breaking news
Eluru
-
వినయంతోనే విద్యకు విలువ
నూజివీడు: విద్యచేత వినయం కలిగినప్పుడే ఆ విద్యకు విలువ ఉంటుందని ప్రముఖ ప్రవచనకారుడు, నైతిక విలువల ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆదివారం విద్యార్థుల్లో నైతిక విలువలు అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత కార్యక్రమాన్ని జ్యోతీప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థులనుద్ధేశించి మాట్లాడుతూ విద్యార్థులంతా ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు బాధపడేలా ప్రవర్తించకూడదన్నారు. చదువుకున్న వాడికి మాత్రమే ఓర్పు వస్తుందని, ఓర్చుకోగలిగిన వాడే వృద్ధిలోకి వస్తారన్నారు. తాను భరించడం, ఇతరుల్ని క్షమించడం అనే లక్షణాల్ని విద్యార్థులు అలవర్చుకోవాలని, కష్టాలను భరించలేక ఆత్మహత్యకు పాల్పడడం కాకుండా కష్టాల నుంచి పట్టుదలను అలవాటు చేసుకోవాలని సూచించారు. మనకందరికి తెలిసింది సముద్రంలో బిందువుతో సమానమని, మనం తెలుసుకోవలసిన విషయాలు లోకంలో ఎన్నో ఉన్నాయన్నారు. ఎప్పుడూ తన గురించే కాకుండా లోక సంక్షేమం కోసం కూడా ఆలోచించాలన్నారు. మంచి పుస్తకాలు చదవాలి ప్రముఖ ప్రవచన కర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు -
దేవుడిని రాజకీయాల్లోకి లాగడం హేయం
చింతలపూడి: చంద్రబాబు ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు సాక్షాత్తూ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని, పవిత్రమైన తిరుపతి లడ్డూను రాజకీయాల్లోకి లాగడం హేయమని వైఎస్సార్సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు అన్నారు. లడ్డూపై దుష్ప్రచారం సీబీఐ నివేదికతో పటాపంచలైందన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై పలు ప్రశ్నలు సంధించారు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఏ ఆధారంతో అబద్ధాలు చెప్పారు?, మాజీ సీఎం వైఎస్ జగన్ను అపఖ్యాతి పాలుచేసేందుకు లడ్డూ పవిత్రతను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో లడ్డూలో కల్తీ జరగలేదని సీబీఐ చార్జిషీట్తో స్పష్టమైందని, దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీకు నైతికత ఉంటే వెంటనే పదవికి రాజీనామా చేసి, ప్రజలకు బహిరంగ క్షమాపణ చె ప్పాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీరును కూడా విజయరాజు తప్పుబట్టారు. ఒకప్పుడు కమ్యూనిస్టునని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు సనాతన ధర్మం అంటూ రంగులు మారుస్తున్నారని, మెట్లు కడిగి భక్తిని ప్రదర్శించడం కేవ లం డ్రామా మాత్రమే అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ నైతిక బాధ్యతగా కూటమి ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని హితవు పలికారు. జెడ్పీటీసీ మొ లుగుమాటి నీరజా సుధాకర్ మాట్లాడుతూ కూటమి నాయకుల అబద్ధాలను హిందువులంతా గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వరావు, పార్టీ నాయకులు మిర్యాల దిలీప్, ఆతుకూరి సుబ్బారావు, పి.మాధవరెడ్డి, కాటూరి ఏరియా, వెంప కృష్ణ, ఎండీ జిలానీ, బండారు గోపి, వెంపా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి కన్వీనర్ విజయరాజు -
తంగెళ్లమూడి..భక్తులతోనిండి
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులో గంగానమ్మవారి జాతర మహోత్సవాలు వరుసగా మూడో ఆదివారం అట్టహాసంగా జరిగాయి. గతనెల 26న తూర్పువీధి, దక్షిణపు వీధి, పవర్పేట, లక్ష్మీవారపు పేట, ఆదివారపుపేట, ఈనెల 1న పడమరవీధి గంగానమ్మ జాతరలు జరిగాయి. చివరగా తంగెళ్లమూడి గంగానమ్మ వారి జాతర ఆదివారం వైభవంగా నిర్వహించారు. నగరంలో సుమారు 100 రోజులకు పైగా ఆయా ప్రాంతాల్లో జాతరలు జరగ్గా తంగెళ్లమూడిలో జాతరతో ఉత్సవాలు ముగియనున్నాయి. గతనెల 11 నుంచి.. తంగెళ్లమూడి ప్రాంతంలోని యాదవ్నగర్లో గత నెల 11న అమ్మవారు పాదం మోపే కార్యక్రమంతో జాతర మొదలైంది. అప్పటి నుంచి ప్రత్యేక పూజ లు, భక్తుల నైవేద్యాల సమర్పణలతో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. జాతర సందర్భంగా అమ్మ వారి మేడల వద్దకు అధిక సంఖ్యలో భక్తులు చేరు కుని నైవేద్యాలు, చీరెలు, సారెలు సమర్పించి మొ క్కులు చెల్లించుకున్నారు. తంగెళ్లమూడి, యాదవనగర్, ఖండ్రికగూడెం, బీడీ కాలనీ, టైటస్ నగర్, పుష్పలీలానగర్, రాణీనగర్, దాదా పలావ్ సెంటర్, ద్వారకానగర్, కుమ్మరిరేవు, తాపీమేసీ్త్ర కాలనీ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చా రు. భక్తులు సమర్పించిన నైవేద్యాలతో భారీ కుంభాలు రాశులుగా ఏర్పడ్డాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో తంగెళ్లమూడి కిటకిటలాడింది. ట్రాఫిక్ గంటల కొద్దీ నిలిచిపోయింది. ప్రధానంగా తంగెళ్లమూడి వంతెన దాటడానికి ప్రజలు ఇబ్బంది పడ్డారు. తంగెళ్లమూడి నుంచి దాదా పలావ్ సెంటర్ వైపు సైతం ట్రాఫిక్ సమస్య తలెత్తింది. పోలీసుల చర్యలతో ట్రాఫిక్ వలయం నుంచి ప్రజలు బయటపడగలిగారు. గంగానమ్మా.. దీవించమ్మా.. తంగెళ్లమూడిలో గంగానమ్మ జాతర ఏలూరులో వరుసగా మూడో ఆదివారం జాతర సందడి పోటెత్తిన భక్తులు -
పనుల్లో జాప్యం.. వైద్య కళాశాలపై నిర్లక్ష్యం
ఏలూరు టౌన్: జిల్లాకే తలమానికంగా ఏలూరులో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటుచేశారు. అప్పట్లో 40 శాతానికి పైగా పనులు పూర్తికాగా.. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్నా పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏలూరు జీజీహెచ్ ప్రాంగణంలో శాశ్వత మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలిస్తే నత్తేనయం అన్నట్టుగా ఉంది. దీంతో పనులు ఎప్పటికి పూర్తవుతాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఈ విద్యా సంవత్సరానికై నా పూర్తిస్థాయిలో మెడికల్ కళాశాల భవనాన్ని అందుబాటులోకి తెస్తారా, పనుల్లో ఆలస్యానికి కారణాలు ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సుమారు రూ.80 కోట్లకు పైగా నిధులతో 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే భవనాన్ని వేగంగా పూర్తి చేయాలనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో.. నాడు.. గత ప్రభుత్వ హయాంలో మెడికల్ కౌన్సిల్ అనుమతులు రావటంతో యుద్ధప్రాతిపదికన ఏ లూరు పాత బస్టాండ్ ప్రాంతంలోని జిల్లా వైద్య ఆ రోగ్య శాఖ ప్రాంగణంలో రూ.60 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో, ల్యాబ్లతో మెడికల్ కాలేజీ భవనాన్ని నిర్మించారు. కేవలం 18 నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో జీ–ప్లస్ 2 భవనాన్ని నిర్మించారు. అత్యాధునిక ల్యాబ్లు, కార్పొరేట్ కళాశాలలకు దీటుగా డిజిటల్ క్లాస్రూమ్స్, లెక్చర్ రూమ్స్, అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ఇలా అన్నీ సమకూర్చారు. 2023 సెప్టెంబర్లో ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు సైతం ప్రారంభించి తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు. 18 నెలలుగా తీవ్ర ఇబ్బందులు నేడు.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 18 నెలల కాలంలో శాశ్వత మెడికల్ కళాశాల భవనాన్ని నిర్మించటంలో జాప్యంతో వైద్య విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2024 జూన్లో అధికారం చేపట్టిన నాటి నుంచి కొన్ని నెలలపాటు నిర్మాణ పనులు నిలిచిపోగా, అనంతరం ప్రభుత్వం పనులు ప్రారంభించింది. అయినా నేటికీ పనుల్లో పెద్దగా పురోగతి కనిపించని పరిస్థితి. ఇప్పటికే వైద్య విద్యార్థులకు తరగతులను షెడ్డుల్లో ఏర్పాటు చేయాల్సిన దుస్థితి. ఇదే తరహాలో పనులు సాగుతూ ఉంటే నాలుగో మెడిసిన్ బ్యాచ్ వస్తే తీవ్ర ఇబ్బందులు తప్పవని పలువురు అంటున్నారు. మెడి ‘కిల్’ బాబు నత్తనడకన ఏలూరు మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు 18 నెలలుగా తీవ్ర జాప్యం ఇబ్బంది పడుతున్న విద్యార్థులు ఈ ఏడాదైనా పూర్తయ్యేనా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో 2023 సెప్టెంబర్లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించారు. ఇప్పటికే మూడో ఏడాది వైద్య విద్యార్థులు మెడిసిన్ చదువుతున్నారు. అధికారులు సరైన రీతిలో తరగతి గదులను ఏర్పాటు చేయలేని దుస్థితి నెలకొంది. ఇప్పటికై నా వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసి అత్యాధునిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. – కె.మధుకుమార్, న్యాయవాది, ఏలూరు ఏలూరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏళ్ల నాటి కల. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో అనుమతులు తెచ్చి, ఏలూరులో ప్రత్యేకంగా భవనాలు నిర్మించి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించారు. చంద్రబాబు ప్రభుత్వ అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా శాశ్వత భవన నిర్మాణాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం వేగంగా పనులు పూర్తిచేసి వైద్య విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. –ప్రత్తిపాటి తంబి, న్యాయవాది, ఏలూరు -
రెవెన్యూ ఉద్యోగులపై పని ఒత్తిడి
భీమవరం : రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని రాష్ట్ర అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ భూప తిరాజు రవీంద్ర రాజు అన్నారు. భీమవరంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ ఏర్పాటుచేశారు. జిల్లా చైర్మన్గా ఎం.సన్యాసిరావు, సెక్రటరీ జనరల్గా జి.పెద్దిరాజు, కన్వీనర్గా ఎం.లక్ష్మీనారాయణ, కో–చైర్మన్గా ఎం.మోషే, ట్రెజరర్గా కె.సుబ్రహ్మణ్యస్వామి, ప్రచార కార్యదర్శిగా పి.సంధ్యారాణి, క్రీడ, సాంస్కృతిక కార్యదర్శిగా కె.ఠాగూర్, ఉప చైర్మన్లుగా ఈ.నాగార్జున, ఎం.నాగరాజు, జి.గోపాలకృష్ణ, బీఎన్వీ రత్నారావు, జి.జక్కయ్య ఎన్నికయ్యారు. -
ప్రసాదాలపై పచ్చ నేతల కన్ను
ద్వారకాతిరుమల: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తరువాత హిందూ ఆలయాలపై రాజకీయ నాయకుల పెత్తనం విపరీతంగా పెరిగిపోయింది. కొందరు చోటా నాయకులు సైతం దేవస్థానం అధికారులపై పెత్తనం చేస్తూ పైరవీలు సాగిస్తున్నారు. తాము చెప్పిన వారికే కాంట్రాక్టులు కట్టబెట్టాలంటూ ఒత్తిళ్లు తెస్తున్నారు. రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాల్లో ఒకటైన చిన్నతిరుపతి (ద్వారకాతిరుమల) శ్రీవారి దేవస్థానంలో ప్రసాదాలు తయారీ టెండర్ విషయంలో అధికారులు ఈ తరహా ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో నేతల ఆదేశాలకు తలొగ్గని అధికారులపై కొందరు వ్యక్తులు ఆదివారం సోషల్ మీడియా వేదికగా అవినీతి ఆరోపణలు పాల్పడటం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. శ్రీవారి దేవస్థానంలో ద్వారకాతిరుమలకు చెందిన రవికృష్ణ మేన్ పవర్ ఏజెన్సీస్ 2024 ఏప్రిల్ 1 నుంచి ప్రసాదాల తయారీ కాంట్రాక్టును నిర్వహిస్తోంది. అప్పటి నుంచి ప్రసాదాల నాణ్యత, రుచిపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో కూడా ప్రసాదాల నాణ్యత, రుచిలో ప్రథమ ర్యాంక్ లభించింది. ఈ ఏజెన్సీస్ కాంట్రాక్ట్ గడువు వచ్చేనెల 31వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలో దేవస్థానం అధికారులు గతనెల 23 నుంచి ప్రారంభించిన కొత్త టెండర్ ప్రక్రియ ఈనెల 5వ తేదీతో ముగిసింది. 6న టెక్నికల్ బిడ్ను ఓపెన్ చేశారు. మా వాళ్లకే టెండర్ ఇవ్వాలంటూ.. విజయవాడకు చెందిన ఎం.విజయచంద్ సప్లయిర్స్, ఎం.రవికుమార్, జీకే మేన్ పవర్, ద్వార కాతిరుమలకు చెందిన రవికృష్ణ మేన్ పవర్ ఏజెన్సీస్ టెండర్లో పాల్గొన్నారు. అయితే ఏమైనా లో టుపాట్లు ఉన్నా తమ వాడికే కాంట్రాక్టును కట్టబెట్టాలంటూ కొందరు పచ్చ నేతలు కొద్దిరోజులుగా అధికారులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్టు సమాచారం. అయితే టెక్నికల్ బిడ్లో సరైన పత్రాలు సమర్పించని వారిని (ఇద్దరు ఏఈఓలు, సూపరింటెండెంట్, జూనియర్ అకౌంట్ అధికారితో కూడిన) కమిటీ తిరస్కరిస్తుందని, తమ చేతిలో ఏమీ ఉండదని అధికారులు చెబుతున్నా ఆ నేతలు వినిపించుకోవడం లేదట. ఆన్లైన్ టెండర్ విషయంలో పొరపాట్లు జరిగితే తమ ఉద్యోగాల మీదకు వస్తుందని, అలాగని అధికార పార్టీ నాయకుల ఆదేశాలు పాటించకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని కొందరు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నడూ లేనివిధంగా.. ఎన్నడూ లేనివిధంగా శ్రీవారి దేవస్థానంపై రాజకీయ క్రీనీడ పడుతోంది. తమ వారికే కాంట్రాక్టులు ఇవ్వాలని కొందరు నాయకులు అధికారులను ఆదేశించే స్థాయికి వచ్చింది. అయితే అలాంటివి ఇక్కడ చెల్లవని పలువురు అధికారులు అంటున్నారు. ని యమ, నిబంధనలకు లోబడే కాంట్రాక్టులను అప్పగిస్తామని చెబుతున్నారు. ఆరోపణల్లో వాస్తవం లేదు రవికృష్ణ మేన్ పవర్ ఏజెన్సీస్ పీఎఫ్, ఈఎస్ఐలు కట్టకుండా అధికారులు బిల్లులు చెల్లించారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని సెక్షన్ సూపరింటెండెంట్ వాసా నగేష్ వివరణ ఇచ్చారు. అన్నీ పరిశీలించిన తరువాతే బిల్లులు చెల్లించామన్నారు. ఆన్లైన్ టెండర్లో అవకతవకలు జరగవని, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రం టెండర్ వేసిన కాంట్రాక్టర్ తప్పనిసరిగా డిపాజిట్ రూ.3 లక్షలు చెల్లించిన ఈఎండీ చలా నా, ఆధార్, పాన్కార్డ్, జీఎస్టీ, ఫర్మ్ రిజిస్ట్రేషన్, మేన్ పవర్ సర్టిఫికెట్లు, ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఈపీఎఫ్, ఈఎస్ఐ సర్టిఫికెట్లు, వాటికి సంబంధించిన తాజా చలానాలు, అ లాగే ఆర్జేసీ, డీసీ కేడర్కు చెందిన ఆల యాల్లో గడచిన రెండేళ్లలో ప్రసాదాలు త యారు చేసిన అనుభవ ధ్రువీకరణ పత్రం, మూడేళ్ల ఇన్కమ్టాక్స్ రిటర్న్స్, తహసీల్దార్ జారీ చేసిన రిలీజియస్ సర్టిఫికెట్, నోటరీ (హిందూ) అఫిడవిట్, సెల్ఫ్ డిక్లరేషన్, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, ఫర్మ్ ఏ సంస్థలోనూ బ్లాక్ లిస్ట్లో లేదని రూ.100ల స్టాంప్ పేపర్పై నో టరైజ్డ్ అఫిడవిట్ను సమర్పించాలి. ఈ పత్రాలన్నీ ఉన్న వారినే కమిటీ ప్రైజ్ బిడ్కు అనుమతించాలి. అక్కడ తక్కువ ధరకు ఎవరు కోట్ చేస్తారో వారికే కాంట్రాక్టును ఇవ్వాలి. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో అధికారులు అన్ని అర్హతలు ఉన్న వ్యక్తికి కాంట్రాక్ట్ అప్పగిస్తారా.. లేక పచ్చ నేతల ఆదేశాలకు తలొగ్గి అనర్హులకు కాంట్రాక్ట్ కట్టబెడతారా.. అన్నది వేచి చూడాల్సి ఉంది. చినవెంకన్న ప్రసాదాల కాంట్రాక్ట్ కోసం యత్నాలు తమ వారికే కట్టబెట్టాలంటూ అధికారులపై ఒత్తిళ్లు నిబంధనలు పాటిస్తామంటున్న అధికారులపై అవినీతి ఆరోపణలు ఆలయాలపై విపరీతంగా పెరిగిన రాజకీయ నాయకుల జోక్యం తలలు పట్టుకుంటున్న దేవస్థానం అధికారులు అధికారులు తమకు సహకరించడం లేదన్న అనుమానంతో కొందరు గుర్తుతెలియని వ్యక్తు లు ఆదివారం సోషల్ మీడియా వేదికగా విష ప్రచారానికి పాల్పడ్డారు. ప్రస్తుత రవికృష్ణ మేన్ పవర్ ఏజెన్సీస్ కాంట్రాక్టర్ వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తి అని, గత 22 నెలలుగా కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐలు చెల్లించడం లేదని, అయినా అధికారులు బిల్లులు చెల్లిస్తున్నారని దేవస్థానం చైర్మన్, ఈఓలకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. అధికారులు కుమ్మకై , బేరం మాట్లాడుకుని మళ్లీ అతడికే టెండర్ను అప్పగించేందుకు ప్రయత్ని స్తున్నారని ఆ మెసేజ్లో ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చారు. -
ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా రెడ్డిదొర
ఏలూరు (ఆర్ఆర్పేట): ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శిగా బీ. రెడ్డి దొర ఎన్నికయ్యారు. ఈ మేరకు విజయవాడలో ఆదివారం జరిగిన ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం వివరాలను ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామారావు ఏలూరులో పత్రికలకు విడుదల చేశారు. ప్రస్తుతం ఏపీటీఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షునిగా పని చేస్తున్న బీ. రెడ్డిదొర రాష్ట్ర కార్యదర్శిగా విజయవాడలో జరిగిన కౌన్సిల్ సమావేశాల సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. ఆయనతో పాటు జిల్లాకు చెందిన సీహెచ్వీ సత్యనారాయణ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారని, అలాగే భాస్కర వర్మ జీఓ కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారని తెలిపారు. రాష్ట్ర కమిటీకి వివిధ పదవులకు ఎన్నికై న ఏపీటీఎఫ్ నాయకులకు జిల్లా సబ్ కమిటీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. -
బలివేలో మహా శివరాత్రి ఉత్సవాలకు శ్రీకారం
బలివే (ముసునూరు): చారిత్రక ప్రసిద్ధ చెందిన బలివేలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఉత్సవాల ప్రత్యేకాధికారి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న ఏర్పాట్లపై అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు. ఆలయ, ఉత్సవ ప్రాంగణాలు, స్నాన ఘట్టాల వద్ద భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులను డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్ అప్రమత్తం చేశారు. తాజాగా ఆలయ ప్రాంగణ ఏర్పాట్లలో భాగంగా ఆదివారం శుభ ఘడియల్లో ఆలయ అర్చకులు తోలేటి అరుణ భాస్కర్, చావలి అమర్ బాబు మంత్రోచ్ఛరణల నడుమ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజాదికాలు నిర్వహించి, పందిరి రాట (గుంజ) వేసి, పందిర్లు, క్యూ లైన్లు ఏర్పాటు పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో పామర్తి సీతారామయ్య, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
సమగ్ర విచారణ జరిపించాలి
పెదవేగి: గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆ త్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని పీడీఎస్యూ నాయకుడు కాకి నాని డిమాండ్ చేశారు. పెదవేగి గురుకుల పాఠశాలకు వెళ్లి తమ బృందం విచారణ చేసినట్టు ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఈపుచర్ల అజిట్ ఆత్మహత్య చేసుకో వడం బాధాకరమని, పూర్తిస్థాయిలో విచారణ జరిపించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో పోలసానిపల్లి, జంగారెడ్డిగూడెంలో ఇద్దరు బాలికలు, పెదవేగిలో బాలుడు ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వ గురుకుల పాఠశాలల నిర్వహణపై తీవ్ర చర్చనీయాంశంగా మారుతుందన్నారు. నగర అధ్యక్షు డు వై.యశ్వంత్ పాల్గొన్నారు. -
బలుసులమ్మ తల్లికి జాతర కళ
తాడేపల్లిగూడెం: కోరిక కోర్కేలు తీర్చే తల్లి.. కల్పవల్లి.. గూడేం పట్టణ ఇలవేల్పు బలుసులమ్మ తల్లికి జాతర కళ వచ్చింది. పుష్కరం తరువాత జాతర నిర్వహిస్తుండడంతో అంగరంగ వైభవంగా అమ్మవారికి జాతర మహోత్సవం జరిపించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 12 నుంచి 27వ తేదీ వరకు జాతర మహోత్సవం నిర్వహించనున్నారు. మార్చి 22న ఆడపడుచులను గౌరవించడం, బంధువులను పిలుచుకొని నైవేద్యాలు పెట్టడం లాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 27న మహాకుంభ నివేదన జరుగనుంది. పుట్టిల్లు పాశం వారి ఇంటి వద్ద నుంచి అత్తిల్లు కర్రి వారి ఇంటికి చేరే ప్రక్రియల మధ్య జాతరకు శ్రీకారం చుడతారు. గరగ ధారులైన గణాచారులు, కణిక దప్పికలు, వీరణాలు, తాసాలు, రామడోలు వాయిద్యాల నడుమ అమ్మవార్ల ప్రతిరూపాలుగా భావించే గణాచారులకు గుగ్గిలపు ధూపాలతో జాతర వేడుక అంబరాన్ని తాకేలా సాగనుంది. శతాబ్ధాలుగా బలుసులమ్మ తల్లి పట్టణంలో శతాబ్ధాల క్రితం వెలిసినట్టు చెబుతారు. మునిసిపల్ కార్యాలయానికి సమీపంలో అనంతమ్మ చెర్వు వద్ద చిన్న గుడిగా ఉన్న ప్రాంతంలో అమ్మవారు కొలువయ్యారు. పట్టణంలో పాతూరుకు చెందిన కర్రి నర్సయ్య జమీందారు సారథ్యంలో ఆలయ నిర్వహణ సాగేదని ప్రతీతి. తర్వాత విశ్వాసం కలిగిన రజక కుటుంబాలు, ఆలయ అభివృద్దికి రావూరి పాండురంగారావు లాంటి దాతల ఆర్ధిక చేయూతతో అమ్మవారి పూజాధికాలు సాగాయి. పట్టణంలో వివాహ వివాహం జరగాలంటే బలుసులమ్మ తల్లికి చలిమారు పోయాలి. చలిమిడి, వడపప్పు ప్రసాదంగా ఇవ్వాలి. పానకం పోయాలి. ఇలా చేస్తే వధూవరులు కాబోయే వారు జీవితాంతం చల్లగా ఉంటారని విశ్వాసం. పాలకుల చొరవతో మరింత శోభ దేవదాయ ధర్మాదాయశాఖా మంత్రిగా పనిచేసిన దివంగత పైడికొండల మాణిక్యాలరావు, మాజీ డిప్యూటీ సీఎం, దేవదాయశాఖా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, 12 ఏళ్ల క్రితం అప్పటి మునిసిపల్ చైర్మన్, ప్రస్తుత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసుల పర్యవేక్షణలో అమ్మవారి ఆలయం దినదిన ప్రవర్థమానం చెందుతుంది. పైడికొండల ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణానికి రూ.కోటి నిధులు, అమ్మవారి కల్యాణ మండపం నిర్మాణానికి అదనంగా నిధులు తీసుకొచ్చారు. ఈ నిధులతో ఆలయ రూపురేఖలు పూర్తిగా మారాయి. భీమవరం మావుళ్లమ్మ దేవతామూర్తికి రూపమిచ్చిన శిల్పి ఆధ్వర్యంలో బలుసులమ్మ రూపం మావుళ్లమ్మ, పెద్దింట్లమ్మ, రూపాలకు ప్రతిరూపం మాదిరిగా బలుసులమ్మ దేవతామూర్తి సాక్షాత్కరించింది. కొట్టు సారథ్యంలో అమ్మవారికి వెండి మకరతోరణం, వెండి ఊయల వంటి ఆభరణాలు అమరాయి. కల్యాణ మండపం పనిని పూర్తి చేశారు. ఆలయ ఆవరణంలో మౌలిక వసతులు కల్పించారు. బొలిశెట్టి చైర్మన్గా ఉన్న సమయంలో తొలిసారి 2014లో జాతరకు శ్రీకారం చుట్టారు. సంయుక్త సహకారంతో అంగరంగ వైభవంగా ఈ జాతర అప్పట్లో జరిగింది. అయోధ్యలో రాముని ప్రతిమను చెక్కిన మైసూర్కు చెందిన అరుణ్యోగిరాజ్ బలుసులమ్మ ఆలయంలో ప్రాణప్రతిష్ట చేసి, యంత్రస్ధాపన చేసిన దేవతామూర్తికి రూపం ఇచ్చారు. ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో.. బలుసులమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్గా శ్రీరంగం అంజి ఆధ్వర్యంలో 2014 జూన్ 18 వ తేదీ నుంచి 24వ తేదీ వరకు తొలి జాతర జరిగింది. ఉత్సవ కమిటీ చైర్మన్గా కొట్టు అంజిబాబు సారథ్యంలో అమ్మవారి ఆలయానికి రజత వైభవం వచ్చింది. వసతులు ఒనగూరాయి. 12 ఏళ్ల తర్వాత యాధృచ్ఛికం కాకపోయినా శ్రీరంగం అంజి ఆధ్వర్యంలో మలి జాతర మార్చి 12 నుంచి జరుగనుంది. ఉగాది నుంచి దసరా, వసంతపంచమికి సామూహిక అక్షరాభ్యాసాలు కార్తీక మాసంలో లక్షదీపార్చాన, శివాభిషేకం, సామూహిక వరలక్ష్మి వ్రతాలు, పదిటన్నుల కూరగాయలతో శాకాంబరి అలంకారాలతో అమ్మవారు బాదంపూడి మల్లికార్జునశర్మ, వెలవలపల్లి ప్రదీప్శర్మ, గోపీశర్మ బ్రహ్మత్వంలో నిత్య పూజలు అందుకుంటున్నారు. ఉత్సవాలకు ఏర్పాట్లు మార్చి నెలలో జరుగనున్న జాతరను భారీగా చేయడానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే పట్టణంలో ఈ శోభ కనిపిస్తోంది. పట్టణంలో ఎస్వీఆర్ సర్కిల్ నుంచి జయలక్ష్మీ థియేటర్ వరకు, పుంతలో ముసలమ్మ ఆలయం దగ్గర నుంచి గమిని ఫంక్షన్ ప్లాజా వరకు విద్యుత్ పందిళ్లను ఏర్పాటుచేస్తున్నారు. లైటింగ్ల అరపలు పెట్టనున్నారు. ఇప్పటికే డివైడర్లకు రంగులు వేస్తున్నారు. తొలి జాతరలో 22వ తేదీనే నైవేద్యాలు జరిగాయి. మార్చి 22న కూడా ఆడపడుచులను గౌరవించడం, బంధువులను పిలుచుకొని నైవేద్యాలు పెట్టడం లాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 27న మహాకుంభ నివేదన జరుగనుంది. పుష్కరం తరువాత అమ్మవారికి జాతర మహోత్సవం మార్చి 12 నుంచి 27 వరకు జాతర ఉత్సవాలు మార్చి 22న ఆడపడుచుల సందడి, నైవేద్యాలు తాడేపల్లిగూడెంలో జాతరకు మొదలైన ఏర్పాట్లు -
వర్జీనియా పంటపై తెగుళ్ల దాడి
● ఉధృతంగా బోడు, సీతాఫలం, మానుమచ్చ తెగుళ్లు ● ఆలస్యంగా వేసిన పంటల్లో అధికంగా తెగుళ్ల ప్రభావం.. దిగుబడిపై రైతుల్లో ఆందోళన బుట్టాయగూడెం: పొగాకు పంటలపై దాడి చేస్తున్న తెగుళ్లను చూసి రైతులు బెంబేలెత్తిపోతున్నారు. బోడు, మానుమచ్చ, సీతాఫలం, ఆకు ముడత వెర్రితలలు వంటి పిచ్చిమెక్కలు ఎక్కువగా ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. తెగుళ్ల నివారణకు ఎన్ని మందులు పిచికారీ చేసినా తగ్గడం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం పలు గ్రామాల్లో ఎదిగి ఆకు రెలుపు దశకు వచ్చాయి. కొన్ని చోట్ల ఆలస్యంగా పొగాకు పంటల్లో ఎక్కువగా బోడు అధికంగా కనిపిస్తూ తోట ఎదుగుదల లేకుండా ఎండిపోయింది. 26,883 హెక్టార్లలో వర్జీనియ పొగాకు సాగు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్న జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాలు, కొయ్యలగూడెం, దేవరపల్లి, గోపాలపురం పొగాకు వేలం కేంద్రాల పరిధిలో సుమారు 11,855 మంది రైతులు 26,883 హెక్టార్లలో ఈ ఏడాది సీజన్లో పొగాకు పంట వేసినట్లు బోర్డు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పొగాకు తోటలు ఎదుగుదల దశలో ఉన్నాయి. అలాగే పలు గ్రామాల్లో క్యూరింగ్ పనులు చేస్తున్నారు. ఈ దశలో పంటలపై తెగుళ్లు దాడి చేయడంతో పలు చోట్ల మొక్కలు ఎదుగుదల లేక దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తున్న బోడు గిరిజన ప్రాంతంలో వేసిన వర్జీనీయా పొగాకు పంటలో ఈ ఏడాది ఎక్కువగా బోడు ఉంది. దీని వల్ల పొగాకు మొక్కలో ఉన్న సారాన్ని బోడి పీల్చేస్తుందని దీని వల్ల మొక్క ఎదుగుదల లేకపోవడం, పంట దిగుబడి బాగా తగ్గిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆకు రంగు మారిపోవడం బుట్టాయగూడెం, కొమ్ముగూడెం, అచ్చియ్యపాలెం, వీరన్నపాలెం, నూతిరామన్నపాలెం, ముప్పినవారిగూడెం తదితర గ్రామాల పరిధిలో వేసిన పొగాకు తోటల్లో ఎక్కువగా బోడు గుర్తించినట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఈ ఏడాది అనుకూలించని వాతావరణం పొగాకు పంటలకు ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా లేదని రైతులు చెబుతున్నారు. మొక్కలు నాటిన రోజు నుంచి తీవ్రమైన చలి, పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో పలు చోట్ల పొగాకు తోటల్లో ఎదుగుదల లేదని రైతులు వాపోతున్నారు. మొక్క సాధరణంగా 22 నుంచి 28 ఆకులు వస్తాయని, వాతావరణం అనుకూలించక పోవడం వల్ల 17 నుంచి 23 ఆకులు వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది పొగాకు పంటల్లో తెగుళ్లు దాడి ఉందని, బుట్టాయగూడెం మండలంలో పొగాకు తోటల్లో ఎక్కువగా బోడు ఉన్నట్లు గుర్తించినట్లు జంగారెడ్డిగూడెం వేలం–1 సూపరిటెండెంట్ బి. శ్రీహరి తెలిపారు. ఈ ఏడాది పొగాకు పంటపై తెగుళ్లు ఎక్కువగా దాడి చేస్తున్నాయి. బోడుతో పాటు మానుకుల్లు, ముజాకో మచ్చ తెగ్లుళ్లు ఇబ్బంది పెడుతున్నాయి. వీటి నివారణకు మందులు కొడుతున్నా తోటల్లో తెగుళ్లు తగ్గడం లేదు. బోడు పంటలను మరింత దెబ్బతీస్తోంది. – సయ్యద్ బాజీ, వర్జీనియా పొగాకు రైతు, అచ్చియ్యపాలెం నేను బుట్టాయగూడెం వీరన్నపాలెం సమీపంలో 5 ఎకరాల్లో పొగాకు పంట వేశాను. ఆ పంటలో బోడు ఎక్కువగా ఉంది. దీని వల్ల ఎకరం పంట దెబ్బతిని పాడైపోయింది. పంట ఎదుగుదల నిలిచి పోయింది. ఆకు రంగు మారిపోయింది. ఈ ఏడాది పొగాకు పంటలో బోడు ఎక్కుగా వచ్చింది. – ఆచంట విష్ణుమూర్తి, పొగాకు రైతు, సూరపవారిగూడెం -
జై వనరూపిణీ.. విజయకారిణి
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అధికంగా తరలివచ్చిన భక్తుల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీవారితోపాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు. కైకలూరు: సమీప జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో కొల్లేటికోట దేవస్థానం ఆదివారం కిటకిటలాడింది. భక్తులు పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మకు పొంగళ్లు, వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ప్రధాన ఉప అర్చకులు పేటేటి పరమేశ్వర శర్మ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లడుతూ ఆదివారం ఒక్క రోజున వివిధ రూపాల్లో అమ్మవారికి రూ.77,091 ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర(తీర్థం) జరుగుతుందన్నారు. ఈ నెల 28న జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గా, గోకర్ణేశ్వరస్వామి కల్యాణం జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. పెదవేగి : ఆగి ఉన్న లారీని మోటారు సైకిల్ ఢీ కొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పెదవేగి ఎస్సై ఎం హరిగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం పోలవరం మండలం గూటాల గ్రామానికి చెందిన నున్న రాంబాబు అతని చిన్న కుమార్తె కుందన శ్రీతో కలిసి ద్విచక్ర వాహనంపై ఏలూరు తంగెళ్ళమూడిలోని సోదరుడి ఇంటి వెళ్తుండగా పెదవేగి మండలం చక్రాయగూడెం గ్రామంలోని పెట్రోల్ బంకు సమీపంలోకి వచ్చేసరికి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో నున్న రాంబాబు (50) అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కుమార్తె కుందనశ్రీకి తీవ్ర గాయాలు కాగా ఆమెను చికిత్స నిమిత్తం ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. రాంబాబు భార్య నున్న లక్ష్మీ అనూష ఫిర్యాదు మేరకు పెదవేగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తణుకు అర్బన్: విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు సూచించారు. తణుకులోని తిరుమల విద్యా సంస్థల ప్రాంగణంలో 5 నుంచి 10వ తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ జేఈఈ పరీక్షల్లో తమ విద్యా సంస్థలో ప్రతి ఐదుగురిలో ఒకరికి సీటు లభిస్తుందని చెప్పారు. మెడికల్లో తమ సంస్థలో ప్రతి ముగ్గురిలో ఒకరికి సీటు వస్తుందని వివరించారు. సంస్థ వైస్ చైర్పర్సన్ రష్మి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు రోల్మోడల్గా ఉండాలని కోరారు. పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు ఎస్.మురళీకృష్ణారెడ్డి, సంతోషి, విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సతీష్బాబు, తణుకు కాలేజ్ ప్రిన్సపాల్ కె.దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. తణుకు అర్బన్: కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటన దువ్వ గ్రామ పరిధిలోని జాతీయరహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వద్దిపర్రుకు చెందిన కుటుంబ సభ్యు లు బొమ్మిడిలో ఫంక్షన్ చూసుకుని కారులో తిరుగు ప్రయాణమయ్యారు. దువ్వ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వెళ్తున్న మరో కారును ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి కారు పిల్లకాలువలోకి జారిపోయింది. కారులో జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ విప్పర్తి అశోక్కుమార్తో పాటు కుటుంబసభ్యులు వీరవల్లి సురేంద్ర, నరేంద్ర, పల్లెకొండ ప్రవీణ్, వీరవల్లి చంద్రమౌళి, 8 సంవత్సరాల బాలిక విప్పర్తి అస్మిత ఉన్నారు. పిల్ల కాలువ , నీరు తక్కువగా ఉండడంతో వీరంతా స్వల్పగాయాలతో బయటపడ్డారు. వీరిని 108 వాహనంలో తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా వైద్యసేవలు పొందుతున్నారు. ఈ ఘటనపై ఏ ఫిర్యాదు రాలేదని రూరల్ పోలీసులు తెలిపారు. -
ముగిసిన నాటకోత్సవాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): స్థానిక వైఎంహెచ్ఏ హాలులో జరుగుతున్న గరికపాటి కళాపరిషత్ నాటకోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. రెండు ప్రదర్శనలు సందేశాత్మకంగా ఉన్నాయి. కళాహారతి తిరుమాలి సంస్థ (కాకినాడ) కళాకారులు ప్రియమైన శత్రువు నాటిక ప్రదర్శించా రు. తల్లిదండ్రుల ప్రేమానురాగాలను యువత ఎలా నిర్లక్ష్యం చేస్తుందో చక్కగా ప్రదర్శించారు. గ్రామీణ నాటక సమాఖ్య (పిఠాపురం) వారి సహృదయ ఆర్ట్స్ (పి.రాయవరం) కళాకారులు పున్నామ నరకం నాటికను ప్రదర్శించారు. సీనియర్ రంగస్థల నటుడు కేపీ రాజు, సీనియర్ రంగస్థల నటి యు.విజయలక్ష్మిలను అక్కినేని స్మారక రంగస్థల పురస్కారాలతో సత్కరించారు. సినీ నటుడు సుబ్బరాయ శర్మ, రచయిత గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, ఎస్ బీఐ రీజనల్ మేనేజర్ పి.కాళిదాసు, కళారత్న ఎస్వీ రామారావు, డాక్యుమెంటరీ నిర్మాత జమలాపురం రాధాకృష్ణ, రచయిత పి.రాజేంద్రకుమార్ తదిరులు హాజరుకాగా గరికపాటి ఆర్ట్స్ థియేటర్ డైరెక్టర్ గరికపాటి కాళిదాసు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని 40 కేంద్రా ల్లో ఆదివారం ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలకు 3,454 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉ దయం 1,960 మందికి 1,841 మంది, మ ధ్యాహ్నం 1,656 మందికి 1,613 మంది హా జరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగా యని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాను ఓ ప్రకటనలో తెలిపారు. ఏలూరు (టూటౌన్): రాష్ట్ర ప్రభుత్వం కోకో ధరల నిర్ణయ కమిటీ నియమించి సోమవారం సమావేశం నిర్వహించనుందని అయితే కమిటీలో కోకో రైతుల సంఘ ప్రతినిధులను కా కుండా ఆయిల్పామ్, కోకో ప్రాసెసింగ్ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించనుండటం అ భ్యంతరకరమని ఏపీ కోకో రైతుల సంఘం రా ష్ట్ర కమిటీ ప్రకటించింది. రాష్ట్ర అధ్యక్షుడు బొ ల్లు రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఆయిల్పామ్, కోకో ప్రాసెసింగ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి కోకో గింజల ధరలు నిర్ణయిస్తారా అని ప్రశ్నించారు. పోరాటాల ఫలితంగానే కోకో గింజల ధర పాలసీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీ నియమించిందని పేర్కొన్నారు. అన్ని జిల్లాల కోకో రైతుల సంఘ ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీఈపీడీసీఎల్ ఏ లూరు సర్కిల్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి 23 వరకు స్మార్ట్ మీటర్ల పఖ్వాడా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ఎస్ఈ పి.సాల్మన్ రాజు ప్రకటనలో తెలిపారు. ఆధునిక సాంకేతి క సేవలు అందించడం, విద్యుత్ వినియోగంపై అవగాహన పెంచడం, ప్రీపెయిడ్ స్మార్ట్ మీ టర్ల వినియోగాన్ని ప్రోత్సహించడం పఖ్వాడా ఉద్దేశమన్నారు. జిల్లాలో వినియోగదారులు స్మార్ట్మీటర్ల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని, స్మార్ట్ మీటర్ అమరిక సమయంలో ఈపీడీసీఎల్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. తాడేపల్లిగూడెం రూరల్: పెదతాడేపల్లి వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం పీజీ కోర్సుల్లో ప్రవేశానికి గేట్ పరీక్షలు నిర్వహించారు. ఉదయం 150 మందికి 131 మంది, సాయంత్రం 150 మందికి 124 మంది హాజరైనట్టు కేంద్రం ప్రిసైడింగ్ అధికారి రాంబాబు తెలిపారు. తుది పరీక్షలు ఈనెల 15, 16వ తేదీల్లో జరుగనున్నాయన్నారు. కో–ఆర్డినేటర్ నటరాజ్, సిస్టమ్స్ అడ్మిన్ కొల్లా సురేష్, టీసీఎస్ ప్రతినిధులు పర్యవేక్షించారు. తణుకు అర్బన్: మహాశివరాత్రి పర్యదినం సందర్భంగా తణుకు డిపో నుంచి శ్రీశైలంకు ఈనెల 12, 13, 14 తేదీల్లో సూపర్లగ్జరీ, పుష్బ్యాక్ 2 ప్లస్ 2 ఆడియో వీడియో కోచ్ బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ డిపో మేనేజర్ సుధారాణి తెలిపారు. టికెట్ ధర పెద్దలకు రూ.820, పిల్లలకు రూ.450 అని, శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ, చినకాకాని, మంగళగిరి క్షేత్రాలు దర్శించేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీ రూపొందించామన్నారు. ఈనెల 14న సాయంత్రం 7 గంటలకు బస్సు బయలుదేరి 16న తణుకు చేరుతుందన్నారు. పుష్బ్యాక్ బస్సు టికెట్ ధర రూ.2,200గా నిర్దేశించామని తెలిపారు. -
తాడువాయిలో 15 నుంచి శివరాత్రి తిరునాళ్ల
జంగారెడ్డిగూడెం: జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న, దక్షిణ కాశీగా పేరుగాంచిన జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 15 నుంచి 19 వరకు శివరాత్రి తిరునాళ్ల ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. నిత్యపూజలతోపాటు ఆధ్యాత్మిక, సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాలు ఇలా... ● 15వ తేదీన ప్రాతఃకాలం నుంచే రుద్రాభిషేకాలు, విశేష పూజలు, స్వామివారి దివ్య మంగళ దర్శనం, ఉదయం 10 గంటల నుంచి విఘ్నేశ్వరుని పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అంకురార్పణ, ధ్వజారోహణ తదితర పూజలు నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు స్వామి వారికి, అమ్మవార్లకు ధూప సేవ, దీపాలంకరణ, నీరాజనం తదితర పూజలు నిర్వహిస్తారు. రాత్రి 11గంటలకు లింగోద్భవ దర్శన పూజలు జరుగుతాయి. ● 16వ తేదీన శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి వారి గ్రామోత్సవం, స్వామి వారికి, అమ్మవారికి అభిషేకాలు, నిత్య పూజలు నిర్వహిస్తారు. ● 17వ తేదీన నిత్య పూజలతోపాటు ఉదయం 10 గంటలకు భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి వారి కళ్యాణ మహోత్సవం, అనంతరం భారీ అన్నసమారాధన నిర్వహిస్తారు. ● 18వ తేదీ ఆలయ సమీపంలో ఉన్న శ్రీ అప్పన్న సమేత అనంతేశ్వరస్వామి వారి ఆలయంలో స్వామి వారికి దివ్య కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ● 19వ తేదీన నిత్యపూజలతోపాటు రాత్రి 8 గంటలకు స్వామి వారికి, అమ్మవారికి శ్రీ పుష్పయాగం (పవళింపు సేవ) జరుగుతుంది. ఏర్పాట్లు పరిశీలించిన ఏఎస్పీ తాడువాయిలో 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఏర్పాట్లను జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు, భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఎర్రకాలువ జలాశయానికి భక్తులు లోతైన ప్రాంతాలకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గజ ఈతగాళ్ళను కూడా ఏర్పాటు చేయాలన్నారు. సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై ఎన్వీ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఉత్సవ కమిటీ ఛైర్మన్ ఉప్పునూతల పుల్లారావు, పాపోలు వెంకట శ్రీనివాస్, రూప సత్యసాయి సుధాకర్, కొడవటి సత్తిరాజు, కాసారపు వెంకటరమణ, పొన్నగంటి మహి, కాసారపు నారాయణ, భక్తుల అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసు అధికారులకు వివరించారు. -
ఆటపాకలో పర్యాటకుల సందడి
కై కలూరు: పక్షి ప్రేమికుల స్వర్గథామంగా పేరుగడించిన ఆటపాక పక్షుల కేంద్రంలో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. సమీప జిల్లాల నుంచి వచ్చిన యాత్రికులతో కేంద్రం కళకళలాడింది. బోటు షికారులో పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ పక్షుల కేరింతలను దగ్గర నుంచి ఆశ్వాదించారు. కేంద్రంలో పక్షి నమూనా మ్యూజియంను ఎక్కువమంది తిలకించారు. చిల్డ్రన్స్ పార్కులో చిన్నారులు, పెద్దలు ఆటలాడుకున్నారు. ఫారెస్టు బీట్ ఆఫీసర్ రాజేష్, సిబ్బంది కొల్లేరు భౌగోళిక పరిస్థితులు, విదేశీ, స్వదేశీ పక్షుల విశేషాలను వివరించారు. పక్షుల వీక్షణకు అనువైన శీతాకాలం కావడంతో పక్షి ప్రేమికులు సందర్శించాలని కోరారు. -
కొల్లేరులో... పక్షుల కనువిందు
కైకలూరు : కొల్లేరు అభయారణ్యంలో ఏషియన్ బర్డ్ సెన్సస్ 2025–2026 ఫిబ్రవరి 4తో ముగిసింది. రాజమండ్రి సర్కిల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు(పీసీసీఎప్) బీఎన్ఎన్ మూర్తి, జిల్లా ఫారెస్టు డీఎఫ్వో బి.విజయ ఆధ్వర్యంలో 5 జట్లుగా పక్షుల గణన చేశారు. పీసీసీఎఫ్ మూర్తి అంచనా ప్రకారం ఈ ఏడాది కొల్లేరు అభయారణ్యంలో 40 లక్షల నుంచి 50 లక్షల పక్షులు శీతాకాలంలో సంచరించినట్లు సమాచారం. దాదాపు 30,000 కిలోమీటర్ల నుంచి విదేశాల నుంచి పక్షుaలు వస్తాయి. ఈ ఏడాది 200 జాతుల పక్షులు కొల్లేరులో ఉన్నట్లు భావిస్తున్నారు. సెన్సస్ బృందాల సమాచారం మేరకు నార్తర్న్న్ పిన్టైల్ పక్షులను ఎక్కువగా గుర్తించారు. ప్లేమింగోస్, కామన్టీల్, గార్కానీ, గాడ్వీట్, శాండ్ పైపర్స్, జకానా, ఫిన్ టైల్, రఫ్ వంటి పక్షులను గమనించారు. మరి కొద్ది రోజుల్లో తుది పక్షుల గణన నివేదిక వెలువడనుంది. గణన జరిగిన ప్రాంతాలు ఇవే.. కొల్లేరు అభయారణ్య పరిధిలో మాదాపురం, మొండికోడు, గుడివాకలంక, ప్రత్తికోళ్ళలంక, కొక్కిరాల లంక, బొమ్మిలి లంక, ఆగడాల లంక, చెట్నెంపాడు, మల్లవరం, దోసపాడు, క్రొవ్వలి, కేదవరం, పోతులూరు, కొల్లేటికోట, పైడిచింతపాడు, గోకర్ణ పురం, గుమ్మళ్లపాడు, ఆలపాడు, పల్లెవాడ, అడవి కొలను, పెదనిండ్రకొలను, డీ.గోపవరం, సిద్ధాపురం, పల్లెవాడ, ఆటపాక, పెదఎడ్లగాడి, శ్రీపర్రులో కొల్లేరు పక్షుల సర్వే జరిగింది. -
ఎస్పీ రావు సేవలు చిరస్మరణీయం
దెందులూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను పుణికి పుచ్చుకున్న మహోన్నత వ్యక్తి దివంగత ఇన్కం ట్యాక్స్ కమిషనర్ ఎస్పీ రావు అని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు అన్నారు. శనివారం కొవ్వలి అంబేడ్కర్ పార్కులో ఎస్పీ రావు 25 వర్ధంతి సభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మోషేన్రాజు, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు హాజరై ఎస్పీ రావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోషేన్రాజు మాట్లాడుతూ ఎస్పీ రావు వంటి వ్యక్తులు అరుదుగా ఉంటారన్నారు. అందరూ చదవాలి.. అందరూ ఎదగాలి.. అందరూ అభివృద్ధి చెందాలనే ఆయన ఆశయం మహోన్నతం అన్నారు. కొవ్వలి గ్రామ దళితుల జీవనోపాధిగా ఉన్న 150 ఎకరాల సమస్య పరిష్కారానికి సమష్టిగా కృషి చేద్దామని అన్నారు. ఎమ్మెల్సీ రవీంద్రబాబు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి, దళితుల జీవనోపాధికి ఎస్పీ రావు సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. దశాబ్దాల కిందట కొవ్వలి గ్రామ దళితుల జీవనోపాధి కోసం 150 ఎకరాల భూమిని కల్పించిన వ్యక్తి ఆయన అని కొనియాడారు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు తనయుడు సాయి కార్తిక్ మాట్లాడుతూ ఎంపీ ల్యాడ్స్ రూ.25 లక్షలతో నిర్మించనున్న అంబేడ్కర్ మల్టీపర్పస్ హాల్కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. కొవ్వలి అభివృద్ధికి తమ కుటుంబం కట్టుబడి ఉందన్నారు. ఎస్పీ రావు జీవిత చరిత్రపై రాసిన పుస్తకం, క్యాలెండర్ను మోషేన్రాజు ఆవిష్కరించారు. వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఊదరగొండ చంద్రమౌళి, వైద్యశాఖ అడిషనల్ డైరెక్టర్ ఎంఆర్ ప్రభాకర్, జార్ఖండ్ మాజీ చీఫ్ సెక్రటరీ కె.విద్యాసాగర్, వైజాగ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ కాటి నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ గొల్ల నాగరాజు, వెఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి గొల్ల కిరణ్, సర్పంచ్లు ఇంటేటి మధులత, మొండెం సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మండలి చైర్మన్ మోషేన్రాజు -
అక్రమాలకు అండగా.. అవినీతి మెండుగా..!
