Annamayya
-
ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
పుంగనూరు : మండల పరిధిలోని రాగానిపల్లెలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాగానిపల్లె గ్రామానికి చెందిన ప్రభాకర్రెడ్డి (67) అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుడి మరణానికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది. మహిళకు పాము కాటుమదనపల్లె టౌన్ : పొలం పనులు చేస్తున్న మహిళను విషసర్పం కాటేసిన సంఘటన బుధవారం పుంగనూరు మండలంలో జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పుంగనూరు మండలం ఈడిగపల్లె సమీపంలోని కురవూరుకు చెందిన రైతు ఏ. వెంకటరమణ భార్య ఏ. మునెమ్మ (60), ఊరికి సమీపంలోని తన వ్యవసాయ బోరు వద్ద టమోటా చెట్లలో కాయలు కోస్తోంది. ఆ సమయంలో చెట్ల మధ్య ఉన్న నాగుపాము మునెమ్మ కాలిపై కాటేసింది. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. గమనించిన కుటుంబీకులు బాధితురాలిని వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు పెద్దతిప్పసముద్రం : మండలంలోని కందుకూరు పంచాయతీ దూలంవారిపల్లి రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సత్యసాయి జిల్లా కదిరికి చెందిన అహమద్ (30), మౌలా (35)లు ద్విచక్ర వాహనంలో కర్నాటక రాష్ట్రం చేలూరుకు వెళ్ళి తిరుగు ప్రయాణంలో కందుకూరు మీదుగా వెళుతుండగా దూలంవారిపల్లి రోడ్డులో ఎదురుగా వస్తున్న ఓ కారు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారులకు తీవ్ర రక్త గాయాలు కావడంతో క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం బి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
మందుబాబుల మధ్య గొడవ
రాయచోటి : మందుబాబుల మధ్య నెలకొన్న మాటలు విభేదాలు పెరిగి బీరు బాటిల్స్తో దాడి చేసుకునేవరకు దారి తీసింది. కలిసి మద్యం సేవిద్దామని వచ్చిన మి త్రుల మధ్య మాటామాటా పెరిగి వారిచేతిలో ఉన్న మద్యం బాటిల్స్తో స్నేహితుడు అన్న కనికరం లేకుండా షేక్ మహ్మద్ ఉమర్ (20) ని పొడిచి ప్రాణాపాయస్థితికి చేర్చాడు. షేక్ మహ్మద్ ఉమర్ తన మిత్రులు కలిసి బుధవారం మధ్యాహ్నం రాయచోటి పట్టణం, చిత్తూరు మార్గంలోని వైన్ షాపుకు వెళ్లారు. తోటి స్నేహితులతో కలిసి మద్యం సేవించే సమయంలో వారి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ వాతావరణాన్ని నెలకొల్పింది. ఈ ఘర్షణలో వచ్చిన మిత్రులలో ఒకరు బీరు బాటిల్ పగులకొట్టి అదే బాటిల్తో ఉమర్ కడుపుపై రెండు పోట్లు పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన ఉమర్ను మిగిలిన మిత్రులు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం చేర్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యంకోసం తిరుపతి ఆసుపత్రికి తరలించారు. బాటిల్తో పొడిచిన వ్యక్తి ఎవరన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిసింది. చీటింగ్ వెనుక గూడుపుఠాణి ! రాజంపేట : జిల్లా వ్యాప్తంగా రాజంపేటలో సంచలనం రేపిన చిట్టీల వ్యాపారి కంచి నాగేంద్ర వర్మ కోట్ల రూపాయిలు బాకీ వెనుక గూడుపుఠాణి దాగి ఉందనే అనుమానాలు సర్వత్రా రేకిత్తిస్తున్నాయి. తొలుత ఐసీఐసీఎస్ బ్యాంక్లో బీమా విభాగంలో పనిచేసిన ఈయన జనం దగ్గర డబ్బులు కాజేయాలని వివిధ రకాల పన్నాగాలతో వ్యూహం తెరపైకి తెచ్చాడని తెలుస్తోంది. మోసపూరిత విధానాలతో ఇప్పుడు రూ.50 కోట్లకు పైగా అక్రమ సంపాదనను సమకూర్చుకున్నాడు. ఈ మాయమాటల గారిడితో మోసపోయిన బాధితుడు ఒకరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో నాగేంద్రవర్మ మోసపూరిత ఆర్ధికలావాదేవీలు ఒకొక్కటిగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. జాబితా సేకరణలో పట్టణ పోలీసులు నిమగ్నమయ్యా రని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపితే గూడుపుఠాణి బయటికి వస్తుందని అందరూ చర్చించుకుంటున్నారు. టీడీపీ నేత సహకారం? .. నాగేంద్ర వర్మకు పట్టణంలో టీడీపీ నేతగా వున్న వడ్డీ వ్యాపారితో మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఇతని వల్లనే ఐసీఐసీఐ బ్యాంకులో పనిచేసేందుకు అవకాశం కలిగిందని టీడీపీ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. ఆయన ఇంటిలో జనానికి నాగేంద్ర పెట్టిన కుచ్చుటోపికి సంబంధించి బంగారం, వెండి రూ.కోట్లాది నగదు ఉందని టీడీపీ వర్గాల్లోనే జోరుగా ప్రచారం జరుగుతోంది. వెలుగులోకి వచ్చిన ఈ ఆర్ధికనేర వ్యవహారంలో ఇతని సహకారం ఉందన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. కాగా.. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిగేనా అన్న అనుమానాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇంత పెద్ద ఎత్తున ఒక సామాన్యుడు రూ.50 కోట్లకుపైగా నగదు లావాదేవీలు జరిపాడంటే ఎవరి ప్రోత్సాహం ఉందనే అంశాలపై అనేక అనుమానాలు రాజంపేట వాసులలో కలుగుతోంది. బీరు బాటిల్తో పొడవడంతో ఒకరికి తీవ్ర గాయాలు -
టాటా ఏస్ వాహనం దగ్ధం
రొంపిచెర్ల : నేషనల్ హైవేలో టాటా ఏస్ దగ్ధమై సుమారు రూ.5 లక్షల వరకు నష్టం వాట్లిలిన సంఘటన చైన్నై–అనంతపురం జాతీయ రహదారిలో బుధవారం సాయంత్రం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన ఫ్యారుసాహెబ్ గుజిరి వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. బుధవారం ఉదయం భాకరాపేట నుంచి అన్నమ్మయ్య జిల్లా కె.వి.పల్లె మండలంలో గ్రామాలు తిరిగి న్యూస్ పేపర్లు, ఇనుప సామాన్లు కొనుగోలు చేసి టాటా ఏసీలో లోడు చేసుకుని స్వగ్రమానికి బయలుదేరారు. అయితే రొంపిచెర్ల క్రాస్ రోడ్డు సమీపంలోని హైవేలో ఒక్క సారిగా టాటా ఏస్లో మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్, క్లీనర్ వాహనం దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. టాటా ఏస్ వాహనంలో క్లీనర్ బీడీ తాగి వేయడం వలనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భా విస్తున్నారు. పీలేరుకు చెందన ఫైరింజన్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వచ్చి మంటలను అదుపు చేశారు. అయితే అప్పుటికే పూర్తిగా కాలి పోయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.5 లక్షల వరకు నష్టం జరిగి ఉంటుందన్నారు. రొంపిచెర్ల ఎస్ఐ మధుసూదన్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వర్క్ టెన్షన్ తగ్గింది
దొంగ మస్టర్లు, బినామీ కూలీలను గుర్తించడం గతంలో కష్ట తరంగానే కాకుండా సవాల్గా ఉండేది. లోపాలను ఆసరా చేసుకుని అక్రమాలకు పాల్పడేవారు. దీనిని కట్టడి చేయడానికి అధికార యంత్రాంగానికి కూడా తలనొప్పిగా ఉండేది. ఎన్ఎంఎంఎస్ (ఫేస్) యాప్ వచ్చాక ఈ సమస్యలకు పుల్ స్టాఫ్ పడింది. వేతనదారు వస్తేనే మస్టర్లో హాజరు నమోదవుతుంది. అదే విధంగా నకిలీ జాబ్ కార్డులకు కూడా కాలం చెల్లింది. పర్యవేక్షణ సులభమైంది. పని వత్తిడి కూడా తగ్గింది. –జి. సుబ్రమణ్యం, ఉపాధి హామీ ఏపీఓ, కురబలకోట మండలం -
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యాయత్నం
పుంగనూరు : పట్టణంలోని యూబి కాంపౌండులో నివాసం ఉంటున్న 29 ఏళ్ల వివాహిత కుటుంబ కలహాల కారణంగా బుధవారం శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. 15 ఏళ్ల క్రితం అహ్మద్బాషాతో వివాహం జరిగింది. కాగా కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వాహనం ఢీకొని వృద్ధురాలికి గాయాలు మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం ముది వేడు వద్ద బుధవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వృద్ధురాలి పరిస్థితి విషమించింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సుమారు 70 సంవత్సరాల వయసున్న గుర్తుతెలియని వృద్ధ మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించామన్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలను ముదివేడు పోలీసులు వెల్లడించాల్సి ఉంది. -
ఎంపీటీసీపై మందుబాబుల దాడి
మదనపల్లె టౌన్ : ఎంపీటీసీపై మందుబాబులు దాడి చేసిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి మదనపల్లెలో జరిగింది. దాడి పై బాధితుడు స్థానిక వన్న్ టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. ఈశ్వరమ్మ కాలనీకి చెందిన దేవేంద్ర కొత్తపల్లె ఎంపీటీసీగా పనిచేస్తున్నాడు. దేవేంద్ర స్థానిక చిత్తూరు బస్టాండ్ లోని ఓ మద్యం దుకాణం వద్ద కొంత కాలంగా క్యాంటీన్ నడుపుతున్నాడు. మంగళవారం రాత్రి పూటుగా తాగిన ఇద్దరు వ్యక్తులు క్యాంటీన్న్ వద్దకు వచ్చి స్నాక్స్ తిని ఆపై బిల్లు చెల్లించకుండా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో హోటల్ నిర్వాహకుడు, ఎంపీటీసీ దేవేంద్ర వారిని అడ్డుకోవడంతో ఆగ్రహించిన ఆ ఇద్దరు వ్యక్తులు దేవేంద్రపై దాడి చేసి, హోటల్లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారని బాధితుడు ఆరోపించారు. ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్న్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మమ్మల్ని కాపాడితే పార్టీ బతుకుతుంది
● ఏం చేశారని ఈ సమావేశాలు ● ఎమ్మెల్యే సమక్షంలో కార్యకర్తల ఆగ్రహంసాక్షి, మదనపల్లె : పార్టీ కోసమని అంటున్నారు..పార్టీ అంటే కార్యకర్తలే కదా, ఆ కార్యకర్తల బాగోగులు పట్టించుకోకుండా..అది చేయండి, ఇది చేయండి అంటే ఎలా అంటూ టీడీపీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం మదనపల్లి నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తల సమావేశాలు నాలుగు చోట్ల జరిగాయి. మదనపల్లె పట్టణానికి సంబంధించి ఎమ్మెల్యే కార్యాలయంలో, మదనపల్లి రూరల్ సంబంధించి ఎంపీ కార్యాలయంలో, తర్వాత రామసముద్రం, నిమ్మనపల్లె మండలాల్లో సమావేశాలు జరిగాయి. సమావేశాలకు పార్టీ నేతలు ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. దాంతో హాజరైన శ్రేణులతో సమావేశాలు ముగించారు. ఇందులో ఎంపీ కార్యాలయంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా, పరిశీలకులు వెంకటేష్ సమక్షంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వార్డులో ఐదు మంది కార్యకర్తలకై నా న్యాయం చేశారా అని ప్రశ్నించారు. న్యాయం చేయలేనప్పుడు ఈ సమావేశాలు ఎందుకని నిలదీశారు. పార్టీ..పార్టీ అంటే సరిపోదు కార్యకర్తలకు ఏం చేస్తున్నారు, వారిని పట్టించుకుంటున్నారా అని ప్రశ్నించారు. వీళ్లను కొట్టండి, వాళ్లతో కొట్టించుకోండి అని చెప్తారే మీరేం చేస్తున్నారని నిలదీశారు. ముందు కార్యకర్తలను కాపాడండి తర్వాత పార్టీని కాపాడుకుందాం, పది మంది కార్యకర్తలకు ఇది చేశామని చెప్పగలరా అని నిలదీశారు. కార్యకర్తలకు న్యాయం జరగనప్పుడు సమావేశం నిర్వహించి ఏం చెప్తారని ప్రశ్నించారు. కార్యకర్తల ప్రశ్నలకు అక్కడున్న నేతలు సమాధానాలు చెప్పకపోగా..ఇతర అంశాలపై ప్రసంగించి వెళ్లిపోయారు. కార్యకర్తలు ప్రశ్నిస్తున్నప్పుడు సమావేశానికి హాజరైన పలువురు కార్యకర్తలు ఇది నిజమే కదా అని చర్చించుకున్నారు. టీడీపీలో వర్గపోరు నెలకొంది. ఎమ్మెల్యే తమకు సహకరించడం లేదని, ఏ పనులు జరగడం లేదంటూ సీనియర్లు ఇప్పటికే పలుమార్లు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. పార్టీ సీనియర్లు, మంత్రుల సమక్షంలోనే తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పినప్పటికీ పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందని సీనియర్లు గోడు వెల్లబోసుకుంటున్నారు. -
నా భర్తను అప్పగించండి
మదనపల్లె టౌన్ : ‘నా ఐదోతనాన్ని కాపాడండి‘అంటూ బాధితురాలు రామిశెట్టి చంద్రకళ వేడుకుంది. బుధవారం మదనపల్లె ప్రెస్క్లబ్లో మదనపల్లె పట్టణం, నీరుగట్టుపల్లికి చెందిన చంద్రకళ విలేకరులతో మాట్లాడుతూ.. 2004లో అన్నమయ్య జిల్లా, మదనపల్లె నియోజకవర్గం, నిమ్మనపల్లె మండలంలోని బాలినాయునిపల్లికి చెందిన రామిశెట్టి (బీడ) శ్రీరాములు కుమారుడు దేవరాజ్ తో బెంగళూరు యలహంక గుడిలో తనకు వివాహ మైంది. పెళ్లయిన నాలుగు రోజులకే భర్త దేవరాజ్, అత్త రెడ్డెమ్మ, మామ బీడ శ్రీరాములు అదనపు కట్నం కోసం వేధించి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించింది. వేధింపులతో తాను రోగగ్రస్తురాలిగా మారి ఆసుపత్రి పాలయ్యానని, తన డబ్బు, బంగారం తీసుకుని విష ప్రయోగంతో చంపేయాలని చూశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త బతికే ఉన్నా చనిపోయాడని తప్పుడు డెత్ సర్టిఫికెట్ తెప్పించి, తాను 2006లో పెట్టిన వరకట్న వేధింపుల కేసును మదనపల్లె టూటౌన్ పోలీసులు మూసి వేశారని తెలిపింది. తనను మోసం చేసి మరో మహిళను పెళ్లి చేసుకున్న తన భర్త దేవరాజ్ కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, పదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నా పోలీసులు న్యాయం చేయలేదని కన్నీరు మున్నీరైంది. తన భర్త బతికే ఉన్నాడని, పోలీసులు తన ఐదోతనం తుడిచిపెట్టకుండా కాపాడాలని ప్రాధేయ పడింది.బాధితురాలు చంద్రకళ వేడుకోలు -
ఫేస్ యాప్తో ఫేక్కు ఫుల్ స్టాప్
● ఉపాధి హామీలో మోసాలకు కళ్లెం ● దొంగ మస్టర్లకు తావు లేదు ● బినామీ కూలీలకు చెక్మదనపల్లి (కురబలకోట) : ఉపాధి హామీలో ఏళ్లుగా వేళ్లూనుకుపోయిన అక్రమాలకు కేంద్రం ఫేస్ (ఎన్ఎంఎంఎస్) యాప్ ద్వారా అడ్డుకట్ట వేసింది. ఒకరు పనిచేసి మరొకరు వేతనాలు తీసుకోవడం, బినామీ కూలీలతో దొంగ మస్టర్లు సృష్టించడం, నకిలీ జాబ్ కార్డుల ద్వారా నిధులు దుర్వినియోగం చేయడం లాంటి అక్రమాలు, అవినీతి, అవకతవకలకు దాదాపుగా అడ్డుకట్ట పడింది. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుండి ఇది అమల్లోకి వచ్చింది. ఇదివరలో ఒకరు పనిచేస్తే మరొకరి పేరుతో బిల్లులు చేసుకుని స్వాహా చేసేవారు. ఇది అధికార యంత్రాంగానికి సవాలుగా మారేది. సోషల్ ఆడిట్లో కూడా దొరక్కుండా జాగ్రత్త వహించేవారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు పరస్పరం కుమ్మక్కయి అక్రమాలకు పాల్పడేవారు. కేంద్ర ప్రభుత్వ చర్యలతో కట్టుదిట్టం అయ్యింది. ఉదయం పనిలోకి వెళ్లగానే ఒక సారి నాలుగు గంటల వ్యవధిలో మరో సారి ఫేస్ యాప్ ఫొటోలు తీస్తున్నారు. దీంతో పని చేసిన వారికే ఉపాధి హామీ కూలి సొమ్ము లభిస్తోంది. బీనామీ మస్టర్లకు చెల్లు చీటి పడింది. ఇది అమల్లోకి వచ్చిన తొలి రోజుల్లో యాప్ కష్టాలు తలెత్తినా క్రమేణా తగ్గిపోయాయి. ఈకైవెసీ పెండింగ్ వల్ల ఫొటో అఫ్లోడ్లో సమస్యలు తలెత్తాయి. అవన్నీ కూడా తొలగిపోయాయి. జిల్లాలో రోజుకు 49 వేల మంది హాజరు.. అన్నమయ్య జిల్లాలోని 25 మండలాల్లో రోజుకు 49,252 మంది కూలీలు పనులు చేస్తున్నట్లు జిల్లా పీడీ వెంకటరత్నం వెల్లడించారు. జిల్లాలో లక్ష 72 వేలు జాబ్ కార్డులు ఉన్నాయి. వీటిలో లక్ష 43 వేలు జాబ్ కార్డులు యాక్టివ్లో ఉన్నాయి. ఫేస్ యాప్ వల్ల తాత్కాలికంగా 20 నుండి 30 శాతం కూలీల సంఖ్య తగ్గినా క్రమేణా పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఒక వైపు టమాటా సాగు, ఇంకో వైపు నేరేడు మరో వైపు సకాలంలో బిల్లులు పడకపోవడం కూడా కూలీల సంఖ్య తగ్గడానికి మరో కారణంగా జనం భావిస్తున్నారు. సర్వర్, సిగ్నల్స్ సమస్యలు తలెత్తినప్పుడు హాజరు నమోదుకు తాత్కాలికంగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే అవకాశం కల్పించారు. -
పంటపొలాలపై ఏనుగుల దాడి
పులిచెర్ల(కల్లూరు): పులిచెర్ల మండలంలో పంట పొలాలపై ఏనుగుల దాడిచేశాయి. బుధవారం తెల్లవారు జామున మండలంలోని పాళెం పంచాయతీ జూపల్లెకు చెందిన రైతు మునస్వామి మామిడితోపులోకి రెండు ఏనుగులు ప్రవేశించి కోత కొచ్చిన మామిడి పంటను నాశనం చేశాయి. అదేభూమిలోని డ్రిప్ పైపులనుకూడా విరిచి వేశాయి.గతకొన్ని రోజులుగా చుట్టు పక్కల ఎక్కడా కనిపించని ఏనుగులు తిరిగి ప్రత్యక్షం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందు తున్నారు. పోలీసులపై డీఎస్పీకి ఫిర్యాదు కురబలకోట: తన భూమిలో అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యంగా కబ్జాకు ప్రయత్నం చేస్తున్న వారికి స్థానిక పోలీసులు వత్తాసు పలుకుతున్నారని మండలంలోని అంగళ్లు గ్రామం తుంగావారిపల్లికి చెందిన పి.సోమశేఖర్ బుధవారం మదనపల్లె డీఎస్పీ పావనికి బుధవారం ఫిర్యాదు చేశారు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమికి అన్ని రికార్డులు ఉన్నాయని, కొన్నేళ్లుగా తమ స్వాధీనంలో కూడా ఉందని తెలిపారు. ఇలాంటి భూమిలో పది కుంటల స్థలాన్ని ఆక్రమించే యత్నం చేస్తున్న వారికి పోలీసులు కూడా సహకరిస్తుండడంపై కూడా తగిన ఆధారాలతో డీఎస్పీకి వివరించినట్లు తెలిపారు. విచారించి తగు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. బాధ్యతల స్వీకరణ కడప సెవెన్రోడ్స్ : జిల్లా సర్వే, భూమి రికార్డుల కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్గా జే.భరత్ కు మార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా లో సర్వే, భూమి రికార్డుల నిర్వహణ, సేవల మెరుగుదల తదితర అంశాలపై చర్చించారు. జిల్లా పరిషత్లోకారుణ్య నియామకాలు కడప సెవెన్రోడ్స్ : జిల్లా పరిషత్లో కారుణ్య నియామకాల కింద 22 మందికి జూనియర్ అసిస్టెంట్లుగా, ముగ్గురికి టైపిస్టులుగా ఉద్యోగాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన నియామక పత్రాలను బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ రామగోవిందరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. దుప్పి మాంసాన్ని పంచుకున్న ఇద్దరు అరెస్టు మైదుకూరు : వనిపెంట అటవీ రేంజ్లోని గంగాయపల్లె బీట్లో చుక్కల దుప్పి మాంసాన్ని భాగాలు చేసి పంచుకున్న ఇద్దరిని బుధవారం అటవీ అధికారులు అరెస్టు చేశారు. మరో 8 మంది పరారయ్యారు. అటవీ రేంజ్ అధికారి చలపతి నాయుడు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గంగాయపల్లె బీట్లో బుధవారం ఉదయం ఓ చుక్కల దుప్పిపై కుక్కలు దాడి చేసి చంపాయి. మున్సిపాలిటీ పరిధిలోని చిన్నయ్యగారిపల్లెకు చెందిన పది మంది ఆ దుప్పిని కోసి భాగాలు వేస్తున్న విషయాన్ని వనిపెంట అటవీ అధికారులకు తెలిసింది. వారు దాడి చేయగా వెంకటసుబ్బయ్య, ప్రసాద్ దొరికారు. మిగిలిన 8 మంది పరారయ్యారు. దొరికిన వారి నుంచి ఆరు కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంఘటనపై కేసు నమోదు చేశామని, పరారైన వారి కోసం గాలిస్తున్నామని ఎఫ్ఆర్ఓ చలపతి నాయుడు తెలిపారు. -
మదనపల్లెకు కర్ణాటక టమాట
సాక్షి, మదనపల్లె: ఒకప్పుడు కర్ణాటక సరిహద్దుల్లో పండే టమాట మదనపల్లె మార్కెట్ యార్డ్కు వచ్చేది. అక్కడి రైతులు ఇక్కడ విక్రయించుకునే వారు. కాలక్రమంలో కర్ణాటకలోనూ టమాట మార్కెట్లు ఏర్పాటు కావడంతో రైతులు అటువైపు మొగ్గు చూపడం మొదలైంది. దాంతో అక్కడి రైతులు కర్ణాటకకే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో వారం రోజులుగా కథ మళ్లీ మొదటికొచ్చింది. కర్ణాటక రైతులు మదనపల్లె మార్కెట్ బాట పడుతున్నారు. తమ దిగుబడిని ఇక్కడికి తరలించి విక్రయించుకుంటున్నారు. ఈ పరిస్థితులు ఇంకా మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరిహద్దులోని రాయల్పాడు, లక్ష్మీపురం, బద్దిపల్లి, అడ్డగల్, గౌనిపల్లి తదితర ప్రాంతాలకు చెందిన రైతులు టమాట పంటను మదనపల్లెకు తెస్తున్నారు. ఇక్కడి మార్కెట్లో 15 కిలోల క్రేట్లను అమలు చేయడం, కమిషన్ లేకపోవడంతో ఇటువైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో 15 కిలోల క్రేట్ల ద్వారానే క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. మదనపల్లె ఈ ప్రాంతాలకు సమీపంలో ఉండడంతో రవాణా ఇబ్బందులు తగ్గుతాయని రైతులు ఇటువైపు వస్తున్నారు. కాగా మదనపల్లెకు వస్తున్న టమాటా దిగుబడి కూడా భారీగా పెరిగింది. బుధవారం 1,440 టన్నుల టమాట వచ్చింది. ఈ సీజన్లో ఇప్పటిదాకా వచ్చిన అత్యధిక టమాట ఇదే. కర్ణాటక నుంచి వచ్చిన రైతుల దిగుబడి కూడా ఉంది. అయితే ధర మాత్రం తగ్గింది. కాగా గత నెల 27న 1,080 టన్నులు, 31న 1,156 టన్నులు, ఈనెల 8న 1,003 టన్నులు, 9న 1,260 టన్నుల టమాట విక్రయానికి వచ్చింది. -
ఇసుక మాఫియా కోరల్లో పెన్నమ్మ
● పరివాహక ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి ● ఇసుక తోడేస్తుండటంతో దెబ్బతింటున్న తాగునీటి పైపులైన్ ● ఐదు ట్రాక్టర్లు సీజ్ చేసిన అధికారులుఎర్రగుంట్ల : వైఎస్సార్ కడపజిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల పరిధి పోట్లదుర్తి గ్రామంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. పెన్నానదిలోని ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారు. దీంతో సమీప గ్రామాలకు వెళ్లే తాగునీటి పైపులైన్లు పగిలిపోయి నీటి ఎద్దడి ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ప్రొద్దుటూరు, యర్రగుంట్ల ప్రాంతాలకు అధికార పార్టీ అండదండలతో వారి అనుచర వర్గీయులే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. పోట్లదుర్తి గ్రామ సమీపంలోని బ్రిడ్జి సమీంలోనే ఇసుకను తోడేశారు. దీంతో ఎక్కడ పడితే అక్కడ పెన్నానది అంతా గుంతలు పడింది. అడుగుభాగాన ఉన్న ఇసుకను తోడేయడంతో మట్టి మాత్రం నదిలో మిగిలింది. పెన్నానదిలోని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా రని గ్రామంలోని కొందరు బుధవారం రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో తహసీల్దార్ అమరేశ్వరీ ఆదేశాల మేరకు ఆర్ఐ ప్రమీల వీఆర్ఓ పెన్నానదిలోకి వెళ్లి దాడులు చేశారు. తర్వాత పోలీసులు వచ్చారు. అధికారులు వస్తున్నారని తెలిసి ఇసుక అక్రమరవాణాదారులు ట్రాక్టర్లను వదిలి పరుగులు పెట్టారు. నదిలో ఉన్న ఐదు ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు. అడుగంటిపోతున్న భూగర్భజలాలు... కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్నానదిలోని ఇసుకపై అధికార పార్టీ నాయకుల అనుచర వర్గీయుల కన్నుపడింది. దీంతో ఇసుకను ఇష్టరాజ్యంగా తోడేస్తున్నారు. ఈ కారణంగా పైపులైన్ దెబ్బతినడంతో పాటు భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. గ్రామాల్లో తీవ్రంగా నీటి ఎద్దడి ఏర్పడుతోంది. ప్రొద్దుటూరు నుంచి అధికంగా ఇసుక మాఫియ దారులు పెన్నానదిలోని ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల నియంత్రణ లేకపోవడంతో ఇసుక బయట ప్రాంతాలకు తరలిపోతోంది. ట్రాలీని వదిలి ఇంజన్తో పరారైన ఇసుకాసురులు ట్రాక్టర్లను సీజ్ చేస్తున్న అధికారులు -
జలధార పనులు వేగంగా పూర్తి చేయాలి
గాలివీడు : జలధార కార్యక్రమం కింద చేపడుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం గాలివీడు మండలం అరవీడు గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న జలధార ఫీడర్ ఛానల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అరవీడు కొండల ప్రాంతం నుంచి ప్రవహించే వర్షపు నీరు గోరాన్ చెరువుకు చేరే మార్గంలో చేపడుతున్న ఫీడర్ ఛానల్ అభివద్ధి పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. ఈ నీరు చిన్నేరు నది ద్వారా పాపాగ్ని నదిలో కలుస్తుందని అధికారులు వివరించారు. పనుల స్థితిగతులను తెలుసుకున్న కలెక్టర్, ప్రస్తుతం మిగిలి ఉన్న అన్ని పనులను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దామోదర్ రెడ్డి, సంబంధిత మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లి: జల సంరక్షణ సంకల్పం జలధార పథకం ద్వారా సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం పాలెంగొల్లపల్లి ప్రాంతంలోని కుక్కలగుట్ట నుంచి కోనంపేట చెరువు వరకు జలధార కార్యక్రమం పనులను కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రెడ్డయ్య,, తహశీల్దార్ క్రాంతి కుమార్, అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఏఈ మహబూబ్ బాష, ఆర్ఐ రాజేష్, ఉపాధిహామి పథకం ఏపీఓ తిరుపాల్, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన సేవలు అందించాలి గాలివీడు: అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. బుధవారం గాలివీడు మండలం వెలిగల్లు పెద్ద తాండలోని వీపీ తాండా అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని వసతులు, పిల్లల హాజరు, సిబ్బంది విధి నిర్వహణ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. పిల్లలతో నేరుగా మాట్లాడి వారి అభ్యసన స్థాయిని తెలుసుకున్నారు. పిల్లలు ప్రాథమిక విషయాలకు కూడా సమాధానాలు చెప్పలేకపోవడం, నాలుగేళ్ల వయస్సు ఉన్న కొంతమంది పిల్లలు తమ పేరు చెప్ప లేకపోవడం పట్ల అసంతప్తి వ్యక్తం చేశారు. పిల్లల బరువును కలెక్టర్ స్వయంగా తనిఖీ చేసి, ప్రతి నెల పిల్లల బరువు, ఎత్తు నమోదుకు సంబంధించిన రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని గుర్తించారు. విధినిర్వహణలో పనితీరు మెరుగుపరచుకోకపోతే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. రామాపురం పీహెచ్సీ తనిఖీ రామాపురం: మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(పీహెచ్సీ) జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ బుధవారం తనిఖీ చేశారు.ఈ సందర్బంగా పీహెచ్సీలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు,మందుల నిల్వలు,వైద్య పరికరాల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య అందించేందుకు అవసరమైన అన్ని రకాల మందులు,వైద్య పరికరాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వైద్య సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మండల వైద్యాధికారి వినోద్కుమార్ మరియు వైద్యులు,ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గోన్నారు. -
డీకేటీ పట్టా భూమిని టీడీపీ నాయకులు కబ్జా చేసేందుకు యత్నించారు. ఇనాయత్ ఖాన్ చెరువు వద్ద టీడీపీ నేతలు సర్పంచ్ వాసు, అతని అనుచరులు కబ్జాకు తెరలేపారు. అయితే ఇక్కడ పట్టాలు ఉన్నాయని ఆక్రమణను అడ్డుకున్న ఎంపీపీ రాజమ్మ, జిల్లా వైఎస్ఆర్సీపీ బీసీ నేత పల్లపు రమే
రాయచోటి: రాయచోటిలో తెలుగుదేశం పార్టీ నేతల భూ అక్రమాల దాహం ఇప్పట్లో తీరేలా లేదు. కోర్టు స్టేలు ఇచ్చినా, ప్రభుత్వం అర్హులకు డీకేటీ పట్టా భూములు కేటాయించినా అధికారంలో ఉన్న టీడీపీ నేతలు మాత్రం తమ దౌర్జన్యకాండ ఆపడం లేదు. ఆక్రమణలకు పాల్పడే ప్రాంతంలోనే డేరాలు వేసుకొని మందిని పోగుచేసుకొని ఆక్రమణలకు అడ్డు వచ్చిన వారిపై దాడి చేసేందుకు వెనుకాడటం లేదు. నెలన్నర క్రిందట పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకుడు దశరథ రామిరెడ్డిపై భూ ఆక్రమణ విషయంలో దాడికి తెగబడిన విషయం మరువక ముందే పట్టణానికి అతి సమీపంలో ఉన్న ఇనాయత్ ఖాన్ చెరువు సమీపంలో 2005లో డీకీటీ పట్టా ఇచ్చిన భూమిని ఆక్రమించేందుకు టీడీపీ నేతలు తెగబడడంతో నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. రాయచోటి రూరల్ మండలం ఎంపీపీ రాజమ్మ (వైఎస్ఆర్సీపీ) కు చెందిన ఒక ఎకరం భూమిని పెమ్మాడపల్లి సర్పంచ్ వాసు (టీడీపీ), అతని అనుచరులు దౌర్జన్యంగా ఆక్రమణకు పాల్పడ్డారు. భూమికి చెందిన డీకేటీ పట్టా, పాస్ బుక్, ఆన్లైన్ రికార్డ్స్ మా పేరున ఉన్నాయని, మీకు ఎలాంటి హక్కులేదని అడగటానికి వెళ్లిన ఎంపీపీ రాజమ్మ, ఆమె భర్త వైఎస్సార్ సీపీ జిల్లా బీసీ నేత పల్లపు రమేష్లపై అక్కడే ఉన్న టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డారు. -
ఒకరితో పనులు చేయించలేం..!
సాక్షి, మదనపల్లె: ఒక డీఈతో 42 కిలోమీటర్ల కాంక్రీట్ లైనింగ్ పనులు కష్టమవుతుంది. నాణ్యత, పనుల వేగం అసాధ్యం అంటూ కదిరి డివిజన్–9 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజగోపాల్ మదనపల్లె సర్కిల్ ఎస్ఈ విఠల్ ప్రసాద్ కు రాసిన లేఖ మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఒకే ఒక్కడు.. పంచపాత్రాభినయం శీర్షికన సాక్షిలో సోమవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. హంద్రీనీవా ప్రాజెక్టు పరిధిలోని పుంగనూరు ఉప కాలువ (పీబీసీ)పనుల నుంచి ముగ్గురు డీఈఈ లను తొలగించి ఒకరికి పని అప్పగించడంపై ప్రత్యేక కథనాలతో సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఈ కథనాల కంటే ముందు గతనెల ఐదవ తేదీన ఈ వ్యవహారంపై రాజగోపాల్ స్పష్టమైన లేఖను రాసి, చర్యలు తీసుకోవాలని కోరారు. అయినప్పటికీ ఉన్నతాధికారి నుంచి ఇప్పటివరకు స్పందన లేకపోవడం పరిశీలిస్తే..రాజకీయ, కాంట్రాక్టు సంబంధిత పెద్ద మతలబేదో ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈఈ రాజగోపాల్ రాసిన లేఖలు అంశాలు పరిశీలిస్తే ఉన్నతాధికారులు తీసుకున్న చర్య తప్పిదం అన్న విషయంతో పాటు, కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం స్పష్టంగా వ్యక్తమవుతోంది. ఆ లేఖలో ఈఈ పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. ● గతంలో హెచ్ఎన్ఎస్ఎస్ డివిజన్–12 (కుప్పం) కింద ఉన్న సబ్ డివిజన్–1, 2, 4 కు చెందిన డీఈఈలు, ఏఈఈలను పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కిలో మీటర్ 165.000 నుండి కిలో మీటర్ 207.800 వరకు పనుల కోసం నియమించారు. తర్వాత వారిని ఉపసంహరించారు. ● ఇప్పుడు మిగిలిన కాంక్రీట్ లైనింగ్, ఎస్ఎఫ్ఆర్సీ, సీఎం అండ్ సీడీ పనులు 42 కి.మీ మేర విస్తరించి ఉన్నాయి. వీటికి ఎక్కువ మంది డీఈఈలు, ఏఈఈల అవసరం ఉంది. ● ఈ మొత్తం 42 కి.మీ పనిని డీఈఈ వై.కృష్ణకిశోర్ (సబ్ డివిజన్ నం.1, కదిరి) ఒకరికే అప్పగించారు. ఆయనకు ఇప్పటికే కిలో మీటర్ 110.000 నుండి కిలోమీటర్ 150.000 వరకు పనులు ఉన్నాయి. అదనంగా కిలోమీటర్ 165.000 నుండి కిలోమీటర్ 207.800 వరకు కూడా అప్పగించారు. ● ఇదే డివిజన్లో వై.కృష్ణకిశోర్తో పాటు ఉన్న ఏఈఈ వి.వంశీకృష్ణ రెడ్డి దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. దాంతో ఈ సబ్ డివిజన్న్లో ఇప్పుడు ఏఈఈలు ఎవరూ లేరు. ● 42 కి.మీ పనులను ఒకే డీఈఈతో నాణ్యంగా, సకాలంలో పూర్తి చేయడం కష్టం. కాబట్టి గతంలో ఈ పనులు చేసిన అనుభవజ్ఞులైన డీఈఈలు, ఏఈఈలను తిరిగి నియమించాలి. వారిని నియమించిన పక్షంలో వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి అని రాజగోపాల్ ఎస్ఈకి రాసిన లేఖలో స్పష్టంగా కోరారు. అధికార వర్గాల్లో అలజడి.. హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండోదశ మదనపల్లె సర్కిల్–3లో నెలకొంటున్న విషయాలు, కాంక్రీట్ లైనింగ్ పనులతీరు, పీబీసీ, కేబీసీల్లో కాంక్రీట్ లైనింగ్ పనుల అప్పగింత వ్యవహరం, కుప్పం డివిజన్–12 మదనపల్లెలోనే ఇంకా కొనసాగుతుండటం, దాన్ని కుప్పానికి తరలించకుండా ఇక్కడి నుంచే విధులు నిర్వహించడం, డీఈఈలకు పనుల బాధ్యతల తొలగింపు, నిబంధనలకు విరుద్ధంగా పనులు అప్పగింత..ఇలాంటి ఎన్నో విషయాలపై సాక్షిలో వస్తున్న వరుస కథనాలతో ప్రాజెక్టు అధికారుల్లో అలజడి నెలకొంది. రహస్యంగా సాగిపోతున్న చర్యలు వెలుగులోకి వస్తున్నాయని, దీనికి తాము బాధ్యులం కావాల్సి వస్తున్న ఆందోళన కొందరిలో వ్యక్తం అవుతోంది. ఇష్టారాజ్యంగా సాగిపోతున్న పనులు బహిర్గతం అవుతుండటంతో వాటిని ఉన్నతాధికారులు సమర్ధించుకోలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. నాణ్యత, పనుల్లో వేగం కష్టం ఆ ముగ్గురు డీఈఈలను తిరిగి ఇవ్వండి గతనెల ఐదునే ఎస్ఈకి లేఖ రాసిన ఈఈ సాక్షి కథనాలు అక్షర సత్యాలు ప్రాజెక్టు అధికార వర్గాల్లో అలజడి స్పందించి వివరాలు కోరిన కలెక్టర్ -
ఇదెక్కడి న్యాయం..
