Eluru
-
ఉపాధ్యాయులకు టెట్ గండం
రేషన్ బియ్యం పట్టివేత ముసునూరు మండలంలోని వలసపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. 8లో uబుధవారం శ్రీ 10 శ్రీ జూన్ శ్రీ 2026ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయులకు ప్రస్తుతం విషమ పరీక్ష ఎదురైంది. 2010వ సంవత్సరానికి ముందు ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన వారు కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సాధించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం ఉపాధ్యాయులను కలవరపెడుతోంది. దాదాపు 16 నుండి 25 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ, ఎందరో విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన వారే ప్రస్తుతం పరీక్షలను ఎదుర్కోవాల్సి రావడం గమనార్హం. అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నిర్వహించిన అన్ని అర్హత పరీక్షల్లో నెగ్గి ఉద్యోగం సాధించిన తాము, ఇప్పుడు తిరిగి తమను తాము నిరూపించుకోవాలని నిబంధన విధించడాన్ని ఉపాధ్యాయ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. పరీక్షల విధానంలో వచ్చిన మార్పులు, కంప్యూటర్ ఆధారిత పరీక్షల నిర్వహణపై తమలో కొందరికి అసలు అవగాహనే లేదని, ఈ పరిస్థితుల్లో పరీక్షలు ఎలా రాయగలమని వారు ప్రశ్నిస్తున్నారు. ఎంతోకాలంగా పాఠాలు బోధిస్తున్న తమకు ఇప్పుడు ‘టెట్’ నిర్వహించడం ఏమిటంటూ ఉపాధ్యాయులు, సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెట్ అర్హత సాధించాల్సిందే.. అసలే విద్యారంగంలో సంస్కరణల పేరుతో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు ఉపాధ్యాయులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా 1 నుండి 10వ తరగతి వరకు 9 రకాల పాఠశాలల విధానాన్ని తీసుకువచ్చారు. ఇప్పటికే పలు రకాల యాప్ల వినియోగంతో టీచర్లు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇది చాలదన్నట్లు, ఇప్పుడు 2010కి ముందు ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులు కూడా ‘టెట్’ పాస్ కావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదో ఒక సబ్జెక్టులో నైపుణ్యం సాధించి, ఆ సబ్జెక్టుపై విద్యార్థులకు పాఠాలు బోధించే తాము.. ప్రస్తుతం అన్ని సబ్జెక్టులు కలిపి నిర్వహించే ‘టెట్’ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలనడం దారుణమని వారు వాపోతున్నారు. ప్రత్యేక టెట్ నిర్వహించాలని డిమాండ్ టెట్ పరీక్షను 150 మార్కులకు నిర్వహించనున్నారు. ఇందులో అర్హత సాధించాలంటే: ఓసీ కేటగిరీవారు 60 శాతం మార్కులు, బీసీ కేటగిరీ 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ, ఎక్స్–సర్వీస్మెన్ కేటగిరీ 40 శాతం మార్కులు సాధించాలి. టెట్ పాస్ కావాలంటే తెలుగు, ఇంగ్లీష్, గణితం, చైల్డ్ డెవలప్మెంట్, పర్యావరణ శాస్త్రం వంటి అంశాలన్నీ చదవాల్సి ఉంటుంది. బయలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు గణితం, తెలుగు పండితులకు సోషల్ స్టడీస్ వంటి సంబంధం లేని సబ్జెక్టులను టెట్లో పెట్టడం వల్ల పాస్ కావడం ఎలా అని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. అందుకోసమే ప్రస్తుతం పనిచేస్తున్న ఇన్–సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ‘ప్రత్యేక టెట్’ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అన్ని కేటగిరీల ఉపాధ్యాయులకూ ఉత్తీర్ణత మార్కులను 35 శాతానికి తగ్గించాలని కోరుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్లలోపు టెట్ రాసి ఉత్తీర్ణత సాధించాలి. లేనిపక్షంలో ఉద్యోగం వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమోననే ఆందోళన గురువులను వెంటాడుతోంది. దీనికి తోడు టెట్ పాస్ కాని వారికి పదోన్నతులతో (ప్రమోషన్లు) పాటు నియామకాలు కూడా ఉండవని కోర్టు తీర్పులో పేర్కొంది. ఐదేళ్లలోపు సర్వీస్ మిగిలి ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇచ్చినప్పటికీ, వారికి పదోన్నతులు కావాలంటే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేశారు. ఈ నిబంధన కారణంగా జిల్లాలో 2010వ సంవత్సరానికి ముందు ఉద్యోగాల్లో ప్రవేశించిన సుమారు 6 వేల మంది ఉపాధ్యాయులు ఇప్పుడు టెట్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ టెట్ నిబంధనను ఉపసంహరించాలని గత ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళనలు నిర్వహించడంతో పాటు, సుప్రీంకోర్టు ఈ నిబంధనను పునఃపరిశీలించాలని కోరుతూ రివ్యూ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. దీనిపై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. గత మే నెల 29వ తేదీన తుది తీర్పు ఇస్తూ ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాల్సిందేనని నొక్కి చెప్పింది. అయితే, గతంలో ఇచ్చిన గడువును మరో ఏడాది పెంచుతూ, అంటే 2028 ఆగస్టు 31వ తేదీలోగా పూర్తి చేయాలని కొద్దిగా సడలింపు ఇవ్వడం ఒక్కటే ఉపాధ్యాయులకు స్వల్ప ఉపశమనం కలిగించే అంశం. సుప్రీంకోర్టు తీర్పుతో గురువుల్లో మళ్లీ మొదలైన టెన్షన్ జిల్లాలో సుమారు 6 వేల మంది టెట్ అర్హత సాధించాల్సిన గురువులు ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని డిమాండ్ -
వాల్టా చట్టానికి తూట్లు
పాలకోడేరు: మండలంలోని శృంగవృక్షం గ్రామ శివారు పెర్కిపాలెం వెళ్లే రహదారి పక్కన పచ్చని చెట్లపై మంగళవారం అమానుషంగా గొడ్డలి వేటు పడింది. వాల్టా చట్టం ప్రకారం ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతులు పొందాల్సి ఉండగా, నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి సుమారు 100 చెట్లను నరికివేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. వ్యవసాయ భూమి మార్పిడి కోసమేనా? మంగళవారం ఉదయం పొలం గట్లపై ఉన్న దాదాపు 30కి పైగా కొబ్బరి, తాటి మానులను మొదలు వరకు నరికి దొంతరలుగా వేశారు. వీటితో పాటు అనేక తాటి చెట్ల మట్టలను కూడా విచక్షణారహితంగా నరికి కుప్పలుగా పడేశారు. మొత్తంగా వందకు పైగా చెట్లను నేలకూల్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో జేసీబీ కూడా ఉండటంతో, సదరు వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ లేదా ఇతర వాణిజ్య అవసరాలకు మార్చేందుకే ఈ చర్యకు పాల్పడినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చట్టం ఇలా ఆంధ్రప్రదేశ్ నీటి, భూమి, చెట్ల (వాల్టా) చట్టం ప్రకారం.. కొబ్బరి, తాటి వంటి వృక్షాలను నరకాలంటే తహసీల్దార్, ఉద్యానవన శాఖల నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలి. నిబంధనలు అతి క్రమిస్తే జరిమానాతో పాటు చట్టపరమైన కఠిన చర్య లు ఉంటాయి. అయితే ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా చెట్లను కూల్చివేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా అధికారులు చెట్లను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అనుమతులు లేకుండా తాటిచెట్ల నరికివేత -
పంట బోదెలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
కాళ్ల: ఆకివీడు శివారు ఐ.భీమవరం రోడ్డులో ఉన్న దుంపగడప పంట బోదెలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనుగొన్నట్లు ఆకివీడు ఎస్సై హనుమంతు నాగరాజు మంగళవారం విలేకరులకు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం పంట బోదెలో 35 సంవత్సరాల వయసు ఉన్న పురుషుని మృతదేహం బోర్లా పడి ఉండడాన్నీ కనుగొన్నామన్నారు. నీలిరంగు ఫ్యాంటు, గోధుమ రంగు చారలు షర్టు కలిగి ఉన్నారని ఆయన వివరించారు. వెంకయ్య–వయ్యేరు కాలువలో నీటి ప్రవాహంలో కొట్టుకుని వచ్చి పంట బోదెలోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. కామవరపుకోట: మండలంలో అంకాలంపాడు, కామవరపుకోట కోత్తూరు పరిసర ప్రాంతాల్లో సోమవారం రాత్రి పొలాలలో బోరు మోటర్ కేబుల్ వైర్లు గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించి వెళ్లినట్లు రైతులు తెలిపారు. దీనిపై మంగళవారం పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఈ వైర్లు సుమారు రూ.2 లక్షల రూపాయలు పైగా ఉంటుందని రైతులు తెలిపారు. గతంలో కూడా ఇలాగే ట్రాన్స్ఫార్మర్ వైర్లు, మోటర్ వైర్లు దొంగతనానికి గురైనట్లు రైతులు పేర్కొన్నారు. ఏలూరు (టూటౌన్): రాష్ట్ర డెడికేటెడ్ కమిషన్ చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్ర ఈ నెల 11న ఏలూరులో పలు కార్యక్రమాలలో పాల్గొంటారని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కోటాకు సంబంధించి వివిధ బీసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి అభిప్రాయాలు, వినతులను స్వీకరించేందుకు గోదావరి సమావేశపు హాలులో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): యోగాంధ్ర–2026 కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యోగాంధ్ర–2026 కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 4.5 లక్షల మంది పౌరులతో యోగ రిజిస్ట్రేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. జూన్ 13న నరసాపురం వలందర్ రేవు వద్ద 1000 మందితో, జూన్ 14న వాసవి పెనుగొండలో 2500 మందితో, జూన్ 19న స్పోర్ట్స్ అథ్లెటిక్స్ మైదానంలో 1500 మందితో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాస్థాయిలో 1500 మందితో మెగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తాడేపల్లిగూడెం రూరల్: మండలంలో మద్యం సేవిస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్న పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ ఎస్సై రవికుమార్ మంగళవారం విలేకరులకు ప్రజాప్రదేశాల్లో మద్యం సేవించడం, గొడవలు చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం, ప్రజాశాంతి భద్రతలకు భంగం కలిగించడం వంటివి చట్టరీత్యా శిక్షార్హమని హెచ్చరించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏలూరు టౌన్: మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నుంచి బంగారం, సెల్ఫోన్ చేరీ చేసిన ఘటన మంగళవారం ఏలూరులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం ఏలూరు అశోక్నగర్ ప్రాంతానికి చెందిన పర్వతనేని సాయినవీన్ బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. నవీన్ తన స్నేహితుడితో కలిసి దేవి బార్ అండ్ రెస్టారెంట్కు మద్యం తాగేందుకు వెళ్లాడు. మద్యం తాగుతున్న సమయంలోనే నవీన్కు అతడి స్నేహితునికి మద్య చిన్న వివాదం ఏర్పడటంతో బార్ నుంచి అతను వెళ్లిపోయాడు. నవీన్ ఒక్కడే బార్ నుంచి బయటకు వచ్చాడు. ఇదే సమయంలో మోటారు సైకిల్పై వేచి ఉన్న ఇద్దరు వ్యక్తులు అతడిని అశోక్ నగర్లో దించుతామని చెప్పి ఎక్కించుకున్నారు. అయితే వారు చొదిమెళ్ల వైపు తీసుకువెళ్తూ గట్టిగా అరవకుండా నోరు మూసేశారు. అతడి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, సెల్ఫోన్ తీసుకుని ఉడాయించారు. ఇద్దరు వ్యక్తులు పారిపోతూ వంగూరు వెళదామని చెప్పుకోవటం తాను విన్నానని నవీన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు ఏలూరు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ప్రయాణ ఇక్కట్లు ఇంకెనాళ్లు?
ఉండి: ఉండి కాలువలో జాతీయ రహదారి రక్షణ కోసం చేపట్టిన రివిట్మెంట్ వాల్ (రక్షణ గోడ) నిర్మాణ పనుల వల్ల ప్రయాణికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నెల ద్వితీయార్ధంలో ప్రారంభమైన ఈ పనుల కోసం జాతీయ రహదారిని, పంట కాలువను అధికారులు మూసివేశారు. పనులు పూర్తిస్థాయిలో ముగిసి, రాకపోకలు యథావిధిగా సాగడానికి మరో నెల రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఉండి మండల శివారు, చెరుకువాడ సరిహద్దుల నుంచి ఆకివీడు మండలం అజ్జమూరు పరిధి వరకు ఈ రక్షణ గోడ నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం ఈ పనులు ప్రాథమిక దశ దాటి కొంత ముందుకు సాగినప్పటికీ, క్షేత్రస్థాయి సమస్యల వల్ల పనుల్లో తీవ్ర ఆలస్యం జరుగుతుంది. మట్టి ఊటతో పనులకు ఆటంకం ఒకవైపు పంట కాలువ, మరోవైపు ఆక్వా చెరువులు ఉండటంతో కాలువ తవ్విన ప్రాంతంలో చెరువుల నుంచి నీరు ఊరుతోంది. దీనికి తోడు కాలువ గట్టే చెరువు గట్టుగా ఉండటం, అధికారులు దీనిపై ముందస్తు శ్రద్ధ తీసుకోకపోవడంతో గట్టు జారి మట్టి తిరిగి కాలువలోకి వచ్చేస్తోంది. ఈ మట్టిని పదే పదే తొలగించాల్సి రావడం వల్లే రక్షణ గోడ పనులు మందగించాయని తెలుస్తోంది. ప్రయాణికుల నరకయాతన.. అదనపు భారం గతంలో ఉండిలో ఆర్ఓబీ నిర్మాణ సమయంలో రైల్వేగేటు కొన్ని రోజులు మూసివేస్తేనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఏకంగా జాతీయ రహదారినే మూసివేయడంతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి.పనులు అనుకున్నట్లు జరిగితే ఈ నెల 20వ తేదీ నాటికి రహదారిని కొద్దిగా తెరుస్తామని అధికారులు చెబతున్నా అది సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కేవలం ద్విచక్ర వాహనదారులు మాత్రమే మట్టి దిబ్బలు ఎక్కుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. సాధారణ ప్రయాణికులు, ఆటోలు కూడా వెళ్లే పరిస్థితి లేదు. ఉండి, ఆకివీడు వైపుల నుంచి వచ్చేవారు పనులు జరిగే ప్రాంతం వరకు వచ్చి, కాలినడకన ఆ ప్రాంతాన్ని దాటి అవతలి వైపు మరో ఆటో ఎక్కాల్సి వస్తోంది. దీంతో ఆటో డ్రైవర్లు ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. 10 కిలోమీటర్ల మేర అదనపు ప్రయాణం భీమవరం నుంచి ఆకివీడు మీదుగా కై కలూరు, ఏలూరు తదితర ప్రాంతాలకు వెళ్లే కార్లు, ఇతర భారీ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి వస్తోంది. భీమవరం నుంచి జువ్వలపాలెం రోడ్డు మీదుగా వెళ్లి, అక్కడ ఏలూరుపాడు వంతెన నుంచి ఐ.భీమవరం మీదుగా ఆకివీడు చేరుకుంటున్నారు. దీనివల్ల సాధారణ మార్గం కంటే సుమారు 10 కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని, సమయంతో పాటు ఇంధనం వృథా అవుతోందని వాహనదారులు వాపోతున్నారు. సాగు, తాగునీటికీ ముప్పు కాలువలకు నీరు విడుదల చేసి వారం రోజులు గడుస్తున్నా.. చెరుకువాడ, దాని శివారు గ్రామాలకు పూర్తిస్థాయిలో సాగు, తాగునీరు అందడం లేదు. సాధారణంగా ఇక్కడి నుంచి ప్రవహించే నీరు అజ్జమూరు మురుగు కాలువలోకి వెళ్లాలి. కానీ, పనులు జరుగుతున్న ప్రాంతంలో అడ్డుకట్ట వేయడం వల్ల, ఉండి అక్విడెక్టు వద్ద పంట కాలువ నీటిని బొండాడ మేజర్ డ్రెయిన్లోకి విడిచిపెడుతున్నారు. ఫలితంగా కలిసిపూడి, చెరుకువాడ ప్రాంతాలకు నీటిమట్టం తగ్గి, పొలాలకు నీరందడం లేదు. నాణ్యతపై అనుమానాలు.. ప్రభుత్వం, అధికారులు ముందుచూపుతో వ్యవహరించి కాలువలు మూసి ఉంచిన సమయంలోనే ఈ పనులు ప్రారంభించి ఉంటే.. నీటి విడుదలకు ముందే పనులు పూర్తయ్యేవి. ఒకవైపు రక్షణ గోడ కడుతుండగానే జాతీయ రహదారి కుంగిపోవడం, మరోవైపు ఆక్వా చెరువుల వల్ల గట్లు జారిపోతుండటంతో భవిష్యత్తులో ఈ కట్టడం సురక్షితమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నీరు ప్రవహిస్తున్న సమయంలోనే పనులు చేస్తుండటంతో రక్షణ గోడ నాణ్యతపై కూడా స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఉండి కాలువ రివిట్మెంట్ వాల్ నిర్మాణంలో తీవ్ర జాప్యం మట్టి కొట్టుకుపోతుండటంతో మందగించిన పనులు 10 కిలోమీటర్లు అదనంగా ప్రయాణంరక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి మే మొదటి వారంలోనే మట్టి పరీక్షలు ప్రారంభించాం. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పూర్తయిన తర్వాతే పనులను వేగవంతం చేశాం. పనులు పూర్తిస్థాయిలో ముగియడానికి మరో నెల రోజులు పట్టవచ్చు. అయితే, ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 20 నాటికి జాతీయ రహదారిపై రాకపోకలను తాత్కాలికంగా పునరుద్ధరిస్తాం. పనులన్నీ త్వరితగతిన, నాణ్యతతో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. – సబీరా సుల్తానా, ఎన్హెచ్ ఏఈ -
కొల్లేరు సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తాం
కై కలూరు: కొల్లేరు ప్రాంత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. తొలి అడుగు పేరుతో కొల్లేరు నాయకుడు బలే ఏసురాజు ఆధ్యరంలో కై కలూరు సీతారామఫంక్షన్ హాలులో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల కొల్లేరు గ్రామ పెద్దలతో మంగళవారం సమావేశం నిర్వహ/ంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ త్వరలో సుప్రీంకోర్టు నుంచి శుభవార్త వస్తుందని భావిస్తోన్నామన్నారు. ఫోన్లో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్తో మాట్లాడించారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ త్వరలో కొల్లేరుపై చర్చిస్తారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మీ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్రావు, జిల్లా అటవీశాఖ అధికారి త్రిమూర్తులురెడ్డి, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న తదితరుల పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల పాత్ర కీలకం
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యార్థి అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర విశిష్టమైనదని, ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు భాషా నైపుణ్యాలు, గణిత ప్రాథమిక నైపుణ్యాలపై పటిష్టమైన అవగాహన కల్పించగలిగితే వారి భవిష్యత్తు విద్యాభ్యాసానికి బలమైన పునాది ఏర్పడుతుందని జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఎఫ్ఎల్ఎన్ ఆరు రోజుల శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో మంగళవారం ఆమె నగరంలోని కోటదిబ్బ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల కేంద్రాన్ని సందర్శించి శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత విద్యా పరిస్థితుల్లో ఎఫ్ఎల్ఎన్ శిక్షణ అత్యంత అవసరమన్నారు. సమగ్ర శిక్ష పరిధిలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలపై కూడా ఉపాధ్యాయులకు అవగాహన కల్పించినట్లు కోర్స్ డైరెక్టర్, ఏలూరు మండల విద్యాశాఖాధికారి ఈదుపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ద్వారకాతిరుమల: వేసవి సెలవులు ముగుస్తున్న నేపధ్యంలో శ్రీవారి క్షేత్రానికి భక్తుల తాకిడి పెరుగుతోంది. సాధారణంగా ప్రతి మంగళవారం స్వల్ప సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శిస్తారు. అయితే ఈ వారం వేలాది మంది భక్తులు క్షేత్రాన్ని సందర్శించారు. దాంతో కల్యాణకట్ట, దర్శనం క్యూలైన్లు, ప్రసాదాల విక్రయాల కౌంటర్లు, క్యూ కాంప్లెక్స్ తదితర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో మంగళవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. స్వామికి ఆలయ ముఖ మండపం వద్ద నాగవల్లి దళాలతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామిని విశేషంగా అలంకరించి పూజా కార్యక్రమం చేశారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.3,55,857 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. అన్నదాన సత్రంలో 2365 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు తెలిపారు. భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం పట్టణంలో వేంచేసియున్న మావుళ్లమ్మ అమ్మవారి హుండీలను దేవస్థానం మంగళవారం లెక్కించారు. 75 రోజులకు రూ.61,06,458 లభించగా, 76.700 గ్రాముల బంగారం, 315 గ్రాములు వెండి అమ్మవారికి హుండీల ద్వారా వచ్చిందని తెలిపారు. కాకినాడ ఎంఎస్ఎన్ చారిటీస్ అసిస్టెంట్ కమిషనర్ చాగంటి సురేష్ నాయుడు పర్యవేక్షణలో జరిపిన ఈ లెక్కింపులో ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. భీమవరం: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు సీడబ్ల్యూఎస్ఎన్ ఆధ్వర్యంలో మంజూరైన ఉచిత ఉపకరణాలను మంగళవారం సర్వశిక్ష కార్యాలయం వద్ద పంపిణీ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. అనంతరం 326 మంది విద్యార్థులకు రూ. 29 లక్షల విలువైన డిజిటల్ హియరింగ్ ఎయిడ్స్, కమోడ్ వీల్చైర్స్, టీఎల్ఎం కిట్టు, ట్రై సైకిల్స్ వంటి ఉపకరణాలు పంపిణీ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ, సమగ్రశిక్ష అడిషినల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి.శ్యామ్ సుందర్ పాల్గొన్నారు. -
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి
తణుకు అర్బన్: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ, వామపక్షాల రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం తణుకు నరేంద్ర సెంటర్లో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ పెట్రల్, డీజిల్ ధరల పెంపుతో సరుకు రవాణా ఛార్జీలు పెరిగి అన్ని నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్నంటి ప్రజల జీవనం దుర్భంరంగా మారుతుందన్నారు. దేశంలోని ప్రస్తుత దుస్థితికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనా వైఫల్యమే కారణమని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, గార రంగారావు, జి.గోపి, బండి సత్యనారాయణ, నాగరత్నం తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం మాయం కావడంతో ఆందోళనలో ఉన్న ఖాతాదారులకు వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. జంగారెడ్డిగూడెంలో మంగళవారం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు వద్ద ఖాతాదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు బ్యాంకు వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితుల తెలిపిన వివరాలు ప్రకారం ఇప్పటికే రూ.కోటి విలువైన బంగారం మాయమైనట్లు తెలుస్తోందన్నారు. దీనిపై బ్యాంకు అధికారులు సమగ్ర విచారణ చేసి ఖాతాదారులకు న్యాయం చేయాలన్నారు. దీనిపై బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్ఎం, పోలీస్ అధికారులతో మాట్లాడానని జెట్టి తెలిపారు. ఆర్ఎం స్పందిస్తూ ప్రస్తుతం బ్యాంకులో బంగారం రుణాలపై విచారణ జరుగుతోందని, ప్రతి ఖాతాదారుడికి న్యాయం చేస్తామని, ఇది పూర్తిగా బ్యాంకు బాధ్యత అని తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, వీరవల్లి సోమేశ్వరరావు, ఉడా నాగేంద్ర కుమార్, గగ్గల కిరణ్ కుమార్, జుత్తిగ ప్రసాద్, పిల్లి రామకృష్ణ, కడిమి కిరణ్ పాల్గొన్నారు. -
తవ్వేయ్.. తరలించేయ్..!
భీమవరం: జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న యనమదుర్రు గ్రామంలో యథేచ్ఛగా రొయ్యల చెరువులు తవ్వి మట్టిని తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవికాలం కావడంతో జిల్లా వ్యాప్తంగా చెరువులు తవ్వకాలు, స్థలాల పూడిక పనులు విచ్చలవిడిగా సాగుతున్నాయి. రొయ్యల చెరువుల తవ్వకాలకు అనుమతులు లేకపోవడమే గాక చెరువు తవ్విన మట్టిని స్థలాల పూడికకు అమ్మకాలు చేస్తూ కొంతమంది పెద్ద మొత్తంలో జేబులు నింపుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. యనమదుర్రు గ్రామంలో ఇటీవల 13 ఎకరాల చెరువు తవ్వకం పనులు చేపట్టారు. గత నెల రోజులుగా పెద్ద సంఖ్యలో భారీ వాహనాలతో మట్టిని తరలిస్తున్నారు. ప్రజాప్రతినిధి పేరు చెప్పుకుని.. యనమదుర్రు గ్రామంలో తవ్వుతున్న చెరువు మట్టిని భీమవరం పట్టణంలో స్థలాల పూడికకు తరలిస్తున్నారు. భారీ వాహనాలతో గ్రామంలోని మిండిపుంత నుంచి మట్టిని తరలిస్తున్నారు. స్థానిక అధికారులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా ప్రజాప్రతినిధికి చెందిన వారికి మట్టి వెళ్తుందని, మీరు అడ్డంకి కలిగిస్తే ఇబ్బందులు తప్పవంటూ కింది స్థాయి అధికారులను బెదిరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువును తవ్వి మట్టి తరలించడం వల్ల మిండిపుంత రోడ్డు దెబ్బతిందని.. దాని వల్ల దాదాపు 300 ఎకరాల భూముల రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద గుంతలు పడడంతో సార్వా సీజన్లో వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడుతుందని వాపోతున్నారు. పుంతరోడ్డు వెంబడి ఉన్న నీటిపారుదల బోదె పూడిపోయిందని దీనితో సారునీరు ప్రవాహానికి ఆటంకం ఏర్పడి సాగుకు ఇబ్బందేనంటున్నారు. గ్రామంలో నుంచి భారీ వాహనాలు విచ్చల విడిగా వెళ్లడం వల్ల సీసీ రోడ్లు సైతం దెబ్బతినడమేగాక ప్రమాదాలు జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు గత నెల రోజులుగా యనమదుర్రులో విచ్చలవిడిగా మట్టి తోలకంపై స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో ఇటీవల జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలకు ఫిర్యాదు చేశారు. తవ్వకాలకు అనుమతులు లేవని ల్యాండ్ కన్వర్షన్ లేకుండా వెంచర్స్ వేసి పంట పొలాలను ఇళ్లస్థలాలుగా పూడ్చివేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉన్నతాధికారులైనా మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేసి రోడ్డు ధ్వంసం కాకుండా అడ్డుకోవాలని కోరుతున్నారు. యనమదుర్రు గ్రామంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు -
భూ రికార్డుల స్వచ్ఛతే లక్ష్యం
సీసీఎల్ఏ జీ జయలక్ష్మి నూజివీడు: భూ రికార్డుల స్వచ్ఛీకరణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని సీసీఎల్ఏ అండ్ రెవిన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జీ జయలక్ష్మి పేర్కొన్నారు. మండలంలోని పల్లెర్లమూడి, అన్నవరంలో నిర్వహిస్తున్న రీ సర్వేను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రీసర్వే జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే తెలియజేయాలని రైతులను అడిగారు. సర్వే సిబ్బంది క్షేత్రస్థాయిలో రీ సర్వే చేస్తున్న విధానం పరిశీలించి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పట్టాదార్ పాసు పుస్తకంలో భూ యజమాని పేరు, సర్వే నెంబర్, విస్తీర్ణం, తదితర వివరాలు సక్రమంగా ఉందీ, లేనిదీ రైతులు పరిశీలించుకోవాలన్నారు. వివరాలలో ఏదైనా పొరపాటు ఉంటే వెంటనే రెవెన్యూ సిబ్బందికి అందించి, పొరపాటుగా ముద్రించిన వివరాలను తెలియజేస్తే, రెవిన్యూ సిబ్బంది రికార్డులు మరోసారి పరిశీలించి, వాటిని వెంటనే మార్పు చేసి ఇస్తారన్నారు. రైతులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని పొరపాట్లు లేని పట్టాదార్ పాసు పుస్తకాలు పొందాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, సబ్కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, సర్వే అధికారి అన్సారీ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సేవల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు ఏలూరు (టూటౌన్): రెవిన్యూ సేవలందించే విషయంలో నిర్లిప్తంగా ఉంటే అధికారులపై చర్యలు తీసుకుంటానని రాష్ట్ర భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మి అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో మంగళవారం రీ సర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, పీఆర్జీఎస్, 22 ఏ కేసుల పరిష్కారం, తదితర రెవెన్యూ అంశాల అమలు తీరుపై కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిబంధనలను పాటించి పొరపాట్లు లేని భూ రికార్డులు రూపొందించాలన్నారు. రెవెన్యూ సేవలలో ప్రజల సంతృప్తి స్థాయి కనీసం 80 శాతంగా ఉండాలన్నారు. ఏలూరు జిల్లాలో రెవెన్యూ సేవలలో ఐవీఆర్ఎస్ సర్వేలో ఏప్రిల్ కన్నా మే నెలలో ప్రజల సంతృప్తి స్థాయి తక్కువగా నమోదైందని, తహసీల్దార్లు ఆఫీస్లో కూర్చుని విధులు నిర్వర్తించడం కాదని, క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలని, ప్రజల సమస్యలపై అందిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వారితో మర్యాదగా ప్రవర్తించి, వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల రెండుసార్లు మెగా 22ఏ పరిష్కార మేళాను నిర్వహించి వెయ్యి ఎకరాలకు పైగా భూములను నిషేదిత భూముల జాబితా నుంచి తొలగించామన్నారు. జిల్లాలో పట్టాదార్ పాస్ పుస్తకాలను నూరు శాతం పంపిణీ చేశామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.జె.అభిషేక్ గౌడ, ఇన్చార్జి డీఆర్ఓ దేవకీదేవి పాల్గొన్నారు. -
దుప్పి మాంసం పేరుతో పంది మాంసం విక్రయం
జంగారెడ్డిగూడెం: చుక్కల దుప్పుల మాంసం అంటూ పంది మాంసాన్ని విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం అటవీశాఖ రేంజ్ అధికారి వి.దుర్గాకుమర్బాబు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు జంగారెడ్డిగూడెం శివారు మార్కండేయపురం వద్ద సీమ పంది మాంసం విక్రయదారుడైన వల్లపు రాము ఇంటిని తనిఖీ చేయగా, అతని వద్ద రెండు చుక్కల దుప్పుల చర్మాలు, వాటి తలలు, కాళ్లు గుర్తించామన్నారు. వాటిని పశుసంవర్ధక శాఖ ఏడీ పీఎన్వీ శేఖర్ దొరతో పరీక్షలు నిర్వహించి దుప్పి అవశేషాలుగా నిర్ధారించినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న అవశేషాలు సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితుడు వల్లపు రామును కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. కాగా రామును విచారించగా నాలుగు నెలల క్రితం జంగారెడ్డిగూడెంకు చెందిన దేవరకొండ ఏసు అనే వ్యక్తి చుక్కల దుప్పి చర్మాన్ని, తలలను, కాళ్లను తీసుకువచ్చి తనకు ఇచ్చినట్లు అధికారులకు తెలిపాడు. ఆ తల, చర్మం, కాళ్లను చూపించి, పంది మాంసాన్ని చుక్కల దుప్పి మాంసంగా మాంసాహార ప్రియులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిపాడన్నారు. అలాగే ఈ అవశేషాలను నిందితుడు రాము ఫ్రిడ్జ్లో భద్రపరిచినట్లు తెలిపారు. ఈ దాడుల్లో డిప్యూటీ రేంజ్ అధికారి పి.ధర్మారావు, బీట్ అధికారి పోలుపర్తి నాగవేణు, వీఆర్ఓ బాజీ, సిబ్బంది పాల్గొన్నారు. చుక్కల దుప్పి చర్మం, తలలు కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్ -
టీడీపీ ఫ్లెక్సీతో బస్ షెల్టర్ మూత
కామవరపుకోట: మండలంలోని రావికింపాడు నుంచి ద్వారకాతిరుమల వెళ్లే రోడ్డులో ఉన్న బస్ షెల్టర్ను టీడీపీ ఫ్లెక్సీలతో మూసివేయడంతో గత కొన్ని రోజుల నుంచి ప్రయాణికులు నాన ఇబ్బందులు గురవుతున్నారు. ఇటీవల గ్రామంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ ఓ కార్యక్రమం ప్రారంభోత్సవానికిగానూ స్థానిక టీడీపీ నాయకులు చిత్రపటాలతో పాటు ఎమ్మెల్యే చిత్రపటం ఉన్న ఫ్లెక్సీతో బస్ షెల్టర్ మూసివేశారు. దీంతో ప్రయాణికుల కూర్చోవడానికి నీడ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల వెళ్లాలంటే చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం పలు దూర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ నుంచి ఆటో, బస్సుల్లో ఈ రహదారి మీదుగా ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివెళ్తూ ఉంటారు. ఎండాకాలం బస్సు షెల్టర్ను ఫ్లెక్సీతో మూసివేయడంతో అక్కడికి వచ్చిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పటికైనా అధికారులు, స్థానిక నాయకులు స్పందించి ఫ్లెక్సీ తొలగించాలని కోరుతున్నారు. -
తండ్రి మందలించడంతో యువకుడి ఆత్మహత్య
టి.నరసాపురం: తండ్రి మందలించడంతో కలుపు మందు తాగి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నూజివీడు మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన మొక్కరాల సత్య పవన్కుమార్ అల్లంచర్ల రాజుపాలెం గ్రామ శివార్లలో వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ భార్య పిల్లలతో జీవిస్తున్నాడు. అతని రెండో కుమారుడు ముక్కరాల లోకేష్ (19) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ వేసవి సెలవులకు వచ్చి ఏ పనీ లేకుండా తిరుగుతూ సెల్ ఫోన్ గేమ్స్ ఆడుతున్నాడు. ఈ నెల 8న తండ్రి మందలించడంతో తోటలో ఉన్న కలుపు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతుని తండ్రి సత్య పవన్ కుమార్ ఫిర్యాదుతో ఎస్సై ఎం.జయబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముసునూరు: అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు నూజివీడు సీఎస్ డీటీ గుండుబోయిన వెంకటేశ్వరరావు చెప్పారు. మండలంలోని వలసపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పది క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెనన్స్ అధికారుల ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకుని, నిల్వదారులైన బండారు వందనం, కడలి లక్ష్మణరావులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలకు పంపిణీ చేయాల్సిన బియ్యం పక్కదారి పడితే సహించేది లేదని, క్రిమినల్ కేసులు విధించడంతో పాటు, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలి
ఏలూరు (టూటౌన్): కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని, కేజీ బేసిన్ గ్యాస్లో రాష్ట్రానికి 50 శాతం వాటా ఇవ్వాలని, పెట్రోలు, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నేడు స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలో సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఏలూరు నగర కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజల నడ్డి విరిచేలా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను విపరీతంగా పెంచిందని విమర్శించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతుంటే భారతదేశంలో మాత్రం పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయని అన్నారు. అనంతరం ఈ రాస్తారోకో కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం. కృష్ణచైతన్య పాల్గొని మాట్లాడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చారని, ఎన్నికలు కాగానే ప్రజలపై ధరల భారం మోపారని మండిపడ్డారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు బి.సోమయ్య, యర్రా శ్రీనివాసరావు, మంగం అప్పారావు, కె.విజయలక్ష్మి, సీపీఐ నాయకులు బండి వెంకటేశ్వరరావు, ఉప్పులూరి హేమశంకర్, పి.కన్నబాబు, కురెళ్ల వరప్రసాద్, సీపీఎం నాయకులు పంపన రవి, వై.ఎస్. కనకారావు, జి.ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు. -
1.2 కిలోల బంగారం మాయం
కొనసాగుతున్న గోల్డ్ ఖాతాల పరిశీలన జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్లో ఖాతాదారుల కుదవ పెట్టిన బంగారం ఇంతవరకూ 1210 గ్రాములు(1.21 కిలోలు) స్వాహా అయినట్లు గుర్తించారు. మంగళవారం రాత్రి వరకూ ఖాతాలను పోలీసుల సమక్షంలో బ్యాంకు అధికారులు పరిశీలించారు. మరోవైపు ఖాతాదారులు మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బంగారు వస్తువుల ఖాతాల పరిశీలనలో తీవ్ర జాప్యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై ఎన్వీ ప్రసాద్ ఖాతాదారులకు సర్ధిచెప్పారు. రాత్రి పొద్దుపోయే వరకు ఖాతాల పరిశీలన జరుగుతూనే ఉంది. పెద్ద ఎత్తున బంగారం మాయం కావడంతో ఖాతాదారులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సుమారు 2,800 ప్యాకెట్లు అధికారులు పరిశీలించాల్సి ఉందని తెలుస్తోంది. ఈ నెల 6న బ్యాంక్ ఆఫ్ బరోడాలో ముగ్గురు ఖాతాదారులకు సంబంధించి 30 కాసుల(240 గ్రాముల) బంగారం మాయమైంది. దీంతో ముగ్గురు ఖాతాదారులు బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు రాత్రి వరకు విషయం తెలుసుకున్న ఖాతాదారులు ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం వరుసగా టోకెన్లు ఇచ్చి ఖాతాదారులు బ్యాంకులో కుదువ పెట్టిన బంగారాన్ని పోలీసుల సమక్షంలో చూపించారు. ఖాతాదారులకు సంబంధించి 118 ప్యాకెట్లలోని బంగారు వస్తువులలో 8 ప్యాకెట్లకు సంబంధించి సుమారు 350 గ్రాముల బంగారం మాయం అయినట్లు గుర్తించారు. లాకర్లో ఉన్న బంగారం మాయం అవడంపై బ్యాంకు సిబ్బంది పాత్రపై కూడా ఖాతాదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బంగారం మాయం ఘటనలో బ్యాంకులో పనిచేసే అప్రయిజర్ పాత్ర కీలకం కాగా, గత కొద్ది రోజులుగా అప్రయిజర్ బ్యాంకుకు రావడం లేదు. ఖాతాదారులు ఎక్కువ బంగారం పెట్టి తక్కువ రుణం పొందిన ఖాతాల నుంచే ఎక్కువ శాతం బంగారం మాయమైంది. రెన్యువల్ చేసిన ఖాతాల నుంచి కూడా బంగారం మాయమైంది. ఖాతాదారులకు తాము పెట్టిన బంగారం మొత్తం పత్రాలపై చూపించి, బ్యాంకులో ఉండే పత్రాలపై మాత్రం తక్కువ బంగారం చూపించడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై బ్యాంకు ఉన్నతాధికారులు మాట్లాడుతూ ప్రతి ఖాతాదారుడి బంగారం తిరిగి చెల్లిస్తామని, తమది ప్రభుత్వ బ్యాంకు అని, బ్యాంకు పూర్తి బాధ్యత వహిస్తుందని, ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. -
వీఆర్ఓల నిరసన గళం
ఏలూరు (టూటౌన్): వీఆర్ఓ మహ్మద్ హుస్సేన్ ఆత్మహత్యకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వీఆర్ఓలు ఏలూరు కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఏపీ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కర్నూలు జిల్లా వెంకాయపల్లి వీఆర్ఓ మహ్మద్ హుస్సేన్ మరణానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలో వీఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లు, వీఆర్ఏలపై పనిభారం నానాటికి పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై తామంతా ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మాత్రమే విధులు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ సెలవు రోజులు, పండుగ రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విధులకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. తమకు కేవలం రెవెన్యూ సంబంధిత విధులు మాత్రమే కేటాయించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అడపా రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్వి సుబ్బారావు, జిల్లా కోశాధికారి దామరాజు రవికుమార్, నూజివీడు డివిజన్ ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, ఏలూరు మండల వీఆర్ఓలు కరీం తదితరులు పాల్గొన్నారు. -
టిప్పర్ లారీ బోల్తా
ఉంగుటూరు మండలంలోని రాచూరు వద్ద టిప్పరు లారీ తిరగపడి వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మోటారు సైక్లిస్టును తప్పించబోయి టిప్పర్ తిరగబడింది. 8లో uసుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయుల పాలిట గొడ్డలి పెట్టు లాంటిది. టెట్ నిబంధనను అధిగమించడానికి పార్లమెంట్లో చట్టసవరణ చేస్తేనే మేలు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంలోని నిబంధనలను సవరించడం ద్వారా ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించవచ్చు. ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను కేవలం టెట్ పరీక్షలతో కొలవలేము. – గెడ్డం సుధీర్, వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ అర్హత సాధించాలనడం ఎంతమాత్రం సహేతుకం కాదు. దాదాపు 20 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వారు ఇప్పటికిప్పుడు తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది? కొన్ని అర్హతా ప్రమాణాల మేరకు అప్పట్లోనే ఉద్యోగాలు పొందిన వారికి, దశాబ్దాల తర్వాత మరోసారి అర్హత పరీక్షలు నిర్వహించి తీరాలనడం ప్రపంచంలో ఎక్కడా లేదు. – పువ్వుల ఆంజనేయులు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు. -
పారదర్శకంగా బదిలీ కౌన్సెలింగ్
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో పనిచేస్తోన్న పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐల బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా చేపట్టారు. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ స్వయంగా కౌన్సెలింగ్ పర్యవేక్షిస్తూ నిబంధనల మేరకు బదిలీలు చేశారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా సాధారణ బదిలీల్లో భాగంగా కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఒకే పోలీస్స్టేషన్లో 5 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించిన సిబ్బందికి సాధారణ బదిలీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీ చేశారు. సిబ్బంది కుటుంబ పరిస్థితులు, పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టి పెట్టుకుని సిబ్బందికి బదిలీ ఉత్తర్వులు అందజేశారు. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలో ఖాళీల వివరాలను ప్రదర్శిస్తూ అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ వారు కోరుకున్న స్థానాలను ఎంపిక చేసుకునే వీలు కల్పించారు. పాఠశాలలు, కళాశాలలు తెరిచే సమయం సమీపించిన నేపథ్యంలో బదిలీ ప్రక్రియ పూర్తి చేయటం పట్ల పోలీస్ సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్పీ శివకిషోర్ పారదర్శకంగా బదిలీలను పూర్తి చేయటం పట్ల సిబ్బంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ బదిలీ ప్రక్రియ కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్, ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
10న ప్రభుత్వ ఉద్యోగుల సంఘ భవనం ప్రారంభం
