breaking news
Eluru
-
జిల్లాలో రహదారి ప్రమాదాలు నివారించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో అధికంగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ను గుర్తించి, వాటి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కే. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ కే. ప్రతాప్ శివకిషోర్తో కలిసి రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ప్రమాదాలు, మరణాలు తగ్గినప్పటికీ, 304 రోడ్డు ప్రమాదాల్లో 149 మంది మృతి చెందడం ఆందోళనకరమన్నారు. అతివేగం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడమే మరణాలకు ప్రధాన కారణాలని, ప్రమాదాల నివారణపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ పాఠశాల బస్సుల్లో తప్పనిసరిగా డాష్ కెమెరాలు అమర్చాలని, జాతీయ రహదారిపై నిలుపుదల చేసే వాహనాలతో పాటు అతివేగంతో వెళ్లేవాటిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. రవాణా శాఖ ఉప కమిషనర్ షేక్ కరీమ్ గత సమావేశ నిర్ణయాలపై తీసుకున్న చర్యలను వివరించారు. సమావేశంలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, ఆర్టీఓ ఎస్బీ శేఖర్, డీపీఓ మల్లికార్జునరావు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎ.భానుప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి అర్జీకీ శాశ్వత పరిష్కారం చూపాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ ఫలాలు నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలతో పాటు ప్రతి గడపకూ అందేలా అధికారులు చూడాలని 20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ ఆదేశించారు. మంగళవారం ఏలూరు కలెక్టరేట్లో ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, అధికారులు సమన్వయంతో వాటికి శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇవ్వాలి అనంతరం కలెక్టరేట్లో వికసిత్ భారత్–స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో ఆయన సమీక్షించారు. జల్ జీవన్ మిషన్, అమృత్ పథకాల ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత నీటి వనరులను గుర్తించి ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇవ్వాలన్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా విద్యార్థులు, గర్భిణులు, బాలింతలకు సంపూర్ణ పోషకాహారం అందించాలని, విద్యార్థులకు రక్తహీనత లేకుండా వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. కొల్లేరులో జిరాయితీ రైతుల హక్కులు కాపాడుతూనే, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా రూపొందించిన కార్యాచరణ నివేదికను జిల్లా యంత్రాంగం కేంద్ర సాధికార కమిటీకి పంపిందన్నారు. ‘సూర్యఘర్’ అమలులో జిల్లా ప్రథమం కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం అమలులో ఏలూరు జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపామన్నారు. పీఎంజీఎస్వై పథకం కింద రూ.437 కోట్లతో 427 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్, జేసీ ఎంజే అభిషేక్ గౌడ, ఏపీ వడ్డీ కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, డీఆర్వో ఎం శ్రీదేవి, జెడ్పీ సీఈఓ పి.జగదాంబ, ఆర్డీఓ కె.లక్ష్మీప్రసన్న, అటవీశాఖ అధికారి పీవీ సందీప్రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ భాననుప్రతాప్ తదితరులు పాల్గొన్నారు -
పొగాకు రైతులకు అండగా జగన్
● దేవరపల్లి పర్యటనను విజయవంతం చేయండి ● పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి చెల్లుబోయిన పిలుపు ద్వారకాతిరుమల: పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగస్టు 5న దేవరపల్లి పర్యటన చేపట్టనున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు. ఈ పర్యటన రైతులకు భరోసా కల్పించడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే వేదికగా నిలుస్తుందన్నారు. జగన్ పర్యటనను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం ద్వారకాతిరుమల మండలంలోని పార్టీ శ్రేణులతో స్థానిక కాపు కల్యాణ మండపం వద్ద మాజీ హోం మంత్రి, వైఎస్సార్సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చెల్లుబోయిన మాట్లాడుతూ, గతంలో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతుల సమస్యలను జగన్ స్వయంగా విన్నారని, వాటిపై స్పందిస్తూ ఇప్పుడు నేరుగా రైతుల వద్దకు వెళ్లి వారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పొగాకు రైతుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. పొగాకు కొనుగోళ్లలో తీవ్ర జాప్యం, గిట్టుబాటు ధర కల్పించకపోవడం, మెయిల్ రిజెక్షన్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ను కూడా ప్రస్తుత ప్రభుత్వం వినియోగించలేదని ఆరోపించారు. రైతులు పడుతున్న కష్టాలపై చంద్రబాబు స్పందించకుండా, జగన్ ప్రశ్నించిన తర్వాతే కేంద్రానికి లేఖ రాసి మమ అనిపించాడని విమర్శించారు. రైతులకు అండగా నిలిచేందుకు జగన్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ప్రతాపనేని వాసు, దాకారపు బంగారమ్మ, బొండాడ వెంకన్నబాబు, పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్, పాకలపాటి త్యాగ భీమేశ్వరరావు, జంగా వెంకట కృష్ణారెడ్డి, గోపా నాగేశ్వరరావు, బిరుదుగడ్డ చల్లారావు, బాలం వెంకటేశ్వరరావు, చెలికాని ప్రవీణ్, తాండ్ర రమేష్, గంటా శ్రీను, ఉప్పల మునేశ్వరరావు, దాసరి రాంబాబు, దొప్పసాని రాంబాబు, బిరుదుగడ్ల బజారయ్య తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా సహస్ర దీపాలంకరణ
ఆలయ ఆవరణలో దీపాలు వెలిగిస్తున్న భక్తులు కుంకుళ్లమ్మ అమ్మవారికి హారతులిస్తున్న అర్చకుడు ద్వారకాతిరుమల: క్షేత్ర దేవత శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయం పౌర్ణమి పర్వదినం సందర్భంగా మంగళవారం రాత్రి సహస్ర దీపాల వెలుగులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు దీపాలను వెలిగించి భక్తి పారవశ్యాన్ని చాటగా, ఆలయ ప్రాంగణం దివ్యకాంతులతో కళకళలాడింది. ముందుగా భక్తులు ఆలయ ఆవరణలో ఓంకారం, శంఖు, చక్ర, నామాలు ఇలా పలు ఆకారాల్లో దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు గర్భగుడిలో కొలువై ఉన్న అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి, మంగళ హారతులిచ్చారు. అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని పలువురు భక్తులు దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
భక్తుడి నగదు చోరీ చేసిన ముఠా అరెస్టు
ద్వారకాతిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుడి వద్ద రూ. లక్ష నగదు చోరీకి గురైన కేసును ద్వారకాతిరుమల పోలీసులు వేగంగా ఛేదించారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 80 వేల నగదు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను ఎస్సై టి. సుధీర్ మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఏలూరు మండలం సుంకరివారి తోటకు చెందిన గూరుగుబెల్లి రమణమూర్తి తన భార్యతో కలిసి ఈ నెల 25న తొలి ఏకాదశి సందర్భంగా ద్వారకాతిరుమల వచ్చారు. ఆ సమయంలో ఆయన వద్ద ఉన్న రూ. లక్ష నగదు చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలు, అడిషనల్ ఎస్పీ వై. ప్రసాదరావు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో భీమడోలు సీఐ పి. కృష్ణ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు సభ్యుల ముఠాను గుర్తించిన పోలీసులు నూజివీడుకు చెందిన బొంకూరు కుమార్, శీలం రాజులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేసి, మిగిలిన రూ. 20 వేల నగదును రికవరీ చేస్తామని ఎస్సై తెలిపారు. చాకచక్యంగా కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. ఈ సందర్భంగా పుణ్యక్షేత్రాలు, రద్దీ ప్రాంతాల్లో భక్తులు తమ నగదు, విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): పోలవరం పనుల్లో మృతి చెందిన ఆపరేటర్ టి. నాగేశ్వరరావు, యంగ్ ఇంజనీర్ కోడూరు రవికాంత్ కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్. లింగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో నీటిలో మునిగిపోయిన యంత్రాన్ని తాడుతో బయటకు లాగే ప్రయత్నంలో వారు నీట మునిగి చనిపోయినట్లు తెలిపారు. మృతుడు నాగేశ్వరరావు (తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం మండలం, చిన్న కొండేపూడి)కి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారని, పెద్ద కుమార్తె 10వ తరగతి చదువుతోందని వివరించారు. మరో మృతుడు రవికాంత్కు వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుందని వాపోయారు. -
రక్తదానంపై అవగాహన అవసరం
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యార్థి దశ నుంచే ప్రతీ ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకోవాలని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ ఎంబీఎస్వీ ప్రసాద్ పిలుపునిచ్చారు. సత్రంపాడులోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో తలసేమియా బాధితుల కోసం రెడ్క్రాస్ ఆధ్వర్యంలో మంగళవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ రక్తదానం చేసిన విద్యార్థులను అభినందించారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారన్నారు కళాశాల ప్రిన్సిపాల్ వంగ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ విద్యార్థులు స్వచ్ఛందంగా అందించిన రక్తం తలసేమియా రోగులకు ఉపయోగపడటం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా నిర్మల, రెడ్క్రాస్ పీఆర్ఓ కేవీ రమణ, వైస్ ప్రిన్సిపాల్ డీవీవీ ఫణి కుమార్, మెడికల్ ఆఫీసర్ కే. శ్రీమాలక్ష్మి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కె.హరిబాబు, కల్చరల్ కో–ఆర్డినేటర్ పి.సౌభాగ్యలక్ష్మి, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు. -
తగ్గుతున్న గోదావరి వరద
పోలవరం రూరల్: గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. మంగళవారం ఉదయం 1.56 లక్షల క్యూసెక్కల నీరు స్పిల్వే నుంచి దిగువకు చేరగా, రాత్రికి ఆ ప్రవాహం 1.16 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి చేరే ఉప నదుల ప్రవాహం క్రమేపీ తగ్గుతుండటంతో వరద ఉధృతి కూడా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం స్పిల్వే వద్ద నీటిమట్టం 28 మీటర్లకు చేరుకుంది. స్పిల్వే లోని 48 గేట్ల ద్వారా 1.16 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వినోద్కుమార్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంలోనూ, జీవో నెం.77 రద్దులోనూ ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి ఐ.రాజేష్ మాట్లాడుతూ.. ‘తల్లికి వందనం’ పథకం కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి కేవలం రూ. 13 వేలు మాత్రమే జమ చేయడం తల్లిదండ్రులను మోసం చేయడమేనని అన్నారు. అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షుడు కాకి నాని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులు విద్యాశాఖ ఏడీ–1కి వినతిపత్రం అందజేశారు. చింతలపూడి (జంగారెడ్డిగూడెం): మద్ది ఆంజనేయస్వామివారిని మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. భక్తులు స్వామివారి చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు చేయించుకోవడంతో పాటు, పలువురు భక్తులు అన్నప్రాశనలు, వాహన పూజలు నిర్వహించుకున్నారు. వివిధ సేవల రూపంలో ఆలయానికి రూ.2,91,560 ఆదాయం సమకూరిందని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, సహాయ కమిషనర్, ఈవో ఆర్వీ చందన తెలిపారు. అలాగే 2,172 మంది భక్తులకు నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణ చేసినట్లు వారు పేర్కొన్నారు. -
అక్రమ తవ్వకాలపై కలెక్టర్కు ఫిర్యాదు
కొయ్యలగూడెం: రాజవరం పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న అక్రమ తవ్వకాలపై కలెక్టర్కి ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు మంగళవారం పేర్కొన్నారు. గంగవరం గ్రామ రెవెన్యూ పరిధిలో గ్రావెల్, మట్టి, ఎర్ర కాలువలోని ఇసుక అక్రమ తవ్వకాల గురించి సాక్ష్యాధారాలతో సహా కలెక్టర్ వెట్రిసెల్వికి ఏలూరు వెళ్లి సమర్పించినట్లు తెలిపారు. మైనింగ్ శాఖ అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వారు చర్యలు తీసుకోలేదని, ఎప్పటికప్పుడు వస్తామంటూ దాటవేస్తున్నారని ఆరోపించారు. దీంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోయి రేయింబవళ్లు అక్రమతోలకాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు గ్యాప్ –2 ప్రాంతంలో సీఫేజ్ నిల్వ ఉన్న ప్రదేశంలోని గొయ్యిలో ప్రమాదవశాత్తు గల్లంతైన ఎక్స్వేటర్ ఆపరేటర్ నాగేశ్వరరావు మృతదేహం వెలికి తీశారు. సోమవారం ఉదయం గల్లంతైన మృతదేహాన్ని గాలింపు చర్యలు చేపట్టి సోమవారం రాత్రి వెలికితీసినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోలవరం మార్చురీకి తరలించి, పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్సై పి.అప్పారావు తెలిపారు. చింతలపూడి (జంగారెడ్డిగూడెం): ఉపాధ్యాయుల వేధింపులు తాళలేకే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి పద్మ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం రాజులకాలనీకి చెందిన కునుపోటు బాలసాయి సుబ్రహ్మణ్యం అలియాస్ బన్ను (16) రావికంపాడు జెడ్పీహెచ్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 3న జుట్టు సరిగా లేదనే కారణంతో ఉపాధ్యాయులు అతడిని కొట్టారు. నాటి నుంచి హెచ్ఎంతో పాటు కొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు అతడిని మానసికంగా వేధిస్తున్నారని, తోటి విద్యార్థుల ముందు బ్యాగ్ వెతికించి అవమానించారని తల్లి తెలిపింది. దీంతో మనస్తాపం చెందిన బన్ను ఈ నెల 26న ఇంట్లో ఉరివేసుకున్నాడు. ఈ మేరకు ఎస్సై వీరప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు టౌన్: ఏలూరు రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలోని పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బిస్కెట్ కలర్ ప్యాంట్, పసుపు రంగు బనియన్ ధరించి ఉన్నాడు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఏలూరు సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉండి: ఖాతాదారుడి ప్రమేయం లేకుండా సేవింగ్స్ ఖాతా నుంచి రూ.1.25 లక్షలు మాయమైన సంఘటనపై మంగళవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యండగండికి చెందిన శృంగవృక్షం ఆంజనేయులు విస్సాకోడేరులో ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. ఆయనకు యండగండి యూనియన్ బ్యాంకులో ఖాతా ఉంది. ఈ ఏడాది మే 11న ఆయన ప్రమేయం లేకుండానే ఖాతా నుంచి రూ.1,25,295 డ్రా అయినట్లు గుర్తించాడు. బ్యాంకు అధికారులను ఆరా తీయగా ఇది ఆన్లైన్ లావాదేవీ అని, తమకేమీ సంబంధం లేదని సమాధానమిచ్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఉండి ఎస్సై మల్లికార్జునరావు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రిపుల్ఐటీల్లో పుస్తకాల కొరత
● విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ● నెల దాటినా పుస్తకాలు అందని వైనం నూజివీడు: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ట్రిపుల్ఐటీల పరిస్థితి దయనీయంగా మారింది. రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయ, ఒంగోలు క్యాంపస్లలో పాలన నానాటికీ దిగజారుతోంది. విద్యా సంవత్సరంలో భాగంగా పీయూసీ ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా ఇంతవరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయలేదు. తెలుగు, ఇంగ్లీషు, గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, బయాలజీ పుస్తకాలు లేకపోవడంతో నాలుగు క్యాంపస్లలోని 4,400 మంది పేద విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెల్ఫోన్లలోనే పాఠాలు.. ఉపాధ్యాయుల తిప్పలు పాఠాలు బోధించడానికి కనీసం అధ్యాపకుల వద్ద కూడా పుస్తకాలు లేని పరిస్థితి నెలకొంది. దీంతో కొందరు ఫ్యాకల్టీ సభ్యులు బయట షాపుల్లో సొంత డబ్బులతో పుస్తకాలు కొనుగోలు చేయగా, మరికొందరు సెల్ఫోన్లలో పీడీఎఫ్ మెటీరియల్ చూసి బోధిస్తున్నారు. విద్యార్థులకు కూడా ఈ పీడీఎఫ్లనే వాట్సాప్లలో పంపుతుండటంతో, గంటల తరబడి సెల్ఫోన్ స్క్రీన్లను చూస్తూ చదువుకోవడం కష్టంగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ల్యాప్టాప్ల స్థానంలో ఇంటర్ పుస్తకాలు ట్రిపుల్ఐటీల్లో 2008 నుంచి గతేడాది వరకు పీయూసీ ప్రథమ సంవత్సరం నుంచే ల్యాప్టాప్లు ఇచ్చి, డిజిటల్ కంటెంట్ ద్వారా బోధించేవారు. అయితే గతేడాది నుంచి ఈ విధానానికి స్వస్తి చెప్పి, ఇంటర్ పాఠ్యపుస్తకాలను పరిచయం చేశారు. ఆగస్టు 4 నుంచి మిడ్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, చేతిలో పుస్తకాలు లేక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మీడియాపై ఆంక్షలు ట్రిపుల్ఐటీలో నెలకొన్న లోపాలను, మెస్లలో నాసిరకం ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్న వైనాన్ని గత రెండు రోజులుగా ‘సాక్షి’లో ప్రత్యేక కథనాలు ప్రచురించడంతో ట్రిపుల్ఐటీ అధికారులు మంగళవారం మీడియాపై ఆంక్షలు విధించారు. లోపాలను సరిచేసుకోవాల్సిన ట్రిపుల్ఐటీ అధికారులు అవేమీ చేయకుండా లోపలికి రావాలంటే అనుమతి తీసుకోవాలని ప్రధాన గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ఉత్తర్వులు పంపారు. వీసీని కలిసేందుకు మంగళవారం విలేకరులు లోపలికి వెళ్లేందుకు అనుమతి కోసం రెండుసార్లు సెక్యూరిటీ సిబ్బంది ఫోన్ చేయగా రెండుసార్లు కూడా బిజీగా ఉన్నారంటూ లోపలికి వెళ్లడానికి అనుమతించలేదు. ప్రభుత్వ సంస్థ అయిన విద్యాసంస్థలోకి వెళ్లడానికి అనుమతులు తీసుకోవాలనడంపై ట్రిపుల్ఐటీ సిబ్బందే విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పట్టణంలోని టీడీపీకి చెందిన చోటామోటా నాయకులు మాత్రం ట్రిపుల్ఐటీలోకి ఇష్టారాజ్యంగా వెళ్తే వస్తూ ఉండటం గమనర్హం. -
1/70 చట్టాన్ని పరిరక్షించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): సుప్రీంకోర్టు వేదికగా 1/70 చట్టాన్ని రద్దు చేయడానికి జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఏజెన్సీ గిరిజన సంఘం, రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆదివాసులు భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎంఎస్ నాగరాజు మాట్లాడుతూ 1/70 చట్టం వచ్చి 56 సంవత్సరాలు గడుస్తున్నా పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆదివాసీల భూములు భూస్వామ్య, పెత్తందారీ శక్తుల చేతుల్లో బందీగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులు పోరాడి సాధించుకున్న భూములను కబ్జా చేసేందుకే కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. గతంలో జీవో నంబర్ 3ని ఏ విధంగా రద్దు చేయించారో, ఇప్పుడు అదే రీతిలో 1/70 చట్టాన్ని రద్దు చేయడానికి కుట్రలు పన్నుతున్నారని, వీటిని తిప్పికొట్టడానికి ఆదివాసీలంతా సమైక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి షేక్ బాషా, ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు కుంజం రామారావు, సహాయ కార్యదర్శి సవలం రాంబాబు తదితరులు ప్రసంగించారు. ధర్నా అనంతరం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో గిరిజన సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ వెట్రిసెల్వికి అందజేశారు. -
నేర నియంత్రణలో టెక్నాలజీ విప్లవం
కై కలూరు: ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ అంశంపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ నిరసనల ముసుగులో క్రిమినల్ రికార్డులున్న సంఘ విద్రోహ శక్తులు పోలీసులపై దాడులకు పాల్పడ్డాయి. ఆందోళనకారుల ముఖాలను గుర్తించేందుకు పోలీసులు అధునాతన ఫేషియల్ రికగ్నేషన్ టెక్నాలజీ (ఎఫ్ఆర్టీ)ని వినియోగించారు. ఈ సాంకేతికత ద్వారా హత్యలు, దోపిడీలు, కిడ్నాప్లు, అత్యాచారాలు, పోక్సో కేసులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి వివిధ తీవ్ర నేరాలకు సంబంధించి ఏకంగా 2,873 మంది నేరస్తులను గుర్తించడం విశేషం. నేర పరిశోధనలో టెక్నాలజీ ఎంతటి సంచలనాత్మక ఫలితాలను ఇస్తుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఏలూరు జిల్లాలో... ఇదే కోవలో ఏలూరు జిల్లా పోలీసులు నేరస్తులను పట్టుకోవడంలో, గుర్తించడంలో పరిశోధనల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. ఇటీవల ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో ‘ధార్ గ్యాంగ్’కు చెందిన ముగ్గురు సభ్యుల కదలికలను పోలీసులు గుర్తించారు. గత నెల 13న విశాఖపట్నం కంచరపాలెం పరిధిలో సంచరించిన ఈ ముఠా.. జూన్ 15న సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ మీదుగా ఏలూరు చేరుకున్నట్లు ఎఫ్ఆర్టీ టెక్నాలజీ ద్వారా పోలీసులు పక్కాగా గుర్తించి వారి పూర్తి వివరాలు, ఫొటోలను సేకరించారు. ఏఎన్పీఆర్ సహాయంతో పోలీసు వ్యవస్థకు ఏఐ ఆధారిత సాంకేతికత కొండంత అండగా నిలుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం రహదారులపై ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ (ఏఎన్పీఆర్) కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను గుర్తించి, దానికి సంబంధించిన సమాచారాన్ని అలారం రూపంలో సమీప పోలీసులకు చేరవేస్తున్నాయి. ఇటీవల కై కలూరులో చోరీకి గురైన బైక్ను పెద్ద తిరుపతిలో పట్టుకోవడంలో ఈ ఏఎన్పీఆర్ టెక్నాలజీయే కీలక పాత్ర పోషించింది. నేరస్తుల ముఖచిత్రాలను ఎఫ్ఆర్ఎస్లో నమోదు చేయడం వల్ల దేశంలో ఎక్కడైనా వారి కదలికలను గుర్తించి సమీప పోలీసు స్టేషన్కు సమాచారం అందే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. నేటి కాలంలో గ్రామాల్లోని ఒక్కో సీసీ కెమెరా ఇద్దరు కానిస్టేబుళ్లతో సమానంగా అప్రమత్తంగా పనిచేస్తోంది. ధర్మా యాప్తో కేసుల పరిష్కారం ఏలూరు జిల్లా ఎస్పీ కే. ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో రూపొందించిన ధర్మా (డిజిటల్ హాలిస్టిక్ ఏఐ డ్త్రెవెన్ రెస్సాన్స్ మేనేజ్మెంట్ అసిస్టెంట్) యాప్ అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఈ ఏఐ ఆధారిత యాప్ ద్వారా నేరాలకు సంబంధించిన ఫొటోలు, సాక్ష్యాలు, ఛార్జ్షీట్లను ఖచ్చితంగా నిర్ధారించుకునే అవకాశం లభిస్తోంది. గత నెలలో 20 శాతం కేసుల పరిష్కారానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడిందని ఐజీ జీవీజీ అశోక్కుమార్ సైతం ప్రత్యేకంగా అభినందించారు. ‘ఆపరేషన్ ట్రేస్’ వంటి కార్యక్రమాల్లో ఆధార్తో పాటు ఇతర డేటా, ఫేషియల్ రికగ్నేషన్ను జోడించడం ద్వారా తప్పిపోయిన మహిళలు, పిల్లలను అత్యంత కచ్చితత్వంతో నేడు వెతికి పట్టుకోగలుగుతున్నారు. నేరస్తుల గుర్తింపులో నూతన సాంకేతికత ఫలితాలిస్తున్న ఫేషియల్ రికగ్నేషన్ టెక్నాలజీ గ్రామాల్లో విస్తరించిన ఏఎన్పీఆర్, సీసీ కెమెరాలు ఏలూరు జిల్లాలో ధర్మా యాప్తో కేసుల పరిష్కారం పోలీసు శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది. ఈ విషయంలో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. అమరావతిలో 360 డిగ్రీల సెంట్రల్ సిస్టం అందుబాటులోకి వచ్చింది. అన్ని ప్రాంతాల సీసీ కెమెరాలను దీనికి అనుసంధానం చేయడం వల్ల నేరస్తులను పట్టుకోవడం మరింత సులభమైంది. నేరాల అదుపు కోసం ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. – వి.రవికుమార్, కై కలూరు రూరల్ సర్కిల్ సీఐ -
భార్యను చంపిన భర్తకు రిమాండ్
ఉండి: మద్యం డబ్బుల కోసం భార్యను హత్య చేసిన భర్త మంగం మురళీని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై మల్లికార్జునరావు మంగళవారం విలేకరులకు తెలిపారు. ఈ నెల 26న ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడిని శనివారం ఉండి నిమ్మలపేట పరిసర ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారని వెల్లడించారు. ఉండి: అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం చెరుకువాడ గ్రామానికి చెందిన హర్షితకు 2020లో హైదరాబాద్కు చెందిన కట్రిశెట్టి అఖిలేష్తో వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. కాగా ఇటీవల అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని హర్షిత పోలీసులను ఆశ్రయించింది. భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణంలోని శ్రీ మావుళ్లమ్మ వారి శాశ్వత నిత్యాన్నప్రసాద వితరణకు మంగళవారం భీమవరం బిల్డర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గన్నాబత్తుల శ్రీనివాస్, వడుపు గోపి, గ్రంధి రవితేజ, యర్రంశెట్టి నాగేశ్వరావు, లీలా కృష్ణ తదితర మిత్ర బృందం 23 మంది సంయుక్తంగా రూ.3,15,000 విరాళంగా అందజేశారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ దాతలకు శేషవస్త్రం, ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ, చైర్మన్ బొండాడ నాగ భూషణం తదితరుల ప్రసాదం, ఫొటో అందజేశారు. రు. శ్రీవారి ఆలయానికి రూ.2.32 లక్షల విరాళం కాళ్ల: మండలంలోని కాళ్లకూరులో ఉన్న స్వయంభూ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులుకు భక్తులు విరాళాలు అందించినట్లు దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈఓ మోకా అరుణ్ కుమార్ మంగళవారం తెలిపారు. దొడ్డనపూడికి చెందిన దివంగత యిర్రింకి సీతారామయ్య–సూర్యనాగరత్నం, దివంగత కొల్లి వెంకటసుబ్బారావు–రామసుందరమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు మూలస్వామి, నాగబాల త్రిపురసుందరి దంపతులు అన్నదాన భవనానికి రూ.1,16,667, మాడ వీధుల విస్తరణ కోసం స్థలం కొనుగోలుకు రూ.1,16,667 అందించినట్లు ఈఓ తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేక దర్శనం కల్పించారు. -
లక్ష్యానికి దూరం.. మిషన్ సక్షం
బుట్టాయగూడెం: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల్లో చదువులపై ఆసక్తి పెంచి, పోషకాహారం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మిషన్ సక్షం’ అంగన్వాడీ పథకం క్షేత్రస్థాయిలో తూతూమంత్రంగా మారుతోందని పలువురు విమర్శిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన ఈ పథకం తన లక్ష్యాలను చేరుకోలేకపోతోందని నిపుణులు అంటున్నారు. పథకం అమలును ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వాస్తవాలు వెలుగు చూసి, పథకం తన లక్ష్యాన్ని సాధిస్తుందని పలువురు కోరుతున్నారు. టీవీలు ఇచ్చారు.. నెట్ కనెక్షన్లు లేవు మిషన్ సక్షం అంగన్వాడీ కేంద్రాలుగా ఎంపిక చేసిన చోట విద్యార్థులకు డిజిటల్ పాఠాలు బోధించే విధంగా ప్రభుత్వం టీవీలను ఇచ్చింది. అయితే ఆ టీవీలకు కేబుల్ కనెక్షన్లు ఇవ్వలేదు. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు సెల్ఫోన్ డేటా, పెన్డ్రైవ్ల సహాయంతో టీవీల్లో వీడియోలను పిల్లలకు చూపిస్తూ విద్యాబోధన చేస్తున్నారు. మారుమూల గ్రామాల్లో సెల్ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేకపోవడంతో కేవలం పెన్డ్రైవ్లతోనే పాఠాలు బోధించే పరిస్థితి నెలకొంది. అంగన్వాడీ కార్యకర్తలు తమ సొంత సెల్ఫోన్లను రీచార్జ్ చేసుకుని ఇంటర్నెట్ వినియోగించి బోధించడం భారంగా మారుతోందని ఆరోపిస్తున్నారు. నీళ్ల కోసం అవస్థలు సక్షం అంగన్వాడీలుగా ఎంపిక చేసిన కేంద్రాల్లో పిల్లలకు సురక్షిత మంచినీరు అందించడం కోసం వాటర్ ఫిల్టర్లను అందజేశారు. అయితే అవి చాలా చోట్ల నిరుపయోగంగానే ఉన్నాయి. నీటి సదుపాయం కోసం ఏర్పాటు చేసిన మోటర్లు కొన్నిచోట్ల పాడైపోగా, మరికొన్ని చోట్ల అసలు మోటర్లే బిగించకపోవడంతో చిన్నారులు మంచినీటి కోసం చేతిపంపుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి టీవీలకు కేబుల్ కనెక్షన్లు ఏర్పాటు చేయించడంతోపాటు, పాడైపోయిన మోటర్లకు మరమ్మతులు చేయించి, నిరుపయోగంగా ఉన్నవాటిని వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. 69 కేంద్రాల ఎంపిక బుట్టాయగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 189 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా అందులో 69 కేంద్రాలను ప్రభుత్వం మిషన్ సక్షం అంగన్వాడీ కేంద్రాలుగా ఎంపిక చేసింది. ఆయా కేంద్రాల్లో చదువుతున్న పిల్లలకు నాణ్యమైన విద్య, ఆరోగ్యం, పోషణ అందించడంతోపాటు క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రతి కేంద్రానికి ఒక టీవీ, వాటర్ ఫిల్టర్, బ్లాంకెట్లు, మెస్ స్టాండ్, ఆట వస్తువులు, 15 పిల్లల కుర్చీలు, 2 పెద్ద కుర్చీలు ఇచ్చారు. అలాగే వాటర్ ట్యాంక్ ఏర్పాటుతోపాటు మోటర్ కూడా బిగించి మంచినీటి సదుపాయం కల్పించాలని పథకంలో పొందుపరిచారు. అయితే, ఎంపికై న అంగన్వాడీ కేంద్రాల్లో 60 శాతానికి పైగా ఈ పథకం నీరుగారిపోయేలా ఉందని అటు గ్రామస్తులు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎంపికై న అన్ని కేంద్రాల్లో పథకం సక్రమంగా అమలయ్యేలా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో టీవీలకు లేని నెట్ కనెక్షన్ పెన్ డ్రైవ్లు, సెల్ఫోన్ డేటాలతో వీడియోలు చూపిస్తున్న వైనం సురక్షిత నీటి కోసం విద్యార్థుల అవస్థలు తూతూమంత్రంగా పథకం అమలు -
లోకేష్ రాజీనామా చేయాల్సిందే
రహదారి ప్రమాదాలు నివారించాలి జిల్లాలో అధికంగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీ అధికారులను ఆదేశించారు. 8లో u● ఏలూరులో వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన సంఘాల ఆందోళన ● డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మిషన్ సక్షం అంగన్వాడీ’ పథకం క్షేత్రస్థాయిలో తూతూమంత్రంగా మారుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 8లో uబుధవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2026ఏలూరు టౌన్: ఏపీలో మెగా డీఎస్సీ –25లో అంతులేని అక్రమాలు, అవినీతి, కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగ నేతలు, పార్టీ నేతలు, శ్రేణులు రోడ్డెక్కాయి. వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు కామిరెడ్డి నాని, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పాతినవలస రాజేష్ ఆధ్వర్యంలో ఏలూరులో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై నాయకత్వం వహించారు. పార్టీ జిల్లా కార్యాలయం నుంచి జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చిన పార్టీ నేతలు, శ్రేణులతో కలిసి ఏలూరు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా ర్యాలీగా ఏలూరు పాతబస్టాండ్ సెంటర్కు చేరుకున్నారు. బీఆర్ అంబేద్కర్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో.. ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, కై కలూరు పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్బాబు, చింతలపూడి పరిశీలకుడు దాసరి రమేష్, దెందులూరు నియోజకవర్గ నేత వెంకటేశ్వరరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సొంగ సందీప్, వైఎస్సార్సీపీ నాయకులు శెట్టి రాజా, కందుల దినేష్ రెడ్డి, జాన్ గురునాథ్, ఇంజేటి నీలిమ, ఆళ్ళ సతీష్ చౌదరి, నెరుసు చిరంజీవి, తేరా ఆనంద్, పల్లి శ్రీనివాస్, చిక్కాల దుర్గాప్రసాద్, భోగిశెట్టి పార్వతి, స్టాన్లీబాబు, పుప్పాల గోపి, చప్పిడి వెంకన్న, పసుపులేటి దినేష్, గంటా సాయి, కాశీ, మిరియాల దిలీప్, చార్లెస్, సింహాద్రి చందు, కిట్టు, ఉదయభాస్కర్ రాజు, తుమరాడ స్రవంతి, వేదకుమారి, పల్లెం ప్రసాద్, గొల్ల కిరణ్, కట్టా ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు. ఏలూరులో వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి పాతబస్టాండ్ సెంటరుకు ర్యాలీగా వస్తున్న పార్టీ నాయకులు, యువత, విద్యార్థులు పాతబస్టాండ్ సెంటరులో నిరసన తెలుపుతున్న జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఉంగుటూరు సమన్వయకర్త వాసుబాబు, ఏలూరు సమన్వయకర్త జయప్రకాష్ తదితరులు -
ఏలూరులో పోలీసుల అత్యుత్సాహం
వైఎస్సార్సీపీ జిల్లా యువజన అధ్యక్షుడు నానికి నోటీసులు ఏలూరు టౌన్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో డీఎస్సీ–25 అవినీతిపై పార్టీ జిల్లా యువజన అధ్యక్షులు కామిరెడ్డి నాని ఆధ్వర్యంలో ఏలూరులో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఇదే సందర్భంలో ఏలూరు టూటౌన్ పోలీసులు కామిరెడ్డి నానికి పార్టీ కార్యాలయం వద్ద నోటీసులు జారీ చేశారు. ర్యాలీకి అనుమతి లేదనీ, కాదని చేస్తే చట్టం మేరకు చర్యలు తప్పవంటూ నోటీసు అందజేశారు. మంత్రి లోకేష్ రాజీనామా, సీబీఐ దర్యాప్తు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగడంతో ఇప్పటికే కూటమి ప్రభుత్వ వైఫల్యంతో ప్రజల్లో విశ్వాసం కోల్పోగా, మరింత సన్నగిల్లుతుందనే భయంతో పోలీసులను ఉసిగొలిపారని ప్రజలు విమర్శిస్తున్నారు. టీడీపీ నేతల బెదిరింపులకు భయపడేది లేదనీ, యువత, నిరుద్యోగులు, విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తున్నామని, ప్రజల కోసం దేనికై నా సిద్దమని యువజన విభాగం జిల్లా అధ్యక్షులు నాని స్పష్టం చేశారు. -
ట్రిపుల్ఐటీలో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు
నూజివీడు: ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ట్రిపుల్ఐటీల్లో అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాము ఆడిందే ఆట, పాడిందే పాట అన్న చందంగా అడ్మినిస్ట్రేషన్లో ఉన్న యూనివర్సిటీ అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తమను సంప్రదించకుండా ఇష్టారాజ్యంగా వేస్తున్న డిప్యుటేషన్లపై ఫ్యాకల్టీలో తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలుండగా మిగులు అధ్యాపకులు ఎక్కడైనా ఉంటే వారిని అవసరమైన చోటకు పంపుతారు. సాధారణంగా ఏ ప్రభుత్వ శాఖలోనైనా, పాఠశాలల్లోనైనా, కళాశాలల్లోనైనా జరిగేది ఇదే. ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా డిప్యుటేషన్లు వేస్తున్నారు. అక్కడ అవసరం ఉన్నప్పటికీ శ్రీకాకుళం ట్రిపుల్ఐటీలో పనిచేసే ఈసీఈ, సీఎస్ఈ బ్రాంచిలకు ముగ్గురు మహిళా ఫ్యాకల్టీని నూజివీడు ట్రిపుల్ ఐటీకి గతేడాది డిప్యుటేషన్పై నియమించారు. వీరి స్థానంలో ఎవరో ఒకరికి వర్క్లోడు ఎక్కువ వేసి పని చేయిస్తున్నారు. వీరిలో ఇద్దరు ఫ్యాకల్టీని అకడమిక్ ఇయర్ ప్రారంభంలో ఒంగోలు ట్రిపుల్ ఐటీకి డిప్యుటేషన్పై పంపారు. వారిరువురు పదిరోజులు కూడా అక్కడ విధులు నిర్వహించకుండా తిరిగి నూజివీడు ట్రిపుల్ఐటీకి వచ్చేశారు. దీని వెనుక ఉన్న మతలబు ఏమిటో నూజివీడు ట్రిపుల్ ఐటీకి అంతుబట్టడం లేదు. నలుగురు ఫ్యాకల్టీకి డిప్యుటేషన్ ఉత్తర్వులు ఈ వ్యవహారంపై ట్రిపుల్ఐటీలోని అధ్యాపకుల మధ్య చర్చ సాగుతుండగానే యూనివర్సిటీ అధికారులు ఈసీఈ చెందిన నలుగురు పురుష ఫ్యాకల్టీని ఒంగోలు ట్రిపుల్ఐటీకి డిప్యుటేషన్పై నియమించారు. నూజివీడు ట్రిపుల్ఐటీలో ఈ నలుగురు ఫ్యాకల్టీకి సరిపడా వర్కులోడు ఉన్నప్పటికీ, మూడు వారాలుగా క్లాసులకు వెళ్లి బోధన చేస్తున్న సమయంలో ఒంగోలు ట్రిపుల్ఐటీకి డిప్యుటేషన్పై వెళ్లాలంటూ ఉత్తర్వులు ఇవ్వడంపై స్థానిక ఫ్యాకల్టీలో విస్మయం వ్యక్తమవుతోంది. ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ఫ్యాకల్టీ లోటు ఉన్నప్పుడు అక్కడ నియమించిన ఇద్దరు మహిళా ఫ్యాకల్టీని 10 రోజులు గడవకుండానే తిరిగి నూజివీడుకు డిప్యుటేషన్పై ఎందుకు పంపారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి యూనివర్శిటీ అధికారులు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నలుగురు ఫ్యాకల్టీలో చుండ్రు ప్రవీణ్కుమార్, వెంపటి శేఖర్ను మొదటి సెమిస్టర్కు, పున్నపు సురేష్, లంకపల్లి బాబూరావులను రెండో సెమిస్టర్కు ఒంగోలు వెళ్లాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చారు. ఇలా అనేక నిర్ణయాలు ఇష్టారాజ్యంగా తీసుకుంటూ ఆర్జీయూకేటీ ఎప్పుడూ వివాదాల్లో ఉండేలా చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల ట్రిపుల్ ఐటీల ప్రతిష్టకు భంగం కలిగే పరిస్థితులు నెలకొంటాయనే ఆందోళన ఫ్యాకల్టీలో వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా ఆర్జీయూకేటీ చాన్సలర్ పూర్తిస్థాయిలో దృష్టి సారించి వివాదాస్పద నిర్ణయాలకు ఫుల్స్టాప్ పెట్టాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.డిప్యుటేషన్లపై తీవ్ర వ్యతిరేకత -
చట్టాల రక్షణ కోసం ఐటీడీఏ ముట్టడి
బుట్టాయగూడెం: ఏజెన్సీలోని ప్రజల సమస్యలను పరిష్కరించాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, జీఓ నంబర్ 3 తరహా జీఓను తీసుకువస్తామన్న ముఖ్యమంత్రి హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సోమవారం ఐటీడీఏను ముట్టడించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శులు పోరంట్ల శ్రీనివాస్, కారం రాఘవలు మాట్లాడుతూ.. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన చట్టాలను, హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1/70, పీసా చట్టాల అమలు విషయంలో ప్రభుత్వ యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. ఏజెన్సీలో విద్య, వైద్యం, అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. మోతుగూడెంకు చెందిన చిన్నారి రిత్విక అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే సరైన వైద్యం అందక మృతిచెందిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను యూపీ పాఠశాలలుగా మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పులిరామన్నగూడెం, రెడ్డికోపల్లి, ఇటుకులకోట, లంకపాకల పాఠశాలలను పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఐటీడీఏ ఏపీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్. రామ్మోహన్రావు, పీఓఎల్ నాయకులు తగరం బాబూరావు, పీఓడబ్ల్యూ నాయకురాలు వెట్టి భారతి, న్యాయవాది యు.ఏసుబాబు, పీడీఎస్యూ నాయకులు బన్నే వినోద్, ఈ.భూషణం తదితరులు పాల్గొన్నారు. -
విలేకరి ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్ట్
తాడేపల్లిగూడెం అర్బన్: యూట్యూబ్ చానల్ జర్నలిస్ట్ ఉర్ల బాలకృష్ణ వర్ధన్ ఆత్మహత్యకు కారణమైన నిందితులను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ రవిచంద్ర బుధవారం నిర్వహించిన విలేకరులతో మాట్లాడుతూ.. బాలకృష్ణ వర్ధన్ సెల్ఫీ వీడియో ఆధారంగా నిందితులు తమ్మిశెట్టి సురేష్, దేవా శివలను అరెస్టు చేశామన్నారు. గతంలో రంగా సురేష్ నిర్వహిస్తున్న యూట్యూబ్ చానల్లో వర్ధన్ రిపోర్టర్గా చేశాడన్నారు. అతనికి నెలవారీ వేతనం చెల్లించకపోగా... వేతనం ఇవ్వమని అడిగితే కులం పేరుతో దూషించినట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో దూషించుకోవడం వల్ల మనస్తాపం చెంది వర్ధన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని, నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ చెప్పారు. -
మెట్ట కొండకు తూట్లు
కొయ్యలగూడెం: రాజవరం (గంగవరం) మెట్ట కొండపై నుంచి గ్రావెల్ అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. సర్వే నంబరు 207 కొండగుట్టను జేసీబీలు, టిప్పర్ లారీలు పెట్టి అక్రమంగా తరలిస్తున్నారు. సుమారు ఏడాదిన్నర కిందట డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించి అక్రమ గ్రావెల్ తవ్వకాలను నిరోధించాలని ఆదేశించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ప్రజలు పేర్కొంటున్నారు. భారీగా కొండను తవ్వడం పర్యావరణానికి చేటుగా మారిందని వాపోతున్నారు. అధికారులు పలుమార్లు దాడులు చేసి అక్రమ రవాణాపై చర్యలు తీసుకున్నప్పటికీ, అవి నామమాత్రమే.. రాత్రి వేళల్లో గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నా మైనింగ్ శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదని ఆరోపిస్తున్నారు. సుమారు వెయ్యి టిప్పర్లకు పైగా గ్రావెల్ మట్టి రవాణా అయిందని, పరిసర ప్రాంతాలలోని టిప్పర్లు, జేసీబీల యజమానులే ఈ గ్రావెల్ దందాకు మూలకారణమని అంటున్నారు. గంగవరం, రాజవరం గ్రామాలు అక్రమాలకు అడ్డాగా నిలిచాయనేది వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోందన్నారు. పొట్టి మెట్ట కొండగా పిలవబడే ప్రాంతం నుంచి కేవలం రెండు సంవత్సరాల కాలంలో రూ. 10 కోట్లకు పైగా విలువైన గ్రావెల్ తవ్వకాలు జరిగాయన్నారు. వేళల్లో అక్రమ తోలకాల వల్ల అంతర్గత రోడ్లు అధ్వానంగా మారుతున్నాయని, నూతనంగా నిర్మించిన బీటీ రోడ్లు సైతం గోతులమయమయ్యాయని ప్రజలు పేర్కొంటున్నారు. గ్రావెల్ తోలకాలు ఇంత పెద్ద ఎత్తున కొనసాగుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోకపోగా, తాము ఏవిధమైన చర్యలు తీసుకోలేకపోతున్నామని ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తుండటంపై ప్రభుత్వ శాఖల పట్ల విశ్వసనీయత కోల్పోతున్నామని ప్రజలు తెలిపారు. అధికారుల చర్యలు అక్రమ తోలకాలను నిరోధించలేనప్పుడు, ప్రభుత్వ తీరును ప్రశ్నించడంతో పాటు అక్రమార్కుల దందాకు వెనుక ఉండి కొమ్ముకాస్తున్నది ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా నామమాత్రపు చర్యలు కాకుండా కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరమని ప్రజలు భావిస్తున్నారు. లింగపాలెం మండలంలో లింగపాలెం: లింగపాలెం మండలంలోని వివిధ చెరువుల నుంచి మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మండలంలోని సుమారు 10 గ్రామ పంచాయతీల పరిధిలోని చెరువుల నుంచి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే జేసీబీలు, ట్రాక్టర్లు, టిప్పర్లతో భారీగా మట్టిని తరలిస్తున్నారు. ముఖ్యంగా పాశ్చానగరం చెరువుతో పాటు ఇతర ప్రాంతాల్లో నిత్యం అక్రమ రవాణా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువుల్లో ఇష్టారాజ్యంగా పెద్ద పెద్ద గోతులు తీస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, ట్రాక్టర్లు బయటకు వెళ్లేందుకు చెరువు గట్లను నరికివేసి బాటలు ఏర్పాటు చేస్తుండటంతో, వర్షాలు వచ్చినప్పుడు చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు. అక్రమ మట్టి తవ్వకాలపై కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారుల తనిఖీలు లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడటమే కాకుండా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని స్థానికులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
పిడుగుపాటుకు పశువులు మృతి
బుట్టాయగూడెం: పొలంలో కట్టేసిన మూడు గిత్తలు, రెండు ఆవులపై ఆదివారం రాత్రి పిడుగుపడి ఐదు పశువులు మృతి చెందిన సంఘటన బుట్టాయగూడెం మండలం మారుమూల గ్రామమైన ఇనుమూరులో జరిగింది. బాధిత రైతు చీమల ముత్యాలరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మేతకు వెళ్లి తిరిగొచ్చిన ఐదు పశువులను గ్రామ సమీపంలోని తమకున్న ఎకరం పొలం మధ్యలో కట్టేసినట్లు తెలిపారు. అర్ధరాత్రి తీవ్రమైన ఉరుములు, మెరుపులతో వర్షం వచ్చిందని చెప్పారు. తెల్లవారుజామున పాలు తీసేందుకు వెళ్లి చూడగా అవన్నీ మృతిచెంది ఉన్నట్లు పేర్కొన్నారు. ముత్యాలరావుకు చెందిన రెండు గిత్తలు, ఒక ఆవు, పాయం పాపారావుకు చెందిన పాలిచ్చే ఆవు, కారం సింగరాజుకు చెందిన రెండు గిత్తలు మృతి చెందినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ... పిడుగుపాటుతో మృతి చెందిన పశువుల యజమానులకు ఒక్కొక్క పశువుకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
విద్యుత్ షాక్తో వ్యక్తి దుర్మరణం
టి.నరసాపురం: విద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషాద సంఘటన ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెడ్లం పంచాయతీ శ్రీరామవరం గ్రామానికి చెందిన చవల అప్పారావు (43) సోమవారం ఉదయం తాను కౌలుకు తీసుకున్న ఆయిల్పామ్ తోటలోని మొక్కలకు నీళ్లు పెడుతున్నాడు. ఈ క్రమంలో పాత బోరు నుంచి కొత్త బోరు వరకు వేసిన కేబుల్ వైరు నీళ్లు పెట్టడానికి అడ్డురావడంతో, దానిని ఒక పైపు ముక్కతో పక్కకు తప్పించేందుకు ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు ఆ కేబుల్ వైరు, ప్లాస్టిక్ ముక్క చాతీపై పడటంతో తీవ్ర విద్యుత్ షాక్కు గురై అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు టి.నరసాపురం ఎస్ఐ ఎం.జయబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ద్వారకాతిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు తన వద్ద ఉన్న రూ.లక్ష నగదును పోగొట్టుకున్న సంఘటన ద్వారకాతిరుమలలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. ఎస్సై టి. సుధీర్ కథనం ప్రకారం... ఏలూరు జిల్లా మాదేపల్లి గ్రామానికి చెందిన గూరుగుబెల్లి రమణమూర్తి కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 25న భార్యతో కలిసి శ్రీవారి దర్శనార్థం ద్వారకాతిరుమలకు వచ్చాడు. ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో ఇంట్లో ఉన్న రూ.లక్ష నగదును తన ప్యాంటు జేబులో పెట్టుకుని తీసుకొచ్చాడు. శ్రీవారి దర్శనం అనంతరం అన్నదాన భవనంలో ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ప్యాంటు జేబులో నగదు లేదని గుర్తించి, గుర్తుతెలియని వ్యక్తులు జేబులోని డబ్బును దొంగిలించినట్లు సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధీర్ తెలిపారు. -
పెరుగుతున్న గోదావరి
పోలవరం రూరల్ : గోదావరి వరద ఉధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో ఉప నదుల నీటితో పాటు శబరి నీరు కూడా నదిలోకి చేరడంతో వరద ప్రవాహం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 28.650 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్వే 48 గేట్ల నుంచి దిగువకు 1.87 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతోంది. దిగువన వరద ప్ర వాహం పెరుగుతూ ఇసుక తిన్నెలను ముంచుకుంటూ ఉధృతంగా ప్రవహిస్తోంది. పోలవరం రూరల్: పాపికొండల అభయారణ్య ప్రాంతం నుంచి పెద్దపులి మైదాన ప్రాంతానికి చేరుకుంది. కొన్ని రోజులుగా గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని శివగిరి, కొరుటూరు అటవీ ప్రాంతంలో సంచరించింది. ఆదివారం పోలవరం మండలంలోని ఇటికిలకోట, పేడ్రా ల, కుంకాల గ్రామాల మీదుగా ఎల్ఎన్డీపేట గ్రామం చేరుకుంది. గ్రామ శివారులోని చెరువు గట్టు వద్ద పెద్ద పులి పాదముద్రలను సో మవారం గ్రామస్తులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. రేంజర్ ఎస్కే వలీ సిబ్బందితో కలిసి వెళ్లి పులి సంచరించిన ప్రదేశాలను పరిశీలించారు. పులి పాదముద్రలను గుర్తించినట్టు ఆయన చెప్పారు. అక్కడి నుంచి గోపాలపురం మండలంలోని సాగి పాడు, నందిగూడెం, గుడ్డిగూడెం ప్రాంతాలకు వెళ్లినట్లు పులికి అమర్చిన రేడియో సిగ్నల్స్ ద్వారా గుర్తించినట్టు రేంజర్ తెలిపారు. పోలవరం రూరల్: పోలవరం డీఎస్పీగా కె.జయకృష్ణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇటీవల గ్రూప్–1 అధికారి గా ఎంపికై న తర్వాత తొలిసారిగా పోలవరం డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. మూడు నెలల క్రితం ఇక్కడ డీఎస్పీగా పనిచేసిన వెంకటేశ్వరరావు ఉద్యోగ విరమణ చేశారు. అనంతరం ఇక్కడ డీఎస్పీలుగా ఇన్చార్జిలు వ్యవహరించారు. డీఎస్పీ జయకృష్ణ బాద్యతలు స్వీకరించడంతో పోలీసు సేవలు మరింత అందుబాటులోకి చేరుకున్నాయి. దెందులూరు: ఏరువాక కేంద్రంలో విస్తరణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ ఫణికుమార్కు ఉత్తమ విస్తరణ శాస్త్రవేత్త అవార్డు లభించింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (బాపట్ల) వ్యవసాయ కళాశాలలో గవర్నర్ జస్టిస్ మహమ్మద్ నజీర్ ఆయనకు అ వార్డు అందించి సత్కరించారు. ఏరువాక కేంద్రం ఉద్యోగులు, వ్యవసాయశాఖ అధికారులు ఫణికుమార్ను అభినందించారు. పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో లోక కల్యాణార్థం వరుణ జ్వలాభిషేకం చేయనున్నట్టు ఆలయ ఈఓ ముచ్చర్ల శ్రీనివాసరావు తెలిపారు. వచ్చేనెల 9న ఉదయం 9 గంటల నుంచి 108 కలశాలతో జ్వలాభిషేకం నిర్వహిస్తామన్నారు. 10న ఉదయం 6 గంటల నుంచి 16 మంది రుత్వికులతో అభిషేకాలు, వరుణ జ్వాలాభిషేక మంత్ర పుష్పం ఏర్పాటుచేస్తామని చెప్పారు. -
అడవి పులికింత
బుట్టాయగూడెం: పెరుగుతున్న పులుల గాండ్రింపులతో అడవి తల్లి పులకిస్తోంది. నడకలో రాజసం, వేటలో గాంభీర్యంతో అడవికి రారాజుగా వెలుగొందే పెద్ద పులుల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతుండటం జీవ వైవిధ్యానికి శుభపరిణామం. ప్రభుత్వాలు తీసుకుంటున్న సంరక్షణా చర్యలు, ప్రజల్లో పెరిగిన అవగాహన వల్ల పులుల సంతతి వృద్ధి చెందుతోంది. నల్లమలతో పాటు ఏలూరు జిల్లాలోని పాపికొండలు అభయారణ్యంలో పులుల కదలికలు గణనీయంగా పెరిగాయి. విస్తరించిన అభయారణ్యం.. ట్రాప్ కెమెరాలకు చిక్కిన జాడలు ఏలూరు, అల్లూరి, భద్రాద్రి జిల్లాల సరిహద్దుల్లోని పాపికొండల అభయారణ్యం మొదట్లో 590 హెక్టార్ల పరిధిలో మాత్రమే ఉండేది. 2008లో దీనిని వన్యప్రాణి అభయారణ్యంగా గుర్తించారు. ఆ తర్వాత దీనిని జాతీయ పార్క్గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం విస్తీర్ణాన్ని 1,12,500 హెక్టార్లకు (10,12,86 చ.కి.మీ) పెంచింది. ఈ ప్రాంతంలో 2009–10 కాలంలో పులుల అడుగుజాడలు, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వాటి గాండ్రింపులు నమోదయ్యాయి. బుట్టాయగూడెం మండలం ఇనుమూరు, చింతలగూడెం, అంతర్వేదిగూడెం, అటవీ ప్రాంతంలో పులుల అడుగులను ఫా రెస్టు అధికారులు గుర్తించారు. 2022 గణనలో ఇ క్కడి ట్రాప్ కెమెరాలకు పులుల చిత్రాలు చిక్కాయి. ప్రస్తుతం ఈ అభయారణ్యంలో నాలుగుకు పైగా పెద్ద పులులు, ఐదుకు పైగా చిరుత పులులు ఉన్న ట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 2026 జనవరిలో నిర్వహించిన గణన వివరాలను అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అధికారికంగా వెల్లడించే అవకాశముంది. పులుల సంరక్షణ అందరి బాధ్యత మానవుని దురాశ, అటవీ విస్తీర్ణం తగ్గడం వల్ల పులుల మనుగడ ప్రమాదంలో పడుతోందని వరల్డ్ వైడ్లైఫ్ గణాంకాలు చెబుతున్నాయి. పులుల సంరక్షణపై అవగాహన పెంచేందుకు 2010లో ర ష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ టైగర్ సమ్మిట్ నిర్ణయం మేరకు ప్రతి ఏటా జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి పులులను సంరక్షించుకోవడం మనందరి బాధ్యత. జీవ వైవిధ్యం.. పులులే ఆధారం పాపికొండల అభయారణ్యంలో పులి గాండ్రింపులు పెరుగుతున్న పులుల సంఖ్య అధికారుల చర్యలు, ప్రజల్లో చైతన్యంతో స్వేచ్ఛగా సంచారం పులి సంరక్షణ అందరి బాధ్యత అంటున్న అటవీ అధికారులు రేపు అంతర్జాతీయ పులుల దినోత్సవం స్వభావం.. జీవనకాలం : పులులు సాధారణంగా ఒంటరిగా జీవిస్తాయి. వీటి జీవితకాలం 18 నుంచి 20 ఏళ్లు. ఇవి రోజుకు దాదాపు 25 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. టెరిటరీ (సంచార పరిధి): ఆడ పులి తన నివాస స్థావరంగా 20 చదరపు కిలోమీటర్ల పరిధిని, మగ పులి 60 నుంచి 100 చదరపు కిలోమీటర్ల పరిధిని ఎంచుకుంటాయి. చెట్ల మొదళ్లపై గోళ్లతో గీరి, మూత్రం ద్వారా తమ సరిహద్దులను గుర్తుంచుకుంటాయి. వేట : పులి ఒకసారి వేటాడితే మళ్లీ వారం రోజుల వరకు వేట జోలికి వెళ్లదు. సంతానోత్పత్తి : నవంబర్–ఏప్రిల్ మధ్య కాలం పులుల పునరుత్పత్తికి అనుకూలం. గర్భధారణ సమయం 93 నుంచి 113 రోజులు (సుమారు 16 వారాలు). ఆడపులి ఒకేసారి 2 నుంచి 3 కూనలకు జన్మనిస్తుంది. పులి పిల్లలు 3 నుంచి 4 ఏళ్ల వరకు తల్లి వద్దే వేట, ఈత నేర్చుకుంటాయి. ఆ తర్వాత మగ పులులు తల్లి నుంచి వేరుపడతాయి. -
ఫీజు బకాయిల కోసం గర్జన
ఏలూరు (ఆర్ఆర్పేట) : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, జీఓ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల విద్యార్థి సమాఖ్య (పీఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. జిల్లా నాయకులు పి.శివశంకర్, టి.ఉదయ్కుమార్ మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మెస్ ఛార్జీలను పెంచాలని కోరారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో విఫలమై, పేపర్ లీకేజీలకు కారణమవుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని పూర్తిగా రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలన్నారు. నీట్ పరీక్షలనుయాజమాన్యాలకే కాకుండా, ఆయా రాష్ట్రాలే నిర్వహించుకునేలా వెసులుబాటు కల్పించాలన్నారు. నీట్ పేపర్ లీకేజీల వల్ల ఆత్మహత్య చేసుకున్న 120 మంది విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలి. విద్యావ్యవస్థలో ప్రభుత్వాల తరఫున జవాబుదారీతనం ఉండాలని స్పష్టం చేశారు. ప్రగతి నారీ సంఘం జిల్లా కార్యదర్శి జి.శారద తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ పీజీఆర్ఎస్కు 62 ఫిర్యాదులు
ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రజల సమస్యలను త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ అన్నారు. ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఆర్)లో అదనపు ఎస్పీ (అడ్మిన్) వై.ప్రసాదరావుతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకుని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. మొత్తంగా 62 ఫిర్యాదులు అందాయని, వీటిలో ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఆర్థిక మోసాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయన్నారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు జిల్లా పోలీసు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా, తమ సమీపంలోని సబ్ డివిజన్ లేదా సర్కిల్ కార్యాలయాల్లోనే ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారులకు ఏలూరు శ్రీ సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు భోజన సదుపాయం కల్పించారు. -
వర్షాల కోసం ప్రత్యేక పూజలు
ద్వారకాతిరుమల: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేశ, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది. క్షేత్ర ఉపాలయమైన భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయంలో బుధవారం నుంచి 31 వరకు మూడు రోజుల పాటు వరుణదేవుని అనుగ్రహం కో సం వారుణానువాక జపం, వరుణ సూక్త పా రాయణాలు, రుద్రహోమాలు, సహస్ర ఘటాభిషేకాలు నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. కై కలూరు: జిల్లాలో ఆదివారం రాత్రి విస్తార వర్షం కురిసింది. సూపర్ ఎల్నినో నేపథ్యంలోలో వర్షాల కోసం వరుణ పూజలు సైతం పలు గ్రామాల్లో జరుగుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా పెదపాడులో 67.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తర్వాత స్థానాలు కై కలూరులో 51.6, ఆగిరిపల్లిలో 36.4, ముదినేపల్లిలో 28.4, కలిదిండిలో 25.8, మండవల్లి లో 24.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. జిల్లా మొత్తం 331.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. -
నాడి పట్టే నాథుడేడి?
