జెరూసలేం: లెబనాన్పై ఇజ్రాయెల్ దళాల దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెలలో లెబనాన్పై జరిపిన దాడుల్లో దాదాపు 1000 మంది ఉగ్రవాదులు హతమైనట్టు ఐడీఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. లెబనాన్లో దాదాపు 3,500కు పైగా లక్ష్యాలపై దాడులు జరిగినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తాజాగా స్పందిస్తూ..‘లెబనాన్లో హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థకు సంబంధించిన అన్ని ప్రధాన కేంద్రాలపై దాడులు జరిగాయి. వైమానికి, సముద్ర, భూ మార్గాల ద్వారా దాడులు చేశాం. దక్షిణ లెబనాన్లో ఐడీఎఫ్ దృఢ నిశ్చయంతో పనిచేస్తోంది. 91వ, 146వ, 36వ, మరియు 162వ డివిజన్లు దక్షిణ లెబనాన్లో లక్షిత కార్యకలాపాలు, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేయడం జరిగింది. అలాగే, ఉగ్రవాదులను నిర్మూలించడంతో పాటు, ఆ సంస్థకు సంబంధించిన సామర్థ్యాలను మరింత దెబ్బతీసి, దానిని ఆ ప్రాంతం నుండి తరిమివేసేందుకు ఒక కేంద్రీకృత భూతల ప్రయత్నానికి నాయకత్వం వహిస్తున్నాయి.
ఇప్పటివరకు, అనేక మంది సీనియర్ కమాండర్లు, వందలాది మంది రద్వాన్ ఫోర్స్ కార్యకర్తలతో సహా సుమారు 1,000 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. లెబనాన్ వ్యాప్తంగా 3,500కు పైగా ఉగ్రవాద లక్ష్యాలపై ఐడీఎఫ్ దాడులు చేసింది. ఈ దాడులు ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, ఆయుధ నిల్వ సౌకర్యాలు, ప్రయోగ స్థానాలు, కమాండ్ అండ్ కంట్రోల్ ప్రధాన కార్యాలయాలపై కేంద్రీకరించబడ్డాయి.
IDF Clearing Homes in Lebanon pic.twitter.com/pTcG4KWWGq
— War Archive Clips (@WarArchiveClips) April 2, 2026
దీనికి అదనంగా, లెబనాన్లో సమాంతర బ్యాంకింగ్ వ్యవస్థగా పనిచేస్తూ, పౌర నిధులను దుర్వినియోగం చేస్తూ, హెబ్జొల్లా ఉగ్రవాద సంస్థకు నిధులు ఇరాన్ నుంచి సమకూరుతున్నాయి. ఇందులో భాగంగా డబ్బు అందుకునే ఆర్థిక సంస్థ అయిన “అల్-ఖార్ద్ అల్-హసన్” అసోసియేషన్ కీలక ఆస్తులు, ఆర్థిక నిల్వ కేంద్రాలపై కూడా దాడులు జరిగాయి. అలాగే ఉత్తర లెబనాన్ నుండి దక్షిణ లెబనాన్కు ఆయుధాలు, శత్రు బలగాలను తరలించడానికి ఉపయోగించే ఐదు ప్రధాన వంతెనలను కూల్చివేశాం. ఈ దాడులు ఉగ్రవాద సంస్థ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన నష్టాన్ని కలిగించాయి’ అని తెలిపారు.


