breaking news
Annamayya
-
వైభవంగా కామాక్షి త్రేతేశ్వరుని కల్యాణం
రాజంపేట రూరల్ : ప్రముఖ శైవ క్షేత్రమైన అత్తిరాలలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరో రోజు నిర్వహించిన శ్రీకామాక్షి సమేత శ్రీత్రేతేశ్వరస్వామి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం దేవదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కల్యాణానికి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని తిలకించారు. తొలుత కామాక్షిదేవి, త్రేతేశ్వరస్వామి వారిని పుష్పాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక ఆసనంపై ఆశీనులను చేశారు.ఆలయ ప్రధాన అర్చకులు కె.వేంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పండితులు వేద మంత్రాలు పఠిస్తూ కల్యాణ క్రతువును క్రమంగా నిర్వహించారు. అనంతరం కల్యాణంలో పాల్గొన్న భక్తులకు ముత్యాల తలంబ్రాలను అందజేశారు. -
తల్లికి వందనం కూడా ఒక మోసమే
రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతుంటే, రూ.15వేల వంతున ఏటా రూ.13,112 కోట్లు ఇవ్వాల్సి ఉండగా తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో పిల్లల సంఖ్యను దాదాపు 21లక్షలు తగ్గించి, కేవలం 66 లక్షలమందికి రూ.8,389 కోట్లు ఇచ్చామన్నట్టుగా చూపిస్తున్నారు. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో చాలామందికి అందలేదు. అందులోనూ చాలామందికి రూ. 8వేలు, 9వేలు, రూ.10వేలు మాత్రమే పడ్డాయి. మూడేళ్లలో ఇవ్వాల్సింది రూ.39,336 కోట్లు ఇవ్వాల్సి ఉంటే తక్కువ చూపిస్తున్నారు. తల్లికి వందనం పథకం అమలు కూడా ఒక మోసమే. – పి. జయచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి.వైఎస్సార్ కడప ఆడబిడ్డ నిధి పథకానికి ఈ బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించలేదు. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పారు. 18–50 ఏళ్లలోపు మహిళలకు ఏడాదికి రూ.32వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఎగ్గొట్టారు. దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇస్తామని ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చారు. మూడు సిలిండర్లు ఎప్పుడిస్తారో చెప్పలేదు. వైఎస్సార్ ఆసరా పథకాన్ని పూర్తిగా ఎత్తేశారు. మహిళలకు సున్నావడ్డీ రుణాలు ఇవ్వడం లేదు. – ఎంవీ సుజిత, స్వయం సహాయ సంఘ సభ్యురాలు. -
అర్జీలకు సత్వర పరిష్కారం
మదనపల్లె టౌన్ : ప్రజల నుంచి వచ్చే అర్జీలన్నీ పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి డిఎస్పీ అందుబాటులో లేక పోవడంతో స్థానిక వన్ టౌన్ సీఐ మహ్మద్ రఫి, ఎస్ఐ గాయత్రి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వద్ద, అర్జీలను స్వీకరించారు. అనంతరం వాటిని ఆన్ లైన్ చేసి జిల్లా ఎస్పీ లాగిన్కు పంపించారు. అర్జీలను పరిశీలించి స్పందించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ.. సంబంధిత పోలీసులు పీజీఆర్ఎస్కు వచ్చే అన్నిరకాల అర్జీలపై విచారణ జరిపి సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. అర్జీలను పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సీఐ, ఎస్ఐలను ఎస్పీ హెచ్చరించారు. -
బడ్జెట్ పేరుతో మళ్లీ దగా
చంద్రబాబు ప్రభుత్వం మరో సారి అంకెల గారడీతో రాష్ట్ర ప్రజలను దగా చేసింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా మోసం చేశారో ఇప్పుడు బడ్జెట్ పేరుతో అదేవిధంగా దగా చేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకానికి నిధులు కేటాయింపు చేయలేదు. మహిళలకు ఇచ్చిన హామీకి బడ్జెట్లో నిధులు కేటాయించకుండా నిరాశ పరిచింది.ప్రతి మహిళకు రూ.1500 నెలకు ఇస్తామని చెప్పి ఆ హామీని కూడా విస్మరించారు. అన్నదాతలకు అరకొర నిధులు కేటాయింపుతో మోసం చేశారు. –గార్ల చంద్రమౌళి, వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి -
దీపం వెలిగిస్తుండగా నిప్పంటుకుని గాయాలు
మదనపల్లె టౌన్ : శివరాత్రి పండుగ సందర్భంగా ఆలయంలో దీపం వెలిగిస్తున్న, ఓ వృద్ధ మహిళ చీరకు నిప్పంటుకుని తీవ్రంగా గాయపడింది. సోమవారం నిమ్మనపల్లె మండలంలో జరిగిన ఘటనపై బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని గారబురుకు చెందిన గంగులమ్మ(74) ఊర్లో ఉన్న శివాలయంలో గ్రామస్తులు విశారాధన చేస్తుండగా వెళ్లింది. అక్కడి ఆలయంలో సాయంత్రం ఓ దీపం ఆరిపోవడంతో తిరిగి వెలిగించే క్రమంలో చీరకొంగుకు నిప్పంటుకుని తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని కుటుంబీకులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చి వైద్యం అందించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆమెను మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తీసుకెళ్లాని డాక్టర్లు సలహా ఇచ్చారు. నిమ్మనపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో భవన కార్మికులకు తీవ్ర గాయాలుమదనపల్లె టౌన్ : రోడ్డు ప్రమాదంలో భవన కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం కురబలకోట మండలంలో జరిగింది. ప్రమాదానికి సంబంధించి ముదివేడు ఎస్ఐ మధురామ చంద్రుడు తెలిపిన వివరాలు.. పెద్దతిప్పసముద్రంకు చెందిన భవన కార్మికులు కరీముల్లా(22), అక్బర్(18), సౌకత్(22) భవన కార్మికులుగా పనిచేస్తున్నారు. ముగ్గురు రోజూ మాదిగిగానే మదనపల్లెలో భవన నిర్మాణం పనులు చేయడానికి బైకులో బయలుదేరారు. స్కూటర్ కురబలకోట మండలం, చెన్నామర్రి మిట్ట వద్దకు రాగానే ఓ కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని 108 సిబ్బంది మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం కరీముల్లాను మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు వెళ్లాలని సూచించారు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్ఐ తెలిపారు. హ్యాండ్ లూమ్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం మదనపల్లె టౌన్ : పట్టణంలో సోమవారం రాత్రి జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం వాటిళ్లింది. ఘటనపై అగ్ని మాపక అధికారి శివప్ప మీడియాకు తెలిపిన వివరాల మేరకు.. నీరుగుట్టువారిపల్లెలో నివాసం ఉంటున్న రవీంద్రారెడ్డి అమృత ట్రేడర్స్ పేరుతో హ్యాండ్ లూమ్, పవర్ లూమ్, స్ప్రేర్ పార్ట్స్ దుకాణం నడుపుతున్నాడు. ఈ క్రమంలో మహాశివరాత్రి సందర్భంగా సోమవారం కుటుంబీకులు దుకాణంలో సాయంత్రం దేవుడికి దీపాలు వెలిగించారు. అనంతరం వారు ఇంటికి వెళ్లిపోయారు. కొంతసేపటికే దీపాలకు హ్యాండ్ లూమ్ దారాలు అంటుకుని మంటలు చెలరేగి అంగడిలో ఉన్న సుమారు రూ.ఐదుల క్షలకు పైగా విలువైన మగ్గాల పరికరాలు కాలిపోయాయి. సమాచారం అందిన వెంటనే సిబ్బందితో వెళ్లి మంటలు అదుపుచేసి పక్కన ఉండే దుకాణాలకు మంటలు వ్యాప్తి చెంకుండా కంట్రోల్ చేశామని తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.రూ.5 లక్షలకు పైగా ఆస్థి నష్టం -
జగనన్నకు ఆశీస్సులందజేయాలని ప్రార్థించా
తంబళ్లపల్లె : మాజీ సీఎం జగనన్నకు చల్లని ఆశీస్సులు ఇవ్వాలని మల్లికార్జున స్వామిని ప్రార్థించినట్టు మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. సోమవారం ములకలచెరువు నకిలీ మద్యం అక్రమ కేసులో ఆయన తంబళ్లపల్లె కోర్టుకు హాజరయ్యారు. కేసు వాయిదా వేయడంతో సమీపంలోని మల్లయ్య కొండపైకి వెళ్లారు. అక్కడ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, జగనన్నకు ఎల్లప్పుడూ చల్లని ఆశీస్సులు ఇవ్వాలని ప్రార్థించానని అన్నారు. గతంలో మల్లయ్య కొండకు భక్తులు రావాలంటే కాలినడక తో ఎంతో ఇబ్బంది ఉండేది, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి సహకారంతో జగనన్న పాలనలో ఘాట్ రోడ్డును నిర్మించినట్లు భక్తులు సంతోషంగా చెబుతున్నారన్నారు. దీనివల్ల శివరాత్రి రోజు లక్షల మంది భక్తులు మల్లయ్య సన్నిధికి వచ్చి దర్శించుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా జరిగిన మల్లయ్య కొండ అభివృద్ధి ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. -
నిబంధనల ఉల్లంఘనపై చర్యలేవీ?
● విచారణ తొక్కి పెట్టారా ● కలెక్టర్ ఆదేశించినా స్పందించని రిజిస్ట్రేషన్ శాఖమదనపల్లె : మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిబంధనలను ఉల్లంఘించి జరిగిన రిజిస్ట్రేషన్లపై ఒక్క పరిశీలన కూడా జరగడం లేదని తెలుస్తోంది. ఇందులో ఒక రిజిస్ట్రేషన్కు సంబంధించి గత జిల్లా కలెక్టర్ శ్రీధర్కు ఫిర్యాదులు వెళ్ళగా వాటిపై చర్యలకు రిజిస్ట్రేషన్ జిల్లా అధికారికి పంపారు. ఇప్పటిదాకా విచారణ కాదు కదా కనీసం పరిశీలన కూడా జరగలేదని స్పష్టంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. మదనపల్లె చెందిన వ్యక్తి స్థానిక సీటీఎం రోడ్డులోని ఓ హాస్పిటల్ కు సంబంధించి ఒకే విలువ ఉండగా, నిబంధనలో ఉల్లంఘించి విలువ తగ్గించి రెండు రిజిస్ట్రేషన్లు చేయడంతో ప్రభుత్వానికి లక్షల ఆదాయం నష్టం కలిగిందని గత ఏడాది ఫిబ్రవరి 28న అప్పటి కలెక్టర్ శ్రీధర్ కు ఫిర్యాదు పంపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి పెరిగిందని దానికి సంబంధించిన కొన్ని వివరాలతో లేఖ రాశారు. ఈ లేఖను కలెక్టర్ రిజిస్ట్రేషన్ల శాఖ జిల్లా అధికారికి పంపారు. దీన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచన చేశారు. అయితే ఏడాది గడిచినా ఈ ఫిర్యాదుపై సంబంధిత అధికారులు ఒక్క పరిశీలన కూడా చేపట్టలేదు. ఈ నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించి స్థానిక సీటీఎం రోడ్డులోని ఓ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఒకే ఆస్తిని రెండుగా విడగొట్టడమే కాక, మార్కెట్ విలువను భారీగా తగ్గించి రిజిస్ట్రేషన్ చేసిన విషయాన్ని గత ఏడాది జులైలో సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి రూ.28.60 లక్షల ఆదాయం నష్టం కలిగింది. ఇది ఒక్క ఆస్తికి సంబంధించి మాత్రమే..ఇంకా ఇలాంటి నిబంధనల ఉల్లంఘనలు ఎన్నో జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై అప్పటి జిల్లా అధికారులు కనీసం స్పందించకపోవడంతో విచారణ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఏడాది కాలంలో జిల్లా అధికారులు పలుమార్లు స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని తనిఖీ చేసినా ఈ అంశాన్ని ఎక్కడా ప్రస్తావనకు తీసుకురాలేదు. ఫలితంగా దీనిపై చేసిన ఫిర్యాదు బుట్ట దాఖలైంది. కనీసం పరిశీలన చేసి ఉంటే అక్రమాలు ఏ మేరకు జరిగాయో బహిర్గతం అయ్యేది. బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉండేది. ఇవేమీ చేయకపోగా కనీసం స్పందించలేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ఐజి పరిశీలనలో ఓ హాస్పిటల్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ వ్యవహారం ఆ శాఖ ఐజీ స్థాయి అధికారి పరిశీలనకు వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక రిజిస్ట్రేషన్ కు సంబంధించే రూ.28.60 లక్షల నష్టం వాటిలిందంటే అక్కడ పనితీరు ఏ విధంగా ఉందో అని ఉన్నత స్థాయి వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. విచారణ జరపలేదు ఓ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి కలెక్టర్ కు అందిన ఫిర్యాదుపై తాను ఎలాంటి విచారణ చేయనిది వాస్తవమేనని మొన్నటిదాకా జిల్లా ఇన్చార్జ్ డిఆర్ గా పనిచేసిన చిత్తూరు డీఆర్ మూర్తి సోమవారం స్పష్టం చేశారు. దీనిపై తమ శాఖ ఉన్నతాధికారుల నుంచి కూడా విచారణకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేశారు. -
టీడీపీ కూటమి ప్రభుత్వం ‘సంస్కారం’ మరిచింది. అంతిమ సంస్కారానికి పెన్షనర్ల కుటుంబీకులకు ఇవ్వాల్సిన డబ్బు జమ చేయడం లేదు. ఒకప్పుడు ప్రభుత్వ పెన్షనర్ మరణిస్తే అదే రోజు వారి కుటుంబీకులకు ప్రభుత్వ చట్టబద్ధంగా ఇవ్వాల్సిన ఫ్యునరల్ చార్జీలు (దహన–ఖననక్రియలు/మట్టిఖ
రాజంపేట : ప్రభుత్వ పెన్షనర్లు మృతి చెందితే వారి అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నగదు సాయం ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో వందలాది మంది ఈ డబ్బుకోసం ఎదురుచూస్తున్నారు. వారి కళ్లు కాయలు కాస్తున్నా ప్రభుత్వానికి కనికరం కరువైంది. గతంలో ప్రభుత్వ పెన్షనర్ చనిపోతే అదే రోజు అంత్యక్రియలకు డబ్బు ఇచ్చే విధానం కొనసాగింది. ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. మృతునికి సంబంధించిన పత్రాలు ఇచ్చేందుకు నెలకు పైగా పడుతుంది. ఇక ప్రభుత్వం నుంచి వీరికి ధనసాయం అందేందుకు ఎన్నాళ్లు పడుతుందో అర్థం కావడం లేదు. పెన్షనర్ చనిపోతే ఆయా కుటుంబీకులు అంత్యక్రియలు వెంటనే నిర్వహిస్తున్నా... సంప్రదాయం ప్రకారం ప్రభుత్వం నుంచి రావాల్సిన కనీస సాయం అందడం లేదు. ఇప్పటివరకు అనేక మంది ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబీకులు నగదు కోసం వేచిఉన్నారు. జిల్లాలో రాజంపేట, కడప, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు, సిద్ధవటం, పులివెందుల, ముద్దనూరు తదితర ప్రాంతాలో ఖజనా కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో అనేక మందికి అంత్యక్రియల డబ్బు రాలేదు. నగదు జమలో జాప్యం... ప్రభుత్వ పెన్షనర్లు మృతి చెందిన క్రమంలో వారికి చట్టబద్ధంగా రావాల్సిన అంత్యక్రియల నగదు వారి సంబంధీకులకు అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబాలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని వాపోతున్నారు. ప్రభుత్వ పెన్షనర్ మరణించిన నేపథ్యంలో అందుకు సంబంధించి డెత్, ఫ్యామిలీ మెంబరు తదితర వివరాలను స్ధానిక ట్రెజరీలో అందచేస్తుంటారు. ఈ ట్రెజరీ ద్వారా ప్రభుత్వ ట్రెజరీకి వివరాలు వెళుతుంటాయి. అంతా అన్లైన్లో జరిగిపోతుంటాయి. అయితే ఖాతాలో నగదు జమ చేయడం ప్రభుత్వం మరిచిపోయినట్లుందన్న విమర్శలు ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబీకుల్లో వినిపిస్తున్నాయి. బడ్జెట్ లేదని కుంటిసాకులుప్రభుత్వ పెన్షనర్లు మరణిస్తే వారికి ఇవ్వాల్సిన ఫ్యునరల్ చార్జీస్ ఇచ్చేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తోందన్న విమర్శలు వెలువడుతున్నాయి. కూటమి ప్రభుత్వం లక్షల కోట్లు వ్యయం చేసి, అనవసర కార్యక్రమాలను చేస్తున్న క్రమంలో ప్రభుత్వ పెన్షనర్లు మరణిస్తే వారి కుటుంబీకులకు డబ్బు ఇవ్వలేని దుస్ధితిలో ఉందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. బడ్జెట్ సాకుతో జిల్లాలో అనేక మంది మరణించిన ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబాలకు ఫ్యునరల్ చార్జీలు చెల్లించడం లేదు. ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబీకులు కూటమి ప్రభుత్వం తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ట్రెజరీల చుట్టూ మృతుల కుటుంబీకులుదివంగతులైన ప్రభుత్వ పెన్షనర్లకు రావాల్సిన ఫ్యునరల్ చార్జీల కోసం వారి కుటుంబీకులు ట్రెజరీల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఫ్యునరల్ చార్జీలు చెల్లించేందుకు అవసరమైన పత్రాలు ఆన్లైన్లో రాష్ట్ర ఖజనాకు వె వెళ్లాయి. అయితే నెలల తరబడి ఈ చార్జీల కోసం ఎదురుచూడాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి. ట్రెజరీ అధికారులు తమ చేతిలో ఏమీ లేదని, డబ్బు రాష్ట్ర ఖజనా నుంచి రావాల్సిందేనని వాపోతున్నారు. ఫ్యునరల్ చార్జీల విషయంలో ఏమీ చేయలేమని స్థానిక ట్రెజరీ అధికారులు చేతులేత్తేస్తున్నారు. మృతుల కుటుంబీకుల ఖాతాలకు నేరుగా రాష్ట్ర ఖజానా నుంచి డబ్బు పడుతుందని చెబుతున్నారు. అయితే ఎప్పుడు వేస్తారో తెలియదంటున్నారు. దీంతో మృతిచెందిన ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబీకులు మదనపడుతున్నారు. ఈ విషయంపై జిల్లా ట్రెజరీ అధికారి వివరణకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. అంత్యక్రియల నగదు జమలో ప్రభుత్వ జాప్యం దివంగత పెన్షనర్ల కుటుంబీకుల ఎదురుచూపు బడ్జెట్ లేదని కుంటి సాకులతో కాలయాపన చేతులెత్తేస్తున్న ఖజానా అధికారులు ట్రెజరీల చుట్టూ తిరుగుతున్న కుటుంబీకులు ప్రభుత్వం ‘మట్టి’కొట్టుకుపోతుందని శాపనార్థాలు -
భూ కబ్జాకు యత్నిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు
