breaking news
Eluru
-
శివోహం.. భజేహం
ముసునూరు మండలం బలివే ఉత్సవాల్లో జన సందోహం ముసునూరు: హరహర మహాదేవ శంభోశంకర స్మ రణలు మార్మోగాయి. బలివేలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తులు బారులు తీరారు. ఆదివారం వేకువజామున విశేష అభిషేకాల అనంతరం భక్తులను అనుమతించారు. ముందుగా భక్తు లు తమ్మిలేరు, జల్లు స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. పితృదేవతలకు పిండ ప్రదా నాలు చేసి తర్పణలు వదిలారు. అన్నిశాఖల అధికారులు, పంచాయతీ సమష్టి కృషితో ఉత్సవాలు జయప్రదమైనట్టు సర్పంచ్ రావు ప్రవీణ సుధాకర్, ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మకంటి శ్యామలరావు, ఈఓ పామర్తి సీతారామయ్య ప్రకటించారు. మంత్రి కొలుసు పార్థసారథి, దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్, జిల్లా అదనపు ఎస్పీ మునిరాజు, నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్, సీఐలు రామకృష్ణ, సత్య శ్రీనివాస్, రాజశేఖర్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల సేవలో స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతల ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర, చక్రపొంగలి, దద్దోజనం, బిస్కెట్లు, మంచినీరు, మజ్జిగ అందజేశారు. పీహెచ్సీ వైద్యాధికారి షకీనా ఇవాంజిలిన్ ఆధ్వర్యంలో ఏడుగురు వైద్యాధికారులతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి 1,708 మందికి వైద్య సేవలు అందించారు. సీఐ రామకృష్ణ, ఎస్సై ఎం.చిరంజీవి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. పట్టిసం.. భక్తజన సంద్రం పోలవరం రూరల్: పట్టిసంలో మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. పవిత్ర గోదావరిలో పు ణ్యస్నానమాచరించి భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి దర్శించుకున్నారు. సుమారు 2 లక్షల మంది భక్తులు క్షేత్రానికి వచ్చినట్టు అంచనా. వీరిలో సు మారు 50 వేల మంది తూర్పుగోదావరి జిల్లా నుంచి ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, కాలినడకన క్షేత్రానికి చేరుకున్నారు. భక్తులు క్షేత్రం దిగువన ఇసుక తిన్నెల వరకూ క్యూకట్టారు. క్యూలైన్లో భక్తులు తాగునీటికి ఇబ్బందులు పడ్డారు. ఇసుక తిన్నెలపై జాతర సందడి కనిపించింది. వేకువజామున ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కొచ్చర్లకోట వీరభద్రరావు కుటుంబసభ్యులు స్వామివారికి తొలిపూజ నిర్వహించారు. సాయంత్రం నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగింది. పాతాళ భోగేశ్వరా.. పాహిమాం కలిదిండి(కై కలూరు): దక్షిణ కాశీగా పేర్గాంచిన కలిదిండి పార్వతీ సమేత పాతాళ భోగేశ్వరస్వామి శివరా త్రి కల్యాణం (తీర్థం)కు భక్తులు పోటెత్తారు. శనివా రం అర్ధరాత్రి స్వామి కల్యాణాన్ని నిర్వహించారు. ఆ దివారం వేకువజాము నుంచి భక్తులు స్వామి దర్శనానికి తరలివచ్చారు. ఆలయంలో విశేష పూజలు జరిగాయి. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, కై కలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) తదితరులు స్వామిని దర్శించుకున్నారు. సుమారు 2 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నట్టు అంచనా. రాత్రి స్వామివారి తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. సీఐ వి.రవికుమార్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లుచేశారు. ద్వారకాతిరుమలలో.. ద్వారకాతిరుమల : క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతున్న భ్రమరాంబ మల్లేశ్వరస్వామివారి ఆలయంలో శివదేవుని కల్యాణోత్సవం రాత్రి ఘనంగా జరిగింది. వే కువజాము నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తారు. హరహర మహాదేవ శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు బలివే, పట్టిసంలో జనసందోహం వేకువజాము నుంచి బారులు ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు -
ఫ్రీజర్ లేదు.. కావాలంటే తెచ్చుకోండి
● మృతదేహంపై ప్రభుత్వాస్పత్రి అధికారుల నిర్లక్ష్యం ● భీమవరంలో ఘటన ● దళితుడనే ఇంత నిర్లక్ష్యమా అంటూ కేవీపీఎస్ ఆగ్రహంభీమవరం (ప్రకాశంచౌక్): చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఫ్రీజర్లో ఉంచాల్సి ఉండగా, తమ వద్ద అలాంటి సౌకర్యాలేమీ లేవని, కావాలంటే ఫ్రీజర్ తెచ్చుకోవాలని భీమవరం ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం అత్తిలి మండలం వరిఘేడుకి చెందిన కన్నెపా ముల రాంబాబు (49) భీమవరం అంబేడ్కర్ సెంటర్లో సొంత ఆటోలో కూర్చొని ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఫిట్స్ ద్వారా మృతిచెందినట్టు నిర్ధారించారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశా రు. పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని అప్పగిస్తా మని వైద్యులు తెలిపారని, అయితే మృతదేహా న్ని ఫ్రీజర్లో పెట్టకుండా బయటే వదిలేశారని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో ఫ్రీజర్ లేదని, అలాంటి సౌకర్యాలు ఇ క్కడ లేవని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాడీని ఇవ్వకుండా.. ఫ్రీజర్లో పెట్టకుండా.. దళిత వ్యక్తి మృతదేహం పట్ల భీమవరం ప్రభు త్వ ఆసుపత్రి అధికారులు, సిబ్బంది తీరు దారుణమని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతి బాబు అన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలో ఫ్రీజర్ లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మృతదేహాన్ని ఫ్రీజర్లో పెట్టకుండా బయటే పెట్టడంతో బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కనీసం బాడీని తమకు అప్పగించండని వేడుకుంటున్నా ఇవ్వకుండా.. అటు ఫ్రీజర్లో పెట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్లే జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో కనీస సదుపాయాలు లేవని అర్థమవుతోందన్నారు. సౌకర్యాలు లేకనా లేదా చనిపోయిన వ్యక్తి దళితుడు కాబట్టే ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. ఏలూరు (టూటౌన్): రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 10.5 శాతం మాత్రమే కేటాయించారని, ఇది విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ విద్య బలోపేతానికి ఏమాత్రం సరిపోదని ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు డి.శివకుమార్ అన్నారు. కనీసం 30 శాతం నిధులు కేటాయించాలన్నారు. తల్లికి వందనం పథకానికి రూ.12 వేల కోట్లు అవసరం కాగా రూ.9,668 కోట్లు కేటాయించడం సరికాదన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పలు సమస్యలు ఉన్నాయని, 4,200 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ వంటి పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. అయినా బడ్జెట్లో 0.77 శాతం మాత్రమే నిధులు కేటాయించారన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బడ్జెట్లో ఊసే లేదని మండిపడ్డారు. హాస్టల్ విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ చార్జీల పెంపు, భవనాలు, మరమ్మతులపై స్పష్టత లేదన్నారు. విద్యారంగానికి ప్రభుత్వం కేటాయించిన నిధులు అంకెల గారడీగా ఉన్నాయని, మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏలూరు (ఆర్ఆర్పేట): పవిత్ర ఖురాన్ అవతరంచిన రంజాన్ మాసంలో విధిగా ఉపవాసా లు, దానధర్మాలు, పుణ్యకార్యాలు చేయాలని జమాతే ఇస్లామీ హింద్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు ముహ్మద్ ముజాహిద్ అన్నారు. స్థానిక శనివారపుపేటలోని జామియా మసీ దులో జమాతే ఇస్లామీ హింద్ శనివారపుపేట శాఖ ఆధ్వర్యంలో రంజాన్ స్వాగత సభను శనివారం రాత్రి నిర్వహించారు. ముఖ్య అతిథిగా ముజాహిద్ మాట్లాడుతూ మానవ జీవన విధా నాన్ని ఖురాన్ తెలియజేస్తుందన్నారు. తమ సంపాదనలో నుంచి జకాత్ (కొంత సొమ్ము) తీసి పేదలు, అనాథలకు ఇవ్వాలని దేవుడు ఆదేశించాడన్నారు. మసీదు ఇమామ్ హాఫిజ్ గులాం రబ్బానీ మాట్లాడుతూ సర్వమానవులకు ఖురాన్ మార్గదర్శకమన్నారు. ఉపవాసా లు పాటిస్తూ చెడు పనులకు దూరంగా ఉండాలని హితవుపలికారు. శనివారపు పేట శాఖ ప్రతినిధి షేక్ షాజహాన్, స్థానిక జమాత్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. -
ఫైళ్లు కదలవు.. సమస్యలు తీరవు
భీమవరం(ప్రకాశం చౌక్) : పాలనా సౌలభ్యం, ప్రజ లకు పరిపాలన అందుబాటులో ఉండటంతో పా టు సమస్యలను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలను పునర్విభజన చేశారు. దీనిలో భాగంగా భీమవరం కేంద్రంగా నూతన పశ్చిమగోదావరి జిల్లా ఏర్పడింది. ఈ ప్రాంత ప్రజలకు కలెక్టరేట్ అందుబాటులోకి వచ్చింది. అయినా ప్రజల సమస్యలు తీరడం లేదు. అర్జీలు అందించి నెలలు గడుస్తున్నా భూసమస్యలు పరిష్కారం కావడం లేదు. నెలల తరబడి పెండింగ్లోనే.. కలెక్టరేట్కు వచ్చే రెవెన్యూ శాఖకు సంబంధించి ఫైళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. రెవెన్యూ సమస్యలపై స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ అందిస్తే తర్వాత ఫైల్ సిద్ధం చేయడానికి నెల రోజులు, అక్కడ నుంచి ఆర్డీఓ కార్యాలయానికి పంపించడానికి మరో నెల రోజులు, అక్కడ నుంచి కలెక్టరేట్కు పంపించడానికి మరో నెల రోజులు ఇలా మూడు నెలలు సమయం పడుతుంది. అలాగే కొన్ని తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లోనే నెలల తరబడి పెండింగ్లోనూ ఉండిపోతున్నాయి. చివరకు కలెక్టరేట్ కు వచ్చినా ఫైల్ జాయింట్ కలెక్టర్, కలెక్టర్ లా గిన్కు వెళ్లడానికి మరో మూడు నుంచి ఆరు నెలలు సమయం పడుతుంది. అది కూడా అర్జీదారులు కలెక్టరేట్కు వచ్చి అధికారులు చూట్టూ తిరిగితే గానీ ఫైల్ ముందుకు కదలని పరిస్థితి. కలెక్టర్, జేసీ లాగిన్కు వెళ్లిన ఫైల్ కూడా ఎప్పుడు క్లియర్ చేస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి. పైసలిస్తేనే ముందుకు..! భూ సమస్యల, మార్పులు చేర్పులపై దరఖాస్తులు ముందుకు కదలలాంటే వసూళ్ల పర్వం కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. తహసీల్దార్, ఆర్డీ ఓ కార్యాలయాల్లో పైసలిస్తేనే ఫైళ్లు కలెక్టరేట్కు చేరుతున్నాయని, లేకుంటే నెలల తరబడి నిరీక్షణ తప్పదనే విమర్శలు వస్తున్నాయి. సమస్యలు వేగంగా పరిష్కారం కాకపోవడంతో ప్రతి సోమ వారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో మళ్లీ మళ్లీ అవే అర్జీలు వస్తున్నాయి. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పట్టించుకుని అర్జీలను వేగంగా పరిష్కరించాలని అర్జీదారులు కోరుతున్నారు. ఆకివీడుకు చెందిన ఓ మహిళ తన అడంగల్లో భూ విస్తీర్ణానికి సంబంధించి సరిచేయాలని దరఖాస్తు చేసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయానికి అక్కడి నుంచి కలెక్టరేట్కు చేరడానికి మూడు నెలలు పట్టింది. కలెక్టరేట్కు చేరి ఆరు నెలలు గడిచింది. మహిళ కుటుంబసభ్యులు నెలల తరబడి కలెక్టరేట్లోని అధికారుల చుట్టూ తిరిగితే ఇటీవల జాయింట్ కలెక్టర్ లాగిన్కు వెళ్లింది. అయినా ఇప్పటికీ ఫైల్ క్లియర్ కాలేదు. భీమవరం మండలం గుట్లపాడుకు చెందిన ఓ రైతు తన భూమిని 22ఏ నుంచి తొలగించాలని కోర్టు ఆర్డర్ ఉందని ఏడాది క్రితం తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ అందజేశారు. ఆర్డీఓ కార్యాలయం ద్వారా కలెక్టరేట్కు దరఖాస్తు చేసుకోగా.. నెలల తరబడి సదరు రైతును తిప్పుకుని చివరకు ఆ పని చేయలేమని కలెక్టర్, జేసి చేతులు ఎత్తేశారు. దీంతో సదరు రైతు కోర్టు ఆర్డర్ అమలు చేయలేదని మరలా కోర్టును ఆశ్రయించాడు. ముందుకు కదలని భూ సమస్యల దస్త్రాలు నెలల తరబడి లాగిన్లలోనే.. అధికారుల తీరుతో అర్జీదారుల అసంతృప్తి కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు కలెక్టర్, జేసీ సమీక్షా సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్లు, పర్యటనల కారణంగానే ఫైల్స్ క్లియర్ చేయడంలో ఆలస్యమవుతోందని తెలుస్తోంది. తమ ఫైళ్ల పరిస్థితిపై అడిగితే కలెక్టరేట్ అధికారులు ఇదే సమాధానమిస్తున్నారని అర్జీదారులు ఆవేదన చెందుతున్నారు. నరసాపురం, భీమవరం ఆర్డీఓ కార్యాలయాల నుంచి కలెక్టరేట్ వరకు సుమారు 500 నుంచి 1,500 వరకు ఫైళ్లు పెండింగ్లో ఉన్నట్టు అంచనా. వాటిలో 22 ఏ, భూ విస్తరణ, వర్గీకరణ తదితర భూ సమస్యల ఫైళ్లు ఉన్నాయి. గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
వీఆర్ఏల సమస్యలపై ముఖం చాటేసిన ప్రభుత్వం
ఉండి: గత ఎన్నికల సమయంలో వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని మాటిచ్చిన కూటమి ప్రభు త్వం అధికారం చేపట్టిన తర్వాత ముఖం చాటేసిందని వీఆర్ఏల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 18న వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోరుతూ సంఘ ఆధ్వర్యంలో కలెక్టర్కు రాయబారం పంపే కార్యక్రమంపై ఆదివారం ఉండిలో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు 18న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లకు రాయబారం కార్యక్రమం నిర్వమించనున్నామన్నారు. సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎం.ఆంజనేయులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు వినతులు ఇచ్చినా ఫలితం లేదన్నారు. కనీసం సమస్యల పరిష్కారం దిశగా ఆలోచన కూడా చేయడం లేదన్నారు. తెలంగాణ మాదిరి పే స్కేలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. భీమవరంలో జరిగే రాయబార కార్యక్రమాన్ని జిల్లాలోని వీఆర్ఏలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వీఆర్ఏలు పాల్గొన్నారు. -
స్కేటింగ్లో సత్తా
తణుకు అర్బన్: స్కేటింగ్లో సత్తాచాటి తణుకుకు చెందిన కాకిలేటి గేయ దీపిక అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. 8 ఏళ్ల వయసులోనే స్కేటింగ్లో కఠోర సాధన చేసి ఇంత వరకు 25 పతకాలు సాధించి సంచలనం రేకెత్తిస్తోంది. 3వ తరగతి చదువుతున్న చిన్నారి ప్రతిరోజూ తణుకు స్కేటింగ్ రేంజర్స్ అకాడమీలో శిక్షణ పొందుతూ తన ప్రతిభను చాటుతోంది. ఈవెంట్స్ ఉన్న రోజుల్లో ముందు నుంచి ఉదయం సమయంలో కూడా ప్రాక్టీస్ చేస్తుంది. అంతర్జాతీయ స్థాయికి చేరిన దీపికతో క్రీడాభిమానులు ఫొటోలు దిగి కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం విశేషం. పతకాల ప్రయాణమిలా.. ఈ నెల 7, 8 తేదీల్లో పూనేలో జాతీయస్థాయి ఎండ్యూరెన్స్ స్కేటింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొన్న దీపిక అండర్–8 బాలికల విభాగంలో మూడు ఈవెంట్స్లో మూడు బంగారు పతకాలు సాధించి మాల్దీవుల్లో జరగనున్న అంతర్జాతీయ స్కేటింగ్ పోటీలకు అర్హత సాధించింది. ఇంతవరకు పూనే, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, కాకినాడ ప్రాంతాల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని రాష్ట్ర, జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో 14 బంగారు, 7 సిల్వర్, 4 కాంస్య పతకాలు సాధించింది. -
సంక్షోభంలో ఉప్పు సాగు
● నిరాశతో సాగుకు సమాయత్తం ● తీరంలో కనిపించని ఒకప్పటి జోరు ● 200 ఎకరాలకు పడిపోయిన సాగు విస్తీర్ణం నరసాపురం: జిల్లాలోని నరసాపురం తీరంలో ఈ ఏడాది ఉప్పు సాగు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. గత ఏడాది వరస ప్రకృతి విపత్తులు, అధిక వర్షాలు నిండా ముంచాయి. పెట్టుబడులు రాక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత ఏడాది దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీంతో ఈ ఏడాది సాగుకు బ్రేక్ వేశారు. సాగు గణనీయంగా తగ్గిపోయింది. ఇదే పరిస్థిఽతి కొనసాగితే భవిష్యత్లో తీరంలో ఉప్పుసాగు కనిపించే పరిస్థితి ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి. వేసవి ప్రారంభం కావడంతో ప్రస్తుతం తీర గ్రామాల్లో ఉప్పు సాగు ముమ్మరంగా ప్రారంభమైంది. నరసాపురంలో 19 కిలోమీటర్లు ఉన్న తీరప్రాంతంలో 200 ఎకరాల్లో ఉప్పు సాగు చేపట్టారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని వేములదీవి, తూర్పుతాళ్లు, చినమైనవానిలంక, పెదమైనవానిలంక, పేరుపాలెం, కేపీపాలెం తదితర 8 గ్రామాల్లో ఉప్పుసాగు మొదలైంది. గిట్టుబాటు ధరలేక.. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఉప్పుకు గిట్టుబాటు ధరలేక రైతులు విలవిల్లాడారు. తుపాన్లు, వర్షాల కారణంగా అసలు పంట దిగుబడి రావడమే తగ్గిపోవడంతో సాగు చేపట్టిన రైతులు అప్పులపాలయ్యారు. ప్రస్తుతం తీరంలో పండించే ఉప్పు బస్తా(50కిలోలు) రైతుల వద్ద దళారులు రూ.200కు కొనుగోలు చేస్తున్నారు. కనీసం బస్తా రూ.300 ఉంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. కష్టపడి పంట పండించే రైతుకు ఏళ్ల తరబడి అదే ధర దక్కుతోంది. ఏటేటా తగ్గుతున్న విస్తీర్ణం.. 2022, 2023 సంవత్సరాల్లో తీరంలో 1500 ఎకరాల్లో ఉప్పు సాగు జరిగింది. ఏటా సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. గత ఏడాది 900 ఎకరాల విస్తీర్ణంలో జరిగింది. ఈ ఏడాది 200 ఎకరాలకు పడిపోయింది. తీరంలో ఉప్పుమడులు చేపలు, రొయ్యల చెరువులుగా మారుతున్నాయి. రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్తే తీరంలో దాదాపు 15 గ్రామాల్లో 4 వేల ఎకరాల్లో ఉప్పు సాగు జరిగేది. రోజుల తరబడి కష్టం ఉప్పు సాగు కష్టంతో కూడుకున్నది. ఒక్కసారి మడి కడితే దాదాపు ఆ మడి నుంచి 6 నెలల వరకూ ఉప్పు దిగుబడి వస్తూనే ఉంటుంది. దీంతో ఉప్పుసాగు లాభాలు తెచ్చిపెడుతుంది. వేసవి ప్రారంభంలో ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉప్పుసాగు ప్రారంభం అవుతుంది. మండే ఎండల్లో చిన్న చిన్న మడులను ఏర్పాటు చేసి ఉప్పు సాగు చేస్తారు. ఒక్కో ఎకరానికి సంబంధించి 60 నుంచి 70 మడులు కడతారు. ముందుగా మడుల్లో మట్టిని కాళ్లతో తొక్కి చదును చేసి తరువాత సముద్రంలోని ఉప్పు నీటిని ఆ మడుల్లో నింపుతారు. సాగు ప్రారంభమైన నాటి నుంచి మడుల్లో 60 రోజుల పాటు 6 నుంచి 10 మంది విపరీతంగా శ్రమిస్తేనే కానీ ఉప్పు తయారీ కాదు. ఎకరానికి పెట్టుబడి రూ.30 వేల వరకు ఉంటుంది. వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు రోజుకు 100 కిలోల వరకూ ఉత్పత్తి వస్తుందని రైతులు చెబుతున్నారు. గిడ్డంగుల సమస్యపై దృష్టి పెట్టని ప్రభుత్వం ఉప్పును భద్రపరచుకోవడానికి గిడ్డంగులు సదుపాయం పెద్ద సమస్య. ప్రభుత్వం గిడ్డంగులను నిర్మించాలనే కనీస ఆలోచన కూడా చేయకపోవడం గమనార్హం. గిడ్డంగులు ఉంటే వర్షాలు వచ్చినప్పుడు పండించిన ఉప్పును వాటిలో భద్రపరుచుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. అకస్మాత్తుగా వర్షాలు పడినా, తుఫాన్లు వంటి విపత్తులు వచ్చి పడినా ఉప్పు కుప్పలు ద్వంసమయిపోతాయి. రైతు కష్టం మొత్తం కరిగిపోతుంది. అధికార పంటగా గుర్తింపు లేదు ఉప్పు సాగుకు అధికార పంటగా ఇంతవరకూ గుర్తింపు లేదు. ఉప్పు పంట ప్రకృతి విపత్తుల కారణంగా ధ్వంసమైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్ట పరిహారం రాదు. బీమా లాంటి సదుపాయాలు ఉండవు. ఉప్పుసాగును అధికార పంటగా గుర్తించాలని, మిగిలిన పంటలకు మాదిరిగా అందించే సదుపాయాలు కల్పించాలని రైతులు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎండలు ప్రారంభం కాగానే ఉప్పు సీజన్ మొదలవుతుంది. ఈ ఏడాది సాగుపై రైతులకు శ్రద్ధ లేదు. ఎన్నో ఏళ్లుగా ఉప్పు పంట సాగు చేస్తున్న రైతులు ఈ ఏడాది సాగుకు స్వస్తి చెప్పారు. వరుసగా నష్టాలు రావడమే కారణం. గత ఏడాది తుఫాన్లు, వర్షాలతో పెట్టుబడులు కూడా రాలేదు. రైతులు అప్పుల పాలయ్యారు. ఒకప్పుడు తీరం అంతా ఉప్పుమడులతో కళకళలాడేది. మైలా రాధాకృష్ణ, ఉప్పు రైతు, పీఎం లంక, నరసాపురం మండలం 50 కేజీల బస్తా రూ 200 పలుకుతోంది. దళారుల మా వద్ద కొన్న ధరకు బయట మార్కెట్లో ఉప్పు ధరకు సంబంధం లేదు. దాదాపు మూడేళ్ల నుంచి ఇదే ధర. గిట్టుబాటు కావడం లేదు. పెట్టుబడులు బాగా పెరిగాయి. గిట్టుబాటు ధర లేకపోతే సాగు కష్టం. గిడ్డంగులు లేకపోవడం వల్ల వర్షాలు పడితే దళారులు అడిగినంతకు అమ్ముకోవాలి. ఉప్పు సాగు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి –మైలా శ్రీనివాస్, పెదమైనవానిలంక, నరసాపురం మండలం -
మృతదేహంతో ధర్నా
ఉండి: సుమారు మూడు నెలల క్రితం ఒమన్ దేశంలో మృతి చెందిన ఓ మహిళ మృతదేహంతో ఆదివారం కుటుంబీకులు ఏజెంట్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. మృతురాలి కుమార్తె వివరాల ప్రకారం నర్సాపురం మండలం చిట్టవరానికి చెందిన పిట్ట రాజమణిని ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం గ్రామానికి చెందిన ఏజెంట్ విమల ఒమన్కు పంపించింది. వెళ్ళినప్పటి నుండి ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గత ఏడాది డిసెంబర్ 4న ఆమె మృతి చెందింది. తన తల్లి మరణించినట్లు ఏజెంట్ ఫోన్ చేసి చెప్పిందని మృతదేహాన్ని తీసుకురావాలని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదని తెలిపారు. స్థానికంగా ఉన్న భారతీయుల సాయంతో తల్లి మృతదేహాన్ని తీసుకొచ్చామని ఆమె తెలిపారు. మృతురాలి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించారు. కై కలూరు: పక్షి ప్రేమికుల స్వర్గధామంగా పేరుపొందిన ఆటపాక పక్షుల విహార కేంద్రంలో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. శివరాత్రి పర్వదినం కావడంతో విజయవాడ – నరసాపురం రూట్లో శైవ క్షేత్రాలను సందర్శించే యాత్రకులు ఆటపాక పక్షుల కేంద్రాన్ని సందర్శించారు. బోటు షికారులో ప్రయాణించి పెలికాన్, పెయింటెడ్ స్ట్రార్క్ పక్షుల కేరింతలను దగ్గర నుంచి వీక్షించారు. భీమడోలు: మానసిక స్థితి బాగోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ద్వారకాతిరుమలకు చెందిన చీమకుర్తి జ్యోతికృష్ణ గణపతి(50) శనివారం రాత్రి భీమడోలు రైల్వే గేటు సమీపాన రైలు కింద పడి మృతి చెందాడు. జ్యోతికృష్ణ గణపతి ఆలయం వద్ద దుకాణాన్ని నిర్వహించేవాడు. కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీనితో ఇంట్లో ఎవరి చెప్పకుండా శనివారం సాయంత్రం బయటకు వచ్చేసాడు. భీమడోలు రైల్వే గేటు వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలో స్థానిక శాంతినగర్లోని మన్నా చర్చ్ పాస్టర్ ఎం.జ్యోతిరాజు ఆధ్వర్యంలో ఆదివారం స్తుతి నైవేద్యం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్థానిక గ్జేవియర్ నగర్లోని సెయింట్ గ్జేవియర్ స్కూల్ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జ్యోతిరాజు మాట్లాడుతూ ఏసుక్రీస్తు మార్గం ప్రపంచానికి అనుసరణీయమన్నారు. నిన్నువలె పొరుగువారిని ప్రేమించు అని సూచించిన ఏసు ప్రభువు మార్గంలో పయనిస్తూ ప్రతి ఒక్కరూ పొరుగువారితో సోదరభావంతో మెలగాలని, పేదలకు సేవ చేయడం ద్వారా ప్రభువుకు చేరువకావచ్చన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సంగీత దర్శకులుగా, గాయకులుగా, వాయిద్య కళాకారులుగా పేరుగాంచిన 80 మందితో నిర్వహించిన సంగీత విభావరి వీనులవిందు చేసింది. తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని పట్టెంపాలెం వై.జంక్షన్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు రూరల్ ఎస్సై జేవీఎన్ ప్రసాద్ సిబ్బందితో ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.3200, మూడు కోడి పుంజులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రసాద్ వివరించారు. కుక్కునూరు: అనుమానస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైన ఘటన ఆదివారం మండలంలోని గుండేటివాగు సమీపంలో జరిగింది. కుక్కునూరు మండల కేంద్రంలోని కిష్టారం గ్రామానికి చెందిన సోడే సంకురు(40) మృతదేహం గుండేటివాగు సమీపంలో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. -
వైభవంగా నృసింహ మహా యజ్ఞం
ద్వారకాతిరుమల: ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై స్వయంభూగా కొలువైన శ్రీ కనకవల్లీ సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అతి రుద్ర సహిత శ్రీ సుదర్శన, నృసింహ ధన్వంతరీ 32వ మహా యజ్ఞం ఆదివారం రాత్రి కనుల పండువగా జరిగింది. హైదరాబాద్కు చెందిన కొచ్చెర్లకోట సత్యవేంకట లక్ష్మీనరసింహం గురుజీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన రుత్వికులు, పండితులు పాల్గొని, ఈ యజ్ఞ క్రతువును వైభవోపేతంగా నిర్వహించారు. స్వయంభూ శ్రీ లక్ష్మీ నారసింహుడికి ఈ యజ్ఞం జరపడం వల్ల లోకశాంతి చేకూరుతుందని పండితులు తెలిపారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో జరిగిన పలు కార్యక్రమాలతో సుందరగిరి పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఉదయం విఘ్నేశ్వర పూజ, మండపారాధనలు, అనంతరం శాలిగ్రామ అభిషేకం, లక్ష బిల్వార్చన, సూర్య నమస్కారాలు, మృత్తిక లింగార్చన, ఏక బిల్వార్చన, సహస్ర లింగార్చన, మహా లింగార్చన, 365 లింగాలకు పార్ధివ మహాలింగార్చన, 121 పార్ధివ లింగార్చన, కలశారాధన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం హోమగుండ ప్రతిష్ఠ, అగ్ని ప్రతిష్ఠాపనా కార్యక్రమాలను వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో అశేష భక్తజనంతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు, హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఫలితాన్ని మార్చే చేతిరాత
ఏలూరు (ఆర్ఆర్పేట): పబ్లిక్ పరీక్షలు దగ్గరకు వచ్చేశాయి. ప్రశ్నాపత్రంలో ఇచ్చిన వాటికి సరైన మాధానాలు రాయడం ఒక్కటే మార్కులు సంపాదించడానికి ఉపయోగపడుతుందనుకుంటే పొరపాటే. జవాబు పత్రాలు మూల్యాంకనం చేసే వారికి విద్యార్థులు రాసిన జవాబులు పూర్తిగా అర్థమైతేనే వారు ఆశించిన మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. పరీక్షల సమయం దగ్గరకు వచ్చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లల చదువు ఎలా సాగుతోంది అనే అంశంపైనే శ్రద్ధ చూపుతున్నారు. చదువుతో పాటు దస్తూరీ పైనా దృష్టి సారిస్తే చక్కటి మార్కులు సొంతమంటున్నారు నిపుణులు. అక్షర దోషాలు, గజిబిజి చేతిరాత వల్ల ఒకటి, రెండు మార్కులు కోల్పోయే ప్రమాదముందంటున్నారు. విద్యార్థి కోల్పోయే ఆ ఒకటి, రెండు మార్కులే ర్యాంకును వేలల్లో తగ్గించేస్తుందనే విషయాన్ని గుర్తెరిగి దస్తూరీపై కూడా శ్రద్ధ చూపాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమాధాన పత్రాన్ని దిద్దే ఉపాధ్యాయుడికి మంచి దస్తూరి కనిపిస్తే ఆ ప్రభావం ఆయన వేసే మార్కులపై సానుకూలంగా ఉంటుందని, ఈ క్రమంలో చక్కటి దస్తూరితో పరీక్షలు రాస్తే మంచి మార్కులు అందుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జవాబు సూటిగా, అక్షరాలు పొందికగా ఉంటే పత్రాలను మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులు మంచి మార్కులు వేసే అవకాశముంటుందంటున్నారు. పరీక్షలు ప్రారంభమయ్యే లోపు ప్రతి రోజూ కొద్ది సేపు రాతపై కూడా శ్రద్ధ పెట్టి సాధన చేస్తే పరీక్షల్లో ఆందోళన లేకుండా సాఫీగా రాయవచ్చంటున్నారు. విద్యార్థులు చేసే పొరపాట్లు కొందరు విద్యార్థులు ఒక జవాబు పత్రంపై 25–30 లైన్లు రాస్తారు. గజిబిజిగా ఉంటే జవాబు పత్రం చూడగానే ఆకట్టుకోదు. ఒక్కోపేజీలో 16–18 లైన్లకు మించకూడదు. లైన్లు సమాంతరంగా ఉండాలి. చాలా మంది విద్యార్థులు ఒత్తిపట్టి రాస్తుంటారు. పెన్నును వేళ్లతో బిగుతుగా పట్టుకుంటారు. దీంతో పేజీ రెండో వైపు అక్షరాలు కనిపిస్తూ చివరికి జవాబుపత్రం గజిబిజిగా తయారవుతుంది. హ్యాండ్ రైటింగ్పై దృష్టి పెట్టాలంటున్న అధ్యాపకులు -
రెండు నెలలుగా జీతాల్లేవు
భీమవరం(ప్రకాశం చౌక్): విద్యుత్ శాఖలో స్పాట్ మీటర రీడర్లు జీవితాలతో కూటమి ప్రభుత్వం అడుకుంటుంది. ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా తీసుకుని కాంట్రాక్టర్లు గత రెండు నెలలగా జీతాలు చెల్లించడం లేదు. జిల్లాలోని పెద తాడేపల్లి, నర్సాపురం, తణుకు సబ్ డివిజన్లోని 100 మందికి రెండు నెలలగా జీతాలు ఇవ్వకుండా మీటర్ రీడింగ్ పనులు చేయిస్తున్నారు. పెద తాడేపల్లి, తణుకు నర్సాపురం సబ్ డివిజన్లో.. పెద తాడేపల్లి, నర్సాపురం, తణుకు సబ్ డివిజన్ల్లో మీటర్లు రీడర్లు 100 మంది ఉన్నారు. వారికి గత రెండు నెలలగా జీతాలు బ్యాంకు ద్వారా చెల్లించకుండా కాంట్రాక్టరు ఇబ్బందులు పెడుతున్నారు. దాంతో రీడర్లు నర్సాపురం, తాడేపల్లి డీఈల వద్ద మొరపెట్టకున్నారు. ఇప్పటికే రీడర్లుకు రెండు నెలల జీతాలు లేవు. మరో వారం రోజుల మూడో నెల వస్తుంది. పీఎఫ్, ఈఎస్ఐ మినహాయింపు లేదు జీతాలతో పాటు ప్రతి నెల పీఎఫ్, ఈఎస్ఐ కూడా కాంట్రాక్టర్ చెల్లించాలి. ఈ రెండు నెలలు జీతాలు చెల్లించకపోవడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ కూడా చెల్లించడం లేదు. దాంతో మీటర్ రీడర్కు ప్రమాదం జరిగితే అతను, అతనిపై ఆధారపడిన కుటుంబం నష్టపోతారు. ఈ విషయం తెలిసి కూడా కూటమి ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వంలో సకాలంలో జీతాలు గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖలోని స్పాట్మీటర్ రీడర్లుకు ప్రతి నెల ఒకటో తేదీ జీతాలు బ్యాంకు ద్వారా జమ చేసేవారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లు, విద్యుత్ శాఖ అధికారులను సమన్వయం చేసి మీటర్ రీడింగ్ సకాలంలో జరిగేలా, మీటర్లు రీడర్లుకు జీతాలు పెడింగ్ లేకుండా సకాలంలో అందేలా పనిచేసేవారు. కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య అవినీతి జగరకుండా చర్యలు తీసుకుని మీటర్ రీడర్లకు ఇబ్బందులు లేకుండా చూసేవారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న రీడర్లు గత రెండు నెలలగా జీతాలు రాక మీటర్ రీడర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కరి సుమారు రూ.50 వేల వరకు జీతాలు చెల్లించాల్సి ఉంది. జీతాలు రాక ఈఎంఐలు, ఇంటి అద్దెకు, కుటుంబ పోషణకు మీటర్ రీడర్లు అప్పులు చేస్తున్నారు. ఒక్కొక్క మీటర్ రీడర్ 5 వేల సర్వీసులు బిల్లింగ్ చేసి వియోగదారులకు సకాలంలో బిల్లు అందిస్తారు. దాంతో వినియోగదారులు సకాలంలో బిల్లు చెల్లిస్తారు. మూడు డివిజన్ల్లో మీటర్ రీడర్లుకు పెడింగ్లో ఉన్న జీతాలు వెంటనే బ్యాంకు ద్వారా జమ చేయాలని కాంట్రాక్టర్లు అదేశించాం. నిబంధనలకు విరుద్దంగా కాంట్రాక్టర్లు మీటర్లు రీడర్లుకు నగదు రూపంలో జీతాలు చెల్లించకూడదు. – పి.ఉషారాణి, విద్యుత్ శాఖ ఎస్ఈ వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకోవాలి. దిద్దుబాటు, గజిబిజి ఉండకూడదు. పదానికి పదానికి మద్య దూరం ఉండాలి చేతి రాత గుండ్రంగా, అర్థమయ్యేలా ఉండాలి. సమాధాన పత్రంలో పేజీకి 15– 16 లైన్లు ఉండాలి. పేజీకి పైన, కింద మార్జిన్ విడిచి పెట్టాలి. మొదటి వరుసలో ఎంత బాగా రాసారో చివరి వరకు అదే దస్తూరి కొనసాగించాలి. తెలుగు, ఆంగ్లం, హిందీ సబ్జెక్టులలో లెటర్ రైటింగ్ ఒకే పేజీలో వచ్చేలా రాయాలి. అక్షర దోషాలు, దిద్దుబాట్లు లేకుండా చూసుకోవాలి గణితంలో అంకెలు స్పష్టంగా ఉండాలి. కొట్టివేతలు వస్తే మార్కులు తగ్గుతాయి. సాంఘికశాస్త్రంలో సమాధానాలు పాయింట్ల వారీగా రాయాలి. శీర్షికలు, ఉప శీర్షికలు కింద అండర్లైన్ చేయాలి. -
80 వేల నాణేలతో శివలింగం
పోలవరం రూరల్: పట్టిసం శివక్షేత్రానికి ఒక భక్తుడు నాణేలతో తయారు చేసిన శివలింగాన్ని అందజేశారు. గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామానికి చెందిన చిలక సాయి రూ.1.25 లక్షలతో 80 వేల నాణేలతో శివలింగాన్ని తయారు చేశారు. ఆ శివలింగాన్ని ఆ గ్రామం నుంచి అధిక సంఖ్యలో భక్తులతో ఊరేగింపుగా తీసుకొచ్చి పట్టిసంలో దేవస్థానం అధికారులకు అప్పగించారు. నిత్యం ఈ శివలింగానికి భక్తులు కొలిచేలా ఏర్పాటు చేయాలని దేవస్థానం ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కె.వీరభద్రరావు, ఈవో సీహెచ్ వెంకటలక్ష్మిని కోరారు. ఈ శివలింగం తయారీకి సుమారు 2 నెలలు పట్టిందని చిలక సాయి తెలిపారు. ఏలూరు టౌన్: ఏలూరు త్రీటౌన్ పరిధిలోని విద్యుత్ నగర్లో ఒంటరిగా జీవిస్తోన్న ఒక వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. తాను ఉంటున్న ఇంటినుంచి దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా... పోలీసులు ఇంట్లోకి వెళ్ళి చూడగా ఒక వ్యక్తి మృతిచెంది ఉన్నాడు. విద్యుత్నగర్లో మధుసూధన్రెడ్డి (41) ఒంటరిగా అద్దెకు ఉంటూ తాపీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నేళ్ళ క్రితం భార్యతో విడాకులు తీసుకోవడంతో ఒంటరిగానే జీవిస్తున్నాడు. మధుసూధన్రెడ్డి ఉంటున్న ఇంటినుంచి దుర్వాసన రావటంతో స్థానికులు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనారోగ్యంతో మృతిచెంది ఉంటాడని పోలీసులు ప్రాఽథమిక అంచనాకు వచ్చారు. మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. -
మానవత నాగేశ్వరరావు అనుమానాస్పద మృతి
ఏలూరు టౌన్: అనేక మందికి సేవలు అందించిన ఆలపాటి నాగేశ్వరరావు అలియాస్ మానవతా నాగేశ్వరరావు అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. ఈ నెల 9న ఏలూరు నగరంలోని వసంతమహాల్ సెంటర్లోని ఆయన నిర్వహిస్తోన్న గాయత్రి ఫైనాన్స్ కార్యాలయం నుంచి ఒంటరిగా బైక్పై బయటకు వెళ్ళారు. ఆరు రోజుల అనంతరం ఆగిరిపల్లి ప్రాంతంలో పెద్ద చెరువులో విగతజీవిగా కనిపించారు. మానవత స్వచ్చంద సంస్థ ద్వారా అనేక మందికి సేవలు అందిస్తుండగా... ఆకస్మికంగా మృతిచెందటం ఏలూరు, పరిసర ప్రాంతాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. శనివారపుపేట శాతవాహన నగర్లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలపాటి నాగేశ్వరరావు ఉంటున్నారు. ఈనెల 9న ఉదయం 11గంటల సమయంలో వసంతమహాల్ సెంటర్లోని తాను నిర్వహిస్తోన్న గాయత్రి ఫైనాన్స్ కంపెనీ కార్యాలయం నుంచి బైక్పై బయటకు వచ్చారు. ఆ తరువాత ఆచూకీ దొరకలేదు. ఆయన భార్య టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నగరంలోని సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా గాలింపు చేపట్టగా... నూజివీడు వైపు వెళుతున్నట్లు గుర్తించారు. అనంతరం ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ కావటంతో ఆచూకీ కనిపెట్టటం క్లిష్టంగా మారింది. గన్నవరం, ఆగిరిపల్లి మద్య ప్రాంతంలో బ్రహ్మలింగయ్య చెరువు వద్ద డ్రోన్లతో పరిశీలించగా ఆయన మోటారు సైకిల్ను గుర్తించారు. శనివారం చెరువు ప్రాంతం అంతా విస్తృతంగా గాలించగా తుప్పల వద్ద నాగేశ్వరరావు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పంచముఖ ఆంజనేయుడికి వెండి కవచం
ద్వారకాతిరుమల: ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై శ్రీ కనకవల్లీ సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో కొలువుదీరిన పంచముఖ ఆంజనేయస్వామికి ఓ దాత రూ.16 లక్షల విలువైన వెండి కవచాన్ని శనివారం బహూకరించారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్న తూర్ల లక్ష్మీపురం గ్రామానికి చెందిన కొచ్చెర్లకోట సత్య వెంకట లక్ష్మీనరసింహం దంపతులు పంచముఖ ఆంజనేయ స్వామికి అలంకరణ నిమిత్తం 5.660 కేజీల బరువుగల వెండి కవచాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. ముందుగా నరసింహ గురూజీ దీన్ని శిరస్సుపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీకి అందించారు. -
మహాయజ్ఞానికి శ్రీకారం
● నేడు రాత్రి సుందరగిరిపై.. ● క్రతువుకు పూర్తయిన ఏర్పాట్లు ద్వారకాతిరుమల: సుందరగిరిపై స్వయంభూగా కొలువైన శ్రీ కనకవల్లీ సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించనున్న అతి రుద్ర సహిత శ్రీ సుదర్శన, నరసింహ ధన్వంతరీ 32వ మహా యజ్ఞానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏటాలాగే ఈ ఏడు కూడా మహా శివరాత్రి నాడు సాయంత్రం మొదలుగా తెల్లవార్లు ఈ మహా యజ్ఞాన్ని ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా హైదరాబాద్కు చెందిన కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యజ్ఞ ఏర్పాట్లను సీహెచ్ కుటుంబరావు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఆలయ యాగశాలలో యజ్ఞ క్రతువుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ముందుగా నరసింహ గురూజీ గర్భాలయంలో కొలువైన స్వామివారి మూలవిరాట్ వద్ద కంకణధారణ చేశారు. అనంతరం యాగశాలలో మహాగణపతి పూజ, హోమాన్ని నిర్వహించారు. ఆ తరువాత కలశ పూజ చేశారు. అలాగే పండితులు, రుత్వికులు వేద మంత్రోచ్ఛరణలతో సహస్ర లింగార్చన, మహా లింగార్చన, మృత్తిక లింగాలకు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. లోకశాంతి కోసం పలు వనమూలికలు, భక్ష్యాలు, వివిధ రకాల ద్రవ్యాలు, సమిదులు, ఖరీదైన ద్రవ్యాలతో ఆదివారం రాత్రి నిర్వహించనున్న మహా యజ్ఞం భక్తులను పరవశింప జేయనుంది. -
మద్యం మత్తుతో చిత్తు
ఆగిరిపల్లి లో రామాలయం పక్కన పడిపోయిన మందు బాబుస్టేట్ బ్యాంక్ వద్ద రోడ్డుపైనే పడక చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఊరుకో మద్యం షాపు.. వీధికో బెల్ట్ షాపు అన్నట్లుగా తయారైంది. దీంతో మందుబాబులతో 24 గంటలు తాగించేస్తున్నారు. బెల్ట్ షాపులు ద్వారా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ఆగిరిపల్లిలో యువత మద్యం తాగి, మత్తు ఎక్కువై రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పడిపోతున్నారు. విజయవాడ రోడ్డులో తప్ప తాగి పడిపోతున్నారు. నిత్యం స్థానికంగా ఉండే వారితో గొడవలకు దిగడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. – ఆగిరిపల్లి -
దొడ్డిదారిన శ్రీవారి దర్శనాలు
● పలువురు సెక్యూరిటీ సిబ్బంది చేతివాటం ● హోంగార్డు, మహిళా సెక్యూరిటీ గార్డును పట్టుకున్న అధికారులు ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో కొందరు ఆలయ, సెక్యూరిటీ సిబ్బంది దొడ్డిదారిన భక్తులను దర్శనాలకు పంపుతూ కాసులు దండుకుంటున్నారు. ఈ నెల 11న ఓ హోంగార్డు భక్తుల నుంచి డబ్బులు తీసుకుని, దర్శనాలకు పంపుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దాంతో అతడిని దేవస్థానం అధికారులు మాతృ సంస్థకు అప్పగించారు. అలాగే మరో ఘటనలో మహిళా హోంగార్డును విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళితే.. చిన్నతిరుపతిగా పేరొందిన ద్వారకాతిరుమల దివ్య క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు సందర్శిస్తున్నారు. వారికి మెరుగైన సేవలు అందించేందుకు ఆలయ అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. కొందరు సిబ్బంది సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ధనికుల నుంచి డబ్బులు తీసుకుని అడ్డదారిలో వారిని దర్శనాలకు పంపుతూ శ్రీవారి ఆదాయానికి గండి కొడుతున్నారు. ముఖ్యంగా భక్తులు రద్దీ ఎక్కువగా ఉండే శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో ఈ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. పట్టించిన నిఘానేత్రం.. ఆలయ తూర్పు రాజగోపురం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ హోంగార్డు ఈనెల 11న కొందరు భక్తుల నుంచి డబ్బులు తీసుకుని ఆలయంలోకి పంపాడు. ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న కొందరు ఉద్యోగులు వారిని రిసీవ్ చేసుకుని దర్శనాలు చేయించినట్టు తెలుస్తోంది. సీసీ కెమేరాల్లో రికార్డ్ అయిన ఈ దృశ్యాలను పరిశీలించిన అధికారులు సదరు హోంగార్డును మాతృ సంస్థకు పంపించివేశారు. ఆ మరుసటి రోజే దేవస్థానానికి చెందిన ఓ మహిళా సెక్యూరిటీ గార్డు భక్తుడి వద్ద డబ్బులు తీసుకుని, దర్శనానికి పంపుతూ అధికారులకు పట్టుబడింది. దాంతో ఆమెను విధుల నుంచి తొలగించారు. సెక్యూరిటీ సిబ్బంది సిఫార్సులతో వెళుతున్న భక్తులను ఆలయంలోకి పంపుతున్న సిబ్బంది ఎవరనేది అధికారులు తేల్చడం లేదు. తీగలాగితే తమకు కావాల్సిన సిబ్బంది డొంక ఎక్కడ కదులుతుందోనన్న భయంతోనే అధికారులు కిమ్మనకుండా ఉండిపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టికెట్లు రీప్రింట్ శ్రీవారి ఆలయంలో దర్శనం టికెట్లు రీప్రింట్ జరుగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.500 అంతరాలయ దర్శనం టికెట్తో పాటు, మిగిలిన దర్శనం టికెట్లను కూడా రీప్రింట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆన్లైన్లో వస్తున్న టికెట్లను డౌన్లోడ్ చేసి, వాటిని రీప్రింట్ చేసి, భక్తులకు విక్రయిస్తూ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. కొందరు టికెట్లు విక్రయించే సిబ్బంది, వాటిని స్కాన్ చేసే సిబ్బంది లాలూచీ పడి ఈ దందాను సాగిస్తూ, జేబులు నింపుకుంటున్నారు. దేవస్థానం అధికారులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రం ఆలయ తూర్పు రాజగోపురం వద్ద ఈ నెల 11న హోంగార్డు డబ్బులు తీసుకుని భక్తులను దర్శనాలకు పంపుతున్నట్టు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. దాంతో అతడిని మాతృ సంస్థకు సరెండర్ చేశాం. మరో మహిళా సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించాం. టికెట్ల రీప్రింట్ వ్యవహారాన్ని పరిశీలిస్తాం. – డీవీ భాస్కర్, శ్రీవారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ -
బురిడీ.. అంకెల గారడీ
కొత్త పథకాలు, ప్రాజెక్టుల ఊసేలేదు.. పాత ప్రాజెక్టులకు అరకొరగా కేటాయింపులు.. పోలవరం నిర్వాసితుల గోడు పట్టని తీరు.. ఆక్వా వర్సిటీ, వశిష్ట గోదావరి వంతెన నిర్మాణాలు, కొల్లేరు వంటి సమస్యలను విజయవంతంగా అటకెక్కించిన వైనం.. గతేడాది మాదిరిగానే ఈ ఏడాదీ రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చంద్రబాబు ప్రభుత్వం మొండిచేయి చూపింది. నిధుల కేటాయింపులు, కీలక అంశాలపై కనీసం ప్రస్తావన కూడా లేకపోవడం విచారకరం. రాష్ట్ర బడ్జెట్పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లాకు లెక్కకు మించిన హా మీలను కూటమి నాయకులు గుప్పించారు. వందల కోట్లతో పథకాలు, ప్రాజెక్టులతో అద్భుతాలు చేస్తామని ఊరూవాడా ప్రచారం చేశారు. తీరా అధికారం చేపట్టిన తర్వాత జిల్లా అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టారు. ఏటా రాష్ట్ర బడ్జెట్లో అరకొర కేటాయింపులతో సరిపెడుతున్నారు. ‘కౌలు’కునేదెలా..? ఉమ్మడి జిల్లాలో 2.45 లక్షల మందికిపైగా కౌలు రైతులు ఉన్నారు. కౌలు వ్యవసాయం ఒడిదొడుకులతో సాగుతోంది. కౌలు రైతుల రక్షణ కోసం ప్రత్యే క చట్టంతో గుర్తింపు ఇచ్చి కౌలురైతులకు కూడా రైతుభరోసా మొదలు అన్ని పథకాల వర్తింపు, గుర్తింపు కార్డుల జారీ, పంట నష్ట పరిహరం వంటివి అందేలా చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హా మీలు ఇచ్చారు. అయితే బడ్జెట్ కౌలురైతుల ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. ‘ఆక్వా’ంక్షలు ఫలించేనా..! గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నరసాపురంలో ఆక్వా యూనివర్సిటీని ఏర్పాటుచేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ యూనివర్సిటీని అటకెక్కించింది. రూ.332 కోట్లతో జరగాల్సిన భవన నిర్మాణానికి అరకొర నిధులను మంజూరు చేయడంతో పాటు వాటిని కూడా పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేని పరిస్థితి. గత బడ్జెట్లో రూ.36 కోట్లు కేటాయించినా పనులకు అనుమతులు రాలేదు. ప్రస్తుత బడ్జెట్లో రూ.20 కోట్లు మాత్రమే కేటాయించారు. వంతెన.. యాతన నరసాపురం ప్రాంతంలో తలమానికంగా ఉండే వశిష్ట గోదావరి వంతెన నిర్మాణానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి అనుమతులతో శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారు. అయితే చంద్రబాబు పాలనలో రాష్ట్ర బడ్జెట్లో రెండేళ్లుగా నిధులు కేటాయించకపోవడంతో ప్రాజెక్టు శంకుస్థాపనకే పరిమితమైంది. కీలక ప్రాజెక్టులకు రిక్తహస్తం జిల్లాలో కీలకమైన పోలవరం ప్రాజెక్టు, పునరావాసం, చింతలపూడి ఎత్తిపోతల పథకం, గోదావరి డె ల్టా ఆధునికీకరణ, ఎర్రకాల్వ, కొల్లేరు ఏ ఒక్క దాని కీ న్యాయం జరగలేదు. సుమారు రూ.5 వేల కోట్లు కేటాయించాల్సిన చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ.435 కోట్లతో సరిపెట్టారు. గత బడ్జెట్లో రూ.220 కోట్లు కేటాయించినా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ● డెల్టా ఆధునికీకరణకు వందల కోట్లు అవసరం కాగా మొక్కుబడిగా రూ.100 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయింపులతోనూ పనులు జరగని పరిస్థితి. ● ఎన్నికల సమయంలో నల్లజర్ల నుంచి తాడేపల్లిగూడెం వరకు ఎర్రకాల్వ ముంపునకు శాశ్వత ప రిష్కారం చూపుతామని కూటమి నాయకులు ప్రకటించారు. అయితే బడ్జెట్లో నామమాత్రంగా సాధారణ మెయింటినెన్స్కు రూ.10 లక్షలు మాత్రమే కేటాయించారు. ● 122 గ్రామాల ప్రజల జీవనస్థితితో ముడిపడి ఉన్న కొల్లేరుకు సంబంధించి బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదు. కొల్లేరును 3వ కాంటూరుకు కు దించి జిరాయితీ భూములిస్తాం, కొల్లేరు గ్రామా ల్లో రోడ్లు, తాగునీరు, మౌలిక సదుపాయాలన్ని కల్పిస్తామని ఎన్నికల్లో ప్రకటించి సుప్రీంకోర్టు సాకుతో గాలికి వదిలేశారు. ● పోలవరం ప్రాజెక్టు పరిధిలో నిర్వాసితులకు పరిహారం అలానే పెండింగ్లో ఉంది. పరిహారం గురించి బడ్జెట్లో ప్రస్తావన కూడా లేదు. పథకాల ఊసేదీ.. సూపర్ సిక్స్ హామీల పేరుతో కూటమి ప్రభుత్వం నిండా వంచించింది. ఈ బడ్జెట్లోనూ ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, రెండు సెంట్ల స్థలాలు వంటి హామీలను ప్రస్తావించలేదు. ఏలూరు జిల్లాలో 6.71 లక్షలు, పశ్చిమగోదావరి జిల్లాలో 6 లక్షల మందికి పైగా మహిళలు ఆడబిడ్డ నిధి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మోసాల పద్దు నిధుల్లేవ్.. పథకాల్లేవ్ పాత ప్రాజెక్టులకు అరకొర కేటాయింపులు అటకెక్కిన వశిష్ట గోదావరి వంతెన కనిపించని ఫుడ్, ఆక్వా క్లస్టర్లు ఉమ్మడి జిల్లాకు మరోసారి మొండిచేయి రాష్ట్ర బడ్జెట్పై విమర్శల వెల్లువ -