యలమంచిలి: భీమవరం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వెనుక ఉన్న ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పశ్చిమగోదావరి జిల్లా నూతన భవనాన్ని ఈ నెల జూన్ 10న ప్రారంభిస్తున్నట్లు సంఘ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు షేక్ ఉమర్ అలీషా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, సంఘ ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ కుమార్ పాల్గొంటారన్నారు. నూజివీడు: పట్టణంలోని ఏడుమెట్ల బావి సెంటర్లో అద్దె ఇంట్లో ఉండే షేక్ మహబూబ్ సుభానీ(35) ఆదివారం అర్ధరాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన షేక్ మహబూబ్ సూబానీ నాలుగేళ్ల క్రితం నూజివీడు వచ్చి డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తున్నాడు. అతనికి అనారోగ్య సమస్యలతో పాటు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమీపంలోని వారు సోమవారం ఉదయం చూసి పట్టణ పోలీసులకు తెలపడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని కిందకు దింపించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కైకలూరు: అక్రమ కేసులో రిమాండ్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్త శ్రీహరిపురం గ్రామానికి చెందిన శొంఠి రవీంద్ర బెయిల్పై సోమవారం విడుదలయ్యాడు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) ఆధ్వర్యంలో శుక్రవారం జనసేన నేత కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ గొడవలో హెడ్కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. ఇందుకు కారణం వైఎస్సార్సీపీ కార్యకర్త రవీంద్ర అంటూ అదే రోజు రాత్రి 2 గంటల ప్రాంతంలో అరెస్టు చేశారు. బెయిల్పై విడుదలైన రవీంద్ర నాయకులతో కలసి కై కలూరు పార్టీ కార్యాలయంలో డీఎన్నార్ను మర్వాదపూర్వకంగా కలిశారు. కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చిన పార్టీ అండగా ఉంటుందని డీఎన్నార్ చెప్పారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): రైలు ఢీకొని ఒకరు మృతి చెందినట్లు తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులు వెల్లడించారు. తాడేపల్లిగూడెం సుబ్రహ్మణ్యేశ్వరస్వామి గుడి వద్ద ట్రాక్ సమీపంలో 40–45 ఏళ్ల వయసున్న పురుషుడు సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని రైలు ఢీకొని మరణించినట్లు తెలిపారు. 5 అడుగుల ఎత్తు, నలుపు, తెలుపు రంగు షర్ట్, నీలం రంగు షార్ట్, బనియన్ ధరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలపారు. భీమవరం: దాడి ఘటనపై పరస్పర ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసినట్లు ఎస్సై రెహ్మాన్ తెలిపారు. ఈ నెల 7వ తేదీ రాత్రి రాయలం గ్రామంలో ఉన్న తన స్నేహితుడు తరుణ్కు టిఫిన్ ఇవ్వడానికి వెళుతుండగా భాస్కర దుర్గాప్రసాద్, మరో ఐదుగురు దాడి చేశారని పండ్ల నందకిషోర్ ఫిర్యాదు చేశాడు. తాను పశువుల పాక దగ్గరకు వెళ్లి వస్తుండగా నందకిషోర్ దాడి చేశాడని భాస్కర దుర్గాప్రసాద్ ఫిర్యాదు చేశాడు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
దేవాలయాలు సున్నితమైన అంశాలు
ద్వారకాతిరుమల: సోషల్ మీడియాలో దేవాలయాల గురించి ప్రచారం చేసేటప్పుడు ఇన్ఫ్లూయెన్సర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని శ్రీవారి దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావు సూచించారు. కొండపైన పద్మాలయ కల్యాణ మండపంలో సోమవారం ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్లతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈఓ త్రినాధరావు మాట్లాడుతూ క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, స్వామివారి సేవలను భక్తులకు మరింత చేరువచేసే విషయంలో సోషల్ మీడియా ముఖ్య పాత్ర పోషిస్తోందన్నారు. ఆలయ అభివృద్ధికి ఇన్ఫ్లూయెన్సర్లు సహకరించాలని కోరారు. ఆన్లైన్ సేవలను విస్తృత పరచాలని, ముఖ్యంగా మన మిత్ర యాప్ వినియోగంపై భక్తులకు అవగాహన కల్పించాలన్నారు. ఆలయం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు ఇన్ఫ్లూయెన్సర్లు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలన్నారు. ఎందుకంటే దేవాలయాలకు సంబంధించిన ప్రతి విషయం ఎంతో సున్నితమైందన్నారు. కవరేజ్ కూడా పరిమితులకు లోబడి ఉండాలని సూచించారు. ఆలయంలో వీడియోలు తీయకూడదన్నారు. డ్రోన్ కవరేజ్ కూడా దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో జరగాలన్నారు. ఇన్ఫ్లూయెన్సర్లకు తాము పూర్తిగా సహకరిస్తామన్నారు. అనంతరం శ్రీగోమాత ప్రొడక్ట్స్ వారు సమకూర్చిన శ్రీవారి మెమెంటోలను ఈఓ త్రినాధరావు ఇన్ఫ్లూయెన్సర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈ డీవీ భాస్కర్, డీఈవో వై.భద్రాజీ, ఏఈఓలు ఎం.దుర్గారావు, పి.నటరాజారావు, వాసు, లక్ష్మీపతి, సూపరింటిండెంట్లు, ఏఈలు, ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, ఏలూరు, దెందులూరు, భీమడోలు, విజయవాడ, భద్రాచలం, అత్తిలి, కామవరపుకోట, దూబచర్ల, అయినవెల్లి తదితర గ్రామాలకు చెందిన ఇన్ఫ్లూయెన్సర్లు పాల్గొన్నారు. ఇన్ఫ్లూయెన్సర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి -
స్థానికంగానే ఆక్వా ఉత్పత్తుల అమ్మకం
● పాలకొల్లులో విక్రయ కేంద్రం ప్రారంభం ● మృగశిర కార్తె పురస్కరించుకుని రొయ్య, చేపలతో భోజనాలు పాలకొల్లు సెంట్రల్: గత రెండేళ్లుగా ఆక్వా రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తి అరుస్తున్నా, ఫీడ్ ధరల పెంపు, ప్రాసెసింగ్ ధరల తగ్గింపు వంటి ఇబ్బందులను తొలగించడంలో ప్రభుత్వం విఫలమైంది. నిరసనలు, ధర్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో, మన దారి మనమే చూసుకోవాలనే దృఢ సంకల్పంతో జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్రాజు ఆధ్వర్యంలో సోమవారం పాలకొల్లు పూలపల్లి బైపాస్ రోడ్డులో నూతన ప్రాన్ డొమెస్టిక్ సేల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గతంలో ఫిష్ ఆంధ్రా పథకాన్ని విమర్శించిన వారు, నేడు రైతులు సొంతంగా ఇటువంటి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి రావడాన్ని పలువురు గమనిస్తున్నారు. ఆక్వా రైతులు స్థానికంగా మార్కెట్ను పెంచుకునేందుకు ఈ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇక్కడ రొయ్యలు విక్రయించే వారికి సంఘం తరపున ఫ్రిజ్లు, రూ. 10,000 పెట్టుబడిని సహాయంగా అందిస్తామని గాంధీభగవాన్రాజు ప్రకటించారు. ఆక్వ్రా రైతు సంఘం నాయకులు ఎవరైనా రొయ్యలు విక్రయించాలని అనుకుంటే తాము వారికి సహకరిస్తామని తెలిపారు. ఈ కేంద్రాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మృగశిర కార్తెలో చేపలు, రొయ్యలు తినడం మన పూర్వీకుల సాంప్రదాయమని, ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం మంత్రి స్వయంగా కేజీ, అరకేజీ ప్యాకెట్ల రొయ్యలను వినియోగదారులకు విక్రయించి, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని ఆక్వా రైతులు పాలకొల్లు, ఆచంట, నర్సాపురంలలో ప్రజలకు చేపలు, రొయ్యల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. ఆక్వా సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీభగవాన్రాజు మాట్లాడుతూ ఆక్వా రైతులు ఫీడ్ ధరలు, ప్రాసెస్ యూనిట్ల వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రాసెసింగ్ యూనిట్లు అయినకాడికి దోచుకుంటున్నాయన్నారు. ఫీడ్ ధరలు పెంచడంతో ఆక్వా రైతు తలకుమించిన భారాన్ని మోస్తూ నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారని వాపోయారు. మన సాంప్రదాయాన్ని ప్రజలకు గుర్తుచేస్తూ ఆక్వా రైతులకు ఉపయోగపడేలా ప్రభుత్వాలు కళ్లు తెరిచేలా ఈ మృగశిర కార్తె రోజున పేద ప్రజలకు రొయ్య, చేపలతో భోజనాలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. మృగశిర కార్తెతో రుతుపవనాలు మొదలై వాతావరణం చల్లబడుతుందని, శరీరంలో మార్పులు కలిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, చేపలు , రొయ్యలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన విందులో సుమారు ఐదు వేల మంది ప్రజలు పాల్గొని, గోంగూర పచ్చిరొయ్యలు, చేపల పులుసుతో భోజనం చేశారు. ఆక్వా సంఘం నాయకులు బోణం చినబాబు, మేడిది జాన్రాజు, సత్యనారాయణరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మృగశిర కార్తె భోజనాలు వడ్డిస్తున్న దృశ్యం అవుట్లెట్లో ఆక్వా ఉత్పత్తుల అమ్మకం -
మరో 350 గ్రాముల బంగారం మాయం
జంగారెడ్డిగూడెం: బ్యాంక్ ఆఫ్ బరోడా జంగారెడ్డిగూడెం బ్రాంచ్లో ఖాతాదారులు బంగారం కుదువ పెట్టి రుణాలు తీసుకోగా, ఖాతాదారులకు సంబంధించిన బంగారం మాయమైంది. ఈ నెల 6న బ్యాంక్ ఆఫ్ బరోడాలో ముగ్గురు ఖాతాదారులకు సంబంధించి 30 కాసుల బంగారం మాయమైంది. దీంతో ముగ్గురు ఖాతాదారులు బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఖాతాదారులు ఆందోళనకు దిగారు. తాము కుదువ పెట్టిన బంగారం బ్యాంకులో ఉందా? లేదా చూపించాలని ఆందోళనకు దిగారు. శనివారం రాత్రి పొద్దుపోయే వరకు ఆందోళన కొనసాగగా, బ్యాంకు అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని సోమవారం ఖాతాదారులు అందరికీ సంబంధించిన కుదువ పెట్టిన బంగారం చూపిస్తామని చెప్పగా, ఖాతాదారులు వెనుదిరిగారు. సోమవారం ఉదయమే బ్యాంకు వద్దకు వందలాది మంది ఖాతాదారులు చేరుకుని ఆందోళన చేశారు. దీంతో బ్యాంకు అధికారులు, ఎస్సై ఎన్వీ ప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది ఖాతాదారులకు వరుసగా టోకెన్లు ఇచ్చి సీరియల్ వారీగా ఖాతాదారులు బ్యాంకులో కుదువ పెట్టిన బంగారాన్ని పోలీసుల సమక్షంలో ఖాతాదారులకు చూపించారు. ఈ విధంగా సోమవారం రాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగగా, ఖాతాదారులకు సంబంధించి 118 ప్యాకెట్లలోని బంగారు వస్తువులను పరిశీలించారు. వాటిలో 8 ప్యాకెట్లకు సంబంధించి సుమారు 350 గ్రాముల బంగారం ఖాతాదారులు పెట్టిన బంగారం కంటే తక్కువగా ఉందని నిర్ధారించారు. దీంతో ఖాతాదారుల నుంచి ఆ 350 గ్రాముల బంగారానికి సంబంధించి ఫిర్యాదులను తీసుకున్నారు. ఇంకా బ్యాంకులో ఖాతాదారులకు సంబంధించి చాలా ప్యాకెట్లు పరిశీలించాల్సి ఉందని, ఈ ప్రక్రియ మొత్తం మరికొన్ని రోజులు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో 6వ తేదీన 30 కాసులు మాయం కాగా, సోమవారం లెక్కల్లో మరో 350 గ్రాముల బంగారం మాయమైంది. దీంతో మిగిలిన ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, బ్యాంకు ఉన్నతాధికారులు విజయవాడ నుంచి వచ్చి ఘటనపై ఆరా తీసినట్లు తెలిసింది. బంగారం మాయం ఘటనలో బ్యాంకులో పనిచేసే అప్రైజర్ పాత్ర కీలకమని భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా అతను పరారీలో ఉన్నట్లు తెలిసింది. అతను దొరికితే బ్యాంకులో ఖాతాదారులు పెట్టిన బంగారం ఎలా మాయమైందో తెలుస్తుందని భావిస్తున్నారు. బ్యాంకులో ఖాతాదారులు తాము పెట్టిన బంగారానికి ప్రస్తుతం బ్యాంకు అధికారులు చూపిస్తున్న బంగారానికి వ్యత్యాసం ఉండి తక్కువ బంగారం చూపించడంతో అసలు ఆ బంగారం ఎలా మాయమైందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
కోర్టు ప్రాంగణంలో అగ్ని ప్రమాదం
ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోర్టు భద్రత, నిఘా నిమిత్తం ప్రాంగణంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టు గుడారంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో చెక్పోస్టులోని కీలకమైన పోలీసు రికార్డులు, సిబ్బందికి సంబంధించిన వస్తువులు, ఫర్నీచర్ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఫైర్ సిబ్బంది తెలిపారు. ఆగిరిపల్లి : వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సింహాద్రి అప్పారావుపేటలో చోటుచేసుకుంది. ఎస్సై శుభ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఎస్ఏ పేటకు చెందిన డేరంగుల విజయలక్ష్మి(22)కి పెదవేగి కి చెందిన నాగేంద్రకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కొన్ని నెలలుగా భార్యాభర్తల గొడవల కారణంగా విజయలక్ష్మి పుట్టింట్లో ఉంటోంది. గత వారం రోజుల నుండి భార్యాభర్తలు ఫోన్ లో గొడవ పడుతున్నారు. ఆమె మనస్థాపం చెంది ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుంది. కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి అప్పటికే మృతి చెందింది. మృతురాలి తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కక్ష సాధింపుతోనే అడ్డంకులు
భీమవరం: భీమవరం పట్టణంలోని ప్రకాశం చౌక్ సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన దిమ్మను అధికారులు తొలగించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్, ప్రకాశం చౌక్ సెంటర్లకు అత్యంత ప్రాధాన్యత ఉంది. అంబేడ్కర్ సెంటర్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహం, ప్రకాశం చౌక్ సెంటర్లో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలను గతంలోనే ఏర్పాటు చేశారు. ఇటీవల ప్రకాశం చౌక్ సెంటర్లో ఎన్టీఆర్, టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కోసం విశాలమైన సిమెంట్ దిమ్మను నిర్మించి, విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే కాకుండా చుట్టూ రక్షణ గోడను నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు విగ్రహాల మధ్యలో ప్రకాశం పంతులు విగ్రహం ఏర్పాటుకు ఎత్తుగా సిమెంట్ దిమ్మను నిర్మించారు. ఈ పనులు దాదాపు 20 రోజులుగా జరుగుతున్నా, మునిసిపల్ అధికారులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. వైఎస్ విగ్రహానికి అడ్డంకులెందుకు? ఇదే ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం పక్కనే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు సంకల్పించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పేరిచర్ల విజయ నర్సింహరాజు, కోడే యుగంధర్, చిరుగుపాటి సందీప్ తదితరులు స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును క్యాంపు కార్యాలయంలో కలిసి విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పగా ఆయన అంగీకరించారు. దీంతో శుక్రవారం రాత్రి విగ్రహ ఏర్పాటుకు దిమ్మను నిర్మించారు. శనివారం ఉదయమే మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో మిగిలిన విగ్రహాల జోలికి వెళ్లకుండా, కేవలం రాజశేఖరరెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన దిమ్మను మాత్రమే తొలగించారు. ఎవరికీ అడ్డులేని ప్రాంతంలో, ఎమ్మెల్యే అనుమతితో విగ్రహం ఏర్పాటుకు తలపెడితే, మున్సిపల్ సిబ్బంది అత్యుత్సాహంతో దిమ్మను తొలగించడం వెనుక రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల ప్రోద్బలం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను పాటించాలనుకుంటే మిగిలిన విగ్రహాల ఏర్పాటుకు ఎలా అనుమతినిచ్చారు? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇతరులకు ఒక నిబంధన, వైఎస్సార్సీపీకి మరొక నిబంధన అమలు చేస్తున్నారని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. అధికారులు జోక్యం చేసుకుని వైఎస్ విగ్రహ ఏర్పాటుకు అనుమతించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలతో అన్ని వర్గాల ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడం దారుణం. ఇప్పటికే ఎన్టీఆర్, ఇతర విగ్రహాలు ఏర్పాటు చేస్తుండగా, వాటికి లేని అడ్డంకులు వైఎస్ విగ్రహానికే ఎందుకు వచ్చాయో మునిసిపల్ అధికారులు సమాధానం చెప్పాలి. – చిరుగుపాటి సందీప్, వైఎస్సార్సీపీ యూత్ వింగ్ అధ్యక్షుడుప్రకాశం చౌక్ సెంటర్లో అల్లూరి విగ్రహం ఎప్పుడో ఏర్పాటు చేశారు. దాని పక్కనే ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధం కాగా, ప్రకాశం పంతులు విగ్రహాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వాటికి ఏ ఇబ్బందీ లేకుండా, రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నిస్తుంటే దిమ్మను తొలగించడం అన్యాయం. పక్షపాత వైఖరితో వైఎస్ విగ్రహాన్ని అడ్డుకుంటే చూస్తూ ఊరుకునేది లేదు. – గాదిరాజు రామరాజు, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు భీమవరంలో వైఎస్ విగ్రహంఏర్పాటుకు అభ్యంతరం ఎన్టీఆర్, ప్రకాశం పంతులు విగ్రహాల ఏర్పాటుకు చురుగ్గా పనులు రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలు -
చింతంపల్లిలో ఎస్పీ ‘పల్లెనిద్ర’
చింతలపూడి: గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలు–పోలీసుల మధ్య సత్సంబంధాలు పెంపొందించడమే ధ్యేయంగా ఏలూరు జిల్లా పోలీస్ శాఖ సరికొత్తగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా చింతలపూడి మండలం చింతంపల్లి గ్రామంలో సోమవారం రాత్రి నిర్వహించిన ‘పల్లెనిద్ర’ కార్యక్రమంలో ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ ప్రజలతో గడిపారు. కార్యక్రమంలో భాగంగా ఎస్పీ గ్రామంలోని వీధుల్లో పర్యటించారు. స్థానిక ప్రజలతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, యువత భవిష్యత్తు, మత్తు పదార్థాల నివారణ, ప్రస్తుత రోజుల్లో పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల గ్రామస్తులకు, మహిళలకు అవగాహన కల్పించారు. యువత చెడు అలవాట్లకు, వ్యసనాలకు దూరంగా ఉంటూ.. ఉన్నత విద్య, క్రీడలపై దష్టి సారించి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఎస్పీ హితవు పలికారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. పల్లెనిద్ర కార్యక్రమంలో ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రామ యువతతో కలిసి ఆయన వాలీబాల్ ఆడారు. ఎస్పీ స్వయంగా కోర్టులోకి దిగి యువకులతో సరదాగా ఆట ఆడటంతో అక్కడి వాతావరణం ఎంతో ఉత్సాహంగా మారింది. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాధన్, చింతలపూడి సీఐ క్రాంతికుమార్, ఎస్ఐ సతీష్ కుమార్, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ముగిసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్
నూజివీడు: ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల ప్రక్రియలో భాగంగా మూడు రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన సోమవారంతో ముగిసింది. చివరి రోజు పరిశీలనకు ఎన్సీసీ కోటాలో 305 మందికి 185 మంది, క్యాప్ కోటాలో 55 మందికి 42 మంది, స్పోర్ట్స్ కోటాలో 119 మందికి 90 మంది, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో 282 మందికి 195 మంది హాజరయ్యారు. ఆర్జీయూకేటీ వీసీ ఆచార్య మద్దాలి లక్ష్మీ నారాయణరావు, నూజివీడు ట్రిపుల్ఐటీ డైరెక్టర్ ఆచార్య గోపాల రాజు, ఏవో లక్ష్మణరావు, అకడమిక్ డీన్ సాదు చిరంజీవి పరిశీలించారు. మొత్తంగా 761 మంది అభ్యర్థులకు 512 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరయ్యారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ పర్యవేక్షించగా డీఎస్డబ్ల్యూఓ రాజేష్, గణిత అధ్యాపకులు సతీష్కుమార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అర్జునరావు పాల్గొన్నారు. చిన వెంకన్నకు కాసుల పంట ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి ఆ లయ హుండీల ఆదాయాన్ని సోమవారం దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, మద్ది ఆంజనేయస్వామి ఆలయ ఈఓ ఆర్వీ చందన పర్యవేక్షణలో లెక్కించారు. 18 రోజులకు నగదు రూపేణా రూ.2,42,55,625 ఆదాయం లభించి నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలి పారు. కానుకల రూపేణా 191 గ్రాముల బంగారం, 3.274 కేజీల వెండితో పాటు అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అలాగే లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.1,000, రూ. 500 నోట్ల ద్వారా రూ.8 వేలు లభించినట్టు చెప్పారు. సగటున రోజుకు శ్రీవారికి రూ.13,47,535 ఆదాయం లభించినట్టు ఈఓ చెప్పారు. ఏలూరు (టూటౌన్): స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుపై ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఈనెల 11న జిల్లాలో పర్యటించనున్నారని, బీసీలు తమ వాణి వినిపించాలని బీసీ కులాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక యాదవ సంఘ భవనంలో సోమవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో బీసీల విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ సంఘాలు, బీసీ డిమాం డ్లను వినతిపత్రాల ద్వారా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు లంక వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు ఉక్కుసూరి గోపాలకృష్ణ, కార్యదర్శి ఎ.మురళి, సైదు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు రెండో రోజు నవచేతన యాప్పై ఈదర సుబ్బమ్మదేవి స్కూల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీడీపీఓ ఎ.పద్మావతి మాట్లాడుతూ యాప్ ద్వారా స్క్రీనింగ్ ఎలా చేయాలి, ఎదుగుదల స్థాయిని ఎలా గుర్తించాలి అనే అంశాలను వివరించారు. పిల్లల్లో శారీరకంగా మానసికంగా, అభివృద్ధిని ఎలా గమనించాలనే విషయాలపై పూర్తి అవగాహన కల్పించారు. ఆరేళ్లలోపు పిల్లలను సర్వే చేయాల్సి ఉందన్నారు. డాక్టర్ ప్రదీప్ చంద్ర, సూపర్వైజర్లు మంగ, జోషి, మీనాక్షి, సత్య, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
దగా పాలనకు రెండేళ్లు
నూజివీడు: వైఎస్సార్సీపీ సదస్సులో మాట్లాడుతున్న నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గణపవరం: ఉంగుటూరు మండలం నారాయణపురంలో జరిగినసదస్సులో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు బుట్టాయగూడెం: కూటమి ప్రభుత్వ అరాచకాలను పోస్టర్ ద్వారా వివరిస్తున్న పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గణపవరం (ఉంగుటూరు)/నూజివీడు/బుట్టాయగూడెం/ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వ రెండేళ్ల దగా పాలనకు నిరసనగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’కార్యక్రమాల్లో భాగంగా సోమవారం జిల్లాలో ని పలు నియోజకవర్గాల్లో సదస్సులు నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం హామీల అమలును విస్మరించడంపై నాయకులు నిలదీశారు. కూటమి ప్రభుత్వ అరాచకాలు, దౌర్జన్యాలను పోస్టర్లు, ఫొ టో గ్యాలరీల ద్వారా వివరించారు. ఉంగుటూరు మండలం నారాయణపురం కమ్మ కల్యాణ మండపంలో పార్టీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు విచ్చలవిడి గా ప్రజాధనాన్ని వృథా చేస్తూ విమానాలు, హెలికాప్టర్లపై చక్కర్లు కొడుతూ ఇచ్చిన హామీలను, పాలనను గాలికొదిలేశారని మండిపడ్డారు. కూటమి నాయకులు పొదుపుపై ప్రజలకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు, పవన్కల్యాణ్ చెప్పిన మాటలు నమ్మి ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వ మోసాలపై వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళనలకు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోందన్నారు. అధికార పార్టీ నాయకులు మట్టి, మద్యం, ఇసుక, కాంట్రాక్టులతో అందినకాడికి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు ఏఎస్ రాజు మాట్లాడుతూ కూటమి రెండేళ్ల పాలనలో ఒక్క కొత్త సామాజిక పింఛను మంజూరు చేయలేదన్నారు. కూటమి అరాచక పాలనపై వైఎస్సార్సీపీ నిరంతరం పోరాటాలు చేస్తుందన్నారు. కూటమి ఎగ్గొట్టిన హామీల ప్లకార్డులను ప్రదర్శించారు. ముందుగా కూటమి అరాచక, రెడ్బుక్ పాలనకు వ్యతిరేకంగా నల్ల బెలూన్లు ఎగురవేశారు. ప్రభుత్వ దుర్మార్గాలను తెలిపే ఫొటో గ్యాలరీని పార్టీ నేతలు తిలకించారు. నాలుగు మండలాల పార్టీ కన్వీనర్లు మరడ మంగారావు, దండు రాము, సంకు సత్యకుమార్, రావిపాటి శ్రీనివాస్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ ముఖ్యనేతలు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. గణపవరం: నారాయణపురం సదస్సులో కూటమి హామీల ప్లకార్డులు చూపుతూ నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులు ఏలూరు టౌన్: నియోజకవర్గ సమావేశంలో మాట్లాడుతున్న ఏలూరు సమన్వయకర్త జయప్రకాష్ గళమెత్తి.. గర్జించి.. హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఏదంటూ ఆగ్రహం వైఎస్సార్సీపీ రౌండ్ టేబుల్ సమావేశాల్లో నాయకుల నిలదీత మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని, డీఎస్సీలో అవినీతి, అవకతవకలకు పాల్పడిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. నూజివీడు పార్టీ కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేయడమే కాకుండా మెగా డీఎస్సీ పేరుతో అనేక అక్రమాలకు, అవినీతికి టీడీపీ ప్రభుత్వం పాల్పడిందన్నారు. క్రీడా కోటా పేరుతో డీఎస్సీ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చి అవకతవకలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. దీనివల్ల లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు రాక తీవ్ర అన్యాయానికి గురయ్యారన్నారు. సూపర్ సిక్స్ అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మామిడి, మొక్కజొన్న రైతులు నష్టపోతున్నా వారిని ఆదుకుందామనే ఆలోచన కూడా కూటమి ప్రభుత్వం చేయలేదని దుయ్యబట్టారు. ఆగిరిపల్లి మండలంలో కొండలన్నింటినీ కొల్లగొడుతూ మట్టి, గ్రావెల్ను దోచుకుంటున్నారన్నారు. పార్టీ క్రిస్టియన్ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు పిళ్లా చరణ్, ముసునూరు జెడ్పీటీసీ వరికూటి ప్రతాప్, జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, నూజివీడు పట్టణ, ముసునూరు, చాట్రాయి మండలాల అధ్యక్షులు శీలం రాము, పోలిమెట్ల శివ, మూల్పురి నాగవల్లేశ్వరరావు, పుచ్ఛకాయల సుబ్బారెడ్డి తదితరులు ప్రసంగించారు. నాయకులు వెంకట సుబ్బ య్య, ఆగిరిపల్లి బెజవాడ రాంబాబు, మలిశెట్టి బాబీ, అత్తి మురళీ, బసవా రామకృష్ణ, మందాడ శివశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన సమయం వచ్చిందని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. బుట్టాయగూడెంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ ఈనెల 12న కన్నాపురం నుంచి కొయ్యలగూడెం వరకూ నిరసన ర్యాలీ చేపట్టనున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విధానాలను ప్రజలకు తెలియ జేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా పాటుపడాలన్నా రు. ప్రతిఒక్కరికీ తాను అందుబాటులో ఉంటానన్నారు. పార్టీ మండల కన్వీనర్లు అల్లూరి రత్నాజీరావు, చందా ప్రసాద్, తుమ్మలపల్లి గంగరాజు, బుగ్గా మురళి, ఎస్పీవీఎస్ రాజు, ఎంపీపీలు తెల్లం రమణ, సుంకర వెంకటరెడ్డి, గంజిమాల రామారావు, పార్టీ జిల్లా కార్యదర్శులు ఆరేటి సత్యనారాయణ, సయ్యద్ బాజీ, దాసరి విష్ణు, రాష్ట్ర కార్యదర్శి మంతెన సోమరాజు, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి మధు, నాయకులు తాళ్లూరి ప్రసాద్, బానోతు కృష్ణ నాయక్, బగ్గి దినేష్, ఏలేటి చంద్రం తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఏలూరు సమన్వయకర్త జయప్రకాష్ టీడీపీ కూటమి రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసిం దేమీ లేదనీ, సూపర్ సిక్స్ హామీలకే దిక్కులేదనీ, ఇంక మేనిఫెస్టో అమలు చేసే దమ్ము కూటమి ప్రభుత్వానికి లేదని వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ విమర్శించారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ వైఫల్యాలపై సదస్సు నిర్వ హించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలోని 143 హామీలను నేటికీ అమలు చేయలేదని విమర్శించారు. సూపర్సిక్స్లో నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. గద్దెనెక్కి రెండేళ్లు గడిచినా ప్రజలకు ఏమీ చేయలేక చేతులెత్తేశారనీ, కేవలం ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరించటం, అక్రమ కేసులు పెట్టడం, దాడులు, దౌర్జన్యాలు చేయటం మాత్రమే కూటమి ప్రభుత్వం పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే అన్నారు. ప్రస్తుతం అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందనీ వ్యవసాయం చేయలేని దుస్థితిలోకి వెళ్లారన్నారు. పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, బీసీసెల్ జిల్లా అధ్యక్షులు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, నాయకులు గంటా మోహనరావు, కొల్లిపాక సురేష్, చిలకపాటి డింపుల్, జిజ్జువరపు విజయనిర్మల, ఇనపనూరి జగదీష్, గాజుల బాజీ, దాసరి రమేష్, కిలాడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్సీ అక్రమాలపై విచారణ చేపట్టాలి
ఏలూరు టౌన్: మెగా డీఎస్సీ–25పై అభ్యర్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారనీ, సీబీఐతో విచారణ చేయించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నేతలు సోమవారం జేసీ అభిషేక్ గౌడ్కు వినతిపత్రం సమర్పించారు. పరీక్షల నిర్వహణలో లీకేజీలు, అవకతవకలు, అధికార దుర్వినియోగం అభ్యర్థులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయనీ వారిలో విశ్వాసాన్ని కల్పించేందుకు విచారణ చేపట్టి వాస్తవాలు వెల్లడి చేయాలన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్ మాట్లాడుతూ డీఎస్సీ–25లో ప్రశ్నాపత్రాల భద్రత, పరీక్షల నిర్వహణ, స్పోర్ట్స్ కోటాలో ఎంపిక చేస్తూ ఉద్యోగ నియామకాలు, సర్టిఫికెట్ల పరిశీలనపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద నిరుద్యోగ అభ్యర్థు ల ఆశలపై నీళ్లు చల్లుతూ అన్యాయం జరిగిందనే అ భియోగాలపై విచారణ చేపట్టాలన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో నిరుద్యోగ యువత పక్షాన పోరాటం చేస్తామన్నారు. వినతిపత్రం సమర్పించిన వారిలో వైఎస్సార్సీపీ జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, ఎస్సీసెల్ నగర అధ్యక్షులు ఇనపనూరి జగదీష్ ఉన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నేతలు -
పీజీఆర్ఎస్లో 348 అర్జీల స్వీకరణ
ఏలూరు (టూటౌన్): ఏలూరు కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్లలో 348 అర్జీలు స్వీకరించి నట్టు జేసీ ఎంజె అభిషేక్ గౌడ తెలిపారు. ప్రతి అర్జీని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఇన్చార్జ్ డీఆర్వో ఎల్.దేవకీదేవి, ఆర్డీఓ కె.లక్ష్మీప్రసన్న, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి, జిల్లా పంచాయతీశాఖ అధికారి జి.మల్లికార్జురావు పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని.. ● భీమడోలు మండలం అర్జవారిగూడేనికి చెందిన గండి రాఘవులు బియ్యం కార్డు ఆన్లైన్ కోసం అర్జీ అందించారు. ● పెదవేగి మండలం రాట్నాలకుంటకు చెందిన ఉల్లిబోయిన రాజేష్ తన భూమి 22ఏలో నమోదైందని, తొలగించాలని కోరారు. ● లింగపాలెం మండలం సింగగూడేనికి చెందిన శికాకొల్లు అనురాధ తన కుమార్తెకు మిషన్ వాత్సల్య పథకం వర్తింపజేయాలని కోరారు. ● ఏలూరు అమీనాపేటకు చెందిన పుప్పాల ముకుందరావు ఏలూరు టౌన్ ఆటోమొబైల్స్ సంఘానికి చెందిన నిధులను ప్రెసిడెంటు, కార్యదర్శి స్వాహా చేశారని, రికవరీ చేయాలని అర్జీ అందించారు. ● వేలేరుపాడు మండలం మద్దిగట్లకి చెందిన సొందే భూబమ్మ తన భూమి ఆక్రమణపై ఫిర్యాదు చేశారు. -
రోడ్డు నిర్మాణానికి అనుమతులు
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం గానుగమామిడి నుంచి రేగులపాడు, రేపల్లె గ్రామాలకు రోడ్డు నిర్మాణ పనులకు ఉన్నతాధికారుల నుంచి అనుమతులు వచ్చినట్టు జంగారెడ్డిగూడెం అటవీశాఖ రేంజ్ అధికారి వి.దుర్గాకుమార్ బాబు తెలిపారు. ‘సాక్షి’లో సోమవారం ప్రచురించిన ‘దారీతెన్నూలేదు’ శీర్షికన కథనానికి స్పందించారు. లంకపాకల, డోలుగండి జంక్షన్ నుంచి రేగులపాడు రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదనను ఉన్నతాధికారులు అనుమతించారన్నారు. అయితే కొమ్మలు కత్తిరించడం వంటి పనులు జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ రేంజ్ అధికారి లేదా ఆయన ప్రతినిధి పర్యవేక్షణలో చేయాలన్నారు. అలాగే నిర్మాణ పనులనూ పర్యవేక్షించాల్సి ఉందన్నారు. నిబంధనల మేరకే రోడ్డు పనులు చేస్తారన్నారు. నిబంధనల మేరకే అటవీ శాఖ కూడా అనుమతులు ఇస్తుందన్నారు. అలాగే ప్రస్తుతం పాపికొండల అభయారణ్యంలో ఫినిషింగ్ జోన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, దానిని దృష్టిలో పెట్టుకుని అనుమతులు ఇచ్చినట్టు చెప్పారు. -
గళమెత్తిన మధ్యాహ్న భోజన కార్మికులు
ఏలూరు (టూటౌన్): మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కార్మికుల ఉపాధి పో గొట్టే స్మార్ట్ కిచెన్లు రద్దు చేయాలని కోరుతూ ఏపీ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం.నాగమణి మాట్లాడుతూ కూట మి ప్రభుత్వం 23 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను తొలగించేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. స్మార్ట్ కిచెన్ పేరుతో ఒకేచోట వండి స్కూల్కు క్యారేజీలు పంపాలని నిర్ణయించడంతో వేలాది మంది కార్మికుల ఉపాధి పోతుందన్నారు. ఇప్పటికే పలు సమస్యలతో తాము పథకాన్ని నిర్వహిస్తున్నామని, ఇప్పుడు అన్యాయంగా తొలగించా లని చూడటం దుర్మార్గమన్నారు. పథక కార్మికులకు రూ.10 వేల వేతనం ఇవ్వాలని, ప్రతినెలా 5లోపు వేతనాలు, బిల్లులు చెల్లించాలనీ, గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలనీ, రెండు జతల యూనిఫాం, గుర్తింపు కార్డు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె.పోసమ్మ మద్దతు తెలిపారు. -
కుంచనపల్లిలో ఎయిర్పోర్టు?
● రాజమహేంద్రవరం తరహాలో నిర్మాణం ● ఐదు కిలోమీటర్ల రన్వే ప్రతిపాదన తాడేపల్లిగూడెం: రాజమహేంద్రవరం ఎయిర్పోర్టు తరహాలో, తాడేపల్లిగూడెం సమీపంలోని కుంచనపల్లి గ్రామంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి త్వరలో ఆమోదముద్ర పడనుంది. విమానయానాన్ని ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం సరళీకృత వైమానిక విధానాన్ని ప్రకటించింది. గత పదేళ్లుగా పెరిగిన విమాన ప్రయాణాలు, సరుకు రవాణా (కార్గో) ద్వారా వచ్చే ఆదాయాలను విశ్లేషించి, రాష్ట్రాల వారీగా ఉన్న వెసులుబాటు మేరకు నూతన విమానాశ్రయాల నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వైమానిక రంగంలో సరళీకృత విధానాలను రూపొందించుకుని, సౌలభ్యాలు, వ్యాపార ప్రయోజనాలు, వేగవంతమైన ప్రయాణాల కోసం నూతన ఎయిర్పోర్టుల నిర్మాణాలు చేపడుతున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట గ్రామాల మధ్య ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించి, భూములను కూడా గుర్తించింది. తాజాగా ఎయిర్పోర్టు ఫీజిబిలిటీని నిర్ధారించేందుకు కేంద్రం నుంచి వచ్చిన బృందం ప్రతిపాదిత ప్రాంతంలో ఇటీవల పర్యటించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను విశ్లేషించిన బృంద సభ్యులు వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట ప్రాంతం బహుళ ప్రయోజన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు సరిపడదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కుంచనపల్లి ప్రాంతంలో రాజమహేంద్రవరం ఎయిర్పోర్టు తరహాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మించేందుకు యోచిస్తున్నారు. కుంచనపల్లిలో ఎయిర్పోర్టు ఫీజిబిలిటీ సూచనల మేరకు, మండలంలోని కుంచనపల్లి ప్రాంతాన్ని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీని కోసం సుమారు 1,200 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఈ ప్రాంతంలో భూములు అందుబాటులో ఉండటం, ఎయిర్పోర్టు నిర్మాణానికి వంతెనలు, తోటలు వంటి ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో ఈ ప్రాంతం ఎంతో అనుకూలమని భావిస్తున్నారు. ఢిల్లీలో కీలక సమావేశం తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి మంగళవారం ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. భూసేకరణ ప్రక్రియకు అవసరమైన నిధులు, ఇతర సాంకేతిక అనుమతులు తదితర విషయాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మంగళవారం సాయంత్రానికి ఎయిర్పోర్టుకు సంబంధించి కీలక సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెంకట్రామన్నగూడెం ఎందుకు సరికాదు స్థల సేకరణకు ఎలాంటి ప్రతిబంధకాలు ఉండవనే ఉద్దేశంతో, కేంద్ర వైమానిక శాఖ మంత్రి గూడెం ఎయిర్పోర్టును ప్రకటించిన సందర్భంలో వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట ప్రాంతంలో సుమారు 1,100 ఎకరాలను గుర్తించారు. సమీపంలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు చెందిన వేల ఎకరాలు అందుబాటులో ఉన్నప్పటికీ, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నుంచి అనుమతులు రావడం అంత సులభం కాదు. ఈ కారణంతోనే వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట గ్రామాల భూములను గుర్తించారు. ఇక్కడే ఎయిర్పోర్టు వస్తుందని అందరూ భావించారు. అయితే, ఫీజిబిలిటీ కమిటీ వచ్చిన తర్వాత మొత్తం సీన్ మారింది. ఏవియేషన్ నిబంధనల ప్రకారం ప్రతిపాదిత ప్రాంతంలో విండ్ క్లియరెన్స్ సరిగా లేదని గుర్తించారు. అంతేకాకుండా, అక్కడ ఉన్న తోటలు ఎయిర్పోర్టు నిర్మాణానికి ఆటంకంగా మారాయి. తొలి ప్రతిపాదనలో రన్వే రెండు కిలోమీటర్లు ఉంటే చాలనుకున్నప్పటికీ, డొమెస్టిక్, కార్గో విమానాల రాకపోకల కోసం ఎయిర్పోర్టును నిర్మిస్తే రన్వే కనీసం ఐదు కిలోమీటర్ల వరకు ఉండాలని నిర్ణయించారు. దీంతో వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట ప్రాంతంలో ఎయిర్పోర్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. -
వడదెబ్బకు యాచకుడి మృతి
తణుకు అర్బన్: స్థానిక వెంకటేశ్వర థియేటర్ సెంటరులో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు తణుకు పట్టణ పోలీసులు తెలిపారు. సుమారు 60 ఏళ్ల వృద్ధుడు గత కొంతకాలంగా అదే ప్రాంతంలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడని, ఆదివారం స్పృహ లేకుండా పడి ఉండగా మరణించినట్లు ధ్రువీకరించామని వారు వివరించారు. తీవ్రమైన వడగాల్పుల వల్లే అతను మరణించి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. భీమడోలులో వృద్ధుడి మృతి భీమడోలు: జాతీయ రహదారి భీమడోలు రైల్వే స్టేషన్ ఎదురు ఉన్న బస్ షెల్టర్ వద్ద ఓ గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని ఆదివారం పోలీసులు గుర్తించారు. వృద్ధుడు వడదెబ్బకు గురై మృతి చెందాడు. తొలుత సమాచారం అందుకున్న భీమడోలు 104 సిబ్బంది వచ్చి మృతదేహాన్ని పరీక్షించి మృతి చెందినట్లు గుర్తించి భీమడోలు పోలీసులకు తెలిపారు. భీమడోలులో కొంత కాలంగా యాచన చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు పంచాయతీ సిబ్బందికి అప్పగించారు. ముదినేపల్లి (కై కలూరు): విద్యుత్ షాక్కు గురై ముదినేపల్లి మండలం శ్రీహరిపురం గ్రోవెల్ ఫీడ్స్ ఫ్యాక్టరీలో మిషన్ ఆపరేటర్ శనివారం రాత్రి మరణించాడు. దీనిపై మృతుని తల్లి అంజలి ఆదివారం ముదినేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వడాలి గ్రామానికి చెందిన అనగాని మహంకాళి (20) ఇటీవల ఐటీఐ పూర్తి చేసి, 7 నెలలుగా సదరు ఫ్యాక్టరీలో మిషన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. శనివారం బీ–షిఫ్ట్లో విధులు నిర్వహిస్తుండగా రాత్రి 8 గంటలకు విద్యుత్ షాక్కు గురయ్యాడు. వెంటనే అతడిని గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ముసునూరు: పంట పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన విషాద ఘటన మండలంలో జరిగింది. యల్లాపురానికి చెందిన సన్నకారు రైతు చీదిరాల సూర్యచంద్రరావు (60), ఆదివారం ఉదయం జీలుగ పంటకు నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లారు. మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా ఫ్యూజ్ వద్ద విద్యుత్ ప్రసరించి, షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖాధికారులు, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించి, అనంతరం బంధువులకు అప్పగించినట్లు ఎస్సై ఎం. చిరంజీవి తెలిపారు. కాళ్ల: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో యువకుడు మృతి చెందినట్లు కాళ్ల పోలీసులు ఆదివారం తెలిపారు. కాళ్ల గ్రామానికి చెందిన తాళ్లూరి యాకోబు (17), తన స్నేహితుడు దండే జాషువరాజుతో కలిసి మోటార్ సైకిల్పై జ్యూస్ తాగడానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా, పెంటపాటి నాగేశ్వరరావు ఇంటి వద్దకు రాగానే, భీమవరం నుంచి కలిదిండి వైపు వేగంగా వెళ్తున్న కారు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న యాకోబుకు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. యలమంచిలి: చించినాడ గ్రామానికి చెందిన పెదపట్నం కిషోర్కుమార్ (35) శనివారం రాత్రి చించినాడ వశిష్ట గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహం ఆదివారం పైకి తేలింది. కిషోర్కుమార్ హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు ఉన్నారు. బ్యాంకు పని ఉందని చెప్పి శనివారం ఉదయం కిషోర్ చించినాడ వచ్చాడు. రాత్రి బాగా మద్యం సేవించి ఇంటికి రావడంతో తండ్రి శ్రీనివాసరావు మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన కిషోర్ గోదావరిలో దూకాడు. తండ్రి పెదపట్నం శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హెడ్ కానిస్టేబుల్ కె.శ్యాంసన్రాజు కేసు నమోదు చేశారు. -
నా భూమి ఎక్కడ?
నరసాపురం: 85 ఏళ్ల భట్టు ప్రభాకరరావుది దయనీయ పరిస్థితి. విశాఖ కేంద్రంగా నేవీలో 40 ఏళ్లపాటు ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేసి, రెండో ప్రపంచ యుద్ధంలోనూ సేవలందించిన ఆయనకు నేడు కనీసం ప్రభుత్వం కేటాయించిన భూమి కూడా దక్కలేదు. ఉద్యోగ విరమణ అనంతరం, ఆయన సేవలకు గుర్తింపుగా 1969 అక్టోబర్ 13న అప్పటి ప్రభుత్వం నరసాపురం మండలం వేములదీవి సముద్రతీర గ్రామంలోని సర్వే నెంబరు 681/1లో 2.40 ఎకరాల భూమిని పట్టాగా ఇచ్చింది. అప్పటి నుంచి ఆ భూమిని రెవెన్యూ అధికారులు ఆయనకు అప్పగించలేదు. గత 57 ఏళ్లుగా ఆ భూమిని తన ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రభాకరరావు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వృద్ధాప్యంతో గుంటూరులో కుమారుడు ఐజయ్య వద్ద ఉంటున్న ఆయన, ఇప్పటికీ తన భూమి కోసం పోరాడుతున్నారు. ఇటీవల అధికారులు స్పందిస్తూ ఆ భూమిని ఎప్పుడో వేరే వారికి ఇచ్చేశామని చెప్పడంతో ప్రభాకరరావు, ఆయన కుమారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఇప్పించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ప్రారంభంలో ఆ భూమి నీళ్లలో ఉండటంతో స్వాధీనం చేసుకోవడం సాధ్యపడలేదని, ఆ తర్వాత ఎన్నిసార్లు అడిగినా అధికారులు పట్టించుకోలేదని ఆయన వాపోతున్నారు. వేలాది ఎకరాల అసైన్డ్ భూములు అన్యాక్రాంతం నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని తీరప్రాంతంలో ఇదే రీతిలో వేలాది ఎకరాల అసైన్డ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. స్వాతంత్య్ర సమరయోధులకు, మాజీ సైనిక ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన భూములను కొందరు వ్యక్తులు, రెవెన్యూ అధికారుల అండతో తరతరాలుగా అనుభవిస్తున్నారు. నరసాపురం, మొగల్తూరు తహసీల్దార్ కార్యాలయాల కేంద్రంగా నిబంధనలను తుంగలో తొక్కి, అక్రమంగా మ్యూటేషన్లు చేయడం, రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించడం జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. గత రెండేళ్లలో నరసాపురం కార్యాలయం వేదికగా అక్రమ మ్యూటేషన్ల జారీ విస్తృతంగా జరిగిందని విమర్శలు వస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిగితే వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు వెలుగులోకి వస్తాయని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 57 ఏళ్లుగా తిరుగుతున్న 85 ఏళ్ల వృద్ధుడు -
వాగ్దానాలు మరిచి.. వంచనతో పాలించి..