మదనపల్లె టౌన్ : వారసత్వంగా సక్రమించిన ఆస్తిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని సోమవారం మదనపల్లెలో జిల్లా ఎస్పీకి బాధితుడు పిర్యాదుచేశాడు. మండలంలోని వేంపల్లెకు చెందిన బయగారి హేమచంద్రకు వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూమి కొంత ఉంది. ఆ భూమిపై కన్నేసిన అదే ఊరిలో ఉండే జయప్ప వర్గీయులు ఇతరుల దగ్గర కొనుగోలు చేశామన్న సాకుతో, ఆదివారం కబ్జాకు యత్నిస్తూ రాతి కూసాలను ట్రాక్టర్లలో తీసుకొచ్చి తన వ్యవసాయ పొలంలో అడ్డంగా తోలేశారని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నాడు. ఇదివరకే గొడవలు చేస్తుంటే తాము కోర్టును ఆశ్రయించగా.. ఇంజక్షన్ ఆర్డర్ కూడా కోర్టు ఇచ్చిందన్నారు. కోర్టు ఆర్డర్ను కూడా బేఖాతర్ చేస్తూ జయప్ప రాతి కూసాలను తన పొలంలో తోలి కబ్జాకు యత్నించడంతో ఎస్పీకి పీజీఆర్ఎస్లో ఫిర్యా దు చేశామని పేర్కొన్నారు. పోలీసులు స్పంచింది. విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరారు. నా బిడ్డను చంపేశారని.. నా బిడ్డను చంపేశారనే అనుమానం ఉంది. విచారించి న్యాయం చేయాలని సోమవారం మదనపల్లె డిఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నిర్వహించిన పీజిఆర్ఎస్లో బాధిత తల్లి ఫిర్యాదు చేసింది. వివరాలు.. మండలంలోని వలసపల్లె గ్రామం, అరవవాండ్లపల్లెకు చెందిన లక్ష్మినారాయణ, లక్ష్మీదేవి దంపతుల చిన్న కుమారుడు పూల దివాకర్(31) బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవాడు. ఈ ఏడాది జనవరి ఒకటి సందర్భంగా ఒక రోజు ముందే భార్య పిల్లలతో దివాకర్ అరవవాండ్లపల్లెలోని తన ఇంటికి వచ్చాడు. జనవరి 1న గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో వెళ్లాడని.. ఆ రోజు నుంచి దివాకర్ కనిపించడం లేదని బాధితురాలు పేర్కొంది. అప్పటినుంచి ఫోన్ పని చేయక పోవడంతో తన బిడ్డను చంపే శారేమో అన్న అనుమానం గా ఉందని దివాకర్ తల్లి ఆరోపించింది. ఇద్దరిపై అనుమానం ఉన్నట్లు పేర్కొని, తన బిడ్డ ఆచూకీ తెలపాలని లక్ష్మీదేవమ్మ స్థానిక తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినా ఇప్పటి వరకు తమకు ఎలాంటి వివరాలు తాలూకా పోలీసులు వెల్లడించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అంగడిరూం ఆక్రమిస్తున్నాడని.. గుర్రంకొండ బస్టాండులో ఉండే తమ అంగడి రూమును సమీప బంధువు మాకం వెంకటేశ్వర్లు రాజకీయ నాయకుల పేరు చెప్పి ఆక్రమించేందుకు యత్నిస్తున్నాడని, సోమవారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి ఓ బాధితురాలు ఫిర్యాదు చేసింది. వివరాలు.. గుర్రంకొండలో నివాసం ఉంటున్న వై, వెంకటాచలపతి, పద్మ దంపతులు బస్టాండు దగ్గర గత కొన్నేళ్లుగా దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నేషనల్ హైవే అధికారులు రోడ్డు విస్తరణలో భాగంగా కూడా కొంత దుకాణం తొలగించి పరిహారం వెంకటాచలపతికి ఇచ్చారు. అలాంటి గదికి ఏఈ వద్ద కరెంట్బిలు, పంచాయతీ సెక్రటరీ దగ్గర పన్ను కట్టినట్లు నకిలీ పత్రాలు సృష్టించి మాకం వెంకటేశ్వర్లు టీడీపీ నాయకుడి పేరు చెప్పి బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఉన్నతాధికారు లు స్పందించి న్యాయం చేయాలని కోరింది. -
జోగి రమేష్ కు వైఎస్సార్సీపీ నాయకుల సంఘీభావం
తంబళ్లపల్లె : ములకలచెరువు నకిలీ మద్యం తయారీ అక్రమ కేసులో తంబళ్లపల్లె కోర్టుకు హాజరైన మాజీ మంత్రి జోగి రమేష్ కు వైఎస్సార్సీపీ నాయకులు స్వాగతం పలికి, వెంట ఉండి సంఘీభావం తెలిపారు. ఆదివారం రాత్రి హార్సిలీహిల్స్పై విడిది చేసిన ఆయన సోమవారం తంబళ్లపల్లె కు చేరుకున్నారు. కురబలకోట మండలం మీదుగా ఇక్కడికి వచ్చారు. కోర్టుకు హాజరై కేసు వాయిదా పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ ఇద్దరు కొంతసేపు వివిధ అంశాలపై ముచ్చటించుకున్నారు. నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులకు జోగి రమేష్ను ఎమ్మెల్యే పరిచయం చేశారు. ఈ సందర్భంగా జగనన్న పాలనలో తంబళ్లపల్లె నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై జోగి రమేష్ ఎమ్మెల్యే వద్ద ప్రస్తావించి ప్రశంసించారు. వైస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆముదాల మధుసూదన్ రెడ్డి, మండల అధ్యక్షుడు చౌడేశ్వర, నాయకులు బెంగుళూరు మల్లికార్జున రెడ్డి, వేమారెడ్డి, శ్రీనివాసులు, మైనద్దీన్, భాస్కర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, రామమూర్తి, కె ఆర్.మల్లిరెడ్డి, కిషోర్ రెడ్డి, కృష్ణారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డికి పాల్గొన్నారు. -
జూదరుల అరెస్టు
సదుం : జూదం ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ విష్ణునారాయణ సోమవారం తెలిపారు. తుమ్మగుంటపల్లె సమీపంలో జూదం ఆడుతున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో కలసి దాడి చేశామన్నారు. తమను చూసి వారు పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నట్లు చెప్పారు. ముగ్గురు పట్టుబడగా.. కొంతమంది పారిపోయారన్నారు. వారి నుంచి రూ.46,500 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. దరఖాస్తు చేసుకోండిపుంగనూరు : పెద్దపంజాణి మండలంలో గీతకులాలకు చెందిన మద్యంషాపు కేటాయింపునకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ సురేష్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వాదేశాల మేరకు ఈనెల 21వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కలెక్టర్ ఆధ్వర్యంలో 23న లాటరీ ద్వారా షాపు కేటాయించనున్నట్లు తెలిపారు. ఏడేళ్ల బాలిక అదృశ్యం మదనపల్లె టౌన్ : మదనపల్లె పట్టణంలో సోమవారం సాయంత్రం ఏడేళ్ల బాలిక మిస్సింగ్ కలకలం రేపుతోంది. బాధితురాలి కుటుంబీకులు స్థానిక వన్ టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. నీరుగట్టువారిపల్లెలో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు గోపినాథ్ కుమార్తె రుషిక ప్రియ(07) స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో రెండోతరగతి చదువుతోంది. సాయంత్రం స్నేహితులతో కలసి కాట్లాటపల్లె రోడ్డుకు వచ్చింది. అక్కడ అదృశ్యమైంది. రాత్రి 8 గంటలైనా ఇంటికి రాక పోవడంతో బాలిక తండ్రి పలు చోట్ల గాలించాడు. ఆచూకి లబించక పోవడంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహ్మద్ రఫి తెలిపారు. బైక్ చోరీమదనపల్లె టౌన్ : మదనపల్లెలో ఆర్టీసీ కండక్టర్కు చెందిన బైకును దొంగలు చోరీ చేశారు. ఘటనపై బాధితుడు తాలూక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు..స్థానిక చిప్పిలిలో కాపురం ఉంటున్న జయరామిరెడ్డి ఒంటి ముందు నిలిపిన బైకును రాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు. ఉదయం గుర్తించిన బాధితుడు వెంటనే వెళ్లి తాలుక పోలీసులకు పిర్యాదు చేశాడు. -
వాహనం ఢీకొని జింక మృతి
పెద్దతిప్పసముద్రం : మండలంలోని రంగసముద్రం–బి.కొత్తకోట రోడ్డులో సోమవారం రోడ్డు ప్రమాదంలో జింక మృతి చెందింది. రోడ్డు దాటే క్రమంలో జింకను వాహనం ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనలో ద్విచక్రవాహదారుడు సైతం తీవ్రంగా గాయపడ్డాడు. మామిడి తోట కంచెకు నిప్పు రామసముద్రం : రామసముద్రం మండలం, మినికి గ్రామం వద్ద ఎంఎస్. సలీం బాషా, నజీర్బాషాలకు చెందిన మామిడి తోట కంచెకు గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం నిప్పు పెట్టారు. గమనించిన స్థానికులు పుంగనూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే వారు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇద్దరికి చెందిన 50 ఎకరాల మామిడి తోటలో స్వల్పంగా కంచె, మామిడి చెట్లు అగ్నికి ఆహుతైనట్లు స్టేషన్ అగ్నిమాపక అధికారి సుబ్బరాజు తెలిపారు. ఈ ప్రమాదంలో నష్టం సుమారు రూ. 5వేలు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ధూమపానం సేవించి ఆర్పకుండా పారవేసిన ముక్కల వల్ల ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. బాలుడిపై కుక్కల దాడి మదనపల్లె టౌన్ : వీధిలో ఆడుకొంటున్న రెండేళ్ల బాలుడిపై కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయ పరచాయి. సోమవారం మదనపల్లె మండలంలో చోటుచేసుకున్న ఘటనపై బాధిత బాలుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు .. మండలంలోని కొత్తవారిపల్లె పంచాయతి, పాళ్యం కొండకు చెందిన సురేష్ కుమారుడు యశ్విన్ (02) ఇంటికి సమీపంలోని వీధిలో ఆడుకుంటూ ఉండగా .. అదే వీధిలో ఉండే చంద్ర పెంచుకున్న కుక్కలు యశ్విన్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కుమారుడి కేకలు విన్న తల్లిదండ్రులు వెంటనే వెళ్లి కుక్కల బారి నుంచి కాపాడి, చికిత్స కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై బాధితుని కుటుంబీకులు స్థానిక తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కలెక్టరేట్కు అర్జీదారుల క్యూ !
● సమస్యలకు పరిష్కారం చూపాలని విన్నపాలు ● వివిధ సమస్యలపై నమోదైన 191 అర్జీలు పీజీఆర్ఎస్లో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ టీడీపీ నాయకుల కబ్జా నుంచి భూమిని విడిపించి న్యాయం చేయాలంటున్న చిరంజీవి, రెడ్డిప్రసాద్మదనపల్లె రూరల్ : ‘సారూ... మాకు న్యాయం చేయండి..’ అంటూ అర్జీదారులు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో అర్జీలు సమర్పించేందుకు క్యూ కట్టారు. ఎన్నిసార్లు తిరుగుతున్నా క్షేత్రస్థాయిలో న్యాయం జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జేసీ శివ నారాయణశర్మ, సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వో మధుసూధనరావు, సర్వే ఏడీ భరత్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ మాట్లాడుతూ ప్రజలు అందజేసే అర్జీలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లాలోని 5 నియోజకవర్గాల నుంచి వివిధ సమస్యలపై 191 అర్జీలు పరిష్కారం కోసం ప్రజలు అందజేశారు. నిమ్మనపల్లె మండలం రాచవేటివారిపల్లె పంచాయతీ మాచిరెడ్డిగారిపల్లెలో 50 ఏళ్లుగా తమ అనుభవంలో ఉంటూ సాగు చేసుకుంటున్న భూమికి, అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఫోర్జరీ పత్రాలతో తప్పుడు పాసుపుస్తకాలు, 1బీ చేసుకుని, అధికార బలంతో తమను భూమిలోకి రానీయకుండా అడ్డుకుంటున్నారని కే.చిరంజీవి, రెడ్డిప్రసాద్లు అర్జీ అందజేశారు. భూమి తమ అనుభవంలో ఉన్నట్లు ఆధారాలను జాయింట్ కలెక్టర్కు అందించి, తమకు న్యాయం చేయాల్సిందిగా వేడుకున్నారు. మదనపల్లె రూరల్ మండలం చిప్పిలి గ్రామంలో అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్న రాజేశ్వరి, చీటీలు, వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతోందని జంగాల దేవరాజ్ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, అధిక వడ్డీల ఆశ చూపి మోసం చేస్తోందన్నారు. రాజేశ్వరి మోసంపై డీఎస్పీకి ఫిర్యాదుచేసినా స్పందన లేకపోవడంతో కలెక్టరేట్కు వచ్చినట్లు తెలిపారు. అంధత్వంతో బాధపడుతూ, చూపులేక జీవనోపాధి కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్తగా దివ్యాంగుల పెన్షన్ మంజూరుచేయాలని సదుం మండలానికి చెందిన వి.శ్రీనివాసులు అర్జీ సమర్పించారు. పదిహేనేళ్లుగా వంటమనిషిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకున్న తాను, పక్షవాతంతో శారీరకంగా బలహీనపడి, పనులు చేయలేని స్థితికి చేరుకున్నానని, కుటుంబపోషణ కోసం దివ్యాంగ పెన్షన్ మంజూరు చేసి తనను ఆదుకోవాల్సిందిగా మదనపల్లె పట్టణం నక్కలదిన్నె తండాకు చెందిన బి.శ్రీనివాస్ నాయక్ అర్జీ అందజేశారు. రెండు కాళ్లు బలహీనంగా ఉండి, దివ్యాంగ పెన్షన్ పొందుతున్న తమ కుమారుడు షేక్ మహమ్మద్ జైన్ బడికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నాడని, మూడు చక్రాల స్టార్టింగ్ బండి మంజూరు చేయాలని మదనపల్లె గౌసియావీధికి చెందిన తల్లిదండ్రులు జావీద్, కౌసర్లు విన్నవించారు. -
పులకించిన భక్తఝరి
● పంచాక్షరితో ప్రతిధ్వనించిన క్షేత్రం ● అరుణోదయ స్నానాలతో భక్తుల కోలాహలం ఝరిలో పోటెత్తిన భక్తులు సంబేపల్లె : మహాశివరాత్రిని పురస్కరించుకొని మండల సరిహద్దులో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రం ‘ఝరి’లో భక్తులు పోటెత్తారు. పరమఽశివుడిని పవిత్రంగా కొలిచి ఉపవాస దీక్షలతో జాగారం చేసి పవిత్ర బాహుదానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు తొలగి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పూర్వం నుంచి ఈ ప్రాంత భక్తులలో అపార నమ్మకం. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చి అరుణోదయ స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా భక్తులు హరహర మహాదేవా... శంభోశంకరా... అంటూ ఆదిదేవుడి ఎదుట ప్రణమిల్లారు. వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఝరి ప్రాంతం జనసంద్రంగా మారింది. అనంతరం వేదపండితులచే సమీపంలోని సిద్ధేశ్వరుని ఆలయంలోని లింగశ్వరూపునికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. కడప, చిత్తూరు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన దేవరెద్దుల నాణేలు ఝరిలో స్నానాలు ఆచరించి పులకాపన చేయడం జరిగింది. సుదూర ప్రాంతాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, నంద్యాల, తదితర జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏపీఎస్ఆర్టీసి అధికారులు బస్సులను ఏర్పాటు చేశారు. అనంతరం చెక్కభజనలు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. -
ఒక్కరూ రాలేదు!
● మున్సిపాలిటీ గుత్తలకు రెండోసారి వేలం.. ● ఈనెల 24న మూడోసారి వేలంమదనపల్లె : మదనపల్లె మున్సిపాలిటీ చెందిన గుత్తలకు నిర్వహిస్తున్న వేలం పాటల వ్యవహారం అంతా అనుకుంటున్నట్టుగానే జరుగుతోంది. పది రోజుల క్రితం కమిషనర్ ప్రమీల గుత్తలను అప్పగించేందుకు మున్సిపల్ కార్యాలయంలో వేలం పాటలను నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి ఇద్దరు మాత్రమే హాజరై పాట పాడకుండా వెళ్లిపోయారు. దీనిపై అనుమానాలు రేకెత్తడంతో కమిషనర్ రెండోసారి వేలం ప్రకటించి సోమవారం కార్యాలయంలో పాట నిర్వహణకు సిద్ధమయ్యారు. అయితే ఊహించని విధంగా మళ్లీ అధికారులకు పాటదారులు షాక్ ఇచ్చారు. వారపు సంత, దినసరి మార్కెట్, జంతువధశాల, ప్రైవేట్ బస్టాండ్ లకు రెండోసారి నిర్వహించిన వేలంపాటలకు ఒక్కరూ కూడా హాజరు కాలేదు. పాటదారుల కోసం వేచి చూసిన కమిషనర్ ప్రమీల, అధికారులు ఎవరూ రాకపోవడంతో ఈనెల 24న మూడోసారి వేలం నిర్వహించేందుకు నిర్ణయించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి వారపుసంతకు రూ.45 లక్షలు, దినసరి మార్కెట్ కు రూ.1.20 కోట్లుగా ప్రభుత్వ ధర నిర్ణయించారు. దీంతో వేలం పాటల నిర్వహణ చేపట్టారు. మొదటిసారి జరిపిన వేలంపాటలో ఇద్దరే పాల్గొన్నారు. దీంతో కమిషనర్ ప్రమీల వాయిదా వేశారు. సాధారణంగా ప్రభుత్వ ధర నిర్ణయించిన పాట నుంచే వేలంపాట మొదలై అంతకుమించి పాట పాడిన వారికి ఏడాది పాటు రుసుం వసూళ్లకు గుత్త అప్పగిస్తారు. అయితే మదనపల్లె మున్సిపాలిటీలో నెలకొన్న విచిత్ర పరిస్థితి చర్చనీయాంశమైంది. గతంలో పాటదారులు గుత్త దక్కించుకునేందుకు పోటీపడేవాళ్లు. మున్సిపాలిటీకి మంచి ఆదాయం లభించేది. ఇప్పుడు నెలకొన్న పరిస్థితి చూస్తుంటే పాటదారులు ఎందుకు ముందుకు రావడం లేదు, దీనికి అసలు కారణమేమిటి అన్నది అంతు చిక్కడం లేదు. అయితే సిండికేట్ గా వ్యవహరించి తాము చెప్పిన ధరకే గుత్తలు ఇవ్వాలన్న ఒత్తిడి అధికారులపై తీసుకువచ్చేందుకే ఇలా చేస్తున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. దీనిపై అధికారులు ఎలా వ్యవహరిస్తారు అన్నది సవాల్ గా మారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలకొన్న గుత్తల అప్పగింత వ్యవహారంలో జరిగిన పరిస్థితులు తిరిగి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల పైనే ఉంది. -
శ్రీ వీరభద్రస్వామికి విశేష పూజలు
రాయచోటి టౌన్ : శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా ఆదివారం స్వామివారికి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను రంగురంగుల పూలు, బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించి గజవాహనంపై ఊరేగించారు. అంతకు ముందుగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అఘోరలింగేశ్వరుడికి విశేష పూజలు నిర్వహించారు. శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా శ్రీ వీరభద్రస్వామికి, శ్రీ భద్రకాళీ అమ్మవార్లకు రాష్ట్ర రవాణ, క్రీడలు, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పట్ట వస్త్రాలు సమర్పించారు. -
ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఎక్కడ...
