయితే ఈ చిత్రంలో నాని సరసన డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్గా కనిపించనుందని టాక్. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయెల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎనిమిది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలోకి రానుంది.
- 
      
                   
                                                       ఏఐ మాయ.. సౌత్ స్టార్స్ ఇలా అయిపోయారేంటి?ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) టెక్నాలజీని కాస్తా గట్టిగానే వాడేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫన్ క్రియేట్ చేసేందుకు ఏఐని విపరీతంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖుల ఫోటోలు, వీడియోల కంటెంట్ను ఎక్కువగా సృష్టిస్తున్నారు. ఇటీవలే బాలీవుడ్ స్టార్స్ వారి సతీమణులతో ఉన్న ఫన్నీ వీడియోను నెట్టింట హల్చల్ చేశాయి. ఈ వీడియో ఫ్యాన్స్కు తెగ నవ్వులు తెప్పించింది.తాజాగా అలాంటి వీడియోనే దక్షిణాది సూపర్ స్టార్స్తో రూపొందించారు. హీరోలు సూర్య, అజిత్, బన్నీ, మహేశ్ బాబు, విజయ్, రామ్ చరణ్తో కలిసి ఫన్నీగా రూపొందించారు. ఇందులో హీరోలంతా హీరోయిన్స్కు ఫుడ్ తినిపిస్తూ కనిపించారు. ఏఐ సాయంతో రూపొందించిన ఈ వీడియో నెట్టింట తెగ నవ్వులు పూయిస్తోంది. తమ స్టార్ హీరోలేంటి ఇలా ఉన్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు కూడా చూసేయండి.Prabhas annaaaaaa😂🤣😁#Prabhas𓃵 pic.twitter.com/43OVHX8wYQ— G.O.A.T Prabhas (@goatPB1) August 8, 2025
- 
      
                   
                                                       నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. హీరోయిన్ ఆవేదనఒకప్పటి హీరోయిన్ తనుశ్రీ దత్తా మరోసారి వార్తల్లో నిలిచింది. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ చాలా ఆవేదనతో ఓ వీడియోని పోస్ట్ చేసింది. తన ఇంట్లోనే తనని వేధిస్తున్నారని.. ఈ బాధ తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ప్లీజ్ ఎవరైనా వచ్చి సాయం చేయండి అంటూ అభ్యర్థించింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.'నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు. పోలీసులకు ఫోన్ చేస్తే.. స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. రేపో, ఎల్లుండో పోలీసుల దగ్గరకు వెళ్తాను. గత నాలుగైదేళ్ల నుంచి ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. నా ఇల్లంతా చిందరవందరగా అయిపోయింది. పనివాళ్లని పెట్టుకుంటే వాళ్లొచ్చి నా వస్తువుల్ని దొంగలిస్తున్నారు. నా ఇంట్లోనే నాకు భద్రత లేకుండా పోయింది. ఎవరైనా వచ్చి కాస్త నాకు సాయం చేయండి' అని ఏడుస్తూ తనుశ్రీ దత్తా వీడియో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: పవన్ వ్యాఖ్యలు.. ట్రెండింగ్లో #BoycottHHVM)బిహార్కి చెందిన తనుశ్రీ దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ విజేతగా నిలిచింది. కానీ 'ఆషిక్ బనాయా అప్నే' పాటతో ఈమెకు చాలా గుర్తింపు వచ్చింది. తెలుగులోనూ 2005లో 'వీరభద్ర' అనే మూవీ చేసింది. తమిళంలోనూ 2010లో తీరదు విలాయాట్టు పిళ్లై అనే చిత్రంలో నటించింది. ఇవి తప్పితే 2013 వరకు హిందీలోనే పలు చిత్రాలు చేసింది. తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది.అయితే 2018లో మీటూ(#Metoo) ఉద్యమంలో భాగంగా ప్రముఖ నటుడు నానా పటేకర్పై సంచలన ఆరోపణలు చేసింది. తనని లైంగికంగా వేధించాడని చెప్పుకొచ్చింది. ఈ కేసులో పటేకర్కి క్లీన్ చిట్ దక్కింది. మరోవైపు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సైతం తనని ఓ సినిమా కోసం నగ్నంగా డ్యాన్స్ చేయమని అడిగాడని గతంలో ఆరోపణలు చేసింది. ఇప్పుడు మాత్రం తన ఇంట్లోనే తనకు వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: మహేశ్, సుకుమార్ని ఫిదా చేసిన హిందీ సినిమా.. ఏంటి దీని స్పెషల్?) View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial)
- 
      
                   
                                                       ట్రంప్ కసి.. ఒబామా అరెస్టు అంటూ ఏఐ వీడియోసంచలన ఆరోపణల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేసిన ఓ వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. ‘చట్టానికి ఎవరూ అతీతులు కాదని’ సందేశంతో ఆయన ఆ పోస్ట్ చేశారు. అయితే మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అరెస్ట్ అయిన నేపథ్యంతో ఉన్న ఏఐ వీడియోను తన ట్రూత్ ప్లాట్ఫారమ్లో పోస్ట్ చేయడం గమనార్హం. ఓవల్ ఆఫీసులో ట్రంప్తో భేటీ అయిన సందర్భంలో మాజీ అధ్యక్షుడు ఒబామాను ఎఫ్బీఐ అరెస్టు చేసినట్లుగా ఆ వీడియో ఉంది. ఒబామా చేతుల్ని వెనక్కి విరిచి మరీ అధికారులు బేడీలు వేశారు. ఆ సమయంలో నవ్వుతూ కనిపించారు ట్రంప్. అటుపై ఒబామా కటకటాల్లో ఉన్నట్లు ఆ వీడియోలో ఉంది. అంతకంటే ముందు ఈ వీడియోలో.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని పలువురు నేతలు చెప్పిన సందేశాన్ని దానికి జత చేశారు. ఆ నేతల్లో ముందుగా ఉంది ఒబామానే కావడం గమనార్హం. Donald #Trump reposts AI-generated video depicting Barack #Obama being arrested.#MAGA | #USApic.twitter.com/crkL8bew9l— Shivanshi Singh (@Shivansshi) July 21, 2025 అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై సంచలన ఆరోపణలకు దిగారు. 2016లో ట్రంప్ విజయం టైంలో ఒబామా ప్రభుత్వం కుట్రలకు తెర తీసిందని.. రష్యా ఎన్నికల జోక్యంపై కల్పిత ఇంటెలిజెన్స్ నివేదికలు తయారు చేయించారని, తద్వారా ట్రంప్ అధ్యక్ష పదవికి అర్హత లేదని చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారామె. ఈ క్రమంలో ఆమె అమెరికా న్యాయవిభాగానికి US Department of Justiceకి కొన్ని డాక్యుమెంట్లు సమర్పించినట్లు సమాచారం. Treason, Tulsi & Trump! Gabbard has accused #BarackObama of 'weaponizing intelligence' against #DonaldTrunp in 2016 - I explain why timing and intention of this huge claim is being questioned 👇#EpsteinFiles #TulsiGabbard pic.twitter.com/orQbiEICNK— Shreya Upadhyaya (@ShreyaOpines) July 20, 2025 ఈ వ్యవహారంపై రిపబ్లికన్ నేతలు గబ్బార్డ్కు మద్దతు తెలుపుతూ.. ఆమెపై ప్రశంసలు గుప్పించారు. అయితే డెమోక్రట్లు మాత్రం ఈ ఆరోపణలను రాజకీయ ప్రేరణతో కూడినవిగా, ఆధారాలు లేనివిగా అభివర్ణించారు. మరోవైపు Obama ఇంకా ఈ ఆరోపణలపై స్పందించలేదు. అయితే ఈ ఆరోపణలు వెల్లువెత్తిన మరుసటిరోజే ట్రంప్ ఇలా ఓ ఏఐ వీడియో తన అధికారిక ఖాతాలో పోస్ట్చేయడం గమనార్హం.
- 
      
                   
                                                       బుట్టబొమ్మతో ప్రేమాయణం కొనసాగిస్తా... ఏం చేసుకుంటావో చేసుకోహైదరాబాద్: ‘ఇన్స్టా రీల్స్ అమ్మాయి బుట్టబొమ్మతో ప్రేమాయణం కొనసాగిస్తా ...ఏం చేసుకుంటావో చేసుకో’అన్న భర్త మాటలతో క్షణికావేశానికి లోనైన వైద్యురాలు ప్రత్యూష ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్రెడ్డి వెల్లడించారు. ఆదివారం డాక్టర్ ప్రత్యూష అనుమానాస్పదంగా మృతి చెందినట్లు నమోదైన కేసులో విచారించిన పోలీసులు మంగళవారం ఆమె భర్త డాక్టర్ అల్లాడి సృజన్, అత్తమామలు పుణ్యవతి–మధుసూదన్తోపాటు ఇన్స్టా రీల్స్గర్ల్ బానోతు శ్రుతిలను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. హసన్పర్తి పోలీస్స్టేషన్లో కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి ఆవివరాలు వెల్లడించారు. మట్టెవాడకు చెందిన తంజాపూరి పద్మావతి కూతురు డాక్టర్ ప్రత్యూషకు (35), ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్కు చెందిన డాక్టర్ అల్లాడి సృజన్కు 2017లో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరు హసన్పర్తిలోని కాకతీయ వెంటెజ్లో ఓ విల్లా కొనుగోలు చేసి నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. వీరితోపాటు సృజన్ తల్లిదండ్రులు పుణ్యవతి–మధుసూదన్లు కూడా ఇక్కడే ఉంటున్నారు. బానోతు శ్రుతితో కుటుంబంలో చిచ్చు.. ఏడాది క్రితం బుట్టబొమ్మ–17 ఇన్స్ర్ట్రాగాం ఐడీ పేరుతో రీల్స్ చేసే అమ్మాయి బానోతు శ్రుతితో డాక్టర్ సృజన్ దగ్గరయ్యాడు. ఈ క్రమంలో తన భార్యకు విడాకులు ఇస్తానని బెదిరించాడు. మరో వైపు శ్రుతి కూడా ఫోన్ ద్వారా ప్రత్యూషను వేధింపులకు గురి చేయడం ప్రారంభించింది. ఆది వారం కూడా ఆ దంపతుల మధ్య గొడవ జరిగింది. శ్రుతిని వదిలేది లేదని సృజన్ చెప్పడంతో ప్రత్యూష పైఅంతస్తుకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. కాగా గొడవ విషయంలో సృజన్ తల్లిదండ్రులు కూడా కొడుకుకే మద్దతు పలికారని ఏసీపీ పేర్కొన్నారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
- 
      
                   
                                                       సీఎం సార్.. దేశ రక్షణలో ఉన్నా.. నా కుటుంబాన్ని రక్షించండి!సాక్షి, టాస్క్ఫోర్స్: దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుంటే, తన భూమిని ఓ రాజకీయ నాయకుడు కబ్జా చేస్తున్నాడని, ఇందుకు అడ్డుగా ఉన్నాడని తన తండ్రిపై దాడి చేశారని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో ఓసైనికుడు పోస్టు చేసిన ఒక సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్ల అడ్డగోలు వ్యవహారాలకు ఈ వీడియో అద్దంపడుతోంది.‘ముఖ్యమంత్రికి.. నా పేరు బీఎన్ ప్రసాద్. మాది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, కదిరివోబనపల్లి గ్రామం. నేను పదేళ్లుగా దేశానికి సైనిక సేవలు అందిస్తున్నాను. మీరు మా గ్రామంలో కొత్తగా నిర్మించిన ఇంటికి ఎదురుగా మాకు ఒక ఎకరం ఇరవై సెంట్ల భూమి ఉంది. ఇందులోనే 15 సెంట్ల భూమిని రాజకీయ నాయకుడైన సుందరప్ప ఆక్రమించుకుని రీసర్వేలో నమోదు చేసుకుని అతని భార్యకు రిజిస్ట్రేషన్ చేశాడు’ అని వాపోయాడు. తన సమస్యపై దృష్టి సారించిన అధికారులు సర్వే చేసి తనకు రావాల్సిన 15 సెంట్లకు ఫెన్సింగ్ వేసినట్లు తెలిపారు. అయితే శనివారం ఉదయం తన తండ్రి బి.నారాయణప్ప పొలంలో పనిచేసేందుకు వెళ్లగా సుందరప్ప, ఆయన కుటుంబ సభ్యులు దాడిచేసినట్లు పేర్కొన్నాడు. సుందరప్పకు ‘దేశం’ అండా‘దందా’.. సుందరప్ప టీడీపీలో కీలక నాయకుడు. భార్య నారాయణమ్మ స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేశారు. కుమారుడు బీరేష్ పంచాయతీ పార్టీ అధ్యక్షుడు. చంద్రబాబు ఇంటి నిర్మాణ పనుల్లోనూ వీరు చురుగ్గా పాల్గొన్నారు. దీంతో పైస్థాయి పార్టీ నేతలతో పరిచయాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో పరిష్కారమైన భూ వివాదాన్ని మళ్లీ తిరగదోడుతూ సుందరప్ప దాడులకు పాల్పడుతున్నాడని సమాచారం. సుందరప్ప కుటుంబంతో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని 2024 ఆగస్టులో ఇదే సైనికుడు ప్రసాద్ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాడు. దీనిపై కుప్పం పోలీసులు అప్పట్లో విచారణ జరిపి ఆ కుటుంబం జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు. కానీ ఇప్పుడు ఈ భూమికి ఎదురుగా సీఎం గృహప్రవేశం జరగటం, పలమనేరు–కృష్ణగిరి రోడ్డు నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేయనుండటంతో రియల్టీ బూమ్ ఏర్పడింది. దీంతో మళ్లీ సుందరప్ప తన భూకబ్జా కుట్రలకు పదునుపెట్టాడు.
- 
      
                   
                                                       రీల్స్ కోసం.. బైకుపై ఎనిమిది మందిహైదరాబాద్: ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా ఎనిమిది మంది యువకులు ఓ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంపై అర్ధరాత్రి రీల్స్ కోసం స్టంట్ చేశారు. జాతీయ రహదారిపై ఈ స్టంట్ కొనసాగుతుండటంతో ఈ దారి గుండా వెళ్తున్న వారు తమ సెల్ఫోన్లో బంధించి ఎక్స్ వేదికగా పోస్టు చేసి..సైబరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం..ఈ నెల 21న అర్థరాత్రి 1.30 గంటల సమయంలో శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది యువకులు ద్విచక్ర వాహనంపై శంషాబాద్ నుంచి ఆరాంఘర్ వైపు పయనమయ్యారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు మైనర్లతో పాటు ఐదుగురు యువకులు పయనిస్తూ రీల్స్ చేశారు. ప్రమాదభరితంగా స్టంట్లు చేశారు. ఈ దృశ్యాలను అటుగా వెళుతున్న పలువురు చిత్రీకరించి ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు వెళ్లే ఈ రహదారి రాత్రి సమయాల్లో బిజీగా ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో వీఐపీల రాకపోకలతో అలర్ట్గా ఉంటుంది. ఈ స్టంట్ విషయమై పలువురు సైబరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను సోమవారం గుర్తించారు. ద్విచక్ర వాహనంతో పాటు ఐదుగురు యువకులను, ముగ్గురు మైనర్లను రాజేంద్రనగర్ పోలీసులకు సోమవారం సాయంత్రం అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- 
      
                   
                                                       బైక్పై యువజంట వికృత చేష్టలు.. రూ. 53,500 జరిమానాన్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో కొందరు యువతీ యువకులు రోడ్లపై విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటన ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపధ్యంలో ఈ జంటపై చర్యలు తీసుకోవాలని పోలీసులను పలువురు కోరారు.సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విస్తృతంగా వైరల్ అయిన ఈ ఐదు సెకన్ల క్లిప్లో ఒక యువకుడు బైక్ నడుపుతుండగా, ఒక యువతి పెట్రోల్ ట్యాంక్పై అతనికి రివర్స్ పొజిషన్లో కూర్చుని, తన కాళ్లను అతనికి వెనుకవైపుగా ఉంచింది. నిత్యం రద్దీగా ఉండే ఎక్స్ప్రెస్వేపై వారిద్దరూ హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. అయితే, ఆ మహిళ చేతిలో హెల్మెట్ ఉంది. అక్కడి సీసీటీవీ కెమెరాలలో ఈ ఉదంతమంతా రికార్డయ్యింది. नोएडा पुलिस ने इस "इशकजादे" का 53500 रुपए का चालान व्हीकल एक्ट में काटकर "प्रेम पत्र" घर भिजवा दिया है !! pic.twitter.com/Dw3gqS46Z8— Sachin Gupta (@SachinGuptaUP) June 16, 2025ఈ వీడియోను గమనించిన తాము, ఆ వాహనం నంబరు ఆధారంగా బైక్ను గుర్తించి మోటారు వాహనాల చట్టంలోని సంబంధిత విభాగాల కింద రూ.53,500 చలానా జారీ చేశామని నోయిడా (ట్రాఫిక్) డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లకన్ సింగ్ యాదవ్ మీడియాకు పారు. ఈ సంఘటన సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందన్నారు. ప్రమాదకరమైన డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం తదితర నేరాల కింద మోటార్ వాహనాల చట్టంలోని వివిధ విభాగాల కింద పోలీసులు ఆ వాహనానికి చలానా జారీ చేశారు.ఇది కూడా చదవండి: జనగణన నోటిఫికేషన్ జారీ.. లెక్కల ప్రక్రియ ఇదే..
- 
      
                   
                                                       స్నేహితుడి భార్యకు అశ్లీల చిత్రాలు పంపిన యువకుడు..!అన్నానగర్(తమిళనాడు): దిండుగల్కు చెందిన 23 ఏళ్ల యువతి పేరుతో అశ్లీల చిత్రాలను ఇన్స్ట్రాగామ్లో ప్రచారం చేశారు. ఇది చూసిన ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు దిగ్భ్రాంతి చెందారు. ఆ యువతి పేరుతో నకిలీ ఖాతా సృష్టించి, దాని ద్వారా అశ్లీల చిత్రాలను విడుదల చేసినట్లు వెల్లడైంది. ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అశ్లీల చిత్రాలను షేర్ చేసిన వ్యక్తి విరుదునగర్ జిల్లా కరియాపట్టికి చెందిన విమల్(31) అని తేలింది. పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారణ జరపగా, షాకింగ్ సమాచారం బయటపడింది. విమల్ ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అతను దిండుగల్ లో ఒక స్నేహితుడితో ఉంటున్నాడు. అతను తన స్నేహితుడిని సిమ్ కార్డ్ కొనమని అడిగాడు. అతని స్నేహితుడు తన పేరు మీద సిమ్ కార్డ్ కొన్నాడు. దీని ద్వారా విమల్ దిండిగల్కు చెందిన ఒక యువతి పేరుతో నకిలీ ఖాతాను ప్రారంభించి, ఇన్స్ట్రాగామ్లో వివిధ చిత్రాలను షేర్ చేశాడు. ఈ సమాచారం వెలుగులోకి రాగానే, షాక్ అయిన మహిళ అతనిని వివరాలు అడిగింది. ఈలోగా చదువు పూర్తి చేసుకున్న తర్వాత, విమల్ తన స్వస్థలం విరుదునగర్కు వెళ్లాడు. నకిలీ ఖాతా వివరాలు వెలుగులోకి రావడంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫలితంగా ఆమె తన వద్ద ఉన్న వివిధ చిత్రాలు, వీడియోలను తొలగించింది. పోలీసులు విమల్ను అరెస్టు చేసినప్పుడు, వారు అతని సెల్ఫోన్ను శోధించారు. సిమ్ కార్డు కొనుగోలు చేసిన స్నేహితుడి భార్యకు విమల్ అశ్లీల చిత్రాలను పంపినట్లు చూసి వారు షాక్ అయ్యారు. విమల్కు 2 వారాల క్రితమే వివాహం జరిగింది. అతన్ని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
- 
      
                   
                                                       నదిని దాటాలంటే.. ప్రాణాలతో చెలగాటమే..న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. జనజీవనం అతలాకుతలమవుతోంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో జనం తమ ప్రాణాలను పణంగా పెట్టి, నదులను దాటుకుంటూ ఆవలివైపునకు చేరుకుంటున్నారు. రాష్ట్రంలోని వరద పరిస్థితులను తెలియజేస్తూ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు(Kiren Rijiju) తన ‘ఎక్స్’ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు.ArunachalPradesh receives heaviest Monsoon rains in the world. Got this video of a man crossing traditional hanging bridge in Anjaw district, Arunachal Pradesh near tri-junction of India, China & Myanmar border. Please remain careful & safe. Govt will provide necessary support. pic.twitter.com/GZ9ypeOzZj— Kiren Rijiju (@KirenRijiju) June 1, 2025దానిలో ఒక నది ఉవ్వెత్తున ఉప్పొంగుతుండగా, ఒక వ్యక్తి తాడు పట్టుకుని ఎంతో కష్టం మీద వంతెన దాటున్న దృశ్యం కనిపిస్తోంది. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఏర్పడుతున్న వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాలలోని పరిస్థితులను ఈ వీడియో(Video) కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. అక్కడ ఉంటున్నవారు ఎంత దుర్భర స్థితిలో ఉంటున్నారో తెలియజేస్తుంది. ఈ వీడియోను భారత్, చైనా, మయన్మార్ సరిహద్దుల్లోని ట్రై-జంక్షన్ సమీపంలోని అంజావ్ జిల్లాలో చిత్రీకరించారు. ఈ వంతెనను వెదురు, చెక్కలు, తాళ్లతో నిర్మించినట్లు కనిపిస్తోంది. ఈ వంతెనలో అక్కడక్కడా కొంతభాగం భారీ వర్షాల కారణంగా కొట్టుకుపోయినట్లు లేదా మునిగిపోయినట్లు కనిపిస్తోంది. వీడియోలో వంతెనపై ఒకవైపు తాళ్లను పట్టుకున్న వెళుతున్న వ్యక్తి కనిపిసుండగా, కింద ఉప్పొంగి ప్రవహిస్తున్న నది ఏ క్షణంలోనైనా వంతెనను తుడిచిపెట్టేస్తుందనేలా ఉంది. గడచిన 48 గంటల్లో అరుణాచల్ ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందారు. ముఖ్యమంత్రి పెమా ఖండు బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతాయనే అంచనాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనవసరమైన ప్రయాణాలను చేయవద్దని కోరారు. ఇది కూడా చదవండి: బీహార్లో మరో దారుణం.. తొమ్మిదేళ్ల దళిత బాలిక విలవిల
- 
      
                   
                                                       దడ పుట్టించిన దుమ్ము తుఫాను.. గాలిలో విమానం చక్కర్లున్యూఢిల్లీ: గాలిలో ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి విచిత్ర పరిస్థితి ఎదురయ్యింది. విపరీతమైన దుమ్ము తుఫాను(Dust storm) కారణంగా రాయ్పూర్ - ఢిల్లీ ఇండిగో విమానం ల్యాండింగ్ను నిలిపివేయాల్సి వచ్చింది. వాతావరణం మెరుగుపడే వరకు ఇండిగో విమానం 6ఈ 6313 కొంతసేపు గాలిలోనే చక్కర్లు కొట్టింది. ఈ ఉదంతాన్ని ఒక ప్రయాణికుడు వీడియోలో రికార్డు చేశారు.ఆదివారం సాయంత్రం ఢిల్లీలో నెలకొన్న తీవ్రమైన దుమ్ము తుఫాను కారణంగా రాయ్పూర్-ఢిల్లీ ఇండిగో విమానం ల్యాండింగ్ను నిలిపివేయవలసి వచ్చింది. ఢిల్లీ-ఎన్సీఆర్(Delhi-NCR)లో చోటు చేసుకున్న ఈదురుగాలులు, దుమ్ము తుఫాను మధ్య పైలట్ ల్యాండింగ్ను నిలిపివేసి పరిస్థితులు మెరుగుపడే వరకు గాలిలో విమానాన్ని వృత్తాకారంలో తప్పుతూ వచ్చారు. ఈ సమయంలో ఒక ప్రయాణీకుడు రికార్డ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విమానం గాలిలో చక్కర్లు కొడుతున్నప్పుడు చుట్టూ అల్లకల్లోలంగా ఉన్న దృశ్యం వీడియోలో కనిపించింది. #WATCH | An IndiGo flight number 6E 6313 from Raipur to Delhi experienced turbulence due to a duststorm, prompting the pilot to climb up again when the aircraft was about to touch down at Delhi airport. The aircraft landed safely at Delhi airport after making many circuits in the… pic.twitter.com/TtDUwIH79b— ANI (@ANI) June 1, 2025ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) ల్యాండ్ చేయడానికి అనుమతి ఇచ్చిన తర్వాత విమానం ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. పైలట్ తెలిపిన వివరాల ప్రకారం ఆ సమయంలో గాలి వేగం గంటకు 80 కి.మీ మేరకు ఉంది. కాగా(సోమవారం)తెల్లవారుజామున ఢిల్లీ-ఎన్సీఆర్ అంతటా బలమైన గాలులు వీచాయి. కాగా మే చివరి మూడు రోజుల్లో ఢిల్లీ-ఎన్సీఆర్లోని పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షం, ఉరుములతో కూడిన వర్షాలు కురిసి, స్థానికులకు కాస్త ఉపశమనం కలిగించాయి. ఇది కూడా చదవండి: అమెరికాలో ‘పాలస్తీనా టెన్షన్’.. బాంబు దాడి కలకలం
- 
      
                   
                                                       నాతో గడుపు.. సర్టిఫికెట్ ఇప్పిస్తా!సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: అధికార మదంతో ఊగిపోతున్న కూటమి నేతలు(Kutami Leaders).. ఇప్పుడు కీచకుల్లా వ్యవహరిస్తున్నారు. తన భర్త డెత్ సర్టిఫికెట్ కోసం అర్జి పెట్టుకున్న ఓ మహిళను బీజేపీ నేత ఒకరు లైంగికంగా వేధిస్తున్న ఉదంతం విసన్నపేటలో వెలుగు చూసింది. విసన్నపేట(Vissannapeta) పట్టణంలో టీ దుకాణంలో పని చేసే ఆదిలక్ష్మీ.. బీజేపీ మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అబ్బినేని బాబుపై సంచలన ఆరోపణలకు దిగింది. ఆయన తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ వీడియో ద్వారా ఆమె వివరాలను వెల్లడించారు .బాధితురాలి భర్త కొద్ది రోజుల మరణించాడు. అయితే డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. అబ్బినేని బాబు ఆమె వద్దకు వచ్చి ఆరా తీశాడు. తనతో కొంత టైం గడిపితే డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తానంటూ అసభ్యకరంగా వ్యవహరించాడు. దీంతో ఆమె గట్టిగా తిట్టి పంపించేసింది. ఆటైంలో అబ్బినేని బాబు తాను చెప్పినట్లు వినకపోతే డెత్ సర్టిఫికెట్ ఎలా వస్తుందో చూస్తానంటూ బెదిరించారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం తెలిసి అబ్బినేని తప్పతాగి వచ్చి ఆమెపై బెదిరింపులకు దిగారు. ‘‘నేను ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే అంతటోడిని అని, ఎవరికీ భయపడను’’ అని మళ్లీ బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె తనకు న్యాయం జరగాలంటూ వీడియో ద్వారా అభ్యర్థించారు.ఇదీ చదవండి; చంద్రబాబు కోవర్టు రాజకీయం
- 
      
                   
                                                       మహానాడులో ఎన్టీఆర్ ఏఐ వీడియోపై గుసగుసలుసాక్షి, వైఎస్సార్ జిల్లా: 'సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు' అనే నినాదంతో తెలుగు దేశం పార్టీని స్థాపించి.. ప్రజాస్వామ్యానికి కొత్త అర్ధం చెప్పిన దార్శనికుడు ఎన్టీఆర్. అయితే ఆ తర్వాత పార్టీ చంద్రబాబు చేతుల్లోకి ఎలా వెళ్లింది.. ఎన్టీఆర్ ఎంతగా క్షోభ పడింది తెలుగు వాళ్లకు తెలిసిన విషయమే. తెలుగు దేశం పార్టీ మహానాడు వేళ.. అందునా ఆయన జయంతినాడు వైరల్ అవుతున్న ఓ వీడియోపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.టెక్నాలజీ అంటూ పదే పదే స్టేట్మెంట్లు ఇచ్చే చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్లు.. మహానాడులో ఏఐతో గొప్పల కోసం తిప్పలు పడడం నవ్వులు పూయిస్తోంది. ఎన్టీఆర్ స్వయంగా మహానాడుకు వచ్చి ఆ తండ్రీకొడుకులను పొగిడితే ఎలా ఉంటుందో అంటూ ఓ ఏఐ (NTR AI Video) వీడియోను మహానాడు వేదికపై ప్రదర్శించారు. చంద్రబాబు పీ4, అమరావతి ద్వారా రాష్ట్రాన్నే మార్చేస్తాడని.. యువగళంతో తన మనవడు లోకేశ్ కొత్త ఊపు తెచ్చాడంటూ ఏఐ ఎన్టీఆర్తో పొగడ్తలు గుప్పించుకున్నారు. ఆ టైంలో అక్కడే ఉన్న కార్యకర్తల్లో కొందరు.. ఆయన బతికి ఉంటే ఏం మాట్లాడే వారో? అంటూ నవ్వుకుంటూ గుసగుసలాడుకోవడం కనిపించింది. మరోవైపు.. ఏఐ వీడియో ద్వారా మాట్లాడిన సీనియర్ ఎన్టీఆర్మహానాడులో ఏఐ వీడియో ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగం సృష్టించి, చంద్రబాబు, లోకేష్ లను పొగడ్తలతో ముంచెత్తిన టీడీపీ నాయకులు pic.twitter.com/if9KqwNHhM— Telugu Scribe (@TeluguScribe) May 28, 2025Video Credits: Telugu Scribeతనను చంద్రబాబు సీఎం గద్దెనుంచి దింపి.. టీడీపీని లాక్కున్న తర్వాత ఎన్టీఆర్ చంద్రబాబు నిజస్వరూపం గురించి పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఈ క్రమంలో తాజా ఏఐ వీడియోపై సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు కనిపిస్తున్నాయి. చంద్రబాబు తన ఆత్మను అమ్ముకున్నాడని, ఔరంగజేబు వారసుడని, తన కంటే పెద్ద నటుడంటూ నాడు ఎన్టీఆర్ చెప్పిన మాటలను కొందరు సోషల్ పోస్ట్ చేస్తున్నారు. ఇదేం ఆనందం చంద్రబాబు, లోకేష్? అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. Video Credits: vasanth_gollapalliఇదీ చదవండి: Mahanadu-కనీసం భోజనాల దాకా అయినా ఆగండయ్యా!
- 
      
                   
                                                       ట్రంప్ పేరుతో నకిలీ యాప్బెంగళూరు: సైబర్ నేగరాళ్లు చివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కూడా వదల్లేదు. ఆయన పేరుతో యాప్ను రూపొందించి.. 150 మందిని మోసం రూ.కోటి వసూలు చేశారు. ‘ట్రంప్ హోటల్ రెంటల్’పేరుతో యాప్ క్రియెట్ చేసిన స్కామర్లు.. ఇందులో పెట్టుబడులు పెడితే డబ్బు రెట్టింపవుతుందని నమ్మబలికారు. యాప్ చట్టబద్ధమైనదిగా చూపించడానికి ఏఐ జనరేటెడ్ ట్రంప్ వీడియోను ప్రసారం చేశారు. పెట్టుబడి పెట్టిన వారికి బహుమతులు కూడా ఆశ చూపారు. అంతేకాదు.. ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. దీంతో నమ్మిన బెంగళూరు, తమకూరు, మంగళూరు, హవేరి వరకు ప్రజలు యాప్లో ఉన్న నంబర్కు కాల్ చేసి డబ్బు ఇచ్చారు. 150 మంది కోటికి పైగా పెట్టుబడి పెట్టారు. వీరికి నమ్మకం కలిగించేందుకు స్కామర్లు ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేవారు. కొన్ని రోజులపాటు చిన్నచిన్న బహుమతులు కూడా అందజేశారు. ఆ తరువాత షేర్లు రోజురోజుకూ పెరుగుతున్నట్టుగా డిజిట్స్ మారుస్తూ వారిని మాయ చేశారు. ఆ తరువాత కొంతకాలానికి యాప్లో ఉన్న నంబర్కు కాల్ చేస్తే స్పందన లేదు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించారు. ఒక్క హవేరీలోనే 15 మందికి పైగా మోసపోయారని పోలీసు అధికారులు వెల్లడించారు.
- 
      
                   
                                                       అతను.. మాజీ సైనికుడువిశాఖ సిటీ/మధురవాడ: సోషల్ మీడియాలో వైరల్ అయిన అనుమానాస్పద వ్యక్తిని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. విచారించగా అతడు ఆర్మీలో ఉద్యోగ విరమణ పొందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం అతడు మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో 24 గంటల టెన్షన్కు తెరపడింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం సాయంత్రం పెద్ద గడ్డంతో సూట్ ధరించిన సుమారు 40 ఏళ్ల వ్యక్తి సిరిపురంలోని పలు ప్రాంతాల్లో ఫొటోలు తీశాడు. అతడు అనుమానాస్పదంగా తిరుగు తూ ఫొటోలు తీస్తుండడాన్ని అక్కడున్న స్థానికులు వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. పాకిస్తాన్తో యుద్ధ నేపథ్యంలో ఆ వీడియో, ఫొటోలు వైరల్ అయ్యాయి. అనుమానాస్పదంగా తిరుగుతూ ఫొటోలు తీస్తుండడంతో ప్రమాదకరమైన వ్యక్తిగా భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై సీపీ శంఖబ్రత బాగ్చి అతన్ని పట్టుకోవాలని ఆదేశించారు. ఆ వ్యక్తి కోసం నగరంలో అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో గాలింపు చేపట్టారు. వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఆ వ్యక్తి కార్òÙడ్ జంక్షన్ వద్ద బస్సులో వెళ్తున్నట్లు పీఎంపాలెం సీఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది గుర్తించారు. అతన్ని స్టేషన్కు తీసుకువెళ్లి విచారణ చేయగా విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పక్కి గ్రామానికి చెందిన పెంకి ప్రవీణ్కుమార్గా తెలుసుకున్నారు. అతడు 2023లో ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాడు. అతని తల్లిదండ్రులు, అన్నదమ్ములతో ఫోన్లో మాట్లాడారు. ఆ వ్యక్తి ఆర్మీ నుంచి రిటైర్ అయిన తరువాత కొంత కాలంగా మానసిక, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ అనంతరం అతడిపై ఎటువంటి నేరపూరితమైన, చెడు నడత ఉన్నట్లు ఆధారాలు లేకపోవడంతో అతని బంధువులకు ఇచ్చి పంపించారు. సోషల్ మీడియా వెర్రి వెతలు. విశాఖలో అజ్ఞాత వ్యక్తి ఫోటోలు తీస్తూ అనుమానాస్పదంగా వున్నారంటూ వైరల్. పోలీసులు ఆరా తీయగా బొబ్బిలికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిగా గుర్తింపు.#AndhraPradesh #Visakhapatnam #Vizag #TeluguNews #VizagNews pic.twitter.com/VRhnK4IZo7— Vizag News Man (@VizagNewsman) May 10, 2025
- 
      
                   
                                                       'తొలి యూట్యూబ్ వీడియో' ..! ఇప్పటికీ 300 మిలియన్లకు పైగా వ్యూస్సోషల్ మీడియా ప్లాట్ఫాం రారాజుగా నీరాజనాలు అందుకుంటోంది 'యుట్యూబ్'..!. దీని పుణ్యమా అని నేటితరం ఏదైనా అవలీలగా చిటికెలో నేర్చేసుకుంటోంది. ఏ చిన్న సందేహం వచ్చినా..యూట్యూబ్ సాయంతో చకచక తెలుసుకుంటున్నారు. అది కుకింగ్, చదువు, ఇతరత్రా ఏదైనా..క్షణాల్లో తెలుసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. అంతేగాదు ఈ యూట్యూబ్ సాయంతో ఎంతో మంది ఓవర్నైట్ స్టార్లుగా మారారు. పైగా ఎంతోమందికి జీవనోపాధిని అందించింది కూడా. అలాంటి యూట్యూబ్ ఫ్లాట్ ఫాంలో అప్లోడ్ అయినా తొలి వీడియో ఏదో తెలుసా..అది నేటికి నిశ్శబ్దంగా ఇంటర్నెట్ చరిత్రను సృష్టిస్తోంది. యూట్యూబ్ను ఫిబ్రవరి 14, 2005న జావేద్ కరీం, చాడ్ హర్లీ, స్టీవ్ చెన్, పేపాల్ తదితర వ్యక్తులు స్థాపించారు. ఇది ప్రస్తుతం గూగుల్ యాజమాన్యంలో ఉంది. అలా మొదలైనా యూట్యూబ్ ప్రస్థానం..ఎంతోమంది యంగ్ టాలెంట్ని వెలికితీసి పరిచయం చేసింది..వారి స్కిల్ ప్రపంచమే తెలుసుకునేందుకు వేదికగా మారింది. అంతేగాదు దీని సాయంతో కొందరూ కంటెంట్ క్రియేటర్లుగా మారి ప్రభంజనం సృష్టిస్తున్నారు కూడా. అలాంటి యూట్యూబ్ ఫ్లాట్ ఫాంపై అప్లోడ్ అయినా తొలి వీడియో ఏదో తెలుసా..!. ఇప్పటికీ అది మిలియన్ల వ్యూస్తో దూసుకుపోతూ నెట్టింట చరిత్ర సృష్టిస్తోంది. పైగా అది జస్ట్ 19 సెకన్ల వీడియో. ఏప్రిల్ 23, 2005న, YouTube సహ వ్యవస్థాపకుడు జావేద్ కరీం శాన్ డియాగో ఓ జూ వద్ద నిలబడి చేసిన చిన్న వీడియో అది. సుమారు 20 ఏళ్ల క్రితం జావేద్ ఏనుగుల ముందు నిలబడి..వాటి గురించి మాములుగా చెబుతున్న సాధారణ వీడియో. ఎలాంటి ఎడిటింగ్ లేకుండా..కనీసం వెనుక ఏవిధమైన సంగీత నేపథ్యం లేని సాదాసీదా వీడియో క్లిప్ అది. కానీ ఆ వీడియోకి గత కొన్నేళ్లుగా వస్తున్నా..వ్యూస్, లైక్లు చూస్తే మతిపోతుంది. ఇప్పటికీ ఆ ఈవీడియోకి 335 మిలియన్లకు పైగా వ్యూస్, 17 మిలియన్లకు పైగా లైక్లు ఉండటం విశేషం. మరో గమ్మత్తైన విశేషం ఏంటంటే.. కరీమ్ య్యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ అయినా ఏకైక వీడియో అదే కావడం. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు కూడా చూసేయండి మరీ..!. (చదవండి: 24 ఏళ్లకే కంపెనీ రన్ చేశాడు ..28కే రిటైర్మెంట్! ఏకంగా రూ. 106 కోట్లు..)
- 
      