సాక్షి, భీమవరం: ‘ఏం తమ్ముళ్లూ.. అధికారంలోకి రావడమే ఆలస్యం.. అవి చేస్తాం.. ఇవి చేస్తాం..’ అంటూ ఎన్నికల్లో హామీల వరద పారించారు చంద్రబాబు. గోదావరిపై వంతెనలు కట్టేస్తానన్నారు.. విజ్జేశ్వరం నుంచి ఇంటింటికీ రక్షిత నీరు ఇచ్చేస్తానన్నారు.. ఆడబిడ్డకు నిధి అన్నారు.. నిరుద్యోగులకు భృతి అన్నారు.. తణుకులో హైటెక్ టవర్, ఆకివీడులో కోల్డ్ స్టోరేజీలు, ఆక్వా రైతులకు రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ అంటూ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా హామీలను పట్టాలెక్కించలేదు. సీఎం చంద్రబాబు సోమవారం జి ల్లాకు వస్తుండటంతో ఎన్నికల్లో ఆయన ఇచ్చిన వా గ్దానాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ● 2024 ఏప్రిల్ 10.. తణుకులోని నరేంద్ర సెంటర్ వద్ద బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ తణుకులో హైటెక్ టవర్ నిర్మిస్తానన్నారు. ఇంటి వద్ద నుంచే ఉద్యోగాలు చేసుకునేలా సాంకేతికతను అందుబాటులోకి తెస్తానని, తణుకును పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, వలసలు అరికడతానని హామీ ఇచ్చారు. ● 2024 మే 10.. ఉండి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ ఆక్వా రైతుల కోసం 500 టన్నులు కెపాసిటీ కలిగిన కోల్డ్ స్టోరేజీలు కట్టిస్తానన్నారు. ఏరియేటర్స్ మీద సబ్సిడీ ఇప్పిస్తానన్నారు. యూనిట్ రూ.1.50కే ఇచ్చి ఆక్వా రంగాన్ని పైకి తీసుకువస్తానన్నారు. నియోజకవర్గంలో భూగర్భ జలాలు కలుషితం కావడంతో విజ్జేశ్వరం నుంచి ప్రొజెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని ఇంటింటికీ కుళాయిల ద్వారా ఇస్తానన్నారు. ఆకివీడులో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి లేదా ఫ్లైఓవర్ నిర్మిస్తామని హామీల గుప్పించారు. రెండేళ్లు కావస్తున్నా ఇవేమీ కార్యరూపం దాల్చలేదు. ● 2024 జనవరిలో.. ఆచంటలో జరిగిన టీడీపీ రా కదలిరా సభలో చంద్రబాబు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అ యోధ్యలంక–కోడేరు మధ్య గోదావరిపై వారధి నిర్మిస్తామని మాటిచ్చారు. ● కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లయినా కేబినేట్లో ఆమోదం అంటూ వశిష్ట వారధి నిర్మాణం ఇంకా ప్రకటనలకే పరిమితమైంది. ఏటా వరదల సమయంలో లంక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీయాల్సి వస్తుంది. ఆచంట, పెనుగొండ, పోడూరు, పాలకొల్లు, యలమంచిలి మండలాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి దొంగరావిపాలెంలోని కోడేరు బ్యాంకు కెనాల్లోకి ఎత్తిపోతల పథకం నిర్మాణం హామీ అటకెక్కిపోయింది. ఆచంట, పోడూరు, పెనుగొండ, యలమంచిలి మండలాల్లోని నక్కల డ్రెయిన్ ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటామన్నారు. అభివృద్ధి మాట పక్కనపెడితే రెండేళ్లుగా కూటమి నాయకులు డ్రెయిన్ గట్లకు తూట్లు పొడుస్తూ యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. రైతును రాజును చేస్తానంటూ ఎన్నికల్లో చెప్పుకొచ్చిన చంద్రబాబు పాలనలో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. జిల్లాలోని 80 వేల మంది కౌలు రైతులను పూర్తిగా విస్మరించారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కొందరికే పరిమితం చేశారు. రైతుల కోసం గత ప్రభుత్వం తెచ్చిన ఉచిత పంటల బీమా పథ కాన్ని ఎత్తివేశారు. నీటి తీరువాను వడ్డీలతో కలిపి వసూలు చేస్తూ రైతుల నడ్డి విరుస్తున్నా రు. గత ఖరీఫ్లో మోంథా తుఫానుతో జి ల్లాలో 9,201 హెక్టార్లలో రూ.23 కోట్ల మేర పంట నష్టం వాటిల్లగా ఇప్పటికి పరిహారం అందక తొలకరి పెట్టుబడుల కోసం రైతులు అగచాట్లు పడుతున్నారు. మరోపక్క సీడ్, ఫీడ్, ఎక్స్పోర్టర్స్ సిండికేట్ దోపిడీ నుంచి ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కోరుతూ కూటమి పాలనలో తరచూ జిల్లాలోని ఆక్వా రైతులు రోడ్డెక్కుతున్న పరిస్థితి. ఎన్నికల్లో మాట ఇచ్చినట్టుగా రూపాయిన్నరకే సబ్సిడీ విద్యుత్ అందజేయాలని, కోల్డ్ స్టోరేజీలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల వాగ్దానాలు అమలుచేయాలని, స మస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సూపర్ సిక్స్ అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టి తొలి ఏడాది ఎగనామం పెట్టారు. లబ్ధిదారుల సంఖ్యకు భారీగా కోతలు పెట్టి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలను మమ అనిపిస్తున్నారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి హామీల అమలు ఊసెత్తడం లేదు. రెండేళ్లలో ఆడబిడ్డ నిధి అందక జిల్లాలో అర్హత కలిగిన సుమారు 5.96 లక్షల మంది మ హిళలు రూ.2,146 కోట్లు నష్టపోయారు. నెలనెలా ఇస్తామన్న రూ.3 వేల భృతి కోసం జి ల్లాలోని వేలాది మంది నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఆచంట నియోజకవర్గం పెనుగొండ మండలం సిద్ధాంతంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు సిద్ధాంతం చేరుకుని గ్రామసభలో పాల్గొంటారు. రైతులతో మాట్లాడి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. బురిడీ బాబూ ! ఎన్నికల్లో జిల్లాకు హామీల వరద పారించిన చంద్రబాబు విజ్జేశ్వరం నుంచి ఇంటింటికీ తాగునీరు వశిష్ట గోదావరిపై వంతెనల నిర్మాణం తణుకులో హైటెక్ టవర్, వలసల నిరోధానికి పరిశ్రమల ఏర్పాటు ఆక్వా రంగానికి రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ హామీల అమలుపై చిత్తశుద్ధి కరువు నేడు జిల్లాకు సీఎం చంద్రబాబు రాక -
అడ్డూ అదుపు లేని మట్టి దందా
ఉండి: మండలంలో మట్టి అక్రమ రవాణా కోసం పంట కాలువలు, పిల్ల కాలువలు, మేజర్, మైనర్ డ్రెయిన్లను ఆక్రమించి, అక్రమంగా వంతెనలు నిర్మించి మట్టిని తరలిస్తున్నారు. దీంతో కలిసిపూడి పంట కాలువ గట్టు అధ్వానంగా మారడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చెరుకువాడ, కలిసిపూడి గ్రామాల సరిహద్దులో గతంలో నిర్మించిన వంతెనకు అప్రోచ్ రోడ్డు కూడా లేదు. ఇప్పుడు అక్రమ మట్టి రవాణా కోసం తమకు అనుకూలంగా వంతెనకు అప్రోచ్ను ఏర్పాటు చేసుకుని, భారీ వాహనాల్లో మట్టిని తరలిస్తున్నారు. జాతీయ రహదారిపైనే అక్రమ అప్రోచ్ వంతెనకు ఏర్పాటు చేసిన ఈ అప్రోచ్ రోడ్డు, జాతీయ రహదారి–165లో ఒకవైపు భాగాన్ని పూర్తిగా ఆక్రమించేసింది. దానికి తోడు, వంతెన మీదుగా భారీ వాహనాలు అధిక లోడుతో వెళ్లడంతో అప్రోచ్ మట్టి రహదారిపైకి జారిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క అధికారీ పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు విమర్శిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న చినుకులకు, అప్రోచ్ కోసం వేసిన కంకర మట్టిలా మారి జారిపోతోంది. దీనివల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదాల నిలయంగా రహదారి అధిక లోడుతో వెళ్తున్న మట్టి వాహనాల నుంచి పెద్ద పెద్ద మట్టి పెళ్లలు రోడ్డుపై పడుతుండటంతో, వెనుక వస్తున్న వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. శనివారం ఇదే ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. ఓవర్లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్పై నుంచి మట్టి పెళ్ల పడటంతో, దానిని తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కింద పడి గాయాలపాలయ్యారు. జాతీయ రహదారిని సగానికి పూడ్చేసినా, ఓవర్లోడ్ వాహనాలతో ప్రయాణికులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా.. అధికారులు ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని వాహనదారులు వాపోతున్నారు. -
లోకలే బెటరొయ్య
సాక్షి, భీమవరం: సిండికేటు దోపిడీతో కుదేలవుతున్న ఆక్వా రంగాన్ని కాపాడుకునే దిశగా ఆక్వా రై తులు అడుగులు వేస్తున్నారు. చేపలు, రొయ్యలకు లోకల్ మార్కెట్ను పెంచుకునే పనిలో ఉన్నారు. అందులో భాగంగా పాలకొల్లులోని జైభారత్ క్షీరారామ ఆక్వారైతు సంఘం మృగశిర సెంటిమెంట్ను తెరపైకి తెచ్చింది. చేపలు, రొయ్యలతో సోమ వారం ప్రత్యేక భోజనాలు ఏర్పాటుచేసింది. 2.63 లక్షల ఎకరాల్లో.. జిల్లాలోని 2.63 లక్షల ఎకరాల్లో ఆక్వా చెరువులకు 60 శాతం విస్తీర్ణంలో వనామీ సాగు చేస్తున్నారు. ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎక్స్పోర్టర్స్ ఏకమై ఇష్టానుసారం రొయ్య, చేపల ధరలు తగ్గించేసి, మేత ధరలు పెంచుతూ తమ కష్టాన్ని దోచుకుంటున్నారని ఆక్వా రైతులు వా పోతున్నారు. ఇటీవల ఎక్స్పోర్టర్స్ ధరలను తగ్గించడంపై జైభారత్ క్షీరారామ ఆక్వారైతు సంఘం ఆధ్వర్యంలో ఆక్వా రైతులు పాలకొల్లులో రొయ్యలను రోడ్డుపై వేసి నిరసన తెలిపారు. ఫీడ్ ధరలు పెంపుపై పాలకొల్లు, వీరవాసరం, ఉండి తదితర చోట్ల రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేశారు. స్థానిక అమ్మకాలు పెంచేందుకు.. రొయ్యల వినియోగంలో ఏడాదికి తలసరి 10 నుంచి 12 కిలోల సగటుతో చైనా ముందుంటే, 8–10 కిలోలతో అమెరికా రెండో స్థానంలో, ఎనిమిది కిలోలతో యూరోపియన్ దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ దేశాలకు రొయ్యలు ఎగుమతి చేస్తున్న మన రాష్ట్రంలో సగటు వినియోగం కేవలం 1.5 కిలోలు మాత్రమేనని ఆక్వా వర్గాలంటున్నాయి. స్థానిక వినియోగం పెంచడం ద్వారా సిండికేట్ దోపిడీకి కళ్లెం వేయాలన్న యోచనలో రైతులు ఉన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల వివిధ కౌంట్లలోని రొయ్యలను ప్రాసెసింగ్ చేసి విక్రయిస్తున్నారు. పాలకొల్లులో యూనిట్ను ఏర్పాటుచేశారు. ఉచిత భోజనాలు మృగశిర కార్తెతో రుతుపవనాలు మొదలవుతాయి. వర్షాలు కురవడంతో తేమ ఎక్కువై జలుబు, దగ్గు, ఉబ్బసం, శ్వాసకోశ సమస్యలు వస్తాయి. చేపలు, రొయ్యల్లో ఉండే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఈ, ప్రొటీన్లు, ఐరన్, జింక్ శ్వాసకోశాన్ని బలంగా ఉంచి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే ఈ సీజనన్లో వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కోసం చేపలు, రొయ్యలు తినడం అ నాదిగా వస్తున్న ఆచారం. ఆక్వా రైతుల సమస్యలపై ఉద్యమిస్తున్న జైభారత్ క్షీరారామా ఆక్వా రైతు సంఘం డొమెస్టిక్ సేల్స్ పెంచేందుకు కృషి చేస్తోంది. చేపలు, రొయ్యల్లోని పోషకాలు, ఉపయోగాలపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. మృగశిర కార్తె రోజున ప్రతి కుటుంబం కిలో రొయ్యలు, కిలో చేపలు కొనుగోలు చేయాలని సంఘ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. సోమవారం మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా పేదల కోసం సంఘ ప రిధిలోని పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్, ఆచంట నియోజకవర్గం మార్టేరు సెంటర్, నరసాపురం సెంటర్లో చేపలు, రొయ్యల వంటకాలతో ఉచిత భోజనాలు ఏర్పాటుచేశారు. స్థానిక వినియోగం పెంపు లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సంఘ నాయకులు చెబుతున్నారు. సీ ఫుడ్ డొమెస్టిక్ వినియోగం పెంచేందుకు గత వైఎస్సార్ ప్రభుత్వం కృషి చేసింది. ఫిష్ ఆంధ్రా ద్వారా జిల్లాలో సబ్సిడీపై రూ.లక్ష నుంచి రూ.3 లక్షల విలువైన 250కు పైగా ఔట్లెట్లు ఏర్పాటుచేశారు. అలాగే ఎక్స్పోర్ట్ క్వాలిటీ రొయ్యలను స్థానిక వినియోగదారులకు డోర్ డెలివరీకి కార్యాచరణ చేశారు. ఎక్స్పోర్టు తరహాలో ప్రాసెస్ చేసిన రొయ్య పప్పు కిలో కౌంట్ను బట్టి రూ.600 నుంచి రూ.850 వరకు ధర నిర్ణయించారు. తొలుత ప్రయోగాత్మకంగా భీమవరం పరిసర ప్రాంతాల్లో అమలుచేసి తర్వాత రాష్ట్రవ్యాప్తం చేయాలని భావించగా సార్వత్రిక ఎన్నికలు రావడంతో కార్యరూపం దాల్చలేదు. స్థానిక మార్కెట్ వైపు రైతుల చూపు తెరపైకి మృగశిర సెంటిమెంట్ చేపలు, రొయ్యల ప్రాధాన్యతను వివరిస్తున్న జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం నేడు పాలకొల్లు, నరసాపురం, ఆచంటలో చేపలు, రొయ్యలతో పేదలకు ఉచిత భోజనాలు డొమెస్టిక్ సేల్స్కు గతంలోనే కార్యాచరణ చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 250 ఫిష్ ఆంధ్రా ఔట్లెట్స్ ఏర్పాటు -
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
దెందులూరు: ఏలూరు రూరల్ మండలం చొదిమెళ్ళ పరిధిలోని కొత్తచెరువు పక్కన ఉన్న వేపూరి శ్రీనివాసరావు కొబ్బరి కోకో తోట గట్టు పక్కన 40–50 ఏళ్ల మధ్య వయస్సు గల పురుషుడి మృతదేహం లభ్యమైంది. సుమారు 10 నుంచి 15 రోజుల క్రితం చనిపోయినట్లు భావిస్తున్నట్లు ఏలూరు రూరల్ ఎస్సై వేముల వెంకటేశ్వరరావు అన్నారు. అతని శరీరంపై నీలం రంగు లుంగీ, తెలుగు పింక్ రంగు గడుల చొక్కా, భుజంపై లేత పచ్చ గడుల కండువా ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. పెనుగొండ: అధికార పక్ష నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామన్నపాలెం పంచాయతీ పాలక వర్గ తీర్మానం చేయగా.. గత పాలకవర్గంలో శిలాఫలకం ఏర్పాటు చేశారు. పాలకవర్గంలో సర్పంచ్, వార్డు సభ్యులతో శిలాఫలకం వేయించడం రివాజు. రామన్నపాలెంలోనూ అలాగే వేయించారు. పాలకవర్గ పదవీ కాలం ముగిసిన అనంతరం అఽధికారులు ఆ శిలాఫలకాన్ని తొలగించడం ప్రస్తుతం విమర్శలకు తావిస్తుంది. కూటమి నాయకుల ఒత్తిడితోనే శిలాఫలకం తొలగించారన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. పాలకవర్గ శిలాఫలకం కూటమి నాయకుల ఒత్తిడితోనే తొలగించారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అఽధికారులు తీరు మార్చుకొని శిలాఫలకం తిరిగి ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్చేశారు. జంగారెడ్డిగూడెం: మోటార్ సైకిల్ ఢీకొన్న ఘటనలో వృద్ధుడు మృతిచెందిన ఘటన ఏలూరు రోడ్డు గుర్వాయిగూడెం పరిధిలోని జీడిపిక్కల ఫ్యాక్టరీ వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి లక్కవరం ఎస్సై షేక్ జబీర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండలపేట మండలం మోదకుదురు గ్రామానికి చెందిన జక్కంశెట్టి నాగేశ్వరరావు (65) చాలా కాలం క్రితం జంగారెడ్డిగూడెం వచ్చి ఉంటూ, జీడిపిక్కల గింజల ఫ్యాక్టరీ వద్ద చెరుకు రసం తీసి జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం చెరుకు తుక్కు రోడ్డు అవతల పడవేసి వస్తున్నాడు. ఇంతలో ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్న బైక్ వృద్ధుడిని అతి వేగంగా ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. యువకులు వాహనంతో సహా పారిపోయారు. ఎస్సై షేక్ జబీర్ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. వృద్ధుడి మృతికి కారణమైన వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
డ్రోన్ కెమెరాలతో నిఘా
ఏలూరు టౌన్: ఏలూరు రూరల్ పరిధిలోని వైఎస్సార్ కాలనీ, పోణంగి గ్రామాలపై డ్రోన్ కెమెరాలతో ఆదివారం సాయంత్రం ప్రత్యేకంగా నిఘా ఉంచారు. ఆయా ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు వన్టౌన్ సీఐ రామకృష్ణ తెలిపారు. వైఎస్సార్ కాలనీ, పోణంగి గ్రామాల పరిధిలో అసాంఘిక శక్తుల కదలికలు, సామాజిక నేరాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు డ్రోన్ నిఘా ఉపయోగపడుతుందని సీఐ తెలిపారు. ప్రజలకు భరోసా కల్పించటంతోపాటు నేరాలకు పాల్పడే వారిలో చట్టం పట్ల భయం ఉండాలని తెలిపారు. -
‘దారీ’తెన్నూ లేదు
● అటవీ శాఖ అభ్యంతరాలు ● ఏజెన్సీలో నిలిచిన రోడ్డు నిర్మాణాలు ● ఆందోళనలో గిరిపుత్రులు బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామాలకు సరైన రోడ్లు లేక కొండరెడ్డి గిరిజనులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పలు రహదారుల నిర్మాణాలకు ప్రభుత్వా లు నిధులు మంజూరు చేసినా అటవీ శాఖ అధికారులు అభ్యంతరాలతో పనులు ముందుకు సాగడం లేదు. దీంతో ఆయా గ్రామాల్లో గిరిజనులు గ్రామా లు దాటాలంటే కొండలు, గుట్టలు ఎక్కిదిగాల్సి వస్తోంది. తమకు రహదారి కష్టాలు తీర్చాలని మొరపెట్టుకున్నా అటవీశాఖ అధికారులు కనికరం చూ పడం లేదని గిరిజనులు అంటున్నారు. ఇదిలా ఉండగా అనుమతుల కోసం ఉన్నతాధికారులకు నివే దించామని స్థానిక అటవీ అధికారులు చెబుతున్నా రు. రానున్న వర్షాకాలంలో మరిన్ని తిప్పలు తప్ప వని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. నిలిచిన పనులు ఇలా.. ● బుట్టాయగూడెం మండలంలో అలివేరు నుంచి లంకపాకల మీదుగా రేగులపాడు, రేపల్లె గ్రా మాలకు సుమారు 5.7 కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణానికి 2022–23లో సుమారు రూ.2.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అలివేరు నుంచి లంకపాకల మీదుగా గానుగమామిడి వరకు రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. మిగిలిన రోడ్డు పనులు అటవీ మార్గంలో ఉండడంతో ఫారెస్ట్ అధికారులు అభ్యంతరాలు తెలపగా పనులు నిలిచిపోయాయి. ● వేలేరుపాడు, బుట్టాయగూడెం మండలాల సరిహద్దు మారుమూల అటవీ ప్రాంతంలో కొండరెడ్డి గిరిజనులు స్వాతంత్య్రానికి ముందు నుంచి నివసిస్తున్న మోదేలు గ్రామానికి రహదారి ని ర్మాణం కోసం సుమారు రూ.4 కోట్ల నిధులు మంజూరయ్యాయి. విద్యుత్ సదుపాయానికి మ రో రూ.70 లక్షలు మంజురయ్యాయి. అయితే వీ టికి కూడా అటవీ అధికారులు అభ్యంతరం చె ప్పడంతో ఆయా పనులు నిలిచిపోయాయి. అ లాగే ప్రధానమంత్రి జన్మాన్ పథకం కింద 19 కు టుంబాలకు గృహాలు మంజూరయ్యాయి. వీటి నిర్మాణానికి కూడా ఫారెస్ట్ అధికారులు అభ్యంతరాలు చెప్పగా అవీ నిలిచిపోయాయి. ● మారుమూల గ్రామం రామనర్సాపురానికి కూ డా పీఎం జన్మాన్లో నిధులు మంజూరైనా అటవీశాఖ అధికారుల అభ్యంతరాలతో పనులు నిలిచిపోయాయి. ● రెడ్డికోపల్లి నుంచి వీరన్నపాలెం గ్రామానికి సుమారు రూ.4.8 కోట్ల అంచనాలతో 4 కిలోమీ టర్ల మేర రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి కూడా ఫారెస్ట్ అధికారుల అభ్యంతరాలు చెప్పారు. ● ఆయా పనుల కోసం స్థానిక అటవీ అధికారులు పంపుతున్న సర్వే నివేదికలను ఆమోదించకుండా ఉన్నతాధికారులు తిరస్కరిస్తున్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ధ్దాలుగా కొండలపై నివసిస్తున్న కొండరెడ్డి గిరిజనులకు సరైన రహదారి లేక అవస్థలు పడతున్నారు. రోడ్ల నిర్మాణాల కోసం ఉన్నతాధికారులు సర్వేలు చేసి ప్రతిపాదనలు పంపిస్తున్నా ఫారెస్ట్ అధికారులు అభ్యంతరాలు తెలిపి తిరస్కరించడం బాధాకరం. వర్షాకాలం రానే వచ్చింది. అధ్వానంగా ఉండే రోడ్లపై గిరిజనులు ప్రయాణం చేయాలంటే చాలా కష్టం. అటవీ అధికారులు రోడ్డు పనులకు అనుమతులు ఇచ్చేలా కృషి చేయాలి. – కారం రాఘవ, న్యూడెమోక్రసీ నాయకుడు, అలివేరు, బుట్టాయగూడెం మండలం -
కిటకిటలాడిన పెద్దింట్లమ్మ ఆలయం
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగింపు దశకు చేరడంతో సమీప జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ, ఆదివారం రోజున ప్రత్యేక దర్శనాలు, కేశఖండన, తీర్థాలు, గదుల అద్దెలు, అమ్మవారి ఫొటోల విక్రయాలు, వాహన పూజలు మరియు విరాళాల ద్వారా రూ.78,915 ఆదాయం వచ్చిందని తెలిపారు. దెందులూరు: పెదవేగి మండలం రాట్నాలకుంటలోని రాట్నాలమ్మ తల్లి ఆలయంలో ఆదివారం అమ్మవారికి ఆలయ అర్చకులు పుష్పాలతో అలంకరణ చేశారు. భక్తులు అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించి మొక్కులు తీర్చుకొని ప్రత్యేక పూజలు చేశారు. సేవా టికెట్ల ద్వారా రూ.4,650, దర్శనం రూ.59,160, విరాళాలు రూ.6,756, ప్రసాదం విక్రయం రూ.3,585, కళ్యాణ కట్ట ద్వారా రూ.800, అమ్మవారి ఫొటోల ద్వారా రూ.365 కలిపి మొత్తం రూ.1,05,276 ఆలయానికి ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు. భీమవరం: వ్యాపారం నిమిత్తం డబ్బు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశారంటూ కె.అనూష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు భీమవరం టూటౌన్ ఎస్సై రెహమాన్ చెప్పారు. భీమవరం మండలం చినఅమిరం గ్రామానికి చెందిన అనూష వద్ద అదే ప్రాంతంలో ఉండే ఎస్.దుర్గ రూ.7 లక్షలు అప్పు తీసుకున్నారు. డబ్బు తిరిగి ఇవ్వక పోవడంతో ఆదివారం ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ముగ్గురి బాలికల అదృశ్యం భీమవరం పట్టణంలోని దుర్గాపురం ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలికలు శనివారం రాత్రి నుంచి కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రెహమాన్ తెలిపారు. -
సంక్షోభంలో పొగాకు రైతులు
బుట్టాయగూడెం: పొగాకు రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.బలరామ్ అన్నారు. జీలుగుమిల్లిలో ప్రజా సంఘాల కార్యాలయంలో సిరిబత్తుల సీతారామయ్య అధ్యక్షతన సంఘ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు రైతులు పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు అప్పులు చేసి పంటలు సాగు చేశారన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం కిలో రూ.360కు పొగాకు కొనుగోలు చేశారని ప్రస్తుతం కేవలం రూ. 240 మధ్యలో కొనుగోలు చేస్తున్నారని అన్నారు. పొగాకు ఉత్పత్తి వ్యయాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో రైతులకు సగటున కిలో రూ.360 పైగా ధర లభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్ ట్రైనింగ్ కార్పొరేషన్ పొగాకు బోర్డు తక్షణమే స్పందించి పొగాకు రైతులకు న్యాయం చేయాలన్నారు. ఏపీ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు జులై 3, 4,5 తేదీల్లో ఏలూరులో జరుగుతున్నట్లు చెప్పారు. 3వ తేదీన భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహిస్తామని అనంతరం బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ, సహాయ కార్యదర్శి కారం భాస్కర్, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గూడెల్లి వెంకట్రావు పాల్గొన్నారు. -
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం పోరాటం
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ స్పష్టం చేశారు. ఆదివారం నగరానికి విచ్చేసిన విద్యాసాగర్తో పాటు ప్రధాన కార్యదర్శి డీవీ రమణలను స్థానిక ఎన్జీఓ హోమ్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు కలిశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, అరకొర జీతాలు తదితర వివరాలను ఎన్జీఓ నాయకులకు దృష్టికి తీసుకువెళ్లారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని కోరుతూ పోరాటం చేస్తున్నామన్నారు. దీనిపై విద్యాసాగర్ స్పందిస్తూ త్వరలోనే రాష్ట్ర నాయకులతో సమావేశం నిర్వహించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా కృషి చేస్తామన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్, రాష్ట్ర సెక్రటరీ కె.నాగభూషణం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.మధుకాంత్, మెంబర్ సెక్రటరీలు సీహెచ్ రాజేష్, డి.మోహన్, టి.చిరంజీవి ఉన్నారు. వీరికి ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ఎస్ హరనాథ్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చోడగిరి శ్రీనివాస్, నెరుసు రామారావు మద్దతుగా నిలిచారు. -
వృత్తి విలువలను కాపాడాలి
నరసాపురం: న్యాయవాద వృత్తిలో విలువలు కాపాడుతూ అడ్వకేట్ యామర్తి వెంకటేశ్వరరావు (వైవీఆర్) జీవించారని త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రామచంద్రరావు అన్నా రు. ఆదివారం స్థానిక తెలగా కల్యాణ మండపంలో యామర్తి శత జయంతి సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ రా మచంద్రరావు మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో విలువలు కాపాడటంలో న్యాయవాదులు సీనియర్లను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కక్షిదారులకు న్యాయం చేయడంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదన్నారు. మూడు దశాబ్దాలపాటు వైవీఆర్ చేసిన సేవలను కొనియాడారు. సభకు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ గ్రంధి భవానీప్రసాద్ అధ్యక్షత వహించారు. ఏపీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ సీవై సోమయాజులు, జస్టిస్ డీఎస్ వర్మ మాట్లాడారు. వైవీఆర్ కుమారుడు చంద్రశేఖర్, న్యాయవాదులు పాల్గొన్నారు. పెనుగొండ : పెనుగొండ నగరేశ్వర మహిషాసురమర్ధనీ వాసవీ కన్యకపరమేశ్వరి ఆలయాన్ని పాట్నా హైకోర్టు న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి దంపతులు సందర్శించారు. ఆదివారం ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చే యించారు. తణుకు ఫస్ట్ అడిషనల్ సివిల్ జడ్జి జి.స్వర్ణ, కొవ్వూరు సివిల్ జడ్జి వి.నాగేశ్వరరావు నాయక్ ఉన్నారు. ఆలయ ఈఓ గుబ్బల రామపెద్దింట్లురావు ఆలయ మర్యాదలతో న్యాయమూర్తులకు స్వాగతం పలికారు. బుట్టాయగూడెం : మండలంలోని కామవరం సమీపంలో అటవీ ప్రాంతంలో కొలువైన గుబ్బ ల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో వేకువజాము నుంచే భక్తుల రాక మొదలైంది. ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూ జలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ పటిష్ట ఏర్పాట్లు చేయగా, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. భీమవరం (ప్రకాశంచౌక్) : జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు ఆదివారం ప్రారంభమయ్యాయయని, ఈనెల 21 వరకు కొనసాగుతాయని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. 13న నరసాపురం వలంధర్ రేవులో, 14న పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నా రు. 21న భీమవరంలో జిల్లాస్థాయి యోగా ది నోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నామన్నా రు. జిల్లాలో ప్రతి మండలంలో ఒక్కో మాస్టర్ ట్రైనర్ ఆధ్వర్యంలో 50 మందికి యోగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నామన్నారు. భీమవరం: రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్రరాజు, ప్రధాన కార్యదర్శి బూరాడ మధుబాబు హెచ్చరించారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్లో ఆదివారం జరిగిన జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు జిల్లా వెంకయ్యపల్లె వీఆర్వో మహ్మద్ హుస్సేన్ మరణానికి కారణమైన అధికారుల తీరును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అధికారుల వేధింపులతోనే హుస్సేన్ ఆత్మహత్య చేసుకున్నాడని ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణ మే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కు టుంబానికి సముచిత న్యాయం చేసి ఆర్థిక భ రోసా కల్పించాలని కోరారు. వేధింపులతో ఆ త్మహత్యలకు పాల్పడటం విచారకరమన్నారు. -
సీలేరు నదిలో పడి విద్యుత్ ఉద్యోగి మృతి
చింతూరు: సీలేరు నదిలో పడి ఓ విద్యుత్ శాఖ ఉద్యోగి మృతి చెందాడు. పోలవరం జిల్లా చింతూరు మండలం కల్లేరు వద్ద శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు జిల్లా బొమ్మిడికి చెందిన మూడు కుటుంబాలకు చెందిన 13 మంది విహారయాత్ర నిమిత్తం చింతూరు ప్రాంతానికి వచ్చారు. ఇక్కడి కల్లేరు సమీపంలోని సీలేరు నది వద్దకు వెళ్లారు. ఇందులో కొందరుస్నానానికి నదిలోకి దిగగా, తేజ అనే బాలుడు ప్రమాదవశాత్తూ నీటిలో కొట్టుకుపోతున్న క్రమంలో సబ్బవరపు ఆనంద్ (37) అతడిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ లోపు ఒడ్డున ఉన్నవారు కేకలు వేయడంతో స్థానికులు నదిలోకి దూకి తేజను రక్షించారు. అనంతరం ఆనంద్ను కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో నీటిలో గల్లంతు కాగా, కొంతసేపటికి సమీపంలోని నది వద్ద పొదల్లో అతని మృతదేహం లభ్యమైంది. మృతుడు విద్యుత్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న చింతూరు ఎస్సై సంతోష్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ఏడాది కాలంలో మార్కెటింగ్ సొసైటీ అభివృద్ధి
ఏలూరు (ఆర్ఆర్పేట): గత ఏడాది కాలంలో ఏలూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీని ఎంతో అభివృద్ధి చేశామని డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ తెలిపారు. శనివారం స్థానిక డీసీఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత జిల్లాలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నరసాపురం, ఉండి, భీమడోలు, కొయ్యలగూడెం, టి.నరసాపురంలలో నూతనంగా ఎరువుల డిపోలు ప్రారంభించి ఆ ప్రాంత రైతులకు కూడా ఎంఆర్పీ కంటే తక్కువ ధరలకే ఎరువులు అందించే ఏర్పాటు చేశామన్నారు. అలాగే సీతానగరంలో మరో ఎరువుల డిపోను ప్రారంభించడానికి ఏర్పాటు చేశామన్నారు. జిల్లా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం తక్కువ ధరలకే మందులు విక్రయించడానికి జనరిక్ మందులు షాపులు నిర్వహిస్తున్నామని, కొత్తగా మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే ప్రజలకు తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులు అందించడానికి ఏలూరులో ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్కు విశేష ఆదరణ లభిస్తోందని, దీంతో ఏలూరులోని సత్రంపాడు, నిడదవోలు, భీమవరంలలో కూడా సూపర్ మార్కెట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే డీసీఎంఎస్లో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న 8 మంది ఉద్యోగులను రెగ్యులర్ చేశామని, కొత్తగా మరో 15 మందికి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. రానున్న రోజుల్లో డీసీఎంఎస్ ద్వారా జిల్లాలోని రైతులకు సామాన్య, మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి కార్యాచరణ రూపొందించామన్నారు. -
తేతలి గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం
● రూ.10 లక్షల ఆస్తి నష్టం ● రెండు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు తణుకు అర్బన్ : తణుకు మండలం తేతలి ఇండస్ట్రియల్ ఏరియాలో శుక్రవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తేతలి – సత్యవాడ రోడ్డులోని సూర్యప్రభ ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని గోడౌన్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో తణుకు ఫైర్ ఆఫీసర్ అజయ్కుమార్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. మంటల తీవ్రత పెరుగుతుండడంతో అత్యవసరంగా అత్తిలికి చెందిన మరో అగ్నిమాపక వాహనాన్ని రప్పించి సుమారు 5 గంటల పాటు శ్రమించి చివరకు మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో గోడౌన్లో ఉన్న నెయ్యి నిల్వలతోపాటు ప్యాకింగ్ మెటీరియల్, విలువైన సామాగ్రితోపాటు ఒక కారు, బుల్లెట్ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో గోడౌన్ కూలిపోగా ఆస్తి నష్టం సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అగ్నిమాపక అధికారి ఐ.అజయ్కుమార్ తెలిపారు. తణుకు రూరల్ సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, ఇన్న్చార్జి ఎస్సై జానా సతీష్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కేదారశెట్టి సుధ పేరుతో ఉన్న గోడౌన్లో మానేపల్లి వెంకట రామగోపాల్కు చెందిన నెయ్యి, ఇతర సామాగ్రి ఉన్నట్లుగా అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. అయితే అగ్నిప్రమాదం చోటుచేసుకున్న గోడౌన్కు ఎటువంటి అనుమతులు లేవని, వాస్తవానికి విరుద్ధంగా మరొక పేరుతో ఈ గోడౌన్ నడుస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కొయ్యలగూడెంలో అగ్నిప్రమాదం
కొయ్యలగూడెం: స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట షేక్ ఇస్మాయిల్కు చెందిన ఇంటిలో శుక్రవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు జంగారెడ్డిగూడెం నుంచి అగ్ని మాపక వాహనం వచ్చి మంటలను అదుపు చేసింది. అప్పటికే సుమారు రూ.30 వేల నగదుతో పాటు మొత్తం గృహోపకరణాలు కాలి బూడిదయ్యాయని బాధితులు వాపోయారు. విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ ప్రమాదం సంభవించిందని చెబుతున్నారు. ఇంట్లో మంటలు చేలరేగిన సమయంలో తాము గాఢనిద్రలో ఉన్నామని, ఆ సమయంలో తాము పెంచుకుంటున్న కుక్క అరిచి తమను మేల్కొలపడంతో ప్రాణాలతో బయటపడ్డామని షేక్ ఇస్మాయిల్ చెప్పాడు. ప్రభుత్వం ద్వారా బాధితులకి రావలసిన ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తానని తహసీల్దార్ పేర్కొన్నారు. ఉండి: మండలంలోని ఎన్నార్పీ అగ్రహారంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సార్వాకు అనువైన వరి విత్తనాలు విక్రయానికి సిద్ధంగా ఉన్నట్లు కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టార్ ఎన్ మల్లిఖార్జునరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంటీయూ 1318, ఎంటీయూ 1293 విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ విత్తనాలు కిలో రూ.42 కాగా 25 కేజీల బస్తా రూ.1,050 ఖరీదు అని తెలిపారు. అలాగే ఎంటీయూ 1282 రిలీజ్ కల్చర్ విత్తనాలు కేజీ రూ.50 కాగా 25 కేజీల బస్తా రూ.1,250గా ఉందన్నారు. విత్తనాలు కావలసిన రైతులు కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ను 99896 23823 నంబర్లో సంప్రదించవచ్చన్నారు. -
రైతులకు విశేష సేవలు
తాడేపల్లిగూడెం: రైతులకు, స్వయం సహాయక బృందాలకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశేష సేవలందిస్తోందని రీజినల్ మేనేజర్ ఈ.వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం పట్టణంలోని కల్యాణ మండపంలో బ్యాంక్ అగ్రికల్చరల్ మెగా అవుట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహించింది. ఆర్ఎం మాట్లాడుతూ విజయవాడ రీజియన్లో ఈ ప్రోగ్రాం కింద రూ.125 కోట్లు మంజూరు చేయగా, పశ్చిమ రీజియన్లో తాడేపల్లిగూడెం, తణుకు, అర్ధవరం, భీమవరం, పైడిపర్రు, చిననిండ్రకొలను, జంగారెడ్డిగూడెం, ఏలూరు బ్రాంచిలలో ఇతోఽధికంగా రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తోందన్నారు. రైతులకు, డ్వాక్రా సంఘాలకు బ్యాంకు అందించే సేవల గురించి ఆయన వివరించారు. మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించారు. బ్యాంక్ మేనేజర్ తోట వివేకానంద, సీనియర్ మేనేజర్ నరేష్, ఏబీఎం బాలరాజు, లబ్ధిదారులు పాల్గొన్నారు. పెనుగొండ: ఈ నెల 9న సిద్ధాంతంలో జరగనున్న సీఎం పర్యటనను ఒకరోజు ముందుకు అంటే 8వ తేదీకి మార్పు చేసినట్లు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ శనివారం విలేకరులకు తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై సమన్వయ కర్త పెందుర్తి వెంకటేష్తో కలిసి కలెక్టరు చదలవాడ నాగరాణి పర్యవేక్షించారు. సీఎం చేతులమీదుగా పట్టాదారు పాస్ పుస్తకాలు అందించే రైతులకు ముందుగా సమాచారం అందించాలన్నారు. సభకు వచ్చే రైతులు, ప్రజలకు తాగునీరు, వైద్య సేవలు, శానిటేషన్ వంటి మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. . ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలన్నారు. సమీక్షలో ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీ, జేసీ టి రాహుల్కుమార్ రెడ్డి, ఆర్డీవోలు దాసిరాజు, కే ప్రవీణ్కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): 2023–24 సంవత్సరం ఇన్స్పైర్ మనక్ అవార్డుల నామినేషన్కి సంబంధించి ఏలూరు జిల్లా నుంచి 8 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ, జిల్లా సైన్స్ అధికారి సోమయాజులు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 75 ప్రాజెక్టులు అప్లోడ్ అవ్వగా ఆన్లైన్లో పరీక్షించి 8 ప్రాజెక్టులు ఎంపిక చేశామన్నారు. న్యాయనిర్ణేతలుగా ఎం.లావణ్య, ఎం. శ్రీనివాస్, పారుల్ సింగ్ వ్యవహరించారు. రాష్ట్రస్థాయి పోటీలు జరిగే తేదీ, వేదిక త్వరలో తెలియజేస్తారు. -
విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
ఏలూరు (టూటౌన్): విద్యార్థులు వేసవిలో సమయం వృథా చేయకుండా విజ్ఞానాన్ని నిరంతరం పెంపొందించుకునే దిశగా కృషి చేయాలని జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ నారాయణ రావు, ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు అన్నారు. స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ శిక్షణ, సమ్మర్ క్యాంపు విద్యార్థుల శిక్షణ ముగింపు కార్యక్రమం శనివారం స్థానిక పవరుపేటలోని అన్నే భవనంలో నిర్వహించారు. సభలో గుడిపాటి నరసింహారావు రిటైర్డ్ లెక్చరర్ పి ఆంజనేయులు, కేవీ నారాయణరావు, రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ వై నిర్మల మాట్లాడుతూ ఇంగ్లీషు భాష, ఉపన్యాసం, సులభ గణితం, కంప్యూటర్ కోర్సులు రెగ్యులర్గా నిర్వహించడానికి కార్యక్రమం రూపొందిస్తామన్నారు. 15 రోజుల స్పోకెన్ ఇంగ్లీష్ సమ్మర్ క్యాంపులో విద్యార్థులు ఆసక్తిగా ఇంగ్లీష్ నేర్చుకున్నారన్నారు. పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాల్లో విద్యార్థులు భాగస్వాములు కావాలన్నారు. ఆగిరిపల్లి: ఆగిరిపల్లిలో విద్యుదాఘాతంతో పూరిల్లు దగ్ధమైంది. రాణి మేకల చుక్కమ్మ అనే వృద్ధురాలు కొండపై ఉన్న సగర్ల కాలనీలో ఒంటరిగా నివసిస్తోంది. శనివారం మధ్యాహ్నం ఆమె నిద్రిస్తున్న సమయంలో విద్యుదాఘాతంతో ఇంటికి మంటలు అంటుకుని ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల వారు మంటలలో చిక్కుకున్న చుక్కమ్మను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో రూ.20 వేల నగదు, వంట సామాగ్రి, దుస్తులు, నిత్యవసర వస్తువులు కాలి బూడిదైనట్లు బాధితురాలు వాపోయింది. గ్రామస్తులు జూలూరు కోటేశ్వరరావు, రేషన్ డీలర్ వేణుగోపాల్, యండురి సుధీర్ నిత్యావసర వస్తువులు, రూ.5 వేల నగదును తహసీల్దార్ ప్రసాద్ చేతుల మీదుగా బాధితురాలు చుక్కమ్మకు అందజేశారు. తల్లీ కుమార్తె అదృశ్యంపై కేసు జంగారెడ్డిగూడెం: తల్లీ కుమార్తె అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు హెచ్సీ ఎన్.ఉమామహేశ్వరరావు తెలిపారు. పట్టణానికి చెందిన కె.రాంబాబు, అతని భార్య ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో తరచూ గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో రాంబాబు ఈ నెల 5వ తేదీ బయటకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి చూసే సరికి, భార్య, 11 ఏళ్ళ కుమార్తె కనిపించలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇంటి వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో రాంబాబు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ తెలిపారు. -
కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ వేసవి సెలవులు ముగుస్తుండటంతో వేలాది మంది భక్తులు, వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో క్షేత్ర పరిసరాలు కిక్కిరిసాయి. తూర్పు రాజగోపుర ప్రాంతం, దర్శనం క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, అనివెట్టి మండపాలు, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. ఆలయ ఆవరణలో పలు కోలాట భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. క్షేత్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సైతం భక్తులతో రద్దీగా మారింది. బస్సులు ఎక్కేందుకు భక్తులు పోటీ పడ్డారు. -
మృత్యుపాశాలు.. లో లెవెల్ కాజ్వేలు
● వర్షాలకు దెబ్బతిని ప్రమాదకరంగా మారిన లో లెవెల్ కాజ్వేలు ● వంతెనలు నిర్మించాలని ప్రజల డిమాండ్ నూజివీడు : నూజివీడు నియోజకవర్గంలోని పలు గ్రామాల పరిధిలో వాగులపై ఉన్న లోలెవెల్ కాజ్వేలు, చప్టా, కల్వర్టులు ప్రమాదభరితంగా తయారయ్యాయి. వర్షాకాలంలో వచ్చిన వరదలకు తోడు, తుపాను ప్రభావానికి కురిసిన వర్షాలకు వాగులు పొంగడంతో వాటికి సమీపంలో రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న కల్వర్టులు, కాజ్వేల వద్ద మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఉంది. వీటికి ప్రధానంగా రెయిలింగ్స్ లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోననే ఆందోళన వాహనదారుల్లో వ్యక్తమవుతోంది. నూజివీడు మండలంలో రామిలేరు, ఊటవాగులు ప్రవహిస్తున్నందున వానాకాలంలోను, తుపాన్ల సమయంలోను ఈ వాగులకు వరదనీరు పెద్ద ఎత్తున వస్తుంది. దీంతో ఈ వాగులపై ఉన్న రోడ్లపైకి పెద్ద ఎత్తున వరదనీరు ప్రవహించి రాకపోకలు సైతం స్తంభించిపోతాయి. ఎటుచూసినా పొంచి ఉన్న ప్రమాదం ● రామిలేరుపై ఉన్న కల్వర్టులు, కాజ్వేలకు మరమ్మతులు చేయించాల్సి ఉంది. ● పోతురెడ్డిపల్లి రోడ్డులో నూజివీడు పట్టణ పరిధిలోని ఊటవాగుపై ఉన్న కాజ్వేకు గతంలోనే భారీ రంధ్రం పడగా తాత్కాలికంగా పూడ్చారు. ● అలాగే జంగంగూడెం, తుక్కులూరు, దేవరగుంట, మీర్జాపురం–కాట్రేనిపాడు, పోతురెడ్డిపల్లి–సింహాద్రిపురం మార్గంలో ఉన్న లోలెవెల్ కాజ్వేలు సైతం దెబ్బతినడమే కాకుండా రెయిలింగ్స్ లేవు. గతేడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు తుక్కులూరు వద్ద ఉన్న లోలెవెల్ కాజ్వేపై వరద ఉధృతంగా ప్రహహించడంతో ఆ ప్రవాహంలో యువతి వాగులోకి కొట్టుకుపోయి మరణించింది. అప్పట్లో ఈ కాజ్వేను జిల్లా కలెక్టర్ కే వెట్రిసెల్వీ పరిశీలించి ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడారు. వంతెన నిర్మించడానికి ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలని సూచించినా ఇంత వరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ● నూజివీడు మండలంలోని దంతులవారిగూడెం–మర్రికుంట గ్రామాల మధ్య ఊటవాగుపై చప్టా ఉండగా 2024 ఆగస్టు 31న వచ్చిన వరద ఉధృతికి చప్టా అంతా కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించడానికి రెండు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్తూ స్థానికులు కిందపడి గాయాలపాలవుతున్నారు. ● ఆగిరిపల్లి మండలంలో నూగొండపల్లి వద్ద ప్రవహించే కుంపిణీపై వాగుపై ఉన్న వంతెనకు రెయిలింగ్స్ లేక ప్రమాదభరితంగా ఉంది. ఈ వాగుకు వరద ఎక్కువగా వస్తుంది. ఈ వంతెనపై గతంలో రెండుసార్లు మనుషులు కొట్టుకుపోయిన సంఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. ● తోటపల్లి–చిన్నాగిరిపల్లి మధ్య ఉన్న లోలెవెల్ కాజ్వే సైతం ప్రమాదభరితంగా ఉంది. ఇక్కడ కూడా గతంలో వరద వచ్చినప్పుడు వ్యక్తి గల్లంతై మృతదేహం కూడా దొరకలేదు. మంత్రిగారు పట్టించుకోరు నియోజకవర్గానికి మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ చిన్న చిన్న పనులు కూడా పూర్తికాకపోవడంపై ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. లోలెవెల్ కాజ్వేలు, చప్టాలు ప్రమాదభరింతగా మారినా వాటి మరమ్మతులకు ఏవిధమైన చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా మంత్రిగారు స్పందించి ప్రమాదభరితంగా ఉన్న లోలెవెల్ కాజ్వేలను, చప్టాలను, కల్వర్టులకు మరమ్మతులు చేయించి ప్రమాదాలు సంభవించకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. నూజివీడు మండలం దంతులవారిగూడెం–మర్రికుంట గ్రామాల మధ్య వరదలకు దెబ్బతిన్న చప్టా, తుక్కులూరు–కాట్రేనిపాడుల మధ్య ప్రమాదభరితంగా లో లెవెల్ కాజ్వే రామిలేరులో వరద ప్రవాహం అత్యంత వేగంగా ఉంటుంది. వరదలు వచ్చేటప్పుడు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఎవరైనా కాజ్వేలు, చప్టాలు దాటడానికి ప్రయత్నిస్తే వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. గతేడాది సెప్టెంబరులో వచ్చిన వరదకు తుక్కులూరుకు చెందిన యువతి వరదలో కొట్టుకపోయి మృతిచెందింది. ప్రమాదభరితంగా ఉన్న కాజ్వేల స్థానంలో ప్రభుత్వం వెంటనే వంతెనల నిర్మాణం చేపట్టాలి. – పాలడుగు విజయ్కుమార్, వైఎస్సార్సీపీ నాయకుడు, తుక్కులూరు -
బ్యాంకులో బంగారం గోల్మాల్
బ్యాంక్ ఆఫ్ బరోడా జంగారెడ్డిగూడెం బ్రాంచ్లో 30 కాసులు మాయం జంగారెడ్డిగూడెం: బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం మాయం కావడంతో బాధితులు ఆందోళనకు దిగారు. తమ ఆభరణాలను చూపించాలంటూ ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకోవడంతో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. శనివారం ఒక ఖాతాదారుడు తన రుణాన్ని పూర్తిగా చెల్లించి, తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి కోరారు. ఆయన తాకట్టు పెట్టిన 9 కాసుల బంగారానికి బదులుగా, బ్యాంకు సిబ్బంది కేవలం 6 కాసుల బంగారం మాత్రమే ఇచ్చారు. మిగిలిన 3 కాసుల ఆభరణాల గురించి ప్రశ్నించగా, ఇదే క్రమంలో మరో ఇద్దరు ఖాతాదారులు తమ బంగారాన్ని చూపించాలని పట్టుబట్టారు. సదరు ఖాతాదారుల ఆభరణాలను పరిశీలించగా, మొత్తం 30 కాసుల బంగారం తక్కువగా ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో ఖాతాదారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. బ్యాంకు అప్రైజర్ రాజు గత రెండు రోజులుగా విధులకు హాజరుకావడంలేదని, అతనే ఈ 30 కాసుల బంగారాన్ని గోల్మాల్ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించామని బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఈ ఘటనతో మిగిలిన ఖాతాదారులు సైతం ఆందోళన చెంది బ్యాంకు వద్దకు చేరుకున్నారు. బ్యాంకులో ఆడిట్ జరుగుతోందని, సోమవారం అందరికీ వారి ఆభరణాలను చూపిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించి వెనుదిరిగారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించినట్లు సిబ్బంది వెల్లడించారు. -
కొయ్యలగూడెంలో అగ్నిప్రమాదం
కొయ్యలగూడెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇంట్లో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించి నగదుతో పాటు గృహోపకరణాలు బూడిదయ్యాయి. 10లో uఖతర్లో వైఎస్సార్సీపీ నిరసన భీమవరం: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడంతో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం విదేశాలకు సైతం పాకింది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈనెల 4 నుంచి వివిధ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ఖతర్లో వైఎస్సార్సీపీ కన్వీనర్ షేక్ జాఫర్ హుస్సేన్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, జగన్ అభిమానులు శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా హుస్సేన్ మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఇతర కూటమి నాయకులు సూపర్సిక్స్ పథకాలంటూ హామీలిచ్చి రెండేళ్లల్లో అమలుచేయకుండా అన్ని వర్గాల ప్రజలకు కూటమి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. నిరుద్యోగ భృతి, లక్షల్లో ఉద్యోగాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా అంటూ అర్హులను పక్కన పెట్టి లోకేష్కు కావల్సిన వారికి ఉద్యోగాలిచ్చి యువతను మోసం చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో జీసీసీ కో కన్వినర్ దొండపాటి శశికిరణ్, శీకొలు బాబు, వాసర్ల సురేష్, రాపాక సూర్య, షైక్ షాన్, మనీష్ రెడ్డి, మోహన్రెడ్డి, మధుసూదన్రెడ్డి, శేఖర్ రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మోసపోయిన అర్హులు
● డీఎస్సీ నిర్వహణ తీరుపై అసంతృప్తి ● క్రీడా కోటా భర్తీలో అన్యాయం ● అర్హులకు న్యాయం చేయాలంటున్న ఉద్యోగ, విద్యార్థి సంఘాలు ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2026ఏలూరు (ఆర్ఆర్పేట): సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఉన్న గౌరవం, మర్యాద ప్రత్యేకమైనవి. అనేక మంది ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించాలని ఎంతో పట్టుదలతో కృషి చేస్తారు. కొంతమంది కొన్ని సంవత్సరాల పాటు శిక్షణ కూడా తీసుకున్నారు. గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు తాము అధికారంలోకి వస్తే తొలి సంతకం డీఎస్సీ ఫైలుపైనే అని చంద్రబాబు అనేక ప్రచార సభల్లో నిరుద్యోగులను నమ్మించారు. తొలి సంతకం డీఎస్సీ ఫైలుపై చేయకుండా చంద్రబాబు వారిని మోసం చేశారు. ప్రతిపక్షాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వంపై చేసిన అలుపెరుగని పోరాటానికి తలొగ్గి ఎట్టకేలకు డీఎస్సీని పట్టాలెక్కించారు. అయితే డీఎస్సీ ఫైలుపై చేసిన సంతకం తమ జీవితాలతో చెలగాటమాడుతుందని నిరుద్యోగులు అసలు అనుకోలేదు. డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన నాటి నుంచి వాటి ఫలితాల విడుదల, రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు వంటి అంశాల్లో ప్రభుత్వం చేసిన జిమ్మిక్కులకు నిరుద్యోగులు ఒక్కసారిగా కుదేలయ్యారు. గతంలో జరిగిన విధంగా రిజర్వేషన్లను గానీ, రోస్టర్ పాయింట్లను గానీ పట్టించుకోకుండా తమకు కావాల్సిన వారికే ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిబంధనలు మార్చి నిరుద్యోగులను ఏమార్చడంతో, ప్రభుత్వం తమను వెన్నుపోటు పొడిచిందని నిరుద్యోగులు హతాశులయ్యారు. మోసపోయిన అర్హులు జిల్లాలోని పోలవరం ప్రాంతానికి చెందిన ఒక గిరిజనుడు క్రీడల్లో జాతీయస్థాయిలో బంగారు పతకం సాధించాడు. ఈ డీఎస్సీలో కూటమి ప్రభుత్వం నూతనంగా తెరపైకి తెచ్చిన హారిజాంటల్ రిజర్వేషన్ విధానంతో అతను ఉద్యోగం రాకుండా నిరుద్యోగిగా మిగిలిపోయాడు. తనకన్నా తక్కువ స్థాయిలో పతకం సాధించిన వ్యక్తికి ఉద్యోగం రావడం అతనిని కలిచివేసింది. ఏలూరు నగరంలో ఒక పాఠశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన పీఈటీగా పని చేస్తున్న మరో వ్యక్తి సైతం జాతీయ స్థాయి పతకం సాధించాడు. ఆయనకు కూడా కాదని, ఆయనకంటే తక్కువ స్థాయి పతకం సాధించిన వ్యక్తికి ఉద్యోగం లభించింది. దీంతో కూటమి నిర్వహించిన డీఎస్సీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం కాదు, తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు అమ్ముకోవడం కోసమే అంటూ నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డీఎస్సీలో అర్హులకు అన్యాయం జరిగిందని ఆధారాలతో సహా చూపిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం చూస్తుంటే భారీ స్థాయిలోనే అక్రమాలు జరిగినట్టు అర్థమవుతోంది. అనర్హులకు కట్టబెట్టిన పోస్టులను తొలగించాలి. మరో సారి కౌన్సిలింగ్ నిర్వహించి అర్హులకు న్యాయం చేయాలి. ముఖ్యంగా స్పోర్ట్స్ డీఎస్సీలో జరిగిన అక్రమాలపై కేంద్ర స్థాయిలో విచారణ చేయించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పి.శివశంకర్, డీవైఎఫ్ఐ ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వం కొట్టిన చీకటి దెబ్బకు మోసమే తమ బ్రాండ్గా కూటమి పాలన సాగు తోందని నిరుద్యోగులు బాహాటంగానే విమర్శలు గుప్పించారు. నిబంధనల మేరకు, న్యాయబద్ధంగా తమకు రావాల్సిన ఉద్యోగాన్ని ప్రభుత్వం లక్షల రూపాయలకు అమ్మేసుకుందని గగ్గోలు పెట్టారు. వారి కేకలు అరణ్య రోదనగానే మిగిలిపోయాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాతిపదికన నిర్వహించిన డీఎస్సీలో మొత్తం 1035 పోస్టులను చూపించగా, పరీక్ష నిర్వహించిన అనంతరం 1026 మంది మాత్రమే ఉద్యోగాలకు ఎంపికయ్యారని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. వీరిలో ఇద్దరు ఉద్యోగంలో చేరడానికి ఆసక్తి చూపించలేదు. మరొకరిని అధికారులు విత్హెల్డ్లో పెట్టారు. ప్రస్తుతం 1035 పోస్టులకు ఈ డీఎస్సీలో 1023 మంది మాత్రమే ఉద్యోగాల్లో చేరారు. ఇదిలా ఉండగా క్రీడల కోటాలో కూడా ఉద్యోగాలు ఇవ్వడంతో జిల్లాలో మొత్తం 26 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేయగా, వారిలో ఒకరు ఉద్యోగంలో చేరలేదు. మిగిలిన వారందరూ ఉద్యోగంలో చేరారు. ఎంపికై న వారిలో ఉద్యోగంలో చేరిన వారిని మినహాయించి మిగిలిన 13 పోస్టులను ప్రస్తుతం నిర్వహించిన డీఎస్సీ నుంచే ఎంపిక చేయవచు. అయితే అధికారులు అటువంటి చర్యలు తీసుకోకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోందని అర్హులైన అభ్యర్థులు చెబుతున్నారు. -
వైఎస్సార్ విగ్రహం దిమ్మె తొలగింపు
భీమవరం: శాసనసభ్యుడి అనుమతితో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటు చేపడితే, మున్సిపల్ అధికారులు నిర్మాణంలో ఉన్న విగ్రహం దిమ్మెను తొలగించారని వైఎస్సార్సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం పట్టణం ప్రకాశం చౌక్ సెంటర్లో ఇప్పటికే వివిధ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయగా, మరికొన్ని ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా తాము కూడా వైఎస్ విగ్రహం ఏర్పాటు చేయాలని సంకల్పించి, ఎమ్మెల్యే అంజిబాబు దృష్టికి తీసుకెళ్లగా ఏర్పాటుకు అభ్యంతరం లేదనడంతో శుక్రవారం దిమ్మ నిర్మాణం చేపట్టారు. శనివారం ఉదయమే మున్సిపల్ అధికారులు జేసీబీతో దిమ్మను తొలగించడంతో, పార్టీ నాయకులు కలెక్టరేట్లో డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, మునిసిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరాయుడు మాట్లాడుతూ, ప్రకాశం చౌక్ సెంటర్లో అన్ని విగ్రహాలతో పాటే రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటుకు సంకల్పించామన్నారు. దీనిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో అభ్యంతరం లేదని స్పష్టం చేశారని, ఆ మేరకు విగ్రహం ఏర్పాటుకు దిమ్మ నిర్మాణం చేపట్టగా, మున్సిపల్ అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా దిమ్మను తొలగించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి పాలవెల్లి మంగ, యూత్ వింగ్ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, పార్టీ నాయకులు కోడే యుగంధర్, గుంటి ప్రభు, బోకూరి విజయరాజు, కాటం స్టాన్లీ పాల్గొన్నారు. -
యోగాంధ్రలో అవార్డు సాధించాలి
ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా రాష్ట్ర స్థాయిలో అవార్డు పొందేలా యోగాంధ్ర– 2026 కార్యక్రమాన్ని నిర్వహించా లని జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణ సంసిద్ధతపై దిశానిర్దేశం చేశారు. సంబంధిత శాఖల అధికారులతో శనివారం సాయంత్రం జేసీ టెలి కాన్ఫరెన్న్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాస్టర్ ట్రైనర్లు, ట్రైనర్ల నమోదు కార్యక్రమాన్ని వెంటనే పూర్తిచేసి, 7 నుంచి ప్రజలకు శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. యోగాంధ్ర –2026 థీమ్పై రూపొందించిన బ్యానర్ను కార్యక్రమంలో తప్పక ప్రదర్శించాలన్నారు. యోగా ఆవశ్యకత, ఆరోగ్య ప్రయోజనాలపై జూనియర్స్ కేటగిరిలో విద్యార్థులకు ఈ నెల 7, 8, 9 తేదీలలో గ్రామ స్థాయిలో వివిధ విభాగాలలో పోటీల నిర్వహించాలని, పోటీలలో పాల్గొనే వారు తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు కావాలన్నారు. జిల్లాలో 191 మంది మాస్టర్ ట్రైనర్లు నమోదు అయ్యారని, వారితో మండల, గ్రామ స్థాయిలో ట్రైనర్లకు శిక్షణ అందించాలన్నారు. -
వదిన, అత్తలపై కక్షతోనే..