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి గురించి ఊసేలేదు. ఏడాదికి ఆడబిడ్డ నిధికి రూ.32,400 కోట్లు అవసరం కాగా దీని గూర్చి పూర్తిగా పట్టించుకోకపోవడం చంద్రబాబు చిత్తశుద్ధి లేమికి అద్దం పడుతోంది. అలాగే నిరుద్యోగ భృతి అంటూ ఓట్లు దండుకుని ఈ బడ్జెట్లో పూర్తిగా మొండి చేయి చూపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ల హామీకి పంగనామాలు పెట్టారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకి బడ్జెట్లో కేటాయించింది శూన్యం. రాష్ట్ర బడ్జెట్ మాటల గారడీ తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. – చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పీలేరు -
కుక్కల దాడిలో జింక మృతి
చౌడేపల్లె : జనారణ్యంలోకి వచ్చిన జింకపై కుక్కలు దాడిచేయడంతో మృతిచెందింది. ఈ ఘటన మండలంలోని దిగువపల్లె పంచాయతీ కొలింపల్లెలో ఆదివారం జరిగింది.స్థానికుల కథనం మేరకు వివరాలిలాఉన్నాయి. సమీపంలోని అటవీ ప్రాంతంనుంచి జింక పంటపొలాల్లోకి రావడం గుర్తించిన కుక్కల గుంపు చట్టుముట్టడంతో అరుపులు కేకలను గుర్తించిన స్థానికులు జింకను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితంలేకపోయింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారి రాము పశువైధ్యాధికారి పవన్కుమార్ల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. -
కనుల పండువగా వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం
స్వామి, అమ్మవారి కల్యాణం నిర్వహిస్తున్న వేదపండితులు, కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తజనం బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలో శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో ఈ వేడుక జరిగింది. ఆదివారం ఉదయం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం స్వామి వారు దీక్షాబంధనాలంకారోత్సవంలో దర్శనమిచ్చారు. రాత్రి 9 గంటలకు గోవిందమాంబ సమేత శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి దంపతుల కల్యాణాన్ని మఠాధిపతి శ్రీ వెంకటాద్రిస్వామి దంపతులు ఘనంగా నిర్వహించారు. తరువాత నరనంది ఉత్సవం ఉత్సాహ భరితంగా జరిగింది. జాగారణ, వివిధ కార్యక్రమా లు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. -
కన్నులపండువగా కల్యాణం
పెండ్లిమర్రి : పొలతల క్షేత్రం శివ నామస్మరణతో మార్మోగింది. మహాశివ రాత్రి పర్వదినం సందర్భంగా జిల్లా నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో పొలతల జనసంద్రమైంది. శివరాత్రి రోజున కోనేటిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. దీంతో కోనేటిలో భక్తుల సందడి కనిపించింది. ఆలయ ఛైర్మన్ రాజారెడ్డి, ఈఓ క్రిష్ణానాయక్ సౌకర్యాలను పర్యవేక్షించారు. అక్కదేవతల ఎదుట.. పొలతల క్షేత్రంలో అక్క దేవతల గుడి చుట్టు అడుగడుగునా భక్తుల సందడి కనిపిచింది. మహిళా భక్తులు కోనేటిలో పుణ్య స్నానాలు ఆచరించి సంతానం కోసం అక్కదేవత గుడి ఎదుట ఒరపడ్డారు. కన్నుల పండువగా స్వామివారి కల్యాణం మహాశివ రాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం ఉదయం10.30గంటల నుంచి 12.15 గంటల వరకు శ్రీమల్లేశ్వరస్వామి, పార్వతీదేవి అమ్మవార్ల కల్యాణం వేదపండితుల ఆధ్వర్యంలో కన్నుల పండువగా నిర్వహించారు. కల్యాణానికి ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్యరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. గట్టి పోలీసు బందోబస్తు మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పర్యవేక్షణలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ చల్లని దొర, ఎస్ఐ తులసి నాగప్రసాద్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. -
గంగమ్మ జాతర.. చూసొద్దాం పద
లక్కిరెడ్డిపల్లి : భక్తులు కోరిన కోర్కెలు తీర్చుతూ కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ దేవత జాతర రాయలసీమ ప్రాంతానికే తలమానికంగా నిలుస్తోంది. ప్రతి ఏడాది మహాశివరాత్రి మరుసటి రోజున ప్రారంభమై మూడురోజులపాటు జాతర జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈనెల 17వ తేదీ రాత్రి చాగలగుట్టపల్లె అమ్మవారి జాగారం, 18న నిండు తిరునాల, 19న మైల తిరునాల జాతర జరగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ సోడి వెంకటేశ్వర్లు, ఆలయ ప్రత్యేకాధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆలయ ప్రాశస్త్యం.. గంగమ్మ తల్లి అనారోగ్యానికి గురైన వారికి అభయమిస్తూ, సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదిస్తూ భక్తుల పాలిట కల్ప తరవుగా శోభిస్లుతోంది. అన్నమయ్య జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలం, అనంతపురం గ్రామంలో కొలువుదీరి ఉంది. మహాశివరాత్రి ముగిసిన రెండోరోజు నుంచి జాతర ప్రారంభమవుతుంది. అమ్మవారికి పుట్టినిల్లుగా భావించే కస్తూరురాజుగారిపల్లి గ్రామంలోని చాగలగుట్టపల్లి నుంచి గంగమ్మ దేవత ఉత్సవ విగ్రహాన్ని బ్యాండు మేళాల మధ్య అప్పలరాజుగారిపల్లి, మార్లవాండ్లపల్లి, మర్రిచెట్టు, చౌటపల్లిల మీదుగా గంగమ్మ జాతర జరిగే ప్రాంతానికి ఊరేగింపుగా తీసుకొస్తారు. దారి పొడవునా అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. సిద్దులపూజతో సిద్దుల ప్రసాదాన్ని సంతానం లేక వరపడిన మహిళలకు అందజేస్తారు. ఇప్పటి నుంచి జాతర ప్రారంభమవుతుంది. పూజలతోపాటు, బండలాగుడు పోటీలు, రాత్రికి చాందినీ, కుంకుమ బండ్లు తిప్పుతారు. చెక్కభజన అమ్మవారి ఉత్సవ మూర్తిని ఊరేగింపుగా చేయడాన్ని నిండు తిరునాలగా భావిస్తారు. రెండోరోజు మైల తిరుణాల రోజున స్థానిక ప్రాంత భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడంతోపాటు సాయంత్రం చాగలగుట్టపల్లె గంగమ్మ అమ్మవారి ఉత్సవ మూర్తిని అమ్మవారి ఇంటికి చేర్చడంతో తిరునాల పరిసమాప్తం అవుతుంది. రాయలసీమ ప్రాంతానికే తలమానికం అనంతపురం గంగమ్మ జాతర ఈనెల 17న చాగలగుట్టపల్లె అమ్మవారి జాగారం 18న నిండు తిరుణాల, 19న మైల తిరునాలవీఐపీ పాసు రద్దు చేశాం ఈ ఏడాది వీఐపీ పాసులను రద్దు చేసి వాటి స్థానంలో రూ. 300లు టికెట్లను తీసుకొచ్చాం. రూ. 100 టికెట్లతోపాటు రూ. 10లు టికెట్లు, ఉచిత దర్శనానికి కూడా ఏర్పాట్లు చేశాము. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, చలువ పందిళ్లను ఏర్పాటు చేశాం. రెండు రోజులపాటు దాతల సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసే దిశగా చూస్తున్నాము. సామాన్య భక్తులకు సులభతరంగా అమ్మవారి దర్శనాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. – శ్రీనివాసులు, ఆలయ ప్రత్యేకాధికారి, అనంతపురం గంగమ్మ ఆలయ, అన్నమయ్య జిల్లాభక్తులకు మెరుగైన సౌకర్యాలు ఈనెల 18, 19వ తేదీల్లో జరిగే శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ జాతర సందర్భంగా సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. జాతరలో ఎక్కడికక్కడ తాత్కాలిక రోడ్లను ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఈ ఏడాది టోల్గేట్లు వసూలు చేయకుండా జాతరకు వచ్చే దుకాణాదారులకు ఇబ్బందులు లేకుండా చేయగలిగాం. – సోడి వెంకటేశ్వర్లు, గంగమ్మ ఆలయ చైర్మన్, లక్కిరెడ్డిపల్లి మండలం, అన్నమయ్య జిల్లా -
ఒరిస్సా యువకుడు అనుమానాస్పద మృతి
మదనపల్లె టౌన్ : ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆదివారం నిమ్మనపల్లె మండలం, బోయకొండ అటవీ ప్రాంతంలోని ఓ కోళ్ల ఫారం వద్ద చోటుచేసుకుంది. నిమ్మనపల్లె పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిస్సా రాష్ట్రం, ఇందుపూర్ జమ్మాలియాకు చెందిన ధ్యానచంద్ర నాయక్ కుమారుడు గౌరీ శంకర్ నాయక్ (27) ఉపాధి నిమిత్తం అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం లోని నిమ్మనపల్లె మండలం, భూమలగడ్డ సమీపంలోని బోయకొండ అడవిలో ఉన్న కోళ్ల ఫారంలో పనిచేయడానికి ఐదేళ్ల క్రితం వచ్చాడు. కోళ్ల ఫారాల వద్ద కాపలాదారుగా పనిచేస్తున్నాడు. ఆదివారం తెల్లవారు జామున తన పనిచేస్తున్న ప్రాంతంలో విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. అపస్మారక స్థితిలో ఉన్న గౌరీశంకర్ నాయక్ను వెంటనే మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు, అతను అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. శనివారం అర్ధరాత్రి సమయంలోనే మృతి చెంది ఉండొచ్చని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. యువకుడి మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన మరణమా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జాతరకు వచ్చే మార్గాలు..
గంగమ్మ జాతర జరిగే ప్రాంతానికి భక్తులు చేరుకోవడానికి రోడ్డు మార్గం ద్వారా మూడు రహదారుల్లో భక్తులు రావొచ్చు. కడప నుంచి రామాపురం మీదుగా చేరుకోవచ్చు. రాయచోటి–కడప జాతీయ రహదారిలో ఉన్న చిట్లూరుకు పడమర వైపు నుంచి రావచ్చు. లక్కిరెడ్డిపల్లి–రాయచోటి మార్గంలోని మర్రిచెట్టు నుంచి తూర్పు వైపున ఉండే రోడ్డు నుంచి, లక్కిరెడ్డిపల్లిలోని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణం ఎదురుగా ఉన్న రోడ్డు నుండి గద్దగుండ్లరాచపల్లి, ఈడిగపల్లి, కౌటపల్లి మార్గాలు ద్వారా గంగమ్మ జాతరకు భక్తులు చేరుకోవచ్చు. తిరునాల కార్యక్రమాలు.. ఈనెల 17వ తేదీ చాగలగుట్టపల్లిలో అమ్మవారి జాగారం, 18న నిండు తిరునాల అమ్మవారికి సిద్దులపూజ, సర్వదర్శనం, బోనాలు, చాందినీ బండ్లు, అమ్మవారి ఊరేగింపు,19న గురువారం మైల తిరునాల ఊరేగింపుతో, గంగ స్నానాలతో అభిషేకంతో తిరునాల ముగుస్తుంది. 18వ తేదీ రాత్రి చెక్కభజన, కోలాటం, ఆర్కెస్ట్రా, జబర్దస్త్ ప్రోగ్రామ్ వంటి కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. -
వైష్ణవాలయంపై గుప్త నిధుల ముఠా విధ్వంసం
బి.కొత్తకోట : జిల్లాలో అత్యంత ప్రధానమైన ఆలయాలు వేళ్లతో లెక్కపెట్టవచ్చు. అందులో పురాతన, అతి ముఖ్యమైన, కేంద్ర పురావస్తుశాఖ పరిధిలోని 15వ శతాబ్దం నాటి సొంపాళ్యం చెన్నకేశవాలయం ఒకటి. ములకలచెరువు మండలంలోని ఈ ఆలయానికి ఘనమైన చరిత్ర ఉంది. విదేశీయుల దాడులకు, కాలానికి ఎదురొడ్డి చరిత్రకు సాక్షిగా నిలిచింది. గర్భగుడిలోని చెన్నకేశవస్వామి విగ్రహం కింద, ఆలయం ఎదుట ఉన్న 50 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభం అంతర్భాగంలో వజ్ర, వైడూర్యాలు నిక్షిప్తమై ఉన్నాయన్న ప్రచారం ఉండటంతో దుండగులు ఆలయంపై కన్నేశారు. విదేశీయుల దాడులతోనే కాక ఇక్కడి ముఠాల ఘాతుకాలకు ప్రస్తుతం ఆలయ భద్రత ప్రశ్నార్థకం అవుతుండగా, మరోవైపు గుప్త నిధుల ముఠాల కారణంగా ఆలయం ధ్వంసానికి గురవుతూ వస్తోంది. చోళ–విజయనగర పాలకులు నిర్మించిన చెన్నకేశవ ఆలయంపై గుప్త నిధుల ముఠాలు ఎన్నో ఏళ్లుగా కన్నేశాయి. ఈనెల 12న రాత్రి గుప్త నిధుల ముఠా పథకం ప్రకారం ఆలయంలోకి చొరబడి కళ్యాణమండప పైకప్పులోని మొగ్గను ధ్వంసం చేసింది. పథకం ప్రకారమే ఈనెల 12న రాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు, గర్భగుడికి కుడివైపు ఉన్న దేవతా మూర్తుల కల్యాణ మండపం వద్దకు వచ్చి గుప్తనిధులు, అందులో వజ్ర వైడుర్యాలు ఉంటారని భావించి మంటపం పైన మధ్యలోని మొగ్గను ధ్వంసం చేశారు. వాటి ఆ మొగ్గ మొక్క పగిలి రాయి ముక్కలు అక్కడే పడి ఉన్నాయి. దుండగులు ముందుగా ఆలయానికి విద్యుత్ సరఫరా వచ్చే వైర్లను కత్తరించి లోపలికి వెళ్లినట్టు చెబుతున్నారు. రాత్రివేళ భద్రత లేకపోవడంతో వీరు లోపలికి వెళ్లేందుకు అడ్డులేకపోయిందని సమాచారం. అయితే ఈ ముఠా ఎవరు, ఎక్కడివారు, ఎంతమంది అనే వివరాలు ఇంకా వెలుగులొకి రాలేదు. వీరు స్థానికులా స్థానికేతరులా, గుప్త నిధులకు అలవాటుపడిన ముఠానా అన్నది పోలీసులు తేల్చాల్సి ఉంది. ధ్వంసమైన మొగ్గను పోలీసులు పరిశీలించారుకాని తదుపరి చర్యలు ఏమిటో తెలియలేదు. విశేషమై మంటపం ఆలయానికి నైరుతి దిశలో నిర్మించిన అద్భుతమైన రాతి కల్యాణమంటపం నాలుగు చదరపు స్తంభాలతో వివిధ కళాకృతులతో వేదికను అలంకరించారు. గ్రానైట్రాయి, మంటపంపైన బండరాయితో నిర్మించగా మొత్తం నిర్మాణం రాళ్లపైనే చెక్కబడింది. సూక్ష్మ బొమ్మలు, జంతువులు తదితరవాటిని చెక్కబడ్డాయి. ప్రతిరాతిపైనా విశేషమైన శిల్పకళ కనిపిస్తుంది. ఇంతటి విశేషమైన శిల్ప హంపిలో కనిపిస్తుందని చెబుతారు. 2009లోనూ.. 2009 ఆగస్టు 30న ఓ గుప్త నిధుల ముఠా సామగ్రితో ఆలయంలోని గర్భగుడిలో తవ్వకాలు జరిపేందుకు ముసుగులు వేసుకుని చొరబడింది. ఈ ముసుగు దొంగలు ఎవరన్నది ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది. వెంట తెచ్చుకున్న నిచ్చెన ద్వారా లోనికి ప్రవేశించగా అప్పుడు భద్రతగా ఉన్న హోం గార్డులు అడ్డుకున్నారు. దీంతో దుండగులు వెంట తెచ్చుకున్న మారణాయుధాల్లో కొన్నింటిని వదిలేసి వెళ్లగా అప్పటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మారణాయుధాల్లో సుత్తులు, రాడ్లు, కారంపొడి, స్టాండులు లభ్యమయ్యాయి. వీటిని శిల్పాలు తొలగించేందుకే తెచ్చి ఉంటారని పోలీసులు అప్పట్లోనే నిర్ధారించారు. ఈ కేసును అప్పట్లో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయకపోవడంతో ఈ ముసుగు దొంగలు తప్పించుకున్నారు. ఆ తర్వాత 2014లోనూ ఇదే తరహాలో గుప్త నిధుల ముఠా ప్రయత్నాలు సాగాయి. ఆలయ భద్రత ప్రశ్నార్థకం సొంపాళ్యం చెన్నకేశవాలయం కేంద్ర పురావస్తుశాఖ ఆధీనంలో ఉంది. దీనికి సంబంధించిన అధికారులు తిరుపతిలో ఉంటారు. ఆలయానికున్న చారిత్రిక నేపథ్యం, సాంస్కృతిక వారసత్వాన్ని దృష్టిలో ఉంచుకోవడమేకాక, ఇలాంటి ఆలయ నిర్మాణం మరోటిలేదు. ఈ ఆలయాన్ని కాపాడి భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఇప్పటికే పలుమార్లు గుప్త నిధుల ముఠాల కారణంగా ధ్వంసం అవుతూ వస్తున్న ఆలయ భద్రతపై ఇప్పటికేనా స్పష్టమైన చర్యలు చేపట్టకపోతే ఆలయ ఇలాంటి మూఠాల చేతితో విధ్వంసాలకు గురయ్యే ఆస్కారం లేకపోలేదు. దాంతోపాటు ఈ గుప్త నిధుల ముఠా ఏదో గుర్తించి వారి ఆటలను కట్టించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.సొంపాళ్యం ఆలయంలో వెలకట్టలేని శిల్ప సంపద నాశనం -
బైక్ల ఢీ : ఒకరిమృతి
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని ఐసీఎల్ క్వారీ సమీపంలో రెండు స్కూటర్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హేమంత్ కుమార్(25) మృతి చెందగా, సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న వెంటనే మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్ సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ ఎం సుధీర్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రున్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. మండల పరిధిలోని కదిరివారిపల్లె గ్రామానికి చెందిన పుల్లయ్య కుమారుడు హేమంత్ కుమార్ సమీపంలో ఓ ట్రాన్స్ఫోర్టులో పనిచేస్తున్నాడు. సాయంత్రం పని ముగించుకుని బైక్లో ఇంటికి బయలు దేరాడు. అలాగే సీకేదిన్నే మండలం పరిధిలోని ఉటూకురుకు చెందిన సత్యనారాయణ కూడా పని ముగించుకుని ముద్దనూరు వైపు నుంచి స్కూటర్లో ఇంటికి బయలుదేరారు. వీరిద్దరు ఐసీఎల్ క్వారీ సమీపంలోకి రాగానే రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు రోడ్డుపై కింద పడి పోయారు. హేమంత్కుమార్కు తల పగిలి రక్తస్రావం జరిగి అక్కడిక్కడే మృతి చెందాడు. సత్యనారాయణ తలకు బలమైన గాయమైంది. కొన ఊపిరితో ఉండటంతో 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సత్యనారాయణ స్కూటర్లో బేల్దారి పనికి సంబంధించిన సామాన్లు ఉండటంతో బేల్దారి అయి ఉంటారని తెలుస్తోంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న స్కూటర్లను తొలిగించి ట్రాఫిక్ సమస్య లేకుండా చేశారు. ● కదిరివారిపల్లి గ్రామానికి చెందిన హేమంత్కుమార్కు పది రోజు కిందట ఆడ బిడ్డ పుట్టిందని, ఇంతలోనే మృతి చెందాడని అతని తల్లిదండ్రులు బోరున విలపించారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడు హేమంత్ కుమార్ చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీమున్నిరుగా విలపించారు. -
ఆటో బోల్తా : నలుగురికి తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో దంపతులతో పాటు వారి ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా, గంగవరం మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన గంగరాజు (28), భార్య మాలశ్రీ (22), పిల్లలు తన్విక (04), తన్విత(04) కవలలతో కలిసి శనివారం రాత్రి ఆటోలో కర్ణాటకలోని తన అత్తగారి ఇంటికి బయలుదేరారు. ఎలగటూరు సమీపం లో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురూ తీవ్రంగా గాయ పడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ లారీ బోల్తా డ్రైవర్కు.. పెద్దతిప్పసముద్రం : మండల కేంద్రం నుంచి అంకిరెడ్డిపల్లి వరకు గత కొద్ది రోజులుగా తారు రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అంకిరెడ్డిపల్లి సమీపంలో మట్టితో వెళుతున్న టిప్పర్ లారీ బోల్తా పడటంతో డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. అయితే పైనున్న విద్యుత్ తీగలు షార్ట్ సర్య్కూట్ కావడంతో వాహనం అదుపు తప్పినట్లు పలువురు పేర్కొన్నారు. టిప్పర్ లారీ లోని మట్టిని లిఫ్ట్ చేసే క్రమంలో ఎగుడు దిగుడుగా ఉన్న రోడ్డుపై వాహనం ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడిందే గాని పైనున్న విద్యుత్ తీగల కారణంగా ఈ ఘటన చోటు చేసుకోలేదని డిస్కం అధికారులు వెల్లడించారు. విద్యుత్ షాక్ అయితే విద్యుత్ లైన్ ట్రిప్ అయ్యేదన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు పీలేరురూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు తీవ్రగా గాయపడ్డారు. ఈ సంఘటన పీలేరు మండలంలో చోటు చేసుకుంది. వివరాలిలావున్నాయి. పూతలపట్టు మండలం టీకేపల్లెకు చెందిన పి. దుర్గా ప్రసాద్ (42), ఎన్. మాధవ (39) ద్విచక్రవాహనంలో పొంతలచెరువు క్రాస్కు వెళుతుండగా ఠానావడ్డిపల్లె మలుపు వద్ద వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దుర్గా ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే కలకడ మండలం పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన భరత్కుమార్ (24) ద్విచక్రవాహనంలో పీలేరు నుంచి స్వగ్రామానికి వెళుతుండగా పొంతలచెరువు క్రాస్ వద్ద బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భరత్కుమార్ను చికిత్సనిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లారు. -