కూలికెళ్లారు.. క్షతగాత్రులయ్యారు
● నిర్మాణంలో ఉన్న భవనం శ్లాబ్ కూలి ప్రమాదం ● 12 మందికి గాయాలు ● వీరిలో ఆరుగురికి తీవ్ర గాయాలు జంగారెడ్డిగూడెం: పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లిన కార్మికులు నిర్మాణంలో ఉన్న భవనం శ్లాబ్ కుప్పకూలడంతో క్షతగాత్రులై మంచాన పడ్డారు. మండలంలోని వేగవరంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ భవన నిర్మాణం శ్లాబ్ పనులు జరుగుతున్నాయి. సుమారు 100 మంది పనిచేస్తున్నారు. భవనం పొడవునా మొ దటి అంతస్తులో పోర్టికో నిర్మాణం జరుగుతుండటంతో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తు వరకు నిర్మించిన రెండు పిల్లర్ల సామర్థ్యం సరిపోకపోవడంతో నిర్మిస్తున్న శ్లాబ్ శనివారం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో కార్మికులంతా మొదటి అంతస్తు నుంచి నేలపై శ్లాబ్తో సహా పడిపోయారు. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. వారిని జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఆరుగురికి స్వల్ప, మరో ఆరుగురికి తీవ్ర గా యాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన కార్మికులు ఆ స్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను పరామర్శించిన జెట్టి : ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావు పరామర్శించారు. ఈ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న శ్లాబ్ కూలీ ప్రమాదం జరగడం ఇదే ప్రథమమని, మళ్లీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భవన నిర్మాణ యాజమాన్యాలు చర్య లు తీసుకోవాలని కోరారు. కార్మికులు వ్యక్తిగత భద్రతకు ఏర్పాట్లు చేయాలన్నారు. నిర్మాణాలను అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, బత్తిన చి న్న, వీరవల్లి సోమేశ్వరరావు, కె.వసంత కుమార్, ప ట్టణ యూత్ అధ్యక్షులు నేకూరి కిషోర్, చేతివృత్తుల విభాగం అధ్యక్షులు జీడికంటి రామారావు, కడిమి కి రణ్ ఉన్నారు. అలాగే సీఐటీయూ మండల కన్వీనర్ పి.సూర్యారావు క్షతగాత్రులను పరామర్శించారు. కార్మికులు పూర్తిగా కోలుకునే వరకూ యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సొంగా రోషన్కుమార్ బాధితుల వివరాలు ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. -
రైతులకు మొండిచేయి
2026–27 రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం రైతులకు మొండిచేయి చూపించింది. కౌలురైతుల ఊసే ఎత్తలేదు. వ్యవసాయ రంగానికి ఆశించిన స్థాయిలో బడ్జెట్లో కేటాయింపులు లేవు. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నిధుల కేటాయింపు తక్కువగా ఉంది. పోలవరం నిర్వాసితుల గురించి ప్రస్తావనే లేదు. – దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బడ్జెట్లో పోలవరం నిర్వాసితులకు ఎంత అనే స్పష్టత లేకపోవడం ద్వారా నిర్వాసితులను ముంచాలనుకున్నారని స్పష్టమవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాసితులను ముంచే పనిలోనే ఉన్నాయి. మహిళలకు నెలకు రూ.1,500, నిరుద్యోగ భృతి ప్రస్తావన లేకపోవడం ద్వారా హామీలను తుంగలో తొక్కారు. – ఎ.రవి, సీపీఎం జిల్లా కార్యదర్శి బడ్జెట్ ప్రజలను మభ్యపెట్టేదిగా, మోసపూరితంగా ఉంది. విద్యా, వైద్య రంగాల్లో కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయి. పోల వరం ప్రాజెక్టును 2027 పుష్కరాల నాటికి పూర్తి చేస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారు. బడ్జెట్ ఆద్యంతం ఆత్మస్తుతి పరనిందాగా ఉంది. పేదలకు మేలు చేయని బడ్జెట్. – డేగా ప్రభాకర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు కౌలు రైతులకు మొండిచేయి చూ పారు. అన్నదాత సుఖీభవ సా యంపై స్పష్టత ఇవ్వలేదు. పంట నష్టపోయిన రైతులకు పంటల బీమా పరిహారం కేటాయింపు జరగలేదు. ధరలు పడిపోయి రైతులు నష్టపోతున్నా కనీసం మద్దతు ధరలు కూడా అందడం లేదు. కౌలు రైతులపై దయ లేదు. – కె.శ్రీనివాస్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీగానే కనిపిస్తుంది. సూపర్సిక్స్ పథకా ల అమలుకు బడ్జెట్ కేటాయింపులు నోచుకోలేదు. ఇళ్ల స్థలాలు లేని పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు, ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలపై బడ్జెట్లో స్పష్టత లేదు. పా రిశ్రామికవేత్తలకు మేలు చేసేదిగా ఉంది. – మన్నవ కృష్ణ చైతన్య, సీపీఐ జిల్లా కార్యదర్శి గ్రామీణ పేదలు, రైతులకు నిరాశ ఎదురైంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి బడ్జెట్లో ప్రాధాన్యమివ్వలేదు. జీ రాం జీ పథకంలో రాష్ట్ర వాటాపై స్పష్టత లేదు. సంక్షేమ పథకాలకు కూడా కేటాయింపులు అంతగా లేవు. పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు జరగదు. – బండి వెంకటేశ్వరరావు, బీకేఎంయు ప్రధాన కార్యదర్శి బడ్జెట్ ఉద్యోగులు, కార్మికులను తీవ్రంగా నిరాశపరిచింది. లక్షల మంది అంగన్వాడీ, ఆశ, మ ధ్యాహ్నం భోజన పథకం కార్మి కుల వేతనాల గురించి ఏ మా త్రం ప్రస్తావించలేదు. అసంఘటిత రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డుల గురించి పట్టించుకోలేదు. 12వ పీఆర్సి గురించి కనీసం మాట్లాడలేదు. – డీఎన్వీడి ప్రసాద్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బడ్జెట్లో కార్మిక సంక్షేమానికి ఎలాంటి కేటాయింపులు లేవు. మొత్తం రూ.3,22,205 కోట్ల బడ్జెట్లో కార్మిక సంక్షేమానికి ఎలాంటి కేటాయింపులు లేకపోవడం చాలా అన్యాయం. వ్యవసాయ, వైద్యం, మహిళా సంక్షేమానికి చాలా తక్కువగా నిధులు కేటాయించారు. – పి.కిషోర్, ఏఐటీయూసీ నాయకుడు, ఏలూరు మాటలు కోటలు దాటినా.. పద్దులు గడప దాటని విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉంది. బడ్జెట్లో 30 శాతం లోటు ఉంది. పేదలకు ఏ మాత్రం ఉపయోగపడని బడ్జెట్ ఇది. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న ప్రభుత్వం బడ్జెట్లో కేవలం రూ.6,105 కోట్లు మాత్రమే కేటాయించడం సరికాదు. ఎన్నడూ లేనివిధంగా ద్రవ్యలోటు ఉంది. – పీవీ రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి, వ్య.కా.స, ఏలూరు రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి అరకొరగా కేటాయింపులు చేయడం దారుణం. కనీసం 6 శాతం నిధులు కూటా విద్యారంగానికి కేటాయించక పోవడం శోచనీయం. ఈ నిధులతో సర్కారీ విద్యారంగం ఎలా అభివృద్ధి చెందుతుందో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. కనీసం 15 శాతం అయినా నిధులు కేటాయించాలి. – బి.రెడ్డిదొర, తాళ్లూరి రామారావు, ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు -
కూలిన ప్రైవేటు స్కూలు స్లాబ్.. పలువురికి గాయాలు
సాక్షి,ఏలూరు: జంగారెడ్డిగూడెంలో ఉద్రిక్తత నెలకొంది. శనివారం వేగవరం సమీపంలో నిర్మాణ పనులు జరుగుతున్న ఓ ప్రైవేటు స్కూలు స్లాబ్ ఒక్కసారిగా కూలింది. ఈ ఘటనలో 15మంది గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందిస్థానికుల సమాచారం మేరకు.. నిర్మాణ పనుల్లో నిమగ్నమైన కార్మికులు స్లాబ్ వేసే పనులు చేస్తుండగా, అది ఒక్కసారిగా కూలిపోవడంతో సుమారు 15 మందికి పైగా గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, సహాయక సిబ్బంది అక్కడికి చేరుకుని గాయపడిన వారిని బయటకు తీసి సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కొంతమంది కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూలు నిర్మాణ పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. -
అత్త వేధింపులతో కోడలు ఆత్మహత్య
ముదినేపల్లి రూరల్: అత్త వేధింపులు భరించలేక కోడలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని దేవపూడిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం గురిండి గ్రామానికి చెందిన సింధుపురం సంతోషిని(27) దేవపూడికి చెందిన చేడు మహేష్ను ప్రేమించి 2023లో వివాహం చేసుకుంది. ఈ వివాహానికి సంతోషిని బంధువులు అంగీకరించినప్పటికీ మహేష్ తల్లి ఒప్పుకోలేదు. అయినప్పటికీ వీరిరువురు వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కూతురు ఉండగా తలసేమియా వ్యాధితో బాధపడుతోంది. దీంతో అత్త అప్పలనరసమ్మ తరచూ కోడలైన సంతోషిని అనారోగ్యవంతురాలైన కూతురిని కన్నావంటూ వేధిస్తోంది. అయితే ఇటీవల మళ్లీ సంతోషిని గర్భం దాల్చింది. అయినప్పటికీ అత్త వేధింపులు ఆపకపోవడంతో పడక గదిలో ఫ్యాన్కి ఉరి వేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి సంతోషిని గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై సంతోషిని సోదరుడు సింగుపురం శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై వీరభద్రరావు గుడివాడ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దెందులూరు: మండలంలోని గాలాయగూడెంలో 2022లో సలాది ఉదయ కిరణ్ను హత్య చేసిన పాలడుగు దుర్గాప్రసాద్కు శుక్రవారం జీవిత ఖైదును, వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ ఏలూరు 5వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి మురళీకృష్ణ తీర్పు చెప్పారు. ఎస్సై రాజమల్లు శివాజీ తెలిపిన వివరాల ప్రకారం ఉదయ్ కిరణ్కు దుర్గాప్రసాద్ తమ్ముడు డబ్బులు ఇవ్వాలి. డబ్బుల గురించి దుర్గాప్రసాద్ తమ్ముడికి, ఉదయ కిరణ్కు ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ విషయాన్ని తన అన్న దుర్గాప్రసాద్కి చెప్పడంతో ఉదయ్ కిరణ్ ఇంటికి వెళ్లి నిలదీశాడు. ఇరువురి మధ్య వాగ్వివాదం పెరిగి దుర్గాప్రసాద్ కత్తితో ఉదయ్కిరణ్ తల వెనుక భాగంలో నరికాడు. తీవ్రంగా గాయపడిన ఉదయ్కిరణ్ను గుంటూరు వైద్యశాలకు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ కేసులో తాజాగా న్యాయమూర్తి నిందితుడికి శిక్ష వేశారు. ఉండి: మండలంలోని ఆరేడులో చోరీకి గురైన కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గణపవరం గ్రామానికి చెందిన ముత్తిరెడ్డి రవితేజ రొయ్యల చెరువుల గట్లపై పెంచుతున్న కోళ్లను బుధవారం రాత్రి చోరీ చేసిన ఘటన పాఠకులకు విధితమే. గురువారం సాయంత్రం ఆ కోళ్లను ఆటోలో తరలిస్తున్న వీరవాసరం మండలం వడ్డిగూడేనికి చెందిన సైదు మోహన్రావును ఎన్నార్పీ అగ్రహారం వద్ద పోలీసులు అరెస్టు చేసి, కోళ్లను స్వాధీనం చేసుకుని ఆటోను సీజ్ చేశారు. శుక్రవారం నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై ఎండీ నసీరుల్లా తెలిపారు. పెదపాడు: నిషేధిత కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని సీజ్చేసి ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పెదపాడు పోలీసులు శుక్రవారం విలేకరులకు తెలిపారు. మండలంలోని తోటగూడెం వైపునకు కోళ్ల వ్యర్థాల వాహనం వస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు తోటగూడెం సెంటర్లో కాపుగాసి వాహనం సీజ్ చేశామని తెలిపారు. ఈ మేరకు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆర్.శ్రీనివాస్ తెలిపారు. -
ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా సేవలు
తాడేపల్లిగూడెం: ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా సేవలను విస్తరించడమే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యమని బ్యాంకు ముంబై సెంట్రల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ డాక్టర్ జి.భాస్కర్ తెలిపారు. బ్యాంకు ఆధ్వర్యంలో శుక్రవారం మాగంటి కల్యాణ మండపంలోని మెగా అగ్రికల్చరల్ క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బాస్కర్ మాట్లాడుతూ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ రుణాలను అందిస్తున్నామన్నారు. అనంతరం రైతులకు రూ.80 కోట్ల విలువైన రుణ మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో విజయవాడ రీజినల్ మేనేజర్ పి.సతీష్బాబు, డాల్ఫిన్స్ గ్రూపు సీఈఓ డి.లీలాకృష్ణ, స్థానిక బ్యాంకు మేనేజర్ షేక్ కరీం పాల్గొన్నారు. అలాగే ఈ నెల 21న రిటైల్ క్రెడిట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్టు తెలిపారు. -
బలవంతపు శిక్షణతో సమస్యలు
రెసిడెన్షియల్ విధానంలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలనుకోవడం ఆహ్వానించదగిన పరిణామమే. అయితే వారికి ఇష్టం లేకుండా బలవంతంగా హాస్టళ్లలో ఉంచినంత మాత్రాన వారికి చదువు అబ్బుతుందన్న నమ్మకం లేదు. ఇలా ఇచ్చే బలవంతపు శిక్షణ వారిని మానసికంగా కుంగదీసి, అనార్యోగానికి గురి చేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం కూడా ప్రశ్నార్థకమవుతుంది. – కాకి నాని, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు రెసిడెన్షియల్ శిక్షణ విధానం విద్యార్థుల భవిష్యత్ కోసమే. వారి తోటి విద్యార్థులు ఉత్తీర్ణులై పై తరగతులకు వెళ్ళి వారు మాత్రం అనుత్తీర్ణులైతే బాధపడేది వారే. నెలరోజుల పాటు హాస్టళ్లలో ఉండి శిక్షణ పొందితే ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంది. కొందరు విద్యార్థులు హాస్టళ్ల నుంచి ఇళ్లకు వెళ్ళిపోవడం వాస్తవమే. – అరుణ్ కుమార్, ఏలూరు మండల విద్యాశాఖాధికారి–2 -
మార్చి 13 నుంచి జాతీయ స్థాయి నాటికల పోటీలు
పాలకొల్లు సెంట్రల్: సాంఘిక నాటక రంగానికి పుట్టినిల్లు అయిన పాలకొల్లులో కళా రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నాటిక పోటీలను నిర్వహిస్తున్నామని పాలకొల్లు కళాపరిషత్ అధ్యక్షుడు కేవీ కృష్ణవర్మ అన్నారు. ఈ మేరకు శుక్రవారం కళాపరిషత్ ఆధ్వర్యంలో మార్చి 13, 14, 15 తేదీల్లో 17వ జాతీయ స్థాయి నాటికల పోటీల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణవర్మ మాట్లాడుతూ అడబాల థియేటర్ వెనుక భాగంలో ఉన్న స్థలంలో నాటిక పోటీలు నిర్వహించనున్నామన్నారు. అనంతరం మొదటి పత్రికను సంస్థ గౌరవ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావుకు అందజేశారు. కార్యక్రమంలో కేఎస్పీఎన్ వర్మ, మానాపురం సత్యనారాయణ, జక్కంపూడి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముదినేపల్లి రూరల్ : మట్టి లారీల వల్ల రోడ్లు ధ్వంసమవుతున్నాయంటూ మండలంలోని పెదగొన్నూరు గ్రామస్తులు లారీలను నిలిపివేసిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని రోజులుగా ప్రజాప్రయోజనాల కోసమంటూ టిప్పర్లతో గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు మట్టిని తరలిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల ఇటీవలనే నూతనంగా వేసిన రోడ్లు ధ్వంసమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ టిప్పర్లతో కాకుండా ట్రాక్టర్లతో మట్టిని తరలించాలని చెప్పినప్పటికీ టిప్పర్లతో తరలిస్తున్నందున రోడ్లు పాడైపోతున్నట్లు శ్రవణం బాలాజీ అనే గ్రామస్తుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికై నా ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ట్రాక్టర్లతోనే మట్టిని తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తణుకు అర్బన్: పూనేలో ఈ నెల 7,8 తేదీల్లో నిర్వహించిన జాతీయస్థాయి ఎండ్యూరెన్స్ స్కేటింగ్ పోటీల్లో తణుకుకు చెందిన క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు. తణుకు స్కేటింగ్ రేంజర్స్ అకాడమీలో శిక్షణ పొందిన తణుకుకు చెందిన కాకిలేటి గేయ దీపిక అండర్–8 బాలికల విభాగంలో మూడు బంగారు పతకాలు, అండర్–19 బాలుర విభాగంలో రెడ్డి పవన్ హర్షవర్థన్ రెండు బంగారు పతకాలు, ఒక వెండి పతకం, అండర్–7 విభాగంలో ఖండవల్ల మయాంక్ కాంస్య, అండర్–5 బాలికల విభాగంలో మండల నిహస్వి కాంస్య పతకం సాధించినట్లు కోచ్ లావణ్య శుక్రవారం విలేకరులకు తెలిపారు. వీరు త్వరలో మాల్దీవుల్లో నిర్వహించే అంతర్జాతీయ స్కేటింగ్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ద్వారకాతిరుమల: శ్రీవారి సన్నిధిలో మార్చి 20 నుంచి 23 వరకు రాష్ట్ర స్థాయిలో ఒంగోలు, పుంగనూరు జాతి ఆవుల అందాలు, పాల పోటీలను నిర్వహించనున్నట్టు గోజాతి సంరక్షణ రాష్ట్ర అధ్యక్షులు యు.చక్రపాణి తెలిపారు. ఈ మేరకు పోటీలు జరిగే మార్కెట్ యార్డు స్థలాన్ని శుక్రవారం ఆయన ఏఎంసీ చైర్మన్ వై.బ్రహ్మరాజుతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ద్వారకాతిరుమలలో గోసమ్మేళనం పేరుతో కొంత కాలంగా ఒంగోలు, పుంగనూరు జాతి గోవులకు అందాలు, పాల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. రైతులకు, పశువులకు అన్ని సౌకర్యాలను కల్పించి, పోటీల్లో గెలుపొందే గోవులకు బహుమతులను అందిస్తామన్నారు. జంగారెడ్డిగూడెం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా (పార్లమెంట్) జంగారెడ్డిగూడెంకు చెందిన బీవీఆర్ చౌదరి నియమితులయ్యారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా బీవీఆర్ చౌదరిని పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందించారు. -
ముగిసిన మావుళ్లమ్మ వార్షిక మహోత్సవాలు
● అమ్మవారికి మహానివేదన సమర్పణ ● అన్నసమారాధనకు పోటెత్తిన భక్తులు భీమవరం(ప్రకాశం చౌక్): దాదాపు నెల రోజుల నుంచి నీరుల్లి కూరగాయపండ్లు వర్తక సంఘం, అమ్మవారి ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీమావుళ్లమ్మ వారి 62వ వార్షిక మహోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారికి మహానైవేద్యం సమర్పించి, అన్నసమారాధన నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు, ఉత్సవ నిర్వాహకులు అమ్మవారికి పలు రకాల పిండి వంటలు, స్వీట్స్,పులిహోర తదితర వాటిని మహా నివేదనగా సమర్పించారు. రూ.1.45 లక్షలు పలికిన లడ్డూ ఉత్సవాలు సందర్భంగా అమ్మవారికి సమర్పించిన 36 కిలోల లడ్డును వేలం వేయగా భీమవరానికి చెందిన బోడపాటి చినబాబు అనే భక్తుడు రూ 1.45 లక్షలకు వేలం పాటలో దక్కించుకున్నారు. లక్ష మందికిపైగా అన్నప్రసాదం ఉత్సవాల ముగింపు సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు అమ్మవారి ఆలయం వద్ద అన్నదాన ప్రసాదం వితరణ నిర్వీరామంగా కొనసాగింది. భీమవరం పట్టణంతో పాటు జిల్లా నలుమూలు నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి అన్నదాన ప్రసాదం స్వీకరించారు. ప్రత్యేక క్యూలైన్లు ద్వారా భక్తులు అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని అన్నదాన ప్రసాదం స్వీకరించారు. మిగిలిన వారికి అమ్మవారి ఆలయం ముందు ఖాళీ ప్రదేశంలో భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆలయం పడమటివైపు తాలూకాఫీసు సెంటర్, దక్షిణంవైపు వేణుగోపాల స్వామి ఆలయం సెంటర్, ఆదివారం బజారు రోడ్డు, అన్నదానానికి వచ్చిన భక్తులతో కిక్కిరిసిపోయాయి. దాదాపు లక్ష మంది అన్నప్రసాదం తీసుకున్నట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. -
మహాశివరాత్రికి బలివే సిద్ధం
ముసునూరు: దేవదాయశాఖ ఆధీనంలో ఉన్న బలే శ్రీరామ లింగేశ్వర ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఏలూరు జిల్లాగా ఏర్పడిన తర్వాత నాలుగో ఏడాది ఈ నెల 14 నుంచి 18 వరకు ఐదు రోజులు పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న ప్రత్యేక అధికారిగా, సర్పంచ్ రావు ప్రవీణ సుధాకర్, ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మకంటి శ్యామలరావు, ఈఓ పామర్తి సీతారామయ్య నేతృత్వంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పిండ ప్రదానాలకు, అమావాస్య స్నానాల కోసం బలివే క్షేత్రంలో ఈ ఏడాది శాశ్వత జల్లు స్నానాలు, మహిళలకు ప్రత్యేక స్నాన ఘట్టాలు, రహదారుల వెడల్పుతో వన్ వే తరహా రాకపోకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే రెండు జిల్లాల సరిహద్దులో ఉన్న బలే రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న దృష్ట్యా మొత్తం 5 విభాగాలుగా నూజివీడు, ఏలూరు, సత్తుపల్లి ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. -
రెసిడెన్షియల్ శిక్షణ
●సీ, డీ గ్రేడుల విద్యార్థులకు 30 రోజుల ప్రణాళిక ●హాస్టళ్లలో ఉండి చదవాల్సిందేనని ఉన్నతాధికారుల హుకుంఏలూరు (ఆర్ఆర్పేట): ప్రభుత్వరంగ విద్యావ్యవస్థను కూటమి ప్రభుత్వం ఎంతగా భ్రష్టు పట్టించాలో? అంతగా భ్రష్టుపట్టిస్తోందని విద్యారంగ నిపుణులు విమర్శిస్తున్నారు. కొత్తకొత్త విధానాలను తెరపైకి తీసుకువచ్చి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెసిడెన్షియల్ శిక్షణ పేరుతో విద్యార్థులను కచ్చితంగా హాస్టల్స్లో ఉండి చదివించాల్సిందేనని తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఉపాధ్యాయులపై పలు యాప్ల బారం మోపడంతో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసి వాటికి నిధులు విడుదల చేయకపోవడంతో సొంత ఖర్చుతో ఉపాధ్యాయులు ఆయా కార్యక్రమాలను బలవంతంగా చేయాల్సి వచ్చింది. పదో తరగతి పర్యవేక్షణకు విద్యాశాఖ అధికారులను కాక విద్యారంగంపై ఏ మాత్రం అవగాహన లేని ఇతర శాఖల అధికారులను నియమించడం, ఇన్విజిలేషన్కు ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా నియమించాలని నిర్ణయం తీసుకోవడం విద్యారంగ నిపుణులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆచరణ సాధ్యంకాని నిర్ణయాలు తీసుకుంటూ వాటిని అమలు చేయాలని పీకల మీద కత్తిపెట్టడంతో ఉపాధ్యాయులు మనోవేదనకు గురవుతున్నారు. 30 రోజుల ప్రణాళిక పేరుతో... మార్చి 16 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అయితే విద్యార్థుల విద్యా ప్రమాణాలకు అనుగుణంగా వారిని ఏ, బీ, సీ, డీ గ్రేడులుగా విభజిస్తూ ప్రత్యేకంగా దృష్టి చదివిస్తూ ఉంటారు. తాజాగా పబ్లిక్ పరీక్షలు ముందున్న నేపథ్యంలో సీ, డీ గ్రేడుల విద్యార్థుల కోసం 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను తెరపైకి తీసుకువచ్చింది. వారిని బలవంతంగా చదివించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు, క్లస్టర్ ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. అలాగే విద్యార్థులను సైతం ప్రభుత్వ నిర్ణయం తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది. హాస్టల్స్కు రావాల్సిందే సీ, డీ గ్రేడు విద్యార్థులను బలవంతంగా చదివించడానికి రెసిడెన్షియల్ శిక్షణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు సీ, డీ గ్రేడ్ విద్యార్థులతో పాటు తరగతులకు ఎక్కువ రోజుల పాటు హాజరు కాని విద్యార్థులను గుర్తించి వారిని రెసిడెన్షియల్ శిక్షణకు హాస్టళ్లకు తరలించారు. విద్యార్థినులను ఏలూరుకు సమీపంలోని వట్లూరు గురుకుల బాలికల వసతి గృహానికి తరలించారు. అలాగే బాలురను నగరంలోని అమీనా పేటలో ఉన్న బీసీ బాలుర హాస్టల్కు తరలించారు. ఈ మేరకు ఏలూరు పరిధిలో 120 మంది విద్యార్థిని, విద్యార్థులను ఇప్పటికే ఆయా హాస్టళ్లకు తరలించి శిక్షణకు ఏర్పాటు చేశారు. మామూలుగానే చదువులో వెనుకంజలో ఉన్న విద్యార్థులు రెసిడెన్షియల్ శిక్షణ పెద్ద శిక్షగా భావిస్తున్నారు. తల్లిదండ్రులకు దూరంగా బలవంతపు చదువులు వారిని మానిసికంగా తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. కొంతమంది విద్యార్థులు ఇంటిపై, తల్లిదండ్రులపై బెంగ పెట్టుకుని రోధిస్తుండడంతో హాస్టళ్ల వార్డెన్లు వారిని ఇళ్లకు పంపేస్తున్నారు. మరికొంత మంది విద్యార్థులు కొత్త ప్రదేశంలో ఇమడలేక అనారోగ్యానికి గురవుతున్నారు. వారిని సముదాయించి అక్కడే ఉంచాలంటే విద్యాశాఖాధికారులకు సమస్యగా మారింది. ఇప్పటికై నా ప్రభుత్వం రెసిడెన్షియల్ శిక్షణపై పునరాలోచించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
సంచలనం రేకెత్తించిన విజిలెన్స్ దాడులు
తణుకు అర్బన్/ఇరగవరం: ఇరగవరం మండలం కంతేరు గ్రామంలో గురువారం నిర్వహించిన విజిలెన్స్ దాడుల్లో ఎరువులు, పురుగుమందుల అనధికార నిల్వల వ్యవహారం జిల్లాలో సంచలనం రేకెత్తించింది. సరుకు కొనుగోళ్లు చేసి ఎక్కడైనా అమ్మేసుకుంటాం అనే రీతిలో అనధికారిక గోడౌన్లో నిర్వహిస్తున్న బ్లాక్ వ్యాపారాన్ని విజిలెన్స్ అధికారులు బట్టబయలు చేశారు. ఈ దాడిలో కంతేరు గ్రామంలో దీవెన ఆగ్రో కెమికల్స్ పేరుతో నడుస్తున్న అనధికార గోడౌన్లో రూ. 80,01,059 విలువైన 22,893 కిలోల పురుగుమందులు, రూ. 14,34,142 విలువైన 26,474 మెట్రిక్ టన్నుల ఎరువుల బస్తాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎరువులు, పురుగుమందుల వ్యాపారం నిర్వహణ, అవసరమైన లైసెన్స్లు ఉన్నప్పటికీ గోడౌన్కు ఎటువంటి అనుమతి లేదని, వ్యవసాయాధికారుల నుంచి డోర్ నంబరుతో సహా తీసుకోవాల్సిన ధ్రువపత్రాలు లేవని గుర్తించారు. అలాగే ఎరువుల నిల్వల్లో తేడాలు ఉండడం వంటి కారణాలతో దీవెన ఆగ్రో కెమికల్స్ సంస్థ ప్రొప్రైటర్ గంటా సురేంద్రపై 6ఏ కేసు నమోదు చేశారు. వ్యవసాయాధికారుల నిర్లక్ష్య వైఖరి ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో గత సీజన్లో ఎరువుల కొరతతోపాటు అరకొర పంపిణీలో సైతం తమకు కావాల్సిన వారికి మాత్రమే ఇచ్చారంటూ రైతుల ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా తణుకు మండలం ముద్దాపురం సొసైటీలో టీడీపీ నాయకులు తమకు అనుకూలమైన వారికి ముందుగానే ట్రాక్టర్లలో ఎరువుల బస్తాలు ఎక్కించి వారి ఇళ్లలో నిల్వలు చేశారు. ఈ వ్యవహారాన్ని రైతులు నిలదీయడంతో గతేడాది అక్టోబరు నెలలో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. నాయకులు వ్యవసాయాధికారులను సైతం ప్రసన్నం చేసుకుని అధికంగా నిల్వలు చేసుకుంటారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అనధికార నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
మద్యం దోపిడీకి పచ్చజెండా
సాక్షి ప్రతినిధి, ఏలూరు: విచ్చలవిడి మద్యం దోపిడీకి మళ్ళీ తెరలేచింది. జిల్లాలో కొత్తగా పొలిటికల్ ఎమ్మార్పీ ట్రెండింగ్లోకి వచ్చింది. ఎమ్మార్పీ కంటే రూ.10 అదనంగా పెంచుకోవచ్చని ప్రభుత్వ ఉత్తర్వులతో మధ్యంతర దోపిడీకి ఒక వైపు తెరలేస్తే మరో రూ. 10 పొలిటికల్ ఎమ్మార్పీ అంటూ క్వార్టర్ సీసాపై రూ.20 అదనంగా వసూలు చేస్తున్నారు. బెల్టుషాపుల్లో నో రూల్స్. నో ఎమ్మార్పీ.. కూటమి చోటా నేతలు నిర్ణయించిందే ధర. సమీక్షా సమావేశాల్లో జిల్లా ఉన్నతాధికారులు ఎమ్మార్పీ ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు, లైసెన్స్ రద్దు అంటూ చేసే హడావుడి కేవలం ప్రకటనలకే పరిమితమవుతోంది. జిల్లాలో 155 వైన్షాపులు, 20 బార్లు కలిపి నెలకు సగటున రూ.120 కోట్ల నుంచి రూ.125 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ప్రతి వైన్షాపుకు అనుబంధంగా పదుల సంఖ్యలో బెల్టుషాపులు వెలిశాయి. గ్రామగ్రామాన మద్యాన్ని ఏరులై పారించడమే ఏజెండాగా బెల్టుషాపులకు తెరదీశారు. జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో బెల్టుషాపుల్లో విక్రయాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో ప్రత్యేక పొలిటికల్ ఎమ్మార్పీ, డ్రై డే ఇతర ప్రత్యేక రోజుల్లో ఇష్టానురీతిలో విక్రయించుకునేలా వ్యవస్థ ఏర్పాటు చేశారు. 7 నియోజకవర్గాల్లో వైన్షాపులు కూటమి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో, కొన్ని చోట్ల ప్రత్యక్ష భాగస్వామ్యంతో మరికొన్ని చోట్ల పరోక్ష భాగస్వామ్యంతో ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలో షాపుల ఏర్పాటు సమయంలోనే షాపులకు రూ.5 లక్షల నుంచి 10 లక్షల మేరకు విక్రయాలు, షాపు స్థాయిని బట్టి ధర నిర్ణయించి అధికార పార్టీ నేతలు వ్యాపారుల నుంచి వసూలు చేశారు. గతేడాది కొత్త లైసెన్స్లు అమలులోకి వచ్చినప్పటి నుంచే రూ.10 ఎమ్మార్పీ అదనంగా కొనసాగిస్తున్నారు. తాజాగా రూ.10 అదనంగా అమ్ముకోవచ్చని ఇచ్చిన జీవోను అడ్డం పెట్టుకుని రూ.20 వసూలు చేస్తున్నారు. ఇదంతా ఎకై ్సజ్ అధికారులకు తెలిసే కొనసాగిస్తున్నారు. ఊరూరా బెల్టుషాపులు ప్రతి వైన్షాపుకు అనుబంధంగా సగటున 40 నుంచి 60 బెల్టుషాపులు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యికి పైగా బెల్టుషాపులు అధికార పార్టీ నేతలే నిర్వహిస్తున్నారు. క్వార్టర్కు సగటున రూ.30 నుంచి రూ.50 వరకు అధికంగా విక్రయిస్తున్నారు. సమయపాలనతో సంబంధం లేకుండా విక్రయాలు జరుగుతున్నాయి. రెండు రోజులు క్రితం ముఖ్యమంత్రి ఐఎఎస్ అధికారులతో నిర్వహించిన ప్రగతి సమావేశంలోనూ దీనిపై చర్చ సాగింది. ఎమ్మార్పీ అధిక ధరలకు విక్రయాలు, బెల్టుషాపుల కట్టడి విషయంలో రాష్ట్రంలో జిల్లా 8వ స్ధానంలో ఉందని బెల్టుషాపులు లేకుండా, ఎమ్మార్పీకు విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సమీక్షలో సూచించారు. ప్రతి వైన్షాపుకు ఓ ధర నిర్ణయించి ఎకై ్సజ్ శాఖ నెలవారీ ప్రత్యేక వసూళ్లు కొనసాగిస్తుంది. దీనికిగాను అడపాదడపా డ్రై డేలు, జాతరలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో అదనంగా రూ.30 పెంచి అమ్ముకున్నా పట్టించుకోని పరిస్థితి. క్వార్టర్పై రూ.20 అదనం రూ.10 ప్రభుత్వ ధరకు మరో రూ.10 పొలిటికల్ ధర జిల్లాలో నెలకు సగటున రూ.120 కోట్ల మద్యం విక్రయాలు బెల్టు షాపుల్లో స్పెషల్ రేట్లు -
తల్లికి వంచన
నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టారు. ఆనక తొలి ఏడాదికి ఎగనామం పెట్టి.. ఇప్పుడు మండలి వేదికగా తల్లికి వందనం అందరికి ఇచ్చామంటూ చంద్రబాబు ప్రభుత్వం అసత్యాలు వల్లించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లికి చెందిన కె. మరియమ్మ తనయుడు ఇంటర్ చదువుతున్నాడు. తల్లికి వందనం పథకం కింద గత ఏడాది రూ.8,850 మాత్రమే అకౌంట్కు జమచేశారు. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ వాటా అని, త్వరలో కేంద్ర ప్రభుత్వ వాటా జమవుతుందంటూ మెసేజ్ వచ్చింది. ఎనిమిది నెలలు కావస్తున్నా మిగిలిన సొమ్ము రాలేదని ఆమె తెలిపారు. సాక్షి ప్రతినిధి,ఏలూరు: పేదరికం కారణంగా తమ బిడ్డలను చదువులకు దూరం చేయకూడదనే ఆశయంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మ ఒడి పధకాన్ని అమలు చేసి తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు చొప్పున వేసి చరిత్ర సృష్టించారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని తల్లి వందనం పేరుతో మార్చి అమలుచేస్తామని, ఎంత మంది పిల్లలుంటే అంతమందికి రూ.15 వేల చొప్పున ఖాతాల్లో వేస్తామని హామీలు ఇచ్చారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను తుంగలోతొక్కి సాంకేతిక కారణాలను సాకుగా చూపి అనేక మంది తల్లులకు తల్లికి వందనం పథకం దూరం చేసి వెన్నుపోటు పొడిచారు. అర్హులకు అందని సాయం జిల్లాలో తల్లి వందనం పథకం అమలులో పక్షపాతం చూపడంతో అర్హుల్లో అనేక మందికి ఈ పథకం దూరమైంది. ఇద్దరు బిడ్డలున్న తల్లులు తమకు రూ.30 వేలు వస్తాయని ఎదురుచూడగా ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో కూటమి ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారు. కేవలం వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఈ పథకానికి దూరమైనట్లు చర్చ జరుగుతోంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లోని అన్ని పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు విద్యాశాఖ రికార్డుల ప్రకారం 2,72,135 మంది ఉండగా తల్లికి వందనం పథకం కేవలం 2,38,434 మందికి మాత్రమే అమలు చేస్తున్నారు. మరో 33,701 మందికి ఈ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం దూరం చేసింది. దీనికితోడు పథకాన్ని అమలు చేసిన వారిలో సైతం ఎక్కువ మంది తల్లుల ఖాతాల్లో కేవలం రూ.8 వేల నుంచి రూ.10 వేలలోపు మాత్రమే వేయడంతో చంద్రబాబు చేతిలో తాము మరోసారి మోసపోయామని తల్లులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పథకం అందని వారిలో సుమారు 9 వేల మంది తమకు పథకాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. అయినప్పటికీ వారికి ఈ పథకాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది తల్లులు పథకానికి దూరం కావడంతో ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి సమావేశాల్లో ఈ విషయాన్ని సభ్యులు చర్చకు తీసుకురావడంలో మరోసారి తల్లికి వందనం పథకంపై రాష్ట్ర వ్యాప్తంగా తల్లుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయి అర్హులకు దక్కని సాయం సాంకేతిక కారణాలతో అందని తల్లికి వందనం 33,701 మందికి మొండిచేయి గ్రీవెన్స్లో 9 వేల దరఖాస్తులు జిల్లాలో 2.45 లక్షల మంది అర్హులు గ్రీవెన్స్లో 9 వేల దరఖాస్తులు -
పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలి
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి ఐఆర్ మంజూరు చేయాలని, సీపీఎస్ను రద్దు చేయాలని, మేనిపెస్టోలో పొందుపర్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఎస్టీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పీబీవిఎన్ఎల్ నారాయణ మాట్లాడుతూ తమ న్యాయబద్ధమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 11వ పీఆర్సీ గడువు పూర్తై 30 నెలలు కావస్తున్నా 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. దీనివల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి సరికాదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కేఆర్ పవన్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే పీఆర్సీ గడువుదాటి మూడు సంవత్సరాలు కావస్తుందని తక్షణమే కమిటీ నియమించి ఐఆర్ ప్రకటింపచేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల ధర్నాను సీపీఐ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, ఏఐటీయూసీ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు తదితరులు సందర్శించి మద్ధతు తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): రెండో శనివారం పాఠశాలలకు సెలవుపై జిల్లా విద్యాశాఖాధికారి భిన్న ప్రకటనలు చేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో గందరగోళ పరిస్థితి నెలకొందని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి గెడ్డం సుధీర్; జిల్లా అధ్యక్షుడు వీ. రామ్మోహన రావు ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తుఫాను ప్రభావం వల్ల ఇచ్చిన సెలవులో భాగంగా రెండో శనివారం ప్రతి పాఠశాల పని చేయాల్సి ఉండగా, శుక్రవారం మధ్యాహ్నం ఉపాధ్యాయ సంఘాల కోరిక మేరకు శనివారం సెలవుగా డీఈఓ ప్రకటించారన్నారు. అది కూడా 220 పనిదినాలకు సరిపోయే పాఠశాలలు సెలవు దినంగా ప్రకటించుకోవచ్చని తెలిపారన్నారు. తిరిగి సాయంత్రం ఏడు గంటల సమయంలో జిల్లాలోని అన్ని పాఠశాలలు శనివారం పనిచేయాలని ప్రకటిస్తూ, వాట్సప్లో మెసేజ్ పెట్టడం దారుణమన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి భిన్న ప్రకటనలతో గందరగోళం సృష్టించడాన్ని వివిధ ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు ఆయా సంఘాల నాయకులు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. ఏలూరు (మెట్రో): పది, ఇంటర్ పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్కి తెలిపారు. ఏపీ సచివాలయం నుంచి పరీక్షలు, ప్రభుత్వ సేవలపై ప్రజల సంతప్తి స్థాయి, కోర్టు భవనాల కోసం స్థలం, కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో స్థల సమస్యలు, తదితర అంశాలపై శుక్రవారం సాయంత్రం కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు పటిష్టమైన ప్రణాళిక రూపొందించుకుని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాను అవినీతి రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని అవినీతి నిరోధశాఖ డీఎస్పీ జీవీ కృష్ణారావు ఒక ప్రకటనలో కోరారు. ఫిర్యాదుదారుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అవినీతి సమాజమే లక్ష్యంగా ప్రజలంతా భాగస్వాములు కావాలని, జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా.. ఎక్కడైనా లంచం కోరితే వెంటనే ఏసీబీకి సమాచారం ఇవ్వాలని తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ 1064 లేదా 9440446157, 9440446159 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ డీఎస్పీ కోరారు. బలివే (ముసునూరు): భక్తులు బలివే రామలింగేశ్వర స్వామిని సులువుగా దర్శించుకుని తిరిగి క్షేమంగా వెళ్ళేలా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. బలివే ఆలయ ప్రాంగణంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చిన్న పొరపాటుకు తావు లేకుండా మహా శివరాత్రి ఉత్సవాలు కనుల పండువగా నిర్వహించాలన్నారు. -
ప్రాణాలైనా అర్పిస్తాం
● నేవీ ఆయుధ డిపో నిర్మాణం వద్దు ● పాలకుల కుట్రలు తిప్పికొడదాం ● మా భూములు ఇచ్చేది లేదు ఏలూరు(టూటౌన్): నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి మా భూములు ఇవ్వం.. ప్రాణాలైనా అర్పిస్తాం.. నేవీ ఆయుధ డిపో నిర్మాణాన్ని అడ్డుకుంటామంటూ కొయ్యలగూడెం మండల ప్రజలు నిరసనగళం ఎత్తారు. కొయ్యలగూడెం మండలం బోడిగూడెం, బర్కిత్నగర్లో నావిక ఆయుధ డిపో నిర్మాణం నిలిపివేయాలని, బలవంతపు భూసేకరణ విరమించాలని కోరుతూ శుక్రవారం ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద బోడిగూడెం, మంగపతి దేవి పేట, బర్కిత్ నగర్,రే గులకుంట, ఊట్లగూడెం గ్రామాల నుంచి ప్రజలు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి కలెక్టరేట్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, పలు ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ ధర్నాను ఉద్దేశించి అక్కినేని వనజ మాట్లాడుతూ జీలుగుమిల్లి మండలం వంకావారిగుడిలో నేవీ ఆయుధ డిపో పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నించిందని, వామపక్షాలు స్థానిక ప్రజలు సాగించిన పోరాటంతో అక్కడి నుంచి కొయ్యలగూడెం మండలం బోడిగూడెం కేంద్రంగా మంగపతి దేవి పేట, బర్కిత్ నగర్, రేగులకుంట, ఊట్లగూడెం పరిధిలో పెట్టాలని చూస్తుందని తెలిపారు. మండలంలోని ప్రజానీకం, రైతులు భూములు ఇవ్వం అని తేల్చి చెబుతున్నా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఆయుధ డిపో నిర్మాణానికి ప్రభుత్వం పూనుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ నేవీ ఆయుధ డిపో నిర్మాణం పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, బలవంతపు భూసేకరణ తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. నేవీ ఆయుధ డిపో నిర్మాణం జరిగితే పచ్చని పొలాలలో వరి, మొక్కజొన్న, పొగాకు తదితర రెండు పంటలు పండే సారవంతమైన భూములు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు సంసాని కిషోర్, ఇళ్ల శ్రీరామమూర్తి, బలుసు నాగేశ్వరరావు మాట్లాడుతూ నేవీ ఆయుధం డిపో నిర్మాణంతో రెండు పంటలు పండే సారవంతమైన కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్వయంగా పంట పొలాలను సందర్శించి వాస్తవాలను పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. సీపీఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, కౌలు రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ, కొయ్యలగూడెం మండలం కార్యదర్శి తాడిగడప ఆంజనేయరాజు, సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి అరటికట్ల రవి, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి (అన్నే భవన్) కే. శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అటకెక్కించారు
ఎన్నికల సమయంలో మీకు రూ.15 వేలు.. మీకు రూ.15 వేలు అంటూ కనిపించిన వారందరికీ గొప్పగా చెప్పారు. గద్దెనెక్కిన తరువాత తల్లి వందనం ఎగనామం పెట్టారు. కొందరికి కొర్రీలు పెట్టారు. నిరుద్యోగ భృతి, 50 ఏళ్ళు దాటిన వారికి పింఛన్ నెరవేర్చలేదు. ఎన్నికల హామీపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. – దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు టీడీపీ ఎన్నికల ముందు తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరం అసలు పథకాన్నే అమలు చేయలేదు. ఇచ్చింది కేవలం రూ.13 వేలు మాత్రమే. కొందరికి రూ.6 వేలు, రూ.7 వేలు మాత్రమే ఇచ్చారు. వచ్చే సంవత్సరం అసలు ఈ పథకం అమలు చేస్తారో లేదోననే అనుమానంతో ప్రజలు ఉన్నారు. మొదటి సంవత్సరం తల్లికి వందనం నగదును కూడా ఇస్తే ప్రజలు సంతోషిస్తారు. – మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటినా అది అవాస్తవమని తేలిపోయింది. అర్హులైన చాలా మందికి తల్లికి వందనం అందడం లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మ ఒడి పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం తల్లి వందనం పేరుతో తల్లులను, పిల్లలను మోసం చేస్తున్నారు. – తెల్లం బాలరాజు, పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త -
ఎదురుదాడి చేస్తున్నారు
ప్రభుత్వం సమర్థవంతంగా పథకాలు అమలు చేయకుండా అడిగిన వారిపై ఎదురుదాడి చేయడం దారుణం. తల్లికి వందనం పేరుతో అందరినీ మోసం చేస్తున్నారు. డబ్బులు పూర్తిగా తల్లుల ఖాతాల్లో జమ చేయడం లేదు. ఏదొక కారణం చెప్పి కోతలు పెడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారంగా సొమ్ములు చెల్లించడంలేదు. – పుప్పాల వాసుబాబు, ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త తల్లికి వందనం అమలు తీరు బాధాకరం. ఎన్నికల సమయంలో ఆకర్షించేలా నీకు 15 వేలు.. నీకు 15 వేలు అంటూ వాగ్దానాలు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ పథకాన్ని ఎలా అమలు చేస్తున్నారో తల్లులు గమనిస్తున్నారు. హామీలు ఇచ్చిన వారందరూ మౌనంగా ఉన్నారు. హామీలు ఇచ్చినవారు స్పష్టమైన ప్రకటన చేయాలి. – కొఠారు అబ్బయ్యచౌదరి, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం ప్రకటించి అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరంలో ఒక్క రూపాయి కూడా తల్లుల ఖాతాల్లో జమ చేయలేదు. రెండో సంవత్సరం ప్రకటించిన రూ.15 వేలు కాకుండా తగ్గించి కొంతమందికి రూ. 13వేలు ఖాతాలో జమ చేశారు. కొన్నిచోట్ల అసలు ఒక రూపాయి కూడా వేయలేదు. ఇలా ప్రతి పథకంలోనూ మోసం చేశారు. కంభం విజయరాజు, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినవన్ని పచ్చి అబద్ధాలు. ఎన్నికల సమయంలో అమలు కాని హామీలు ఇస్తారు. తీరా గద్దెనెక్కిన తరువాత వాటిని అమలు చేయరు ఇది చంద్రబాబు నైజం. తల్లి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి అర్హులైన వారికి ఇస్తానని హామీ ఇచ్చారు. మరోసారి చంద్రబాబు అబద్ధాల కోరని తేలిపోయింది. – మామిళ్ళపల్లి జయప్రకాష్, ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త -
పట్టిసంలో పటిష్ట బందోబస్తు
పోలవరం రూరల్: పట్టిసంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు 550 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ అన్నారు. పట్టిసీమలో మహాశివరాత్రి ఉ త్సవాలకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయం, ఇసుక తిన్నెలు, రేవులో ఏర్పాట్లపై సూచనలిచ్చారు. ఆయన వీరేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏటిగట్టు రోడ్డులో ట్రాఫిక్కు అంతరాయం లేకుండా పర్యవేక్షించాలన్నారు. ట్రైనీ ఐఎఫ్ఎస్ కృష్ణచైతన్య, ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, ఏఎస్పీ సుస్మిత రా మనాథన్, డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, సీఐ బాల సురేష్బాబు, ఎస్సై పవన్కుమార్ ఉన్నారు. -
కదం తొక్కి.. లేబర్ కోడ్లపై గళమెత్తి..