                   
                                                       ఐదేళ్లుగా అదే పని.. మహిళలు స్నానం చేస్తుండగా..వెంగళరావునగర్(హైదరాబాద్): మహిళలు స్నానం చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీస్తున్న వ్యక్తిని మధురానగర్ అసోసియేషన్ నేతలు పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం... మధురానగర్కాలనీ కమ్యూనిటీహాల్లో కొన్నేళ్లుగా ఓ కుటుంబం విధులు నిర్వర్తిస్తోంది. వారి కుమార్తె సమీపంలోని చీరల దుకాణంలో సేల్స్గర్ల్గా పని చేస్తోంది. ఆమె సోమవారం ఉదయం విధులకు వెళ్లడానికి స్నానం చేస్తూ సబ్బు కోసం వెతికింది. అయితే ఆమెకు అక్కడ మొబైల్ ఫోన్ చేతిని తాకింది. భయపడి దుస్తులు ధరించి బయటకు వచ్చి చూడగా కమ్యూనిటీహాల్లో ఎలక్ట్రిషియన్గా విధులు నిర్వర్తించే వై.మరియాలి కుమార్ స్నానం గది కిటికీ పక్కన దాక్కుని ఉన్నాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు తెలియజేయగా అతడు వచ్చి మరియాలి కుమార్ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఫోన్తో సహా అతను పారిపోయాడు. విషయాన్ని బాధితురాలు సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రతాప్రెడ్డి తదితరులకు తెలియజేసింది. సంఘం నేతలు పోలీసులకు ఫోన్ చేసి ఎలక్ట్రిషియన్ను పట్టుకుని విషయాన్ని సేకరించారు. ఐదేళ్లుగా మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు, ఫొటోలు తీస్తున్నట్లుగా అంగీకరించాడు. తాను తీసిన వీడియోలు, ఫొటోలు అన్నీ తొలగించినట్టుగా తెలియజేశాడు. అనంతరం నిందితుడిని కాలనీ నేతలు మధురానగర్ పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- 
      
                   
                                                       బెంగళూరు మెట్రోస్టేషన్లో ప్రేమికుల...కర్ణాటక: గతంలో తెరవెనుక జరిగే రొమాన్స్ నేడు వీధుల్లోకి వచ్చింది. మెట్రో రైల్వేస్టేషన్లో ఓ జంట పట్టపగలే అందరి ముందు ప్రేమ కలాపాల్లో మునిగిపోయిన వీడియో భారీ వైరల్గా మారింది.ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు నగరంలోని మెజెస్టిక్ మెట్రోస్టేషన్ ఒకటో ప్లాట్ఫాంలో ఓ జంట, చుట్టుపక్కల ప్రయాణికులు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యం ఎవరో మొబైల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్గా మారింది. ప్రేమికులు ప్రేమకలాపం చోటు చేసుకున్నది మెజెస్టిక్ మెట్రోస్టేషనా లేక మాదావర స్టేషన్లోనా అనే స్పష్టత లేనప్పటికీ అందరి ముందు ఇలా ప్రవర్తించడంపై ఆ జంటపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక నిమిషం 30 సెకండ్ల నిడివి ఉన్న ప్రేమికుల రొమాన్స్ వీడియోపై వేలాదిమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దృశ్యాలు విదేశాల్లో మాత్రమే చూడవచ్చు. ఇటీవల రోజుల్లో ఇక్కడ కూడా ఇలాంటి ప్రవృత్తి పెచ్చుమీరడం మంచిది కాదని సోషల్ మీడియాలో నెటిజన్ ఒకరు తెలిపారు.
- 
      
                   
                                                       Delhi Metro: మరో వీడియో వైరల్.. ఈసారి మద్యం వంతు..న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఢిల్లీ మెట్రో(Delhi Metro)కు చెందిన మరో వీడియో వైరల్గా మారింది. దీనిని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియోలో మెట్రోలో కూర్చున్న ఒక ప్రయాణికులు ఒక చేతితో మద్యం గ్లాసు పట్టుకుని తాగుతూ, మరో చేతితో ఉడికించిన గుడ్డును తింటున్నాడు. తనను ఎవరైనా గమనిస్తున్నారా అని అటునిటు చూస్తూ మద్యం సిప్ చేస్తున్నాడు. దీనిని గమించిన ఒక ప్రయాణికుడు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై ఢిల్లీ పోలీసులు వెంటనే స్పందించారు.Eggs & "Alcohol" in the Metro? That’s not breakfast - that’s a Breach !!Break the rules, Face the consequences, Rules aren’t suggestions: They’re the law.#DPUpdates pic.twitter.com/CP2P5fDFiW— Delhi Police (@DelhiPolice) April 9, 2025ఢిల్లీ పోలీసులు ఈ వీడియోను సోషల్ మీడియా(Social media) ప్లాట్ఫారం ‘ఎక్స్’లో షేర్ చేస్తూ ‘మెట్రోలో గుడ్లు, మద్యం తీసుకోవడం అనేది అల్పాహారమేమీ కాదు. ఇది నియమాల ఉల్లంఘన. ఇలా చేసినందుకు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు. అయితే మెట్రోలో కనిపించిన ఆ వ్యక్తి పోలీసులకు క్షమాపణలు చెబుతూ ‘ఆ వీడియోలో నేను గుడ్డు తింటూ, మద్యం తాగుతున్నట్లు కనిపించాను. కానీ అది మద్యం కాదు, అప్పీ ఫిజ్ (Appy Fizz)’ అని వివరణ ఇచ్చాడు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)ఈ ఘటనపై స్పందిస్తూ మెట్రోలో మద్యం సేవించడం నిబంధనలకు విరుద్ధమని, ప్రయాణికులు బాధ్యతాయుతంగా మెలగాలని సూచించింది. డీఎంఆర్సీ(DMRC) ఒక అధికారిక ప్రకటనలో ‘ఈ వీడియో ఉద్దేశపూర్వకంగా రూపొందించినట్లు కనిపిస్తోంది. మద్యం సేవించడం లాంటి వ్యవహారాలు మెట్రో నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది’ అని పేర్కొంది. అలాంటి ఘటనలను ఎవరైనా చూస్తే, వెంటనే మెట్రో సిబ్బందికి లేదా సీఐఎస్ఎఫ్ అధికారులకు తెలియజేయాలని కోరింది. కాగా ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. కొందరు ఆ వ్యక్తి చర్యను తప్పుపట్టగా, మరికొందరు అతని వివరణ హాస్యాస్పదమని కామెంట్ చేశారు.ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ ఆరోపణలపై చైనా ఆగ్రహం
- 
      
                   
                                                       ఏకంగా పోలీసు వాహనంతోనే రీల్!సోషల్ మీడియాలో రీల్స్ మోజులో విచక్షణ మర్చిపోతున్నారు. కంటెంట్ కోసం, వ్యూస్ కోసం వాళ్లు సృష్టించా అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి ఒక పిచ్చి పనికి లక్షల కొద్దీ వ్యూస్ రావడంతో ఇక అందరూ అదే బాటపడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ ఈ రీల్స్ పురాణం చాలా పెద్దదే. తాజాగా నాగర్కర్నూల్కు చెందిన ఇద్దరు యువకులు పోస్ట్ చేసిన రీల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏకంగా పోలీస్ పెట్రోలింగ్ వెహికిల్తోనే రీల్స్ చేశారా యువకులు. ఇద్దరు యువకులు పోలీసు వాహనం నడుపుతూ.. రీల్స్చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు వివాదా స్పద మయ్యాయి. నాగర్కర్నూల్ జిల్లా ఈగలపెంటలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. జిల్లాలోని ఈగలపెంట పోలీస్స్టేషన్కు చెందిన ఇన్నోవా టీఎస్ 09 పీఏ 4622 వాహనాన్ని మంగళవారం ఇద్దరు యువకులు నడుపుతూ రీల్స్ చేశారు. ఈగలపెంట పోలీస్స్టేషన్కు చెందిన ఓ అధికారి బంధువులే.. దోమలపెంట సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన రీల్స్ చేసినట్టు తెలుస్తోంది. కాగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాగర్కర్నూల్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
- 
      
                   
                                                       'ఇది నీకు సిగ్గుచేటు'.. బిల్గేట్స్ ఎదుటే నిరసన (వీడియో)శుక్రవారం జరిగిన 50వ మైక్రోసాఫ్ట్ వార్షికోత్సవ వేడుకలో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఇజ్రాయిల్ మిలటరీకి ఏఐ టెక్నాలజీని అందిస్తుండటాన్ని వారు వ్యతిరేకించారు. మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ 'ముస్తఫా సులేమాన్' ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో ఈ పరిణామ చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ముస్తఫా సులేమాన్ ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగి ఇబ్తిహాల్ అబౌసాద్ వేదిక వద్దకు వచ్చి ఆయన వ్యాఖ్యలకు అంతరాయం కలిగించారు. ముస్తఫా.. ఇది నీకు సిగ్గుచేటు. ఏఐను మంచి కోసం ఉపయోగిస్తున్నామని మీరు చెబుతున్నారు. కానీ గాజా ఘర్షణ సమయంలో ఇజ్రాయెల్ మిలటరీకి ఏఐ టెక్నాలజీని అందించి.. 50వేల మంది మరణానికి కారణమైంది. మైక్రోసాఫ్ట్ మారణహోమానికి సహాయం చేసిందని అన్నారు.నేను మీ మాటలు వింటున్నాను, థాంక్యూ అంటూ.. ఆమె మాటలకు ముస్తఫా స్పందించారు. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్, సీఈఓ సత్య నాదెళ్ల, మాజీ సీఈఓ స్టీవ్ బాల్మెర్ కూడా ఉన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగం కోసం మూడేళ్లు: హృదయాన్ని కదిలించే పోస్ట్ఇబ్తిహాల్ అబౌసాద్ నిరసన తెలిపిన తరువాత.. మరో ఉద్యోగి వానియా అగర్వాల్ కూడా నీరసం తెలిపారు. మైక్రోసాఫ్ట్ వార్షికోత్సవ వేడుకలో వీరు నిరసన తెలిపినందుకు వారు తమ వర్క్ అకౌంట్ యాక్సెస్ కోల్పోయినట్లు సమాచారం. బహుశా వారిని ఉద్యోగంలో నుంచి తొలగించి ఉండొచ్చని తెలుస్తోంది.An employee disrupted Microsoft’s 50th anniversary event to protest its use of AI.“Shame on you,” said Microsoft worker Ibtihal Aboussad, speaking directly to Microsoft AI CEO Mustafa Suleyman. “You are a war profiteer. Stop using AI for genocide. Stop using AI for genocide in… pic.twitter.com/cfub3OJuRv— PALESTINE ONLINE 🇵🇸 (@OnlinePalEng) April 4, 2025
- 
      
                   
                                                       Myanmar: భూ ప్రకంపనల వైరల్ వీడియోలునేపిడా/బ్యాంకాక్: మయన్మార్(Myanmar)ను భూకంపం కుదిపేసింది. వందలాది భవనాలు నేల మట్టమయ్యాయి. మరణాల సంఖ్య లెక్కకు అందనంతగా ఉంది. ఇక నిరాశ్రయులైనవారి సంఖ్య చెప్పలేనంతగా ఉంది. ఈ భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Dashcam footage of the powerful 7.7 magnitude earthquake in Myanmar Mandalay city#MyanmarEarthquake #Myanmar #Burma #Thailand #Bangkok pic.twitter.com/jzuRilDMsr— Culture War Report (@CultureWar2020) March 29, 2025మయన్మార్, థాయిలాండ్లలో సంభవించిన భూకంపానికి సంబంధించిన ఈ వీడియోలో ఆకాశహర్మ్యాలు ఊగడాన్ని చూడవచ్చు. రోడ్లపై వాహనాలు కదలడాన్ని కూడా చూడవచ్చు. ఈ వీడియో వణుకుపుట్టించేదిగా ఉంది.High-rise condo in Thailand with a pool on the 37th floor#Myanmar #Burma #Thailand pic.twitter.com/9tHDxZ7B4M— Culture War Report (@CultureWar2020) March 29, 2025ఈ వీడియోలో ఆకాశహర్మ్యంలో నిర్మించిన స్విమ్మింగ్ ఫూల్లో అలలు ఏర్పడి, అవి ఎగసిపడటాన్ని చూడవచ్చు. దీనిని చూస్తే చాలు.. భూకంప తీవ్రతను అంచనా వేయవచ్చు.🧵 Extreme shaking going on in Myanmar during the 7.7 Earthquake#MyanmarEarthquake #Myanmar #Burma #Thailand #Bangkok pic.twitter.com/4jGeCgZJXc— Culture War Report (@CultureWar2020) March 29, 2025ఈ వీడియోలో ఇంటిలో ఏర్పడిన భూకంప ప్రభావాన్ని చూడవచ్చు. చిన్న చెట్టును ఊపినప్పుడు అది ఎలా ఊగిపోతుందో ఆ విధంగా ఈ ఇల్లు భూకంప తీవ్రతకు ఊగిపోయింది.People trapped on the 78th floor Skywalk at Mahanakhon Building, Bangkok, during the 7.7 earthquake#MyanmarEarthquake #Myanmar #Burma #Thailand #Bangkok pic.twitter.com/j7WQYai24w— Culture War Report (@CultureWar2020) March 29, 2025స్కై వాక్ చేయడానికి 78వ అంతస్తుకు చేరుకున్న జనం భవనం కంపించడంతో ఎంతగా భయపడ్డారో ఈ వీడియోలో చూడవచ్చు. అక్కడున్న వస్తువులు జారిపోతుండటాన్ని గమనించవచ్చు.🧵 Mother Nature is Mind blowing The Earth was torn open today in Myittha, Mandalay Region, following the powerful 7.7 earthquake in Myanmar#MyanmarEarthquake #Myanmar #Burma #Thailand #Bangkok pic.twitter.com/tORlQD019c— Culture War Report (@CultureWar2020) March 29, 2025ఈ వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. భూమి పూర్తిగా చీలిపోయి, చాలా లోతైన పగుళ్లు ఏర్పడటాన్ని చూడవచ్చు.Narrowly escape! In #Bangkok, Thailand, a worker was cleaning the exterior walls while the building shook violently due to the #Myanmar earthquake, nearly hit by the falling glasses.#Myanmarquake #earthquakemyanmar pic.twitter.com/mDSB8MgiX4— Shanghai Daily (@shanghaidaily) March 29, 2025ఈ వీడియోలో భూకంపం తర్వాత ఆకాశహర్మ్యం పైకప్పుపై నుంచి నీరు జలపాతంలా పడటం కనిపిస్తుంది. భూకంపం సంభవించిన సమయంలో భవనాన్ని శుభ్రం చేస్తున్న వ్యక్తి ఎంతో భయపడుతూ కనిపిస్తున్నాడు.Devastating 7.7 Earthquake causes water to rise up from the ground in Myanmar pic.twitter.com/VFfT8qMLmU— TaraBull (@TaraBull808) March 29, 2025ఈ వీడియోలో భూమికి పగుళ్లు ఏర్పడిన దరిమిలా భూమి నుండి పంపు ద్వారా నీరు దానికదే ఉబికి రావడాన్ని గమనించవచ్చు.Nurses at a maternity center in Ruili, southwest China's Yunnan Province, did all they could to protect newborns when a deadly earthquake struck Myanmar, sending strong tremors across the border into Yunnan. #quake #heroes #China pic.twitter.com/KKhkxiDrKm— China Xinhua News (@XHNews) March 29, 2025ఈ వీడియో నైరుతి చైనాలోని ఒక ఆస్పత్రికి సంబంధించినది. భూకంపం సమయంలో నవజాత శిశువులను రక్షించడానికి నర్సులు పడుతున్న పాట్లను గమనించవచ్చు.ఇది కూడా చదవండి: ‘ప్రయాగ్రాజ్’కు పోటీగా నాసిక్ కుంభమేళా
- 
      
                   
                                                       ‘నీ ఇష్టమొచ్చింది చేసుకో’.. ట్రంప్ను రెచ్చగొడుతూ ఇరాన్ వీడియోతెహ్రాన్ : ఇరాన్ ఎనభై ఐదు సెకన్ల నిడివిగల వీడియోతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను రెచ్చగొట్టింది. అమెరికాతో ఎట్టి పరిస్థితుల్లో అణు ఒప్పందం చేసుకోబోమని పరోక్షంగా సంకేతాలిచ్చింది.ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్కు లేఖ రాశారు. ఇరాన్తో అణు ఒప్పందం చేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెబుతూనే ఆ దేశం చర్చలకు రావాలని ఆహ్వానించారు. అందుకు సుమారు రెండు నెలల డెడ్లైన్ విధిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖపై ఇరాన్ అధ్యక్షుడు స్పందిస్తూ.. ట్రంప్తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధం లేమని, ఆయనకు ఇష్టమొచ్చింది చేసుకోవచ్చు’అని పేర్కొన్నారు.అయితే, ట్రంప్ విధించిన అణు ఒప్పందం డెడ్ లైన్ గడువు సమీపిస్తున్న తరుణంలో తన సైనిక విభాగం బలంగా ఉందని చెబుతూ ఇరాన్ ఎనభై ఐదు సెకన్ల వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో మిస్సైల్ సిటీ పేరుతో క్షిపణులను ఏర్పాటు చేసిన తన మూడవ అండర్గ్రౌండ్ ప్రదేశాల్ని క్యాప్చర్ చేసింది. అండర్గ్రౌండ్ టన్నెల్స్లో ఏర్పాటు చేసిన మిస్సైల్ సిటీలో భారీ అణు ఆయుధాల్ని మనం చూడొచ్చు. Iran is responding to external threats by releasing a new video showcasing one of its underground missile tunnel systems, packed with missile engines, mobile launchers, and a range of advanced weaponry. The footage prominently features the Paveh cruise missile, the Ghadr-380… pic.twitter.com/ILsdlrPtQy— Basha باشا (@BashaReport) March 25, 2025ఇక ఇరానియన్ రాష్ట్రీయ మీడియా ప్రసారం చేసిన 85 సెకన్ల వీడియోలో ఇరాన్ సైనిక సారథి మేజర్ జనరల్ మొహమ్మద్ హోసేన్ బాగెరీ, ఐఆర్సీజీ ఏరోస్పేస్ ఫోర్స్ చీఫ్ అమీర్ అలీ హాజిజాదెహోలు ఓపెన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ ఆ క్షిపణుల్ని చూపిస్తున్నారు.ఇరాన్ మిస్సైల్ సిటీలో ఖైబర్ షెకాన్, ఘదర్-హెచ్,సెజిల్, పావే ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి. ఈ అణు ఆయుధాల్ని ఇరాన్ ఇటీవల ఇజ్రాయిల్పై దాడి చేసేందుకు ఉపయోగించినట్లు పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.
- 
      
                   
                                                       ‘డాన్స్ కోసం పుట్టి.. ప్రొఫెసర్ అయ్యారు’బెంగళూరు: ఏదైనా కళాశాలో పంక్షన్ జరుగుతున్నప్పుడు విద్యార్థులు నృత్యం చేస్తుంటే, ఉపాధ్యాయులు వారిని ఉత్సహపరచడాన్ని, ఆనందించడాన్ని చూస్తుంటాం. అయితే దీనికి భిన్నమైన దృశ్యం బెంగళూరులో కనిపించింది. ఇక్కడి ఒక కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్ విద్యార్థుల సమక్షంలో హిప్-హాప్ నృత్యం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో సంచలనాలు సృష్టిస్తోంది. ఆ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఆ ప్రొఫెసర్ను ఉత్సాహపరుస్తుండగా, అతను డాన్స్ ఇరగదీయడాన్ని మనం వీడియోలో చూడవచ్చు.గ్లోబల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీ(Global Academy of Technology) (గాట్) విద్యార్థులు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియోలో ప్రొఫెసర్ పుష్ప రాజ్.. ప్లే అవుతున్న మ్యూజిక్కు అనుగుణంగా నృత్యం చేయడాన్ని చూడవచ్చు. మైఖేల్ జాక్సన్ తరహాలో నృత్యం చేశారు. కళాశాల కారిడార్లో ప్రొఫెసర్ నృత్యం చేస్తుండగా, విద్యార్థులు ఆనందంతో కేకలు వేశారు. కళాశాలలోని విద్యార్థులంతా అతని నృత్యాన్ని వీక్షించారు. ఈ వీడియో ఇప్పటికే 24 మిలియన్లకు పైగా వ్యూస్ను దక్కించుంది.ఈ వీడియోను చూసిన యూజర్స్ సోషల్ మీడియా(Social media)లో రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఒక యూజర్ ‘నృత్యకారునిగా పుట్టారు.. లెక్చరర్గా బలవంతంగా మారారు’ అని రాయగా, మరొకరు ‘అతను నా గురువు కాకుంటే, నాకు ఇష్టమైన హీరో అయ్యేవారు’ అని రాశారు. మరొకరు ‘అతను తనకు నచ్చని వృత్తిలో కొనసాగుతున్నారు’ అని రాశారు. మొరొకరు *అతను మాస్టర్ జీ కాదు..డ్యాన్స్ మాస్టర్ జీ’ అని రాశారు. View this post on Instagram A post shared by 🎥🚀 (@gatalbum)ఇది కూడా చదవండి: New Delhi: తృటిలో తప్పిన తొక్కిసలాట
- 
      
                   
                                                       బీట్స్తో అదరగొట్టేసిన బుడ్డోళ్లు : 3 కోట్ల వ్యూస్, ఓ లుక్కేసుకోండి మరి!‘బాల్యం బంగారు నిధి’ ఇది అందరం ఒప్పుకునే మాట. బాల్య స్మృతులు ఎవరికైనా చెప్పలేనంత ఉల్లాసాన్ని ఇస్తాయి. బాల్యం అనగానే అందమైన అనుభూతులు, అనుభవాలు ఒక్కసారిగా మనల్ని చుట్టుముడతాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించిన జ్ఞ్యాపకాలు ఒక్కసారిగా నిద్ర లేస్తాయి. చిన్నపుడు మనం చేసిన అల్లరి, చిలిపి చిలిపి చేష్టలు గుర్తొస్తాయి. బ్లాక్ బోర్డుపై రాసిన రాతలు, స్కూలు బెంచ్పై చెక్కుకున్నపేర్లు, అదేదో సినిమాలో అన్నట్టు నచ్చిన అమ్మాయిపై పేపర్ బాల్ విసరడం, అది మాస్టార్కు తగిలి, వీపు పగలడం ఇలా.. ఎన్నో..ఎన్నో గుర్తుకు వస్తాయి కదా. ఇపుడు మీరు చదవబోయే కథనం కూడా అలాంటి ఎన్నో అనుభవాలను గుర్తు చేస్తుంది. పుణేకు చెందిన విద్యార్థుల వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది.ప్రాజెక్ట్ అస్మి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో ఇపుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఇది 3 కోట్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. కమెంట్లు వెల్లువెత్తాయి. పూణేలోని ఒక పాఠశాల చెందిన బ్యాచ్ జామెట్రీ బాక్స్, బెంచె మీద వాయిస్తూ అద్భుతమైన సంగీతాన్ని సృష్టించారు. వాటర్ బాటిల్ను మాత్రమే ఉపయోగించి డ్రమ్ బీట్స్తో అదరగొట్టేశారు. ఒకరి తరువాత ఒకరు తమ టాలెంట్తో రెచ్చిపోయారు. దీంతో తరగతి గది ఒక చిన్న కచేరీ వేదికగా మారిపోయింది. దీంతో టీచర్లు కూడా అలా మైమరిచిపోయారు. చుట్టూ ఉన్న పిల్లలు, స్నేహితులు చప్పట్ల మోత మోగించారు. చదవండి: అప్పుడు వెడ్డింగ్ గౌను, ఇపుడు ఎంగేజ్మెంట్ రింగ్ : సమంత అంత పనిచేసిందా? View this post on Instagram A post shared by Project Asmi (@projectasmi_pune)అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించి విద్యార్థులు ఉత్పత్తి చేసే బీట్లు , రిథమ్లు భలే ఉంటాయి. వారి క్రియేటివిటీని మెచ్చుకోకుండా ఉండలేం. కల్మషం లేని లేత వయసులో వారి ప్రతిభను ,సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహిస్తే గొప్ప ప్రతిభావంతులుగా మారతారు. మరి ఈ బాల శివమణిలకు ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుందో వేచి చూద్దాం.
- 
      
                   
                                                       మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. ఈ స్పెషల్ వీడియో చూశారా?టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీలో పలువురు అగ్రతారలు నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్బాబు, మోహన్లాల్, ప్రభాస్, అక్షయ్కుమార్, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇటీవలే రెండో టీజర్ విడుదల చేసిన ఈ భారీ ప్రాజెక్ట్ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియోను మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ మూవీ మేకింగ్కు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. ఇందులో మంచు విష్ణు పలు అంశాలపై టీమ్తో చర్చిస్తూ కనిపించారు. ఈ సినిమా తెర వెనుక సంగతులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. The making of Kannappa#kannappa pic.twitter.com/hZCBKbjjYK— Vishnu Manchu (@iVishnuManchu) March 9, 2025
- 
      
                   
                                                       మరణశయ్యపై తల్లి.. కూతురి దుర్మార్గంపై కోర్టు కన్నెర్రకన్నతల్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.. ఆ కూతురేమో దుర్మార్గంగా ఆలోచించింది. ఆస్తి కోసం బలవంతంగా ఆమెతో వీలునామాపై సంతకం చేయించుకుంది. అయితే సాక్ష్యంగా ఉంటుందని ఆ కూతురు తీయించుకున్న వీడియోనే.. ఈ బండారం మొత్తాన్ని బయట పెట్టింది. దీంతో కోర్టు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చింది . యూకేలో ఓ వ్యక్తి మూడేళ్లపాటు చేసిన న్యాయ పోరాటం.. నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. సోదరుడిని మోసం చేసి ఆస్తి కొట్టేయాలని భావించిన ఓ మహిళకు పెద్ద షాకే తగిలింది. అతనికి 7 లక్షల పౌండ్ల విలువైన(మన కరెన్సీలో రూ.7 కోట్ల 86 లక్షల దాకా) విలువైన ఆస్తిపాస్తుల్లో సగం సోదరుడికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.కేసు ఇదే..మార్గరేట్ బేవర్స్టాక్(76) అనే మహిళ 2021 మార్చిలో కన్నుమూసింది. చనిపోయే టైంలో ఆమె తన ఆస్తి మొత్తం కూతురు లీసా పేరిట రాసింది. కొడుకు జాన్కు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. అయితే మతిమరుపు జబ్బుతో బాధపడుతున్న తన తల్లి.. సోదరికి మాత్రమే ఆస్తి ఎలా రాయగలిగిందని అతనికి అనుమానం వచ్చింది. ఆస్తిలో వాటా కోరుతూ.. సెంట్రల్ లండన్ కౌంటీ కోర్టులో పిటిషన్ వేశాడు.తన తల్లి 2014 నుంచే మతిమరుపు వ్యాధితో బాధపడుతోందని, ఆ వీలునామాపై అనుమానాలు ఉన్నాయని వాదించాడతను. అయితే తల్లి తన పేరిట రాసిన వీలుకు సంబంధించిన వీడియోను లీసా కోర్టులో ప్రవేశపెట్టింది. ఆ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయమూర్తి జేన్ ఇవాన్స్.. లీసాను గద్దించారు. అది బలవంతంగా చేయించుకున్నదేనని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆ వీడియోలో ఆమె అతి కష్టంగా మాట్లాడుతోంది. పైగా పెన్నును ఆమెతో బలవంతంగా పెట్టించుకున్నట్లు కనిపిస్తోంది. వీలు కూడా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన కాపీలా ఉంది అని జడ్జి అభ్యంతరాలు వ్యక్తం చేశారు.జడ్జి కన్నెర్ర చేయడంతో లీసా నిజం ఒప్పుకుంది. అది ఆమె చనిపోతున్న సమయంలో తీసిందని తెలిపింది. తల్లికి ఉన్న ఆ జబ్బును ఆసరా చేసుకుని ఆస్తి మొత్తం కాజేయాలని ప్రయత్నించినట్లు చెప్పింది. సాక్ష్యంగా ఉండాలని ఆ టైంలో వీడియో కూడా తీయించుకున్నట్లు తెలిపింది. దీంతో ఆస్తిలో సగం వాటా.. సోదరుడు జాన్కు అప్పగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాదు.. జాన్కు అయిన కోర్టు ఖర్చులను కూడా లీసానే భరించాలని ఆదేశించింది.
- 
      
                   
                                                       అమెరికాలో కాల్పుల కలకలం.. వీడియో వైరల్లూసియానా: అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం చోటుచేసుకుంది. లూసియానా(Louisiana)లోని ఫ్రాంక్లిన్టన్లో జరిగిన మార్డి గ్రాస్ పరేడ్లో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కాల్పుల తర్వాత పరేడ్లో చోటుచేసుకున్న గందరగోళం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ‘ఎక్స్’ హ్యాండిల్లో ఈ బ్రేకింగ్ న్యూస్(Breaking News) ప్రత్యక్షమయ్యింది. BREAKING🚨: Several individuals were injured in a shooting that took place during a parade in Franklinton, Louisiana, a small town located in Washington Parish. The incident disrupted what was intended to be a festive community event.— Officer Lew (@officer_Lew) March 3, 2025 ఇది కూడా చదవండి: 9,000 హార్స్పవర్ రైలు ఇంజిన్ సిద్ధం.. ఎంత మాల్ లాగుతుందంటే..
- 
      
                   
                                                       మా గోడు వినండి..భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భర్త కథలక్నో: కట్టుకున్న భార్య (wife) రాచిరంపాన పెడుతోందంటూ జీవితాల్ని అర్థాంతరంగా జీవితాల్ని ముగుస్తున్న భర్తల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే బెంగళూరులో అతుల్ సుభాష్, కర్ణాటకలో ఓ కానిస్టేబుల్ తిప్పన్న.. రాజస్థాన్లో ఓ డాక్టర్ అజయ్.. ఇలా రోజుకొక ఉదంతం వెలుగులోకి వస్తోంది. ఇదిలా ఉండగానే.. ఉత్తరప్రదేశ్లో మరో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది.ప్రముఖ టెక్ కంపెనీ టీసీఎస్ (tcs)లో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న 25ఏళ్ల మానవ్ శర్మ(manav sharma) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫిబ్రవరి 24న తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. అయితే,మరణానికి ముందు మానవ్ శర్మ ఆవేదనతో కూడిన ఆరు నిమిషాల 50 సెకన్ల నిడివిగల ఓ వీడియోను రికార్డ్ చేశాడు. ఆ వీడియోలో తన వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయని, తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, ఇదే విషయంలో తనకు, తన భార్యకు గొడవలు జరిగేవని అన్నారు. అయినా తనలో మార్పు రాలేదన్నారు. మగాళ్లకు రక్షణే లేదామానవ్ శర్మ ఏడుస్తూ.. దేశంలో మహిళలను రక్షించేలా చట్టాలు ఉన్నట్లు.. పురుషులను రక్షించేలా చట్టాలు ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. పురుషుల గురించి ఆలోచించండి’ అని న్యాయస్థానాల్ని వేడుకున్నాడు. పురుషులకు రక్షణ కల్పించకపోతే.. వారు అంతమవుతారని హెచ్చరించారు. కోడలి నిర్వాకం వల్లే ఈ సందర్భంగా తన మణికట్టుపై కత్తికోసుకున్న గుర్తులను చూపిస్తూ అంతకుముందు తాను ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు శర్మ వెల్లడించాడు. నా మరణానంతరం నా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దని అర్జిస్తూ వీడియోను ముగించాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యపై సమాచారం అందుకున్న శర్మ తండ్రి సదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడు మరణానికి తన కోడలు కారణమని ఆరోపించారు.అన్నీ అవాస్తవాలేమానవ్ శర్మ ఆత్మహత్యపై ఆయన సతీమణి ఖండించారు. నా భర్త మద్యానికి బానిసయ్యారు. అతిగా మద్యం సేవించి పలుమార్లు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. మూడు సార్లు నేనే రక్షించా. మద్యం సేవించిన తరువాత నాపై దాడి చేసేవారు. ఇదే విషయాన్ని తన అత్తమామల దగ్గర ప్రస్తావించినా వారు పట్టించుకోలేదు.అవన్నీ పెళ్లికి ముందే.. పెళ్లి తర్వాత భర్తే నా సర్వసంవివాహేతర సంబంధంపై మీడియా ఆమెను ప్రశ్నించగా..అవన్నీ పెళ్లికి ముందే. పెళ్లి తర్వాత భర్తే నా సర్వసం’అని అన్నారు. ఈ సందర్భంగా వాట్సాప్ చాట్ను బహిర్ఘతం చేశారు. ఆ చాట్లో దీదీ, దయచేసి ఏదో ఒకటి చేయండి. తనను తాను చంపుకుంటాడు అని తన భర్త సోదరికి(వదిన) మెసేజ్ చేసింది. బదులుగా అతన్ని ఒంటరిగా ఉండనివ్వండి. నిద్రపోండి’ అని బదులిచ్చినట్లు గమనించవచ్చు.ఇప్పటి వరకూ జరగని అరెస్టులుమానవ్ శర్మ ఆత్మహత్యపై ఆగ్రా ఏఎస్పీ వినయక్ గోపాల్ మాట్లాడారు. ‘మాకు ఆగ్రాలోని మిలటరీ హాస్పిటల్లో మానవ్ మృతదేహం ఉందనే సమాచారం వచ్చింది. మానవ్ బలవన్మరణానికి పాల్పడ్డారు. అతని ఆత్మహత్య కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. బాధితుడు రికార్డ్ చేసిన వీడియోను గుర్తించాం. అందులో తన భార్యతో విభేదాలు, ఇతర సమస్యల కారణంగా ప్రాణాలు తీసుకున్నట్లు గుర్తించామని’ చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
- 
  
      మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్ మహిళ వీడియో వైరల్
- 
      
                   
                                                       వంశీపై అక్రమ కేసు.. వీడియో బయటపెట్టిన వైఎస్సార్సీపీసాక్షి, తాడేపల్లి: వల్లభనేని వంశీపై పెట్టిన అక్రమ కేసులో వీడియోను వైఎస్సార్సీపీ బయట పెట్టింది. షాపింగ్ చేస్తున్న సత్యవర్థన్ వీడియోను ఆ పార్టీ విడుదల చేసింది. ‘సత్యమేవ జయతే’ అంటూ ట్వీట్ చేసింది. ‘‘తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని.. న్యాయ వ్యవస్థలను అపహాస్యం చేస్తున్న చంద్రబాబు సర్కారు తీరుకు నిలువెత్తు నిదర్శనం ఇది’’ అని వైఎస్సార్సీపీ ఆధారాలతో సహా బట్టబయలు చేసింది.‘‘ఈ వీడియోలో బ్లూషర్ట్ వేసుకున్న వ్యక్తే సత్యవర్థన్. వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశారంటూ పోలీసులు చెప్తున్న వ్యక్తి ఇతనే. మరి ఈ వీడియోను చూస్తే సత్యవర్థన్ కిడ్నాప్నకు గురైనట్టుగా ఉందా?’’ అని వైఎస్సార్సీపీ ప్రశ్నించింది.‘‘పోలీసులు ఆరోపిస్తున్న ఫిబ్రవరి 12న విశాఖపట్నంలోని ఆనందపురం జంక్షన్లో ఒక బట్టల దుకాణంలో స్వేచ్చగా షాపింగ్ చేసుకుంటున్న సత్యవర్థన్ వీడియో ఇది. కిడ్నాప్ చేసి, నిర్బంధించిన వ్యక్తి బయటకు ఎలా వస్తారు?. ఇలా స్వేచ్ఛగా షాపింగ్ ఎలా చేస్తారు?. దీని అర్థం పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని.. వారి కుటుంబ సభ్యులను భయపెట్టి, బెదిరించి తప్పుడు ఫిర్యాదు తీసుకున్నారని ఈ వీడియో సాక్షిగా బయటపడింది’’ అని వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది.💣 Truth Bomb 💣సత్యమేవ జయతేతీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని, న్యాయవ్యవస్థలను అపహాస్యం చేస్తున్న @ncbn సర్కారు తీరుకు నిలువెత్తు నిదర్శనం ఇది.ఈ వీడియోలో బ్లూషర్ట్ వేసుకున్న వ్యక్తే సత్యవర్థన్. వల్లభనేని వంశీ కిడ్నాప్… pic.twitter.com/pAa5VMknV9— YSR Congress Party (@YSRCParty) February 26, 2025ఇదీ చదవండి: లోకేష్.. ఇవిగో ఆధారాలు..!
- 
      