భూమికి సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయని, అక్కడే ఉన్న పోలీసులకు చెబుతున్నా వారివైపు నుంచి ఎలాంటి సహకారం లభించకపోగా ఇక్కడే ఉంటే దాడులు చేయడమే కాదు మేము కూడా మీ మీద కేసులు పెట్టాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించి పంపించడంపై ఎంపీపీ రాజమ్మ తీవ్రంగా మనస్థాపానికి గురయ్యారు. న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసులే దౌర్జన్యాలకు అండగా నిలవడం ఎంతవరకు సమంజసమంటూ మీడియా ముందు ఎంపీపీ విలపించారు. మంగళవారం ఉదయం నుంచి టీడీపీ నాయకులు, గ్రామ సర్పంచ్ వాసు, విజయ్, నాగేంద్ర కుమార్, రామాంజి, చిట్టి, హరిలు గుడారాలు వేసుకొని మా భూమి ఆక్రమణకు పాల్పడుతున్నారని ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించడానికి వచ్చిన తమపై తమ పిల్లలపై పీకలదాకా మద్యం సేవించి భయానక వాతావరణం సృష్టించి కొడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇరవై సంవత్సరాలుగా తమ ఆధీనంలో పొలం సాగుచేసుకుంటున్నామని.. ఇప్పుడు ఆ భూమిని తెలుగుదేశం నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించడం ఎంతవరకు సమంజసమని, ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ ఎంపీపీ మీడియా ద్వారా మొరపెట్టుకున్నారు. బీసీ నాయకుడు వల్లపు రమేష్ మాట్లాడుతూ రాయచోటి రూరల్ మండలం, పెమ్మాడపల్లి పంచాయతీలో సర్వే నెంబరు 511/1లో 2005లో పల్లపు రాజమ్మ పేరున ఒక ఎకరం డీకేటీ పట్టాను ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఈ భూమిని స్థానిక తెలుగుదేశం నాయకులు దౌర్జన్యంగా ఆక్రమణకు పాల్పడ్డారన్నారు. భూమిపై సర్వే హక్కులు తమకు ఉన్నాయని, ఆధారాలతో ముందుకు వస్తే తమను, తన భార్య రాజమ్మను రెండుసార్లు కొట్టి పంపారన్నారు. తమ భూమిలో ఎలాంటి వివాదాలు లేకపోయినా వారు చేస్తున్న దౌర్జన్యాలకు పోలీసులు కూడా వారికే మద్దతు పలుకుతుండడం దారుణమన్నారు. పది సంవత్సరాలుగా వైఎస్సార్ సీపీ తరపున ఎంపీపీగా కొనసాగుతున్న పల్లపు రాజమ్మ, వైఎస్సార్ సీపీ నాయకులు కావడంతోనే దౌర్జన్యంగా టీడీపీ నాయకులు భూ కబ్జాలకు తెరతీశారని రమేష్ ఆరోపించారు. -
ఉపాధ్యాయుల్లో టెట్ కలవరం
మదనపల్లె సిటీ: ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) కలవరపెడుతోంది. నిర్ణీత సమయంలోగా ఉత్తీర్ణత సాధించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. విద్యాహక్కు చట్టం అమల్లోకి రాక ముందు ఉపాధ్యాయులుగా నియమితులై అయిదేళ్లుకుపైగా సర్వీసు ఉన్న వారు రెండేళ్లలోపు టెట్ తప్పనిసరిగా అర్హత సాధించాలని ఆదేశించింది. 2011 ముందు ఉపాధ్యాయులుగా నియమితులైన వారంతా 2028 ఆగస్టు 31 లోపు టెట్ ఉత్తీర్ణత కావాలి. స్కూల్ అసిస్టెంట్లకు ఇబ్బందే: 2010కి ముందు డీఎస్సీల ద్వారా ఎంపికై న ఉపాధ్యాయులంతా టెట్ రాయాల్సి ఉంది. ఎస్జీటీలతో పోలిస్తే స్కూల్ అసిస్టెంట్లు పరీక్షను ఎదుర్కొనటం కొంచెం ఇబ్బందే. ఎందుకంటే వీరిలో ఎక్కువ మంది ఏదొక సబ్జెక్టునే 6–10 తరగతులకు బోధిస్తుంటారు. టెట్కు మాత్రం అన్ని సబ్జెక్టులు చదవకతప్పదు. ఉదాహరణకు జీవశాస్త్రం ఉపాధ్యాయులకు వారి సబ్జెక్టు నుంచి 20 మార్కులే ప్రశ్నలు వస్తాయి. మిగతా 130 మార్కుల కోసం పిల్లల అభివృద్ధి పెడగాజీ, మాతృభాష, ఆంగ్లభాష, గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలను చదవాల్సి ఉంటుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 6 వేల మందికిపైగానే.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 6 వేలకుపైగానే 2010 డీఎస్సీకి ముందు ఎంపికై నవారు. వీరంతా ఇప్పుడు టెట్ రాయాల్సి ఉంది. ఉపాధ్యాయులు నిరసన ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునిస్తూ కేంద్ర ప్రభుత్వం అమెండ్మెంట్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణంలో మంగళవారం ఉపాధ్యాయులు నిరసన తెలియజేశారు. జిల్లా ఫ్యాఫ్టో చైర్మన్ హేమలత మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ డీఎస్సీ ద్వారా అర్హత పరీక్ష రాసి మెరుగైన ర్యాంకులు సాధించిన తర్వాతే పోస్టులు పొందడం జరిగిందన్నారు. ఇప్పుడు విద్యార్థులకు బోధిస్తున్న సమయంలో ఈ నిబంధన తీసుకురావడంవల్ల ఉపాధ్యాయులు అభద్రతకు గురవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధుసూదన్, రవిప్రకాష్, పురం వెంకటరమణ, ఆదినారాయణ, విజయ్కుమార్, నరసింహులు, మురళి, రమాదేవి, కుసుమ, సంగీత, నాగమోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గవర్నర్ బంగ్లా ఆధునీకరణ
సాక్షి, మదనపల్లె: బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ పై ఉన్న గవర్నర్ అతిథిగృహ దుస్థితిపై గత నెల 6న సాక్షిలో గవర్నర్ ఘోస్ట్ హౌస్ శీర్షిక ప్రచురితమైన కథనంపై పర్యాటకశాఖ స్పందించింది. అతిథిగృహ ఆధునీకరణకు, ఇతర పనులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని పర్యటశాఖ ప్రాజెక్టుల విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శేషగిరిరావు ఆదేశించారని ఆ శాఖ ఇంజనీరింగ్ విభాగం డీఈఈ శ్రీనివాస్ సాక్షికి తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తామని, గవర్నర్ బంగ్లాను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. హార్సిలీహిల్స్ కాంట్రాక్టు రద్దు సాక్షి, మదనపల్లె: బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ పై ఉన్న టూరిజం యూనిట్ అభివృద్ధికి గత ప్రభుత్వం రూ.9.13 కోట్లు మంజూరు చేసింది. ఇందులో కాంట్రాక్టర్ రూ.కోటి విలువైన పనులు మాత్రమే చేసి మిగతా పనులు వదిలేశారు. దీనిపై సోమవారం సాక్షిలో హార్సిలీ హిల్స్ అభివృద్ధికి చంద్రగ్రహణం అన్న శీర్షిక ప్రచురితమైన కథనంపై ఇంజనీరింగ్ విభాగం డీఈఈ శ్రీనివాస్ స్పందించారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్ సంస్థను తొలగించేందుకు పర్యాటకశాఖ నిర్ణయించిందని తెలిపారు. నిధులను సద్వినియోగం చేసుకునేందుకు మరో కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించే విధంగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారని ఆయన తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ప్రచార కరదీపికలు ఆవిష్కరణ మదనపల్లె సిటీ: ఎల్నిలో పరిస్థితుల నేపథ్యంలో రైతులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ 2026–27 ప్రచార కరదీపికలను మంగళవారం మదనపల్లె కలెక్టరేట్లో కలెక్టర్ నిశాంత్కుమార్ ఆవిష్కరించారు. రైతులకు వాతావరణ మార్పులు, పంటల నిర్వహణ, జీవ ఉత్ప్రేరకాల వినియోగం వంటి అంశాలపై సమయానుకూలంగా అవగాహన కల్పించడం అవసరమన్నారు. జిల్లాలోని అన్ని రైతు సేవా కేంద్రాలు, ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టుల ద్వారా కరదీపికలను రైతులకు అందించి విస్తృత ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. డిజిటల్ వేదికలు, మొబైల్యాప్లు, ఎస్ఎంఎస్, వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా వ్యవసాయ సలహాలు రైతులకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయం, తేమ సంరక్షణ, నీటి నిర్వహణ, దేశవాళీ విత్తనాల వినియోగం, మిశ్రమ పంటల సాగు ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ, సమాచార శాఖ ఏడీ పురుషోత్తం, వ్యవసాయశాఖ ఏఓ నవీన్రెడ్డి పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని రాస్తారోకో మదనపల్లె టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డగోలుగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మదనపల్లె పట్టణంలోని అనిబిసెంట్ కూడలి వద్ద సీపీఎం, సీపీఐ, ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో వామపక్షాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి రోడ్డుపై బైఠాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన కారణంగా రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.కృష్ణప్ప, సీపీఎం శ్రీనివాసులు మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూరుస్తూ సామాన్య ప్రజలపై భారాలు మోపుతోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, సీపీఐ నాయకులు పాల్గొన్నారు. సీపీఐ వినూత్న ప్రదర్శన పుంగనూరు: డీజల్, పెట్రోల్ ధరలను పెంచడంపై సీపీఐ వినూత్న ప్రదర్శన చేపట్టింది. మంగళవారం సీపీఐ కార్యదర్శి వెంకట్రమణారెడ్డి, రామమూర్తి, కార్యకర్తలు కలసి ఆటోలకు తాడుకట్టి లాగుతూ ప్రదర్శన చేశారు. -
జిల్లా ఆర్థిక ప్రగతికి బ్యాంకర్లు రుణాలు అందించాలి
మదనపల్లె సిటీ: జిల్లా ఆర్థిక ప్రగతికి బ్యాంకర్లు విరివిగా రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం మదనపల్లె కలెక్టరేట్లోని బీసీ హాలులో కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ(డీసీసీ), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (డిఎల్ఆర్సీ) బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2026–27కు రూ.18,013 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక ఆమోదించడం జరిగిందన్నారు. ఇందులో ప్రాధాన్యతరంగానికి రూ.14,503 కోట్లు, వ్యవసాయరంగానికి రూ12,654 కోట్లు కేటాయించడం లక్ష్యమన్నారు. కేటాయించిన రుణ లక్ష్యాలను బ్యాంకర్లు తప్పనిసరిగా అధిగమించాలని సూచించారు. పారిశ్రామికరంగంలో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు త్వరితగతిన రుణాలు అందించాలని తెలిపారు. ఆర్థిక చేకూర్పులో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో బ్యాంకు బ్రాంచ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్థిక అక్షరాస్యతపై విస్తృత అవగాహన కల్పించాలని ఎల్డీఎంకు సూచించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. రుణ పథకాలకు అర్హత పొందిన లబ్ధిదారులకు పెండింగ్ లేకుండా రుణాలు అందించాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. సురక్షితమైన డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలన్నారు. లీడ్ బ్యాంకు మేనేజర్ ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని బ్యాంకులకు 2025–26 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి నిర్దేశించిన పలు రకాల రుణాల లక్ష్యాలు, సాధించిన ప్రగతి, 2026–27 ఆర్థిక సంవత్సరానికి లక్ష్యాలపై డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశంకు సంబంధించిన అజెండా వివరాలను, ఆయా అంశాలలో బ్యాంకు సాధించిన ప్రగతిని కలెక్టర్కు వివరించారు. సమావేశంలో ఏఎల్డీఎం మంజునాథ్, నాబార్డ్ డీడీఎం పృధ్వి, ఆర్బీఐ ఎల్డీఓ ఎలమంద, యూనియన్ బ్యాంకు ఆర్ఎం తులసీ, వివిధ బ్యాంకు మేనేజర్లు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు
పీలేరు రూరల్ : జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు గాయపడ్డారు. పీలేరు టౌన్లో కారు, బైక్ ఢీకొని ఇద్దరు వ్యక్తులకు తీవ్ర రక్త గాయాలు అయిన సంఘటన మంగళవారం జరిగింది. సీఐ యుగంధర్ కథనం మేరకు వివరాలి ఉన్నాయి. పీలేరు పట్టణం ఆర్టీసీ నల్లగుట్టకు చెందిన షేక్ షామీర్ స్థానిక సాయిబాబాగుడి వీధికి చెందిన అఖిల్ అను ఇరువురు మంగళవారం సాయంత్రం క్రికెట్ ఆడి బైక్పై వెళ్తూ పీలేరు నుంచి తిరుపతికి వెళ్తున్న కారును ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో షమీర్, అఖిల్ లకు తీవ్ర రక్త గాయాలు కావడంతో 108లో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ ప్రమాదంపై పీలేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బైక్ను ఆటో ఢీకొని మంటలు మదనపల్లె టౌన్ : ఆటో ఢీకొని బైక్లో మంటలు చెలరేగడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మంగళవారం మదనపల్లె మండలంలో జరిగింది. బాధితుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లె పట్టణంలోని ఎస్టేట్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఖాదర్వల్లి కుమారుడు మహమ్మద్ ఆరిఫ్ (20) ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. ప్రయాణికులను తీసుకెళ్తున్న తన ఆటోకు పెట్రోల్ లేకపోవడంతో ఆటో ఆగి పోయింది. స్థానికుల సాయంతో వెంటనే స్థానిక పెట్రోల్ బంకు వద్దకు వచ్చి క్యానులో పెట్రోల్ నింపుకొని స్నేహితుని బైక్లో బైపాస్ రోడ్డు వద్దకు వెళుతుండగా మార్గంమధ్యలోని వెన్నెల రెస్టారెంట్ వద్ద బైక్ను ఆటో వచ్చి ఢీకొంది. దీంతో బైక్లో మంటలు చెలరేగి ఆరిఫ్కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మిద్దైపె నుంచి పడి.. నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్) : నిద్రించేందుకు మిద్దైపెకి వెళ్లిన ఓ టైలర్ ప్రమాదవశాత్తు కిందపడి కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం ఉదయం నిమ్మనపల్లె మండలంలో ఈ ఘటన వెలుగు చూసింది. బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దేవలంకురప్పల్లికి చెందిన టైలర్ చంద్రమోహన్(35) సోమవారం రాత్రి మిద్దైపె పడుకోవడానికి వెళ్లాడు. అర్ధరాత్రి వేళ నిద్రలో ఉండగా, ప్రమాదవశాత్తు మిద్దైపె నుంచి కిందకు పడిపోయాడు. ఈ ఘటనలో కాళ్లు, చేతులు, నడుము విరిగి నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం వెంటనే తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నిమ్మనపల్లె పోలీసులు తెలిపారు. -
పిచ్చి కుక్క వీరంగం
మదనపల్లె టౌన్ : బి.కొత్తకోట మండలం బీరంగి పంచాయతీ కంబాలపల్లిలో మంగళవారం పిచ్చి కుక్క వీరంగం సృష్టించింది. ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితురాలిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని రెఫర్ చేశారు. కుటుంబీకులు బాధితురాలిని మదనపల్లికి తరలించగా చికిత్స పొందుతోంది. గ్రామంలో ఊర, పిచ్చి కుక్కల బెడదను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
టెండర్ లెస్సు.. పారిశుద్ధ్యం తుస్సు
● మదనపల్లె మార్కెట్లో నెలకు రూ.26,600 టెండర్ ● పనులు వదిలేసిన కాంట్రాక్టర్ ● కుప్పలుగా పేరుకుపోయిన టమాట వ్యర్థాలుసాక్షి, మదనపల్లె : మదనపల్లె వ్యవసాయ మార్కెట్ దేశంలోనే అతిపెద్దది. టమాట క్రయ విక్రయాల్లో ఆసియాలోనే పెద్దది. అలాంటి మార్కెట్లో పారిశుద్ధ్య చర్యలు ఏ స్థాయిలో చేపట్టాల్సి ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అయితే పోటీపడి పారిశుద్ధ్య పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇప్పుడు చేతులెత్తేశాడు. టమాట వ్యర్థాలను తొలగించకపోవడంతో కుప్పలుగా పేరుకుపోయాయి. వాటి దుర్వాసన భరించలేకపోతున్నారు. పరిస్థితులు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ఎదురుచూడాల్సి వస్తోంది. టెండర్కు పోటాపోటీ మదనపల్లె మార్కెట్లో రోజూ వందల టన్నుల్లో టమాట వస్తుంది. వాటి గ్రేడింగ్, నాసిరకం టమాటలను మార్కెట్లోనే వదిలేస్తారు. వీటిని ఏరోజుకారోజు తొలగించి పారిశుద్ధ్య పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఈ పనుల అప్పగింత కోసం గత నెలలో టెండర్లను నిర్వహించారు. ఇందులో ఎనిమిది మంది వ్యక్తులు పాల్గొన్నారు. వారిలో మనోహర్ అనే వ్యక్తి నెలకు రూ.26,600తో పనులు చేపట్టేందుకు టెండర్ దాఖలు చేశారు. అధికారులు దీన్నే ఖరారు చేశారు. వాస్తవంగా గతంలో నెలకు రూ.72 వేలు చెల్లించేవారు. ఇప్పుడు ఈ కాంట్రాక్టు పని దక్కించుకోవాలన్న లక్ష్యంతో పోటాపోటీగా పాల్గొన్నారు. పాల్గొన్న వారు రూ.75 వేల నుంచి రూ.26,600 వరకు టెండర్లు దాఖలు చేశారు. మనోహర్ దాఖలు చేసిన టెండర్ని ఖరారు చేశారు. టెండర్ ఖరారు చేస్తే.. నెలకు రూ.26,600తో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు అంగీకరించిన కాంట్రాక్టర్ పనులు చేపట్టాలి. దీనికోసం గత నెల 13న ఏడాది పాటు ఒప్పందం జరిగింది. ప్రతిరోజు 10 నుంచి 15 ట్రాక్టర్ల వ్యర్థాలను ఇక్కడి నుంచి తరలించాల్సి ఉంటుంది. అయితే కొత్త కాంటాక్ట్ ఇంత వరకు ఒక్క రోజు కూడా పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య పనులు నిర్వహించలేదు. మొక్కుబడిగా రెండు–మూడు ట్రాక్టర్ల వ్యర్థాలను తొలగించి మిగిలినవి వదిలేస్తున్నారు. దాంతో మార్కెట్లో కంపు కొడుతోంది. రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలా ఖరారు చేశారు పోటాపోటీగా సాగిన టెండర్లలో రూ.26,600 అధికారులు ఎలా ఖరారు చేశారు అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. గతంలో నెలకు రూ.72 వేలు ఉన్న ఈ టెండర్.. ఇప్పుడు అందులో రూ.45,400 తగ్గించి టెండర్ దాఖలు చేస్తే, కాంట్రాక్టర్ పనులు నిర్వహిస్తారని ఎలా ఆశించారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. -
రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం విఫలం
● సూపర్ సిక్స్ పేరుతో మోసం ● ఈ నెల 12న శాంతియుత ర్యాలీ ● వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డిరాయచోటి అర్బన్ : రెండేళ్ల కూటిమి పాలన అన్ని రంగాల్లో విఫలం అయ్యిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. మంగళవారం రాయచోటిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సాలు పూర్తవుతోందని, దాదాపుగా 50 శాతం పాలన అయిపోయిందన్నారు. ఇప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 12న వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజల సహకారంతో రాయచోటి పట్టణంలో శాంతియుత ర్యాలీ చేయబోతున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం రూ.3.50 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని మండిపడ్డారు. చేసిన అప్పును సంక్షేమ పథకాలకు కూడా వినియోగించడం లేదని పేర్కొన్నారు. వందలాది హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేశాం, పండుగ చేసుకోండని చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇచ్చిన హామీలలో 50 ఏళ్లకు పిఛన్, మహిళలకు నెలకు రూ.1500లు, నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వకుండా అందరినీ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో డ్వాక్రా మహిళా సంఘాలకు క్రమం తప్పకుండా సున్నా వడ్డీ వచ్చేటువంటి పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ సున్నా వడ్డీ మాటే లేదన్నారు. మరో వైపు రైతులను నిర్ధాక్షిణ్యంగా మోసం చేస్తున్నారని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని పేర్కొన్నారు. ఇంత వరకు ఒకసారి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీకి రూ.5 వేల కోట్ల బకాయిలు పెట్టడంతో ఆసుపత్రులలో వైద్యం అందడం లేదన్నారు. భ్రష్టు పట్టిన లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ను భ్రష్టు పట్టించారని పేర్కొన్నారు. గండికోటలో ఒక మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యం, పుంగనూరు, మదనపల్లి, కడప, బద్వేల్, నందికొట్కూరులలో సంఘటనలలో బాధితులకు న్యాయం చేయడం లేదన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతోపాటు నిత్యావసర సరుకుల ధరలను కూడా నియంత్రణలోకి తీసుకురాలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. మరోవైపు రాయచోటి చుట్టూ ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిలో హెచ్చరిక బోర్డులు జగన్ హయాంలో ఏర్పాటు చేయిస్తే, ఇప్పుడు కూటమి పాలకుల అండతో యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారని తెలిపారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలి 2022లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 26 జిల్లాలు ఏర్పాటు చేసిందని, అందులో భాగంగా రాయచోటిని జిల్లా కేంద్రంగా చేసిందని పేర్కొన్నారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ గెజిట్ ప్రకారం 26 జిల్లాలే కొనసాగుతున్నాయని, ఈ ప్రభుత్వం చేసిన 28 జిల్లాల ప్రతిపాదనకు కేంద్ర గెజిట్ లేదన్నారు. అందుకే అన్నమయ్య జిల్లాకు రాయచోటిని యథాతథంగా జిల్లా కేంద్రంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలను తిరిగి ఇక్కడనే పెట్టాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తప్పిదం చేసిందని, ఇప్పటికై నా సరైన విధానంలోకి రావాలని హితవు పలికారు. అదనపు బస్టాండ్ డీపీఆర్కే రెండేళ్లు రవాణా శాఖ మంత్రి రాయచోటికి బస్టాండ్ వచ్చింది, వచ్చింది అని రెండేళ్ల నుంచి చెబుతున్నాడని, స్వయంగా ఆ శాఖ మంత్రి అయి ఉండి బస్టాండ్ ఏర్పాటు డీపీఆర్కు రెండేళ్లు సమయం పట్టిందంటే, అభివృద్ధి ఎప్పుడు చేస్తారో అని పేర్కొన్నారు. తనకు మంత్రి పదవీ లేకపోయినా అప్పటి సీఎం జగన్ ద్వారా జిల్లా కేంద్రం ఏర్పాటుతోపాటు అనేక కార్యాలయాలను ఏర్పాటు చేశామన్నారు. తాగునీటి పైపులు వేస్తున్నామని మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారే... బస్టాండ్ డీపీఆర్ల కోసం రెండేళ్లు పట్టిందే, ఆ నీటి స్కీం మీరు చేయగలుగుతారా అని ప్రశ్నించారు. తాము మూడు సంవత్సరాల పాటు ఆర్డబ్లూఎస్ అధికారులతో నిరంతరం కష్టపడి ఎక్కడ పైప్లైన్ ఉండాలి, ఎక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ ఉండాలి, ఏ ప్రాంతం నుంచి గ్రావిటీ ఎక్కడ వస్తుందన్న విషయాలపై డ్రాయింగ్ తీసుకుని కష్టపడి పని చేసిన విషయాలను ఆయన గుర్తు చేశారు. హంద్రీ నీవా, గాలేరు నగరి లింక్ చేయలా, గాలేరు నుంచి గ్రావిటీని హంద్రీ నీవాలోకి రాయచోటికి వెలిగల్లు ద్వారా కలిపే పనులను డీపీఆర్లు తయారు చేయించి, టెండర్లు కూడా పిలిపించి, పనులను కూడా ప్రారంభించామన్నారు. ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనాలి వైఎస్సార్సీపీ అధిష్టానం పిలుపు మేరకు ఈ నెల 12వ తేదీన రాయచోటిలో శాంతియుత నిరసన ర్యాలీని చేపడుతన్నామని తెలిపారు. యువత, విద్యార్థులు, మహిళలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ భాషా, వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ నవాజ్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు వెన్నుపోటును ప్రజల్లోకి తీసుకెళ్లాలి
గుర్రంకొండ : చంద్రబాబు నాయుడు రెండేళ్ల పరిపాలనలో చేసిన వెన్నుపోటును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం గుర్రంకొండలోని గోల్డెన్ ప్లాజా కల్యాణ మండపంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లబెలూన్లను ఎగురవేసి కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నాయకులు తమ నిరసన తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి వైఎస్సార్సీపీ రౌండ్ టేబుల్ సదస్సులో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయ్యిందన్నారు. ముఖ్యంగా రైతులను, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలను దారుణంగా మోసం చేసిందన్నారు. రైతులకు పంటనష్టపరిహారం చెల్లించకుండా రెండేళ్లుగా దగా చేస్తోందన్నారు. నియోజకవర్గంలో పోలీసులు నాయకులపై పెడుతున్న అక్రమ కేసుల విషయం పార్టీ అఽధినేత జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి తప్పు చేశామంటూ ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. డీఎస్సీలో అవకతవకలకు పాల్పడి ఎంతో మంది నిరుద్యోగులకు జీవితం లేకుండా చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం 20 లక్షల మంది తల్లులుకు ఇవ్వలేదన్నారు. ఉచిత బస్సుప్రయాణం అంటూ ఉన్న బస్సులను నిలిపివేస్తుండడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీపం పథకం అరకొరగా మహిళలకు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. రాష్ట్రంలొ రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్లు ముక్తియార్ఆలీఖాన్, జగన్మోహన్రెడ్డి, వెంకట్రమణారెడ్డి, చింతల రమేష్కుమార్రెడ్డి, కమలాకర్రెడ్డి, పులి శివారెడ్డి, జెడ్పీటీసీలు రత్నశేఖర్రెడ్డి, ఆనంద్, ఎంపీపీలు అప్పల్ల, శ్రీదేవి, నాయకులు రాహుల్ చక్రవర్తి రెడ్డి, నల్లారితిమ్మారెడ్డి, చింతల శివానందరెడ్డి, మహితా ఆనంద్, సుంకర చక్రధర్, హరిత, నక్కాచంద్రశేఖర్, జమీర్, ప్రకాష్రెడ్డి,బాబురెడ్డి, శ్రీనివాసులురెడ్డి, కేశవరెడ్డి, కలీమ్, నాగేంద్ర, ఎల్వీ రమణ తదితరులు పాల్గొన్నారు.పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి -
మృతదేహాన్ని తీసుకెళ్లాలని విజ్ఞప్తి
మదనపల్లె టౌన్ : ఆప్తుల కోసం మృతదేహం ఎదురు చూస్తోందని మదనపల్లెకు చెందిన రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పెద్దయ్య మంగళవారం మీడియాకు తెలిపారు. సిటిఎం రోడ్డు వేమన్న వీధికి చెందిన వి.పచ్చప్ప మొదలియార్ అనారోగ్యంతో తిరుపతి రుయా ఆసుపత్రిలో ఇటీవల చేరి, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారన్నారు. గతంలో ఆయన తన సంరక్షణలో ఉండేవారని చెప్పారు. మృతుడి బంధు మిత్రులు ఎవరైనా ఉంటే బుధవారం సాయంత్రం 5 గంటలలోగా పచ్చప్ప మృతదేహాన్ని తీసుకెళ్లాలని, లేనిపక్షంలో మున్సిపాలిటీకి అప్పగిస్తామని పెద్దయ్య తెలిపారు. సమాచారం కోసం రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పెద్దయ్యను గానీ, రుయా వైద్యులను గానీ సంప్రదించ వచ్చునని తెలిపారు. -
వైన్షాప్లో చోరీ
వాల్మీకిపురం : పట్టణంలోని తరిగొండ రోడ్డులో సోమవారం అర్ధరాత్రి వైన్షాప్లో చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలు.. గుర్తు తెలియని దుండగులు స్థానిక తరిగొండ రోడ్డులో వైన్షాప్లోకి చొరబడ్డారు. దుకాణం పైకప్పు రేకులు తొలగించి, లోనికి ప్రవేశించి క్యాష్ కౌంటర్లోని రూ.76 వేల నగదు, మద్యం బాటిళ్లు చోరీ చేశారని క్యాషియర్ యుగంధర్రెడ్డి తెలిపారు. మంగళవారం షాప్ తెరిచేందుకు వెళ్లిన క్యాషియర్ యథావిధిగా షెట్టర్ తీసి లోనికి వెళ్లారు. అక్కడ క్యాష్ కౌంటర్ పెట్టెను పగలగొట్టడం గమనించి, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రాఘవరెడ్డి, ఎస్ఐ తిప్పేస్వామి ఆధ్వర్యంలో క్లూస్ టీం సహాయంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుల వేలిముద్రలను సేకరించారు. చెరువులో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం పుంగనూరు : మండలంలోని కొండసముద్రం గ్రామ చెరువులో సుమారు 70 సంవత్సరాల వయసు కలిగిన గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని మంగళవారం గ్రామస్తులు గుర్తించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి చేరుకుని, శవాన్ని నీటిలో నుంచి వెలికితీశారు. ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరే ఇతర కారణాలతో అయినా మృతి చెందాడా? అనే విషయాలు విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నగదు స్వాహాపై ఎస్పీకి ఫిర్యాదుమదనపల్లె టౌన్ : ఖాతాలో ఉన్న రూ.1.86 లక్షల స్వాహాపై ఓ బాధితుడు మంగళవారం మదనపల్లె ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనపై వివరాలు.. పట్టణంలోని త్యాగరాజవీధికి చెందిన గౌస్అహ్మద్, అతని తల్లి సిరాజున్నీసాల ఖాతాల్లో ఉన్న రూ.1.86 లక్షల నగదు నాలుగు రోజుల కిందట మాయమైంది. ఏటీఎం కార్డు జేబులో ఉండగానే, బ్యాంక్కు వెళ్లి నగదు డ్రా చేయకుండానే.. ఖాతాల్లో ఉన్న నగదు మాయంపై బాధితులు ఆందోళనకు గురై వెంటనే బ్యాంకుకెళ్లి అధికారులను సంప్రదించారు. సైబర్ నేరగాళ్లు ఖాతాలను ఖాళీ చేసినట్లు వారు చెప్పడంతో వన్టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదని బాధితులు తెలిపారు. గౌస్ఆహ్మద్ మంగళవారం ఎస్సీ ధీరజ్ను సంప్రదించి ఫిర్యాదు చేశాడు. బంగారు హారం అపహరణముద్దనూరు : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ మెడలో ధరించిన బంగారు హారం మంగళవారం చోరీకి గురైంది. ముద్దనూరుకు చెందిన ప్రమీళ అనే మహిళ కడపలో ముద్దనూరుకు చెందిన వారి వివాహానికి హాజరై తిరిగి మధ్యాహ్నం కడపలో బైపాస్ రైడస్ బస్సులో ఎక్కింది. ముద్దనూరులోని 4 రోడ్ల కూడలిలో బస్సు దిగి ఇంటికి వెళ్లింది. ఇంటికి వెళ్లి గమనించగా తన మెడలో ధరించిన సుమారు 3 తులాల బంగారు హారం చోరీకి గురైనట్లు గుర్తించింది. ఎస్పీ కార్యాలయం వద్ద గౌస్అహ్మద్ -
అయ్యో.. చిన్నారులకు ఎంత కష్టం వచ్చిందో..!
● ప్రాణాపాయ స్థితిలో కవల పిల్లలు ● తల్లిదండ్రులు నిరుపేదలు ● ఆపన్నహస్తం అందించి ఆదుకోవాలని వేడుకోలుపెద్దతిప్పసముద్రం : మండల కేంద్రంలోని మసీదు వీధిలో సాయివర్దన్, శిరీష దంపతులు నివసిస్తున్నారు. దినసరి వ్యవసాయ పనులే వీరి జీవనాధారం. ఈ క్రమంలో గత నెల 31న శిరీష మదనపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కవల మగ పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆ దంపతుల ఆనందం గంటల వ్యవధిలోనే ఆవిరైపోయింది. శిరీషకు నెలలు నిండకనే జన్మించిన ఇద్దరు పిల్లల బరువు 700 నుంచి 800 గ్రాములు మాత్రమే ఉండటంతో.. తక్షణం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు వెళ్లాలని డాక్టర్లు సూచించారు. దీంతో దిక్కుతోచని వారు హుటాహుటిన ప్రాణాపాయ స్థితిలో ఉన్న కవల పిల్లలను కాపాడుకునేందుకు వెంటిలేటర్ సాయంతో బెంగళూరుకు వెళ్లారు. అక్కడ ఆసుపత్రిలో రోజుకు రూ.లక్షకు పైగా ఖర్చు వస్తోందని, ఇప్పటి వరకు రూ.10 లక్షలకు పైగా ఖర్చు వచ్చిందని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. శిరీష పేరు రేషన్ కార్డులో కూడా ఇంకా నమోదు కాకపోవడం, ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు కూడా లేనందున దంపతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని, భారీ మొత్తంలో ఆసుపత్రిలో వైద్య ఖర్చులు భరించే స్తోమత లేదని వారు వాపోయారు. మానవతావాదులు, దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు స్పందించి ఫోన్ పే శిరీష 8179066898, సాయివర్దన్ 9110539333ల పేరిట పిల్లల వైద్య ఖర్చులకు సాయం అందించి ఆసుపత్రి అత్యవసర వైద్య విభాగంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ పిల్లలకు పునర్జన్మ ఇచ్చి ఆదుకోవాలని ఆ దంపతులు వేడుకుంటున్నారు. -
ఏఆర్ డీఎస్పీకి సన్మానం
మదనపల్లె టౌన్ : విధి నిర్వహణలో నిబద్ధత, నిరంతర శ్రమ ఉంటే ఉన్నత శిఖరాలు దానంతట అవే వరిస్తాయని రిజర్వ్ ఇన్స్పెక్టర్ వి.జె.రామకృష్ణ నిరూపించారు. జిల్లా పోలీస్ శాఖలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తించి, తనదైన చెరగని ముద్రవేశారు. మంగళవారం ఆయన ఏఆర్ డీఎస్పీగా పదోన్నతి పొందారు. పదోన్నతిపై చిత్తూరు జిల్లాకు బదిలీ అవుతున్న సందర్భంగా మదనపల్లె జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ధీరజ్, ఏఎస్పీ వేంకటాద్రి, ఇతర పోలీస్ అధికారులతో కలిసి ఆయనకు ఘనంగా సన్మాన, వీడ్కోలు సభను నిర్వహించారు. ఈ ఆత్మీయ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్పీ ధీరజ్.. రామకృష్ణను స్వయంగా దుశ్శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. వృద్ధుడి ఆత్మహత్య మైదుకూరు : మున్సిపాలిటీలోని గడ్డంవారిపల్లె వద్ద ఉన్న ఇండస్ట్రీయల్ సముదాయంలో వాచ్మెన్గా పని చేస్తున్న చల్ల ఆంజనేయులు(70) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంజనేయులు నిత్యం మద్యం సేవిస్తుండటంతో ఆరోగ్యం క్షీణించింది. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని పలు ప్రాంతాల్లో ఇంటి నిర్మాణ సామగ్రిని అపహరించిన నలుగురిని వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ వివరాలను మంగళవారం సాయంత్రం వన్టౌన్ సీఐ టీవీ కొండారెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. పట్టణంలోని మట్టిమసీదు వీధికి చెందిన షేక్ అబ్దుల్ సుభహాన్ కార్పెంటర్ పని చేసేవాడు. ఇతను ముగ్గురు మైనర్ బాలురులతో కలసి యర్రగుంట్ల, జమ్మమడుగు బైపాస్ రోడ్డులో గత నెల 17న రాత్రి సమయంలో కడ్డీలు కటింగ్ చేసే మిషన్ను దొంగలించాడు. అదే రోజు రాత్రి మరో రెండు ప్రాంతాల్లో ఇంటి నిర్మాణ పని ముట్లను చోరీ చేశారు. ఈ ఘటనపై బాధితుడు షేక్ సాధక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వన్టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేసి చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించారు. ఈ క్రమంలో నలుగురు నిందితులు ఎర్రగుంట్ల రోడ్డులోని వాసవి సర్కిల్ సమీపంలో ఉండగా ఎస్ఐ సిబ్బందితో కలిసి వెళ్లి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చోరీ చేసిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు సీఐ తెలిపారు. -
బిల్లులు లేకుండా బంగారు నగలు విక్రయించొద్దు
ప్రొద్దుటూరు క్రైం : బిల్లులు లేకుండా బంగారు నగలను విక్రయించరాదని ప్రొద్దుటూరు బంగారు దుకాణ యజమానులకు ఏఎస్పీ విభూకృష్ణ సూచించారు. పట్టణంలోని బంగారు వ్యాపారులు, అసోసియేషన్ ప్రతినిధులతో మంగళవారం ఏఎస్పీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి దుకాణ యజమాని నాణ్యమైన సీసీ కెమెరాలను అమర్చుకోవాలన్నారు. మెయిన్బజార్, దర్గాబజార్, పాతమార్కెట్ సమీపంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా దుకాణదారులు సహకరించాలన్నారు. రహదారికి ఇరువైపులా దుకాణాల ముందు ఒక లైన్ను ఏర్పాటు చేసుకొని లైన్ లోపలే బైక్లు నిలుపుకొనేలా ఎవరికి వారు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. బంగారు నగలను విక్రయించడానికి కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దొంగ బంగారు కొనుగోలు చేసి ఎవరూ ఇబ్బందులు పడరాదని సూచించారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు బుశెట్టి రామ్మోహన్రావు, ఉప్పలూరు ఇలియాస్, సీఐలు టీవీ కొండారెడ్డి, వంశీనాథ్, ట్రాఫిక్ సీఐ సురేష్రెడ్డి, ఎస్ఐలు శ్రీనివాసులు, రాఘవేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
మదనపల్లె (కురబలకోట): పూర్వ కాలం నుంచి భారతీయ సంస్కృతిలో భాగంగా కొనసాగుతున్న యోగా ఉత్కృష్టమైనదని, ఆరోగ్య సమాజ నిర్మాణానికి ఇది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ 12వ యోగాడే–26డే ఉత్సవాల సందర్భంగా తొలి రోజు మదనపల్లె జెడ్పీ హైస్కూల్లో సోమవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగాతో సంపూర్ణ ఆర్యోగం, మానసిక ప్రశాంతత పొందొచ్చని తెలిపారు. జూన్ 11న హార్సిలీహిల్స్, 14న బోయకొండలో యోగాంధ్ర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జాయింట్ కలెక్టర్ శివ్నారాయణశర్మ మాట్లాడుతూ యోగాను జీవితంలో అలవాటుగా మార్చుకోవాలన్నారు. దీని ప్రాధాన్యతను గుర్తించి గ్రామాల్లో కూడా యోగా శిక్షణ కార్యక్రమాలను విస్తరింపజేయాలని వివిధ శాఖల ఉద్యోగులకు సూచించారు.మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్ఓ చంద్రశేఖర్రెడ్డి, కరుణాకర్, అంగన్వాడీ, ఆరోగ్య కార్యకర్తలు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదనపల్లె పట్టణంలోని నవ చైతన్య భారతి స్కూల్ విద్యార్థుల యోగా ప్రదర్సన ఆకట్టుకుంది. జిల్లా కలెక్టర్ వారిని మెచ్చుకుని ప్రశంసపత్రాలు అందజేశారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ -
● కక్ష సాధింపునకే ప్రాధాన్యం
ప్రజల సమస్యల పరిష్కారం కంటే రాజకీయ కక్షసాధింపునకే చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రచార ఆర్భాటాలు, అబద్ధాల ప్రచారమే అజెండాగా మారింది. ఏ విషయాన్ని ప్రశ్నించినా జగనన్న పాలన అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు కూటమి పాలనకు అంతం తప్పదు. – వి.మనూజ, మాజీ మున్సిపల్ చైర్మన్ మదనపల్లె మున్సిపాలిటీలో టీడీపీ ఎమ్మెల్యే పెత్తనం పెరిగింది. ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. రాష్ట్రంలో అవినీతిలో మదనపల్లె మొదటి స్థానంలో ఉంది. కలెక్టరేట్కు సమస్యలపై వెళ్తే పరిష్కారం కావడం లేదు. కార్యాలయాలు అవినీతి నిలయాలుగా మారిపోయాయి. సామాన్యులకు న్యాయం జరగడం లేదు. – మురళి, ిసీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రాష్ట్రంలో ఈ రెండేళ్లలో శాంతి భద్రతలు క్షీణించాయి. పాలన పేరుకే సాగుతోంది. సంక్షేమం, అభివద్ధి లేదు. మ హిళలు, రైతులు, యువత, తీవ్ర నిరాశలో ఉన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఘోర వైఫల్యం నెలకొంది. – కృష్ణప్ప, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి -
ప్రజామోదం లేని కూటమి పాలన
● అధికారం కోసం హామీలు.. వచ్చాక వెన్నుపోటు ● జగనన్న కోసం జనం ఎదురుచూస్తున్నారు ● మదనపల్లెలో వెన్నుపోటుకు రెండేళ్లపై వైఎస్సార్సీపీ సదస్సు సాక్షి, మదనపల్లె: తమను పాలించాలని ఐదేళ్లు అధికారం ఇచ్చినప్పటికీ కూటమి ప్రభుత్వం రెండేళ్లకే ప్రజా విశ్వాసం కోల్పోయిందని వైఎస్సార్సీపీ సహా ప్రతిపక్ష పార్టీల నాయకులు పేర్కొన్నారు. సోమవారం మదనపల్లెలోని దేశాయి ఫంక్షన్ హాల్లో వెన్నుపోటుకు రెండేళ్లపై ప్రతిపక్ష పార్టీలతో వైఎస్సార్సీపీ సదస్సు నిర్వహించింది. సమన్వయకర్త నిసార్ అహ్మద్ అధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు హాజరైన వివిధ వర్గాల నాయకులు, మహిళా నాయకులు రెండేళ్ల కూటమిపాలన తీరుపై విరుచుకుపడ్డారు. ఇది ప్రజా పాలన కాదు ప్రజా కంటక పాలన, ప్రజలను నట్టేట ముంచే ప్రభుత్వం అంటూ ఘాటుగా విమర్శించారు. ఈ రెండేళ్లలో ఏ ఏ వర్గాలు ఎలా నష్టపోయాయి, ప్రజలకు దూరమైన సంక్షేమం, నిరుపేదలు ఎదుర్కొంటున్న నిత్యవసర భారం, విద్యార్థులు, రైతులు, కార్మికులు, రైతు కూలీలు, వ్యాపారులు, ఇలా అన్ని వర్గాలకు కూటం ప్రభుత్వం ఎలా వెన్నుపోటు పొడిచిందో విడమరిచి తమ ప్రసంగాల్లో వివరించారు. అన్ని రంగాల్లో వైఫల్యం రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో ఒక్క రంగంలోనూ ప్రజా రంజక పాలన అందించలేదని నాయకులు మండిపడ్డారు. రైతు భరోసా ఏడాదికి రూ.20వేలు ఇస్తామని ఒక ఏడాది ఇవ్వలేదు, తల్లికి వందనం పేరుతో అదే మోసం చేశారు. సూపర్ సిక్స్ అన్నారు, ఇవి ఎవరికి అందాయి, ఎవరికి ఇచ్చారో చెప్పేవన్నీ కాకి లెక్కలు, జగనన్న ఇచ్చిన పథకాలతో వీటిని ప్రజలు పోల్చుకోవడం లేదని పేర్కొన్నారు. లేని నిబంధనలు, కోతలతో పథకాలకే వాతలు పెట్టిన ఘనత చంద్రబాబు సర్కారుదని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు నిండా మోసం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, ఉద్యోగాలు ఇస్తామని నమ్మించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తోందని నిలదీశారు. మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీ నిర్వహించి నిరుద్యోగులతో చెలగాటమాడడం చంద్రబాబుకే దక్కిందన్నారు. వికలాంగులకు సదరన్ స్లాట్ కష్టాలు తీరలేదన్నారు. ఎరువులు నల్ల బజార్లో వెళ్తున్నా, ధరలు మండుతున్నా చంద్రబాబు సర్కార్ ఏం చేసిందని ప్రశ్నించారు.జగనన్న పాలనలో పేదల భూములకు ఫ్రీ హోల్డ్ చేస్తే అది అక్రమం, చంద్రబాబు సర్కార్ ఎకరా 99 పైసలకు భూములు ఇస్తే అది సక్రమం అవుతుందా అని నిలదీశారు. అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని అన్నారు. జగనన్న పాలనలో ఎక్కడైనా మహిళలకు ఇబ్బంది కలిగితే పోలీసులు నిమిషాల్లో చేరుకుని కాపాడేవారు. ఇప్పుడు చిన్నారులు, మహిళలు తేడా లేకుండా వారిపై అఘాయిత్యాలు జరుగుతున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్నారని మహిళా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సంక్షేమం విషయంలో జగనన్న పాలనతో చంద్రబాబు సర్కార్ అంచుల్లో కూడా లేదని స్పష్టం చేశారు. సదస్సు సక్సెస్ మదనపల్లెలో నిర్వహించిన వెన్నుపోటుకు రెండేళ్లు సదస్సుకు మంచి స్పందన లభించింది. సీపీఐ, ఆప్ ప్రతినిధులు, మేధావులు, యువజన నాయకులు, మహిళా ప్రతినిధులు హాజరై తమ వాణి వినిపించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ దురాగతాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంది. అందరూ ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వీఎస్.రెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి సయ్యద్ రెహామాన్, నాయకులు రాజేంద్ర నాయుడు, కేశవ రెడ్డి, ఆర్ఐ.రమణారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మస్తాన్ ఖాన్, డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, వెలుగు చంద్ర, బీరంగి రేవతి, వినూతబాయి, రేణుక, రాధాకష్ణ, సురేంద్ర, జయభారత్, రెడ్డి శేఖర్ రెడ్డి , సురేంద్ర, ఆవుల మల్లికార్జున, ప్రసాద్ బాబు, శ్రీనివాసులు, ఎన్.ఇర్ఫాన్ ఖాన్, ఈశ్వర్ నాయక్, చిప్పిలి మల్లికార్జున రెడ్డి, మధు, షేక్ ఇర్ఫాన్, శీలం రమేష్ , కొత్తపల్లి మహేశ్ , శారదా రెడ్డి, శ్యామల, అపర్ణ, నాగమణి , ధనలక్ష్మి, మంజుల, అమ్మాజాన్, మేరీ, బండపల్లి వెంకట రమణ, యూనస్, తాజ్ భాషా, అబ్దుల్లా, శరత్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, నాగరాజ రెడ్డి, రమణ, వడిగల శ్రీకాంత్, చరణ్, షేక్ జబి, కోటూరు ఈశ్వర్, మహమ్మద్ ఖాన్, విష్ణువర్ధన్ రెడ్డి, జి వి . ప్రసాద్, ఎం.ఫిర్దౌస్ ఖాన్, మజ్జిగ కేశవ యాదవ్, ఆవుల విశ్వనాథ్, చీకలబైలు చంద్ర, చలపతి, సత్తార్, తాళే సుబ్రహ్మణ్యం, వేణుగోపాల్ రెడ్డి, సమద్ , సాధిక్, భాను, మహేశ్ పాల్గొన్నారు. వెన్నుపోటుకు రెండేళ్లు సదస్సులో పాల్గొన్న నిసార్ అహ్మద్, తిప్పారెడ్డి తదితరులు, సదస్సుకు హాజరైన వివిధ వర్గాల ప్రతినిధులు -
కోఆర్డినేటర్ శ్రీనివాసరాజును విధుల్లో నుంచి తొలగించాలి
మదనపల్లె సిటీ : జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరాజు సుదీర్ఘ అక్రమ డిప్యూటేషన్, నిధుల దుర్వినియోగం, విద్యా అక్రమాలు, ప్రభుత్వ సర్వీసు నిబంధనల ఉల్లంఘనలపై విచారణ చేసి, అతన్ని విధుల్లో నుంచి తొలగించాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్కు వినతిపత్రం అందజేశారు. శ్రీనివాసరాజు అక్రమాల గురించి వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు పవన్లు స్థానిక విలేకర్లకు వివరించారు. నిబంధల ప్రకారం ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్గా డిప్యూటేషన్ కాలపరిమితి మూడు సంవత్సరాలు, అయితే నింబధనలు తుంగలో తొక్కి డిప్యూటేషన్ పేరుతో అక్రమంగా ఆ పదవిలో కొనసాగుతున్నారన్నారు. ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ కేంద్రాల కేటాయింపులు, విద్యార్థుల నుంచి అక్రమంగా రూ.3 వేలు నుంచి రూ.5 వేల వరకు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. క్లాసులకు హాజరు కాని వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. ఒక బాధ్యతాయుత అధికారిగా ఉంటూ ఇటీవల కడపలోని హరిత హోటల్లో జరిగిన రాజకీయ సమావేశానికి హాజరైనట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళిని పూర్తిగా ఉల్లంఘించినట్లు తెలిపారు. ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారన్నారని ఆరోపించారు. శ్రీనివాసరాజు అక్రమాలపై ప్రత్యేక విచారణ అధికారిని నియమించి సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్్ చేశారు. అవినీతికి కేరాఫ్గా మారిన అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ విచారణ చేయించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సాఆర్ విద్యార్థి విభాగం నాయకులు విశ్వా, తేజ, ఉదయ్, మహేష్, అజాద్, ఖాన్, లోకి, చెన్న తదితరులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్కు వైఎస్సార్ఎస్యూ వినతి -
గంగమ్మా..దీవించమ్మా
వాల్మీకిపురం: స్థానిక వాల్మీకి నగర్లో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ జాతరలో సోమవారం ఉదయం పుష్పపల్లకిలో సింహవాహం అధిరోహించిన అమ్మవారు గ్రామంలో ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మంగళవాయిద్యాలు, బాణాసంచా పేళ్లుల్లు మధ్య ఊరేగింపు కొనసాగింది. భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించారు. గంగమ్మా..దీవించమ్మా అని మొక్కుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జానపద నృత్యాలు, కోలాటాలు, ఆకట్టుకున్నాయి. 10న మెగా జాబ్మేళా మదనపల్లె సిటీ, పుంగనూరు: పుంగనూరులో ఈనెల 10వతేదీన మోగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి దాసరి నాగార్జున తెలిపారు. ప్రభుత్వ మైనార్టీ ఐటీఐ ప్రాంగణంలో ఉదయం నుంచి జరిగే వేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని, అర్హులైన అభ్యర్థుఽలకు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లోమా, డిగ్రీ, బీటెక్ ఇతర అర్హతలు కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబ్ మేళాలలో పాల్గొనే అభ్యర్థులు ముందుగా నైపుణ్యం పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు.మరిన్ని వివరాలకు 7780599208 6301612761,9553202509 నంబర్లలో సంప్రదించాలన్నారు. క్రీడల్లోనూ రాణించాలి మదనపల్లె సిటీ: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం తెలిపారు. సోమవారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఉచిత సమ్మర్ ఫుట్బాల్ కోచింగ్ ముగింపు కార్యక్రమం జరిగింది. క్రీడాకారులకు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కోచింగ్ క్యాంపు వల్ల విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి పెరిగిందన్నారు. ఇదే స్పూర్తితో పాఠశాలలో జరిగే పోటీల్లో పాల్గొనాలని సూచించారు. కోచింగ్లో నేర్పిన మెలకువలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో డిఎస్డిఓ చంద్రశేఖర్, ఎంఈఓ ఆంజనేయులు, పీడీలు అన్సర్బాషా, మురళి, నరేష్, మహేంద్ర, బాలాజీ, మోహన్ తదితరులు పాల్గొన్నారు. సంబేపల్లె పోలీసులపై ఎస్పీకి ఫిర్యాదు మదనపల్లె టౌన్: సంబేపల్లె పోలీసుల తీరుపై జిల్లా ఎస్పీ ధీరజ్కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. సంబేపల్లెలోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో దొంగలు ఇటీవల విగ్రహాలను చోరీ చేశారు. అయితే ఫిర్యాదుపై స్థానిక పోలీసులు స్పందించకపోవడమే కాకుండా, కేసును తారుమారు చేసేందుకు ఒత్తిడి తెస్తున్నారని గ్రామానికి చెందిన పలువురు ఆరోపించారు. సోమవారం మదనపల్లె పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ ధీరజ్కు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరారు. విగ్రహాలు చోరీ చేసిన దొంగలను త్వరగా అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన వారిలో శంకరా, వెంకటరమణ, నాగరాజా తదితరులు ఉన్నారు. రిక్రూట్మెంట్ దరఖాస్తు గడువు పెంపు కడప ఎడ్యుకేషన్: ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ –2026 కు సంబంధించిన అధ్యాపక నియామకాల దరఖాస్తు గడువు ఒక వారం పొడిగించారని రిజిస్ట్రార్ ఆచార్య పద్మ వెల్లడించారు. ఆన్లైన్ దరఖాస్తులు ,రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీని 15వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు.అర్హులైన దరఖాస్తుదారుల జాబితా 29న ప్రదర్శిస్తామని వివరించారు.అర్హులైన అభ్యర్థుల తుది జాబితా 7వ తేదీ ప్రకటించనున్నట్లు వివరించారు. -
డ్రైవరన్నా మేలుకో.. గమ్యం చేరుకో..
మదనపల్లె టౌన్ : డ్రైవరన్నా మేలుకో.. నిద్రమత్తు వీడి క్షేమంగా గమ్యం చేరుకో... అంటూ జిల్లా పోలీసులు వినూత్న ప్రచారానికి తెరలేపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సోమవారం జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో జాతీయ రహదారులు, ప్రధాన రోడ్లపై పోలీసులు వాహన డ్రైవర్లను నిలిపి వారి చేత ముఖాలు కడిగించి.. నిద్రమత్తు వదిలించే కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా అర్ధరాత్రి దాటిన తర్వాత కడప– చైన్నె జాతీయ రహదారి, సంబేపల్లి, రాయచోటి, గుర్రంకొండ, అలాగే ముంబై టు చైన్నె జాతీయ రహదారి మదనపల్లె, పుంగనూరు రోడ్లపై పోలీసులు వాహనాలను నిలిపి తనిఖీలు చేపట్టారు. డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారా లేదా నిద్రమత్తులో ఉన్నారా అన్న విషయాన్ని పరిశీలించి వారికి సూచనలు, సలహాలు ఇచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లాలో ‘స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో..’ సత్ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేవలం చట్టపరమైన చర్యలకే పరిమితం కాకుండా, ఒక బాధ్యతాయుతమైన మిత్రుడిలా జిల్లా పోలీసులు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం వాహనదారుల్లో చైతన్యం నింపుతోంది. -
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : గాజు ముక్కలు మింగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన సోమవారం గుర్రంకొండలో చోటు చేసుకుంది. ఆసుపత్రి అవుట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుర్రంకొండకు చెందిన మహమ్మద్ అలీ(35) కుటుంబ సమస్యల కారణంగా మనస్తాపం చెందాడు. మద్యం మత్తులో గాజు ముక్కలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు కుటుంబీకులకు సమాచారం అందించడంతో వారు వెంటనే బాధితుడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో ప్రస్తుతం కోలుకుంటున్నాడు. గుర్రంకొండ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. భార్యపై కోపంతో.. మదనపల్లె టౌన్ : వృద్ధాప్యంలో తనకు అండగా ఉండాల్సిన భార్య ఎడబాటుగా ఉండటమే కాకుండా తన బాగోగులు పట్టించుకోవడం లేదని, మనస్తాపం చెంది ఓ వృద్ధుడు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం పెద్దమండెం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యులు, జిల్లా ఆసుపత్రి అవుట్పోస్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కలిపేర్ల గ్రామం నత్తి ఓబన్నగారిపల్లెకు చెందిన రామచంద్రారెడ్డి(65) భార్య గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఇంట్లో తనకు అన్నం వడ్డించేవారు, సపర్యలు చేసేవారు లేరని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దానికి తోడు భార్య ఎడబాటుగా ఉండడాన్ని జీర్ణించుకోలేక జీవితంపై విరక్తితో పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన గ్రామస్తులు బాధితుడిని వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స అందించడంతో ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఘటనపై పెద్దమండ్యం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడిపై తేనెటీగల దాడి మదనపల్లె టౌన్ : తన వ్యవసాయ బావి దగ్గర పొలం పనులు చేస్తున్న యువకుడిపై తేనెటీగలు దాడి చేసి గాయపరిచిన సంఘటన సోమవారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబీకుల కథనం మేరకు.. కోటవారిపల్లె పంచాయతీ బండకిందపల్లెకు చెందిన మధుకర్రెడ్డి(23) ఊరికి సమీపంలోని తన వ్యవసాయ బావి దగ్గర పొలం పనులు చేస్తుండగా, ఒక్కసారిగా పెద్ద తేనెటీగలు గుంపు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా డాక్టర్లు వైద్యం అందించడంతో కోలుకుంటున్నాడు. -
ఖాళీ జాగాలపై పచ్చనేతల కన్ను
ఎక్కడ ఖాళీ జాగా కన్పించినా పచ్చ నేతల కన్నుపడుతోంది. ప్రభుత్వ స్థలాల కోసం తెగబడుతున్నారు. ఓ కీలక ప్రజాప్రతినిధి పేరుతో గ్యాంగులతో భూ కబ్జాలకు రెచ్చిపోతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే మీవల్ల అయ్యేది చేసుకోండంటూ బెదిరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని పట్టణంలోని కోళ్లబైలు గ్రామం వైఎస్సార్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఊరంతా కదిలి కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు వచ్చారు. సర్వే నంబర్ 669లో 2008 కాలనీ మంజూరు కాగా 15 సెంట్లు కమ్యూనిటీ పర్పస్ కోసం కేటాయించారు. రూ. కోటికి పైగా విలువ చేసే దీనిని కొట్టేయడానికి ఓ ప్రముఖ ప్రజాప్రతినిధి పేరుతో భూ కబ్జా గ్యాంగ్లు యత్నిస్తున్నారని కాలనీ వాసులు జిల్లా కలెక్టర్కు విన్నవించారు. ఈ స్థలం కబ్జా కాకుండా గుడి, బడి, అంగన్వాడీ, హాస్పిటల్ లేదా వాటర్ ట్యాంక్ లాంటి ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాలని కోరారు. ఇందుకు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. -
లక్ష్యం వీడకు.. అడుగు తడబడనీయకు!
