Eluru
-
గూడెంలో రేషన్ దందా
తాడేపల్లిగూడెం: పట్టణంలో ఇద్దరు యువకులు రేషన్ దందా సాగిస్తున్నారు. పట్టణం, పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. ఇందులో ఒకరు స్లీపింగ్, మరొకరు యాక్టివ్ పార్టనర్గా కొనసాగుతున్నారు. స్లీపింగ్ పార్టనర్గా చెప్పుకొనే వ్యక్తి గతంలో దొంగ బియ్యాన్ని కొనుగోలు చేసే మిల్లుల సమాచారం తెలుసుకొని ఇతరులకు ఉప్పు అందించి సొమ్ములు చేసుకొనేవాడని ప్రతీతి. ప్రస్తుతం అతడు అక్రమ బియ్యంలో ఉండడమే కాక, ఒక పెద్దతలకాయ పేరు చెప్పి ఉద్యోగుల బదిలీలు చక్కపెడుతున్నాడంటున్నారు. ఏడాదికి ముందు రేషన్ మాఫియా సవితృపేటకు చెందిన వారసత్వ బియ్యం అక్రమ రవాణా చేసే ఒక కుటుంబంలో ఉండేదనేది బహిరంగ రహస్యం. పెదతాడేపల్లి మార్గంలో ఎరువుల గోదాములు కేంద్రంగా అక్రమ బియ్యం నిల్వలు చేసి, జిల్లాను దాటించి సొమ్ములు చేసుకొనే వారు. విజిలెన్సు దాడులు జరిగినా కూడా అక్రమ వ్యవహారాలకు అడ్డుకట్ట పడలేదు. చివరికి వ్యవహారం తలబొప్పి కట్టేలా తయారవుతున్న తరుణంలో ఈ అక్రమ వ్యవహారానికి బలవంతంగా బ్రేక్ వేశారు. అక్రమ రేషన్ వ్యవహారం తాత్కాలికంగా ఆగినట్టుగా కనిపించినా ఏడాదిగా మళ్లీ పురుడుపోసుకుంది. ఈ నూతన ద్వయం అక్రమ రేషన్ వ్యవహారం యథేచ్ఛగా సాగిస్తోంది. యాక్టివ్గా ఉన్న భాగస్వామి ఇటీవల అక్రమ బియ్యం తరలిస్తున్న తరుణంలో విజిలెన్స్ అధికారులు భీమడోలులో బియ్యం పట్టుకున్నారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో, ఆరో వార్డులోని మామిడితోటలోనూ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. అయినప్పటికీ అక్రమ రేషన్ వ్యాపారం మూడు మూటలు, ఆరు బస్తాలుగా సాగుతోందని తెలుస్తోంది. పెద్దతలకాయల పేరుచెప్పి స్లీపింగ్ పార్టనర్ పేట్రేగిపోతున్న వ్యవహారం కూడా చర్చనీయాంశమైంది. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రేషన్ మాఫియా సాగిస్తున్న నయా ద్వయం విచ్చలవిడిగా అక్రమ బియ్యం వ్యాపారం మా వెనుక పెద్దలున్నారంటూ బ్లాక్ మెయిలింగ్ -
నెరవేరని సొంతింటి కల
● వైఎస్పార్ కాలనీలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలు ● రుణం కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం మండవల్లి: పేదల సొంతింటి కళ నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం కక్షపూరిత ధోరణే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు సొంతిల్లు సమకూర్చేందేకు వైఎస్సార్ కాలనీలో ఇళ్ల స్థలాలు కేటాయించింది. వారు ఇళ్లు నిర్మించుకునేందుకు సైతం రుణం మంజూరు చేసింది. ఈ క్రమంలో చాలా చోట్ల పేదలు ఇళ్లు నిర్మించుకున్నారు. అయితే తరువాత ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారిపోవడం జరిగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వైఎస్సార్ కాలనీలోని ఇళ్ల నిర్మాణాలపై పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీంతో వైఎస్సార్ కాలనీలో మౌలిక సౌకర్యాలు లేక, రుణం మంజూరు కాకపోవడంతో ఇళ్లు నిర్మించుకునే వీలు లేక లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. మండవల్లిలోని వైఎస్సార్ కాలనీలో 174 మందికి ఒక్కొక్కరికీ సెంటున్నర చొప్పున ఇళ్ల స్థలాలు గతంలో కేటాయించారు. 74 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. కొన్ని ఫౌండేషన్ దశలో, 30 ఇళ్లకు భీములు పోసి, మరో 10 ఇళ్లు శ్లాబ్ దశలో, 10 ఇళ్లు పూర్తికాబడి ఉన్నాయి. మిగిలిన వంద మంది లబ్ధిదారులకు రుణ సౌకర్యం మంజూరు కాకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. రుణ సౌకర్యం కలిగిస్తేనే గృహాలు నిర్మించుకోగలమని చెబుతున్నారు. మౌలిక వసతులు శూన్యం కాలనీ పొలాల మధ్యలో ఉండడం.. ఇక్కడ ఎలాంటి తాగునీటి వసతి కల్పించకపోవడంతో కాలనీలోని లబ్ధిదారులు తాగునీటికి నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కాలనీకి వెళ్లే రహదారి పల్లపు ప్రదేశంలో ఉండటంతో వర్షం నీరు నిలిచిపోయి రాకపోకలు సాగించడానికి అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వైఎస్సార్ కాలనీలో మౌలిక సౌకర్యాలు కల్పించడంతోపాటు, మిగిలిన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలకు రుణాలు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు. అస్తవ్యస్తంగా కాలనీ రహదారి మండవల్లి వైఎస్సార్ కాలనీలో ఇళ్ల నిర్మాణాల పరిస్థితి సుమారు 100 ఇళ్లు రుణ సౌకర్యం లేక ఖాళీ స్థలాలతో ఉన్నాయి. లబ్ధిదారులంతా రెక్కాడితే గానీ డొక్క నిండని పేదవారు. ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పిస్తేనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమవుతాయి. అధికారులు త్వరితగతిన వారికి రుణాలు మంజూరు చేయాలి. – సుంకర కనకరాజు, మండవల్లి కాలనీలో ఉన్నవారందరూ పేదలే. ప్రభుత్వం రుణం మంజూరు చేయకుండా ఇంటి నిర్మాణాలు ప్రారంభించడం కష్టమే. స్థలాలు ఉన్నా ఇళ్ల నిర్మాణాలు జరుగకుంటే ప్రయోజనం లేదు. అధికారులు లబ్ధిదారులందరికీ రుణాలు మంజూరు చేసి సహకరించాలి. – రాజేంద్ర, మండవల్లి -
వంతెన.. ఇంకెన్నాళ్లీ యాతన
● నిలిచిన రావులపర్రు వంతెన నిర్మాణం ● బిల్లులు అవ్వక పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్ ● వంతెన కోసం ప్రజల ఎదురుచూపులుఉంగుటూరు: పత్తేపురం పంటకాలువపై వంతెన నిర్మాణం మళ్లీ నిలిచిపోయింది. బిల్లులు పూర్తికాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేసినట్లు తెలిసింది. ఈ వంతెన నిర్మాణం కోసం రావులపర్రు గ్రామ ప్రజలు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. 2019కి ముందు పత్తేపురం పంటకాలువపై ఉన్న వంతెన శిథిలమై కూలిన నాటి నుంచి ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. వ్యవసాయ ఉత్పుత్తులు, ఎరువులు పురుగుమందులు గ్రామంలోకి తేవాలన్నా, గ్రామం నుంచి బయటకు తోలాలన్నా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడి ప్రజలు మండల కేంద్రం ఉంగుటూరు చేరాలంటే చుట్టూ తిరిగి నారాయణఫురం మీద నుంచి రావాల్సి వస్తోంది. దీంతో కూలిన వంతెన స్థానంలో నూతన వంతెన నిర్మించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు గ్రామ ప్రజలు విజ్ఞప్తులు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు మారినా పని పూర్తి కాలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు వంతెన నిర్మాణానికి రూ.70 లక్షలు నిధులు మంజూరు చేయించడంతో పనులు ప్రారంభమయ్యాయి. ఆర్అండ్బీ శాఖ వారి పర్యవేక్షణలో ఈ వంతెన పనులు పూర్తి కావాల్సి ఉంది. గతేడాది కొంతవరకు పనులు చేశారు. పక్క గోడలు కూడా పూర్తయ్యాయి. అయితే ఆ తరువాత నుంచి పనులు నిలిచిపోయాయి. చేసిన పని వరకు బిల్లు అవ్వకపోవడం వల్ల కాంట్రాక్టరు పని ఆపేసినట్లు తెల్సింది. -
స్వచ్ఛతకు ‘కృష్ణా’ర్పణం
ఏలూరు (టూటౌన్): అపరిశుభ్రమైన ప్రస్తుత కృష్ణా నది జలాలను పంపుల చెరువులో నింపొద్దని నగర ప్రజలు కోరుతున్నారు. ఏలూరు ప్రజానీకానికి వేసవి దాహార్తిని తీర్చేందుకు పంపుల చెరువు నింపడం కోసం విజయవాడ నుంచి కృష్ణా నది జలాలను కిందికి, ఏలూరు కృష్ణా కెనాల్ లోకి వదిలారు. అయితే ప్రస్తుతం కృష్ణా కెనాల్లోకి వస్తున్న, కాలువలో ప్రవహిస్తున్న నీరు చాలా అపరిశుభ్రంగా, కలుషితంగా, దుర్వాసనతో మురుగు నీటిలా ఉన్నాయి. ఈ అపరిశుభ్రమైన నీటిని పడమటి లాకుల ద్వారా కిందికి వదిలి పరిశుభ్రమైన నీరు వచ్చిన తర్వాతనే పంపుల చెరువులు నింపాలని ఐఎఫ్టీయూ ఏలూరు నగర కమిటీ మున్సిపల్, ప్రభుత్వ అధికారులను కోరింది. ఈ మేరకు ఐఎఫ్టీయూ బృందం ఆదివారం పడమటిలాకుల వద్ద కృష్ణా కెనాల్ నీటిని పరిశీలించారు. అనంతరం పంపుల చెరువు వద్ద నీటిని పరిశీలించారు. మూడు నెలల తర్వాత కృష్ణా కాలువకు నీరు ఏలూరు నగరానికి గోదావరి, కృష్ణా జలాలలతో వేసవిలో దాహార్తిని తీర్చేందుకు ఒక పక్క అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే కృష్ణా కాలువకు విజయవాడ ఎనికేపాడు వద్ద బుడమేరుకు అండర్ టన్నెల్ నిర్మిస్తున్న కారణంగా గత మూడు నెలలుగా ఏలూరుకు వచ్చే కృష్ణా కాలువను మూసివేశారు. ప్రస్తుతం వేసవిలో దిగువ ప్రాంతాల్లోని తాగునీటి చెరువులకు నీటిని అందించే ఉద్దేశ్యంతో ఇటీవల నీటిని విడుదల చేశారు. కానీ ఎగువ ప్రాంతంలో కాలువలో ఉన్న వ్యర్థాల కారణంగా దిగువ ఏలూరు వచ్చేసరికి కృష్ణా కాలువ నీరు కలుషితంగా మారుతోంది. ఈనెల 7వ తేదీ సాయంత్రానికి ఏలూరు చేరుకున్న కృష్ణా నీరు పంపుల చెరువులోకి తోడేందుకు పనికి రాకుండా పోయింది. తాగునీటికి పనికిరావంటూ రిపోర్టు ప్రస్తుతం కృష్ణా కాలువలో వస్తున్న నీరు తాగునీటికి పనిరావంటూ ల్యాబ్ రిపోర్టు వచ్చినట్లు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. మురుగు నీరు ఆగిపోయిన తర్వాతనే కృష్ణా కాలువ నీటిని పంపుల చెరువులోకి తోడటం జరుగుతుందని అంటున్నారు. మరో పక్క కాలువలోకి కొద్ది రోజులు మాత్రమే నీరు విడుదల చేస్తారనే కారణంగా చెరువును నింపేందుకు మున్సిపల్ అధికార యంత్రాంగం తొందర పడుతున్నట్లు కన్పిస్తోంది. అయితే మురుగు నీరు పూర్తిగా దిగువ కొల్లేరులోకి వదిలేసిన తర్వాతనే శుభ్రమైన నీరు వచ్చాకే పంపుల చెరువులోకి నీటిని మళ్లించాలని నగర ప్రజలు కోరుతున్నారు. తాగునీరు.. తాగలేరు ప్రస్తుతం కృష్ణా కాలువలో కలుషిత వ్యర్థాలతో కూడిన నీరు ప్రవహిస్తోంది కాలువలో పరిశుభ్రమైన నీరు వచ్చాకనే కృష్ణా నీటిని పంపుల చెరువులోకి నింపాలి. లేని పక్షంలో ఉన్న నీరు మొత్తం కలుషితమయ్యే ప్రమాదం పొంచి ఉంది. గతంలో ఏలూరు ప్రజలు తెలియని వింత రోగాలతో బాధపడిన సంఘటన గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుని జాగ్రత్తలు పాటించాలి. – బి.సోమయ్య, నగర అధ్యక్షుడు, ఇఫ్టూ ఏలూరు నగర కమిటీ, ఏలూరు డ్రెయినేజీ నీటిని తలపిస్తున్న కృష్ణా నీరు ఆ నీటినే పంపుల చెరువులోకి నింపేందుకు సిద్ధమవుతున్న యంత్రాంగం మురుగు నీరు నింపడంపై నగరవాసుల్లో ఆందోళన స్వచ్ఛమైన నీటినే చెరువులోకి పంపింగ్ చేయాలని డిమాండ్ -
సుబ్రహ్మణ్యేశ్వరా.. శరణు.. శరణు..
ముదినేపల్లి (కై కలూరు): రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన ముదినేపల్లి మండలం, శింగరాయపాలెం–చేవూరుపాలెంలో కొలువైన వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు ఆదివారం పోటెత్తారు. స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు తోలేటి వీరభద్రశర్మ ప్రత్యేక అభిషేకాలు చేశారు. దేవస్థాన ఆవరణలో పుట్టిలో వెలిసిన స్వామివారికి అనేక మంది భక్తులు పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. ముఖ్యంగా ఓ జంట యజ్ఞాన్ని నిర్వహించి నాగ ప్రతిష్ట చేశారు. ఆలయ సహాయ కమిషనరు, కార్యనిర్వహణాధికారిణి ఆర్.గంగా శ్రీదేవి, ఆలయ చైర్మన్ బొంగు రవికుమార్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత అన్నప్రసాదాన్ని నిర్వహించారు. కామవరపుకోట: స్థానిక రామన్నపాలెం రోడ్డులోని తపస్య ఎడ్యుకేషనల్ స్కూల్, జూనియర్ కాలేజీలో ఏలూరు చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ పాలూరి, సెక్రటరీ కన్నా సూర్య నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అండర్ 9 చెస్ పోటీలు నిర్వహించారు. ఏలూరుకు చెందిన బాలురు విభాగంలో శివనాగ్ 4 పాయింట్లు, అఖిలేష్ 3 పాయింట్లు, బాలికల విభాగంలో చిర్నవి 3 పాయింట్లు, బిస్మి యాస్మిన్ జారా 2 పాయింట్లు సాధించి ఎంపికయ్యారు. విద్యాసంస్థల యాజమాన్యం జగన్ పాల్గొన్నారు. ముసునూరు: మండలంలోని చింతలవల్లిలో రూ.4.02 కోట్లతో నిర్మించ తలపెట్టిన 33/11 కేవీ విద్యుత్తు ఉప కేంద్ర నిర్మాణానికి ఆదివారం గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారధి భూమి పూజ చేశారు. అనంతరం రూ.83 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రహదారులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టరు టీవీఎన్ఎస్.మూర్తి, ఎస్ఈ యు.హనుమయ్య, విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: పట్టణంలో ఓ ఇంట్లోకి ప్రేవేశించిన పామును స్నేక్ సేవియర్స్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు చదలవాడ క్రాంతి చాకచక్యంగా పట్టుకున్నారు. జంగారెడ్డిగూడెం గ్రాండ్–2 సాయి బాలాజీ టౌన్షిప్ 3వ రోడ్లో దినేష్పటేల్ మార్వాడి వ్యాపారి ఇంట్లోకి నాలుగు అడుగుల గోధుమ తాచుపాము ప్రవేశించింది. ఆదివారం ఉదయం నిద్రలేచి ఇంట్లో నుంచి బయటకు రాగానే గుమ్మం వద్ద గోధుమ తాచు పడుకుని ఉంది. భయభ్రాంతులకు గురైన దినేష్ పటేల్ వెంటనే స్నేక్ సేవియర్స్ సొసైటీకి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన క్రాంతి పామును చాకచక్యంగా పట్టుకుని సమీపంలోని అటవీప్రాంతలో విడిచిపెట్టాడు. కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మకు వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క అదివారం మాత్రమే ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల విక్రయం, వాహన పూజలు, విరాళాల ద్వారా మొత్తం రూ.84,926 ఆదాయం వచ్చిందని తెలిపారు. అమ్మ దర్శనానికి విచ్చేసిన భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని ఈవో చెప్పారు. -
వనరూపిణి.. వర ప్రదాయిని
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. విజయవాడకు చెందిన భక్తులు డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. అధికంగా తరలివచ్చిన భక్తుల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీవారితోపాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు. ఉండి: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉంగుటూరు మండలం బొమ్మిడి గ్రామానికి చెందిన నాగరాజు నర్సింహరాజు, అతని భార్య ఉదయశ్రీ (50) పెదపుల్లేరులో మల్లిఖార్జునస్వామి ఆలయ ప్రతిష్టకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఉండి రైల్వే గేటు దాటిన వెంటనే వీరి ద్విచక్రవాహననాన్ని వెనక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చుని ఉన్న ఉదయశ్రీ కింద పడిపోవడం, ఆమైపె నుంచి లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. లారీ విడిచిపెట్టి డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఉదయశ్రీ మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ యెషయా కేసు నమోదు చేశారు. -
శ్రీనివాస కల్యాణం.. కడు రమణీయం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాధ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం రాత్రి శ్రీనివాసుని దివ్యకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణల నడుమ జరిగిన ఈ కల్యాణ తంతు భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్లను పల్లకీ వాహనంలో ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం అట్టహాసంగా పల్లకీ వాహనాన్ని ఆలయ ఆవరణలోని కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. అంతక ముందే కల్యాణ మండపంలో విశేషంగా అలంకరించిన వేదికపై స్వామి, అమ్మవార్ల కల్యాణ మూర్తులను ఉంచి అర్చకులు పుష్పాలంకారాలు చేశారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ఆలయ ఈఓ వై.భద్రాజీ పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం అర్చకులు, పండితులు స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించి కల్యాణ తంతును ప్రారంభించారు. సుముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేసి, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను భక్తుల గోవింద నామస్మరణల నడుమ వైభవంగా జరిపారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలను అందజేశారు. లక్ష్మీపురంలో అట్టహాసంగా వేడుక -
శ్రీవారి దేవస్థానం ఈఓగా వేండ్ర త్రినాథరావు
ద్వారకాతిరుమల: అన్నవరం శ్రీ వీరవెంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావును, ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈఓగా నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నియామకానికి సంబంధించిన జీఓ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. రాజమహేంద్రవరం ఆర్జేసీగా పనిచేస్తున్న ఆయన్ను గతేడాది డిసెంబర్ 9న అన్నవరం దేవస్థానం ఈఓగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. అయితే ద్వారకాతిరుమల దేవస్థానం ఈఓగా పనిచేసిన ఎన్వీఎస్ఎన్ మూర్తి గతేడాది డిసెంబర్ 31తో పదవీ విరమణ పొందగా, అప్పటి ఇదే దేవస్థానంలో డీఈఓగా పనిచేస్తున్న యర్రంశెట్టి భద్రాజీ ఇన్చార్జి ఈఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. త్రినాథరావు ఈఓగా బాధ్యతలు చేపట్టిన తరువాత, భద్రాజీ మళ్లీ డీఈఓగా ఇదే దేవస్థానంలో కొనసాగుతారు. టి.నరసాపురం: బంగారం, వెండి ఆభరణాల చోరీపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్సీ ఎం.రాజు తెలిపారు. ఏపిగుంట గ్రామానికి చెందిన యిర్ల సత్యనారాయణ ఈ నెల 10న భార్యతో కలిసి జంగారెడ్డిగూడెంలో బంధువుల గృహ ప్రవేశానికి వెళ్లారు. తిరిగి ఈ నెల 11న ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. బీరువాలోని 24 గ్రా. బంగారం, 1050 గ్రా. వెండి ఆభరణాలు అపహరణకు గరైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పల్లెవించని పాలన
ఆకివీడు: పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు.. దేశాభివృద్ధి గ్రామసీమలపైనే ఆధారపడి ఉంటుంది. ప్రజాపాలనలో ఎంతో ప్రాధాన్యమున్న స్థానిక సంస్థలపై రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ఇప్పటికే నిర్వీ ర్యం చేసింది. తాజాగా గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలనను తీసుకువచ్చింది. ఇప్పటికే ఆయా గ్రామాలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రత్యేకాధికారులు బాధ్యతలు చేపట్టారు. మండల స్థాయిలోని అన్ని శాఖల అధికారుల్ని ప్రత్యేక అధికారులుగా నియమించారు. కొన్నిచోట్ల రెండు, మూడు గ్రామాలకు కలిపి ఒక అధికారిని ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జిల్లాలోని 409 పంచాయతీలకు గాను 390 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించా రు. అత్యధిక పంచాయతీలు, వార్డు సభ్యులు వైఎస్సార్సీపీ మద్దతుదారులే ఉన్నారు. ఐదేళ్ల పాటు గ్రామ అభివృద్ధికి విశిష్ట సేవలందించిన ప్రజాప్రతినిధులు ఇటీవల పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలనకు తెరతీసింది. అధికారులకు పని ఒత్తిళ్లు కూటమి ప్రభుత్వంలో జిల్లా, మండల, గ్రామస్థా యి అధికారులకు పని ఒత్తిడి పెరిగింది. వీడియో కాన్ఫెరెన్స్లు, ఇతర సమావేశాలు, సంబంధిత శాఖల పనిఒత్తిళ్లతో ఇప్పటికే సతమతమవుతున్న అధికారులను గ్రామాల్లో ప్రత్యేకాధికారులుగా నియమించడంతో మరింత పనిభారం పెరిగింది. ఇప్పుడు గ్రామస్థాయి అధికారులతో పనిచేయించడం, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం వీరికి ఇబ్బందే. మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీరాజ్, ఆర్అర్డబ్ల్యూఎస్, మండల విద్యాశాఖ, ఏపీఎంలు, అంగన్వాడీ ప్రాజెక్టు అధికారులతో పాటు ఇతర సీనియర్ అధికారులను కూడా ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఎన్నికలంటే భయమా..? సకాలంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్విహించాల్సి ఉండగా ప్రత్యేక అధికారుల పాలనతో కొంత కాలం గడిపేయాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి సర్కారు ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహించడంలో వెనుకంజ వేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగంతో ప్రజలు బెంబేలెత్తిపోయి, విసిగిపోయారు. ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందనే భావనతో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడంలో సీఎం చంద్రబాబు వెనుకంజ వేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంచాయతీలకు నిధులు ఆగిపోవడమే కాకుండా ఇతర గ్రాంటులు కూ డా వచ్చే అవకాశాలు కన్పించ డం లేదు. పాలకవర్గాలు లేకపోవడంతో ఆర్థిక సంఘ నిధులు వచ్చే అవకాశాలు లేవంటున్నారు. గత కొన్నేళ్లుగా పాలకవర్గం లేని కొన్ని పంచాయతీలకు ఆర్థిక సంఘ నిధులు మంజూరు కాలేదు. గ్రాంటులు చప్పబడిపోవడం, పంచాయతీ నిధులు అంతంత మాత్రంగానే ఉండటంతో పల్లెల్లో సమస్యల పరిష్కారానికి నిధుల లేమి ఏర్పడనుంది. దీంతో ప్రత్యేక అధికారులు ఖాళీ ఖజానాతో గ్రామాల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి నిధులు ఎక్కడ నుంచి తీసుకువస్తారనే సందేహం వ్యక్తమవుతోంది. సమస్యల్ని చెప్పుకునేందుకు సచివాలయాలకు వెళ్లినా సంబంధిత ప్రత్యేక అధికారి లేరనే సమాధానాలు వస్తాయంటున్నారు. ప్రత్యేక అధికారి అందుబాటులో లేకపోవడంతో ప్రజాసమస్యలతో పరిష్కారంతో పాటు అభివృద్ధి పనుల కొనసాగింపు ప్రశ్నార్థకం కానుంది. ప్రత్యేక అధికారి దృష్టికి వెళ్లినా ఆయా సమస్యల పరిష్కారానికి నిధులలేమి అడ్డుకానుందంటున్నారు. ప్రత్యేక అధికారుల నియామకంతో చెక్పవర్ వచ్చినా ఆయా పనులకు సీఎంఎఫ్ఎస్ ద్వారా బిల్లులు తీసుకునేందుకు నిధుల కొరత ఎదురుకానుంది. ప్రత్యేక పాలన.. పట్టాలెక్కేనా? గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన అధికారులకు మరింత ఒత్తిడి ఇప్పటికే సచివాలయాలు నిర్వీర్యం అడుగడుగునా ఆర్థిక నష్టాలే.. స్థానిక సంస్థలపై చంద్రబాబు నిర్లక్ష్యం జిల్లాలో 409 పంచాయతీలు పంచాయతీ ఎన్నికలకు వెనుకడుగు గడువు ముగుస్తుందని తెలిసినా స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేకే ప్రత్యేక అధికారుల పాలనను చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చింది. సచివాలయ వ్యవస్థతో గత ప్రభుత్వంలో పల్లెలు ప్రగతి పథంలో నడిచాయి. ప్రజల ముంగిటే పాలన సాగింది. గత ప్రభుత్వంలో ఐదేళ్లూ స్థానిక సర్పంచ్లు, వార్డు సభ్యులు తమ సేవల్ని గ్రామాల అభివృద్ధికి వినియోగించారు. ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించినా మూడొంతులకు పైగా విజయం వైఎస్సార్సీపీ మద్దతుదారులదే. – పీవీఎల్ నర్సింహరాజు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, ఉండి -
వరి రైతులను ఆదుకొనేవారేరి?
● ధాన్యం కొనడం లేదని ఆగ్రహం ● కళ్లాల వద్ద రైతుల నిరసన భీమడోలు: కళ్లాల్లోని ధాన్యాన్ని మిల్లులకు తరలించకుండా కాలయాపన చేస్తుండటంపై ఆన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పూళ్ల గ్రామంలో కళ్లాల వద్ద ఆదివారం ధర్నాకు దిగారు. వారం రోజులుగా రేపూమాపూ అంటూ అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహిస్తోందని మండిపడ్డారు. కౌలు రైతు లు, రైతు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు రైతులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, కౌలు రైతు సంఘం జిల్లా కన్వీనర్ కొర్ని అప్పారావు, జిల్లా కో–కన్వీనర్ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పది రోజులుగా రబీ కోతలు ముమ్మరంగా సాగుతున్నాయని, ఆరుదలకు వచ్చిన పంటను గోనె సంచుల్లో సిద్ధం చేయగా.. తరలించేందుకు లారీలు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. కళ్లాల్లో నెట్టులు కట్టిన ధాన్యం బస్తాలను చూ పుతూ నిరసన తెలిపారు. వారం రోజులుగా అధికారులు కాలయాపన చేస్తున్నారని, వాతావరణంతో ఇబ్బందిపడే పరిస్థితి ఉందన్నారు. పంటను స కాలంలో తరలించకపోతే తీవ్రంగా నష్టపోతామంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి లారీలు ఏర్పాటు చేసి కళ్లాల్లోని ధా న్యాన్ని మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు.రైతు సంఘం నాయకులు అల్లు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బోనస్ ప్రకటించాలి దెందులూరు: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని పోతునూ రులో పర్యటించి కళ్లాల్లోని ధాన్యాన్ని పరిశీలించారు. పెరిగిన ఉత్పత్తి ఖర్చుల రీత్యా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం మద్దతు ధర రూ.2,369 రైతుకు ఏమాత్రం గిట్టుబాటు కాదన్నారు. కేరళలో మాదిరిగా రూ.900 బోనస్ ఇవ్వాలని కోరారు. అలాగే ధాన్యం రవాణాకు వాహనాల ఏర్పాటు, నాణ్యమైన గోనె సంచులు, తూకాలు, తేమశాతం లెక్కింపులో మోసాలు అరికట్టేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రబీలో పీఆర్ 126 రకం వరికి బదులు ఇతర రకాలు సాగు చేయమని చెప్పడంతో పది బస్తాలకు పైగా దిగుబడి తేడా వస్తోందని, దీంతో రైతులు నష్టపోతున్నారన్నారు. అధిక దిగుబడులు వచ్చే విత్తనాలు అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. రైతు సంఘం మండల అధ్యక్షుడు గండి రాజా, మండల కార్యదర్శి సున్నా వెంకట్రావు ఉన్నారు. -
హైకోర్టు తీర్పును అమలు చేయాలి
ఏలూరు (టూటౌన్): ఏపీ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న 1,000 మంది ఆప్కాస్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఐఎఫ్టీయు) ఏలూ రు నగర విస్తృత సమావేశం డిమాండ్ చేసింది. స్థానిక ఐఎఫ్టీయూ కార్యాలయంలో సంఘ అధ్యక్షుడు లావేటి కృష్ణారావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 26 ఏళ్లు నామమాత్రపు వేతనాలతో పనిచేస్తూ ఆప్కాస్ ఉద్యోగులు శ్రమదోపిడీకి గురవుతున్నారన్నారు. సమాన పనికి సమాన వేతనం సూత్రం ఆధారంగా పర్మినెంట్ ఉద్యోగులతో సమానమైన జీతాలు చెల్లించాలని కోరారు. లేకుంటే దశల వారీగా ఆందోళనలు చేపడతామన్నారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పర్మినెంట్ కార్మికుడి జీతంలో నాలుగోవంతు జీతం కూడా ఆప్కాస్ ఉద్యోగులకు చెల్లించడం లేదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకటరావు, ము న్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.సోమయ్య ఏలూరు నగర కార్యదర్శి జి. వెంకటేశ్వరరావు, న్యాయవాది కేవీ రత్నం తదితరులు పాల్గొన్నారు. దెందులూరు: పెదవేగి మండలం రాట్నాలకుంటలోని రాట్నాల మ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయంలో అమ్మవా రు విశేష అలంకర ణలో దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించి, మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి ఒక్కరోజు ఆదాయం రూ.రూ.1,09,524 వచ్చిందని ఆలయ చైర్మన్ మన్నే శ్రీనివాసరావు తెలిపారు. ఆలయ ఈఓ ఎన్.సతీష్కుమార్, జూనియర్ అసిస్టెంట్ విడుదల సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏలూరు (టూటౌన్): ప్రతి వారం జిల్లా, మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) సోమవారం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరులో ఉదయం 10 గంటల నుంచి యధావిధిగా పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. ముదినేపల్లి (కై కలూరు): ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్పై ముదినేపల్లి పోలీసులు ఆదివారం ఆకస్మిక దాడులు చేశారు. ఎస్సై వీరభద్రరావుకు వచ్చిన సమాచారం మేరకు గురజ గ్రామంలో దాడులు నిర్వహించారు. మొత్తం 8 మంది బెట్టింగ్రాయుళ్లను అరెస్ట్ చేసి ఏడు సెల్ఫోన్లు, రూ.4,500 స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. భీమవరం (ప్రకాశంచౌక్): రాష్ట్రంలో సోమ వారం 51 మండలాల్లో తీవ్ర వడగాలులు, 49 మండలాల్లో వడగాలులు, మంగళవారం 53 మండలాల్లో తీవ్ర వడగాలులు, 57 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్జైన్ తెలిపారు. ఏలూరు జిల్లాలోని రెండు మండలాల్లో తీవ్రవడగాలులు, 4 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో 41.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ భీమవరం (ప్రకాశంచౌక్) : రెండు దశాబ్దాలుగా పెండింగ్లో ఉ న్న ఎన్హెచ్–165 ని ర్మాణ పనులను అతి త్వరలోనే ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. ఆదివారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాడేపల్లిగూడెంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ హాల్ట్ కోసం ప్రయత్నిస్తున్నామని, 15 రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే జిల్లాలో రైల్వే సర్వీసుల విస్తరణలో భాగంగా గతంలో స్పెషల్ ట్రైన్లుగా ఉన్న 9 రైళ్లను ఇప్పుడు రెగ్యులర్ సర్వీసులుగా మార్చినట్లు ప్రకటించారు. -
రాజు చెరువు మట్టి.. కొల్లగొట్టి
కొయ్యలగూడెం: రాజు చెరువు నుంచి అక్రమ మట్టి తోలకాలకు భూబకాసురులు ఆదివారం శ్రీకారం చుట్టారు. దీనిపై ఇప్పటికే ‘సాక్షి’ కథ నాన్ని ప్రచురించినా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు యథేచ్ఛగా చెరువులో మట్టి తవ్వకాలు మొదలుపెట్టారు. స్థానికులు అభ్యంతరాలు తెలిపి తోలకందారులతో ఘర్షణకు దిగినా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిసింది. ఇదే చెరువులో అనుమతి మేరకు ఓ వైపు ట్రాక్టర్లలో మట్టి తోలకాలు కొనసాగుతుండగా.. తాజాగా ఇతర ప్రాంతాల నుంచి పొక్లయిన్లను తీసుకువచ్చి టిప్పర్లలో మట్టి తరలిస్తున్నారు. తోలకాలపై కలెక్టర్ సూచన మేరకు ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ సభ్యుల్లో ఏ ఒక్కరూ కూడా సమాచారం అందించినా స్పందించడం లేదు. ప్రజాప్రతినిధుల ఒత్తిడితో తాము ఏమీ చే యలేకపోతున్నామని సంయుక్త కమిటీలోని కొ ందరు అధికారులు చెబుతున్నారని సాగునీటి సంఘాలు, రైతు సంఘాల ప్రతినిధులు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
కస్టడీకి ఇస్తే కొందరికి కష్టమే!