కొయ్యలగూడెం: ‘కంచే చేను మేసిన’ చందంగా ఉంది కన్నాపురం అటవీ శాఖ కార్యాలయంలో అధికారుల తీరు. రేంజ్ పరిధిలో అటవీ ప్రాంతాన్ని సంరక్షించాల్సిన అధికారులు అక్రమార్కులతో కలిసి కలప అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొండ, కోనల్లోని చెట్లను యథేచ్ఛగా నరికి కలపను తరలిస్తున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. వర్జీనియా పొగాకు బ్యారన్ క్యూరింగ్ పనులు ప్రారంభం కానుండటంతో కలప అక్రమ రవాణా ఊపందుకుంది. నిత్యం రేంజ్ పరిధిలో 40 ట్రక్కులకు పై గా కలపను అక్రమార్కులు పోలవరం, చింతలపూ డి, గోపాలపురం నియోజకవర్గాల్లోని గ్రామాలకు తరలిస్తున్నారు. టన్ను కలపను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు విక్రయిస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా, అక్రమార్కులను పట్టుకు న్నా కేసులు నమోదు చేయకుండానే అధికారులు ముగించేస్తున్నారు. ఇందుకు పలు సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కార్యాలయంలోనే రాజీ : గతేడాది నవంబర్ 16న నాలుగు బైక్లతో కొందరు కలపను తరలిస్తుండగా అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఒక వ్యక్తి బైక్ను మాత్రమే స్వాధీనం చేసుకుని కార్యాలయానికి తరలించి మిగిలిన మూడు వాహనాలను వదిలేసినట్టు సమాచారం. ఈ విషయం ఉన్నతాధికారులకు ఆధారాలతో సహా తెలిసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో పట్టుబడిన వ్యక్తి మరికొందరితో కలిసి వెళ్లి రేంజ్ కార్యాలయంలో వాగ్వాదానికి కూడా దిగాడు. అధికారులు మిగిలిన వాహనాలపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పారే తప్ప అ మలు కాలేదు. పట్టుబడిన వ్యక్తి గొడవకు దిగడంతో అధికారులే రాజీ కుదిర్చారు. పట్టుబడిన మో టార్ సైకిల్కు బదులు పనిచేయని మరో బైక్ను సీజ్ చేసి అసలు వాహనాన్ని అక్రమార్కుడికి తిరిగి ఇచ్చేశారు. అలాగే గతేడాది సెప్టెంబర్ 20న మో టార్ బైక్లపై తరలిస్తున్న కలపను డీఆర్వో ప ట్టుకుని సెల్ఫీ కూడా తీశారు. అయితే దీనికి సంబంధించి కేసు కూడా నమోదు కాలేదు. పెద్ద ఎత్తున తరలింపు అక్రమార్కులు సిండికేట్గా వ్యవహరిస్తూ పలు బీట్లలో చెట్టను నరికి కలప తరలించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. అతి విలువైన వృక్షజాతికి చెందిన దుంగలను రవాణా చేసి రూ.20 లక్షలకు పైగా దండుకున్నారు. సమాచారం అందుతున్న సమయాల్లో స్క్వాడ్ సిబ్బందికి దొరుకుతున్న అక్రమ కలప, వాహనాలు.. రేంజ్ కార్యాలయ అధికారులు, సిబ్బందికి దొరక్కపోవడం గమనార్హం. నెల రోజుల వ్యవధిలో పదికి పైగా కలప తరలిస్తున్న ఫోర్ వీలర్స్ వాహనాలను స్క్వాడ్ బృందం పట్టుకోవడం మినహా కార్యాలయ అధికారులు, సిబ్బంది ఎలాంటి వాహనాలను పట్టుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అడవికి అన్యాయం కన్నాపురం అటవీ శాఖ కార్యాలయంలో అవినీతి జాఢ్యం అటవీ కలపను యథేచ్ఛగా తరలిస్తున్న అక్రమార్కులు అక్రమ రవాణాకు అధికారుల సహకారంపై ఆరోపణలు రూ.3 లక్షలకు పైనే నెలవారీ మామూళ్లు ఉన్నతాధికారుల వద్ద ఉన్న పలుకుబడితో కార్యాలయంలోని ఓ అధికారి మొత్తం కలప అక్రమ రవాణా కు ప్రధాన కేంద్రంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కార్యాలయానికి సంబంధించి ఉన్నతాధికారిని నియమించాల్సి ఉన్నా దానిని నిలుపుదల చేయిస్తూ అన్నీ తానై వ్యవహరిస్తున్నారని, కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని సైతం తన గుప్పిట్లో పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే ఇద్దరు రేంజ్ అధికారులు కన్నాపురం కార్యాలయానికి బదిలీపై రావాల్సి ఉన్నా సదరు అధికారి ఆ ప్రక్రియను ఆపడానికి వెనకాడలేదని తెలిసింది. కలప అక్రమ రవాణాకు సంబంధించి మీడియాలో వార్తలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు వెనుకటి తేదీలతో కేసులు నమోదు చేసినట్టు రికార్డులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దళారులను కూడా వీరే ఎంపిక చేసుకుని వారి ద్వారా 50 కిలోమీటర్లలోపు కలప అక్రమ రవాణా అయ్యేలా చూస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి కలప అక్రమ రవాణాను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
విత్తనాల కల్తీని సహించం
మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు(మెట్రో): జిల్లాలో నాణ్యత లేని, కల్తీ విత్తనాలు సరఫరా చేసే వారిపై క్రిమినల్ కేసులు న మోదు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కలెక్టరేట్లో శనివారం మంత్రి మనోహర్ అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్తీ విత్తనాలు సరఫరా చేసే వారిపై క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు. అలాగే ఎరువుల సరఫరా సమస్యలు లేకుండా చూడాలన్నారు. 22ఏ కేసుల పరిష్కారం, ఆయిల్పామ్, కోకో, కొబ్బరి పంటల సాగు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పేదల గృహ నిర్మాణాలు, పాపికొండల వద్ద పర్యాటక అభివృద్ధి, రోడ్ల మరమ్మతులు, మట్టి అక్రమ రవాణా తదితర అంశాలపై మాట్లాడారు. మంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్సీలు వంకా రవీంద్రనాథ్, జయమంగళ వెంకటరమణ, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు మాట్లాడారు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ, డీఎఫ్ఓ సందీప్రెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్, రమణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి మనోహర్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. -
బాలుడి మృతిపై సమగ్ర విచారణ చేయిస్తా..
కలెక్టర్ వెట్రిసెల్వి హామీ పెదవేగి: పెదవేగిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న అజిత్ మరణంపై విచారణ చేసి తమకు న్యాయం చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు కలెక్టర్ కె.వెట్రిసెల్విని కోరారు. ఏలూరు కలెక్టరేట్లో శనివారం వారు కలెక్టర్ను కలిసి తమ కుమారుడిది ఆత్మహత్య కాదని, తమ కుమారుడి మృతిపై సమగ్ర విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. అజిత్ మృతి ఘటనపై సమగ్ర విచారణ చేయించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. ఏలూరు (ఆర్ఆర్పేట): మార్చి 16 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుందని డీఈఓ ఎం. వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 20న నిర్వహించాల్సిన ఇంగ్లిష్ పరీక్షను మార్చి 21కు మార్చినట్టు పేర్కొన్నారు. 20న ఈద్ ఉల్ ఫితర్ పండుగ ఉన్నందున ఈ మార్పు చేసినట్టు స్పష్టం చేశారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం శనివారం పరీక్షలు నిర్వహించినట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. 9వ తరగతి ప్రవేశ పరీక్షకు 639 మందికి 233 మంది, 11వ తరగతిలో ప్రవేశాలకు 677 మందికి 151 మంది హాజరయ్యారన్నారు. ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ నాలుగు కేంద్రాలను సందర్శించారని తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రభుత్వం ఏపీ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్–2026 అమలుచేయాలనే ఉద్దేశంతో రూపొందించిన ముసాయిదా నిబంధనలు ఉద్యోగులు, ఉపాధ్యాయుల భద్రతకు ముప్పుగా పరిణమించనున్నాయని ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ గుగులోతు కృష్ణ, జిల్లా అధ్యక్షుడు ఈ. రామ్మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.మోహన్ ప్రకటనలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలపై అభిప్రాయాలు, సూచనలు, సలహాలు పంపాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను ప్రభుత్వం కోరిందని, ఈ నిబంధనలు తీవ్రనష్టం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఎక్స్ట్రార్డినరీ లీవ్, 33 ఏళ్ల సేవ పూర్తయితే బలవంతపు రిటైర్మెంట్ వంటి పలు నిబంధనలు ప్రమాదకంగా ఉన్నాయని తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని 49 కేంద్రాల్లో శనివారం ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలకు 4,363 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 2,514 మందికి 2,391 మంది, మధ్యాహ్నం 2,018 మందికి 1,972 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాను ఓ ప్రకటనలో తెలిపారు. భీమవరం: ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ అయిన సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కా ర్యదర్శులు యాళ్ల మోహనరావు, గుమ్మల్ల జకరయ్య కోరారు. శనివారం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, ఎమ్మెల్సీ గోపిమూర్తిని కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 14 నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాలు అందజేశామన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయి లు, ఆర్థిక ప్రయోజనాలు, వేతన సవరణ క మిషన్ ఏర్పాటు, మధ్యంతర భృతి తదితర అంశాలపై రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు చేయాలని కోరారు. కూటమి పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో హామీ మేరకు సీపీఎస్/జీపీఎస్ విధానాలపై పునః సమీక్ష చేయాలన్నారు. ఉద్యోగుల స మస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని, సభలో ప్రస్తావిస్తామని మోషేన్రాజు, గోపి మూర్తి హామీ ఇచ్చారని నేతలు తెలిపారు. -
కొల్లేరులో కనువిందు
కొల్లేరు అభయారణ్యంలో పక్షుల గణన పూర్తయ్యింది. శీతాకాలంలో సుమారు 40 వేల నుంచి 50 వేల పక్షులు సంచరించినట్టు సమాచారం. 8లో uగ్రామసభ తీర్మానం లేకుండా, ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవ హరిస్తోంది. దీనికి కూటమి ప్ర భుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. రూ.వేల కోట్ల కాంట్రాక్టు పనుల కోసమే ఆయుధ డిపో ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతులు అంటున్నారు. రైతు ఉద్యమంలో దళారులు తయారయ్యారు. వారిని నమ్మి ఎవరూ మోసపోవద్దు. – కె.శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మా అత్తవారిచ్చిన మూడెకరాల భూమి పోలవరం ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో పోయింది. పరిహారం డబ్బులు ఖర్చయిపోయాయి. తాజాగా బోడిగూడెంలో తాతల కాలం నాటి నుంచి ఉన్న ఐదెకరాల భూమిని నేవీ ఆయుధ డిపోకు ఇమ్మంటున్నారు. ఇదీ ఇచ్చేస్తే మా కుటుంబం ఎలా బతకాలి. మా భూములన్నీ భూసేకరణలోనే లాగేసుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గం. – యాగంటి కృష్ణ, బోడిగూడెం, కొయ్యలగూడెం మండలం నాకు రెండెకరాల పొలం ఉంది. డిపోను పెడితే మా భవిష్యత్ ఏంటో అర్థం కావడం లేదు. పచ్చని పొలాల్లో పంటలు పండించుకుని జీవిస్తుంటే ఇప్పుడు ఆయుధ డిపో పెడతాం.. భూములను నష్టపరిహారం అందిస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం మాకొద్దు. ఎవరికీ భూమిలిస్తామని మేం చెప్పలేదు. ఎంపీ పుట్టా చెప్పినట్లు రైతులు భూములిస్తారనడం అన్యాయం. – నీలపాల తాతారావు, అచ్యుతాపురం, కొయ్యలగూడెం మండలం -
అదే పోరుబాట
నమో వేంకటేశా.. నమో వేంకటేశా.. అంటూ వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ద్వారకాతిరుమల క్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. 8లో uఏజెన్సీలో ఆయుధ డిపో ఏర్పాటుపై తారాస్థాయిలో నిరసనలు వ్యక్తమౌతున్నాయి. గిరిజనుల అభీష్టం, గ్రామసభల తీర్మానానికి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం వేస్తున్న అడుగులను పోరుబాటతో గిరిజనులు అడ్డుకుంటున్నారు. ఇప్పటికే జీలుగుమిల్లిలో ఆయుధ డిపోకు వ్యతిరేకంగా తారాస్థాయిలో ఉద్యమాలు నిర్వహించడంతో ప్రతిపాదనను జీలుగుమిల్లి నుంచి కొయ్యలగూడేనికి మార్చారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్యాదవ్ ఆదేశాలతో అధికారులు హడావుడిగా సర్వేలు నిర్వహిస్తుండటంతో కొయ్యలగూడెంలోనూ పోరుబాట ఉధృతమైంది. ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026రైతుల భారీ ప్రదర్శన (ఫైల్) సాక్షిప్రతినిధి, ఏలూరు: నేవీ ఆయుధ డిపో నిర్మాణ ప్రతిపాదనకు సంబంధించి భూసేకరణ తీవ్ర వివాదస్పదంగా మారింది. దాదాపు రెండేళ్ల నుంచి ఏజెన్సీలో గిరిజనులు, గిరిజనేతరులు వ్యతిరేకంగా పో రాడుతున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రతిపాదన వచ్చినా రైతులు సుముఖంగా లేకపోవడంతో అప్పటి కలెక్టర్ ప్రతిపాదనను తిరస్కరించి కేంద్రానికి పంపారు. అయితే కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక ఏలూరు ఎంపీ పుట్టా ప్రాజెక్టును సీరియస్గా తీసుకుని హడావుడి చేశారు. తొలుత జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెం పంచాయతీ పరిధిలో 1,016 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించారు. కలెక్టర్ అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించి భూసేకరణకు ఆదేశాలు ఇచ్చారు. జీలుగుమిల్లి మండలంలో గ్రామసభలు నిర్వహించి ప్రతిపాదనలను తిప్పికొట్టడానికి రైతులు, గ్రామస్తులు ప్రయత్నించినా సర్కారు మాత్రం వెనక్కి తగ్గకుండా బలంగా ఒత్తిడి తెచ్చింది. పలు రకాలుగా రైతులను దారికి తెచ్చి భూసేకరణకు ప్రయత్నించినా అక్కడ పోరుబాట తారాస్థాయికి చేరడంతో ప్రతిపాదనలు విరమించుకున్నారు. ఇంతటితో ఆగకుండా కొయ్యలగూడెం మండలానికి ప్రాజెక్టును షిఫ్ట్ చేశారు. కొయ్యలగూడెంలో ఆగ్రహ జ్వాలలు కొయ్యలగూడెం, గోపాలపురం మండలాల సరిహద్దు గ్రామాల్లో భూసేకరణ చేసి ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో మళ్లీ వివాదం రేగింది. స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను సైతం పరిగణనలోనికి తీసుకోకుండా ఎంపీ ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నారనే ఆరోపణలున్నా యి. ఈ పరిణామాల క్రమంలో జీలుగుమిల్లిలో భూసేకరణ నిలిపివేసి కొయ్యలగూడెం, గోపాలపురం మండలాల్లోని బోడిగూడెం, మంగపతిదేవిపేట, బర్కెట్నగర్, రేగులగుంట, ఊట్లగూడెం, త్రినాథపురంలో 1,200 ఎకరాల భూమిని ప్రాజెక్టు కోసం సేకరించాలని నిర్ణయించి హడావుడిగా సర్వే చేపట్టి నివేదికలు సిద్ధం చేశారు. ఆయా గ్రామాల్లో గ్రామసభలు, ముందస్తు సమాచారం లేకుండా రెండు పంటలు పండే భూములను ఎలా ఇస్తామంటూ రైతులు తిరగబడుతున్నారు. గత వారం వందలాది మందితో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బోడిగూడెం నుంచి కొయ్యలగూడెం వరకు పార్టీలకు అతీతంగా రైతులు ఆరు కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి తక్షణమే ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే అన్ని గ్రామాల్లో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గ్రామసభల ద్వారా తీర్మానం చేసి తిప్పికొట్టాలని నిర్ణయించారు. వర్జీనియా పొ గాకు, ఆయిల్పామ్, మొక్కజొన్న, అరటి, కోకో, కొబ్బరి, ఇతర ఉద్యాన పంటలు పండే సారావంతమైన భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వ బోమని రైతులు అంటున్నారు. ఆయుధ డిపో మాకొద్దు జీలుగుమిల్లి నుంచి కొయ్యలగూడేనికి ఆయుధ డిపో షిఫ్ట్ హడావుడిగా కొయ్యలగూడెంలో సర్వే 6 గ్రామాల్లో 1,200 ఎకరాల సేకరణకు ప్రయత్నాలు రైతులు వ్యతిరేకిస్తున్నా మొండిగా ముందుకెళ్తున్న సర్కారు ఆయుధ డిపోపై ఎంపీ పుట్టా పట్టు గ్రామసభల్లో వ్యతిరేక తీర్మానాలకు పంచాయతీలు సిద్ధం -
కోకో ధర తగ్గింపు అన్యాయం
పెదవేగి: కొనుగోలు కంపెనీలు కోకో గింజల ధర లు తగ్గించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధరల పాలసీ ప్రకటించాలని, కంపెనీల మోసాలు అరికట్టాలని ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం డిమాండ్ చేసింది. శనివారం విజయరాయిలోని గాంధీనగర్ సీతారామ కల్యాణ మండలపంలో రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ధర నిర్ణయంపై ఈనెల 9న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమావేశంలో తీసుకోవాల్సిన చర్య లు గురించి చర్చించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం కోకో రైతులతో సమావేశం నిర్వహిస్తున్న తరుణంలో కంపెనీలు ధరలు ఎలా తగ్గిస్తాయని ప్రశ్నించారు. కిలో గింజలకు ధరను రూ.400 నుంచి రూ.380కు తగ్గించారని, దీనిపై ప్రశ్నిస్తే అంతర్జాతీయ మార్కెట్ ధర తగ్గిందని చెప్పడం అన్యాయమన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో జనవరిలో రూ.550 ధర ఉంటే రూ.350లకే కొనుగోలు చేశారన్నారు. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా రైతులకు ధరలు చెల్లించడం లేదన్నారు. ధరలు తగ్గించడం సరికాదని దీనిపై ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు భ విష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు పర్వతనేని సుబ్రహ్మణ్యేశ్వరరావు, పానుగంటి అచ్యుతరామయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి గుదిబండి వీరారెడ్డి, కోనేరు సతీష్బాబు, పాలడుగుల నరసింహారావు, నాయకులు బొప్పన పూర్ణచంద్రరావు, కూరపాటి ధర్మారావు, బొప్పన శివరాం పాల్గొన్నారు. -
ఆంధ్ర బౌలింగ్ కోచ్గా నాగవర్మ
ఏలూరు రూరల్ : ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అండర్–14 జట్టు బౌలింగ్ కోచ్గా పెదవేగి మండలం భోగాపురం గ్రామానికి చెందిన మట్టా నాగవర్మ నియమితులయ్యారు. త్వరలో తమిళనాడులో జరగబోయే అంతర రాష్ట్ర అండర్–14 బాలుర క్రికెట్ పోటీల్లో నాగవర్మ పాల్గొంటారు. నాగవర్మ వద్ద శిక్షణ పొందిన పలువురు క్రికెటర్లు సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ, విజయ్హజారే ట్రోఫీల్లో ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. భీమడోలు : భీమడోలు ఈతకోటవారి వీధిలో శనివారం పట్టపగలే చోరీ జరిగింది. పొల్నాటి శ్రీనివాస్ ఇంట్లోని ఆరు కాసుల బంగారు అభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. గ్రామానికి చెందిన తాపీమేస్త్రి పొల్నాటి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు మేనల్లుడి ఇంట్లో నిశ్చితార్ధానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి నల్లపూసల తాడు, బంగారు చైన్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మదీనా బాషా తెలిపారు. -
వక్ఫ్ భూముల ఆక్రమణకు యత్నం
నూజివీడు: వందలాది ఎకరాల వక్ఫ్భూములను కబళించేందుకు ప్రభుత్వ పెద్దలు పావులు కదపడం దారుణమని వైఎస్సార్సీపీ ముస్లీం మైనారిటీ విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షులు షేక్ యూనస్పాషా(గబ్బర్) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నియోజకవర్గ కార్యాలయంలో ముస్లీం మైనారిటీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ జిలానీ, నాయకులు షేక్ మస్తాన్వలీ, జలాల్ఖాన్, షేక్ మస్తాన్, మహ్మద్ ఖదీర్, అలీ బాషాలు శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు ముస్లింలకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా తుంగలో తొక్కారన్నారు. ఇప్పుడు మంగళగిరి ప్రాంతంలోని 71.57 ఎకరాలను, మల్లాయపాలెం ప్రాంతంలోని 232 ఎకరాల వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ రెండు చోట్ల ఉన్న వక్ఫ్ భూములు అత్యంత విలువైనవని, వాటిని సరిగా వినియోగిస్తే ముస్లిం సమాజానికి భారీ ఆదాయ వనరులుగా మారతాయన్నారు. వక్ఫ్భూములను టీడీపీ అనుకూల వర్గాలకు కేటాయిచేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముస్లింలు భావిస్తున్నారన్నారు. వక్ఫ్ భూములను తీసుకోవడాన్ని నిరసిస్తూ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన నాయకులు ఈ నెల 9న కలెక్టర్కు వినతిపత్రం అందిస్తారన్నారు. -
నమో వేంకటేశా..
ద్వారకాతిరుమల: నమో వేంకటేశా.. అంటూ వేలాది మంది భక్తులు శనివారం శ్రీవారిని దర్శించారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు సందడిగా మారాయి. గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. దర్శనం క్యూలైన్లు, ఉచిత ప్రసాద వితరణ క్యూలైన్లు, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, కల్యాణకట్ట, నిత్యాన్నదాన భవనం తదితర విభాగాలు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. ఆకివీడు నుంచి భద్రాచలానికి పాదయాత్రగా వెళ్తున్న రామ భక్తులు మద్యలో శ్రీవారి క్షేత్రాన్ని సందర్శించారు. దాంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. వారంతా కాషాయ జెండాలను పట్టుకుని ఆలయంలోకి వెళ్లి స్వామి, అమ్మవార్లను దర్శించారు. -
కొల్లేరులో పక్షుల కనువిందు
● పూర్తయిన లెక్కింపు.. తుది జాబితా తయారు ● సుమారు 50 లక్షల పక్షులు ఉన్నట్లు ప్రాథమిక అంచనా కై కలూరు : కొల్లేరు అభయారణ్యంలో ఏషియన్ బర్డ్ సెన్సస్ 2025–2026 ఫిబ్రవరి 4తో ముగిసింది. రాజమండ్రి సర్కిల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు(పీసీసీఎప్) బీఎన్ఎన్ మూర్తి, జిల్లా ఫారెస్టు డీఎఫ్వో బి.విజయ ఆధ్వర్యంలో 5 జట్లుగా పక్షుల గణన చేశారు. పీసీసీఎఫ్ మూర్తి అంచనా ప్రకారం ఈ ఏడాది కొల్లేరు అభయారణ్యంలో 40 లక్షల నుంచి 50 లక్షల పక్షులు శీతాకాలంలో సంచరించినట్లు సమాచారం. దాదాపు 30,000 కిలోమీటర్ల నుంచి విదేశాల నుంచి పక్షులు వస్తాయి. ఈ ఏడాది 200 జాతుల పక్షులు కొల్లేరులో ఉన్నట్లు భావిస్తున్నారు. సెన్సస్ బృందాల సమాచారం మేరకు నార్తర్న్న్ పిన్టైల్ పక్షులను ఎక్కువగా గుర్తించారు. ప్లేమింగోస్, కామన్టీల్, గార్కానీ, గాడ్వీట్, శాండ్ పైపర్స్, జకానా, ఫిన్ టైల్, రఫ్ వంటి పక్షులను గమనించారు. మరి కొద్ది రోజుల్లో తుది పక్షుల గణన నివేదిక వెలువడనుంది. గణన జరిగిన ప్రాంతాలు ఇవే.. కొల్లేరు అభయారణ్య పరిధిలో మాదాపురం, మొండికోడు, గుడివాకలంక, ప్రత్తికోళ్ళలంక, కొక్కిరాల లంక, బొమ్మిలి లంక, ఆగడాల లంక, చెట్నెంపాడు, మల్లవరం, దోసపాడు, క్రొవ్వలి, కేదవరం, పోతులూరు, కొల్లేటికోట, పైడిచింతపాడు, గోకర్ణపురం, గుమ్మళ్లపాడు, ఆలపాడు, పల్లెవాడ, అడవికొలను, పెదనిండ్రకొలను, డీ.గోపవరం, సిద్ధాపురం, పల్లెవాడ, ఆటపాక, పెదఎడ్లగాడి, శ్రీపర్రులో కొల్లేరు పక్షుల సర్వే జరిగింది. -
గేటు పడితే ట్రాఫిక్ కష్టాలు
భీమడోలు: జాతీయ రహదారి, రాష్ట్రీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న భీమడోలు రైల్వే గేటు మీదుగా వాహనాల రాకపోకలు వాహనదారులకు చుక్కలు చూపుతోంది. రైల్వే గేటును ఒక్కసారి మూస్తే భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో ఈ గేటు మీదుగా రాకపోకలు సాగించాలంటే భయపడుతున్నారు. ఏలూరు నుంచి భీమడోలు వచ్చే వారు, తాడేపల్లిగూడెం నుంచి భీమడోలు వైపుగా వచ్చే వాహనాలు అడ్డుగా రావడం సమస్యగా మారింది. భీమడోలు నుంచి జాతీయ రహదారికి వచ్చే వాహనాలతో గేటు వద్ద రద్దీగా మారుతుంది. ఇష్టానుసారంగా రాకపోకలు సాగిస్తుండడంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గేటు తెరిస్తే వాహనాలు వేగంగా దూసుకెళ్తుండడంతో ట్రాఫిక్ నిలిచిపోతుంది. ఫ్లైఓవర్తో ట్రాఫిక్కు చెక్ భీమడోలు రైల్వే గేట్లో రోజుకు పదుల సంఖ్యలో గేటు వేస్తున్నారు. ఈ గేటు మీదుగానే ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తాయి. మెట్ట ప్రాంతాలకు, రాష్ట్రీయ రహదారి వైపు వెళ్లాలన్నా ప్రధాన మార్గం ఇదే. ఒక్కసారి వేసిన గేటు 2 నుంచి 3 రైళ్లు వెళ్లే వరకూ తీసే పరిస్థితి లేదు. దీంతో భారీ వాహనాలు, ద్విచక్రవాహనాలతో రద్దీ ఏర్పడుతుంది. గేటు వద్ద ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్ వంతెన వేసి గేటు మూసి వేయాలని నిర్ణయించారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్డి నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. -
మద్దిలో అభిషేక సేవ
జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం స్వామి వారికి అభిషేక సేవ నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో స్వామి ఉత్సవ విగ్రహానికి అర్చకులు, వేద పండితులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆలయానికి వివిధ సేవల రూపేణా రూ.1,28,350 ఆదాయం సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో 1450 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఈవో తెలిపారు. ఏలూరు టౌన్: ఏలూరు పాతబస్టాండ్ పరిసర ప్రాంతాల్లో శక్తి టీమ్ పెట్రోలింగ్ విధుల్లో ఉండగా... ఒక స్కూటీపై వెళుతున్న ఇద్దరు యువకులు పోలీసులను గమనించి భయంతో పారిపోయేందుకు ప్రయత్నింగా శక్తి టీం వారిని అదుపులోకి తీసుకుని తనికీ చేసింది. గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు యువకులతో పాటు మరో మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి గంజాయి, రూ.2.02 లక్షల రెండు స్కూటీలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళా స్టేషన్ డీఎస్పీ యూ.రవిచంద్ర పర్యవేక్షణలో సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో శక్తి టీమ్ సభ్యులు అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచారు. శనివారం శక్తి టీం సభ్యులు పాతబస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 300 గ్రాముల గంజాయి, రెండు స్కూటీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై టూటౌన్ స్టేషన్లో కేసు నమోదు చేశామని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. కుక్కునూరు: ఏపీ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మండలంలోని దాచారం ఇసుక రీచ్ నుంచి శుక్రవారం రాత్రి రెండు టిప్పర్ లారీలలో ఇసుకను తరలిస్తుండగా అశ్వారావుపేట వద్ద తెలంగాణ పోలీసులు ఆపి తనిఖీ చేయగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో లారీలను స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఆగిరిపల్లి: ఆగిరిపల్లికి చెందిన బెజవాడ రామారావు (65) ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందాడు. ఎస్సై శుభ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం ఆగిరిపల్లికి చెందిన రామారావు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. శనివారం సాయంత్రం మల్లిబోయినపల్లి వద్ద పొలంలో ఉన్న గేదెల కోసం ఆగిరిపల్లి నుంచి ట్రాక్టర్ ఎక్కగా బస్టాండ్ వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. కింద పడిపోయిన రామారావుకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రామారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని బొలెరో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని హోటల్ ఎన్లో శ్రీ కృష్ణ సుజుకి షోరూం తరఫున కొత్త సుజుకి ఈ–యాక్సెస్ ఈవీ స్కూటర్ను మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం మార్కెట్లోకి విడుదల చేశారు. షోరూం యజమాని, శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ నారా శేషు, ఎమ్మెల్యేలు పత్సమట్ల ధర్మరాజు, బడేటి రాధాకృష్ణయ్య, జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కె.గోవిందరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక టెక్నాలజీతో పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా రూపొందించిన ఈ వాహనాలు కస్టమర్ల ఆదరణ పొందాలని ముఖ్య అతిథులు ఆకాంక్షించారు. శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ నారా నరసింహమూర్తి, డైరెక్టర్లు ఎన్వీ హనుమకుమార్, సీహెచ్ సూరిబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
ఏలూరు (టూటౌన్): మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నగరంలో శనివారం సాయంత్రం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యాలయం వద్ద ప్రారంభమై కొత్త బస్టాండ్, ఫైర్ స్టేషన్ సెంటర్, విజయ విహార్ సెంటర్, రమా మహల్ సెంటర్, రైల్వే స్టేషన్ పాత బస్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎంఎస్ఆర్యు రాష్ట్ర ఉప ప్రధానకార్యదర్శి వీవీఎన్ ప్రసాద్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు అమలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం దుర్మార్గమన్నారు. లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలను కార్పొరేట్లకు కారుచౌకగా మోడీ ప్రభుత్వం అప్పగిస్తుందని వారు తెలిపారు. అందులో భాగంగానే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎం.ఇస్సాక్, వైఎస్ కనకారావు, జె.గోపి, పి.రవికుమార్, ఎస్కె.షమీమా, జాన్ బాబు, కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీ
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రెడ్బుక్ని విడిచి ప్రైవేట్ విద్యాసంస్థల వైపు చూడాలని, ఫీజుల దందాను అరికట్టాలని ఎస్ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మోహన్బాబు విద్యాసంస్థల్లో జరుగుతున్న దోపిడీని ప్రశ్ని స్తే కిడ్నాప్ చేయటం, చిత్రహింసలు పెట్టడం సరికాదన్నారు. మోహన్బాబు, ఆయన తనయుడు విష్ణు విద్యావ్యవస్థలో రాక్షస పాలన నడుస్తోందన్నారు. ఏఐఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి.శివ మాట్లాడుతూ మోహన్బాబు యూనివర్సిటీలో బౌన్సర్లు ఎందుకున్నారని, యూజీసీ విచారణకు వెళ్లినప్పుడు ఏం చేసిందంటూ ప్రశ్నించారు. పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు సీహెచ్ శివాజీ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్, బీకేఎంయూ జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సీపీఎం నగర కార్యదర్శి పి.రవికుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
భూసేకరణ భయం
శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026మార్కెట్లో ఎకరా రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు ధర ఉంది. రైతులు నష్టపోకుండా పరిహారం అందించాలి. గతంలో ఒక్కోచోట ఒక్కో ధర చెల్లించారు. ఇది భూసేకరణ చట్టానికి విరుద్ధం. మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం ఇప్పించాలి. బొగ్గు విషయంలో కూడా రైతులను, ప్రజలను చైతన్య పరిచి ఒప్పించాలి. – పి.సోమశేఖరాచార్యులు, రైతు, యర్రగుంటపల్లి, చింతలపూడి మండలం రైతులను ఒప్పించి భూసేకరణ జరపకుండా బొగ్గు గనులకు టెండర్లు ఎలా పిలుస్తారు. గతంలో గ్రీన్ఫీల్డ్ హైవే విషయంలో కూడా రైతులతో సంతకాలు తీసుకుని అవార్డు పాస్ చేశారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. బొగ్గు తవ్వకాల కోసం భూసేకరణ చేపడితే రైతులు తొందరపడి సంతకాలు పెట్టవద్దు. – గిరి భోగారావు, మాజీ సొసైటీ చైర్మన్, రాఘవాపురం సాక్షి ప్రతినిధి, ఏలూరు: మెట్ట ప్రాంత రైతులకు భూసేకరణ భయం పట్టుకుంది. కేంద్ర ప్రాజెక్టులు, రాష్ట్ర ప్రాజెక్టులంటూ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియలు నిర్వహిస్తోంది. చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదలు తాజాగా రేచర్ల బొగ్గు బ్లాక్ వరకూ అన్నింటికీ భూసేకరణే కీలకం. ఇక తాజాగా రేచర్లలో బొగ్గు బ్లాక్ టెండర్లు ఖరారైనట్టు పల్లెల్లో విస్తృత ప్రచారం మొదలుకావడంతో రైతుల్లో భూసేకరణ భయం తారాస్థాయికి చేరింది. బ్లాక్లుగా విభజించి.. ఖమ్మం, ఏలూరు జిల్లా సరిహద్దుల్లో భారీ బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు 12 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఖమ్మం, కృష్ణా, ఏలూరు జిల్లా మెట్ట ప్రాంతాల్లో భారీగా బొగ్గు నిల్వలు ఉన్నట్లు నిర్ధారించి 1964 నుంచి 2016 వరకు నాలుగు విడతలుగా సర్వేలు నిర్వహించి 2016లో ఖరారు చేశారు. ఈ దశ దాటుకుని 2017 నుంచి చింతలపూడి కేంద్రంగా బొగ్గు నిల్వలను ఎంత లోతులో ఉన్నాయనే దానిపై అధ్యయనం చేసి బ్లాక్లుగా విభజించారు. 2023లో ఖరారు : చింతలపూడి మండలంలోని రేచర్ల బొగ్గు బ్లాక్లు 2023లో ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ పరిధిలో 22.24 చదరపు కిలోమీటర్ల పరిధిలో రేచర్ల బొగ్గు బ్లాక్ను ఖరారు చేశారు. దీని పరిధిలో జీ–13 గ్రేడ్కు సంబంధించిన నాణ్యమైన బొగ్గు దాదాపుగా 2,225.63 మిలియన్ టన్నులు ఉన్నట్టు అంచనా వేసి ఆ మొత్తానికి టెండర్ ప్రక్రియ గతేడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభించింది. అక్టోబర్ 27 వరకు టెండర్ దాఖలు తుది గడువు, 28న టెక్నికల్ గ్రిడ్ల పరిశీలన, ఖరారు, నవంబర్ 24 నుంచి 28 వరకు ఈ–వేలం ద్వారా కేటాయించేలా టెండర్ షెడ్యూల్ ప్రకటించారు. వాస్తవానికి అంతకు ముందు రెండుసార్లు ఏర్పాటు చేసినా టెండర్ దశలో నిలిచిపోయింది. మూడో సారి మాత్రం టెండర్లలో రిలయన్స్, యాక్సిస్ ఎనర్జీ సంస్థ సంయుక్తంగా బిడ్లు దాఖలు చేశాయి. కొద్దినెలల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యాక బొగ్గు నిల్వల తవ్వకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రేచర్ల బ్లాక్లో గ్రేడ్–1 బొగ్గు ద్వారా ఏటా 8 వేల మెగా వాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. చింతలపూడిలోని రేచర్ల, శెట్టివారిగూడెం, వెంకటాపురం, యర్రగుంటపల్లి, అల్లిపల్లి, ఊటసముద్రం, సీతానగరం, చింతంపల్లి, నామవరం, వెంకట్రాదిగూడెం, కాంతంపాలెం, చింతలపూడి రూరల్ మండలంలో కొంత భాగం బొగ్గు తవ్వకాలు కోసం భూసేకరణ జరిగే అవకాశం ఉంది. గతంలో సింగరేణి ప్రాజెక్టు సమయంలో భూసేకరణ ప్రక్రియ జరిగినప్పుడు భూములు కోల్పోయిన వారికి భూసేకరణ చట్టం ప్రకారం పరిహారంతో పాటు ఇంటికొక ఉద్యోగం, అలాగే సంస్థ లాభాల్లోంచి కొంత రాయల్టీగా ఇచ్చి భూసేకరణ ప్రక్రియ నిర్వహించారు. రైతుల్లో గుబులు రేచర్ల బొగ్గు బ్లాక్ టెండర్ ప్రక్రియ పూర్తి పరిహారాలు, భూసేకరణపై స్పష్టత కరువు టెండర్లు ఖరారైనట్టు విస్తృత ప్రచారం చింతలపూడి మండలంలో 22.24 చ.కి. పరిధిలో నిల్వలు ఇప్పటికే వరుస భూసేకరణలతో రైతులు విలవిల గ్రామసభలు, డీపీఆర్లు లేకుండా టెండర్లు ఏంటంటూ మండిపాటు వాస్తవానికి ప్రాజెక్టు ఖరారయ్యాక రెవెన్యూ యంత్రాంగం భూసేకరణ కోసం ప్రత్యేక సర్వే నిర్వహించాలి. ఎంత భూమి అవసరమవుతుంది, ఎన్ని గ్రామాల్లో భూమి సేకరించాల్సి ఉంటుందనే నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక పంపాలి. ప్రభుత్వ ఆమోదంతో భూసేకరణ చట్టం ప్రకారం భూమి విలువకు మూడు రెట్లు పరిహారం ప్రకటించాలి. అనంతరం ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి గ్రామ తీర్మానాల ద్వారా సేకరణ ప్రక్రియ నిర్వహించి భూములను సదరు సంస్థకు అప్పగించి వారి నుంచి పరిహారం రైతులకు అందేలా చూడాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ ఏదీ లేకుండానే బొగ్గు బ్లాక్లను ఖరారు చేయడం, టెండర్లు తుది దశకు తీసుకురావడంతో తర్వాత ఏం జరుగుతుందనే దానిపై పల్లెల్లో భయం మొదలైంది. ఇప్పటికే చింతలపూడి ఎత్తిపోతల పథకం, గ్రీన్ఫీల్డ్ హైవే కింద భూములను తీసుకుని మార్కెట్ విలువల్లో 40 శాతం కూడా పరిహారం ఇవ్వకపోవడంపై అన్నదాతల్లో ఆగ్రహం ఉంది. ఈ క్రమంలో తాజా భూసేకరణ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. -
ఫైరింగ్లో నైపుణ్యం సాధించాలి
కామవరపుకోట: పోలీస్ సిబ్బంది ఫైరింగ్లో మరింత నైపుణ్యాన్ని సాధించాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్, జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ సూచించారు. వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ వార్షిక నేర సమీక్ష సమావేశాన్ని పురస్కరించుకుని తడికలపూడిలో గురువారం ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ అశోక్కుమార్ మాట్లాడుతూ ఫైరింగ్ ప్రాక్టీస్ వల్ల పోలీసు సిబ్బందిలో ఆత్మ విశ్వాసం, నైపుణ్యం, అప్రమత్తత పెరుగుతాయని, అత్యవసర పరిస్థితుల్లో ఆయుధాల వినియోగంపై పూర్తి అవగాహన కలుగుతుందని అన్నారు. ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది శారీరకంగా, మానసికంగా ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని, దీని కోసం ఫైరింగ్ ప్రాక్టీస్ను వినియోగించుకుని వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయన్నారు. జిల్లాలో అన్ని సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు శిక్షణకు హాజరయ్యారు. ఏఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు, ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత, ఏఆర్ అదనపు ఎస్పీ జి.మునిరాజా పాల్గొన్నారు. నేర సమీక్షా సమావేశం ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా వార్షిక నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్, కలెక్టర్ వెట్రిసెల్వి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏలూరులో జాతరకు లక్షలాది మంది వచ్చినా ఎటువంటి చిన్న సంఘటనలు జరగకుండా, ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేసిన పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ పోలీస్ శాఖకు కలెక్టర్ అందిస్తున్న సహకారం స్ఫూర్తిదాయకమన్నారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్.సుస్మిత, ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, ఏబీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ హబీబ్ బాష, డీఎస్పీలు డి.శ్రావణ్కుమార్, ఎం.వెంకటేశ్వరరావు, కేవీవీఎన్వీ ప్రసాద్, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఏపీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. -
కై కలూరు సర్పంచ్ను కొనసాగించాలంటూ తీర్పు
కై కలూరు: నిధుల దుర్వినియోగం అంశంపై వైఎస్సార్సీపీ పాలనలో ఎన్నిౖకైన కైకలూరు సర్పంచ్ దానం మేరీ నవరత్నకుమారిని గతేడాది జూన్ 19న కలెక్టర్ కె.వెట్రిసెల్వి సస్పెండ్ చేశారు. అంతకు ముందు 2025 జనవరి 18న సర్పంచ్ చెక్ పవర్ను కూడా రద్దు చేశారు. దీనిపై సర్పంచ్ న్యాయపోరాటం చేశారు. న్యాయవాది జడ శ్రావణ్కుమార్ పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ను విధు ల్లో కొనసాగించాలంటూ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్, ఏలూరు కలెక్టర్కు హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. కేవలం రాజకీయ కారణాలతోనే సర్పంచ్ పదవి నుంచి పిటిషనర్ను తొలగించారని, ఎలాంటి ప్రామాణికమైన విచారణ పాటించలేదని న్యాయవాది వాదించారు. దీంతో ఏకీభవించిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా సర్పంచ్ మేరీ నవరత్నకుమారి మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాలతో సర్పంచులు, జెడ్పీటీసీలను వేధిస్తున్న నాయకులకు ఈ తీర్పు గుణపాఠం కావాలన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని 52 కేంద్రాల్లో శుక్రవారం జరిగిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 3,924 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 2,242 మందికి 2,124 మంది, మధ్యాహ్నం 1,842 మందికి 1,800 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాను ప్రకటనలో తెలిపారు. ఏలూరు(మెట్రో): ప్రభుత్వ కార్యాలయాల్లోని రికార్డులన్నింటినీ డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో పొందుపరచాలని జేసీ ఎంజే అభిషేక్ గౌడ ఆదేశించారు. శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ నుంచి రికార్డుల డిజిటలైజేషన్పై అధికారుల తో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. చింతలపూడి: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కాపు సామాజికవర్గంపై సాగిస్తున్న వివక్షాపూరిత చర్యలను వైఎస్సార్సీపీ జిల్లా మున్సిపల్ విభా గం అధ్యక్షుడు, కాపు నేత బొడ్డు వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. కాపు నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయించడం, భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ప్రకటనలో తెలిపారు. రాజకీయంగా ఎదుర్కోలేక, నేతల కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం అత్యంత హేయమన్నారు. టీడీపీ, జనసేనలో ఉన్న కాపు నేతలు కేవలం ఆయా పార్టీలకు ‘కాపలా’ కాయడానికే పరిమితమా? అని ఆయన ప్రశ్నించారు. కాపు నేతలపై అరాచకాలను సహించబోమని, ప్రభుత్వం వైఖరి మార్చుకోకుంటే ఐక్యంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ ఎల్లవేళలా కాపులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఏలూరు(మెట్రో): పట్టాదార్ పాస్ పుస్తకాల ఈకేవైసీ, పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటానని కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, ఈకేవైసీపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించాఆరు. ఈకేవైసీని త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. వెనుకబడి ఉన్న టి.నరసాపురం, ఆగిరిపల్లి, జీలుగుమిల్లి, ముసునూరు తదితర మండలాల తహసీల్దార్లు ప్రగతి చూపాలని, లేకుంటే చర్యలు తప్పవని అన్నారు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్, రమణ, తహసీల్దార్లు పాల్గొన్నారు. పెదవేగి: విజయరాయి గాంధీనగర్లోని సీతారామ కల్యాణ మండపం వద్ద శనివారం కోకో రైతుల సమావేశం నిర్వహిస్తున్నట్టు ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొల్లు రామకృష్ణ, కె.శ్రీనివాస్ శుక్రవా రం ప్రకటనలో తెలిపారు. కోకో గింజల ధర తగ్గింపుపై ఈ సమావేశంలో చర్చిస్తారని, ప్రభుత్వం ఇంతవరకూ ధరల పాలసీ ప్రకటించలేదని, ధర నిర్ణయం కాకపోవడంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, ఫలితంగా రైతులు నష్టపోతున్నారని ఆందోళన చేశారు. సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు. -
గురువులపై ఆటోమేషన్ కత్తి
ఏలూరు (ఆర్ఆర్పేట): చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులను ముప్పుతిప్పలు పెడుతోంది. తాజాగా పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఇన్విజిలేషన్ బాధ్యతలకు సంబంధించి కొత్తగా ఆటోమేషన్ విధానాన్ని తీసుకువచ్చింది. దీంతో ఇన్విజిలేషన్ విధులు భారం కానున్నాయని ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఈ విధానం వల్ల పరీక్షల నిర్వహణే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల ప్రమేయం లేకుండా ఆటోమేషన్ ద్వారా ఇన్విజిలేషన్ విధులు కేటాయించడం అనే ప్రక్రియ పూర్తిగా అసంబద్ధమని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వెసులుబాటు సాధారణంగా జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులు టెన్త్ పరీక్షలకు సంబంధించి ఇన్విజిలేషన్ విధులకు అర్హులైన ఉపాధ్యా యులను ఎంపిక చేసి కేటాయిస్తారు. ఇందులో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, గర్భిణులు, బాలింతలు, దివ్యాంగ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చేవారు. అలాగే పిల్లల పరీక్షల నిమిత్తం లేదా తల్లిదండ్రులను ఆస్పత్రులకు తీసుకువెళ్లాల్సి వచ్చే వారికి కూడా అభ్యర్థన మేరకు వెసులుబాటు ఉండేది. అలాగే ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్న వారికి కూడా మినహాయింపు లభించేది. అయితే ఆటోమేషన్ ప్రక్రియ ద్వారా ఆయా వర్గాలకు మినహాయింపు లభించే పరిస్థితి లేదు. సాఫ్ట్వేర్ పరిధిలోకి.. ఆటోమేషన్ ప్రక్రియ వల్ల ఇన్విజిలేషన్ విధులన్నీ సాఫ్ట్వేర్ పరిధిలోకి వెళతాయని ఉపాధ్యాయులు అంటున్నారు. టీచర్ల జాబితా సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేస్తే సబ్జెక్టు, కేంద్రాలను బట్టి ఉపాధ్యాయులకు ఇన్విజిలేషన్ విధులను కేటాయిస్తుంది. దీని వల్ల ఉపాధ్యాయులు దూరంగా ఉన్న కేంద్రానికి వెళ్లి విధులు నిర్వహించాల్సి ఉంటుందని, ప్రత్యేక మినహాయింపులు, వెసులుబాటులు ఉండవని టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ఇది ప్రభుత్వ కక్ష సాధింపు అని ఉపాధ్యాయ సంఘాలు గళమెత్తుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలతో ఏమాత్రం చర్చించకుండా కూటమి ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని అంటున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయన్నారు. గతంలో బలవంతపు శిక్షణల పేరుతో కొందరు ఉపాధ్యాయులను బలి తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు సాఫ్ట్వేర్ నిర్దేశిత ఇన్విజిలేషన్ విధుల రూపంలో మరికొందరిని బలి కోరుకుంటుందా అని ప్రశ్నిస్తున్నారు. టెన్త్ పరీక్షలకు ఆటోమేషన్లో ఇన్విజిలేషన్ బాధ్యతలు ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులకు అతీతంగా విధులు దూర ప్రాంతాలను కేటాయించే అవకాశం ఉపాధ్యాయుల్లో ఆగ్రహ జ్వాలలు విధులను బహిష్కరించే ఆలోచన -
తెలంగాణలో మొదలై.. ‘తూర్పు’లో ముగిసి..