● ఇంటర్లో అప్రమత్తత అవసరం ● గాడి తప్పితే జీవితమే గందరగోళం ● క్రమశిక్షణ అలవరుచుకుంటే ఉజ్వల భవిష్యత్తుమదనపల్లె సిటీ : పదో తరగతి వరకు ఓ లెక్క. ఆ తరువాత మరో లెక్క. బాల్య దశకు క్రమంగా వీడ్కోలు పలుకుతూ ఇంకోమెట్టు ఎక్కే దశనే ఇంటర్. ఇక్కడ వేసే ప్రతి అడుగు.. తీసుకునే నిర్ణయం భవితవ్యాన్ని సూచిస్తుంది. జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం తరగతులు మొదలవగా.. మొదటి సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. కొంగొత్త ఆశలతో ప్రథమ సంవత్సరంలో చేరే విద్యార్థులు జాగ్రత్తలు పాటించాల్సిన ఆవశ్యతపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. దిశానిర్దేశం అవసరం విద్యార్థి జీవితంలో ఇంటర్ కీలక మలుపు. ‘పది’ పూర్తయ్యే వరకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పరిశీలన ఉంటుంది. ఇంటర్ విషయానికొస్తే.. అప్పటి వరకు ఉన్న ఉపాధ్యాయులు కనిపించరు పర్యవేక్షణ స్థాయి తగ్గుతుంది. ఈ తరుణంలో గాడితప్పే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూరిత వాతావరణంలో మెలుగుతూ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాలి. భావోద్వేగాల నియంత్రణ అప్పటి వరకు ఉన్న వాతావరణం, వ్యక్తులు కనిపించకపోవడం, సహచర విద్యార్థులలో త్వరగా కలిసిపోని పరిస్థితుల్లో ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పరిిస్థితుల్లో లక్ష్యాలు పక్కదారి పట్టే అవకాశాలు లేకపోలేదు. టీనేజీ వయసులో భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. తాత్కాలిక ఆకర్షణ జోలికి వెళితే ఇబ్బందులు తప్పవు. చెడు వ్యసనాల జోలికి వెళ్లద్దు. ఉత్తమ స్నేహం మేలు స్నేహితుల ఎంపిక తీరు భవిష్యత్తు ఫలితాలపై ప్రభావం చూపుతుంది. స్నేహితున్ని చూసి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చుని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇంటర్లో దాదాపుగా కొత్తవారే తరగతి గదుల్లో ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో స్నేహితులను ఎంచుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. చెడుకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో మెలిగే స్నేహాన్ని ఎంచుకోవడం ఉత్తమం. సెల్ఫోన్తో జాగ్రత్త పదో తరగతి తరువాత పలువురు గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు చదువు నిమిత్తం వెళ్తుంటారు. ఈ క్రమంలో తమ పిల్లలకు సెల్ఫోన్ కొనిచ్చే ముందు జాగ్రత్తలు వివరించాలి. నిర్లక్ష్యం వహిస్తే కలిగే నష్టాలను తల్లిదండ్రులు స్పష్టం చెప్పాలి. ఆన్లైన్ గేమ్స్, యాప్స్, సైబర్ మోసాలపై అప్రమత్తం చేయాలి.సున్నితంగా మార్పు తేవొచ్చు ఇంటర్ చదివే విద్యార్థుల్లో మార్పు కనిపిస్తే తల్లిదండ్రులు స్నేహపూరిత వాతావరణంలో సున్నితంగా మార్పు తేవాలి. కళాశాల వద్ద ఏది జరిగినా చెప్పే వాతావరణం ఇంట్లో కల్పించాలి. పిల్లల్లో అసాధారణ మార్పు వస్తే గమనించి ఆరా తీయాలి. ఆత్మస్థైర్యం పెంపొందించాలి. కొందరు సర్దుకోలేక ఇంటిపై బెంగతో ఇబ్బంది పడుతుంటారు. మానసిక సమస్యలు మొదలువుతాయి. కౌన్సెలింగ్ ద్వారా మార్పు తేవొచ్చు. –చాముండేశ్వరి, సైకాలజిస్టు, మదనపల్లె -
జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సస్పెన్షన్
పెండ్లిమర్రి : పెండ్లిమర్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఇందిరను సస్పెండ్ చేస్తూ సోమవారం ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ పి.రంజిత్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది 2026 పబ్లిక్ పరీక్షల సమయంలో డిపార్టుమెంట్ ఆఫీసర్ భూతలింగేశ్వర్పై ప్రిన్సిపల్ ఇందిర దురుసుగా ప్రవర్తించడంతోపాటు దాడికి పాల్పడ్డారని అప్పట్లో ఆయన ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు నివేదికను కలెక్టర్కు అందించారు. కలెక్టర్ ఇంటర్బోర్డుకు అందించడంతో ప్రిన్సిపల్ను సస్పెండ్ చేశారు. సోలార్ కంపెనీ ఉద్యోగి బలవన్మరణం మదనపల్లె టౌన్ : భార్య మరొకరితో వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన సోలార్ కంపెనీ ఉద్యోగి ఉరేసుకుని బలవన్మరణం చెందిన విషాదకర సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె గ్రామం ఎరగ్రుండ్లపల్లెకు చెందిన వెంకటరమణ నాయక్ కుమారుడు మల్లికార్జున నాయక్(31) స్థానికంగా ఉన్న సోలార్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే విధులకు వెళ్లి వచ్చాడు. భర్త ఇంట్లో లేని సమయంలో భార్య చంద్రకళ మరో యువకుడితో వెళ్లిపోయిందని తెలిసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఊరికి సమీపానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.భార్య మరొకరితో వెళ్లిపోవడంతో మనస్తాపం -
యథేచ్ఛగా గుట్టకాయ స్వాహా
పీలేరు : మండలంలో అడ్డూ అదుపూ లేకుండా గుట్టలు తవ్వి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని తలపుల, గూడరేవుపల్లె, జాండ్ల తదితర గ్రామాల్లోని గుట్టలను కొంత మంది అధికార పార్టీ నాయకులు తవ్వేస్తున్నారు. ప్రతి రోజూ జేసీబీల సాయంతో గుట్టలు తవ్వి మట్టిని టిప్పర్లకు నింపి తరలిస్తున్నారు. వందలాది టిప్పర్ల మట్టిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల మట్టిని చెరువు స్థలాల్లో నింపి చదును చేసి వెంచర్లుగా మారుస్తున్నారు. మరోవైపు గుట్టలను కనుమరుగు చేసి ఆ స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం. -
బాధితులకు త్వరితగతిన న్యాయం
మదనపల్లె టౌన్ : ఫిర్యాది రాక వెనుక బాధ ఉంటుందని, ఆ సమస్యను గుర్తించి పరిష్కరించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలనే ఉద్దేశంతో సోమవారం మదనపల్లె పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన నేరుగా పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను స్వయంగా స్వీకరించి, వారి సమస్యలను విన్న ఎస్పీ సంబంధిత అంశాలపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా కుటుంబ వివాదాలు, సైబర్ మోసాలు, భూ, ఆస్తి తగాదాలు, నకిలీ పత్రాల వ్యవహారాలు, అధిక వడ్డీ వేధింపులు, ఆన్లైన్ మోసాలు, ప్రేమ పేరుతో మోసాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించారు. సంబంధిత పోలీసు అధికారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదులను చట్ట పరిధిలో నిష్పక్షపాతంగా పరిష్కరించి బాధితులకు న్యాయం అందించాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను సంబంధిత పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, డీఎస్పీ కార్యాలయాల్లో కూడా నమోదు చేయవచ్చని, అక్కడ స్వీకరించిన ఫిర్యాదులను సైతం పీజీఆర్ఎస్ ఫిర్యాదులుగానే పరిగణించి తగిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. భర్తపై ఫిర్యాదు పెళ్లయిన ఏడు నెలలకే భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనను మోసం చేస్తున్నాడని ఓ మహిళ జిల్లా ఎస్పీ ధీరజ్కు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేసి కాపురాన్ని నిలబెట్టాలని తంబళ్లపల్లె మండలం గోపిదిండి దళితవాడకు చెందిన మంజునాథ్ భార్య సునీత(23) ఎస్పీని కోరింది. -
టమాట కిలో రూ.41
సాక్షి, మదనపల్లె : మదనపల్లె మార్కెట్ యార్డ్లో టమాట ధర దూసుకుపోతోంది. ఐదు రోజులుగా కిలో రూ.30కి మించి పలుకుతోంది. ఆదివారం అత్యధికంగా కిలో ధర రూ.41 పలికింది. ఈ సీజన్లో ఇప్పటిదాకా ఇదే టాప్ ధర అయింది. విక్రయానికి 991 టన్నులు వచ్చింది. శనివారం 783 టన్నులురాగా కిలో అత్యధిక ధర రూ.37 పలికింది. శుక్రవారం అయితే అత్యధిక ధర కిలో రూ.34 పలికింది. విక్రయానికి 997 టన్నుల టమాట వచ్చినప్పటికీ ధర మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మార్కెట్కు వస్తున్న టమాట దిగుబడిలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ధరల్లో మాత్రం తేడా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఒక్కరోజులోనే కిలోకు రూ.4 పెరగడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. నేడు డయల్ యువర్ ఎస్ఈ సాక్షి, మదనపల్లె : జిల్లాలో విద్యుత్ వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిస్కం జిల్లా ఎస్ఈ ఆడేపూడి సోమశేఖర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8.30 నుంచి 9:30 గంటల వరకు ఈ కార్యక్రమానికి వినియోగదారులు ఫోన్ ద్వారా తమ సమస్యలను తెలియజేయాలని కోరారు. 9440817449 నంబరుకు ఫోన్ చేసి విద్యుత్ సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్సాక్షి, మదనపల్లె : స్థానిక కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తామని తెలిపారు. కిందిస్థాయిల్లో పరిష్కారంకాని ఫిర్యాదులను ప్రజలు కలెక్టరేట్లో జరిగే పీజీఆర్ఎస్కు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆన్లైలో కూడా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. క్రీడలతో ఆరోగ్యం పదిలం మదనపల్లె సిటీ : క్రీడలతో మానసికోల్లాసం, మెరుగైన ఆరోగ్యం పొందొచ్చని డీఎస్డీఓ చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం మదనపల్లెలోని బీటీ కాలేజీ మైదానంలో ప్రపంచ సైకిల్ దినోత్సవం పురస్కరించుకుని ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు, సైక్లింగ్ వల్ల ఆరోగ్య పరిరక్షణ, శారీరక దృఢత్వం, పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు వంటి ప్రయోజనాలు ఉంటాయన్నారు.సైక్లింగ్ను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలన్నారు.కార్యక్రమంలో రిటైర్డు డీఎస్డీఓ సయ్యద్బాషా, కోచ్లు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. 95 శాతం ‘సర్ ’ పూర్తి చేయాలి సిద్దవటం : మూడు రోజుల్లోగా 95 శాతం ఎస్ఐఆర్ పూర్తి చేయాలని రాజంపేట సబ్ కలెక్టర్ భావన అధికారులను ఆదేవించారు. సిద్దవటం మండలంలోని పెద్దపల్లి గ్రామ పంచాయతీ శివునిపల్లి గ్రామంలో ఆదివారం సబ్ కలెక్టర్ బీఎల్ఓలు ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేస్తున్నారా లేదా అని క్షేత్రస్థాయిలో ఓటర్లను అడిగి తెలుసుకున్నారు. సిద్దవటం మండలంలో ఇప్పటి వరకు 62.5 శాతం మ్యాపింగ్ పూర్తయిందని తహసీల్దార్ విజయ్కుమార్ సబ్ కలెక్టర్కు వివరించారు. కిచెన్ షెడ్డును త్వరగా పూర్తి చేయాలిమండల కేంద్రమైన సిద్దవటంలో నిర్మిస్తున్న కిచెన్షెడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని రాజంపేట సబ్ కలెక్టర్ భావన కాంట్రాక్టర్ను ఆదేశించారు. సిద్దవటం జెడ్పీ ఉన్నత పాఠశాల పక్కన నిర్మిస్తున్న కిచెన్ షెడ్ నిర్మాణ పనులను ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కిచెన్ షెడ్లను నిర్మిస్తోందన్నారు. జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసిందని కిచెన్ షెడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అప్పగించాలని ఆదేశించారు. -
పాముకాటుతో దంత వైద్యురాలు మృతి
గాలివీడు : మండల పరిధి కరిమిరెడ్డిగారిపల్లెకు చెందిన దంత వైద్యురాలు గొట్టివీటి శివనాగమణి(34) పాముకాటుకు గురై చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గొట్టివీటి శ్రీరాములు, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె అయిన శివనాగమణి బీడీఎస్ విద్యను పూర్తి చేసి గుర్రంకొండ, తంబళ్లపల్లి, గాలివీడు ప్రాంతాల్లో ప్రైవేట్ దంత వైద్యశాలలను నిర్వహిస్తూ వైద్య వృత్తిలో స్థిరపడింది. వ్యక్తిగత కారణాల వల్ల భర్తతో విడాకులు తీసుకున్న అనంతరం తండ్రి సంరక్షణలో స్వగ్రామంలో నివసిస్తోంది. ఈ నెల 3వ తేదీ రాత్రి ఇంటి ఆవరణలో ఉండగా ఆమెను పాము కాటువేసింది. వెంటనే కుటుంబ సభ్యులు రాయచోటిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందినప్పటికీ, విష ప్రభావం శరీరంలోని కీలక భాగాలకు వ్యాపించడంతో శనివారం రాత్రి ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శివనాగమణి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మదనపల్లె టౌన్: పాము కాటేయడంతో బాలుడు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఆదివారం ములకలచెరువు మండలంలో చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మద్దినాయునిపల్లెకు చెందిన దిలీప్(12) ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా విష సర్పం కాటేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. అయినప్పటికీ అతని పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. దీంతో బాలుడిని తిరుపతికి తరలించారు. -
వేర్వేరు ప్రమాదాల్లో 19 మందికి గాయాలు
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లాలో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 19 మందికి గాయాలయ్యాయి. మదనపల్లె మండలం పుంగనూరు రోడ్డులోని గ్రీన్ వ్యాలీ స్కూల్ వద్ద ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాయచోటికి చెందిన సయ్యద్ ఫజులుల్లా (59), సయ్యద్ అబివుల్లా (38) కారులో రాయచోటి నుంచి పుంగనూరుకు సొంత పనిపై కారులో బయలుదేరారు. కారు మార్గంమధ్యలోని మదనపల్లె మండలం పుంగనూరు రోడ్డులోని గ్రీన్ వ్యాలీ స్కూల్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పుంగనూరు నాగపాల్యానికి చెందిన వెల్డర్లు రహంతుల్లా, తాహీర్, షమీర్, రబ్బానీతోపాటు కారులో ఉన్న ఇద్దరు కలిపి మొత్తం ఆరుగురు గాయపడ్డారు. వారిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించి, చికిత్సలు అందిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా పోలీసులు తెలిపారు. ఆటోను ఢీకొన్న కారు ఆటోను కారు ఢీకొనడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బి.కొత్తకోట మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని గట్టు గ్రామం పట్రవారిపల్లెకు చెందిన మల్లీశ్వరి(38), తస్లీమ్(38)తోపాటు మరో ఐదుగురు ఆటోలో బి.కొత్తకోటకు ప్రయాణికుల ఆటోలో బయలుదేరారు. ఆటో వెళ్తుండగా గుమ్మసముద్రం చెరువు వద్ద ఎదురుగా వచ్చిన ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఐదుగురిని బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి, మల్లీశ్వరి, తస్లీమ్ను మెరుగైన చికిత్స కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బి కొత్తకోట పోలీసులు తెలిపారు. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని.. కలకడ : రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురికి గాయాలు అయిన సంఘటన కలకడ మండలం కె.బాటవారిపల్లె పంచాయతీ పోతువారిపల్లె సమీపంలో జరిగింది. కలకడ 108 సిబ్బంది కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పీలేరుకు చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి దేవితో కలిసి కలకడ నుంచి పీలేరు వైపునకు, కలకడకు చెందిన బాబాషాదిక్ పీలేరు నుంచి కలకడకు ద్విచక్రవాహనాలపై వెళ్తున్నారు. మార్గంమధ్యలోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలోకి రాగానే ఎదురు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వారు ముగ్గురూ గాయపడ్డారు. వారిని కలకడ 108 సిబ్బంది పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చౌడేపల్లె : చౌడేపల్లె– పలమనేరు మార్గంలోని చిట్రెడ్డిపల్లె వద్ద ఆదివారం రాత్రి ఎదురెదురుగా రెండు స్కూటర్లు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తిరుపతి తొండవాడకు చెందిన శంకర(47), నాగేంద్ర(35)లు స్కూటర్పై చౌడేపల్లె నుంచి సోమలమండలం పెద్ద ఉప్పరపల్లె సమీపంలో గల ఆవులపల్లెలో జరిగే గంగజాతర వేడుకలకు బయలు దేరారు. పొలం వద్ద నుంచి స్కూటర్పై సుబ్రమణ్యం(45) వస్తున్నాడు. ఎదురెదురుగా వస్తున్న వీరి స్కూటర్లు చిట్రెడ్డిపల్లె గ్రామం వద్ద ఢీకొన్నాయి. వారు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శంకర స్పృహ కోల్పోయి, పరిస్థితి విషమంగా మారడంతో 108 సహాయంతో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. -
కేశాలు దానం.. స్ఫూర్తిదాయకం
మదనపల్లె సిటీ : క్యాన్సర్ బాధితుల మోములో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ చేపట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం స్థానిక హెల్పింగ్మైండ్స్ కార్యాలయంలో గట్టుకు చెందిన జనార్థన్రెడ్డి, నర్మద దంపతుల కుమార్తె సాయినిహారిక, ములకలచెరువుకు చెందిన మురళీధర్, సౌభాగ్యలక్ష్మి దంపతుల కుమార్తె సాయి గోపికలు కేశాలు దానం చేశారు. వారు పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వారికి ప్రశంసా పత్రాలు, పూల మొక్కలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ నిర్వాహకులు అబూబకర్సిద్దిక్, సభ్యులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’కి తూట్లు.. కూలీలకు పాట్లు
సాక్షి, టాస్క్ఫోర్స్ : రొంపిచెర్ల మండలంలో ఉపాధి పనులను యంత్రాలతో చేస్తున్నారు. ఉపాధి కార్యాలయానికి కిలో మీటరు దూరంలోనే.. యంత్రాలతో పనులు చేస్తున్నా అధికారులు అటు వైపు కన్నెతి చూడటం లేదు. ఈ పనులను కూలీలతో చేయించినట్లు మస్టర్లు పెట్టి ప్రభుత్వ నిధులు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రొంపిచెర్ల గ్రామ పంచాయతీ వారణాసివారిపల్లె సమీపంలోని మంచినీళ్ల కుంట చెరువు కట్టను బల పరిచేందుకు రూ.2.50 లక్షల ఉపాధి నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఇక్కడ కూలీలు చేయాల్సిన పనులను జేసీబీలు, ట్రాక్టర్లు పెట్టి.. కూలీల కడుపుకొడుతున్నారు. యంత్రాలతో పనులు చేసి కూలీలు చేసినట్లు మస్టర్లు పెట్టి నిధులను దోచుకుంటున్నారు. చెరువులకు వెళ్లే కాలువల పూడికతీత పనులను కూడా మండలంలో యంత్రాలతోనే చేస్తున్నారని ప్రజలు బహిరంగంగా చెబుతున్నారు. ఇందులో ఉపాధి అధికారుల హస్తం కూడా ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. పనులు ఎలాగైనా చేసుకోవచ్చునని అయితే తమకు 20 శాతం నిధులను ఇవ్వాలని సిబ్బంది చెప్పి నిధులను అందరూ కలసి పంచుకుంటున్నట్లు సమాచారం. కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు నిధులు చేరుతున్నట్లు తెలిసింది. వీడియోలతో కూలీల హాజరు ఉపాధి పనులను యంత్రాలతో చేసి కూలీలు చేసినట్లు చూపించేందుకు.. బడా నేతలు కూలీల ఫొటోలు, వీడియోలను తీసి వాటిని పనులు చేస్తున్న చోటికి తీసుకుని వెళ్లి అక్కడ ఫొటోలు, వీడియో సాయంతో కూలీలు పని చేస్తున్నట్లు జీపీఎస్తో హాజరు వేస్తున్నట్లు తెలిసింది. ఈ తంతు రొంపిచెర్ల మండలంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఉపాధిలో ఎలాంటి అక్రమాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్లను ప్రవేశ పెట్టినా ఇక్కడ వాటి పప్పులు ఉడకడం లేదు. ఇప్పుటినా అధికారులు, ప్రజాప్రతినిధులు తగు చర్యలు తీసుకుని ఉపాధిలో ఎలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఫిర్యాదు చేసినా మారని అధికారులు పుంగనూరు నియోజకవర్గంలో జాతీయ ఉపాధి పథకం పనులలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి 6 నెలల క్రితం ఫిర్యాదు చేశారు. దీంతో విజిలెన్స్ అధికారులు ఉపాధి పనులను తనిఖీ చేశారు. అవకతవకలు కొన్ని వెలుగు చూసినా ఉన్నతస్థాయి అధికారులపై రాజకీయ నాయకుల ఒత్తిడితో బయటికి రాకుండా అడ్డు పడినట్లు సమాచారం. ఉపాధి సిబ్బంది ఒక చోట జియో టాగింగ్ చేస్తే పనులు మరో చోట ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అయితే అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో అక్రమాలు బయట పడకుండా సర్దేశారు. మరో మారు ఉపాధి అక్రమాలపై కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ మిథున్రెడ్డి ఆధారాలతో సహాఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. యంత్రాలతో పనులు పక్క దారి పడుతున్న నిధులు నేతలు, అధికారులు కుమ్మక్కు మరో సారి ఫిర్యాదు చేయనున్న ఎంపీ -
ప్రైవేటు దోపిడీ అరికట్టాలి
● తల్లిదండ్రులపై ‘ప్రైవేట్’భారం ● ఈ నెల 12 నుంచి పునః ప్రారంభంకానున్న పాఠశాలలుమదనపల్లె సిటీ : జూన్ వచ్చిదంటే తల్లిదండ్రుల్లో దడ పుడుతోంది. పాఠశాలలు ఈ నెల 12 నుంచి పునః ప్రారంభంకానున్నాయి. దీంతో పుస్తకాలు, యూనిఫాం, ఫీజుల పేరిట వారిపై అదనపు భారం పడునుంది. ప్రైవేట్లో ఎల్కేజీ,యూకేజీలకే వేలాది ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంటర్, డిగ్రీ చదువులకు సైతం భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అయినా సరే తమ పిల్లలను ప్రైవేట్లో ఉన్నతంగా చదివించి మంచి భవిష్యత్తు అందించాలని సామాన్యులు కలలు కంటున్నారు. ఇదే అదునుగా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అందికకాడికి దండుకుంటున్నాయి. డొనేషన్లు, ఫీజుల పేరిట ఇష్టారీతిన వసూలు చేస్తున్నాయి. జీవో నంబర్ 1–కు తూట్లు పొడుస్తూ విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు. నామమాత్రమైన పేరెంట్ కమిటీలు పాఠశాలలకు కొమ్ముకాయడంతో ‘ఫీ’జులం సాగుతోం. విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలు మితిమీరుతున్నాయి. అందినకాడికి దండుకోవడమే జల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు వ్యాపార సంస్థలుగా మారాయి. అడ్డగోలు ఫీజుల వసూలుతో పాటు యూనిఫాం, పుస్తకాలు, నోటుబుక్లు,టై, బెల్టు, షూ ఇలాంటి ప్రతిదీ విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. బడి ప్రారంభం కాకముందే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. మరికొన్ని పాఠశాలలు వారు సూచించిన బుక్స్టాల్, దుస్తుల షాపుల్లోనే కొనుగోలు చేయాలని చీటీలు అందిస్తున్నారు. ఆ పుస్తకాలు మిగతా స్టోర్లలో దొరక్కపోవడంతో దిక్కుతోచని స్థితిలో అక్కడే అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. 1వ తరగతి చదివే విద్యార్థుల నోట్, పాఠ్యపుస్తకాలకే రూ.3వేల నుంచరి రూ.5 వేల వరకు వెచ్చించాల్సిన దుస్థితి. ఇంత జరుగుతున్నా అధికారులు మామూలుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాపార సంస్థలుగా మారిన ప్రైవేట్ బడులు జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ చదువులకే ఏడాదికి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ–టెక్నో,మోడల్, కాన్సెప్ట్, టెక్నో, గ్రామర్, ఐఐటీ, నీట్,జెఈఈ ఇలా తోక పేర్లు తగిలిస్తూ తల్లిదండ్రుల కలలను సొమ్ము చేసుకుంటన్నారు. హాస్టళ్లు కూడా ఏర్పాటు చేసి ఏడాదికి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థులకు అడ్మిషన్ ఫీజు తీసుకోకూడదు. అయినా కొన్ని పాఠశాలలు ఇష్టారీతిన వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాఠశాలల్లో కనీస వసతులు కూడా ఏర్పాటు చేయడం లేదు. ఇరుకు గదులు, క్రీడా మైదానాలు లేకపోవడం, విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, తాగునీరు, తదతర సౌకర్యాలు లేనప్పటికి ఫీజుల వసూలులో మాత్రం వెనుకాడటడం లేదు.అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేట్ పాఠశాలలు తల్లిదండ్రులను దోపిడీకి గురి చేస్తున్నాయి. ప్రభుత్వం ఫీజులను అరికట్టాలి. విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలి. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో నింబధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు విక్రయిస్తున్నారు. ఎలాంటి తనిఖీలు చేయడం లేదు. –మాధవ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి -
గరం గరం!
రాజ్యసభ సీటు దక్కకపోవడంపై వాసు కినుక సోషల్ మీడియాలో శ్రీనివాసులరెడ్డి పోస్టు హల్చల్ వాసును అనునయించిన తెలుగుతమ్ముళ్లు ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు సన్నాహాలు మూకుమ్మడి రాజీనామా చేయాలనే దిశగా ఆలోచనలు అధిష్టానం వాకబు చేయడంతో వెనక్కు తగ్గిన వైనం సాక్షి ప్రతినిధి, కడప : తెలుగుదేశం పార్టీ జోనల్ కోఆర్డినేటర్ ఆర్ శ్రీనివాసులరెడ్డికి అధిష్టానం మొండిచేయి చూపించింది. రాజ్యసభ సీటుపై పెట్టుకున్న ఆశలు ఆడియాశలయ్యాయి. తుది వరకు సభ్యత్వం ఆశించి ఆపై భంగపాటుకు గురయ్యారు. వెరశి 13ఏళ్లుగా టీడీపీలో నిబద్ధతతో పనిచేస్తున్నా అధిష్టానం నిర్ణయం కలత కలిగించిందని, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం రాజకీయ జీవితంలో అత్యంత నిరాశ కలిగించిన ఘటనగా మిగిలిపోతుందని పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈపరిస్థితుల్లో కడప తెలుగుతమ్ముళ్లు గరంగరంగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యత్వం దక్కుతోందని గత కొంతకాలంగా శ్రీనివాసులరెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తే కారణాలేమైనప్పటికీ టీడీపీలో ఆయన ప్రాధాన్యత తగ్గిందనే చెప్పాలి. తొలుత జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించారు.తర్వాత పొలిట్బ్యూరో సభ్యుల జాబితా నుంచి గెంటేశారు. జోనల్ కోఆర్డినేటర్ పదవితో మాత్రమే సరిపెట్టారు. అయినప్పటీకీ ఎలాంటి అసంతృప్తి బహిర్గత పర్చకుండా సైలెంట్గా ఉండిపోయినా, రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకపోవడంతో శ్రీనివాసులరెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. దీంతో కడప నియోజకవర్గంలో ఆయన అభిమానులు సైతం కినుక వహించారు. మూకుమ్మడిగా రాజీనామా చేయాలనే దిశగా అనుచరులు అడుగులు వేశారు. అధిష్టానం నిశితంగా పరిశీలన.. టీడీపీ అధిష్టానం తెలుగుతమ్ముళ్ల అడుగులను నిశితంగా పరిశీలన చేసినట్లు సమాచారం. శ్రీనివాసులరెడ్డి అనుచరుల ప్రత్యేక సమావేశం గురించి నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఆపై పొరుగున ఉన్న నేతలను సైతం పురమాయించినట్లు సమాచారం. సమావేశం వీగిపోయేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరిస్తూ అధిష్టానం డైరెక్షన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈపరిస్థితులల్లో శ్రీనివాసులరెడ్డి స్వయంగా జోక్యం చేసుకొని ఎవ్వరూ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయరాదని, అధిష్టానం గురించి మీడియాలో ఎటువంటి వ్యాఖ్యలు చేయరాదని సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగుతమ్ముళ్లు అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేయాలని భావించినప్పటికీ శ్రీనివాసులరెడ్డి వారిని కట్టడి చేసినట్లు సమాచారం. అందుకు కారణాలు అనేకం. సమావేశం నిర్వహిస్తే పొరుగు నేతల ప్రమేయం కడపలో పెరిగే అవకాశం లేకపోలేదు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో టీడీపీకి అన్నీ తానై వ్యవహారించిన శ్రీనివాసులరెడ్డికి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరి మద్దతు లభించడం లేదు. ప్రత్యేకించి అధిష్టానం ఎదుట శ్రీనివాసులరెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని కోరిన సందర్భమే లేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనుచరుల సమావేశాన్ని సైతం తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. అదే విషయాన్ని నిఘా వర్గాలు సైతం సీఎంఓ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. -
ఆహార శుభ్రత.. ఆరోగ్య భద్రత
కడప ఎడ్యుకేషన్ : ప్రతి ఒక్కరూ ఆహారం సురక్షితంగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వినయ్కుమార్ సూచించారు. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం’పై ఆదివారం వైఎస్ఆర్ జిల్లా కడపలోని గాంధీనగర్ హైస్కూల్లో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వినయ్ కుమార్ మాట్లాడుతూ కలుషిత ఆహారం తినడం వల్ల పలు రకాల రోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా చేతులు కడుక్కోవాలన్నారు. బయటి ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. పాడైన లేదా కాలం తీరిన ఆహారం తీసుకోకూడదు సూచించారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ నెంబర్ 15100, చైల్డ్ లైన్ హెల్ప్లైన్ నెంబర్ 1098, ఉచిత న్యాయ సాయం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఏవైనా సమస్యలుంటే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ వారి దృష్టికి తీసుకొని రావచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆహార భద్రతా అధికారులు హరిత, రమేష్ కుమార్రెడ్డి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ చంద్రకాంతమ్మ, సంత, ప్రవీణ్, కడప మండలంలోని హోటల్స్ సిబ్బంది, పార లీగల్ వాలంటీర్స్ దశరథరామిరెడ్డి, కృష్ణారెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
బోయకొండలో ఘర్షణ
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ దేవస్థానం వద్ద ఫొటో షాపు నిర్వాహకుడు, భక్తుల మధ్య మాటకుమాట పెరిగి వివాదం తారా స్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు దాడి చేసుకొనే పరిస్థితికి వెళ్లిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన ఓ భక్తుడు బోయకొండ దేవస్థానం వద్ద ఫొటోలు తీసే నిర్వాహకుడితో గొడవపడ్డారు. ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో ఆలయ సిబ్బంది జోక్యం చేసుకొని వివాదాన్ని సర్దుబాటు చేశారు. ఈ విషయమై ఈఓ ఏకాంబరంను వివరణ కోరగా.. ఇరువర్గాల నడుమ ఘర్షణ జరిగింది వాస్తమేనని, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు షాపు నిర్వాహకుడికి హెచ్చరిక చేశామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగినా.. ఆలయ ఈఓ, పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మదనపల్లె టౌన్ : వృద్ధుడిపై పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మనచెరువు పంచాయతీ దండువారిపల్లెకు చెందిన గంగులయ్య (63) ఇంటి ముందు నిలుచొని ఉండగా, ఎక్కడి నుంచో వచ్చిన పిచ్చి కుక్క ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గంగులయ్యను మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. పులిచెర్ల(కల్లూరు): ట్రాక్టరు కింద పడి డ్రైవర్ దుర్మరణం చెందిన సంఘటన ఆదివారం కల్లూరు సమీపంలోని ఎస్సార్ పెట్రోల్ బంకు సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు... కల్లూరు– చిత్తూరు జాతీయ రహదారిలో కల్లూరు సమీపంలో ఉన్న ఎస్సార్ పెట్రోల్ బంక్ పక్కన మామిడి కాయల ర్యాంప్ పైకి పాకాల మండలం అడుసుపల్లెకు చెందిన డ్రైవరు రాజశేఖర్(35).. ట్రాక్టరు ఇంజిన్ను తిప్పుకొని వస్తామని వెళ్లాడు. తిరిగి వస్తుండగా అదుపు తప్పి దాని కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కల్లూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. మదనపల్లె టౌన్ : అనారోగ్యం తాళలేక వృద్ధురాలు ఎలుకల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జిల్లా ఆస్పత్రి అవుట్పోస్ట్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు .. మదనపల్లె మండలం నడింపల్లి పంచాయతీ జంగాలపల్లికి చెందిన గంగప్ప భార్య మునెమ్మ (80) అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమె తీవ్ర మనస్తాపం చెంది, ఇంట్లో ఉన్న ఎలుకల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. రామసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గోమాతల సేవలో మమకారం
పుంగనూరు: పున్నమి రోజు తిరువణ్ణామలైలో గిరిప్రదక్షణ సమయంలో అల్పాహారం తీసుకుంటుండగా వచ్చిన ఆలోచనతో ఆ నలుగురు మిత్రులకు గోసేవ చేయాలని నిర్ణయించారు. ప్రతి పున్నమికి ఒక లారీ లోడ్ పచ్చగడ్డి గోవులకు అందించే కార్యక్రమాన్ని పుంగనూరులో ప్రారంభించారు. ఆలోచన ఎలా వచ్చిందంటే .... పట్టణంలో సాధారణ కుటుంబాల్లో జన్మించిన కెఎస్.మణి, మదన్మోహన్షేట్, గణేష్రెడ్డిలు వ్యాపారం చేస్తుంటారు. విద్యాసాగర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నలుగురు మంచి మిత్రులుగా ఉన్నారు. ప్రతి పున్నమికి తమిళనాడులోని తిరువణ్ణామలై వెళ్లి గిరిప్రదక్షణం చేసి రావడం వీరికి అలవాటు. ఇలా ఉండగా మూడేళ్ల క్రితం గిరిప్రదక్షణకు వెళ్లి అక్కడ అల్పాహారం తీసుకుని అరిటాకులను కిందపడేసే సమయంలో పశువులు పరుగున వచ్చి అరటి ఆకులను తినడంతో ఆరోజు పశువులకు గడ్డి ఇవ్వాలనే ఆలోచన వారిలో మొదలైంది. గోమాతలో సకల దేవతలు కొలువైనందున బయట తీర్థయాత్రలు చేయడం ఎందుకు... పుంగనూరులోనే పశువులకు సేవ చేద్దామని నిర్ణయించారు. తమ శక్తి మేరకు చందాలు వేసుకుని మరుసటి పున్నమి నాటికి లారీ పచ్చగడ్డి కొనుగోలు చేసి బైపాస్ రోడ్డులోని ఆర్టీసీ డిపో వద్ద ఉచితంగా ఇవ్వడం ప్రారంభించారు. రెండు నెలల పాటు ప్రచారం లేకపోవడంతో గడి పంపిణీ కష్టతరమైంది. ప్రస్తుతం ప్రచారం ఊపందుకోవడంతో లారీ లోడు పచ్చగడ్డి గంటల్లో తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా పశువులు సైతం పున్నమి రోజున అక్కడికి వచ్చి పచ్చగడ్డి తినడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ధరలతో పనిలేదు నలుగురు మిత్రులు ప్రతి నెల చందాలు వేసుకుని గడ్డి ధర ఎంత ఉన్నా లారీ లోడు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం సుమారు రూ.10 వేలకు పైగా విలువ చేసే పచ్చిగడ్డి పున్నమి రోజు పశువులకు ఉదయం నుంచి అందిస్తారు. పశువుల యజమానులు, వీధి పశువులు సైతం ఆహారం కోసం తాటిమాకులపాళెంలోని ఆర్టీసి డిపో వద్దకు చేరిపోతున్నాయి. యజమానులు తమకు కావాల్సిన గడ్డిని వాహనాలు, ఆటోల్లో తీసుకెళ్తారు. ప్రతి నెల లక్షలాది రూపాయలు పశువుల ఆహారం కోసం తమ ఆదాయాన్ని కేటాయిస్తూ, గోమాతల సేవలో తరిస్తున్న నలుగురు మిత్రులు పట్టణంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. అందరి మన్ననలు పొందుతున్నారు. పున్నమి రోజు గడ్డి అందజేత ఆదర్శంగా నిలుస్తున్న మిత్రులు -
● శ్రీరెడ్డెమ్మకొండలో భక్తుల రద్దీ
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన సంతాన దేవత శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. పలువురు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు. హిందువులతో పాటు ముస్లీంలు ఆలయానికి తరలివచ్చారు. రాయలసీమ జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. -
క్షేత్రస్థాయి వాస్తవాలు
హంద్రీనీవా ప్రాజెక్టులో జూనియర్ డీఈఈకి 5 సబ్ డివిజన్ల అప్పగింత ఈఈ పరిధిని మించి బాధ్యతలు కట్టబెట్టడం వెనుక పెద్ద ‘మతలబు’? 15 ఏళ్ల అనుభవం ఉన్న ముగ్గురు సీనియర్ల నెత్తిన ‘నీవా’ గుదిబండ! సాక్షి, మదనపల్లె : ప్రభుత్వ శాఖ అయినా, ప్రైవేటు సంస్థ అయినా విధుల నిర్వహణలో సీనియార్టీకి, అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చి పనులను నాణ్యతగా చేయించుకోవడం ఎక్కడైనా ఆనవాయితీగా వస్తుంది. అయితే ప్రస్తుత కూటమి పాలనలో ఇవేమీ అక్కర్లేదు. ‘మనోడైతే చాలు.. అనుభవం గట్రా ఏమీ వద్దు.. మేం చెప్పినట్టు చేసేవాడైతే చాలు.. అదే పెద్ద సీనియార్టీ’ అన్నట్లుగా పాలకులు కొత్త భాష్యం చెబుతున్నారు. అచ్చంగా ఇదే పరిస్థితి ప్రస్తుతం హంద్రీనీవా ప్రాజెక్టు రెండో దశలో కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రాజెక్టు పనులకు సంబంధించి ఓ జూనియర్ కోసం ముగ్గురు అనుభవజ్ఞులైన సీనియర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను (డీఈఈ) బలిపశువులను చేశారు. అది కూడా పథకం ప్రకారం వారికి పనులు లేని నీవా ఉపకాలువ పనులు అప్పగించి, కీలకమైన కాంక్రీట్ లైనింగ్, స్ట్రక్చర్స్ పనుల నుంచి తప్పించేశారు. ఏడాది డీఈఈకి ‘టాప్ ప్రయారిటీ’ హంద్రీనీవా ప్రాజెక్టులోనే పుంగనూరు ఉపకాలువ కిలోమీటర్ 165 నుంచి 207.800 డివిజన్–12 పరిధిలోకి వస్తుంది. ఈ పరిధిలో పనిచేస్తున్న డీఈలు రవి, రమణారావు, సెల్వరాజ్లను పీబీసీ పనుల నుంచి ఉన్నతాధికారులు అకస్మాత్తుగా తప్పించారు. వీరంతా ఏఈ స్థాయి అనుభవాన్ని దాటుకుని, డీఈఈలుగానే 15 ఏళ్లకు పైగా సుదీర్ఘ క్షేత్రస్థాయి అనుభవం కలిగిన వారు. అయితే కదిరి డివిజన్–11లో ఏఈగా పనిచేస్తూ ఈ మధ్యనే డీఈఈగా పదోన్నతి పొంది, కనీసం ఏడాది అనుభవం కూడా పూర్తికాని కృష్ణకిశోర్కు ఈ కీలకమైన పీబీసీ కాంక్రీట్ లైనింగ్, స్ట్రక్చర్స్ పనులను కట్టబెట్టారు. ఏ ప్రభుత్వ శాఖలోనూ లేని విధంగా హంద్రీనీవా ప్రాజెక్టులో జూనియర్కు అత్యధిక పనులు అప్పగించడం వెనుక కారణాలు ఏమిటన్నది ఇంజనీరింగ్ అధికారుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సర్కిల్కు చెందిన ఓ ఉన్నతాధికారి రాజకీయ ఒత్తిళ్లతో తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత సాహసోపేతమని తోటి అధికారులు అంతర్గత చర్చల్లో చెప్పుకుంటున్నారు. కేబీసీ లాగే పీబీసీ.. అంతా మతలబు! గతంలో కుప్పం ఉపకాలువ కాంక్రీట్ లైనింగ్ పనుల విషయంలో ఉన్నతాధికారులు తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతోనే ఇప్పుడు పీబీసీ పనుల అప్పగింత వ్యవహారాన్ని ఇంజనీర్లు పోల్చుతున్నారు. డివిజన్–12 పరిధిలోకి వచ్చే కేబీసీలో కాంక్రీట్ లైనింగ్ పనులు చేసేందుకు ఈఈ, డీఈఈలు ఉన్నప్పటికీ, అందరినీ పక్కనపెట్టి కేవలం ఒక్క డీఈఈతోనే పనులన్నీ చేయించారు. 123 కిలోమీటర్ల కాలువ పని పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ అంతా ఒక్కరికే అప్పగించారు. ఇదే తరహాలో ఇప్పుడు పీబీసీలోనూ సీనియర్లను పక్కనబెట్టి జూనియర్కు బాధ్యతలు ఇవ్వడం వెనుక పెద్ద ‘మతలబు’ ఉందని ప్రాజెక్టు వర్గాలు గుసగుసలాడుతున్నాయి.ఎస్ఈకి లేఖాస్త్రం ముందస్తు స్కెచ్.. ‘పనిలేని’ బాధ్యతలు! డీఈఈలు రవి, సెల్వరాజ్, రమణారావులను పీబీసీ పనుల నుంచి తప్పిస్తే తర్వాత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని ఉన్నతాధికారులు ముందే పసిగట్టినట్లున్నారు. అందుకే కొంత ముందస్తు జాగ్రత్తగా వీరికి ప్రాజెక్టులో అంతర్భాగమైన ‘నీవా ఉపకాలువ’ పనులను అప్పగించారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. నీవా ఉపకాలువలో పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు ఇప్పటికీ ప్రతిపాదనలుగానే మిగిలిపోయాయి. ఆ పనులను ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేస్తుందో, క్షేత్రస్థాయిలో ఎప్పుడు ప్రారంభం అవుతాయో ఎవరికీ తెలియదు. ఇలాంటి ‘పనిలేని’ బాధ్యతలను సీనియర్లకు అప్పగించారంటే ఉన్నతాధికారుల దూరదృష్టి (రాజకీయ వ్యూహం) ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ నిధులు మంజూరయ్యే వరకు ఈ ముందస్తుగా బలైన సీనియర్లు ఎదురుచూడక తప్పదు. పాపం.. బలిపశువులు! డివిజన్–12కు చెందిన డీఈఈలను పీబీసీలో అప్పగించిన పనుల నుంచి తొలగించడంతో వారు పూర్తిగా బలిపశువులయ్యారు. ఒక్కో డీఈఈకి 15 ఏళ్లకు పైబడిన అనుభవం ఉన్నా, ఇప్పుడా అనుభవం ఏడాది సీనియారిటీ లేని జూనియర్ డీఈఈ ముందు అభాసుపాలైంది. వీరికి ప్రస్తుతం అటు కుప్పం కాంక్రీట్ లైనింగ్ పనుల్లోనూ బాధ్యతలు లేవు, ఇటు పుంగనూరు బాధ్యతల నుంచీ తప్పించారు. దీంతో ‘రెంటికి చెడ్డ రేవడి’లా మారి వీరికి ఎలాంటి పనిలేక కార్యాలయాల్లో ఖాళీగా కూర్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మా తప్పేమిటి?’ నిలదీసిన సీనియర్ డీఈఈలు హంద్రీనీవా పుంగనూరు ఉపకాలువ బాధ్యతల నుంచి అన్యాయంగా తొలగించబడిన ముగ్గురు సీనియర్ డీఈఈలు రవి, సెల్వరాజ్, రమణారావులు ఎస్ఈ విఠల్ ప్రసాద్కు రాసిన ఫిర్యాదు లేఖ ఇరిగేషన్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఉన్నతాధికారుల ఏకపక్ష తీరును ప్రశ్నిస్తూ, తాము చేసిన తప్పేమిటని నిలదీస్తూ వారు సంధించిన ప్రశ్నలు ఇవీ.. తీవ్ర వివక్ష : కదిరి డివిజన్–9కి 50 కి.మీ పరిధి ఇస్తే, 25 ఏళ్లకు పైగా సర్వీస్, 15 ఏళ్ల డీఈఈ అనుభవం ఉన్న మాకు మాత్రం 15 కి.మీ లోపే కేటాయించారు. కనీస అనుభవం లేని జూనియర్లకు 131.200 కి.మీ ఉన్న కుప్పం బ్రాంచ్ కెనాల్ (కేబీసీ) బాధ్యతలు అప్పగించారు. క్లీన్ రికార్డు : ఇన్వెస్టిగేషన్, ఎగ్జిక్యూషన్, ఓ అండ్ ఎం, డిజైన్లు, టన్నెల్ పనుల్లో క్లీన్ రికార్డుతో పనిచేశాం. ఎస్ఈ ఆదేశాల మేరకు పీబీసీలో సైట్ సర్వేలు, ఎస్టిమేట్లు పూర్తి చేసి ప్రభుత్వం నుంచి ప్రశంసా పత్రాలు అందుకున్నా మమ్మల్ని పక్కన పెట్టారు. జూనియర్కు ఐదు సబ్ డివిజన్లు: ఇటీవలే ప్రమోట్ అయి, ఏడాది సర్వీస్ కూడా లేని జూనియర్ డీఈఈకి ఇప్పటికే ఉన్న 2 సబ్ డివిజన్లతో పాటు, మమ్మల్ని తప్పించిన పీబీసీలోని మరో 3 సబ్ డివిజన్లను కలిపి మొత్తం 5 సబ్ డివిజన్ల బాధ్యతలు కట్టబెట్టారు. ఇది ఈఈ పరిధి కంటే ఎక్కువ. ‘పనిలేని’ చోటికి బదిలీ: మమ్మల్ని పీబీసీ నుంచి తప్పించి, ఇంకా కనీసం పరిపాలనా అనుమతులు కూడా రాని నీవా బ్రాంచ్ కెనాల్ బ్యాలెన్స్ పనులకు కేటాయించి ఉద్దేశపూర్వకంగా ఖాళీగా ఉంచారు. స్పందన శూన్యం : తమకు జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకుని త్వరగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అయితే, ఈ లేఖ అంది రోజులు గడుస్తున్నా ఉన్నతాధికారి నుంచి ఎలాంటి సమాధానం కానీ, ప్రత్యుత్తరం కానీ లేకపోవడంతో సీనియర్ డీఈఈల ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. -
హార్సిలీహిల్స్ అభివృద్ధికి చంద్ర గ్రహణం
సాక్షి, మదనపల్లె : రాష్ట్రంలో ఏకై క వేసవి విడిది కేంద్రం బి.కొత్తకోట మండలంలోని హార్సిలీ హిల్స్. దీని అభివృద్ధి కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో నిధులు మంజూరు చేసింది. టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్కు పనులు అప్పగించింది. మొదట్లో వేగంగా ప్రారంభమైన పనులు..తర్వాత కూటమి అధికారంలోకి రావడంతో మందగించాయి. దీనివల్ల పర్యాటకశాఖ భారీగా ఆదాయం నష్టపోతోంది. చంద్ర బాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. రూ.9.13 కోట్లతో పనులు హార్సిలీహిల్స్ అభివృద్ధి, అతిథి గృహాల ఆధునికీకరణపై గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది. దీంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ రూ.9.13 కోట్ల నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న బి బ్లాక్, ఎన్జీవో బ్లాక్, యాత్రీ నివాస్, కాటేజీల ఆధునికీకరణతోపాటు కొత్తగా టూరిజం రెస్టారెంట్ నిర్మాణం కోసం ఈ నిధులు ఇచ్చారు. హైదరాబాద్కు చెందిన ఆర్.గంగయ్య అండ్ కో సంస్థ కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నాడు. ఈ పనులను 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్లోపు 9 నెలల్లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకుంది. వైల్డ్ విండ్స్ భవనంలోని 8, విండ్ విస్టిల్ భవనంలోని 6, విండ్ఫాల్ భవనంలోని 4 అతిథి గృహలను కాంట్రాక్టర్కు అప్పగించింది. ఖర్చు చేసింది రూ.కోటే రూ.9.13 కోట్ల నిధులను ఖర్చు చేయాల్సి ఉండగా కాంట్రాక్టు సంస్థ కేవలం రూ.కోటి విలువైన పనులు మాత్రమే చేసింది. విండ్ఫాల్, యాత్రీనివాస్కు చెందిన అతిథి గృహాలను మాత్రమే ఆధునికీకరించి మిగిలిన వాటిని వదిలేశారు. రూ.8.13 కోట్ల నిధులను ఖర్చు చేయలేదు. ఈ పరిస్థితుల్లో నిధులు నిష్ఫలమయ్యే పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పర్యాటకశాఖకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఆ మేరకు నిధులు కూడా ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఈ నిధులను సద్వినియోగం చేసి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధి ఏ మాత్రం చూపలేదు. 9నెలల్లో రూ.55 లక్షల నష్టం 2024 ఏప్రిల్ నుంచి 18 అతిథి గృహాల ఆధునికీకరణ కోసం కాంట్రాక్టర్కు అప్పగించడంతో అవి పర్యాటకులకు అందుబాటులో లేవు. దీంతో ఈ గదులనుంచి టూరిజంకు తొమ్మిది నెలల్లో రూ.55 లక్షల నష్టం వాటిల్లింది. వీటి పనులు పూర్తి చేసి అప్పగించాల్సిన కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం వహించింది. 2024 డిసెంబర్లో పనులు పూర్తి చేసి అప్పగించలేదు. నెలల తరబడి జాప్యం జరిగింది. 2025లో కూడా కొంతకాలం అతిథిగృహాల కేటాయింపు జరగలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.9.13 కోట్లతో ఆధునికీకరణ రెస్టారెంట్ భవనం మంజూరు కూటమిప్రభుత్వం వచ్చాక పనులపై కాంట్రాక్టర్ నిర్లక్ష్యం రూ.కోటి పనులు చేసి వదిలేశారు రూ.8.13 కోట్ల పనులు ప్రశ్నార్థకం -
పందుల దొంగల ముఠా అరెస్ట్
● రూ.10 లక్షల నగదు, వాహనాలు స్వాధీనం పులివెందుల రూరల్ : వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలోని పార్నపల్లె రోడ్డు కోతి సమాధి వద్ద పందులు, గొర్రెల దొంగల ముఠాను పులివెందుల పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం అర్బన్ పోలీస్స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో సీఐ శ్రీరామ్ వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలో.. పందులు, గొర్రెల దొంగల ముఠాను అరెస్టు చేసి వారి నుంచి రూ.10 లక్షల నగదు, బుల్లెట్, బొలెరో వాహనాలతో పాటు పందులు, గొర్రెలను స్వాధీనం చేసుకున్నామన్నారు. దొంగల ముఠాను శనివారం పార్నపల్లె రోడ్డులోని కోతి సమాధి వద్ద అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశామన్నారు. నిందితులలో అనంతపురం జిల్లాకు చెందిన ఎరుకుల శ్రీరామ్, భాస్కర్, చంద్రశేఖర్, చిరంజీవి, రాజు, భరత్కుమార్ ఉన్నట్లు తెలిపారు. ద్విచక్రవాహనం చోరీ కేసులో శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలానికి చెందిన ఇర్ఫాన్ అను కూబాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బోడా శ్రీను, విజయ్ పరారీలో ఉన్నారన్నారు. వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. సమావేశంలో ఎస్ఐ తిమోతి, ఏఎస్ఐలు సిద్దార్థ, వర్మ, పోలీసులు పాల్గొన్నారు. -
యువకుడి దారుణ హత్య
మైదుకూరు : వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులోని ఇందిరమ్మ కాలనీలో ఆదివారం సంపంగి నాగేంద్ర(37) అలియాస్ నాగేంద్రబాబు అలియాస్ పెద్ద షకీలా అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మైదుకూరు అర్బన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఇందిరమ్మ కాలనీకి చెందిన నాగేంద్ర ఆటో డ్రైవర్గా, బేల్దారిగా పని చేస్తుంటాడు. ఆయనకు ఖాజీపేట మండలం నాగసానిపల్లెకు చెందిన జ్యోతి అనే యువతితో వివాహం అయింది. వీరికి ఆరేళ్ల నయనిక అనే కుమార్తె ఉంది. రోజూ మద్యం తాగుతుండటంతో జ్యోతి నాగేంద్రతో గొడవపడి రెండు నెలల కిందట పుట్టింటికి వెళ్లింది. మద్యం తాగాక నాగేంద్ర రోజూ కాలనీలోని గుడి ఆవరణలో ఉన్న అరుగుపై పడుకునేవాడు. కాలనీకే చెందిన గాలి సుదర్శన్రెడ్డి అనే యువకుడితో కలిసి తిరిగేవాడు. సుదర్శన్రెడ్డి తల్లి గురించి నాగేంద్ర చెడుగా ప్రచారం చేసేవాడు. తన తల్లిపై దుష్ప్రచారం మానుకోకపోతే నాగేంద్రను ఎప్పుడైనా చంపుతానంటూ సుదర్శన్రెడ్డి చెప్పేవాడు. ఆ ప్రకారమే శనివారం రాత్రి గుడి ఆవరణలోని అరుగుపై నిద్రపోతున్న నాగేంద్రపై ఆదివారం తెల్లవారుజామున సుదర్శన్రెడ్డి మచ్చుకత్తితో దాడి చేసి ముఖంపై పలుమార్లు నరికాడు. దాంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన నాగేంద్ర తమ్ముడు నాగేంద్ర ప్రసాద్ అలియాస్ చిన్న షకీలా.. సుదర్శన్రెడ్డి తన అన్నను నరుకుతున్నాడని చూసి గట్టిగా కేకలు వేసి వెంబడించగా అతను పారిపోయాడు. నాగేంద్ర ప్రసాద్ ఫిర్యాదు మేరకు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి కేసు నమోదు చేసి సుదర్శన్రెడ్డి కోసం గాలిస్తున్నారు. -
మామిడిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
పీలేరు రూరల్ : మామిడికి కనీస గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఎండపల్లె శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మామిడి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలన్నారు. మామిడి రైతులు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. మామిడి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల నుంచి 4.5 లక్షల హెక్టార్లలో మామిడి సాగు ఉందన్నారు. ప్రతి ఏటా 45 నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉత్పత్తి అవుతోందన్నారు. మామిడి గుజ్జుకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని తెలిపారు. అయినా రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడం బాధాకరమని చెప్పారు. ఇప్పటికై నా ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. -
మరమ్మతుకు నోచుకోని తాగునీటి బోరు
రామసముద్రం : రామసముద్రం మండలం ఊలపాడు పంచాయతీ ఏతూరుపల్లి గ్రామంలో గత 20 రోజులుగా తాగునీటి సమస్యతో గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. తాగునీటి బోరుకు ఉన్న కేబుల్ వైరును గుర్తుతెలియని దుండగులు చోరీకి చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పంచాయతీ అధికారులు ఈ సమస్యను పట్టించుకున్న దాఖలాలు లేవని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా గ్రామస్తులు పనులు వదులుకుని విద్యుత్ సరఫరా వేళల్లో తాగునీటి కోసం రైతుల బోర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. వేసవి కాలంలో ఇన్ని రోజులు సమస్యతో అవస్థలు పడుతున్నా అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి బోరును మరమ్మతు చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
చెరువులో పడి వ్యక్తి మృతి
పీలేరురూరల్ : స్థానిక అయ్యపునాయుని చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం వెలుగుచూసింది. వివరాలిలావున్నాయి. తిరుపతి జిల్లా ఎర్రావారిపాళెం మండలం బోడేవాండ్లపల్లె పంచాయతీ వంకిరెడ్డిగారిపల్లెకు చెందిన శివరామిరెడ్డి (65) శుక్రవారం పీలేరులో బంధువుల ఇంటికి వచ్చి ఆచూకీ కనిపించలేదు.కుటుంబ సభ్యులు యర్రావారిపాళెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే శనివారం స్థానిక అయ్యపునాయునిచెరువులో ఆయన మృతదేహం లభ్యమైంది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి
కలికిరి : రైతులు రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి జి.శివనారాయణ అన్నారు. వ్యవసాయ శాఖ పొలం సంరక్షణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మర్రికుంటపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులనుద్దేశించి మాట్లాడుతూ పచ్చిరొట్ట, జీవన ఎరువులు, వర్మీ కంపోస్టు ఎరువులు వినియోగిస్తే రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో చిరుధాన్యాలు సాగుచేయాలని సూచించారు. డీఆర్సీ ఏఓ రామక్రిష్ణ, ఏఓ హేమలత, ఆత్మ బీటీఎం అమృత్కుమార్రెడ్డి, ఏఈఓ ఇంద్ర, కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్, ఏపీసీఎన్ఎఫ్, ఆర్ఎస్కే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
చిరుత సంచారం !