                   
                                                       ‘ఏఐ ఏమైనా చేయగలదు’: సత్య నాదెళ్ల వీడియోకి మస్క్ రిప్లైఏఐని ఎక్కువగా విశ్వసించే ఎలాన్ మస్క్ (Elon Musk).. ఈసారి వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై విశ్వాసం వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన వీడియోను టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ రీషేర్ చేస్తూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని మరింత నొక్కిచెప్పారు. "కృత్రిమ మేధ ప్రతిదాన్ని మెరుగుపరుస్తుంది" అని పేర్కొన్నారు.రైతులు తక్కువ వనరుల వినియోగంతో ఉత్పాదకతను పెంచడానికి కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాలు ఎలా సహాయపడతాయో ఈ వీడియో చూపిస్తుంది. కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గణనీయంగా ప్రయోజనం పొందిన భారతదేశంలోని బారామతి సహకార సంఘానికి చెందిన ఒక రైతు ఉదాహరణను సత్య నాదెళ్ల ఉదహరించారు.తక్కువ భూమి ఉన్న రైతులు పంట దిగుబడిలో గణనీయమైన మెరుగుదలను చూశారని, రసాయనాల వాడకం తగ్గిందని, నీటి నిర్వహణ మెరుగైందని చెప్పుకొచ్చారు. జియోస్పేషియల్ డేటా, డ్రోన్లు, ఉపగ్రహాల నుంచి ఉష్ణోగ్రత డేటా, రియల్ టైమ్ సాయిల్ అనాలిసిస్ ద్వారా ఈ సమాచారం మొత్తాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనుసంధానం చేస్తుందని తెలిపారు. రైతులు వారి స్థానిక భాషలో ఈ సమాచారాన్ని పొందవచ్చు.రియల్ టైమ్ అగ్రికల్చర్ డేటాతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మిళితం చేయడం ద్వారా రైతులు మరింత సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవచ్చని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఇది సుస్థిర వ్యవసాయ పద్ధతులకు దారితీస్తుందని, సామర్థ్యాన్ని పెంచుతుందని వివరించారు.ఆ వీడియో ఇదే.. మీరూ చూసేయండి..A fantastic example of AI's impact on agriculture. pic.twitter.com/nY9o8hHmKJ— Satya Nadella (@satyanadella) February 24, 2025
- 
      
                   
                                                       దయచేసి ప్రయాగ్రాజ్ రావొద్దు.. నెట్టింట పోస్టులుప్రయాగ్రాజ్: మహా కుంభమేళా ముగింపు వేళ ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్రాజ్ సంగమం వద్ద భక్తుల రద్దీ మరింత పెరిగింది. మహా శివరాత్రి పర్వదినాన పుణ్య స్నానాల కోసం ఇంకా కోట్ల మంది ఆధ్యాత్మిక నగరం(Devotional City Prayagraj) వైపు అడుగులేస్తున్నారు. ఈ తరుణంలో నగరవాసుల ప్రజల తరఫున ఓ విజ్ఞప్తి.. అక్కడ నెలకొన్న అధ్వాన్న పరిస్థితులు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.‘‘మీకు దణ్ణం పెడతాం.. దయ చేసి ప్రయాగ్రాజ్ రావొద్దూ..’’ అక్కడి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పోటెత్తుతున్న భక్తజనంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, అలాగే నగర సందర్శన పేరిట కొందరు ఇప్పటికే ఇక్కడి పరిస్థితిని అధ్వాన్నంగా మార్చేశారని వాపోతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.‘నేను ఎక్కడినుంచి స్టార్ట్ చేయాలో కూడా నాకు తెలియడం లేదు. ప్రయాగ్రాజ్ పూర్తిగా విధ్వంసకర దశకు చేరుకుంది. గత సంవత్సరమేమో కుంభమేళా ఏర్పాట్లకు సరిపోయింది. ఇక్కడి రోడ్లన్నీ తవ్వేశారు. ఫ్లై ఓవర్లు వేశారు. అయితే ప్రస్తుతం మహాకుంభమేళా చివరి అమృత స్నానం కూడా ముగిసింది. అయినా జనం తగ్గకుండా రోజురోజుకు పెరుగుతున్నారు ఎందుకో తెలియడం లేదు. ఇక్కడికి రావడం ఇక ఆపండి. భారీ జనసందోహాన్ని భరించే శక్తి ప్రయాగ్రాజ్(Pyagraj)కు ఎంత మాత్రం లేదు. నగరంలోని చిన్న చిన్న సందులు కూడా ట్రాఫిక్తో నిండిపోయాయి. జనాలకు సివిక్ సెన్స్ లేకుండా ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తూ ఉమ్మేస్తున్నారు. మలమూత్ర విసర్జన చేస్తున్నారు’ అని మండిపడ్డాడు.మహా కుంభమేళా నేపథ్యంలో ఆధునీకరణ పేరిట వేల కోట్ల రూపాయలు కేటాయించింది యూపీ ప్రభుత్వం. కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లతో పాటు రకరకాల హంగుల నగరాన్ని ముస్తాబు చేసింది. అంతేకాకుండా.. భారీగా జనం వస్తారనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టింది. అయితే.. మహా కుంభమేళా(Maha Kumbh Mela) ఆరంభం అయ్యాక ఆ పరిస్థితి దారుణంగా మారింది.అందంగా అలంకరించిన నగరాన్ని.. భక్తుల్లో కొందరు అధ్వాన్నంగా తయారు చేశారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. పాదాచారులు ఎక్కడపడితే అక్కడ చెత్తపడేయడం, మూత్రమలవిసర్జన చేసేయడంతో పరిస్థితి దారుణంగా మారింది. పారిశుద్ధ్య సిబ్బంది రంగంలోకి దిగినా ఆ పరిస్థితి మార్పు రాలేదని చెబుతున్నారు. మరోవైపు.. దారులన్నీ జనం, వాహనాలతో నిండిపోయాయి. ఆఖరికి.. ఇరుకు సందులను కూడా వదలకుండా ట్రాఫిక్తో నింపేస్తున్నారు.ఇక.. ప్రైవేట్ వాహనాల దోపిడీ దందా, రోడ్లపై ఇష్టానుసారం సంచరించం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదంటున్నారు మరికొందరు. కుంభమేళా ముగుస్తుందనగా.. రద్దీ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఎందుకు?. గంగానదీ.. త్రివేణి సంగమం ఎక్కడికి పోదు కదా.. తీరికగా వచ్చి పుణ్యస్నానాలు చేసుకోవచ్చు కదా అంటూ కొందరు.. ఇంకోసారి ప్రయాగ్రాజ్ వైపు రావొద్దంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
- 
      
                   
                                                       సెలక్షన్స్పై ‘వీడియో’ కన్నున్యూఢిల్లీ: క్రీడాకారులు, జట్ల సెలక్షన్ ట్రయల్స్పై పదేపదే వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు కేంద్ర క్రీడా శాఖ సిద్ధమైంది. దీనికి శాశ్వత పరిష్కారంగా ఇక మీదట జరిగే ఎంపిక ప్రక్రియనంతా వీడియో రూపంలో తీయనుంది. తద్వారా అర్హులైన ప్రతిభావంతులకే బెర్త్లు లభించేలా చూడనుంది. ప్రతి ఒక్కరి సెలక్షన్ ప్రదర్శన వీడియోలో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి విమర్శలకు తావుండదు. ‘ఇకపై అన్ని సెలక్షన్ ట్రయల్స్పై వీడియో నిఘా పెడతాం.పారదర్శకత, న్యాయబద్ధమైన ఎంపికలకు ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. దీనివల్ల క్రీడాకారులకు మేలు జరుగుతుంది. ప్రదర్శనే ఎంపికకు గీటురాయి అవుతుంది. మెరిట్ కనబరిచిన వారే భారత జట్లకు ఎంపికవుతారు. ఇందులో క్రీడా సమాఖ్యలు ఇష్టారీతిన వ్యహరించేందుకు వీలుండదు. క్రీడా శాఖ అధికారులు, భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) అధికారులు పర్యవేక్షకులుగా హాజరవుతారు. ఇకపై ప్రతీ క్రీడాంశంలో దీన్ని అమలు చేస్తాం’ అని క్రీడా శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. షూటింగ్, రెజ్లింగ్లలో జరిగే సెలక్షన్ ట్రయల్స్ ప్రతీసారి విమర్శలపాలవుతోంది. రెజ్లింగ్ సమాఖ్య అయితే పతకాల కంటే కూడా ఈ తరహా వివాదాలు, విమర్శలతోనే వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే! భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) వ్యవహారాల వల్ల అర్హత ఉండి, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనలేకపోతున్నారు. ఈ సీజన్లో తొలి రెండు ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్లకు భారత రెజ్లర్లు దూరమయ్యారు. దీనిపై క్రీడాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే ఈ శాఖ గుర్తింపు ఉన్న జాతీయ సమాఖ్యలకు ఢిల్లీలోని స్టేడియాల్లో ఆఫీస్ వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టారు. దీనివల్ల ఢిల్లీకి వచ్చిన లేదంటే ఢిల్లీ నుంచి అంతర్జాతీయ టోర్నీలకు బయలుదేరే ఆటగాళ్లకు ఆయా సమాఖ్యలు సమన్వయంతో సేవలందించేందుకు వీలవుతుంది. గతంలో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో క్రీడా సమాఖ్యల కార్యాలయాలు ఉండేవి. కానీ 2010 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యం కోసం ఆ స్టేడియాన్ని నవీకరించడంతో సమాఖ్యల ఆఫీసుల్ని అక్కడి నుంచి తరలించారు.
- 
      
                   
                                                       Delhi: కొత్త సీఎం రేఖా గుప్తా కుమారుని వీడియో వైరల్న్యూఢిల్లీ: ఢిల్లీ నూతన సీఎంగా రేఖా గుప్తా(Rekha Gupta) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్గా మారాయి. తాజాగా ఆమె కుమారుడు నికుంజ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఒక మహిళకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించడం ఆనందించాల్సిన విషయం. #WATCH | Delhi CM-designate Rekha Gupta's son, Nikunj says, "It is good that a woman has been given the opportunity to be the CM. We are confident that she will be able to shoulder her responsibility very well. Her 30-year-long hard work has proved to be successful. She has… pic.twitter.com/UXesCIMM8g— ANI (@ANI) February 20, 2025 ఆమె ఈ బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించగలదని నేను నమ్ముతున్నాను. ఆమె 30 ఏళ్ల కష్టానికి తగిన ఫలితం లభించింది. ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. ఆమెకు ఈ అవకాశం కల్పించిన ప్రధానమంత్రి మోదీ(Prime Minister Modi)కి, పార్టీకి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. రేఖా గుప్తా అత్త మీరా గుప్తా తన కోడలికి అభినందనలు తెలిపారు. #WATCH | Delhi CM-designate Rekha Gupta's mother-in-law Meera Gupta says, "...Work well."When asked if she sends her best wishes to the CM-designate, she says, "Yes, certainly..." pic.twitter.com/vTaT3RWgZq— ANI (@ANI) February 20, 2025 ఇది కూడా చదవండి: Delhi: రేఖా గుప్తా క్యాబినెట్ మంత్రులలో ఎవరి విద్యార్హతలేమిటి?
- 
      
                   
                                                       వలసదారులకు సంకెళ్లు.. వైట్హౌజ్ వివాదాస్పద వీడియోవాషింగ్టన్: అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి అవమానకరంగా పంపిస్తున్నారని భారత్తో సహా ఇతర దేశాల్లో అమెరికాపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా భారత్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో విమర్శలు గుప్పిస్తోంది. అమెరికా ఇప్పటివరకు భారత్కు పంపించిన వలసదారుల చేతులు, కాళ్లకు సంకెళ్లు వేసి అవమానకర రీతిలో తీసుకువచ్చారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.ఈ ఆరోపణలకు ఊతమిచ్చేలా వైట్హౌజ్ తాజాగా ఓ వివాదాస్పద 41 నిమిషాల నిడివి గల వీడియోను సోషల్మీడియాలో పోస్టు చేసింది. అక్రమ వలసదారులను విమానం ఎక్కించేముందు వారికి సంకెళ్లు వేస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. అలాగే వారికి వేయడానికిగాను గొలుసులను పోలీసులు సిద్ధం చేస్తుండడం వీడియోలో కనిపిస్తోంది. అయితే విమానం ఎక్కుతున్న అక్రమ వలదారుల ముఖాలు మాత్రం వీడియోలో కనిపించలేదు. ASMR: Illegal Alien Deportation Flight 🔊 pic.twitter.com/O6L1iYt9b4— The White House (@WhiteHouse) February 18, 2025కాగా, అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులకు సంకెళ్లు వేసి తరలిస్తున్న అంశంలో ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ కూడా ఏమీ చేయలేకపోయారని కాంగ్రెస్ మండిపడుతోంది. ఇంతకుముందు ఇదే విషయమై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందిస్తూ మహిళలకు, పిల్లలకు సంకెళ్లు వేయడం లేదని సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు.
- 
      
                   
                                                       మరో వీడియో విడుదల చేసిన కిరణ్ రాయల్ బాధితురాలుసాక్షి, తిరుపతి: కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి మరో వీడియో విడుదల చేశారు. ‘‘నేను జైపూర్ నుంచి తిరుపతికి క్షేమంగా వస్తానన్న నమ్మకం లేదు.. నా పిల్లలకు ఏమైనా జరిగితే కిరణ్ రాయలే కారణం’’ అంటూ ఆమె సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ‘‘నేను తిరుపతిలో కిరణ్ రాయల్పై ఫిర్యాదు చేశా. ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారంలో ఉన్నవాళ్లకే పోలీసులు అండగా ఉంటారా?’’ అని లక్ష్మి ప్రశ్నించారు.డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను అభ్యర్థించినా నాకు న్యాయం జరగలేదు. నేను తిరుపతికి వచ్చిన వెంటనే మరో వ్యక్తి ఉన్నాడు ఆ వీడియోను కూడా రిలీజ్ చేస్తాను’’ అని లక్ష్మి పేర్కొన్నారు. కాగా, కిరణ్ రాయల్ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ గత కొద్దిరోజులుగా న్యాయ పోరాటం చేస్తోన్న బాధితురాలు లక్ష్మిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆమెకు జైపూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.ఇదీ చదవండి: జనసేన కిరణ్ రాయల్కు షాక్కాగా, తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జి కిరణ్ రాయల్ మోసాన్ని వివరిస్తూ మొదటిసారిగా లక్ష్మి విడుదల చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే.. కిరణ్రాయల్ తనను బెదిరించి.. రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి మాట్లాడిన వీడియో వైరల్గా మారింది. ఈ క్రమంలో బాధిత మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో కూడా సంచలనంగా మారింది.సోమవారం తిరుపతి ప్రెస్క్లబ్లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రెస్మీట్ ముగిసిన వెంటనే.. జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఇవాళ బెయిల్ వచ్చిన తర్వాత లక్ష్మి మరో వీడియో విడుదల చేశారు.ఇదీ చదవండి: జనసేన కిరణ్ రాయల్ బాగోతం.. వీడియో వైరల్
- 
      
                   
                                                       ‘అద్భుత స్వాగతం’.. పారిస్ నుంచి ప్రధాని మోదీ వీడియోపారిస్: ప్రధాని నరేంద్ర మోదీ ఐదురోజుల విదేశీ పర్యటన సందర్భంగా సోమవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రధాని మోదీని కౌగిలించుకుని స్వాగతించారు. తన ప్రాన్స్ పర్యటనకు సంబంధించి ప్రధాని మోదీ తాజాగా సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ఒక పోస్టు చేశారు. Here are highlights from the memorable welcome in Paris yesterday. pic.twitter.com/lgsWBlZqCl— Narendra Modi (@narendramodi) February 11, 2025‘తన స్నేహితుడు, అధ్యక్షుడు మాక్రాన్ను పారిస్లో కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది’ అని మోదీ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. మాక్రాన్ పారిస్లో అందించిన విందులో ప్రధాని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ను కూడా ప్రధాని మోదీ కలుసుకున్నారు. ప్రధాని మోదీ మంగళవారం ఉదయం ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను షేర్ చేశారు. ‘సోమవారం పారిస్లో జరిగిన చిరస్మరణీయ స్వాగతానికి సంబంధించిన వీడియో’ అని దానిలో రాశారు.Un chaleureux accueil à Paris !Le froid n'a pas découragé la communauté indienne de venir montrer son affection ce soir. Je suis reconnaissant à notre diaspora, et fier de ses accomplissements ! pic.twitter.com/rQSsI5njfN— Narendra Modi (@narendramodi) February 10, 2025మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ పారిస్లో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో చర్చలు జరిపారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక పోస్ట్లో తెలిపింది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక ట్వీట్లో‘పారిస్లో అద్భుతమైన స్వాగతం లభించింది. వాతావరణం ఎంతో చల్లగా ఉన్నప్పటికీ, ఇక్కడి భారతీయులు ఆప్యాయతను చూపించారు. అందుకు వారికి కృతజ్ఞతలు చెబుతున్నాను. వారు సాధించిన విజయాలకు గర్విస్తున్నాను. ప్రపంచ నేతలు, ప్రపంచ సాంకేతిక సీఈఓల ఏఐ యాక్షన్ సమ్మిట్కు సహ అధ్యక్షత వహించడానికి ఎదురు చూస్తున్నాను’ అని మోదీ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh: స్టేషన్లో రద్దీ.. ఏసీ కోచ్ అద్దాలు బద్దలు కొట్టి..
- 
      
                   
                                                       జనసేన కిరణ్ రాయల్ బాగోతం.. వీడియో వైరల్సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జి కిరణ్రాయల్ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది. కిరణ్రాయల్ తనను బెదిరించి.. రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆమె ఏం చెప్పిందంటే.. ‘నా పేరు లక్ష్మి. నేను ఒకర్ని నమ్మి మోసపోయాను. అప్పులు చేసి రూ.1.20 కోట్లు ఇచ్చాను. డబ్బులు అడిగితే పిల్లల్ని చంపుతానని బెదిరించి.. ఇంకా ఎన్నో చేసి నాతో వీడియో రికార్డు చేయించుకున్నారు.కేవలం రూ.30 లక్షలకు బాండ్లు, చెక్కులు రాయించాడు. నా వద్ద అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. పిల్లలు అడుగుతున్నారు. వారికి సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇంక నేను బతకలేను. కిరణ్ రాయల్ వల్లే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను చనిపోయాకైనా ఆ డబ్బులు మా పిల్లలకు చెందుతాయని ఆశిస్తున్నాను’ అంటూ మహిళ వాపోయింది. శనివారం ఆ వీడియో బయటకు రాగా.. వెంటనే స్పందించిన కిరణ్ రాయల్ ఆమెకు ఫోన్చేసి నానా బూతులు తిడుతూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగినట్టు ఆ మహిళ కిరణ్రాయల్ వాయిస్ రికార్డును విడుదల చేశారు. వీడియో వైరల్ అయ్యాక కిరణ్రాయల్ మీడియా సమావేశం నిర్వహించి.. ఆమె కిలాడి లేడీ అని, బెట్టింగ్ల కారణంగా అప్పుల పాలైందని, ఆ కుటుంబాన్ని తానే రక్షించానని చెప్పుకొచ్చారు.బాధితురాలు ఏమంటోందంటే..తిరుపతి మండలం చిగురువాడకు చెందిన లక్ష్మి ప్రస్తుతం తిరుపతి ఎంఆర్ పల్లిలో నివాసం ఉంటోంది. చిగురువాడలో ఉండే సమయంలో కిరణ్రాయల్ తన నివాసం పక్కనే వచ్చి చేరాడని లక్ష్మి చెబుతోంది. తనతో ఉన్న పరిచయం మేరకు డబ్బులు అడిగేవాడని.. కిరణ్ రాయల్ వాడుతున్న కారు, ఇంటికి కూడా తాను అప్పులు చేసి కొంత, ఎకరం భూమిని అమ్మి మరికొంత డబ్బులు ఇచ్చినట్టు తెలిపింది. మొత్తంగా రూ.1.20 కోట్లు, 25 సవర్ల బంగారు ఆభరణాలు ఇచ్చినట్టు వివరించింది. ఈ విషయం తెలియడంతో భర్త, కుటుంబీకులు నిలదీయగా.. తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేసినట్టు లక్ష్మి వెల్లడించింది.భర్త మరణించాక పిల్లల చదువులు, కుటుంబ పోషణకు డబ్బులు అడిగినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన డబ్బుకు రెండింతలు ఇస్తానని.. మూడు నెలలు ఆగమని ఒప్పించినట్టు తెలిపింది. ఆ తరువాత డబ్బు అడుగుతుంటే.. రూ.30 లక్షలకు బాండు పేపర్లు, చెక్కులు ఇచ్చారని చెప్పింది. అప్పుల వాళ్ల ఒత్తిళ్లు తీవ్రం కావడం, కుటుంబంలో తీవ్ర ఇబ్బందులు రావటంతో కిరణ్ రాయల్కి ఫోన్చేసి గట్టిగా మాట్లాడినట్టు తెలిపింది. అయినా అతడి బెదిరింపులు తారస్థాయికి చేరటంతో వీడియో రిలీజ్చేసి ఆత్మహత్యకు యత్నించినట్టు వివరించింది.బూతులు తిడుతూ..వీడియో వైరల్ కావడంతో జనసేన నేత కిరణ్రాయల్ మీడియాతో మాట్లాడుతూ.. లక్ష్మి కిలాడి లేడీ అని, ఆమెపై జైపూర్, విశాఖ, బెంగళూరులో కేసులు ఉన్నాయని ఆరోపించారు. బెట్టింగ్లు, రకరకాల వ్యవసనాలతో ఆమె అప్పులు పాలైందని, ఆ కారణంగానే లక్ష్మిని తిరుచానూరు పోలీసులు అరెస్ట్ చేస్తే తానే విడిపించానని చెప్పారు. కాగా.. వీడియో వైరల్ అయిన వెంటనే.. కిరణ్ రాయల్ లక్ష్మికి ఫోన్చేసి నానాబూతులు తిడుతూ.. చంపేస్తానని, ఆ తరువాత నెలలో బయటకు వస్తానంటూ తీవ్రస్థాయిలో బెదిరించిన వాయిస్ను లక్ష్మి మీడియా ముందు వినిపించారు.తన కార్యాలయానికి వచ్చి బెదిరించి వెళ్లిన వీడియోలను కూడా మీడియాకు చూపించారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వారం కాదని, తనకు శత్రువులు లేరని, ఏదైనా జరిగితే కిరణ్రాయల్ వల్లే అని లక్ష్మి మీడియా ముందు వెల్లడించారు. కిరణ్ రాయల్ అరాచకాలకు సంబంధించిన ప్రతి దానికి ఆధారాలు తన వద్ద ఉన్నాయని వివరించారు. కిరణ్రాయల్ తనకు ఫోన్చేసి మాట్లాడిన మాటలకు సంబంధించి 10 వాయిస్ రికార్డులను లక్ష్మి విడుదల చేశారు. ఆ వాయిస్లో పత్రికలో రాయలేని విధంగా బూతులు మాట్లాడుతూ.. చంపేస్తానంటూ బెదిరించిన రికార్డులు ఉన్నాయి.
- 
      
                   
                                                       Delhi Election 2025: కేజ్రీవాల్ ఇంటికి ‘బేబీ మఫ్లర్ మ్యాన్’న్యూఢిల్లీ: దేశరాజధాని ఢ్లిలీలోని మొత్తం 70 అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు((శనివారం) జరుగుతోంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం చూసుకుంటే బీజేపీ ముందంజలో ఉంది. #WATCH | Delhi: A young supporter of AAP National Convenor Arvind Kejriwal, Avyan Tomar reached the residence of Arvind Kejriwal dressed up as him to show support. pic.twitter.com/dF7Vevy6En— ANI (@ANI) February 8, 2025 ఇంతలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి 'బేబీ మఫ్లర్ మ్యాన్' వచ్చాడు. ఇతని పేరు అవ్యాన్ తోమర్. కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన ధరించిన లాంటి దుస్తులు ధరించి వచ్చాడు. కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్న అవ్యాన్ తోమర్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ తాము ఎన్నికల ఫలితాల రోజున ఇక్కడికి వస్తుంటామని, ఆమ్ ఆద్మీ పార్టీనే మా కుమారునిని ‘బేబీ మఫ్లర్ మ్యాన్’ అనే పేరు పెట్టిందని తెలిపారు. #WATCH | Delhi: Avyan Tomar's father, Rahul Tomar says, "... We always come here on result days... The party has also given him the name of 'Baby Muffler Man'..." pic.twitter.com/cMdDc3sGWf— ANI (@ANI) February 8, 2025
- 
      
                   
                                                       మీరందరూ తప్పకుండా ఇలా చేయాలనేదే నా కోరిక: సమంతాఉదయం ధ్యానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. రోజంతా గడపడానికి కావల్సిన శక్తి, శాంతి లభిస్తుంది.ధ్యానం అనేది శరీరం మనస్సును ఏకీకృతం చేయడంలో సహాయపడుతుంది. ఇది ఏకాగ్రత, విశ్రాంతిని అందిస్తుంది.భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేలా, స్థిరమైన ఆలోచనలను అందిస్తుంది. చాలామందికి, ఇదొక ఆధ్యాత్మిక అనుభవం. ఈవిషయాన్ని స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో వివరించింది.ప్రతిరోజూ కేవలం 15 నిమిషాల ధ్యానం ఆరోగ్యానికి చాలామందని సూచించింది. నిశ్శబ్దంగా కూర్చని, శ్వాసమీద ధ్యాస పెడితే ప్రశాంతంగా ఉంటుందని వెల్లడించింది. దీనికి సంబంధించి ఒక వీడియోను ఇన్స్టాలో షేర్ చేసింది. ధ్యానంతన జీవితంలో చాలా బాగా పనిచేసిందని తెలిపింది. ఒక ప్రశాతమైన ప్రవాహంలోకి పయనించడానికి ధ్యానానికి మించింది లేదని పేర్కొంది. ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా, తనలోని ఆ నిశ్శబ్ద ప్రదేశం ఎప్పుడూ అక్కడే ఉంటుంది. మీరు మెడిటేషన్ను ఎన్నుకుంటే అన్ని గందగగోళాలనుంచి శాంతి లభిస్తుందని తెలిపింది. మీ మనస్సులోని ఆలోచనల గురించి చింతించకండి. వాటిని పక్కన పెట్టడమే ఉపాయం. మీరందరూ ప్రయత్నించాలని నేను కోరుకునేది ఏదైనా ఉంటే, అది ఇదే అంటూ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)ధ్యానం వలన లాభాలు ,ఎపుడు ప్రారంభించాలి.ధ్యానం ఉదయం, సాయంత్రం, నిర్ణీత సమయంలో ఆచరిస్తే మంచిది. వాస్తవానకి ధ్యానం చేయడానికి "చెడు" సమయం అంటూ ఏమీ ఉండదు. నిబద్ధతతో, పట్టుదలగా చేయడమే ముఖ్యం. రిలాక్స్గా , సౌకర్యవంతంగా ఉన్న వాతావరణంలో ధ్యానాన్ని ఆచరించాలి. అయితే ఉదయం ధ్యానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు మెండు అని చెబుతారు. ఒక పది లేదా పదహేను నిమిషాలు పాటు మనతో మనం కనెక్ట్ అయ్యే అవకాశం.కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్కు చెందిన సర్టిఫైడ్ మెడిటేషన్ ఇన్స్ట్రక్టర్ ఇంటిగ్రేటివ్ వెల్నెస్ ఎక్స్పర్ట్ అభిప్రాయం ప్రకారం ఉదయం ధ్యానం చేయడం వల్ల రోజంతా ఆ సానుకూల ప్రభావం కొనసాగుతుంది. ప్రశాంతంగా, విషయాలమీద మనస్సును కేంద్రీకరించేలా, ఒత్తిడిని, భావోద్వేగాల్ని అదుపు చేసుకోవడంలో సాయడపడుతుంది. ముఖ్యంగా ఒత్తిడితో కూడిన రోజుల్లో అయితే ఆందోళనను తగ్గిస్తుంది. ఓరిమి పెరుగుతుంది. 8 వారాల పాటు రోజుకు13 నిమిషాలు ధ్యానం చేసేవారిలో సానుకూల మార్పులు కనిపించినట్టు అధ్యయనం తేలింది.ఇదీ చదవండి: అతిలోకసుందరి వారసురాలు జాన్వీకపూర్ లగ్జరీ ఇల్లు : ఎంత వైభోగమో!ధ్యానం, రకాలుశ్రద్ధ ధ్యానంఆధ్యాత్మిక ధ్యానందృష్టి ధ్యానంమంత్ర ధ్యానంఅతీంద్రియ ధ్యానంలవింక్ కైండ్నెస్ ధ్యానంవిజువలైజేషన్; వాకింగ్ ధ్యానం, శ్వాసమీద ధ్యాస ఇలా పలు రకాలున్నాయి.
- 
      
                   
                                                       భీమిలిలో దారుణం.. బాలిక వీడియో చిత్రీకరించి..సాక్షి, విశాఖపట్నం: భీమిలిలో దారుణం జరిగింది. బాలిక న్యూడ్ వీడియో చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడుతున్న కామాంధుడి కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. బాలిక దుస్తులు మార్చుకుంటుండగా గాజువాకకు చెందిన సమీప బంధువు జానకిరామ్ (53).. నగ్న వీడియోలు తీసి తల్లిని బెదిరించాడు. కుమార్తె నగ్న వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసిన జానకిరామ్.. వివాహిత నుండి పలుమార్లు లక్షల్లో వసూలు చేశాడు. దీంతో భీమిలి పోలీసులను బాధిత మహిళ ఆశ్రయించింది. నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.చిట్టివలసలో తల్లి, కూతురు ఆత్మహత్యమరో ఘటనలో భీమిలిజోన్ చిట్టివలసలో తల్లి, ఇద్దరు కూతుర్లు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ మృతి చెందిన తల్లి, ఒక కుమార్తె మృతి చెందారు. భర్త రామకృష్ణ దివీస్ ఉద్యోగి. భర్తతో మనస్పర్థల కారణంగా ఇద్దరి పిల్లలకు పురుగుల మందు తాగించిన తల్లి.. తాను తాగింది. తల్లి మాధవి(25), కూతురు రితిక్ష (2) మృతి చెందారు. మరో కుమార్తె ఇషిత (5) హాస్పిటల్లో చికిత్స పొందుతోంది.
- 
      
                   
                                                       ఇజ్రాయెల్ టీనేజర్ బందీ వీడియో...విడుదల చేసిన హమాస్జెరూసలేం: ఏడాదికి పైగా బందీగా ఉన్న 19 ఏళ్ల ఇజ్రాయెల్ సైనికురాలి వీడియోను హమాస్ విడుదల చేసింది. మూడున్నర నిమిషాల నిడివి ఉన్న వీడియోలో అల్బాగ్ హిబ్రూ భాషలో మాట్లాడారు. తనను 450 రోజులకు పైగా నిర్బంధించారని, ఇజ్రాయెల్తనను, ఇతర బందీలను మరిచిపోయిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తన వయసు 19 ఏళ్లని, కానీ ఇప్పుడు జీవితం మొత్తం తన కళ్లముందుందని చెప్పారు. వీడియో తమ గుండెను ముక్కలు చేసిందని అల్బాగ్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. కూతురు వీడియో చూసిన అనంతరం వారు ఓ వీడియో ప్రకటన చేశారు. తమ కూతురు తీవ్ర మానసిక క్షోభను అనుభవించినట్లు కనిపిస్తోందన్నారు. ఆమె క్షేమంగా విడుదలయ్యేలా చూడాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుకు విజ్ఞప్తి చేశారు. బందీల కుటుంబాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో అల్బాగ్ కుటుంబ ప్రకటనపై ప్రధాని స్పందించారు. బం«దీలను స్వదేశానికి రప్పించేందుకు తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని చెప్పారు. బందీలకు హాని తలపెట్టే సాహసం చేసే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కుటుంబం అనుమతితో... సాధారణంగా కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా హమాస్ విడుదల చేసే బందీల ఫొటోలు, వీడియోలను ఇజ్రాయెల్ మీడియా ప్రచురించదు. వీడియోను విడుదల చేయడానికి అల్ బాగ్ కుటుంబం తొలుత నిరాకరించినా.. తరువాత అంగీకరించింది. బందీల ఫొటోలు, వీడియోలను హమాస్ ప్రచురించడాన్ని ఇజ్రాయెల్ గతంలో ఖండించింది. "Liri, if you're hearing us, tell the others that all the families are moving heaven and earth. We will fight until all hostages are returned"Eli and Shira Albag , Liri Albag's Parents, called the Prime Minister and Defense Minister, after watching her video from captivity,… pic.twitter.com/Y9xAh47W7O— Bring Them Home Now (@bringhomenow) January 4, 2025హమాస్ చెరలో 96 మంది.. ఇజ్రాయెల్పై హమాస్ దాడి సమయంలో 250 మందిని బందీలుగా గాజాకు తరలించారు. వారిలో కొందరిని రక్షించారు. 34 మంది మరణించారు. ప్రస్తుతం హమాస్ చెరలో 96 మంది మిగిలారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్)లో నిఘా సైనికురాలిగా ఉన్న లిరీ అల్బాగ్ను గాజా సరిహద్దులోని నహల్ ఓజ్ సైనిక స్థావరంలో ఉండగా హమాస్ ఉగ్రవాదులు పట్టుకున్నారు. ఆమెతో పాటు మరో ఆరుగురిని సైతం బంధించారు. వీరిలో ఒకరిని రక్షించగా, మరొకరు హత్యకు గురయ్యారు. అల్బాగ్తోపాటు నలుగురు బందీలుగా మిగిలారు. చర్చల నేపథ్యంలో వీడియో.. ఖతార్లో ఇజ్రాయెల్, హమాస్ల మధ్య ఏడాదిన్నరగా సాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు కాల్పుల విరమణ చర్చలు పునఃప్రారంభమయ్యాయి. చర్చల్లో మధ్యవర్తులుగా ఖతార్, ఈజిప్్ట, అమెరికాలు ఉన్నాయి. ఒప్పందం కోసం నెలల తరబడిగా చేస్తున్న ప్రయత్నాలు ఇంతవరకు ఎలాంటి పురోగతి సాధించలేదు. తాజాగా శుక్రవారం నుంచి గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 70 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో హమాస్ లిరీ వీడియోను విడుదల చేసింది. ఇదీ చదవండి: గాజాలో ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు
- 
      
                   
                                                       ఎంటర్టైన్మెంట్ ఉండగా.. డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్: ప్రభాస్డ్రగ్స్ నిర్మూలనకు టాలీవుడ్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ తన స్వరం కలిపారు. మత్తు పదార్థాలు, డ్రగ్స్కు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. డ్రగ్స్పై అవగాహన కల్పిస్తూ ప్రభాస్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. లైఫ్లో మనకు బోలెడన్నీ ఎంజాయ్ మెంట్స్, ఎంటర్టైన్మెంట్ ఉన్నాయని ప్రభాస్ అన్నారు. మనల్ని ప్రేమించే వారు, మనకోసం బతికే మనవాళ్లు ఉండగా.. డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? అని ప్రభాస్ ప్రశ్నించారు. సే నో టూ డ్రగ్స్ అంటూ అభిమానులను, సినీ ప్రియులను ప్రభాస్ కోరారు. మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్ కు బానిసలైతే 8712671111 నెంబర్కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. మత్తుకు బానిసలైనవాళ్లు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వీడియోలో ప్రభాస్ మాట్లాడారు.
- 
      
                   
                                                       పరుగులు పెట్టే రోబో.. మైండ్ బ్లోయింగ్ వీడియోసూపర్ స్టార్ 'రజనీ కాంత్' రోబో సినిమా వచ్చిన తరువాత.. బహుశా రోబోలు ఇలాగే ఉంటాయేమో అని చాలామంది భావించారు. అయితే ఇటీవల టెస్లా రూపొందించిన నడిచే రోబోకు సంబందించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. ఇప్పుడు చైనా కంపెనీ ఏకంగా పరుగెత్తే రోబోను తయారు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.చైనీస్ కంపెనీ ‘రోబో ఎరా’ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హ్యూమనాయిడ్ రోబోను తయారు చేసింది. ‘స్టార్1’ పేరుతో రూపొందించిన ఈ రోబో శరవేగంగా పరుగులు తీయగలదు. ఇది గంటకు 8 మైళ్లు (12.98 కి.మీ.) వేగంతో పరుగెడుతోంది. ఈ రోబోకు హైటార్క్ మోటార్లు, ఏఐ సెన్సార్లు అమర్చడం వల్ల.. ఇది ఎలాంటి ఎగుడు దిగుడు దారుల్లోనైనా అదే వేగంతో పరుగెతూనే దాటేస్తుంది.ఇదీ చదవండి: ఐటీ ఫ్రెషర్లకు గుడ్న్యూస్.. ఏకంగా 40000 ఉద్యోగాలు‘రోబో ఎరా’ చూడటానికి సగటు మనిషి పరిమాణంలోనే 5.6 అడుగుల ఎత్తు, 64.86 కేజీల బరువుతో ఉంటుంది. ఇలాంటి పరుగుల రోబోలను ‘టెస్లా’ కంపెనీ ‘ఆప్టిమస్’ పేరుతోను, ‘బోస్టన్ డైనమిక్స్’ కంపెనీ ‘అట్లాస్’ పేరుతోను రూపొందించాయి. అయితే, ‘రోబో ఎరా’ తాజాగా రూపొందించిన ‘స్టార్ 1’ వాటి కంటే వేగంగా పరుగులు తీయగలగడంతో, అత్యంత వేగవంతమైన రోబోగా రికార్డు సాధించింది.
- 
  
      Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి ఫోటోలు చూశారా?
- 
      
                   
                                                       26 ఏళ్ల తర్వాత.. అక్షరం పొల్లు పోకుండా జరిగింది!ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ (Elon Musk) తన ఎక్స్ ఖాతాలో ఓ పాత వీడియోను షేర్ చేశారు. ఇందులో ఇంటర్నెట్ అనేది.. మీడియాలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని పేర్కొన్నారు. 1998లో చెప్పిన ఆ మాటలే నేడు నిజమయ్యాయి.26 సంవత్సరాల క్రితం 1998లో 'మస్క్'ను ఒక ఇంటర్వ్యూయర్ ఇంటర్నెట్ భవిష్యత్తు గురించి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ''ఇంటర్నెట్ అన్ని మీడియాల సూపర్సెట్ అని నేను భావిస్తున్నాను" అని మస్క్ పేర్కొంటూ.. మీడియాకు ఇంధనం ఇంటర్నెట్ అని వివరించారు.ఇంటర్నెట్.. వినియోగదారులు తాము చూడాలనుకుంటున్న వాటిని ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. ఇది తప్పకుండా సాంప్రదాయ మీడియాలను విప్లవాత్మకంగా మారుస్తుందని మస్క్ స్పష్టం చేశారు. అప్పుడు నేను చెప్పిన మాటలకు చాలామంది నన్ను వెర్రివాడిగా భావించారని మస్క్ లేటెస్ట్ ట్వీట్లో పేర్కొన్నారు.స్పేస్ఎక్స్ స్టార్లింక్ ప్రాజెక్ట్ఇలాన్ మస్క్ ప్రపంచవ్యాప్తంగా హై-స్పీడ్ ఇంటర్నెట్ను అందించాలని లక్ష్యంతో స్పేస్ఎక్స్ స్టార్లింక్ ప్రాజెక్ట్ ప్రారభించారు. అపరిమిత డేటా మాత్రమే కాకుండా.. రిమోట్ ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సర్వీస్ అందించడమే దీని లక్ష్యం. భారత్లో.. స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడికాలేదు. ఇది రిలయన్స్ జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా మారుతుంది.ఇదీ చదవండి: తండ్రి బిలియనీర్.. భార్య మిస్ ఇండియా.. అతడెవరో తెలుసా?ఏఐపై మస్క్ వ్యాఖ్యలుఇంటర్నెట్ గురించి మాత్రమే కాకుండా కృత్రిమ మేధస్సు (AI) గురించి కూడా మస్క్ గతంలోనే వ్యాఖ్యానించారు. ఏఐ ఉద్యోగాలను తొలగిస్తుందని అంచనా వేశారు. భవిష్యత్తులో బహుశా ఎవరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చని అన్నారు. ఏఐ, రోబోలు ప్రజలకు అవసరమైన అన్ని వస్తువులు.. సేవలను అందజేస్తాయని ఆయన విశ్వసించారు.The crazy thing is that they thought I was crazy for stating this super obvious predictionpic.twitter.com/OK0akTRj3E— Elon Musk (@elonmusk) December 10, 2024
- 
      
                   
                                                       రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీ.. వీడియో షేర్ చేసిన చెర్రీ!రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా 'గేమ్ ఛేంజర్'. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. మేకర్స్ వరుస అప్డేట్స్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పొలిటికల్, యాక్షన్ థ్రిల్లర్గా ఈ మూవీని రూపొందించారు.అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను రామ్ చరణ్ పంచుకున్నారు. గేమ్ ఛేంజర్ షూటింగ్ రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. చిత్రబృందంతో షూటింగ్లో పాల్గొన్న క్షణాలను వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.కాగా.. ఇటీవలే 'నానా హైరానా' అంటూ సాగే మెలొడీ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. కార్తిక్, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచిస్తే.. సంగీత దర్శకుడు తమన్ అదిరిపోయే ట్యూన్స్ అందించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు మాస్ పాటలు ప్రేక్షకులను మెప్పించగా.. టీజర్కు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు.#Gamechanger #JaanaHairaanSa @shankarshanmugh @advani_kiara @BoscoMartis @DOP_Tirru @MusicThaman @AalimHakim @ManishMalhotra pic.twitter.com/Ei3mMAgPHF— Ram Charan (@AlwaysRamCharan) December 10, 2024
- 
      
                   
                                                       అలిపిరి టోల్ గేట్ దగ్గర పుష్ప-2 సాంగ్కు యువతి రీల్..తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీ రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. అయితే, కొందరు భక్తులు చేసే పిచ్చి చేష్టలు మిగతా భక్తులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.. అయితే, తిరుమలలో ఫొటో షూట్లు, రీల్స్ చేయడం.. లాంటివి నిషేధించినా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఎన్నిసార్లు హెచ్చరించినా.కొందరు భక్తులు, యూట్యూబర్లు తీరు మార్చుకోవడం లేదు.. లైక్ ల కోసం పవిత్రమైన చోట ఐటమ్ సాంగ్కు రీల్స్ చేస్తూ.. వెగటు పుట్టిస్తున్నారు.. తాజాగా, అలిపిరి టోల్ గేట్ వద్ద పుష్ప 2 మూవీలోని ‘కిస్సిక్’ సాంగ్కు డాన్స్ చేసింది ఓ యువతి.. అలిపిరి టోలేట్ ముందు డాన్స్ చేసిన ఆ వీడియోను యువతి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయడంతో.ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.ఆ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.. ఇలాంటి వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.. అయితే, గతంలోను కోండపై సినీ నటి నయనతార ఫొటో షూట్, దర్శనం క్యూ లైన్లో చెన్నై యువకులు రీల్స్ చేయడం.. మొన్న అలిపిరి మెట్ల వద్ద పులి అంటూ బిగ్ బాస్ ఫేమ్ యువతి రీల్ చేయడం.. ఇలా.. వరుస ఘటనలు జరుగుతుండడంపై భక్తులు మండిపడుతున్నారు.. pic.twitter.com/PLmEypMVys— Telugu Scribe (@TeluguScribe) December 4, 2024అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసేందుకు పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే, విషయం తెలుసుకున్న యువతి.. శ్రీవారి భక్తులు తనను క్షమించాలంటూ మరో వీడియో విడుదల చేయడం గమనార్హం. https://t.co/DrCk8b8lOm pic.twitter.com/eYdYE9U2RZ— Telugu Scribe (@TeluguScribe) December 4, 2024
- 
      
                   
                                                       ‘ఇక్కడ రోజుకు వెయ్యిసార్లు చస్తున్నాం.. మమ్మల్ని కాపాడండి’టెల్అవీవ్: ఇజ్రాయెల్,హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొలిక్కిరావడం ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తమ వద్ద బందీగా ఉన్న ఇజ్రాయెల్ యువకుడు ఎడాన్ అలెగ్జాండర్ వీడియోను హమాస్ తాజాగా విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తమ విడుదలకు ప్రయత్నించాలని బందీగా ఉన్న యువకుడు వీడియోలో ఏడుస్తూ మొర పెట్టుకున్నారు. తామంతా ఇక్కడ రోజుకు వెయ్యిసార్లు చస్తున్నామని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. కాగా,ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచేందుకే హమాస్ మిలిటరీ విభాగం అల్ కస్సామ్ బ్రిగేడ్ ఈ వీడియోను విడుదల చేసినట్లు సమాచారం. Well, atleast he looks healthy an clean. Idan Alexander, held hostage because of Netanyahu #Israel pic.twitter.com/J42O2yGsRg— Steven Markussen (@DALAX) November 30, 2024ఈ వీడియోపై ఎడాన్ తల్లి యేల్ స్పందించారు. తన కుమారుడి వీడియో తనను కలవరపరిచిందని, హమాస్ వద్ద ఉన్న బందీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇది తెలియజేస్తోందన్నారు. ఈ వీడియోపై ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు కార్యాలయం స్పందించింది. ఇలాంటి హమాస్ వ్యూహాలు ఇజ్రాయెల్ లక్ష్యాన్ని అడ్డుకోలేవని స్పష్టం చేసింది. హమాస్ వద్ద ఉన్న బందీలను కచ్చితంగా తిరిగి తీసుకొస్తామని తెలిపింది. గత ఏడాది అక్టోబర్7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేయడంతో సుమారు 1200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని తమతోపాటు పాలస్తీనాలోని గాజాకు తీసుకెళ్లింది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 43వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
- 
      
                   
                                                       థ్యాంక్స్ గివింగ్ : వ్యోమగామి సునీతా విలియమ్స్ స్పెషల్ మీల్అంతరిక్షంలో థాంక్స్ గివింగ్ జరుపుకునేందుకు భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సిద్ధమయ్యారు. ఒక ప్రత్యేక మీల్తో థ్యాంక్స్ గివింగ్ సందర్భాన్ని జరుపుకోనున్నారు. ఈ మేరకు బుధవారం సునీతా విలియమ్స్ సందేశంతో కూడిన ఒక వీడియోను నాసా విడుదల చేసింది.“ఇక్కడ ఉన్న మా సిబ్బంది భూమిపై ఉన్న మా స్నేహితులు,కుటుంబ సభ్యులందరికీ అలాగే మాకు మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికీ హ్యాపీ థాంక్స్ గివింగ్ చెప్పాలనుకుంటున్నారు” అని విలియమ్స్ తన వీడియో సందేశంలో తెలిపారు. ఈ సందర్భంగా నాసా తమకు బటర్నట్ స్క్వాష్, యాపిల్స్, సార్డినెస్ (చేపలు), స్మోక్డ్ టర్కీ(బేక్చేసిన చికెన్) వంటి ఆహార పదార్థాలను అందించిందని వ్యోమగాములు పంచుకున్నారు. ప్రతీ ఏడాది నవంబరు నాలుగో గురువారం అమెరికాలో థాంక్స్ గివింగ్ జరుపుకుంటారు."We have much to be thankful for."From the @Space_Station, our crew of @NASA_Astronauts share their #Thanksgiving greetings—and show off the menu for their holiday meal. pic.twitter.com/j8YUVy6Lzf— NASA (@NASA) November 27, 2024 కాగా 8 రోజుల అంతరిక్ష పర్యటన కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లిన భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. సునీతా విలియమ్స్తోపాటు బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన బోయింగ్ సంస్థ తయారు చేసిన స్టార్లైనర్ రాకెట్లోని ప్రొపల్షన్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా వారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అక్టోబరులో దీపావళిని కూడా అంతరిక్షంలోనే జరుపుకున్నారు సునీత. వారిద్దరినీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తీసుకువచ్చేందుకు నాసా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
- 
      
                   
                                                       'ఇటు రావే నా గాజు బొమ్మ'.. ఆ పాటతో తారకరత్న కూతురి హాఫ్ శారీ వేడుక!తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న నందమూరి హీరో తారకరత్న. అంతలా అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా ఇటీవల ఆయన పెద్దకూతురు నిష్కా తారకరత్న హాఫ్ శారీ వేడుక ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలుస వీడియోలను తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు ఆయన సతీమణి అలేఖ్యా రెడ్డి. ఇది చూసిన నందమూరి ఫ్యాన్స్ అచ్చం నాన్న పోలికే అంటూ సంతోషం వ్యక్తం చేశారు.తాజాగా ఈ వేడుకకు సంబంధించిన మరో వీడియోను అలేఖ్య తన ఇన్స్టాలో షేర్ చేశారు. 'ఇటు రావే నా గాజు బొమ్మ' అనే సాంగ్ను ఈ వీడియోకు జతచేశారు. నాని హీరోగా నటించిన హాయ్ నాన్న చిత్రంలోని ఈ పాట తండ్రీ, కూతుళ్ల మధ్య ప్రేమను తెలిపేలా ఉంది. తన కూతురి కోసం ఒక తండ్రి పడే తపనను ఈ ఒక్క పాటలో చూపించారు. తన ముద్దుల కూతురిని తలచుకుని అలేఖ్య ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కుమార్తెను ముద్దాడింది.తారకరత్న కూతురి హాఫ్ శారీ వేడుకకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. తారకరత్న నివాసంలో జరిగిన ఈ వేడుకను గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఫంక్షన్లో కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు.తారకరత్న జర్నీకాగా.. ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న అకాల మరణం చెందారు. గుండెపోటుకు గురై బెంగళూరులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. View this post on Instagram A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna)
- 
      
                   
                                                       హమాస్ చీఫ్ బంకర్ చూస్తే షాక్ అవాల్సిందే.. భారీగా డబ్బు..హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో మృతి చెందారు. తాజాగా ఆయనకు సంబంధించిన రహస్య బంకర్ వీడియోను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గాజాలోని ఖాన్ యూనిస్ ఉన్న ఈ బంకర్లో వంటగది సామాగ్రి, పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ పంపిణీ చేసిన సహాయక సమాగ్రి, మిలియన్ డాలర్ల భారీ నగదు, పెర్ఫ్యూమ్, వ్యక్తిగత షవర్ ఉన్నాయి. ఈ వీడియో ఫిబ్రవరి నెలకు సంబంధించినదిగా తెలుస్తోంది.ఇక.. అక్టోబరు 7న ఇజ్రాయెల్పై దాడికి సిన్వార్ సూత్రధారి. ఆయన రఫాకు పారిపోయే ముందు ఈ బంకర్లోనే కొన్నిరోజులు గడిపినట్లు తెలుసోంది. ఇస్మైల్ హనియే హత్య అనంతరం ఇజ్రాయెల్ సైన్యం సిన్వార్ను అంతం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే అక్టోబర్ 16న జరిపని దాడుల్లో సిన్వార్ మృతి చెందారు.Hamas' eliminated leader Yahya Sinwar was hiding in this underground tunnel months ago:Surrounded by UNRWA bags of humanitarian aid, weapons and millions of dollars in cash.He hid like a coward underground, using the civilians of Gaza as human shields. pic.twitter.com/0ylVjTCv7H— Israel ישראל (@Israel) October 20, 2024 ‘‘హమాస్ నుంచి తొలగించబడిన నేత యాహ్యా సిన్వార్ కొన్ని నెలల క్రితం ఈ భూగర్భ సొరంగంలో దాక్కున్నారు. మానవతా సహాయం, ఆయుధాలు, మిలియన్ల డాలర్ల నగదుతో ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA) బ్యాగులు ఉన్నాయి. ఆయన గాజా పౌరులను కవచాలుగా ఉపయోగించుకొని, పిరికివాడిలా భూగర్భంలో దాక్కున్నారు’’ అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించే ఎక్స్లో వీడియోను విడుదల చేసింది.Hamas leader Yahya Sinwar’s wife reportedly spotted with $32,000 Birkin bag as she went into hiding https://t.co/Dwqf0h7nTQ pic.twitter.com/JHZ5eMrYiZ— New York Post (@nypost) October 20, 2024 ఆదివారం ఇజ్రాయెల్ సైన్యం అక్టోబర్ 7 దాడికి ఒక రోజు ముందు యాహ్యా సిన్వార్ బంకర్ గుండా వెళుతున్నట్లు చూపించే వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ఫుటేజీలో.. హమాస్ నాయకుడు సిన్వార్ తన కుటుంబంతో కలిసి బ్యాగులు, సామాగ్రిని చేతిలో పట్టుకుని నడుస్తున్నట్లు దృష్యాలు కనిపించాయి. సిన్వార్ భార్య సొరంగంలోకి పారిపోతున్నప్పుడు 32వేల అమెరికన్ డాలర్ల(సుమారు రూ. 27 లక్షలు) విలువైన ఖరీదైన హ్యాండ్బ్యాగ్ని తీసుకువెళ్లిన దృష్యం కనిపించింది.చదవండి: అక్టోబర్లో దాడులకు ముందు సిన్వర్ ఇలా..
- 
      
                   
                                                       HYD: మియాపూర్లో చిరుత.. భయాందోళనలో స్థానికులుసాక్షి,హైదరాబాద్: అడవుల్లో ఉండే చిరుత భాగ్యనగరంలోకి ఎంటరైంది. శుక్రవారం(అక్టోబర్ 18)మియాపూర్ లో చిరుత సంచరించడం సంచలనం రేపింది. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఏకంగా మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక భాగంలో చిరతు సంచరించింది. స్థానికుల సమాచారంతో చిరుత సంచరించిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో చిరుత కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిరుత సంచరిస్తున్న వీడియోను స్థానికులు ఫోన్లో బందించారు.
- 
      
                   
                                                       దసరా పండుగ ఉత్సవాల్లో ఏఆర్ కానిస్టేబుల్ వీరంగంసాక్షి,సూర్యాపేట : సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం, బేతవోలులో జరిగిన దసరా ఉత్సవాల్లో వీరకుమార్ అనే ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. పండుగ సందర్భంగా గ్రామానికి వచ్చిన కానిస్టేబుల్ వీరకుమార్ ఆలయంలో మాజీ సర్పంచ్ నాగయ్యను కాలితో తన్ని దాడికి దిగాడు. అడ్డుకునేందుకు వచ్చిన ఏఎస్ఐ వెంకటేశ్వర్లుపై కూడా దాడికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అదే సమయంలో అక్కడే ఉన్న కోదాడ పట్టణ సీఐ రాము ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశాడు.మాజీ సర్పంచ్ నాగయ్య ఆలయం భయట మూత్ర విసర్జన చేస్తుండగా.. కొందరు వీడియోలు తీసి వాట్సప్లో షేర్ చేయడంతో గొడవ తలెత్తింది. ఇదికాస్తా ఘర్షణకు దారితీయడంతో నలుగురికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడ్డ ఏఆర్ కానిస్టేబుల్ వీరకుమార్పై చిలుకూరు పోలిస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు కోదాడ రూరల్ ఎస్సై రజితారెడ్డి తెలిపారు
- 
      
                   
                                                       రతన్ టాటా మళ్లీ బతికొస్తే..!రతన టాటాను ఒక పారిశ్రామికవేత్తగా కంటే కూడా ఒక గొప్ప మానవతావాదిగా, అనుక్షణం దేశ శ్రేయస్సు కోసం కాంక్షించిన వ్యక్తిగా అందరూ గుర్తుంచుకుంటారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈ లోకాన్ని విడిచి మనందరికీ దూరమయ్యారు. ఆయన మళ్లీ బతికొస్తే బావుండు అని అనుకోనివారుండరు.అలా భావించిన ఒక వ్యక్తి రతన్ టాటాపై ఏఐ సహాయంతో ఓ అద్భుతమైన వీడియో రూపొందించారు. తన సారథ్యంలోని టాటా గ్రూపు ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో దేశ ప్రజల శ్రేయస్సు గురించే రతన్ టాటా ఆలోచించేవారు. అలా ఆయన అభివృద్ధి చేసిన పలు వ్యాపారాలను గుర్తు చేస్తున్నట్టుగా రతన్ టాటా ఈ వీడియోలో కనిపించారు.రతన్ టాటా దూరమయ్యారని దేశమంతా బాధాతప్తులైన వేళ టాటా మళ్లీ బతికొచ్చి ‘చింతించకండి.. నేను లేకపోయినా నా జ్ఞాపకాలు మీతోనే ఉంటాయి‘ అని అంటున్న విధంగా రూపొందించిన ఈ ఏఐ వీడియో సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.Best use of ‘AI’ ❤️ pic.twitter.com/FLreHPZr0I— Yash Gowda (@yash_gowdaa) October 11, 2024
- 
      
                   
                                                       ఇది మెట్రోనా లేక నవరాత్రుల మండపమా?కోల్కతా: ప్రతీయేటా నవరాత్రులలో కోల్కతాలో దుర్గాపూజా మండపాలను అద్బుతంగా తీర్చిదిద్దుతుంటారు. భక్తులు వీటిని చూసి మైమరచిపోతుంటారు. ఇటువంటి మండపాలకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారుతుంటాయి. అయితే వీటికి భిన్నమైన ఒక మండపం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో తొలుత అండర్ వాటర్ మెట్రో లోపల ఓ వ్యక్తి వీడియో తీస్తున్నట్లు కనిపిస్తుంది. తరువాత అద్భుత దృశ్యం కనిపిస్తుంది. నిజానికి ఇది మెట్రో కాదు. నీటి అడుగున మెట్రో థీమ్తో రూపొందించిన దుర్గాపూజా మండపం. వీడియో చివరిలో దుర్గమ్మవారి విగ్రహం కనిపిస్తుంది . పలువురు భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడాన్ని కూడా వీడియోలో చూడవచ్చు.ఈ వీడియోను చూసినవారంతా వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో దీనిని షేర్ చేస్తున్నారు. ఈ వీడియో @ChapraZila అనే పేజీ నుండి పోస్ట్ అయ్యింది. దాని క్యాప్షన్గా 'కోల్కతాలోని మెట్రో మార్గంలో నిర్మించిన దుర్గామాత మండపం’ అని రాసివుంది. ఈ వీడియోను ఇప్పటివరకూ 36 వేల మందికి పైగా యూజర్లు వీక్షించారు. कोलकाता में मेट्रो की तर्ज पर बना मां दुर्गा का पंडाल 👏❤️ pic.twitter.com/YFYb3D2xAF— छपरा जिला 🇮🇳 (@ChapraZila) October 8, 2024ఇది కూడా చదవండి: బూటకపు ఎన్కౌంటర్.. డీఎస్పీకి జీవితఖైదు
- 
      
                   
                                                       గుండెపోటుతో యూట్యూబర్ కన్నుమూతసీతాపూర్: దేశంలో దేవీనవరాత్రులు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. యూపీలోని సీతాపూర్లో నవరాత్రుల వేళ విషాదం చోటుచేసుకుంది. అమ్మవారి జాగరణలో కార్యక్రమంలో పాల్గొన్న ఒక యూట్యూబర్ ఆనందంగా నృత్యం చేస్తూ, ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.యూపీలోని సీతాపూర్లో నవరాత్రి కార్యక్రమాలను చిత్రీకరించేందుకు వచ్చిన వికాస్ అనే యూట్యూబర్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. వికాస్ కుప్పకూలగానే అక్కడ ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. వికాస్ స్నేహితులు వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి, గుండెపోటుతో మృతిచెందాడని ధృవీకరించారు. వికాస్ మృతికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. దానిలో వికాస్ హఠాత్తుగా కిందపడిపోవడం, తరువాత అతని స్నేహితులు అతనిని ఆస్పత్రికి తరలించడం కనిపిస్తుంది. వికాస్ షార్ట్ వీడియోలు తీస్తూ ఫేమస్ అయ్యాడు. ఫాలోవర్ల సంఖ్య కూడా అధికంగానే ఉంది. దుర్గా జాగృతి కార్యక్రమంలో పాల్గొనేందుకు స్నేహితులతో పాటు వచ్చిన వికాస్ డీజే ట్యూన్స్కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ అక్కడే కుప్పుకూలిపోయాడు. వెంటనే అతని స్నేహితులు అతనిని దగ్గరలోని పీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు వికాస్ చనిపోయినట్లు నిర్ధారించారు. వికాస్ మృతిపై పోలీసులకు తెలియజేయకుండా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: కిడ్నాపైన బాలుడు శవమై తేలాడు
- 
      
                   
                                                       కాంగ్రెస్ మహిళా నేతకు వేధింపులు.. వీడియోతో బయటపెట్టిన బీజేపీకాంగ్రెస్ను మహిళ వ్యతిరేక పార్టీ అంటూ బీజేపీ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. అందరూ చూస్తుండగానే స్టేజ్ మీ ఓ మహిళను లైంగికంగా వేధించారంటూ కాంగ్రెస్పై. దానికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది కాషాయపార్టీ. హర్యానా కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా, ఇతర నేతల సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని మండిపడింది.ఇంతకీ ఏం జరిగిందంటే.. కాంగ్రెస్ నేత దీపిందర్ సింగ్, ఇతర నేతలు ఉన్న వేదికపై ఉన్నప్పుడే ఓ మహిళ వేధింపులు ఎదుర్కొన్నట్లు కొన్ని దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోస్టు చేస్తూ.. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్లా దీపేందర్ హుడా కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. ఇలాంటి వారి అసభ్య ప్రవర్తన కారణంగా ఎంతోమంది మహిళా కాంగ్రెస్ నేతలు పార్టీని వీడారని ఆరోపించారు. చాలా అవమానకరమైన వీడియో బయటపడింది. కొన్ని దృశ్యాలు సిగ్గుపడేలా ఉన్నాయి. ఇది మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని కాగ్రెస్ ఎంపీ కుమారి సెల్జా ధృవీకరించారు. పట్టపగలు, దీపేందర్ హుడా సమక్షంలో వేదికపై ఒక మహిళా నేతకు పార్టీకి చెందిన వ్యక్తి నుంచే వేధింపులు ఎదురయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లోనే మహిళలకు భద్రత లేకపోతే.. ఇక రాష్ట్రంలోని మహిళలు ఎలా భద్రంగా ఉంటారు?.. ఇది మహిళా వ్యతిరేక పార్టీ. ఈ హుడా మద్దతుదారులపై ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ చర్యలు తీసుకుంటారా?’ అని ప్రశ్నించారు.Most shocking 😮 A woman congress leader was molested in stage in presence of Deependra Hooda by congress leaders Confirmed by news reports and even Kumari Selja If women are not safe in Congress meetings in full public view during the daytime - can they be safe if Congress… pic.twitter.com/yIw46gl91t— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) October 5, 2024మరోవైపు మహిళలు, పేదలు, దళితులను గౌరవించకపోవడం కాంగ్రెస్ సంస్కృతి, డీఎన్ఏలో ఉందనంటూ హర్యానా ముఖ్యమంత్రి నయాబ్సింగ్ సైనీ విమర్శించారు. ఈ విషయంలో మాకు ఫిర్యాదు వస్తే.. చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ ప్రభుత్వం ఎవరినీ వదిలిపెట్టద్దని చెప్పారు.కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కుమారి సెల్జా సైతం ఈ ఘటనను ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘బాధితురాలితో నేను మాట్లాడాను. తనపై వేధింపులు జరిగాయని ఆమె తెలిపింది. రాజకీయాల్లో ఎదిగేందుకు ఎంతో కష్టపడి పనిచేస్తోన్న ఓ మహిళకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం తీవ్రంగా ఖండించదగినది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- 
      
                   
                                                       మెట్రోలో వర్షం.. కంగుతిన్న ప్రయాణికులుముంబై: దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనం పలు ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ నేపధ్యంలో మహారాష్ట్రలోని ముంబైలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది.ప్రయాణీకులతో నిండిన ముంబై మెట్రోలోని ఒక కోచ్లో అకస్మాత్తుగా వర్షం పడింది. ప్రయాణికులతో రద్దీగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.కోచ్లో ఉన్న ఏసీ వెంట్ నుంచి అకస్మాత్తుగా నీరు బయటకు రావడాన్ని వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఈ దృశ్యాన్ని అక్కడున్న పలువురు తమ కెమెరాల్లో బంధించారు. ఢిల్లీ మెట్రోకు సంబంధించిన అనేక వైరల్ వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. ఇప్పుడు ఇదే రేంజ్లో ముంబై మెట్రో వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసిన కొందరు.. ‘మెట్రోలో ప్రయాణించేందుకు వారు టికెట్ తీసుకున్నారని, అయితే ఇప్పుడు వారంతా స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్లుందని కామెంట్ చేశారు. ఈ ఘటనపై కొందరు సరదాగా కామెంట్ చేస్తుండగా, మరికొందరు మెట్రో పరిస్థితిని సీరియస్గా తీసుకుంటున్నారు. మెట్రో యాజమాన్యం ఈ సమస్యను పరిష్కరించాలని పలువురు యూజర్లు కోరుతున్నారు. Life in a metro ❌Rain in a metro ✅#Mumbai #MumbaiRain pic.twitter.com/B2m90FsbuW— Miss Ordinaari (@shivangisahu05) September 24, 2024ఇది కూడా చదవండి: నేడు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు
- 
      
                   
                                                       న్యూస్ చదువుతుండగా లెబనాన్ జర్నలిస్ట్పై ఇజ్రాయెల్ మిస్సైల్ దాడిబీరూట్ : లెబనాన్ దేశంలో హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడి చేస్తోంది. ఈ దాడితో రెండ్రోజుల వ్యవధిలో సుమారు 550 మందికి పైగా మరణించారని, 1,800 మందికిపైగా గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.ఈ తరుణంలో ఇజ్రాయెల్కు వ్యతిరేక కథనాల్ని ప్రసారం చేస్తున్నారనే నెపంతో లెబనాన్ టీవీ ఛానెల్ లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం రాకెట్ దాడి చేసింది.ఆ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. లెబనాన్లో ఇజ్రాయెల్ - హిజ్బుల్లా దళాల మధ్య వైమానిక దాడులపై మిరయా ఇంటర్నేషనల్ నెట్వర్క్ టీవీ ఛానల్ న్యూస్ రూమ్లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. లైవ్ టెలికాస్ట్పై అప్పటికే సమాచారం అందుకున్న ఇజ్రాయెల్ ఆర్మీ.. న్యూస్ రూమ్లో న్యూస్ ప్రసారం చేస్తున్న మిరయా ఇంటర్నేషనల్ నెట్వర్క్ టీవీ ఛానల్ ఎడిటర్–ఇన్–చీఫ్ జర్నలిస్ట్ ఫాది బౌడియాపై రాకెట్ దాడి చేసింది. ఫాది బౌడియా ఇంటర్వ్యూ చేస్తుండగా ఆయన వెనుక నుంచి రాకెట్ దూసుకొచ్చింది. ఈ దాడిలో బౌడియాకు తీవ్ర గాయాలయ్యాయి. ఫుటేజీలో, బౌడియా పేలుడు తీవ్రతతో అరుస్తూ.. హాహాకారాలు వ్యక్తం చేస్తూ ప్రాణ భయంతో భీతిల్లిపోయారు. ఏమి జరుగుతుందో తెలియక భయాందోళన చెందారు. పేలుడు కారణంగా అతనికి గాయాలైనట్లు నివేదికలు ధృవీకరించాయి.A video shows journalist Fadi Boudiya being thrown off balance while he was live on air in Lebanon. Boudiya is the editor-in-chief of Miraya International Network and has reportedly been injured in the attack.Video Credit: @eye.on.palestine#thecurrent #lebanon pic.twitter.com/YdHQNoyxk9— The Current (@TheCurrentPK) September 24, 2024చదవండి : హిబ్జుల్లా కమాండర్ హతం
- 
      
                   
                                                       నిద్రలో నడుస్తూ అడవిలోకి...!అమెరికాలో లూసియానా రాష్ట్రంలోని వెబ్స్టర్ పారిస్కు చెందిన ఓ పాపకు నిద్రలో నడిచే అలవాటుంది. శనివారం రాత్రి ఇంట్లో పడుకున్న బాలిక మరునాడు ఉదయం ఇంట్లో కనిపించలేదు. నిద్రలో నడుస్తూ కాస్త దూరం ఎటైనా వెళ్లిందేమోనని తల్లిదండ్రులు చుట్టుపక్కలంతా వెదికారు. ఎక్కడా కనిపించకపోవడంతో మర్నాడు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటి చుక్కపక్కల సీసీటీవీ కెమెరాలన్నింటినీ జల్లెడ పట్టారు. కనీసం బూట్లు లేకుండా బాలిక సమీపంలోని అడవుల్లోకి నడిచి వెళ్తూ ఓ కెమెరాకు చిక్కింది. వెంటనే గాలింపు చేపట్టారు. చిన్నారి నడిచి వెళ్లిన ప్రాంతమంతా జల్లెడ పట్టారు. ట్రాకింగ్ డాగ్స్, డ్రోన్లతో పాటు చివరికి హెలికాప్టర్ను కూడా రంగంలోకి దించారు. విషయం తెలిసి వందలాది మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి వెదుకులాటకు దిగారు. పోలీసులు, ప్రభుత్వ ఏజెన్సీలతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నాయి. చివరకు రాత్రి 11 గంటల వేళ రోడ్డుకు సమీపంలో అడవిలో చిన్నారిని ఓ డ్రోన్ థర్మల్ ఇమేజింగ్ ద్వారా కనిపెట్టింది. అప్పటికి ఒక రోజు గడిచినా చిన్నారి ఇంకా గాఢనిద్రలోనే ఉండటం విశేషం! పోలీసులు, తల్లిదండ్రుల పిలుపులతో ఉలిక్కిపడి లేచింది. నెమ్మదిగా ఏడుపందుకుంది. తల్లిదండ్రులు ఊరడించడంతో మెల్లిగా తేరుకుంది. ఈ దృశ్యాలు అందరినీ కదిలించాయి. ‘అడవిలో, వణికించే చలిలో ఆ చిన్న పాప ప్రశాంతంగా నిద్రపోతూ దొరికిన క్షణాలు హృదయాలను కదిలించాయి. సాంకేతిక పరిజ్ఞానం ఇలా సామాజిక ప్రయోజనానికి ఉపయోగపడటం నిజంగా బాగుంది’ అంటూ నెటిజన్లు సంబరపడుతున్నారు.
- 
      
                   
                                                       తిరగలి పట్టిన మాజీ సీఎం రబ్రీదేవిపట్నా: బీహార్లో ఆసక్తికర రాజకీయాలు నడుస్తుంటాయి. ముఖ్యంగా ఆర్జేడీ నేత లాలూతో పాటు అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశాలు వైరల్గా మారుతుంటాయి. తాజాగా లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ తన తల్లి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవికి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ వీడియోను చూసిన వారంతా రకరకాలుగా తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో రబ్రీదేవి సాధారణ బీహారీ మహిళగా కనిపిస్తున్నారు. గోధుమలను తిరగలి పడుతూ, వాటిని జల్లెడ పడుతూ, శుభ్రం చేస్తూ కనిపిస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన తేజస్వి యాదవ్ ‘జీవితాన్ని నడిపించేది తల్లి.. ఆశ, నమ్మకం, ప్రేమలకు ప్రతిబింబం తల్లి’ అని రాశారు.ఈ వీడియోను చూసిన రవి ఆనంద్ అనే యూజర్.. ‘కుటుంబం, అధికారం రెండింటినీ ఎలా నడపవచ్చో ప్రపంచానికి చాటిచెప్పిన తల్లి ఆమె’ అని రాశారు. మరో యూజర్ ‘మీరు బీహార్ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలను ఏకకాలంలో చూపించారని’ రాశారు. जीवन का संबल है माँ! जीवन का आस-विश्वास, सार-प्यार, प्रतिमान और आर्शीवचन है माँ! #motherslove #mothers #trending pic.twitter.com/j7fYUwfvOE— Tejashwi Yadav (@yadavtejashwi) September 22, 2024ఇది కూడా చదవండి: ‘అహ్మద్కు రీనా లేఖ’.. మూడవ తరగతి లెసన్పై పోలీసులకు ఫిర్యాదు
- 
      
                   
                                                       మహిళా పీఈటీ అకృత్యంతంగళ్లపల్లి (సిరిసిల్ల): క్రమశిక్షణ పేరుతో వ్యాయామ ఉపాధ్యాయురాలు (పీఈటీ) విద్యార్థినులపై కర్కషంగా వ్యవహరించిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చోటుచేసుకుంది. తమను పీఈటీ జ్యోత్స్న బారి నుంచి రక్షించాలని కోరుతూ విద్యార్థినులు గురువారం తెల్లవారుజూమున 5 గంటలకు పాఠశాల గోడదూకి సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు. తమ ను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్న పీఈటీని వెంటనే విధుల నుంచి తొలగించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థినులు మీడియాకు తమగోడు వెళ్లబోసుకుంటూ.. ఐదేళ్లుగా గిరిజన గురుకులంలో పీఈటీగా పనిచేస్తున్న జ్యోత్స్న బదిలీ అయినప్పటికీ కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని ఇక్కడే కొనసాగుతోందన్నా రు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. విద్యార్థినులను బూతులు తిడుతూ దాడి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఇద్దరు బాలికలకు నెలసరి రావడంతో బాత్రూమ్లలో స్నానం చేస్తుండగా ప్రార్థన సమయంలో ఎందుకు స్నానాలు చేస్తున్నారని ఆగ్రహంతో బాత్రూమ్ల తలుపులు పగులగొట్టి స్నానం చేస్తుండగా తన ఫోన్లో వీడియో తీయడంతోపాటు కర్ర తో చితకబాదారని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినుల ఆందోళన విషయం తెలుసుకున్న సిరిసిల్ల రూ రల్ సీఐ మొగిలి, తంగళ్లపల్లి ఎస్సై డి.సుధాకర్ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడి ధర్నాను విరమింపజేయగా.. బాలికలు మరోసారి పాఠశాల గేటు ఎదుట ఆందోళనకు దిగారు. పలు విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్దకు చేరుకుని బాలికలకు మద్దతుగా నిలిచారు. రంగంలోకి కలెక్టర్.. పీఈటీ సస్పెన్షన్ గిరిజన బాలికల ఆందోళన గురించి తెలుసుకున్న కలెక్టర్ సందీప్కుమార్ ఝా హుటాహుటిన గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్తో మాట్లాడి అప్పటికప్పుడు పీఈటీ జ్యోత్స్నను విధుల నుంచి తొలగించారు. పీఈటీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీఐ మొగిలిని ఆదేశించారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ పద్మను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో తంగళ్లపల్లి పోలీస్స్టేషన్లో పీఈటీ జ్యోత్స్నపై కేసు నమోదైంది. కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి కాల్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి): విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు దారితప్పడంతో దేహశుద్ధి చేసిన ఘటన గురువారం పెద్దపల్లి జిల్లాలో జరిగింది. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఓ జెడ్పీ హైస్కూల్లో కొంతకాలంగా ఇద్దరు ఉపాధ్యాయులు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో వారు తమ తల్లిదండ్రులకు మొరపెట్టుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఓ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి హెచ్చరించి వదిలిపెట్టారు. మరో ఉపాధ్యాయుడు విధులకు గైర్హాజరు కావడంతో దాడి నుంచి తప్పించుకోగలిగాడు. ఈ విషయమై హెచ్ఎంను వివరణ కోరగా, ఇద్దరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని విద్యార్థినులు తన దృష్టికి తీసుకురావడంతో మందలించానని, అయినా వారు ప్రవర్తన మార్చుకోకపోవడంతో విషయం తల్లిదండ్రుల దృష్టికి వెళ్లిందన్నారు. ఇద్దరు ఉపాధ్యాయుల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు.
- 
      