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా లోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉండటంతో పేద, మధ్యతరగతి ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. స్థానిక జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో అన్నిరకాల స్పెషలిస్ట్ వై ద్యులను అందుబాటులో ఉంచాల్సి ఉండగా, ప్ర భుత్వ నిర్లక్ష్యం కారణంగా పరిస్థితులు రోజురోజు కూ దిగజారుతున్నాయి. అత్యవసర, మెరుగైన వై ద్యం కోసం ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి, అప్పులపాలవుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ జ్వరాలు, ప్రసవాలు తప్ప ఇతర వ్యాధులకు సరైన చికిత్స అందడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 8 ఆసుపత్రులు.. 21 మంది వైద్యుల ఖాళీలు ● జిల్లాలో ఒక జిల్లా ఆసుపత్రి, 4 ఏరియా ఆసుపత్రులు, 3 సామాజిక ఆరోగ్య కేంద్రాలు కలిపి మొత్తం 8 ప్రధాన ప్రభుత్వాస్పత్రులు ఉన్నాయి. వీటిలో మొత్తం 21 మంది వైద్యుల కొరత ఉంది. ● సాధారణ ఎంబీబీఎస్ వైద్యుల నుంచి జనరల్ సర్జన్లు, అనస్థీషియా (మత్తు) నిపుణులు, గైనకాలజిస్టుల వరకు అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ● ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు పైచదువుల కోసమో లేదా సొంత ఆస్పత్రుల ఏర్పాటు కోసమో వెళ్లిపోతుంటే, వారి స్థానంలో కొత్తవారిని నియమించడంలో ప్రభుత్వం విఫలమైంది. ● ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుదామన్నా.. స్థానికంగా అన్ని రకాల వైద్య సేవలు అందించే మల్టీస్పెషాలిటీ నెట్వర్క్ ఆస్పత్రులు లేవు. దీంతో ఒక్కో చికిత్స కోసం వేర్వేరు పట్టణాలకు తి రగాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. అందుబాటులో లేని స్కానింగ్ సేవలు జిల్లాలోని ఏ ప్రభుత్వాసుపత్రిలోనూ ఎంఆర్ఐ, సీటీ స్కాన్ వంటి ఆధునిక, ఖరీదైన పరికరాలు అందుబాటులో లేవు. దీంతో పేదలు అత్యవసర పరిస్థితుల్లో రోగులకు స్కానింగ్ అవసరమైతే, ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయించి రూ.3,000 నుంచి రూ.6,000 వర కు సొంతంగా ఖర్చు చేసుకోవాల్సి వస్తోంది. ప్రభు త్వం సకాలంలో స్పందించి ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు, ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. భీమవరం ఏరియా ఆస్రత్రి ఆస్పత్రి వైద్యుల కొరత తణుకు జిల్లా ఆస్పత్రి జనరల్ ఎంబీబీఎస్ 2, మత్తు డాక్టర్ 1, రేడియాలజిస్ట్ 1, డెర్మటాలజిస్ట్ 1, జనరల్ మెడిసన్ 1, పీఎం 1 (మొత్తం 7) భీమవరం ఏరియా ఆస్పత్రి జనరల్ ఎంబీబీఎస్ 1, జనరల్ మెడిసన్ 2 (మొత్తం 3) తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రి జనరల్ ఎంబీబీఎస్ 1, పిడియాట్రిక్స్ 1, రేడియాలజిస్ట్ 1 (మొత్తం 3) నరసాపురం ఏరియా ఆస్పత్రి జనరల్ ఎంబీబీఎస్ 1, గైనకాలజిస్ట్ 1 (మొత్తం 2) ఆచంట సీహెచ్సీ జనరల్ సర్జరీ 1, జనరల్ మెడిసన్ 1, డెంటిస్ట్ 1 మత్తు డాక్టర్ 1 (మొత్తం 4) పెనుగొండ సీహెచ్సీ గైనకాలజిస్ట్ 1 ఆకివీడు సీహెచ్సీ జనరల్ సర్జరీ 1 వైద్యం.. పూజ్యం ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల కొరత పూర్తిస్థాయిలో అందని సేవలు జనరల్ మెడిసిన్, గైనకాలజిస్టులు లేరు ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్లు లేవు అత్యవసర వైద్యానికి ప్రైవేట్ ఆస్పత్రులే దిక్కు పట్టించుకోని కూటమి ప్రభుత్వం -
వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ద్వారకాతిరుమల: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలోని పొగాకు వేలం కేంద్రాన్ని వచ్చేనెల 5న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు సోమవారం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్, రీజనల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, మాజీ హోం మంత్రి తానేటి వనిత, వైఎస్సార్సీపీ ఏ లూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, తెల్లం బాలరాజు, పార్టీ ఏలూరు ఇన్చార్జి మా మిళ్లపల్లి జయప్రకాష్, మాజీ ఏఎంసీ ౖచైర్మన్ గన్నమని జనార్దనరావు తదితరులు దేవరపల్లిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే స్థానిక కరుటూరి ఫంక్షన్ హాల్ సమీపంలో హెలీప్యాడ్ ఏర్పాటుకు స్థలాన్ని, పొ గాకు వేలం కేంద్రంలో రైతులతో జగనన్న ని ర్వహించనున్న ముఖాముఖీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ శ్రేణులకు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో ద్వారకాతిరుమల మండలానికి చెందిన పార్టీ నేతలు పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్, బొండాడ వెంకన్నబాబు, చెలికాని ప్రవీణ్, బిరుదుగడ్డ చల్లారావు, దాసరి రాంబాబు, జంగా వెంకట కృష్ణారెడ్డి, భోగరాజు సాయికృష్ణ, బిరుదుగడ్డ బజారయ్య, మానుకొండ సు బ్బారావు, దాకారపు బంగారమ్మ, అగ్గియ్య, మల్లిపూడి నాగమణి, దాసరి ఏసురత్నం, దొప్పసాని రాంబాబు, షేక్ బాష తదితరులు ఉన్నారు. -
పెనుగొండలో వేద పాఠశాల
పెనుగొండ : అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసవీ శాంతి థాంలో త్వరలోనే వేద పాఠశాల నిర్వహించనున్నట్టు ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజులు తెలిపారు. సోమవారం వాసవీ శాంతి థాంలో విలేకరులతో మాట్లాడుతూ వేద పాఠశాలలో పూర్తిస్థాయిలో వేదాభ్యాసం చేయిస్తామని, ఆలయాల్లో అర్చకులుగా ఉపాధి కల్పించేందుకు కృషిచేస్తామన్నారు. 102 రుషీ గోత్ర మందిరాన్ని సువర్ణ మందిరంగా తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. ముందుగా గ్రీన్ టెంపుల్ చేయడమే లక్ష్యంగా అర్కిటెక్లు కృషి చేస్తున్నారన్నారు. ఆధ్యాత్మిక శోభ విరాజిల్లేలా సుందరీకరణ పనులు ప్రారంభించామన్నారు. -
అర్జీలు పునరావృతం కారాదు
ఏలూరు (ఆర్ఆర్పేట) : ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోపు పూర్తిస్థాయి పరిష్కారం చూపాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి స్థాయి మరింత పెంచేలా పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా పరిష్కారం అందించాలని ఆదేశించారు. జేసీ ఎంజే అభిషేక్గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్కుమార్రెడ్డి, డీఆర్వో ఎం.శ్రీదేవి, విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్.దేవకీదేవి, ఆర్డీఓ కె.లక్ష్మిప్రసన్న, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని.. ● భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన ఉయ్యూరు నాగరాజు తనకు అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయం జమ కాలేదని, త్వరగా జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ● ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామానికి చెందిన పేరూరి చంద్రశేఖర్ తన స్థలం ఆక్రమణకు గురైందని, రాకపోకలకు రహదారి లేకుండా చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జ రిపి తగిన పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. ● దెందులూరు మండలం గోపన్నపాలెంకు చెందిన వి.ధర్మారావు గ్రామ పంచాయతీలో డంపింగ్ పనులు పూర్తి చేశానని, చాలా కాలం గడిచినా బిల్లులు రాలేదని, వాటిని వెంటనే చెల్లించాలని కోరారు. ● టి.నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామానికి చెందిన వట్టి రాధాకృష్ణ అయ్యప్పస్వామి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచి నిధులు మంజూరు చేయించాలని కోరారు. ● పెదవేగి మండలం పెదకడిమికి చెందిన చల్లగొల్ల వెంకటరావు తమ గ్రామంలో పాడి రైతులు చాలామంది ఉన్నారని తెలిపారు. పశువుల చెరువులో నీటి కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్లక్ష్యం సహించం పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టరేట్ హెచ్చరించారు. పీజీఆర్ఎస్ అర్జీలపై కలెక్టరేట్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. శాఖల వారీగా పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన అర్జీలు పరిష్కార ప్రగతిలో లోటు కనిపించిన అధికారులపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెట్రిసెల్వి -
హోరాహోరీగా చెస్ పోటీలు
తాడేపల్లిగూడెం (టీఓసీ): మాస్టర్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో వెస్ట్ గోదావరి జిల్లా అండర్–19 ఓపెన్ అండ్ గర్ల్స్ చదరంగం పోటీలు పట్టణంలో ఆదివారం వాణి స్కూల్లో హోరాహోరీగా జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఆంధ్ర చెస్ వైస్ చైర్మన్ సీహెచ్ఆర్కే వర్మ, నిర్వాహకుడు ఎస్ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్ జమ రాంబాబు హాజరయ్యారు. మొదటి నాలుగు స్థానాలు సాధించిన క్రీడాకారులు జిల్లా తరపున ఆగస్టు 1, 2 తేదీల్లో అనకాపల్లిలో జరిగే రాష్ట్ర అండర్ చదరంగం పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. బాలుర విభాగంలో ఎన్.కుష్వంత్ (భీమవరం), కె.త్రిశాంక్ కోటి (తాడేపల్లిగూడెం), పి.జోగేందర్ (తాడేపల్లిగూడెం) మౌర్య రామసూర్య (పాలకొల్లు), బాలికల విభాగంలో వి.సునీత (గణపవరం), కె.మోక్షిత్ (భీమవరం), కె.సాన్విత (తణుకు), కె.తేజస్విని (తాడేపల్లిగూడెం)లు విజేతలుగా నిలిచారు. -
పొగాకు నారుమడులకు రిజిస్ట్రేషన్ అవసరం
కొయ్యలగూడెం: పొగాకు నారుమడులు వేసే ప్రతి రైతు తప్పనిసరిగా టుబాకో బోర్డు వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వేలం నిర్వహణ అధికారి వి.శివకుమార్ సూచించారు. పొగాకు బోర్డు జారీ చేసిన ముఖ్యమైన నిబంధనలను వివరించారు. గరిష్ట పరిమితి: నారుమడుల రిజిస్ట్రేషన్కు ఒక వ్యక్తిగత రైతుకు గరిష్టంగా 2 హెక్టార్ల పరిమితి మాత్రమే ఉంటుంది. అంతకు మించి అనుమతి లభించదు. ముందస్తు అనుమతి తప్పనిసరి: రిజిస్టర్డ్ రైతు తన సొంత అవసరాల కోసం నారు పోసుకోవాలనుకున్నా, నేరుగా వేలం నిర్వహణ అధికారికి దరఖాస్తు చేసుకుని ముందస్తు అనుమతి పొందాలి. అధికారిక విత్తనాలే వాడాలి: రైతులు మార్కెట్లో దొరికే విత్తనాలను వాడకూడదు. ఎన్ఐఆర్సీ, ఏటీసీ–ఐఎల్టీడీ సంస్థలు సిఫార్సు చేసిన, ఎస్ఎల్ఎస్ అధికారిక నారుమడి విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. గుర్తింపు లేనివి కొంటే: గుర్తింపు లేని లేదా అనధికార నారుమళ్ల నుంచి నారు కొనుగోలు చేసి తోటలు వేస్తే, ఆ పొగాకును బోర్డు కొనుగోలు చేయదు. అలాంటి తోటలకు ఆథరైజేషన్ కార్డులు జారీ చేయరు. అనుమతి లేకుండా నారుమడులు వేసినా, కేటాయించిన విస్తీర్ణం కంటే ఎక్కువగా వేసినా నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఉల్లంఘనకు పాల్పడిన రైతుల నారుమడి నిర్వహణ, రిజిస్ట్రేషన్, బేరం లైసెన్సులు తక్షణమే రద్దు చేస్తారు. డెడ్లైన్: నారుమడులను నవంబర్ 30 నాటికి పూర్తిగా ధ్వంసం చేయాలి. నిర్ణీత గడువు తర్వాత కూడా నారుమడులు అలాగే ఉంచితే బోర్డు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. -
వెలవెలబోతున్న మత్స్య శిక్షణా కేంద్రం
● ఏకై క కేంద్రాన్ని పట్టించుకోని అధికారులు ● ప్రశ్నార్థకంగా విద్యార్థుల భవిష్యత్తు ఉంగుటూరు: రాష్ట్రంలోనే ఏకై క మత్స్య శిక్షణా కేంద్రమైన బాదంపూడి మత్స్య శిక్షణా సంస్థ విద్యార్థులు లేక వెలవెలబోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల నుంచి భారీగా అభ్యర్థులు తరలివచ్చి ఇక్కడ శిక్షణ పొందేవారు. ఇక్కడ అందించే మూడు నెలల సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసిన వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విస్తృతంగా ఉద్యోగాలు సాధించారు. శిక్షణ ఇలా చేపల విత్తన (నారు) ఉత్పత్తి, చేపల రక్షణ, వ్యాధుల నివారణ చర్యలు, చెరువుల నిర్వహణ వంటి కీలకమైన అంశాలపై ఇక్కడ సమగ్ర శిక్షణ ఇస్తారు. గతంలో స్టైఫండ్తో 20 మంది, నాన్–స్టైఫండ్తో 20 మంది చొప్పున అభ్యర్థులకు హాస్టల్ వసతి కల్పిస్తూ శిక్షణనిచ్చేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత నిర్వహణ లోపాలు, పర్యవేక్షణ కరవవ్వడం వల్ల ఈ కేంద్రం ప్రాధాన్యం క్రమంగా తగ్గుతూ వచ్చింది. దానికితోడు ప్రభుత్వం ఇస్తున్న స్టైఫండ్ను కూడా రద్దు చేయడంతో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ ఏడాది కేవలం 12 మంది మాత్రమే చేరారు. తరగతులు క్రమబద్ధంగా జరగకపోవడం, బోధకులు తరచూ సెలవులు పెట్టడం వల్ల ఈ 12 మంది కూడా సరిగా రావడం లేదు. ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కేంద్రం భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మత్స్య శిక్షణా కేంద్రం నిబంధనల ప్రకారమే నడుస్తోంది. ప్రస్తుతం 12 మంది విద్యార్థులు శిక్షణ పొందుతుండగా తరగతులు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. ఇన్స్టిట్యూట్ సరిగా తెరవడం లేదనే వార్తల్లో నిజం లేదు. విద్యార్థులు ప్రాక్టికల్స్ కోసం బయటకు వెళ్లినప్పుడు కేంద్రం ఖాళీగా కనిపిస్తుంది తప్ప, నిర్వహణలో ఎలాంటి లోపాలు లేవు. – భార్గవి, నిర్వహణ అధికారి -
స్ఫూర్తిప్రదాత ప్రగడ కోటయ్య
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో చేనేత రంగ పరిశ్రమ అభివృద్ధికి, చేనేత కార్మికుల సంక్షేమం కోసం విశేషంగా కృషిచేసిన దివంగత ప్రగడ కోటయ్య జీవితం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో జిల్లా చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో కోటయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. కోటయ్య చిత్రపటానికి కలెక్టర్తో పాటు జేసీ అభిషేక్ గౌ డ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పి ంచారు. కలెక్టర్ మాట్లాడుతూ కోటయ్య జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఉత్తర్వు లు జారీ చేయడం శుభపరిణామమన్నారు. చే నేత వర్గాల ప్రయోజనాల కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారన్నారు. ఇన్చార్జి డీఆర్వో ఎల్.దేవకీ దేవి, ఉమ్మడి జిల్లా చేనేత జౌళిశాఖ శాఖ అధికారి బి.హనుమంతరావు, కలెక్టరేట్ ఏఓ ఎన్వీ నాంచారయ్య పాల్గొన్నారు. పోలవరం రూరల్: గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఎగువ ప్రాంతాల నుంచి కొండవాగుల నీరు వచ్చి చేరడంతో నదిలో వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటిమట్టం 28 మీటర్లు దాటింది. స్పిల్వేకి చెందిన 48 గేట్ల ద్వారా 52 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల్లో గోదా వరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. -
శ్రీనివాసా.. గోవిందా..
ద్వారకాతిరుమల : సెలవు దినం కావడంతో ఆదివారం ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణకట్ట, అనివెట్టి మండపాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. సాయంత్రం వరకూ రద్దీ కొనసాగింది. దెందులూరు : పెదవేగి మండలం వేగివాడలో ఓ 24 ఏళ్ల యువకుడికి కరోనా సోకింది. ఈ విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. సదరు యువకుడికి డయాలసిస్ చేయించాల్సి ఉన్నందున విజయవాడ తరలించామని వైద్యాధికారులు తెలిపా రు. కరోనా వైరస్ తీవ్రతరమైంది కాదని ఫ్లూ మాదిరిగా వచ్చి పోతుందని డీఎంహెచ్ఓ శోభ అన్నారు. ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని, గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉంటూ వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, గుంపులుగా ఉన్న సమూహాల్లోకి వెళ్లొద్దన్నారు. కరోనా వైరస్పై సూచనలు, సలహాలు, అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దెందులూరు : ఇటలీలో పోప్ లియోను ఆది వారం దెందులూరుకు చెందిన ఆర్సీఎం ఫాదర్ పులిపాటి అనుదీప్ కలిశారు. పోప్ నుంచి దీవెనలు తీసుకున్నారు. దేశంలో శాంతి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ప్రార్థనలు చేయాలని కోరినట్టు ఫాదర్ అనుదీప్ తెలిపారు. తమ సోదరుడు అనుదీప్ పోప్ లియోను కలవడం అదృష్టం భా విస్తున్నట్టు వైఎస్సార్సీపీ నేత, ఎంపీటీసీ పులిపాటి ఆనంద్ అన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట) : ఆర్టీసీ కార్గో సర్వీసుకు సంబంధించి ఆథరైజ్డ్ పార్సిల్ బుకింగ్ ఏజెంట్లుగా నియమించడానికి అవకాశం కల్పిస్తున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం ప్రకటనలో తెలిపారు. ఏలూరు పరిసర ప్రాంతాలైన వట్లూరు, సత్రంపాడు, శనివారపు పేట, ఆదివారపు పేట తూర్పువీధి, తంగెళ్లమూడి, అలాగే మండవల్లి, పెదపాడు, పెద వేగి, చాటపర్రు, అశోక్నగర్, నరసింహారావుపేట, ఫైర్స్టేషన్, మినీ బైపాస్, రామకృష్ణా పురం తదితర ప్రాంతాల్లో పార్సిల్ బుకింగ్కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు ఆర్టీసీ కార్గో ఏటీఎంను సెల్ 73311 47263లో సంప్రదించాలని కోరారు. తాడేపల్లిగూడెం (టీఓసీ) : భారతీయ విద్యాభవన్స్లో 38వ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్షిప్ 2026 ఎంపిక పోటీ లు జరిగాయి. వీరంపాలెం హైస్కూల్కు చెందిన కె.భువనేశ్వరి అండర్–16 షాట్పుట్ విభాగంలో, ఎం.హేమశ్రీ అండర్–14లో ట్రయాతలాన్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచారు. వీరు తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాల హెచ్ఎం బి.సుకుమార్, పీఈటీ బి.ఉమామహేశ్వరి, ఉపాధ్యాయులు వీరిని అభినందించారు. భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను సోమవారం భీ మవరం కలెక్టరేట్తో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ కూడా నిర్వహిస్తామన్నారు. -
కళ తప్పిన ఖరీఫ్
● జాడ లేని వానలు ● ఎండిపోతున్న నారుమడులు ● అడుగంటిన చెరువులు లింగపాలెం: జూలై మాసం ముగుస్తున్నా వరుణుడి జాడ లేకపోవడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మెట్ట ప్రాంతంలో వ్యవసాయానికి, తాగునీటికి వర్షపాతమే ప్రధాన ఆధారం. ఏటా ఈ సమయంలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగేవి. అయితే ఈ ఏడాది వర్షాభావం వల్ల పనులు లేక కూలీల కుటుంబ పోషణ కష్టంగా మారింది. కరువు మేఘాలు.. ఎండమావులుగా చెరువులు జూన్లో కురిసిన కొద్దిపాటి వర్షాలకు రైతులు దు క్కులు దున్ని, నాట్లు వేసేందుకు వరి నారుమడులు పోశారు. అయితే జూలైలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ నెలలో సాధారణంగా 140 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 5 మి.మీ. మాత్రమే నమోదైంది. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో తీవ్రమైన ఎండలు, ఉక్కపోత నెలకొన్నాయి. వర్షాలు లేక చెరువులు ఎండిపోయాయి. బోరు బావుల్లో నీటిమట్టాలు అడుగంటిపోయాయి. విత్తిన విత్తనాలు మొలకెత్తక, మొలకెత్తిన నారుమడులు నీరు లేక ఎండిపోతున్నాయి. పడిపోతున్న తమ్మిలేరు నీటిమట్టం ఎగువ ప్రాంతాల నుంచి ప్రవాహాలు రాకపోవడం, స్థానికంగా వర్షాలు కురవకపోవడంతో తమ్మిలేరు రిజర్వాయర్లో నీటిమట్టం దారుణంగా పడిపోయింది. ఈ రిజర్వాయర్ పరిధిలోని దాదాపు 37,000 ఎకరాల ఆయకట్టు సాగు ఇప్పుడు అంధకారంలో పడింది. లింగపాలెం మండలంలో దయనీయం లింగపాలెం మండలంలో ఏటా ఖరీఫ్ సీజన్లో 6,000 ఎకరాల వరకు వరి సాగవుతంది. కానీ ప్రస్తుతం నీటి కొరత కారణంగా కేవలం 350 ఎకరాల్లో మాత్రమే బోరు బావుల కింద సాగు చేపట్టారు. ఈ పంట కూడా తగినంత నీరందక ఎండిపోయే స్థితికి చేరింది. -
5న వైఎస్ జగన్ ‘పొగాకు మహోద్యమం’ సభ
చింతలపూడి (జంగారెడ్డిగూడెం): పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వచ్చేనెల 5న దేవరపల్లిలో ‘పొగాకు మహోద్యమం’ సభను నిర్వహించనున్నారని, పార్టీ శ్రేణులు జయప్రదం చే యాలని పార్టీ చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు పిలుపునిచ్చారు. ఆదివారం జంగారెడ్డిగూడెంలో పార్టీ నేత జెట్టి గురునాథరావు కార్యాలయం వద్ద పార్టీ ముఖ్య నాయకులు, యువజన విభాగం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయరాజు మా ట్లాడుతూ మెట్ట ప్రాంతంలో పొగాకు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ విషయాన్ని తాము వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లగా, జంగారెడ్డిగూడెంలో గతంలో రైతులు చేసిన ఉద్యమాన్ని ఆయన కొనియాడారని గుర్తుచేశారు. ప్రతి పొగాకు బేలూ కొనుగోలు చేసేంత వరకూ రైతులకు వైఎస్సార్సీపీ అండగా నిలిచి పోరాడుతుందని స్పష్టం చేశారు. దేవరపల్లిలో జరిగే మహాసభకు పార్టీ నా యకులు, కార్యకర్తలు, యువతతో పాటు రైతులంతా పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు కర్పూరం గౌరయ్యగుప్త, యువ నాయకుడు జెట్టి సత్య ఆదిత్య, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ముప్పిడి శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ అయినాల వెంకట రమణమూర్తి, నేకూరి కిషోర్, జిల్లా నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చిప్పాడ వెంకన్న, రాష్ట్ర నాయకుడు భావన ఋషి, నాయకులు కాసర శేషారెడ్డి, కత్తి వసంత్, డాక్టర్ పళ్ల రమణ, గగ్గల కిరణ్ కుమార్, కాటం అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
ఉచిత న్యాయ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): న్యాయసేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సేవలను అవసరమైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్యానల్ న్యాయవాదులు సూచించారు. రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు కార్గిల్ విజయ దివస్ సందర్భంగా ఆదివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక వన్టౌన్లోని మాజీ సైనిక ఉద్యోగుల అసోసియేషన్లో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సులో ప్యానల్ న్యాయవాదులు మాట్లాడుతూ వీర్ పరివార్ సహాయత యోజన పథకాలపై అవగాహన కలిగించారు. మాజీ సైనిక ఉద్యోగులకు ఎదురయ్యే ఆస్తి, పెన్షన్ బకాయిలు మొదలైన అంశాలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచిత సహాయం అందిస్తుందని ఈ అవకాశాన్ని అవసరమైన సైనిక ఉద్యోగులు ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాదులు సంగీతరావు, జీవీ భాస్కర్, వెంకటేశ్వరరావు, జీవీ రమణ, జిల్లా సైనిక సంక్షేమ ఆఫీసర్ కొండలరావు, మాజీ సైనిక ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
అమర జవాన్ల త్యాగం స్ఫూర్తిదాయకం
భీమవరం: కార్గిల్ అమరవీరుల త్యాగాల సువర్ణాక్షరాలతో చిరస్థాయిగా నిలిచిపోతాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భీ మవరంలో జిల్లా యువమోర్చా ఆధ్వర్యంలో వీర జవాన్లకు ఘన నివాళులర్పించారు. మాజీ సైనికులను మంత్రి సత్కరించారు. అనంతరం పట్టణంలో భారీ కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ దేశ సరిహద్దులను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకమన్నారు. అమర జవాన్ల స్ఫూర్తితో యువత నవభారత నిర్మాణానికి పునరంకితం కావాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు గోపాల్ పాల్గొన్నారు. -
కళారూపాలు కనుమరుగు
● దయనీయ స్థితిలో కళాకారులు ● సంచార జాతులకు ప్రోత్సాహం కరువు పాలకోడేరు: సంస్కృతి అంటే ఆలయాలు, పండుగలతో పాటు కళారూపాలు కూడా. తెలుగు నేలకు ప్రాణం పోసిన జానపద కళలు ఆధునికత దెబ్బకు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. ఫలితంగా మన గుర్తింపు, సాంస్కృతిక వారసత్వం ప్రమాదంలో పడుతున్నాయి. కాలగర్భంలో కలుస్తున్న ‘బుడబుక్కల’ కళ ఒకప్పుడు తెల్లవారుజామునే ఊరూరా డమరుకం మోగిస్తూ, శ్రీఅంబ పలుకు జగదంబ పలుకుశ్రీ అంటూ ప్రజలను మేల్కొలిపే శ్రీబుడబుక్కలశ్రీ వారు గ్రామీణ జీవనంలో అంతర్భాగంగా ఉండేవారు. రంగురంగుల దుస్తులతో శుభాశుభాలు చెప్తూ, జానపద గేయాల ద్వారా వినోదాన్ని, ఆధ్యాత్మిక సందేశాలను అందించేవారు. తోలుబొమ్మలాట, బుర్రకథ వంటి కళలతో పాటు ఈ రూపం కూడా పురాణ గాథలను, ఆచారాలను తరువాతి తరాలకు అందించేది. ఆధునికత ప్రభావం.. కళాకారుల దయనీయ స్థితి టీవీలు, స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా వంటి ఆధునిక వినోద మాధ్యమాల విస్తరణతో సంప్రదాయ కళలకు ఆదరణ కరువైంది. జీవనోపాధి లేక, కొత్త తరం కూడా ఈ రంగం వైపు రాకపోవడంతో ఈ కళ అంతరించిపోయే దశకు చేరింది. ప్రస్తుతం ఈ కళాకారులు స్థిర నివాసం లేక గుడారాల్లో నివసిస్తూ చిత్తు కాగితాలు ఏరుకోవడం, పూసల దండలు అమ్మడం లేదా యాచక వృత్తి ద్వారా పొట్టపోసుకుంటున్నారు. కాగితాలపై శ్రీబీసీ–ఏశ్రీ జాబితాలో ఉన్నప్పటికీ, దారిద్య్రరేఖకు దిగువన అత్యంత దయనీయ జీవితాన్ని గడుపుతున్నారు. వీరు తమను శ్రీఎస్టీశ్రీ జాబితాలో చేర్చాలని లేదా కనీసం అంత్యోదయ అన్నయోజన (రేషన్) కార్డులు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు ● ఈ పురాతన సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వాలు, సాంస్కృతిక సంస్థలు తక్షణమే స్పందించాలి. ● వృద్ధులకు, కళాకారులకు క్రమం తప్పకుండా పింఛన్లు, ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలి. ● కొత్త తరానికి ఈ కళలను నేర్పించేందుకు ప్రత్యేక శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాలి. ● పాఠశాల పాఠ్యంశాల్లో, సాంస్కృతిక ఉత్సవాల్లో జానపద కళలకు ప్రాధాన్యమిచ్చి యువతలో అవగాహన పెంచాలి. ● జానపద కళలను కాపాడుకోవడం అంటే మన అస్తిత్వాన్ని, మూలాలను కాపాడుకోవడమే.బుడబుక్కలు, దొమ్మరి, తోలు బొమ్మలాట వారు సంచార, అర్ధ సంచార, విముక్తి జాతులుగా పిలవబడుతున్నారు. వీరికి తరతరాలుగా అక్షర జ్ఞానం లేకపోయినా, భారత, భాగవత, రామాయణాలను ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. వీరిని గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అలాగే ఇల్లు, ఆహారం వంటి వసతులు కల్పించాలి. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా వీరంతా అన్ని రంగాల్లో దూరంగానే ఉన్నారు. – చింతపల్లి గురుప్రసాద్, సంచార జాతుల రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సంచార జాతుల్లో ఉన్న కళాకారులను గుర్తించి, ప్రభుత్వం ప్రోత్సహించాలి. కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న సాంస్కృతిక రంగానికి, సంచార జాతుల కళాకారులకు ప్రవేశం కల్పించి అసలైన కళారూపాలను ప్రజలకు అందించాలి. ఎన్నికల ముందు ఈ కళాకారులకు గుర్తింపు కార్డులు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి రెండేళ్లయినా ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు. – పెండ్ర వీరన్న, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, సంచార జాతుల వ్యవస్థాపక అధ్యక్షుడు -
నకిలీ వీసాలతో మోసం
నూజివీడు: వీసాలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇప్పించి విదేశాలకు పంపిస్తామని నమ్మించి నకిలీ వీసాలతో మోసం చేస్తున్న నిందితులను నూజివీడు పోలీసులు అరెస్టు చేశారు. నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్ ఆదివారం వివరాలు వెల్లడించారు. పట్టణంలోని నెహ్రూపేటకు చెందిన రాచప్రోలు ఫణిసుందర్ తన నుంచి నూజివీడుకు చెందిన అట్టారాహ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు కంచల డానియేల్ విక్టర్, హైదరాబాద్కు చెందిన అన్ని ట్రాన్స్ ఓషనిక్ ప్రైవేటు లిమిటెడ్ నిర్వాహకుడు దారా వివేక్ రాజ్ యూకేలో ఉద్యోగం, వీసా ఇప్పిస్తామని నమ్మించి రూ.14.45లక్షలు వసూలు చేసి నకిలీ ఈ వీసా ఇచ్చి మోసం చేశారని ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు తీగలాగితే డొంక కదిలింది. వీరు ఇక్కడ ఒక్కచోటే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన దాదాపు 41 మంది నుంచి దాదాపు రూ.6.50 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. యూకే, కెనడా, లక్సెంబర్గ్ తదితర దేశాలకు పంపుతామని, కావాల్సిన వీసాలు ఇప్పిస్తామని నమ్మబలికి వారందరిని మోసం చేశారు. దీంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి వారిపై బీఎన్ఎస్ ప్రకారం 318(4), 336 రెడ్విత్3(5) కింద కేసు నమోదు చేశారు. దారా వివేక్రాజ్ది పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ కాగా కంచల డానియేల్ విక్టర్ది నూజివీడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేధించిన పట్టణ ఎస్సైలు లక్ష్మణ్బాబు, కే.నాగేశ్వరరావు, మరో ముగ్గురు కానిస్టేబుళ్లను డీఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. సమావేశంలో సీఐ ఐవీ నాగేంద్రకుమార్ పాల్గొన్నారు. విదేశాల్లో ఉద్యోగాలిప్పించి వీసాలిచ్చి విదేశాలకు పంపుతామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా డీఎస్పీ సూచించారు. ఏదైనా కన్సల్టెన్సీ, ఏజన్సీ ద్వారా విదేశాలకు వెళ్లే ముందు ఆ సంస్థ లైసెన్స్, రిజిస్ట్రేషన్ వివరాలను ప్రభుత్వ పోర్టల్లో తనిఖీ చేసుకోవాలన్నారు. పోలీసుల అదుపులో నిందితులు -
ఉత్సాహంగా బ్యాడ్మింటన్ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ శ్రీప్రకాష్ పాఠశాలలో రెండురోజులుగా కొనసాగుతున్న సీబీఎస్ఈ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. ఆదివారం ఉదయం మ్యాచ్లను పాఠశాల డైరెక్టర్ విజయ్ప్రకాష్ ప్రారంభించారు. అండర్–14, 17, 19 బాలుర విభాగాల్లో మొత్తం 54 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. క్యార్టర్ ఫైనల్స్ విభాగంలో ప్రతిభ చూపిన ప్రతి విభాగంలోని 4 జట్లు సెమీస్కు అర్హత సాధించాయి. అండర్–14 విభాగంలో గ్రీన్ సిటీ ఇంగ్లీష్ మీడియం (విశాఖ), డాక్టర్ కేఎల్ ప్రసాద్ స్కూల్ (గుంటూరు), గాడియం స్కూల్ (హైదరాబాద్), సర్ సీఆర్ రెడ్డి స్కూల్ (ఏలూరు) సెమీస్కు చేరుకున్నాయి. అండర్–17 విభాగంలో గాడియం స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్, మౌంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ (కర్నూలు), భారతీయ విద్యాభవన్ స్కూళ్లు సెమీస్లో స్థానం పొందాయి. అండర్–19 విభాగంలో శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్ (పెద్దాపురం), ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్ (కాకినాడ), పల్లవి మోడల్ స్కూల్ (అల్వాల్), బీవీవీ వెంకటేశ్వర స్కూల్(తిరుపతి) సెమీస్కు చేరారు. ఈ పోటీలను టెక్నికల్ అడ్వైజర్ బృందం పర్యవేక్షించగా, రిఫరీలు శ్రీనివాస్, సాయిబాబు, పరమేశ్వరరావు, డి.శ్రీనివాస్ సహకారం అందించారు. తాడేపల్లిగూడెం: జీతం బకాయి సొమ్ము అడిగితే యూట్యూబ్ చానల్ ప్రతినిధులు వేధింపులకు పాల్పడగా కెమెరామెన్ ఉర్ల బాలకృష్ణ వర్ధన్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దేవ శివప్రసాద్ను ఆదివారం అరెస్టు చేశారు. డీఎస్పీ యు.రవిచంద్ర, ఎస్సై బాదం శ్రీనివాసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఉర్ల బాలకృష్ణ వర్ధన్ ఆత్మహత్యపై అతని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మీడియా సంస్థ నిర్వాహకులు సురేష్, శివలు తమ కుమారుడిని వేధించారని, అవి తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులలో ఒకరైన దేవ శివప్రసాద్ను ఆదివారం అరెస్టు చేశామన్నారు. సోమవారం కోర్టులో హాజరు పరుస్తామన్నారు. మరో నిందితుడు సురేష్ గురించి పోలీసు బృందాలు గాలిస్తున్నాయన్నారు. -
ఏపీఆర్సెట్లో 42వ ర్యాంక్
నిడమర్రు: పెదనిండ్రకొలను గ్రామానికి చెందిన వంగ వెంకట ప్రభావతి శనివారం విడుదలైన ఏపీఆర్ సెట్లో 42వ ర్యాంక్ సాధించింది. ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం పరిధిలో ఒంగోలు డీఎస్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఫర్ ఉమెన్స్లో గణితంలో పీహెచ్డీ సీట్ సాధించినట్లు మండల విద్యాశాఖ అధికారులు అనూరాధ, శేషగిరిరావులు తెలిపారు. తణుకు అర్బన్: అమరావతి ఇన్క్యూజివ్ క్రికెట్ కప్ 2026 కోసం జిల్లా స్థాయి దివ్యాంగ క్రికెటర్ల ఎంపికలు ఆదివారం తణుకు ఏఎస్సార్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించారు. డీసీఏఏ జనరల్ సెక్రటరీ యడ్లపల్లి సూర్యనారాయణ ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ లేళ్ల సుబ్బారాయుడు, ఆర్గనైజర్ పెరుమాళ్ల దిలీప్, డీసీసీఏపీ సభ్యులు కొండా సత్యవరప్రసాద్ పర్యవేక్షణలో జిల్లా జట్టును ఎంపిక చేశారు. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారుల దరఖాస్తుల పరిశీలన అనంతరం నెట్స్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా జట్టును ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. లింగపాలెం: బేర్ సీడ్ కంపెనీ ఏజెంట్ వల్ల సుమారు రూ.50 లక్షలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తొర్లపాటి బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లింగపాలెం మండలం తిమ్మక్కపాలెం గ్రామంలో ఆదివారం నష్టపోయిన రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ మాట్లాడుతూ కంపెనీ ఏజెంట్ మన్నే రామకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులను నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ముదినేపల్లి(కై కలూరు): జిల్లాలో ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం భక్తులు రద్దీ కనిపించింది. దేవస్థాన ఆవరణ పుట్టలో భక్తులు పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. ఆలయ చైర్మన్ బొంగు రవికుమార్, ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగాశ్రీదేవీ, ధర్మకర్తల మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కై కలూరు: పెద్దింట్లమ్మా.. నీ భక్తులు కోరిన వరాలివ్వమ్మా.. అంటూ భక్తులు కొల్లేటికోట పెద్దింట్లమ్మను ఆర్తితో వేడుకున్నారు. సమీప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మకు మొక్కులు ఆదివారం తీర్చుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల విక్రయం, వాహనపూజలు, విరాళాల ద్వారా రూ.1,00,817 ఆదాయం వచ్చిందని తెలిపారు. కొయ్యలగూడెం: రాజవరం పంచాయతీ గంగవరం గ్రామ పరిధిలో నిత్యం కొనసాగుతున్న గ్రావెల్, మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని రాజవరం–1, 2 రెవెన్యూ అధికారులు తహసీల్దార్ ఎన్.నాగరాజుకు ఫిర్యాదు చేశారు. రాజవరం సమీపంలోని పెద్ద చెరువు, గంగవరం మెట్ట, ఎర్ర కాలువ ప్రాంతాల్లో జేసీబీ, టిప్పర్ లారీలు పెట్టి తోలకాలు చేస్తున్నారని దీని అడ్డుకుంటే తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్వేనెంబర్ 483లో భారీ స్థాయిలో గ్రావెల్ మట్టి డంప్ చేసి ఉందని అన్నారు. అక్రమ తోలకాలను నిరోధించడంతోపాటు బాధ్యులైన వారిపై చేసి చర్యలు చేపట్టాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. -
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి రోయింగ్ పోటీలు
చింతలపూడి (జంగారెడ్డిగూడెం): ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఎర్రకాలువ వాటర్ స్పోర్ట్స్ సెంటర్లో రాష్ట్రస్థాయి రోయింగ్ చాంపియన్షిష్–2026 పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. ఎస్ఆర్ఏఏపీ, శాప్, డీఎస్ఏ ఏలూరు సంయుక్త ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. శాప్ డైరెక్టర్ జగదీశ్వరి, శాప్ డీఎస్డీఓ అజీజ్ సిరాజ్, ఎస్ఆర్ఏఏపీ అ ధ్యక్షుడు తరుణ్ కాకాని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలురు, బాలికలకు సబ్ జూనియర్, జూ నియర్, సీనియర్ విభాగాల్లో సింగిల్, డబుల్ స్కల్స్ అంశాలపై ఎంపిక పోటీలు నిర్వహించారు. ప్రధాన కోచ్ కృష్ణమూర్తి, టెక్నికల్ అఫీషియల్ విజయ్ రో వర్ పర్యవేక్షించారు. జిల్లాల ప్రతినిధులు ఉదర్ల జోషి (ఏలూరు), ఎన్.పవన్ (ఎన్టీఆర్), ఎం.తులసిరామ్ (అనకాపల్లి), పరిగి వేణుగోపాలరావు (సత్యసాయి), పి.శ్రీనివాస్ (శ్రీకాకుళం), వెంకటేష్ (పశ్చిమగోదావరి), ఎన్.దేవుడు (తూర్పుగోదావరి), సర్పంచ్ సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షుడు చంటి పాల్గొన్నారు. విజేతలు వీరే.. సబ్ జూనియర్ బాలికల విభాగం : ఎం.లక్ష్మి (ఏలూరు) స్వర్ణం, జె.హైడి రోసిలిన్ (పశ్చిమగోదావరి) రజతం, ఎం.జాగృతి (నెల్లూరు) కాంస్యం. సబ్ జూనియర్ బాలుర విభాగం : ఎం.కుశాల్ (నెల్లూరు) స్వర్ణం, ఎన్.జస్వంత్ (ఏలూరు) రజతం, బి.నిర్మలా నాయక్ (పశ్చిమగోదావరి) కాంస్యం. జూనియర్ మహిళల విభాగం : కె.ప్రేమకుమారి (ఏలూరు) స్వర్ణం, జె.వాసవి (అనకాపల్లి) రజతం, ఎస్.యమున (ఎన్టీఆర్ జిల్లా) కాంస్యం. జూనియర్ బాలుర విభాగం: జి.మాధవ్ (ఎన్టీఆర్ జిల్లా) స్వర్ణం, బి.లిఖిత్ నాయక్ (శ్రీకాకుళం) రజ తం, ఐ.జగదీష్ (ఎన్టీఆర్ జిల్లా) కాంస్యం. సీనియర్ పురుషుల విభాగ ం: జి.సాయిరామ్ (ఎన్టీఆర్ జిల్లా) స్వర్ణం, బి.సంతోష్ (ఏలూరు) రజతం, ఎన్.దేవరాజ్ (అనకాపల్లి) కాంస్య పతకాలు సాధించారు. -
రోగాలకు తెరపడేదెప్పుడో?