ద్వారకాతిరుమల: రాష్ట్రవ్యాప్తంగా సంచలనాన్ని రేకె త్తించిన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో రూ.200 నకిలీ దర్శనం టికెట్ల స్కామ్కు సంబంధించిన కేసులో ఇప్పటివరకు పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఆలయ చరిత్రలోనే ఈ స్కామ్ అతి పెద్దదిగా చెబుతున్నారు. దేవస్థానం సాఫ్ట్వేర్కు సమాంతరంగా మరో సాఫ్ట్వేర్ను త యారు చేసి, స్కామ్కు పాల్పడ్డ వారిని పోలీస్ ఉన్నతాధికారులు ఉపేక్షించడం లేదు. అందుకే లోతైన విచారణ జరిపేందుకు ప్రస్తుతం రిమాండ్లో ఉన్న నిందితుల్లో ఐదుగురిని భీమడోలు సీఐ (విచారణ అధికారి) పి.కృష్ణ పోలీస్ కస్టడీకి కోరేందుకు సిద్ధమయ్యారు. దీంతో దేవస్థానంలో కొందరు ఉ ద్యోగుల వెన్నులో వణుకు మొదలైంది. అంతా అయిపోయిందని ఊపిరి పీల్చుకున్న కొందరు మళ్లీ కథ మొదటికొచ్చిందని తలలు పట్టుకుంటున్నారు. కస్టడీకి పిటీషన్ కేసులో ఏ–1 ఐఎస్జే రాజు, ఏ–2 ఎం.రమేష్, ఏ–3 ఎస్.శేషుబాబు, ఏ–4 మేకా సతీష్, ఏ–5 టి.సత్యనారాయణ ను పోలీస్ కస్టడీకి కోరుతూ సీఐ కృష్ణ సోమవారం భీమడోలు కోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. ఈ కేసులో లోతైన విచారణ జరిపితే మరికొందరు బయటపడే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. వారమైనా చర్యల్లేవు నకిలీ టికెట్ల వ్యవహారంపై గత నెలలోనే దేవస్థానం డిపార్ట్మెంటల్ ఎంక్వయిరీ నిర్వహించింది. విచార ణాధికారిగా ఈఈ డీవీ భాస్కర్, ప్రజెంటింగ్ అధికారిగా ఏఈఓ ఎంఎస్ఎల్ వాసు, అసిస్టెంట్ ప్రజెంటింగ్ అధికారిగా సూపరింటెండెంట్ ఐవీ రామారావు వ్యవహరించారు. వీరు దేవస్థానంలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బందిని విచారించారు. అధికారులు, సిబ్బంది జాబ్ చార్ట్ ప్రకారం విధులు నిర్వర్తించలేదని తేల్చి నివేదికను ఈనెల 6న ఆలయ ఈఓ వై.భద్రాజీకి సమర్పించారు. మొదటి నుంచి తాత్సారమే.. టికెట్ల స్కామ్ గతనెల 15న వెలుగులోకి వచ్చింది. అదేరోజు ఈఓ భద్రాజీ స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యా దు చేశారు. అయినా డిపార్ట్మెంటల్ ఎంక్వయిరీ వేయడంలో తాత్సారం చేశారు. వారం తర్వాత ఎంక్వయిరీ వేయగా.. విచారణ చేపట్టిన అధికారులు నివేదిక సమర్పించి వారం గడిచినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. దీంతో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నకిలీ టికెట్ల స్కామ్లో ఐదుగురిని కస్టడీకి కోరనున్న సీఐ లోతైన విచారణతో మరికొందరి పాత్ర బయటపడే అవకాశం కొందరు ఉద్యోగుల్లో మొదలైన వణుకు -
లీజు చెల్లించి భూములు అప్పగించాలి
కాళ్ల: ఓఎన్జీసీ సంస్థ డ్రిల్లింగ్ నిమిత్తం తమ వద్ద తీసుకున్న భూమికి సంబంధించి లీజు చెల్లించి భూములను అప్పగించాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. కోలనపల్లిలో డ్రిల్లింగ్ భూమి ఆవరణలో ఎనిమిది స్థలాలకు సంబంధించిన రైతులు ఆదివారం సమావేశమయ్యారు. కాళ్ల, కోలనపల్లి, బొండాడ లంక, సీసలిలో రెండు, గణపవరం మండలం అడవికొలను, తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం కరవాక ప్రాంతాల్లో రెవెన్యూ శాఖ ద్వారా 1999లో అప్పగించామని అప్పటినుంచి 2018 జనవరి వరకూ లీజు సొమ్ము చెల్లించారన్నారు. నాటి నుంచి 2026 వరకూ సంస్థ ఎటువంటి లీజు చెల్లించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిది స్థలాలకు సంబంధించి సుమారు 50 మందికి పైగా రైతుల భూములు ఉన్నాయి. అధికారులను అడిగితే వీటిని ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాం లీజు సొమ్ములు వారే చెల్లిస్తారు, ఓఎన్జీసీకి ఎటువంటి సంబంధంలేదని చెబుతు న్నారని తెలిపారు. భూములను రైతుల ప్ర మేయం లేకుండా ఓఎన్జీసీ మూడో పార్టీకి ఎలా ఇచ్చారని రైతులు ప్రశ్నించారు. అయితే వారు ఎటువంటి డ్రిల్లింగ్ ఆపరేట్ చేయడంలేదని, ఓఎన్జీసీ సంస్థను అడిగినా సరైన సమాధానం చెప్పడంలేదన్నారు. పనులు జరగనప్పుడు లీజు సొమ్ములు చెల్లించి భూములు అప్పగించాలని కోరినా పట్టించుకోవడం లేదని వాపోయారు. -
అమ్మో.. మళ్లీ పులి
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతానికి పెద్దపులి మళ్లీ వచ్చేసింది. జనవరి 21న తెలంగాణలోని కావిడిగుండ్ల గ్రామం నుంచి రాష్ట్రంలోని ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం పందిరిమామిడిగూడెం గుబ్బల మంగమ్మ గుడి సమీపంలోకి ప్రవేశించిన పెద్దపులి వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ అటు ప్రజలను ఇటు అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకులేకుండా చేసిందనే విషయం పాఠకులకు తెలిసిందే. అలాగే జిల్లాలోని 13 పశువులపై దాడి చేసి హతమార్చింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 13న పోలవరం మండలం నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకం పరిసర ప్రాంతాల మీదుగా గోదావరి దాటుకుంటూ తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. అక్కడ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ అధికారులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడంతో రాయవరం మండలం పెద్ద కూర్మాపురంలో ఫారెస్ట్ అధికారుల ప్రత్యేక ఆపరేషన్తో పూనె నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్ మత్తు ఇంజక్షన్ ఇచ్చి పెద్దపులిని బంధించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన అనంతరం అధికారులు పెద్దపులిని పాపికొండల అభయారణ్యంలో తిరిగి విడిచిపెట్టారు. అయితే అడవి బాట పట్టిన పెద్దపులి మళ్లీ పోలవరం జిల్లాలోని పలు గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ క్రమంలో పెద్దపులి శనివారం మళ్లీ జిల్లాలోకి వచ్చేసింది. అయితే పెద్దపులిని పాపికొండల అభయారణ్యంలో వదిలినప్పుడు దాని కదలికలు గుర్తించేలా ఫారెస్ట్ అధికారులు రేడియో కాలర్ సిగ్నల్స్ను అమర్చారు. వీటి సిగ్న ల్స్ ఆధారంగా పులి కదలికలను ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ప్రస్తుతం పాపికొండల అభయారణ్యంలో సంచరిస్తున్న పులి మళ్లీ వచ్చిన మార్గంలోనే ఏలూరు జిల్లా దాటుకుని తెలంగాణ మీదుగా మహారా ష్ట్రలోని తడోబా అడవుల్లోకి చేరుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పెద్ద పులి (ఫైల్) బాబోయ్.. మళ్లొచ్చింది పాపికొండల అభయారణ్యంలో సంచారం రేడియో కలర్ సిగ్నల్స్ ద్వారా గుర్తింపు ‘తూర్పు’ నుంచి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి భయాందోళనలో గిరిజనులు అప్రమత్తం చేస్తున్న అటవీశాఖ అధికారులు జనవరి, ఫిబ్రవరిల్లో జిల్లాను వణికించిన పులి సంచారం -
అమ్మకానికి సర్కారీ కొలువులు
సిఫార్సు పత్రాలు ఆదివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి, భీమవరం: ‘మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం కావాలా?.. ఎస్సై ఉద్యోగం కావాలా?.. సివిల్ సప్లయిస్ డిపార్ట్మెంట్లోనా.. కలెక్టరేట్లోనా..’ ఎక్కడైనా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సర్కారు కొలువుల పేరిట కొందరు కూటమి నేతలు నిరుద్యోగులకు వలవేసి రూ.3 కోట్ల మేర వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తణుకు నియోజకవర్గంలోని అత్తిలి మండలంలో గత పది నెలల కాలంగా ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. సొమ్ములు చెల్లించి నెలలు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో బాధితులు ఉన్నారు. తెలిసిన వారి వద్ద తమ ఆవేదన చెబుతుండటంతో ఈ విషయం వెలుగుచూస్తోంది. అత్తిలి మండలంలోని ఒక గ్రామానికి చెందిన కొందరు నేతలు ప్రభుత్వంలో తమకున్న పలుకుబడితో పోలీస్, రెవెన్యూ, సివిల్ సప్లయిస్, రవాణా, కలెక్టరేట్ కార్యాలయం, తదితర ఏ ప్రభుత్వ శాఖలోనైనా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించినట్టు సమాచారం. విద్యార్హతను బట్టి కాసులు కుమ్మరించగలిగితే ఏలూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర ఏరియాల్లో ఆయా ఉద్యోగాల్లో కూర్చోబెడతామని నమ్మించి ఉద్యోగ స్థాయిని బట్టి రూ. 3 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అవసరమైతే స్థానికంగాను ఉద్యోగాలు ఇస్తామని నమ్మించినట్టు చెబుతున్నారు. తమ పిల్లలకు సర్కారు కొలువు దొరుకుతుందన్న ఆశతో కొందరు తల్లిదండ్రులు అప్పో సొప్పో చేసి సదరు నేతల చేతిలో పెట్టారంటున్నారు. అత్తిలి మండలంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన దాదాపు 50 మంది వరకు రూ.3 కోట్ల మేర వారికి కుమ్మరించినట్టు తణుకులో హాట్ టాపిక్గా మారింది. ఉద్యోగాల కోసం సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతస్థాయి నుంచి స్థానిక అధికారులకు సిఫార్సు చేస్తున్నట్టుగా ఉన్న పత్రాలను సొమ్ములు ఇచ్చిన వారికి అందజేసినట్టు సమాచారం. శిక్షణ పేరిట గత ఏడాది కొందరిని ఏలూరు తీసుకువెళ్లి పలు కార్యాలయాల్లో కూర్చోబెట్టినట్టు తెలుస్తోంది. ఏడాది కావస్తున్నా ఇంకా ఉద్యోగాలు రాకపోవడంతో కొందరు సదరు నాయకుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా మరికొందరు ఉద్యోగం వద్దని, తాము చెల్లించిన సొమ్ములు తిరిగి ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు పేరు చెప్పేందుకు నిరాకరించిన బాదితుడు ఒకరు తెలిపారు. అధికార కూటమిలో స్థానికంగా పలుకుబడి ఉన్న నాయకులు కావడంతో ఏ విధమైన ఆధారాలు లేకుండానే రూ.లక్షలు తీసుకువెళ్లి వాళ్ల చేతిలో పోశామన్నారు. ఉన్నతస్థాయిలో వారికి చెల్లించామని, అవి రావాల్సి ఉందని రేపు మాపు అంటూ తిప్పుకుంటున్నారని అంటున్నారు. బాదితులంతా చిన్నస్థాయి వారు కావడంతో ఈ విషయం బయటపెడితే ఉద్యోగం మాట ఎలా ఉన్నా తమ డబ్బులు తిరిగిరావన్న ఆందోళనతో ఎవరూ ముందుకురాని పరిస్థితి నెలకొంది. ఇదిలాఉండగా ఈ వ్యవహారం బయటకు పొక్కుతుండటంతో సదరు నేతలు బాధితుల ఇళ్లకు వెళ్లి వారిని బుజ్జగించే పనిలో పడ్డట్టు సమాచారం. ఉద్యోగాలు వద్దు.. మా సొమ్ములు మాకు తిరిగి చెల్లించమని ఒత్తిడి తెస్తున్న ముగ్గురికి తిరిగి సొమ్ములు చెల్లించినట్టు తెలుస్తోంది. నిరుద్యోగ యువతకు తణుకులో కూటమి నేతల ఎర ఉద్యోగాల పేరిట రూ.3 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూళ్లు దాదాపు 50 మంది నుంచి రూ.3 కోట్ల వసూళ్లు! మంత్రులు, ఐఏఎస్ అధికారుల పేరిట సిఫార్సు లేఖలు పది నెలలుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న బాధితులు -
బలహీన వర్గాల అభ్యున్నతికి ఫూలే కృషి
అంతర్జిల్లా నేరస్తుడి అరెస్టు చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నేరస్తుడిని నరసాపురం పోలీసులు అరెస్టు చేశారు. 108 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. 8లో uమామిళ్ళపల్లి జయప్రకాష్ ఏలూరు (టూటౌన్): వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని వైఎస్సార్సీపీ ఏలూరు ఇన్చార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్ అన్నారు. ఫూలే జయంతిని పార్టీ నగర కార్యాలయంలో శనివారం బీసీ నగర అధ్యక్షుడు కిలాడి దుర్గారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. జయప్రకాష్ పాల్గొని ఫూలే చిత్రపటానికి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాలకు కోసం ఫూలే చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, నగర వైఎస్సార్సీపీ నేతలు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపెయ్యి సుధీర్ బాబు, దాసరి రమేష్, మున్నుల జాన్ గుర్నాథ్, కొల్లిపాక సురేష్, ఇనపనూరి జగదీష్, కేదారేశ్వరి, విజయనిర్మల, కార్యకర్తలు పాల్గొన్నారు. -
విషాదం మిగిల్చిన విహారం
వాగులో పడి యువకుడి మృతి దెందులూరు/చింతూరు: పోలవరం జిల్లా చింతూరు మండలం తులసిపాక సమీపంలోని ఘాట్రోడ్డు సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద వాగులో పడి ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరానికి చెందిన కంతేటి రమేష్ (28) శనివారం మృతి చెందాడు. పది మంది స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. అనంతరం స్నానం చేయడానికి సోకిలేరు వాగులో దిగగా, లోతు అంచనా తెలియక మునిగిపోయాడు. రమేష్ను కాపాడేందుకు స్నేహితులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం చింతూరు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మోతుగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ ఇంటర్ వరకు చదివి కొబ్బరి దింపు కూలీగా జీవనం సాగిస్తున్నాడు. రమేష్కు ఏడాది క్రితం వివాహం కాగా భార్య, కుమారుడు ఉన్నారు. మూడు రోజుల క్రితం స్నేహితులతో కలిసి రామసింగవరం నుంచి బొలెరో వాహనంలో వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఏలూరు (టూటౌన్): కాలువలు కట్టేలోగా చెరువులను నీటితో నింపుకోవాలని జలవనరుల శాఖ ఎస్ఈ చిలకపాటి దేవప్రకాష్ సూచించారు. ఈ వేసవిలో ఏలూరు నగర ప్రజల దాహార్తిని తీర్చడం కోసం జలవనరుల శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ చిలకపాటి దేవ ప్రకాష్ జలవనరుల శాఖ ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేిశారు. మున్సిపల్ కార్పోరేషన్ ఇంజినీర్లతో సమన్వయం చేసుకొని కాలువలు కట్టే లోపు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
రాధాకృష్ణను అరెస్టు చేయాలి
చింతలపూడి: మహిళల పట్ల అనుచితంగా, అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణ, యాంకర్ వెంకటకృష్ణలను వెంటనే అరెస్ట్ చేయాలని చింతలపూడి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి కంభం విజయరాజు డిమాండ్ చేశారు. శనివారం చింతలపూడి పోలీస్ స్టేషన్లో మహిళా విభాగం నేతలతో కలిసి ఆయన ఫిర్యాదు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని మండిపడ్డారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరంగా మాట్లాడటం కేవలం రాజకీయ విమర్శ కాదని, ఇది సమాజంలో మహిళల గౌరవాన్ని కించపరిచే ప్రమాదకర చర్య అని ధ్వజమెత్తారు. సోషల్ మీడియా కార్యకర్తలను టీం బ్యాచ్ అంటూ కించపరచడం, వారిపై వ్యక్తిగత దూషణలకు దిగడం అనైతికమని పేర్కొన్నారు. రాధాకష్ణ, వెంకటకష్ణలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యన డిమాండ్ చేశారు. ఎంపీపీ డా.బి.రాంబాబు నాయక్, పట్టణ అధ్యక్షుడు కొప్పుల నాగేశ్వరరావు, జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వరరావు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కనమతరెడ్డి చండీప్రియ, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు త్సల్లాబత్తుల శ్రీనివాసరావు, మున్సిపల్ విభాగం కార్యదర్శి ఎ.సుబ్బారావు, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్.కాంతారావు, బీసీ విభాగం అధ్యక్షుడు ఎం గురుబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. -
సమాజంపై బాధ్యతగా ఉండాలి
నరసాపురం రూరల్: ప్రతి ఒక్కరూ భగవంతుని పట్ల భక్తి, సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని త్రిదండి చినజీయర్ స్వామి ప్రబోధించారు. స్థానిక ఆదికేశవ ఎంబర్ మానార్ స్వామి ఆలయంలో రాజగోపురం నిర్మాణ పనులకు శనివారం ఆయన శాస్త్రోకంగా భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ సనాతన ధర్మం విశిష్టతను, రామానుజాచార్యుల వారి సిద్ధాంతాలను వివరించారు. వ్యవస్థల పట్ల విశ్వాసంతో మెలగాలని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. రాజగోపుర నిర్మాణానికి సహకరించిన దాతల కుటుంబ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆలయ చైర్మన్ పుప్పాల కృష్ణారావు, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ఆలయ ఈవో పి.కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. -
హిజ్రాలను అడ్డుకున్న పోలీసులు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో శనివారం రాత్రి కొందరు హిజ్రాలకు ఎస్సై టి.సుధీర్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి క్షేత్రంలో కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈనెల 5న ‘సాక్షి’లో ‘శ్రీవారి ఆలయంలో హిజ్రాల రౌడీయిజం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి పోలీస్ అధికారులు స్పందించారు. శనివారం రాత్రి క్షేత్రంలో భారీగా వివాహాలు జరుగుతున్న నేపథ్యంలో హిజ్రాలను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా 15 మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. ఈ సందర్భంగా టవేరా కారులో కొండపైకి వెళుతున్న 10 మంది హిజ్రాలను ఎస్సై టి.సుధీర్ సిబ్బందితో కలిసి టోల్గేటు వద్ద అడ్డుకున్నారు. పెళ్లిళ్లకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేసి, దౌర్జన్యాలకు పాల్పడటం సరికాదన్నారు. క్షేత్రంలో జరిగే పెళ్లిళ్లకు వెళ్లడానికి ఇక వీల్లేదన్నారు. కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఎం.రవికుమార్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిరసనలో పాల్గొన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయాలని, 36 శాతం ఐఆర్ మంజూరు చేయాలని, పాత పెన్షన్ పద్ధతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో శనివారం సాయంత్రం ఓ భక్తుడు పాము కాటుకు గురయ్యాడు. స్థానికులు వెంటనే పీహెచ్సీకి, అక్కడి నుంచి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విజయవాడకు చెందిన ఆర్అండ్బి ఉద్యోగి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలసి ఉదయం క్షేత్రానికి విచ్చేశాడు. ఆదివారం ఉదయం నిత్యకల్యాణంలో పాల్గొనాలని ధర్మఅప్పారాయ నిలయంలో గదిని అద్దెకు తీసుకున్నాడు. సాయంత్రం వెంకటేశ్వరరావు బయటకు వెళ్లే క్రమంలో, సత్రం ముఖ ద్వారం వద్దకు వచ్చేసరికి అక్కడ మెట్లపై ఉన్న పాము ఆయన కాలి బొటన వేలుపై కరిచింది. వెంటనే ఆయనను స్థానిక పీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి 108 ఆంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏలూరు (టూటౌన్): సామాజిక సంస్కరణలతో పాటు మహిళా విద్యకు పాటుపడిన మహా వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకలు కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చైతన్యవంతమైన జీవితం సాగించేందుకు విద్య చాలా అవసరమని ఫూలే ఆనాడే చెప్పారని, దానిని ఆచరించారన్నారు. పేద వర్గాల అభివృద్ధికి ఫూలే చేసిన సేవలు నేటి తరం వారికి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.ఎం. జె.అభిషేక్ గౌడ పాల్గొన్నారు. -
కార్యకర్తలకు అండగా ఉంటాం
కాళ్ల: చంద్రబాబు పాలనలో కుల మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. కాళ్ళ మండలం పెదఅమిరంలో పదవీ విరమణ చేసిన ఉండి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సర్పంచులకు సత్కార కార్యక్రమం నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ సర్పంచులుగా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లను తీసుకొచ్చి వలంటీర్ వ్యవస్థతో గ్రామాల్ని అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. కూటమి పరిపాలనలో రెండేళ్లు సర్పంచ్లకు ప్రోటోకాల్ కూడా లేకుండా చేశారన్నారు. కార్యక్రమంలో నరసాపురం నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణరాజు, ఆకివీడు మండల పార్టీ అధ్యక్షుడు నంద్యాల సీతారామయ్య, జెడ్పీటీసీలు రణస్తుల మహంకాళి, వేగేశ్న వెంకట రాజు, ఆకివీడు మున్సిపల్ చైర్పర్సన్ జామి హైమా వతి మాట్లాడారు. పదవీ విరమణ చేసిన సర్పంచులు, ఉప సర్పంచ్లను ఘనంగా సత్కరించారు. ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గాప్రసాద్ రాజు, ఉండి ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి రాజు, ఉండి మండల అధ్యక్షుడు ఆంజనేయరాజు, పాలకోడేరు మండల అధ్యక్షులు పాపారావు, ఆకివీడు పట్టణ అధ్యక్షుడు అంబటి రమేష్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ పాల్గొన్నారు. ఉండి నియోజవర్గంలో కులమతాల మధ్య చిచ్చు పెట్టడంతో ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను గెలిపిస్తే సంపద సృష్టిస్తాం, ప్రత్యేక నిధులు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తారని అనుకుంటారని, ఉండి నియోజకవర్గంలో మాత్రం దాని విరుద్ధంగా నడుస్తుందన్నారు. ఇప్పుడు అమరావతిలో రూ.2 లక్షల కోట్లు ఖర్చుపెట్టి రాజధానిగా చేస్తానని చెబుతున్నారని.. రాజధాని నిర్మాణానికి రూ. 10 లక్షల కోట్లు ఉంటే తప్ప పూర్తి కాదని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారన్నారు. గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ మూడు ప్రాంతాల అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని మావిగన్ను జగన్ సూచించారని, కూటమి నాయకుల దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నరసింహరాజు మాట్లాడుతూ కూటమి నాయకుల ఒత్తిళ్లకు లొంగకుండా కట్టుబడి ఉన్న సర్పంచులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఆరోగ్య శ్రీ లేదని, ఫీజు రీయింబర్స్మెంట్ లేదని, ఒక్క పథకం కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వటం లేదన్నారు. ఉండి నియోజకవర్గంలో ఇళ్లు పడగొట్టడం వంటివి చేశారని, ఇప్పుడు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు పొందేందుకు చూస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో పోరాటాలకు సిద్ధం కావాలని ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా అండగా ఉండాలని కోరారు. కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు ఉండి నియోజకవర్గంలో భయపడే పరిస్థితి తీసుకొచ్చారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు -
వన్యప్రాణుల దాహార్తి తీర్చేలా..
● అడవిలో సోలార్ పంపులతో నీటి సదుపాయం ● వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు బుట్టాయగూడెం: వేసవిలో అటవీ ప్రాంతంలోని వన్యప్రాణుల దాహర్తిని తీర్చేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గత రెండేళ్లుగా వన్యప్రాణి సంరక్షణ కోసం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నీటితొట్టెలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో వేసవిలో నీటి కోసం పలు రకాల వన్యప్రాణులు అటవీ పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వచ్చేవి. ఆ సమయంలో పలు వన్యప్రాణులు కుక్కల బారిన లేదా వాహనాల కింద పడి మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో నీటితొట్టెలు ఏర్పాటు చేసి వాటి దాహర్తి తీర్చేలా కృషి చేస్తున్నారు. 60 నీటికుంటల ఏర్పాటు పాపికొండల అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో వన్యప్రాణులకు వేసవిలో దాహర్తిని తీర్చేవిధంగా సుమారు 60 నీటి తొట్టెలను ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. వీటితోపాటు అటవీ ప్రాంతంలోని కాల్వల్లో 20 చెలమలను తీసి, వన్యప్రాణులకు నీటి సౌకర్యం లభించేలా చర్యలు తీసుకున్నారు. అవి కాకుండా 25 చెక్డ్యామ్స్ ద్వారా నీటిని నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా నీటితొట్టెల్లో వేసవికాలంలో నాలుగు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా బేస్ క్యాంప్ సిబ్బంది, బీట్ అధికారులు నీటిని తీసుకొచ్చి నింపుతున్నారు. వాహనాల్లో వెళ్ళలేని నీటి తొట్టెల వద్దకు బేస్క్యాంప్ సిబ్బంది వెళ్లి నింపుతారు. పక్కన ఉప్పు ముద్దలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నీటి కోసం వచ్చిన వన్యప్రాణులు దాహర్తిని తీర్చుకుని ఉప్పు ముద్దను నాకుతాయని దీనితో వడదెబ్బ బారి నుంచి కాపాడుకునే అవకాశాలు ఉంటాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. నీటిని నింపేందుకు రూ.1.50 లక్షల కేటాయింపు వేసవి కాలంలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేలా ప్రభుత్వం సుమారు రూ. 1.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు చెబున్నారు. ఈ నిధులతో వేసవిలో అడవుల్లో నీటి తొట్టెలు నింపేందుకు మాత్రమే ఖర్చు చేస్తామని అధికారులు తెలిపారు. పాపికొండల్లో 14 రకాల జంతువుల సంచారం 1,12,500 లక్షల హెక్టార్లలో పాపి కొండల అభయారణ్యం విస్తరించి ఉంది. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పాపికొండల అభయారణ్యం పరిధిలో ఉన్న బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. వైల్డ్లైఫ్ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమేరాలకు చిక్కుతున్నాయి. వాటి సంరక్షణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు, పాపికొండ అభయారణ్యంలో ఎలుగు బంట్లు, కొండ గొర్రెలు, జింకలు, కొండ చిలువలు, అడవి పందులు, ఆగలి, చిరుతలు, ముళ్ల పందులు, దున్నలు వంటి అనేక జంతువులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పాపికొండల అభయారణ్యం లోని వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక కృషి చేస్తున్నాం. సుమారు 60 నీటి తొట్టెలు వన్యప్రాణులు సంచరించే ప్రదేశాల్లో ఏర్పాటు చేశాం. వేసవిలో నాలుగు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా నీటిని పోసి తొట్టెలు నింపుతున్నాం, జంతువులకు నీటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. – ఎస్కే వలీ, అటవీ శాఖ రేంజ్ అధికారి, పోలవరం -
లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
● 13 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు ● సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో ఘటన కోదాడ రూరల్ : లారీని వెనుక నుంచి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో 13 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ పట్టణ పరిధిలోని మేళ్లచెర్వు ఫ్లై ఓవర్ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి ఇంట్రసిటీ స్మార్ట్ ట్రావెల్స్కు చెందిన బస్సు 46 మంది ప్రయాణికులతో ఏపీలోని ఏలూరుకు బయల్దేరింది. శనివారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ సమీపంలోకి రాగానే విజయవాడ వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. డ్రైవర్తో పాటు 13 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని స్థానికులు అంబులెన్స్లో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కోదాడ పట్టణ సీఐ శివశంకర్ తెలిపారు. చికిత్స అనంతరం ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. -
నేత్రపర్వం.. ఎదుర్కోలు ఉత్సవం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్ర ఉపాలయమైన లక్ష్మీపురం ఆలయంలో శ్రీనివాసుని దివ్య కల్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శనివారం రాత్రి స్వామి, అమ్మవార్లకు నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవం భక్తులకు కనువిందు చేసింది. ఉదయం ఆలయ యాగశాలలో అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థులు హోమాది కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే ఆలయ ఆవరణలో శ్రీనివాసుడు, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి ప్రత్యేక అలంకారాలు చేసి, హారతులిచ్చారు. రాత్రి ఆలయంలో స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవాన్ని జరిపి, భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. వివాహం జరిగే ముందురోజు వధూవరులు తరఫు బంధువులు శుభలేఖను పఠించేందుకు జరిపే కార్యక్రమమే ఎదుర్కోలు ఉత్సవమని పండితులు తెలిపారు. కల్యాణానికి ఏర్పాట్లు శ్రీనివాసుని దివ్యకల్యాణ మహోత్సవాన్ని ఆదివారం రాత్రి అట్టహాసంగా జరుపనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కల్యాణ మండప ప్రాంతాన్ని విద్యుద్దీపాలు, పుష్పమాలికలు, మామిడితోరణాలు, అరటి బోదెలతో సుందరీకరించారు. -
అంతర్ జిల్లా నేరస్తుడి అరెస్టు
నిందితుడి నుంచి 108 గ్రాముల బంగారం, కిలో వెండి రికవరీ నరసాపురం రూరల్: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నేరస్తుడిని నరసాపురం టౌన్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 108 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. నరసాపురం పట్టణానికి చెందిన గంగులకుర్తి శ్రీనివాసరావు మార్చి 27న కుటుంబంతో కలసి షిరిడీ యాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాసరావు ఇంటి తాళాల పగులగొట్టి బంగారు, వెండి ఆభరాణాలను అపహరించారు. ఈనెల 6న యాత్ర ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన శ్రీనివాసరావు దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం నరసాపురం మెయిన్రోడ్డువద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు తణుకు పట్టణానికి చెందిన సింగారపు ఈశ్వరరావుగా గుర్తించారు. అతడిపై నరసాపుపరంతో పాటు ఏలూరు, తాడేపల్లిగుడెం, భీమవరం, తణుకు, పాలకొల్లు, రాజమండ్రి వంటి సుమారు 20 ప్రాంతాల్లో చోరీ కేసులు ఉన్నాయి. కేసు ఛేదనలో చురుగ్గా వ్యవహరించిన నరసాపురం టౌన్ సీఐ యాదగిరి, సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. -
పాడికి వేసవి గండం
● పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాల దిగుబడిపై ప్రభావం ● జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న పశువైద్యులు యలమంచిలి : వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో పశువులు అల్లాడిపోతుంటాయి. దీంతో పాల దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటించి పశువులను సంరక్షించుకోవాలని మండల పశు వైద్యాధికారి డాక్టర్ పెంటపాటి వరప్రసాద్ పాడి రైతులకు సూచిస్తున్నారు. పశువులను ఉదయం, సాయంత్రం మాత్రమే మేతకు తీసుకెళ్లాలి. రోజుకు రెండు, మూడు సార్లు చల్లని నీటితో కడగాలి. ఉష్ణోగ్రతలను అదుపు చేసేందుకు వీలుగా కొట్టం చుట్టూ తడిపిన గోనె సంచులు కట్టాలి. వీలైనంత వరకు పచ్చి గడ్డి అందించాలి. పశువులకు సరిపడా నీరు నిరంతరం అందుబాటులో ఉంచాలి. – డాక్టర్ పెంటపాటి వరప్రసాద్, మండల పశు వైద్యాధికారి -
ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ
కైకలూరు : పామర్రు–దిగమర్రు జాతీయ రహదారిపై పల్లెవాడ గ్రామం వద్ద ఆగిఉన్న ట్రాక్టర్ను మాచర్ల నుంచి నిడదవోలు వెళుతున్న ధాన్యం లోడు లారీ శనివారం ఉదయం ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ట్రాక్టర్ వద్ద ఎవరూ లేరు. ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే కారణమని భావిస్తున్నారు. పోలీసులు ప్రమాద ఘటనపై విచారిస్తున్నారు. ముసునూరు: సరిహద్దు వివాదంలో దాడి చేసిన ముద్దాయికి కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఎస్సై ఎం.చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం వలసపల్లిలో జూన్ 27, 2020న పల్లి పాము హేమలత (59)ను సమీప నివాసి గొల్లపల్లి సుశీల(47) సరిహద్దు వివాదంలో కరత్రో కొట్టి తీవ్రంగా గాయపరచింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి ముసునూరు ఎస్సై కేసు నమోదు చేసి, చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో నూజివీడు జేఎఫ్ సీఎం జడ్జి ముద్దాయికి ఆరు నెలల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధించినట్లు ఎస్సై ఎం చిరంజీవి శనివారం తెలిపారు. టి.నరసాపురం: నిషేదిత కలుపు మందు కలిగిఉన్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు హెచ్సీ ఎం.రాజు తెలిపారు. మండలంలోని గుర్వాయిగూడెంకు చెందిన కమ్మ నాగేశ్వరరావు వద్ద నిషేదించిన గ్లైసెల్ కలుపు మందు ఉందన్న సమాచారంతో అతని వ్యవసాయ క్షేత్రంలో ఏవో ఎం.ప్రియాంక శనివారం తనిఖీలు నిర్వహించారు. నాగేశ్వరరావు పామాయిల్ తోటలోని షెడ్డులో రూ.2,93,400 విలువ చేసే 360 లీటర్ల నిషేదిత గ్లైసెల్ కలుపు మందు బాటిళ్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. భీమవరం (ప్రకాశంచౌక్): ఇటీవల న్యూఢిల్లిలో జరిగిన అడ్వెంచర్ నేషనల్ స్పోర్ట్స్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఓపెన్ చాంపియన్షిప్ మీట్ 2026లో జిల్లా ఉప మలేరియా అధికారి యాతం నాగబాబు పతకాలు గెలుచుకున్నారు. 800, 1500 మీటర్ల పరుగులో మొదటి స్థానంతో బంగారు పతకాలు, 400 మీటర్ల పరుగులో 2వ స్థానంతో వెండి పతకాలు గెలుచుకున్నట్లు ఆయన చెప్పారు. 2027లో జపాన్లో జరిగే ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ పరుగు పందెం పోటీలకు ఎంపికై నట్లు నాగబాబు తెలిపారు. -
శ్రీనివాసా.. చిద్విలాసా
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రంలో శనివారం భక్తులు పోటెత్తారు. శ్రీవారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ రెండవ శనివారం, ఇంటర్మీడియెట్, పదోతరగతి విద్యార్థులకు సెలవులు కావడంతో వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో కిక్కిరిశాయి. పలు భజన మండలి సభ్యులు ఆలయ ఆవరణలో ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరుల మదిని హత్తుకున్నాయి. సాయంత్రం వరకు ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. పెనుగొండ: అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని వాసవీ శాంతి థాంలో శశనివారం వాసవీ శాంతి హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం నుంచి 102 అడుగుల రుషీ గోత్ర మందిరంలోని 92 అడుగుల వాసవీ మాత పంచలోహ విగ్రహాన్ని దర్శించుకొని, మరకత శిల వాసవీ మాతకు పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం, యాగ శాలలో వాసవీ శాంతి హోమం వేద మంత్రోచ్ఛారణల మధ్య హోమం నిర్వహించి, పూర్ణాహుతి సమర్పించారు. -
మారుతున్న డెల్టా స్వరూపం
● నానాటికీ తగ్గిపోతున్న పంటల విస్తీర్ణం ● ఇష్టానుసారంగా చేపల చెరువుల తవ్వకాలే కారణం ఉంగుటూరు: డెల్టా ప్రాంతంలో పంట భూముల విస్తీర్ణం నానాటికి తగ్గిపోతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు అక్రమార్కులు అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా చేపలు చెరువులు తవ్వడంతో డెల్టా స్వరూపం నానాటికి మారిపోతోంది. ప్రధానంగా రావులపర్రు ఆయకట్టులో ఇబ్బడిముబ్బడిగా చేపల చెరువులు తవ్వడంతో ఆయకట్టులోని సగం విస్తీర్ణం చేపలు చెరువులుగా మారిపోయింది. ఇప్పటికే ఈగ్రామానికి పక్కనే ఉన్న రాచూరు, శీతారామపురం ఆయకట్టులో పూర్తిగా చెరువులుగా మారిపోయాయి. కాకర్లమూడి, దొంతవరం ఆయకట్టులో సగ భాగం చేపలు చెరువులుగా మారిపోయాయి. దీంతో కాలుష్య ప్రభావం ఎక్కువయ్యే ప్రమాదం ఏర్పడుతోంది. చెరువులుగా మారని పంట చేలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చేపలు చెరువులుగా మార్చుకోవాల్సి వస్తోంది. ఏలూరు జిల్లాలో ఎక్కువ విస్తీర్ణం వరి పంట పండేది ఉంగుటూరు మండలమే. అలాంటిది ఇక్కడ పంట విస్తీర్ణం తగ్గిపోయి చేపల చెరువులు పెరిగిపోతున్నాయి. రావులపర్రు–రాచూరు మధ్యలో వంద ఎకరాలు విస్తీర్ణంలో చేపలు చెరువులు తవ్వకాలు జరగుతున్నాయి. ఇలా చెరవులు తవ్వడం వలన మత్స్య శాఖ, రెవెన్యూ అధికారులకు కాసుల పంట పండినట్టే. దీంతో అక్రమార్కులు ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా చేపల చెరువుల తవ్వకాలు చేపడుతున్నా అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోవడం లేదు. -
నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్
ఆగిరిపల్లి: మండల కేంద్రమైన ఆగిరిపల్లిలో నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్ తెలిపారు. శనివారం ఉదయం ఆగిరిపల్లిలోని కొండ కాలనీలోని ఇళ్లు, వాహనాలను డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి ధ్రువపత్రాలు లేని 47 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా సంబంధిత నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడంలో ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. అనంతరం పోలీసు అధికారులు ప్రజలతో కలిసి డీఎస్పీ ప్రసాద్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో నూజివీడు టౌన్, రూరల్ సీఐలు సత్య శ్రీనివాస్, రామకృష్ణ, ఎస్సైలు శుభశేకర్, నాగేశ్వరరావు, రామకృష్ణ, చిరంజీవి 50 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కొయ్యలగూడెం: హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై బి.చంద్రశేఖర్ శనివారం పేర్కొన్నారు. సీఐ బాల సురేష్ తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కొయ్యలగూడెంలోని ఎస్టీ నగర్లో వరసకు అత్త అయిన పోలా మంగమ్మ అనే వృద్ధురాలిని అల్లుడు కేదారి పుల్లయ్య ఈనెల 10వ తేదీన హత్య చేసి పరారయ్యాడన్నారు. అచ్యుతాపురం సమీపంలో నిందితుడు పుల్లయ్యను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు చెప్పారు. భీమవరం (ప్రకాశంచౌక్): వర్కింగ్ జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు అమలు చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ను మరో ఏడాది అనగా 2026–27కు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్ జీఓఎంస్ సంఖ్య 43 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీఓఎంస్ సంఖ్య 12 ద్వారా 2015లో అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్టులు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అదే విధంగా ఫ్రీలాన్స్, వెటరన్ జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) మాదిరిగా వివిధ ఎంపానల్డ్ ఆసుపత్రుల ద్వారా గుర్తింపు పొందిన అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా క్యాస్ లెస్ వైద్య సేవలు అందించే లక్ష్యంతో వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్స్కీమ్ (డబ్ల్యూజెహెచ్ఎస్)ను ప్రవేశపెట్టడం జరిగింది. జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు. -
నిందితుడి షాపు తొలగింపు
పెనుగొండ: ఆచంట మండలం కొడమంచిలిలో ఆరేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడిన వెలగన వెంకటస్వామి షోడా షాపును పోలీసులు తొలగించారు. చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల పాపపై 70 ఏళ్ల వృద్ధుడు బుధవారం అఘాయిత్యానికి పాల్పడిన సంగతి విధితమే. కాగా, నిందితుడు పరారీలో ఉండడంతో రోడ్డు ఆక్రమణలో ఉన్న అతడి దుకాణాన్ని పెనుగొండ సీఐ రాయుడు విజయ్కుమార్ ఆధ్వర్యంలో ఆచంట ఎస్సై కె.వెంకట రమణ జేసీబీతో కూల్చివేశారు. నిందితుడు కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే కేసు నమోదు చేశామని వివరించారు. అయితే బాధితురాలికి అందించాల్సిన ప్రభుత్వ సహాయం వెంటనే అందించాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. ముక్కు పచ్చలారని బాలికపై అఘాయిత్యానికి పాల్పడినా ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రకటనలు లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బలహీన వర్గానికి చెందిన కుటుంబం కావడంతో ఎవరి అండదండలు లేకపోవడంతో న్యాయం జరగడం లేదంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఆగని మట్టి అక్రమ తవ్వకాలు
ద్వారకాతిరుమల: మండలంలోని సత్తాలచెరువులో మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఓ పచ్చ నాయకుడు రాత్రి వేళల్లో యథేచ్ఛగా ఈ దందాను సాగిస్తున్నాడు. పెద్దస్థాయిలో మట్టి తరలింపు జరుగుతన్నా అధికారులెవరూ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. దాంతో అద్దూఅదుపు లేకుండా ఈ దందా సాగిపోతోంది. గ్రామంలోని సత్తాల ఇరిగేషన్ చెరువులో ఓ టీడీపీ నాయకుడు రాత్రి, పగలు తేడా లేకుండా మట్టి అక్రమ తవ్వకాలు జరుపుతున్నాడు. జేసీబీ సహాయంతో మట్టిని తవ్వి, టిప్పర్ల ద్వారా మట్టిని బయటకు తరలించేస్తున్నాడు. ఒక్కో టిప్పర్ మట్టిని దూరాన్ని బట్టి రూ. 7 వేల నుంచి 12 వేలకు విక్రయిస్తున్నాడు. ప్రజాధనాన్ని బహిరంగంగా దోచేస్తున్నా పట్టించుకునే నాథుడు లేకపోవడం దారుణమని గ్రామస్తులు అంటున్నారు. అధికారుల తీరుపై పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు. -
భూసర్వేపై గిరిజనుల కన్నెర్ర
కుక్కునూరు: మండలంలోని అరవపల్లి రెవెన్యూ పరిధిలో నిర్వాసితుల కోసం సేకరించే భూముల సర్వేను స్థానిక గిరిజన రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. వివరాల ప్రకారం పోలవరం జిల్లా, ముంపు మండలాల్లో ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరిధిలో ముంపునకు గురవుతున్న గిరిజన నిర్వాసితులకు భూమికి భూమి పరిహారం అందించేందుకు మండలంలోని అర్వపల్లి రెవెన్యూ పరిధిలో భూములను సేకరించే దిశగా అధికారులు శుక్రవారం సర్వే చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక గిరిజన రైతులు సర్వే జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి తమకు తెలియకుండా ఎలా సర్వే నిర్వహిస్తారు? అని అడ్డుకున్నారు. తహసీల్దార్కు వినతి సర్వే అడ్డుకున్న అనంతరం కుకునూరు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్కు సర్వే నిలిపేయాలని కోరుతూ మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక దాచారం, గొమ్ముగూడెం గిరిజన రైతులు మాట్లాడుతూ, తాత ముత్తాతల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది గిరిజనేతరులు గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాదారులుగా వారి పేర్లను మార్పు చేసుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించి పరిహారాన్ని పొందాలని గిరినేతర్లు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ఆధీనంలో ఉన్న భూములను కనీస సమాచారం తెలియపరచకుండా పిసా గ్రామసభలు నిర్వహించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్వహిస్తున్న ఈ సర్వేను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దీనిపై గిరిజనులంతా ఏకమై పోరాటం చేస్తామని హెచ్చరించారు. అధికారులను సర్వే నిలిపేయాలని అడ్డుకుంటున్న గిరిజన రైతులు తహసీల్దార్ కార్యాలయం ధర్నా చేస్తున్న గిరిజన రైతులు భూముల సర్వేకు వచ్చిన అధికారులు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయని అందుకే సర్వే చేస్తున్నామని చెబున్నారు. తాత ముత్తాతల తరాల నుండి సాగు చేసుకుంటున్న గిరిజన భూములకు పిసా గ్రామ సభలు నిర్వహించకుండా ప్రభుత్వం సర్వే చేయమని ఎలా ఆర్డర్స్ ఇస్తుంది. ఈ భూములను గిరిజన రైతుల పేర్లపై మార్చాలని మేము గతంలో ఉన్నతాధికారులు కలిసి దరఖాస్తు కూడా అందించాం. –సోడే వెంకటేష్, పిసా కమిటీ అధ్యక్షుడు, అరవపల్లి, కుక్కునూరు గిరిజన ఆధీనంలో ఉన్న భూములను గిరిజనులకు తెలియజేయకుండా ప్రభుత్వం గిరినేతర్లకు కట్టబెట్టాలని చూస్తుంది. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని సర్వేను నిలిపివేయాలి. గిరిజన రైతులకు న్యాయం చేయాలి. లేకపోతే పెద్దస్థాయిలో ఉద్యమిస్తాం. – సోడే చంద్రయ్య, గిరిజన రైతు, అరవపల్లి, కుక్కునూరు మండలం -
తోకతిప్ప పంట కాలువ మురుగునీటితో కలుషితం
భీమవరం అర్బన్: మండలంలోని తోకతిప్ప పంట కాలువలోకి కొంతమంది ఆక్వా రైతులు యనమదుర్రు డ్రైయిన్లోని మురుగునీరు మోటార్లతో తోడేయడంతో కలుషితమవుతుంది. ఈ పంటకాలువ గొల్లవానితిప్ప, గూట్లపాడు రేవు, తోకతిప్ప, బరువానిపేట గ్రామాలకు సాగు, తాగు నీరు అందుతుంది. ఈ నెల 15 పంట కాలువలకు నీరు నిలుపుదల చేయనున్న నేపథ్యంలో ముందస్తుగా తోకతిప్ప గ్రామంలోని రక్షిత మంచినీటి చెరువుకు తాగునీటిని నింపాల్సి ఉంది. అంతేకాకుండా ప్రతి ఏటా చేపలు, రొయ్యల చెరువులకు వంతుల వారీ విధానం ద్వారా నీటిని నింపుకుంటున్నారు. తోకతిప్ప– బరువానిపేట గ్రామాల మధ్యలో కొంతమంది రైతులు యనమదుర్రు డ్రెయిన్లోని కలుషిత మురుగునీటిని పంట కాలువల్లోకి తోడుకుని అక్కడి నుంచి తమ చెరువుల్లోకి నీటిని మోటార్లతో నింపుకోవడంపై పలువురు గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ చర్యలను అడ్డుకోవాల్సిన ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా పంటకాలువల్లోకి యనమదుర్రు డ్రెయిన్లోని మురుగునీటి తోడుతున్నా పట్టించుకోవడం లేదని దీంతో తోకతిప్ప, గూట్లపాడు రేవు వరకు పంట కాలువలోని జలాలు కలుషితమవుతున్నాయని రైతులు వాపోతు న్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పంటకాలువల్లోని మురుగునీటిని తోడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
నేత్రపర్వం.. ధ్వజారోహణం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధ్వజారోహణ వేడుక శుక్రవారం రాత్రి నేత్రపర్వంగా సాగింది. శ్రీనివాసుని దివ్యకల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని ఈ వేడుకను భక్తుల గోవింద నామస్మరణల నడుమ అట్టహాసంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో కల్యాణమూర్తులకు అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. రాత్రి ధ్వజారోహణ కార్యక్రమం నిమిత్తం యాగశాలలో ధ్వజపటంపై గరుత్మంతుని చిత్రపటాన్ని అర్చకులు, పండితులు వేద మంత్రోచ్ఛరణలతో లిఖించారు. పూజలు, హోమాది కార్యక్రమాల అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేదమంత్రోచ్ఛరణల నడుమ ధ్వజపటానికి హారతులిచ్చి, దానిని ధ్వజస్తంభంపై ఎగురవేశారు. శ్రీనివాసుని కల్యాణ మహోత్సవాలను వీక్షించేందుకు సర్వాది దేవతలను ఆహ్వానించే క్రమంలో ఈ ధ్వజారోహణ తంతును నిర్వహిస్తామని అర్చకులు జరిపారు. -
ఇదెక్కడి ‘పచ్చ’పాతం?