ఏలూరు టౌన్: ఉంగుటూరు మండలం నల్లమాడు గ్రామ శివారు జీడిమామిడి తోటలో జరిగిన జంట హత్యల కేసును ఏలూరు జిల్లా పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాలు, సీడీఆర్ రికార్డుల ఆధారంగా ఛేదించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న కక్షతో పాటు, తీసుకున్న అప్పును ఎగ్గొట్టాలనే దురాశతో ప్రధాన నిందితురాలు ఈ దారుణానికి ప్రణాళిక రచించింది. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఈ వివరాలను వెల్లడించారు. నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన మద్దా వెంకటలక్ష్మి, గంటా ఆంథోబాయి తల్లీ కూతుళ్లు. మే 29న నల్లమాడు సమీపంలోని తోటలో విగతజీవులుగా పడి ఉన్నారు. చేబ్రోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన వెంటనే, ఎస్పీ ఆదేశాలతో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. నిందితుల అరెస్టు పోలీసులు ఈ నెల 5న తాడేపల్లిగూడెం రోడ్డులో పోనమాల శిరీష, కర్రి ప్రసాద్ (బన్ను), ఆశు దుర్గ అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి మృతురాళ్ల బంగారు, వెండి ఆభరణాలు, సెల్ఫోన్లు, హత్యకు ఉపయోగించిన రాళ్లు, మద్యం సీసాలు, గుళికలు కలిపిన టీ చిక్కం, మోటారు సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితురాలు శిరీషకు మృతురాలు వెంకటలక్ష్మి వదిన, ఆంథోబాయి అత్త అవుతారు. తన అక్రమ సంబంధాల గురించి శిరీష భర్తకు వీరు చెప్పారన్న కోపంతో పాటు, ఆంథోబాయి దగ్గర తీసుకున్న రూ. లక్ష అప్పు తీర్చాల్సిన పనిలేకుండా చేయాలనే కుట్రతో ఈ హత్యలకు పథకం వేశారు. మే 29న శిరీష మృతురాళ్లను మభ్యపెట్టి తోటలోకి పిలిపించింది. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం, నిందితురాలు ఆశు దుర్గ మద్యం సీసాలలో నిద్రమాత్రలు కలిపి వారికి తాగించింది. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే, కర్రి ప్రసాద్ సహకారంతో బ్లేడుతో దాడి చేసి, రాళ్లతో తలలను పగలగొట్టి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆధారాలు లేకుండా చేసి పరారయ్యారు. ఈ కేసును వేగంగా ఛేదించిన నిడమర్రు, భీమడోలు, కై కలూరు రూరల్, ఏలూరు టూటౌన్, పెదవేగి సీఐలు, ఎస్ఐలు, ఐటీ కోర్ మరియు ప్రత్యేక బృందాల సిబ్బందిని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ప్రత్యేకంగా అభినందించారు. జంట హత్యల కేసును ఛేదించిన ఏలూరు పోలీసులు -
పోలీసుల పనితీరుపై అవగాహన
దెందులూరు: జిల్లా ఎస్పీ కే.ప్రతాప శివ కిషోర్ దెందులూరు బాల సదన్కు చెందిన 23 మంది బాలికలను ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు శనివారం ఆహ్వానించారు. పోలీసులు సమాజంలో ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారో ఎస్పీ బాలికలకు వివరించారు. ట్రాఫిక్ నిబంధనలపై, మహిళా పోలీసుల పనితీరు గురించి అవగాహన కల్పించారు. బాలికల వ్యక్తిగత భద్రతపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏమిటో పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా వివరించారు. ఆధునిక పోలీసింగ్ పద్ధతులపై బాలికలకు అవగాహన కల్పించే క్రమంలో, ఎస్పీ డ్రోన్ కెమెరాల పనితీరును, నేరాల నియంత్రణలో నిఘాలో వాటి ప్రాముఖ్యతను స్వయంగా చూపించారు. ఉన్నతమైన జీవితాన్ని గడపాలంటే చదువు ఒక్కటే మార్గమని, విద్యార్థి దశ నుండే చదువు పట్ల అంకితభావంతో, ఆసక్తితో ఉండాలని పిల్లలకు దిశానిర్దేశం చేశారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లను 62 డివిజన్లకు పెంచే ప్రక్రియను ఈ నెల 16 వరకు నిలుపుదల చేయాలంటూ హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. డివిజన్ల పెంపుదలకు సంబంధించి మాజీ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపెయ్యి సుధీర్ బాబులు కోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్ ప్రకారం ఈ నెల 4న కోర్టు ఏలూరు కార్పొరేషన్లో డివిజన్ల పెంపుదల ప్రక్రియను నిలుపుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని కోర్టు మూవీ ఫేమ్ హీరోయిన్ శ్రీదేవి శనివారం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆమె ముందుగా స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో పండితుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు, అభిమానులు ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. నూజివీడు: ట్రిపుల్ ఐటీల ప్రవేశాలలో భాగంగా దరఖాస్తు చేసుకున్న ప్రత్యేక కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన నూజివీడు ట్రిపుల్ ఐటీలో రెండోరోజైన శనివారం కొనసాగింది. దీనిలో భాగంగా ఎన్సీసీ కోటాలో 487 మందికి 342 మంది, క్యాప్ కోటాలో 97 మందికి 69 మంది, స్పోర్ట్స్ కోటాలో 164 మందికి 129 మంది కలిపి 748 మంది అభ్యర్థులకు 540 మంది సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరయ్యారు. ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు పరిశీలించారు. కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్, నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య గోపాలరాజు పర్యవేక్షించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): సర్వీస్లో ఉన్న టీచర్లు టెట్ పాస్ కావాల్సిందేనన్న నిబంధనపై పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జాక్టో) ఏలూరు జిల్లా చైర్మన్ పువ్వుల ఆంజనేయులు కోరారు. ఈ విషయమై శనివారం స్థానిక అశోకవర్ధన కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలలో ఉదయం 10 గంటలకు జాక్టో సభ్య సంఘాలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సర్వీసు టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలంటే చట్టసవరణ ఒక్కటే మార్గమని, అందుకు పార్లమెంట్లో విద్యా హక్కు చట్టానికి సవరణ చేయాలని, చట్టసవరణ జరిగే లోపు సర్వీసులో ఉన్న టీచర్లకు ప్రత్యేకంగా ఏడాదికి రెండు దఫాలు టెట్ నిర్వహించాలని తీర్మానం చేశారు. వీటితో పాటు ఉత్తీర్ణత మార్కులు అన్ని కేటగిరీలకు 35 శాతం ఉండాలని, సిలబస్లో కూడా మార్పులు చేసి, ఏ సబ్జెక్టు బోధిస్తున్నారో అదే సబ్జెక్టులో పరీక్ష నిర్వహించాలని తీర్మానం చేశారు. -
దాహం కేకలు
లోసరి చానల్ పరిధిలో తాగునీటికి ఇక్కట్లు భీమవరం: గుక్కెడు నీళ్ల కోసం లోసరి చానల్ పరిధిలోని గ్రామాల ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. వేసవి నేపథ్యంలో కాలువలకు నీరు వదిలి వారం రోజులు గడుస్తున్నా, భీమవరం పట్టణంలోని లోసరి ప్రధాన కాలువపై చేపట్టిన వంతెన పనులు పూర్తికాకపోవడంతో, కాలువకు వేసిన అడ్డుకట్ట తొలగించలేదు. దీనివల్ల దిగువ గ్రామాలకు నీటి సమస్య ఏర్పడింది. సుమారు 20 రోజుల క్రితమే పలు గ్రామాల్లోని మంచినీటి చెరువులు అడుగంటడంతో, ప్రజలు దూరప్రాంతాలకు వెళ్లి నీటిని కొనుగోలు చేసుకుని దాహార్తిని తీర్చుకుంటున్నారు. మరికొన్ని గ్రామాల్లో చెరువుల్లోని నీరు పాచిపట్టి, దుర్వాసన వస్తుండటంతో వాడకానికి కూడా పనికిరాకుండా పోయాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువకు నీటిని విడుదల చేస్తే తమ సమస్య తీరుతుందని ఆశించిన ప్రజలకు, ఈ వంతెన నిర్మాణ పనులు అడ్డంకిగా మారాయి. గత ప్రభుత్వ హయాంలో యనమదుర్రు కాలువపై నిర్మించిన వంతెనలకు అప్రోచ్ రోడ్లు లేకపోవడంతో అవి నిరుపయోగంగా మిగిలిపోయాయి. అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనా సాంకేతిక కారణాలతో పనులు ప్రారంభం కాలేదు. ఇటీవల ప్రభుత్వం రూ.24 కోట్లు మంజూరు చేయడంతో, ఏప్రిల్ నెలలో భీమవరం డీఎన్నార్ కళాశాల సమీపంలో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే, పనులు నత్తనడకన సాగుతుండటంతో నేటికీ కనీసం పిల్లర్ల పనులు కూడా పూర్తికాలేదు. దీనివల్ల గొల్లవానితిప్ప, తోకతిప్ప, గూట్లపాడు, కొత్తపూసలమూరు, దొంగపండి, లోసరి, గొంది, బర్రెవానిపేట తదితర గ్రామాలకు నీరు చేరక, మంచినీటి చెరువులు నింపుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అడుగంటిన చెరువుల్లోని కలుషిత నీటిని సరఫరా చేయడం వల్ల తాము అనారోగ్యం పాలవుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వంతెన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, లేనిపక్షంలో కాలువ నీటిని ప్రత్యామ్నాయ మార్గంలో మళ్లించాలని కోరుతున్నారు. వంతెన పనుల కారణంగా నీటి విడుదలకు ఇబ్బంది ఏర్పడింది. బెడ్ లెవెల్ పనులను త్వరితగతిన పూర్తి చేయించి, నీటి పారుదలకు ఆటంకం లేకుండా ఏర్పాటు చేస్తాం. రెండు రోజుల్లో అడ్డుకట్ట తొలగించి నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకుంటాం. – అడబాల శ్రీనివాస్, ఆర్అండ్బీ ఈఈ -
అక్రమంగా విద్యాసామగ్రి విక్రయాలు
భీమవరం: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో విద్యార్థులకు పుస్తకాలను విక్రయిస్తున్నారనే ఫిర్యాదుతో శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు తనిఖీ నిర్వహించారు. పుస్తకాలు ఉన్న గదిని గుర్తించి సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు సాయి కృష్ణ మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి అధిక ఫీజులు, విద్యా సామగ్రి విక్రయాలతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారన్నారు. శ్రీచైతన్య స్కూల్లో అక్రమంగా విద్యాసామగ్రి విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ నాయకులు బి.సింధు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
థర్మాకోల్ లోడు లారీ దగ్ధం
ఉండి: మండలంలోని పాములపర్రు గ్రామంలో శుక్రవారం జరిగిన విద్యుత్ ప్రమాదంలో థర్మాకోల్ లోడు లారీ దగ్ధమైంది. స్థానికులు,అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ధర్మకోల్ లోడుతో గణపవరం నుంచి ఆకివీడు బయలుదేరిన లారీ పాములపర్రులోని పెదకాపవరం రోడ్డులోకి వెళ్లింది. రోడ్డులోకి తిరిగిన కొద్ది దూరంలోనే లారీకి విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా లారీలోని థర్మాకోల్కు మంటలు అంటుకుని పెద్దగా వ్యాపించాయి. ఇది గమనించని లారీ డ్రైవర్ ముందుకు వెళ్లడంతో స్థానిక మహిళలు గట్టిగా కేకలు వేశారు. దీంతో లారీ డ్రైవర్ లారీలో నుంచి కిందికి దూకేశాడు. అదే ప్రాంతంలో రోడ్డును ఆనుకుని ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు లారీ తాకడంతో ప్రమాదం మరింత పెద్దదైంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో పాటుగా నల్లని పొగ గ్రామమంతా అలముకోవడంతో ప్రజలు భయబ్రాంతులకు గురైయ్యారు. సమాచారం అందుకున్న ఆకివీడు అగ్నిమాపక అధికారి వెంకటేశ్వరరావు తన సిబ్బందితో ప్రమాదస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని ఆయన అంచనా వేశారు. -
గోదావరిలో స్నానానికి వెళ్లి యువకుడి మృతి
పెనుగొండ: గోదావరిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ జారి పడి ఓ యువకుడు మరణించాడు. వివరాల్లోకి వెళితే కరుగోరుమిల్లి పుష్కరాల రేవులో స్నేహితులతో కలసి వల్లూరు గెద్దాడ వారి పాలెంకు చెందిన జక్కంశెట్టి భానుప్రసాద్(18) స్నానానికి వెళ్లాడు. అయితే మధ్యాహ్నం రెండుగంటల సమయంలో ప్రమాదవ శాత్తు జారి పడిపోవడంతో గల్లంతయ్యాడు. స్నేహిహితులు రక్షించడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది, దీంతో స్థానికులు, పోలీసులు, పాలకొల్లు అగ్నిమాపక సిబ్బంది కలసి గాలించగా సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మృత దేహాం లభ్యమైంది. దీంతో బంధువుల ఆర్తనాదాలు స్థానికులను కలచివేశాయి. మృతుడి బావ దొంగ విఘ్నేశ్వరరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కట్టా వెంకట రమణ తెలిపారు. ఏలూరు టౌన్: జిల్లాలో ఆపరేషన్ రిస్టోర్లో భాగంగా తమ విలువైన మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన వాటిని ఎంతో శ్రమించి రివకరీ చేసి శుక్రవారం బాధితుల ఇంటివద్దకే వెళ్లి పోలీసులు అందజేశారు. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో ఆపరేషన్ రిస్టోర్లో ఏలూరు సైబర్సెల్ సీఐ దాసు తమ టెక్నికల్టీమ్తో ఏలూరు జిల్లాలో సుమారు 322 మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. ఈ సెల్ఫోన్ల విలువ సుమారుగా రూ.60 లక్షల 40 వేలు ఉంటుందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు పోలీస్ సబ్డివిజన్ల పరిధిలో పోలీస్ అధికార యంత్రాంగం నేరుగా బాధితుల ఇళ్లకే వెళ్లి సెల్ఫోన్లు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులపై దర్యాప్తు చేపట్టి మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్తో కొద్దిరోజుల్లోనే 322 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులో వన్టౌన్ సీఐ రామకృష్ణ బాధితుల ఇంటికి వెళ్లి ఫోన్లను అందజేయడంతో వారు పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఖతార్ దోహాలో హోమ్కేర్ నర్స్ రంగంలో ఉద్యోగావకాశాల కోసం దరఖాస్తులు కోరుతున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్.జితేంద్రబాబు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. 21 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న పురుషులు, సీ్త్రలు ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు. అలాగే 2 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థుల నుంచి 2 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని వివరించారు. నెలకు సుమారుగా రూ.1,30,000 వరకు జీతం ఉంటుందని స్పష్టం చేశారు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్, సంబంధిత ఎడ్యుకేషన్ సర్టిఫికెట్, అనుభవం ధ్రువీకరణ పత్రాలు, గుడ్ స్టాండింగ్ సర్టిఫికెట్, గ్రాడ్యుయేషన్ అటెస్టేషన్ సమర్పించాలని కోరారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నైపుణ్యం వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని లేదా హెల్ప్లైన్ నెంబర్ 9988853335కు ఫోన్ చేయాలని కోరారు. -
నవధాన్యాల సాగు.. పంటలకు బాగు
ముసునూరు : రసాయన ఎరువుల వాడకంతో భూసారం క్షీణించడంతో పాటు పర్యావరణ కాలుష్యం ఏర్పడి రైతులకు సాగు ఖర్చు పెరగడమే కాక దిగుబడులపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో నేల ఆరోగ్యం, ఉత్పాదక శక్తి పెంపు, సేంద్రియ ఎరువుల వినియోగంపై అవగాహన పెరగడంతో పచ్చిరొట్ట సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు పశువుల ఎరువులు, వర్మీ కంపోస్ట్ కొరత, ధరలు అధికం కావడంతో రైతులు పచ్చి రొట్ట ఎరువుగా నవధాన్యాల సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న ఎల్నినో ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రకృతి వ్యవసాయంలో నవధాన్యాల సాగు బాగా దోహదపడుతుంది. దీనికి అనుగుణంగానే ప్రకతి వ్యవసాయ శాఖ అధికారులు నవధాన్యాల పంటల సాగుపై అవగాహన కల్పించి, విత్తనాలిచ్చి, రైతులను ప్రోత్సహిస్తున్నారు. నవ ధాన్యాల రకాలు వరి, గోధుమ, ఉలవ,పెసలు,కందులు, నువ్వులు, అనుములు,మినుములు, శెనగలు. వీటితోపాటు పచ్చిరొట్ట కోసం జొన్నలు, మొక్కజొన్నలు, సజ్జలు, జనుము, జీలుగ, పిల్లిపెసర, రాగులు, తదితర చిరు ధాన్యాలు కూడా పచ్చిరొట్ట సాగు కోసం వినియోగించుకోవచ్చు. ప్రయోజనాలివే ● నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. నేల కోతను నివారించి నష్టాన్ని తగ్గిస్తుంది. ● నవధాన్యాల విత్తనాలు ఎక్కువ రకాలుగా చల్లడం వల్ల మొక్కలు సన్నగా ఎదిగి, నేలలో కలియ దున్నినప్పుడు వేగంగా కుళ్లి, నేలలో కలిసిపోతాయి. దీంతో నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. ● నేలలో ఉండే ప్రయోజనకర సూక్ష్మజీవుల సంఖ్యను మెరుగుపరుస్తుంది. ● వేర్లు భూమిలో ఎక్కువ లోతుకు వెళ్లడం వల్ల నేలను అధికంగా గుల్లబారేలా చేస్తుంది. ● రసాయన ఎరువుల వాడకాన్ని 35 నుంచి 45 శాతం వరకు తగ్గించడంలో సహాయపడతాయి. ● కలుపు మొక్కలను తగ్గించడంలోనూ సహాయపడతాయి. పశువుల మేతగా కూడా వాడవచ్చు. పచ్చిరొట్టను కలిపే విధానం పళ్లెపు నాగలితో పంటకు 60 నుంచి 80 రోజుల వ్యవధి వచ్చినపుడు నవ ధాన్యాల రొట్టను కలియ దున్నడం వల్ల మట్టిలో బాగా కలిసి పోతుంది. రోటవేటర్ ను ఉపయోగిస్తే జీవ పదార్ధం వేగంగా కుళ్లిపోతుంది. పాడి–పంటనవధాన్యాల పచ్చిరొట్టను పెంచి పొలంలో కలియదున్నడం ద్వారా పుష్కలమైన పోషకాలు పంటకు అందుతాయి. దీని వల్ల పంట సాగు ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధిస్తారు. ప్రకతి సేద్యం విభాగం ద్వారా నవ ధాన్యాల విత్తన పంపిణీ కొనసాగుతోంది. రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – ఆలూరు చాముండేశ్వరి, మండల వ్యవసాయ శాఖాధికారి, ముసునూరు -
పరాయి పంచన డీఐఈఓ కార్యాలయం
భీమవరం: విద్యకు పెద్ద పీట వేస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేస్తున్నా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ కార్యాలయానికి సొంత గూడు, సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయానికే సొంతగూడు లేక పరాయి పంచన కాలక్షేపం చేస్తుంటే ఇంటర్మీడియట్ విద్యాశాఖ నిర్వహణ ఎలా ఉంటుందో? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు రెండు ఎయిడె డ్, రెండు సోషల్ వెల్ఫేర్, సుమారు 82 ప్రైవేటు కళాశాలలున్నాయి. ఇవికాక ఈ ఏడాది మరికొన్ని జూనియర్ కళాశాలల ఏర్పాటుకు అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఇంటర్మీడియట్ విద్య నిర్వహణకు జిల్లా కేంద్రమైన భీమవరంలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యాలయానికి సొంత భవనం లేక కొంతకాలంగా పట్టణంలోని గ్రంధి వెంకటేశ్వరరావు(జీవీఆర్) ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలోని చిన్న గదిలో తాత్కాలికంగా కార్యాలయం ఏర్పాటు చేసుకుని విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరితో నెట్టుకొస్తున్న వైనం ఇంటర్మీడియట్ కార్యాలయంలో జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారితో (డీఐఈఓ)పాటు సూపరింటెండెంట్, యూడీసీ, ఎల్డీసీ, ఏవో, అటెండర్ వంటి సుమారు 15 మంది వరకు సిబ్బంది పని చేయాల్సి ఉంది. అయితే ఇక్కడ సూపరింటెండెంట్, యూడీసీ, డిప్యూటేషన్పై అటెండర్ మాత్రమే పని చేస్తున్నారు. ఇటీవల సూపరింటెండెంట్, యూడీసీలకు పదోన్నతులు లభించడంతో రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. దీంతో ప్రస్తుతం డీఐఈఓ, అటెండర్తోనే కాలక్షేపం చేస్తున్నారు. దీంతో కొత్తగా కళాశాల ఏర్పాటుకు అనుమతులు, అడ్మిషన్స్, ఇంటర్ పరీక్షల నిర్వహణ వంటి వాటిని పర్యవేక్షించడం వారికి తలకుమించిన భారంగా మారింది. సొంత భవనం లేక ఇబ్బందులు జిల్లాలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. అనుమతులు లేని విద్యాసంస్ధలకు ప్రజాప్రతినిధులే ప్రారంభోత్సవాలు చేయడం దీనికి నిదర్శనంగా ఉందని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రవేటు విద్యాసంస్ధలను నడుపుతున్న యాజమాన్యాలపై అధికారులు మెతకవైఖరే దీనికి కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని 20 మండలాల పరిధిలో అనేక ప్రైవేటు పాఠశాలలు, కళాశాలు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే నడుపుతున్నారు. ఒక్క భీమవరం పట్టణం, భీమవరం మండలాల్లోనే 48 ప్రైవేట్ పాఠశాలలకుగాను 25 పాఠశాలలకు ప్రస్తుత విద్యాసంవత్సరానికి ఎలాంటి అనుమతులు లేవు. అలాగే ప్రస్తుత విద్యాసంవత్సరానికి జిల్లాలో 7 నూతన కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నట్లు విద్యాశాఖ చెబుతుంది. అయితే వీటికి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అనుమతులు రాకుండానే పెద్ద సంఖ్యలో విద్యార్థులను చేర్చుకుంటుండగా వారి వద్ద నుంచి ఫీజుల రూపంలో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భీమవరం పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేస్తున్న కళాశాలను పలువురు ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవం చేయడం విశేషం. గత కొంతకాలంగా భీమవరం పట్టణంలోని జీవీఆర్ ప్రభుత్వం జూనియర్ కళాశాలలోని చిన్నపాటి గదిలో కార్యాలయాన్ని నిర్వహిస్తున్న అధికారులు పరీక్షల నిర్వహణకు ఇబ్బందిగా ఉండడంతో క్యాంప్ను తాత్కాలికంగా పట్టణంలోని కేజీఆర్ఎల్ కళాశాల ఆవరణలోకి మార్చారు. ఈ నెల 6 నుంచి జూనియర్ కళాశాలలు నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న తరుణంలో అనేక ప్రైవేట్ కళాశాలలో ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు వసూలు, కళాశాలల వద్దనే బుక్స్, విద్యాసామాగ్రి వంటివి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే డీఐఈఓ కార్యాలయానికి తగిన సిబ్బంది, అనుకూలమైన కార్యాలయం భవనం లేకపోవడం చూస్తుంటే వీరి పర్యవేక్షణ ఎలా ఉంటుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కలెక్టరేట్లో సముదాయంలోనే జిల్లా విద్యాశాఖ కార్యాలయం నిర్వహిస్తుండగా డీఐఈఓ కార్యాలయం ఎవరికీ అంతగా అందుబాటులో లేని చోట నిర్వహించడం వెనుక ఆంతర్యం అంతుబట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయడం మేలు
పెనుమంట్ర: దేశంలో ప్రస్తుతం వరి ఉత్పత్తి అవసరాలకు మించి పెరిగిందని, అందువల్ల రైతులు వరికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేయాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి పీవీ సత్యనారాయణ అన్నారు. మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో శుక్రవారం సార్వా విత్తన దినోత్సవం, ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు కేవలం 55 లక్షల టన్నుల బియ్యం సరిపోతాయని, మన రాష్ట్ర ఉత్పత్తి 90 లక్షల టన్నులకు పైచిలుకు ఉందని తెలిపారు. వరి సాగు విస్తీర్ణాన్ని క్రమంగా తగ్గించి, ఆ స్థానంలో నూనె గింజలు, పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సూచించారు. దీని ద్వారా దేశంలో వంటనూనెల దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతో పాటు, పప్పుధాన్యాల ఉత్పత్తి పెరిగి పోషకాహార భద్రత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. పురుగు మందుల వాడకాన్ని తగ్గించాలి అలాగే రైతులు రసాయన ఎరువులు, పురుగు మందులను విచక్షణారహితంగా ఉపయోగించడం వలన నేల ఆరోగ్యం క్షీణిస్తుందని సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం భూ సారాన్ని కాపాడటానికి ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ పథకంలో భాగంగా జూన్ 1 నుంచి 30 వరకు క్షేత్ర స్థాయిలో రసాయన ఎరువులు తగ్గించడం, జీవన ఎరువులు, సేంద్రియ ఎరువుల వాడకం పెంచడం వంటి విషయాలపై రైతులకు అవగాహన కల్పించాలని శాస్త్రవేత్తలను ఆదేశించారు. సహ పరిశోధనా సంచాలకుడు సీహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను ఉపయోగించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. వరి శాస్త్రవేత్త ఎం.గిరిజా రాణి మాట్లాడుతూ వివిధ వాతావరణ పరిస్థితులు, మార్కెట్ అవసరాలకు అనువైన వరి వంగడాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం బుట్టాయగూడెం పరిసర గ్రామాల నుంచి వచ్చిన 50 మంది గిరిజన రైతులకు గిరిజన ఉపప్రణాళికా పథకంలో భాగంగా ఎంటీయూ 1318 ఫౌండేషన్ విత్తనం ఉచితంగా అందజేశారు. -
తాడిచెట్టు పడి వ్యక్తి మృతి
భీమవరం: ఎండ వేడిని తట్టుకోలేక ఆరుబయట కూర్చున్న వ్యక్తిపై తాడిచెట్టుపడి మృతి చెందిన ఘటన భీమవరం గరువుపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. భీమవరం వన్టౌన్ ఎస్సై బీవై కిరణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని 11వ వార్డు గరువుపేటకు చెందిన పాలపర్తి రాజ్ కుమార్ (29) క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి వివాహం కాగా భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్ సరఫరా లేకపోవడంలో ఇంట్లో వేడిని భరించలేక రాజ్కుమార్ తన ఇంటి ముందు ఖాళీ స్థలంలో మంద్రు సత్తి, ఏలేటి జీవరత్నం, పాలపర్తి చిన్ని మరికొందరితో కలిసి కూర్చున్నాడు. అయితే నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షం, ఈదురు గాలుల వల్ల ఖాళీ స్థలంలో ఉన్న తాటి చెట్టు వంగిపోయి బలహీనమైంది. శుక్రవారం మధ్యాహ్నం వీచిన గాలికి తాటి చెట్టు విరిగి రాజ్ కుమార్పై పడడంతో వెంటనే స్పహ కోల్పోయాడు. ఈ ప్రమాదంలో మంద్రు సత్తి కాలుకు గాయమైంది. బాధితులను వెంటనే బంధువులు ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రాజ్కుమార్ మరణించినట్లు ధ్రువీకరించారు. పాలపర్తి చిన్నరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కిరణ్ కుమార్ చెప్పారు. -
ఎఫ్టెక్
భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక మునిసిపల్ కార్యాలయంలో మునిసిపల్ నిధులు (ప్రజాధనం) రూ.5 లక్షల నుంచి 6 లక్షలు నిధులతో ఇండోర్ క్రికెట్ నెట్ అధికారుల కోసం ఏర్పాటు చేస్తున్నారని దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఇటీవల సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన మునిసిపల్ అధికారులు ప్రత్యేక అధికారి మునిసిపల్ నిధులు వదులుకుని దాతలను ఆశ్రయించి క్రికెట్ నెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. మోతుగూడెం: చింతూరు మండలం పొల్లూరు పిక్నిక్ స్పాట్ వద్ద స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తూ జారిపడి ఎం.అఖిల్ (24) అనే యువకుడు మృతి చెందాడు. మృతుడి స్వస్థలం ఏలూరు జిల్లా కామవరపుకోట. మృతుడు ఫొటోగ్రాఫర్గా పని చేస్తున్నాడు. పదిమంది స్నేహితులతో విహార యాత్రకు వచ్చి పొల్లూరు పిక్నిక్ స్పాట్ వద్ద స్నానాలకు దిగి గల్లంతయ్యాడు. అప్రమత్తమైన స్నేహితులు గాలించగా అప్పటికే చనిపోయాడు. విషయం తెలుసుకున్న మోతుగూడెం ఎస్సై నాజర్ హుస్సేన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని చింతూరు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పెనుగొండ : సీఎం చంద్రబాబు ఈ నెల 9న సిద్ధాంతంలో పర్యటించనుండడంతో జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. 9న జరిగే సభలో రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. దీంతో శుక్రవారంస్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, జాయింట్ కలెక్టరు టి రాహూల్ కుమార్ రెడ్డితో కలసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఏర్పాట్లు నిర్ణీత గడువులో పూర్తి చేసి పర్యటను విజయవంతం చేయడానికి సిద్ధం గా ఉండాలని అధికారులను జిల్లా కలెక్టరు ఆదేశించారు. భీమవరం: ఆంధ్రప్రదేశ్ 16వ హాకీ సీనియర్ రాష్ట్రస్ధాయి టోర్నమెంట్కు జిల్లా హామీ జట్టు ఎంపికను ఈనెల 8న నిర్వహిస్తున్నట్లు హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కలిదిండి ఆనందరాజు, వివేక్ సత్యభారత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. భీమవరం సెయింట్ మేరీస్ హైస్కూల్ ఆవరణలో సోమవారం ఉదయం 7 గంటలకు ఎంపిక ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడకారులు 1992 జనవరికి ముందు జన్మించి ఉండాలని స్పష్టం చేశారు. ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు ఎస్ఎస్సీ మార్కుల జాబితా, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్ తీసుకురావాలని; ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 12 నుంచి నాలుగు రోజులపాటు ధర్మవరంలో నిర్వహించే రాష్ట్రస్థాయి టోర్నమెంట్ పాల్గొంటారని వివరించారు. ద్వారకాతిరుమల: స్థానిక సొసైటీ పెట్రోల్ బంకు సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధుడు తీవ్ర గాయాలు పాలయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం. మండలంలోని కొమ్మర గ్రామానికి చెందిన మానుకొండ ధర్మరాజు మధ్యాహ్నం ద్వారకాతిరుమలకు వచ్చి, పనులు ముగించుకుని తన టీవీఎస్ ఎక్సెల్ మోపెడ్పై స్వగ్రామానికి వెళుతున్నాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి మోపెడ్ అదుపు తప్పడంతో ధర్మరాజు రోడ్డుపై పడిపోయాడు. దాంతో అతడి తలకు, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 ఆంబులెన్స్ ఈఎంటీ వెంకట్, పైలెట్ సుధాకర్లు క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స చేసిన అనంతరం స్థానిక పీహెచ్సీకి తరలించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని ముస్లింలు, బీజేపీ, విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ నాయకులతో కలిసి జంగారెడ్డిగూడెం బోసు బొమ్మ సెంటర్లో మానవహారంగా ఏర్పడి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో గౌరవంగా పూజించుకునే గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లింలు కోరడం అభినందనీయమన్నారు. జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు మొహమ్మద్ అబ్దుల్ నబీ మాట్లాడుతూ అంతా సమైక్యతతో ఉండి ఆవును కూడా జాతీయ జంతువుగా ప్రకటించే ప్రయత్నం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు కొప్పాక శ్రీనివాసరావు, విశ్వహిందూ పరిషత్ నాయకులు తిప్పాభట్ల రామకృష్ణ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాజీ జిల్లా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ షేక్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు ప్రభుత్వ మోసాలపై నిలదీద్దాం
మండవల్లి: చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలుపై గట్టిగా నిలదీద్దామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) కార్యకర్తలకు పిలుపునిచ్చా రు. మండవల్లి సెంటర్లో దివంగత వైఎస్సార్ వి గ్రహం వద్ద మండల పార్టీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి శ్రీ రామదుర్గాప్రసాద్ (రాము), మండల పార్టీ అధ్యక్షుడు బేతపూడి ఏశావురాజు ఆధ్వర్యంలో శుక్రవా రం చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమా న్ని నిర్వహించారు. డీఎన్నార్ మాట్లాడుతూ కూట మి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా.. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నా రు. ఈ సందర్భంగా కూటమి ఎన్నికల మేనిఫెస్టో, చంద్రబాబు, పవన్కల్యాణ్ ఫొటోలతో సంతకాలు పెట్టి పంచిన బాండ్ల కాపీలను దహనం చేశారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన, మహిళలకు ప్రతి నెలా రూ.1,500 ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తక్షణమే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
ఏలూరు (టూటౌన్): పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జి చైర్మన్, రెండో అదనపు జిల్లా జడ్జి ఎం. మీనాదేవి అన్నారు. శుక్రవారం ప్రపంచ ప ర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతిని రక్షించడం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ఇది ప్రజలందరి బాధ్యత అన్నారు. మొక్కలు పెంచడం, నీరు, విద్యుత్ ఆదా, చెత్త రీసైక్లింగ్ను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణాన్ని రక్షించవచ్చన్నారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా ఇన్చార్జి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ప్రమీలరాణి, 4వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి, ఎకై ్సజ్ మెజిస్ట్రేట్ కె.స్పందన, బార్ అసోసియేషన్ ప్రె సిడెంట్ కొనే సీతారాం, ప్యానెల్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఆఖరి రోజు ఇంగ్లిష్ పరీక్షకు 1,043 మంది విద్యార్థులకు 438 మంది హాజరయ్యారు. అధికారులు 13 కేంద్రాల్లో తనిఖీలు చేశారని, ఎలాంటి మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 3,952 మంది ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు శుక్రవారం 3,952 మంది విద్యార్థులు హా జరయ్యారు. ఉదయం 32 కేంద్రాల్లో ఫస్టియర్ ఎకనామిక్స్ పరీక్షకు 901 మందికి 795 మంది, ఒకేషనల్ విద్యార్థులు 756 మందికి 622 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 31 కేంద్రాల్లో సెకండియర్ మ్యాథ్స్–2బీ పరీక్షకు 2,217 మందికి 2,043 మంది, 645 మంది ఒకేషనల్ విద్యార్థులకు 492 మంది హాజరయ్యారని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె. యోహాన్ తెలిపారు. నేడు క్వాలిఫయింగ్ పరీక్ష శనివారం ఇంటర్మీడియెట్ క్వాలిఫయింగ్ పరీక్ష (పర్యావరణ విద్య)ను 60 కేంద్రాల్లో 449 మంది విద్యార్థులకు నిర్వహించనున్నారు. ఆదివారం నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభమవుతాయి. నూజివీడు: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు ప్రత్యేక కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన శుక్రవారం నూజివీడు ట్రిపుల్ఐటీలో ప్రా రంభమైంది. ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ ఆ చార్య మద్దాలి లక్ష్మీ నారాయణరావు మాట్లాడుతూ ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో దరఖాస్తు చేసిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నామన్నారు. తొలిరోజు 749 మంది విద్యార్థులకు 511 మంది హాజరయ్యా రు. రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, నూజివీడు ట్రిపుల్ఐటీ డైరెక్టర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు, డీన్ అకడమిక్ సాదు చిరంజీవి, పరిపాలనాధికారి బి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్మీడియెడ్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష పేపర్ల మూల్యాంకనం ఆదివారం నుంచి ప్రారంభించనున్నట్టు ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోమాన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆంగ్లం, హిందీ, చరిత్ర, గణితం, సంస్కృతం, తెలుగు, బోటనీ, రసాయనశాస్త్రం, సివిక్స్, కామర్స్, ఫిజిక్స్, జువాలజీ సబ్జెక్టులకు జవాబుపత్రాల మూల్యాంకనం స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమవుతుందన్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు కలిపి 12 సబ్జెక్టులకు నియమించిన చీఫ్ ఎగ్జామినర్లు, ఎగ్జామినర్లు అదే రోజు ఉదయం 10 గంటలకు, స్క్రూటినైజర్లు సోమవారం ఉదయం 10 గంటలకు మూల్యాంకన కేంద్రంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. విధులకు హాజరుకాకుంటే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఖరీఫ్ సాగుకు పటిష్ట ప్రణాళిక
ఏలూరు (టూటౌన్): జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతులకు ఇబ్బంది కలగకుండా పటిష్ట ప్రణాళిక రూ పొందించుకుని అమలు చేయాలని పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా సమీక్షా కమిటీ సమావేశాన్ని ఆయన అధ్యక్షతన నిర్వహించారు. గత సమావేశంలో ప్రజాప్రతినిధు లు తెలిపిన అంశాలపై తీసుకున్న చర్యలు, ఖరీఫ్ సంసిద్ధత, వ్యవసాయ, అనుబంధ రంగాలు, పీఎం సూర్య ఘర్ యోజన ప్రగతి, ఫుడ్ ప్రాసెసింగ్ యూ నిట్ల ఏర్పాటు, జలధార, ఇరిగేషన్ ఓ అండ్ ఎం పనుల ప్రగతి తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మా ట్లాడుతూ జిల్లా ఖరీఫ్ ప్రారంభమైందని, విత్తనా లు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పేదలకు మంజూరు చేసిన ఇళ్లలో 16 వేల మంది లబ్ధిదారులు నిర్మాణ పనులు ప్రా రంభించలేదని, వాటిని రద్దు చేయాలన్నారు. కలెక్టర్ మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్కుమార్, పత్సమట్ల ధర్మరాజు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. -
పంచాయతీ కార్మికుల ఆకలికేకలు
● పారిశుద్ధ్య సేవల్లో వీరే కీలకం ● నెలల తరబడి వేతనాలు అందక ఆందోళన భీమవరం: స్వచ్ఛాంధ్ర.. క్లీన్ స్వీప్ అంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు చీపుర్లు పట్టి ఫొటోలకు ఫోజులిస్తుంటే గ్రామాల్లో నిరంతరం రోడ్లు, డ్రెయిన్లు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్ వెహికల్స్ డ్రైవర్లు, పంపు ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు నెలల తరబడి జీతాలందక అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో 406 పంచాయతీల్లో వందలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. దాదాపు 200 పంచాయతీల్లో సుమారు మూడు వేల మంది కాంట్రాక్ట్ టెండర్ పద్ధతిలో సేవలందిస్తున్నారు. రోజూ తెలవారక ముందే రోడ్లను శుభ్రం చేయడం, చెత్తను ట్రాక్టర్, ఆటోరిక్షాల్లో ఎక్కించి దూరప్రాంతాలకు తరలించడం, డ్రెయినేజీలను శుభ్రం చేయడం వంటి పనులు చేస్తున్నారు. రోజంతా కష్టపడ్డా.. రోజంతా వీరు సేవలందించినా నెలకు రూ.15 వేల వేతనం మాత్రమే అందు తోంది. జిల్లాలో పెనుగొండ, అత్తిలి, ఉండి, వీరవాసరం, రేలంగి, ఇరగవరం, రాయకుదురు వంటి మేజర్ పంచాయతీల్లో సుమారు 30 మంది వరకు పనిచేస్తున్నారు. వీరంతా ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా మస్తర్లు వేయాల్సి ఉంటుంది. ఒకపూట పనికి వెళ్లకపోయినా వేతనంలో కోత విధిస్తారు. ఇదిలా ఉండగా కొన్ని పంచాయతీల్లో తొమ్మిది నెలలుగా కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు. మరికొన్ని పంచాయతీల్లో మూడు నుంచి ఆరు నెలల వేతన బకాయిలు ఉన్నాయి. సామగ్రి భారం : ఓ పక్క వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్న కార్మికులపై గోరు చుట్టుపై రోకలి పోటు మాదిరిగా పారిశుద్ధ్య పనులకు వినియోగించే చీపుర్లు, పారలు వంటి పనిముట్ల భారం పడుతోంది. వీరు సొంత ఖర్చులతో వీటిని కొనుగోలు చేసి విధులు నిర్వహించాల్సి వస్తోందది. కొన్ని పంచాయతీల్లో కార్మికులందరికీ ఒకేరకంగా వేతనాలు ఇస్తున్నా పని కేటాయింపులో వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వేతనాలు అందకపోవడంతో ఇటీవల పెనుగొండ పంచాయతీ సిబ్బంది ఆందోళనకు దిగారు. అలాగే యలమంచిలి మండలంలో మేడపాడు పంచాయతీ సిబ్బంది సమావేశమై తక్షణం జీతాలు ఇవ్వకుంటే సమ్మె బాట పట్టాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యమని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ చెబుతున్నా క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి మాత్రం చొరవ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. అరకొర జీతాలతో జీవితాలు నెట్టుకొస్తున్న పంచాయతీ పారిశుద్ధ్య, ఇతర కార్మికులకు నెలల తరబడి జీతాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణం ప్రభుత్వం జీతాలు చెల్లించాలి. – ఎం.ఆంజనేయులు, ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు జిల్లాలో కార్మికులు సమస్యలతో సతమతమవుతున్నారు. కొన్ని పంచాయతీల్లో ఏడాది కాలంగా జీతాలు ఇవ్వడం లేదు. చీపుర్లు, పారలు వంటివి కూడా కార్మికులే కొనుగోలు చేసుకోవడం భారంగా మారింది. – మానుకొండ శివరావు, యూనియన్ జిల్లా అధ్యక్షుడు -
ఎత్తిపోతల పథకం అధ్యక్షుడి మార్పుపై నిరసన
పోలవరం రూరల్: మండలంలోని 2600 ఎకరాలకు సాగునీరు అందించే గూటాల ఎత్తిపోతల పథకం ప్రస్తుత అధ్యక్షుడిని మార్చడంతో ఆ పథకం వద్ద శుక్రవారం సాయంత్రం రైతులు నిరసన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా ఈ పథకం అధక్షుడిగా కరిబండి శ్రీను కొనసాగుతుండగా, మరో వ్యక్తిని కొత్తగా అధ్యక్షుడిగా నియమించాలని అధికారులకు నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఆదేశాలు ఇవ్వడంతో రైతులు సమావేశమయ్యారు. అధ్యక్ష స్థానంలో శ్రీనునే కొనసాగించాలని ఏపీఎస్ఐడీసీ ఏఈ సురేంద్రకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ అన్ని ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని తెలిపారు. ఆందోళన స్థలి వద్దకు సీఐ కృష్ణకుమార్, ఎస్సై అప్పారావులు చేరుకుని రైతుల సమస్యలను తెలుసుకున్నారు. -
28న లక్ష మందితో సభ
భీమవరం: డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు వైఖరి కారణంగా రాష్ట్రంలోని సుమారు 1.10 కోట్ల మంది దళితులు, దళిత క్రైస్తవులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జై భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడా శ్రవణ్కుమార్ అన్నారు. శుక్రవారం భీమవరం అంబేడ్కర్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. రఘురామకృష్ణంరాజు వ్యవహార శైలికి నిరసనగా అల్టిమేటం ఇవ్వడానికి ఈనెల 28న ఏలూరులో లక్ష మంది దళితులు, దళిత క్రైస్తవ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు చెప్పారు. రాజ్యాంగ హోదాలో ఉన్న రఘురామకృష్ణంరాజు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు రద్దు చేయా లని హైకోర్టులో కేసులు ఎలా వేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో 113 చర్చిలను తొలగించాలని, చర్చిలపై మైకులను తీసివేయాలని డీజీపీకి రఘురామకృష్ణంరాజు ఏ అధికారంతో లేఖ రాశారో చెప్పాలన్నారు. రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆయన్ను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రఘురామకృష్ణంరాజు దళం పేరుతో కొందరు అర్ధరాత్రు లు తిరుగుతున్నారని, దళిత శ్మశానాల్లో సమాధులు ఎవరికి కట్టారు, ఏ సమాధులపై సిలువ గుర్తులున్నాయో ఫొటోలు తీస్తున్నారన్నారు. దళితులు, దళిత క్రైస్తవుల ఓట్లు వద్దని చెబుతున్న డిప్యూటీ స్పీకర్ వారు కడుతున్న పన్ను నుంచి జీతంగా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. అనంతరం బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఏపీ బహుజన జేఏసీ నాయకులు పాల్గొన్నారు. -
జనగణన పూర్తి చేయని అధికారులపై చర్యలు
ఏలూరు (టూటౌన్): జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేసి నివేదిక స మర్పించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. జనగణనపై శుక్రవారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్దేశిత సమయంలోపు జనగణనను పూర్తిచేయాల్సిన బాధ్యత తహసీల్దార్లదేనని, పూర్తిచేయని అధికారులపై చర్యలు తీసుకుంటానని హె చ్చరించారు. రాష్ట్ర, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో జనగణనలో ఎన్యూమరేటర్లు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. జేసీ అభిషేక్ గౌడ, డీఆర్వో ఎల్.దేవకీదేవి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): హాకీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ మెన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ హాకీ చాంపియన్షిప్–2026 ఎంపికలు స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియంలో శనివారం నిర్వహించనున్నామని జిల్లా హా కీ అసోసియేషన్ కార్యదర్శి జి.సతీష్బాబు ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారు లు ఈనెల 12 నుంచి ధర్మవరంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. క్రీడాకారులు 1992 జనవరి 1 తర్వాత పుట్టిన వారై ఉండాలని పేర్కొన్నారు. -
డీఐజీ వార్షిక తనిఖీ
నవధాన్యాల సాగు.. బాగు నేల ఆరోగ్యం, ఉత్పాదక శక్తి పెంపు, సేంద్రియ ఎరువుల వినియోగంపై అవగాహన పెరగడంతో నవధాన్యాల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. 8లో uఏలూరు టౌన్: ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ వార్షిక తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలోని విభాగాలను పరిశీలించారు. జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (డీసీఆర్బీ) స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ), ఫింగర్ ప్రింట్స్ విభాగాల పనితీరును సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో శాంతిభద్ర తలు, నేర నియంత్రణకు చర్యలు, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన, మహిళలు, బాలికల భద్రత తదితర అంశాలపై సమీక్షించారు. పెండింగ్ కేసులు, పాత నేరస్తుల కదలికలపై నిఘా, మహిళల మిస్సింగ్ కేసుల దర్యాప్తుకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. కేసుల దర్యాప్తులో అ త్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరింత విస్తృతంగా వినియోగిస్తూ నేరగాళ్ల ఆటకట్టించాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. డ్రోన్ కెమెరాల నిఘాను పెంచటం ద్వారా అసాంఘిక కార్యకలాపాలను అరికట్టే అవకాశం ఏర్పడు తుందనీ, నిషేధిత మత్తుపదార్థాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వాహన తనిఖీలు మరింత పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆయన వెంట ఉన్నారు. ఏఆర్ అదనపు ఎస్పీ జి.మునిరాజా, పోలీస్ ప్రధాన కార్యాలయ ఏఓ షేక్ మస్తాన్, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఆర్ఐలు పవన్కుమార్, సతీష్, ఆయా విభాగాల డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
ఏఐఎస్ఎఫ్ ఆందోళన
ఏలూరు (టూటౌన్): నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి నైతి క బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ ర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి.శివకుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ధర్నాచౌక్లో ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ నీట్ పరీక్షను 20 లక్షల మందికి పైగా రాశారని, పరీక్ష రద్దుతో వీరంతా ఇబ్బందులు పడుతున్నారన్నారు. దేశంలో పేద, మధ్య తరగతి విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. కేంద్ర విద్యాశాఖ నిర్లక్ష్యమే కారణమని, తక్షణమే ఎన్టీఏ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎ త్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించా రు. ఏఐఎస్ఎఫ్ నాయకులు సిద్దు, ఆకాష్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
నీలినీడలు
శనివారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: నీలి విప్లవానికి చిరునామాగా నిలిచిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆక్వారంగ ఊపిరిని కూటమి ప్రభుత్వ పాలన తీసేస్తోంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఆక్వారంగం దేశంలోనే ప్రథమ స్థానం సాధిస్తుండగా.. ఏలూరు జిల్లా కలిదిండి మండలం తలసరి ఆదాయంలో ఏపీలో ప్రథమ స్థానం, కై కలూరు మండలం ద్వితీయ స్థానంలో నిలుస్తున్నాయి. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తున్న ఆక్వారంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కంపెనీలు మేత ధరల పెంపు నిర్ణయాన్ని నిలుపుదల చేస్తున్నామని స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో చేపలు 1.80 లక్షల ఎకరాలు, రొయ్యలు 1.10 లక్షల ఎకరాలు మొత్తంగా 2.90 లక్షల్లో ఆక్వాసాగు ఉంది. మొత్తంగా 65 వేల మంది రైతులు ఆక్వాపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రధానంగా రొయ్యల మేతల ధరలను తయారీ కంపెనీలు పెంచుతున్నామని ప్రకటించ డంతో రైతులు రోడ్డెక్కారు. వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. ధరల నియంత్రణకు ముందు చూ పుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో వచ్చిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ అథారిటీ (అప్సడా) చట్టానికి చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. రొయ్య రైతు.. కంట కన్నీరు ఒకప్పుడు మీసం మెలిసిన రొయ్య రైతుల కళ్లల్లో నేడు కన్నీరు కనిపిస్తోంది. మేత (ఫీడ్) ధరల పెంపు నిర్ణయం కుదుపు కుదిపేసింది. మేత తయారు చేసే కంపెనీలు టన్నుకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు (వనామీ రొయ్యల మేత కిలోకు రూ.8, టైగర్ రొయ్యల మేత కిలోకు రూ.10 చొప్పున) ధరలను పెంచేశాయి. మేత కంపెనీలు సిండికేట్గా ఏర్పడి కృత్రిమంగా ధరలను పెంచుతున్నాయని రైతులు పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. మేత బస్తాలను రోడ్లపై తగలబెట్టారు. రైతులతో చర్చించకుండా ధరలు ఎలా పెంచుతారని నిలదీశారు. ముడి సరుకుల ధరలు తగ్గినప్పుడు ఒక్క పైసా కూడా తగ్గించని కంపెనీలు ఇప్పుడు అమాంతం ధరలు ఎలా పెంచుతాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతు నెత్తిన గల్ఫ్ సంక్షోభం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల సముద్ర ఆహార ఎగుమతులు నిలిచిపోయాయి. ఆయా దేశాలకు పంపిన కంటైనర్లు తిరిగి వెనక్కి రావడం, కొత్త ఎగుమతి ఆర్డర్లు రద్దు కావడంతో స్థానిక మార్కెట్లో రొయ్యల నిల్వలు పెరిగిపోయి రైతులు భయాందోళనతో తక్కువ ధరలకే విక్రయించాల్సి వస్తోంది. వాతావరణంలో వేగంగా వచ్చిన మార్పుల వల్ల చెరువుల్లో రొయ్యలకు వైట్ స్పాట్ సిండ్రోమ్ (తెల్లమచ్చ తెగులు) వంటి వైరల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. దీంతో రైతులు పంట కాలం పూర్తికాకముందే అత్యవసరంగా రొయ్యలను తక్కువ ధరలకే విక్రయించి నష్టపోతున్నారు. రొయ్యల చెరువు అయ్యో.. ఆక్వా ఒడుదొడుకుల మధ్య ఆక్వారంగం నలిగిపోతున్న రొయ్యల రైతులు మేత ధరలపై స్పష్టమైన ప్రకటన చేయని ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో సాగు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారడంతో పాటు ఎన్నో వేల కుటుంబాలకు ఆక్వారంగం ఉపాధి కల్పిస్తోంది. ఇటువంటి రంగా న్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఎన్నికల సమ యంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. అప్సడా చట్టాలకు అనుగుణంగా ధరల ని ర్ణయాల్లో రైతులను భాగస్వాములు చేయాలి. – బలే నాగరాజు, ఆక్వా రైతు, చింతపాడు, మండవల్లి మండలం అధికారం సాధించిన ఆరు నెలల్లో ఆక్వా రైతులకు ఆక్వా జోన్స్తో సంబంధం లేకుండా యూనిట్ విద్యుత్ ధర రూ.1.50కే అందిస్తామని ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఊదరగొట్టారు. గద్దెనెక్కి రెండేళ్లు అవుతున్నా ఆక్వా రైతుల సబ్సిడీపై మాట్లాడటం లేదు. అలాగే తయారీ కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. కోల్ట్ స్టోరేజీలు నిర్మిస్తామన్న హామీ నెరవేరలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కరోనా సమయంలో సైతం ఆక్వా ఉత్పత్తుల రవాణాకు ఎటువంటి ఆటంకం కలిగించలేదని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. -
మన్యం విద్యావ్యవస్థలో కీలక మార్పులు
బుట్టాయగూడెం: ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లోని విద్యా వ్యవస్థలో మరో కీలకమైన మార్పుకు శ్రీకారం చుట్టారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో గత 16 సంవత్సరాలుగా కొనసాగుతున్న 3, 4 తరగతుల ప్రవేశానికి జరిగే అడ్మిషన్లు ఈ సంవత్సరం నుంచి నిలిచిపోనున్నాయి. ఇకపై ఆశ్రమ పాఠశాలల్లో నేరుగా 5వ తరగతి నుంచే ప్రవేశాలు కల్పించాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే 3, 4 తరగతులకు అడ్మిషన్లు నిలిపివేయనున్నారు. పసి పిల్లలను చిన్న వయస్సులోనే ఇళ్లకు, తల్లిదండ్రులకు దూరంగా ఉంచి ఆశ్రమ పాఠశాలల్లో ఉంచడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గుర్తించారు. ఈ నేపథ్యంలోనే గిరిజన సంక్షేమ శాఖ తాజా నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి మండలంలో కేవలం రెండు, మూడు ఎంపిక చేసిన పాఠశాలల్లో మాత్రమే 3, 4 తరగతులను కొనసాగించే అవకాశం కల్పించారు. మిగిలిన అన్ని ఆశ్రమ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి నేరుగా 5వ తరగతి నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఐటీడీఏ పరిధిలో 25 ఆశ్రమ పాఠశాలలు కేఆర్పురం ఐటీడీఏ పరిధిలో 25 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 12 బాలుర, 13 బాలికల పాఠశాలలు నిర్వహిస్తున్నారు. వీటిలో సుమారు 5 వేల మందికి పైగా గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఏడాది నుంచి గిరిజన విద్యాలయాల్లో నూతన విద్యావిధానం అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో అధికారులు దీనికి సంబంధించిన కసరత్తును చేస్తున్నారు. ఇటుకులకోట, కొయిదా (బాలురు), రెడ్డికోపల్లి, పులిరామన్నగూడెం ఆశ్రమ పాఠశాలలో 3 నుంచి 7వ తరగతి వరకూ క్లాస్లు నిర్వహించనున్నారు. గతంలో ఇలా గత చరిత్రను పరిశీలిస్తే ఆశ్రమ పాఠశాలల్లో కేవలం 6వ తరగతి నుంచే అడ్మిషన్లు ఉండేవి. విద్యార్థులు తమ స్వగ్రామాల్లో జీపీఎస్ పాఠశాలలు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో 5వ తరగతి వరకూ చదువుకుని ఆ తర్వాతే ఆశ్రమ పాఠశాలల్లో చేరేవారు. అనంతరం వచ్చిన మార్పుల్లో 3వ తరగతి నుంచే విద్యార్థులను ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించేలా నిబంధనలను మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అప్పటి నుంచి ఈ విధానమే అమలు జరుగుతుండగా తాజాగా ఈ ఏడాది మళ్లీ పాత పద్ధతిలోనే అడ్మిషన్లు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. గిరిజన విద్యార్థులకు అన్యాయం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కొత్తగా తీసుకువచ్చిన మార్పులతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఎంపిక చేసిన పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించడం ద్వారా అనేక మంది విద్యార్థులు డ్రాప్అవుట్స్గా మారిపోతారని వారు ఆరోపిస్తున్నారు. ఈ విధానంపై అధికారులు, ప్రభుత్వం పునరాలోచన చేసి పాత పద్ధతినే అమలు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన విద్యా సంస్కరణల వల్ల గిరిజన విద్యార్థులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కేవలం మూడు పాఠశాలల్లోనే 3వ నుంచి 7వ తరగతి వరకూ ఏర్పాటు చేయడం వల్ల పలు గ్రామాల్లోని గిరిజన విద్యార్థులు చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ విద్యా సంస్కరణలపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి. – ఎస్. రామ్మోహన్, అఖిల భారత ఆదివాసీ వేదిక జాతీయ కన్వీనర్ ఈ విద్యా సంవత్సరం నుంచి ఆశ్రమ పాఠశాలలో కీలకమైన మార్పులు వచ్చినప్పటికీ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చదువుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మూడు పాఠశాలల్లో 3 నుంచి 7 వరకూ విద్యను అభ్యసించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. 22 పాఠశాలల్లో 5 నుంచి 10వ తరగతి వరకూ చదువుకునేలా ఏర్పాటు చేస్తున్నాం. – పి. జనార్థన్రావు, డీడీ, కేఆర్పురం ఐటీడిఏ, బుట్టాయగూడెం మండలం ఇకపై ఐదో తరగతి నుంచే ఆశ్రమ బాట 16 ఏళ్లగా కొనసాగుతున్న 3, 4 తరగతుల అడ్మిషన్ల నిలిపివేత ఈ విద్యా సంవత్సరం నుంచే మార్పులు గిరిజన విద్యార్థులు నష్టపోతారంటున్న విద్యార్థి సంఘాలు -
వేసవి శిబిరం.. నిర్వాహకులకు శిరోభారం
భీమవరం: గతంలో ‘జన్మభూమి’ అంటూ గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి దాతలపై ఆధారపడ్డ తెలుగుదేశం ప్రభుత్వం... నేడు గ్రంథాలయాల్లో ఏర్పాటు చేసిన వేసవి విజ్ఞాన తరగతుల నిర్వహణ భారాన్ని కూడా దాతలపైనే వేసి వేడుక చూస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజ్ఞాన తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోగా... ఈ తరగతులను తప్పనిసరిగా నిర్వహించాలని, దీనికోసం దాతల సహకారం తీసుకోవాలని ఆదేశించడం గమనార్హం. విద్యార్థుల మేలు కోసమే అయినా... వేసవి కాలంలో పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు బయట తిరుగుతూ ఎండబారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఏటా శాఖా గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన తరగతులు నిర్వహిస్తుంటారు. సుమారు 40 రోజుల పాటు చిన్నారులకు విజ్ఞానంతో పాటు వినోదం, సృజనాత్మకతకు పదును పెట్టే విధంగా ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఈ తరగతులు జరుగుతాయి. ఇందులో భాగంగా విద్యార్థులకు కంప్యూటర్ బేసిక్స్, పుస్తక పఠనం, డ్యాన్స్, క్యారమ్స్, నీతికథల బోధన, చెస్, యోగా, చిత్రలేఖనం, సంగీతం వంటివి నేర్పించాలని ప్రభుత్వం గ్రంథాలయాధికారులను ఆదేశించింది. ఇంతవరకు బాగానే ఉన్నా... ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 74 శాఖా గ్రంథాలయాలకు గాను, 40 రోజుల పాటు చిన్నారులకు శిక్షణ ఇవ్వడానికి శిక్షకులను (ట్రైనర్స్) ఏర్పాటు చేయడం... కార్యక్రమాలకు అతిథులుగా వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులకు పుష్పగుచ్ఛాలు, అల్పాహారం (స్నాక్స్) వంటివి అందించడం గ్రంథాలయాధికారులకు తలకు మించిన భారంగా మారింది. ఏప్రిల్ 28వ తేదీన ప్రారంభమైన ఈ వేసవి విజ్ఞాన శిబిరాలు ఈ నెల 6వ తేదీతో ముగియనున్నాయి. సర్టిఫికెట్లు, జ్ఞాపికలకూ దాతలదే భారం! చిన్నారులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చి, వారికి పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ఇవ్వడానికి కూడా దాతలను ఆశ్రయించాల్సి వచ్చింది. చిన్నారుల కోసం నిర్వహించిన పోటీల్లో విజేతలకు ప్రభుత్వం తరపున ఎటువంటి బహుమతులు ఇవ్వకపోవడంతో... గ్రంథాలయాధికారులు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీలు తమ పరువు కాపాడుకోవడానికి దాతలను ఆశ్రయించి ‘మమ’ అనిపించాల్సి వస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మున్ముందు మంగళమేనా భీమవరం పట్టణంలోని డాక్టర్ వైఎస్సార్ మెమోరియల్ శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన విజ్ఞాన తరగతుల్లో పాల్గొన్న విద్యార్థులకు ‘మానవత’ సంస్థ స్నాక్స్ అందించగా... ‘దాట్ల శ్రీదేవి ట్రస్ట్’ ఆధ్వర్యంలో జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి ఏటా ఇదే పరిస్థితి కొనసాగితే.. మున్ముందు ఈ వేసవి విజ్ఞాన తరగతులకు మంగళం పాడాల్సి వస్తుందని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. భీమవరం వంటి గ్రేడ్–1 శాఖా గ్రంథాలయంలో ప్రతిరోజూ సుమారు 70 మంది వరకు చిన్నారులు హాజరై శిక్షకులు చెప్పే అంశాలను శ్రద్ధగా విన్నారు. అయితే, మూడు గంటలకు పైగా ఎంతో ఓపికగా కూర్చునే పిల్లలకు కనీసం స్నాక్స్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం విశేషం. గతంలో ప్రతి గ్రంథాలయానికి విజ్ఞాన శిబిరాల నిర్వహణ కోసం రూ. 15 వేల వరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా... నేడు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. దీంతో నిర్వాహకులు దాతల వద్దకు వెళ్లి చేయి చాచాల్సి వచ్చింది. నిధులు ఇవ్వకుండా... చేతులెత్తేసిన ప్రభుత్వం వేసవి విజ్ఞాన తరగతుల నిర్వహణ భారం దాతలపైనే ! ఇలాగైతే కష్టమే అంటున్న గ్రంథాలయాధికారులు -
శ్రీవారి క్షేత్రంలో అభివృద్ధి పనుల పరిశీలన
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఇటీవల ప్రారంభమైన అభివృద్ధి పనులను, అలాగే త్వరలో చేపటనున్న మరిన్ని పనులకు సంబంధించిన ప్రణాళికలను రాష్ట్ర దేవాదాయశాఖ రిటైర్డ్ ఎస్ఈ, టెక్నికల్ కమిటీ సభ్యుడు ఎస్.సుబ్బారావు ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు, ఈఈ భాస్కర్లతో కలిసి గురువారం పరిశీలించారు. అలాగే ఆలయ తూర్పు ప్రాంతంలోని షాపింగ్ కాంప్లెక్స్ వెనుక ప్రాంతంలో త్వరలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రణాళికలను, మాస్టర్ ప్లాన్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ముందుగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఏలూరు (టూటౌన్): జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో గురువారం వ్యవసాయ, అనుబంధ రంగాలు, జలధార, సూర్యఘర్ యోజన, తదితర కార్యక్రమాల అమలుపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ నిర్ధేశించిన లక్ష్యాల మేర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు త్వరితగతిన ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జలధార కార్యక్రమం ద్వారా నీటి సంరక్షణ పనులను ఈనెల 15వ తేదీ లోగా పూర్తిచేయాలన్నారు. సూర్యఘర్ ప్రయోజనాలపై ప్రజలకు గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా సమీక్షా సమావేశం శుక్రవారం ఉదయం 10 గంటలకు ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరుగుతుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో ఖరీఫ్–2026 సన్నద్ధత, వ్యవసాయ, అనుబంధ రంగాల లక్ష్యాలు, జలధార, ఇరిగేషన్ శాఖ ఓఅండ్ఎం పనులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, సూర్యఘర్ యోజన లక్ష్యాల ప్రగతి, తదితర అంశాలపై సమీక్ష జరుగుతుందన్నారు. భీమవరం(ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా ముఖ్య ప్రణాళిక శాఖలో సహాయ సంచాలకులుగా విధులు నిర్వహిస్తున్న కంటిపూడి శ్రీనివాసరావుకు డిప్యూటీ డైరెక్టర్ హోదా లభించింది. 2022 నుంచి ఆయన ఇక్కడ సేవలందిస్తున్నారు. రెండుసార్లు ఇన్చార్జి సీపీఓగా బాధ్యతలు నిర్వర్తించారు. డిప్యూటీ డైరెక్టర్ పదోన్నతితో త్వరలో ఏలూరు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారిగా బాధ్యతలు స్వీకరించనున్నట్టు ఆయన చెప్పారు. తణుకు అర్బన్: భారతీయ టెక్స్టైల్స్ ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించాలని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ ధాయిలాండ్లో జరుగుతున్న ట్రేడ్ సదస్సులో కోరారు. బ్యాంకాక్లో జరుగుతున్న ఆసియన్ సోర్సింగ్ ఫెయిర్లో భారతీయ ఎంబాసిడర్ పునీత్ అగర్వాల్తో జరిగిన సమావేశంలో రవీంద్రనాథ్ మాట్లాడారు. థాయిలాండ్లో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, ఈ నేపథ్యంలో భారతీయ నూలు ప్రాముఖ్యతను బ్యాంకాక్లోని ఇండియన్ ఎంబసీ అధికారులు వాణిజ్య సంస్థలకు భారతీయ ఉత్పత్తుల సరఫరాపై అవగాహన కల్పించాలని కోరారు. అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్లో వివిధ వస్త్ర పరిశ్రమల ఉత్పత్తులను ప్రదర్శించగా ఆంధ్రప్రదేశ్ నుంచి రవళి స్పిన్నర్ల నూలు ఉత్పత్తులు పట్ల ఇతర దేశాల వస్త్ర తయారీదారులు ఆసక్తి చూపించినట్లు ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ తెలిపారు. -
రోడ్లపై బర్త్డే వేడుకలకు పోలీసుల బ్రేక్
● ఇప్పటికే 120 మందికిన్యాయస్థానాల్లో జరిమానాలు ● తల్లిదండ్రులు తమ పిల్లలను అదుపులో ఉంచుకోవాలని వినతి తణుకు అర్బన్ : పుట్టినరోజంటూ రహదారులపై సంబరాలు చేసుకుంటున్నారా? బాణసంచా కాల్చి కేకులు కట్ చేస్తున్నారా? అయితే మీకోసమే.. పుట్టినరోజు సంబరాలు రహదారులపై చేసుకుంటూ ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్న అంశాన్ని తణుకు పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఇటీవల కాలంలో కొందరు యువత స్నేహితుల పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకోవాలనే తపనతో రహదారులపై విచ్చలవిడిగా చేస్తున్న సంబరాలు ప్రయాణికులు, స్థానికులకు ఇబ్బందులకు గు రిచేస్తున్నాయి. దీంతో పోలీసులకు వచ్చిన ఫిర్యాదులను అనుసరించి చట్టపరంగా చర్యలకు దిగారు. గత నెలన్నర రోజుల కాలంలో తణుకులో 120 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచి జరిమానాలు వేయించారు. కొందరిపై ఎఫ్ఐఆర్లు సైతం వేశారు. దీంతో తల్లిదండ్రులు తమ బిడ్డలను పుట్టినరోజును ఇళ్లలోనే చేసుకునేలా చూసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. పుట్టినరోజు సంబరాలకు కేంద్రాలుగా.. తణుకు జాతీయ రహదారి షర్మిష్ట సెంటర్ సర్వీస్ రోడ్డు ప్రాంతంతోపాటు ఎన్టీఆర్ పార్కు, ప్రధాన కూడళ్లు, వెంకటేశ్వర థియేటర్ ప్రాంతాల్లో యువత తమ స్నేహితుల పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తూ హద్దులు దాటే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇటీవల తణుకు వెంకటేశ్వర థియేటర్ సెంటర్లో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో బాణసంచా కాల్చడంతో ద్విచక్రవాహనదారులు, పాదచారులపైకి వెళ్లి దుస్తులు కాలిపోయి ఒంటికి గాయాలయ్యాయి. దీంతో పాటు తణుకు జాతీయ రహదారి షర్మిష్ట సెంటర్ సర్వీసు రోడ్డులో కొందరు యువకులు నిత్యం ఏదో ఒక పుట్టినరోజు వేడుక నిర్వహిస్తూ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నిలదీసిన ప్రయాణికులపైకి దూసుకువస్తున్న విషయాలు పోలీసుల దృష్టికి వచ్చాయి. అంతేకాకుండా ఈ వేడుకల్లో అదే ప్రాంతాల్లో మద్యం సేవిస్తూ, బైక్ స్టంట్లు చేస్తున్న ఆగడాలు కూడా మితిమీరిపోయిన పరిస్థితుల్లో పోలీసులు చర్యలకు దిగారు. పోస్టర్ విడుదల స్టేషన్కు వస్తున్న ఫిర్యాదులతో విసుగెత్తిన పోలీసులు ఇటీవల కాలంలో 120 మంది యువకులను అదుపులోకి తీసుకుని జరిమానాలు విధించి, కౌన్సెలింగ్లు ఇచ్చారు. అంతేకాకుండా వేడుకల్లో ఏర్పడిన తీవ్రతతో కొందరిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేశారు. దీంతో తణుకు పోలీసు అధికారులు యువత తమ పుట్టినరోజులను తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల మధ్య నిర్వహించుకోవాలని తెలిపే పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో బహిరంగంగా నిర్వహించుకోవడం ద్వారా ఏర్పడుతున్న ఇబ్బందులను సైతం చిత్రాల ద్వారా తెలియపరిచారు. ఇకపై ఇలాంటి పనులు నిషేధమని, నిబంధనలు మీరితే చట్టరీత్యా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇబ్బందులు సృష్టిస్తే టోల్ఫ్రీ నంబర్ 112, తణుకు పట్టణ సీఐ 9440796640, పట్టణ ఎస్సై 9154965934 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. -
వెన్నుపోటుపై జనాగ్రహం
కీలక మార్పులు ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లోని విద్యా వ్యవస్థలో కీలక మార్పుకు శ్రీకారం చుట్టారు. ఆశ్రమ పాఠశాలల్లో ఇకపై నేరుగా 5వ తరగతి నుంచే ప్రవేశాలు కల్పించనున్నారు. 8లో uరోడ్లపై బర్త్డే వేడుకలకు పోలీసులు బ్రేక్ వేశారు. వేడుకల్లో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి జరిమానాలు వేయిస్తున్నారు. 8లో uశురకవారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: సర్కారు వెన్నుపోటుపై జనాగ్రహం పెల్లుబికింది. ఎన్నికల హామీలను అమలు చేయకుండా చంద్రబాబు చేస్తున్న మోసంపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నిరసన ర్యాలీలు, బైక్ ర్యాలీలు, మానవహారాలు నిర్వహించి కూటమి ఎన్నికల మేనిఫెస్టో పత్రాలను దహనం చేసి నిరసన తెలిపారు. ఆడబిడ్డ నిధి అంటూ మహిళలను వంచించడం మొదలుకొని అనేక హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా రెండేళ్లు కాలం గడపడంపై సర్వత్రా మండిపడ్డారు. కై కలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు బైక్ర్యాలీ నిర్వహించారు. ఏలూరు నగరంలో పార్టీ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ 50 డివిజన్లల్లో కూటమి మోసాల కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. ● కై కలూరులో... నియోజకవర్గంలో కై కలూరు, కలిదిండి మండలాల్లో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కై కలూరులో పార్టీ కార్యాలయం నుంచి సంతమార్కెట్ వరకు మోటారుసైకిల్పై ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. కలిదిండిలో దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిరసన కార్యక్రమం జరిపారు. ● చింతలపూడిలో... నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో పార్టీ కార్యక్రమం నిర్వహించారు. జంగారెడ్డిగూడెం, కామవరపుకోట మండలాల్లో నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిపారు. కామవరపుకోట మండలంలో కొత్తూరు బస్టాండ్ నుంచి చెక్పోస్టు వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. జంగారెడ్డిగూడెంలో పార్టీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. చింతలపూడిలో తొలుత మారుతీనగర్ ఉన్న దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి ర్యాలీగా బోసుబొమ్మ సెంటరుకు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. మండలంలోని ఫాతిమాపురంలో మండల నాయకుల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. లింగపాలెం మండలంలో మండల నాయకులు, పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ● నూజివీడులో... నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు చాట్రాయి, ఆగిరిపల్లి మండలాల్లో పాల్గొని కార్యక్రమం నిర్వహించారు. నూజివీడులో టౌన్ ప్రెసిడెంట్, ముసునూరులో మండల పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో నిరసనలు జరిపారు. ● ఉంగుటూరులో... నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో భీమడోలు మండలంలోని భీమడోలు జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. నిడమర్రు, గణపవరం, ఉంగుటూరు మండలాల్లో ఆయా మండల కన్వీనర్లు చేశారు. ● పోలవరంలో... నియోజకవర్గంలోని 5 మండలాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం సమన్వయకర్త తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో బుట్టాయగూడెం, పోలవరం మండలాల్లో జరిపారు. జీలుగుమిల్లి, టి.నర్సాపురం, కొయ్యలగూడెం మండలాల్లో మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ● ఏలూరులో... ఏలూరు నగరంలోని సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు 50 డివిజన్లల్లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందించారు. ప్రతి డివిజన్లో డివిజన్ ఇన్చార్జులు పాల్గొని గడిచిన రెండేళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలకు వివరించి కరపత్రాలను అందజేశారు. జయప్రకాష్ 34వ డివిజన్లో కరపత్రాలు పంపిణీ చేశారు. ● దెందులూరులో... నియోజకవర్గంలోని పెదపాడు, దెందులూరు, పెదవేగి, ఏలూరు రూరల్ మండలాల్లో ఆయా మండల కన్వీనర్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. దెందులూరు మండలంలో పార్టీ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు కామిరెడ్డి నాని నేతృత్వంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసనలకు విశేష స్పందన జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో వెల్లువెత్తిన నిరసనలు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులు దహనం -
పింఛన్ స్టంట్.. కూటమి ఫొటోషూట్ !