● ముగిసిన పెద్దపులి ప్రయాణం ● 17 రోజులపాటు పంజా విసిరిన వైనం ● పట్టిసీమ మీదుగా గోదావరి దాటి.. ● కూర్మాపురంలో బంధించిన అధికారులు బుట్టాయగూడెం: తెలంగాణలోని కావిడిగుండ్లలో మొదలైన పెద్దపులి ప్రయాణం తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురంలో ముగిసింది. దాదాపు 17 రోజులపాటు ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల ప్రజలను హడలెత్తించిన పులిని ఎట్టకేలకు రెస్క్యూ టీమ్ సురక్షితంగా బంధించింది. గతనెల 21న తెలంగాణలోని అశ్వారావుపేట మండలం కావిడిగుండ్లలో రెండు ఆవులపై దాడి చేసి చంపిన పులి 22న ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. బుట్టాయగూడెం మండలం పందిరిమామిడిగూడెం, గుబ్బల మంగమ్మ గుడి మార్గం వైపు తిరుగుతూ హడలెత్తించింది. అదేరోజు అంతర్వేదిగూడెం సమీపంలో ఆవు, లేగ దూడలపై పంజా విసిరి హతమార్చింది. 23న నాగులగూడెం సమీపంలో మూడు ఆవులపై దాడి చేసి చంపేసింది. అటవీ అధికారులు ఏర్పాటుచేసిన ట్రాప్ కెమెరాల్లో చిక్కిన పెద్దపులిని చూసి అందరూ వణికిపోయారు. సుమారు 4 అడుగుల ఎత్తు, మీటన్నర పొడవు ఉండటంతో బెంబేలెత్తారు. అదే రోజు మధ్యాహ్నం అంతర్వేదిగూడెం సమీపంలో, రాత్రి కొండ ప్రాంతంలోని గాడిదబోరు సమీపంలో సంచరించింది. 24న బుట్టాయగూడెం మండలం గుర్రప్పగూడెంలో గేదైపె, కోట నాగవరంలో లేగ దూడలపై దాడి చేసింది. అక్కడి నుంచి కంసాలికుంట, అల్లికాల్వ మీదగా రాయిగూడెం వెళ్లి అక్కడ మరో గేదె దూడను హతమార్చింది. 13 పశువులను హతమార్చి.. రాయిగూడెం నుంచి కొయ్యలగూడెం మండలం బిల్లుమిల్లి చేరుకుని ఆవులను హతమార్చింది. రెండు రోజులపాటు అక్కడే మకాం వేసిన పెద్దపులి 26న మళ్లీ రావిగూడెం చేరుకుని గేదె దూడను చంపింది. అక్కడి నుంచి కండ్రికగూడెం, అమ్మపాలెం వెళ్లి రెండు గేదెలను చంపి తినేసింది. 27న బుట్టాయగూడెం మండలం లంకపల్లి రామ నర్సాపురం మీదుగా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే 30న అటవీ ప్రాంతంలో మాటేసిన పెద్దపులి అక్కడికి వచ్చిన ఆవుపై దాడి చేసి చంపేసింది. 31న పోలవరం మండలం ఇటుకులకోటలో లేగ దూడలను హతమార్చి పట్టిసీమ ఎత్తిపోతల పథకం పరిసర ప్రాంతాల నుంచి గోదావరి ఈదుకుంటూ అటుగా వెళ్లింది. మొత్తంగా ఏలూరు జిల్లాలో 13 పశువులను పులి హతమార్చింది. పోలవరం జిల్లా చిన్నకొండేపూడి, పెద్ద కొండేపూడి పంట పొలాల్లో పెద్దపులి పాదముద్రలను అక్కడి అధికారులు గు ర్తించారు. అక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించిన పెద్దపులి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఫారెస్ట్ అధికారులు, పూనే నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్ రాయవరం మండలం కూర్మాపురంలో గన్ ద్వారా మత్తు ఇంజక్షన్లు ఇచ్చి శుక్రవారం సాయంత్రం పెద్దపులిని బంధించారు. అక్కడి నుంచి పులిని రాజమండ్రి తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
కేంద్రీకరణతో సమస్యలు
ఆటోమేషన్ విధానంతో పరిపాలన పూర్తిగా కేంద్రీకరణకు దారి తీస్తుంది. సాధారణంగా వికేంద్రీకరణ మార్గంలో పాలన సాగిస్తుంటారు. ఆటోమేషన్ ద్వారా పాలన కేంద్రీకరించబడితే ఎటువంటి సమస్య వచ్చినా పై స్థాయిలోనే పరిష్కరించుకోవాలి. అదే జరిగితే సమస్య పరిష్కారానికి ఎక్కువ సమయం పట్టి అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉంది. – గుగులోతు కృష్ణ, ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ విధానపరమైన సంస్కరణలు తీసుకువచ్చేటప్పుడు ఉద్యోగులకు ఆమోదయోగ్యమా, ఆచరణాత్మకమా అని ఆలోచించాలి. ఆటోమేషన్ వంటి సంస్కరణలు అమలు చేసే ముందు ఉపాధ్యాయ సంఘాలతో చర్చిస్తే లోటుపాట్లు తెలుస్తాయి. ఇప్పటికై నా ప్రభుత్వం ఆటోమేషన్పై పునః సమీక్షించి, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. – వి.రామ్మోహనరావు, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆరోపణ
జంగారెడ్డిగూడెం: వీఆర్వో సాయంతో తమకు చెందాల్సిన భూమిని వేరొకరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపిస్తూ దంపతులు ప్రజాసంఘాల సహాయంతో స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు. బాధితులు అంగిన రాంబాబు, చిన్నాయమ్మ వివరాలు వెల్లడించారు. రాంబాబుకు ఇద్దరు సోదరులు ఉండగా ఓ సోదరుడు చిన్నతనంలోనే వేరొకరికి దత్తత వెళ్లిపోయాడు. మరో సోదరుడు మరణించాడు. రాంబా బు తల్లిదండ్రులకు కొయ్యలగూడెం మండలం బ య్యనగూడెంలోని 0.579 ఎకరాల భూమి ఉంది. దీనిని దత్తత వెళ్లిన సోదరుడు ఓ వీఆర్వో సాయంతో తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని రాంబాబు దంపతులు ఆరోపిస్తున్నా రు. దీనిపై తాము కోర్టుకు వెళ్లామన్నారు అయితే సదరు వీఆర్వో బంధువుకు ఈ భూమిని విక్రయించినట్టు ఆన్లైన్లో చూపిస్తోందన్నారు. సదరు వీఆర్వో అక్రమాలకు పాల్పడుతున్నాడని, తమకు అన్యాయం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సబ్ రిజిస్ట్రార్ ఎం.గోపిని వివరణ కోరగా రెవెన్యూ రికార్డులు, ఆధార్ కార్డులు, లింకు డాక్యుమెంట్లు అన్నీ పరిశీలించాకే రిజిస్ట్రేషన్ చేశామని, తమ కా ర్యాలయంలో ఎలాంటి లోపం, అక్రమాలు జరగ లేదని అన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు కూడా నివేదిక పంపుతామన్నారు. లీగల్ ఓపీనియన్ కూ డా తీసుకున్నాకే తాము రిజిస్ట్రేషన్ చేశామన్నారు. -
చట్టాల అమలులో నిర్లక్ష్యం తగదు
బుట్టాయగూడెం: గిరిజన చట్టాల అమలులో నిర్లక్ష్యం ఆపాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తప్పవని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు హెచ్చరించారు. మండలంలోని ఇనుమూరులో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా స్థాయి శిక్షణ తరగతులు శుక్రవారం జరిగాయి. ఆదివాసీలు, గిరిజన చట్టాలు అంశంపై శిక్షణ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం గిరిజనులకు ఇచ్చిన హక్కులు, ప్రత్యేక చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలులో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల భూములు, అటవీ వనరులు, జీవనాధారాన్ని కాపాడే చట్టాలు కాగితాలకే పరిమితం కావడం బాధాకరమన్నారు. గిరిజన చట్టాలు అమలులో విఫలమైతే గిరిజన సమాజం సంఘటితంగా పోరాట పథంలో నడవడం తప్ప మరో మార్గం ఉండదని హెచ్చరించారు. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో ఆదివాసీలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఏ.అశోక్, మొడియం నాగమణి, తెల్లం రామకృష్ణ, ధర్ముల రమేష్, పోలోజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పట్టిసం శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు
పోలవరం రూరల్: మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టిసం రేవులో క్షేత్రానికి వెళ్ళేందుకు వీలుగా క్యూలైన్లు, టిక్కెట్ కౌంటర్లు, ర్యాంపు పనులు సాగుతున్నాయి. ఈ నెల 14 నుంచి 16 వరకు ఇసుక తిన్నెలపై జరిగే ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. కొంత దూరం నడుచుకుంటూ వచ్చి అక్కడి నుంచి పంట్ల మీద, తడికల బాదులతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ర్యాంపుపై నడుచుకుంటూ ఇసుక తిన్నెలపై చేరేలా పనులు చేపట్టారు. ఇసుక తిన్నెలపై నడుచుకుంటూ మరో వైపు నదిలో ఏర్పాటుచేసిన ప్లాట్ఫాం దాటాల్సి ఉంది. అక్కడి నుంచి క్షేత్రానికి నడచుకుంటూ వెళ్ళేందుకు వీలుగా గోనె సంచుల్లో ఇసుక నింపి బస్తాలతో ప్లాట్ఫాం పనులు చేపట్టాల్సి ఉంది. క్షేత్రానికి దిగువ నుంచి క్యూలైన్లో నడుచుకుని శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకుని వచ్చేలా పనులు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టిసం పంచాయతీ దేవస్థానం అధికారులు ఇరువైపులా పనులు చేపట్టారు. గోదావరి వైపు నడిచి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ర్యాంపు టిక్కెట్ కౌంటర్లు, క్యూలైన్ల కోసం చలువ పందిళ్ళు -
దివ్యాంగుల క్రికెట్ విజేతగా ఆంధ్రప్రదేశ్
దెందులూరు: ప్రతిభ ప్రతి ఒక్కరికి గుర్తింపు తీసుకొస్తుందని ఏలూరు జిల్లా డీఎస్డీఓ అజీజ్ అన్నారు. శుక్రవారం ఏలూరు రూరల్ మండలం మల్కాపురం ఆశ్రం వైద్యశాల ఆడిటోరియంలో దివ్యాంగుల క్రికెట్ పోటీలు జరిగాయి. దివ్యాంగుల క్రికెట్ పోటీల్లో విజేతగా ఏపీ జట్టు నిలిచింది. విజేతను రూ.50 వేల నగదు ట్రోఫీతో సత్కరించారు. మూడు రోజుల దివ్యాంగుల క్రికెట్లో భాగంగా ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులకు ప్రోత్సాహక నగదుతో పాటు ప్రశంసా పత్రం అందజేశారు. ఏలూరు జిల్లా డీఎస్డీఓ అజీజ్ మాట్లాడుతూ దివ్యాంగుల క్రికెట్ క్రీడను ప్రోత్సహించేలా అన్ని చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆశ్రం కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్ రాజు, గుప్తా ఫౌండేషన్ కార్యదర్శి శ్రీనివాసరావు, ఎన్ ఫౌండేషన్ అధినేత నారా శేషు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రవీంద్రబాబు, అర్జున అవార్డు గ్రహీత మెన్ అండ్ ఉమెన్ బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అజయ్ కుమార్ రెడ్డి, క్రికెట్ అకాడమీ సెక్రటరీ మదన్ పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): 2026–27 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాల నిమిత్తం పరీక్ష ఈ నెల 7న నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. 9వ తరగతికి ప్రవేశ పరీక్ష 3 పరీక్ష కేంద్రాలలో, 11వ తరగతికి ప్రవేశ పరీక్ష 3 పరీక్ష కేంద్రాలలో జరుగుతాయన్నారు. 9వ తరగతికి 639 మంది, 11వ తరగతికి 677 మంది పరీక్ష రాయనున్నారన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్తో ఉదయం 10 గంటలకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఉదయం 11 గంటల తరవాత ఎవరిని అనుతించరని, పరీక్ష పూర్తి అయ్యేవరకు ఎవరినీ బయటకు వెళ్ళడానికి అనుమతించరని స్పష్టం చేశారు. బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్తో మాత్రమే బబుల్ చేయాలని, పరీక్ష కేంద్రం లోకి మొబైల్ ఫోన్లు, చేతి గడియారం, కాలిక్యులేటర్లు తీసుకురాకూడదన్నారు. 9490728768, 9704812546 హెల్ఫ్లైన్ నెంబర్లలో సంప్రదించాలన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): సీనియర్ ఉపాధ్యాయులు టెట్ పరీక్ష రాసి అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఉద్యోగ భద్రత కోల్పోతున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేస్తూ గత గురువారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిర్వహించిన ఆందోళనలో జిల్లా నుంచి యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఈ మేరకు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ రుద్రాక్షి ఏలూరులో విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాస్ కావాలని సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం సత్వరమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశామన్నారు. టెట్ సిలబస్, అర్హత మార్కుల విషయంలో సడలింపు ఇవ్వాలని విద్యాశాఖ మంత్రిని కోరారని చెప్పారు. -
శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి
జంగారెడ్డిగూడెం: శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ నాణ్యమైన పొగాకును ఉత్పత్తి చేయాలని పొగాకు బోర్డు ఆర్ఎం జీఎల్కే ప్రసాద్ అన్నారు. మండలంలోని తాడువాయి, చల్లావారిగూడెం, మంగిశెట్టిగూడెం, బుట్టాయగూడెం, మార్కండేయపురం, సూరపువారిగూడెంలో వ్యవసాయక్షేత్రాలను ఆయన శాస్త్రవేత్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ నాణ్యమైన పొగాకు ఉత్పత్తికి, మంచి దిగుబడికి రైతులు సకాలంలో తొలి మొగ్గ దశలో తల తుంచి పిలక నివారణ మందు వాడాలన్నారు. మందులు వాడిన 17 రోజుల తర్వాత మాత్రమే ఆకు కొట్టు చేయాలని, లేదంటే పురుగు మందు అవశేషాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. మెగ్నీషియం లోపం ఎక్కువగా ఇసుక నేలల్లో ఉంటుందని, ఎకరాకు 15 కిలోల మెగ్నీషియం ఆకై ్సడ్ శాస్త్రవేత్తలు సూచించిన విధంగా భూమిలో వేయాలన్నారు. ఇనుము లోపం గుర్తిస్తే 0.5శాతం ఫెర్రస్ సల్ఫేట్ లీటరు నీటికి 5 గ్రాములు పిచికారీ చేయాలన్నారు. సూక్ష్మ పోషకాల సమగ్ర యాజమాన్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశన్, వేలం అధికారులు జె.సురేంద్రకుమార్, బి.శ్రీహరి, గ్రేడింగ్ అధికారి వై.ప్రశాంత్, ఐటీసీ లీఫ్ మేనేజర్ కొట్రేష్ తదితరులు పాల్గొన్నారు. -
రొయ్య ధరలు పతనం
● 100 కౌంట్ రూ.270 నుంచి రూ.250కు పడిపోయిన వైనం ● అమెరికా సుంకాలు తగ్గినా రైతులకు దక్కని ఫలితం అమెరికా టారిఫ్ 25 నుంచి 18 శాతానికి తగ్గించడంతో రొయ్యల ధరలు పెరుగుతాయని రైతులు ఆశించారు. దీనికి భిన్నంగా కౌంట్ ధరలు రూ.20 నుంచి రూ.40 వరకూ తగడం దారుణం. రొయ్యల ట్రేడర్స్, ఏజెన్సీలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. ప్రభుత్వం పర్యవేక్షించి రైతులకు గిట్టుబాటు ధరలు అందించాలి – కొరుపోలు అప్పారావు, ఆక్వా రైతు ప్రస్తుతం వాతావరణ మార్పులతో మంచు, వైరస్ ప్రభావం తగ్గలేదు. ప్రతికూల వాతావరణంతో తెగుళ్లు పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో నిరంతరం ఏరియేటర్లు తిరగాల్సిన పరిస్థితి ఉంది. గతంతో పోల్చితే రైతులకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. 100 కౌంటు ధర రూ.280 వద్ద నిలకడగా ఉంటే రైతుకు మేలు జరుగుతుంది. – జె.రవీంద్ర, సీనియర్ ఆక్వా టెక్నీషియన్ నిడమర్రు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రొయ్య ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. ఒకప్పుడు సిరులు కురిపించిన ఈ సాగు గత కొంత కాలంగా వాతావరణ మార్పులతో వైరస్, నాణ్యమైన సీడ్ అందకపోవడం, మేతల ధరలు, పెట్టుబడులు పెరగడం, టారిఫ్ల పెరుగుదలతో ధరలు గణనీయంగా పడిపోయాయి. ప్రభుత్వం ధరలు నియంత్రించలేకపోవడం వంటి కారణాలతో ఆక్వా సాగు రైతులు నేల చూపులు చూస్తున్నారు. గత రెండు రోజులుగా రొయ్య ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఓ పక్క వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు పడిపోవడం, మరోవైపు తగ్గని వైరస్తో పోరాటం చేస్తున్న రైతులను ధరలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నెల 3 వరకు 100 కౌంట్ ధర రూ.270 ఉండగా బుధవారం నుంచి రూ.250కి పడిపోయింది. మిగిలిన కౌంట్ ధర రూ.20 నుంచి రూ.40 వరకూ తగ్గడంతో ఆక్వా సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిలకడలేని ధరలతో ఆక్వా సాగు చేయడంతో కనీసం పెట్టుబడులు రాని పరిస్థితి ఉందని రొయ్య రైతులు చెబుతున్నారు. మరోవైపు అమెరికా సుంకాలను 25 నుంచి 18 శాతానికి తగ్గించినట్లు ప్రకటించినా రొయ్య ధరలు పతనం అవ్వడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రొయ్య ధరలు, మేతల ధరలు నియంత్రించాల్సిన కూటమి సర్కారే సిండికేట్లకు కొమ్ము కాస్తోందని ఆక్వా రైతులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 1.20 లక్షల ఎకరాల్లో రొయ్య సాగు చేస్తున్నారు. వీటిలో 90 శాతం పైగా వనామినే. అమెరికా ప్రకటించిన రోజే రొయ్య ఽకౌంట్ ధరలు తగ్గడంపై ఆక్వా రైతులు నేల చూపులు చూస్తున్నారు. మేత, ఇతర ఖర్చులు పెరుగుతుంటే రొయ్యల ధరలు మాత్రం తగ్గతుండటం ఆక్వా సాగు రంగాన్ని కుదిపేస్తోంది. సాగు సమస్యలు ఎదుర్కొని పంట చేతికొచ్చే సమయంలో పట్టుబడులకు దిగిన రోజే ధరలు పడిపోవడంతో టన్ను రొయ్యకు రూ.20 నుంచి రూ.50 వేల వరకూ నష్టపోతున్నట్లు రైతులు చెబుతున్నారు. దీంతో నికర ఆదాయం తగ్గి రైతులు నష్టాల బారిన పడుతున్నామని, పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్లో ఆక్వా సాగు ప్రశ్నార్థకమే అని చెబుతున్నారు. ఽకూటమి ప్రభుత్వంలో గడ్డు పరిస్థితి రొయ్య ధరల నియంత్రణలో కూటమి సర్కారు తీవ్రంగా విఫలమైందని ఆక్వా రైతులు విమర్శిస్తున్నారు. రొయ్య ధరలు నియంత్రించలేక పోవడం, మేతల ధరలు కంపెనీలు పెంచుతున్నా వారిని అదుపు చేయలేక పోవడంపై ఆక్వా రైతులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆక్వా సాఽఽధికారిత కమిటీని ఏర్పాటు చేసి ప్రతి వారం సీడ్, ఫీడ్ రేట్లు, ఆక్వా ఉత్పత్తుల ధరలపై మంత్రుల కమిటీ సమీక్షించే పద్ధతిని కూటమి సర్కారు పక్కన పెట్టిందని రైతులు విమర్శిస్తున్నారు. అమెరికా పెంచిన సుంకాల పేరుతో వ్యాపారులు రొయ్య ధరలు అప్పట్లో అమాంతం తగ్గించేశారు. పెరిగిన టారిఫ్ ప్రకటనతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. అంతర్జాతీయ మార్కెట్లో టారిఫ్లను చూపి మధ్య దళారీలు ఇష్టారాజ్యంగా రొయ్య రేట్లు తగ్గించుకుంటూ పోతుండటంతో 100 కౌంట్ రొయ్యకు కనీస ధర కూడా లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆక్వా సాఽఽధికారత కమిటీ, ప్రతివారం సీడ్, ఫీడ్ రేట్లు, ఆక్వా ఉత్పత్తుల ధరలపై మంత్రుల కమిటీ సమీక్షించి స్థిరీకరణ కోసం చర్యలు తీసుకునేది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఆ సాధికారత కమిటీకి మంగళం పాడింది. తమ పార్టీలకు చెందిన ప్రాసెసింగ్ ప్లాంట్, హేచరీ, ఫీడు కంపెనీల నుంచి ప్రతినిధులతో ఆక్వా కమిటీ ఏర్పాటు చేస్తే, ఈ కమిటీ రైతుల సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తుంది? – పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మెల్యే -
కాలువ గట్టు మట్టి అక్రమ రవాణా
కొయ్యలగూడెం: చింతలపూడి ఎత్తిపోతల కాలువ గట్టు నుంచి అక్రమార్కులు మట్టిని యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. వారం రోజులుగా కన్నాపురం పులిరామన్నగూడెం గ్రామాల మధ్య ఉన్న ఎత్తిపోతల కాలువ గట్టు నుంచి మట్టి రవాణా చేస్తున్నప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రేయింబవళ్లు మట్టి తోలకాలు సాగుతున్నా చర్యలు తీసుకోకపోవడంతో భవిష్యత్తులో కాలువకు గండ్లు పడే ప్రమాదం ఉందని రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం మండలాలలోని పరిసర గ్రామాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల నిమిత్తం నిబంధనలకు విరుద్ధంగా కాలువ గట్టు ఎత్తిపోతల మట్టిని వినియోగిస్తున్నట్లు తెలిసింది. అభివృద్ధి పనులకు వినియోగించాల్సిన గ్రావెల్ మట్టికి బదులు నాణ్యతలేని మట్టిని వినియోగించడం వలన భవిష్యత్తులో నిర్మాణాలు సుదీర్ఘ కాలం ఉండవని ప్రజలు పేర్కొంటున్నారు. అధికారులు వెళుతున్న సమయంలో రైతులకు చెందిన జీ రాయితీ భూములను పేర్కొంటూ తీరా వాళ్లు వెళ్లిపోయాక మళ్ళీ కాలువ గట్టు తవ్వకాలు చేస్తున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. నూజివీడు : ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో లోను క్లియర్ కాకుండానే క్లియర్ అయినట్లు నకిలీ పత్రాలను పెట్టి తనఖా పెట్టిన పత్రాలను రిలీజ్ చేయించడానికి ప్రయత్నించగా.. వారిని పోలీసులకు అప్పగించారు. శ్రీరామ్ ఫైనాన్స్ తాడేపల్లిగూడెం బ్రాంచ్లో అద్దేపల్లి వెంకటరత్నం కోటి రూపాయల లోను తీసుకున్నాడు. ఆ లోను క్లియర్ అయిపోయిందని చెప్పి బ్రాంచ్కి చెందిన వ్యక్తి అని చెబుతూ దొడ్డి నాగరాజు అనే అతనిని తీసుకొచ్చి నకిలీ సర్టిఫికెట్ సమర్పించి తనఖా రిజిస్ట్రేషన్ రిలీజ్కు ప్రయత్నించారు. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ ఎన్.ఫణిసీతారామరాజుకు అనుమానమొచ్చి శ్రీరామ్ ఫైనాన్స్ అధికారులకు తెలియజేయగా వారు వచ్చి ఫేక్ లెటర్లుగా తెలిపారు. దీంతో వారిని పోలీసులకు అప్పగించారు. భీమడోలు: పొలసానిపల్లి రహదారి వద్ద ఏర్పాటు చేసిన కూటమి నాయకుల ఫ్లెక్సీలను గ్రామానికి చెందిన వ్యక్తులు ధ్వంసం చేయించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు శుక్రవారం గ్రామ సర్పంచ్ షేక్ రహీమాబేగం తెలిపారు. సీసీటీవీ ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
బలివే ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన
బలివే( ముసునూరు): మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తుల సౌకర్యాలు, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఉత్సవాలను విజయవంతం చేయనున్నట్లు ఉత్సవాల ప్రత్యేక అధికారి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న అన్నారు. బలివేలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద దేవదాయ శాఖ జిల్లా అధికారి కే.శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించామని, పోలీస్, పంచాయతీ రాజ్ శాఖల సహాయంతో భక్తుల పుణ్యస్నానాలు, దైవ దర్శనానికి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనంతరం ఆలయం ప్రాంగణంలో క్యూలైన్ల కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను, ఉత్సవ ప్రాంగణంలో ఏర్పాట్లు, జల్లుస్నానాల ఏర్పాట్లు పరిశీలించారు. -
స్కూల్ బస్సు బోల్తా
చాట్రాయి: మండలంలోని గుడిపాడులో ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట సిద్ధార్థ స్కూల్, కాలేజీ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబో యి రోడ్డు పక్కనున్న పంట బోదెలోకి బోల్తా కొ ట్టింది. దీంతో బస్సులోని ఎనిమిది మంది వి ద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా ఒక విద్యార్థినికి పళ్లు కదిలి ఊడిపోయాయి. క్షతగ్రాతులను విస్సన్నపేటలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటన విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై డి.రామృష్ణ తెలిపారు. వేగంగా బస్సులు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఏలూరు (మెట్రో): జిల్లాలో ఏడు మద్యం బార్ల కేటాయింపును లాటరీ పద్ధతి ద్వారా పూర్తిచేసినట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టరేట్లో గురువారం ప్రక్రియను నిర్వహించారు. ఏలూరు స్టేషన్ పరిధిలో 6, జంగారెడ్డిగూడెం స్టేషన్ పరిధిలో ఒక బార్ కోసం 28 దర ఖాస్తులు వచ్చాయన్నారు. లాటరీ పద్ధతిలో వీటిని బసు సాంబశివరావు, ఎరకల నాగ వెంకట కామాక్షి, సుంకర శ్రీదేవి, తల్లూరి శివ రామారావు, ఎరగ్రోగు భానుప్రకాష్, ఆరేపల్లి సంతోష్కుమార్, మద్దుల జగదీశ్వర వేణుగోపాల్కు కేటాయించామన్నారు. జిల్లా ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి ఎ.ఆవులయ్య, ఎకై ్సజ్ సీఐలు జి.శ్రీకృష్ణ ధనరాజు, కె.శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని 34 కేంద్రాల్లో గురువారం జరిగిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 2,782 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 1,248 మందికి 1,228 మంది, మధ్యాహ్నం 1,586 మందికి 1,554 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాను ప్రకటనలో తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): పదో తరగతి పరీక్ష ఫీజులను తత్కాల్ విధానంలో చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని డీఈఓ ఎం. వెంకటలక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. రూ.1,000 అపరాధ రుసుంలో ఈనెల 12 వరకు చెల్లించవచ్చని సూచించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులోని పలు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాంటూ ఏపీటీఎఫ్ నగర శాఖ నాయకులు గురువారం నగర కమిషనర్ భానుప్రతాప్కు వినతిపత్రం సమర్పించారు. ఓపీఎస్ ఉపాధ్యాయులకు డీఏ ఏరియర్స్ను జమచేయాలని కోరారు. ఒక నెల బిల్లు సబ్మిట్ చేసినా నగదు జమకాలేదన్నారు. అలాగే సీపీఎస్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు సంబంధించిన మూడు బిల్లులు సమర్పించగా 90 శాతం నగదు జమకాలేదన్నారు. పీఎఫ్ రుణా లు మంజూరు చేయాలని కోరారు. అధ్యక్షుడు కురమ ఆనంద్ కుమార్, ప్రధాన కార్యదర్శి అబ్బదాసరి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు ఎంవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ఇన్విజిలేషన్ ఆటోమేషన్ విధానం ఉపాధ్యాయులకు భారం కానుందని ఏపీటీఎఫ్–1938 రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ గుగులోతు కృష్ణ, ఏలూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ.రామ్మోహన్, జి.మోహన్ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోమేషన్ పేరుతో జిల్లా, మండల విద్యాశాఖ అధి కారుల పాత్రను తగ్గించడం సరికాదన్నారు. -
పక్కా ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి నిల్
● గృహ నిర్మాణశాఖను వేధిస్తున్న సిబ్బంది కొరత ● ఏఈలు, డీఈలు లేరు ● అన్ని పనులు ఈఈనే చేసుకోవాలి నూజివీడు: రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు నియోజకవర్గంలో గృహ నిర్మాణ శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. వర్క్ ఇన్స్పెక్టర్ల నుంచి ఏఈ, డీఈల వరకు సిబ్బంది కొరతతో ఆశాఖ ఉన్నతాధికారైన ఈఈ సతమతమవుతోన్నారు. గృహ లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేయాలంటే లబ్ధిదారులకు తానే సమాచారం ఇచ్చి వారిని రప్పించి సమావేశాన్ని నిర్వహించుకుంటున్నారు. నూజివీడు డివిజన్లో నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, లింగపాలెం, చింతలపూడి మండలాలతో పాటు నూజివీడు మున్సిపాలిటీ, చింతలపూడి నగర పంచాయతీలున్నాయి. ఈ మండలాల్లో జగనన్న కాలనీల్లో గృహాలు త్వరితగతిన నిర్మాణం జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత వర్క్ ఇన్స్పెక్టర్లు, ఏఈలపై ఉంది. అయితే 8 ఏఈ పోస్టులు ఖాళీగా ఉండటంతో గ్రామ, వార్డు సచివాలయాలకు చెందిన ఇంజినీరింగ్ అసిస్టెంట్లను ఇన్చార్జి ఏఈలుగా నియమించి కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వారి రెగ్యులర్ వర్కులకు, సర్వేలు చేసేందుకు ప్రాధాన్యతనిస్తుండటం, గృహ నిర్మాణ శాఖ పనులనుపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో గృహాల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. అంతేగాకుండా పలు వార్డు, గ్రామ సచివాలయాల్లో సైతం ఇంజినీరింగ్ అసిస్టెంట్ల కొరత నెలకొంది. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభించి బేస్మెంట్ లెవెల్ నుంచి రూఫ్ లెవెల్ వరకు పలు స్థాయిల్లో ఉన్న గృహాల నిర్మాణాలను మార్చి నెలాఖరు వరకు పూర్తిచేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలంటే సిబ్బంది లేక ఉన్నతాధికారులు సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం ఎలా చేయాలా అని కూడా తలలు పట్టుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. పట్టణంలో విఽవిధ దశల్లో 957 గృహాలు నూజివీడు పట్టణ పరిధిలో 12 జగనన్న కాలనీ లేఅవుట్లుండగా 2,737 గృహాలను మంజూరు చేయగా వాటిలో 1,401 గృహాలు నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి. మిగిలిన వాటిలో 341 గృహాలకు అసలు నిర్మాణ పనులు ప్రారంభించలేదు. బేస్మెంట్ లెవెల్లో 828 గృహాలు, రూఫ్ లెవెల్లో 129 గృహాలు చొప్పున మొత్తం 957 గృహాల నిర్మాణ పనులను మార్చి నెలాఖరు కల్లా పూర్తిచేయాల్సి ఉంది. దీనికి గాను ఆయా లబ్ధిదారులతో సమావేశాలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల్లో చైతన్యం తీసుకువచ్చి నిర్మాణం జరుపుకునేలా చేయాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత వేధిస్తుండటంతో పనులు ఏమీ జరగడం లేదు. ఈఈ ఒక్కరే లబ్ధిదారులకు సమాచారం ఇవ్వడం, సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించి గృహాలను నిర్మించుకునేలా చైతన్యపరచడం, ఉన్నతాధికారులు నిర్వహించే టెలీ కాన్ఫరెన్స్లు, సమావేశాలకు హాజరవ్వడం వంటి పనులతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో రెగ్యులర్ సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డివిజన్లో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వ లక్ష్యాల మేరకు పనిచేస్తున్నాం. వచ్చే నెలాఖరు నాటికి పట్టణంలో 957 గృహాల నిర్మాణాన్ని పూర్తిచేయాలని లబ్ధిదారులను చైతన్య పరుస్తున్నాం. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు ప్రభుత్వం అదనంగా అందిస్తున్న సాయాన్ని సైతం తెలియజేసి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. – మూడు రామోజీ నాయక్, హౌసింగ్ ఈఈ, నూజివీడు -
ఎవరెస్టు ఎక్కేటంత సంకల్పం
● లడక్లో ట్రెక్కింగ్ ట్రైనింగ్ పూర్తి చేసిన కలిదిండి ఎస్సై ● 2027లో ఎవరెస్టు ఆధిరోహణకు సన్నాహాలు కై కలూరు: ఖాకీలంటే కాఠిన్యం కాదని, ఎవరెస్టు ఎక్కే అంత సంకల్పానికి సైతం నెరవకుండా ముందుకెళతారని నిరూపిస్తున్నారు ఏలూరు జిల్లా కలిదిండి ఎస్సై వి.వెంకటేశ్వరరావు. గణపవరం ప్రాంతం నుంచి రెండేళ్ల క్రితం కలిదిండి ఎస్సైగా ఆయన విధుల్లో చేరారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎవరెస్టు అధిరోహణ ముందస్తు సన్నాహాల్లో భాగంగా జనవరి 21న ఆయన లడక్లో ట్రెక్కింగ్కు వెళ్లారు. నేపాల్కు చెందిన ట్రైనర్ దేవదాయసర్ ఆధ్వర్యంలో 12 రోజులు మైనస్ 25 డిగ్రీల సెల్సియస్లో 5 వేల మీటర్ల ఎత్తు వరకు వెళ్లారు. ట్రైనింగ్ పూర్తి చేసుకుని తిరిగి కలిదిండిలో ఎస్సైగా విధుల్లో చేరారు. ఆయన సాహసోపేత నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తూ ఎస్సైకు అభినందనలు తెలిపారు. ఎవరెస్టు శిఖరాన్ని 2027 అధిరోహించడానికి ప్రణాళికతో శిక్షణ పొందుతున్నాను. లడక్ శిక్షణ ముందు భువనగిరిలో రాక్క్లైమింగ్లో శిక్షణ తీసుకున్నాను. ఇప్పుడు శరీరంపై 15 కేజీల బరువుతో ట్రెక్కింగ్ చేయగలుగుతున్నాను. పోలీసుశాఖ నుంచి ఎవరెస్టు అధిరోహించి జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ధృడసంకల్పంతో ఉన్నాను. ఖర్చుతో కూడినది కావడంతో దాతలు ముందుకొస్తారని భావిస్తున్నాను. – వి.వెంకటేశ్వరరావు, ఎస్సై, కలిదిండి -
రూ.4.94 లక్షల విలువైన పీడీఎస్ రైస్ పట్టివేత
తణుకు అర్బన్: తణుకులో అక్రమంగా నిల్వచేసిన పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలోని షెడ్డులో పట్టణానికి చెందిన కొల్లి బాబు నిల్వ ఉంచిన 12 టన్నుల బియ్యంతోపాటు ఒక వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు. ముందుగా హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని గోస్తనీ కాలువ గట్టు రోడ్డులో వ్యాన్ ద్వారా రవాణా చేస్తున్న బియ్యాన్ని అధికారులు గుర్తించి ఆరా తీసి విచారణలో భాగంగా ఒక షెడ్డులో బియ్యం నిల్వలను గుర్తించారు. రూ.4,94,520 విలువైన 7,363 టన్నుల రేషన్ బియ్యం (12,363 కిలోలు)తోపాటు వ్యాన్ను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తణుకు పట్టణంలో వివిధ ప్రాంతాల్లో పీడీఎస్ బియ్యాన్ని సేకరించి కాలనీలోని షెడ్డులో నిల్వచేసి పెద్ద మొత్తంలో తూర్పుగోదావరి జిల్లాకు తరలిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. నిర్వాహకుడు కొల్లి బాబుపై 6 ఏ కేసు నమోదుచేసినట్లు తణుకు తహసీల్దార్ కార్యాలయ డీటీ శ్రీదేవి తెలిపారు. నూజివీడు: విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించాలనే లక్ష్యంతో ‘విద్యార్థులు–నైతిక విలువలు’ అనే అంశంపై ఈనెల 8న నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రిపుల్ ఐటీలోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో ఉదయం 9.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. దీనిలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు పాల్గొని ఉపన్యసిస్తారన్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్, ఆర్జీయూకేటీ కులపతి ఆచార్య కొత్తా మధుమూర్తి, ఉప కులపతి ఆచార్య ఎం విజయ కుమార్ హాజరుకానున్నారు. ముదినేపల్లి రూరల్ చోరీ కేసుల్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఇటీవల ముదినేపల్లిలో పాలబూత్లో చోరీతోపాటు, స్థానిక అలేఖ్య అపార్ట్మెంట్స్లో మోటార్సైకిల్ దొంగతనం జరిగింది. ఈ చోరీ కేసుల్లో భీమవరం మండలం డేగాపురం గ్రామానికి చెందిన వి దుర్గామల్లేశ్వరరావును నిందితుడిగా గుర్తించి ముదినేపల్లిలో గురువారం అదుపులోకి తీసుకుని అతడి నుంచి మోటార్సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిని కై కలూరు కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ రిమాండ్ విధించినట్లు తెలిపారు. తాడేపల్లిగూడెం రూరల్: కుమార్తైపె అఘాయిత్యానికి పాల్పడిన తండ్రికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని నీలాద్రిపురం గ్రామానికి చెందిన సురగాని రంగారావు, అతని తమ్ముడు సురగాని బుచ్చిరాజు కలిసి కుమార్తైపె అఘాయిత్యానికి పాల్పడ్డారని తల్లి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటన 2022 సంవత్సరంలో చోటు చేసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను ఏలూరు ఓపెన్ కోర్టులో హాజరుపర్చగా, బాలిక తండ్రి రంగారావుపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు విధించడంతో రూ.10వేలు జరిమానా విధించారు. దీనితో, పాటు బాలికకు ముద్దాయి రూ.2 లక్షలు, ప్రభుత్వం రూ.3 లక్షలు చెల్లించాలని మేజిస్ట్రేట్ తీర్పునిచ్చినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. తాడేపల్లిగూడెం రూరల్: కొట్లాట కేసులో నలుగురికి జరిమానా విధించినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. మండలంలోని జగన్నాథపురం గ్రామంలో 2021 ఫిబ్రవరి 23వ తేదిన కొట్లాట, గొడవ జరిగింది. అప్పట్లో అడ్డాల సూర్యచంద్రరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులు రాటాల సత్యనారాయణ, రాటాల వీరవెంకట మణికంఠ దుర్గావరప్రసాద్, రాటాల వెంకట దుర్గారావు, రాటాల నారాయణస్వామిలకు ఒక్కొక్కరికీ రూ.11 వేలు చొప్పున మొత్తం రూ.44 వేలు జరిమానా విధిస్తూ రెండవ అదనపు మొదటి తరగతి కోర్టు జడ్జి అన్నామణి తీర్పు వెల్లడించారన్నారు. విచారణకు ఏపీపీ ఎ.రవిప్రసాద్, కోర్టు కానిస్టేబుల్ ఎస్.సుబ్బారావు సహకరించినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. -
కబ్జా కోరల్లో గ్రంథాలయ భవనం?