ఏలూరు (టూటౌన్): జిల్లా పరిషత్ సెంటర్లో ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారుల వైఖరిపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలను తొలగిస్తున్నా టీడీపీ నాయకులకు చెందిన షాపులను ఎందుకు వదిలేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే నిత్యం రద్దీగా ఉండే జిల్లాపరిషత్ సెంటర్ నుంచి ఇండోర్ స్టేడియం, కలెక్టరేట్కు వెళ్లే మార్గంలో జిల్లాపరిషత్ దుకాణ సముదాయాల వద్ద ఫుట్పాత్లు, డ్రెయిన్లు ఆక్రమించేసి వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ ఇక్కట్లు ఏర్పడుతున్నాయి. అలాగే డ్రెయిన్లలో సిల్ట్ తొలగింపు ఇబ్బందిగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఈ సమస్య పరిష్కరించాలని ఇటీవల కాలంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో కార్పొరేషన్ అధికారులు శుక్రవారం జిల్లాపరిషత్ కూడలిలో ఉన్న పుట్పాత్, డ్రెయిన్ల ఆక్రమణలు తొలగింపునకు శ్రీకారం చుట్టారు. అయితే ఇక్కడా పచ్చపాతమే చూపించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి రాజకీయ పలుకుబడి లేని వారి దుకాణాలు ముందు యథేచ్చగా యంత్రాలతో పగుల గొట్టిన సిబ్బంది, రాజకీయ పలుకుబడి మెండుగా ఉన్న ఓ టీడీపీ నాయకుడి షాపు ముందు పుట్ ఫాత్పై నిర్మించిన జ్యూస్ షాపు జోలికి మాత్రం వెళ్లక పోవడం గమనార్హం. దీంతో ఇదెక్కడి న్యాయం? అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. రాజకీయ పైరవీలకు తావివ్వకూడదు పట్టణంలో ఇటీవల కాలంలో ఆక్రమణలు భారీగా పెరిగాయి. అయితే ప్రజల ఫిర్యాదులతో ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టారు. అయితే ఆక్రమణలు తొలగించే విషయంలో వీడు మనవాడా? కాదా అనే విషయాలతో పాటు రాజకీయ పైరవీలకు చోటివ్వకుండా ఎవ్వరైనా ఒక్కటే అన్న చందంగా ఆక్రమణలు తొలగించాలని పట్టణవాసులు కోరుతున్నారు. సాధారాణ వ్యక్తుల దుకాణాలకు సంబంధించిన ఆక్రమణలు తొలగిస్తున్న నగరపాలక సంస్థ సిబ్బంది, రాజకీయ నాయకులు జోలికి వెళ్లకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ అండా లేని వారి, ప్రతిపక్షనాయకులకు చెందిన వాటిని ధ్వంసం చేసి తమ పార్టీకి చెందిన వారికి మాత్రం వెసులుబాటు కల్పించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా పరిషత్ సెంటర్లో ఆక్రమణలు తొలగింపులో అధికారుల వింత వైఖరి డ్రెయిన్లపై కట్టిన టీస్టాల్, ఇతర నిర్మాణాల తొలగింపు టీడీపీ నాయకుడి జ్యూస్ షాపు జోలికి వెళ్లని వైనం -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ముమ్మిడివరం: స్థానిక జాతీయ రహదారి కాశివాని తూము బైపాస్ రోడ్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో పాలకొల్లు ప్రాంతం గగ్గిపర్రుకు చెందిన రందికట్ల ఏసురాజు (18) మృతి చెందగా లంకల కోడేరుకు చెందిన కొయ్య రాజకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వీరు యానాం నుంచి మోటారు సైకిల్పై వస్తూ ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయి ఈ ప్రమాదానికి గురయ్యారు. వాహనంపై వెనుక కూర్చున్న ఏసురాజు జారిపడడంతో బస్సు వెనుక చక్రం కింద పడి మృతి చెందాడు. రాజ్కుమార్ కొంచెం దూరం వెళ్లి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని 108లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏసురాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్సై డి.జ్వాలాసాగర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపాలి
వీరవాసరం: పైలేరియా వ్యాధిగ్రస్తులు డాక్టర్ల సూచనలు, సలహాలను పాటిస్తూ ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపాలని డీఎంహెచ్ఓ గీతాబాయి తెలిపారు. అండలూరులో శుక్రవారం నిర్వహించిన ఫైలేరియా నివారణ వారోత్సవాల్లో ఆమె పాల్గొని, వ్యాధిపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఫైలేరియాకు సంబంధించిన ఎంఎండీటీ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి వి.క్రాంతి కుమార్, కొణితివాడ పీహెచ్సీ వైద్యులు యు.నవనీత్, ఎంపీహెచ్ఓ పి.ప్రభాకర్ రావు, ఫైలేరియా యూనిట్ ఆఫీసర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): చిత్తూరులో నిర్వహించనున్న ఉమెన్స్ జూనియర్ హాకి టోర్నమెంట్కు జిల్లా తరపున మహిళా జట్టు ఎంపికలను ఆదివారం నిర్వహించనున్నామని జిల్లా హాకి అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కలిదిండి ఆనందరాజు, కె.వి.ఎస్ భరత్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 16 నుంచి 19 వరకూ రాష్ట్ర హాకీ టోర్నమెంట్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్కు క్రీడాకారిణుల ఎంపిక కోసం పోటీలను భీమవరం సెయింట్ మేరీస్ హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేశామని వివరించారు. 2007 జనవరి 1 తర్వాత జన్మించిన వారే అర్హులని, ఆసక్తి గల క్రీడాకారిణిలు ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్తో సంప్రదించాలని కోరారు. మరిన్ని వివరాలకు 90301 06037 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. దెందులూరు: మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి 5 వ తరగతి ప్రవేశానికి ఈ నెల 12న పరీక్ష నిర్వహించనున్నారు. హాల్ టికెట్స్ https://mjpapbcwreis.apcfss.in వెబ్సైటులో ఉంచారని సమన్వయకర్త, ఏలూరు బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్.భాగ్యలక్ష్మి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరుకావాలని కోరారు. తణుకు అర్బన్ : విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం తణుకులో చోటు చేసుకుంది. స్థానిక సజ్జాపురానికి చెందిన సింహం భవానిశంకర్ (36) టైల్స్ అతికించే వృత్తిలో ఉపాధి పొందుతున్నారు. గురువారం సాయంత్రం ఇరగవరం రోడ్డు కాలనీలోని ఒక భవనంలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగిలింది. ఫోకస్ లైటుకు సంబంధించిన కనెక్షన్ తీసే క్రమంలో ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగలడంతో అక్కడే కుప్పకూలాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువచ్చినా అప్పటికే భవాని శంకర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. భవానిశంకర్కు ఇంకా వివాహం కావాల్సి ఉండగా తల్లితో కలిసి సజ్జాపురంలో నివాసం ఉంటున్నారు. సోదరి మాదాసు కల్యాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తణుకు పట్టణ ఎస్సై కె.శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమడోలు: జాతీయ రహదారి పొలసానిపల్లి రహదారిపై ఓ కూరగాయల రైతును ఐషర్ వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో గుణ్ణంపల్లికి చెందిన రైతు ఎం.రత్తయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్లితే.. ఎం.రత్తయ్య కూరగాయలను ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం జరిగే సంతలో వేసేందుకు తన బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో భీమడోలు నుంచి పొలసానిపల్లి మధ్య రహదారిపైకి వచ్చేసరికి ఎం.రత్తయ్యను వెనుక నుంచి ఐషర్ వ్యాన్ అతివేగంగా వచ్చి ఢీకొట్టి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న భీమడోలు 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడు రత్తయ్యకు ప్రాథమిక చికిత్స చేశారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు. -
నకిలీ టికెట్ల కేసులో నిందితుల అరెస్ట్
ఏలూరు టౌన్/ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల దేవస్థానంలో నకిలీ టికెట్ల వ్యవహారంలో కీలకమైన నిందితులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నకిలీ టికెట్లను కౌంటర్ ద్వారా భక్తులకు విక్రయించి, భారీ ఎత్తున అక్రమార్జన చేసినట్లు పోలీసుల విచారణలో నిర్థారణ అయ్యింది. ఏలూరు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రూ.100, రూ.200 విలువైన నకిలీ టికెట్లను ముఖ్యంగా శని, ఆదివారాల్లో రద్దీ సమయంలో విక్రయిస్తూ భారీగా సొమ్ములు కాజేసినట్లు తెలిపారు. కీలక నిందితుడు దేవస్థానం ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఐనంపూడి సాయి జగన్నాథరాజు అనే వ్యక్తితో పాటు మరికొందరు ఔట్ సోర్సింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది సైతం నకిలీ టికెట్ల వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నారని స్పష్టం చేశౠరు. ఒక సాప్ట్వేర్ ఉద్యోగి సహాయంలో కంప్యూటర్, ప్రింటర్లను ఏర్పాటు చేయటమే కాకుండా ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ను రూపొందించినట్లు విచారణలో తేలింది. పెన్డ్రైవ్లో సాఫ్ట్వేర్ను వేసుకుని అప్పటికప్పుడు నకిలీ టికెట్లు ప్రింట్ తీస్తూ అవినీతికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిరోజూ రూ.100ల టికెట్లు వంద, రూ.200 టికెట్లు వంద చొప్పున భక్తులకు విక్రయిస్తూ సొమ్మును కాజేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఈ నకిలీ వ్యవహారంపై దేవస్థానం ఈఓ భద్రాజీ ఫిర్యాదుతో ద్వారకాతిరుమల పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కీలక నిందితుల అరెస్ట్ నకిలీ టికెట్ల వ్యవహారంలో ఏడుగురు కీలక నిందితులను ద్వారకాతిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఏ3 సముద్రాల శేషుబాబు, ఏ4 మేక సతీష్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ప్రధాన నిందితుడు ద్వారకాతిరుమలకు చెందిన ఐనంపూడి సాయి జగన్నాథరాజు, ములగాల రమేష్, తొంటపాక సత్యనారాయణ, దెందులూరు మండలం పెరుగు గూడెం గ్రామానికి చెందిన ఉప్పలపాటి శ్రీనివాస్, కొమ్మర గ్రామానికి చెందిన కీర్తి అశోక్కుమార్, మానుకొండ ఆంజనేయులు, ఉంగుటూరు మండలం ఉప్పాకపాడు గ్రామానికి చెందిన ముత్యాల నాగవెంకట సత్యశ్రీనివాసరావును పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. వీరివద్ద రూ.200 విలువైన 61 నకిలీ టికెట్లు, టికెట్ల ముద్రణకు వినియోగించే ల్యాప్ట్యాప్, థర్మల్ ప్రింటర్, 5 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అంశంపై లోతైన విచారణ చేస్తున్నామనీ, ఇంకా ఎవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందనీ, రెగ్యులర్ ఉద్యోగులు ఏమైనా దీనిలో భాగస్వాములు అయ్యారా? అనేది విచారణ చేస్తున్నామని ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ తెలిపారు. ఈ నకిలీ టికెట్ల కేసు దర్యాప్తులో ప్రతిభ చాటుకున్న భీమడోలు సీఐ పీ.కృష్ణ, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్, కానిస్టేబుల్స్ జి.ధర్మరాజు, టి.లక్ష్మీనారాయణ, హోంగార్డు వీజే ప్రకాష్బాబును జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్, డీఎస్పీ శ్రావణ్కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులకు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఓ నిందితుడు స్పెషల్ ఆఫర్ ఇచ్చాడు. సాఫ్ట్వేర్ తయారు చేసింది మీరేనని కోర్టులో ఒప్పుకుంటే రూ. 10 లక్షలు ఇస్తానని అతడు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అయితే ఆ ఆఫర్ను ఇద్దరు నిందితులు ఒప్పుకోలేదు. అయినా పట్టువిడవకుండా రాత్రి వరకు తమ ప్రయత్నాలు సాగించడం విశేషం.. అలా ఎలా తయారు చేశారు..? నకిలీ టికెట్ల స్కామ్కు వినియోగించిన సాఫ్ట్వేర్ను బయట వ్యక్తులు ఇష్టానుసారంగా ఎలా తయారు చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. దేవదాయశాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి, కమిషనర్ స్థాయి అధికారులు ఆర్డర్ కాపీ ద్వారా అనుమతిస్తేనే గానీ సాఫ్ట్వేర్ను తయారు చేయకూడదు. కానీ తన స్నేహితుడు రమేష్ అడిగాడని ఉంగుటూరు మండలం, ఉప్పాకపాడు గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎమ్ఎన్వీఎస్ శ్రీనివాసరావు దేవస్థానం టికెట్ల సాఫ్ట్వేర్ను తయారు చేసేశాడు. ఇదిలా ఉంటే సాఫ్ట్వేర్ తయారు చేసినందుకు శ్రీనివాసరావును పోలీసులు ఎఫ్ఐఆర్లో ఏ9 (ఆఖరి) నిందితుడిగా చేర్చారు. తెలిసి చేసినా.. తెలియక చేసినా ఈ తప్పు కారణంగా నకిలీ టికెట్ల జారీ యథేచ్ఛగా సాగిపోయింది. -
నాలుగు సంస్థలతో కీలక ఎంఓయూలు
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయం ఒకే రోజు నాలుగు ప్రతిష్టాత్మక సంస్థలతో నాలుగు కీలక అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ)లు కుదుర్చుకుందని ఉపకులపతి డాక్టర్ కె.ధనుంజయరావు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యాన విశ్వ విద్యాలయం పరిపాలన భవనంలో గురువారం నిర్వహించిన ఎంఓయూల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ఒప్పందాలు కేవలం కాగితాలపై సంతకాలతో ఆగిపోకుండా ఆచరణలో గొప్ప ఫలితాలు అందిస్తాయని ఆయన తెలిపారు. నాలుగు ఒప్పందాలు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్), బెంగళూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ (ఐఐహెచ్ఆర్)తో కుదుర్చుకున్నామని తెలపారు. ఈ కార్యక్రమంలో ఐఐహెచ్ఆర్ డైరెక్టర్ డాక్టర్ తుషార్ కాంతి బెహరా, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.మాధవి, డాక్టర్ సీహెచ్ రూత్, డాక్టర్ బి.ప్రసన్నకుమార్, ఎస్.సూర్యకుమారి ప్రేమానందం తదితరులు పాల్గొన్నారు. పెదపాడు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పెదపాడు మండలంలోని తాళ్లమూడిలో చోటు చేసుకుంది. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా నగరం మండలం మెడపల్లి గ్రామానికి చెందిన పేరుమాని ఏడుకొండల రెడ్డి (40) తన టాటా ఇంట్రా వాహనంలో పచ్చిమిర్చి, చిలగడ దుంపల లోడును చీరాల సమీపంలోని చినగంజాం వద్ద లోడు చేసుకుని రాజమండ్రికి బయలుదేరాడు. మార్గమధ్యలో గురువారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో పెదపాడు మండలంలోని తాళ్లమూడి గ్రామానికి వచ్చేసరికి నిద్రమత్తులో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో డ్రైవర్ సీట్లోనే ఇరుక్కుపోవడంతో హైవే పెట్రోలింగ్ అఽధికారులు బయటకు లాగేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఏడుకొండలు రెడ్డి మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పెదపాడు ఎస్సై ఆర్.శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉండి: గ్రామంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పాములపర్రు గ్రామానికి చెందిన కఠారి శ్రీనివాసులు తన ద్విచక్రవాహనంపై బుధవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ఉండి గ్రామానికి టిఫిన్ కోసం వెళ్లాడు. తిరిగి వస్తుండగా గ్రామంలోని వెలివర్రు జంక్షన్ వద్దకు రాగానే పాములపర్రు వైపు నుంచి ఉండి వైపుగా ఎదురుగా వస్తున్న లారీ అతనిని వేగంగా ఢీ కొట్టింది. దీంతో అతనికి తలతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి సోదరుడు అంబులెన్స్లో భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి నుంచి అందిన సమాచారం, భార్య దుర్గ ఇచ్చి న ఫిర్యాదు మేరకు ఎస్సై ఎండీ నసీరుల్లా కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. -
గుబ్బల మంగమ్మ గుడి వద్ద టూరిజం అభివృద్ధికి కృషి
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలో ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి గుడిని ఏపీ ఫారెస్ట్ పీసీసీఎఫ్ మాజీ అధికారి, ప్రభుత్వ రాష్ట్ర అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా గుబ్బల మంగమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో టూరిజం పరంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన వనరులపై, అధికారులను, కమిటీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుబ్బల మంగమ్మ గుడి అటవీప్రాంతంలో ఉన్నందున ఆ పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వల్ల కలిగే కాలుష్యాన్ని నివారించేందుకు అధికారులు, కమిటీ సభ్యులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ముఖ్యంగా భక్తులు ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు వాడకుండా అవగాహన కలిగించాలన్నారు. ఆలయ పరిసరాల్లో డీఎఫ్ఓ పర్యవేక్షణలో స్టాగ్ (ప్రదర్శన బోర్డు చిహ్నం) ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ సందీప్ రెడ్డి, సబ్ డీఎఫ్ఓ వెంకట సుబ్బయ్య, జంగారెడ్డిగూడెం రేంజ్ అధికారి దుర్గాకుమార్బాబు, ములగలంపల్లి సెక్షన్ ఆఫీసర్ కె.రాంబాబు, ఆలయ కమిటీ ప్రతినిధులు కోర్సా రాంబాబు, కె. గంగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
గ్రామ స్వరాజ్యానికి తూట్లు
● గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల్లో పోలీస్ స్టేషన్లు ● గత ప్రభుత్వ గుర్తులను చెరిపేస్తున్న వైనం సాక్షి, టాస్క్ఫోర్స్: గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వం గ్రామ స్వరాజ్యం నెరవేర్చేందుకు స్వగ్రామంలోనే పాలన ప్రజల ముంగిటకు తీసుకొచ్చారు. ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు, పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్ మండలాల్లో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు అన్ని కలిపి దాదాపు 250 నిర్మించారు. నాడు–నేడు పథకంలో భాగంగా ఎన్నో పాఠశాలలు ఆధునికీకరించారు. వంతెనలు, రోడ్లు నిర్మించారు. కూటమి చర్యలతో విస్మయం వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పెదపాడులో నిర్మించిన సచివాలయాన్ని, పెదవేగిలో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని గురువారం పోలీస్ స్టేషన్లుగా మార్చి ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. అయితే ఈ చర్యలతో గ్రామీణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఎటువంటి ప్రభుత్వ కార్యాలయ భవన నిర్మాణాలు చేపట్టలేదని చెబుతున్నారు. ప్రజలకు సేవలను అందించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని పోలీస్ స్టేషన్లుగా మార్చి ప్రారంభించడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. 500కు పైగా శిలాఫలకాలు ధ్వంసం ఈ రెండు ప్రభుత్వ కార్యాలయాలపై గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి స్థానిక ప్రజాపతినిధుల పేర్లు ఉన్న శిలాఫలకాలను కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే ధ్వంసం చేశారు. అంతే కాకుండా నియోజకవర్గంలో దాదాపు 500పైగా శిలాఫలకాలను ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోకపోగా ‘నూతన భవనం’ అనే పేరుతో ప్రారంభోత్సవం చేయడం ఏంటి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పెదవేగిలో పోలీస్ సర్కిల్ ఆఫీస్గా మారిన రైతు భరోసా కేంద్రం -
జిల్లా ఆర్చర్లకు పతకాలు
భీమవరం (ప్రకాశంచౌక్): గుంటూరులో ఇటీవల నిర్వహించిన చెరుకూరి వోల్గా– లెనిన్ మెమోరియల్ అండర్ 15 నేషనల్ ఆర్చరీ చాంపియన్షిప్లో కాంపౌండ్ విభాగంలో జిల్లా ఆర్చర్లు పతకాలు గెలుచుకున్నారు. మాగాపు సుహాస్ వ్యక్తిగత విభాగంలో గోల్డ్మెడల్ సాధించాడని ఆర్చరీ జిల్లా అధ్యక్షుడు ఎల్.జయరాజు గురువారం విలేకరులకు తెలిపారు. మిక్సిడ్ విభాగంలో అల్లూరు కనిష్కతో సిల్వర్ మెడల్, బాలుర విభాగంలో బ్రాంజ్ మెడల్ను కై వసం చేసుకున్నాడన్నారు. అల్లూరు కనిష్క, కలిదిండి హేమశ్రీ కాంపౌండ్ గర్ల్స్ టీమ్ సిల్వర్ మెడల్ సాధించిందని తెలిపారు. మెడల్స్ సాధించిన ఆర్చర్లను, కోచ్ సాహిత్ను పలువురు అభినందించారు. టి.నరసాపురం: ప్రభుత్వం నిషేధించిన కలుపు మందు గ్లైసెల్ 360 లీటర్లను వ్యవసాయ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్కే హబీబ్ మాట్లాడుతూ మండలంలోని గుర్వాయిగూడెం గ్రామానికి చెందిన రైతు కె.నాగేశ్వరావుకు చెందిన ఆయిల్ పామ్ తోటలో ఉన్న షెడ్డులో నిషేధిత గ్లైసెల్ కలుపు మందు అక్రమ నిల్వలు ఉన్నాయని సమాచారం వచ్చిందన్నారు. దీంతో మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రియాంక, చింతలపూడి ఎడిఎ సుబ్బారావుతో కలిసి తనిఖీలు నిర్వహించామన్నారు. తనిఖీల్లో 360 లీటర్ల గ్లైసెల్ బాటిళ్లు గుర్తించి, వీవీఆర్ఓ సమక్షంలో ఆ మందులను స్వాధీనం చేసుకుని రైతుపై 6ఏ కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. పురుగుమందుల నియంత్రణ చట్టం 1968, జీవో నెంబర్ 649ప్రకారం గ్లైసెల్ 41 శాతం కలుపు మందును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తయారీ వినియోగం నిషేధించాయన్నారు. గ్లైసెల్ క్రయ విక్రయాలు చట్టరీత్యా నేరమని, ఆ మందును కొన్నా అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యలమంచిలి: మండలంలోని ఆర్యపేట గ్రామానికి చెందిన కవల లక్ష్మీ కుమారి (44) అనే మహిళ కువైట్ దేశంలో గుండెపోటుతో మృతి చెందింది. ఆమె గత నాలుగేళ్లుగా కువైట్లోని ఒక ఇంట్లో పనిచేస్తున్నారు. ఈ నెల 4న ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో స్థానిక భారతీయులు, ఇండియన్ ఎంబసీ సహకారంతో మృతదేహాన్ని కార్గో విమానంలో శుక్రవారం భారతదేశం తీసుకువస్తున్నారు. -
శాశ్వత భవనం.. ఇంకెంత దూరం?
● భీమవరం కలెక్టరేట్కు నాలుగేళ్లు పూర్తి ● గత ప్రభుత్వంలో శాశ్వత భవనానికి జీఓ ● కూటమి ప్రభుత్వం వచ్చాక కలెక్టరేట్ తరలింపునకు కుట్రలు భీమవరం (ప్రకాశం చౌక్) : పరిపాలన సౌలభ్యం, ప్రజలకు అధికార యంత్రాంగం అందుబాటులో ఉండాలని లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నరసాపురం పార్లమెంట్ను నూతన పశ్చిమగోదావరిగా జిల్లాగా భీమవరం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. అయితే జిల్లా కలెక్టరేట్ ఏర్పడి నాలుగేళ్లు పూర్తయ్యింది. జిల్లాలోని ఏడు నియోజవర్గాల ప్రజలకు కలెక్టరేట్ ద్వారా అన్ని సేవలు సులభంగా వేగంగా అందుతున్నాయి. ఏలూరు 70 కిలోమీటర్లు వెళ్లే దూరాభారం తగ్గంది. అయితే కలెక్టరేట్కు శాశ్వత భవనం లేక ఇప్పటికీ అద్దె భవనంలో కొనసాగుతుంది. పట్టించుకోని కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భీమవరం నుంచి కలెక్టరేట్ను వేరేచోటుకు తరలించాలని కుట్రలు జరిగాయి. భీమవరం ప్రజలు నుంచి తిరుగుబాటు రావడంతో ఆ ప్రయత్నాలు మానుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలలు అవుతున్నా నేటికీ కలెక్టరేట్కు శాశ్వత భవనం నిర్మాణానికి మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అసలు కలెక్టరేట్ భవనం నిర్మాణం ఊసే ఎత్తడం లేదు. జిల్లాలోని కూటమి ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు మంత్రులు కలెక్టరేట్ శాశ్వత భవనం నిర్మాణం గురించి పట్టించుకోవడం లేదు ఈ ఏడాది నిర్మాణంపై నీలినీడలు భీమవరం మార్కెట్ యార్డ్లోనే కలెక్టరేట్ భవనం నిర్మాణం ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు స్పష్టం చేసి నెలలు గడస్తున్నాయి. కానీ ఇప్పవరకు నిర్మాణానికి సంబంధించి కనీసం అధికారులు పరిశీలన కూడా చేయలేదు. నిర్మాణానికి అనుకూలమైన వాతవారణం ఉండే వేసవిలో కలెక్టరేట్ శాశ్వత భవనం నిర్మాణం పనులు చేపట్టకపోతే ఈ ఏడాది కూడా కలెక్టరేట్ భవనం నిర్మాణం లేనేట్టా? అనే సందేహం కలుగుతుందని ప్రజలు చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కలెక్టరేట్కు శాశ్వత భవనం ఉండాలని అన్నింటికి అనుకూలమైన భీమవరం మార్కెట్ యార్డ్ను ఎంపిక చేసి అక్కడ ఇంటిగ్రేటెడ్ భవనం నిర్మాణానికి జీఓ జారీ చేశారు. అప్పట్లో పలు రాజకీయ పార్టీలు, మేథావులు, సీనియర్ రాజకీయ నాయకులు. నేడు కూటమిలో నాయకులు కూడా అందరు కూడా మార్కెట్ యార్డులో కలెక్టరేట్ నిర్మాణం మంచి నిర్ణయమని ప్రశంసించారు. అలాంటి మార్కెట్ యార్డులో కలెక్టరేట్ భవనం నిర్మాణానికి ఈకూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా మౌనంగా ఎందుకు ఉంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు కలెక్టరేట్ భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
వైభవంగా శ్రీనివాసుని కల్యాణోత్సవాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసుని దివ్యకల్యాణ మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయంలో స్వామి వారిని పెండ్లి కుమారుడిగా, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేశారు. అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్ధుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల గోవింద నామస్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఈ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికను ఆలయ అర్చకులు విశేషంగా అలంకరించారు. అనంతరం సింహాసనంపై కల్యాణ మూర్తులను ఉంచి ఈ తంతును నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ఈఓ వై.భద్రాజీ, సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యం
ఏలూరు (టూటౌన్): స్థానిక ఐఏడీపీ హాలులో గురువారం ప్రకృతి వ్యవసాయ అమలుపై విస్తృత స్థాయీ శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యస్.కె.హబీబ్ భాషా తెలిపారు. లింగపాలెం, నిడమర్రు, టి.నర్సాపురం, చింతలపూడి, పెదపాడు, నూజివీడు, జంగారెడ్డిగూడెం, పెదవేగి, వేలేరుపాడు వివిధ మండలాలు నుండి సుమారు 120 మంది కేడర్ సభ్యులు ఈ శిక్షణలో పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా, జిల్లా ప్రాజెక్ట్ మేనేజరు బి.వెంకటేష్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని వివరించారు. -
రోత వ్యాఖ్యలపై ప్రజాగ్రహం
గ్రామ స్వరాజ్యానికి తూట్లు వైఎస్సార్ సీపీ హయాంలో నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను కూటమి ప్రభుత్వం పోలీస్ స్టేషన్లుగా మార్చి గ్రామ స్వరాజ్యానికి తూట్లు పొడుస్తోంది. 8లో uపశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కలెక్టరేట్ ఏర్పడి నాలుగేళ్లు పూర్తయింది. ఇప్పటివరకు శాశ్వత భవనం లేక అద్దె భవనంలో కొనసాగుతోంది. 8లో uశురకవారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: నీచమైన రాతలతో రాక్షాసానందం పొందే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు గట్టిగా బుద్ధి చెబుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు హెచ్చరించారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మరీ ముఖ్యంగా వైఎస్సార్సీపీ నేతల కుటుంబ సభ్యులను రోత పదజాలంతో మాట్లాడడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు వెల్లువెత్తాయి. అదే విధంగా అనేక మండలాల్లో పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసి, చట్టపరంగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తణుకులో బుధవారం జిల్లాస్థాయిలో ఆందోళనలు నిర్వహించగా గురువారం పోలవరం, నూజివీడు, ఉండి, భీమవరం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు, పోలీసు ఫిర్యాదులు చేశారు. ● నూజివీడు నియోజకవర్గంలో.. నూజివీడు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నేతృత్వంలో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. గౌవరమైన జర్నలిజం వృత్తిలో మహిళలను కించపరచడంపై ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవుపలికారు. తక్షణమే రాధాకృష్ణ చేయించిన రోత వ్యాఖ్యలపై మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ● పోలవరం నియోజకవర్గంలో.. పోలవరం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని కోరుతూ బుట్టాయగూడెం పోలీస్ స్టేషన్ ఎదుట పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు కార్యకర్తల భార్యలపై సైతం వ్యాఖ్యలు చేయించడం ఆయన మానసిక స్థితికి అద్దం పడుతుందన్నారు. ఇటువంటి చర్యలను సభ్యసమాజం ఏనాడూ స్వాగతించదని, రాధాకృష్ణ తక్షణమే మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కొయ్యలగూడెం మండల కేంద్రంలో గురువారం వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మహిళలపై ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ● తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో.. ఏబీఎన్ రాధాకృష్ణ్ణపై చర్యలు తీసుకోవాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డి రఘురామ్ నాయుడు డిమాండ్ చేశారు. రాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా తాడేపల్లిగూడెం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వడ్డి రఘురామ్ నాయుడు మాట్లాడుతూ రాధాకృష్ణ వైఎస్సార్సీపీ నాయకుల భార్యలనే కాకుండా యావత్ మహిళా సమాజాన్ని కించపరిచేలా మాట్లాడారన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా నీచమైన, నికృష్టమైన భాష ఉపయోగించడం అనాగరికమన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల మెప్పు కోసం ఇలా దిగజారి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. వెంటనే క్షమాపణలు చెప్పకపోతే ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ● భీమవరం నియోజకవర్గంలో.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై గురువారం భీమవరం వన్టౌన్ పోలీస్స్టేషన్లో భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి చినమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఫిర్యాదు అందచేశారు. ఈ సందర్భంగా చినమిల్లి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ఎప్పుడూ మహిళా పక్షపాతిగానే ఉంటూ, మహిళలకు పదవులు ఇచ్చి గౌరవించిందన్నారు. మహిళల పట్ల ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీలోని నాయకులు, కార్యకర్తల భార్యల గురించి చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలను చేసిన రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ● ఉండి నియోజకవర్గంలో.. ఉండి నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నర్సింహరాజు ఆధ్వర్యంలో ఉండి సెంటర్ నుంచి ఉండి పోలీస్ స్టేషన్ వరకూ పార్టీ శ్రేణులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీఎల్ మాట్లాడుతూ పార్టీకి అహర్నిశలు పాటుడుడుతున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల భార్యలపై చేసిన మురికి వ్యాఖ్యలకు రాధాకృష్ణ సిగ్గుపడాలన్నారు. రాజకీయాల్లోకి మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకూ సబబని ప్రశ్నించారు. నీజమైన మాటలకు క్ష మాపణ చెప్పకపోతే తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. అనంతరం ఉండి స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేసి ఎస్సై ఎండీ నసీరుల్లాకు ఫిర్యాదు చేశారు. ● పాలకొల్లు నియోజకవర్గంలో.. కలానికే కళంకం తీసుకువచ్చిన ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) అన్నారు. పట్టణ పోలీస్స్టేషన్లో ిసీఐ కోలా రజనీకుమార్కు ఫిర్యాదు చేశారు. పత్రికల్లో ఏది రాసినా చెల్లుబాటు అవుతుందనే అహంకారంతో మహిళలను కించపరుస్తూ కథనాలు రాసి పైశాచికానందం పొందుతున్న రాధాకృష్ణ నిరంకుశత్వ దోరణిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల మహిళలపై దాడులు, దౌర్జన్యాలు మితిమీరుతున్నాయన్నాయని ఆందోళన చెందారు. రాధాకృష్ణ బహిరంగంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల కుటుంబ సభ్యులపై రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఉంగుటూరు నియోజకవర్గం చేబ్రోలులో వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన తెలిపారు. చేబ్రోలు బస్టాండ్ సెంటర్ల నుంచి ర్యాలీగా బయల్దేరి పోలీస్ స్టేషన్లో ఎస్సై సూర్యభగవాన్కు ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అలాగే నరసాపురం, ఆచంటలోని పోలీస్స్టేషన్లలో స్థానిక నాయకులు ఫిర్యాదులు చేశారు. నూజివీడు: పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సైకు ఫిర్యాదు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు బుట్టాయగూడెం: పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు భీమవరం (ప్రకాశం చౌక్): వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి చినమిల్లి వెంకటరాయుడు, పార్టీ నేతలు పాలకొల్లు సెంట్రల్: పోలీస్ స్టేషన్ వద్ద సీఐకు ఫిర్యాదు చేస్తున్న పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్ గుడాల గోపి, పార్టీ శ్రేణులుచెత్త పలుకుకు ఛీత్కారం నీచానికి పరాకాష్టగా పిచ్చి రాతలు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు, ఫిర్యాదులు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఆత్మగౌరవం కించపరిస్తే గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరిక ఉమ్మడి పశ్చిమలో వెల్లువెత్తిన నిరసనలు -
ఉపాధ్యాయుల నిరసన
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో స్థానిక గ్జేవియర్ నగర్లోని పదో తరగతి మూల్యాంకన కేంద్రం సెయింట్ గ్జేవియర్ పాఠశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను ‘‘పోరుబాట’’ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మలిదశ ఆందోళనలో భాగంగా ఈ నెల 25, 26, 27 తేదీల్లో విజయవాడ ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని, కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా చైర్మన్ జీ. మోహన్, సెక్రటరీ జనరల్ ఎం. ఆదినారాయణ, కో–చైర్మన్లు జీ. వెంకటేశ్వరరావు, జంగం రవీంద్ర, ప్రధానోపాధ్యాయుల సంఘ జిల్లా అధ్యక్షుడు వీ. మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. డెమోక్రటిక్ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పీ.వెంకటేశ్వరరావు నిరసనకు సంఘీభావం తెలిపారు. -
అర్లగట్టును పరిశీలించిన రెవెన్యూ అధికారులు
ఆగిరిపల్లి: మండలంలోని తోటపల్లి, గన్నవరం మండలం గొల్లనపల్లి సరిహద్దులో ఉన్న అర్లగట్టును గురువారం రెవెన్యూ అధికారులు పరిశీలించారు. అర్లగట్టుపై గ్రావెల్ తవ్వకాలు పెచ్చు మీరుతుండడంతో ‘కొండలనూ తవ్వేస్తున్నారు’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన తహసీల్దార్ పీఎన్వీ ప్రసాద్ ఆదేశాలతో ఆర్ఐ యూనస్, వీఆర్వో సుబ్బయ్య గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రసాద్ మాట్లాడుతూ అర్లగట్టుపై గ్రావెల్ తవ్వకాలను పరిశీలించి కలెక్టర్కు నివేదికను పంపిస్తామని తెలిపారు. అనుమతులు లేకుండా గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏలూరు (టూటౌన్): గ్రామ పంచాయతీ వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయా లని కోరుతూ ఏపీ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పి కిషోర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే గురువారం జిల్లా పంచాయతీ అధికారి కె అనురాధకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీల్లో పంపు ఆపరేటర్లు, స్వీపర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, ఎలక్ట్రిషీయన్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్స్గా సుమారు 2 వేల మంది పనిచేస్తున్నారన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీసం వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు వర్తింపజేయాలని, గుర్తింపు కార్డులు అందించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ప్రభాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు టౌన్: ఏలూరులో అత్యాధునిక హంగులతో రూ.2.73 కోట్ల వ్యయంతో నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు తమ సమస్యలు నిర్భయంగా చెప్పుకునేలా స్నేహపూర్వక వాతావరణం కల్పించటమే ప్రధాన కర్తవ్యం అన్నారు. అనంతరం ఏలూరు ట్రాఫిక్ క్రాస్రోడ్ పార్కును సందర్శించారు. కలెక్టర్ వెట్రిసెల్వి, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్, ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, ఎమ్మెల్యేలు చంటి, ధర్మరాజు, ప్రభాకర్, ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ అప్పలనాయుడు, జెడ్పీ చైర్మన్ పద్మశ్రీ, మేయర్ నూర్జహాన్ పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి మొదటి ఆరేళ్లలో అందించే పోషకాహారమే ప్రధానమని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. 8వ విడత పోషణ్ పక్వాడా పోస్టర్ను కలెకటరేట్లో గురువారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్య క్రమం ఈనెల 9 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు. చిన్న పిల్లల్లో పోషకాహార లోపాన్ని పోగొట్టేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారాన్ని అందిస్తున్నామన్నారు. నీటి భద్రతపై సమీక్ష : జిల్లాలో చేపట్టాల్సిన కాల్వలు, చెరువుల మరమ్మతులు, పూడికతీత తదితర పనులకు అవసరమైన నిధుల వివరాలతో ప్రాథమిక ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఇరిగేషన్ శాఖాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రతిపాదనలు రూపొందించడంలో సాగునీటి వినియోగదారుల సంఘాల సూచనలు పరిగణనలోనికి తీసుకోవాలన్నారు. -
మూల్యాంకనం.. ప్రశ్నార్థకం!
ఏలూరు (ఆర్ఆర్పేట): ఇటీవల జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబధించి విద్యార్థులు రాసిన జవాబుపత్రాల మూల్యాంకనం ఉపాధ్యాయులకు సవాలు విసురుతోంది. ముఖ్యంగా ట్యాబ్ ఆధారిత మార్కుల నమోదు ప్రక్రియ ఉపాధ్యాయులకు పెను సవాలు విసురుతోంది. స్పెషల్ అసిస్టెంట్లకు ఈ విధానం తలకుమించిన భారంగా మారింది. ప్రతి స్పెషల్ అసిస్టెంట్ రోజుకు 80 జవాబు పత్రాలకు సంబంధించి ట్యాబ్ల్లో మార్కులు అప్లోడ్ చేయాల్సి వస్తోంది. దీంతో సాంకేతికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో పేపర్ స్కానింగ్ చేయడానికే వారికి 15 నుంచి 20 నిమిషాలకు పైగా సమయం పడుతోంది. ఈ లెక్కన వారు ప్రతిరోజూ సుమారు 640 నిమిషాలకు పైగా సమయం ఇందుకోసం వెచ్చించాల్సి వస్తోంది. అంతేకాకుండా ఎక్కువ మంది స్పెషల్ అసిస్టెంట్లు ఒకేసారి నెట్వర్క్ వినియోగిస్తుండడంతో ట్యాబ్లు సైతం మొరాయిస్తున్నాయి. తరగని పని : సాధారణంగా జవాబుపత్రాల మూల్యాంకనం ఉదయం 9 నుంచి ప్రాంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. అయితే ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ట్యాబ్ ఆధారిత మార్కుల నమోదు ప్రక్రియ కారణంగా రాత్రి 9 గంటలు దాటిన తరువాత కూడా జరుగుతూనే ఉంటోంది. నెట్వర్క్ సమస్య ఒక కారణం కాగా విద్యార్థి రాసిన జవాబుపత్రంలోని ప్రతి పేజీని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి రావడం, అసిస్టెంట్ ఎగ్జామినర్ దిద్దిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి రావడం ప్రధాన సమస్యగా తలెత్తింది. మార్కుల విషయంలో ఎటువంటి తేడా వచ్చినా పూర్తి బాధ్యతను స్పెషల్ అసిస్టెంట్లదేనని చెప్పడంతో వారిలో తీవ్ర ఒత్తిడి నెలకొంటోంది. వేతనం పెంచాలని డిమాండ్ : జవాబు పత్రాల మూల్యాంకనం విధుల్లో ఉన్న అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లకు ఇస్తున్న వేతనం ఏమాత్రం న్యాయసమ్మతం కాదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో నాలుగు గంటలకు పైగా అదనపు సమయం పని చేస్తున్నందున వేతనం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అసిస్టెంట్ ఎగ్జామినర్లకు పేపర్కు రూ. 10 చొప్పున చెల్లించడంతో పాటు రోజుకు రూ.400 డీఏగా చెల్లించనున్నారు. వారికి మొత్తం రోజుకు రూ. 800 చెల్లించే అవకాశం ఉంది. అయితే వారితో పాటు సమానంగా పని చేస్తున్న స్పెషల్ అసిస్టెంట్లకు మాత్రం 80 పేపర్లు వెరిఫికేషన్ చేసినందుకు గాను కేవలం రోజుకు రూ. 300 మాత్రమే చెల్లించే ఏర్పాటు చేయడం దారుణమంటున్నారు. మూల్యాంకన ప్రక్రియలో స్పెషల్ అసిస్టెంట్లు తీవ్ర అన్యాయానికి గురౌతున్నారు. అసిస్టెంట్ ఎగ్జామినర్లు దిద్దిన 80 పేపర్లను వీరు పరిశీలించి ట్యాబ్ల ద్వారా స్కానింగ్ చేసి మార్కులను నమోదు చేయించడం వెట్టి చాకిరీ చేయించడమే. పైగా వారికి రోజుకు కేవలం రూ. 300 వేతనం ఇస్తామనడం శ్రమదోపిడీగా పరిగణించాల్సి ఉంటుంది. – గుగ్గులోతు కృష్ణ, ఏపీటీఎఫ్ 1938, రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ ట్యాబ్ ఆధారిత మూల్యాంకనంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ట్యాబ్ల పనితీరు సక్రమంగా ఉండేలా చూడాలి. వేగవంతమైన నెట్వర్క్ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. మూల్యాంకన విధుల్లో ఉన్న ఉపాధ్యాయులందరికీ నిత్యం ద్రవపదార్థాలు పంపిణీ చేయాలి. దీనితో పాటు గదుల్లో గాలి, వెలుతురు సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. – గెడ్డం సుధీర్, వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి సవాలు విసురుతున్న జవాబుపత్రాల మూల్యాంకనం నెట్వర్క్ లేక మొరాయిస్తున్న ట్యాబ్లు స్పెషల్ అసిస్టెంట్లకు పని భారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకూ చేసినా తరగని పని వేతనం పెంచాలని డిమాండ్ -
రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.364 కోట్లు
నూజివీడు: ఏలూరు జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా గత ఆర్థిక సంవత్సరానికి రూ.472.5 కోట్ల లక్ష్యం కాగా రూ.364.6 కోట్లు ఆదాయం వచ్చినట్లు ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ కే శ్రీనివాసరావు పేర్కొన్నారు. నూజివీడులోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీనిలో భాగంగా రిజిస్ట్రేషన్ నిమిత్తం వచ్చిన ప్రజలకు సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా, లేవా అని పరిశీలించారు. అలాగే రికార్డులను తనిఖీ చేసిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంకు గతేడాది టార్గెట్ రూ.69.48 కోట్లు కాగా రూ.54.55 కోట్లు ఆదాయం మాత్రమే వచ్చిందన్నారు. 1983 ముందు నుంచి ఉన్న రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నామని, దీనివల్ల భూముల వివరాలన్నీ ప్రజలకు సులువుగా అందుబాటులోకి వస్తాయన్నారు. వివాహ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ముందుగానే స్లాట్ బుక్ చేసుకుంటే ప్రక్రియ అరగంటలో పూర్తవుతుందన్నారు. అపార్ట్మెంట్లు, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు గతంలో కంటే ప్రస్తుతం తగ్గాయని, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మాత్రం యథావిధిగా ఉన్నాయన్నారు. నూజివీడు పట్టణంలో ప్రస్తుతం కొనసాగుతున్న సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద అసౌకర్యాలను గుర్తించామని, త్వరలోనే మరొక సౌకర్యవంతమైన భవనంలోనికి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని మార్చడం జరుగుతుందన్నారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ నడింపల్లి ఫణిసీతారామరాజు ఉన్నారు. -
కొండలనూ తవ్వేస్తున్నారు
ఆగిరిపల్లి: మైనింగ్ తవ్వకాలకు అనుమతులు ఉన్నాయంటూ అధికార పార్టీకి చెందిన నేతలు పచ్చని కొండలను సైతం తవ్వేసి పిండి చేసేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా లారీల్లో గ్రావెల్ తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని తోటపల్లి, గన్నవరం మండలం గొల్లనపల్లి సరిహద్దుల్లో ఉన్న అర్లగట్టులో గ్రావెల్ తవ్వుకోవడానికి మైనింగ్ శాఖ నాలుగు హెక్టార్లలో అనుమతులు ఇచ్చిందంటూ గత రెండు నెలలుగా గన్నవరంనకు చెందిన అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో ఇష్టానుసారంగా గ్రావెల్ తవ్వి తరలించుకుపోతున్నారని తోటపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రావెల్ తవ్వకాలతో తోటపల్లి పరిధిలో ఉన్న మామిడి తోటలు నాశనమై పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుమ్ముతో మామిడికాయలు పూర్తిగా దెబ్బతింటున్నాయని రైతులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మూడు గ్రామాలకు చెందిన రైతులు ఆర్లగట్టుపై తమ పశువులను మేత కోసం తోలేవారు. కానీ ఇప్పుడు గట్టుపై గ్రావెల్ తవ్వకాలతో పశుగ్రాసం కొరత ఏర్పడిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం లారీల రాకపోకలతో రోడ్లపై భారీ గుంతలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. అంతే కాకుండా ఆర్లగట్టు సమీపంలోనే గతంలో అనుమతులకు మించి గ్రావెల్ తవ్వేయడంతో మైనింగ్ శాఖ అధికారులు వారిపై రూ.2 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. అలాగే అర్లగట్టుపై కూడా అనుమతులకు మించి తవ్వుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే గ్రామస్తులు అంతా కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గ్రావెల్ తవ్వకాలతో మామిడి తోటలు తీవ్రస్థాయిలో దెబ్బతింటున్నాయి. మైనింగ్ తవ్వకాలకు వచ్చే దుమ్ముకు మామిడికాయలు రంగు మారిపోయి పూర్తిగా దెబ్బతిన్నాయి. మైనింగ్ శాఖ అధికారులు గ్రావెల్ తవ్వకాలను నిలిపివేయాలి – సింహాద్రి నాగబాబు, తోటపల్లి -
పోతునూరు పీహెచ్సీకి వైద్యులు
దెందులూరు: ‘పోతునూరు పీహెచ్సీలో వైద్యుల కొరత’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు స్పందించారు. పోతునూరు పీహెచ్సీకి అమరావతి డైరెక్టరేట్ నుంచి డాక్టర్ వెంకట రాకేష్, గుండుగొలను పీహెచ్సీ నుంచి డాక్టర్ శరణ్య వైద్యాధికారులుగా నియమితులయ్యారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు నగర పాలక సంస్థలో పని చేస్తున్న దాదాపు వెయ్యి మంది మున్సిపల్ ఆప్కాస్ కార్మికులకు మార్చి నెల జీతాలు వెంటనే చెల్లించాలని ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏలూరు నగర కమిటీ మున్సిపల్ కమిషనర్ను కలిసి బుధవారం వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షుడు బి.సోమయ్య మాట్లాడుతూ ప్రతి నెలా ఒకటి, రెండో తేదీల్లో వచ్చే మున్సిపల్ ఆప్కాస్ కార్మికుల జీతాలు నేడు ఎనిమిదో తేదీన కూడా రాలేదని అన్నారు. దానివల్ల మున్సిపల్ ఆప్కాస్ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే మార్చి నెల బకాయి జీతాలు ఇప్పించాలని ఆయన కోరారు. మున్సిపల్ కమిషనర్ ఏ భానుప్రతాప్ మాట్లాడుతూ ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉందని, సాంకేతిక కారణాలవల్ల జీతాలు పడలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడామని.. ఒక వారంలోగా మున్సిపల్ కార్మికుల జీతాలు చెల్లిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షుడు లావేటి కృష్ణారావు, కార్యదర్శి జి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): రెండో విడత జేఈఈ మెయిన్స్ పరీక్షలు బుధవారం నాటితో ముగిశాయి. పరీక్షల చివరి రోజు బుధవారం 581 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏలూరు నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో మధ్యాహ్నం సెషన్ పరీక్షకు 122 మందికి గాను 115 మంది, తాడేపల్లిగూడెం వాసవిలో 180 మందికి గాను 176 మంది, శశి ఇంజనీరింగ్లో 113 మందికి గాను 109 మంది, భీమవరం విష్ణు ఇంజనీరింగ్లో 100 మందికి గాను 97 మంది, డీఎన్ఆర్ కళాశాలలో 88 మందికి గాను 84 మంది హాజరయ్యారు. ద్వారకాతిరుమల: శ్రీవారి రూ.200 నకిలీ దర్శనం టికెట్ల స్కామ్ కేసులోని నిందితులను పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ క్రమంలో 7 గురు నిందితులను బుధవారం సాయంత్రం ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్కు తరలించారు. అందులో ఒక సెక్యూరిటీ గార్డు, అలాగే ఇటీవల విధుల నుంచి తొలగించబడిన దేవస్థానం సెక్యూరిటీ సూపర్ వైజర్ ఉన్నారు. ఇదిలా ఉంటే భీమడోలు సీఐ పి.కృష్ణ, స్థానిక ఎస్సై టి.సుధీర్ నిందితుల వివరాలను దేవస్థానం నుంచి సేకరించారు. అలాగే ఒక ప్రింటర్ను స్వాధీనం చేసుకున్నారు. విలేకర్ల సమావేశం అనంతరం వీరందరినీ గురువారం కోర్టులో హాజరుపరచనున్నారు. ఏలూరు (టూటౌన్): లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పాత చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఇఫ్ట్యూ ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడారు. అనేక పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను బీజీపీ సర్కార్ తుంగలో తొక్కి.. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. వీటిని రద్దు చేసేవరకు కార్మిక వర్గం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బి.సోమయ్య, ఇఫ్ట్యూ ఏలూరు నగర సహాయ కార్యదర్శి ముంగము అప్పారావు, పల్లి గంగరాజు, పీడీఎస్యూ జిల్లా ప్రెసిడెంట్ కాకి నాని, బాడిత వీరభద్రం, ఇఫ్ట్యూ నగర సహాయ కార్యదర్శి ఎం.విజయలక్ష్మి, ఏలూరు ఏరియా పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ లొట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఖాకీల కాఠిన్యం
గోదావరి మోక్షధామం పెనుగొండ: సిద్ధాంతం కేదారీఘాట్లోని శ్మశాన వాటికలో రూ.3 కోట్లతో 62 సెంట్ల విస్తీర్ణంలో గోదావరి మోక్షధామం నిర్మాణానికి కలెక్టర్ నాగరాణి శ్రీకారం చుట్టారు. గురువారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రశాంతతకు మారుపేరైన జిల్లాలో పోలీస్ శాఖ గాడి తప్పుతుంది. సామాన్యులపై ఖాకీలు నిత్యం ప్రతాపం చూపిస్తూ లాఠీ ట్రీట్మెంట్తో హడలెత్తిస్తున్నారు. తరచూ జిల్లాలో ఇటువంటి ఘటనలు చేసుకుంటున్నా.. సెటిల్మెంట్లతో తెరమరుగు చేస్తుండడం గమనార్హం. తాజాగా బుట్టాయగూడెం ఎస్సై దుర్గా మహేశ్వరరావు యువకుడ్ని చితకబాదడం, నిడమర్రు ఎస్సై రమేష్ ఓ వ్యక్తిని కొట్టడంతో అవమానంగా భావించి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఈ రెండు ఘటనల్లో ఇద్దరు ఎస్సైలను సస్పెండ్ చేశారు. అనంతరం పూర్తి స్థాయి విచారణ నిర్వహించి ఇద్దరు ఎస్సైలను వీఆర్కు పంపడం జిల్లాలో చర్చనీయాంశమైంది. లాఠీ ట్రీట్మెంట్ : జిల్లాలో ఖాకీలు సామాన్యులపై ప్రతాపం చూపుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీకి తలొగ్గి అడ్డగోలుగా కేసులు నమోదు చేయడం, ప్రజాప్రతినిధుల ఆదేశాలంటూ బాధితులకు న్యాయం చేయకుండా కక్షపూరిత ధోరణికి పరోక్షంగా మద్దతు పలకడం, కొన్ని సందర్భాల్లో హైకోర్టు ఉత్తర్వుల ధిక్కరణకు పాల్పడుతూ తరచూ సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. కొన్ని పొలిటికల్ కేసుల్లో న్యాయమూర్తులు ఎస్సైలను మందలించడం, మెమోలు జారీ చేయాలని ఉత్తర్వులిచ్చిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. అయినా పోలీసులు అదే ధోరణిలో కొనసాగడం చర్చగా మారింది. రాధాకృష్ణ వ్యాఖ్యలపై కన్నెర్ర నిడమర్రుకు చెందిన నండూరి శివ కార్తికేయ (33) తన మేనకోడలు గొలుసు పోవడానికి అదే గ్రామానికి చెందిన వ్యక్తి కావడమని ఆరోపించడంతో ఆ రెండు కుటుంబాలు ఘర్షణ పడ్డాయి. గత నెల 30న నిడమర్రు పోలీస్స్టేషన్లో ఇరువర్గాల ఫిర్యాదులను కేసులుగా నమోదు చేశారు. ఈ క్రమంలో నిడమర్రులో కల్యాణోత్సవాల బందోబస్తుల్లో విధుల్లో ఉన్న ఎస్సైను.. కేసు నమోదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని శివకార్తీకేయ ప్రశ్నించాడు. దీంతో ఎస్సైకు కోపం కట్టలు తెంచుకుంది. ఇదే సమయంలో తిరునాళ్లలో బాలాజీ అనే వ్యక్తి కత్తి తిప్పి పరారీ అయ్యాడు. దీంతో కల్యాణోత్సవం వద్ద, అనంతరం స్టేషన్లో ఎస్సై విచారణ పేరుతో శివకార్తీకేయను తీవ్రంగా కొట్టి అవమానించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో కార్తీకేయ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తణుకు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివకార్తీకేయకు పోలీస్ బందోబస్తు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పరిస్థితి విషమించడంతో అతడు మృతి చెందాడు. ఈ ఘటనలో పోలీసులేమి వేధించలేదని నడిరోడ్డుపై పోలీసులను దుర్భాషలాడితే అదుపులోకి తీసుకుని స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించామని డీఎస్పీ శ్రావణ్కుమార్ ప్రకటించారు. అయితే ఎస్సైను మాత్రం వీఆర్కు పంపడం ఈ కేసులో ప్రత్యేకం. జిల్లాలో గాడి తప్పిన పోలీసింగ్ అకారణంగా యువకుడిని గాయపరిచిన బుట్టాయగూడెం ఎస్సై నిడమర్రు ఎస్సై కొట్టడంతో మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య ఇద్దరు ఎస్సైలు వీఆర్కు.. గతంలోనూ ఇదే తరహా ఘటనలు జిల్లాలో అనేకం -
భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి
అన్నదాన భవనానికి విరాళం కాళ్ల: కాళ్లకూరు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అన్నదానం నిమిత్తం కోలనపల్లికి చెందిన గ్రంధి వెంకటేశ్వర్లు, జ్ఞాన ప్రసన్న రూ.1,11,111 విరాళం అందించారు. ఏలూరు (టూటౌన్): పోలవరం ప్రాజెక్ట్ ఆర్అండ్ఆర్ కాలనీలకు భూసేకరణను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి బుధవారం సాయంత్రం పోలవరం ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ పునరావాస కార్యక్రమాలు, జాతీయ రహదారుల నిర్మాణానికి, ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు, చింతలపూడి ఎత్తిపోతల పథకం, సెల్ ఫోన్ నెట్వర్క్ టవర్ల ఏర్పాటు, తదితర కార్యక్రమాలకు భూ సేకరణపై అధికారులతో వీడియో కాన్షరెన్స్ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు నిర్మించే కాలనీలకు సంబంధించి భూసేకరణ పనులను వెంటనే పూర్తిచేసి, కాలనీ నిర్మాణ ఏజెన్సీలకు అప్పగించాలని ఆదేశించారు. జాతీయ రహదారుల నిర్మాణ భూసేకరణ పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూసేకరణ చేయాల్సిన భూ విస్తీర్ణం వివరాలతో నివేదిక సమర్పించాలని, భూసేకరణ పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు భూసేకరణ పనులను వేగవంతం చేయాలని, దెందులూరు నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు సెరికల్చర్ భూమి సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, నూజివీడు నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కునకు భూసేకరణకు భూమిని వెంటనే గుర్తించాలని అన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, ఇన్చార్జి డీఆర్ఓ భాస్కర్, పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అభిషేక్, నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న, ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీఓలు కిషోర్, రమణ, కలెక్టరేట్ భూసేకరణ విభాగ అధికారి పోతురాజు, బాబ్జి తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయ పద్ధతులే మేలు
ఏలూరు (టూటౌన్): ఎల్నినో ప్రభావంతో పంటల దిగుబడులు తగ్గకుండా ఉండేందుకు రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించి ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా చెప్పారు. స్థానిక ఐఏడీపీ హాల్లో బుధవారం ప్రకృతి వ్యవసాయ అమలుపై 3వ రోజున 154 మంది కేడర్కు విస్తృత స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎస్కే హాబీబ్ బాషా, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బి.వెంకటేష్ ఎల్నినో ప్రభావంతో పంటల దిగుబడులు తగ్గకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. -
అకారణంగా కొట్టడంతో..