బుట్టాయగూడెం : పశ్చిమ ఏజెన్సీ ప్రాంత గిరిజన గ్రామాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, మారిన వాతావరణ పరిస్థితుల వల్ల బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. కొన్నిచోట్ల బెడ్లు సరిపోక బల్లలపై, నేలపైనే చికిత్స పొందాల్సిన దుస్థితి నెలకొంది. టైఫాయిడ్, మలేరియా కేసులు తీవ్రమవ్వడంతో పాటు రోగులలో ప్లేట్లెట్స్ కూడా పడిపోతున్నాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 313 మలేరియా కేసులు నమోదు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఏజెన్సీ ప్రాంతంలో 313 మలేరియా కేసులు నమో దయ్యాయి. వీటిలో 306 ఏజెన్సీ పరిధిలోనే నమో దు కాగా, 7 కేసులు వెలుపలి ప్రాంతాలకు చెందినవి. ఈ ప్రాంతంలో దాదాపు 220 గ్రామాలను మలేరియా ప్రభావిత ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. నివారణ చర్యల్లో భాగంగా మొదటి విడత స్ప్రేయింగ్ పనులు పూర్తి చేసినప్పటికీ, ప్రస్తుత వాతావరణ మార్పుల వల్ల వ్యాధులు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. దోమ తెరల పంపిణీ ఊసేలేదు సాధారణంగా మలేరియా కట్టడికి మలాథియాన్ స్ప్రేయింగ్తో పాటు దోమతెరలను పంపిణీ చేస్తుంటారు. గతంలో (2021లో) వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 2,50,000 దోమతెరలను అందజేశారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక్క దోమతెర కూడా పంపిణీ చేయకపోవడంపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. జ్వరాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందించి గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఉచితంగా దోమతెరలు పంపిణీ చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఏజెన్సీ ప్రజలు కోరుతున్నారు. అంతర్వేదిగూడెంలోని ప్రభుత్వాస్పత్రిలో జ్వర పీడితులు మంచం పట్టిన మన్యం విజృంభిస్తున్న జ్వరాలు ఈ ఏడాదిలో 313 మలేరియా కేసులు జ్వరపీడితులతో ఆస్పత్రులు కిటకిట ఇప్పటికీ పంపిణీ కాని దోమ తెరలు ఏజెన్సీ ప్రాంతంలోని గ్రా మాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామాల్లోని ప్రతి ఇంట్లో జ్వరపీడితులు కనిపిస్తున్నారు. ఆస్పత్రులు కూడా నిండిపోయి కిటకిటలాడున్నాయి. గ్రామంలోనే ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి ప్రజలకు వైద్యసేవలు అందించేలా కృషి చేయాలి. – కారం రాఘవ, ఏఐకేఎమ్ఎస్ నాయకులు, అలివేరు, బుట్టాయగూడెం మండలంఈ ఏడాది సరైన వైద్యం అందక పలువురు ప్రాణాలు కోల్పోయారు. మోతుగూడెంకు చెందిన రిత్విక అనే చిన్నారి స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో సకాలంలో వైద్యం అందక మృతి చెందగా, ఇటీవల పులిరామన్నగూడెంకు చెందిన గిరిజన విద్యార్థిని మడకం నందిత మలేరియాతో ప్రాణాలు విడిచింది. -
ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆహాకారం
నూజివీడు: ‘ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు’ అంటారు. అలాంటి ఉల్లిపాయ, వెల్లుల్లి లేని వంటగది సాధారణంగా ఎక్కడా ఉండదు. రోగనిరోధక శక్తిని పెంచి, కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇవేమీ ఉపయోగించకుండా వంటలు చేస్తుండటంతో నూజివీడు ట్రిపుల్ఐటీ విద్యార్థులు రుచీపచీ లేని ఆహారాన్ని తినలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. నామినేషన్ పద్ధతిలో మెస్ కేటాయింపు నూజివీడు ట్రిపుల్ఐటీలోని 8,800 మంది విద్యార్థులకు భోజన వసతి కల్పించే బాధ్యతను ఎలాంటి టెండర్లు పిలవకుండానే ఏకపక్షంగా, నామినేషన్ పద్ధతిలో హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్కు మూడేళ్ల కాలపరిమితితో అప్పగించారు. ప్రతి విద్యార్థికి రోజుకు రూ.110 చొప్పున చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని, 2025 దసరా సెలవుల అనంతరం నుంచి ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెస్ నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో ఉన్న కాంట్రాక్టర్లకు రోజుకు రూ.88 మాత్రమే చెల్లించేవారని, ఇప్పుడు ఎక్కువ మొత్తంలో ఇచ్చినా ఆహార నాణ్యతలో ఎలాంటి మార్పూ లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అన్నం సరిగా ఉడకకపోవడమే కాకుండా తరచూ దుర్వాసన వస్తోందని.. దీనిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిందామంటే తిండి లేదు ఉదయాన్నే ఇచ్చే అల్పాహారంలో ఒక్క ఇడ్లీ తప్ప మిగతావేవీ తినేలా ఉండటం లేదు. గారెలు, పునుగులు చేదుగా ఉండి, చల్లారితే రాతిలా గట్టిపడుతున్నాయి. అట్లు కూడా రుచిగా ఉండటం లేదు. కూరగాయలతో చేసే వంటకాలను అతిగా డీప్ ఫ్రై చే స్తుండటంతో తినలేకపోతున్నారు. ఉల్లి, వెల్లుల్లి అ సలే వాడకపోవడంతో వంటకాలకు రుచి ఉండటం లేదు. దీంతో వేరే దారి లేక విద్యార్థులు పెరుగన్నంతోనే కడుపు నింపుకుంటున్నారు. రుచీపచీ లేని భోజనం అల్పాహారం అంతంతమాత్రమే.. ఉల్లి, వెల్లుల్లి వాడకుండానే కూరలు గుడ్డు, చికెన్ అందించని వైనం ట్రిపుల్ఐటీ విద్యార్థుల ఆవేదన వేసవి సెలవుల అనంతరం జులై 1న తరగతులు ప్రారంభమై దాదాపు నెల రోజులు కావస్తున్నా ఇప్పటివరకు గుడ్డు కానీ, చికెన్ కానీ పెట్టడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. గంలో వారంలో 5 రోజులు కోడిగుడ్డు, 2 రోజులు చికెన్ ఇచ్చేవారు. నూతన యాజమాన్యం వచ్చాక దానిని 4 రోజుల గుడ్డు, ఒక రోజు చికెన్కు కుదించారు. అయితే ప్రస్తుతం ఇవేమీ అందించడం లేదు. అయినా నెలాఖరున మెస్ బిల్లులు వసూలు చేసేటప్పుడు మాత్రం నాన్వెజ్తో కలిపే చార్జి చేస్తారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఉల్లి, వెల్లుల్లితో కూడిన నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడంతో పాటు మెనూ ప్రకారం కోడిగుడ్డు, చికెన్లను రోజూవారీగా సక్రమంగా అందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
క్యూ కదలక.. స్వామి కానరాక
నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం ద్వారకాతిరుమల: శ్రీవారి శాశ్వత నిత్యాన్నదాన ట్రస్టుకు ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లికి చెందిన బిక్కిన లక్ష్మీనరసమ్మ రూ.1,01,116 విరాళంగా అందజేశారు. పెంటపాడు: ప్రత్తిపాడు గ్రామ దేవత పైళ్లమ్మ అమ్మవారికి శనివారం సారె కార్యక్రమం నిర్వహించారు. అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం శ్రీ 26 శ్రీ జూలై శ్రీ 2026ద్వారకాతిరుమల: తొలి ఏకాదశి సందర్భంగా శనివారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి రావడంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిలబడలేక పలువురు క్యూలైన్లలోనే కింద కూర్చుండిపోగా, ఆలయంలోకి వెళ్లకుండానే దేవుడు బయటే కనిపించాడు అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పాత క్యూ కాంప్లెక్స్ వినియోగంలో ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఉండేవి కావని, కొత్త క్యూ కాంప్లెక్స్ వల్ల ఈ పరిస్థితులు నెలకొన్నాయని చర్చ సాగుతోంది. దర్శనం త్వరగా పూర్తవుతుందన్న ఆశతో రూ.200 దర్శనం టికెట్లు కొనుగోలు చేసి క్యూలైన్లలోకి వచ్చిన భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.100 దర్శనం టికెట్ తీసుకున్నవారు, ఉచిత దర్శనం భక్తులు తమకంటే ముందుగా దర్శనానికి వెళ్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో కొందరు భక్తులు నిలబడలేక క్యూలైన్లలోనే కింద కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెల్ఫోన్లు భద్రపరిచేందుకు బారులు సెల్ఫోన్లను భద్రపరిచేందుకు ఏర్పాటు చేసిన డిపాజిట్ కౌంటర్ల వద్ద కూడా భక్తులు బారులు తీరారు. నూతన అనివెట్టి మండపం నుంచి అన్నమయ్య విగ్రహ కూడలి వరకు క్యూలైన్లు కొనసాగాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కౌంటర్ వద్ద అప్పటికప్పుడు షామియానా ఏర్పాటు చేశారు. కొత్త క్యూ కాంప్లెక్స్ ప్రారంభం తర్వాత.. నూతన శాశ్వత క్యూ కాంప్లెక్స్ ప్రారంభమైనప్పటి నుంచి భక్తుల ఇబ్బందులు మరింత పెరిగాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నమయ్య విగ్రహ ప్రాంతంలో తాత్కాలిక క్యూ కాంప్లెక్స్ ఉన్నప్పుడు భక్తులకు ప్రశాంతంగా స్వామివారి దర్శనం జరిగిందని, ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదని ఆలయ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. మరోవైపు, అష్టకష్టాలు పడి ఆలయంలోకి చేరుకున్నా.. వెనుక భక్తుల రద్దీ ఎక్కువగా ఉందంటూ సిబ్బంది త్వరత్వరగా బయటకు పంపేస్తున్నారని, దీంతో స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకునే అవకాశం దక్కడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక క్యూ కాంప్లెక్స్ అవసరం ఇటీవల ప్రారంభమైన నూతన శాశ్వత క్యూ కాంప్లెక్స్ భక్తుల రద్దీకి సరిపోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితిని ముందుగానే గుర్తించిన అధికారులు నూతన అనివెట్టి మండపం పక్కన లక్షలాది రూపాయలు వెచ్చించి తాత్కాలిక క్యూలైన్లు నిర్మించి, వాటిపై వాటర్ప్రూఫ్ టాప్ ఏర్పాటు చేశారు. ఆ క్యూలైన్ల లోంచి భక్తులు మళ్లీ శాశ్వత క్యూ కాంప్లెక్స్ వద్ద ఉన్న క్యూలైన్లలోకి వెళ్లి, అందులో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వృద్ధులు, చిన్నారులు ఎక్కువసేపు నిలబడలేక క్యూ లైన్లలోనే ఇబ్బందులు పడుతున్నారు. నూతన అనివెట్టి మండపం పక్కన తాత్కాలిక క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తే భక్తులకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. లేకపోతే ముక్కోటి ఏకాదశి, గోదావరి పుష్కరాలు జరిగే సమయంలో భారీగా తరలి వచ్చే భక్తులకు మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, అవాంచనీయ ఘటనలు జరిగే ప్రమాదం కూడా లేకపోలేదని పేర్కొంటున్నారు.శ్రీవారి అంతరాలయ ద్వారం, దాని ముందు, పక్కన ఉన్న ద్వారాలను పెద్దవి చేయాల్సిన అవసరం ఉందని దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ అధికారులకు సూచించారు. ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డీవీ భాస్కర్, ఆలయ ప్రధానార్చకులు పీవీఎస్ఎస్ఆర్ జగన్నాథాచార్యులను వెంటబెట్టుకుని ఆయన రూ.100, రూ. 200, ఉచిత దర్శనం క్యూలైన్లలోకి వెళ్లారు. అక్కడ నుంచి చూసే సామాన్య భక్తులకు స్వామివారు కనిపించడం లేదని, ఆలయ ద్వారాలను పెద్దవి చేయాల్సి అవసరం ఉందని సూచించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ట్రస్టు బోర్డులో ఆమోదించి తనకు పంపాలని ఆదేశించారు. తొలి ఏకాదశికి ద్వారకాతిరుమలకు పోటెత్తిన భక్తులు దర్శనానికి క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షణ నిలబడలేక చతికిలపడ్డ పలువురు భక్తులు ఆలయ ద్వారాలు పెద్దవి చేయాలని దేవదాయ కమిషనర్ సూచన రూ.200 దర్శనం క్యూలైన్న్లో 4 గంటల నుంచి వేచి ఉన్నా దర్శనం కాలేదు. రూ.100, ఉచిత దర్శనం భక్తులు కూడా ముందే వెళ్తున్నారు. క్యూలైన్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. – చిన్నశెట్టి గోపీ, భక్తుడు – దమ్మపేట, తెలంగాణ గతంలో దర్శనానికి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదు. ఇప్పుడు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. వృద్ధులు, చిన్నారులతో పాటు పలువురు భక్తులు ఎక్కువసేపు నిలబడలేక క్యూలైన్లలోనే కింద కూర్చుంటున్నారు. – మన్నెం గంగాధరరావు – దమ్మపేట, తెలంగాణ -
జయహో జగన్నాథ
ద్వారకాతిరుమల: జై జగన్నాథ.. జయహో జగన్నాథ అంటూ భక్తుల నామస్మరణలతో జగన్నాథ రథయాత్ర శనివారం సాయంత్రం తిమ్మాపురం గ్రామానికి అట్టహాసంగా సాగింది. శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జగన్నాథుని దివ్య రథోత్సవాలు ఈనెల 16 నుంచి వైభవంగా జరుగుతున్నాయి. ఆఖరి రోజు సాయంత్రం ఆలయం వద్ద రథన్ని విశేషంగా అలంకరించారు. అర్చకులు సుభద్ర, బలభద్ర, జగన్నాథుడి దారు విగ్రహాలను ఆలయం నుంచి తీసుకొచ్చి, రథంలో వేంచేపు చేసి, పూజాదికాలను నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాల నడుమ జగన్నాథుడి రథం అశేష భక్తజన సందోహం నడుమ లక్ష్మీపురం మీదుగా సమీప గ్రామమైన తిమ్మాపురం తరలివెళ్లింది. ప్రతి ఇంటి ముంగిట భక్తులు జగన్నాథుడిని దర్శించి తరించారు. తిరిగి రధం రాత్రికి ఆలయానికి చేరుకుంది. నూజివీడు: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలను నిర్వహిస్తున్న ఆర్జీయూకేటీలో ప్రభుత్వం భర్తీ చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ పోస్టులకు వయో పరిమితి విధించడంపై కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెంటార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ట్రిపుల్ ఐటీల్లో 104 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గరిష్ట వయో పరిమితి ఓసీ అభ్యర్థులకు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 49 ఏళ్లుగా నిబంధన విధించింది. దీంతో గత 18 ఏళ్లుగా ట్రిపుల్ ఐటీలను నమ్ముకుని పనిచేస్తున్న దాదాపు 200 మంది కాంట్రాక్టు మెంటార్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లలో సుమారు 70 మంది రాత పరీక్షకు అనర్హులుగా మారే ప్రమాదం ఏర్పడింది. 2023లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో లెక్చరర్ పోస్టులకు ఎలాంటి వయో పరిమితి విధించలేదు. దీనివల్ల ట్రిపుల్ ఐటీల ప్రారంభం నుంచి పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లభించింది. వయో పరిమితి నిబంధనను సడలించి న్యాయం చేయాలని కాంట్రాక్టు అధ్యాపకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): అతి వేగమే ప్రమాదాలకు కారణమని, ఓపికతో, నేర్పుతో జాగ్రత్తగా వాహనం నడిపితే మీతోపాటు ఎక్కిన ప్రయాణికులను క్షేమంగా గమ్యం చేర్చవచ్చని ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ సూచించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు డిపో గ్యారేజ్లో శనివారం ప్రమాద రహిత వారోత్సవాల కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కరీమ్ మాట్లాడుతూ వాహనం నడిపేటప్పుడు తొందర పని చేయదని, ఓవర్ టేక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, వానాకాలంలో వాహనం నడిపేటప్పుడు మరిన్ని జాగ్రత్తలతో వాహనాన్ని నడపాలని సూచించారు. ప్రమాదాలకు గురికాకుండా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తమ విధులను నిర్వహించాలని సూచించారు. జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వారోత్సవాలు జనవరిలో జరుగుతాయని, ఈ సంవత్సరం జూలైలో వారం రోజులు పాటు నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ బి.వాణి, తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏలూరులో పారా లీగల్ వలంటీర్లుగా పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి శనివారం ప్రకటనలో తెలిపారు. సమాజ సేవ మీద ఆసక్తి ఉండి స్వచ్ఛందంగా కక్షిదారులకు, న్యాయ సేవాధికార సంస్థ కోసం పనిచేసేందుకు ముందుకు రావాలని కోరారు. కనీసం పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఆగస్టు 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోలవరం రూరల్: గోదావరి వరద మళ్ళీ పెరుగుతోంది. నదిలోకి చేరే శబరి నీటితో పాటు ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి భారీగా నీరు చేరడంతో వరద ప్రవాహం పెరిగింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద 28 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్వే నుంచి 51,000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతోంది. -
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
చింతలపూడి: ఆయిల్పాం తోటలో గెలలు కోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి ఓ వ్యక్తి అక్కడికక్కడే మతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం ప్రగడవరం గ్రామానికి చెందిన పల్లపు నాగరాజు (40) జీవనోపాధిలో భాగంగా వ్యవసాయ పనులకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో మండలంలోని యర్రగుంటపల్లి గ్రామంలో ఒక రైతుకు చెందిన ఆయిల్పాం తోటలో గెలలు కోసేందుకు వెళ్లాడు. తోటలో గెలలు కోస్తున్న సమయంలో, విద్యుత్ వైర్లు గెడకు తగలడంతో తీవ్ర విద్యుత్ షాక్కు గురై అపస్మారక స్ధితికి చేరుకున్నాడు. నాగరాజును ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. నాగరాజు మృతి వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, ప్రగడవరం గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉపాధి కోసం వెళ్లిన వ్యక్తి శవమై తిరిగిరావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబ యజమాని దూరమవ్వడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. ఎస్సై కె సతీష్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఖర్జూరంలో పురుగులు.. పాడైపోయిన చిక్కీలు
సమస్యల సుడిగుండంలో.. కై కలూరు: కూటమి ప్రభుత్వ పాలనలో అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పంపిణీ చేసే పోషకాహారంలో పురుగులు, బూజు వస్తున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. దీనికితోడు ఐసీడీఎస్ అధికారులకు, అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వ్యత్యాసాలు, అగాధం ఏర్పడుతోంది. పురుగులు పట్టిన ఖర్జూరాలను పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు తమ ముఖంపైనే విసిరికొడుతున్నారని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్లో వెల్లడవుతున్న అసంతృప్తి కేంద్రాలకు సరఫరా అయ్యే వస్తువుల నాణ్యతపై ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. నాణ్యత బాగుంటే ‘1’, బాగోలేకపోతే ‘2’ నొక్కాలని అడగ్గా.. మెజారిటీ లబ్ధిదారులు నాణ్యత సరిగ్గా లేదనే (2) సమాధానమిస్తున్నారు. అయితే, ఐసీడీఎస్ సిబ్బంది సరుకుల నాణ్యతను మెరుగుపరచడం వదిలేసి, కార్యకర్తలపైనే మండిపడుతుండటం గమనార్హం. కార్యకర్తలపైనే ఆర్థిక భారం : పెరిగిన ధరలతో జీవనం భారంగా మారిన తరుణంలో, ఐసీడీఎస్ కార్యాలయం చెల్లించాల్సిన ఖర్చులను కూడా తమపైనే రుద్దుతున్నారని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల పోషణ్ పక్వాడా ముగింపు వేడుకలకు కలెక్టర్ వెట్రిసెల్వి వచ్చారు. ఆ తర్వాత వచ్చిన అధికారులకు భోజనాలు, ఇతర పదార్థాల తయారీకి దాదాపు రూ.30 వేలు ఖర్చవగా, ఆ భారాన్ని తమపైనే వేశారని అంగన్వాడీలు తెలిపారు. కొత్త మెనూ చార్టుల ఫ్లెక్సీల కోసం ఒక్కో కేంద్రం నుంచి రూ.100 వసూలు చేస్తున్నారని, నిజానికి కై కలూరులో ఫ్లెక్సీ తయారీకి రూ.70 మాత్రమే ఖర్చవుతుందని వారు చెబుతున్నారు. అలాగే కై కలూరు ఓరియంటల్ స్కూల్లో జరిగిన ఒక్కరోజు శిక్షణకు సంబంధించిన భోజన ఖర్చులు రూ.270 ఇంకా చెల్లించలేదని, కేంద్రాల్లో నిర్వహించే టీబీ ఈవెంట్ బిల్లులను కూడా సకాలంలో మంజూరు చేయడం లేదని వాపోతున్నారు. నిలదీసి అడుగుతుంటే వేదింపులకు గురుచేస్తోన్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని అంగన్వాడీ కార్యకర్త చెప్పారు.కోడిగుడ్ల సైజుల్లో వ్యత్యాసాలు చిక్కీలోపల బూజు అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం ఇలా.. కోడిగుడ్డు సైజుల్లో వ్యత్యాసాలు ఐవీఆర్ఎస్ కాల్స్లో సరుకులపై తీవ్ర వ్యతిరేకత ఖర్చులు తమపై మోపుతున్నారని కార్యకర్తల ఆవేదన జిల్లాలోని 10 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 2,225 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఒక్క కై కలూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో, 13 సెక్టార్ల పరిధిలో 311 కేంద్రాలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అటుకులు, రాగిపిండి, బెల్లం, ఖర్జూరం, చిక్కి వంటి 6 రకాల పదార్థాలను అందిస్తున్నారు. వీటిలోని ఖర్జూరాల్లో తెల్లటి పురుగులు కనిపిస్తుండగా, చిక్కి బూజు పడుతోంది. నిబంధనల ప్రకారం ఒక్కో గుడ్డు 50 గ్రాములు ఉండాల్సి ఉండగా, చాలావరకు చిన్న సైజు గుడ్లే సరఫరా అవుతున్నాయి. రాగి జావ తయారీకి ఇచ్చే పిండిలో ఇసుక వస్తోంది. ఆన్లైన్ నమోదు ప్రకారమే రేషన్ ఇస్తున్నా, సరుకుల నాణ్యత లోపం వల్ల గ్రామాల్లో జనం తమను నిలదీస్తున్నారని అంగన్వాడీ టీచర్లు వాపోతున్నారు. వైఎస్సార్సీపీ పాలనలోనే సరుకుల నాణ్యత మెరుగ్గా ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కూటమి నాయకుల మాట వినకపోతే తమపై వరుసగా ఫిర్యాదులు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. -
నాటు తుపాకీతో హత్యకు కుట్ర
ఏలూరు టౌన్: వివాహేతర సంబంధాన్ని కొనసాగించవద్దని హెచ్చరించినా పట్టించుకోకుండా, తన వదినతో చనువుగా ఉంటున్నాడనే కోపంతో నాటు తుపాకీతో ఒక వ్యక్తిని హతమార్చేందుకు వేసిన కుట్రను చింతలపూడి పోలీసులు భగ్నం చేశారు. తీగ లాగితే డొంక కదిలినట్లు... ఈ హత్య ప్రయత్నంపై దర్యాప్తు చేయగా ఏకంగా నాటు తుపాకులు తయారు చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనంతరం ఆయన నాటు తుపాకీలను, తయారీ సామగ్రిని పరిశీలించారు. హెచ్చరించినా వినలేదని.. చింతలపూడి మండలం బట్టువారిగూడెం గ్రామానికి చెందిన సందక సాయిబాబు వదినతో, సుబ్బారాయుడుగూడెం గ్రామానికి చెందిన పల్నాటి మహేష్ చనువుగా ఉంటున్నాడు. వివాహేతర సంబంధం కొనసాగుతుందనే అనుమానంతో మహేష్ను మందలించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో చింతలపూడి మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామం ఎన్ఆర్టీఆర్ సెంటర్కు చెందిన తాళం వీరబాబు నుంచి సాయిబాబు ఒక నాటు తుపాకీ తీసుకున్నాడు. పల్నాటి మహేష్ను అంతం చేయాలనే ఉద్దేశంతో గణిజర్ల ప్రాంతంలోని ఆయిల్పాం తోట వద్ద రెండు రోజులుగా అదను కోసం వేచి ఉన్నాడు. ఈ నెల 24న సాయిబాబు, వీరబాబు ఇద్దరూ మోటారు సైకిల్పై గణిజర్ల వెళ్లి వస్తుండగా.. చింతలపూడి ఎస్సై తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఇద్దరూ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా, వారి వద్ద ఒక నాటు తుపాకీ, ఒక లైవ్ బుల్లెట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నాటు తుపాకుల తయారీ గుట్టురట్టు జంగారెడ్డిగూడెం డీఎస్పీ బీహెచ్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ టీ. క్రాంతికుమార్, ఎస్సై కే. సతీష్కుమార్ దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాటు తుపాకీ కలిగి ఉన్న వీరబాబును విచారించగా, వెంకట్రాదిగూడెం గ్రామానికి చెందిన యలగం నాగేశ్వరరావు పేరు బయటకు వచ్చింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి 5 నాటు తుపాకులు, ఒక తుపాకీ చెక్క, తుపాకులు తయారు చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తుపాకీ పనిచేసే మెకానిజానికి వెల్డింగ్ పనులు చేస్తున్న రాఘవాపురం, కమలాపురం గ్రామానికి చెందిన తోటకూర రామరాజును అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి వెల్డింగ్ మిషన్, నాటు తుపాకీ మెకానిజం భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. తుపాకీ బ్యారల్ గొట్టం తయారు చేస్తున్న ఏలూరు పవర్పేట రైల్వేస్టేషన్ రోడ్డు ప్రాంతానికి చెందిన మంతెన వీరభద్రాచారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి తుపాకీ బ్యారల్ తయారీకి వినియోగించే రెండు ఇనుప గొట్టాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 6 నాటు తుపాకులు, తుపాకీ తయారీ చెక్క, 4 తుపాకీ తూటాలు, తుపాకీ తయారీకి వినియోగించే పేలుడు పదార్థం, తుపాకీ తయారీ పరికరాలు, ఒక తుపాకీ మెకానిజం భాగం, రెండు ఇనుప బ్యారల్ గొట్టాలు, ఒక వెల్డింగ్ మిషన్, ఒక హీరో గ్లామర్ మోటారు సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన చింతలపూడి సీఐ క్రాంతికుమార్, ఎస్సై సతీష్కుమార్, కానిస్టేబుళ్లు వినోద్కుమార్, హనుమంతరావు, భగవాన్, సత్యనారాయణ, ప్రకాష్, లక్ష్మణరావు, బాబురావు, రమేష్, హోంగార్డు సురేష్లను ఏలూరు జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ ప్రత్యేకంగా అభినందించారు. హత్యాయత్నాన్ని భగ్నం చేసిన జంగారెడ్డిగూడెం పోలీసులు ఐదుగురి అరెస్ట్, నాటు తుపాకులు, తయారీ సామగ్రి స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ శివకిషోర్ -
విద్యాసంస్థల బంద్ జయప్రదం
ఏలూరు (ఆర్ఆర్పేట): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ శుక్రవారం జిల్లాలో జయప్రదమైంది. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ముందు రోజునే తమ సంస్థలకు సెలవు ప్రకటించి బందులో పాల్గొన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్ మీటింగ్ (పీటీఎం) ఏర్పాటు చేయడంతో వాటికి బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్ కాలేజీలను ఆయా విద్యార్థి సంఘాల నాయకులు మూయించి వేశారు. ఏలూరులో కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీ వద్ద విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయగా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకు నేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు పి.శివాజీ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి.శివకుమార్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని, డీవైఎఫ్ఐ జిల్లా నాయకుడు గేదెల శివకుమార్ కేంద్ర ప్రభుత్వ తీరుపై శాంతియుత పద్ధతుల్లో నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై ఢిల్లీలో పోలీసులు అమానుష లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల నాయకులు బంద్లో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పీవీ రామకృష్ణ, సీఐటీయూ జిల్లా నాయకులు పంపన రవికుమార్, మంచెల్ల ఇస్సాక్ పాల్గొన్నారు. -
మక్కినవారిగూడెం సొసైటీలో విచారణ
టి.నరసాపురం: మక్కినవారిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో అవకతవకలు జరిగాయంటూ స్థానిక రైతులు సిరిమళ్ల జనార్దనరావు, ఆచంట అనిల్కుమార్, సిరిమళ్ల వెంకటేశ్వరరావులు ఇటీవల ఏలూరులో పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన చింతలపూడి కో–ఆపరేటివ్ సహాయ రిజిస్ట్రార్ ఏకేఎస్ఎస్ మూర్తి, సీనియర్ ఇన్స్పెక్టర్ నజీమ్లు శుక్రవారం సొసైటీలో క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. విచారణ అనంతరం సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఈ సందర్భంగా విచారణ అధికారులు తెలిపారు. -
ప్రభుత్వ ఐటీఐలో ఆన్లైన్ అడ్మిషన్లు
నూజివీడు: నూజివీడులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాల కోసం రెండో విడత కౌన్సెలింగ్కు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రధాన అధికారి పి.రజిత శుక్రవారం ప్రకటనలో తెలిపారు. వచ్చేనెల 3న సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు కాపీని ప్రింట్ తీసుకుని ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆగస్టు 4లోపు వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. 6న ఐటీఐ కళాశాలలో కౌన్సెలింగ్కు హాజరు కావాలని పేర్కొన్నారు. ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాలతో ఏలూరుకి చెందిన భాస్కర్ల ఆర్ఎన్ శంకర్ (బాచి)ను వైఎస్సార్సీపీ గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఎస్సీ యువతకు పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు షెడ్యూల్ కులాల సహకార సంఘం కార్యనిర్వాహక ఇంజనీర్ ఎం.ముక్కంటి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. కిసాన్ డ్రోన్ ఆపరేటర్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నిషియన్, బ్యూటీ థెరపిస్ట్, ప్లంబర్–జనరల్ కోర్సులకు టెన్త్ పాస్, డ్రోన్ సర్వీస్ టెక్నీషియన్, సోలార్ పీవీ ఇన్స్టాలర్ కోర్సులకు ఇంటర్మీడియట్ పాస్ కావాలన్నారు. అభ్యర్థుల వయసు 21–45 ఏళ్ల మధ్య ఉండాలని, శిక్షణ వ్యవధి 90 రోజులు ఉంటుందని, ఉచిత భోజనం, వసతి కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు కంప్యూటర్ ఆపరేటర్ ఎ.రవికుమార్ సెల్: 9393527666, జూనియర్ అసిస్టెంట్ ఎం.శ్రీనివాసరావు 98498 42059, సీనియర్ అసిస్టెంట్ ఎం.సుషుమాదేవి 9177721350 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. -
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
ముదినేపల్లి (కై కలూరు): ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాట పటిమకు ఆకర్షితులై పలువురు పార్టీలోకి చేరుతున్నారని జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) అన్నారు. ముదినేపల్లి మండలం ప్రొద్దువాక గ్రామంలో టీడీపీకి చెందిన దొడ్డాకుల సాయి శివకుమార్, బోయిన వెంకట నరసింహ, కుందేటి వీరాంజనేయులు శుక్రవారం కై కలూరులో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. డీఎన్నార్ వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. మండల పార్టీ అధ్యక్షుడు బోయిన రామరాజు, జిల్లా పంచా యతీరాజ్ విభాగ కార్యదర్శి బొబ్బిలి రత్తయ్యనాయుడు, సిరిపురపు సత్యనారాయణ, కర్రే సోమశేఖరరావు పాల్గొన్నారు. భీమవరం: అమరావతి చాంపియన్షిప్ నియోజకవర్గ సెలెక్షన్ ట్రెయిల్స్ను శనివారం నుంచి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో నిర్వహించనున్నట్టు జిల్లా క్రీడాధికారి శుక్రవారం ప్రకటన లో తెలిపారు. అండర్–17, అండర్–23 విభాగాల్లో 12 ఆటల్లో సెలెక్షన్స్ ఉంటాయన్నారు. -
తొలి ఏకాదశికి ముస్తాబు
ఈవీఎం గోడౌన్ తనిఖీ ఏలూరు (ఆర్ఆర్పేట): కలెక్టరేట్లోని ఈవీఎం గోడౌన్ను రాష్ట్ర ఎలెక్టోరల్ అధికారి కార్యాలయ డిప్యూటీ సీఈఓ ఎస్.ఆంజనేయులుతో కలిసి కలెక్టర్ కె.వెట్రిసెల్వి తనిఖీ చేశారు. ద్వారకాతిరుమల: ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. శనివారం తొలి ఏకాదశి కావడంతో ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని శుక్రవారం దేవస్థానం సిబ్బంది సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శిస్తారని ఆలయవర్గాలు అంచనా వేస్తున్నాయి. తొలి ఏకాదశి రోజున అన్నం, మాంసాహారం తీసుకోకూడదని శ్రీవారి దేవస్థానం ఆగమ పండితులు సుదర్శనం శ్రీనివాసాచార్యులు తెలిపారు. తులసి ఆకులు కోయడం, జుట్టు, గోర్లు కత్తిరించుకోవడం, గొడవలు, దుర్భాషలు, పగలు నిద్రపోవడం, ఇతరులను అవమానించడం వంటి పనులకు దూరంగా ఉండాలన్నారు. వేకువజామున స్నానం చేసి శ్రీమహావిష్ణువును తులసీ దళాలతో పూజించాలని, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ మంత్రాన్ని జపిస్తూ విష్ణు సహస్రనామ పారాయణం చేయాలన్నారు. ఉపవాసం పాటించి, దానధర్మాలు చేసి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే శ్రీహరి అనుగ్రహం లభిస్తుందని చెప్పారు. లబ్బీపేట (విజయవాడతూర్పు): రోయింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 26న జంగారెడ్డిగూడెంలో రాష్ట్ర రోయింగ్ చాంపియన్ షిప్–2026 పోటీలు నిర్వహించనున్నట్టు ఏపీ స్కల్లింగ్ అండ్ రోయింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ తరుణ్ కాకాని తెలిపారు. శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఈ పోటీల్లో 500 మీటర్ల దూరంలో సబ్ జూనియర్, జూనియర్ సీనియర్ విభాగాల్లో బాలురు, బాలికలకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
తీరు మారాలి బాబు
శనివారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2026ద్వారకాతిరుమల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖ ఆలయాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారిందనే ఆరోపణలకు ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం ట్రస్టు బోర్డు సమావేశం బలంచేకూర్చింది. నెలకు రూ.40 లక్షలకు పైగా వెచ్చిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిశుభ్రత కనిపించడం లేదని బోర్డు సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని అధికారులను నిలదీశారు. చివరకు 15 రోజుల్లోగా పరిస్థితి మెరుగుపడకపోతే కాంట్రాక్టు రద్దుకు తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని సభ్యులు అల్టిమేటం జారీ చేశారు. సీఎం బంధువైన కాంట్రాక్టర్ తీరుపై కూటమి సభ్యులే గళమెత్తడం క్షేత్రంలో హాట్టాపిక్గా మారింది. ట్రస్టు బోర్డు సమావేశంలో తీవ్ర చర్చ కొండపై ఉన్న ద్వారకా అతిథి గృహంలో గురువా రం జరిగిన ట్రస్టు బోర్డు సమావేశంలో దాదాపు 40 నిమిషాల పాటు పారిశుద్ధ్య నిర్వహణపైనే సుదీర్ఘంగా చర్చ సాగింది. పర్వదినాలు, వివాహ శుభకార్యాలు ఎక్కువగా జరిగే రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందని సభ్యులు మండిపడ్డారు. సిబ్బంది గైర్హాజరు గతంతో పోలిస్తే పారిశుద్ధ్య కాంట్రాక్టులో కార్మికుల సంఖ్య పెరిగినా, క్షేత్రస్థాయిలో కొద్దిమంది మా త్రమే కనిపిస్తున్నారని ద్వారకాతిరుమల మండలానికి చెందిన ఇద్దరు సభ్యులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం 200 మంది విధులు నిర్వహించాల్సి ఉండగా, తక్కువ మందితోనే మమ అనిపిస్తున్నారని ఆరోపించారు. మేనేజర్పై ఆగ్రహం.. 15 రోజుల అల్టిమేటం పారిశుద్ధ్య కాంట్రాక్ట్ మేనేజర్పై కూడా సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళా కార్మికులతో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నాడని, అధికారులను ఏమాత్రం లెక్కచేయడం లేదని వచ్చిన ఫి ర్యాదులపై నిలదీశారు. దీనికి ఆయన నుంచి ఎ లాంటి సమాధానం రాకపోవడంతో సభ్యులు మ రింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీ వెనుక ఎవరున్నా ఇకపై సహించేది లేదు. 15 రోజుల్లోగా ప రిస్థితి మెరుగుపడకపోతే కాంట్రాక్టును రద్దు చేస్తూ తీర్మానం చేసి, ప్రభుత్వానికి నివేదిస్తాం.’అంటూ ట్రస్టు బోర్డు సభ్యులు హెచ్చరించారు. అధికారి సంచలన వ్యాఖ్యలు సమావేశంలో ఓ పర్యవేక్షణాధికారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. తన 40 ఏళ్ల సర్వీసులో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య లోపాలపై కాంట్రాక్టర్కు పలుమార్లు నోటీసులు జారీ చేస్తే, దేవదాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి తిరుగు ప్రయాణంలో తనకే హెచ్చరికలు వచ్చాయని, చర్యలు తీసుకుంటామని భయపెట్టారని సభ్యుల ఎదుట వెల్లడించడంతో సమావేశంలో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక ఆలయాల ఆదాయ, వ్యయాలను బట్టి ఆయా దేవస్థానాల అధికారులే టెండర్లు ఖరారు చేసేవారు. అప్పట్లో ద్వారకాతిరుమల పారిశుద్ధ్య కాంట్రాక్టు విలువ నెలకు రూ.18.28 లక్షలుగా ఉండేది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పారిశుద్ధ్య సేవలను మెరుగుపరుస్తామనే కారణంతో రాష్ట్ర దేవదాయ శాఖ కార్యాలయం ద్వారానే అన్ని ప్రముఖ ఆలయాల టెండర్లను నిర్వహించింది. ఈ క్రమంలో 2015–2019 మధ్య (టీడీపీ హయాంలో) పనిచేసిన కాంట్రాక్టర్ భాస్కరనాయుడికే మళ్లీ టెండర్ లభించింది. ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్టు మొ త్తాన్ని రూ.50 లక్షలకు పెంచినా పారిశుద్ధ్యంలో మార్పు రాకపోవడం, పైగా సీఎం చంద్రబాబుకు బంధువైన కాంట్రాక్టర్ తీరుపై కూటమి సభ్యులే గళమెత్తడం ఇప్పుడు నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శ్రీవారి క్షేత్రంలో పారిశుద్ధ్య నిర్వహణపై ట్రస్టుబోర్డు సభ్యుల ఆగ్రహం సమావేశంలో 40 నిమిషాలపాటు వాడీవేడిగా చర్చ కాంట్రాక్టర్కు 15 రోజుల గడువిస్తూ అల్టిమేటం తీరు మారకుంటే కాంట్రాక్ట్ రద్దుకు తీర్మానం చేస్తామని హెచ్చరిక సీఎం బంధువు (కాంట్రాక్టర్) నిర్వాకంపై కూటమి సభ్యులే గళం ఏఐ సృష్టించిన చిత్రం -
జోరుగా పాత బట్టల వ్యాపారం
భీమవరం : విద్య, వ్యాపార, వైద్య కేంద్రాలుగా వేగంగా అభివృద్ధి చెందుతున్న భీమవరం పట్టణంలో ఒకవైపు భారీ షాపింగ్ మాల్స్ వెలుస్తుంటే... మరోవైపు పేదల కోసం పాత బట్టలు అమ్మే దుకాణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆక్వా హబ్గా పేరుగాంచి, ప్రభుత్వానికి కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్నప్పటికీ, భీమవరం పరిసర ప్రాంతాల్లో అనేక మంది పేదలు పూట గడవడానికి పడుతున్న పాట్లు వర్ణనాతీతం. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి పేరుతో విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నా, ఒంటి నిండా బట్ట కప్పుకోవడానికి అనేక మంది పేదలు పాత బట్టల వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. పాత బట్టలను విక్రయిస్తూ పట్టణంలో అనేక కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. అంతా డబ్బున్నవారే అనుకుంటే పొరపాటే... పట్టణ పరిసర ప్రాంతాల్లోని ప్రజలంతా ధనవంతులేనని, ఇక్కడ భారీ ఎత్తున వ్యాపారాలు సాగుతున్నాయనే ప్రచారం ఉంది. ఆక్వా చెరువుల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందన్నది నిజమే అయినా, ఽపేదలు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో నాణ్యమైన కొత్త దుస్తులు కొనలేని పేదలు ఎక్కువగా ఉండటంతో, పట్టణంలో పాత బట్టల వ్యాపారం జోరుగా సాగుతోంది. బస్టాండ్ వెనుక జోరుగా విక్రయాలు... పట్టణంలోని బస్టాండ్ వెనుక ఉన్న సాయిబాబా గుడి ప్రాంతంలో చాలాకాలంగా పాత బట్టల వ్యాపారం సాగుతోంది. వీటితో పాటు ఇండస్ట్రియల్ ఏరియా, లారీ స్టాండ్ల వద్ద చిరిగిన వస్త్రాల అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ వ్యాపారంలో ఎక్కువగా మహిళలే ఉండటం విశేషం. వీరికి కొందరు పురుషులు గ్రామాల్లో తిరిగి పాత బట్టలు సేకరించి తెచ్చి ఇస్తుంటారు. ఇక్కడ చీరలు, ప్యాంట్లు, షర్టులు, లుంగీలు, నైటీలు, చిన్నపిల్లల దుస్తులు ఇలా అన్ని రకాల వస్త్రాలు లభిస్తాయి. పట్టణంలో మంగళ, శుక్రవారాలు మినహా మిగిలిన అన్ని రోజుల్లోనూ ఈ వ్యాపారం జరుగుతుంది. మంగళ, శుక్రవారాల్లో పాత దుస్తులు కొనకూడదనే సెంటిమెంట్ ఉండటంతో కొనుగోలుదారులు రారని వ్యాపారులు చెబుతున్నారు. కాగా, భీమవరంలో పాత బట్టల వ్యాపారం నెలకు సుమారు రూ. 50 లక్షల వరకు ఉంటుందని అంచనా. పాత బట్టలు కొనుగోలుచేసేవారు ఎక్కువగానే ఉంటారు, ప్రధానంగా పండుగ రోజుల్లో వ్యాపారం ఎక్కువగా ఉంటుంది. కొత్త బట్టలు కొనుగోలు చేయలేని పేదలు కనీసం శుభ్రమైన చిరుగులు లేని వస్త్రాలు ధరించాలనే పాత బట్టలు కొంటుంటారు. – చింతా జ్యోతి, వ్యాపారి దాదాపు 20 ఏళ్లుగా పాతబట్టల వ్యాపారంతోనే జీవనం సాగిస్తున్నాం. కొత్త బట్టల షాపులెన్ని వచ్చినా మా వ్యాపారం మాత్రం కొనసాగుతూనే ఉంది. కార్మికులు, పేదలు పాత బట్టలు కొనుగోలు చేస్తుంటారు. – కానేటి ధనలక్ష్మి, వ్యాపారి పాత బట్టలను ఎక్కువగా కార్మికులు కొనుగోలు చేస్తుంటారు. ప్రతి రోజు తాపీపనులు, బంటా పనులకు వెళ్లే పేద కార్మికులు పాత బట్టలు కొనుగోలు చేస్తారు. చిరుగులు లేని చీరలు, ఫ్యాంటు, షర్ట్స్ తక్కువ ధరలకు లభించడంతో కార్మికులు వాటిని వినియోగిస్తారు. – గంటా పుష్పలత, వ్యాపారి కొత్తబట్టలు కొనుగోలు చేయలేని పేదలు చిరుగులు లేని, శుభ్రమైన పాతబట్టలే కొత్తవిగా భావిస్తారు. మావద్దకు వచ్చే వారంతా పేదలు కావడంతో మేము కూడా పెద్ద మొత్తంలో లాభాల కోసం చూడకుండా తక్కువ ధరలకే విక్రయిస్తుంటాం. – గంటా ఇందిర, వాప్యారి భీమవరం బస్టాండ్ వెనుక పాత బట్టల దుకాణాలు 20 ఏళ్లకు పైగా విక్రయాలు నెలకు సుమారు రూ.50 లక్షల వ్యాపారం -
భక్తుల సౌకర్యాలు, అభివృద్ధికి పెద్దపీట
ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో భక్తుల సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి, సేవల విస్తరణ, ఆదాయ వృద్ధి, విద్యా సంస్థల అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకర్రావు అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు, ఆలయ ప్రధానార్చకులు పీవీఎస్ఎస్ఆర్ జగన్నాధాచార్యులు (ఎక్స్అఫిషియో మెంబర్), బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ట్రస్ట్బోర్డు కీలక నిర్ణయాలు ఇవీ.. ● ద్వారకాతిరుమల గ్రామస్తులకు ప్రస్తుతం అమలులో ఉన్న శీఘ్ర దర్శనాన్ని ఉత్తర ద్వారం ద్వారా కొనసాగించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ● అంతరాలయంలో శ్రీవారి మూలమూర్తులకు అష్టోత్తర శతనామార్చన సేవను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ సేవలో పాల్గొనే దంపతులకు రూ.3,116 రుసుం నిర్ణయించారు. అలాగే గతంలో నిర్వహించిన కోటి తులసీ పూజను తిరిగి ప్రారంభించే అంశంపై సమీక్షించారు. ● దేవస్థానం సంస్కృతోన్నత పాఠశాల వెలుపల ఉన్న వినాయకుని మందిరాన్ని పాఠశాల గ్రౌండ్లోని ఖాళీ స్థలంలోకి మార్పు చేసి, నూతన ఆలయాన్ని నిర్మించేందుకు అంచనాలను ఆమోదించారు. ● భక్తులకు నాణ్యమైన పాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచే లక్ష్యంతో విజయ డెయిరీ (కృష్ణ జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్ కం లిమిటెడ్) పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రం ఏర్పాటుకు షాపు కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ● శ్రీవారి ఆగమ పాఠశాలలో ఆగమ విద్య పూర్తి చేసిన విద్యార్థులు తప్పనిసరిగా 3 నెలల పాటు దేవస్థానానికి చెందిన ఆలయాల్లో అప్రెంటిస్ చేయాలని నిర్ణయించారు. ● వాహనాల టోల్ రుసుంను వసూలు చేసుకునే లైసెన్స్ హక్కునకు రెండేళ్ల కాలపరిమితికి నిర్వహించిన బహిరంగ వేలం, సీల్డ్ టెండర్ ద్వారా వచ్చిన అత్యధిక బిడ్ను ఆమోదించారు. ● శ్రీవారి క్షేత్ర దత్తత దేవాలయాలైన మైలవరంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయాల్లో కొబ్బరి చెక్కల సేకరణ లైసెన్స్ హక్కునకు జరిగిన బహిరంగ వేలం ద్వారా వచ్చిన హెచ్చు పాటలను ఆమోదించారు. ● శ్రీవారి ప్రసాదాల తయారీ, పడితరం, అన్నప్రసాదం తయారీకి అవసరమైన 21 రకాల రసవర్గాల సరఫరా కోసం నిర్వహించిన ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్ల ద్వారా వచ్చిన తక్కువ ధరలను ఆమోదించారు. ● రాబోయే ఆశ్వయుజ మాస తిరుకల్యాణ మహోత్సవాలను దృష్టిలో ఉంచుకొని తాత్కాలిక గోల్డ్ కలర్ ఫైబర్ మండపం, పందిళ్లు, రంగులకు అవసరమైన అంచనాలను ఆమోదించారు. ● క్షేత్రంలోని హైస్కూల్ గ్రౌండ్లో ఉన్న గరుడాళ్వార్, ఆళ్వార్ సదనం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామి భారీ విగ్రహాలకు రంగులు వేయడానికి అవసరమైన అంచనాలను ఆమోదించారు. ● శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవాలయం వద్ద, వకుళమాత అన్నప్రసాద భవనం సమీపంలో పీపీజీఐ బస్సు షెల్టర్ల నిర్మాణానికి అంచనాలు ఆమోదించారు. ● ప్రధాన ఆలయం, దత్తత దేవాలయాలు, వివిధ ట్రస్టుల జూన్–2026 నెల ఆదాయ, వ్యయాలను పరిశీలించి ఆమోదించారు. -
నిర్వాసితుల పునరావాస భూసేకరణపై సర్వే