కూటమి ప్రభుత్వ పింఛన్ స్టంటు ఇది.. ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు గ్రామంలో ఒక వృద్ధుడికి పింఛన్ ఇవ్వాలి. పింఛన్ ఇచ్చేందుకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వచ్చారు. ఫొటోలు బాగా రావాలి. మానవత్వం చాటుకుంటున్నట్లు కనిపించేలా సోషల్ మీడియాలో రీల్ పోస్ట్ పెడితే వైరల్ కావాలనుకున్నారో ఏమో.. అన్ని ఏర్పాట్లు చేశారు. ఓ వృద్ధుడు తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడని ప్రత్యేకంగా ఆటో ఏర్పాటుచేసి పచ్చ కండువా వేసి కూర్చోబెట్టారు. ఎమ్మెల్యే చింతమనేని ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి సచివాలయ సిబ్బందితో స్పాట్ లోనే పింఛన్ను ఆటోలోనే ఇప్పించారు. ఎమ్మెల్యే వెళ్లిపోయారు. పని అయిపోయింది. అనార్యోగంతో ఆటోలో ఉన్న వృద్ధుడు బైక్పై రయ్రయ్మంటూ తిరుగుతూ ఇలా ఫొటోలకు చిక్కాడు. –సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు -
ఆరకమణలపై సబ్ కలెక్టర్ కొరడా
నూజివీడు: పట్టణంలోని ఆక్రమణలపై సబ్ కలెక్టర్, మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి బొల్లపల్లి వినూత్న కఠిన చర్యలు చేపట్టారు. మైలవరం రోడ్డులోని ముసలి రామమందిరం నుంచి శ్రీనివాస సెంటర్ వరకు ఉన్న దుకాణదారులు డ్రెయినేజీలపై కౌంటర్లు, షోకేస్లు, వస్తువులు ఏర్పాటు చేయడంపై ఆమె మండిపడ్డారు. దీనివల్ల వాహనాలు నిలపడానికి స్థలం లేక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వ్యాపారాలన్నీ షట్టర్ల లోపలే జరగాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కొరపాటి పీరయ్యను ఆదేశించారు. అలాగే డ్రెయినేజీలపై ఉన్న నూడిల్స్ బండ్లు, టిఫిన్ బండ్లు, కొబ్బరిబోండాల దుకాణాలు, టీస్టాళ్లను వెంటనే తొలగించి, సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు. పట్టణంలోని అన్ని రోడ్లలో ఉన్న ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో సబ్ కలెక్టర్తో పాటు కమిషనర్, టీపీఓ కె.వెంకటేశ్వరరావు, టౌన్ ఎస్సై నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
వ్యసనాలకు బానిసలై చోరీలు
యలమంచిలి : చెడు వ్యసనాల కోసం దొంగతనాలు చేస్తున్న ఇద్దరిలో ఒకరిని గురువారం అరెస్టు చేసినట్లు నరసాపురం డీఎస్పీ ఎం.సుధాకరరావు తెలిపారు. పాలకొల్లు పోలీస్స్టేషన్లో గురువారం నిందితుడిని మీడియాకు చూపించారు. నరసాపురం మండలం రుస్తుంబాద గ్రామానికి చెందిన కొత్తపల్లి నరేష్, రాజమహేంద్రవరానికి చెందిన గోడి సతీష్ కుమార్ ఆలియాస్ కాకి ఇద్దరు చెడు వ్యసనాలుకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలని దొంగతనాలకు అలవాటుపడ్డారు. గత కొంతకాలంగా వీరిరువురు కలసి పాలకొల్లు, పోడూరు, నరసాపురం, పెనుమంట్ర, కాళ్ల మొదలగు ప్రాంతాల్లో సంచరించి తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి సమయంలో దొంగతనాలు చేస్తున్నారు. వీరిపై పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 నేరాలు, పోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 3, నరసాపురం రూరల్, పెనుమంట్ర, కాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 8 నేరాలు చేశారు. నరసాపురం డీఎస్పీ ఎం సుధాకరరావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందం ఈ నెల 3వ తేదీ బుధవారం నరసాపురం మండలం రుస్తుంబాద గ్రామానికి చెందిన కొత్తపల్లి నరేష్ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 142 గ్రాముల బంగారు ఆభరణాలు, 4 కిలోల వెండి వస్తువులు రికవరీ చేశారు. నరేష్తో పాటు దొంగతనాల్లో పాల్గొన్న గోడి సతీష్ కుమార్ (కాకి) పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కొత్తపల్లి నరేష్ పట్టుకోవడంలో చాకచక్యంగా పని చేసిన పాలకొల్లు రూరల్ సీఐ గుత్తుల శ్రీనివాస్, పాలకొల్లు రూరల్ ఎస్సై బొంతు సురేంద్ర కుమార్, పోడూరు ఎస్సై కె సుధాకర్రెడ్డి, కానిస్టేబుల్స్ బాలాజీ, కె.ప్రసాద్బాబులను ప్రత్యేకంగా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ అభినందించినట్లు ఆయన తెలిపారు. ఒకరి అరెస్టు, పరారీలో మరొకరు -
ఉపాధ్యాయుల ఆందోళన
కొయ్యలగూడెం: అన్నమో రామచంద్ర అని ఉపాధ్యాయులు ఉసూరుమన్నారు. గురువారం పరింపూడి జెడ్పీ హైస్కూల్లో సుమారు 250 మంది ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం కల్పించలేదంటూ ఆందోళన బాటపట్టారు. ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జలగం రాంబాబు మాట్లాడుతూ ఆరు రోజులపాటు ఎఫ్ఎల్ఎన్ శిక్షణ తరగతులు తీసుకోవడానికి వచ్చిన తమకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అయితే భోజనాన్ని అరకొరగా ఏర్పాటు చేయడంతో సగం మంది ఆకలితో అలమటించాల్సి వచ్చిందన్నారు. దీంతో కొయ్యలగూడెంలోని హోటల్స్కి వెళ్లి భోజనాలు చేసి అనంతరం శిక్షణ తరగతులకు హాజరు కావాల్సిన దుస్థితి అధికారులు కల్పించారని ఆరోపించారు. ఏ మండలానికి ఆ మండలంలోని శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలన్నారు. అసలే ఎండలు తీవ్రంగా ఉండడంతో ఉపాధ్యాయులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వడదెబ్బలకు గురి అవుతున్నారన్నారు. తమకు వసతి సౌకర్యం భోజన సౌకర్యం అరకొరగా కల్పించడంపై ఆందోళన చేసి శిక్షణ తరగతులను బహిష్కరించారు. ఇప్పటికై నా మిగిలిన రోజులలో ఉపాధ్యాయులకు సరైన వసతి సౌకర్యాలు కల్పించాలని ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి ఏలూరు టౌన్: ఒక గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతిచెందాడు. ఏలూరు నగరంలోని సర్ సీఆర్ఆర్ అటానమస్ కళాశాల వెనుక వైపు రైల్వే ట్రాక్ సమీపంలో మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. ఆలస్యంగా వెలుగు చూడటంతో మృతదేహాం కుళ్ళిన స్థితిలో ఉందని రైల్వే పోలీసులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి వెళ్ళిన రైల్వే పోలీస్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 40 ఏళ్ల మద్య ఉంటుందని భావిస్తున్నారు. నలుపు రంగు షర్ట్, బ్రౌన్ కలర్ గళ్ళ చొక్కా ధరించి ఉన్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. వివరాలు తెలిసిన వారు ఏలూరు రైల్వే ఎస్సై కృపాదానాన్ని సంప్రదించాలని కోరారు. మరిన్ని వివరాలకు 94404 11000నంబర్కు ఫోన్ చేయాలని కోరారు. గుర్తుతెలియని వృద్ధురాలి మృతి ఏలూరు టౌన్: స్థానిక రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద గుర్తు తెలియని ఒక వృద్ధురాలు గురువారం రైలు ఢీకొని మృతి చెందింది. మృతురాలి వయస్సు సుమారు 75 సంవత్సరాలకు పైబడి ఉండవచ్చని, 5.5 అడుగుల ఎత్తు, నలుపురంగు శరీర చాయ కలిగి ఉందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. -
ఇంటిగ్రేటెడ్ సెన్సింగ్పై అవగాహన
తాడేపల్లిగూడెం: మేథో ఆధారిత రవాణా వ్యవస్థలకు ఇంటిగ్రేటెడ్ సెన్సింగ్ కమ్యూనికేషన్స్ సాంకేతికత ఎంతో కీలకంగా మారనుందని యునైటెడ్ స్టేట్స్ దేవ్కామ్ ఆర్మీ రీసెర్చ్ లాబోరేటరీ సీనియర్ ఫెలో డాక్టర్ కుమార్ విజయ్ మిశ్రా అన్నారు. గురువారం ఏపీ నిట్లో సైబర్ సెక్యూరిటీ పరిశోధనా ధృక్కోణాలు అనే అంశంపై నిపుణుల ఉపన్యాసం ఏర్పాటు చేశారు. సైబర్ సెక్యూరిటీ , ఆధునిక రాడార్ వ్యవస్థలు, ఇంటిగ్రేటెడ్ సెన్సింగ్, కమ్యూనికేషన్స్ రంగాల్లో ఉద్భవిస్తున్న సవాళ్లు, అవకాశాలు పరిశోధన అంశాల గురించి మిశ్రా తెలియచేశారు. సైనిక, పౌర కమ్యూనికేషన్ మౌలిక వసతుల్లో సైబర్ భద్రతతో పాటు, సైబర్ స్థిరత్వం ప్రాధాన్యం వివరించారు. భవిష్యత్లో వైర్లెస్ నెట్వర్కులు, స్వయం చాలక వ్యవస్థలు, స్మార్ట్ రక్షణ వేదికలు మేథో ఆధారిత రవాణా వ్యవస్థలకు ఐఎస్ఏసీ సాంకేతికత కీలకంగా మారనుందన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ వి.సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి
ఆగిరిపల్లి: శోభనాపురం వైఎస్సార్ సీపీ గ్రామ అధ్యక్షుడు నక్కనబోయిన సాంబశివరావుపై దాడి చేసిన టీడీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం ఆగిరిపల్లి పోలీస్స్టేషన్లో ఎస్సై శుభశేఖర్ను కలిసి సాంబశివరావుపై దాడి చేసిన నిందితులపై పోలీసులు తీసుకున్న చర్యలును అడిగారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ సాంబశివరావును దారి కాచి తన కుమార్తె ముందే దాడి చేశారని, దాడి చేసిన టిడిపి నాయకుల పేర్లును సాంబశివరావు కుమార్తె చెబుతున్నా పోలీసు అధికారులు ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పటికై నా పోలీసు అధికారులు స్పందించి దాడి చేసిన టీడీపీ నాయకులు ను అరెస్ట్ చేసి బాధితుడు సాంబశివరావుకుకు న్యాయం చేయాలని కోరారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు బెజవాడ రాంబాబు, నియోజవర్గ రైతు సంఘం అధ్యక్షులు ఈలప్రోలు సుబ్బయ్య, జెడ్పీటీసీ సభ్యులు వీరబాబు, ఎంపీటీసీ సభ్యులు సాదం గోపి, గుర్రం శ్రీనివాసరావు, వలంటరీ విభాగం అధ్యక్షులు భాస్కర్ ప్రసాద్, కంబాల ప్రదీప్ తదితరులు ఉన్నారు. -
కారు ఢీకొని రైతు మృతి
భీమడోలు: జాతీయ రహదారి పాతూరు వద్ద గురువారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ రైతు మృతి చెందాడు. వివరాల ప్రకారం సూరప్పగూడెం పంచాయతీ పరిధిలోని పాతూరుకు చెందిన రైతు వెజ్జు సత్యనారాయణ(53) ఉదయం సూరప్పగూడెంలోని వ్యవసాయ పనుల నిమిత్తం తన బైక్పై వెళ్లాడు. అక్కడ పనులు ముగించుకుని తిరిగి తన స్వగ్రామానికి బైక్పై వస్తూ జాతీయ రహదారిని దాటుతుండగా.. నరసాపురం నుంచి ఏలూరు వైపుగా వెళ్తున్న కారు అతివేగం వచ్చి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైతు వెజ్జు సత్యనారాయణకు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అయితే బైక్ను ఢీకొట్టిన కారు పల్టీలు కొట్టి నుజ్జునుజ్జయ్యింది. అతనిని చికిత్స నిమిత్తం నిమిత్తం ఓ ప్రైవేటు అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టమ్ నిమిత్తం సత్యనారాయణ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైతు సత్యనారాయణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య వెజ్జు సుబ్బలక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమడోలు హెచ్సీ సూరిశెట్టి శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చింతమనేని X జెడ్పీ చైర్పర్సన్
డీపీఓగా మల్లికార్జునరావు ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లా పంచాయతీ అధికారిగా నియమితులైన జీవీకే మల్లికార్జునరావు బుధవారం కలెక్టర్ వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిశారు. కాళ్ల: కాళ్లకూరులో వేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు దివంగత వేటుకూరి శివరామరాజు కుమారులు రూ.1,01,116 విరాళంగా అందజేశారు. గురువారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లాలో కూటమి పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. దెందులూరు ఎమ్మెల్మే చింతమనేని ప్రభాకర్, జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. గతంలో జెడ్పీ చైర్పర్సన్ను ఉద్దేశించి చింతమనేని కోవర్టు అంటూ వ్యాఖ్యలు చేయగా.. తాజాగా పార్టీ నుంచి గెంటేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారంటూ చింతమనేనిని ఉద్దేశించి జెడ్పీ చైర్పర్సన్ విమర్శలు చేశారు. దీంతో కూటమి కుమ్ములాటకు మళ్లీ తెరలేచింది. చింతమనేని ప్రభాకర్ కొద్ది నెలల క్రితం జరిగిన ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడి ప్రమాణస్వీకార సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి పార్టీలో కోవర్టులున్నారని.. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలతో ఇబ్బందులు ఉన్నాయని వ్యాఖ్యలు చేయగా అదే వేదికపై ఉన్న మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా స్పందించారు. పార్టీలో ఎవరిని చేర్చుకోవాలనేది అధిష్టానందే తుది నిర్ణయమని, దానికనుగుణంగా అన్ని ఉంటాయని బదులిచ్చారు. దీంతో మంత్రి వర్సెస్ చింతమనేని వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. చింతమనేని జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీని ఉద్దేశించి మాట్లాడారు. గత కొన్నేళ్ళుగా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు, రాజకీయ వివాదాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల అనంతరం జెడ్పీ చైర్పర్సన్ టీడీపీలో చేరికను చింతమనేని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదు. నియోజకవర్గంలో జెడ్పీ చైర్పర్సన్కు చెక్! సమావేశాల్లో జెడ్పీ చైర్పర్సన్ వేదికపైన, ఎమ్మెల్యేలకు కింద కుర్చీలు వేయడంపై ఒకసారి వివాదం రేగింది. జెడ్పీ చైర్పర్సన్ సొంత మండలమైన పెదపాడులోని సత్యవోలు, నాయుడుగూడెం, కొత్తముప్పర్రులో పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్యశాఖ నిధులతో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి జెడ్పీ చైర్పర్సన్ పేరు లేకుండా శిలాఫలకాలు ఎమ్మెల్యే వేయించారనేది ఆరోపణ. సత్యవోలులో సబ్స్టేషన్ నిర్మాణం పూర్తయ్యి కార్యకలాపాలు ప్రారంభమైనా ఓపెనింగ్ చేయకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నారనేది అభియోగం. తాజాగా జెడ్పీలో గ్రూపులు ఏర్పాటు చేసి చైర్పర్సన్ నిర్ణయాలకు గండికొట్టేలా పావులు కదుపుతున్నారు. ఈ పరిణామాల క్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ప్రొటోకాల్ వివాదంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ను వివరణ కోరినట్లు సమాచారం. మరోవైపు దెందులూరులో అడ్డగోలుగా మైనింగ్ దందా సాగుతున్న క్రమంలో జెడ్పీ చైర్పర్సన్ మైనింగ్ తవ్వకాలపై సమీక్ష నిర్వహించడం చింతమనేనికి కోపం తెప్పించింది. దీనిపై ఇన్చార్జి మంత్రి జెడ్పీ చైర్పర్సన్ను ప్రశ్నించినట్లు సమాచారం. దెందులూరు ఎమ్మెల్యే పైనా జెడ్పీ చైర్పర్సన్ సీఎంకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల క్రమంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తనను పార్టీ నుంచి గెంటివేయడానికి దెందులూరు నేతలు కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. కూటమిలో కుమ్ములాటల పర్వం జెడ్పీ చైర్పర్సన్ను గతంలో కోవర్టు అన్న చింతమనేని పార్టీ నుంచి గెంటేయడానికి చింతమనేని ప్రయత్నం: జెడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ -
దైవదర్శనానికి వెళ్లి వడదెబ్బతో మృతి
కై కలూరు: దైవదర్శనానికి వెళ్లి రాత్రి గుడిలో నిద్రించిన మహిళ ఉదయం చూసేసరికి మరణించిన ఘటన కృష్ణాజిల్లా మోపిదేవి సుబ్రహ్మేణ్యేశ్వర ఆలయంలో బుధవారం జరిగింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం కై కలూరు సంతమార్కెట్ సెంటర్లో నివసిస్తున్న మానుపాటి శ్రీదేవి(50)కి భర్త మరణించగా కుమార్తె సాయిపూజితకు వివాహమై భీమవరంలో ఉంటుంది. మృతురాలు శ్రీదేవి సమీప గృహాల్లో పనులు చేసుకుని ఒంటరిగా జీవిస్తోంది. ఈమె వివిధ దైవదర్శనాల నిమిత్తం ఆదివారం ఇంటి నుంచి వెళ్లినట్లు బంధువులు చెబుతున్నారు. మంగళవారం పగలు ఎండలో మోపిదేవి సుబ్రహ్మేణ్యేశ్వర ఆలయానికి చేరుకుంది. రాత్రి గుడివద్ద నిద్ర చేసింది. ఆమెకు నిద్ర పట్టక మధ్య రాత్రిలో ఆందోళనతో తిరిగినట్లు సమీప వ్యక్తులు చెబుతున్నారు. బుధవారం మరణించి ఉండటాన్ని భక్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మోపిదేవి ఎస్సై గౌతంకుమార్ శ్రీదేవి మృతదేహానికి అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం బంధువులు గ్రామంలో దహస సంస్కారాలు పూర్తి చేశారు. శ్రీదేవి పగలు ఎండలో నడవడం వలన వడదెబ్బకు గురై మృతి చెందినట్లు తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో అటవీ, అడవి వంటి ప్రాంతాల గుర్తింపు డిజిటలైజ్ పనులు వేగవంతం చేసి నివేదికలు సమర్పించాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం అటవీ భూములు, ప్రాంతాలను గుర్తించి డిజిటలైజ్ ప్రగతిపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో నోటిఫైడ్ అడవులు, అన్–నోటిఫైడ్ అడవులు, ఆక్రమణలు, చెట్లు లేని భూములు, ప్రైవేట్ తోటల పెంపకంపై డేటా సేకరించాలన్నారు. జలధార– జలహారతి కార్యక్రమంలో భాగంగా భూగర్భ జలాల రీఛార్జ్ షాఫ్ట్లు ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. జలధార– జలహారతిలో కాల్వలు, చెరువులలో పూడికతీత పనులను సక్రమంగా చేపట్టి నీటినిల్వ సామర్థ్యం గతం కన్నా పెరిగేలా చూడాలన్నారు. ఈ నెల రెండవ వారం నుంచి వర్షాలు ప్రారంభం కానున్న దృష్ట్యా, కురిసిన ప్రతి నీటి బొట్టును పరిరక్షించుకునేందుకు పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. -
ఇష్టానుసారం తవ్వకాలు
● ఆక్వా చెరువులతో వ్యవసాయ భూములకు ముప్పు ● తవ్వకాలను అడ్డుకున్న ఎఫ్డీవో భీమడోలు: ఆక్వాజోన్ పరిధిని విస్తరించడంతో భీమడోలు మండలంలో సంప్రదాయ వ్యవసాయ భూములు చేపల చెరువులుగా మారుతున్నాయి. సంబంధిత అధికారులు యథేచ్ఛగా అనుమతులు ఇస్తుండటంతో, ఎలాంటి అనుమతులు లేని పచ్చని పంట పొలాలను సైతం కొందరు కూటమి నేతలు గుట్టుచప్పుడు కాకుండా ఆక్వా చెరువులుగా మార్చేసుకుంటున్నారు. అనుమతుల కోసం మత్స్యశాఖ అధికారులకు లక్షలాది రూపాయలు ముట్టజెబుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంట బోదెలను ధ్వంసం చేస్తూ మురుగునీటి వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుండటంతో, భవిష్యత్తులో తమ పొలాలు ముంపునకు గురై బీడు భూములుగా మారుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో డెల్టా ప్రాంతాలకే పరిమితమైన ఆక్వా సాగు, నిబంధనల సడలింపుతో ఇప్పుడు మెట్ట ప్రాంతాలైన గుండుగొలను, భీమడోలు పంచాయతీల్లో విస్తరిస్తుండటం రైతులు, పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది. ఐదేళ్ల కితం చెరువులకు పర్మిషన్లు తీసుకున్న రైతులు అప్పట్లో కఠిన నిబంధనలు ఉండడంతో తవ్వేందుకు వెనుకడుగు వేసారు. కూటమి పాలనలో నిబంధనలు సడలించి పర్మిషన్లు ఇచ్చేందుకు మండల స్థాయి కమిటీలు సిద్ధమవుతున్నాయి. భీమడోలు మండల పరిధిలోని వేసవిలో గుండుగొలను, భీమడోలు పంచాయతీ పరిధిలో చెర్వుల తవ్వకాలు చేపట్టారు. మత్స్యశాఖ సిబ్బందికి లక్షల్లో చేతులు మారినట్లు విమర్శలు వ్యక్తమవతున్నాయి. తగ్గుతున్న వ్యవసాయ విస్తీర్ణం ఆక్వా సాగు ద్వారా రైతులకు అధిక ఆదాయం లభిస్తున్నా, దీర్ఘకాలంలో భూమి నిస్సారం కావడం, భూగర్భ జలాలు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పంట భూములు చెరువులుగా మారడంతో వ్యవసాయ విస్తీర్ణం తగ్గి, ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఆక్వా సాగు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే, భవిష్యత్తు తరాల కోసం వ్యవసాయం, పర్యావరణం, భూగర్భ జలాల సంరక్షణ మధ్య ప్రభుత్వం సమతుల్యత పాటించడం అవసరమని ప్రజలు కోరుతున్నారు. అక్రమ చెరువుల తవ్వకాల అడ్డగింపు గుండుగొలను ఆయకట్టు పరిధిలో సర్వే నెంబర్లు 524 నుంచి 580 వరకు 40 మంది రైతులకు చెందిన 90 ఎకరాల వ్యవసాయ భూమిని ఆక్వా చెరువులుగా మార్చుకునేందుకు అధికారులు అనుమతిచ్చారు. అయితే, తవ్వకాల సమయంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా తవ్వి డ్రైనేజీ వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. ఇదే ముసుగులో అనుమతులు లేని సర్వే నెం. 526, 527ల్లోని ఏడు ఎకరాల వ్యవసాయ భూమిని సైతం రాత్రింబవళ్లు జేసీబీల సాయంతో చెరువుగా మార్చేస్తున్నారు. దీనివల్ల తమ పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయకట్టు రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం భీమడోలు మత్స్యశాఖ అధికారిణి (ఎఫ్డీవో) దుర్గాభవాని తన సిబ్బందితో హుటాహుటిన వెళ్లి పనులను అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువులు తవ్వుతున్న వారికి నోటీసులు ఇచ్చారు. అనుమతుల్లేకుండా తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. -
దాడి చేసిన నిందితుడిపై చర్యలేవి?