● గర్జించిన కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాలు ● భారీ ప్రదర్శనలు, నిరసన ర్యాలీలు ● లేబర్ కోడ్లు రద్దు చేయాలంటూ డిమాండ్ ఏలూరు (టూటౌన్): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరు తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం జరిగిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో వేలాది మంది కార్మికులు పాల్గొని విజయవంతం చేశారు. భారీ ప్రదర్శనలతో హోరెత్తించారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో, ఆర్ఆర్పేట ఎన్టీఆర్ పార్కు వద్ద ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఏలూ రు జిల్లాలో బ్యాంకులు, బీమా, బీఎస్ఎన్ఎల్ తదితర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డా యి. కార్మికులు సమ్మెలో ఉండటంతో పలు పరిశ్రమలు నడవలేదు. అంగన్వాడీ, ఆశావర్కర్లు, ము న్సిపల్, హమాలీ వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో, రవాణా కార్మికులు, మెడికల్ రిప్స్, ఎల్ఐసీ ఏజెంట్లు, రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆర్టీసీ, విద్యుత్ సంస్థల్లో పనిచేసే కార్మికులు సంఘీభావం తెలిపారు. కార్మికుల మెడకు ఉరితాడే.. లేబర్ కోడ్స్ అమలు చేయడం అంటే కార్మికుల మెడకు ఉరుతాడు వేయడమే అని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరావు అన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జూట్ మిల్లు సెంటర్ నుంచి భారీ ప్రదర్శన జరిగింది. కార్మికులు విన్నూతంగా ఉరి బిగించుకుని నిరసన తెలిపారు. కలెక్టరెట్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ పార్క్ వద్ద జరిగిన సభలో ఐఎఫ్టీయు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జాతీయ నాయకురాలు అక్కినేని వనజ మా ట్లాడుతూ లేబర్ కోడ్లపై మండిపడ్డారు. కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల నిరసన అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్జీఈఎఫ్), ఏపీఎన్జీఓస్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు జిల్లా ఎన్జీజీఓ, జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాతీయ సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఏలూరులోని కలెక్టరేట్ వద్ద భోజన విరామ సమయంలో ఉ ద్యోగులు నిరసన తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి ఎం. సరస్వతి, జిల్లా కార్యదర్శి నెరుసు రామారావు పాల్గొన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏలూరులో జరిగిన నిరసన కార్యక్రమాలకు వైఎస్సార్సీపీ ఏలూరు ని యోజకవర్గ ఇన్చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ), మాజీ ఎమ్మెల్యే, దెందులూరు నియోజకవర్గ ఇన్చార్జి కొఠారు అబ్బయ్యచౌదరి సంఘీభా వం తెలిపారు. కార్మికుల శ్రమదోపిడీకి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పోరాడుతుందని తెలిపారు. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు గుడిదేసి శ్రీనివాస్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్, రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి భాస్కర్ల శంకర్ బాచి, సత్యనారాయణ, బసవ, రవలిశెట్టి శ్రీనివాస రావు, ఉయ్యాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): స్క్రాప్ ఎలక్ట్రిసిటీ (ఎమెండ్మెంట్) బిల్–2025కు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు గురువారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆర్ఆర్పేటలోని విద్యుత్ భవన్ వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ విద్యుత్ రంగాన్ని, విద్యుత్ వనరులను ప్రైవేటీకరించేందుకు తీసుకువచ్చిన ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ చట్టంతో ఉద్యోగులతో పాటు వినియోగదా రులకు నష్టం జరుగుతుందన్నారు. -
బలివే ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
ముసునూరు: బలివే మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తుల సౌకర్యాలు, భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని జేసీ అభిషేక్ గౌడ్ అన్నారు. ఉత్సవాల ప్రత్యేకాధికారి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న అధ్యక్షతన గురువారం ఆలయం వద్ద సమీక్షా సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ గతేడాది కంటే అధికంగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల పుణ్యస్నానాలు, పిండ ప్రదానాలు, అభిషేకాలు, దైవ దర్శనానికి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ మాట్లాడుతూ 400 మంది పోలీసులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు, సెక్యూరిటీ సిబ్బంది, సీసీ కెమెరాల నిఘాతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామన్నారు. డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్తో కలిసి ఆలయ ప్రాంగణం లోపల, వెలుపల క్యూలైన్లు, ప్రసాద కౌంటర్లు, పందిళ్లను పరిశీలించారు. ట్రైనీ ఐపీఎస్ జయసింహ, సర్పంచ్ రావు ప్రవీణ సుధాకర్, ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మకంటి శ్యామలరావు, తహసీల్దార్ ప్రశాంతి, ఈవో పామర్తి సీతారామయ్య, సీఐ రామకృష్ణ, ఎస్సై ఎం.చిరంజీవి ఉన్నారు. జేసీ అభిషేక్ గౌడ్ -
ఎంపీహెచ్ఏల ఎంపికలో అవకతవకలు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సుప్రీంకోర్టు తీర్పును సైతం బేఖాతరు చేస్తూ మల్టీపర్సస్ హెల్త్ అసిస్టెంట్ (ఎం) పోస్టులను ఎంపిక చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీం తీర్పులో జీఓ 1207 మేరకు ఉద్యోగాల నుంచి తొలగించిన ఎంపీహెచ్ఏ (ఎం) సిబ్బందిని పునర్నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే జిల్లాలో అర్హులకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి 104 మందిని పునర్నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేర కు ఏలూరు జిల్లా అధికారులు ఈనెల 4న 41 మందితో జాబితా విడుదల చేశారు. మరోసారి 10న 43 మందితో జాబితా సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపారు. అయితే ఈ జాబితాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రూపొందించిన జా బితాలో పీఎన్వీ సత్యనారాయణ (68) రిటైర్డ్ కాగా, పీఎన్వీ పెద్దిరాజు మరణించారని చెబుతున్నారు. ఇక 273 జీఓలోని మరో ఇద్దరు లక్ష్మయ్య, శ్రీను అనే వారిని ఎంపిక చేయటంపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 1207 జీఓ మేరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 104 మంది జాబితాలో 39వ పేరుతో తణుకు మండలం పైడిపర్రుకి చెందిన ముప్పిడి రత్నరాజుకు జాబితాలో చోటులేదని బాధితుడు వాపోతున్నాడు. తాను గతంలో అనారోగ్యంతో సెలవులో ఉన్నాననీ, మెడికల్ సర్టిఫికెట్లు సైతం అప్పట్లో ఏలూరు వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సమర్పించానని చెబుతు న్నాడు. అయినా తన పేరును జాబితాలో పెట్టకపోవటంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాననీ, న్యాయం చేయాలని రత్నరాజు కోరుతున్నారు. -
కొల్లేరులో కూటమి రాక్షస రాజ్యం
ప్రకృతి అందాలకు నెలవైన కొల్లేరులో కూటమి రాక్షస రాజ్యం సాగుతోంది. పెద్దల కట్టుబాట్లతో ఆచార సంప్రదాయాలు పాటిస్తూ ప్రశాంత జీవనం సాగిస్తున్న లంక గ్రామాల్లో కూటమి నేతలు చిచ్చురేపుతున్నారు. విభజించు.. పాలించు సిద్ధాంతంతో పెట్రేగిపోతున్నారు. ప్రశ్నించిన సర్పంచులపై మూకుమ్మడి దాడులకు పాల్పడుతున్నారు. గతంలో ఎన్నికల సమయంలోనే ఇక్కడ రాజకీయాలు ఉండేవి. ఆ తర్వాత అందరూ కలిసిమెలిసి జీవనం సాగించేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిలదీసిన వారిపై రౌడీమూకలతో దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. అక్రమ పోలీసు కేసులతో భీతావహ వాతావరణం సృష్టిస్తూ పైశాచికానందం పొందుతున్నారు. సాక్షి, టాస్క్ఫోర్స్: వేంగి–చాళుక్యుల పాలన నుంచి కొల్లేరు ప్రాంతానికి విశిష్ట స్థానం ఉంది. పూర్వపు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 44 దిబ్బలను కొల్లేరు ప్రాంతంగా పరిగణించారు. ఇక్కడి ప్రజలు కొల్లేటికోట పెద్దింట్లమ్మను ఆరాధిస్తారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 9 మండలాల్లో 122 గ్రామాల్లో కొల్లేరు ప్రాంతం విస్తరించి ఉంది. ఏలూరు, కై కలూరు, దెందులూరు, ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాల్లో 80 వేల కుటుంబాలతో సుమారు 3.20 లక్షల మంది జనాభా ఉన్నారు. కొల్లేరు అభయారణ్యాన్ని 77,138 ఎకరాలుగా నిర్ధారించారు. కట్టుబాట్లకు తూట్లు కొల్లేరు గ్రామాల్లో ప్రభుత్వానికి సమాంతరంగా ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. గ్రామ జనాభాను బట్టి బంటాలుగా విభజిస్తారు. ఒక్కో బంటాలో 100 నుంచి 50 మంది సభ్యులు ఉండవచ్చు. బంటాకు ఒక నాయకుడు ఉంటాడు. గ్రామంలో అన్ని బంటాలకూ కలిపి పెద్ద వడ్డీ అనే వ్యక్తి నాయకత్వం వహిస్తాడు. ఇతనికి అనుబంధంగా క్యాషియర్, గుమాస్తా, బంట్రోతులు ఉంటారు. కొల్లేరులో చేపల చెరువుల పాటల ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామావసరాలు, పెద్ద వడ్డీ, సిబ్బంది జీతాలకు ఉపయోగిస్తారు. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు ఉన్నా పెద్ద వడ్డీ నిర్ణయానికి లోబడి పనిచేయాల్సి ఉంటుంది. గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే పోలీస్స్టేషన్ల వరకు వెళ్లకుండా రూ.1,000 నుంచి రూ.50 వేల వరకు నగదును తప్పుగా కట్టాల్సి వస్తుంది. సైదు గంగరాజు స్ఫూర్తి ఇదేనా.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొల్లేరు పేరు చెప్పగానే పూర్వం ఠక్కున గుర్తుకొచ్చే పేరు దివంగత సైదు గంగరాజు. కొల్లేరు వడ్డీ సామాజికవర్గానికి చెందిన ఆయన అందరూ ఐకమత్యంగా ఉంటూ అభివృద్ధి సాధించాలని కోరుకున్నారు. నేడు ఆయన ఆశయానికి కూటమి సర్కారు తూట్లు పొడుస్తోంది. ఐక్యతకు మారుపేరైన గ్రామాల్లో రక్తపుటేరులు పారిస్తోంది. హామీలపై ప్రశ్నిస్తే గ్రామస్తులనే పావులుగా చేసుకుని సొంత మనుషులపైనే మూకుమ్మడిగా దాడులు చేయిస్తోంది. పోలీసు స్టేషన్లలో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునేలా విభేదాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకుంటోంది. కేవలం కొల్లేరు అభయారణ్య చెరువుల పేరుతో సాగుతున్న మైండ్ గేమ్లో కొల్లేరు గ్రామాల్లోని అమాయక బిడ్డలు బలవుతున్నారు. గత నెలలో ఎన్నికల హామీలపై ప్రశ్నిస్తూ, సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు నత్తగుళ్లపాడు సర్పంచ్ ముంగర రామకృష్ణరాజుపై మూకుమ్మడి దాడి జరిగింది. రౌడీ మూకలు ఆయన ఇల్లు ధ్వంసం చేశారు. తిరిగి సర్పంచ్పైనే పోలీసులు కేసు నమోదు చేశారు. 2025 మేలో రాజకీయ నాయకుల మాటలు విని కొందరు మహిళలు చటాకాయి సర్పంచ్ ఘంటసాల శేషారావుపై కమ్యూనిటీ హాలు వద్ద దాడి చేశారు. దీంతో కొద్దిరోజులకే మనస్తాపంతో సర్పంచ్ మృతి చెందారు. 2025 జూలైలో రాజుల కొట్టాడలో వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్నారని సర్పంచ్ కొల్లాటి పద్మావతి, శ్రీనుల కుమారుడు, బంధువులపై ఇదే గ్రామంలో కూటమి నేతలు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 2025 ఆగస్టులో నత్తగుళ్లపాడు యువతిని చటాకాయి యువకుడు ప్రేమించి తీసుకెళ్లాడు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం. వారిద్దరినీ తీసుకొస్తుండగా శ్రీపర్రు వద్ద కారు ఆపి నత్తగుళ్లపా డుకు చెందిన వ్యక్తులు ఇతరులతో కలిసి చ టాకాయిలో ముగ్గురు పెద్దలపై దాడి చేశారు. ఐక్యతకు తూట్లు నిలదీసిన సర్పంచులపై మూకుమ్మడి దాడులతో బీభత్సం విభజించు.. పాలించు విధానం అమలు లంక గ్రామాల్లో కట్టుబాట్లకు చెల్లుచీటీ వారిలో వారికే విభేదాలు సృష్టించి పైశాచికానందం పనికిమాలిన రాజకీయాలను పక్కన పెట్టి కష్టాల్లో ఉన్న కొల్లేరు ప్రజల సంక్షేమం కోసం కృషి చేయండి. నత్తగుళ్లపాడు సర్పంచ్పై దాడి దురదృష్టకరం. కట్టుబాట్ల గ్రామం అనే నానుడికి ఇటువంటివి మచ్చ. కొల్లేరు నాయకులు కళ్లు తెరవాలి. పూర్వ వైభవాన్ని పునరుద్ధరించుకోవాలి. – చింతపల్లి వెంకటనారాయణ, కొల్లేరుపై పుస్తక రచయిత, కై కలూరు -
పది సూత్రాలు పాటిస్తే విజయం మీదే
పరీక్షల్లో విజయం సాధించాలంటే విద్యార్థులు పది సూత్రాలు పాటించాలి. రోజు, వారం, నెల వారీగా చదువుకు ప్రణాళిక రూపొందించుకోవాలి. తెలియని విషయాలను ఉపాధ్యాయల నుంచి తెలుసుకోవాలి. అర్థమైనవి పదేపదే చదవాలి. గతంలో నమూనా పరీక్షల ఆధారంగా ప్రణాళిక వేసుకోవాలి. పునశ్చరణ చేసుకోవాలి. మంచి దస్తూరీ అలవరుచుకుని నిర్ణీత సమయంలో పరీక్ష ముగించడానికి కృషి చేయాలి. సెల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం, సరైన నిద్ర ఉండాలి, అన్ని సబ్జెక్టులకు సమాన సమయాన్ని కేటాయించాలి. వ్యక్తిగత లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటిని సాధించాలనే కసితో చదవాలి. – అక్కింశెట్టి రాంబాబు, సైకాలజిస్ట్ -
ఆరోగ్యకరమైన ద్రవ పదార్థాలు తీసుకోవాలి
వచ్చేది వేసవి కాలం కావడంతో ఘన పదార్థాలు శరీరానికి పెద్దగా సహించవు. డీహైడ్రేషన్తో వాంతులు, విరోచనాలతో ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంటుంది. అటువంటి సమయంలో ఆరోగ్యకరమైన ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా మంచినీరు, కొబ్బరి నీరు, పండ్ల రసాలు, మజ్జిగ, రాగిజావ వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అలాగే రోజుకు కనీసం 8 గంటలు గాఢనిద్రకు కేటాయించాలి. ప్రతిరోజూ కొద్ది సమయం యోగ, ధ్యానం సాధనకు కేటాయించాలి. – డాక్టర్ ఎంఎల్వీ ప్రసాద్, ఆంధ్రా హాస్పిటల్స్ డైరెక్టర్ -
విధులకు హాజరై.. తిరిగి వెళుతూ..
● ఆర్ఎంవో డాక్టర్ తాతారావు గుండెపోటుతో మృతి ● శోకసంద్రంలో తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి వైద్య సిబ్బంది తణుకు అర్బన్ : తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ అందే వెంకట రమా సత్య తాతారావు (56) గుండెపోటుతో మృతిచెందారు. బుధవారం ఉదయం విధుల్లోకి వచ్చిన ఆయన ఓపీలో రోగులకు వైద్యసేవలందించారు. అనంతరం వైద్య సిబ్బందికి సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. అనంతరం గుండెల్లో కొంచెం మంటగా ఉందంటూ ఆస్పత్రిలో ఈసీజీ తీయించుకుని నార్మల్గా ఉందని నిర్ధారించుకుని ఇంటికి వెళ్లిపోతానని నిడదవోలుకు కారులో స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరారు. ఉండ్రాజవరం దాటిన తర్వాత గుండెపోటు రావడంతో అకస్మాత్తుగా కారు అదుపు తప్పి రోడ్డు మార్జిన్లోని పిల్లకాలువ పక్కకు వెళ్లి నిలిచిపోయింది. స్థానికులు వెంటనే కారు అద్దాలు పగులగొట్టి కిందకు దించి సీపీఆర్ చేసి అక్కడ నుంచి నేరుగా ఆయన్ను తణుకులో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన కన్నుమూసినట్టు వైద్యులు నిర్ధారించారు. గతేడాది జూన్లో సాధారణ బదిలీల్లో భాగంగా తాడేపల్లిగూడెం ఇన్చార్జ్ సూపరింటెండెంట్గా ఉన్న ఆయన తణుకు ఆర్ఎంఓగా విధుల్లో చేరారు. శోకసంద్రంలో ఆస్పత్రి వర్గాలు తాతారావు ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేక ఆస్పత్రి వర్గాలు శోకసంద్రంలో నిలిచారు. తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆవరణలో ఉంచిన ఆయన భౌతికకాయాన్ని వైద్యవర్గాలు సందర్శించాయి. తాడేపల్లిగూడెం ఆర్టీవో కౌసర్ భానో ఆస్పత్రికి వచ్చి తాతారావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.సాయికిరణ్తోపాటు తహసీల్దార్ దండు అశోక్వర్మ, వైద్యులు, సిబ్బంది డాక్టర్ తాతారావుకు నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులు నిడదవోలులోని ఆయన నివాసానికి తాతారావు భౌతికకాయాన్ని అంబులెన్స్లో తరలించారు. ఆయనకు భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలోను, చిన్న కుమార్తె వైజాగ్ ఆస్పత్రిలో మెడిసిన్ విద్యనభ్యసిస్తున్నారు. ఆస్పత్రికి వెళ్దామన్నా వద్దన్న వైనం తణుకులో కార్డియాలజిస్ట్కు చూపించుదామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాయికిరణ్ పట్టుబట్టినా.. మా డాక్టరు దగ్గరకు వెళ్తానని బలవంతంగా బయలుదేరినట్లుగా ఆస్పత్రి వైదులు చెబుతున్నారు. గతంలోనే గుండెకు రెండు స్టంట్స్ పడటంతో అశ్రద్ధ వద్దని అన్నా వినలేదని వాపోయారు. ‘మనిషి ప్రాణం ఎంతో విలువైనది. ఆస్పత్రికి వచ్చే రోగికి అత్యవసర వైద్యం అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు విలువైన వైద్యం సత్వరమే అందించగలిగితే ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వారవుతారు. అందుకోసం ప్రతి ఒక్కరూ వైద్యసేవలో అప్రమత్తంగా ఉండాలి.’ బుధవారం మధ్యాహ్నం వైద్య సిబ్బందికి నిర్వహించిన సమావేశంలో ఆయన ఇచ్చిన చివరి సందేశం. -
సస్యరక్షణతో మామిడిలో అధిక దిగుబడులు
నూజివీడు: రైతులు మామిడి తోటల్లో సస్యరక్షణ చర్యలను చేపట్టడం ద్వారా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవ్చని ఉద్యాన అధికారి ఆర్ హేమ పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో మామిడి తోటలను సందర్శించిన ఆమె మామిడి తోటల సస్యరక్షణపై రైతులకు పలు సూచనలు చేశారు. మామిడి తోటల్లో పూతమీద తేనెమంచు పురుగు ఆశించినట్లయితే, నివారణకు అజారక్టిన్ 3000 పీపీఎం 2ఎంఎల్ లీటరు నీటికి, బుప్రోపెజన్ 25 ఈసీ 1.5 ఎంఎల్ లీటరు నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 ఎంఎల్ లేదా థయామిథాక్సాన్ 25 శాతం 0.3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. తామర పురుగుల నివారణకు నీలి రంగు జిగురు అట్టలు 40 నుంచి 50 వరకు తోటల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. వేపనూనె 3000 పీపీఎం 2ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. పోంగామియా సోప్ 7.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని, ఎసిఫేట్ 75 ఎస్పీ 1.5 గ్రాములు లీటర్ నీటికి లేదా ఫిప్రోనిల్ 5 ఈసీ 2ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా తామర పురుగులను నివారించుకోవచ్చన్నారు. బూడిద తెగులు నివారణ ఇలా.. నీటిలో కరిగే గంధకం 3 గ్రా లేదా హెక్సాకొనజోల్ 2 ఎంఎల్ లేదా అజాక్సిస్ట్రోబిన్ 1ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పక్షికన్ను తెగులు సోకితే.. నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా కార్బండిజమ్ 1 గ్రాము, మాంకోజబ్ 2.5 గ్రాములు కలిపి లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మసిమంగు నివారణకు ఎమామెక్టిన్ బెంజీయేటర్ 0.4 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకులపై మసిని తొలగించుటకు 2 కిలోల గంజి పొడిని గోరువెచ్చని 3 నుంచి 4 లీటర్ల నీటిలో కలిపి ఉడికంచిన తరువాత మిగులు నీరుపోసి 100 లీటర్ల గంజి ద్రావకం తయారు చేసి తెగులు కనిపించిన భాగాలపై ఎండ బాగా ఉన్న రోజల్లో పిచికారీ చేయాలి. 4–5 రోజుల తరవాత నీటిని పిచికారీ చేస్తే చాలా వరకు మసి రంగు పోతుందని ఉద్యాన అధికారి హేమ తెలిపారు. పాడి–పంట -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
బుట్టాయగూడెం: మోటార్సైకిల్ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెం సమీపంలోని కనకదుర్గమ్మ అమ్మవారి గుడి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అశ్వారావుపేటకు చెందిన నరాలశెట్టి నాగేశ్వరరావు (52) బుధవారం సొంత పనిమీద ద్విచక్రవాహనంపై జీలుగుమిల్లి వెళ్లి తిరిగి వస్తుండగా తాటాకులగూడెం సమీపంలోని కనకదుర్గమ్మ అమ్మవారి గుడి సమీపంలో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై క్రాంతికుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి నాగేశ్వరరావు భార్య నాగమల్లేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నాగేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మృతుడి స్వగ్రామం బాపట్ల జిల్లా అని ఉద్యోగ రీత్యా అశ్వారావుపేటలో హార్టికల్చడ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్లు నాగమల్లేశ్వరి ఫిర్యాదులో పేర్కొన్నారు. -
పాత విధానాన్నే కొనసాగించాలి
పాత కార్మిక చట్టాల ప్రకారం అమల్లో ఉన్న 8 గంటల పని విధానాన్ని యధావిధిగా కొనసాగించాలి. దాన్ని 12 గంటలకు పెంచడం వల్ల కార్మికులు నష్టపోతారు. జాతీయ కనీస వేతనం రోజుకు రూ.178 ప్రకటించడం అన్యాయం. దీని వల్ల వేతనాలు పెరగకపోగా తగ్గుతాయి. దేశంలోనే వేతనం తక్కువుగా ఉన్న రాష్ట్రాన్ని కొలమానంగా తీసుకోవడం అన్యాయం. – డీఎన్వీడి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ, ఏలూరు జిల్లా ఇప్పటి వరకు ఏడుగురుతోనే ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ జరిగేది. తాజాగా లేబర్కోడ్ల ప్రకారం కనీసం 100 మంది లేదా 10 శాతం మంది కార్మికులు ఉండాలని మార్చడం దుర్మార్గం. పరిశ్రమల లేఆఫ్, లాకౌట్, మూసివేతకు వంద మంది కార్మికులు ఉన్నా ప్రభుత్వ అనుమతులు ఉండాలనే నిబంధనను మార్చడం సరికాదు. – బండి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు, ఏఐటీయూసీ, ఏలూరు జిల్లా ఒక కాంట్రాక్టరు కింద ఇంతవరకు 20 మంది కార్మికులు పనిచేస్తే ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్, కనీస వేతనాలతో సహ అన్ని హక్కులు వర్తించాయి. దానిని ఇప్పుడు 50 మందికి మార్చడంతో భవిష్యత్తులో కాంట్రాక్ట్ కార్మికులకు ఏ చట్టాలు వర్తించని పరిస్థితులు నెలకొన్నాయి. లేబర్ కోడ్ల కారణంగా అనేక రాష్ట్రాల్లో ఉన్న సంక్షేమ బోర్డులు రద్దవనున్నాయి. – బద్ధా వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి, ఇఫ్టూ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా -
పట్టిసం ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన
సస్యరక్షణతో అధిక దిగుబడులు రైతులు మామిడి తోటల్లో సస్యరక్షణ చర్యలను చేపట్టడం ద్వారా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవ్చని ఉద్యాన అధికారులు సూచిస్తున్నారు. 8లో uపోలవరం రూరల్: పట్టిసం మహాశివరాత్రి ఉత్సవాలలో సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 15న పట్టిసీమలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడతో కలిసి బుధవారం పట్టిసం రివర్ ఇన్లో సమీక్షించారు. క్యూలైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా త్వరితగతిన దర్శనం కలిగేలా క్యూలైన్లు నిర్వహించాలన్నారు. ఆలయం వద్ద, ప్రధాన రహదారుల్లో రాకపోకలకు అంతరాయం కలగకుండా, తొక్కిసలాట జరగకుండా ట్రాఫిక్ నియంత్రణ, బారికేడ్ల ఏర్పాటు చేపట్టాలన్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు, ప్రథమ చికిత్స శిబిరాలు, ముఖ్యంగా గోదావరి వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. నదిని దాటించే సమయంలో ఫెర్రీ వద్ద ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నది వెంట 108 వాహనాలు, వైద్య కేంద్రాలు, మోటారు బోట్లు, గత ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఆర్డీఓ ఎంవీ.రమణ, ఐటీడీఏ పీవో కె.రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ కలప స్వాధీనం
కొయ్యలగూడెం: రేంజర్ భాను ప్రకాష్కి అందిన సమాచారంతో బుధవారం దిప్పకాయల పాడులో దాడులు నిర్వహించి అక్రమ కలపతో రవాణా అవుతున్న వాహనాన్ని స్వాధీనం చేసుకొని కన్నాపురం అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు ఎఫ్ఎస్ఓ పి.మణికుమారి పేర్కొన్నారు. వాహనంలో సుమారు యాభైకి పైగా దిమ్మలతో ఉన్న టేకు దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. కలప విలువను లెక్కించాల్సి ఉందన్నారు. బీట్ ఆఫీసర్ కె.నవీన్, కె.వెంకన్నబాబు, రాంబాబు పాల్గొన్నారు. పంట కాలువలో శిశువు మృతదేహం పెదపాడు: పెదపాడు ఎస్సీ ఏరియాలోని కమ్యూనిటీ హాలు వద్ద పంట కాలువలో శిశువు మృతదేహం లభ్యమైంది. స్థానికులు బుధవారం సాయంత్రం మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ఆర్.శ్రీనివాస్ అక్కడకు చేరుకుని శిశువు మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి పంపించారు. వీఆర్వో అనకాపల్లి నర్సింహరావు ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జన్మనిచ్చిన బిడ్డను ఎవరు పడేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
లేబర్ కోడ్లపై రణభేరి
ఏలూరు (టూటౌన్): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 12న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కార్మిక, కర్షక వర్గాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. సమ్మెకు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెల రోజుల నుంచి పలు సన్నాహాక కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా వాల్ పోస్టర్లు, కరపత్రాలు, ప్రచార జాతాలు, గేట్ మీటింగ్లు, పని ప్రదేశాల్లో కార్మికులను కలవడం, ఆయా సంస్థలకు సమ్మె నోటీసులు ముందుగా అందించడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. చివరిగా ఈ నెల 12న ఏలూరు, భీమవరంలలో భారీ ప్రదర్శనలు, బహిరంగ సమావేశాలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. సమ్మెకు రెండు జిల్లాల పరిధిలోని అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ఉద్యోగులు, కర్షకులు, శ్రామికులు సంపూర్ణ మద్దతును తెలిపారు. కార్పొరేట్ల ఒత్తిడితోనే పాలకవర్గం లేబర్ కోడ్లు అమల్లోకి తెచ్చినట్లు కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కార్మిక వర్గాన్ని మరింత దోచుకోవడానికి ఇప్పుడున్న కార్మిక చట్టాలు అడ్డుగా ఉన్నాయనేది కార్పొరేట్ల విధానం. కార్మిక వర్గానికి ఇప్పుడున్న హక్కులను కూడా తొలగించడమే లేబర్ కోడ్ల సారాంశం. కార్మికుల డిమాండ్లివే.. 8 గంటల పని విధానం కొనసాగించాలి. గతంలో మాదిరిగా యూనియన్ రిజిస్ట్రేషన్ ఏడుగురితో చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. ఈఎస్ఐ అర్హతను పాత విధానం ప్రకారం 10 మందితో కొనసాగించాలి. కాంట్రాక్ట్ కార్మికులకు చట్టాలు వర్తించడానికి పెంచిన 50ను పాత విధానంలో 20కి తగ్గించాలి. 100 మంది కార్మికులు పనిచేసే కంపెనీల మూసివేత లే ఆఫ్, లాకౌట్లకు ప్రభుత్వ అనుమతి తీసుకుంటే సరిపోయేది. దాన్ని తాజాగా 300 మంది ఉంటేనే అమలు చేస్తాననడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నేడు సార్వత్రిక సమ్మె -
ఊ కొట్టలేదంటే ఊస్టింగే!
గురువారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షి, టాస్క్ఫోర్స్: కొల్లేరు అభయారణ్యంలో విధులు నిర్వహించడం అటవీ అధికారులకు కత్తిమీద సాములా మారింది. ఓ పక్క సిబ్బందికి కష్టమొస్తే ఊరుకోనని అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ చెబుతున్నా.. అందుకు విరుద్ధంగా ఏలూరు జిల్లాలో రాజకీయ నేతల అండతో కొల్లేరు పెద్దల పంతం నెగ్గుతోంది. తాజాగా రాజమహేంద్రవరం అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు(సీసీఎఫ్) బీఎన్ఎన్ మూర్తి, ఏలూరు జిల్లా అటవీ అధికారి బత్తిన విజయను ఒకేసారి బదిలీ చేశారు. డీఎఫ్ఓను రాష్ట్ర ఉన్నతాధికారికి రిపోర్టు చేయమన్నారు. దీంతో ఆ శాఖలో కలకలం రేగింది. అక్రమ చెరువుల విషయంలో ఊ.. కొడితే సరే.. లేదంటే ఊస్టింగే అన్న నానుడి కూటమి ప్రభుత్వంలో మరోసారి రుజువైంది. అసలేం జరిగిందంటే.. కొల్లేరు అభయారణ్యంలో అక్రమ చెరువుల పూర్తి స్థాయి ప్రక్షాళన చేయలేదని, వాటి వివరాలు తెలపాలని సుప్రీంకోర్టు నియమించిన సాధికారిత కమిటీ అటవీ అధికారులను నివేదిక కోరింది. దీంతో కై కలూరు మండలంలో చటాకాయి, కొట్టాడ, పందిరిపల్లిగూడెం వంటి గ్రామాల్లో చెరువులను ధ్వంసం చేయడానికి అటవీశాఖ డీఎఫ్వో విజయ, సీసీఎఫ్ బీఎన్ఎన్.మూర్తిలు సిబ్బందితో వెళ్ళారు. ఇప్పటివరకు సాగునకు ఊరుకున్నామని, ఖాళీ చేసిన అక్రమ చేపల చెరువుల్లో తిరిగి జీరో సైజు పిల్ల వేయవద్దని ఫారెస్టు అధికారులు కోరారు. దీంతో కోపమొచ్చిన కొల్లేరు పెద్దలు పవన్ కల్యాణ్ కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి సమయంలో కొల్లేటికోట వెళ్ళిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ను కొల్లేరు పెద్దలు అటవీ అధికారులను అడ్డుకోలేకపోతున్నారని నిలదీశారు. ఈ నేపధ్యంలో ఇరువురు అటవీ అధికారులపై బదిలీ వేటు పడింది. గతంలోనూ ఇలాగే.. కొల్లేరులో అటవీ అధికారులు బిక్కుబిక్కు మంటూ విధులు నిర్వహిస్తున్నారు. 2016లో టీడీపీ పాలనలో అక్రమ చెరువులను అడ్డుకునే అనేక మంది అధికారులను రాజకీయ నాయకులు అక్రమ బదిలీలు చేయించారు. 2014 నవంబరులో తూర్పుగోదావరి జిల్లా నుంచి రేంజర్ సునీల్కుమార్ కొల్లేరులో విధులు నిర్వహించేందుకు వచ్చారు. వచ్చీ రావడమే అక్రమ చేపల చెరువులపై కొరఢా ఝలిపించారు. కొల్లేరు పెద్దలు ప్రజాప్రతినిధుల వద్ద పంచాయతీ పెట్టారు. దీంతో మూడు నెలలకే బదిలీపై ఆయనను పంపించేశారు. 2016 డిసెంబరు 2న డీఎఫ్వోగా వీవీఎల్ సుభద్రాదేవి బాధ్యతలు చేపట్టారు. కై కలూరు మండలం చినకొట్టాడ, పెంచికలమర్రు, వడ్లకూటితిప్ప కొల్లేరు అభయారణ్య చెరువుల్లో చేప పిల్లలను వదిలిన 8 వాహనాలను సీజ్ చేసి కేసులు పెట్టారు. అంతే ఆమె రెండు వారాల్లోపే సెలవు పెట్టి వెళ్ళిపోయారు. తర్వాత శివశంకరరెడ్డి డీఎఫ్వోగా బాధ్యతలు చేపట్టారు. మాటవినకపోతే సెలవు పెట్టి వెళ్ళాలని చెప్పడంతో ఆయన సెలవులోకి వెళ్ళారు. అప్పటి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టుగా ఎస్ఎస్.శ్రీధర్ కొల్లేరులో బాధ్యతయుతమైన విధులు నిర్వహించారు. ఆయనను అనంతపురానికి బదిలీ చేశారు. అటవీ చట్టాలు, పర్యావరణంపై పూర్తి పట్టున్న ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (పీసీసీఎఫ్) ఏవీ జోసఫ్ను బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్గా పంపించారు. కొల్లేరులో మాట వినని ఫారెస్టు అధికారుల బదిలీ 2016 లోనూ ఇంతే అక్రమ చెరువులకు సహకరిస్తేనే కొల్లేరులో మనుగడ సుప్రీంకోర్టు నిబంధనలకు నీళ్లు కొల్లేరు అభయారణ్య విషయంలో వింత వాదన జరుగుతోంది. ఏదైన ఒక వస్తువును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించవచ్చు. కొల్లేరు అభయారణ్యంలో సర్వే నంబర్లు ఆధారంగా వేలాది ఎకరాలు అక్రమ చెరువులు సాగువుతోన్నాయి. అటవీ, రెవెన్యూ, పోలీసు అధికారులు వస్తే వస్తువు మాదిరిగా అక్రమ చెరువును తరలించే అవకాశం లేదు. ప్రజలు అడ్డుపడుతోన్నారనే సాకుతో అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం కొల్లేరులో అక్రమ చెరువుల్లో జీరో సాగు చేప పిల్లలు సాగు చేస్తున్నారు. ఈ నెలలో సుప్రీంకోర్టు కొల్లేరు చెరువులపై తీర్పు వెలువరించనుంది. ఇటువంటి సమయంలో సుప్రీం కోర్టు నియమించిన సీఈసీ కమిటీకి నివేదికలు పంపించే అధికారులను బదిలీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అడ్డుఅదుపు లేకుండా అక్రమ చెరువులు తవ్వేస్తారని పర్యావరణవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ నేత కారు అద్దాలు ధ్వంసం
వైఎస్సార్సీపీ నాయకుల నిరసనఉంగుటూరు: వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ సర్పంచి దంతంశెట్టి సత్యనారాయణ కారు అద్దాలు గుర్తు తెలియని వ్యక్తులు పగుల కొట్టారు. తన ఇంటి దగ్గరలో పార్కు చేసిన కారు వెనుక అద్దాలను మంగళవారం రాత్రి పగుల కొట్టడంతో చేబ్రోలు పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మరడా మంగారావు, బూత్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి ఎలిశెట్టి పాపారావు బాబ్జి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పెనుగొండ బాలకృష్ణ, ఎంపీటీసీ చాంబర్ అధ్యక్షుడు బండారు నాగరాజు, పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు పుప్పాల గోపి ,మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా జయలక్ష్మి, పార్టీ బీసీ నాయకుడు రమణ తదితరులు ఈ ఘటనను ఖండించారు. దంతంశెట్టిని పరామర్శించారు. వైఎస్సార్సీపీకి అండగా నిలుస్తున్న దొంతంశెట్టి కారు అద్దాలు పగలగొట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
ఆకివీడు చైర్పర్సన్కు అవమానం
ఆకివీడు: పట్టణ ప్రథమ పౌరురాలికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వలేదు. బీసీ మహిళను అవమానపరిచారంటూ స్థానిక నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక 13వ వార్డులోని శ్రీ నగర్ కాలనీలో 15వ ఆర్థిక సంఘ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు తనను పిలవగా, నిర్మాణ ప్రాంతానికి వచ్చేసరికి పట్టణ టీడీపీ అధ్యక్షుడు గంధం ఉమ కొబ్బరికాయ కొట్టారని వాపోయారు. నా వార్డులో మీరు కొబ్బరికాయ కొట్టడమేమిటని ప్రశ్నించగా మీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ దురుసుగా మాట్లాడారని హైమావతి ఆవేదన వ్యక్తంచేశారు. ప్రథమ పౌరురాలికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా, ప్రజాప్రతినిధిని లెక్కచేయకుండా ఇష్టానుసారం వ్యవహరించడం కూటమి నాయకుల దౌర్భాగ్యమన్నారు. వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు అంబటి రమేష్ మాట్లాడుతూ తన వార్డులో రోడ్డు నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టననివ్వకుండా చైర్పర్సన్ను అవమాన పరచడం దారుణమన్నారు. స్థానికంగా సంబంధం లేని వ్యక్తులు వార్డుల్లోకి వచ్చి ఇలాంటి చర్యలకు పాల్పడటం దుర్మార్గమన్నారు. నగర పంచాయతీ చీప్ విప్ పడాల శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు దొడ్డి జగదీష్, గేదెల అప్పారావు, జిల్లా వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షులు గుండా సుందర రామనాయుడు తదితరులు ఉన్నారు. -
తీరంలో తాబేళ్ల మృత్యుఘోష
● నరసాపురం, పేరుపాలెం బీచ్ల్లో విషాద దృశ్యాలు ● సుమారు 50 తాబేళ్ల మృత్యువాత నరసాపురం రూరల్: నరసాపురం నియోజకవర్గ తీర ప్రాంతంలో ఏటా వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే ఆలివ్ రెడ్లీ తాబేళ్లు, వేటగాళ్ల నిర్లక్ష్యానికి బలైపోతున్నాయి. గతేడాది కూడా ఇదే సమయంలో తాబేళ్లు మృత్యువాత పడిగా కలెక్టర్ చొరవతో తాబేళ్ల గుడ్లను సేకరించి సంరక్షించి పిల్లలు బయటకు వచ్చాకా సముద్రంలో విడిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పేరుపాలెం, పెదమైనవానిలంక, చినమైనవానిలంక వంటి తీరప్రాంత గ్రామాల్లో ఈ ఏడాది జనవరి నుంచే తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు ఒడ్డుకు రావడం ప్రారంభించాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో వీటి గుడ్లను సేకరించి హ్యాచరీల ద్వారా సంరక్షించే పనులు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ, సముద్రంలో జరుగుతున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు రోజులుగా భారీ సంఖ్యలో తాబేళ్లు మృతి చెంది తీరానికి కొట్టుకొస్తున్నాయి. పోయిన సంవత్సరం కూడా ఇదే సమయంలో సుమారు 100కు పైగా తాబేళ్లు ప్రాణాలు కోల్పోయాయి. తాజాగా మంగళవారం 29, బుధవారం 20 తాబేళ్లు మృత్యువాత పడ్డాయి. వీటితోపాటు రెండున్నర మీటర్ల పొడవు, 240 కిలోల బరువు ఉన్న హేంపర్ బ్యాక్ డాల్ఫిన్ కూడా తీరానికి కొట్టుకు వచ్చింది. కేవలం తూర్పుతీరానికి దగ్గరలో నదీముఖ తీర ప్రాంతాల్లో 30 మీటర్ల కంటే తక్కువ లోతులో ఇవి సంచరిస్తుంటాయి. ప్రమాదపుటంచున ఉన్న ఈ తరహా డాల్పిన్లు ప్రస్తుతం పరిరక్షించాల్సిన జాతిగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. తాబేళ్ల కళేబరాలకు అధికారులు పోస్టుమార్టం నిర్వహించి, మరణానికి కారణాలు విశ్లేషించారు. దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న సందర్శకులు చనిపోయిన తాబేళ్ల కళేబరాలు తీరం వెంబడి కుళ్లిపోతుండటంతో ఆ ప్రాంతమంతా తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోంది. దీనివల్ల బీచ్కు వచ్చే పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సముద్ర తాబేళ్లకు సంబంధించి పోస్టుమార్టంలో అధిక శాతం వాటి పాదాలు నరికివేసి ఉండటం, కళ్లు పీకేసి ఉండటంతో పాటు, బలమైన దెబ్బతగిలిన గాయలతో పాటు వలల్లో చిక్కుకున్న అవశేషాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో గుర్తించిట్లు అఽధికారులు చెబుతున్నారు. వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.చంద్రశేఖర రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అటవీ అధికారి డీఏ కిరణ్, ఫారెస్ట్ రేంజర్ మురాల కరుణాకర్ పర్యవేక్షణలో మృత కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహించారు. జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి ఏయస్ఆర్ మూర్తి, మత్స్యశాఖ అభివృద్ది అధికారి ఏడుకొండలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాంప్రసాద్, మైరెన్ ఏఎస్సై ఫాతిమా, వీఆర్వో సుభాషిణి పాల్గొన్నారు. తీరంలో మృతి చెందిన తాబేళ్లు, డాల్ఫిన్ సముద్ర జీవుల సంరక్షణ కోసం ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించినప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడమే ఈ మరణాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మత్స్యకారులు తీరం నుంచి 8 నాటికల్ మైళ్ల అవతల మాత్రమే వేట సాగించాలి. చాలా మంది ఈ నిబంధనను అతిక్రమించి తీరానికి దగ్గరగా వేటాడుతున్నారు. సంతానోత్పత్తి కోసం తీరానికి వచ్చే క్రమంలో, ఈ తాబేళ్లు మత్స్యకారుల వలల్లో చిక్కుకుని ఊపిరాడక మృతి చెందుతున్నాయి. తాజాగా తాబేళ్లతో పాటు డాల్ఫిన్ వంటి అరుదైన జీవులు కూడా మృతి చెందడం కలిచివేస్తోంది. -
ఆరోగ్యం భద్రం.. ప్రణాళికతో విజయం
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. 10వ తరగతి, ఇంటర్మీడియెట్తో పాటు అన్ని తరగతులకు పరీక్షలు దగ్గర పడ్డాయి. ఏడాదంతా చదివింది ఒక ఎత్తు అయితే ఈ రెండు మూడు నెలలు చదివేది మరో ఎత్తుగా చెప్పవచ్చు. ఈ సమయంలో కేవలం చదువు ఒక్కటే కాదు. ఈ సమయంలో ఆరోగ్యమూ ముఖ్యమే అని వైద్యులు, సైకాలజిస్టులు చెబుతున్నారు. ఒత్తిడి.. పెను ప్రభావమే పబ్లిక్ పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్థులపై సహజంగానే ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలా ఒత్తిడి చేయడం విద్యార్థుల శారీరక, మానసిక పరిస్థితులపై పెను ప్రభావమే చూపుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. పరీక్షల సమయంలో వినోదం, క్రీడలకు దూరమై విద్యార్థులు మానసికంగా అధిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. అదే జరిగితే ఆరోగ్యం కూడా క్షీణిస్తుందని హెచ్చరిస్తున్నారు. వారికి కొంత ఆటవిడుపు సమయం ఇవ్వాలని, సూచిస్తున్నారు. ఆహారం, విశ్రాంతిపై ప్రత్యేక శద్ధ అవసరం చదువు ధ్యాసలో పడి సమయానికి ఆహారం, విశ్రాంతి తీసుకోకపోయినా ప్రమాదమే అని, అటువంటి వారికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. కొందరు పిల్లలను రాత్రి 11 గంటల వరకూ చదివించి, తిరిగి తెల్లవారుజామునే 5 గంటలకు నిద్రలేపి మళ్లీ చదివిస్తుంటారని అలా చేయడం వల్ల విద్యార్థికి తగిన విశ్రాంతి దొరకక తొందరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుందంటున్నారు. విద్యార్థులకు ఇచ్చే ఆహారంలో తేలికగా జీర్ణం అయ్యే ఇడ్లీ, చారుతో భోజనం మంచిందంటున్నారు. అలాగే అందుబాటులో ఉండే సీజనల్ పండ్లు, మెదడు చురుకుగా పని చేయడానికి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వాలి. పరీక్షలు పూర్తయ్యే వరకూ మాంసాహారాలకు, మసాలాలు, ఉప్పు, కారాలు అధికంగా ఉండే ఆహారాలు పెట్టకపోవడమే మంచిది. రాత్రి సమయాల్లో నిద్రకు ఉపక్రమించే ముందు టీలు, కాఫీలు తీసుకోకూడదు. రాత్రి పొద్దుపోయే వరకూ చదవకూడదు. కనీసం 8 గంటలు నిద్రపోవాలి. తెల్లవారుజామున చదివితే పాఠ్యాంశాలు బాగా గుర్తుంటాయి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులు (ఫైల్) చదువుతో పాటు ఆరోగ్యమూ ముఖ్యమే.. పరీక్షల సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి ఆహారం, విశ్రాంతిపై శ్రద్ధ అవసరం తల్లిదండ్రులూ ఒత్తిడి పెట్టొద్దు త్వరలో టెన్త్, ఇంటర్ పరీక్షలు జిల్లాలో 58 వేల మందికి పైగా విద్యార్థులు త్వరలోనే ఇంటర్మీడియెట్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రాంభం కానున్నాయి. ఇంటర్మీడియెట్కు సంబంధించిన ప్రయోగ పరీక్షలు ముగిశాయి. పదో తరగతి విద్యార్థులకు ప్రస్తుతం ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. మార్చి 2వ తేదీ నుంచి గ్రాండ్ టెస్ట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అనంతరం ఈ నెల 23వ తేదీ నుంచి ఇంటర్మీడియెట్ విద్యార్థులకు, మార్చి 16వ తేదీ నుంచి పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వారి పరీక్షలు ముగిసిన అనంతరం డిగ్రీ, పీజీ, 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు కూడా పరీక్షలు జరుగుతాయి. -
పంచాయతీ కార్యదర్శిపై దాడి
బుట్టాయగూడెం : ఇంటి పన్ను కట్టమని అడిగినందుకు పంచాయతీ కార్యదర్శిపై ఒక వ్యక్తి దాడి చేశాడు. దీనిపై బుధవారం రాత్రి కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొరమామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి గుండేపల్లి సోమరాజు బుధవారం సాయంత్ర సిబ్బందితో కలిసి ఇంటి పన్నులు వసూలు చేసేందుకు వెళ్లారు. గ్రామంలోని ఒక టీస్టాల్ వద్ద పవన్కుమార్ అనే వ్యక్తిని ఇంటి పన్ను చెల్లించమని అడుగగా ఆ వ్యక్తి వివాదస్పదంగా మాట్లాడినట్లు కార్యదర్శి తెలిపారు. అసభ్య పదజాలంతో మాట్లాడుతూ పలుమార్లు తనపై దాడి చేసి కొట్టినట్లు కార్యదర్శి చెప్పారు. విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయ్యాలని కోరుతూ స్థానిక పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. కార్యదర్శి సోమరాజుపై జరిగిన దాడిని డిప్యూటీ ఎంపీడీఓ, వీఎస్ఎస్ శ్రీనివాసరావు, కార్యదర్శిలు రామకృష్ణ, కిరణ్, తదితరులు తీవ్రంగా ఖండించారు. -
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం పి. అంకంపాలెం సమీపంలోని కోళ్లఫారమ్లో ఒక యువతి ఆనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఒరిస్సా రాష్ట్రం రాయ్ఘడ్ జిల్లా బీఎల్ఓడీ మండలం ఓయ్పంగు గ్రామానికి చెందిన పతిక రష్మిక (19) నాలుగు రోజుల క్రితం పి. అంకంపాలెం సమీపంలోని కోళ్లఫారం వద్ద జీవనోపాధి కోసం వచ్చి పనిలో చేరింది. అయితే ఆ యువతి షెడ్లో అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందింది. రష్మిక అదే కోళ్లఫారమ్లో పనిచేస్తున్న ప్రశాంత్ అనే యువకుడితో గత 8 నెలలుగా పరిచయం ఉండి ఒరిస్సాలోనే సహజీవనం చేసినట్లు సమాచారం. అయితే ప్రశాంత్కు ఇప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల ప్రశాంత్ తన భార్యతో కలిసి కోళ్ల ఫారమ్లో పనిచేస్తుండగా రష్మిక కూడా నాలుగు రోజుల క్రితం ఇక్కడికి వచ్చినట్లు పలువురు చెబుతున్నారు. ముగ్గురూ ఒకే గదిలో నివసిస్తున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం ప్రశాంత్, అతని భార్య పని నిమిత్తం కోళ్లఫారమ్కు వెళ్లగా రష్మిక షెడ్లో ఉరివేసుకున్నట్లు చెబుతున్నారు. యువతి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందో తమకు తెలియదని అంటున్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముద్దాపురంలో శిలాఫలకం ధ్వంసం
తణుకు అర్బన్: తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో టీడీపీ శ్రేణులు కయ్యానికి కాలు దువ్వారు. గత వైఎస్సార్సీపీ హయాంలో స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో 2024లో రోడ్డు శంకుస్థాపన కోసం ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని బుధవారం రాత్రి ధ్వంసం చేశారు. ధ్వంసం చేస్తున్న కార్మికులను వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశ్నించగా తణుకు నుంచి పనికి వచ్చామని గ్రామ మాజీ సర్పంచ్ ముళ్లపూడి శ్రీనివాస్ పని పురమాయించినట్లు చెప్పారు. అప్పట్లో రూ.5 కోట్లు నిధులతో రోడ్డు నిర్మాణం కోసం మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఈ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారని, నేడు అర్ధాంతరంగా రాత్రి సమయంలో ఆ శిలాఫలకాన్ని తొలగించే పనులు చేపట్టారని వైఎస్సార్ సీపీ నాయకులు తుమ్మగంటి నాగ సత్యనారాయణ (నాగు) విమర్శించారు. ఇదేమిటని మళ్లపూడి శ్రీనివాస్ను ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా ఇంటి లోపలకు వెళ్లిపోయారని నాగు తెలిపారు. ద్వారకాతిరుమల: ఐఎస్ జగన్నాథపురంలో సుందరగిరిపై స్వయంభూ కనకవల్లీ సమేత లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ద్వితీయ దివస మోదక హవన ప్రారంభ వేడుకలు బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా ఆలయ యాగశాలలో మహా గణపతి లక్షమోదక హోమాన్ని జరిపారు. మహాశివరాత్రి నాడు జరిపే అతిరుద్రప్రయోగ సహిత సుదర్శన నృశింహ మహాయజ్ఞం నిర్వహణలో భాగంగా ఈ వేడుకను నిర్వహించారు. ఉదయం ఆలయ యాగశాలలో నారసింహుని ఉపాసకులు కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీ ఆధ్వర్యంలో, సీహెచ్ కుటుంబరావు పర్యవేక్షణలో పలు కార్యక్రమాలను వైభవంగా జరిపారు. రుత్వికులు, పండితులు మోదకాలను, పలురకాల దినుసులను హోమగుండంలో వేస్తూ క్రతువును నిర్వహించారు. లోక శాంతి కోసం ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ముదినేపల్లి రూరల్: ఇటీవల అదృశ్యమైన తల్లీపిల్లల ఆచూకీ తెలుసుకుని స్ధానిక పోలీసులు కుటుంబ సభ్యులకు బుధవారం అప్పగించారు. బొమ్మినంపాడుకు చెందిన వాసుపల్లి పెద్దిరాజులుకు భార్య శిరీషతోపాటు రాజేశ్వరి, శాంతిప్రియ, నాగదుర్గ కుమార్తెలున్నారు. వీరంతా ఈనెల 8న ఆధార్కార్డు సవరణలు చేసుకునేందుకు బయటకు వెళ్లారు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో పెద్దిరాజులు పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు పెద్దిరాజులు భార్య శిరీష, కుమార్తెలు కలిదిండి మండలం కోరుకొల్లులో ఉన్నట్లు గుర్తించి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. ఎస్సై వీరభద్రరావు వీరిని కుటుంబసభ్యులకు అప్పగించారు. తణుకు అర్బన్: గుర్తు తెలియని మృతదేహం తణుకు మండలం వేల్పూరు గ్రామ పరిధిలోని కంపోస్టు యార్డులో బుధవారం లభ్యమైంది. కంపోస్టు యార్డులోని చెత్తకు నిప్పుపెట్టిన స్థలంలో మృతదేహం కొంతభాగం కాలిపోయి ఉంది. మృతుడి వయస్సు సుమారుగా 40 నుంచి 50 మధ్య ఉండవచ్చని, తెలుపురంగు చొక్కా, నీలం రంగు జీన్స్ ఫ్యాంటు ధరించి ఉన్నారని, జుట్టు కొంతమేర తెలుపు రంగుతో ఉందని, నాలుగు రోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. తణుకు రూరల్ పోలీసులు మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి పంచనామా అనంతరం అంత్యక్రియలు జరిపించారు. రూరల్ స్టేషన్ ఏఎస్సై అనుమానాదస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మండవల్లి: ఓ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం లింగాల గ్రామానికి చెందిన సాయిలక్ష్మి ఈ నెల 10వ తేదీన ఇంట్లో దేవుడికి దీపారాధన చేస్తుండగా, దీపం వత్తు ఆమె చీరకు అంటుకుని మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. సమాచారం తెలుసుకున్న భర్త వెంకటేశ్వరరావు వెంటనే వచ్చి ఆమెను కై కలూరు ప్రభుత్వాసుపత్రికి అనంతరం మెరుగైన వైద్య సేవల నిమితం గన్నవరం సిద్ధార్ధ మెడికల్ కాలేజీకి తరలించారు. బుధవారం ఉదయం ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారుడు సాయిల శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తపాలా సేవల్లో సాంకేతిక పరిజ్ఞానం జోడించండి