కొయ్యలగూడెం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసానికి సంబంధించి భూసేకరణ కోసం గురువారం సర్వే ప్రక్రియ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ అభిషేక్ శర్మ (ఐఏఎస్) ఆధ్వర్యంలో అధికారుల బృందం అచ్చుతాపురం సమీపంలోని రెవెన్యూ పరిధిలో గల సుమారు 75 ఎకరాల ప్రాంతాన్ని పరిశీలించింది. చింతూరు, ఎటపాక ప్రాంతాలకు చెందిన పోలవరం నిర్వాసిత కుటుంబాల పునరావాసం కోసం ఈ భూసేకరణ ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా సర్వే నంబర్లు 1043, 1044లకు సంబంధించిన భూములను అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో కొవ్వూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, చింతూరు, ఎటపాక, జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారులు, కొయ్యలగూడెం తహసీల్దార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూముల వివరాలు, సేకరణ ప్రక్రియ పురోగతి, స్థానిక పరిస్థితులు, అవసరమైన పరిపాలనా చర్యలపై ఉన్నతాధికారులు విస్తృతంగా సమీక్షించారు. భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఐఏఎస్ అభిషేక్ శర్మ ఆదేశించారు. నూజివీడు : చెల్లని చెక్కు కేసులో నూజివీడు మండలం గొల్లపల్లికి చెందిన చల్లారి సత్యన్నారాయణకు ఆరునెలల జైలు శిక్ష, రూ.11 లక్షల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మేజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూర్తి గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం గొల్లపల్లికి చెందిన చల్లారి సత్యన్నారాయణ, చల్లారి శివనాగమల్లేశ్వరరావు అన్నదమ్ములు. 2020 అక్టోబరు 4న శివనాగమల్లేశ్వరరావు, సత్యన్నారాయణకు రూ.10 లక్షలు అప్పుగా ఇచ్చాడు. కొంతకాలం తరువాత తన బాకీ తిరిగి చెల్లించమని అడగగా సత్యన్నారాయణ 2023 జూన్ 19న రూ.10 లక్షలకు చెక్కును శివ నాగమల్లేశ్వరరావుకు ఇచ్చాడు. ఆ చెక్కును బ్యాంకులో వేయగా సత్యన్నారాయణ బ్యాంకు ఖాతాను నిలిపివేసినట్లు ఆ చెక్కును బ్యాంకు అధికారులు తిప్పి పంపారు. దీంతో శివ నాగమల్లేశ్వరరావు కోర్టులో కేసు వేయగా విచారణ అనంతరం సత్యన్నారాయణకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. -
హత్యాయత్నం సెక్షన్లు నమోదు చేయాలి
పాలకోడేరు: తనపై, తన కుమారుడు పాలా రాధాకృష్ణపై ఈ నెల 6వ తేదీన జరిగిన దాడి కేసులో పోలీసులు బలహీనమైన సెక్షన్లు నమోదు చేశారని వేండ్ర గ్రామానికి చెందిన బాధితురాలు పాలా గోగులమ్మ ఆరోపించారు. పొలం సరిహద్దు వివాదాన్ని పురస్కరించుకుని అదే గ్రామానికి చెందిన కవురు గంగాధరరావు, ఆయన భార్య, కొడుకు కలిసి తమపై కత్తులతో దాడి చేశారని ఆమె తెలిపారు. ఈ ఘటనలో గోగులమ్మ తలకు తీవ్ర గాయమై 18 కుట్లు పడ్డాయని, రాధాకృష్ణకు కూడా తీవ్ర గాయాలు కావడంతో నేటికీ ప్రైవేట్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారని వాపోయారు. ఈ ఘటనపై పాలకొడేరు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెం. 96/2026 కింద కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్లో బీఎన్ఎస్ 329(3), 118(1), 351(2), 3(5) సెక్షన్లు నమోదు చేసినప్పటికీ.. దాడి తీవ్రతను, ప్రాణహాని తలపెట్టాలనే ఉద్దేశాన్ని పరిగణనలోకి తీసుకుని హత్యాయత్నం వంటి బలమైన సెక్షన్లు జోడించాలని గోగులమ్మ డిమాండ్ చేశారు. ‘మమ్మల్ని చంపాలనే ఉద్దేశంతోనే కత్తులతో తలపై కొట్టారు. నా కొడుకు ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నాడు. ఇంత జరిగినా పోలీసులు సరైన సెక్షన్లు పెట్టకుండా నిందితులకు కొమ్ము కాస్తున్నారా?’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి దాడికి ప్రతిదాడి జరిగినట్లుగా క్రైమ్ నెం. 97/2026 కింద ఎదురు కేసు కూడా నమోదైనట్లు ఎఫ్ఐఆర్ ద్వారా తెలుస్తోంది. న్యాయం జరిగే వరకు పోరాడతామని, అవసరమైతే ఉన్నతాధికారులను కలుస్తామని బాధితుల కుటుంబం స్పష్టం చేసింది. కేసులో కఠినమైన సెక్షన్లు జోడించి నిందితులను శిక్షించాలని వేండ్ర అగ్రహారం మాజీ సర్పంచ్ ముత్యాలరావుతో పాటు గ్రామస్తులు కోరుతున్నారు. మరొకవైపు, మెడికల్ రిపోర్ట్ ఆధారంగానే కేసు నమోదు చేశామని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. తణుకు అర్బన్: తణుకు మండలం కొమరవరం గ్రామ శివారులోని కొండాలమ్మ గుడిలో చోరీకి ప్రయత్నించిన దొంగను స్థానికులు పట్టుకున్నారు. గురువారం గుర్తుతెలియని వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించి చోరీకి ప్రయత్నించగా పట్టుకున్న గ్రామస్తులు స్తంభానికి కట్టి దేహశుద్ధి చేశారు. అనంతరం తణుకు రూరల్ పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ ఘటనపై గ్రామస్తులు ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్నట్లు ఎస్సై నాళం శ్రీనివాసరావు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధితుల ఆవేదన ఏలూరు టౌన్ : ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో ప్రజలకు మెరుగైన వైద్యం అందే పరిస్థితి కనిపించడం లేదు. వైద్యులు, సిబ్బంది తీవ్ర నిర్లక్ష్య వైఖరి వల్ల కళ్లు తెరవకముందే పురిటిలోనే పసిబిడ్డల ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. లింగపాలెం మండలం అయ్యపరాజుగూడెంకు చెందిన సిలారపు స్వీటీ అనే మహిళ తన మొదటి కాన్పు కోసం మూడు రోజుల క్రితం (మంగళవారం) జీజీహెచ్లో చేరింది. మొదటి సంతానం కావడంతో స్వీటీ, ఆమె భర్త మహేష్ తమ బిడ్డ కోసం ఎంతో ఆశగా ఎదురుచూశారు. తీరా గురువారం ప్రసవం పూర్తయ్యాక చూస్తే... నవజాత శిశువు తలకు గాయాలు ఉండటంతో పాటు బిడ్డ మృతి చెంది ఉండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డను దక్కకుండా చేసిందంటూ హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. -
సచివాలయం.. సేవలకు దూరం
● పనిచేయని కంప్యూటర్లు ● వేధిస్తున్న సిబ్బంది కొరత ● సేవల్లో జాప్యం ● కూటమి పాలనలో ప్రజలకు తిప్పలు కై కలూరు: ఒకే చోట ప్రజల సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలే లక్ష్యంగా ప్రారంభమైన సచివాలయాలు నేడు పూర్వ వైభవాన్ని కోల్పోయి వెలవెలబోతున్నాయి. గతంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య క్లినిక్ వంటి సేవలు గ్రామంలోనే లభించగా, నేడు మళ్లీ చిన్నచిన్న పనుల కోసం మండల కేంద్రాలకు తిరగాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మౌలిక వసతుల లేమి.. పనిచేయని కంప్యూటర్లు గ్రామాల్లో వివిధ రకాల ప్రభుత్వ ధ్రువపత్రాలను వేగంగా అందించడానికి గతంలో ప్రతి సచివాల యానికి రెండు కంప్యూటర్లు, పవర్ బ్యాకప్, ఫర్నిచర్ సమకూర్చారు. అయితే ప్రస్తుతం నిర్వహణ లోపంతో అనేక చోట్ల కంప్యూటర్లు మూలన పడ్డాయి. కనీసం తాగునీటి సదుపాయం కూడా లేక సచివాలయాలకు వచ్చే ప్రజలు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇంటి వద్దకే రేషన్, పెన్షన్ సేవలు అందగా, నేడు మళ్లీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. తీవ్రమైన సిబ్బంది కొరత : ఉద్యోగుల సర్దుబాటు (రేషనలైజేషన్) కారణంగా సచివాలయాల్లో సిబ్బంది సంఖ్య గణనీయంగా తగ్గింది. ఖాళీ అయిన స్థానాల్లో కొత్తవారిని నియమించకపోవడంతో సేవలందించడం భారంగా మారింది. ఉదాహరణకు కై కలూరు నియోజకవర్గంలో 79 సచివాలయాల్లో గతంలో 230 మంది పనిచేయగా, ప్రస్తుతం ఆ సంఖ్య 150 కన్నా తగ్గింది. శృంగవరప్పాడు సచివాలయ బాధ్యతలను కేవలం ఒకే ఒక్క ఏఎన్ఎం చూసుకుంటోంది. కలిదిండి మండలంలోని 20 సచివాలయాలకు గాను మొత్తం మండలంలో ఒకే ఒక్క వ్యవసాయ సహాయకుడు అందుబాటులో ఉన్నారు. పనులు మానుకుని పడిగాపులు : మహిళా పోలీసులు, వెల్ఫేర్, డిజిటల్ అసిస్టెంట్లు లేకపోవడం వల్ల కొ ల్లేరు గ్రామ ప్రజలు సర్టిఫికెట్ల కోసం పనులన్నీ వదులుకుని మండల కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఖాళీలను భర్తీ చేసి, మౌలిక వసతులు కల్పించి సచివాలయాలకు పూర్వవైభవం తీసుకురావాలని గ్రామీణులు కోరుతు న్నారు. కంప్యూటర్ల సమస్యపై కలిదిండి ఎంపీడీఓ కె.రమణబాబును వివరణ కోరితే ఇప్పటికే కంప్యూటర్లు పాడైన సచివాలయాల్లో కొత్తవి అందించామని, సమస్యను పరిశీలిస్తామని చెప్పారు. కై కలూరు–2 సచివాలయంలో పనిచేయని కంప్యూటర్లు శృంగవరప్పాడు సచివాలయంలో సిబ్బంది లేని దృశ్యం సచివాలయాల్లో ఏడుగురు పనిచేయాల్సిన చోట కేవలం ఒక్కరూ మాత్రమే ఉంటున్నారు. ప్రధానంగా డిజిటల్ అసిస్టెంట్లపై భారం పడుతోంది. కలిదిండి మండలంలో పలు సచివాలయాల్లో ఒకరు, ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వెంటనే సిబ్బందిని భర్తీ చేయాలి. – ఎస్.మహంకాళిరావు, సీపీఎం కార్యదర్శి, మండవల్లి మండలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో సచివాలయాలు పారదర్శకంగా, అర్హతే ప్రామాణికంగా సేవలు అందించాయి. సచివాలయంలో సర్వే అసిస్టెంట్లను ఏర్పాటుచేశారు. నేడు సిబ్బంది కొరత కనిపిస్తోంది. సచివాలయాలకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించాలి. – బలే నాగరాజు, చింతపాడు, మండవల్లి మండలం -
ఆధ్యాత్మిక చింతన, క్రమశిక్షణతో జీవించాలి
చింతలపూడి (జంగారెడ్డిగూడెం): స్థానిక పద్మ థియేటర్ ఎదురుగా ఉన్న శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాల్లో ప్రముఖ సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, వారాహి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ కమిటీ, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు కురెళ్ళ రాంబాబు శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన ఆధ్యాత్మిక సభలో గరికపాటి ప్రసంగిస్తూ... మానవ జీవితంలో వారాహి దేవి ఉపాసన, బ్రహ్మచర్యం, దైవీ గుణాల ప్రాధాన్యతను వివరించారు. దైవభక్తితో పాటు ప్రతి ఒక్కరిలో కరుణ, దయ, సద్గుణాలు ఉండాలని... తోటివారికి సహాయపడే మనస్తత్వమే నిజమైన భక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. దేవసేన అంటే కేవలం సైన్యం మాత్రమే కాదని, మనిషిలో ఉండాల్సిన దైవీ గుణాలకు ప్రతీక అని వ్యాఖ్యానించారు. సమాజంలో అసూయ, గర్వం వీడి అంతా ఐక్యతతో మెలిగినప్పుడే ఆత్మజ్ఞానం, సుఖశాంతులు కలుగుతాయని ఉద్బోధించారు. ఆధ్యాత్మిక చింతనతో పాటు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలని భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, వేద పండితులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
విద్యార్థులతో వెట్టి చాకిరీ
నూజివీడు: విద్యార్థులతో పాఠశాలలో పనులు చేయించడంపై యనమదల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని హైస్కూల్ ఆవరణలోని శాటిలైట్ స్కూల్లో ఉపాధ్యాయులు గురువారం సాయంత్ర సమయంలో పాఠశాల ముందు భాగంలో ఉన్న సిమెంట్ చేసిన ఫ్లోరింగ్ను, బాత్రూమ్లను విద్యార్థులతో కడిగించారు. విద్యార్థులు బాత్రూమ్ల వద్ద నుంచి బకెట్లతో నీళ్లను మోసుకొస్తూ, ఆవరణను శుభ్రం చేస్తుండటంపై స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు పిల్లలతో పనులు చేయిం చడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
టీడీపీ దౌర్జన్యకాండ
రెచ్చిపోతున్న మట్టి మాఫియా కామవరపుకోట మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలను లక్ష్యంగా చేసుకుని మట్టిని తోడేస్తోంది. 8లో uశురకవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2026సాక్షిప్రతినిధి, ఏలూరు: దెందులూరులో అధికార పార్టీ దౌర్జన్యకాండ తారాస్థాయికి చేరింది. సామాన్యుడిని మొదలు ప్రతిపక్ష పార్టీ ప్రధాన నేతల వరకూ అందరినీ లక్ష్యంగా చేసుకుని ఆస్తినష్టాలకు తెగబడే కొత్త సంస్కృతికి తెరలేచింది. సాక్షాత్తూ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ప్రజాప్రతినిధి కొఠారు అబ్బయ్యచౌదరిని లక్ష్యంగా చేసుకుని రెండేళ్ల నుంచి ప్రత్యక్ష వేధింపులకు విడతల వారీగా దిగుతుండటం నియోజకవర్గంలో హాట్టాపిక్గా మారింది. రెండేళ్లుగా అబ్బయ్యచౌదరి కుటుంబానికి చెందిన పొలంలో ఫలసాయం కోయకుండా దాడి, దౌర్జన్యం, తప్పుడు కేసులతో అధికార పార్టీ ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారు. కక్ష సాధింపు ధోరణితో.. దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు ధోరణి కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలో పోలీసుల ద్వారా అడ్డగోలు చర్యలకు దిగుతూ హడావుడి కొనసాగిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే అబ్బయ్యచౌదరి లక్ష్యంగా దాడులు, ధ్వంస రచనకు సన్నద్ధమైతే ప్రతిపక్ష పార్టీ నేతలు బలంగా తిప్పుకొట్టారు. కొల్లేరు రైతులకు లీజు డబ్బులు ఇవ్వాలనే సాకుతో చింతమనేని నియోజకవర్గంలో కొత్త వివాదానికి తెరదీశారు. కౌంటింగ్ మరుసటి రోజు నుంచే అబ్బయ్యచౌదరి ఇంటి వద్ద డప్పు కొట్టించడం, వంటావార్పు చేయించడం, కొల్లేరు ప్రాంతానికి చెందిన వారనే ముసుగులో టీడీపీ కార్యకర్తలతో హడావుడి కొన్ని నెలల పాటు కొనసాగించారు. అబ్బయ్యచౌదరి తానేమీ ఎవరికీ బాకీ లేనని, డబ్బులు ఇవ్వాల్సిందేమి లేదని ఖరాఖండీగా తేల్చి చెప్పడంతో వివాదం సర్దుమణిగింది. అబ్బయ్యచౌదరి, సోదరిమణులకు స్వగ్రామమైన కొండలరావుపాలెంలో 70 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. దానిలో ఆయిల్పామ్, కోకో, కొబ్బరి సాగులో ఉంది. ఈ క్రమంలో రెండేళ్ల నుంచి ఇక్కడ ఫలసాయం కోయనివ్వకుండా ఎమ్మెల్యే వర్గీయులు, టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని గందరగోళం సృష్టిస్తున్నారు. కొద్ది నెలల క్రితం పంట కోసే సమయంలో దాడులు, దౌర్జన్యాలకు తెగబడి పొలంలో చెట్లు నరకడంతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడి వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనే ఎదురు కేసు నమోదు చేయించారు. ఆ తరువాత మళ్లీ ఇదే తరహాలో హడావుడి జరగడంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటుచేసి టీడీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడటం కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా పొలంలో పని చేయించుకోవడానికి కూలీలను మాట్లాడుకుంటే టీడీపీ నేతలు భయభ్రాంతులకు గురి చేసి రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో రెండేళ్లుగా ఫలసాయం చెట్లపైనే కుళ్లిపోవడంతో 400 లకుపైగా ఆయిల్పామ్ మొక్కలు చనిపోవడం, కొబ్బరి, మరికొన్ని మొక్కలు మృత్యువాత పడటంతో రూ.2.20 కోట్ల మేర ఫలసాయం నష్టం జరిగింది. ఈ పరిణామాల క్రమంలో బుధవారం అబ్బయ్యచౌదరి పొలంలో ఉండి పనులు చేయిస్తుండగా మళ్లీ పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యేకు తప్పని వేధింపులు అబ్బయ్యచౌదరి పొలంలో పంట కోయనీయకుండా అడ్డుకునే యత్నం రెండేళ్లుగా ఇవే వేధింపులు కొనసాగిస్తున్న చింతమనేని 70 ఎకరాల్లో కుళ్లిపోతున్న ఫలసాయం దాదాపు రూ.2.20 కోట్ల నష్టం ఆయిల్పామ్, కొబ్బరి మొక్కల మృత్యువాత కోతకు వచ్చే కూలీలపై టీడీపీ నేతల బెదిరింపులు చింతమనేని బెదిరింపులకు భయపడేది లేదు: అబ్బయ్యచౌదరి పొలంలో పనులు చేయడానికి వచ్చే కూలీల ఇళ్లకు ఎమ్మెల్యే చింతమనేని వెళ్లి పనులకు వెళ్లవద్దని అడ్డగించడం సిగ్గుమాలిన చర్య అని అబ్బయ్యచౌదరి ధ్వజమెత్తారు. తనలాంటి వారికి కూడా కొత్త రాజకీయాలు నేర్పిస్తున్నారని, కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ఆయన హెచ్చరించారు. -
రెచ్చిపోతున్న మట్టి మాఫియా
కామవరపుకోట: మండలంలో మట్టి మాఫియా యథేచ్ఛగా రెచ్చిపోతోంది. స్థానిక ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలను లక్ష్యంగా చేసుకుని జేసీబీలతో తోడేస్తూ, టిప్పర్లు, ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. ఆ మట్టిని ప్రైవేట్ నిర్మాణాలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ఇటుక బట్టీలకు అమ్ముకుంటూ అక్రమార్కులు లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. గత కొంతకాలంగా రాత్రి, పగలు తేడా లేకుండా ఈ అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. స్థానిక అధికార పార్టీ నాయకుల అండదండలతో, నకిలీ అనుమతులు చూపిస్తూ అవసరానికి మించి మట్టిని తోడేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు సైతం తరలిస్తూ అక్రమార్కులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. జనావాసాల మధ్య అతివేగం.. ప్రశ్నిస్తే బెదిరింపులు! జనావాసాల మధ్య నుంచి టిప్పర్లు, ట్రాక్టర్లు అతివేగంగా రాకపోకలు సాగిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అక్రమ రవాణాను స్థానికులు ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. ఇటీవల తడికలపూడిలో జరుగుతున్న మట్టి తవ్వకాలపై ఓ విలేకరి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు, అతనిని కూడా బెదిరించి హెచ్చరించినట్లు సమాచారం. పర్యావరణానికి తీవ్ర ముప్పు! ఈ మట్టి మాఫియా వల్ల ఒకవైపు ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు, మరోవైపు గుట్టలు, కొండలను ఇష్టానుసారంగా తవ్వేయడం వల్ల పర్యావరణ సమతుల్యత తీవ్రంగా దెబ్బతింటోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, కుంటల్లో పరిమితికి మించి మట్టి తీయడం వల్ల నీరు నిల్వ ఉండే సామర్థ్యం తగ్గిపోతోందని, భూగర్భ జలాలు ఇంకిపోయి బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు లేకపోవడంతో ఈ ప్రాంతం మాఫియాకు అడ్డాగా మారుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, మట్టి అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని, అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజాసంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూములు, చెరువులే లక్ష్యం రాత్రింబవళ్లూ అక్రమ రవాణా ప్రభుత్వ ఆదాయానికి గండి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని పర్యావరణవేత్తల ఆందోళనగత కొంత కాలంగా అక్రమార్కులు టీడీపీ అండదండలతో చెరువులు, ప్రభుత్వ భూములు, గుట్టలను ఇష్టానుసారం తవ్వి మట్టిని అక్రమంగా తరలిస్తూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. దీనివలన ప్రభుత్వ ఆదాయానికి గండిపడటంతో పాటు భూగర్భజలాలు ఇంకిపోయి బోర్లలోని నీరు ఎండిపోయి రైతులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. అధికారులు వెంటనే స్పందించి మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలి. – కంభం విజయరాజు, వైఎస్సార్ సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ -
అప్పుల ‘పొగ’లో ఆరిపోయిన రైతు ప్రాణం
● గిట్టుబాటు ధర దక్కక.. అప్పులు తీర్చే మార్గం కనిపించక పొగాకు రైతు మృతి ● మనోవేదనతో గుండెపోటుకు గురై మరణించాడన్న భార్య, కుటుంబ సభ్యులు బుట్టాయగూడెం: పొగాకు పంటకు గిట్టుబాటు ధర దక్కలేదన్న దిగులు.. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడం ఆ రైతును తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. వేలం కేంద్రానికి 8 బేళ్లు తరలించగా.. రెండు బేళ్లను కొనుగోలు చేసిన అధికారులు 6 బేళ్లను వెనక్కి పంపించారు. చివరకు బంటా కూలీ చెల్లించేందుకు కూడా డబ్బుల్లేకపోవడంతో ఆ రైతు కుంగిపోయాడు. చివరకు గుండె పగిలి మరణించాడు. మండలంలోని ముప్పినవారిగూడెంకు చెందిన పొగాకు రైతు పాలా వెంకటేశ్వరరావు (70) గుండెపోటుకు గురై రాజమహేంద్రవరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళ వారం సాయంత్రం మృత్యువాత పడిన ఘటన వి దితమే. గురువారం అతడి భార్య సీతారత్నం, కు మారుడు శ్రీనివాసరావు, కుమార్తెలు వెంకటరమణ, సుజాత మీడియాతో మాట్లాడారు. ‘మాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదయ్యా’ రైతు భార్య సీతారత్నం మాట్లాడుతూ.. ‘నా భర్త ఈ ఏడాది 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పొగాకు పండించారు. సీజన్ ప్రారంభంలోనే వేసిన పంట పాడైపోవడంతో దానిని దున్ని మళ్లీ పంట వేశాం. సాగు కోసం బ్యాంకు నుంచి రూ.12 లక్షల రుణం తీసుకున్నాం. ప్రైవేట్ అప్పులు మరో రూ.10 లక్షలు పంట కోసం వెచ్చించాం. పాడైన పంటను దున్ని మళ్లీ పంట వేయడం వల్ల అదనంగా అప్పుల భారం పడింది. పొగాకు కొనుగోళ్ల ప్రారంభం నుంచీ పంటకు గిట్టుబాటు ధర లేదు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మా ఆయన దిగులుపడ్డారు. ఇటీవల జంగారెడ్డిగూడెం వేలం కేంద్రానికి 8 బేళ్లు అమ్మకానికి తీసుకెళ్లగా.. కేవలం 2 బేళ్లు మాత్రమే కొన్నారు. మిగిలిన 6 బేళ్లు వెనక్కి పంపించారు. పొ గాకు పనులు వేసిన బంటాకు సుమారు రూ.1.50 లక్షల వరకు బకాయి పడ్డాం. ఆ డబ్బుల కోసం కూలీలు మా ఇంటికొచ్చి గొడవ చేశారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురై నా భర్త ఇబ్బంది పడే వారు. అప్పుల బాధ ఎలాగైనా తీర్చుకోవచ్చు ఆందోళన చెందవద్దని చెబుతూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఛాతీలో నొప్పి వస్తోందని చెప్పారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదయ్యా’ అంటూ కన్నీటి పర్యంతమైంది. ‘ఈ అన్యాయం మరే రైతు కుటుంబానికి జరగకూడదు’ రైతు వెంకటేశ్వరరావు కుమారుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘వ్యవసాయం అంటే మా నాన్నకు ఎంతో ఇష్టం. పొగాకు ధరలు పెరగకపోవడంతో అప్పులవాళ్లు ఇబ్బంది పెడుతున్నారని డబ్బు స ర్దాలని నాన్న అడిగారు. ఆందోళన చెందొద్దని.. తా ను ఏదోలా డబ్బులు సమకూరుస్తానని చెప్పాను. ఇంతలోనే ఆయన గుండెపోటుకు గురై మరణించారు. వైఎస్సార్సీపీ పాలనలో కిలో పొగాకు ధర సుమారు రూ.450 చొప్పున వచ్చింది. రైతు కుటుంబాలు ఎంతో ఆనందించాయి. ఇప్పుడు హైగ్రేడ్ పొ గాకు కిలో రూ.265, లోగ్రేడ్ పొగాకు కిలో రూ.175 పలుకుతోంది. దీంతో గిట్టుబాటు ధరలేక ఇళ్ల వద్దే పొగాకు బేళ్లు నిల్వ ఉంచే పరిస్థితి. ఇలాంటి అ న్యాయం మరే రైతు కుటుంబానికి జరగకూడదు.’ అని అన్నారు. బాధిత కుటుంబానికి పరామర్శ వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులను పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గురువారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడు వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అ నంతరం బాలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభు త్వం రైతుల కష్టాలను పట్టించుకోకపోవడంతో రై తు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు వ స్తున్నాయన్నారు. ప్రభుత్వం పొగాకు రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. బాధిత రైతు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఆరేటి సత్యనారాయణ, జెడ్పీటీసీ మొడియం రామతు ల సి, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు తాళ్లూరి ప్ర సాద్, మాజీ సర్పంచ్ తెల్లం వెంకటలక్ష్మి, నాయకు లు కుక్కల రాంపండు, పంపన కృష్ణ, పంపన నాగబాబు, మేకరబోయిన శ్రీను, జిత్తుక సురేష్ ఉన్నారు. -
నేడు మెగా పీటీఎం
నవజాత శిశువు మృతి ఏలూరు జీజీహెచ్లో నవజాత శిశువు మృతి చెందడంతో బాధితులు ఆందోళనకు దిగారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. 8లో uకలెక్టర్ వెట్రిసెల్విఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని 1772 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో శుక్రవారం మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించనున్నట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టరేట్లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, విద్యా ప్రమాణాలు పెంపుదల, తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, పాఠశాల–కుటుంబ సంబంధాలను పటిష్టపరచడం మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ ప్రధాన ఉద్దేశమన్నారు. నిర్వాసితులను తరలించాలి పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కాలనీలను డిసెంబర్లోపు పూర్తిచేసి, నిర్వాసితులందరినీ కాలనీలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి పోలవరం ప్రాజెక్ట్ పునరావాసం, కాలనీల నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ, కాలనీల నిర్మాణ పనులపై అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సీఎం ఆదేశాల మేరకు కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులతో పాటు రోడ్లు, డ్రైనేజీ, అంగన్వాడీ, పాఠశాలలు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను కల్పి ంచాలన్నారు. భూసేకరణలో అవకతవకలకు పాల్పడినా, కాలనీల నిర్మాణాల విషయంలో అలసత్వం వహించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ, పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అభిషేక్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాములు నా యక్, ఎస్డీసీ దేవకీదేవి, ఎస్ఈలు జెడ్.రమేష్, విజయరత్నం తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు మనోజ్ఞ ఎంపిక
తణుకు అర్బన్ : స్థానిక ఎస్కేఎస్డీ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థిని మానె మనోజ్ఞ (ఎంపీసీ) రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ భూపతిరాజు హిమబిందు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో మనోజ్ఞ అండర్ 17 బాలికల సింగిల్స్ విభాగంలో విన్నర్గాను, అండర్ 19 బాలికల డబుల్స్ విభాగంలో విన్నర్గాను, అండర్ 19 బాలికల సింగిల్స్ విభాగంలో రన్నర్గా నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. ఈ సంద్భంగా ప్రశంసాపత్రాలు, ట్రోఫీలు అందుకున్నట్లు చెప్పారు. గురువారం కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్య ఉషారాణి, జాయింట్ సెక్రటరీ చిట్టూరి వెంకట కృష్ణారావు విద్యార్థిని మనోజ్ఞతోపాటు ఫిజికల్ డైరెక్టర్, అధ్యాపకులను ప్రత్యేకంగా అభినందించారు. పాలకొల్లు సెంట్రల్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన జిల్లా స్థాయి శారీరక దివ్యాంగుల క్రికెట్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ కన్వీనర్ లేళ్ల సుబ్బారాయుడు తెలిపారు. గురువారం మీడియాకు వివరిస్తూ డిఫరెంట్లీ అబలీడ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంద్రప్రదేశ్ (డీసీసీ, ఏపీ), డిఫరెంట్లీ అబ్లీడ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఆంద్రప్రదేశ్ (డీఏసీఏ) సంయుక్త ఆధ్వర్యంలో అమరావతి ఇన్క్లూజివ్ క్రికెట్ కప్ 2026 టోర్నమెంట్కు సంబంధించి జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 26వ తేదీ ఉదయం 8 గంటల నుంచి తణుకు సమీపంలోని పైడిపర్రు వై జంక్షన్ వద్ద ఉన్న ఏఎస్ఆర్ బీఈడి క్యాంపస్లోని ఏఎస్ఆర్ క్రికెట్ అకాడమీ నెట్స్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఎంపికలో పాల్గొనే దివ్యాంగ క్రీడాకారులు తమ వ్యక్తిగత క్రికెట్ కిట్ తప్పనిసరిగా వెంట తీసుకురావాలన్నారు. పూర్తి వివరాలకు 95159 21299, 97019 22334 సెల్ నంబర్లలో సంప్రదించాలన్నారు. బుట్టాయగూడెం: గిరిజన యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ నెల 25వ తేదీ కేఆర్పురం వైటీసీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. లలిత గిరిజన మహిళా మండలి సంస్థ ద్వారా ఉద్యోగ కల్పన కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు శనివారం ఉదయం 10 గంటలకు వైటీసీలో జరిగే కార్యక్రమంలో తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాలకు 94933 59574, 73825 52616 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
వసూల్ రాజా !
షరా‘మామూలే’ సాక్షి, భీమవరం: పైవాళ్లకు పంపాలంటూ అసోసియేషన్ నేత అదనపు వసూళ్లు పశ్చిమ రైస్ మిల్లింగ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఏసీకే ఫార్మాలిటీస్ అన్నీ ఇచ్చేశాక రాష్ట్రంలో ఏ జిల్లాలోను లేని విధంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పుడు మళ్లీ ప్రత్యేక వసూళ్లు ఎవరి జేబులోకని చర్చించుకుంటున్నారు. ఎందుకొచ్చిన గొడవని ఎవరికి వారు గుట్టుచప్పుడు కాకుండా ముట్టచెబుతున్నారు. రూ.12 కోట్లు టార్గెట్కు రెండు రోజుల్లో రూ.10 కోట్లకు పైగానే కలెక్షన్ వసూలు చేసినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. రైతుల నుంచి సివిల్ సప్లయిస్ శాఖ సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం మిల్లులకు అప్పగిస్తుంది. మిల్లింగ్ చేసి 67 శాతం బియ్యాన్ని మిల్లర్లు సివిల్ సప్లయిస్కు అప్పగించాలి. గత ఖరీఫ్లో జిల్లాలోని రైతుల నుంచి దాదాపు 4.45 లక్షల మెట్రిక్ టన్నులు, రబీలో 7.82 లక్షలు మెట్రిక్ టన్నులు కలిపి 12.27 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 29 టన్నుల బియ్యాన్ని ఒక ఏసీకే (ఎక్నాలెడ్జ్మెంట్)గా పరిగణిస్తారు. ఈ మేరకు 28,116 ఏసీకేల బియ్యాన్ని సివిల్ సప్లయిస్కు అప్పగించాలి. దీనిలో కొంత మొత్తం ఎఫ్సీఐకు, మిగిలిన బియ్యాన్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషనన్ సిస్టమ్ (పీడీఎస్)కు సివిల్ సప్లయిస్ కేటాయింపులు చేస్తుంది. ప్రత్యేక కలెక్షన్ ఖరీఫ్, రబీ సీఎంఆర్ మేరకు ఇప్పటికే ఫార్మాలటీస్ పూర్తిచేసినట్టు సమాచారం. కాగా అసోసియేషన్లోని కీలక నేత తాజాగా బ్రోకెన్ పర్సంటేజీని మేనేజ్ చేసే నిమిత్తం ప్రభుత్వంలోని పైవాళ్లకు ఇవ్వాలంటూ ఏసీకేకు రూ.4,500 చొప్పున ఇవ్వాలని మిల్లర్లకు హుకుం చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో 207 మిల్లులకు గాను సీఎంఆర్ కేటాయింపుల మేరకు దాదాపు రూ.12 కోట్లు కలెక్షన్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. కూటమి పక్షాలకు చెందిన నేతల అండదండలు పుష్కలంగా ఉన్న సదరు నేతతో ఎందుకొచ్చిన గొడవని మిల్లర్లు చెప్పిన మొత్తం చెల్లిస్తున్నారు. రెండు రోజుల్లో పలు మిల్లుల నుంచి రెండు రోజుల్లో రూ.10 కోట్ల వరకు కలెక్షన్ చేసినట్టు రైస్మిల్లింగ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇరుగుపొరుగు జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా కేవలం పశ్చిమగోదావరి జిల్లాలోనే ఈ స్పెషల్ కలెక్షన్ జరుగుతోందని, ఈ మొత్తం ఎవరి జేబుల్లోకి వెళుతుందని మిల్లర్లు చర్చించుకుంటున్నారు. మరోపక్క సీఎంఆర్ కేటాయింపుల్లోను సదరు నేత ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్న టాక్ ఉంది. మిల్లింగ్ కెపాసిటీ మేరకు సీఎంఆర్ కేటాయింపులు చేయాలి. ప్రైవేట్ ట్రేడింగ్ చేసే మిల్లులకు సీఎంఆర్ ఇవ్వకూడదు. కాగా కూటమికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలను అడ్డంపెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్న పేరుంది. తనకు కావాల్సిన వారికి ఎక్కువగాను, లేనివారికి తక్కువగాను కేటాయింపులు చేస్తున్నారనుకుంటున్నారు. అధికారులు ఆయన చెప్పిన విధంగానే నడుచుకుంటున్నారన్న విమర్శలున్నాయి. పైవాళ్ల పేరిట పశ్చిమలో ప్రత్యేక దందా రైస్ మిల్లర్ల నుంచి ఏసీకేకు రూ.4,500 అదనపు వసూలు ఖరీప్, రబీలో సీఎంఆర్ ద్వారా 28,347 ఏసీకేల బియ్యం ఉత్పత్తి రైస్ మిల్లుల నుంచి రూ.12 కోట్ల మేర కలెక్షన్ టార్గెట్ రెండు రోజుల్లో రూ.10 కోట్లకు పైగానే వసూలు (ఏఐ సృష్టించిన చిత్రం)మిల్లర్లు ఇచ్చే బియ్యంలో నూకలు (బ్రోకెన్) పర్సంటేజీ గతంలో 25 శాతం వరకు ఎఫ్సీఐ అనుమతి ఇచ్చేది. గత సీజన్ నుంచి బ్రోకెన్ను 10 శాతానికి పరిమితం చేసింది. ఎఫ్సీఐ ప్రమాణాలకు లోబడి బియ్యం నాణ్యత ఉండాలి. సీఎంఆర్ బియ్యం తీసుకునే సమయంలో నిబంధనల పేరిట సంబంధిత అధికారులు ఇబ్బందులు పెట్టకుండా కింది స్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు మిల్లర్లు మామూళ్లు ముట్టజెబుతుంటారు. ఒక ఏసీకేకు సుమారు రూ. 2,500 చొప్పున కేటాయింపుల మేరకు ఈ ముడుపులు ఉంటాయి. రీసైకిల్ చేసిన పీడీఎస్ బియ్యానికి రూ.10 వేల వరకు ఉంటుంది. రాజకీయ నేతలకు ఇచ్చే మామూళ్లు సెపరేటుగా ఉంటాయి. మిల్లర్ల నుంచి సేకరించి పైస్థాయికి చేరేవేసే బాధ్యతను అసోసియేషన్ చూసుకుంటుంది. ఈ వ్యవహారమంతా తెరవెనుక గట్టుచప్పుడు కాకుండా సాగిపోతుంది. -
తరలివెళ్లిన పొగాకు రైతులు
చింతలపూడి (జంగారెడ్డిగూడెం): తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన పొగాకు రైతుల ముఖ్య సమావేశానికి బుధవారం జిల్లా నుంచి వైఎస్సార్సీపీ నాయకులతో పాటు రైతులు తరలివెళ్లారు. రైతు సంఘం ప్రతినిధులు పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభంపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ... వేలం కేంద్రాలకు తెచ్చిన బేళ్లలో సగానికి పైగా వ్యాపారులు కొనుగోలు చేయకుండా తిరస్కరించడంతో రవాణా, కూలి ఖర్చులు రైతులకు తీవ్ర భారం అవుతున్నాయని తెలిపారు. 2020లో సంక్షోభం వచ్చినప్పుడు జగన్మోహన్రెడ్డి మార్క్ఫెడ్ ద్వారా రూ.300 కోట్లు కేటాయించి కొనుగోలు చేయించి ఆదుకున్నారని గుర్తుచేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, తలారి వెంకట్రావు, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం 32 వేలం కేంద్రం రైతు సంఘం అధ్యక్షుడు సత్రం వెంకటరావు, 18వ వేలం కేంద్రం ఉపాధ్యక్షుడు వామిశెట్టి హరిబాబు, రైతు నాయకులు బోడా శ్రీనివాసరెడ్డి, నరహరశెట్టి రాజేంద్ర ప్రసాద్, మధు, సయ్యద్ బాజీ తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
పెనుమంట్ర: మండల పరిధిలోని ఓడూరు, భట్లమగుటూరు, జుత్తిగ గ్రామాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు ఎస్సై కె.స్వామి బుధవారం రాత్రి విలేకరులకు తెలిపారు. మంగళవారం రాత్రి భట్టమగుటూరు వద్ద రాష్ట్రీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో జుత్తిగ గ్రామానికి చెందిన కొడమంచిలి కామయ్య అలియాస్ గోతియ్య (65) తీవ్రంగా గాయపడ్డారు. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మృతుని కుమారుడు సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని వివరించారు. అలాగే ఓడూరు వద్ద కానూరు – లంకలకోడేరు రహదారిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన దుండి సంజీవ్ కుమార్ (19) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తణుకులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుని సోదరుడు సూరిబాబు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు. జుత్తిగకు చెందిన కొండగిరి శంకరరావు (58) ఈ నెల 20న రాత్రి ప్రమాదవశాత్తు జీఅండ్వీ కెనాల్లో పడిపోయారు. బుధవారం ఆయన మృతదేహం లభ్యమైంది. మృతుని కుమారుడు మోహన శివ సాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కామయ్య మృతదేహం సంజీవ కుమార్ (ఫైల్) -
ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి
లింగపాలెం: ఎల్నినో ప్రభావంతో సాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సూచించారు. బుధవారం ధర్మాజీగూడెంలో పర్యటించిన ఆమె, పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. సాగునీటి లభ్యత తక్కువగా ఉన్నందున ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని, ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక రామకృష్ణ మేన్యూర్ డిపోను తనిఖీ చేసి, నిల్వల పట్టికను బోర్డుపై ఉంచాలని, యాప్ ద్వారానే ఎరువుల విక్రయాలు జరపాలని ఆదేశించారు. నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా, తహసీల్దార్ నజీముల్లాషా పాల్గొన్నారు. పాఠశాల ఆకస్మిక తనిఖీ ధర్మాజీగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు పాఠాలు బోధించి, వారి సమాధానాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన నాణ్యత, మౌలిక వసతులను పరిశీలించి, పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు స్పష్టం చేశారు. అనంతరం గ్రామంలోని ‘భవిత’ దివ్యాంగుల పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న వసతులు, వైద్య సేవలను పరిశీలించారు. -
అక్రమంగా తరలిస్తున్న పొగాకు బేళ్లు సీజ్
చింతలపూడి (జంగారెడ్డిగూడెం): జీలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామం నుంచి గుంటూరుకు అక్రమంగా రవాణా అవుతున్న పొగాకు బేళ్లను పొగాకు బోర్డు విజిలెన్స్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో మంగళవారం నిఘా ఉంచిన అధికారులు, దర్భగూడెం–వంకవారిగూడెం రోడ్డు వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దళారులు అక్రమంగా కొనుగోలు చేసి గుంటూరుకు తరలిస్తున్న క్రమంలో ఎలాంటి పర్మిట్లు లేని సుమారు 27 హై గ్రేడ్ పొగాకు బేళ్లను గుర్తించి, వాటిని తక్షణమే సీజ్ చేశారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులపై నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి, సీజ్ చేసిన పొగాకును తదుపరి చర్యల నిమిత్తం జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా ఎన్ఎల్ఎస్ రీజనల్ మేనేజర్ జె.సురేంద్ర కుమార్ మాట్లాడుతూ పొగాకు రైతులు ఎవరూ తమ పంట బేళ్లను బయట వ్యక్తులకు, దళారులకు అమ్మకూడదని సూచించారు. ఈ దాడుల్లో పొగాకు బోర్డు విజిలెన్స్ అధికారులు జీఎం కిరణ్, సాయి ప్రశాంత్, ధర్మతేజ పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరికి గుణపాఠం నేర్పుతా
దెందులూరు: తనపై దౌర్జన్యం చేస్తే దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలహీనపడదని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. బుధవారం పెదవేగి మండలం కొండలరావుపాలెంలో ఆయన పొలాల వద్ద ఆయిల్పామ్ గెలలు కోస్తున్న నేపథ్యంలో సీఐ సుభాష్ ఆధ్వర్యంలో ఎస్సైలు పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు నియోజవర్గంలో నాలుగు మండలాల నుంచి వందలాది సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ రెండేళ్లుగా నా కుటుంబ సభ్యులు పొలాల్లో ఆయిల్పామ్ గెలలు, కోకో పంటలు కోస్తుండగా ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు అడ్డుకుంటున్నారన్నారు. తన నివాసంపై గతంలో రాళ్లు వేసి దాడి చేశారన్నారు. ఈ తరహా కక్షపూరిత రాజకీయాలు తాను ఎన్నడూ చూడలేదన్నారు. ఇలాంటి బెదిరింపు రాజకీయాలకు భయపడే ప్రసక్తి లేదన్నారు. తన ఇంటిపై, పొలంలో దాడులు చేసిన వారికి తప్పకుండా గుణపాఠం నేర్పుతానని హెచ్చరించారు. రెండు సంవత్సరాలుగా అడ్డుకోవడంతో వందలాది మొక్కలు చనిపోతున్నాయని ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారన్నారు. దాడులు, అక్రమ కేసులతో బెదిరిస్తూ బెంబేలెత్తిస్తున్నారని.. అధికారం ఏ ఒక్కరికీ శాశ్వతం కాదని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలన్నారు. నేరుగా తనతో తలపడాలే తప్ప కుటుంబ సభ్యుల ఆస్తులకు నష్టం కలిగించడం సరికాదన్నారు. వడ్డీల కార్పొరేషన్ మాజీ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు, జెడ్పీటీసీ లీలా నవకాంతం, వైస్ ఎంపీపీ వేమూరి జితేంద్ర, మండల కొండలరావు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పొలం వద్ద ఆయిల్పామ్ గెలలు కోయిస్తున్న మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, పోలీసు బందోబస్తు -
శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ వి.గోపాలకృష్ణారావు బుధవారం సతీసమేతంగా సందర్శించారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రదక్షిణలు నిర్వహించిన అనంతరం న్యాయమూర్తి స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు ఆయనకు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలుకగా, దేవస్థానం ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. న్యాయమూర్తి వెంట భీమడోలు కోర్టు జడ్జి ఎస్. ప్రియదర్శిని నూతక్కి, ఆలయ సూపరింటెండెంట్ ఐవీ రామారావు తదితరులున్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): యోగాసన క్రీడల ప్రోత్సాహం, ఆరోగ్యంపై చైతన్యం, క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యంగా యోగాసన భారత్ ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించనున్నట్టు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి మోటమర్రి మల్లిఖార్జునరావు ఒక ప్రకటనలో తెలిపారు. రతుంగ గేమ్స్ పేరిట నిర్వహిస్తున్న ఈ పోటీలు స్థానిక వన్టౌన్లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి సత్రంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమౌతాయన్నారు. ఆర్టిస్టిక్ సింగల్, ఆర్టిస్టిక్ పెయిర్, రిథమిక్ పెయిర్, ఆర్టిస్టిక్ గ్రూప్, ట్రెడిషనల్ గ్రూప్ అంశాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీలు సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ల విభాగాల్లో జరుగుతాయని, జిల్లాలోని అన్ని పాఠశాలల, కళాశాలల విద్యార్థులతో పాటు యోగాసన కేంద్రాల విద్యార్థులు, ప్రజలు పాల్గొనవచ్చన్నారు. వివరాలకు 98486 11744, 83094 15417, 94907 34033 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): నీట్ పరీక్షా పత్రాల లీకేజీపై ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థి, యువజనులపై ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు సాగించిన పాశవిక లాఠీచార్జీని ఖండిస్తూ ఐఎఫ్టీయూ, పీవైఎల్, ఏఐకేఎంఎస్ సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఫ్టూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యూవీ మాట్లాడుతూ... లక్షలాది మంది విద్యార్థులు, యువజనుల భవిష్యత్తును నాశనం చేసేలా నీట్ పరీక్షా పత్రాల లీకేజీకి కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా కోరుతూ విద్యార్థి, యువజనులు చేపట్టిన ఉద్యమంపై మోదీ, అమిత్ షాల ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా దమనకాండను ప్రయోగించడాన్ని తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా, పోలీసుల ముసుగులో ఆర్ఎస్ఎస్ గూండాలు కూడా దాడికి దిగారని ఆరోపించారు. ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకుడు టి. బాబురావు మాట్లాడుతూ విద్యార్థి, యువజనులపై దారుణంగా లాఠీచార్జ్ చేసి తీవ్ర హింసకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు పోరండ్ల శ్రీనివాస్, ఇఫ్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, నగర అధ్యక్షుడు బి.సోమయ్య, నగర ప్రధాన కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు, నాయకులు డి.వీరినాయుడు, మంగం అప్పారావు పాల్గొన్నారు. పోలవరం రూరల్: ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి నీరు భారీగా చేరడంతో వరద ప్రవాహం క్రమేణా పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటిమట్టం 26 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం స్పిల్వే నుంచి 32 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల్లో కూడా వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. -
బదిలీల రాజకీయం