● జేసీబీతో కొంత భాగం పడగొట్టిన వైనం ● పోలీసులకు ఫిర్యాదు చేసిన సెక్రటరీ, లేదంటున్న పోలీసులు తణుకు అర్బన్: మండపాక గ్రంథాలయ భవనాన్ని కబ్జా చేసేందుకు ఆక్రమణదారులు యత్నించారు. పంచాయితీ కార్యాలయం సరిహద్దుకు చేర్చి ఉన్న గ్రంథాలయ భవనం చాలా కాలంగా శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారింది. దీంతో ఆ భవన స్థలంపై కన్నేసిన అక్రమార్కులు ఈనెల 2వ తేదీన రాత్రి సమయంలో జేసీబీని తీసుకువచ్చి భవనం కూల్చివేత పనులు చేస్తుండగా స్థానికులు, అధికారులు అడ్డుకోవడంతో పనులు నిలిపివేశారు. ఈ ఘటనపై పంచాయితీ సెక్రటరీ శేఖర్ తణుకు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు. విలువైన స్థలం మండపాక నడిబొడ్డు, కాలువ పక్కనే ఉన్న ఈ గ్రంథాలయ భవనం అత్యంత ఖరీదైన భూమిగా స్థానికులు చెబుతున్నారు. సుమారుగా 200 గజాల్లో ఉండే ఈ భవనం చాలా కాలంగా నిరుపయోగంగా ఉండడంతో ఆ స్థలంపై కన్నేసిన వారు పడగొట్టి కలుపుకునే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి ఈ స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగా భవనాన్ని కొంతమేర పడగొట్టారని సమాచారం. ఈ వ్యవహారంలో పంచాయతీ సెక్రటరీ శేఖర్ తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశానని మీడియాకు తెలిపారు. అయితే తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ రైటర్ శ్రీనివాస్ మాత్రం సెక్రటరీ ఫోన్ ద్వారా తెలిపారే కానీ ఇంతవరకు ఎటువంటి రాతపూర్వకంగా ఫిర్యాదుచేయలేదని చెబుతుండడం వివాదాస్పదంగా మారింది. కేసు పెట్టానని సెక్రటరీ అనడం, లేదని పోలీసులు చెబుతుండడం వెనుక ఏదో అదృశ్య శక్తి ఉందని, ఈ స్థలం ఎవరికీ కలుస్తుంది, దీని వెనుక ఎవరున్నారనే విషయం తేలాల్సి ఉంది. గ్రామంలో అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు దీని వెనుక ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి. -
అటకెక్కిన కార్పొరేషన్ రుణాలు
భీమవరం(ప్రకాశం చౌక్): ఎన్నికల హామీలను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేషన్ రుణాల పేరిట హడావుడి చేసి తీరా నిధుల విడుదల చేయకుండా జాప్యం చేస్తోంది. బీసీ, కాపు తదితర కార్పొరేషన్ల ద్వారా అర్హులైన యువతకు రూ.5 లక్షల వరకు రుణాలు ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రుణంలో 50 శాతం సబ్సిడీ ప్రభుత్వం భరిస్తుందని దరఖాస్తులు స్వీకరించి ఇంటర్వ్యూలు సైతం చేశారు. ఇదంతా జరిగి దాదాపు ఏడాది కావస్తుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం కనీసం ఇంటర్వ్యూలు కూడా నిర్వహించలేదు. అయినా ఇప్పటికీ రుణాల ఊసెత్తకపోవడంతో దరఖాస్తుదారులు ఎన్నాళ్లీ ఎదురుచూపులు అంటూ నిట్టూరుస్తున్నారు. మరోసారి కూటమి ప్రభుత్వం చేతిలో మోసపోయామంటూ రుణాలపై ఆశలు వదులుకుంటున్నారు. నిధుల ఊసేది? కార్పొరేషన్ రుణాలకు సంబంధించి ప్రభుత్వం సబ్సిడీ 50 శాతం సొమ్మును బ్యాంకులకు విడుదల చేస్తే మిగిలిన 50 శాతం కలిపి బ్యాంకులు లబ్ధిదారులకు రుణంగా మంజూరు చేస్తాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకూ రుణాలకు సంబంధించిన సబ్సిడీ సొమ్ములు విడుదల చేయలేదు. దీంతో బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వెనుకాడుతున్నాయి. వచ్చిన దరఖాస్తులు బ్యాంకుల్లో మూలన పడ్డాయి. 79 వేల మందికి పైగా.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో బీసీ, ఎస్సీ, కాపు తదితర కార్పొరేషన్ల రుణాల కోసం ఏలూరు జిల్లాలో 40,156, పశ్చిమగోదావరిలో 38,893 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా బీసీ కార్పొరేషన్కు ఏలూరులో 21,838, పశ్చిమగోదావరిలో 17,686 దరఖాస్తులను స్వీకరించారు. పచ్చ నేతల సమక్షంలోనే.. ఉమ్మడి జిల్లాలో బీసీ, కాపు కార్పొరేషన్ రుణాలకు సంబంధించి ఇంటర్వ్యూలు కూటమి నాయకులు ముఖ్యంగా తెలుగుదేశం నేతల సమక్షంలోనే జరిగాయి. 90 శాతం యూనిట్లను కూటమికి చెందిన, కూటమి నాయకులు సిఫార్సు చేసిన వారికి మంజూరు చేసేలా బ్యాంకు మేనేజర్లపై ఒత్తిళ్లు కూడా చేశారు. మీకు రుణం రాదంటూ పలువురు అర్హులైన అభ్యర్థులను టీడీపీ శ్రేణులు ఆందోళనకు కూడా గురిచేశాయి. ఇంతా హడావుడి చేసి రుణాలు మంజూరు చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. నిధుల కేటాయింపు.. మళ్లింపు 2024–25 బడ్జెట్లో బీసీ, కాపు కార్పొరేషన్ రుణాలకు సబ్సిడీ నిధులు కేటాయించామని నాడు విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు. అయితే నిధులను ప్రభుత్వం బ్యాంకులకు రిలీజ్ చేయకుండా మళ్లించిందనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి నిమ్మల తీరు మరీ విడ్డూరం చంద్రబాబు సబ్సిడీ రుణాలు అందిస్తారంటూ ప్రచారం చేసిన జిల్లా మంత్రి నిమ్మల రామానాయుడు ఒక్క అడుగు ముందుకు వేసి మరీ పాలకొల్లులో లబ్ధిదారులకు సబ్సిడీ రుణాల చెక్కు సైతం అందించారు. తీరా లబ్ధిదారులకు బ్యాంకులకు వెళితే అసలు నిజం తెలిసింది. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సబ్సిడీ నిధులు విడుదల చేయలేదని తెలుసుకుని ప్రభుత్వ తీరుపై ముక్కున వేలేసుకున్నారు. జిల్లాలో మంత్రి నిమ్మల, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు ఉన్నా కార్పొరేషన్ రుణాల ఊసే ఎత్తడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీలకు మొండిచేయి చూపింది. ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం 9 నెలల క్రితం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం కనీసం ఇంటర్వ్యూలు కూడా నిర్వహించలేదు. ఏలూరు జిల్లాలో 111 యూనిట్లకు 6,826, పశ్చిమగోదావరి జిల్లాలో 742 యూనిట్లకు 3,181 దరఖాస్తులు వచ్చాయి. ఎన్నాళ్లీ ఎదురుచూపులు? ఊసేలేని బీసీ, ఎస్సీ తదితర కార్పొరేషన్ల రుణాలు దరఖాస్తులు స్వీకరించి ఏడాది విడుదల కాని నిధులు.. నిలిచిన యూనిట్లు బడ్జెట్లో కేటాయించిన సొమ్ములు మళ్లింపు! రుణాల పేరుతో చంద్రబాబు సర్కారు మోసం ఉమ్మడి జిల్లాలో 79 వేలకు పైగా దరఖాస్తులు -
విద్యాంజలి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని 1,728 పాఠశాలలు విద్యాంజలి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పాఠశాలలకు కావాల్సిన అవసరాలను విద్యాంజలి పోర్టల్లో నమోదు చేయాలని సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ కే. పంకజ్ కుమార్ సూచించారు. గురువారం స్థానిక ఈదర సుబ్బమ్మ దేవి మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి విద్యాంజలి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాఠశాలలకు అవసరమైన సదుపాయాలను సర్వీస్ రూపంలో, వస్తు రూపంలో అవసరాలుగా నమోదు చేయాలని సూచించారు. విద్యాంజలి కార్యక్రమం ద్వారా ప్రతి పాఠశాలకు అవసరమైన సదుపాయాలు దాతల ద్వారా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాంజలి పోర్టల్ ద్వారా వాలంటీర్గా పాఠశాలల్లో సర్వీస్ చేయడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులను ప్రోత్సహించి రిజిస్ట్రేషన్ చేసేటట్టు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యాంజలి కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 7వ తేదీన జిల్లాలోని అన్ని మండలాల్లో ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని, వాటికి అవసరమైన నిధులు విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు, ఎన్న్జీవోలు, ఎస్ఎంసీ సభ్యులు, రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చారు. అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ రెడ్డి రామారావు, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ యెహోషువ, ఆల్టర్నేటివ్ స్కూల్ కోఆర్డినేటర్ ఎస్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ అరాచకాలకు భయపడం
ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, కాపు నాయకుడు అంబటి రాంబాబుపై దాడి, ఇల్లు, కార్యాలయాలపై దాడు లు, విధ్వంసం చేసిన టీడీపీ గుండాలపై ప్ర భుత్వం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వైఎస్సార్ సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) డిమాండ్ చేశారు. జిల్లాకు చెందిన పార్టీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు, నూజివీడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఏలూరు కన్వీనర్ మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ) పార్టీ నేతల బృందం గురువారం అంబటి కుటుంబాన్ని పరామర్శించారు. దాడుల ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందనే భరోసా కల్పించారు. ధ్వంసమైన కారు, ఇంటి పరిసరాలు, కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందనే ఆరోపణలు చేసిందని, అయితే సీబీఐ, సిట్ నివేదికతో సీఎం చంద్రబాబు, పవన్కల్యాణ్ చేసిన ఆరోపణలు అవాస్తవాలు అని తేలిందన్నారు. లడ్డూ ప్రసాదం విషయంలో పరువుపోయిన ప్రభుత్వం దానిని కప్పిబుచ్చుకునేందుకు వైఎ స్సార్సీపీ నేతలు, వారి ఇళ్లపై దాడులకు తెగబడుతోందన్నారు. అక్రమ కేసులతో ప్రజల దృష్టిని మళ్లించాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. ఇప్పటికై నా ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను భయపెట్టాలని చూడటం మానుకోవాలన్నారు. ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణేష్, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ల శంకర్, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి వామిశెట్టి పరమేశ్వరరావు, జెడ్పీటీసీ కాశీ విశ్వనాథ్ ఉన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి పరామర్శ వైఎస్సార్సీపీ జిల్లా నేతల బృందం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. కొద్దిసేపు దాడి జరిగిన పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటి కారిడార్లో పెట్రోల్ బాంబులతో దాడి చేసి దహనం చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. మాజీ మంత్రుల కుటుంబాలకు జిల్లా నేతల పరామర్శ -
జననేతకు నీరాజనం
జన తరంగం ఎగసింది.. అభిమాన నేతను చూసి మురిసింది.. సంక్షేమ ప్రదాతకు ఆత్మీయ స్వాగతం పలికింది.. అడుగడుగునా బ్రహ్మరథం పట్టింది.. ‘సీఎం.. సీఎం.. జై జగన్’ నినాదాలతో హోరెత్తించింది.. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వెల్లువలా వచ్చిన జనకెరటం జననేతకు నీరాజనాలు అర్పించింది.. యువత, అభిమానుల కేరింతలు, ఉత్సాహం నడుమ భీమవరం జనసంద్రాన్ని తలపించింది. వివాహ వేడుకకు హాజరైన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. శురకవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20268లో uసాక్షి, భీమవరం/భీమవరం (ప్రకాశం చౌక్): శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు కుమారుడు ఐపీఎస్ అధికారి చిట్టిరాజు, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గొర్రెముచ్చు కిషోర్కుమార్ కుమార్తె తేజ రిషితల వివాహం గురువారం పెద అమిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ హాలులో వైభవంగా జరిగింది. నూతన జంటను ఆశీర్వదించేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారన్న సమాచారంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు భీమవరం చేరుకున్నారు. ఉదయం నుంచే జువ్వలపాలెం, క న్వెన్షన్ హాలు రోడ్లలో హడావుడి మొదలైంది. పార్టీ శ్రేణులు, యువత పార్టీ జెండాలు, జగన్ ఫ్లెక్సీలతో సందడి చేశారు. దారిపొడవునా ఫ్లెక్సీలతో రోడ్డును ముంచెత్తారు. ఉదయం 11.30 గంటలకు పెద అమిరం రోడ్డులోని హెలీప్యాడ్కు జగన్ చేరుకోగా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పార్టీ నేతలు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. హెలీప్యాడ్ నుంచి కల్యాణవేదిక వరకూ పార్టీ శ్రేణులు, యువతతో రోడ్డు కిక్కిరిసిపోయింది. భారీ ఎత్తున బాణాసంచా కాల్పులతో అధినేతకు పార్టీ వ్రేణులు స్వాగతం పలికారు. తమ అభిమాన నేతను దగ్గరగా చూసేందుకు యువకులు బారికేడ్లు, ప్రహరీ గోడలను లెక్కచేయకుండా కాన్వాయ్ వెంట పరు గులు తీశారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి హెలీప్యాడ్ నుంచి తిరుగు పయనమయ్యే వరకూ జగన్ను చూసేందుకు, ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబర్చారు. కిక్కిరిసిన కన్వెన్షన్ కల్యాణ వేదిక వద్ద మోషేన్రాజు, అన్నామణి దంపతులు వైఎస్ జగన్కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. వధూవరులు చిట్టిరాజు, తేజ రిషితలను జగన్ ఆశ్వీరించారు. వేదిక వద్ద జగన్ను చూసేందుకు జనం పోటీపడ్డారు. ఆయన వధూవరులను ఆశీర్వదిస్తున్న దృశ్యాలను చిన్నాపెద్దా తేడాలేకుండా సోఫాలు, కుర్చీలు ఎక్కీ మరీ తమ సెల్ఫోన్లలో బంధిస్తూ మురిసిపోయారు. అభిమా న నేతతో కరచాలనం కోసం పోటీపడ్డారు. భీమవరం.. అభిమాన సంద్రం వైఎస్ జగన్కు ఘన స్వాగతం మండలి చైర్మన్ మోషేన్రాజు తనయుని వివాహ వేడుకకు హాజరు పెదఅమిరం రోడ్డులో ప్రభంజనం ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి వెల్లువలా పార్టీ శ్రేణులు -
బుట్టాయగూడెం ఎంపీపీగా తెల్లం రమణ
బుట్టాయగూడెం : బుట్టాయగూడెం ఎంపీపీగా తెల్లం రమణ ఎన్నికై నట్లు ఎన్నికల పరిశీలకుడు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం జరిగిన ఎన్నికల్లో 15 మంది ఎంపీటీసీలకు 12 మంది హాజరయ్యారని చెప్పారు. కోరం పూర్తి కావడంతో ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం పూర్తి చేశామని చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదికలను ఉన్నతాధికారులు పంపిస్తామన్నారు. అలాగే ఎంపీపీగా ఎన్నికై న తెల్లం రమణకు ఎన్నిక ఫాంను జేసీ, ఆర్డీఓ చేతుల మీదుగా అందజేశారు. ఏలూరు (టూటౌన్): విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు పూర్తికాకుండానే ఏలూరు జిల్లాలో కొన్ని ప్రవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ముందస్తు అడ్మిషన్న్లు చేస్తూ, విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెబుతూ అధిక ఫీజులు వసూలు చేయడానికి సిద్దమవుతున్నాయని ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి.శివ కుమార్ అన్నారు. స్థానిక ఆర్ఆర్పేటలోని స్ఫూర్తి భవన్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని విద్యాసంస్థలకు అసలు ప్రభుత్వ గుర్తింపు కూడా లేకుండా అడ్మిషన్న్లు చేస్తుంటే కనీసం విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోడం చాలా బాధాకరమన్నారు. గుర్లింపు లేని విద్యాసంస్థలను సీజ్ చేయాలన్నారు. ఫీజుల వసూళ్లపైనా జిల్లా విద్యాశాఖ అధికారులకు అనేక సార్లు వినతిపత్రాలు అందించినా ఏ మాత్రం కూడా స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పోరాటాలకు పిలుపు నిస్తామని హెచ్చరించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా బుధవారం జిల్లాలోని 47 కేంద్రాల్లో నిర్వహించిన ప్రయోగ పరీక్షలకు 3,917 మంది హాజరయ్యారు. జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు జరిగిన ఈ పరీక్షల్లో ఉదయం 1,859 మందికి 1,820 మంది హాజరు కాగా 39 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 2,143 మందికి 2,097 మంది హాజరు కాగా 46 మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్షల్లో ఎలాంటి మాల్ప్రాక్టీస్ కేసులూ నమోదు కాలేదని, పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి యోహాను ఒక ప్రకటనలో తెలిపారు. నూజివీడు: రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి చాట్ల పుల్లారావు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12న నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో శానిటేషన్ కార్మికులు బుధవారం పాంప్లెట్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ మోదీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తోందన్నారు. ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచిందని, ఇది కార్మిక వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. ఈ ఫిబ్రవరి 12న చేపట్టే సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం బుధవారం స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. సమావేశంలో 2026– 2027 సంవత్సరానికి జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి తదితర పనులకు రూ.25 కోట్లతో ప్రతిపాదనలను రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ సంచాలకుడికి పంపడానికి తీర్మానించి ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చెర్మన్ జుత్తుగ నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్ బాబు, వయోజన విద్యాశాఖ ఉప సంచాలకుడు జీసీహెచ్ ప్రభాకర్, వయోజన విద్యాశాఖ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆర్.విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నిలిచిన మీటర్ రీడింగ్
భీమవరం (ప్రకాశం చౌక్) : విద్యుత్ మీటర్ రీడర్ల సమ్మెతో జిల్లా వ్యాప్తంగా రీడింగ్ నిలిచిపోయింది. దీంతో శ్లాబ్లో తేడా వచ్చి విద్యుత్ బిల్లులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు చంద్రబాబు పాలనలో కాంట్రాక్టు, కమిషన్పై పనిచేసే ఉద్యోగులు నరకం చూస్తున్నారు. తాజాగా విద్యుత్ మీటర్ రీడర్ల తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ నెల 1 తేదీ నుంచి విజయవాడలో ధర్నా చేపట్టారు. గత నాలుగు రోజులగా మీటర్ రీడర్లు సమ్మె చేస్తున్నా సర్కారు కనీసం పట్టించుకోవడం లేదు. జిల్లావ్యాప్తంగా బిల్లింగ్ నిలుపుదల రాష్ట్ర వ్యాప్తంగా మీటర్లు రీడర్లు చేపట్టిన ధర్నాతో జిల్లాలోని 5 వేల మంది మీటర్లు రీడర్లు కూడా బిల్లింగ్ నిలుపుదల చేశారు. బిల్లులు తీయడం ఆలస్యం కావడంతో విద్యుత్ వినియోగదారులకు శ్లాబ్ పెరిగిపోయి బిల్లులు అధికంగా వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పెరిగిన కరెంట్ బిల్లులతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే శ్లాబ్ మారిపోయి. బిల్లులు పెరిగితే ఇబ్బందులు పడతామని సామాన్యులు వాపోతున్నారు. రూ.500 బిల్లు కాస్తా.. తీయడం ఆసల్యమై మరో రూ.300 పెరిగి రూ.800 వరకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 10 తేదీ లోపు బిల్లు తీయాల్సి ఉండగా.. పట్టణాలు, పల్లెల్లో 5వ తేదీ వచ్చినా కూడా బిల్లులు తీసే ప్రక్రియ ప్రారంభం కాలేదు. మీటర్ రీడర్లు లేకపోవడంతో విద్యుత్ సంస్థ లైన్మ్యాన్లు, స్విప్ట్ ఆపరేటర్లకు ఆ పని అప్పగించారు. జిల్లా వ్యాప్తంగా 6,53,764 సర్వీసులు ఉన్నాయి. 5 వేల మంది చేయాల్సిన బిల్లింగ్ 1000 మంది ఎప్పటికి పూర్తి చేస్తారని ప్రశ్నిస్తున్నారు. 10వ తేదీ దాటితే బిల్లు శ్లాబ్ మరింత పెరుగుతుంది. ఎస్సీ, ఎస్టీలకు విద్యుత్ రాయితీ వర్తించదు. ముందస్తుగా సమాచారం ఇచ్చి రీడర్లు ధర్నాకు వెళ్లినా.. విద్యుత్ శాఖ అధికారులు సకాలంలో స్పందించలేదు. కాంట్రాక్టర్లను భయపెడుతున్నారు విద్యుత్ స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్లపై విద్యుత్ సంస్థ ఒత్తిడి తీసుకొస్తుంది. వెంటనే కొత్త రీడర్లతో రీడింగ్ తీయాలని, ప్రతి రోజు బిల్లింగ్ 12.5 శాతం జరగాలని కాంట్రాక్టర్లు దగ్గర ఉన్న స్కానర్లు, ప్రింటర్లు, మొబైల్స్, చార్జర్లు వెంటనే డిపార్ట్మెంట్కు ఇవ్వాలని, ఇవ్వని వారిపై పోలీస్ కేసు పెట్టాలని విద్యుత్ శాఖ అధికారులు కాంట్రాక్టర్లను భయపెడుతున్నారు. జిల్లాలో దాదాపు 20 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. కొత్త రీడర్లు వస్తే పాతవారి పరిస్థితి గురించి ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. రూ.10 వేలు దాటని జీతం విద్యుత్ మీటర్ రీడర్ల జీతం రూ.10 వేలు కూడా లేదు. పట్టణాల్లో పీఎఫ్, ఈఎస్ఐకు అన్నీ కలుపుకుని మీటర్కు రూ.6.16, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6.36 చొప్పున చెల్లిస్తున్నారు. ఈ మొత్తం సరిపోవడం లేదని కాంట్రాక్టర్లు డిమాండ్ చేయడంతో పట్టణాల్లో రూ.0.26, గ్రామాల్లో రూ.0.75 పెంచారు. రీడింగ్ యంత్రం చార్జీలు, ఫోన్ రీచార్జ్, రీడింగ్ పేపర్ రోల్, మరమ్మతులు, ఈఎస్ఈ, ఈపీఎఫ్ మినహాయింపులు పోగా.. విద్యుత్ మీటర్ రీడర్కు చేతికి ఒక్కో మీటర్కు పట్టణంలో రూ.4.66, గ్రామీణ ప్రాంతంలో రూ.3.89 అందుతుంది. ఒక్క మీటర్ రీడర్ నెలకు మూడు వేల మీటర్ల వరకు రీడింగ్ తీస్తారు. దీన్ని బట్టి చూస్తే వారి ఆదాయం ప్రతి నెలా కేవలం రూ.10 వేల లోపే ఉంటుంది. 20 ఏళ్లగా పనిచేస్తున్నా ఇదే పరిస్థితి విద్యుత్ మీటర్ రీడర్లుగా గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న వారే అధికంగా ఉన్నారు. 20 ఏళ్లుగా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కనీసం ఉద్యోగ భద్రత కల్పించకుండా రీడర్లపై కేసుల నమోదుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మాట మార్చిన చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించిన సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ప్రస్తుతం వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో విమర్శించిన నోటితోనే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు మంచి ప్రక్రియ అని చెప్పి మాట మార్చారు. స్మార్ట్ మీటర్లతో అటు ప్రజలకు, ఇటు మీటర్ రీడర్లకు ద్రోహం చేసిన ఘనత చంద్రబాబుకే చెల్లింది. స్మార్ట్ మీటర్ల నేపథ్యంలో మీటర్ రీడర్లకు విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. రీడర్ల విద్యార్హతను బట్టి విద్యుత్ శాఖలో టెక్నికల్, నాన్ టెక్నికల్ షిఫ్ట్ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మిగిలిన వారిని వాచ్మెన్, అటెండర్ పోస్టుల్లో నియమించాలి. ఎస్క్రో ఖాతాను వెంటనే తెరవాలి. కాంట్రాక్టర్లు, విద్యుత్ శాఖ అధికారులతో విద్యుత్ మీటర్ రీడర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం మూడు డివిజన్లు ఉన్నాయి. ఇందులో భీమవరం డివిజన్లో 2,09,970 సర్వీసులు, నరసాపురం డివిజన్లో 2,24,354, తాడేపల్లిగూడెం డివిజన్లో 2,19,440 కలిపి మొత్తం 6,53,764 సర్వీసులు ఉన్నాయి. బిల్లులు తీయకపోవడంతో విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చే అవకాశం నాలుగు రోజులుగా సమ్మెలో విద్యుత్ మీటర్ రీడర్లు 10 తేదీ మీటర్ రీడింగ్కు తుది గడువు విద్యుత్ మీటర్ల రీడర్ల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం -
ఎఫెక్ట్
ఏలూరు (ఆర్ఆర్పేట) : ‘స్తంభాలపై ప్రమాద ఘంటికలు’ శీర్షికతో సాక్షి దినపత్రికలో ఈ నెల 3న ప్రచురించిన కథనంపై విద్యుత్ అధికారులు స్పందించారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలపై కట్టిన కేబుల్ వైర్లను తొలగించారు. హై టెన్షన్ విద్యుత్ వైర్లకు తాకుతున్న చెట్ల కొమ్మలను సైతం తొలగించారు. ఈపీడీసీఎల్ ఏలూరు నార్త్ ఏఈ రాంబాబు మాట్లాడుతూ విద్యుత్ స్తంభాలకు చుట్టిన కేబుల్ వైర్లకు సంబంధించిన సంస్థలకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. తమ ప్రాంతంలో విద్యుత్ వైర్లను చెట్ల కొమ్మలు తాకుతున్న విషయాన్ని స్థానికులు తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటిని తొలగించి విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
భూ దోపిడీకి భారీ స్కెచ్
3,650 గజాలకు రూ.39 కోట్ల డీల్ సాక్షి, టాస్క్ఫోర్స్ : వందేళ్లకు పైగా గూడెంలో అందరికి తెలిసిన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన భూమి అది. స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో మహాత్మాగాంధీకి భూములు విరాళాలు ఇచ్చిన కుటుంబానికి చెందిన భూమిని లీజు పేరిట ఒక వ్యక్తి తీసుకున్నాడు. అతని కుమారులు మాకు సర్వహక్కులతో విక్రయించారని, వారికి వారసులు లేరని, స్థలాన్ని ముక్కలు ముక్కలుగా విక్రయించడం మొదలుపెట్టారు. రాజకీయ నేతల కన్ను భూమిపై పడటంతో బడా మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. కట్చేస్తే... ఆ భూమిలో కొంత భాగం రోడ్డు కిందకు పోయేలా చూపించి రూ.39 కోట్ల పరిహారం పొందడానికి పకడ్బందీ స్కెచ్ గీశారు. ఆ మేరకు వచ్చే పరిహారంలో వాటాలు ఖరారు చేసుకున్నారు. పనంతా కొలిక్కితెచ్చారు. కట్చేస్తే.. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారసులు హైకోర్టులో కేసు దాఖలు చేయడంతో మొత్తం ప్రయత్నానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. తాడేపల్లిగూడెంలోని టూటౌన్ సమీపంలో సత్యనారాయణ స్వామి ఆలయ సమీపంలో కృష్ణా రైస్మిల్లు సర్వే నెంబర్ 403లో ఉంది. 5.80 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ భూమి దామోజీపురపు ముఖ్య ప్రాణారావు కుటుంబసభ్యులది. 1929లో పెంటపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్ అయింది. అనంతరం తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటయ్యాక భూమి రికార్డు బదలాయింపు చేశారు. అనంతరం ప్రాణారావు 1939 జనవరి 2న తన వాటాగా వచ్చిన 5.80 ఎకరాల భూమిని 99 ఏళ్ళ లీజుకు ఒక వ్యక్తికి అప్పగించారు. కట్చేస్తే.. ముఖ్య ప్రాణారావు వారసులున్నప్పటికీ కుటుంబ సభ్యులు భూమి బాగోగులు పట్టించుకోలేదు. దీంతో లీజు తీసుకున్న వ్యక్తి ప్రాణారావుకు వారసులు లేరని దాన విక్రయ హక్కులతో తనకు లీజుకు ఇచ్చారని హడావుడి చేసి పెంటపాడు మండలానికి చెందిన ఒక డాక్యుమెంట్ రైటర్ సహకారంతో అత్తిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 26 రిజిస్ట్రేషన్లు చేసినట్లు సమాచారం. 5.80 ఎకరాల భూమిని ముక్కలు ముక్కలుగా విక్రయించారు. ఈ వ్యవహారంలో డాక్యుమెంట్ రైటర్ది కీలకపాత్ర. సబ్రిజిష్ట్రార్ కార్యాలయ ఉద్యోగులను కూడా అన్ని విధాలా సర్దుబాటు చేసి మరీ తతంగం నడిపించారు. ఇక కూటమి అధికారంలో ఉండటంతో బడానేతను సంప్రదించి మాస్టర్ ప్లాన్లో చిన్నపాటి సర్దుబాట్లతో ఈ సర్వే నెంబర్లో కొంత భూమిని ప్రభుత్వం తీసుకుని పరిహారం ఇస్తే నూరు శాతం లీగల్ అవుతుందని నిర్ణయించి పొలిటికల్ పెద్దలను ఆశ్రయించి భారీ యాక్షన్ ప్లాన్కు తెరదీశారు. డీల్ బాగుండటంతో బడా పొలిటికల్ నేత రంగంలోకి దిగాడు. వెంటనే మాస్టర్ ప్లాన్లో భాగంగా 1,500 గజాలు కేఎన్ రోడ్డులో, 2,150 గజాలు భీమవరం రోడ్డు విస్తరణలో పోయేలా సెట్చేసి 40 అడుగుల రహదారిని చూపించారు. కేఎన్ రోడ్డులో 1,500 గజాల భూమికి గజం రూ. 75 వేలు, భీమవరం రోడ్డులో 2,150 గజాలకు గజం రూ.25 వేలు ప్రభుత్వం నిర్ణయించిన ధర. దీనికి మూడు రెట్లు పరిహారం ఖరారు చేయించుకునేలా అన్ని మంతనాలు పూర్తి చేశారు. మొత్తం రూ.39 కోట్ల పరిహారానికిగాను 40 శాతం టీడీఆర్ బాండ్ల రూపంలో మిగిలిన 60 శాతం నగదు వారి ఖాతాల్లో పడేలా సెట్ చేసుకున్నారు. దీనికిగాను బడా నేతకు 50 శాతం అంటే రూ.19.50 కోట్లు గూడెం మున్సిపాల్టీలో కీలక అధికారి ఒకరికి కోటిన్నర, మరొకరికి రూ.కోటి, మిగిలిన మొత్తం వారసులు లేరని తనకే దక్కుతుందని కాగితాలు సిద్ధం చేసిన వ్యక్తికి వచ్చేలా ప్లాన్ ఖరారు చేసుకున్నారు. ఈ వ్యవహారం ఖర్చంతా కూడా కాగితాలు సిద్ధం చేసిన వ్యక్తే భరించాలని నిర్ణయించారు. కట్చేస్తే.. మున్సిపాల్టీలో ఓ అధికారి తాను పనిచేయలేనని సెలవులో వెళ్ళినట్లు సమాచారం. భూ పంచాయతీపై హడావుడి తెలుసుకున్న దామోజీపురపు కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించారు. దామోజీపురపు భారతి, మరో నలుగురు కలిసి హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబర్ 35154/2025 నెంబరుతో కోర్టులో కేసు దాఖలు చేశారు. మాస్టర్ ప్లాన్ పేరిట టీడీఆర్ బాండ్ల ఇచ్చే ప్రక్రియ నిలుపుదల చేయాలని కోర్టు ఆదేశించిన క్రమంలో వ్యవహారం నిలిచిపోయింది. రెవెన్యూ రికార్డులోని ఆర్ఎస్ఆర్ను, ఇతర పత్రాలను అధికారం ఉన్న బడా నేత సాయంతో సవరణలు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. గూడెంలో బ్రాహ్మణ వారసత్వ ఆస్తిపై బడా నేత కన్ను 40 అడుగుల రోడ్డు విస్తీర్ణంలో 3,650 గజాలు ప్రభుత్వానికి దానికిగాను రూ.39 కోట్ల పరిహారం సగం పరిహారం బడా నేతకు ఖరారు మున్సిపల్ అధికారులకు రూ.2.50 కోట్ల భారీ నజరానా మిగిలిన మొత్తం మరికొందరికి హైకోర్టు ఉత్తర్వులతో తాత్కాలికంగా బ్రేక్ -
శివరాత్రికి చురుగ్గా ఏర్పాట్లు
పోలవరం రూరల్: మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టిసం శివక్షేత్రంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పోలవరం మండలం పట్టిసం శివక్షేత్రంలో ఈ నెల 14 నుంచి 16 వరకు ఇసుక తిన్నెలపై జరిగే ఉత్సవాలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. లక్షన్నరకు పైగా భక్తులు హాజరవుతారనే అంచనాతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి నదిలో భక్తులు నడిచి వెళ్లేందుకు వీలుగా పంట్లు ఏర్పాటు చేసి క్షేత్రం వైపు ఇసుకతో ర్యాంపు ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఇసుక తిన్నెలపై చలువ పందిళ్ళ నిర్మాణం చేపట్టారు. వాహనాలు పార్కింగ్ ప్లేస్లు, తాత్కాలిక బస్టాండ్ల ఏర్పాట్లకు సంబంధించిన ప్రదేశాలను సంబంధిత శాఖ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది వరద ప్రవాహం మారడంతో నది మధ్యలో రెండు పాయలుగా ఏర్పడింది. దీంతో నడిచి వెళ్లి వచ్చేందుకు మార్గం దూరమైంది. ఇసుక తిన్నెలపై తాత్కాలిక మరుగుదొడ్లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా కర్రలు, తాటాకులతో నిర్మాణాలు చేపట్టారు. భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వీలుగా క్యూలైన్లు, బారికేడ్ల పనులు చేస్తున్నారు. ఇసుక తిన్నెలపై నిర్మిస్తున్న చలువ పందిళ్లు -
‘మార్పు’ అమలుపై దృష్టి పెట్టాలి
కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు(మెట్రో) : జిల్లాలో నాటుసారా తయారీ నుంచి బయటకు వచ్చిన కుటుంబాలకు ‘మార్పు’ కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించామని, ఈ కార్యక్రమానికి సద్వినియోగం చేసుకునేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం నవోదయం–2 లో మార్పు కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి కార్యక్రమాల అమలుపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా రూపొందించేందుకు నాటుసారా తయారీదారులను ఆ వృత్తి నుంచి బయటకు తీసుకొచ్చి వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించామన్నారు. ఈ సందర్భంగా నాటుసారా తయారీ మానేసి, ప్రత్యామ్నాయ ఉపాధి పొందేందుకు అంగీకరించిన 26 కుటుంబాలకు రూ.19 లక్షలు కలెక్టర్, ఎమ్మెల్యేలు బడేటి చంటి, సొంగా రోషన్కుమార్లు అందించారు. తొలి విడత అక్రిడిటేషన్ల జారీకి ఆమోదం ఏలూరు జిల్లాలో దరఖాస్తు చేసుకున్న పాత్రికేయుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేశామని కలెక్టర్ చెప్పారు. బుధవారం జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి రెండో సమావేశంలో మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు వివిధ సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం సమర్పించగా, పరిశీలించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
నేడు భీమవరానికి వైఎస్ జగన్
సాక్షి, భీమవరం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం భీమవరం రానున్నారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు తనయుడు ఐపీఎస్ అధికారి చిట్టిరాజు వివాహ వేడుకకు హాజరుకానున్నారు. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు స్థానిక పెదఅమిరం రోడ్డులోని హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి సమీపంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ హాలుకు కారులో చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం 12 గంటలకు భీమవరం నుంచి తాడేపల్లి బయలుదేరి వెళతారు. ఈ మేరకు జగన్ పర్యటన షెడ్యూల్ ఖరారైనట్టు పార్టీ నేతలు తెలిపారు. అభిమాన నేత రాక కోసం పార్టీ శ్రేణులు, అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఘనంగా స్వాగత ఏర్పాట్లు: జగన్ పర్యటన కోసం మండలి చైర్మన్ మోషేనురాజు, పార్టీ నేతలు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. వివాహ వేదిక ఉన్న పెదఅమిరం రోడ్డు దారిపొడవునా స్వాగత ఫ్లెక్సీలతో ముంచెత్తారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలిరానున్నారు. హెలీప్యాడ్ పరిశీలన హెలీప్యాడ్ స్థలాన్ని బుధవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, భీమవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ చినమిల్లి వెంకటరాయుడు తదితరులు పరిశీలించారు. జగన్ను కలిసేందుకు భారీ ఎత్తున నేతలు తరలిరానుండటంతో ఏర్పాట్లపై సమీక్షించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేరిచర్ల నరసింహరాజు, జిల్లా అధికారప్రతినిధి కామన నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు తదితరులు పాల్గొన్నారు. మండలి చైర్మన్ మోషేనురాజు తనయుడి వివాహ వేడుకకు హాజరు -
సాగునీటి చెరువుల్లో మట్టి అక్రమ రవాణా
కొయ్యలగూడెం: యర్రంపేట–రాజవరం గ్రామాల మధ్య ఉన్న పులపాకుల చెరువు నుంచి బుధవారం మట్టి అక్రమ తరలింపు యథేచ్ఛగా కొనసాగింది. ఇప్పటివరకు రాత్రి వేళల్లో కొనసాగించిన మట్టి రవాణాపై సంబంధిత శాఖాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కులు పట్టపగలే రెచ్చిపోయారు. దీంతో రైతులకు మట్టి తోలకందార్లకు వాగ్వివాదం చోటుచేసుకుంది. మట్టి తోలకాలతో చెరువు గర్భం నాశనం అవుతుందని, భారీ గోతులు ఏర్పడి పశువులకు ప్రమాదకరంగా మారుతున్నాయని అక్రమార్కులతో ఘర్షణకు దిగారు. అంతేకాకుండా చెరువు నుంచి ఖరీఫ్ సీజన్లో పంట పొలాలకు సాగునీరు అందించే కాలువ గట్లు, కళింగ ప్రాంతం ధ్వంసమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుదకు తాము అనుకున్న కాడికి మట్టి తోలకలు పూర్తి అయిన తర్వాత జేసీబీలను, టిప్పర్లను తరలించుకు వెళ్లారని తతంగమంతా గంటల తరబడి ఉన్నప్పటికీ అధికార గణం అటువైపు చూడలేదని రైతులు ఆరోపించారు. -
నిరంతర శ్రమతోనే విజయం
ద్వారకాతిరుమల: ద్వారకానగర్లోని డీపాల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల పూర్వ విద్యార్థిని డాక్టర్ తలారి తేజస్విని గ్రూప్–1లో విజయం సాధించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా ఎంపికై ంది. భీమడోలుకు చెందిన ఆమెను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ప్రిన్సిపాల్ ఫాదర్ టోనీ మాట్లాడుతూ తమ పాఠశాల పూర్వ విద్యార్థిని తేజస్వినీ విద్యార్థులకు ఆదర్శప్రాయమన్నారు. క్రమశిక్షణ, నిరంతర శ్రమ, లక్ష్యంపై విశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. సిస్టర్ జాన్సీ, కెన్నెడీ, చాముండి, మీనా పాల్గొన్నారు. -
‘పది’ ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
భీమవరం: పదో తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో పదో తరగతి పరీక్షల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుఫై బుధవారం ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కచ్ఛితంగా అమలు చేయాలన్నారు. పాఠశాలలకు విద్యార్థులు సక్రమంగా హాజరయ్యేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నది తల్లిదండ్రులు గమనించాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, ఎంతమంది రైజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్ ఉన్నారు, మార్కులు ఎలా వస్తున్నాయి అనే అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ పరిశీలన చేశారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల హాజరు, సబ్జెక్టుల వారీగా పురోగతిపై మండలాల వారీగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్షించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, డిప్యూటీ విద్యాశాఖ అధికారులు ఎన్.రమేష్, ఎం.మురళి సత్యనారాయణ, ఎంఈఓలు, హెచ్ఎంలు పాల్గొన్నారు. -
అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం
భీమవరం: అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, దేశ ప్రయోజనాలకై ఐక్యంగా పోరాడుదామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక డా.బీఆర్.అంబేద్కర్ భవనంలో సీపీఎం ఆధ్వర్యంలో అమెరికా ట్రంప్ సుంకాలు, యుద్దోన్మాదం, ప్రపంచ శాంతి, సవాళ్లు అంశంపై సదస్సు జరిగింది. సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ అధ్యక్షత వహించిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా శ్రీనివాసరావు మాట్లాడారు. అమెరికా ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చలాయించాలని చూస్తోందని ఆరోపించారు. గతంలో అమెరికా సుంకాలు 5 శాతం మాత్రమే ఉండేవని, నేడు 18 శాతం పెంచిందన్నారు. ఇప్పటికే అమెరికా పేటెంట్ పేరుతో కోట్ల రూపాయలు ప్రపంచ దేశాల నుంచి దోచేస్తున్నారని గుర్తుచేశారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా, దేశ ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పక్షాలు ఒకే వేదిక పైకి వచ్చి మోడీని ప్రశ్నించాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కొనాల భీమరావు, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు, అంకెం సీతారాం, బి.బలరాం, దండు శ్రీనివాసరాజు, మెంటే పార్థసారథి, బి.వాసుదేవరావు, కేతా గోపాలన్, కర్రినాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
నైపుణ్యాలతోనే ఉద్యోగాలు
ఏలూరు (టూటౌన్): నైపుణ్యాలతో యువత ఉద్యోగాలు సాధించి తమ జీవితాలను మెరుగు పర్చుకోవాలని సీడాప్ సీఈఓ పి.నారాయణ స్వామి పిలుపునిచ్చారు. పరిశీలనలో భాగంగా ఆయన బుధవారం ఏలూరు జిల్లాలోని పలు శిక్షణా కేంద్రాలను సందర్శించారు. అనంతరం ఏలూరులో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. సందర్శనలో భాగంగా సీడాప్–డీడీయూజికేవై ఆధ్వర్యంలో నడుస్తున్న వివాస్, సీడాప్, ముండ్రు ఇన్ఫ్రా ప్రాజెక్టు, భూమిక మహిళా గిరిజన సొసైటీ శిక్షణ కేంద్రాలను ఆయన పరిశీలించారు. శిక్షణా కేంద్రంలోని మౌలిక సదుపాయాలు, వసతి, భోజన సౌకర్యాలను స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. శిక్షణ నాణ్యతను అంచనా వేసే క్రమంలో ప్రాక్టికల్ ల్యాబ్లను సందర్శించిన నారాయణ స్వామి, తంగెళ్ళమూడిలోని డీడీయూజికేవై శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న శిక్షణార్ధులకు యూనిఫార్మ్లు, వెల్కమ్ కిట్లను పంపిణీ చేశారు. స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ రాధాకృష్ణ, వి.సురేష్, జేడీఎం, డీఆర్డీఏ పీడీ టీవీ విజయలక్ష్మి పాల్గొన్నారు. నరసాపురం: ట్రాఫిక్ నిభంధనలు ఉల్లంఘించిన ఆరుగురు యువకులకు కోర్టు ఉత్తర్వుల ప్రకారం డీఎస్పీ డాక్టర్ శ్రీవేద ఆధ్వర్యంలో బుధవారం నరసాపురం అంబేడ్కర్ సెంటర్లో సామాజిక శిక్ష అమలు చేశారు. శిక్షపడ్డ వారిలో నలుగురిచే మైక్లో ట్రాఫిక్ నిబంధనలు చదివించారు. మరో ఇద్దరిచే ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మూడు గంటల పాటు ఈ కార్యక్రమం సాగింది. పట్టణ పరిధిలో ట్రాపిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఆరుగురు వ్యక్తులను నరసాపరం మేజిస్ట్రేట్ కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా భారతీయ న్యాయ సంహిత నూతన నిబంధన సెక్షన్ 4(ఎఫ్) కింద వారికి సామాజిక సేవ శిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చారని డీఎస్పీ చెప్పారు. ఒక్కొక్కరికి రూ.200 జరిమానాతో పాటు, బస్టాండ్ ఏరియా వంటి రద్దీ ప్రాంతాల్లో పోలీసులతో కలిసి మూడు గంటల పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విధుల్లో పాల్గొనాలని కోర్టు ఆదేశించిందని తెలిపారు. దీంతో శిక్షను అమలు చేసినట్టు వివరించారు. తణుకు అర్బన్: తణుకు రైల్వే అవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సుమారు 45 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి పైడిపర్రు డ్రైవర్స్ కాలనీ సమీపంలో రైలు పట్టాలపై పడి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందజేశారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా తల భాగం నుజ్జుయింది. రైల్వే ఎస్సై సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసినవారు 99084 48729, 90140 99132 నంబర్లలో సమాచారం ఇవ్వాలని కోరారు. -
మోగనున్న పెళ్లి బాజాలు
తణుకు అర్బన్, జంగారెడ్డిగూడెం: మూడుముళ్లతో ఏడడగులు నడుస్తూ అగ్ని సాక్షిగా వేదమంత్రోచ్ఛరణతో ఏర్పడే వివాహ బంధం కోసం ముహుర్తాలు ముంచుకొచ్చే వేళ దగ్గరపడింది. నిండు నూరేళ్లు విడదీయలేని జన్మజన్మల బంధాన్ని కలిపే మంచి ముహూర్తం కోసం వధూవరులు ఉవ్విళ్లూరుతున్నారు. ముహూర్తాల జాతర మూఢం అనంతరం వివాహాల వేడుకకు పండితులు ముహుర్తాలు సిద్ధం చేశారు. గత నాలుగు నెలలుగా ముహూర్తాలు లేకపోవడంతో కల్యాణాలు పెండింగ్లో పడ్డాయి. ఈనెల 17వ తేదీతో మూఢం ముగుస్తుండడంతోపాటు 2026 ఏడాది పొడవునా ముహూర్తాల జాతర ఉన్న నేపథ్యంలో వేల సంఖ్యలో వివాహాలు జరిగే పరిస్థితులు జిల్లాలో ఉన్నాయి. ఇప్పటికే కల్యాణ మండపాల కోసం వధూవరుల పెద్దలు వెతుకులాట చేపట్టారు. భారీ స్థాయిలో ముహుర్తాలు ఉన్న సందర్భంగా ఆలయాలు, కల్యాణ మండపాలు బుకింగ్ చేసుకుంటున్నారు. ముహూర్తం ఫిక్స్ అవ్వకపోయినా ముందస్తుగానే కల్యాణ మండపాలకు సిఫార్సులతో బుకింగ్లు చేసేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో సుమారుగా మూడు వేలకు పైగా వివాహాలు జరగనున్నట్లు పండితులు చెబుతున్నారు. ఈనెల 20 నుంచి కల్యాణ వైభోగం ఈ ఏడాదిలో ఫిబ్రవరి నెలలో ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. ఏడాది పొడవునా శుభ ముహూర్తాలు ఉండడంతోపాటు ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అధిక సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 20, 21, 24, 25, 26 తేదీల్లోను, మార్చిలో 1, 3, 4, 7, 8, 9, 11, 12 తేదీల్లోను, ఏప్రిల్లో 15, 20, 21, 25, 26,27, 28, 29 తేదీల్లోను, మే లో 1, 3, 7, 11 తేదీల్లోను, జూన్లో 21, 22, 23, 24, 25, 26, 27, 29, తేదీల్లోను, జూలైలో 1, 6, 7, 11 తేదీల్లోను, నవంబరులో 21, 24, 25, 26, 27, 30 తేదీల్లోను, డిసెంబరులో 1, 2, 3, 4, 6, 11, 12, 13 తేదీల్లో అధిక సంఖ్యలో పెళ్లిళ్లు ఉండనున్నాయి. కల్యాణ మండపాలకు డిమాండ్ రానున్న శుభ ముహూర్తాలకు కల్యాణ మండపాలు, హోటళ్లకు డిమాండ్ నెలకొంది. జిల్లాలో వందకుపైగా ఉన్న కల్యాణ మండపాల్లో భారీగా వివాహాలు జరిగేందుకు సిద్ధంగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే కల్యాణ మండపాలు ముందస్తు బుకింగ్లు అయిపోయాయి. మండపం స్థాయిని బట్టి రూ.50 వేలు నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతున్నట్లుగా తెలుస్తోంది. గిరాకీగా అనుబంధ వ్యాపారాలు పెళ్లిళ్ల కోసం జిల్లాకు వచ్చే బంధువులు, అతిథుల కోసం లాడ్జీలు, హోటళ్లు సైతం ముహుర్తాలున్న తేదీల్లో బుక్ అవుతున్నాయి. ఇక పెళ్లిళ్లకు అత్యంత ముఖ్యమైనది డెకరేషన్. వీటిలో ఫ్లవర్ డెకరేషన్కు రూ.30 వేలు నుంచి రూ.5 లక్షల వరకు ధరలు పలుకుతుండగా, జిల్లాలో తూర్పుగోదావరి జిల్లా, కడియం ప్రాంతంతోపాటు చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి సైతం తాజా పూల రకాలను తెప్పిస్తారు. సినీ హంగులతో భారీ సెట్టింగ్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా మూఢం కారణంగా గిరాకీ లేకుండా ఖాళీగా ఉన్న ఫొటోగ్రాఫర్లకు డిమాండ్ పెరగనుంది. వీడియో గ్రాఫర్స్, మిక్సింగ్ యూనిట్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. సుమారుగా రూ.50 వేలు నుంచి లక్షల్లో బేరాలు జరుగుతున్నాయి. పురోహితులకు క్రేజ్ వివాహాల ముహూర్తాలు దగ్గరపడడంతో పురోహితులు కూడా ముందస్తుగానే బుక్ అయిపోతున్నారు. వారికి కూడా విపరీతమైన డిమాండ్ నెలకొంది. అలాగే మంగళ వాయిద్యాలు వాయించే భజంత్రీలు, ఆర్కెస్ట్రాలు, ట్రావెల్స్కు సైతం కార్లు, బస్సుల కోసం ముందస్తుగానే రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. షామియానా వ్యాపారాలు కూడా ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా క్యాటరింగ్ సంస్థలు బిజీగా ఉండనున్నాయి. క్యాటరింగ్ కార్మికులకు డిమాండ్ పెరిగింది. శుక్ర మౌఢ్యమి నేపథ్యంలో మూడు నెలలుగా ముహూర్తాలు లేవు. దీంతో చాలా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పెళ్లి ముహూర్తాలు మెండుగా ఉన్నాయి. వచ్చే ఆరు నెలల కాలంలో అత్యధిక ముహూర్తాలు ఉండటంతో ఎక్కువ పెళ్లుళ్లు జరిగే అవకాశం ఉంది. అత్యధిక ముహూర్తాలతో పౌరోహిత్యం వహించే వారికి ఆర్థిక స్వావలంభన కలుగుతుంది. – గరిమెళ్ళ గంగాధర శాస్త్రి, జంగారెడ్డిగూడెం ఈనెల 20 నుంచి ముహూర్తాలు ఏడాది పొడవునా ముహూర్తాల జాతర వేల సంఖ్యలో జరగనున్న కల్యాణాలు పెళ్లి మండపాలకు, ఫొటోగ్రాఫర్లకు, పురోహితులకు గిరాకీ -
తేనెటీగల పెంపకంతో స్వయం సమృద్ధి
తాడేపల్లిగూడెం: ఆదాయ వనరుగా తేనెటీగల పెంపకాన్ని ఎంచుకుంటే ఆర్థిక స్వయం సమృద్ధి సాధించవచ్చని వక్తలు పేర్కొన్నారు. వెంకట్రామన్నగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న తేనెటీగల పెంపకం శిక్షణ ముగింపు కార్యక్రమం బుధవారం ముగిసింది. ఏడు రోజుల పాటు సాగిన శిక్షణలో తేనెటీగల పెంపకంలో జాగ్రత్తలు, ఎలాంటి ప్రాంతాల్లో పెంచాలి, మెళకువలు ఎలా తీసుకోవాలనే విషయాలను విశదీకరించారు. విస్తరణ సంచాలకులు డాక్టర్ రూత్ మాట్లాడుతూ రైతులు, ఆకాంక్ష కలిగిన వారు ఇలాంటి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు తేనెటీగల పెంపకాన్ని ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాలన్నారు. తేనెటీగల నుంచి తేనెతో పాటు మైనం, ఇతర ఉప ఉత్పత్తులు వస్తాయన్నారు. సంప్రదాయ పెంపకం గానే కాకుండా, వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. శిక్షణలో నేర్చుకున్న శాసీ్త్రయ అంశాలను వ్యవసాయ కార్యకలాపాల్లో వినియోగించుకోవాలన్నారు. కేవీకె సమన్వయకర్త డాక్టర్ పి.విజయలక్ష్మి, శాస్త్రవేత్తలు డాక్టర్ ఇమ్మానియేల్, డాక్టర్ ఆదర్శ, డాక్టర్లు ఉదయశ్రీ, బి.పెదబాబు పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్లను అందజేశారు. -
అదరగొట్టిన ఆంధ్రా జట్టు
ఏలూరు రూరల్: అంధుల క్రికెట్ పోటీలో ఆంధ్ర జట్టు విజయం సాదించింది. తెలంగాణ జట్టుపై 2 వికెట్ల తేడాతో గెలిచింది. బుధవారం ఏలూరు ఆశ్రం వైద్య కళాశాల ఆవరణలో అంధుల టి20 క్రికెట్ పోటీ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు నిర్ణీత ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. బ్యాట్స్మెన్ ఏ రవి 118 పరుగులతో సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. తర్వాత లక్ష్య చేధనకు దిగిన తెలంగాణ జట్టు 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. హతిక్ 75 పరుగులతో రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. మూడు మ్యాచ్ల సీరిస్లో భాగంగా ఆశ్రంలో మొదట మ్యాచ్ జరిగింది. పోటీల ప్రారంబోత్సవంలో ఆశ్రం సీఈఓ డాక్టర్ కె హనుమంతురావుతో పాటు సంగీత్ దర్శకుడు సందీప్రాజ్ క్రీడాకారులను అభినందించారు. అంధులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్బాబు. పోటీలకు సహకరించిన ఆశ్రం యాజమాన్యానికి నిర్వాహకులు కె మధన్, జయరాజు ధన్యవాదాలు తెలిపారు. అంధుల క్రికెట్లో పైచేయి -
ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా?