ఏపీ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ శ్రీదేవి కై కలూరు: తపాలా సేవల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ బీపీ.శ్రీదేవి సూచించారు. ఆటపాక బ్రాంచి పోస్టాఫీస్ను మంగళవారం ఆమె సందర్శించారు. అనంతరం కై కలూరు, పల్లెవాడ పోస్టాఫీసుల పరిధిలోని 20 బ్రాంచి పోస్టాపీసుల గ్రామీణ్ డాక్ సేవక్(జీడీఎస్) సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తపాలశాఖ ఐవీ 2.0 అనే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందిస్తోందన్నారు. గుడివాడ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎస్.కృష్ణమూర్తి, ఏఎస్పీ సీహెచ్.శ్రీనివాసరావు, కై కలూరు సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ కె.సురేష్కుమార్, ఇన్స్పెక్టర్ బి.విజయ్ పాల్గొన్నారు. ఏలూరు రూరల్: ఈ నెల 13, 14 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్–12 బాలుర క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు చేపట్టనున్నామని క్రికెట్ అసోసియేషన్ త్రిసభ్య కమిటీ సభ్యుడు ఎస్కే షాకిర్హుస్సేన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఏలూరు సీఆర్ఆర్ కళాశాల గ్రౌండ్లో ఉదయం 8 గంటలకు ఎంపిక పోటీలు ప్రారంభమౌతాయని వివరించారు. వివరాలకు 70136 33143లో సంప్రదించాలన్నారు. భీమడోలు: గుండుగొలను గ్రామంలోని మెయిన్ రోడ్డులోని వినాయకుని ఆలయం, రామాలయం, గంగానమ్మ ఆలయాల్లో చోరీకి విఫలయత్నం జరిగింది. ఆలయాల్లో హుండీ అపహారణ, వస్తువులను చెల్లాచెదురుగా పడేయడం, తలుపులు పగలగొట్టి ఉండడాన్ని ఆలయ కమిటీ సభ్యులు గుర్తించారు. రామాలయంలోని హుండీని అపహరించి, అందులోని రూ.15 వేలు నగదు కాజేశారని రామాలయం కమిటీ సభ్యుడు వెలివెల సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు సీసీ ఫుటేజీ, వేలిముద్రలను సేకరించారు. జంగారెడ్డిగూడెం: ట్రాక్టర్ ట్రక్కు బోల్తా పడి కూలీ మృతిచెందిన ఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపిన వివరాలు ఇవి. పట్టణానికి చెందిన జాలా ప్రసాద్ (49) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 9న ఓ రైతుకు చెందిన పొగాకు తోటలో పనికి వెళ్లిన ప్రసాద్, అక్కడ నుంచి ట్రాక్టర్లో పొగాకు లోడు వేసుకుని వస్తున్నాడు. పట్టణంలోని బుట్టాయగూడెం రోడ్డులో ఉన్న రాజారాణి కళ్యాణ మండపం వద్దకు వచ్చేసరికి ట్రాక్టర్, ట్రక్కు తిరగబడటంతో ప్రసాద్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని భార్య రత్నకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
శ్రీశైలం మల్లన్నకు శ్రీవారి దేవస్థానం పట్టువస్త్రాలు
ద్వారకాతిరుమల: శ్రీశైలం శ్రీ మల్లిఖార్జున స్వామివారికి ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం అధికారులు సోమవారం రాత్రి పట్టు వస్త్రాలను సమర్పించారు. శివరాత్రిని పురస్కరించుకుని మల్లన్నకు నిర్వహించే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ వస్త్రాలను అందజేశారు. ముందుగా శ్రీవారి దేవస్థానం ఈఓ యర్రంశెట్టి భద్రాజీ, ఏఈఓ పి.నటరాజారావు పట్టు వస్త్రాలను శిరస్సుపై పెట్టుకుని అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ మల్లన్న సన్నిధికి చేరుకున్నారు. అనంతరం అక్కడి అధికారులకు వాటిని అందజేశారు. ఆ తరువాత మల్లన్నను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఏటా బ్రహ్మోత్సవాల్లో మల్లన్నకు చినవెంకన్న దేవస్థానం పట్టు వస్త్రాలను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో శ్రీవారి దేవస్థానం సూపరింటిండెంట్ హయగ్రీవాచార్యులు, ఆచారి తదితరులున్నారు. నూజివీడు: పశువుల కొవ్వు నుంచి నూనెను తయారు చేస్తున్న వ్యక్తిని మంగళవారం పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 60 కిలోల గడ్డకట్టిన నూనెను స్వాధీనం చేసుకున్నారు. పట్టణ ఎస్సై నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని అజరయ్యపేటకు చెందిన కంచిపోగు అజయ్ అలియాస్ మస్తాన్ గత 20 ఏళ్లకు పైగా పశువులను కోసి మాంసాన్ని విక్రయిస్తూ ఉంటాడు. అంతేగాకుండా పశువుల కొవ్వును కరిగించి నూనెను తయారు చేసి విక్రయిస్తూ ఉంటాడు. దీంతో పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఉదయం 7గంటల సమయంలో ఎస్సై తన సిబ్బందితో వెళ్లి అతడిని అదుపులోకి తీసుకోవడంతో పాటు గడ్డకట్టి ఉన్న నూనె టిన్నులను, కొవ్వు మాంసాన్ని స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించారు. మాంసం కొవ్వునుంచి నూనె తయారు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొయ్యలగూడెం: నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా నిర్మాణ ప్రక్రియ పూర్తి చేసి తీరుతామని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పేర్కొన్నారు. మంగళవారం సరిపల్లి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ నేవీ డిపో నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఆయుధ డిపో నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తే ఎందాకై నా వెళ్లడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎంపీ పుట్టా మహేష్యాదవ్, తానూ ఆయుధ డిపో నిర్మాణంలో కృత నిశ్చయంతో ఉన్నామన్నారు. చోడి పిండి సుబ్రహ్మణ్యం, ఏఎంసీ మాజీ చైర్మన్ పారేపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు. -
హరహర మహాదేవ.. శంభో శంకర
భీమవరం (ప్రకాశం చౌక్): మహాశివరాత్రి మహోత్సవాలకు జిల్లాలోని శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు జరగనున్న శివరాత్రి మహోత్సవాల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. జిల్లాలో దేవాదాయశాఖ నిర్వహణలో 30కు పైగా ప్రసిద్ధి శివాలయాలు ఉన్నాయి. ఆలయ కమిటీల ద్వారా నిర్వహించే శివాలయాలు మరో 15 వరకు ఉంటాయి. ముఖ్యంగా జిల్లాలో భీమవరం, పాలకొల్లులో పంచారామ క్షేత్రాలు, ఆచంట రామేశ్వరస్వామి, నత్తారామేశ్వరం రామలింగేశ్వరస్వామి వారి దేవస్థానాల్లో 5 రోజుల పాటు నిర్వహించే శివరాత్రి మహోత్సవాలకు జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది భక్తులు వస్తుంటారు. చురుగ్గా ఏర్పాట్లు జిల్లాలోని పంచారామక్షేత్రాలు, ప్రముఖ శివాలయాల్లో శివరాత్రి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ అలంకరణలు, సెట్గింగ్లు, డెకరేషన్ల పనులు చేస్తున్నారు. భక్తులకు మంచినీటి సౌకర్యం, టాయిలెట్స్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా ఆలయాల్లో దేవదాయ శాఖ, పోలీసులు, పంచాయతీ, మున్సిపల్, ఆరోగ్య శాఖ, రెవెన్యూ, ఫైర్ తదితర శాఖలతో ఉత్సవాలపై సమన్వయ మీటింగ్లు పూర్తి చేశారు. 13, 15 తేదీల్లో స్వామి వారి కల్యాణం మహాశివరాత్రి మహోత్సవాల్లో స్వామి వారి కల్యాణ తంతు అద్భుతమైన ఘట్టం. స్వామి వారి కల్యాణాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు వారికి అందుబాటులో ఉన్న శివాలయాలకు చేరుకుంటారు. ఈనెల 13వ తేదీన ఆచంటలోని శ్రీరామేశ్వరస్వామి వారి కల్యాణం కాగా మిగిలిన శివాలయాల్లో ఈనెల 15వ తేదీన స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నారు. స్వామి వారి కల్యాణం అనంతరం రథోత్సవం, తెప్సోత్సం నిర్వహిస్తారు. ప్రసిద్ధ ఆలయాలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన శివాలయాలు ఉన్నాయి. మహాశివరాత్రి ప్రత్యేక పూజలు అందుకునే ప్రముఖు శివక్షేత్రాలు ఇవి. భీమవరం మండలం యనమదుర్రులోని పార్వతీ సమేత శక్తీశ్వర స్వామి, భీమవరంలో భీమేశ్వర స్వామి, ఆచంట రామేశ్వరస్వామి, నత్తారామేశ్వరంలో రామేశ్వరస్వామి, జుత్తిగ ఉమాసోమేశ్వరస్వామి, లక్ష్మణేశ్వరంలో దుర్గా లక్ష్మణేశ్వరస్వామి, శివదేవుని చిక్కాలలో శివదేవస్వామి, పెనుగొండలో నగరేశ్వరస్వామి తదితర శివాలయాలు మహా శివరాత్రి మహోత్సవాలకు ముస్తాబవుతున్నాయి. భీమవరంలో పంచారామక్షేత్రంఉమాసోమేశ్వర స్వామి వారు జిల్లాలోని భీమవరం, పాలకొల్లు పంచారామక్షేత్రాల్లో 5 రోజుల పాటు నిర్వహించే మహాశివరాత్రి మహోత్సవాలకు భారీగా భక్తులు వస్తుంటారు. రోజుకు 10 వేలు నుంచి 30 వేలమంది వరకు భక్తులు పంచారామ క్షేత్రాలను దర్శిస్తారు. పంచారామ క్షేత్రాల్లో స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు, విశేష అలంకరణలు నిర్వహిస్తారు. రధోత్సవాలు, తెప్పోత్సవాలు జరుపుతారు. అలాగే పలు సాంస్కృతికి కార్యక్రమాలు ఏర్పాటుచేయడం జరుగుతుంది. భీమవరం పంచారామక్షేత్రంలో ఉమాసోమేశ్వరుడు చంద్రుడి ప్రతిష్ఠాపన కావడంతో శివలింగం అమావాస్యకు గోధుమ వర్ణంలో, పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలోకి మారడం ఇక్కడి ప్రత్యేకత. క్షేత్ర పాలకుడు శ్రీజనార్థన స్వామి వారు. మహాశివరాత్రి మహోత్సవాలకు జిల్లాలోని దేవదాయ శాఖ పరిధిలోని పంచారామక్షేత్రాలతోపాటు అన్ని శివాలయాల్లో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. భక్తులు రద్ధీగా ఉండే శివాలయాల వద్ద ప్రత్యేక దృష్టి పెట్టి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అన్ని శాఖల అధికారులతో సమన్వయ మీటింగ్ నిర్వహించి మహాశివరాత్రి మహోత్సవాలను విజయవతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. – వి.సూర్యప్రకాష్ జిల్లా దేవాదాయ శాఖ అధికారి 13 నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు జిల్లావ్యాప్తంగా శివాలయాల్లో ఆధ్యాతిక శోభ జిల్లాలోని రెండు పంచారామాలు, శివాలయాల్లో ఏర్పాట్లు 5 రోజులపాటు విశేష పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు -
కాలువ గట్టుపై ఆగని ‘పచ్చ’ దందా
ద్వారకాతిరుమల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొందరు పచ్చ నేతల దందాలకు, దౌర్జన్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. సంపాదనే ధ్యేయంగా ప్రకృతి వనరులను సైతం దోపిడీ చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ దోపిడీకి ద్వారకాతిరుమల మండల పరిధిలోని పోలవరం కుడి కాలువ గట్టు కేంద్రంగా మారింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఎర్ర మట్టిని యథేచ్ఛగా తవ్వుకుని, అమ్ముకుంటున్నారు. అయినా అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. నిత్యం మట్టి అక్రమ తవ్వకాలే.. పంగిడిగూడెం నుంచి గుణ్ణంపల్లి వరకు పోలవరం కుడి కాలువ గట్టుపై నిత్యం అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. మండలంలోని నారాయణపురం పంచాయతీ గుళ్లపాడు గ్రామ పరిధిలోని పోలవరం కుడి కాలువ గట్టుపై కొద్ది రోజులుగా మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఓ పచ్చ ముఠా రాత్రి, పగలు అనే తేడా లేకుండా జేసీబీ సహాయంతో ఎంతో విలువైన ఎర్ర మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా చుట్టుపక్కల గ్రామాలకు తరలిస్తోంది. ఈ మట్టిని ఆయిల్పామ్ తోటల్లో రోడ్ల నిర్మాణానికి వినియోగిస్తున్నట్టు పలువురు చెబుతున్నారు. అలాగే టిప్పర్ల ద్వారా పెద్ద ఎత్తున మట్టి కాలువ కింద రొయ్యలు, చేపల చెరువులకు తరలిపోతోంది. ఒక్కో ట్రాక్టర్ గ్రావెల్ రూ.800కు, ఒక్కో టిప్పర్ మట్టిని రూ.10 వేలకు విక్రయించి, సొమ్ము చేసుకుంటున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులెవరూ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. పునాదుల పేరుతో.. ఇంటి పునాదులకంటూ కొందరు పచ్చ నేతలు ఇష్టానుసారంగా మట్టిని కొళ్లగొట్టి, అమ్ముకుని, జేబులు నింపుకుంటున్నారు. పైకి గ్రామ అభివృద్ధికి, ప్రజల అవసరాలకని పెద్దపెద్ద మాటలు చెబుతున్నారు. కానీ వేలాది రూపాయలకు మట్టిని అమ్ముకుంటున్నారు. వాస్తవానికి సామాన్య ప్రజల అవసరాలకు ఈ మట్టి ఉపయోగపడటం లేదని స్థానికులు అంటున్నారు. ఈ మట్టి అక్రమ తవ్వకాలపై కాలువ జేఈ బాపూజీని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ద్వారకాతిరుమల మండలం గుళ్లపాడు వద్ద పోలవరం కుడి కాలువ గట్టుపై అక్రమంగా జరుగుతున్న ఎర్ర మట్టి తవ్వకాలు, ట్రాక్టర్లో తరలిపోతున్న గ్రావెల్ పోలవరం కుడి కాలువ గట్టుపై యథేచ్ఛగా ఎర్ర మట్టి తవ్వకాలు ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా వివిధ ప్రాంతాలకు తరలింపు ఆ వైపు కన్నెత్తి చూడని అధికారులు -
వృద్ధురాలిపై దాడి కేసులో నిందితుడి అరెస్ట్
జంగారెడ్డిగూడెం: ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి మెడలో బంగారుగొలుసు చోరీ చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పోలీస్స్టేషన్లో ఆమె మంగళవారం వివరాలు వెల్లడించారు. కామవరపుకోట పాతూరు బీసీ కాలనీకి చెందిన వృద్ధురాలు కలకోటి వెంకట సత్యవతి ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈ నెల 7వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఆమె భోజనం చేస్తుండగా, ఇంటి తలుపులు కొట్టిన శబ్ధం విని తలుపు తీసింది. ముఖానికి గుడ్డకట్టుకుని ఉన్న గుర్తు తెలియని వ్యక్తి ఆమైపె దాడి చేసి, ఇనుప రాడ్డుతో తలపై కొట్టి, వృద్ధురాలి మెడలోని 2 కాసుల బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు. దీనిపై వృద్ధురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తడికలపూడి ఎస్సై టి.చెన్నారావు కేసు నమోదు చేశారు. సీఐ ఎంవీ సుభాష్ ఆధ్వర్యంలో ఎస్సై విచారణ నిర్వహించి నిందితుడు కామవరపుకోట మండలం పాతూరు గ్రామానికి చెందిన అడవికొట్టు వెంకటేశ్వరరావు అలియాస్ చక్రి అలియాస్ అంజిగా గుర్తించారు. కామవరపుకోట చింతలపూడి వెళ్లే రోడ్లో గ్రామ శివారు ఆర్ఆర్జీకే డైరీ వద్ద నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.1.40లక్షలు విలువైన 14.600 గ్రాముల బంగారు గొలుసు, నేరానికి ఉపయోగించిన మోటార్సైకిల్, వృద్ధురాలిపై దాడికి వినియోగించిన ఇనుప రాడ్డు, దుస్తులు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ చెప్పారు. కేసును చేధించిన సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై టి.చెన్నారావు, క్రైం పార్టీ ఏఎస్సై ఎన్వీ సంపత్కుమార్, పీసీలు ఎస్కే షాన్, ఎన్.రమేష్, ఎ.సుధీర్లను ఏఎస్పీ అభినందించారు. -
శాప్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు
17న చెస్, 24 సైక్లింగ్ జట్లు ఎంపిక ఏలూరు రూరల్: రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాప్ లీగ్స్ పేరిట ఆటల పోటీలు నిర్వహించనున్నామని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎస్ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తంగా 31 క్రీడాంశాల్లో జిల్లాస్థాయిలో పోటీలు చేపట్టి జిల్లా జట్లను ఎంపిక చేస్తుందన్నారు. ఈనెలలో లీగ్స్ ప్రారంభమై, 11 నెలల పాటు కొనసాగి డిసెంబర్లో ముగుస్తాయన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 17వ తేదీన ఏలూరు ఇండోర్ స్టేడియం వెయిట్ లిఫ్టింగ్ హాల్లో జిల్లాస్థాయి చెస్ పోటీలు చేపట్టనున్నామని వివరించారు. అండర్ 13, 15, 17, 19 విభాగంలో పురుషులు, మహిళలకు పోటీలు చేపడతామని వెల్లడించారు. ఇదే క్రమంలో ఈ నెల 24వ తేదీన ఇండోర్ స్టేడియంలో జిల్లాస్థాయి సైక్లింగ్ పోటీలు చేపడతామన్నారు. ఇందులో ఎంపికై న వారు ఈ నెల 28వ తేదీ నుంచి మార్చి 1 వరకూ విజయవాడలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. వివరాలకు 90594 85538లో సంప్రదించాలని సూచించారు. -
నృసింహ మహాయజ్ఞానికి ఏర్పాట్లు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత ఆలయమైన ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై స్వయంభూగా కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో అతి రుద్ర సహిత శ్రీ సుదర్శన, నరసింహ ధన్వంతరీ 32వ మహాయజ్ఞ నిర్వహణకు మంగళవారం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఉదయం గర్భాలయంలో కొలువైన స్వామివారి మూలవిరాట్కు వేద పండితులు, రుత్వికులు వేద మంత్రోచ్ఛరణలతో విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం హైదరాబాద్కు చెందిన కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీ ఆధ్వర్యంలో, సీహెచ్ కుటుంబరావు పర్యవేక్షణలో ప్రధాన యజ్ఞం ప్రారంభానికి సూచికగా మహా గణపతి లక్షమోదక హోమాన్ని ఆలయ యాగశాలలో వైభవంగా జరిపారు. సాయంత్రం వరకూ నిర్విరామంగా కొనసాగిన ఈ హోమ క్రతువుతో సుందరగిరి ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. మహాశివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ యజ్ఞ క్రతువులో భాగంగా ఈనెల 13న అంకురార్పణం, ధ్వజారోహణం, శ్రీ నృసింహ హోమం, 14న కలశప్రతిష్ఠ, మహా గణపతి హోమాన్ని నిర్వహించనున్నారు. 15న మహా శివరాత్రిని పురస్కరించుకుని మహా లింగార్చన, రాత్రి అతి రుద్ర సహిత శ్రీ సుదర్శన, నరసింహ ధన్వంతరీ మహా యజ్ఞాన్ని వైభవంగా జరుపనున్నారు. అలాగే 16న నిర్వహించే కలశాభిషేకం, శాంతి కల్యాణంతో యజ్ఞ క్రతువు ముగియనుంది. ప్రతి రోజూ శాలిగ్రామ ఆరాధన, లక్ష బిల్వార్చన, లలితా సహస్ర నామార్చన కార్యక్రమాలను నిర్వహిస్తామని నరసింహ గురూజీ తెలిపారు. ఈనెల 15న మహాయజ్ఞం -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ముదినేపల్లి రూరల్: విద్యుత్షాక్కు గురై చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని బొమ్మినంపాడులో జరిగింది. గ్రామానికి చెందిన యర్రా బిందుమాధవసాయి (30) రొయ్యల చెరువు సాగు చేస్తుంటాడు. గత నెల 28న చెరువు వద్దకు వెళ్లగా ఫ్యాన్ సెట్లు పనిచేయడం లేదని గుర్తించాడు. దీనితో ఎలక్ట్రీషియన్ను రప్పించి ఫ్యాన్సెట్లకు సంబంధించిన మోటార్ను బాగుచేస్తుండగా ప్రమాదవశాత్తూ బిందుమాధవసాయి విద్యుత్షాక్కు గురయ్యాడు. షాక్కు గురైన వెంటనే నీటిలో పడిపోగా ఒడ్డుకు తీసుకునివచ్చి నీళ్లు కక్కించి గుడివాడ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికత్స కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. బింధుమాధవసాయికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఈ ప్రమాద ఘటనపై తండ్రి శ్రీరాములు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నూజివీడు: పట్టణంలో యువతిపై దాడిచేసి గాయపరిచిన నిందితుడు బండారు సురేష్కుమార్ను పట్టణ సీఐ పీ సత్యశ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నారు. యువతిపై దాడి చేసిన అనంతరం నిందితుడు విస్సన్నపేట, చాట్రాయి ప్రాంతాలకు పరారయ్యాడు. అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలోని వేంసూరుకు వెళ్లగా అక్కడ నిందితుడిని సోమవారం రాత్రి సీఐ అదుపులోకి తీసుకుని నూజివీడుకు తరలించారు. దాడికి గల కారణాల గురించి విచారిస్తున్నట్లు తెలిసింది. -
ముసాయిదాలోని అంశాలు అంగీకరించం
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్– 2026 ముసాయిదాలోని అంశాలు ఉపాధ్యాయ, ఉద్యోగులకు తీవ్ర నష్టం చేకూర్చేలా ఉన్నాయని, ఆయా అంశాలను ఏమాత్రం అంగీకరించేది లేదని ఉపాధ్యాయ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం స్పష్టం చేసింది. స్థానిక పవర్పేట నగరపాలక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంగళవారం జిల్లా స్థాయి ఉపాధ్యాయ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కొత్త ముసాయిదా పెన్షన్ నిబంధనలపై ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఈ అంశంపై సమష్టిగా చర్చించి, ప్రభుత్వానికి తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేస్తామన్నారు. ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ –1980ను దెబ్బతీసే ఏ మార్పులనైనా ఉపాధ్యాయులు, ఉద్యోగులు సహించబోమని, ప్రభుత్వం వెంటనే ఈ ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. -
పంచాయతీ ఎన్నికలకు కసరత్తు
హరహర మహాదేవ శివరాత్రి ఉత్సవాలకు శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు ఉత్సవాల నేపథ్యంలో శివాలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. 8లో uశ్రీవారి ఆలయానికి దత్తత ఆలయమైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో శ్రీ సుదర్శన, నరసింహ ధన్వంతరీ మహాయజ్ఞానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. 8లో uబుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026ఏలూరు (టూటౌన్): పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. గతేడాది సెప్టెంబర్ 3న రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాత్కాలిక షెడ్యూల్ను ప్రతిపాదించి, అందుకు అనుగుణంగా కార్యక్రమాలను చేపట్టాలని అప్పట్లోనే జిల్లా పంచాయతీ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ జిల్లా నుండి ముగ్గురు అధికారులకు పలు సాంకేతిక అంశాలపై శిక్షణ కూడా ఇచ్చారు. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్చి 9 నాటికి పంచాయతీ ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పల్లెల్లో ఎన్నికల వేడి రాజుకుంది. చాలా మంది ఆశావహులు పోటీలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అవసరమైన ఆర్థిక గణాంకాల లెక్కలు వేసుకుంటున్నారు. ఏలూరు జిల్లాలో మొత్తం 543 పంచాయతీలు జిల్లాల పునర్విభజన అనంతరం ఏలూరు జిల్లా వ్యాప్తంగా 27 మండలాల పరిధిలో మొత్తం 543 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిఽధిలో మొత్తం 5,687 వార్డులు ఉన్నాయి. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయి. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలో 29, నూజివీడు పురపాలక సంఘంలో 32 వార్డులు ఉన్నాయి. చింతలపూడి నగర పంచాయతీలో 20 వార్డులు ఉన్నాయి. ప్రారంభమైన ఎన్నికల చర్చలు గ్రామాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. రచ్చబండల వద్ద జనం చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సారి ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు. పోటీ చేసిన వారిలో ఎవరు గెలుస్తారు అనే లెక్కలు వేసుకుంటున్నారు. కిళ్లి షాపులు, టీ దుకాణాలు, హోటల్స్ వంటి వాటి వద్ద కూడా పంచాయతీ ఎన్నికల గురించి చర్చలు సాగుతున్నాయి. బయటకు వస్తున్న ఆశావహులు పంచాయతీ ఎన్నికలు త్వరలోనే నిర్వహించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆసక్తిగా ఉన్న పలువురు ఆశావహులు తెరపైకి వస్తున్నారు. ఎవరికి వారు తెరవెనుక కసరత్తు చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా సమాలోచనలు చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎన్నికల్లో అధికార పార్టీ వైపు నుంచి కంటే ప్రతిపక్ష పార్టీ వైపు నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు పెద్ద సంఖ్యలో పైరవీలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పోటీ విషయంలో రచ్చ తప్పేలా లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి పంచాయతీలో టీడీపీకి పోటీగా జనసేన నుంచి ఆశావహులు ప్రయత్నాలు మొదలెట్టేసారు. తమకు ఇవ్వాల్సిందే నంటూ గ్రామ స్థాయి నాయకులు మండల, నియోజకవర్గ స్థాయి నాయకుల వద్ద అప్పుడే పైరవీలు చేస్తున్నారు. సీట్ల విషయంలో కూటమి పార్టీల్లోని అసంతృప్తే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల విజయానికి పరోక్షంగా దోహాదపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంచాయతీ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం నిర్వ హించాలి. ఎన్నికల కమీషన్ రాజ్యాంగ బద్దమైన వ్యవస్థ. ఈ వ్యవస్థ సరిగా పనిచేసేలా అధికారులు కృషి చేయాలి. ప్రజల్లో నమ్మకం కలిగించి రాబోయే స్థానిక ఎన్నికల్లో నిజాయితీగా ఎన్నికల కమీషన్ పనిచేయాలి. – మెండెం సంతోష్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్సీ సర్పంచుల హక్కుల పరిరక్షణ సంఘం పంచాయతీ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేలా ఎన్నికల కమిషన్ పనిచేయాలి. ఎస్సీ, ఎస్టీ సర్పంచుల రిజర్వేషన్ల స్థానాల్లో ఇతరుల పెత్తనం లేకుండా చూడాలి. సరైన సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ వాతావరణంలో ప్రజలకు సేవ చేసే అవకాశం ప్రజా ప్రతినిధులకు కల్పించినట్లు అవుతుంది. – కంచర్ల వాణి, సర్పంచ్, గోపవరం, ముసునూరు మండలం ఏప్రిల్ 2తో ముగియనున్న పాలన మార్చి 9 నాటికి ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని తాజాగా ఆదేశాలు ఇప్పటికే పల్లెల్లో మొదలైన ఎన్నికల హడావుడి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్న ఆశావహులు జిల్లాలో మొత్తం 543 పంచాయతీలు, 5,687 వార్డులు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల పాలన 2021, ఏప్రిల్ 3న ప్రారంభమైంది. పంచాయతీల పాలకవర్గ పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ 2తో ముగియనుంది. దీంతో నిర్ణీత సమయంలోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా చేపట్టాల్సిన ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి 1 వరకు ఉన్న అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగా జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా ఆయా గ్రామ పంచాయతీల్లో వార్డుల వివరాలు, జనాభా, సామాజిక వర్గాల వివరాలు సేకరించడం తదితర పనులలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. ఆయా పనుల్లో జిల్లాలోని పంచాయతీ అధికారులు, సిబ్బంది తలమునకలై ఉన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 2021 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించారు. ఏప్రిల్ 3న నూతన పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 2న పంచాయతీ పాలకవరా్గాల పదవీకాలం ముగియనుంది. ఈ లోగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. పురపాలక, నగర పంచాయతీలు, నగరపాలక సంస్థల పాలకవర్గాల గడువు మార్చి 17తో, ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీ కాలం సెప్టెంబర్ 23, 24తో పూర్తి కానుంది. 2021లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 862 గ్రామ పంచాయతీల పరిధిలో 9,660 వార్డు స్థానాలకు నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. -
గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్
ద్వారకాతిరుమల: రెండు బైక్లపై గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను ద్వారకాతిరుమల పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం. మండలంలోని ఎం.నాగులపల్లి జాతీయ రహదారిపై ఎస్సై టి.సుధీర్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో హైదరాబాద్కు చెందిన బండారి శివ, దుదాని లక్ష్మణ్సింగ్, మూరగుంట్ల ఆనంద్లు బైక్లపై వస్తూ ఘటనా స్థలంలో పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో ఎస్సై సుధీర్కు అనుమానం వచ్చి వారిని పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్ జేవీ సుబ్బారావు, మధ్యవర్తుల సమక్షంలో సదరు యువకులను విచారించి, తనిఖీలు చేశారు. వారి వద్ద 12.885 కేజీల గంజాయి కలిగిన 10 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.6.45 లక్షలు ఉంటుందని నిర్ధారించారు. సీలేరు దగ్గర పసుపులంక నుంచి హైదరాబాద్కు ఈ గంజాయిని తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో నిందితులను అరెస్టు చేసి, గంజాయి రవాణాకు వినియోగించిన బైక్లను సీజ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. ఏలూరు టౌన్: ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ విద్యార్థుల నుంచి యాజమాన్యం అదనంగా రూ.1,500 వసూలు చేస్తున్నట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మొదటి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థులకు ఏలూరు జీజీహెచ్లోని ఎంసీహెచ్ బ్లాక్ భవనం పై అంతస్తులో హాస్టల్ నిర్మించారు. నెలకు ఒక్కో విద్యార్థి నుంచి రూ.1,500 వరకు అనధికార వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. రూ.1,000 మెయింటినెన్స్, మరో రూ.500 బస్సు కోసం చెల్లించాలని చెబుతున్నారు. ఇప్పటికే హాస్టల్, మెస్కు ప్రతినెలా రూ.5,500 చెల్లిస్తుండగా అదనంగా రూ.1,500 కట్టాల్సి రావటంతో తమ కుటుంబాలపై భారం పడుతుందని అంటున్నారు. కాలేజీలో 150 మంది ఫస్టియర్ విద్యార్థులు ఉండగా వారిలో 130 మంది వరకూ హాస్టల్లో వసతి పొందుతున్నారు. వీరిలో ఫ్రీ సీటు సాధించిన వైద్య విద్యార్థులు సుమారు 78 మందికి పైగా ఉంటారు. వీరంతా సామాన్య రైతు, పేద, మధ్యతరగతి వర్గాల కుటుంబాలకు చెందిన వారు. ఫ్రీ సీటు సాధించిన సామాన్య, మధ్యతరగతి వర్గాల వైద్య విద్యార్థులపై చులకన భావనతో కాలేజీ యాజమాన్యం మాట్లాడుతుందని విద్యార్థులు అంటున్నారు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియని దైన్యస్థితిలో విద్యార్థులు ఉన్నారు. అదనంగా సొమ్ములు చెల్లింపులు, హాస్టల్లో వసతులపై నిలదీస్తే.. మీ పేర్లు చెప్పండి.. మీరు ఎలా పాస్ అవుతారో చూస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారని చెబుతున్నారు. ఏలూరు(మెట్రో): ఉగ్రవాద హింస, తీవ్రవాదం, సరిహద్దు కాల్పులు, తదితర కారణాలతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు కేర్ అండ్ ఎడ్యుకేషన్ కింద ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో అర్హత కలిగిన పిల్లలకు 25 సంవత్సరాల వరకు వారి విద్యకు సంబంధించిన మౌలిక అవసరాల కోసం ఆర్థిక సహాయం అందిస్తారన్నారు. ఈ పథక ప్రయోజనాలు పొందేందుకు జిల్లా బాలల సంరక్షణ కార్యాలయంలో సంప్రదించవచ్చని, ఇతర సమాచారం కోసం జిల్లా బాలల సంరక్షణ అధికారిని 08812– 249883 నెంబరులో సంప్రదించవచ్చన్నారు. తాడేపల్లిగూడెం: భారత ప్రభుత్వ ఆధీనంలోని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో నిట్లో గత రెండు రోజులుగా సాగుతున్న రాష్ట్రీయ కర్మయోగి లార్జ్ స్కేల్ జన్ సేవా కార్యక్రమం మంగళవారం ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగులను సృజనాత్మకంగా, వృత్తి నిపుణులుగా, సేవా దృక్పథం కలిగిన వారిగా తీర్చిదిద్దడమే ఈ కర్మయోగి మిషన్ ముఖ్య ఉద్దేశమని వక్తలు పేర్కొన్నారు. కొత్త విషయాలను ఉద్యోగులకు విశదీకరించారు. రెండు రోజుల్లో 122 మంది ఉద్యోగులు హాజరయ్యారు. ముగింపు కార్యక్రమంలో రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మందకొడిగా ఆస్తి పన్ను వసూళ్లు
జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లాలో ఆయా మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లు మందకొడిగా సాగుతున్నాయి. ఆర్థిక సంవత్సరం సుమారు 50 రోజుల్లో ముగుస్తుండగా పన్ను వసూళ్లు మాత్రం ముందుకు సాగడం లేదు. జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉండగా, ఏలూరు కార్పొరేషన్, చింతలపూడి నగర పంచాయతీలుగా ఉన్నాయి. వీటిలో మొత్తం అసెస్మెంట్లు 1,15,903 ఉండగా, మొత్తంగా రూ. 96.02 కోట్లు ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉంది. వీటిలో పాత బకాయిలు కలిసి ఉన్నాయి. ఇంతవరకు రూ. 31.19 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. మొత్తం మీద 37.2 శాతం ఆస్తి పన్నులు వసూలయ్యాయి. ఆయా మున్సిపాలిటీల్లో ఇంటి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు, కేంద్ర, రాష్ట్ర కార్యాలయాల పన్నులు కలిసి ఉన్నాయి. మొత్తం 1,15,903 అసెస్మెంట్లు ఉన్నాయి. ఇంత వరకు పన్నుల వసూళ్ళలో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ 41.11 శాతం వసూళ్లతో ప్రథమస్థానంలో ఉండగా, ఏలూరు కార్పొరేషన్ 36.28 శాతంతో చివరి స్థానంలో ఉంది. చింతలపూడి నగరపంచాయతీ 39.49 శాతంతో రెండో స్థానం, నూజివీడు 37.68 శాతంతో మూడో స్థానంలో నిలిచాయి. మున్సిపాలిటీలు వసూలు వసూలైనది కావాల్సినది (రూ.కోట్లలో) (రూ.కోట్లలో)జంగారెడ్డిగూడెం 13.22 5.43 చింతలపూడి 2.79 1.10 నూజివీడు 11.04 4.16 ఏలూరు 68.97 25.02 (కార్పొరేషన్) మొత్తం 96.02 35.71సచివాలయాల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. పట్టణంలో మైక్ ద్వారా ఆస్తి పన్ను చెల్లించాలని ప్రచారం చేస్తున్నాం. ఆస్తి పన్ను చెల్లించాలని డిమాండ్ నోటీసు జారీ చేశాం. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పన్ను వసూళ్లకు ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం. పన్ను వసూళ్లలో ఎలాంటి అలసత్వం వహించవద్దని ఆదేశాలు జారీ చేశాం. ప్రజలు కూడా సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి. – కేవీ రమణ, మున్సిపల్ కమిషనర్, జంగారెడ్డిగూడెం -
ప్రసాదాల తయారీ టెండర్ రద్దుకు నిర్ణయం
ద్వారకాతిరుమల: శ్రీవారి ప్రసాదాల తయారీ కాంట్రాక్ట్ టెండర్ను రద్దు చేయాలని అధికారుల కమిటీ నిర్ణయించింది. మొత్తం నలుగురు కాంట్రాక్టర్లు టెండర్లు వేయగా, అందులో సరైన పత్రాలు సమర్పించని కారణంగా టెక్నికల్ బిడ్లో మూడు టెండర్లను డిస్ క్వాలిఫై చేశారు. ప్రైజ్ బిడ్ ఓపెన్ చేయాలంటే కనీసం రెండు టెండర్లు ఉండాలి. సింగిల్ టెండర్ ఉండటంతో పూర్తిగా టెండర్ ప్రక్రియను రద్దు చేయాలని అధికారుల కమిటీ నిర్ణయించి, నివేదికను ఆలయ ఈఓకు సమర్పించింది. నిబంధనల ప్రకారం సరైన పత్రాలు సమర్పించని కారణంగా విజయవాడకు చెందిన ఎం.విజయచంద్ సప్లయర్స్, ఎం.రవికుమార్, జీకే మ్యాన్ పవర్ టెండర్లను కమిటీ డిస్ క్వాలిఫై చేసింది. ద్వారకాతిరుమలకు చెందిన రవికృష్ణ మ్యాన్ పవర్ ఏజన్సీస్ టెండర్ ప్రైజ్ బిడ్కు అర్హత పొందింది. కొందరు టీడీపీ నాయకులు తమకు చెందిన వ్యక్తికే ప్రసాదాల తయారీ కాంట్రాక్టు కట్టబెట్టాలని దేవస్థానం అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు. అధికారులు పారదర్శకంగా టెండర్ ప్రక్రియను నిర్వహించడంతో ముగ్గురు కాంట్రాక్టర్లు డిస్ క్వాలిఫై అయ్యారు. కొత్త టెండర్ ప్రక్రియలో అర్హత పొందిన రవికృష్ణ మ్యాన్ పవర్ ఏజన్సీస్పై, అంబరుఖానా అధికారులపై అసత్య ఆరోపణలు చేస్తూ రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్కు, ఆలయ ఛైర్మన్, ఈఓలకు గుర్తు తెలియని వ్యక్తులు ఈనెల 8న వాట్సప్ల ద్వారా మెసేజ్లు పంపారు. ఆ ఆరోపణలు అవాస్తవమని అధికారులు తమ విచారణలో తేల్చారు. దేవస్థానం అధికారులు మళ్లీ కొత్తగా పిలిచే టెండర్లో, ప్రస్తుతం ఉన్న షరతులే ఉంచుతారా.. లేక అధికార పార్టీ నాయకుల కోసం వాటిని సడలిస్తారా.. అన్న దానిపై క్షేత్రంలో జోరుగా చర్చ జరుగుతోంది. -
కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి చర్యలు తీసుకోవాలి
నూజివీడు: నూజివీడుకు మంజూరు చేసిన కేంద్రీయ విద్యాలయానికి గత ప్రభుత్వం కేటాయించిన ఏడెకరాల స్థలాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం వెంటనే కేబినేట్ సమావేశంలో తీర్మానం చేసి కేంద్రీయ విద్యాలయ సంఘటన్కు అప్పగించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కోరారు. ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కమిషనర్ వికాస్ గుప్తాను మంగళవారం ప్రతాప్ అప్పారావు కలిసి నూజివీడులో కేంద్రీయ విద్యాలయం ప్రారంభించే విషయమై చర్చించారు. ఈ సందర్భంగా వికాస్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ ఏడెకరాల స్థలాన్ని కేబినేట్ మీటింగ్లో అప్రూవ్ చేసి కమిషనర్కు పంపాలని కోరారు. నూజివీడులో కేంద్రీయ విద్యాలయ నిర్వహణకు రెండేళ్ల క్రితమే ఎంప్లాయిస్ కాలనీలో 16 తరగతి గదులతో తాత్కాలిక భవనాన్ని సిద్ధం చేసి కేంద్రీయ విద్యాలయ సంఘటన్కు అప్పగించామని, సికింద్రాబాద్లోని డిప్యూటీ కమిషనర్ సైతం నూజివీడు విచ్చేసి భవనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఏడాదిన్నరగా ప్రారంభించకుండా ఉండటం వల్ల నూజివీడు ప్రాంతంలోని పేద వర్గాలకు చెందిన పిల్లలకు అన్యాయం జరుగుతోందని, ఎంతో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థను తీసుకువస్తే ఇంత వరకు ప్రారంభించకపోవడం దురదృష్టకరమన్నారు. దీనిపై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కేంద్రీయ విద్యాలయం ప్రారంభమయ్యేలా, ఏడెకరాల స్థలాన్ని కేబినేట్లో అప్రూవ్ చేసేలా కృషి చేయాలని ప్రతాప్ అప్పారావు కోరారు. మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు -
కలియుగ దైవంతో రాజకీయాలా ?
ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ ఏలూరు టౌన్: టీడీపీ ప్రభుత్వం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామితో ఆటలాడుతూ.. నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ అన్నారు. శ్రీవారి పవిత్రత, లడ్డూ ప్రసాదం విశిష్టతను పరిరక్షించాల్సిన కూటమి ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయాల కోసం దేవుడితో రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని సీబీఐ, సిట్ దర్యాప్తులో తేలిపోయిందని, తాజాగా సీఎం చంద్రబాబు, కూటమి నేతలు మాట మార్చుతూ.. పామాయిల్, కెమికల్స్ కలిశాయని ఆరోపిస్తున్నారని తెలిపారు. వీటికి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్ల నుంచి తీసుకున్న శాంపిల్స్పై చేసిన ల్యాబ్ పరీక్షల చుట్టూనే ఈ కేసు నడుస్తుందనే విషయాన్ని టీడీపీ, కూటమి నేతలు గమనించాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్దిరోజుల్లోనే శ్రీవారు లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారం జరిగితే... దానికి బాధ్యత వహిస్తూ సమాధానం చెప్పాల్సింది టీడీపీ ప్రభుత్వమేనని తెలిపారు. ఈ టీడీపీ ప్రభుత్వం ఇప్పటికై నా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారితో రాజకీయాలు చేయకుండా... తప్పును ఒప్పుకోవాలని ఏలూరు సమన్వయకర్త జేపీ హితవుపలికారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ, అభిమానాన్ని చూసి భయంతో ఆయనపై కుట్రలు చేస్తున్నారని, దేవుడు కూటమి నేతలకు సరైన రీతిలో శిక్ష విధిస్తారని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు నెరుసు చిరంజీవి, జిల్లా కార్యదర్శి కంచుమర్తి తులసీ, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, నగర దివ్యాంగుల విభాగం అధ్యక్షులు ఏ.కృష్ణ, తదితరులు ఉన్నారు. -
కాలేజీ బస్సును ఢీకొట్టిన లారీ
నలుగురు విద్యార్థులకు గాయాలు దెందులూరు: కాలేజీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై పెదవేగి మండలం దుగ్గిరాల సర్వీస్ రోడ్డువద్ద సోమవారం డిపాల్ కాలేజీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైసీపీ రెండో సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఏలూరు సర్వజన వైద్యశాలకు తరలించారు. ముగ్గురు వైద్యం చేయించుకుని డిశ్చార్జి కాగా, ఒక విద్యార్థి వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్లు ఎస్సై శేఖర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. చాట్రాయి: చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై డి రామకృష్ణ తెలిపారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మండలంలోని నరశింహారావు సొసైటీలో గత డిసెంబర్ 25న చోరీ జరిగినట్లు తెలిపారు. తాళం పగల కొట్టి లోపల బీరువాలో ఉన్న రూ 1.40 లక్షల నగదు చోరీకి గురైందన్నారు. సొసైటీ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. అనుమానితులపై ప్రత్యేక నిఘాపెట్టి నిందితుడు గ్రామానికి చెందిన నక్కా గంగాధరావుని అరెస్టు చేసి అతని వద్ద నుంచి చోరీ సొత్తు రూ 1.40 లక్షల నగదుని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పోలవరం రూరల్: పట్టిసం శివక్షేత్రంలోని వీరేశ్వరస్వామి, భావన నారాయణ స్వామి క్షేత్రాలకు సంబంధించి హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ఫౌండర్ ఫ్యామిలీ మెంబర కుచ్చరకోట వీరభద్రరావు, ఈవో సీహెచ్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వీరేశ్వరస్వామి దేవస్థానం హుండీల ఆదాయం రూ. 5,73,460, భావన నారాయణ స్వామి క్షేత్రం ఆదాయం రూ. 38,915 వచ్చినట్లు ఈవో తెలిపారు. నూజివీడు: వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న ఓ వ్యక్తి తనను పెళ్లిచేసుకోవాలని వేధిస్తూ యువతిపై కత్తితో దాడి చేసిన ఘటన ఆదివారం సాయంత్రం నూజివీడు పట్టణంలో చోటుచేసుకుంది. హనుమంతులగూడెంకు చెందిన పులపాక నవ్య(21) తన తల్లితో కలిసి పట్టణంలోని స్టేషన్తోట ప్రాంతంలోని సాయిబాబు గుడి ఏరియాలో అద్దెకు ఉంటూ బీఎస్సీ నర్సింగ్ చదువుతూనే స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. 2018లో రజకపేటలో అద్దెకు ఉన్న సమయంలో వివాహమై ఇద్దరు పిల్లలున్న బండారు సురేష్కుమార్ (30) నవ్యకు పరిచయమయ్యాడు. కొంతకాలానికి అతడు అల్లరి చేస్తుండటంతో ఆమె అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసి వేరేచోటకు వెళ్లిపోయారు. నువ్వంటే నాకిష్టం, నన్ను పెళ్లి చేసుకో అంటూ ఆమెను వేధిస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో ఈనెల 8న సాయంత్రం నవ్య కొప్పుల వెలమపేటలో ఉంటున్న ఆమె మామయ్య ఇంటికి నడిచి వెళ్తుండగా సురేష్ ఆమైపె చాకుతో దాడి చేయగా త్రుటిలో తప్పుకోవడంతో కాలిపై గాయమైంది. ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించిన అనంతరం ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐ పీ సత్యశ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పాస్టర్ పరంజ్యోతి మృతి ఏలూరు (ఆర్ఆర్పేట): స్థానిక శ్రీరామ్నగర్లోని బెనీలా ప్రార్థనా మందిరం పాస్టర్ ఎం పరంజ్యోతి ఆదివారం మృతిచెందారు. సోమవారం సాయంత్రం వరకు ఆయన మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం సెయింట్ గ్జేవియర్ పాఠశాలలో ఉంచారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన ప్రఖ్యాత సంగీత దర్శకునిగా, ఆరాధకునిగా రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవ సమాజానికి పరిచితులు. పరంజ్యోతి శాంతినగర్లోని మన్నా చర్చి బిషప్ ముంగడం ఎలీషా రాజు ప్రథమ కుమారుడు. -
నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలి
ఏలూరు(మెట్రో): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు పాటు, ట్రైనీ ఐపీఎస్ జయాశర్మ, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్ తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్వో వి.విశ్వేశ్వరరావు మాట్లాడుతూ పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లో ప్రజలు సమర్పించిన అర్జీలపై అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో అర్జీదారులతో స్వయంగా మాట్లాడి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. ఏ శాఖకు వచ్చిన అర్జీలకు ఆ శాఖ వారు మాత్రమే పరిష్కారం చూపాలని, వేరే శాఖకు పంపితే కాల యాపన జరిగి సమస్యలు ఉత్పన్నం అవుతాయన్నారు. అర్జీలకు నిర్ణీత సమయంలోగా నాణ్యమైన పరిష్కారం చూపినప్పుడే అర్జీదారులు సంతృప్తి చెందుతారని అన్నారు. సోమవారం 392 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులు తిప్పాలని వినతి ఏలూరు (ఆర్ఆర్పేట): కొల్లేరు గ్రామమైన పైడి చింతపాడు నుంచి ఏలూరుకు విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సును తిప్పాలని పత్తికోళ్ళలంకకు చెందిన జీ.ఖ్యాతి పుష్పశ్రీ పీజీఆర్ఎస్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. -
పస్తులుంటున్నాం.. జీతాలివ్వండి !
కై కలూరు: కుటుంబాలతో సహా పస్తులుంటున్నాం.. ఏడు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలి.. అంటూ కై కలూరు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు 20 మంది తాలూకా సెంటర్లో సోమవారం భిక్షాటన చేశారు. దుకాణాల వద్దకు వెళ్ళి జోలి పట్టి డబ్బులు అడుక్కున్నారు. అనంతరం కార్మికులు మాట్లాడుతూ జీతాలు అందించపోయినా పనులు మాత్రం మానలేదన్నారు. ఇప్పటికే అప్పులు చేసి వడ్డీలు చెల్లిస్తున్నామన్నారు. తక్షణం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై పంచాయతీ ఈవో వి.ఫణిరాజకుమారిని వివరణ కోరగా ఇటీవల ఎంపీడీవో సెలవులో ఉండడంతో ఇన్చార్జి ఎంపీడీవోకు బాధ్యతలు ఇచ్చారన్నారు. తిరిగి ఎంపీడీవో విధుల్లో చేరారన్నారు. ఈ క్రమంలో జీతాలు చెల్లించడంలో ఆలస్యం అయ్యిందన్నారు. సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. -
హరహరా అంటే బుడబుడా నీటి బుడగలు..