బుట్టాయగూడెం ఎస్సై దుర్గామహేశ్వరరావు జంగారెడ్డిగూడెంకు చెందిన అఖిల్ అనే యువకుడ్ని చితకబాదారు. గత నెలలో రెడ్డిగణపవరంలో జరిగిన తిరునాళ్లలో అఖిల్ అనే యువకుడిని ఎస్సై గట్టిగా కొట్టడంతో రెండు చేతులు విరిగిపోయాయి. పొలిటికల్ నేతలు రంగప్రవేశం చేసి కేసు రాజీకి ప్రయత్నించారు. అయినా యువకుడు బంధువులు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఎస్సైను వీఆర్కు పంపారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే విచారణ పేరుతో థర్డ్ డిగ్రీ ప్రయోగించడం చర్చనీయాంశంగా మారింది. మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇలాంటి ఘటనలు జరిగిన తరువాత బాధిత కుటుంబాలతో రాజకీయ, ఇతరాత్ర ఒత్తిళ్లు తీసుకువచ్చి సర్దుబాటు చేసుకోవడం విశేషం. -
రద్దు చేసిన హక్కులను పునరుద్ధరించాలి
ఏలూరు (టూటౌన్): రద్దు చేసిన హక్కులను పునరుద్ధరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్, ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కోట దిబ్బ ప్రాంతంలో నిరసన తెలిపారు. అనంతరం ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)ని క్యాంప్ కార్యాలయంలో కలసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు కె.మహాలక్ష్ముడు, ఎ.అప్పలరాజు మాట్లాడుతూ కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన 2025 సివిల్ పెన్షన్ వాలిడేషన్ చట్టంను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గంగాధర్ రావు, ఎన్.మధుసూదనరావు, కరీం తదితరులు పాల్గొన్నారు. -
గంధకంతో సిరుల పంట
చింతలపూడి: సాధారణంగా రైతులు పంటలకు ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ వాడకంపైనే దృష్టి సారిస్తుంటారు. కానీ, మొక్కల సమగ్ర ఎదుగుదలకు, నాణ్యమైన దిగుబడికి ఈ మూడింటితో పాటు గంధకం నాలుగో ముఖ్యమైన పోషకమని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో సాగయ్యే తోట పంటలకు గంధకాన్ని అందించడం ద్వారా ఊహించని రీతిలో అధిక దిగుబడులు సాధించవచ్చని స్పష్టం చేస్తున్నారు. మెట్ట ప్రాంతంలో రైతులు ఉద్యాన పంటలను ఎక్కువగా పండిస్తుంటారు. అయితే ఉద్యాన పంటల్లో గంధకం వాడకం వల్ల 25 శాతం దిగుబడి పెరుగుతుందని ఉద్యానవన శాఖాధికారి ఎండీ షాఫియ ఫర్హీన్ తెలిపారు. మొక్కల పెరుగదలలో కీలక పాత్ర మొక్కల్లో పత్రహరితం పెరగడానికి, ప్రోటీన్ల తయారీకి గంధకం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం పోషకమే కాకుండా, మొక్కలలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఆయిల్ పామ్ వంటి పంటల్లో నూనె శాతాన్ని పెంచుతుంది. పండ్ల తోటల్లో పండ్ల పరిమాణం, రంగు, రుచి నాణ్యతను మెరుగుపరుస్తుంది. గంధకం వాడటం వల్ల పండ్లు కోత తర్వాత ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఉద్యానవన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆయిల్ పామ్ గెలల బరువు పెరుగుతుంది, నూనె శాతం గణనీయంగా వృద్ధి చెందుతుంది.కొబ్బరికాయ పరిమాణం పెరగడంతో పాటు, కొబ్బరి పీచు నాణ్యత మెరుగుపడుతుంది. నిమ్మ, బత్తాయి సిట్రస్ జాతి పంటల్లో రసం శాతం పెరుగుతుంది, తోలు మందం తగ్గుతుంది.అరటి గెల బరువు పెరగడమే కాకుండా, కాయలు త్వరగా పండకుండా నిల్వ ఉంటాయి. మామిడిపూత రాలడం తగ్గుతుంది. కాయ నాణ్యత పెరిగి ఎగుమతులకు అనుకూలంగా మారుతుంది. మొక్కలో గంధకం లోపిస్తే మొదట లేత ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. మొక్కల పెరుగుదల కుంటుపడి, కాండం బలహీనంగా మారుతుంది. రైతులు కేవలం యూరియా, డీఏపీలపైనే ఆధారపడకుండా, గంధకం వంటి ద్వితీయ శ్రేణి పోషకాలను వాడినప్పుడే ఉద్యాన పంటల్లో ఆశించిన దిగుబడి వస్తుందని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు. గంధకంతో ఉపయోగాలెన్నో ● క్లోరోఫిల్ ఉత్పత్తి గంధకం క్లోరోఫిల్ ఉత్పత్తికి సహాయపడుతుంది, ఇది మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేయడానికి అవసరం. కొన్ని విటమిన్ల ఉత్పత్తికి గంధకం చాలా అవసరం. ● పండ్ల నాణ్యత పండ్ల రుచి, వాసన, రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు, ఉల్లిపాయ, వెల్లుల్లిలో వాటి ప్రత్యేకమైన వాసన గంధకం వల్లనే వస్తుంది. ● తెగుళ్లు, వ్యాధుల నివారణ కొన్ని సందర్భాల్లో, గంధకం శిలీంద్ర నాశినిగా, కొన్ని రకాల తెగుళ్లను నివారించడానికి కూడా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ● లభ్యత ఇలా.. గంధకం మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అమ్మోనియ సల్ఫేట్, జిప్సం, సల్ఫేట్ ఆఫ్ పొటాష్, జింక్ సల్ఫేట్ , మెగ్నీషియం సల్ఫేట్, మాంగనీస్ సల్ఫేట్, ఐరన్ సల్ఫేట్ల రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. గంధకం నేలలో వాడినప్పుడు దానికి సంబంధించిన ఆమ్ల స్వభావం మన నేలకు ఉదజని సూచిక 6 నుంచి 6.5 వరకు వచ్చే సరికి నేలలోని అన్ని రకాల పోషకాలు మొక్కకు అందుబాటులోకి వస్తాయి. ● చౌడు భూముల్లో చౌడు భూములను బాగు చేసుకోవడానికి నేలలోని ఉదజని సూచికను బట్టి ఎకరానికి 500 కేజీల జిప్సంను వాడినట్లయితే దిగుబడి బాగా పెరుగుతుంది. గంధకం వాడకంతో పంట నాణ్యత, పరిమాణం, గింజల్లో నూనె శాతం పెరుగుతుంది. ● ఆదాయ పెరుగుదల ఉద్యాన పంటల్లో తక్కువ ధరలో అందుబాటులో ఉండే జిప్సం, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 50 శాతం, సల్ఫర్ గుళికలు 90 శాతం వాడితే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. కాపుకాసే తోటలైతే 500 గ్రాములు, వయస్సును బట్టి 5 నుంచి 10 కేజీల జిప్సం సంవత్సరానికి రెండు సార్లు వేసుకున్నట్లయితే దిగుబడులు పెరుగుతాయి. ఇతర పండ్ల తోటలకు, కూరగాయల తోటలకు అయితే దుక్కిలో ఎకరానికి నేల స్వభావాన్ని బట్టి 300 నుంచి 500 కేజీల జిప్సంను వాడుకోవచ్చు. ఎండీ షాఫియ ఫర్హీన్ ఉద్యానవన శాఖాధికారిణి ఉద్యాన పంటల్లో అత్యధిక దిగుబడులు -
యథేచ్ఛగా ఇసుక దోపిడీ
కుక్కునూరు: రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని వాగుల నుంచి ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతుంది. అంతరాష్ట్ర సరిహద్దులను ఆసరా చేసుకుని తెలంగాణకు చెందిన ఇసుక మాఫియా ఆంధ్ర ప్రాంత ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళ్తే ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు సరిహద్దు ప్రాంతంలోని సీతారాం నగరం గ్రామానికి ఆనుకుని ఉన్న కిన్నెరసాని వాగు పరిధి కొంతమేర ఆంధ్ర, కొంతమేర తెలంగాణ రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. కాగా తెలంగాణ పరిధిలోని సోంపల్లి గ్రామ సమీపంలో తెలంగాణ రాష్ట్రం రెండు అధికారిక ర్యాంపులను కేటాయించింది. ఈ ర్యాంపుల మీదుగా ఇసుక తరలింపు జరుగుతుండగా దీన్ని ఆసరాగా చేసుకుని తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు కిన్నెరసాని వాగులోని పాసిరేవు వద్ద నుంచి ఇసుకను అనధికారికంగా తరలిస్తున్నారు. కాగా పాసిరేవుకు ఇవతల ప్రాంతం ఆంధ్ర ప్రాంత పరిధిలో ఉంటుంది. అయితే ఆంధ్ర ప్రాంతం పరిధిలోకి వచ్చే ప్రాంతం నుంచి ఇసుకను తవ్వి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. సరిహద్దులపై స్పష్టత కరువు మండలంలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు సరిహద్దులపై స్పష్టత లేకపోవడం, స్పష్టత వచ్చే దిశగా చర్యలు చేపట్టకపోవడం ఇసుక మాఫియాకు వరంలా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జీపీఎస్ యాప్ ఆధారంగా సీతారామ నగరం గ్రామం సరిహద్దులను బూర్గంపాడు పరిధిలో చూపిస్తుండడంతో ఇసుక మాఫియా అది తెలంగాణ ప్రాంతం అని చెప్పుకుంటూ మన ప్రాంత పరిధిలోని ఇసుకను తరలించుకుని సొమ్ము చేసుకుంటుంది. కూటమి నాయకుల విమర్శలు తమ మండలంలో ఇసుక అక్రమంగా తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని కూటమికి చెందిన నాయకులే ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు. దీన్ని బట్టి చూస్తే మండలంలో జరిగే ఇసుక అక్రమ దందా ఏ విధంగా ఉందనేది స్పష్టం అవుతుంది. అంతేకాక సీతారామ నగరం పరిధిలోని కిన్నెరసాని వాగులో ఆంధ్ర ప్రాంతం నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని కూటమి పార్టీకి చెందిన ఓ నాయకుడు సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేశారు. దీంతో ఇసుక తరలింపులో అధికారుల పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకురూ.18 లక్షల విరాళం
ద్వారకాతిరుమల: శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టు అభివృద్ధికి భారీగా విరాళాలు అందిస్తున్న హనుమాన్ జంక్షన్ సమీపంలోని బొమ్ములూరుకు చెందిన దీపక్ నెక్స్జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు అభినందనీయులని దేవస్థానం ఈఓ వై.భద్రాజీ అన్నారు. దీపక్ నెక్స్జెన్ కంపెనీ ఎండీ అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం, కంపెనీ ప్రతినిధులు బుధవారం నిత్యాన్నదాన ట్రస్ట్కు రూ.18 లక్షలను జమ చేశారు. ఈ విరాళం చెక్కును ఆలయ ఈఓ భద్రాజీకి అందించారు. ఈ సందర్భంగా ఈఓ వారికి స్వామివారి శేష వస్త్రం, కండువాలు కప్పి ఘనంగా సత్కరించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా నెక్స్జెన్ కంపెనీ దాదాపు రూ.1,47,08,007లను అందించినట్టు ఈఓ తెలిపారు. -
జనసేన జెడ్పీటీసీ సభ్యుడి వేధింపులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/భీమవరం (ప్రకాశం చౌక్): పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండల జనసేన జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్ నాయుడు తనను వేధించాడని, రూ.10 లక్షలు, బంగారం తీసుకుని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తూ భీమవరం గునుపూడికి చెందిన మద్దాల విజయలక్ష్మి అనే మహిళ వీడియో రిలీజ్ చేసింది. వీడియోలో ఆమె మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ అంటే అభిమానంతో భీమవరంలోని జనసేన పార్టీ ఆఫీసుకు ప్రతి కార్యక్రమానికి వెళ్లేదానినని, జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడుతో తనకు పరిచయం ఏర్పడిందన్నారు. నేను అంటే ఇష్టమని, లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని జయప్రకాష్ అడిగాడన్నారు. నాకు పెళ్లి అయిపోయిందని, విడాకులు కూడా తీసుకున్నానని... సెట్ అవ్వదని చెప్పానన్నారు. తనకూ పెళ్లి అయ్యిందని, తన భార్య కూడా వదిలేసిందని, బాగా చూసుకుంటానని చెప్పడంతో జయప్రకాష్ తో రెండేళ్లు కలిసి ఉన్నానని బాధితురాలు చెప్పారు. ఈ క్రమంలో ఇల్లు కొంటున్నానని, ఆర్థిక ఇబ్బంది ఉందని చెప్పి రూ.10 లక్షలు, బంగారం తీసుకున్నాడని... తర్వాత నుంచి అతడి ప్రవర్తన మారి తనను ఇష్టం లేకుండా చూడటం, కొట్టడం, గంజాయి కలిపిన స్వీట్స్ పెట్టడం, గంజాయి మత్తులో శారీరకంగా తనను టార్చర్ చేయడం వంటివి చేసేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాను భరించలేక మా పుట్టింటికి వెళ్లిపోయానని, అయినా మళ్లీ ఫోన్ చేయడంతోపాటు, మా అమ్మతో మాట్లాడి... తీసుకెళ్లి మరలా టార్చర్ చేశాడని వాపోయింది. ఓ సారి టార్చర్ చేసిన తర్వాత ఆస్పత్రిలో చూపించి ఇంటికి పంపించాడని ఆమె రిలీజ్ చేసిన వీడియోలో తెలిపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆది నుంచి వివాదాస్పదుడే.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం జెడ్పీటీసీ గుండా జయప్రకాష్నాయుడు(జేపీ) ఆది నుంచి వివాదాస్పద వ్యక్తి. ఆయనపై భూఆక్రమణలు, సివిల్ వివాదాలు, కొట్లాటలకు సంబంధించి కేసులున్నాయి. అలాగే బ్యాంకు రుణాలకు సంబంధించిన, తెలంగాణలో మత్స్యశాఖలో చేపల సాగు టెండర్ల విషయంలోనూ నకిలీ ధ్రువీకరణపత్రాలు, బ్యాంకు గ్యారెంటీలు సమర్పించారని ఆరోపణలపైనా తెలంగాణ ప్రభుత్వం రెండేళ్ల కిందట విచారణ నిర్వహించింది. తణుకు, భీమవరం, వీరవాసరంలోనూ ఆయనపై కేసులున్నాయి. -
గర్బిణుల ప్రాణాలతో చెలగాటం
ఏలూరు టౌన్: వైద్యులను దేవుడితో సమానంగా గౌరవిస్తూ ఉంటారు... ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్కు వెళితే వైద్యుడు తన ప్రాణాలను కాపాడతారనే నమ్మకంతో ఉంటారు. ఏలూరు సర్వజన ఆసుపత్రిలోని మాతాశిశు విభాగం (ఎంసీహెచ్)లో గర్భిణుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. నవమాసాలు మోసి... పండంటి బిడ్డకు జన్మనిస్తున్న గర్భిణుల ప్రాణాలకు భరోసా లేకుండా పోతుందంటూ బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకటీ...రెండో కాదు ఏకంగా పదుల సంఖ్యలో నిత్యం ఇదే తరహా తంతు సాగుతున్నా... జిల్లా స్థాయి అధికారులు సైతం ఏమీ చేయలేకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. గర్భిణులకు ఆపరేషన్లు చేయగా... కుట్లు విడిపోవటం, తీవ్ర ఇన్ఫెక్షన్లతో అనారోగ్యం బారినపడటం, ప్రాణాపాయ స్థితి ఎదుకావడం ఇక్కడ సర్వసాధారణ అంశంగా మారిపోయింది. ప్రాణాలంటే... నిర్లక్ష్యమా ? ఏలూరు జీజీహెచ్లోని ఎంసీహెచ్ విభాగం వైద్యులు, వైద్య సిబ్బందికి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదనీ... తీవ్ర నిర్లక్ష్యం కారణంగానే గర్భిణుల ఆపరేషన్ల విషయంలో విఫలం అవుతున్నారని అంటున్నారు. గత ఏడాది కాలంలో సుమారు 50 నుంచి 60మందికి పైగా గర్భిణులు ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటూ హాస్పిటల్ నుంచి బలవంతంగా బయటకు వెళ్లిపోవటం పరిస్థితికి అద్దం పడుతుంది. తాజాగా ఎంసీహెచ్ బ్లాక్లో నిడిగట్టు మౌనిక, కొడాలి సుప్రియ, వెన్నెల, పెనుమాల రమ్య, లావణ్య ఇలా గర్బిణిలు వైద్యులు, సిబ్బంది అలసత్వంతో అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆపరేషన్ చేసిన అనంతరం కనీసం కుట్లు సరిగ్గా వేయకపోవటంతో కుట్లు విడిపోయి, తీవ్ర ఇన్ఫెక్షన్తో విలవిల్లాడుతున్నారు. పోనీ బయటకు వెళ్ళి వేరే హాస్పిటల్లో వైద్య చికిత్స చేయించుకుందామని అనుకుంటే... డిశ్చార్జ్ చేయకుండా వైద్య సిబ్బందితో బెదిరింపులకు పాల్పడడం నిత్య కృత్యంగా మారిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. ఎంసీహెచ్ బ్లాక్ వద్ద ఆందోళన ఏలూరు జీజీహెచ్లోని ఎంసీహెచ్ బ్లాక్ వద్ద గర్భిణులపై వైద్యులు, వైద్య సిబ్బంది తీరుకు నిరసనగా మాలమహానాడు రాష్ట్ర నాయకులు అబ్బూరి అనిల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాధితుల తరఫున ఆందోళనకు దిగారు. హాస్పిటల్ గేటు వద్ద బైఠాయించి బాధితుల బంధువులు, యువతతో కలిసి ధర్నా చేశారు. ప్రజలకు సరైన వైద్యం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ అధికారులు చర్యలు చేపట్టకపోవటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది పేదవర్గాల మహిళలు ప్రసూతి కోసం జీజీహెచ్కు వస్తుంటే... ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం దారుణమంటూ నిరసన తెలిపారు. పీజీలతో వైద్యం చేయిస్తూ...చోద్యం చూస్తున్న అధికారులు కుట్లు విడిపోయి... ఇన్ఫెక్షన్లతో తీవ్ర అనారోగ్యం ఏలూరు జీజీహెచ్లో వైద్యసేవలపై తీవ్ర అసంతృప్తి ఏలూరు జీజీహెచ్లో వైద్యులు, సిబ్బంది తీరు దారుణంగా ఉంది. పేద మహిళలు ప్రసూతికి వస్తే ... తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్లే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. రెండు, మూడు సార్లు కుట్లు వేయటానికి వాళ్ళు మనుషులేనా ? అంటూ మండిపడ్డారు. కుట్లు విడిపోయి ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ ఉంటే కనీస వైద్యచికిత్స చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆపరేషన్ చేశాక 20 నుంచి నెలరోజుల వరకూ హాస్పిటల్లోనే ఉంచుతూ... మందులు బయటకు రాస్తూ వ్యాపారం చేస్తున్నారు. – అబ్బూరి అనిల్, మాలమహానాడు, రాష్ట్ర నాయకులు నేను కడుపులో నొప్పితో సుమారు ఆరునెలల నుంచీ ఏలూరు జీజీహెచ్కు తిరుగుతూ ఉన్నా. మేము ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చూపించుకునే స్తోమత లేక జీజీహెచ్కు వస్తే... ఇక్కడ వైద్యులు కనీసం చేయి పట్టుకుని కూడా చూడలేదు. రక్త పరీక్షలు పేరుతో తిప్పుతూ ఉన్నారు. కడుపులో గడ్డలు ఉన్నాయంటారు.. కానీ చికిత్స మాత్రం చేయడం లేదు. పేదలకు సరైన వైద్యం అందే పరిస్థితి కనిపించడం లేదు. ఆసుపత్రి అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలి. – దానం భవానీ, తంగెళ్లమూడి -
ఓటరు జాబితాలో అవకతవకలపై అప్రమత్తం
ఏలూరు టౌన్: ఓటరు జాబితా సవరణలో జరుగుతున్న అవకతవకలపై ప్రతి బూత్ కమిటీ సభ్యుడు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్రెడ్డి అన్నారు. బూత్ కమిటీ రీజనల్ కోఆర్డినేటర్ బీవీఆర్ చౌదరి, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు చింత అనిల్ ఆధ్వర్యంలో ఏలూరులో జిల్లా స్థాయి బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటర్ల జాబితాలో సవరణపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పార్టీ నేతలకు, బూత్కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు. సుధాకర్రెడ్డి మాట్లాడుతూ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పేరుతో ఓట్ల సవరణలో ఏవిధంగా ఓట్లను భారీఎత్తున తొలగించారో చూశామన్నారు. ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియపై ప్రతి బూత్ కమిటీ సభ్యుడు అవగాహన చేసుకుంటూ రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, పీఏసీ సభ్యులు, ఉంగుటూరు సమన్వయకర్త పుప్పాల వాసుబాబు, పోలవరం సమన్వయకర్త తెల్లం బాలరాజు, చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు, ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, కై కలూరు, చింతలపూడి, ఏలూరు పరిశీలకులు నూకపెయ్యి సుధీర్బాబు, దాసరి రమేష్, డీవీఆర్కే చౌదరి, పార్టీ నేతలు, బూత్కమిటీ సభ్యులు హాజరయ్యారు. -
సీహెచ్సీలో ఫ్యాన్లకు మరమ్మతులు
దెందులూరు: స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఫ్యాన్లకు మంగళవారం మరమ్మతులు చేయించారు. సీహెచ్సీలో ఉన్న 3 ఫ్యాన్లు మరమ్మతులకు గురవడంతో ఆస్పత్రి సిబ్బంది, రోగులు పడుతున్న అవస్థలపై ‘ఫ్యాన్లు రిపేరు చేయించరూ..’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ సుందర్బాబు రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. వెంటనే మూడు ఫ్లాన్లకు మరమ్మతులు చేయించారు.ఏలూరు (ఆర్ఆర్పేట): ఇటీవల నిర్వహించిన ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు రాసిన జవాబు పత్రాల మూల్యాంకనంను జాగ్రత్తగా ఎటువంటి తప్పులకు తావు లేకుండా పూర్తి చేయాలని ఇంటర్మీడియెట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా ఆదేశించారు. మంగళవారం స్థానిక కోటదిబ్బలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న మూల్యాంకన కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఏలూరు జిల్లాలో ప్రస్తుతం అన్ని సబ్జెక్టుల మూల్యాంకనం పూర్తయిందని, ఇంగ్లీష్ సబ్జెక్టు మూల్యాంకనం బుధవారంతో పూర్తవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మూల్యాంకన కేంద్రం స్ట్రాంగ్ రూమ్, స్కానింగ్ రూమ్లను తనిఖీ చేసి శిబిరం అధికారి కే యోహాన్కు, ఇతర అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జరుగుతున్న తరగతులను పరిశీలించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోర్టులో వినియోగం నిమిత్తం రిజిస్టర్లు, బ్రౌన్ పేపర్లు, కంప్యూటర్ పేపర్లు వంటి స్టేషనరీ వస్తువులు కొనుగోలు చేసేందుకు సీల్డ్ టెండర్లు కోరుతున్నట్లు జిల్లా జడ్జి ఎస్.శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. నమూనా కాగితాలతోపాటు సీల్డ్ టెండర్ కొటేషన్లు ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ కోర్ట్, ఏలూరు చిరునామాకు కార్యాలయ పనిదినాలలో ఈ నెల 18 సాయంత్రం 5 గంటలలోపు అందేలా పంపాలన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): రెండో విడత జేఈఈ మెయిన్స్ పరీక్షల ఐదో రోజు మంగళవారం 465 మంది విద్యార్థులు హాజరయ్యారు. 5వ రోజు పరీక్షలు అన్ని కేంద్రాల్లో కేవలం మధ్యాహ్నం సెషన్లో మాత్రమే నిర్వహించారు. ఏలూరు నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో పరీక్షకు 70 మందికి గాను 63 మంది హాజరు కాగా ఏడుగురు గైర్హాజరయ్యారు. తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో మధ్యాహ్నం సెషన్లో 179 మందికి గాను 158 మంది హాజరు కాగా, శశి ఇంజనీరింగ్ కళాశాలలో 107 మందికి 77 మంది హాజరయ్యారు. భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో 99 మందికి 83 మంది హాజరు కాగా, డీఎన్ఆర్ కళాశాలలో మధ్యాహ్నం సెషన్లో 100 మందికి 84 మంది హాజరయ్యారు. ఏలూరు (ఆర్ఆర్పేట): రేషన్ పంపిణీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే డీలర్లను తొలగిస్తామని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో డీలర్ల పనితీరును జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్, రేషన్ పంపిణీ తదితర విషయాల్లో తక్కువ పనితీరు కనబరిచిన 45 మంది చౌకధరల దుకాణాల డీలర్లతో మాట్లాడారు. ప్రజలకు రేషన్ పంపిణీని సక్రమంగా చేయాలనీ, రేషన్ కోసం వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. తక్కువ పనితీరు కనబరిచిన 45 రేషన్ దుకాణాలను సీఎస్ డీటీలు వెంటనే వ్యక్తిగతంగా సందర్శిస్తామన్నారు. సమావేశంలో ఏలూరు జిల్లా పౌర సరఫరాల అధికారి బాబు విలియమ్స్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరామమూర్తి పాల్గొన్నారు. -
కైకలూరు జనసేనలో జగడాలు
సాక్షి టాస్క్ఫోర్స్: అన్యాయాలను ప్రశ్నించడానికి పిడికిలి ఎత్తామని పదే పదే చెప్పుకుంటున్న జనసేన పార్టీ కై కలూరు నియోజకవర్గంలో తన ఉనికిని కోల్పోతోంది. పార్టీ గుర్తుల చొక్కాలతో ఎంచక్కా దౌర్జన్యాలు, ఇసుక దోపిడి, కోడిపందేలు, పేకాట కోర్టు కేసులతో కొందరు చెడ్డ పేరు తెస్తున్నా కట్టడి చేసే ప్రయత్నం అధిష్టానం చేయడం లేదు. కొందరు చేసే తప్పును అందరిపై రుద్దవద్దంటూ సోషల్ మీడియా వేదికగా జనసేన నాయకులు నెత్తినోరు బాదుకుంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ నీడగా మారిన జనసేన కార్యకర్త వల్ల మొత్తం పార్టీ అభాసుపాలవుతున్నా ప్రశ్నించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. రెండు జనసేన పార్టీ కార్యాలయాలు జనసేన పార్టీలో ఆధిపత్య పోరుకు నిదర్శనంగా నియోజకవర్గ పార్టీ జనసేన కార్యాలయాలు నిలుస్తున్నాయి. కై కలూరు పోస్టాఫీసు ఎదురుగా జనసేన నియోజకవర్గ ప్రధాన పార్టీ కార్యాలయం ఉంది. అదే విధంగా ఆటపాకలో జనసేన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఇంటి వద్ద కై కలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం కొనసాగుతోంది. మీడియా సమావేశాలను సైతం విడివిడిగా నిర్వహిస్తున్నారు. ఇటీవల అమరావతిపై పార్లమెంటులో బిల్లు ఆమోదంపై కై కలూరు జనసేన పార్టీ కార్యాలయంలో దీపాలు వెలిగించి హడావిడి చేశారు. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వెంట తిరిగే జనసేన నాయకులు ఒక వర్గంగా, జనసేన ఎమ్మెల్సీ జయమంగళతో కలసి ఉంటున్న నాయకులు మరో వర్గంగా ఇక్కడ పార్టీ తయారైందంటూ చర్చ జరుగుతోంది. ఇన్చార్జి నియామకంపై అధిష్టానం వెనకడుగు కై కలూరు నియోజకవర్గంలో జనసేన ఇన్చార్జిని నియమించడానికి పార్టీ అధిష్టానం వెనకడుగేస్తోంది. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. దీంతో చిరంజీవి కుటుంబంతో అవినాభావ సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కామినేని మాట కాదనరు. ఏలూరు ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్తో మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ కారణాలతో బీజేపీ, టీడీపీ స్నేహబంధాన్ని దెబ్బతీయవద్దనే ధోరణితోనే జనసేన అదిష్టానం వ్యవహరిస్తోంది. కనీసం జనసేన పార్టీ మండల కమిటీలను సైతం నియోజకవర్గంలో వేయలేకపోతుంది. మాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు వస్తుందని కష్టపడిన జనసేన యువత ఇప్పుడు ఉసూరుమంటోంది. కైకలూరు పోస్టాఫీసు ఎదుట జనసేన పార్టీ మరో కార్యాలయంలో నాయకులు నియోజకవర్గంలో రెండు పార్టీ కార్యాలయాలు మౌనం వహిస్తున్న జనసేన ఎమ్మెల్సీ జయమంగళ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించని అధిష్టానం ఎమ్మెల్యే కామినేని నీడగా మారిన వ్యక్తికే పనులు పార్టీకి ఫిర్యాదులు వెళ్లినా కనీసం ప్రశ్నించని నాయకత్వం -
నకిలీల డొంక కదిలింది
బుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ద్వారకాతిరుమల: శ్రీవారి రూ.200 నకిలీ దర్శనం టికెట్ల స్కాం కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంది. పోలీసులు తీగ లాగితే డొంకంతా కదిలింది. ఇప్పటికే ఈ కేసులో ఏడుగురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నిందితులుగా గుర్తించినట్టు తెలుస్తోంది. మరింత లోతుగా విచారణ జరిగితే మరికొందరి పాత్రలు బయటపడే అవకాశం ఉంది. ఆ దిశగా పోలీసులు విచారణ జరుపుతారా.. లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన వెంకన్న ఆలయంలో గతనెల 15న రూ.200 నకిలీ దర్శనం టికెట్ల విక్రయాలు బయటపడ్డాయి. దీనిపై ఆలయ ఈఓ వై.భద్రాజీ ఫిర్యాదు మేరకు ఎస్సై టి.సుధీర్ దేవస్థానం అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఐఎస్జే రాజు, సెక్యూరిటీ గార్డు మేకా సతీష్పై కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా మరో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎస్.శేషు బాబును అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అనంతరం శేషు బాబును, సతీష్ను కోర్టుకు హాజరు పరచి, రిమాండ్కు తరలించారు. పోలీసుల అదుపులో సాఫ్ట్వేర్ ఉద్యోగి యలమంచిలి సమీపంలో ఐఎస్జే రాజును పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో రాజు పలు విషయాలు వెల్లడించాడు. దేవస్థానం అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రమేష్ తాడేపల్లిగూడెంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన తన స్నేహితుడి వద్ద నకిలీ టికెట్లకు సంబంధించిన సాఫ్ట్వేర్ తయారు చేయించినట్టు తెలుసుకున్నారు. దాంతో రమేష్తో పాటు, సాఫ్ట్వేర్ (బెంగుళూరు) ఉద్యోగిని, అవుట్ సోర్సింగ్లో హార్డ్వేర్గా పనిచేస్తున్న శ్రీను అనే వ్యక్తిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకు ఈ కేసులో ఏడుగురు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నిందితులుగా గుర్తించినట్టు తెలుస్తోంది. సెక్యూరిటీ, ఇతర సిబ్బంది కూడా ఉన్నట్టు సమాచారం. సెల్ఫోన్లో పంపకాల చిట్టా పోలీసులు ఐఎస్జే రాజు వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్ నుంచి మరింత సమాచారాన్ని సేకరించారు. నకిలీ టికెట్ల విక్రయాల ద్వారా వచ్చిన నగదును నిందితులు వాటాలు వేసుకుని పంచుకున్నారు. ఆ తరువాత ఆ లెక్కలను వారు వాట్సప్ల ద్వారా షేర్ చేసుకున్నట్టు గుర్తించారు. పంపకాల్లో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి నిందితుడిగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు సాఫ్ట్వేర్ ఉన్న పెన్డ్రైవ్ను, ఓ ల్యాప్ట్యాప్ను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. తుదిదశకు చేరిన శ్రీవారి దర్శనం టికెట్ల కేసు దర్యాప్తు ఏడుగురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు గుర్తింపు పోలీసుల అదుపులో సాఫ్ట్వేర్ తయారు చేసిన ఇంజినీర్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్న శేషుబాబును మూడు నెలల క్రితం రూ.200 టికెట్ కౌంటర్ నుంచి మరో చోటికి మార్చారు. మరుసటి రోజే మళ్లీ అతడిని రూ. 200 కౌంటర్లో నియమించారు. ఇలా డ్యూటీ మార్చేం దుకు ఎస్టాబ్లిష్మెంట్ గుమస్తాకి రూ.20 వేలు ఇచ్చినట్టు శేషుబాబు పోలీసుల విచారణలో తెలిపాడు. సిబ్బంది విధుల కేటాయింపులో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని దేవస్థానం ఈఓకి లెటర్ రాసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. -
నేడు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు నగర పాలక సంస్థలో పనిచేసే మున్సిపల్ ఆప్కాస్ కార్మికులు 1000 మందికి మార్చి నెలలో ఇవ్వాల్సిన జీతాలు నేటికి ఇవ్వలేదని, వెంటనే జీతాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 10 గంటలకు కార్పొరేషన్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించాలని ఫెడరేషన్ ఏలూరు నగర కమిటీ సమావేశం నిర్ణయించిందని ఆ సంఘ నాయకులు తెలిపారు. స్థానిక ఐఎఫ్టీయూ కార్యాలయంలో ఫెడరేషన్ సమావేశం యూనియన్ అధ్యక్షుడు లావేటి కృష్ణారావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నగర కార్యదర్శి జి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిధి పోర్టల్ పేరుతో కార్మికుల జీతాలను ఆలస్యం చేస్తున్నారని, దానివల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమావేశంలో యూనియన్ గౌరవాధ్యక్షుడు ఇఫ్టూ ఏలూరు నగర అధ్యక్షుడు బి.సోమయ్య, పంతం చిన్న నాగరాజు, బంగారు వెంకటేశ్వరరావు, తానంకి జార్జి పాల్గొన్నారు. -
అనాథ బాలలకు నూతన జీవితం
గర్భిణుల ప్రాణాలతో చెలగాటం ఏలూరు సర్వజన ఆసుపత్రిలోని మాతాశిశు విభాగంలో గర్భిణుల ప్రాణాలతో వైద్య సిబ్బంది చెలగాటం ఆడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 8లో uకలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు (ఆర్ఆర్పేట): కన్నతల్లి చనిపోయి, తండ్రి వదిలేసిన అనాథ బాలలు ముగ్గురిని కలెక్టర్ వెట్రిసెల్వి అక్కున చేర్చుకున్నారు. కుక్కునూరు చెందిన ఏడు, ఆరు, నాలుగు సంవత్సరాల వయసు కలిగిన ముగ్గురు బాలికల తల్లి ఇటీవల మరణించింది. తండ్రి పిల్లలను వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు లేక దీనస్థితిలో ఉన్న వారి పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కలెక్టర్ వెట్రిసెల్వి ఆ పిల్లల పరిస్థితిని పరిశీలించి తీసుకురావాల్సిందిగా ఐసీడీఎస్ పీడీ శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి సీహెచ్ సూర్య చక్రవేణిలను ఆదేశించారు. కలెక్టరేట్కు తీసుకువచ్చిన ఆ బాలికలతో కలెక్టర్ వెట్రిసెల్వి కొంతసేపు మాట్లాడారు. వారికి కొత్త బట్టలు, చెప్పులు, బిస్కెట్లు, డ్రాయింగ్ పుస్తకాలు, కలర్ పెన్సిల్లు నోట్ బుక్స్ ఇచ్చి, తదుపరి చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సూర్య చక్రవేణికి ఆదేశాలు జారీ చేశారు. -
సెప్సిస్ ప్రాణాంతకం..
● తీవ్ర అనారోగ్యానికి గురువుతున్న బాధితులు ● జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు యలమంచిలి: ప్రస్తుతం వాతావరణ మార్పులతో ప్రజలు రోగాల బారినపడుతున్నారు. చాలారోగాలు ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంటాయి. సాధారణంగా నలతగా ఉందంటే ఇన్ఫెక్షన్ సోకిందంటూ ఉంటా. వైద్యులు వివిధ పరీక్షలు చేసిన తరువాత ఏ ఇన్ఫెక్షనో చెబుతారు. అయితే ఈ సమస్యపై అంతులేని నిర్లక్ష్యం వహిస్తుంటాం. ఇన్ఫెక్షన్ ప్రాణాంతకం అయినా చాలామంది కొంచెం నలతగా ఉంటే సొంత వైద్యం చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో అనేక మంది ఇన్ఫెక్షన్ల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇన్ఫెక్షన్ను సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ను సెప్సిస్ అంటారు. శరీరంలో సోకే ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా అదుపు చేయకపోతే అది తీవ్రమైన ఇన్ఫెక్షన్కు (సెప్సిస్)కు దారి తీయవచ్చు. తొలుత ఇన్ఫెక్షన్ నిర్ధారణ కచ్చితంగా జరగాలి. అనంతరం నియంత్రణకు అవసరమైన చికిత్స చేయించాలి. మల్టిఫ్లెక్స్ పీసీఆర్ అనే అధునాతన వైద్య పరీక్ష ద్వారా త్వరితగతిన సెప్సిస్ను నిర్ధారించవచ్చు. బయోఫయర్ ద్వారా మూడు గంటల్లో నిర్ధారణ చేయవచ్చు. నిర్ధారణతోపాటు ఇన్ఫెక్షన్ నియంత్రణకు కావాల్సిన మందులు వాడాలి. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు యాంటిబయాటిక్స్ వైద్యుల సలహాలు మేరకు మాత్రమే వాడాలి. – డాక్టర్ ఆర్ శ్రీ సాహిత్య ఎమర్జెన్సీ,ఐసీయూ, అత్యవసర చికిత్స వైద్య నిపుణురాలు, పాలకొల్లు ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన వారికి, చిన్న పిల్లలకు, ఊపిరితిత్తులు, గుండె, లివర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి, హెచ్ఐవీ బాధితులకు, సుగర్ వ్యాధి బాధితులకు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి సోకే అవ కాశం ఉంది. ప్రతి సంవత్సరం ఐదు కోట్ల మంది సెప్పిస్ వ్యాధి బారిన పడుతున్నారు. వీరిలో కోటిమంది ప్రాణాలు ప్రమాదస్థితికి చేరుకుంటున్నా యి. ప్రపంచవ్యాప్తంగా 50శాతం మంది సెప్సిస్వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షణాలు ఇది సూక్ష్మ క్రిముల ద్వారా వస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రతలు హెచ్చు తగ్గులుగా ఉండటం, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస వేగంగా తీసుకోవడం, విపరీతమైన నీరసం, తీవ్రమైన చలి, ఆయాసం, మూత్ర విసర్జన తగ్గిపోవడం, బీపీ తగ్గడం, పెరగడం, రోగి తికమక పడడం తదితర లక్షణాలు వ్యాధి బాధితుల్లో కనిపిస్తాయి. వ్యాధి సోకే భాగాలు నూటికి 50 శాతం ఊపిరితిత్తులు. కిడ్నీలు, బ్రెయిన్, యూరినరి ట్రాక్, చర్మం, ఇతర భాగాల్లో వ్యాధి ఇన్ఫెక్షన్లు సోకుతాయి. కడుపులో ఇన్ఫెక్షన్లు రావడం ద్వారా అల్సర్లు ఏర్పడతాయి. కాళ్లల్లో పుండ్లు ఏర్పడి చీము పట్టి పరిస్థితి ప్రమాదంగా మారి కొన్నిసార్లు ఆపరేషన్ల ద్వారా ఆ గాయాలను తొలగించాల్సి వస్తుంది. బ్లడ్ కల్చర్, కార్బాఆర్, బయోఫైయర్ (అన్ని రకాల సూక్ష్మ క్రిములకు) పరీక్షల ద్వారా సెప్సిస్ని నిర్ధారిస్తారు. అంటువ్యాధి కారకాలు, వాటి విషపూరిత పదార్థాల వ్యాప్తి, వాటి స్థానం నుంచి రక్త ప్రవాహంలో కలవడం ద్వారా ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఇది ఒక ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన జబ్బు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తక్షణమే గుర్తించి చికిత్స చేయని పక్షంలో శరీరంలోని పలు అవయవాలు ఇన్ఫెక్షన్ల వల్ల పనిచేయడం మానేస్తాయని వివరిస్తున్నారు. చివరికి రోగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వీరికి సకాలంలో వ్యాధి నిర్ధారణ చేసి వైద్యం అందించని పక్షంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ (సెప్సిస్) మారి రోగులను ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. -
జంకుతున్న జయమంగళ..