                   
                                                       ‘రాహుల్ గాంధీ.. మీకూ మీ నాన్నమ్మ గతే పడుతుంది’న్యూఢిల్లీ: సిక్కులకు సంబంధించి లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. భారతదేశంలో సిక్కులకు మత స్వేచ్ఛ లేదని రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో బీజేపీలోని సిక్కు నేతలు ఢిల్లీలో నిరసన తెలిపారు. ఈ నేపద్యంలో కాంగ్రెస్ తాజాగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే తర్విందర్ సింగ్ మార్వకు చెందిన వీడియోను షేర్ చేసింది. దానిలో తర్విందర్.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఎదురైన విధి రాహుల్కు కూడా ఎదురవుతుందని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ పార్టీ తన ‘ఎక్స్’ హ్యాండిల్లో ఈ వీడియోను షేర్ చేస్తూ, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని మోదీని కోరింది.. అలాగే.. ఢిల్లీ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే, తర్విందర్ సింగ్ మార్వా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘రాహుల్ గాంధీ.. ఆగండి.. లేకపోతే భవిష్యత్తులో మీ నాన్నమ్మకు పట్టిన గతే మీకూ పడుతుందని’ అన్నారని, ఈ బీజేపీ నేత బహిరంగంగా చంపేస్తానని బెదిరించారని, మీ పార్టీలోని ద్వేషం కారణంగానే ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయని’ ప్రధాని మోదీకి కాంగ్రెస్ విన్నవించింది. కాగా అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘భారత్లోని సిక్కులు.. తమకు తలపాగా, కంకణం ధరించడానికి అనుమతి ఉంటుందో ఉండదోననే ఆందోళనలో ఉన్నారు. ఇది ఒక సిక్కులకే కాదు, అన్ని మతాల ప్రజలకు సంబంధించినది’ అని వ్యాఖ్యానించారు. కాగా ఢిల్లీ బీజేపీ నేత తర్విందర్ సింగ్ మార్వా రెండేళ్ల క్రితం వరకు కాంగ్రెస్లో ఉన్నారు. 2022 జూలైలో కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. दिल्ली BJP का नेता और पूर्व विधायक, तरविंदर सिंह मारवाह ने आज प्रदर्शन के दौरान कहा: “राहुल गांधी बाज आ जा, नहीं तो आने वाले टाइम में तेरा भी वही हाल होगा जो तेरी दादी का हुआ”BJP का ये नेता खुलेआम देश के नेता प्रतिपक्ष की हत्या की धमकी दे रहा है.@narendramodi जी, अपने… pic.twitter.com/tGisA5dfNu— Congress (@INCIndia) September 11, 2024ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ప్రచారానికి వాల్మీకి స్కామ్ డబ్బు
- 
      
                   
                                                       గెలిపిస్తే టిక్టాక్ను కాపాడుతా: ట్రంప్వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపిస్తే చైనాకు చెందిన సోషల్ మీడియా వేదిక ‘టిక్టాక్’ను కాపాడుతానని అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో టిక్టాక్కు తాను రక్షకుడిని అవుతానని ఉద్ఘాటించారు. టిక్టాక్ కావాలని కోరుకునేవారంతా అధ్యక్ష ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని కోరారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. అమెరికాలో తన ప్రత్యర్థి వర్గం టిక్టాక్ను మూసివేయడానికి కుట్ర పన్నుతోందని పరోక్షంగా అధ్యక్షుడు జో బైడెన్పై ఆరోపణలు గుప్పించారు. టిక్టాక్ను అమెరికా కంపెనీకి విక్రయిండానికి దాని మాతృ సంస్థపై ఒత్తిడి పెంచేలా లేదా అమెరికాలో టిక్టాక్ను నిషేధించేలా జో బైడెన్ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్లో ఓ బిల్లుపై సంతకం చేసింది. నిజానికి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2020లో టిక్టాక్పై నిషేధం విధించడం గమనార్హం.
- 
      
                   
                                                       రీల్స్ పిచ్చి: పాము కాటుకు యువకుడు బలిసాక్షి,కామారెడ్డిజిల్లా: సోషల్మీడియాలో పాపులర్ అవ్వాలన్న కోరిక మరో ప్రాణాన్ని బలిగొన్నది. సాహసం చేసి పేరుతెచ్చుకునే మాట అటుంచితే యుక్త వయస్సులోనే ఆయుష్షు పూర్తయిపోయింది. కామారెడ్డి జిల్లా దేశాయిపేటలో శుక్రవారం(సెప్టెంబర్6) విషాద ఘటన జరిగింది. సోషల్మీడియాలో వైరల్ అయ్యేందుకు శివరాజు అనే యువకుడు ఏకంగా విష సర్పాన్నే నోటితో కరిచి పట్టుకున్నాడు. ఈ దృశ్యాలను వీడియో తీయాల్సిందిగా స్నేహితులకు చెప్పాడు. ఇంకేముంది షరామామూలుగానే పాము తన సహజ స్వభావంతో యువకున్ని కాటు వేసింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన శివరాజును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివరాజు తుద్విశ్వాస విడిచాడు. యువకుడు అకారణంగా చనిపోవడంపై కుటుంబసభ్యులు కనీరుమున్నీరవుతున్నారు. పాముకాటుతో మృతిచెందిన శివరాజు ఇటీవల పాములు పట్టడంలో శిక్షణ పొందుతున్నట్లు తెలిసింది.
- 
      
                   
                                                       ‘హెల్మెట్ లేకుండా స్కూటర్పై మొసలి’సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఎప్పుడు ఎలాంటి విచిత్రాలు కనిపిస్తాయో ఎవరూ చెప్పలేరు. కడుపుబ్బా నవ్వించే వీడియోలతో పాటు కంగుతినిపించే వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతుంటాయి. ఇదేకోవకు చెందిన ఒక వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది.గుజరాత్కు చెందిన ఈ వీడియో ఒక పట్టాన నమ్మేలా లేదు. ఈ వీడియోను చూసినవారంతా తెగ ఆశ్చ్యపోతున్నారు. భారీ వర్షాలకు నదిలో నుంచి మొసళ్లు బయటకు రావడాన్ని చూసిన జనం.. అలాంటి మొసలి స్కూటర్పై వెళ్లడాన్ని చూసి కంగుతింటున్నారు. ఈ వీడియోలో ఇద్దరు యువకులు స్కూటర్పై వెళుతుండటాన్ని చూడవచ్చు. వారి మధ్య ఓ మొసలి కూడా ఉంది. ఒకరు స్కూటర్ నడుపుతుండగా, మరొకరు ఆ భారీ మొసలిని ఒడిలో పెట్టుకుని కూర్చున్నారు. కుక్కలను, పిల్లులను ఇలా స్కూటర్పై ఎక్కించుకుని తీసుకుని వెళ్లడాన్ని ఎప్పుడో ఒకప్పుడు చూసేవుంటాం. కానీ ఇలా మొసలిని బండిపై తీసుకువెళ్లడాన్ని ఎప్పుడూ చూడలేదని ఈ వీడియో చూసినవారు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ వీడియోను @gharkekalesh అనే ఖాతా ద్వారా మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫారమ్ ఎక్స్లో షేర్ చేశారు. ఈ వీడియో క్యాప్షన్లో ‘వడోదరలోని విశ్వామిత్ర నది నుంచి బయటకు వచ్చిన ఒక మొసలిని ఇద్దరు యువకులు స్కూటర్పై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్యాలయానికి తీసుకెళ్లారు’ అని రాసివుంది. ఈ వీడియోను చూసిన ఒక యూజర్ ‘ మొసలిని నీటిలో నుంచి బయటకు తీసి, దాని నోటిని తాడుతో కట్టేస్తే అది బలహీనపడిపోతుంది’ అని రాశారు. మరొక యూజర్ ‘సోదరుని ధైర్యానికి వందనం’ అని రాయగా, ఇంకొకరు ‘హెల్మెట్ లేకుండా స్కూటర్పై మొసలి ఎలా వెళుతుంది? అని రాశారు. Two young men took a crocodile found in Vishwamitra river in Vadodara to the forest department office on a scooter🫡pic.twitter.com/IHp80V9ivP— Ghar Ke Kalesh (@gharkekalesh) September 1, 2024
- 
      
                   
                                                       శ్రీనగర్లో దేశభక్తి పరవళ్లు... వైరల్ వీడియోభారతదేశం నేడు 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ తరుణంలో జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్కు చెందిన ఒక వీడియో దేశభక్తిని పరవళ్లు తొక్కిస్తోంది. దీనిని చూసిన భారతీయుల్లో ఉత్సాహం రెట్టింపవుతోంది.ఈ వీడియోలో శ్రీనగర్లోని లాల్చౌక్ దగ్గర ఓ యువకుడు జెండాను గాలిలో ఊపుతూ కనిపిస్తున్నాడు. ఆ యువకుడు ఖాకీ ప్యాంటు ధరించి, శరీరం పైభాగంలో త్రివర్ణాలను పెయింట్ చేయించుకున్నాడు. ఆ యువకుడి కడుపుపై అశోకచక్రం, ఛాతీపై భారత్ అని రాసి ఉంది. అతను భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ నినాదాలు చేయడాన్ని వీడియోలో చూడవచ్చు.2019లో ఆర్టికల్ 370ని రద్దు చేశాక కశ్మీర్కు ప్రత్యేక హోదా ముగిసింది. ఈ ఆర్టికల్ను తొలగించిన ఐదేళ్ల తర్వాత, కశ్మీర్లో శాంతి నెలకొంది. ఇక్కడి ప్రజలు ప్రధాన స్రవంతిలో చేరారు. భారతదేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జమ్ముకశ్మీర్ అత్యంత వేడుకగా చేసుకుంటోంది. #WATCH | #IndependenceDay2024 | Lal Chowk in Jammu & Kashmir's Srinagar is all decked up as India celebrates its 78th Independence Day. pic.twitter.com/SVmzg7iqdX— ANI (@ANI) August 15, 2024
- 
      
                   
                                                       Bihar: వెలుగులోకి తొక్కిసలాట వీడియోబీహార్లోని జెహనాబాద్లోని బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మృతిచెందారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఫుటేజీలో ఆలయం చుట్టూ భక్తుల రద్దీ కనిపిస్తుంది. ఇరుకైన మార్గంలో తోపులాట జరగడాన్ని ఆ వీడియోలో చూడవచ్చు. అలాగే పలువులు భయాందోళనలతో పరుగులు తీయడం కూడా వీడియోలో కనిపిస్తుంది.శ్రావణమాసంలో శివలింగాన్ని అభిషేకించేందుకు ఆలయానికి సుమారు 60 వేల మంది భక్తులు చేరుకున్నారు. పూల విక్రయదారునితో కొందరు భక్తులకు గొడవ జరిగిన దరిమిలా అక్కడి వాలంటీర్లు లాఠీచార్జి చేయడంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.ఈ కేసులో ఒక పూల విక్రయదారుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ ఈ ఘటనలో ప్రమేయమున్న మరో ముగ్గురు పూల విక్రయదారుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారన్నారు. కాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మృతులు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. जहानाबाद: सिद्धेश्वर नाथ मंदिर में भगदड़ का VIDEO आया सामनेबिहार के जहानाबाद में बाबा सिदेश्वरनाथ मंदिर के भगदड़ का वीडियो आया सामने आया है, जहां अचानक मची भगदड़ की चपेट में आकर 7 लोगों की मौत हो गई थी.#bihar | #jehanabad | #jehanabadstampede | #video pic.twitter.com/dTB9wukSkP— NDTV India (@ndtvindia) August 13, 2024
- 
      
                   
                                                       రోబోతో టేబుల్ టెన్నిస్.. ఫిదా చేస్తున్న వీడియోఏఐ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లోనూ టెక్నాలజీని వాడేస్తున్నారు. ఇప్పుడు తాజాగా టేబుల్ టెన్నిస్ ఆడే రోబోట్ వెలుగులోకి వచ్చింది. ఇది టేబుల్ టెన్నిస్ క్రీడాకారులకు ట్రైనింగ్ కూడా ఇచ్చేస్తోంది. వేగం, సామర్థ్యంలో ఈ రోబోట్.. మనుషులను కూడా మించిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వీడియోలో గమనిస్తే.. టేబుల్ టెన్నిస్ ఆడే రోబో మానవ పోటీదారులు గట్టి పోటీ ఇస్తోంది. సొంతంగా బాల్ పట్టుకోలేదు, సర్వ్ కూడా చేయలేదు. కానీ టేబుల్ టెన్నిస్ ఆడవాళ్లను మాత్రం అవలీలగా ఓడించేస్తోంది. ఈ రోబోట్ మొత్తం 29 మ్యాచ్ల సమయంలో 13 మందిని ఓడించి 45 శాతం విజయాన్ని సొంతం చేసుకుంది. కొంతమంది ఆటగాళ్లతో రోబోట్ కూడా ఓడిపోయింది.
- 
      
                   
                                                       విజయవాడ దుర్గగుడిలో నిఘా వైఫల్యంసాక్షి, విజయవాడ: విజయవాడ దుర్గగుడిలో నిఘా వైఫల్యం వెలుగుచూసింది. అమ్మవారి అంతరాలయ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోపై అధికారులు స్పందించారు. రెండురోజుల క్రితం అంతరాలయాన్ని భక్తురాలు వీడియో తీసింది.తాను తీసిన విజువల్స్ సోషల్ మీడియాలో పెట్టడంతో భద్రతాపై అనుమానాలు వ్యక్తమవుతున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆలయ అధికారులు విచారణ చేపట్టారు. ఆలయ పరువుకు భంగం కలిగించేవారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు.. ఘటనపై పోలీస్ శాఖకి ఫిర్యాదు చేశారు.
- 
      
                   
                                                       మేడిగడ్డ బ్యారేజ్ డ్రోన్ వీడియో వైరల్.. కేసు నమోదుసాక్షి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్ట్లోని మేడిగడ్డ బ్యారేజ్ డ్రోన్ వీడియోపై కేసు నమోదైంది. గత నెల 26న మేడిగడ్డ బ్యారేజ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్, పార్టీ ముఖ్య నాయకులు సందర్శించారు.ఈ నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు.. డ్రోన్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇరిగేషన్ ఏఈఈ ఫిర్యాదుతో మహదేవ్పూర్ పీఎస్లో కేసు నమోదైంది.. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
- 
      
                   
                                                       వీడియో లీక్పై స్పందించిన ఊర్వశి రౌతేలాబాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా బాత్రూమ్ వీడియో లీక్ అయిందంటూ ఒక క్లిప్పింగ్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే ఆమె తన మేనేజర్తో మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా లీక్ అయింది. ఆ వీడియో ఎలా బయటకొచ్చిందంటూ ఊర్వశి మాట్లాడిన మాటలు ఆన్లైన్లోకి రావడంతో ఈ టాపిక్ పెద్ద దుమారమే రేపింది. వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పక్కన డ్యాన్స్ వేసిన ఈ బ్యూటికి తెలుగులో కూడా పాపులారటీ ఉంది. ఆయితే, ఆమె పర్సనల్ వీడియో అంటూ వైరల్ అయిన క్లిప్పింగ్ గురించి ఊర్వశి తాజాగా రియాక్ట్ అయింది.అందరూ అనుకునేలా ఆ వీడియో లీక్ అవడం నిజమేనని ఊర్వశి రౌతేలా ఇలా చెప్పుకొచ్చింది. 'నేను బాలీవుడ్లో గుస్పేటియా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో భాగంగా ఓ సీన్ కోసం అలా నటించాను. కానీ, అది ఇటీవల నెట్టింట లీక్ కావడంతో నేను చాలా బాధపడ్డాను. కనీసం సినిమా చిత్రీకరణ పూర్తి కాలేదు.. అప్పుడు ఇలా వీడియోలు, ఫోటోలు లీక్ కావడం విచిత్రంగా ఉంది. అయితే, నేను అందరికీ చెప్పేది ఒక్కటే.. ఆ వీడియో నా వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కాదు. మరోకరికి ఇలాంటి సంఘటన ఎదురుకాకూడదని ఆశిస్తున్నాను.' అని ఊర్వశి చెప్పుకొచ్చింది.ఈ విషయంపై ఊర్వశి రౌతేలాపై నెటిజన్లు మండి పడుతున్నారు. వీడియో లీక్ అయింది సరే.. మేనేజర్తో మాట్లాడిన కాల్ ఎలా లీక్ అయిందంటూ వారు ఫైర్ అవుతున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని వారు చెప్పుకొస్తున్నారు. బాత్రూమ్ వీడియో లీక్ చేసుకుంటూ సినిమా ప్రమోషన్ చేసుకునే స్థాయికి చేరావా..? అంటూ ఊర్వశి రౌతేలాను తిట్టిపోస్తున్నారు. ఆమె నటించిన గుస్పేటియా చిత్రం ఆగష్టు 9న విడుదల కానుంది. అక్షయ్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించగా.. సూషి గణేషన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో బాలకృష్ణ నటిస్తోన్న 109 చిత్రంలో కూడా ఊర్వశి నటిస్తుంది.
- 
      
                   
                                                       మైక్రోసాఫ్ట్ బగ్ ప్రభావం .... అమెరికా గగనతలం ఖాళీ!న్యూయార్క్: అమెరికా గగనతలంలో ప్రతి రోజు విమానాల ట్రాఫిక్ ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఈ ట్రాఫిక్ ఒక్కసారిగా తగ్గిపోతే ఎలాఉంటుందో శుక్రవారం(జులై 19) అర్థమైంది. మైక్రోసాఫ్ట్ విండోస్లో బగ్ సమస్య తలెత్తి అమెరికాలోని ప్రముఖ ఎయిర్లైన్స్ కంపెనీలైన అమెరికన్ ఎయిర్లైన్స్,డెల్టా,యునైటెడ్ సంస్థల విమానాలు ఎక్కడికక్కడే ఎయిర్పోర్టుల్లో నిలిచిపోయాయి. దీంతో అగ్రదేశ గగనతలంలో విమానాల ట్రాఫిక్ పూర్తిగా తగ్గిపోయింది. అక్కడ సాధారణ సమయంలో విమానాల రద్దీ ఎలా ఉంటుంది.. శుక్రవారం విమానాల రద్దీ తగ్గిన తర్వాత ఎలా ఉందనే 12 గంటల ఆసక్తికర టైమ్లాప్స్ వీడియోను ఓ నెటిజన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. విమానాల ట్రాఫిక్ టైమ్లాప్స్ వీడియోను నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు. 12-hour timelapse of American Airlines, Delta, and United plane traffic after what was likely the biggest IT outage in history forced a nationwide ground stop of the three airlines. pic.twitter.com/wwcQeiEtVe— Colin McCarthy (@US_Stormwatch) July 19, 2024
- 
      
                   
                                                       వైఎస్ఆర్ స్ఫూర్తితోనే భారత్ జోడో యాత్ర: రాహుల్ గాంధీ!సాక్షి,న్యూఢిల్లీ: వైఎస్రాజశేఖర్రెడ్డి అసలు సిసలైన ప్రజా నాయకుడని లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్గాంధీ కొనియాడారు. వైఎస్ఆర్ నుంచి తాను వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నట్లు చెప్పారు. తాను దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్ జోడో యాత్రకు వైఎస్ఆర్ పాదయాత్రే స్ఫూర్తి అని తెలిపారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా సోమవారం(జులై 8) నివాళి అర్పించిన రాహుల్గాంధీ ప్రత్యేాక వీడియో విడుదల చేశారు. ప్రజల కోసమే జీవించిన నాయకుడు రాజశేఖర్రెడ్డి అని కీర్తించారు. ఆయన బతికి ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరుగా ఉండేదన్నారు. కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కావన్నారు. My humble tributes to former Chief Minister of Andhra Pradesh, YS Rajasekhara Reddy ji, on his 75th birth anniversary.A true leader of the masses, his grit, dedication, and commitment to the upliftment and empowerment of the people of Andhra Pradesh and India has been a guiding… pic.twitter.com/iuGVsmsW8g— Rahul Gandhi (@RahulGandhi) July 8, 2024
- 
      
                   
                                                       Hathras Stampede: కరోనా కాలంలోనూ..యూపీలోని హత్రాస్లో జరిగిన భారీ తొక్కిసలాట దేశవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో 121 మంది మృతి చెందారు. నారాయణ్ సాకార్ అలియాస్ భోలే బాబా సత్సంగంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.ఈ సత్సంగానికి స్థానికులతో పాటు ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ల నుంచి కూడా భోలే బాబా అనుచరులు తరలివచ్చారు. భారీ స్థాయిలో జనం వచ్చినప్పటికీ సత్సంగ్ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయలేదనే ఆరోపణలున్నాయి. ఈ నేపధ్యంలో గతంలో భోలే బాబా నిర్వాకానికి సంబంధించిన అంశం మరోమారు చర్చల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న 2021లో భోలే బాబా ఒక సత్సంగ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో 50 వేల మందికి పైగా జనం పాల్గొన్నారు. నాడు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సత్సంగంలో 50 మంది మాత్రమే పాల్గొనడానికి అనుమతివుంది. అయితే ఈ నియమాన్ని ఉల్లంఘిస్తూ 50 వేల మందికి పైగా జనం సత్సంగానికి హాజరయ్యారు.ఇందుకు భోలే బాబా సహకరించారనే ఆరోపణలున్నాయి. నాడు ఫరూఖాబాద్లో జరిగిన ఈ కార్యక్రమానికి జనం పోటెత్తడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఆప్పట్లో జిల్లా యంత్రాంగం సత్సంగ్ నిర్వాహకులకు నోటీసు కూడా ఇచ్చింది. 2021లో బాబా నిర్వహించిన సత్సంగానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ये वीडियो 2021 का है जब फ़र्रुख़ाबाद में बाबा नारायण हरि साकार ने सत्संग किया था. साल 2021 में कोविड की वजह से प्रशासन ने सिर्फ़ 50 लोगों की अनुमति दी थी लेकिन बाबा ने 50 हज़ार से ज़्यादा की भीड़ इकट्ठी कर दी थी.#HathrasAccident #HathrasTragedy #bholebaba pic.twitter.com/0GLHXUdxV0— NDTV India (@ndtvindia) July 3, 2024
- 
      
                   
                                                       మృత్యుకేళికి సాక్ష్యం.. తాజా వీడియోయూపీలోని హత్రాస్లో సత్సంగ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 116 మంది మృత్యువాత పడ్డారు. లెక్కలేనంతమంది గాయపడ్డారు. సత్సంగం జరిగిన ప్రాంతానికి చెందిన తాజా వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ మౌనం తాండవిస్తోంది. నిన్న(మంగళవారం) జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 40 వేల మంది పాల్గొన్నారు. #WATCH | Uttar Pradesh: Visuals from the incident spot where a stampede took place yesterday, claiming the lives of 116 people in Hathras. The incident happened during a Satsang conducted by 'Bhole Baba'. pic.twitter.com/7wfXYFRHIO— ANI (@ANI) July 3, 2024నారాయణ్ సకర్ విశ్వ హరిగా పేరొందిన భోలే బాబా సత్సంగ కార్యక్రమానికి హాజరైన భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటన సికంద్రరావు కొత్వాలి ప్రాంతంలోని జీటీ రోడ్డులోని ఫుల్రాయ్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.సత్సంగానికి పెద్ద సంఖ్యలో జనం హాజరు కావడం, నిర్వాహకులు తగిన ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని తెలుస్తోంది. కాగా యూపీ సీఎం యోగి ఈరోజు(బుధవారం) హత్రాస్ బాధితులను పరామర్శించనున్నారు.
- 
      
                   
                                                       మనోళ్లు వీడియో షాపింగ్లోనూ ముందంజసాక్షి, హైదరాబాద్: మనోళ్లు వీ–కామర్స్ (వీడియో కామర్స్)లోనూ దుమ్మురేపుతున్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ఓ అడుగు ముందే ఉంటున్న భారత యువతరం వీ–కామర్స్లోనూ ముందుకు సాగుతోంది. టెక్, డిజిటల్, ఆన్లైన్ షాపింగ్లో ముందంజలో ఉంటున్న భారతీయులు వీ–కామర్స్ను సైతం సులభంగా అందిపుచ్చుకుంటున్నారు. వీడియో మాధ్యమం ఆధారంగా భారత కస్టమర్లు వీ–కామర్స్ ఆఫర్లు, డీల్స్ను పరిశీలిస్తున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇప్పటికే అత్యధికంగా ఇంటర్నెట్ డేటా వినియోగిస్తున్న దేశాల్లో భారత్ ఒకటన్న విషయం తెలిసిందే. 2023 జూన్–2024 మే మధ్యలో ఇంటర్నెట్లో మనవాళ్లు 20 లక్షల గంటలకుపైగా ఈ డీల్స్, ఆఫర్స్ను సమీక్షించినట్టుగా వెల్లడైంది.ఈ విషయంలో దేశీయంగా చూస్తే టాప్–5 నగరాల్లో ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, కోల్కతా నిలిచాయి. ఇంతేకాకుండా వీ–కామర్స్ వైపు ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాలు (వీరిలో 30 ఏళ్లలోపు వారు, మహిళలు అధికం) కూడా మొగ్గుచూపుతున్నట్టు తేలడం విశేషం. డైరెక్ట్ టు కన్జుమర్ (డీ 2 సీ) బ్రాండ్లు, విక్రయదారులు, రైతులు ఇతర వర్గాల వారు కూడా వీ–కామర్స్ ఆఫరింగ్స్ పట్ల ఉత్సాహం చూపడంతోపాటు ఇందులో తమకు ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయంతో ఉన్నట్టుగా రెడ్సీర్ అధ్యయనం నివేదిక స్పష్టంచేసింది.దీనిని ఉటంకిస్తూ... వీడియో కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్, వీ–కామర్స్ పట్ల భారత్లో సానుకూల స్పందన పెరుగుతున్నట్టుగా పేర్కొంది. మొత్తంగా వీడియో కామర్స్ పరంగా (ఓవరాల్ వీడియో కామర్స్ ఎంగేజ్మెంట్) చూస్తే టయర్ 2, 3 ప్రాంతాల్లోని వారు 65 శాతం దాకా ఉన్నట్టుగా ఫ్లిప్కార్ట్ తెలిపింది. ప్రధానంగా ఫ్యాషన్, బ్యూటీ, పర్సనల్ కేర్, హోమ్ డెకర్, ఫరి్నíÙంగ్పై వీరు దృష్టి పెడుతున్నట్టు తెలిపింది. ఈ ఏడాది తాము నిర్వహించిన ఫార్మర్స్ అల్ఫాన్సో మ్యాంగో డే లైవ్ స్ట్రీమ్ (రైతు నుంచి వినియోగదారుడిని నేరుగా కలిపేలా), బిగ్ భారత్ డీ 2 సీ లైవ్ స్ట్రీమ్, ద ఎండ్ ఆఫ్ సీజన్ సేల్, జీరో అవర్ వంటి కార్యక్రమాలకు మంచి స్పందన రావడంతోపాటు వినియోగదారులు పెద్దఎత్తున కొనుగోళ్లు జరిపేందుకు అవకాశం ఏర్పడిందని పేర్కొంది.
- 
      
                   
                                                       ‘నీట్’పై చర్చకు రెడీ: రాహుల్ గాంధీఢిల్లీ: లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విద్యార్థులను ఉద్దేశించి వీడియో విడుదల చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై మోదీ ప్రభుత్వంతో చర్చలు జరపడమే ఇండియా కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు. శుక్రవారం(జూన్28) లోక్సభలో నీట్ అంశం మాట్లాడుతుండగా తన మైక్ కట్ చేశారని మండిపడ్డారు.The INDIA Opposition bloc wants to have a constructive debate with the Government on the NEET exam and the prevailing paper leak issue. It is unfortunate that we weren’t allowed to do so in Parliament today. This is a serious concern that is causing anxiety to lakhs of families… pic.twitter.com/zKdHwOe2LM— Rahul Gandhi (@RahulGandhi) June 28, 2024 నీట్ పేపర్ లీక్ గురించి అందరికీ తెలుసన్నారు. విద్యార్థులకు నష్టం కలిగించి, కొందరు మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. ప్రవేశ పరీక్షల కోసం విద్యార్థులు ఎన్నో ఏళ్లుగా చదువుతుంటారని గుర్తు చేశారు. పవిత్రమైన వైద్య వృత్తిని చేపట్టడం వారి కల అని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రతిపక్షాల సమావేశంలో ఈ విషయంపై చర్చించినట్లు తెలిపారు. విద్యార్థుల తరఫున పోరాడాలని నిర్ణయించామన్నారు. ఏడేళ్లలో 70సార్లు పలు పరీక్షల ప్రశ్న పేపర్లు లీక్ అయ్యాయని, లీకుల కారణంగా రెండు కోట్ల మంది విద్యార్థులు సమస్యలు ఎదుర్కొన్నారని రాహుల్ విమర్శించారు. దీనికి పరిష్కారం చూపాలని విద్యార్థులు ప్రధాని మోదీని కోరుతున్నా ఆయన మౌనం వీడట్లేదన్నారు.
- 
      
                   
                                                       జిమ్లో అల్లు స్నేహారెడ్డి.. వర్కవుట్స్ చూశారా!టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్యగా స్నేహా రెడ్డి అందరికీ పరిచయమే. సినిమాలకు సంబంధం లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో నెటిజన్లను ఆకట్టుకుంటారు. ఈ క్రమంలో ఆమెకు నెట్టింట ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్స్టాగ్రామ్లో ఆమెకు సుమారు 10 మిలియన్ల వరకు ఫాలోవర్స్ ఉన్నారుతాజాగా స్నేహారెడ్డి జిమ్లో వర్కవుట్ చేస్తోన్న సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫిట్నెస్పై శ్రద్ధ వేరే లెవెల్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 మూవీతో బిజీగా ఉన్నారు. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రాన్ని పుష్ప పార్ట్-1కు సీక్వెల్గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలోనూ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన పుష్ప-2 ఊహించని విధంగా డిసెంబర్కు వాయిదా పడింది.Giving us major fitness goals, #AlluSnehaReddy seen streching & flexing to the core at the gym! 📸💪#AlluArjun #TFNReels #TeluguFilmNagar pic.twitter.com/QHMYWqNuNA— Telugu FilmNagar (@telugufilmnagar) June 28, 2024
- 
      
                   
                                                       Pune Drug Case: వీడియో బహిర్గతంతో 14 మంది అరెస్ట్మహారాష్ట్రలోని పూణెలో ఓ పబ్కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పబ్లో కూర్చుని కొందరు డ్రగ్స్ తీసుకోవడం దానిలో కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.అక్రమ పబ్లపై వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు పాటించని పబ్లపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పూణెలోని ఫెర్గూసన్ రోడ్డులోని ఒక పబ్లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కలకలం చెలరేగింది.పబ్లోని వాష్రూమ్లో ఇద్దరు యువకులు డ్రగ్స్ తీసుకోవడం వీడియోలో కనిపిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలలో రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం ఈ కేసులో ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేసింది. వీరిలో ఆరుగురు వెయిటర్లతో మొత్తం ఎనిమిదిమంది ఉన్నారు. ఈ కేసులో నలుగురు పోలీసులను కూడా సస్పెండ్ చేశారు. ఈ కేసులో అరెస్టయిన ఎనిమిది మందిని జూన్ 29 వరకు పోలీసు కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు.పుణె పోలీసులు పబ్ యజమాని సంతోష్ విఠల్ కమ్తే, సచిన్ కమ్తేతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. పబ్లోని ప్రధాన గేటును మూసివేసి, మరో గేటు ద్వారా పబ్లో కూర్చున్నవారికి వెయిటర్లు మత్తు పదార్థాలు అందించారని పోలీసులు గుర్తించారు. విషయం బయటకు పొక్కడంతో వెంటనే చర్యలు చేపట్టిన పోలీసులు పబ్కు సీల్ వేసి, డ్రగ్స్ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.
- 
      
                   
                                                       మద్యం మత్తులో యువతి.. వీడియో షేర్ చేసిన బీజేపీ నేతదేశంలోని కొందరు యువతీయువకులు మత్తుకు బానిసలుగా మారి తమ కెరియర్ను నాశనం చేసుకోవడమే కాకుండా, తల్లిదండ్రులను కష్టాలపాలు చేస్తున్నారు. మత్తుపదార్థాల తీసుకోవడం వలన జరిగే హాని గురించి అటు ప్రభుత్వం, ఇటు స్వచ్ఛంద సంస్థలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఆశించినంత ఫలితం కనిపించడంలేదు. తాజాగా పంజాబ్లోని అమృత్సర్లో మద్యం మత్తులో రాత్రివేళ రోడ్డుపై జోగుతున్న ఓ యువతికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో అమృత్సర్లోని మోహక్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని జీటీ రోడ్డులో చిత్రీకరించారు. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో మత్తుమందులను అరికట్టడంలో విఫలమైన ప్రభుత్వంపై విమర్శలు చెలరేగుతున్నాయి.ఈ వీడియోను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంజీందర్ సింగ్ సిర్సా తన ‘ఎక్స్’ హ్యాండిల్లో షేర్ చేశారు. పంజాబ్లో డ్రగ్స్ సమస్యను నివారించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమయ్యిందని ఆరోపించారు. మంజీందర్ సింగ్ షేర్ చేసిన వీడియోలో రాత్రివేళ రోడ్డుపై ఒక యువతి మద్యం మత్తులో ఊగిపోతూ కనిపిస్తుంది. ఆమె సరిగా నిలబడలేక పోవడాన్ని కూడా వీడియోలో చూడవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో రాష్ట్రాన్ని మత్తుమందుల నుంచి విముక్తి చేస్తామని ప్రకటించిందని, ఇప్పుడు ఆ మాటనే విస్మరించిందని సుజీందర్ సింగ్ ఆరోపించారు. This late night video of Amritsar of a young girl high under Drugs shows the failure of @AAPPunjab Govt! What have you done to Punjab, CM @bhagwantmann Ji?You came to power promising elimination of drugs in 3 months but now your own party people are involved in this!Drug… pic.twitter.com/QdIADuRsZS— Manjinder Singh Sirsa (@mssirsa) June 24, 2024
- 
      
                   
                                                       ప్రధాని మోదీ శశాంకాసనం.. ప్రయోజనాలివేఅంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకోనున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ప్రధాని మోదీ ఈసారి కూడా తన యోగాసనాల ఏఐ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానిలో శశాంకాసనం వేసే విధానాన్ని వివరించారు.ఈ వీడియోను సంస్కృత భాషలో రూపొందించారు. శశాంకాసనం వేసేటప్పుడు శరీరం కుందేలు మాదిరి పొజీషన్లోకి వస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్ దూరమవుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలో వీడియోలో చూపించారు. ఈ ఆసనం వేయడానికి ముందుగా వ్రజాసన భంగిమలో కూర్చోవాలి. మోకాళ్లపై చేతులను ఉంచాలి. ఇప్పుడు రెండు మోకాళ్లను వీలైనంత వరకు సౌకర్యవంతమైన భంగిమలో విస్తరించాలి. అరచేతులను మోకాళ్ల మధ్య ఉంచాలి. వాటిని ముందుకు చాస్తూ, శరీరాన్ని కిందకు వంచాలి. అప్పుడు చేతులు సమాంతరంగా ముందుకు చాచాలి. అదే పొజీషన్లో ముందుకు చూస్తూ కొంత సమయం పాటు ఈ భంగిమలో ఉండాలి. తరువాత వ్రజాసన భంగిమకు రావాలి.మలబద్ధకంతో బాధపడుతున్నవారు ఈ ఆసనం వేయడం వలన మంచి ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా ఈ ఆసనం వేస్తే కోపం అదుపులోకి వస్తుంది. వెన్ను నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్తో బాధపడేవారు ఈ ఆసనాన్ని వేయకూడదు. తీవ్రమైన వెన్నునొప్పి ఉన్నవారు కూడా ఈ ఆసనం వేసేటప్పుడు పలు జాగ్రత్తలు పాటించాలి. హైబీపీ ఉన్నవారు ఈ ఆసనం వేసే విషయమై వైద్యులను సంప్రదించడం ఉత్తమం. Here is why you must practice Shashankasana regularly… pic.twitter.com/95kwzrKYTD— Narendra Modi (@narendramodi) June 19, 2024
- 
      