వివాహితపై యువకుడి దాడి ఉంగుటూరు బి–బ్లాకు అటవీ ప్రాంతంలో ఓ యువకుడు వివాహిత శరీరంలోని ప్రైవేట్ పార్టులను కాల్చేసి హింసించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 8లో u● రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ను తలపిస్తున్నాయి ● మాజీ హోం మంత్రి తానేటి వనిత ద్వారకాతిరుమల: ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అనే సందేహం కలుగుతోందని మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనిత పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి నియోజకవర్గ ముఖ్య నేతలతో కలసి మంగళవారం వెళ్లి పరామర్శించినట్టు ద్వారకాతిరుమలలో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమె వెల్లడించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై కూటమి దాడులు దారుణమని ఆమె మండిపడ్డారు. ఏపీలో పరిస్థితులను చూస్తుంటే బీహార్ను తలపిస్తున్నాయని, రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న, నిలదీస్తున్న, దీటుగా సమాధానం చెబుతున్న వారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద, వారి ఇళ్ల మీద, వారి ఆస్తుల మీద ఈ రకంగా దాడులు చేయడం దారుణమని పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ నిగ్గు తేల్చడంతో ఇలా డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని విమర్శించారు. జోగి రమేష్ను పరామర్శించినవారిలో పార్టీ నేతలు డి.బంగారమ్మ, బి.సాయికృష్ణ, పి.యోహాను, పి.ఏసుబాబు, జి.శ్రీను, కె.రుక్మిణీనాథ్, ఎం.చిట్టిబాబు తదితరులు ఉన్నారు. -
కాకినాడ టౌన్–తిరువన్నామలై మధ్య ప్రత్యేక రైళ్లు
ఏలూరు (టూటౌన్): కాకినాడ టౌన్–తిరువన్నామలై మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ట్రైన్ నెం.07617 కాకినాడ టౌన్–తిరువన్నామలై మధ్య ఈ నెల 14న, ట్రైన్ నెం.07618 తిరువన్నామలై–కాకినాడ టౌన్ మధ్య ఈనెల 16న నడుస్తుందన్నారు. ఈ రైలు కాకినాడ టౌన్లో బయలు దేరి సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరంటౌన్, ఆకివీడు, కై కలూలరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, వెల్లూరు స్టేషన్లలో ఆగనుంది. కాకినాడ టౌన్–హిస్సార్ మధ్య ప్రత్యేక సర్వీసులు కాకినాడ టౌన్–హిస్సార్ మధ్య 12 ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలియజేశారు.ట్రైన్ నెం.07705 కాకినాడ టౌన్–హిస్సార్ మధ్య ఈ నెల 19 నుంచి మార్చి 26 మధ్య ఆరు సర్వీసులు, ట్రైన్ నెం.07706 హిస్సార్–కాకినాడ టౌన్ మధ్య ఈ నెల 22 నుంచి మార్చి 29 మధ్య ఆరు సర్వీసులు నడుస్తాయని స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం: వరల్డ్ ట్రాన్స్ప్లాంట్ గేమ్స్ మెడలిస్ట్ ఎస్ఎన్ నాయుడు మరో ఘన విజయం సాధించారు. జంగారెడ్డిగూడెం అటవీశాఖ సెక్షన్ అధికారిగా పని చేస్తున్న నాగ వాసు నాయుడు సుంకర (ఎస్.ఎన్. నాయుడు) ఇటీవల పూణేలో నిర్వహించిన మాస్టర్స్ నేషనల్ గేమ్స్లో 5 కిలోమీటర్ల రేస్వాక్ పోటీలో రజత పతకం సాధించాడు. ఈ మేరకు ఎస్ఎన్ నాయుడును మంగళవారం అటవీశాఖ అధికారులతో పాటు, జంగారెడ్డిగూడెం అటవీశాఖ సెక్షన్ పరిధిలోని నాయకులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. ఏలూరు (టూటౌన్): ఆక్వా ఫీడ్ ధరలు పెంపు దారుణమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం ఏలూరు అన్నే భవనంలో ఆయన మాట్లాడుతూ ఫీడ్ తయారీ కంపెనీలు సిండికేట్ గా మారి ఏకపక్షంగా ఫీడ్ ధరలు పెంచడం తగదన్నారు. టన్ను ఫీడ్ కు రూ.4వే లు పెంచడం వలన ఉత్పత్తి ఖర్చులు పెరిగి ఆక్వా రైతులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో సోయాబీన్ వంటి రా మెటీరియల్ ధరలు బాగా తగ్గినప్పుడు ఫీడ్ ధరలు తగ్గించలేదని, ఇప్పుడు రా మెటీరియల్ ధర పెరిగిందని ధరలు పెంచుతున్నట్లుగా కంపెనీలు చెప్పడం అన్యాయమన్నారు. ఇప్పటికై నా పెంచిన ఫీడ్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పోలవరం రూరల్: పట్టిసం మహాశివరాత్రిఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం చేసే ఏర్పాట్లు అధికారులు సమన్వయంతో పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ తెలిపారు. పోలవరం మండలం పట్టిసం శివక్షేత్రం వద్ద రెండవ దఫా సమావేశం మంగళవారం ఉత్సవ కమిటీ ఛైర్మన్, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవీ రమణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు అధికార యంత్రాంగం పటిష్టమైన పనులు చేపట్టాలన్నారు. శాఖల వారీగా నిర్ధేశించిన పనులు ఎంత వరకు పూర్తయ్యాయనే విషయాలను సంబంధిత అధికారులతో సమీక్షించారు. వాహనాల పార్కింగ్కు అనువైన ప్రాంతాలను గుర్తించాలన్నారు. నదిలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర సమయాల్లో నది దాటేందుకు స్పీడ్ బోట్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఐటీడీఏ పీఓ రాములునాయక్, ఆర్టీసీ ఆర్ఎం సబ్నమ్, వంశపారంపర్య ధర్మకర్త కె.వీరభద్రరావు, డీఎల్పీఓ సుబ్బారాయుడు, తహసీల్దార్ ఆర్ఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
దేవుని భూమికే శఠగోపం
దేవుడికే శఠగోపం పెట్టి ఆలయ భూముల్ని చేపల చెరువుల్లో కలిపేసుకున్న ఉదంతమిది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు విషయం బయటకు పొక్కడంతో దేవదాయ అధికారులు హడావుడిగా గతంలోని కౌలు లీజును రద్దుచేశారు. చెరువు, పొలం కౌలులీజుకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అయితే చెరువు మధ్యలో ఉన్న దేవస్థానం భూముల సరిహద్దులను అధికారులు ఏ విధంగా నిర్ణయిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. సాక్షి, భీమవరం, నరసాపురం రూరల్: కొప్పర్రులోని శ్రీసీతారామస్వామివారికి 468/2 సర్వే నంబరులో 1.32 ఎకరాలు, 456/1లో 1.52 ఎకరాలు, 458/1లో 1.60 ఎకరాల సాగు భూమి ఉంది. వీటిని కొందరు కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నారు. ఈ భూములు చుట్టు పక్కల గల సుమారు 30 ఎకరాల పొలాలను యజమానులు చెపల చెరువు నిమిత్తం లీజుకు ఇచ్చేశారు. ఏకమొత్తంగా చెరువు తవ్వేందుకు మధ్యలో దేవస్థానం భూములు అడ్డంగా మారాయి. స్థానిక నేత, దేవాదాయ సిబ్బంది అండదండలతో ఈ భూములను చేపల చెరువు కోసం అప్పగించేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవస్థానం భూముల్ని చెరువులో కలిపేసుకుని ఆక్వా సాగుచేస్తున్నారు. పీజీఆర్ఎస్లో ఫిర్యాదు నిబంధనలకు విరుద్ధంగా దేవస్థానం భూమిని చెరువులో కలిపేయడం పట్ల గ్రామానికి చెందిన ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు యాదంరెడ్డి సూరిబాబు, బ్రహ్మాజీలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. కొద్దిరోజుల క్రితం విషయం బయటకు పొక్కడంతో ఆలయ అధికారులు హుటాహుటీన పాత లీజును రద్దుచేసి రానున్న మూడేళ్ల కాలానికి కౌలు హక్కుల నిమిత్తం ఈనెల 12వ తేదీన టెండర్, బహిరంగ వేలంకు ప్రకటన విడుదల చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. చెరువులో దేవాలయ భూములు ఎక్కడున్నది సరిహద్దులు నిర్ణయించకుండా బహిరంగ వేలం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. చెరువు లీజుదారులకు మేలు చేసే ఉద్దేశ్యంలో అధికారులు ఉన్నారన్న ఆరోపణలున్నాయి. ఆలయ భూముల సరిహద్దులు నిర్ణయించిన తర్వాతనే వేలం నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అయితే చెరువులో సరిహద్దులు ఏ విధంగా నిర్ణయిస్తారనేది తేలాల్సి ఉంది. దీంతో ఈ వ్యవహరాన్ని మసిపూసి మారేడుకాయ చేసే పనిలో కొందరు వ్యక్తులు ఉన్నట్టు సమాచారం. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించి ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ వి.సూర్యప్రకాష్ను సంప్రదించగా తన దృష్టికి రాలేదని, పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘‘నరసాపురం రూరల్ కొప్పర్రులో దాదాపు 35 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ చెరువును గమనించారా? ఏడాది క్రితం వరకు ఇక్కడే గ్రామంలోని దేవస్థానంకు చెందిన 4.44 ఎకరాల పంట పొలాలు ఉండేవి. కౌలుసాగు నిమిత్తం దేవస్థానం వాటిని లీజుకు ఇచ్చింది. చుట్టూ ఉన్న పంట పొలాలను ఏక ప్లాటుగా ఆక్వా చెరువు తవ్వుకునేందుకు భూ యజమానులు ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చారు. స్థానిక కూటమి నేతల అండదండలతో మధ్యలోని దేవాదాయ భూములను అడ్డగోలుగా తవ్వేసి చేపల చెరువులో కలిపేసుకుని ఆక్వాసాగు చేస్తున్నారు’’. కొప్పర్రులో కూటమి నేతల నిర్వాకం 4.44 ఎకరాల సీతారామస్వామి ఆలయ పంట పొలాల్ని చేపల చెరువుకు ఇచ్చేసిన వైనం అడ్డగోలుగా ప్రైవేట్ వ్యక్తుల చెరువులో కలిపేసి ఆక్వాసాగు విషయం బయటకు పొక్కడంతో హడావుడిగా లీజు రద్దు -
మానసిక వికలాంగురాలిపై అత్యాచారం
చింతలపూడి: మానసిక వైకల్యంతో ఉన్న యువతిపై అమానుషానికి ఒడిగట్టిన కామాంధుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. చింతలపూడి సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జంగారెడ్డిగూడెం ఇన్చార్జి డీఎస్పీ యు.రవిచంద్ర కేసు వివరాలను వెల్లడించారు. చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి మానసిక వైకల్యంతో బాధపడుతోంది. దీనిని ఆసరాగా చేసుకున్న అదే గ్రామానికి చెందిన కొప్పుల ఏసు అనే వ్యక్తి ఆమె తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి పలుమార్లు యువతిపై అత్యాచారం చేశాడు. యువతికి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఎవరికీ చెప్పుకోలేదని, ఆ ధీమాతోనే నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని డీఎస్పీ తెలిపారు. రెండు నెలల తర్వాత యువతిలో శారీరక మార్పులను గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షల్లో ఆమె రెండు నెలల గర్భవతి అని తేలడంతో, కుటుంబ సభ్యులు గతేడాది డిసెంబర్ 13న పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన బాధిత యువతిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనుమానితులను అదుపులోకి తీసుకుని సాంకేతిక పరిజ్ఞానం, డీఎన్ఏ పరీక్షల ద్వారా నేరాన్ని శాసీ్త్రయంగా ధ్రువీకరించారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. నిందితుడిని పట్టుకున్న చింతలపూడి సీఐ క్రాంతికుమార్, ఎస్సై సతీష్ కుమార్, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు. -
కొల్లేరు తాబేళ్ల అక్రమ రవాణా
కామాంధుడి అరెస్ట్ మానసిక వైకల్యంతో ఉన్న యువతిపై అమానుషానికి ఒడిగట్టిన కామాంధుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. 8లో uబుధవారం శ్రీ 4 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026కై కలూరు: కొల్లేరు తాబేళ్లు.. స్మగ్లర్లుకు రూ.కోట్ల అదాయ వనరుగా మారాయి. కొల్లేరు ప్రాంతంలో సేకరించిన తాబేళ్లను ఒడిశాకు అక్రమ రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. చెక్పోస్టుల వద్ద అధికారులు తూతూమంత్రంగా దాడులు నిర్వహిస్తుండడంతో తాబేళ్ల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. సాధారణంగా తాబేళ్లు పంట బోదెలు, కాలువలు, డ్రెయిన్లలో లభిస్తాయి. కొల్లేరు ప్రాంతంలో ఆక్వా చెరువుల్లో ప్రవేశించడంతో ఇక్కడ ఎక్కువ సంఖ్యలో జీవిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం ఆక్వా సాగు 2.90 లక్షల ఎకరాల్లో సాగువుతోంది. ఆక్వా హబ్గా పేరుగడించిన కై కలూరు నియోజకవర్గంలో 84,734 ఎకరాల్లో చేపలు, రొయ్యల సాగు చేస్తున్నారు. ఇక్కడ ఆక్వా చెరువుల పట్టుబడుల సమయంలో తాబేళ్లు సేకరణ వలల మేసీ్త్రల ద్వారా జరుగుతోంది. ఆక్వా రైతులు సైతం ఇవి ఉపయోగం లేవని వలల రైతులను తీసుకువెళ్లమంటున్నారు. తాబేళ్ల సేకరణ ఇలా.. ఒడిశాకు చెందిన కుమార్ అనే వ్యక్తి కై కలూరు ప్రాంతంలో కొందరు యువకులతో కలసి తాబేళ్లను అక్రమ రవాణా చేశాడు. ఏపీ, ఒడిశాలో అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఒడిశాకు కొన్ని సంవత్సరాల క్రితం మకం మార్చాడు. అతని శిష్యులు స్మగ్లింగ్ వ్యాపారాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నారు. ఇందులో కొరుకొల్లు గ్రామ సమీప బొబ్బిలిగూడెంకు చెందిన ఓ వ్యక్తి కీలకసూత్రధారిగా ఉన్నాడు. ఇతని ఆదేశాలతో కై కలూరు మండలం ఆలపాడు, వింజరం, శీతనపల్లి, దొడ్డిపట్ల, వేమవరప్పాడు, రామవరం, కలిదిండి మండలం, వెంకటాపురం, గొల్లగూడెం, సానారుద్రవరం, కోరుకొల్లు, బొబ్బిలిగూడెం, ఆరుతెగలపాడు, చింతలమోరు, మండవల్లి మండలం, చింతపాడు, కొవ్వాడలంక, పులపర్రు, దెయ్యంపాడు, ముదినేపల్లి మండలంలో వడాలి, బొమ్మినంపాడు గ్రామాల్లో తాబేళ్లను సేకరిస్తున్నారు. మరికొన్ని డ్రెయిన్లలో సేకరించిన వారి నుంచి కొనుగోలు చేస్తున్నారు. అక్కడక్కడ గోనెసంచులలో వీటిని ఉంచి రాత్రి వేళల్లో వ్యాన్లో లోడింగ్ చేసి పంపుతున్నారు. రాష్ట్ర సరిహద్దులు దాటించేది ఇలా.. కై కలూరు కొల్లేరు ప్రాంతాల్లో సేకరించిన తాబేళ్లను సైజుల బట్టి ఇక్కడ రూ.30 నుంచి రూ.60కి కొనుగోలు చేస్తున్నారు. ఒడిశా మార్కెట్లో వీటిని రూ.400 నుంచి రూ.500కు విక్రయిస్తున్నారు. వారానికి రెండు వాహనాలు కలిదిండి మండలం కోరుకొల్లు, కాళ్ల, భీమవరం, రాజోలు మీదుగా ఒడిశా చేరుతున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా వాహనంలో అడుగున గురకలు ఉంచి మధ్యలో తాబేళ్లను పేర్చి తిరిగి పైన గురకలు వేసి సంచులతో కడుతున్నారు. అనేక చెక్పోస్టులు దాటి ఒడిశాకు తాబేళ్లు ఎలా చేరుతున్నాయనేది లక్ష డాలర్ల ప్రశ్నగా మారింది. కొద్ది రోజుల క్రితం రామవరం దొడ్డిపట్ల ప్రాంతాల్లో రోడ్డు పక్కన సంచుల్లో తాబేళ్లను కొందరూ గుర్తించారు. తాబేళ్లు ఉభయజలచరాలు. ప్రకృతితో అత్యంత ప్రాధాన్యత కలిగిన వీటిని షెడ్యూల్ 1లో చేర్చారు. వీటి రవాణా నేరం. టోరిటోరియల్ అధికారులకు సమాచారం అందించాలి. అటవీశాఖ సిబ్బందిని తాబేళ్లు అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆదేశాలిచ్చాం. త్వరలో స్మగ్లర్లను అదుపులోకి తీసుకుంటాం. – కేపీ.రామలింగాచార్యులు, కై కలూరు ఫారెస్ట్ రేంజర్ కూటమికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం ఎమ్మెల్సీ ఇజ్రాయేల్ ఒడిశాకు తరలిస్తున్న స్మగ్లర్లు చేపలు, రొయ్యల చెరువుల పట్టుబడుల సమయంలో తాబేళ్ల సేకరణ వారానికి రెండు వ్యాన్లలో రాష్ట్ర సరిహద్దులు దాటుతున్న వైనం అక్రమ రవాణాను అడ్డుకోలేని అధికారులు చెక్పోస్టుల వద్ద తూతూమంత్రంగా దాడులు అంతరిస్తున్న తాబేళ్లు షెడ్యూల్ 1 జాబితాలో చేర్పు అంతరించిపోతున్న తాబేలు జాతిని అన్ని దేశాలు షెడ్యూలు–1 కేటగిరీలో చేర్చాయి. వస్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం తాబేళ్లను వేటాడినా, పెంపుడు జంతువులుగా పెంచినా, రవాణా చేసిన జరిమానాతో పాటు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) వీటి సంతతి అంతరిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. కొల్లేరు ప్రాంతంలో లభిస్తున్న తాబేలును భారతీయ ఫ్లాష్షెల్ తాబేలు (లిస్సీమిస్ పంక్టాటో) అంటారు. ఇది మంచినీటి తాబేలు కావడంతో అసోం, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో స్పెషల్ డిష్గా శుభాకార్యాల్లో ఉపయోగిస్తున్నారు. -
ముగిసిన నారసింహుని కల్యాణోత్సవాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణ మహోత్సవాలు మంగళవారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిశాయి. భీష్మ ఏకాదశి పర్వదినం మొదలుగా ఆరు రోజులపాటు ఈ ఉత్సవాలను స్మార్త ఆగమ యుక్తంగా, పాంఛాహ్నిక దీక్షతో ఆలయ పండితులు, అర్చకులు కన్నులపండువగా నిర్వహించారు. ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఆలయానికి అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించి తీర్ధప్రసాదాలతో పాటు, అన్నప్రసాదాన్ని స్వీకరించారు. రాత్రి ఆలయంలో శ్రీపుష్ప యాగోత్సవ వేడుకను నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు రాత్రి ఆలయంలో స్వర్ణ శేష వాహనంపై 12 ప్రదక్షిణలు, 12 సేవా కాలాలు, 12 రకాల పిండి వంటలతో నివేదనలు చేశారు. అనంతరం శ్రీపుష్ప యాగోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఏలూరు టౌన్: నగరంలో జంతు కళేబరాలు, కొవ్వుతో నూనె తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్న పలు ప్రాంతాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. ఏలూరు విజిలెన్స్ సీఐ గంగాభవానీ తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు నగరంలో నాలుగు బృందాలుగా విజిలెన్స్ అధికారులు దాడులు చేశారని, ఏలూరు ఆదివారపుపేట మార్కెట్లో, లంకపేట సమీపంలో దాడులు చేసిన 15 లీటర్ల నూనె డబ్బాలు 26 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇద్దరు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ఏలూరు టూటౌన్ పోలీసులకు అప్పగించామని తెలిపారు. అలాగే కామవరపుకోట ప్రాంతం నుంచి ఒక వ్యక్తి ఏలూరు వచ్చి ఈ నూనెను తయారు చేస్తున్నారని, 15 కిలోల నూనె డబ్బా రూ.700లకు విక్రయిస్తున్నారని గుర్తించామన్నారు. ఏలూరు ఫుడ్సేఫ్టీ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ నూనెను సబ్బులు, కొవ్వొత్తుల తయారీలోనూ వినియోగిస్తున్నట్లు గుర్తించామనీ, కానీ సరైన ఆధారాలు లభించలేదన్నారు. -
రైతులకు చుక్కలు చూపిస్తున్న ఎలుకలు
● రబీ ప్రారంభంలోనే పెరిగిన ఎలుకల బెడద ● అవగాహన కల్పిస్తున్న వ్యవసాయాధికారులు పాలకొల్లు సెంట్రల్: రబీసాగుకు తొలిదశలోనే ఎలుకల బెడద మొదలైంది. వరిపంటను నాశనం చేస్తూ రైతులకు ఎలుకలు చుక్కలు చూపిస్తున్నారు. చెందుతున్నారు. వ్యవసాయ డివిజన్ పాలకొల్లు, పోడూరు, ఆచంట మండలాల్లో, అలాగే నియోజకవర్గ స్థాయిలో లెక్కిస్తే యలమంచిలి మండలంలో మొత్తం కలిపి సుమారు 40,500 ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. ప్రస్తుతానికి పంట మొదటి దశలో ఉండడంతో తొలిదశలోనే ఎలుక దాడి చేయడంతో రైతులు కంటిమీద కునుకులేకుండా ఉన్నారు. ఎన్ని రసాయన మందులు పిచికారీ చేస్తున్నా ఎలుకలు మాత్రం నియంత్రించడం సాధ్యం కావడంలేదని రైతులు వాపోతున్నారు. ముందుగా ఊడ్చిన, వెదజల్లిన ప్రాంతాల్లో వరిమొనలను నాశనం చేస్తున్నాయని వాపోతున్నారు. ఫలితాలు ఇవ్వని నివారణ చర్యలు ఎలుకలను నివారించడానికి రైతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కావడంలేదు. వరి నూకలను నూనె రసాయనిక మందులను తగిన మోతాదులో కలిపి పొట్లాలు కలిపి ఎలుక కన్నాల్లో పెడుతున్నా పలితం లేదంటున్నారు. దాంతో ఎలుకల బుట్టలు లేదా పొగబెట్టే విధానంలో ముందుకు వెళ్దామన్నా అది అధిక ఖర్చుతో కూడకున్న పని కావడంతో రైతులు వ్యవసాయశాఖ అధికారుల సూచనలపై ఆధారపడ్డారు. వ్యవసాయశాఖ అధికారులు ఎలుకల నివారణ కోసం రైతులకు అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారు. నూకలు, నూనెలతో పాటు ప్రభుత్వం ఉచితంగా అందించే బ్రోమోడయోలిన్ మందును కలిపి పెట్టడం వల్ల ఫలితం కనిపిస్తుందని చెబుతున్నారు. విషపు ఎర తయారీ విధానం 480 గ్రాముల నూకలకు 10 గ్రాముల నూనె కలిపి దానికి 10 గ్రాముల బ్రోమోడయోలిన్ పొడి మందు కలిపితే 500 గ్రాముల విషపు ఎర తయారవుతుంది. ఈ పొడి మందు 10 గ్రాముల చొప్పున కాగితంతో పొట్లాలు కట్టుకోవాలి. ఆ విధంగా పొట్లాలు కట్టుకొని ఒకొక్క ఎలుక కన్నానికి ఒకొక్క పొట్లం చొప్పున ఉంచుకోవాలి. మొదటి రోజు ఎలుక కన్నాలను మట్టితో పూడ్చాలి. రెండవ రోజు తెరువబడిన కన్నాలను బ్రోమోడయోలిన్ విషపు ఎర పొట్లాన్ని కన్నానికి ఒకటి చొప్పున ఉంచాలి. పదో రోజు తెరిచి ఉన్న కన్నాలను గుర్తించి మళ్లీ బ్రోమోడయోలిన్ పొట్లాన్ని బొరియ దగ్గర ఉంచాలి. పదిహేనో రోజు తెరిచిన కన్నాలను లెక్కించి ఫలితాన్ని గమనించుకోవాలి. మందు కలిపినప్పుడు చేతులకు గ్లౌజులను వేసుకోవాలి. మందు విషపూరితం కాబట్టి తయారు చేసిన రోజునే బోరియల దగ్గర ఉంచాలి. పిల్లలకు, పశువులకు అందుబాటులో లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విరుగుడు మందు విటమిన్ కే–1 ను అందుబాటులో ఉంచుకోవాలి. రైతులు ఆయా పరిధిలో ఉన్న వ్యవసాయ విస్తరణాధికారి, మండల వ్యవసాయాధికారి సూచనలు పాటిస్తూ సామూహికంగా ఎలుకల నివారణా కార్యక్రమాన్ని చేపడితే పలితాలు ఆశించవచ్చని అధికారులు చెబుతున్నారు. సమర్థ ఎలుకల నివారణకు విషపు ఎరను ఉంచడంతోపాటు యాంత్రిక, సేద్య పద్ధతులను కూడా అనుసరించాలని సూచిస్తున్నారు. ఎలుకలను నివారించేందుకు సామూహిక ఎలుకల నివారణా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. గ్రామస్థాయిలో రైతులకు అవగాహనా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. బ్రోమోడయోలిన్ 0.25 సీబీ ఎలుకల మందు ఉచితంగా రైతులకు పంపిణీ చేస్తున్నాం. ఎర తయారీకి అవసరమైన నూకలు, నూనె రైతులు సేకరించుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు, పోరంబోకు స్థలాల్లో పెట్టే ఎరకు అయ్యే ఖర్చును గ్రామ పంచాయితీలే భరించాలి. 500 గ్రాముల విషపు ఎర సుమారుగా 2.5 ఎకరాల పొలంలో ఉండే 50 కన్నాలకు సరిపోతుంది. – మురళీకృష్ణ, సహాయ సంచాలకుడు, పాలకొల్లు -
భూసేకరణ వేగిరపర్చాలి
ఏలూరు(మెట్రో) : జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి సోమవారం పోలవరం ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ పునరావాస కార్యక్రమాలు, జాతీయ రహదారుల నిర్మాణం, సెల్ఫోన్ నెట్వర్క్ టవర్ల ఏర్పాటు, ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు నిమిత్తం భూసేకరణపై అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భీమవరం: చంద్రబాబు ప్రభుత్వంలో కూటమి నాయకుల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయని, ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, వైఎస్సార్సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు ధ్వజమెత్తారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజినీ, జోగి రమేష్లపై దాడులను ఖండిస్తూ సోమవారం రాయలం గ్రామంలోని వెంకటరాయుడు నివాసంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజాసమస్యలను గాలికి వదిలి వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులే పరమావిధిగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని నిగ్గుతేలడంతోపాటు విశాఖలో కోట్లాది రూపాయల వి లువ చేసే భూములను అప్పనంగా ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుడికి కట్టబెట్టడం వంటి వ్యవహారాల్లో కూటమి పార్టీలకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు వైఎస్సార్సీపీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో భయాందోళనలు కలిగించి కూటమి నేతలు లబ్ధి పొందాలని చూస్తున్నారని, అయితే దాడులు, కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులకు నిరసనగా పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం భీమవరం డీఎస్పీ రఘు వీర్విష్ణును కలిసి వినతిపత్రం అందజేశారు. తాడేపల్లిగూడెం రూరల్: గత వైఎస్సార్సీపీ ప్రభు త్వం అమలు చేసిన నవరత్నాలు పథకాల ద్వారా లబ్ధి పొందిన యువతి గ్రూప్–1 పరీక్షల్లో సత్తాచాటింది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ విభాగంలో కొలువు సాధించింది. పెదతాడేపల్లికి చెందిన జాలాది రమ్యశ్రీ గత ప్రభుత్వం అందించిన విద్యాదీవెన సాయం ద్వారా బీటెక్ పూర్తిచేసింది. గ్రూప్–1 పరీక్ష సన్నద్ధతకు అవసరమైన ఆర్థిక సాయాన్నీ నాటి జగన్ ప్రభుత్వం అందించింది. దీంతో గ్రూప్–1 పరీక్షల్లో ప్రతిభ కనబర్చింది. ఆమె తండ్రి కుటుంబరావు ప్రైవేట్ డ్రైవర్ కాగా తల్లి సునీత అంగన్వాడీ టీచర్. అక్క మౌనిక వెల్లమిల్లి ఆర్ఎస్కేలో వీఏఏగా, మరో సోదరి మనీష హైదరాబాద్లో పనిచేస్తున్నారు. రమ్య శ్రీ పెదతాడేపల్లి శ్రీరామా విద్యానికేతన్ పూర్వ విద్యార్థిని కాగా ప్రిన్సిపాల్ ఎ.వీరవెంకటసుబ్బరాజు ఆమెను అభినందించారు. భీమవరం(ప్రకాశం చౌక్): విద్యుత్ మీటర్ రీడర్లు సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో ధర్నా చేయడంతో రెండు రోజులుగా జిల్లాలో విద్యుత్ మీటర్ల రీడింగ్ నిలిపోయింది. జిల్లాలో సుమారు 500 మంది మీటర్ రీడర్లు ఉన్నారు. భీమవరం డివిజన్లో 2,09,970, నరసాపురం డివిజన్లో 2,24,354, తాడేపల్లిగూడెం డివిజన్లో 2,19,440 మొత్తంగా 6,53,764 సర్వీసులకు సంబంధించిన బిల్లింగ్ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో శ్లాబ్ రేట్లు మారి బిల్లులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వినియోగదారులు అంటున్నారు. భీమవరం: సమస్యల పరిష్కారం కోసం పోలీసులను ఆశ్రయించే బాధితులకు పోలీసు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి వారికి అండగా నిలవాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. సోమవారం భీమవరం వన్టౌన్ పోలీసుస్టేషన్ వద్ద నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులు స్వీకరించి ఆయా స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వినతులు సమగ్రంగా పరిశీలించి శాత్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఏఎస్పీ వి.భీమారావు, డీఎస్పీ రఘువీర్విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
గంగానమ్మకు నీరాజనం
ఏలూరు (ఆర్ఆర్పేట): చల్లని తల్లి.. సిరులు కురి పించే కల్లవల్లి.. ఏలూరు నగర ఆరాధ్య దేవత గంగానమ్మవారి జాతర మహోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. పడమర వీధి గంగానమ్మవారి జాతరలో భాగంగా అమ్మవారికి సోమవారం నగరవాసులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఏడేళ్లపాటు నీరాక కోసం ఎదురుచూస్తాం గంగానమ్మ అంటూ ఇంటింటా నీరాజనాలు అర్పించారు. సుమారు వంద రో జులపాటు ప్రత్యేక పూజలు, నైవేద్యాలతో కొలిచిన అమ్మవారిని కొర్లబండిపై నగర శివార్లకు సాగనంపే ప్రక్రియ నేత్రపర్వంగా జరిగింది. ఊరేగింపులో కొర్లబండిపై అమ్మవారి వేషధారణలో పంబల వారు కూర్చొని భక్తులకు కుంకుమబొట్లు పెడుతూ ఆశీర్వదిస్తూ ముందుకు సాగారు. తీన్మార్ డప్పు లు, బుట్టబొమ్మలు, శక్తివేషాలు, డీజేలు, కోయ, శాసీ్త్రయ, జానపద నృత్యాలతో ఊరేగింపు జనసంద్రాన్ని తలపించింది. ఉదయం 10 గంటల సమయంలో ప్రారంభమైన కొర్లబండి ఊరేగింపు రాత్రి 7.30 గంటలకు సగం దూరం కూడా పూర్తికాలేదు. పడమర వీధిలో అమ్మవారి మేడల నుంచి మొదలైన ఊరేగింపు కుండీ సెంటర్, గడియార స్థంభం సెంటర్, మెయిన్బజార్, బిర్లా భవన్ సెంటర్, వైఎంహెచ్ఏ హాలు, రామకోటి ప్రాంగణం, అంబికా సెంటర్ మీదుగా ఓవర్బ్రిడ్జి డౌన్లోని జ్యూట్మిల్లు వద్దకు చేరుకోవడానికి దాదాపు తొమ్మిది గంటలు పట్టింది. నగరం.. భక్త జన సంద్రం కొర్లబండి ఊరేగింపును తిలకించడానికి లక్ష మందికి పైగా భక్తులు వచ్చినట్టు అంచనా. నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆటోలు, ట్రా క్టర్లు, కార్లు, ద్విచక్రవాహనాల్లో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వీరితో పాటు ఇప్పటికే నగరానికి వచ్చిన అతిథులు, నగర ప్రజలతో ఊరంతా జన ఉప్పెనను తలపించింది. ఊరేగింపుతో నగరం అష్టదిగ్బంధమైంది. ఎటు చూసినా భక్తులతో నిండిపోవడంతో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చెమటోడ్చారు. అమ్మవారి ఊరేగింపు జ్యూట్మిల్లు ప్రాంతాన్ని దాటిన తరువాత ట్రాఫిక్ను వదిలారు. స్థానిక ఓవర్బ్రిడ్జిపై ప్రజలు వేలాదిగా నడుచుకుంటూ తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సి వచ్చింది. అలా గే కై కలూరు రోడ్డు, పెదపాడు రోడ్డు, పాతబస్టాండు సెంటర్, వంగాయగూడెం సెంటర్, విజయ విహార్ సెంటర్, రైల్వే ట్రాక్ రోడ్డు, రాజీవ్ స్నేహవారధి ఇలా ఎక్కడ చూసినా కోలాహలమే కనిపించింది. ఆయా మార్గాల్లో కిలోమీటరు దూరం వెళ్లడానికి గంటకు పైగా సమయం పట్టింది. శక్తి వేషాలు కొర్లబండిలో పంబల వారు భక్త జన ఉప్పెన ఏలూరులో జన జాతర నేత్రపర్వంగా కొర్లబండిపై ఊరేగింపు నగరం అష్టదిగ్బంధనం అమ్మవారికి ఘనంగా వీడ్కోలు -
ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్
రూ.25 వేలు తీసుకుంటూ పట్టుబడిన వైనం తణుకు అర్బన్: హెడ్ కానిస్టేబుల్ రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంఘటన తణుకు పట్టణ పోలీస్స్టేషన్లో సోమ వారం రాత్రి చోటుచేసుకుంది. చీటింగ్కి సంబంధించి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ నమోదు చేయకుండా ఉండాలంటే రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఘటనలో హెడ్ కానిస్టేబుల్, స్టేషన్ రైటర్ కె.సుబ్బారావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని రూ.25 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ జీవీ కృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన జక్కంశెట్టి మావుళ్లేశ్వరరావు అనే వ్యక్తి మరో నలుగురు వ్యక్తులతో కలిసి ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశారని తణుకుకి చెందిన రావిపాటి నాగదేవి అనే మహిళ కలెక్టర్ను ఆశ్రయించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తణుకు పట్టణ పోలీస్స్టేషన్లో తప్పుడు కేసు నమోదు చేయించారని ఆ కేసుకు సంబంధించి 41 నోటీసు ఇచ్చేలా హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు రూ.25 వేలు డిమాండ్ చేశారని, పట్టణ సీఐ ఎన్.కొండయ్యకు రూ.20 వేలు, సుబ్బారావుకు రూ.5 వేలు అని డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏలూరు ఏసీబీ డీఎస్పీని ఆశ్రయించారు. ఈనెల 1న కేసు నమోదుచేసిన డీఎస్పీ సోమవారం రాత్రి మావుళ్లేశ్వరరావు రైటర్ సుబ్బారావుకు స్వయంగా రూ.25 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో తణుకు సీఐ ఎన్.కొండయ్యకు రూ.20 వేలు ఇవ్వాలన్న వ్యవహారంపై సీఐ పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నామని, నింది తుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు వెల్లడి ంచారు. దాడిలో ఏసీబీ సీఐలు కె.శ్రీనివాస్, ఎం.బాలకృష్ణ, సిబ్బంది ఉన్నారు. -
చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యత
కై కలూరు: చిత్తడి నేలలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాజమండ్రి సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు బీఎన్ఎన్.మూర్తి చెప్పారు. వరల్డ్ వైడ్ ఫండ్(డబ్ల్యూడబ్ల్యూఎఫ్), అటవీశాఖ సంయుక్తంగా ఆటపాక పక్షుల కేంద్రంలో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సోమవారం నిర్వహించింది. నేషనల్, జాగృతి, ఆక్స్ఫర్డ్, ఏలూరు పీపుల్ ఉడ్స్, శృంగవరప్పాడు, వడాలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ స్టేట్ డైరెక్టర్ ఫరిదా టంపల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథి అటవీశాఖ సీసీఎఫ్ మూర్తి మాట్లాడుతూ విదేశీ పక్షులు 30,000 కిలోమీటర్లు ప్రయాణించి శీతాకాలంలో ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం కొల్లేరు చిత్తడి నేలలే అన్నారు. ప్రస్తుతం కొల్లేరులో 40 లక్షల నుంచి 50 లక్షల పక్షులు ఉన్నాయన్నారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ స్టేట్ డైరెక్టర్ ఫరిదా టంపల్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు తడి నేలలు – సంప్రదాయ జ్ఞానం, సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం అనే నినాదంతో జరుగుతున్నాయన్నారు. జిల్లా అటవీశాఖ అధికారిణి బి.విజయ కొల్లేరులో జీవవైవిద్యం గురించి అందరూ తెలుసుకోవాలన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఫారెస్టు రేంజర్ రామలింగాచార్యులు, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లీడ్ పార్టనర్ బీఎస్ఎం.శ్రీనివాస్, నిర్వాహకులు ఎంఎస్.తిరుమలేశ్వరరావు, శశాంక్, ఇన్చార్జి డీఆర్వో రాంబాబు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, ఫారెస్టు సిబ్బంది హాజరయ్యారు. ఆటపాక పక్షుల కేంద్రంలో చిత్తడి నేలల దినోత్సవం -
సరిపల్లిలో భారీ చోరీ
కొయ్యలగూడెం: ఇంట్లో ఎవరూ లేని సమయంలో పట్టపగలు ఆగంతకులు ఇంటి తలుపులు పగలకొట్టి బీరువాలో ఉన్న నగలు నగదు అపహరించిన సంఘటన ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో సోమవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం మండలంలోని సరిపల్లి గ్రామానికి చెందిన మేరీ కుమారి ఉదయం సుమారు పదిన్నర సమయంలో సమయానికి వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వచ్చింది. వచ్చేసరికి ఇంటి తలుపులు పగులకొట్టి ఉండడంతో లోపలికి వెళ్ళి చూడగా బీరువా తలుపు తీసి సామాన్లు చిందరవందరగా పడి ఉన్నట్లు తెలిపింది. లోపల దాచిన సుమారు రూ.4.30 లక్షల నగదు, 4 కాసుల బంగారు ఆభరణాలు 12 తులాల వెండి పట్టీలు కనపడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. జంగారెడ్డిగూడెం: జాతరకు వెళ్లి వచ్చేసరికి దుండగులు దోచేశారు. బాధితుడు మేడూరి రవితేజ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన రవితేజ, స్థానిక బైనేరు వాగు వద్ద ఉన్న శివాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నారు. ఆయన ఏరియా ఆసుపత్రి వెనుక ఉన్న ఎస్ఎస్ నగర్లో ఉంటున్నారు. ఈ నెల 1న ఏలూరులో జరుగుతున్న జాతర మహోత్సవానికి కుటుంబంతో కలిసి వెళ్లారు. సోమవారం పనిమనిషి ఇంటికి వచ్చి చూడగా, తలుపులు పగులగొట్టి ఉండటంతో రవితేజకు సమాచారం ఇచ్చింది. రవితేజ వచ్చి చూడగా, బీరువాలో ఉంచిన 3 కిలోల వెండి వస్తువులు, రూ. 50వేల నగదు, 10 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించాడు. చోరీకి గురైన వస్తువుల్లో సుమారు 2.50 కిలోల వరకు తాను పనిచేసే శివాలయంలోని దేవుడి వస్తువులని రవితేజ తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించినట్లు రవితేజ తెలిపారు. ఉండి: ఉండిలో మైనర్పై అత్యాచార ఘటనపై నమోదైన పోక్సో కేసులో భాగంగా నిందితుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించినట్లు ఎస్సై ఎండీ నసీరుల్లా తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం 2023 డిసెంబరులో ఉండిలోని పడవలవాని పేటలో మైనర్ బాలికపై వరుసకు మేనత్త కొడుకు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అప్పటి మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ నున్న మురళీకృష్ణ విచారణ చేపట్టి నాగాంజనేయులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. నేరం రుజువు కావడంతో జడ్జి బీ లక్ష్మీనారాయణ జీవితకాలం జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా, బాధితురాలికి రూ.5.80 లక్షల పరిహారం అందజేయాలని ఆదేశించినట్లు ఎస్సై తెలిపారు. భీమవరం: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆశాజనకంగా లేదని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.ప్రకాశం, బీవీ నారాయణ సోమవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయ పన్ను నిబంధనల్లో ఎలాంటి మార్పు లేకపోవడం నిరాశపర్చిందని, కొత్త పన్ను నిబంధనల్లో పొదుపు, ఇతర తగ్గింపులకు అవకాశం లేకపోవడం దారుణమన్నారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షలకు పెంచాలన్నారు. -
కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
టి.నరసాపురం: కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిలు అన్నారు. టి.నరసాపురం ఎస్ఎస్ కన్వెన్షన్లో సోమవారం సాయంత్రం జరిగిన పోలవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. పోలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ తెల్లం బాలరాజు అధ్యక్షత వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందన్నారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. గతంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకుని పార్టీ ముందుకు సాగనుందని కార్యకర్తలకు భవిష్యత్తులో అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కార్యకర్తల ద్వారానే జరుగుతుందన్నారు. కార్యకర్తలు బలోపేతం కావడానికి భవిష్యత్తులో పార్టీ దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన: బాలరాజు సంస్థాగత నిర్మాణం పారదర్శకంగా రచ్చబండ పెట్టి చేయాలని సూచించారు. మెజార్టీ సభ్యులు కోరిన వారిని కమిటీల్లో సభ్యులుగా నియమించుకోవాలన్నారు. ప్రభుత్వం అసత్య ప్రచారాలను మానుకోవాలని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంతో దృష్టి పెట్టాలని హితవు పలికారు. తెల్లం బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందన్నారు. కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ళల్లో తట్టా బుట్టా సర్ధుకుని పోతోందన్నారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇళ్లను ధ్వంసం చేయడం అరాచక పాలనకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో లోకేష్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. ఈ నెల 10 లోపు గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలా చేయడం ద్వారా నియోజకవర్గానికి 8 నుంచి 10 వేల మంది కార్యకర్తలు అనుబంధ సంఘాల్లో సభ్యులుగా ఉంటారని వివరించారు. కార్యక్రమంలో టి.నరసాపురం మండల కన్వీనర్ శ్రీను రాజు, మచిలిపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథరావు, జెడ్పీటీసీ సామంతపూడి బాల సూర్యనారాయణ, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు వాసిరెడ్డి మధు, కొత్త ప్రకాష్బాబు, చిక్కాల దుర్గాప్రసాద్, ఆరేటి సత్యనారాయణ, పి.అభిషేక్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సరిత, తుమ్మలపల్లి గంగరాజు, గంజిమాల రామారావు తదితరులు పాల్గొన్నారు. -
క్షమించరాని నేరం
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై, ఆయన ఇంటిపై దాడి చేయడం హేయం. కక్షకట్టి, రె చ్చగొట్టి అంబటి రాంబాబు, జోగి రమేష్లపై రౌడీలను, గూండాలను ఉసిగొలిపి భయభ్రాంతులకు గురి చేయడం రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయడం తప్ప మరేమీ కాదు. దాడులకు పూనుకోవడం క్షమించరాని నేరం. – పుప్పాల వాసుబాబు, ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే రాజకీయాలు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. విమర్శల సైతం హుందాగా ఉండాలి. దాడులు దౌర్జన్యాలు అక్రమ కేసులు సరి కాదు. బాధితులూ అదే బాటలో పయనిస్తే పరిస్థితి ఏమిటి. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిభద్రతల అమలు విషయంలో పూర్తిగా వైఫల్యం చెందింది. – కొఠారు అబ్బయ్యచౌదరి, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే రెడ్బుక్ రాజ్యాంగం పరాకాష్టకు చేరింది. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దౌర్జన్య కాండ దుర్మార్గపు పాలనకు, దుష్ట సామ్రా జ్యానికి నిదర్శనం. ప్రజలు హేయమైన ప్రభుత్వ పాలన చూస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించి మరలా జగనన్న రాజ్యాన్ని త్వరలో తీసుకువస్తారు. – కంభం విజయరాజు, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి నేతలు పాలనను విస్మరించి ఆటవిక దాడులు, దహనకాండలకు తెరదీయడం నీతిమాలిన చర్య. ఎన్నికల ముందు నీతి వ్యాఖ్యలు వల్లించిన కూటమిలోని మిగతా పార్టీలు ఇప్పుడు దహనకాండలపై ఎందుకు నోరువిప్పడం లేదు. ప్రజలే కూటమి నేతలకు బుద్ధి చెప్పాలి. – మామిళ్లపల్లి జయప్రకాష్, ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త -
ప్రజాస్వామ్య విలువలకు పాతర
చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తున్నారు. ప్రశ్నించిన వారిని టార్గెట్ చేసి ఇళ్లపై రౌడీలతో దాడులు చేయించడం దుర్గార్మం. ఈ దాడులను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. తిరుమల నెయ్యిలో కల్తీ జరగలేదని నివేదికలు రావడంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టించడానికి వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. – దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, కై కలూరు నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రులు జోగి రమేష్ ఇంటిని తగలబెట్టడం, అంబటి రాంబాబు ఇంటి వద్దకు వెళ్లి ధ్వంసం చేయడం దుర్మార్గం. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను అణచివేయాలనే నిరంతరం కేసులు పెడుతూ వేధిస్తోంది. ఎంతగా అణచివేయాలని చూస్తే తిరిగి అంత వేగంగా పైకి లేస్తాం. ప్రభుత్వం సక్రమ పాలన అందించాలి. – మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులను భయపెట్టాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదు. అక్రమ కేసులు పెట్టి దుర్మార్గంతో కూడిన రాక్షస చర్యలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదు. అంబటి రాంబాబు, జోగి రమేష్లపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. – తెల్లం బాలరాజు, పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే -
కూటమి గూండాగిరి
మంగళవారం శ్రీ 3 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రశ్నిస్తే.. దాడులు.. అదేంటని మళ్లీ అడిగితే రౌడీమూకలతో ఇళ్లపైకి తెగబడి దహనకాండ.. ఇది రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న పాలన. తిరుమల లడ్డూ వ్యవహారం, వైజాగ్ గీతం యూనివర్సిటీ భూముల వ్యవహారాన్ని పక్కదోవ పట్టించడానికి ఆటవిక దాడులు, దౌర్జన్యాలతో డైవర్షన్ రాజకీయాలకు దిగింది సీఎం చంద్రబాబు అండ్ కో. వైఎస్సార్సీపీ ముఖ్య నేతలైన అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలకు నిప్పంటించి భౌతికదాడులకు తెగబడ్డాయి పచ్చ మూకలు. ఇదే తరహాలో జిల్లాలోని కై కలూరు, దెందులూరు నియోజకవర్గాల్లోనూ రాజకీయాలు కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలతో పాటు ప్రజలు ముక్తకంఠంతో దాడుల సంస్కృతిని ఖండిస్తున్నారు. రాజకీయ దాడులు : గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాల కోసం కూటమి నేతలు దాడులకు తెరదీశారు. ఎమ్మెల్యేలు స్వయంగా దాడుల్లో పాల్గొనడం, తీవ్ర అసభ్యపదజాలంతో దూషించి రివర్స్లో కేసులు పెట్టించడం పరిస్థితి పరాకాష్టకు నిదర్శనం. జిల్లాలోని కై కలూరులో ఇదే తరహా దాడులు కొనసాగిస్తున్నారు. ఎన్నికల హామీ నెరవేర్చలేదని ఈనెల 22న కొల్లేటికోటకు వచ్చిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ను నత్తగుళ్లపాడు వైఎస్సార్సీపీ సర్పంచ్ రామకృష్ణరాజు ప్రశ్నించడంతో ఇంటిపై దాడి చేసి సర్పంచ్పై హత్యాయత్నం చేశారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. దెందులూరు నియోజకవర్గంలో నిన్నమొన్నటి వరకూ ఇదే తరహాలో రాజకీయ దాడులు కొనసాగాయి. జంగిల్ రాజ్ రాష్ట్రంలో ఆటవిక పాలన ప్రశ్నిస్తే దాడులు, ఇళ్లకు నిప్పు జిల్లాలోనూ ఇదే సంస్కృతి వైఎస్సార్సీపీ నేతలపై దాడుల పర్వం కూటమి అరాచకాలపై సర్వత్రా నిరసనలు -
వైద్య,ఆరోగ్యశాఖలోఅవకతవకలు
● మల్టీ పర్పస్ ఆరోగ్య కార్యకర్తల నియామకాల్లో గోల్మాల్ ● అనర్హులతో జాబితా తయారుచేసి హడావుడిగా విడుదల ఏలూరు టౌన్ : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో మల్టీ పర్సస్ ఆరోగ్య కార్యకర్తల (ఎంపీహెచ్డబ్ల్యూ) పునర్ నియామకాల్లో అధికారులు అనేక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్హులకు అన్యాయం చేస్తూ... అనర్హులతో జాబితా హడావుడిగా విడుదల చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక్కో ఉద్యోగానికి ఎంత మొత్తంలో సొమ్ములు దండుకున్నారో? అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను సైతం తోసిరాజని.. పోస్టులు అమ్మేసుకున్నారనే అభిప్రాయం ఉద్యోగుల్లో నెలకొంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యంతో అర్హులు ఉద్యోగాలకు దూరం కావాల్సి వస్తోందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేతలు అధికారుల తీరుపై ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం 2013లో రాష్ట్రంలో సుమారు 1200 మందికి కాంట్రాక్ట్ విధానంలో ఎంపీహెచ్డబ్ల్యూ (ఎం)గా ఉద్యోగాలు కల్పించారు. దీనిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 104 మంది ఉద్యోగాలు పొందారు. అప్పటి నుంచి వీరంతా రెగ్యులర్ చేయాలంటూ ప్రభుత్వాలను కోరుతూ వస్తున్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పుతో కాంట్రాక్ట్ సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. తమకు న్యాయం చేయాలంటూ ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2025 అక్టోబర్ 9న సుప్రీంకోర్టు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు చెబుతూ తొలగించిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం పునర్ నియామకాలకు ఉత్తర్వులు జారీ చేసింది. జాబితాలో లేని వ్యక్తులకు ఉద్యోగాలా? ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని 104 మంది మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్(మేల్) ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో ప్రస్తుతం 86 మంది ఎంపీహెచ్డబ్ల్యూ ఉద్యోగులు ఉండగా... హడావుడిగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు 69 మందితో ఒక జాబితా తయారు చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సిద్ధపడింది. ఈ జాబితా తప్పులతడకగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీం తీర్పు ఆధారంగా, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా... ఏలూరు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా ఉద్యోగ నియామకాలు చేపట్టారనే విమర్శలు వస్తున్నాయి. 2013లో నియామకం పొందిన 104 మంది ఉద్యోగుల జాబితా వైద్య ఆరోగ్యశాఖలో ఉందా ? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నూతనంగా ఉద్యోగాలకు ఎంపిక చేసిన జాబితాలో జీవోలో లేని వ్యక్తులకు సైతం ఉద్యోగాలు ఇచ్చేందుకు సిబ్బంది సిద్ధపడడంపై ఆరోపణలు వస్తున్నాయి. జూనియర్ల ఎంపికపై అనుమానాలు ఎంపీహెచ్డబ్ల్యూ(ఎం) కాంట్రాక్ట్ ఉద్యోగుల పునర్నియామకాల్లో జూనియర్లను ఉద్యోగాలకు ఏవిధంగా ఎంపిక చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అనర్హులు, జూనియర్లను ఎంపిక జాబితాలో పెట్టటం వెనుక భారీ అవినీతి జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అవగాహన రాహిత్యం, రికార్డులు లేకపోవటంతో ఇష్టారాజ్యంగా చేస్తున్నారని చెబుతున్నారు. జీవోకు విరుద్ధంగా ఎంపిక సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా విడుదల చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలు చేసేందుకు సిబ్బంది సిద్ధపడటంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు వై.మోహనరావు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, ఏలూరు జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు జే.గోవిందరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. ఎంపిక జాబితాను వెంటనే సరిచేసి అర్హులైన 86 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూనియర్లు, అనర్హులకు ఉద్యోగాలు ఏ విధంగా కల్పిస్తారంటూ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పును, ప్రభుత్వ ఉత్తర్వులను సైతం పక్కనబెట్టి ఎంపిక జాబితా సిద్ధం చేయడంపై సందేహాలు వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేసి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. -