కై కలూరు: దక్షిణ కాశీగా పేరుగడించిన కలిదిండి పార్వతీ సమేత పాతాళ భోగేశ్వరస్వామి దివ్య కల్యాణ శివరాత్రి మహోత్సవాలు ఈ నెల 13 నుంచి 17 వరకు జరగనున్నాయి. స్వామివారి దివ్య కల్యాణం 14వ తేదీ రాత్రి 1.25 గంటలకు నిర్వహిస్తారు. ఇప్పటికే దేవస్థానంకు రంగులు, చలువ పందిర్లు, క్యూలైన్లు, కోనేరు శుభ్రం వంటి పనులను శరవేగంగా చేస్తున్నారు. ఈ ఏడాది శివరాత్రికి రెండో శనివారం, ఆదివారం రెండు రోజున సెలువు దినాలు రావడంతో దాదాపు లక్షపైనే భక్తులు స్వామి దర్శనానికి విచ్చేస్తారని పోలీసులు భావిస్తున్నారు. తాజాగా ప్రాకార మండప నిర్మాణ తవ్వకం పనుల్లో సాలిగ్రామ శివలింగాకారం బయల్పడటంతో భక్తుల సంఖ్య పెరిగింది. జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన భోగేశ్వరస్వామి శివరాత్రి తీర్థానికి విచ్చేసే భక్తుల కోసం పంచాయతీరాజ్ నుంచి రూ.10 లక్షలు, మండల పరిషత్ నుంచి రూ.5 లక్షలతో శాశ్వత మరుగుదొడ్లును నిర్మిస్తున్నారు. నూతన ప్రాకార మండప పనులను పునఃప్రారంభించారు. దాతల సాయంతో కోనేరును శుభ్ర పరిచే పనులు పూర్తి చేసి కొత్త నీటిని నింపారు. దేవాలయ ప్రాంగణంలో రహదారులను ఏర్పాటు చేశారు. రాజగోపుర నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని ఆలయ అధికారులు చెప్పారు. 11వ శతాబ్దం నుంచి పూజలు.. వేంగిరాజు రాజరాజచోళుడు 11వ శతాబ్దంలో శివాలయాన్ని నిర్మించారు. భోగేశ్వరలంకలో రైతు పొలంలో నాగలి కర్ర తగిలి రక్తం పారుతూ స్వయంభూలింగం బయటపడింది. కర్రతగిలి విరిగిన భాగాన్ని అతికించినట్లు చరిత్ర చెబుతోంది. ఆ భాగం నుంచి రక్తపు నీరు చమరిస్తున్నట్లుగా ఉంటుందని భక్తుల విశ్వాసం. కోడికూత, రోకటి పోటు వినలేనంటూ ఏకాంతంగా ఉన్న ఈ చోటనే ఆలయ నిర్మించాలని స్వామి కోరాడని ఇక్కడ స్థల పురాణం చెబుతోంది. పూర్వం వర్షకాలంలో ఒక రోజున జోరున వర్షం కురుస్తుంటే స్వామి నిత్యార్చనకు ఆలస్యం జరిగిందట. దీంతో స్వామి వారు స్వయంగా ధ్వజస్తంభం ఎక్కి అర్చకుల రాకను గమనించి ధ్వజ స్తంభంపై నుంచి దూకడంతో కింద స్వామివారి పాదాల గుర్తులు ఏర్పడ్డాయని చరిత్ర చెబుతోంది. నన్నయ్యబట్టు తొలి తెలుగు కావ్యం ఇక్కడే రాజరాజ నరేంద్రుడు నాలుగు పద్యాల కావ్యంలో శోభించేలా కవి నన్నయ్యభట్టుచే తొలి తెలుగు కావ్యం ఇక్కడే రాయించారని చరిత్రలో చెప్పారు. పూర్వం రాజరాజనరేంద్రుడు, కవి నన్నయ తణుకులో నిర్వహించిన యజ్ఞం పూర్తి చేసుకుని ఆశ్వాలపై కలిదిండికి వచ్చారు. దారిలో ఓ నలుగురు అశ్వాల కంటే ముందు పరిగెత్తుతూ ఇక్కడ కోనేరులో దిగి మాయమయ్యారు. సరస్వతి దేవీ ప్రతక్ష్యమై మీకు ఎదురు పడింది ‘భోగేంద్రులు నాగేంద్రులు’ అని చెప్పి ఇక్కడ కోనేరు ద్వారా పాతాళానికి వెళ్తారని తెలిపింది. ఒడ్డున నిలిచి పాతాళ భోగేశ్వరా హరహర అని పిలిస్తే బుడబుడ మంటూ బుడగలు వస్తాయని అమ్మ చెప్పిందని పురాణం. ఇప్పటికీ బుడబుడ శబ్దాలు వినిపించడం ఒక వింత. 13 నుంచి పాతాళ భోగేశ్వరస్వామి శివరాత్రి ఉత్సవాలు 11వ శతాబ్దంలో నిర్మించిన అతి పురాతన శివాలయం తాజాగా తవ్వకాల్లో బయల్పడిన మరో సాలిగ్రామ శివలింగాకారం సుమారు లక్ష పైబడి భక్తులు విచ్చేస్తారని అంచనా అతి పురాతనమైన భోగేశ్వరస్వామి స్వయంభూలింగం. తాజాగా సాలిగ్రామ లింగం ఇక్కడ నిర్మాణ పనుల్లో బయల్పడింది. భక్తుల దర్శనార్థం శివాలయ ఆవరణలో ప్రతిష్ట చేయాలని భావిస్తున్నాం. శివరాత్రికి అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. శివరాత్రి జాగారం రాత్రి ఆకట్టుకునే సాంసృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఈ ఏడాది లక్షపైనే భక్తులు విచ్చేస్తారని భావిస్తున్నాం. – శింగనపల్లి శ్రీనివాసరావు, ఆలయ ఈవో, పాతాళభోగేశ్వరస్వామి దేవస్థానం -
జిల్లా ఫారెస్టు అధికారిణి విజయ బదిలీ
కై కలూరు: ఏలూరు జిల్లా ఫారెస్టు అధికారిణి బత్తిన విజయ ఆకస్మిక బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నుంచి సోమవారం కార్యాలయానికి ఉత్తర్వులు చేరాయి. డీఎఫ్ఓ విజయను రాష్ట్ర అటవీ అధికారికి రిపోర్ట్ చేయాలని సూచించారు. ఆమె స్థానంలో ఇన్చార్జిగా జిల్లా టెరిటోరియల్ డీఎఫ్ఓ పొతంశెట్టి సందీప్రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. డీఎఫ్వో విజయ 2021లో కై కలూరు ప్రాంత రేంజర్గా పనిచేశారు. తర్వాత మాచర్లకు బదిలీపై వెళ్లారు. తిరిగి 2024 సెప్టెంబరులో ఏలూరు జిల్లా వన్యప్రాణి ఫారెస్టు అధికారిణిగా పదోన్నతిపై విధులు చేపట్టారు. ఇటీవల సుప్రీంకోర్టు సాధికారిత కమిటీ(సీఈసీ) బృందానికి నేతృత్వం వహించారు. సీఈసీ అదేశాలతో కొల్లేరు అభయారణ్యంలో అక్రమ చెరువులను ధ్వంసం చేయాలని రాజమండ్రి సర్కిల్ పీసీసీఎఫ్ బీఎన్ఎన్.మూర్తితో కలసి కొల్లేరులో అక్రమ చెరువుల ధ్వంసానికి ప్రయత్నించారు. చటాకాయి, నత్తగుళ్లపాడు వంటి గ్రామాల్లో చెరువుల ధ్వంసానికి వెళితే ప్రజలు నిరసన తెలిపారు. కొల్లేరు నాయకులు అటవీ అధికారుల చర్యలను వ్యతిరేకించారు. తర్వాత ప్రజాప్రతినిధులకు అటవీ అధికారులపై ఫిర్యాదులు చేశారు. ఈ నేపధ్యంలో విజయ బదిలీ అటవీశాఖలో చర్చనీయాంశంగా మారింది. -
ఆర్థిక అక్షరాస్యత పోస్టర్ల ఆవిష్కరణ
ఏలూరు(మెట్రో): ఆర్బీఐ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవ కార్యక్రమాలలో భాగంగా ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంపొందించేందుకు పోస్టర్లను కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత ఎంతో కీలకమని, సురక్షిత బ్యాంకింగ్ విధానాలు, డిజిటల్ లావాదేవీలు, పొదుపు అలవాట్లు, ఆర్థిక మోసాల నుంచి రక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ వారోత్సవాలలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు బాధ్యతాయుత ఆర్థిక ప్రవర్తనపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం సందర్భంగా బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ ఆర్థిక భద్రతపై బ్యాంకర్లు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏలూరు (టూటౌన్): పంచాయతీ కార్మికులకు నెల నెల సక్రమంగా జీతాలు చెల్లించాలని గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా కార్యదర్శి పి.కిషోర్ డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలపై జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) కె.అనూరాధకు సోమవారం వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి పి.కిషోర్ మాట్లా డుతూ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు అప్పులు చేసుకుని పస్తులతో బతకాల్సి వస్తుందన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు కనీసం యూనిఫాం, చెప్పులు, కొబ్బరి నూనె, చేతి గ్లౌజులు వంటి కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. తక్షణమే జిల్లాలో బకాయిపడిన పంచాయతీల్లో కార్మికులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మికులకు ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. డిపిఓ స్పందిస్తూ జిల్లాలో వివిధ పంచాయతీల్లో బకాయిలను మార్చి నెలాఖరుకు క్లియర్ చేయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏలూరు (టూటౌన్): గత ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు వాగ్దానం చేసిన విధంగా తక్షణం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని ఏఐవైఎఫ్ ఏలూరు జిల్లా కో కన్వీనర్ తొర్లపాటి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సమస్యలతో కూడిన వినతిపత్రం సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ కూటమి పెద్దలు ఎన్నికల సమయంలో రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీలను అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే భర్తీ చేస్తామని, ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, నిరుద్యోగ యువతకు శిక్షణ, ప్రోత్సాహకాలు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 19 నెలలు గడచినా కూడా ఒక్క హామీ అమలుకు నోచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఎన్నికల సమయంలో వలంటీర్లకు ఇచ్చిన హామీ మేరకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ ఏలూరు జిల్లా కన్వీనింగ్ కమిటీ మెంబర్ కురెళ్ళ వరప్రసాద్, బొల్లవరపు శేఖర్ పాల్గొన్నారు. -
అక్రమ అరెస్టులకు భయపడేది లేదు
ద్వారకాతిరుమల: కూటమి అక్రమ అరెస్టులకు భయపడేది లేదని మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనిత అన్నారు. మాజీ మంత్రి, కాపు నేత అంబటి రాంబాబు ఇంటిపై ఇటీవల జరిగిన దాడి, ఆయన అక్రమ అరెస్టును నిరసిస్తూ నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులతో కలసి వనిత సోమవారం గుంటూరులోని అంబటి ఇంటికి వెళ్లారు. తొలుత ద్వారకాతిరుమల మండల నాయకులు భీమడోలు మండలం గుండుగొలను హైవేపైకి చేరుకున్నారు. అక్కడి నుంచి కార్లలో వారంతా ర్యాలీగా గుంటూరులోని రాంబాబు ఇంటికి తరలివెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లి, ఆయన్ను పరామర్శించారు. వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ఇంకెంతో కాలం అది చెల్లదన్నారు. ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో జంతువుల కొవ్వు కలసిందని అసత్య ఆరోపణలు చేసి, చివరకు భంగపడ్డ చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్లు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. పార్టీ నాయకులు దాకారపు బంగారమ్మ, బొండాడ వెంకన్నబాబు, పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్, షేక్ మస్తాన్ బాషా, మల్లిపూడి నాగమణి, దాసరి రాంబాబు తదితరులున్నారు. -
గిట్టుబాటు ధర లభించేనా?
బుట్టాయగూడెం: ఒకప్పుడు ప్రధాన వాణిజ్య పంటగా ఉన్న నాటు పొగాకు పంట సాగు క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది. అధిక పెట్టుబడి, కూలీల కొరత, సాగులో ఆశించిన లాభాలు రాకపోవడం, తదితర కారణాలతో పంట తగ్గిపోతుందని రైతులు వాపోతున్నారు. ఒకప్పుడు వేలాది ఎకరాలుగా సాగైన నాటుపొగాకు ఇప్పుడు వందల ఎకరాలకే పరిమితమైంది. ముఖ్యంగా గత రెండు సంవత్సరాల నుంచి నాటు పొగాకుకు గిట్టుబాటు ధర తగ్గిపోవడంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయినట్లు కనిపిస్తోంది. గత ఏడాది 6 ఎకరాలు పంట వేసిన రైతు ఈ ఏడాది 3 ఎకరాలు మాత్రమే పంట వేశారు. ఆశించిన స్థాయిలో మార్కెట్ ధర లభించకపోవడంతో నాటు పొగాకును తగ్గించి వర్జీనియా పొగాకు, ఇతర పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో... 2019 నుంచి 2024 వరకూ నాటు పొగాకు పంటల సాగు అధికంగా ఉండేది. సుమారు 2,500 ఎకరాల వరకూ మన్యప్రాంతంలో నాటుపొగాకు పంట పండించేవారు. నాటు పొగాకు పుట్టు 227 కేజీలు సుమారు రూ. 65 వేల నుంచి రూ.70 వేల వరకూ మద్దతు ధర వచ్చిందని, ఆ సమయంలో పంటల్లో లాభాలను కూడా చూశామని రైతులు చెబుతున్నారు. అలాగే పంటల సాగుకు కరెంట్ సదుపాయం కూడా సక్రమంగా ఉండడంతో నీటి కొరతకు కూడా ఇబ్బంది పడేవాళ్లం కాదని చెబుతున్నారు. రెండేళ్లుగా దక్కని గిట్టుబాటు ధర గడచిన రెండేళ్లుగా పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది నాటు పొగాకు పుట్టు ధర రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ మాత్రమే వచ్చిందని, దీంతో తీవ్ర నష్టాల పాలయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎకరం నాటుపొగాకు పంటకు తమకు రూ.1,50,000 వరకూ ఖర్చవుతుందని కనీస మద్దతు ధర రాకపోవడంతో ఈ ఏడాది సగానికి సగం పంట సాగు తగ్గించినట్లు చెబుతున్నారు. కాగా ఈ ఏడాది మన్యంలో కేవలం 600 ఎకరాల్లో మాత్రమే పంటలు వేసినట్లు రైతులు తెలిపారు. నాటు పొగాకు సాగు చేసే రైతులకు విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. ఆరుగాలం కష్టపడి పంటను పండించిన రైతు ఆ పంట అమ్ముకోవాలంటే నానా అవస్థలు పడుతున్నాడు. పంట కొనుగోలు చేసిన వ్యాపారులే ఆ పంటకు ధర నిర్ణయిస్తున్న పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా రైతుకు డబ్బులు చెల్లించే విషయంలో కూడా దళారుల నిర్ణయమే. అయితే రైతులు పండించిన పంటకు సొమ్ము ఎప్పుడు లభిస్తుందో కూడా తెలియని దుస్థితి నెలకొంటుంది. అవసరమైనప్పుడు ఆ వ్యాపారి దగ్గరకు వెళ్లి కొద్దికొద్దిగా సొమ్ము తెచ్చుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు. గత రెండేళ్లుగా నాటు పొగాకుకు గిట్టుబాటు ధర లేదు. ఎంతోకాలంగా నాటు పొగాకు పండిస్తున్న మేము ఈ ఏడాది ఎంతో ఆశతో మళ్లీ నాటు పొగాకు పంట వేశాం. ఈసారైనా పంటకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా అధికారులు కృషి చేయాలి. పంట పండించిన మాకు ఆ డబ్బులు కూడా సక్రమంగా చేతికి వచ్చే పరిస్థితి లేదు. – కొప్పిశెట్టి కిషోర్, నాటు పొగాకు రైతు, కొమ్ముగూడెంగత ఏడాది నేను 6 ఎకరాల్లో నాటుపొగాకు పంటను వేశాను. పుట్టు కేవలం రూ.30 వేలు మాత్రమే పలికింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో నాటు పొగాకు పుట్టు ధర రూ.70 వేల వరకూ వచ్చింది. గత రెండేళ్లుగా నాటుపొగాకుకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఈ ఏడాది కేవలం 3 ఎకరాల్లో మాత్రమే పంట వేశాను. – వల్లభనేని శివనాగరాజు, నాటు పొగాకు రైతు, కొమ్ముగూడెం గత రెండేళ్లుగా నాటు పొగాకుకు దక్కని గిట్టుబాటు ధర భారీగా తగ్గిన సాగు విస్తీర్ణం 600 ఎకరాల్లో సాగు చేస్తున్న చిన్న, సన్నకారు రైతులు -
అక్రమ అరెస్టులకు భయపడేది లేదు
మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ కుటుంబాలను మాజీ హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదన్నారు. 8లో uబుట్టాయగూడెం: రాజకీయ స్వార్థంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. మండలంలోని దుద్దుకూరులో ఆయన సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆరోపణలో ఏ మాత్రం నిజం లేదని ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్లు తేల్చినా.. దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు బుకాయిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి సాహసించని రీతిలో చంద్రబాబు మళ్లీ అవే ఆబద్దాలాడుతున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద చల్లాలనే ఉద్దేశంతోనే పవిత్రమైన తిరుపతి లడ్డూను రాజకీయంగా వాడుకోవడాన్ని బాలరాజు తీవ్రంగా ఖండించారు. వారు చేస్తున్న దుర్మార్గపు ప్రచారాన్ని ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు నిలదీస్తున్నారని దానిని దారి మళ్లించడానికి మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఇంటిపై దాడి, హత్యాయత్నం చేయడం, జోగి రమేష్ ఇంటిపైన నిప్పు పెట్టడం చూస్తుంటే ప్రజాగ్రహం నుంచి తప్పించుకోవడం కోసం చేస్తున్న కుట్రలుగా కనిపిస్తున్నాయని చెప్పారు. లడ్డూల్లో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని స్పష్టంగా చెబున్నప్పటికీ చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు. చేసిన తప్పులు ఒప్పుకుని లెంపలేసుకుని క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి శిక్షించే శిక్షలను కూటమి పాలకులు తప్పించుకోలేరని బాలరాజు అన్నారు. ఇప్పటికైనా దుష్ప్రచారం ఆపాలని అన్నారు. తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే -
ఉద్యోగాల పేరుతో లక్షలు వసూలు చేసి మోసం
● టీడీపీ నాయకురాలిపై చర్యలు తీసుకోవాలి ● ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ డిమాండ్ఏలూరు (టూటౌన్): రైల్వే, పోస్టల్, కోర్టుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేసిన కొయ్యలగూడెంకు చెందిన టీడీపీ మహిళా నాయకురాలిపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర చైర్మన్ ఐ.వేమేశ్వరి డిమాండ్ చేశారు. స్థానిక ఎన్ఆర్పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కొయ్యలగూడెంకు చెందిన టీడీపీ మహిళా లీడర్ గంగిరెడ్ల మేఘలాదేవి కొయ్యలగూడెం, కాకినాడ జిల్లా ఏలేశ్వరంనకు చెందిన పలువురు మహిళల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 2022–23 మధ్య కాలంలో ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.10 లక్షలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. బాధితులు తొమ్మిది మంది నుంచి రూ.90లక్షలు వసూలు చేసి తిరిగి చెల్లించమని అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. ఫేక్ శిక్షణ, ఫేక్ జాయినింగ్ ఆర్డర్లు ఇచ్చి బాధితులను మోసం చేశారని, అడిగితే తాను టీడీపీ నాయకురాలినని.. చేతనైంది చేసుకోండి ఆనడం, ఇంటికి వెళితే దౌర్జన్యం చేసి బెదిరించడం చేస్తున్నారన్నారు. బాధితులంతా నిరుపేదలని, వారు ఇండ్లు, స్థలాలు అమ్మి, అప్పులకు తెచ్చి సొమ్ములు చెల్లించారన్నారు. వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోగా డబ్బులు అడిగితే బెదిరించడం తగదన్నారు. దీనిపై బాధితులు ఏలూరు, కాకినాడ జిల్లాల కలెక్టర్లకు, పోలీసులతో పాటు మంత్రి నారా లోకేష్, డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు న్యాయం చేయకపోవడం బాధాకరమన్నారు. తక్షణం బాధితులకు న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో బాధిత మహిళలు పోలనాగమ్మ, అంబటి లవ లక్ష్మి, అనుమోలు పద్మావతి, సందక రమణమ్మ, ఏఐబీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నెట్బాల్ పోటీలకు విద్యార్థిని ఎంపిక
భీమవరం: ఇటీవల వాసవి పెనుగొండలో జరిగిన ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇంటర్ కాలేజి నెట్బాల్ సెలెక్షన్లో డాక్టర్ సీఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థిని ఎం ఎస్తేరు రాణి రాణించి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ సకుమళ్ళ సత్యనారాయణ తెలిపారు. ఈనెల 14వ తేదీ నుంచి 18 వరకు ఆంధ్రప్రదేశ్, కృష్ణా యూనివర్సిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని స్టెల్లా కళాశాలలో జరగనున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్బాల్ పోటీల్లో పాల్గొనే ఆదికవి నన్నయ యూనివర్సిటీ మహిళల జట్టుకు ఎం ఎస్తేరు రాణి ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని ఎస్తేర్ రాణిని కళాశాల సెక్రెటరీ – కరస్పాండెంట్ డాక్టర్ చీడే సత్యనారాయణ అభినందించారు. కార్యక్రమంలో ట్రెజరర్ వడుపు గోపి, పీడీ దావూద్ ఖాన్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. -
గంగానమ్మకు ఘనంగా వీడ్కోలు
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలో గత మూడు నెలలుగా భక్తుల విశేష పూజలందుకున్న శ్రీ గంగానమ్మ అమ్మవారికి సోమవారం నగర ప్రజలు అత్యంత వైభవంగా వీడ్కోలు పలికారు. తూర్పు వీధి, దక్షిణపువీధి, పవరుపేట, లక్ష్మివారపుపేట, ఆదివారపుపేటలతో పాటు పడమరవీధి ప్రాంతాల్లో గత వంద రోజులకు పైగా భక్తిశ్రద్ధలతో కొలిచి గత నెల 26, ఈ నెల 2 తేదీల్లో అమ్మవారిని సాగనంపగా తంగెళ్ళమూడి ప్రాంతంలో చివరిసారిగా అమ్మవారికి సోమవారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. భారీ ఎత్తున ఊరేగింపు తంగెళ్ళమూడిలో ఏర్పాటు చేసిన శ్రీ గంగానమ్మ అమ్మవారి మేడల నుంచి అమ్మవారిని కొర్లబండిపై నగర శివార్లకు సాగనంపే ప్రక్రియ నేత్రపర్వంగా జరిగింది. ఊరేగింపులో కొర్లబండిపై అమ్మవారి వేషధారణలో పంబల వారు కూర్చొని భక్తులకు కుంకుమబొట్లు పెడుతూ ఆశీర్వదిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా తీన్మార్ డప్పులు, డీజేలు, నృత్యాలు, బుట్టబొమ్మలు, శక్తి వేషధారులతో ఊరేగింపు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఊరేగింపు సాగిందిలా.. జాతర మేడల నుంచి అమ్మవారి కొర్ల బండి ఊరేగింపు ప్రారంభమై అక్కడి నుంచి మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయం మీదుగా వేణుగోపాల స్వామి ఆలయం, స్వాతి టవర్స్, అంగడాల ప్లాట్స్, చెరువుగట్టు రోడ్డు, బీడీ కాలనీలోని కనకదుర్గమ్మ ఆలయం, ఆర్కే ఫ్యాషన్స్ వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి చింతలపూడి రోడ్డులోకి ప్రవేశించి బాబూ జగజ్జీవన్ రామ్ కమిటీ హాలు మీదుగా రాణీ నగర్లోని రామాలయం వద్దకు చేరుకుని జంగారెడ్డిగూడెం రోడ్డులోకి ప్రవేశించింది. చివరిగా జంగారెడ్డిగూడెం రోడ్డులోని టాటా మోటార్స్ షోరూం సమీపంలో అమ్మవారిని పొలిమేరలు దాటించి అక్కడ అమ్మవారిని విడిచి వచ్చారు. నగరంలో భారీ ఊరేగింపు -
మాట్లాడలేరు.. మంచం దిగలేరు
● 16 ఏళ్లుగా వైకల్యంతో బాధపడుతున్న హిమాని, జాను ● రూ.15 వేల పింఛన్ కోసం ఎదురుచూపు లింగపాలెం: ఒకవైపు పుట్టుకతో వైకల్యం.. మరోవైపు పేదరికం. పుట్టినప్పటి నుంచి మంచానికే పరిమితమైన వారి జీవితాలు చూసేవారికి కన్నీళ్లు తెప్పిస్తాయి. లింగపాలెం మండలం బోగోలు గ్రామానికి చెందిన పరసా స్వామి, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె వెంకట హిమాని (16), కుమారుడు జాను(13)కు పుట్టుకతోనే అంగవైకల్యం. పూర్తిస్థాయిలో మంచానికే పరిమితమయ్యారు. మాట్లాడలేరు. అనేక ఆసుపత్రులకు తిప్పినా ప్రయోజనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు సేవలు చేస్తూ పెంచుకుంటున్నారు. పిల్లలిద్దరికీ తీవ్ర అంగవైకల్యం ఉన్నప్పటికి హిమానికి మాత్రమే రూ.6 వేల పింఛన్ అందుతుంది. జానుకి పింఛన్ ఇవ్వడం లేదు. తమది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబమని, ఇద్దరూ కూలి పనులకు వెడితే గాని గడవదని.. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. భార్యాభర్తలిద్దరిలో ఒకరు పిల్లల వద్ద ఉండి బాగోగులు చూసుకోవాలి. ఒకరు ఇంట్లో పిల్లల దగ్గరుంటే మరొకరు కూలి పనులకు వెళ్తుంటారు. ఎన్టీఆర్ భరోసా కింద పూర్తి వైకల్యం ఉన్నవారికి రూ.15 వేల పింఛను అందజేసి ఆదుకోవాలని కోరుతున్నారు. కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని, అధికారుల చుట్టూ తిరగలేక మానేశామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ, మండల స్థాయి నాయకులను సంప్రదించినా ఫలితం లేదని వాపోతున్నారు. -
అభివృద్ధి పేరిట దోపిడీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తెలుగు తమ్ముళ్ళు కొత్త రకం దందాకు తెరతీశారు. అభివృద్ధి పనులు, మరమ్మతుల ముసుగులో గ్రావెల్ దందా చేస్తూ నిత్యం లక్షలు గడిస్తున్నారు. చెరువు పూడికతీత పేరుతో ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ద్వారా నిధులు మంజూరు చేయించి పనులు పక్కన పెట్టి గ్రావెల్తో సొమ్ము చేసుకుంటున్న పరిస్ధితి జిల్లాలో నెలకొంది. ద్వారకాతిరుమల మండలం రామన్నగూడెంలోని రావులచెరువులో ఈ తరహా దందాను ప్రజాప్రతినిధి అనుచరగణం కొన్ని నెలలుగా సాగిస్తున్నా అధికారులు స్పందించడం లేదు. రెండు రోజులు క్రితం జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ ప్రభుత్వాన్ని నిలదీస్తే చర్యలు తీసుకుంటామన్నా పురోగతి లేదు. జిల్లాలో తెలుగు తమ్ముళ్ళు కొత్త దందాకు తెరదీశారు. ప్రధానంగా కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, దెందులూరు, భీమడోలు, ద్వారకాతిరుమల మండలాల్లో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. అన్ని చోట్ల ప్రజాప్రతినిధుల ముఖ అనుచర గణం గ్రావెల్ దందా సాగిస్తోంది. అన్నిచోట్ల ఇరిగేషన్ మొదలుకుని రెవెన్యూ అధికారుల వరకు సాగుతున్న అక్రమ దందాపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ మొక్కుబడిగానైనా స్పందించని పరిస్థితి. ద్వారకాతిరుమల మండలంలోని రామన్నగూడెంలోని రావులచెరువు 43.77 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చెరువు ఆయకట్టు పరిధిలో 114.98 ఎకరాల సాగు భూమి ఉంది. చెరువు పూడికతీసిన మట్టితో కరకట్టను పటిష్టం చేసి, మరమ్మత్తులకు గురైన సప్లయ్ చానళ్లు, షట్టర్లను బాగు చేసి, మొక్కలు నాటేందుకు, చెరువుకు సంబంధించి అభివృద్ధి పనులు నిర్వహించడానికి కలెక్టర్ వెట్రిసెల్వి ఆమోదంతో మినరల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.94.30 లక్షల నిధులు మంజూరు చేశారు. జిల్లా మొత్తం మీద సుమారు కోటి రూపాయలు మైనింగ్ నగదును మంజూరు చేసిన ఏకై క చెరువు ఇది. వాస్తవానికి పూడికతీసి కరకట్టల అభివృద్ధి పనులు 3 నుంచి 6 నెలల కాలంలో అన్నింటిని పూర్తి చేయాల్సి ఉంది. తెలుగు తమ్ముళ్లు దీనిని ఆదాయ వనరుగా మలుచుకుని పనులు పక్కనపెట్టి సరికొత్త దోపిడీకి శ్రీకారం చుట్టారు. జిల్లాలో అడ్డగోలుగా గ్రావెల్, మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం దారుణం. డీఆర్సీ సమావేశంలో ద్వారకాతిరుమల మండలం రావులచెరువులో జరుగుతున్న అక్రమ దందాపై సభలో ప్రస్తావించి అధికారులను నిలదీశాం. బహిరంగంగా అందరికి తెలిసేలా గ్రావెల్ దందా జరుగుతున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, చెరువులు ఎందుకు అభివృద్ధి చేయడం లేదని, మంజూరు చేసిన నిధులను ఏం చేశారంటూ ప్రశ్నించాం. రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ మూడు విభాగాలు సంయుక్తపాత్ర ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదు. – ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ రావులచెరువు పూడికతీత ముసుగులో గ్రావెల్ దందా చెరువు కరకట్ట పటిష్టానికి రూ.95 లక్షల మంజూరు పూడిక తీస్తున్నామంటూ వందల ట్రాక్టర్ల గ్రావెల్ అమ్మకం స్పందించని అధికార యంత్రాంగం డీఆర్సీలో నిలదీసిన ఎమ్మెల్సీ వంకా రవీంద్ర ప్రజాప్రతినిధి ప్రధాన అనుచరుల కనుసన్నల్లో చెరువు గ్రావెల్ దందా మొదలైంది. దాదాపు 6–7 నెలల నుంచి 15 క్యూబిక్ మీటర్ల టిప్పర్కు రూ.2500, మూడు క్యూబిక్ మీటర్ల ట్రాక్టర్ గ్రావెల్కు సుమారు రూ.500 వరకు ప్రజాప్రతినిధులు వసూలు చేస్తున్నారు. నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లతో గ్రావెల్ను లోడ్ చేస్తుంటారు. ప్రత్యేకంగా పొక్లెయిన్ ఏర్పాటు చేసి మరీ పగలూ రాత్రి తేడా లేకుండా చెరువును ధ్వంసం చేస్తున్నారు. ఇంతవరకు వేలాది ట్రిప్ల గ్రావెల్ను తవ్వేసి కోట్లు గడించారు. ఇదిలా ఉంటే జిల్లాలో ప్రధానంగా కామవరపుకోట, తడికలపూడి, భీమడోలు, ఏలూరు తదితర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లకు గ్రావెల్ను విక్రయిస్తున్నారు. ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్లు పొంది రోడ్ల నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్లకు సైతం ఇదే గ్రావెల్ను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. భీమడోలు మండలం లింగపాడులో రోడ్డు నిర్మాణం, తిమ్మాపురం నుంచి తిరుమలపాలెం వరకు, అలాగే కొన్ని చోట్ల చేపల చెరువు కరకట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఈ గ్రావెల్ను విక్రయించినట్లు స్థానికులు చెబుతున్నారు. -
కార్మిక సమ్మెను జయప్రదం చేయాలి
ఏలూరు (టూటౌన్): ఈ నెల 12న కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నగరంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్మిక, వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ ఈనెల 12న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని కార్మికులు వందలాది మందితో మున్సిపల్ ఆఫీసు నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఉద్దేశించి ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేస్తూ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికులకు ఉరి తాళ్ల లాంటివని, వీటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 12న దేశవ్యాప్త సమ్మెలో గ్రామీణ పేదలు, అసంఘటిత కార్మికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని మోదీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ఐఎఫ్టీయు నగర అధ్యక్ష, కార్యదర్శులు బి.సోమయ్య, యర్రా శ్రీనివాసరావు, ఏఐటీయూసీ నాయకులు పి.కన్నబాబు, అప్పలరాజు, కడుపు కన్నయ్య, పి.కిశోరు, బాలభాస్కరరావు, కనకదుర్గారావు, బాలాజీ, శంకర్, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
వినయంతోనే విద్యకు విలువ
నూజివీడు: విద్యచేత వినయం కలిగినప్పుడే ఆ విద్యకు విలువ ఉంటుందని ప్రముఖ ప్రవచనకారుడు, నైతిక విలువల ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆదివారం విద్యార్థుల్లో నైతిక విలువలు అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత కార్యక్రమాన్ని జ్యోతీప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థులనుద్ధేశించి మాట్లాడుతూ విద్యార్థులంతా ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు బాధపడేలా ప్రవర్తించకూడదన్నారు. చదువుకున్న వాడికి మాత్రమే ఓర్పు వస్తుందని, ఓర్చుకోగలిగిన వాడే వృద్ధిలోకి వస్తారన్నారు. తాను భరించడం, ఇతరుల్ని క్షమించడం అనే లక్షణాల్ని విద్యార్థులు అలవర్చుకోవాలని, కష్టాలను భరించలేక ఆత్మహత్యకు పాల్పడడం కాకుండా కష్టాల నుంచి పట్టుదలను అలవాటు చేసుకోవాలని సూచించారు. మనకందరికి తెలిసింది సముద్రంలో బిందువుతో సమానమని, మనం తెలుసుకోవలసిన విషయాలు లోకంలో ఎన్నో ఉన్నాయన్నారు. ఎప్పుడూ తన గురించే కాకుండా లోక సంక్షేమం కోసం కూడా ఆలోచించాలన్నారు. మంచి పుస్తకాలు చదవాలి ప్రముఖ ప్రవచన కర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు -
దేవుడిని రాజకీయాల్లోకి లాగడం హేయం
చింతలపూడి: చంద్రబాబు ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు సాక్షాత్తూ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని, పవిత్రమైన తిరుపతి లడ్డూను రాజకీయాల్లోకి లాగడం హేయమని వైఎస్సార్సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు అన్నారు. లడ్డూపై దుష్ప్రచారం సీబీఐ నివేదికతో పటాపంచలైందన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై పలు ప్రశ్నలు సంధించారు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఏ ఆధారంతో అబద్ధాలు చెప్పారు?, మాజీ సీఎం వైఎస్ జగన్ను అపఖ్యాతి పాలుచేసేందుకు లడ్డూ పవిత్రతను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో లడ్డూలో కల్తీ జరగలేదని సీబీఐ చార్జిషీట్తో స్పష్టమైందని, దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీకు నైతికత ఉంటే వెంటనే పదవికి రాజీనామా చేసి, ప్రజలకు బహిరంగ క్షమాపణ చె ప్పాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీరును కూడా విజయరాజు తప్పుబట్టారు. ఒకప్పుడు కమ్యూనిస్టునని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు సనాతన ధర్మం అంటూ రంగులు మారుస్తున్నారని, మెట్లు కడిగి భక్తిని ప్రదర్శించడం కేవ లం డ్రామా మాత్రమే అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ నైతిక బాధ్యతగా కూటమి ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని హితవు పలికారు. జెడ్పీటీసీ మొ లుగుమాటి నీరజా సుధాకర్ మాట్లాడుతూ కూటమి నాయకుల అబద్ధాలను హిందువులంతా గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వరావు, పార్టీ నాయకులు మిర్యాల దిలీప్, ఆతుకూరి సుబ్బారావు, పి.మాధవరెడ్డి, కాటూరి ఏరియా, వెంప కృష్ణ, ఎండీ జిలానీ, బండారు గోపి, వెంపా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి కన్వీనర్ విజయరాజు -
తంగెళ్లమూడి..భక్తులతోనిండి
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులో గంగానమ్మవారి జాతర మహోత్సవాలు వరుసగా మూడో ఆదివారం అట్టహాసంగా జరిగాయి. గతనెల 26న తూర్పువీధి, దక్షిణపు వీధి, పవర్పేట, లక్ష్మీవారపు పేట, ఆదివారపుపేట, ఈనెల 1న పడమరవీధి గంగానమ్మ జాతరలు జరిగాయి. చివరగా తంగెళ్లమూడి గంగానమ్మ వారి జాతర ఆదివారం వైభవంగా నిర్వహించారు. నగరంలో సుమారు 100 రోజులకు పైగా ఆయా ప్రాంతాల్లో జాతరలు జరగ్గా తంగెళ్లమూడిలో జాతరతో ఉత్సవాలు ముగియనున్నాయి. గతనెల 11 నుంచి.. తంగెళ్లమూడి ప్రాంతంలోని యాదవ్నగర్లో గత నెల 11న అమ్మవారు పాదం మోపే కార్యక్రమంతో జాతర మొదలైంది. అప్పటి నుంచి ప్రత్యేక పూజ లు, భక్తుల నైవేద్యాల సమర్పణలతో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. జాతర సందర్భంగా అమ్మ వారి మేడల వద్దకు అధిక సంఖ్యలో భక్తులు చేరు కుని నైవేద్యాలు, చీరెలు, సారెలు సమర్పించి మొ క్కులు చెల్లించుకున్నారు. తంగెళ్లమూడి, యాదవనగర్, ఖండ్రికగూడెం, బీడీ కాలనీ, టైటస్ నగర్, పుష్పలీలానగర్, రాణీనగర్, దాదా పలావ్ సెంటర్, ద్వారకానగర్, కుమ్మరిరేవు, తాపీమేసీ్త్ర కాలనీ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చా రు. భక్తులు సమర్పించిన నైవేద్యాలతో భారీ కుంభాలు రాశులుగా ఏర్పడ్డాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో తంగెళ్లమూడి కిటకిటలాడింది. ట్రాఫిక్ గంటల కొద్దీ నిలిచిపోయింది. ప్రధానంగా తంగెళ్లమూడి వంతెన దాటడానికి ప్రజలు ఇబ్బంది పడ్డారు. తంగెళ్లమూడి నుంచి దాదా పలావ్ సెంటర్ వైపు సైతం ట్రాఫిక్ సమస్య తలెత్తింది. పోలీసుల చర్యలతో ట్రాఫిక్ వలయం నుంచి ప్రజలు బయటపడగలిగారు. గంగానమ్మా.. దీవించమ్మా.. తంగెళ్లమూడిలో గంగానమ్మ జాతర ఏలూరులో వరుసగా మూడో ఆదివారం జాతర సందడి పోటెత్తిన భక్తులు -
పనుల్లో జాప్యం.. వైద్య కళాశాలపై నిర్లక్ష్యం
ఏలూరు టౌన్: జిల్లాకే తలమానికంగా ఏలూరులో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటుచేశారు. అప్పట్లో 40 శాతానికి పైగా పనులు పూర్తికాగా.. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్నా పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏలూరు జీజీహెచ్ ప్రాంగణంలో శాశ్వత మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలిస్తే నత్తేనయం అన్నట్టుగా ఉంది. దీంతో పనులు ఎప్పటికి పూర్తవుతాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఈ విద్యా సంవత్సరానికై నా పూర్తిస్థాయిలో మెడికల్ కళాశాల భవనాన్ని అందుబాటులోకి తెస్తారా, పనుల్లో ఆలస్యానికి కారణాలు ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సుమారు రూ.80 కోట్లకు పైగా నిధులతో 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే భవనాన్ని వేగంగా పూర్తి చేయాలనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో.. నాడు.. గత ప్రభుత్వ హయాంలో మెడికల్ కౌన్సిల్ అనుమతులు రావటంతో యుద్ధప్రాతిపదికన ఏ లూరు పాత బస్టాండ్ ప్రాంతంలోని జిల్లా వైద్య ఆ రోగ్య శాఖ ప్రాంగణంలో రూ.60 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో, ల్యాబ్లతో మెడికల్ కాలేజీ భవనాన్ని నిర్మించారు. కేవలం 18 నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో జీ–ప్లస్ 2 భవనాన్ని నిర్మించారు. అత్యాధునిక ల్యాబ్లు, కార్పొరేట్ కళాశాలలకు దీటుగా డిజిటల్ క్లాస్రూమ్స్, లెక్చర్ రూమ్స్, అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ఇలా అన్నీ సమకూర్చారు. 2023 సెప్టెంబర్లో ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు సైతం ప్రారంభించి తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు. 18 నెలలుగా తీవ్ర ఇబ్బందులు నేడు.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 18 నెలల కాలంలో శాశ్వత మెడికల్ కళాశాల భవనాన్ని నిర్మించటంలో జాప్యంతో వైద్య విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2024 జూన్లో అధికారం చేపట్టిన నాటి నుంచి కొన్ని నెలలపాటు నిర్మాణ పనులు నిలిచిపోగా, అనంతరం ప్రభుత్వం పనులు ప్రారంభించింది. అయినా నేటికీ పనుల్లో పెద్దగా పురోగతి కనిపించని పరిస్థితి. ఇప్పటికే వైద్య విద్యార్థులకు తరగతులను షెడ్డుల్లో ఏర్పాటు చేయాల్సిన దుస్థితి. ఇదే తరహాలో పనులు సాగుతూ ఉంటే నాలుగో మెడిసిన్ బ్యాచ్ వస్తే తీవ్ర ఇబ్బందులు తప్పవని పలువురు అంటున్నారు. మెడి ‘కిల్’ బాబు నత్తనడకన ఏలూరు మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు 18 నెలలుగా తీవ్ర జాప్యం ఇబ్బంది పడుతున్న విద్యార్థులు ఈ ఏడాదైనా పూర్తయ్యేనా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో 2023 సెప్టెంబర్లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించారు. ఇప్పటికే మూడో ఏడాది వైద్య విద్యార్థులు మెడిసిన్ చదువుతున్నారు. అధికారులు సరైన రీతిలో తరగతి గదులను ఏర్పాటు చేయలేని దుస్థితి నెలకొంది. ఇప్పటికై నా వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసి అత్యాధునిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. – కె.మధుకుమార్, న్యాయవాది, ఏలూరు ఏలూరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏళ్ల నాటి కల. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో అనుమతులు తెచ్చి, ఏలూరులో ప్రత్యేకంగా భవనాలు నిర్మించి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించారు. చంద్రబాబు ప్రభుత్వ అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా శాశ్వత భవన నిర్మాణాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం వేగంగా పనులు పూర్తిచేసి వైద్య విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. –ప్రత్తిపాటి తంబి, న్యాయవాది, ఏలూరు -
రెవెన్యూ ఉద్యోగులపై పని ఒత్తిడి
భీమవరం : రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని రాష్ట్ర అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ భూప తిరాజు రవీంద్ర రాజు అన్నారు. భీమవరంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ ఏర్పాటుచేశారు. జిల్లా చైర్మన్గా ఎం.సన్యాసిరావు, సెక్రటరీ జనరల్గా జి.పెద్దిరాజు, కన్వీనర్గా ఎం.లక్ష్మీనారాయణ, కో–చైర్మన్గా ఎం.మోషే, ట్రెజరర్గా కె.సుబ్రహ్మణ్యస్వామి, ప్రచార కార్యదర్శిగా పి.సంధ్యారాణి, క్రీడ, సాంస్కృతిక కార్యదర్శిగా కె.ఠాగూర్, ఉప చైర్మన్లుగా ఈ.నాగార్జున, ఎం.నాగరాజు, జి.గోపాలకృష్ణ, బీఎన్వీ రత్నారావు, జి.జక్కయ్య ఎన్నికయ్యారు. -
ప్రసాదాలపై పచ్చ నేతల కన్ను
ద్వారకాతిరుమల: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తరువాత హిందూ ఆలయాలపై రాజకీయ నాయకుల పెత్తనం విపరీతంగా పెరిగిపోయింది. కొందరు చోటా నాయకులు సైతం దేవస్థానం అధికారులపై పెత్తనం చేస్తూ పైరవీలు సాగిస్తున్నారు. తాము చెప్పిన వారికే కాంట్రాక్టులు కట్టబెట్టాలంటూ ఒత్తిళ్లు తెస్తున్నారు. రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాల్లో ఒకటైన చిన్నతిరుపతి (ద్వారకాతిరుమల) శ్రీవారి దేవస్థానంలో ప్రసాదాలు తయారీ టెండర్ విషయంలో అధికారులు ఈ తరహా ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో నేతల ఆదేశాలకు తలొగ్గని అధికారులపై కొందరు వ్యక్తులు ఆదివారం సోషల్ మీడియా వేదికగా అవినీతి ఆరోపణలు పాల్పడటం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. శ్రీవారి దేవస్థానంలో ద్వారకాతిరుమలకు చెందిన రవికృష్ణ మేన్ పవర్ ఏజెన్సీస్ 2024 ఏప్రిల్ 1 నుంచి ప్రసాదాల తయారీ కాంట్రాక్టును నిర్వహిస్తోంది. అప్పటి నుంచి ప్రసాదాల నాణ్యత, రుచిపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో కూడా ప్రసాదాల నాణ్యత, రుచిలో ప్రథమ ర్యాంక్ లభించింది. ఈ ఏజెన్సీస్ కాంట్రాక్ట్ గడువు వచ్చేనెల 31వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలో దేవస్థానం అధికారులు గతనెల 23 నుంచి ప్రారంభించిన కొత్త టెండర్ ప్రక్రియ ఈనెల 5వ తేదీతో ముగిసింది. 6న టెక్నికల్ బిడ్ను ఓపెన్ చేశారు. మా వాళ్లకే టెండర్ ఇవ్వాలంటూ.. విజయవాడకు చెందిన ఎం.విజయచంద్ సప్లయిర్స్, ఎం.రవికుమార్, జీకే మేన్ పవర్, ద్వార కాతిరుమలకు చెందిన రవికృష్ణ మేన్ పవర్ ఏజెన్సీస్ టెండర్లో పాల్గొన్నారు. అయితే ఏమైనా లో టుపాట్లు ఉన్నా తమ వాడికే కాంట్రాక్టును కట్టబెట్టాలంటూ కొందరు పచ్చ నేతలు కొద్దిరోజులుగా అధికారులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్టు సమాచారం. అయితే టెక్నికల్ బిడ్లో సరైన పత్రాలు సమర్పించని వారిని (ఇద్దరు ఏఈఓలు, సూపరింటెండెంట్, జూనియర్ అకౌంట్ అధికారితో కూడిన) కమిటీ తిరస్కరిస్తుందని, తమ చేతిలో ఏమీ ఉండదని అధికారులు చెబుతున్నా ఆ నేతలు వినిపించుకోవడం లేదట. ఆన్లైన్ టెండర్ విషయంలో పొరపాట్లు జరిగితే తమ ఉద్యోగాల మీదకు వస్తుందని, అలాగని అధికార పార్టీ నాయకుల ఆదేశాలు పాటించకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని కొందరు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నడూ లేనివిధంగా.. ఎన్నడూ లేనివిధంగా శ్రీవారి దేవస్థానంపై రాజకీయ క్రీనీడ పడుతోంది. తమ వారికే కాంట్రాక్టులు ఇవ్వాలని కొందరు నాయకులు అధికారులను ఆదేశించే స్థాయికి వచ్చింది. అయితే అలాంటివి ఇక్కడ చెల్లవని పలువురు అధికారులు అంటున్నారు. ని యమ, నిబంధనలకు లోబడే కాంట్రాక్టులను అప్పగిస్తామని చెబుతున్నారు. ఆరోపణల్లో వాస్తవం లేదు రవికృష్ణ మేన్ పవర్ ఏజెన్సీస్ పీఎఫ్, ఈఎస్ఐలు కట్టకుండా అధికారులు బిల్లులు చెల్లించారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని సెక్షన్ సూపరింటెండెంట్ వాసా నగేష్ వివరణ ఇచ్చారు. అన్నీ పరిశీలించిన తరువాతే బిల్లులు చెల్లించామన్నారు. ఆన్లైన్ టెండర్లో అవకతవకలు జరగవని, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రం టెండర్ వేసిన కాంట్రాక్టర్ తప్పనిసరిగా డిపాజిట్ రూ.3 లక్షలు చెల్లించిన ఈఎండీ చలా నా, ఆధార్, పాన్కార్డ్, జీఎస్టీ, ఫర్మ్ రిజిస్ట్రేషన్, మేన్ పవర్ సర్టిఫికెట్లు, ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఈపీఎఫ్, ఈఎస్ఐ సర్టిఫికెట్లు, వాటికి సంబంధించిన తాజా చలానాలు, అ లాగే ఆర్జేసీ, డీసీ కేడర్కు చెందిన ఆల యాల్లో గడచిన రెండేళ్లలో ప్రసాదాలు త యారు చేసిన అనుభవ ధ్రువీకరణ పత్రం, మూడేళ్ల ఇన్కమ్టాక్స్ రిటర్న్స్, తహసీల్దార్ జారీ చేసిన రిలీజియస్ సర్టిఫికెట్, నోటరీ (హిందూ) అఫిడవిట్, సెల్ఫ్ డిక్లరేషన్, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, ఫర్మ్ ఏ సంస్థలోనూ బ్లాక్ లిస్ట్లో లేదని రూ.100ల స్టాంప్ పేపర్పై నో టరైజ్డ్ అఫిడవిట్ను సమర్పించాలి. ఈ పత్రాలన్నీ ఉన్న వారినే కమిటీ ప్రైజ్ బిడ్కు అనుమతించాలి. అక్కడ తక్కువ ధరకు ఎవరు కోట్ చేస్తారో వారికే కాంట్రాక్టును ఇవ్వాలి. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో అధికారులు అన్ని అర్హతలు ఉన్న వ్యక్తికి కాంట్రాక్ట్ అప్పగిస్తారా.. లేక పచ్చ నేతల ఆదేశాలకు తలొగ్గి అనర్హులకు కాంట్రాక్ట్ కట్టబెడతారా.. అన్నది వేచి చూడాల్సి ఉంది. చినవెంకన్న ప్రసాదాల కాంట్రాక్ట్ కోసం యత్నాలు తమ వారికే కట్టబెట్టాలంటూ అధికారులపై ఒత్తిళ్లు నిబంధనలు పాటిస్తామంటున్న అధికారులపై అవినీతి ఆరోపణలు ఆలయాలపై విపరీతంగా పెరిగిన రాజకీయ నాయకుల జోక్యం తలలు పట్టుకుంటున్న దేవస్థానం అధికారులు అధికారులు తమకు సహకరించడం లేదన్న అనుమానంతో కొందరు గుర్తుతెలియని వ్యక్తు లు ఆదివారం సోషల్ మీడియా వేదికగా విష ప్రచారానికి పాల్పడ్డారు. ప్రస్తుత రవికృష్ణ మేన్ పవర్ ఏజెన్సీస్ కాంట్రాక్టర్ వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తి అని, గత 22 నెలలుగా కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐలు చెల్లించడం లేదని, అయినా అధికారులు బిల్లులు చెల్లిస్తున్నారని దేవస్థానం చైర్మన్, ఈఓలకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. అధికారులు కుమ్మకై , బేరం మాట్లాడుకుని మళ్లీ అతడికే టెండర్ను అప్పగించేందుకు ప్రయత్ని స్తున్నారని ఆ మెసేజ్లో ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చారు. -
ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా రెడ్డిదొర
ఏలూరు (ఆర్ఆర్పేట): ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శిగా బీ. రెడ్డి దొర ఎన్నికయ్యారు. ఈ మేరకు విజయవాడలో ఆదివారం జరిగిన ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం వివరాలను ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామారావు ఏలూరులో పత్రికలకు విడుదల చేశారు. ప్రస్తుతం ఏపీటీఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షునిగా పని చేస్తున్న బీ. రెడ్డిదొర రాష్ట్ర కార్యదర్శిగా విజయవాడలో జరిగిన కౌన్సిల్ సమావేశాల సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. ఆయనతో పాటు జిల్లాకు చెందిన సీహెచ్వీ సత్యనారాయణ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారని, అలాగే భాస్కర వర్మ జీఓ కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారని తెలిపారు. రాష్ట్ర కమిటీకి వివిధ పదవులకు ఎన్నికై న ఏపీటీఎఫ్ నాయకులకు జిల్లా సబ్ కమిటీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. -
బలివేలో మహా శివరాత్రి ఉత్సవాలకు శ్రీకారం