                   
                                                       వాట్సాప్లో మూడు అదిరిపోయే ఫీచర్లువాట్సాప్ ఎప్పటికప్పుడు తన వినియోగదారుల కోసం అప్డేటెడ్ ఫీచర్స్ పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ తరుణంలో తాజాగా ఆడియోతో స్క్రీన్ షేరింగ్, పార్టిసిపెంట్ కెపాసిటీ, స్పీకర్ స్పాట్లైట్ ఫీచర్ అనే మూడు కొత్త ఫీచర్స్ తీసుకువచ్చింది.ఆడియోతో స్క్రీన్ షేరింగ్: వాట్సాప్ ఇప్పుడు వినియోగదారులు ఆడియోతో స్క్రీన్ షేరింగ్ ఫీచర్ ద్వారా తమ స్క్రీన్ & ఆడియోను ఏకకాలంలో పంచుకునేందుకు వీలుంటుంది. స్క్రీన్ షేరింగ్ అనేది గతంలోనే వాట్సాప్ పరిచయం చేసినప్పటికీ.. ఇప్పుడు మెరుగైన ఆడియో సఫోర్ట్ జోడించింది.వీడియో కాల్లలో పెరిగిన పార్టిసిపెంట్ కెపాసిటీ: ఇప్పటి వరకు ఒక మీటింగ్ అంటే జూమ్ లేదా గూగుల్ మీట్ వంటి యాప్స్ ఉపయోగించి ఉంటారు. వాట్సాప్ తీసుకువచ్చిన ఈ కొత్త ఫీచర్ ద్వారా ఒకేసారి 32 మంది వీడియో కాల్లో పాల్గొనవచ్చు.స్పీకర్ స్పాట్లైట్ ఫీచర్: కాల్లో ఎవరు మాట్లాడుతున్నారో ట్రాక్ చేయడం కోసం స్మార్ట్ఫోన్ యాప్లో కష్టంగా అనిపించినప్పటికీ, మాట్లాడే వ్యక్తిని ఆటోమేటిక్గా హైలైట్ చేయడానికి స్పాట్లైట్ ఫీచర్ను కూడా జోడించింది.వాట్సాప్ ఇప్పుడు ఆడియో, వీడియో నాణ్యతను మెరుగుపరచడం మీద ఎక్కువ ద్రుష్టి సారించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సరికొత్త ఫీచర్స్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్స్ అన్నీ త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ తప్పకుండా వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
- 
      
                   
                                                       జాన్వీ కపూర్ వీడియోపై కామెంట్.. ఇచ్చిపడేసిన హీరోయిన్!బాలీవుడ్ భామ జాన్వీకపూర్ మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా ఈ రోజే థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో రాజ్కుమార్ రావుకు జంటగా నటించింది. ఈ సినిమాలో మహిమ పాత్రలో మెరిసింది. అయితే ఇటీవల ఈ మూవీ షూటింగ్కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. అందులో తన భూజానికి గాయమైనట్లు కనిపించింది. ఇది చూసిన ఫ్యాన్స్ నటనపై తన అంకితభావాన్ని కొనియాడారు.అయితే ఈ వీడియో చూసిన ఓ నెటిజన్ జాన్వీ కపూర్ను ట్రోల్ చేశాడు. టెన్నిస్బాల్తో ఆడిన క్రికెట్లో కూడా మీకు గాయమైందా? అంటూ నవ్వుతున్న ఎమోజీలను పెట్టారు. అయితే ఇది చూసిన జాన్వీ కపూర్ సైతం అతనికి అదిరిపోయే రిప్లై ఇచ్చింది. తనకు సీజన్ బాల్తో ఆడుతుండగానే గాయమైందని.. అందుకే టెన్నిస్ బాల్తో ఆడాల్సి వచ్చింది. నా భుజాలకు ఉన్న బ్యాండేజ్లను చూస్తే ఆ విషయం మీకు అర్థమవుతుందంటూ రాసుకొచ్చింది. ఇలాంటి వాటిపై కామెంట్ చేసే ముందు ఒకసారి వీడియో మొత్తం చూడండి.. అప్పుడు మీ జోక్స్కు నేను కూడా నవ్వుతా అంటూ కౌంటర్ ఇచ్చిపడేసింది. దీంతో దెబ్బకు సారీ జాన్వీ మేడమ్.. అంటూ రిప్లై ఇచ్చాడు. కాగా.. 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' చిత్రాన్ని కరణ్ శర్మ డైరెక్షన్లో తెరకెక్కించారు. అభిమానుల అంచనాల మధ్య మే 31 థియేటర్లలో విడుదలైంది. కాగా.. జాన్వీ కపూర్ టాలీవుడ్లో దేవర చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor)
- 
      
                   
                                                       నవీన్ పట్నాయక్పై అస్సాం సీఎం హిమంత సంచలన ట్వీట్భువనేశ్వర్: ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్పై అస్సాం సీఎం, బీజేపీ ఫైర్ బ్రాండ్ హిమంత బిశ్వశర్మ ఎక్స్(ట్విటర్)లో సంచలన పోస్టు పెట్టారు. సీఎం నవీన్ చేతుల కదలికలను కూడా ఆయన అనుయాయుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పాండియన్ నియంత్రిస్తున్నారని హిమంత ఆరోపించారు. దీన్ని బట్టి పాండియన్ చేతిలో నవీన్ ఎంతగా బంధీగా మారారో తెలుస్తోందన్నారు. ప్రజలతో నవీన్ స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నారు. కాగా, తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా నవీన్ పట్నాయక్ ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతుండగా ఆయన చేతులు వణికాయి. ఇంతలో నవీన్కు మైక్ పట్టుకున్న పాండియన్ వెంటనే నవీన్ పట్నాయక్ వణుకుతున్న చేయి కనిపించకుండా పక్కకు పెట్టిన వీడియోను హిమంత తన ఎక్స్(ట్విటర్)ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియో ఒడిషాలో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. This is a deeply distressing video. Shri VK Pandian ji is even controlling the hand movements of Shri Naveen Babu. I shudder to imagine the level of control a retired ex bureaucrat from Tamil Nadu is currently exercising over the future of Odisha! BJP is determined is give back… pic.twitter.com/6PEAt7F9iM— Himanta Biswa Sarma (Modi Ka Parivar) (@himantabiswa) May 28, 2024
- 
      
                   
                                                       ఆప్ మంత్రి డర్టీ పిక్చర్చంఢీగడ్: పంజాబ్ ఆప్ మంత్రి బాల్కర్ సింగ్కు సంబంధించిన ఓ అభ్యంతర వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఆయనపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిస్తానని చెప్పి ఓ మహిళతో మంత్రి బాల్కర్ సింగ్ అసభ్యంగా ప్రవర్తించారని బీజేపీ ఆరోపణలు చేసింది. అయితే దీనిపై మంత్రి స్పందించారు. ఆ వీడియో గురించి తనుకు తెలియదని, అది తనది కాదని స్పష్టం చేశారు. బాల్కర్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కేబినెట్లో స్థానిక ప్రభుత్వం, అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్నారు.ఉదోగ్యం కోసం తన వద్దకు వచ్చిన ఓ మహిళ పట్ల మంత్రి అసభ్యంగా ప్రవర్తించిన వీడియోను సోమవారం బీజేపీ నేతలు సోషల్మీడియాలో షేర్ చేయటంతో వైరల్గా మారింది. వీడియో కాల్లో సదరు మహిళను దుస్తులు తొలగించాలని మంత్రి బలవంతం చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు.బీజేపీ ఆరోపణల నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి దర్యాప్తు చేపట్టి.. మూడు రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఓ నివేదిక ఇవ్వాలని పంజాబ్ పోలీసులను ఆదేశించింది. ఆరోపణలు నిజమని తేలితే మంత్రిని అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా రాజకీయంగా దుమారం రేపటంతో మంత్రి బాల్కర్ సింగ్ స్పందించారు. ‘‘ఆ వీడియో ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నాకు ఆ వీడియో గురించి తెలియదు. నేను ఏం వ్యాఖ్యలు చేయలేను’’ అని తెలిపారు.21 ఏళ్ల మహిళకు వీడియో కాల్ చేసి.. అభ్యంరంగా ప్రవర్తించిన మంత్రి బాల్కర్ సింగ్ వెంటనే పదవి నుంచి తొలగించాలని బీజేపీ నేత తాజిందర్ బగ్గా సీఎం అరవింద్ కేజ్రీవాల్ను డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ.. ఎంపీ స్వాతి మలివాల్పై దాడిని ఉదహరిస్తూ ఆప్ (AAP)అంటే ఒక స్త్రీ ద్వేషి పార్టీ అని మండిపడ్డారు.
- 
      
                   
                                                       హ్యూమనాయిడ్ అట్లాస్ రోబో.. వీడియో వైరల్టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో బోస్టన్ డైనమిక్స్ తన నెక్స్ట్ జనరేషన్ 'హ్యూమనాయిడ్ అట్లాస్ రోబో'ను ఆవిష్కరించింది. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్.. అంతే కాకుండా ఇది మునుపటి మోడల్స్ కంటే కూడా ఎన్నో అప్డేట్స్ పొందింది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.వీడియోలో గమనించినట్లయితే.. అట్లాస్ రోబోట్ పైకి లేయడం, ముందుకు వెనుకకు కదలటం కూడా చూడవచ్చు. ఇది ఇప్పటికి తయారైన దాదాపు అన్ని రోబోట్స్ కంటే భిన్నంగా ఉంది. మొండెం మీద ఒక ప్లేట్ ఉంది. సన్నగా ఉండే మొండెం భాగం.. తలపై రింగ్ లైట్ వంటివి ఉన్నాయి.ఈ అట్లాస్ రోబోట్ తన శరీరాన్ని సైన్స్ ఫిక్షన్ హారర్ మూవీలోని ఓ జీవి మాదిరిగా నడుమును 180 డిగ్రీలు మెలితిప్పి పైకి లేస్తుంది. తలను కూడా పూర్తిగా తిప్పుతుంది. చురుగ్గా ముందుకు వెళ్లడం, వెనక్కు రావడం కూడా వీడియోలో గమనించవచ్చు. ప్రస్తుతం ఈ రోబోట్ టెస్టింగ్ దశలోనే ఉంది. రాబోయే రోజుల్లో పూర్తిగా సిద్దమవుతుంది.ఈ హ్యుమానాయిడ్ అట్లాస్ రోబోట్ పూర్తిగా తయారైన తరువాత వివిధ పనుల్లో ఉపయోగించనున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి రోబోట్స్ కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి కొంతమంది కస్టమర్లకు మాత్రమే దీనిని అందించే అవకాశం ఉంది. ఈ వరుసలో హ్యుందాయ్ మొదటి స్థానంలో ఉంది.
- 
      
                   
                                                       ప్రపంచంలోనే తొలి తల మార్పిడి..! ఏకంగా హాలీవుడ్ మూవీని తలపించేలా..!ఇంతవరకు అవయవ మార్పిడులకు సంబంధించి..గుండె, కళ్లు, చేతులు, కిడ్నీ వంటి ట్రాన్స్ప్లాంటేషన్లు గురించి విన్నాం. ఇటీవల జంతువుల అయవాలను మనుషులకు మార్పిడి చేస్తున్న ప్రయత్నాల గురించి కూడా చూశాం. అవి విజయవంతం కాకపోయినా..అవయవాల కొరతను నివారించే దృష్ట్యా వైద్యులు సాగిస్తున్న ప్రయాత్నాలే అవి. ఐతే తాజాగా ఓ మెడికల్ స్టార్టప్ కంపెనీ తొలిసారిగా తల మార్పిడి శస్త్ర చికిత్సను అభివృద్ధిపరిచే లక్ష్యాన్ని చేపట్టింది. ఇది సఫలం అయితే చికిత్సే లేని వ్యాధులతో పోరాడుతున్న రోగుల్లో కొత్త ఆశను అందించగలుగుతాం. ఇంతకీ ఏంటా వైద్య విధానం అంటే..యూఎస్లోని బ్రెయిన్బ్రిడ్జ్, న్యూరోసైన్స్, బయో మెడికల్ ఇంజనీరింగ్ స్టార్టప్ ప్రపంచంలోనే తొలిసారిగా తల మార్పిడి వ్యవస్థను అభివృద్ధి చేసే లక్ష్యాన్ని చేపడుతున్నట్లు ప్రకటించింది. ఐతే ఈ కంపెనీ ఇంతవరకు రహస్యంగా ఈ ప్రయోగాలు చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడూ ప్రపంచం తాము చేస్తున్న ఈ సరికొత్త వైద్య గురించి మరింతగా తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో బహిర్గతం చేసింది. ముఖ్యంగా చికిత్స చేయలేని స్థితిలో.. స్టేజ్ 4లో ఉన్న కేన్సర్, పక్షవాతం, అల్జీమర్స్ , పార్కిన్సన్స్ వంటి న్యూరోడెజనరేటివ్ వ్యాధులతో బాధపడుతున్న రోగుల్లో కొత్త ఆశను అందించడమే లక్ష్యంగా ఈ ప్రయోగానికి నాంది పలికినట్లు బ్రెయిన్ బ్రిడ్జ్ స్టార్టప్ పేర్కొంది. చిత్త వైకల్యంతో బాధపడుతున్న రోగి తలను ఆరోగ్యకరమైన బ్రెయిన్డెడ్ డోనర్ బాడీతో మార్పిడి చేయడం వంటివి ఈ సరికొత్త వైద్య విధాన ప్రక్రియలో ఉంటుంది. అందుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేకెత్తించింది.ఈ వీడియోలో రెండు రోబోటిక్ బాడీలపై ఏకకాలంలో శస్త్ర చికిత్స చేస్తున్న రెండు స్వయం ప్రతిపత్త రోబోలు కనిపిస్తాయి. ఇక్కడ ఒకరి నుంచి తలను తీసి మరో రోబోటిక్ శరీరంలోకి మార్పిడి చేస్తారు. ఇది చూడటానికి హాలీవుడ్ రేంజ్ సన్నివేశంలా అనిపిస్తుంది. ఇలాంటి అత్యధునిక శస్త్రచికిత్సపైనే న్యూరబుల్, ఎమోటివ్, కెర్నల్ అండ్ నెక్ట్స్ మైండ్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ వంటి కంపెనీలు కూడా వర్క్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్రెయిన్బ్రిడ్జ్లోని ప్రాజెక్ట్ లీడ్ హషేమ్ అల్-ఘైలీ మాట్లాడుతూ..తాము మెదడు కణాల క్షీణతను నివారించేలా అతుకులు లేకుండా తల మార్పిడి చేసేందుకు హైస్పీడ్ రోబోటిక్ సిస్టమ్ను వినియోగించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఉన్న అధునాతన ఏఐ అల్గారిథమ్లు శస్త్ర చికిత్సలో నరాలు, రక్తనాళాల తోపాటు వెన్నుపాముని కచ్చితంగా తిరిగి కనెక్ట్ చేయడంలో రోబోలకు మార్గనిర్దేశం చేస్తాయని అల్ ఘైలీ చెప్పారు. తాము ఈ కాన్సెప్ట్ని విస్తృతమైన శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా రూపొందించమని తెలిపారు.ఇది వైద్య సరిహద్దులను చెరిపేసేలా.. ప్రాణాంతక పరిస్థితులతో పోరాడుతున్న వారికి ప్రాణాలను రక్షించేలా వినూత్న పరిష్కారాలను అందిచగలదని చెప్పారు. 🤖 BrainBridge, the first head transplant system, uses robotics and AI for head and face transplants, offering hope to those with severe conditions like stage-4 cancer and neurodegenerative diseases… pic.twitter.com/7qBYtdlVOo— Tansu Yegen (@TansuYegen) May 21, 2024 (చదవండి: వడదెబ్బకు గురైన నటుడు షారూఖ్! దీని బారిన పడకూడదంటే..!)
- 
  
      అసలు వీడియో ఈసీ ఎందుకు దాస్తుంది?
- 
      
                   
                                                       32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!ప్రముఖ ఆన్లైన్ వీడియో ప్లాట్ఫామ్ యూట్యూబ్ నిషేధిత కంటెంట్గా భావించే 32 వీడియో లింకులను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించింది. హాంకాంగ్ కోర్టు నిర్ణయానికి లోబడి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది.చైనా-హాంకాంగ్ మధ్య కొన్నేళ్లుగా రాజకీయ, బౌగోళిక సమస్య కొనసాగుతోంది. హాంకాంగ్లో ప్రత్యేకపాలన ఉంటుంది. అక్కడి ప్రభుత్వాన్ని చైనాకు అనుకూలంగా ఉండే వారికి కట్టబెడుతారు. దాంతో స్థానిక ప్రజలనుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. అందులో భాగంగా 2019లో ‘గ్లోరీ టు హాంకాంగ్’ అనే నిరసన గీతం ప్రాచుర్యంలోకి వచ్చంది. దీన్ని నిషేధించాలని కోరుతూ హాంకాంగ్ అప్పీల్ కోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఆ గీతం యూట్యూబ్లో వైరల్గా మారడంతో దాన్ని తొలగించాలని తాజాగా కోర్టు ఆదేశించింది. ఫలితంగా పాటకు సంబంధించిన 32 వీడియో లింకులను తొలగిస్తున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. చైనా నుంచి హాంకాంగ్ విభజనను కోరుకుంటున్న అసమ్మతివాదులు ఆ పాటను ఉపయోగించుకోవచ్చని న్యాయమూర్తులు హెచ్చరించారు.ఇదీ చదవండి: టీవీ రిమోట్ పనిచేయడం లేదా..? చిట్కా మీ కోసమే..కోర్టు నిర్ణయంతో నిరాశ చెందినట్లు యూట్యూబ్ చెప్పింది. అయినప్పటికీ ఆ తీర్పును పాటిస్తామని స్పష్టం చేసింది. బుధవారం నుంచి ఇకపై యూట్యూబ్లో ఆ గీతం కోసం సెర్చ్చేస్తే ‘కోర్టు ఆర్డర్ వల్ల ఇందుకు సంబంధించిన కంటెంట్ దేశీయ డొమైన్లో నిషేధించడమైంది’ అనే పాప్అప్ మెసేజ్ వస్తుందని చెప్పింది. ఆన్లైన్లో స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తీకరించానుకునేవారిని కట్టడి చేయడం సరికాదని, ఈ వ్యవహారానికి సంబంధించి ఇతర వర్గాలకు అప్పీల్ చేస్తామని తెలిపింది. ఇప్పటికే మానవ హక్కుల సంస్థలతో తమ భావాలను పంచుకున్నట్లు కంపెనీ పేర్కొంది.
- 
      
                   
                                                       రోటీ చేసి, భోజనం వడ్డించిన ప్రధాని మోదీ - వీడియోపాట్నా: బీహార్ రాజధాని పాట్నాలోని ప్రసిద్ధ సిక్కు మందిరం గురుద్వార్ను ప్రధాని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా లంగర్లో భక్తులకు భోజనం వడ్డించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మోదీ పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సిక్కుల ప్రార్థనా స్థలంలో మోదీ ఒక స్టీల్ బకెట్ తీసుకుని, అందులోని ఆహారాన్ని అక్కడి ప్రజలకు వడ్డించడం చూడవచ్చు. అంతే కాకుండా మోదీ స్వయంగా రోటీ తయారు చేయడానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.इतनी सुंदर और गोल रोटी तो महिलाये भी नहीं बनाती होगी.... मान गये मोदी जी आपको pic.twitter.com/0VZuMxMsi4— Hardik Bhavsar (Modi Ka Parivar) (@Bitt2DA) May 13, 2024ఆదివారం బీహార్లో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్షో నిర్వహించారు. బీహార్లో రోడ్షో నిర్వహించిన తొలి ప్రధాని మోదీ. సోమవారం ప్రధానమంత్రి రాష్ట్రంలోని హాజీపూర్, ముజఫర్పూర్, సరన్ నియోజకవర్గాల్లో ఎన్నికల ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.ऐसा सनातन का पुरोधा ढूंढने पर भी न मिलेगा Proud of you My PM 🔥 pic.twitter.com/nDAZWQKGqo— Hardik Bhavsar (Modi Ka Parivar) (@Bitt2DA) May 13, 2024ఇదిలా ఉండగా లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం దేశ ప్రజలను అధిక సంఖ్యలో ఓటు వేయాలని కోరారు. ''నాలుగో దశ లోక్ సభ ఎన్నికలలో పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 96 స్థానాలలో పోలింగ్ జరుగుతుంది.ఈ నియోజక వర్గాలలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారనీ ఓటింగ్ పెరుగుదలకు.. యువ ఓటర్లు మహిళలు దోహదం చేస్తారనీ నమ్ముతున్నాను.రండి ,మనందరం మన కర్తవ్యాన్ని నిర్వర్తించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం'' అని మోదీ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.Sikhism is rooted in the principles of equality, justice and compassion. Central to Sikhism is Seva. This morning in Patna, I also had the honour of taking part in Seva as well. It was a very humbling and special experience. pic.twitter.com/0H8LufyzJ6— Narendra Modi (@narendramodi) May 13, 2024
- 
      
                   
                                                       Buddhadeb Bhattacharya: నేను బుద్ధదేవ్ మాట్లాడుతున్నా...!లోక్సభ ఎన్నికల్లో గెలవడానికి పారీ్టలు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ప్రచారం పర్వంలో కృత్రిమ మేధ (ఏఐ)తో ఇప్పటికే జోరుగా వాడుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా పశి్చబెంగాల్లో సీపీఎం కూడా ఇదే దారి పట్టింది. కొద్ది రోజుల క్రితం ఏఐ యాంకర్ ‘సమత’ను ప్రచారంలోకి దింపిన ఆ పార్టీ, తాజాగా బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు దిగ్గజం బుద్ధదేవ్ భట్టాచార్య వీడియోను కూడా అలాగే తయారు చేసింది! ఏఐ సహాయంతో సరిగ్గా మాజీ బుద్ధదేవ్ ప్రతిరూపాన్ని, వాయిస్ను రూపొందించింది. 2 నిమిషాల 6 సెకన్ల నిడివితో కూడిన వీడియో సందేశం సాయంతో అటు బీజేపీ, ఇటు తృణమూల్పై ఏకకాలంలో దాడి చేసింది. ‘‘బెంగాల్లో ఉపాధి లేదు, మహిళలకు గౌరవం లేదు. రాష్ట్రం అవినీతికి అడ్డాగా మారుతోంది. రాష్ట్రాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని, పరిశ్రమలొస్తాయని, వ్యవసాయం మెరుగుపడుతుందని, పిల్లలకు ఉద్యోగాలొస్తాయని తృణమూల్ చెప్పిన మాటలన్నీ నీటిమూటలే అయ్యాయి. అంతా అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. కేంద్రంలో బీజేపీ కూడా జనాల జీవితాలతో ఆడుకుంటోంది. నోట్ల రద్దు నుంచి మొదలుకుని కార్పొరేట్ లూటీ దాకా సర్వం కొద్ది మంది కుబేరులకు మేలు చేసే నిర్ణయాలే. తాజాగా మోదీ సర్కారు ఎన్నికల బాండ్ల అవినీతికి పాల్పడింది. దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. దేశాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేసే పనిలో పడింది. ఈ ఆటలను సాగనీయొద్దు. అందుకు మన ముందున్న మార్గం పోరాటం ఒక్కటే. ఈ పోరాటంలో గెలవాలంటే ఈ ఎన్నికల్లో లెఫ్ట్ డెమొక్రటిక్ సెక్యులర్ అభ్యర్థులనే గెలిపించండి’’ అంటూ వీడియోలో బుద్ధదేవ్ విజ్ఞప్తి చేశారు! ఇంటికే పరిమితం... తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బుద్ధదేవ్ కొంతకాలం కిందట ఆస్పత్రిలో చేరారు. కోలుకుని ఇంటికి తిరిగొచి్చన తర్వాత బయటికి కనిపించడమే లేదు. పూర్తి విశ్రాంతిలో ఉన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వామపక్ష కార్యకర్తలు, మద్దతుదారుల్లో ఉత్సాహాన్ని నింపడానికి సీపీఎం ఇలా బుద్ధదేవ్తో కూడిన ఏఐ వీడియోను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే వీడియోను రూపొందించిన తరువాత బుద్ధదేవ్ కుటుంబానికి వినిపించి, వారి అనుమతితోనే సామాజిక వేదికల్లో పోస్ట్ చేసింది పార్టీ. బుద్ధదేవ్ సందేశం వామపక్ష కార్యకర్తలకు ఎంతో ఉత్తేజాన్నిస్తుందని సీపీఎం నమ్ముతోంది. అంతేకాకుండా రాష్ట్ర ఓటర్లను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుందని భావిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్
- 
      
                   
                                 యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఓవర్ యాక్షన్ చేస్తే అది మన మెడకే చుట్టుకుంటుంది. ఛానల్ ఉంది కదా అనో, చేతిలో కెమెరా ఉంది కదా అనో విచక్షణ మరిచి ప్రవర్తించకూడదు. ఇది తెలియక చాలామంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్లు ఫేక్వార్తలు, సమాచారంతో గప్పాలు కొడుతుంటారు. తాజాగా పబ్లిసిటీ కోసం నిషిద్ధ ప్రాంతంలోకి ఉద్దేశపూర్వకంగా ఎంటరైన ఒక యూట్యూబర్కి దిమ్మతిరిగే షాక్ తగిలింది. విషయం ఏమిటంటే.. బెంగళూరులోని యలహంకకు చెందిన వికాస్ గౌడ (23) అడ్డంగా బుక్కయ్యాడు. ఏప్రిల్ 7వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెన్నైకి వెళ్లే ఎయిరిండియా విమానం టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. భద్రతా తనిఖీల అనంతరం విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. ఇక్కడి దాకా బాగానే వుంది. విమానం ఎక్కకుండా, విమానాశ్రయ ఆవరణలోనే తిరుగుతూ వీడియో కంటెంట్ను రికార్డ్ చేశాడు. ఇక్కడితో సరిపెట్టినా బావుండేది. ఎయిర్పోర్ట్లో రోజంతా బస చేసా.. అయినా తనని ఎవరూ పట్టించుకోలేదంటూ ప్రగల్భాలు పలుకుతూ ఏప్రిల్ 12న ఒక వీడియో తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. విమానాశ్రయంలో మొత్తం తిరిగినా తనను ఎవరూ పట్టుకోలేదంటూ, ఎయిర్పోర్ట్ భద్రత గురించి నెగెటివ్ కామెంట్ చేశాడు. అంతా అయ్యాక డ్యామేజ్ కంట్రోల్లో పడ్డాడు. ఆ ఎయిర్పోర్ట్ వీడియోను తన ఛానెల్ నుండి తీసివేశాడు. కానీ అది కాస్తా చేరాల్సిన వారి దృష్టికి అప్పటికే చేరిపోయింది. కట్ చేస్తే.. విషయం తెలుసుకున్న ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ వింగ్ సీఐఎస్ఎఫ్ వికాస్పై ఫిర్యాదు చేసింది. దీంతో అతణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్లు 505, 448 కింద కేసు కూడా నమోదు చేశారు. తన ఫ్లైట్ మిస్సయ్యానని పేర్కొంటూ, సుమారు ఆరు గంటలపాటు విమానాశ్రయంలో తిరిగాడని, కానీ అతను చెప్పినట్టుగా 24 గంటలు కాదని తన విచారణలో తేలిందని భద్రతా అధికారులు వెల్లడించారు. అతని మొబైల్ ఫోన్నుస్వాధీనం చేసుకున్నారు. ఎట్టకేలకు తను చేసింది తప్పేనని అంగీకరించాడు. ప్రచారంకోసం అలా చేశానంటూ లెంపలేసుకున్నాడు. మొత్తం మీద గౌడకు బెయిల్ మంజూరు కావడంతో బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు.
- 
      
                   
                                 హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి.. వీడియో విడుదలసిరియాలో ఉన్న హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్కు సంబంధించిన స్థావరాలపై దాడి చేసినట్ల ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. దాడికి సంబంధించి ఓ వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఆర్మీ విడుదల చేసింది. అక్టోబర్ 7 నుంచి హమాస్ మిలిటెంట్ గ్రూప్కు అనుకూలంగా లెబనాన్ దేశానికి చెందిన హెజ్బుల్లా ఇజ్రాయెల్పై దాడులకు తెగపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిరియాలో విస్తరించిన హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్పై కూడా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ఆర్మీ ఇప్పటికే పదేపదే హెచ్చరించింది. ‘సిరియాలోని హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ సైనిక స్థావరాలపై ఖచ్చితమైన నిఘా ఆధారంగా దాడి చేశాము’ అని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. సిరియాలోని ఓ భవనంపైబుధవారం తెల్లవారుజామున దాడి చేసినట్లు తెలిపే ఓ విడియోను ఇజ్రాయెల్ ఆర్మీ విడుదల చేసింది. צה"ל תקף לפני זמן קצר תשתית צבאית שהוצבה בחזית שטח סוריה, אשר ממידע מודיעיני עולה כי שימשה את ארגון הטרור חיזבאללה. צה"ל רואה במשטר הסורי אחראי לכל אשר קורה בשטחו ולא יאפשר ניסיונות אשר יובילו להתבססות ארגון הטרור חיזבאללה בחזיתו>> pic.twitter.com/Eh2W5LRyYH — צבא ההגנה לישראל (@idfonline) April 9, 2024 హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ కార్యకలాపాలకు సంబంధించి సిరియా తన భూభాగంలో జవాబుదారిగా ఉంటుంది. కానీ సిరియా దేశం అవతల హిజ్బుల్లా దాడులు చేసే ప్రయత్నాలను అనుమంతిచబోమని ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరించింది. అదే విధంగా దక్షిణ లెబనాన్లోని పలు హిజ్బుల్లా మిలిటెంట్ స్థావరాలపై దాడి చేసినట్లు ప్రకటించటం గమనార్హం. దక్షిణ లెబనాన్లోని ధైరా, తైర్ హర్ఫా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఆర్మీ హిజ్బుల్లా మిలిటెంట్లు లక్ష్యంగా మిసైల్ దాడి చేసినట్ల ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది.
- 
      
                   
                                 కేజ్రీవాల్ మరో జైలు సందేశం.. ఈసారి ‘ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్’ఢిల్లీ, సాక్షి: జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నుంచి మరో సందేశం వచ్చింది. ఎప్పటిలాగే ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ ఆ సందేశాన్ని వినిపించారు. అయితే ఈ సారి ఓ ఆసక్తికర అంశం ఉంది. అదేంటంటే.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సందేశాన్ని ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ వినిపిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆమె వెనుక గోడకు అంబేడ్కర్, భగత్ సింగ్ చిత్రపటాలతో పాటు సీఎం కేజ్రీవాల్ ఫోటో కూడా ఉంది. అయితే కటకటాల వెనుక సీఎం ఉన్నట్లు ఆ ఫొటోను ఏర్పాటు చేశారు. "నేను జైలులో ఉండటం వల్ల ఢిల్లీ ప్రజలు ఏ విధంగానూ బాధపడకూడదు. ప్రతి ఎమ్మెల్యే ప్రతి రోజు వారి ప్రాంతానికి వెళ్లి ప్రజల సమస్యలను చర్చించి వాటిని పరిష్కరించాలి" అని కేజ్రీవాల్ తన లేఖలో పేర్కొన్నట్లు సునీత కేజ్రీవాల్ వీడియోలో చదివి వినిపించారు. "ప్రజల ప్రభుత్వపరమైన సమస్యలే కాకుండా ఇతర సమస్యలను కూడా మనం పరిష్కరించాలి. ఢిల్లీలోని రెండు కోట్ల మంది ప్రజలు నా కుటుంబం. నా వల్ల ఎవరూ బాధపడకూడదు. వారందరికీ దేవుడి ఆశీస్సులు ఉంటాయి. జై హింద్" అని కేజ్రీవాల్ అన్నట్లుగా సునీత పేర్కొన్నారు.
- 
      
                   
                                 వద్దమ్మా.. తప్పూ!ఈ మధ్య ‘గైడింగ్ హ్యాండ్స్’ అంటూ ఒక వీడియో వచ్చింది. అది వెక్కిరింత వీడియో. ఫోన్ చూసుకుంటూ తల ఎల్లవేళలా కిందకు దించి ఉండేవారిని చేయి పట్టి చేరవలసిన చోటుకు చేర్చే‘సహాయక చేతులను’ భవిష్యత్తులో ఉపాధిగా చేసుకోవచ్చని అందులో చూపుతారు. అంటే అంధులను చేయి పట్టి నడిపించేవారికి మల్లే ఈ ఫోన్ బానిసలను చేయి పట్టి నడిపించి చార్జ్ తీసుకునే వ్యక్తులు భవిష్యత్తులో వస్తారన్న మాట. మనం ఫోన్కు శ్రుతి మించి ఎడిక్ట్ అయ్యామని చెప్పేందుకు ఈ వీడియో చేశారు. బండి మీద వెళుతూ ఫోన్ మాట్లాడితే ప్రమాదం అని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ వినడం లేదు. కొందరు హెల్మెట్లో దూర్చి మరీ ఫోన్ మాట్లాడుతూ ప్రమాదం బారిన పడతారు. మరికొందరు హెడ్ఫోన్స్తో మాట్లాడుతూ వెనకొచ్చే వాహనాల హారన్ వినక ప్రమాదంలో పడుతున్నారు. మొన్నటి మార్చి 26న బెంగళూరు విద్యారణ్యపురలో ఒక మహిళ ఇలా ఫోన్ బిగించి కట్టి మాట్లాడుతూ ఒక వ్యక్తి కెమెరాకు చిక్కింది. అతను షూట్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. అందరూ ఇలా చేయడం ప్రమాదం అన్నారు. ఈ ఎండల్లో ఫోన్ వేడెక్కి పేలినా ప్రమాదమే అని మరికొందరు హెచ్చరించారు. పోలీసులు ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నించారు. చివరకు వీడియో పోలీసుల వరకూ వెళ్లింది. బండి నంబర్ ఆధారంగా ఆ మహిళను గుర్తించి యలహంక ట్రాఫిక్ స్టేషన్ వారు 5 వేల రూపాయల ఫైన్ వేశారు. అవసరమా ఇదంతా?
- 
      
                   
                                 హాయి హాయిగా... కూల్ కూల్గా!ఎలాంటి క్యాప్షన్ లేకుండా రమీజ్ అనే యూజర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన చెన్నై ఆటోడ్రైవర్ వీడియో 3 కోట్ల ఎనభై ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్తో దూసుకుపోతోంది. ‘ఏమిటీ ఆటోడ్రైవర్ స్పెషాలిటీ?’ అనే విషయానికి వస్తే... ఎండా కాలంలో చెన్నైలో వేడి అంతా ఇంతా కాదు. ఈ వేడిని తట్టుకోవడానికి సదరు ఆటోడ్రైవర్ ఎకో ఫ్రెండ్లీ ఏసీ ఫ్యాన్ను తయారుచేసి తన ఆటోలో బిగించాడు. ఆటోడ్రైవరే కాదు ప్రయాణికులు కూడా హాయి హాయిగా కూల్ కూల్గా ప్రయాణిస్తున్నారు.
- 
      
                   
                                 సెల్ఫ్–లవ్వెనకటికి ఒక ఈగ ఇల్లలుకుతూ ఇంటి పనుల్లో పడి పేరు మరచిపోయిందట. చాలామంది మహిళలు ఇంటిపనుల్లో తలమునకలైపోయి తమ ఇష్టాలను మరచిపోతుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రొఫెసర్ ఫల్గుణి గృహిణుల కోసం ఒక వీడియో చేసింది. ‘మహిళలు తమ భర్త, పిల్లల కోసం ఇష్టమైన వంటకాలను తయారుచేసే వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం చూశాను. మరి మీ కోసం ఎప్పుడు తయారు చేస్తారు? మీ కుటుంబ సభ్యులకు నచ్చిన వంటకాల గురించి మాత్రమే కాదు మీకు నచ్చిన వాటి గురించి కూడా దృష్టి పెట్టండి’ అంటూ తనకు బాగా నచ్చిన వంటకాన్ని తయారుచేస్తున్న వీడియోను ఫల్గుణి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ వైరల్ క్లిప్ 1.4 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. ఈ వీడియో క్లిప్ చూసి ఒక మహిళ ఇలా స్పందించింది... ‘నీకు ఇష్టమైనది చేసి పెడతాను. ఏంచేయమంటావు అని అడిగింది అమ్మ. వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. పెళ్లయిన తరువాత ఇంటిపనుల్లో పడి నాకు ఇష్టమైన వంటకం ఏమిటో కూడా మరిచిపోయాను. ఈ వీడియో చూసిన తరువాత సెల్ఫ్–లవ్ ్ర΄ాముఖ్యత గురించి రియలైజ్ అయ్యాను’
- 
      