పీలేరురూరల్ : మండలంలోని రేగళ్లు, బాలంవారిపల్లె పంచాయతీల పరిధిలో శనివారం చిరుత సంచారం కలకలం రేపింది. మండలంలోని బాలంవారిపల్లె పంచాయతీ మొరవపల్లె వద్ద నాయునిచెరువు సఫ్లైచానల్ ఉపాధి పనులు చేస్తుండగా చిరుత పులిని చూసినట్లు ఓ కూలీ అందరికీ సమాచారం ఇచ్చాడు. దీంతో ఉలిక్కిపడిన గ్రామస్తులు అటవీశాఖ, రెవెన్యూ అధికారులకు తెలియచేశారు. దీంతో కలికిరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గిరి, వీఆర్వో నారాయణ, గ్రామస్తులు పలు చోట్ల గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత జాడ ఎక్కడా కనబడలేదని ఎఫ్బీవో తెలిపారు. నక్కను గానీ, హైనాను గానీ చూసి చిరుతగా భావించి ఉండవచ్చునని చెప్పారు. అయినా గ్రామస్తులు రెండుమూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలుపీలేరు : వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని జిల్లా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ టి.అశోక్ ప్రతాప్రావు అన్నారు. శనివారం స్థానిక కడప రోడ్డు మార్గంలోని ఫ్లై ఓవ ర్ వద్ద వాహనాల తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలకు డార్జిలింగ్ లైట్ తప్పనిసరిగా అమర్చాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిపికేట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ తదితర పత్రాలు విధిగా తమ వద్ద కలిగి ఉండాలన్నా రు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. పీలేరు ఎంవీఐ విజయకుమారి, సిబ్బంది పాల్గొన్నారు. నేడు సైకిల్ ర్యాలీమదనపల్లె సిటీ : ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మదనపల్లెలో సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు డీఎస్డీఓ చంద్రశేఖర్ తెలిపారు. స్థానిక బీటీ కాలేజీ మైదానంలో ఉదయం 7 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలోని విద్యార్థులు, కోచ్లు, పీడీలు పాల్గొనాలని కోరారు. 12 నుంచి ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు మదనపల్లె సిటీ: ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఈనెల 12 నుంచి ప్రా రంభమవుతాయని మదనపల్లె ఓపెన్స్కూల్ అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ మహహ్మద్ ఖాన్ తెలిపారు.ఆన్లైన్లో అడ్మిషన్లకు జూలై 30 వరకు గడువుందని సూచించారు. ఈ అవకాశాన్ని వి ద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
అసైన్డ్ స్థలాలకు రిజిస్ట్రేషన్లు
సాక్షి, మదనపల్లె : పదేళ్లు అనుభవంలో ఉన్నన ప్రభుత్వ అసైన్డ్ పట్టా ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్టు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ మహాలక్ష్మీ పట్నాయక్ తెలిపారు. శనివారం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీఓ నెంబర్ 297 ద్వారా గ్రామ కంఠం భూములకు, జీఓ నెంబర్ 306 ద్వారా పదేళ్ల అనుభవం ఉన్న అసైన్డ్ పట్టాలకు నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్ చేస్తున్నామని పేర్కొన్నారు. స్టాంపుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నాసిక్ నుంచి స్టాంప్స్ రావాల్సి ఉందని, అవసరమైన మేర స్టాక్ను తెప్పించుకోవడానికి చర్యలు తీసుకున్నామని వివరించారు. ఓటీపీ విధానంతో ప్రజలకు పారదర్శక సేవలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ గురుస్వామి ఇక్కడి రిజిస్ట్రేషన్లు, ఆదాయ వివరాలను ఆమెకు తెలియజేశారు.డీఐజీ మహాలక్ష్మి పట్నాయక్ -
రైలుకింద పడి యువకుడు..
పీలేరురూరల్ : రైలుకింద పడి మధ్యప్రదేశ్ యువకుడు మృతి చెందిన సంఘటన పీలేరు పట్టణ శివారు ప్రాంతం చిత్తూరు రోడ్డు మార్గంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రట్లం జిల్లా రింగ్నోడ్కు చెందిన భరత్కుమార్ (35) పీలేరు పట్టణంలో గత ఐదు సంవత్సరాలుగా అక్కడక్కడ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి చిత్తూరు రోడ్డు మార్గంలో మోడల్ కాలనీ సమీపంలో నాగర్కోయిల్ నుంచి ముంబై వెళుతున్న రైలు కింద పడి మృతి చెందాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మధ్యప్రదేశ్కు పంపించారు. -
ఎరువు కోసం ఏకరువు
గాలివీడు : -Q-È‹œ ïÜf-¯Œl {´ëÆý‡…¿ê°MìS Ð]l¬…§ól hÌêÏÌZ° OÆð‡™èl-¯]l²-ÌS¯]l$ GÆý‡$-Ð]l#ÌS «§ýlÆý‡Ë$ ¿ýæÄ¶æ$ò³-yýl$-™èl$-¯é²Æ‡$$. JMýS-OÐðlç³# Ðé™é-Ð]l-Æý‡×æ Ð]l*Æý‡$µ-ÌS™ø ç³…rË$ çÜÇV> ç³…yýl-MýS-´ùÐ]l-yýl…, Ð]l$ÆøOÐðlç³# ç³…yìl¯]l ç³…rMýS$ {糿¶æ$™èlÓ… Wr$t»êr$ «§ýlÆý‡ MýSÍ-µ…-^èl-MýS-´ù-Ð]lyýl…™ø Cç³µ-sìæMóS Ð]lÅÐ]l-ÝëĶæ$… ¿êÆý‡…V> Ð]l*Ç…-¨. D {MýSÐ]l$…ÌZ QÈ‹œ ò³r$t-º-yýl$ÌS MøçÜ… G§ýl$-Æý‡$-^èl*çÜ$¢¯]l² çÜÐ]l$-Ķæ*°MìS M>…ò³ÏMŠSÞ GÆý‡$-Ð]l#ÌS «§ýlÆý‡Ë$ ºÝë¢Oò³ ₹200 ¯]l$…_ ₹450 Ð]lÆý‡MýS$ ò³Æý‡-VýS-yýl…™ø MýSÆý‡Û-MýS$Ë$ Ð]l$Ç…™èl MýS$…W´ù-™èl$-¯é²Æý‡$. ïÜf-¯Œl {´ëÆý‡…-¿ýæ-Ð]l$-Ð]l#™èl$¯é² ¯ólsìæMîS Ñ™èl¢-¯éË$, GÆý‡$-Ð]l#Ë$ OÆð‡™èl$-ÌSMýS$ A…§ýl$-»ê-r$ÌZMìS Æ>Ð]l-yýlÐól$ Ìôæ§ýl$. ©…™ø D Hyé¨ QÈ‹œ ÝëVýS$ {ç³Ô>²-Æý‡¦-MýS…V> Ð]l*Ç…-¨. లక్షలాది ఎకరాల్లో సాగు.. నేటికీ దొరకని విత్తనాలు! జిల్లాలో లక్షలాదిమంది రైతులు లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. రుతుపవనాల రాకతో వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు దుక్కులు దున్ని భూములను సిద్ధం చేసుకుంటున్నారు. ఖరీఫ్లో ముఖ్యంగా వేరుశనగ, కంది, ఆముదంతో పాటు జొన్న, వరి, అలసంద, ఉలవ తదితర పంటలు సాగు కానున్నాయి. భూములు సిద్ధమైనా ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలు, సరిపడా ఎరువులు ముందస్తుగా సొసైటీలు, రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. మద్దతు ధర కరువు.. చంద్రబాబు ప్రభుత్వంపై మండిపాటు గత రబీ సీజన్ లో నీటి వసతి ఉండి కష్టపడి పంటలు పండించినా.. వాటికి కనీస మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు పెరగడం, గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని, ఇప్పు డు ఎరువుల ధరలు కూడా పెంచితే తాము వ్యవసాయాన్ని వదిలేయాల్సి వస్తుందని గాలివీడు పరివాహక ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలి ఇప్పటికై నా ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి జిల్లావ్యాప్తంగా అవసరమైన వేరుశనగ, ఇతర విత్తనాలను, ఎరువులను సబ్సిడీపై తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్లాక్ మార్కెట్ కాకుండా పాత ధరలకే ఎరువులు లభించేలా కఠిన నిఘా పెట్టాలని కోరుతున్నారు. ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకం! జిల్లాలో విత్తనాలు, ఎరువుల తీవ్ర కొరత సాగు పనులకు ముందే అమాంతం పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఆర్బీకేలను నిర్వీర్యం చేశారని, గిట్టుబాటు ధర కల్పించలేదని అన్నదాతల ఆగ్రహం -
టమాట కిలో రూ.37
సాక్షి, మదనపల్లె : మదనపల్లె మార్కెట్లో టమాట ధరలు పెరుగుతున్నాయి. శనివారం మార్కెట్లో కిలో అత్యధిక ధర రూ.37 పలికింది. ఈ సీజన్లో ఇప్పటిదాకా పలికిన అత్యధిక ధర ఇదే కావడం విశేషం. శుక్రవారం కిలో రూ.34పలికిన ధర శనివారం ఏకంగా కిలోకు మూడు రూపాయలు పెరిగింది. 783 టన్నుల టమాట మార్కెట్కు వచ్చింది. పెరుగుతున్న ధరలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు. ఇంటర్ తరగతులు ప్రారంభంమదనపల్లె సిటీ : జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కాలేజీకి విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. మరో వైపు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుండటంతో తరగతులు పెద్దగా నిర్వహించలేదు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో మొదటి రోజులు తరగతులు ప్రారంభించారు. ఆహార భద్రతపై అవగాహన సదస్సుపుంగనూరు : జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం స్థానిక లీనార్డ్ పాఠశాలలో ఆహార భద్రతపై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఫుడ్సేఫ్టీ అధికారి గురులక్ష్మీ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సుగుణ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదివారం నిర్వహించే ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పేర్కొన్నారు. అలాగే నిత్యం తినే ఆహారంలో ఆకుకూరలను ఎక్కువగా తినాల ని, చిరుతిండ్లు మానేయాలని సూచించారు. ఖతర్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం మదనపల్లె సిటీ : ఖతర్లో హోమ్కేర్ నర్సుల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి దాసరి నాగార్జున తెలిపారు. బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం నర్సింగ్ చదివి, 21 నుంచి 40 ఏళ్లలోపు పురుషులు, సీ్త్రలు అర్హులన్నారు. రోజుకు 12 గంటలు, వారానికి ఆరు రోజులు పని చేయాల్సి ఉంటుందన్నారు. ఒప్పంద కాలం రెండేళ్లు ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు ఈనెల 8లోపు నైపుణ్యం యాప్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. -
గాలి మాటలతో సరి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాడు మహానాడు వేదికగా ‘కడప ఉక్కు–రాయలసీమ హక్కు’ అంటూ రంగురంగుల గ్రాఫిక్స్ చూపించారు. నేడు బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ‘రైజింగ్ రాయలసీమ’ అంటూ నినాదాలు ఇస్తున్నారు. విభజన చట్టంలో ఉన్న హక్కులనే సాధించలేని వీరు సీమను రైజింగ్ చేస్తామనడం హాస్యాస్పదం. గత 30 ఏళ్లుగా తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలో ఉన్న బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి నేటికీ పంట కాలువలు లేవు. జీఎన్ఎస్ఎస్ (గాలేరు నగరి) ప్రాజెక్టు పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉంది. పాలకులవన్నీ గాలిమాటలే. – చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీపీఎం -
చెట్టుపై నుంచి పడి వ్యక్తికి గాయాలు
పుంగనూరు: మండలంలోని ఆరంట్లపల్లెకి చెందిన శ్రీరాములు (50) తన పొలంలో నేరేడు చెట్టు ఎక్కి కాయలు కోస్తూ ప్రమాదవశాత్తు కిందపడిన సంఘటన శనివారం జరిగింది. ఈ ప్రమాదంలో శ్రీరాములు తలకు బలమైన గాయమైంది. కుటుంబ సభ్యులు అతన్ని మదనపల్లె ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. బొలెరో ఢీకొని.. రామసముద్రం: రామసముద్రం మండలం కాప్పల్లి పంచాయతీ బ్రాహ్మణవారిపల్లి బస్టాప్ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం కదిరేపల్లికి చెందిన శంకరప్ప (42) గాయపడ్డాడరు. ఇతను రామసముద్రం నుంచి మదనపల్లె మార్కెట్కు బైక్లో అల్లనేరేడు కాయలు తీసుకెళుతుండగా వెనుక నుంచి బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శంకరప్ప ఎడమ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని రామసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. వైఎస్సార్సీపీ నాయకుడి బైక్ దహనంరొంపిచెర్ల: వైఎస్సార్సీపీ నాయకుడి ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు కాల్సి వేసినట్లు బాధితుడు మోహన్ రెడ్డి శనివారం తెలిపారు. బాధితుని కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజక వర్గంలోని రొంపిచెర్ల మండలం చల్లావారిపల్లె గ్రామ పంచాయతీ గెర్లపల్లెకు చెందిన చల్లావారిపల్లె గ్రామ పంచాయతీ వైఎస్సార్సీపీ కన్వీనర్ మోహన్ రెడ్డి తన (ఏపీ 03 ఏసీ 8615) ద్విచక్ర వాహనాన్ని ఈనెల 4వ తేదీ రాత్రి వ్యవసాయ పొలం వద్ద పెట్టాడు. రాత్రి గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి కాల్చి వేశారు. ఉదయం వెళ్లి చూడగా ద్విచక్ర వాహనం పూర్తిగా కాలి పోయిందన్నారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వారు కాల్చి వేశారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయమై రొంపిచెర్ల పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ ఆత్మహత్యాయత్నంమదనపల్లె టౌన్: కుటుంబ సమస్యలతో మనస్తాపం చెందిన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శనివారం చోటుచేసుకున్న ఘటనపై బాదితురాలి కుటుంబీకుల కథనం.. కురబలకోట మండలం, అంగళ్లుకు చెందిన రమణమ్మ (45) కూలి పనులు చేస్తుండేది. కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది, ఇంట్లో ఉన్న విషం తాగింది. గమనించిన స్థానికులు బాధితురాలిని 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. -
ఆకలికేకలపై కదిలిన యంత్రాంగం
రాయచోటి టౌన్ : రాయచోటి టౌన్ : శిక్షణ తరగతులలో పాల్గొనేందుకు వచ్చిన ఉపాధ్యాయులకు కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలం అయ్యా రు. తాగేందుకు మంచినీరు లేదు, మధ్యాహ్నం కడుపునకు సరిపడా భోజనం పెట్టలేదు, ఈ విషయంపై ఈనెల 6న ‘ఉపాధ్యాయుల ఆకలికేకలు’ శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై అధికారులు స్పందించారు. ఉపాధ్యాయులకు అందిస్తున్న భోజన వసతులపై జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం దగ్గరుండి పర్యవేక్షించారు. నిర్వాహకులు ఉపాధ్యాయులకు భోజనం వడ్డించారు. ఉపాధ్యాయులు తిన్నాక చివర్లో డీఈఓ తిన్నారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మండే ఎండల తాకిడి నుంచి రక్షించేందుకు షామియానాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే రద్దీని తగ్గించేందుకు ప్రత్యేకంగా మహిళలకు రెండు,పురుషులకు రెండు వేర్వేరుగా భోజనం కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ విషయం గురించి జిల్లావిద్యాశాఖాధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాయచోటి డివిజన్ పరిధిలోని ఉపాధ్యాయులు ఈ ట్రైనింగ్ సెంటర్లో పాల్గొనాల్సి ఉందని, అయితే సుండుపల్లె, వీరబల్లె మండలాలకు చెందిన ఉపాధ్యాయులు రాజంపేటకు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉండటంతో వారు కూడా వచ్చారన్నారు. దీంతో భోజన సౌకర్యం కల్పించడంలో ఇబ్బంది కలిగిందని, ఇకపై ఎలాంటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఉపాధ్యాయులకు భోజనం వడ్డించిన నిర్వాహకులు మహిళలకు రెండు, పురుషులకు రెండు కౌంటర్లు ఏర్పాటు -
పదవులు–పంపకాలు కోసమే
½gôæ-ï³MìS {´ë…¡Ä¶æ$ AÀÐ]l–-¨®Oò³ _™èl¢-Ô¶æ$¨® Ìôæ§ýl$. ™èlÐ]l$ Æ>f-MîSĶæ$ ç³§ýlÐ]l#Ë$, ç³…ç³-M>ÌS MøçÜÐól$ C糚yýl$ Mö™èl¢ ¯érM>Ë$ Byýl$-™èl$-¯é²Æý‡$. Ñ¿ýæ-f¯]l ^èlrt… {ç³M>Æý‡… Ððl¯]l$-MýS-º-yìl¯]l hÌêÏÌS AÀ-Ð]l–-¨®MìS CÐéÓ-ÍÞ¯]l MýS±çÜ ₹50 MørÏ MóS…{§ýl °«§ýl$Ë$ HÐ]l$Ķæ*ÅÆ‡$$? MýSyýl-ç³ÌZ EMýS$P MýSÆ>Ã-V>Æý‡… HÆ>µ-r$Oò³ ^èlrt… ^ólíÜ.. C糚yýl$ Ýë«§ýlÅ… M>§ýl…r* ÐéÆó‡ ^ðlç³#¢-¯é²Æý‡$. D {´ë…™é-°MìS G…™ø MîSÌS-MýS-OÐðl$¯]l MýSyýlç³&»ñæ…-VýSâ¶æ*Æý‡$ OÆð‡ÌôæÓ-OÌñ毌S VýS$Ç…_ MóS…{§ýl… ç³NÇ¢V> Ð]l$Ça-´ù-Ƈ$$…¨. A…™èlÆŠæ Æ>[ÚëtÌS ±sìæ ÑÐé-§éÌSMýS$ Ð]lÊÌS-M>-Æý‡-MýS$Ë$ ½gôæï³ ¯ól™èlÌôæ. Kr$Ï&-ïÜr$Ï Ñ$¯]là ÒÇMìS ïÜÐ]l$ {ç³Äñæ*f-¯é-ÌS™ø ç³°-Ìôæ§ýl$. – జి.ఈశ్వరయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, సీపీఐ -
విద్యావ్యవస్థను నాశనం చేసిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు
మదనపల్లె సిటీ: ప్రభుత్వ విద్యను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని ఏఐఎస్ఎ్ఫ్ రాష్ట్ర అఽధ్యక్షులు జీ.వలరాజు మండిపడ్డారు. మదనపల్లెలో శనివారం ఏఐఎస్ఎఫ్ జిల్లా స్థాయి విద్యా,వైజ్ఞానిక రాజకీయ,సైద్ధాంతిక శిక్షణ తరగతులు జరిగాయి. ప్రైవేటు,కార్పోరేట్ విద్యా సంస్థలను అందలం ఎక్కించాలనే నీట్ ప్రవేశ పరీక్షను ఎన్టీఏ లాంటి ప్రైవేటు సంస్థకు ఇవ్వడం వల్ల మూడు సార్లు ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందన్నారు. దీని వల్ల ఎంతో మంది పేద,మధ్య తరగతి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. నీట్ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రం లీకుకు పూర్తిగా బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీల పరిస్థితి చాలా దయనీయంగా మారిందన్నారు. యూనివర్సిటీలకు నిధులు లేకపోవడంతో పాటు ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయడం లేదన్నారు. కార్యక్రమంలో సీసీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు రామానాయుడు, ఏఐఎస్ఎప్ నాయకులు ఎంవి రమణ, జనార్థన్, మహేష్, మాధవ్, కోటేశ్వరరావు,సాంబశివ, గంగారాణి తదితరులు పాల్గొన్నారు. -
పుంగనూరులో వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు
పుంగనూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గురువారం పుంగనూరులో ఆ పార్టీ శ్రేణులు చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా శాంతియుతంగా నిరసన తెలుపగా చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్పతో సహా పలువురిపై పుంగనూరు పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. వివరాలిలా.. రాష్ట్ర రీజనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పి.మిథున్రెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో గురువారం పార్టీ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, బాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్లను తగలబెట్టే కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారు. దీనిపై అధికార పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేసింది. హనీఫ్బాషా అనే వ్యక్తి వద్ద పోలీసులు స్టేట్మెంట్ తీసుకుని జాతీయ రహదారిపై ప్రజలకు ఇబ్బంది కలిగించడంతో పాటుప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని సాకుగా చూపుతూ 33 మందిపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఇందులో చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్పను ఏ–1గా చేర్చడంతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్చార్జ్ ఫకృద్దీన్ షరీఫ్, ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శి జయరామిరెడ్డి, జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ అమ్ము, మాజీ ఎంపీపీ నరసింహులు, పార్టీ పట్టణ, మండల కన్వినర్లు ఇర్ఫాన్, అమరనాథరెడ్డి, మైనార్టీ నాయకుడు మమ్ముతో పాటు మరో 22 మందిపై కేసు నమోదు చేశారు. దీనిపై మాజీ ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులతో బెదిరిస్తోందని, ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదన్నారు. తెలుగుదేశం మోసాలను ప్రజలకు వివరించి, తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం
మదనపల్లె టౌన్ : రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందిన విషాదకర ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ముదివేడు ఎస్ఐ మధురామ చంద్రుడు తెలిపిన వివరాల ప్రకారం.. పీటీఎం మండలం పిడింవారిపల్లికి చెందిన రెడ్డప్ప కుమారుడు కొండా ఉదయ్ కుమార్(20) తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం బైక్పై స్వగ్రామానికి వస్తుండగా, కురబలకోట మండలం కాండ్లమడుగు క్రాస్ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందా లేక బైక్ అదుపు తప్పి పడి చనిపోయాడా అనేది తెలియాల్సి ఉందని ఎస్ఐ పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని ఎస్ఐ తెలిపారు. యువకుడి మృతితో పిడింవారిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. పుంగనూరు : పుంగనూరు మండలంలోని సుగాలిలలిమెట్ట వద్ద జాతీయ రహదారిపై ఎదురెదురుగా వెళ్తున్న రెండు లారీలు ఢీకొన్న సంఘటన శుక్రవారం రాత్రి 11 గంటలకు జరిగింది. చైన్నె వైపు వెళ్తున్న ఒక లారీ.. అనంతపురం వైపు వెళ్తున్న మరో లారీ సుగాలిమిట్ట వద్దకు రాగానే ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా రెండు లారీల్లో మంటలు చెలరేగడంతో లారీలు దగ్ధమయ్యాయి. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో డ్రైవర్లకు, క్లీనర్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాగా ఈ ప్రమాదంలో రెండు లారీలు దగ్ధం కావడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
గతంలో ఇలాంటి పరిస్థితి లేదు
గతంలో ఇలాంటి శిక్షణలు చాలా జరిగాయి. ఉపాధ్యాయులకు భోజనాలు, టీ, టిఫిన్లు చాలా బాగా పెట్టేందుకు ప్రభుత్వాలు రూ.300 ఇస్తున్నాయి. ఈ డబ్బులతో నాణ్యమైనవి పెట్టొచ్చు. నిన్న సగం మందికి తక్కువ వచ్చిది. ఈ రోజు కూడా 150 మందికి వరకు తక్కువ వచ్చింది. బయటికి వెళ్లి భోజనం తినేందుకు కూడా అవకాశం లేదు. అయినా భోజనాలు పెట్టే కాంట్రాక్టర్కు నాలుగు, ఐదు జిల్లాలు కలిపి ఇవ్వడం వల్ల.. ఆయన మరొకరికి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడంతో ఇలా జరుగుతోంది. అంతే కాదు దీనిపై పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం మరో కారణం. – రెడ్డెప్పరెడ్డి, జిల్లా ప్రెసిడెంట్, వైఎస్సార్సీపీ టీచర్స్ ఫెడరేషన్ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఇలా జరుగుతోంది -
వాహనం సహా ఎర్రచందనం స్వాధీనం
పులిచెర్ల (కల్లూరు) : కల్లూరులో వాహనం సహా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కల్లూరు బీసీ కాలనీలో శుక్రవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. వారిని చూసిన కారు డ్రైవర్ కొంత దూరం వెళ్లి.. వాహనాన్ని వదిలి పారిపోయాడు. పోలీసులు పరిశీలించగా.. కారులో 12 ఎర్రచందనం దుంగలు ఉండటాన్ని గమనించారు. వాహనాన్ని కల్లూరు పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. అందులో 12 దుంగల బరువు 358 కేజీలుగా గుర్తించారు. వాటి విలువ రూ.16.46 లక్షలు, వాహనం విలువ రూ.4 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఆరుగురు యువకుల బైండోవర్సాక్షి, మదనపల్లె : బి.కొత్తకోటలో న్యూసెన్స్ సృష్టిస్తున్న ఆరుగురు యువకులను శుక్రవారం బైండోవర్ చేసినట్టు సీఐ కే.గోపాల్రెడ్డి తెలిపారు. పట్టణానికి చెందిన ఎన్.సుదర్శన్ (23), డి.కళ్యాణ్ (23), ఎం.గిరిష్కుమార్ (22), ఎస్.అల్లాబకష్ (19), ఎ.హర్షవర్దన్ (20), టి.గణేష్(20)లు న్యూసెన్స్ సృష్టిస్తూ స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారిని బైండోవర్ చేసి ఆర్ఎస్డిటి బాలాజీ ఎదుట హాజరు పరిచినట్టు తెలిపారు. వీరికి కౌన్సెలింగ్ ఇచ్చామని సీఐ తెలిపారు. -
హాస్టళ్లలో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి
కలకడ : జిల్లాలోని అన్ని బీసీ వెల్ఫేర్ హాస్టల్లలో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించే సమయానికి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిణి తేజశ్విని ఆదేశించారు. శుక్రవారం మండలంలోని కె.బాటవారిపల్లె పంచాయతీ బీసీ కాలనీ సమీపంలోని బీసీ హాస్టల్ను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో 38 బీసీ హాస్టల్లు ఉండగా కేవలం 26 కేంద్రాలకు మాత్రమే శాశ్వత భవన సదుపాయం ఉండగా, 12 ప్రైవేటు వ్యక్తుల గదులను అద్దెకు తీసుకుని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వాటిలో జూన్–12 నాటికి కనీస సౌకర్యాలు అయిన నీరు, నీడ, విశ్రాంతి గదులలో ఫ్యాన్లు, విద్యుత్ సౌకర్యం ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని చెప్పారు. ఎలాంటి ఫిర్యాదులు అందినా సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని బీసీ హాస్టల్ కాంపౌడ్ పరిధిలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ మనోజ్కుమార్, డిప్యూటి ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఓ సుజాత, సాంకేతిక సహాయకులు సురేంద్ర, నాగవేణి, హాస్టల్ వార్డెన్ సుబ్బరామయ్య, పంచాయతీ అభివృద్ధి అధికారిణి నందిని, ఉపాధి హామీ పథకం మేట్ ఓబులేశు, అమరనాథ్, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలికిరి : వైఎస్సార్సీపీ అధిష్టానం పిలుపు మేరకు కలికిరి పట్టణంలో శుక్రవారం ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించిన వైఎస్సార్సీపీ నాయకులపై పోలీసులు శనివారం అక్రమంగా కేసు నమోదు చేశారు. పబ్లిక్ న్యూసెన్స్, రవాణాకు అంతరాయం, తాము వద్దన్నా వినకుండా కార్యక్రమం చేపట్టారన్న అభియోగాలతో బీఎన్ఎస్ 223, 292, 192 ఆర్/డబ్ల్యూ 3(5) సెక్షన్ల కింద కానిస్టేబుల్ సుబ్బరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ అనీల్కుమార్ కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చింతల రమేష్కుమార్రెడ్డి, నాయకులు రత్నశేఖర్రెడ్డి, ఆర్.మధుసూదన్రెడ్డి, ఎస్టీడీ హరి, శామ్యూల్, నరేష్, హనీఫ్, ద్వారకనాథరెడ్డి, సహదేవ, గోపాల్, రాహుల్ చక్రవర్తిరెడ్డితోపాటు మరికొంత మందిపై కేసు నమోదు చేశారు. పాముకాటుతో వ్యక్తికి అస్వస్థతచౌడేపల్లె : పాము కాటుకు గురై వ్యక్తి అస్వస్థతకు గురైన ఘటన శుక్రవారం జరిగింది. మండల కేంద్రంలోని ప్రైవేటు బస్టాండులో సుబ్రమణ్యం చిల్లర దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయన కుమారుడు శబరీష్(39) విక్రయదారుకోసం దుకాణంలో సరుకులు తీసే క్రమంలో నాగుపాము కాటేసింది. పాము కాటును గుర్తించిన అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య కోసం పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా దుకాణంలోని నాగుపామును పట్టుకొని అటవీ ప్రాంతంలో వదలడానికి తీసుకెళ్లారు. -
పక్కాగా యోగాంధ్ర నిర్వహణ
సాక్షి, మదనపల్లె: యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించారు. వీసీలో ఆయన మాట్లాడుతూ జూన్ 7 నుంచి 20 వరకు థీమాటిక్ యోగా, టూరిస్ట్ యోగా, టెంపుల్ యోగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మున్సిపల్ ప్రాంతాల్లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. దీనిపై అవగాహన పెంపొందించేందుకు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ఆసనాలు, ప్రాణాయామం, సింక్రొనైజ్డ్ యోగా, క్విజ్, నినాదం, వ్యాసరచన పోటీలను నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో మదనపల్లె సబ్ కలెక్టర్, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లు, శాఖల అధికారులు పాల్గొన్నారు. పట్టణాభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి మదనపల్లె సిటీ: పలమనేరు–కుప్పం–మదనపల్లె పట్టణాభివృద్ది (పీకేఎంయూడీఏ) పరిధిలో చేపడుతున్న అభివృద్ది పనులు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్,పీకేఎంయూడీఏ వైస్ చైర్మన్ శివ్నారాయణశర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్ణణ ప్రణాళిక, ఇంజినీరింగ్శాఖల ప్రగతి, సమస్యల పరిష్కారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పీకేఎంయూడీఏ ద్వారా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద అభివృద్ది చేయడానికి ప్రతిపాదించిన స్థలాల్లో ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా లేఔట్ ప్లాన్లు రూపొందించాలన్నారు. పట్టణ ప్రణాళిక నిబంధనలకు విరుద్దంగా ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. -
విత్తన బంతుల తయారీకి శ్రీకారం
మదనపల్లె టౌన్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హరితాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో 20 లక్షల విత్తన బంతుల తయారీ కార్యక్రమానికి మదనపల్లెలో శ్రీకారం చుట్టినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓ ఎస్.ఎన్. అహ్మద్ తెలిపారు.శుక్రవారం మదనపల్లెలోని బసినికొండ నగర వనంలో విత్తన బంతుల తయారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విస్తృతంగా మొక్కల పెంపకం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సామాజిక వనవిభాగం డీఎఫ్ఓ శివకుమార్, ఎఫ్ఆర్ఓ జయప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. రామయ్య సన్నిధిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్యను శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కృపాసాగర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. రంగమండపంలో వారిని ఆలయ అర్చకులు సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. -
వ్యవసాయ మోటార్ల కేబుల్ వైర్ల చోరీ
వాల్మీకిపురం : మండలంలోని నగరిమడుగు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో దాదాపు 10 మంది రైతులకు సంబంధించిన వ్యవసాయ బోర్ల వద్ద ఉన్న కేబుల్ వైర్లను చోరీ చేసిన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. నగిరిమడుకు చెందిన రెడ్డెప్ప, శ్రీరాములు, జ్యోతి, నరసింహారెడ్డి, రెడ్డెప్ప, వెంకటరెడ్డి, రామాంజులు, నాగమ్మ, రామయ్య తదితర రైతుల వ్యవసాయ భూముల వద్ద 200 మీటర్లకు పైగా ఉన్న కేబుల్ వైర్లను గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు శుక్రవారం గుర్తించారు. అసలే వ్యవసాయంలో నష్టాలు చవిచూస్తుంటే మరో పక్క వైర్లను చోరీ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చొరవ చూపి కేబుల్ వైర్ల దొంగలను పట్టుకొని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. -
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్కు గాయాలు
రామసముద్రం : అదుపుతప్పి ఇసుక ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు గాయాలైన సంఘటన రామసముద్రం మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. రామసముద్రం మండలం ఎలవనెల్లూరు పంచాయతీ పైగడ్డ నుంచి బల్లసముద్రం వైపు మీదుగా ఇసుక లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి రహదారి పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి గాయపడిన డ్రైవర్ను బయటికి తీసి చికిత్స నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన డ్రైవర్ అనపల్లి కొత్తూరుకు చెందిన వ్యక్తిగా సమాచారం. -
● నాణ్యత కాదు ఆధిపత్యం కావాలి
● పనుల నుంచి ముగ్గురు డీఈఈలు తొలగింపు ● ఒక డీఈకి ఐదు డీఈల బాధ్యతలు ● పనులు ఒక డివిజన్వి.. అప్పగింత మరో డివిజన్కు ● మెకానికల్ అధికారులకు సివిల్ పనులు అప్పగింత సాక్షి, మదనపల్లె: ఏ ప్రభుత్వ శాఖలో అయినా ఎవరికి సంబంధించిన విధులను లేదా పనులను సంబంధిత అధికారులే చేపట్టాలి..బాధ్యత వహించాలి..అయితే హంద్రీనీవా ప్రాజెక్టు రెండో దశకు సంబంధించిన మదనపల్లె సర్కిల్–3లో ఇష్టారాజ్యం నెలకొంది. ఒక డివిజన్ పరిధికి చెందిన విధులను మరో డివిజన్కు ఇచ్చేస్తున్నారు. ఒక డివిజన్లోని పనుల్లో మరో డివిజన్ అధికారుల పెత్తనం నడుస్తోంది. ఏ డివిజన్లో ఎవరు చేయాల్సిన పనులను వారికి అప్పగించడం లేదు. అధికారికంగా దక్కాల్సినవి కేటాయించడం లేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా ముగ్గురు డీఈఈలకు అప్పగించిన పనులను లాగేశారు. వీటిని మరో డీఈకి ఇచ్చేశారు. అసలు పనితో సంబంధం లేని డివిజన్లకు పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం ఇక్కడి అధికారులకే సాధ్యమైంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. పని విభజనలో పక్షపాతం ప్రభుత్వం రూ.366 కోట్లతో పుంగనూరు ఉప కాలువకు కాంక్రీట్ లైనింగ్ పనులను గత ఏడాది చేపట్టింది. వీటిని పర్యవేక్షించి రికార్డు చేసేందుకు, విధుల నిర్వహణ కోసం కిలోమీటర్ల పరిధిలో డీఈలకు పర్యవేక్షణకు కిలోమీటర్ల అప్పగింతలోనే వివక్ష చోటుచేసుకుంది. కొందరికి కొంత ఇవ్వగా.. అయినవారికి అత్యధిక కిలోమీటర్లను కేటాయించడంతోనే ఇష్టారాజ్యానికి తెర లేచింది. ఇందులో డీఈ వెంకట ప్రతాప్కు 74 కిలోమీటర్ నుంచి 110 కిలోమీటర్ వరకు, తిరిగి 150 కిలోమీటర్ నుంచి 165 కిలోమీటర్ వరకు, డీఈ కృష్ణ కిషోర్ కు 110 కిలోమీటర్ నుంచి 142 కిలోమీటర్ వరకు, డీఈ రమణరావుకు 165 కిలోమీటర్ నుంచి 180 కిలోమీటర్ వరకు, డీఈ రవికి 180 కిలోమీటర్ నుంచి 195 కిలోమీటర్ వరకు, డీఈ సెల్వరాజ్ కు 195 కిలోమీటర్ నుంచి 207.800 కిలోమీటర్ పనులను అప్పగించారు. ఏడాదిగా ఈ పనులను ఈ డీఈలు బాధ్యతలను నిర్వర్తించారు. ఆ ముగ్గురిని తొలగిస్తూ... తాజాగా పుంగనూరు ఉపకాలువ పనుల విధులు నిర్వహిస్తున్న కుప్పం డివిజన్–12కు చెందిన రమణారావు (పలమనేరు), రవి (వి.కోట), సెల్వరాజ్ (కుప్పం)లకు అప్పగించిన విధుల నుంచి తొలగించి వారికి కేటాయించిన కిలోమీటర్లను రద్దు చేశారు. మిగతా వారితో పోలిస్తే ఈ ముగ్గురికి అతితక్కువ కిలోమీటర్లు ఇచ్చారు. అయినప్పటికీ అది కూడా లేకుండా తొలగించేశారు. వాస్తవానికి డివిజన్–12కు చెందిన ఈ ముగ్గురు డీఈలకే కిలోమీటర్ 165 నుంచి కిలోమీటర్ 207.800 వరకు అప్పగించాలి. అయితే అయినవారి కోసమో లేక తెర వెనుక ఏ మంత్రాంగం నడిచిందో ఉన్నఫళంగా పనులను పీకేశారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది డీఈ వెంకటప్రతాప్. ఆయనకు 51 కిలోమీటర్ల పరిధిని కేటాయించారు. ఈయనకు కేటాయించిన కిలోమీటర్లలో ఒక్క కిలోమీటర్కు కోతలేదు, పైగా ఆయన విధులవైపు ఎవరూ కన్నెత్తి చూడడం లేదు. ఇది ప్రాజెక్టు అధికారుల్లో చర్చకు దారితీస్తోంది. ఒక డీఈకే ఐదు బాధ్యతలు పుంగనూరు ఉప కాలువ పనులు చూస్తున్న ముగ్గురు డీఈల నుంచి తొలగించిన పనులను కదిరి డివిజన్–9లో మెకానికల్ డీఈ గా పనిచేస్తున్న కృష్ణ కిషోర్ కు అప్పగించారు. ఇప్పటికే కృష్ణ కిషోర్ కు ఇదే కాలువలో కిలోమీటర్ 110 నుంచి 142 వరకు పనులను అప్పగించారు. ఇప్పుడు పనుల నుంచి తొలగించిన ముగ్గురు డీఈలకు సంబంధించిన పనులన్నీ అదనంగా అప్పగించారు. ఈయన కదిరి డివిజన్–9లో మెకానికల్ డీఈతో పాటు కదిరి డివిజన్–11 లోని ఓ డీఈ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఈయన ఒక్కరికే ఐదుగురు డీఈల బాధ్యతలను ఉన్నతాధికారులు అప్పగించారు. ఈ అధికారికి ఇన్నేసి బాధ్యతలను అప్పగించడం వెనుక కారణమేమై ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చని ప్రాజెక్టులోని ఇంజినీరింగ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. డివిజన్నే మార్చేశారు ఉన్నతాధికారులు అనుకుంటే ఏమైనా చేయొచ్చనే దానికి హంద్రీనీవా ప్రాజెక్టులో తీసుకుంటున్న నిర్ణయాలే నిదర్శనం. కుప్పం ఉపకాలువ కాంక్రీట్ లైనింగ్ పనులు డివిజన్ నంబర్–12 పరిధిలోకి వస్తుంది. దీనికి ఒక ఈఈ, డీఈలు ఉన్నారు. పుంగనూరు ఉపకాలువ కిలోమీటర్ 165 నుంచి 207 కిలో మీటర్ వరకు డివిజన్–12 పరిధిలోకి వస్తుంది. అంటే ఈ డివిజన్కు చెందిన ఈఈ దీని పర్యవేక్షణ చేయాలి. అయితే ఉన్నతాధికారులు మాత్రం ఇంకోలా నిర్ణయించారు. మెకానికల్ విభాగానికి చెందిన కదిరి డివిజన్–9కి ఈఈకి పని బాధ్యత బదలాయించారు. దీంతో అక్కడి ఈఈ రాజగోపాల్కు వీటి పనుల పర్యవేక్షణ బాధ్యతలు దక్కాయి. డివిజన్–12 ఈఈ పరిధిలోని పనిని మార్చేయగా ఇప్పుడు డివిజన్–12కు చెందిన డీఈలకు ఉన్న పనుల బాధ్యతల నుంచి కూడా తప్పించేశారు. పుంగనూరు ఉపకాలువలో కాంక్రీట్ లైనింగ్ పనులు ఇంకా మిగిలి ఉండగా, స్ట్రక్చర్స్ పనులు ఇంకా మొదలు పెట్టలేదు. స్ట్రక్చర్స్ లో అండర్ టన్నెల్, సూపర్ ప్యాసేజ్, బ్రిడ్జిలు, ఇన్ లెట్లు, అవుట్ లెట్లు, ఓటీలు, క్రాస్ ఎక్స్ లెటర్లు, ఎస్కేప్ లో తదితర పనులు చేపట్టి పూర్తి చేయాల్సి ఉంది. వీటి బాధ్యతల పర్యవేక్షణను తామే చేయాలని, తమకే అప్పగించాలని కొందరు అధికారుల నుంచి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కాంట్రాక్ట్ సంస్థకు చెందిన ఓ ఉద్యోగి కీలకపాత్ర వహించి ఇలా ఇష్టారాజ్యంగా పనులు అప్పగింతపై తీవ్ర ప్రభావం చూపినట్టు ఇంజినీరింగ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా పుంగనూరు ఉపకాలువలో కాంక్రీట్ లైనింగ్ పనుల నాణ్యతను నీటి ప్రవాహం చెప్పకనే చెప్పింది. లైనింగ్ కొట్టుకుపోయినా ఇప్పటికీ చర్యలు తీసుకోని అధికారులు పనుల అప్పగింత విషయంలో వేగంగా చర్యలు తీసుకుంటుండటం గమనార్హం. -
ఇన్చార్జ్ పాలన ఇంకెన్నాళ్లు..!?