కాశీవిశ్వేశ్వరున్ని దర్శించుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి
పులిచెర్ల(కల్లూరు)– శివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకొని ఆదివారం మండలంలొని దేవళంపేటలో వెలసిన శ్రీకాశీవిశ్వేశ్వర స్వామి ఆలయం, చిచ్చిలివారిపల్లె లోని మల్లి కార్జున స్వామి ఆలయాల్లో జరిగిన పూజల్లో మాజీమంత్రి పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.అర్చకులు పెద్దిరెడ్డికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ సురేంద్రనాధరెడ్డి, మండల కన్వీనర్ నాధమునిరెడ్డి,వైఎస్సార్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ హేమసుందరరెడ్డి, చెంచురెడ్డి, నిరంజన్రెడ్డి, గోవిందరెడ్డి, రాయల్మోహన్, లోకేశ్వరరెడ్డి , దేవేంద్రరెడ్డి పాల్గొన్నారు. -
వెన్నుపోటు బాబు
సూపర్ సిక్స్ హామీలకు మంగళం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో సూపర్ సిక్స్ హామీలకు మంగళం పాడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇరవై నెలల కాలంలో కనీసం అమలు చేయని పథకాల ఊసెత్తకుండా ప్రజలను మరోసారి నిక్కచ్చిగా మోసగించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కింది. ఆడబిడ్డ నిధి కింద 18సంవత్సరాలు నుండి ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తానన్న ప్రధాన హామీని విస్మరించిన కూటమి ప్రభుత్వాన్ని మహిళలు క్షమించరు. – నల్లారి తిమ్మారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎక్సిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు50 ఏళ్లకు ఫించను ఉత్తిదే మైనార్టి, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఏళ్లకే ఫించను ఇస్తామని గత ఎన్నికల్లో కూటమి నేతలు ప్రజలకు హామీ ఇచ్చి, గద్దెనెక్కి ఇరవైనెలలు గడిచినా, రెండు పర్యాయాలు బడ్జెట్ ప్రవేశ పెట్టినా రెండు సార్లు 50 ఏళ్ల పింఛన్ల పథకానికి ఒక్క రూపాయి కేటాయించకపోవడం దారుణం. పైగా సూపర్ సిక్స్ పథకాలు పూర్తిగా అమలు చేసేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం. – డాక్టర్ ఇక్బాల్ అహ్మద్, వైఎస్సార్సీపీ కేంద్ర ఎక్సిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కమలాపురం : కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలో స్థానిక క్రాస్ రోడ్డు సమీపంలోని పెద్దచెప్పలి క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఎస్ఐ విద్యా సాగర్ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. వేంపల్లె మండలం ముతుకూరుకు చెందిన మాచునూరు శ్రీనివాసులు (38), అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులురెడ్డిలు బైక్లో కమలాపురం మండలం విభరాపురంలో సొంత పనుల నిమిత్తం వచ్చారు. తిరిగి వెళుతుండగా పెద్దచెప్పలి క్రాస్ వద్దకు రాగానే స్పీడ్ బ్రేకర్ ఉండటంతో బైక్ నడిపే శ్రీనివాసులురెడ్డి స్లో చేశాడు. కడప నుంచి ఎర్రగుంట్ల వైపు వెళ్తున్న లారీ బైక్ను వేగంగా వెళ్లి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ వెనుక వైపు కూర్చున్న మాచునూరు శ్రీనివాసులు కింద పడ్డాడు. అతడిని తొక్కించుకుంటూ లారీ వెళ్లిపోయింది. ఈ ఘటనలో శ్రీనివాసులు నడుము నుంచి మోకాళ్ల వరకు ఉన్న భాగమంతా నుజ్జు నుజ్జు అయింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న శ్రీనివాసులురెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా ప్రమాదానికి కారణమైన లారీని ఎర్రగుంట్ల వద్ద పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. -
చంద్రబాబు మాయాజాలానికి ‘రాయలసీమ’చిన్నబోయింది. కేశవ అంకెల గారడీ చూసి నిట్టూర్చింది. ఓట్లిచ్చి దీవించినా..సీట్లతో మురిపించినా నిధుల.. నీళ్ల వాటాల్లో ‘సీమ’ చిట్టచివరే నిలిచింది. నారావారి జిమ్మిక్కుల ముందు ఉక్కు పరిశ్రమ ఓడిపోయింది. విత్త మంత్రి ఉత్త బడ్జెట్టు
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని కూటమి సర్కార్ రాయలసీమ సమగ్రాభివృద్ధిని గాలికొదిలేసింది. సీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రకటించడం ఉత్తి మాటేనని తేటతెల్లమైంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ సారి బడ్జెట్లోనూ సీమకు, ఉమ్మడి జిల్లాకు అరకొర నిధులే దక్కాయి. ఉక్కు పరిశ్రమ ఊసే లేదు. వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్షర్ క్లస్టర్ ప్రస్తావనే రాలేదు. అన్నమయ్య ప్రాజెక్టు పునః నిర్మాణంపై ఎలాంటి దృష్టి పెట్టలేదు. జనాభా ప్రాతిపదికన లేదా భూ విస్తీర్ణం ప్రాతిపదికన ఎటు చూసినా రాయలసీమ ప్రాంతానికీ అన్యాయం చేశారని ఆర్థిక నిపుణులు వాపోతున్నారు. సాగునీటి రంగ ప్రాజెక్టులపై సైతం సవతి తల్లి ప్రేమ చూపించారని రాజకీయ పక్షాలు మండిపడ్డాయి. 2026–27 వార్షిక బడ్జెట్లో చంద్రబాబు సర్కార్ పరనిందా–ఆత్మస్తుతి మినహా ప్రాధాన్యత లోపించందని నిపుణులు వివరిస్తున్నారు. రూ.3,32,205.33 కోట్లు బడ్జెట్ అంకెల గారడీ తలపిస్తోందని రాజకీయ నేతలు విమర్శించారు. దాదాపు రూ.97వేల కోట్లు లోటు బడ్జెట్ను ఎలా పూడుస్తారో, ఆదాయ మార్గాలు ఏమిటో తెలియజేయలేదని నిపుణులు వివరిస్తున్నారు. ఉద్యోగులకు వేల కోట్లు బకాయి లున్నా చెల్లింపులకు బడ్జెట్లో నిధులు కేటాయించ లేదని ఉద్యోగ వర్గాలు వాపో తున్నాయి. పీఆర్సీ కమీషన్ నియామకం, మధ్యంతర భృతి కోసం ఎదురుచూస్తు న్న ఉద్యోగ వర్గాలకు రాష్ట్ర బడ్జెట్ శరాఘాతమని.. వాటి ప్రస్తావనే లేకపోవడంపై ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. మహిళలకు...నిరుద్యోగులకు మొండిచేయి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రకటించిన మహాశక్తి పథకం (ఆడబిడ్డ నిధి), నిరుద్యోగ భృతికి మంగళం పలికింది. 18ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున అందిస్తామని ప్రకటించారు. ఆ హామీ మేరకు ఒక్క వైఎస్సార్ జిల్లాలోనే 7,06,94 మంది అర్హులుగా ఉన్నారు. ప్రతినెలా రూ.106.05 కోట్లు చెల్లించాల్సి ఉంది. అలాగే నిరుద్యోగ భృతి రూ.3వేలు అందిస్తామని ప్రకటించారు, ఆ పఽథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా 2.80లక్షల మందికి అందించాల్సి ఉంది. వీరికి ప్రతినెలా రూ.84కోట్లు చెల్లించాలి. 2026–27వార్షిక బడ్జెట్లో ఆయా పథకాలకు నిధులు కేటాయింపు ఊసే లేకపోవడం గమనార్హం. రైతులకు ఎంతో ఉపయోగకరమైన ధరల స్థిరీకరణ నిధి మమ అన్పించారు. కేవలం రూ.500కోట్లతో సరిపెట్టారు. విప్లవాత్మక మార్పులకు మంగళం... విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నాడు–నేడు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేసింది. పేద విద్యార్థులకు అత్యున్నత విద్య అందించాలనే దృష్టిలో సీబీఎస్ఈ టోపేల్, ఐబీ సిలబస్ ప్రవేశ పెట్టింది. ఇప్పుడు ఆ పథకాన్ని సీఎం చంద్రబాబు సర్కార్ మంగళం పలికింది. నాడు–నేడు పథకానికి ఆర్థిక మంత్రి కేశవ్ ఎలాంటి నిధులు కేటాయించలేదు. పైగా సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ సిలబస్లను ప్రభుత్వ పాఠశాలల్లో రద్దు చేసి ప్రైవేటు యాజమాన్య పాఠశాలలకు ప్రాధాన్యత పెంచడం కూటమి సర్కార్ వైఫల్య పాలనకు నిదర్శనం. ఉక్కు పరిశ్రమ ఊసే లేదు వైఎస్సార్–ఈఎంసీకి ప్రాధాన్యత నిల్ అన్నమయ్య ప్రాజెక్టు ప్రస్తావనే లేదు కడప, అన్నమయ్య జిల్లాలకుప్రాధాన్యత కరువు బడ్జెట్పై రాజకీయ పక్షాలు మండిపాటు -
హంద్రీ–నీవా గోవిందా
కరువురైతుల కల్పతరువు హంద్రీ–నీవా పూర్తికి కూటమి ప్రభుత్వానికి శ్రద్ధ కనిపించలేదు. జిల్లాలో రూ.925 కోట్లతో పను లు చేపట్టేందుకు ప్రతిపాదించారు. బడ్జెట్లో మొత్తం ప్రాజెక్టు పనులకు రూ.2,500 కోట్లు అడిగితే బడ్జెట్లో రూ.800 కోట్లు కేటాయించారు. సీమ జిల్లాల్లో పనుల పూర్తికి ఈ నిధులు సరిపోవని ప్రభుత్వానికి తెలి యదా. ఈ నిధులు జిల్లాలో జరగాల్సిన పను లకే సరిపోవు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టును ప్రభుత్వం ఎప్పుడు పూర్తి చేస్తుంది. వెనుకబ డిన తంబళ్లపల్లె నియోజకవర్గ అభివృద్దిపైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అభివృద్ధి, బడు గు, బలహీనవర్గాలపై కనికరం చూపని బడ్జెట్ ఇది. –ద్వారకనాథరెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే బడ్జెట్ మోసపూరిత విధానాలతో రూపొందించబడింది. బడ్జెట్లో ఆదా యం రూ.1,37,000 కోట్లు వస్తుందని చెప్పడం హాస్యాస్పదం. వాస్తవానికి రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ఆర్థిక వనరులు, రెవెన్యూ అంచనా ప్రకారం రూ.97 వేల కోట్లు వరకు మాత్రమే ఆదా యం వచ్చే అవకాశం ఉంది. సుమారు 40–50 వేల కోట్లు అదనంగా ఆదాయం వస్తుందని చూపిస్తూ ప్రజలను మోసం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. చంద్రబాబు నాయుడి పాలనంతా మోసపూరితమే. అన్నమయ్య జిల్లాకు, రాయచోటికి కొత్తగా ఈ బడ్జెట్లో కేటాయింపులేవీ జరగలేదు. – గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
సంజీవయ్య జీవితం ఆదర్శం
మదనపల్లె రూరల్: దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సేవా దృక్పథాన్ని పెంచుకోవాలని జేసీ శివ్ నారాయణశర్మ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య అన్నారు. బడుగు, బలహీనవర్గాలకు భూమి అందేలా ఎన్నో భూసంస్కరణలు చేపట్టారన్నారు. సమాజ హితం కోసం పోరాడిన ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. జిల్లా విజిలెన్స్, పర్యవేక్షణ కమిటీ, ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడారు.డీఆర్వో మధుసూధన్రావు, కురబ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటరమణ, కుమ్మరి, శాలివాహన డైరెక్టర్ భావన, డీవీఎంసీ కమిటీ సభ్యులు శ్రీనివాసులు, చంద్రశేఖర్, మాలమహానాడు యమలా సుదర్శనం, ఎమ్మార్పీఎస్ నరేంద్ర పాల్గొన్నారు. జేసీ శివ్ నారాయణ శర్మ -
శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
కడప కోటిరెడ్డిసర్కిల్: మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలోని శైవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పొలతలకు 165 బస్సులు, నిత్యపూజ కోనకు 40, లంకమల 23, బి.మఠం 17, మల్లెంకొండ 10, హత్యరాల 22, జ్యోతి 6, కన్యతీర్థం 8, అల్లాడుపల్లె దేవలాలు 12, తలకోన 5, మల్లెంకొండ 10, సంగమేశ్వర దేవలాలు 2, భానుకోట 3, అగస్తేశ్వరకోనకు 8 బస్సులు చొప్పున నడుపుతున్నామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం బస్టాండ్లలో మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, చలువపందిళ్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులను నియమించామని, భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
ఈ–చలానా లింకులతో జాగ్రత్త
మదనపల్లె టౌన్ : ఈ చలానా చెల్లింపుల విషయంలో వాహదారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పి ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు. శనివారం మదనపల్లె కలెక్టరేట్ లో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాగాళ్లు పోలీసుల పేరుతో నకిలీ వెబ్సైట్లు సృష్టించి నకిలీ పేమెంట్ల లింకులతో ప్రజల సెల్ ఫోన్లకు లింకులు పంపి డబ్బు ఖాజేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఏపి పోలీస్ శాఖ అప్రమత్తమై ప్రజలను సైబర్ నేరగాళ్ల నుండి మోసపోకుండా అప్రమత్తం చేస్తున్నట్లు తెలలిపారు. ఎప్పుడూ పేమెంట్ లింకులు పంపదని గుర్తుచేశారు. ఈ– చలానాలను తనిఖీ లేదా చెల్లించడానికి కేవలం ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. అంతే కాకుండా వాట్సాప్ ఈ– గవర్నెన్స్ సేవ, ఫోన్ నంబర్ 9552300009 ద్వారా ఫోన్ పే, గూగుల్ పే, ఏపిఆన్లైన్, మీ–సేవా, గ్రామ, వార్డుడ సచిఇవాలయాలలో మాత్రమే చెల్లించాలని తెలిపారు. జిల్లాలోని పోలీస్ అధికారులు సైబర్ మోసాలపై ప్రజల్లో విసృతంగా అఅవగాహన కల్పిచాలని జిల్లా ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.జిల్లా ఎస్పీ ఽధీరజ్ కునుబిల్లి -
● ప్రాజెక్టులపై చిన్నచూపు
చంద్రబాబు సర్కార్ 2026–27 వార్షిక బడ్జెట్లో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై శీతకన్ను వేసింది. తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు ఊసే లేదు. గాలేరి–నగరి సుజల స్రవంతి పథకంపై చిత్తశుద్ధి కన్పించలేదు. జీఎన్ఎస్ఎస్–హెచ్ఎన్ఎస్ఎస్ అనుసంధానం చేసి కుప్పానికి సైతం నీరు ఇవ్వాలని వైఎస్సార్సీపీ సర్కార్ భావిస్తే, కూటమి సర్కార్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటికే జీఎన్ఎస్ఎస్ దాదాపు రూ.2వేల కోట్లు పనులు పూర్తయి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. తాజాగా రూ.665.37కోట్లు బడ్జెట్ కేటాయింపు చేశారు. జీఎన్ఎస్ఎస్ పరిధిలో పనులు ముందడుగు పడే అవకాశమే లేద ని నిపుణులు వివరిస్తున్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ రూ.2,621 కోట్లు కేటాయించగా, అందులో 25శాతం మాత్రమే జీఎన్ఎస్ఎస్ కేటాయించడం వెనుక కూటమి సర్కార్ దుర్భుద్ధి తేటతెల్లమౌతోందని రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నా యి. జీఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ పనుల పురో గతి ప్రశ్నార్థకంగా మారింది. కేసీ కెనాల్ ఆయక ట్టుకు ప్రాణప్రదమైన రాజోలి ప్రాజెక్టు ప్రస్తావనే లేదు. బడ్జెట్లో నిధుల కేటాయింపులే లేకపోవ డం సర్కారు కక్షపూరిత విధానానికి నిదర్శనం. నీటి ప్రాజెక్టుల కేటాయింపులు...రూ.కోట్లలో.. -
పొలతలకు తరలివచ్చిన భక్తజనం
పెండ్లిమర్రి : జిల్లాలో ప్రసిద్ధి పొందిన శైవ క్షేత్రాల్లో పొలతల క్షేత్రం ప్రముఖమైంది. క్షేత్రానికి శనివారం జిల్లా నలుమూల నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం స్వామివారికి వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, ఆకుపూజ, రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఆలయ చైర్మన్ రాజారెడ్డి, ఈఓ క్రిష్ణానాయక్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేపట్టారు. డీఎంహెచ్ ఓ నాగరాజు, తహసీల్దార్ అనురాధ, ఎంపీడీవో జగన్మోహన్రెడ్డిలు ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిఘా నేత్రంలో పొలతల క్షేత్రం పొలతలలో మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. అంసాఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు పొలతల క్షేత్రం చూట్టు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు రానున్నారు. క్షేత్రంలో అత్యాధునిక డ్రోన్ కెమెరాతో నిఘా చేపట్టారు. నేడు శివపార్వతుల కల్యాణోత్సవం మహశివరాత్రి పర్వదినం సందర్భంగా పొలతల క్షేత్రంలో ఆదివారం ఉదయం 10 గంటలకు ముత్యాల తలంబ్రాలతో శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ రాజారెడ్డి, ఈఓ క్రిష్ణానాయక్లు తెలిపారు. అనంతరం రాత్రి 10గంటలకు రథోత్సవం అక్కదేవతల గుడి వరకు ఉంటుందన్నారు.ప్రారంభమైన శివరాత్రి ఉత్సవాలు -
శివోహం!
● జిల్లా అంతటా మార్మోగుతున్న శైవనామం ● శైవ క్షేత్రాల్లో ఘనంగా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు ● ఇప్పటికే కొండ కోనలకు చేరుకున్న భక్తజనం ● నేడు మహా శివరాత్రి పర్వదినం కడప సెవెన్రోడ్స్: శివుడు....భోళాశంకరుడు...భక్తవ శంకరుడు...ఆకు, పండు, పువ్వు, నీరు ఇలా ఏమిచ్చి మనసారా మొక్కినా భక్తులను కరుణిస్తాడు...వరాలు కురిపిస్తాడు....ఆపదలో ఆదుకుంటాడు....అందుకే ఆయన భక్తవ శంకరుడు. ఆ స్వామి వారిని తలుచుకునే మహాశివరాత్రి భక్తులకు ఎంతో ముఖ్యమైనది. ఈ పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు. నిర్వాహకులు శివాలయాలను అందంగా తీర్చిదిద్దారు. ● ఉమ్మడి జిల్లాలో ప్రముఖ శివాలయాలు అందులోనూ అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాల సంఖ్య 15కి పైగానే ఉంది. ఒకప్పుడు ఈ జిల్లాలో శైవం బాగా విస్తరిల్లింది. జిల్లాలో వీరశైవ ఆలయాలు కూడా ఉండడంతో అటు తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా శివరాత్రి సందర్భంగా భక్తులు ఈ జిల్లాకు వస్తుంటారు. మహాశివరాత్రి సందర్బంగా జిల్లా అంతటా ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లోని శైవ క్షేత్రాల్లో శివరాత్రి పూజలు నిర్వహించడానికి జిల్లా దేవదాయ, ధర్మదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వైద్య ఆరోగ్య, పంచాయతీ, అగ్నిమాపకశాఖ, పోలీసు తదితర ప్రభుత్వ శాఖల సహకారంతో ఇప్పటికే పలుమార్లు జిల్లాలోని అటవీ ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలను పరిశీలించారు. పోలీసు అధికారులు కూడా తమ పరిధిలోని శైవ క్షేత్రాలకు బందోబస్తు కోసం తరలివెళ్లారు. శనివారం ఉదయం నుంచే అటవీ క్షేత్రాల మొక్కులుగల భక్తులు ప్రత్యేక వాహనాలను ఉచితంగా ఏర్పాటు చేశారు. అలాగే ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అటవీ ప్రాంతాల్లోని ఆలయాలకు వెళ్లేందుకు పలువురు భక్తులు ద్విచక్ర వాహనాలను ఉపయోగించడంతో దారులన్నీ రద్దీగా మారాయి. నడక శ్రమ తెలియకుండా భక్తులు చేసే శివనామ స్మరణతో ఆయా క్షేత్రాలు మార్మోగాయి. శివ పూజలకు ఘనంగా ఏర్పాట్లు శివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలలో శివయ్యకు విశేష పూజలు నిర్వహించనున్నారు. జిల్లాలో లక్షల మంది హాజరయ్యే క్షేత్రా లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పొలతల, నిత్యపూజస్వామికోన, అత్తిరాల, భైరవకోన, కపర్థీశ్వరకోన, కన్యతీర్థం, భానుకోట, మోటకట్ల తదితర ప్రాంతాలకు భక్తులు భారీగా హాజరవుతారు. అటవీ ప్రాంతాలతోపాటు గ్రామాలు, పట్టణాలు, కడప,రాయచోటి, నగరంలోని శివాలయాలలో కూడా వైభవంగా పూజలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు అన్ని ఆలయాలలో పండుగ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం అన్నదానం చేయనున్నారు. రాత్రి 8 నుంచి అర్థరాత్రి వరకు భజనలు, ప్రవచనా లు, భక్తి గీతాలాపనలు నిర్వహించనున్నారు. అర్దరాత్రి లింగోద్భవం సందర్భంగా మహాన్యాస పూ ర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. విద్యుద్దీపాల వెలుగులో ఆలయం -
కల్యాణం.. కమనీయం!
