మద్యం మత్తుతో చిత్తు
ఆగిరిపల్లి లో రామాలయం పక్కన పడిపోయిన మందు బాబు
స్టేట్ బ్యాంక్ వద్ద రోడ్డుపైనే పడక
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఊరుకో మద్యం షాపు.. వీధికో బెల్ట్ షాపు అన్నట్లుగా తయారైంది. దీంతో మందుబాబులతో 24 గంటలు తాగించేస్తున్నారు. బెల్ట్ షాపులు ద్వారా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ఆగిరిపల్లిలో యువత మద్యం తాగి, మత్తు ఎక్కువై రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పడిపోతున్నారు. విజయవాడ రోడ్డులో తప్ప తాగి పడిపోతున్నారు. నిత్యం స్థానికంగా ఉండే వారితో గొడవలకు దిగడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
– ఆగిరిపల్లి
మద్యం మత్తుతో చిత్తు