ఆగిరిపల్లి: మండలంలోని శోభనాపురం వైఎస్సార్సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు నక్కనబోయిన సాంబశివరావుపై విచక్షణ రహితంగా దాడి చేసిన టీడీపీ నాయకుడిపై ఇంతవరకు సరైన చర్యలు ఎందుకు తీసుకోలేదని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పోలీసు అధికారులను ప్రశ్నించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న సాంబశివరావును ఆయన మంగళవారం రాత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు సాంబశివరావును దారి కాచి కూతురి ముందే తీవ్రంగా దాడి చేశారన్నారు. ఆగిరిపల్లి టీడీపీ మండల అధ్యక్షుడు దాడి చేయించాడని సాంబశివరావు, అతని కుటుంబ సభ్యులు చెబుతున్నా అతనిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపరిచిన టీడీపీ నాయకుడు ఇంద్రపై తూతు మంత్రంగా కేసు నమోదు చేశారన్నారు. అతను దర్జాగా బయట తిరుగుతున్నాడని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. ఇప్పటికై నా సాంబశివరావుపై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకొని, న్యాయం చేయాలని ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
టీడీపీ నుంచి గెంటేయాలనే కుట్ర
ఏలూరు రూరల్: కొందరు నాయకులు తనను టీడీపీ నుంచి గెంటేయాలని కుట్ర చేస్తున్నారని ఉమ్మడి పశ్చిమగోదావరి జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశీ ఆరోపించారు. దీనిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసే పిరికివాళ్లం కాదని, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ధైర్యంగా ఎదుర్కొంటానన్నారు. బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో భర్త ప్రసాద్తో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. గతంలో రాజకీయ ప్రత్యర్ధులుగా ఎదుర్కొన్న నాయకులు నేడు అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారన్నారు. కొద్దిరోజుల క్రితం ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికై న ఎమ్మెల్యే బడేటి చంటిని కలిసి శుభాకాంక్షలు చెప్పామని, ఈ సమయంలో కొందరు దెందులూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వలస పక్షులు అంటూ గేలి చేస్తూ, పలు పత్రికల్లో వార్తలు రాయించారని గుర్తు చేశారు. పార్టీలో అందరికీ మేం నచ్చాలని లేదని, మాకు కూడా కొందరు నచ్చరన్నారు. బాధ్యతలు చేపట్టిన సీఈఓ నేటికీ చైర్పర్సన్ను కలవలేదన్నారు. జెడ్పీ ఉద్యోగులు సైతం రెండు వర్గాలుగా విడిపోయి, పాలనను సాగనీయడం లేదన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నిన మా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తామన్నారు. -
వెన్నుపోటుకు రెండేళ్లు
ఏలూరు టౌన్: టీడీపీ కూటమి అధికారం చేపట్టి రెండేళ్లలో ప్రజలను దారుణంగా మోసం చేస్తూ... తన అసమర్థ పాలనతో ప్రజలను నట్టేట ముంచిందని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. అధికారం చేపట్టిన రెండేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని, వారి ‘సూపర్ సిక్స్’ పథకాలు ‘సూపర్ ఫాల్స్’గా మారాయని విమర్శించారు. ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్తో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు పాలనతో ప్రజలు ఏవిధంగా నష్టపోయారో వివరిస్తూ... రెండేళ్ల వెన్నుపోటుపై ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో ప్రజలకు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోను అమలు చేయకుండా ఏవిధంగా మాయచేశారో ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. నిరుద్యోగ యువత, రైతన్నలు, మహిళలు, విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను ఎంత దారుణంగా మోసం చేశారో ప్రజలు గుర్తించాలని కోరారు.రాష్ట్రంలోని రైతన్నలకు కేంద్రంతో సంబంధం లేకుండా రూ.20 వేల ఆర్థిక సాయం చేస్తూ ఆదుకుంటానని నమ్మబలికారని, తీరా అధికారంలోకి వచ్చాక రైతులకు తీవ్ర ద్రోహం చేశారని మండిపడ్డారు. కనీసం పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారన్నారు. బ్యాంకు రుణాలు తీర్చలేక, తుఫానుల పంట నష్టపరిహారం, బీమా సదుపాయం లభించక రైతులు దైన్యస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి జిల్లాల్లో ఆక్వా రైతుల పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయని, టీడీపీ హామీలు ఏమయ్యాయో తెలియని దుస్థితి ఏర్పడిందన్నారు. మహిళలను మోసగించారు మహిళల దృష్టిలో చంద్రబాబు నయవంచకుడిగా మారారని ఆరోపించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తే... చంద్రబాబు వారిని దివాళా తీసేలా చేశారన్నారు. 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పింఛను ఇస్తానని మోసం చేశారన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకూ నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పి హ్యాండిచ్చారని, గతంలో జగన్ ఏటా ఇచ్చిన రూ.18,750 పథకానికి చంద్రబాబు పూర్తిగా ఎగనామం పెట్టారని గుర్తుచేశారు. నిరుద్యోగ యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తూ ఎన్నికల హామీలపై నీళ్లు చల్లారని విమర్శించారు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నిరుద్యోగులను నమ్మించి మోసం చేశారన్నారు. ఉద్యోగ కల్పన లేకుంటే ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని రెండేళ్లు కావస్తున్నా నెరవేర్చలేదని నిలదీశారు. చంద్రబాబు మోసాలపై ఉద్యమబాట కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని డీఎన్ఆర్ స్పష్టం చేశారు. ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రజల పక్షాన పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. జూన్ 4న మండల కేంద్రాల్లో టీడీపీ కూటమి మేనిఫెస్టో ప్రతులు, బాబు–పవన్ సంతకాల బాండ్ల దగ్ధం, జూన్ 8, 9 తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో యువత, రైతులు, మహిళలకు బాబు మోసాలపై అవగాహన కల్పించేందుకు రౌండ్ టేబుల్ సమావేశాలు, జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు వెన్నుపోటుకు నిరసనగా భారీ ర్యాలీలు చేపడతారని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పోలవరం నియోజకవర్గ పరిశీలకుడు కనుమూరి శివాజీ, కై కలూరు పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్బాబు, చింతలపూడి పరిశీలకుడు దాసరి రమేష్, జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్బాబు, వడ్డీల కార్పొరేషన్ అధ్యక్షుడు ముంగర సంజయ్కుమార్, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, వైఎస్సార్టీయూ జిల్లా అధ్యక్షులు పల్లి శ్రీనివాస్, ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 4 నుంచి 12 వరకు వైఎస్సార్సీపీ పోరుబాట యువత, రైతులు, మహిళలతో ఆందోళనలు పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు -
జంట హత్యల కేసులో దొరకని క్లూ
యూత్ ఐకాన్ అవార్డు తాడేపల్లిగూడెం: సామాజిక సేవ, యువజన సాధికారత కృషి చేస్తున్న తాడేపల్లిగూడెంకు చెందిన చిరివెళ్ల సాయి మహంతీర్కు యూత్ ఐకాన్ అవార్డు లభించింది. ఉంగుటూరు: నల్లమాడు జంట హత్యల కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఏలూరు జిల్లా నల్లమాడు ఆయకట్టు జీడితోట పొలంలో జరిగిన తల్లి, కూతుళ్ల హత్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ ఘటన జరిగి 37 గంటలు గడుస్తున్నా పోలీసులకు ఇంకా ఎలాంటి కీలక ఆధారాలు దొరకలేదు. ఏలూరు, జంగారెడ్డిగూడెం ట్రైనీ ఐపీఎస్ అధికారులు, డీఎస్పీ శ్రావణ్కుమార్ నేతృత్వంలోని బృందాలు మంగళవారం మరోసారి అక్కడ తనిఖీలు చేపట్టాయి. నిందితుల కోసం వేలిముద్రల నిపుణులు, క్లూస్ టీమ్ సలహాలు తీసుకుంటూ, సెల్ఫోన్ డేటా ఆధారంగా కూడా విచారణ జరుపుతున్నారు. కేసును ఛేదించేందుకు పలువురు సీఐలు, ఎస్ఐలు రంగంలోకి దిగారు. మరోవైపు గణపవరం సీఐ రజనీకుమార్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో మృతులు ఆంధోబాయి, ఆమె కుమార్తె వెంకటలక్ష్మి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం మృతదేహాలను కుమారుడు నాగరాజు, భర్త సుదర్శన్లకు అప్పగించగా, బంధువులు అనంతపల్లిలో అంత్యక్రియలు పూర్తి చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. -
కావాల్సిన వారికే ఉద్యోగాలు
● డీఎస్సీలో నూతన విధానంపై రచ్చ ● అన్నీ అవకతవకలే అంటూ అభ్యర్థుల నిరసన ● పట్టించుకోని ప్రభుత్వం బుధవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2026ఏలూరు (ఆర్ఆర్పేట): డీఎస్సీ కోసం సంవత్సరాలుగా ఎదురుచూసిన అభ్యర్థులకు ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. గత ఏడాది జరిగిన డీఎస్సీ అంతా తప్పుల తడకగా నిర్వహించి ప్రభుత్వం పారదర్శకతను ప్రశ్నార్థకం చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడితే తొలి సంతకం డీఎస్సీ ఫైలుపైనే అని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత డీఎస్సీని పక్కకు పెట్టేశారు. నిరుద్యోగులు, యువత నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతకు భయపడి ఎట్టకేలకు గత ఏడాది చివర్లో డీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు ఆశించిన మేరకు డీఎస్సీ పారదర్శకంగా మాత్రం జరగలేదని అప్పట్లోనే పలువురు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా డీఎస్సీని నిర్వహించడం, అనంతరం తమకు కావాల్సిన వారికి, డబ్బులిచ్చిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టిందని.. డీఎస్సీలో తప్పక ఉద్యోగం వస్తుందని ఆశించిన ఎంతోమంది నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ అవకతవకలే అంటూ నిరసన కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ అంతా అవకతవకలేనని అభ్యర్థులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాకు సంబంధించిన ఉద్యోగాల ఎంపిక జరగాల్సి ఉండగా, అందుకు భిన్నంగా ఈ డీఎస్సీలో జిల్లా సెలక్షన్ కమిటీ నామమాత్రపు పాత్రే పోషించిందని, ఎంపికలన్నీ రాష్ట్ర స్థాయిలోనే చేశారనే విమర్శలు కూడా వచ్చాయి. ఎంపికలన్నీ ముఖ్యనేత కనుసన్నల్లో డబ్బులిచ్చిన వారినే ఎంపిక చేసేలా సింగిల్ విండో ప్రాతిపదికన నిర్వహించి సొమ్ములు దండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డీఎస్సీలో అక్రమాలు జరిగాయి అని చెప్పడానికి స్పోర్ట్స్ కోటానే చక్కని నిదర్శనం అంటున్నారు. విచిత్రంగా విద్యా శాఖకు ఎటువంటి సంబంధం లేకుండా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) పంపిన జాబితాలోని అభ్యర్థులనే ఉద్యోగాలకు ఎంపిక చేయడం కూడా విమర్శలకు తావిచ్చింది. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి జిల్లాలో 23 మంది అభ్యర్థులకు రిజర్వేషన్ ఉంది. ఎప్పటిలా ఎంపికలు నిర్వహిస్తే ప్రతి ఉద్యోగానికీ 1:3 గానీ, కనీసం 1:2 నిష్పత్తిలో గానీ అభ్యర్థులను పిలవాల్సి ఉంటుంది. ఈ మేరకు జిల్లాలో కావాల్సిన 23 ఉద్యోగాలకు కేవలం ఒక్కొక్క అభ్యర్థి పేరునే ప్రతిపాదిస్తూ శాప్ అధికారులు కేవలం 23 మంది పేర్లతోనే జాబితా పంపడం, ఆ జాబితాలోని వారికే ఉద్యోగాలు దక్కడం కూడా అవకతవకలు జరిగాయనడానికి బలం చేకూర్చుతోంది. మెగా డీఎస్సీ అంటూ కాలం గడిపిన కూటమి ప్రభుత్వం, ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితుల్లో దగా డీఎస్సీగా మార్చేశారు. టెట్, డీఎస్సీ లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలివ్వడం ఎంతవరకు సబబు? పారదర్శకంగా చేపట్టాల్సిన డీఎస్సీని స్పోర్ట్స్ కోటాలో ఇస్తే నాణ్యతకు కొలమానం ఏముంటుంది? తక్షణమే డీఎస్సీ విషయంలో సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతున్నాం. ఎస్.వీ.జాకబ్బాబు, వైఎస్సార్సీపీ టీచర్స్ వింగ్ అధ్యక్షుడు, తణుకు అర్బన్ డీఎస్సీ 2025లో న్యాయపరమైన, సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి. స్పష్టమైన గైడ్లైన్స్ లేకుండా నోటిఫికేషన్ ఇవ్వడం వల్లే డీఎస్సీ నియామకాలు కోర్టు కేసుల గందరగోళంలో చిక్కుకున్నాయి. నియామకాల్లో పూర్తి పారదర్శకత పాటించి, అక్రమాలపై విచారణ జరపాలి. ప్రభుత్వం ఇప్పటికై నా తన మొండివైఖరిని వీడి నిరుద్యోగుల ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. – కోటే వరుణ్, భైరవపట్నం, మండవల్లి మండలం డీఎస్సీలో గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ఈ దఫా డీఎస్సీలో హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ విధానంలో మహిళలు, దివ్యాంగులు, వివిధ క్రీడల్లో ప్రతిభ చూపిన వారు, ఎక్స్–సర్వీస్మెన్లను చేర్చారు. సాధారణంగా ప్రతీ డీఎస్సీలో జనరల్ కేటగిరీలో ఈ నాలుగు కేటగిరీలకు చెందిన వారు ఉద్యోగాలకు ఎంపికై నా, ఇదే కేటగిరీకి చెందిన ఇతరులకు రిజర్వేషన్ వర్తిస్తుంది. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన హారిజాంటల్ రిజర్వేషన్ విధానంలో ఈ నాలుగు కేటగిరీలకు చెందిన అభ్యర్థుల్లో ఎవరైనా జనరల్ కేటగిరీలో ఉద్యోగం సాధిస్తే ఇక ఆ కేటగిరీలో రిజర్వేషన్ ఉండకుండా చేసి ఆయా అభ్యర్థులకు ఉద్యోగాలను దూరం చేసింది. -
వినూత్న నిరసనకు రైతులు సన్నద్ధం
● ఆక్వా రంగంలోని సమస్యలపై ఆందోళన ● ఈనెల 8న ఉచిత భోజనాలతో రైతుల నిరసన ● నాయకత్వం వహించేది కూటమి నేతలేనా? భీమవరం: ఆక్వా ఫీడ్, సీడ్ ధరల విపరీత పెంపు, రొయ్యల ధరలు పతనం కావడం, సబ్సిడీ విద్యుత్ అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆక్వా రైతులు ప్రభుత్వంపై వినూత్న నిరసనకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో దాదాపు 90 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఈ నెల 8వ తేదీన మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలకు రొయ్యలు, చేపల కూరలతో ఉచిత భోజన వసతి కల్పించి తమ నిరసనను తెలపాలని రైతులు నిర్ణయించారు. రైతులు ఉక్కిరిబిక్కిరి ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, ఫీడ్, సీడ్ ధరలు విపరీతంగా పెంచడంతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీనికి తోడు రొయ్యల ధరల్లో నిలకడ లేకపోవడం, కొనుగోలుదారులు సిండికేట్గా మారి ధరలను తగ్గించేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మే నెలలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని రైతులంతా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. వీరవాసరంలో ఫీడ్ బస్తాలను తగులబెట్టి మరీ నిరసన తెలిపారు. ఆక్వా జోన్ల ప్రమేయం లేకుండా ఆక్వా రైతులందరికీ సబ్సిడీ విద్యుత్ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టి, అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. మూకుమ్మడిగా రోడ్డెక్కిన రైతులు ఆక్వా సాగు చేస్తున్న రైతులు విభిన్న రాజకీయ పార్టీలకు మద్దతుదారులుగా ఉన్నప్పటికీ, సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు రాజకీయాలను పక్కనబెట్టి అంతా ఒక్కటయ్యారు. అయితే, ఈ ఆందోళన కార్యక్రమాలకు ఎక్కువగా టీడీపీ, జనసేన, బీజేపీ స్థానిక నాయకులే నాయకత్వం వహిస్తుండటం విశేషం. పార్టీలతో సంబంధం లేకుండా రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఈ పోరాటం సాగుతోంది. ఆక్వా ఫీడ్ ధరలపై తేలని నిర్ణయం గత నెలలో ఫీడ్ ఉత్పత్తి కంపెనీలు ధరలను విపరీతంగా పెంచడంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఒకేసారి టన్ను ఫీడ్ ధరను రూ. 16 వేలకు పెంచడంతో, ప్రభుత్వం ఫీడ్ కంపెనీల యజమానులతో అత్యవసర సమావేశం నిర్వహించింది. దీనివల్ల ధరల పెంపు తాత్కాలికంగా నిలిచిపోయినప్పటికీ, ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల భవిష్యత్తులో ధరలు పెంచక తప్పదని కంపెనీల యజమానులు స్పష్టం చేశారు. దీంతో ఎప్పుడైనా ధరలు మళ్లీ పెరగొచ్చనే ఆందోళనలో రైతులు ఉన్నారు. సబ్సిడీ విద్యుత్పై వెలువడని స్పష్టత ఆక్వా జోన్లతో సంబంధం లేకుండా సాగు చేస్తున్న రైతులందరికీ సబ్సిడీ విద్యుత్ ఇవ్వాలనే డిమాండ్పై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి సానుకూల ప్రకటన రాలేదు. జిల్లాలో సుమారు 16,332 ఆక్వా విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వాటిలో రెండు వేలకు పైగా రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం లభించడం లేదు. ఇటువంటి తరుణంలో పెట్టుబడులు పెరిగి, ఆదాయం తగ్గడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రొయ్యల ధరల పతనం, ఫీడ్, సీడ్ ధరల పెరుగుదలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలి. పెంచిన ఫీడ్ ధరలను తాత్కాలికంగా తగ్గించడం సరిపోదు, భవిష్యత్తులో ధరలు పెంచకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. అలాగే రొయ్యల ధరలు నిలకడగా ఉండేలా కట్టుదిట్టమైన వ్యవస్థను తీసుకురాకపోతే ఆక్వా రైతుల మనుగడ కష్టమవుతుంది. – భోగిరెడ్డి శ్రీనివాసరావు, ఆక్వా రైతు, తోలేరు ప్రభుత్వంపై ఇప్పటికే పలు రూపాల్లో పోరాటం చేసిన ఆక్వా రైతులు, ఈసారి మరింత వినూత్నంగా నిరసన తెలపనున్నారు. ఈ నెల 8న మృగశిర కార్తె సందర్భంగా పాలకొల్లు, నరసాపురం, మార్టేరు తదితర ప్రాంతాల్లో ప్రజలకు ఉచితంగా చేపలు, రొయ్యల భోజనాలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమానికి నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, టీడీపీకి చెందిన పాలకొల్లు ఏఎంసీ మాజీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు వంటి కూటమి నాయకులే మద్దతుగా నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ స్పందిస్తూ.. ఆక్వా రైతులు కూడా పత్తి రైతుల మాదిరిగానే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందంటూ విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపుతోంది. మొత్తం మీద కూటమి ప్రభుత్వంలోని పార్టీల నాయకులే ఈ ఆందోళనల్లో ముందుండటం గమనార్హం. -
మాతా శిశు మరణాలు నివారించాలి
ఏలూరు (టూటౌన్): జిల్లాలో తల్లి, శిశు మరణాలను పూర్తిగా నివారించడమే లక్ష్యంగా ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు మాతృ–జీరో ఐఎంఆర్, ఎంఎంఆర్ పైలట్ ప్రాజెక్టుపై కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, క్షేత్రస్థాయిలో సిబ్బంది సమన్వయంతో పనిచేసి మాతాశిశు మరణాలను పూర్తిగా నివారించాలని ఆదేశించారు. హైరిస్క్ ఉన్న గర్భిణులను గుర్తించి, ప్రసవానికి నెల రోజుల ముందు నుంచే రోజువారీగా వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని, ప్రతి హైరిస్క్ గర్భిణీ పర్యవేక్షణకు ఒక అడాప్షన్ అధికారిని నియమించాలని ఆదేశించారు. గర్భిణులు యోగా, వ్యాయామం, నడక సాగించేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రసవానంతరం 40 రోజుల పాటు సిబ్బంది మాతాశిశు గృహాలను తప్పనిసరిగా సందర్శించి వైద్య సేవలు, పౌష్టికాహారంపై సలహాలు అందించాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు. శోభ, ఐసిడిఎస్ పీడీ పి. శారద, డీసీహెచ్ఎస్ డాక్టర్ సి.హెచ్. బేబికమల, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. పద్మావతి, నోడల్ ఆఫీసర్ శ్రీనివాసరావు మరియు నూజివీడు నియోజకవర్గ వైద్యాధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ కె. వెట్రిసెల్వి -
ఎకై ్సజ్ శాఖలో పదోన్నతులు
ఏలూరు టౌన్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎకై ్సజ్ శాఖలో సుదీర్ఘకాలం నుంచి ఉత్తమ సేవలు అందిస్తున్న 10 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతులు లభించాయి. వారందరికీ హెడ్కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ జిల్లా ఎకై ్సజ్ అధికారి ఏ.ఆవులయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ బీ.శ్రీలత చేతులమీదుగా పదోన్నతుల నియామక పత్రాలను అందజేశారు. ఇందులో ఎకై ్సజ్ హెడ్కానిస్టేబుళ్లుగా.. కే.నాగరాజు, యు.ఫిలిప్, పీ.రామ్మోహనరావు, జే.గోపాలకృష్ణ, పీ.సత్యనారాయణ, బీకేఎన్ సింగ్, వై.శ్రీరామమూర్తి, కే.సూర్యప్రకాశరావు, కే.వెంకటరామన్న దొర, పీ.శైలజ ఉన్నారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్, ఎకై ్సజ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అక్కిన ఆనంద్, కార్యవర్గ సభ్యులు పదోన్నతులు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. -
నల్లమాడులో జంట హత్యలు
ఉంగుటూరు: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లమాడు ఆయకట్టు ప్రాంతంలోని జీడిమామిడి తోటల్లో మూడు రోజులు క్రితం జరిగిన జంట హత్యలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. మృతులు తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన తల్లీ కుమార్తెగా గుర్తించారు. వీరిద్దరినీ శుక్రవారం రాత్రి హతమార్చినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... అనంతపల్లికి చెందిన గంటా అంథోబాయికి నలుగురు పిల్లలు. వీరిలో వెంకటలక్ష్మి అంధురాలు కావడంతో 2009లో బ్యాక్లాగ్ పోస్టులో ఏలూరు మున్సిపాలిటీలో అటెండర్ ఉద్యోగం వచ్చింది.తల్లి అంథోబాయితో కలిసి ఏలూరులో ఇల్లు అద్దెకు తీసుకుని ఉద్యోగం చేస్తోంది. వెంకటలక్ష్మి సోదరుడు సుదర్శన్ కూడా వీరితోనే ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఏలూరులో తల్లీకుమార్తె బయలుదేరి ఫంక్షన్కు వెళ్లేందుకు దూబచర్ల వచ్చారు. రాత్రి 8 గంటల సమయంలో దూబచర్ల చేరినట్టు ఏలూరులో ఉన్న కుమారుడికి తల్లి ఫోన్ చేసి చెప్పింది. 9 గంటల నుంచి వారి ఫోన్ పని చేయలేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఆలపాటి వేణు అనే రైతు పొలంలోకి వెళ్లగా అక్కడ మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారమిచ్చాడు.దీంతో ఏలూరు డీఎస్పీ శ్రావణకుమార్, కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్, ఇతర పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుకుని వివరాలు సేకరించారు. జంట హత్యల విషయం తెలియడంతో నల్లజర్ల, ఉంగుటూరు మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి మృతులను గుర్తించి అనంతపల్లికి చెందిన వారని చెప్పడంతో వారి బంధువులకు పోలీసులు సమాచారమిచ్చారు. క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో హంతకుల కోసం వెతుకుతున్నారు. శుక్రవారం రాత్రి బస్సు దిగిన తర్వాత తల్లీకుమార్తె ఆటో ఎక్కి ఉండవచ్చని... ఆటో డ్రైవర్ వీరిని నల్లమాడు ఆయకట్టు పరిధిలోని జీడితోటలోకి తీసుకెళ్లి బంగారం, నగదు కోసం హతమార్చి ఉండొచ్చని భావిస్తున్నారు. హంతకులు ఎవరు, హత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సు నుంచి జారిపడి మహిళ దుర్మరణం
భీమడోలు: బస్సు ఫుట్పాత్ నుంచి జారిపడి ఓ మహిళ దుర్మరణం పాలైన ఘటన సోమవారం భీమడోలు బస్టాండ్లో చోటుచేసుకుంది. గణపవరంనకు చెందిన గేదెల అనంతలక్ష్మి (41) జీవనోపాధి నిమిత్తం భర్త, పిల్లలతో తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో నివసిస్తోంది. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె భీమడోలు జంక్షన్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందుతోంది. ఈ క్రమంలో సోమ వారం తన కుమార్తె చింతా శృతితో కలిసి ఆస్పత్రికి వచ్చి మందులు తీసుకుని తిరిగి అనంతపల్లికి వెళ్లేందుకు భీమడోలు బస్టాండ్కు వచ్చారు. రాజమండ్రి బస్సు సర్వీసులు తక్కువగా ఉండడంతో గంటల తరబడి వేచి చూశారు. ఎట్టకేలకు వచ్చిన బస్సు ప్రయాణికులతో రద్దీగా ఉండటంతో ఆనంతలక్ష్మి బస్సు ఎక్కి ఫుట్పాత్పై నిలబడింది. కుమార్తె బస్సు ఎక్కలేదు. ఈలోపు బస్సు వేగంగా ముందుకు కదలడంతో ఒక్కసారిగా ఫుట్పాత్పై నుంచి అనంతలక్ష్మి జారి పడింది. ఇంతలోనే ఆమె పొట్ట పైనుంచి బస్సు వెనుక చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కళ్లేదుటే తల్లి మరణం చూసిన కుమార్తె శృతి కన్నీరుమున్నీరుగా విలపించింది. సమాచారం అందుకున్న భీమడోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆనంతలక్ష్మి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త నరసింహమూర్తి ఫిర్యాదు మేరకు భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొవ్వూరు ఆర్టీసీ డీఎం బస్టాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రయాణికులను విచారించారు. ఆస్పత్రికి వచ్చి తిరిగి వెళుతుండగా ప్రమాదం -
పోలీస్ పీజీఆర్ఎస్లో 45 అర్జీలు
ఏలూరు టౌన్ : ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో 45 ఫిర్యాదులను జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ స్వీకరించారు. ఫిర్యాదులు, వినతులు సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు ఏలూరు రావాల్సిన పనిలేదనీ.. ఆన్లైన్ సౌకర్యం ఉంటే నేరుగా మీకోసం వెబ్సైట్లో ఫిర్యాదులు నమోదు చేసుకోవ చ్చని స్పష్టం చేశారు. ఫిర్యాదుల పురోగతికి టోల్ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించే అవకాశం ఉందన్నారు. పెదవేగి స్టేషన్కు వాహనం అందజేత పెదవేగి సర్కిల్ పోలీస్స్టేషన్కు బొలెరో వాహనాన్ని దాత అందజేశారు. పెదవేగి మండలం గార్లమడుగులోని వాహన్కాఫీ లిమిటెడ్ యా జమాన్యం సుందరరామరాజు కార్పొరేట్ సో షల్ రెస్పాన్సిబులిటీలో భాగంగా రూ.10 లక్షల విలువైన వాహనాన్ని పెదవేగి సీఐ రా జశేఖర్కు అందజేశారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శివకిషోర్, ఏఆర్ అదనపు ఎస్పీ మునిరాజా, ఆర్ఐ సతీష్ ఉన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): తూర్పుప్రాంత విద్యు త్ పంపిణీ సంస్థ డిస్కం పరిధిలో అధికారుల పదోన్నతులు, బదిలీలపై ‘విద్యుత్ ఉద్యోగుల్లో బదిలీల చర్చ’ శీర్షికతో గత నెల 30న ‘సాక్షి’లో ప్రచురించిన కథనం నిజమైంది. కథనంలో పేర్కొన్నట్టుగానే ఏలూరు ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ పి.సాల్మన్రాజుకు చీఫ్ జనరల్ మేనేజర్గా పదోన్నతి కల్పించి వి శాఖలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో పో స్టింగ్ ఇచ్చారు. అలాగే ఏలూరులో ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేఎం అంబేడ్కర్కు పదో న్నతి కల్పించి ఏలూరులోనే సూపరింటెండింగ్ ఇంజనీర్గా పోస్టింగ్ ఇచ్చారు. కాగా ఏలూరు సర్కిల్ పరిధిలోని పెదవేగిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.గోపాలకృష్ణకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పదోన్నతి కల్పించి రాజమహేంద్రవరం కనస్ట్రక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పోస్టింగ్ ఇచ్చారు. ఏలూరు ఈఈ అంబేడ్కర్కు పదోన్నతి కల్పించడంతో ఏర్పడిన ఖాళీని విజయనగరంలో ఈఈ టెక్నికల్గా పనిచేస్తున్న ఎం.రాజశేఖరంతో భర్తీ చేశారు. భీమవరం టెక్నికల్ ఏఈఈ సీహెచ్ వీరాస్వామికి డిప్యూటీ ఈఈగా పదోన్నతి కల్పించి ఏలూరు డీపీఈ–1లో పోస్టింగ్ ఇచ్చారు. భీ మవరం ఎస్పీఎంలో ఏఈ వి.రాంబాబుకు డిప్యూటీ ఈఈగా పదోన్నతి కల్పించి జీలుగుమిల్లి ఆపరేషన్స్ స్థానంలో పోస్టింగ్ ఇచ్చారు. నరసాపురం టెక్నికల్ ఏఈ బి.మాధురీ దేవికి డిప్యూటీ ఈఈగా పదోన్నతి కల్పించి పశ్చిమగోదావరి జిల్లా సీటీఎం–1 విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. జీలుగుమిల్లి ఆపరేషన్స్ డిప్యూటీ ఈఈ కె.రమేష్ను ఏలూరు ప్రొటెక్షన్ విభాగానికి బదిలీ చేశారు. సోంపేట సీ అండ్ ఓలో డిప్యూటీ ఈఈ ఎం.నిరంజన్ బాబును పెద వేగి ఆపరేషన్ విభాగానికి బదిలీ చేశారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రభుత్వ రంగ సంస్థలకు, గురుకుల, సొసైటీ పాఠశాల ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచే దస్త్రానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినట్టు సమాచారం వచ్చిందని, ఇది ఎన్ జీఓ సంఘ నాయకుల కృషి ఫలితమేనని ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు, రాష్ట్ర ఉ పాధ్యక్షుడు ఆర్ఎస్ హరనాథ్ ప్రకటనలో తెలిపారు. రెండేళ్లుగా ఏపీ ఎన్జీవోస్ నాయకత్వం కృషి ఫలితంగా వేలాది మంది ఉద్యోగులకు ఊరట లభించిందన్నారు. కామవరపుకోట: ఆడమిల్లికి చెందిన నల్లమెల్లి అలేఖ్య (19) అనే యువతి గతనెల 23న ఆత్మహత్యకు యత్నించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. వివరాలిలా ఉన్నాయి.. అలేఖ్య పదో తరగతి వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. ఆమె సరిగ్గా ఇంటి పనులు చేయడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై ఎలుకల మందు తిన్నది. ఆమె ను కుటుంబసభ్యులు ఏలూరు అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్విస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. తడికలపూడి ఎస్సై ఎస్.వల్లీపద్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మలేరియాపై నిర్లక్ష్యం తగదు
ఏలూరు (టూటౌన్): ప్రజల భాగస్వామ్యంతోనే మలేరియా నిర్మూలన సాధ్యమని, మలేరియాపై నిర్లక్ష్యం తగదని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం మలేరియా వ్యతి రేక మాసోత్సవాల అవగాహన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ప్రపంచ మలేరియా వ్యతిరేక మా సోత్సవాలను ఈనెల 30 వరకు నిర్వహిస్తామన్నా రు. మలేరియా నివారణ, నియంత్రణ, చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జేసీ అభిషేక్ గౌడ, డీఎంహెచ్ఓ యు.శోభ, డీఎంఓ పీఎస్ఎస్ ప్రసాద్, అడిషినల్ డీఎంహెచ్ఓ ఎల్.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్లో 289 అర్జీల స్వీకరణ ఏలూరు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లలో 289 అర్జీలు అందాయని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. పీజీఆర్ఎస్లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్ప వని హెచ్చరించారు. జేసీ అభిషేక్ గౌడ, ఇన్చార్జి డీఆర్వో ఎల్.దేవకీదేవి, ఆర్డీఓ కె.లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని.. ● జంగారెడ్డిగూడేనికి చెందిన యాసారపు నూకరత్నం మ్యూటేషన్, ఆన్లైన్ చేయించి పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పించాలని కోరారు. ● చింతలపూడి మండలం ప్రగడవరానికి చెందిన జమ్మిశెట్టి బాబూరావు గ్రామంలో 50 ఏళ్లకు పైగా ఉన్న పుంత దారిని మూసివేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ● జంగారెడ్డిగూడెం మండలం వేగవరానికి చెందిన నెల్లూరి చంద్రశేఖర్ భూమిని రీసర్వే చేసి ఆన్లైన్ లో నమోదు చేయాలని కోరారు. ● ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రుకు చెందిన సైదు దుర్గా చేపల చెరువును సర్వే చేయించి హ ద్దులు నిర్ణయించాలని కోరారు. ● భీమడోలు మండలం పూళ్లకు చెందిన బొల్లారపు భాస్కరరావు అర్జీనిస్తూ తమ గ్రామంలో రోడ్డుపై మట్టి, కంకర పోసి చాలా రోజులైయిందని, రో డ్డు పనులు చేపట్టకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. -
తల్లీకూతుర్ల మృతదేహాలకు శవపంచనామా
ఉంగుటూరు: ఉంగుటూరు మండలం నల్లమాడు ఆయకట్టు ప్రాంతంలోని జీడిమామిడి తోటల్లో తల్లి గంటా అంథోబాయి (60), కుమార్తె వెంకటలక్ష్మి (47) హత్యలకు సంబంధించి మృతదేహాలకు అధికారులు సోమవారం శవపంచనామా నిర్వహించారు. ఏలూరు డీఎస్పీ శ్రావణకుమార్ నేతృత్వంలో చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్, సీఐ రజనీకుమార్, నల్లమాడు, ఎ.గోకవరం వీఆర్వోలు నాగరాజు, భారతి శవపంచనామాలో పాల్గొన్నారు. ముమ్మర దర్యాప్తు కేసు దర్యాప్తులో భాగంగా పోలీసు జాగిలాలు ఘ టనా ప్రదేశం నుంచి వెనుక వైపు ఉన్న పొలాల్లోకి వెళ్లి ఆగిపోయాయి. అంధురాలు వెంకటలక్ష్మిని ముందుగా హతమార్చగా.. తల్లి అంథోబాయి పారిపోయే ప్రయత్నం చేయగా ఆమెనూ హతమార్చినట్టు తెలుస్తోంది. రెండు మృతదేహాలు సుమారు 50 మీటర్ల దూరంలో పడి ఉండటాన్ని బట్టి ఇది అర్థమవుతోంది. క్లూస్ టీము ఎస్సై ఆనందబాబు, శంకరరావు ఘటనా ప్రదేశాలను పరిశీలించారు. నాలుగు బృందాలుగా పోలీసులు ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని డీఎస్పీ శ్రావణ్కుమార్ తెలిపారు. అంధుల సంఘాల ఖండన అంధురాలు వెంకటలక్ష్మిని హతమార్చడాన్ని అంధుల సంఘాల నాయకులు ఖండించారు. విజువల్లీ చాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు జీడీఎస్ వీరభద్రరావు మృతుల కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి హత్యలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
కూటమిది దగా డీఎస్సీ
ఏలూరు టౌన్ : కూటమి ప్రభుత్వానిది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు గళమెత్తాయి. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో సోమవారం ఏలూరులో వైఎస్సార్సీపీ జిల్లా యువజన అధ్యక్షుడు కామిరెడ్డి నాని ఆధ్వర్యంలో డీఎస్సీ–25 అవినీతి కుంభకోణంపై భారీ ధర్నా చేపట్టారు. ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ యువజన విభాగం రీజనల్ కో–ఆర్డినేటర్, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్, ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కందుల దినేష్రెడ్డి హాజరయ్యారు. భారీ ర్యాలీ.. బైఠాయింపు వైఎస్సార్సీపీ నాయకులు ఏలూరు ఎన్ఆర్పేట ప్రధాన రహదారి నుంచి భారీ ర్యాలీగా ఏలూరు కలెక్టరేట్ ధర్నా చౌక్ వరకూ వెళ్లారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ పెద్దెత్తున నినాదాలు చేశారు. రూ.15 లక్షలకు స్పోర్ట్స్ కోటాలో పోస్టుల బేరాలా?, ఔట్సోర్సింగ్ ఉద్యోగికి డీఎస్సీ లో మొదటి ర్యాంకు ఎలా వచ్చింది?, డేటా ఎందుకు డిలీట్ చేశారు, మెరిట్ లిస్ట్ ఎందుకు దాచారు అంటూ ప్రశ్నలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ టీడీపీ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టేలా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల నుంచి హాజరైన వైఎస్సార్సీపీ యువజన విభాగం మండల అధ్యక్షులు, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, గ్రామ యువజన కమిటీల నేతలు భారీ సంఖ్యలో హాజరై ప్రభుత్వ విధానాలపై తమ అసంతృప్తిని చాటుకున్నారు. నిరుద్యోగ యువత సైతం పెద్దసంఖ్యలో ధర్నాకు హాజరై తమ మద్దతు తెలిపారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలు కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు పిల్ల చరణ్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల సతీష్చౌదరి, ఏడు నియోజకవర్గాల నుంచి యువజన విభాగం అధ్యక్షులు, కమిటీ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్రంలోని సుమారు 3 లక్షల మంది నిరుద్యోగ గ్రాడ్యుయేట్ల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. డీఎస్సీ–25లో ప్రశ్నపత్రాల లీకేజీ, డేటా డిలీషన్, మెరిట్ లిస్ట్ల మాయం వంటి అక్ర మాలపై ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. పైగా అవినీతిని ప్రశ్నిస్తే క్రిమినల్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ పరిధిలోనే ఇన్ని అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణం. విచారణ పూర్తయ్యే వరకు ఆయన్ను మంత్రి పదవి నుంచి పక్కన పెట్టాలి. నిజంగా ప్రభుత్వం అవినీతికి పాల్పడకపోతే విచారణకు ఎందుకు భయపడుతున్నారు? డబ్బులు ముట్టజెప్పిన వారికే ఉద్యోగాలు కల్పించడం నిరుద్యోగులను దగా చేయడం కాదా. – కారుమూరి సునీల్కుమార్, యువజన విభాగం రీజనల్ కో–ఆర్డినేటర్, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి వ్యవస్థలను గుప్పిట్లో పె ట్టుకుని టీచర్ పోస్టుల భర్తీ పేరుతో రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాల్లో టీడీపీ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పేరుతో నిరుద్యోగుల జీవితాలను అంధకారం చేస్తున్నారు. కలెక్టర్ చైర్మన్గా, విద్యాశాఖాధికారి కన్వీనర్గా ఉండే జిల్లా సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ) పాత్రను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ‘తొలి సంతకం’ అంటూ ప్రచారం చేసుకున్నది కేవలం తమ అవినీతి కోసమేనని తేలిపోయింది. ఈ బోగస్ డీఎస్సీ అక్రమాలపై నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తాం. రాష్ట్రంలో అర్హులైన నిరుద్యోగులకు న్యాయం చేయండి. – కందుల దినేష్రెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి వైఎస్సార్సీపీ కార్యకర్తలను కలెక్టరేట్లోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్న పోలీసులు కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందిస్తున్న నాయకులు డీఎస్సీ–25పై సీబీఐతో సమగ్ర దర్యాప్తునకు డిమాండ్ రాష్ట్రంలో 4 వేల మంది అభ్యర్థులకు అన్యాయం ఏలూరు కలెక్టరేట్ వద్ద నిరసన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో భారీ ర్యాలీ -
పేపర్ లీక్కు ఆ టాపరే నిదర్శనం
డీఎస్సీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించి ఉంటే న్యాయ విచారణకు సిద్ధం కావాలి. డిజిటల్ విభాగంలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రశ్నపత్రాల ప్రక్రియతో ఏం సంబంధం? ప్రశ్నపత్రాల తయారీ, అప్లోడ్ బాధ్యతలు చూసిన వ్యక్తే కృష్ణా జిల్లా టాపర్గా నిలవడం పేపర్ లీకేజీకి ప్రత్యక్ష నిదర్శనం. ఒకవేళ అతను ప్రతిభతోనే పాసైనా.. రికార్డుల నుంచి అతడి పేరు, మార్కులు, ర్యాంకును ఎందుకు డిలీట్ చేశారో సమాధానం చెప్పాలి. డీఎస్సీ తుది మెరిట్ లిస్ట్ను అభ్యర్థులకు అందుబాటులో ఉంచకపోవడం వెనుక ఉన్న మతలబు ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలి. డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలపై స్పందించలేని పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగ యువతకు కూటమి నాయకులు సమాధానం చెప్పాలి. – మామిళ్లపల్లి జయప్రకాష్, ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త ప్రభుత్వ అక్రమాల వల్ల దాదాపు 4 వేల మంది అర్హులైన నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. ఈ అన్యాయంపై 200 మందికి పైగా అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా సీఎం చంద్రబాబు, విద్యామంత్రి లోకేష్ పట్టించుకోవడం లేదు. ఎంపికై న వారికి మాత్రమే సీక్రెట్గా మెసేజ్లు పంపడం వెనుక పెద్ద కుంభకోణమే ఉంది. ఒక్కో పోస్టును రూ.15 లక్షలకు అమ్ముకున్నట్లు ఆడియోలు బయటకు వచ్చినా చర్యలు లేవు. ముఖ్యమంత్రి బంధువునని చెప్పుకుంటూ పోస్టులను సంతలో సరుకులా అమ్మేసిన వ్యక్తిపై ఎందుకు కేసు పెట్టడంలేదు? స్పోర్ట్స్ కోటా పోస్టుల విక్రయాలపై కచ్చితంగా సీబీఐతో విచారణ చేయించాలి. – కామిరెడ్డి నాని, వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు -
నయవంచనకు చంద్రబాబు నిదర్శనం
కొయ్యలగూడెం : నయవంచనకు, నమ్మక ద్రోహానికి, వెన్నుపోటుకు చంద్రబాబు నిదర్శనంగా నిలుస్తారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) ఎద్దేవా చేశారు. కొయ్యలగూడెంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి మనోవేదనతో మరణానికి చంద్రబాబు కారణమయ్యాడన్నా రు. నీతిమాలిన రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని అన్నారు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలంగా పనిచేసిన చంద్రబాబు తన పార్టీ ద్వారా ఏనాడు ఒక్కసారి కూడా సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదనే సంగతి సిగ్గుచేటు అ న్నారు. ఇప్పుడు కేవలం కూటమి ప్రభుత్వం మో దీ, అమిత్షాల దయదాక్షిణ్యాలపై రాష్ట్రంలో మనగలుగుతుంది అన్నారు. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను, సానుభూతిపరులను గెలిపించుకుని మళ్లీ జగన్మోహన్రెడ్డి పాలనకు బీజం వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం వెన్నుపోటుకు రెండేళ్లకు సంబంధించిన కరపత్రా లు ప్రదర్శించి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్, జిల్లా టాస్క్ఫోర్స్ అధ్యక్షుడు శివారెడ్డి, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావు, నియోజకవర్గ పరిశీలకుడు కనుమూరి శివరామరాజు, ఉభయగోదావరి జిల్లాల బూత్ కమిటీ కన్వీనర్ బీవీఆర్ చౌదరి, రాష్ట్ర కార్యదర్శి మంతెన సోమరాజు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ -
చితికిపోతున్న చిరు వ్యాపారులు
కై కలూరు: గ్యాస్ కొరతతో కట్టెల పొయ్యల కన్నీటి కష్టాలు తిరిగి ప్రత్యక్షమవుతున్నాయి. చిరు హోటల్ వ్యాపారులు కాలగమనంలో కలిసిపోయిన ఊక పొయ్యిలను మళ్లీ ఏర్పాటు చేసుకుంటున్నారు. కట్టెల పొయ్యల నుంచి వచ్చే పొగ కారణంగా ఉపిరితిత్తులు సమస్యలతో పూర్వం అధిక మరణాలు సంభవించాయి. దీంతో ప్రభుత్వాలు ఉజ్వల వంటి గ్యాస్ సరఫరా పథకాలను అమలు చేసింది. పొగబారిన జీవితాల నుంచి ప్రజలకు విముక్తి కలిగించడానికి గ్యాస్ సరఫరాను పల్లెలకు చేరువ చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధం నేపధ్యంలో గ్యాస్ కొరతను సాకుగా చూపి కృత్రిమ గ్యాస్ కొరతను సృష్టిస్తున్నారు. దీంతో తిరిగి ఊక పొయ్యిలే దిక్కవుతున్నాయి. కై కలూరు రైతుబజారు సమీపంలో కృపా హోటల్ యజమాని 6గురు సిబ్బందికి ఉపాధి కల్పిస్తున్నాడు. గ్యాస్ కొరతతో అధిక రోజులు హోటల్ మూసేయాల్సి వచ్చింది. దీనికి తోడు ఎండలు దంచికొడుతోన్నాయి. ఈ నేపథ్యంలో చివరకు రూ.50 వేలు వెచ్చించి ఊక పొయ్యిను కట్టించేశాడు. మరికొంత మంది హోటల్ యజమానులు కట్టల పొయ్యలను ఆశ్రయించారు. వంట తయారీదారులు పొగబారిన పడుతున్నారు. ఏం చేయమంటారండీ.. బ్లాక్లో గ్యాస్ సిలిండర్లను కొనలేకపోతున్నాం.. పెట్టుబడులు, సప్లయర్ల జీతాలు కూడా రావడం లేదని ఓ చిరు హోటల్ యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. జీవన పోరాటంలో ఉక్కపోత నిత్యవసర వస్తువుల్లో ప్రధానమైన గ్యాస్ కొరతతో గతించిన వంట పద్ధతులు తిరిగి వెలుగులోకి వస్తున్నాయి. ఊక పొయ్యి ఏర్పాటుకు రూ.50 వేలు ఖర్చవుతోంది. ఇందులో ముడిసరుకుగా వినియోగిస్తున్న బస్తా ఊక రూ.170 పలుకుతుంది. పూర్వం ఊక బస్తా రూ.70 పలికింది. అదే కేజీ కట్టెలు రూ.30 పలుకుతున్నాయి. ఓ చిన్న హోటల్లో 3 బస్తాల ఊకకు రూ.510 ఖర్చు అవుతుంది. ఇదే కట్టెలతో వంటకాలు చేస్తే రూ.600వరకు ఖర్చు చేస్తున్నారు. ఇదే గ్యాస్ విషయానికి వస్తే రూ.1500 ఖర్చు చేయాల్సి వస్తుంది. పెరిగిన గ్యాస్ ధరలు, కొరత కారణంగా ఊక, కట్టెల పొయ్యిల మధ్య హోటల్ సిబ్బంది ఉక్కపోత, వేడిని భరిస్తున్నారు. వాణిజ్య సిలిండర్పై రూ.900 పెంపు దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో కేంద్రంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్పై ఏకంగా రూ.900 కేంద్రం పెంచేసింది. గతేడాది ఏప్రిల్లో చివరిసారిగా రూ.50, ఇటీవల మరో రూ.60 గృహ వినియోగ సిలిండర్పై కేంద్రం పెంచింది. వాణిజ్య కనెక్షన్లపై ఇటీవల రూ.115 పెరిగింది. తాజాగా వాణిజ్య గ్యాస్ సిలిండర్పై మరో రూ.900 ఒకేసారి పెంచేసింది. కొద్ది రోజుల ముందు వాణిజ్య సిలిండర్ రూ.2, 370 ఉంది. ఏకంగా రూ.900 పెంచడంతో రూ.3,270కు చేరింది. ఇప్పటికే బ్లాక్లో వాణిజ్య సిలిండర్ రూ.3 నుంచి రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంతో హోటల్ యజమానులు ఊక, కట్టెల పొయ్యల వైపునకు మళ్లుతున్నారు. హోటల్ వ్యాపారం కష్టతరంగా మారుతోంది. ఇప్పటికే ముడి సరుకుల ధరలు విపరితంగా పెరిగాయి. క్వాలిటీ సరుకు అందించపోతే కస్టమర్లు రావడం లేదు. ఈ నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్లు దొరకని పరిస్థితి. పైగా అమాంతం రేటు పెంచేశారు. దీంతో నేను రూ.50 వేలు వెచ్చించి ఊక పొయ్యిను ఏర్పాటు చేసుకున్నాను. –కసిలంకి ఆంజనేయులు, హోటల్ యజమాని, కై కలూరు టిఫిన్ సెంటర్ల పరేషాన్ గ్యాస్ కొరతతో ఊక పొయ్యిల ఏర్పాటు పెరిగిన ధరలు తట్టుకోలేక కట్టెలతో వంటకాలు వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై రూ.900 పెంపు -
ఐస్క్రీమ్ ఫ్రిజ్లు దగ్ధం
తణుకు అర్బన్: తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలో వరిచేలు మొదళ్లకు నిప్పు అంటించడంతో సమీపంలోని ఐస్క్రీమ్ ఫ్రీజర్స్ దగ్ధమయ్యాయి. తణుకు అగ్నిమాపక అధికారి ఐ.అజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తేతలిలో లాహమ్ ఫుడ్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎదురుగా ఉన్న రామలక్ష్మి లేఅవుట్లో వరిచేలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో సమీపంలోనే ఉన్న పవన్పుత్ర ఎంటర్ప్రైజస్కు సంబంధించిన 5 ఐస్క్రీమ్ ఫ్రిజ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో రూ.2 లక్షలు విలువైన సామాగ్రి నష్టం జరగగా, మరో రూ.5 లక్షల విలువైన సామాగ్రిని రక్షించారు. -
తీరంలో అనధికార గరికట్లు
నరసాపురం: నరసాపురం తీరగ్రామాల్లో గరికట్ల దోపిడీ యథేచ్ఛగా సాగుతుంది. కొన్ని గ్రామాల్లోని టీడీపీ నాయకులు దౌర్జన్యంగా గరికట్లను ఆక్రమించుకుని పాటలు నిర్వహించి వాటిని వేరే వారికి అప్పగించి ఏటా రూ.60 లక్షల వరకూ సొమ్ము జేబుల్లో నింపుకుంటున్నారు. దీంతో వేటనే ఆధారం చేసుకుని బతుకుతున్న మత్ప్యకారులు జీవనోపాధిని కోల్పోతున్నారు. మత్స్యకార సొసైటీలు సైతం అలంకారప్రాయంగా మారుతున్నాయి. ఎక్కడ చూసినా అనధికార గరికట్లు నరసాపురం మండలం మోడి ఎల్బీచర్ల, లక్ష్మణేశ్వరం, వేములదీవి, పసలదీవి గ్రామాల్లో ఉన్న కాలువలు, డ్రెయిన్లపై స్థానిక మత్స్యకారులు తరతరాలుగా వేట సాగిస్తున్నారు. మత్స్యకార సొసైటీల ద్వారా అనుమతి తీసుకుని, సొసైటీకి నిర్ధేశించిన మొత్తాన్ని ఏటా చెల్లించి వేట సాగించే విధానం అమల్లో ఉంది. దీనితో మత్స్యకారులకు ఉపాధితోపాటు సదరు మత్స్యకార సొసైటీకి ఆదాయం రావడం ద్వారా మత్స్యకారుల అభివృద్ధికి దోహదమవుతుంది. అయితే ఇటీవల ఆయా గ్రామాల్లోని కొందరు టీడీపీ నాయకులు కాలువలు, డ్రెయిన్లను దౌర్జన్యంగా ఆక్రమించుకుని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. స్థానిక మత్స్యకారులు వేట సాగించకుండా కట్టుదిట్టం చేసి దోపిడీ పర్వం కొనసాగిస్తున్నారు. ఏటా రూ.60 లక్షల వరకూ దోపిడీ 19 కిలోమీటర్ల సముద్ర తీరప్రాంతం ఉన్న నరసాపురంలో 2 లక్షల వరకూ మత్స్యకార జనాభా ఉంది. 90 శాతం మంది ఇందులో వేటనే వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. టీడీపీ నాయకులు ఇతర ప్రాంతాలకు చెందిన మత్స్యకారేతరులకు గరికట్లు అప్పగించడంతో స్థానిక మత్స్యకారులు ఉపాధి లేక వలసలు పోతున్నారు. దర్బరేవు డ్రెయిన్పై 11, వెస్ట్ కుక్కిలేరుపై 6, పరకాలశేషావతారం కాలువపై 11 అనధికార గరికట్లు ఉన్నాయి. ఒక్కో దానికి పాటలు నిర్వహించి ఒక్కో గరికట్టుకు డిమాండ్ను బట్టి రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ ఏడాదికి వసూలు చేస్తున్నారు. మొత్తంగా ఏటా రూ.60 లక్షలకుపైగా మత్స్యకార సొసైటీలకు చెందకుండా, ఇటు ప్రభుత్వానికి చెందకుండా, మత్స్యకారుల అభివృద్ధికి నోచుకోకుండా టీడీపీ నాయకుల జేబుల్లోకి వెళుతోంది. మత్స్యశాఖ అధికారులు సైతం లంచాల మత్తులో, రాజకీయ ఒత్తిళ్లతో నోరు మెదపడం లేదు. డ్రెయిన్ల శాఖ అధికారులు కూడా ఇదే తీరుతో వ్యవహరిస్తున్నారనే విమర్శ ఉంది. మత్స్యకారేతరుల చేతిలో గరికట్లు కాలువలు, డ్రెయిన్లలో యథేచ్ఛగా వేట చక్రం తిప్పుతున్న గ్రామాల టీడీపీ పెద్దలు ఏటా రూ.60 లక్షల దోపిడీ మత్స్యకారుల జీవనోపాధికి గండి నిబంధనలకు విరుద్ధంగా పాటలు పెట్టి గరికట్లు అప్పగించి స్థానిక మత్స్యకారుల పొట్టలు కొడుతున్నారు. వేట నిషేధ ఆజ్ఞలు కూడా ఉల్లంఘించి లక్షల్లో దండుకుంటున్నారు. అన్నీ తెలిసిన మత్స్యశాఖ అధికారులు ఏ చర్యలు తీసుకోవడం లేదు. – బొడ్డు ఆశీష్కుమార్, ఎల్బీచర్ల మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు ఎన్ని గరికట్లకు అనుమతి ఇచ్చారని సమాచారహక్కు చట్టం ద్వారా అడిగినా అధికారుల నుంచి సమాధానం లేదు. మత్స్యకారులు కానివారు పాటలు పెట్టి గరులు అప్పగించడం ఏమిటి. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. – తిరుమలశెట్టి వెంటకటేశ్వర్లు, ఎల్బీచర్ల మత్స్యకార సొసైటీ కార్యదర్శి -
ఉంగుటూరులో ‘మట్టి’ జాతర
ఉంగుటూరు: ఉంగుటూరు మండలంలోని మెట్టప్రాంత చెరువుల్లో మట్టి, కంకర తవ్వకాలు గత 15 రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇబ్బడిముడిగా సాగుతున్నాయి. జేసీబీలు, పొక్లెయిన్లతో భూమిని తవ్వేస్తూ రాత్రింబవళ్లు వందలాది లారీలు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, మెరక పనులకు వీటిని అమ్ముకుంటూ లక్షల రూపాయలు జేబులు నింపుకుంటున్నారు. గ్రామాల్లో వందలాది ట్రాక్టర్లు తిరగటంతో రేగుతున్న దుమ్మూధూళి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ‘యర్రచెరువు’లో భయానక పరిస్థితి ఉంగుటూరు యర్రచెరువులో మట్టి, కంకరను రాత్రింబవళ్లు యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. ఇష్టానుసారంగా భారీ గోతులు తీస్తుండటంతో పర్యావరణం దెబ్బతినేంతగా ఇక్కడి పరిస్థితి భయానకంగా మారింది. ఈ కంకరను జిల్లాలోని పలు ప్రాంతాలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడే ఈ తవ్వకాలను వెనుక ఉండి నడిపిస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. నీలాద్రిపురం ‘అబ్బినీడి చెరువు’లో మెరకల దోపిడీ నీలాద్రిపురం దగ్గర ఉన్న అబ్బినీడి చెరువులో గత పదిహేను రోజులుగా తవ్వకాలు సాగుతున్నాయి. ఈ మట్టిని వివిధ లేఅవుట్లు, నిర్మాణాల మెరక పనుల కోసం అమ్ముకుంటున్నారు. ఒక అధికార కూటమి నాయకుడే ఈ చెరువును తవ్విస్తున్నట్లు సమాచారం. వెల్లమిల్లి ‘పెండ్లికొడుకు చెరువు’లో తవ్వకాల జాతర వెల్లమిల్లి పెండ్లికొడుకు చెరువులో వారం రోజులుగా ట్రాక్టర్లు, మిషన్ల శబ్దాలతో ఒక జాతరను తలపించేలా కోలాహలం కనిపిస్తోంది. స్థానిక కూటమి నాయకుల కనుసన్నల్లోనే ఈ పనులు జరుగుతున్నాయి. ఇక్కడి మట్టిని లోకల్గానే కాకుండా తాడేపల్లిగూడెం మండలంలోని పలు ప్రాంతాలకు మెరక పనుల కోసం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నాచుగుంటలో ‘అనుమతుల’ ముసుగులో.. నాచుగుంటలోని అబ్బినీడి చెరువును తవ్వి మట్టిని బయటకు తరలిస్తున్నారు. స్థానిక కూటమి నాయకుడి ఆధ్వర్యంలో ఈ పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే తాము మైనర్ ఇరిగేషన్ అధికారుల నుంచి అనుమతి పొందామని వారు చెబుతున్నప్పటికీ, అది ఎంతవరకు నిజమనేది అధికారులకే తెలియాలి. యర్రమళ్ల ‘తోటాడి చెరువు’లో సొంత తవ్వకాలు యర్రమళ్ల గ్రామాన్ని ఆనుకుని ఉన్న తోటాడి చెరువులో మట్టి దోపిడీ సాగుతోంది. స్థానిక టీడీపీ నాయకుడి ఆధ్వర్యంలో మట్టిని తవ్వి పొలాలకు, గ్రామాల్లో మెరక పనులకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇతర గ్రామాల్లోనూ అదే బాట.. ఇవే కాకుండా మండలంలోని బాదంపూడి, గోపినాథపట్నం, తిమ్మయ్యపాలెం, యర్రమిల్లిపాడు, గోపాలపురం, రామచంద్రపురం తదితర గ్రామాల ఆయకట్టు చెరువుల్లోనూ అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. ఎ.గోకవరం చెరువులో, నల్లమాడు ‘సుద్దగుంట చెరువు’లో కూడా స్థానిక నాయకుల కనుసన్నల్లోనే అప్పుడప్పుడు తవ్వకాలు జరుపుతున్నారు. కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి! ఈ విధంగా మెట్టప్రాంతంలోని ప్రతీ గ్రామంలో తవ్వకం పనులు జోరుగా సాగుతున్నా.. రెవెన్యూ, మైనర్ ఇరిగేషన్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల కనుసన్నల్లోనే ఈ పనులు జరుగుతుండటంతో అధికారులు నోరు మెదపడం లేదు. ఈ అక్రమ భూమార్పిడి వల్ల ప్రభుత్వానికి ‘సీనరేజ్’ రూపంలో రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతోంది. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్ము.. అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోందని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రాత్రింబవళ్లు యథేచ్ఛగా మట్టి, కంకర అక్రమ తవ్వకాలు కూటమి నేతలకు కాసుల పంట చెరువులను గుల్లచేస్తూపర్యావరణానికి హాని -
ప్రజాధనంతో క్రికెట్ నెట్
భీమవరం(ప్రకాశం చౌక్): మున్సిపల్ కార్యాలయంలో అధికారులు ఆడుకొవడానికి ప్రజాధనం సుమారు రూ.5 నుంచి రూ.7 లక్షలు ఖర్చు పెట్టి ఇండోర్ క్రికెట్ నెట్ ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయానికి దక్షిణం వైపు ఈ క్రికెట్ నెట్ ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఉన్న భీమవరం ఆర్డీవో ప్రవీణ్కుమార్ రెడ్డి అదేశాలతో ఈ క్రికెట్ నెట్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మున్సిపల్ నిధులను కూటమి ప్రభుత్వం ఒక పక్క ఇతర శాఖల ఈవెంట్లకు ఉపయోగిస్తోంది. ఇక క్రికెట్ కోసం ప్రత్యేక అధికారి మున్సిపల్ నిధులు వెచ్చిస్తున్నారు. భీమవరం ప్రజల కనీస సౌకర్యాల కోసం మున్సిపల్ నిధులు వినియోగించకుండా, ఇలా ఈవెంట్లకు, క్రికెట్ నెట్లకు అధికారులు దుర్వినియోగం చేస్తుండడంపై విమర్శలు వెలువెత్తున్నాయి. -
పెద్దింట్లమ్మా.. పాహిమాం
కైకలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మా.. నీ చల్లని దయ మాపై చూపవమ్మా.. అంటూ భక్తులు ఆర్తితో కొల్లేటికోట పెద్దింట్లమ్మను వేడుకున్నారు. సమీప జిల్లాల నుంచి వేసవి సెలవులు ముగియనుండటంతో వేలాదిగా భక్తులు అమ్మవారిని ఆదివారం దర్శించకున్నారు. అమ్మవారికి మహిళలు వేడి నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వర శర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం అమ్మవారికి ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మ ఫొటోల విక్రయం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.81,206 ఆదాయం వచ్చిందని తెలిపారు. బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అధికంగా తరలివచ్చిన భక్తుల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ వారితోపాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు. కాళ్ల: స్వయంభూ కాళ్ళకూరు శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు ఆకివీడు మండలం ఐ.భీమవరం గ్రామానికి చెందిన దివంగత వేగేశ్న అప్పలరాజు జ్ఞాపకార్థం భార్య నాగమణి, కుమారులు బాపిరాజు, గోపాలకృష్ణంరాజు, ప్రసాదరాజు రూ.3 లక్షలు విరాళం అందించారు. దేవాలయం చుట్టూ మాడవీధుల విస్తరణలో భాగంగా స్థలం కొనుగోలు నిమిత్తం దాతలు ఈ విరాళం అందించినట్లు దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈవో మోకా అరుణ్ కుమార్ ఆదివారం తెలిపారు. ఈసందర్భంగా దాతలకు ప్రత్యేక దర్శనం కల్పించి స్వామివారి ప్రతిమతో సత్కరించారు. నూజివీడు: పట్టణ పరిధిలోని మామిడి తోటల్లో పార్టీ పేరుతో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు ఆదివారం మెరుపుదాడి చేశారు. సీఐ పీ సత్యశ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో కలిసి సీఐ పేకాట శిబిరంపై దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.39,700 నగదును సీజ్ చేయడంతో పాటు 18 సెల్ఫోన్లు, 13 మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతూ పట్టబడిన వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. బుట్టాయగూడెం: గిరిజన గ్రామాలకు సరఫరా అవుతున్న సత్యసాయి గోదావరి శుద్ధి నీటి సరఫరా గత మూడు రోజులూగా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు.గోదావరి నీటి వల్ల కీళ్ల నొప్పులు, ఇతర వ్యాధులు ప్రబలకుండా ఉంటాయనే ఉద్దేశంతో సింగన్నపల్లి, బూసరాజుపల్లి సమీపంలోని సత్యసాయి మెయిన్ వాటర్ ట్యాంక్ నుంచి ప్రజలు గోదావరి శుద్ధి జలాలను తెచ్చుకుని తాగుతున్నారు. అసలే వేసవి కాలం.. ఈ సమయంలో గోదావరి శుద్ధి జలాలు ఆగిపోవడంతో ప్రజల బాధలు వర్ణనాతీతంగా మారాయి. అధికారులు స్పందించి నీటి సరఫరాకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై సత్యసాయి ఉద్యోగులను వివరణ కోరగా కొవ్వాడ, పోలవరం సమీపంలో పైప్లైన్ల మరమ్మతు పనులు జరుగుతున్నాయని మంగళవారం తిరిగి సత్యసాయి శుద్ధి జలాలను అన్ని గ్రామాలకు అందిస్తామని చెప్పారు. -
ఏపీ నిట్.. ఉన్నత విద్యకు మెట్టు
తాడేపల్లిగూడెం: జాతీయ ఉన్నత విద్యకు వేదికలు నిట్, ఐఐటీలు. ఇక్కడ సీటు సాఽధించడం విద్యార్థుల కల. సాధారణ ఇంజనీరింగ్ విద్యకు భిన్నంగా, స మాజానికి ఉపయుక్తంగా ఉండే కోర్సులు నిట్లలో ఊపిరిపోసుకుంటాయి. దేశంలో 31వ నిట్గా 2015లో తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్ ఏర్పాటయ్యింది. బీటెక్, ఎంటెక్, ఎంఎస్ బై రీసెర్చ్, పీహెచ్డీ ఫుల్టైం, పార్ట్టైం కోర్సులతో విద్యార్థులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగాలపై ఏఐ ప్రభావం పడినా ఇక్కడ చదివితే కొలువుకు ఢోకా ఉండదనే భరోసా ఉంది. ఏపీ నిట్ ఎన్ఆర్ఐఎఫ్ ర్యాకింగ్కు అర్హత సాధిస్తోంది. 2025లో 200–250 బ్యాండ్లో ఏపీ నిట్ ఉంది. ఈ జూన్కు కొత్త ర్యాంకును అధికారికంగా ప్రకటించనున్నారు. శాశ్వత ఫ్యాకల్టీల ఆధారంగా, సీట్ మ్యాట్రిక్స్ను ప్రామాణికంగా తీసుకుని కోర్ సబ్జెక్టులకు తరగతికి 90 మంది విద్యార్థులు, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్ తరగతులకు 30 మంది విద్యార్థులను ఉంచుతున్నారు. శాశ్వత ప్రాతిపదికన ఫ్యాకల్టీల నియామక ప్రక్రియ పూర్తికాకపోవడంతో, గతంలో ఇక్కడి కొందరు అధికారుల నిర్వాకం వల్ల కోల్పోయిన 240 సీట్లను తిరిగి తెచ్చుకునే అవకాశం లేకుండా పోయింది. శాశ్వత భవనాలు.. అధునాతన వసతులు ఏపీ నిట్లో 480 సీట్లు ఉన్నాయి. వీటిలో హోంస్టేట్ కోటా కింద ఏపీ విద్యార్థులకు 240, దేశంలోని మి గిలిన రాష్ట్రాల విద్యార్థులకు 240 సీట్లు కేటాయించారు. బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివి ల్ ఇంజనీరింగ్, సీఎస్ఈ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈసీఈ, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్, మె టీరియల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లు ఇక్కడ ఉన్నాయి. 127 మంది ఫ్యాకల్టీలు, ప్రస్తుతం 2,310 మంది విద్యార్ధులు, 120 మంది స్టాఫ్, 250 మంది స్కాలర్స్ ఉన్నారు. ఇన్చార్జి డైరెక్టర్ పాలనే ఇంకా కొనసాగుతుండటంతో 2024లో పూర్తి కావాల్సిన ఫ్యాకల్టీల ఎంపిక కార్యక్రమం పూర్తికాలేదు. దీంతో గతంలో కోల్పోయిన 240 సీట్లు రాలేదు. ఏపీ నిట్కు శాశ్వత భవనాలు ఉన్నాయి. మౌలిక వస తులు, ల్యాబ్ భవనం, సెంట్రల్ లైబ్రరీ, రవీంద్ర భారతి ఆడిటోరియంతో పాటు 11 ఏళ్ల కాలంలో 20 ఎంఓయూలను వివిధ సంస్థలతో ఏపీ నిట్ కు దుర్చుకుంది. ఆర్ అండ్ డీ ప్రాజెక్టులు ఏడు వచ్చా యి. 15 కన్సల్టెన్సీల ప్రాజెక్టులు దక్కాయి. ఓఎస్ఐఆర్ ప్రాజెక్టు కింద రూ.7.15 కోట్ల ప్రాజెక్టులు ద క్కాయి. 2025లో 510 మంది విద్యార్థులకు ఉద్యోగాల ఆఫర్ లెటర్లు వచ్చాయి. గరిష్టంగా వార్షిక వేతనం రూ.65 లక్షలు ఉంది. 8 బ్రాంచ్లు.. 480 సీట్లు -
నేడు వైఎస్సార్సీపీ యువజన విభాగం ధర్నా
దెందులూరు: రాష్ట్రంలో మెగా డీఎస్సీ–2025 పే రుతో నిరుద్యోగ యువతను చేసిన కుటమి ప్రభు త్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కామిరెడ్డి నాని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, యువజన విభాగం వర్కింగ్ రాష్ట్ర ప్రెసిడెంట్ కారుమూరి సునీల్కుమార్ అధ్యక్షతన ఉదయం 9.30 గంటలకు ధర్నా నిర్వహిస్తామన్నారు. పార్టీ నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు. దెందులూరు : పెదవేగి మండలం రాట్నాలకుంటలోని రాట్నాల మ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు ప్రత్యేక పూజలు చేయించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి పలురూపాల్లో రూ.87,715 ఆదాయం లభించిందని ఆలయ కమిటీ చైర్మన్ మన్నే శ్రీనివాసరావు తెలిపారు. ఈఓ ఎన్.సతీష్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ విడుదల స త్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. దెందులూరు: ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ అందుబాటులో ఉంచాలని, నిల్వ ఉన్న ఎరువులు పాత ధరలకే విక్రయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆది వారం దెందులూరులో ఎరువుల సమస్యలపై విలేకరులతో మాట్లాడారు. యూరియా, డీఏపీ వాడకాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు కూడబలుక్కుని రైతులకు సరిపడా అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించినట్టు స్పష్టమవుతోందన్నారు. యూరియా, డీఏపీలపై ఆంక్షలు విధించడాన్ని విరమించుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మేలు చేస్తామని చెబుతూ ఆచరణలో రైతులకు నష్టం కలిగే విధానాలను అనుసరిస్తున్నాయని విమర్శించారు. పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని, పాత స్టాకు పాత రేట్లకే అమ్మేలా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పెనుగొండ: పౌర్ణమి సందర్భంగా సిద్ధాంతంలో హిందూ ధర్మపరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గోదావరి మాతకు పంచహారతులు ఇచ్చారు. ఆదివారం రాత్రి కేదారీఘాట్లో కలగభద్రుడు స్వామి బ్రహ్మత్వంలో ఏకముక, ద్విముఖ, చతుర్థ పంచమ, కుంభ, నక్షత్ర పూర్ణకుంభ, స్పర్ప కుంభ హరతులు ఇచ్చారు. నదీమ తల్లులను ఆరాధించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయమని హిందూ ధర్మపరిరక్షణ సమితి సభ్యులు అన్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భీమవరం: ఒడిశాకు చెందిన ఓ యువతి భీమవరం కొమరాడరోడ్డులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రాయగడ్ జిల్లా స గడ ప్రాంతానికి చెందిన బిలామా ఘమంగా (26) పట్టణంలోని ఆక్వా పరిశ్రమలో రొయ్య ల ప్యాకింగ్ విభాగంలో పనిచేస్తూ వసతిగృహంలో నివసిస్తుంది. ఆదివారం వేకువజామున వసతి గృహానికి సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. హెడ్ కానిస్టేబుల్ భూషణం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో యువతితో ప్రేమ వ్యవహారమే కారణం..? ఆక్వా పరిశ్రమలో పనిచేస్తున్న మరో యువ తితో మృతురాలు సన్నిహితంగా ఉండేది. అదికాస్తా ప్రేమగా మారడంతో ఒకరితో మరొకరు ఆప్యాయంగా ఉండేవారు. అయితే తన స్నేహితురాలు మరో యువకుడితో ఇటీవల ఎక్కువగా మాట్లాడటాన్ని ఘమంగా జీర్ణించుకోలేకపోయింది. ఆ యువతితో ఘర్షణపడి సెల్ఫోన్ విసిరికొట్టి వసతిగృహం నుంచి రెండురోజుల క్రితం బయటకు వెళ్లిపోయింది. అప్పట్నుంచి ఎలాంటి సమాచారం లేకపోగా చెట్టుకు తాడు తో ఉరివేసుకుని వేలాడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కదలని బేళ్లు.. రైతుల కన్నీళ్లు
సోమవారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2026బుట్టాయగూడెం: పొగాకు పగాకుగా మారిపోయింది. ఈ ఏడాది ధర దారుణంగా పడిపోయింది. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కనీసం పెట్టుబడి ఖర్చులైనా దక్కితే చాలన్న దీనస్థితిలో ఆశగా ఎదురుచూస్తున్నారు. గతేడాది గరిష్టంగా రూ.450 వరకూ ధర పలికింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి రూ.265కు మించి లేదు. దీంతో రైతులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఒక వైపు ప్రకృతి వైపరీత్యాలు, మరో వైపు వాతావరణ పరిస్థితులు వీటి తో పాటు అధిక పెట్టుబడులు వెరసి పొగాకు రైతులను మనోవేదనకు గురి చేస్తున్నాయి. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేయడంతో పాటు వేలకు వేలు పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్న రైతులకు సరైన మద్దతు ధర లేకపోవడంతో నష్టాలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గతేడాది గరిష్ట ధర కి లోకు.. రూ.450 ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో గల తేలిక నేలల్లో (ఎన్ఎల్ఎస్)లో ఈ ఏడాది సుమారు 29.074 హెక్టార్లలో పొగాకు సాగు జరిగినట్టు బోర్డు అధికారులు తెలిపారు. 80 మిలియన్ కిలోల వరకూ దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం–1,2, గోపాలపురం, దేవరపల్లి, కొయ్యలగూడెం కేంద్రాల పరిధిలో 12,012 మంది రైతులు 13,864 బ్యారన్లను రిజిస్ట్రేషన్ చేసుకుని ఆయా బేరన్ల పరిధిలో సుమారు 22,194 హెక్టార్లలో వర్జీనియా పొగాకును సాగుచేస్తున్నారని అధికారులు తెలిపారు. అయితే గతేడాది కిలో పొగాకు ధర సుమారు రూ.450 పలకగా ఈ ఏడాది రూ.265 దాటి ధర పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రూ.360 ధర పలికితే గానీ తాము పెట్టిన పెట్టుబడుల నుంచి బయటపడగలమని రైతులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో గిట్టుబాటు ధరలు గత వైఎస్సార్సీపీ పాలన సమయంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు లభించాయి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మార్క్ఫెడ్ను రంగంలోకి దించి రైతులకు అండగా నిలిచింది. రైతుల దగ్గర నుంచి పొగాకు కొనుగోలు చేసి గిట్టుబాటు ధరలు కల్పించడంతో రైతులు కష్టాల నుంచి గట్టెక్కారు. మార్కెట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పోటీతత్వం పెరగడంతో రైతులు లాభాలబాట పట్టారు. ఆనాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా నిలిచిన విధానాన్ని ఇప్పుడు రైతులు గుర్తు చేసుకుంటున్నారు. రైతుల ఇంట్లోనే ఉన్న పొగాకు బేళ్లు నరసాపురం తీర గ్రామాల్లో గరికట్ల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. టీడీపీ నాయకులు దౌర్జన్యంగా గరికట్లను ఆక్రమించుకుంటున్నారు. కర్షకుల పాలిట పగాకు రైతులకు దక్కని గిట్టుబాటు ధరలు ఇల్లు కదలని బేళ్లు సాగు ఖర్చు పెరగ్గా.. తగ్గిన ఆదాయం ప్రస్తుత కొనుగోలు ధర రూ. 265 కిలోకు రూ.360 వస్తేనే గానీ గిట్టుబాటు కాదంటున్న రైతులు పొగాకుకు కిలో రూ.360 ధర కల్పించాలి. ప్రభుత్వం, బోర్డు అధికారులు రైతులను ఆదుకోవాలి. అమ్మకాలపై ఆసక్తి చూపని రైతులు ఇళ్ల వద్దే బేళ్లను ఉంచుతున్నారు. కొందరు రైతులు దళారులకు తక్కువ రేట్లకు విక్రయిస్తున్నారు. రైతులకు న్యాయం చేయాలి. – కె.శ్రీనివాస్, ఏపీ రైతు సంఘం జిల్లా నాయకుడు, ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ పాలనలో అప్ప టి సీఎం వైఎస్ జగన్ పొగాకు రైతులకు అండగా నిలిచారు. రైతులకు గిట్టుబాటు ధర లభించని సమయంలో మార్క్ఫెడ్ను రంగంలోకి దించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రైతులు కష్టాలపాలవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి. – తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే, దుద్దుకూరు, బుట్టాయగూడెం మండలం పొగాకు సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ధరలను చూస్తే నిరాశే కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో పొగాకు ధరలు తగ్గుముఖం పట్టిన సందర్భాల్లో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించి రైతులను ఆదుకున్నారు. ప్రస్తుతం ఇలానే రైతులను ఆదుకోవాలి. – సయ్యద్ బాజీ, పొగాకు రైతు, అచ్చియ్యపాలెం, బుట్టాయగూడెం మండలం గత సంవత్సరంతో పో ల్చుకుంటే ఈ ఏడాది రైతులకు సాగు ఖర్చులు బాగా పెరిగాయి. కౌలు, పెట్టుబడు లు 30 శాతం మేర పెరిగా యి. పొగాకు ధరలు పెరిగితే తప్ప సాగు చేసిన రైతులు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడలేరు. – కలగర నాని, పొగాకు రైతు, కొమ్ముగూడెం, బుట్టాయగూడెం మండలం ఈ ఏడాది పొగాకుకు మంచి ధర వస్తుందనే ఆశతో రైతులు సాగు చేపట్టారు. అయితే 22,194 హెక్టార్లలో రైతులు సాగుచేయగా 48.75 మిలియన్ కేజీల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశా రు. ఆ మేరకే పొగాకు కొనుగోలుకు బోర్డు కూడా అనుమతించింది. అయితే రైతులు మాత్రం అనధికారికంగా 7 వేల హెక్టార్లలో సాగు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఏడాది కౌలు, పెట్టుబడులు, భారీగా పెరిగాయని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం కిలో రూ.265 కొనుగోలు చేస్తే కనీసం అప్పులు కూడా తీరే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 30 శాతానికి పైగా ఖర్చులు పెరిగాయని ప్రభుత్వం, బోర్డు అధికారులు చొరవ చూపి తమకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. -
వైఎస్సార్సీపీ ఓట్ల తొలగింపునకు కుట్రలు
● పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలి ● జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ పిలుపు గణపవరం: ఎన్నికల కమిషన్ అధికారికంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై వైఎస్సార్సీపీ బూత్స్థాయి ఏజెంట్లు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కేవీపీ ఫంక్షన్ హాల్లో ఉంగుటూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల బీఎల్ఏలు, పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలకు ఎస్ఐఆర్ (సర్)పై అవగాహన కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే, పార్టీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) మాట్లాడుతూ సర్ కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, మద్దతుదారులు, అభిమానుల ఓట్ల తొలగింపునకు సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ఆ కుట్రలు సమర్థవంతంగా తిప్పికొ ట్టాలని అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు ఎలాంటి దారుణాలైనా చేస్తారన్నారు. కూటమిపై తీవ్ర వ్యతిరేకత మాజీ ఎమ్మెల్యే వాసుబాబు మాట్లాడుతూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, అందువల్ల రానున్న స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అలాగే గ్రామాల్లో ఓటర్లు చాలామంది ఇతర పట్ట ణాల్లో ఉంటున్నారని వీరిని స్వగ్రామాలకు రప్పించి ఓటర్లుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అప్రమత్తంగా ఉంటే వచ్చే స్థానిక సంసంస్థల ఎన్నికల్లో అఽధికార పార్టీపై ఆధిపత్యం సాధించవచ్చన్నారు. సర్పై నిరంతర సమీక్ష ఏలూరు జిల్లా ఎస్ఐఆర్ టాస్క్ఫోర్స్ ఇన్చార్జి పోతుల శివారెడ్డి మాట్లాడుతూ సర్ విషయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిరంతరం సమీక్షిస్తున్నారని, ప్రతి నియోజకవర్గానికీ పరిశీలకులను పంపి కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారన్నారు. బీఎల్ఏలు ప్రతి బూత్లోని ఓటర్లను, ఓటర్ల జాబితాలను పరిశీలించాలన్నారు. పొరుగు రాష్ట్రాల్లో సర్ ప్రక్రియలో ఓటర్ల తొలగింపు కారణంగా అధికారం కోల్పోవడమే కాక పలువురు ప్రముఖులు ఓటమిపాలయ్యారన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. నిశితంగా పరిశీలించాలి ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఒక్కో పోలింగ్ కేంద్రంలో 20 నుంచి 30 ఓట్లు తొలగిస్తే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. అందువల్ల బీఎల్ఏలు ఓటర్ల జాబితా పరిశీలిస్తూ ప్రతి ఇంటికీ వెళ్లి ఓట్లను పరిశీలించాలని కోరారు. అర్హులైన ఒక్కరి ఓటు కూడా తొలగించే పరిస్థితి ఉండకూడదన్నారు. అర్హుల ఓట్లు తొలగించారంటే మన నిర్లక్ష్యమే కారణమన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. గణపవరంలో అవగాహన సదస్సులో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్. చిత్రంలో పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు, పాల్గొన్న బీఎల్ఏలు, నాయకులు బూత్ కమిటీ రీజినల్ కో–ఆర్డినేటర్ బీవీఆర్ చౌదరి మాట్లాడుతూ అనర్హుల ఓట్ల తొలగింపు, అర్హుల ఓట్ల నమోదు ప్రక్రియను పక్కాగా పర్యవేక్షించాలని సూచించారు. టీటీడీ పాలకవర్గ మాజీ సభ్యుడు గాదిరాజు సుబ్బరాజు మాట్లాడుతూ బీఎల్ఏలు నియోజకవర్గంలోని ప్రతి ఓటును క్షుణ్ణంగా పరిశీలించి, అర్హుల ఓట్లు పోకుండా చూడాలన్నారు. వివాహం, మరణాలు, మైగ్రేషన్ జరిగితే వారి ఓట్లను అత్యంత పారదర్శకంగా చేర్చడం, తొలగించడం చేయాలన్నారు. నాలుగు మండలా ల పార్టీ కన్వీనర్లు దండు రాము, సంకు సత్యకుమార్, మరడ మంగారావు, రావిపాటి శ్రీనివాస్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, బూత్ లెవల్ ఏజెంట్లు పాల్గొన్నారు. -
హత్యాయత్నం హేయమైన చర్య
మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు నూజివీడు: ఆగిరిపల్లి మండలంలోని శోభనాపురానికి చెందిన వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు నక్కనబోయిన సాంబశివరావుపై శనివారం జరిగిన హత్యాయత్నాన్ని మాజీ ఎమ్మెల్యే, నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జి మేకా వెంకట ప్రతా్ప్ అప్పారావు తీవ్రంగా ఖండించారు. పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాంబశివరావును పరామర్శించారు. ఆసుపత్రి ఆర్ఏంఓ డాక్టర్ శ్రీనివాస్ను, వైద్యురాలు తనూజను అడిగి సాంబశివరావు పరిస్థితి తెలుసుకున్నారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ దాడి చేయించిన నక్కనబోయిన వేణు గ్రామ టీడీపీ అధ్యక్షుడని, ఆగిరిపల్లి మండలంలో ఉన్న కొండలన్నింటిని దోచేసి కనుమరుగు చేస్తున్నాడంటూ అనేక మంది ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. మట్టిని దోచేస్తున్న అనకొండ అనే పోస్ట్ ను సాంబశివరావు షేర్ చేశాడని, దీనికే రౌడీయిజం చేస్తూ దాడిచేసి చంపే ప్రయత్నం చేశారన్నారు. నూజివీడు నియోజకవర్గం ప్రశాంతమైన ఏరియా అని ఇలా దాడి జరగడం ఇదే ప్రథమమని అన్నారు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఎలాంటి అన్యాయం జరిగినా తాను ఊరుకోనని ఇటీవలే మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారని, ఇప్పుడు టీడీపీ వాళ్లే ఇలా దాడి చేయడం హేయమన్నారు. ఈ సంఘటనపై పోలీసులు తాత్సారం చేయకుండా దాడి చేయించిన నక్కనబోయిన వేణు, దాడి చేసి చంపడానికి ప్రయత్నించిన దొండపాటి ఇంద్రపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని మేకా వెంకట ప్రతాప్ అప్పారావు డిమాండ్ చేశారు. ఆయన వెంట పట్టణ అధ్యక్షులు శీలం రాము, మున్సిపల్ విభాగం అధ్యక్షులు మలిశెట్టి బాబీ, ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి కంచర్ల లవకుమార్, తదితరులు పాల్గొన్నారు. -
గిన్నిస్ బుక్లో హవిలాకు చోటు
ఏలూరు (ఆర్ఆర్పేట) : నగరంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన పోలగాని హవిలా గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది. గత ఫిబ్రవరి 2న హైదరాబాదులో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల ఆధ్వర్యంలో హలేల్ మ్యూజిక్ స్కూల్ గిన్నిస్ కీబోర్డ్ ఆధ్వర్యంలో వాయిద్య కారులు కీబోర్డు ఆగకుండా వాయించే పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో 22 దేశాల నుంచి దాదాపు 2 వేల మంది పాల్గొనగా అందులో 777 మంది ఎంపికయ్యారు. వారిలో హవిలా ఎంపికై హలేల్ మ్యూజిక్ స్కూల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఈ సందర్భంగా హలేల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు అగస్టన్ దండింగి ఇటీవల హైదరాబాదులో గిన్నిస్ అచీవర్స్ మీట్లో హవిలాకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. హవిలాకు నగరానికి చెందిన పలువురు సంగీత కళాకారులు, కళాభిమానులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. భీమవరం: ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్పై తెలంగాణలో జరుగుతున్న ఆందోళనల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అభిప్రాయపడ్డారు. భీమవరంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరూ ఎక్కడికై నా స్వేచ్ఛగా వెళ్లొచ్చని, కానీ పవన్ పర్యటనలను అడ్డుకుంటామంటూ హెచ్చరికలు చేయడం తగదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మిగిలిన నాయకులు ఈ తరహా పరిణామాలపై పునరాలోచించుకోవాలని, లేకుంటే వారికే తీవ్ర నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు. కుక్కునూరు: లైంగిక వేధింపుల కేసులో కుక్కునూరు పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లును సస్పెండ్ చేసినట్టు కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని పెద్దరావిగూడెం గ్రామానికి చెందిన వివాహితను కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు లైంగికంగా వేధించినట్టు పోలీస్స్టేషన్కు ఫిర్యాదు అందిందని, దీనిపై శాఖాపరమైన చర్యల నిమిత్తం ఎస్పీ కార్యాలయానికి నివేదిక పంపగా, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. పెదపాడు : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కోర్టు ముగ్గురికి జరిమానా విధించింది. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాలు ఇవి. మండలంలోని కలపర్రు టోల్గేట్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతున్న వసంతవాడకు చెందిన జుజ్జువరపు చరణ్, పెనమలూరుకు చెందిన షేక్ అబ్దుల్ ఖాదర్, నూజివీడు ఎంఆర్ అప్పారావు కాలనీకి చెందిన జలసూత్రం అప్పారావు అను ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపర్చగా వారికి ఒక్కొక్కరికి రూ.10వేల జరిమానా విధించారు. -
పోలీసులకు సత్కారం
పదవీ విరమణ చేసిన పలువురు పోలీసులను శనివారం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీ అస్మీ సత్కరించారు. వారి సేవలను కొనియాడారు. 8లో uభూదేవి పండగ జరిగే రెండు రోజులు గ్రామాల్లో ఎంతో సందడి నెలకుంటుంది. భక్తి శ్రద్దలతో పూజలు చేయడమే కాకుండా రేలా నృత్యాలు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. ఇవి తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. రేపటి తరాలకు కూడా గుర్తుండేలా భూదేవి పండుగ చేస్తాం. – తెల్లం దేవరాజు, కంసాలికుంట, బుట్టాయగూడెం మండలం తొలకరిలో వ్యవసాయ పనులు మొదలు పెట్టక ముందే భూదేవి పండగ చేయడం మా సాంప్రదాయం. మా పూర్వీకుల నుంచి ఇది వస్తోంది. పండుగ చేసిన తర్వాతే వ్యవసాయ పనులు ప్రారంభిస్తాం. పండుగ రెండు రోజులు గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లి విరుస్తుంది. – వెట్టి పెంటమ్మ, కాకులవారిగూడెం. బుట్టాయగూడెం మండలం -
నవధాన్యాల సాగు మేలు
ఏలూరు (టూటౌన్): ప్రకృతి వ్యవసాయ విధానంలో నవధాన్యాల సాగు ఎంతో మేలు చేస్తుందనే అంశంపై రైతులకు అవగాహన కలిగించాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. ఎల్నినో తీవ్ర ప్రభావం – ప్రకృతి సాగు ఆవశ్యకతపై అవగాహన కరపత్రాన్ని శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆవిష్కరించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవధాన్యాల సాగు ద్వారా వర్షాభావ పరిస్థితులను తట్టుకునే శక్తి పెరుగుతుందని, తక్కువ నీటితోనే సాగు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. జిల్లాలో 2,55,816 మంది పింఛనుదారులకు జూన్ నెలకు రూ.113.29 కోట్లు పంపిణీ చేస్తారని, 1వ తేదీన 100 శాతం పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవకతవకలకు పాల్పడితే సస్పెన్షన్ జిల్లాలో జలధార– జలహారతి కార్యక్రమంలో అవకతవకలకు పాల్పడితే సస్పెన్షన్ తప్పదని కలెక్టర్ హెచ్చరించారు. పోలవరం నియోజకవర్గంలోని ఏడు మండలాలు, చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి, టి.నర్సాపురం మొత్తం తొమ్మిది మండలాలు వారీగా పనుల ప్రగతిపై కలెక్టరు సమీక్షించారు. జలధార–జలహారతి కాల్వలు, చెరువులలో పూడికతీత పనులను సక్రమంగా చేపట్టడం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. ఎంపీడీఓలు, డ్వామా, ఇరిగేషన్ అధికారులు నిబంధనల మేరకు పూర్తి అయ్యాయా లేదా అన్నది పరిశీలించకుండా, కేవలం 6 అంగుళాలు పూడికతీత పనులను కూడా పనులు పూర్తయినట్లుగా చూపిస్తున్నారన్నారు. జలధార– జలహారతి కార్యక్రమంలో నిర్లక్ష్యం, అలసత్వం వ్యవహరిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ పీడీ హబీబ్బాషా, డ్వామా పీడీ కె.వెంకట సుబ్బారావు, ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా పీడీ బీ. వెంకటేష్ పాల్గొన్నారు. -
మద్దతు ధర పెంపు మోసపూరితం
బుట్టాయగూడెం: రైతుల పంటలకు మద్దతు ధరల పెంపు మోసపూరితమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ ఆరోపించారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల ఉత్తర్వుల కాపీలను ఆ సంఘం ఆధ్వర్యంలో నాయకులు స్థానిక ప్రభుత్వాస్పత్రి వద్ద శనివారం దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలు 20 శాతం పెంచి పంటలకు మద్దతు ధరలు కేవలం 8 శాతమే పెంచి కేంద్రం రైతులను మోసం చేసిందన్నారు. కనిష్టంగా వరికి కిలో 0.72 పైసలు, మొక్కజొన్నకు కిలో 0.10 పైసలు పెంచారని చెప్పారు. కాంప్లెక్స్ ఎరువులపై ఒక్కో బస్తాకు సగటున రూ.200 నుంచి రూ.300 వరకు ధర పెంచేందుకు ఎరువుల కంపెనీలకు కేంద్రం అనుమతి ఇచ్చిందని ఆరోపించారు. ఎరువుల ధరలు సుమారు 15 నుంచి 20 శాతం వరకు పెరిగాయని చెప్పారు. పంటల మద్దతు ధర ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, పెంచిన ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు కోర్సా జలపాలు, సిరిబత్తుల సీతారామయ్య, వెట్టి వీరయ్య, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు. -
జలరక్ష యాప్తో విద్యార్థులకు అవార్డు
కై కలూరు: ఆకస్మిక వరదల సమయంలో ముందస్తు హెచ్చరికలకు కోసం కై కలూరు మండలం జంగంపాడు ప్రభుత్వ పాఠశాల 7, 8 తరగతుల విద్యార్థులు జలరక్ష అనే యాప్ని సృష్టించి రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మక ‘ఇన్నోవేషన్ చాంపియన్’ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ నెల 25 నుంచి 29 వరకు వైజాగ్ గీతం యూనివర్సిటీలో హాక్ టూ ది ఫ్యూచర్ హ్యాకథాన్ పోటీలు జరిగాయి. రాష్ట్రంలో 8 జిల్లాల నుంచి 100 మంది విద్యార్థులు పోటీపడ్డారు. ఈ పోటీల్లో జంగంపాడు విద్యార్థులు నాగసాయి, యేసురాజు, శ్రీబాలాజీ, పవన్ తేజ, లీలా వెంకట్ జలరక్ష యాప్ రూపొందించారు. ఈ యాప్లో నార్మల్, చెక్ స్టేటస్, ప్లే ఎలర్ట్, ఫిషర్మెన్ సెప్టీ, ఎమర్జన్సీ, హెల్ప్ అనే ప్యూచర్లు ఉన్నాయి. సెల్లో యాప్ డౌన్లోడ్ చేసుకున్న కొల్లేరు ప్రాంత ప్రజలకు వరదల సమయంలో సెన్సర్ ఆధారంగా ముందే హెచ్చరిక చూపిస్తోంది. ఎవరైనా వరద నీటిలో చిక్కుకుంటే అక్కడ లోకేషన్తో సహా అత్యవసర సేవల విభాగాలకు సమాచారాన్ని చేరవేస్తోంది. ఈ యాప్ను రూపొందించినందుకుగాను విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో విశాఖపట్నం ప్రాంతీయ విద్యా శాఖ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) బీ.విజయభాస్కర్ నుంచి విద్యార్థులు ఇన్నోవేషన్ చాపియన్ అవార్డును అందుకున్నారు. ఈ సంరద్భంగా విద్యార్థులను, పాఠశాల గైడ్ టీచర్ పి.సురేష్బాబును గ్రామపెద్దలు అభినందించారు. -
ఆకివీడులో 2.6 కిలోల గంజాయి స్వాధీనం
కాళ్ల: ఆకివీడులో 2.6 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈమేరకు వివరాలను సీఐ కాళీచరణ్ వెల్లడించారు. ఆకివీడులో గంజాయి విక్రయాలు సాగుతున్నాయనే సమాచారంతో ఎస్పీ నయీమ్ అస్మి, డీఎస్పి రఘువీర్ విష్ణు ఆదేశాల మేరకు పోలీసులు దాడులు చేసినట్లు తెలిపారు. దాడుల్లో ఆకివీడు శివారు ఉప్పుటేరు బ్రిడ్జి వద్ద మందపాడు వెళ్లే మార్గంలో ఉన్న డంపింగ్ యార్డ్ వద్ద గంజాయి పంచుకుంటుండగా ఐదుగురిని పట్టుక్నుట్లు చెప్పారు. నిందితుల నుంచి 2.6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిలో ముగ్గురు పాత నేరస్తులు ఉన్నారని తెలిపారు. మారేడుమిల్లి ప్రాంతం నుంచి ఇక్కడకు తీసుకువచ్చి గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. నిందితుల నుంచి నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, వారిపై రౌడీషీట్ తెరుస్తున్నట్లు చెప్పారు. గంజాయి బ్యాచ్ని పట్టుకోవడంలో సహకరించిన కానిస్టేబుల్ విజయ్, శివ, శంకర్, వాసులకు సీఐ రివార్డులు అందించారు. ఎస్సై హనుమంతు నాగరాజు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. -
దేశ ప్రయోజనాలే లక్ష్యం
భీమవరం : అధికారం కోసం బీజేపీ ఆవిర్భవించలేదని దేశ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చెప్పారు. భీమవరంలో రెండు రోజుల పాటు నిర్వహించే పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ శిక్షణా తరగతులు శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ సమైక్యతే పరమావధిగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని, ముందు దేశం, తర్వాతే మనం అనే ఉన్నతమైన భావనతో ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ బీజేపీ కేవలం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను ఆధారంగా చేసుకుని నడిచే పార్టీ అన్నారు. సీనియర్ నాయకులు సైతం నిరంతర అభ్యాసం, ప్రశిక్షణ అనేది పార్టీలో అత్యంత ఆవశ్యకమని, అందువల్లే సామాన్య బూత్ స్థాయి కార్యకర్త సైతం జాతీయ స్థాయి అత్యున్నత నేతగా ఎదిగే రాజకీయ స్వేచ్ఛ బీజేపీలో సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీప్రసన్న, రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారపాటి తపన చౌదరి, రాష్ట్ర ప్రశిక్షణ సభ్యుడు కోడూరి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ -
గిరి సీమల్లో సంబరం
గంజాయి స్వాధీనం ఆకివీడులో 2.6 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు పాత నేరస్తులు ఉన్నారు. 8లో u● తొలకరి వేళ వైభవంగా భూదేవి పండుగ ● వర్షాలతో కరుణించమని వన దేవతలకు పూజలు ● మన్యం గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026బుట్టాయగూడెం: మారుతున్న కాలంలోనూ చెరిగిపోని సంస్కృతికి, తరతరాలుగా వస్తున్న నమ్మకానికి పశ్చిమ ఏజెన్సీ ప్రాంతం అద్దంపడుతోంది. బుట్టాయగూడెం మండలంలోని గిరిజన గ్రామాల్లో మరో వారం రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక శోభ కొనసాగనుంది. తొలకరి వేళ ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న సమయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ వందేళ్ల నాటి సంప్రదాయాన్ని ఆదివాసీ గిరిపుత్రులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. జడి ప్రక్రియతో మొదలై ఆటపాటలు, ఊయల ఉత్సవాలు, వేట వంటి విభిన్న సాంస్కృతిక ఆచారాలతో ఈ వేడుకలు జరుగుతాయి. భూదేవి పండుగగా పిలిచే ఈ గిరిజన సాంప్రదాయ ఉత్సవాలు ఇప్పటికే ప్రారంభం కాగా, మరొక వారం రోజుల్లో అన్ని గిరిపల్లెల్లోనూ జరగనున్నాయి. ఇందుకోసం గిరిజనులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో బాట పండగ, పప్పుల పండుగ, మామిడికాయ పండగ లాంటి అనేక పండుగలు జరిగినప్పటికీ, వాటిలో భూదేవి పండుగ అత్యంత ప్రధానమైనది. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాలను దైవంగా భావించి ప్రకృతిని కొలిచే ఆచారం ఇక్కడ నేటికీ సజీవంగా ఉంది. ఆదివాసీ గిరిజనులకు ఆధునిక ప్రపంచపు పోకడలతో, కొత్త టెక్నాలజీలతో పనిలేదు. వారు నమ్ముకున్న ప్రకృతి, వనాలే వారి దేవుళ్లు. తొలకరి జల్లులు కురిసే వేళ ఎంతో వైభవంగా భూమి తల్లికి పూజలు చేసి, ఆపై నాగలి పట్టి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. భావి తరాలకు ఆదర్శంగా పండుగలు ఆచార వ్యవహారాలకు, కట్టుబాట్లకు నిలయమైన గిరిపుత్రులు తమ సాంస్కృతిక సంప్రదాయాలను ప్రాణంగా కాపాడుకుంటూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఊరి పండుగ కావడంతో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొంటారు. పండుగ మొదటిరోజు గ్రామంలో గంగానమ్మ దేవతకు కోడిని కోసి నైవేద్యంగా పెడతారు. అనంతరం ఇప్పచెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలంతా ఒకచోట కూర్చుని సహపంక్తి భోజనం చేస్తారు. రెండవరోజు ఉదయం గంగానమ్మకు గ్రామ పెద్ద ప్రత్యేక పూజలు చేశాక, గుడి ఎదుట గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలు చేస్తారు. ఆకట్టుకునే బావా మరదళ్ల సందడి మొదటిరోజు రాత్రి పూజలు చేసిన ఇప్పచెట్టుకు ఏడు గజాల దూరంలో పేడతో కళ్లాపి చల్లి ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గులో నాటుకోడి గుడ్డును ఉంచి, మొదట మహిళలు, తర్వాత పురుషులు బాణంతో ఆ గుడ్డును పగలకొడతారు. ఆ సమయంలో మహిళలు పురుషులపై పేడ నీళ్లు చల్లుతూ పరుగులు పెట్టిస్తారు. అలా పరుగులు తీసిన మగవారు బాణాలు పట్టుకుని అడవికి వేటకు వెళతారు. సాయంత్రం వేళ వేటతో తిరిగి వచ్చాక, శరీరానికి పేడ పూసుకుని స్నానం చేసి ఇంట్లోకి వెళతారు. వేటలో తెచ్చిన జంతువును వండి, మళ్లీ ఊరంతా కలిసి విందు భోజనం చేస్తారు. ఈ పండుగ సమయంలో మహిళలు లయబద్ధంగా చేసే సాంప్రదాయ రేల నృత్యాలతో పాటు బావా మరదళ్ల సందడి గ్రామాల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. -
దొంగపిండిలో కుంగిన వంతెన
● వంతెనపై లారీ వెళ్తూ దిగబడిన వైనం ● త్రుటిలో తప్పించుకున్న డ్రైవర్ ● వంతెన ధ్వంసంతో నిలిచిన రాకపోకలు ● గగ్గోలు పెడుతున్న గ్రామస్తులు భీమవరం అర్బన్ : మండలంలోని దొంగపిండి గ్రామంలో బందాల చేడు డ్రెయిన్పై నిర్మించిన వంతెన శనివారం తెల్లవారుజామున కుంగిపోయింది. గోదావరి ఇసుక 3 యూనిట్లతో నిండిన టిప్పర్ లారీ వంతెనపైకి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే లారీ నుంచి దూకేయడంతో ప్రాణాలు కాపాడుకున్నాడు. తాత్కాలిక మరమ్మతులతో సరి దొంగపిండి గ్రామానికి చుట్టూ ఉప్పుటేరు, బొండాడ, కొచ్చేడు డ్రెయిన్లు ఉండటంతో భీమవరం పట్టనానికి ఏకై క మార్గంగా ఇక్కడ వంతెన ఉంది. సుమారు 1983లో నిర్మించిన ఈ వంతెన శిథిలావస్థకు చేరింది. గత 5 నెలల క్రితం ఈ వంతెన వద్ద మొదటి ఖానా ధ్వంసం అయినప్పటికీ తాత్కాళిక మరమ్మతులు చేసి కాలం గడిపేశారు. దీంతో ఆటోలు, బస్సులు, లారీలు కొంతకాలం తిరిగాయి. ఇప్పుడు వంతెన ఆవలి వైపు భారీగా కుంగిపోవడంతో ద్విచక్ర వాహనాలు మాత్రమే వెళుతున్నాయని కనీసం ఆటోలు కూడా వెళ్లడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు నిత్యం కూలిపనుల నిమిత్తం భీమవరం పట్టణం, యనమదుర్రు, దిరుసుమర్రు తదితర గ్రామాలకు ఆటోలు, వ్యాన్లపై వెళుతుంటారు. ఇప్పుడు వంతెన కూలిపోవడంతో తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. 5 నెలల క్రితం వంతెన కుంగినా ఆర్అండ్బీ అధికారులు, ప్రజాప్రతినిధులు తాత్కాలిక మరమ్మతులు చేశారే తప్ప, పూర్తిస్థాయిలో వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోలేకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని మండిపడుతున్నారు. గ్రామంలో రొయ్యలు, చేపలు చెరువులు ఎక్కువగా ఉండటంతో వాటికి మేతలోడులు, చేపలు ఎగుమతుల ద్వారా భారీ లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ వంతెన ధ్వంసం అవడం వల్ల తీవ్రంగా నష్టపోతామని గ్రామస్తులు, ఆక్వా రైతులు వాపోతున్నారు. త్వరితగతిన అధికారులు, ప్రజాప్రతనిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
కిడ్నీ వ్యాధి బాధితుడికి జగన్ అండ
దెందులూరు: దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం కొత్తముప్పర్రు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మాజీ సర్పంచ్ కోటా గోవర్ధన్ తండ్రి శ్రీరాములు కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతూ, డయాలసిస్ చేయించుకుంటున్నారు. పూర్తి చికిత్సకు ఖర్చు భారీగా ఉండడంతో, వారు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి సాయం కోరారు. ఆయన వెంటనే స్పందించి, స్వయంగా శ్రీరాములును మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు తీసుకువెళ్లి పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితుడితో మాట్లాడి, వారికి అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. మెరుగైన చికిత్సకు ఏర్పాట్లు చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యుల కోసం తక్షణమే స్పందించిన అబ్బయ్య చౌదరిని ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. శనివారం నిర్వహించిన భౌతికశాస్త్రం పరీక్షకు 3,734 మందికి గాను 2900 మంది హాజరు కాగా 834 మంది గైర్హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహించిన ఎస్ఎస్సీ సోషల్ పరీక్షకు మొత్తం 195 మంది విద్యార్థులకు 166 మంది హాజరుకాగా 29 మంది గైర్హాజరయ్యారు. దూరవిద్య ఇంటర్ గణితం పరీక్షకు 93 మందికి 83 మంది హాజరు కాగా 10 మంది గైర్హాజరయ్యారు. చరిత్ర పరీక్షకు 30 మందికి గాను 24 మంది హాజరయ్యారు. ఏలూరు(టూటౌన్): రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ ఏలూరు జిల్లా ఎన్నికలు శనివారం ఏలూరు కోటదిబ్బ అసోసియేషన్ హాలులో జరిగాయి. జిల్లా అధ్యక్షుడిగా డి మహాలక్ష్ముడు, ప్రధాన కార్యదర్శిగా జి.గంగాధర్ రావు, కోశాధికారిగా కే పద్మనాభరావు ఎన్నికయ్యారు. జిల్లా అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేషన్ సలహా మండలి సభ్యులుగా టి.రామారావు, ఆర్.వెంకటేశ్వర్లు, ఏ.అప్పలరాజును ఎన్నుకున్నారు. జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెంలో వేంచేసియున్న మద్ది ఆంజనేయస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా రాజన సత్యనారాయణ(పండు), సభ్యులుగా ఓబిళ్ళనేని సూర్యభవాని, చింతపల్లి రత్నసురేష్, ధూళిపాళ్ల సూర్యచంద్ర ప్రభాకరరావు, వల్లూరి సునీత, జగన్నాథం వెంకటమ్మ, తిరుమలశెట్టి నాగ వరలక్ష్మి, దూనబోయిన నారాయణమూర్తి, గెడా దుర్గా హరిసాగర్, నడిపల్లి విద్యాధర్, ఆరుగొల్లు సావిత్రిలు ప్రమాణస్వీకారం చేశారు. దేవస్థానం సీనియర్ అర్చకులు వెంకటాచార్యులు ఎక్స్అఫిషియో మెంబరుగా ప్రమాణస్వీకారం చేశారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ పరీక్షలకు శనివారం ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు మొత్తం 1,846 మంది హాజరయ్యారు. ఉదయం 29 కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన కామర్స్–1 పరీక్షకు 688 మంది జనరల్ విద్యార్థులకు 605 మంది హాజరు కాగా మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన ఫిజిక్స్–2 పరీక్షకు 1396 మంది జనరల్ విద్యార్థులకు 1241 మంది హాజరు కాగా 155 మంది గైర్హాజరయ్యారు. -
గిరిజన గ్రామానికి సౌర వెలుగులు
కుక్కునూరు: జన్మన్ కార్యక్రమం ద్వారా మారుమూల గిరిజన పల్లెల్లో విద్యుత్ శాఖ ధికారులు సౌర వెలుగులు నింపారు. మండలంలోని పెద్దరావిగూడెం పంచాయతీ, చిపురుగూడెం గ్రామంలో 13 కిలోవాట్, బండారిగూడెం గ్రామంలో 12 కిలోవాట్ల సోలార్ ఆఫ్ గ్రిడ్ రూ.65 లక్షలతో ఏర్పాటు చేసి 85 ఆదివాసీ కుటుంబాలకు ఏపీఈపీడీసీఎల్ సంస్థ విద్యుత్ సౌకర్యం కల్పించింది. ఈ గ్రిడ్ను శనివారం ఏపీఈపీడీసీఎల్ ఏలూరు సర్కిల్ ఎస్ఈ పి.సాల్మాన్రాజు ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ ట్రాన్స్కో డీఈ ఖాన్, ఏడీఈ కట్టా రమేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రంలో చినవెంకన్న తిరువీధి సేవ శనివారం రాత్రి కన్నులపండువగా జరిగింది. చాత్మార్ తిరునక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో అర్చకులు తొళక్క వాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి విశేష పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ స్వామివారి వాహనం ఆలయ ప్రధానరాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిటకు వచ్చిన స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. బుట్టాయగూడెం: బుట్టాయగూడెం శివారు అల్లికాల్వ సమీపంలో ఉన్న కాలువ వద్ద శనివారం మధ్యాహ్నం ఒక కారు పల్టీ కొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టి.సత్యనారాయణ అనే వ్యక్తి తన భార్యతో కలిసి కారులో బుట్టాయగూడెం నుంచి కన్నాపురం వైపు వెళ్తుండగా అల్లికాల్వ సమీపంలో ఉన్న కాల్వ సమీపంలో కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు. కారును స్థానికులు బయటకు తీశారు. -
న్యాయం చేయాలని గిరిజనుల ధర్నా
ఏలూరు (ఆర్ఆర్పేట): డీ– నమూనా పట్టాల భూములను ఆన్లైన్ చేయడంలో జరుగుతున్న అవకతవకలను నిలువరించి గిరిజనులకు న్యాయం చేయాలని శరత్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వడ్లపట్ల సాయి శరత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అన్యాయానికి గురౌతున్న జీలుగుమిల్లి మండలం పాలచర్ల రాజవరం గ్రామానికి చెందిన గిరిజనులతో కలిసి శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శరత్ మాట్లాడుతూ 1984, 2003 సంవత్సరాల్లో ప్రభుత్వమే డీ–నమూనా పట్టాలు మంజూరు చేసినా, ప్రస్తుతం రికార్డులు లేవనే కారణంతో భూములను ఆన్న్లైన్ చేయకపోగా, గిరిజనేతరుల పేర్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఐటీడీఏ పీవో, ఎస్డీసీ, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ తదితర అధికారులను పలుమార్లు ఆశ్రయించినా న్యాయం జరగలేదని తెలిపారు. పైగా అధికారుల నిర్లక్ష్యానికి బాధ్యత తమపై మోపుతూ దొంగ పట్టాలు సృష్టించారని ఆరోపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు చేసేందుకు భూముల్లోకి వెళ్తే పోలీసులతో తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని, పీజీఆర్ఎస్లో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పరిష్కారం లభించలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే,, అధికార యంత్రాంగం తమ సమస్యను అర్థం చేసుకోకుండా చిన్నచూపు చూస్తున్నారని పేర్కొంటూ, పూర్తి విచారణ జరిపి తమ భూములను వెంటనే ఆనన్లైన్ చేయాలని కలెక్టర్ను కోరారు. కలెక్టరును కలిసినవారిలో సోయం కాంతమ్మ, సోడెం అరుణ, సోడెం రాజు, పూనెం మహాలక్ష్మమ్మ, కొర్స లక్ష్మి, పూనెం దుర్గారావు, తాటి ముత్యాల రావు తదితరులున్నారు. -
ఓట్లను కొల్లగొడతారు.. జాగ్రత్త!
● వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ ● బీఎల్ఏలకు ‘సర్’ ప్రక్రియపై అవగాహన కై కలూరులో సర్పై అవగాహన సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్. సమావేశానికి హాజరైన బీఎల్ఏలు, నాయకులు కై కలూరు: కూటమి ప్రభుత్వం మన ఓట్లును కొల్లగొట్టడానికి ‘సర్’ను ఆయుధంగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తోందని, వైఎస్సార్సీపీకి బీఎల్ఏలు పెద్ద బలని, బూత్ స్థాయి నుంచి సైనికుల్లా పనిచేయాలని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) బీఎల్ఏలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నియోజకవర్గ బూత్ లెవల్ ఏజెంట్స్కు సర్ ప్రక్రియపై అవగాహన సమావేశం కై కలూరు సీతారామ ఫంక్షన్ హాలులో శనివారం జరిగింది. జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆకట్టుకున్న పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై పార్టీ కేంద్ర కార్యాలయ రాష్ట్ర కార్యదర్శి, సర్ జిల్లా ఇన్చార్జి పోతుల శివారెడ్డి, కోఆర్డినేటర్ బీవీఆర్ చౌదరిలు సర్ ప్రక్రియలో తీసుకోవల్సిన జాగ్రత్తలపై చెప్పిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఆకట్టుకుంది. బీఎల్ఏలు 45 రోజులు దీక్షలా ఓట్లను పరిశీలించాలని చెప్పారు. రెండు, మూడు ఓట్ల తేడాతో ముఖ్యమంత్రుల పీఠం కోల్పోయిన ఘటనలను వివరించారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఓటర్ల వెరిఫికేషన్ కార్యక్రమం జరుగుతుందన్నారు. కై కలూరు నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 19,000 మంది పార్టీ కేడర్ ఉందన్నారు. నియోజకవర్గ సర్ పరిశీలకులుగా డీ.నారాయణను నియమించారన్నారు. బీఎల్ఏలు ఓట్లు తొలగింపు, మార్పుల విషయంలో తుది సంతకం నియోజకవర్గ ఇన్చార్జితో సంప్రదించి చేయాలన్నారు. ఓటరు వద్దకు ముందుగానే వెళ్ళి కావాల్సిన గుర్తింపు కార్డులు, కలర్ ఫొటోలు, ధరఖాస్తులపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం చంద్రబాబు వెన్నుపోటు పాలనపై ఇటీవల ముద్రించిన పుస్తకంలో విషయాలను వివరించారు. భారీగా తరలివచ్చిన బీఎల్ఏలు, పార్టీ నాయకులతో కై కలూరు సీతారామ ఫంక్షన్ హాలు కిక్కిరిసింది. ఎండను లెక్క చేయకుండా భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ముదిరాజుల సంఘ విభాగ అధ్యక్షుడు కోమటి విష్ణువర్థనరావు, ఎంపీపీలు రామిశెట్టి సత్యనారాయణ, పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్, రాష్ట్ర పార్టీ నాయకులు గుమ్మడి వెంకటేశ్వరరావు, సయ్యపురాజు గుర్రాజు, గంటా సంధ్య, ఐనాల బ్రహ్మాజీ, బలే నాగరాజు, గాదిరాజు కిట్టు, గాలిబ్బాబు, ముదినేపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు ఈడే వెంకటేశ్వరమ్మ, రాచూరి రాధా, రఫీ, మేరీ నవరత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులకు సత్కారం
భీమవరం : పోలీసుల సేవలను పోలీసు శాఖ ఎప్పటికీ గుర్తించుకుంటుందని పదవీ విరమణ చేసినా వారి కుటుంబాలకు వెన్నుదన్నుగా ఉంటుందని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. పదవీ విరమణ పొందని పలువురు పోలీసులను శనివారం ఆయన సత్కరించారు. పదవీ విరమణ చేసిన జిల్లా పోలీసు కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె వెంకటేశ్వరరావు, పాలకోడేరు ఎస్సై ఎన్ హరిబాబు, భీమవరం ట్రాఫిక్ ఎస్సై టీవీజీ రాజు, పోడూరు ఏఎస్సై పి.విజయ్కుమార్, తాడేపల్లిగూడెం ట్రాఫిక్ ఏఎస్సైలు పి.సింగరాజు, ఎం.గోవిందరావు, పెనుమంట్ర హెడ్ కానిస్టేబుల్ పి శ్రీనివాసరావు, జిల్లా పోలీస్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ పి రామకృష్ణ, డిస్ట్రిక్ట్ ఆర్మర్డ్డ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్స్ కె నాగ మునీంద్రరావు, కె.సువర్ణరాజు, పాలకొల్లు టౌన్ పోలీస్ స్టేషన్ హోమ్గార్డ్ వై ప్రభాకర్లను సత్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ రఘువీర్ విష్ణు, జిల్లా ఆర్మ్ర్డ్ రిజర్వ్ డీఎస్పీలు ఎంవీవీ సత్యనారాయణ, కె వెంకట్రావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ, జిల్లా పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ సీహెచ్ మోజేష్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు జరిపితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. శనివారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నివారణ చట్టం (పీసీపీఎన్డీటీ చట్టం) అమలుతీరుపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ, గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న స్కానింగ్ కేంద్రాలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే లింగ నిర్ధారణ కోసం ప్రయత్నించే గర్భిణులు, కుటుంబ సభ్యులు కూడా చట్టపరంగా శిక్షార్హులేనని హెచ్చరించారు. సమాజంలో బాలికల సంఖ్య తగ్గిపోకుండా, ఆడ శిశువుల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలపై తరచూ తనిఖీలు నిర్వహించి, రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు. జంగారెడ్డిగూడెం : చేసిన పనికి డబ్బులు చెల్లించలేదని మనస్తాపానికి గురైన ఓ తాపీమేసీ్త్ర పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరానికి చెందిన దాసరి వెంకటేశ్వరరావు తాపీమేసీ్త్రగా పనిచేస్తున్నాడు. అతడు జంగారెడ్డిగూడెంనకు చెందిన కాంట్రాక్టర్ వద్ద పనులు ఒప్పుకుని కూలీలతో రెండు నెలల క్రితమే పనులు పూర్తి చేశాడు. దానికి సంబంధించి కాంట్రాక్టర్ తాపీమేస్త్రి వెంకటేశ్వరరావుకు రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వకపోవడం, మరోవైపు డబ్బుల కోసం కూలీల నుంచి ఒత్తిడి ఎదురవడంతో మనస్ధాపానికి గురైన వెంకటేశ్వరరావు జంగారెడ్డిగూడెం వచ్చి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అతడిని స్ధానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. -
నాన్ లే అవుట్లలో రియల్ దందా
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నాన్–లే అవుట్లలో స్థలాల వ్యాపారం జోరుగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్కు మంచి రోజులొచ్చాయని కూటమి నాయకులు ప్రచారం చేస్తూ, అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ లేఅవుట్లు వేస్తున్నారు. తద్వారా కొనుగోలుదారులను స్థలాల విషయంలో దారుణంగా మోసం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల వ్యవసాయ భూములను ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టితో పూడ్చి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. నాన్–లేఅవుట్ అనే విషయాన్ని కొనుగోలుదారులకు తెలియకుండా, తక్కువ ధరకే ఇస్తున్నామంటూ ఆకర్షణీయ ప్రకటనలతో నమ్మిస్తున్నారు. నిబంధనల ప్రకారం లేఅవుట్లకు డీటీసీపీ, పంచాయతీ, మున్సిపాలిటీ, ఇతర శాఖల నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ తర్వాతే ప్లాట్లుగా విభజించి విక్రయించాలి. కూటమి నాయకుల అండదండలతో రియల్ వ్యాపారులు నిబంధనలను పక్కనబెట్టి అక్రమ లేఅవుట్ల దందాను జోరుగా సాగిస్తున్నారు. అక్రమ లేఅవుట్ల పూడికల్లో కూటమి నేతలు కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు మట్టి కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతూ అక్రమ మట్టి దందాకు పూర్తిగా సహకరిస్తున్నారు. స్థానికంగా ఉండే కూటమి నాయకులు, జేసీబీ యజమానులు, కాంట్రాక్టర్ల నుంచి తమ స్థాయిలో మామూళ్లు వసూలు చేస్తున్నారు. అధికారులకు హెచ్చరికలు జిల్లాలో నాన్–లే అవుట్ల పూడికలు, అక్రమ మట్టి తోలకాలను అడ్డుకుంటున్న అధికారులకు కూటమి నాయకులు గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకూ వార్నింగ్లు ఇస్తున్నారు. ఆ లేఅవుట్ మా వాళ్లదే.. దాని జోలికి వెళ్లొద్దు, వెళ్తే చర్యలు తప్పవు అని హెచ్చరిస్తుండడంతో స్థానిక అధికారులు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసిన సోమనాథరెడ్డి.. జిల్లా పంచాయతీల పరిధిలో ఉన్న నాన్–లేఅవుట్లపై దృష్టి సారించి చర్యలకు ఉపక్రమించారు. అందులో కూటమి నాయకుల లేఅవుట్లు కూడా ఉండడంతో, ఆయనను జిల్లా నుంచి బదిలీ చేయించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పట్టించుకోని రెవెన్యూ శాఖ జిల్లాలోని 20 మండలాలకు సంబంధించి నాన్–లేఅవుట్ల పూడికల కోసం వ్యవసాయ భూములను ఇష్టానుసారంగా తవ్వేస్తున్నప్పటికీ రెవెన్యూ శాఖ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లాలోని భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం మూడు రెవెన్యూ డివిజన్ల ఆర్డీఓలు ఈ మట్టి తోలకాలపై కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. వారి డివిజన్ల పరిధిలో అక్రమ మట్టి తోలకాలు దారుణంగా జరుగుతున్నా ఏ ఆర్డీఓ స్పందించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా అక్రమ లే అవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. గత ప్రభుత్వంలో బ్రేక్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లాలో అక్రమ లేఅవుట్లకు బ్రేక్ పడింది. అందుకు కారణం జిల్లా వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలు అందించడం కోసం దాదాపు 1500 ఎకరాల భూములను ప్రభుత్వం సేకరించి వాటి పూడిక పనులను చేయించడమే. దీనివల్ల అక్రమ లేఅవుట్లు వేయాలనుకునే వ్యాపారులకు మట్టి దొరికే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా ఐదేళ్ల పాటు అక్రమ లేఅవుట్ల వ్యాపారానికి అడ్డుకట్ట పడింది. స్థలాలు కొనుగోలు చేసి మోసపోతున్న ప్రజలు అక్రమ లే అవుట్ల పూడికల్లో కూటమి నేతల ప్రమేయం చర్యలు తీసుకున్న పంచాయతీ అధికారిపై బదిలీ వేటు -
వైఎస్సార్సీపీ నేతలపై ఆగని కూటమి నేతల అరాచకం
ఏలూరు: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి నేతల అరాచక పర్వం కొనసాగుతూనే ఉంది. ఏలూరు జిల్లా శోభనాపురంలో వైఎస్సార్సీపీ నేత సాంబశివరావుపై టీడీపీ నేతలు దాడికి దిగారు. సాంబశివరావుపై కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు టీడీపీ నేతలు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని సాంబశివరావుపై దాడి చేశారు కూటమి నేతలు. గాయపడిన సాంబశివరావును స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాంబశివరావును మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు పరామర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈ తరహా దాడులు చేస్తారా అంటూ మేకా ప్రతాప్ ప్రశ్నించారు. -
పశ్చిమగోదావరి జిల్లాలో కుప్పకూలిన వంతెన
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: భీమవరం మండలంలో ఘోర ప్రమాదం తప్పింది. దొంగపిండి గ్రామం వద్ద వంతెన కూలిపోయింది. ఇసుక లారీ వెళ్తుండగా వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదం నుంచి లారీ డ్రైవర్ బయటపడ్డారు. గ్రామానికి ఇదే ఏకైక మార్గం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దొంగపిండి గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
ప్రియురాలిని చంపి.. భర్తకు ఫోన్ చేసిన ప్రియుడు..!