కడప వైఎస్ఆర్ సర్కిల్ : నగర శివారులోని జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో ఇన్చార్జ్ అధికారుల పాలన కొనసాగుతోంది. గత రెండేళ్ల కిందట లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న అప్పటి డీటీసీ చంద్రశేఖర్రెడ్డిని విధుల నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఇన్చార్జ్ల పాలన కొనసాగుతోంది. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా డీటీసీ ప్రసాద్ ఆరు నెలల పాటు సేవలు అందించారు. ఆ తర్వాత చిత్తూరు డీటీసీ నిరంజన్రెడ్డి నాలుగు నెలలు అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అనంతపురం డీటీసీగా ఉన్న వీర్రాజు 2025 సెప్టెంబర్ నుంచి ఇన్చార్జ్ డీటీసీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన వారంలో బుధ, గురువారాల్లో మాత్రమే రవాణా శాఖ కార్యాలయంలో వాహన యజమానులకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారు. వారం రోజులుగా పెండింగ్లో ఉన్న పనులను ఇన్చార్జ్ డీటీసీ మొత్తం పూర్తి చేసి వెళుతున్నారు. మిగిలిన రోజులో డీటీసీ లేకపోవడంతో వాహనదారులకు పనులు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేధిస్తున్న సిబ్బంది కొరత జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత రవాణా శాఖ కార్యాలయంలోని సిబ్బందిని అన్నమయ్య జిల్లాకు కేటాయించారు. దీంతో ఇక్కడ సిబ్బంది కొరత ఏర్పడింది. జిల్లా కేంద్రంలోని జిల్లా ఉప రవాణా శాఖ కార్యాలయంలో ఒక డీటీసీ, ఎంవీఐ ఒకరు, ఏ ఎంవీఐలు ముగ్గురు, ఏఓలు ఇద్దరు, సీనియర్ అసిస్టెంట్లు ముగ్గురు, జూనియర్ అసిస్టెంట్లు ముగ్గురు ఉండాలి. అయితే ప్రస్తుతం డీటీసీ లేకపోగా ఏంవీఐ ఒకరు, ఏఎంవీఐలు ఇద్దరు, ఏవోలు ఇద్దరు, సీనియర్ అసిస్టెంట్లు ఇద్దరు, జూనియర్ అసిస్టెంట్లు ఇద్దరు మాత్రమే ఉన్నారు. వీరిలో ఎవరు సెలవుపై వెళ్లినా పనులు సకాలంలో జరగక పెండింగ్లో పడిపోతున్నాయి. ఇన్చార్జ్ డీటీసీ లేని సమయంలో వాహనదారులకు ఏ ఇబ్బందులు ఉన్నా తమ పరిధిలో ఉన్న పనులను ఎంవీఐ, ఏ ఎంవీఐలు చేస్తున్నారు. డీటీసీ పరిధిలో ఉన్న పనులు పెండింగ్లో ఉండక తప్పడం లేదు. జిల్లాలోని నాలుగు ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాలు కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేలలో సిబ్బంది కొరతతో అగచాట్లు పడుతున్నా రు. రవాణా శాఖ అధికారులు రెగ్యులర్ డీటీసీని నియమించాలని పలుమార్లు ఉన్నతాధికారులకు లెటర్లు రాసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికై నా రవాణా శాఖ ఉన్నతాధికారులు జిల్లా ఉప రవాణా శాఖ కార్యాలయానికి రెగ్యులర్ డీటీసీని నియమించాలని వాహనదారులు కోరుతున్నారు. రెగ్యులర్ డీటీసీ లేక వాహనదారులకు ఇక్కట్లు రెండేళ్లుగా భర్తీ కాని పోస్టు వారంలో రెండు రోజులు మాత్రమే సేవలు -
ఉపాధ్యాయుల ఆకలికేకలు
రాయచోటి టౌన్ : శిక్షణ తరగతులలో పాల్గొనేందుకు వచ్చిన ఉపాధ్యాయులకు కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలం అయ్యారు. తాగేందుకు మంచినీరు లేదు, మధ్యాహ్నం కడుపునకు సరిపడా భోజనం పెట్టలేదు, మధ్యలో ఇవ్వాల్సిన స్నాక్స్ అసలే లేదు.. ఇదేమని ప్రశ్నిస్తే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ వెటకారపు మాటలు. దీంతో చేసేది లేక చాలీచాలని భోజనంతో అర్ధ కడుపు నింపుకొన్న వారు కొందరైతే.. అసలే అన్నం లేకుండా వెళ్లిన ఉపాధ్యాయులు మరికొందరు. వివరాల్లోకి వెళ్లితే.. రాయచోటిలోని మాసాపేట సుగవాసి రాజారాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు 1, 2వ తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానంపై 6 రోజుల శిక్షణ నిర్వహిస్తున్నారు. ఇందులో 600 మందికి పైగా పాల్గొంటున్నారు. వీరికి టీ, స్నాక్స్తోపాటు మధ్యాహ్నం భోజనం అందించేందుకు ప్రభుత్వం ఒక్కొక్క ఉపాధ్యాయుడికి రూ.300 చొప్పున అందించి ఒక కాంట్రాక్టర్కు అప్పగించారు. ఆ కాంట్రాక్టర్ మరో కాంట్రాక్టర్కు సబ్ కాంట్రాక్ట్ రూ.140లకు అంటే సగానికి కన్నా తక్కువ డబ్బులకు అప్పగించారు. ఈ సబ్ కాంట్రాక్టర్ అందుకు తగిన విధంగానే భోజనాలు తెచ్చిపెట్టారు. ఇది సగం మందికి కూడా సరిపోవడం లేదు. మరో రూ.100తో స్టేషనరీ కూడా అందించాల్సి ఉంది. అధికారుల పర్యవేక్షణ కరువు ఉదయం టీ, టిఫిన్ అంతంత మాత్రంగా అందిస్తున్నా... కనీసం మధ్యాహ్నం అయినా కడుపు నిండా భోజనం పెడతారంటే.. అది కూడా లేకపోవడంతో ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. ఉదయం టీ, టిఫిన్ సరిగా ఇవ్వకపోతే పోతిరి కనీసం మధ్యాహ్నం భోజనం అయినా పెట్టాలి కదా అని ప్రశ్నిస్తే.. మీకు దిక్కున్న చోట చెప్పుకోపోండి.. అంటూ వెటకారపు సమాధానాలు చెప్పడంతో ఉపాధ్యాయులు ఆవేదనకు గురయ్యారు. కనీసం తాగునీరు కూడా ఇవ్వకపోవడంతో తమకు తాము ఇళ్ల దగ్గర నుంచి మంచినీళ్ల బాటిళ్లు తెచ్చుకోవడంతోపాటు కొందరు విరామ సమయంలో బయటి నుంచి తెప్పించుకొన్నారు. మధ్యాహ్నం భోజనం వడ్డించే సమయంలో వీరికి ఎండ తాపం నుంచి తప్పించేందుకు షామియానాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో.. వారి వద్ద ఉన్న విస్తర్లనే గొడుగుల్లా మార్చుకొన్నారు. కొసమెరుపు ఏమిటంటే గతంలో ఇలాంటి శిక్షణలు చాలా జరిగాయి కానీ ఇలాంటి ఇబ్బందులు లేవని ఉపాధ్యాయులే చెప్పడం గమనార్హం. ఇంతా జరుగుతున్నా ఇటు వైపు విద్యాశాఖ అధికారులు కన్నెత్తి చూడలేదని, దీంతో తాము ఎవరితో చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉపాధ్యాయుల శిక్షణ సందర్భంగా వారికి ఏర్పాటు చేసిన భోజనం ఏర్పాట్లలో ఆలస్యం అయ్యిందన్న విషయం వాస్తమేనని రాయచోటి మండల విద్యాశాఖాధికారి బాలాజీ నాయక్ తెలిపారు. రాయచోటి పట్టణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1,2 తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు రెండు రోజులుగా ఎఫ్ఎల్ఎస్ శిక్షణ ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. శిక్షణ సమయంలో శుక్రవారం మధ్యాహ్నం ముందుగా నిర్ణయించిన మండలాల కంటే మరికొన్ని మండలాలకు చెందిన ఉపాధ్యాయులు రావడం వల్ల భోజనం కొరత ఏర్పడిందన్నారు. వెంటనే కాంట్రాక్టర్కు ఆదేశించి మరో 20 నిమిషాలలో భోజనం తెప్పించామన్నారు. ఆలస్యమైన 15–20 మధ్యలో కొంత మంది ఉపాధ్యాయులు భోజనం కొరత ఏర్పడిందని ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. మున్ముందు నిర్వహించే కార్యక్రమాలకు వసతి ఏర్పాట్లలో ఎలాంటి కొరత రానివ్వరాదని కాంట్రాక్టర్ను హెచ్చరించినట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధ్యాయుల శిక్షణలో సౌకర్యాలు కరువు అరకొరగా టీ, టిఫిన్, భోజనం ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోండంటూ వెటకారపు మాటలుభోజనం ఆలస్యం అయింది నిజమే : ఎంఈవోప్రభుత్వం ప్రతి ఉపాధ్యాయుడికి రూ.300 చొప్పున భోజనాల కోసం ఇస్తోంది. అయితే నిర్వాహకులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో మెనూ పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సరైన భోజనాలు ఇవ్వడం లేదు. అసలే ఎండలు మండిపోతున్నాయి. కనీసం తాగునీరు కూడా ఇవ్వడం లేదు. అధికారులు దీనిపై పర్యవేక్షణ చేసి తరువాత శిక్షణ జరిగే రోజుల్లో సౌకర్యాలు సక్రమంగా ఉండే విధంగా చూడాలి. – శివారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, పీఎస్టీయూ -
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
మదనపల్లె టౌన్: జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసి, సామాన్య ప్రజల ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ కఠిన నిర్ణయలు తీసుకుంటోందని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో రవాణా, ఆర్అండ్ బి, జాతీయ రహదారుల అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ .. రాత్రి వేళల్లో ప్రమాదాల నివారణకు 4, 6,8,10, 20 చక్రాల వాహనాలతో పాటు ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు తప్పనిసరిగా రేడియం రిఫ్లెక్టర్లు అమర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధ రించేలా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో ‘హెల్మెట్ లేకపోతే ప్రవేశం లేదు (నో హెల్మెట్–నో ఎంట్రీ) అనే నిబంధనను కఠినంగా అమలు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి డి. అశోక్ ప్రతాప్, జిల్లా డీఆర్బీఈఓ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అరవింద దేవి, జాతీయ రహదారుల డీఈఈలు మధుసూదన, సుజాత (చిత్తూరు), నాగరాజ (రాయచోటి), మోటార్ వెహికిల్ ఇన్న్స్పెక్టర్లు దినేశ్ చంద్ర, అజయ్ కుమార్, డీసీఆర్బీ సీఐ ఏ.ఆదినారాయణ రెడ్డి, డీటీఆర్బీ ఎస్ఐ డి. రమేష్ బాబు తదితరలు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి -
ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ను సస్పెండ్ చేయాలి
రాయచోటి : ఓపెన్ స్కూల్ జిల్లా కో–ఆర్డినేటర్ శ్రీనివాసరాజును సస్పెండ్ చేసి, శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జంగంరెడ్డి కిషోర్ దాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం రాయచోటిలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నమయ్య జిల్లా ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ శ్రీనివాసరాజు కాలపరిమితి ముగిసినప్పటికీ డిప్యుటేషన్ పేరుతో మూడు సంవత్సరాల నుంచి అక్రమంగా పదవిలో కొనసాగుతూ.. జిల్లాలో ఓపెన్ స్కూల్ వ్యవస్థను అవినీతిమయం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓపెన్ స్కూల్ పరిధిలో జరుగుతున్న అక్రమాలను తీవ్రంగా ఎండగట్టారు. పరీక్షా కేంద్రాల కేటాయింపులు, ఓపెన్ టెన్త్, ఇంటర్ విద్యార్థుల నుంచి ఒక్కొక్కరి దగ్గర రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అర్హత లేని వారికి నకిలీ పత్రాలు సృష్టించి అడ్మిషన్లు కల్పిస్తున్నారని విమర్శించారు. కనీసం పీసీపీ తరగతులకు ముఖం చూపించని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని, వారు క్లాసులకు హాజరైనట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఓపెన్ స్కూల్ విధానంలో కీలకమైన ఇరవై శాతం అంతర్గత మార్కులు (ట్యూటర్ మార్కడ్ అసైన్మెంట్లు) ఇచ్చే ప్రక్రియను ఒక పెద్ద దందాలా మార్చి.. విద్యార్థుల నుంచి ఖాళీ పేపర్లు తీసుకొని లంచాలు వసూలు చేస్తూ ఆన్లైన్ పోర్టల్లో పూర్తి మార్కులు వేస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశల వారీగా పోరాటాలు కడప హరిత హోటల్లో గురువారం జరిగిన ఒక పూర్తి స్థాయి రాజకీయ కార్యక్రమానికి.. ప్రభుత్వ అధికార హోదాలో ఉన్న శ్రీనివాసరాజు హాజరు కావడాన్ని కిషోర్ దాస్ తీవ్రంగా ఖండించారు. ఒక ప్రభుత్వ అధికారిగా సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ సమావేశాల్లో పాల్గొనడం చట్టవిరుద్ధమన్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ తన స్థాయి, పరిధిని మరచి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై శ్రీనివాసరాజు దుర్మార్గపు ఆరోపణలు చేయడం ఆయన మతిభ్రమించిన తనానికి నిదర్శనమన్నారు. శ్రీనివాసరాజు తన వ్యాఖ్యలపై వెంటనే వైఎస్సార్సీపీ నాయకత్వానికి, కార్యకర్తలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. రాజకీయాలు చేయాలనే మోజు ఉంటే వెంటనే తన కో–ఆర్డినేటర్ పదవికి, ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి అధికార తెలుగుదేశం పార్టీలో చేరి పచ్చ కండువా కప్పుకొని బహిరంగంగా రాజకీయ ప్రసంగాలు చేసుకోవచ్చని హితవు పలికారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారిన శ్రీనివాసరాజును విధుల నుంచి తొలగించి ఆయన అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అందులో భాగంగా సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి ఆయనను తొలగించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేసే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. తరువాత అఖిలపక్ష విద్యార్థి సంఘాల సమావేశం ఏర్పాటు చేసి శ్రీనివాసరాజును తొలగించే వరకు నిరంతర పోరాట కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అబ్దుల్ తదితర నాయకులు పాల్గొన్నారు. విద్యార్థుల నుంచి అక్రమంగా వసూళ్లు టీడీపీ సమావేశంలో శ్రీనివాసరాజు పాల్గొనడం చట్టవిరుద్ధం వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కిషోర్ దాస్ -
‘జగనన్న ఉన్నప్పుడు ఇట్లా కాదు మామా!’
‘చంద్రబాబు ముఖంలో మార్పు వచ్చింది.. మారిన మనిషంటూ జనాన్ని నమ్మించి, గ్యారెంటీ బాండ్లని చేతిలో పెడితే.. మురిసిపోయి ఓట్లేసినందుకు మన బతుకులు బస్టాండ్ అయ్యాయి మామా!’ అంటూ బద్వేలు నియోజకవర్గం కలసపాడు పీర్ల చావిడి రచ్చబండ కాడ కూర్చుని జనం కూటమి సర్కార్ను ఎద్దేవా చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఏ ఒక్క పథకం డబ్బులు అకౌంట్లలో పడకపోగా, నిబంధనల పోట్లతో ఉన్న పథకాలకు తూట్లు పొడుస్తున్న చందాన సాగుతున్న అరాచక పాలనపై పల్లెల్లో జనం తిరగబడుతున్నారు. ఇటీవల ఊర్లో శుభకార్యానికి హైదరాబాద్ నుంచి వచ్చిన రామచంద్రుడిని చూసి రచ్చబండ కాడ ఉన్న వెంకన్న పలకరించాడు. ‘ఏమిరా రామచంద్రా! ఎట్లుంది హైదరాబాద్ల నీ ఉద్యోగం? జీతం బాగానే ఇస్తున్నారా, ఏమన్నా ఎనకేస్తున్నావా? బంగ్లాలు, ఇండ్లు ఏమన్నా కట్టినావా సామీ?’ అని గుక్కతిప్పుకోకుండా అడిగేశాడు.దానికి రామచంద్రుడు నిట్టూరుస్తూ.. ‘ఏం సరిపోతాదిలే మామా! జీతాలు చూస్తే అణాపైసలు.. ఖర్చులు చూస్తే కొండంత! ఏది ముట్టుకున్నా రేట్లు సెగలు పుట్టిస్తున్నాయి. అంత సీన్ ఉంటే పిల్లోలను ఊర్ల ముసలోళ్ల కాడ ఎందుకు వదిలిపోతా? నా సామిరంగా.. ఈ రెండేళ్ల నుంచి నడ్డి విరిగిపోతాంది మామా! వెనకటికి మన జగనన్న సీఎంగా ఉన్నప్పుడు మనకు ‘వైఎస్ఆర్ ఆసరా’, ‘సున్నా వడ్డీ రుణాలు’ టైమ్కు వచ్చేవి. ఏడాదికి రూ.18 వేలకు పైగా ఒకేసారి చేతికొస్తే ఆడోళ్లు పొదుపుగా దాచుకునేవాళ్లు. పిల్లకు ‘అమ్మ ఒడి’ వచ్చేది, పెద్ద పిల్లోనికి ‘ఫీజు రీయింబర్స్మెంట్’ వచ్చేది. ఇంటి పెద్దన్నగా జగనన్నే ఉండి ఆదుకునేటోడు. ఆ డబ్బులతో పిల్లల చదువులే కాకుండా ఇంట్లో ముసల్లోళ్ల వంటా వార్పుకు కూడా సాయపడేవి. ఊర్లో ఉపాధి పనులు ఉండి కూలి గిట్టుబాటయ్యేది. దాంతో పండగలకు మేం కూడా ఎంతో సంతోషంగా ఊరికొచ్చేవాళ్లం. కానీ ఇప్పుడేమైందో ఏమో గానీ.. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ‘తల్లికి వందనం’ పోయింది, ‘వైఎస్ఆర్ ఆసరా’ పోయింది, ‘సున్నా వడ్డీ’ కూడా పోయింది! ఇక కడప దగ్గర్లో ఇంజినీరింగ్ చదువుతున్న నా కొడుకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని కాలేజీ వాడు రూ.75 వేలు కట్టమన్నాడు, లేకుంటే పరీక్షలు రాయనీయమన్నారట! చేసేది లేక నీ కూతురు పుస్తెల గొలుసు, ఇంకొన్ని చిన్న చిన్న వెండి సొమ్ములు ఉంటే బ్యాంకులో తాకట్టు పెట్టి ఫీజు కట్టినాం మామా.. జగనన్న ఉన్నప్పుడు ఇట్టాంటి తిప్పలు అస్సలు ఉండకపోయేవి, హాయిగా నిద్రపోయేవాళ్లం. మన బావమరిది కూడా అప్పట్లో ‘రైతుభరోసా’ డబ్బులతో హాయిగా వ్యవసాయం చేసుకునేటోడు. ఇప్పుడు వాడికీ వ్యవసాయంలో తీరని నష్టాలు వచ్చాయట. ఈసారి యూరియా దొరక్క వాడు వేసిన మొక్కజొన్న పంట అంతా ఎండిపోయిందట, వాడు కూడా దిగాలుగా కూర్చున్నాడు. ఏదో పిల్లలను, ముసల్లోళ్లను చూద్దామని ఆశగా ఊరికొస్తే.. ఇక్కడ ఎవరి ముఖంలోనూ సంతోషమనేదే కనిపిస్తలేదు మామా..!’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అక్కడే కూర్చుని ఉన్న యుగంధర్ మాటలో మాట కలిపాడు. ‘నిజమేరా రామచంద్రా..! మా అన్న భార్యకు గతంలో ‘వైఎస్ఆర్ ఆసరా’, ‘సున్నా వడ్డీ’ డబ్బులు చక్కగా వచ్చేవి. ఇప్పుడు అవేవీ రావడం లేదు. మా అన్న పాడెక్కి ఏడాది కావస్తోంది. ఇంతవరకు నా వదినకు వితంతు పింఛన్ ఇవ్వలేదు! 50 ఏళ్లకే పింఛన్ ఇస్తానన్న చంద్రబాబు.. వితంతువులను ఇలా నడిరోడ్డున పడేశాడు. మేం గ్రామ పెద్దను తీసుకుని సచివాలయానికి వెళ్తే.. ‘మీ అన్నకు ఇదివరకు పింఛన్ లేదు కాబట్టి, మీ వదినకు కొత్త పింఛన్ రాదు’ అని సాకులు చెప్తున్నారు. ఏం చేయాలో తెలియక నా వదిన కూలి పనులకు వెళ్లి బతుకీడుస్తోంది.గతంలో ఆమె కొడుక్కి వాలంటీర్ ఉద్యోగం ఉండేది. నెలకు రూ.5 వేలు వస్తే ఇల్లు గడిచేది. ఇప్పుడా ఉద్యోగం లేదు, వాడు కూడా రోడ్డున పడ్డాడు. అటు ఉద్యోగమూ లేదు, ఇటు నిరుద్యోగ భృతీ లేదు. జాబ్ క్యాలెండర్ రాకపోయే సరికి వాడు బతుకుదెరువు కోసం పట్టణం వెళ్లిపోయాడు. ఈ పండుగకు కూడా వాడు ఊరికి రాలేదు. ఇక్కడేమో నా వదిన మంచం పట్టింది. ఏందిరా రామచంద్రా..! ఇప్పుడు ఊర్లో రేషన్ కార్డు కావాలన్నా జన్మభూమి కమిటీ నాయకుల కాళ్లు పట్టుకోవాలి. పిల్లల చదువుల కోసం ‘ఇ.డబ్ల్యూ.ఎస్’ సర్టిఫికెట్ కావాలన్నా నెలల తరబడి ఆఫీస్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. రెండేళ్లకే ఎంత దారుణమైన మార్పు వచ్చిందిరా అబ్బా! నాడు సొంత మామకే వెన్నుపోటు పొడిచాడు.. ఇప్పుడు మాయమాటలు చెప్పి మనందరికీ వెన్నుపోటు పొడిచాడు! పాలిచ్చే బర్రెను కాదనుకుని, తన్నే దున్నపోతును తెచ్చుకుని ఇంట్లో కట్టేసుకున్నాం. ఇదేం కర్మరా రామా.. రెండేళ్లలోనే ఇట్లయిపాయె!’ అంటూ యుగంధర్ నిట్టూర్చాడు. అక్కడే కూర్చుని అన్నీ వింటున్న శ్రీకాంత్ ఒక్కసారిగా నోరు తెరిచి.. ‘నిజమేరా బావా..! జగనన్న పాలనలో మాకు కుట్టుపని నిమిత్తం ప్రతి ఏడాది రూ. 10 వేలు ‘జగనన్న చేదోడు’ పథకం కింద ఇచ్చేటోళ్లు. ఇప్పుడవి రాకుండా పోయాయి. ఊర్లో ఎక్కడైనా బతుకుదామన్నా అసలు పనే దొరకడం లేదు. చేసేది లేక కట్టుకున్న భార్యను, పిల్లలను, ముసలోళ్లను ఊర్లోనే వదిలేసి, బతుకుదెరువు కోసం హైదరాబాద్ పోయి దొరికిన కాడ కమిషన్కు బట్టలు కుడుతున్నా. ఓటు ఈ మోసగానికి వేసి పెద్ద తప్పు చేశామా అనిపిస్తోంది’ అని ఆవేదన చెందాడు. రాజశేఖర్ ఏకబిగిన అందుకొని.. ‘చంద్రబాబు పాలన అంతా ఉత్తుత్తిదేరా అబ్బా..! జనాన్ని నమ్మించడం, ఓట్లు దండుకొని మోసం చేయడం ఎలాగో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఇటు నిరుద్యోగ భృతి లేదు, అటు సూపర్ సిక్స్ హామీల అమలు అంతంతమాత్రమే. పేద పిల్లలు డాక్టర్లు కావాలని జగనన్న ప్రభుత్వం మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ఈ కూటమి సర్కార్ ప్రైవేట్ పరం చేసి, పేదల వైద్యాన్ని అంగట్లో అమ్మేసింది! ఆరోగ్యశ్రీని పూర్తిగా బొంద పెట్టారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల నుంచి అమరావతి జపం చేయడం, ప్రజలకు మాయమాటలు చెప్పి దోచుకోవడం తప్ప ఇంకేం కనిపించడంలేదు’ అని ఊదరగొట్టాడు. దాంతో రచ్చబండ కాడ ఉన్న జనం అంతా ‘అవునురో అబ్బా.. ఇవన్నీ అక్షరాలా నిజాలేరో! ఓటేసి నిలువునా మోసపోయాం’ అంటూ తలలు పట్టుకున్నారు. – కాతా వెంకట నరసింహారెడ్డి, బద్వేలుమా ఉసురు తగులుతుంది! జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి, నాలాంటి నిరుద్యోగులు లక్షలాది మందికి గౌరవంగా జీవనోపాధి కల్పించారు. అలాంటి ఉపాధిని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి లాగేసుకుంది. నమ్మించి మా బతుకులను రోడ్డున పడేసిన ఈ కూటమి సర్కార్కు మా ఉసురు తగులుతుంది. – షేక్ అర్షియా, మాజీ వలంటీర్, కలసపాడు.జీవనోపాధినే లాగేసుకున్నారు! వలంటీర్లను ఉద్యోగాల నుంచి తొలగించబోమని, పైగా జీతం రూ. 10 వేలు చేస్తామని ఎన్నికలపుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా కూటమి ప్రభుత్వం వచ్చాక వలంటీర్ వ్యవస్థే లేకుండా చేశారు. వలంటీరుగా ఉన్నప్పుడు నెలకు రూ. 5 వేలు వచ్చినా మా సొంత ఊర్లోనే ఖర్చులకు సరిపోయేవి. ఇప్పుడు ఆ కాస్తా లేకుండా చేసి ఘోరంగా మోసం చేశారు.– మల్లిఖార్జున, మాజీ వలంటీర్, బ్రాహ్మణపల్లె.నేడు ఆఫీసుల చుట్టూ తిప్పలు! మేము వలంటీర్లుగా ఉన్నప్పుడు నెలలో మొదటి ఐదు రోజులు ఎక్కడికెళ్లినా వెతికి పట్టుకొని మరీ అవ్వతాతల చేతుల్లో పింఛన్లు పె ట్టేవాళ్లం. ఇప్పుడు ఆ పరి స్థితి లేదు. రేషన్ కార్డు కావాలన్నా, ఇతర ప్రభుత్వ సేవ లు కావాలన్నా పేదలు తమ రెక్కాడితే గాని డొక్కాడరని తెలిసి కూడా ఉపాధి పనులు వదిలేసి నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.’– శ్రీనివాసులు, మాజీ వలంటీర్, కలసపాడు. -
జనాభా లెక్కల పేరిట సైబర్ మోసాలు
మదనపల్లె టౌన్ : ప్రజల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించేందుకు సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాను ఎంచుకుంటున్నారని, ప్రస్తుతం జనాభా లెక్కల (సెన్సెస్) పేరుతో సాగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ దీరజ్ పేర్కొన్నారు. గురువారం మదనపల్లెలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఒక ప్రకటన విడుదల చేశారు.ఇటీవలి కాలంలో సైబర్ కేటుగాళ్లు జనాభా లెక్కల నమోదు అధికారులమంటూ ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ లు, వాట్సాప్ లింకుల ద్వారా ప్రజలను సంప్రదిస్తున్నట్లు పోలీసులు గుర్తించారన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిజిటల్ సర్వే చేస్తున్నామని నమ్మిస్తూ.. ఆధార్ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా నంబర్లు సేకరించి, ఆపై మీ మొబైల్ నంబర్లకు వచ్చే ఓటీపీలను అడిగి క్షణాల్లో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారని ఎస్పీ తెలిపారు. ప్రభుత్వ అధికారిక యంత్రాంగం ఎన్నడూ ఫోన్లలో గానీ, అనుమానాస్పద లింకుల ద్వారా గానీ బ్యాంక్ వివరాలు, ఓటీపీలు, ఏటీఎం పిన్ నంబర్లు అడగరనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. మొబైల్ ఫోన్లకు వచ్చే ఎటువంటి అపరిచిత లింకులపై క్లిక్ చేయవద్దని, ఒకవేళ పొరపాటున ఎవరైనా ఇలాంటి సైబర్ మాయగాళ్ల బారిన పడి ఆర్థికంగా నష్టపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 అనే టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయాలన్నారు. లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. బాధితులు ఎంత త్వరగా స్పందిస్తే అంత వేగంగా పోగొట్టుకున్న సొమ్మును ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయాలి రామసముద్రం : బాధితుల సమస్యలపై సత్వరమే స్పందించి.. న్యాయం అందించడమే పోలీసుల బాధ్యత అని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. గురువారం రామసముద్రం పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ కేసులకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. స్టేషన్ స్థితిగతులపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ రామసముద్రం కర్ణాటక సరిహద్దులో ఉన్నందున అక్రమ రవాణా జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నేర చరితులపై నిఘా పెట్టామని తెలిపారు.కార్యక్రమంలో సీఐ రవి నాయక్, ఎస్ఐ హృషికేశవరెడ్డి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ ధీరజ్ -
శుభ కార్యాలకు కొన్నాళ్లు ‘శుభం కార్డు’
మదనపల్లె సిటీ : వివాహాలు, గృహప్రవేశాలు, నిశ్చితార్థాలు వంటి శుభకార్యాలతో నిత్యం కళకళలాడే ముహూర్తాల సీజన్కు తాత్కాలికంగా విరామం పడింది. తిరుగులేని శుభ ముహూర్తాలు లేకపోవడంతో జిల్లావ్యాప్తంగా పెళ్లి బాజాలు మూగబోయాయి. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, రాయచోటి, పీలేరు, పుంగనూరుతో పాటు పలు మండల కేంద్రాల్లో వందలాది కల్యాణ మండపాలు ఉన్నాయి. సాధారణంగా ఈ కేంద్రాల్లో నెలకు సుమారు 200కు పైగా వివాహాలు జరుగుతుంటాయి. అయితే, అధిక జ్యేష్టమాసం రావడంతో గత నెల 14 నుంచి ఈ నెల 18 వరకు వివాహాది ప్రధాన శుభకార్యాలకు పూర్తిగా బ్రేక్ పడింది.‘మూఢమి’ కారణంగా వాయిదాలు వేద పండితుల ప్రకారం మే 14 నుంచి జూన్ 18 వరకు ఉన్న కాలాన్ని ‘మూఢమి’ (శూన్యమాసం)గా పరిగణిస్తారు. ఈ కాలంలో ఎలాంటి పెద్ద శుభకార్యాలు తలపెట్టకూడదనే నియమం ఉంది. అందుకే జనాలు పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి ప్రధాన వేడుకలను వాయిదా వేసుకుంటున్నారు. అయితే అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం, సీమంతం మరియు ఆస్తుల రిజిస్ట్రేషన్లు వంటి సాధారణ కార్యక్రమాలను మాత్రం యథావిధిగా నిర్వహించుకోవచ్చునని పండితులు చెబుతున్నారు. అనుబంధ రంగాల్లో మందగమనం ముహూర్తాలు లేకపోవడంతో వివాహ వేడుకలపై ఆధారపడి జీవించే వందలాది అనుబంధ రంగాలు, వృత్తుల వ్యాపారం తాత్కాలికంగా మందగించింది. కల్యాణ మండపాలు, కేటరింగ్ సర్వీసెస్, టెంట్ హౌస్లు, డెకరేషన్ నిర్వాహకులు, పూల వ్యాపారులు, జ్యువెలరీ షాపులు, వస్త్ర వ్యాపారులు, ఫొటోగ్రాఫర్లు, హోటళ్లు మరియు లాడ్జీల వ్యాపారాలపై ఈ శూన్యమాసం ప్రభావం తీవ్రంగా పడనుంది. వ్యాపారాలు లేక సిబ్బందికి ఉపాధి కరువైంది. అయితే జూన్ 19 నుంచి మళ్లీ సీజన్ ప్రారంభం కానుండటంతో ఈ రంగాలన్నీ తిరిగి ఊపందుకుంటాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 19 నుంచి మళ్లీ సందడి ఈ నెల 19న ‘నిజ జ్యేష్టమాసం’ ప్రారంభం కావడంతో మళ్లీ జిల్లాలో శుభముహూర్తాల సందడి మొదలుకానుంది. జూన్ 19, 20, 21, 24, 25, 26, 27, 28 తేదీల్లో అత్యంత బలమైన ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత జూలై 1 నుంచి 9 వరకు కూడా వివాహాలు, గృహప్రవేశాలకు అనువైన తేదీలున్నాయి. వీటితో పాటు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లోనూ పలు శుభముహూర్తాలు లైన్ కట్టాయి. 18 వరకు నిలిచిపోనున్న పెళ్లి బాజాలు! అడ్డుగా మారిన అధిక జ్యేష్టమాసం (మూఢమి) బోసిపోతున్న కల్యాణ మండపాలు.. ఉపాధి కోల్పోతున్న అనుబంధ రంగాలు 19 నుంచి మళ్లీ ప్రారంభం కానున్న పెళ్లిళ్ల సందడి -
బాల్యాల బంధం.. గర్భాల భారం !
● జిల్లాలో యథేచ్ఛగా బాల్య వివాహాల జోరు ● పెరుగుతున్న టీనేజ్ గర్భిణుల సంఖ్య ● తగ్గుతున్న సాధారణ గర్భధారణల శాతం ● 6,441 మంది హైరిస్క్ గర్భిణులు మదనపల్లె టౌన్: జిల్లాలో గర్భిణీ మహిళల ఆరోగ్య స్థితిగతులపై అందుతున్న గణాంకాలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. జిల్లాలో మూడేళ్లుగా మొత్తం గర్భధారణల నమోదు శాతం గణనీయంగా తగ్గుతుండగా, మరోవైపు 18 ఏళ్ల లోపు (టీనేజ్) గర్భం దాల్చుతున్న వారి సంఖ్య మరియు హైరిస్క్ కేసుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నట్లు అధికారిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ లోపించడం, మౌలిక వసతుల కొరత కారణంగా జిల్లాలో మాతా శిశు సంరక్షణ కుంటుపడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పడిపోతున్న గర్భిణుల నమోదు జిల్లాలో మొత్తం గర్భిణుల నమోదు సంఖ్య గడిచిన ఏడాదిలోనే 12.4% మేర పడిపోయింది. 2024–25లో 30,095 మంది నమోదైతే, 2025–26 నాటికి ఆ సంఖ్య 26,356 కి తగ్గింది. ఒకే సంవత్సరంలో 3,739 గర్భధారణలు తగ్గడం వెనుక జిల్లాలో జననాల రేటు తగ్గడం లేదా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ నమోదు ప్రక్రియలో లోపాలు ఉండవచ్చని పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు ‘హై రిస్క్’ కేటగిరీలోనే.. చిన్న వయసు ప్రసవాల కారణంగా జిల్లాలో సమస్యలతో కూడిన ‘హై రిస్క్’ గర్భధారణల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. జిల్లాలో నమోదవుతున్న గర్భిణుల్లో ప్రతి ఏటా 21% నుండి 24% మంది హై రిస్క్ కేటగిరీలోనే ఉంటున్నారు. 2024–25లో అత్యధికంగా 7,085 హైరిస్క్ కేసులు నమోదు కాగా, 2025–26 లో 6,441 కేసులు నమోదయ్యాయి. గర్భిణులలో తీవ్ర రక్తహీనత, హైబీపీ, షుగర్ వ్యాధి మరియు తక్కువ వయసులోనే గర్భం దాల్చడం వంటివి ఈ ప్రమాదకర స్థితికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. అందుబాటులో 3 ఆసుపత్రులే జిల్లాలో ఏకంగా 6,441 మంది గర్భిణులు అత్యంత ప్రమాదకరమైన ‘హై రిస్క్’ కేటగిరీలో ఉంటే, వీరికి అత్యవసర వైద్యం అందించడానికి జిల్లా మొత్తం మీద ఫస్ట్ రెఫరల్ యూనిట్లు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు కేవలం మూడు మాత్రమే ఉన్నాయి. మదనపల్లె, రాయచోటి, రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే ఈ సదుపాయం ఉండటంతో పాటు, అక్కడ గైనకాలజిస్టులు, పీడియాట్రీషియన్లు వంటి స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. 68 శాతానికే పరిమితమైన చెకప్స్.. కుంటుపడుతున్న లక్ష్యాలు గర్భిణులకు క్రమం తప్పకుండా చేయాల్సిన యాంటీనాటల్ కేర్ చెకప్స్ జిల్లాలో కేవలం 68 శాతం మాత్రమే జరుగుతున్నాయి. మారుమూల గ్రామాలు, గిరిజన తండాలకు ఏఎన్ఎంలు రెగ్యులర్గా వెళ్లడం లేదని, ఫలితంగానే చెకప్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ నిర్దేశించిన కీలక లక్ష్యాలైన..టీనేజ్ ప్రెగ్నెన్సీలను 5 శాతం లోపుకు తగ్గించడం, 100 శాతం ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు (ఆసుపత్రి కాన్పులు) చేయడం, మరియు మాతృ మరణాల రేటును 70 లోపునకు పరిమితం చేయడంలో క్షేత్రస్థాయి సిబ్బంది వైఫల్యం స్పష్టంగా బయటపడుతోంది. గత 2023–24లో 12 మాతృ మరణాలు నమోదు కాగా, 2024–25 నాటికి ఆ సంఖ్య 6కి తగ్గింది. అయితే ప్రస్తుత 2025–26 సంవత్సరంలో ఇప్పటివరకు 7 మరణాలు నమోదయ్యాయి. మరణాల సంఖ్య తగ్గినట్లు కనిపిస్తున్నా, జాతీయ ప్రమాణాలతో పోలిస్తే జిల్లాలో ఎంఎంఆర్ ఇంకా ఎక్కువగానే ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాగా జిల్లాలో గర్భిణీల నమోదు శాతం తగ్గకుండా ప్రత్యేక చైతన్య కార్యక్రమాలు చేపడతాం. చిన్న వయసు గర్భధారణలు, హైరిస్క్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని డీఎంహెచ్ఓ లక్ష్మీనరసయ్య తెలిపారు. -
దాతలూ.. సాయం చేయరూ !
మదనపల్లె టౌన్: ఏడు నెలలకే జన్మించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న కవల బిడ్డలను కాపాడుకునేందుకు పీటీఎం మండలానికి చెందిన దంపతులు దాతల సాయం కోసం అర్థిస్తున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం, పీటీఎం మండలానికి చెందిన సాయి వర్ధన్, శిరీష దంపతులకు ఇద్దరు మగ బిడ్డలు జన్మించారు. నెలలు నిండకుండానే పుట్టడంతో ఇద్దరు చిన్నారులు కేవలం 800 గ్రాముల బరువుతో అత్యంత విషమ పరిస్థితిలో ఉన్నారు. మెరుగైన చికిత్స కోసం చిన్నారులను బెంగళూరులోని రెయిన్బో ఆసుపత్రిలో చేర్చి ఎన్ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. పిల్లల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శ్రమిస్తున్నప్పటికీ, రోజుకు సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతోందని తల్లి శిరీష తెలిపారు. గురువారం మదనపల్లె ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన శిరీష, తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఇంత భారీ మొత్తం భరించలేమని కన్నీటి పర్యంతమయ్యారు. కళ్లముందే ప్రాణాపాయ స్థితిలో ఉన్న బిడ్డలను కాపాడు కునేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు మానవతా దక్పథంతో ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేయాలని వేడుకున్నారు. దాతలు ఫోన్ పే నెంబర్ 8143633396 నంబర్కు ఆర్థిక సహాయం అందిం చాలని విన్నవించారు.ఏడు నెలల కవలల చికిత్స కోసం తల్లిదండ్రుల వేడుకోలు -
యువకుడిపై దాడి
మదనపల్లె టౌన్: పాత కక్షలు మనసులో పెట్టుకుని ఓ యువకుడిపై తన ప్రత్యర్థి దాడి చేసిన సంఘటన గురువారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. బాధితుని కథనం మేరకు.. పట్టణంలోని అమ్మ చెరువు మిట్టలో నివాసం ఉంటున్న జయకుమార్ ను అదే ప్రాంతంలో ఉంటున్న శ్రీనివాసులు మాట్లాడే పని ఉందని పిలిచాడు. పాత కక్షలు మనసులో పెట్టుకొని బండరాళ్లతో దాడి చేసి గాయపరిచాడు. గాయపడిన వ్యక్తిని కుటుంబీకులు స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తులో ఉంది. 436 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం బద్వేలు అర్బన్ : బద్వేలులో గురువారం విజిలెన్స్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో మున్సిపాలిటీ పరిధిలోని చెన్నంపల్లె మిట్టలోని ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 436 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అధికారులు తెలిపిన వివరాల మేరకు నడిపిపోలయ్య అనే వ్యక్తి రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్లు అందిన సమాచారం మేరకు విజిలెన్స్, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించారు.నడిపిపోలయ్యపై బద్వేలు అర్బన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సీఐ శ్రీనివాసులరెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ డీటీ శివశంకర్ తదితరులుపాల్గొన్నారు. -
కనీస అభ్యసన సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలి
డీఈఓ సుబ్రమణ్యంమదనపల్లె సిటీ: నిపుణ్భారత్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా విద్యార్థుల తరగతి స్థాయిని బట్టి కనీస అభ్యసన సామర్థ్యాల పెంపుదలకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కె.సుబ్రమణ్యం అన్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా ఒకటి, రెండు తరగతులకు బోధిస్తున్న ఉపాధ్యాయుల కోసం ఆరు కేంద్రాల్లో నిర్వహిస్తున్న ‘జ్ఞాన ప్రకాష్’ఆరు రోజుల శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు.శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో తప్పనిసరిగా అమలు చేసి, విద్యార్థి కేంద్రిత బోధనా విధానాల ద్వారా వారి నైపుణ్యాల అభివృద్దికి ప్రతి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. సమగ్రశిక్ష అకడమిక్ మానిటరింగ్ అధికారి జి.కరుణాకర్, కోర్సు కో ఆర్డినేటర్ ప్రభాకర్రెడ్డి, సెంటర్ ఇన్చార్జ్ పద్మావతి, ఉపాధ్యాయులు, డీఆర్పీలు పాల్గొన్నారు. కొత్త తరహా విద్యాబోధన అందించాలి పీలేరు : ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు కొత్త తరహా విద్యాబోధన అందించాలని రాష్ట్ర పరిశీలకులు విజయకుమార్ అ న్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అక్షరాస్యతా అభివృద్ధి కోసం ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఆరు రోజుల శిక్షణ కార్య క్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సందర్శించిన ఆయన మా ట్లాడుతూ ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ప్రా థమిక అక్షర జ్ఞానం, సంఖ్యాజ్ఞానం, పాఠ్య పుస్తకాల మార్పులపై అవగాహన పెంచుకోవాలన్నారు. -
క్రమశిక్షణ,పట్టుదలతోనే విజయం సాధ్యం
తిరుపతి అర్బన్ : క్రమశిక్షణతోపాటు పట్టుదలతోనే హర్షిత్ ఆల్ఇండియా స్థాయిలో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో 15వ ర్యాంక్ కై వసం చేసుకున్నారని విశ్వం విద్యాసంస్థల కరస్పాండెంట్ తులసీ విశ్వనాథ్రెడ్డి, డైరెక్టర్లు విశ్వచందన్రెడ్డి, విశ్వశ్రీ పేర్కొన్నారు. గురువారం తిరుపతిలోని విశ్వం స్కూల్లో హర్షిత్తో పాటు విద్యార్థి తల్లి డాక్టర్ గిరిజాను దుశ్శాలువాతో సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశ్వం విద్యాసంస్థల్లో చదువుకున్న హర్షిత్ 2019లో సైనిక్ స్కూల్ ప్రవేశంలో రాష్ట్రంలో 3వ ర్యాంక్ను సాధించారని చెప్పారు. భవిష్యత్లో ఉన్నత శిఖరాలను ఆధిరోహించాలని తాము ఆక్షాంకిస్టున్నట్లు వెల్లడించారు. అలాగే కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యాక్షుడు విశ్వనాధ్రెడ్డి హర్షిత్ను అభినందించారు. రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ప్రవేశ పరీక్షలకు సంబందించి అధనపు సమాచారం కోసం 8688888802, 9399976999 నెంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. -
నాటు బాంబులు..హడలిపోతున్న ప్రజలు
దుర్గసముద్రం సమీపంలోని మామిడితోటలో నల్లమందు ఉంట కొరికి గాయపడిన పెంపుడు కుక్క (ఫైల్)అటవీ ప్రాంతంలో వేట గాళ్లు ఏర్పాటు చేసిన నల్లమందు ఉంట (ఫైల్)వేటగాళ్ల చేతిలో చిక్కి విక్రయించేందుకు తెచ్చిన కుందేలు(ఫైల్)చౌడేపల్లె : గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలు, అటవీ ప్రాంతం సమీపంలోని గుట్టలు, వంకల్లో వేటగాళ్లు సరికొత్త ఆలోచనలతో వన్యమృగాలను మట్టుపెడుతున్నారు. అడవి పందుల కోసం నాటు తుపాకీలే కాకుండా నల్లమందు ఉంటలు, ఉర్లు అమర్చడం వల్ల.. అటవీ జంతువుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. గ్రామాల్లో అటవీ ప్రాంతాల్లోని పొలాల్లోకి, పరిసరాల్లోకి వెళ్లడానికి సైతం ప్రజలు భయపడుతున్నారు. మండలంలోని దుర్గసముద్రం, ముదిరెడ్డిపల్లె, చుక్కావారిపల్లె, పందిళ్ళపల్లె, ఆమినిగుంట, మడుకూరు, గాజులవారిపల్లె, పరికిదొన, చెడుగుట్లపల్లె, కొలింపల్లె, మాదంవారిపల్లె, షికారిపాళ్యం, సీజేఎఫ్ఎస్ కాలనీ, బండమీదపల్లె, సింగిరిగుంట, చారాల, బుటకపల్లె, దుర్గసముద్రం, నాగిరెడ్డిపల్లె తదితర అటవీ ప్రాంతాల సమీపంలో గల గ్రామాల పరిసర ప్రాంతాల్లో అడవి పందులే కాకుండా అటవీ మృగాలను చంపేస్తున్నారు. ఇటీవల జరిగిన నాటుబాంబు పేలుళ్ల కారణంగా పెంపుడు కుక్కతోపాటు పాడిఆవులు మృతి చెందాయి. పాడి ఆవులు మేత కోసం వెళ్లిన సమయంలో అక్కడ పడి ఉన్న ఉంటలను మేతతోపాటు కొరికేందుకు ప్రయత్నించి మృత్యువాత పడిన సంఘటలు ఉన్నాయి. అటవీ సంపద, వన్యప్రాణాలను రక్షించాల్సిన అటవీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో.. వేటగాళ్ల తూటాలకు, నాటు బాంబులకు(నల్లమందు ఉంటలకు) బలవుతున్నాయి. వీటితోపాటు వలలు, ఉర్లు ఏర్పాటు చేసి అడవి పందులు, కుందేళ్లు, కంజులు, పూరేడి గువ్వలను సైతం పొట్టనపెట్టుకొంటున్నారు. అడవులలో వేటగాళ్ల బారి నుంచి తప్పించుకునేందుకు అటవీ జంతువులు ఏకంగా జనారణ్యంలోని పరుగులు తీస్తున్నాయి. గతంలో బోయకొండ, చుక్కావారిపల్లె పరిసర ప్రాంతంలో ఓ దుప్పి వేటగాళ్ల దాడిలో తూటాలకు బలైనట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో అటవీ జంతువుల మాంసం విక్రయాల వ్యాపారం మూడు పువ్వలు ఆరుకాయలుగా సాగుతోంది. ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నా అటవీ శాఖ అధికారులు, పోలీసులు కానీ పట్టించుకోకపోవడంతోపాటు ఆ దిశగా విచారణ సైతం చేపట్టకపోవడం గమనార్హం. కొందరు దర్జాగా విందు భోజనాలు సైతం ఏర్పాటు చేసుకొని మద్యం మత్తులో చిందులేస్తున్నారని, వారికి అధికారుల అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటు వైపుగా పంట పొలాలకు వెళ్లే రైతులు సైతం భయభ్రాంతులకు గురవుతున్నారు. వన్యప్రాణులను కాపాడుకోవడానికి ప్రభుత్వం లక్షలాది రూపాయలు వ్యయం చేస్తున్నా బూడిదలో పోసిన పన్నీరులా మారింది. ఇకనైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటవీ ప్రాణులను చంపడం, పేలుడు పదార్థాలు వాడటం చట్టరీత్యానేరం. గ్రామీణ ప్రాంతాల్లో నల్లమందు ఉంటల ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయం మా దృష్టికి రాలేదు. విచారణ చేసి, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. వీటితోపాటు నాటుతుపాకులు, జూదం, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు ప్రజలు సమాచారం ఇవ్వాలి. సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. – చిన్నరెడ్డెప్ప, ఎస్ఐ, చౌడేపల్లె వేటగాళ్ల తూటాలకు బలవుతున్న అటవీ మృగాలు అడుగు పెట్టడానికి భయపడుతున్న జనం అడవి పందుల కోసం ఉంటలతో దాడులు ప్రాణాలు కోల్పోతున్న కుందేళ్లు, జింకలు, దుప్పులు -
● బాబు వెన్నుపోటుకు రెండేళ్లు..