రాయచోటి టౌన్: రాయచోటి రాచరాయుడి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శనివారం శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా రెండవ రోజు ఉదయం 9గంటలకు స్వామి వారి కల్యాణ మహోత్సవం వేదపండితులు రాచరాయ యోగీస్వామి, ప్రణవానందగిరి స్వామి వారి శిశ్యులు మఠం ఓంకార స్వామి వారి ఆచార్యత్వంలో నిర్వహించారు. ఉదయం స్వామి వారికి ఆలయ పాలక మండలి అధ్యక్షుడు తిరుమల మనోజ్కుమార్, ఈవో డీవీ రమణారెడ్డి ఆధ్వరంలో గణపతి హోమం, ఉత్సవ మూర్తులకు ఆలయ ప్రధాన అర్చకులు శంకరయ్యస్వామి, కృష్ణయ్యస్వామి వారి ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి కల్యాణ మహోత్సవానికి మండిపల్లి లక్ష్మీప్రసాద్రెడ్డి ముత్యాలు, తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం కల్యాణ మంటపం వేదికపై స్వామి వారి కల్యాణ క్రతువు క్రమంగా నిర్వహించారు. -
పట్టువస్త్రాల సమర్పణ
తంబళ్లపల్లె : మల్లయ్యకొండ మల్లికార్జునస్వామికి పెద్దమండ్యం మండలం అవికేనాయక్తాండాకు చెందిన హాంధీరాంబావాజీ ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు బి.శివానాయక్ పట్టువస్త్రాలు సమర్పించారు. స్వగ్రామం నుంచి టెంకాయపట్టలు, పూలతో అలంకరించిన ట్రాక్టర్లతో బత్తినిగారిపల్లె పిల్లనగ్రోవి కళాకారుల బృందం విన్యాసాలతో ఊరేగింపుగా మల్లయ్యకొండకు తీసుకెళ్లారు. పట్టువస్త్రాలను స్వామివారికి సమర్పించారు. ప్రత్యేక పూజలతో మొక్కులు తీర్చుకున్నారు. ఎంపిటీసీ చంద్రానాయక్, శివమాల భక్తులు పాల్గొన్నారు. పేకాటశిబిరంపై దాడులుచౌడేపల్లె : మండలంలోని దిగువపల్లె పంచాయతీ బోయకొండ భవానీ నగర్లో శుక్ర వారం రాత్రి పేకాట శిబిరంపై పోలీసులు మెరుపుదాడి చేసి తొమ్మిదిమందిని అదుపులోకి తీసుకొన్నట్లు ఎస్ఐ నాగేశ్వరరావు శనివారం తెలిపారు.శుక్రవారం రాత్రి ఓ భవనం లోని రెండోఅంతస్తులో రహస్యంగా పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు చేశామన్నారు.గదిలో పేకాట ఆడుతున్న 9 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.1,78,200 నగదు, తొమ్మిదిసెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్ఐ తెలిపారు. పట్టుడినవారందరూ మదనపల్లె, ముళబాగల్, బెంగళూరుకు చెందిన వారుగా గుర్తించారు. వీరిని పుంగనూరు కోర్టుకు తరలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థి ఆత్మహత్యకలసపాడు : మండలంలోని పుల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన రాచకొండుగురుతేజ (16) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాచకొండుచిన్నగురయ్య, గురమ్మల కుమారుడైన గురుతేజ కలసపాడులోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. గురుతేజకు కొన్నేళ్ల నుంచి చర్మవ్యాధి కారణంగా ఆసుపత్రిల్లో వైద్యం అందించినా తగ్గకపోవడంతో చదువుపై శ్రద్ధ చూడపం లేదన్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించలేనని మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత చర్మవ్యాధికి సంబంధించిన ఆయింట్మెంట్ క్రీమ్ను పూసు కుని చదువుకుకోవాలని తల్లికి చెప్పి గదిలోకి వెళ్లిపోయాడు. సుమారు రాత్రి 10 గంటల సమయంలో తల్లి చూడగా గదిలోని ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.9మంది అరెస్ట్, రూ.1.78లక్షలు స్వాధీనం -
కిడ్నీ రాకెట్ కేసులో మరో నిందితుడు అరెస్ట్
మదనపల్లె టౌన్ : రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మదనపల్లె కిడ్ని రాకెట్ కేసులో తప్పించుకు తిరుగుతున్న మరో నిందితున్ని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి అరెస్టుకు సంబంధించి అన్నమయ్య జిల్లా మదనపల్లె డిఎస్పీ మహీంద్ర, టూటౌన్ ఎస్ఐ రహీముల్లా స్థానిక డిఎస్పీ కార్యాలయంలో అరెస్టు వివరాలను మీడియాకు వెళ్లడించారు. మదనపల్లె ఎస్బీఐ కాలనీలో ఉన్న గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వాహకుడు, అప్పటి జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ఆంజనేయులు, మదనపల్లె జిల్లా ఆస్పత్రి డయాలసిస్ కేంద్రం మేనేజర్ బాల రంగడు అలియాస్ బాలు, కదిరి ప్రభుత్వాసుపత్రి డయాలసిస్ మేనేజర్ మెహరాజ్లకు మధ్యవర్తిగా వ్యవహరించిన కృష్ణా జిల్లా కరప గ్రామానికి నార్ల వెంకటేశ్వర్లు (47)ను శనివారం అరెస్టు చేశారు. కాగా ఈ కేసులో ఇది వరకే బెంగుళూరుకు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ పార్థసారథిరెడ్డి మరి కొంత మంది గత ఏడాది నవంబర్ 9న విశాఖపట్నం జిల్లా, బొడ్డి పాళ్యంకు చెందిన సాడి యమున(29) శరీరం నుంచి కిడ్నీని తొలగించారు. దీంతో ఆమె 10న మృతి చెందింది. మదనపల్లెలో కిడ్నీ రాకెట్ మూలాలు బయటకు రావడంతో ఈ కేసు రాష్ట వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. మృతురాలి తల్లి సూరమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఘటనపై డిఎస్పీ మహీంద్ర ఆదేశాల మేరకు స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ రాజారెడ్డి, ఎస్ఐ రహీముల్లా పలువురిపై హత్య కేసు నమోదు చేశారు. మొదటి దఫాలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, రెండో దఫాలో నలుగురి నిందితులను అరెస్టుచేశారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న మొత్తం 22 మంది నిందితుల్లో పోలీసులు ఉప్పటి వరకు పది మంది నిందితులనే అరెస్టుచేశారు. ఇంకా 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేయాల్సి ఉన్నట్లు తెలసింది. కాగా ఈ కేసులో ప్రమేయం ఉన్న కృష్ణా జిల్లా, కరప గ్రామంకు చెందిన ఏ10 ముద్దాయి నార్ల వెంకటేశ్వర్లు (47)ను అరెస్టుచేశారు. ముద్దాయిలను పోలీసులు ఒకొక్కరినే అరెస్టు చేస్తూ వస్తుండడడంతో తీగ లాగితే డొంక కదిలినట్లుగా కిడ్నీ రాకెట్ కేసులో సూత్రధారులు, పాత్రధారులను గుర్తించి అరెస్టు చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. -
పురుగు మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : పురుగు మందుతాగి రైతు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన శనివారం జరిగింది. ఘటనపై మదనపల్లె జిల్లా ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు.. చౌడేపల్లె మండలం, దావిడ కురప్పల్లికి చెందిన రైతు భాస్కర్ రెడ్డి(60) భూ వివాదం విషయమై స్థానికులతో జరిగిన గొడవలో మనస్థాపం చెందాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లి టమాటా చెట్లకు కొట్టడానికి తెచ్చి ఉంచిన పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు బాధితున్ని వెంటనే ఓ ప్రైవేట్ వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం, అతని పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు రెతు ఆత్మహత్యాయత్నం సమాచారాన్ని చౌడేపల్లి పోలీసులకు అందించారు. -
భూవివాదంలో ముగ్గురిపై టీడీపీ నాయకుల దాడి
పీలేరురూరల్ : ఇరు వర్గాలు భూవివాదంలో ఘర్షణపడి ముగ్గురిపై విచక్షణా రహితంగా దాడి చేసిన సంఘటన శనివారం పట్టపగలు పీలేరు పట్టణ నడిబొడ్డున చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. పీలేరు పట్టణానికి చెందిన ఎస్. బోదేషావలి (50) కుమారుడు ఎస్. జాకీర్ హుస్సేన్ (32) శనివారం తమ కుటుంబానికి స్థానిక తిరుపతి రోడ్డు మార్గంలోని సర్వే నంబర్ 1/4లో ఉన్న భూమి వద్దకు వెళ్లాడు. వారికి చెందిన 1.20 ఎకరాల భూమిలో టీడీపీ నాయకుడు మౌలా, అతని అనుచరులు ప్లాంట్లు వేసి విక్రయిస్తాన్నారని ప్రశ్నించాడు. భూ వివాదంలో ఇరువర్గాలు ఘర్షణపడ్డారు. ఈ సందర్భంగా మాలా అనచరులు జాకీర్ హుస్సేన్పై దాడి చేశారు. దీంతో జాకీర్హుస్సేన్ టోల్ఫ్రీ నెంబరు 112కు కాల్ చేశాడు. దీంతో స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను వేరు చేశారు. దాడిలో గాయపడిన జాకీర్ హుస్సేన్ స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు తీసుకోవాల్సిందిగా కోరాడు. అయితే పోలీస్ అధికారులు ముందు ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని సూచించారు. దీంతో బాధితుడు తన తండ్రి బోదేషావలి, భావమరిది ఎస్. సయ్యద్ బాషా (29)తో కలసి ఆస్పత్రికి బయలుదేరాడు. అయితే స్థానిక సాయిబాబా గుడి సమీపంలో అడ్డగించి బోదేషావలి, సయ్యద్బాషాపై నడిరోడ్డుపై విచక్షణారహితంగా దాడి చేశారు. టీడీపీ నాయకుల దాడిలో గాయపడ్డ ముగ్గురు చికిత్సమిత్తం స్థానికి ప్రభుత్వాస్పత్రికి చేరారు. బోదేషావలికి కాలు, నడుముకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ విషయంపై సీఐ యుగంధర్ను వివరణ కోరగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని తెలిపారు. -
చోరీ కేసులో క్లూస్ టీమ్తో విచారణ
లక్కిరెడ్డిపల్లి : మండలంలోని దప్పేపల్లి గ్రామం, గల్లావాండ్లపల్లికి చెందిన గల్లా వీరాంజనేయులు ఇంటిలో గుర్తు తెలియని దొంగలు పడి బంగారు నగలతోపాటు నగదును అపహరించుకుపోయినట్లు శుక్రవారం రాత్రి లక్కిరెడ్డిపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు శనివారం ఉదయం క్లూస్ టీమ్తోపాటు డాగ్ స్క్వాడ్తో కలిసి చోరీ జరిగిన ప్రాంతంలో తనిఖీ చేపట్టినట్లు లక్కిరెడ్డిపల్లి ఎస్ఐ డి.శోభ తెలిపారు. బాధితుడిని విచారించగా 19 తులాల బంగారు నగలు ఉన్నట్లు చెప్పారు. వీటిలో నాలుగు తులాలు దొంగలు అపహరించుకెళ్లారని గుర్తించినట్లు ఎస్ఐ శోభ తెలిపారు. గల్లా వీరాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వివాహిత ఆత్మహత్యరాయచోటి: ఇంటిలో ఎవరూలేని సమయంలో షేక్ రేష్మ (220 చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం రాయచోటి పట్టణం, కొత్తపల్లిలోని పారమండపం వీధిలో అసన్ వలి ఇంటిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. షేక్ అసన్ వల్లితో ఏడు సంవత్సరాల క్రితం రేష్మకు వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కలరు. అసన్ వలి తోపుడు బండి మీద ప్రూట్స్ వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. గత రెండు సంవత్సరాల నుండి ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉండేవని సమీప బంధువులు చెప్తున్నారు. శనివారం ఉదయం భర్త ఇంటి నుండి బయటకు వెళ్లిన తరువాత చీరతో ఐరన్ రాడ్కు ఉరివేసుకొని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. నీటి మడుగులో పడి వృద్ధ్దుడు మృతి రాయచోటి : మేకపొతును రక్షించబోయి కాపరి కోటకొండ తిమ్మయ్య (83) నీటి మడుగులో పడి మృత్యువాతపడ్డాడు. రాయచోటి పట్టణంలొని చిత్తూరు రోడ్డు ఫిష్ మార్కెట్ వెనుకాల వంక మడుగులొకి ఒక మేకపోతు దూకింది. దానిని రక్షించడానికి తిమ్మయ్య నీళ్లలోకి దిగి అందులో కూరుకుపోయాడు. మడుగు పూర్తిగా నిండడం, తిమ్మయ్యకు వయస్సు మీరడం వంటి కారణాలతో ఆయన బయటకు రాలేక మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. రూరల్ మండల పరిధిలొని యండపల్లి గ్రామం, కురబపల్లికి చెందిన తిమ్మయ్య ఐదు సంవత్సరాల నుంచి మటన్ షాపు నిర్వహిస్తున్నాడు. సుబ్బయ్య పొటేళ్లు, మేకపోతులను మేపడానికి తీసుకెళ్లాడు. శుక్రవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో తిరుగు ప్రయాణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. విషయాన్ని స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. శనివారం ఉదయం నీటిని తోడి ఊబిలోపల చిక్కుకుపోయిన తిమ్మయ్యను బయటకు తీశారు. మృతునికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. త్రుటిలో తప్పిన ప్రమాదం గోపవరం :శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు నుంచి భక్తులు ట్రాక్టర్లో మండలంలోని మల్లెంకొండకు వెళుతుండగా శనివారం సూరేపల్లె వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి ఒకవైపుకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో భక్తులకు ప్రమాదం జరగలేదు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని భక్తులు తెలిపారు. బడ్జెట్లో గ్రంథాలయాలకు నిధులు కేటాయించాలి కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిపార్ట్మెంట్ వారీగా కేటాయించిన బడ్జెట్లో జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగులకు జీతాల కోసం రూ.36.34 కోట్ల మాత్రమేనని కేటాయించారని దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాదెండ్ల బాబ్జిలు అన్నారు. రెండేళ్ల నుంచి రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ 20 కోట్ల రూపాయలు కాగా ప్రతి నెలకు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు సుమారుగా 10 కోట్ల రూపాయలు అవసరంగా ఉందన్నారు. ఈ ఏడాది జులై మాసానికి మరో 25 మంది రెగ్యులర్ ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నారని వీరికి చెల్లించాల్సిన బెనిఫిట్స్ మరో రూ.15 కోట్లు అదనపు భారం పడే అవకాశం ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ 150 కోట్లు అవసరం కాగా ప్రభుత్వం రూ. 36.30 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందన్నారు. -
శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా మూలవిరాట్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా ప్రధాన అర్చకులు వీణారాఘవాచార్యులు మూల విరాట్కి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. మదనపల్లె టౌన్: ఇంధన పొదుపుపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని అన్నమయ్య జిల్లా అగ్నిమాపక అధికారి ఆదినారాయణ తెలిపారు. శనివారం మదనపల్లె బెంగుళూరు బస్టాండులో ఉన్న ఓ పెట్రోల్ బంకు ఆవరణలో గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ బాయ్లతో ఫైర్ సేప్టీ, ఇంధన పొదుపుపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎఫ్ఓ మాట్లాడుతూ ప్రజలకు అనునిత్యం ఎంతో అవసరమైన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఇంధనాల ఆవశ్యకత, పొదుపు అంశాలపై క్షుణ్ణంగా వివరించి చైతన్యపరిచారు. వాక్థాన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. మదనపల్లె అగ్నిమాపక అధికారి శివప్ప, మదనపల్లె, రామసుముద్రం, కురబలకోట, తంబళ్లపల్లె, వాల్మీకిపురం మండలాల గ్యాస్ డీలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
మెడికల్ మాఫియాపై ఉద్యమిస్తాం
మదనపల్లె అర్బన్ : మెడికల్ మాఫియాపై ఉద్యమ పోరాటం తప్పదంటూ సీపీఐ నాయకులు పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా ప్రభుత్వాస్పత్రి ఎదుట ఫార్మా, మెడికల్ మాఫియాపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మహేష్, సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్పలు మాట్లాడుతూ మెడికల్ మాఫియా చాపకిందనీరులా దేశవ్యాప్తంగా విస్తరిస్తోందన్నారు. ముఖ్యంగా బోగస్, నాణ్యతలేని మందులతో ప్రాణనష్టం సంభవిస్తోందన్నారు. ప్రజల ప్రాణాలతో వైద్యశాఖ చెలగాటమాడుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఫార్మా కంపెనీలు, కార్పొరేట్ ఆస్పత్రుల అధిక లాభాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నట్లు ఆరోపించారు. ఇందులోభాగంగా నాణ్యతలేని మందులు, వైద్యసామగ్రి మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్పొరేట్ ఆస్పత్రుల దందాపై గతంలో కూడా సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అయితే చిన్నపాటి జబ్బులకు రూ.లక్షల్లో బిల్లులు వేసి ప్రాణాలు తోడేస్తున్నారని తెలిపారు. ప్రజలు ఫార్మా, మెడికల్ మాఫియాతో ఆర్థికంగా నష్టపోయి, ప్రాణాలు కోల్పోతున్నా.. వైద్యారోగ్యశాఖ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మాఫియాకు కళ్లెం వేయకుంటే సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామంటూ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాంబశివ, మురళీ, చిన్నయ్య, శ్రీనివాసులు, వెంకటేష్, మాధవ్, చంద్రశేఖర్, రవి, చిన్నప్ప, తిరుమల, దేవా, తదితరులు పాల్గొన్నారు. -
104 వాహనాల కేసులో పురోగతి సాధించాం
రాయచోటి : అన్నమయ్య జిల్లాలో 104 వాహనాల దోపిడీ కేసులో పురోగతి సాధించినట్లు రాయచోటి అర్బన్ సీఐ బీవీ చలపతి తెలిపారు. శనివారం రాయచోటి అర్బన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు పురోగతి విషయాలను వివరించారు. రాయచోటి మున్సిపాలిటీలో ఎఫ్–1 శానిటరీ ఇన్చార్జ్ అధికారి నరసింహులు, శివప్రసాద్లతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసి మరింత సమాచారం కోసం విచారణ కొనసాగిస్తున్నామన్నారు. రాయచోటి ఏరియా ఆసుపత్రి ఆవరణలో శిథిలావస్థ పీసీలో ఉన్న నాలుగు 104 వాహనాలను జిల్లా డీఎంహెచ్ఓ ఏరియా ఆసుపత్రి సూపరిటెండెంట్ల మౌఖిక ఆదేశాల మేరకు నరసింహులు డంపింగ్ యార్డుకు తరలించినట్లు చెప్పారు. వాహనాల తరలింపుకు అవసరమైన నిధులు ఇవ్వకపోవడంతో మాసాపేటకు చెందిన శివప్రసాద్తో కలిసి వాటిని స్క్రాప్ క్రింద లక్షాయాభై వేల రూపాయలకు విక్రయించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. మరిన్ని కోణాలలో విచారించిన అనంతరం నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని సిఐ వివరించారు. -
రైల్వేస్టేషన్ మెట్లపై నుంచి పడి..
మదనపల్లె టౌన్ : మదనపల్లె రైల్వేస్టేషన్ మెట్లపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఘటనపై బాధితురాలు తెలిపిన వివరాలు.. కురబలకోట మండలం, పెద్దపల్లెకు చెందిన వెంకటరమణ భార్య కె.రెడ్డెమ్మ(65) పని నిమిత్తం శనివారం మదనపల్లె మండలం, సీటీఎంకు వచ్చింది. అక్కడి క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్కు వెళ్లింది. అవతల వైపునకు వెళ్లడానికి పట్టాలు దాటేందుకు మెట్లపైకి వెళ్లింది. అవతల వైపున దిగుతుండడగా ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి కిందపడి కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడింది. స్థానికులు గమనించి బాధితురాలిని108 వాహనంలో చికిత్స కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం ఎముకల డాక్టర్లు ఆస్పత్రిలో అందుబాటులో లేరని తిరుపతికి రెఫర్ చేశారు. ఘటనపై కేసు దర్యాప్తులో ఉంది. పోలీసుల విచారణములకలచెరువు : మండలంలోని సోంపల్లెలో వెలసిన శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో గురువారం రాత్రి గుప్తనిధుల కోసం గుర్తు తెలితని దుండగులు కల్యాణ మండపంలోని తామర మొగ్గను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సెక్యూరిటీ రమణప్ప శనివారం ఎస్ఐ ప్రతాప్, పురావస్తుశాఖ అధికారి బాలక్రిష్ణారెడ్డిలు విచారించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... ఘటనపై పలు అనుమానాలు ఉన్నట్లు వారు అన్నారు. ఆలయానికి సీసీ కెమెరాలను అమర్చడంతో విద్యుత్ కనెక్షన్కు సంబంధించి మెయిన్ వైరును దుండగులు తొలగించారన్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని వారి వివరించారు. గాయపడిన వ్యక్తి మృతిచింతకొమ్మదిన్నె : మండలంలోని బుగ్గలేటిపల్లె వద్ద శుక్రవారం రాత్రి ఆటో–టిప్పర్ ఢీకొన్న సంఘటనలో గాయపడిన ఆటోడ్రైవర్ శీలం చంద్ర రిమ్స్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు చింతకొమ్మదిన్నె మండలంలోని ఇప్పపెంట గ్రామం నివాసి. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
రౌద్రాయ.. వీరభద్రాయ..
● వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం ● వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవారికి విశేష పూజలు ● భక్తిశ్రద్ధలతో ధ్వజారోహణం ధ్వజారోహణం నిర్వహిస్తున్న అర్చకులు, ప్రత్యేక అలంకరణలో వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవారు రాయచోటి టౌన్ : ‘భద్రకాళీ ప్రియాయ.. రౌద్రాయ.. వీరభద్రాయ నమః’ అంటూ భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. తమను చల్లగా చూడాలని వారు స్వామి, అమ్మవారిని వేడుకున్నారు. రాయచోటిలో శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. తెల్లవారుజామున ఆలయ పాలక మండలి అధ్యక్షుడు తిరుమల మనోజ్కుమార్, ఈవో డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు నర్రావెంకట భాస్కర్ సిద్ధాంతి నేతృత్వంలో ఆయన శిష్యులు (రుత్వికులు), ఆలయ ప్రధాన అర్చకులు యాగశాలలో హోమాలు నిర్వహించారు. ముందుగా మహాగణపతి పూజ నిర్వహించి తరువాత హోమం చేశారు. అక్కడి నుంచి కలశపూజతో స్వామివారికి సమర్పించారు. తరువాత స్వామి, అమ్మవారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. బంగారు ఆభరణాలతోపాటు వెండి కిరీట ధారణతో అందంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వస్త్రాలు అందజేత బ్రహ్మోత్సవాల నిర్వాహకుల(అర్చకులు, రుత్వికుల)కు ఆలయ సంప్రదాయం ప్రకారం వస్త్రాలు అందజేశారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఆజ్ఞ పొందుతూ ఆ వస్త్రాలను వారికి అందజేశారు. వాటిని ధరించిన తరువాత పూజలకు సిద్ధమయ్యారు. కంకణధారణ స్వామి వారి బ్రహ్మోత్సవాల నిర్వాహకుల(ఆలయ పాలక మండలి సభ్యులు, అధ్యక్షుడు, మహానైవేద్య నిర్వాహకులు, రుత్వికులు, ప్రధాన అర్చకుల)కు కంకణధారణ చేశారు. వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కంకణధారణ చేసిన వారు నియమనిష్టలతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిసే వరకు ఆలయ ప్రాంగణాన్ని విడిచి వెళ్లకూడదని వేదపండితులు వెల్లడించారు. శైవాచారం ప్రకారం ధ్వజారోహణ వీరశైవాచారం ప్రకారం కంకణధారణ చేసిన బ్రహ్మోత్సవాల నిర్వాహకులు శైవ ఆగమనం ప్రకారం.. రుత్వికులు శ్రీ వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు నందీశ్వరుడి ద్వారా పరమ శివుడి ఆజ్ఞ కోరుతూ విన్యాసాలు ప్రదర్శించారు. వారితోపాటు కన్నడ భక్తులు, స్థానిక భక్తులు నిర్వహించిన విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం నందీశ్వరుడిని వస్త్రంపై చిత్రీకరించి ధ్వజారోహణ చేశారు. దీంతో శ్రీవీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. -
రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించండి
● మసీదు ఆస్తులపై వాస్తవాలు వెలుగులోకి తేవాలి ● వైఎస్సార్సీపీ నేతల డిమాండ్ మదనపల్లె : మదనపల్లె మసీదు ఆస్తులు, ఆదాయ, వ్యయాలపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. వక్ఫ్బోర్డు ఆస్తులు, ఆదాయంలో రూ.3 కోట్ల అక్రమాలు జరిగాయని అసెంబ్లీలో ఆరోపిస్తూ దానిపై విచారణ జరపాలని ఎమ్మెల్యే షాజహాన్బాషా ప్రభుత్వాన్ని కోరడాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించారు. శుక్రవారం వైఎస్సార్సీపీ ఎస్ఈసీ మెంబర్, ఏపీఎండీసీ మాజీ చైర్మన్ షమీంఅస్లాం ఇంట్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మదనపల్లెలో మసీదుకు వచ్చే కోట్లాది ఆదాయం, నిధుల నిల్వ, వక్ఫ్ఆస్తుల విషయంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, దీనిపై ఎమ్మెల్యే విచారణకు కోరడం మంచి పరిణామమని అన్నారు. 2014 నుంచి జరిగిన వాటిపై విచారణ మొదలుపెట్టి ఇప్పటిదాకా ఏం జరిగిందో తేలాలంటే రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపితే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయన్నారు. దీనిపై చిత్తశుద్ధితో ప్రభుత్వం ద్వారా విచారణ జరిపిస్తే ఎమ్మెల్యేను సత్కరిస్తామన్నారు. ఎన్నో ఏళ్లుగా వక్ఫ్ పరిధిలోకి వెళ్లిన మసీదు ఆస్తులు, వాటి నిర్వహణ, స్థలాలు ఎవరెవరికి ఇచ్చారు, వాటి ఆదాయం ఎక్కడికి వెళ్తోంది అనే వివరాలు బహిర్గతం కావాలని ముస్లిం సమాజం ఎప్పటి నుంచో ఎదురు చూస్తోందని, ఎమ్మెల్యే విచారణకు కోరడం శుభపరిణామమని అన్నారు. వైస్చైర్మన్ నూర్ఆజం మాట్లాడుతూ మసీదు ఆస్తులు, స్థలాల్లో వైఎస్సార్సీపీ నేతల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. మీరు విచారణ కోరడం ఎంతో మంచిది, సత్వరమే ప్రభుత్వం ద్వారా విచారణ జరిపించి నిజాలను వెలుగులోకి తేవాలని కోరారు. వైఎస్సార్సీపీ నాయకుడు గుండ్లూరి రఫీ మాట్లాడుతూ 2014 నుంచి మొదలైన షెడ్ల నిర్మాణం, వాటి ఆదాయం, అక్రమాలపై విచారణ చేస్తే తమ వద్ద ఉన్న ఆధారాలు అందిస్తామన్నారు. మసీదు సొమ్మును కాజేసిన వారెవరైనా శిక్షకు గురికావాల్సిందేనని స్పష్టం చేశారు. సమావేశంలో కౌన్సిలర్ బీఏ.ఖాజా, నాయకులు రహంతుల్లా, ఇర్పాన్షేక్, రహీం, చాంద్బాషా, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
విచారణకు హాజరు
రాయచోటి : 104 ప్రభుత్వ వాహనాల ధ్వంసం, అపహరణ కేసులో అనుమానితులుగా ఉన్న ఎఫ్–1 శానిటరీ ఇన్స్పెక్టర్ నరసింహులు, డంపింగ్యార్డ్ వాచ్మెన్ ప్రసాద్లను రాయచోటి అర్బన్ పోలీసులు విచారణ చేశారు. శుక్రవారం ఉదయం వారిద్దరినీ స్టేషన్కు పిలిపించి సాయంత్రం వరకు పోలీసులు తమదైన శైలిలో విచారణ చేసినట్లు సమాచారం. 104 వాహనాలను ధ్వంసం చేసి వాటి విడిభాగాలను ఎక్కడ విక్రయించారు? వీటి విక్రయంలో ఎవరి పాత్ర ఉందన్న విషయాలపై ఆరా తీసినట్లు తెలిసింది. 104 వాహనాలతోపాటు రాయచోటి మున్సిపాలిటీలో పారిశుధ్యం వాహనాల అపహరణకు కారణమైన ఎఫ్–1 శానిటరీ అధికారి నరసింహులుపై కేసు నమోదు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ ఫయాజ్బాషా, పలువురు కౌన్సిలర్లు సీఐకు ఫిర్యాదు చేశారు. ప్రాధాన్యత రంగాలకు రుణాలు మంజూరు చేయాలి మదనపల్లె రూరల్ : జిల్లా వార్షిక ప్రణాళికలో భాగంగా ప్రాధాన్యత రంగాలకు రుణాలు సకాలంలో అందించి, జిల్లా ఆర్థికాభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలని అన్నమయ్య జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జి.ఆంజనేయులు కోరారు. శుక్రవారం స్థానిక వెలుగు కార్యాలయంలో డిసెంబర్ 2025కు సంబంధించి జాయింట్ మండల లెవల్ బ్యాంకర్స్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం 16,619 కోట్లు కాగా, డిసెంబర్ నాటికి 18,042 కోట్లు దాదాపు 108 శాతానికి పైగా లక్ష్యాలను సాధించామన్నారు. అన్నమయ్య జిల్లాలో సూర్యఘర్, విశ్వకర్మ, పీఎంఈజీపీ, హ్యాండ్లూమ్, టెక్స్టైల్, వీవర్స్ ముద్ర యోజన, విద్యారుణాలు తదితర రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పెద్ద సంఖ్యలో లోన్లు మంజూరు చేసి ఉపాధి కల్పించాల్సిందిగా బ్యాంకర్లకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు బ్యాంకర్లు లబ్ధిదారులకు రుణాలు అందజేసి వారి ఆర్థిక పురోగతికి సహాయ పడాలన్నారు. పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. జిల్లా లీడ్ కార్యాలయం రాయచోటి నుంచి మదనపల్లె బెంగళూరు రోడ్డులోని బీటీ కాలేజీ హాస్టల్లోకి మార్చడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డీపీఎం ప్రసాద్రెడ్డి, హ్యాండ్లూమ్స్ జిల్లా అసిస్టెంట్ ప్రవీణ్కుమార్, ఏపీఎం ఖిజర్ఖాన్ పాల్గొన్నారు. -
బాలికా విద్యాలయాల్లో ఉత్తమ విద్యను అందించాలి
మదనపల్లె సిటీ: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ప్రిన్సిపాళ్లు, మోడల్ స్కూళ్ల వార్డెన్లు ఉత్తమ విద్యను అందించాలని సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ అనురాధ అన్నారు. శుక్రవారం మదనపల్లె సమీపంలోని గ్రీన్వ్యాలీ పాఠశాలలో ఎన్ఐఈపీఏ సహకారంతో అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన కేజీబీవీ ప్రత్యేక అధికారులకు సాధికారత కల్పించే లక్ష్యంతో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. బాలికా విద్య అణగారిన, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి తోడ్పటంలో కేజీబీవీ ఒక పరివర్తనాత్మక పథమని తెలిపారు. ఈ పథకంలో ప్రత్యేక అధికారులు నాయకులుగా, సంరక్షులుగా, మార్గదర్శకులుగా, సమర్థ నిర్వాహకులుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో సమర్థవంతంగా అమలు చేసినపుపడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని తెలిపారు. శిక్షణా కార్యక్రమంలో బాలిక విద్య ప్రాముఖ్యత, ప్రత్యేకాధికారుల బా ధ్యతలు, ఆర్థిక నిర్వహణ, నిధుల వినియోగం, ఐసీటీ వినియోగం, ఆరోగ్యం, పరశుభ్రత, భ ద్రత,రక్షణ, జెండర్ అవగాహన వంటి అంశాలపై విస్తృత అవగాహన కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జీసీడీఓలు సుమతి, రూత్మేరీ,రేవతి, సీఎంఓ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాకు ఒంటిమిట్ట రామయ్య తలంబ్రాలు
ఒంటిమిట్ట : గత కొన్నేళ్ల నుంచి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి సన్నిధి నుంచి అమెరికా దేశానికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలను ముమ్మడి పాపిరెడ్డి గారి మల్లారెడ్డి కుటుంబం పంపడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా అమెరికాకు పంపాలనే ఉద్దేశంతో శుక్రవారం ముమ్మడి పాపిరెడ్డి గారి మల్లారెడ్డి, ఆయన కుమారుడు వెంకట సుబ్బారెడ్డి, వారి కుటుంబ సభ్యులతో కలిసి తలంబ్రాలు, పట్టువస్త్రాలను ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముడి సన్నిధికి తీసుకొచ్చారు. ముందుగా వారికి ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికి, ఆలయ ప్రదక్షణ కావించి, గర్భాలయంలోని మూల విరాట్ చెంత.. వారు తెచ్చిన తలంబ్రాలు, పట్టువస్త్రాలను ఉంచి ఆలయ అర్చకులు వీణారాఘవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ ఒంటిమిట్ట రామయ్య చెంత నుంచి అమెరికా దేశంలోని చికాగోలో గల లెమోంట్ రామాలయంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి వీటిని పంపించి, వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ టీటీడీ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, కుటుంబ సభ్యులు సత్యభాను శ్రీ, సాయి తన్విరెడ్డి, ఇక్షిత, లలితమ్మ, సుదర్శన్రెడ్డి, శ్రీవాసవి, జస్వంత్ రెడ్డి, వేదాన్సి పాల్గొన్నారు. -
ఎంఎస్ఎంఈలకు వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం దోహదం
మదనపల్లె రూరల్ : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ)లు చిన్న వ్యాపారాల నుంచి పెద్ద సరఫరాదారులుగా ఎదిగేందుకు వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(వీడీపీ) ఉపయోగపడుతుందని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కృష్ణ కిషోర్ అన్నారు. ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఎంఎస్ఎంఈ–ఆర్ఏఎంపీ పథకం కింద హైదరాబాద్కు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(సీఐటీడీ) నిర్వహణలో పట్టణంలోని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో రెండు రోజుల వీడీపీ కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణకిషోర్ మాట్లాడుతూ జిల్లాలోని పారిశ్రామిక వనరులు, డిమాండ్, సరఫరా, పరిస్థితులు, ఎంఎస్ఎంఈ, ఉద్యమి రిజిస్ట్రేషన్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శిక్షణా కార్యక్రమాలు, ప్రభుత్వ పాలసీలు, యంత్ర సామగ్రిపై లభిస్తున్న ప్రోత్సాహకాలు, ఎంఎస్ఎంఈలకు అందుబాటులోని సబ్సిడీలు, అవకాశాలపై అవగాహన కల్పించారు. విజయవాడకు చెందిన ఎంఎస్ఎంఈ–సీఐటీడీ డిప్యూటీ డైరెక్టర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈల పోటీ సామర్థ్యాన్ని పెంచడం, మార్కెట్ లింకేజీలను బలోపేతం చేయడం, ఆర్థిక వనరులను మెరుగుపరచడం, నాణ్యత, సస్టెయినబిలిటీ, చట్టపరమైన అనుసరణలను ప్రోత్సహించడంపై వివరించారు. వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఎంఎస్ఎంఈలకు వాస్తవమైన వ్యాపార అవకాశాలు సృష్టించే ప్రాక్టికల్ ప్లాట్ఫామ్గా పేర్కొన్నారు. జ్ఞానాంబిక కరస్పాండెంట్ డాక్టర్.ఆర్.గురుప్రసాద్, మదనపల్లె నుంచి పట్టు, టెర్రకోట ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్కు ఎగుమతి చేయవచ్చన్నారు. హ్యాండీక్రాఫ్ట్స్ డిపార్ట్మెంట్ ఏడీ పవన్కుమార్రెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో హ్యాండీక్రాఫ్ట్స్ రంగానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, స్థానిక వనరులను వినియోగించి ఎంఎస్ఎంఈలను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ఎంఎస్ఎంఈలకు అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. మొదటి రోజు వీడీపీ కార్యక్రమంలో 152 మంది ఎంఎస్ఎంఈలు పాల్గొన్నారు. 15 ఎంఎస్ఎంఈ ప్రతినిధులు తమ ఉత్పత్తుల స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ–సీఐటీడీ సీనియర్ కన్సల్టెంట్ ఎస్.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
తెగుతున్న వింగ్.. పదునెక్కుతున్న వన్
● రైల్వన్యాప్తో బుకింగ్కార్యాలయాలకు మంగళం ● కమర్షియల్ వ్యస్థలకు బీటలు రైల్వన్ యాప్ రైలు రైల్వేస్టేషన్లో బుకింగ్ కార్యాలయం రాజంపేట: ఇక రానున్న రోజుల్లో రైల్వన్యాప్తో రైలెక్కాల్సిన పరిస్థితులు ఆవిష్కృతమవుతున్నాయి. ఆ విధంగా రైల్వేశాఖ రైల్వన్యాప్కు పదనుపెడుతోంది.దీనిపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తోంది. ఫలితంగా కమర్షియల్ వింగ్ను బలహీనపరిచే దిశగా రైల్వేశాఖ పయనిస్తోంది. స్టేషన్మాస్టర్లతో టికెట్ల కొట్టించాలని, అనవసరం వ్యయం తగ్గించేందుకు రైల్వన్యాప్ను అస్త్రంగా రైల్వేశాఖ ప్రయోగిస్తోందని రైల్వే కార్మికవర్గాలు అభిప్రాయపడున్నాయి. ఇప్పటికే అన్ని స్టేషన్లలో రైల్వన్యాప్ ప్రచారహోర్డింగ్లను ఏర్పాటుచేశారు. బ్రిటీషు కాలం నుంచి కొనసాగుతూ వస్తున్న రైల్వే కమర్షియల్ విభాగం కనుమరుగు కానుంది. ప్రతి రైల్వేస్టేషన్లో రైల్వే బుకింగ్, పార్శిల్ బుకింగ్ కార్యాలయాలు ఉండేవి. వాటిని రాను..రాను తీసేస్తూ వస్తున్నారు. కేంద్ర రైల్వేమంత్రిత్వశాఖ తీసుకొచ్చిన రైల్వేవన్యాప్ సర్వం అన్నట్లుగా స్టేషన్లోని బుకింగ్లను ఎత్తివేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఫలితంగా కమర్షియల్ సిబ్బంది మనుగడకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయని కార్మికసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అవగాహన జిల్లా రైలుమార్గంలో పలు రైల్వేస్టేషన్లకు టికెట్ కోసం, రిజర్వేషన్ చేసుకోవడానికి వస్తున్న ప్రయాణికులకు కమర్షియల్ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, రిజర్వేషన్ ఎలా చేసుకోవాలి, రైళ్ల రాకపోకలు ఏ విధంగా తెలుసుకోవాలో రైల్వన్యాప్లో తెలియచేస్తున్నారు. బుకింగ్ కౌంటర్ టికెట్ జారీ చేయకుండా ప్రయాణికుల మొౖబైల్ నుంచి టికెట్లను జారీ చేయించడం, రిజర్వేషన్ చేయిస్తున్నారు. ఈ విధంగా చేయాలని ఇప్పటికే రైల్వే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ● స్టేషన్లలో బుకింగ్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి మంగళం పాడనున్నారు. స్టేషన్లలో బుకింగ్ కార్యాలయాలను ఎత్తివేస్తే ఆ డిపార్టుమెంట్ అంటిపెట్టుకొని పనిచేస్తున్న కమర్షియల్ సిబ్బందిని వేరే విధంగా వినియోగించుకోనున్నారు. చాలమందిని టీసీలుగా రైలు ఎక్కించనున్నారు. మరికొందరిని ఇతర డిపార్టుమెంట్లోకి పంపించనున్నారు. ఇదంతా చాపకిందనీరుగా సాగుతోందని రైల్వేవర్గాలు సమాచారం. స్టేషన్మాస్టర్లే టికెట్ జారీ చేసుకోవాలంటా... స్టేషన్మాస్టర్లే టికెట్ జారీ చేసుకోవాలని ఉన్నతస్థాయి నుంచి సంకేతాలను పంపిస్తున్నారు. ఓ వైపు ప్రయాణీకులు టికెట్లు ఇవ్వాలి.. మరోవైపు రైళ్ల రాకపోకల గురించి సిగ్నల్ ఇవ్వాలి.. కంట్రోలర్తో సంభాషించాలి.. ఇలాంటి అనేక సమస్యలు ఆపరేటింగ్ వ్యవస్థలో తలెత్తనున్నాయి. ఫలితంగా స్టేషన్మాస్టర్లు ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని రైల్వే నిపుణులు చెపుతున్నారు. ఒక్కోసారి రైళ్ల ప్రమాదానికి స్టేషన్మాస్టర్లు కారణమయ్యే పరిస్థితులు నెలకొంటాయని కార్మిక సంఘాలు వాపోతున్నాయి. బ్రిటీషు కాలం నుంచి బుకింగ్ వ్యవస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి కూడా అదే కారణమని రైల్వేశాఖలోని సీనియర్లు చెబుతున్నారు. ప్రయాణికులకు టికెట్ ఇచ్చి, మళ్లీ రైళ్ల నిర్వహణ అంటే కష్టమని, ఈవిధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్టేషన్మాస్టర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. కడప, నందలూరు, ఎర్రగుంట్లలో బుకింగ్ కార్యాలయాలు కొనసాగించే దిశగా రైల్వే యోచన చేస్తోంది. మిగిలిన రైల్వేస్టేషన్లలో రైల్వన్యాప్, ప్రైవేట్ ఆపరేటర్ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా రైల్వేశాఖ అడుగులు వేస్తున్నట్లు కార్మికవర్గాలు చర్చించుకుంటున్నారు. నందలూరు స్టేషన్లో స్టేషన్మాస్టర్ టికెట్ ఇచ్చుకోవాలంటే కష్టమని రైల్వే నిపుణులు చెపుతున్నారు. నిరంతరం గూడ్స్ రైళ్ల రద్దీతోనే స్టేషన్మాస్టర్కు సరిపోతుంది. రోజుకు 30కిపైగా గూడ్స్ రైళ్లు, రెగ్యులర్, స్పెషల్ ట్రైన్స్ నడుస్తుంటాయి. ఇటాంటి పరిస్థితిలో రైల్వన్యాప్ వ్యవస్థ కోసం బుకింగ్ కార్యాలయాన్ని ఎత్తివేయడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. రైల్వే భధ్రత అంశం కూడా ఇందులో ఇమిడివుంది. వందలాది మంది రైల్వే కార్మికులు, ఉద్యోగులు, రన్నింగ్స్టాప్ నందలూరు రైల్వేకేంద్రంగా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బుకింగ్ వ్యవస్థను కొనసాగించాలని రైల్వేకార్మికవర్గాలు కోరుతున్నాయి. -
ఉద్యానపంటల సాగు విస్తీర్ణం పెంచాలి
మదనపల్లె రూరల్: అధిక ఆదాయం ఇచ్చే ఉద్యానవన పంటల సాగుపై రైతులను ప్రోత్సహించి, జిల్లాలో సాగు విస్తీర్ణాన్ని పెంచాలని రైతుసేవా కేంద్రాల సిబ్బందిని జిల్లా ఉద్యాన అధికారి ఎస్.ఎస్.వీ.సుభాషిణి ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో 2026–27 సంవత్సరానికి రాయలసీమ, ప్రకాశం జిల్లాల ఉద్యాన పంటల సాగు పెంపుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికపై వర్క్షాప్ నిర్వహించారు. సమావేశంలో మదనపల్లె, వాయల్పాడు, ములకలచెరువు, తంబళ్లపల్లె, పుంగనూరు, చౌడేపల్లె హార్టికల్చర్ ఆఫీసర్స్ పరిధిలోని రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ సహాయకులు, ఎంపీఈఓలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీహెచ్ఓ సుభాషిణి మాట్లాడుతూ అన్నమయ్యజిల్లాలో ప్రస్తుతం 68,952 హెక్టార్లలో ఉద్యానపంటలు సాగవుతున్నాయన్నారు. రాయలసీమ ప్రాజెక్ట్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 25 క్లస్టర్లను గుర్తించామన్నారు. 2026–27 సంవత్సరానికి 19,388 హెక్టార్లలో ఉద్యానపంటల సాగు పెంపుపై కార్యాచరణ ప్రణాళిక వేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్స్ ఈశ్వర్ప్రసాద్రెడ్డి, సంతోషి, వరప్రసాద్, భీమేష్ తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు: ప్రజలకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం తగదని జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ లోకవర్ధన్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్యసేవల వివరాలను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, 104 సర్వీసు సేవలను పరిశీలించారు.వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. -
● నీకు నేను... నాకు నువ్వు..