బలివే (ముసునూరు): చారిత్రక ప్రసిద్ధ చెందిన బలివేలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఉత్సవాల ప్రత్యేకాధికారి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న ఏర్పాట్లపై అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు. ఆలయ, ఉత్సవ ప్రాంగణాలు, స్నాన ఘట్టాల వద్ద భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులను డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్ అప్రమత్తం చేశారు. తాజాగా ఆలయ ప్రాంగణ ఏర్పాట్లలో భాగంగా ఆదివారం శుభ ఘడియల్లో ఆలయ అర్చకులు తోలేటి అరుణ భాస్కర్, చావలి అమర్ బాబు మంత్రోచ్ఛరణల నడుమ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజాదికాలు నిర్వహించి, పందిరి రాట (గుంజ) వేసి, పందిర్లు, క్యూ లైన్లు ఏర్పాటు పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో పామర్తి సీతారామయ్య, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
సమగ్ర విచారణ జరిపించాలి
పెదవేగి: గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆ త్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని పీడీఎస్యూ నాయకుడు కాకి నాని డిమాండ్ చేశారు. పెదవేగి గురుకుల పాఠశాలకు వెళ్లి తమ బృందం విచారణ చేసినట్టు ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఈపుచర్ల అజిట్ ఆత్మహత్య చేసుకో వడం బాధాకరమని, పూర్తిస్థాయిలో విచారణ జరిపించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో పోలసానిపల్లి, జంగారెడ్డిగూడెంలో ఇద్దరు బాలికలు, పెదవేగిలో బాలుడు ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వ గురుకుల పాఠశాలల నిర్వహణపై తీవ్ర చర్చనీయాంశంగా మారుతుందన్నారు. నగర అధ్యక్షు డు వై.యశ్వంత్ పాల్గొన్నారు. -
బలుసులమ్మ తల్లికి జాతర కళ
తాడేపల్లిగూడెం: కోరిక కోర్కేలు తీర్చే తల్లి.. కల్పవల్లి.. గూడేం పట్టణ ఇలవేల్పు బలుసులమ్మ తల్లికి జాతర కళ వచ్చింది. పుష్కరం తరువాత జాతర నిర్వహిస్తుండడంతో అంగరంగ వైభవంగా అమ్మవారికి జాతర మహోత్సవం జరిపించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 12 నుంచి 27వ తేదీ వరకు జాతర మహోత్సవం నిర్వహించనున్నారు. మార్చి 22న ఆడపడుచులను గౌరవించడం, బంధువులను పిలుచుకొని నైవేద్యాలు పెట్టడం లాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 27న మహాకుంభ నివేదన జరుగనుంది. పుట్టిల్లు పాశం వారి ఇంటి వద్ద నుంచి అత్తిల్లు కర్రి వారి ఇంటికి చేరే ప్రక్రియల మధ్య జాతరకు శ్రీకారం చుడతారు. గరగ ధారులైన గణాచారులు, కణిక దప్పికలు, వీరణాలు, తాసాలు, రామడోలు వాయిద్యాల నడుమ అమ్మవార్ల ప్రతిరూపాలుగా భావించే గణాచారులకు గుగ్గిలపు ధూపాలతో జాతర వేడుక అంబరాన్ని తాకేలా సాగనుంది. శతాబ్ధాలుగా బలుసులమ్మ తల్లి పట్టణంలో శతాబ్ధాల క్రితం వెలిసినట్టు చెబుతారు. మునిసిపల్ కార్యాలయానికి సమీపంలో అనంతమ్మ చెర్వు వద్ద చిన్న గుడిగా ఉన్న ప్రాంతంలో అమ్మవారు కొలువయ్యారు. పట్టణంలో పాతూరుకు చెందిన కర్రి నర్సయ్య జమీందారు సారథ్యంలో ఆలయ నిర్వహణ సాగేదని ప్రతీతి. తర్వాత విశ్వాసం కలిగిన రజక కుటుంబాలు, ఆలయ అభివృద్దికి రావూరి పాండురంగారావు లాంటి దాతల ఆర్ధిక చేయూతతో అమ్మవారి పూజాధికాలు సాగాయి. పట్టణంలో వివాహ వివాహం జరగాలంటే బలుసులమ్మ తల్లికి చలిమారు పోయాలి. చలిమిడి, వడపప్పు ప్రసాదంగా ఇవ్వాలి. పానకం పోయాలి. ఇలా చేస్తే వధూవరులు కాబోయే వారు జీవితాంతం చల్లగా ఉంటారని విశ్వాసం. పాలకుల చొరవతో మరింత శోభ దేవదాయ ధర్మాదాయశాఖా మంత్రిగా పనిచేసిన దివంగత పైడికొండల మాణిక్యాలరావు, మాజీ డిప్యూటీ సీఎం, దేవదాయశాఖా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, 12 ఏళ్ల క్రితం అప్పటి మునిసిపల్ చైర్మన్, ప్రస్తుత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసుల పర్యవేక్షణలో అమ్మవారి ఆలయం దినదిన ప్రవర్థమానం చెందుతుంది. పైడికొండల ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణానికి రూ.కోటి నిధులు, అమ్మవారి కల్యాణ మండపం నిర్మాణానికి అదనంగా నిధులు తీసుకొచ్చారు. ఈ నిధులతో ఆలయ రూపురేఖలు పూర్తిగా మారాయి. భీమవరం మావుళ్లమ్మ దేవతామూర్తికి రూపమిచ్చిన శిల్పి ఆధ్వర్యంలో బలుసులమ్మ రూపం మావుళ్లమ్మ, పెద్దింట్లమ్మ, రూపాలకు ప్రతిరూపం మాదిరిగా బలుసులమ్మ దేవతామూర్తి సాక్షాత్కరించింది. కొట్టు సారథ్యంలో అమ్మవారికి వెండి మకరతోరణం, వెండి ఊయల వంటి ఆభరణాలు అమరాయి. కల్యాణ మండపం పనిని పూర్తి చేశారు. ఆలయ ఆవరణంలో మౌలిక వసతులు కల్పించారు. బొలిశెట్టి చైర్మన్గా ఉన్న సమయంలో తొలిసారి 2014లో జాతరకు శ్రీకారం చుట్టారు. సంయుక్త సహకారంతో అంగరంగ వైభవంగా ఈ జాతర అప్పట్లో జరిగింది. అయోధ్యలో రాముని ప్రతిమను చెక్కిన మైసూర్కు చెందిన అరుణ్యోగిరాజ్ బలుసులమ్మ ఆలయంలో ప్రాణప్రతిష్ట చేసి, యంత్రస్ధాపన చేసిన దేవతామూర్తికి రూపం ఇచ్చారు. ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో.. బలుసులమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్గా శ్రీరంగం అంజి ఆధ్వర్యంలో 2014 జూన్ 18 వ తేదీ నుంచి 24వ తేదీ వరకు తొలి జాతర జరిగింది. ఉత్సవ కమిటీ చైర్మన్గా కొట్టు అంజిబాబు సారథ్యంలో అమ్మవారి ఆలయానికి రజత వైభవం వచ్చింది. వసతులు ఒనగూరాయి. 12 ఏళ్ల తర్వాత యాధృచ్ఛికం కాకపోయినా శ్రీరంగం అంజి ఆధ్వర్యంలో మలి జాతర మార్చి 12 నుంచి జరుగనుంది. ఉగాది నుంచి దసరా, వసంతపంచమికి సామూహిక అక్షరాభ్యాసాలు కార్తీక మాసంలో లక్షదీపార్చాన, శివాభిషేకం, సామూహిక వరలక్ష్మి వ్రతాలు, పదిటన్నుల కూరగాయలతో శాకాంబరి అలంకారాలతో అమ్మవారు బాదంపూడి మల్లికార్జునశర్మ, వెలవలపల్లి ప్రదీప్శర్మ, గోపీశర్మ బ్రహ్మత్వంలో నిత్య పూజలు అందుకుంటున్నారు. ఉత్సవాలకు ఏర్పాట్లు మార్చి నెలలో జరుగనున్న జాతరను భారీగా చేయడానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే పట్టణంలో ఈ శోభ కనిపిస్తోంది. పట్టణంలో ఎస్వీఆర్ సర్కిల్ నుంచి జయలక్ష్మీ థియేటర్ వరకు, పుంతలో ముసలమ్మ ఆలయం దగ్గర నుంచి గమిని ఫంక్షన్ ప్లాజా వరకు విద్యుత్ పందిళ్లను ఏర్పాటుచేస్తున్నారు. లైటింగ్ల అరపలు పెట్టనున్నారు. ఇప్పటికే డివైడర్లకు రంగులు వేస్తున్నారు. తొలి జాతరలో 22వ తేదీనే నైవేద్యాలు జరిగాయి. మార్చి 22న కూడా ఆడపడుచులను గౌరవించడం, బంధువులను పిలుచుకొని నైవేద్యాలు పెట్టడం లాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 27న మహాకుంభ నివేదన జరుగనుంది. పుష్కరం తరువాత అమ్మవారికి జాతర మహోత్సవం మార్చి 12 నుంచి 27 వరకు జాతర ఉత్సవాలు మార్చి 22న ఆడపడుచుల సందడి, నైవేద్యాలు తాడేపల్లిగూడెంలో జాతరకు మొదలైన ఏర్పాట్లు -
వర్జీనియా పంటపై తెగుళ్ల దాడి
● ఉధృతంగా బోడు, సీతాఫలం, మానుమచ్చ తెగుళ్లు ● ఆలస్యంగా వేసిన పంటల్లో అధికంగా తెగుళ్ల ప్రభావం.. దిగుబడిపై రైతుల్లో ఆందోళన బుట్టాయగూడెం: పొగాకు పంటలపై దాడి చేస్తున్న తెగుళ్లను చూసి రైతులు బెంబేలెత్తిపోతున్నారు. బోడు, మానుమచ్చ, సీతాఫలం, ఆకు ముడత వెర్రితలలు వంటి పిచ్చిమెక్కలు ఎక్కువగా ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. తెగుళ్ల నివారణకు ఎన్ని మందులు పిచికారీ చేసినా తగ్గడం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం పలు గ్రామాల్లో ఎదిగి ఆకు రెలుపు దశకు వచ్చాయి. కొన్ని చోట్ల ఆలస్యంగా పొగాకు పంటల్లో ఎక్కువగా బోడు అధికంగా కనిపిస్తూ తోట ఎదుగుదల లేకుండా ఎండిపోయింది. 26,883 హెక్టార్లలో వర్జీనియ పొగాకు సాగు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్న జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాలు, కొయ్యలగూడెం, దేవరపల్లి, గోపాలపురం పొగాకు వేలం కేంద్రాల పరిధిలో సుమారు 11,855 మంది రైతులు 26,883 హెక్టార్లలో ఈ ఏడాది సీజన్లో పొగాకు పంట వేసినట్లు బోర్డు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పొగాకు తోటలు ఎదుగుదల దశలో ఉన్నాయి. అలాగే పలు గ్రామాల్లో క్యూరింగ్ పనులు చేస్తున్నారు. ఈ దశలో పంటలపై తెగుళ్లు దాడి చేయడంతో పలు చోట్ల మొక్కలు ఎదుగుదల లేక దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తున్న బోడు గిరిజన ప్రాంతంలో వేసిన వర్జీనీయా పొగాకు పంటలో ఈ ఏడాది ఎక్కువగా బోడు ఉంది. దీని వల్ల పొగాకు మొక్కలో ఉన్న సారాన్ని బోడి పీల్చేస్తుందని దీని వల్ల మొక్క ఎదుగుదల లేకపోవడం, పంట దిగుబడి బాగా తగ్గిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆకు రంగు మారిపోవడం బుట్టాయగూడెం, కొమ్ముగూడెం, అచ్చియ్యపాలెం, వీరన్నపాలెం, నూతిరామన్నపాలెం, ముప్పినవారిగూడెం తదితర గ్రామాల పరిధిలో వేసిన పొగాకు తోటల్లో ఎక్కువగా బోడు గుర్తించినట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఈ ఏడాది అనుకూలించని వాతావరణం పొగాకు పంటలకు ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా లేదని రైతులు చెబుతున్నారు. మొక్కలు నాటిన రోజు నుంచి తీవ్రమైన చలి, పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో పలు చోట్ల పొగాకు తోటల్లో ఎదుగుదల లేదని రైతులు వాపోతున్నారు. మొక్క సాధరణంగా 22 నుంచి 28 ఆకులు వస్తాయని, వాతావరణం అనుకూలించక పోవడం వల్ల 17 నుంచి 23 ఆకులు వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది పొగాకు పంటల్లో తెగుళ్లు దాడి ఉందని, బుట్టాయగూడెం మండలంలో పొగాకు తోటల్లో ఎక్కువగా బోడు ఉన్నట్లు గుర్తించినట్లు జంగారెడ్డిగూడెం వేలం–1 సూపరిటెండెంట్ బి. శ్రీహరి తెలిపారు. ఈ ఏడాది పొగాకు పంటపై తెగుళ్లు ఎక్కువగా దాడి చేస్తున్నాయి. బోడుతో పాటు మానుకుల్లు, ముజాకో మచ్చ తెగ్లుళ్లు ఇబ్బంది పెడుతున్నాయి. వీటి నివారణకు మందులు కొడుతున్నా తోటల్లో తెగుళ్లు తగ్గడం లేదు. బోడు పంటలను మరింత దెబ్బతీస్తోంది. – సయ్యద్ బాజీ, వర్జీనియా పొగాకు రైతు, అచ్చియ్యపాలెం నేను బుట్టాయగూడెం వీరన్నపాలెం సమీపంలో 5 ఎకరాల్లో పొగాకు పంట వేశాను. ఆ పంటలో బోడు ఎక్కువగా ఉంది. దీని వల్ల ఎకరం పంట దెబ్బతిని పాడైపోయింది. పంట ఎదుగుదల నిలిచి పోయింది. ఆకు రంగు మారిపోయింది. ఈ ఏడాది పొగాకు పంటలో బోడు ఎక్కుగా వచ్చింది. – ఆచంట విష్ణుమూర్తి, పొగాకు రైతు, సూరపవారిగూడెం -
జై వనరూపిణీ.. విజయకారిణి
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అధికంగా తరలివచ్చిన భక్తుల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీవారితోపాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు. కైకలూరు: సమీప జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో కొల్లేటికోట దేవస్థానం ఆదివారం కిటకిటలాడింది. భక్తులు పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మకు పొంగళ్లు, వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ప్రధాన ఉప అర్చకులు పేటేటి పరమేశ్వర శర్మ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లడుతూ ఆదివారం ఒక్క రోజున వివిధ రూపాల్లో అమ్మవారికి రూ.77,091 ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర(తీర్థం) జరుగుతుందన్నారు. ఈ నెల 28న జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గా, గోకర్ణేశ్వరస్వామి కల్యాణం జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. పెదవేగి : ఆగి ఉన్న లారీని మోటారు సైకిల్ ఢీ కొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పెదవేగి ఎస్సై ఎం హరిగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం పోలవరం మండలం గూటాల గ్రామానికి చెందిన నున్న రాంబాబు అతని చిన్న కుమార్తె కుందన శ్రీతో కలిసి ద్విచక్ర వాహనంపై ఏలూరు తంగెళ్ళమూడిలోని సోదరుడి ఇంటి వెళ్తుండగా పెదవేగి మండలం చక్రాయగూడెం గ్రామంలోని పెట్రోల్ బంకు సమీపంలోకి వచ్చేసరికి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో నున్న రాంబాబు (50) అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కుమార్తె కుందనశ్రీకి తీవ్ర గాయాలు కాగా ఆమెను చికిత్స నిమిత్తం ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. రాంబాబు భార్య నున్న లక్ష్మీ అనూష ఫిర్యాదు మేరకు పెదవేగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తణుకు అర్బన్: విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు సూచించారు. తణుకులోని తిరుమల విద్యా సంస్థల ప్రాంగణంలో 5 నుంచి 10వ తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ జేఈఈ పరీక్షల్లో తమ విద్యా సంస్థలో ప్రతి ఐదుగురిలో ఒకరికి సీటు లభిస్తుందని చెప్పారు. మెడికల్లో తమ సంస్థలో ప్రతి ముగ్గురిలో ఒకరికి సీటు వస్తుందని వివరించారు. సంస్థ వైస్ చైర్పర్సన్ రష్మి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు రోల్మోడల్గా ఉండాలని కోరారు. పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు ఎస్.మురళీకృష్ణారెడ్డి, సంతోషి, విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సతీష్బాబు, తణుకు కాలేజ్ ప్రిన్సపాల్ కె.దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. తణుకు అర్బన్: కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటన దువ్వ గ్రామ పరిధిలోని జాతీయరహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వద్దిపర్రుకు చెందిన కుటుంబ సభ్యు లు బొమ్మిడిలో ఫంక్షన్ చూసుకుని కారులో తిరుగు ప్రయాణమయ్యారు. దువ్వ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వెళ్తున్న మరో కారును ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి కారు పిల్లకాలువలోకి జారిపోయింది. కారులో జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ విప్పర్తి అశోక్కుమార్తో పాటు కుటుంబసభ్యులు వీరవల్లి సురేంద్ర, నరేంద్ర, పల్లెకొండ ప్రవీణ్, వీరవల్లి చంద్రమౌళి, 8 సంవత్సరాల బాలిక విప్పర్తి అస్మిత ఉన్నారు. పిల్ల కాలువ , నీరు తక్కువగా ఉండడంతో వీరంతా స్వల్పగాయాలతో బయటపడ్డారు. వీరిని 108 వాహనంలో తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా వైద్యసేవలు పొందుతున్నారు. ఈ ఘటనపై ఏ ఫిర్యాదు రాలేదని రూరల్ పోలీసులు తెలిపారు. -
ముగిసిన నాటకోత్సవాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): స్థానిక వైఎంహెచ్ఏ హాలులో జరుగుతున్న గరికపాటి కళాపరిషత్ నాటకోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. రెండు ప్రదర్శనలు సందేశాత్మకంగా ఉన్నాయి. కళాహారతి తిరుమాలి సంస్థ (కాకినాడ) కళాకారులు ప్రియమైన శత్రువు నాటిక ప్రదర్శించా రు. తల్లిదండ్రుల ప్రేమానురాగాలను యువత ఎలా నిర్లక్ష్యం చేస్తుందో చక్కగా ప్రదర్శించారు. గ్రామీణ నాటక సమాఖ్య (పిఠాపురం) వారి సహృదయ ఆర్ట్స్ (పి.రాయవరం) కళాకారులు పున్నామ నరకం నాటికను ప్రదర్శించారు. సీనియర్ రంగస్థల నటుడు కేపీ రాజు, సీనియర్ రంగస్థల నటి యు.విజయలక్ష్మిలను అక్కినేని స్మారక రంగస్థల పురస్కారాలతో సత్కరించారు. సినీ నటుడు సుబ్బరాయ శర్మ, రచయిత గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, ఎస్ బీఐ రీజనల్ మేనేజర్ పి.కాళిదాసు, కళారత్న ఎస్వీ రామారావు, డాక్యుమెంటరీ నిర్మాత జమలాపురం రాధాకృష్ణ, రచయిత పి.రాజేంద్రకుమార్ తదిరులు హాజరుకాగా గరికపాటి ఆర్ట్స్ థియేటర్ డైరెక్టర్ గరికపాటి కాళిదాసు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని 40 కేంద్రా ల్లో ఆదివారం ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలకు 3,454 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉ దయం 1,960 మందికి 1,841 మంది, మ ధ్యాహ్నం 1,656 మందికి 1,613 మంది హా జరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగా యని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాను ఓ ప్రకటనలో తెలిపారు. ఏలూరు (టూటౌన్): రాష్ట్ర ప్రభుత్వం కోకో ధరల నిర్ణయ కమిటీ నియమించి సోమవారం సమావేశం నిర్వహించనుందని అయితే కమిటీలో కోకో రైతుల సంఘ ప్రతినిధులను కా కుండా ఆయిల్పామ్, కోకో ప్రాసెసింగ్ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించనుండటం అ భ్యంతరకరమని ఏపీ కోకో రైతుల సంఘం రా ష్ట్ర కమిటీ ప్రకటించింది. రాష్ట్ర అధ్యక్షుడు బొ ల్లు రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఆయిల్పామ్, కోకో ప్రాసెసింగ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి కోకో గింజల ధరలు నిర్ణయిస్తారా అని ప్రశ్నించారు. పోరాటాల ఫలితంగానే కోకో గింజల ధర పాలసీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీ నియమించిందని పేర్కొన్నారు. అన్ని జిల్లాల కోకో రైతుల సంఘ ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీఈపీడీసీఎల్ ఏ లూరు సర్కిల్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి 23 వరకు స్మార్ట్ మీటర్ల పఖ్వాడా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ఎస్ఈ పి.సాల్మన్ రాజు ప్రకటనలో తెలిపారు. ఆధునిక సాంకేతి క సేవలు అందించడం, విద్యుత్ వినియోగంపై అవగాహన పెంచడం, ప్రీపెయిడ్ స్మార్ట్ మీ టర్ల వినియోగాన్ని ప్రోత్సహించడం పఖ్వాడా ఉద్దేశమన్నారు. జిల్లాలో వినియోగదారులు స్మార్ట్మీటర్ల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని, స్మార్ట్ మీటర్ అమరిక సమయంలో ఈపీడీసీఎల్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. తాడేపల్లిగూడెం రూరల్: పెదతాడేపల్లి వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం పీజీ కోర్సుల్లో ప్రవేశానికి గేట్ పరీక్షలు నిర్వహించారు. ఉదయం 150 మందికి 131 మంది, సాయంత్రం 150 మందికి 124 మంది హాజరైనట్టు కేంద్రం ప్రిసైడింగ్ అధికారి రాంబాబు తెలిపారు. తుది పరీక్షలు ఈనెల 15, 16వ తేదీల్లో జరుగనున్నాయన్నారు. కో–ఆర్డినేటర్ నటరాజ్, సిస్టమ్స్ అడ్మిన్ కొల్లా సురేష్, టీసీఎస్ ప్రతినిధులు పర్యవేక్షించారు. తణుకు అర్బన్: మహాశివరాత్రి పర్యదినం సందర్భంగా తణుకు డిపో నుంచి శ్రీశైలంకు ఈనెల 12, 13, 14 తేదీల్లో సూపర్లగ్జరీ, పుష్బ్యాక్ 2 ప్లస్ 2 ఆడియో వీడియో కోచ్ బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ డిపో మేనేజర్ సుధారాణి తెలిపారు. టికెట్ ధర పెద్దలకు రూ.820, పిల్లలకు రూ.450 అని, శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ, చినకాకాని, మంగళగిరి క్షేత్రాలు దర్శించేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీ రూపొందించామన్నారు. ఈనెల 14న సాయంత్రం 7 గంటలకు బస్సు బయలుదేరి 16న తణుకు చేరుతుందన్నారు. పుష్బ్యాక్ బస్సు టికెట్ ధర రూ.2,200గా నిర్దేశించామని తెలిపారు. -
తాడువాయిలో 15 నుంచి శివరాత్రి తిరునాళ్ల
జంగారెడ్డిగూడెం: జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న, దక్షిణ కాశీగా పేరుగాంచిన జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 15 నుంచి 19 వరకు శివరాత్రి తిరునాళ్ల ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. నిత్యపూజలతోపాటు ఆధ్యాత్మిక, సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాలు ఇలా... ● 15వ తేదీన ప్రాతఃకాలం నుంచే రుద్రాభిషేకాలు, విశేష పూజలు, స్వామివారి దివ్య మంగళ దర్శనం, ఉదయం 10 గంటల నుంచి విఘ్నేశ్వరుని పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అంకురార్పణ, ధ్వజారోహణ తదితర పూజలు నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు స్వామి వారికి, అమ్మవార్లకు ధూప సేవ, దీపాలంకరణ, నీరాజనం తదితర పూజలు నిర్వహిస్తారు. రాత్రి 11గంటలకు లింగోద్భవ దర్శన పూజలు జరుగుతాయి. ● 16వ తేదీన శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి వారి గ్రామోత్సవం, స్వామి వారికి, అమ్మవారికి అభిషేకాలు, నిత్య పూజలు నిర్వహిస్తారు. ● 17వ తేదీన నిత్య పూజలతోపాటు ఉదయం 10 గంటలకు భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి వారి కళ్యాణ మహోత్సవం, అనంతరం భారీ అన్నసమారాధన నిర్వహిస్తారు. ● 18వ తేదీ ఆలయ సమీపంలో ఉన్న శ్రీ అప్పన్న సమేత అనంతేశ్వరస్వామి వారి ఆలయంలో స్వామి వారికి దివ్య కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ● 19వ తేదీన నిత్యపూజలతోపాటు రాత్రి 8 గంటలకు స్వామి వారికి, అమ్మవారికి శ్రీ పుష్పయాగం (పవళింపు సేవ) జరుగుతుంది. ఏర్పాట్లు పరిశీలించిన ఏఎస్పీ తాడువాయిలో 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఏర్పాట్లను జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు, భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఎర్రకాలువ జలాశయానికి భక్తులు లోతైన ప్రాంతాలకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గజ ఈతగాళ్ళను కూడా ఏర్పాటు చేయాలన్నారు. సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై ఎన్వీ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఉత్సవ కమిటీ ఛైర్మన్ ఉప్పునూతల పుల్లారావు, పాపోలు వెంకట శ్రీనివాస్, రూప సత్యసాయి సుధాకర్, కొడవటి సత్తిరాజు, కాసారపు వెంకటరమణ, పొన్నగంటి మహి, కాసారపు నారాయణ, భక్తుల అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసు అధికారులకు వివరించారు. -
ఆటపాకలో పర్యాటకుల సందడి
కై కలూరు: పక్షి ప్రేమికుల స్వర్గథామంగా పేరుగడించిన ఆటపాక పక్షుల కేంద్రంలో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. సమీప జిల్లాల నుంచి వచ్చిన యాత్రికులతో కేంద్రం కళకళలాడింది. బోటు షికారులో పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ పక్షుల కేరింతలను దగ్గర నుంచి ఆశ్వాదించారు. కేంద్రంలో పక్షి నమూనా మ్యూజియంను ఎక్కువమంది తిలకించారు. చిల్డ్రన్స్ పార్కులో చిన్నారులు, పెద్దలు ఆటలాడుకున్నారు. ఫారెస్టు బీట్ ఆఫీసర్ రాజేష్, సిబ్బంది కొల్లేరు భౌగోళిక పరిస్థితులు, విదేశీ, స్వదేశీ పక్షుల విశేషాలను వివరించారు. పక్షుల వీక్షణకు అనువైన శీతాకాలం కావడంతో పక్షి ప్రేమికులు సందర్శించాలని కోరారు. -
కొల్లేరులో... పక్షుల కనువిందు
కైకలూరు : కొల్లేరు అభయారణ్యంలో ఏషియన్ బర్డ్ సెన్సస్ 2025–2026 ఫిబ్రవరి 4తో ముగిసింది. రాజమండ్రి సర్కిల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు(పీసీసీఎప్) బీఎన్ఎన్ మూర్తి, జిల్లా ఫారెస్టు డీఎఫ్వో బి.విజయ ఆధ్వర్యంలో 5 జట్లుగా పక్షుల గణన చేశారు. పీసీసీఎఫ్ మూర్తి అంచనా ప్రకారం ఈ ఏడాది కొల్లేరు అభయారణ్యంలో 40 లక్షల నుంచి 50 లక్షల పక్షులు శీతాకాలంలో సంచరించినట్లు సమాచారం. దాదాపు 30,000 కిలోమీటర్ల నుంచి విదేశాల నుంచి పక్షుaలు వస్తాయి. ఈ ఏడాది 200 జాతుల పక్షులు కొల్లేరులో ఉన్నట్లు భావిస్తున్నారు. సెన్సస్ బృందాల సమాచారం మేరకు నార్తర్న్న్ పిన్టైల్ పక్షులను ఎక్కువగా గుర్తించారు. ప్లేమింగోస్, కామన్టీల్, గార్కానీ, గాడ్వీట్, శాండ్ పైపర్స్, జకానా, ఫిన్ టైల్, రఫ్ వంటి పక్షులను గమనించారు. మరి కొద్ది రోజుల్లో తుది పక్షుల గణన నివేదిక వెలువడనుంది. గణన జరిగిన ప్రాంతాలు ఇవే.. కొల్లేరు అభయారణ్య పరిధిలో మాదాపురం, మొండికోడు, గుడివాకలంక, ప్రత్తికోళ్ళలంక, కొక్కిరాల లంక, బొమ్మిలి లంక, ఆగడాల లంక, చెట్నెంపాడు, మల్లవరం, దోసపాడు, క్రొవ్వలి, కేదవరం, పోతులూరు, కొల్లేటికోట, పైడిచింతపాడు, గోకర్ణ పురం, గుమ్మళ్లపాడు, ఆలపాడు, పల్లెవాడ, అడవి కొలను, పెదనిండ్రకొలను, డీ.గోపవరం, సిద్ధాపురం, పల్లెవాడ, ఆటపాక, పెదఎడ్లగాడి, శ్రీపర్రులో కొల్లేరు పక్షుల సర్వే జరిగింది. -
ఎస్పీ రావు సేవలు చిరస్మరణీయం
దెందులూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను పుణికి పుచ్చుకున్న మహోన్నత వ్యక్తి దివంగత ఇన్కం ట్యాక్స్ కమిషనర్ ఎస్పీ రావు అని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు అన్నారు. శనివారం కొవ్వలి అంబేడ్కర్ పార్కులో ఎస్పీ రావు 25 వర్ధంతి సభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మోషేన్రాజు, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు హాజరై ఎస్పీ రావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోషేన్రాజు మాట్లాడుతూ ఎస్పీ రావు వంటి వ్యక్తులు అరుదుగా ఉంటారన్నారు. అందరూ చదవాలి.. అందరూ ఎదగాలి.. అందరూ అభివృద్ధి చెందాలనే ఆయన ఆశయం మహోన్నతం అన్నారు. కొవ్వలి గ్రామ దళితుల జీవనోపాధిగా ఉన్న 150 ఎకరాల సమస్య పరిష్కారానికి సమష్టిగా కృషి చేద్దామని అన్నారు. ఎమ్మెల్సీ రవీంద్రబాబు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి, దళితుల జీవనోపాధికి ఎస్పీ రావు సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. దశాబ్దాల కిందట కొవ్వలి గ్రామ దళితుల జీవనోపాధి కోసం 150 ఎకరాల భూమిని కల్పించిన వ్యక్తి ఆయన అని కొనియాడారు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు తనయుడు సాయి కార్తిక్ మాట్లాడుతూ ఎంపీ ల్యాడ్స్ రూ.25 లక్షలతో నిర్మించనున్న అంబేడ్కర్ మల్టీపర్పస్ హాల్కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. కొవ్వలి అభివృద్ధికి తమ కుటుంబం కట్టుబడి ఉందన్నారు. ఎస్పీ రావు జీవిత చరిత్రపై రాసిన పుస్తకం, క్యాలెండర్ను మోషేన్రాజు ఆవిష్కరించారు. వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఊదరగొండ చంద్రమౌళి, వైద్యశాఖ అడిషనల్ డైరెక్టర్ ఎంఆర్ ప్రభాకర్, జార్ఖండ్ మాజీ చీఫ్ సెక్రటరీ కె.విద్యాసాగర్, వైజాగ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ కాటి నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ గొల్ల నాగరాజు, వెఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి గొల్ల కిరణ్, సర్పంచ్లు ఇంటేటి మధులత, మొండెం సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మండలి చైర్మన్ మోషేన్రాజు -
అక్రమాలకు అండగా.. అవినీతి మెండుగా..!
కొయ్యలగూడెం: ‘కంచే చేను మేసిన’ చందంగా ఉంది కన్నాపురం అటవీ శాఖ కార్యాలయంలో అధికారుల తీరు. రేంజ్ పరిధిలో అటవీ ప్రాంతాన్ని సంరక్షించాల్సిన అధికారులు అక్రమార్కులతో కలిసి కలప అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొండ, కోనల్లోని చెట్లను యథేచ్ఛగా నరికి కలపను తరలిస్తున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. వర్జీనియా పొగాకు బ్యారన్ క్యూరింగ్ పనులు ప్రారంభం కానుండటంతో కలప అక్రమ రవాణా ఊపందుకుంది. నిత్యం రేంజ్ పరిధిలో 40 ట్రక్కులకు పై గా కలపను అక్రమార్కులు పోలవరం, చింతలపూ డి, గోపాలపురం నియోజకవర్గాల్లోని గ్రామాలకు తరలిస్తున్నారు. టన్ను కలపను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు విక్రయిస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా, అక్రమార్కులను పట్టుకు న్నా కేసులు నమోదు చేయకుండానే అధికారులు ముగించేస్తున్నారు. ఇందుకు పలు సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కార్యాలయంలోనే రాజీ : గతేడాది నవంబర్ 16న నాలుగు బైక్లతో కొందరు కలపను తరలిస్తుండగా అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఒక వ్యక్తి బైక్ను మాత్రమే స్వాధీనం చేసుకుని కార్యాలయానికి తరలించి మిగిలిన మూడు వాహనాలను వదిలేసినట్టు సమాచారం. ఈ విషయం ఉన్నతాధికారులకు ఆధారాలతో సహా తెలిసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో పట్టుబడిన వ్యక్తి మరికొందరితో కలిసి వెళ్లి రేంజ్ కార్యాలయంలో వాగ్వాదానికి కూడా దిగాడు. అధికారులు మిగిలిన వాహనాలపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పారే తప్ప అ మలు కాలేదు. పట్టుబడిన వ్యక్తి గొడవకు దిగడంతో అధికారులే రాజీ కుదిర్చారు. పట్టుబడిన మో టార్ సైకిల్కు బదులు పనిచేయని మరో బైక్ను సీజ్ చేసి అసలు వాహనాన్ని అక్రమార్కుడికి తిరిగి ఇచ్చేశారు. అలాగే గతేడాది సెప్టెంబర్ 20న మో టార్ బైక్లపై తరలిస్తున్న కలపను డీఆర్వో ప ట్టుకుని సెల్ఫీ కూడా తీశారు. అయితే దీనికి సంబంధించి కేసు కూడా నమోదు కాలేదు. పెద్ద ఎత్తున తరలింపు అక్రమార్కులు సిండికేట్గా వ్యవహరిస్తూ పలు బీట్లలో చెట్టను నరికి కలప తరలించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. అతి విలువైన వృక్షజాతికి చెందిన దుంగలను రవాణా చేసి రూ.20 లక్షలకు పైగా దండుకున్నారు. సమాచారం అందుతున్న సమయాల్లో స్క్వాడ్ సిబ్బందికి దొరుకుతున్న అక్రమ కలప, వాహనాలు.. రేంజ్ కార్యాలయ అధికారులు, సిబ్బందికి దొరక్కపోవడం గమనార్హం. నెల రోజుల వ్యవధిలో పదికి పైగా కలప తరలిస్తున్న ఫోర్ వీలర్స్ వాహనాలను స్క్వాడ్ బృందం పట్టుకోవడం మినహా కార్యాలయ అధికారులు, సిబ్బంది ఎలాంటి వాహనాలను పట్టుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అడవికి అన్యాయం కన్నాపురం అటవీ శాఖ కార్యాలయంలో అవినీతి జాఢ్యం అటవీ కలపను యథేచ్ఛగా తరలిస్తున్న అక్రమార్కులు అక్రమ రవాణాకు అధికారుల సహకారంపై ఆరోపణలు రూ.3 లక్షలకు పైనే నెలవారీ మామూళ్లు ఉన్నతాధికారుల వద్ద ఉన్న పలుకుబడితో కార్యాలయంలోని ఓ అధికారి మొత్తం కలప అక్రమ రవాణా కు ప్రధాన కేంద్రంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కార్యాలయానికి సంబంధించి ఉన్నతాధికారిని నియమించాల్సి ఉన్నా దానిని నిలుపుదల చేయిస్తూ అన్నీ తానై వ్యవహరిస్తున్నారని, కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని సైతం తన గుప్పిట్లో పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే ఇద్దరు రేంజ్ అధికారులు కన్నాపురం కార్యాలయానికి బదిలీపై రావాల్సి ఉన్నా సదరు అధికారి ఆ ప్రక్రియను ఆపడానికి వెనకాడలేదని తెలిసింది. కలప అక్రమ రవాణాకు సంబంధించి మీడియాలో వార్తలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు వెనుకటి తేదీలతో కేసులు నమోదు చేసినట్టు రికార్డులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దళారులను కూడా వీరే ఎంపిక చేసుకుని వారి ద్వారా 50 కిలోమీటర్లలోపు కలప అక్రమ రవాణా అయ్యేలా చూస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి కలప అక్రమ రవాణాను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
విత్తనాల కల్తీని సహించం
మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు(మెట్రో): జిల్లాలో నాణ్యత లేని, కల్తీ విత్తనాలు సరఫరా చేసే వారిపై క్రిమినల్ కేసులు న మోదు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కలెక్టరేట్లో శనివారం మంత్రి మనోహర్ అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్తీ విత్తనాలు సరఫరా చేసే వారిపై క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు. అలాగే ఎరువుల సరఫరా సమస్యలు లేకుండా చూడాలన్నారు. 22ఏ కేసుల పరిష్కారం, ఆయిల్పామ్, కోకో, కొబ్బరి పంటల సాగు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పేదల గృహ నిర్మాణాలు, పాపికొండల వద్ద పర్యాటక అభివృద్ధి, రోడ్ల మరమ్మతులు, మట్టి అక్రమ రవాణా తదితర అంశాలపై మాట్లాడారు. మంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్సీలు వంకా రవీంద్రనాథ్, జయమంగళ వెంకటరమణ, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు మాట్లాడారు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ, డీఎఫ్ఓ సందీప్రెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్, రమణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి మనోహర్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. -
బాలుడి మృతిపై సమగ్ర విచారణ చేయిస్తా..
కలెక్టర్ వెట్రిసెల్వి హామీ పెదవేగి: పెదవేగిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న అజిత్ మరణంపై విచారణ చేసి తమకు న్యాయం చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు కలెక్టర్ కె.వెట్రిసెల్విని కోరారు. ఏలూరు కలెక్టరేట్లో శనివారం వారు కలెక్టర్ను కలిసి తమ కుమారుడిది ఆత్మహత్య కాదని, తమ కుమారుడి మృతిపై సమగ్ర విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. అజిత్ మృతి ఘటనపై సమగ్ర విచారణ చేయించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. ఏలూరు (ఆర్ఆర్పేట): మార్చి 16 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుందని డీఈఓ ఎం. వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 20న నిర్వహించాల్సిన ఇంగ్లిష్ పరీక్షను మార్చి 21కు మార్చినట్టు పేర్కొన్నారు. 20న ఈద్ ఉల్ ఫితర్ పండుగ ఉన్నందున ఈ మార్పు చేసినట్టు స్పష్టం చేశారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం శనివారం పరీక్షలు నిర్వహించినట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. 9వ తరగతి ప్రవేశ పరీక్షకు 639 మందికి 233 మంది, 11వ తరగతిలో ప్రవేశాలకు 677 మందికి 151 మంది హాజరయ్యారన్నారు. ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ నాలుగు కేంద్రాలను సందర్శించారని తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రభుత్వం ఏపీ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్–2026 అమలుచేయాలనే ఉద్దేశంతో రూపొందించిన ముసాయిదా నిబంధనలు ఉద్యోగులు, ఉపాధ్యాయుల భద్రతకు ముప్పుగా పరిణమించనున్నాయని ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ గుగులోతు కృష్ణ, జిల్లా అధ్యక్షుడు ఈ. రామ్మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.మోహన్ ప్రకటనలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలపై అభిప్రాయాలు, సూచనలు, సలహాలు పంపాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను ప్రభుత్వం కోరిందని, ఈ నిబంధనలు తీవ్రనష్టం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఎక్స్ట్రార్డినరీ లీవ్, 33 ఏళ్ల సేవ పూర్తయితే బలవంతపు రిటైర్మెంట్ వంటి పలు నిబంధనలు ప్రమాదకంగా ఉన్నాయని తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని 49 కేంద్రాల్లో శనివారం ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలకు 4,363 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 2,514 మందికి 2,391 మంది, మధ్యాహ్నం 2,018 మందికి 1,972 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాను ఓ ప్రకటనలో తెలిపారు. భీమవరం: ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ అయిన సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కా ర్యదర్శులు యాళ్ల మోహనరావు, గుమ్మల్ల జకరయ్య కోరారు. శనివారం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, ఎమ్మెల్సీ గోపిమూర్తిని కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 14 నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాలు అందజేశామన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయి లు, ఆర్థిక ప్రయోజనాలు, వేతన సవరణ క మిషన్ ఏర్పాటు, మధ్యంతర భృతి తదితర అంశాలపై రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు చేయాలని కోరారు. కూటమి పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో హామీ మేరకు సీపీఎస్/జీపీఎస్ విధానాలపై పునః సమీక్ష చేయాలన్నారు. ఉద్యోగుల స మస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని, సభలో ప్రస్తావిస్తామని మోషేన్రాజు, గోపి మూర్తి హామీ ఇచ్చారని నేతలు తెలిపారు. -
కొల్లేరులో కనువిందు
కొల్లేరు అభయారణ్యంలో పక్షుల గణన పూర్తయ్యింది. శీతాకాలంలో సుమారు 40 వేల నుంచి 50 వేల పక్షులు సంచరించినట్టు సమాచారం. 8లో uగ్రామసభ తీర్మానం లేకుండా, ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవ హరిస్తోంది. దీనికి కూటమి ప్ర భుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. రూ.వేల కోట్ల కాంట్రాక్టు పనుల కోసమే ఆయుధ డిపో ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతులు అంటున్నారు. రైతు ఉద్యమంలో దళారులు తయారయ్యారు. వారిని నమ్మి ఎవరూ మోసపోవద్దు. – కె.శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మా అత్తవారిచ్చిన మూడెకరాల భూమి పోలవరం ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో పోయింది. పరిహారం డబ్బులు ఖర్చయిపోయాయి. తాజాగా బోడిగూడెంలో తాతల కాలం నాటి నుంచి ఉన్న ఐదెకరాల భూమిని నేవీ ఆయుధ డిపోకు ఇమ్మంటున్నారు. ఇదీ ఇచ్చేస్తే మా కుటుంబం ఎలా బతకాలి. మా భూములన్నీ భూసేకరణలోనే లాగేసుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గం. – యాగంటి కృష్ణ, బోడిగూడెం, కొయ్యలగూడెం మండలం నాకు రెండెకరాల పొలం ఉంది. డిపోను పెడితే మా భవిష్యత్ ఏంటో అర్థం కావడం లేదు. పచ్చని పొలాల్లో పంటలు పండించుకుని జీవిస్తుంటే ఇప్పుడు ఆయుధ డిపో పెడతాం.. భూములను నష్టపరిహారం అందిస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం మాకొద్దు. ఎవరికీ భూమిలిస్తామని మేం చెప్పలేదు. ఎంపీ పుట్టా చెప్పినట్లు రైతులు భూములిస్తారనడం అన్యాయం. – నీలపాల తాతారావు, అచ్యుతాపురం, కొయ్యలగూడెం మండలం -
అదే పోరుబాట
నమో వేంకటేశా.. నమో వేంకటేశా.. అంటూ వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ద్వారకాతిరుమల క్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. 8లో uఏజెన్సీలో ఆయుధ డిపో ఏర్పాటుపై తారాస్థాయిలో నిరసనలు వ్యక్తమౌతున్నాయి. గిరిజనుల అభీష్టం, గ్రామసభల తీర్మానానికి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం వేస్తున్న అడుగులను పోరుబాటతో గిరిజనులు అడ్డుకుంటున్నారు. ఇప్పటికే జీలుగుమిల్లిలో ఆయుధ డిపోకు వ్యతిరేకంగా తారాస్థాయిలో ఉద్యమాలు నిర్వహించడంతో ప్రతిపాదనను జీలుగుమిల్లి నుంచి కొయ్యలగూడేనికి మార్చారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్యాదవ్ ఆదేశాలతో అధికారులు హడావుడిగా సర్వేలు నిర్వహిస్తుండటంతో కొయ్యలగూడెంలోనూ పోరుబాట ఉధృతమైంది. ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026రైతుల భారీ ప్రదర్శన (ఫైల్) సాక్షిప్రతినిధి, ఏలూరు: నేవీ ఆయుధ డిపో నిర్మాణ ప్రతిపాదనకు సంబంధించి భూసేకరణ తీవ్ర వివాదస్పదంగా మారింది. దాదాపు రెండేళ్ల నుంచి ఏజెన్సీలో గిరిజనులు, గిరిజనేతరులు వ్యతిరేకంగా పో రాడుతున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రతిపాదన వచ్చినా రైతులు సుముఖంగా లేకపోవడంతో అప్పటి కలెక్టర్ ప్రతిపాదనను తిరస్కరించి కేంద్రానికి పంపారు. అయితే కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక ఏలూరు ఎంపీ పుట్టా ప్రాజెక్టును సీరియస్గా తీసుకుని హడావుడి చేశారు. తొలుత జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెం పంచాయతీ పరిధిలో 1,016 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించారు. కలెక్టర్ అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించి భూసేకరణకు ఆదేశాలు ఇచ్చారు. జీలుగుమిల్లి మండలంలో గ్రామసభలు నిర్వహించి ప్రతిపాదనలను తిప్పికొట్టడానికి రైతులు, గ్రామస్తులు ప్రయత్నించినా సర్కారు మాత్రం వెనక్కి తగ్గకుండా బలంగా ఒత్తిడి తెచ్చింది. పలు రకాలుగా రైతులను దారికి తెచ్చి భూసేకరణకు ప్రయత్నించినా అక్కడ పోరుబాట తారాస్థాయికి చేరడంతో ప్రతిపాదనలు విరమించుకున్నారు. ఇంతటితో ఆగకుండా కొయ్యలగూడెం మండలానికి ప్రాజెక్టును షిఫ్ట్ చేశారు. కొయ్యలగూడెంలో ఆగ్రహ జ్వాలలు కొయ్యలగూడెం, గోపాలపురం మండలాల సరిహద్దు గ్రామాల్లో భూసేకరణ చేసి ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో మళ్లీ వివాదం రేగింది. స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను సైతం పరిగణనలోనికి తీసుకోకుండా ఎంపీ ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నారనే ఆరోపణలున్నా యి. ఈ పరిణామాల క్రమంలో జీలుగుమిల్లిలో భూసేకరణ నిలిపివేసి కొయ్యలగూడెం, గోపాలపురం మండలాల్లోని బోడిగూడెం, మంగపతిదేవిపేట, బర్కెట్నగర్, రేగులగుంట, ఊట్లగూడెం, త్రినాథపురంలో 1,200 ఎకరాల భూమిని ప్రాజెక్టు కోసం సేకరించాలని నిర్ణయించి హడావుడిగా సర్వే చేపట్టి నివేదికలు సిద్ధం చేశారు. ఆయా గ్రామాల్లో గ్రామసభలు, ముందస్తు సమాచారం లేకుండా రెండు పంటలు పండే భూములను ఎలా ఇస్తామంటూ రైతులు తిరగబడుతున్నారు. గత వారం వందలాది మందితో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బోడిగూడెం నుంచి కొయ్యలగూడెం వరకు పార్టీలకు అతీతంగా రైతులు ఆరు కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి తక్షణమే ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే అన్ని గ్రామాల్లో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గ్రామసభల ద్వారా తీర్మానం చేసి తిప్పికొట్టాలని నిర్ణయించారు. వర్జీనియా పొ గాకు, ఆయిల్పామ్, మొక్కజొన్న, అరటి, కోకో, కొబ్బరి, ఇతర ఉద్యాన పంటలు పండే సారావంతమైన భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వ బోమని రైతులు అంటున్నారు. ఆయుధ డిపో మాకొద్దు జీలుగుమిల్లి నుంచి కొయ్యలగూడేనికి ఆయుధ డిపో షిఫ్ట్ హడావుడిగా కొయ్యలగూడెంలో సర్వే 6 గ్రామాల్లో 1,200 ఎకరాల సేకరణకు ప్రయత్నాలు రైతులు వ్యతిరేకిస్తున్నా మొండిగా ముందుకెళ్తున్న సర్కారు ఆయుధ డిపోపై ఎంపీ పుట్టా పట్టు గ్రామసభల్లో వ్యతిరేక తీర్మానాలకు పంచాయతీలు సిద్ధం -
కోకో ధర తగ్గింపు అన్యాయం
పెదవేగి: కొనుగోలు కంపెనీలు కోకో గింజల ధర లు తగ్గించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధరల పాలసీ ప్రకటించాలని, కంపెనీల మోసాలు అరికట్టాలని ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం డిమాండ్ చేసింది. శనివారం విజయరాయిలోని గాంధీనగర్ సీతారామ కల్యాణ మండలపంలో రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ధర నిర్ణయంపై ఈనెల 9న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమావేశంలో తీసుకోవాల్సిన చర్య లు గురించి చర్చించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం కోకో రైతులతో సమావేశం నిర్వహిస్తున్న తరుణంలో కంపెనీలు ధరలు ఎలా తగ్గిస్తాయని ప్రశ్నించారు. కిలో గింజలకు ధరను రూ.400 నుంచి రూ.380కు తగ్గించారని, దీనిపై ప్రశ్నిస్తే అంతర్జాతీయ మార్కెట్ ధర తగ్గిందని చెప్పడం అన్యాయమన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో జనవరిలో రూ.550 ధర ఉంటే రూ.350లకే కొనుగోలు చేశారన్నారు. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా రైతులకు ధరలు చెల్లించడం లేదన్నారు. ధరలు తగ్గించడం సరికాదని దీనిపై ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు భ విష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు పర్వతనేని సుబ్రహ్మణ్యేశ్వరరావు, పానుగంటి అచ్యుతరామయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి గుదిబండి వీరారెడ్డి, కోనేరు సతీష్బాబు, పాలడుగుల నరసింహారావు, నాయకులు బొప్పన పూర్ణచంద్రరావు, కూరపాటి ధర్మారావు, బొప్పన శివరాం పాల్గొన్నారు. -
ఆంధ్ర బౌలింగ్ కోచ్గా నాగవర్మ
ఏలూరు రూరల్ : ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అండర్–14 జట్టు బౌలింగ్ కోచ్గా పెదవేగి మండలం భోగాపురం గ్రామానికి చెందిన మట్టా నాగవర్మ నియమితులయ్యారు. త్వరలో తమిళనాడులో జరగబోయే అంతర రాష్ట్ర అండర్–14 బాలుర క్రికెట్ పోటీల్లో నాగవర్మ పాల్గొంటారు. నాగవర్మ వద్ద శిక్షణ పొందిన పలువురు క్రికెటర్లు సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ, విజయ్హజారే ట్రోఫీల్లో ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. భీమడోలు : భీమడోలు ఈతకోటవారి వీధిలో శనివారం పట్టపగలే చోరీ జరిగింది. పొల్నాటి శ్రీనివాస్ ఇంట్లోని ఆరు కాసుల బంగారు అభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. గ్రామానికి చెందిన తాపీమేస్త్రి పొల్నాటి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు మేనల్లుడి ఇంట్లో నిశ్చితార్ధానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి నల్లపూసల తాడు, బంగారు చైన్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మదీనా బాషా తెలిపారు. -
వక్ఫ్ భూముల ఆక్రమణకు యత్నం
నూజివీడు: వందలాది ఎకరాల వక్ఫ్భూములను కబళించేందుకు ప్రభుత్వ పెద్దలు పావులు కదపడం దారుణమని వైఎస్సార్సీపీ ముస్లీం మైనారిటీ విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షులు షేక్ యూనస్పాషా(గబ్బర్) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నియోజకవర్గ కార్యాలయంలో ముస్లీం మైనారిటీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ జిలానీ, నాయకులు షేక్ మస్తాన్వలీ, జలాల్ఖాన్, షేక్ మస్తాన్, మహ్మద్ ఖదీర్, అలీ బాషాలు శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు ముస్లింలకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా తుంగలో తొక్కారన్నారు. ఇప్పుడు మంగళగిరి ప్రాంతంలోని 71.57 ఎకరాలను, మల్లాయపాలెం ప్రాంతంలోని 232 ఎకరాల వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ రెండు చోట్ల ఉన్న వక్ఫ్ భూములు అత్యంత విలువైనవని, వాటిని సరిగా వినియోగిస్తే ముస్లిం సమాజానికి భారీ ఆదాయ వనరులుగా మారతాయన్నారు. వక్ఫ్భూములను టీడీపీ అనుకూల వర్గాలకు కేటాయిచేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముస్లింలు భావిస్తున్నారన్నారు. వక్ఫ్ భూములను తీసుకోవడాన్ని నిరసిస్తూ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన నాయకులు ఈ నెల 9న కలెక్టర్కు వినతిపత్రం అందిస్తారన్నారు. -
నమో వేంకటేశా..