యర్రగుంట్లలో మేనిఫెస్టో కాపీలను దహనం చేస్తున్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కడపలో టీడీపీ మేనిఫెస్టో కాపీలను దహనం చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలుచెన్నూరు: మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి ప్రొద్దుటూరులో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మేనిఫెస్టోకు హామీల రంగులద్దీ..మోసపూరిత ప్రకటనలతో మాయ చేసిన కూటమి నేతల తీరుపై జనం భగ్గుమన్నారు. ఇంటింటికీ తిరిగి ఉత్తుత్తి బాండ్లు పంచి.. నిలువునా వంచించిన పచ్చ పాలకులపై ధ్వజమెత్తారు. ‘నీకు..నీకు..నీకు..’ అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి.. అధికారంలోకి వచ్చాక హామీలు అటకెక్కించడంపైఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు ‘బాబు ష్యూరీటీ’ అంటూ బాండ్లు పంచిన నేతలు ఇప్పుడెక్కడున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. మేనిఫెస్టో కాపీలను మంటల్లో కాల్చివేశారు.. బాండ్ల ప్రతులను అడ్డంగా చించేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు కొలువుదీరి రెండేళ్లు గడిచినా హామీలు అమలు చేయని నేపథ్యంలో వైఎస్సార్సీపీ ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో నిరసన మిన్నంటింది. దగాపడ్డ ప్రజాస్వామ్యంపై దండోరా వేస్తున్న ప్రజాక్షేత్రం వైఎస్సార్సీపీతో కలిసి ఊరువాడ ధర్మాగ్రహం బాండు పేపర్లను దహనం చేసి నిరసన వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే ఆకేపాటి సాక్షి అన్నమయ్య: చంద్రబాబు సర్కార్ ఎన్నికల హామీలు విస్మరించడంపై వైఎస్సార్సీపీ నిప్పులు చెరిగింది. ప్రజలకు వెన్నుపోటు పొడవడంపై ఉవ్వెత్తున రగిలిపోయింది. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరశనలో భాగంగా గురువారం మండల, నియోజకవర్గ కేంద్రాలల్లో ప్రజలతో కలిసి భారీ ఎత్తున ప్రత్యక్ష ఆందోళన చేపట్టింది. టీడీపీ మ్యానిఫెస్టో, సూపర్ సిక్స్ కరపత్రాలు, ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్ గ్యారెంటీ’బాండ్లు ఆయా కేంద్రాల్లో దహనం చేశారు. కూటమి సర్కార్ హామీలు విస్మరించడంపై నిప్పులు చెరిగారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన, ఇప్పటి కూటమి పాలనను ప్రజలు భేరీజు వేసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. చంద్రబాబు ప్రభుత్వం మహిళలు, నిరుద్యోగులు, రైతులు ఇ లా అన్నీ వర్గాల ప్రజల్ని మో సం చేసిందని వైఎస్సార్సీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి మండిపడ్డారు. పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె మండలాలల్లో చేపట్టిన నిరశనలో ఆయన పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రతి మీటింగ్ లోను సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని విపరీతంగా ప్రచారం చేశారని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణలో వైఫల్యం చెందారని ధ్వజమెత్తారు. ● ఒంటిమిట్టలో వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి నిరశన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారని ఇంత దారుణంగా మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలే గద్దె దించుతారన్నారు. వంచించడమే ఆయన నైజమని దెప్పిపొడిచారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేపట్టిన నిరశనలు మిన్నంటాయి. ● పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డెప్ప... రామసముద్రంలో నిసార్ అహ్మద్ అన్నమయ్య జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు నిరసన వాణి వినిపించాయి. ప్రధాన రోడ్లపైకి వచ్చి చంద్రబాబు తీరును నిరసన వ్యక్తం చేశారు. పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డెప్ప ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, శ్రేణులు నిరసన గళం వినిపించగా, మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రం మండలంలో పార్టీ ఇన్ఛార్జి నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అలాగే రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో పార్టీ నాయకులు పాల్గొని చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా ముందుకు సాగారు. రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెంలో జెడ్పీమాజీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డి, సంబేపల్లెలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్రెడ్డి, పుంగనూరు, రాయచోటిలలో మాజీ మున్సిపల్ మున్సిపల్ చైర్మన్లు అలీంబాష, ఫయాజ్ బాషల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో పార్టీ నేతలు పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. ● కడపలో మాజీ మేయర్లు కొత్తమద్ది సురేష్బాబు, పాకా సురేష్ నిరశన కార్యక్రమాన్ని కొనసాగించారు. సూపర్సిక్స్ పథకాలు అమలు చేయకపోవడం, ప్రజలకు వెన్నుపోటు పొడవడంపై మండిపడ్డారు. ● ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో గాంధీ పార్కు వద్ద కూటమి ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ బాండ్లను ప్రదర్శించారు. నిరుపయోగంగా ఉండిపోయిన బాండ్లను చించేశారు. ● పోరుమామిళ్లలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మె ల్యే డాక్టర్ సుధా పాల్గొని ప్రసంగించారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వంపై భరోసా లేకుండా పోయిందని వాపోయారు. వంచించడం మినహా చేయూతనివ్వాలనే దిశగా సీఎం చంద్రబాబు సర్కార్ వ్యవహరించడం లేదని మండిపడ్డారు. ● పులివెందులలో మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్రెడ్డి, వైఎస్సార్సీపీ నేత వైఎస్ మధనమోహన్రెడ్డి నేతృత్వంలో నిరశన చేపట్టారు. మైదుకూరులో వెన్నుపోటుపై నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తదితరులు పుంగనూరు బస్టాండ్లో వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్లు ప్రదర్శిస్తున్న మాజీ ఎంపీ రెడ్డెప్ప, తదితరులు.. రామసముద్రంలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న నిసార్ అహ్మద్ -
సేవా మూర్తులకు ‘స్నేహ’హస్తం
కేవీపల్లె : సమాజ శ్రేయస్సే ధ్యేయంగా రెండు దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ’ఫ్రెండ్లీ వెల్ఫేర్ సర్వీసెస్’ సంస్థ తన సేవా పరిధిని మరింత విస్తృతం చేసింది. సమాజానికి నిస్వార్థంగా సేవలందించే వారే నిజమైన హీరోలని గుర్తిస్తూ.. ఇటీవల భాగ్యనగరంలో ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ఘనంగా ‘నిర్వి అవార్డ్స్ – టాప్ 100 సోషల్ హీరోస్’:నిర్వి ఆర్ట్స్ ఆధ్వర్యంలో వసుధ ఫౌండేషన్, ఫ్రెండ్లీ వెల్ఫేర్ సర్వీసెస్ సంయుక్తంగా హైదరాబాద్లో ‘నిర్వి అవార్డ్స్ – టాప్ 100 సోషల్ హీరోస్’ పేరిట ఒక ప్రతిష్టాత్మక అవార్డుల ప్రధానోత్సవాన్ని నిర్వహించాయి.నిజమైన హీరోలకు సన్మానం: సమాజంలో వెలుగులోకి రాని ఎందరో నిస్వార్థ సేవకులను గుర్తించి, వివిధ రంగాలలో విశేష సేవలందించిన 100 మంది సోషల్ హీరోలను ఈ వేడుకలో ఘనంగా సన్మానించి అవార్డులను అందజేశారు.కళలు, సాహిత్యానికి ప్రోత్సాహం: ఈ సందర్భంగా సంస్థ అధినేత ఎం. హరిప్రసాద్రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తులో లలిత కళలు, సాహిత్యం, జానపదం, మరియు ప్రాచీన కళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కలిగిన వారిని ప్రోత్సహించడానికి త్వరలోనే ‘నిర్వి ఫోక్ అవార్డ్స్’, ‘నిర్వి ఫిలిం అవార్డ్స్’ వంటి సరికొత్త కార్యక్రమాలను కూడా చేపట్టేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ప్రజల్లో ఆధ్యాత్మిక భావన.. ధార్మిక గ్రంథాల పంపిణీ:కేవలం సామాజిక, వైద్య, విద్యా రంగాలకే పరిమితం కాకుండా.. సమాజంలో నైతిక విలువలు, ఆధ్యాత్మిక భావనలను పెంపొందించడానికి హరిప్రసాద్రెడ్డి విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు.పుస్తకాల పంపిణీ: యువత, విద్యార్థులలో సన్మార్గాన్ని పెంపొందించేందుకు రామాయణం, భాగవతం వంటి ధార్మిక గ్రంథాలతో పాటు, నీతి విలువలను నేర్పే సుమతి శతకం పుస్తకాలను వేలాది మందికి ఉచితంగా పంపిణీ చేశారు.జాతరల్లో అన్నదానం: తన స్వగ్రామమైన చీనేపల్లెలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరిగే చిన్నక్కమ్మ, పెద్దక్కమ్మ జాతర మహోత్సవాలకు, అలాగే శ్రీరామనవమి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ఫ్రెండ్లీ వెల్ఫేర్ సర్వీసెస్ ఆధ్వర్యంలో విస్తృతంగా ఉచిత అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.అటు విదేశాల్లో వ్యాపారవేత్తగా రాణిస్తూనే.. ఇటు స్వదేశంలో అనాథల ఆకలి తీరుస్తూ, కళలను ప్రోత్సహిస్తూ, ఆధ్యాత్మిక చైతన్యాన్ని రగిలిస్తున్న హరిప్రసాద్రెడ్డి సేవలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రశంసలందుకుంటున్నాయి. సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం ఫ్రెండ్లీ వెల్ఫేర్ సర్వీసెస్ ద్వారా సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తాం. తాను విదేశాల్లో ఆరు నెలలు ఉంటే మిగిలిన రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాల నిర్వహణకు కృషి చేస్తాం. వచ్చే ఆగష్టు మాసంలో తిరుపతిలో ‘నిర్వి అవార్ుడ్స–టాప్ 100 సోషల్ హీరోస్’ కార్యక్రమం నిర్వహించాలని భావించడం జరిగింది. – ఎం. హరిప్రసాద్రెడ్డి, ఫ్రెండ్లీ వెల్ఫేర్ సర్వీసెస్ సంస్థ అధినేత ఫ్రెండ్లీ వెల్ఫేర్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ‘టాప్ 100 సోషల్ హీరోస్’ పురస్కారం హైదరాబాద్లో ఘనంగా ‘నిర్వి అవార్డ్స్’ వేడుక వంద మంది సమాజ సేవకులకు సన్మానం సామాజిక సేవతో పాటు ఆధ్యాత్మిక ప్రచారానికి హరిప్రసాద్రెడ్డి పెద్దపీట త్వరలోనే నిర్వి ఫోక్, ఫిలిం అవార్డ్స్ నిర్వహణకు సన్నాహాలు -
కుటుంబ కలహాలతో మగ్గాల నిర్వాహకుడు ఆత్మహత్య
మదనపల్లె టౌన్ : కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది మగ్గాల నిర్వాహకుడు ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం వెలుగుచూసింది. రెండో పట్టణ సీఐ మహమ్మద్ రఫీ తెలిపిన వివరాల ప్రకారం.. నీరుగట్టువారిపల్లిలోని చౌడేశ్వరిదేవి గుడి రెండో వీధిలో నివాసం ఉంటున్న బి.జయరాం (37) స్వస్థలం రాయచోటి బట్లపల్లి. 20 ఏళ్ల క్రితం కుటుంబంతో మదనపల్లెకు వచ్చి నీరుగట్టుపల్లిలో స్థిరపడ్డాడు. భోజనపు శ్రీరాములుకు రవిచంద్ర, వెంకటరత్నం, జయరాం ముగ్గురు కుమారులు కాగా అందరూ వేర్వేరుగా స్థిరపడ్డారు. జయరాం ఇంట్లోనే 20 వరకు మగ్గాలు ఏర్పాటు చేసుకుని వచ్చే ఆదాయంతో భార్య రుక్మిణి, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో వారం క్రితం రుక్మిణి పిల్లలతో కలిసి బెంగళూరులోని యలహంకకు వెళ్లిపోయింది. ఇంట్లో ఒంటరిగా మిగిలిన జయరాం జీవితంపై విరక్తి చెంది ఇంట్లోని ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ మహమ్మద్ రఫీ, ఎస్ఐ రామాంజనేయులు, ఏఎస్ఐ మహాదేవ, రమణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కిటికీ నుంచి పరిశీలించి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. మృతుడి తల్లి, అన్నదమ్ములు, భార్యను పిలిపించిన పోలీసులు వారి సమక్షంలోనే తలుపులు పగలగొట్టి మృతదేహాన్ని కిందకు దించారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో
మదనపల్లె టౌన్ : కురబలకోట మండలం చేనేతనగర్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ముదివేడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లె మండలం రామాచర్లపల్లికి చెందిన ఆదమ్మ (55), పవిత్ర (24), రామలక్ష్మి (45), ఎస్.ఎస్.విని (5), పుంగనూరు మండలం పందిళ్లవారిపల్లికి చెందిన శ్రీనివాసులు (47), మదనపల్లె ఎస్టేట్లోని సత్యసాయి కాలనీకి చెందిన సుల్తాన్ (22) ఆటోలో బి.కొత్తకోటలో జరిగిన శుభకార్యానికి వెళ్లారు. కార్యక్రమం ముగించుకుని స్వగ్రామానికి వస్తుండగా, కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని చేనేతనగర్ వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఐసర్ లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.సమాచారం అందుకున్న కురబలకోట 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి కలకడ : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన గురువారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలాఉన్నాయి. కలకడ మండలం ,కె.బాటవారిపల్లె గ్రామానికి చెందిన పెద్దకోట్ల కృష్ణయ్య (70) చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై ఉన్న కేఎస్ఆర్ కాంప్లెక్స్ వద్ద వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కృష్ణయ్యకు భార్య, నాగరత్న, కుమారుడు అశోక్, కుమార్తె నళిని ఉన్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఆరుగురికి గాయాలు -
మూగ.. వేదన!
సాక్షి, అన్నమయ్య: కూటమి సర్కార్లో మూగజీవుల వేదన అరణ్యరోదనగా మారింది. ఒకవైపు తీవ్రమైన కరువు పరిస్థితుల వల్ల తినడానికి మేత, తాగడానికి నీరు లేక రైతులు తమ పశువులను సాకలేక నిస్సహాయ స్థితికి చేరుకుంటే, మరోవైపు ఈ కష్టాలను అక్రమ వ్యాపారులు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. రాయలసీమ వ్యాప్తంగా ఉన్న ప్రధాన మార్కెట్ల నుంచి తక్కువ ధరలకే పశువులను కొనుగోలు చేసి, గుట్టుచప్పుడు కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళలోని కసాయి ఖానాలకు యథేచ్ఛగా తరలిస్తున్నారు. అక్రమ రవాణా మార్గాలు రాయలసీమలోని ప్రధాన కేంద్రాల నుండి పొరుగు రాష్ట్రాలకు ప్రతిరోజూ రెండు ప్రధాన మార్గాల ద్వారా ఈ అక్రమ రవాణా సాగుతోంది. ఒకటి బెంగళూరు మార్గం..వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరు, పులివెందుల, మైదుకూరు, కడప ప్రాంతాల నుండి పశువుల ను సేకరిస్తున్నారు. అక్కడి నుండి వాటిని రాయచోటి, మదనపల్లె మీదుగా కర్ణాటక రాజధాని బెంగళూరుకు తరలిస్తున్నారు. రెండో రూట్లో హిందూపురం, అనంతపురం, కదిరి, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు మీదుగా భారీ కంటైనర్లలో మూగజీవాలను తమిళనాడు, కేరళ సరిహద్దులు దాటిస్తున్నారు. కంటైనర్లలో కుక్కి... ఊపిరాడక పశువుల మృతి! అక్రమార్కులు కేవలం డబ్బు సంపాదన మార్గంగా మార్చుకుని, పశువుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో భారీ కంటైనర్లో సామర్థ్యానికి మించి దాదాపు 70 నుండి 80 కి పైగా ఆవులు, ఎద్దులు, గేదెలను ఎలాబడితే అలా కుక్కుతున్నారు. అవి కదలకుండా ఉండేందుకు గట్టిగా తాళ్లతో కట్టేసి గంటల తరబడి నరకయాతన చూపిస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి పెద్దమండ్యం మీదుగా మంగళవారం ఉదయం వెళ్తున్న 10 భారీ కంటైనర్లను తనిఖీ చేయగా ఈ దారుణం బయటపడింది. ఆయా వాహనాలలో మొత్తం 510 పైగా మూగజీవాలను అక్రమంగా తరలిస్తుండగా, గాలి కూడా ఆడని రీతిలో ఒకదానిపై ఒకటి కుక్కడం వల్ల ఊపిరాడక పలు పశువులు కంటైనర్లలోనే మృత్యువాత పడటం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. చెక్ పోస్టుల వద్ద ‘అమ్యామ్యాలు’.. ఈ అక్రమ రవాణా అంతా అధికారులకు తెలిసినా ఎవరికీ తెలియనట్లుగా సాగిపోతుండటం గమనార్హం. జిల్లా సరిహద్దుల్లోని చెక్పోస్టుల వద్ద పోలీసులు, సంబంధిత అధికారులు అక్రమార్కుల వద్ద ’చేయి తడు పుకుంటూ’ వాహనాలను వదిలేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. నోరు లేని మూగజీవాలకు విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నా పరిరక్షించా ల్సిన ప్రభుత్వ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారని జీవకారుణ్యమూర్తులు మండిపడుతున్నారు. ఇప్ప టికైనా ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టి ఈ మాఫియా ఆటకట్టించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.రవాణాను అడ్డుకున్న ప్రజలుపెద్దమండ్యం/గాలివీడు: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం పెద్దమండ్యం మండల కేంద్రంలో పశువుల అక్రమ రవాణా కలకలం రేపింది. 10 కంటైనర్లలో 510 పశువులను తరలిస్తుండగా.. స్థానిక యువకులు అడ్డుకున్నారు. రాష్ట్రంలోని అనంతపురం, హిందూపురం, గోరంట్ల, పత్తికొండ తదితర ప్రాంతాల నుంచి ఈ పశువుల రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడి రైతులు, వ్యాపారస్తుల నుంచి కొనుగోలు చేసి తరలించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లను వినియోగిస్తున్నారు. వీటి రవాణా వెనుక బడాడాన్ ఉన్నట్లు తెలుస్తోంది. కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువు ప్రాంతానికి చెందిన ఒకరు సూత్రధారిగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక యువకులు తంబళ్లపల్లె పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి కంటైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కంటైనర్లలో 165 ఎద్దులు, 345 దున్నపోతులు, ఎనుములు ఉన్నాయి. వీటిని పుంగనూరు, తమిళనాడు, కేరళ ప్రాంతాలలో జరిగే సంతలకు తరలిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వాటికి రాయచోటి సమీపంలోని మామిడి తోటలో వసతి, సంరక్షణ కల్పించారు. అలాగే గాలివీడు మండల కేంద్రంలోని వెలిగల్లు ప్రాజెక్టు సమీపాన అక్రమంగా తరలిస్తున్న గోవులను పోలీసులు స్వా«దీనం చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల కళ్లుగప్పేందుకు ‘హైటెక్’ వ్యూహాలు! అధికారులకు చిక్కకుండా ఉండేందుకు ఈ అక్రమ రవాణా ముఠాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నాయి. పశువుల కంటైనర్ కంటే ఒక కిలోమీటరు ముందే ఒక ‘పైలట్ వాహనం’ (కార్ లేదా బైక్) రోడ్డుపై వెళ్తుంటుంది. మార్గమధ్యంలో పోలీసులు లేదా అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు కనిపిస్తే, వెంటనే వెనుక వస్తున్న కంటైనర్ల డ్రైవర్లను అప్రమత్తం చేసి దారి మళ్లిస్తారు. రవాణాకు ఉపయోగిస్తున్న ప్రతి కంటైనర్కు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్తో పాటు వాహనం ముందు భాగంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రధాన సూత్రధారులు ఆఫీసుల్లో కూర్చుని లైవ్లో రోడ్డు కదలికలను గమనిస్తూ అప్రమత్తం అవుతున్నారు. -
అన్నదాత కొత్త అవతార్
తంబళ్లపల్లె: సంప్రదాయ పంటలకు గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్న అన్నమయ్య జిల్లా రైతులకు ‘అవతార్’ రకం ఔషధ చిన్న ఉల్లిగడ్డల సాగు కాసుల వర్షం కురిపిస్తోంది. నిరంతరం నష్టాలు తెచ్చే టమాట, వేరుశనగ పంటల స్థానంలో ఇక్కడి రైతులు కొత్త రకం సాగువైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితోనే అత్యధిక నికర ఆదాయాన్ని సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం తంబళ్లపల్లె మండలంలో దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఉల్లి సాగు యథేచ్ఛగా సాగుతోంది. టమాట నష్టాల నుంచి.. ‘అవతార్’ లాభాల వైపు! తంబళ్లపల్లె మండలం పరసతోపు పంచాయతీ నాయనప్పగారిపల్లెకు చెందిన రైతు అమరనాథరెడ్డి గతంలో టమాట పంటను సాగు చేసి తీవ్రంగా నష్టపోయారు. తోటి ఆదర్శ రైతుల సలహాతో ఆయన సరికొత్త ప్రయోగం చేశారు. తమిళనాడు నుంచి కిలో రూ. 13 వేల చొప్పున వెచ్చించి ‘అవతార్’ రకం ఔషధ చిన్న ఉల్లిగడ్డల విత్తనాలు తెచ్చి నారు పోశారు. 40 రోజుల తర్వాత ఆ నారును ఒకటిన్నర ఎకరం పొలంలో నాటగా, కేవలం 85 రోజుల్లోనే పంట దిగుబడి చేతికొచ్చింది. పొలంలో కలుపు లేకుండా చూసుకుంటూ, కేవలం ఒకే ఒక్కసారి యూరియా, డీఏపీ వంటి ఎరువులు వేసి, డ్రిప్ సిస్టమ్ ద్వారా నీటిని అందిస్తూ నాణ్యమైన దిగుబడి సాధించారు. ఎకరాకు 11 టన్నుల దిగుబడి.. తోట వద్దే వ్యాపారుల తాకిడి! విత్తనాలు కొనడం దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు ఎకరాకు రూ. 80 వేల నుంచి రూ. 90 వేల వరకు పెట్టుబడి అయినట్లు రైతు తెలిపారు. ప్రస్తుతం తోటలో పంట దిగుబడి ప్రారంభం కాగా, ఎకరాకు 10 నుంచి 11 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. మార్కెటింగ్కు వెళ్లాల్సిన పని లేకుండా వ్యాపారులే నేరుగా తోటల వద్దకు వచ్చి కిలో రూ. 30 నుంచి రూ. 35 వరకు చెల్లించి కొనుగోలు చేస్తుండటం విశేషం. శ్రీలంక, మలేషియా, దుబాయ్లకు ఎగుమతి ఈ అవతార్ రకం ఔషధ ఉల్లిగడ్డలు రెండు నుంచి నాలుగు పాయలుగా ఉండి, లేత ఎరుపు రంగులో ఉంటాయి. కోసేటప్పుడు కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది. ఈ ఉల్లిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉండటం వల్ల వీటిని వివిధ మందుల తయారీలోనూ, వంటల్లోనూ ఎక్కువగా వినియోగిస్తారు. అందుకే వీటికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ కొనుగోలు చేసిన ఉల్లిని తమిళనాడుకు తరలించి, అక్కడి నుంచి శ్రీలంక, మలేషియా, దుబాయ్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు వ్యాపారులు వెల్లడించారు. బుల్లి ఉల్లి..లాభాలు వెదజల్లి శ్రీలంక, మలేషియాలకు తంబళ్లపల్లె చిన్న ఉల్లి ఎగుమతులు టమాట, వేరుశనగ వదిలి ‘అవతార్’ ఔషధ ఉల్లివైపు రైతుల మొగ్గు తోటల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు పెట్టుబడి రూ. 90 వేలు.. ఎకరాకు రూ. 3 లక్షల వరకు నికర లాభం! -
ఆమెకు.. ఆగర్భశత్రువులు
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లాలో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలను తుంగలో తొక్కి ‘మాఫియా’గా మారుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గర్భిణీ మహిళల ఆరోగ్య సమస్యలను, ప్రభుత్వ ఆసుపత్రుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ స్కానింగ్ నిర్వాహకులు దోపిడీకి తెరలేపారు. మెషిన్లు ఉన్నా నడిపే నాథుడే లేడు.. జిల్లా వ్యాప్తంగా పేద ప్రజలకు వైద్య సేవలు అందించడానికి మొత్తం 25 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. అయితే, గర్భిణీ మహిళలకు అత్యంత కీలకమైన అల్ట్రాసౌండ్ స్కానింగ్ సదుపాయం మాత్రం కేవలం 4 ఆసుపత్రుల్లో మాత్రమే అరకొరగా అందుబాటులో ఉంది. మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో ఇద్దరు రేడియాలజిస్టులకు గానూ ఒకరే ఉండగా, ఆమె కూడా సెలవుపై వెళ్లడంతో స్కానింగ్ విభాగం పూర్తిగా మూతపడింది. రాయచోటి ఏరియా ఆసుపత్రిలో స్కానింగ్ మెషిన్ ఉన్నప్పటికీ అది పని చేయడం లేదు. పీలేరు ఆసుపత్రిలో డాక్టర్లు, సాంకేతిక సిబ్బంది ఎవరూ లేరు. రాజంపేట ఏరియా ఆసుపత్రిలో ఒక స్కానింగ్ మెషిన్, ఒక డాక్టర్ ఉన్నా.. టెక్నీషియన్ వారానికి రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాడు. జిల్లా మొత్తానికి 8 మంది రేడియాలజిస్టులు అవసరం కాగా.. ప్రస్తుతం ఉన్నది ఒక్కరే. ప్రభుత్వ ధర రూ.500.. ప్రైవేట్ బాదుడు రూ.5,000: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోవడంతో 95 శాతం మంది గర్భిణులు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ అల్ట్రాసౌండ్ స్కానింగ్కు రూ. 500 – రూ. 800, టిఫా స్కా న్కు రూ. 1,000 – రూ. 1,500, డాప్లర్ స్కాన్కు రూ. 1,500 – రూ. 2,000 మాత్రమే తీసుకోవాలి. కానీ క్షేత్రస్థాయిలో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు సాధారణ స్కాన్లకే రూ. 1,500 నుంచి రూ. 5,000 వరకు అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఒక్కో గర్భధారణ కాలంలో 3 నుంచి 4 సార్లు స్కానింగ్ తీయించాలి. ఈ మేరకు కేవలం స్కానింగ్ల కోసమే పేద కుటుంబాలు రూ. 8,000 వరకు అప్పులు చేసి ఖర్చు పెట్టాల్సి వస్తోంది. రూ.15,000 ఇస్తే చాలు లింగనిర్ధారణ ప్రభుత్వ నిఘా లోపాన్ని ఆసరాగా చేసుకుని మదనపల్లె, రాయచోటి పరిసర ప్రాంతాలలో ప్రైవేట్ సెంటర్లు ‘ప్యాకేజీ’ల పేరిట అక్రమ దందాకు తెరలేపాయి. రూ.15,000 ల ప్యాకేజీ తీసుకుని పుట్ట బోయే బిడ్డ లింగం (ఆడో, మగో) చెబుతున్నారనే సమాచారం ఉంది. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక సరిహద్దు మండలాల్లో ఈ అక్రమ లింగ నిర్ధారణ మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోతోంది. పడిపోతున్న ఆడపిల్లల నిష్పత్తి ఈ అక్రమ లింగ నిర్ధారణల కారణంగా జిల్లాలో భ్రూణహత్యలు పెరిగిపోయి, బాలికల సంఖ్య ప్రమాదకరంగా పడిపోతోంది. జిల్లాలో 0–6 ఏళ్ల పిల్లల గణాంకాలను పరిశీలిస్తే.. ప్రతి 1,000 మంది మగపిల్లలకు 873 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు అయిన 934 కంటే చాలా తక్కువగా ఉండటం నిపుణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సీసీటీవీలు లేవు.. రికార్డింగ్లు లేవు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి స్కానింగ్ రూమ్లో ఆడియో, వీడియో రికార్డింగ్తో కూడిన సీసీటీవీ తప్పనిసరిగా ఉండాలి. రెండేళ్ల పాటు రికార్డు భద్రపరచాలి. ప్రతి గర్భిణీకి స్కానింగ్ ముందు ఫారం–ఎఫ్ ను నింపి, ఆధార్, భర్త సంతకం తీసుకోవాలి. ఆన్లైన్ ఎంట్రీ ద్వారా ప్రతి స్కాన్ వివరాలు 24 గంటల్లో పీసీపీఎన్డీటీ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ‘ఇక్కడ లింగ నిర్ధారణ చేయబడదు. అతిక్రమిస్తే 3 ఏళ్ల జైలు, రూ.50 వేల జరిమానా‘ అనే బోర్డు తెలుగు, ఇంగ్లీషులో పెట్టాలి. కానీ జిల్లాలో అనుమతి లేని స్కానింగ్ సెంటర్లు 27 పైనే ఉన్నాయి. పగటిపూట తనిఖీలు ఉంటాయనే భయంతో, రాత్రి వేళల్లో రహస్య ప్రాంతాలలో ఇళ్ల వద్దకే పోర్టబుల్ మెషిన్లను తీసుకువెళ్లి దొంగచాటుగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మదనపల్లెలోని ప్రైవేట్ సెంటర్లలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయించుకోవడానికి గర్భిణీలు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఇక్కడ డబ్బు, పలుకుబడి ఉన్నవారికి గంటలోనే స్కానింగ్ ప్రక్రియ పూర్తవుతోంది. అదే మారుమూల పల్లెల నుంచి వ్యయప్రయాసలకోర్చి మినిమం ఫీజు కట్టి వచ్చే నిరుపేద మహిళలకు మాత్రం అవమానం ఎదురవుతోంది. ఒక రోజు లేదా రెండు రోజులు ముందే అపాయింట్మెంట్ తీసుకున్నప్పటికీ, వారిని 24 గంటల నుంచి 48 గంటల పాటు రోడ్డుపై పడిగాపులు కాయిస్తున్నారు. జిల్లాలో కాసుల కోసంచిన్నారులు బలి రెచ్చిపోతున్న స్కానింగ్ మాఫియా అధికారుల అండతోనే అక్రమ దందా? 8 మంది రేడియాలజిస్టులకు ఉన్నది ఒక్కరే! 95 శాతం మంది గర్భిణులకుప్రైవేటే దిక్కు రాష్ట్ర సగటు కంటే పడిపోయినబాలికల లింగ నిష్పత్తి (873 మాత్రమే) ప్రభుత్వానికి నివేదికలు పంపాం జిల్లాలో మొత్తం 59 స్కానింగ్ సెంటర్లు ఉండగా, ప్రస్తుతం 52 సెంటర్లకు మాత్రమే అను మతులున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వాటిపై 2025– 26 సంవత్సరంలో 18 దాడులు నిర్వహించి, 7 కేసు లు నమోదు చేశాం. 3 స్కానింగ్ సెంటర్లను పూర్తిగా సీజ్ చేశాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రేడియాలజిస్టులు లేకపోవడం పెద్ద సమస్యగా మారిన మాట వాస్తవమే, దీనిపై ప్రభుత్వానికి నివేదికలు పంపాం. లింగ నిర్ధారణను అరికట్టడానికి విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేశాం. – డాక్టర్ లక్ష్మీనరసయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి -
● పోలీసుల కళ్లుగప్పేందుకు ‘హైటెక్’ వ్యూహాలు!
● రాయలసీమలోహైటెక్ పశువుల దందా ● పోలీసుల కళ్లుగప్పి కబేళాలకుమూగజీవాల అక్రమ రవాణా! సాక్షి, అన్నమయ్య: కూటమి సర్కార్లో మూగజీవుల వేదన అరణ్యరోదనగా మారింది. ఒకవైపు తీవ్రమైన కరువు పరిస్థితుల వల్ల తినడానికి మేత, తాగడానికి నీరు లేక రైతులు తమ పశువులను సాకలేక నిస్సహాయ స్థితికి చేరుకుంటే, మరోవైపు ఈ కష్టాలను అక్రమ వ్యాపారులు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. రాయలసీమ వ్యాప్తంగా ఉన్న ప్రధాన మార్కెట్ల నుంచి తక్కువ ధరలకే పశువులను కొనుగోలు చేసి, గుట్టుచప్పుడు కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళలోని కసాయి ఖానాలకు యథేచ్ఛగా తరలిస్తున్నారు. అక్రమ రవాణా మార్గాలు రాయలసీమలోని ప్రధాన కేంద్రాల నుండి పొరుగు రాష్ట్రాలకు ప్రతిరోజూ రెండు ప్రధాన మార్గాల ద్వారా ఈ అక్రమ రవాణా సాగుతోంది. ఒకటి బెంగళూరు మార్గం..వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరు, పులివెందుల, మైదుకూరు, కడప ప్రాంతాల నుండి పశువుల ను సేకరిస్తున్నారు. అక్కడి నుండి వాటిని రాయచోటి, మదనపల్లె మీదుగా కర్ణాటక రాజధాని బెంగళూరుకు తరలిస్తున్నారు. రెండో రూట్లో హిందూపురం, అనంతపురం, కదిరి, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు మీదుగా భారీ కంటైనర్లలో మూగజీవాలను తమిళనాడు, కేరళ సరిహద్దులు దాటిస్తున్నారు. కంటైనర్లలో కుక్కి... ఊపిరాడక పశువుల మృతి! అక్రమార్కులు కేవలం డబ్బు సంపాదన మార్గంగా మార్చుకుని, పశువుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో భారీ కంటైనర్లో సామర్థ్యానికి మించి దాదాపు 70 నుండి 80 కి పైగా ఆవులు, ఎద్దులు, గేదెలను ఎలాబడితే అలా కుక్కుతున్నారు. అవి కదలకుండా ఉండేందుకు గట్టిగా తాళ్లతో కట్టేసి గంటల తరబడి నరకయాతన చూపిస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి పెద్దమండ్యం మీదుగా మంగళవారం ఉదయం వెళ్తున్న 10 భారీ కంటైనర్లను తనిఖీ చేయగా ఈ దారుణం బయటపడింది. ఆయా వాహనాలలో మొత్తం 510 పైగా మూగజీవాలను అక్రమంగా తరలిస్తుండగా, గాలి కూడా ఆడని రీతిలో ఒకదానిపై ఒకటి కుక్కడం వల్ల ఊపిరాడక పలు పశువులు కంటైనర్లలోనే మృత్యువాత పడటం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. చెక్ పోస్టుల వద్ద ‘అమ్యామ్యాలు’.. ఈ అక్రమ రవాణా అంతా అధికారులకు తెలిసినా ఎవరికీ తెలియనట్లుగా సాగిపోతుండటం గమనార్హం. జిల్లా సరిహద్దుల్లోని చెక్పోస్టుల వద్ద పోలీసులు, సంబంధిత అధికారులు అక్రమార్కుల వద్ద ’చేయి తడు పుకుంటూ’ వాహనాలను వదిలేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. నోరు లేని మూగజీవాలకు విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నా పరిరక్షించా ల్సిన ప్రభుత్వ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారని జీవకారుణ్యమూర్తులు మండిపడుతున్నారు. ఇప్ప టికైనా ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టి ఈ మాఫియా ఆటకట్టించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కంటైనర్లో కుక్కి ఆవులను తరలిస్తున్న దృశ్యం అధికారులకు చిక్కకుండా ఉండేందుకు ఈ అక్రమ రవాణా ముఠాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నాయి. పశువుల కంటైనర్ కంటే ఒక కిలోమీటరు ముందే ఒక ‘పైలట్ వాహనం’ (కార్ లేదా బైక్) రోడ్డుపై వెళ్తుంటుంది. మార్గమధ్యంలో పోలీసులు లేదా అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు కనిపిస్తే, వెంటనే వెనుక వస్తున్న కంటైనర్ల డ్రైవర్లను అప్రమత్తం చేసి దారి మళ్లిస్తారు. రవాణాకు ఉపయోగిస్తున్న ప్రతి కంటైనర్కు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్తో పాటు వాహనం ముందు భాగంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రధాన సూత్రధారులు ఆఫీసుల్లో కూర్చుని లైవ్లో రోడ్డు కదలికలను గమనిస్తూ అప్రమత్తం అవుతున్నారు. -
పరిశ్రమల స్థాపనలో యువతకు ఉపాధి
సాక్షి, మదనపల్లె: జిల్లాలో పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి సంబంధించిన అనుమతుల ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నట్టు కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నా రు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగిల్ డెస్క్ విధానంలో అనుమతులకు శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. గత 35 రోజుల్లో పరిశ్రమల స్థాపన, విస్తరణ, రెన్యూవల్ సంబధిత 27 దరఖాస్తులు అందగా 16కు పరిష్కారం ఇచ్చామన్నారు. పరిశ్రమల ప్రోత్సాహం కింద రూ.3.76 కోట్ల రాయితీ మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కింద 74 యూనిట్లకు రూ.2.26 కోట్ల మార్జిన్ మనీ విడుదల చేసినట్లు తెలిపారు. పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కె. కష్ణ కిశోర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ వై.వి.కే. సుబ్బారావు పాల్గొన్నారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ -
మదనపల్లెకు వ్యాపారుల క్యూ
సాక్షి, మదనపల్లె: మదనపల్లె టమాట నాణ్యతగా ఉండడంతో ఇక్కడ కొనుగోలు చేసేందుకు ఒరిస్సా, పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యాపారులు క్యూ కట్టారు. ఈ రాష్ట్రాలకు అవసరమైన స్థాయిలో టమా ట కొనుగోలు చేసి తరలించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా టమాటా ధర ఆశాజనకంగా పెరిగింది. మార్కెట్కి వస్తున్న దిగుబడి తగ్గినప్పటికీ ధరల విషయంలో ప్రభావం చూపడం లేదు. రోజు రోజుకు మదనపల్లె మార్కెట్లో టమాట ధర పెరుగుతూ వస్తోంది. సోమవారం ఏ గ్రేడ్ టమోటా అత్యధిక ధర కిలో రూ.33 పలికింది. విక్రయానికి 940 టన్నుల టమాట వచ్చింది. మంగళవారం కూడా కిలో ధర రూ.33 కొనసాగింది. విక్రయానికి 902 టన్నుల టమాటా వచ్చింది. కాగా మంగళవారం మదనపల్లె మార్కెట్ నుంచి ఏడు రాష్ట్రాలకు టమాట ఎగుమతి అయ్యింది. ఛత్తీస్గఢ్, తెలంగాణ, పాండిచ్చేరి, తమిళనాడు, కేరళం, పశ్చిమబెంగాల్, ఒరిస్సా రాష్ట్రాలకు, ఏపీలోని అనకాపల్లి, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఏలూరు, కాకినాడకు ఎగుమతి అయింది. ఇందులో పశ్చిమ బెంగాల్, ఒరిస్సా కు చెందిన వ్యాపారులు నేరుగా ఇక్కడికి వచ్చి వేలంపాటల్లో పాల్గొని టమాటను కొనుగోలు చేశారు. కొన్న టమాటలో పశ్చిమబెంగాల్ కు 150 టన్నులు, ఒరిస్సాకు వంద టన్నులు ఎగుమతి చేశారు. కిలో రూ.33కు పెరిగిన టమాట ధర ఏడు రాష్ట్రాలకు ఎగుమతి -
జాతీయ స్థాయిలో సత్తాచాటిన యువకుడు
పెద్దతిప్పసముద్రం: మండలంలోని మల్లెల గ్రామానికి చెందిన జుట్టు రవితేజ, చాముండేశ్వరి దంపతుల కుమారుడు జే.సాయితేజ జేఈఈ అడాన్స్డ్ పరీక్షల్లో ఎస్సీ కేటగిరీ కింద జాతీయ స్థాయిలో 189వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. యువకుడిని గ్రామస్తులు అభినందించారు. వేంపల్లె: ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ (ఆర్కే వ్యాలీ) క్యాంపస్ నూతన డైరెక్టర్గా ప్రొఫెసర్ విజయ్ ప్రకాష్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్గా పనిచేస్తున్న కుమార స్వామి గుప్తా బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఐఐటీ ఢిల్లీలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న జి.విజయ్ ప్రకాష్ను నూతన డైరెక్టర్గా నియమించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ట్రిపుల్ ఐటీలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న విభాగాధిపతులతో సమావేశమయ్యారు. సాక్షి, మదనపల్లె: వ్యవసాయ ఉత్పత్తుల రవాణా పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ–ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానాన్ని జూలై ఒకటి నుంచి అమలు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి టి.త్యాగరాజు తెలిపారు. మార్కెట్ యార్డుల పరిధిలో కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించే సమయంలో సంబంధిత వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా ఆన్లైన్లో ఈ–ట్రాన్స్పోర్ట్ పర్మిట్ జారీ చేస్తుందని తెలిపారు. ఈ విధానంతో మార్కెట్ ఫీజు ఎగవేత ఉండదని తెలిపారు. ఉత్పత్తుల కొనుగోలు, రవాణా ప్రక్రియపై సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. వలంటరీ ట్రేడర్లు, రవాణాదారులు సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఈ–ట్రాన్స్పోర్ట్ పర్మిట్ పొందిన తర్వాత మాత్రమే వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ–ట్రాన్స్పోర్ట్ పర్మిట్ వివరాల కోసం రైతులు, వ్యాపారులు మార్కెట్ కమిటీ కార్యదర్శిని సంప్రదించాలని కోరారు. -
● రవాణాను అడ్డుకున్న ప్రజలు
పెద్దమండ్యం/గాలివీడు: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం పెద్దమండ్యం మండల కేంద్రంలో మంగళవారం పశువుల అక్రమ రవాణా కలకలం రేపింది. 10 కంటైనర్లలో 510 పశువులను తరలిస్తుండగా.. స్థానిక యువకులు అడ్డుకున్నారు. రాష్ట్రంలోని అనంతపురం, హిందూపురం, గోరంట్ల, పత్తికొండ తదితర ప్రాంతాల నుంచి ఈ పశువుల రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడి రైతులు, వ్యాపారస్తుల నుంచి కొనుగోలు చేసి తరలించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లను వినియోగిస్తున్నారు. వీటి రవాణా వెనుక బడాడాన్ ఉన్నట్లు తెలుస్తోంది. కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువు ప్రాంతానికి చెందిన ఒకరు సూత్రధారిగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక యువకులు తంబళ్లపల్లె పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి కంటైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కంటైనర్లలో 165 ఎద్దులు, 345 దున్నపోతులు, ఎనుములు ఉన్నాయి. వీటిని పుంగనూరు, తమిళనాడు, కేరళ ప్రాంతాలలో జరిగే సంతలకు తరలిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వాటికి రాయచోటి సమీపంలోని మామిడి తోటలో వసతి, సంరక్షణ కల్పించారు. అలాగే గాలివీడు మండల కేంద్రంలోని వెలిగల్లు ప్రాజెక్టు సమీపాన అక్రమంగా తరలిస్తున్న గోవులను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. -
‘బాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్లు ఆవిష్కరణ
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్లను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డి, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్రెడ్డి, పార్టీ సీఈసీ సభ్యులు కె. సురేష్ బాబు, అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, జెడ్పీ ఛైర్మెన్ రామగోవిందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ సక్రమంగా అమలు చేయలేదన్నారు. ‘బాబూ ష్యూరిటీ, మోసం గ్యారెంటీ’ అనే నినాదాన్ని నిజం చేసి, ఆరు కోట్ల మంది ప్రజలను మోసం చేశారని విమర్శించారు. -
దగా డీఎస్సీపై యువత ధ్వజం
● ప్రతిభకు ఉద్యోగాలు ఇవ్వకుంటే పరీక్షలెందుకు ? ● ఉద్యోగాలను అంగడి సరుకులా అమ్ముకుంటారా ! ● మదనపల్లె కలెక్టరేట్ ఎదుట హోరెత్తిన యువజన నినాదం ● డీఎస్సీ అక్రమాలపై తీవ్ర ఆగ్రహం ● మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ సాక్షి, మదనపల్లె: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు సర్కార్ ప్రతిభకు పాతరేసి, ఉద్యోగాలను అమ్ముకోవడంపై యువతలో నిరసన పెల్లుబికింది.అక్రమాల డీఎస్సీపై చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగులను వంచించిన ప్రభుత్వం తక్షణమే డీఎస్సీను రద్దు చేసి, బాధ్యులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని నినాదాలతో హోరెత్తించింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్ పిలుపుతో సోమవారం యువజన విభా గం నిర్వహించిన చలో కలెక్టరేట్ కార్య క్రమం మదనపల్లెలో విజయవంతమైంది. మెగా డీఎస్సీ నియామకాలు అక్రమాలమయమని.. వాస్తవాలు కళ్లకు కనిపిస్తున్నా ప్రభుత్వం ఇంకా నటిస్తోందని, తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. మీరు నిర్వహించింది ప్రతిభగల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే డీఎస్సీ కాదని, అది ఉద్యోగాలను అమ్మకానికి పెట్టిన దళారు ల సెలక్షన్ కమిటీ అని నినాదాలతో హోరెత్తించింది. ప్రదర్శన, ధర్నా : వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యరంలో చేపట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమం కోసం వివిధ ప్రాంతాల నుంచి పార్టీ యువజన శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మిషన్ కాంపౌండ్ నుంచి పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, స్థానిక సమన్వయకర్త నిసార్ అహ్మద్, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిద్దింటి కిషోర్లతో ర్యాలీ ప్రారంభమైంది. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలతో కలెక్టరేట్ వద్దకు చేరుకున్నా రు. అక్కడ పోలీసులు అడ్డుకుని గేట్లు వేశారు. తర్వాత కొద్దిమందిని లోపలికి పంపించారు. తర్వాత గంటకుపైగా కలెక్టరేట్ ఎదుట యువజన విభాగం శ్రేణులు, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు ధర్నా నిర్వహించా రు. అనంతరం డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ పీజీఆర్ఎస్ విధుల్లో ఉన్న ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ మాధవకృష్ణారెడ్డికి నేతలు వినతి పత్రం అందజేశారు.పరిశీలకురాలు అనీషారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నేతలు శివప్రసాద్రెడ్డి, కిషోర్, కిశోర్కుమార్రెడ్డి, హర్షవర్దన్రెడ్డి, దావూద్, కౌషిక్, వాసుదేవరెడ్డి, షేక్ ఇర్ఫాన్, ఖాదర్, హేమంత్, ద్వారకనాధరెడ్డి, పవన్, నాగరాజు రెడ్డి, ఆనంద్, శరత్ రెడ్డి, అశోక్, యూనిస్, ఫిరోజ్, ఆనంద్ రెడ్డి, చక్రధర్, గౌతం, భాస్కర్, బాలాజీ పాల్గొన్నారు. -
క్రికెట్ బెట్టింగ్లో ప్రధాన బుకీ అరెస్ట్
కడప అర్బన్ : జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప ఇన్చార్జ్ డీఎస్పీ ఇ.బాలస్వామిరెడ్డి పర్యవేక్షణలో కడప తాలూకా పీఎస్ సీఐ పి.నరసింహరాజు ఆధ్వర్యంలో ఎస్ఐ మహమ్మద్రఫీ తమ సిబ్బందితో కలిసి ప్రధాన క్రికెట్ బుకీ ఇందిరెడ్డి జనార్ధన్రెడ్డిని ఆదివారం రాత్రి అక్కాయపల్లి శాస్త్రి నగర్లో అరెస్ట్ చేశారు. సోమవారం కడప డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కడప ఇన్చార్జ్ డీఎస్పీ ఇ.బాలస్వామిరెడ్డి వివరాలు వెల్లడించారు. కడప నగరంలోని అక్కాయపల్లె శాస్త్రినగర్లో ప్రధాన నిందితుడు ఇందిరెడ్డి జనార్ధన్రెడ్డి ఇంటిలో కడప తాలూకా సీఐ నరసింహరాజు తమ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు సంబంధించిన ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా అరెస్ట్ చేశారు. నిందితుడు తన ల్యాప్టాప్, మొ బైల్ ఫోన్లు, వై–ఫై రూటర్ ద్వారా తన సబ్ బుకీలైన వారికి యూజర్ ఐడీలు, యూఆర్ఎల్ లింకులు పంపించి, వాటి ద్వారా ప్రజల నుంచి డబ్బును స్వీకరిస్తూ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. అలాగే కస్టమర్లను ప్రోత్సహించేందుకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేని 12 విలువైన మద్యం బాటిళ్లు అక్రమంగా నిల్వ వుంచినట్లు గుర్తించారు. ఈ క్రమంలో నిందితుడి వద్ద నుంచి రూ.7,00,550 నగదు, ల్యాప్టాప్, ఐదు మొబైల్ ఫోన్లు, ఒక వైఫై రూటర్, నగదు కౌంటింగ్ మిషన్, 12 ఖరీదైన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఇందిరెడ్డి జనార్ధన్రెడ్డిని నడిపిస్తున్న ప్రధాన నిర్వాహకుడు, మోడమీదపల్లెకు చెందిన అంబవరం మాధవరెడ్డి అలియాస్ మోడమీదపల్లె మాధవరెడ్డి, పులివెందులకు చెందిన నరేష్, గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన గోల్డ్ శేఖర్, చెన్నూరుకు చెందిన గుగ్గిళ్ల చాణక్య, రెడ్డెయ్యరెడ్డి, హరినాథ్ అలియాస్ శ్రీహరి, ఆమంచి కళ్యాణ్ చక్రవర్తి, షేక్ ఇంతియాజ్, జయప్రకాష్ అలియాస్ చంటితోపాటు ఇంకా కొంతమంది ఉన్నట్లు వెల్లడైందని డీఎ స్పీ తెలిపారు. కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. -
దొంగ అనుకుని చితకబాదిన గ్రామస్తులు
పుంగనూరు : దొంగ అనుకుని ఓ వ్యక్తిని గ్రామస్తులు చితకబాదిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఆదివారం మండలంలోని దిగువపల్లెలో బోరుబావుల వద్ద కేబుల్ వైర్లు దొంగతనం చేస్తున్నాడని రామసముద్రం మండలం తిరుమలరెడ్డిపల్లెకి చెందిన బాబాసాహెబ్ను గ్రామస్తులు వైర్లు, కర్రలతో తీవ్రంగా చితకబాదారు. ఈ దాడిలో బాబాసాహెబ్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ను ఢీకొన్న కారుమదనపల్లె టౌన్ : బైక్పై వెళ్తున్న రైతును ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ములకలచెరువు సీఐ ప్రతాప్ ఆదివారం మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం గందోడిపల్లికి చెందిన రైతు రెడ్డప్పరెడ్డి(55) అన్నమయ్య జిల్లా పి.కొత్తకోటలో వ్యాపారులు అప్పుగా తీసుకున్న ఎరగ్రడ్డల డబ్బు వసూలు చేసుకుని రావడానికి బైక్పై బయలుదేరాడు. మార్గంమధ్యలోని పులికల్లు మిట్ట వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రైతు రెడ్డప్పరెడ్డిని ములకలచెరువు 108 సిబ్బంది హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైతు మృతి -
ఉపాధి కూలీని కాటేసిన పాము
పెద్దమండ్యం : పాముకాటుతో ఉపాధి కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని దిగువపల్లె పంచాయతీ తుమ్మలవంకతండాలో ఆదివారం జరిగింది. వివరాలలోకి వెళితే.. తుమ్మలవంకతండా సమీపంలో యర్రకోటాల బండ వద్ద జలధార ఫీడర్ ఛానల్ పూడికతీత పనులను తండాకు చెందిన కూలీలు చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఈ పనులు చేస్తుండగా మూడే వెంకటరమణ నాయక్ భార్య సుశీలమ్మ(65) పాముకాటుకు గురైంది. దీంతో ఆమె అక్కడే కుప్పకూలడంతో కూలీలు హుటాహుటిన చికిత్సల కోసం తంబళ్లపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్ ఆమె అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. పాముకాటుతో కూలీ మృతి చెందడంతో తండాలో విషాదం నెలకొంది. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఉపాధి కూలీలు అధికారులను కొరారు. శివాలయంలో కొండ చిలువ కలకలంముద్దనూరు : మండల పరిధి చింతకుంట గ్రామంలోని కొండపై వెలసిన శివాలయంలో ఆదివారం కొండ చిలువ కలకలం సృష్టించింది. కొండచిలువను చూసిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అనంతరం గ్రామస్తులే కొండచిలువను కొండలో వదిలినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.వృద్ధురాలి మృతి -
హార్సిలీహిల్స్పై సండే సందడి
సాక్షి, మదనపల్లె : బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ ఆదివారం సందర్శకులతో కిటకిటలాడింది. కుటుంబాలతో వచ్చిన పర్యాటకులు సందడి చేస్తూ.. పిల్లలు, పెద్దలు ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. విద్యార్థులకు సెలవులు ఉండటం, బక్రీద్ అనంతరం వచ్చిన ఆదివారం కావడంతో రద్దీ అధికంగా నెలకొంది. పర్యాటకులు ప్రకృతి సందర్శన ప్రాంతాలైన గాలిబండ వ్యూ పాయింట్లు, అటవీశాఖ పర్యావరణ సముదాయంలో ప్రకృతి అందాలను తిలకించారు. అటవీశాఖ పార్కులో చిన్నారులు సందడి చేశారు. ప్రకృతి అధ్యయన కేంద్రం తిలకించి అటవీ విషయాలను తెలుసుకున్నారు. జిల్లాతోపాటు శ్రీ సత్యసాయి, అనంతపురం, కడప, చిత్తూరు, కర్ణాటక, తమిళనాడుకు చెందిన పర్యాటకులు సేద తీరేందుకు వచ్చారు. రద్దీ కారణంగా కొండ రోడ్లపై వాహనాలు బారులు తీరాయి. రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. -
జిల్లా హాకీ జట్టు ఎంపిక
మదనపల్లె సిటీ: స్థానిక బీటీ కాలేజీ హాకీ క్రీడా మైదానంలో ఆదివారం జిల్లా సీనియర్ పురుషుల హాకీ జట్టు ఎంపికలు జరిగాయి.జిల్లా నలుమూలల నుంచి 25 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపిక కమిటీలో జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శివప్రసాద్, సీనియర్ హాకీ క్రీడాకారుడు ఆసిఫ్ సభ్యు లుగా వ్యవహరించారు. తుది జట్టు వచ్చేవారం ప్రకటించనున్నట్లు తెలిపారు. ఎంపికై న వారు జూన్ 12 నుంచి 15 వరకు సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగే రాష్ట్ర సీనియర్ హాకీ ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. కార్యక్ర మంలో డీఎస్డీఓ చంద్రశేఖర్, హాకీ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జలజ, సీనియర్ హాకీ క్రీడాకారుడు హితేష్రావు, ఆసీఫ్, పిట్టు, రెడ్డి పాల్గొన్నారు. సాక్షి, మదనపల్లె: జిల్లాలో విద్యుత్ వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం నిర్వహిస్తున్న డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం దృష్టికి తీసుకురావాలని డిస్కం జిల్లా ఎస్ఈ ఆడేపూడి సోమశేఖర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఉదయం 8.30 నుంచి 9:30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమానికి వినియోగదారులు ఫోన్ ద్వారా తమ సమ స్యలను తెలియజేయాలని కోరారు. 94408 17449 నంబర్కు ఫోన్ చేసి విద్యుత్ సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కురబలకోట: అంగళ్లులోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయిలో టాప్ 20 కళాశాలగా ట్రిపుల్ ఏ రేటింగ్ లభించినట్లు ప్రిన్సిపాల్ రామనాథన్ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఎన్పీటీఈఎల్ ఆన్లైన్లో నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థులు, అధ్యాపకులు 7484 మంది ప్రతిభ కనపరిచినట్లు తెలిపారు. కళాశాలకు టిపుల్ ఏ రేటింగ్తో పాటు టాప్ 20లో జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో ఒకటో ర్యాంకు గుర్తింపు లభించినట్లు చెప్పారు. ఎన్పీటీఈఎల్ ద్వారా కళాశాలకు విశిష్ట గుర్తింపు లభించడం పట్ల చాన్స్లర్ డాక్టర్ నాదెళ్ల విజయ భాస్కర్ చౌదరి హర్షం వ్యక్తం చేశారు. -
నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది
మదనపల్లె టౌన్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రైతును సకాలంలో ఆసుపత్రికి తరలించడంతోపాటు, ఆయన వద్ద ఉన్న సుమారు లక్ష రూపాయల నగదును కుటుంబ సభ్యులకు అప్పగించి మొలకలచెరువు 108 సిబ్బంది తమ నిజాయితీని చాటుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం గందోడిపల్లికి చెందిన రైతు రెడ్డిప్పరెడ్డి(55) అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలోని వ్యాపారులకు అప్పుగా ఇచ్చిన ఎరగ్రడ్డల డబ్బు వసూలు చేసుకునేందుకు వస్తుండగా, మార్గ మధ్యంలోని పులికల్లు మిట్ట వద్ద కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న మొలకలచెరువు 108 సిబ్బంది మధుసూదనరెడ్డి, శబరీష్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ రైతు రెడ్డిప్పరెడ్డి మృతి చెందాడు. ప్రమాద స్థలంలో రైతు వద్ద లభించిన సుమారు లక్ష రూపాయల నగదును 108 సిబ్బంది భద్రపరిచి, మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు కృషి చేయడమే కాకుండా, నగదును నిజాయితీగా అప్పగించిన 108 సిబ్బందిని స్థానికులు, బాధిత కుటుంబీకులు అభినందించారు. -
అయ్యో.. అప్పుడే నూరేళ్లు నిండాయా!