ఏలూరు టౌన్: అనుమానం పెనుభూతంగా మారింది... ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధం కాస్తా... పగ, ప్రతీకారానికి దారితీశాయి... డబ్బులు ఇస్తానని నమ్మబలికి ఊరు తీసుకువెళ్ళి అత్యంత కిరాతకంగా చంపేశాడు... ఐదు రోజుల అనంతరం మృతదేహాన్ని గుంతతవ్వి పూడ్చిపెట్టాడు. ఈ ఘోరహత్యకు సంబంధించి ఏలూరు త్రీటౌన్లో నమోదైన మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులకు విస్తుగొలిపే నిజాలు వెలుగుచూశాయి. ఏలూరు త్రీటౌన్ పోలీసులు అత్యంత చాకచక్యంగా, అత్యాథునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి.. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఏలూరు పోలీస్సబ్ డివిజన్ కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏలూరు త్రీటౌన్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఏలూరు శివారు శౌరీపురం గ్రామానికి చెందిన మల్లపల్లి విశాలి (36) ఏప్రిల్ 18న గుడివాడలోని బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లింది. విశాలి ఇంటికి రాకపోవటంతో భర్త, బంధువులు కంగారుపడ్డారు. ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ఆఫ్ రావడంతో భర్త ఆందోళనతో ఏలూరు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు క్రైమ్నెంబర్ 81/2026, విమెన్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఏలూరు త్రీటౌన్ సీఐ వి.కోటేశ్వరరావు, ఎస్సై పి.రాంబాబు బృందాలుగా మహిళ కదలికలపై నిఘా ఉంచారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి దర్యాప్తు చేపట్టగా... శౌరీపురం గ్రామానికే చెందిన ఫ్రాన్సిస్ శౌరి (36) పాలవ్యాపారితో ఆమె నిత్యం ఫోన్ మాట్లాడినట్లు గుర్తించారు. మిస్సింగ్ కేసు విచారణ సమయంలో ఫ్రాన్సిస్ గ్రామంలో లేకపోవడంతో పోలీసుల అనుమానం బలపడింది. పాలవ్యాపారి ఫ్రాన్సిస్ విశాలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ రూ.2 లక్షలు వడ్డీకి అప్పు ఇచ్చినట్లు గుర్తించారు. ఇద్దరి మద్య వివాహేతర సంబంధం కొనసాగుతూ ఉండగానే, మరోవైపు విశాలి ఇతర వ్యక్తులతో ఫోన్ మాట్లాడుతుందనే అనుమానాన్ని పెంచుకున్నాడు. ప్రియురాలిపై మోహం కాస్తా, కక్షగా మారింది. ఆమెను హతమార్చాలని పథకం రచించాడు. చున్నీతో గొంగు బిగించి... పెద్దరాయితో మోది హత్య ప్రియురాలిని హత్య చేయాలనే పధకంతో ఏప్రిల్ 18న డబ్బులు ఇస్తానని నమ్మించి విశాలిని హనుమాన్ జంక్షన్కు రావాలని చెప్పాడు. ఆమెను మోటారు సైకిల్పై నూజివీడు మండలం పల్లెర్లమూడి, పోలవరం కాలువ గట్టు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. విశాలి చున్నీతో ఆమె గొంతు బిగించి ఊపిరాడకుండా చేశాడు. కిందపడిపోయిన ఆమెపై పెద్దరాయితో ఛాతీపై బలంగా మోదాడు. కిరాతకమైన దాడిలో విశాలి ప్రాణాలు కోల్పొయింది. హత్య చేసిన అనంతరం పొదల్లో పడేసి మెల్లగా జారుకున్నాడు. ఐదు రోజుల అనంతరం ఏప్రిల్ 23న సంఘటనా స్థలానికి వెళ్లిన ఫ్రాన్సిస్ ఆమె మృతదేహాన్ని లోతుగా గుంతతవ్వి పూడ్చిపెట్టాడు. ఆమె బట్టలు, వస్తువులను దగ్ధం చేశాడు. పోలీసులు, కుటుంబ సభ్యులను తప్పుదోవ పట్టించేందుకు ఆమె బతికే ఉందనే భ్రమ కలి్పస్తూ వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ విశాలి ఫోన్ నుంచి భర్తకు వాట్సాప్ చాటింగ్ చేయటం, ఫోన్ చేసి లిఫ్ట్ చేశాక మాట్లాడకుండా ఉంటూ వారితో ఆటలాడాడు. అనంతరం ఆమె మొబైల్ ఫోన్ పగులగొట్టి, చెరువులో పడేశాడు. ఎట్టకేలకు ఛేదించిన పోలీసులు ఏలూరు త్రీటౌన్ పోలీసులు పక్కా సమాచారంతో ఈనెల 28న ఏలూరు హౌసింగ్బోర్డు కాలనీ సమీపంలో నిందితుడు ఫ్రాన్సిస్ను మోటారు సైకిల్తో అదుపులోకి తీసుకుని విచారించారు. నేరాన్ని అంగీకరిస్తూ నూజివీడు పల్లెర్లమూడి శివారులో మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రదేశానికి పోలీసులు వెళ్ళిన అనంతరం నూజివీడు తహసీల్దార్ సమక్షంలో శవాన్ని వెలికితీశారు. మహిళ మిస్సింగ్ కేసును హత్య కేసు, ఆధారాల నిర్మూలన సెక్షన్లు 103(1), 238(ఏ)బీఎన్ఎస్ గా మార్పు చేశారు. బంధువుల అదనపు స్టేట్మెంట్లు రికార్డు చేసి, నేరస్థలంలో పక్కా ఆధారాలు సేకరించి, నిందితుడ్ని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దీంతో నిందితుడికి కోర్టు రిమాండ్ విధించిందని ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ తెలిపారు. ఈ కేసు ఛేదించటంలో ప్రతిభ చూపిన త్రీటౌన్ సీఐ వి.కోటేశ్వరరావు, ఎస్సై పి.రాంబాబు, సిబ్బందిని ఏలూరు జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ ప్రత్యేకంగా అభినందించారు. -
సీయూఈటీ పరీక్ష అభ్యర్థులకు ఇబ్బందులు
భీమవరం: భీమవరం డీఎన్నార్ అటానమస్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన జాతీయ స్థాయి యూనివర్శిటీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష (సీయూఈటీ)కు హాజరైన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జిల్లా వ్యాప్తంగా భీమవరం ఒక్కటే పరీక్షా కేంద్రం కావడం, 140 మంది విద్యార్థులను కేటాయించడం పరీక్షా కేంద్రంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై 6 గంటలకు ముగియాల్సి ఉండగా 8.30 గంటలకు పూర్తికాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పరీక్ష నిర్వహణకు డీఎన్నార్ కళాశాల యాజమాన్యం 2 ల్యాబ్లను కేటాయించగా ఒక ల్యాబ్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో విద్యార్థులందరినీ ఒకే ల్యాబ్లో పరీక్ష రాయించడం వల్లనే సమస్య ఏర్పడిందని చెబుతున్నారు. అయితే పరీక్షకు హాజరైన విద్యార్థులు మాత్రం సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడం, మధ్యలోనే సిస్టం ఆగిపోవడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వంటి ఇబ్బందులు ఏర్పడినా పట్టించుకునే నాథుడు లేడని ఆందోళన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షా కేంద్రం బయట దోమలు, ఉక్కబోతతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. చాట్రాయి: వడ దెబ్బ తగిలి వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండలంలోని జనార్థనవరంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కంచల నాగులు(80) శుక్రవారం ఇంట్లో ఉండగా వాంతులు రావడంతో వడదెబ్బతగిలి మృతి చెందాడు. మృతుడికి కొడుకు ఉన్నారు. గుడివాకలంకలో.. దెందులూరు: ఏలూరు రూరల్ మండలం గుడివాకలంక వైఎస్సార్సీపీ నాయకుడు ముంగర అంతర్వేది (40) వడదెబ్బతో శుక్రవారం మృతి చెందారు. ఆయనకు భార్య కూతురు, కొడుకు ఉన్నారు. ఆయన మృతిపై వైఎస్సార్ సీపీ నాయకులు సంతాపం తెలిపారు. జంగారెడ్డిగూడెం: డ్రైనేజీలో పడి ఒక వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై ఎన్వీ ప్రసాద్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. స్థానిక వెటర్నరీ ఆసుపత్రి సమీపంలో నివసిస్తున్న జాజి సింగారయ్య (40) సెంట్రింగ్ పని చేసుకుని జీవిస్తున్నారు. అయితే 28న రాత్రి పనిమీద బయటకు వెళ్తున్నానని చెప్పి తిరిగి ఇంటికి రాలేదు. అయి తే ఉదయం చూసే సరికి సమీపంలో డ్రెయినేజీలో పడి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై సింగారయ్య సోదరి కోన వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 3న గుర్తు తెలియని పార్సిల్స్ బహిరంగ వేలం తణుకు అర్బన్: ఆర్టీసీ కార్గో పార్సిల్స్కు సంబంధించి గుర్తు తెలియని పార్సిల్స్ను ఏలూరు కొత్త బస్టాండ్లో వచ్చేనెల 3వ తేదీన బహిరంగ వేలం వేయనున్నట్లు ఏలూరు జిల్లా కార్గో వాణిజ్య శాఖాధికారి జీవీఎల్పీ సుబ్బారావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ వేలంలో ఆసక్తి కలిగిన వారు పాల్గొనాలని కోరారు. -
రసాయన ఎరువులతో భూసారం క్షీణత
నూజివీడు: మొక్కలకు కావాల్సిన పోషకాలను మొక్కలు భూమి నుంచి గ్రహిస్తాయనే విషయం అందరికి తెలిసిందే. అయితే భూముల్లో పోషకాల లోపం ఉంటే వాటి భర్తీకి రసాయనిక ఎరువులను రైతులు అవసరానికి మించి వాడుతున్నారు. దీనివల్ల అన్నదాతలకు పెట్టుబడులు విపరీతంగా పెరుగుతున్నాయి. సన్న, చిన్నకారు రైతులు పంటలు పండించేటప్పుడు కొన్ని పోషకాలను అధికంగా ఇవ్వడం, మరికొన్ని పోషకాలు తక్కువగా ఇవ్వడం వల్ల పోషక లభ్యతలో సమతుల్యత లేక పంటల ఉత్పాదకత తగ్గిపోతోంది. అలాగే రసాయన ఎరువులను అవసరానికి మంచి వాడడంతో భూములు పంటల సాగుకు పనికి రాకుండాపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు రసాయన ఎరువులను తగ్గించి, సేంద్రియ ఎరువులను వాడాలని నూజివీడు ఏడీఏ జొన్నలగడ్డ భవాని సూచిస్తున్నారు. ఆమె రైతులకు పలు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. సేంద్రియ ఎరువుల్లో పచ్చిరొట్ట ఎరువులు ● పచ్చిరొట్ట విత్తనాలను పొలంలో చల్లుకుని పంట పూత దశలో భూమిలోనే కలియదున్నాలి. ఇలా చేయడం వల్ల 30 నుంచి 35 శాతం వరకు నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు. ● ఖరీఫ్ పంటకు ముందు వర్షాకాలంలో పచ్చిరొట్ట ఎరువులను సాగుచేసుకోవాలి. జీలుగ, జనుము, అలసంద, పిల్లిపెసర, పెసర తదితర పచ్చిరొట్ట ఎరువులు బాగా ఉపయోగపడతాయి. ● వ్యవసాయశాఖ 50 శాతం రాయితీపై రైతులకు పచ్చిరొట్ట విత్తనాలను అందిస్తోంది. వీటిని ఖరీఫ్ సాగుకు కొద్దిరోజుల ముందే చిరుజల్లులు పడే సమయంలో పొలాల్లో చల్లుకోవాలి. ● జనుము, పిల్లిపెసరను పశువులకు మేపవచ్చు. ఆ తరువాత భూమిలో కలిపి దున్నుకోవాలి. జీలుగ అయితే పశువులు మేయవు కాబట్టి పూత దశ ముందు వరకు నేలలో కలిపి దున్నాలి. ● వరి నాట్లు వేయడానికి కనీసం 20రోజులు ముందే నేలలో కలిపి దున్నినట్లయితే నాట్లు వేసే సమయానికి భూమిలో కుళ్లి సేంద్రియ ఎరువుగా మారి పంటకు ఉపయోగపడుతుంది. సేంద్రియ ఎరువుల వల్ల లాభాలు నేలలో నీటిని పట్టి ఉంచే గుణం పెరుగుతుంది. భూసారం పెరగడంతోపాటు వివిధ పోషకాల మార్పిడి చెందే శక్తి నెలలో పెరుగుతుంది. మొక్కలకు చీడపీడలను తట్టుకునే శక్తి పెరుగుతుంది. నేలలో సూక్ష్మజీవులు వృద్ధి చెంది సుస్థిర దిగుబడులు సాధించడానికి ఉపయోగపడతాయి. దిగుబడులు కూడా పెరుగుతాయి. నేలలో కాలుష్యం తగ్గుతుంది. జీలుగను భూమిలో కలిపి దున్నడం వల్ల చౌడుశాతం కూడా తగ్గుతుంది. భూమిలో సత్తువ పెరగడమే కాకుండా పంట సాగు కూడా ఆశాజనకంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరైతూ పచ్చిరొట్ట పైర్లను సాగుచేసి రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకుంటే సాగులో పెట్టుబడులు తగ్గడమే కాకుండా నాణ్యమైన దిగుబడులు సాధించడం ద్వారా వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. -
న్యాయవాదుల విధుల బహిష్కరణ
ఏలూరు (టూటౌన్): ఆశ్రం ఆస్పత్రి వద్ద న్యాయవాదులపై సంఘ విద్రోహ శక్తులు విచక్షణారహితంగా దాడి చేసి గాయపరచడాన్ని నిరసిస్తూ ఏలూరులోని అన్ని కోర్టుల న్యాయవాదులు శుక్రవారం విధులను బహిష్కరించారు. ఈనెల 26న ఆశ్రం ఆస్పత్రి బ్రిడ్జి వద్ద ఏలూరు జిల్లా కోర్టు న్యాయవాది పళ్లపాటి ర మేష్, హైకోర్టు న్యాయవాది పొడేటి లక్ష్మయ్యపై సంఘ విద్రోహ శక్తులు ఆగి ఉన్న కారులోంచి వీరిని బయటకు లాగి దాడి చేశారు. రమేష్ మెడలోని బంగారు గొలుసును లాక్కొని చంపుతామని బెదిరించారు. దీనికి నిరసనగా ఏలూరు బార్ అసోసియేష న్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోనే సీతారామారావు, జనరల్ సెక్రటరీ నిమ్మల జ్యోతికుమార్, ఉపాధ్యక్షుడు ఎన్వీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందించారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. శుక్రవారం గణితం పరీక్షకు 2,334 మంది విద్యార్థులకు 1,486 మంది హాజరయ్యారు. అలాగే ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సీ సైన్స్ అండ్ టెక్నాలజీ పరీక్షకు 351 మందికి 303 మంది, ఇంటర్ ఫిజిక్స్ పరీక్షకు 68 మందికి 56 మంది, పొలిటికల్ సైన్స్ పరీక్షకు 73 మందికి 58 మంది హాజరయ్యారు. 30 కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. ఎలాంటి మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. 32 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు జిల్లాలో 32 కేంద్రాల్లో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. మొత్తంగా 5,290 మంది హాజరయ్యారు. ఫిజిక్స్–1 పరీక్షకు 4742 మంది జనరల్ విద్యార్థులకు 4,402 మంది, 480 మంది ఒకేషనల్ విద్యార్థులకు 344 మంది హాజరయ్యారు. కామర్స్–2 పరీక్షలకు 544 మంది హాజరయ్యారు. వీరిలో 291 మంది జనరల్ విద్యార్థులకు 260 మంది, 507 మంది ఒకేషనల్ విద్యార్థులకు 284 మంది హాజరయ్యారని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సూచించారు. స్థానిక అశోక్నగర్ కేపీడీటీ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష గదుల్లోకి ఇన్విజిలేటర్లు, సిబ్బంది, విద్యార్థులు సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకు రాకూడదన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా ప టిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల హాజరుపై ఆరా తీశారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులు ఉన్నారు. ఏలూరు (టూటౌన్): ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు అర్హులైన అభ్యర్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆన్లైన్ ద్వారా జూలై 31లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బాలల సంరక్షణాధికారి సీహెచ్ సూర్యచక్రవేణి ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలకు తనను సెల్ 9491063810లో సంప్రదించాలని కోరారు. ఏలూరు (టూటౌన్): జనగణనను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాల్సిన బాధ్యత తహసీల్దార్లదేనని, జిల్లాలో ఇండ్ల గణనను శ నివారం నాటికి పూర్తి చేయాలని జేసీ ఎంజే అభిషేక్ గౌడ స్పష్టం చేశారు. జనగణన ప్రగతి, జూన్ నెలలో పంపిణీ చేయాల్సిన పట్టాదార్ పాస్ పుస్తకాలు తదితర అంశాలపై శుక్రవారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా స మీక్షించారు. జనగణనను ఈనెల 30లోపు పూ ర్తి చేయాల్సి ఉందని, ఇంకా పూర్తి కాకపోవడంపై తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
సీడ్ బాల్స్తో అడవుల విస్తరణ
కామవరపుకోట: అడవుల విస్తరణకు సీడ్ బాల్స్ దోహదపడతాయని, జిల్లాలో 12 లక్షల సీడ్ బాల్స్ చల్లే కార్యక్రమాన్ని చేపట్టామని జిల్లా అటవీ శాఖా ధికారి సందీప్రెడ్డి తెలిపారు. శుక్రవారం తడికలపూడి సెంట్రల్ నర్సరీలో సీడ్ బాల్ తయారీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. సీడ్ బాల్స్ ప్రాముఖ్యత, వాటి తయారీ విధానం, అడవుల అభివృద్ధిలో వాటి పాత్రపై అవగాహన కల్పించారు. జంగారెడ్డిగూడెం, భీమవరం, రాజమహేంద్రవరం, ఏలూరు విభాగాలకు చెందిన అటవీ అధికారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. మొక్కల పెంపకానికి ప్రజలు సహకరించాలని కోరారు. గ్రీన్ కై ్లమేట్ టీం ప్రతినిధులు, సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు ప్రత్యక్షంగా, ఫారెస్ట్ బీట్ ఆ ఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు ఇతర సిబ్బంది గూగుల్ లైవ్ ద్వారా పాల్గొన్నారు. -
ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తం
ఏలూరు టౌన్: ఎన్నికల సంఘం రాష్ట్రంలో అమలు చేస్తున్న స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ (ఓటర్ల జాబితా సవరణ) సర్పై వైఎస్సార్సీపీ నేతలు అత్యంత అప్రమత్తంగా ఉండాలనీ, బీఎల్ఏలు శ్రద్ధగా పనిచేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. శుక్రవారం నగరంలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో సర్పై బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ)కు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులు గా ఏలూరు జిల్లా టాస్క్ఫోర్స్, రాష్ట్ర కార్యదర్శి పో తుల శివారెడ్డి, బూత్ కమిటీ జోన్ ఇన్ఛార్జ్ బీవీఆర్కే చౌదరి, ఏలూరు నియోజకవర్గ పరిశీలకులు డీవీఆర్కే చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బీఎల్ఏలు, పార్టీ నేతలకు ఓటరు జా బితా సవరణపై అవగాహన కల్పించారు. సర్ అత్యంత కీలకమైన ప్రక్రియ అనీ, ప్రతి బీఎల్ఏ తమ పరిధిలోని ప్రతి ఓటరుపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా శ్రద్ధ వహించటంతోపాటు, అక్రమంగా ఓటర్లను చేర్చే పనులు చేస్తే వాటిని గుర్తించి అభ్యంతరాలు నమోదు చేయాలన్నారు. రాబోయే నెలన్నర రోజులు బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తూ ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఏలూరు నియోజకవర్గంలోని పార్టీ నేతలు, శ్రేణులంతా సమష్ట్టిగా, సమన్వయంతో పనిచేస్తూ అక్రమాలకు అడ్డుకట్ట వే యాలని పిలుపునిచ్చారు. నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, చింతలపూడి పరిశీలకుడు దాసరి రమేష్, బూత్ కమిటీల నగర అధ్యక్షుడు ఎచ్చర్ల ఉమామహేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి ము న్నుల జాన్, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు చిరంజీవి, వైఎస్సార్టీయూ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణేష్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రాజేష్, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ల బాచి, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, వాణిజ్య విభాగం రాాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంటా మోహనరావు, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి ఇమ్మానియేల్ జయకర్, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్, లీగల్సెల్ నగర అధ్యక్షులు ప్రత్తిపాటి తంబి, నగర ఎస్సీసెల్ అధ్యక్షులు ఇనపనూరి జగదీష్, బీసీసెల్ నగర అధ్యక్షులు కిలాడి దుర్గారావు, జిల్లా కార్యదర్శి యుగంధర్ప్రసాద్, నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ -
స్కూల్ బస్సుల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరి
ఏలూరు (ఆర్ఆర్పేట): పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రతి ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు రవాణా శాఖ సూచించిన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా బస్సులను సిద్ధం చేయాలని ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన జిల్లా పోలీస్ శాఖ, రవాణా శాఖ సంయుక్తంగా ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో నిర్వహించిన సదస్సులో అధికారులు పేర్కొన్న బస్సుల్లో వీఎల్టీడీని, డ్యాష్ బోర్డు కెమెరాలు అమర్చడం, పోలీస్ శాక కేటాయించిన క్యూఆర్ కోడ్ కలిగిన పోస్టర్లను ప్రతి స్కూల్ బస్సు ముందు, వెనుక భాగాల్లో అతికించడం, 60 సంవత్సరాల వయస్సు మించని, అనుభవం కలిగి ఉన్న డ్రైవర్లను నియమించడం, బ్రీత్ అనలైజర్లను ఏర్పాటు చేసుకోవడం, రవాణా శాఖ అధికారులు అందించిన చెక్ లిస్టులో పేర్కొన్న భద్రతా ప్రమాణాలను పాటిస్తూ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రమాదాల నివారణకు సహకరించాలన్నారు. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీ అధికారులతో కూడిన 5 తనిఖీ బృందాలు ఈ నెల 1 నుంచి అన్ని ప్రైవేటు విద్యాసంస్థల పాఠశాలలు, కళాశాలల బస్సుల ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా ఇప్పటి వరకు 841 బస్సులను తనిఖీ చేసి, బస్సుల్లో భద్రతా ప్రమాణాలు సరిగా లేని 652 బస్సుల యాజమాన్యాలకు నోటీసులు అందించామన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు వారి బస్సుల్లో ని లోపాలను సరిచేసుకుని, బస్సులకు ఏటీఎస్ ద్వారా ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలని, లేని పక్షంలో కేసులు నమోదు చేయడంతో పాటు బస్సులను సీజ్ చేస్తామని డీటీసీ కరీమ్ హెచ్చరించారు. దెందులూరు: మండలంలోని ఉండ్రాజవరం బస్టాండ్ సమీపంలో శుక్రవారం ట్రాక్టర్ ఢీకొని ఓ ద్విచక్ర వాహనదారుడు మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దెందులూరు మండలం దోసపాడు గ్రామానికి చెందిన పంతగాని రాజేష్ (25) మోటార్ సైకిల్పై శుక్రవారం పోతునూరు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఉండ్రాజవరం బస్టాండ్ సమీపంలోకి వచ్చేసరికి ఓ ట్రాక్టర్ అదుపుతప్పి రాజేష్ను ఢీకొట్టింది. దీంతో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అవివాహితుడు కాగా తల్లిదండ్రులు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలం వద్ద రోదిస్తున్న మృతుడి బంధువులు, రాజేష్ (ఫైల్) -
ఆ క్షణం.. ఉద్విగ్నభరితం
● 2019 మే 30న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం ● ఐదేళ్లు.. ప్రగతి పరవళ్లు ● చెప్పింది చేసి చూపించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ● మళ్లీ ఆ రోజులు రావాలని ప్రజల ఆకాంక్ష ● రెండేళ్లుగా కూటమి పాలనలో నలిగిపోతున్న జనం శనివారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2026సాక్షి, భీమవరం: రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2019 మే 30న జగన్ బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే నవరత్నాల అమలుకు అడుగులు వేశారు. ఎక్కడా లేని విధంగా సచివాలయ, వలంటీర్ వ్యవస్థలు తెచ్చారు. పింఛన్ కోసం వృద్ధుల పడిగాపులకు చెక్ పెట్టి 1వ తారీఖు ఉదయాన్నే ఇంటికి వచ్చి సా యాన్ని వారి చేతికందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదల అభ్యున్నతికి వైఎస్సార్ పెన్షన్ కానుక, అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, టైలర్లు, రజకులు, నాయిబ్రాహ్మణుల కోసం జగనన్న చేదోడు, డ్రైవర్ల కోసం వాహనమిత్ర, మత్య్సకారులకు మత్య్సకార భరోసా, చేనేత కార్మికుల కోసం నేతన్న నేస్తం తదితర సంక్షేమ కార్యక్రమాలతో పేదలను ఆదుకున్నారు. డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో ఉమ్మడి జిల్లాలోని పేదలకు సుమారు రూ.2,500 కోట్ల లబ్ధి చేకూర్చారు. ఉచిత పంటల బీమా, ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను సరఫరా చేశారు. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రైతులకు రూ.796.49 కోట్లు సాయం అందించారు. జగనన్న సురక్ష శిబిరాల ద్వారా ఉమ్మడి జిల్లాలోని దాదాపు 11.82 లక్షల మందికి లబ్ధిదారులకు ఏ విధమైన సర్వీస్ చార్జీ లేకుండానే కుల ధ్రువీకరణ, ఆదాయ, జనన, మరణ, మ్యారేజ్ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ తదితర 12.04 లక్షల సర్టిఫికెట్లు అందజేశారు. ప్రజారోగ్యమే పరమావధిగా.. జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లతో పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేశారు. స్పెషలిస్ట్ వైద్యులతో విలేజ్ క్లినిక్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్యశిబిరాలు ఏర్పాటుచేశారు. 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచి 15 లక్షల మందికి పైగా రోగులకు వైద్యసేవలందించారు. ఆరోగ్యశ్రీలో రూ.5 లక్షల వరకు ఉన్న వ్యయ పరిమితిని రూ.25 లక్షలకు, 1,059గా ఉన్న చికిత్సల సంఖ్యను 3,257కు పెంచడం ద్వారా పేదల ఆరోగ్యానికి మరింత భద్రతను కల్పించారు పేదింట డిజిటల్ విద్య పేద విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధన చేపట్టారు. నాడు–నేడు ద్వారా రూ.369.13 కోట్లతో కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారు. 8వ తరగతి విద్యార్థులకు రూ.30 వేలు విలువ చేసే ట్యాబ్లు అందజేశారు. జగనన్న అమ్మఒడి పథకం కింద 1,48,342 మంది తల్లులకు రూ.887.9 కోట్లు, పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనలుగా రూ.770 కోట్లు సాయం అందించారు. కూటమి వెన్నుపోటుకు రెండేళ్లు అంతన్నారు.. ఇంతన్నారు.. అధికారంలోకి రావడమే ఆలస్యమన్నారు. సూపర్ సిక్స్ అంటూ ఊరూరా ఊదరగొట్టారు. జూన్ నుంచే అమలు.. ఇవిగో బాండ్లు అంటూ ఏ కుటుంబానికి ఎంత వస్తుందో కరపత్రాలపై రాసి మరీ ఇంటింటీకి ఇచ్చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన మొదలై అప్పుడే రెండేళ్లు కావస్తుండగా ఆడబిడ్డ నిధి, నిరు ద్యోగభృతి ఊసెత్తడం లేదు. ఇంటికో ఉద్యోగం మాటే లేదు. సంక్షేమం జాడలేక పేదింట కాంతులు, ఆక్వా, వరి రైతులకు భరోసా కరువయ్యాయి. ప్రైవేటీకరణ పేరిట పాలకొల్లులో మెడికల్ కళాశాల నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అర్ధాంతంగా ఆపేసింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయక నరసాపురంలో ఆక్వావర్సిటీ నిర్మాణం అసంపూర్తిగా ఆగిపోయింది. ఆరోగ్యశ్రీ గాల్లో దీపంలా ఉండగా వైద్యశిబిరాల నిర్వహణ లేదు. జిల్లాలో ప్రగతి పడకేసింది. ఇసుక, మట్టి, మద్యం అన్నింటా సిండికేట్ల దోపిడీతో రెండేళ్లకే కూటమి పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మళ్లీ జననేత జగన్ పాలన రావాలంటూ జనం 2019 మే 30ను గుర్తుచేసుకోవడం కనిపిస్తోంది. 2019 మే 30.. తూరుపు కొండల్లో ఉదయించిన సూర్యునిలా జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరపురాని రోజు.. చారిత్రక పాలనకు తొలి అడుగుపడిన రోజు.. పేద బతుకులకు భరోసా వచ్చిన రోజు.. అక్కచెల్లెమ్మలకు ‘చేయూత’గా, వారి డ్వాక్రా రుణమాఫీకి ‘ఆసరా’గా, అగ్రవర్ణాల పేద మహిళలకు ‘నేస్తం’గా, పేదల చదువులకు ‘అమ్మఒడి’లా, వారి ఉన్నతికి విద్య, వసతి దీవెనలకు అంకురార్పణ పడిన రోజు.. పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ జిల్లాలో సుమారు 76,069 మందికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. ఆక్వారంగానికి ప్రోత్సహిస్తూ నరసాపురంలో రూ.332 కోట్ల వ్యయంతో ఆక్వావర్సిటీ మంజూరు చేశారు. పాలకొల్లు మండలం దగ్గులూరులో రూ.475 కోట్ల వ్యయంతో 61 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కళాశాల పనులు చేపట్టారు. పాలకొల్లులో రూ.13.50 కోట్ల వ్యయంతో 150 పడకల ఆసుపత్రి నిర్మాణం చేయగా, నరసాపురంలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. భీమవరంలో రూ.40 కోట్ల వ్యయంతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు చేపట్టారు. దాదాపు రూ.540 కోట్ల వ్యయంతో గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లీనిక్లు, బల్క్మిల్క్ యూనిట్లు, డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపట్టారు. సచివాలయ వ్యవస్థతో ఎందరో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించిన ఏకైక వ్యక్తి మాజీ సీఎం వైఎస్ జగన్. సచివాలయ ఉద్యోగులు మే 30న మర్చిపోలేరు. మళ్లీ అలాంటి రోజులు రా వాలని యువత కోరుకుంటోంది. నేడు ప్రచారా ర్భాటం తప్ప ఎవరికీ ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు లేవు. – మండ విశ్వనాథ్ నారాయణరెడ్డి, మార్టేరు మహిళలకు అన్ని పథకాలు ఇచ్చి అండగా నిలిచిన వైఎస్ జగన్ పాలనను అందరూ కోరుకుంటు న్నారు. అన్ని రంగాల్లో మహిళలకు 50 శాతం కచ్చితంగా అమలు చేసిన ఏకై క వ్యక్తి జగన్. సంక్షేమంతో మహిళకు బాసటగా నిలిచారు. జగన్ మళ్లీ అధికారం చేపట్టాలని అందరూ కోరుకుంటున్నారు. – కోట సరోజిని వెంకటేశ్వరరావు, ఆచంట దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా ప్ర భుత్వాలు పాలించాయి. ఇన్ని ప్రభుత్వాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన ఎంతో బాగుంది. ఇచ్చి న మాట ప్రకారం పాలన చేసి ప్రజలకు దగ్గర య్యారు. దేశంలోనే ఇలాంటి పాలన ఎక్కడా అందించలేదు. మరలా ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నాం. – కొండేటి లాజర్, కుముదవల్లి -
‘మా జీవనోపాధిపై దెబ్బకొట్టొద్దు’
ఆగిరిపల్లి: తోటపల్లిలో నిర్మిస్తున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు వలన మా జీవనోపాధి దెబ్బతింటుందని అధికారుల ముందు గ్రామాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తోటపల్లిలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసే చింతగట్టు వద్ద తోటపల్లి, చిన్నాగిరి పల్లి, సింగన్నగూడెం, సర్నాల గొల్లగూడెంకి చెందిన గ్రామస్తులతో అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన అనేక కుటుంబాలకు చెందినవారు ఎన్నో సంవత్సరాలుగా చింతగట్టుపై పశువులను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నామని, గతంలో హైకోర్టు కూడా తమకు అనుకూలమైన తీర్పు వెలువరించిందని, ఇప్పుడు బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే పశువులకు పశుగ్రాసం లేక జీవనోపాధి కోల్పోతామని 2/1 సర్వే నెంబర్ లో ఇంకా 500 ఎకరాలు ఖాళీ స్థలం ఉందని ప్రభుత్వం బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన స్థలం అక్కడ ఏర్పాటు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. పర్యావరణానికి హాని బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో కొండను ధ్వంసం చేస్తే పర్యావరణానికి హాని కలుగుతుందని గ్రామస్తులు అధికారులకు తెలిపారు. ప్రభుత్వం, అధికారులు న్యాయం చేయకపోతే అవసరమైతే కోర్టుకి వెళ్లి అయినా సరే న్యాయం కోసం పోరాడుతామని తేల్చి చెప్పారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వెంకట్రావు మాట్లాడుతూ బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న రైతులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. బయో గ్యాస్ ప్లాంట్ వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని జరగదని తెలిపారు. మంత్రి కొలుసు పార్థసారథి కుమారుడు నితిన్ కృష్ణ మాట్లాడుతూ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. జిల్లా పరిశ్రమల చీఫ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఎస్ఆర్సీ మూర్తి, మండల వ్యవసాయ అధికారి భవాని, డిప్యూటీ ఎంపీడీఓ దుర్గారావు పాల్గొన్నారు. -
ప్రజల అర్జీలపై తక్షణం స్పందించాలి
నిడమర్రు: గ్రామాల్లో నిర్వహిస్తున్న సందర్శన సభల్లో స్వీకరిస్తున్న అర్జీలపై తక్షణం అధికారులు స్పందించి పరిష్కరించేలా కృషి చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఒక నెల, ఒక గ్రామం, నాలుగు సార్లు సందర్శన కార్యక్రమం రెండో సారి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొని పలు సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ముందుగా పలు గ్రామాల్లోని అభివృద్ధి, ప్రధాన సమస్యలు, రెవెన్యూ సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పీహెచ్సీ అభివృద్ధిపై దృష్టి నిడమర్రు సభ అనంతరం పెదనిండ్రకొలను, పత్తేపురం గ్రామాల్లో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న, తదితరులు పర్యటించి పలు సమస్యలను తెలుసుకున్నారు. పెదనిండ్రకొలను గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని పరిశీలించి వైద్య అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అఽధికారులను కోరారు. పెదనిండ్రకొలను పందికోడు కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించే పనులు త్వరితగతిన చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. పత్తేపురంలో నూతన పంచాయతీ భవనం నిర్మాణం చేపట్టాలన్నారు. పత్తేపురం తాగునీటి పథకం మంచినీటి చెరువు ప్రక్షాళన పనులను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.రంగలక్ష్మి, ఎంపీడీఓ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. -
తలనీలాల ఎగుమతులకు కేంద్రం సహకరించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): తలనీలాల ఎగుమతులు వృద్ధి చెందడానికి, ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం పొందడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని శాసన మండలి సభ్యులు, ప్రముఖ తలనీలాల ఎగుమతిదారు వంక రవీంద్రనాథ్ అన్నారు. శుక్రవారం కేంద్ర సంస్థ డైరెక్టర్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ప్లాస్టిక్స్ ఎగుమతి ప్రోత్సాహక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మాణ సామర్థ్యం– తల నీలాల ఎగుమతులు –సాంకేతిక అభివృద్ధి అనే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో దక్షిణ భారతదేశం నుంచి తలనీలాల ఎగుమతి దారులు పాల్గొన్నారు. తలనీలాల ఎగుమతి ద్వారా అనేక వేల మంది అనేక రాష్ట్రాల్లో ఉపాధి పొందుతున్నారని, విగ్గులు, తదితర హెయిర్ ప్రొడెక్ట్స్ తయారీలో భారతదేశ ఎగుమతిదారులు వెనుకబడి ఉన్నారని, ఈ తయారీ రంగానికి సంబంధించిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవడాని ప్రభుత్వ సాయం కావాలని రవీంద్రనాథ్ కోరారు. విశాఖపట్నం డిప్యూటీ డీజీఎఫ్టీ కార్యాలయం నుంచి వచ్చిన పలని ఫణి కుమార్ ఎగుమతి దారుల సమస్యలు ఉన్నతాధికారులకు తెలియజేస్తానని తెలిపారు. హెయిర్, హెయిర్ ప్రొడెక్ట్స్ అసోసియేషన్ చైర్మన్ బెంజమిన్ చెరియన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్లెక్స్ కౌన్సిల్ రీజనల్ డైరెక్టర్ రూబిన్ హోబ్డే, మడుపల్లి మోహన్ గుప్తా, కేకే గుప్తా, సతీష్ గాంధీ, కిషోర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ ఉద్యోగుల్లో బదిలీల చర్చ
ఏలూరు (ఆర్ఆర్పేట): తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీసీడీసీఎల్) పరిధిలో జూన్ మొదటి వారంలో పదోన్నతులు జరుగనున్నాయని, ఏలూరు, భీమవరం సర్కిళ్లలో పలువురు అధికారులకు పదోన్నతులతో పాటు బదిలీలు జరగనున్నాయనే చర్చ ఉద్యోగుల్లో విస్తృతంగా జరుగుతోంది. అలాగే విద్యుత్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచే అంశంపై ప్రభుత్వం వచ్చేనెల 4న జరిగే కేబినేట్ సమావేశంలో ఓ నిర్ణయానికి రానుందని తెలిసింది. ఈ నేపథ్యంలో ఈపీడీసీఎల్ పరిధిలో గత ఆరు నెలలుగా పదవీ విరమణలు జరిగినా ఆయా స్థానాలను ఇప్పటివరకూ భర్తీ చేయలేదనే చర్చ కూడా నడుస్తోంది. లైన్ లాసులు తగ్గించడంలో.. ప్రస్తుతం ఏలూరు ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్గా పనిచేస్తున్న పి.సాల్మన్రాజుకు పదోన్నతి లభించనుందని సమాచారం. ఆయన్ను చీఫ్ జనరల్ మేనేజర్గా విశాఖలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ చేయనున్నారని చర్చించుకుంటున్నారు. డిస్కం స్థాయిలో లైన్ లాసులను తగ్గించడంలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా సంస్థ సీఎండీ ఇమ్మడి పృధ్వీతేజ్ ఆయనకు ప్రశంసాపత్రం కూడా అందించడం ఈ వాదనకు బలం చేకూర్చుతోంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచితే ఆయనకు పదోన్నతి లభించదని, ఇక్కడ మూడేళ్ల సర్వీస్ పూర్తిచేసుకోవడంతో బదిలీ మాత్రం తప్పదనే చర్చా జరుగుతోంది. ఆయన భార్య భీమవరంలో పశుసంవర్ధక శాఖలో జిల్లాస్థాయి అధికారిగా పనిచేస్తున్నందున సాల్మన్రాజును భీమవరం సర్కిల్కు బదిలీ చేసే అవకాశం ఉందంటున్నారు. అంబేడ్కర్కు స్థానిక ప్రజాప్రతినిధి అడ్డు ! ఏలూరు డివిజన్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న కేఎం అంబేడ్కర్ పదోన్నతుల జాబితాలో ఉన్నారు. ఆయన సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ)గా పదోన్నతి పొందుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే అంబేడ్కర్కు ఏలూరులో పోస్టింగ్ ఇవ్వడాన్ని స్థానిక ప్రజాప్రతినిధి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయన ఒత్తిడికి సీఎండీ తలొగ్గితే అంబేడ్కర్ను కొత్తగా ఏర్పడిన పోలవరం సర్కిల్కు ఎస్ఈగా నియమించే అవకాశం ఉందంటున్నారు. వచ్చేనెల 4న జరిగే కేబినెట్ సమావేశంలో విద్యుత్ సంస్థల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచే అవకాశం ఎక్కువగానే ఉందని ఉద్యోగులు అంటున్నారు. 60 ఏళ్లకు పదవీ విరమణ ఉంటే వందలాది మంది ఉద్యోగులు, అధికారులు పదవీ విరమణ చేస్తారని, వారికి పదవీ విరమణ ఫలాలు అందించాలంటే ప్రభుత్వం దగ్గర అంత విత్తం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో పదవీ విరమణ వయసు పెంచితే పైన చెప్పుకున్న సమీకరణాల్లో చాలా మార్పులు ఉండను న్నాయి. దీనికి తోడు గత ఆరు నెలల క్రితం అంటే 2026 జనవరిలో పదవీ విరమణ చేసిన వారు కూడా తిరిగి ఉద్యోగాల్లో చేరతారని, అప్పుడు ఆయా ప్రాంతాల్లోని స్థానిక ప్రజాప్రతినిధుల ఆశీస్సులు ఎవరికి లభిస్తాయో వారికి కోరుకున్న స్థానాలు లభిస్తాయనే చర్చ వేడిగానే జరుగుతోంది. సీజీఎంగా ఏలూరు ఎస్ఈ సాల్మన్రాజు! ఏలూరు ఈఈకు ఎస్ఈగా అవకాశం పదవీ విరమణ వయసు పెంచితే మారనున్న సమీకరణాలు వచ్చేనెలలో పదోన్నతులు వచ్చే నెల ప్రారంభం నాటికి డిస్కం స్థాయిలో బదిలీలు పూర్తి చేయాలని సీఎండీ చూస్తూ ఉండగా పలు స్థానాల కోసం ఇప్పటికే ప్రజాప్రతినిధుల ద్వారా సీఎండీకి లేఖలు సమర్పిస్తూ పలువురు అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారని సమాచారం. కోనసీమ జిల్లాలో పనిచేస్తున్న విజయానంద్ పదోన్నతిపై భీమవరం ఎస్ఈగా రావడానికి, ఏలూరు సర్కిల్ పరిధిలోని జంగారెడ్డిగూడెం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ఖాన్ సైతం భీమవరం ఎస్ఈ స్థానానికి రావడానికి ప్రయత్నాలు చేస్తుండటంతో ఆ స్థానానికి పోటీ ఎక్కువగా ఉంది. భీమవరంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఎస్ఈ ఉషారాణిని అమలాపురం ఎస్ఈగా, అమలాపురం ఎస్ఈ రాజేశ్వరిని కాకినాడకు బదిలీ చేస్తారని చెప్పుకుంటున్నారు. ఇలా పదోన్నతులు జరిగితే తాడేపల్లిగూడెం ఈఈ, భీమవరం డీఈ టెక్నికల్, నరసాపురం, నిడదవోలు తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు స్థానచలనం కలిగే అవకాశం ఉందంటున్నారు. -
ప్రియుడే.. కాలయముడై
● కిరాతకంగా వివాహితను హత్య చేసిన ప్రియుడు ● ఐదు రోజుల తర్వాత గుంత తీసి శవాన్ని పాతిపెట్టిన వైనం ఏలూరు టౌన్: అనుమానం పెనుభూతంగా మారింది... ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధం కాస్తా... పగ, ప్రతీకారానికి దారితీశాయి... డబ్బులు ఇస్తానని నమ్మబలికి ఊరు తీసుకువెళ్ళి అత్యంత కిరాతకంగా చంపేశాడు... ఐదు రోజుల అనంతరం మృతదేహాన్ని గుంతతవ్వి పూడ్చిపెట్టాడు. ఈ ఘోరహత్యకు సంబంధించి ఏలూరు త్రీటౌన్లో నమోదైన మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులకు విస్తుగొలిపే నిజాలు వెలుగుచూశాయి. ఏలూరు త్రీటౌన్ పోలీసులు అత్యంత చాకచక్యంగా, అత్యాథునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి.. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఏలూరు పోలీస్సబ్ డివిజన్ కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏలూరు త్రీటౌన్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఏలూరు శివారు శౌరీపురం గ్రామానికి చెందిన మల్లపల్లి విశాలి (36) ఏప్రిల్ 18న గుడివాడలోని బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లింది. విశాలి ఇంటికి రాకపోవటంతో భర్త, బంధువులు కంగారుపడ్డారు. ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ఆఫ్ రావడంతో భర్త ఆందోళనతో ఏలూరు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు క్రైమ్నెంబర్ 81/2026, విమెన్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఏలూరు త్రీటౌన్ సీఐ వి.కోటేశ్వరరావు, ఎస్సై పి.రాంబాబు బృందాలుగా మహిళ కదలికలపై నిఘా ఉంచారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి దర్యాప్తు చేపట్టగా... శౌరీపురం గ్రామానికే చెందిన ఫ్రాన్సిస్ శౌరి (36) పాలవ్యాపారితో ఆమె నిత్యం ఫోన్ మాట్లాడినట్లు గుర్తించారు. మిస్సింగ్ కేసు విచారణ సమయంలో ఫ్రాన్సిస్ గ్రామంలో లేకపోవడంతో పోలీసుల అనుమానం బలపడింది. పాలవ్యాపారి ఫ్రాన్సిస్ విశాలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ రూ.2 లక్షలు వడ్డీకి అప్పు ఇచ్చినట్లు గుర్తించారు. ఇద్దరి మద్య వివాహేతర సంబంధం కొనసాగుతూ ఉండగానే, మరోవైపు విశాలి ఇతర వ్యక్తులతో ఫోన్ మాట్లాడుతుందనే అనుమానాన్ని పెంచుకున్నాడు. ప్రియురాలిపై మోహం కాస్తా, కక్షగా మారింది. ఆమెను హతమార్చాలని పథకం రచించాడు. చున్నీతో గొంగు బిగించి... పెద్దరాయితో మోది హత్య ప్రియురాలిని హత్య చేయాలనే పధకంతో ఏప్రిల్ 18న డబ్బులు ఇస్తానని నమ్మించి విశాలిని హనుమాన్ జంక్షన్కు రావాలని చెప్పాడు. ఆమెను మోటారు సైకిల్పై నూజివీడు మండలం పల్లెర్లమూడి, పోలవరం కాలువ గట్టు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. విశాలి చున్నీతో ఆమె గొంతు బిగించి ఊపిరాడకుండా చేశాడు. కిందపడిపోయిన ఆమైపె పెద్దరాయితో ఛాతీపై బలంగా మోదాడు. కిరాతకమైన దాడిలో విశాలి ప్రాణాలు కోల్పొయింది. హత్య చేసిన అనంతరం పొదల్లో పడేసి మెల్లగా జారుకున్నాడు. ఐదు రోజుల అనంతరం ఏప్రిల్ 23న సంఘటనా స్థలానికి వెళ్లిన ఫ్రాన్సిస్ ఆమె మృతదేహాన్ని లోతుగా గుంతతవ్వి పూడ్చిపెట్టాడు. ఆమె బట్టలు, వస్తువులను దగ్ధం చేశాడు. పోలీసులు, కుటుంబ సభ్యులను తప్పుదోవ పట్టించేందుకు ఆమె బతికే ఉందనే భ్రమ కల్పిస్తూ వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ విశాలి ఫోన్ నుంచి భర్తకు వాట్సాప్ చాటింగ్ చేయటం, ఫోన్ చేసి లిఫ్ట్ చేశాక మాట్లాడకుండా ఉంటూ వారితో ఆటలాడాడు. అనంతరం ఆమె మొబైల్ ఫోన్ పగులగొట్టి, చెరువులో పడేశాడు. ఎట్టకేలకు ఛేదించిన పోలీసులు ఏలూరు త్రీటౌన్ పోలీసులు పక్కా సమాచారంతో ఈనెల 28న ఏలూరు హౌసింగ్బోర్డు కాలనీ సమీపంలో నిందితుడు ఫ్రాన్సిస్ను మోటారు సైకిల్తో అదుపులోకి తీసుకుని విచారించారు. నేరాన్ని అంగీకరిస్తూ నూజివీడు పల్లెర్లమూడి శివారులో మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రదేశానికి పోలీసులు వెళ్ళిన అనంతరం నూజివీడు తహసీల్దార్ సమక్షంలో శవాన్ని వెలికితీశారు. మహిళ మిస్సింగ్ కేసును హత్య కేసు, ఆధారాల నిర్మూలన సెక్షన్లు 103(1), 238(ఏ)బీఎన్ఎస్ గా మార్పు చేశారు. బంధువుల అదనపు స్టేట్మెంట్లు రికార్డు చేసి, నేరస్థలంలో పక్కా ఆధారాలు సేకరించి, నిందితుడ్ని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దీంతో నిందితుడికి కోర్టు రిమాండ్ విధించిందని ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ తెలిపారు. ఈ కేసు ఛేదించటంలో ప్రతిభ చూపిన త్రీటౌన్ సీఐ వి.కోటేశ్వరరావు, ఎస్సై పి.రాంబాబు, సిబ్బందిని ఏలూరు జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ ప్రత్యేకంగా అభినందించారు.