చిక్కిన చైన్ స్నాచర్ చేపలు అమ్ముకుంటున్న వృద్ధురాలిని బురిడీ కొట్టించి ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 8లో uభూ వివాదం సద్దుమణిగింది.. రాజకీయ వేడి రాజుకుంది. చివరకు బదిలీల కత్తి దేవస్థానం అధికారుల మెడపై వేలాడుతోందన్న చర్చ ద్వారకాతిరుమల క్షేత్రంలో జోరందుకుంది. ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావుకు అనుకూలంగా ఉన్నారనే కారణంతోనే అధికారులను ఒక్కొక్కరిని పచ్చనేతలు టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇద్దరు సూపరింటెండెంట్లు డిప్యుటేషన్పై బదిలీ కాగా.. మరి కొందరిపై, ముఖ్యంగా ఇద్దరు ఇంజనీరింగ్ విభాగ అధికారులపై బదిలీ వేటు తప్పదన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆలయ చైర్మన్ వయోభారాన్ని దృష్టిలో ఉంచుకుని పరిపాలన సౌలభ్యం కోసం చైర్మన్కు ఆయన కుమారుడిని సహాయకుడిగా నియమిస్తూ ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీఓను సైతం రద్దు చేయించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. గురువారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2026ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్ర దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ భూకబ్జా వివాదం ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. భూవివాదం కూటమి పాలకులకు, నేతలకు తలనొప్పిగా మారిన నేపథ్యంలో.. అందుకు కారణమయ్యారన్న అనుమానంతో కొందరు దేవస్థానం అధికారులపై బదిలీ వేటు మొదలైంది. ఇప్పటికే ఇద్దరు అధికారులు బదిలీ కాగా.. మరికొందరు కీలక అధికారులు టార్గెట్ లిస్టులో ఉన్నారన్న చర్చ సాగుతోంది. దీంతో శ్రీవారి దేవస్థానంలో అసలు నడుస్తోంది పరిపాలనా ప్రక్రియా..? రాజకీయ కక్ష సాధింపా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భూవివాదంతో మొదలైన రగడ దేవుడి భూకబ్జా వ్యవహారం బయటకు రావడంతో వివాదం రాజుకుంది. దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకరరావు కుమారుడు, అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావు గత నెల 23న వివాదాస్పద భూమి అంశంపై ఓ టీడీపీ నేతను నిలదీయడం, అదే రోజు తొలి ట్రస్ట్ బోర్డు సమావేశంలో ఆ నేతతో వాగ్వాదం జరగడం పరిస్థితిని మరింత వేడెక్కించింది. అనంతరం దేవుడి భూమి.. దేవుడికే దక్కాలంటూ మాజీ హోం మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నేతలు చేపట్టిన ఆందోళనలు రాజకీయ దుమారాన్ని రేపాయి. దాంతో అధికారులు రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి, జరిగిన తప్పులను సరిచేయడం కూడా పాలకుల కబ్జాకోరుతనాన్ని మరింత బహిర్గతం చేసింది. ఇప్పటికే ఇద్దరిపై బదిలీ వేటు గతంలో శ్రీవారి దేవస్థానం నుంచి అన్నవరం దేవస్థానానికి బదిలీ అయిన సూపరింటెండెంట్ కోటగిరి కిషోర్ ఏడాది క్రితం డిప్యూటేషన్పై తిరిగి మళ్లీ ఇక్కడికి వచ్చారు. ఆయన డిప్యుటేషన్ కాలం ఇటీవల ముగియడంతో, మరో ఏడాది పాటు దాన్ని పొడిగించుకునేందుకు కిషోర్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాజాగా మంగళవారం సూపరింటెండెంట్ వాసా నగేష్ను పెనుగంచిప్రోలు దేవస్థానానికి ఏడాది పాటు డిప్యూటేషన్పై బదిలీ చేయడం క్షేత్రంలో చర్చకు దారితీసింది. ఈ ఇద్దరు బదిలీ పచ్చ పాలకుల కనుసన్నల్లో జరిగిందేనన్న చర్చ జరుగుతోంది. పరిపాలనా అవసరాల దృష్ట్యా అని సాకుచూపి, పాలకుల ఆదేశాలను దేవాదాయశాఖ అధికారులు అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో ఇద్దరు అధికారులపై గురి దేవస్థానం ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డీవీ భాస్కర్, ఎలక్ట్రికల్ డీఈ టి.సూర్యనారాయణ కూడా టార్గెట్ లిస్టులో ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. త్వరలో వీరిపైనా బదిలీ చర్యలు ఉంటాయని కొందరు నేతలు బహిరంగంగా చెబుతున్నారు. ఈ ఇద్దరూ చైర్మన్కు సన్నిహితులుగా గుర్తింపు పొందిన అధికారులే కావడం గమనార్హం. ఉద్యోగం చేయలేం బాబోయ్ రాజకీయ ఒత్తిళ్లు, బదిలీల బెదిరింపులతో దేవస్థానం అధికారులు, సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఇలా ఒత్తిళ్లు కొనసాగితే ఉద్యోగాలు చేయడం కష్టమే’ అని పలువురు వాపోతున్నారు. గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు తమకు ఎదురవలేదని అంటున్నారు. లక్ష్మీపురం భూవివాదం తర్వాత దేవస్థానం అధికారులపై బదిలీ బాణం ఇప్పటికే ఇద్దరు బదిలీ.. మరో ఇద్దరిపై గురి చైర్మన్ కుమారుడి జీఓను రద్దు చేయించేందుకు ప్రయత్నాలు? శ్రీవారి క్షేత్రంలో హాట్టాపిక్గా బదిలీ రాజకీయాలు (ఏఐ సృష్టించిన చిత్రం) -
మట్టి లారీ సీజ్
కొయ్యలగూడెం : అనుమతులు లేని మట్టి రవాణాపై రెవెన్యూ అధికారుల చర్యలు చేపట్టారు. బుధవారం రాజవరం శివారు గంగవరం వద్ద అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న లారీని తహసీల్దార్ ఎన్.నాగరాజు, రెవెన్యూ అధికారులు అడ్డుకుని సీజ్ చేశారు. అనంతరం లారీను కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్కు తరలించారు. దెందులూరు : మండలంలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని దెందులూరు ఎస్సై డి.వెంకట్ కుమార్ తెలిపారు. బుధవారం దెందులూరు పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండల పరిధిలో ఏ విధమైన అంశాలపై సమావేశాలు, సామూహిక ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదన్నారు. పోలీస్ నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం : శతాధిక వృద్ధురాలు కుచ్చలపాటి సూర్యకాంతమ్మ (108) స్థానిక శ్రీ సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచింది. సమాచారం ఇచ్చినా కుటుంబ సభ్యులు రాకపోవడంతో, ఆశ్రమ నిర్వాహకుడు జయవరపు శేఖర్, సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు ముందుకొచ్చి, హిందూ స్మశానవాటికలో ఆమె అంత్యక్రియలను శాస్త్రబద్ధంగా నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. కన్నవారే రాని సమయంలో బిడ్డల కంటే మిన్నగా అంతిమ సంస్కారాలు చేసిన శేఖర్, మధు సేవలను క్షత్రియ సేవా సమితి సభ్యుడు దండు ధనరాజు, పలువురు ప్రముఖులు కొనియాడారు. తణుకు అర్బన్ : ఆర్టీసీ బస్సు డివైడర్ను ఢీకొట్టిన ఘటన ప్రయాణికులను హడలెత్తించింది. తణుకు రాష్ట్రపతి రోడ్డు కోర్టు సమీపంలో బుధవారం జరిగిన ఈ ఘటనలో తణుకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బస్టాండ్ నుంచి మునిసిపల్ కార్యాలయం వైపు వెళ్తూ డివైడర్పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డివైడర్పై ఉన్న మొక్కల కుండీలు ధ్వంసమై పక్కరోడ్డుపైకి ఎగిరి పడ్డాయి. ఆ సమయంలో రహదారిపై ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే రోడ్డు ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ కనీసం బస్సును ఆపకుండా నిర్లక్ష్యంగా వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. డ్రైవింగ్లో బస్సును అదుపు చేయలేకపోతే ప్రయాణికుల పరిస్థితి ఏంటని స్థానికులు చర్చించుకున్నారు. చింతలపూడి: మండలంలోని ఎరగ్రుంటపల్లి గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్కు గురై ఒక పాడిగేదె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పాడిరైతు తెలిపిన వివరాల ప్రకారం ఎరగ్రుంటపల్లి గ్రామానికి చెందిన రైతు పెనుబాక రామారావు తన పాడిగేదెను మేతకు తోలుకెళ్లిన సమయంలో అక్కడ రోడ్డు పై పడి ఉన్న విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. చనిపోయిన గేదె విలువ సుమారు రూ. లక్ష రూపాయలు ఉంటుందని బాధితుడు వాపోయాడు. జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా బీహెచ్ వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన ఏఎస్పీ సుస్మిత రామనాథన్ నంద్యాల ఏఎస్పీగా బదిలీ అవ్వడంతో, విజయవాడ అజిత్సింగ్ నగర్ క్రైమ్ విభాగంలో సీఐగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు పదోన్నతిపై ఇక్కడికి డీఎస్పీగా వచ్చారు. నూతన డీఎస్పీకు జంగారెడ్డిగూడెం ఎస్సై ఆర్.వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై కుటుంబరావు, తడికలపూడి ఎస్సై వల్లీపద్మ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. -
పొగాకు రైతులకు బోర్డు షాక్
● వచ్చే సీజన్లో వర్జీనియా ఉత్పత్తి లక్ష్యం భారీగా కోత ● 2026–27 సీజన్కు 81.02 మిలియన్ కిలోలకే పరిమితం బుట్టాయగూడెం : రానున్న 2026–27 సీజన్లో వర్జీనియా పొగాకు ఉత్పత్తి లక్ష్యాన్ని భారీగా తగ్గిస్తూ భారత పొగాకు బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బోర్డు అధికారులు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 2024–25 సీజన్కు 170 మిలియన్ కిలోలు, 2025–26 సీజన్కు 143 మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇచ్చిన బోర్డు, రాబోయే 2026–27 సీజన్కు వచ్చేసరికి ఉత్పత్తిని ఏకంగా 81.02 మిలియన్ కిలోలకు కుదించింది. ఇందులో భాగంగా ఉత్తర తేలిక నేలలున్న రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని జంగారెడ్డిగూడెం–1, 2, దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం వేలం కేంద్రాల పరిధిలో కేవలం 28.02 మిలియన్ కిలోల ఉత్పత్తికి మాత్రమే ఆమోదం తెలిపింది. తగ్గింపునకు ప్రధాన కారణాలివే ప్రస్తుత సీజన్ పొగాకు మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు వ్యక్తమవుతున్నాయి. వేలంలో రోజూ సగానికి పైగా బిల్లులు తిరస్కరణకు గురికావడం, ధరలు ఘోరంగా పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితులకు ప్రధానంగా మూడు అంశాలు కారణమని వ్యాపారులు బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సిగరెట్ ఉత్పత్తులపై జీఎస్టీ పెంపుతో పాటు పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, అవసరానికి మించి స్థానికంగా, ఇతర దేశాల్లో పొగాకు దిగుబడి పెరగడం ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. విదేశీ వ్యాపారుల నుంచి ఆశించిన స్థాయిలో ఆర్డర్లు రాకపోవడంతోనే ఈ సంక్షోభం నెలకొందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రాబోయే సీజన్ ఉత్పత్తిని తగ్గించి, ప్రస్తుత సీజన్లో మిగిలిపోయిన నిల్వలను కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అయోమయంలో సాగుదారులు ఉత్పత్తి లక్ష్యాన్ని సగానికి పైగా కోతేయడంతో రాజమహేంద్రవరం రీజియన్ పొగాకు రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. బోర్డు నూతన నిబంధనల ప్రకారం ప్రతి బేరన్కు కేవలం 20 క్వింటాళ్ల ఉత్పత్తికి మాత్రమే అనుమతి ఉంటుంది. దీనివల్ల బేరన్కు కేవలం 2 ఎకరాల్లో మాత్రమే సాగు చేయాల్సి వస్తుంది.ఒక్కో రైతుకు గరిష్టంగా 4 బేరన్లకే పరిమితి విధించారు. 2025–26 సీజన్లో బేరన్కు 41 క్వింటాళ్ల వరకు అనుమతి ఉండేది. ఈ తగ్గింపు వల్ల కనీస పెట్టుబడులు రావని రైతులు వాపోతున్నారు. అనధికార సాగుపై బోర్డు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో పొగాకుకు బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లడమే మేలని పలువురు భావిస్తున్నారు. ఏఐ సృష్టించిన చిత్రంగత నాలుగేళ్లుగా పొగాకు ఉత్పత్తి లక్ష్యాన్ని తగ్గిస్తూనే వస్తున్నారు. రాబోయే సీజన్లో మరింత కోత విధించడం వల్ల రైతులు తీవ్రంగా దెబ్బతింటారు. ప్రభుత్వం, పొగాకు బోర్డు ఈ నిర్ణయంపై వెంటనే పునరాలోచన చేసి, ఉత్పత్తి లక్ష్యాన్ని పెంచాలి. – సయ్యద్ బాజీ, పొగాకు రైతు, అచ్చెయ్యపాలెం -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
టి.నరసాపురం: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు స్థానిక అప్పలరాజుగూడెం గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్. వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులను బుధవారం పాఠశాల ఆవరణలో ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ నెల 21న ఏలూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ పోటీల్లో తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు పలు విభాగాల్లో ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయికి అర్హత సాధించారని వెల్లడించారు. అండర్–14 విభాగంలో కె.కౌశిక్ వర్థన్ కిడ్స్ జావిలిన్ త్రోలో ప్రథమ స్థానం సాధించగా, అండర్–18 విభాగంలో బి.రాజేష్ షాట్పుట్లో, జి.భరత్ కుమార్ 100 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానాల్లో నిలిచారు. అలాగే అండర్–16 విభాగంలో పి.మోషే 60 మీటర్ల పరుగు పందెంలో, జి.మనోజ్ షాట్పుట్లో ద్వితీయ స్థానాలు దక్కించుకుని రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారని వివరించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులతో పాటు, వారికి ప్రత్యేక శిక్షణ అందించిన పీఈటి టి.లహరి దుర్గను అభినందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రిన్సిపాల్ ఎన్.సుబ్రహ్మణ్యంతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భీమడోలులో.. భీమడోలు: జిల్లా అఽథ్లెటిక్స్ పోటీల్లో భీమడోలు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభను చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు విద్యార్థులను బుధవారం పాఠశాలలో అభినందించారు. అండర్ 16 విభాగంలో దాసరి జయశ్రీలక్ష్మీ 60 మీటర్ల పరుగు పందెం, 600 మీటర్ల పరుగు విభాగాల్లో ప్రథమ స్థానాన్ని సాధించి తమ సత్తాను చాటింది. అండర్ 18 విభాగంలో ఎల్.రాకేష్కుమార్ 1000 మీటర్ల పరుగు పోటీల్లో ద్వితీయ స్థానం సాధించగా, అండర్ 16 విభాగంలో ఎ.రాజేష్ లాంగ్ జంప్ విభాగంలో ద్వితీయ స్థానాన్ని సాధించాడు. వచ్చే నెల 11, 12, 13వ తేదీల్లో తిరుపతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని హెచ్ఎం జీఎస్ పద్మజ తెలిపారు. పాఠశాలకు చెందిన క్రీడాకారులు ఆదిత్య, అఖిల్, పవన్తేజ, మహీలు జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనుబర్చినందులకు ప్రశంసా పత్రాలను అందించారు. విజేతలకు తర్ఫీదును అందించిన పీడీ పి.త్రిపుర స్వాతి, పి.సురేష్బాబు, సోమశేఖర్, శ్యాంబాబునాయక్లను హెచ్ఎం అభినందించారు. -
రైతులు యాజమాన్య పద్ధతులను పాటించాలి
నూజివీడు : ఎల్నినో ప్రమాదం పొంచి ఉన్నందున మామిడి రైతులు యాజమాన్య పద్ధతులను పాటిస్తే తోటలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూసుకోవచ్చని మామిడి పరిశోధనస్థానం ప్రధాన శాస్త్రవేత్త బొర్రా కనకమహాలక్ష్మి పేర్కొన్నారు. ప్రపంచ మామిడి దినోత్సవం సందర్భంగా స్థానిక మామిడి పరిశోధన స్థానం ఆవరణలో బుధవారం రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు మామిడి తోటలను తొలగించి పామాయిల్ మొక్కలు నాటుతున్నారని, దీనివల్ల దీర్ఘకాలంలో అనేక నష్టాలు ఎదురవుతాయన్నారు. మామిడి తోటలను తీసేయాల్సిన పనిలేదని, సరైన యాజమాన్య పద్ధతులను రైతులు అవలంభిస్తే ఆదాయాన్ని పొందవచ్చన్నారు. మరో శాస్త్రవేత్త కె.ఉమామహేశ్వరి మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువులను ఎక్కువగా వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు, విస్సన్నపేట ఉద్యాన అధికారులు ఆర్.హేమ, సౌజన్య, కీటక శాస్త్రవేత్త శాలిరాజు తదితరులు పాల్గొన్నారు. -
మూడో రోజుకు చేరిన నిరసనలు
తాడేపల్లిగూడెం : అసిస్టెంటు ప్రొఫెసర్లుగా దీర్ఘకాలంగా నన్నయ్య విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న తమను పర్మినెంటును చేయాలని కోరుతూ స్ధానిక నన్నయ్య ప్రాంగణం వద్ద కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన నిరసన బుధవారం మూడో రోజుకు చేరుకుంది.తక్షణమే ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు అసిస్టెంటు ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో ఫీడ్ ధరలు పెరిగిపోవడం, ప్రాసెసింగ్ ధరలు తగ్గిపోవడంతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్రాజు అన్నారు. బుధవారం పూలపల్లిలో గాంధీరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్వా రైతుల సమస్యలు పరిష్కారం కోసం కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలను అందించామన్నారు. ముఖ్యంగా నేషనల్ ఫిషరిస్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్ఎఫ్డీబీ) ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఉందన్నారు. నూతనంగా ఇప్పుడు అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనికోసం స్థలం కూడా కేటాయించారన్నారు. ఎన్ఎఫ్డీబీ రాష్ట్రంలో రావడం వల్ల రాష్ట్రంలో చేపల ఉత్పత్తి, రొయ్యల పెంపకం, మార్కెటింగ్, ఎగుమతులను పెంచుకోవచ్చన్నారు. అలాగే ఆక్వాకు చెందిన క్వారంటైన్ను కూడా వైజాగ్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం అధ్యక్షుడు బోణం చినబాబు, మేడిది జాన్రాజు, పెన్మెత్స సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు ఏలూరు (ఆర్ఆర్పేట): దేశ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవద్దని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపు మేరకు బుధవారం పాతబస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం నాయకులు కె. శ్రీనివాస్, పోరండ్ల శ్రీనివాస్, బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 24న కేంద్ర ప్రభుత్వం అమెరికాతో చేసుకోనున్న ఈ ఒప్పందం అన్నదాతల పాలిట ఉరితాడుగా మారుతుందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా రైతులు వ్యతిరేకిస్తున్నా కేంద్రం మొండిగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. వెంటనే ఈ ఒప్పందాన్ని విరమించుకోవాలని, 60 ఏళ్లు దాటిన పేద రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు నెలకు రూ. 10 వేల పింఛన్ అందించాలని, ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు, ఏఐయూకేఎస్ జిల్లా నాయకుడు సిరికొండ రామారావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రం సంక్షోభంలో ఉంది
కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఏలూరు (ఆర్ఆర్పేట): కూటమి పాలనలో రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్నారని, డిగ్రీలు, ఇంజనీరింగ్ చదివిన యువత కేవలం రూ.5 వేలు, రూ.10 వేల జీతాలకే పనిచేస్తూ దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు 19 ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. రాష్ట్రంలో కాపులు 20 శాతం మంది ఉన్నప్పటికీ, ఇప్పటివరకూ ఏ కాపు నాయకుడూ ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారో ఆ సామాజికవర్గ ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. కాపులు ముఖ్యమంత్రి కావాలంటే కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. దేశంలో నీట్ అక్రమాలపై న్యాయం కోరుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేసి, బూటు కాళ్లతో గొంతులపై తొక్కడం అత్యంత దారుణమన్నారు. పరీక్షలు న్యాయంగా నిర్వహించాలని అడిగినందుకు విద్యార్థులను జైళ్లలో పెట్టడం దేశ చరిత్రలోనే ఎన్నడూ జరగలేదని దుయ్యబట్టారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. -
పోలీసులకు చిక్కిన చైన్ స్నాచర్
ఏలూరు టౌన్: చేపలు అమ్ముకుంటున్న వృద్ధురాలిని బురిడీ కొట్టించి ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రావణ్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. ఏలూరు రూరల్ మండలం లింగారావుగూడేనికి చెందిన సోమమ్మ చేపలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ నెల 15న శ్రీపురం వంతెన వద్ద ఆమె చేపలు విక్రయిస్తుండగా, మండవల్లి మండలం బైరవపట్నానికి చెందిన గొల్లు నాగ కార్తీక్ అనే యువకుడు చేపలు కొనే నెపంతో వచ్చాడు. ఆమె దృష్టి మళ్లించి మెడలోని 18.43 గ్రాముల బంగారు గొలుసును తెంచుకుని ద్విచక్రవాహనంపై పరారయ్యాడు. వృద్ధురాలి ఫిర్యాదుతో ఏలూరు వన్ టౌన్ సీఐ రామకృష్ణ, రూరల్ ఎస్సై వెంకటేశ్వరరావులు గాలింపు చేపట్టారు. నిందితుడు పారిపోతున్న సమయంలో స్థానిక యువకులు అతడి ఫోటో తీయడం కేసు దర్యాప్తుకు ఎంతో ఉపకరించింది. బుధవారం నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతడి నుంచి రూ.లక్ష విలువైన బంగారు గొలుసుతో పాటు నేరానికి వాడిన ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడే ఈ చోరీకి పాల్పడినట్లు తెలిపారు. సమయస్ఫూర్తితో నిందితుడి ఫోటో తీసి కేసు ఛేదనకు సహకరించిన యువకులకు డీఎస్పీ అభినందనలు తెలిపారు. త్వరలోనే వారికి సిటిజన్ అవార్డు అందజేస్తామని ప్రకటించారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న సీఐ రామకృష్ణ, ఎస్సై వెంకటేశ్వరరావు, పోలీసు సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. -
ప్రతి రైతుకు పంటల బీమా అందాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా అమలు చేస్తున్న పంటల బీమా పథకంలో ప్రతి రైతు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కే వెట్రిసెల్వి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో ‘పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం’పై రూపొందించిన వాల్ పోస్టర్ను మంగళవారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... వాతావరణం ప్రతికూల పరిస్థితుల కారణంగా పంట నష్టాల నుంచి రైతులను ఆదుకునేందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. రైతులు పత్తి పంటకు ఎకరానికి రూ.1,900, నిమ్మ పంటకు రూ.2,500 చొప్పున జూలై 31వ తేదీలోగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అకాల లేదా అధిక వర్షపాతం, చీడపీడలకు అనుకూలించే వాతావరణం, అధిక ఉష్ణోగ్రతలు, ఈదురు గాలులు, గాలిలో తేమ శాతం తదితర కారణాలతో నష్టం జరిగితే జిల్లాలో పత్తి, నిమ్మ పంటలకు ఈ బీమా వర్తిస్తుందన్నారు. పరిహారంగా పత్తి పంటకు ఎకరానికి రూ. 38 వేలు, నిమ్మ పంటకు రూ. 50 వేల చొప్పున అందుతుందని ఆమె వివరించారు. 24న మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ : పాఠశాలలో విద్యా ప్రమాణాల స్థాయి పెరిగేలా ‘మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్’ అర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కే వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఆమె స్థానిక కలెక్టరేట్ నుంచి మంగళవారం మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ నిర్వహణ ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈనెల 24వ తేదీన జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. -
భర్త చెర నుంచి విముక్తి
భీమడోలు: తాగుబోతు భర్త బారి నుంచి ఒక మహిళను భీమడోలు పోలీసులు అత్యంత వేగంగా స్పందించి కాపాడారు. కుటుంబ కలహాల వల్ల దూరంగా ఉంటున్న సీతారత్నాన్ని, ఆమె భర్త రాజు భీమడోలు బస్టాండ్లో బెదిరించి బలవంతంగా బైక్పై తీసుకెళ్లాడు. ప్రమాదాన్ని గ్రహించిన ఆమె వెంటనే శక్తి యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. సీఐ వి.కృష్ణ ఆదేశాలతో ఎస్సై మదీనా బాషా ఆధ్వర్యంలో హెచ్సీ సూరిశెట్టి శ్రీనివాసరావు, హోంగార్డు పరమేశ్లు జీపీఎస్ ఆధారంగా వెంబడించారు. పోలీసులను చూసి రాజు పారిపోవడంతో సీతారత్నాన్ని సురక్షితంగా కాపాడారు. సమయస్ఫూర్తిగా స్పందించి తన ప్రాణాలు కాపాడిన పోలీసులకు బాధితురాలు కృతజ్ఞతలు తెలిపింది. -
డిజిటల్ రూపంలో కోయ, గిరిజన భాషలు
బుట్టాయగూడెం: గిరిజన భాషల పరిరక్షణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఏఐ టూల్ డెవలప్ చేసి కోయ, గిరిజన భాషలను డిజిటల్ రూపంలో పొందుపరుస్తున్నట్లు ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్ తెలిపారు. ఈమేరకు మండలంలోని కేఆర్పురం ఐటీడీఏలో మంగళవారం కోయభాష నిపుణులు, కోయ భాష అనువాదం వారితో వర్క్షాప్ నిర్వహించారు. ఐటీడీఏ పీఓ మాట్లాడుతూ కోయ భాష పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. ప్రొఫెసర్ డాక్టర్ చిక్కాల నాగరాజు మాట్లాడుతూ భాష సంస్కృతితో ముడిపడి ఉందని, ఆ భాష అంతరించిపోతే సంస్కృతి కూడా అంతరించిపోతుందని అన్నారు. భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. కార్యక్రమంలో డీడీ పి.జగన్నాథరావు, అసోసియేట్ ప్రొఫెసర్ జి. చంద్రకళ, డీవైఈఓ కె.రవిప్రసన్నకుమార్, ఏఎంఓ కె.శిరమయ్య, సీఎంఓ ఎస్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఏఎంఓ ఎం.రమణారావు, వైటీసీ మేనేజర్ ఇజ్రాయేల్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి సమస్య పరిష్కరించాలి
మావుళ్లమ్మకు బంగారం సమర్పణ భీమవరం (ప్రకాశంచౌక్): శ్రీ మావుళ్లమ్మ తల్లికి సంపూర్ణ స్వర్ణ వస్త్రం నిధికి ముప్పాళ్ళ నరసరాజు, నాగమణి దంపతులు రూ.లక్ష విరాళంగా అందజేశారు.ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలో తాగునీటి సమస్య తలెత్తకుండా దెందులూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను పూర్తిస్థాయిలో నింపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ మంగళవారం కలెక్టర్ కె.వెట్రిసెల్వికి వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. జూన్ నెల 1 నుంచి గోదావరి కాలువకు నీరు విడుదల చేసినప్పటికీ కాలువలో పూడికలు తొలగింపు పని పూర్తికాని కారణంగా జూన్ 10 వరకు దెందులూరు సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ వద్ద చాంబర్ వరకు నీటి సరఫరా జరగలేదన్నారు. జూన్ 11 నుంచి నీటిని విడుదల చేసినప్పటికీ కాలువలో నీటి స్థాయి 1.5 అడుగుల నుంచి 2 అడుగుల లోపు మాత్రమే ప్రవహిస్తున్న కారణంగా చెరువును నింపడానికి పూర్తి స్థాయిలో మోటార్లను వినియోగించడానికి వీలుపడలేదన్నారు. గోదావరి కాలువల్లో పూడికతీత పనులు పూర్తికాకపోవడం, కాలువలో నీటి మట్టం తక్కువగా ఉండటంతో 3 వేల మిలియన్ లీటర్ల సామర్థ్యం గల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో ప్రస్తుతం కేవలం 270 మిలియన్ లీటర్ల నీరు మాత్రమే ఉందని, ఇది ఏడు రోజులకు సరిపోతుందని మేయర్ వివరించారు. గోదావరి కాలువ నుంచి వచ్చే నీటిని మధ్యలో మళ్లించకుండా, ట్యాంక్ నింపేందుకు వీలుగా ఇరిగేషన్ అధికారులను ఆదేశించాలని ఆమె కలెక్టర్ను కోరారు. స్పందించిన కలెక్టర్, చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
179 బస్సులపై కేసులు
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని వాహన తనిఖీ అధికారులు గత నెల 12వ తేదీ నుంచి ఈ నెల 20 వరకూ వివిధ ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన 179 బస్సులపై కేసులు నమోదు చేసి, రూ.3.95 లక్షల అపరాధ రుసుము విధించినట్లు ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ మంగళవారం తెలిపారు. ఇందులో వీఎల్టీడీ లేని 144 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రతి స్కూల్ బస్సుకు తప్పనిసరిగా వీఎల్టీడీ పరికరాన్ని కలిగి ఉండాలని, డ్యాష్ బోర్డు కెమెరాలను బిగించాలన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు రహదారి భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులను సురక్షితంగా తరలించాలని, లేని పక్షంలో కేసులు నమోదు చేయడంతో పాటు బస్సులను సీజ్ చేస్తామని డీటీసీ కరీమ్ హెచ్చరించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో ఎస్సీలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీ మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ పెదపూడి విజయకుమార్ స్పష్టం చేశారు. స్థానిక గిరిజన భవనంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మాలల సంక్షేమానికి, అభివృద్ధికి పూర్వవైభవం తీసుకువస్తా మని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పర్యటించి, క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. దళితుల హక్కులు, కార్పొరేషన్ ద్వారా పేదలకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, శిక్షణలపై పూర్తిస్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ విషయాలపై అధికారులు కూడా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సమాజంలో ఎస్సీలు ఆర్థికంగా బలోపేతం కావడానికి సీని యర్ నాయకుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం. ముక్కంటి, ఏపీ మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ డైరెక్టరు దాసరి ఆంజనేయులు, కృష్ణా జిల్లా డైరెక్టరు దయాల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో ఆగస్టు నెలలో 26 గ్రామాలకు చెందిన రైతులకు 14,153 పట్టాదారు పాస్పుస్తకాలు పంపిణీ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కే. వెట్రిసెల్వి, రాష్ట్ర భూపరిపాలనా ప్రధాన కమిషనర్ జి.జయలక్ష్మికి వివరించారు. రాష్ట్ర సచివాలయం నుంచి 22–ఎ దరఖాస్తుల పరిష్కారం, పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ, రీ–సర్వే, ఐవీఆర్ఎస్ సర్వే, ఇతర రెవెన్యూ సమస్యల పరిష్కారంపై భూపరిపాలనా ప్రధాన కమిషనర్ మంగళవారం వివిధ జిల్లాల కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. కాన్ఫరెన్స్లో కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పాస్పుస్తకాల పంపిణీకి సంబంధించి ఈ–కేవైసీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. అలాగే 22–ఎ భూ సమస్యలకు సంబంధించి జిల్లాలో ఇప్పటివరకు 410 దరఖాస్తులు రాగా, అందులో 107 దరఖాస్తులను ఆమోదించినట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం లేని 109 దరఖాస్తులను తగిన కారణాలు తెలియజేస్తూ తిరస్కరించామన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): గోదావరి పుష్కరాలు – 2027 ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం నుంచి పుష్కరాల ప్రత్యేక అధికారి వీరపాండియన్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులు ప్రద్యుమ్న, కార్తికేయ మిశ్రా మంగళవారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖల అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో వారు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గోదావరి పుష్కరాల సందర్భంగా స్నాన ఘాట్ల నిర్మాణం, ఘాట్లలో మౌలిక సదుపాయాల కల్పన, పుష్కర ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి, రవాణా, భద్రత తదితర అంశాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులు సమర్పించిన ప్రతిపాదనలను ఈ సందర్భంగా పరిశీలించి సమీక్షించారు. జూమ్ కాన్ఫరెన్స్లో కలెక్టర్ కే. వెట్రిసెల్వితో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రెగ్యులేటర్లకు గ్రహణం
బుధవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 2026నరసాపురం: అటుపక్క కొల్లేరు, ఇటు పక్క సముద్రం ద్వారా వస్తున్న ఉప్పునీటి సమస్యకు చెక్ పెట్టాలని, ముఖ్యంగా భూగర్భ జలాలు ఉప్పు నీటిమయం కాకుండా చూడాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆలోచన చేసి మంజూరు చేసిన రెగ్యులేటర్ల నిర్మాణం కూటమి ప్రభుత్వం రాకతో అటకెక్కింది. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటుతున్నా.. ఈ ప్రాజెక్ట్పై ఉలుకూ పలుకూ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. 2022లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.642.22 కోట్లతో రెగ్యులేటర్లు నిర్మించాలని నిర్ణయించింది. ఇరిగేషన్ శాఖ చేసిన ప్రతిపాదనలకు వెంటనే పాలనా అనుమతులు కూడా అప్పటిలో వెలువడ్డాయి. దీంతో టెండర్లు పిలిచారు. ఈ ప్రాజెక్ట్తో ఉప్పుటేరు కలుషితం కాకుండా నివారించడంతో పాటు, కొల్లేరు సరస్సులోని కొంతభాగం ఉప్పునీటి ప్రభావానికి లోనుకాకుండా ఉండేలా ప్రాజెక్ట్ రూపకల్పన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండుచోట్ల, కృష్ణా జిల్లాలో ఒకచోట రెగ్యులేటర్లు కమ్ వంతెనల నిర్మాణాలకు రూ.642.22 కోట్లతో ప్రాజెక్ట్ను రూపొందించారు. ఉప్పునీరుగా మారుతున్న కొల్లేరు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తరించిన కొల్లేరు సరస్సులో సుమారు 67 వరకూ చిన్న, మధ్యస్థ, పెద్ద డ్రైయిన్లు కలుస్తున్నాయి. ఈ నీరంతా కొల్లేరు సరస్సు నుంచి ఆకివీడు మండలంలోని దుంపగడప వద్ద ఉప్పుటేరులో కలుస్తుంది. మళ్లీ ఆ నీరు సుమారు 64 కిలోమీటర్ల మేర ప్రవహించి, మన జిల్లా శివారున ఉన్న మొగల్తూరు సమీపంలోని కృష్ణా జిల్లా చినగొల్లపాలెం వద్ద సముద్రంలో కలిసిపోతుంది. దీంతో పాటు జిల్లాలోని పలు ఉప్పుటేరుల్లోని నీరు కూడా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ మోళ్లపర్రు సీమౌత్ వద్ద కలుస్తుంది. సముద్రంలో కలవడం ద్వారా ఇదంతా ఉప్పునీరుగా మారుతుంది. సముద్రం ఆటుపోట్ల వల్ల మళ్లీ సముద్రంలోని ఈ ఉప్పునీరే ఈ సీమౌత్ ద్వారా రివర్స్లో డ్రైయిన్లలోకి ప్రవేశించి ఉప్పునీరుగా మారుతోంది. ఒకప్పుడు చప్పనీరుగా ఉండే కొల్లేరు సరస్సులోని చాలా భాగం ఉప్పునీరుగా మారడానికి కూడా కారణం ఇదేనని గతంలో జరిగిన సర్వేల్లో తేలింది. ఉప్పునీరంతా తిరిగి డ్రైయిన్లలో కలవడం ద్వారా అటు సాగుకు, ఇటు తాగునీటికి కూడా పనికిరాకుండా పోతోంది. ఊసే ఎత్తని ఇరిగేషన్ మంత్రి జిల్లాకు చెందిన నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. పూర్తిగా ఇరిగేషన్ శాఖకు చెందిన ఈ ప్రాజెక్ట్ మంత్రి ద్వారా పట్టాలెక్కుతుందని రెండు జిల్లాల వాసులు ఆశించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఉప్పునీటి సమస్యతో అటు సాగు, ఇటు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు, ముఖ్యంగా రైతులు తమ కష్టాలకు చెక్ పడుతుందని సంతోషించారు. మంత్రి గానీ, ఎమ్మెల్యేలు గానీ ఈ ప్రాజెక్ట్పై కనీసం నోరుమెదపకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించి, ఈ సమస్య నివారణకు వాటర్ రిసోర్సెస్ ప్రాజెక్టు కమిటీ నిపుణుల సలహా కోరారు. కమిటీ నిపుణులు సర్వే చేసి, మూడు చోట్ల రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టి, మూడు దశల్లో నీటిని అదుపుచేస్తే సమస్య పరిష్కారమవుతుందని సూచించడంతో యుద్ధప్రాతిపదికన ఈ ప్రాజెక్ట్ రూపకల్పనకు అప్పట్లో ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు మండలం దుంపగడపలో రూ.111 కోట్లతో రెగ్యులేటర్, మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ పంచాయతీ మోళ్ళపర్రు వద్ద (సముద్రం–ఉప్పుటేరు కలిసే సీమౌత్) రూ. 364.87 కోట్లతో రెగ్యులేటర్ కమ్ వంతెన, కృష్ణా జిల్లా పడతడిక వద్ద రూ.166.35 కోట్లతో రెగ్యులేటర్ కమ్ వంతెన నిర్మించేందుకు పాలనా అనుమతులు ఇవ్వడంతో 2023 డిసెంబరులో టెండర్లు పిలిచారు. తరువాత ఏడాది ప్రారంభంలోనే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ప్రాజెక్ట్ అటకెక్కింది. నిలిచిన రూ.642.22 కోట్ల ప్రాజెక్ట్ ఉప్పుటేరుపై రెగ్యులేటర్ల నిర్మాణాలకు గత ప్రభుత్వం ప్రయత్నం సాంకేతిక అనుమతులు మంజూరు డెల్టాలో ఉప్పు నీటి ఇబ్బందుల నివారణకు చర్యలు పట్టించుకోని ప్రస్తుత ఇరిగేషన్ మంత్రి -
కూటమి పాలనపై మహిళాగ్రహం
● మహిళలకు భద్రత కల్పించడంలో ఘోర వైఫల్యం ● ఏలూరులో వైఎస్సార్సీపీ మహిళా నేతల భారీ ర్యాలీ ఏలూరు టౌన్: టీడీపీ కూటమి పాలనలో మహిళలపై జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులు, హత్యాచారాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏలూరులో మంగళవారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు పాదయాత్రగా వచ్చిన మహిళలు, అక్కడ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, మహిళా హోంమంత్రి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు, ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ ముఖ్యఅతిథులుగా పాల్గొని సంఘీభావం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ మహిళ విభాగం అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా స్థాయి మహిళనేతలు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో హాజరై కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు. అంబేడ్కర్ రాజ్యాంగం అమలు చేయండి ఈ సందర్భంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు సరితారెడ్డి మాట్లాడుతూ, కూటమి నేతలు రెడ్బుక్ రాజ్యాంగం కాకుండా అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబుకు అమరావతిపై ఉన్న శ్రద్ధ మహిళల రక్షణపై లేదని, టీడీపీ నేతల అండతోనే మహిళలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లతో కేసులు నమోదు కావట్లేదని, పోలీసుల నిర్లక్ష్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడితే తాట తీస్తామని చెబుతున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ఏం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. హోమంత్రి రాజీనామా చేయాలి ఏలూరు నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల మాట్లాడుతూ, గుంటూరులో టీడీపీ నేత ఆధ్వర్యంలో మహిళలను వివస్త్రను చేయటం, మరో జనసేన నేత మహిళ జాకెట్ చింపిన సంఘటనలు చోటుచేసుకోవటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో మహిళా హోంమంత్రి ఉన్నా రక్షణ లేకపోవడం దారుణమని, ఎన్నికల ముందు చెప్పిన మహిళల భద్రత ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి మాట్లాడుతూ, గుంటూరులో మహిళను వివస్త్రను చేసిన ఘటనపై స్పందించని హోంమంత్రికి పదవిలో ఉండే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దెందులూరు జెడ్పీటీసీ నిట్టా లీలానవకాంతం మాట్లాడుతూ, ప్రభుత్వం నేరస్తులకు అండగా ఉంటూ పోలీసులను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళ ప్రధాన కార్యదర్శి జగ్గవరపు జానకిరెడ్డి, అధికార ప్రతినిధి ఇంజేటి నీలిమ, జెడ్పీటీసీలు నీరజ, తుమ్మగుంట భవానీ, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి కనకదుర్గ రాణి, మహిళా కార్యదర్శులు వేదకుమారి, మంద జయలక్ష్మి, ఆర్తి పార్వతి, కై కలూరు నియోజకవర్గం మహిళ అధ్యక్షురాలు దున్న బేబీ, చింతలపూడి నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు చండీప్రియ, ఉంగుటూరు నియోజకవర్గం మహిళ అధ్యక్షురాలు గంటా శ్రీలక్ష్మి, నూజివీడు మహిళ అధ్యక్షురాలు సుజనాకుమారి, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు స్వాతియాదవ్, వలంటీర్ వింగ్ జిల్లా అధ్యక్షురాలు భోగిశెట్టి పార్వతి, ఎంపీపీలు రమ్యకుమారి, భక్తుల రమాదేవి, గిరిజ, మున్సిపల్ మాజీ ఛైర్మన్ మద్దిరాల కోటమ్మ తదితరులు పాల్గొన్నారు. పాతబస్టాండ్ సెంటరులో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తున్న వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలు ర్యాలీలో పాల్గొన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఏలూరు సమన్వయకర్త జయప్రకాష్ తదితరులు -
తగ్గుతూ.. పెరుగుతూ గోదావరి
పోలవరం రూరల్: తగ్గుతూ పెరుగుతూ గోదావరి వరద ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 26 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్వే నుంచి దిగువకు 29,500 క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. సోమవారం ఉదయం వరద కొంత పెరిగినా సాయంత్రం నుంచి స్వల్పంగా తగ్గుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి నీరు చేరడం తగ్గడంతో వరద ప్రవాహం ఒకేలా కొనసాగుతోంది. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లా రెవెన్యూ అధికా రిగా బాధ్యతలు స్వీకరించిన ఎం.శ్రీదేవి సో మవారం కలెక్టర్ కె.వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిశారు. ఒంగోలు జిల్లాలో కృష్ణప ట్నం–హైదరాబాద్ పైప్లైన్ ప్రాజెక్ట్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఆమెను ప దోన్నతిపై ఏలూరు డీఆర్వోగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శ్రీదేవి ఇటీవల బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్ను కలిసి పూలమొక్క అందించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏలూరులో ఆందోళన నిర్వహించారు. ముందుగా ఫైర్స్టేషన్ నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ పేపర్ లీకేజీకి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన కేంద్ర ప్రభుత్వ దివాలాకోరు విధానాలు విడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు పవన్కుమార్, అక్షయ్ మాట్లాడుతూ 20 రోజులకు పైగా ఢిల్లీలో శాంతియుతంగా దీక్ష చేస్తున్న వారిపై కేంద్ర ప్రభుత్వవం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పౌర హక్కుల సంఘం నాయకులు శ్రీమన్నారాయణ, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నాయకులు కట్టా సత్యనారాయణ, ఎస్ఎఫ్ఐ పూర్వ నాయకులు ఆర్.లింగరాజు, డీఎన్వీడీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో దశాబ్ధాలుగా సేవలందిస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను తక్షణమే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ప్రాంగణం వద్ద ఉద్యోగులు సోమవారం నిరసన చేపట్టారు. ప్రభుత్వం అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందని, దీంతో దీర్ఘకాలంగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ప్రిన్సిపాల్ టి.అశోక్కు అందజేశారు. విశ్వవిద్యాలయాల కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం ఉపాధ్యక్షుడు హీరాభట్టు, సంయుక్త కార్యదర్శి పి.ప్రశాంతి, సభ్యులు ప్రైమ్ బాబు, శ్రీరాముడు, బాబులు తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ పత్రాలతో ఆస్తి కాజేసిన ముఠా అరెస్టు
కై కలూరు: నకిలీ ఆస్తి పత్రాలతో విలువైన ఆస్తిని కాజేయడానికి ప్రయత్నించిన ముఠాను ముదినేపల్లి పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు సోమవారం తరలించారు. ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ కై కలూరులో వివరాలు వెల్లడించారు. ముదినేపల్లి మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన త్రిపురనేని ఏసుబాబు మరణించడంతో ఆమె భార్య వరలక్ష్మీ అమెరికాలో పిల్లల వద్దకు వెళ్ళింది. తిరిగి ఆరు నెలలకు వచ్చింది. అదే గ్రామానికి చెందిన నల్లపు శివ, గోపతాటి మహంకాళి, ఆమె కూతురు కాగితాల కొండమ్మ పేరుతో 2.23 ఎకరాల చేపల చెరువు, 3 సెంట్ల డాబాను నకిలీ డెత్, ఫ్యామిలీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులను సృష్టించి కై కలూరు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమంగా పార్టిషన్ డీడ్, సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్లను రిజిస్ట్రేషన్ చేయించారు. దీనిపై గత నెల 18న ముదినేపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో త్రిపుననేని ఏసుబాబు వద్ద మహంకాళి, కొండమ్మ భర్త, శివ పనిచేశారు. ఆ సమయంలో ఆస్తి విషయం శివకు ఏసుబాబు చెప్పాడు. దీన్ని ఆసరాగా చేసుకుని ఆయన మరణాంతరం ఏసుబాబు మరో మహిళను వివాహం చేసుకున్నట్లు ఆధార్ కార్డులో ఆమె ఇంటి పేరును త్రిపుననేనిగా మార్చాడు. ఏసుబాబు హైదరాబాదులో మరణిస్తే డెత్ సర్టిఫికెట్ ఏలూరు నుంచి తీసుకున్నారు. దర్యాప్తులో మోసం బయటపడింది. -
ప్రాణహాని ఉందని ఎస్పీకి ఫిర్యాదు
ఏలూరు టౌన్: ఏలూరు చాటపర్రు రోడ్డు శివకామాక్షి నగర్ ప్రాంతానికి చెందిన కనకం వెంకట సాయి ప్రసాద్ తనకు ప్రాణహాని ఉందని... తనపై ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇటీవల దాడి జరిగిందంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నగరపాలక సంస్థ, ఎస్ఎంఆర్ నగర్కు సంబంధించి అవినీతి అంశాలపై చట్టానికి లోబడి పోరాటం చేస్తున్నానని, ప్రజాహితం దృష్టిలో పెట్టుకుని అవినీతి, అక్రమాలపై ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. ఎస్ఎంఆర్ నగర్లో రోడ్ల పనులకు సంబంధించి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని, ఈ ఉత్తర్వుల కాపీని 2026 జూలై 18న జిల్లా కలెక్టరేట్లో అధికారులకు అందజేశానన్నారు. నగరపాలక సంస్థ రెండో అంతస్తులోని సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్కు కాపీ అందజేసి కార్యాలయం మెట్లు దిగుతూ ఉండగా... సీసీ కెమెరాలు లేని ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనను అడ్డగించి, దాడి చేశారని తెలిపారు. భయంతో గట్టిగా అరిచానని, కొందరు ఉద్యోగులు అక్కడికి రావటంతో దాడి చేసిన వ్యక్తులు పారిపోయారని తెలిపారు. ఎస్ఎంఆర్ నగర్లో అవినీతిపై ఫిర్యాదు చేయటంతో కావాలనే ఎవరో కుట్రపూరితంగా దాడి చేశారన్నారు. తన కుమార్తె, దివ్యాంగుడైన కుమారుడిని పోషించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందనీ, ప్రాణహాని జరిగితే కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని, దీనిపై సమగ్ర విచారణ చేయాలని కోరారు. ఏలూరు (ఆర్ఆర్పేట): అమెరికాలో జరిగిన ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఏలూరు జిల్లాలోని యువతి, యువకులను ఫుట్బాల్ క్రీడ వైపు ఆకర్షించేలా చేశాయని సీనియర్ ఫుట్బాల్ క్రీడాభిమాని బెల్లంకొండ కొండయ్య అన్నారు. ఆదివారం అమెరికాలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ ఫైనల్ పోటీ ముగింపు సందర్భంగా క్రీడాభిమానులు ఏలూరు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన ఫుట్బాల్ క్రీడ భారతదేశంలో సైతం మరింత ప్రజాదరణ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పోటీలను ఏలూరు జిల్లాలో క్రీడాభిమానులు, బాలబాలికలు పెద్ద సంఖ్యలో చూశారని సంతోషం వ్యక్తం చేశారు. ్ఠ సాక్షి, టాస్క్ ఫోర్స్: దెందులూరు గారపాటి హైమావతి దేవి ఉన్నత పాఠశాలలో క్రికెట్ బెట్టింగ్ పోటీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన కానిస్టేబుల్ పోడూరి మధు జిల్లా విద్యాశాఖ అధికారికి సోమవారం ఫిర్యాదు చేశారు. దెందులూరు గ్రామానికి చెందిన ఇద్దరూ వాట్సప్లో మెసెజ్లు పెట్టి క్రికెట్ బెట్టింగ్ పోటీలు నిర్వహించారన్నారు. గత కొన్ని వారాలుగా దెందులూరు గవర్నమెంట్ హైస్కూల్ లో క్రికెట్ బెట్టింగులు జరుగుతున్నాయని ఆరోపించారు. పోటీలు నిర్వహణకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, నైట్ వాచ్మెన్, ఫిజికల్ డైరెక్టర్ ఎలా అనుమతి ఇస్తారన్నారు. దీనిపై దెందులూరు ఎస్సై డి.వెంకట్ కుమార్ వివరణ కోరగా హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వడ్లపట్ల విజయకుమార్ దీనిపై ఫిర్యాదు చేశారన్నారు. ఆదివారం హై స్కూల్లో తన అనుమతి లేకుండా నిర్వహించారని ఆయన ఫిర్యాదు చేశారన్నారు. -