                   
                                 అవిభక్త కవలలకు వివాహం.. వరుడెవరంటే..అమెరికాకు చెందిన అవిభక్త కవలలు (కంజోయిన్డ్ ట్విన్స్)అబ్బి, బ్రిట్నీ హెన్సెల్లు రిటైర్డ్ ఆర్మీ అధికారిని పెళ్లి చేసుకుని ముఖ్యాంశాలలో నిలిచారు. 1996లో ‘ది ఓప్రా విన్ఫ్రే షో’లో కనిపించి, ఇద్దరూ తొలిసారి వెలుగులోకి వచ్చారు. తాజాగా ఈ అవిభక్త కవలలు అమెరికా ఆర్మీ రిటైర్డ్ అధికారి జోష్ బౌలింగ్ను వివాహం చేసుకున్నారు. బ్రిట్నీ హాన్సెల్ ఫేస్బుక్ ప్రొఫైల్లో వారి పెళ్లి ఫొటో ప్రత్యక్షమయ్యింది. దానిలో పెళ్లి దుస్తుల్లో ఈ అవిభక్త కవలలు జోష్ బౌలింగ్ ముందు నిలబడి అతని చేతిని పట్టుకోవడాన్ని చూడవచ్చు. ఈ కవల సోదరీమణులు ప్రస్తుతం ఐదవ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. వీరు వీరి స్వస్థలమైన మిన్నెసోటాలో నివసిస్తున్నారు. మరోవైపు జోష్ బౌలింగ్ ఫేస్బుక్ పేజీలో అతను ఆ అవిభక్త కవలలకు ఐస్ క్రీం అందిస్తున్న ఫొటోలు, వెకేషన్ ఫోటోలు ఉన్నాయి. వీరి వివాహానికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా బయటకు వచ్చింది. దానిలో వారు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. అబ్బి, బ్రిట్నీ హెన్సెల్ల శరీరం కలసిపోయివుంటుంది. అబ్బి కుడి చేయి , కుడి కాలును నియంత్రిస్తుండగా, బ్రిట్నీ ఎడమ వైపు అవయవాలను నియంత్రిస్తుంది.
- 
      
                   
                                 వన్యప్రాణులపై రీల్స్ చేయండి.. రూ. 5,000 గెలుచుకోండి!ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ మహానగరం పేరు వినగానే అక్కడి జూలాజికల్ పార్క్ గుర్తుకు వస్తుంది. ఇది దేశంలోని పురాతన జూలాజికల్ పార్కులలో ఒకటి. ఈ పార్కులో పలు రకాల జంతువులు, పక్షులు కనిపిస్తాయి. ఈ పార్కుకు వచ్చే పర్యాటకుల సంఖ్యను మరింతగా పెంచేందుకు అక్కడి అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. కాన్పూర్ జూ పార్కు అధికారులు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యర్థులకు ఉచితంగా పార్కును సందర్శించే అవకాశాన్ని కల్పించారు. తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పలువురిని కాన్పూర్ జూకి ఆహ్వానించారు. వారిని జంతువులపై ప్రత్యేకంగా రీల్స్ చేయాలని కోరారు. వీటిలో అత్యధిక వ్యూస్ వచ్చిన వాటికి వేర్వేరు విభాగాలలో బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ‘కాన్పూర్ దర్శన్’ అనే పేరు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్ షెఫాలీ రాజ్ మాట్లాడుతూ జూలో నిర్వహిస్తున్న ఈ పోటీ ఉద్దేశ్యం దేశం నలుమూలలలోని ప్రజలకు కాన్పూర్ జూ పార్కు గురించి తెలియజేసి, వారు ఇక్కడికి వచ్చేలా ప్రేరేపించడమేనని అన్నారు. పర్యాటకులు రూపొందించే రీల్స్లో అత్యధికులు లైక్ చేసిన రీల్కు రూ. 5000, తరువాత ఉన్న రీల్కు రూ. 3000 నగదు బహుమతి అందించనున్నామని తెలిపారు.
- 
      
                   
                                 మాల్లో విషాదం: తండ్రి చేతుల్లోంచి జారిపడి..కుటుంబంతో సరదాగా గడుపుదామని షాపింగ్మాల్కు వెళ్లిన ఆ కుటుంబానికి శోకం మిగిలింది. తండ్రి చేతుల్లోంచి జారిపడి ఏడాదిన్నర బిడ్డ కన్నుమూసింది. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లోని ఓ షాపింగ్మాల్లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఎస్కులేటర్ మీద వెళ్లేందుకు ఓ వ్యక్తి చంటి బిడ్డను ఎత్తుకుని ఉన్నాడు. ఆ టైంలో ఆ వ్యక్తి ఐదేళ్ల కొడుకు ముందుకు వెళ్తుండడంతో.. నిలువరించేందుకు ఆ తండ్రి యత్నించాడు. ఈ లోపు చేతిలో ఉన్న బిడ్డ జారి కింద పడిపోయాడు. మూడో అంతస్థు నుంచి పడిపోవడంతో ఆ బిడ్డకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆ చిన్నారి కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. మాల్ సీసీటీవీ కెమెరాల్లో ఘటన తాలుకా దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపర్చొచ్చు.. సున్నిత మనస్కులు ఈ వీడియో చూడకండి Toddler at Raipur mall dies after falling from the third floor after he accidentally slips from the lap of the guardian, while he looked after another child.#Raipur pic.twitter.com/aGlW7oZUAk — Anurag Tyagi (@TheAnuragTyagi) March 20, 2024
- 
      
                   
                                 ‘బొద్దింకల దోసె’?! షాక్ అయిన అమ్మడుసామాన్యంగా బొద్దింకలను చూస్తేనే శరీరం ఝల్లుమంటుంది...అలాంటి బొద్దింక ఆహారంలో కనిపిస్తే..? ఆ భోజనం తినగలమా? ఈ మధ్యకాలంలో మనకు ఎక్కువగా వినిపిస్తున వార్త "ఆహారంలో బొద్దింక". ట్రైన్, రెస్టారెంట్, విమానాల్లో ఇలా ఎక్కడ చూసినా ఇవే వార్తలు. తాజాగా ఢిల్లీలో ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. న్యూఢిల్లీలోని కనౌట్ ప్లేస్లోని ఓ రెస్టారెంట్లో మధ్యాహ్న భోజనం కోసం ఓక మహిళ, ఆమె స్నేహితురాలు దోసను ఆర్డర్ చేసారు. సరిగ్గా అలా తినడం మొదలు పెట్టిందో లేదో.. అక్కడ అనుమానాస్పదంగా ఏదో కనిపించింది. ఏంటా అని పరిశీలనగా చూసింది. అంతే.. ఒకటి కాదు రెండు కాదు ఎకంగా ఎనిమిది బొద్దింల్ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. ఇవి చదవండి: నిత్యం వీటిని తినడంతో.. కలిగే మార్పులు తెలుసా! దీంతో ఈ సంఘటనను రికార్డుచేయాలని నిర్ణయించుకుంది. స్నేహితురాలి సాయంతో వీడియో రికార్డ్ చేస్తోంది. ఇంతలోనే హోటల్ సిబ్బందిలో ఒకరు ఎంట్రీ ఇచ్చాడు. అకస్మాత్తుగా ప్లేట్ను లాగేసుకున్నాడు. ఈ విషయాన్ని ఇషాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ‘బొద్దింకల’పై ఆరా తీస్తున్నారు. తనకెదురైన భయంకరమైన అనుభవాన్ని ఇషాని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ కేఫ్ లైసెన్స్, శుభ్రతపై అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. రెస్టారెంట్ల పరిశుభ్రత స్థాయి, లైసెన్స్లను తనిఖీ చేయడానికి అధికారులు క్రమం తప్పకుండా రెస్టారెంట్లను సందర్శించి తగిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు నమోదు కావంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ‘ది క్వింట్’ షేర్ చేసిన ఈ వీడియో ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
- 
      
                   
                                 ఇదేందిది.. ప్రజర్ కుక్కర్ను ఇలానూ వాడొచ్చా?కొంతమంది తమ అవసరాలకు అనుగుణంగా ఇంటిలోని వస్తువులతో వినూత్న ఆవిష్కరణలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇటువంటివాటిని చూసినప్పుడు మన కళ్లను మనమే నమ్మలేం. ఇన్నాళ్లూ ఈ సంగతి మనకు తెలియలేదే.. అని ఆశ్యర్యపోతుంటాం. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్గా మారింది. ఈ వీడియోలో ప్రజర్ కుక్కర్ నుంచి విజిల్ రాగానే ఓ యువతి చేసిన పని చూస్తే ఎవరైనా ఆశ్యర్యపోవాల్సిందే. హాట్ ప్రజర్ కుక్కర్ను ఉపయోగించి ఆ యువతి దుస్తులు ఇస్త్రీ చేయడాన్ని వీడియోలో చూడవచ్చు. ప్రజర్ కుక్కర్ నుంచి విజిల్ రాగానే ఆ యువతి ఇండక్షన్ స్టవ్ నుంచి దించి, దానిని తీసుకుని గదిలోకి పరిగెడుతుంది. తరువాత ఆ కుక్కర్ సాయంతో ఒక షర్ట్ ఇస్త్రీ చేస్తుంది. ఈ వీడియోను చూసిన యూజర్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ 17 సెకన్ల వీడియో @Babymishra_ అనే ఖాతాతో ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు ఒక లక్షా 40 వేల మందికి పైగా వీక్షించగా, ఆరు వందల మందికి పైగా యూజర్లు ఈ వీడియోను లైక్ చేశారు. ఒక యూజర్ ‘ఆమె సృజనాత్మకతకు వందనం’ అని రాయగా, మరొక యూజర్ ‘ఇస్త్రీ పెట్టె నూతన ఆవిష్కరణ. వెంటనే పేటెంట్ తీసుకోవాలి’ అని రాశారు. प्रिय दीदी जी को दंडवत प्रणाम 🙏 pic.twitter.com/ux2XkGpMSX — Shubhangi Pandit (@Babymishra_) March 12, 2024
- 
      
                   
                                 Google software engineer : ఏ డే ఇన్ మై లైఫ్...గూగుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సలోని రక్హోలియా ‘ఏ డే ఇన్ మై లైఫ్ ఎట్ గూగుల్’ కాప్షన్తో పోస్ట్ చేసిన వీడియో 2.4 మిలియన్ల వ్యూస్ను దక్కించుకుంది. ఉదయం ఇంటి నుంచి బయలుదేరడం నుంచి గూగుల్ ఆఫీసులోకి అడుగు పెట్టడం, చెక్ అప్డేట్స్, బ్రేక్ ఫాస్ట్, ప్లాన్ ఫర్ ది డే అండ్ వర్క్, గెట్ సమ్ వాటర్ అండ్ స్నాక్స్, కోడ్ అండ్ అటెండింగ్ మీటింగ్స్, కొద్ది సమయం పుస్తకం చదవడం, టేబుల్ టెన్నిస్ ఆడడం, వర్క్ చేస్తూ స్నాక్స్, కాఫీ ఆస్వాదించడం. వర్క్కోడ్, డిజైన్, డిస్కస్, మ్యూజిక్ రూమ్లో కొద్దిసేపు గడపడం, జిమ్లో కొద్దిసేపు ఎక్సర్సైజ్, కోడింగ్ సెషన్లు, సాయంత్రం ఆఫీసు నుంచి తిరిగి ఇంటికి వెళ్లడం...ఇలాంటి దృశ్యాలెన్నో ఈ వీడియోలో కనిపిస్తాయి. ఆఫీస్ జిమ్లో క్విక్ వర్కవుట్ సెషన్లాంటి వెల్–టైమ్డ్ బ్రేక్స్ను ఈ వీడియో హైలెట్ చేస్తుంది.
- 
      
                   
                                 ఖలిస్తానీ నేత హత్య వీడియో.. తొలిసారి టీవీలో ప్రసారంఒట్టావా: ఖలిస్తానీ అనుకూల నేత హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య వీడియో తొలిసారి కెనడాలోని ఓ టీవీ చానల్లో ప్రసారమైంది. గత ఏడాది జూన్ 18న కెనడా బ్రిటీష్ కొలంబియా ప్రావిన్సులోని సర్రే పట్టణంలో ఉన్న గురునానక్ సిక్ గురుద్వారా సాహిబ్ ఆవరణలో నిజ్జర్పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్యకు సంబంధించిన సీసీటీవీ వీడియోను కెనడాలో తొలిసారిగా అధికారిక సీబీసీ న్యూస్ చానల్ ప్రసారం చేసింది. గురుద్వారా పార్కింగ్ ప్లేస్లో నిజ్జర్ ప్రయాణిస్తున్న వైట్ సెడాన్కారును ఒక పిక్అప్ ట్రక్కు తొలుత అడ్డగిస్తుంది. అనంతరం ట్రక్కులో నుంచి నిజ్జర్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చిన మాస్కులు ధరించిన వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపి అక్కడే వేచి ఉన్న టయోటా క్యామ్రీ కారులో ఎక్కి పారిపోయిన దృశ్యాలు ప్రసారమయ్యాయి. ఈ కేసులో ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క నిందితుడిని కూడా అరెస్టు చేయలేకపోయింది. నిజ్జర్ హత్య కేసును ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్(ఐహెచ్ఐటీ)దర్యాప్తు చేస్తోంది. నిజ్జర్ హత్యతో భారత వేగులకు సంబంధముందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గత ఏడాది సెప్టెంబర్ 18న ఆ దేశ పార్లమెంటులో వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. ఈ వ్యాఖ్యల తర్వాత భారత్, కెనడా మధ్య సంబంధాలు బలహీనమయ్యాయి. ఇదీ చదవండి.. కెనడాలో భారత సంతతి వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులు
- 
      
                   
                                 ఛీఛీ.. మూమూస్ ఇలా చేస్తారా?ఇటీవలి కాలంలో మూమూస్ చాలామందికి ఇష్టమైన చిరుతిండిగా మారిపోయింది. అయితే ఛత్తీస్గఢ్లోని ధామ్తరిలో మూమూస్ తయారీకి సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసిన వారికి ఇకపై మూమూస్ జోలికి వెళ్లకూడదని అనిపించడం ఖాయం. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో స్థానిక అధికారులు అప్రమత్తం అయ్యారు. ధామ్తరిలో మూమూస్ విక్రయించే అన్ని దుకాణాలపై దాడులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అలాగే మూమూస్ తినేవారంతా చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన మురికి పాదాలతో మూమూస్ కోసం పిండిని కలపడం చూడవచ్చు. ఈ వీడియోను చూసిన పలువురు తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తున్నారు. मोमोज़ का आटा, क्या आप भी मोमोज़ खाते है..?? pic.twitter.com/hmA0QxbFRd — Abhishek Pandey (@Abhishe76395130) March 5, 2024
- 
      
                   
                                 రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. లోపలే 9 నిమిషాలున్న అనుమానితుడుగతవారం బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగిన ఘటన అందరిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దీనికి కారణమైన నిందితుడు ఎవరనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. అయితే పేలుడు సంభవించడానికి కారణమైన ఓ వ్యక్తి సుమారు 9 నిమిషాల పాటు కేఫ్లో ఉన్నట్లు తెలుస్తోంది. బాంబు దాడికి పాల్పడిన అనుమానితుడు సన్ గ్లాసెస్, మాస్క్, బేస్ బాల్ టోపీతో బస్టాండ్ నుంచి రామేశ్వరం కేఫ్ వైపు నడుస్తున్నట్లు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. శుక్రవారం ఉదయం 11.34 గంటలకు బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్లోని కేఫ్లోకి ప్రవేశించిన అతను మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నట్లు కనిపించాడు. మరో ఫుటేజిలో అతడు ఉదయం 11.43 గంటలకు కేఫ్ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అనుమానితుడు వచ్చినంత హడావుడిగానే వెళ్లిపోయినట్లు ఫుటేజిలో కనిపిస్తోంది. రామేశ్వరం కేఫ్లో అనుమానితుడు తొమ్మిది నిమిషాలు మాత్రమే గడిపినట్లు సీసీటీవీ ఆధారాలు సూచిస్తున్నాయి. పేలుడుకు కారణమైనట్లు అనుమానిస్తున్న వ్యక్తి కేఫ్లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ (IED) ఉన్న బ్యాగ్ని వదిలిపెట్టాడు. ఈ పేలుడులో కొంతమంది కేఫ్ సిబ్బంది సహా 10 మంది గాయపడ్డారు. ఈ కేసును ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) టేకోవర్ చేసింది. VIDEO | Another CCTV visual of Bengaluru cafe blast suspect emerged showing him entering and leaving the cafe At least 10 people were injured in the low intensity blast at the popular Rameshwaram Cafe in Bengaluru's Whitefield locality on Friday. (Source: Third Party) pic.twitter.com/9jpUfxcJt1 — Press Trust of India (@PTI_News) March 4, 2024
- 
      
                   
                                 ఎయిరిండియా ఇన్ఫ్లైట్ సేఫ్టీ వీడియో : విభిన్న నృత్య రీతులతోటాటా గ్రూపు యాజమాన్యంలో ఎయిరిండియా ఇటీవల సరికొత్తగా ముస్తాబైంది. విమానాల్ని కలర్ఫుల్గా, ముఖ్యంగా ఎయర్హెస్టెస్ తదితర సిబ్బంది డ్రెస్ కోడ్ను అందంగా తీర్చిదిద్దింది. తాజాగా మరో కొత్త అప్డేట్ను కూడా ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజనులను బాగా ఆకట్టుకుంది. దేశ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కొత్త ఇన్ఫ్లైట్ సేఫ్టీ వీడియోను తీసుకొచ్చింది. ఎయిరిండియా విమానం బయలు దేరడానికి ముందు వినిపించే ప్రయాణీకుల కోసం 'సేఫ్టీ ముద్ర' అనే కొత్త ఇన్ఫ్లైట్ సేఫ్టీ వీడియోను పరిచయం చేసింది. వివిధ కళారూపాల నుండి ప్రేరణ పొందినట్టు తెలిపింది. "శతాబ్దాలుగా, భారతీయ శాస్త్రీయ నృత్యం , జానపద-కళా రూపాలు కథలు, సూచిక మాధ్యమంగా పనిచేశాయి. నేడు, అవి విమాన భద్రత గురించి మరొక కథను చెబుతున్నాయి." అని ట్వీట్ చేసింది. సుసంపన్నమైన, విభిన్నమైన నృత్య రీతుల ప్రేరణతో కొత్త సేఫ్టీ ఫిల్మ్అంటూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. మెకాన్ వరల్డ్గ్రూప్కు చెందిన ప్రసూన్ జోషి, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ , డైరెక్టర్ భరతబాల సంయుక్తగా 'సేఫ్టీ ముద్రాస్'ను దీన్ని తీసుకొచ్చారు. భరతనాట్యం, బిహు, కథక్, కథాకళి, మోహినియాట్టం, ఒడిస్సీ, ఘూమర్ .గిద్దా, ఎనిమిది విభిన్న నృత్య రూపాల్లో ముద్రలు లేదా నృత్యవ్యక్తీకరణలు ఇందులో చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణీకులకు భారతదేశ గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ, అవసరమైన భద్రతా సూచనలను అందించేలా దీన్ని తీర్చిదిద్దడం సంతోషదాయమన్నారు ఎయిరిండియా సీఎండీ కాంప్బెల్ విల్సన్ For centuries, Indian classical dance and folk-art forms have served as medium of storytelling and instruction. Today, they tell another story, that of inflight safety. Presenting Air India’s new Safety Film, inspired by the rich and diverse dance traditions of India.#FlyAI… pic.twitter.com/b7ULTRuX1Z — Air India (@airindia) February 23, 2024
- 
      
                   
                                 పుణెలో గూగుల్ కొత్త ఆఫీస్.. ఎలా ఉందో చూడండి..Google New Office In Pune : భారత్లో విస్తరణను కొనసాగిస్తున్న టెక్ దిగ్గజం గూగుల్ ( Google ) ఇటీవల పుణెలోని కోరేగావ్ పార్క్ అనెక్స్లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కార్యాలయం ద్వారా గ్లోబల్ ఇంజినీరింగ్ బృందాల సహకారంతో అధునాతన ఎంటర్ప్రైజ్ క్లౌడ్ టెక్నాలజీల రూపకల్పన, రియల్ టైమ్లో సాంకేతిక సలహాలను అందించడం, ప్రొడక్ట్ ఇంప్లిమెంటేషన్ నైపుణ్యాలను అందిస్తారు. ఇక్కడ 1,300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తారని అంచనా. పుణెలోని గూగుల్ కొత్త ఆఫీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న అర్ష్ గోయల్.. అక్కడ ఉద్యోగుల కోసం అందుబాటులో ఉన్న పలు సౌకర్యాల గురించి తెలియజేశారు. దీనికి సంబంధించి తీసిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. విశాలమైన ఆఫీస్లో అందమైన ఇంటీరియర్స్ తోపాటు నోరూరించే ఆహారంతో కేఫ్, గేమ్ జోన్, రిక్రియేషన్ రూమ్ వంటి ఆకట్టుకునే సౌకర్యాలు ఉన్నాయి. ''పుణెలో కొత్తగా ప్రారంభించిన గూగుల్ ఆఫీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల రోజు ఎలా ఉంటుందో చూడండి'' అంటూ తన ఫోలోవర్లతో వీడియోను పంచుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో షేర్ చేసినప్పటి నుంచి 4,70,000 కుపైగా వీవ్స్, 18,000 కుపైగా లైక్లను పొందింది. చాలా మంది ఇంటర్నెట్ యూజర్లు గూగుల్ కొత్త ఆఫీస్ ఇష్టపడ్డారు.అక్కడ పని చేయడానికి తాము ఇష్టపడుతున్నట్లు కామెంట్లు పెట్టారు. పుణెలో ఏర్పాటైన ఈ కొత్త ఆఫీస్తో గూగుల్కి ఇప్పుడు భారత్లో హైదరాబాద్లోని తన దేశ ప్రధాన కార్యాలయంతో సహా ఐదు కార్యాలయాలు ఉన్నాయి. View this post on Instagram A post shared by Arsh Goyal (@arshgoyalyt)
- 
      
                   
                                 వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ సంస్థలో విషాదం!ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ సంస్థలో విషాదం చోటు చేసుకుంది. ఆ కంపెనీకి చెందిన మాజీ సీఈఓ సుసాన్ వోజ్కికీ కుమారుడు 19 ఏళ్ల మాక్రో ట్రోపర్ మరణించారు. నార్తన్ కాలిఫోర్నియాలోని బర్కిలీ నగరం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన హాస్టల్లో మరణించిట్లు ట్రాపర్ తల్లిదండ్రులు నిర్ధారించారు. ట్రోపర్ ఎందుకు మరణించారనే విషయంపై స్పష్టత లేదు. ట్రోపర్ ఆపస్మారక స్థితిలో జారుకున్నప్పుడు సమాచారం అందుకు బర్కిలీ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ట్రాపర్ మరణించినట్లు తేలింది. ట్రోపర్ ఎందుకు మరణించారనే అంశం వెలుగులోకి వచ్చేందుకు ఇంకా నెల రోజుల సమయం పట్టొచ్చంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టాక్సికాలజీ రిపోర్ట్ కోసం కుటుంబం ఎదురు చూస్తున్నారు. మనవడి మరణంపై ట్రోపర్ నాయనమ్మ, యూట్యూబ్ మాజీ సీఈఓ సూసన్ వోజిస్కీ తల్లి ఎస్తేర్ వోజిస్కీ కన్నీరుమున్నీరుగా విలపించారు. మెటా పోస్ట్లో తన మనవడిది ప్రేమించే తత్వం, గణిత మేధావి’ అంటూ అభివర్ణించింది. యూట్యూబ్ సీఈఓ సూసన్ వోజిస్కీ తొమ్మిదేళ్ల పాటు యూట్యూబ్కు సీఈఓగా వ్యవహరించిన సూసన్ వోజిస్కీ గత ఏడాది రాజీనామా చేశారు. 54 ఏళ్ల సూసన్ తన కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తొమ్మిదేళ్ల క్రితం తాను యూట్యూబ్లో చేరినప్పుడు, మంచి లీడర్షిప్ టీంను ఏర్పాటు చేశానని, నీల్ మోహన్ ఆ బృందంలో భాగమని సూసన్ చెప్పారు. సూసన్ రాజీనామాతో భారత సంతతికి చెందిన నీల్ మోహన్, యూట్యూబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా బాధ్యతలు స్వీకరించారు.
- 
      
                   
                                 ఇవాళ నుంచే తాజ్ మహోత్సవ్ ప్రారంభం!ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒక్కటైన తాజ్ మహల్ని జీవితంలో ఒక్కసారైన చూడాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. ఆగ్రాలో ఉండే ఈ కట్టడాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. దీన్ని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఎవరైనా ఆగ్రా ప్రయాణానికి వెళ్లాలనుకుంటే మాత్రం ఇక్కడ ప్రతి ఏడాది జరిగే తాజ్ మహోత్సవ్ (Taj Mahotsav 2024)న్ని అస్సలు మిస్సవ్వరు. తాజ్ మహోత్సవ్ ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో జరుగుతుంది.ఈ ఏడాది ఈ ఉత్సవం ఫిబ్రవరి 17న ప్రారంభమై ఫిబ్రవరి 27 వరకు కొనసాగనుంది. పర్యాటకుల కోసం ఈసారి వివిధ సాంస్కృతిక కార్యక్రమాల వీక్షణతోపాటు హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ వంటివి ఏర్పాటు చేయడం విశేషం. ఎన్ని రోజులు జరుగుతుందంటే.. ఈ ఏడాది తాజ్ మహోత్సవం ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతున్నాయి. తాజ్ మహోత్సవ్ అనేది 10 రోజుల పాటు జరిగే వార్షిక కార్యక్రమం.సరిగ్గా ఇది ఫిబ్రవరి 27న ముగుస్తుంది. ఈసారి ప్రత్యేకతలు... ఈ ఏడాది తాజ్ మహోత్సవ్లో ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఈసారి యమునా మహా ఆరతి తాజ్ మహోత్సవ్లో కనిపించనుంది. యమునా నది ఘాట్లపై తాజ్ మహోత్సవం సందర్భంగా మహా ఆరతి కార్యక్రమం నిర్వహిస్తారు. దీంతో పాటు పర్యాటకుల కోసం గాలిపటాల పండుగ, గజల్ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు.. తాజ్ మహోత్సవ్ సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను చూడటం ఒక విభిన్నమైన ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతిరోజు సాయంత్రం ప్రసిద్ధ కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు ఇస్తారు. తాజ్ కమిటీ, ఉత్తర్ ప్రదేశ్ టూరిజం శాఖ సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి. తాజ్ మహల్ తూర్పు ద్వారం సమీపంలోని శిల్పగ్రామ్లో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. తాజ్ మహోత్సవ్లో భారతీయ సంగీతం, నృత్యానికి సంబంధించిన వివిధ రకాలను చూసే అవకాశం లభిస్తుంది. ఇక్కడకు వచ్చి కథక్, భరతనాట్యం, క్లాసికల్, సబ్-క్లాసికల్ గానం, భోజ్పురి గానం, అవధి గానం, ఖవ్వాలి, భజన్ సంధ్య, బ్రజ్ జానపద పాటలు, జానపద నృత్యాలు, వేణువు, సరోద, సితార్, తబలా, పఖావాజ్, రుద్రవీణ మొదలైనవి వాయించడం ఆస్వాదించవచ్చు. తాజ్ మహోత్సవ్లో ప్రముఖ బాలీవుడ్ కళాకారులు కూడా ప్రదర్శన ఇస్తారు. ఇందులో గజల్ సింగర్, ఖవ్వాలి, సింగర్, స్టాండప్ కామెడీ, తదితర ఈవెంట్లను కూడా నిర్వహిస్తారు. ఇవీ కాకుండా ఇంకా దేశం నలుమూలల నుండి వచ్చే వందలాది మంది కళాకారులు తమ అద్భుతమైన శిల్ప కళా, హస్త కళా నైపుణ్యాలను ఇక్కడ ప్రదర్శనలో ఉంచుతారు. ఇక్కడ చాలావరకు ప్రాంతీయ ప్రత్యేకతలు కలిగిన అన్నీ కళాఖండాలు ఒకేచోట కొలువుదీరుతుండటం విశేషం. ఇందులో ఈశాన్య రాష్ట్రాల నుంచే వచ్చే కళాకారులు వెదురు బొంగుతో తయారు చేసిన బొమ్మలు ప్రదర్శనలో ఉంచుతారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల నుంచి వచ్చేవారు రాతి శిల్పాలు, అలాగే జమ్మూ కశ్మీర్ నుంచి వచ్చేవారు తివాచీలు, షాలువాలు, స్వెటర్ల వంటివి ప్రదర్శనకు ఉంచుతారు. ఇక్కడ హస్తకళా కళల ప్రదర్శన, దుకాణాలు, రుచికరమైన ఆహారం కోసం ఫుడ్ జోన్ తదితరాలు పర్యాటకులు ఎంతగానో ఆకర్షిస్తాయి.తాజ్ మహోత్సవ్ ప్రవేశ టికెట్ రూ. 50. విదేశీ పర్యాటకులు ఐదేళ్లలోపు పిల్లలకు ప్రవేశ రుసుము లేదు. Glimpses of Taj Mahotsav: A Cultural Extravaganza in the Heart of Agra. Celebrating 33 years in 2024 Experience India's rich arts, crafts, music, cuisine. With 400 artisans showcasing woodwork, stone carving, mesmerizing performances, delicious food. 17th to 27th Feb, 2024. pic.twitter.com/TU4yAvWB9C — Taj Mahal (@TajMahal) February 15, 2024 (చదవండి: తరతరాలకు సరిపడ సంపదలో అత్యుత్తమ దేశం ఇదే! భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..)
- 
      
                   
                                 Jharkhand: ‘గవర్నర్గారూ.. మా మెజార్టీ ఇది!’రాంచీ: హేమంత్ సొరెన్ అరెస్ట్ వెంటనే జార్ఖండ్లో నూతన ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఆలస్యం చేయకుండా జేఎంఎం సీనియర్ నేత చంపయ్ రాయ్ను లెజిస్టేటివ్ లీడర్గా ప్రకటించారు. కానీ, గవర్నర్ మాత్రం ప్రభుత్వ ఏర్పాటునకు వెంటనే ఆహ్వానించలేదు. దీంతో తీవ్ర సస్పెన్స్ తర్వాత.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను చంపయ్ సొరెన్ కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు మెజారిటీ ఉందని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు తెలిపారు. అంతేకాదు.. అప్పటికే తీసిన మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేల వీడియోను గవర్నర్కు చూపించడం గమనార్హం. జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్జేడీ)ల అధికార కూటమి చంపయ్ సొరెన్కు మద్దతు తెలుపుతున్న 43 మంది ఎమ్మెల్యేల వీడియోను విడుదల చేసింది. గవర్నర్ను చంపయ్ సొరెన్ కలవడానికి వెళ్లే ముందు ఎమ్మెల్యేలు వీడియో రికార్డింగ్ ద్వారా మద్దతు చెప్పించారు. महामहिम राज्यपाल जी बहुमत यंहा साफ-साफ बिना चश्मा को देखा जा सकता है। फिर भी नया सरकार का गठन में देरी किस बात का? जब विद्यायकों का समर्थन का लेटर आपके पास पहुंचा हुआ है, तो किस शुभ घड़ी का इंतज़ार कर रहे है आप? जनता को जवाब दे महामहिम @jhar_governor जी।#JharkhandCM pic.twitter.com/BNuc8jaHu2 — Md Furkan Ahmad (@Furkanjmm) February 1, 2024 ఆ వీడియోలో చంపయ్ సొరెన్తో పాటు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత అలంగీర్ ఆలం, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తా, సీపీఐ (ఎంఎల్) ఎల్ ఎమ్మెల్యే వినోద్ సింగ్, ప్రదీప్ యాదవ్లు ఉన్నారు. సమావేశానంతరం చంపయ్ సొరెన్ మాట్లాడుతూ.. 'ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెజారిటీ సాధించి 22 గంటలైంది. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ చెప్పారు.' అని అన్నారు. మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ బుధవారం రాత్రి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో హేమంత్ సొరెన్ అరెస్టు కావడంతో చంపయ్ సొరెన్ వెంటనే సీఎంగా ప్రమాణం చేస్తారని అంతా భావించారు. కానీ, రాజ్భవన్ వద్ద నాటకీయ పరిణామాల నేపథ్యంలో అది వాయిదా పడుతూ వస్తోంది. ఇదీ చదవండి: Jarkhand Crisis: కొత్త సీఎంగా చంపయ్ సొరెన్ ఎంపికకు అసలు కారణం ఇదే?
- 
      
                   
                                 కొండపై క్రికెట్.. రోడ్డుపై ఫీల్డింగ్ - ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్భారతదేశంలో క్రికెట్కున్న క్రేజు అంతా ఇంతా కాదు, ఈ క్రేజుని వేరే లెవెల్కు తీసుకెళ్లిన కొందరు యువతులకు సంబంధించిన వీడియోను పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా షేర్ చేశారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో పలువురు క్రికెట్ అభిమానుల మనసు దోచేస్తుంది. క్రికెట్ ఆడాలంటే గ్రౌండ్ / మైదానం ఉండాలి. అది లేనప్పుడు వీధుల్లో ఉన్న చిన్న ప్రదేశాల్లోనే క్రికెట్ ఆడుకుంటారు. అయితే ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో యువతులు కొండల్లో క్రికెట్ ఆడటం చూడవచ్చు. ఈ సంఘటన ఆ యువతులకు క్రికెట్ మీద ఉన్న పిచ్చిని ఇట్టే తెలియజేస్తుంది. కొండ మీద క్రికెట్ ఆడుతుంటే.. కింద రోడ్డు మీద ఫీల్డింగ్ చేస్తున్న దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు. ఆనంద్ మహీంద్రా ఈ వీడియో షేర్ చేస్తూ.. భారత్ క్రికెట్ను మరో స్థాయికి తీసుకెళ్లిందంటూ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికీ ఈ వీడియోను 14 లక్షల మంది వీక్షించారు. ఇదీ చదవండి: పానీ పూరీ అమ్మడానికి థార్.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే.. ఈ వీడియో చూసిన కొందరు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. క్రికెట్ మన రక్తంలోనే ఉందని కొందరు కామెంట్ చేస్తే.. ఇలాంటి క్రికెట్ తామెక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు. India takes cricket to another level. Or should I say many ‘levels’…. 👍🏽🙁 pic.twitter.com/Lhv8BIzw74 — anand mahindra (@anandmahindra) January 24, 2024
- 
      
                   
                                 మంటల్లో శునకం.. ప్రాణాలకు తెగించిన యువకుడు!ఇటీవలి కాలంలో పెంపుడు జంతువులను పెంచుకునేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. వాటిని ఇంటిలోని మనుషుల్లానే భావిస్తూ, వాటిపై ప్రేమ కురిపిస్తుంటారు. వాటి రక్షణ కోసం ఏమి చేసేందుకైనా సిద్ధపడుతుంటారు. తాజాగా వైరల్గా మారిన ఒక వీడియో జంతు ప్రేమకు ఉదాహరణగా నిలిచింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక ఇంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించడాన్ని గమనించవచ్చు. ఈ నేపధ్యంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇంతలో ఒక వ్యక్తి పరుగున వచ్చి , మంటలు వ్యాపించిన ఆ ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తాడు. అతనిని అగ్నిమాపక సిబ్బంది వారించినా, అతను వారి మాటను పట్టించుకోడు. మంటలు చుట్టుముట్టిన ఇంటిలోకి దూరిన ఆ వ్యక్తి కొద్దిసేపటి తరువాత ఒక శునకాన్ని తీసుకుని బయటకు వస్తాడు. ఆ శునకాన్ని కాపాడే ప్రయత్నంలో ఆ వ్యక్తి చేతికి స్వల్పంగా కాలిన గాయం అవుతుంది. ఈ కుర్రాడి జంతు ప్రేమను చూసిన వారంతా అతనిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫారమ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో @HumansNoContext అనే ఖాతాలో షేర్ చేశారు. వీడియోతో పాటుగా ఉన్న క్యాప్షన్లో ‘తన పెంపుడు శునకాన్ని రక్షించడానికి ఒక వ్యక్తి తగలబడుతున్న ఇంట్లోకి ప్రవేశించాడు’ అని రాశారు. ఇప్పటి వరకు 2 లక్షల 85 వేల మంది ఈ వీడియోను వీక్షించారు. వీడియోను చూసిన యూజర్స్ ఆ యువకుడని నిజమైన హీరో అంటూ మెచ్చుకుంటున్నారు. Man runs into burning home to save his dog pic.twitter.com/BOMk1nBDiU — NO CONTEXT HUMANS (@HumansNoContext) January 25, 2024
- 
      
                   
                                 ఈ ఏడాది 1996 క్యాలెండర్స్ వాడుకోండి..! ఎందుకంటే?2023 ముగిసింది 2024 కూడా వచ్చేసింది. అయితే ఈ ఏడాది చాలా మంది 1996 క్యాలెండర్ తీసి మళ్ళీ గోడకు తగిలిస్తున్నారు. ఇంతకీ 2024లో సుమారు మూడు దశాబ్దాల నాటి క్యాలెండర్ ఎందుకు తగిలిస్తున్నారు? దీని వెనుక ఉన్న కారణం ఏంటనేది ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి 2024లో వచ్చిన క్యాలెండర్ మొత్తం 1996 నాటి క్యాలెండర్ మాదిరిగానే ఉంది. అంటే 2024 జనవరి 1.. సోమవారంతో మొదలైంది. 1996 జనవరి 1 కూడా సోమవారమే మొదలైంది. రెండూ కూడా లీప్ సంవత్సరాలే. దీన్ని బట్టి చూస్తే క్యాలెండర్ చక్రం మళ్ళీ మొదలైందా అన్నట్లు అనిపిస్తోంది. దీనికి సంబంధించిన పోస్టులు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. 1996 ఈజ్ బ్యాక్ అంటూ కొందరు, 1996 - 2024 సేమ్ టు సేమ్ అంటూ కొందరు వీడియోలను వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ క్యాలెండర్ ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని గమనించిన కొన్ని ఈ కామర్స్ సంస్థలు 1996 క్యాలెండర్ మాదిరిగానే దాని మీద వివిధ కవర్ ఫొటోలతో అమ్మకానికి పెడుతూ డబ్బు సంపాదించుకుంటున్నాయి. ఇదీ చదవండి: మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఈ కంపెనీలకు కొత్త రూల్స్! ఆన్లైన్లో అమ్మకానికి ఉన్న ఈ క్యాలెండర్ల ధరలు 50 డాలర్ల నుంచి 200 డాలర్ల వరకు ఉంది. భారతీయ కరెన్సీ ప్రకారం వీటి ధర రూ. 4000 నుంచి రూ. 16000 వరకు ఉందన్నమాట. ఇందులో కూడా 1996లో చైల్డ్ స్టార్గా ఫేమస్ అయిన 'జొనాథన్ టేలర్ థామస్' ఫోటో ఉన్న క్యాలెండర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 1996 క్యాలెండర్లో ఉన్న డేట్స్ మాత్రమే కాకుండా ప్రెసిడెంట్ ఎలక్షన్స్, ఒలంపిక్ గేమ్స్ వంటివి కూడా దాదాపు ఒకేలా ఉన్నట్లు తెలుస్తోంది. 1996లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఒలంపిక్ గేమ్స్ జరిగాయి. ఇప్పుడు 2024లో కూడా అమెరికా ఎలక్షన్స్.. ఒలంపిక్ గేమ్స్ కూడా జరగనున్నాయి. https://t.co/khl7lItR3j 1996 calendar is the same as 2024. Use the old one pic.twitter.com/Awa1nrkrYP — giveawayhub (@ritly_) January 2, 2024
- 
      