సచివాలయ ఉద్యోగినిపై దాడి దారుణం
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లులో ధనలక్ష్మి టిఫిన్ సెంటర్కు డిమాండ్ నోటీసు ఇచ్చేందుకు వెళ్లిన సచివాలయ ఉద్యోగిని షేక్ షకీనాపై సోమవారం హోటల్ నిర్వాహకులు దాడి చేసిన ఘటనపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నాయకులు మండిపడ్డారు. బాధితురాలు షకీనాతో కలిసి పట్టణ పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ షేక్ ఉమర్ ఆలీషా మాట్లాడుతూ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై భౌతిక దాడులకు దిగడం దారుణమన్నారు. సచివాలయ మహిళా ఉద్యోగులకు రక్షణ కరువయ్యిందని, ఇటీవల దాడులు పెరుగుతున్నాయన్నారు. ఇప్పటికే పని ఒత్తిడితో సతమతమవుతున్న ఉద్యోగులు ఇలా భౌతిక దాడులు ఎదురైతే ఎలా పనిచేస్తారని, షకీనాకు న్యాయం జరగకపోతే సంఘం ఆధ్వర్యంలో ఉద్యమానికి సైతం వెనకాడబోమని హెచ్చరించారు. ఎన్నడూ చూడలేదు : తాను ఐదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నానని, ఇంత దారుణం ఎన్నడూ చూడలేదని షకీనా అన్నారు. ఉన్నతాధికారులు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీ గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘాల సూచనల మేరకు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. అనంతరం పోలీసులు టిఫిన్ సెంటర్ నిర్వాహకులను పోలీస్స్టేషన్కు తరలించారు. దాడికి ఖండన యలమంచిలి: పాలకొల్లులో సచివాలయ ఉద్యోగినిపై దాడిని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పాలకొల్లు తాలూకా యూనిట్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సంఘ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు షేక్ ఉమర్ ఆలీషా ప్రకటన విడుదల చేశారు. పోలీసులు నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని కోరా రు. పాలకొల్లు తాలూకా అధ్యక్షుడు వి.సునీల్కుమార్, ఎం.నారాయణ రాజు మద్దతు తెలిపారు. -
పంచాయతీ అభివృద్ధి అధికారులకు శిక్షణ తరగతులు
ఏలూరు(మెట్రో): గ్రామస్థాయిలో వివిధ ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో పంచాయతీ అభివృద్ధి అధికారులదే కీలక పాత్ర అని జిల్లా ప్రజా పరిషత్ సీఈవో ఎం.శ్రీహరి పేర్కొన్నారు. సోమవారం ఏలూరులోని సోషల్ సర్వీస్ ట్రైనింగ్ సెంటర్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రేడ్ 4, 5 పంచాయతీ అభివృద్ధి అధికారులకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమాలను జెడ్పీ సీఈఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య పంచాయతీ అభివృద్ధి అధికారులు వారధి వంటివారని ప్రజలకు ప్రభుత్వ సేవలను సకాలంలో సమర్ధవంతంగా అందించవల్సిన బాధ్యత పంచాయతీ అభివృద్ధి అధికారులదేనని తెలిపారు. జిల్లా ట్రైనింగ్ మేనేజర్ గుర్రాల ప్రసంగి రాజు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిపాలన సమర్ధవంతంగా జరగాలంటే ప్రతీ పంచాయతి అభివృద్ధి అధికారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాలలో నేర్చుకొని పరిపాలన అంశాలపై పట్టు సాధించాలన్నారు. -
కనుల పండువగా చందనోత్సవం
ద్వారకాతిరుమల: ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామికి చందనోత్సవాన్ని సోమవారం కనుల పండువగా నిర్వహించారు. ఈ వేడుకతో ఉగ్ర రూపంలో ఉన్న నారసింహుడు చందన లేపంతో సేదతీరారు. ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయానికి దత్తత దేవాలయమైన ఈ ఆలయంలో భీష్మ ఏకాదశి పర్వదినం ప్రారంభమైన స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున ఆలయంలో నిత్య హోమాలు, మూలమంత్ర హవనాలు జరిగాయి. అనంతరం స్వామి, అమ్మవార్లకు పంచామృత అభిషేకాలను ఆలయ అర్చకులు, పండితులు ఘనంగా నిర్వహించారు. ఆ తరువాత స్వామి మూలవిరాట్కు చందన మహోత్సవాన్ని వేద మంత్రోచ్ఛరణలతో పండితులు వైభవంగా నిర్వహించారు. ఉగ్రరూపంలో ఉండే లక్ష్మీనారసింహుడిని శాంతింపజేసేందుకు జరిపిన ఈ ఉత్సవాన్ని వీక్షించిన భక్తులు పరవశించారు. పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, నీరు, తేనెతో ముందుగా స్వామిని అభిషేకించారు. మహా పూర్ణాహుతి, కలశోద్వాసన, అపబృదం, ధ్వజ అవరోహణ కార్యక్రమాలు నేత్రపర్వంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ, ఏఈఓ రమణరాజు తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి, తీర్ధప్రసాదాలను స్వీకరించారు. పెద్ద ఎత్తున మహిళా భక్తులు సుందరగిరిపై పాలపొంగళ్లను వండి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. మంగళవారం స్వామివారికి జరిగే ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని ఈఓ భద్రాజీ తెలిపారు. సుందరగిరిపై అట్టహాసంగా వేడుక -
గంగానమ్మ తల్లి.. భక్తులు ప్రణమిల్లి
అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు జన జాతరను తలపిస్తోంది. నగరమంతా గంగానమ్మవారి జాతర సందడి కనిపిస్తోంది. పడమరవీధిలో గంగానమ్మవారి జాతర ఆదివారం అట్టహాసంగా నిర్వ హించారు. గత వారం తూర్పువీధి, దక్షిణపువీధి, పవర్పేట, లక్ష్మీవారపుపేట, ఆదివారపుపేటలో జాతర సంబరాలు జరగ్గా.. ఇప్పుడు పడమరవీధిలో వేడుకలు నిర్వహిస్తున్నారు. పడమరవీధి గంగానమ్మవారి జాతరను నగరంలోని దాదాపు సగం మంది జనం పైగా పాటించారు. జాతర పూనకాలే.. ఏడేళ్లకోసారి వచ్చే జాతర కావడంతో నగరవాసులంతా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. మూడు నెలలుగా అమ్మవారిని పడమరవీధి వద్ద మేడల్లో ప్రతిష్ఠించి ప్రత్యేక పూ జలు చేశారు. ఆదివారం వేకువజాము 2.30 గంటల నుంచి నైవేద్యాలు సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. భారీగా భక్తులు తరలిరావడంతో ఈ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. భారీ కుంభం ఉదయం 9 గంటలకే అమ్మవారి మేడల వద్ద భక్తులు సమర్పించిన నైవేద్యాలతో భారీ కుంభం ఏర్పడింది. ఉదయం 10, 11 గంటల సమయానికి భక్తుల రాక మరింత పెరిగింది. భక్తులంతా నైవేద్యాలు సమర్పించడంతో అమ్మవారి మేడల వద్ద కుంభం కొండను తలపించింది. సాయంత్రానికి సుమారు లక్ష మందికి పైగా భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించినట్టు అంచనా. అమ్మవారికి నీరా‘జనం’ జాతర మహోత్సవానికి నగర ప్రజల ఆహ్వానం మే రకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అతిథులు ఏలూరు చే రుకున్నారు. ముందస్తు బుకింగ్లతో లాడ్జీల్లో గదులన్నీ ఫుల్ అయ్యాయి. పడమరవీధి గంగానమ్మవారి దేవస్థానం పరిధిలోని పడమరవీధి, వంగాయగూడెం, రామకృష్ణాపురం, గులాబీతోట, ఎన్టీఆర్ నగర్, నరసింహరావుపేట, పోస్టల్ కాలనీ, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో ప్రతి వీధిలో టిప్టాప్ పందిళ్లు వేసి బంధుమితుల్రకు విందు భోజనాలు ఏర్పాటుచేశారు. దీంతో ఆయా మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి. ప్రధాన రహదారుల్లో కిటకిట వీధులన్నీ రద్దీగా ఉండటంతో ప్రధాన రహదారులపై ప్రయాణించాల్సి వచ్చింది. దీంతో పాత బ స్టాండు, కొత్త బస్టాండు ప్రాంతాలు, రామకృష్ణాపురంలోని మినీ బైపాస్ రోడ్డు, విజయవిహార్ సెంటర్, వసంతమహల్ సెంటర్, పవర్పేట స్టేషన్ రో డ్డు తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరా యం ఎదురయింది. కిలోమీటరు దూరం బైక్పై వెళ్లేందుకు దాదాపు రెండు గంటల సమయం పట్టింది. పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకున్నారు. హేలాపురి.. ఆధ్యాత్మిక సిరి అట్టహాసంగా పడమర వీధి జాతర నైవేద్యాలు సమర్పించిన లక్ష మందికి పైగా భక్తులు నగరంలో పండుగ వాతావరణం నేడు అమ్మవారిని సాగనంపనున్న భక్తులు -
పరాకాష్టకు పచ్చమూకల దాడులు
మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు బుట్టాయగూడెం: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం తారాస్థాయికి చేరుకుందని పోలవరం మాజీ ఎ మ్మెల్యే, వైఎస్సార్సీపీ కన్వీనర్ తెల్లం బాల రాజు అన్నారు. ఆదివారం ఆయన దుద్దుకూరులో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏదో రూపంలో దాడులు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం జరుగుతుందన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, జోగి రమేష్, అలాగే భూమన బ్రహ్మనాయుడు ఇళ్లపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పచ్చమూకలు దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోకపో వడం బాధాకరమన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, అన్నింటికీ చంద్రబాబు, పవన్కల్యా ణ్, లోకేష్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వైఎస్సార్ నాయకులు, కార్యకర్తలు భ యపడే ప్రసక్తే లేదని, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేస్తామని అన్నారు. ఉంగుటూరు: అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడిగా డా.కోనా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. బాదంపూడి శివారులో కల్యాణ మండపంలో ఈ కార్య క్రమం నిర్వహించారు. రాజ్యసభ మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, తెలంగాణ రాష్ట్ర ఐవీఎఫ్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస గుప్త, ఐవీఎఫ్ వ్యవస్థాపక సభ్యులు రమేష్ అగర్వాల్, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్లు పాల్గొన్నారు. వాసవీ మాత ఆలయంలో పూజలు చేసిన అనంతరం ర్యాలీగా కల్యాణ మండపానికి వెళ్లారు. ఈ సందర్భంగా పలు కమిటీల్ని నియమించి ప్రమా ణ స్వీకారం చేయించారు. ఐవీఎఫ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వక్తలు తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని 54 కేంద్రాల్లో ఆదివారం ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగాయి. 5,076 మంది హాజరయ్యారు. పెదపాడు: ఏలూరు కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన పీజీఆర్ఎస్కు రద్దు చేశారు. జాతర దృష్ట్యా రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. -
నత్తగుళ్లపాడు వైఎస్సార్సీపీ సర్పంచ్పై హత్యాయత్నం
● ఎన్నికల హామీలపై ప్రశ్నించినందుకు దాడి ● ఇల్లు ధ్వంసం కై కలూరు: చంద్రబాబు పాలనలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులపై దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఏలూరు జిల్లా నత్తగుళ్లపాడు వైఎస్సార్సీపీ సర్పంచ్ ముంగర రామకృష్ణరాజు (రూబేన్)పై శనివారం అర్ధరాత్రి హత్యాయత్నం చేశారు. దాదాపు 60 మంది సర్పంచ్ ఇంటిని ధ్వంసం చేసి ఆయన తలపై ఇనుప రాడ్డుతో కొట్టారు. అడ్డువచ్చిన సర్పంచ్ భార్య నవ్య దుస్తు లు చించి దాడి చేశారు. కుటుంబసభ్యులు పోలీసు ల సాయంతో వారిని కై కలూరు ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. కొల్లేరు ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని గత నెల 22న కొల్లేటికోటకు వచ్చిన కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినే ని శ్రీనివాస్ను కొల్లేరు పెద్దలు నిలదీశారు. దీనిపై నత్తగుళ్లపాడు సర్పంచ్ రామకృష్ణరాజు కొల్లేరులో నివసించే ప్రతి కుటుంబానికీ అర ఎకరం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి కామినేని శ్రీనివాస్ మోసం చేశారని వీడియో విడుదల చేశారు. దానిని సహించలేక టీడీపీ నాయకుడు బలే ఏసురాజు తనపై దాడి చేయించాడని బా ధిత సర్పంచ్ రామకృష్ణరాజు ఆరోపించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సర్పంచ్ రామకృష్ణరాజు దంపతులను వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షు డు, కై కలూరు నియోజకవర్గ కన్వీనర్ దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) ఆదివారం పరామర్శించారు. దాడికి గురైన సర్పంచ్ రామకృష్ణరాజు వీపుపై గాయాలు -
కోపల్లె వంతెన వద్ద ఉద్రిక్తత
● జక్కరంలోని ఆర్సీఎం చర్చి విద్యుత్ మీటర్ తొలగింపు ● భగ్గుమన్న క్రైస్తవ సంఘాల నాయకులు కాళ్ల: జక్కరంలోని ఆర్సీఎం చర్చి విద్యుత్ మీటర్ తొలగింపుపై క్రైస్తవ సంఘాలు భగ్గుమన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల తీరును నిరసిస్తూ శనివారం కోపల్లె వంతెన వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల జక్కరం–కోపల్లె వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. నాలుగు లైన్ల వంతెన, రోడ్డు పనుల కోసం ఆర్అండ్బీ అధికారులు కొలతలు నిర్వహించారు. రోడ్డు మార్జిన్లో ఉన్న ఇళ్లు, చర్చిలను తొలగించాలని నిర్ధారించారు. జక్కరంలోని అరుంధతి పేటలో ఆర్సీఎం చర్చి విద్యుత్ మీటర్ను పంచాయతీ, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు శుక్రవారం తొలగించారు. ఈ విషయం తెలిసిన స్థానిక ఆర్సీఎం చర్చి విశ్వాసులు, పాస్టర్లు క్రైస్తవ సంఘాలతో కలిసి శనివారం కోపల్లె వంతెన వద్ద ఆందోళన చేశారు. కోపల్లె వంతెన వద్ద మూడు వైపులా క్రైస్తవ సంఘాల నాయకులు, మహిళలు నిరసన చేశారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, సీఐలు జగదీశ్వరరావు, కాళీచరణ్, ఎస్సైలు, తహసీల్దార్ సుందర్ సింగ్, ఆర్అండ్బీ ఏఈ శ్రీహరిరాజు, ఇతర అధికారులు ఆందోళనకారులతో మాట్లాడారు. ఆర్సీఎం చర్చి విద్యుత్ మీటర్ను ఏర్పాటు చేసే వరకు ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. శనివారం రాత్రి కూడా ఆందోళన కొనసాగుతూనే ఉంది. వంతెన ఏర్పాటుకు 100 మీటర్ల దూరంలో ఉన్న చర్చి విద్యుత్ మీటర్ తొలగించటం చాలా అన్యాయమని, క్రైస్తవుల మనోభా వాలకు ఇబ్బంది కలిగించే విధంగా అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని ఏపీ సీపీఏ ఫౌండర్ చైర్మన్ ఎండీ ఇస్మాయిల్ మండిపడ్డారు. ఆందోళనలో ఏఐసీఎఫ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మత్తే రాజ్ కుమార్, ఏపీ సీపీఏ పొలిటికల్ ప్రెసిడెంట్ జి రాజేష్ ఖన్నా, పాలకొల్లు ప్రెసిడెంట్ జోసెఫ్ రాజకుమార్, స్టేట్ కోఆర్డినేటర్ బెనర్జీ, ఎఫ్ఎఫ్సీఐ నాయకులు స్టాల్ని థామస్, ఆర్సీఎం ఫాదర్లు స్టాల్ని బాలయేసు తదితరులు పాల్గొన్నారు. -
లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయుడిని శిక్షించాలి
కుక్కునూరు: ఇబ్రహీంపేట స్కూల్లో స్వీపర్పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని సీఐటీయూ మండల కన్వీనర్ యర్నం సాయికిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఎంఈఓ, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా చేసి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయికిరణ్ మాట్లాడుతూ మండలంలోని ఇబ్రహీంపేట ప్రాథమిక పాఠశాలలో గత పదేళ్లుగా స్కూల్ స్వీపర్గా పనిచేస్తున్న కాకర్ల వెంకటేశ్వరమ్మను అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కొద్ది రోజుల నుంచి అసభ్యకరంగా తిడుతూ, లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయం కలెక్టర్కి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఉద్యోగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, స్కూల్ స్వీపర్ను, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి, ఉద్యోగం నుంచి తొలగించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని సాయికిరణ్ హెచ్చరించారు. ధర్నా కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్ గిరిజన సంఘం మండల ఉపాధ్యక్షుడు కాక ఆనంద్, బాధితురాలు కాకర్ల వెంకటేశ్వరమ్మ, నాయకులు కారం నాగలక్ష్మి, కాక కమలమ్మ, సీత, పాపమ్మ, సీతమ్మ, కృష్ణవేణి, చంద్రమ్మ, పుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. -
గేదెల కోసం చెరువులోకి దిగి..
ద్వారకాతిరుమల : గేదెల కోసం చెరువులోకి దిగిన ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మారంపల్లి గ్రామంలోని చంద్రవంక చెరువులో చోటుచేసుకుంది. మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బంది శనివారం చెరువులోంచి వెలికితీశారు. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్ల మండలం, ఘంటావారిగూడెం గ్రామానికి చెందిన దొబ్బిడి వెంకట సుబ్బారావు (60) శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లి గేదెలకు గడ్డి వేశాడు. తిరిగి మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం చేసిన తరువాత, మళ్లీ పొలానికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి రాకపోయే సరికి ఆయన కుమారుడు గంగాధరరావు పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో సాయంత్రం పొలానికి వెళ్లి చుట్టుపక్కల వెతికాడు. చంద్రవంక చెరువు గట్టుపై వెంకట సుబ్బారావు సెల్ఫోన్, పొగాకు కవరు, అలాగే చెరువులో గేదెలు ఉన్నట్టు గుర్తించాడు. దాంతో తన తండ్రి గేదెల కోసం చెరువులోకి దిగి, గల్లంతైనట్టు తెలుసుకున్నాడు. కాగా హెడ్ కానిస్టేబుల్ కె.శ్రీనివాసరావు సమక్షంలో శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని వెలికితీశారు. గంగాధరరావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్సీ శ్రీనివాసరావు తెలిపారు. -
తాళం వేసి ఉన్న ఇంటిలో చోరీ
పాలకొల్లు సెంట్రల్: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలని రామాలయం సమీపంలో చోటుచేసుకుంది. బాధితురాలు సయ్యపురాజు పద్మ తెలిపిన వివరాల ప్రకారం ఆమె భర్త అర్ధకట్ల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఆరు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఉంటుండగా కుమార్తె ఇటీవల బ్లడ్ కేన్సర్తో మృతి చెందింది. జనవరి 26వ తేదీన పద్మ ఇంటికి తాళాలు వేసుకుని ఉండిలో ఉన్న అమ్మగారి ఇంటికి వెళ్లారు. శనివారం ఉదయాన్నే స్థానికులు ఫోన్చేసి ఇంటి తాళాలు తీసి ఉన్నాయని సమాచారం ఇవ్వడంతో ఆమె ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటిలోని మూడు బీరువాలు పగల గొట్టి ఉన్నాయి. పది కాసుల బంగారు, రూ.50 వేలు నగదు, ద్విచక్ర వాహనం చోరీ జరిగినట్లు గుర్తించినట్లు చెప్పారు. శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో దొంగ ఇంటి ముందు గునపంతో తిరుగుతుండగా సీసీ కెమెరాలో రికార్డయ్యిందన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉందన్నారు. -
శ్రీవారి క్షేత్రం.. భక్తజన సంద్రం
ద్వారకాతిరుమల: చిన వెంకన్న దివ్య క్షేత్రం శనివారం భక్తజన సంద్రమయ్యింది. శ్రీవారికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, అనివేటి మండపం, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, కల్యాణకట్ట, నిత్యాన్నదాన భవనం ఇలా అన్ని విభాగాలు భక్తులతో పోటెత్తాయి. భక్తుల వాహనాలతో ఘాట్ రోడ్లు నిండిపోయాయి. అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. లింగపాలెం: పంట కాలువలోకి ట్రాక్టర్ దూసుకెళ్లిన ఘటన శనివారం లింగపాలెం శివారులో చోటుచేసుకుంది. ఎస్బీఐ బ్యాంకు సమీపంలోకి ట్రాక్టర్ వెళుతుండగా ఒక్కసారిగా గేదెలు అడ్డు వచ్చేసరికి ట్రాక్టర్ డ్రైవర్ వాటిని తప్పించేందుకు సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పాలకోడేరు: మండలంలోని వేండ్ర రైల్వే గేటు సమీపంలో సుమారు 32 సంవత్సరాల వయసు గల గుర్తుతెలియని వ్యక్తిని రైలు ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు భీమవరం రైల్వే ఎస్సై ఎస్ సుబ్రహ్మణ్యం తెలిపారు. శుక్రవారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో కాకినాడ– లింగంపల్లి ప్రత్యేక రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. వివరాలు తెలిసిన వారు భీమవరం రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు. -
బైక్లు ఢీ.. ఒకరి మృతి
నలుగురికి గాయాలు ఆకివీడు: ఎదురెదురుగా రెండు మోటార్సైకిళ్లు అతివేగంగా ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జాతీయరహదారిపై దుంపగడప గ్రామ అడ్డరోడ్డు సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం కై కలూరు మండలం పెదరామవరంనకు చెందిన బొక్కవరపు రాఘవేంద్రరావు, సామియేలు పనిమీద ఆకివీడు వచ్చి తిరిగి తమ గ్రామానికి బైక్పై తిరిగి వెళ్తుండగా ఆకివీడు వెలంపేటకు చెందిన అల్లు మణికంఠ, ఎస్కే అభి, మరో వ్యక్తి మోటార్సైకిల్పై వస్తూ దుంపగడప అడ్డరోడ్డు సమీపంలో ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో బొక్కవరపు రాఘవేంద్రరావు (20) స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా అతడితోపాటు వచ్చిన సామియేలుకు తీవ్ర గాయాలయ్యాయి. మరో బైక్పై ఉన్న ముగ్గురికి కూడా గాయలవడంతో చికిత్స నిమిత్తం 108లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతుడు రాఘవేంద్ర చిన్నాన్న బొగ్గవరపు సాయిబాబా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై హనుమంతు నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. భార్యాభర్తలకు తీవ్ర గాయాలు భీమడోలు: దైవదర్శనానికి మోటార్సైకిల్పై వెళ్తున్న భార్యాభర్తలను వెనుకనుంచి కారు ఢీకొట్టింది. శనివారం ఉదయం జాతీయ రహదారి కురెళ్లగూడెం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరవాసరం మండలం మత్య్సపురి గ్రామానికి చెందిన పిప్పళ్ల రామకృష్ణ, పుణ్యవతి బైక్పై ద్వారకాతిరుమలలోని స్వామి వారి దర్శనానికి బయలుదేరారు. మార్గమధ్యమైన కురెళ్లగూడెం వద్దకు వచ్చేసరికి తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వైపు వెళ్తున్న కారును డ్రైవర్ అతివేగంగా నిర్లక్ష్యంగా నడపడంతో రామకృష్ణ మోటార్సైకిల్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లు ఎస్సై ఎస్కే మదీనా బాషా తెలిపారు. నలుగురికి తీవ్ర గాయాలు ద్వారకాతిరుమల: రాళ్లకుంటలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలగురికి తీవ్ర గాయాలయ్యాయి. రాజమండ్రికి చెందిన దుర్గారావు, నాగరాజు, నాగ అశ్విన్ కె.గోకవరంలోని ఇటుకల బట్టీలో పనిచేస్తున్నారు. వారు బైక్పై స్వగ్రామానికి వెళుతుండగా ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి బైక్పై వెళుతున్న గోపీ అనే వ్యక్తి, వీరి బైక్ను ఎదురుగా ఢీకొట్టాడు. నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను 108 ఆంబులెన్స్లో నల్లజర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
నయన మనోహరం.. నారసింహుని పరిణయోత్సవం
ద్వారకాతిరుమల : భక్తజన నృసింహ నామస్మరణలు.. వేద పండితుల సుస్వర మంత్ర పఠనాలు.. ప్రతి ఘట్టాన్నీ గుర్తు చేసేలా మంగళవాయిద్య నాదాలు.. అందంగా అలంకరించిన పందిళ్లు, సుగంధభరిత పుష్పమాలికలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన కల్యాణ వేదిక.. దానిపై పట్టువస్త్రాలు, సర్వాభరణాలు ధరించి, బుగ్గన చుక్కతో వరుడిగా మెరిసిపోతున్న స్వామివారు.. ఆ పక్కనే వధువులుగా కొలువుదీరిన అమ్మవార్లు.. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో.. జగదానంద కారకుడైన నారసింహ స్వామివారి వార్షిక దివ్య తిరుకల్యాణోత్సవం జరిగిన వేళ.. ఐఎస్ జగన్నాధపురం క్షేత్రం భూతల వైకుంఠాన్ని తలపించింది. దేదీప్యమానంగా వెలిగిపోయింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. నయనానందకరంగా సాగిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కల్యాణోత్సవాన్ని కనులారా తిలకించి, పులకించిపోయారు. కన్నులపండువగా.. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత నారసింహుని ఉత్సవ మూర్తులను సుందరగిరిపై నుంచి శనివారం ఉదయం కొండ కింద కల్యాణ మండపం వద్దకు పల్లకీ వాహనంలో తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేంచేపు చేసి, అలంకరించారు. అనంతరం పరిణయ వేడుకల్లో ఒక్కో ఘట్టాన్ని పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కన్యాదానం జరిపి, సరిగ్గా 11.10 గంటల సుముహూర్త సమయంలో స్వామి, అమ్మవార్ల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేశారు. ఆ తరువాత వేద మంత్రోచ్ఛరణలతో మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకను పండితులు అట్టహాసంగా జరిపారు. ప్రభుత్వం తరుఫున గోపాలపురం ఏఎంసీ చైర్మన్ వై.బ్రహ్మరాజు, దేవస్థానం తరుఫున ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావు, ఈఓ యర్రంశెట్టి భద్రాజీ అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. వేడుక అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు, స్వామివారి అన్నప్రసాదాన్ని అందించారు. ఈ వేడుకలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కల్యాణ ఘడియలో స్వామి, అమ్మవార్లు, కల్యాణ వేడుకను వీక్షిస్తున్న భక్తులు ఐఎస్ జగన్నాధపురంలో అట్టహాసంగా వేడుక కనులారా తిలకించి, పులకించిన భక్తజనం భక్తులతో పోటెత్తిన సుందరగిరి -
కల్తీ కుట్రలపై మండిపాటు
ఆదివారం శ్రీ 1 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి మంచి బుద్ధి ప్రసాదించాలని, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ తిరుమల లడ్డూ ప్రసాదాన్ని స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా కదం తొక్కాయి. చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టులా సీబీఐ నివేదిక ఇచ్చిందని, ఇకనైనా తీరుమారకపోతే ప్రజలే గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. కూటమికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి ఆలయాల్లో పూజలు చేశారు. హిందువుల మనోభావాలతో చెలగాటమాడుతూ కలియుగదైవాన్ని కించపరిస్తే ప్రజలు తీవ్రంగా స్పందిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, కై కలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. కై కలూరులోని మీసాల వెంకన్న దేవస్థానంలో దూలం నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామికి అభిషేకం చేశారు. పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు కోమటి విష్ణువర్దనరావు, రాష్ట్ర నాయకులు రామిశెట్టి సత్యనారాయణ, గంటా సంధ్య, పాల్గొన్నారు. నూజివీడులో నియోజకవర్గంలో.. నూజివీడులో నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప అప్పారావు ఆధ్వర్యంలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. స్వామికి సాష్టాంగ నమస్కారం చేశారు. చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడటం మానుకోవాలని, సమస్యలపై ప్రశ్నించినప్పుడల్లా ఇలాంటి డైవర్షన్ రాజకీయాలతో కాలం గడుపుతూ రాష్ట్ర ప్రజల మనోభావాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శీలం రాము, మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు, జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమెళ్ళ కృష్ణంరాజు, ముసునూరు జెడ్పీటీసీ వరికూటి ప్రతాప్, ఆగిరిపల్లి ఎంపీపీ బోళ్ళ అనూష తదితరులు పాల్గొన్నారు. పోలవరం నియోజకవర్గంలో.. పోలవరం నియోజకవర్గం బుట్టాయగూడెంలోని శివాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో ఆలయంలో పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు. తెల్లం బాలరాజు మాట్లాడుతూ సీబీఐ ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సుదీర్ఘ విచారణ అనంతరం నివేదిక ఇచ్చిందని ఇకనైనా చంద్రబాబు మంచి బుద్ధితో పరిపాలన సాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో.. ఉంగుటూరులో సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో పార్వతీ సమేత భీమేశ్వర స్వామి, వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. వాసుబాబు మాట్లాడుతూ కోట్లాది మంది హిందువుల మనోభావాలపై దాడి చేసిన చంద్రబాబునాయుడు, పవన్కళ్యాణ్ను దేవుడు కూడా క్షమించరని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్ధానం మాజీ మెంబర్ గాదిరాజు సుబ్బరాజు పాల్గొన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో.. చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి రామాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం విజయరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేసిన చంద్రబాబుకు సీబీఐ నివేదిక చెంపపెట్టులాంటిదని, తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాధరావు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలి ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో వైఎస్సార్సీపీ ప్రత్యేక పూజలు సమస్యలపై ప్రశ్నిస్తే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం -
ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 30 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించే ఏర్పాటు చేయాలని యూటీఎఫ్ నాయకులు ఎమ్మెల్యే బడేటి చంటిని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసిన యూటీఎఫ్ నాయకులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు. యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ పీఆర్సీపీకి కొత్త కమిషనర్ను ఇంతవరకు నియమించలేదన్నారు. కొత్త పీఆర్సీ అమలు చేసేవరకు ఐఆర్ మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 3 సంవత్సరాలుగా సరెండర్ లీవులు చెల్లించడం లేదని, 4 డీఏలు పెండింగ్లో ఉండగా ఒక డీఏ మాత్రమే ఇచ్చారన్నారు. రాష్ట్రంలో అర్హులైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాల్సి ఉందన్నారు. సానుకూలంగా నిర్ణయాలు తీసుకొనకపోతే సమస్యల పరిష్కారం నిమిత్తం ఉద్యమించక తప్పదని, ఫిబ్రవరి 17న ‘చలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.సుభాషిని, రవికుమార్ రుద్రాక్షి తదితరులు ఉన్నారు. -
రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు
ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్థన్ ఏలూరు టౌన్: రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని.. మాజీ మంత్రి విడుదల రజనీపై దాడులకు పాల్పడడం దుర్మార్గమని, కూటమి పాలనలో ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నారని వైఎస్సార్సీపీ ముదిరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్థన్ ముదిరాజ్ విమర్శించారు. ఏలూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి రజనీపై జరిగిన దాడిపై స్పందిస్తూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి మహిళలకు రక్షణ లేదనీ, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, అఘాయిత్యాలు, ఆఖరికి మాజీ మంత్రులకు సైతం భద్రత లేని దుస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రిపై దాడులు చేయటం బాధాకరమని, ఇలాంటివి విరమించుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. పోలీసులు సైతం కూటమికి కొమ్ము కాయటం చూస్తే రాష్ట్రంలో చట్టం పనిచేస్తుందా అనే అనుమానం వస్తుందన్నారు. మాజీ బీసీ మహిళ మంత్రిని అవమానిస్తే ప్రభుత్వం చోద్యం చూస్తోందనీ, ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సమావేశంలో కై కలూరు నియోజకవర్గం ప్రచార విభాగం అధ్యక్షుడు పాము వీరవెంకట రవికుమార్, సోషల్ మీడియా ఉపాధ్యక్షుడు మణిమాల రాజేష్, మండవల్లి మండల పంచాయతీరాజ్ ఉపాధ్యక్షుడు పెరుమాళ్ళ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతోనే ప్రమాదాల నివారణ
ఏలూరు (ఆర్ఆర్పేట): రహదారి నియమాలను పాటించడంతో పాటుగా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతోనే రహదారి ప్రమాదాల నివారణ సాధ్యమని అడిషినల్ ఎస్పీ నక్కా సూర్య చంద్రరావు అన్నారు. శనివారం సీఆర్రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో రవాణా శాఖ నిర్వహించిన రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లా డుతూ ప్రతి ఒక్కరు రహదారి నియమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలన్నారు. ఆర్టీవో ఎస్.బాలేందు శేఖర్ మాట్లాడుతూ ప్రమాదాల సంఖ్యను తగ్గించడంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. గత ఏడాది జిల్లాలో 760 రహదారి ప్రమాదాలు జరగ్గా.. 300 మంది చనిపోయారని, 430 మందికి గాయాలయ్యాయన్నారు. హెల్మెట్ తప్పక ధరించాలన్నారు. కార్యక్రమంలో 3 టౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ రాంబాబు, వాహన తనిఖీ అధికారులు రమేష్ బాబు, జీ.ప్రసాదరావు, ఎన్డీ విఠల్, జమీర్, సురేష్, జగదీశ్, స్వామి, నెహ్రు, కళ్యాణి, ప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఈ నె 18 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సులైన డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ (లోయర్, హయ్యర్ గ్రేడ్) పరీక్షలు జిల్లాలో నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. టైమ్ టేబుల్ సంబంధిత వెబ్సైట్లో పొందుపరిచినట్టు తెలిపారు. ఏలూరు(మెట్రో): గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో శనివారం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్ మన్ యోజన, తదితర కార్యక్రమాల ద్వారా మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు గృహాలు, తాగునీరు, రోడ్లు, విద్యుత్, విద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పనకు నిధులు మంజూరు చేసిందని, వాటికి సంబందించిన పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తిచేసి, నిధులు పూర్తిస్థాయిలో వినియోగించాలన్నారు. గ్రామీణ నీటి సరఫరా పథకం ద్వారా 86 పనులు మంజూరుకాగా, 78 పనులు పూర్తయ్యాయని, మిగిలినవి 15 రోజులలో పూర్తిచేయాలన్నారు. గిరిజన ప్రాంతాలలోని 86 గ్రామాలకు 81 గ్రామాలలో విద్యుత్ సౌకర్యం అందించారని, మిగిలిన 5 గ్రామాలలో విద్యుత్ సౌకర్యం పనులు పూర్తి చేయాలన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఒకేషనల్(బ్రిడ్జ్ కోర్సు) విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షల 5వ రోజు మొత్తం 503 మంది హాజరయ్యారు. జిల్లాలోని 8 పరీక్షా కేంద్రాల్లో ఉదయం పరీక్షలు నిర్వహించలేదు. మధ్యాహ్నం పరీక్షలకు 556 మందికి 503 మంది హాజరు కాగా 53 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి యోహాను తెలిపారు.నేటి నుంచి జనరల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు (మెట్రో): కోకో రైతుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ద్వారా ఉద్యాన శాఖ నిర్వహిస్తున్న కోకో కాంక్లేవ్ 2026 రెండో రోజు జరిగింది. ఏలూరులో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వ్యవసాయ, అనుబంధ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ కె.శ్రీనివాసులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ కోకో అభివృద్ధి కోసం చర్యలు, కోకో గింజల ప్రాసెసింగ్ రాయితీలపై వివరించారు. డా. చలపతిరావు, విశ్రాంత శాస్త్రవేత్త కాళిదాస్లు కోకోలో చీడ పీడల లక్షణాలు, యాజమాన్య పద్ధతులు వివరించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వివరాలు, రైతులకు కావలసిన సదుపాయాలు గురించి ఇష్టాగోష్టి నిర్వహించారు. -
రాయల్ కిరణ్ నోరు అదుపులో పెట్టుకోవాలి
వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు చిరంజీవి ఏలూరు టౌన్: కూటమి నేతల ప్రోద్భలంతో కిరణ్ రాయల్ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను తీవ్ర పదజాలంతో కించపరిచే వ్యాఖ్యలు చేశాడని, నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదుండి సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బీసీ సెల్ నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. బీసీలు, యాదవులకు వైఎస్సార్సీపీ అధినేత అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే అక్కసుతో యాదవులను అణచివేయాలనే కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని యాదవులకు కేటాయించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిది కాదా? అని ప్రశ్నించారు. బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు నెరుసు చిరంజీవి మాట్లాడుతూ... రాయల్ కిరణ్ చేసిన వ్యాఖ్యలను బీసీ సంఘాలన్నీ ఖండిస్తున్నాయని, వైఎస్సార్సీపీ నేతలను ఇష్టారాజ్యంగా తిడుతూ మళ్ళీ పార్టీలో చోటు సంపాదించాలనే కుటిల రాజకీయాలు చేయటం మానుకోవాలన్నారు. కూటమి నేతలు ఇకనైనా అరాచకాలు, దాడులు, కించపరిచే వ్యాఖ్యలు మానుకోవాలన్నారు. సమావేశంలో బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి కిలారు బుజ్జి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, బీసీ సెల్ నేతలు హాజరయ్యారు. -
నగరంలో జాతర సందడి
● నేడు పడమర వీధి గంగానమ్మ జాతర ● వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లుఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలో మరోసారి జాతర సందడి నెలకొంది. గత ఆదివారం నగరంలోని తూర్పువీధి, దక్షిణపు వీధి, పవర్పేట, లక్ష్మీవారపు పేట, ఆదివారపు పేట ప్రాంతాల్లో నిలిపిన అమ్మవార్ల జాతర నిర్వహించి సోమవారం అమ్మవారికి వీడ్కోలు పలికారు. ఈ ఆదివారం నగరంలోని పడమర వీధి శ్రీ గంగానమ్మ జాతర మహోత్సవం నిర్వహించడానికి కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. నేడే గంగానమ్మ జాతర మహోత్సవం పడమర వీధి శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అమ్మవారి మేడల వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడానికి వివిధ మార్గాల్లో దర్శనం క్యూలైన్లు అందుబాటులోకి తెచ్చారు. సుమారు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని కమిటీ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. వచ్చిన వారందరికీ అమ్మవారికి దర్శనం కల్పించే దిశగా చర్యలు చేపట్టారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఉచిత దర్శనమనేదే లేకుండా సామాన్య భక్తుల వద్ద నుంచి దర్శనం నిమిత్తం టిక్కెట్టు పెట్టి రూ. 20 రూపాయలు వసూలు చేయనున్నట్టు ఇప్పటికే కమిటీ ప్రతినిధులు ప్రకటించారు. నగర ప్రజలకు దర్శనమిచ్చిన కొర్లబండి జాతర ముగిసిన అనంతరం అమ్మవారిని సోమవారం ఊరి పొలిమేరలకు సాగనంపుతారు. కొర్ల బండిని నగర ప్రజల సందర్శనార్థం పడమర వీధి జాతర కమిటీ సభ్యులు రెండు రోజులు ముందుగానే శనివారం నగరంలో ప్రధాన రహదారుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా కొర్లబండిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ప్రత్యేక ఏర్పాట్లు ఆదివారం అమ్మవార్లకు నైవేద్యం సమర్పించడానికి, దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం వివిధ శాఖలు సమన్వయం చేస్తున్నాయి. రెడీమేడ్ మరుగుదొడ్లు సిద్ధం చేశారు. పారిశుద్ధ్యం కోసం బృందాలను ఏర్పాటు చేశాారు. జాతర ప్రాంతంలో విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా అందుబాటులో ఉండేలా ఈపీడీసీఎల్ ఎస్ఈ ఆదేశాలిచ్చారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రజలకు ట్రాఫిక్ మళ్ళింపుపై సమాచారం ఇస్తున్నారు. ఈ మేరకు ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే నైవేద్యాలు పడమర వీధి శ్రీ గంగానమ్మ అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడానికి భక్తులు లక్ష మందికి పైగా వస్తారని అంచనా వేయడంతో భక్తుల తాకిడిని ఎదుర్కోవడానికి తెల్లవారుజామున 2.30 గంటల నుంచే నైవేద్యాలు సమర్పించే వెసులుబాటు కల్పించారు. జాతరను పురస్కరించుకుని బంధుమిత్రులకు విందు భోజనాలు ఏర్పాటు చేసుకున్న నగర ప్రజలు వారికి సమయానికి భోజనాలు అందించాలంటే అమ్మవారికి తొందరగా నైవేద్యం సమర్పిస్తే అంత తొందరగా ఇతర పనులు చేసుకునే అవకాశం ఉంటుందనే తెల్లవారుజామునుంచే భక్తులు దర్శనం కోసం పొటెత్తే అవకాశం ఉంది. -
ప్రయాణికుల భద్రతకు భరోసా
ఏలూరు (ఆర్ఆర్పేట): ఆర్టీసీ అంటే భద్రత, భరోసాకు మారుపేరని ఎస్పీ కే ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ ఏలూరు డిపో గ్యారేజ్లో ఆర్టీసీ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన చిన్నప్పుడు తన తల్లి తనతో ఆలస్యమైనా పరవాలేదు.. ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయమని చెప్పారని, నేటికీ దూర ప్రాంతాలు వెళ్ళాల్సి వస్తే ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్ళడానికి ఇష్టపడతానని తెలిపారు. రహదారి ప్రమాదాలను నివారించడం మనచేతుల్లోనే ఉందని, రహదారిపై వాహనాలతో వెళ్ళేటప్పుడు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం మాట్లాడుతూ డ్రైవర్లకు నిరంతరం శిక్షణ ఇస్తూ వారిని మానసికంగా కూడా సిద్ధం చేసేలా సైకాలజిస్టులతో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది రహదారి ప్రమాదాలు తగ్గించడంలో సఫలీకృతమయ్యామని, రహదారి ప్రమాదాల శాతాన్ని సున్నాకు చేర్చడమే లక్ష్యంగా ఆర్టీసీ డ్రైవర్లు మరింత అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు శేఖర్, జగదీష్, సురేష్, ఏలూరు ఆర్టీసీ డిపో మేనేజర్ బీ వాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం గత ఏడాదిలో ప్రమాద రహితంగా బస్సులు నడిపిన డ్రైవర్లను అతిథుల ద్వారా ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందచేశారు. ఉత్తమ డ్రైవర్ అవార్డులు అందుకున్నవారు ఏలూరు డిపోకు చెందిన ఆర్వీ రావు, జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన బీకే రెడ్డి, ఎం.చిన్నయ్య జిల్లా స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ఏలూరు డిపో స్థాయిలో ఎంఎస్రావు, ఎంఎస్నారాయణ, వీవీఎస్ రెడ్డి. జంగారెడ్డిగూడెం డిపో స్థాయిలో ఎస్కేఎం షాకీర్, ఎంబీ రావు, ఎంపీఆర్ రావు, నూజివీడు డిపో స్థాయిలోఎంజీ రావు, కేఆర్ కృష్ణ, ఎండీ సిద్ధిక్ అవార్డులు అందుకున్నారు. ప్రథమ ఉత్తమ డ్రైవర్గా అవార్డు అందుకుంటున్న కేవీ రావు, బీకే రెడ్డి, ద్వితీయ ఉత్తమ డ్రైవర్ డ్రైవర్లు ఎం. చిన్నయ్య, ఎంఎస్ రావు, ఎంఎస్ నారాయణ, వీవీఎస్ రెడ్డి, ఎస్కేఎం షాకీర్డ్రైవర్లు ఎంబీ రావు, ఎంపీఆర్ రావు, ఎంజీ రావు, కేఆర్ కృష్ణ, ఎండీ సిద్ధిక్ -
గ్రూప్–2లో సత్తా
గ్రూప్ –2 ఫలితాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పలువురు సత్తా చాటారు. తణుకుకు చెందిన సాయి ఫణీంద్ర ఎకై ్సజ్ ఎస్సైగా, పాలకొల్లుకు చెందిన మౌనిక సబ్ రిజిస్ట్రార్గా, ఏలూరుకు చెందిన అజయ్ కుమార్ కోఆపరేటివ్ సొసైటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్గా ఎంపికయ్యారు. – తణుకు అర్బన్, పాలకొల్లు సెంట్రల్, ఏలూరు (ఆర్ఆర్పేట)గ్రూప్–2 ఫలితాల్లో తణుకుకు చెందిన దుద్దుపూడి సాయి ఫణీంద్ర మొదటి ప్రయత్నంలోనే ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. గ్రూప్–2 ఫలితాల్లో 300 మార్కులకు 220.66 మార్కులు సాధించి ఈ ఘనత సాధించారు. దుద్దుపూడి మోహన్రావు, పోసి రత్నం కుమారుడైన ఫణీంద్ర తాడేపల్లిగూడెంలోని వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. పదో తరగతి చదువుతున్న సమయంలోనే తండ్రి చనిపోగా తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో 2020లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సంపాదిచారు. మూడేళ్ల పాటు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించిన ఫణీంద్ర సివిల్స్పై మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రూప్స్కు సిద్ధమయ్యారు. అమ్మ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని భవిష్యత్తులో ఐఏఎస్ కావాలనే తన లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయనున్నట్లు ఫణీంద్ర తెలిపారు. కొంచాడ చిన్ని మౌనిక పాలకొల్లు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన కొంచాడ అప్పలరాజు, రమణి దంపతులకు కుమార్తె చిన్ని మౌనిక గ్రూప్–2 పలితాల్లో సబ్ రిజిస్ట్రార్గా ఎంపికై ంది. ఐఏఎస్ సాధించాలనేది తన లక్ష్యమని తెలిపింది. నవోదయలో 6 నుంచి 10 వరకూ చదివినట్లు తెలిపారు. అగ్రికల్చరల్ బీఎస్సీ అనంతరం.. 2023 మే నెలలో కోర్టులో ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం భీమవరం కోర్టులో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. గ్రూప్–2లో సెలెక్ట్ అవ్వడంతో సబ్రిజిస్ట్రార్ ఉద్యోగం సాధించానని.. సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నానని తప్పనిసరిగా ఐఏఎస్ సాధిస్తానని ఆమె తెలిపింది. తండ్రి, సోదరుడు పట్టణంలోనే వ్యాపారం చేస్తుంటారు. తల్లి యలమంచిలి మండలంలో కలగంపూడి గ్రామ సచివాలయ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. -
ఎన్టీఆర్ యూనివర్సిటీ బాల్ బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక
ఏలూరు రూరల్: ఫిబ్రవరి 11 నుంచి 15 వరకూ దిండిగుల్ల పీఎస్ఎన్ఏ ఇంజినీరింగ్ కాలేజ్లో ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ మహిళల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు జరగనున్నాయని ఆశ్రం కళాశాల పీడీ వీవీఎస్ఎం శ్రీనివాసరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ మహిళల జట్టు కోసం ఈ నెల 30న ఆశ్రం కళాశాల ఆవరణలో ఎంపిక పోటీలు చేపట్టామని వెల్లడించారు. ఆశ్రం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస్ చేబ్రోలు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్, సీఈఓ డాక్టర్ కె.హనుమంతురావు పర్యవేక్షణలో సెలక్షన్ కమిటీ సభ్యులైన ఫిజికల్ డైరక్టర్లు ఈ.త్రిమూర్తి, డీవీవీఎస్ శ్రీనివాస్, వీవీఎస్ఎం శ్రీనివాసరాజు, జి.నాగరాజు కలిసి జట్టును ఎంపిక చేశశాని పేర్కొన్నారు. టి.నరసాపురం : విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెడ్లం గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ రహీమ్(38) అదే గ్రామానికి చెందిన అసిస్టెంట్ లైన్మెన్ వద్ద హెల్పర్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 29న సాయంత్రం ఇద్దరు వెళ్ళి తెడ్లం గ్రామ శివార్లలో రైతు పొలంలో ట్రాన్స్ఫార్మర్ బాగు చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఎల్టీ వైరులోని కండక్టర్ కుడి చేతి బొటన వేలుకు తగిలి కరెటుషాక్ తో ట్రాన్స్ఫార్మర్పై నుంచి కిద పడిపోయాడు. వెంటనే అసిస్టెంట్ లైన్మెన్, రైతు ఇద్దరు కలిసి చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. డాక్టర్ పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేడుకగా నరసన్న కల్యాణోత్సవాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్.జగన్నా పురంలోని సుందరగిరిపై స్వయంభూగా కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం ఆలయంలో విశేష కార్యక్రమాలు జరిగాయి. ఉదయం అర్చకులు, పండితులు నిత్యహోమములు, మూలమంత్ర హవనములు, బలిహరణ, వేదపారాయణ ఔపాసన మండప పూజలు జరిపి స్వామివారికి, అమ్మవార్లకు హారతి, మంత్రపుష్పములు సమర్పించారు. సాయంత్రం మూలమంత్ర హవనములు, బలిహరణలు, హారతి, మంత్రపుష్పాలు తదితర కార్యక్రమాలు నేత్రపర్వంగా జరిగాయి. ప్రాణాచారాలు పడిన మహిళలు సంతానం కోసం పరితపించే పలువురు మహిళలు ఉదయం ఆలయ ప్రాంగణంలో దీక్షతో ప్రాణాచారాలు నిర్వహించారు. ముందుగా వారంతా నారసింహుడిని దర్శించారు. అనంతరం సుందరగిరిపై పాలపొంగళ్లను వండి స్వయంగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ఆ తరువాత తడిదుస్తులతో వారంతా ఆలయం వెనుక ప్రాణాచారం పడ్డారు. సాయంత్రం వరకు ఆ మహిళలు నరసింహుని స్మరిస్తూ ఉపవాస దీక్షను చేశారు. ఇలా చేయడంవల్ల వారికి స్వామివారు మదిలో సాక్షాత్కరించి కోరిన కోర్కెలను తీరుస్తాడని భక్తుల నమ్మకం. అలాగే వారు నవగ్రహ పూజలు జరిపారు. నేడు నారసింహుడి కల్యాణం.. సుందరగిరి దిగువనున్న కల్యాణ మండపంలో నరసన్న దివ్య కల్యాణ మహోత్సవం శనివారం ఉదయం 11.10 గంటలకు వైభవంగా జరగనుంది. ఇందుకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేడుకలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ కోరారు. నేడు నారసింహుని దివ్య కల్యాణం -
జాతరకు పటిష్ట ఏర్పాట్లు
● ఏలూరు పడమరవీధి శ్రీ గంగమ్మ జాతర ● 800 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏలూరు టౌన్: ఏలూరు నగరం పడమర వీధిలోని శ్రీ గంగమ్మతల్లి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా.. భక్తి శ్రద్దలతో జరుపుకునేందుకు భక్తులు సిద్ధపడుతున్నారు. వేలాదిగా భక్తులు జాతర మహోత్సవాలకు తరలివస్తారనే అంచనాలతో పోలీస్ అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. భక్తులకు అసౌకర్యం లేకుండా జాతర కమిటీ ప్రత్యేక శ్రద్ధ వహించాలంటూ ఐజీ జీవీజీ అశోక్కుమార్ సూచించారు. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్తో కలిసి ఆయన శుక్రవారం పడమరవీధి గంగమ్మ తల్లి జాతర మహోత్సవ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భారీ పోలీస్ బందోబస్తు వన్టౌన్ ప్రాంతంలో శ్రీ గంగమ్మతల్లి జాతర మహోత్సవం ముగింపు సందర్భంగా ఫిబ్రవరి 1, 2 తేదీల్లో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ యంత్రాంగం పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ ఆధ్వర్యంలో వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణతోపాటు పోలీస్ సిబ్బందిని భారీ సంఖ్యలో నియమించారు. జాతర ముసుగులో మద్యం సేవించి అల్లర్లకు పాల్పడే వ్యక్తులను ముందుగానే గుర్తించేలా మఫ్టీలో పోలీసులను రంగంలోకి దించారు. ఆలయ సమీపంలో సీసీ కెమెరాల ఏర్పాటు, డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచారు. ఫిబ్రవరి 1న ఆదివారం మహా కుంభం, ఫిబ్రవరి 2న ఊరేగింపునకు వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. జాతర ప్రాంతంలో భక్తులకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. జాతర కమిటీ సభ్యులు, రెవెన్యూ, ఏలూరు నగరపాలక సంస్థ, వైద్య ఆరోగ్యశాఖల అధికారులతో పోలీస్ యంత్రాంగం సమన్వయం చేసుకుంటూ భక్తులకు అసౌకర్యం లేకుండా చర్యలు చేపట్టేలా ఎస్పీ ప్రత్యేక ప్రణాళికతో ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అసౌకర్యం, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాం. ఆదివారం తెల్లవారుజాము నుంచి నగరంలోకి భారీ వాహనాలకు అనుమతులు లేవు. ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. మఫ్టీలో పోలీసులు అల్లర్లకు పాల్పడే వారిపై నిఘా ఉంచుతారు. – డీ.శ్రావణ్కుమార్, డీఎస్పీ -
కమనీయం.. శివయ్య కల్యాణం
ద్వారకాతిరుమల: క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో శివదేవుని కల్యాణ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుక ఆద్యంతం భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా దేవస్థానం సిబ్బంది ఆలయాన్ని, పరిసరాలను సుగంధభరిత పుష్పమాలికలు, మామిడి తోరణాలు, అరటిబోదెలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి, అర్చకులు విశేష పుష్పాలంకారాలు చేశారు. ఆ తరువాత కల్యాణ తంతును ప్రారంభించి, సుముహూర్త సమయంలో నూతన వధువరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేశారు. సుముహూర్త సమయంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల శివనామస్మరణల నడుమ మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను కన్నులపండువగా జరిపి, కల్యాణ మూర్తులకు హారతులిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు తీర్ధప్రసాదాలను స్వీకరించారు. -
శ్రీవారిని, లడ్డూని అవమానించిన కూటమి
తణుకు అర్బన్: పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందంటూ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాన్ని అవమానం పాలుచేశారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. లడ్డూలో ఎటువంటి కొవ్వులూ కలవలేదని సీబీఐ సిట్లో నివేదిక ఇచ్చిందని, దీనిపై కూటమి నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఏ రకంగా ప్రాయశ్చిత్యం చేసుకుంటారని నిలదీశారు. వేంకటేశ్వరస్వామిని అవమానించి పాపం మూటగట్టుకున్నారన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా విష ప్రచారం చేసిన కూటమి నేతలను భగవంతుడు క్షమించడని స్పష్టం చేశారు. తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయంగా వాడుకున్నారన్నారు. ఆర్ఎస్ఎస్, సనాతన ధర్మం, బీజీపీ ఏం చేస్తున్నారు లడ్డూ కల్తీ జరిగిందని కూటమి నేతలు గుళ్ల చుట్టూ తిరుగుతున్నారని, కానీ తణుకులో ఆవులను, పాలి చ్చే గేదెలను కోసేస్తుంటే ఆర్ఎస్ఎస్, సనాతన ధ ర్మం, బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి ప్రశ్నించారు. ఏ కల్తీ లేనిచోట రాద్ధాంతం చేస్తున్నారని, కానీ తణుకులో జరుగుతున్న గోవధపై మాత్రం మాట్లాడరని మండిపడ్డారు. చేతనైతే గోవధ నిలిపివేసేందుకు పాటుపడాలని కారుమూరి సూచించారు. కూటమి కవ్వింపులు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తమ పార్టీ శ్రేణులతో కలిసి ఒకరోజు ముందుగా ప్రకటించిన ప్రకారం శుక్రవారం ఉదయం తణుకులోని రాష్ట్రపతి రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చారు. అదే సమయంలో తాము కూడా అదే ఆలయానికి వస్తున్నట్టుగా ఎమ్మెల్యే రాధాకృష్ణ కూడా ప్రకటించారు. దీంతో పోలీసులు సైతం ముందుగానే ఆలయం వద్ద మోహరించారు. ఉద యం 9 గంటల తరువాత మాజీ మంత్రి కారుమూరి, పార్టీ నాయకులతో కలిసి వచ్చి స్వామిని దర్శించుకుని అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. అప్పటికే భారీగా వచ్చిన కూటమి నా యకులు కారుమూరి కారు ఎక్కిన తరువాత ‘కల్తీ లడ్డూ గోవింద’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయినా కారుమూరితో పాటు పార్టీ శ్రేణు లు సంయమనం పాటించారు. కూటమి నేత ల నినాదాలు, కవ్వింపులతో ఏం జరుగుతుందో నని పోలీసు అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఎలాంటి కొవ్వులూ కలవలేదనిసీబీఐ నివేదిక బాబు, పవన్ ఎలా ప్రాయశ్చిత్తం చేసుకుంటారు ? మాజీ మంత్రి కారుమూరి ఆగ్రహం -
సా..గుతున్న రబీ
నరసన్న కల్యాణోత్సవాలు ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నరసన్న కల్యాణోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. 8లో uశనివారం శ్రీ 31 శ్రీ జనవరి శ్రీ 2026సాక్షి, భీమవరం: ఉమ్మడి పశ్చిమలో రబీ సాగు జాప్యమవుతోంది. ఖరీఫ్ కలిసిరాక, ప్రభుత్వం సహకారం అందక దాళ్వా పనులు నత్తనడకన జరుగుతున్నాయి. సాగు చివరిలో నీటి ఎద్దడి రాకుండా డిసెంబరు నెలాఖరవు నాటికి నాట్లు పూర్తిచేయాల్సి ఉండగా జనవరి ముగుస్తున్నా ఇంకా సాగుతూనే ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని 2.25 లక్షల ఎకరాలు, ఏలూరు జిల్లాలో 80 వేల ఎకరాల్లో రైతులు రబీ సాగు చేస్తున్నారు. మున్ముందు ఎండల తీవ్రత, నీటి ఎద్దడితో పంటకు నష్టం కలుగకుండా సకాలంలో సాగు పూర్తిచేసేందుకు డిసెంబరు నెలాఖరు నాటికి నాట్లు పూర్తిచేయాలని, వెదజల్లు పద్ధతిని అవలంభించే వారు డిసెంబరు మొదటి వారంలోపు విత్తుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు గతంలోనే సూచించారు. కలిసిరాని ఖరీఫ్ : సాగునీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్ ఆలస్యమైంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 4.01 లక్షల ఎకరాల్లో తొలకరి సాగు చేయగా పంట పాలుపోసుకునే, గింజ గట్టిపడే కీలక దశల్లో మోంథా తుపాను తీవ్ర నష్టం కలిగించింది. స్వర్ణ, సంపద స్వర్ణ సాగుచేసిన పొలాల్లో పంట నేలకొరిగింది. ఎంటీయూ 1318, పీఎల్ఏ 1100, తదితర రకాల్లో తాలు గింజలు పెరిగి దిగుబడులు తగ్గిపోయాయి. పశ్చిమలోని ఆకివీడు, నరసాపురం, భీమవరం, పెంటపాడు, మొగల్తూరు తదితర మండలాల్లోని 25 వేల ఎకరాలు, ఏలూరులోని ఉంగుటూరు, దెందులూరు, చింతలపూడి తదితర చోట్ల సుమారు 30 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఖరీఫ్లో ఎకరాకు సగటున 26.25 క్వింటాళ్లు చొప్పున దిగుబడి రావాల్సి ఉండగా తుపాను ప్రభావంతో 21 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఎకరాకు 5.25 క్వింటాళ్ల దిగుబడి తగ్గిపోయింది. క్వింటాల్కు మద్దతు ధర రూ.2,369లు మేరకు ఒక్కో ఎకరాకు రూ.12,437లు వరకు నష్టపోయి పెట్టుబడులు దక్కని దుస్థితి ఎదురైంది. మరో 20 వేల ఎకరాల్లో.. పశ్చిమలో ఇప్పటివరకు రెండు లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తికాగా మరో 20 వేల ఎకరాల్లో జరగాల్సి ఉంది. ముందుగా రబీ నాట్లు వేసిన తాడేపల్లిగూడెం రూరల్ తదితర ప్రాంతాల్లో వరి పంట దుబ్బు చేస్తుండగా యలమంచిలి, ఆచంట, నరసాపురం తదితర చోట్ల ఇంకా నాట్లు జరుగుతున్నాయి. ఈ సీజన్లో అధిక శాతం విస్తీర్ణంలో 120 నుంచి 125 రోజులు సాగుకాలం కలిగిన వంగడాలు సాగవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఏప్రిల్ నెలాఖరు, మే మొదటి వారం వరకూ సాగు జరిగే అవకాశం ఉందని అంచనా. సాగు చివర్లో ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన నాట్లు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. జనవరిలోనూ నాట్లు దాళ్వా సాగు ఆలస్యం రైతులకు నష్టాలు మిగిల్చిన ఖరీఫ్ సాయం అందించని ప్రభుత్వం రబీ పెట్టుబడులకు సతమతం ఉమ్మడి జిల్లాలో 3.15 లక్షల ఎకరాల్లో సాగు దాళ్వా సాగు (ఎకరాల్లో) జిల్లా విస్తీర్ణం పశ్చిమగోదావరి 2.25 లక్షలు ఏలూరు 80 వేలు -
విజిలెన్స్ దాడులు
ఏలూరు టౌన్: ఏలూరులో విజిలెన్స్, రెవెన్యూ, జీఎస్టీ అధికారులు శుక్రవారం సంయుక్తంగా దా డులు చేశారు. ఐదు షాపుల్లో నిషేదిత గుట్కా ప్యా కెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను గుర్తించి కేసులు నమోదు చేశారు. విజిలెన్స్ డీఎస్పీ సింగులూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. ఏలూరు వన్టౌన్ పోలీసులకు వీటిని అప్పగించి, క్రిమినల్ కేసులు నమోదుకు సిఫార్సు చేశామని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ వెంకటేశ్వరరా వు తెలిపారు. విజిలెన్స్ సీఐ డి.ప్రసాదకుమార్, గంగాభవానీ, ఎస్సై సీహెచ్ రంజిత్కుమార్, కె.సీతారాము, కె.నాగరాజు, జీఎస్టీ అధికారి కె.శ్రీనివాసమూర్తి, రెవెన్యూ అధికారులు ఉన్నారు. -
తాగునీటి పైప్లైన్లకు మరమ్మతులు
బుట్టాయగూడెం: మండలంలోని నందాపురం సమీపంలోని పునరావాస కాలనీలో మంచినీటి సమస్య పరిష్కారానికి శుక్రవారం అధికారులు చర్యలు తీసుకున్నారు. కాలనీలో పైప్లైన్లు పగిలిపోయి బురదనీరు రావడంతో నిర్వాసితులు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’లో ప్రచురించిన ‘పునరావాస కాలనీలో సమస్యల పోరు’ కథనానికి అధికారులు స్పందించారు. పంచాయతీరాజ్ డీఈ, ఏఈలు, నిమ్మలగూడెం పంచాయతీ కార్యదర్శి జి.విమలాదేవి పునరావాస కాలనీని సందర్శించారు. పాడైపోయిన పైప్లైన్లను మరమ్మతులు చేయించారు. మరో రెండు లైన్లు ఉన్నాయని అవి శనివారం పూర్తి చేస్తే మొత్తం కాలనీ అంతటికీ మంచినీరు సరఫరా అవుతుందని అధికారులు చెప్పారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన ‘సాక్షి’కి నిర్వాసితులు కృతజ్ఞతలు తెలిపారు. -
బలివే ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
నూజివీడు: మహాశివరాత్రిని పురస్కరించుకుని వచ్చేనెల 15న జరిగే బలివే ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం మహా శివరాత్రి ఉత్సవాలపై అధికారులతో సమీక్షించారు. ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఉండాలని, దాదాపు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి తోపులాటలు జరగకుండా చూడాలన్నారు. ఆలయ పరిసరాల్లో దుకాణాలు పెట్టనీయొద్దని, కనీసం 500 మీటర్ల దూరం పాటించాలన్నారు. తమ్మిలేరులో భక్తులు స్నానాలాచరించాల్సి ఉన్న నేపథ్యంలో తమ్మిలేరులో నీటి ప్రవాహంపై నివేదిక ఇవ్వాలన్నారు. ఆరోగ్య శిబిరాలు, పారిశుద్ధ్యంపై సూచనలిచ్చారు. తిరునాళ్లలో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేస్తున్నారని, జెయింట్వీల్, ఇతర వినోదం కలిగించే పరికరాల ఫిట్నెస్ను పరిశీలించాలన్నారు. అధికారులంతా సమన్వయంతో ఉ త్సవాలను విజయవంతం చేయాలని కోరారు. డీ ఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్, సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ, ఆలయ ఈఓ పామర్తి సీతారామ య్య, ఎస్సై మేడిబోయిన చిరంజీవి, ఇన్చార్జి ఎంపీడీఓ బసవరాజు సత్యనారాయణ పాల్గొన్నారు. -
అక్షరాస్యత పెంపునకు చర్యలు
ఏలూరు(మెట్రో): అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో అక్షరాస్యత పెరుగుదలకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి శుక్రవారం అక్షర ఆంధ్ర, యూనిఫైడ్ ఫామిలీ సర్వే, పీ–4 తదితర కార్యక్రమాలపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలోని 97,200 మందికి అక్షరాస్యత, ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యత అందించడం లక్ష్యంగా ని ర్ణయించామన్నారు. యూనిఫైడ్ ఫామిలీ సర్వే పనులు వేగవంతం చేయాలని, పీ–4 ద్వారా గుర్తించిన బంగారు కుటుంబాలు, మార్గదర్శుల వివరాలను యాప్లో నమోదు చేయాలన్నారు. జెడ్పీ సీఈఓ శ్రీహరి, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఏలూరు టౌన్: చింతలపూడిలోని కనకదుర్గ ఫైనాన్స్ కంపెనీలో ఆడిటర్ భారీ చోరీకి పాల్పడ్డాడు. ఈ కేసును అత్యంత చాకచక్యంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోలీసులు ఛేదించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన ఆడిటర్ వడ్లమూడి ఉమమహేష్ను పోలీసులు అరెస్ట్ చేసి అతడి నుంచి భారీ ఎత్తున సుమారు రూ.7 కోట్ల విలువైన 4.490 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీ నం చేసుకున్నారు. ఈ బంగారు ఆభరణాలు 378 మంది ఖాతాదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ బంగారు ఆభరణాలను కనకదుర్గ ఫైనా న్స్ ప్రధాన కార్యాలయ ప్రతినిధులకు శుక్రవా రం అందజేశారు. వందలాది మంది ఖాతాదారులకు చెందిన బంగారు ఆభరణాలను తిరిగి రికవరీ చేయటంలో పోలీసుల కృషిని ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు అభినందించారు. జంగారెడ్డిగూడెం ఇన్చార్జి డీఎస్పీ యు.రవిచంద్ర, ఏలూరు మహిళ స్టేషన్ సీఐ ఎం.సుబ్బారావు, ఫైనాన్స్ కంపెనీ యాజమాన్యం ఉన్నారు. ఏలూరు (టూటౌన్): జిల్లా పరిధిలో బాలల సంరక్షణ కేంద్రాల రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించినట్టు జిల్లా పర్యవేక్షణాధికారి టి.జ్యోతి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు సహా సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జతచేసి వచ్చేనెల 13లోపు ఏలూరులోని కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు జ్యోతి సెల్ 7780399779, జిల్లా బాలల సంరక్షణ అధికారి సీహెచ్ సూర్యచక్రవేణి సెల్ 89191 60257 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్మీడియెట్ ఒకేషనల్ (బ్రిడ్జ్కోర్సు, ఆన్జాబ్ ట్రైనింగ్) విద్యార్థులకు ప్రాక్టికల్స్ శుక్రవారం కొనసాగాయి. జిల్లాలోని 34 కేంద్రాల్లో ఉదయం 2,320 మందికి 2,286 మంది, మధ్యాహ్నం 2,502 మందికి 2,457 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాను తెలిపారు. ఏలూరు (టూటౌన్): ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు ఉద్యమిస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ)జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరుతూ స్థానిక డీమార్ట్ సెంటర్లో గాంధీజీ విగ్రహం వద్ద శుక్రవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధి చట్టానికి బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని, కార్పొరేట్ల ప్రయోజనం కోసం ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. జీ రాం జీ పేరిట కొత్త పథకాన్ని తీసుకువచ్చిందని దీనిపై రాష్ట్రంలో ఉన్న పాలకులు ప్రశ్నించకపోవడం దారుణమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, బీకేఎంయూ జిల్లా సహాయ కార్యదర్శి గోలిమే బాలయేసు, మండల కార్యదర్శి పొటేలు పెంటయ్య, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి పి.కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యాన పంటలకు ప్రోత్సాహం
ఏలూరు(మెట్రో): రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. స్థానిక చింతలపూడి రోడ్డులోని బాలాజీ గార్డెన్స్ ఫంక్షన్ హాలులో శుక్రవారం రాష్ట్రస్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోకో పంట విస్తీర్ణం పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు తక్కువ ఖర్చు తో నాణ్యమైన కోకో ఉత్పత్తి, సాగులో మెలకువలు, మార్కెటింగ్ సౌకర్యాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించడమే ఈ కాంక్లేవ్ ఉద్దేశమన్నారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 44,984 ఎకరాల్లో కోకో సాగవుతుందని, అదనంగా 1,200 హెక్టార్లలో పంట సాగుచేసేలా రైతులు శిక్షణ ఇచ్చా మన్నారు. ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కు మార్, పత్సమట్ల ధర్మరాజు మాట్లాడారు. అనంత రం కోకో పంటకు సంబంధించి కరపత్రాలు వి డుదల చేశారు. ఉద్యాన శాఖ కమిషనర్ కె.శ్రీనివాసులు, ఉద్యాన అధికారి సాజా నాయక్, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్ తదితరులు పాల్గొన్నారు. కోకో బోర్డు కోసం వినతి ఏలూరు (టూటౌన్): కోకో బోర్డు, కోకో పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని, కోకో గింజలకు ధరల పాలసీ ప్రకటించాలని కోరుతూ ఏపీ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి అచ్చెన్నాయుడుకు వినతిపత్రం అందించారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కోకో రైతులు సాగులో కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారని ఆదుకోవాలని కోరారు. -
వారానికే కుప్పకూలిన డ్రెయినేజీ గోడ
● నాణ్యత డొల్ల.. నిర్మాణం గుల్ల ● చంద్రబాబు ప్రభుత్వంలో పనుల తీరిది నూజివీడు: చంద్రబాబు ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యే విషయంలోను, పనులను పంచుకోవడంలో చూపుతున్న శ్రద్ధ అభివృద్ధి పనుల నాణ్యతపై చూపడం లేదు. పర్యవేక్షించాల్సిన అధికారులు పనులు జరుగుతున్న ప్రాంతానికి రా కుండా కార్యాలయాల్లోనే కూర్చోని కాలం వెళ్లబుచ్చుతుండటంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నూజివీడులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బాపూనగర్ రోడ్డులో నిర్మించిన సీసీ డ్రెయినేజీ గోడ శుక్రవారం కుప్పకూలింది. ఈ డ్రెయిన్ను నిర్మించి పట్టుమని వారం రోజులు కాకుండానే కూ లిపోవడం సంచలనంగా మారింది. మున్సిపాలిటీ చరిత్రలోనే ఇలాంటి సంఘటన చోటుచేసుకోలేదని, ఇంత దారుణంగా అభివృద్ధి పనులు నిర్వహించడంపై ప్రజలు విస్మయం వ్యకం చేస్తున్నారు. బాపూనగర్ రోడ్డులో రామకృష్ణ మఠం ఎదురుగా మురుగునీరు వెళ్లే వాగుకు రూ.9 లక్షల అంచనాతో సీసీ డ్రెయినేజీ నిర్మిస్తున్నారు. ఈ పనులను సాయి సారథి ఇన్ఫ్రా అనే కాంట్రాక్టు కంపెనీ దక్కించుకుంది. ఈనెల 24న సీసీ డ్రెయినేజీని నిర్మించగా వారం రోజులు తిరగకుండానే గోడ కూలిపోయింది. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా.. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే డ్రెయినేజీ గోడ కూలి ఉండవచ్చని భావిస్తున్నారు. కాలువ అడుగు భాగంలో బెడ్ సరిగా వేయకుండానే గోడలను నిర్మించడం, అది కూడా ఎస్టిమేషన్లో పేర్కొన్న విధంగా చేసి ఉండరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంజనీరింగ్ సిబ్బంది అభివృద్ధి పనులను దగ్గరుండా పర్యవేక్షించాల్సి ఉండగా ఇటువైపు పనులను చూడలేదని స్థానికులు చెబుతు న్నారు. వర్క్ ఇన్స్పెక్టర్, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఏఈ, డీఈలు ఉన్నా ఒక్కరూ కూడా వచ్చి పనులను పర్యవేక్షించలేదని అంటున్నారు. నిర్మాణ సమయంలో సిమెంట్, కంకర, ఇసుక ఏ దామాషాలో కలుపుతున్నారనే దానిపై కూడా పట్టించుకున్న వారే లేరనే విమర్శలు ఉన్నాయి. విజిలెన్స్ విచారణకు డిమాండ్ కూలిన సీసీ డ్రెయినేజీ గోడను వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ శీలం రాము, మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు, కౌన్సిలర్ కొడవటి రాంబాబు, నాయకులు తలారి సతీష్, పిళ్లా చరణ్, గిరి వరలక్ష్మి, ఉదయగిరి కృపారావు తదితరులు పరిశీలించారు. కూటమి ప్రభుత్వంలో పనులు పంచుకోవడానికి చూపుతున్న శ్రద్ధ నాణ్యతతో చేయడానికి చూపడం లేదన్నారు. అధికారులు కూడా అధికార పార్టీ నాయకులు, కాంట్రాక్టర్ల మాటలు వినడమే తప్ప నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేయించకపోవడంతోనే ఈ దుస్థితి ఎదురైందన్నారు. ప్రస్తుతం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పనుల నాణ్యతపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
గూడెం విమానాశ్రయంపై కదలిక
జాతరకు పటిష్ట ఏర్పాట్లు ఏలూరు పడమరవీధిలో గంగానమ్మవారి జాతర మహోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. 8లో uతాడేపల్లిగూడెం: రాష్ట్రంలో ఏర్పాటుచేయబోయే నాలుగు కొత్త విమానాశ్రయాలపై శుక్రవారం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయడంతో తాడేపల్లిగూడెం విమానాశ్రయ ఏర్పాటుపై కదలిక వచ్చింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలో వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట గ్రామాల్లో భూసేకరణ చేసి విమానాశ్రయం ఏర్పాటు చేస్తారని ప్రచారం ఉంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో భూపరిశీలన చేశారు. రెండు, మూడు నెలల క్రితం ఈ ప్రతిపాదన హల్చల్ చేసినా, తర్వాత ఆగిపోయింది. తాజా ప్రకటనతో గూడెం విమానాశ్రయం ఏర్పాటుపై మరలా చర్చ ప్రారంభమైంది. గూడెంలో కొత్త ఎయిర్పోర్టు ఏర్పాటుపై అధ్యయనం చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టుగా వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి అడిగిన ప్రశ్నకు పౌరవిమానయాన సహాయ మంత్రి మురళీధర్ మో హోల్ సమాధానం ఇచ్చినట్టు సమాచారం. వి మానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన స్థల వివరాలను ఎయిర్పోర్టు అఽథారిటీ ఆఫ్ ఇండి యాకు ప్రభుత్వం అందజేసినట్టు తెలిసింది. -
గొంతులో అన్నం ముద్ద అడ్డుపడి చిన్నారి మృతి
జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో శుక్రవారం గొంతులో అన్నం ముద్ద అడ్డుపడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. పట్టణంలోని మార్కండేయపురం జగనన్న ఎల్–3 లేఅవుట్ కాలనీలో ర్యాలీ ఆంజనేయకుమార్, భాను శిరీష దంపతులు. వారికి జెస్సీ (2) అనే కుమార్తె ఉంది. శుక్రవారం జెస్సీ తల్లి భాను శిరీష, నాన్నమ్మ వెంకట రమణ పనిమీద పట్టణానికి వచ్చారు. మధ్యాహ్న కావడంతో జెస్సీ తండ్రి ఆంజనేయకుమార్ అన్నం కలిపి చిన్నారికి తినిపిస్తున్నాడు. ఆ సమయంలో చిన్నారికి అన్నం ముద్ద గొంతు నుంచి దిగక ఉక్కిరిబిక్కిరైంది. దీంతో తండ్రి పక్కనే నివసిస్తున్న వరాల దుర్గను పిలిచాడు. ఆమె వచ్చి చిన్నారికి సపర్యలు చేసింది. అయినా బాలిక స్పృహ కోల్పోయింది. వెంటనే ఆంజనేయకుమార్ అక్కంపేటలో ఉంటున్న తన అక్క మాటూరి పద్మావతి, బావ రాంబాబులకు ఫోన్ చేశాడు. వారు వచ్చి చిన్నారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చిన్నారి మృతిచెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్యోగుల హామీలు నెరవేర్చాలి
పెదవేగి : రాష్ట్ర ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన 4 డీఏలను వెంటనే ప్రకటించి, సీపీఎస్ను రద్దు చేయాలని, 12వ పీఆర్సీ కమిటీ నియమించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు, ఫ్యాప్టో చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పెదవేగి మండలం నందు వివిధ పాఠశాలలను ఆయన సందర్శించి మాట్లాడారు. హామీల సాధన కోసం ఎస్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించే దశల వారీ పోరాటంలో ఉపాధ్యాయులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్టీయూ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కేఆర్ పవన్ కుమార్, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శులు బీ మహేష్, ఎండీ షఫీయుద్దిన్, పెదవేగి మండల అధ్యక్షుడు పి నాగార్జున, ప్రధాన కార్యదర్శి టి ప్రవీణ్ కుమార్, నెరుసు శ్రీనివాస్, వీ అమృత్, టి.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పంట కాలువలో ఆక్వా వ్యర్థాల విడుదల
ఉండి: పంట కాలువలోకి ఆక్వా వ్యర్థాలు విడుదల చేయడంతో పంట కాలువ కలుషితమవుతోంది. దీంతో సాగు, తాగునీరు కలుషితమై ఇటు రైతులు, అటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉండి శివారు ఉప్పుగుంట పంట కాలువలోకి ఓ ఆక్వా రైతు దర్జాగా ఆక్వా వ్యర్థాలను విడిచిపెట్టేశాడు. పెద్ద చెరువులో పట్టుబడి జరిగిన అనంతరం దానిలోని మొత్తం వ్యర్థాలను పంట కాలువలోకే విడిచిపెట్టేశారు. దీంతో స్థానికంగా ఉండే ప్రజలు వాడుకునే నీరు కలుషితమైంది. సదరు రైతు చెరువుకు మాత్రమే కాకుండా వేలాది ఎకరాల్లో చెరువులకు ఇన్లెట్ సౌకర్యం మాత్రమే ఉండి అవుట్లెట్ సౌకర్యం లేకపోవడం గమనార్హం. కాసులకు కక్కుర్తిపడిన అధికారులు నిబంధనలకు తూట్లు పొడిచి ఎడాపెడా ఆక్వా చెరువులకు అనుమతులు ఇవ్వడం దీనికి ప్రధాన కారణం. ఆక్వా చెరువుకు అనుమతివ్వాలంటూ ప్రాథమికంగా పరిశీలించాల్సి ఉంది. సాగునీరు చెరువుకు అందుతుదా లేదా అని, అలాగే చెరువులోని మురుగునీరు డ్రెయిన్లోకి వెళ్లే సదుపాయం ఉందా లేదా అని చూడాలి. కానీ ఒక్క మండలమే కాకుండా నియోజకవర్గంలోని వేలాది ఎకరాల ఆక్వా చెరువులకు ఇదే సమస్య ఉంది. దీనివల్లనే చెరువుల పట్టుబడి జరిగిన అనంతరం దానిలో విషపూరితమైన వ్యర్థాలను నేరుగా పంటకాలువల్లోకి వదిలేస్తున్నారు. దీంతో నీటిని కనీస అవసరాలకు తాగునీటికి వినియోగించిన ప్రజలు అంతుచిక్కని రోగాలతో ప్రాఽణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఇటీవల కేన్సర్ వ్యాధి ఎక్కువగా ప్రబలేందుకు ఆక్వా వ్యర్థాలు కూడా ఒక కారణంగా పేర్కొంటున్నారు. ఇంతటి ప్రాణాపాయం ప్రజలకు సంభవిస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
జగనన్న క్రీడలను ప్రోత్సహించారు
తణుకు అర్బన్: సంక్రాంతి పండుగలో యువత జూద క్రీడల జోలికి పోకండా జగనన్న 2.0 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి క్రీడలపైపు మళ్లించడం మంచి పరిణామమని వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జ్, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్కుమార్ అన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తణుకు జాతీయ రహదారి సమీపంలో నిర్వహిస్తున్న జగనన్న 2.0 క్రికెట్ టోర్నమెంట్ను గురువారం సునీల్కుమార్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యలమల నాగార్జునయాదవ్ సందర్శించారు. సునీల్కుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వయస్సుల వారికి క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించారని గుర్తుచేశారు. క్రీడా సామగ్రి ఉచితంగా ఇవ్వడంతోపాటు క్రీడాకారులకు అల్పాహారం, భోజన వసతి కల్పించి విజేతలకు నగదు బహుమతులు అందజేసి ప్రోత్సహించారన్నారు. ముఖ్యంగా జగనన్న 2.0 క్రికెట్ టోర్నమెంట్లో పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల నుంచి 40 జట్లు పాల్గొనడం విశేషమని, నిర్వాహకుడైన వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ తణుకు పట్టణ అధ్యక్షుడు పెనుమాల రాజేష్ను ప్రత్యేకంగా అభినందించారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గోపె ఎడ్వర్డ్ పాల్, రెండు జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. -
పోస్టాఫీస్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ఏలూరు (టూటౌన్) : ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన పోస్టాఫీస్ పొదుపు, జీవిత బీమా పథకాలను ఉద్యోగులంతా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ సర్కిల్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ కె.సంతోష్ నేత పిలుపునిచ్చారు. పోస్టాఫీస్ పొదుపు పథకాలు, తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్ గల తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా ఆవశ్యకతపై భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు డివిజన్ల తపాలా సిబ్బందితో గురువారం ఏలూరులో అవగాహన సదస్సు నిర్వహించారు. ఏలూరు తపాలా సూపరింటెండెంట్ ఎస్.విజయ్ భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ అవగాహన సదస్సులో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ కె.సంతోష్ నేత ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వినియోగదారులు తమ సమీప పోస్టాఫీస్లను సందర్శించి వివిధ పొదుపు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వచ్చే నెల 18, 19, 20వ తేదీల్లో జరుగు మెగా తపాలా జీవిత బీమా డ్రైవ్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ రెవెన్యూ లక్ష్యాలను సాధించిన ప్రతిభావంతులైన ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భీమవరం డివిజన్ సీనియర్ తపాలా సూపరింటెండెంట్ కె.హరికృష్ణ ప్రసాద్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఏవీ సరేష్ కుమార్, తాడేపల్లిగూడెం సూపరింటెండెంట్ ఎం.శ్రీనివాసు, మూడు డివిజన్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ కె.సంతోష్ నేత -
సుందరగిరిపై కల్యాణోత్సవాలు ప్రారంభం
● పెండ్లికొడుకై న నారసింహుడు ● స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు ద్వారకాతిరుమల : శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన మండలంలోని ఐఎస్.జగన్నాధపురం సుందరగిరిపై కొలువైన స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారు భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం పెండ్లి కుమారుడయ్యారు. స్మార్త ఆగమయుక్తంగా పాంచాహ్నిక దీక్షతో వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కనకవల్లీ, లక్ష్మీ అమ్మవార్లు పెండ్లి కుమార్తెలయ్యారు. ముందుగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి, విశేష పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ పండితులు నారసింహుడిని పెండ్లి కుమారునిగాను, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగాను చేశారు. వేడుకలో పాల్గొన్న ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ, ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం గర్భాలయంలో విశేష అలంకారాల్లో దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించి, ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. సాయంత్రం ఆలయంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచన, రుత్విగ్వరణ, అంకురార్పణ, కలశస్థాపన, ధ్వజారోహణ, అగ్నిప్రతిష్టాపన వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి, తీర్థ ప్రసాదాలను, అలాగే అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఉత్సవాల్లో నేడు : ● ఉదయం 8 గంటల నుంచి నిత్య పూజలు, హోమము, బలిహరణ ● సాయంత్రం 6 గంటల నుంచి నిత్య పూజలు, హోమములు, బలిహరణ, నీరాజన మంత్రపుష్పములు ● సాంస్కృతిక కార్యక్రమం : రాత్రి 7 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శనలు -
దొరకునా ఇటువంటి సేవ..
● క్షీరారామలింగేశ్వరస్వామికి 47 ఏళ్లుగా పాగా నేస్తున్న వీరన్న కుటుంబం ● పూర్వీకుల ఆనవాయితీ నిలబెడుతున్న సోమేశ్వరరావు పాలకొల్లు సెంట్రల్: మహాశివరాత్రి ఉత్సవాలు మరో ఇరవై రోజుల్లో ప్రారంభంకానున్నాయి. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి మల్లన్న పాగా ఏర్పాటుచేస్తారు. అటు శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో తదుపరి పంచారామక్షేత్రాల్లో ఒకటైన శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామివార్లకు మహాశివరాత్రి పర్వదినం నాడు లింగోద్భవ సమయంలో మల్లన్న పాగాను సమర్పిస్తారు. లింగోద్భవ సమయానికి స్వామివారి గర్భాలయం శిఖరం నుంచి గాలిగోపురం శిఖరం వరకూ రెండు పేటలుగా అమరుస్తారు. ఈ వేడుకను తిలకించడానికి భక్తులు అర్థరాత్రి సమయంలో తండోపతండాలుగా తరలివస్తుంటారు. 1979లో ప్రారంభం స్వామివారికి సమర్పించే ఈ పాగాను పాలకొల్లు మండలంలోని దగ్గులూరు గ్రామానికి చెందిన అందే వీరన్న 1979లో ప్రారంభించారు. శ్రీశైలంలో ఏర్పాటుచేసే పాగాను చూసిన వీరన్న నాడు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సంప్రదించి ఆలయ అధికారుల అనుమతితో నాడు మల్లన్న పాగాను స్వయంగా మగ్గంపై నేచి స్వామివారికి సమర్పించేవారు. అనంతరం వీరన్న అల్లుడుకు వారసికంగా ఈ పాగాను నేయడం అందించారు. నేడు వారి మనవడు వరదా సోమేశ్వరరావు తన తాతగారి వారసికాన్ని నిలబెడుతున్నారు. ఖర్చుతో కూడుకున్నా, పనిభారమైనా.. స్వామివారు కల్పించిన అదృష్టాన్ని ఎంతో ఇష్టంగా చేస్తున్నారు. కార్తీకమాసంలో పాగా నేతకు ఏర్పాట్లు కార్తీకమాసం ప్రారంభంలో పాగా నేతకు పనులు ప్రారంభిస్తారు. ముందుగా స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం పాగా పనులు ప్రారంభిస్తారు. కృష్ణాజిల్లా పెడన వెళ్లి నూలు (దారం) తెచ్చుకుని ఆ నూలును తడిపి ఐదు రోజులు పాటు నానబెడతారు. ఆరవ రోజు ఆ నూలుకు గెంజి పెట్టి ఎండలో ఆరబెడతారు. అనంతరం రాట్నంతో నూలు తోడుకుంటారు. నూలు తోడుకున్న డబ్బాలతో తూర్పుగోదావరి జిల్లా బండారులంక తీసుకువెళ్లి అక్కడ ఈ నూలును రోలింగ్ (దంత్రం) చేయిస్తారు. 200 గజాల పొడుగు వచ్చేలా రోలింగ్ చేస్తారు. అక్కడ నుంచి ఆ రోలింగ్ను నరసాపురం తీసుకువస్తారు. ఇక్కడ సుమారు 26 మంది భక్తి శ్రద్ధలతో రోలింగ్కు గెంజి పెట్టి పడుగు ఏర్పాటుచేస్తారు. అనంతరం దానిని చుట్టుకుని ఇంటికి తెచ్చి అల్లుసాపుకుని అంతరం బొండకు చుడతారు. ఈ సమయంలో సుమారు చుట్టుపక్కల ఓ పది, పదిహేను మంది భక్తులు వచ్చి ఇందులో పాల్గొంటారు. ఆ బొండను మగ్గం ఎక్కిస్తారు. మహాశివరాత్రికి ముందుగా రెండు లేక మూడు నెలలు ముందు ఇంటిలో స్వామివారి పీఠం ఏర్పాటుచేసుకుని ఆ బొండను మగ్గం ఎక్కించి అప్పటి నుంచి పాగాను నేయడం మొదలు పెడతారు. ప్రతి రోజు ఉదయం కొబ్బరికాయ కొట్టి మగ్గం నేయడం ప్రారంభించి ఉదయం రెండు గంటలు, రాత్రి ఓ ఆరు గంటలు పాటు నేస్తుంటారు. రాత్రి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి నేతను ముగిస్తారు. ఇలా రోజుకు దాదాపు నాలుగు లేదా ఐదు మూరలు నేస్తుంటారు. మిగిలిన సమయంలో వాళ్ల వృత్తి ప్రకారం నేత చీరలు నేస్తుంటారు. ఈ పాగాను 180 మీటర్లు పొడవు, 90 సెం.మీ వెడల్పుతో ఏర్పాటుచేస్తారు. స్వామివారికి రోజుకు ఓ మూర చొప్పున లెక్కించి 365 మూరలు వచ్చేలా పాగా తయారు చేస్తారు. అలాగే మరో 20 మూరలు పార్వతి అమ్మవారికి సమర్పిస్తారు. పాగా నేస్తున్న అన్ని రోజులు ఎక్కడకు పలకరింపులకు వెళ్లరు, మాంసాహారం ముట్టుకోకుండా దీక్షతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తుంటారు. అలాగే ఈ మగ్గాన్ని ఒక్క స్వామివారి పాగా నేయడం కొరకే ఉపయోగిస్తుంటారు. పంచారామాల్లో ఎక్కడా లేని ఈ పాగా నేత మాకు క్షీరారామలింగేశ్వరస్వామి కల్పించిన అదృష్టంగా భావిస్తున్నాం. మా తాతగారు మాకు అప్పగించిన వారసికాన్ని నిలబెట్టుకుంటున్నాము. ప్రస్తుతం పాగా తయారీ ఖర్చుతోపాటు, సహకరించే మనుషులు పెద్దగా దొరక్కపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆలయ అధికారులు ఆర్థికంగా కొంతవరకూ సహాయం చేస్తుంటారు. – వరదా సోమేశ్వరరావు, రామకోటి దంపతులు, దగ్గులూరు -
అంతర్వేది ఉత్సవాలకు పెరిగిన రద్దీ
నరసాపురం: అంతర్వేది ఉత్సవాలకు సంబంధించి నరసాపురంలో గురువారం రద్దీ మరింత పెరిగింది. స్వామి పవిత్ర రథోత్సవం నేఫధ్యంలో యాత్రికులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. తెల్లవారుజామున కల్యాణ మహోత్సవాన్ని తిలకించి వెనుదిరిగిన భక్తులతో పట్టణంలో గోదావరి పంటురేవు వద్ద రద్దీ నెలకొంది. భక్తుల సౌకర్యార్థం 3 పంటులు ఏర్పాటు చేశారు. ఇక స్టీమరన్రోడ్డు పొడవునా అంతర్వేది యాత్రికులకు పలు స్వచ్ఛంధ సంస్థలు, రాజకీయ పార్టీల వారు పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకీరామ్ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ చేశారు. వన్నెంరెడ్డి శ్రీనివాస్, గుగ్గిలపు మురళి, బళ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి సేవా సమితివారు మజ్జిగ పంపిణీ చేశారు. -
కొల్లేరు సమస్య పరిష్కారానికి అడ్డుపడుతున్నదెవరు?
ఏలూరు (టూటౌన్): కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి అడ్డుపడుతున్నది ఎవరని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి సూటిగా ప్రశ్నించారు. కొల్లేరు సమస్యపై కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు పత్రికా ముఖంగా చేసిన వ్యాఖ్యలపై గురువారం నిర్వహించిన సమావేశంలో రవి మాట్లాడారు. కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కల్లబొల్లి మాటలు చెప్పడం కాదని, మొసలి కన్నీరు కార్చడం కాదని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది వారి ప్రభుత్వమేనని కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారానికి అడ్డు చెప్పేవారు ఎవరూ లేరని, చిత్తశుద్ధి ఉంటే సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. లేనిపక్షంలో కొల్లేరు ప్రజలే భవిష్యత్తులో సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 120 జీవోను రద్దు చేయాలని, కొల్లేరును 3వ కాంటూర్కు కుదించాలని, ఆ పరిధిలోనే అభయారణ్యాన్ని అభివృద్ధి చేయాలని, పక్షులను పరిరక్షించాలని, 3వ కాంటూర్ కు వెలుపల ఉన్న ప్రభుత్వ భూములు, పట్టా భూములు కొల్లేరు ప్రజలు సాగు చేసేందుకు అవకాశం కల్పించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, కొల్లేరు ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఇంప్లీడ్ అవ్వాలని, అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కొల్లేరు ప్రజల తరఫున సీపీఎం నిరంతరం పోరాటాలు సాగిస్తుందని ఎ.రవి స్పష్టం చేశారు. -
శ్రీమావుళ్లమ్మ ఆలయ హుండీల ఆదాయం రూ.59.25 లక్షలు
భీమవరం (ప్రకాశం చౌక్): పట్టణ ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయ హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. సింగరాయపాలెం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ జి గంగా శ్రీదేవి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారికి 26 రోజులకుగాను హుండీల ద్వారా రూ.59,25,41 ఆదాయం లభించగా బంగారం 45.100 గ్రాములు, వెండీ 210 గ్రాములు, విదేశీ కరెన్సీ లభించినట్లు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం, ధర్మకర్తలు, భీమవరం దేవదాయ ధర్మదాయశాఖ తనిఖీదారు వి వెంకటేశ్వరరావ తదితరులు పాల్గొన్నారు. -
జగన్ పేరు చెబితే కూటమికి వణుకు
ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీ ఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు వింటేనే కూటమి నేతలకు వణుకు పుడుతుందనీ, కేక్ కట్ చేసుకున్నా భయంతో అక్రమ కేసులు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారనీ వైఎస్సార్సీపీ నాయకులు అన్నా రు. ఏలూరు నియోజకవర్గ సంస్థాగత కమిటీల నిర్మాణ ప్రత్యేక సమావేశం గురువారం నిర్వహించారు. పార్టీ ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారు మూరి సునీల్కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి నా గార్జున యాదవ్ హాజరయ్యారు. ముందుగా దివంగత వైఎస్సార్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరింత బలోపేతం చేయాలి ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్సార్సీపీని నియోజకవర్గంలో మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయి నుంచి నేతలు, కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేస్తూ సంస్థాగత నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏలూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేసేందుకు సైనికుల్లా పనిచేయాలన్నారు. కార్యకర్తలకే ప్రాధాన్యం రాబోయే కాలంలో పార్టీ కార్యకర్తలకే జగన్ ప్రాధాన్యమిస్తారని, ఆయన మాట ఇస్తే కచ్చితంగా నిలబెట్టుకుంటారని నాగార్జున యాదవ్ అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉండగా ధైర్యంగా నిలబడి, అక్రమ కేసులను తట్టుకున్న వారందరినీ జగన్ ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుంటారనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్సీపీ కార్యకర్తలకు సైతం భయపడుతుందన్నారు. పార్టీ శ్రేణులంతా జగన్కు అండగా నిలవాలని, రాబోయే ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలతో కలిసి కూటమిపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, రాష్ట్ర కార్యదర్శులు డీవీఆర్కే చౌదరి, దాసరి రమేష్, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంటా మోహనరావు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గేదెల సూర్యప్రకాశరావు, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణేష్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్ గురునాథ్, నాయకులు ఇనపనూరి జగదీష్, కేదారేశ్వరి, జిజ్జువరపు విజయనిర్మల, చిలకపాటి డింపుల్, షేక్ రియాజ్, గుడివాడ రామచంద్రకిషోర్, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్ మాట్లాడుతూ 2019–24 వరకు సంతోషంగా జీవిస్తే కూటమి ప్రభుత్వం 18 నెలల పాలనతో నరకం చూస్తున్నామని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ఖజానా ఖాళీ అని చెప్పగానే ప్రజలంతా మరోసారి మోసపోయామని చెంపలేసుకున్నారన్నారు. ఏలూరు సమన్వయకర్త జయప్రకాష్ మాట్లా డుతూ ఏలూరు నియోజకవర్గంలో పార్టీని కొందరు నేతలు నట్టేట ముంచి వెళితే, పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో తన కు బాధ్యతలు అప్పగించారన్నారు. ఏలూరులో ఎంతో మంది సైనికుల్లాంటి నేతలు, కార్యకర్తలు ఉన్నారని, వారంతా అండగా ఉంటారని జగన్ భరోసా ఇచ్చారన్నారు. పార్టీ శ్రేణులంతా సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు చంద్రబాబువి నీచ రాజకీయాలు ఏలూరు సంస్థాగత కమిటీల నిర్మాణ సమావేశంలో నాయకులు -
వీర వనితలకు జేజేలు
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యార్థినులకు వీరోచిత వనితల త్యాగాలు, అసమాన ప్రతిభా, పాటవా లను బోధించాల్సిన అవసరం ఉందని బాలోత్సవా ల రాష్ట్ర సమన్వయకర్త పిన్నమనేని మురళీకృష్ణ అ న్నారు. నగరంలో గంగానమ్మ జాతర సందర్భంగా హేలాపురి బాలోత్సవం, మానవత, ఏవీఆర్ విజ్ఞా న కేంద్రం ఆధ్వర్యంలో గురువారం స్థానిక సురేష్ చంద్ర బహుగుణ పాఠశాల ఆడిటోరియంలో వీర వనితల జీవితాలతో కూడిన ప్రదర్శనలు ఇచ్చారు. మురళీకృష్ణ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ జాతర సందర్భంగా ఇటువంటి బహుముఖ కార్యక్రమాలు హేలాపురి బాలోత్సవం నిర్వహించడం ఆదర్శనీయమన్నారు. బాలోత్సవం అధ్యక్షుడు ఆలపాటి నాగేశ్వరరావు, దేవరకొండ వెంకటేశ్వర్లు, గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ బాల్యంలోనే విద్యార్థులకు దేశభక్తి భావాలను సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు వీరవనితలకు జేజేలు పేరు తో కార్యక్రమం నిర్వహించామన్నారు. విద్యార్థిను లు వీర వనితల వేషధారణలతో ఆకట్టుకు న్నారు. మ్యాజిక్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ని ర్వహించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రి మీదుగా ఫైర్స్టేషన్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
స్వామి చందాల సొమ్ము ఎక్కడ?