ద్వారకాతిరుమల: నమో వేంకటేశా.. అంటూ వేలాది మంది భక్తులు శనివారం శ్రీవారిని దర్శించారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు సందడిగా మారాయి. గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. దర్శనం క్యూలైన్లు, ఉచిత ప్రసాద వితరణ క్యూలైన్లు, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, కల్యాణకట్ట, నిత్యాన్నదాన భవనం తదితర విభాగాలు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. ఆకివీడు నుంచి భద్రాచలానికి పాదయాత్రగా వెళ్తున్న రామ భక్తులు మద్యలో శ్రీవారి క్షేత్రాన్ని సందర్శించారు. దాంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. వారంతా కాషాయ జెండాలను పట్టుకుని ఆలయంలోకి వెళ్లి స్వామి, అమ్మవార్లను దర్శించారు. -
కొల్లేరులో పక్షుల కనువిందు
● పూర్తయిన లెక్కింపు.. తుది జాబితా తయారు ● సుమారు 50 లక్షల పక్షులు ఉన్నట్లు ప్రాథమిక అంచనా కై కలూరు : కొల్లేరు అభయారణ్యంలో ఏషియన్ బర్డ్ సెన్సస్ 2025–2026 ఫిబ్రవరి 4తో ముగిసింది. రాజమండ్రి సర్కిల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు(పీసీసీఎప్) బీఎన్ఎన్ మూర్తి, జిల్లా ఫారెస్టు డీఎఫ్వో బి.విజయ ఆధ్వర్యంలో 5 జట్లుగా పక్షుల గణన చేశారు. పీసీసీఎఫ్ మూర్తి అంచనా ప్రకారం ఈ ఏడాది కొల్లేరు అభయారణ్యంలో 40 లక్షల నుంచి 50 లక్షల పక్షులు శీతాకాలంలో సంచరించినట్లు సమాచారం. దాదాపు 30,000 కిలోమీటర్ల నుంచి విదేశాల నుంచి పక్షులు వస్తాయి. ఈ ఏడాది 200 జాతుల పక్షులు కొల్లేరులో ఉన్నట్లు భావిస్తున్నారు. సెన్సస్ బృందాల సమాచారం మేరకు నార్తర్న్న్ పిన్టైల్ పక్షులను ఎక్కువగా గుర్తించారు. ప్లేమింగోస్, కామన్టీల్, గార్కానీ, గాడ్వీట్, శాండ్ పైపర్స్, జకానా, ఫిన్ టైల్, రఫ్ వంటి పక్షులను గమనించారు. మరి కొద్ది రోజుల్లో తుది పక్షుల గణన నివేదిక వెలువడనుంది. గణన జరిగిన ప్రాంతాలు ఇవే.. కొల్లేరు అభయారణ్య పరిధిలో మాదాపురం, మొండికోడు, గుడివాకలంక, ప్రత్తికోళ్ళలంక, కొక్కిరాల లంక, బొమ్మిలి లంక, ఆగడాల లంక, చెట్నెంపాడు, మల్లవరం, దోసపాడు, క్రొవ్వలి, కేదవరం, పోతులూరు, కొల్లేటికోట, పైడిచింతపాడు, గోకర్ణపురం, గుమ్మళ్లపాడు, ఆలపాడు, పల్లెవాడ, అడవికొలను, పెదనిండ్రకొలను, డీ.గోపవరం, సిద్ధాపురం, పల్లెవాడ, ఆటపాక, పెదఎడ్లగాడి, శ్రీపర్రులో కొల్లేరు పక్షుల సర్వే జరిగింది. -
గేటు పడితే ట్రాఫిక్ కష్టాలు
భీమడోలు: జాతీయ రహదారి, రాష్ట్రీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న భీమడోలు రైల్వే గేటు మీదుగా వాహనాల రాకపోకలు వాహనదారులకు చుక్కలు చూపుతోంది. రైల్వే గేటును ఒక్కసారి మూస్తే భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో ఈ గేటు మీదుగా రాకపోకలు సాగించాలంటే భయపడుతున్నారు. ఏలూరు నుంచి భీమడోలు వచ్చే వారు, తాడేపల్లిగూడెం నుంచి భీమడోలు వైపుగా వచ్చే వాహనాలు అడ్డుగా రావడం సమస్యగా మారింది. భీమడోలు నుంచి జాతీయ రహదారికి వచ్చే వాహనాలతో గేటు వద్ద రద్దీగా మారుతుంది. ఇష్టానుసారంగా రాకపోకలు సాగిస్తుండడంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గేటు తెరిస్తే వాహనాలు వేగంగా దూసుకెళ్తుండడంతో ట్రాఫిక్ నిలిచిపోతుంది. ఫ్లైఓవర్తో ట్రాఫిక్కు చెక్ భీమడోలు రైల్వే గేట్లో రోజుకు పదుల సంఖ్యలో గేటు వేస్తున్నారు. ఈ గేటు మీదుగానే ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తాయి. మెట్ట ప్రాంతాలకు, రాష్ట్రీయ రహదారి వైపు వెళ్లాలన్నా ప్రధాన మార్గం ఇదే. ఒక్కసారి వేసిన గేటు 2 నుంచి 3 రైళ్లు వెళ్లే వరకూ తీసే పరిస్థితి లేదు. దీంతో భారీ వాహనాలు, ద్విచక్రవాహనాలతో రద్దీ ఏర్పడుతుంది. గేటు వద్ద ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్ వంతెన వేసి గేటు మూసి వేయాలని నిర్ణయించారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్డి నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. -
మద్దిలో అభిషేక సేవ
జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం స్వామి వారికి అభిషేక సేవ నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో స్వామి ఉత్సవ విగ్రహానికి అర్చకులు, వేద పండితులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆలయానికి వివిధ సేవల రూపేణా రూ.1,28,350 ఆదాయం సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో 1450 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఈవో తెలిపారు. ఏలూరు టౌన్: ఏలూరు పాతబస్టాండ్ పరిసర ప్రాంతాల్లో శక్తి టీమ్ పెట్రోలింగ్ విధుల్లో ఉండగా... ఒక స్కూటీపై వెళుతున్న ఇద్దరు యువకులు పోలీసులను గమనించి భయంతో పారిపోయేందుకు ప్రయత్నింగా శక్తి టీం వారిని అదుపులోకి తీసుకుని తనికీ చేసింది. గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు యువకులతో పాటు మరో మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి గంజాయి, రూ.2.02 లక్షల రెండు స్కూటీలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళా స్టేషన్ డీఎస్పీ యూ.రవిచంద్ర పర్యవేక్షణలో సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో శక్తి టీమ్ సభ్యులు అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచారు. శనివారం శక్తి టీం సభ్యులు పాతబస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 300 గ్రాముల గంజాయి, రెండు స్కూటీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై టూటౌన్ స్టేషన్లో కేసు నమోదు చేశామని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. కుక్కునూరు: ఏపీ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మండలంలోని దాచారం ఇసుక రీచ్ నుంచి శుక్రవారం రాత్రి రెండు టిప్పర్ లారీలలో ఇసుకను తరలిస్తుండగా అశ్వారావుపేట వద్ద తెలంగాణ పోలీసులు ఆపి తనిఖీ చేయగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో లారీలను స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఆగిరిపల్లి: ఆగిరిపల్లికి చెందిన బెజవాడ రామారావు (65) ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందాడు. ఎస్సై శుభ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం ఆగిరిపల్లికి చెందిన రామారావు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. శనివారం సాయంత్రం మల్లిబోయినపల్లి వద్ద పొలంలో ఉన్న గేదెల కోసం ఆగిరిపల్లి నుంచి ట్రాక్టర్ ఎక్కగా బస్టాండ్ వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. కింద పడిపోయిన రామారావుకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రామారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని బొలెరో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని హోటల్ ఎన్లో శ్రీ కృష్ణ సుజుకి షోరూం తరఫున కొత్త సుజుకి ఈ–యాక్సెస్ ఈవీ స్కూటర్ను మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం మార్కెట్లోకి విడుదల చేశారు. షోరూం యజమాని, శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ నారా శేషు, ఎమ్మెల్యేలు పత్సమట్ల ధర్మరాజు, బడేటి రాధాకృష్ణయ్య, జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కె.గోవిందరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక టెక్నాలజీతో పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా రూపొందించిన ఈ వాహనాలు కస్టమర్ల ఆదరణ పొందాలని ముఖ్య అతిథులు ఆకాంక్షించారు. శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ నారా నరసింహమూర్తి, డైరెక్టర్లు ఎన్వీ హనుమకుమార్, సీహెచ్ సూరిబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
ఏలూరు (టూటౌన్): మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నగరంలో శనివారం సాయంత్రం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యాలయం వద్ద ప్రారంభమై కొత్త బస్టాండ్, ఫైర్ స్టేషన్ సెంటర్, విజయ విహార్ సెంటర్, రమా మహల్ సెంటర్, రైల్వే స్టేషన్ పాత బస్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎంఎస్ఆర్యు రాష్ట్ర ఉప ప్రధానకార్యదర్శి వీవీఎన్ ప్రసాద్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు అమలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం దుర్మార్గమన్నారు. లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలను కార్పొరేట్లకు కారుచౌకగా మోడీ ప్రభుత్వం అప్పగిస్తుందని వారు తెలిపారు. అందులో భాగంగానే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎం.ఇస్సాక్, వైఎస్ కనకారావు, జె.గోపి, పి.రవికుమార్, ఎస్కె.షమీమా, జాన్ బాబు, కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీ
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రెడ్బుక్ని విడిచి ప్రైవేట్ విద్యాసంస్థల వైపు చూడాలని, ఫీజుల దందాను అరికట్టాలని ఎస్ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మోహన్బాబు విద్యాసంస్థల్లో జరుగుతున్న దోపిడీని ప్రశ్ని స్తే కిడ్నాప్ చేయటం, చిత్రహింసలు పెట్టడం సరికాదన్నారు. మోహన్బాబు, ఆయన తనయుడు విష్ణు విద్యావ్యవస్థలో రాక్షస పాలన నడుస్తోందన్నారు. ఏఐఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి.శివ మాట్లాడుతూ మోహన్బాబు యూనివర్సిటీలో బౌన్సర్లు ఎందుకున్నారని, యూజీసీ విచారణకు వెళ్లినప్పుడు ఏం చేసిందంటూ ప్రశ్నించారు. పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు సీహెచ్ శివాజీ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్, బీకేఎంయూ జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సీపీఎం నగర కార్యదర్శి పి.రవికుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
భూసేకరణ భయం
శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026మార్కెట్లో ఎకరా రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు ధర ఉంది. రైతులు నష్టపోకుండా పరిహారం అందించాలి. గతంలో ఒక్కోచోట ఒక్కో ధర చెల్లించారు. ఇది భూసేకరణ చట్టానికి విరుద్ధం. మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం ఇప్పించాలి. బొగ్గు విషయంలో కూడా రైతులను, ప్రజలను చైతన్య పరిచి ఒప్పించాలి. – పి.సోమశేఖరాచార్యులు, రైతు, యర్రగుంటపల్లి, చింతలపూడి మండలం రైతులను ఒప్పించి భూసేకరణ జరపకుండా బొగ్గు గనులకు టెండర్లు ఎలా పిలుస్తారు. గతంలో గ్రీన్ఫీల్డ్ హైవే విషయంలో కూడా రైతులతో సంతకాలు తీసుకుని అవార్డు పాస్ చేశారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. బొగ్గు తవ్వకాల కోసం భూసేకరణ చేపడితే రైతులు తొందరపడి సంతకాలు పెట్టవద్దు. – గిరి భోగారావు, మాజీ సొసైటీ చైర్మన్, రాఘవాపురం సాక్షి ప్రతినిధి, ఏలూరు: మెట్ట ప్రాంత రైతులకు భూసేకరణ భయం పట్టుకుంది. కేంద్ర ప్రాజెక్టులు, రాష్ట్ర ప్రాజెక్టులంటూ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియలు నిర్వహిస్తోంది. చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదలు తాజాగా రేచర్ల బొగ్గు బ్లాక్ వరకూ అన్నింటికీ భూసేకరణే కీలకం. ఇక తాజాగా రేచర్లలో బొగ్గు బ్లాక్ టెండర్లు ఖరారైనట్టు పల్లెల్లో విస్తృత ప్రచారం మొదలుకావడంతో రైతుల్లో భూసేకరణ భయం తారాస్థాయికి చేరింది. బ్లాక్లుగా విభజించి.. ఖమ్మం, ఏలూరు జిల్లా సరిహద్దుల్లో భారీ బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు 12 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఖమ్మం, కృష్ణా, ఏలూరు జిల్లా మెట్ట ప్రాంతాల్లో భారీగా బొగ్గు నిల్వలు ఉన్నట్లు నిర్ధారించి 1964 నుంచి 2016 వరకు నాలుగు విడతలుగా సర్వేలు నిర్వహించి 2016లో ఖరారు చేశారు. ఈ దశ దాటుకుని 2017 నుంచి చింతలపూడి కేంద్రంగా బొగ్గు నిల్వలను ఎంత లోతులో ఉన్నాయనే దానిపై అధ్యయనం చేసి బ్లాక్లుగా విభజించారు. 2023లో ఖరారు : చింతలపూడి మండలంలోని రేచర్ల బొగ్గు బ్లాక్లు 2023లో ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ పరిధిలో 22.24 చదరపు కిలోమీటర్ల పరిధిలో రేచర్ల బొగ్గు బ్లాక్ను ఖరారు చేశారు. దీని పరిధిలో జీ–13 గ్రేడ్కు సంబంధించిన నాణ్యమైన బొగ్గు దాదాపుగా 2,225.63 మిలియన్ టన్నులు ఉన్నట్టు అంచనా వేసి ఆ మొత్తానికి టెండర్ ప్రక్రియ గతేడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభించింది. అక్టోబర్ 27 వరకు టెండర్ దాఖలు తుది గడువు, 28న టెక్నికల్ గ్రిడ్ల పరిశీలన, ఖరారు, నవంబర్ 24 నుంచి 28 వరకు ఈ–వేలం ద్వారా కేటాయించేలా టెండర్ షెడ్యూల్ ప్రకటించారు. వాస్తవానికి అంతకు ముందు రెండుసార్లు ఏర్పాటు చేసినా టెండర్ దశలో నిలిచిపోయింది. మూడో సారి మాత్రం టెండర్లలో రిలయన్స్, యాక్సిస్ ఎనర్జీ సంస్థ సంయుక్తంగా బిడ్లు దాఖలు చేశాయి. కొద్దినెలల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యాక బొగ్గు నిల్వల తవ్వకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రేచర్ల బ్లాక్లో గ్రేడ్–1 బొగ్గు ద్వారా ఏటా 8 వేల మెగా వాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. చింతలపూడిలోని రేచర్ల, శెట్టివారిగూడెం, వెంకటాపురం, యర్రగుంటపల్లి, అల్లిపల్లి, ఊటసముద్రం, సీతానగరం, చింతంపల్లి, నామవరం, వెంకట్రాదిగూడెం, కాంతంపాలెం, చింతలపూడి రూరల్ మండలంలో కొంత భాగం బొగ్గు తవ్వకాలు కోసం భూసేకరణ జరిగే అవకాశం ఉంది. గతంలో సింగరేణి ప్రాజెక్టు సమయంలో భూసేకరణ ప్రక్రియ జరిగినప్పుడు భూములు కోల్పోయిన వారికి భూసేకరణ చట్టం ప్రకారం పరిహారంతో పాటు ఇంటికొక ఉద్యోగం, అలాగే సంస్థ లాభాల్లోంచి కొంత రాయల్టీగా ఇచ్చి భూసేకరణ ప్రక్రియ నిర్వహించారు. రైతుల్లో గుబులు రేచర్ల బొగ్గు బ్లాక్ టెండర్ ప్రక్రియ పూర్తి పరిహారాలు, భూసేకరణపై స్పష్టత కరువు టెండర్లు ఖరారైనట్టు విస్తృత ప్రచారం చింతలపూడి మండలంలో 22.24 చ.కి. పరిధిలో నిల్వలు ఇప్పటికే వరుస భూసేకరణలతో రైతులు విలవిల గ్రామసభలు, డీపీఆర్లు లేకుండా టెండర్లు ఏంటంటూ మండిపాటు వాస్తవానికి ప్రాజెక్టు ఖరారయ్యాక రెవెన్యూ యంత్రాంగం భూసేకరణ కోసం ప్రత్యేక సర్వే నిర్వహించాలి. ఎంత భూమి అవసరమవుతుంది, ఎన్ని గ్రామాల్లో భూమి సేకరించాల్సి ఉంటుందనే నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక పంపాలి. ప్రభుత్వ ఆమోదంతో భూసేకరణ చట్టం ప్రకారం భూమి విలువకు మూడు రెట్లు పరిహారం ప్రకటించాలి. అనంతరం ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి గ్రామ తీర్మానాల ద్వారా సేకరణ ప్రక్రియ నిర్వహించి భూములను సదరు సంస్థకు అప్పగించి వారి నుంచి పరిహారం రైతులకు అందేలా చూడాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ ఏదీ లేకుండానే బొగ్గు బ్లాక్లను ఖరారు చేయడం, టెండర్లు తుది దశకు తీసుకురావడంతో తర్వాత ఏం జరుగుతుందనే దానిపై పల్లెల్లో భయం మొదలైంది. ఇప్పటికే చింతలపూడి ఎత్తిపోతల పథకం, గ్రీన్ఫీల్డ్ హైవే కింద భూములను తీసుకుని మార్కెట్ విలువల్లో 40 శాతం కూడా పరిహారం ఇవ్వకపోవడంపై అన్నదాతల్లో ఆగ్రహం ఉంది. ఈ క్రమంలో తాజా భూసేకరణ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. -
ఫైరింగ్లో నైపుణ్యం సాధించాలి
కామవరపుకోట: పోలీస్ సిబ్బంది ఫైరింగ్లో మరింత నైపుణ్యాన్ని సాధించాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్, జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ సూచించారు. వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ వార్షిక నేర సమీక్ష సమావేశాన్ని పురస్కరించుకుని తడికలపూడిలో గురువారం ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ అశోక్కుమార్ మాట్లాడుతూ ఫైరింగ్ ప్రాక్టీస్ వల్ల పోలీసు సిబ్బందిలో ఆత్మ విశ్వాసం, నైపుణ్యం, అప్రమత్తత పెరుగుతాయని, అత్యవసర పరిస్థితుల్లో ఆయుధాల వినియోగంపై పూర్తి అవగాహన కలుగుతుందని అన్నారు. ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది శారీరకంగా, మానసికంగా ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని, దీని కోసం ఫైరింగ్ ప్రాక్టీస్ను వినియోగించుకుని వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయన్నారు. జిల్లాలో అన్ని సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు శిక్షణకు హాజరయ్యారు. ఏఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు, ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత, ఏఆర్ అదనపు ఎస్పీ జి.మునిరాజా పాల్గొన్నారు. నేర సమీక్షా సమావేశం ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా వార్షిక నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్, కలెక్టర్ వెట్రిసెల్వి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏలూరులో జాతరకు లక్షలాది మంది వచ్చినా ఎటువంటి చిన్న సంఘటనలు జరగకుండా, ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేసిన పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ పోలీస్ శాఖకు కలెక్టర్ అందిస్తున్న సహకారం స్ఫూర్తిదాయకమన్నారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్.సుస్మిత, ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, ఏబీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ హబీబ్ బాష, డీఎస్పీలు డి.శ్రావణ్కుమార్, ఎం.వెంకటేశ్వరరావు, కేవీవీఎన్వీ ప్రసాద్, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఏపీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. -
కై కలూరు సర్పంచ్ను కొనసాగించాలంటూ తీర్పు
కై కలూరు: నిధుల దుర్వినియోగం అంశంపై వైఎస్సార్సీపీ పాలనలో ఎన్నిౖకైన కైకలూరు సర్పంచ్ దానం మేరీ నవరత్నకుమారిని గతేడాది జూన్ 19న కలెక్టర్ కె.వెట్రిసెల్వి సస్పెండ్ చేశారు. అంతకు ముందు 2025 జనవరి 18న సర్పంచ్ చెక్ పవర్ను కూడా రద్దు చేశారు. దీనిపై సర్పంచ్ న్యాయపోరాటం చేశారు. న్యాయవాది జడ శ్రావణ్కుమార్ పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ను విధు ల్లో కొనసాగించాలంటూ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్, ఏలూరు కలెక్టర్కు హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. కేవలం రాజకీయ కారణాలతోనే సర్పంచ్ పదవి నుంచి పిటిషనర్ను తొలగించారని, ఎలాంటి ప్రామాణికమైన విచారణ పాటించలేదని న్యాయవాది వాదించారు. దీంతో ఏకీభవించిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా సర్పంచ్ మేరీ నవరత్నకుమారి మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాలతో సర్పంచులు, జెడ్పీటీసీలను వేధిస్తున్న నాయకులకు ఈ తీర్పు గుణపాఠం కావాలన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని 52 కేంద్రాల్లో శుక్రవారం జరిగిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 3,924 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 2,242 మందికి 2,124 మంది, మధ్యాహ్నం 1,842 మందికి 1,800 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాను ప్రకటనలో తెలిపారు. ఏలూరు(మెట్రో): ప్రభుత్వ కార్యాలయాల్లోని రికార్డులన్నింటినీ డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో పొందుపరచాలని జేసీ ఎంజే అభిషేక్ గౌడ ఆదేశించారు. శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ నుంచి రికార్డుల డిజిటలైజేషన్పై అధికారుల తో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. చింతలపూడి: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కాపు సామాజికవర్గంపై సాగిస్తున్న వివక్షాపూరిత చర్యలను వైఎస్సార్సీపీ జిల్లా మున్సిపల్ విభా గం అధ్యక్షుడు, కాపు నేత బొడ్డు వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. కాపు నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయించడం, భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ప్రకటనలో తెలిపారు. రాజకీయంగా ఎదుర్కోలేక, నేతల కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం అత్యంత హేయమన్నారు. టీడీపీ, జనసేనలో ఉన్న కాపు నేతలు కేవలం ఆయా పార్టీలకు ‘కాపలా’ కాయడానికే పరిమితమా? అని ఆయన ప్రశ్నించారు. కాపు నేతలపై అరాచకాలను సహించబోమని, ప్రభుత్వం వైఖరి మార్చుకోకుంటే ఐక్యంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ ఎల్లవేళలా కాపులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఏలూరు(మెట్రో): పట్టాదార్ పాస్ పుస్తకాల ఈకేవైసీ, పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటానని కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, ఈకేవైసీపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించాఆరు. ఈకేవైసీని త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. వెనుకబడి ఉన్న టి.నరసాపురం, ఆగిరిపల్లి, జీలుగుమిల్లి, ముసునూరు తదితర మండలాల తహసీల్దార్లు ప్రగతి చూపాలని, లేకుంటే చర్యలు తప్పవని అన్నారు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్, రమణ, తహసీల్దార్లు పాల్గొన్నారు. పెదవేగి: విజయరాయి గాంధీనగర్లోని సీతారామ కల్యాణ మండపం వద్ద శనివారం కోకో రైతుల సమావేశం నిర్వహిస్తున్నట్టు ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొల్లు రామకృష్ణ, కె.శ్రీనివాస్ శుక్రవా రం ప్రకటనలో తెలిపారు. కోకో గింజల ధర తగ్గింపుపై ఈ సమావేశంలో చర్చిస్తారని, ప్రభుత్వం ఇంతవరకూ ధరల పాలసీ ప్రకటించలేదని, ధర నిర్ణయం కాకపోవడంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, ఫలితంగా రైతులు నష్టపోతున్నారని ఆందోళన చేశారు. సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు. -
గురువులపై ఆటోమేషన్ కత్తి
ఏలూరు (ఆర్ఆర్పేట): చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులను ముప్పుతిప్పలు పెడుతోంది. తాజాగా పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఇన్విజిలేషన్ బాధ్యతలకు సంబంధించి కొత్తగా ఆటోమేషన్ విధానాన్ని తీసుకువచ్చింది. దీంతో ఇన్విజిలేషన్ విధులు భారం కానున్నాయని ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఈ విధానం వల్ల పరీక్షల నిర్వహణే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల ప్రమేయం లేకుండా ఆటోమేషన్ ద్వారా ఇన్విజిలేషన్ విధులు కేటాయించడం అనే ప్రక్రియ పూర్తిగా అసంబద్ధమని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వెసులుబాటు సాధారణంగా జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులు టెన్త్ పరీక్షలకు సంబంధించి ఇన్విజిలేషన్ విధులకు అర్హులైన ఉపాధ్యా యులను ఎంపిక చేసి కేటాయిస్తారు. ఇందులో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, గర్భిణులు, బాలింతలు, దివ్యాంగ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చేవారు. అలాగే పిల్లల పరీక్షల నిమిత్తం లేదా తల్లిదండ్రులను ఆస్పత్రులకు తీసుకువెళ్లాల్సి వచ్చే వారికి కూడా అభ్యర్థన మేరకు వెసులుబాటు ఉండేది. అలాగే ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్న వారికి కూడా మినహాయింపు లభించేది. అయితే ఆటోమేషన్ ప్రక్రియ ద్వారా ఆయా వర్గాలకు మినహాయింపు లభించే పరిస్థితి లేదు. సాఫ్ట్వేర్ పరిధిలోకి.. ఆటోమేషన్ ప్రక్రియ వల్ల ఇన్విజిలేషన్ విధులన్నీ సాఫ్ట్వేర్ పరిధిలోకి వెళతాయని ఉపాధ్యాయులు అంటున్నారు. టీచర్ల జాబితా సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేస్తే సబ్జెక్టు, కేంద్రాలను బట్టి ఉపాధ్యాయులకు ఇన్విజిలేషన్ విధులను కేటాయిస్తుంది. దీని వల్ల ఉపాధ్యాయులు దూరంగా ఉన్న కేంద్రానికి వెళ్లి విధులు నిర్వహించాల్సి ఉంటుందని, ప్రత్యేక మినహాయింపులు, వెసులుబాటులు ఉండవని టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ఇది ప్రభుత్వ కక్ష సాధింపు అని ఉపాధ్యాయ సంఘాలు గళమెత్తుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలతో ఏమాత్రం చర్చించకుండా కూటమి ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని అంటున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయన్నారు. గతంలో బలవంతపు శిక్షణల పేరుతో కొందరు ఉపాధ్యాయులను బలి తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు సాఫ్ట్వేర్ నిర్దేశిత ఇన్విజిలేషన్ విధుల రూపంలో మరికొందరిని బలి కోరుకుంటుందా అని ప్రశ్నిస్తున్నారు. టెన్త్ పరీక్షలకు ఆటోమేషన్లో ఇన్విజిలేషన్ బాధ్యతలు ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులకు అతీతంగా విధులు దూర ప్రాంతాలను కేటాయించే అవకాశం ఉపాధ్యాయుల్లో ఆగ్రహ జ్వాలలు విధులను బహిష్కరించే ఆలోచన -
తెలంగాణలో మొదలై.. ‘తూర్పు’లో ముగిసి..
● ముగిసిన పెద్దపులి ప్రయాణం ● 17 రోజులపాటు పంజా విసిరిన వైనం ● పట్టిసీమ మీదుగా గోదావరి దాటి.. ● కూర్మాపురంలో బంధించిన అధికారులు బుట్టాయగూడెం: తెలంగాణలోని కావిడిగుండ్లలో మొదలైన పెద్దపులి ప్రయాణం తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురంలో ముగిసింది. దాదాపు 17 రోజులపాటు ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల ప్రజలను హడలెత్తించిన పులిని ఎట్టకేలకు రెస్క్యూ టీమ్ సురక్షితంగా బంధించింది. గతనెల 21న తెలంగాణలోని అశ్వారావుపేట మండలం కావిడిగుండ్లలో రెండు ఆవులపై దాడి చేసి చంపిన పులి 22న ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. బుట్టాయగూడెం మండలం పందిరిమామిడిగూడెం, గుబ్బల మంగమ్మ గుడి మార్గం వైపు తిరుగుతూ హడలెత్తించింది. అదేరోజు అంతర్వేదిగూడెం సమీపంలో ఆవు, లేగ దూడలపై పంజా విసిరి హతమార్చింది. 23న నాగులగూడెం సమీపంలో మూడు ఆవులపై దాడి చేసి చంపేసింది. అటవీ అధికారులు ఏర్పాటుచేసిన ట్రాప్ కెమెరాల్లో చిక్కిన పెద్దపులిని చూసి అందరూ వణికిపోయారు. సుమారు 4 అడుగుల ఎత్తు, మీటన్నర పొడవు ఉండటంతో బెంబేలెత్తారు. అదే రోజు మధ్యాహ్నం అంతర్వేదిగూడెం సమీపంలో, రాత్రి కొండ ప్రాంతంలోని గాడిదబోరు సమీపంలో సంచరించింది. 24న బుట్టాయగూడెం మండలం గుర్రప్పగూడెంలో గేదైపె, కోట నాగవరంలో లేగ దూడలపై దాడి చేసింది. అక్కడి నుంచి కంసాలికుంట, అల్లికాల్వ మీదగా రాయిగూడెం వెళ్లి అక్కడ మరో గేదె దూడను హతమార్చింది. 13 పశువులను హతమార్చి.. రాయిగూడెం నుంచి కొయ్యలగూడెం మండలం బిల్లుమిల్లి చేరుకుని ఆవులను హతమార్చింది. రెండు రోజులపాటు అక్కడే మకాం వేసిన పెద్దపులి 26న మళ్లీ రావిగూడెం చేరుకుని గేదె దూడను చంపింది. అక్కడి నుంచి కండ్రికగూడెం, అమ్మపాలెం వెళ్లి రెండు గేదెలను చంపి తినేసింది. 27న బుట్టాయగూడెం మండలం లంకపల్లి రామ నర్సాపురం మీదుగా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే 30న అటవీ ప్రాంతంలో మాటేసిన పెద్దపులి అక్కడికి వచ్చిన ఆవుపై దాడి చేసి చంపేసింది. 31న పోలవరం మండలం ఇటుకులకోటలో లేగ దూడలను హతమార్చి పట్టిసీమ ఎత్తిపోతల పథకం పరిసర ప్రాంతాల నుంచి గోదావరి ఈదుకుంటూ అటుగా వెళ్లింది. మొత్తంగా ఏలూరు జిల్లాలో 13 పశువులను పులి హతమార్చింది. పోలవరం జిల్లా చిన్నకొండేపూడి, పెద్ద కొండేపూడి పంట పొలాల్లో పెద్దపులి పాదముద్రలను అక్కడి అధికారులు గు ర్తించారు. అక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించిన పెద్దపులి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఫారెస్ట్ అధికారులు, పూనే నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్ రాయవరం మండలం కూర్మాపురంలో గన్ ద్వారా మత్తు ఇంజక్షన్లు ఇచ్చి శుక్రవారం సాయంత్రం పెద్దపులిని బంధించారు. అక్కడి నుంచి పులిని రాజమండ్రి తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
కేంద్రీకరణతో సమస్యలు
ఆటోమేషన్ విధానంతో పరిపాలన పూర్తిగా కేంద్రీకరణకు దారి తీస్తుంది. సాధారణంగా వికేంద్రీకరణ మార్గంలో పాలన సాగిస్తుంటారు. ఆటోమేషన్ ద్వారా పాలన కేంద్రీకరించబడితే ఎటువంటి సమస్య వచ్చినా పై స్థాయిలోనే పరిష్కరించుకోవాలి. అదే జరిగితే సమస్య పరిష్కారానికి ఎక్కువ సమయం పట్టి అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉంది. – గుగులోతు కృష్ణ, ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ విధానపరమైన సంస్కరణలు తీసుకువచ్చేటప్పుడు ఉద్యోగులకు ఆమోదయోగ్యమా, ఆచరణాత్మకమా అని ఆలోచించాలి. ఆటోమేషన్ వంటి సంస్కరణలు అమలు చేసే ముందు ఉపాధ్యాయ సంఘాలతో చర్చిస్తే లోటుపాట్లు తెలుస్తాయి. ఇప్పటికై నా ప్రభుత్వం ఆటోమేషన్పై పునః సమీక్షించి, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. – వి.రామ్మోహనరావు, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆరోపణ
జంగారెడ్డిగూడెం: వీఆర్వో సాయంతో తమకు చెందాల్సిన భూమిని వేరొకరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపిస్తూ దంపతులు ప్రజాసంఘాల సహాయంతో స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు. బాధితులు అంగిన రాంబాబు, చిన్నాయమ్మ వివరాలు వెల్లడించారు. రాంబాబుకు ఇద్దరు సోదరులు ఉండగా ఓ సోదరుడు చిన్నతనంలోనే వేరొకరికి దత్తత వెళ్లిపోయాడు. మరో సోదరుడు మరణించాడు. రాంబా బు తల్లిదండ్రులకు కొయ్యలగూడెం మండలం బ య్యనగూడెంలోని 0.579 ఎకరాల భూమి ఉంది. దీనిని దత్తత వెళ్లిన సోదరుడు ఓ వీఆర్వో సాయంతో తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని రాంబాబు దంపతులు ఆరోపిస్తున్నా రు. దీనిపై తాము కోర్టుకు వెళ్లామన్నారు అయితే సదరు వీఆర్వో బంధువుకు ఈ భూమిని విక్రయించినట్టు ఆన్లైన్లో చూపిస్తోందన్నారు. సదరు వీఆర్వో అక్రమాలకు పాల్పడుతున్నాడని, తమకు అన్యాయం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సబ్ రిజిస్ట్రార్ ఎం.గోపిని వివరణ కోరగా రెవెన్యూ రికార్డులు, ఆధార్ కార్డులు, లింకు డాక్యుమెంట్లు అన్నీ పరిశీలించాకే రిజిస్ట్రేషన్ చేశామని, తమ కా ర్యాలయంలో ఎలాంటి లోపం, అక్రమాలు జరగ లేదని అన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు కూడా నివేదిక పంపుతామన్నారు. లీగల్ ఓపీనియన్ కూ డా తీసుకున్నాకే తాము రిజిస్ట్రేషన్ చేశామన్నారు. -
చట్టాల అమలులో నిర్లక్ష్యం తగదు
బుట్టాయగూడెం: గిరిజన చట్టాల అమలులో నిర్లక్ష్యం ఆపాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తప్పవని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు హెచ్చరించారు. మండలంలోని ఇనుమూరులో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా స్థాయి శిక్షణ తరగతులు శుక్రవారం జరిగాయి. ఆదివాసీలు, గిరిజన చట్టాలు అంశంపై శిక్షణ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం గిరిజనులకు ఇచ్చిన హక్కులు, ప్రత్యేక చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలులో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల భూములు, అటవీ వనరులు, జీవనాధారాన్ని కాపాడే చట్టాలు కాగితాలకే పరిమితం కావడం బాధాకరమన్నారు. గిరిజన చట్టాలు అమలులో విఫలమైతే గిరిజన సమాజం సంఘటితంగా పోరాట పథంలో నడవడం తప్ప మరో మార్గం ఉండదని హెచ్చరించారు. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో ఆదివాసీలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఏ.అశోక్, మొడియం నాగమణి, తెల్లం రామకృష్ణ, ధర్ముల రమేష్, పోలోజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పట్టిసం శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు
పోలవరం రూరల్: మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టిసం రేవులో క్షేత్రానికి వెళ్ళేందుకు వీలుగా క్యూలైన్లు, టిక్కెట్ కౌంటర్లు, ర్యాంపు పనులు సాగుతున్నాయి. ఈ నెల 14 నుంచి 16 వరకు ఇసుక తిన్నెలపై జరిగే ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. కొంత దూరం నడుచుకుంటూ వచ్చి అక్కడి నుంచి పంట్ల మీద, తడికల బాదులతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ర్యాంపుపై నడుచుకుంటూ ఇసుక తిన్నెలపై చేరేలా పనులు చేపట్టారు. ఇసుక తిన్నెలపై నడుచుకుంటూ మరో వైపు నదిలో ఏర్పాటుచేసిన ప్లాట్ఫాం దాటాల్సి ఉంది. అక్కడి నుంచి క్షేత్రానికి నడచుకుంటూ వెళ్ళేందుకు వీలుగా గోనె సంచుల్లో ఇసుక నింపి బస్తాలతో ప్లాట్ఫాం పనులు చేపట్టాల్సి ఉంది. క్షేత్రానికి దిగువ నుంచి క్యూలైన్లో నడుచుకుని శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకుని వచ్చేలా పనులు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టిసం పంచాయతీ దేవస్థానం అధికారులు ఇరువైపులా పనులు చేపట్టారు. గోదావరి వైపు నడిచి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ర్యాంపు టిక్కెట్ కౌంటర్లు, క్యూలైన్ల కోసం చలువ పందిళ్ళు -
దివ్యాంగుల క్రికెట్ విజేతగా ఆంధ్రప్రదేశ్
దెందులూరు: ప్రతిభ ప్రతి ఒక్కరికి గుర్తింపు తీసుకొస్తుందని ఏలూరు జిల్లా డీఎస్డీఓ అజీజ్ అన్నారు. శుక్రవారం ఏలూరు రూరల్ మండలం మల్కాపురం ఆశ్రం వైద్యశాల ఆడిటోరియంలో దివ్యాంగుల క్రికెట్ పోటీలు జరిగాయి. దివ్యాంగుల క్రికెట్ పోటీల్లో విజేతగా ఏపీ జట్టు నిలిచింది. విజేతను రూ.50 వేల నగదు ట్రోఫీతో సత్కరించారు. మూడు రోజుల దివ్యాంగుల క్రికెట్లో భాగంగా ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులకు ప్రోత్సాహక నగదుతో పాటు ప్రశంసా పత్రం అందజేశారు. ఏలూరు జిల్లా డీఎస్డీఓ అజీజ్ మాట్లాడుతూ దివ్యాంగుల క్రికెట్ క్రీడను ప్రోత్సహించేలా అన్ని చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆశ్రం కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్ రాజు, గుప్తా ఫౌండేషన్ కార్యదర్శి శ్రీనివాసరావు, ఎన్ ఫౌండేషన్ అధినేత నారా శేషు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రవీంద్రబాబు, అర్జున అవార్డు గ్రహీత మెన్ అండ్ ఉమెన్ బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అజయ్ కుమార్ రెడ్డి, క్రికెట్ అకాడమీ సెక్రటరీ మదన్ పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): 2026–27 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాల నిమిత్తం పరీక్ష ఈ నెల 7న నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. 9వ తరగతికి ప్రవేశ పరీక్ష 3 పరీక్ష కేంద్రాలలో, 11వ తరగతికి ప్రవేశ పరీక్ష 3 పరీక్ష కేంద్రాలలో జరుగుతాయన్నారు. 9వ తరగతికి 639 మంది, 11వ తరగతికి 677 మంది పరీక్ష రాయనున్నారన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్తో ఉదయం 10 గంటలకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఉదయం 11 గంటల తరవాత ఎవరిని అనుతించరని, పరీక్ష పూర్తి అయ్యేవరకు ఎవరినీ బయటకు వెళ్ళడానికి అనుమతించరని స్పష్టం చేశారు. బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్తో మాత్రమే బబుల్ చేయాలని, పరీక్ష కేంద్రం లోకి మొబైల్ ఫోన్లు, చేతి గడియారం, కాలిక్యులేటర్లు తీసుకురాకూడదన్నారు. 9490728768, 9704812546 హెల్ఫ్లైన్ నెంబర్లలో సంప్రదించాలన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): సీనియర్ ఉపాధ్యాయులు టెట్ పరీక్ష రాసి అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఉద్యోగ భద్రత కోల్పోతున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేస్తూ గత గురువారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిర్వహించిన ఆందోళనలో జిల్లా నుంచి యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఈ మేరకు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ రుద్రాక్షి ఏలూరులో విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాస్ కావాలని సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం సత్వరమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశామన్నారు. టెట్ సిలబస్, అర్హత మార్కుల విషయంలో సడలింపు ఇవ్వాలని విద్యాశాఖ మంత్రిని కోరారని చెప్పారు. -
శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి
జంగారెడ్డిగూడెం: శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ నాణ్యమైన పొగాకును ఉత్పత్తి చేయాలని పొగాకు బోర్డు ఆర్ఎం జీఎల్కే ప్రసాద్ అన్నారు. మండలంలోని తాడువాయి, చల్లావారిగూడెం, మంగిశెట్టిగూడెం, బుట్టాయగూడెం, మార్కండేయపురం, సూరపువారిగూడెంలో వ్యవసాయక్షేత్రాలను ఆయన శాస్త్రవేత్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ నాణ్యమైన పొగాకు ఉత్పత్తికి, మంచి దిగుబడికి రైతులు సకాలంలో తొలి మొగ్గ దశలో తల తుంచి పిలక నివారణ మందు వాడాలన్నారు. మందులు వాడిన 17 రోజుల తర్వాత మాత్రమే ఆకు కొట్టు చేయాలని, లేదంటే పురుగు మందు అవశేషాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. మెగ్నీషియం లోపం ఎక్కువగా ఇసుక నేలల్లో ఉంటుందని, ఎకరాకు 15 కిలోల మెగ్నీషియం ఆకై ్సడ్ శాస్త్రవేత్తలు సూచించిన విధంగా భూమిలో వేయాలన్నారు. ఇనుము లోపం గుర్తిస్తే 0.5శాతం ఫెర్రస్ సల్ఫేట్ లీటరు నీటికి 5 గ్రాములు పిచికారీ చేయాలన్నారు. సూక్ష్మ పోషకాల సమగ్ర యాజమాన్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశన్, వేలం అధికారులు జె.సురేంద్రకుమార్, బి.శ్రీహరి, గ్రేడింగ్ అధికారి వై.ప్రశాంత్, ఐటీసీ లీఫ్ మేనేజర్ కొట్రేష్ తదితరులు పాల్గొన్నారు. -
రొయ్య ధరలు పతనం
● 100 కౌంట్ రూ.270 నుంచి రూ.250కు పడిపోయిన వైనం ● అమెరికా సుంకాలు తగ్గినా రైతులకు దక్కని ఫలితం అమెరికా టారిఫ్ 25 నుంచి 18 శాతానికి తగ్గించడంతో రొయ్యల ధరలు పెరుగుతాయని రైతులు ఆశించారు. దీనికి భిన్నంగా కౌంట్ ధరలు రూ.20 నుంచి రూ.40 వరకూ తగడం దారుణం. రొయ్యల ట్రేడర్స్, ఏజెన్సీలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. ప్రభుత్వం పర్యవేక్షించి రైతులకు గిట్టుబాటు ధరలు అందించాలి – కొరుపోలు అప్పారావు, ఆక్వా రైతు ప్రస్తుతం వాతావరణ మార్పులతో మంచు, వైరస్ ప్రభావం తగ్గలేదు. ప్రతికూల వాతావరణంతో తెగుళ్లు పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో నిరంతరం ఏరియేటర్లు తిరగాల్సిన పరిస్థితి ఉంది. గతంతో పోల్చితే రైతులకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. 100 కౌంటు ధర రూ.280 వద్ద నిలకడగా ఉంటే రైతుకు మేలు జరుగుతుంది. – జె.రవీంద్ర, సీనియర్ ఆక్వా టెక్నీషియన్ నిడమర్రు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రొయ్య ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. ఒకప్పుడు సిరులు కురిపించిన ఈ సాగు గత కొంత కాలంగా వాతావరణ మార్పులతో వైరస్, నాణ్యమైన సీడ్ అందకపోవడం, మేతల ధరలు, పెట్టుబడులు పెరగడం, టారిఫ్ల పెరుగుదలతో ధరలు గణనీయంగా పడిపోయాయి. ప్రభుత్వం ధరలు నియంత్రించలేకపోవడం వంటి కారణాలతో ఆక్వా సాగు రైతులు నేల చూపులు చూస్తున్నారు. గత రెండు రోజులుగా రొయ్య ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఓ పక్క వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు పడిపోవడం, మరోవైపు తగ్గని వైరస్తో పోరాటం చేస్తున్న రైతులను ధరలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నెల 3 వరకు 100 కౌంట్ ధర రూ.270 ఉండగా బుధవారం నుంచి రూ.250కి పడిపోయింది. మిగిలిన కౌంట్ ధర రూ.20 నుంచి రూ.40 వరకూ తగ్గడంతో ఆక్వా సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిలకడలేని ధరలతో ఆక్వా సాగు చేయడంతో కనీసం పెట్టుబడులు రాని పరిస్థితి ఉందని రొయ్య రైతులు చెబుతున్నారు. మరోవైపు అమెరికా సుంకాలను 25 నుంచి 18 శాతానికి తగ్గించినట్లు ప్రకటించినా రొయ్య ధరలు పతనం అవ్వడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రొయ్య ధరలు, మేతల ధరలు నియంత్రించాల్సిన కూటమి సర్కారే సిండికేట్లకు కొమ్ము కాస్తోందని ఆక్వా రైతులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 1.20 లక్షల ఎకరాల్లో రొయ్య సాగు చేస్తున్నారు. వీటిలో 90 శాతం పైగా వనామినే. అమెరికా ప్రకటించిన రోజే రొయ్య ఽకౌంట్ ధరలు తగ్గడంపై ఆక్వా రైతులు నేల చూపులు చూస్తున్నారు. మేత, ఇతర ఖర్చులు పెరుగుతుంటే రొయ్యల ధరలు మాత్రం తగ్గతుండటం ఆక్వా సాగు రంగాన్ని కుదిపేస్తోంది. సాగు సమస్యలు ఎదుర్కొని పంట చేతికొచ్చే సమయంలో పట్టుబడులకు దిగిన రోజే ధరలు పడిపోవడంతో టన్ను రొయ్యకు రూ.20 నుంచి రూ.50 వేల వరకూ నష్టపోతున్నట్లు రైతులు చెబుతున్నారు. దీంతో నికర ఆదాయం తగ్గి రైతులు నష్టాల బారిన పడుతున్నామని, పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్లో ఆక్వా సాగు ప్రశ్నార్థకమే అని చెబుతున్నారు. ఽకూటమి ప్రభుత్వంలో గడ్డు పరిస్థితి రొయ్య ధరల నియంత్రణలో కూటమి సర్కారు తీవ్రంగా విఫలమైందని ఆక్వా రైతులు విమర్శిస్తున్నారు. రొయ్య ధరలు నియంత్రించలేక పోవడం, మేతల ధరలు కంపెనీలు పెంచుతున్నా వారిని అదుపు చేయలేక పోవడంపై ఆక్వా రైతులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆక్వా సాఽఽధికారిత కమిటీని ఏర్పాటు చేసి ప్రతి వారం సీడ్, ఫీడ్ రేట్లు, ఆక్వా ఉత్పత్తుల ధరలపై మంత్రుల కమిటీ సమీక్షించే పద్ధతిని కూటమి సర్కారు పక్కన పెట్టిందని రైతులు విమర్శిస్తున్నారు. అమెరికా పెంచిన సుంకాల పేరుతో వ్యాపారులు రొయ్య ధరలు అప్పట్లో అమాంతం తగ్గించేశారు. పెరిగిన టారిఫ్ ప్రకటనతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. అంతర్జాతీయ మార్కెట్లో టారిఫ్లను చూపి మధ్య దళారీలు ఇష్టారాజ్యంగా రొయ్య రేట్లు తగ్గించుకుంటూ పోతుండటంతో 100 కౌంట్ రొయ్యకు కనీస ధర కూడా లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆక్వా సాఽఽధికారత కమిటీ, ప్రతివారం సీడ్, ఫీడ్ రేట్లు, ఆక్వా ఉత్పత్తుల ధరలపై మంత్రుల కమిటీ సమీక్షించి స్థిరీకరణ కోసం చర్యలు తీసుకునేది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఆ సాధికారత కమిటీకి మంగళం పాడింది. తమ పార్టీలకు చెందిన ప్రాసెసింగ్ ప్లాంట్, హేచరీ, ఫీడు కంపెనీల నుంచి ప్రతినిధులతో ఆక్వా కమిటీ ఏర్పాటు చేస్తే, ఈ కమిటీ రైతుల సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తుంది? – పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మెల్యే -
కాలువ గట్టు మట్టి అక్రమ రవాణా
కొయ్యలగూడెం: చింతలపూడి ఎత్తిపోతల కాలువ గట్టు నుంచి అక్రమార్కులు మట్టిని యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. వారం రోజులుగా కన్నాపురం పులిరామన్నగూడెం గ్రామాల మధ్య ఉన్న ఎత్తిపోతల కాలువ గట్టు నుంచి మట్టి రవాణా చేస్తున్నప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రేయింబవళ్లు మట్టి తోలకాలు సాగుతున్నా చర్యలు తీసుకోకపోవడంతో భవిష్యత్తులో కాలువకు గండ్లు పడే ప్రమాదం ఉందని రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం మండలాలలోని పరిసర గ్రామాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల నిమిత్తం నిబంధనలకు విరుద్ధంగా కాలువ గట్టు ఎత్తిపోతల మట్టిని వినియోగిస్తున్నట్లు తెలిసింది. అభివృద్ధి పనులకు వినియోగించాల్సిన గ్రావెల్ మట్టికి బదులు నాణ్యతలేని మట్టిని వినియోగించడం వలన భవిష్యత్తులో నిర్మాణాలు సుదీర్ఘ కాలం ఉండవని ప్రజలు పేర్కొంటున్నారు. అధికారులు వెళుతున్న సమయంలో రైతులకు చెందిన జీ రాయితీ భూములను పేర్కొంటూ తీరా వాళ్లు వెళ్లిపోయాక మళ్ళీ కాలువ గట్టు తవ్వకాలు చేస్తున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. నూజివీడు : ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో లోను క్లియర్ కాకుండానే క్లియర్ అయినట్లు నకిలీ పత్రాలను పెట్టి తనఖా పెట్టిన పత్రాలను రిలీజ్ చేయించడానికి ప్రయత్నించగా.. వారిని పోలీసులకు అప్పగించారు. శ్రీరామ్ ఫైనాన్స్ తాడేపల్లిగూడెం బ్రాంచ్లో అద్దేపల్లి వెంకటరత్నం కోటి రూపాయల లోను తీసుకున్నాడు. ఆ లోను క్లియర్ అయిపోయిందని చెప్పి బ్రాంచ్కి చెందిన వ్యక్తి అని చెబుతూ దొడ్డి నాగరాజు అనే అతనిని తీసుకొచ్చి నకిలీ సర్టిఫికెట్ సమర్పించి తనఖా రిజిస్ట్రేషన్ రిలీజ్కు ప్రయత్నించారు. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ ఎన్.ఫణిసీతారామరాజుకు అనుమానమొచ్చి శ్రీరామ్ ఫైనాన్స్ అధికారులకు తెలియజేయగా వారు వచ్చి ఫేక్ లెటర్లుగా తెలిపారు. దీంతో వారిని పోలీసులకు అప్పగించారు. భీమడోలు: పొలసానిపల్లి రహదారి వద్ద ఏర్పాటు చేసిన కూటమి నాయకుల ఫ్లెక్సీలను గ్రామానికి చెందిన వ్యక్తులు ధ్వంసం చేయించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు శుక్రవారం గ్రామ సర్పంచ్ షేక్ రహీమాబేగం తెలిపారు. సీసీటీవీ ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
బలివే ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన
బలివే( ముసునూరు): మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తుల సౌకర్యాలు, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఉత్సవాలను విజయవంతం చేయనున్నట్లు ఉత్సవాల ప్రత్యేక అధికారి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న అన్నారు. బలివేలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద దేవదాయ శాఖ జిల్లా అధికారి కే.శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించామని, పోలీస్, పంచాయతీ రాజ్ శాఖల సహాయంతో భక్తుల పుణ్యస్నానాలు, దైవ దర్శనానికి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనంతరం ఆలయం ప్రాంగణంలో క్యూలైన్ల కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను, ఉత్సవ ప్రాంగణంలో ఏర్పాట్లు, జల్లుస్నానాల ఏర్పాట్లు పరిశీలించారు. -
స్కూల్ బస్సు బోల్తా
చాట్రాయి: మండలంలోని గుడిపాడులో ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట సిద్ధార్థ స్కూల్, కాలేజీ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబో యి రోడ్డు పక్కనున్న పంట బోదెలోకి బోల్తా కొ ట్టింది. దీంతో బస్సులోని ఎనిమిది మంది వి ద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా ఒక విద్యార్థినికి పళ్లు కదిలి ఊడిపోయాయి. క్షతగ్రాతులను విస్సన్నపేటలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటన విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై డి.రామృష్ణ తెలిపారు. వేగంగా బస్సులు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఏలూరు (మెట్రో): జిల్లాలో ఏడు మద్యం బార్ల కేటాయింపును లాటరీ పద్ధతి ద్వారా పూర్తిచేసినట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టరేట్లో గురువారం ప్రక్రియను నిర్వహించారు. ఏలూరు స్టేషన్ పరిధిలో 6, జంగారెడ్డిగూడెం స్టేషన్ పరిధిలో ఒక బార్ కోసం 28 దర ఖాస్తులు వచ్చాయన్నారు. లాటరీ పద్ధతిలో వీటిని బసు సాంబశివరావు, ఎరకల నాగ వెంకట కామాక్షి, సుంకర శ్రీదేవి, తల్లూరి శివ రామారావు, ఎరగ్రోగు భానుప్రకాష్, ఆరేపల్లి సంతోష్కుమార్, మద్దుల జగదీశ్వర వేణుగోపాల్కు కేటాయించామన్నారు. జిల్లా ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి ఎ.ఆవులయ్య, ఎకై ్సజ్ సీఐలు జి.శ్రీకృష్ణ ధనరాజు, కె.శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని 34 కేంద్రాల్లో గురువారం జరిగిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 2,782 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 1,248 మందికి 1,228 మంది, మధ్యాహ్నం 1,586 మందికి 1,554 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాను ప్రకటనలో తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): పదో తరగతి పరీక్ష ఫీజులను తత్కాల్ విధానంలో చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని డీఈఓ ఎం. వెంకటలక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. రూ.1,000 అపరాధ రుసుంలో ఈనెల 12 వరకు చెల్లించవచ్చని సూచించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులోని పలు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాంటూ ఏపీటీఎఫ్ నగర శాఖ నాయకులు గురువారం నగర కమిషనర్ భానుప్రతాప్కు వినతిపత్రం సమర్పించారు. ఓపీఎస్ ఉపాధ్యాయులకు డీఏ ఏరియర్స్ను జమచేయాలని కోరారు. ఒక నెల బిల్లు సబ్మిట్ చేసినా నగదు జమకాలేదన్నారు. అలాగే సీపీఎస్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు సంబంధించిన మూడు బిల్లులు సమర్పించగా 90 శాతం నగదు జమకాలేదన్నారు. పీఎఫ్ రుణా లు మంజూరు చేయాలని కోరారు. అధ్యక్షుడు కురమ ఆనంద్ కుమార్, ప్రధాన కార్యదర్శి అబ్బదాసరి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు ఎంవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ఇన్విజిలేషన్ ఆటోమేషన్ విధానం ఉపాధ్యాయులకు భారం కానుందని ఏపీటీఎఫ్–1938 రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ గుగులోతు కృష్ణ, ఏలూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ.రామ్మోహన్, జి.మోహన్ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోమేషన్ పేరుతో జిల్లా, మండల విద్యాశాఖ అధి కారుల పాత్రను తగ్గించడం సరికాదన్నారు. -
పక్కా ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి నిల్
● గృహ నిర్మాణశాఖను వేధిస్తున్న సిబ్బంది కొరత ● ఏఈలు, డీఈలు లేరు ● అన్ని పనులు ఈఈనే చేసుకోవాలి నూజివీడు: రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు నియోజకవర్గంలో గృహ నిర్మాణ శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. వర్క్ ఇన్స్పెక్టర్ల నుంచి ఏఈ, డీఈల వరకు సిబ్బంది కొరతతో ఆశాఖ ఉన్నతాధికారైన ఈఈ సతమతమవుతోన్నారు. గృహ లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేయాలంటే లబ్ధిదారులకు తానే సమాచారం ఇచ్చి వారిని రప్పించి సమావేశాన్ని నిర్వహించుకుంటున్నారు. నూజివీడు డివిజన్లో నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, లింగపాలెం, చింతలపూడి మండలాలతో పాటు నూజివీడు మున్సిపాలిటీ, చింతలపూడి నగర పంచాయతీలున్నాయి. ఈ మండలాల్లో జగనన్న కాలనీల్లో గృహాలు త్వరితగతిన నిర్మాణం జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత వర్క్ ఇన్స్పెక్టర్లు, ఏఈలపై ఉంది. అయితే 8 ఏఈ పోస్టులు ఖాళీగా ఉండటంతో గ్రామ, వార్డు సచివాలయాలకు చెందిన ఇంజినీరింగ్ అసిస్టెంట్లను ఇన్చార్జి ఏఈలుగా నియమించి కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వారి రెగ్యులర్ వర్కులకు, సర్వేలు చేసేందుకు ప్రాధాన్యతనిస్తుండటం, గృహ నిర్మాణ శాఖ పనులనుపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో గృహాల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. అంతేగాకుండా పలు వార్డు, గ్రామ సచివాలయాల్లో సైతం ఇంజినీరింగ్ అసిస్టెంట్ల కొరత నెలకొంది. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభించి బేస్మెంట్ లెవెల్ నుంచి రూఫ్ లెవెల్ వరకు పలు స్థాయిల్లో ఉన్న గృహాల నిర్మాణాలను మార్చి నెలాఖరు వరకు పూర్తిచేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలంటే సిబ్బంది లేక ఉన్నతాధికారులు సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం ఎలా చేయాలా అని కూడా తలలు పట్టుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. పట్టణంలో విఽవిధ దశల్లో 957 గృహాలు నూజివీడు పట్టణ పరిధిలో 12 జగనన్న కాలనీ లేఅవుట్లుండగా 2,737 గృహాలను మంజూరు చేయగా వాటిలో 1,401 గృహాలు నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి. మిగిలిన వాటిలో 341 గృహాలకు అసలు నిర్మాణ పనులు ప్రారంభించలేదు. బేస్మెంట్ లెవెల్లో 828 గృహాలు, రూఫ్ లెవెల్లో 129 గృహాలు చొప్పున మొత్తం 957 గృహాల నిర్మాణ పనులను మార్చి నెలాఖరు కల్లా పూర్తిచేయాల్సి ఉంది. దీనికి గాను ఆయా లబ్ధిదారులతో సమావేశాలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల్లో చైతన్యం తీసుకువచ్చి నిర్మాణం జరుపుకునేలా చేయాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత వేధిస్తుండటంతో పనులు ఏమీ జరగడం లేదు. ఈఈ ఒక్కరే లబ్ధిదారులకు సమాచారం ఇవ్వడం, సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించి గృహాలను నిర్మించుకునేలా చైతన్యపరచడం, ఉన్నతాధికారులు నిర్వహించే టెలీ కాన్ఫరెన్స్లు, సమావేశాలకు హాజరవ్వడం వంటి పనులతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో రెగ్యులర్ సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డివిజన్లో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వ లక్ష్యాల మేరకు పనిచేస్తున్నాం. వచ్చే నెలాఖరు నాటికి పట్టణంలో 957 గృహాల నిర్మాణాన్ని పూర్తిచేయాలని లబ్ధిదారులను చైతన్య పరుస్తున్నాం. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు ప్రభుత్వం అదనంగా అందిస్తున్న సాయాన్ని సైతం తెలియజేసి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. – మూడు రామోజీ నాయక్, హౌసింగ్ ఈఈ, నూజివీడు -
ఎవరెస్టు ఎక్కేటంత సంకల్పం
● లడక్లో ట్రెక్కింగ్ ట్రైనింగ్ పూర్తి చేసిన కలిదిండి ఎస్సై ● 2027లో ఎవరెస్టు ఆధిరోహణకు సన్నాహాలు కై కలూరు: ఖాకీలంటే కాఠిన్యం కాదని, ఎవరెస్టు ఎక్కే అంత సంకల్పానికి సైతం నెరవకుండా ముందుకెళతారని నిరూపిస్తున్నారు ఏలూరు జిల్లా కలిదిండి ఎస్సై వి.వెంకటేశ్వరరావు. గణపవరం ప్రాంతం నుంచి రెండేళ్ల క్రితం కలిదిండి ఎస్సైగా ఆయన విధుల్లో చేరారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎవరెస్టు అధిరోహణ ముందస్తు సన్నాహాల్లో భాగంగా జనవరి 21న ఆయన లడక్లో ట్రెక్కింగ్కు వెళ్లారు. నేపాల్కు చెందిన ట్రైనర్ దేవదాయసర్ ఆధ్వర్యంలో 12 రోజులు మైనస్ 25 డిగ్రీల సెల్సియస్లో 5 వేల మీటర్ల ఎత్తు వరకు వెళ్లారు. ట్రైనింగ్ పూర్తి చేసుకుని తిరిగి కలిదిండిలో ఎస్సైగా విధుల్లో చేరారు. ఆయన సాహసోపేత నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తూ ఎస్సైకు అభినందనలు తెలిపారు. ఎవరెస్టు శిఖరాన్ని 2027 అధిరోహించడానికి ప్రణాళికతో శిక్షణ పొందుతున్నాను. లడక్ శిక్షణ ముందు భువనగిరిలో రాక్క్లైమింగ్లో శిక్షణ తీసుకున్నాను. ఇప్పుడు శరీరంపై 15 కేజీల బరువుతో ట్రెక్కింగ్ చేయగలుగుతున్నాను. పోలీసుశాఖ నుంచి ఎవరెస్టు అధిరోహించి జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ధృడసంకల్పంతో ఉన్నాను. ఖర్చుతో కూడినది కావడంతో దాతలు ముందుకొస్తారని భావిస్తున్నాను. – వి.వెంకటేశ్వరరావు, ఎస్సై, కలిదిండి -
రూ.4.94 లక్షల విలువైన పీడీఎస్ రైస్ పట్టివేత
తణుకు అర్బన్: తణుకులో అక్రమంగా నిల్వచేసిన పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలోని షెడ్డులో పట్టణానికి చెందిన కొల్లి బాబు నిల్వ ఉంచిన 12 టన్నుల బియ్యంతోపాటు ఒక వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు. ముందుగా హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని గోస్తనీ కాలువ గట్టు రోడ్డులో వ్యాన్ ద్వారా రవాణా చేస్తున్న బియ్యాన్ని అధికారులు గుర్తించి ఆరా తీసి విచారణలో భాగంగా ఒక షెడ్డులో బియ్యం నిల్వలను గుర్తించారు. రూ.4,94,520 విలువైన 7,363 టన్నుల రేషన్ బియ్యం (12,363 కిలోలు)తోపాటు వ్యాన్ను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తణుకు పట్టణంలో వివిధ ప్రాంతాల్లో పీడీఎస్ బియ్యాన్ని సేకరించి కాలనీలోని షెడ్డులో నిల్వచేసి పెద్ద మొత్తంలో తూర్పుగోదావరి జిల్లాకు తరలిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. నిర్వాహకుడు కొల్లి బాబుపై 6 ఏ కేసు నమోదుచేసినట్లు తణుకు తహసీల్దార్ కార్యాలయ డీటీ శ్రీదేవి తెలిపారు. నూజివీడు: విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించాలనే లక్ష్యంతో ‘విద్యార్థులు–నైతిక విలువలు’ అనే అంశంపై ఈనెల 8న నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రిపుల్ ఐటీలోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో ఉదయం 9.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. దీనిలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు పాల్గొని ఉపన్యసిస్తారన్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్, ఆర్జీయూకేటీ కులపతి ఆచార్య కొత్తా మధుమూర్తి, ఉప కులపతి ఆచార్య ఎం విజయ కుమార్ హాజరుకానున్నారు. ముదినేపల్లి రూరల్ చోరీ కేసుల్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఇటీవల ముదినేపల్లిలో పాలబూత్లో చోరీతోపాటు, స్థానిక అలేఖ్య అపార్ట్మెంట్స్లో మోటార్సైకిల్ దొంగతనం జరిగింది. ఈ చోరీ కేసుల్లో భీమవరం మండలం డేగాపురం గ్రామానికి చెందిన వి దుర్గామల్లేశ్వరరావును నిందితుడిగా గుర్తించి ముదినేపల్లిలో గురువారం అదుపులోకి తీసుకుని అతడి నుంచి మోటార్సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిని కై కలూరు కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ రిమాండ్ విధించినట్లు తెలిపారు. తాడేపల్లిగూడెం రూరల్: కుమార్తైపె అఘాయిత్యానికి పాల్పడిన తండ్రికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని నీలాద్రిపురం గ్రామానికి చెందిన సురగాని రంగారావు, అతని తమ్ముడు సురగాని బుచ్చిరాజు కలిసి కుమార్తైపె అఘాయిత్యానికి పాల్పడ్డారని తల్లి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటన 2022 సంవత్సరంలో చోటు చేసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను ఏలూరు ఓపెన్ కోర్టులో హాజరుపర్చగా, బాలిక తండ్రి రంగారావుపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు విధించడంతో రూ.10వేలు జరిమానా విధించారు. దీనితో, పాటు బాలికకు ముద్దాయి రూ.2 లక్షలు, ప్రభుత్వం రూ.3 లక్షలు చెల్లించాలని మేజిస్ట్రేట్ తీర్పునిచ్చినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. తాడేపల్లిగూడెం రూరల్: కొట్లాట కేసులో నలుగురికి జరిమానా విధించినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. మండలంలోని జగన్నాథపురం గ్రామంలో 2021 ఫిబ్రవరి 23వ తేదిన కొట్లాట, గొడవ జరిగింది. అప్పట్లో అడ్డాల సూర్యచంద్రరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులు రాటాల సత్యనారాయణ, రాటాల వీరవెంకట మణికంఠ దుర్గావరప్రసాద్, రాటాల వెంకట దుర్గారావు, రాటాల నారాయణస్వామిలకు ఒక్కొక్కరికీ రూ.11 వేలు చొప్పున మొత్తం రూ.44 వేలు జరిమానా విధిస్తూ రెండవ అదనపు మొదటి తరగతి కోర్టు జడ్జి అన్నామణి తీర్పు వెల్లడించారన్నారు. విచారణకు ఏపీపీ ఎ.రవిప్రసాద్, కోర్టు కానిస్టేబుల్ ఎస్.సుబ్బారావు సహకరించినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. -
కబ్జా కోరల్లో గ్రంథాలయ భవనం?