మొక్కజొన్న రైతులకు బకాయిలు చెల్లించాలి
నూజివీడు: సీడ్ మొక్కజొన్నను కొనుగోలు చేసిన కంపెనీలు తక్షణమే రైతులకు డబ్బులు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ జమలయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చలసాని వెంకట రామారావు డిమాండ్ చేశారు. సీడ్ కంపెనీలు రైతులతో చేసుకున్న ఒప్పందం మేరకు దిగుబడి తగ్గిన రైతులకు ఆ మేరకు నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు సంఘం ఆధ్వర్యంలో నూజివీడు సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద సీడ్ మొక్కజొన్న సాగు చేసి నష్టపోయిన రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జమలయ్య, రామారావులు మాట్లాడుతూ నూజివీడు మండలంలో సింజెంటా, విజయలక్ష్మి అడ్వెంటా, శ్రీకర, బేయర్ తదితర కంపెనీలు పలు గ్రామాల్లో రైతులతో ఒప్పందాలు చేసుకొని ఎకరానికి నాలుగు నుంచి ఐదు టన్నుల దిగుబడి వస్తుందని, టన్నుకు రూ.30 వేలు నుంచి 40 వేలు చెల్లించి కొనుగోలు చేస్తామని నమ్మించి మోసం చేశారన్నారు. ఈ రోజుకు దాదాపు రూ.100 కోట్లపైగా బకాయిలు రైతులకు చెల్లించాలన్నారు. కంపెనీ ప్రతినిధులు చెప్పిన ప్రకారం దిగుబడి రాకపోగా తీవ్రంగా నష్టపోయారన్నారు. దిగుబడి వచ్చిన మేరకు ఆ పంటను కంపెనీ ప్రతినిధులు తీసుకెళ్లి నాలుగు నెలలైనా ఇంతవరకు ఒక్క పైసా చెల్లించకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. డబ్బులు ఇవ్వమని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని రైతులను నమ్మించి మోసగించిన కంపెనీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ స్పందించి రైతులను ఆదుకోవడానికి జూలై 22న రైతులు, కంపెనీ యాజమాన్యాలు, వ్యవసాయ అధికారులతో తక్షణమే సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతు సంఘం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు, కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆళ్వార్ సదనానికి సొబగులు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో దశాబ్ధాల చరిత్ర గల ఆళ్వార్ సదనం కొత్తరూపును సంతరించుకుంటోంది. కాలక్రమేణా శిథిలావస్థకు చేరిన ఈ సత్రం భవనానికి దేవస్థానం అధికారులు మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతుండగా, భక్తులకు అన్ని సౌకర్యాలతో కూడిన వసతి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఒకప్పుడు భక్తులకు వసతి కల్పించడంతో పాటు పెళ్లిళ్లకు వేదికై న ఆళ్వార్ సదనం శిథిలావస్థకు చేరడంతో కొంతకాలంగా వినియోగానికి దూరమైంది. దీంతో భవనం పూర్తిగా దెబ్బతినకుండా పరిరక్షించేందుకు మరమ్మతులు చేపట్టారు. పాత నిర్మాణం ప్రత్యేకతను కాపాడుతూ అవసరమైన చోట్ల ఆధునిక హంగులను జోడిస్తున్నారు. పైకప్పు, గోడలు, ఫ్లోరింగ్, విద్యుత్ వ్యవస్థ తదితర అంశాలను పునరుద్ధరిస్తూ భవనానికి కొత్త మెరుగులు దిద్దుతున్నారు. ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేలా.. ఆళ్వార్ సదనం పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా గార్డెన్లు ఏర్పాటు పనులు కూడా కొనసాగుతున్నాయి. పచ్చదనంతో నిండిన వాతావరణాన్ని కల్పించేలా వివిధ రకాల మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
డీజిల్ దొంగతనం చేస్తున్న వ్యక్తి అరెస్టు
అత్తిలి: అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్డు తదితర ప్రాంతాలలో రోడ్లపై ఉంచిన ట్రాక్టర్లలో డీజిల్ దొంగతనం చేస్తున్న పెనుగొండకు చెందిన తానేటి ఆశీర్వాదంను అరెస్టు చేసినట్లు అత్తిలి ఎస్సై కేఎన్ విశ్వనాథ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం రోడ్ల పక్కన ఉంచిన ట్రాక్టర్ల పైపులను కోసి డీజిల్ దొంగతనం చేస్తున్నాడని ఈ విధంగా సుమారు 40 లీటర్ల డీజిల్ దొంగతనం చేశాడన్నారు. ఆశీర్వాదంపై పెనుగొండ, తణుకు తదితర ప్రాంతాల్లో 30కి పైగా కేసులు ఉన్నాయని తెలిపారు. ముసునూరు: ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మండలంలో జరిగింది. లోపూడికి చెందిన నందిపాము రవి(36) బీటెక్ చదివాడు. మానసిక సమస్యలతో ఇబ్బంది పడేవాడు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత వివాహం చేశారు. భార్యతో పొసగక పోవడంతో విడాకులు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో మద్యానికి బానిసయ్యాడు. దీంతో తరచూ కుటుంబంలో గొడవలు జరిగేవి. ఆదివారం మధ్యాహ్నం మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగాడు. స్థానికుల సాయంతో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.చిరంజీవి తెలిపారు. -
మట్టి మాఫియా దోపిడీ
చింతలపూడి: స్థానిక నగర పంచాయతీ పరిధిలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ స్థాయిలో మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. చింతలపూడి పరిధిలోని పెద్ద చెరువుతో పాటు పరిసర ప్రాంతాల చెరువుల నుంచి రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్ ఆదేశాలకు తూట్లు జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పెద్ద చెరువులో బహిరంగంగానే తవ్వకాలు సాగుతున్నా.. రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమంగా తరలిస్తున్న మట్టి వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడటమే కాకుండా, పర్యావరణ సమతుల్యత కూడా తీవ్రంగా దెబ్బతింటుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు ట్రాక్టర్లు, టిప్పర్లలో మట్టి తరలిపోతోంది. ట్రిప్పర్కు దూరాన్ని బట్టి 5 వేల నుంచి 6 వేల వరకు వసూలు చేస్తురన్నారని స్థానికులు చెబుతున్నారు. కామవరపుకోట మండలంలో.. కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో ఇటీవల అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అటు పోలీసులు గానీ, ఇటు రెవెన్యూ అధికారులు గానీ పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో సహజ వనరులను కొల్లగొడుతూ, రోడ్లను పాడుచేస్తూ సాగుతున్న ఈ అక్రమ మట్టి దందాను తక్షణమే అరికట్టాలని, ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, తనిఖీలు చేపట్టి అక్రమార్కులపై, వారికి సహకరిస్తున్న ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
328 అర్జీల స్వీకరణ
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు కలెక్టరేట్లో సో మవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో 328 అర్జీలు స్వీకరించినట్టు జేసీ ఎంజే అభిషేక్ గౌడ తెలిపారు. అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్కుమార్రెడ్డి, డీఆర్వో ఎం.శ్రీదేవి, ఆర్డీఓ కె.లక్ష్మీప్రసన్న, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నిర్ణీత సమయంలోపు అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆయన ఆదేశించారు. అర్జీల్లో కొన్ని.. ● చింతలపూడి మండలం పట్టాయగూడేనికి చెందిన సుంకర పార్వతి తమ గ్రామంలోని అటవీ భూముల్లో 100 మంది గ్రూపుగా కూరగాయలు సాగు చేసుకుంటున్నామని, సదరు భూమిని కొందరు ఆక్రమించుకుని తమపై దౌర్జన్యానికి దిగారని, తమకు న్యాయం చేయాలని కోరారు. ● జంగారెడ్డిగూడెం మండలం కేతవరానికి చెందిన వి.మణెమ్మ తనకు స్థలం మంజూరు చేశారని, ఇంటి నిర్మాణానికి రుణం, సబ్సిడీ మంజూరు చేయాలని కోరారు. ● టి.నర్సాపురం మండలం తిరుమలదేవిపేటకు చెందిన వేమా శ్యామల రీసర్వే లో తనకు 20 సెంట్లు తక్కువగా నమోదైందని, సరిచేయాలని అభ్యర్థించారు. ● జీలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామానికి చెందిన అలకాల సోమిరెడ్డి పోలవరం ప్రాజెక్ట్ పునరావాస ప్యాకేజీ సొమ్ము వేరే వారికి మంజూరు చేశారని, న్యాయం చేయాలని కోరారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతి
భీమవరం: భీమవరం పట్టణం తాడేపల్లిగూడెం రోడ్డులోని రైల్వే అండర్పాస్లో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్లు 38వ వార్డు వీఆర్వో ఎం.మహాలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్సై రెహ్మాన్ చెప్పారు. సుమారు 40 ఏళ్లు వయస్సు కలిగిన గుర్తుతెలియని పురుషుడు మృతిచెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బుట్టాయగూడెం: క్రీడలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను క్రీడల పట్ల ఆసక్తి చూపేలా ప్రోత్సహించాలని గోపాలపురం ప్రభుత్వ వైద్యాధికారి పిన్నేంటి శ్రీదేవి అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఈశా ఫౌండేషన్ గ్రామోత్సవ వాలీబాల్ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాలీబాల్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విజేతలకు రూ.10 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రూ.7 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి రూ.5 వేలు, నాల్గో స్థానంలో నిలిచిన వారికి రూ.3 వేలు నగదుతో పాటు ట్రోఫీలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాయల చదువర్ల సంఘం మాజీ అధ్యక్షుడు ఆర్జేఎన్ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. ఉండి: మండలంలో తరచూ ఆర్టీసీ బస్సులు మొరాయిస్తున్నాయి. నిర్వహణ సరిగా లేకపోవడం, పాడైన రోడ్లతో బస్సులు రోడ్డుపైనే నిలిచిపోతున్నాయి. గత వారంలో ఉండి బస్టాండ్కు సమీపంలో ఏలూరు డిపోకు చెందిన బస్సు మొరాయించడంతో ప్రయాణికులు మరో దారి చూసుకోవాల్సి వచ్చింది. సోమవారం మండలంలోని కలిపూడి గ్రామంలో భీమవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మొరాయించింది. ఏలూరు నుంచి భీమవరం వస్తున్న బస్సు ఇంజిన్లోని ఫ్యాన్ బెల్టు తెగిపోయింది. దీంతో ప్రయాణికులు ఆటోల ద్వారా వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు. పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆ సమస్యలు పరిష్కరించాలని జేఏసీ జిల్లా అధ్యక్షుడు యు.వెంకట పాండు రంగారావు అన్నారు. సోమవారం పట్టణంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును క్యాంపు కార్యాలయంలో జేఏసీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాండు రంగారావు మాట్లాడుతూ పీఆర్సీ కమిటీ వేసి ఐఆర్ ప్రకటించాలన్నారు. పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులు సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. తమ సమస్యలను పరిష్కారం అయ్యేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో యుటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు విజయరామరాజు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పెన్మెత్స సాయివర్మ, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాశం, యుటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. తణుకు అర్బన్: తణుకులో విద్యుత్ తీగలు చోరీకి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తణుకు పాతవూరులోని ఒక లే అవుట్లో ఉన్న విద్యుత్ స్తంభాలకు వేళాడుతున్న విద్యుత్ తీగలను చోరీ చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విద్యుత్ శాఖ ఏఈ బండారు నరసింహమూర్తి ఇచ్చిన ఫిర్యాదుమేరకు పట్టణ ఎస్సైసీహెచ్ సత్యనారాయణ కేసు నమోదుచేసినట్లు చెప్పారు. 150 మీటర్ల మేర తీగలు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఆయిల్పామ్ గెలల ఏరివేతపై ఆందోళన
టి.నరసాపురం: బాగా పక్వానికి వచ్చిన ఆయిల్పామ్ గెలలను సైతం పనికిరావంటూ ఏరివేస్తుండటాన్ని నిరసిస్తూ మండల కేంద్రమైన టి.నరసాపురంలో రైతులు సోమవారం ఆందోళన నిర్వహించారు. స్థానిక నవభారత్ ఫ్యాక్టరీకి చెందిన ఆయిల్పామ్ వే–బ్రిడ్జ్ వద్ద ఫ్యాక్టరీ సిబ్బంది రైతులు తీసుకువచ్చిన గెలలను సరిగా పండలేదనే సాకుతో భారీగా పక్కన పడేస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకుడు, రైతు ప్రతినిధి దేవరపల్లి సీతారాం ప్రసాద్ తీసుకువచ్చిన మూడు టన్నుల గెలల్లో దాదాపు రెండున్నర టన్నుల గెలలను పక్వానికి రాలేదనే నెపంతో తీసుకోకపోవడంతో వివాదం మొదలైంది. దీంతో సీతారాం ప్రసాద్తో పాటు పలువురు రైతులు వే–బ్రిడ్జ్ వద్ద ధర్నాకు దిగారు. ఫ్యాక్టరీ యాజమాన్యం వచ్చి తగిన సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఇక్కడ తిరస్కరించిన గెలలనే పక్క మండలాల్లోని ఇతర ఫ్యాక్టరీల వారు కొనుగోలు చేస్తున్నారని, అక్కడ పనికివచ్చిన గెలలు ఇక్కడ ఎందుకు పనికిరావని ప్రశ్నించారు. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే, ఆయిల్ రికవరీ శాతం సరిగా లేదంటూ సాకులు చెప్పడం తగదన్నారు. కాయల నుంచి గింజలు రాలిన తర్వాతే కోయాలని ఆంక్షలు విధించడం వల్ల పంట పాడైపోయి తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. ఫ్యాక్టరీ యాజమాన్యం గెలల ఏరివేతను తక్షణమే నిలిపివేయాలని, రైతులు నష్టపోకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చింతలపూడి (జంగారెడ్డిగూడెం): అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన తల్లి, ఆమెతో ఉంటున్న వ్యక్తి కలిసి నాలుగేళ్ల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టారు. శరీరంపై వాతలు పెడుతూ చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై జంగారెడ్డిగూడెం పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామవరపుకోట గ్రామానికి చెందిన టి.మహేష్శర్మ, కుక్కునూరుకు చెందిన మంజూషలు 2021లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె (4) ఉంది. కుటుంబ కలహాల కారణంగా కొన్నాళ్ల క్రితం దంపతులిద్దరూ విడిపోయారు. అనంతరం మంజూష జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వెంకట్తో పరిచయం ఏర్పడటంతో, అతనితోనే జంగారెడ్డిగూడెంలో ఉంటోంది. ఈనెల 10న తండ్రి మహేష్శర్మ కుమార్తెను చూసేందుకు ఆమె చదువుతున్న పాఠశాలకు వెళ్లాడు. చిన్నారి చేతులపై కాలిన గాయాలు, వాతలు ఉండటాన్ని గమనించి ప్రశ్నించగా.. తల్లి మంజూష, వెంకట్లు రోజూ తనను కొడుతూ వాతలు పెడుతున్నారని రోదిస్తూ చెప్పింది. పసిపాపపై జరుగుతున్న దారుణాన్ని తెలుసుకున్న తండ్రి వెంటనే జంగారెడ్డిగూడెం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యాపారం వెలవెల
సాక్షి ప్రతినిధి,ఏలూరు: స్థానిక వ్యాపారం దెబ్బతింది. కోట్ల రూపాయలు టర్నోవర్ స్థాయి నుంచి రూ.లక్షలకు దిగజారింది. కిరాణా కొట్టు నుంచి బంగారు షాపు వరకు అన్నింటికీ ఆన్లైన్ సెగ భారీగా తగలడంతో ఏళ్ల తరబడిగా మందకొడిగా సాగుతున్న వ్యాపారం ఆరు నెలల నుంచి పూర్తిగా పడకేసింది. మార్కెట్లో మనీ సర్క్యులేషన్ తగ్గడంతో ట్రేడ్ టర్నోవర్ లేక చిన్నషాపు నుంచి మాల్స్ వరకు అందరి పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. రెండు, మూడేళ్ల క్రితం వరకు ఒక్క ఏలూరు నగరంలో రోజుకు సగటున అన్ని వ్యాపారాలు కలుపుకుని రూ.70 కోట్లపైనే టర్నోవర్ జరగ్గా నేడు సగానికి పడిపోయి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. బేరాలు లేవు.. బోణీలు కావు.. నిత్యం ట్రేడ్ బిజీతో ఉండే ఏలూరు మెయిన్ బజార్, ఆర్ఆర్పేట రోడ్డు, ఫైర్స్టేషన్ ఇక జిల్లాలోని కై కలూరు, నూజివీడు, చింతలపూడి, జంగారెడ్డిగూడెంలోని ప్రధాన మార్కెట్లు పూర్తిగా కొనుగోళ్లు తగ్గిపోయాయి. ఒకవైపు నిత్యావసరాలు మొదలు గ్యాస్ వరకు ధరలు భగ్గుమండటంతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు నిత్యావసరాలు మినహా ఆర్భాటలకు పోలేని పరిస్ధితి. వాస్తవానికి జనవరి నుంచి ప్రతి నెలా స్థానిక మార్కెట్కు ఏదోక సీజన్ పేరుతో ఒక మోస్తరుగా వ్యాపారాలు జరిగి టర్నోవర్ కాస్త ఆశాజనకంగా ఉండటంతో జీఎస్టీ వసూళ్లు కూడా బాగానే ఉండేవి. అయితే ఈ ఏడాది సంక్రాంతి సీజన్ పూర్తిగా అట్టర్ఫ్లాప్ కావడం.. రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల జరిగే సంక్రాంతి వ్యాపారాలు 60 శాతానికే పరిమితం కావడం, ఆ తరువాత రకరకాల పండగలు, ఇతర సీజన్లు, పంట డబ్బులు చేతికి అందే సమయం ఇలా ప్రతి నెలా కొంత మేరకు ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గింది. అలాగే మే, జూన్ నెలల్లో స్కూల్స్ సీజన్ కావడంతో బుక్స్షాపుల నుంచి వస్త్రదుకాణాల వరకు కొంత మేరకు వ్యాపారం ఉండేది. కాని ఈఏడాది అన్ని వ్యాపా రాలూ తగ్గిపోయాయి. ఆన్లైన్తో అధిక నష్టం ఆన్లైన్ వ్యాపారాలతో స్థానిక వ్యాపారాలు 30 శాతానికిపైగా నష్టం వాటిల్లుతుంది. చిన్నపాటి నిత్యావసరం మొదలు ఎలక్ట్రానిక్ ఉపకరణాల వరకు అన్ని ఆన్లైన్ కొనుగోళ్లు అధికంగా జరుగుతున్నాయి. ఇక హోటల్ రంగంలో కూడా వ్యాపారాలు పూర్తిగా మందగించాయి. నిత్యావసరాలు, గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరగడంతో హోటల్స్ వ్యాపారాలకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. ప్రధానంగా ఆన్లైన్లో వస్త్రాలు, ఎలక్ట్రా నిక్స్ అధికంగా జరుగుతున్నాయి. కరోనా స మయం నుంచి జిల్లాలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఆన్లైన్ షాపింగ్కే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. చలా‘మనీ’ లేక.. మార్కెట్లు ఢీలా భారీగా తగ్గిన టర్నోవర్ కిరాణా మొదలు బంగారం వరకూ అందరు వ్యాపారులదీ అదే పరిస్థితి ఆన్లైన్ మార్కెట్తోనూ అవరోధాలు పూర్తిగా పడకేసిన రియల్ ఎస్టేట్ ఆరు నెలలుగా జిల్లాలో ఇదే పరిస్థితి ఇటీవల వెల్లువెత్తుతున్న జాతీయస్థాయి మాల్స్, ఆన్లైన్ వ్యాపారాలు కారణంగా చిన్నచిన్న వ్యాపారాలపై పెను ప్రభావం చూపుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు సైతం ఆన్లైన్ వ్యాపారాలకు సంబంధించి డెలివరీలు అందుతుండటంతో వినియోగదారులు వాటి దారానే తమకు కావాల్సిన వస్తువులు ఆర్డర్ పెట్టుకుని కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో జరుగుతున్న వ్యాపారాల్లో వారి వాటా బాగా పెరిగి స్థానిక చిరు వ్యాపారుల వాటా కనిష్ట స్థాయికి పతనమైపోయింది. –నేరెళ్ల రాజేంద్ర, మర్చంట్స్ చాంబర్ జిల్లా అధ్యక్షుడు బంగారం, వెండి ధరలు అసాధారణ స్థాయిలో హెచ్చుతగ్గులు ఉండడంతో బంగారం వ్యాపారం సవాలుగా పరిణమించింది. ఒకేసారి రూ.వేలల్లో ధరలు పెరగడం లేదా తగ్గుతూ ఉండటంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఆభరణాల జోలికి రావడం లేదు. గతంలో భవిష్యత్ లాభాల కోసం పెట్టుబడిగా కూడా బంగారం కొనుగోలు చేశారు. కానీ ఈ హెచ్చుతగ్గుల కారణంగా ధర తగ్గితే విపరీతమైన నష్టం చవిచూడాల్సి వస్తుందనే ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని షాపుల్లో బంగారం వ్యాపారం అంతంతమాత్రంగానే సాగుతోంది. – పచ్చిపులుసు సుజన్, బంగారు వ్యాపారి2019–2024 కాలంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా ఏదో ప్రభుత్వ పథకం డీబీటీ రూపంలో నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో జమయ్యేది. తద్వారా మార్కెట్లో అవసరాలతో పాటు కొంతమేరకు కొనుగోళేఉ్ల అధికంగా జరిగి జీఎస్టీ ఆదాయం పెరగడంతో పాటు మనీ సర్క్యులేషన్ బాగుండేది. దీంతో పాటు పల్లెల్లో మైక్రో ఫైనాన్స్ల పేరు లేకుండా పోయింది. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, సున్నావడ్డీ, చేయూత, జగనన్న విద్యాకానుక, గోరుముద్ద, కాపునేస్తం, విద్యాదీవెన, వసతి దీవెన ఇలా ప్రభుత్వ పధకాల ద్వారా ప్రతి నెల లబ్ధిదారులకు నగదు జమయ్యేది. ఒక్క ఏలూరు జిల్లాలో అమ్మఒడి పథకం ద్వారా రూ.1,069.30 కోట్లు, గోరుముద్ద ద్వారా రూ.203 కోట్లు, విద్యాదీవెన ద్వారా రూ.383.40 కోట్లు, రైతు భరోసా ద్వారా రూ.1.830.24 కోట్లు ఇలా ప్రత్యక్ష లబ్ధి జరగడంతో మార్కెట్లో టర్నోవర్ ఉండటం అన్ని రకాల వ్యాపారాలు ఆశాజనకంగా సాగిన పరిస్ధితి. -
ఎన్నడూ లేనివిధంగా సాగునీటి ఎద్దడి
ఏలూరు (ఆర్ఆర్పేట) : దెందులూరు నియోజకవర్గంలో తీవ్రంగా ఉన్న సాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి సోమవారం ఏలూరు జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల పరిధిలోని కృష్ణా ఈస్ట్ కాలువ ఆయకట్టు కింద ఉన్న సుమారు 58 వేల ఎకరాల వరి, ఆక్వా సాగు పూర్తిగా నీటిపైనే ఆధారపడి ఉందన్నారు. ప్రస్తుతం సాగునీరు అందక, చరిత్రలో తొలిసారిగా రైతులు సాగు ప్రారంభించలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువుల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన రైతులు.. ప్రభుత్వం నుంచి నీటి లభ్యతపై స్పష్టత లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారన్నారు. నీరివ్వలేకపోతే పరిహారం చెల్లించాలి ప్రభుత్వం వెంటనే సాగునీటిపై ప్రకటన చేయాలని, నీరివ్వలేని పక్షంలో రైతులకు పెట్టుబడి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుని, పోలవరం కాలువ నీటిని గుండేరువాగు, సీతంపేట కాలువ ద్వారా మళ్లించి 13,800 ఎకరాలకు సాగునీరు అందించిన విషయాన్ని గుర్తుచేశారు. పంపింగ్ సరిపోవడం లేదు ప్రస్తుతం గోదావరి కాలువ ద్వారా జరుగుతున్న నీటి పంపింగ్ సరిపోవడం లేదని, అదనంగా మరో రెండు మోటార్లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అలాగే కృష్ణా ఈస్ట్, పోలవరం కాలువల ద్వారా గ్రామ చెరువులను నింపి తాగునీటి సమస్య రాకుండా చూడాలన్నారు. రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వైఎస్సార్సీపీ తరఫున పోరాటం కొనసాగిస్తామని అబ్బయ్యచౌదరి స్పష్టం చేశారు. జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్బాబు, నాయకులు ముంగర సంజీవ్కుమార్, పల్లెం ప్రసాద్, తేరా ఆనంద్, మోరు రామరాజు,మండల కొండలరావు, నిట్టాగంగరాజు, కట్టా ఏసుబాబు, కొలుసు గణపతిరావు తదితరులు ఉన్నారు. -
చేపనారు ఉత్పత్తి ప్రారంభం
ఉంగుటూరు: బాదంపూడి మత్స్య కేంద్రంలో చేపనారు ఉత్పత్తి ఆలస్యంగా ప్రారంభమైంది. సాధారణంగా చేపనారు ఉత్పత్తికి వాతావరణ ఉష్ణోగ్రత 28 డిగ్రీల లోపు ఉండాలి. ఈ ఏడాది 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉత్పత్తి ఆలస్యమైంది. ఏటా జూన్ నెలలో గోదావరి కాలువలకు నీరు రాగానే ఉత్పత్తిని ప్రారంభిస్తారు, ఈ ఏడాది జూలై 17వ తేదీ నుంచి ప్రక్రియ మొదలైంది. గతంలో ఇక్కడ ఉత్పత్తి చేసిన చేపనారును బయట ఫారాలకు విక్రయించేవారు. సంస్థ స్వయం సమృద్ధిని సాధించే దిశగా ఎదిగింది. ప్రభుత్వ విధానాల్లో మార్పు రావడంతో ప్రస్తుతం ఉత్పత్తి చేసిన చేప పిల్లలను కేవలం ప్రభుత్వ ఫారాలకు, రిజర్వాయర్లలో ఉచితంగా వదిలేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. అన్నీ సమస్యలే.. ఈ కేంద్రం సమర్థవంతంగా పనిచేయాలంటే కనీసం 20 మంది సిబ్బంది అవసరం, కానీ ప్రస్తుతం ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు. ఫిషరీస్ ఇన్స్పెక్టర్లు కూడా ఇన్చార్జులుగానే విధులు నిర్వర్తిస్తున్నారు. కేంద్రం వద్ద సరైన పర్యవేక్షణ, రక్షణ వసతులు లేవు. కాంపౌండ్ వాల్ లేకపోవడంతో బయట వ్యక్తులు ఫారంలోకి చొరబడి చేపలను అపహరించే ప్రమాదం పొంచి ఉంది. ఉత్పత్తికి అధిక వ్యయం అవుతున్నప్పటికీ, ఆదాయం లేని పరిస్థితి నెలకొంది. దీంతో ఫారంను ఎలా నడపాలో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, అంతరించిపోతున్న చేప జాతులను కాపాడేందుకు మత్స్యశాఖ ఈ కేంద్రంలో చేపనారు ఉత్పత్తి చేస్తోంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన చేప పిల్లలను పోలవరం, కృష్ణా, గోదావరి నదులతో పాటు పోగుండ, కొంగువారి ప్రాజెక్టు, జల్లేరు జలాశయం, కొన్ని మేజర్ ఇరిగేషన్ చెరువుల్లో వదలాలని నిర్ణయించారు. చైనీస్ హేచరీని ఉపయోగించి ప్రస్తుతం చేపనారు ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటివరకు 65 లక్షల చేపనారును ఉత్పత్తి చేయగా, అందులో 35 లక్షలను బాదంపూడి కుండీల్లో, 25 లక్షలను ఏలూరు ప్రభుత్వ ఫారంలో స్టాక్ చేశారు. వాతావరణం అనుకూలించక ఆలస్యంగా ప్రక్రియబాదంపూడి చేపల కేంద్రంలో ఉత్పత్తిని ప్రారంభించాం. సిబ్బంది కొరత వంటి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, లక్ష్య సాధన దిశగా ముందుకు వెళ్తున్నాం. గతంలో ఇన్చార్జులు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ఏడీఏని, ఫిషరీస్ ఇన్స్పెక్టరును నియమించాం. ఇకపై ఫారం నిర్వహణ మెరుగుపడుతుంది. –ఆర్.వి. ప్రసాద్ , జిల్లా ఫిషరీస్ అధికారి -
పాఠశాలల రేషనలైజేషన్తో నష్టం
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏజెన్సీ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన రేషనలైజేషన్ విధానాన్ని రద్దు చేయాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఆయనతో పాటు ఆదివాపసీ ట్రైబల్ ఫోరం జాతీయ కన్వీనర్ సరియం రామ్మోహన్, నాయకులు టి.బాబురావు మాట్లాడారు. ఐటీడీఏ పరిధిలోని లంకపాకల, పులిరామన్నగూడెం, రెడ్డికొప్పల్లి, ఇటికలకోట పాఠశాలల్లో 8, 9, 10 తరగతులను ఎత్తివేసి.. కేవలం 3 నుంచి 7 తరగతుల వరకే పరిమితం చేశారన్నారు. మిగిలిన 21 పాఠశాలల్లో 3, 4 తరగతులను తొలగించారని మండిపడ్డారు. దీనివల్ల మారుమూల అటవీ గ్రామాల పిల్లలు 2 నుంచి 6 కిలోమీటర్లు అడవి మార్గంలో నడవాల్సి వస్తోందన్నారు. కొండారెడ్డి గిరిజన విద్యార్థులు 60 కిలోమీటర్ల దూర ప్రాంతాలకు వెళ్లలేక చదువు మధ్యలోనే మానేసే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం ఈ రేషనలైజేషన్ను రద్దు చేసి, పాత పద్ధతిలోనే 3 నుంచి 10వ తరగతి వరకు తరగతులను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నాయకులు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంబూరి శ్రీమన్నారాయణ, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కారం రాఘవ, ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కన్వీనర్ తగరం బాబురావు, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు కారం అరుణ, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ.భూషణం తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగాన్ని అగ్రస్థానంలో నిలుపుదాం
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యారంగంలో ఏలూ రు జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. సోమవారం ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన షైనింగ్ స్టార్స్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కలెక్టర్తో పాటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగాషైనింగ్ స్టార్స్ కార్యక్రమం ద్వారా 2025–26 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. పదో తరగతిలో ప్రతిభ చాటిన 187 మందికి రూ.37.40 లక్షలు, ఇంటర్మీడియట్లో రాణించిన 35 మంది విద్యార్థులకు రూ.7 లక్షల విలువైన నమూనా చెక్కులను అతిథులు అందజేశారు. ప్రతిభావంతులైన ఈ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాలు, మెడల్స్ను అందించి సన్మానించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలను మార్చే బడి ఒక దేవాలయం లాంటిదన్నారు. విద్యాశాఖ రూపొందించిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ను సమర్థవంతంగా అమలు చేసి, జిల్లాలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు కృషి చేసిన అందరినీ అభినందించారు. డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ, డీఐఓ కె.యోహాను తదితరులు పాల్గొన్నారు. -
ఎనిమిదేళ్ల కష్టం.. విక్రమ్–1 విజయం
ఏలూరు (ఆర్ఆర్పేట) : ఎనిమిదేళ్లపాటు అవిశ్రాంతంగా శ్రమించి విక్రమ్–1 ప్రాజెక్టు సఫలం కావడానికి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని శాస్త్రవేత్త, స్కైరూట్ చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ నాగభరత్ డాకా విజయం సాధించారని ఆయన మావ చావలి శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ఆదివారం ఆయన ఏలూరులో విలేకరులతో మాట్లాడుతూ శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ స్టేషన్ నుంచి ప్రయోగించిన దేశంలో మొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్–1 విజయంలో ప్రధాన భూమిక పోషించిన శాస్త్రవేత్త, స్కైరూట్ చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ నాగభరత్ డాకా తన అల్లుడని అన్నారు. తన ఏకైక కుమార్తె పావనిని 2016లో వివాహం చేసుకున్నారన్నారు. భరత్ మ ద్రాసు ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేశారని, ఆ సమయంలో రూమ్మేట్ పవన్కుమార్ చందన (మెకానికల్ ఐఐటీ ఖరగ్పూర్)తో కలిసి స్కైరూట్ సంస్థను 2018లో ప్రారంభించారని పేర్కొన్నారు. -
ఆశలకు బీటలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: డెల్టాలో భూమి బీటలు వారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పచ్చని పంట పొలాలతో కళకళలాడే భూములు బీడులుగా మారుతున్నాయి. సర్కారు అంతులేని నిర్లక్ష్యం, ప్రణాళికా లోపంతో కృష్ణా, గోదావరి ప్రధాన కాలువల పూడికతీత పనులు తూతూమంత్రంగా నిర్వహించారు. ఫలితంగా దిగువకు నీరు పారకపోవడంతో డెల్టా బీటలు వారుతుంది. మరోవైపు 70 శాతం పూర్తి కావాల్సిన వరినాట్లు జిల్లాలో 40 శాతానికే పరిమితమయ్యాయి. 50 రోజులు గడిచినా.. ఖరీఫ్ కష్టాలు నీటి రూపంలో అన్నదాతలను వెంటాడుతున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 55 రోజులు గడిచినా పూర్తిస్థాయిలో నాట్లు పడలేదు. ఇప్పటివరకు జిల్లాలో 79,419 ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. గతేడాది ఇదే సమయానికి సుమారు 1.40 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. కృష్ణా, గోదావరి డెల్టాల నుంచి నారుమడులకు నీటిని ఇప్పటికే విడుదల చేశారు. జూన్ 1న గోదావరి డెల్టా, జూలై 1 నుంచి కృష్ణా డెల్టా నీటిని జిల్లాలో విడుదల చేశారు. రెండు డెల్టాల పరిధిలో దెందులూరు, కైకలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో అత్యధిక సాగు విస్తీర్ణం ఉంటుంది. ఈ పరిణామాల క్రమంలో రెండు కాలువలకు అయితే నీరు విడుదల చేసినా చివరి వరకు నీరందని పరిస్థితి. పూర్తిస్థాయిలో లేని ప్రవాహం : వాస్తవానికి ప్రతి సీజన్ ప్రారంభంలో జలవనరుల శాఖ కాల్వల్లో తూడు, గుర్రపుడెక్క, సిల్ట్ తొలగించి నీటి పారుదలకు ఇబ్బందులు కుండా అవసరమైన మరమ్మతులు కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేస్తుంది. ఈ ఏడాది కూడా అలానే కొన్ని పనులు చేశారు కానీ నీరు పూర్తిస్థాయి ప్రవాహం మాత్రం లేని పరిస్థితి. దీంతో ప్రధానంగా గోదావరి డెల్టా పరిధిలోని భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు, దెందులూరు, కృష్ణా డెల్టా పరిధిలోని పెదపాడు, ఏలూరు రూరల్, దెందులూరు, ముదినేపల్లి మండలాల్లో వరిసాగు ఇబ్బందికరంగా మారింది. తాజాగా దెందులూరు మండలంలో కొవ్వలి, పోతునూరు, సత్యనారాయణపురం, దెందులూరు, కొమిరేపల్లి, ఏలూరు రూరల్ మండలంలోని పాలగూడెం, అలాగే భీమడోలులో కొన్ని గ్రామాల్లో రైతులు లక్షలు ఖర్చు పెట్టి నాట్లు వేసినా నీరందడం లేదు. చాట్రాయి మండలంలో తమ్మిలేరు పరిధిలో 13,200 ఎకరాల విస్తీర్ణంలో సాగు ఉంది. దీనికి కూడా నీటి ఇబ్బందులు తీవ్రమయ్యాయి.పట్టిసీమ జలాలు తప్పనిసరి జిల్లా రైతులు పట్టిసీమ జలాల కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రధానంగా పట్టిసీమ జలాలు కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలో ఉన్న గ్రామాల్లో నారుమడుల కోసం విడుదల చేస్తే కొంత మేరకు ఇబ్బందులు తగ్గుతాయి. జానంపేట వద్ద తమ్మిలేరులోకి పట్టిసీమ జలాలు మళ్లిస్తే తూర్పు, పడమర లాకుల ద్వారా శివారు భూముల వరకు నీరందించే పరిస్థితి ఉంది. జిల్లా యంత్రాంగంతో పాటు పాలకులు పూర్తిగా పట్టించుకోకపోవడంతో అన్నదాతల వేదన అరణ్య రోదనగా మారింది.ఇప్పటికే గతేడాది దిగుబడులు గణనీయంగా తగ్గడంతో ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల నష్టం వాటిల్లింది. పేరుకే మద్దతు ధర ఉన్నా దళారుల దోపిడీ, దిగుబడి తగ్గడంతో రైతులు పూర్తిగా నష్టపోయారు. దీంతో పాటు మోంథా తుఫాన్లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తామని రాష్ట్ర, కేంద్ర బృందాలు హడావుడి పర్యటన మినహా ఒక్క రైతుకు రూపాయి జమకాని పరిస్థితి. ఇక ఈ ఏడాది సాగునీటి ఇబ్బందులు కొనసాగితే నూరు శాతం నాట్లు కూడా అనుమానంగా మారే పరిస్థితి ఉంది. -
జగనన్న కాలనీలో సమస్యల గోడు
● అధ్వానంగా వీధి రోడ్లు ● కరువైన మంచినీటి పైపులైన్లు, డ్రైనేజీ వ్యవస్థ ఆకివీడు: జిల్లాలోనే అతిపెద్ద కాలనీగా పేరుగాంచిన కుప్పనపూడి శివారు, తాళ్లకోడులోని జగనన్న కాలనీ సమస్యల వలయంలో చిక్కుకుంది. ఈ కాలనీలో సుమారు 1,500కు పైగా కుటుంబాలు నివాసం ఉంటుండగా, మరో 1,000 ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది. గత ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో వెయ్యికి పైగా ఇళ్లు పూర్తయ్యాయి. విద్యుత్ సౌకర్యం కల్పించి, ఉచిత కరెంట్ కనెక్షన్లు, వీధిలైట్లు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారులను గ్రావెల్ రోడ్లుగా నిర్మించినప్పటికీ, అంతర్గత వీధి రోడ్ల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా ఉందని స్థానికులు మొరపెట్టుకుంటున్నారు. నీటి కష్టాలు తీరని వైనం మంచినీటి కోసం ప్రధాన పైప్లైన్ నిర్మించినప్పటికీ, వీధుల్లో కుళాయి కనెక్షన్ల కోసం పైప్లైన్లు వేయలేదు. దీంతో వైర్ పైపుల ద్వారా నీటిని తోడుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. పైప్లైన్ల విస్తరణకు ఎలాంటి నిధులు మంజూరు కాలేదు. ఇటీవల రెండు మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేసినా, నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు వాపోతున్నారు. కాలనీ కోసం ప్రత్యేకంగా మంచినీటి చెరువును ఏర్పాటు చేసి, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్, పైప్లైన్ వ్యవస్థను నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో నరకం ఇటీవల ప్రధాన రహదారిని సీసీ రోడ్డుగా అభివృద్ధి చేసినప్పటికీ, వర్షం వస్తే అంతర్గత వీధి రోడ్లు జలమయం అవుతున్నాయి. ఆయా రోడ్ల నుంచి ప్రధాన సీసీ రోడ్డుపైకి చేరుకోవడం ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి పథకం, చెరువు కోసం భూసేకరణ వంటి కనీస వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్ కేటాయించాలని వారు కోరుతున్నారు. పన్నుల భారం.. సదుపాయాల శూన్యం కనీస వసతులు లేని కాలనీలో ఇంటి పన్ను చెల్లించాలని కుప్పనపూడి పంచాయతీ ఒత్తిడి చేస్తోందని నివాసితులు ఆరోపిస్తున్నారు. కుప్పనపూడి పంచాయతీ ద్వారా సరఫరా అవుతున్న నీటికి, కుళాయి పన్ను, ఇంటి పన్ను చెల్లిస్తేనే నీరు ఇస్తామని షరతు విధించడంపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీపై అదనపు భారం 74 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కాలనీ కుప్పనపూడి గ్రామంపై అదనపు భారంలా మారిందని గ్రామస్తులు, పంచాయతీ పాలకవర్గం ఆందోళన చెందుతోంది. కుప్పనపూడి గ్రామంలో 7,300 మంది జనాభా ఉండగా, ఈ కాలనీ కలపడంతో మొత్తం జనాభా 12 వేలకు చేరింది. అయితే, పంచాయతీకి వస్తున్న ఆదాయం సుమారు రూ.38 లక్షలు మాత్రమేనని, ఈ కొద్దిపాటి నిధులతో ఇంత జనాభాకు మౌలిక సదుపాయాలు కల్పించడం అసాధ్యమని పంచాయతీ పేర్కొంటోంది. ఈ కాలనీని ఆకివీడు నగర పంచాయతీలో విలీనం చేయాలని లేదా కాలనీ అభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్లు మంజూరు చేయాలని స్థానికులు, గ్రామ పంచాయతీ అధికారులు ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. -
సుబ్బారాయుడికి మొక్కులు తీర్చుకున్న భక్తులు
ముదినేపల్లి (కై కలూరు): సింగరాయపాలెం సెంటర్ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తులు స్వామివారి దేవస్థానం పుట్ట వద్ద పాలు పోసి పూజలు చేశారు. దేవస్థానం ఉచిత భోజన సౌకర్యం కల్పించింది. ఆలయ చైర్మన్ బొంగు రవికుమార్, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగాశ్రీదేవి ఏర్పాట్లను పర్యవేక్షించారు. తణుకు అర్బన్: తణుకు పాతవూరు ప్రాంతంలో విద్యుత్ స్తంభాలకు ఉన్న విద్యుత్ తీగలు చోరీ చేస్తున్న వ్యక్తికి సంబంధించిన వీడియోలు ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాతవూరు పశువుల ఆస్పత్రి ప్రాంతంలోని లే అవుట్లో ఏర్పాటుచేసి ఉన్న విద్యుత్ స్తంభాల నుంచి విద్యుత్ తీగలను కట్చేసి, చుట్టుకుని ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్తున్న వీడియోలు వివిధ వాట్సప్ గ్రూపుల్లో హల్చల్ చేస్తున్నాయి. అయితే విద్యుత్ తీగలు కట్ చేసి చుట్ట చుట్టిన ఘటనను గుర్తుతెలియని వ్యక్తులు వీడియో తీసినట్లుగా తెలుస్తోంది. అతను విద్యుత్ శాఖకు చెందిన వ్యక్తి అని, మునిసిపల్ కాంట్రాక్టు కార్మికుడంటూ ఆరోపణలు వినిపిస్తుండగా.. ఆ రెండు విభాగాల అధికారులు అతడు తమ ఉద్యోగి కాదని, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లుగా చెబుతున్నారు. వీడియోలో చోరీ చేస్తున్న వ్యక్తి కొమ్మాయిచెరువు ప్రాంత వాసిగా భావిస్తున్నారు. -
మృత్యు లోయలుగా చెరువులు
● 20 నుంచి 40 అడుగుల లోతు తవ్వేసిన అక్రమార్కులు ● కళ్లముందు కనిపిస్తున్నా పట్టించుకోని అధికారగణం చాట్రాయి: వ్యాపారమే లక్ష్యంగా చేపట్టిన అక్రమ మట్టి తరలింపుతో మండలంలోని చెరువులు లోయలను తలపిస్తున్నాయి. ఈ గోతులు రేపటి రోజున మృత్యు కూపాలుగా మారే ప్రమాదం ఉంది. మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో గత మూడు నెలలుగా ఇరిగేషన్ చెరువుల నుంచి అక్రమంగా మట్టిని తరలించి లక్షల రూపాయల వ్యాపారం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్నా, సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో మట్టి మాఫియాకు తిరుగులేకుండా పోయింది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే, మనవాడే కదా.. తవ్వేసుకో అన్నట్లుగా వ్యవహరిస్తూ రాత్రి, పగలు తేడా లేకుండా మట్టిని యథేచ్ఛగా తరలించారు. నిబంధనలకు పాతర వాస్తవానికి ఇరిగేషన్ చెరువుల్లో మట్టిని తరలించాలంటే ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ శాఖల అనుమతులు తప్పనిసరి. చెరువులో ఎంత లోతు తవ్వాలో నిబంధనలు ఉంటాయి. వాటిని పక్కన పెట్టి 20 నుంచి 40 అడుగుల లోతులో ఎక్కడ పడితే అక్కడ మట్టిని తవ్వుతున్నారు. వాల్టా చట్టం, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని ఇటుక బట్టీలకు, ప్రైవేట్ భూముల అభివృద్ధికి తరలించి, ఒక్కో ట్రాక్టర్ మట్టిని రూ.500 నుంచి రూ.600 వరకు అమ్ముకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఇంటి పన్ను, ఆస్తి పన్ను, నీటి పన్నులు వసూలు చేస్తున్నట్లే, మట్టి, ఇసుక, గ్రావెల్ తవ్వకాలపై పన్నులు వసూలు చేస్తే పంచాయతీలకు ఆదాయం వస్తుందని ప్రజలు సూచిస్తున్నారు. మృత్యు కూపాలు చనుబండలోని చిన్న చెరువు, పెద్ద చెరువు, పర్వతాపురం చెరువుల్లో తవ్విన గోతులు అత్యంత లోతుగా ఉండటంతో, పొరపాటున ఎవరైనా అందులో పడితే మరణం ఖాయం. ఈ చెరువుల గోతులు నివాస ప్రదేశాల పక్కనే ఉండడంతో ఎవరైనా పొరబాటున గోతిలో పడి చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చెరువులో తవ్విన గోతులు ప్రమాదాలకు నిలయంగా ఉన్నాయి. గోతుల్లో పడి చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు. చిన్న చెరువులో తవ్విన గోతులు నివాస ప్రదేశాలకు దగ్గరగా ఉన్నాయి. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చీదిరాల దుర్గ, చనుబండ, చాట్రాయి మండలం -
గుబ్బల మంగమ్మ తల్లి గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అధికంగా తరలివచ్చిన భక్తుల వల్ల ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారితోపాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు. భీమవరం: భీమవరం పట్టణంలోని విస్సాకోడేరు వంతెన సమీపంలో ఆదివారం కారు బీభత్సం సృష్టించింది. పాలకొల్లు వైపు నుంచి భీమవరం వస్తున్న కారు వంతెన సమీపంలోని చికెన్ సెంటర్ నుంచి మోటారుసైకిల్పై వస్తున్న యువకుడిని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో విద్యుత్ స్తంభం ముక్కలు కాగా, కారు ముందుభాగం దెబ్బతింది. అనంతరం మట్టిగుట్టను ఢీకొని ఆగిపోయింది. మోటారుసైకిల్పై వస్తున్న యువకుడు తీవ్రంగా గాయపడడంతో చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. కామవరపుకోట: కామవరపుకోట పాతూరులో ఆదివారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో బాధిత కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది. పాతూరు శివారు వాలిసుగ్రీవుల గట్టు వద్ద ఉన్న కాలనీలో నివాసముంటున్న యామండ్ర ప్రసన్న, ఆదివారం ఆమె కుమార్తెను కళాశాలలో దింపి రావడానికి గౌరీపట్నం వెళ్ళింది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు గమనించి మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. అప్పటికే ఇంట్లోని మంచాలు, టీవీ, ఫ్యాన్లు, దుస్తులు, బంగారు ఆభరణాలు, నగదు, వాటితో పాటు ప్రసన్న కుమార్తె సర్టిఫికెట్లు కాలి బూడిదయ్యాయి. అయితే తమంటే గిట్టనివారే ఇలా చేసి ఉంటారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జంగారెడ్డిగూడెం సీఐ ఎం.వి.సుభాష్, తడికలపూడి ఎస్.ఐ వల్లీ పద్మ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధితులను వైఎస్సార్సీపీ నాయకులు తమ్మిశెట్టి గిరిజ, సుబ్రహ్మణ్యం, సాయిన కనకరాజు, టీవీఎస్ రాజు పరామర్శించి దుస్తులు, ఆర్థిక సహాయం అందజేశారు. తాడేపల్లిగూడెం రూరల్: ట్రాక్టర్ ట్రక్కును బైక్ ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మరణించినట్లు రూరల్ ఏఎస్సై గోపీనాథ్ తెలిపారు. కొయ్యలగూడెం మండలం సరిపల్లికి అడ్డగర్ల దుర్గాప్రసాద్ బైక్ఫై ఎల్.అగ్రహారం టిడ్కో గృహాల వద్దకు వచ్చాడు. ప్రమాదవశాత్తు ఆగి ఉన్న మున్సిపాల్టీ ట్రాక్టర్ ట్రక్కును ఢీకొన్నాడు. దుర్గాప్రసాద్ తలకు తీవ్రగాయమైంది. అతనిని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ఆదివారం తెల్లవారు జామున చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రూరల్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో మృతుడి సోదరుడు పృథ్విరాజ్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఏఎస్సై తెలిపారు. పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని నరసాపురం రోడ్డులో ఉన్న మహేశ్వరి టింబర్ డిపోలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం వేకువజామున మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. -
శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ఆదివారం సందర్శించారు. కుటుంబసమేతంగా విచ్చేసిన ఆయనకు ముందుగా దేవస్థానం అధికారులు, అర్చకులు తూర్పు రాజగోపురం వద్ద పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రదక్షిణల అనంతరం ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు శ్రీవారి శేష వస్త్రా న్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలకగా, దే వస్థానం ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు చినవెంకన్న చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. న్యాయమూర్తి వెంట జిల్లా జడ్జి ఎస్.శ్రీదేవి, భీమడోలు కోర్టు జడ్జి ఎస్.ప్రియదర్శిని నూతక్కి తదితరులు ఉన్నారు. -
ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
టి.నరసాపురం: మండలంలోని బందంచర్ల గ్రామానికి చెందిన పుసునూరి అయ్యప్ప (43) ఆదివారం ఉదయం తన బంధువుల ఇంటి సమీపంలోని షెడ్డులో ఉరివేసుకుని మృతి చెందినట్లు టి.నరసాపురం ఎస్సై ఎం.జయబాబు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. జయబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మద్యానికి బానిసగా మారాడని, శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో వాగ్వాదం జరిగిన అనంతరం, ఇంటి సమీపంలోని షెడ్డులో నిద్రించడానికి వెళ్లాడని తెలిపారు. ఆదివారం ఉదయం స్థానికులు గమనించి సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా, అయ్యప్ప ఉరివేసుకుని మృతి చెంది ఉన్నాడని వివరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్లోని దువ్వాడ–గుడివాడ సెక్షన్లలోని పలు స్టేషన్లలో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ (పీసీఓఎం) వినీత్కుమార్ ఆదివారం విస్తృతంగా తనిఖీలు చేశారు. దువ్వాడ, కొవ్వూరు, గోదావరి స్టేషన్ల మధ్యలో జరుగుతున్న స్టేషన్ ఆధునికీకరణ పనులు, మౌలిక సదుపాయాలపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తాడి, అనకాపల్లి, బయ్యవరం, గుల్లిపాడు, గొల్లప్రోలు, రాజమండ్రి, అనకాపల్లి, సామర్లకోట స్టేషన్లలో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో జరుగుతున్న ఆధునికీకరణ పనులను పరిశీలించారు. రైళ్ల కార్యకలాపాలు మెరుగుపర్చడం, సెక్షన్ల సామర్థ్యాన్ని పెంచడం, ట్రాఫిక్ సౌకర్యాలను ప్రత్యేకంగా పరిశీలించి అధికారులతో మాట్లాడి సులభతరం చేయడానికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే గోదావరి పుష్కరాల కోసం జరుగుతున్న సన్నాహక పనులు పరిశీలించి.. రాజమండ్రి, కొవ్వూరు, గోదావరి స్టేషన్లలో ప్రయాణికుల మౌలిక సదుపాయాలపై అధికారులతో సమీక్షించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. తనిఖీల్లో విజయవాడ డివిజన్ సీనియర్ డీఓఎం సురేష్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కై కలూరు: అమ్మా.. కొల్లేటికోట పెద్దింట్లమ్మా.. మా కోరికలు నెరవేర్చవమ్మా అంటూ భక్తులు ఆర్తితో వేడుకున్నారు. సమీప జిల్లాల నుంచి అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. వేడి నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ.. ఒక్క ఆదివారం రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదాలు, గదుల అద్దెలు, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.95,047 ఆదాయం వచ్చిందని తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. -
చింతగుంట చెరువులో అక్రమ మట్టి దందా
ఆగిరిపల్లి: మండలంలోని సగ్గూరు గ్రామంలో అధికార పార్టీకి చెందిన నేతలు, అనుమతుల పేరుతో చింతగుంట చెరువులోని మట్టిని ఇష్టానుసారంగా తవ్వేసి అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు ఎవరూ కన్నెత్తి చూడకపోవడం, ఫిర్యాదు కోసం ఫోన్ చేసినా స్పందించకపోవడంపై గ్రామస్తులు వాపోతున్నారు. పొలం మెరకల కోసం అనుమతులు తీసుకున్నట్లు చెబుతూ, జేసీబీలతో చెరువును తవ్వి సుమారు 50 ట్రాక్టర్ల ద్వారా వందలాది ట్రిప్పులను పక్కనే ఉన్న వేరే జిల్లాలోని గ్రామాలకు తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ మట్టిని రూ.1000 నుంచి రూ.1200 వరకు విక్రయిస్తున్నారని, దూరాన్ని బట్టి ధరలను పెంచుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, మట్టి ట్రాక్టర్ల రాకపోకలతో చెరువు పక్కనే ఉన్న పొలాలు నాశనమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించి, అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎర్ర చెరువులో అక్రమ తవ్వకాలు మండలంలోని నూగొండపల్లిలో టీడీపీ నాయకులు ఎర్ర చెరువును ఇష్టానుసారం తవ్వేశారు. ఆదివారం ఉదయం నుంచి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అనుమతులు లేకుండా తవ్వేసి వందలాది ట్రిప్పులను పిన్నమరెడ్డిపల్లి, నూగొండపల్లికి తరలించి జేబులు నింపుకుంటున్నారు. చెరువులను తవ్వేస్తున్నా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. అనుమతి లేకుండా చెరువులను తవ్వేయడంతో పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. దీంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రానికి సంఘటన స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు మట్టి తవ్వకాలను తూతూమంత్రంగా నిలిపేసి మమ అనిపించారు. అనుమతి లేకుండా చెరువులో అక్రమ తవ్వకాలు చేసే వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఉత్సాహంగా ఈశా గ్రామోత్సవం పోటీలు
బుట్టాయగూడెం: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈశా గ్రామోత్సవం పేరిట ఆదివారం ఘనంగా క్రీడాపోటీలను నిర్వహించారు. ఈ పోటీలను కేఆర్పురం ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పి.జనార్దన్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక వికాసానికి ఎంతో అవసరం అన్నారు. క్రీడల్లో ఓటమి, గెలుపులను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని క్రీడాకారులు అలవరచుకోవాలని కోరారు. మరింత ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపికవ్వాలని ఆకాంక్షించారు. తొలుత క్రీడా జ్యోతిని వెలిగించి డీడీ పోటీలను ప్రారంభించారు. ఉదయం నుంచే ప్రారంభమైన ఈ పోటీలను చూసేందుకు అనేక మంది అధిక సంఖ్యలో హాజరయ్యారు. కళాశాల మైదానం క్రీడా వాతావరణంతో సందడిగా మారింది. ఆదివారం సెలవురోజు కావడంతో విద్యార్థులు కూడా ఈ పోటీలను తిలకించారు. వాలీబాల్, త్రోబాల్ పోటీల్లో ప్రతి మ్యాచ్లో ఆటగాళ్లు ప్రదర్శించిన చురుకుదనం, టీమ్ వర్క్ ప్రేక్షకుల నుంచి చప్పట్లు అందుకున్నాయి. ఈ పోటీల్లో సుమారు 38 వాలీబాల్ టీంలు, 8 త్రోబాల్ మహిళా టీంలు పాల్గొన్నాయి. త్రోబాల్ మహిళల విభాగంలో బుట్టాయగూడెం లిటిల్ రోజ్ టీమ్ మొదటి స్థానం, సీతప్పగూడెం రెండో స్థానం, మామిడిగొంది మూడోస్థానం, రాజవరం నాలుగో స్థానంలో నిలిచాయి. మొదటి, రెండు స్థానాల్లో గెలుపొందిన వారు విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. త్రోబాల్లో విజేతలైన వారికి కేఆర్పురం స్పోర్ట్స్ ఫెడరేషన్ సెక్రటరీ లక్ష్మణ్రావు చేతుల మీదుగా నగదు బహుమతులను అందజేశారు. మోస్ట్ జాయ్ఫుల్ ప్లేయర్గా గొరపర్తి ఝాన్సీని ఎంపిక చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జి.కుసుమ, నేషనల్ వాలీబాల్ ప్లేయర్ బి.వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు జాగా.. వేసేయ్ పాగా
ఉల్లిక్కిపాటు తాడేపల్లిగూడెం: మార్కెట్లో ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగి వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వారం రోజులుగా ధరలు ఎగబాకుతుండటంతో, గతంలో లభించిన తక్కువ ధరల విక్ర యాలు ఆగిపోయాయి. ఆదివారం నాటి హోల్సేల్ మార్కెట్లో సాధారణ రకం ఉల్లి క్వింటాలు రూ.2,800 పలకగా, నాణ్యమైన రకం రూ.3,400 కు చేరింది. ఫలితంగా బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.40 కి చేరింది. మహారాష్ట్ర ఉల్లిపైనే ఆధారం ప్రస్తుతం దేశీయ మార్కెట్లకు మహారాష్ట్ర ఉల్లిపాయలే ప్రధాన దిక్కుగా మారాయి. నాబార్డు రుణ సదుపాయంతో నిర్మించిన బహిరంగ గోదాముల వల్ల ఇక్కడి ఉల్లి 90 రోజులకు పైగా నిల్వ ఉంటుంది. మార్కెట్ అవసరాలను బట్టి రైతులు సరుకును సరఫరా చేస్తుంటారు. ఈ ఉల్లి పైపొరలపై నల్లమచ్చలు (కాటుక) వచ్చినా కుళ్లిపోవు. అందువల్ల వీటిని ఎక్కువగా వాడతారు. సాధారణంగా ఖరీఫ్, రబీ సీజన్లలో కర్నూలు వంటి ప్రాంతాల నుంచి వచ్చే దిగుబడులు ధరలను అదుపులో ఉంచుతాయి. కర్నూలుపై ఎల్నినో ప్రభావం కర్నూలులో ఉల్లి పంట 80 శాతం వర్షాధారం. అ యితే ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో సాగు తీవ్రంగా దెబ్బతింది. కర్నూలు జిల్లాలో 19,242 హెక్టార్ల సాగు లక్ష్యానికి కేవలం 2,349 హెక్టార్లలోనే పంట వేశారు. నంద్యాలలో 4,583 హెక్టార్లకు గాను 251 హెక్టార్లలోనే నారు వేశారు. గత సీజన్లలో 7.50 లక్షల టన్నుల దిగుబడి రాగా, అందులో 2.64 లక్షల టన్నులు తెలుగు రా ష్ట్రాలతో పాటు కర్ణాటకకు ఎగుమతి అయ్యేవి. తా డేపల్లిగూడెం మార్కెట్ నుంచి ఈ సరుకు పశ్చిమ బెంగాల్, అసోం, బంగ్లాదేశ్, మలేషియా, ఆఫ్రికా దేశాలకు కూడా ఎగుమతి అయ్యేది. కానీ ఈసారి వానలు లేక రైతులు నారు పోసే పరిస్థితి కూడా లేదు. భవిష్యత్తులో ఉల్లి కొరత మరింత తీవ్రమై, ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. సాక్షి, టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వ పాలనలో కై కలూరు నియోజకవర్గంలో ఇరిగేషన్, ఆర్అండ్బీ శాఖలకు చెందిన ప్రభుత్వ భూములు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయి. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో అక్రమార్కులు ప్రభు త్వ స్థలాల్లో శాశ్వత కట్టడాలు నిర్మిస్తూ సొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా కలెక్టర్కు స్వయంగా ఫి ర్యాదులు అందుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అక్ర మ నిర్మాణాలకు అడ్డుకట్ట పడటం లేదు. ప్రధాన కాలువలు, డ్రెయిన్ల కబ్జా ● రాళ్లకోడు కాలువ : ఏలూరు రోడ్డు నుంచి దానిగూడెం మీదుగా సాగునీరు అందించే ఈ కీలకమైన కాలువ స్థలాలు దాదాపు 70 శాతం మేర ఆక్రమణకు గురయ్యాయి. కెనరా బ్యాంకు ఎదురుగా ఇరిగేషన్ భూమిలో రెండంతస్తుల భవ నాన్ని నిర్మిస్తున్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినా నిర్మాణం ఆగకపోగా, స్థానికుల రాకపోకలకు వీలుగా కాలువను మట్టితో పూడ్చి ప్రత్యామ్నాయ దారి ఏర్పాటు చేయడం గమనార్హం. ● వర్లకోడు డ్రెయిన్ : కై కలూరులో వరద నీటిని కొల్లేరుకు పంపించే ఈ ప్రధాన డ్రెయిన్ను కూడా కబ్జా చేశారు. దీనివల్ల వర్షాల సమయంలో పట్టణంలోని పలు వార్డులు ముంపునకు గురవుతున్నాయి. ● ఆక్వా చెరువుల విస్తరణ : కలిదిండి మండలంలో ఆక్వా రైతులు మరమ్మతుల నెపంతో డ్రెయిన్లను అందినకాడికి ఆక్రమిస్తున్నారు. కోర్టు ఆదేశాల బేఖాతరు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశిస్తున్నా, స్థానిక అధికారులు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు. మండవల్లి మండలం భైరవపట్నం శివారు శోభానాద్రిపురం జాతీయ రహదారి పక్కన ఇరిగేషన్ భూమిలో 12 దుకాణాల సముదాయాన్ని నిర్మించారు. అధికారులు కేవలం ‘ఇది ఇరిగేషన్ స్థలం’ అని బోర్డులు పెట్టి చేతులు దులుపేసుకున్నారే తప్ప, దుకాణాలను తొలగించలేదు. పులపర్రులో ఆర్అండ్బీ భూమిని ఆక్రమించి ఏకంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు ఆక్రమణలపై ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు ఒకరిపై ఒకరు నెపం నెట్టేస్తూ కాలయాపన చేస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఇరిగేషన్ అధికారులనే మళ్లీ నియమించడంతో, వారు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి మూగ ప్రేక్షకులుగా మిగిలిపోయారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులే ఈ ఆక్రమణలపై ఫ్లెక్సీలతో నిరసన తెలపడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. మండవల్లి మండలం శోభనాద్రిపురంలో ఇరిగేషన్ భూమిలో దుకాణ సముదాయం కై కలూరు రాళ్లకోడు కాలువ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం భీమవరం : న్యూ ఆంధ్ర బాడీబిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చేనెల 2న భీమవరం వీరమ్మపార్కు వద్ద చాంపియన్ ఆఫ్ ది చాంపియన్ బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించనున్నట్టు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఖాసీం తెలిపారు. ఆదివారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో పోటీల బ్రోచర్ను డీఎస్పీ రఘువీర్విష్ణు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఖాసీం మాట్లాడుతూ పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ట్యా జిల్లాల క్రీడాకారులు పాల్గొంటారన్నారు. విజేతకు రూ.20 వేల నగదు బహుమతి, మిగిలిన విజేతలకు నగదు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందిస్తామన్నారు. రఘువీర్ విష్ణు మాట్లాడుతూ బాడీబిల్డింగ్ శరీర సౌష్టవంతో పాటు క్రమశిక్షణకు దోహదం చేస్తుందన్నారు. అసోసియేషన్ జిల్లా చైర్మన్ దాసి వరప్రసాద్ బాబు, వైస్ ప్రెసిడెంట్ పెన్మెత్స రవివర్మ, పి.అమూల్యరావు, అల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు. పెరుగుతున్న ఉల్లి ధరలు కిలో రూ.40 మహారాష్ట్ర పంటే దిక్కు కూటమి పాలనలో రెచ్చిపోతున్న అక్రమార్కులు ఇరిగేషన్, ఆర్అండ్బీ భూముల ఆక్రమణ రూ.కోట్ల విలువైన స్థలాలు కబ్జా రాజకీయ నేతల అండ కుచించుకుపోతున్న పంట కాలువలు కై కలూరు రాళ్లకోడు కాలువ ఆక్రమణలపై సమాచారం అందింది. దీనిపై విచారణ చేయిస్తాం. ఇరిగేషన్ భూము ల ఆక్రమణలపై ఉన్నతాధికా రులకు నివేదికలు పంపించాం. ఆక్రమణల వద్ద బోర్డులను సైతం ఏర్పాటుచేశాం. ప్రభుత్వ భూములను ఆక్రమించడం నేరం. చర్యలు తీసుకుంటాం. – డి.శిరీష, ఇరిగేషన్ డీఈఈ, కై కలూరు -
క్రీడలను ప్రోత్సహించాలి
భీమవరం: పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే దేశానికి మంచి క్రీడాకారులు అందించిన ఘనత వారికి దక్కుతుందని సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 17 నుండి మూడు రోజులపాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సాగి రామకృష్ణంరాజు మెమోరియల్ బ్యాడ్మింటన్ మెన్ అండ్ ఉమెన్ సెలక్షన్స్ కమ్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడాకారుల ప్రతిభ చూస్తుంటే అబ్బురపరుస్తోందని, అండర్ లెవల్లో కూడా మంచి పట్టుదలతో ఆడి విజయాలు అందుకున్న విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం తరఫున రాహుల్ కుమార్ రెడ్డి దంపతులను ఘనంగా సత్కరించారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ఫిజికల్ డైరెక్టర్, క్రీడల ఆర్గనైజింగ్ సెక్రెటరీ డాక్టర్ సీహెచ్ హరిమోహన్ అధ్యక్షత వహించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిషాంత్ వర్మ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా క్రీడలకు తమ కళాశాల వేదికగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. -
కల్వర్టుల వద్ద మరమ్మతులు
భీమడోలు : ‘రోడ్డు నిర్మాణంలో నాణ్యత డొల్ల’ శీర్షికన ఈనెల 17న ‘సాక్షి’లో ప్రచు రించిన కథనానికి అధికారులు స్పందించారు. భీమడోలు వంతెన నుంచి పెదలింగంపాడు వరకు నిర్మించిన రహదారి కల్వర్టుల వద్ద కుంగిపోవడంతో భీమడోలు పీఐయూ శాఖ ఆధ్వర్యంలో మరమ్మతులు చేపట్టారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు తమ స్పందన తెలియజేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి కోరారు. పీజీఆర్ఎస్ కేంద్రాలను సందర్శించే పౌరుల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు జి ల్లా, మండల స్థాయి పీజీఆర్ఎస్ కేంద్రాల్లో, వి విధ మాధ్యమాల్లో క్యూఆర్ కోడ్ను ప్రదర్శించాలని నిర్ణయించామన్నారు. ఈ క్యూఆర్ కోడ్ను పీజీఆర్ఎస్ కేంద్రాల వద్ద ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. అలాగే నోటీసు బోర్డులు, హెల్ప్ డెస్క్లు, ఫిర్యాదుల కౌంటర్లు తదితర ప్రదేశాల్లో క్యూఆర్ కోడ్ పోస్టర్లు ఏర్పాటుచేయాలన్నారు. సాంఘిక సంక్షేమ అధికారి అరుణకుమారి తాడేపల్లిగూడెం (టీఓసీ): పేద విద్యార్థుల ప్రభుత్వ కాలే జీ వసతి గృహాలను సద్వినియోగం చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్వీ అరుణకుమారి అన్నారు. స్థానిక హౌసింగ్బోర్డు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలుర హాస్టల్లో ఆదివారం భోజనం ప్లేట్లు, బెడ్షీట్లు, నైట్ డ్రస్సులు, టవల్స్ తదితర వాటిని విద్యార్థులకు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో 35 హాస్టళ్లు ఉన్నాయని, వాటిలో 13 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ అన్నారు. ఇంటర్ నుంచి బీటెక్ వరకు చదివే పేద విద్యార్థులు వీటిని వినియోగించుకోవాలన్నారు. నరసాపురం, పాలకొల్లు, తణుకు, భీమవరంలో హాస్టళ్లు, పరిమెళ్ల, పెంటపాడు, ఉండి, దర్శిపర్రులో బాలికల హాస్టల్స్, ప్రీమెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయన్నారు. అలాగే తాడేపల్లిగూడెంలో రెండు బాయ్స్ కళాశాల హాస్టల్స్, బాలికల హాస్టల్ ఉన్నాయని, జిల్లాలో 7 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రీ మెట్రిక్ హాస్టళ్లు కూడా ఉన్నాయన్నారు. అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి బి.రామాంజనేయరాజు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన జిల్లా ఆస్పత్రిలో నెలకొన్న వైద్యులు, మందుల కొరతను తక్షణమే పరిష్కరించాలని ఆర్సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి పి.కిషోర్ డిమాండ్ చేశారు. ఆదివారంస్థానిక ఆర్సీపీఐ పార్టీ కార్యాలయంలో జి.శారద అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆ యన మాట్లాడుతూ వైద్య కళాశాలలో ప్రొ ఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కలిపి 60 మందికి పైగా ఉండాల్సి ఉండగా ప్రస్తుతం సుమారు 22 మంది మాత్రమే పనిచేస్తున్నారన్నారు. ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయకపోవడంతో రో గులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్) : భీమవరం పట్టణ ఇలవేల్పు, భక్తుల పాలిట కొంగు బంగారం మావుళ్లమ్మవారికి ఇన్నర్ వీల్ క్లబ్ మహిళా సభ్యులు ఆదివారం ఆషాఢ సారె సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి మొక్కులు తీర్చుకున్నారు. -
రిజిస్ట్రేషన్.. పరేషాన్
ఏలూరులో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఏలూరు (ఆర్ఆర్పేట): భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రజా, ప్రైవే ట్ భాగస్వామ్య (పీపీపీ) విధానాన్ని వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖర్లు సరికొత్త నిరసనలకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 396ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 20 (సోమవారం) నుంచి జిల్లావ్యాప్తంగా పెన్డౌన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇప్పటికే లేఖర్ల నిరసనలతో జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నెల ఆరంభంలో (7, 8 తేదీల్లో) లేఖర్ల నిర్వహించిన రెండు రోజుల టోకెన్ పెన్డౌన్ వల్ల రిజిస్ట్రేషన్లు పూర్తిగా స్తంభించాయి. జిల్లాలోని భీమడోలు, జంగారెడ్డిగూడెం, పోలవరం కార్యాలయాల్లో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. రోజుకు 80 నుంచి 100 రిజిస్ట్రేషన్లు జరిగే ఏలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండు రోజుల్లో కలిపి కేవలం 12 మాత్రమే జరిగాయి. మొత్తంగా జిల్లాలోని 12 కార్యాలయాల్లో 7న 65, 8న 147 రెండు రోజుల్లో కేవలం 212 రిజిస్ట్రేషన్లు జరిగి, రూ.70.57 లక్షల ఆదాయం మాత్రమే వచ్చింది. అంటే కేవలం రెండు రోజుల్లోనే ప్రభుత్వం సుమారు రూ.2 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తుందా? ఏలూరు జిల్లాలోనే రోజుకు రూ.కోటి నష్టం వస్తే, రాష్ట్రవ్యాప్తంగా జరిగే నష్టం ఊహాతీతం. ఈ నేపథ్యంలో లేఖర్ల సుదీర్ఘ సమ్మెను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల ఒత్తిళ్లకు లొంగిపోతే, భవిష్యత్తులో ఇతర శాఖల జీఓల అమలుపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఆర్ఎస్కేలపై లేఖర్ల అల్టిమేటం తాజాగా కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను (ఆర్ఎస్కే) ఏర్పాటు చేస్తూ జీఓ విడుదల చేసింది. ఈ నిర్ణయం వల్ల తమ ఉపాధికి గండి పడుతుందని ఆందోళన చెందిన దస్తావేజు లేఖర్ల యూనియన్ పెన్డౌన్కు పిలుపునిచ్చింది. ఈనెల 20 నుంచి 31 వరకు సుదీర్ఘంగా ఈ నిరసన కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. పాతికేళ్లుగా సాగుతున్న పెత్తనం లేఖర్ల వ్యవస్థను రద్దు చేసి సుమారు 25 ఏళ్లు గడుస్తున్నా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇప్పటికీ లేఖర్ల దే పెత్తనం. ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని అందు బాటులోకి తెచ్చి, ప్రజలు స్వయంగా దస్తావేజులు తయారు చేసుకునే వెసులుబాటు కల్పించినా ఆశించిన చైతన్యం రాలేదు. ఈ విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవడమే దీనికి ప్రధాన కారణం. కక్షిదారుల అవగాహనా రాహిత్యమే పెట్టుబడిగా రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద గతంలో డాక్యుమెంట్ రైటర్ల (దస్తావేజు లేఖర్ల) వ్యవస్థ నడిచింది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ కోసం ప్రజ లు కచ్చితంగా దస్తావేజు లేఖర్లపైనే ఆధారపడాల్సి వచ్చేది. వారు ఆస్తి విలువలో 1 నుంచి 2 శాతం వరకు కమీషన్ వీరు వసూలు చే సేవారు. ఉదాహరణకు, రూ.50 లక్షల ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే లేఖరులకే దాదాపు రూ.లక్ష వరకు సమర్పించుకోవాల్సి వచ్చేది. ఈ క్రమంలో 2002లో చంద్రబాబు ప్రభుత్వం లేఖర్ల వ్యవస్థను రద్దు చేసింది. అప్పటి నుంచే రిజిస్ట్రేషన్ శాఖలో డిజిటలైజేషన్కు శ్రీకారం చుట్టింది. దస్తావేజు లేఖర్ల పెన్డౌన్ ఆర్ఎస్కేపై ప్రభుత్వానికి అల్టిమేటం రిజిస్ట్రేషన్లపై ప్రతికూల ప్రభావం ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందా? -
తిరోగమనంలో ట్రిపుల్ఐటీలు
నూజివీడు : ట్రిపుల్ఐటీల్లో (ఆర్జీయూకేటీ) ఇటీవల కాలంలో విద్యాప్రమాణాలు క్రమంగా క్షీణిస్తున్నా యనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచస్థాయి ప్రమాణాలతో పేద, గ్రామీణ విద్యార్థులకు ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ విద్యను అందించాలనే ఆశయంతో ఏర్పాటైన ఈ సంస్థలు, అధికారుల అసమంజస నిర్ణయాల వల్ల తిరోగమనం దిశగా పయనిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. పీయూసీ విధానానికి.. 2024 విద్యాసంవత్సరం వరకు ఇంజినీరింగ్ కో ర్సులకు అనుగుణంగా, అంతర్జాతీయ సాంకేతిక మార్పులను బట్టి పీయూసీ సిలబస్ను ప్రత్యేకంగా రూపొందించి బోధించేవారు. అయితే 2025–26 విద్యాసంవత్సరం నుంచి ఈ విధానానికి స్వస్తి చెప్పి, సాధారణ ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాలను ప్రవేశ పెట్టారు. దీనివల్ల సాధారణ జూనియర్ కాలేజీలకు, ట్రిపుల్ఐటీలకు తేడా లేకుండా పోయిందని విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆరేళ్ల సమీకృత విద్య విశిష్టతను దెబ్బతీసి, కేవలం ఇంటర్, ఇంజినీరింగ్ల కలయికగా మార్చేసిందనే విమర్శలు ఉన్నాయి. సెమిస్టర్ విధానానికి స్వస్తి 2008 నుంచి పీయూసీలో విజయవంతంగా అమలువుతున్న సెమిస్టర్ విధానాన్ని 2025–26 విద్యాసంవత్సరం నుంచి రద్దు చేసి, వార్షిక పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఏడాది మొత్తం చదివిన సిలబస్ను ఒకేసారి రాయాల్సి రావడంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. గతంలో ఏడాదికి రెండుసార్లు రెమిడియల్ పరీక్షలు రాసుకునే అవకాశం ఉండగా, ఇప్పుడు ఆ అవకాశం ఏడాదికి ఒకేసారికి పరిమితమైంది. దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు వార్షిక విధానం నుంచి సెమిస్టర్ విధానం వైపు అడుగులు వేస్తుంటే, ట్రిపుల్ఐటీలు మాత్రం వెనక్కి వెళ్తుండటం విస్మయం కలిగిస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, ట్రిపుల్ఐటీల పూర్వవైభవానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాంకేతిక విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన ఈ సంస్థలో ఐటీ సబ్జెక్టు ప్రాధాన్యతను తగ్గించడం మరో వివాదాస్పద నిర్ణయం. గతంలో పీయూసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో పాటు ఐటీ సబ్జెక్టును తప్పనిసరిగా బోధించేవారు. ఈ సబ్జెక్టుకు పరీక్షలు నిర్వహించి క్రెడిట్లు కూడా ఇచ్చేవారు. 2025–26 విద్యాసంవత్సరం నుంచి ఈ క్రెడిట్లను తొలగించడంతో, విద్యార్థులు ఐటీ నేర్చుకోవడంపై ఆసక్తి చూపడం లేదు. రాబోయే రోజుల్లో ఈ సబ్జెక్టునే పూర్తిగా తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పీయూసీ నుంచే ల్యాప్టాప్లు ఇవ్వడం, ఐటీ బోధించడం వల్లే ప్లేస్మెంట్స్ సాధించడంలో ట్రిపుల్ఐటీ విద్యార్థులు ఇతర ఇంజినీరింగ్ విద్యార్థుల కంటే ముందుంటున్నారని సాఫ్ట్వేర్ కంపెనీలు ఫీడ్బ్యాక్ ఇస్తున్నాయి. అలాంటి కీలక సబ్జెక్టును నిర్వీర్యం చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆరేళ్ల సమీకృత సాంకేతిక విద్య కోసం ఏర్పాటు గతేడాది నుంచి ఇంటర్, ఇంజినీరింగ్ విద్యగా తయారైన బోధన పీయూసీలో ఇంటర్ పాఠ్య పుస్తకాలతో చదువులు -
ఘనంగా యోగాసన పోటీలు
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమంలో ఆరా ఫౌండేషన్, నిత్య సాధన కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి యోగాసన పోటీలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన యోగ సాధకులు, క్రీడాకారులు 76 మంది పాల్గొన్నారు. వివిధ విభాగాలలో ట్రెడిషనల్, ఆర్టిస్టిక్ సోలో, పెయిర్, రిథమిక్ పెయిర్లలో ఈ పోటీలు జరిగాయి. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి వెంకటేశ్వరరాజు, కార్యదర్శి కరిబండి రామకృష్ణ, గౌరవాధ్యక్షులు వింజుమూరి మాధవరావు, ఏపీ ఆర్గనైజింగ్ కార్యదర్శి మండూరు వెంకట రమణ పర్యవేక్షించారు. న్యాయ నిర్ణేతలుగా కర్రి భువనేశ్వరి, బొజ్జ లక్ష్మి వెంకట సాయి, టీజేవీఎస్ భారతి, సయ్యద్ యాసిన్, మోహిద్దీన్, శ్రీనివాసరావు, రామచక్రధరరావు, దుర్గాభవానీ, రామచంద్రరెడ్డి వ్యవహరించారు. విజేతలు వచ్చే నెలలో జరిగే రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలకు అర్హత సాధించారు. వివిధ కేటగిరీలలో పి. అభినందని, పి.హాసిని, కె.కృష్ణహర్షిణి, పి.చిరంజీవి, వి.గురు ప్రసాద్, ఎన్.రాజేష్, కార్తీక ఉషశ్రీ దుర్గ, సీహెచ్ సీతారామ భరత్, కె.వాసంతి, టి.లక్ష్మి, బి.శిరీష, సీహెచ్ హేమలత, ఎస్.అమల, ఎం.సుభద్ర, బి.రేణుక, ఎ.సుభాషిణి విజేతలుగా నిలిచారు. -
‘సాక్షి’పై దాడి ఘటనలో కేసు నమోదు
● కోర్టు ఉత్తర్వులతో ఎఫ్ఐఆర్ ● ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు ఆరుగురిపై కేసు ఏలూరు (ఆర్ఆర్పేట): గతేడాది ఏలూరులో ‘సాక్షి’ కార్యాలయంపై టీడీపీ శ్రేణులు చేసిన దాడి ఘటనకు సంబంధించి ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. గతేడాది జూన్ 10న ఎన్ఆర్ పేటలోని ‘సాక్షి’ కార్యాలయంపై దాడి జరిగిన క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్పందించలేదు. ఈ క్రమంలో కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేయగా కోర్టు ఆదేశాలతో పోలీసులు ఈనెల 9న ఆరుగురుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసుకు సంబంధించి వివరాలు ఇలా.. గతేడాది జూన్ 7న సాక్షి టీవీలో అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సాక్షి కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారు. దీనిలో భాగంగా గతే డాది జూన్ 10న ఏలూరు కార్యాలయంపై దాడి చేసి, ఆఫీసు కాంపౌండ్లోని ఫర్నిచర్ను, ఇతర వస్తువులను దహనం చేసి తీవ్ర భయాందోళనలు సృష్టించారు. దాడి జరిగాక 17న ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ జిల్లా ఎస్పీ కె.ప్రతాప శివకిషోర్కు ఫిర్యాదు చేయడం, పోలీసులు స్పందించకపోవడంతో డీజీపీకి మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపి చివరికి న్యాయస్థానంలో ప్రైవేటు కంప్లయింట్ దాఖలు చేశారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 24న న్యాయస్థానం ఇరువాదనలు విని ఎఫ్ఐఆర్ను నమోదు చేసి చట్టప్రకారం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని ఆదేశించడంతో 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. న్యాయ వాది ప్రత్తిపాటి తంబి వాదనలు వినిపించారు. ఆరుగురిపై ఎఫ్ఐఆర్ ఈ కేసులో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు, టీడీపీ నేతలు వై.శివబాబు, గారపాటి రామసీత, దేవరపల్లి ఆదాం, టి.తాతయ్య, గుత్తా అనిల్, కొనకళ్ల శివమణి తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదైందని న్యాయవాది తంబి తెలిపారు. -
38 చెక్బౌన్స్ కేసుల పరిష్కారం
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా లోక్ అదాలత్ నిర్వహించినట్టు జిల్లా న్యాయసేవాధికార సంస్ధ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి తెలి పారు. శనివారం నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్లో 38 చెక్బైన్స్ కేసులు పరిష్కారమయ్యాయని, రూ.1,59,85,914లు ఫిర్యాదుదారులకు చెల్లించామన్నారు. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు తమ కేసులను సత్వరంగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుని న్యాయపరమైన వివాదాల నుంచి విముక్తి పొందవచ్చన్నారు. గత శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్తో పాటు ఈ ప్రత్యేక లోక్ అదాలత్ను విజయవంతం చేయడంలో సహకరించిన న్యాయాధికారులు, న్యాయవాదులు, బ్యాంకు అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. తాడేపల్లిగూడెం: ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో మిశ్రమ వ్యవసాయ విధానం ఎంతో అవసరమని ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. శనివారం సింగరాజుపాలెం వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించిన శాస్త్రవేత్తలు, వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను అధిగమించడానికి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, నేల సారవంతం, తేమ సంరక్షణపై అవగాహన కల్పించారు. డ్రమ్ సీడర్ ద్వారా వరి సాగు చేయడం వల్ల పెట్టుబడి, శ్రమ తగ్గడమే కాకుండా నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుందని వారు తెలిపారు. రిజిస్ట్రార్ ఎం. మాధవి, విస్తరణ సంచాలకులు సి.హెచ్. రూత్, పరిశోధన సంచాలకులు ఎస్. సూర్యకుమారి పాల్గొన్నారు. యలమంచిలి: అబ్బిరాజుపాలెం సూరయ్య రేవు ఫెర్రీ వేలం రూ.10,14,500లకు ఖరారైంది. ఈనెల 10న నిర్వహించిన వేలం రూ.8.10 లక్షలకు ఖరారైన సంగతి తెలిసిందే. అయితే పాట మళ్లీ నిర్వహించాలని కోరుతూ శిరిగినీడి వెంకటేశ్వరరావు రీటెండర్ వేయడంతో స్థానిక సచివాలయంలో ఇన్చార్జి ఎంపీడీఓ జేడీవీ ప్రసాద్ పర్యవేక్షణలో ఇన్చార్జి గ్రామ కార్యదర్శి కాసాని శ్రీరామలక్ష్మి శనివారం వేలం నిర్వహించారు. శిరిగినీడి శ్రీనివాస్, శిరిగినీడి వెంకటేశ్వరరావు వేలంలో పాల్గొనగా వెంకటేశ్వరరావు అత్యధిక మొత్తానికి పాట పాడారు. దీంతో వెంకటేశ్వరరావుకు ఫెర్రీ వేలం ఖరారు చేసినట్టు శ్రీరామలక్ష్మి ప్రకటించారు. -
వారాహి కలశ ఊరేగింపు
భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక డీమార్ట్ ఎదురుగా స్వప్న వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల మహోత్సవంలో భాగంగా కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. కై కలూరు: ప్రతి కార్యకర్త పార్టీతో నేరుగా అనుసంధానమయ్యే అవకాశం జగన్ 2.0 సూపర్ యాప్ కలిగిస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. కై కలూరు పార్టీ కార్యాలయంలో యాప్ పోస్టర్ను శనివారం ఆయన విష్కరించారు. అనంతరం డీఎన్నార్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల గొంతుకను అణచివేసే ప్రయత్నాలను తిప్పికొట్టడంతోపాటు సమాచార మార్పిడి, ప్రజా సమస్యలు, పోలీసు, రాజకీయ వేదింపులపై డిజటల్ డైరీ ద్వారా నేరుగా ఫిర్యాదు చేసే అవకాశాన్ని ఈ యాప్ కల్పిస్తోందన్నారు. పార్టీ యాప్లో మన భావాలను నేరుగా పంచుకునే అవకాశం ఉంటుందన్నారు. కై కలూరు నియోజకవర్గంలో వివిధ పార్టీ పదవులు పొందిన కార్యకర్తలు, నాయకుల సంఖ్య 18,500 ఉందన్నారు. ప్రతి ఒక్కరూ యాప్ను సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. అనంతరం పలువురితో ఆయన యాప్ను డౌన్లోడ్ చేయించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ముదిరాజుల సంఘ విభాగ అధ్యక్షుడు కోమటి విష్ణువర్థనరావు, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షుడు మహమ్మద్ సర్వర్, నాలుగు మండలాల సోషల్ మీడియా అధ్యక్షులు శొంఠి చిన్నా, మోగనాటి గడియోన్, చాబత్తిన వినోద్, రాంశ్రీ మహేష్, జిల్లా నాయకులు పేర్ని పృథ్వి, మనిమిల్లి రాజేష్, వల్లూరి చైతన్య వర్మ, పండు రవిరాజు, దండే రవిప్రకాష్ పాల్గొన్నారు. -
ఆశలకు బీటలు
ఆదివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2026సాగునీటి కోసం రైతులు ఎదురు చూడటం, రోడ్డెక్కడం, ధర్నాలు చేయడం బాధాకరం. ఏటా సాగుకు నీరు హక్కుగా చట్టం చేయాలి. పర్యవేక్షణ పకడ్బందీగా ఉండాలి. కాలువలకు మరమ్మతులు ముందుగా చేస్తే ఇబ్బంది ఉండదు. – సనిపల్లి రామకృష్ణ, మాజీ సర్పంచ్ రైతులకు సాగునీరు సకాలంలో అందించలేకపోవడంలో ఇరిగేషన్ శాఖ అధికారుల వైఫల్యం బాధాకరం. ప్రణాళిక లేకపోవడం, ఒత్తిళ్లకు గురవడం, రైతులను విస్మరించడం సరికాదు. ఈ విధానం మారాలి. సాగుకు పూర్తిస్థాయిలో నీరందించాలి. – బుద్ధ కృష్ణార్జునరావు, వైఎస్సార్సీపీ పోతునూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు సాక్షి ప్రతినిధి, ఏలూరు: డెల్టాలో భూమి బీటలు వారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పచ్చని పంట పొలాలతో కళకళలాడే భూములు బీడులుగా మారుతున్నాయి. సర్కారు అంతులేని నిర్లక్ష్యం, ప్రణాళికా లోపంతో కృష్ణా, గోదావరి ప్రధాన కాలువల పూడికతీత పనులు తూతూమంత్రంగా నిర్వహించారు. ఫలితంగా దిగువకు నీరు పారకపోవడంతో డెల్టా బీటలు వారుతుంది. మరోవైపు 70 శాతం పూర్తి కావాల్సిన వరినాట్లు జిల్లాలో 40 శాతానికే పరిమితమయ్యాయి. 50 రోజులు గడిచినా.. ఖరీఫ్ కష్టాలు నీటి రూపంలో అన్నదాతలను వెంటాడుతున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 55 రోజులు గడిచినా పూర్తిస్థాయిలో నాట్లు పడలేదు. ఇప్పటివరకు జిల్లాలో 79,419 ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. గతేడాది ఇదే సమయానికి సుమారు 1.40 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. కృష్ణా, గోదావరి డెల్టాల నుంచి నారుమడులకు నీటిని ఇప్పటికే విడుదల చేశారు. జూన్ 1న గోదావరి డెల్టా, జూలై 1 నుంచి కృష్ణా డెల్టా నీటిని జిల్లాలో విడుదల చేశారు. రెండు డెల్టాల పరిధిలో దెందులూరు, కై కలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో అత్యధిక సాగు విస్తీర్ణం ఉంటుంది. ఈ పరిణామాల క్రమంలో రెండు కాలువలకు అయితే నీరు విడుదల చేసినా చివరి వరకు నీరందని పరిస్థితి. పూర్తిస్థాయిలో లేని ప్రవాహం : వాస్తవానికి ప్రతి సీజన్ ప్రారంభంలో జలవనరుల శాఖ కాల్వల్లో తూడు, గుర్రపుడెక్క, సిల్ట్ తొలగించి నీటి పారుదలకు ఇబ్బందులు కుండా అవసరమైన మరమ్మతులు కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేస్తుంది. ఈ ఏడాది కూడా అలానే కొన్ని పనులు చేశారు కానీ నీరు పూర్తిస్థాయి ప్రవాహం మాత్రం లేని పరిస్థితి. దీంతో ప్రధానంగా గోదావరి డెల్టా పరిధిలోని భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు, దెందులూరు, కృష్ణా డెల్టా పరిధిలోని పెదపాడు, ఏలూరు రూరల్, దెందులూరు, ముదినేపల్లి మండలాల్లో వరిసాగు ఇబ్బందికరంగా మారింది. తాజాగా దెందులూరు మండలంలో కొవ్వలి, పోతునూరు, సత్యనారాయణపురం, దెందులూరు, కొమిరేపల్లి, ఏలూరు రూరల్ మండలంలోని పాలగూడెం, అలాగే భీమడోలులో కొన్ని గ్రామాల్లో రైతులు లక్షలు ఖర్చు పెట్టి నాట్లు వేసినా నీరందడం లేదు. చాట్రాయి మండలంలో తమ్మిలేరు పరిధిలో 13,200 ఎకరాల విస్తీర్ణంలో సాగు ఉంది. దీనికి కూడా నీటి ఇబ్బందులు తీవ్రమయ్యాయి. డెల్టా ఎండుతోంది కృష్ణా, గోదావరి డెల్టాల్లో శివారు భూములకు నీరు కరువు దెందులూరులో తీవ్రమైన సాగునీటి కష్టాలు జలవనరుల శాఖ నిర్లక్ష్యం తూతూమంత్రంగా కాలువ పనులు జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో 79 వేల ఎకరాల్లోనే నాట్లు గతేడాది ఇదే సమయానికి 1.40 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తి జిల్లా రైతులు పట్టిసీమ జలాల కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రధానంగా పట్టిసీమ జలాలు కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలో ఉన్న గ్రామాల్లో నారుమడుల కోసం విడుదల చేస్తే కొంత మేరకు ఇబ్బందులు తగ్గుతాయి. జానంపేట వద్ద తమ్మిలేరులోకి పట్టిసీమ జలాలు మళ్లిస్తే తూర్పు, పడమర లాకుల ద్వారా శివారు భూముల వరకు నీరందించే పరిస్థితి ఉంది. జిల్లా యంత్రాంగంతో పాటు పాలకులు పూర్తిగా పట్టించుకోకపోవడంతో అన్నదాతల వేదన అరణ్య రోదనగా మారింది. ఇప్పటికే గతేడాది దిగుబడులు గణనీయంగా తగ్గడంతో ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల నష్టం వాటిల్లింది. పేరుకే మద్దతు ధర ఉన్నా దళారుల దోపిడీ, దిగుబడి తగ్గడంతో రైతులు పూర్తిగా నష్టపోయారు. దీంతో పాటు మోంథా తుఫాన్లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తామని రాష్ట్ర, కేంద్ర బృందాలు హడావుడి పర్యటన మినహా ఒక్క రైతుకు రూపాయి జమకాని పరిస్థితి. ఇక ఈ ఏడాది సాగునీటి ఇబ్బందులు కొనసాగితే నూరు శాతం నాట్లు కూడా అనుమానంగా మారే పరిస్థితి ఉంది. -
విద్యుదాఘాతం కాటేసింది
కలిదిండి(కై కలూరు): కలిదిండి మండలం వెంకటాపురంలో శనివారం జరిగిన ఘటనలో ఒక కూలీ ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన పంచకర్ల వెంకన్న (49) పాతబావిని పూడ్చే పనిలో ఉండగా, మోటారు ద్వారా నీటిని తోడుతుండగా కాలు జారి మోటారును పట్టుకోవడంతో షాక్కు గురై బావిలో పడి మృతి చెందాడు. అతడి కుమారుడు బాజీబాబు ఫిర్యాదు మేరకు కలిదిండి ఎస్సై పవన్కుమార్ కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దెందులూరు: ప్రమాదవశాత్తూ చెరువులో పడి రెండో తరగతి విద్యార్థి మృతి చెందాడని దెందులూరు ఎస్సై డి.వెంకట్కుమార్ తెలిపారు. పోతునూరుకి చెందిన నిదునూరి దుర్గారావు కుమారుడు యేసుబాబు శుక్రవారం స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఆడుకోవడానికి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో బంధువులు వెతకగా, సమీపంలోని చెరువులో ఉన్న పడవలో ఆడుకుంటున్నాడని స్థానికులు తెలపడంతో గాలించారు. రాత్రి 11:30 గంటలకు యేసుబాబు మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ స్పోర్ట్స్: విశాఖలోని అక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో 11వ రాష్ట్ర అంతర్ జిల్లాల సబ్జూనియర్, జూనియర్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ శనివారం ప్రారంభమైంది. కేటగిరీ–2 బాలుర 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్ విభాగంలో ఏలూరుకు చెందిన స్వామినాయుడు విజేతగా నిలిచారు. -
కలవరిపాటు
జిల్లాలో ఎన్నడూలేని విధంగా వరి రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులతో మెరక ప్రాంతాలకేగాక డెల్టా ప్రాంతంలో కూడా రైతులు సాగునీటి కష్టాలను చవిచూస్తున్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నియోజకవర్గం పోడూరు మండలంలోనే వరి నారుమడులకు నీరందక ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చుకుని నారును కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారంటే జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.భీమవరం: జిల్లాలో 20 మండలాల పరిధిలో 2.25 లక్షల ఎకరాల్లో సార్వా వరినాట్లు వేయాల్సి ఉండగా రైతులంతా దాదాపు నారుమడులు పూర్తి చేశారు. తాడేపల్లిగూడెం, తణుకు, పెంటపాడు, గణపవరం తదితర మండలాల్లో ముమ్మరంగా నాట్లు వేస్తుండగా జిల్లావ్యాప్తంగా సుమారు 55 వేల ఎకరాల్లో నాట్లు పూర్తి చేశారు. నారుమడి.. రైతులు తడబడి రైతులు సార్వా వరి పంటపై గంపెడు ఆశతో నాట్లువేయడానికి సన్నద్ధమై పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి భూమిను చదును చేయడం, మెట్టదుక్కులు, నారుమడులు వేసుకున్నారు. జూలై పూర్తికావస్తున్నా వరుణుడి జాడ లేకపోవడంతో కేవలం కాలువల నీటిపైనే ఆధారపడ్డారు. అయితే కొన్ని ప్రాంతాల్లోని కాలువ శివారు భూములకు నీరందకపోవడంతో నారుమడులకు సైతం నీరులేక బీటలు వారుతుంటే నాట్లు వేసుకునేందుకు దుక్కు చేయడానికి నీరందని దుస్థితి ఏర్పడింది. దీంతో కొందరు రైతులు ఆయిల్ ఇంజిన్ల సాయంతో నారుమడులకు నీరు పెట్టుకోవడం, మరికొన్నిచోట్ల ట్యాంకర్లతో నీరు తెచ్చుకుని నారుమడులు ఎండిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాలువ శివారు భూములకు నీరంకపోవడంతో పంట దమ్ముచేసుకునే అవకాశం లేకుండా పోయిందని దీంతో వరినారు ముదిరిపోయే ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాట్లు వేసినా మూన తిరగని పరిస్థితి సాగునీటికి ఇబ్బందులేని ప్రాంతాల్లో 15 రోజుల క్రితమే వరినాట్లు పూర్తిచేసినా నేటికి నాట్లు మూనతిరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండ తీవ్రత, వడగాల్పులు కారణంగా వరినాట్లు ఎండిపోతున్నాయని దీంతో తిరిగి మనేదలు వేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికే పొలం దుక్కు, నారుమడులు, నాట్లు వేయడానిక పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టామని, నాట్లు ఎండిపోవడం వల్ల తిరిగి వేయాలంటే మరింత ఖర్చు తప్పదంటున్నారు. సాగునీరు ఉన్నా వర్షం లేకపోతే పైరు ఏపుగా పెరిగే అవకాశం లేదని దాని వల్ల పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి చేపడితే సక్రమంగా వర్షాలు కురవనే భయం అందరిలోనే ఉన్నా మరీ ఇంత దారుణంగా ఉంటుందని ఊహించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినందున వరి రైతులు సార్వా సాగులో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. నాట్లు వేసిన పొలాల్లో నీరు లేకుంటే కలుపు ఎక్కువగా వచ్చే అవకాశముంది. తప్పనిసరిగా కలుపు నివారణా చర్యలు చేపట్టాలి. కేవలం కాలువ నీటిపైనే ఆధారపడటం వల్ల చేలల్లో నీరు త్వరితగతిన ఇంకిపోయే ప్రమాదముంది. తరచూ నీరు పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎరువులు వేసుకునే సమయంలో తప్పనిసరిగా భూమి చెమ్మగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. – జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖ అఽధికారి, భీమవరం వాన.. హైరానా వర్షాభావంతో రైతుల ఆందోళన ఎండిపోతున్న నారుమడులు నీరందక ముందుకు సాగని దుక్కులు జిల్లాలో 2.25 లక్షల ఎకరాల్లో వరి సాగు ఇప్పటివరకు 55 వేల ఎకరాల్లోనే నాట్లు -
భౌబోయ్ !