పుంగనూరు ‘మున్సిపాలిటిలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నోడికి ఏముందని నా బిడ్డను ఇచ్చేది... ప్రేమించినంత మాత్రాన నా బిడ్డను ఇవ్వాలని రూల్ ఉందా.. ’ అని బాలిక తండ్రి అడ్డు చెప్పినా ఆ ప్రేమజంట వివాహం చేసుకుని నేడు ఆదర్శంగా నిలిచారు. పుంగనూరు పట్టణానికి చెందిన బి.నరేంద్రరాజు మున్సిపాలిటీలో రెవెన్యూ ఇన్స్స్పెక్టర్గా పని చేస్తున్నారు. ఆయనకు 1996లో కర్ణాటకకు చెందిన ఎస్ఐ గోపాలక్రిష్ణ కుమార్తె శిల్పతో పరిచయం ఏర్పడింది. ఆమె బంధువుల ఇంటికి వచ్చేది. అలా పుంగనూరుకు వచ్చివెళ్తుండగా పరిచయం కాస్తా పెరిగి పెద్దదై ప్రేమలో పడ్డారు. కులాలు ఒకటైనా పెద్దలు స్థాయీబేధాలతో ప్రేమజంటను విడదీశారు.ఏడాది పాటు పోరాటం సాగించారు. చివరకు ప్రేమే జయించింది. 1997 జూన్ 27న అతికష్టం మీద వివాహం జరిగింది. అదే ఏడాది నరేంద్రరాజుకు ఉద్యోగం పర్మినెంట్ అయింది. దీంతో ఆ కుటుంబంలో సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఇద్దరు కుమారు లు పునీత్రాజు,మనోజ్రాజుతో ప్రస్తుతం ఆ ప్రేమజంట సంతోషంగా జీవిస్తూ, ఆదర్శంగా నిలిచారు. –నరేంద్ర, శిల్పా, పుంగనూరు -
బస్సులో నిద్రిస్తూ గుండెపోటుతో డ్రైవర్ మృతి
పెద్దతిప్పసముద్రం : పగలంతా బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన ఓ ఆర్టీసీ డ్రైవర్ గురువారం రాత్రి బస్సులో నిద్రించాడు. ఆయన నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పుంగనూరు మండలం ఈడిగపల్లికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఎస్ఎస్ బాషా (50) మదనపల్లి వన్ డిపోలో పని చేసేవాడు. విధి నిర్వహణలో భాగంగా గురువారం రాత్రి 8 గంటలకు మదనపల్లెలో బయలుదేరి 9–45 గంటలకు నైట్ హాల్ట్ పెద్దతిప్పసముద్రం చేరుకున్నాడు. భోజనం అనంతరం డ్రైవర్, కండక్టర్ బస్సులో నిద్రించారు. శుక్రవారం వేకువజామున 4:15 గంటలకు బస్సు తిరిగి ఇక్కడి నుంచి మదనపల్లెకి బయలు దేరాలి. డ్రైవర్ ఎంత సేపటికి నిద్ర లేవకపోవడం, ఎలాంటి చలనం లేకుండా నిర్జీవంగా పడి ఉండటంతో.. కండక్టర్ మంజునాథ్ 108కు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. 108 వాహన సిబ్బంది వచ్చి పరీక్షించగా గుండెపోటుతో డ్రైవర్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం ఈ విషయాన్ని డిపో అధికారులకు, మృతుడి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ క్రమంలో వేరే డ్రైవర్ను రప్పించి బస్సును డిపోకు తరలించగా, డ్రైవర్ మృతదేహాన్ని కుటుంబీకులు కారులో ఈడిగపల్లికి తీసుకెళ్లారు. వ్యక్తి అదృశ్యం కేవీపల్లె : వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటశివకుమార్ తెలిపారు. వివరాలిలా వున్నాయి. మండలంలోని మఠంపల్లె పంచాయతీ గొల్లపల్లెకు చెందిన బాల వెంకటరమణ (50) ఈ నెల 10న ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు గ్రామ పరిసరాలు, బంధువుల ఇళ్ల వద్ద గాలించినా కనిపించలేదు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అతని ఆచూకీ తెలిసిన వారు కలకడ సీఐ 8712626239, కేవీపల్లె ఎస్ఐ 9440900710 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు మదనపల్లె టౌన్ : కురబలకోట మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగి, ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై ముదివేడు ఎస్ఐ మధురామ చంద్రుడు కథనం మేరకు వివరాలు.. మండలంలోని అంగళ్లు గ్రామం తుమ్మచెట్లపల్లెకు చెందిన రైతు పి. విశ్వనాథ(48) బైక్లో సొంత పనిపై అంగళ్లుకు వెళ్లాడు. కదిరి రోడ్డులో పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి బైకులో బయలుదేరాడు. ఇంటికి బైకులో వెళుతుండగా మార్గంమధ్యలోని మిట్స్ కళాశాల వద్ద, ముందు వెళుతున్న ట్రాక్టర్ షడన్గా రోడ్డు క్రాస్ చేయడంతో తప్పించబోయి, ట్రాక్టర్ ట్రాలీని రైతు వెనక నుంచి ఢీకొన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు వెంటనే వచ్చి విశ్వనాథ్ను చికిత్సల కోసం హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, ప్రథమ చికిత్సలు అందించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్ల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో విఫలం
మదనపల్లె అర్బన్ : ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన కోర్కెలు, సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివారెడ్డి, మధుసూదన్ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంలో భాగంగా శుక్రవారం స్థానిక మిషన్ కాంపౌండ్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్టీయూ నాయకులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ 11వ పీఆర్సీ గడువు పూర్తయి 30 నెలలు గడిచినా 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయకపోవడంతో రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో మొత్తమ్మీద సుమారు రూ.23 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా, కూటమి ప్రభుత్వం అరకొర చెల్లింపులు చేయడంతో మొత్తం బకాయిలు రూ.34 వేల కోట్లకు చేరిందన్నారు. ముఖ్యంగా పీఆర్సీ, డీఏ, సరెండర్ లీవ్, పీఎఫ్, మెడికల్ బిల్లుల చెల్లింపులో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వాపోయారు. అయితే విడతల వారీగా నాలుగు డీఏలు మంజూరు చేయాల్సి ఉండగా, కేవలం ఒక్క డీఏతో సరిపెట్టిందని వివరించారు. దీంతో పెన్షనర్ల ఆశలు అడియాశలయ్యాయని పేర్కొన్నారు. దీంతోపాటు 15 నెలలుగా గ్రాట్యుటీ చెల్లించలేదన్నారు. ఇందులో భాగంగా సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్న లక్షలాది ఉద్యోగుల ఆకాంక్షను తుంగలో తొక్కారని మండిపడ్డారు. అయితే ఎన్నికల సమయంలో ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ, మధ్యంతర భృతి, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెన్షనర్లకు పెన్షన్ కార్పొరేషన్, సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం కొనసాగింపు తదితర సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. పైగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్ల అమలు, సమస్యల పరిష్కారం ఊసే లేదన్నారు. డిమాండ్ల సాధన, సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఫలితం శూన్యమన్నారు. వీటిపై అనేకసార్లు కూటమి ప్రభుత్వానికి విన్నవించి, అధికారులకు వినతిపత్రాలు అందజేసినా పట్టించునే నాథుడే లేడన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆదేశాల మేరకు ఒక్క రోజు నిరసన వ్యక్తం చేశామన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్కుమార్రెడ్డి, జగన్మోహన్, మురళీ, మోహన్, వేణుగోపాల్రెడ్డి, నరసింహులు, జనార్ధన్రెడ్డి, గిరిధర్నాయక్, భాస్కర్రెడ్డి, సుబ్బారెడ్డి, ప్రభాకర్, రమణ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, తదితరులు పాల్గొన్నారు. -
భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదు
లక్కిరెడ్డిపల్లి : ఈ నెల 18, 19వ తేదీలలో జరగనున్న గంగమ్మ జాతర సందర్భంగా సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించేలా చొరవ చూపాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఆర్డీఓ శ్రీనివాసులు అధికారులకు సూచించారు. శుక్రవారం మండలంలోని గంగమ్మ దేవత ఆలయ ప్రాంగణంలో రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, టీడీపీ నాయకులు లక్ష్మీప్రసాద్రెడ్డి, ఆలయ చైర్మన్ వెంకటేశ్వర్లు, ఈఓ శ్రీనివాసులతో కలిసి మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్ష చేశారు. జాతరకు వచ్చే సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి జాతరను విజయవంతం చేయాలని సూచించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా అదనపు ట్యాంకర్లు ద్వారా సరఫరా చేయాలన్నారు. జాతర జరిగే మూడు రోజులు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ఎక్కడికక్కడ ముందస్తుగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. శానిటేషన్, మరుగుదొడ్లు, స్నానపుగదులు, మహిళా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. లక్షలాది మంది భక్తులు జాతరకు తరలిరానుండటంతో చలువ పందిళ్లు ఏర్పాటు చేసి క్యూలైన్ల వద్ద సౌకర్యాలు కల్పించి తాగునీటి సరఫరా జరిగేలా చూడాలన్నారు. ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులను నడపాలన్నారు. వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. భక్తులకు మంచినీళ్ల ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసేలా దాతలను ప్రోత్సహించాలన్నారు. ఈ ఏడాది వీఐపీ పాసులు రద్దు చేయడంతో రూ. 300లు టికెట్స్ ఏర్పాటు చేయడం, కొంత మేర సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని వారికి సులభతరంగా అమ్మవారి దర్శనాన్ని కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి ఏడాది వలే ఈ ఏడాది కూడా లక్కిరెడ్డిపల్లి జర్నలిస్టులు, రాయచోటి మురళీ, కోచింగ్ సెంటర్, మానవతా స్వచ్ఛంద సేవాసంస్థ గాలివీటి ప్రవీణ్ కుమార్రెడ్డిలతోపాటు దాతల సహకారంతో నీళ్ల ప్యాకెట్లు, మజ్జిగ, నీళ్లబాటిళ్లు పంపిణీ చేసేందుకు ప్రోత్సాహం చూపాలని సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ క్రాంతి కుమార్, టీడీపీ నాయకులు మదన్, మార్కెట్ చైర్మన్ షఫీ నాయక్, ఆలయ పూజారులు చంద్ర, రెడ్డి శేఖర్, గంగయ్య, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గంగమ్మ జాతరకు విస్తృత ఏర్పాట్లు అధికారులు సమన్వయంతో పని చేయాలి ఎస్పీ ధీరజ్, ఆర్డీఓ శ్రీనివాసులు -
ఆదాయ లక్ష్యాలు సాధించాలి
కలెక్టర్ నిశాంత్కుమార్ మదనపల్లె: ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చేశాఖలు నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ నిశాంత్కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో వివిధశాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పీఆర్, మున్సిపల్శాఖల్లో అభివృద్ధి పనులపై విధించిన జీఎస్టీని పక్కాగా వసూలయ్యేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాణిజ్య పన్నులు, రవాణా, మైనింగ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల, అటవీ, ఎకై ్సజ్శాఖలకు సంబంధించి వివరాలను తెలుసుకున్నారు. మోటారు వాహనాల షోరూమ్ల వద్ద వాటి ఇన్వాయిస్ ధరలను తెలిపేలా పట్టిక ఉండాలని, దానికిమించిన ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగదారులు ఫిర్యాదు చేయాలని సూచించారు. నాటుసారా, నకిలీమద్యంపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. కర్ణాటక, తమిళనాడు మద్యం ఇక్కడికి అక్రమ రవాణా జరక్కుండా అడ్డుకోవాలన్నారు. నిరుపయోగంగా ఉన్న మైనింగ్ లీజులను నిబంధనల ప్రకారం పునరుద్ధరించి మైనింగ్ ప్రారంభించాలని ఆదేశించారు. ప్రజలకు రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ పై అవగాహన పెంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
క్రమశిక్షణే విజయానికి తొలి మెట్టు
– విద్యార్థుల విజయస్ఫూర్తి సదస్సులో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి రాయచోటి : క్రమశిక్షణతో కూడిన విద్యే ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని, సమాజంలో నిజమైన మార్పు విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అభిప్రాయ పడ్డారు. శుక్రవారం రాయచోటి పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ‘విద్యార్థుల విజయ స్ఫూర్తి’ అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. విద్యార్థులు మార్కుల కోసమే కాకుండా జీవితానికి ఉపయోగపడే జ్ఞానం కోసం చదవాలని సూచించారు. ‘రెడీ టూ చేంజ్’ అనే నినాదాన్ని గుర్తు చేస్తూ కాలానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలన్నారు. ముఖ్యంగా ఏఐ వంటి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా తన విద్యా ప్రయాణంలోని అనుభవాలను పంచుకుంటూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. మూడు సూత్రాలు: లెర్నింగ్ : ఎన్ని పుస్తకాలు చదివామన్నది కాదు.. అందులో ఎంత జ్ఞానాన్ని గ్రహించామన్నదే ముఖ్యం డిటర్మినేషన్ : ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యం వీడకూడదు డిసిప్లన్ : తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల వినయం, క్రమశిక్షణ కలిగి ఉండటమే అసలై ఆభరణం అన్నారు. పదో తరగతి విద్యార్థులు : వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ఎస్పీ వారికి స్వయంగా పరీక్ష కిట్లను అందజేశారు. ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పదో తరగతి తర్వాత విద్యార్థులకు ప్రత్యేకంగా కెరీర్ గైడెన్స్ సెషన్ నిర్వహిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రక్షణపై.. : యువత మాదకద్రవ్యాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళల రక్షణ కోసం రూపొందించిన ‘శక్తి’ యాప్పై ప్రతి విద్యార్థిని అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, పట్టణ సీఐ బీవీ చలపతి, ట్రాఫిక్ సీఐ ఎస్.కుళాయప్ప, ఎస్ఐలు విష్ణువర్ధన్, జహీర్, పాఠశాల హెడ్మాస్టర్ ఎస్.సైరాబాను, మోటివేషనల్ స్పీకర్ డీజీ రామమూర్తి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. -
ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలి
కడప కార్పొరేషన్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి రూ.40వేల కోట్ల బకాయిలు ప్రభుత్వం విడుదల చేయాలని ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి కోరారు. గురువారం శాననమండలిలో ఆయన ఉద్యోగుల సమస్యలను లేవనెత్తారు. 12వ పీఆర్సీ నియామకం ఇంకా పూర్తి కాలేదని, దీనితోపాటు మధ్యంతర భృతి చెల్లింపుపై కూడా ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. వారికి 4 డీఏలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు అందాల్సిన గ్రాట్యూటీ, పెన్షన్ బకాయిలు, ఇతర బెనిఫిట్లు భారీగా పెండింగ్లో ఉన్నాయన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్, టీఏ, సరెండర్ లీవుల బకాయిలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదన్నారు. గ్రంథాలయ సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు, పింఛన్లు పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. జనవరి 2024 నుంచి సెప్టెంబర్ 2025 వరకూ ఉన్న 3.64 శాతం డీఆర్ బకాయిలను ఏప్రిల్ 2026 నుంరరి విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ ఇంతవరకూ చెల్లించలేదన్నారు. ఈ బకాయిలన్నీ ప్రభుత్వం వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి -
బాలికల వసతిగృహం తనిఖీ
పుంగనూరు: పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహాన్ని కలెక్టర్ నిశాంత్కుమార్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతిగృహంలో చదువుతున్న 9, 10 తరగతుల విద్యార్థినుల పుస్తకపఠనాన్ని, నేర్చుకున్న సామర్థ్యాన్ని ఆయన పరిశీలించారు. 6వ తరగతి చదువుతున్న విద్యార్థినిని గణితశాస్త్రంలోని సమస్యను పరిష్కరించాలని సూచించగా విద్యార్థిని సమస్యను పూర్తిగా పరిష్కరించడాన్ని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ సైన్సు, గణితశాస్త్ర బోధనపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థినులకు కంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు అందిస్తున్న వసతి సౌకర్యాలు, ఆహార నాణ్యత, పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు. -
ఈ సారైనా నిధులిస్తారా!