ఆగిరిపల్లి: 22 ఏళ్లుగా అన్నదాన కమిటీ సభ్యులు భక్తుల నుంచి చందాలు వసూలు చేసి మంత్రి కొలుసు పార్థసారథికి అందించిన రూ.28.50 లక్షలు ఎక్కడ ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రశ్నించారు. గురువారం స్థానిక శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పది రోజుల క్రితం అన్నదాన కమిటీ నిర్వాహకులు మంత్రి పార్థసారథికి నగదు రూపంలో రూ.15.50 లక్షలు, చెక్కు ద్వారా రూ.13.00 లక్షలు అందజేశారని గుర్తుచేశారు. ఇప్పటివరకు ఆ నగదు ఎక్కడుందని, దేవస్థానం ఖాతాలో ఎందుకు జమచేయలేదని ప్రశ్నించారు. దీనిపై మంత్రి పార్థసారథి సమాధానం చెప్పాలన్నారు. వాస్తవంగా నిర్వాహకులు ఇవ్వాల్సింది రూ.56 లక్షలు కాగా రూ.28.50 లక్షలు ఇచ్చేందుకు ఆగిరిపల్లి గ్రామస్తులు ఒప్పుకున్నారని, ఆ నగదును మంత్రి దగ్గర పెట్టుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఈనెల 25న జరిగిన అన్నదాన కార్యక్రమంలో వసూలు చేసిన విరాళాల వివరాలను ఆలయ ఈఓ తెలియజేయకుండా అన్నదాన కమిటీ సభ్యులతో కుమ్మక్కవడం ఏంటని మండిపడ్డారు. భక్తు లు ఇచ్చిన విరాళాలు రూ.4.10 లక్షలు మాత్రమే జమ చేయడం ఏంటని, మిగతా నగదు ఎక్కడుందని ప్రశ్నించారు. పూర్తి వివరాలు వెల్లడించకుంటే దేవదాయ కమిషనర్కు, దేవదాయ శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామని వెంకట ప్రతాప్ అప్పారావు హెచ్చరించారు. -
ప్రాణాలైనా అర్పిస్తాం.. మా భూములు ఇవ్వలేం
కొయ్యలగూడెం: ప్రాణాలైనా అర్పిస్తాం.. పుడమి తల్లిని వదులుకోం.. అంటూ పోలవరం, గోపాలపురం నియోజకవర్గాల రైతులు గళమెత్తారు. నేవీ ఆయుధ డిపో పేరుతో బలవంతపు భూసేకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని బోడిగూడెం, మంగపతిదేవిపేట, బర్కెట్నగర్, రేగులగుంట, ఊట్లగూడెం, త్రినాథపురం గ్రామాల రైతులు, రైతు కూలీలు, మహిళలు, ప్రజలు కొయ్యలగూడెంలో కదం తొక్కారు. తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. మెయిన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. ఆయుధ డిపోను అడ్డుకుంటే అరెస్టుల పర్వం కొనసాగుతుందన్న ఏలూరు ఎంపీ మహేష్యాదవ్ మాటలను ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోడిగూడెం నుంచి కొయ్యలగూడెం వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర ర్యాలీ జరిగింది. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు కోసం తమ భూములను లాక్కోవద్దని, తమ జీవితాలను బలిపెట్టవద్దని నినదించారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే మూడుచోట్ల తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న ఆయుధ డిపోను కొయ్యలగూడెం మండలంలో ఏర్పాటు చేస్తామనడంపై రైతుల్లో అను మానాలు నెలకొన్నాయి. తక్షణమే నిలుపుదల చేయాలి ఆయుధ డిపో నిర్మాణానికి 1,200 ఎకరాల భూసేకరణ కోసం చేస్తున్న ప్రయత్నాలు తక్షణమే నిలుపుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. పొగాకు, ఆయిల్పామ్, మొక్కజొన్న, అరటి, కూరగాయలు, కోకో, కొబ్బరి, నిమ్మ వంటి పంటలు పండే సారవంతమైన భూములను నాశనం చేయడం తగదన్నారు. 2013 భూసేకరణ చట్టానికి విరుద్ధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యవహరించడం అన్యాయమన్నారు. ఇప్పుడిప్పుడే పంట భూములు పూర్తిస్థాయిలో సాగులోకి వచ్చాయని, ఫలసాయం పొందే సమయంలో రైతుల పొట్టకొట్టడం తగదన్నా రు. భూసేకరణపై ఏలూరు ఎంపీ అసత్య ప్రచారం చే స్తున్నారని, తాము ఎక్కడ అంగీకరించామో ని రూపించాలని డిమాండ్ చేశారు. సర్వే పేరుతో తమ భూముల్లోకి వస్తే ఆత్మార్పణ చేసుకుంటామని అల్టిమేటం ఇచ్చారు. అనంతరం తహసీల్దార్కి వినతిపత్రం అందించారు. తహసీల్దార్ ఎన్.నాగరాజు మాట్లాడుతూ బలవంతంగా భూసేకరణ చేయమని, గ్రామసభ నిర్వహించిన తర్వాతే ముందుకు వెళతామని హామీ ఇవ్వడం ఆందోళన విరమించారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణ చైతన్య, సీపీఐ, సీపీఎం మండల కన్వీనర్లు తాడిగడప ఆంజనేయరాజు, శుక్లబోయిన రాంబాబు, చలసాని కిషోర్, ఆతుకూరి వీర్రాజు, సర్పంచ్లు పాల్గొన్నారు. కొయ్యలగూడెంలో కదం తొక్కిన రైతులు నేవీ ఆయుధ డిపో నిర్మాణం కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడం కోసమే అని వైఎస్సార్సీపీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. ఆయన మాట్లాడుతూ వేలాది మంది రైతులను కడుపు కొట్టేలా భూదోపిడీకి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. రెండు పంటలు పండుతూ సస్యశ్యామలంగా ఉన్న భూములను నేవీ డిపోకి ఎంపిక చేయడం రైతులకు తీవ్ర అన్యాయం చేయడమే అన్నారు. ఇక్కడ నేవీ డిపో ఏర్పాటుపై ఎంపీ మహేష్ యాదవ్ అత్యుత్సాహం కనబర్చడం అనుమానాలకు తావిస్తోందన్నారు. తక్షణమే ఆయుధం నిర్మాణ ప్రతిపాదన విరమించుకోవాలని లేదంటే రైతులకు మద్దతుగా ప్రజాస్వామ్యవాద పార్టీలు అంతా ఏకం కావాల్సి ఉంటుందని బాలరాజు హెచ్చరించారు. -
రోడ్డుపై ఒట్టు.. నాణ్యత తీసికట్టు
నూజివీడు: లక్షలాది రూపాయల ప్రజాధనంతో వేసిన సిమెంట్ రోడ్డుకు ఏడాది కాలంలోనే మూడో సారి మరమ్మతులు నిర్వహిస్తున్న ఘనత చంద్రబాబు సర్కారుకే సాధ్యం. బహుశా సిమెంట్ రోడ్డుకు మరమ్మతుల పనులు రాష్ట్రంలో ఎక్కడా జరిగి ఉండవు. తారు రోడ్డుకంటే ఎక్కువ కాలం మన్నుతుందనే ఉద్దేశంతో తారురోడ్డు నిర్మాణానికి అయ్యే వ్యయంలో రెట్టింపు వ్యయమవుతున్నా సిమెంట్ రహదారులను నిర్మిస్తున్నారు. అయితే నూజివీడు పట్టణంలోని విస్సన్నపేట రోడ్డులో పెట్రోలు బంకుల సమీపంలో ఆర్అండ్బీకి చెందిన సిమెంట్ రహదారికి మూడోసారి మరమ్మత్తులు చేస్తున్నారు. ఈ సిమెంట్ రహదారికి గతేడాది ఫిబ్రవరిలో నితిన్ సాయి కనస్ట్రక్షన్ కంపెనీ నిర్మించింది. రూ.60 లక్షలతో 20 మీటర్ల వెడల్పున, 200 మీటర్ల పొడవునా 9 అంగుళాల మందంతో సిమెంట్ రోడ్డును నిర్మించారు. అయితే సిమెంట్ రోడ్డు నిర్మాణం జరిగిన తరువాత క్యూరింగ్ పీరియడ్ ముగిసిన అనంతరం వాహనాల రాకపోకలను అనుమతించిన నెల రోజుల్లోపే రోడ్డు దారుణంగా ధ్వంసమైంది. రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలపై అప్పట్లో పట్టణ ప్రజల్లో తీవ్ర చర్చ జరిగింది. అయితే అప్పటినుంచి అప్పుడప్పుడూ సిమెంట్ లేచిపోయి కంకర బయటపడిన చోటల్లా సంబంధిత కాంట్రాక్టర్తో సిమెంట్తో ప్లాస్టింగ్ చేయిస్తూ వచ్చారు. అలా చేసినప్పటికీ చేసిన ప్లాస్టింగ్ సైతం వాహనాల రాకపోకలకు లేచిపోయి మళ్లీ కంకర బయటపడుతోంది. కనస్ట్రక్షన్ కంపెనీ మంత్రి తనయుడిది కావడంతో ఆర్అండ్బీ అధికారులు ఏంచేయాలో పాలు పోక తలలు పట్టుకున్నారు. సిమెంట్ రోడ్డుకు నిర్మించిన అప్రోచ్ రోడ్డు సైతం గుంతలు పడుతూనే ఉండేది. ఈ గుంతల్లో పాత గృహాలను కూల్చగా వచ్చిన రాళ్లు, మట్టిని పోసి పూడుస్తూ వచ్చారు. సిమెంట్ రోడ్డు అధ్వానంగా మారడం మంత్రికి రాజకీయంగా డ్యామేజీని తెచ్చిపెట్టింది. తాజాగా సిమెంట్ రోడ్డు నిర్మాణం ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా సిమెంట్ రోడ్డుపై గుంతలు పడుతుండటంతో ఎట్టకేలకు కాంట్రాక్ట్ కంపెనీ మళ్లీ మూడంగుళాల మందంతో దానిపైన సిమెంట్ రోడ్డును నిర్మిస్తోంది. ఇనుప ఊసలతో మూస కట్టి కాంక్రీట్ను పోస్తున్నారు. ఈ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. ఆర్అండ్బీ అధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నా రు. మళ్లీ సిమెంట్ రోడ్డు పోస్తుండటంతో పట్టణ ప్రజలతో పాటు రాజకీయ వర్గాలు సైతం ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి. ఏడాదిలోనే మూడోసారి సిమెంట్ రోడ్డుకు మరమ్మతులు నెలరోజుల్లోనే అధ్వానం ౖపైపె పూతలతో సరి మరలా రోడ్డు నిర్మాణం నూజివీడులో రాజకీయ చర్చ సిమెంట్ రోడ్డు ఉపరితలం లేచిపోయి కంకర బయట పడుతున్నందున సంబంధిత కాంట్రాక్టు కంపెనీనే మరలా ఇనుప ఊసలతో మూస కట్టి మూడంగుళాల మందంతో కాంక్రీటు వేసే పనులను చేపట్టింది. గతంలో చేసిన పనికి తాము ఒక్క రూపాయి కూడా బిల్లు చెల్లించలేదు. – బాబూరావు, ఆర్అండ్బీ డీఈ, నూజివీడు -
లడ్డూపై కూటమి కుట్ర భగ్నం
కూటమి నేతలకు సద్బుద్ధి ప్రసాదించాలని ఏలూరులో వైఎస్సార్సీపీ నాయకుల పూజలుఏలూరు టౌన్: వేంకటేశ్వరస్వామీ.. కూటమి నేతలకు బుద్ధి ప్రసాదించు అంటూ వైఎస్సార్సీపీ నాయకు లు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదంటూ సీబీఐ ఇచ్చిన నివేదికతో కూటమి నేతల రాజకీయ కుట్ర బద్ధలైందంటూ వైఎస్సార్సీపీ ఏ లూరు కన్వీనర్ మామిళ్లపల్లి జయప్రకాష్ అన్నారు. గురువారం ఏలూరులోని ఆర్ఆర్పేట వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, చంద్రబాబు, పవన్కల్యాణ్, కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా తిరుపతి వెంకన్న పవిత్రను కించపరిచేలా, స్వామివారి ప్ర సాదం లడ్డూని ఆయుధంగా మార్చి చంద్రబాబు రచించిన కుట్రపూరిత నాటకం పూర్తిగా భగ్నమైందన్నారు. ఇంత నీచమైన రాజకీయాన్ని, మతం పేరు తో ప్రజలను రెచ్చగొట్టి అలజడులు సృష్టించాలనే రాజకీయ క్రీడను ఎన్నడూ చూడలదేన్నారు. 18 నెలల అనంతరం సీబీఐ చార్జిషీట్లో లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని స్పష్టం చేసిందన్నారు. కూ టమి నేతలకు భవిష్యత్తులో ప్రజలు సరైన గుణపా ఠం చెబుతారని జయప్రకాష్ అన్నారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బా బు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్, బీసీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, నాయ కులు గంటా మోహనరావు, భాస్కర్ల శంకర్, ప్రత్తిపాటి తంబి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ విజయానికి సైనికుల్లా పనిచేయాలి
కై కలూరు: వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) అన్నారు. పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణ సమావేశం బుధవారం నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళి అర్పించారు. డీఎన్నార్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త, నాయకులు పూర్తి వివరాలతో డిజిటలైషన్ చేయించుకోవాలన్నారు. పార్టీ గుర్తింపు కార్డులు ప్రతి ఒక్కరి వద్ద ఉండాలన్నారు. పార్టీ అనుంబంధ కమిటీలను అందరూ పూర్తి చేయాలన్నారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ, టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు మొండితోక అరుణ్కుమార్, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జ్ కారుమూరు సునీల్ కుమార్, నియోజకవర్గ ఇన్చార్జ్ మామిళ్ళపల్లి జయప్రకాష్, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ అధ్యక్షులు కోమటి విష్ణువర్థన్, పార్టీ ఎంపీపీలు రామిశెట్టి సత్యనారాయణ, చందన ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్ పరీక్షల్లో భాగంగా ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలకు రెండో రోజు మొత్తం 1312 మంది హాజరయ్యారు. జిల్లాలోని 10 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షల్లో ఉదయం 806 మందికి 678 మంది హాజరుకాగా 128 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 696 మందికి 634 మంది హాజరు కాగా 62 మంది గైర్హాజరయ్యారు. -
మొక్కజొన్న పంట పరిశీలించిన అధికారులు
కొయ్యలగూడెం: మొక్కజొన్న పంట వేసి నష్టపోయిన రైతులకు సంబంధిత కంపెనీ వెంటనే తగిన నష్టపరిహారం అందజేయాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏడీఏ పి.బుజ్జిబాబు పేర్కొన్నారు. సాక్షి దినపత్రికలో బుధవారం ప్రచురితమైన శ్రీకల్తీ విత్తనాలతో నష్టం్ఙ కథనానికి స్పందించిన వ్యవసాయ శాఖ అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు రైతులను పరామర్శించారు. పొంగుటూరు, కన్నాయగూడెం, గవరవరం గ్రామాల రైతులతో నష్టం అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీడ్ని అందజేసిన కంపెనీ ప్రతినిధులను రప్పించి జరిగిన నష్టానికి బాధ్యత వహించాల్సిందిగా సూచించారు. ఈ నేపథ్యంలో రైతు ప్రతినిధులు కంపెనీ ప్రతినిధులు ఒప్పందానికి వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల ఆదాయాన్ని బుధవారం స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో లెక్కించారు. 20 రోజులకు నగదు రూపేణా రూ. 2,24,23,765 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 174 గ్రాముల బంగారం, 3.594 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. నూజివీడు: ట్రిపుల్ఐటీలో క్వాంటం కంప్యూటింగ్పై నిర్వహిస్తున్న ఐదురోజుల వర్క్షాపులో భాగంగా బుధవారం క్వాంటం భౌతిక శాస్త్రం, క్వాంటం ఆల్గోరిథం, క్వాంటం కమ్యూనికేషన్కు సంబంధించిన కీలక అంశాలపై అవగాహన కల్పించారు. రెండో రోజు సాంకేతిక సెషన్ను ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ మాజీ డైరెక్టర్ ఆచార్య జీ భగవన్నారాయణ నిర్వహించారు. భౌతిక శాస్త్ర అధ్యాపకుడు, వర్క్షాప్ కన్వీనర్ దుర్గాబాబు క్వాంటం ఆప్టిక్స్పై ఉపన్యాసం ఇచ్చారు. కాంతి క్వాంటం స్వభావం, ఆధునిక క్వాంటం సాంకేతికతల్లో ప్రాముఖ్యతను వివరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉడతా పావని క్వాంటం ఆల్గోరిథంపై సాంకేతిక సెషన్ నిర్వహించి, సంప్రదాయ ఆల్గోరిథంలతో పోలిస్తే క్వాంటం ఆల్గోరిథంకు ఉన్న తేడాను వివరించారు. ఏలూరు(మెట్రో): రాష్ట్రంలో ఉగాది నాటికి 5 లక్షల నిరుపేదలకు ఇళ్ళు అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి బుధవారం జిల్లాలో పేదల గృహ నిర్మాణాల లక్ష్యాలపై గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్యాల సాధనకు అనుగుణంగా సిబ్బంది పనిచేసి లక్ష్యాలు సాధించాలన్నారు. ఇళ్ల నిర్మాణ ప్రగతిపై ప్రతి వారం సమీక్షిస్తానని, నిర్లక్ష్యం వహించే అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థలోని ఉద్యోగాల దరఖాస్తు తేదీ పొడిగించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి తెలియజేసారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థలోని డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లుగా తెలిపారు. అభ్యర్థులు 30వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు న్యాయ సేవాధికార కార్యాలయం చేరేలా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు
ఏలూరు టౌన్: రాష్ట్రంలో కూటమి పాలనలో మహిళలకు భద్రత కరువైందని.. అకృత్యాలు, ఆచారకాలతో సామాన్యులకు, ముఖ్యంగా మహిళలకు రక్షణ లేకుండా పోతుందని.. కూటమి పార్టీల ఎమ్మెల్యేలు కీచకులుగా మారారని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి విమర్శించారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మలతో కలిసి మాట్లాడారు. ప్రధాన కార్యదర్శి స్రవంతి మాట్లాడుతూ.. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచకపర్వం సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. బాధిత మహిళకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందన్నారు. బాధితులపైనే కేసులు పెట్టటం, బెదిరింపులకు పాల్పడడం దారుణం అన్నారు. ప్రజలకు భరోసా కల్పించాల్సిన ప్రజా ప్రతినిధులే అఘాయిత్యాలకు పాల్పడుతూ పశువుల్లా వ్యహరిస్తే.. ఇక మహిళలకు న్యాయం ఎవరు చేస్తారని ప్రశ్నించారు. ఒక మహిళ బయటకు వచ్చి తనకు అన్యాయం జరిగిందని చెబితే న్యాయం చేయాల్సిన బాధ్యత మీపై ఉందని ప్రభుత్వ నేతలు గుర్తు పెట్టుకోవాలన్నారు. ఏలూరు నగర మహిళ అధ్యక్షురాలు విజయనిర్మల మాట్లాడుతూ.. టీడీపీ కూటమి ప్రభుత్వంలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు పెచ్చుమీరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ బాధిత మహిళకు అండగా ఉంటుందని, టీడీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విచారణ చేపట్టి బాధితురాలికి న్యాయం చేయాలన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ వలంటీర్స్ వింగ్ జిల్లా అధ్యక్షురాలు భోగిశెట్టి పార్వతి, జిల్లా మహిళ కార్యదర్శి అచ్యుతకుమారి, జిల్లా కార్యదర్శి కే.తులసీ, మహిళ నాయకురాలు కుమారి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి స్రవంతి -
జేఈఈ మెయిన్స్కు 1,397 మంది హాజరు
ఏలూరు (ఆర్ఆర్పేట): దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఎన్ఐటీ విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే జేఈఈ మెయిన్స్ తొలివిడత పరీక్షల్లో బుధవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 6 కేంద్రాల్లో మొత్తం 1397 మంది విద్యార్థులు హాజరయ్యారు. తొలి సెషన్లో ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్లో 150 మందికి 149 మంది హాజరు కాగా సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కేంద్రంలో 150 మందికి గాను 150 మంది హాజరయ్యారు. తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కేంద్రంలో 140 మందికి గాను 140 మంది, శశి ఇంజనీరింగ్ కేంద్రంలో 111 మందికి గాను 111 మంది హాజరయ్యారు. భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కేంద్రంలో 50 మందికి 49 మంది, డీఎన్నాఆర్ కేంద్రంలో 101 మందికి గాను 100 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్లో 150 మందికి 149 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కేంద్రంలో 151 మందికి గాను 148 మంది, వాసవి ఇంజనీరింగ్ కేంద్రంలో 133 మందికి గాను 133 మంది, శశి ఇంజనీరింగ్ కేంద్రంలో 117 మందికి గాను 117 మంది హాజరయ్యారు. భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కేంద్రంలో 50 మందికి గాను 50 మంది హాజరు కాగా, డీఎనన్నాఆర్ కళాశాల కేంద్రంలో 101 మందికి గాను 101 మంది హాజరయ్యారు. -
మళ్లీ రిజిస్ట్రేషన్ల బాదుడు
ఏలూరు (ఆర్ఆర్పేట): చంద్రబాబు ప్రభుత్వం మరోసారి రిజిస్ట్రేషన్ చార్జీలు భారీగా పెంచి జనం నెత్తిన భారం మోపడానికి సిద్ధమైంది. దీంతో జిల్లాలో భూముల కొనుగోలు కలగా మిగిలే పరిస్థితిలా తయారైంది. కేవలం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే భూముల ధరలు పెరుగుతాయని ప్రభుత్వం చెబుతున్నా పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం కారణంగా మొత్తం జిల్లాలోని మారుమూల పల్లెల్లో కూడా ధరలు పెరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం మార్కెట్ విలువ సవరణకు రిజిస్ట్రేషన్ శాఖకు అనుమతులు ఇచ్చారు. గతేడాది ప్రాంతాన్ని బట్టి 0 నుంచి 25 శాతం భూముల ధరలను పెంచిన ప్రభుత్వం.. వరుసగా రెండో ఏడాది భూముల విలువలు పెంచడానికి తీసుకున్న నిర్ణయం అశనిపాతంలా మారింది. రెండో ఏడాదీ భూముల విలువను 0 నుంచి 25 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయం వల్ల భూముల ధరల్లో మొత్తంగా 50 శాతం పెరుగుదల ఉంటుంది. భూముల మార్కెట్ విలువల పెంపు నిర్ణయాన్ని ఫిబ్రవరి 1 నుంచే అమలు చేస్తున్నారు. ఈ మేరకు భీమడోలు రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో 0 నుంచి 20 శాతం, చింతలపూడి రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో 10 నుంచి 25 శాతం, జంగారెడ్డిగూడెం పరిధిలో 10 నుంచి 17 శాతం భూముల ధరలు పెరుగనున్నాయి. కామవరపుకోట పరిధిలో 5 నుంచి 25 శాతం, పోలవరం కార్యాలయం పరిధిలో 0 నుంచి 20 శాతం, ఏలూరు కార్యాలయం పరిధిలో 5 నుంచి 10 శాతం, గణపవరం కార్యాలయం పరిధిలో 0 నుంచి 25 శాతం పెరుగనున్నాయి. వీటితో పాటు వట్లూరు కార్యాలయం పరిధిలో 10 నుంచి 20 శాతం, కై కలూరు కార్యాలయం పరిధిలో 17 నుంచి 20 శాతం, మండవల్లి కార్యాలయం పరిధిలో 7 నుంచి 25 శాతం, ముదినేపల్లి కార్యాలయం పరిధిలో 5 నుంచి 20 శాతం, నూజివీడు కార్యాలయం పరిధిలో 0 నుంచి 15 శాతం భూముల ధరలు పెరుగనున్నాయి. జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 5 కార్యాలయాల్లో దస్తావేజుల సంఖ్య కూడా పడిపోయింది. ఏలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే 5,070 దస్తావేజులు తక్కువగా రిజిస్ట్రేషన్ చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో 15,912 దస్తావేజుల రిజిస్ట్రేషన్ జరగ్గా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 10,842 మాత్రమే జరిగాయి. చింతలపూడి కార్యాలయంలో 361, గణపవరం రిజిస్ట్రార్ కార్యాలయంలో 46, కై కలూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో 20 ముదినేపల్లి రిజిస్ట్రార్కార్యాలయంలో 9 దస్తావేజుల రిజిస్ట్రేషన్ తగ్గాయి. గతేడాది భూముల విలువలను పెంచినా ఆదాయం పెరగలేదు. భూముల ధరలు పెంచడంతో వాటి కొనుగోలుకు ప్రజలు నిరాసక్తత చూపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో రెండు నెలలు మిగిలి ఉండగా ఇంతవరకూ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయంలో దాదాపు రూ.5 కోట్లు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా 75,660 దస్తావేజులు రిజిస్ట్రేషన్ జరగ్గా వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.297.84 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకూ ఈ 12 కార్యాలయాల్లో 74,057 దస్తావేజులు రిజిస్ట్రేషన్ జరగ్గా.. రూ. 292.94 కోట్ల ఆదాయం వచ్చింది. వాస్తవానికి భూముల ధరలు పెంచితే రిజిస్ట్రేషన్ల ద్వారా ఎక్కువ ఆదాయం రావాలి. గత 25 ఏళ్ళుగా దస్తావేజుల లేఖరిగా పని చేస్తున్నాను. గతంలో ఎప్పుడు భూముల ధరలు పెరిగినా ఆదిలో కొంత రిజిస్ట్రేషన్లు తగ్గినా తరువాత పుంజుకునేవి. గత ఏడాదిలో పెంచిన భూముల ధరల కారణంగా రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గిపోయాయి. దీంతో మాకు వచ్చే ఆదాయం కూడా పూర్తిగా తగ్గిపోయింది. కుటుంబ పోషణకు కూడా ఆదాయం రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. – వీ చంద్రశేఖర ఫణి కుమార్, దస్తావేజుల లేఖరి ప్రభుత్వం గతేడాది భూముల ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం కారణంగా ఇళ్ళ స్థలాలు, పొలాలు కొనుగోలు చేసే నాథుడే కరువయ్యాడు. గత ఏడాది రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా నాశనమైంది. ఈ ఏడాది కూడా ధరలు పెంచాలని తీసుకున్న నిర్ణయంతో అసలు భూముల కొనుగోలుపై ఆలోచన కూడా చేసే పరిస్థితి కనిపించడం లేదు. – గంటా రాజేశ్వరరావు, రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మరోసారి మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం 25 శాతం వరకూ భూముల విలువ పెంచేందుకు నిర్ణయం ఫిబ్రవరి 1 నుంచే అమలు గతేడాది రూ. 5 కోట్లు తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం -
శ్రీవారి క్షేత్రం.. స్వచ్ఛతలో ప్రథమం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రానికి స్వచ్ఛతలో మొదటి ర్యాంక్ దక్కింది. రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాలకు వస్తున్న భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా భక్తుల నుంచి నిర్వహించిన అభిప్రాయ సేకరణలో ద్వారకాతిరుమల దేవస్థానానికి సంతృప్తికర ఫలితాలు లభించాయి. గత నెల ప్రసాదాలకు మొదటి ర్యాంక్ రాగా, ఈసారి స్వచ్ఛతకు ఆ ర్యాంక్ దక్కింది. శ్రీకాళహస్తి, ద్వారకాతిరుమల, అన్నవరం, విజయవాడ, సింహాచలం, కాణిపాకం, శ్రీశైలం దేవస్థానాల్లో భక్తులకు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం గత డిసెంబర్ 25 నుంచి ఈనెల 25 వరకూ వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా ఈ సర్వేను నిర్వహించి, ర్యాంకులను ప్రకటించింది. ద్వారకాతిరుమల 75.8 శాతంతో మొదటి ర్యాంక్ సాధించిది. శ్రీకాళహస్తి 75.8 శాతంతో రెండో ర్యాంక్, అన్నవరం 74.1 శాతం, కాణిపాకం 73.1, సింహాచలం 72.5, విజయవాడ 72.5 శాతం, శ్రీశైలం 69.8 శాతం సాధించాయి. ఏ అంశానికి ఏ ర్యాంక్ మొత్తం 4 అంశాలపై భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపారు. అందులో సంతృప్తికర దర్శనం అంశానికి మొదటి ర్యాంక్ శ్రీకాళహస్తికి, రెండో ర్యాంక్ అన్నవరానికి, మూడో ర్యాంక్ ద్వారకాతిరుమలకు లభించాయి. తాగునీటి సదుపాయం అంశానికి మొదటి ర్యాంక్ శ్రీకాళహస్తికి, రెండో ర్యాంక్ ద్వారకాతిరుమలకు, మూడో ర్యాంక్ అన్నవరానికి లభించాయి. ప్రసాదం తాజా, రుచి అంశానికి మొదటి ర్యాంక్ శ్రీకాళహస్తికి, రెండో ర్యాంక్ ద్వారకాతిరుమలకు, మూడో ర్యాంక్ అన్నవరానికి వచ్చాయి. పారిశుధ్య నిర్వహణ అంశానికి మొదటి ర్యాంక్ ద్వారకాతిరుమలకు, రెండో ర్యాంక్ కాణిపాకంకు, మూడో ర్యాంక్ సింహాచలంకు లభించాయి. ఓవరాల్గా అధిక శాతం మంది భక్తులు ద్వారకాతిరుమల దేవస్థానం అందిస్తున్న సేవలకే మొదటి ఓటు వేయడంతో, ప్రథమ ర్యాంక్ దక్కింది. శ్రీవారి ధనుర్మాస మండప ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్న పారిశుధ్ధ్య కార్మికులు శ్రీవారి కొండపైన జల ప్రసాదం వాటర్ ప్లాంట్ పారిశుద్ధ్య విషయంలో దేవస్థానం అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచడం వల్లే ఈ ర్యాంక్ లభించింది. క్షేత్రంలో 2022 అక్టోబర్ 1 నుంచి 2025 సెప్టెంబర్ 30 వరకు పారిశుద్ధ్య పనులను నిర్వహించిన సెవెన్ హిల్స్ ఫెసిలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (మంగళగిరి) కంపెనీకి దేవస్థానం నెలకు సుమారు రూ. 18.28 లక్షలు చెల్లించింది. కూటమి ప్రభుత్వం పారిశుధ్య ఇతర పనుల కాంట్రాక్ట్ను 2025 అక్టోబర్ 1 నుంచి పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ (తిరుపతి) సంస్థకు నెలకు రూ. 54 లక్షలకు అప్పగించింది. అరకోటికి పైగా ఖర్చు అవుతున్నా.. మొదట్లో పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా జరిగేవి. కాంట్రాక్టర్కు ఇంత పెద్ద మొత్తంలో నగదు చెల్లిస్తున్నందున పారిశుద్ధ్య పనులపై దేవస్థానం అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే శ్రద్ధగా పనులు చేయిస్తున్నారు. ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో చినవెంకన్న దర్శనం సంతృప్తికరంగా జరిగిందని 67.7 శాతం మంది, జరగలేదని 32.3 శాతం మంది తెలిపారు. తాగునీటి సదుపాయం, ఇతర మౌలిక వసతులు బాగున్నాయని 73.5 శాతం, బాగోలేదని 26.5 శాతం మంది తెలిపారు. ప్రసాదం తాజాగా, రుచిగా బాగుందని 83.4 శాతం మంది, బాగోలేదని 16.6 శాతం మంది తెలిపారు. పారిశుధ్యం బాగుందని 71.2 శాతం మంది, బాగోలేదని 28.8 శాతం మంది తెలిపారు. దేవస్థానం సేవలకు శ్రీవారి భక్తుల సంతృప్తి ప్రభుత్వం నిర్వహించిన వాట్సాప్, ఐవీఆర్ఎస్ సర్వేలో వెల్లడి నాలుగు అంశాలపై సర్వే.. మొదటి ర్యాంక్ ద్వారకాతిరుమలకు -
కొల్లేరులో పక్షుల గణన
● ఈ ఏడాది పెరిగిన పక్షుల సంఖ్య ● అటవీశాఖ అధికారుల వెల్లడికై కలూరు: కొల్లేరు అభయారణ్యంలో పక్షుల గణన బుధవారం నుంచి ప్రారంభమైంది. మొత్తం ఆరు జట్లుగా ఒక్కో జట్టులో 5 సభ్యులతో బుధవారం, శుక్రవారం పక్షుల లెక్కింపు చేశారు. కొల్లేరు అభయారణ్య పరిధిలో మదాపురం, మెండికోడు, గుడివాకలంక, ప్రత్తికోళ్ళలంక, కొక్కిరాలలంక, బొమ్మిలిలంక, ఆగడాలలంక, చెట్నెంపాడు, మల్లవరం, దోసపాడు, క్రొవ్వలి, కేదవరం, పోతులూరు, కొల్లేటికోట, పైడిచింతపాడు, గోకర్ణపురం, గుమ్మళ్లపాడు, ఆలపాడు, పల్లెవాడ, అడవికొలను, పెదనిండ్రకొలను, డీ.గోపవరం, సిద్దాపురం, పల్లెవాడ, ఆటపాక, పెదఎడ్లగాడి, శ్రీపర్రులో కొల్లేరు పక్షుల సర్వే జరుగుతుంది. గత శీతాకాలంతో పోల్చుకుంటే ఈ ఏడాది పక్షుల సంఖ్య పెరిగిందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. -
యథేచ్ఛగా కలప అక్రమ రవాణా
బుట్టాయగూడెం: కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అటవీశాఖ అధికారులు ఎప్పుటికప్పుడు దాడులు జరిపి కలపను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నా కలప అక్రమ రవాణా ఆగడం లేదు. ప్రస్తుతం వర్జీనియా పొగాకు క్యూరింగ్ పనులు ప్రారంభం కావడంతో పొగాకు బేరన్లకు కూడా అడవిలోని కలపను నరికి యథేచ్ఛగా తరలిస్తున్నారు. అటవీశాఖ అధికారుల కంట పడకుండా ఈ చీకటి వ్యాపారం జోరుగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బుట్టాయగూడెం మండలం రాజానగరంలో, దండిపూడి సమీపంలో అడవిలో కలపను నరికి ట్రాక్టర్లపై తరలిస్తుండగా కన్నాపురం రేంజ్ అధికారి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో పట్టుకుని కలప ట్రాక్టర్లను కార్యాలయానికి తరలించారు. అదేవిధంగా రెడ్డిగణపవరం సమీపంలో కూడా ట్రాక్టర్లో కలప తరలిస్తుండగా ములగలంపల్లి బీట్ ఆఫీసర్ కుర్స రాంబాబు పట్టుకుని జంగారెడ్డిగూడెం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. కాగా రాత్రి వేళల్లో కొందరు వ్యక్తులు ట్రాక్టర్లలో కలపను గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు. బుట్టాయగూడెం మండలం వీరన్నపాలెం సమీపంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం కాల్వ వద్ద తరలించేందుకు అడవిలో నుంచి నరికిన కలపను సిద్ధంగా ఉంచి భద్రపరచి ఉంచారు. అయితే ఇది ఎవరు, ఎందుకు అక్కడ ఉంచారో తెలియాల్సి ఉంది. ఫారెస్ట్ అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేసి కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. -
సుందరగిరిపై ‘కల్యాణ కాంతులు’
●నారసింహుని కల్యాణోత్సవాలకు సర్వం సిద్ధం ●నేడు వరుడు కానున్న స్వామివారు కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో ఇరువైపులా విద్యుద్దీప అలంకారాలు, నారసింహుని భారీ విద్యుత్ కటౌట్ద్వారకాతిరుమల: నారసింహుని దివ్య కల్యాణ మహోత్సవాలకు ఐఎస్ జగన్నాధపురంలోని సుందరగిరి పర్వతం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయ పరిసరాలు విద్యుద్దీప కాంతులీనుతున్నాయి. అలాగే సుందరగిరిపై ఏర్పాటు చేసిన నారసింహుని భారీ విద్యుత్ కటౌట్, ఘాట్ రోడ్డుకు ఇరువైపులా అమర్చిన విద్యుద్దీప తోరణాలు మిరుమిట్లు గొలుపుతున్నాయి. వృక్షాలు సైతం విద్యుత్ అలంకరణలతో కనువిందు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈనెల 29 నుంచి వచ్చేనెల 3 వరకు స్వామివారి కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. అందులో భాగంగా ఉత్సవాల తొలిరోజు గురువారం ఉదయం 10.15 గంటలకు ఆలయ అర్చకులు, పండితులు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా చేస్తారని ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. యావన్మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొనాలని ఆయన కోరారు. -
కబడ్డీ పోటీల్లో ట్రిపుల్ ఐటీ విద్యార్థికి కాంస్య పతకం
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన కెమికల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సర విద్యార్థి వై శ్రీనివాస్ కబడ్డీ పోటీలో ప్రతిభను కనబరిచి కాంస్య పతకం సాధించాడు. విశాఖపట్నం మెడ్టెక్ జోన్లో ఈనెల 21 నుంచి 26 వరకు జరిగిన మూడవ జాతీయ పురుషుల పారా కబడ్డీ పోటీల్లో పాల్గొని జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించి కాంస్యం పతకం సాధించడం విశేషం. శ్రీనివాస్ను డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్, పరిపాలనాధికారి బీ లక్ష్మణరావు, అకడమిక్ డీన్ సాదు చిరంజీవి, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీ సుబ్బలక్ష్మి తదితరులు బుధవారం అభినందించారు. ఆకివీడు: స్థానిక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న దేవర కొండ ఏడుకొండలు (58) చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు ఎస్సై హనుమంతు నాగరాజు బుధవారం తెలిపారు. గత నెల 31న సెలవుపై తన స్వగ్రామం బాపట్ల వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారని, అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు చెప్పారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారని, 2023 నుంచి ఆకివీడు పోలీస్ స్టేషన్లోనే ఆయన విధుల్ని నిర్వహిస్తున్నట్లు ఎస్సై వివరించారు. జంగారెడ్డిగూడెం: ఆర్టీసీ బస్సు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురైన ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు బుధవారం ద్వారకాతిరుమల వెళ్లి మధ్యాహ్నాం స్థానిక కొత్తబస్టాండ్కు తిరిగి వచ్చింది. డ్రైవర్ వాహనాన్ని బస్టాండ్లో ఓ పక్కగా నిలుపుదల చేసి భోజనం చేసేందుకు వెళ్లారు. కొద్ది సేపటికి బస్సు ముందు భాగం నుంచి పొగలు రావడంతో స్థానికులు గుర్తించి సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు ముందు జాగ్రత్తగా బకెట్లతో నీటిని చల్లి పొగను కట్టడి చేశారు. ఇంజన్ వద్ద ఉన్న క్వాయిల్ వైర్లు డైరెక్ట్ కావడంతో పొగలు వచ్చాయని, వెంటనే బస్సును డిపోకు తరలించి క్వాయిల్ మార్చడం జరిగిందని డీఎం గంగాధరరావు తెలిపారు. బుట్టాయగూడెం: జిల్లాలోని మూడు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పీఓ కె. రాములు నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుట్టాయగూడెం గురుకుల బాలికలు, కేఆర్పురం, జీలుగుమిల్లి బాలురు గురుకులాల్లో ఒక్కో పాఠశాలలో 80 ఖాళీలు ఉండగా వాటిలో 2 ఓసీ, 10 ఎస్సీ, 4 బీసీ, 2 ఏఈక్యూ, 55 ఎస్టీ, 2 పీసీటీ ఏనాది పీహెచ్సీ, 5 పీటీజి చొప్పున ఖాళీలు ఉన్నట్లు చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 28వ తేదీ లోగా ఆన్లైన్ చేసుకోవాలని కోరారు. అలాగే ఈ పాఠశాలల్లో ఏప్రిల్ 4వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. పెదవేగి : పాత కక్షల నేపథ్యంలో కత్తులతో దాడి చేసి ఓ వ్యక్తిని తీవ్రంగా గాయపరచిన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. స్థానికులు తెలిిపిన వివరాలు ఇవి. బుధవారం పెదవేగి మండలం, రామచంద్రపురం గ్రామం లో కర్ణాటక మధు అనే వ్యక్తిని పాత గొడవలు పురస్కరించుకుని నక్క రాము అనే వ్యక్తి కత్తితో తీవ్రంగా నరికాడని, ఈ మేరకు వైద్య చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని సమాచారం. భర్తపై కేసు నమోదుయలమంచిలి: స్థానిక అంబాల చెరువుగట్టుకు చెందిన చదలవాడ సుశీల (51)ను ఆమె భర్త సుబ్బారావు ఈ నెల 26న తలపై కర్రతో కొట్టడంతో రక్త గాయమైంది. ఆమె పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై కర్ణీడి గుర్రయ్య బుధవారం తెలిపారు. -
ఉపాధ్యాయుల సమస్యలపై ఎస్టీయూ ఉద్యమ కార్యాచరణ
ఏలూరు (ఆర్ఆర్పేట) : ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ రా ష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను రూపొందించినట్టు ఆ సంఘ ఏలూరు జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీబీవీఎన్ఎల్ నారాయణ, కేఆర్ పవన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, పదవీ విరమణ చేసిన మరుసటి రోజునే పెన్షన్ సౌకర్యాలు చెల్లించాలనేవి తమ ప్రధాన డిమాండ్లని స్పష్టం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ మెమో. 57 మేరకు 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అనులు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన నాలుగు డీఏలను వెంటనే మంజూరు చేయాలలని డిమాండ్ చేశారు. ఆయా డిమాండ్ల సాధనకు తలపెట్టిన దశలవారీ పోరాటాన్ని విజయవంతం చేయాలని ఏలూరు జిల్లాలోని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. డిమాండ్ల సాధన కోసం ఈనెల 30న రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పిస్తామన్నారు. అలాగే ఫిబ్రవరి 10వ తేదీన ఏలూరు జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన చేస్తామన్నారు. ఫిబ్రవరి 25వ తేదీన విజయవాడలో బహిరంగ సభ, నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. -
గ్రావెల్ లారీల పట్టివేత
తణుకు అర్బన్ : అక్రమ మార్గంలో గ్రావెల్ రవాణాకు పాల్పడుతున్న లారీలను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు విజిలెన్స్ ఎస్పీ కె.నాగేశ్వరరావుకు వచ్చిన సమాచారంతో విజిలెన్స్, మైన్స్, రవాణాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామం నుంచి గ్రావెల్ లోడుతో వచ్చిన 6 యూనిట్ల గ్రావెల్ లారీలు 5, 3 యూనిట్ల గ్రావెల్ లారీ ఒకటి తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలో అదుపులో తీసుకున్నట్లు విజిలెన్స్ ఎస్సై కె.సీతారాము తెలిపారు. గ్రావెల్ లోడుతో ఉన్న లారీలకు సంబంధించి ఎటువంటి మైనింగ్ బిల్లులు లేకుండా, అధిక లోడుతో రవాణా చేస్తున్నట్లుగా నిర్ధారించి సదరు వాహనాలపై మైనింగ్ అపరాధ రుసుముగా రూ. 66 వేలు, అధిక లోడు కారణంగా రూ. 2.56 లక్షలు అపరాధ రుసుము విధించినట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఏజీ కె.శ్రీధర్, ఇన్స్పెక్టర్ డి.ప్రసాద్ కుమార్, సీహెచ్.రంజిత్ కుమార్, మైనింగ్ రాయల్టీ ఇన్స్పెక్టర్ పి.అన్నపూర్ణ, రవాణా శాఖ అధికారి కేవీ.సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్) : కొయ్యలగూడెం మండలంలో పొంగుటూరు, గవరవరం గ్రామాల్లో నకిలీ మొక్కజొన్న విత్తనాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని, విత్తన కంపెనీల మోసాలను అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కట్టా భాస్కరరావు, కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్థానిక పవరుపేటలోని అన్నే భవనంలో నకిలీ మొక్కజొన్న విత్తనాలపై వారు బుధవారం మాట్లాడారు. విత్తన కంపెనీలు రైతులను మోసగిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. కంపెనీల ఇష్టారాజ్యంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను మోసగించిన విత్తన కంపెనీ ప్రతినిధులపై చర్యలు తీసుకుని రైతులకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. రైతులు చేస్తున్న ఆందోళనకు రైతు సంఘం సంఘీబావం ప్రకటిస్తోందని చెప్పారు. భీమవరం: పెన్నాడ – భీమవరం రైల్వే స్టేషన్ల పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు జీఆర్పీ ఎస్సై ఎం.సుబ్రహ్మణ్యం తెలిపారు. మృతుడికి సుమారు 40 ఏళ్లు వయస్సు ఉంటుందని, రైలు ఢీకొనడం వల్ల చనిపోయాడని భావిస్తున్నామన్నారు. మృతుడు నలుపు రంగు ప్యాంటు, నలుపు రంగు షర్ట్ ధరించి ఉన్నాడని, కుడి చేతి మీద షణ్ముఖరావు, లక్ష్మి అని పచ్చబొట్టు ఉందన్నారు. వివరాలు తెలిసిన వారు 99084 48729కు సమాచారం అందించాలని కోరారు. దెందులూరు : దెందులూరు పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైనట్లు ఎస్సై ఆర్ శివాజీ తెలిపారు. గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలికపై మంగళవారం రాత్రి 15 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడినట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. బాలుడు పరారీలో ఉన్నాడని, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై చెప్పారు. -
గరుడ వాహనంపై శోభనాచలుడు
ఆగిరిపల్లి : శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి మాఘమాస రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం స్వామివారి కల్యాణ మండపంలో వలివేటి శేష శోభనాచల శ్రీనివాసరావు దంపతులు, వలివేటి హేమ శ్రీధర్ దంపతుల కై ంకర్యంలో స్వామివారి శాంతి కల్యాణం వైభవంగా జరిపించారు. రాత్రి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్వామివారిని పెండ్లి కుమారుడిగా అలంకరించి గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంతకృష్ణ స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. పెదపాడు: మండలంలోని అప్పనవీడులో అభయాంజనేయస్వామి వారి హుండీ ఆదాయాన్ని బుధవారం ఏలూరు తనిఖీదారు వి సురేష్ పర్యవేక్షణలో లెక్కించారు. స్వామివారికి రూ.12,44,579 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ తారకేశ్వరరావు తెలిపారు. 85 రోజులకు గాను ఈ ఆదాయం లభించిందన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వేమూరి శ్రీనివాసరావుతోపాటు భక్తులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
బైపాస్ రోడ్డు కల నెరవేరేనా?
నూజివీడు: నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న పట్టణ ప్రజల అసౌకర్యాన్ని తొలగించేందుకు రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడుకు గత ప్రభుత్వంలో మంజూరైన బైపాస్ రోడ్డు నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. పట్టణానికి మైలవరం రోడ్డు నుంచి విస్సన్నపేట రోడ్డు వరకు బైపాస్ రోడ్డు నిర్మాణానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. దీంతో బైపాస్ రోడ్డు నిర్మాణం జరిగితే ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయని పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ బైపాస్ రోడ్డు ట్రిపుల్ ఐటీ వెనుక భాగం నుంచి గొడుగువారిగూడెం మీదుగా పెద్దచెరువు కళంగి పైభాగాన విస్సన్నపేట రోడ్డుకు కలుస్తుంది. ఈ బైపాస్ రోడ్డు నిర్మాణానికి దాదాపు 22.50 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, దీనికి సంబంధించి ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ను సైతం విడుదల చేసింది. భూ యజమానులు సైతం బైపాస్ రోడ్డు నిర్మాణానికి తమ భూమిని ఇవ్వడానికి అప్పట్లోనే అంగీకరించారు. 4.30 కిలోమీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో నిర్మాణం బైపాస్ రోడ్డును మైలవరం రోడ్డు వద్ద నుంచి విస్సన్నపేట రోడ్డు వరకు గొడుగువారిగూడెం ఎగువ భాగం మీదుగా నిర్మించనున్నారు. రోడ్డు పొడవు మొత్తం 4.30 కిలోమీటర్లు కాగా, వెడల్పు 10 మీటర్లు (33అడుగులు). ఈ మార్గంలో బిల్లుడు వాగుపై వంతెనను నిర్మించడంతో పాటు మరో రెండు శ్లాబ్ కల్వర్టులను సైతం నిర్మిస్తారు. బైపాస్ రోడ్డుకు అవసరమైన భూమిని సేకరించేందుకు గాను అప్పటి ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రత్యేక చొరవ తీసుకొని భూముల యజమానులతో నిరంతరం చర్చిస్తూ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ భూమిని ఇచ్చేలా అంగీకరింపజేశారు. రోడ్డు నిర్మిస్తే ట్రాఫిక్ కష్టాలకు తెరపడినట్లే ఇబ్రహీంపట్నం, కొండపల్లి, జీ కొండూరు, గంపలగూడెం మండలం వినగడప ప్రాంతాల్లో ఉన్న స్టోన్క్రషర్ల నుంచి కంకర లారీలు నిత్యం నూజివీడు మీదుగా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాకు రాకపోకలు సాగిస్తుంటాయి. 40 టన్నుల నుంచి 60 టన్నుల లోడుతో భారీ వాహనాలు పట్టణంలోకి వస్తుండటంతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయినట్లయితే నూజివీడు పట్టణానికి ట్రాఫిక్ కష్టాలు తీరతాయని భావించారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై 19 నెలలు గడిచినా బైపాస్రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ఇంత వరకు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణం నిమిత్తం భూమిని సేకరించే పనులు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో శరవేగంగా జరుగుతున్న తరుణంలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమైనప్పటికీ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడిచినా బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పనులు ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా నిలిచిపోయాయి. ఎంతో శ్రమించి భూములను ఇవ్వడానికి రైతులందరినీ ఒప్పించినప్పటికీ ప్రస్తుత పాలకులు మాత్రం రోడ్డు నిర్మాణం విషయమై పట్టించుకున్న దాఖలాలే కనిపించడం లేదని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. బైపాస్ రోడ్డు పనులు చేపట్టి పూర్తి చేస్తే పట్టణ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరతాయి. మైలవరం, గంపలగూడెం వైపు నుంచి వచ్చే హనుమాన్ జంక్షన్ వైపు నుంచి వెళ్లే వాహనదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది. భారీ వాహనాలు పట్టణంలోనికి రాకుండా ఉంటాయి. – జీ రాజు, సీపీఎం నాయకుడు, నూజివీడు బైపాస్ రోడ్డు నిర్మిస్తే పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగడమే కాకుండా, రైతులకు కూడా ఎంతో లాభం చేకూరుతుంది. మామిడి తోటల్లోకి వెళ్లి రావడానికి, వ్యవసాయ దిగుబడులను సులువుగా మార్కెట్కు తెచ్చుకోవడానికి వీలవుతుంది. అంతేగాకుండా బైపాస్ రోడ్డు వెంబడి ఉండే రైతుల భూముల ధరలు సైతం పెరుగుతాయి. – షేక్ మస్తాన్వలీ, నూజివీడు గత ప్రభుత్వంలోనే నూజివీడు బైపాస్కురూ.25 కోట్లు మంజూరు భూములిచ్చేందుకు రైతులు సైతం అంగీకారం పట్టించుకోని ప్రస్తుత పాలకులు