ముచ్చటగా మూడో పార్టీలో కొనసాగుతోన్న ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ జనసేన పార్టీని దూకుడుగా తీసుకెళ్లడానికి జంకుతున్నారు. నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన జయమంగళ, వైఎస్సార్సీపీ పాలన చివరిలో పార్టీలో చేరారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొల్లేరు ప్రాంత బిడ్డకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. తీరా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన జనసేన పార్టీలో చేరారు. చుక్కాని లేని నావగా మారిన జనసేన పార్టీకి జయమంగళ రావడంతో పవన్ కల్యాణ్ సామాజికవర్గంతో పాటు బీసీలు పార్టీకి అండగా ఉంటారని అందరూ భావిం చారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు టీటీడీ బ్రేక్ దర్శనాల సిఫార్సుల లెటర్లకే ఎమ్మెల్సీ పరిమితమయ్యారు. అధికారులు సైతం ఎమ్మెల్సీని లెక్కచేయడం లేదు. ప్రోటోకాల్ లేదు. ఎమ్మెల్యే కామినేనితో ఎమ్మెల్సీ జయమంగళ కలసి కార్యక్రమాల్లో పాల్గొనడం వేళ్ల మీద లేక్కేయాల్సిందే. -
ప్రశాంతంగా పోలీస్ పదోన్నతుల అర్హత పరీక్షలు
ఏలూరు టౌన్: ఉమ్మడి ఉభయగోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణాజిల్లాలో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు ఫిట్ఫర్ ఎస్ఐ ప్రమోషన్స్లో భాగంగా ప్రీ ప్రమోషనల్ ట్రైనింగ్ క్వాలిఫైయింగ్ పరీక్షలు ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం సమీపంలోని శ్రీ సురేష్చంద్ర బహుగుణ స్కూల్లో ప్రశాతంగా జరిగాయి. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ప్రత్యేక పర్యవేక్షణలో మంగళవారం ఉదయం 9గంటల నుంచి 11.30గంటల వరకూ పరీక్షలు నిర్వహించారు. పేపర్–1 పరీక్షకు మొత్తం 112మంది హాజరుకాగా, వారిలో మహిళలు 29మంది, పురుషులు 83మంది ఉన్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకూ పేపర్–2 పరీక్ష నిర్వహించారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ, సదుపాయాలను పరిశీలించారు. ఎక్కడా అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా, పటిష్టమైన ఏర్పాట్లు మధ్య పరీక్షలు సాగుతున్నాయని తెలిపారు. బుధవారం ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో పరీక్షలకు హాజరైన సిబ్బందికి టర్న్ అవుట్, స్వ్కాడ్ డ్రిల్, ఆర్మ్స్డ్రిల్, ఆయుధాల కోల్నా జోల్నా, వైవా, నేరస్థల పరిశీలన, నేర స్థలంలో వినియోగించే సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలపై పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ రెండు పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో శిక్షణ అనంతరం వారికి సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతులు లభిస్తాయని ఐజీ అశోక్కుమార్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్.సుస్మిత, పోలవరం డీఎస్పీ యం.వెంకటేశ్వరరావు, డీటీసీ డీఎస్పీ సీహెచ్జీవీ ప్రసాద్, డీఏఆర్ అదనపు ఎస్పీ ఎల్.చెంచిరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా ఈస్ట్జోన్ డీఎస్పీ బీ.విద్య, డీఏఆర్ డీఎస్పీ బీ.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
15 నాటికి నీటి సరఫరా నిలిపివేత
పాలకొల్లు సెంట్రల్: సాగునీటి సంఘాల అధ్యక్షుల సమన్వయంతో మురుగు కాలువలు ప్రక్షాళణ చేసే దిశగా చర్యలు చేపడతామని డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ పెన్మెత్స రామభద్రరాజు అన్నారు. మంగళవారం సాగునీటి సంఘాల అధ్యక్షులు, అధికారులతో స్థానిక డ్రెయినేజీ శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఈ సీహెచ్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 15 నాటికి ప్రధాన కాలువలకు నీటి కట్టడం జరుగుతుందన్నారు. అనంతరం మురుగు కాలువల ప్రక్షాళనపై చర్యలు చేపడతామని చెప్పారు. వీటి బాధ్యతను సాగునీటి సంఘ అధ్యక్షులు చేపడతారని తెలిపారు. గతంలో ఉన్న రేట్లకు పని చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదని అన్నారు. కార్మికుల వేతనాల పెంపుపై ఉన్నతాధికారులతో మాట్లాడతామని చెప్పారు. కార్యక్రమంలో ఏఈఈలు ఎ.దుర్గాప్రసాద్, జి.సతీష్, బి.సాయిశాంతం, సాగునీటి సంఘాల అధ్యక్షులు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, ఇంటి శ్రీరాములు, ఆరుమిల్లి రామశ్రీనివాస్, దేవరపు దొరబాబు, దేవళ్ల మోహన్, మాతా రత్నరాజు, కుక్కల సత్యనారాయణ, పులంకడం రాఘవులు, టి.వెంకట కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్మీపురంలో చోరీ
దెందులూరు: పెదవేగి మండలం లక్ష్మీపురం గార్డెన్స్లో రైతు మన్నె సుబ్రహ్మణ్యం ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గత నాలుగు రోజుల నుంచి యజమానులు ఇంట్లో ఉండకపోవడంతో అదును చూసి చోరీ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉన్న 12 కాసుల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. మంగళవారం చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన సుబ్రహ్మణ్యం పోలీసులను ఆశ్రయించాడు. సంఘటన తెలుసుకున్న పెదవేగి సీఐ సీహెచ్ రాజశేఖర్, పెదవేగి ఎస్సై హరి సంఘటన స్థలాన్ని పరిశీలించి, బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బాధితులను పరామర్శించారు. భీమవరం (ప్రకాశంచౌక్): శోభిత వర్మ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా రాజమండ్రి నగరంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రఖ్యాత ఇంద్రజాలికుడు, రచయిత, మ్యాజిక్ స్టార్ డాక్టర్ బోస్ను ‘మార్నింగ్ స్టార్’ బిరుదుతో సత్కరించారు. మ్యాజిక్ రంగానికీ, రచనా రంగానికీ బోస్ చేస్తున్న విశిష్ట సేవలను ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస వర్మ కొనియాడారు. ఎస్వీ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఇంద్రజాల ప్రదర్శనలు, ఏక పాత్రాభినయ పోటీలు, కవితా పఠనాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలైన ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలం దేవస్థానాలకు నూతన ట్రస్ట్బోర్డు ఏర్పాటు చేసినట్టు ఓ లిస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అందులో భాగంగా ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానానికి చైర్మన్గా ఎస్వీ సుధాకరరావుతో కలిపి 17 మంది సభ్యులతో ట్రస్టుబోర్డు ఏర్పాటు చేసినట్టు అందులో పేర్కొన్నారు. చైర్మన్ మినహా మిగిలిన 16 మందిలో 13 మంది టీడీపీ, 2 జనసేన, 1 బీజేపీకి చెందిన వారు ఉన్నట్టు లిస్ట్లో పేర్కొన్నారు. ద్వారకాతిరుమల మండలం వేంపాడుకు చెందిన చింతమనేని హనుమంతరావు, ద్వారకాతిరుమలకు చెందిన కంపసాటి నాగసీత, నల్లజర్లకు చెందిన యలమాటి శ్రీనివాసరావు, ఆవపాడుకు చెందిన అచ్యుత సత్యనారాయణ, యర్నగూడేఇకి చెందిన పాలూరి వెంకట చరిత, దుద్దుకూరుకు చెందిన కడియం సత్యవతి, హుకుంపేటకు చెందిన హోట వీరభద్రరావు ఎంపికై నట్టు లిస్ట్లో ఉంది. అలాగే ఏలూరుకు చెందిన చలువాది శివకృష్ణ, అనపర్తికి చెందిన పల్లి శ్రీనివాసరెడ్డి, తణుకుకు చెందిన కాకి సురేష్ కుమార్, అల్లి సత్యనారాయణ, నెల్లిమర్లకు చెందిన కింతాడ కళావతి, గూడూరుకు చెందిన బత్తిన ప్రమీల, ప్రత్తిపాడుకు చెందిన చిరుగూరి సుశీల, తాడేపల్లిగూడేనికి చెందిన కాసిరెడ్డి మధులత, ఎమ్మిగనూరుకు చెందిన యుకే సుహాసిని ఎంపికై నట్టు ఉంది. ఆకివీడు: డ్వాక్రా యానిమేటర్ల అవినీతిలో అధికారులు, బ్యాంకు అఽధికారుల భాగస్వామ్యం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సందక ఉదయ కుమారి ఆరోపించారు. స్థానిక సంఘ కార్యాలయంలో మంగళవారం ఐద్వా సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆకివీడులోని సంతపేట, సమతానగర్ ప్రాంతాల్లోని డ్వాక్రా గ్రూపు సభ్యులకు రూ. 2 కోట్ల మేర టోకరా వేసిన సంఘటనపై నేటికీ చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతితో దుర్వినియోగమైన సొమ్మును డ్వాక్రా సభ్యుల వద్ద నుంచి వసూలు చేసేందుకు ఆదేశాలివ్వడం దారుణమన్నారు. గతంలో మేము తీసుకున్న సొమ్ము మాత్రమే తిరిగి చెల్లిస్తామని, అవినీతికి గురై బ్యాంక్లో డ్రా చేసిన సొమ్ముకు మాకు సంబంధంలేదని డ్వాక్రా సభ్యులు చెప్పినా పట్టించుకోకపోవడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై పోలీస్ అధికారులు స్పందించకపోతే డ్వాక్రా సభ్యులతో జిల్లా అధికారుల కార్యాలయాలు ముట్టడిస్తామని ఉదయకుమారి హెచ్చరించారు. కార్యక్రమంలో డోకల లక్ష్మి, గేదల లావణ్య, ఎర్రా కృష్ణవేణి, బొక్కా కళ్యాణి, అర్జి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
మూల్యాంకనం సమస్యలు పరిష్కరించండి
ఏలూరు (ఆర్ఆర్పేట): పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో తలెత్తుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జాక్టో నాయకులు మంగళవారం జిల్లా విద్యాశాఖాధకారి ఎం.వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జాక్టో జిల్లా చైర్మన్ పువ్వుల ఆంజనేయులు మాట్లాడుతూ మూల్యాంకన కేంద్రంలో స్థిరమైన, వేగవంతమైన నెట్వర్క్ సదుపాయం కల్పించాలని, ట్యాబ్ పరికరాల నాణ్యత, పనితీరును సమగ్రంగా సమీక్షించాలని డిమాండ్ చేశారు. మూల్యాంకన కేంద్రంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, స్పెషల్ అసిస్టెంట్లకు తీవ్ర ఇబ్బందుల విషయంలో సాంకేతిక సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. సిబ్బందికి రెమ్యూనరేషన్ పెంచాలని కోరారు. -
వైఎస్సార్ విగ్రహ మరమ్మతులకు అనుమతివ్వండి
ఏలూరు టౌన్: మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద మరమ్మతులు చేపట్టేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం సమర్పించారు. ఏలూరు ఫైర్స్టేషన్ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహం చుట్టూ ఉన్న రెయిలింగ్, ఫ్లోరింగ్ మరమ్మతులకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. గతంలో వైఎస్సార్ విగ్రహం వద్ద వాటర్ ఫౌంటెయిన్ నిర్మిస్తామంటూ రైలింగ్, ఫ్లోరింగ్ తొలగించారనీ, కానీ నేటికీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రభుత్వ నిధులతో కాకుండా తామే సొంత ఖర్చులతో మరమ్మతులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ను కోరారు. ఏలూరు నగరంలోనూ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారనీ వాటి పరిష్కారానికి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చర్యలు చేపట్టాలని కోరినట్లు సమన్వయకర్త జయప్రకాష్ తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, రాష్ట్ర మహిళ ప్రదాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ల బాచి, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల ఉన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వికి వైఎస్సార్ సీపీ నాయకుల వినతి -
రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి
పాలకొల్లు సెంట్రల్: పోడూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హోంగార్డు రఘుమండ వెంకటరమణ (57) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విధి నిర్వహణలో భాగంగా ఆదివారం రాత్రి స్టేషన్కు వెళుతూ పాలకొల్లు మార్టేరు రోడ్డులో ఉల్లంపర్రు వద్ద ఉన్న ఓ పెట్రోల్ బంక్లో తన వాహనంలో పెట్రోలు కొట్టించుకున్నాడు. బంక్ నుంచి బయటకు వస్తుండగా ఓ కారు ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయిన రమణ తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆశుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కొరకు భీమవరం తరలించారు. అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు తెలిపారు. కారు టైర్ పంక్చర్ అవ్వడంతో అదుపుతప్పి హోంగార్డ్ను ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. రమణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రమణ మృతి పట్ల పాలకొల్లు పట్టణ, రూరల్ సీఐలు కె రజనీకుమార్, జి శ్రీనివాస్, ఎస్సైలు, పోలీసులు, హోంగార్డులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తంచేశారు. -
వేప చెట్లను పరిశీలించిన శాస్త్రవేత్తలు
ఏలూరు (టూటౌన్): వివిధ మండలాల్లో పురుగు, తెగుళ్ల కారణంగా చనిపోతున్న వేప చెట్లను సోమవారం నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. బీకే లక్ష్మీ, వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా. ఎన్బీవీ చలపతిరావు, ఏలూరు జిల్లా ఏరువాక కేంద్రం సమన్వయకర్త డా. కె. ఫణికుమార్ సంయుక్తంగా పరిశీలించారు. డైబ్యాక్ కారణంగా వేప చెట్లు చనిపోతున్నట్లు గుర్తించారు. డైబ్యాక్ అన్ని వయసుల వేప చెట్ల ఆకులు, కొమ్ములు, పుష్పాలను ప్రభావితం చేస్తుందన్నారు. దీని ప్రభావంతో చెట్టు పైభాగం నుంచి కిందివరకు కొమ్మలు క్రమంగా ఎండిపోతాయన్నారు. డైబ్యాక్ ఒక ఫంగల్ రోగం అయినప్పటికీ, వేప చెట్లు కొన్నిసార్లు టీ మస్కిటో బగ్ కీటకం ద్వారా కూడా ప్రభావితమవుతాయన్నారు. డైబ్యాక్ సోకిన కొమ్ములను కత్తిరించి తొలగించాలని, తర్వాత కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా లేదా కార్బెండెజిం 1 గ్రా, ప్రోఫెనోఫాస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి చెట్టు చిగురు, కొమ్మలు బాగా తడిచేలాగా పిచికారీ చేయాలని సూచించారు. -
మొక్కజొన్న రైతుల ఆందోళన
పోలవరం రూరల్: తుపాను ప్రభావంతో చెదురుమదురుగా పడుతున్న జల్లులకు మొక్కజొన్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న పంట ఆరబెట్టి ఉండటంతో చినుకులు పడితే బరకాలు కప్పి ఒబ్బిడి చేసుకునే పనులు చేపడుతున్నారు. పోలవరం మండలంలో పర్యటించిన వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మొక్కజొన్న రైతులను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువత రైతులకు కష్టాలు పెరిగాయని విమర్శించారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రెండేళ్లుగా సమస్యలను పట్టించుకోవడం లేదని తెలిపారు. ప్రభుత్వం మొక్కజొన్న రైతులకు రూ.3 వేల మద్దతు ధర నిర్ణయించి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల తరఫున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బుగ్గా మురళీకృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పేకాటలో పట్టుబడ్డ ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే గన్మెన్
సాక్షి, టాస్క్ఫోర్స్: ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) గన్మెన్ పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. పదిరోజుల తరువాత సోమవారం అతడిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు. సాధారణంగా పోలీసుశాఖలో సిబ్బంది ఏదైనా తప్పు చేసినా, క్రమశిక్షణ ఉల్లంఘించినా వెంటనే వీఆర్కు పంపడం లేదా విచారణ నిర్వహించి సస్పెండ్ చేయడం సర్వసాధారణం. కానీ ఈ కానిస్టేబుల్ విషయంలో మాత్రం పదిరోజులు ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. గతనెల 28న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గన్మెన్ శనపతి శ్రీఆంజనేయులు భీమడోలు పోలీస్స్టేషన్ పరిధిలో ఓ పేకాట శిబిరంలో పేకాడుతూ పోలీసులకు రెడ్హ్యాండెడ్గా చిక్కారు. అతడితో సహా ఎనిమిదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం గన్మెన్కు భీమడోలు పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. శాఖాపరమైన విషయం కావడంతో ఎస్పీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఎస్పీ కూడా చర్యలేమీ తీసుకోలేదు. అప్పటినుంచి గన్మెన్ ఎమ్మెల్యే వెంట అన్ని కార్యక్రమాల్లో భద్రత నిమిత్తం పాల్గొంటున్నారు. సోమవారం ఉదయం చొదిమెళ్లలో జరిగిన సాగునీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంట ఆయన కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రీ ఆంజనేయులును సస్పెండ్ చేస్తూ ఎస్పీ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. గతనెల 28న భీమడోలులో పేకాట శిబిరంలో గన్మెన్ అరెస్ట్ పదిరోజుల తరువాత ఇప్పుడు సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు ఈ పదిరోజులు ఎమ్మెల్యే బడేటి చంటి వెంటే గన్మెన్ -
గురువులకు స్పాట్
పాఠశాలకు వెళ్ళిన తర్వాత మూల్యాంకనానికి రావాలని పిలుపు రావడంతో, దాదాపు 25 కిలోమీటర్ల దూరం నుంచి మూల్యాంకన కేంద్రానికి రావాల్సి వచ్చిందని ఉపాధ్యాయులు లబోదిబోమన్నారు. నిబంధనల మేరకు మూల్యాంకన కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉపాధ్యాయులకే విధులు వేయాల్సి ఉంది. 25 కిలోమీటర్ల కంటే దూరంలో ఉన్న వారిని సైతం విధులకు పిలవడం అన్యాయమని, వారు ఉదయం కేంద్రానికి చేరుకోవడం నుంచి తిరిగి ఇంటికి వెళ్లే వరకు తీవ్ర ఒత్తిడిలో ఉండే ప్రమాదం ఉంటుందని నాయకులు చెబుతున్నారు. ఉపాధ్యాయుడు ఒత్తిడిలో ఉంటే మూల్యాంకనంలో తేడాలు వస్తాయని, అది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుందంటున్నారు. స్పెషల్ అసిస్టెంట్లుగా వేయాల్సిన సీనియర్లను, జూనియర్లను విడిచి మధ్యస్థ సర్వీసు ఉన్న వారిని వేయడం విమర్శలకు తావిస్తోంది. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లా విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులను పెట్టిన స్పాట్ వాల్యుయేషన్ పేరుతో ముప్పుతిప్పలు పెడుతున్నారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా సిద్ధం చేసిన జాబితాలోంచి కొంతమందిని తొలగించి కొత్తవారికి విధులు వేసేందుకు ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు విద్యాశాఖాధికారులు ఎందుకు శ్రద్ధ చూపారని ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయంలో విద్యాశాఖాధికారులకు భారీగానే ముడుపులు అందాయని, అలాగే రాజకీయ నాయకుల సిఫార్సులూ పనిచేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాబితా మార్పుపై సందేహాలు పదో తరగతి విద్యార్థులు రాసిన జవాబు పత్రాల మూల్యాంకనం వాస్తవానికి ఈ నెల 4 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్లో ఈస్టర్ సెలవును గమనించకుండా షెడ్యూల్ విడుదల చేయడంతో, తర్వాత ఉపాధ్యాయులు ప్రాతినిధ్యం వహించగా ఈ నెల 6 నుంచి మూల్యాంకనం ప్రారంభమయ్యేలా షెడ్యూల్ను మార్పు చేశారు. 4 నుంచే ప్రారంభం కావాల్సిన మూల్యాంకనం కోసం అంతకుముందే జాబితా సిద్ధం చేయాల్సి ఉండగా, విద్యాశాఖాధికారులు 5 వ తేదీ సాయంత్రానికి గానీ జాబితా సిద్ధం చేయలేకపోయారు. ఆలస్యంగా జాబితా సిద్ధం చేసినా అందులో మార్పులు చేయాల్సి రావడం విద్యాశాఖాధికారుల వైఫల్యంగానే పరిగణించాలని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. బడికెళ్లాక మూల్యాంకనానికి పిలుపు ఆదివారం రాత్రికి చాలామందికి మూల్యాంకన విధులు ఉన్నట్టు మెసేజ్లు వచ్చాయి. మెసేజ్లు రాని వారంతా తమకు విధులు పడలేదని భావించి ఉదయమే పాఠశాలలకు వెళ్ళారు. అలా విధుల్లోకి వెళ్ళిన దాదాపు 30 మందికి పైగా ఉపాధ్యాయులకు మూల్యాంకన విధులకు హాజరు కావాలని అప్పటికప్పుడు మెసేజ్లు పంపడం, ఎంఈఓల నుంచి ప్రధానోపాధ్యాయుల ద్వారా వ్యక్తిగతంగా సమాచారం ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆదివారం రాత్రి వరకు జాబితాలో లేని తమ పేర్లు, ఉదయం పాఠశాల విధులకు హాజరైన తర్వాత ఎలా చేరాయో తెలియక ఉపాధ్యాయులు గందరగోళానికి గురయ్యారు. విఫలమైన ఆటోమేషన్ విధానం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో ప్రవేశపెట్టిన ఆటోమేషన్ విధానం మరోసారి విఫలమైందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. గతంలో ఇన్విజిలేషన్ విధుల్లో కూడా ఈ విధానం లోపాల పుట్టగా మారడంతో దానిని మార్చి తిరిగి ఎంఈఓలు, డీఈఓల చేతుల్లోకే నియామక ప్రక్రియ వెళ్ళిన విషయాన్ని గుర్తించకుండా, మళ్ళీ ఆటోమేషన్లో జాబితా రూపొందించడం హాస్యాస్పదం అంటున్నారు. ఆటోమేషన్ లోపాల వల్ల ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు మార్పులు చేయాల్సి వచ్చిందని కొందరు అంటుండగా, ఆ లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుని విద్యాశాఖాధికారులు అస్మదీయులకు ఒకలా, తస్మదీయులకు ఒకలా విధులు వేశారని ఆరోపిస్తున్నారు. నిబంధనలు అమలు చేయాల్సిన విద్యాశాఖాధికాారులే వాటిని అతిక్రమించడం భావ్యం కాదు. 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి విధులు వేయడంతో రవాణా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మహిళా ఉపాధ్యాయులు ఇంటి పనులన్నీ ముగించుకుని అంత దూరం రావడం కత్తిమీద సాములాంటిది. – గుగ్గులోతు కృష్ణ, ఏపీటీఎఫ్ 1938, రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ మూల్యాంకన విధుల పేరుతో ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేయడం సరికాదు. తల్లిదండ్రులను, పిల్లలను చూసుకోవాల్సిన వారిని కూడా విధులకు పిలవడం వల్ల ఆ ఒత్తిడి మూల్యాంకనంపై పడుతుంది. ఇది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తుంది. – గెడ్డం సుధీర్, వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ అధికార ప్రతినిధి బడికెళ్లిన తరువాత పేపర్ల వాల్యుయేషన్కు పిలుపు ముందుగా తయారు చేసిన జాబితా మార్పు 25 కిలోమీటర్ల దూరంలో వారికీ విధులు -
కొల్లేరు.. ఎడారి తీరు
● మాయమవుతున్న పచ్చదనం ● సముద్రపు ఉప్పునీరు కొల్లేరులోకి.. ● రెగ్యులేటర్ల నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంకై కలూరు: కోటి అందాల కొల్లేరు కళ తప్పింది. ఏప్రిల్లోనే చుక్క నీరు లేక ఎడారిని తలపిస్తోంది. పచ్చదనం మాయమైంది. కొల్లేరు పక్షులు నీటికోసం, ఆహారం కోసం అల్లాడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పర్యవేక్షణ కొరవడడంతో దక్షిణ కాశ్మీరంగా పేరొందిన కొల్లేరు కన్నీరు పెడుతోంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు వరదల సమయంలో కొల్లేరులోకి చేరుతుంది. ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు డ్రెయిన్ల నుంచి ఎక్కువ నీరు వస్తుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది కొల్లేరులోకి నీటి ప్రవాహం తగ్గింది. దీంతో లక్షాలాది ఎకరాల కొల్లేరు భూములు బీటలు వారాయి. పర్యాటకులను ఆకర్షించే సహజసిద్ధ అందాలు నీరులేక కళావిహీనంగా తయారయ్యాయి. అలమటిస్తున్న కొల్లేరు పక్షులు కొల్లేరు సరస్సుకు ఏటా సైబీరియా, ఆస్ట్రేలియా, నైజీరియా వంటి పలు దేశాల నుంచి వలస పక్షులు విడిది కోసం వస్తాయి. మొత్తం 189 రకాల పక్షులు కొల్లేరుపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఏటా డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలలు పక్షుల సంతానోత్పత్తికి అనుకూల కాలం. కొల్లేరులో వింటర్ సీజన్ ముగిసినప్పటీకీ కొన్ని విదేశీ పక్షులతో పాటు స్వదేశీ పక్షులు కొల్లేరులోనే ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పక్షి ప్రేమికుల స్వర్గథామంగా పేరుగడించిన ఆటపాక పక్షుల కేంద్రం విహార చెరువులో కేవలం రెండున్నర అడుగుల నీరు మాత్రమే ఉంది. ప్రస్తుత ఎండలు బట్టి మరో 20 రోజుల్లో నీరు అడుగంటే ప్రమాదం ఉంది. దీంతో పక్షులకు వేసవి ఆహార కష్టాలు ఈ ఏడాది తప్పడం లేదు. రెగ్యులేటర్ల నిర్మాణం కలేనా..? కొల్లేరు సరస్సులో నిత్యం నీరు నిల్వ ఉండాలంటే రెగ్యులేటర్ల నిర్మాణమే శరణ్యమని పలు కమిటీలు తేల్చిచెప్పాయి. వైఎస్సార్సీపీ పాలనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రెగ్యులేటర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నిల్ ఇచ్చారు. ఉప్పుటేరు ముఖద్వారం, చినగొల్లపాలెం, పెదలంక డ్రెయిన్పై డబుల్ లైన్ బ్రిడ్జి. గరిసిపూడి అండర్ టెన్నల్ నిర్మాణాలకు రూ.452 కోట్లు కేటాయించారు. రెగ్యులేటర్ల నిర్మాణం జరిగితే కై కలూరు, ఆకివీడు, భీమవరం, పెడన, దెందులూరు నియోజకవర్గాలకు మేలు జరుగుతుంది. చంద్రబాబు ప్రభుత్వం రెగ్యులేటర్ల అంశాన్ని పక్కన పడేసింది. కొల్లేరులో నీరు లేకపోవడంతో సముద్రపు ఉప్పునీరు పైకి ఎగదన్నుతోంది. దీంతో పంట పొలాలు చౌడుబారుతున్నాయి. ఇప్పటికే కై కలూరు నియోజకవర్గంలో కలిదిండి మండలం ఉప్పుటేరు పరివాహక ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల భూములు చౌడబారాయి. ప్రతి ఏటా ఏప్రిల్ నెల నుంచి మూడు నెలలు సముద్రపు నీరు కొల్లేరులో కలవడం వల్ల సరస్సులో సహజ సిద్ధంగా పెరిగే నల్ల జాతి చేపలు అంతరించిపోతున్నాయి. ఉప్పుశాతం ఎక్కువై కొల్లేరులో మట్టి బీటలు వేస్తోంది. మావులు (చేపలను పట్టే బుట్ట)ను కొల్లేరు సరస్సులో పెడుతోన్నా మత్స్యకారులకు రిక్తహస్తాలే మిగులుతున్నాయి. కొల్లేరుకు గోదావరి జలాలు మళ్లించాలి. చింతలపూడి వద్ద ఈ అవకాశం ఉంది. పోలవరం నిర్మాణం జరిగితే ఖచ్చితంగా కొల్లేరుకు నీరు వస్తుంది. అసలు కొల్లేరు సమస్యకు గుదిబండగా మారిన 120 జీవోను రద్దు చేయాలి లేదా సవరించాలి. కొల్లేరు ప్రజలతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలి. – చింతపల్లి వెంకటనారాయణ, కొల్లేరు ప్రాంత సాహితీవేత్త, కై కలూరు రెగ్యులేటర్లు నిర్మిస్తే కొల్లేరు సరస్సులో నిత్యం నీరు నిల్వ ఉంటుంది. సముద్రపు నీరు ఏటా కొల్లేరులో ప్రవేశించకుండా షెట్టర్లు మూసుకునే అవకాశం కలుగుతుంది. నిల్వ చేసిన నీటిలో 2 అంగుళాల చేప పిల్లలను వదిలితే కొల్లేరు ప్రజలకు వేట ఉంటుంది. దీంతో కొల్లేరులో వలసలు నివారించవచ్చు. వైఎస్సార్సీపీలో కేటాయించిన పనులను చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడవద్దు. – ముంగర నరసింహారావు, కొల్లేరు నాయకుడు, ఆకివీడు -
డివైడర్ ఎక్కిన కారు
తణుకు అర్బన్: తణుకు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కారు డివైడర్ పైకి దూసుకెళ్లింది. స్థానిక శర్మిష్ట సెంటర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉండ్రాజవరం మండలానికి చెందిన వ్యక్తి సోమవారం విజయవాడ నుంచి స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నిద్రమత్తులోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే డివైడర్ పై ప్రమాద సూచికలు ధ్వంసం కాగా కారు ముందు భాగం నుజ్జుయింది. చికిత్స పొందుతూ మృతి మంగళగిరి టౌన్, నిడమర్రు: ఎస్సై కొట్టాడని ఓ యువకుడు పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా నిడమర్రు గ్రామానికి చెందిన నండూరి శివకార్తికేయ (38)తన మేనకోడలు బంగారం గొలుసు పోవడానికి అదే గ్రామానికి చెందిన వేణుగోపాల్ కారణమని ఆరోపించడంతో ఇరు వర్గాలు మార్చి 29వ తేదీ ఘర్షణ పడ్డారు. ఇరువర్గాలు మార్చి 30న నిడమర్రు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 31వ తేదీన నిడమర్రు బాల వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాల్లో బందోబస్తు నిర్వహిస్తున్న ఎస్సై రమేష్, పోలీస్ సిబ్బందితో శివకార్తికేయ కేసు విషయమై వాగ్వివాదానికి దిగాడు. తనపై కేసు నమోదు చేసి వేణుగోపాల్పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎస్సైను ప్రశ్నించాడు. దీంతో శివకారిక్తేయను జీపులో స్టేషన్కు తీసుకువెళ్లి ఎస్సై రమేష్ కొట్టినట్లు శివకార్తికేయ కుటుంబ సభ్యులు ఆరోపించారు. కల్యాణ మహోత్సవాల్లో అందరూ చూస్తుండగా ఎస్సై రమేష్ కొట్టాడని, విచారణ పేరుతో స్టేషన్కు తీసుకువెళ్లారని బాధితుడు శివకార్తికేయ ఏప్రిల్ 1వ తేదీన పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. శివకార్తికేయ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. పోలీసుల వేధింపులే మృతికి ప్రధాన కారణమని శివకార్తికేయ బంధువులు ఆరోపించారు. ఆకివీడు: జన్యు లోపంతో వింత దూడ జన్మించి, వెంటనే మృతి చెందినట్టు పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకుడు జి.మల్లేశ్వరరావు సోమవారం చెప్పారు. స్థానిక కరెంట్ ఆఫీసు వద్ద ఉప్పల చిన్నాకు చెందిన పశువు ఆదివారం నాడు ప్రసవ సమయంలో ఇబ్బంది పడుతుందని రైతు ఫిర్యాదు చేయడంతో వెంటనే వెళ్లి ప్రేగుకు అడ్డంగా దూడ ఉందని గుర్తించి వైద్య సేవలందించామన్నారు. జన్యులోపంతో పుట్టిన దూడ గుర్రం ముఖం పోలి, వింత ఆకారంలో ఉందని, పుట్టిన వెంటనే దూడ చనిపోయిందని ఏడీ చెప్పారు. పశువును కాపాడినట్లు తెలిపారు. ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో రూ.200 దర్శనం నకిలీ టికెట్ల విక్రయాల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐఎస్జే రాజును సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితుడి సోదరుడి ఫోన్ కాల్ డేటా ఆధారంగా వారి సొంత ఊరు అయిన కాకినాడ జిల్లా, తుని వద్ద ఉన్న వేంపాడు గ్రామంలో ఐఎస్జే రాజు ఉన్నట్టు ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్ తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఉదయం వేంపాడు గ్రామానికి సిబ్బందితో కలసి వెళ్లిన ఎస్సై సుధీర్, అక్కడ పలువురిని విచారించారు. అనంతరం ఐఎస్జే రాజును గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నిందితుడు పోలీసుల సంరక్షణలో ఓ రహస్య ప్రదేశంలో ఉన్నట్టు సమాచారం. టి.నరసాపురం: బంగారు ఆభరణాల చోరీపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం జయబాబు తెలిపారు. తెడ్లం పంచాయతీలోని మరియపురం గ్రామానికి చెందిన గొల్లపల్లి మరియరాణి ఈస్టర్ పండుగ కావడంతో ఈ నెల 4వ తేదీ రాత్రి చర్చికి వెళ్లింది. ప్రార్థనలు ముగించుకుని ఇంటికి వచ్చింది. సోమవారం ఉదయం డ్వాక్రా డబ్బులు చెల్లించేందుకు బీరువా తెరవగా లాకర్ పగులగొట్టి ఉండటాన్ని గమనించింది. బీరువాలో ఉంచిన కాసున్నర బంగారు ఆభరణాలు, నగదు కనిపించకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
26 నుంచి చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు
● 30న రాత్రి 8 గంటల నుంచి తిరుకల్యాణం ● వచ్చేనెల 1న రథోత్సవంద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చిన్నవెంకన్న వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు ఈనెల 26 నుంచి వచ్చే నెల 3 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. వైఖానస ఆగమాన్ని అనుసరించి పాంచాహ్నిక దీక్షతో ఈ ఉత్సవాలను 8 రోజుల పాటు అట్టహాసంగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో శ్రీవారికి ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రామోత్సవాలను, శ్రీహరి కళాతోరణ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను వైభవంగా జరుపుతామన్నారు. అలాగే ఆలయ ముఖ మండపంలో స్వామివారు రోజుకో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 26 నుంచి వచ్చేనెల 3 వరకు ఆలయంలో స్వామివారికి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. యావన్మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని, స్వామివారిని దర్శించి తరించాలని ఈఓ కోరారు. ఉత్సవాలు జరిగేదిలా.. ● ఈనెల 26 న ఉదయం 9.30 గంటలకు శ్రీవారిని పెండ్లి కుమారునిగాను, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేసి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ● 27న రాత్రి 9 గంటలకు ధ్వజారోహణ, అనంతరం హంసవాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ● 28న ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ● 29న ఉదయం 7 గంటలకు హనుమద్వాహనంపై స్వామివారి గ్రామోత్సవం, రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం, అనంతరం వెండి శేష వాహనంపై గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ● 30న ఉదయం 7 గంటలకు సింహ వాహనంపై శ్రీవారి గ్రామోత్సవం, రాత్రి 8 గంటల నుంచి శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ● వచ్చేనెల 1న రాత్రి 8 గంటల నుంచి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ● 2న ఉదయం 10.30 గంటలకు చక్రస్నానం, రాత్రి 9 గంటలకు ధ్వజావరోహణం, అనంతరం అశ్వ వాహనంపై గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ● 3న ఉదయం 9 గంటలకు చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి 7 గంటలకు ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపుసేవ, శ్రీపుష్పయాగం కార్యక్రమాలు జరుగుతాయి. వీటితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. -
దంచికొట్టిన వాన
జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షం దంచికొట్టింది. ఏలూరు నగరంలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 3 గంటల వరకు తీవ్రమైన ఎండ, ఉక్కపోత. 3 గంటలు దాటిన తరువాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి దట్టమైన మబ్బులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. గంటన్నర పాటు ఏలూరు నగరంలో వర్ష బీభత్సం కనిపించింది. నగరంలోని ప్రధాన కూడళ్లు వర్షపు నీటితో నిండిపోయాయి. పవరుపేట, చాణిక్యపురి కాలనీ, ఫైర్స్టేషన్ సెంటర్ వంటి ప్రధాన సెంటర్లల్లో చెట్లు కూలి ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. కళాశాలలు వదిలే సమయం కావడంతో విద్యార్థులు ఇళ్ళకు చేరేందుకు అవస్థలు పడ్డారు. – సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు డీసీసీబీ బ్యాంకు మెయిన్ రోడ్డులో.. ఏలూరు కొత్త బస్టాండ్ ఇలా.. ఏలూరు ఓవర్ బ్రిడ్జిపైన రెయిలింగ్ ధ్వంసమై దృశ్యం వర్షపు నీటిలో పత్తేబాద రైతుబజార్ -
రూ.10 లక్షల ప్రమాద బీమా అందించాలి
ఏలూరు (టూటౌన్): నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ప్రమాద బీమా రూ.10 లక్షలు అందించాలని యూనియన్ నాయకులు ఎర్ర రాంబాబు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక సీఐటీయు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలో భాగంగా కలెక్టరేట్ వద్ద ధర్నాలో ఎర్ర రాంబాబు మాట్లాడారు. ప్రభుత్వం మార్చి నెల నుంచి ప్రవేశపెట్టిన సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నారపల్లి రమణారావు మాట్లాడుతూ గత ఆరేళ్లుగా పోరాడిన కార్మికులకు పునరుద్ధరించిన కార్మిక సంక్షేమ బోర్డులో స్థానం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో నిర్మాణ కార్మికులందరికీ చట్టం అమలు చేయాలని, 58 ఏళ్లు దాటిన భవన నిర్మాణ కార్మికులకు రూ.5000 పెన్షన్ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చిట్టికొమ్మ కొండలరావు, తేడ్ల నాగరాజు, రెడ్డి లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఉరుకులు.. పరుగులు
గణపవరం: సాఫీగా సాగుతున్న దాళ్వాసాగు చివరిదశలో రైతులను బెంబేలెత్తిస్తోంది. పంట చేతికందివచ్చిన సమయంలో అకాల వర్షాలు రైతన్నకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. రబీ పంట బాగా పండిందని ఆనందంగా మాసూళ్లకు ఏర్పాట్లు చేసుకుంటున్న రైతులకు వాతావరణ మార్పులు గుండెల్లో రైళ్లు పరుగు పెట్టిస్తున్నాయి. చేతికంది వచ్చిన పంట నోటికి అందకుండా పోతుందా అన్న ఆందోళన రైతులను వేధిస్తుంది. రెండు రోజులపాటు భారీ వర్షాలు పడేఅవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు అప్రమత్తమయ్యారు. సోమవారం మధ్యాహ్నం మండలంలో అక్కడక్కడా ఓమోస్తరు వర్షం కురిసింది. ముఖ్యంగా రబీపైరు కోతలు ప్రారంభించిన పిప్పర, చిలకంపాడు, కాశిపాడు గ్రామాల్లో వర్షం జల్లులు రైతులను ఉరుకులు పెట్టించాయి. కోతకోసిన ధాన్యం వర్షంబారిన పడకుండా కాపాడు కోవడానికి రైతులు ధాన్యం రాశులపై బరకాలు కప్పి ఉంచారు. చాలా మంది రైతులు ప్లాస్టిక్ బరకాలు, టార్ఫాలిన్లను సిద్ధం చేసుకున్నారు. . పూటకోరకంగా మారుతున్న వాతావరణం రైతుల గుండెల్లో గుబులు రేపుతుంది. వారం రోజులుగా విపరీతంగా ఎండలు కాయడంతో రైతులు వరికోతలు ప్రారంభించారు. చిలకంపాడు, వాకపల్లి, వీరేశ్వర పురం, కాశిపాడు గ్రామాల ఆయకట్టులో నాలుగు రోజులుగా వరి కోతలు ప్రారంభించారు. ధాన్యం రాశులు సమీప పుంతలు, గట్లుమీద నిల్వచేసి ఉంచారు. ఈసమయంలో వర్షం హెచ్చరికలతో రైతులు ధాన్యం తడవకుండా రక్షణ చర్యలు చేపట్టారు. కోతకు ఏర్పాట్లు చేసుకున్న రైతులు వాయిదావేసుకున్నారు. మరోరెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందన్న హెచ్చరికలవల్ల కోసిన ధాన్యం ఎండబెట్టు కోవడానికి రైతులకు ధైర్యం చాలడంలేదు. ధాన్యం ఎండబెట్టడం, మళ్లీ పోగులుపెట్టి బరకాలు కప్పుకుంటూ ఇబ్బందులు పడేకన్నా వాతావరణం కుదుటపడిన తర్వాత ధాన్యం ఎండబెట్టుకోవచ్చునని వేచిఉన్నారు. గణపవరం, నిడమర్రు మండలాలలో దాదాపు 15 వేల ఎకరాలలో దాళ్వా సాగు చేశారు. ఇప్పటికి 10శాతం రైతులు కోతలు పూర్తిచేశారు. వాతావరణం అనుకూలిస్తే ఈ వారంలో దాదాపు వరికోతలు ముమ్మరమయ్యే అవకాశం ఉంది. ఈనెల మూడో వారాంతానికి రబీ మాసూళ్లు పూర్తవుతాయని వ్యవసాయఅధికారులు అంచనా వేస్తున్నారు. -
శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలకృష్ణారావు సోమవారం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ముందుగా దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు ఆయనకు స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలుకగా, ఆలయ ఈఓ వై.భద్రాజీ చిన్నవెంకన్న చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. కుక్కునూరు : మండలంలోని పెదరావిగూడెం పంచాయతీ, వెంకటాపురం గ్రామం వద్ద పెద్దపులి రోడ్డు దాటిందన్న వార్తలు సోమవారం కలకలం రేపాయి. ఆదివారం రాత్రి ఐటీసీ కర్మాగారం నుంచి వస్తున్న కార్మికులకు పులి రోడ్డు దాటుతూ కనిపించిందని గ్రామస్థులకు తెలపడంతో, వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ సిబ్బంది జంతువు వెళ్లిన మార్గంలో పాదముద్రలను పరిశీలించారు. రాత్రి వేళ కావడంతో పాదముద్రలు సరిగా కనిపించక పులో కాదో పోల్చుకోలేకపోయారు. సోమవారం ఉదయం అటవీ శాఖ సిబ్బంది ఆ ప్రాంతంలోని పాదముద్రలను పరిశీలించారు. అయితే, అవి పులి పాదముద్రలు కావని నిర్ధారించారు. పెదరావిగూడెం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జగదీష్ మాట్లాడుతూ.. పులి సంచరిస్తోందన్న వార్తలు కేవలం వదంతులు మాత్రమేనని స్పష్టం చేశారు. ఏలూరు (టూటౌన్): పీజీఆర్ఎస్ ద్వారా అందిన విజ్ఞప్తులు రీఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం జేసీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీలను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని సూచించారు. సోమవారం నాటి కార్యక్రమంలో మొత్తం 238 విజ్ఞప్తులు అందాయి. ఇందులో ఇన్చార్జ్ డీఆర్వో భాస్కర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం. ముక్కంటి, సర్వే శాఖ ఏడీ అన్సారీ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): జిల్లాలో చేపట్టాల్సినన నీటి సంరక్షణ పనులను సాగునీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులతో కలిసి ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. శ్రీనీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యతశ్రీ కార్యక్రమంపై ఆమె సోమవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూగర్భ జలమట్టం పెంచేలా ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టాలని, చెరువుల పూడికతీత, కాలువల మరమ్మతులు, గుర్రపుడెక్క తొలగింపు వంటి పనులపై నివేదికలు తక్షణమే సమర్పించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో గ్రామ, మండల పరిధిలోని సాగునీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులతో కలిసి పరిశీలించి గ్రామాల వారీగా నివేదికలను మండల ప్రత్యేకాధికారి ధ్రువీకరించిన అనంతరం సంబంధిత ఎంపీడీవోలు రెండు రోజుల్లోగా సమర్పించాలన్నారు. ఉపాధి హామీ పధకం, వీబీజీ రాంజీ కింద గుర్తించిన పనులపై కూడా నివేదికలు రూపొందించి సమర్పించాలన్నారు. వేసవిలో 6 మీటర్లు, వర్షాకాలం ముగిసే నాటికి 3 మీటర్లు భూగర్భ జలమట్టాలు పెరిగేలా కురిసిన ప్రతి నీటి చుక్కని ఒడిసిపట్టేలా నీటి సంరక్షణ పనులు చేపట్టాలన్నారు. ఉద్యాన రైతులు తమ క్షేత్రాల్లో తప్పనిసరిగా ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. -
కోరిన ఫలాలు అందించే మద్ది అంజన్న
జంగారెడ్డిగూడెం: మనిషిలోని రాక్షసత్వాన్ని నశింపజేసి కోరుకున్న ఫలాలను అందించే దేవుడు మద్ది ఆంజనేయస్వామి అని ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు అన్నారు. మండలంలోని గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామిని ఆదివారం ఆయన దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించు కోవడం ఎంతో ప్రశాంతతను చేకూర్చిందని, ఇక్క డి అర్చకులు, అధికారులు, ఈ ప్రాంతవాసులు ధన్యులని అన్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారి ఆర్వీ చందన ఉన్నా రు. అనంతరం గుర్వాయిగూడెం మానస సరోవర్ విల్లాస్లో డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. సుఖ దుఃఖ సమన్వయం అనే అంశంపై ప్రవచించారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నిడమర్రు: మండలంలోని పత్తేపురంలో లాల్ బహుదూర్ శాస్త్రి ఓరియంటల్ (పాచ్య) కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. 1967 నుంచి 1994 మధ్య కాలంలో ఇక్కడ చదువుకున్న సుమారు 135 కుటుంబాలు ఈ వేడుకలో పాల్గొన్నాయి. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి మూర్తిరాజుకు నివాళులర్పించిన అనంతరం అప్పటి అనుభూతులను నెమరు వేసుకొన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తమ గురువులను ఘనంగా సన్మానించుకున్నారు. గ్రూప్ ఫొటోలు దిగారు. క్షేమ సమచారం తెలుసుకున్నారు. మృతి చెందిన గురువులను గుర్తించుకుని నివాళులర్పించారు. ప్రస్తుతం కళాశాల అక్కడ లేకపోయినా, తమ గుండెల్లో ఆ జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయని వారు భావోద్వేగానికి లోనయ్యారు. ఆదివారం గ్రామమంతా పండిత శ్రేష్టులతో పులకించింది. -
స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం
భీమడోలు: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. భీమడోలు మానస పాఠశాలలో ఆదివారం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికిల్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ క్యాంపులోని పలు విభాగాలను వాసుబాబు, మానవత జిల్లా అధ్యక్షుడు కండేపు వెంకట సూర్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయవాడ మణిపాల్ ఆసుపత్రి గుండె, క్యాన్సర్ ఆసుపత్రి, సరస్వతి ఎముకల ట్రామా కేర్, వేమగిరి కంటి వైద్య ఆసుపత్రిలకు చెందిన వైద్యులు వచ్చి రోగులకు వైద్య పరీక్షలు చేశారు. ఆయన విభాగాల్లో రోగులకు చేస్తున్న పరీక్షలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతగానో మేలు చేస్తాయన్నారు. సేవాభావంతో మానవత సంస్థ చేస్తున్న మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వారిని అభినందించారు. 350 మంది రోగులకు పలు పరీక్షలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. 47 మందికి కళ్లజోళ్లు వేశారు. ఏడుగురికి కంటి ఆపరేషన్లకు రిఫర్ చేశారు. 65 మందికి గుండె పరీక్షలు చేశారు. మహిళలకు గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు చేశారు. కార్యక్రమంలో ఎముకల వైద్య నిపుణులు అక్కెం నరేష్, తాజా మాజీ సర్పంచ్ పాము సునీతామాన్సింగ్, పాఠశాల ప్రిన్సిపల్ యలమర్తి రవీంద్రకుమార్, వైఎస్సార్సీపీ నాయకులు రామిశెట్టి గంగాధర్, పంచకర్ల సత్యనారాయణ, చిలపర్తి ఆదినారాయణ, గోనుగుంట రమణ శంకర్, పసుపులేటి సాంబశివరావు, తుమ్మల ఉమామహేశ్వరరావు, ఉన్నమట్ల సత్యనారాయణ, చిలపర్తి రామారాయుడు తదితరులు పాల్గొన్నారు. -
సెల్ఫోన్ల రికవరీ
జంగారెడ్డిగూడెం: సెల్ఫోన్ చోరీ జరిగినా, పోగొ ట్టుకున్నా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ అన్నా రు. పట్టణంలో ఆదివారం 5వ విడత కార్యక్రమంలో భాగంగా రికవరీ అయిన సెల్ఫోన్లను ఏఎస్పీ సుస్మిత , సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై ఎన్వీ ప్రసాద్లతో కలిసి బాధితుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ సమీప పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి సీఐఆర్లో నమోదు చేయించుకోవాలన్నారు. సెల్ఫోన్ ట్రేస్ కాగానే బాధితులకు అందిస్తామన్నారు. సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. సెల్ఫోన్ వినియోగించే సమయంలో పోలీస్ శాఖ నుంచి మెసేజ్లు, పోలీస్ సిబ్బంది ఫోన్ చేసి చోరీ సెల్ఫోన్ వివరాలు తెలియజేస్తే వెంటనే పోలీస్స్టేషన్లో అప్పగించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కూడా కేసు నమో దు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటివరకు సీఐఆర్లో 393 రిక్వెస్ట్లు నమోదయ్యాయని ఏ ఎస్పీ చెప్పారు. కాగా జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్డివిజన్ పరిధిలో చోరీ సెల్ఫోన్ల రికవరీ 90 శాతం ఉందని అన్నారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
సాగునీరు విడుదల
దెందులూరు: ‘కొవ్వలిలో సాగుకు నీటి గండం’ శీర్షిక న ‘సాక్షి’లో గత బుధవా రం ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. దా దాపు 350 ఎకరాలు వరి పొలాలు పూర్తి స్థాయిలో సాగునీరు అందకపోవడంతో ఈనిపొట్ట దశలో ఉన్న పొలాల భూ ములు బీటలు వారాయి. సాగు చేసే రైతులు కన్నీట పర్యంతమవుతున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి కాలువ ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ సుబ్రమణ్యం పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేశారు. గోదావరి కాలువ నుంచి కొవ్వలిలో సాగు భూములకు నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకున్నారు. తణుకు అర్బన్: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) సీనియర్ నాయకురా లు, సీపీఐ మాజీ ఎమ్మె ల్యే వంక సత్యనారాయ ణ సతీమణి, ప్రస్తుత ఎ మ్మెల్సీ వంక రవీంద్రనాథ్ మాతృమూర్తి వంక నాగమణి (95) తణుకులోని ఆమె స్వగృహంలో ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె భర్త వంక సత్యనారాయణ గతంలోనే మృతి చెందారు. కుమారులు రామదాస్, మోహన్, రవీంద్రనాథ్, కుమార్తెలు అరుణ, సీతామహాలక్ష్మి ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): పుస్తక పఠనం ద్వా రా జ్ఞానం వస్తుందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ప్రకృతి క్షేత్రపాలకులు మధుసూదనరావు కలెక్టర్ను కలిసి ఎదిగే ఆడపిల్ల ఏమి తెలుసుకోవా లి?, గాంధీ మహాత్ముని దృష్టిలో విద్య– పర్యా వరణం/పరిశుభ్రత అనే రెండు పుస్తకాలను సుమారు 300 ప్రతులను డీఈఓకు అందజేశారు. వీటిని హైస్కూల్ విద్యార్థులకు అందించాలని కోరారు. డాక్టర్ మీసరగండ రమాదేవి రచించిన ఎదిగే ఆడపిల్ల ఏమి తెలుసుకోవాలి? పుస్తకం యుక్త వయసు బాలికలకు అవసరమైన వ్యక్తిగత అవగాహన పెంచేందుకు దో హదపడుతుందన్నారు. కోడూరి శ్రీరామమూర్తి రచించిన గాంధీ మహాత్ముని దృష్టిలో విద్య – పర్యావరణం/ పరిశుభ్రత పుస్తకం ద్వారా పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించవచ్చని చెప్పారు. భీమవరం (ప్రకాశంచౌక్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ)నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) ఆధ్వర్యంలో భీమవరం ఎంపీడీఓ కార్యాలయంలో ఈనెల 8న ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీ, జగదీశ్ మైరెన్ ఎక్స్పోర్ట్స్, కియా మో టార్స్, జెస్పర్ మోటర్స్, ఇన్నోవా సోర్స్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.లోకమాన్ తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ 9440838388, 8688594244 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలకు ఆదివారం 1,167 మంది విద్యార్థు లు హాజరయ్యారు. ఏలూరులోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో ఉదయం 127 మందికి 119, మ ధ్యాహ్నం 121 మందికి 111 మంది హాజరయ్యారు. తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 181 మందికి 175 మంది, మధ్యాహ్నం 179 మందికి 172 మంది హా జరయ్యారు. శశి ఇంజనీరింగ్ కళాశాలలో ఉ దయం 116 మందికి 111 మంది, మ ధ్యాహ్నం 105 మందికి 102 మంది హాజర య్యారు. భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 99 మందికి 98 మంది, మ ధ్యాహ్నం 100 మందికి 95 మంది హాజరయ్యారు. డీఎన్ఆర్ కళాశాలలో ఉదయం 98 మందికి 95 మంది, మధ్యాహ్నం 93 మందికి 89 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. -
రైలు ప్రమాదంలో సీఐఎస్ఎఫ్ ఎస్ఐ మృతి
ఏలూరు టౌన్: ఏలూరు నగరానికి చెందిన గోపిరెడ్డి హేమంత్ సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్ రైలులో ప్రయాణిస్తూ ఉండగా.. మధ్యలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతిచెందారు. హేమంత్ భౌతికకాయాన్ని నేడు ఏలూరు పత్తేబాదలోని ఆయన స్వగృహానికి తీసుకురానున్నారని బంధువులు తెలిపారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలిపారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. చాట్రాయి: చాట్రాయి ఆర్సీఎం స్కూల్లో ఆదివారం నగదు చోరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్కూలు సిబ్బంది జీతాల కోసం రూ.2 లక్షలు స్కూలు యాజమాన్యం ఆఫీసు రూంలో పెట్టి తాళం వేసి ఈస్టర్ పండుగను జరుపుకున్నారు. సాయంత్రం చర్చి నుంచి ఆఫీసుకు రాగా తాళాలు పటలకొట్టి రూ.2 లక్షల నగదును దొంగిలించారు. దీంతో యాజమాన్యం స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. నూజివీడు డీఎస్పీ వీఎన్వీ ప్రసాదు, సీఐ, ఎస్ఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
● నేత్రపర్వంగా రాట్నాలమ్మ ఉత్సవాలు
దెందులూరు: పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారిని రాజరాజేశ్వరిదేవిగా అలంకరించారు. ఉదయం అమ్మవారికి విఘ్నేశ్వర పూజ, నవగ్రహ మండపార్చన తదితర పూజ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ నిర్వహించారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, జడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హరే శ్రీనివాస కోలాటం రాయుడుపాలెం, రత్నాలకుంట, వారిచే కోలాట ప్రదర్శన నిర్వహించారు. ఆలయం వద్ద మహా అన్నసమారాధన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి కమిటీ చైర్మన్ మన్నే శ్రీనివాసరావు, ఈవో ఎన్.సతీష్ కుమార్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుంటున్న కొఠారు అబ్బయ్య చౌదరి అన్నసమారాధన రాజరాజేశ్వరిగా దర్శనమిచ్చిన అమ్మవారు -
పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. సమీప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మను దర్శించుకున్నారు. మహిహిళలు పాల పొంగళ్లు సమర్పించారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవారికి తలనీలాల మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్ర పటాల అమ్మకం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.1,15,082 వచ్చిందని తెలిపారు. -
మండే ఎండ.. అప్రమత్తతే అండ
● వేసవి వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యలు ● అందుబాటులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు భీమడోలు: ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గత ఏడాది కన్నా ఈ ఏడాది గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వచ్చే కొన్ని రోజులు వేడి గాలులతో పాటు ఉక్కపోత పెరిగి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయనుంది. సాధారణంగా మే నెల తొలి వారంలో పెరగాల్సిన ఉష్ణోగ్రతలు, ఎల్నినో ప్రభావంతో ఏప్రిల్ మొదటి వారంలోనే పెరిగాయి. జిల్లాలో 35 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావడం వేసవి తీవ్రతకు అద్దం పడుతోంది. వడదెబ్బ ప్రభావంపై విస్తృత ప్రచారం దీనివల్ల రెక్కల కష్టంపై బతికే బడుగుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోంది. వృద్ధులు, చిన్నారులు, మహిళలు, రోగులు, శ్రమజీవులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారంతా అనారోగ్యానికి గురై వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో వడదెబ్బకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పీహెచ్సీలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందుబాటులో ఉంచి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వేసవి దృష్ట్యా మానవుని శరీరంలో సంభవించే ఉష్ణోగ్రతలను తట్టుకోవడం లేదా నియంత్రించే శక్తి విఫలం కావడం వల్లే ఈ వడదెబ్బ సంభవిస్తుంది. శరరంలో లవణాలు కోల్పోవడంతో దుష్ఫరిణామాల వల్ల ప్రాణాంతకం కావచ్చు. అంతర్గత అవయవాలు సక్రమంగా పనిచేయక మరణం సంభవించవచ్చు. సత్వరం చికిత్స తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. వీటితో పాటు నీటి లోపం, జీర్ణ సంబంధ వ్యాధులు, దోమల ద్వారా వచ్చే వ్యాధులు, చర్మ సమస్యలు, మూత్ర సంబంధ సమస్యలు, తలనొప్పి, ఎలక్ట్రోలైట్ లోపం వల్ల కలిగే మూర్ఛల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డయాబెటిస్, కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎల్నినోనే కారణం ఈ వాతావరణ హెచ్చుతగ్గులకు ఎల్నినో ప్రభావమే కారణమని అధికారులు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్ర జలాలు వేడెక్కడం వల్ల ఏర్పడే ఈ ప్రక్రియ కారణంగా ఈ వేసవి గతంలో కంటే ఎక్కువ తీవ్రంగా ఉంటుందని, వర్షాలు సైతం ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయని వివరిస్తున్నారు. వడదెబ్బ లక్షణాలు – జాగ్రత్తలు వడదెబ్బ తగిలితే శరీర ఉష్ణోగ్రత అమాంతంగా పెరిగిపోవడం, చెమట పట్టకపోవడం, వణుకు, పాక్షికంగా ఫిట్స్ రావడం, అపస్మారక స్థితికి చేరుకోవడం జరుగుతుంది. మగత నిద్ర, కలవరింతలు, పెదవులు తడిబారిపోవడం వంటివి కనిపిస్తాయి. అలాంటి వ్యక్తికి వీలైనంత త్వరగా ప్రాథమిక చికిత్స అందించాలి. వెంటనే నీడ ఉన్న ప్రదేశానికి చేర్చి గాలి తగిలేలా చూడాలి. శరీరం సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చే వరకు తడి వస్త్రంతో తుడవాలి. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా ఓఆర్ఎస్ తాగించాలి. అపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు తాగించరాదు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాలి. నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● ఎండలో వెళ్లేటప్పుడు తప్పనిసరిగా టోపీ, గొడుగు లేదా తలపాగా ధరించాలి. ● తేలికపాటి నూలు (కాటన్) వస్త్రాలు ధరించడం మంచిది. ● వేడి గాలి ఇంట్లోకి రాకుండా కిటికీలకు పరదాలు లేదా గోనె సంచులు అడ్డుగా కట్టాలి. ● ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలి. ● రోజుకు కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగాలి. చేయకూడనివి ● మధ్యాహ్నం వేళ ఎండలో ఎక్కువగా తిరగరాదు. ● మద్యం సేవించరాదు. ● రోడ్లపై అమ్మే రంగు పానీయాలు, కలుషిత ఆహార పదార్థాలను తినరాదు. ● మాంసాహారం తగ్గించి, తాజా కూరగాయలు తీసుకోవాలి. ● పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని దోమలు లేకుండా చూసుకోవాలి. పీహెచ్సీ పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నాం. పంచాయతీల్లో వీటిని అందుబాటులో ఉంచాం. బీపీ, సుగర్ వ్యాధిగ్రస్తులు ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. – ఆర్.జాహ్నవి కృష్ణ, వైద్యాధికారిణి, గుండుగొలను వేసవిలో వడదెబ్బతో పాటు విరోచనాలు, ఫుడ్ పాయిజనింగ్, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగరాదు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నాం. –జేఎం సాయి, జనరల్ మెడిసిన్, సీహెచ్సీ, భీమడోలు -
జగ్జీవన్ జీవితం స్ఫూర్తిదాయకం
ఏలూరు (టూటౌన్): బాబూ జగ్జీవన్రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అన్నారు. ఆదివారం స్థాని క ఓవర్ బ్రిడ్జి వద్ద జిల్లా సాంఘిక సంక్షేమ శా ఖ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. సామాజిక సేవ చే స్తూనే కుల నిర్మూలన కోసం ఉద్యమాలు నడిపిన సామాజిక విప్లవ యోధుడిగా జగ్జీవన్రా మ్ చరిత్రలో నిలిచిపోయారన్నారు. ఫుడ్ కా ర్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థను ప్రవేశపెట్టి ఆహార సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారన్నారు. కార్మికులు కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించి వారి అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారన్నారు. బడుగు,బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి జగ్జీవన్ అని కొనియాడారు. సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వై.విశ్వమోహన్రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగులు, ఏపీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, పెద్దాడ వెంకటరమణ, అడబాల రవి, దొడ్డిగర్ల సుభమల్లిక్, కడిమి యోహాను, నల్లిమిల్లి శంకర్, డా.పొలిమేర హరికృష్ణ, మే తర అజయబాబు తదితరులు పాల్గొన్నారు. -
బాధితుల ఇళ్లకు వెళ్లి సెల్ఫోన్ల అందజేత
భీమడోలు: భీమడోలు పోలీసులు ఆదివారం వినూత్న సేవా కార్యక్రమం చేపట్టారు. గతంలో సెల్ఫోన్లు పోగొట్టుకున్న బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి రికవరీ చేసిన సెల్ఫోన్లను వారికి అందించారు. భీమడోలు ఎస్సై ఎస్కే మదీనా బాషాతో కలిసి సీఐ వి.కృష్ణలు ఆర్జావారిగూడెంలోని ఇద్దరు బాధితుల గృహాల వద్దకు వెళ్లి వాటిని అందించగా, వారంతా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖలోని పలు విభాగాల పనితీరు, ఆన్లైన్ విధానం గురించి వారికి సీఐ అవగాహన కల్పించారు. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి ఫోన్లు వెతికి పట్టుకుని వాటిని తమకు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఫోన్లు పొగొట్టుకుంటే తిరిగి రాదనే ఆపోహ ఉండేదని, కానీ పోలీసు ఉన్నతాధికారులే తమ ఇళ్లకు వచ్చి వాటిని అందజేయడం వారి పనితీరుకు నిదర్శనమన్నారు. సీఐ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యి మొబైల్ ఫోన్లు ఎస్పీ కేపీఎస్ కిషోర్ ఆదేశాల మేరకు బాధితులకు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నరసాపురం రూరల్: స్థానిక కెనాల్ రోడ్డులో కొలువై ఉన్న శ్రీ సత్తెమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 3న శుక్రవారం నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు సోమవారంతో ముగియనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించే కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి డప్పు వాయిద్యాలు, పోతురాజుల నృత్యాలు, డీజే పోగ్రామ్లతో భక్తుల కోలాహలం మధ్య అమ్మవారి స్నానాల కార్యక్రమం అత్యంత వైభవంగా చేశారు. -
పొగాకు రైతుల బెంబేలు
బుట్టాయగూడెం : కోటి ఆశలతో పొగాకు పంట సా గు చేసిన రైతులకు ఈ ఏడాదీ నిరాశ తప్పేలా లేదు. గత మూడేళ్లుగా పెరిగిన భూమి కౌలు, పెట్టుబడులను సైతం లెక్కచెయ్యకుండా వర్జీనియా పొగాకు సాగుచేస్తున్నారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించకపోయినా చీడాపీడలు, తెగుళ్ల దాడులను తట్టుకుని మరీ సాగు చేశారు. పొగాకు రంగు, దిగుబడులు వచ్చే అవకాశం ఉందంటూ ఆనందపడ్డారు. ఈ నేపథ్యంలో గతనెల 25న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల్లో వర్జీనీయా పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కాగా మొదటిరోజు కిలో రూ.265 ధర పలకడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. కనీసం రూ.295కు కొనుగోలు చేయాలని రైతులు కోరినా పొగాకు కొనుగోలు కంపెనీలు, పొగాకు బోర్డు అధికారులు పట్టించుకోకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని జంగారెడ్డిగూడెం–1, 2, కొయ్యలగూడెం, గోపాలపురం దేవరపల్లిలోని ఐదు వేలం కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. 49.32 మిలియన్ కిలోలకు అనుమతి ఈ ఏడాది పొగాకు సీజన్కు సంబంధించి ఐదు వేలం కేంద్రాల పరిధిలో సుమారు 49.32 మిలి యన్ కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చింది. సాగు విస్తీర్ణం పెరగడం, దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో సుమారు 80 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది 60 మిలియన్ కిలోల ఉత్పత్తికి పొగాకు బోర్డు అను మతి ఇవ్వగా 83.88 మిలియన్ కిలోల ఉత్పత్తి జరిగింది. అలాగే గతేడాది మార్కెట్లో కిలో ధర గరిష్టంగా రూ.453 పలికింది. అలాగే కనిష్టంగా రూ.250 పలకగా సగటున రూ.297.50 చొప్పున లభించింది. ఈ ఏడాది అన్ని పరిస్థితులను తట్టుకు ని పొగాకు సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధర వస్తుందనే ఆశాభావంతో ఉన్నా ఇటీవల ప్రారంభమైన పొగాకు కొనుగోలులో కేవలం రూ.265 మాత్రమే ధర పలకడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. కొనుగోలు ప్రారంభమై 10 రోజులు దా టుతున్నా ధరల్లో మార్పు రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. పొగాకుకు రూ.360 ధర కల్పి ంచి కొనుగోలు చేయాలి. లేకపోతే రైతులు అప్పుల పాలవ్వడం ఖాయం. ప్రస్తుత ధర రూ.265 ఇస్తే రైతుల పరిస్థితి అగమ్యగోచరమే. పొగాకు పంట కొనుగోలుపై ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవాలి. లేనిపక్షంలో రైతుల పక్షాన ఆందోళన చేస్తాం. – కె.శ్రీనివాస్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి, ఏలూరు ఈ ఏడాది పంటలకు పెట్టుబడులు, ఖర్చులు బాగా పెరి గాయి. కౌలు ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం వేలం కేంద్రాల్లో జరుగుతున్న కొనుగోలులో ధర చూస్తే భయమేస్తుంది. ఇలానే ధరలు కొనసాగితే నష్టాల పాలవుతాం. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావు. ప్రభుత్వం ఆదుకోవాలి. – కలగర నాని, పొగాకు రైతు, కొమ్ముగూడెం, బుట్టాయగూడెం మండలం బె‘ధర’గొడుతోంది పొగాకు ధరలు చూసి నిరాశ వేలం ప్రారంభమై పది రోజులు పుంజుకోని వర్జీనియా ధరలు బ్రైట్ గ్రేడ్ పొగాకు ధరకిలో రూ.265 మాత్రమే సగటు ధర రూ.330 తగ్గితే నష్టం తప్పదంటున్న రైతులు ప్రభుత్వం పట్టించుకోవాలని వినతి -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
బుట్టాయగూడెం: శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గిరిజన యువకులు మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జీలుగుమిల్లి మండలం తాటిరామన్నగూడెంకు చెందిన మడకం సంతోష్ (19), పండు సందీప్ (20) తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట మండలం చిచ్చోడుగుంటలో వేడుకకు హాజరై ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా, గాండ్లగూడెం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అశ్వారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సందీప్, సంతోష్ల మృతితో తాటిరామన్నగూడెంలో విషాద చాయలు అలముకున్నాయి. భీమడోలు: పొలసానిపల్లి పంచాయతీ శివారు ఆంజనేయనగరం గ్రామంలో శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలు, రూ.68 వేల నగదు దోచుకెళ్లారు. బాధితుడు ముత్తంశెట్టి మణికంఠ తన కుటుంబసభ్యులతో కలిసి ఇంటి వరండాలో నిద్రపోతుండగా, దొంగలు వెనుక తలుపు తీసి లోపలికి ప్రవేశించారు. బీరువా పగులగొట్టి అందులో ఉన్న రెండు కాసుల బంగారు తాడు, చెవిదిద్దులు, నగదును అపహరించారు. ఆదివారం తెల్లవారుజామున నిద్రలేచిన మణికంఠ చోరీ జరిగినట్లు గుర్తించి భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ఎస్.కే. మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం: కుక్క కాటుకు గురై సరైన సమయంలో చికిత్స తీసుకోకపోవడంతో సుంకర పోసిబాబు (37) అనే వ్యక్తి రేబిస్ వ్యాధితో మరణించాడు. పట్టణంలోని అంబికా రెస్టారెంట్ రోడ్డులో హోటల్ నడుపుతున్న పోసిబాబును ఆరు నెలల క్రితం కుక్క కరిచింది. ఈ నెల 3న ఆయనలో రేబిస్ లక్షణాలు కనిపించాయి. ఇది గమనించిన భార్య, కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ మంచినీటిని చూసి బిగుసుకుపోతున్నాడు. వైద్యులు ముఖంపై నీళ్ళు చల్లినప్పటికీ మరింతగా బెదిరిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే రాజమండ్రి, ఆపై కాకినాడ ఆసుపత్రులకు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. శనివారం సాయంత్రం ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడికి భార్య అనంతలక్ష్మి, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. ఎస్సై ఎన్.వి. ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుట్టాయగూడెం: మండలంలోని కామవరం అటవీ ప్రాంతంలో వెలసిన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. లారీలు, మినీ వ్యాన్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలపై తరలివచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణ ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ తల్లికి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి భీమవరంనకు చెందిన ఆలయ మాజీ ధర్మకర్త వడ్డీ సుబ్బారావు కుమారుడు వడ్డీ దివ్య శ్రీవీర వెంకట శ్రీకాంత్ దంపతులు 10 గ్రాముల బంగారం, మోటూరుకి చెందిన కారిచర్ల ఉషశ్రీ 7 గ్రాముల బంగారం సమర్పించారు. దాతలకు ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆశీర్వచనాలు అందించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు దాతలకు అమ్మవారి ఫొటో, ప్రసాదం అందజేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు. -
వైఎస్సార్ విగ్రహ ధ్వంసం
● టీడీపీ అల్లర మూకల పనే ● ఇద్దరిపై కేసు నమోదు పెనుమంట్ర: పెనుమంట్ర మండలం ఓడూరు గ్రామంలోని అంబేడ్కర్ పార్కు వద్ద ప్రధాన రహదారి పక్కనే ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి శిలా విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన కొందరు టీడీపీ అల్లరి మూకలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు సిలువూరి హరివర్మ చేసిన ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన సాదే టోనీ, కప్పల చందు అనే యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పెనుమంట్ర ఎస్సై కె.స్వామి ఆదివారం తెలిపారు. ఈ ఇద్దరు యువకులతో పాటు మరో 18 మంది అర్ధరాత్రి పార్కులో పార్టీ చేసుకొని ఈ విగ్రహ విధ్వంసానికి పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని పూర్తిస్థాయిలో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
శ్రీవారి ఆలయంలో హిజ్రాల రౌడీయిజం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో కొందరు హిజ్రాల రౌడీయిజం రోజురోజుకు పెచ్చుమీరుతోంది. పోలీస్, దేవస్థానం అధికారులను సైతం వారు లెక్కచేయడం లేదు. దర్శనాలకు వెళ్లే సమయంలో ఆలయంలో వారి దురుసు ప్రవర్తన భక్తులను విస్తుగొలుపుతోంది. ఎవరైనా అడ్డొస్తే వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. అంతే కాదు క్షేత్రంలోని అనివేటి మండపం, పరిసర ప్రాంతాల్లో పెళ్లి చేసుకునే వారిని బెదిరించి మరీ రూ.1,000 చొప్పున వసూలు చేస్తున్నారు. అదే కల్యాణ మండపాల్లో డిమాండ్ చేసి ఒక్కో పెళ్లికి రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. ఇవ్వకపోతే పెళ్లికొడుకు, పెళ్లి కూతురికి, వారి బంధువులకు శాపనార్ధాలు పెట్టడం, బెదిరించడం, నోటికొచ్చిన బూతులు తిట్టడం వంటివి చేస్తున్నారు. దాంతో భీతిల్లుతున్న పెళ్లి బృందాలు ఎందుకొచ్చిన గొడవలే అని వారు అడిగింది ఇచ్చి పంపుతున్నారు. బెదిరించి రూ.50 వేల వసూళ్లు సామాన్య, మధ్య తరగతి కుటుంబాల వారే అనివేటి మండపాలు, ఆ పరిసర ప్రాంతాల్లో వివాహాలు జరుపుకుంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద కల్యాణ మండపాలకు వేలాది రూపాయల అద్దెలు చెల్లించలేక వారు ఇక్కడ పెళ్లిళ్లు చేసుకుంటారు. అయితే కొందరు హిజ్రాలు అలాంటి వారిని కూడా వదలడం లేదు. పెళ్లి జరిగే సమయంలో వారి వద్దకు వెళ్లి బెదిరించి, శాపనార్ధాలు పెట్టి, ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టి, అప్పటికీ వారు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే దౌర్జన్యాలకు పాల్పడి ఒక్కో పెళ్లి బృందం నుంచి బలవంతంగా రూ.1,000 చొప్పున వసూలు చేస్తున్నారు. కల్యాణ మండపాల్లో పెళ్లిళ్లు చేసుకునే వారి నుంచి రూ.5 వేలు చొప్పున బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి అనివేటి మండపాలు, పరిసర ప్రాంతాల్లో 50 వరకు వివాహాలు జరగగా, హిజ్రాలు వారి నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేశారు. అంతరాలయానికి పంపలేదని శనివారం ఉదయం ఇద్దరు హిజ్రాలు, ఒక మహిళను తీసుకుని శ్రీవారి దర్శనానికని వెళ్లగా, అధికారులు వారిని ఆలయంలోకి పంపారు. అయితే అంతరాలయ దర్శనానికి పంపలేదని వారు ఆలయంలో నానా హడావుడి చేశారు. తన చాతీపై చేతులు వేసి నెట్టారంటూ అందులో ఒక హిజ్రా సిబ్బందిని భయపెట్టే ప్రయత్నం చేసింది. అయినా వారు లెక్కచేయక పోవడంతో అక్కడున్న అధికారిని నోటికొచ్చినట్టు తిట్టారు. ఇదంతా చూసిన భక్తులు విసుగుచెందారు. హిజ్రాలు ఆలయంలో ప్రవర్తించిన తీరుపై పలువురు మండిపడ్డారు. దృష్టి సారించాలి గతంలో ఓ సారి హిజ్రాలు క్షేత్రంలో జరిగిన ఓ వీఐపీ వివాహానికి వెళ్లి, డబ్బులు డిమాండ్ చేసి రచ్చరచ్చ చేశారు. అప్పట్లో ఈ విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. పెళ్లిళ్లకు వెళ్లి బలవంతంగా డబ్బులు వసూలు చేసే, రౌడీయిజం చేసే హిజ్రాలపై కేసులు నమోదు చేయాలని అప్పట్లో సీఐ, ఎస్సైలకు ఆదేశాలిచ్చారు. కొద్ది నెలలు మాత్రమే ఆ ఆదేశాలు సక్రమంగా అమలయ్యాయి. ప్రస్తుతం పెళ్లిళ్లు చేసుకునే వారు కొందరు హిజ్రాలు పెడుతున్న ఇబ్బందులను భరించలేక పోతున్నారు. ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
మద్దిలో అభిషేక సేవ
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో శనివారం ఆంజనేయస్వామికి అభిషేక సేవ నిర్వహించారు. ఆలయ ముఖ మండపంపై ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించారు. ఆలయానికి వివిధ సేవల రూపేణా రూ.1,66,107 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో సుమారు 1357 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఈవో తెలిపారు. ద్వారకాతిరుమల : ఓ భక్తుడు పోగొట్టుకున్న ట్యాబ్ ఉన్న బ్యాగ్ను పోలీసులు కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే సదరు భక్తుడికి అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన ఏశాంత్ శనివారం శ్రీవారి దర్శనార్ధం ద్వారకాతిరుమలకు విచ్చేశాడు. స్వామివారి దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో అతడు తన ట్యాబ్ ఉన్న బ్యాగ్ను పోగొట్టుకున్నాడు. వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. దాంతో ఎస్సై టి.సుధీర్, కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ సీసీ ఫుటేజీల ఆధారంగా బ్యాగ్ను కనుగొన్నారు. అనంతరం బ్యాగ్ను, అందులోని ట్యాబ్ను బాదితుడు ఏశాంత్కు భీమడోలు సీఐ పి.కృష్ణ, ఎస్సై సుధీర్లు అందజేశారు. ఏలూరు టౌన్: ఏలూరు రూరల్ మండలం కొమడవోలు గ్రామంలో వివాహిత శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఆరవల్లి నాగమణి (44) భర్త, పిల్లలతో కలిసి జీవిస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న ఏలూరు రూరల్ ఎస్ఐ నాగబాబు, ట్రైనీ ఐపీఎస్ అధికారి జయశర్మ సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. ఆత్మహత్యకు కారణాలేంటనే అంశంపై స్థానికులను ఆరా తీశారు. -
జెడ్పీటీసీలకు లక్షల్లో బకాయిలు
దెందులూరు: పేరుకే జెడ్పీటీసీసలమని.. గౌరవం వేతనం లేదని పలువురు జెడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలం నుంచి ఒకరు జెడ్పీటీసీగా ఎన్నికవుతారు. జిల్లాలో 48 మంది జెడ్పీటీసీలున్నారు. ఒక్కొక్కరికి నెలకు గౌరవ వేతనంగా రూ.6000 ప్రభుత్వం కేటాయించింది. 36 నెలలుగా ఒక్కొక్కరికి సుమారు 2.18 లక్షలు రావాల్సి ఉంది. మొత్తం 48 మంది జడ్పీటీసీ సభ్యులకు కలిపి రూ. 1.03 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. ఆరు నెలలు మాత్రమే గౌరవ వేతనం మంజూరు చేశారంటున్నారు. జిల్లా పరిషత్ అధికారులు జెడ్పీటీసీ గౌరవ వేతనం బిల్లులు మంజూరుకు రెండు మూడుసార్లు ప్రభుత్వానికి పంపారని, బిల్లులకు సంబంధించి నిధులు మంజూరు కాలేదు. ఇదేనా జెడ్పీటీసీ సభ్యులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవమని అని ప్రశ్నిస్తున్నారు. 2026 సెప్టెంబర్ 30 వరకు జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ఉందని, ఇంకెప్పుడు ప్రభుత్వం గౌరవం వేతనం మంజూరు చేస్తుందని జెడ్పీటీసీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో సంవత్సరానికి జిల్లాకు వివిధ పనుల నిమిత్తం కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్న ప్రభుత్వం ప్రజల నుంచి ఎన్నికై న జెడ్పీటీసీ సభ్యులకు గౌరవం వేతనం ఎందుకు పెండింగ్లో పెడుతున్నారని అడుగుతున్నారు. బయటి వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా ఇబ్బందిగా ఉందని పలువురు జెడ్పీటీసీలు వాపోతున్నారు. జిల్లా పరిషత్ అధికారులు ఒకటికి రెండుసార్లు బిల్లులు పెట్టినా ఎందుకు మంజూరు చేయడం లేదని, పెండింగ్ ఎందుకు పెడుతున్నారని అంటున్నారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. తమకు అందించే గౌరవ వేతన విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమాత్రం సరైనది కాదని జెడ్పీటీసీలు అంటున్నారు మంజూరుకు నోచుకోని బిల్లులు -
8న మార్టేరులో కిసాన్ మేళా
ఏలూరు(టూటౌన్): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గోదావరి మండల పరిధిలో కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు ఏలూరు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కె.ఫణి కుమార్ తెలిపారు. శనివారం ఏలూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 8న మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్ధానంలో కిసాన్ మేళా నిర్వహిస్తారన్నారు. మారుతున్న వాతావరణ, వాణిజ్య పరిస్థితులు–సుస్థిర వరి వ్యవసాయం అంశంపై కిసాన్ మేళా జరగనుందన్నారు. ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విశ్వవిద్యాలయ అధికారులు, వివిధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన అధికారులు హాజరవుతారన్నారు. కిసాన్ మేళా సందర్భంగా వ్యవసాయ, ఉద్యాన, మత్స్య పరిశ్రమ, వ్యవసాయ యాంత్రీకరణ, వివిధ ప్రైవేట్ కంపెనీలకు చెందిన ప్రదర్శన శాలలను ఏర్పాటు చేస్తారన్నారు. రైతులకు నూతన వరి రకాల ప్రదర్శన, క్విజ్ పోటీ నిర్వహిస్తారన్నారు. జిల్లాలోని రైతులు పెద్ద సంఖ్యలో కిసాన్ మేళాకు హాజరుకావాలన్నారు. -
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ దుర్మరణం
పెనుమంట్ర : మాముడూరు గ్రామంలోని సత్తెమ్మ తల్లి ఆలయం సమీపంలో రొయ్యల చెరువుల్లో మట్టి లెవెలింగ్ పనులు చేస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బొక్క దుర్గాప్రసాద్ (27) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. మావుడూరు పంచాయతీ వార్డు మెంబర్ బొక్క రామకృష్ణ కుమారుడైన దుర్గాప్రసాద్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రొయ్యల చెరువులో మట్టి పనులు చేస్తూ ట్రాక్టర్ రివర్స్ చేస్తుండగా బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది. కొడుకు మృతితో ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. దుర్గాప్రసాద్ మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. పెనుమంట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొయ్యలగూడెం: దిప్పకాయలపాడులో శనివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో రెండిళ్లు దగ్ధమయ్యాయి. తంగిరాల వెంకటేష్, షేక్ ఇమాంబిలకు చెందిన ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి. పొలం పనులకు వెళ్లిన సమయంలో అగ్ని ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. ముందుగా వెంకటేష్ ఇంటిలో అగ్ని ప్రమాదం సంభవించగా పక్కనే ఉన్న ఇమాంబి ఇంటికి వ్యాపించిందన్నారు. జంగారెడ్డిగూడెం నుంచి అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపు చేసేసరికి రెండిళ్లు ఆహుతయ్యాయని బాధితులు వాపోయారు. ఇమాంబి ఇంటి నిర్మాణం కోసం తీసుకువచ్చిన లక్ష రూపాయల నగదుతో పాటు బంగారం కాలి బూడిద అయిందని విలపించింది. ఘటనా స్థలం వద్దకు రెవెన్యూ, విద్యుత్ శాఖ, అధికారులు వచ్చి ప్రమాదానికి కారణాలపై విచారణ చేపట్టారు. -
కారు ఢీకొని వ్యక్తి మృతి
కై కలూరు: అతి వేగంగా వస్తున్న కారు బైక్ను ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించిన ఘటన ఆలపాడు ప్లైఓవర్ బ్రిడ్జిపై శనివారం జరిగింది. కై కలూరు రూరల్ పోలీసుల వివరాలు ప్రకారం భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామానికి చెందిన మామిడి శ్రీను(45) కై కలూరు మండలం ఆలపాడులో చిన్న అల్లుడు పులిపాక సుబ్బారావుతో కలిసి బైక్పై ఆకివీడు వెళ్ళి తిరిగి వస్తున్నాడు. ఆలపాడు ప్లైఓవర్ బ్రిడ్జిపై ఆకివీడు నుంచి వస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. వెనుక కూర్చున్న శ్రీను మరణించాడు. ద్విచక్రవాహం నడుపుతున్న సుబ్బారావుకు గాయాలయ్యాయి. అతనిని కై కలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పెద్ద అల్లుడు ఫిర్యాదుపై కారు డ్రైవర్పై కేసు నమోదు చేసిన రూరల్ ఎస్ఐ రాంబాబు దర్యాప్తు చేస్తున్నారు. -
ర్యాలీలకు అనుమతి లేదు
ఆకివీడు మండలంలో 144 సెక్షన్ అమలు భీమవరం(ప్రకాశం చౌక్): ఆకివీడు మండలంలో హిందూ, క్రైస్తవ, స్వచ్చంద సంస్థలు, రాజకీయ పార్టీలు చేపట్టే ర్యాలీలు, ఇతర కార్యక్రమాలకు అనుమతులు లేవని, 5న చలో ఆకివీడు పేరిట ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు పెట్టుకున్న సంస్థలు రద్దు చేసుకొవాలని భీమవరం డీఎస్పీ రఘువీరా విష్ణు అన్నారు. శనివారం భీమవరం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీవో ప్రవీణ్కుమార్రెడ్డితో కలిసి ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆకివీడు పెద్దపేటలో ప్రస్తుతం ప్రశాంత వాతవరణం ఉందని, ర్యాలీలు ఏర్పాటు చేయడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. మండలంలో 144 సెక్షన్ అమల్లో ఉందని. అలాగే 30 పోలీసు యాక్ట్ కూడా అమల్లో ఉందన్నారు. అనుమతులు లేకుండా కార్యక్రమాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఈస్టర్ పండుగకు సన్నద్ధం
ఉండి: గుడ్ఫ్రైడే జరుపుకున్న క్రైస్తవ సోదరులు ఆదివారం జరిగే ఈస్టర్ పండుగ కోసం సిద్ధమవుతున్నారు. మృతిచెందిన తమ వారి సమాధులను శనివారం పరిశుభ్రంగా కడిగి రంగులు వేసి అందంగా తీర్చిదిద్దారు. పూలు, పండ్లు, కొవ్వొత్తులు, విద్యుత్ లైట్లతో సమాధులను అలంకరించి ఆదివారం తెల్లవారు జామున చర్చ్ నుంచి బయలుదేరి సమాధుల వద్దకు ఊరేగింపుగా వెళ్తారు. బాణసంచా కాల్పులతో, భక్తి కీర్తనలతో ఊరేగింపు నిర్వహిస్తారు. క్రైస్తవులు తమవారి సమాధుల వద్దకు వెళ్ళి ప్రార్థనలు నిర్వహిస్తారు. ఒకరినొకరు ప్రేమతో పలకరించుకుంటూ ఈస్టరు పండుగ శుభాకాంక్షలు తెలుపుతారు. అనంతరం ఉదయం చర్చిల్లో జరిగే కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొని ప్రార్థనలు చేస్తారు. -
భక్తులతో పోటెత్తిన చిన వెంకన్న క్షేత్రం
ద్వారకాతిరుమల: పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో చిన్న వెంకన్న క్షేత్రం శనివారం భక్తజన సంద్రమైంది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. ముఖ్యంగా దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో రద్దీగా మారాయి. 104 జంటలు శ్రీవారి నిత్యార్జిత కల్యాణంలో పాల్గొన్నారు. వేలాది మంది భక్తులు స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇదిలా ఉంటే అనివేటి మండపంలో పలు భజనమండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. సాయంత్రం వరకు క్షేత్రం భక్తుల రద్దీ కొనసాగింది. నిత్య కల్యాణంలో పాల్గొన్న 104 జంటలు -
శ్రీవారి ఆలయంలో హిజ్రాల రౌడీయిజం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో కొందరు హిజ్రాల రౌడీయిజం రోజురోజుకు పెచ్చుమీరుతోంది. పోలీస్, దేవస్థానం అధికారులను సైతం వారు లెక్కచేయడం లేదు. దర్శనాలకు వెళ్లే సమయంలో ఆలయంలో వారి దురుసు ప్రవర్తన భక్తులను విస్తుగొలుపుతోంది. ఎవరైనా అడ్డొస్తే వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. అంతే కాదు క్షేత్రంలోని అనివేటి మండపం, పరిసర ప్రాంతాల్లో పెళ్లి చేసుకునే వారిని బెదిరించి మరీ రూ.1,000 చొప్పున వసూలు చేస్తున్నారు. అదే కల్యాణ మండపాల్లో డిమాండ్ చేసి ఒక్కో పెళ్లికి రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. ఇవ్వకపోతే పెళ్లికొడుకు, పెళ్లి కూతురికి, వారి బంధువులకు శాపనార్ధాలు పెట్టడం, బెదిరించడం, నోటికొచ్చిన బూతులు తిట్టడం వంటివి చేస్తున్నారు. దాంతో భీతిల్లుతున్న పెళ్లి బృందాలు ఎందుకొచ్చిన గొడవలే అని వారు అడిగింది ఇచ్చి పంపుతున్నారు. బెదిరించి రూ.50 వేల వసూళ్లు సామాన్య, మధ్య తరగతి కుటుంబాల వారే అనివేటి మండపాలు, ఆ పరిసర ప్రాంతాల్లో వివాహాలు జరుపుకుంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద కల్యాణ మండపాలకు వేలాది రూపాయల అద్దెలు చెల్లించలేక వారు ఇక్కడ పెళ్లిళ్లు చేసుకుంటారు. అయితే కొందరు హిజ్రాలు అలాంటి వారిని కూడా వదలడం లేదు. పెళ్లి జరిగే సమయంలో వారి వద్దకు వెళ్లి బెదిరించి, శాపనార్ధాలు పెట్టి, ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టి, అప్పటికీ వారు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే దౌర్జన్యాలకు పాల్పడి ఒక్కో పెళ్లి బృందం నుంచి బలవంతంగా రూ.1,000 చొప్పున వసూలు చేస్తున్నారు. కల్యాణ మండపాల్లో పెళ్లిళ్లు చేసుకునే వారి నుంచి రూ.5 వేలు చొప్పున బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి అనివేటి మండపాలు, పరిసర ప్రాంతాల్లో 50 వరకు వివాహాలు జరగగా, హిజ్రాలు వారి నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేశారు. అంతరాలయానికి పంపలేదని శనివారం ఉదయం ఇద్దరు హిజ్రాలు, ఒక మహిళను తీసుకుని శ్రీవారి దర్శనానికని వెళ్లగా, అధికారులు వారిని ఆలయంలోకి పంపారు. అయితే అంతరాలయ దర్శనానికి పంపలేదని వారు ఆలయంలో నానా హడావుడి చేశారు. తన చాతీపై చేతులు వేసి నెట్టారంటూ అందులో ఒక హిజ్రా సిబ్బందిని భయపెట్టే ప్రయత్నం చేసింది. అయినా వారు లెక్కచేయక పోవడంతో అక్కడున్న అధికారిని నోటికొచ్చినట్టు తిట్టారు. ఇదంతా చూసిన భక్తులు విసుగుచెందారు. హిజ్రాలు ఆలయంలో ప్రవర్తించిన తీరుపై పలువురు మండిపడ్డారు. దృష్టి సారించాలి గతంలో ఓ సారి హిజ్రాలు క్షేత్రంలో జరిగిన ఓ వీఐపీ వివాహానికి వెళ్లి, డబ్బులు డిమాండ్ చేసి రచ్చరచ్చ చేశారు. అప్పట్లో ఈ విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. పెళ్లిళ్లకు వెళ్లి బలవంతంగా డబ్బులు వసూలు చేసే, రౌడీయిజం చేసే హిజ్రాలపై కేసులు నమోదు చేయాలని అప్పట్లో సీఐ, ఎస్సైలకు ఆదేశాలిచ్చారు. కొద్ది నెలలు మాత్రమే ఆ ఆదేశాలు సక్రమంగా అమలయ్యాయి. ప్రస్తుతం పెళ్లిళ్లు చేసుకునే వారు కొందరు హిజ్రాలు పెడుతున్న ఇబ్బందులను భరించలేక పోతున్నారు. ఇప్పటికై నా పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. అంతరాలయంలోకి ఎందుకు పంపరంటూ హడావుడి క్షేత్రంలో ఒక్కో పెళ్లికి రూ. వెయ్యి నుంచి.. రూ. 5 వేలు వరకు బలవంతపు వసూళ్లు ఇవ్వకపోతే బెదిరింపులు, తిట్లు, అసభ్యకర ప్రవర్తనలు -
చర్యలు తీసుకోరా?