                   
                                 టీవీ నుంచి వీడియోల వైపు.. !న్యూఢిల్లీ: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అన్ని రంగాల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొబైల్ ప్రతిఒక్కరి జీవితంలో భాగమైంది. ఏదైనా కొత్త సినిమా, వెబ్సిరీస్ చూడాలన్నా ఇప్పుడు టీవీలకు బదులుగా మొబైల్, ల్యాప్టాప్లనే వాడుతున్నారు. అందరి ఇళ్లల్లో టీవీలు ఉన్నా క్రమంగా వాటి వాడకం తగ్గుతోంది. ఓటీటీలకు ప్రాధాన్యం పెరుగుతోంది. అందుకు సంబంధించి మీడియా పార్ట్నర్స్ ఏషియా ఆసక్తికర నివేదిక విడుదల చేసింది. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో (ఏపీఏసీ) 2028 నాటికి అత్యధికంగా ఆదాయం నమోదయ్యే టాప్ 6 వీడియో మార్కెట్లలో భారత్ కూడా ఒకటిగా ఎదగనుంది. ఈ జాబితాలో చైనా, జపాన్, కొరియా, ఆస్ట్రేలియా, ఇండొనేషియాలు కూడా ఉన్నాయి. ఆసియా–పసిఫిక్ ప్రాంత వీడియో పరిశ్రమలో ఈ ఆరు దేశాల వాటా ఏకంగా 90 శాతంగా ఉండనుంది. మీడియా పార్ట్నర్స్ ఏషియా (ఎంపీఏ) విడుదల చేసిన ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇక 2023–28 మధ్య కాలంలో అత్యంత వేగంగా ఎదిగే వీడియో మార్కెట్లలో ఒకటిగా భారత్ ఉంటుందని నివేదిక పేర్కొంది. వార్షిక ప్రాతిపదికన 5.6 శాతం మేర వృద్ధి చెందవచ్చని అంచనా వేసింది. 14 మార్కెట్లలో ఉచిత టీవీ చానళ్లు, పే–టీవీలు, వివిధ రకాల వీవోడీలు (వీడియో–ఆన్–డిమాండ్) .. వాటి వినియోగదారులు, ప్రకటనలు మొదలైన అంశాలను అధ్యయనం చేసిన మీదట ఎంపీఏ ఈ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం 2023–28 మధ్య కాలంలో ఏపీఏసీ వీడియో పరిశ్రమ మొత్తం ఆదాయం 2.6 శాతం వార్షిక వృద్ధితో 165 బిలియన్ డాలర్లకు చేరనుంది. చైనా మార్కెట్ 1.7 శాతం వృద్ధితో 2028 నాటికి 70 బిలియన్ డాలర్లకు చేరుకోగలదు. ఆ తర్వాత స్థానాల్లో జపాన్ (35 బిలియన్ డాలర్లు), భారత్ (17 బిలియన్ డాలర్లు), కొరియా (14 బిలియన్ డాలర్లు), ఆస్ట్రేలియా (11 బిలియన్ డాలర్లు) ఉంటాయి. కనెక్టివిటీ దన్ను.. మెరుగైన ఇంటర్నెట్, కనెక్టెడ్ టీవీల వినియోగం పెరగడం, ప్రీమియం లోకల్ కంటెంట్పై ఇన్వెస్ట్ చేస్తుండటం, ప్రీమియం స్పోర్ట్స్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉండటం మొదలైన అంశాల వల్ల ఆసియా–పసిఫిక్ వీడియో పరిశ్రమ క్రమంగా టీవీ నుంచి ఆన్లైన్ వైపు వెడుతోందని నివేదిక తెలిపింది. రాబోయే రోజుల్లో ఆదాయాలు, వీక్షకుల సంఖ్య పెరగడానికి కూడా ఇదే కారణం కాగలదని పేర్కొంది. 2023లో 5.5 శాతం వృద్ధి .. ఏపీఏసీ వీడియో పరిశ్రమ ఆదాయం 2023లో 5.5 శాతం వృద్ధి చెందింది. 145 బిలియన్ డాలర్లకు చేరింది. ఆన్లైన్ వీడియో విభాగం ఇందుకు దోహదపడింది. ఏపీఏసీలో గతేడాది చైనా అగ్రస్థానంలోనే కొనసాగింది. 64 బిలియన్ డాలర్ల మార్కెట్గా నిల్చింది. చైనాను పక్కన పెడితే గతేడాది అతి పెద్ద మార్కెట్లలో జపాన్ (32 బిలియన్ డాలర్లు), భారత్ (13 బిలియన్ డాలర్లు), కొరియా (12 బిలియన్ డాలర్లు), ఆస్ట్రేలియా (9.5 బిలియన్ డాలర్లు), తైవాన్, ఇండొనేషియా ఉన్నాయి. వినియోగదారులు ఆన్లైన్ వైపు మళ్లుతుండటం, కనెక్టెడ్ టీవీలు పెరుగుతుండటంతో టీవీ మాధ్యమంపై ఒత్తిడి పెరుగుతోందని నివేదిక పేర్కొంది.
- 
      
                   
                                 శ్రీరాముని పాటకు విద్యార్థుల నృత్యం.. వీడియో వైరల్!దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా అయోధ్య, నూతన రామాలయం గురించే చర్చ జరుగుతోంది. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టులు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రతిరోజూ వైరల్ అవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే పాఠశాల విద్యార్థులకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కొంతమంది చిన్నారులు శ్రీరాముని పాటకు నృత్యం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రతిరోజూ రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోల్లో చాలా మంది సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంటారు. అయితే తాజాగా చిన్నారుల నృత్యానికి సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారి, అందరి హృదయాలను హత్తుకుంటోంది. ఈ వీడియోలో ‘మేరీ రామ్ జీ సే కహ్ దేనా జై సియా రామ్’ అనే పాట వినిపిస్తుంటుంది. ఈ పాటకు అనుగుణమైన నృత్యాన్ని ఒక గురువు అక్కడున్న చిన్నారులకు నేర్పిస్తుంటారు. ఈ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్ఫారమ్లలో వైరల్ అవుతోంది. ఈ వీడియో @desimojito అనే పేరుతో మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫారమ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో షేర్ చేశారు. ‘నా దేశం మారుతోంది’ అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటి వరకు తొమ్మి వేల మందికి పైగా వీక్షించారు. వీడియోను చూసిన యూజర్స్ కామెంట్ బాక్స్లో ‘జై శ్రీరాం’ అని రాస్తున్నారు. Mera desh badal raha hai ❤️❤️ pic.twitter.com/BCBjphqROn — desi mojito 🇮🇳 (@desimojito) January 2, 2024
- 
      
                   
                                 దక్షిణ కొరియా ప్రతిపక్ష నేతపై దాడిదక్షిణ కొరియా ప్రతిపక్ష నేత దాడి లీ జే మ్యుంగ్ జరిగింది. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయన బూసన్ నగరంలో కొత్తగా నిర్మిస్తున్న ఎయిర్ పోర్టు సైట్ను సందర్శించారు. అనంతరం లీ జే మ్యుంగ్ మీడియాతో మాట్లాడున్న సమయంలో పెద్ద సంఖ్యయలో యువకులు చుట్టూ చేరారు. ఒక్కసారిగా ఓ యువకుడు లీ జే మ్యుంగ్పై దాడి చేశాడు. కత్తి వంటి ఓ ఆయుధంతో ఆయన మెడపై బలంగా పొడిచాడు. దీంతో లీ జో కుప్పకూలిపోయాడు. వెంటనే స్పదించిన భద్రత అతన్ని అక్కడి నుంచి లాక్కువెళ్లి అరెస్ట్ చేశారు. లీ జే మ్యుంగ్ను స్థానికఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అందాల్సి ఉంది. Footage showing the Stabbing Attack earlier against the Leader of the Democratic Party of South Korea, Lee Jae-myung while he was Speaking to a Crowd in the Southeastern City of Busan. pic.twitter.com/uEAabsxzmX — OSINTdefender (@sentdefender) January 2, 2024 దారుణ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ప్రతిపక్ష నేత లీ జే పై జరిగిన దాడి ఘటనను దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేతపై దాడి జరిటం సరికాదని అన్నారు. అయితే 2022లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చాలా తక్కువ మెజార్టీ యూన్ సుక్ యోల్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. చదవండి: ఉక్రెయిన్పై రష్యా డ్రోన్ దాడులు
- 
      
                   
                                 కోటి సుపారీ: ‘హత్యకు కుట్ర.. అతనిపైనే అనుమానం’ప్రముఖ వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డి హత్య కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సామ దామోదర్రెడ్డిని చంపుతామంటూ ఫోన్ చేసి.. 27న ముహూర్తం అంటూ ఓ సుపారీ గ్యాంగ్ బెదిరించింది. రూ. 50 లక్షలు అడ్వాన్స్ ముట్టిందని.. దామోదర్ రెడ్డిని హత్య చేయడానికి కోటి రూపాయల డీల్ కుదిరిందని వీడియో పంపించారు. బీహారీ గ్యాంగ్ క్షణాల మీద నిన్ను చంపి పడేస్తారంటూ వారి ఫోటోలు ఓ దుండగుడు దామోదర్రెడ్డికి పంపించాడు. దీంతో తనకు ప్రాణహాని ఉందని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో దామోదర్రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డిపై బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. జీవన్రెడ్డి తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని దామోదర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. శంకర్ పల్లిలోని చైతన్య రిసార్ట్ భూమి షయంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై లుక్ అవుట్ నోటీసులు
- 
      
                   
                                 బీజేపీ వీడియోతో డీఎంకే ఎదురుదాడిచెన్నై: హిందీ మాట్లాడేవాళ్లు తమిళనాడులో టాయిలెట్లు కడుగుతున్నారంటూ మార్చి నెలలో డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యల వీడియోపై బీజేపీ దుమ్మెతిపోస్తుండటంతో డీఎంకే ఘాటుగా స్పందించింది. దక్షిణాది ప్రజలు నల్లగా ఉంటారంటూ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యల వీడియోను తెరమీదకు తెచి్చంది. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ‘నల్లని మనుషులు’ అంటూ బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యల పాత వీడియోను డీఎంకే తాజాగా షేర్ చేసి దీనిపై బీజేపీ నేతలు ఏమంటారని ప్రశ్నించింది. 2017 సంవత్సరంలో అల్ జజీరా టీవీ చానల్లో చర్చా కార్యక్రమంలో తరుణ్ చేసిన వ్యాఖ్యలు ఆనాడు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు. ‘‘ ఉత్తరాది రాష్ట్రాల ప్రజలకు నిజంగానే జాతి వివక్ష చూపే అవలక్షణమే ఉంటే మాకు మొత్తం దక్షిణాదితో అవసరమేముంది?. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్.. ఇలా ఈ రాష్ట్రాల ప్రజలతో ఎందుకు కలిసి మెలిసి ఉంటాం?. మా చుట్టూ మొత్తం నలుపు మనుషులే ఉన్నారు’’ అని తరుణ్ విజయ్ మాట్లాడిన వీడియోను డీఎంకే ఐటీ విభాగం షేర్ చేసింది. ‘‘యూపీ, బిహార్ ప్రజలు ఇంగ్లి‹Ùను గాలికొదిలి హిందీని పట్టుకుని వేలాడి తమిళనాడులో టాయిలెట్లు కడుగుతున్నారు’’ అని డీఎంకే నేత దయానిధి మారన్ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా దేశవ్యాప్తంగా వివాదం రేపడం తెలిసిందే.
- 
      
                   
                                 అనుకున్నది సాధించడమంటే ఇదే.. వీడియో వైరల్దేశీయ పారిశ్రామిక దిగ్గజం, మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ.. ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన చాలా విషయాలను షేర్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే తాజాగా తన ట్విటర్ ఖాతా ద్వారా మండే మోటివేషన్ పేరుతో ఒక వీడియో పోస్ట్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక చిన్న ఫాంటా బాటిల్ కనిపిస్తుంది. దాని చుట్టూ చేరిన రెండు తేనెటీగలు ఎంతో చాకచక్యంగా బాటిల్ మూతను తీసేయడం చూడవచ్చు. ఆ బాటిల్ మూట కొంచెం వదులుగా ఉండటంతో అవి రెండు చెరోవైపు తిప్పుతూ మూతను తీసేయం గమ్మత్తుగా అనిపిస్తుంది. చూడటానికి ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన అథికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ.. టీమ్ వరకు అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది, సక్సెస్ ఎప్పుడూ వ్యక్తిగత విజయంగా ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఇదీ చదవండి: ఒక్కప్లాన్తో 14 ఓటీటీ సబ్స్క్రిప్షన్లు.. జియో టీవీ బంపర్ ఆఫర్ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వేలమంది వీక్షించిన ఈ వీడియోకి.. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే తేనెటీగలను చూసి కూడా నేర్చుకోవాల్సింది చాలానే ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. These winged insects , Honey Bees, are not commonly known to have the faculties & skills for this task. Teamwork makes the impossible possible. Success doesn’t always have to be an individual achievement. #MondayMotivation pic.twitter.com/KV8EIEUFMm — anand mahindra (@anandmahindra) December 18, 2023
- 
      
                   
                                 పార్లమెంట్లో అలజడికి సూత్రదారి?ఢిల్లీ: పార్లమెంట్లో బుధవారం జరిగిన ఆందోళనకర ఘటనలో ఆరో నిందితున్ని లలిత్ ఝాగా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో పార్లమెంట్ ఆవరణలోనే లలిత్ ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేల్చారు. ఘటనకు సంబంధించిన వీడియోను పశ్చిమ బెంగాల్కు చెందిన ఎన్జీవో వ్వవస్థాపకురాలు నీలాక్ష ఐచ్కు షేర్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం లలిత్ ఝా పరారీలో ఉన్నాడు. సామాజిక కార్యకర్తగా పేరొందిన లలిత్ ఈ కుట్ర వెనుక ప్రధాన సూత్రగారి అని పోలీసులు భావిస్తున్నారు. బెంగాల్లో పలు ఎన్జీవోలలో భాగస్వామిగా పాలు పంచుకుంటున్నట్లు గుర్తించారు. బెంగాల్లోని పురీలియా, ఝార్గ్రమ్ జిల్లాల్లో కీలక నెట్వర్క్ ఉన్నట్లు తన సహచరులతో చెప్పుకున్నట్లు దర్యాప్తులో తేలింది. "లలిత్ నాకు కాల్ చేయలేదు. పార్లమెంటు వెలుపల నిరసనకారులు గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగిస్తున్న వీడియోను వాట్సాప్లో పంపాడు. మధ్యాహ్నం 1-2 గంటల మధ్య ఈ వీడియో పంపాడు. ఆ సమయంలో కాలేజీలో ఉండి చూసుకోలేదు. తర్వాత చూసి నిరసన వివరాలను అడిగాను." అని నీలాష్క ఐచ్ తెలిపారు. కోల్కతాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో లలిత్ పరిచయమయ్యాడని నీలాష్క తెలిపారు. వెనకబడిన వర్గాల తరుపున సామాజిక కార్యక్రమాలు చేస్తుంటానని లలిత్ పరిచయమైనట్లు చెప్పారు. అంతకుమించి లలిత్ గురించి తనకు ఏం తేలియదని అన్నారు. లలిత్ ఐచ్ ఎన్జీవో 'సంయబడి సుభాస్ సభ' ప్రధాన కార్యదర్శిగా కూడా లలిత్ పనిచేశాడు. అయితే.. తమ ఎన్జీవోలోని సభ్యులందరూ వారు నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తుంటారని నీలాష్క పేర్కొన్నారు. ఈ కుట్ర గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ఇదీ చదవండి: Parliament Issue: గ్యాస్ క్యానిస్టర్లు అంటే ఏంటి? ఎక్కడైనా వాడొచ్చా?
- 
      
                   
                                 మస్క్ వారి మరమనిషి మరింత కొత్తగా.. టెస్లా రోబో 2.0!అప్పుడు యోగా చేసి ఆశ్చర్యపరిచిన టెస్లా హ్యూమనాయిడ్ రోబో ఇప్పుడు డ్యాన్స్ ఇరగదీస్తోంది. గుడ్లు చకాచకా ఉడకబెట్టేస్తోంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా కంపెనీ సరికొత్తగా ఆవిష్కరించిన హ్యుమనాయిడ్ రోబో డెమో వీడియోను మస్క్ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా పంచుకున్నారు. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. తన కొత్త తరం హ్యూమనాయిడ్ రోబో 'ఆప్టిమస్ జెన్ 2' (Optimus Gen-2) ను ఆవిష్కరించింది. ఇది ఏమేమి పనులు చేయగలదో మస్క్ షేర్ చేసిన వీడియోలో చూడవచ్చు. ఇది అచ్చం మనిషిలాగే వివిధ పనులు చేస్తోంది. టెస్లా కొన్ని నెలల క్రితం ఆవిష్కరించిన 'ఆప్టిమస్ జెన్ 1'ను మరింత మెరుగుపరిచి ఈ 'ఆప్టిమస్ జెన్ 2' రూపొందించింది. ఇది మునుపటి రోబో కంటే 10 కేజీలు తేలికైనది. 30 శాతం వేగవంతమైనది. దీనికి మరింత సామర్థాన్ని జోడించారు. నడక వేగం, చేతి కదలికలు, వేళ్లపై స్పర్శ సెన్సింగ్ తదితర అన్ని అంశాల్లోనూ మెరుగుదలను ప్రదర్శిస్తోంది. ఇది కూడా చదవండి: CEOs Secret WhatsApp chat: ‘శామ్ అవుట్’.. వెలుగులోకి సీఈవోల సీక్రెట్ వాట్సాప్ చాట్ ఎలాన్ మస్క్ తాజాగా ‘ఎక్స్’లో షేర్ చేసిన ఈ వీడియోకు "ఆప్టిమస్" అని క్యాప్షన్ పెట్టారు. టెస్లా ఫ్యాక్టరీలో చుట్టూ సైబర్ ట్రక్ల మధ్య షైనీ వైట్ కలర్ బాడీలో ఆప్టిమస్ జెన్2 రోబో మెరిసిపోతూ కనిపిస్తోంది. వీడియో చివర్లో రెండు రోబోలు డ్యాన్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి. కాగా 2022లో మొదటిసారిగా హ్యూమనాయిడ్ రోబో కాన్సెప్ట్ గురించి వెల్లడించారు. Optimuspic.twitter.com/nbRohLQ7RH — Elon Musk (@elonmusk) December 13, 2023
- 
      
                   
                                 నా కంటి రెప్పలో కాటుక ముగ్గు నువ్వే...‘‘నా కాఫీ కప్పులో షుగరు క్యూబు నువ్వే నువ్వే.. నా కంటి రెప్పలో కాటుక ముగ్గు నువ్వే నువ్వే..’’ అంటూ సాగుతుంది ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘ఓ మై బేబీ’పాట. హీరో మహేశ్బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇది. శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి మరో హీరోయిన్. బుధవారం ‘‘ఓ మై బేబీ.. నీ బుగ్గలు పిండాలి.. ఓ మై బేబీ నీకు ముద్దులు పెట్టాలి..’’ అంటూ సాగే ‘ఓ మై బేబీ..’పాట పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేశారు. సంగీత దర్శకుడు తమన్ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈపాటను శిల్పారావు ఆలపించారు. సూర్యదేవర రాధాకృష్ణ (చిన్నబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస.
- 
      
                   
                                 ఈ వీడియో చూస్తే.. గాడిద అంటూ ఎవరినీ నిందించరు!చాలామంది కోపంలో ఎదుటి వ్యక్తిని గాడిదతో పోలుస్తూ నిందిస్తుంటారు. అయితే తాజాగా వైరల్గా మారిన ఒక వీడియోలో గాడిద తన తెలివి తేటలను అద్భుతంగా ప్రదర్శించింది. ఈ ఫన్నీ వీడియోను చూసిన వారంతా ఆ గాడిదను మెచ్చుకుంటున్నారు. మరికొందరైతే ఇన్నాళ్లూ గాడిద పేరుతో అప్పుడప్పుడూ ఇతరులను నిందిస్తూ వచ్చామని, తెలియక పొరపాటు చేశామని లెంపలేసుకుంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా తమ కళ్లనే తాము నమ్మలేకపోతున్నామని అంటున్నారు. మరికొందరు ఈ గాడిద.. కథల్లో చెప్పినట్లు నక్క కన్నా తెలివైనదని అంటున్నారు. ఈ గాడిద కష్టించేందుకు బదులు తన తెలివిని ఉపయోగించి, తాను చేయాల్సిన పనిని మరింత సులభతరం చేసుకుంది. Work smarter.. 😅 pic.twitter.com/fFanLbhCO1 — Buitengebieden (@buitengebieden) December 10, 2023 ఈ వీడియోకు ఇప్పటివరకూ 80 లక్షలకు పైగా వీక్షణలు దక్కాయి. వేలమంది ఈ వీడియోను లైక్ చేశారు. ఇంతకీ ఈ వీడియోలో ఏమున్నదనే విషయానికొస్తే.. కొన్ని గాడిదలు వాటికి ఎదురుగా అడ్డుగా ఉన్న కర్రను దాటి వెళుతున్నాయి. అయితే వాటిలో ఒక గాడిదకు అలా కర్రను దాటి అవతలి వైపునకు వెళ్లాలని అనిపించలేదు. కొసేపు ఆలోచించాక దానికి ఒక ఉపాయం తోచింది. వెంటనే అది అడ్డుగా ఉన్న కర్రను తన నోటితో సులువుగా తొలగించి, యమ దర్జాగా, హాయిగా మందుకు కదిలింది. ఈ వీడియోను చూసినవారంతా గాడిద తెలివితేటలకు తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇది కూడా చదవండి: రైలులో యువతిపై అకృత్యం.. బాత్రూమ్లో నిందితుని పట్టివేత! మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్ ఛానల్ వీక్షించండి:
- 
      
                   
                                 పసివాడిని బావిలో తోసేసిన బాలిక.. తరువాత?పిల్లలు తమ ఆటల్లో వినోదం కోసం చేయకూడని పనులు కూడా చేస్తుంటారు. ఒక్కోసారి వీటి పర్యవసానాలు ఊహకందని విధంగా ఉంటాయి. తాజాగా పిల్లల ఆటలకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిని చూసినవారంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూశాక పిల్లలను ఎప్పుడూ ఒంటరిగా వదలకూడదని, వారిని కనిపెట్టుకుని ఉండాలని ఎవరికైనా అనిపిస్తుంది. ఈ షాకింగ్ వీడియోలో ఒక బాలిక తన కంటే చిన్నవాడైన ఒక బాలుడిని ఎత్తుకుని బావిలోకి తోసేయడం కనిపిస్తుంది. ఈ వీడియో చైనాకు చెందినదని తెలుస్తోంది. ఈ వీడియో మొదట్లో ఇద్దరు పిల్లలు బావి దగ్గర ఆడుకోవడం కనిపిస్తుంది. ఆటల్లో భాగంగా ఆ బాలిక ఆ పిల్లాడిని ఎత్తుకుని బావి దగ్గరకు తీసుకువస్తుంది. తరువాత ఆ పిల్లాడిని బావిలో పడేస్తుంది. అయితే ఆ పిల్లాడు ఆ బావి గోడను పట్టుకుంటారు. దీనిని గమనించిన ఆ బాలిక.. బాలుని చేతులను గోడ నుంచి జరిపి బావిలోకి తోసేసింది. బావిలో పడిపోయిన బాలుడు ఏడుస్తున్నప్పటికీ అతడికి సాయం చేసేందుకు ఎవరూ రాకపోవడం వీడియోలో కనిపిస్తోంది. అయితే కొద్దిసేపటి తరువాత స్థానికులు ఆ బాలుని ఆర్తనాదాలు విని అతనిని కాపాడుతారు. The boy was rescued. God Bless. Parenting, parenting, parenting... pic.twitter.com/1LZZPznkwr — Uturn_Yturn 🦎 ♊️ (@Uturn_Yturn) November 27, 2023 ఇంటర్నెట్లో వైరల్గా మారిన ఈ వీడియో యూజర్లను కలిచివేసింది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్లో @cctvidiots అనే ఖాతాతో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన యూజర్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: తుపానులకు పేర్లు ఎందుకు? ఎవరు పెడతారు?
- 
      
                   
                                 గుడ్లగూబ పరుగులు చూశారా?సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు కొదవేంలేదు. తాజాగా గుడ్లగూబకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో గుడ్లగూబ పరిగెత్తడాన్ని చూడవచ్చు. నేటి రోజుల్లో గుడ్లగూబను చూడటమే అంత్యంత అరుదు. ఎప్పుడైనా కనిపించినా అది చెట్టుపైనే కనిపిస్తుంది. అయితే ఒక గుడ్లగూబ నేలపై పరిగెత్తడాన్ని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఓ ఇంటిలోపల గుడ్లగూబ పరిగెత్తడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ గుడ్లగూబను చూసిన తర్వాత అది ఆ ఇంటిలోని వారి పెంపుడు జంతువు అని అనిపిస్తుంది. ఈ వీడియోను చూసిన చాలామంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా చాలామంది జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలను చూసేందుకు ఇష్టపడతారు. ఈ వీడియోను అమేజింగ్ నేజర్ అనే పేరుగల ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ఒక యూజర్ ‘ఇది అద్భుతమైన వీడియో’ అని రాయగా, మరొకరు ‘నేను మొదటిసారిగా గుడ్లగూబ నడవటాన్ని చూస్తున్నాను’ అని రాశారు. ఇది కూడా చదవండి: లాల్దుహోమా ఎవరు? మిజోరం ఎన్నికల్లో ఎందుకు కీలకం? Have you ever seen a owl run ? pic.twitter.com/roSdhAUSyX — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) November 30, 2023
- 
      
                   
                                 వామ్మో.. వీళ్ల పెళ్లి ఖర్చు రూ.491 కోట్లా? ప్రత్యేకతలివే!ఒకప్పుడు రాజుల కాలంలో ఐదు రోజులు ఆడంబరంగా పెళ్లి చేసుకునే వారని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. ఈ కంప్యూటర్ యుగంలో కూడా కొంత మంది ధనవంతులు అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇటీవల సౌత్ ఫ్లోరిడాకు చెందిన ఒక వ్యక్తి తన కూతురు పెళ్ళికి వందల కోట్లు ఖర్చు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సౌత్ ఫ్లోరిడాకు చెందిన ఒక కార్ డీలర్షిప్ తన కూతురు 'మడేలైన్ బ్రాక్వే' పెళ్లి ఐదు రోజులు ఘనంగా చేసాడు. దీనికైన ఖర్చు 59 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ.491 కోట్లు కంటే ఎక్కువ. ఈ వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తుంది. 26 ఏళ్ల మడేలైన్ బ్రాక్వే.. తన ప్రియుడు 'జాకబ్ లాగ్రోన్'తో జరిగిన ఐదు రోజుల పెళ్ళికి సంబంధించి ఒక డాక్యుమెంటరీ తీసింది. కచేరీ ప్రారంభం నుంచి వేర్సైల్లెస్ ప్యాలెస్లో రాత్రిపూట బస చేసే వరకు అన్నింటికీ సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలైస్ గార్నియర్లో రిహార్సల్ డిన్నర్, వెర్సైల్లెస్ ప్యాలెస్లో రాత్రిపూట బస, ప్రైవేట్ లంచ్, ఉటాలోని ఫైవ్ స్టార్ లగ్జరీ రిసార్ట్లో బ్యాచిలొరెట్ వీక్ వంటి అన్ని వీడియో రికార్డ్ చేసుకున్నారు. వివాహ వేదిక ఎక్కడో స్పష్టంగా వెల్లడించలేదు, కానీ ఈఫిల్ టవర్ ఉద్యానవనంలో వేడుకలు పెద్ద ఎత్తున జరిగినట్లు, బహుశా అదే ప్రాంతంలో పెళ్లి కూడా జరిగి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఈ జంట 2020 మార్చిలో డేటింగ్ ప్రారంభించారు. లాగ్రోన్ లింక్డ్ఇన్ అకౌంట్ ప్రకారం, అతను కంట్రీ మ్యూజిక్ అసోసియేషన్లో టాలెంట్ కోఆర్డినేటర్గా, కంట్రీ సింగర్ జాసన్ ఆల్డియన్కు ప్రొడక్షన్ అసిస్టెంట్గా కూడా పనిచేసినట్లు తెలుస్తోంది. పెళ్ళికి కొన్ని రోజుల ముందే ఈ జంట, వారి స్నేహితులు పారిస్కు వెళ్లారు. వీరు బస చేసిన హోటల్ గదుల ఖరీదు రోజుకి 2400 డాలర్లని సమాచారం. ఇదీ చదవండి: రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే.. కోట్లు ఖర్చు పెట్టి వివాహాలు చేసుకున్న ఘటనలు ఇప్పటికే కూడా చాలా వెలుగులోకి వచ్చాయి. గతంలో కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి తన కూతురు పెళ్ళికి రూ. 500 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిసింది. పెళ్ళిలో వధువు ధరించిన చీర ఖరీదే రూ. 17 కోట్లు కాగా, ఆమె వేసుకున్న బంగారు ఆభరణాల ఖరీదు రూ. 90 కోట్లు, మేకప్ కోసం మాత్రమే రూ. 30 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by The Lake Como Wedding Planner (@lakecomoweddings)
- 
      
                   
                                 యువత కోసమే తొలి అడుగుసాక్షి, హైదరాబాద్: తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణలోని యువతను ఆదుకోవడమే లక్ష్యంగా తొలిఅడుగు వేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహు ల్గాంధీ వెల్లడించారు. అక్కడి నిరుద్యోగులు, యువతతో ముచ్చటించిన సందర్భంలో తాను చూసిన, విన్న విషయాలు తీవ్రంగా కలచివేశాయ ని పేర్కొన్నారు. తెలంగాణలోని పరిస్థితులను పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల హైదరాబాద్ అశోక్నగర్లో నిరుద్యోగులు, విద్యార్థులతో భేటీ అయిన వీడియో ను సోమవారం ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. ‘నేను ఒకసారి తెలంగాణ యువతతో సమావేశమయ్యాను. పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకవడం, ఈ లీకేజీల్లో కేసీఆర్ బంధువుల పాత్ర ఉండడం సిగ్గుపడాల్సిన విషయం. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బులతో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు రావడం లేదు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంది. యువతకు ఉపాధి, విద్యావకాశాలు కల్పించే దిశలో మేం మొదటి అడుగు వేస్తాం. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేలా జాబ్ కేలండర్ ఇప్పటికే విడుదల చేశాం. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం. యువ వికాసంలో భాగంగా విద్యాభరోసా కార్డుల ద్వారా విద్యార్థులు.. కళాశాల, యూనివర్సిటీ, కోచింగ్ ఫీజులు కట్టుకునేందుకు రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తాం. అది తెలంగాణ యువత కోసం మేం వేయబోయే ముందడుగు..’అని ఆ వీడియోలో రాహుల్ చెప్పారు. దొరల సర్కారులో తెలంగాణ యువత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని అశోక్నగర్లో తన తాజా భేటీతో స్పష్టమైందని, తమ పార్టీ ఇచ్చిన జాబ్ కేలండర్ వారికి ఉపశమనం కలిగిస్తుందని, త్వరలో కాంగ్రెస్ నేతృత్వంలో రాబోయే ప్రజల సర్కారులో తెలంగాణ యువత భవితవ్యం పదిలంగా ఉంటుందని, ఇది తన గ్యారంటీ అని పేర్కొన్నారు. నేడు కార్మిక సంఘాలతో భేటీ: చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్గాంధీ మంగళవారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10:30–11 గంటల వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఆటో వర్కర్లు, జీహెచ్ఎంసీ, జిగ్ కార్మికుల సంఘాలతో సమావేశమవుతారని, మధ్యాహ్నం 11:30–12:30 గంటల వరకు నాంపల్లి నియోజకవర్గంలో రోడ్షో నిర్వహించి కార్నర్ మీటింగ్లో మాట్లాడతారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ జహీరాబాద్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు.
- 
      
                   
                                 సొరంగ బాధితుల ఫొటోలను ఎండోస్కోపిక్ కెమెరా ఎలా తీసింది?ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్లో గత 9 రోజులుగా 41 మంది కూలీలు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కసరత్తు చేస్తోంది. ఈ నేపధ్యంలో వారికి పైపు ద్వారా ఘన ఆహారాన్ని అందించడంలో ప్రభుత్వం విజయం సాధించింది. దీనితోపాటు ఎండోస్కోపిక్ కెమెరా ద్వారా కార్మికుల పరిస్థితిని అధికారులు గమనించారు. రెస్క్యూ బృందం ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున వారి దగ్గరకు ఎండోస్కోపిక్ ఫ్లెక్సీ కెమెరా పంపారు. వారి క్షేమ సమాచారం గురించి ఆరా తీశారు. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. అందుకే ఎండోస్కోపిక్ కెమెరా అంటే ఏమిటో.. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండోస్కోపిక్ కెమెరాలను మానవ శరీరంలోని అంతర్గత అవయవాలను పరిశీలించడానికి ఉపయోగిస్తారు. ఎండోస్కోపిక్ కెమెరాలు అత్యంత సాంకేతికంగా పనిచేస్తాయి. సరైన రోగనిర్ధారణ, వ్యాధులకు తగిన చికిత్స అందించేందుకు ఎండోస్కోపిక్ కెమెరాను వైద్యులు వినియోగిస్తారు. ఆధునిక ఎండోస్కోపిక్ కెమెరాలు ‘చిప్-ఆన్-టిప్’ సాంకేతికతతో పనిచేస్తాయి. కెమెరా చివరిలో ఉన్న సాఫ్ట్ ప్యాకేజీ ద్వారా ఫొటోలు తీయడం జరుగుతుంది. ఈ కెమెరా పైన ఎల్ఈడీ లైట్ ఉంటుంది. ఫలితంగా ఈ కెమెరా చీకటిగా ఉన్న ప్రదేశాలలో కూడా చిత్రాలను క్లిక్ చేయగలుగుతుంది. ఉత్తరాఖండ్లోని సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం అధికారులు ఫ్లెక్సీ కెమెరాను ఉపయోగించారు. పైప్లైన్లోని చిన్న రంధ్రం ద్వారా కెమెరాను సొరంగం లోనికి పంపించి బాధితుల గురించి తెలుసుకున్నారు. ఇది కూడా చదవండి: యాంటీమాటర్ అంటే ఏమిటి? ఎందుకు అత్యంత శక్తివంతం?
- 
      
                   
                                 మెట్రోలో ఇకపై పిచ్చిపిచ్చి వీడియోలు కుదరవ్!ఢిల్లీ మెట్రోకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఒక్కోసారి ప్రేమికుల రొమాన్స్, మరోసారి యువకుల ఫైట్స్, ఇంకొన్నిసార్లు యువతీయువకుల డ్యాన్స్.. ఇలాంటి వీడియోలు తరచూ కనిపిస్తుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు అభ్యంతరకరంగా ఉంటున్నాయి. వీటిని గమనించిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) చీఫ్ వికాస్ కుమార్ ఇలా వీడియోలు తీసేవారిని హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు మెట్రో అధికారులు పలు కఠిన చర్యలు చేపడుతున్నారని తెలిపారు. వీడియో మేకింగ్ ఘటనలను నివారించేందుకు ఒక బృందం మెట్రోలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుందన్నారు. అభ్యంతరకర వీడియోలు తీస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. త్వరగా ఫేమస్ అయ్యేందుకు చాలామంది మెట్రో లోపల వీడియోలు షూట్ చేయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడం జరుగుతుంటుంది. ఇలాంటి వీడియోలు వేగంగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా కురచ దుస్తులు ధరించి యువతులు చేస్తున్న వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇటువంటి ఘటనలను నియంత్రించేందుకు మెట్రో లోపల అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తోటి ప్రయాణికులు మెట్రో అధికారులకు తెలియజేయాలని డీఎంఆర్సీ చీఫ్ వికాస్ కుమార్ కోరారు. ఇది కూడా చదవండి: సొరంగంలో చిక్కుకున్నవారంతా క్షేమం.. ఫొటో విడుదల!