● కారు ఢీకొని బాలుడి మృతి ● కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులుకేవీపల్లె : ‘అయ్యో బిడ్డా.. అప్పుడే నీకు నిండు నూరేళ్లు నిండాయా’ అంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మండలంలోని కలికిరివాండ్లపల్లె వద్ద ఆదివారం కారు ఢీకొని ఓ బాలుడు మృతి చెందాడు. వివరాలిలా వున్నాయి. మదనపల్లెకు చెందిన ప్రసాద్ కుమారుడు త్రినేష్(6) కలికిరివాండ్లపల్లెలోని బంధువుల ఇంటికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం త్రినేష్ రోడ్డుపైకి రావడంతో పీలేరు నుంచి రాయచోటి వైపు వెళుతున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ త్రినేష్ను చికిత్స నిమిత్తం 108 వాహనంలో పీలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అక్కడికి బంధువులు పెద్ద ఎత్తున చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మల్లయ్యకొండకు బస్సులు
మదనపల్లె సిటీ: తంబళ్లపల్లె సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. సోమవారం మదనపల్లె డిపో నుంచి ఉదయం 6, 6.30 గంటలకు బస్సులు బయలుదేరతాయన్నారు. తంబళ్లపల్లె రాగిమాను సర్కిల్ నుంచి సాయంత్రం వరకు షటిల్ సర్వీసులు నడుస్తాయని తెలిపారు. సాక్షి, మదనపల్లె: స్థానిక కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం(పీజీఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తామని తెలిపారు. ప్రజలు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కూడా ఫిర్యాదులను అధికారులు స్వీకరిస్తారని తెలిపారు.సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆన్లైన్లో కూడా ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది.అమ్మా..కరుణించమ్మా అని వేడుకున్నారు. అర్చకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి చీరసారె సమర్పించి భక్తి చాటు కున్నారు. కర్ణాటక, తమిళనాడుతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. -
మాలేపాడులో రోడ్డు దిగ్బంధంతో ఉద్రిక్తత
మదనపల్లె టౌన్ : మదనపల్లి మండలంలోని మాలేపాడులో టీడీపీలోని రెండు గ్రూపుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. దారి, భూ వివాదాల కారణంగా టీడీపీలోని ఓ వర్గానికి చెందిన మధుకర్రెడ్డిని పొలాల్లో ఉండే కాయలు కోయనీయలేదని.. అదే పార్టీకి చెందిన మరో వర్గంలోని జాఫర్ బాషా దారి నిలేశాడు. ఇప్పుడు మధుకర్రెడ్డి రహదారిని మూసి జాఫర్ బాషాను రాకుండా రోడ్డు దిగ్బంధం చేయడంతో వివాదం తలెత్తి ఆదివారం ఉదయం రెండు వర్గాల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. దీంతో మాలేపాడులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు మాలేపాడుకు చేరుకుని గొడవలు జరగకుండా సర్ది చెప్పి రెండు వర్గాలకు దారి సమస్య పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో మాట్లాడించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో వివాదం సద్దుమణిగింది. -
ఓట్ల తొలగింపును అడ్డుకుంటాం
రాయచోటి అర్బన్: ఓటర్ల నమోదు ప్రక్రియలో బీఎల్ఏలు కీలకమని, ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమేనని, అక్రమంగా చేస్తున్న ఓట్ల తొలగింపును అడ్డుకుంటామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్)లో బూత్ లెవల్ ఏజెంట్ల(బీఎల్ఏ)ల పాత్ర కీలకమైనదన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అక్రమంగా చేపట్టిన ఓట్ల తొలగింపు ప్రక్రియను అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓట్లు జాబితాలో ఉండేలా నిబద్ధతతో పని చేయాలని బీఎల్ఏలకు సూచించారు. ఇతర పార్టీలు ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులతో అభ్యంతరాలు ఉంటే తక్షణమే నిబఽంధనల ప్రకారం సంబంధిత బూత్ లెవల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అర్హుల ఓటు తొలగకుండా, అనర్హుల పేర్లు చేర్పులు జరగకుండా చూడాలన్నారు. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఫారం–6,7 తో పాటు జాబితాలో దొంగ ఓటర్లను ఎలా గుర్తించాలి, అర్హత ఉన్నప్పటికీ ఓటర్లను ఉద్దేశపూర్వకంగా ఎలా తొలగిస్తారు అనే విషయాలను స్క్రీన్పై వివరించారు. ప్రతి ఓటు ఎంతో విలువైనది, ఒక్క గ్రామంలో ఒక్క ఓటు, మండలం, నియోజకవర్గ స్థాయికి చేరేసరికి వేలల్లో మార్పు చూపుతుందని, అది గెలుపును ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఓటర్ల తుది జాబితా విడుదల అయ్యేవరకు జాగ్రత్తగా, బాధ్యతగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలనను కొనసాగిస్తోందని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ ఇటీవల నిర్వహించిన మహానాడులో వైఎస్ జగన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారనే కానీ అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి సారించ లేదన్నారు. రెండేళ్ల పాలనలో వారు చెప్పుకునేదానికి ఏ సంక్షేమ, అభివృద్ధి పథకం లేవన్నారు. జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని తీసేసి, ఈ ప్రాంత ప్రజల కలలను చిదిమివేశారని ఆయన ధ్వజమెత్తారు. ● త్వరలో రాబోయే స్థానిక ఎన్నికలను సమష్టిగా ఎదుర్కొందామని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులకు ఏ కష్టం వచ్చినా తోడుగా, అండగా ఉంటామని శ్రీకాంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. గత జగన్ ప్రభుత్వ పాలనను బేరీజు వేసుకుని ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్, రాయచోటి మున్సిపల్ మాజీ చైర్మన్ ఫయాజ్ బాషా, లక్కిరెడ్డిపల్లె మాజీ ఎంపీపీ మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, రాయచోటి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు , మాజీ ప్రజాప్రతినిధులు , బూత్ కమిటీ ఏజంట్లు పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలి అర్హులైన వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను పోగొట్టుకోకుండా చూడాలి. ఎస్ఐఆర్ జరిగిన ఉత్తరప్రదేశ్లో 2.89 కోట్లు, మధ్యప్రదేశ్లో 34లక్షలు, గుజరాత్లో 68లక్షలు, తమిళనాడులో 74లక్షలు, పశ్చిమబెంగాల్లో 91లక్షల ఓట్లు తొలగించారు. అందువల్ల మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది. దీన్ని బీఎల్ఏలు క్షుణ్ణంగా పరిశీలించి తగిన విధంగా ఎదుర్కోవాలి. – ఆకేపాటి అమరనాథరెడ్డి, వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు బీఎల్ఏలు సైనికుల్లా పని చేయాలి వైఎస్సార్సీపీ బీఎల్ఏలు నెల రోజుల పాటు సైనికుల్లా పని చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ అనుంబంధ సంఘాలతో సమన్వయం చేసుకుని పార్టీ మద్దతుదారుల ఓట్లు తొలగకుండా కృషి చేయాలి. ఇప్పటి వరకు గమనిస్తే ఎస్ఐఆర్ జరిగిన అన్ని రాష్ట్రాల్లో భారీగా ఓట్ల తొలగింపు జరిగింది. రాబోవు అన్ని రకాల ఎన్నికలను సమర్థఽవంతంగా ఎదుర్కొనేందుకు కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలి. – సురేష్ బాబు, వైఎస్సార్ సీపీ రాజంపేట పార్లమెంటరీ పరిశీలకులు ఎస్ఎస్ఆర్ స్పెషల్ సమ్మరీ రివిజన్ , ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ల గురించి రీసోర్స్ పర్సన్ , ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి వివరించారు. ఎస్ఐఆర్లో రెండు ఫేజ్లు ప్రీ ఎన్యూమరేషన్, ఎన్యూమరేషన్లు ఉంటాయన్నారు. ప్రీ ఎన్యూమరేషన్లో బీఎల్ఓలు 2025 ఓటరు జాబితాను 2002 ఓటరు జాబితాతో అనుసంధానం చేస్తారని తెలిపారు. ఎన్యూమరేషన్లో 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ అయిన వారికి ఫారం వివరాలతో ఫ్రీ ఫిల్డ్గా వస్తుందని, వారు కేవలం ఫొటో అంటించి , సంతకం చేసి బీఎల్ఓకు ఇవ్వాలన్నారు. మ్యాపింగ్ కాని వారికి వారు ఎన్యూమరేషన్ ఫారంలో వివరాలు నింపి , బంధుత్వ ఆధారాలు, అవసరమైన పత్రాలు సమర్పించాలన్నారు. మ్యాపింగ్ నిరూపించుకోలేని వారు ప్రభుత్వం నిర్దేశించిన 13 పత్రాలలో ఏవైనా రెండు సమర్పించాలన్నారు. బీఎల్ఏలు, స్థానిక నాయకులు ప్రతి ఇంటినీ సందర్శించి , ఓటర్లలందరికీ పాస్ పోర్టు సైజ్ ఫొటోతో పాటు గుర్తింపు కార్డును రెడీగా పెట్టుకోమని చెప్పాలని ఆమె సూచించారు. బీఎల్ఏ రోజుకు 50 ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించవచ్చునన్నారు. అంతకు ముందు వైఎస్సార్సీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి, అన్నమాచార్య కరస్పాండెంట్ ఎల్లారెడ్డి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కమిటీ సభ్యులు జల్లా సుదర్శన్ రెడ్డి, యధుభూషణ రెడ్డి, రాయలసీమ ఇన్చార్జి నరసింహారెడ్డి, సర్కాజీ, చిదంబర్ రెడ్డి తదితరులు బీఎల్ఏలకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో బీఎల్ఏలే కీలకం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి -
●పట్టుబడిన బియ్యమే సాక్ష్యం
సాక్షి, మదనపల్లె: జిల్లా నుంచి కర్ణాటకకు నిత్యావసర బియ్యం పక్కదారి పడుతోంది. గతంలో జరిగిన దాడుల్లో ఈ విషయం వెలుగుచూసింది. అయితే దీనిపై జిల్లా స్థాయిలో దాడులు, తనిఖీలు తగ్గడమేకాక కఠినమైన చర్యలు లేకపోవడంతో అక్రమంగా తరలిపోతున్న బియ్యాన్ని కట్టడిచేసే మార్గాలు లేకపోతున్నాయి. ప్రధానంగా మదనపల్లె, బి.కొత్తకోట, బురకాయలకోట కేంద్రాలుగా రేషన్బియ్యం దందా దర్జాగా సాగుతోంది. పేదలకు నిత్యవసర చౌకడిపోల ద్వారా కిలో బియ్యం రూపాయికే పంపిణీ చేస్తున్నారు. ఈ బియ్యం అక్రమ వ్యాపారులకు ప్రధాన వనరుగా మారింది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యాన్ని కొనుగోలు చేసి వాటిని కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాజమార్గంలో చేస్తున్న అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాల్సిన విజిలెన్న్స్, పౌరసరఫరాల శాఖలు నిర్లిప్తత ప్రదర్శిస్తున్నాయి. ఫలితంగా అక్రమ వ్యాపారులు రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. వ్యక్తుల ద్వారా సేకరణ మదనపల్లె, బి.కొత్తకోటల్లో అక్రమ రేషన్బియ్యం నిల్వ గోదాములు నిర్వహిస్తుండటం వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని బంగార్పేట, కోలారు ప్రాంతాలకు, బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు మండలానికి చెందిన వ్యక్తులు తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల నుంచి రేషన్బియ్యాన్ని సేకరిస్తుంటారు. అక్రమ బియ్యం రవాణా చేస్తున్న వ్యాపారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల ద్వారా ఆయా ప్రాంతాలనుంచి పేదలకు రేషన్బియ్యం కిలోకు రూ.10 నుంచి రూ.14 వరకు చెల్లిస్తామని ఆశచూపి సేకరిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. సేకరించిన బియ్యాన్ని ఆటోలు, రవాణా వాహనాల్లో బి.కొత్తకోట, మదనపల్లెల్లోని గోదాములకు తరలించి, రాత్రివేళల్లో కర్ణాటక సరిహద్దును దాటించి ఆ రాష్ట్రంలోని బంగారుపేట మిల్లులకు తరలిస్తున్నట్టు సమాచారం. అక్కడి మిల్లుల్లో బియ్యానికి పాలిష్ చేసి కొత్త బ్రాండ్ల పేరుతో ప్యాకింగ్ చేసి వాటిని తిరిగి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకొంటున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో 4,29,269 రేషన్ కార్డులు జిల్లాలో మొత్తం 4,29,269 నిత్యావసర రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో మదనపల్లె నియోజకవర్గంలో 89,668 కార్డులు, పీలేరు నియోజకవర్గంలో 88,589, పుంగనూరు నియోజకవర్గంలో 68,410, రాయచోటి నియోజకవర్గంలో 96,626, తంబళ్లపల్లె నియోజకవర్గంలో 85976 కార్డులు ఉన్నాయి. అలాగే జిల్లాలో మొత్తం 992 నిత్యావసర చౌక ధరల డిపోలు నడుస్తున్నాయి. వాటిలో మదనపల్లెలో 164, పీలేరులో 258, పుంగనూరులో 159, రాయచోటిలో 208, తంబళ్లపల్లెలో 203 చౌక డిపోలు ఉన్నాయి. ఈ రేషన్ కార్డులకు ప్రతినెల చౌక డిపోల ద్వారా 6481.789 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. కనుమరుగైన దాడులు ప్రభుత్వం పంపిణీ చేసే నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వలు, రవాణాపై విజిలెన్స్, పౌరసరఫరాలశాఖ బృందాల దాడులు కరువయ్యాయి. ఒకవేళ దాడులు చేసిన చౌకడిపోల్లో నామమాత్రపు తనిఖీలతో సరిపెట్టేస్తున్నారు. బి.కొత్తకోటలో గతవారం ఒక చౌకడిపో నుంచి బియ్యాన్ని వాహనంలో తరలిస్తున్న వ్యవహారం బట్టబయలైంది. ఇలాంటి ఘటనలు సాగుతున్నా దాడులు లేవు. దీనిపై సరైన చర్యలు చేపట్టాల్సి ఉంది. మదనపల్లె, బి.కొత్తకోట కేంద్రాలుగా కర్ణాటకకు భారీగా తరలిపోతున్న సబ్సిడీ బియ్యం సరిహద్దులో తనిఖీలు నామమాత్రం దాడులు మరచిన విజిలెన్స్, పౌరసరఫరాలశాఖ మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలు కర్ణాటక సరిహద్దులో ఉన్నాయి. మదనపల్లె రూరల్, రామసముద్రం, బి.కొత్తకోట, పెద్దతిప్ప సముద్రం మండలాల సరిహద్దుల్లో గతంలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. వీటిని తొలగించడంతో ఇప్పుడు ఈ మార్గాల్లో వెళ్లే అక్రమ బియ్యం వాహనాలను తనిఖీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. మదనపల్లె సమీపంలో చీకలబైలు వద్ద ఎకై ్సజ్, మార్కెటింగ్శాఖ చెక్ పోస్టులు ఉన్నప్పటికీ పౌరసరఫరాల శాఖ చెక్ పోస్ట్ లేదు. అక్రమ బియ్యంపై ఈ శాఖల ఉద్యోగులు పట్టించుకోవడం లేదు. దీంతో పగలు రాత్రి తేడా లేకుండా బియ్యం కర్ణాటక బాట పడుతోంది. మూడేళ్లక్రితం బి.కొత్తకోట కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారంపై అప్పటి ఎస్ఐ రామమోహన్ దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన 6.5 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమో దు చేశారు. ఇదే గోదాముపై దాడిచేసిన రెవెన్యూ అధికారులు 20 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల మదనపల్లెలోని ఈశ్వరమ్మకాలనీ, ఇండిస్ట్రీయల్ ఎస్టేట్లోని రెండు రైస్మిల్లుల్లో రేషన్ బియ్యం పట్టుబడింది. గతవారం బి.కొత్తకోటలో ఓ చౌకదుకాణం నుంచి తరలిస్తుండగా 22 బస్తాల బియ్యం పట్టుబడింది. మదనపల్లె రైస్మిల్లులో రేషన్ బియ్యం పట్టుబడిందంటే ఈ దందా ఎంత యథేచ్ఛగా సాగుతోందో అర్థమవుతుంది. గతేడాది రెడ్డీస్ కాలనీలో 150 క్వింటాళ్లకుపైగా రేషన్ బియ్యం పట్టుబడింది. ఎక్కడెక్కడ గోదాములు నిర్వహిస్తున్నారో తెలిసినా ఎందుకు పట్టించుకోకపోవడం వెనుక కారణ మేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. పోలీసులు ఒకసారి కర్ణాటక వ్యాపారిపై కేసు నమోదు చేయగా, మళ్లీ అదేవ్యక్తి గోదాము నుంచి రెవెవెన్యూ అధికారులు రేషన్బియ్యం సాధ్వీనం చేసుకొన్నారు. అయితే ఈ అక్రమ దందాను మాత్రం నిలువరించలేకపోతున్నారు. -
మృతదేహంతో రోడ్డెక్కిన కుటుంబ సభ్యులు
● న్యాయం చేయాలని డిమాండ్ ● అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు వెల్లడికలకడ : తమ వాడిని కొట్టి చంపారని, పోలీసులు న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డెక్కారు. కలకడ మండలం కె.బాటవారిపల్లె పంచాయతీ ఎస్టీ కాలనీకి చెందిన రామానాయక్ కుమారుడు బాబునాయక్(48) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాబునాయక్ మృతి పట్ల తమకు అనుమానాలు ఉన్నాయని మృతుడి భార్య శంకరమ్మ, కుటుంబ సభ్యులు.. మృతదేహంతో చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై కె.బాటవారిపల్లె బిసి కాలనిలోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. గంట సమయం పైగా రోడ్డుపై రాకపోకలను నిలిపి వేశారు. ఈ సమస్యపై స్పందించిన కలకడ పోలీసులు న్యాయం చేస్తామని పోస్ట్మార్టం ఆధారంగా కేసు ముందుకు సాగుతుందని తెలిపినా మృతుడి బంధువులు వినలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న కేవీపల్లె ఎస్ఐ బీవీ శివకుమార్ అనుమానితులను వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
చెరువులో పడి వ్యక్తి మృతి
మదనపల్లె టౌన్ : దుస్తులు ఉతకడానికి వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. మదనపల్లె మండలం సీటీఎం కొత్తపేటకు చెందిన బాలాజీ(45) ఆదివారం చిన్నతిప్పసముద్రం చెరువుకు బట్టలు ఉతకడానికి వెళ్లాడు. ఈ క్రమంలో పొరపాటున లోతైన నీటిలో పడి మునిగి పో యాడు. గమనించిన కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో స్థానికులు తాలూకా పోలీసులకు, అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక అధికారి శివప్ప ఫైర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని చెరువులో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. బాలాజీ మృతదేహాన్ని వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణంచిన్నమండెం : మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామం మల్లూరు క్రాస్ సమీపంలో ఆదివారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొని విజయనగరం రమణమ్మ(35) అనే మహిళ దుర్మరణం చెందింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన విశ్వనాథ్ సతీమణి రమణమ్మ సొంత పనుల నిమిత్తం రాయచోటికి వెళ్లేందుకు మల్లూరు క్రాస్ వద్దకు వెళ్తుండగా.. కొండారెడ్డి మామిడి తోట సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వ్యక్తి ఆత్మహత్యాయత్నం చౌడేపల్లె : కుటుంబ కలహాల కారణంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం మండలంలోని పరికిదొనపంచాయతీ నుంజార్లపల్లెలో చోటుచేసుకుంది. స్థానికుల కథథనం మేరకు... వెంకటచలపతినాయుడు(49)కు కుటుంబ సభ్యులతో వాగ్వాదం జరిగింది. మనస్తాపం చెంది గడ్డి నివారణ మందు తాగి అపస్మారస్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. కాగా అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నైతిక విలువలు, వృత్తి నైపుణ్యాలతో విశ్వసనీయతకడప సెవెన్రోడ్స్ : జర్నలిజంలో నైతిక విలువలు, వృత్తి నైపుణ్యం, కచ్చితత్వం, సామాజిక బాధ్యతలను పెంపొందించుకోవడం ద్వారా మీడియా పట్ల ప్రజల్లో విశ్వాసం బలపడుతుందని రాష్ట్ర సీఆర్ మీడియా అకాడమి చైర్మన్ ఆలపాటి సురేష్కుమార్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రామీణ విలేకరులకు నిర్వహించిన రెండు రోజుల పునశ్చరణ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. అన్నమయ్య జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి పురుషోత్తం, సీనియర్ జర్నలిస్టు కొర్రా విజయ్కుమార్, తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్టు జనార్దన్, కర్నూలుకు చెందిన డెస్క్ సీనియర్ జర్నలిస్టు నవీన్కుమార్ చౌదరి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం జర్నలిస్టులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకుడు రామసుబ్బారెడ్డి, సమాచార పౌరసంబంధాల ఏడీ పద్మజ, పెద్ద సంఖ్యలో విలేకరులు, ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. -
మార్కెట్ యార్డులో రైతుపై దాడి
పుంగనూరు : మార్కెట్ యార్డులో ప్రైవేటు వ్యక్తులు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తూ , రైతులపై దాడులు చేస్తుండటంతో.. వారు శనివారం రాత్రి మార్కెట్ యార్డు గేటుకు తాళం వేసి, ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. రామసముద్రం మండలం మిట్టచింతవారిపల్లెకి చెందిన రైతు వెంకటరమణ రాత్రి 10 గంటల సమయంలో టమాటాలు ట్రాక్టర్లో వేసుకుని మార్కెట్ యార్డుకు తీసుకొచ్చాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న లారీ డ్రైవర్ ట్రాక్టర్కు అడ్డుపెట్టి దూషించడం జరిగింది. దీనిపై రైతు వెంకటరమణ ప్రశ్నించే సమయంలో డ్రైవర్, అతని అనుచరులు కలసి.. వెంకటరమణను కిందకు పడేసి కొట్టి గాయపరిచారు. దీనిపై రైతులు రాత్రి గేటుకు తాళాలు వేసి నిరసన తెలిపారు. నినాదాలు చేశారు. కమీషన్ల పేరుతో దోపిడీ చేస్తున్నారని, అడిగితే ప్రైవేటు వ్యక్తులచే దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే సీఐ సుబ్బరాయుడు, ఎస్ఐలు అన్సర్బాషా, రమణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైతులతో సీఐ మాట్లాడారు. దాడి చేసిన వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తామని, ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.గేటుకు తాళం వేసి రైతుల ఆందోళన -
కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం!
ప్రకృతి ఒడిలో సేదతీరాలని వెళ్లిన ఆ దంపతులకు, అదే ప్రకృతి కడుపుకోత మిగుల్చుతుందనడానికి ఆ కొండపై ఉన్న ఆ చిన్న సమాధే సాక్ష్యం. సముద్ర మట్టానికి 4,141 అడుగుల ఎత్తులో చల్లని గాలులతో మురిపించే హార్సిలీ హిల్స్ వెనుక ఒక శతాబ్దం నాటి గుండె బరువెక్కించే వింత విషాదం దాగి ఉంది.అప్పట్లో ఉమ్మడి కడప జిల్లా కలెక్టర్గా పనిచేసిన డబ్ల్యూ.డి. హార్సిలీ ఈ కొండను కనుగొని, ఇక్కడి ప్రశాంతతకు ముగ్ధుడయ్యారు. ఆ మమకారంతోనే తన నిండు గర్భిణి అయిన భార్యను తీసుకుని కొండపై వేసవి విడిదికి వచ్చారు. అంతా సంతోషంగా సాగుతున్న వేళ.. 1864 మే 31న ఆ తల్లి కడుపు పండింది, ఒక పసికందు పుట్టాడు. కొండంత ఆనందంతో ఆ తండ్రి ఉప్పొంగిపోయాడు. కానీ, విధి ఆ సంతోషాన్ని ఒక్క రోజు కూడా నిలవనీయలేదు.పురిట్లోనే ఆ పసిగుండె ఊపిరి ఆగిపోయింది. దీంతో ఆ దంపతుల రోదన కొండ గుహల్లో ప్రతిధ్వనించింది. ఆ బిడ్డకు ‘జార్జ్ హార్సిలీ’ అని నామకరణం చేసి, కొండపై తమకున్న ప్రేమకు గుర్తుగా ఆ పసికందు మృతదేహాన్ని అక్కడే ఖన నం చేశారు. ఇప్పటికీ ఆ చిన్నారి సమాధి.. పర్యాటకులను పలకరిస్తూ ఆనాటి కలెక్టర్ దంపతుల హృదయ వేదనను మౌనంగా కథలుగా చెబుతూనే ఉంది. –సాక్షి, మదనపల్లెనట్టనడుమ ఒక్కరోజు కూడా లేని జీవితం -
● ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
వాల్మీకిపురం: ఎన్నికల కమిషన్ అధికారికంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) అత్యంత అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక షిరిడిసాయి కళ్యాణమండపంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ బీఎల్ఏల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడానికి కూటమి నేతలు పన్నాగాలు పన్నుతున్నారని, ఏజెంట్లు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనను, అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొనేందుకు క్యాడర్ సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్లారి తిమ్మారెడ్డి, ఇక్బాల్ అహ్మద్, సతీష్ రెడ్డి, రత్నశేఖర్రెడ్డి, దండు జగన్మోహన్ రెడ్డి, చక్రధర్, ఉదయ్ కుమార్, శివానంద రెడ్డి, కేశవ రెడ్డి, వెంకట్రమణ, రాంపల్లి రమేష్, కమలాకర్ రెడ్డి, ముక్తియార్, రమేష్ రెడ్డి, వెంకట్రమణా రెడ్డి, జమీర్ అలీఖాన్, అప్పల్లా, నక్కా చంద్రశేఖర్, నీళ్లభాస్కర్, శ్రీధర్రాయల్, ఇబ్రహిం, ఇర్ఫాన్, సాధిక్, శివారెడ్డి, జయచంద్ర, నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. -
ఓట్ల తొలగింపునకు బాబు కుట్రలు
సాక్షి, మదనపల్లె: ‘సర్’ కార్యక్రమం ద్వారా వైఎస్సార్ సీపీ మద్దతుదారులు, అభిమానుల ఓట్లను తొలగించడమే లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని.. ఆ కుట్రలను తిప్పి కొట్టాలని వైఎస్ఆర్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం బి.కొత్తకోటలో తంబళ్లపల్లె నియోజకవర్గం, మదనపల్లెలో నియోజకవర్గ బీఎల్ఏలకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పై జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి అధ్యక్షతన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఓట్ల తొలగింపుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తారని అన్నారు. సర్ విషయంలో బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పుంగనూరులో 90 వేల ఓట్ల తొలగింపునకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఓటర్లలో చాలామంది బెంగళూరు, పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నారు. వారిని స్వగ్రామాలకు రప్పించి ఓటర్లుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలు సాధించాలని కోరారు.సర్ విషయంలో క్యాడర్ను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు సమీక్షించాలని అన్నారు. దీనికోసం మాజీ సీఎం వైఎస్.జగన్ పరిశీలకులను పంపి దిశానిర్దేశం చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు అమరనాథ్రెడ్డి మాట్లాడుతూ బీఎల్ఏలు ప్రతి బూతులోని ఓటర్లను పరిశీలించాలన్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో అధికార ంలో ఉన్న పార్టీలు సర్ కారణంగా అధికారం కోల్పోవడమే గాక ఇద్దరు ముఖ్యమంత్రులు ఓటమిపాలయ్యారని గుర్తు చేశారు. ఏపీలో స్థానిక ఎన్నికలను సర్ తర్వాత నిర్వహించే అవకాశం ఉందని అన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 20 నుంచి 30 ఓట్లు తొలగిస్తే పార్టీకి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఎల్ఏలు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటును పరిశీలించాలని కోరారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి మాట్లాడుతూ తంబళ్లపల్లెను సర్ ద్వారా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అన్నారు. దీనిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ సర్పై అవగాహన కల్పించారు. మదనపల్లె సమన్వయకర్త నిసార్ అహ్మద్ మాట్లాడుతూ చంద్రబాబు ఓట్ల తొలగింపు కుట్రలను భగ్నం చేయాలని పిలుపునిచ్చారు.జిల్లా బూత్ కమిటి అధ్యక్షులు నడివీధి సుధాకర్, పరిశీలకులు అనీషారెడ్డి, బాబ్జాన్, జింకా చలపతి, సీనియర్ నేత శ్రీనాథ్ రెడ్డి, మాజీ చైర్మన్ మనూజ, మాజీ వైస్ చైర్మన్ నూర్ ఆజం, జిల్లా ఉపాధ్యక్షులు పాగొండ ఖలీల్,హరీష్కుమార్ రెడ్డి, కొండా సిద్ధార్థ, రెడ్డిశేఖర్ రెడ్డి, జడ్పిటిసిలు ఉదయ్ కుమార్, రామచంద్రారెడ్డి, ఎస్ఏ కరీముల్లా, షేక్ ఇర్ఫాన్ పాల్గొన్నారు. బి.కొత్తకోటలో జరిగిన సమావేశానికి హాజరైన బీఎల్ఏలు, నాయకులు, మాట్లాడుతున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్రంలో ఆకేపాటి సర్పై బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి బీఎల్ఏల శిక్షణలో రీజనల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి,జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి -
ప్రజలకు చంద్రబాబుపై అపనమ్మకం
రాజంపేట: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అపనమ్మకం ఏర్పడిన పరిస్ధితులు నేడున్నాయని, గత ఎన్నికల్లో ఓటువేశామని బాధపడుతున్నారని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి విమర్శించారు. శనివారం మేడాభవన్లో ఆయన అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులతో భేటీ అయ్యారు. ఈసందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రెండేళ్ల కూటమి పాలనలో ఎన్నికల హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారన్నారు. టీడీపీ రెండేళ్లపాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని గుర్తుచేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా చంద్రబాబు పాలనపై అసంతృప్తితో ఉన్నారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రెండేళ్ల పాలన మోసపూరితమని, ప్రజలకు వెన్నుపోటు నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పారు. మండల, నియోజకవర్గ స్ధాయిలో నిరసనలు జయప్రదం చేయాలన్నారు. వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఐక్యంగా ముందుకెళ్లాలని పిలుపు నిచ్చారు. స్ధానికసంస్ధలో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో నందలూరు మండలాధ్యక్షుడు మేడా విజయభాస్కర్రెడ్డి, నందలూరు వైఎస్సార్సీపీ కన్వీనరు సిద్ధవరం గోపిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కలీం,మోదుగల చంద్రశేఖర్, రాజశేఖర్రెడ్డి, గంగినాయుడు, మోహన్రెడ్డి, నాగసుబ్బయ్య, సోమిశెట్టి ప్రభాకర్,ఆల్విన్ విజయుడు, మహిళనాయకురాలు పల్లెమాధవి,మైనార్టీ ప్రతినిధులు షాజహాన్, జుల్ఫీకర్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. మేడారఘునాథరెడ్డి -
టెట్ మినహాయింపునకు చట్ట సవరణ చేయాలి
సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుల వల్ల రాష్ట్రంలోని ఉపాధ్యాయులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 20 నుంచి 30 సంవత్సరాల కింద ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులను ఇప్పుడు టెట్ పాస్ కావాలంటే కష్టతరమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి విద్యాహక్కు చట్టంలో సవ రణలు చేయాలని డిమాండ్ చేశారు. 2010 కు ముందు సర్వీస్లో చేరిన ఉపాధ్యాయులకు, పదోన్నతులకు టెట్ నుంచి మినహాయింపు వచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. – ఆదిరెడ్డి శ్యామసుందరరెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్లమెంట్లో చట్టం చేయడమే ఏకై క మార్గం టెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే పార్లమెంటులో చట్టం చేయడమే ఏకై క మార్గం. రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడం వల్ల లక్ష లాది మంది ఉపాధ్యాయులు గందరగోళంలో పడ్డారు. ఉపాధ్యాయులు ఒకవైపు పాఠ శాలల్లో విద్యా బోధన చేస్తూ, మరోవైపు టెట్ పరీక్షలకు సిద్ధం కావడం ఆచరణలో చాలా కష్టతరం. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చట్ట సవరణ జరిగేలా చూడాలి. –మాదన విజయ కుమార్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు. -
రాయచోటిని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
రాయచోటి : రాయచోటి పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మున్సిపల్ శాఖ చేపడుతున్న క్లీన్స్వీప్ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటి ఎస్సీ కాలనీలోని సాయిబాబా వీధిలో నిర్వహిస్తున్న క్లీన్స్విప్ కార్యక్రమాన్ని ఆర్డీఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. కాలువలు,డ్రైనేజీలు శుభ్రపరిచే పనులను తనిఖీ చేసి పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఇంటింటా చెత్త సేకరణను సమర్థవంతంగా నిర్వహించాలని, తడి, పొడి చెత్తను తప్పనిసరిగా వేర్వేరుగా సేకరించే విధానాన్ని అమలు చేయాలన్నారు. ప్రజలు కూడా తమ ఇళ్లలోనే చెత్తను వేరుచేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని కలెక్టర్ కోరారు. రోడ్లు, కాలువలు, ఖాళీస్థలాల్లో చెత్త వేయడం పూర్తిగా మానుకోవాలని తెలిపారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని కార్మీకులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాయచోటిలో నలభైరోజులుగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల ద్వారా 122 కిలోమీటర్ల డ్రైనేజీలలో 95 కిలోమీటర్లమేర పూడికతీత, శుభ్రపరిచే పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ -
ఆర్టీసీ బస్సులు ఢీ
– నలుగురికి గాయాలు గాలివీడు: మండలపరిధి అరవీడు గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం క్రాస్ సమీపంలో శనివారం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొ న్న ఘటనలో నలుగురు గా యపడ్డారు. ఈ ఘటనలో గాయత్రి, పూజిత, సోమే శ్వరతో పాటు బస్సు డ్రైవర్ ఎం. తిరుమలయ్య గా యాలపాలయ్యారు. స్థానికులు క్షతగాత్రులను గాలివీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.ప్రమాదం కారణంగా కొంతసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మదనపల్లె టౌన్: పట్టణంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల కుటుంబీకులు, వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలం లోని కోళ్లబైలు పంచాయతీ, వైఎస్ జగన్ కాలనీలో నివాసం ఉంటున్న మంజునాథ కుమారులు రేవంత్ కుమార్ (15), రంజిత్ (13) స్థానిక నీరుగట్టువారిపల్లెలోని చౌడేశ్వరి కల్యాణ మండపం వద్ద ఉన్న ఆలయానికి పూజ కోసం వెళ్లారు. స్వామివారిని దర్శించుకుని తిరిగి బైక్పై కాలనీకి వెళ్తుండగా, అమ్మ చెరువుమిట్ట మూడురోడ్ల కూడలి వద్ద మరో బైక్ వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అన్నదమ్ములు ఇద్దరు తీవ్రంగా గాయ పడ్డారు.స్థానికులు క్షతగాత్రులను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లె టౌన్: గుడికి విద్యుత్ దీపాలతో డెకరేషన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన శనివారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లె పట్టణం బసినికొండ లో నివాసం ఉంటున్న అరుణ్ (20) పోతపోలు గ్రామం సిద్ధమ్మగారిపల్లెలో ఉన్న రాముల గుడిలో పూజలు జరుగుతుండ టంతో డెకరేషన్ పనుల కోసం వెళ్లాడు. గుడి పైకి ఎక్కి రంగురంగుల విద్యుత్ దీపాలను అలంకరిస్తు ఉండగా ప్రమాద వశాత్తు కాలుజారి కిందపడ్డాడు. దీంతో తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితున్ని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన వైద్యులు, అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఘటనపై మదనపల్లె తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పుంగనూరు: అతివేగంగా వస్తున్న బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు గాయపడగా , వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బోడినాయునిపల్లెకి చెందిన భానుప్రసాద్ (25), గుట్టపల్లెకి చెందిన రేవంత్(23) ఇద్దరు ద్విచక్రవాహనంలో ఇంటికి వెళుతుండగా పట్టణంలోని కొత్తయిండ్లు సమీపంలో ఎదురుగా మదనపల్లె నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు అతివేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో భానుప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. రేవంత్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. స్థానికులు భానుప్రసాద్ను ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్కు ఆసుపత్రికి తరలించారు. పిడుగుపాటుతో మహిళ మృతి ఎర్రగుంట్ల : మండల పరిధిలోని చిలంకూరు గ్రామంలో శ్రీ చౌడేశ్వరిదేవి దేవాలయం సమీపంలో ఉంటున్న కొట్టు అంజనమ్మ(36) పిడుగుపాటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం నుంచి గాలివాన భీభత్సం సృష్టించింది. చిలంకూరు గ్రామం సమీపంలో పిడుగు శబ్దంతోపాటు మెరుపు రావడంతో అంజనమ్మ ఆ శబ్దానికి గుండె పోటు వచ్చి కుప్పకూలి పోయింది. స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు మహేష్ కూడా ఈ పిడుగు శబ్దానికి కింద పడ్డాడు.అతన్ని ప్రొద్దుటూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి కడప రిమ్స్కు తరలించారు.గాయపడిన రంజిత్, రేవంత్ కుమార్ -
వివాహిత ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్: కుటుంబ కలహాలతో ఓ వివాహిత శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాలు.. ములకలచెరువు మండలం, సోంపాల్యం పంచాయతీ, గొడ్డావుల కోటకు చెందిన మంజునాథ భార్య మీనాక్షి (32) కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వెంటనే ఇంట్లో ఉన్న పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించడంతో ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ములకల చెరువు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పశువుల లారీ సీజ్ మదనపల్లె టౌన్: నిబంధనలకు విరుద్ధంగా 28 పశువులను ఒకే లారీలో ఊపిరి ఆడకుండా కుక్కి తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన డ్రైవర్ ఆర్ముగం, క్లీనర్ గౌతమ్ పులివెందుల, కదిరి ప్రాంతాల్లో తక్కువ ధరకు పశువులను కొనుగోలు చేసి పలమనేరు వైపు తరలిస్తున్నారు. శుక్రవారం రాత్రి సీటీఎం రోడ్డులోని తట్టివారిపల్లె జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ లారీ పట్టుబడింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పశువులను చీకటివారిపల్లె గోశాలకు తరలించి పశువైద్యులతో చికిత్స అందించారు. కేసు నమోదు చేసి అక్రమ రవాణా వెనుక ఉన్నవారిపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు తెగిన చేయి వాల్మీకిపురం: పాడిఆవులకు పచ్చిగడ్డిని యంత్రంతో కత్తరిస్తుండగా అందులో రైతు చేయి చిక్కుకుపోయి ప్రమాదవశాత్తు తెగిపోయిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలు..పట్టణానికి చెందిన రమేష్బాబు (48) కొంత భూమిని కౌలుకు తీసుకొని అందులో పశువులకు మేత వేసుకొని పాడి ఆవులను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం పశువుల మేతను కత్తిరించేందుకు యంత్రంలో గడ్డి వేసేందుకు వెళ్లాడు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు రైతు కుడి చేయి యంత్రంలో చిక్కుకొని తెగిపోయింది. కుటుంబ సభ్యులు బాధితుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు మదనపల్లెకు రెఫర్ చేశారు. పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో శస్త్ర చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
కలకడ : కలకడ మండలం, కె.బాటవారిపల్లె పంచాయతీ ఎస్టీ కాలనీకి చెందిన రామానాయక్ కుమారుడు బాబునాయక్ (48) అనుమానస్పదస్థితిలో మృతి చెందాడు. కేవీపల్లె ఎస్ఐ బీవీ శివకుమార్ కథనం మేరకు..బాబునాయక్ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శుక్రవారం సాయంత్రం మద్యం తాగడానికి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. శనివారం ఉదయం బాబునాయక్ భార్య శంకరమ్మ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. శనివారం ఉదయం చిత్తూరు–కర్నూలు జాతీయరహదారి పక్కన కె.బాటవారిపల్లె బస్స్టాప్ ఎదురుగా ఉన్న కార్పెంటర్దుకాణం(కొయ్యలమిషన్) వద్ద బాబునాయక్ మృతిచెంది ఉండటం గుర్తించి కలకడ పోలీసులకు సమాచారం అందించారు. శుక్రవారం రాత్రి అదే గ్రామానికి చెందిన మల్లేష్, రెడ్డెప్ప లతో కలిసి తన భర్త మద్యం తాగినట్లు తెలిసిందని, ఆయన మృతిపట్ల తనకు అనుమానాలు ఉన్నాయని శంకరమ్మ పోలీసలకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఎస్ఐ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.బాబునాయక్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఆరు దశాబ్దాల బంధానికి అరుదైన ముగింపు !