● జేసీబీతో కొంత భాగం పడగొట్టిన వైనం ● పోలీసులకు ఫిర్యాదు చేసిన సెక్రటరీ, లేదంటున్న పోలీసులు తణుకు అర్బన్: మండపాక గ్రంథాలయ భవనాన్ని కబ్జా చేసేందుకు ఆక్రమణదారులు యత్నించారు. పంచాయితీ కార్యాలయం సరిహద్దుకు చేర్చి ఉన్న గ్రంథాలయ భవనం చాలా కాలంగా శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారింది. దీంతో ఆ భవన స్థలంపై కన్నేసిన అక్రమార్కులు ఈనెల 2వ తేదీన రాత్రి సమయంలో జేసీబీని తీసుకువచ్చి భవనం కూల్చివేత పనులు చేస్తుండగా స్థానికులు, అధికారులు అడ్డుకోవడంతో పనులు నిలిపివేశారు. ఈ ఘటనపై పంచాయితీ సెక్రటరీ శేఖర్ తణుకు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు. విలువైన స్థలం మండపాక నడిబొడ్డు, కాలువ పక్కనే ఉన్న ఈ గ్రంథాలయ భవనం అత్యంత ఖరీదైన భూమిగా స్థానికులు చెబుతున్నారు. సుమారుగా 200 గజాల్లో ఉండే ఈ భవనం చాలా కాలంగా నిరుపయోగంగా ఉండడంతో ఆ స్థలంపై కన్నేసిన వారు పడగొట్టి కలుపుకునే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి ఈ స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగా భవనాన్ని కొంతమేర పడగొట్టారని సమాచారం. ఈ వ్యవహారంలో పంచాయతీ సెక్రటరీ శేఖర్ తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశానని మీడియాకు తెలిపారు. అయితే తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ రైటర్ శ్రీనివాస్ మాత్రం సెక్రటరీ ఫోన్ ద్వారా తెలిపారే కానీ ఇంతవరకు ఎటువంటి రాతపూర్వకంగా ఫిర్యాదుచేయలేదని చెబుతుండడం వివాదాస్పదంగా మారింది. కేసు పెట్టానని సెక్రటరీ అనడం, లేదని పోలీసులు చెబుతుండడం వెనుక ఏదో అదృశ్య శక్తి ఉందని, ఈ స్థలం ఎవరికీ కలుస్తుంది, దీని వెనుక ఎవరున్నారనే విషయం తేలాల్సి ఉంది. గ్రామంలో అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు దీని వెనుక ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి. -
అటకెక్కిన కార్పొరేషన్ రుణాలు
భీమవరం(ప్రకాశం చౌక్): ఎన్నికల హామీలను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేషన్ రుణాల పేరిట హడావుడి చేసి తీరా నిధుల విడుదల చేయకుండా జాప్యం చేస్తోంది. బీసీ, కాపు తదితర కార్పొరేషన్ల ద్వారా అర్హులైన యువతకు రూ.5 లక్షల వరకు రుణాలు ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రుణంలో 50 శాతం సబ్సిడీ ప్రభుత్వం భరిస్తుందని దరఖాస్తులు స్వీకరించి ఇంటర్వ్యూలు సైతం చేశారు. ఇదంతా జరిగి దాదాపు ఏడాది కావస్తుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం కనీసం ఇంటర్వ్యూలు కూడా నిర్వహించలేదు. అయినా ఇప్పటికీ రుణాల ఊసెత్తకపోవడంతో దరఖాస్తుదారులు ఎన్నాళ్లీ ఎదురుచూపులు అంటూ నిట్టూరుస్తున్నారు. మరోసారి కూటమి ప్రభుత్వం చేతిలో మోసపోయామంటూ రుణాలపై ఆశలు వదులుకుంటున్నారు. నిధుల ఊసేది? కార్పొరేషన్ రుణాలకు సంబంధించి ప్రభుత్వం సబ్సిడీ 50 శాతం సొమ్మును బ్యాంకులకు విడుదల చేస్తే మిగిలిన 50 శాతం కలిపి బ్యాంకులు లబ్ధిదారులకు రుణంగా మంజూరు చేస్తాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకూ రుణాలకు సంబంధించిన సబ్సిడీ సొమ్ములు విడుదల చేయలేదు. దీంతో బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వెనుకాడుతున్నాయి. వచ్చిన దరఖాస్తులు బ్యాంకుల్లో మూలన పడ్డాయి. 79 వేల మందికి పైగా.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో బీసీ, ఎస్సీ, కాపు తదితర కార్పొరేషన్ల రుణాల కోసం ఏలూరు జిల్లాలో 40,156, పశ్చిమగోదావరిలో 38,893 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా బీసీ కార్పొరేషన్కు ఏలూరులో 21,838, పశ్చిమగోదావరిలో 17,686 దరఖాస్తులను స్వీకరించారు. పచ్చ నేతల సమక్షంలోనే.. ఉమ్మడి జిల్లాలో బీసీ, కాపు కార్పొరేషన్ రుణాలకు సంబంధించి ఇంటర్వ్యూలు కూటమి నాయకులు ముఖ్యంగా తెలుగుదేశం నేతల సమక్షంలోనే జరిగాయి. 90 శాతం యూనిట్లను కూటమికి చెందిన, కూటమి నాయకులు సిఫార్సు చేసిన వారికి మంజూరు చేసేలా బ్యాంకు మేనేజర్లపై ఒత్తిళ్లు కూడా చేశారు. మీకు రుణం రాదంటూ పలువురు అర్హులైన అభ్యర్థులను టీడీపీ శ్రేణులు ఆందోళనకు కూడా గురిచేశాయి. ఇంతా హడావుడి చేసి రుణాలు మంజూరు చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. నిధుల కేటాయింపు.. మళ్లింపు 2024–25 బడ్జెట్లో బీసీ, కాపు కార్పొరేషన్ రుణాలకు సబ్సిడీ నిధులు కేటాయించామని నాడు విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు. అయితే నిధులను ప్రభుత్వం బ్యాంకులకు రిలీజ్ చేయకుండా మళ్లించిందనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి నిమ్మల తీరు మరీ విడ్డూరం చంద్రబాబు సబ్సిడీ రుణాలు అందిస్తారంటూ ప్రచారం చేసిన జిల్లా మంత్రి నిమ్మల రామానాయుడు ఒక్క అడుగు ముందుకు వేసి మరీ పాలకొల్లులో లబ్ధిదారులకు సబ్సిడీ రుణాల చెక్కు సైతం అందించారు. తీరా లబ్ధిదారులకు బ్యాంకులకు వెళితే అసలు నిజం తెలిసింది. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సబ్సిడీ నిధులు విడుదల చేయలేదని తెలుసుకుని ప్రభుత్వ తీరుపై ముక్కున వేలేసుకున్నారు. జిల్లాలో మంత్రి నిమ్మల, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు ఉన్నా కార్పొరేషన్ రుణాల ఊసే ఎత్తడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీలకు మొండిచేయి చూపింది. ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం 9 నెలల క్రితం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం కనీసం ఇంటర్వ్యూలు కూడా నిర్వహించలేదు. ఏలూరు జిల్లాలో 111 యూనిట్లకు 6,826, పశ్చిమగోదావరి జిల్లాలో 742 యూనిట్లకు 3,181 దరఖాస్తులు వచ్చాయి. ఎన్నాళ్లీ ఎదురుచూపులు? ఊసేలేని బీసీ, ఎస్సీ తదితర కార్పొరేషన్ల రుణాలు దరఖాస్తులు స్వీకరించి ఏడాది విడుదల కాని నిధులు.. నిలిచిన యూనిట్లు బడ్జెట్లో కేటాయించిన సొమ్ములు మళ్లింపు! రుణాల పేరుతో చంద్రబాబు సర్కారు మోసం ఉమ్మడి జిల్లాలో 79 వేలకు పైగా దరఖాస్తులు -
విద్యాంజలి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని 1,728 పాఠశాలలు విద్యాంజలి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పాఠశాలలకు కావాల్సిన అవసరాలను విద్యాంజలి పోర్టల్లో నమోదు చేయాలని సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ కే. పంకజ్ కుమార్ సూచించారు. గురువారం స్థానిక ఈదర సుబ్బమ్మ దేవి మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి విద్యాంజలి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాఠశాలలకు అవసరమైన సదుపాయాలను సర్వీస్ రూపంలో, వస్తు రూపంలో అవసరాలుగా నమోదు చేయాలని సూచించారు. విద్యాంజలి కార్యక్రమం ద్వారా ప్రతి పాఠశాలకు అవసరమైన సదుపాయాలు దాతల ద్వారా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాంజలి పోర్టల్ ద్వారా వాలంటీర్గా పాఠశాలల్లో సర్వీస్ చేయడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులను ప్రోత్సహించి రిజిస్ట్రేషన్ చేసేటట్టు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యాంజలి కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 7వ తేదీన జిల్లాలోని అన్ని మండలాల్లో ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని, వాటికి అవసరమైన నిధులు విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు, ఎన్న్జీవోలు, ఎస్ఎంసీ సభ్యులు, రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చారు. అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ రెడ్డి రామారావు, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ యెహోషువ, ఆల్టర్నేటివ్ స్కూల్ కోఆర్డినేటర్ ఎస్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ అరాచకాలకు భయపడం
ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, కాపు నాయకుడు అంబటి రాంబాబుపై దాడి, ఇల్లు, కార్యాలయాలపై దాడు లు, విధ్వంసం చేసిన టీడీపీ గుండాలపై ప్ర భుత్వం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వైఎస్సార్ సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) డిమాండ్ చేశారు. జిల్లాకు చెందిన పార్టీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు, నూజివీడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఏలూరు కన్వీనర్ మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ) పార్టీ నేతల బృందం గురువారం అంబటి కుటుంబాన్ని పరామర్శించారు. దాడుల ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందనే భరోసా కల్పించారు. ధ్వంసమైన కారు, ఇంటి పరిసరాలు, కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందనే ఆరోపణలు చేసిందని, అయితే సీబీఐ, సిట్ నివేదికతో సీఎం చంద్రబాబు, పవన్కల్యాణ్ చేసిన ఆరోపణలు అవాస్తవాలు అని తేలిందన్నారు. లడ్డూ ప్రసాదం విషయంలో పరువుపోయిన ప్రభుత్వం దానిని కప్పిబుచ్చుకునేందుకు వైఎ స్సార్సీపీ నేతలు, వారి ఇళ్లపై దాడులకు తెగబడుతోందన్నారు. అక్రమ కేసులతో ప్రజల దృష్టిని మళ్లించాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. ఇప్పటికై నా ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను భయపెట్టాలని చూడటం మానుకోవాలన్నారు. ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణేష్, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ల శంకర్, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి వామిశెట్టి పరమేశ్వరరావు, జెడ్పీటీసీ కాశీ విశ్వనాథ్ ఉన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి పరామర్శ వైఎస్సార్సీపీ జిల్లా నేతల బృందం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. కొద్దిసేపు దాడి జరిగిన పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటి కారిడార్లో పెట్రోల్ బాంబులతో దాడి చేసి దహనం చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. మాజీ మంత్రుల కుటుంబాలకు జిల్లా నేతల పరామర్శ -
జననేతకు నీరాజనం
జన తరంగం ఎగసింది.. అభిమాన నేతను చూసి మురిసింది.. సంక్షేమ ప్రదాతకు ఆత్మీయ స్వాగతం పలికింది.. అడుగడుగునా బ్రహ్మరథం పట్టింది.. ‘సీఎం.. సీఎం.. జై జగన్’ నినాదాలతో హోరెత్తించింది.. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వెల్లువలా వచ్చిన జనకెరటం జననేతకు నీరాజనాలు అర్పించింది.. యువత, అభిమానుల కేరింతలు, ఉత్సాహం నడుమ భీమవరం జనసంద్రాన్ని తలపించింది. వివాహ వేడుకకు హాజరైన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. శురకవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20268లో uసాక్షి, భీమవరం/భీమవరం (ప్రకాశం చౌక్): శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు కుమారుడు ఐపీఎస్ అధికారి చిట్టిరాజు, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గొర్రెముచ్చు కిషోర్కుమార్ కుమార్తె తేజ రిషితల వివాహం గురువారం పెద అమిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ హాలులో వైభవంగా జరిగింది. నూతన జంటను ఆశీర్వదించేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారన్న సమాచారంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు భీమవరం చేరుకున్నారు. ఉదయం నుంచే జువ్వలపాలెం, క న్వెన్షన్ హాలు రోడ్లలో హడావుడి మొదలైంది. పార్టీ శ్రేణులు, యువత పార్టీ జెండాలు, జగన్ ఫ్లెక్సీలతో సందడి చేశారు. దారిపొడవునా ఫ్లెక్సీలతో రోడ్డును ముంచెత్తారు. ఉదయం 11.30 గంటలకు పెద అమిరం రోడ్డులోని హెలీప్యాడ్కు జగన్ చేరుకోగా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పార్టీ నేతలు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. హెలీప్యాడ్ నుంచి కల్యాణవేదిక వరకూ పార్టీ శ్రేణులు, యువతతో రోడ్డు కిక్కిరిసిపోయింది. భారీ ఎత్తున బాణాసంచా కాల్పులతో అధినేతకు పార్టీ వ్రేణులు స్వాగతం పలికారు. తమ అభిమాన నేతను దగ్గరగా చూసేందుకు యువకులు బారికేడ్లు, ప్రహరీ గోడలను లెక్కచేయకుండా కాన్వాయ్ వెంట పరు గులు తీశారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి హెలీప్యాడ్ నుంచి తిరుగు పయనమయ్యే వరకూ జగన్ను చూసేందుకు, ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబర్చారు. కిక్కిరిసిన కన్వెన్షన్ కల్యాణ వేదిక వద్ద మోషేన్రాజు, అన్నామణి దంపతులు వైఎస్ జగన్కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. వధూవరులు చిట్టిరాజు, తేజ రిషితలను జగన్ ఆశ్వీరించారు. వేదిక వద్ద జగన్ను చూసేందుకు జనం పోటీపడ్డారు. ఆయన వధూవరులను ఆశీర్వదిస్తున్న దృశ్యాలను చిన్నాపెద్దా తేడాలేకుండా సోఫాలు, కుర్చీలు ఎక్కీ మరీ తమ సెల్ఫోన్లలో బంధిస్తూ మురిసిపోయారు. అభిమా న నేతతో కరచాలనం కోసం పోటీపడ్డారు. భీమవరం.. అభిమాన సంద్రం వైఎస్ జగన్కు ఘన స్వాగతం మండలి చైర్మన్ మోషేన్రాజు తనయుని వివాహ వేడుకకు హాజరు పెదఅమిరం రోడ్డులో ప్రభంజనం ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి వెల్లువలా పార్టీ శ్రేణులు -
బుట్టాయగూడెం ఎంపీపీగా తెల్లం రమణ
బుట్టాయగూడెం : బుట్టాయగూడెం ఎంపీపీగా తెల్లం రమణ ఎన్నికై నట్లు ఎన్నికల పరిశీలకుడు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం జరిగిన ఎన్నికల్లో 15 మంది ఎంపీటీసీలకు 12 మంది హాజరయ్యారని చెప్పారు. కోరం పూర్తి కావడంతో ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం పూర్తి చేశామని చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదికలను ఉన్నతాధికారులు పంపిస్తామన్నారు. అలాగే ఎంపీపీగా ఎన్నికై న తెల్లం రమణకు ఎన్నిక ఫాంను జేసీ, ఆర్డీఓ చేతుల మీదుగా అందజేశారు. ఏలూరు (టూటౌన్): విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు పూర్తికాకుండానే ఏలూరు జిల్లాలో కొన్ని ప్రవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ముందస్తు అడ్మిషన్న్లు చేస్తూ, విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెబుతూ అధిక ఫీజులు వసూలు చేయడానికి సిద్దమవుతున్నాయని ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి.శివ కుమార్ అన్నారు. స్థానిక ఆర్ఆర్పేటలోని స్ఫూర్తి భవన్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని విద్యాసంస్థలకు అసలు ప్రభుత్వ గుర్తింపు కూడా లేకుండా అడ్మిషన్న్లు చేస్తుంటే కనీసం విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోడం చాలా బాధాకరమన్నారు. గుర్లింపు లేని విద్యాసంస్థలను సీజ్ చేయాలన్నారు. ఫీజుల వసూళ్లపైనా జిల్లా విద్యాశాఖ అధికారులకు అనేక సార్లు వినతిపత్రాలు అందించినా ఏ మాత్రం కూడా స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పోరాటాలకు పిలుపు నిస్తామని హెచ్చరించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా బుధవారం జిల్లాలోని 47 కేంద్రాల్లో నిర్వహించిన ప్రయోగ పరీక్షలకు 3,917 మంది హాజరయ్యారు. జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు జరిగిన ఈ పరీక్షల్లో ఉదయం 1,859 మందికి 1,820 మంది హాజరు కాగా 39 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 2,143 మందికి 2,097 మంది హాజరు కాగా 46 మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్షల్లో ఎలాంటి మాల్ప్రాక్టీస్ కేసులూ నమోదు కాలేదని, పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి యోహాను ఒక ప్రకటనలో తెలిపారు. నూజివీడు: రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి చాట్ల పుల్లారావు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12న నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో శానిటేషన్ కార్మికులు బుధవారం పాంప్లెట్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ మోదీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తోందన్నారు. ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచిందని, ఇది కార్మిక వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. ఈ ఫిబ్రవరి 12న చేపట్టే సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం బుధవారం స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. సమావేశంలో 2026– 2027 సంవత్సరానికి జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి తదితర పనులకు రూ.25 కోట్లతో ప్రతిపాదనలను రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ సంచాలకుడికి పంపడానికి తీర్మానించి ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చెర్మన్ జుత్తుగ నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్ బాబు, వయోజన విద్యాశాఖ ఉప సంచాలకుడు జీసీహెచ్ ప్రభాకర్, వయోజన విద్యాశాఖ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆర్.విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నిలిచిన మీటర్ రీడింగ్
భీమవరం (ప్రకాశం చౌక్) : విద్యుత్ మీటర్ రీడర్ల సమ్మెతో జిల్లా వ్యాప్తంగా రీడింగ్ నిలిచిపోయింది. దీంతో శ్లాబ్లో తేడా వచ్చి విద్యుత్ బిల్లులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు చంద్రబాబు పాలనలో కాంట్రాక్టు, కమిషన్పై పనిచేసే ఉద్యోగులు నరకం చూస్తున్నారు. తాజాగా విద్యుత్ మీటర్ రీడర్ల తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ నెల 1 తేదీ నుంచి విజయవాడలో ధర్నా చేపట్టారు. గత నాలుగు రోజులగా మీటర్ రీడర్లు సమ్మె చేస్తున్నా సర్కారు కనీసం పట్టించుకోవడం లేదు. జిల్లావ్యాప్తంగా బిల్లింగ్ నిలుపుదల రాష్ట్ర వ్యాప్తంగా మీటర్లు రీడర్లు చేపట్టిన ధర్నాతో జిల్లాలోని 5 వేల మంది మీటర్లు రీడర్లు కూడా బిల్లింగ్ నిలుపుదల చేశారు. బిల్లులు తీయడం ఆలస్యం కావడంతో విద్యుత్ వినియోగదారులకు శ్లాబ్ పెరిగిపోయి బిల్లులు అధికంగా వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పెరిగిన కరెంట్ బిల్లులతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే శ్లాబ్ మారిపోయి. బిల్లులు పెరిగితే ఇబ్బందులు పడతామని సామాన్యులు వాపోతున్నారు. రూ.500 బిల్లు కాస్తా.. తీయడం ఆసల్యమై మరో రూ.300 పెరిగి రూ.800 వరకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 10 తేదీ లోపు బిల్లు తీయాల్సి ఉండగా.. పట్టణాలు, పల్లెల్లో 5వ తేదీ వచ్చినా కూడా బిల్లులు తీసే ప్రక్రియ ప్రారంభం కాలేదు. మీటర్ రీడర్లు లేకపోవడంతో విద్యుత్ సంస్థ లైన్మ్యాన్లు, స్విప్ట్ ఆపరేటర్లకు ఆ పని అప్పగించారు. జిల్లా వ్యాప్తంగా 6,53,764 సర్వీసులు ఉన్నాయి. 5 వేల మంది చేయాల్సిన బిల్లింగ్ 1000 మంది ఎప్పటికి పూర్తి చేస్తారని ప్రశ్నిస్తున్నారు. 10వ తేదీ దాటితే బిల్లు శ్లాబ్ మరింత పెరుగుతుంది. ఎస్సీ, ఎస్టీలకు విద్యుత్ రాయితీ వర్తించదు. ముందస్తుగా సమాచారం ఇచ్చి రీడర్లు ధర్నాకు వెళ్లినా.. విద్యుత్ శాఖ అధికారులు సకాలంలో స్పందించలేదు. కాంట్రాక్టర్లను భయపెడుతున్నారు విద్యుత్ స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్లపై విద్యుత్ సంస్థ ఒత్తిడి తీసుకొస్తుంది. వెంటనే కొత్త రీడర్లతో రీడింగ్ తీయాలని, ప్రతి రోజు బిల్లింగ్ 12.5 శాతం జరగాలని కాంట్రాక్టర్లు దగ్గర ఉన్న స్కానర్లు, ప్రింటర్లు, మొబైల్స్, చార్జర్లు వెంటనే డిపార్ట్మెంట్కు ఇవ్వాలని, ఇవ్వని వారిపై పోలీస్ కేసు పెట్టాలని విద్యుత్ శాఖ అధికారులు కాంట్రాక్టర్లను భయపెడుతున్నారు. జిల్లాలో దాదాపు 20 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. కొత్త రీడర్లు వస్తే పాతవారి పరిస్థితి గురించి ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. రూ.10 వేలు దాటని జీతం విద్యుత్ మీటర్ రీడర్ల జీతం రూ.10 వేలు కూడా లేదు. పట్టణాల్లో పీఎఫ్, ఈఎస్ఐకు అన్నీ కలుపుకుని మీటర్కు రూ.6.16, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6.36 చొప్పున చెల్లిస్తున్నారు. ఈ మొత్తం సరిపోవడం లేదని కాంట్రాక్టర్లు డిమాండ్ చేయడంతో పట్టణాల్లో రూ.0.26, గ్రామాల్లో రూ.0.75 పెంచారు. రీడింగ్ యంత్రం చార్జీలు, ఫోన్ రీచార్జ్, రీడింగ్ పేపర్ రోల్, మరమ్మతులు, ఈఎస్ఈ, ఈపీఎఫ్ మినహాయింపులు పోగా.. విద్యుత్ మీటర్ రీడర్కు చేతికి ఒక్కో మీటర్కు పట్టణంలో రూ.4.66, గ్రామీణ ప్రాంతంలో రూ.3.89 అందుతుంది. ఒక్క మీటర్ రీడర్ నెలకు మూడు వేల మీటర్ల వరకు రీడింగ్ తీస్తారు. దీన్ని బట్టి చూస్తే వారి ఆదాయం ప్రతి నెలా కేవలం రూ.10 వేల లోపే ఉంటుంది. 20 ఏళ్లగా పనిచేస్తున్నా ఇదే పరిస్థితి విద్యుత్ మీటర్ రీడర్లుగా గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న వారే అధికంగా ఉన్నారు. 20 ఏళ్లుగా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కనీసం ఉద్యోగ భద్రత కల్పించకుండా రీడర్లపై కేసుల నమోదుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మాట మార్చిన చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించిన సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ప్రస్తుతం వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో విమర్శించిన నోటితోనే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు మంచి ప్రక్రియ అని చెప్పి మాట మార్చారు. స్మార్ట్ మీటర్లతో అటు ప్రజలకు, ఇటు మీటర్ రీడర్లకు ద్రోహం చేసిన ఘనత చంద్రబాబుకే చెల్లింది. స్మార్ట్ మీటర్ల నేపథ్యంలో మీటర్ రీడర్లకు విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. రీడర్ల విద్యార్హతను బట్టి విద్యుత్ శాఖలో టెక్నికల్, నాన్ టెక్నికల్ షిఫ్ట్ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మిగిలిన వారిని వాచ్మెన్, అటెండర్ పోస్టుల్లో నియమించాలి. ఎస్క్రో ఖాతాను వెంటనే తెరవాలి. కాంట్రాక్టర్లు, విద్యుత్ శాఖ అధికారులతో విద్యుత్ మీటర్ రీడర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం మూడు డివిజన్లు ఉన్నాయి. ఇందులో భీమవరం డివిజన్లో 2,09,970 సర్వీసులు, నరసాపురం డివిజన్లో 2,24,354, తాడేపల్లిగూడెం డివిజన్లో 2,19,440 కలిపి మొత్తం 6,53,764 సర్వీసులు ఉన్నాయి. బిల్లులు తీయకపోవడంతో విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చే అవకాశం నాలుగు రోజులుగా సమ్మెలో విద్యుత్ మీటర్ రీడర్లు 10 తేదీ మీటర్ రీడింగ్కు తుది గడువు విద్యుత్ మీటర్ల రీడర్ల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం -
ఎఫెక్ట్
ఏలూరు (ఆర్ఆర్పేట) : ‘స్తంభాలపై ప్రమాద ఘంటికలు’ శీర్షికతో సాక్షి దినపత్రికలో ఈ నెల 3న ప్రచురించిన కథనంపై విద్యుత్ అధికారులు స్పందించారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలపై కట్టిన కేబుల్ వైర్లను తొలగించారు. హై టెన్షన్ విద్యుత్ వైర్లకు తాకుతున్న చెట్ల కొమ్మలను సైతం తొలగించారు. ఈపీడీసీఎల్ ఏలూరు నార్త్ ఏఈ రాంబాబు మాట్లాడుతూ విద్యుత్ స్తంభాలకు చుట్టిన కేబుల్ వైర్లకు సంబంధించిన సంస్థలకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. తమ ప్రాంతంలో విద్యుత్ వైర్లను చెట్ల కొమ్మలు తాకుతున్న విషయాన్ని స్థానికులు తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటిని తొలగించి విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
భూ దోపిడీకి భారీ స్కెచ్
3,650 గజాలకు రూ.39 కోట్ల డీల్ సాక్షి, టాస్క్ఫోర్స్ : వందేళ్లకు పైగా గూడెంలో అందరికి తెలిసిన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన భూమి అది. స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో మహాత్మాగాంధీకి భూములు విరాళాలు ఇచ్చిన కుటుంబానికి చెందిన భూమిని లీజు పేరిట ఒక వ్యక్తి తీసుకున్నాడు. అతని కుమారులు మాకు సర్వహక్కులతో విక్రయించారని, వారికి వారసులు లేరని, స్థలాన్ని ముక్కలు ముక్కలుగా విక్రయించడం మొదలుపెట్టారు. రాజకీయ నేతల కన్ను భూమిపై పడటంతో బడా మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. కట్చేస్తే... ఆ భూమిలో కొంత భాగం రోడ్డు కిందకు పోయేలా చూపించి రూ.39 కోట్ల పరిహారం పొందడానికి పకడ్బందీ స్కెచ్ గీశారు. ఆ మేరకు వచ్చే పరిహారంలో వాటాలు ఖరారు చేసుకున్నారు. పనంతా కొలిక్కితెచ్చారు. కట్చేస్తే.. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారసులు హైకోర్టులో కేసు దాఖలు చేయడంతో మొత్తం ప్రయత్నానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. తాడేపల్లిగూడెంలోని టూటౌన్ సమీపంలో సత్యనారాయణ స్వామి ఆలయ సమీపంలో కృష్ణా రైస్మిల్లు సర్వే నెంబర్ 403లో ఉంది. 5.80 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ భూమి దామోజీపురపు ముఖ్య ప్రాణారావు కుటుంబసభ్యులది. 1929లో పెంటపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్ అయింది. అనంతరం తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటయ్యాక భూమి రికార్డు బదలాయింపు చేశారు. అనంతరం ప్రాణారావు 1939 జనవరి 2న తన వాటాగా వచ్చిన 5.80 ఎకరాల భూమిని 99 ఏళ్ళ లీజుకు ఒక వ్యక్తికి అప్పగించారు. కట్చేస్తే.. ముఖ్య ప్రాణారావు వారసులున్నప్పటికీ కుటుంబ సభ్యులు భూమి బాగోగులు పట్టించుకోలేదు. దీంతో లీజు తీసుకున్న వ్యక్తి ప్రాణారావుకు వారసులు లేరని దాన విక్రయ హక్కులతో తనకు లీజుకు ఇచ్చారని హడావుడి చేసి పెంటపాడు మండలానికి చెందిన ఒక డాక్యుమెంట్ రైటర్ సహకారంతో అత్తిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 26 రిజిస్ట్రేషన్లు చేసినట్లు సమాచారం. 5.80 ఎకరాల భూమిని ముక్కలు ముక్కలుగా విక్రయించారు. ఈ వ్యవహారంలో డాక్యుమెంట్ రైటర్ది కీలకపాత్ర. సబ్రిజిష్ట్రార్ కార్యాలయ ఉద్యోగులను కూడా అన్ని విధాలా సర్దుబాటు చేసి మరీ తతంగం నడిపించారు. ఇక కూటమి అధికారంలో ఉండటంతో బడానేతను సంప్రదించి మాస్టర్ ప్లాన్లో చిన్నపాటి సర్దుబాట్లతో ఈ సర్వే నెంబర్లో కొంత భూమిని ప్రభుత్వం తీసుకుని పరిహారం ఇస్తే నూరు శాతం లీగల్ అవుతుందని నిర్ణయించి పొలిటికల్ పెద్దలను ఆశ్రయించి భారీ యాక్షన్ ప్లాన్కు తెరదీశారు. డీల్ బాగుండటంతో బడా పొలిటికల్ నేత రంగంలోకి దిగాడు. వెంటనే మాస్టర్ ప్లాన్లో భాగంగా 1,500 గజాలు కేఎన్ రోడ్డులో, 2,150 గజాలు భీమవరం రోడ్డు విస్తరణలో పోయేలా సెట్చేసి 40 అడుగుల రహదారిని చూపించారు. కేఎన్ రోడ్డులో 1,500 గజాల భూమికి గజం రూ. 75 వేలు, భీమవరం రోడ్డులో 2,150 గజాలకు గజం రూ.25 వేలు ప్రభుత్వం నిర్ణయించిన ధర. దీనికి మూడు రెట్లు పరిహారం ఖరారు చేయించుకునేలా అన్ని మంతనాలు పూర్తి చేశారు. మొత్తం రూ.39 కోట్ల పరిహారానికిగాను 40 శాతం టీడీఆర్ బాండ్ల రూపంలో మిగిలిన 60 శాతం నగదు వారి ఖాతాల్లో పడేలా సెట్ చేసుకున్నారు. దీనికిగాను బడా నేతకు 50 శాతం అంటే రూ.19.50 కోట్లు గూడెం మున్సిపాల్టీలో కీలక అధికారి ఒకరికి కోటిన్నర, మరొకరికి రూ.కోటి, మిగిలిన మొత్తం వారసులు లేరని తనకే దక్కుతుందని కాగితాలు సిద్ధం చేసిన వ్యక్తికి వచ్చేలా ప్లాన్ ఖరారు చేసుకున్నారు. ఈ వ్యవహారం ఖర్చంతా కూడా కాగితాలు సిద్ధం చేసిన వ్యక్తే భరించాలని నిర్ణయించారు. కట్చేస్తే.. మున్సిపాల్టీలో ఓ అధికారి తాను పనిచేయలేనని సెలవులో వెళ్ళినట్లు సమాచారం. భూ పంచాయతీపై హడావుడి తెలుసుకున్న దామోజీపురపు కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించారు. దామోజీపురపు భారతి, మరో నలుగురు కలిసి హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబర్ 35154/2025 నెంబరుతో కోర్టులో కేసు దాఖలు చేశారు. మాస్టర్ ప్లాన్ పేరిట టీడీఆర్ బాండ్ల ఇచ్చే ప్రక్రియ నిలుపుదల చేయాలని కోర్టు ఆదేశించిన క్రమంలో వ్యవహారం నిలిచిపోయింది. రెవెన్యూ రికార్డులోని ఆర్ఎస్ఆర్ను, ఇతర పత్రాలను అధికారం ఉన్న బడా నేత సాయంతో సవరణలు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. గూడెంలో బ్రాహ్మణ వారసత్వ ఆస్తిపై బడా నేత కన్ను 40 అడుగుల రోడ్డు విస్తీర్ణంలో 3,650 గజాలు ప్రభుత్వానికి దానికిగాను రూ.39 కోట్ల పరిహారం సగం పరిహారం బడా నేతకు ఖరారు మున్సిపల్ అధికారులకు రూ.2.50 కోట్ల భారీ నజరానా మిగిలిన మొత్తం మరికొందరికి హైకోర్టు ఉత్తర్వులతో తాత్కాలికంగా బ్రేక్ -
శివరాత్రికి చురుగ్గా ఏర్పాట్లు
పోలవరం రూరల్: మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టిసం శివక్షేత్రంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పోలవరం మండలం పట్టిసం శివక్షేత్రంలో ఈ నెల 14 నుంచి 16 వరకు ఇసుక తిన్నెలపై జరిగే ఉత్సవాలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. లక్షన్నరకు పైగా భక్తులు హాజరవుతారనే అంచనాతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి నదిలో భక్తులు నడిచి వెళ్లేందుకు వీలుగా పంట్లు ఏర్పాటు చేసి క్షేత్రం వైపు ఇసుకతో ర్యాంపు ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఇసుక తిన్నెలపై చలువ పందిళ్ళ నిర్మాణం చేపట్టారు. వాహనాలు పార్కింగ్ ప్లేస్లు, తాత్కాలిక బస్టాండ్ల ఏర్పాట్లకు సంబంధించిన ప్రదేశాలను సంబంధిత శాఖ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది వరద ప్రవాహం మారడంతో నది మధ్యలో రెండు పాయలుగా ఏర్పడింది. దీంతో నడిచి వెళ్లి వచ్చేందుకు మార్గం దూరమైంది. ఇసుక తిన్నెలపై తాత్కాలిక మరుగుదొడ్లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా కర్రలు, తాటాకులతో నిర్మాణాలు చేపట్టారు. భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వీలుగా క్యూలైన్లు, బారికేడ్ల పనులు చేస్తున్నారు. ఇసుక తిన్నెలపై నిర్మిస్తున్న చలువ పందిళ్లు -
‘మార్పు’ అమలుపై దృష్టి పెట్టాలి
కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు(మెట్రో) : జిల్లాలో నాటుసారా తయారీ నుంచి బయటకు వచ్చిన కుటుంబాలకు ‘మార్పు’ కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించామని, ఈ కార్యక్రమానికి సద్వినియోగం చేసుకునేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం నవోదయం–2 లో మార్పు కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి కార్యక్రమాల అమలుపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా రూపొందించేందుకు నాటుసారా తయారీదారులను ఆ వృత్తి నుంచి బయటకు తీసుకొచ్చి వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించామన్నారు. ఈ సందర్భంగా నాటుసారా తయారీ మానేసి, ప్రత్యామ్నాయ ఉపాధి పొందేందుకు అంగీకరించిన 26 కుటుంబాలకు రూ.19 లక్షలు కలెక్టర్, ఎమ్మెల్యేలు బడేటి చంటి, సొంగా రోషన్కుమార్లు అందించారు. తొలి విడత అక్రిడిటేషన్ల జారీకి ఆమోదం ఏలూరు జిల్లాలో దరఖాస్తు చేసుకున్న పాత్రికేయుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేశామని కలెక్టర్ చెప్పారు. బుధవారం జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి రెండో సమావేశంలో మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు వివిధ సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం సమర్పించగా, పరిశీలించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
నేడు భీమవరానికి వైఎస్ జగన్
సాక్షి, భీమవరం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం భీమవరం రానున్నారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు తనయుడు ఐపీఎస్ అధికారి చిట్టిరాజు వివాహ వేడుకకు హాజరుకానున్నారు. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు స్థానిక పెదఅమిరం రోడ్డులోని హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి సమీపంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ హాలుకు కారులో చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం 12 గంటలకు భీమవరం నుంచి తాడేపల్లి బయలుదేరి వెళతారు. ఈ మేరకు జగన్ పర్యటన షెడ్యూల్ ఖరారైనట్టు పార్టీ నేతలు తెలిపారు. అభిమాన నేత రాక కోసం పార్టీ శ్రేణులు, అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఘనంగా స్వాగత ఏర్పాట్లు: జగన్ పర్యటన కోసం మండలి చైర్మన్ మోషేనురాజు, పార్టీ నేతలు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. వివాహ వేదిక ఉన్న పెదఅమిరం రోడ్డు దారిపొడవునా స్వాగత ఫ్లెక్సీలతో ముంచెత్తారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలిరానున్నారు. హెలీప్యాడ్ పరిశీలన హెలీప్యాడ్ స్థలాన్ని బుధవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, భీమవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ చినమిల్లి వెంకటరాయుడు తదితరులు పరిశీలించారు. జగన్ను కలిసేందుకు భారీ ఎత్తున నేతలు తరలిరానుండటంతో ఏర్పాట్లపై సమీక్షించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేరిచర్ల నరసింహరాజు, జిల్లా అధికారప్రతినిధి కామన నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు తదితరులు పాల్గొన్నారు. మండలి చైర్మన్ మోషేనురాజు తనయుడి వివాహ వేడుకకు హాజరు -
సాగునీటి చెరువుల్లో మట్టి అక్రమ రవాణా
కొయ్యలగూడెం: యర్రంపేట–రాజవరం గ్రామాల మధ్య ఉన్న పులపాకుల చెరువు నుంచి బుధవారం మట్టి అక్రమ తరలింపు యథేచ్ఛగా కొనసాగింది. ఇప్పటివరకు రాత్రి వేళల్లో కొనసాగించిన మట్టి రవాణాపై సంబంధిత శాఖాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కులు పట్టపగలే రెచ్చిపోయారు. దీంతో రైతులకు మట్టి తోలకందార్లకు వాగ్వివాదం చోటుచేసుకుంది. మట్టి తోలకాలతో చెరువు గర్భం నాశనం అవుతుందని, భారీ గోతులు ఏర్పడి పశువులకు ప్రమాదకరంగా మారుతున్నాయని అక్రమార్కులతో ఘర్షణకు దిగారు. అంతేకాకుండా చెరువు నుంచి ఖరీఫ్ సీజన్లో పంట పొలాలకు సాగునీరు అందించే కాలువ గట్లు, కళింగ ప్రాంతం ధ్వంసమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుదకు తాము అనుకున్న కాడికి మట్టి తోలకలు పూర్తి అయిన తర్వాత జేసీబీలను, టిప్పర్లను తరలించుకు వెళ్లారని తతంగమంతా గంటల తరబడి ఉన్నప్పటికీ అధికార గణం అటువైపు చూడలేదని రైతులు ఆరోపించారు. -
నిరంతర శ్రమతోనే విజయం
ద్వారకాతిరుమల: ద్వారకానగర్లోని డీపాల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల పూర్వ విద్యార్థిని డాక్టర్ తలారి తేజస్విని గ్రూప్–1లో విజయం సాధించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా ఎంపికై ంది. భీమడోలుకు చెందిన ఆమెను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ప్రిన్సిపాల్ ఫాదర్ టోనీ మాట్లాడుతూ తమ పాఠశాల పూర్వ విద్యార్థిని తేజస్వినీ విద్యార్థులకు ఆదర్శప్రాయమన్నారు. క్రమశిక్షణ, నిరంతర శ్రమ, లక్ష్యంపై విశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. సిస్టర్ జాన్సీ, కెన్నెడీ, చాముండి, మీనా పాల్గొన్నారు. -
మోగనున్న పెళ్లి బాజాలు
తణుకు అర్బన్, జంగారెడ్డిగూడెం: మూడుముళ్లతో ఏడడగులు నడుస్తూ అగ్ని సాక్షిగా వేదమంత్రోచ్ఛరణతో ఏర్పడే వివాహ బంధం కోసం ముహుర్తాలు ముంచుకొచ్చే వేళ దగ్గరపడింది. నిండు నూరేళ్లు విడదీయలేని జన్మజన్మల బంధాన్ని కలిపే మంచి ముహూర్తం కోసం వధూవరులు ఉవ్విళ్లూరుతున్నారు. ముహూర్తాల జాతర మూఢం అనంతరం వివాహాల వేడుకకు పండితులు ముహుర్తాలు సిద్ధం చేశారు. గత నాలుగు నెలలుగా ముహూర్తాలు లేకపోవడంతో కల్యాణాలు పెండింగ్లో పడ్డాయి. ఈనెల 17వ తేదీతో మూఢం ముగుస్తుండడంతోపాటు 2026 ఏడాది పొడవునా ముహూర్తాల జాతర ఉన్న నేపథ్యంలో వేల సంఖ్యలో వివాహాలు జరిగే పరిస్థితులు జిల్లాలో ఉన్నాయి. ఇప్పటికే కల్యాణ మండపాల కోసం వధూవరుల పెద్దలు వెతుకులాట చేపట్టారు. భారీ స్థాయిలో ముహుర్తాలు ఉన్న సందర్భంగా ఆలయాలు, కల్యాణ మండపాలు బుకింగ్ చేసుకుంటున్నారు. ముహూర్తం ఫిక్స్ అవ్వకపోయినా ముందస్తుగానే కల్యాణ మండపాలకు సిఫార్సులతో బుకింగ్లు చేసేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో సుమారుగా మూడు వేలకు పైగా వివాహాలు జరగనున్నట్లు పండితులు చెబుతున్నారు. ఈనెల 20 నుంచి కల్యాణ వైభోగం ఈ ఏడాదిలో ఫిబ్రవరి నెలలో ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. ఏడాది పొడవునా శుభ ముహూర్తాలు ఉండడంతోపాటు ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అధిక సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 20, 21, 24, 25, 26 తేదీల్లోను, మార్చిలో 1, 3, 4, 7, 8, 9, 11, 12 తేదీల్లోను, ఏప్రిల్లో 15, 20, 21, 25, 26,27, 28, 29 తేదీల్లోను, మే లో 1, 3, 7, 11 తేదీల్లోను, జూన్లో 21, 22, 23, 24, 25, 26, 27, 29, తేదీల్లోను, జూలైలో 1, 6, 7, 11 తేదీల్లోను, నవంబరులో 21, 24, 25, 26, 27, 30 తేదీల్లోను, డిసెంబరులో 1, 2, 3, 4, 6, 11, 12, 13 తేదీల్లో అధిక సంఖ్యలో పెళ్లిళ్లు ఉండనున్నాయి. కల్యాణ మండపాలకు డిమాండ్ రానున్న శుభ ముహూర్తాలకు కల్యాణ మండపాలు, హోటళ్లకు డిమాండ్ నెలకొంది. జిల్లాలో వందకుపైగా ఉన్న కల్యాణ మండపాల్లో భారీగా వివాహాలు జరిగేందుకు సిద్ధంగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే కల్యాణ మండపాలు ముందస్తు బుకింగ్లు అయిపోయాయి. మండపం స్థాయిని బట్టి రూ.50 వేలు నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతున్నట్లుగా తెలుస్తోంది. గిరాకీగా అనుబంధ వ్యాపారాలు పెళ్లిళ్ల కోసం జిల్లాకు వచ్చే బంధువులు, అతిథుల కోసం లాడ్జీలు, హోటళ్లు సైతం ముహుర్తాలున్న తేదీల్లో బుక్ అవుతున్నాయి. ఇక పెళ్లిళ్లకు అత్యంత ముఖ్యమైనది డెకరేషన్. వీటిలో ఫ్లవర్ డెకరేషన్కు రూ.30 వేలు నుంచి రూ.5 లక్షల వరకు ధరలు పలుకుతుండగా, జిల్లాలో తూర్పుగోదావరి జిల్లా, కడియం ప్రాంతంతోపాటు చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి సైతం తాజా పూల రకాలను తెప్పిస్తారు. సినీ హంగులతో భారీ సెట్టింగ్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా మూఢం కారణంగా గిరాకీ లేకుండా ఖాళీగా ఉన్న ఫొటోగ్రాఫర్లకు డిమాండ్ పెరగనుంది. వీడియో గ్రాఫర్స్, మిక్సింగ్ యూనిట్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. సుమారుగా రూ.50 వేలు నుంచి లక్షల్లో బేరాలు జరుగుతున్నాయి. పురోహితులకు క్రేజ్ వివాహాల ముహూర్తాలు దగ్గరపడడంతో పురోహితులు కూడా ముందస్తుగానే బుక్ అయిపోతున్నారు. వారికి కూడా విపరీతమైన డిమాండ్ నెలకొంది. అలాగే మంగళ వాయిద్యాలు వాయించే భజంత్రీలు, ఆర్కెస్ట్రాలు, ట్రావెల్స్కు సైతం కార్లు, బస్సుల కోసం ముందస్తుగానే రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. షామియానా వ్యాపారాలు కూడా ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా క్యాటరింగ్ సంస్థలు బిజీగా ఉండనున్నాయి. క్యాటరింగ్ కార్మికులకు డిమాండ్ పెరిగింది. శుక్ర మౌఢ్యమి నేపథ్యంలో మూడు నెలలుగా ముహూర్తాలు లేవు. దీంతో చాలా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పెళ్లి ముహూర్తాలు మెండుగా ఉన్నాయి. వచ్చే ఆరు నెలల కాలంలో అత్యధిక ముహూర్తాలు ఉండటంతో ఎక్కువ పెళ్లుళ్లు జరిగే అవకాశం ఉంది. అత్యధిక ముహూర్తాలతో పౌరోహిత్యం వహించే వారికి ఆర్థిక స్వావలంభన కలుగుతుంది. – గరిమెళ్ళ గంగాధర శాస్త్రి, జంగారెడ్డిగూడెం ఈనెల 20 నుంచి ముహూర్తాలు ఏడాది పొడవునా ముహూర్తాల జాతర వేల సంఖ్యలో జరగనున్న కల్యాణాలు పెళ్లి మండపాలకు, ఫొటోగ్రాఫర్లకు, పురోహితులకు గిరాకీ