● గ్రామాలు, పట్టణాల్లో పెరుగుతున్న దాడులు ● బయటకు రావాలంటే వణుకు ఆకివీడు : ఇటీవల ప్రజలపై కుక్కల దాడుల పెరిగాయి. అనేక మంది దాడిలో తీవ్రంగా గాయపడి వైద్యం పొందుతున్నారు. ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని జీవించాల్సి వస్తోంది. పీహెచ్సీలు, సీహెచ్సీల్లో యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేయించుకుని కాలం గడుపుతున్నారు. మరికొందరు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. వీధి కుక్కలతో పాటు పెంపుడు కుక్కల దాడులు కూడా పెరిగాయి. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతున్నా, వీధి కుక్కల నివారణకు అధికారులు ఏవిధమైన చర్యలు తీసుకోవడంలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కుక్కకాటుకు మందును సరఫరా చేస్తోంది కానీ, కుక్కల బెడదను తొలగించేందుకు మార్గాలు అన్వేషించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. లక్షల రూపాయలతో యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లు కొనుగోలు చేసి సరఫరా చేస్తున్న అధికారులు, కుక్కల బెడదను నివారించడంలో మాత్రం విఫలమవుతున్నారు. సమస్యను మూలాల్లోంచి పరిష్కరించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉండి నియోజకవర్గంలోని 72 గ్రామాల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. జిల్లాలో అనేక మంది కుక్కకాటుకు గురై ప్రాణాలు కోల్పోయినా, అధికారులు మాత్రం మొద్దునిద్ర వీడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట దొంగల భయం కంటే, కుక్కల భయమే ఎక్కువగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ఒంటరిగా వెళ్లేవారే టార్గెట్ కుక్కలు ఒంటరిగా ప్రయాణించేవారిని, ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారిని, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే పిల్లల్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. గుంపులు గుంపులుగా సంచరిస్తూ, వాహన చోదకులను వెంబడించి మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. వాహనం వేగంగా నడిపితే, అవి పరుగు పందెంలో పాల్గొన్నట్లు దూసుకువచ్చి మీదపడుతున్నాయి. కుక్కలు వెంబడించినప్పుడు వాహనాన్ని నిలుపుదల చేసి బెదిరిస్తే అవి వెళ్లిపోయే అవకాశం ఉందని స్థానికులు సూచిస్తున్నారు. నియంత్రణకు చర్యలేవీ? కుక్కల నియంత్రణకు పంచాయతీలు, నగర పంచాయతీలు తీసుకుంటున్న చర్యలు శూన్యం. కొన్ని గ్రామాల్లో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేడు. కుక్కల్ని చంపకూడదని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ, వాటి నియంత్రణకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాలని, ఆరోగ్య పరిస్థితుల్ని మెరుగుపరచాలని ఆదేశించింది. ఆ విధమైన చర్యలు లేకపోవడంతో, కుక్కల సంతతి విపరీతంగా పెరిగిపోతోంది. తగినంత ఆహారం అందక, ఆరోగ్య పరిస్థితులు క్షీణించడంతో అవి పిచ్చికుక్కలుగా మారుతున్నాయి. -
చదువు కొనసాగించేందుకే ఓపెన్ స్కూళ్లు
తణుకు అర్బన్: అనివార్య కారణాల వల్ల మధ్యలోనే చదువు ఆపేసిన వారు తిరిగి విద్యను కొనసాగించేందుకు ఓపెన్ స్కూల్ ఒక అద్భుత వరమని ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ పెన్మెత్స వెంకట సత్యనారాయణరాజు అన్నారు. తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2026–27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నాయని తెలిపారు. ఎంఈవో బండి ఆంజనేయులు మాట్లాడుతూ, ఈ నెల 31 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. అనంతరం ఓపెన్ స్కూల్ అడ్మిషన్లపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మావతి, ఫస్ట్ అసిస్టెంట్ రామకృష్ణ, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ఆరోగ్య శాఖాధికారులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. నూజివీడు: గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు, రాష్ట్ర ప్రభుత్వ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ‘అమరావతి చాంపియన్ షిప్–26’ పేరుతో క్రీడోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఏలూరు జిల్లా డీఎస్డీఓ ఎస్.అజీజ్ శుక్రవారం తెలిపారు. ఆసక్తి ఉన్నవారు పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7981635592, 9059485538 నంబర్లను సంప్రదించవచ్చన్నారు. అండర్–17, అండర్–23 విభాగాల్లో బాలికలు, బాలురకు నియోజకవర్గ స్థాయిలో ఈ పోటీలు జరుగుతాయి. ఆర్చరీ, అథ్లెటిక్స్, బాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్బాల్, హాకీ, చదరంగం, కబడ్డీ, ఖోఖో, వెయిట్లిఫ్టింగ్, వాలీబాల్, యోగా పోటీలు ఉంటాయి. నూజివీడు నియోజకవర్గ స్థాయి పోటీల తేదీలను ఖరారు చేసేందుకు ఈ నెల 20న ఉదయం 10 గంటలకు ఎస్ఆర్ఆర్ హైస్కూల్లో సమావేశం నిర్వహించనున్నారు. కొయ్యలగూడెం (జంగారెడ్డిగూడెం) : మండల పరిధిలోని వెంకటరామానుజపురం గ్రామంలో విద్యుత్ షాక్కు గురై ముప్పిడి వెంకటరెడ్డి (37) అనే కౌలు రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. వెంకటరెడ్డి ఇటీవల గ్రామంలో కొంత పామాయిల్ తోటను కౌలుకు తీసుకున్న ఆయన, శుక్రవారం తోటలో గెలలు నరికే పనులు చేపట్టాడు. ఈ క్రమంలో పక్క తోట రైతు కొఠారి పవన్ కుమార్ కోరడంతో, అక్కడే ఉన్న కొబ్బరి చెట్టు మట్టలను తొలగించేందుకు వెంకటరెడ్డి ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆయన చేతిలోని ఐరన్ గెడ ప్రమాదవశాత్తు పైనున్న విద్యుత్ వైర్లకు తాకడంతో విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎన్వీప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోక్సో కేసు నమోదు
ఉండి: మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడటంతో, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలికను అదే గ్రామానికి చెందిన గుబ్బల హేమంత్కుమార్ ప్రేమ పేరుతో వేధించాడు. గత మే నెలలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడి, ఈ విషయాన్ని ఎవరికై నా చెబితే చంపేస్తానని బెదిరించాడు. హైదరాబాద్లో చదువుకునేందుకు వెళ్లిన బాలిక, వారం రోజుల క్రితం తిరిగి గ్రామానికి వచ్చింది. యువకుడి వేధింపులు మళ్లీ మొదలవ్వడంతో, పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్సై హనుమంతు మల్లికార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొయ్యలగూడెం (జంగారెడ్డిగూడెం) : జంగారెడ్డిగూడెం ప్రాంత ప్రజల గొంతుకగా నిలిచిన సీనియర్ జర్నలిస్ట్, శ్రీసాక్షిశ్రీ పత్రిక రిపోర్టర్ ధనిశెట్టి వెంకట భాస్కరరావు (59) గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. శుక్రవారం ఆయన భౌతికకాయం వద్ద ఏపీయూడబ్ల్యూజే నాయకులు, సాక్షి పాత్రికేయులు, తోటి జర్నలిస్టులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భాస్కర్ ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు ప్రస్తుతం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. శుక్రవారం ఆయన అంతిమ యాత్రలో వైఎస్సార్సీపీ నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజాసంఘాల నేతలు, ప్రభుత్వ అధికారులు, పట్టణ ప్రముఖులు, ఏపీయూడబ్ల్యూజే నాయకులు, విలేకరులు పాల్గొన్నారు. -
కోర్కునే తరుణం
ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఏపీఈఏపీసెట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ర్యాంకు ఆధారంగా ఏ కళాశాలలో, ఏ బ్రాంచ్ లో సీటు లభిస్తుందోనని ఇప్పటికే సమాచారం విద్యార్థులు సేకరించుకున్నారు. తమకు నచ్చిన కళాశాలలో తాము చదవగలిగే కోర్సుల్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కొందరు మాత్రం ఏ నిర్ణయానికి రాలేక డైలమాలో ఉన్నారు. ప్రస్తుతం ట్రెండ్ సీఎస్ఈ, ఐటీ, డేటాసైన్స్, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ వంటి వాటిపై ఉండగా.. ఏఐ ప్రభావం ఆర్థిక మాంధ్యం, ఐటీ రంగంలో తగ్గిన క్యాంపస్ సెలెక్షన్స్ నేపథ్యంలో కోర్ బ్రాంచులు మెకానికల్, ఈఈఈ, సివిల్ వంటి వాటిపైనా దృష్టి సారించాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. కొత్త కోర్సులు.. కోటి ఆశలు ఇంజనీరింగ్లో సంప్రదాయ కోర్సులతో పాటు కొత్తగా వస్తున్న కోర్సుల గురించి తెలుసుకునేందుకు భవిష్యత్కు బంగారు బాటలు పడే అవకాశం ఉందని విద్యారంగం నిపుణులు అంటున్నారు. సీఎస్ఈలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ (వీఎల్ఎస్ఐ) డిజైన్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఏరోస్పేస్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, నెట్ వర్కింగ్, అల్గారిథమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రోగ్రామ్ డిజైన్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ హార్డ్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, అగ్రికల్చరల్, మైరెన్, మైనింగ్, స్కిల్ అండ్ టెక్స్టైల్ వంటి కొత్త బ్రాంచీలను పరిశీలించవచ్చని అంటున్నారు. ఈనెల 20 నుంచి 29 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు 22 నుంచి 31 వరకు ఆన్లైన్లో విద్యార్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ల పరిశీలన 25 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం వచ్చేనెల 1న వెబ్ ఆప్షన్లు మార్చుకునే అవకాశం వచ్చేనెల 6న సీట్ల కేటాయింపు వచ్చేనెల 7 నుచి 13 వరకు కళాశాలల్లో ప్రవేశాలు వచ్చేనెల 10 నుంచి తరగతుల ప్రారంభం కొత్తబంగారు లోకం ఇంజనీరింగ్ ప్రవేశాలకు పచ్చజెండా తొలి విడత కన్వీనర్ కోటారిజిస్ట్రేషన్ల ప్రక్రియ షురూ 20 నుంచి షెడ్యూల్ 25 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం వచ్చేనెల 10 నుంచి తరగతులు ఏఐ సృష్టించిన చిత్రం -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కామవరపుకోట : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన కామవరపుకోట శివారు ఉప్పలపాడు సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన కొలుకులూరి రమేష్ (30), గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవిస్తుంటాడు. శుక్రవారం తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా దేవులపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి కామవరపుకోట వచ్చి, కేక్, స్వీట్స్ తీసుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా.. కామవరపుకోట శివారు ఉప్పలపాడు సమీపంలోకి వెళ్లేసరికి ఎదురుగా వస్తున్న ట్రక్ ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో రమేష్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. తడికలపూడి ఎస్సై వల్లీ పద్మ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): 108 అంబులెన్స్ వాహనాలపై పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏలూరు జిల్లా 108 కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా సమావేశం స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పి. శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలు కాపాడడంలో కీలకపాత్ర పోషిస్తున్న 108 అంబులెన్స్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ప్రాణాలు కాపాడేందుకు శ్రమిస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తూ మినిమం టైమ్ స్కేల్ కల్పించాలన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 12 గంటల పని విధానాన్ని రద్దు చేసి 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు, 108 ఉద్యోగులు పాల్గొన్నారు. -
పొగాకు మార్కెట్ను గాడిలో పెట్టాలి
కొయ్యలగూడెం (జంగారెడ్డిగూడెం) : పొగాకు మార్కెట్ను గాడిలో పెట్టాలని వర్జీనియా రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎన్ఎల్ఎస్ ఏరియా 5 పొగాకు బోర్డుల రైతు సంఘాల ప్రతినిధులు, రైతు నాయకులు గుంటూరులోని ప్రముఖ పొగాకు కంపెనీలైన ఐటీసీ, జీపీఐ, డెక్కన్, పీఎస్ఎస్హెచ్ ప్రతినిధులను కలిసి ప్రస్తుత మార్కెట్ సంక్షోభంపై చర్చించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ.. వేలం ప్రారంభమై నాలుగు నెలలు కావస్తున్నా ధరలు దిగజారుతున్నాయే తప్ప పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బేరన్కు రూ. 5 లక్షల వరకు నష్టం వస్తోందని, నో–బిడ్లు కూడా 40 శాతం తగ్గడం లేదని కంపెనీల దృష్టికి తీసుకెళ్లారు. పండిన పంటలో ఇప్పటివరకు 10 శాతం మాత్రమే అమ్మకాలు జరిగాయని, కావున గత ఏడాది తరహాలోనే క్వింటాకు రూ. 290 గరిష్ట ధర ఇవ్వాలని కోరారు. దీనిపై కంపెనీ ప్రతినిధులు స్పందిస్తూ.. కస్టమర్లు ఆ ధరకు రావడం లేదని, రైతులు లగ్స్, లీఫ్ గ్రేడ్లను వేలం కేంద్రాలకు తీసుకువస్తే మార్కెట్ కొంత మెరుగయ్యే అవకాశం ఉందని సూచించారు. కంపెనీల విజ్ఞప్తి మేరకు రైతు సోదరులందరూ లీఫ్ బేళ్లు, ఇతర గ్రేడ్లను వేలం కేంద్రాలకు తీసుకురావాలని రైతు సంఘాల నాయకులు కోరారు. అనంతరం వారు పొగాకు బోర్డు అధికారులను కలిసి సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వర్జీనియా రైతు సంఘం నాయకులు పరిమి రాంబాబు, కరాటం రెడ్డిబాబు తదితరులు పాల్గొన్నారు. -
జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ
● అధినేత జగన్తో కార్యకర్తల అనుసంధానం ● ప్రతి కార్యకర్త డౌన్లోడ్ చేసుకోవాలి ● జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ పిలుపు ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో పార్టీ నేతలు, కార్యకర్తలను అనుసంధానం చేస్తూ యాప్ను రూపొందించారనీ.. జగన్ 2.0 సూపర్యాప్ ప్రతి కార్యకర్త ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) పిలుపునిచ్చారు. సమన్వయకర్తలు కొఠారు అబ్బయ్య చౌదరి (దెందులూరు), కంభం విజయరాజు (చింతలపూడి), మామిళ్లపల్లి జయప్రకాష్ (ఏలూరు)తో కలిసి ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో జగన్ 2.0 సూపర్ యాప్ను డీఎన్నార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను పార్టీ అధినేతతో అనుసంధానించే ప్రత్యేక వేదికే జగన్ 2.0 సూపర్యాప్ అన్నారు. కూటమి కుట్రలను తిప్పికొడుతూ, ప్రభుత్వ దురాగతాలను ధైర్యంగా ఎదుర్కొనేందుకు వైఎస్ జగన్ సూపర్ యాప్నకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, కై కలూరు పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్బాబు, చింతలపూడి పరిశీలకుడు దాసరి రమేష్, జిల్లా అధికార ప్రతినిధి మున్నల జాన్గురునాథ్, జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంట మోహనరావు, రాష్ట్ర వడ్డీల కార్పొరేషన్ అధ్యక్షుడు ముంగర సంజయ్కుమార్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు చిక్కాల దుర్గాప్రసాద్, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రాజేంద్రప్రసాద్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రాజేష్, వలంటీర్ వింగ్ జిల్లా అధ్యక్షుడు భోగిశెట్టి పార్వతి, లీగల్సెల్ రాష్ట్ర కార్యదర్శి డీవీ రామాంజనేయులు, బీసీ సెల్ నగర అధ్యక్షుడు కిలాడి దుర్గారావు, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్, సోషల్ మీడియా నగర అధ్యక్షుడు పచ్చిపులుసు సుజన్, లీగల్సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ తదితరులు ఉన్నారు. చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకను నొక్కాలనే టీడీపీ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు యాప్ దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఉన్నా ప్రతి కార్యకర్త, నాయకుడు తమ కష్టాన్ని, బాధను, సమస్యలను అధినేత వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లవచ్చన్నారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ సిద్దాంతాలు, ఆశయాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేందుకు యాప్ ఉపయోగపడుతుందన్నారు. దేశంలోనే వైఎస్సార్సీపీ సోషల్ మీడియా బలమైందనీ, దెబ్బకొట్టాలనే కుట్రలతో టీడీపీ కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని వాటికి చెక్ పెట్టేందుకు జగన్ 2.0 సూపర్యాప్ కార్యకర్తల చేతిలోకి వస్తుందన్నారు. ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్నీ నాయకులు, కార్యకర్తలకు నేరుగా, వేగవంతంగా చేరవేయాలనే సంకల్పంతో ఈ సూపర్ యాప్ను డిజైన్ చేశారని చెప్పారు. దీని ద్వారా ప్రతి కార్యకర్త పార్టీతో నేరుగా అనుసంధానం అయ్యే అవకాశం ఏర్పడిందన్నారు. -
క్రీడల ద్వారా మానసిక ఒత్తిడి దూరం
భీమవరం: క్రీడాకారులు ఏదో ఒక క్రీడలో మంచి ప్రావీణ్యాన్ని పెంపొందించుకుంటే మానసిక ఒత్తిడి నుంచి దూరం కావచ్చని జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ అన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కమ్ బ్యాడ్మింటన్ సెలక్షన్స్ను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. విద్యార్థులకు గతంలో మానసిక ఒత్తిడులు ఉండేవి కావని, చక్కగా చదువుకొని ఏదో ఒక ఆటతో సేదతీరే వారన్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఒత్తిడిని జయించాలంటే కష్టపడి చదవడమేగాక క్రమశిక్షణ, ఆటల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ.. తమ కళాశాలలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం. వంశీకృష్ణ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 460 మంది క్రీడాకారులు సెలక్షన్స్కు హాజరు కావడం విశేషమన్నారు. కార్యక్రమంలో కళాశాల క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ సిహెచ్. హరిమోహన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కె.ఎస్.ఆర్ ప్రసాద్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ చిట్టూరి వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఇందుకూరి కిషోర్, కళాశాల డైరెక్టర్ ఎం. జగపతిరాజు, ప్రిన్సిపల్ కె.వి మురళీకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్. దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
బయో గ్యాస్ ప్లాంట్ పేరుతో దోపిడీ
ఆగిరిపల్లి : తోటపల్లిలో బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో మంత్రి పార్థసారథి తన అనుచరులతో కలిసి కోట్లాది రూపాయల విలువైన ప్రకృతి సంపదను అక్రమంగా దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆరోపించారు. శుక్రవారం తోటపల్లిలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బెజవాడ రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన గ్రామస్తుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తోటపల్లి చెందిన మరియమ్మ, లక్ష్మీ మాట్లాడుతూ, తమ భూములను ప్రభుత్వం లాక్కుని మంత్రి కుమారుడికి అప్పగించిందని, అధికారులు తమ గోడును పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయం లోపలికి కూడా రాకుండా బయటకు వెళ్లగొట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జువ్వనబోయిన ఆంజనేయులు మాట్లాడుతూ మంత్రి అనుచరుల అక్రమ మైనింగ్తో ప్రకృతిని దోచేయడం వల్ల జీవనోపాధి దెబ్బతింటోందని, ప్రశ్నిస్తే కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ.. గత నెల రోజుల్లోనే సుమారు 5 వేల లారీ ట్రిప్పుల గ్రావెల్ను తరలించారని, రాబోయే రెండేళ్లలో 45 వేల ట్రక్కుల ద్వారా రూ. 40 కోట్లు దోచుకోవడానికి మంత్రి యత్నిస్తున్నారని విమర్శించారు. తోటపల్లిలోని దుగ్గిరాల బాల రావమ్మ తల్లి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని, అమ్మవారి స్థలంలో అక్రమ రవాణా చేస్తున్నారని, కొండ వాగులో అక్రమంగా రోడ్డు వేయడంతో గ్రామం నీట మునిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మంత్రికి అనుమతులు ఉంటే బహిరంగంగా చూపించాలని, అప్పటివరకు తనే స్వయంగా గ్రావెల్ రవాణా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గత నెల రోజుల నుంచి గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతుంటే రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తనపై గత ప్రభుత్వంలో మైనింగ్కు పాల్పడ్డానని మంత్రి చేస్తున్న ఆరోపణలను సవాల్ చేస్తున్నానని, అవి నిరూపిస్తే ఏ చర్యకై నా సిద్ధమని స్పష్టం చేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని తనపై ఇంతవరకు ఒక్క అవినీతి మరక కూడా లేదని, నువ్వు ఎక్కడినుండో వచ్చి నూజివీడు నియోజవర్గాన్ని దోచేసుకుంటున్నావని అన్నారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఈ అక్రమాలపై విచారణ జరిపి గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో డిజిటల్ స్క్రీన్ ద్వారా అక్రమ మైనింగ్ చిత్రాలను గ్రామస్తులకు చూపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ళ కృష్ణంరాజు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బెజవాడ రాంబాబు, నియోజవర్గ రైతు సంఘం అధ్యక్షుడు ఈలప్రోలు సుబ్బయ్య, మండల ఉపాధ్యక్షుడు కొండవరదల రమేష్, నూజివీడు టౌన్ పార్టీ అధ్యక్షులు శీలం రాము, జెడ్పీటీసీ పిన్నిబోయిన వీరబాబు, నాయకులు అత్తి మురళి పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ఆరోపణ -
24న మెగా పీటీఎం
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈనెల 24న మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ నిర్వహించనున్నట్టు జేసీ అభిషేక్ గౌడ తెలిపారు. ఈ మీట్లో విద్యా ప్రమాణాల స్థాయి, పాఠశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. లీప్ యాప్ను విద్యార్థుల తల్లితండ్రులు డౌన్లోడ్ చేసుకుంటే టీచర్స్ అటెండెన్స్, తమ పిల్లల విద్యా పురోగతి స్థాయి మెరుగుపరుచుకునేందుకు దోహదపడుతుందన్నారు. పీటీఎంను ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించాలన్నారు. సోమవారం 10వ తరగతి, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో సన్మానిస్తామని జేసీ చెప్పారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో తల్లికి వందనం పథకం లబ్ధి కోసం ఎస్సీ విద్యార్థులు బ్యాంకు ఖాతాలు తెరవాలని సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారి ముక్కంటి ప్రకటనలో తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం రూ.13 వేల ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. సమీపంలోని పోస్టాఫీస్లో ఐపీపీబీ అకౌంట్తో పోస్టల్ ఖాతా తెరవవచ్చ ని సూచించారు. మరిన్ని వివారలకు సీనియర్ అసిస్టెంట్ సీహెచ్ శ్రీనివాస్, 95022 28533, పర్యవేక్షకుడు బి.సుశీల్కుమార్, 77991 41999ను సంప్రదించవచ్చన్నారు. -
కొల్లేరు ఆరకమణలపై నాన్చొద్దు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు అభయారణ్య రక్షణ విషయంలో కేంద్ర సాధికారిత కమిటీ (సీఈసీ) ఘాటైన వ్యాఖ్యలను సంధించింది. అటవీశాఖ అధికారులతో జిల్లా యంత్రాంగం సమన్వయం చేసుకుని అక్రమ చెరువులను తొలగించాలని స్పష్టం చేసింది. ప్రధానంగా కొల్లేరు అభయారణ్యంలో చేపల, రొయ్యల చెరువుల సాగు నిషేధం జీఓ 120 ఉన్నా ఎలా వాటికి విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశారనే అంశాన్ని నిగ్గు తేల్చాలంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి గాంచిన ఏలూరు జిల్లా ఆటపాక పక్షుల విహార కేంద్రం చెరువు ఎందుకు నీరులేక ఏటా ఎండుతోందని ప్రశ్నించింది. పక్షుల ఆవాసం కోసం నీరు నింపడానికి వచ్చే అడ్డుంకులపై ఆరా తీసింది. దీంతో కొల్లేరు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మరోసారి ఫిర్యాదు కొల్లేరు సరస్సులో ఆక్రమణలు, కర్మాగారాల వ్యర్థాల విడుదల, పర్యావరణ విఘాతంపై కాకినాడకు చెందిన రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి మృత్యుంజయరావు తాజాగా కొల్లేరులో జరుగుతున్న పరిణామాలపై మరోసారి ఫిర్యాదు చేశారు. అక్రమ చెరువుల సాగుపై సాక్ష్యాలతో వివరించారు. దీంతో కమిటీకి ఆ నివేదిక అందించాలని ఆదేశాలు వచ్చాయి. ఈనెల 15న మంగళగిరిలో జరిగిన సమావేశంలో రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు 10 రోజుల్లో పూర్తి నివేదికలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (పీసీసీఎఫ్) డాక్టర్ పీవీ చలపతిరావు, వైల్డ్ లైఫ్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు(సీసీఎఫ్) డాక్టర్ కె.నాగేశ్వరరావు ఆదేశించారు. గతనెల 29న కొల్లేరు అంశంపై తీర్పు వాయిదా పడిన నేపథ్యంలో పూర్తి నివేదికను త్వరగా సీఈసీకి అందించాలని రెవెన్యూ, ఫారెస్టు అధికారులను పీసీసీఎఫ్ ఆదేశించారు. కూటమి నేతల మాట చెల్లుబాటవునా..? ఎన్నికల ముందు కొల్లేరులో పేదలందరికీ భూములు పంపిణీ చేస్తామని నాయకులు వాగ్దానాలు చేశారు. కొల్లేరు కాంటూరు కుదింపు అంశం కుదరదని కేంద్రం తేల్చాడంతో కొల్లేరులో జిరాయితీ, డీ–ఫాం భూములను మినహాయించి పంపిణీ చేస్తామన్నారు. జీఓ 120 ప్రకారం కొల్లేరులో 77,138 ఎకరాలను గుర్తించారు. కై కలూరు, ఉంగుటూరు, దెందులూరు, ఉండి నియోజకవర్గాల్లో విస్తరించిన కొల్లేరు అభయారణ్యంలో పట్టా భూములు 14,932 ఎకరాలు, డీ ఫాం భూములు 5,510 మొత్తం 20,442 ఎకరాలు ఉన్నాయి. వీటిని మినహాయించాలని ప్రభుత్వం కోరింది. ఇటీవల ఆయా రైతుల నుంచి వివరాలను సైతం సేకరించింది. ఇదంతా ఇలా ఉంటే కొల్లేరు సరస్సులో కాలుష్యం పేరుకుపోతుంటే ఏం చర్యలు తీసుకున్నారని సీఈసీ అడుగుతోంది. ఈ నేపథ్యంలో కొల్లేరు ప్రజలకు తీర్పు అనుకులంగా వస్తుందా? అనే మీమాంసలో కొల్లేరు ప్రజలు ఉన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలి అనధికార చెరువులకు విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇచ్చారు? కొల్లేరులో వ్యర్థాల నియంత్రణకుఏం చర్యలు తీసుకున్నారు? ఆటపాక పక్షుల కేంద్రం ఎందుకు ఎండిపోతోంది కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) ప్రశ్నలు -
ఒప్పందంపై సంతకం చేయొద్దు
ఏలూరు (ఆర్ఆర్పేట): మన రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసి నాశనం చేసే అమెరికాతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయవద్దంటూ ఈనెల 22న సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్.కె.ఎం) పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి జిల్లా సమావేశం పిలుపునిచ్చింది. శుక్రవారం ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి జిల్లా సమావేశం బీకేఎంయూ జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహనరావు, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి కారం రాఘవ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి. రామకృష్ణ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస డాంగే తదితరులు మాట్లాడారు. ఈ నెల 22న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలలో సంయుక్త కిసాన్ మోర్చాలోని భాగస్వామ్య సంఘాలతో పాటు జిల్లాలోని అన్ని పంటల రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. -
డీఆర్వోగా శ్రీదేవి
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లా రెవెన్యూ అధికారిగా శ్రీదేవి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఒంగోలు జిల్లాలో కృష్ణపట్నం–హైదరాబాద్ పైప్లైన్ ప్రాజెక్ట్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఆమెకు ప్రభుత్వం పదోన్నతి కల్పి స్తూ ఏలూరు డీఆర్వోగా నియమించింది. ఆ మెను కలెక్టరేట్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఏలూరు టౌన్: ఏలూరు శివారు జాతీయ రహదారి సమీపంలోని ఇంద్రప్రస్థ వద్ద మో టారుసైకిల్ అదుపుతప్పి ఓ యువతి దుర్మర ణం పాలయ్యింది. వివరాలిలా ఉన్నాయి.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి చెందిన వేముల జయంతి అనే యువతి, మేనమామ కొండబాబుతో కలి సి మోటార్సైకిల్పై ఏలూరు వచ్చారు. తిరిగి వెళుతుండగా శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఘటనా స్థలం వద్ద మోటారు సైకిల్ అదుపుతప్పింది. జయంతి, కొండబాబుకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆస్ప త్రికి తరలించేందుకు ఎవరూ ముందుకు రాలే దు. ఆ సమయంలో ఏలూరు త్రీటౌన్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్ నందకిషోర్ అటుగా వెళుతూ వెంటనే స్పందించారు. వారిద్దరినీ ఏ లూరులోని జీజీహెచ్కు తరలించారు. వైద్యు లు పరీక్షించి జయంతి మార్గమధ్యలోనే మృతిచెందినట్టు నిర్ధారించారు. వెంటనే ఎవరూ ముందుక రాకపోవడం, సకాలంలో 108 అంబులెన్స్ అందుబాటులో లేకపోవటంతో యు వతి మృతిచెందినట్టు చెబుతున్నారు. జీజీహెచ్ లో మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి.. ఐదుగురికి గాయాలు
నూజివీడు: చెక్కుబౌన్స్ ఇచ్చిన కేసులో నూజివీడుకు చెందిన సోలే వందన అజయ్కుమార్కు ఆరు నెలల జైలుశిక్ష, రూ.2.50లక్షల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మెజిస్ట్రేట్ గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు పట్టణానికి చెందిన పరుచూరు రాహుల్ మనోహర్ 2023 అక్టోబర్ 17న అజయ్కుమార్కు రూ.2లక్షలు అప్పుగా ఇచ్చారు. కొంతకాలం గడిచిన తరువాత తన బాకీ తీర్చమని రాహుల్ అడగగా అజయ్కుమర్ 2023 నవంబరు 17న రూ.2లక్షలకు చెక్కును ఇచ్చాడు. దీంతో చెక్కును బ్యాంకులో వేయగా అజయ్కుమార్ అకౌంట్లో నగదు లేకపోవడంతో బౌన్స్ అయ్యింది. దీంతో రాహుల్ మనోహర్ కోర్టులో కేసు వేయగా విచారణ అనంతరం న్యాయమూర్తి అజయ్కుమార్కు జైలుశిక్ష, జరిమానా విధించారు. నూజివీడు: పట్టణంలోని పెద్దచెరువులో అక్రమ మట్టి తవ్వకాలు చేస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు విజిలెన్స్ అధికారులు గురువారం దాడి చేశారు. విజిలెన్స్ స్క్వాడ్ ఇన్స్పెక్టర్లు కేవీ రమణ, ప్రకాష్లు చెరువులో జరుగుతున్న తవ్వకాల వద్దకు వెళ్లి 6 ట్రాక్టర్లను, పొక్లెయిన్ను, జేసీబీని పట్టుకుని వీఆర్వో రంగారావుకు అప్పగించారు. విజిలెన్స్ అధికారులు వెళ్లిపోయిన తర్వాత ట్రాక్టరు డ్రైవర్లు 8 ట్రాక్టర్లలోని మట్టిని అక్కడే వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో వీఆర్ఓ ఈ విషయాన్ని ఆర్ఐ, తహసీల్దార్లకు తెలియజేశారు. ఆగిరిపల్లి: ఎద్దుల కొనుగోలు విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం ఒకరి ప్రాణం తీసింది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని సురవరం గ్రామానికి చెందిన కనకలింగేశ్వరరావు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఇతడికి ఏడేళ్ల క్రితం కోడూరుపాడు గ్రామానికి చెందిన నాగసాయి గంగాభవానితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురువారం ఉదయం లింగేశ్వరరావు తన సోదరుడితో కలిసి వ్యవసాయ పనుల కోసం ఎద్దులను కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి ఖర్చులు ఉన్నందున ఇప్పుడు ఎద్దులు కొనవద్దని భార్య గంగాభవాని వారించినప్పటికీ అతడు గోపాలపురంలో రెండు గిత్తలను కొనుగోలు చేసి మధ్యాహ్నానికి ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ విషయమై దంపతుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగి అది కాస్తా పెనుగులాటకు దారితీసింది. ఆ సమయంలో గంగాభవాని చేతిలో ఉన్న కూరగాయలు కోసే చాకు లింగేశ్వరరావు గుండెల్లో దిగడంతో తీవ్ర రక్తస్రావమైంది. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని చిన్న ఆవుటపల్లిలోని పిన్నమనేని ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెదవేగి: ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదవేగి జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఎమ్ఎస్ఎన్వీ ప్రసాదరెడ్డి కానిస్టేబుల్ ఇన్స్ట్రక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన ద్విచక్ర వాహనంపై ఏలూరు నుంచి ఏడో మైలు వైపు విధులకు వెళ్తున్నారు. పెదవేగి మండలం నాగన్నగూడెం సమీపంలోకి వచ్చేసరికి, ఎదురుగా వస్తున్న ఆటో ముందు చక్రంలో గాలి తగ్గి అదుపు తప్పింది. ఒక్కసారిగా కుడివైపునకు ఒరిగిపోయిన ఆటో ప్రసాదరెడ్డి ప్రయాణిస్తున్న బైక్తో పాటు మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసాదరెడ్డి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తితో పాటు ఆటోలో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారంతా శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన వారిగా గుర్తించారు. వీరు రాట్నాలమ్మ అమ్మవారిని దర్శించుకుని, అనంతరం పెదవేగిలోని సాయిబాబా స్థూపాన్ని సందర్శించి ఆటోలో ఏడవ మైలు మీదుగా ఏలూరు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పెదవేగి ఎస్సై ఎం. హరిగోపాల్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఓచర్ రాస్తానంటాడు.. చక్కగా దోచేస్తాడు
● బ్యాంకుల వద్ద మహిళలే లక్ష్యంగా మోసాలు ● సీసీ పుటేజీలో గుర్తించిన పోలీసులు ● నిందితుడిపై 50కు పైగా కేసులు కై కలూరు: బ్యాంకులో అన్నీ తెలిసిన వ్యక్తిగా చలామణి అవుతాడు. అక్కడ వస్తువులు సర్దుతున్నట్టు నటిస్తూ బ్యాంకు సిబ్బందితో చనువుగా మాట్లాడతాడు. చదువురాని డ్వాక్రా మహిళలను టార్గెట్ చేస్తూ.. అదును చూసి ఫేక్ ఓచర్లు రాసి సొమ్ములు కాజేస్తున్నాడు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన షేక్ నాగూర్ మీరావలీ అనే కేటుగాడు. ఇదే తరహాలో కృష్ణా, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మీరావలిపై 50కు పైగా కేసులు నమోదయ్యాయి. బ్యాంకుల వద్దకు వచ్చిన డ్వాక్రా మహిళలు, వృద్ధులు, నిరక్షరాస్యులను లక్ష్యంగా చే సుకుని తాను బ్యాంకు ఉద్యోగి, డ్వాక్రా సీసీ అంటూ నమ్మించి నగదు తీసుకుని కౌంటర్లో చెల్లిస్తా నని నమ్మిస్తున్నాడు. అనంతరం వారికి ఫేక్ ఓచర్ అందించి సొమ్ములతో ఉడాయిస్తున్నాడు. మోసం బట్టబయలయ్యిందిలా.. కలిదిండి మండలం గుర్వాయిపాలెంకు చెందిన బొల్లా ముత్యాలమ్మ జూన్ 6న కలిదిండి ఎస్బీఐ బ్యాంకుకు డ్వాక్రా రుణ వాయిదా చెల్లించేందుకు వెళ్లింది. అప్పటికే కొన్ని రోజులుగా డ్వాక్రా మహిళలకు తాను బ్యాంకు సిబ్బంది, వెలుగు కార్యాలయానికి చెందిన వ్యక్తిగా మీరావలి నమ్మిస్తూ వ చ్చాడు. దీంతో ఓచర్ రాసి నగదు కౌంటర్లో చెల్లిస్తానని చెప్పగా ముత్యాలమ్మ నమ్మింది. అతడికి రూ.61 వేలు ఇవ్వగా.. కౌంటర్ వద్దకు వెళ్లి నగదు చెల్లించకుండా అప్పటికే తన జేబులో సిద్ధం చేసుకున్న చెల్లింపు రశీదును ఆమె ఇచ్చి మోసం చేశాడు. ఆ రశీదు తీసుకుని ఆమె ఇంటికి వెళ్లిపోయింది. తా జాగా మరలా వాయిదా చెల్లించేందుకు ఆమె వెళ్లగా అసలు బండారం బయట పడింది. ఆమె కలిదిండి పోలీసులను ఆశ్రయించగా.. బ్యాంకులో సీసీ పుటేజీని పరిశీలించి మోసగాడు నాగూల్ మీరావలీని గుర్తించారు. అతడి ఆచూకీ తెలిసిన వారు పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. బ్యాంకుల వద్ద ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని కలిదిండి ఎస్సై పవన్కుమార్ సూచించారు. -
సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభం
తణుకు అర్బన్ : ది ఆంధ్రా సుగర్స్ లిమిటెడ్ సంస్థ సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగంలో తమ సొంత అవసరాల వినియోగంలో భాగంగా వెంకటరాయపురం కర్మాగార సముదాయంలో నూతనంగా నిర్మించిన 1.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్ను సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల నరేంద్రనాథ్ చౌదరి ప్రారంభించారు. గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ సౌర ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తణుకులోని కర్మాగారాల అవసరాలకు వినియోగిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల అచ్యుతరామయ్య, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎస్ఆర్వీకే రంగారావు తదితరులు పాల్గొన్నారు. నూజివీడు: పట్టణంలోని బొందిలీపేటకు చెందిన మహిళ ప్రమాదవశాత్తూ బావిలో పడిపోగా పోలీసులు కాపాడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం బొందిలీపేటకు చెందిన శైలజ అనే మహిళ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. ఈ సమాచారాన్ని స్థానికులు వెంటనే పట్టణ పోలీసుస్టేషన్కు తెలియజేయగా పట్టణ ఎస్సై–2 నాగేశ్వరరావు తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బావిలో పడిపోయి ఉన్న మహిళలను బయటకు తీశారు. దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి బైటపడింది. విషయాన్ని తెలుసుకున్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పగడాల సత్యన్నారాయణ అక్కడకు చేరుకుని వివరాలను తెలుసుకున్నారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ హాస్య నటుడు, కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. తాడేపల్లిగూడెం వాసి యూత్ పవన్ భాసంశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో యోగిబాబు నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం పట్టణ ఇలవేల్పు బలుసులమ్మ అమ్మవారిని యోగిబాబు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో నిర్వాహకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల్లో యోగిబాబు పాల్గొన్నారు. యోగిబాబుకు నిర్వాహకులు అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందించారు. టి.నరసాపురం: అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్తమామలు, ఆడపడుచుపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం.జయబాబు తెలిపారు. వివరాల ప్రకారం రాజుపోతేపల్లి గ్రామానికి చెందిన యర్రపాటి భానుశ్రీకి, ఖమ్మం జిల్లా లచ్చన్నగూడెంకు చెందిన అర్చేపల్లి సందీప్తో 2020లో వివాహమైంది. పెళ్లి సమయంలో కట్నకానుకలుగా 7 కాసుల బంగారం, 20 తులాల వెండి, రూ.2.50 లక్షల నగదు, ఆడపడుచు కట్నం కింద రూ.20 వేలతో పాటు రూ.1.30 లక్షల విలువైన సారె సామాగ్రి ఇచ్చారు. వివాహమైన కొన్నాళ్లు వీరి సంసారం బాగానే సాగింది. ఆ తర్వాత అదనపు కట్నం తేవాలంటూ భర్త సందీప్తో పాటు అత్తమామలు, ఆడపడుచు కలిసి భానుశ్రీని శారీరకంగా, మానసికంగా వేధిస్తూ, చంపుతామని బెదిరించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం ఆమెను, కూతురిని పుట్టింటి వద్ద వదిలేసి వెళ్లారు. తమను కాపురానికి తీసుకెళ్లాలని భానుశ్రీ ఫోన్ చేయగా వస్తే చనిపోతానంటూ సందీప్ బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. భీమవరం: ఇంటి నుంచి వెళ్లిన తన భర్త తిరిగి రాలేదంటూ భార్య పి.కల్పన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు భీమవరం టూటౌన్ ఎస్సై రెహ్మన్ గురువారం విలేకరులకు తెలిపారు. పట్టణంలోని ద్రోణంరాజు వారి వీధికి చెందిన పి.లక్ష్మీనర్సింహ ఈ నెల 14న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్ల వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించకపోవడంతో భార్య కల్పన పోలీసులను ఆశ్రయించింది. -
వాడీవేడిగా మున్సిపల్ సమావేశం
ఏలూరు (టూటౌన్): ఏలూరు నగరపాలక సంస్థ ఆఖరి సమావేశం గురువారం వాడీవేడిగా సాగింది. అజెండాలో పొందుపర్చిన 17 అంశాల్లో పలు వాటిపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పెద్ద ఎత్తున వాదోపవాదాలు కొనసాగాయి. కౌన్సిల్ సమావేశం అరుపులు కేకలతో దద్దరిల్లింది. చివరకు అజెండాలో 17 అంశాలను కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించినట్టు పేర్కొన్నారు. చివరిలో సభ్యులంతా కలిసి గ్రూపు ఫొటో దిగడంతో కౌన్సిల్ సమావేశం ముగిసింది. సభ ప్రారంభంలో మేయర్ నూర్జహాన్ మాట్లాడుతూ గత ఐదేళ్లలో నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఐదేళ్ల కాలంలో సహకరించిన సహచర కార్పొరేటర్లు, కో–ఆప్షన్ సభ్యులు, అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్సీపీ కార్యాలయానికి కరెంట్ కట్పై నిలదీత నగరంలో నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయానికి విద్యుత్ కనెక్షన్ కట్ చేయించడంపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్ గుడిదేసి శ్రీనివాసరావు ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు కక్షపూరితంగా తమ పార్టీ కార్యాలయానికి విద్యుత్ తొలగించారని దుయ్యబట్టారు. దీనిపై కమిషనర్ భానుప్రతాప్ సమాధానమిస్తూ జిల్లా కార్యాలయ నిర్మాణానికి ప్లాన్ అనుమతులు లేవని, దీంతో విద్యుత్ కనెక్షన్ కట్ చేయించామని అన్నారు. మేకల కబేళాలో పనిచేస్తున్న పశువైద్యాధికారి వెంకయ్య అంశంపై జరిగిన చర్చలో ఎస్ఎంఆర్ పెదబాబు ఘాటుగా స్పందించారు. ఆయన విధులు సక్రమంగా నిర్వహి ంచనప్పుడు కార్పొరేషన్ నుంచి వేతనం ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ గుడిదేశి శ్రీనివాసరావు కల్పించుకుని మాట్లాడబోగా పెదబాబు చేతిలోని మైక్ను విసిరివేశారు. మొత్తానికి చివరి సమావేశాన్ని మమ అనిపించేశారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ గుడిదేశి, డిప్యూటీ మేయర్ కర్రి మధ్య వాదోపవాదాలు మేయర్ నూర్జహాన్కు వినతిపత్రం అందిస్తున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆఖరి సమావేశంలోనూ తప్పని వాదోపవాదాలు సమస్యలపై నిలదీసిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఏలూరులో అజెండాలోని 17 అంశాలకు ఆమోదం -
ఫ్యాన్స్ ఫుల్జోష్
నూతనోత్సాహంఈరోజు మీరు చూపిస్తున్న ఈ ఆదరణ, అభిమానానికి నిజంగా నోటి నుంచి మాట కూడా రానంతగా భావోద్వేగం. ఇసుక వేసినా రాలనంతగా, కంటి చూపు మేరలో ఎక్కడా కూడా ఖాళీ స్థలం కనిపించనంతగా, ఈ అభిమాన తరంగాల మధ్య మీరు చూపిస్తున్న ఈ ప్రేమ, ఈ అభిమానానికి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి రెండు చేతులు జోడించి పేరుపేరునా హృదయ పూర్వక కృతజ్ఞతలు. – భీమవరంలో తన కోసం వచ్చిన అభిమాన సంద్రాన్ని చూసి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్న మాటలివి సాక్షి, భీమవరం: సిండికేట్ దోపిడీతో కుదేలవుతున్న ఆక్వా రైతులకు అండగా 15న జగన్ భీమవరం వస్తున్నారని రెండు వారాల క్రితం వైఎస్సార్సీపీ నేతలు ప్రకటించిన నాటి నుంచే సభ భగ్నానికి కూటమి కుట్రలకు తెరలేపింది. సభను ఫెయిల్యూర్ చేసే లక్ష్యంతో భీమవరం, వీరవాసరం, పాలకొల్లు, తణుకు, ఆకివీడులలో టీడీపీ, జనసేన పార్టీకి చెందిన పలువురు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లుతూ చంద్రబాబు సర్కారు చేస్తున్న దగాను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. సభకు రైతులు రాకుండా ఆపాలని చూశారు. 14న మధ్యాహ్నం వరకు హెలీప్యాడ్కు అనుమతులు రాకుండా అడ్డుకున్నారు. రోడ్డు, లేదా రైలు మార్గం ద్వారా జగన్ భీమవరం వచ్చితీరతారని, దారిలో జన సునామీని ఆపడం మాతరం కాదని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేయడంతో హైడ్రామాకు తెరదించుతూ సభ ప్రారంభానికి కొన్ని గంటల ముందు హెలీప్యాడ్కు ప్రభుత్వం నుంచి అనుమతి రావడం గమనార్హం. రైతుల రాకను అడ్డుకోవాలన్న కూటమి ప్రయత్నాలు విఫలమయ్యాయి. జన జాతర సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా ఆక్వా రైతులకు అండగా భీమవరం వచ్చిన జగన్కు జనం బ్రహ్మరథం పట్టారు. సభ ఉదయం 11 గంటలకు కాగా 8 గంటల నుంచే పట్టణంలోని జువ్వలపాలెం, ఉండి, లోసరి, పా లకొల్లు, తాడేపల్లిగూడెం, నరసాపురం రోడ్లు జనంతో రద్దీగా కనిపించాయి. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి వేలాదిగా ఆక్వా రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణులు తరలివచ్చారు. తమ అభిమాన నాయకుడిని ప్రత్యక్షంగా చూడాలని చిన్నాపెద్దా, ఆడమగా తేడాలేకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో చేరడంతో హెలీప్యాడ్ నుంచి సభావేదిక వరకు రోడ్డు మొత్తం జనజాతరను తలపించింది. దారి మొత్తం జై జగన్ నినాదంతో మార్మోగింది. తాలుకా ఆఫీస్ సెంటర్, ప్రకాశం చౌక్, అంబేడ్కర్ సెంటర్, బీవీరాజు సెంటర్లు కిక్కిరిసిపోయాయి. లూథరన్ గ్రౌండ్ నుంచి జగన్ కాన్వాయి బైపాస్ రోడ్డులోని డాక్టర్ బీవీ రాజు విగ్రహం సమీపంలోని సభా ప్రాంగణం చేరుకునేందుకు కేవలం 1.5 కి.మీ దూరానికి గంటకు పైనే సమయం పట్టింది. జగన్ మాట్లాడుతూ అధైర్యపడవద్దు నేనున్నానని, మూడేళ్ల తర్వాత వచ్చేది మన ప్రభుత్వమేనని, చంద్రబాబు సిండికేట్ను కూకటి వేళ్లతో పెకిలిస్తానంటూ ఇచ్చిన హామీ ఆక్వా రైతుల్లో కొండంత ధైర్యాన్ని నింపింది. పోలీసుల ప్రేక్షక పాత్ర వేలాదిగా జనం తరలిరాగా వారిని అదుపు చేయడంలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారన్న విమర్శలున్నాయి. భారీగా జనం తరలివస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఉన్నా జగన్కు జెడ్ఫ్లస్ కేటగిరీ భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. సభా వేదికపైగా ఒక్కసారిగా అభి మానులు చొచ్చుకురావడంతో వారిని కంట్రోల్ చేసేందుకు పార్టీ నేతలు, వైఎస్సార్సీపీ వలంటీర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. జన సునామీ భీమవరంలో జగన్ ఆక్వా సభ సూపర్ సక్సెస్ జనాభిమానం ముందు పారని కూటమి కుట్రలు వెల్లువలా తరలివచ్చిన రైతులు, జనం జనసంద్రాన్ని తలపించిన భీమవరం రోడ్లు అడుగడుగునా జననేతకు బ్రహ్మరథం రెట్టించిన ఉత్సాహంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆక్వా రైతుల సభ సూపర్ సక్సెస్ కావడం వైఎస్సార్సీపీలో జోష్ నింపింది. కూటమి కుట్రలను దాటుకుని కనివినీ ఎరుగని రీతిలో అంచనాలకు మించి భారీగా జనం రావడంతో జిల్లాలోని వైఎస్సార్సీపీ కేడర్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. భీమవరంలో మునుపెన్నడూ ఈ స్థాయిలో జనసంద్రాన్ని చూడలేదని స్థానికులు అంటున్నారు. జగన్ భీమవరం పర్యటన ఖరారైన నాటి నుంచి సభ విజయంతానికి పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాధ్, జిల్లా అధ్యక్షుడు ము దునూరి ప్రసాదరాజు నేతృత్వంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి కేడర్ మొత్తం సభ విజయవంతానికి సమష్టిగా పనిచేశారు. సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ని యోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించుకుని ప్రణాళికాబద్ధంగా పనిచేశారు. నియోజకవర్గాల నుంచి మోటారు సైకిల్, ఆటోలు, కార్లు ర్యాలీలుగా జనం జగన్ సభకు తరలివచ్చారు. -
కొండను ఆక్రమిస్తున్న అక్రమార్కుడు
నూజివీడు: పట్టణంలోని ట్రిపుల్ఐటీ ఎదురుగా ఉన్న జగనన్న కాలనీకి ఆనుకుని ఉన్న కొండను అక్రమార్కులు ఆక్రమించుకుంటున్నారు. వారం రోజులకు పైగా కొండను ఆక్రమించే పనులు చేస్తున్నా రెవెన్యూ అధికారులు గానీ, సిబ్బంది గానీ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మండలంలోని రేగుంటకు చెందిన ఓ వ్యక్తి కొండను ఆక్రమించి మామిడి మొక్కలు వేశాడు. దీనిపై కొండను ఆనుకుని ఉన్న జగనన్న కాలనీ వాసులు అభ్యంతరం చెప్పగా తనకు పట్టా ఉందంటూ చెబుతున్నట్లుగా కాలనీ వాసులు పేర్కొంటున్నారు. అయితే గట్టుకు సంబంధించి ఎవరికీ పట్టాలు ఇవ్వలేదని రెవెన్యూ సిబ్బంది పేర్కొన్నారు. స్థానికులు సమాచారంతో వీఆర్ఓ సుబ్బారావు కొండ వద్దకు వెళ్లి ఆక్రమణదారుడితో మాట్లాడి ఆక్రమించుకోవడానికి వీల్లేదని చెప్పా రు. అంతేగాకుండా ఆక్రమణను తొలగించాలని లేఖను సైతం ఆర్ఐ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఆక్రమణదారుడికి కొందరు అధికార పార్టీ నాయకులు కొమ్ము కాస్తున్నట్లు సమాచారం. -
సరిహద్దు వివాదంతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి
ఉండి: సరిహద్దు వివాదంలో అధికారుల నుంచి న్యాయం లభించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండిలో ఓ వ్యక్తి ప్రైవేట్ సెల్ టవర్ ఎక్కి కలకలం సృష్టించాడు. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి టవర్ ఎక్కి, కిందకు దూకేస్తానంటూ హల్చల్ చేశాడు. ఈ సందర్భంగా టవర్ కింద ఉన్న అతని భార్య త్రివేణి మాట్లాడుతూ మాకు, మా పొరుగువారికీ మధ్య మూడేళ్లుగా సరిహద్దు వివాదం నడుస్తోంది. దీనిపై గత ఏడాది డిసెంబర్లో స్పందనలో ఫిర్యాదు చేయగా.. అప్పటి తహసీల్దార్ సమస్యను పరిష్కరించి, ఆ దారి మాదేనంటూ ఎండార్స్మెంట్ ఇచ్చారని తెలిపారు. కానీ, ఆ తర్వాత ప్రత్యర్థులు మళ్లీ ఆ దారి మాదేనంటూ మాపై హక్కులు చెలాయిస్తూ తన భర్తను తీవ్రంగా కొట్టారని ఆరోపించింది. దీనిపై పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని, దాడి చేసిన వారికి అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండటంతో మాకు ఎవరూ న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే వ్యక్తి టవర్ ఎక్కాడన్న సమాచారం అందుకున్న తహసీల్దార్ మంతెన రామప్రసాదరాజు, ఎంపీడీఓ శ్రీనివాస్, సీఐ కాళీచరణ్, ఎస్సై హెచ్.మల్లికార్జున, పంచాయతీ కార్యదర్శి అనిల్ తదితరులు ఫైర్ ఇంజన్తో సహా ఘటనా స్థలానికి చేరుకున్నారు. టవర్ పై ఉన్న శ్రీనివాస్తో పాటు ఇరుపక్షాలతో అధికారులు చర్చలు జరిపారు. న్యాయం చేస్తామని అధికారులు నచ్చజెప్పడంతో రాత్రి 8 గంటల సమయంలో శ్రీనివాస్ సురక్షితంగా కిందకు దిగాడు. అనంతరం ఇరువర్గాల డాక్యుమెంట్లు పరిశీలించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగిన న్యాయం చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. -
శాసీ్త్రయ యాజమాన్యంతో అధిక దిగుబడులు
ఆగిరిపల్లి: మామిడి తోటల్లో శాసీ్త్రయ యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని నూజివీడు మామిడి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శాలిరాజు సూచించారు. మండలంలోని వడ్లమాను గ్రామంలో మామిడి రైతులకు శాసీ్త్రయ సాగు విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ శాలిరాజు మాట్లాడుతూ పాత తోటల్లో ఎండిపోయిన కొమ్మలను తొలగించి, చెట్లను గొడుగు ఆకారంలో కత్తిరించుకోవాలన్నారు. సమతుల్య ఎరువులు, సూక్ష్మపోషకాల వినియోగంతో పాటు అంతర పంటల సాగు ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని వివరించారు. అలాగే, తెగుళ్లు, పురుగుల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు, సేంద్రియ పద్ధతులు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె. షాజా నాయక్, మండల ఉద్యానశాఖాధికారిణి కె. జ్యోతి ప్రియాంక, వీహెచ్ఏ నాగాంజనేయులు, ఆర్ఎస్కే ఇన్చార్జులు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు. -
జగన్నాథుని రథం.. భక్తుల పరవశం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్ర దత్తత ఆలయం లక్ష్మీపురంలోని సంతాన వేణుగోపాల జగన్నాథ, వేంకటేశ్వరస్వామివారి సన్నిధిలో రథోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయం నుంచి ద్వారకాతిరుమల క్షేత్రానికి రథయాత్ర నేత్రపర్వంగా సాగింది. సుందరంగా అలంకరించిన రథంలో సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుని దారు విగ్రహాలను వేంచేపు చేసి ప్రత్యేక పూజల అనంతరం రథయాత్ర ప్రారంభించారు. ఆలయ ఏఈఓ ఐ.రమణరాజు, ఎలక్ట్రికల్ డీఈ టి.సూర్యనారాయణ, సూపరింటిండెంట్ జి.సుబ్రహ్మణ్యం రథం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథం ముందుగా ఆలయం చుట్టూ తిరిగి అశేష భక్తజనం నడుమ ద్వారకాతిరుమల క్షేత్రానికి చేరుకుంది. అక్కడ భక్తుల దర్శన అనంతరం తిరిగి లక్ష్మీపురంలో ఆలయానికి చేరుకుంది.