రాజంపేట: రైల్వే చరిత్రలో చారిత్రాత్మక అధ్యాయం మొదలుకానుంది. అక్టోబరు 2, 1966లో ఆవిర్భవించిన దక్షిణ మధ్య రైల్వేతో కడప రైల్వే విభాగానికి ఉన్న ఆరు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం తెగిపోయింది . కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్ర కారం, జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా దేశంలోనే 18వ జోన్గా ఏర్పాటైన దక్షిణకోస్తా రైల్వేజోన్ పరిపాలన అధికారికంగా ప్రారంభం కానుంది. ఇన్నాళ్లు సికింద్రాబాద్తో ఉన్న జోన్ బంధం వీడి, ఇకపై విశాఖ జోన్తో కొత్త ప్రస్థానం మొదలవుతుంది. ఏపీ విభజన చట్టం హామీల మేరకు వైజాగ్ రైల్వే జోన్ పురుడు పోసుకుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కొత్త జోన్ ఏర్పాటుకు భూముల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో శాశ్వత భవన నిర్మాణం శరవేగంగా సాగుతుండగా, తాత్కాలికంగా ఎంపిక చేసిన ‘డెక్’ భవనంలో జోనల్ ఆఫీసును ఏర్పాటు చేశారు. జూన్ 1న ఎటువంటి ఆర్భాటాలు లేకుండా సాధారణంగానే ఈ జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. కొత్త జోన్లోనూ కడపకు అన్యాయమేనా..? విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్న కొత్త జోన్పై కడప జిల్లా వాసులు భారీగా ఆశలు పెట్టుకున్నప్పటికీ, జిల్లా రైల్వే రంగంలో దశాబ్దాలుగా నలుగుతున్న పెండింగ్ సమస్యలు ఎటూ తేలడం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కృష్ణపట్నం–ఓబులవారిపల్లె రైల్వేలైన్లో ప్యాసింజర్ రైళ్లు నడిపించాలనే డిమాండ్ ఇప్పటికీ నెరవేరలేదు. దశాబ్దాల కల అయిన కడప–బెంగళూరు రైల్వేలైన్ పనులు పెండింగ్లోనే ఉండిపోయాయి. ముద్దనూరు–ముదిగుబ్బ, కంభం–ప్రొద్దుటూరు, భాకరాపేట–గిద్దలూరు రైలుమార్గాలు కేవలం సర్వేలకే పరిమితమయ్యాయి. జిల్లా కేంద్రమైన కడప రైల్వే స్టేషన్ను ఎయిర్పోర్టు తరహాలో అభివృద్ధి చేస్తామన్న హామీ మూలనపడింది. ఒకప్పుడు అత్యంత కీలక కేంద్రమైన నందలూరులో ప్రత్యామ్నాయ రైల్వే పరిశ్రమ ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. కనీసం అన్ని రైళ్లకు ఇక్కడ వాటరింగ్ సదుపాయం కల్పించే ప్రతిపాదన కూడా పెండింగ్లో పడింది. కొత్త జోన్ కేంద్రమైన విశాఖపట్నానికి వెళ్లేందుకు జిల్లా వాసులకు కనీసం ఒక్క ప్రత్యక్ష రైలు కూడా అందుబాటులో లేదు. కొత్త జోన్కు వెళ్లే ఏకై క రైలు తిరుమల ఎక్స్ప్రెస్ మాత్రమే కావడం, అది ఎప్పుడూ రద్దీగా ఉండటంతో జిల్లా ప్రజలు, రైల్వే సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. జిల్లా మీదుగా ఇప్పటివరకు కనీసం ఒక్క వందేభారత్ రైలు కూడా నడపలేదు. ఆదాయానికి గండి.. బదిలీల తర్జనభర్జనలు కొత్తగా ఏర్పాటు కాబోతున్న దక్షిణ కోస్తా జోన్ ప్రారంభంలోనే పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోయింది. ఈస్ట్కోస్ట్ పరిధిలోని అత్యంత కీలకమైన ’కెకె లైన్’ (కోరాపుట్–కిరండూల్ లైన్) తిరిగి ఈస్ట్ కోస్ట్ జోన్ పరిధిలోనే ఉండిపోవడంతో దాదాపు రూ. 9,950 కోట్ల ఆదాయాన్ని కొత్త జోన్ నష్టపోతుందని రైల్వే వర్గాలు అంటున్నాయి. కొత్త జోన్కు రూ. 25 వేల కోట్ల ఆదాయం ఉండాల్సి ఉండగా, ఈ మార్పుల వల్ల రూ. 17,500 కోట్ల ఆదాయం మాత్రమే ఉంటుందని అంచనా. మరోవైపు, జోన్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఉద్యోగుల కేటాయింపులు, బదిలీల వ్యవహారంపై రైల్వే శాఖలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. వీటిపై డీఆర్ఎంలతో రైల్వేబోర్డు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. కొందరు ఉద్యోగులు తెలంగాణా ప్రాంతంలోనే పనిచేసేందుకు ఆసక్తి చూపుతుండటం గమనార్హం. సదరన్ రైల్వే జోన్లో భాగంగా 1956లో ఏర్పాటైన గుంతకల్ డివిజన్, అక్టోబరు 2, 1977లో దక్షిణ మధ్య రైల్వే జోన్లో విలీనమైంది. ఇప్పుడు దక్షిణకోస్తా జోన్లోకి వెళ్లడంతో దీని సరిహద్దుల్లో పలు మార్పులు చేర్పులు జరిగాయి. రేపటి నుంచే దక్షిణకోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు సికింద్రాబాద్ వీడి.. విశాఖ ‘డెక్’భవనం గూటికి కడప రైల్వే ఆదాయం కోల్పోవడంపై విమర్శలు సీమ రైల్వేలకు న్యాయం చేయాలని ఎంపీల డిమాండ్ కృష్ణపట్నం–ఓబులవారిపల్లె ప్యాసింజర్ లైన్, కడప–బెంగళూరు ప్రాజెక్టులపై జిల్లా వాసుల ఆశలు కొత్తగా ఏర్పాటైన దక్షిణకోస్తా జోన్కు రావలసిన ఆదాయాన్ని రాబట్టడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విశాఖ జోన్కు రావాల్సిన భారీ ఆదాయం ఈస్కోస్ట్ జోన్లోకి వెళ్లిపోయింది. ఈ విషయమై లోక్సభలో కూడా ప్రస్తావించాను. తిరుపతి కేంద్రంగా బాలాజీ (తిరుపతి) డివిజన్ చేయాలన్న డిమాండ్ను నెరవేర్చకుండానే జోన్ను ప్రారంభించడం బాధాకరమని, ఈ విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. – పీవీ మిథున్రెడ్డి, రాజంపేట ఎంపీ దక్షిణ మధ్య రైల్వే నుంచి 60 ఏళ్ల తర్వాత విడిపోయి దక్షిణకోస్తా రైల్వేలోకి బదిలీ అయిన రాయలసీమ రైల్వేలకు ఇప్పుడైనా పూర్తి న్యాయం చేయాలి. వైఎస్సార్ కడప జిల్లా మీదుగా కొత్త రైళ్లను తీసుకురావాలి. వైఎస్సార్ మానసపుత్రిక అయిన కడప–బెంగళూరు రైల్వేలైన్ను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సీమ రైల్వే ధిలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న రైలు మార్గాలను పూర్తి చేసే దిశగా నూతన ఎస్సార్ యాజమాన్యం ఆలోచన చేయాలి. అలాగే తిరుపతి డివిజన్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలి – మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు -
శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శనివారం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా అర్చకులు శ్రావణ్ కుమార్, పవన్ కుమార్ మూల విరాట్లకు పంచామృతాభిషేకం జరిపారు.టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు, తులసి మూలవిరాట్లను గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి వారిని దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. వేంపల్లె : మండల పరిధి నాగూరు గ్రామంలోని హరిజనవాడకు చెందిన గ్రీన్ అంబాసిడర్ వేమా నాగన్న (55) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసు లు తెలిపారు. వేమా నాగన్న విధుల్లో భాగంగా ఈ నెల 27న మూడు చక్రాల రిక్షాపై నాగూరుకు బయలు దేరారు. మార్గం మధ్యలో రిక్షా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకు కడప రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు వివరించారు. ఆయనకు భార్య మేరీ సువర్ణ, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వైద్య విద్యలో విద్యార్థి ప్రతిభ కడప సెవెన్రోడ్స్ : కడపకు చెందిన వసంత్ మౌని విహంత్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంపార్టెన్స్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్లో ప్రతిభ చాటారు. ఈ పరీక్షలో ఆయన అఖిల భారతస్థాయిలో 26వ ర్యాంకును సాధించారు. న్యూరో సర్జరీ విభాగంలో ఓపెన్ కేటగిరి కింద ఎయిమ్స్, నిమ్హాన్స్, జిప్మర్, పీజీ ఐ చండీఘర్లలో 31 సీట్లు మాత్రమే ఉండ గా, అందులో ఒకటి ఆయన కై వసం చేసుకున్నా రు. కడపలోని సింగారెడ్డి ఎన్క్లేవ్లో నివాసముంటున్న కాంట్రాక్టర్ వెంకట సుబ్బారెడ్డి కుమారుడైన విహంత్రెడ్డి పూణెలోని ఆర్మ్డ్ ఫోర్స్డ్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పీజీలో ఎంఎస్ జనరల్ సర్జరీని పూణెలోని భారతి విద్యాపీ ఠ్ కళాశాలలో పూర్తి చేసి ఇప్పుడు న్యూరో సర్జరీ విభాగంలో సీటు పొందారు. కడప ఎడ్యుకేషన్: కడప నాగారాజుపేటకు చెందిన దివంగత వేపరాల వీర భాస్కర్ రావు (రిటైడ్ హెడ్ మాస్టర్ సీఎస్ఐ స్కూల్) మనవరాలు పెట్లు కావ్య, కుమారుడు వేపరాల గోయల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సాధించారు.విజయవాడకు చెందిన హలెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు అగస్తిక దండంగి ఆధ్వరంలో 2026 ఫిబ్రవరి 2న పలు దేశాలకు చెందిన 777 మంది ‘ది లార్జెస్ట్ ఎలక్ట్రానిక్ కీబోర్డ్ ఎంసెంబల్’ చేశారు. 777 మంది గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకొన్నారు. వీరిలో కడప కు చెందిన పెట్లు కావ్య, వేపరాల గోయల్ ఉన్నారు. ఈ నెల 29న హైదరాబాద్ గౌచ్చిబౌలి విక్టరీ చర్చిలో జరిగిన కార్యక్రమంలో పాస్టర్ అగస్తిక దండంగి చేతుల మీదుగా ధ్రువపత్రాన్ని అందుకున్నారు. కావ్య, గోయల్ -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్: అప్పుల బాధ తాళలేక రైతు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మాలేపాడు పంచాయతీ, ఆవుల పల్లెకు చెందిన వెంకటేష్ (38)కు సుమారు 8 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. పంటల సాగు కోసం తన పొలంలో ఏడు బోర్లు వేశాడు. ప్రస్తుతం టమాటా ఇతర కూరగాయ పంటలను పండించాడు. అయితే బోర్లలో నీళ్లు అడుగంటి పోవడంతో పంటలకు సరిపడా నీళ్లు లేక ఎండు ముఖం పడుతున్నాయి. ఇప్పటికే 7 బోర్లు, వ్యవసాయ పంటల సాగు, ఇతర ఖర్చులకోసం సుమారు 20 లక్షలకు పైగా అప్పు చేశాడు. అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచక జీవితంపై విరక్తి చెందాడు. కూరగాయ పంటలకు తెచ్చిన గడ్డి మందును పొలంలోనే తాగాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి, అతని పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం రుయాకు వెళ్లాలని సూచించారు. కుటుంబీకులు వెంకటేశును స్థానకంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేపట్టారు. -
శేష జీవితం ప్రశాంతంగా గడపండి
జిల్లా ఎస్పీ ధీరజ్ మదనపల్లె టౌన్: సమాజ రక్షణ కోసం దశాబ్దాల పాటు అంకితభావంతో పనిచేసిన పోలీసులు శేష జీవితాన్ని కుటుంబంతో ప్రశాంతంగా గడపాలని జిల్లా ఎస్పీ ధీరజ్ ఆకాంక్షించారు. శనివారం మదనపల్లె జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ముగ్గురు ఏఎస్ఐలైన మాబూ సాహెబ్ (కలికిరి పీఎస్), పి. వెంకటరమణ (రామాపురం పీఎస్), ఎం. శేఖర్ రావు (రైల్వేకోడూరు పీఎస్)లకు జిల్లా పోలీసు యంత్రాంగం తరపున ‘ఆత్మీయ వీడ్కోలు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి రిటైర్డ్ అధికారులను శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. పోలీసు అధికారులు సుదీర్ఘ సర్వీసు పూర్తి చేయడంలో వారి జీవిత భాగస్వాముల పాత్ర వెలకట్టలేనిదని ఎస్పీ కొనియాడారు. తోటి సిబ్బందిని వదిలి వెళ్తుండటంతో పదవీ విరమణ పొందిన అధికారులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రతి బీఎల్ఏ సైనికుడే !
● ఓటర్ల జాబితా వైఎస్సార్సీపీ గెలుపునకు తొలిఅడుగు ● వైఎస్ జగన్ను సీఎంగా చేసుకోవాలన్నదే ధ్యేయం ● ఎమ్మెల్సీ టీ. కల్పలతారెడ్డి రాజంపేట: స్ధానికసంస్థల ఎన్నికల్లో ప్రతి బూత్లెవెల్ ఏజెంట్ (బీఎల్ఏ సైనికుడని, ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత బీఎల్ఏదేనని శాసనమండలి సభ్యురాలు,అన్నమయ్య జిల్లా బీఎల్ఏ పరిశీలకురాలు టీ.కల్పలతారెడ్డి అన్నారు. శుక్రవారం రాజంపేట మండలం ఆకేపాటి ఎస్టేట్లో ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ బీఎల్ఏ విస్తృత స్ధాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ల జాబితాయే వైఎస్సార్సీపీ గెలుపునకు తొలి అడుగు అని అన్నారు. బీఎల్ఏలు తమ పరిధిలోని ఓటర్ల జాబితాపై పట్టు సాధించాలన్నారు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓట్లను రకరకాలుగా తొలిగించేందుకు టీడీపీ నాయకులు కుట్రలు చేసేందుకు ప్రయత్నిస్తారన్నారు. దానిని బీఎల్ఏలు అడ్డుకోవాలన్నారు. మళ్లీ 2029లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్న ధ్యేయంతో ముందుకెళ్లాలన్నారు. ప్రతి ఒక్క బీఎల్ఏ సర్పై అవగాహన కలిగి ఉండాలన్నారు. సమావేశంలో రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి ఆకేపాటి అనిల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్పోలా శ్రీనివాసులరెడ్డి, ఎంపీపీలు మేడా విజయభాస్కర్రెడ్డి, గాలివీటి రాజేంద్రరెడ్డి, కేంద్రకార్యాలయ పరిశీలకులు నరసింహారెడ్డి. ఎస్ఈసీ సభ్యుడు చొప్పాఎల్లారెడ్డి, రాయలసీమ బూత్ కమిటి కన్వీనరు తల్లెం భరత్కుమార్రెడ్డి, జిల్లా బూత్కమిటి నేత నడివీధి సుధాకర్, మండలకన్వీనర్లు టక్కోలు శివారెడ్డి, దొడ్డిపల్లెభాస్కర్రాజు, జె. కృష్ణరావుయాదవ్, నీలకంఠేశ్వరరెడ్డి, సిద్ధవరం గోపిరెడ్డి,బెహరన్ వైఎస్సార్సీపీ కన్వీనరు ఓర్సు నాగరాజు, నాయకులు గొబ్బిళ్ల త్రినాధ్,పాపినేని విశ్వనాధరెడ్డి, దండుగోపి,వడ్డెరమణ, మహిళనేతలు ఏకులరాజేశ్వరీరెడ్డి, రక్కాసి శ్రీవాణి, పల్లె మాధవి పాల్గొన్నారు. సర్పై బీఎల్ఏలు అప్రమత్తంగా వ్యవహరించాలి. నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి.ఓట్లు తొలగింపునకు గురికాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత బీఎల్ఏలదే. స్థానికసంస్ధలలో వైఎస్సార్సీపీ సత్తా చాటుకునేందుకు సమష్టిగా కృషిచేయాలి. బూత్ స్ధాయిలో వైఎస్సార్సీపీ ఓట్లకు గండిపడకుండా చూసుకోవాలి. – సురేష్బాబు, వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరీశీలకుడు ఒక ఓటు కూడా పొగొట్టుకోకూడదు. ఆ దిశగా బీఎల్ఏలు పనిచేయాలి. సర్లో బీఎల్ఏలదే కీలకపాత్ర.అది గుర్తుంచుకోవాలి. చంద్రబాబుకు బుద్ధి చెప్పేరోజులు దగ్గరలో ఉన్నాయి. ఇటీవల పలు రాష్ట్రాలలో ఓట్ల తొలగింపుతో నేతలు ఓటమి పాలయ్యారు. అందువల్ల ఓట్ల తొలిగింపునకు అడ్డుకట్టవేసే విధంగా బీఎల్ఏలు పనిచేయాలి. – ఆకేపాటి అమర్నాఽథరెడ్డి, ఎమ్మెల్యే, రాజంపేట స్థ్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురాలి.సమష్టిగా గెలుపునకు కృషిచేయాలి. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సీఎం చంద్రబాబు మోసపూరిత పాలనను ప్రజలు గ్రహించారు.రెండేళ్లలో హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రె డ్డిని మళ్లీ సీఎంను చేసుకోవాలంటే బీఎల్ఏలు కీలకపాత్ర పోషించాలి. ఓట్ల తొలిగింపుకు కుట్రలు తెరలేస్తాయి. వాటిని అడ్డుకొని మన ఓట్లను కాపాడుకోవాలి. – మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైఎస్సార్ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న నాయకులు -
31న హాకీ జట్టు ఎంపిక
మదనపల్లె సిటీ: జిల్లా సీనియర్ పురుషుల హాకీ జట్టు ఎంపిక ఈనెల 31న నిర్వహించనున్నట్లు అన్నమయ్య హాకీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పీ.వీ.ప్రసాద్, జి.శివప్రసాద్ తెలిపారు. స్థానిక బీటీ కాలేజీ హాకీ మైదానంలో ఉదయం 10 గంటలకు జరుగుతుందన్నారు. క్రీడాకారులు 1.1.1992 లేదా ఆ తర్వాత జన్మించినవారు అర్హులన్నారు. పదో తరగతి మార్కుల జాబితా, పుట్టినతేదీ సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు జూన్ రెండో వారంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంటులో పాల్గొంటారని పేర్కొన్నారు. మదనపల్లి (కురబలకోట): ప్రజల ఆరోగ్యవంతమైన జీవనానికి గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి ప్రజల భాగస్వామ్యం ఆవశ్యకమని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. తంబళ్లపల్లి నియోజక వర్గ గ్రామాలకు రూ.70.40 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన 22 ఈ–ఆటో రిక్షాలను శుక్రవారం మదనపల్లి కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కలెక్టర్ నిశాంత్కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటికి చెత్త సేకరణ, తడి–పొడి వ్యర్థాలు వేరు చేయడం ఘన వ్యర్థాల నిర్వహణలో ఈ–ఆటో రిక్షాలు కీలక పాత్ర వహిస్తాన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ నిధులతో ఒక్కో వాహనం రూ. 3.20 లక్షల వ్యయంతో సమకూర్చినట్లు వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ పరిశుభ్ర గ్రామాల నిర్వహణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ, డీఎల్పీఓ లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. కలికిరి: జిల్లాలోని బీడు భూములను సాగులోకి తీసుకురావడమే జలధార ప్రాజెక్టు లక్ష్యమని జిల్లా వ్యవసాయాధికారి శివన్నారాయణ అన్నారు. కలికిరి కేవీకే కార్యాలయంలో శుక్రవారం పీలేరు నియోజకవర్గ పరిధిలోని రైతు సేవా కేంద్రాల సిబ్బందికి ప్రాజెక్ట్ జలధార ఉద్దేశంపై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలోని 3272 చెరువులను జలధార కార్యక్రమం ద్వారా నీరు నింపడం జరుగుతుందని, దీంతో చెరువుల ఆయకట్టు, చుట్టుపక్కల ప్రాంతాల్లోని బోర్లలో భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయన్నారు. జిల్లా ఉద్యాన అధికారిణి సుభాషిణి , జిల్లా పశుసంవర్దకశాఖ అధికారి గుణశేఖర్ పిళ్ళై మాట్లాడారు. రాయచోటి: విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడాలంటే ప్రాథమిక దశలోనే కనీస అభ్యసన సామర్థ్యాలను సాధించాలని.. ఈ లక్ష్యంతోనే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ డాక్టర్ అనురాధ తెలిపారు. ఏపీ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమంలో భాగంగా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్కు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం రాయచోటి మండలం, ఎగువ అబ్బవరంలోని ఆర్చనా కళాశాల ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభమైంది. ఈనెల 29 నుంచి జూన్ 2వ తేది వరకు రెసిడెన్షియల్ విధానంలో శిక్షణను నిర్వహించడం జరుగుతుందన్నారు. శిక్షణ ప్రారంభోత్సవంలో డాక్టర్ అనురాధ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం – 2020, నిపుణ్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి విద్యార్థి మూడో తరగతి పూర్తయ్యే నాటికి చదవడం, రాయడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలు సాధించడమే ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. విద్యార్థులు వయస్సుకు తగిన అభ్యసన స్థాయికి చేరుకోవడానికి ఉపాధ్యాయులు సమర్థవంతమైన బోధన పద్దతులను అవలంబించాలని సూచించారు. డైట్ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఇన్చార్జ్ అసదుల్లా, సమగ్ర శిక్ష కో–ఆర్డినేటర్ జనార్దన్, ఏపిఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ఆటో బోల్తా: ఐదుగురికి తీవ్ర గాయాలు
గాయపడిన వాణి వెంకటేష్ హైదర్ సాబ్ రమణ నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్): నిమ్మనపల్లె మండలంలోని మర్రిబండ వద్ద శుక్రవారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న నిమ్మనపల్లె 108 సిబ్బంది జస్వంత్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఆటో డ్రైవర్ వెంకటేష్, ప్రయాణీకులు వాణి, హైదర్ సాబ్, రమణతో పాటు మరో వ్యక్తిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాళ్లు, చేతులు విరగడంతో వెంకటేష్, హైదర్ సాబ్లను మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భూమి మాది..!
● ఆక్రమణ నాటకం వారిది ● అధికారులు విచారించి న్యాయం చేయాలి: బాధితుల వేడుకోలు మదనపల్లె టౌన్: భూములు మావి, రెవెన్యూ రికార్డులన్నీ మా పేరుపైనే ఉన్నాయి. కానీ మా భూములు కబ్జా చేసి నిందలు మాపైనే వేస్తూ నాటకాలు ఆడుతున్నారు. జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి తమకు న్యాయం చేయాలని కురబలకోట మండలం, చేనేత నగర్కు చెందిన రావూరి అమరనాథ్ రెడ్డి, ఎరజ్రేనువారిపల్లెకు చెందిన రెడ్డెమ్మ, వై.అమరనాథ్ రెడ్డి దంపతులు, నందిరెడ్డిగారిపల్లెకు చెందిన ఫైరోజ్ ఖాన్ లు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వారు మదనపల్లె ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడారు. ఎరజ్రేనువారిపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 605–1, 606, 677 భూ వివాదానికి సంబంధించి అన్ని రెవెన్యూ రికార్డులు తమ వద్ద ఉన్నాయని రావూరి అమరనాథరెడ్డి తెలిపారు. నిబంధనల మేరకు 1979లో కొనుగోలు చేసిన స్థలంలోకి తమను రానివ్వకుండా కబ్జాదారులు ఎం. బాలకష్ణారెడ్డి, వెంకటరమణారెడ్డి అధికార పార్టీ అండతో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తన వద్ద ఉన్న రికార్డులను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ భూవివాదంతో గతంలో పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేయగా రెవెన్యూ అధికారులు రికార్డులను పరిశీలించి, సర్వే అనంతరం అన్ని రిపోర్టులు తమకే అధికారికంగా ఇచ్చారన్నారు. వై.అమరనాథ్ రెడ్డి, రెడ్డమ్మ దంపతులు మాట్లాడుతూ.. తమకు వారసత్వంగా వచ్చిన భూమిని దాయాదులు వెంకటరమణారెడ్డి కబ్జా చేసి భూమిలోకి రానివ్వకుండా అడ్డుకుంటు ఉన్నారన్నారు. ఆ వ్యక్తి రెండు నకిలీ ఖాతాలను తయారు చేసుకుని, తమ భూములను ఆక్రమించుకున్నాడన్నారు. అధికారుల రీ సర్వేలోనూ ఆన్ లైన్ తమకే చేసినా ఇంకా దౌర్జన్యం చేస్తున్నారని, ఇటీవలే తనపై దాడి కూడా చేశారన్నారు. వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. 605–1 లో తమకు వారసత్వంగా 8.80 ఎకరాల భూమి ఉందని, ఎన్. బాలకృష్ణారెడ్డి, జయరామి రెడ్డి లు కబ్జాచేసి తమను పొలంలోకి రానివ్వడం లేదని ఫైరోజ్ ఖాన్ ఆరోపించాడు. పిజిఆర్ఎస్ లో ఫిర్యాదు చేయగా, రీ సర్వే చేయనివ్వకుండా బాలకృష్ణా రెడ్డి, జయరామిరెడ్డి లు అధికారులను అడ్డుకుంటున్నా రన్నారు. ఉన్నతాధికారుల స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. -
బూత్లెవల్ ఏజెంట్ కీలకంగా వ్యవహరించాలి
రైల్వేకోడూరు అర్బన్: నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ చెందిన ప్రతి 252 బూత్ లెవల్ ఏజంట్లు సర్ ప్రక్రియలో కీలక భూమిక పోషించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అదికారప్రతినిధి, మాజీఎమ్మెల్యే, ఇన్చార్జి కొరముట్ల శ్రీనివాసులు శక్రవారం తెలిపారు. స్థానిక రాజ్కళ్యాణ మండపంలో జరిగిన సర్ ప్రక్రియపై అవగాహన కార్యక్రమానికి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, రాజంపేట, కడప పరిశీలకులు సురేష్బాబు, కొండూరుఅజయ్రెడ్డి లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్ ప్రక్రియలో భాగంగా నియోజవర్గంలో ఓట్ల తొలగింపుపై పార్టీ కార్యకర్తలు, బీఎల్ఏ దృష్ఠి పెట్టాలని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ పరిశీలకులు నరసింహారెడ్డి, సహదేవరెడ్డి, పంజంవేణుగోపాల్రెడ్డి, సాయికిషోర్రెడ్డి, చెవుశ్రీనివాసులురెడ్డి, జెట్పీటీసీరత్నమ్మ, రాయలసీమ బూత్కన్వీనర్ తల్లెంభరత్కుమార్రెడ్డి, క్రిష్ణారెడ్డి, , వెంకటరెడ్డి, సీహెచ్రమేష్, నందాబాల, విజయ్కుమార్రెడ్డి, సుదర్శన్రెడ్డి, సతీష్రెడ్డి పాల్గొన్నారు. -
జనగణమన... స్వాగతంబున!
ఈ ఫొటోలో కనిపిస్తున్న బోర్డు కేవలం ఒక పట్టణ ఆహ్వాన సూచిక కాదు, కాల గర్భంలో దాగి ఉన్న ఒక గొప్ప చరిత్రకు సజీవ సాక్ష్యం! విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అడుగుజాడల గుర్తులను మోస్తున్న మదనపల్లె పట్టణం ఇప్పుడు సరికొత్తగా పర్యాటకులను ఆహ్వానిస్తోంది. ఆయన ఇక్కడి థియోసాఫికల్ కాలేజీలో విడిది చేసినప్పుడే, మన జాతీయ గీతం ‘జనగణమన’ను బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి అనువదించారు. ఆ చారిత్రక క్షణానికి గౌరవంగా పీకేఎం(పలమనేరు, కుప్పం, మదనపల్లె) – ఉడా (అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఒక అద్భుతమైన లోగోను సిద్ధం చేసింది. రవీంద్రుని రూపం, చుట్టూ ప్రకృతి అందాలు, సంప్రదాయ కలశం, గోవులతో కూడిన ఈ లోగో బోర్డులను బెంగళూరు, తిరుపతి, కడప, చిత్తూరు రహదారుల వెంబడి ఏర్పాటు చేస్తున్నారు. మదనపల్లెలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరికీ ఈ బోర్డులు ఇకపై స్వాగతం పలుకుతూ ఇక్కడి సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేయనున్నాయి. –సాక్షి, మదనపల్లె -
మైనింగ్ అడ్డుకుంటాం
సాధుకొండలో మైనింగ్ను అడ్డుకుంటాం. జగనన్న పాలనలో శైవ భక్తుల మనోభావాలకు పెద్దపీట వేశాం. కొండలను కాపాడటమేకాక ఆలయ అభివృద్ధికి కృషి చేశాం. మైనింగ్ పేరుతో దోచుకునేందుకు ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు పన్నాగం వేశారు. రహస్యంగా బిడ్లను ఆహ్వనించిన ప్రభుత్వం ఇప్పుడు ఏపీఎండీసీ ద్వారా సర్వే చేయించేందుకు పూనుకోవడం ఏకపక్షమే. తంబళ్లపల్లె ప్రజలు, భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లకూడదు. మల్లయ్యకొండల జోలికి వస్తే ప్రభుత్వానికి పుట్టగతులుండవు. –పీవీ.మిథున్రెడ్డి, రాజంపేట ఎంపీ భక్తులు ఊరుకోరు పవిత్ర శైవ పుణ్యక్షేత్రంగా వర్దిల్లుతున్న మల్లయ్యకొండల సముదాయంలోని సాధుకొండలో మైనింగ్ కోసం సర్వే చేస్తే భక్తులు ఊరుకోరు. 2006 నుంచి మైనింగ్ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొండల్లో శివనామస్మరణ తప్ప మరో ధ్వని వినపడకూడన్న కృతనిశ్చయానికి కట్టుబడింది. భక్తుల కోసం ఊహించని స్థాయిలో సౌకర్యాలు కల్పించాం. ఇప్పుడు మైనింగ్ పేరుతో కొల్లగొడతామంటే ప్రజలు, భక్తులు ఒప్పుకోరు. –పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే -
మత్తు మందు చల్లి.. బంగారు గొలుసు అపహరణ
లింగాల : లింగాల మండలం అంబకపల్లె గ్రామంలో పట్టపగలే మహిళ మెడలోని రూ.5 లక్షల విలువైన మూడున్నర తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. వివరాలు..చిల్లర దుకాణం నిర్వహిస్తున్న కేతిరెడ్డి సరళ వద్దకు శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై ముఖాలకు మాస్కులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు సరకులు కొనేందుకు వచ్చారు. ఆమె సరకులు ఇస్తుండగా ముఖంపై మత్తు మందు చల్లి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు. నిందితులు పులివెందుల వైపు పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ జగదీశ్వరరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను విచారించి కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. ట్రావెల్ బస్సు బోల్తా – ముగ్గురికి గాయాలు గోపవరం : మండలంలోని నెల్లూరు – ముంబై (ఎన్హెచ్–67) జాతీయ రహదారిపై జిల్లా సరిహద్దు రెండో మలుపు వద్ద శుక్రవారం తెల్లవారుజామున బీసీవీఆర్ ట్రావెల్స్కు సంబంధించిన బస్సు విజయవాడ నుంచి కదిరికి వెళుతుండగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కడప జిల్లా కె.రాజుపాలెంకు చెందిన జయప్రసాద్, అనంతపురం జిల్లా తలుపులకు చెందిన పవన్కుమార్, అనంతపురం జిల్లా కదిరికి చెందిన శ్రీనివాసులు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. బస్సు అదుపుతప్పి రెండు పల్టీలు కొట్టడంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. పెనుప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను గమ్యస్థానం చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. బద్వేలు రూరల్ ఎస్ఐ రంగారావు, సిబ్బంది ఘటన ప్రాంతానికి చేరుకు ని బస్సు ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కడుపు నొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య ముద్దనూరు: మండలంలోని చెర్లోపల్లెకు చెందిన కుంచపు భారతి (37) కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ మధుసూదన్రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. భారతి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడేవారన్నారు. గురువారం నొప్పి భరించలేక విషద్రావణం తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
అడిగేదెవరు..ఆపేదెవరు
● పోలీస్స్టేషన్ ముందు నుంచే దర్జాగా వెళుతున్న ఇసుక టిప్పర్లు ● సవాల్ విసురుతున్న ఇసుకాసురులు గుర్రంకొండ: పోలీసులా... అయితే మాకేంటీ అంటూ ఇసుకాసురులు పోలీస్స్టేషన్ ముందే దర్జాగా టిప్పర్లను తీసుకెళుతున్నారు. రేయింబవళ్లు ఇసుక అక్రమ రవాణా షరా మామూలుగా మారింది. దీని గురించి అడిగేవారు..ఆడ్డుకొనేవారు ఎవరూ లేక పోవడంతో ఇష్టానుసారం ఇసుకాసురులు చెలరేగిపోతున్నారు. ఇసుక టిప్పర్ రోడ్డుపై వెళ్లిందంటే వాహనం వెనుక వెళ్లే ద్విచక్రవాహనదారుల కళ్లుమండిపోవాల్సిందే. గాలికి ఇసుక కొట్టుకువచ్చి కళ్లలో పడుతుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. జనావాసాల మధ్యలో వెళ్లేటప్పుడు ఇసుకపై పట్టగానీ, నర్సరీ జాలీగానీ ఏర్పాటు చేసుకోక పోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అయినా తీరు మార్చుకోని ఇసుకాసురులు అధికారులకు, పోలీసులకు సవాల్ విసురుతూ పోలీస్స్టేషన్ ముందు నుంచే పట్టకట్టకుండా ఇసుక టిప్పర్లను తిప్పుతుండడం గమనార్హం. జిల్లా నలుమూలల నుంచి ఇసుక టిప్పర్లు గు ర్రంకొండ మీదుగా మదనపల్లె, కర్ణాటక వైపు నిత్యం వెళుతుంటాయి. గతంలో టిప్పర్లపై ఇసుక గాలికి ఎగిరి వెనుకవైపు వచ్చే వాహనదారులు ఇబ్బంది పడకుండా ప్లాస్టిక్ పట్టగానీ నర్సరీ జాలీగానీ ఏర్పాటు చేసుకొని వెళ్లేవారు. ప్రస్తుతం ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకుండా ఇష్టానుసారం జనవాసాల మధ్యలో వెళుతుండడం గమనార్హం. ప్రతిరోజు గంటకోమారు ఇసుక టిప్పర్ వెళుతుండడంతో కష్టాలు తప్పడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే పోలీస్స్టేషన్ ముందు వైపు నుంచే దర్జాగా ఇసుక టిప్పర్లు వెళుతున్నా పట్టించుకోవడం లేదు.దీంతో సమస్యను ఎవరికి చెప్పుకోవాలో, ఎవరికి ఫిర్యాదు చేయాలో దిక్కుతోచని స్థితిలో ద్విచక్రవాహన దారులు, గ్రామస్తులు ఉన్నారు. ఇటీవల పోలీసులు ఇసుక టిప్పర్లపై మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు. దీంతో కొద్దిరోజుల పాటు జాగ్రత్తగా వీటిని తిప్పారు. అయితే మళ్లీ వారం రోజుల నుంచి ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకుండా ఇసుక టిప్పర్లను తిప్పుతుండడం గమనార్హం. పోలీస్స్టేషన్ ముందే వాహనాలను నిలిపి జరిమానాలు విధించే పోలీసులు వాళ్ల కళ్లముందే ఇసుక టిప్పర్లు వెళుతున్నా చూసీచూడనట్లు వ్యహరిస్తుండడం విమర్శలు దారితీస్తోంది. ద్విచక్రవాహనాలు, ఇతర వాహనాలను రోజులో రెండుమార్లు నిలిపి జరిమానాలు విధించే పోలీసులకు ఇసుకటిప్పుర్లు కనిపించడం లేదా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. -
ఆరోగ్య భారతి
కమలాపురం : సమాజ సంక్షేమానికి భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) పెద్దపీట వేస్తోంది. పరిశ్రమ నెలకొల్పిన ప్రాంతమైన వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలో భారతి సిమెంట్స్, అపోలో టెలీమెడిసిన్ నెట్ వర్కింగ్ ఫౌండేషన్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆన్సైట్ వైద్య సంరక్షణను టెలీమెడిసిన్ ఆధారిత స్పెషాలిటీ కన్సల్టేషన్లతో కలిసి గ్రామీణులకు ఆరోగ్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు డిజిటల్ క్లినిక్ రూపొందించింది. ఈ ప్రాజెక్ట్ను అపోలో టెలిమెడిసిన్ నెట్ వర్కింగ్ ఫౌండేషన్ అమలు చేస్తూ, కార్యచరణ రూపొందించింది. నిరంతర సేవలు, శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, పటిష్టమైన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ ఉండేలా చర్యలు చేపట్టింది. ప్రముఖ అపోలో హాస్పిటల్స్ పర్యవేక్షణలో 2015లో ఫ్యాక్టరీ ఎదుటే రూ. 50 లక్షల వ్యయంతో టెలీక్లినిక్ను ఏర్పాటు చేశారు. అపోలో వైద్య సిబ్బంది పర్యవేక్షణలో రోజుకు దాదాపు 40 నుంచి 50 మంది రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. ఫ్యాక్టరీ సమీప గ్రామాల ప్రజలతో పాటు కమలాపురం, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల నుంచి నిత్యం అధిక సంఖ్యలో క్లినిక్కు వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. చికిత్స చేయడంతో పాటు మందుల పంపిణీ, రక్త పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. ఇప్పటి వరకు లక్ష మందికి పైగా వైద్య సేవలు అందించారు. అపోలో పర్యవేక్షణలో డిజిటల్ క్లినిక్ నిర్వహణ -
కళ్లు తేలేస్తున్న కోళ్లు
గుర్రంకొండ: అటు వ్యవసాయం.. ఇటు ఉద్యానవన పంటలు చేతికందక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన జిల్లా రైతాంగాన్ని.. తాజాగా పౌల్ట్రీ (కోళ్ల) పరిశ్రమ సంక్షోభం మరింత కోలుకోలేని దెబ్బతీస్తోంది. జిల్లాలో ఎండల తీవ్రత ఊహించని స్థాయికి చేరడంతో పౌల్ట్రీ ఫారాల్లోని కోళ్లు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఎల్నినో ప్రభావంతో పాటు భానుడి భగభగలకు తట్టుకోలేక ఊపిరి వదులుతున్నాయి. చేతికొచ్చే దశలోనే మృత్యువాత.. పతి కోళ్ల ఫారమ్లోనూ రోజుకు సగటున 30 నుంచి 40 కోళ్లు చనిపోతున్నాయి. కొన్నిచోట్ల 15 నుంచి 25 రోజుల వయసున్న కోళ్లు చనిపోతుండగా, మరికొన్ని చోట్ల తీరా అమ్మకానికి సిద్ధంగా ఉన్న చివరి దశ కోళ్లు ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నాయి. లక్షలాది రూపాయల మేత తినిపించి, కంటికి రెప్పలా కాపాడి, తీరా లాభాలు చేతికొచ్చే సమయంలోనే కోళ్లు మృత్యువాత పడుతుండడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు.గుదిబండగా మారిన ‘కంపెనీ’ ఒప్పందాలు..కోడిపిల్లలను రైతులకు ఇచ్చే సమయంలో సాధారణ మరణాల (మోర్టాలిటీ) నష్టాన్ని పూడ్చడానికి ప్రతి 1000 పిల్లలకు అదనంగా 50 పిల్లలను కంపెనీలు ఉచితంగా ఇస్తాయి. అంటే 10 వేల కోళ్లు పెంచే రైతుకు అదనంగా 500 పిల్లలు వస్తాయి. ఈ అదనపు కోళ్లు చనిపోతే రైతుకు ఎటువంటి నష్టం ఉండదు. కానీ, ఈ ఏడాది ఎండల తీవ్రత వల్ల మరణాల సంఖ్య ఆ పరిమితిని ఎప్పుడో దాటిపోయింది. ఆ 500 మార్జిన్ దాటి చనిపోయే ప్రతి అదనపు కోడి నష్టాన్ని, దాని మేత ఖర్చును పూర్తిగా రైతే భరించాలనే నిబంధన పౌల్ట్రీ రైతుల మెడకు ఉరితాడుగా మారింది. జేసీబీలతో గోతులు తీసి పూడ్చివేత ఎండల తీవ్రతను తగ్గించేందుకు పగటిపూట కోళ్ల ఫారాల రేకుల షెడ్లపై నిరంతరం నీటిని చల్లుతున్నారు. మరికొందరు రైతులు రేకుల షెడ్లపై కొబ్బరి మట్టలు (టెంకాయ పట్టలు), చెరువుల్లో లభించే జమ్ము (గడ్డి వంటి మొక్కలు)ను కోయించి వేస్తున్నారు. అయినా ఎలాంటి ఫలితం లేకుండా పోతోంది. దీంతో చేసేదేమీ లేక రైతులు చనిపోయిన వేలాది కోళ్లను జేసీబీలతో పెద్ద పెద్ద గోతులు తీయించి పూడ్చిపెడుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పౌల్ట్రీ రైతాంగాన్ని ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి తక్షణమే ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఎల్నినో ఎఫెక్ట్: కుప్పకూలుతున్న పౌల్ట్రీ పరిశ్రమ భానుడి భగభగలకు జిల్లాలో రోజుకు 21 వేల కోళ్లు మృతి రోజుకు రూ.35 లక్షల మేర బూడిద కంపెనీల ‘మార్జిన్’ నిబంధనలురైతులకు శాపం అదనపు మరణాల భారమంతావారి నెత్తినే! షెడ్లపై జమ్ము వేసి నీళ్లు చల్లుతున్నా దక్కని ఫలితం మృతిచెందిన కోళ్లను జేసీబీలతో గోతులు తీసి పూడ్చివేత -
దగా డీఎస్సీ రద్దు చేయాలి
సాక్షి, మదనపల్లె: నిరుద్యోగుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నేతలు ధ్వజమెత్తారు. దగా డీఎస్సీ రద్దయ్యేదాకా పోరు ఆగదని స్పష్టం చేశారు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ విద్యార్థి విభా గం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం జరిగింది. శుక్రవారం మదనపల్లె అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మెగా డీఎస్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డీఎస్సీ ఎంపికల విషయంలో అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర చక్రధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో డీఎస్సీ పరీక్ష పేరుతో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. 3.36 లక్షల మంది నిరుద్యోగులు పరీక్ష రాస్తే, మెరిట్ లిస్టులు బయటపెట్టకుండా, అభ్యర్థుల ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపడం వెనుక ఉన్న కుట్ర దాగుందని ఆరోపించారు. అర్ధరాత్రి వేళ డేటాబేస్ నుంచి ప్రతిభావంతులైన అభ్యర్థుల వివరాలను ఎందుకు డిలీట్ చేశారు, సెలెక్టెడ్ అని మెసేజ్ పంపి, ఆ తర్వాత మార్కులు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల తయారీ బాధ్యతలను ప్రైవేట్ కాంట్రాక్టు ఉద్యోగికి అప్పగించడం, ఆ ఉద్యోగి జిల్లా టాపర్గా, జోన్–2 ర్యాంకర్ అవ్వడం పేపర్ లీక్ ముందే జరిగిందని అర్థమవుతోందన్నారు. నిరుద్యోగ అభ్యర్థులు ఒక్కొక్కరినుంచి ఒక్కో పోస్టును రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించి చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. జిల్లా అధ్యక్షుడు జంగంరెడ్డి కిషోర్ దాస్ మాట్లాడుతూ మైదానంలో అడుగుపెట్టని ఆటగాళ్లకు బోగస్ సర్టిఫికేట్లతో డీఎస్సీలో టీచర్ పోస్టులు అమ్ముకున్నారని ఆరోపించారు. మూడు పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థికి కేవలం ఒక్క పోస్టుకే కాల్ లెటర్ పంపి దాదాపు నాలుగు వేల మంది ఉన్నత ఉద్యోగ అవకాశాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత పోస్టులు ఇవ్వాలి అని హైకోర్టు స్పష్టంగా ఆదేశించినా వాటిని బేఖాతర్ చేశారన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురాకుండా, తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి న్యాయవ్యవస్థనే మోసం చేశారని మండిపడ్డారు. నిరుద్యోగ యువత జీవితాలను నాశనం చేసిన డీఎస్సీ కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐ విచారణ జరిపించడానికి ప్రభుత్వం సిద్ధమా అని సవాల్ చేశారు. విచారణ జరిగితే నిజాలు బయటపడతాయని చంద్రబాబు, లోకేష్ భయపడుతున్నారని అన్నారు. ఈకుంభకోణానికి బాధ్యత వహించి లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కళ్యాణ్ భరత్, మదనపల్లి అధ్యక్షులు అశోక్ రాయల్, రాష్ట్ర కార్యదర్శి హేమంత్, తంబలపల్లె నియోజవర్గం అధ్యక్షులు అభిలాష్రెడ్డి, పీలేరు నియోజకవర్గం అధ్యక్షు లోకనాథం, జిల్లా కార్యదర్శి పూర్ణచంద్ర, నాయకులు గిరీష్ , సీనియర్ విద్యార్థి విభాగం, ద్వారకనాథ్ రెడ్డి, పీలేరు భువనేశ్వర్ రెడ్డి , లోకనాథ్ రెడ్డి ,జిల్లా ఉపాధ్యక్షులు నరేష్, జిల్లా ఎస్టీ సెల్ నాయకులు పీలేరు చిన్న, నిమ్మలపల్లి మండల అధ్యక్షులు ప్రశాంత్, జిల్లా కార్యదర్శి ఆఫ్రిత్ , సీనియర్ విద్యార్థి విభాగం నాయకులు షేక్ మౌలాలి , కొండ వెంకటరమణారెడ్డి , రావూరి హరికృష్ణ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నేతలు డిమాండ్ మదనపల్లెలో వైఎస్సార్సీపీ విద్యార్థి పోరు -
యువతకు క్రీడలు ఎంతో అవసరం
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు : గ్రామీణ యువతకు క్రీడలు ఎంతో అవసరమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని సుగాలిమిట్ట గ్రామంలో మిథున్ దళం క్రికెట్ టోర్నమెంట్ను పెద్దిరెడ్డి ప్రారంభించారు. వైఎస్సార్సీపీ జిల్లాయూత్వింగ్ కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డి ఆధ్వర్యంలో మిథున్దళం టోర్నమెంట్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి క్రీడాకారులు, అభిమానులు, గిరిజన మహిళలు ఘనస్వాగతం పలికారు. ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రికెట్ ఆడి ప్రారంభించారు. క్రీడల్లో పాల్గొనే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి క్రీడలను ప్రోత్సహించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం క్రీడలను విస్మరించిందని ఆరోపించారు. క్రీడాకారులు పెద్దిరెడ్డి జిందాబాద్...మిధున్రెడ్డి జిందాబాద్ అంటు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, ఎంపీపీ భాస్కర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అలీమ్బాషా, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, బైరెడ్డిపల్లి రెడ్డెప్ప, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బాణావత్ మునీంద్రనాయక్, పార్టీ నాయకులు భానుప్రసాద్, రాజేష్, సురేష్, ప్రశాంత్రెడ్డి, డాబా శ్రీనివాసులు, ఆంజినాయక్, శ్రీనివాసులునాయక్, వేణునాయక్, మోహన్నాయక్, బాబునాయక్, రాజునాయక్, రషీదబేగం తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా బర్సీ మహోత్సవం
కమలాపురం: కమలాపురం పట్టణంలో వెలసిన దర్గా–ఏ–గఫారియా, జహీరియా స్వర్గీయ పీఠాధిపతి హాజి జహీరుద్ధీన్ షా ఖాద్రి బర్సీ మహోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి పీఠాధిపతి, సజ్జాద్–ఏ–నషీన్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రి, దర్గా కన్వీనర్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో బర్సీ మహోత్సవం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్త జన సందోహం నడుమ పీఠాధిపతి నివాసం నుంచి జహీరియా దర్గా వరకు గంధం ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్వామి వారి మజార్లపై గంధం ఎక్కించి, పూల చాదర్లు సమర్పించారు. ప్రత్యేక ఫాతెహ నిర్వహించారు. రాత్రి నాత్ చదివారు. అనంతరం బయాన్ చేశారు. పీఠాధిపతి సోదరులు దస్తగిరి షా ఖాద్రి, మౌలానా, గౌస్పాక్, జియా మాలిక్, సర్ఫరాజ్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
మహిళల భద్రతకు ‘ఆపరేషన్ దండాయన’
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లిమదనపల్లె టౌన్: మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, వారిపై నేరాలకు పాల్పడే వారికి త్వరితగతిన శిక్షలు పడేలా జిల్లా వ్యాప్తంగా ‘ఆపరేషన్ దండాయన’కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. శుక్రవారం మదనపల్లె జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన ‘స్పీడ్ ట్రయల్ మానిటరింగ్’విధానాన్ని జిల్లాలో వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. మహిళలపై జరిగే అత్యాచారాలు, గృహ హింస, పొక్సో కేసుల్లో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళలపై నేరాల్లో (క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్) 16 కేసుల్లో నిందితులకు కోర్టు ద్వారా శిక్షలు పడేలా పోలీస్ శాఖ చట్టపరమైన చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. సంచలనాత్మక కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.వెంకటాద్రి మహిళా పోలీస్ స్టేషన్ సీఐ. జి.శంకర మల్లయ్య, కోర్ట్ మానిటరింగ్ ఇన్స్పెక్టర్ జె. ప్రసాద్ బాబు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కె. సురేష్ కుమార్ రెడ్డి, డీసీఆర్ బి, ఎస్ఐ.బి. సహదేవి, తదితరులు పాల్గొన్నారు.