క్రిమినల్స్పై చర్యలు తీసుకోకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆధ్యాత్మికమైన ఉన్నత పదవిలో ఉన్న బీఆర్ నాయుడు మహిళపై లైంగికంగా వ్యవహరించిన తీరును ఖండించకుండా వత్తాసు పలుకుతోంది. కూటమి ప్రభుత్వంలో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులకు అండదండలు అందిస్తున్నారు. బీఆర్ నాయుడు ఉమనైజర్. –తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే, పోలవరం కోట్లాది మంది హిందువుల మనోభావాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మహిళతో అసభ్యంగా ప్రవర్తించగా వీడియోలతో సహా సోషల్ మీడియాలో వైరల్ కావడం హిందువులను దిగ్భ్రాంతికి గురిచేసింది. చైర్మన్ అనైతిక కార్యకలాపాల వలన తిరుమల తిరుపతి దేవస్థానం అప్రతిష్టపాలవుతోంది. బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి. – మామిళ్లపల్లి జయప్రకాష్, ఏలూరు కన్వీనర్ తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న బీఆర్ నాయుడుని వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలి. పవిత్ర క్షేత్రానికి కళంకం తెచ్చిన వ్యక్తిని పదవిలో కొనసాగించడం సరికాదు. ఈ విషయంలో సీఎం చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించాలని స్వామివారికి విన్నవించుకున్నాం. రాష్ట్రంలో కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. – కంభం విజయరాజు, చింతలపూడి కన్వీనర్ -
తిరుమల పవిత్రతను కాపాడండి
ఈస్టర్కు సన్నద్ధం క్రైస్తవ విశ్వాసులు ఈస్టర్ పండుగను ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. మృతిచెందిన తమ వారి సమాధులను సుందరంగా అలంకరించారు. 8లో uద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో కొందరు హిజ్రాల రుబాబు రోజురోజుకు పెచ్చుమీరుతోంది. పోలీసులను కూడా వారు లెక్కచేయడం లేదు. 8లో uఆదివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ శనివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత ఆయా ప్రాంతాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయం బయట సీఎం చంద్రబాబు, బీఆర్ నాయుడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిందువులు పవిత్రంగా భావించే తిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్గా ఉంటూ అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన బీఆర్ నా యుడిని పదవి నుంచి తొలగించకుండా వెనకేసు కుని రావడంలో చంద్రబాబు ఉద్దేశం ఏంటో స్ప ష్టం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ నాయుడుపై వెంటనే చర్యలు తీసుకోకుంటే హిందువుల ఆగ్రహ జ్వాలల్లో గురికాకతప్పదని హెచ్చరించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ● కై కలూరు నియోజకవర్గం.. కై కలూరులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నిరసన తెలిపారు. ● దెందులూరు నియోజకవర్గం.. పెదపాడు మండల కలపర్రులో వేణుగోపాలస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లాంటి వారిపై చర్యలు తీసుకోకుండా సీఎం ఉదాసీనంగా వ్యవహరించడం హేయమైన చర్య అన్నారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరి పూజలు నిర్వహించి అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టారు. ● ఉంగుటూరు నియోజకవర్గం.. భీమడోలులోని రూపక వేంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆందోళన చేశారు. ● నూజివీడు నియోజకవర్గం.. నూజివీడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ● పోలవరం నియోజకవర్గం.. కొయ్యలగూడెం వై.జంక్షన్ వద్ద దుర్గమ్మ ఆలయంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిరసన తెలిపారు. ● ఏలూరు నియోజకవర్గం.. ఏలూరు ఆర్ఆర్పేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ● చింతలపూడి నియోజకవర్గం.. చింతలపూడిలోని రామాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి అనంతరం పార్టీ శ్రేణులతో నిరసన తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నినాదాలు చేస్తున్న ఏలూరు కన్వీనర్ మామిళ్లపల్లి జయప్రకాష్, నాయకులు పెదపాడు: కలపర్రులో నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ తిరుమల ప్రతిష్టకు శాపంగా టీ టీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పా పాలు నిలుస్తున్నాయి. వెంటనే ఆయన్ను పదవి నుంచి తొలగించాలి. ఛీత్కారం ఎదుర్కొంటు న్నా బీఆర్ నాయుడిని తొలగించకపోవడం అ నుమానాలకు తావిస్తోంది. చంద్రబాబులో వీక్ పాయింట్లు బీఆర్ నాయుడికి తెలుసు, అందుకే చర్యలు తీసుకోవడం లేదు. – దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలలు చేస్తూ సాక్ష్యాధారాలతో దొరికిపోయారు. మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రానికి మచ్చ తెచ్చారు. అలాంటి వ్యక్తిని సీఎం చంద్రబాబు క్షమిస్తున్నాడు. కలియుగ దైవం తగిన శాస్తి చేయడం ఖాయం. సనాతనీ అని చెప్పుకునే పవన్కల్యాణ్ మౌనం వహించడం దారుణం. – పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మెల్యే, ఉంగుటూరు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించి తిరుమల పవిత్రత కాపాడాలి. టీటీడీ చైర్మన్ అశ్లీల కార్యక్రమాలకు పాల్పడిన వీడియోలు వైరల్ అయినా ఆయన్ను ఇప్పటివరకూ పదవి నుంచి తొలగించకుండా సీఎం చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. – కొఠారు అబ్బయ్యచౌదరి, దెందులూరు కన్వీనర్ బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా ఉంటూ అసాంఘిక, అనైతిక చర్యలకు పాల్పడటం దారుణం. బీఆర్ నాయుడు రాసలీలలు వెలుగులోకి వచ్చి నెల రోజులు దాటుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు బీఆర్ నాయుడుతో అంటకాగుతూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. – మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, మాజీ ఎమ్మెల్యే, నూజివీడు సద్బుద్ధి ప్రసాదించు స్వామీ టీటీడీ చైర్మన్ను తక్షణమే తొలగించాలి హిందువుల ఆగ్రహ జ్వాలలకు గురికాక తప్పదు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు -
కాంతారావుకు జాతీయ స్థాయి జ్యూరీ అవార్డు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరుకు చెందిన చిత్రకారుడు మజ్జి సూర్య కాంతారావు జాతీ య స్థాయిలో మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. శనివారం చైన్నె లలిత కళా అకాడమీ ఆర్ట్ గ్యాలరీలో శ్రీ ధరిణి కళైకూడమ్ (కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన 21వ నేషనల్ కాంపిటీషన్ అండ్ ఎగ్జిబిషన్లో ప్రతిష్టాత్మక జ్యూరీ అవార్డు అందుకు న్నారు. ఆయన గీసిన చిత్రాల్లోని సృజనాత్మక త, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే శైలి జ్యూరీ సభ్యులను విశేషంగా ఆకట్టుకుంది. ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని ఏలూరు జిల్లా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ఎస్ హరనాథ్ ప్రకటనలో డిమాండ్ చేశారు. ముఖ్యంగా 2022 నుంచి 2026 వరకు ఉన్న సరెండర్ లీవ్స్ బకాయిలు, మూడు డీఏలు,11 పీఆర్సీ అరియర్స్ ఇవ్వాలని కోరారు. 12 పీఆర్సీ కమిటీని వెంటనే నియమించి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలకు శనివారం 1,147 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏలూరులోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో ఉదయం 123 మందికి 110 మంది, మధ్యాహ్నం 116 మందికి 111 మంది హాజరయ్యారు. తాడేపల్లిగూడెం వా సవి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 184 మందికి 180 మంది, మధ్యాహ్నం 181 మందికి 174 మంది హాజరయ్యారు. శశి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 116 మందికి 112 మంది, మధ్యాహ్నం 97 మందికి 93 మంది హాజరయ్యారు. భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 100 మందికి 92 మంది, మధ్యాహ్నం 100 మందికి 92 మంది హాజరయ్యారు. డీఎన్నార్ కళాశాలలో ఉదయం 97 మందికి 95 మంది, మధ్యాహ్నం 96 మందికి 88 మంది హాజరయ్యారు. ఏలూరు (టూటౌన్): రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలపై సంతృప్త స్థాయిలో వృద్ధి కనిపించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం జిల్లా సమీక్షా సమావేశాన్ని నిర్వహించా రు. మంత్రి మనోహర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్ల మరమ్మతులు, సంక్షేమ హాస్టళ్లలో వసతులపై సూచనలిచ్చారు. కాలువలు, డ్రెయిన్లలో పూడికతీత పనులు చేపట్టాలని, ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈనెల 20 వరకు గోదావరి నుంచి కాలువలకు నీరందించేలా తీర్మానించారు. మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యేలు సొంగా రోషన్ కుమార్, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు, మద్దిపాటి వెంకటరాజు మాట్లాడారు. పోలీస్స్టేషన్లకు వాహనాల అందజేత దాతల సహకారంతో జిల్లాలోని ఏడు పోలీస్ స్టేషన్లకు రూ.70 లక్షల విలువైన ఏడు వాహనాలను అందించినట్టు ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం వాహనాలు అందించిన దాతలను మంత్రులు, శాసనసభ్యులు, కలెక్టర్, ఏలూరు రేంజ్ ఐజీ, జిల్లా ఎస్పీ ఘనంగా సన్మానించారు. సాక్షి, భీమవరం: విద్యాహక్కు చట్టం ఆర్టీఈ 12(1)(సి) అమలులో ప్రైవేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ పి.శ్యాంసుందర్ హె చ్చరించారు. ‘ఉచిత విద్య.. అంతా మిథ్య’ శీ ర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన మాట్లాడారు. జిల్లాలో తొలి విడతగా 1,047 మంది పేద విద్యార్థులు ఉచిత ప్రవేశాలకు అర్హత పొందారన్నారు. ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రభుత్వం వీరికి 25 శాతం రిజర్వేషన్ కింద ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు. -
రైతు సేవా కేంద్రాలపై నిర్లక్ష్యం తగదు
ఏలూరు (టూటౌన్): గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మొదలుపెట్టిన రైతు సేవా కేంద్రాల నిర్మాణాలను కూటమి సర్కారు పూర్తిచేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. ఏలూరు జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 488 కేంద్రాలను మంజూరుచేయగా గత ప్రభుత్వంలోనే 217 కేంద్రాలు వినియోగంలోకి రాగా.. 138 కేంద్రాల పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి రెండేళ్లు కావస్తున్నా చిన్నపాటి పనులను పూర్తిచేయకుండా కాంట్రాక్టర్లు జాప్యం చేస్తున్నారని, ప్రభుత్వం దృష్టి పెట్టి పనులు వేగవంతం చేయాలని కోరారు. ఏలూరు మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఒక పేషెంట్ ప్రతి విభాగానికి వేరే ఓపీ కార్డు తీసుకోవాలనే నిబంధనతో సత్వర సేవలు అందడం లేదని, పలుమార్లు ఓపీ కోసం క్యూలలో నిలవలేక రోగులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ విధానాన్ని వెంటనే మార్చాలని కోరారు. బుట్టాయగూడెం ఆరోగ్య కేంద్రంలో జనరల్ సర్జన్, జనరల్ ఫిజీషియన్ 8 నెలలుగా లేకపోవడంతో ప్రజలకు సేవలందడం లేదన్నారు. మన్యం ప్రాంతం కొయిదా, కుక్కునూరు, అమరవరం ప్రాథమిక ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో వైద్యులు లేరని, డిప్యూటేషన్పై ఒకరు అరకొరగా వచ్చి వైద్యం చేయడంతో ప్రజలకు సకాలంలో సేవలు అందడం లేదన్నారు. పెదపాడు మండలంలో నిడమర్రు ప్రాంతంలో రెండు పీహెచ్సీలు, 12 సబ్ సెంటర్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, మరమ్మతులు చేయించాలని కోరారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా గత ప్రభుత్వం అన్ని పంచాయతీలకు రిక్షా బళ్లు ఇవ్వగా, ప్రస్తుతం చిన్నపాటి మరమ్మతులు చేయకుండా వీటిని మూలన పడేశారన్నారు. అన్ని విషయా లపై చర్యలు తీసుకుంటామని, స్వచ్ఛాంధ్ర మిషన్ ద్వారా రిక్షాలను బాగు చేయిస్తా మని ఇంచార్జ్ మంత్రి మనోహర్ హామీ ఇచ్చారు . జీలుగుమిల్లిలో బస్షెల్టర్ను రోడ్డు విస్తరణలో తొలగించాలని, అయితే తిరిగి నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు ఇ బ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ -
ఉద్రిక్తత.. అబ్బయ్య చౌదరిని అడ్డుకున్న టీడీపీ నేతలు
సాక్షి, ఏలూరు జిల్లా: కలపర్రు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీటీడీ ఛైర్మన్ను పదవి నుంచి బీఆర్ నాయుడిని తొలగించాలని డిమాండ్ చేస్తూ.. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నిరసన చేపట్టింది. వేణుగోపాలస్వామి ఆలయం వద్ద అబ్బయ్య చౌదరిని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. కలపర్రు గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. -
బీసీలంటే కూటమి ప్రభుత్వానికి చులకనా?
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో బీసీలంటే కూటమి ప్రభుత్వానికి చులకనగా ఉందా అని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై పార్టీ) రాష్ట్ర కో కన్వీనర్ నెరుసు నాగమణి యాదవ్ ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక సాహిత్య మండలి హాలులో ఆమె విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు బీసీలకు ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని, వారిని రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను విస్మరిస్తే ఫలితం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. బీసీవై పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ ఆకుల వెంకట స్వామి మాట్లాడుతూ బీసీల కోసం 5 డిమాండ్లతో తమ పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఇచ్చిన అల్లిమేటం గడువు మార్చి 31తో ముగిసిందని, ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 11న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా దీక్ష కరపత్రాలను విడుదల చేశారు. సమావేశంలో నాయకులు సర్నాల శివరాణి, తోకల రామకృష్ణ, అనగాని రామ్ ప్రసాద్, వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సెల్ టవర్ నిర్మాణంపై స్థానికుల ఆందోళన కొయ్యలగూడెం: సెల్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అశోక్ నగర్ ప్రాంతవాసులు శుక్రవారం పనులను అడ్డుకున్నారు. నివాసిత ప్రాంతాల మధ్య సెల్ టవర్ ఏర్పాటు చేయడం వలన ఆరోగ్యరీత్యా దుష్పరిణామాలు ఎదుర్కొంటామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు అనుమతులు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటుండగా ప్రభుత్వ పరంగా ఉండాల్సిన అనుమతులు లేవని స్థానికులు ఆరోపించారు. దీనిపై నిర్మాణదారులకు నివాసితులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అన్ని అనుమతులు ఉంటేనే పనులను ప్రారంభించండని స్థానికులు పేర్కొన్నారు. దీనిపై పంచాయతీ, రెవెన్యూ శాఖ అధికారులకు వారు ఫిర్యాదు చేశారు. -
కంటైనర్ ఢీకొట్టి ఇద్దరు మృతి
చౌటుప్పల్/కామవరపుకోట: ఆటోను రోడ్డుపక్కన ఆపి టైరు మారుస్తుండగా కంటైనర్ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం, జాలపవారిగూడెం గ్రామానికి చెందిన పళ్ల నవీన్కుమార్, సాధనాల లక్ష్మీనర్సింహస్వామి, రాసపోలి కనకరాజు, నాగపోగుల కృష్ణఫణీంద్రలు ఏలూరు పరిసర ప్రాంతాల్లో కొబ్బరి బొండాలు సేకరించి ఆటోల్లో లోడు చేసుకుని గురువారం రాత్రి హైదరాబాద్కు బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులోని చెరువు సమీపంలోకి చేరుకోగానే పళ్ల నవీన్కుమార్కు చెందిన ఆటో పంక్చర్ అయింది. దీంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి టైరు మార్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన మిగతా ముగ్గురు ఆటో డ్రైవర్లు కూడా తమ వాహనాలను ఆపారు. సెల్ఫోన్ లైట్ల వెలుతురులో ఆటో టైర్ మారుస్తుండగా హైదరాబాద్ వైపునకు వెళ్తున్న కంటైనర్ లారీ వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో సాధనాల లక్ష్మీనర్సింహస్వామి (39) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మిగతా వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పల్లా నవీన్కుమార్(27) అక్కడే చికిత్స పొందుతూ మృతిచెందాడు. మిగలిన ఇద్దరు ఆటో డ్రైవర్లు చికిత్స పొందుతున్నారు. పల్లా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతులు పల్లా నవీన్ కు భార్య, ఏడాది కుమారుడు ఉన్నాడు. సాధనాల స్వామి భార్య గర్భవతి. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆటో టైరు మారుస్తుండగా ఘటన -
గోపాలా..ఈ గోవులను పట్టించుకునే వారే లేరా?
● మేత లేక బక్కచిక్కుతున్న ఆవులు ● కె.పెంటపాడు బైరాగిమఠంగోశాల వద్ద వింత పరిస్థితి పెంటపాడు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన కె.పెంటపాడు బైరాగిమఠం గోపాలస్వామి ఆలయంలో గోశాలలోని గోవులు మేత లేక అల్లాడుతున్నాయి. ఇక్కడ 150కి పైగా గోవులు ఉంటాయి. వీటి కోసం ప్రత్యేకంగా కాపరి ఉంటున్నా వాటి ఆలనాపాలనా పట్టించుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా సమస్య తీవ్రతరమైంది. దీంతో గోపాలా.. మా మోర వినవా అంటూ నిత్యం గోపాలస్వామిని మొర పెట్టుకుంటున్నాయి. అయితే గోవుల సంరక్షణ బాధ్యతలు మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. పచ్చగడ్డి ఏదీ? గతంలో ఆలయ ఆవరణలో ఆవుల కోసం ప్రత్యేకంగా పచ్చగడ్డి పెంచే వారు. గత రెండేళ్లుగా ఆ మేత లేదు. సార్వా ఎండుగడ్డి మాత్రం స్టోరేజీ చేశారు. అదికూడా రక్షణ లేకపోవడంతో కుళ్లిపోయింది. గోశాల చుట్టూ దుర్వాసన వస్తోంది. అక్కడే చెత్త వేయడం వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. గోశాల వద్ద నిత్యం మందుబాబులు మద్యం తాగుతున్నారు. అక్కడ, పడమర రాజగోపురం వద్ద మద్యం ఖాళీ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. గోవుల కోసం తాగునీరు లేదు. వారానికి ఒక సారి నీరు పోస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ నీరు ఎండకు వేడెక్కడంతో గోవులు ముట్టుకోవడం లేదు. గోశాల చరిత్ర బైరాగిమఠంలో ఒక గోవు గోపాలుడిని సేవించేందుకు ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి అలసిపోయి అక్కడే మృతి చెందింది. దీంతో ఆ ఆవు బొమ్మ ఆలయంలో ప్రతిష్టించారు. ఆలయానికి వచ్చే భక్తులు తప్పక ఆవు విగ్రహానికి కూడా పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇంత ప్రాశస్త్యం ఉన్న గోశాలలోని గోవులను పట్టించుకోకపోవడం భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయానికి వేల ఎకరాలు భూమి ఉన్నా గోశాలకు విరాళాలివ్వండి అంటూ ప్రచారాలు చేసుకుంటున్నారే తప్ప వాటిని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గోశాల నిర్వహణను సవ్యంగా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
డివైడర్ను ఢీకొట్టిన కారు
ఆలమూరు: 216ఏ జాతీయ రహదారిలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా చొప్పెల్ల వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆలమూరు ఎస్సై జి.నరేష్ కథనం ప్రకారం.. చింతలపూడికి చెందిన సుంకర నవీన్, చందుమళ్లకు చెందిన కె.రామ్తేజ, పాలకొల్లుకు చెందిన కె.శివాజీ గణేష్కుమార్ కారులో విశాఖపట్నం బయలు దేరారు. చొప్పెల్ల లాకుల వద్దకు వచ్చేసరికి రాంగ్ రూట్ వెళ్లేందుకు ప్రయత్నించిన ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి డివైడర్ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. అందులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్హెచ్, 108 అంబులెన్స్లలో క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎస్సై నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురికి తీవ్ర గాయాలు -
రైతు గోడు ఎవరికీ పట్టదా?
● ఇంకా ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ● ధాన్యం ఆరబెట్టేందుకు రైతుల అవస్థలు భీమడోలు: రబీ ధాన్యం రోడ్డెక్కింది. చేతికందిన పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతుంది. దీనితో రైతులు తమ ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. దళారులకు ధాన్యాన్ని అయినకాడకు అమ్ముకుంటూ నష్టాన్ని మూటగట్టుకుంటున్నారు. ప్రస్తుతం రైతులకు కనీస మద్దతు ధర దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో గోదాములు కొరత, వర్షాల భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో మెషీన్లతో కోసిన పంట తేమ శాతం తగ్గించుకునేందుకు రోడ్లపైనే ఆరబోసుకుంటున్నారు. దళారులను ఆశ్రయిస్తున్న రైతులు వారం రోజుల కితమే ధాన్యం చేతికందినప్పటికీ.. కొనేవాడు లేక బరకాలు కప్పి ఉంచి కాపలా కాస్తున్నారు. రబీ ధాన్యం చేతికందగానే కొనుగోలుకేంద్రాలు తెరవకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతుంది. మెట్ట ప్రాంతాల్లోని బోర్ల కింద సాగు చేసిన 1153 రకం పంట కోతలు ప్రారంభం కాగా మాసూళ్ల పర్వం కూడా పూర్తయ్యింది. అయితే అటూ ప్రభుత్వం కొనక.. దళారులకే అమ్మి తీవ్రంగా నష్టపోతున్నారు. దీనితో రైతులు, కౌలు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఓ పక్క వాతావరణంలో ఏర్పడ్డ ఎల్నినో పరిస్థితులు నేపథ్యంలో విభిన్న పరిస్థితులు తలెత్తడంతో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మార్చి నెలాఖరు నాటికి కోతలు ప్రారంభించినా.. జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఊసే ఎత్తడం లేదు. వాస్తవానికి సార్వాలో రైతులు ఎకరాకు రూ.10 వేలకు పైగా నష్టాన్ని చవిచూసారు. అయితే దాళ్వాలో ఆ నష్టం నుంచి బయట పడాలంటే ఎకరాకు 50 బస్తాలకుపైగా దిగుబడులు రావాలి. కానీ కొన్ని చోట్ల 40 బస్తాలు మాత్రమే దిగుబడులు రావడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. 1153 రకం వేసిన రైతాంగం తక్కువ దిగుబడులు వస్తుండడంతో దాళ్వా నష్టాల సాగుగా మారింది. ధాన్యం ఆరబోసుకునేందుకు ఇబ్బందులు దాళ్వాలో రైతులు 1121, పీఆర్ 126, 1153, 1426 వరి రకాలను సాగు చేసారు. మెట్ట ప్రాంతాల్లో బోర్ల కింద రైతులు 1153 రకాన్ని సాగు చేయగా.. 110 రోజుల పంట కావడంతో మార్చి నెలాఖరు నాటికి రైతుల చేతికందింది. అయితే ఆ ధాన్యాన్ని రోడ్లపైనే ఆరబోసుకుంటున్నారు. జాతీయ రహదారులు, అప్రోచ్ రోడ్లపై సీతంపేట, సూరప్పగూడెం తదితర గ్రామాల్లోని రైతులు ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. గోదాముల్లో నిల్వ చేసుకునే అవకాశం లేక రైతులు వాటి పై బరకాలు కప్పి భద్రపర్చుకుంటుంన్నారు. ఎకరా సాగుకు రైతుకు రూ.40 వేల నుంచి రూ.45వేల వరకు ఖర్చు అయ్యింది. మెషీషన్లతో కోసిన ధాన్యాన్ని అరబెట్టేందుకు ఎకరాకు ఇద్దరు కూలీలకు రోజుకు రూ.800లు ఖర్చు అవుతుంది. ఎక్కువగా ఎండలో ఉండడంతో గింజ ముక్కలై నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని రైతులు వేడుకుంటున్నారు. 10 ఏకరాల భూమిని ౖౖకౌలుకు తీసుకుని సాగు చేసాను, ఏకరాకు రూ.45వేల వరకు ఖర్చు అయ్యింది. ధాన్యాన్ని కోసి అరపోసి బస్తాలపై నింపాం. ధాన్యం కోనుగోళ్లు ప్రారంభించకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మిల్లుకు తరిస్తున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరచిన తర్వాత రేటు తెలుస్తుంది. అయితే రోడ్లపై ధాన్యం ఉంచితే పోలీసులు ఊరుకోవడం లేదు. –ఎం.బాలయ్య, కౌలు రైతు, సీతంపేట ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 6, 7వ తేదీల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు చర్యలు చేపట్టాం. భీమడోలు సబ్ డివిజన్ పరిధిలో భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు, ద్వారకాతిరుమల మండలాల్లో 55 వేల ఏకరాల్లో దాళ్వా సాగు చేశారు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా కొన్నా దళారులపై తగు చర్యలు తీసుకుంటాం. –పి.ఉషారాజకుమారి, ఏడీఏ, భీమడోలు -
ఎస్సై దాతృత్వం
లింగపాలెం: మండలంలోని ములగలంపాడులో ఇటీవలే కొడుకులు సరిగ్గా చూడక ఇంటి బయట చెట్టు కింద వృద్ధురాలు నివాసం ఉంటుంది. స్థానికులు, సోషల్మీడియాలో వచ్చిన కథనాలకు ఎస్సై వెంకన్న స్పందించారు. వృద్ధరాలి దగ్గరకు వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడి ఆమెను పక్కనే ఉన్న వాళ్ళ బంధువుల ఇంటి దగ్గర పెట్టి ఆ వృద్ధురాలికి త్వరలోనే నివాసం ఏర్పాటు చేయాలని కుమారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. కామవరపుకోట: తడికలపూడి పోలీస్ స్టేషన్ ఎస్సై చెన్నారావును పోలీస్ ఉన్నతాధికారులు వీఆర్లో పెట్టారు. తడికలపూడి ఎస్సైగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు గడిచింది. శాఖా పరమైన కారణాలతో వీఆర్లో పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఇన్చార్జి ఎస్సై జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్సైగా పని చేస్తున్న కుటుంబరావును నియమించారు. వేలేరుపాడు: గాలి వల్ల 11 కేవీ లైన్ కొయిదా ఫీడర్ వైర్ తెగడంతో వేలేరుపాడు మండలంలోని విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో ఐదు పశువులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. శివకాశీపురం గ్రామంలో శ్రీనివాసరావు చెందిన ఐదు ఎద్దులను (పశువులు) ఇదే గ్రామానికి చెందిన కుంబటి నాగరాజు శుక్రవారం మధ్యాహ్నం దగ్గరలోని పొలాలకు మేతకు తీసుకెళ్లాడు. తిరిగి ఇంటికి తోలుకొస్తున్న క్రమంలో ఒక్కసారిగా గాలి రావడంతో 11కేవీ లైన్ విద్యుత్ వైరు తెగి పశువులపై పడింది. దీంతో ఐదు పశువులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ సమయంలో నాగరాజు పక్కకు పారిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. గణపవరం: రక్తదానం చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని, రక్తదానంతో మరొకరికి ప్రాణదానం చేయవచ్చని గణపవరానికి చెందిన పద్మపూజిత గ్రూపు చైర్మన్ ఆర్.బసవరాజు అన్నారు. శుక్రవారం గణపవరంలో పద్మపూజిత గ్రూపు సంస్థల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శిబిరాన్ని ప్రారంభించిన బసవరాజు రక్తదానంపై ప్రజలలో అవగాహన కల్పించడం ద్వారా స్వచ్ఛందంగా రక్తదానం చేసేలా చైతన్యవంతులు చేయాలని యూత్ సభ్యులకు సూచించారు. ఈ శిబిరంలో రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో పద్మపూజిత అనుబంధ సంస్థల జోనల్, ఏరియా అధికారులు ఫణి, అనిల్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జంగారెడ్డిగూడెం, పోలవరం సర్కిల్ కార్యాలయాలను శుక్రవారం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమీషనర్ కేవీ నాగ ప్రభుకుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, సర్కిల్ పరిధిలో చేపట్టిన కార్యక్రమాలపై అడిగి తెలుసుకున్నారు. సిబ్బందిని నాటు సారాకు సంబంధించి సమాచారం సేకరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నాగ ప్రభుకుమార్ మాట్లాడుతూ తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి సుంకం చెల్లించని మద్యంపై నిఘా ఉంచాలని సూచించినట్లు తెలిపారు. అనంతరం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులోని బోర్డర్ చెక్పోస్టును ఆయన తనిఖీ చేసి, సూచనలు చేశారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం, పోలవరం సీఐలు కె.శ్రీనుబాబు, కె.వీరబ్రహ్మం, ట్రైనీ ఎస్సై సతీష్కుమార్ పాల్గొన్నారు. నేటి నుంచి పాలిసెట్ ఉచిత కోచింగ్ తాడేపల్లిగూడెం (టీఓసీ): పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ఎస్ఎ్ఫ్ఐ తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గణేష్, పతివాడ నాగేంద్రబాబు తెలిపారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ భీమవరంలోని డాక్టర్ బీవీరాజ్ విద్యా సంస్థల్లోని బి.సీతా పాలిటెక్నిక్ కళాశాలలో శిక్షణ ఇస్తామన్నారు. మరిన్ని వివరాలకు 90141 52239, 91823 09153, 76809 17097 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలి
ఏలూరు (టూటౌన్): ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం అన్నే భవనంలో రబీ ధాన్యం కొనుగోలు సమస్యలపై ఆయన మాట్లాడారు. ఉంగుటూరు, దెందులూరు మండలాల్లో కొన్ని గ్రామాల పరిధిలో రబీ వరి కోతలు జరుగుతున్నాయని, రైతులు ధాన్యం అమ్ముకోవడానికి సిద్ధం చేస్తున్నారని, కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం వలన ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. దళారులకు ధాన్యం అమ్ముకున్నాక కొనుగోలు కేంద్రాలు తెరవడం వల్ల రైతులకు ప్రయోజనం లేదన్నారు. రబీ ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. -
అధ్వానంగా కాలువల నిర్వహణ
పెనుగొండ: పంట కాలువలు, డ్రెయిన్లు నిర్లక్ష్యపు నీడలో వాటి సర్వూపాన్ని కొల్పోతున్నాయి. సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో శివారు ప్రాంత రైతులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ప్రధాన కాలువ గట్లు డంపింగ్ యార్డులుగా, అక్రమణలతో నిండిపోతుండడంతో దిగువ ప్రాంతానికి నీరు వెళ్లే పరిస్థితి లేకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కాలువల నిర్వహణ గాలికొదిలేయడంతో రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. సాగు తుది దశకు చేరుకొన్న తరుణంలో ఇప్పటికే వంతుల వారీ విధానంతో సాగును రైతులు ముందుకు నెట్టుకెళ్తున్నారు. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ఆక్రమణల పరంపర, నిర్వహణా లోపంతో దిగువకు నీరు ప్రవహించే అవకాశం లేదని రైతులు వివరిస్తున్నారు. ముఖ్యంగా దేవ కాలువ, ఇలపర్రు కాలువ, చానల్ 1, చానల్ 2 వంటి ప్రధాన కాలువల్లో వ్యర్థాలు ఎక్కువగా పడేయడంతో పాటు, తూడు పెరిగిపోవడంతో నీరు కిందకు వెళ్లే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు దేవ కాలువ పరీవాహక ప్రాంతాలు సైతం ఆక్రమణకు గురి కావడంతో రోజురోజుకు కాలువ బక్కచిక్కిపోతోంది. దీంతో ఆయకట్టు ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి పంటకాలువల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఆక్రమణలు తొలగించడంతో పాటు, శివారు ప్రాంతాలకు నీరు సక్రమం చేరడానికి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. డ్రెయిన్ల పరిస్థితి దారుణం మురుగు డ్రెయిన్ల పరిస్థితి మరీ దారుణంగా మారింది, డ్రెయిన్ల గట్టులను పరీవాహక పంచాయతీలు డంపింగ్ యార్డులుగా వినియోగించుకుంటున్నాయి. రోజురోజుకూ చెత్త పెరిగిపోతుండడంతో ఆయా మురుగు డ్రెయిన్లలోకి చెత్త డంపింగ్ చేసేస్తున్నారు. నక్కలు డ్రెయిన్, తాడేరు డ్రెయిన్లు డంపింగ్ యార్డులుగా ఉపయోగపడుతున్నాయి. దీంతో వర్షాకాలంలో నీరు ముందుకు సాగే పరిస్థితి లేక పరీవాహక ప్రాంతమంతా ముంపునకు గురై వందలాది ఎకరాల పంటను నష్టపోవాల్సి వస్తుంది. రైతులు పదేపదే అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోతుంది. డంపింగ్ యార్డులకు స్థలాలు కేటాయించకపోవడం వల్లే కాలువ గట్లను పంచాయతీలు డంపింగ్ యార్డులుగా ఉపయోగిస్తున్నాయని చెబుతున్నారు. -
ఏసు మార్గం అనుసరణీయం
మండవల్లి: మండలంలోని భైరవపట్నం ఆర్సీఎం చర్చి వద్ద గుడ్ప్త్రెడే సందర్భంగా సిలువ మార్గంలో వైఎస్సార్పీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు శుక్రవారం పాల్గొన్నారు. డీఎన్నార్ మాట్లాడుతూ యేసు బోధించిన కరుణ, జాలి, దయ, ప్రేమ, క్షమలను అందరూ అససరించి, తోటి మానవులకు అపకారం చేయకుండా ఉండాలని సూచించారు. డీఎన్నార్తో పాటు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కైకలూరు : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడే దిశగా టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలనే డిమాండ్తో శనివారం సాయంత్రం 4 గంటలకు కై కలూరు వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) శుక్రవారం వెల్లడించారు. నియోజకవర్గ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు, వివిధ హోదాల్లో నాయకులు తప్పక హాజరుకావాలని కోరారు. జంగారెడ్డిగూడెం: నేవీ ఆయుధ డిపో కారణంగా ఏజెన్సీ మెట్ట ప్రాంతంలోని సారవంతమైన భూములు రైతులు కోల్పోవాల్సి వస్తుందని, ఇది ఈ ప్రాంతానికి మంచిది కాదని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొయ్యలగూడెం మండలంలో 1900 బ్యారెన్ల పరిధిలో రైతులు వర్జీనియా సాగు చేస్తున్నారని, ఈ ప్రాంతంలో వరి, మొక్కజొన్న, పామాయిల్తో పాటు వాణిజ్య పంటలు కూడా ఎక్కువగా పండుతాయన్నారు. ఇప్పటికే ఏజెన్సీ మెట్ట ప్రాంతంలోని రైతులు వేలాది ఎకరాలు కోల్పోయారన్నారు. ప్రస్తుతం నేవీ డిపో ఈ ప్రాంతంలో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, దీని కోసం సుమారు 1800 ఎకరాల వరకు అవసరమని, ఇందుకు కొయ్యలగూడెం మండలాన్ని ఏర్పాటుకు నిర్ణయించారన్నారు. కొయ్యలగూడెం మండలంలో అధిక ఉత్పాదక ఇచ్చే వ్యవసాయ భూములు ఉన్నాయని, వాటిని నేవీ డిపోకు వినియోగిస్తే వ్యవసాయం నాశనం అవుతుందన్నారు. వ్యవసాయం మీద ఆధారపడిన వారి పరిస్థితి ఏంటన్నారు. నేవీ ఆయుధ డిపో వస్తే ఉపాధి పెరుగుతుందని చెబుతున్నారని, అది వాస్తవం కాదన్నారు. ఇప్పటికై నా నాయకులు, అధికారులు ఈ ఆలోచనను విరమించుకోవాలని, ఒక వేళ ఇక్కడే పెట్టాలి అనుకుంటే మర్లగూడెం పారెస్ట్ భూమిని సేకరించాలని, ఇక్కడ 2 వేల ఎకరాల భూమి ఉందన్నారు. ఏలూరు (టూటౌన్): పోలవరాన్ని సందర్శించి తన జీవితం ధన్యమైందని గవర్నర్ చెప్పడం సంతోషకరమైన విషయమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రవి తెలిపారు. ఆ ప్రాంత గిరిజనుల, ప్రజల అవసరాలు, సమస్యలు గురించి పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఉన్న శ్రద్ధ ఆ ప్రాజెక్టుకు భూములిచ్చిన గిరిజనులు, దళితులు, పేదలైన నిర్వాసితులపై లేకపోవడం శోచనీయమన్నారు. నిర్వాసితుల పునరావాసం గురించి ఆలోచన లేకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. పోలవరం నిర్వాసిత కుటుంబాలు 1,05,000 వరకు ఉన్నాయని, వాటిలో దాదాపుగా 50 శాతంగా ఉన్న 50వేల కుటుంబాలకు చెందిన గిరిజనులు గోడు పట్టించుకొనే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. కాగ్ నివేదికలో పునరావాసం కేవలం 20 శాతం కూడా కల్పించలేదని, ప్రాజెక్టు నిర్మాణం మాత్రం 70 శాతం చేసారని తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మండలాన్ని యూనిట్గా తీసుకొని ఒకేసారి పరిహారం చెల్లించాలని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇదే విషయాన్ని కాగ్, సీపీఎం, ఇతర సంస్థలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలకు పట్టడం లేదన్నారు. నిర్వాసితుల పరిస్థితి ముంపు వాటిల్లినప్పుడు చాలా దయనీయంగా ఉంటుందని, ఆధార్ కార్డులు చూసి కొవ్వొత్తులు, మంచినీటి ప్యాకెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. మరోసారి ఈ ప్రాంతంలో గర్నవర్ పర్యటించి నిర్వాసితులను కలవాలని, వారి సమస్యలు అడిగి తెలుసుకోవాలన్నారు. -
అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం
బుట్టాయగూడెం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు అన్నారు. మండల కేంద్రమైన బుట్టాయగూడెంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమరావతికి సంబంధించి మొదటి విడతలో 50 వేల ఎకరాలు తీసుకుని పనులు చేయకుండా బాహుబలి సెట్టింగ్లు చేసి రాష్ట్ర ప్రజలకు సినిమా చూపించారని అన్నారు. మళ్లీ రెండో విడతలో 80 వేల ఎకరాలు భూములు సేకరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అమరావతి భూములు ఇచ్చే విషయంలో రైతులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. లక్ష ఎకరాలతో అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు దోపిడీకి తెరలేపారన్నారు. అమరావతి పేరుతో రూ.40 వేల కోట్లు అప్పు చేసి రూ.5 వేల కోట్లను అడ్వాన్స్గా తన అనుచరులకు దోచిపెట్టారని అన్నారు. ఒక చోటే కేంద్రీకృతం ఉండకూడదని అభివృద్ధి రాష్ట్ర నలుమూలల ఉండాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి పదే పదే చెబుతూ వస్తున్నారని చెప్పారు. అమరావతికి వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నడూ మాట్లాడలేదని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అద్భుతమైన ప్రతిపాదనను తీసుకువచ్చారన్నారు. ఆ ప్రతిపాదనలను కూడా చంద్రబాబు తీసుకునే పరిస్థితి లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ను అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీరావు, పార్టీ సీనియర్ నాయకులు ఆరేటి సత్యనారాయణ, ఎంపీపీ తెల్లం రమణ, వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్రావు, తదితరులు పాల్గొన్నారు. -
తవ్వేయ్.. దోచేయ్
సాక్షి టాస్క్ఫోర్స్ : ఉంగుటూరు మండలంలో ఎర్ర కంకర కూటమి నేతలకు కాసులు పంటగా కురిపిస్తోంది. ఉంగుటూరు మండలం మెట్ట ప్రాంతంలో కంకర క్వారీలు ఇష్టానుసారం తవ్వకాలు చేస్తున్నారు. నల్లమాడు ఉప కేంద్రం పక్కన పెద్ద ఎత్తున కంకరను పొక్లెయినర్ల సాయంతో తవ్వి పట్టుకుపోతున్నారు. పోలవరం కుడి కాలువ గుట్లను దోచేస్తున్నారు. డెల్టా ప్రాంతానికి లారీల్లో కంకర, మట్టి తరలిపోతోంది. ఎ.గోకవరం ఆయకట్టులో ప్రభుత్వ పోరంబోకులో కంకర తవ్వేసి తరలించేస్తున్నారు. రోజుకు వంద లారీలు తగ్గకుండా కంకర తరలిపోతోంది. వీటి వెనక కూటమి నేతలు ఉన్నారనేది బహిరంగ రహస్యం . దాంతో మండలంలోని రెవెన్యూ అధికారులు చేతులేత్తేశారు. మండలంలోని ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. -
పరీక్షలు అయిపోయాయోచ్
ముగిసిన 10 పరీక్షలు ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో జరుగుతున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారం నాటితో ముగిశాయి. ఈ పరీక్షల్లో భాగంగా గురువారం నిర్వహించిన ఇంగ్లీష్ పరీక్షలకు 22,923 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 23,418 మంది విద్యార్థులకు గాను 495 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థుల హాజరు శాతం 97.89 శాతంగా నమోదైంది. పరీక్షలను ఫ్లయింగ్ స్క్వాడ్ 32, డిస్ట్రిక్ట్ లెవెల్ అబ్జర్వర్ 06, జిల్లా విద్యాశాఖాధికారి 04, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ 03 మొత్తం 45 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ పరీక్షలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. విద్యార్థుల్లో ఉత్సాహం ఏడాది పాటు కఠోరదీక్షతో చదివి పరీక్షలను విజయవంతంగా రాయడంతో విద్యార్థుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. వాస్తవానికి ఏప్రిల్ 1వ తేదీతో పరీక్షలు ముగియాల్సి ఉండగా గత నెలలో రంజాన్ పండుగ సెలవు రావడంతో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంగ్లీష్ పరీక్ష నిర్వహించలేకపోయారు. దీనితో ఈ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీకి మార్చుతూ ప్రభుత్వ పరీక్షల కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఇంగ్లీష్ పేపర్ పరీక్షను గురువారం నిర్వహించారు. పబ్లిక్ పరీక్షల్లో చివరి పరీక్ష రాశామన్న ఆనందంలో పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు కేరింతలు కొట్టారు. వారి విద్యా సంస్థల బస్సుల్లో తిరిగి వెళుతూ కేకలు వేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. -
మూల్యాంకనం ఉత్తర్వులు పునఃపరిశీలించాలి
ఏపీటీఎఫ్ నాయకుల వినతిఏలూరు (ఆర్ఆర్పేట): పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు రాసిన జవాబుపత్రాల మూల్యాంకన కార్యక్రమం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ విధులపై విద్యాశాఖ అధికారులు విడుదల చేసిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలని కోరుతూ ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ ఆర్.ఆశకు గురువారం ఏపీటీఎఫ్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ సంబంధిత సబ్జెక్టులను బోధించని ఉపాధ్యాయులకు కూడా మూల్యాంకన విధులు కేటాయించబడినట్లు గమనించామన్నారు. విభిన్న ప్రతిభావంతుల (వికలాంగుల) కేటగిరికి చెందిన ఉపాధ్యాయులకు కూడా ఉత్తర్వులను జారీ చేశారని, అలాగే ప్రాథమిక పాఠశాలల హెడ్మాస్టర్లకు ప్రత్యేక సహాయకులుగా విధులు కేటాయించినట్టు గుర్తించామన్నారు. అయితే వారు పాఠశాల నిర్వహణతో పాటు ఎన్రోల్మెంట్ డ్రైవ్ వంటి కీలక బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుందని, ఈ సమస్యలు మూల్యాంకన ప్రక్రియ నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందన్నారు. ఈ మేరకు అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను పునఃపరిశీలించి అర్హతలు, సంబంధిత సబ్జెక్టుల ఆధారంగా విధులను కేటాయించాలని సంఘం తరఫున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఈ రామ్మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి జీ మోహన్, జిల్లా కార్యదర్శి డీ శ్రీనివాసరావు, గుంటూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
ఆకివీడు: పట్టణంలో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులో గురువారం అతివేగంగా వచ్చిన కారు ట్రాక్టర్ను ఓవర్ టేక్ చేస్తూ కరెంట్ స్తంభం, గోడను ఢీకొట్టింది. సంఘటనలో ఎవరికీ గాయాలు అవ్వలేదు. స్థానిక శాంతి నగర్ వైపు నుంచి ఇద్దరు మైనర్లు మధ్యాహ్న సమయంలో అతి వేగంగా కారును నడుపుతూ ట్రాక్టర్ను తప్పించబోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి, దాని వెనుకనే ఉన్న గోడను ఢీకొట్టారు. ప్రమాదంలో విద్యుత్ స్తంభం ముక్కలై వైర్లు తెగిపడ్డాయి. మంటలు వచ్చి సరఫరా నిలిచిపోయింది. గోడ ధ్వంసమైంది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. మధ్యాహ్నం కావడంతో ఆ ప్రాంతంలో జనసంచారం, పాఠశాల విద్యార్థులు బయటకు రాలేదు. లేకుంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభం ధ్వంసమైన సంఘటనపై స్తంభం పునరుద్ధరణ, లైన్లు ఏర్పాటు వంటి వాటికి రూ. 25,600 ఎస్టిమేట్ వేశామని, సంబంధిత కారు యజమాని వద్ద వసూలు చేస్తామని ట్రాన్స్కో ఏఈ రత్నాకర్ చెప్పారు. -
‘సత్యసాయి’ మంచినీటి కోసం నిరసన
బుట్టాయగూడెం: సత్యసాయి మంచినీటిని సరఫరా చేయాలని కోరుతూ రెడ్డిగణపవరంనకు చెందిన గ్రామస్తులు గురువారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గత సంవత్సర కాలంగా సత్యసాయి మంచినీటి సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనకు కేవీపీఎస్ జిల్లా నాయకులు అందుగుల ఫ్రాన్సిస్ మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నేషనల్ హైవే రోడ్ల నిర్మాణం వల్ల జరుగుతున్న పనులతో సత్యసాయి నీరు నిలిచిందని సంబంధిత అధికారులు చెబుతున్నారన్నారు. ఈ విషయంపై ఇటు సత్యసాయి వాటర్ప్లాంట్ కాంట్రాక్టర్లు, బ్రిడ్జిలు కట్టే కాంట్రాక్టర్ల దృష్టికి కూడా తీసుకువెళ్లినా ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి సత్యసాయి నీటిని వెంటనే ప్రజలకు సరఫరా చేయాలని, లేనిపక్షంలో నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు పూనెం దుర్గారావు, గ్రామస్తులు ఏ సీతమ్మ, వింజరపు వేణు, కె.అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
నెలాఖరులోపు రుణాలు చెల్లిస్తే వడ్డీ మాఫీ
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘం ద్వారా 2015–16 నుంచి 2018–19 మధ్య కేంద్ర ప్రభుత్వం వారి ద్వారా ఎన్ఎఫ్డీసీ/ఎన్ఎస్కేఎఫ్డీసీ పథకాల ద్వారా రుణం పొందిన వారు రుణం చెల్లిస్తే వడ్డీ మాఫీ అవుతుందని ఈడీ ఎం.ముక్కంటి తెలిపారు. గురువారం రుణాలు చెల్లించిన వారికి తన కార్యాలయంలో వడ్డీ మాఫీ సర్టిఫికెట్లను అందించి, సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రుణాలు చెల్లించాల్సిన వారు 465 మంది ఉన్నారని, వారు. అసలు రూ.13.55 కోట్లు చెల్లిస్తే వడ్డీ రూ.1.66 కోట్లు మాఫీ అవుతుందని స్పష్టం చేశారు. నూజివీడు: పట్టణంలోని కొత్తపేట 17వ వార్డులో అనధికారికంగా వంటగ్యాస్ సిలిండర్లను విక్రయించే దుకాణంపై గురువారం నూజివీడు సబ్కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న మెరుపు దాడి చేశారు. అయితే సబ్కలెక్టర్ వెళ్లేసరికి దుకాణదారుడు దుకాణాన్ని మూసేసి వెళ్లిపోయాడు. దీంతో సబ్కలెక్టర్ ఇక్కడ ఏ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారనే సమాచారాన్ని చుట్టుపక్కల వారిని అడిగి దుకాణాన్ని సీజ్ చేయించారు. అలాగే దుకాణం షట్టర్పై నోటీసు అంటించారు. ఈ సందర్భంగా సబ్కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్, పట్టణ పరిధిలో ఎక్కడైనా వంట గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసినా, అధిక ధరలకు విక్రయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సబ్కలెక్టర్ వెంట టీపీఓ కె.వెంకటేశ్వరరావు, మున్సిపల్ మేనేజర్ నరసింహారావు తదితరులు ఉన్నారు. -
వైఎస్సార్ సీపీలోకి చేరికలు
తాడేపల్లిగూడెం రూరల్: క్షేత్ర స్థాయిలో వైఎస్సార్ సీపీని బలోపేతం చేయాలని ఆ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ వడ్డి రఘురాం నాయుడు పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని ఎల్.అగ్రహారం టిడ్కో గృహ సముదాయం వద్ద జనసేనకు చెందిన పలువురు వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి నియోజకవర్గ ఇన్చార్జ్ వడ్డీ రఘురాం నాయుడు పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకూ ఎల్లప్పుడూ పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే టిడ్కో గృహ సముదాయంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. జగన్ను ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతీ కార్యకర్త స మష్టిగా పనిచేయాలన్నారు. నియోజకవర్గంలో పార్టీ జెండాను ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు గొర్రెల శ్రీనివాస్, కాకర్ల శ్రీనివాస్, దత్తి సాయి, మానుకొండ వెంకటేశ్వరరావు, తానేటి అజయ్, లంకా రాజశేఖర్, గోకా వెంకటేశ్వరరావు, తాళ్ళప్రసాద్, వట్టి బుజ్జి, యాండ్రపు వంశీ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా త్రిశూల స్నానం
పాలకొల్లు సెంట్రల్ : పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం త్రిశూలస్నానం, కంకణ విమోచన అవభృద స్నానం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రాత్రి స్వామివార్ల పుష్పోత్సవ కార్యక్రమం చేశారు. దాదాపు 25 మంది దంపుతులు అమ్మవారికి బుట్టల్లో సారెను సమర్పించారు. అనంతరం ముత్తయిదువులకు జాకెట్టు, గాజులు పంపిణీ చేశారు. దాతలు కంచర్ల రామారావు కుమారులు సత్యనారాయణ, సూర్యనారాయణ దంపతులు ప్రసాద వితరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ముచ్చర్ల శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ వాసు తదితరులు పాల్గొన్నారు. -
ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటులో టీడీపీ నేతల చేతివాటం
సాక్షి టాస్క్ఫోర్స్: ప్రభుత్వం నిర్వహించే అభివృద్ధి పనులను సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటున్న టీడీపీ నాయకులు ప్రజల ముక్కుపిండి డబ్బు దోచేస్తున్నారు. అత్తిలి మండలంలో కొందరు కూటమి నాయకులు చేస్తున్న ఈ తరహా దోపిడీకి ప్రజలు నెత్తీనోరు బాదుకుంటున్నారు. అత్తిలి మండలం ఆరవిల్లి గ్రామంలోని వైఎస్సార్ కాలనీలో విద్యుత్ శాఖ ఏర్పాటుచేసిన ట్రాన్స్ఫార్మర్ను టీడీపీ నాయకులు సొమ్ముచేసుకున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు కాలనీలోని ప్రజల నుంచి ఒక్కో ఇంటికీ ఒక్కోలా ధర నిర్ధేశించి వసూళ్లకు దిగిన వ్యవహారం ఆరవల్లిలో గుప్పుమంది. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం అంటూ రూ.300 నుంచి రూ.1,500 వరకు గుంజేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏసీ ఉన్న గృహానికి ఒకలా, ఏసీ లేని గృహానికి మరొకలా టీడీపీ నాయకులు డబ్బులు వసూళ్లలో రూ.50 వేలకుపైగా దోచుకున్నారన్న విషయం గుప్పుమంది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ శాఖ ఏర్పాటుచేస్తే టీడీపీ నాయకులు ఎందుకు డబ్బులు వసూలు చేశారంటూ కాలనీవాసులు గుర్రుగా ఉన్నారు. వైఎస్సార్ కాలనీలో 100 ఇళ్లు ఆరవల్లి వైఎస్సార్ కాలనీలో 100కుపైగా ఇళ్లు ఉండగా ఇప్పటివరకు ఉన్న ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం సరిపోక లోఓల్టేజీ సమస్య తలెత్తింది. దీంతో రూ.8 లక్షల నిధులతో విద్యుత్ 100 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు ఇటీవల విద్యుత్ శాఖ అధికారులు పనులు నిర్వహించారు. ముందుగా సరిపడా సిమెంట్ దిమ్మ కట్టించగా ఇదే అదనుగా చూసిన స్థానిక టీడీపీ నాయకులు డబ్బులు వసూళ్లకు తెరతీశారంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుచేయగా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంపై విద్యుత్ శాఖ అధికారులు మాత్రం రూపాయితో సహా విద్యుత్ శాఖ వెచ్చిస్తుందని ప్రజలు ఎటువంటి విరాళాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతుండడం విశేషం. రూ.25 వేలు దోచేశారు కాలం చెల్లిన తినుబండారాల ప్యాకెట్ విక్రయించారంటూ ఇటీవల ఒక వ్యాపారి నుంచి రూ.25 వేలు కూటమి నాయకుడు దోచుకున్న వ్యవహారం అత్తిలిలో సంచలనం రేకెత్తించింది. ఆర్యవైశ్యుడికి చెందిన ఒక దుకాణం నుంచి కొనుగోలు చేసిన ప్యాకెట్ కాలం చెల్లిందని అర్ధరాత్రి సమయంలో ఇంటిపైకి పది మంది వచ్చి దౌర్జన్యానికి దిగగా సదరు వ్యాపారి కాళ్లు పట్టుకున్నా క్షమించని దుస్థితి. ఈ క్రమంలో సదరు కూటమి నాయకుడు రూ.లక్ష డిమాండ్ చేయగా తమ వద్ద అంతలేదని చివరకు రూ.25 వేలు ఇచ్చినట్లుగా అత్తిలిలోని ఆర్యవైశ్యులు చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి అత్తిలి మండలం అంతా దోపిడీలు, దౌర్జన్యాలు, దాడులకు నిలయంగా మారిందని ప్రజానీకం చర్చించుకుంటున్నారు. అధికార పార్టీలో ఉన్న కొందరు నాయకులకు కప్పం కట్టకుంటే కానీ వ్యాపారాలు చేసుకోలేని స్థితిలో వ్యాపారులు ఉన్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మామూళ్లు వసూలు చేస్తున్న వైనం ఆరవల్లి వైఎస్సార్ కాలనీలో బయటపడిన వ్యవహారం ఇంటికొచ్చి రూ.1,500 వరకూ గుంజేశారని ఆరోపణలు విద్యుత్ శాఖ నిర్మిస్తే టీడీపీ నాయకుల దోపిడీ ఏంటనే ప్రశ్నలు -
దేవదేవా ‘అశ్వాలు’ లేవా?
● అశ్వాలు లేని రథంలో చిన వెంకన్నకు రథోత్సవం ● అధికారులకు విషయం తెలిసినా పట్టించుకోని వైనం ద్వారకాతిరుమల: ఆ దేవదేవుడి దివ్య రథానికి అశ్వాలు లేవు. అయినా ప్రతి ఆరు నెలలకోసారి క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారు ఉభయ దేవేరులతో కలసి ఈ రథంలోనే క్షేత్ర పురవీదుల్లో విహరించడం గమనార్హం. రథానికి చెక్క అశ్వాలు, ఛత్రం వంటివి లేవని అధికారులకు తెలిసినా వారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో తో భక్తులు ఇదేం దారుణమంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం శ్రీవారి వార్షిక ఆదాయం రూ. 180 కోట్లు పైమాటే. ఇంత ఆదాయం వస్తున్నా.. కనీసం శ్రీవారి రథాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో అధికారులు లేరు. అలాగే స్వామివారి చక్ర స్నానానికి కోనేరు నిర్మించే విషయంలోనూ అధికారులు తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్యాబిన్లోనే చక్ర స్నానం? బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు శ్రీవారికి రథోత్సవాన్ని, ఏడో రోజు చక్రస్నానాన్ని నిర్వహిస్తారు. అయితే అశ్వాలు లేని రథంలో రథోత్సవం, ఆలయ యాగశాలలో ట్యాప్ కింద చక్రస్నానం జరుపుతున్న తీరుపై గతేడాది అక్టోబర్ 11న సాక్షి దినపత్రికలో ‘ఆదాయమున్నా.. కనిపించని వైభవం’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దానికి స్పందించిన ఆలయ అధికారులు యాగశాలలో ట్యాప్ వద్ద ఐరన్ క్యాబిన్ను నిర్మించారు. ఇకపై బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి చక్ర స్నానాన్ని అందులోనే జరపనున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే శ్రీవారి చక్రస్నానం ఇక భక్తులకు పూర్తిగా కనబడనట్టే అవుతుంది. దగ్గరపడుతున్న సమయం శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు ఈనెల 26 నుంచి మే 3 వరకు జరగనున్నాయి. అందులో భాగంగా రథోత్సవం మే 1న జరగనుంది. అంటే రథోత్సవానికి ఇంకా 28 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. అధికారులు స్పందిస్తే ఆ సమయంలోపే రథానికి అశ్వాలను ఏర్పాటు చేయించొచ్చు. అలాగే భక్తులకు అమ్మవార్ల దర్శనం కలిగేలా రథంలో కొద్దిపాటి మార్పులు చేయించొచ్చు. అయితే అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. ఏడేళ్ల క్రితం లక్షలాది రూపాయలతో శ్రీవారి రథాన్ని నిర్మించారు. అయితే రథ నిర్మాణంలో తలెత్తిన లోపాలు కారణంగా రథం జీవకళను కోల్పోయిందన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా రథానికి చెక్క అశ్వాలు, ఛత్రం (పైన గొడుగు), రథం చుట్టూ సింహం బొమ్మలు ఉండాలి. అలాగే అశ్వాలను అదుపు చేస్తున్నట్టుగా రజకుడి బొమ్మ ఉండాలి. కానీ అవేమీ రథంలో లేకపోవడంతో భక్తులు విస్మయానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే రథంలో స్వామివారి పక్కన ఉండే అమ్మవార్లు భక్తులకు కనిపించరు. దాంతో రథయాత్రలో పాల్గొనే భక్తులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. స్వామివారి ప్రస్తుత రథాన్ని పూర్వ రథాలకు మాదిరిగా చేయించాలని భక్తులు కోరుతున్నారు. -
ఉత్సాహంగా వాటర్ స్పోర్ట్స్ పోటీలు
జంగారెడ్డిగూడెం: మండలంలోని కేకేఎం ఎర్రకాలువ రిజర్వాయర్లో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం జిల్లాస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను శాప్ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్ఏ అజీజ్ మాట్లాడుతూ శాప్ లీగ్స్లో భాగంగా జిల్లా స్థాయి వాటర్ స్పోర్ట్స్ నిర్వహించామన్నారు. కాయాకింగ్, కెనో యింగ్, రోయింగ్, డ్రాగన్ బోట్ తదితర పోటీలు అండర్–15 సబ్ జూనియర్స్, అండర్–18 జూనియర్స్ బాలురు, బాలికల విభాగాల్లో పోటీలు నిర్వహించామని తెలిపారు. ఈ పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో నిర్వహించే రాష్ట్రస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఎస్.సత్యనారాయణ, ఎస్.రాంబాబు, యడ్ల తేజేశ్వరరావు పాల్గొన్నారు. -
గవర్నర్కు స్వాగతం
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ గురువారం సందర్శించారు. ముందుగా హెలీకాప్టర్లో ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టును పరిశీలించి, ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుంచి పనుల పురోగతిని పరిశీలించారు. గవర్నర్ హెలికాప్టర్ దిగిన వెంటనే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, బలరామకష్ణ ప్రసాద్, ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీను, పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ అభిషేక్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, ఎస్ఈ ఆర్. రామచంద్రరావు, జిల్లా అటవీశాఖ అధికారి పీవీ సందీప్ రెడ్డి, మేఘ సీవో ఏవీ సతీష్, జీఎం గంగాధర్ స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కె.నరసింహమూర్తి ప్రాజెక్టు పనులను గవర్నర్కు వివరించారు. నూజివీడు: నూజివీడు కేంద్రీయ విద్యాలయ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గురువారంతో పూర్తయినట్టు ప్రిన్సిపాల్ మహమ్మద్ ఫారూఖ్ తెలిపారు. నూజివీడులో కేంద్రీయ విద్యాలయంకు ప్రజల నుంచి స్పందన బాగా వచ్చిందన్నారు. ఒకటో తరగతికి 80 వరకు వచ్చాయని, రెండో తరగతిలో ప్రవేశానికి 108 దరఖాస్తులు, మూడో తరగతికి 96, నాలుగో తరగతికి 96, ఐదో తరగతికి 47 చొప్పున దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రస్తుతం మొదటి ఏడాది కాబట్టి తరగతికి 40 సీట్లు చొప్పున మాత్రమే ఉంటాయన్నారు. ఏలూరు (టూటౌన్): పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేట ఎస్సీ మాల క్రైస్తవులపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన దాడిని ఖండిస్తూ తక్షణం ఆయన్ను బర్తరఫ్ చేయాలని మాల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ఇండోర్ స్టేడియం ఎదురుగా గల లేడీస్ క్లబ్ నందు ఏలూరు జిల్లా మాల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రఘురామ కృష్ణరాజును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆకివీడు పెదపేట మాలలకు న్యాయం చేయాలని, అక్రమంగా అరెస్టు చేసిన మాలలందరిని బేషరతుగా విడుదల చేయాలని, జరిగిన సంఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో మెజిస్ట్రీయల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమావేశ అనంతరం కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. అక్కడ నుంచి ఏలూరు రేంజ్ డీఐజీ ఆఫీసు వరకు ప్రదర్శనగా వెళ్లి డీఐజీకి వినతిపత్రం అందజేశారు. రిటైర్డ్ ఐఆర్ఎస్ చాగంటి సంజీవ్, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా, ఏలూరు మాజీ డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్బాబు, ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్, డాక్టర్ మెండెం సంతోష్కుమార్, నేతల రమేష్ బాబు, దెందులూరు జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం: గ్లోబల్ బ్రాండ్లుగా దేశ కోకో, జీడి పంటలు మారనున్నాయని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ కె.ధనుంజయరావు అన్నారు. న్యూఢిల్లీలోని కృషి భవన్లో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం జరిగిన సమావేశానికి ధనుంజయరావు అతిఽథిగా హాజరయ్యారు. ఏపీలోని కోకో, జీడిపంటల సాగు, ఉత్పత్తి సామర్థ్యం, ప్రొసెసింగ్ గురించి వివరించారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాంతాన్ని హార్టీకల్చర్ హబ్గా, ఏలూరు జిల్లాను కోకో హబ్గా ప్రకటించడంతో పాటు వార్షిక బడ్జెట్లో రూ.30 వేల కోట్లు కేటాయించిందన్నారు. ఉద్యానవర్సిటీని సందర్శించాలని ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంగీలాల్ జాట్ని వీసీ కోరారు. -
ఉచిత విద్య.. అంతా మిథ్య
విద్యాహక్కు చట్టం ఆర్టీఈ 12(1)(సీ) కింద భీమవరంలో పేద కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి తన కుమారుడిని స్థానికంగా ప్రైవేట్ స్కూల్లో 1వ తరగతిలో చేర్పించేందుకు అర్హత పొందారు. కార్పొరేట్ స్కూల్లో తన కుమారుడికి సీటు రావడంతో ఉచిత విద్య అందుతుందని సంబరపడిపోయాడు. అడ్మిషన్ కోసం వెళితే ఫిజికల్ యాక్టివిటీస్, పుస్తకాలు, యూనిఫాం తదితర వాటి కోసం రూ.30 వేలు వరకు చెల్లించాలనడంతో షాకయ్యాడు. 7వ తేదీలోగా ఈ మొత్తం చెల్లించి అడ్మిషన్ తీసుకోకుంటే మీకు వచ్చిన సీటు రద్దవుతుందని చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు. సాక్షి, భీమవరం: పేదల పిల్లలకు కార్పొరేట్ స్కూళ్లలో ఉచిత విద్యనందించాలన్న ఆశయానికి తూట్లు పడుతున్నాయి. అడ్మిషన్, ఫిజికల్ యాక్టివిటీస్, బుక్స్, యూనిఫాం తదితర వాటి పేరు చెప్పి విద్యాహక్కు చట్టం ఆర్టీఈ 12(1)(సీ) లబ్ధిదారులకు విద్యాసంస్థలు చుక్కలు చూపిస్తున్నాయి. చెప్పినంత చెల్లించి అడ్మిషన్ తీసుకోకుంటే సీటు రద్దయిపోతుందని చెబుతుండటంతో చిన్నారుల తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు. పేదల విద్యకు పెద్దపీట వేసిన జగన్ ప్రభుత్వం వారిపై ఫీజుల భారం పడకుండా ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించే వీలు కల్పించారు. ఉచిత నిర్బంద విద్యాహక్కు చట్టం సెక్షన్–12(1), (సి) కింద ప్రైవేట్ విద్యాసంస్థల్లోని 1వ తరగతిలో 25 శాతం సీట్లు పేద విద్యార్థుల కోసం కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. ఐదేళ్లు నిండి ఆరేళ్ల లోపు పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశం కల్పిస్తూ అందుకు అర్హతగా విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.14 లక్షలలోపు ఉండాలి. స్కూల్స్ యాజమాన్యాలకు ఏడాదికి అర్బన్లో రూ.8,000, రూరల్లో రూ.6,500, ఏజెన్సీలో రూ.5,500 ఫీజుగా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని అమ్మఒడి సాయం నుంచి ప్రభుత్వమే చెల్లించి మిగిలిన సొమ్మును విద్యార్థి తల్లి ఖాతాకు జమచేసే విధంగా అప్పట్లో చర్యలు తీసుకుంది. జిల్లాలో 383 ప్రైవేట్ పాఠశాలలకు గాను 1వ తరగతిలో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయిస్తూ 2022–23 విద్యాసంవత్సరం నుంచి ఉచిత విద్యను అమల్లోకి తెచ్చారు. తొలి ఏడాది వివిధ ప్రైవేట్ స్కూళ్లలో 38 మంది విద్యార్థులు చేరారు. 2023–24లో అనూహ్యంగా 1,812 దరఖాస్తులు రాగా అర్హత కలిగిన 1,162కి ఉచిత విద్య పొందే అవకాశం కల్పించారు. కూటమి ప్రభుత్వంలో ఉచిత విద్యకు కష్టాలు మొదలయ్యాయి. గత ప్రభుత్వం ఏటా క్రమం తప్పకుండా అమ్మఒడి సాయాన్ని విడుదల చేయడం వలన ఆ మొత్తం నుంచి ప్రైవేట్ విద్యాసంస్థలకు కనీస ఫీజు ఇచ్చేందుకు పేదలకు ఇబ్బంది ఉండేదికాదు. కాగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనంకు తొలి ఏడాది ఎగనామం పెట్టడంతో ఫీజుల భారం తల్లిదండ్రులపై పడింది. ఫీజు మొత్తం చెల్లించాలంటూ అప్పట్లో పలు విద్యాసంస్థలు నోటీసులు ఇచ్చాయి. ఉచిత విద్య అందుతుందన్న ఆశతో ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించిన పేదలు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అయినకాడికి అప్పులు చేసి ఫీజులు చెల్లించిన పరిస్థితులు ఎదురయ్యాయి. అడ్మిషన్, ఫిజికల్ యాక్టివిటీస్, పుస్తకాలు, యూనిఫాం పేరిట బాదుడు సీటు కోసం రూ.30 వేల వరకూ డిమాండ్ చేస్తున్న విద్యాసంస్థలు 7లోపు అడ్మిషన్ తీసుకోకుంటే సీటు ఉండదని భయపెడుతున్న వైనం బెంబేలెత్తుతున్న సెక్షన్–12(1)సీ లబ్ధిదారులు పేదలకు ప్రైవేట్ స్కూళ్లల్లో ఉచిత విద్య పొందే వీలు కల్పించిన జగన్ సర్కారు ప్రైవేట్ విద్యాసంస్థల్లోని 1వ తరగతిలో 25 శాతం సీట్లు కేటాయింపు రానున్న విద్యాసంవత్సరానికి ఆర్టీఈ 12(1)(సి) కింద తొలి విడతగా జిల్లాలో 1,047 మంది ఉచిత ప్రవేశాలకు అర్హత సాధించారు. ఈనెల 7వ తేదీలోగా విద్యార్థుల పేరెంట్స్ తమ ఆదాయం, కులం, ఆధార్, బర్త్ తదితర సర్టిఫికెట్లు అందజేసి అడ్మిషన్లు పూర్తి చేసుకోవాల్సి ఉంది. అందుకోసం వెళుతున్న వారికి ప్రైవేట్ స్కూళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. అడ్మిషన్ నిమిత్తం రూ.500 నుంచి రూ.2000 వరకు, ఫిజికల్ యాక్టివిటీస్ కోసం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు, పుస్తకాలకు రూ. 10 వేల వరకు, యూనిఫాంకు రూ.3 వేల వరకు చెల్లించాలని స్కూల్ యాజమాన్యాలు చెబుతున్నట్టు పేరెంట్స్ అంటున్నారు. ఈ సొమ్ములు చెల్లించి నిర్ణీత గడువులోగా అడ్మిషన్ తీసుకోకుంటే సీటు రద్దయిపోతుందని చెబుతుండటంతో ఏంచేయాలో పాలుపోవడం లేదని వాపోతున్నారు. ఆయా ఫీజుల భారం లేకుండా ఉచిత ప్రవేశాలకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ పి.శ్యాంసుందర్ను సంప్రదించగా ఆయన ఫోన్కు అందుబాటులో లేరు. -
వన్స్టాప్ సెంటర్ పరిశీలన
ఏలూరు (టూటౌన్): పట్టణంలోని సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలోని వన్ స్టాప్ సెంటర్ను గురువారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వన్ స్టాప్ సెంటర్ నిర్వహణ, ఆన్లైన్ ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం మొదలైన విషయాలను అడిగి తెలుసుకున్నారు, ఎక్కువగా గృహ హింస కేసులు నమోదు అవుతున్నాయని, అధికారులు ఎక్కువగా గృహ హింస కేసులు నమోదు అయ్యే ప్రాంతాలలో అవగాహన సదస్సును నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో సెంట్రర్ అడ్మిన్ నిర్మల, స్టాండింగ్ కౌన్సిల్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ద్వారకాతిరుమల: పురుగుల మందు తాగిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. వివరాల ప్రకారం కొయ్యలగూడెం మండలం రాజవరానికి చెందిన ఎ.నాగరాజు(30) ద్వారకాతిరుమల మండలం సీహెచ్ పోతేపల్లిలోని ఓ రైతు వద్ద కమతం ఉంటున్నాడు. ఏం జరిగిందో తెలియదు గానీ నాగరాజు గత మంగళవారం పురుగుల మందు తాగాడు. అప్పటి నుంచి ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు లేకపోవడంతో పోలీస్టేషన్లో కేసు నమోదు కాలేదు. -
నా వేలితో నా కంటినే పొడుచుకున్నా..
కై కలూరు మాజీ సర్పంచ్ నవరత్నకుమారి కై కలూరు: కూటమి పార్టీలో చేరి నా వేలితో నా కంటిని నేనే పొడుచుకున్నానని కై కలూరు మాజీ సర్పంచ్ దానం మేరీ నవరత్నకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ కాలం చివరి రోజు గురువారం ఆమె కై కలూరులో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్), పార్టీ నాయకుల మద్దతుతో సర్పంచ్గా విజయం సాధించానన్నారు. కూటమిలో చేరిన అనంతరం ఎస్సీ సర్పంచ్గా విధులు నిర్వహిసున్న తనపై అసత్య ఆరోపణలు చేసి చెక్పవర్ రద్దుతో పాటు సర్పంచ్గా సస్పెండ్ చేశారన్నారు. కోర్టు ఆదేశాలతో తిరిగి ఇటీవల సర్పంచ్గా విధుల్లో చేరానన్నారు. కై కలూరులో సంపు తొగింపు, వెలంపేట స్కూల్ వద్ద ట్రాన్మ్ఫార్మర్ ఏర్పాటు, వార్లకోడు డ్రెయిన్, దళిత క్రైస్తవుల శ్మశాన వాటిక విషయంలో కచ్చితత్వంగా ఉండటం వల్ల నాపై కక్ష సాధింపు చర్యలకు నాయకులు దిగారన్నారు. న్యాయ స్థానంపై నమ్మకం ఉందని, అందరికీ కోర్టు ద్వారా సమాధానం చెబుతానని తెలిపారు. -
ఎస్సై కొట్టాడని విషం తాగిన యువకుడు
ఏలూరు జిల్లా: ఎస్సై కొట్టాడని ఓ యువకుడు పురుగు మందు తాగిన ఘటన ఏలూరు జిల్లా నిడమర్రులో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమర్రుకు చెందిన నండూరి శివకార్తికేయ (33) తన మేనకోడలు బంగారు గొలుసుపోవడానికి అదే గ్రామానికి చెందిన వట్టి వేణుగోపాల్ కారణమని ఆరోపించడంతో గత నెల 29న ఇరు కుటుంబాలు ఘర్షణ పడ్డాయి. రెండువర్గాలు 30న నిడమర్రు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై కేసులు నమోదు కాగా.. మంగళవారం నిడమర్రు బాలవెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఎస్సై రమేష్, పోలీసు సిబ్బందితో బాధితుడు శివకార్తికేయ వాగ్వాదానికి దిగాడు. తనపై కేసు నమోదు చేసి వేణుగోపాల్పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించాడు. ఆ సందర్భంలో బాలాజీ అనే వ్యక్తి కత్తి తిప్పి పరారయ్యాడు. దీంతో శివకార్తికేయను ఎస్సై జీపులో స్టేషన్కు తీసుకువెళ్లి చితకబాదినట్టు శివకార్తికేయ కుటుంబసభ్యులు చెబుతున్నారు. శివకార్తికేయ మద్యం మత్తులో మాట్లాడుతున్నాడని కుటుంబ సభ్యులు చెప్పగా రాత్రికి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించారు. అయితే కల్యాణోత్సవాల్లో అందరూ చూస్తుండగా ఎస్సై రమేష్ కొట్టాడని, విచారణ పేరుతో స్టేషన్లోనూ కొట్టాడని బాధితుడు శివకార్తికేయ బుధవారం పురుగు మందు తాగాడు. అతడిని తణుకులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా.. పోలీసుల దౌర్జన్యంతో శివకార్తికేయ ఆత్యహత్యకు పాల్పడ్డాడని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం శివకార్తికేయ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో బుధవారం రాత్రి ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. వాస్తవాలను తెలుసుకునేందుకు సీసీ ఫుటేజ్లు పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తామని చెప్పారు. ఈ ఘటనలో తప్పు ఎవరిదో గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. డీఎస్పీ వెంట నిడమర్రు సీఐ రజనీకుమార్, కైకలూరు రూరల్ సీఐ రవికుమార్ ఉన్నారు. nidamarru incident youth consumes poison over -
ఐస్క్రీమ్ అమ్మితే రూ.3,000 జరిమానా!
కుక్కునూరు: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం నెమలిపేట గ్రామస్తులు వేసవి నేపథ్యంలో పిల్లల ఆరోగ్యం కాపాడుకునే దిశగా తీసుకున్న నిర్ణయం పలువురిని ఆలోచింపజేస్తోంది. ఐస్క్రీమ్లు తిని చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారని, దీంతో తమ గ్రామంలోకి ఐస్క్రీమ్ బండ్లు రాకూడదంటూ గ్రామ సరిహద్దులో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నిబంధనను మీరి ఎవరైనా ఐస్క్రీమ్ అమ్మితే రూ.3 వేలు, ఐస్క్రీమ్ కొన్న వారికి రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. డోలీ మోత.. గర్భిణుల వ్యథ!గర్భిణులకు డోలీ కష్టాలు తప్పట్లేదు. అల్లూరి జిల్లా, డుంబ్రిగుడ మండలం కొల్లాపుట్టు పంచాయతీ పరిధిలోని డొకిరిపాడుకి చెందిన పాంగి డొమినికి బుధవారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. గ్రామానికి రోడ్డు లేకపోవడంతో గత్యంతరం లేక 3 కి.మీ. డోలీలోనే మోసుకెళ్లారు. బూసిపుట్టుకు చేరుకున్న అనంతరం అంబులెన్స్కు ఫోన్ చేసినా రాకపోవడంతో ప్రైవేటు వాహనంలో అరకులోయ ప్రాంతీయాస్పత్రికి తరలించారు. కాగా, డొకిరిపాడు రహదారి నిర్మాణానికి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.2.5 కోట్లు నిధులు మంజురయ్యాయి. నిలిచిపోయిన పనులు కూడా చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేయలేక పోతోందంటూ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – డుంబ్రిగుడ -
ఆరోగ్యం.. ఆదాయం
● ద్విచక్ర వాహనంపై ‘సిరిధాన్యాల’ ప్రయాణం ● వ్యాపారంలో లాభం కంటే.. ప్రజల ఆరోగ్యానికే పెద్దపీట చింతలపూడి: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ‘ఫాస్ట్ ఫుడ్’ కల్చర్ పెరిగిపోయి ప్రజలు అనా రోగ్యం బారిన పడుతుంటే, ఓ యువకుడు మాత్రం ప్రజలకు ఆరోగ్యాన్ని పంచుతూ తన జీవనోపాధిని వెతుక్కుంటున్నాడు. చిరుధాన్యాల (మిల్లెట్స్) విలువను చాటిచెబుతున్నాడు చింతలపూడి పట్టణానికి చెందిన దేవగురు సత్యనారాయణ. ఆరోగ్యం.. ఆదాయం.. ఒకే బాటలో.. ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కొరల్రు, అరికెలు, సామలు, ఊదలు, రాగి వంటి మిల్లెట్లతో తయారు చేసిన జావను విక్రయిస్తూ ఒకపక్క కుటుంబాన్ని పోషించుకుంటూనే, మరోపక్క ప్రజలకు పోషకాహారాన్ని అందిస్తున్నాడు. గత మూడు సంవత్సరాలుగా తన ద్విచక్ర వాహనాన్ని ఒక ‘మొబైల్ క్యాంటీన్’లా మార్చుకుని ఊరూరా తిరుగుతూ వీటిని విక్రయిస్తున్నాడు. కేవలం జావ అమ్మి వెళ్లిపోవడం కాకుండా, దాని వల్ల కలిగే ప్రయోజనాలను కూడా ఆయన వివరిస్తున్నాడు. మధుమేహం, రక్తపోటు నియంత్రణలో మిల్లెట్లు ఎలా తోడ్పడతాయో వినియోగదారులకు వివరిస్తున్నాడు. ప్రస్తుతం రోజుకు సగటున 40 నుంచి 50 గ్లాసుల జావ విక్రయిస్తూ తనదైన శైలిలో రాణిస్తున్నాడు. ఈ రోజుల్లో ప్రజలకు రుచిపై ఉన్న శ్రద్ధ ఆరోగ్యంపై లేదు. చిరుధాన్యాల గొప్పతనం గురించి ఇంకా సరైన అవగాహన రావాలి. ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం అందితే, మరిన్ని ప్రాంతాల్లో ఈ ఆరోగ్యకరమైన జావను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతానని అంటున్నాడు. మిల్లెట్ జావ తాగడం వల్ల మధుమేహం, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. కొవ్వు కరిగి బరువు కూడా తగ్గుతారు. చిరు ధాన్యాల జావ గురించి ప్రజలకు అవగాహన కలిగించాలి. ప్రభుత్వం సహాయం అందిస్తే వ్యాపారాన్ని మరింత విస్తరించే ఆలోచన ఉంది. – దేవగురు సత్యనారాయణ -
పీఎన్జీ గ్యాస్ కనెక్షన్ల విస్తరణకు చర్యలు
భీమవరం (ప్రకాశం చౌక్): జిల్లాలో పీఎన్జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) కనెక్షన్ల విస్తరణను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం జాయింట్ కలెక్టరేట్ ఛాంబర్ ఎన్ఎండీవై గోదావరి గ్యాస్, సివిల్ సప్లైస్, మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గృహ వినియోగదారులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన నిరంతర గ్యాస్ సరఫరా అందించేందుకు పీఎన్జీ గ్యాస్ విస్తరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రజల్లో అవగాహన కల్పించి, పీఎన్జీ కనెక్షన్లు పొందేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో తాడేపల్లిగూడెం ప్రాంతంలో మొత్తం 9,902 గ్యాస్ కనెక్షన్లకు పైప్లైన్ సదుపాయం సిద్ధంగా ఉన్నప్పటికీ, కేవలం 63 మంది మాత్రమే వినియోగం చేస్తున్నారని తెలిపారు. ఎల్పీజీ సిలిండర్లతో పోలిస్తే పీఎన్జీ గ్యాస్ వినియోగం ద్వారా వినియోగదారులకు నెలకు సుమారు రూ.100 నుంచి రూ.150 వరకు ఆదా అవుతుందని చెప్పారు. ప్రజలు ముందుకు వచ్చి సంబంధిత శాఖల అధికారులతో సంప్రదించి పీఎన్జీ గ్యాస్ కనెక్షన్లు పొందాలని సూచించారు. గ్యాస్ కనెక్షన్ల కోసం గోదావరి గ్యాస్ అసిస్టెంట్ మేనేజర్ను ఫోన్ నెంబర్ 94914 24143 ద్వారా సంప్రదించాలన్నారు. అలాగే భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు పట్టణాల్లో పీఎన్జీ గ్యాస్ కనెక్షన్ల విస్తరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.సమావేశంలో డీఎస్ఓ ఎన్.సరోజ, గోదావరి గ్యాస్ అసిస్టెంట్ మేనేజర్ ఎం.సత్య రాకేష్, భీమవరం మున్సిపల్ కమిషనర్ ఎం.రామచంద్రారెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖాధికారి యు.మంగపతిరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
నకిలీ టికెట్ల వ్యవహారంపై సీరియస్
● టెక్నికల్ టీంను నియమించిన దేవదాయ శాఖ కమిషనర్ ● వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానంలో ఇటీవల వెలుగు చూసిన రూ.200 నకిలీ టికెట్ల వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవాలని దేవదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, కమిషనర్లకు, జిల్లా ఎస్పీకి సీఎంఓ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. దాంతో పోలీసులు ఈ కేసు దర్యాప్తును మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయంలో గత నెల 15న రూ.200 నకిలీ టికెట్ల విక్రయాల వ్యవహారం బయటపడింది. దీనిపై దేవస్థానం ఈఓ వై.భద్రాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై టి.సుధీర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎస్.శేషుబాబు, ఏ3 నిందితుడిగా ఉన్న సెక్యురిటీ గార్డు మేకా సతీష్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఏ1 నిందితుడైన ఐఎస్జే రాజు ముందస్తు బెయిల్ కోసం జిల్లా కోర్టును ఆశ్రయించాడు. ఇదిలా ఉంటే రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ నకిలీ టికెట్ల స్కాంపై ఒక టెక్నికల్ కమిటీని నియమించారు. అందులో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) లిమిటెడ్ సభ్యులు, సింహాచలం దేవస్థానానికి చెందిన సిస్టం అడ్మినిస్ట్రేటర్, అన్నవరం దేవస్థానానికి చెందిన మరో సిస్టం అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు. వారం రోజుల్లోగా సంబంధిత రిపోర్టును తనకు అందించాలని కమిషనర్ కమిటీని ఆదేశించారు. మరో ఒకటి రెండు రోజుల్లో కమిటీ దేవస్థానంలో విచారణ చేపట్టనుంది. అయితే వీరు పరిశీలించాల్సిన కంప్యూటర్ సిస్టంను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. దాంతో పోలీసులు ఈ కమిటీకి సహకరిస్తారా.. లేక తామే టెక్నికల్ పరీక్షలు జరిపిస్తామని పోలీసులు చెబుతారా? అన్నది ప్రశ్నార్ధకంగా ఉంది. పోలీసులు కంప్యూటర్ సిస్టంను టెక్నికల్ టీమ్కు ఇవ్వకపోతే వారు దేవస్థానం వద్ద ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించడం మినహా ఏమీ చేయలేరు. ఏది ఏమైనా ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ సంచలనంగా మారింది. -
ఉండి ఎమ్మెల్యే తీరు మార్చుకోవాలి
ఏలూరు(ఆర్ఆర్పేట): ఆకివీడు పెద్దపేటలో మతసామరస్యత వాతావరణానికి విఘాతం కలగడానికి ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు వైఖరే కారణమని సీపీఎం ఏలూరు నగర కమిటీ నిర్వహించిన సమావేశంలో వక్తలు పేర్కొన్నారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నగర కార్యదర్శి పంపన రవికుమార్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి చాగంటి సంజీవ్ మాట్లాడుతూ గత నెల రోజులుగా ఆకివీడు పెద్దపేట వివాదం ముదురుతుంటుంటే జిల్లా పోలీసు యంత్రాంగం ఎమ్మెల్యే ఎలా వ్యవహరించినా సహకరించడం సరికాదన్నారు. పేటలో ఉన్న గుడిని ఏ విధంగా నిర్మించుకోవాలో వారే నిర్ణయించుకుంటారని తెలిపారు. ఇరువర్గాలను ఐక్యం చేస్తూ సమస్యను పరిష్కారం చేసేలా వ్యవహరించాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రవి మాట్లాడుతూ జిల్లా ప్రశాంతతకు మారుపేరని, చిన్న చిన్న ఘర్షణలు జరిగినా వెంటనే సద్దుమణిగేవన్నారు. ఆకివీడులో జరుగుతున్న వివాదం కేవలం డిప్యూటీ స్పీకర్ రాజేస్తున్న వివాదం మాత్రమే తప్ప ప్రజల మధ్య వివాదం కాదన్నారు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అరెస్ట్ చేసిన 57 మంది దళిత యువకులను వెంటనే విడుదల చేయాలన్నారు. దళిత క్రిస్టియన్ రైట్స్ జేఏసీ చైర్మన్ డాక్టర్ పెరికే వరప్రసాదరావు మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేసి ఒక కులానికో, మతానికో ఏకపక్షంగా వ్యవహరించడం తగన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్రావు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు యంత్రాంగం వైఫల్యం వలనే ఈ వివాదం ముదిరిందన్నారు. టీడీపీ, జనసేన కేడర్ కూడా ఆలోచించాలని, రఘురామకృష్ణరాజు కుట్రలో బలికావద్దన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ పూలె ఉద్యమ నేతలు డాక్టర్ పెరియార్ దాసరి జీవన్ శ్యాం, కెవీపియస్ జిల్లా కార్యదర్శి అండుగుల ఫ్రాన్సిస్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పీవీ రామకృష్ణ, సామజిక ఉద్యమ నేతలు మాంచెల్ల ఇస్సాక్, కాకర్ల రాజేంద్ర ప్రసాద్, పీ.వెంకటేశ్వర్లు, పళ్లెం ప్రసాద్, వైఎస్ కనకారావు, జీ.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి చాగంటి సంజీవ్ -
ఆక్వా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి
కై కలూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపలు, రొయ్యల రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ బి.బలరాం డిమాండ్ చేశారు. కై కలూరు ఎన్జీవోస్ కాలనీలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, ఆక్వా రైతు బొడ్డు నోబుల్ నివాసం వద్ద ఆక్వారంగ ప్రస్తుత పరిస్థితులపై సమావేశం బుధవారం నిర్వహించారు. బలరాం మాట్లాడుతూ ట్రంప్ సుంకాలు, యుద్ధంతో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ప్రస్తుతం ఆక్వా ఉత్పత్తులకు స్థిరమైన, నిలకడైన ధరలు లేకపోవడంతో ఉత్పత్తి ఖర్చులు పెరిగి ఆక్వా రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ఆక్వా ఫీడ్కు సంబంధించిన సోయాబీన్ ముడి సరుకుల ధరలు తగ్గినా ఫీడ్ ధరలు తగ్గించకపోవడం అన్యాయమన్నారు. ఫీడ్ ధరలు తగ్గించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. విద్యుత్ సబ్సిడీ రైతులందరికీ వర్తింపజేయాలని, పెంచిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ధరలు తగ్గించాలన్నారు. ఆక్వారంగాన్ని వ్యవసాయ రంగంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆక్వా రైతుల సమస్యలపై జూన్ 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభల్లో చర్చిస్తామని చెప్పారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రవి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.