కడప సిటీ: జిల్లాలోని సాగు,తాగునీటిప్రాజెక్టులపై ‘పచ్చ’నీడ కమ్ముకుంది. ‘పైసల్లేక..’ పనులు జరగడమే గగనమైంది. ఫలితంగా జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎగనామం పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం జిల్లాలోని మిగతా ప్రాజెక్టుల ఉన్నతినీ గాలికొదిలేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబేమో ప్రతి సమావేశంలో రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరందిస్తామని డప్పు కొడతారు. వాస్తవ రూపం లో అది అమలు కావడం లేదు. ● రాజంపేట పరిధిలో ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణం అతీగతీ లేకుండా పోయింది. కమిటీలతో కాలయాపన చేసి మళ్లీ కొత్త టెండరు పిలువడంగానీ లేదా అదే కాంట్రాక్టర్కు అప్పగించడంగానీ జరగడం లేదు. దీంతో ప్రాజెక్టు నిర్మాణం అగమ్యగోచరంగా మారింది. జిల్లాలోని ప్రాజెక్టులు శరవేగంగా కొనసాగాలంటే 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3 వేల కోట్లకు పైగా నిధులు అవసరమని నీటిపారుదలశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నేపధ్యంలో జిల్లా ప్రాజెక్టుల సీఈ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించే సమయం ఆసన్నమైంది. కనీసం అధికారులు పంపిన నివేదిక ప్రకారం నిధులను మంజూరు చేస్తారా? లేక ఎగనామం పెడతారా? అనేది వేచి చూడాల్సిందే. రాయలసీమ వాసిగా.. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వట్టి మాటలు చెప్పడం ఆపి.. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసి నీళ్లు ఇచ్చి సీమ గొంతు తడపాలని ప్రజలు కోరుతున్నారు. అన్నమయ్య కావాలంటే రూ.100 కోట్లు కావాలి అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణం కోసం 2021 నవంబరులో అప్పటి వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం రూ. 787.77 కోట్లకు అనుమతులు ఇచ్చి టెండర్లను కూడా పిలిచింది. ఈ పనులను రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ దక్కించుకుంది. ఈ సంవత్సరం మార్చి చివరి నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికీ సంబంధించిన డిజైన్పై ఆమోదం లభించకపోవడంతో ప్రాజెక్టుకు బీజం పడలేదు. కమిటీ నెపంతో నీటిపారుదల ఇంజనీరింగ్ శాఖ అధికారులు, సాంకేతిక నిపుణులు పరిశీలించి ప్రాజెక్టు పూర్తికి నిధులు అవసరమని తేల్చడం జరిగింది. 2021 నవంబరు 19న అన్నమయ్య ప్రాజెక్టు మట్టి కట్ట వరదకు గురైంది. స్పిల్వే 94 మీటర్లు దెబ్బతింది. ఇతర ప్రాజెక్టులకు.. మైలవరం జలాశయానికి రూ. 1.60 కోట్లు, ఝరికోనకు రూ. 7 కోట్లు, వెలిగల్లుకు రూ.5.20 కోట్లు, బుగ్గవంక ప్రాజెక్టుకు రూ. 0.20 కోట్లు అవసరమని అధికారులు నివేదించారు. రూ.10 కోట్లు ప్రణాళికేతర పద్దు కింద అవసరమని అధికారులు కోరారు. ఈ నిధులు వస్తేగానీ ఈ పనులు ముందుకు సాగే అవకాశం కనిపించడం లేదు. అలాగే పులివెందుల నియోజకవర్గ ప్రాజెక్టు పనులకు రూ. 430 కోట్లు, దిగువ సగిలేరుకు రూ. 30 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పనులపై సర్కార్ నిర్లక్ష్యం ప్రాజెక్టులకు రూ. 3 వేల కోట్లకు పైగా నిధులు అవసరం! బడ్జెట్లో నిధుల కేటాయిస్తారా....ఎగనామం పెడతారా? ఒకవైపు పోతిరెడ్డిపాడు పనులు సాగుతూనే ఉన్నా...అవుకు జలాశయం నుంచి గండికొట సొరంగం వరకు వరద కాలువ, సొరంగం పనులు వైఎస్సార్ సీపీ పాలనలో జరిగాయి. కూటమి హయాంలో సర్వరాయసాగర్, వామికొండ, జీఎన్ఎస్ఎస్ ఫేస్–2 ప్యాకేజీలు ఉండగా, 3–7 వరకు పనుల్లో పురోగతి లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సివిల్ పనులు, భూ సేకరణ, అధికారులు, సిబ్బంది వేతనాలు, పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు అవసరమని ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. ప్రతిపాదనలు అందజేశాం జిల్లాలోని ఆయా ప్రాజెక్టుల పెండింగ్ పనులకు దాదాపు రూ. 3 వేలకోట్లకు పైగా నిధులు అవసరమని ప్రభుత్వానికి నివేదికలు అందజేశాం. నిధులు మంజూరు కాగానే జిల్లాలోని ఆయా ప్రాజెక్టుల పెండింగ్ పనులకు సంబంధించి పనులను శరవేగంతో పూర్తి చేస్తాం. అన్నమయ్య ప్రాజెక్టు కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నిర్మాణ పనులు చేపడతాం. –వరప్రసాద్, ప్రాజెక్టుల సీఈ, కడప -
ప్రైవేట్ పాఠశాలలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ అనూరాధ మదనపల్లె సిటీ: విద్యా హక్కు చట్టం ప్రకారం 2026–27 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించేందుకు జిల్లాలోని ప్రతి ప్రైవేట్,అన్ ఎయిడెడ్ పాఠశాలలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ అనూరాధ పేర్కొన్నారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సమగ్రశిక్ష ఆధ్వర్యంలో పాఠశాలల విద్యా కమిషనర్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ విధానం గురించి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రక్రియ ఈనెల 16వతేదీలోపు పూర్తి చేయాలన్నారు. ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాల కోసం ఈనెల 20వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నందున ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పాఠశాల గుర్తింపు సర్టిఫికెట్ ప్రతిని అప్లోడ్ చేయాలన్నారు. ఆర్టీఈ కింద గత నాలుగు సంవత్సరాల్లో ఎంత మంది విద్యార్థులు ప్రవేశం పొందారు ప్రస్తుతం ఎంత మంది చదువుతున్నారు అనే వివరాలు కూడా నమోదు చేయాలన్నారు. డిప్యూటీ ఎంపిడిఓ తిరుపాల్నాయక్, సమగ్ర శిక్ష సీఎంఓ, నోడల్ అధికారి కరుణాకర్, ఎంఈఓలు ప్రభాకర్రెడ్డి, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
సమీక్షకే సమయం లేదా!
ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల గడువు సమీపిస్తోంది. సరిగ్గా మరో 45 రోజుల్లో ఉత్సవాలకు శ్రీకారం జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్త జనం తరలిరానుంది. పైగా రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో జరిగే బ్రహ్మోత్సవ వేడుక ఇది. ఇంతటి మహోత్సవంపై ఉన్నత స్థాయి అధికారులు ఇంతవరకు సన్నాహాక సమీక్షలు నిర్వహించక పోవడంపై భక్తులు నిట్టూర్చుతున్నారు. ఇది టీటీడీ అధికారుల నిర్లక్షాన్ని చూపుతోందని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల ఉత్సవాల్లో ముందస్తు చర్యల్లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంఘటనలు.. మృత్యువాత పడుతున్న ఘటనలను ఉటంకిస్తున్నారు. ● ఒంటిమిట్టలో శ్రీ కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాలను మార్చి 26న అంకురార్పణ చేయనున్నారు. ఏప్రిల్ 5వ తేది వరకు నిర్వహించాలని ఇప్పటికే అధికారికంగా అనుమతిచ్చారు. సరిగ్గా 42 రోజుల సమయం ఉంది. గతంలో ఏటా మూడు నెలల ముందు నుంచి బ్రహ్మోత్సవాలు వచ్చే వరకు నెలకోసారి సమీక్ష సమావేశం నిర్వహించే వారు. ఈ ఏడాది ఇంతవరకు ఉన్నతాధికారులతో ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. ఈపాటికి కల్యాణ వేదిక వద్ద బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు మొదలయ్యేవి. సీతారాముల కళ్యాణ వేదిక ప్రాంగణంలో కంపచెట్లు, కలుపు మొక్కలు తొలగించి, చదును చేసేందుకు గుత్తపత్రాలు ఆహ్వానించినా, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడ ఇంకా ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. మొక్కలను తొలగించి చదును చేయాల్సి ఉంటుంది. వాహనాలను నిలిపేందుకు ప్రత్యేకంగా స్థలాన్ని ఎంపిక చేసి, అక్కడ శుభ్రం చేయాల్సి ఉన్నా కదలిక లేదు. విద్యుత్ నియంత్రికలు అమర్చాలి, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి, తాగునీరు, సేవకులకు భోజన వసతి, పట్టువస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో అలంకరణలు, విద్యుత్ కాంతులు, స్వాగత తోరణాలు ఏర్పాటు, ప్రసాదం పంపిణీ, పారిశుధ్యం, వైద్య సేవలు, క్యూలైన్లు వంటి అంశాలు చర్చకు రావాల్సి ఉంది. ఉత్సవాల వేల విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బంది, సేవకులకు బస వసతి కల్పించడంపై శ్రద్ధ వహించాల్సి ఉంది. ఒంటిమిట్ట రామయ్య బ్రహ్మోత్సవ వేడుకల సమాచారాన్ని దశదిశలా తెలిపేలా విస్తృతంగా ప్రచారం చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1న జరిగే సీతారాముల కల్యాణానికి తలంబ్రాలు అందజేసేందుకు చిరు సంచులు, రాములోరి పరిణయ ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ప్యాకెట్లలో తలంబ్రాలు నింపి అందిస్తామని అధికారులు చెబుతున్నారు. గోడపత్రాలు, ప్రముఖులకు ఆహ్వాన పుస్తకాలు(వీఐపీ, వీవీఐపీ), రంగుల కరపత్రాలు, ప్రత్యేక ఆహ్వానాలు పత్రాలు వేల సంఖ్యలో ముద్రించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుందని చెబుతున్నా... గోడ, కర, ప్రచార పత్రాలు ఇంకా ఇక్కడికి చేరలేదు. నెలన్నర రోజుల్లో ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు గోడ, కర, ఆహ్వాన పత్రాల ఊసే లేదు? కల్యాణ వేదిక ప్రాంగణమంతా పిచ్చిమొక్కలే ఇదీ కోదండ రాముడి ఉత్సవ ఏర్పాట్ల తీరు సాధారణంగా గత వేడుకల్లో జరిగిన తప్పిదాలను మరలా జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నతాధికారులు సమీక్షించాల్సి ఉంది. సమీక్షలే చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. ఏటా ఉత్సవాలు ప్రారంభమవడానికి ముడు నెలల ముందే ఒంటిమిట్టలో చేపట్టాల్సిన అభివద్ధి పనులు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ, సమీక్ష నిర్వహిస్తూ వచ్చేవారు. లోటు పాట్లు లేకుండా ముందస్తుగా కసరత్తు చేసి, విజయవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, ఆ దిశగా అడుగులేసేవారు. ఈ దఫా ఎందుకనో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇక్కడికి జేఈవో, ఈవో ఉన్నత స్థాయి అధికారులెవరూ రాలేదు. -
తమ్ముళ్ల తన్నులాట..
● కత్తులు కట్టెలతో రాడ్లతో దాడులు.. ● తమ్ముడు మణికంఠకు తీవ్ర గాయాలు.. ● అనుయాయుల కోసం స్టేషన్ గడప తొక్కిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మంత్రి అనుయాయులు రాయచోటి : రాయచోటిలో తెలుగు తమ్ముళ్ల మధ్య వార్ రోజురోజుకు అధిగమవుతోంది. ఒకవైపు మంత్రి మండిపల్లి, ఇంకోవైపు పార్టీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి వర్గీయుల గ్యాంగుల మధ్య దాడులు, ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. దాడులను అదుపు చేయడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు అధికార పార్టీ అధినేతల ఒత్తిడుల కారణంగా విఫలమవుతున్నట్లు సమాచారం. దాడుల పరంపరలో బుధవారం టీడీపీకి చెందిన అధినేతల జోక్యం వివాదాలకు మరింత ఆజ్యం పోసేలా చేసింది. అనుచరులకు మద్దతుగా ఒకవైపు పార్టీ జిల్లా అధ్యక్షుడు సుగువాసి ప్రసాద్ బాబు, మరోవైపు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అనుచరులైన బోనుమల ఖాదరవల్లి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. వీరి రాకతో పోలీస్ స్టేషన్ ఆవరణమంతా వారి అనుయాయులు, గ్యాంగులతో నిండిపోయింది. ఒక దశలో పోలీస్టేషన్ ఆవరణం యుద్ధ వాతావరనాన్ని తలపించింది. నాలుగు రోజుల నుంచి రెండు వర్గాల మధ్య దాడులు, ప్రతి దాడులు సాగుతున్నాయి. బుధవారం సాయంత్రం పాత రాయచోటికి చెందిన మణికంఠ (35) పై రాడ్లు, కట్టెలతో మరో గ్యాంగ్ దాడికి తెగబడింది. ఈ ఘటనలో మణికంఠ తలపై తీవ్రమైన గాయాలయ్యాయి. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఇరు వర్గాలకు చెందిన కొంతమందిని స్టేషన్ కు పిలిచి తమదైన స్టైల్ లో కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో పార్టీ అధినేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. గ్యాంగులకు అనుకూలంగా నాయకులు సైతం వత్తాసు పలుకుతుండడంతో వారిని నిలువరించడంలో పోలీసులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా గ్యాంగులకు మద్దతుగా ఒకవైపు పార్టీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు నేరుగా పోలీస్ స్టేషన్ గడప తొక్కడంతో నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు బహిర్గతమయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాయచోటిలో జరిగిన సంఘటనపై అర్బన్ సీఐ చలపతిని వివరణ కోరగా ఇరు వర్గాలను పిలిచి స్టేషన్లో కౌన్సెలింగ్ ఇచ్చామని, ఇలాంటి సంఘటనలు మరో మారు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించి పంపినట్టు చెప్పారు. -
కంచే చేను మేస్తోంది !
● సామాజిక భద్రత పెన్షన్లలో సచివాలయం సిబ్బంది చేతివాటం ● అరవీడు,గోపనపల్లె గ్రామాల్లో 6.50 లక్షల నిధులు గోల్ మాల్ గాలివీడు : ప్రజలకు, ప్రభుత్వానికి జవాబుదారీతనంగా పనిచేయాల్సిన సచివాలయం సిబ్బంది చేతివాటంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. వివరాల్లోకి వెళితే గాలివీడు మండలంలో ప్రతి నెలా 1 నుంచి 3 వతేదీ వరకు వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ,దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.నిబంధనల మేరకు పెన్షన్ల పంపిణీ అనంతరం ప్రతి నెలా 4, 5 వ తేదీల్లో మిగిలిన సొమ్మును లెక్కగట్టి గ్రామపంచాయతీ కార్యదర్శి సమక్షంలో ప్రభుత్వ ఖజానాకు బ్యాంకులో జమ చేయాలి. అయితే సచివాలయం సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుండటంతో ఖజానాకు చేరాల్సిన సొమ్ము పక్కదారి పడుతోంది.అరవీడు గ్రామంలో 2025–26 సంవత్సరానికి గాను ఆగస్టు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్,జనవరి మాసాల్లో మిగులు సొమ్ము రూ.4,08,000 ప్రభుత్వ ఖజానాకు జమ కాలేదు.అలాగే గోపనపల్లె గ్రామంలో .2021–22 జనవరి నుంచి 2025–26 జనవరి వరకూ దాదాపు నాలుగు సంవత్సరాలుగా మిగులు పెన్షన్ల సొమ్ము రూ.2,46,000 ఖజానాకు కాకుండా సచివాలయం సిబ్బంది జేబుల్లోకి వెళ్లడం పలు సందేహాలకు దారితీస్తోంది.అయితే సంబంధిత శాఖ డీఆర్డీఏ నుంచి ఎప్పటికప్పుడు స్వాహా చేసిన సొమ్మును రికవరీ చెయ్యాలని ఎంపీడీఓ కార్యాలయానికి సమాచారం ఇస్తున్నప్పటికీ స్థానిక యంత్రాంగం భాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తూ నిధుల దుర్వినియోగంలో పరోక్షంగా భాగస్వాములు అవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం ఈ అక్రమాలపై విచారణ జరిపి ప్రభుత్వ సొమ్మును రికవరీ చేసి,అక్రమార్కులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మెమోలు ఇస్తున్నాం మిగులు పెన్షన్ సొమ్ము ప్రభుత్వ ఖజానాకు జమ చేయని సిబ్బందికి మెమోలు ఇస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్ సొమ్ము దుర్వినియోగం చేస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సొమ్ము రికవరీ కోసం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – చంద్రమౌళీశ్వర్, ఎంపీడీఓ, గాలివీడు. -
మాదకద్రవ్యాల నిర్మూలనకు కార్యాచరణ
మదనపల్లె: జిల్లాలో మాదకద్రవ్యాలను అరికట్టేందుకు కార్యాచరణ, కళాశాలలు, విద్యాసంస్థలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల భద్రతపై డ్రోన్ పెట్రోలింగ్ చర్యలను విస్తృతం చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ పోలీసు శాఖను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో బుధవారం శాంతి భద్రతలు, మహిళల సంరక్షణ, మాదకద్రవ్యాల నిర్మూలనపై ఎస్పీ ధీరజ్ కునుబిల్లితో కలిసి జిల్లాకు చెందిన డీఎస్పీలు, సీఐలతో సమీక్షించారు. ఐవీఆర్ఎస్ ద్వారా మహిళలపై నేరాలకు సంబంధించి ప్రజల నుండి తీసుకున్న అభిప్రాయాలను పరిశీలించారు. నమోదైన కేసులు, అవగాహన కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడేవారిపై పీడీ చట్టం అమలు చేయాలని సూచించారు. యువత మాదకద్రవ్యాల వైపు వెళ్లకుండా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను మండల, గ్రామ, కళాశాల, పాఠశాలలలో స్థాయిలో నిర్వహించాలన్నారు. డీ–అడిక్షన్ కేంద్రాల ఏర్పాటుకు అధికారులను ఆదేశించారు. కాగా త్వరలో ఈగల్ క్లబ్ సభ్యుల మెగా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ -
బార్ బరి.. గెలుపెవరిదోమరి !
● ఏడేళ్ల తర్వాత ఏపీ బార్ కౌన్సిల్కు ఎన్నికలు ● 13న పోలింగ్కు సన్నద్ధం రాజంపేట : జిల్లాలోని న్యాయవాద వర్గాల్లో ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈనెల 13న ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టులకు సంబంధించి బార్ అసోసియేషన్లు తమ తమ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు పోటీపడుతున్నారు. బార్ కౌన్సిల్ ఓటరు జాబితాను ఖరారు చేసింది. మొదటి ప్రాధాన్యత ఓటు కోసం న్యాయవాదులు మల్లగుల్లాలు పడుతున్నారు.ఏడేళ్ల తర్వాత స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతుండటం గమనార్హం. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ పర్యవేక్షణ ఈ ఏడాది జనవరి 3న గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి విధితమే. జనవరి 5 నుంచి 13 మధ్య నామినేషన్లు స్వీకరించారు. ఈ ఎన్నికలు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయి. సుప్రీం కోర్టు నియమించిన కమిటీ పర్యవేక్షణలో ఈ ఎన్నికల ప్రక్రియ జరగనుంది. బరిలో 143 మంది అభ్యర్ధులు రాష్ట్ర వ్యాప్తంగా 109 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 23 స్ధానాల కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 150 బార్ అసోసియేషన్లు ఉన్నాయి. 143మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 23మందిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వీరిలో నుంచి చైర్మన్ అభ్యర్ధిని ఎంపిక చేసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 39409 ఓట్లు ఉన్నాయని స్టేట్బార్ కౌన్సిల్ వెల్లడించింది. జిల్లాలో ఏయే కోర్టు పరిధిలో.. జిల్లాలో కడప, బద్వేలు,జమ్మలమడుగు,నందలూరు, ప్రొద్దుటూరు,పులివెందుల,రాజంపేట, రాయచోటి , రైల్వేకోడూరు, మైదుకూరు, కమలాపురం,లక్కిరెడ్డిపల్లె కోర్టుల పరిధిలో బార్ అసోసియేషన్ కార్యవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ బార్ అసోసియేషన్ల పరిధిలో ఏపీ బార్ స్టేట్ కౌన్సిల్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం పోలింగ్ అధికారులను కూడా త్వరలో నియమించి, ఉత్తర్వులు విడుదల చేయనున్నారు. ఇప్పటికే పోలింగ్ అధికారుల ఎంపిక కొనసాగిందని న్యాయవాదులు చెబుతున్నారు. జిల్లా వారీగా ఓట్లు ఇలా.. న్యాయవాదుల సమాచారం మేరకు జిల్లా వారీగా ఓటర్లు వివరాలు ఇలా ఉన్నాయి. కడప(760), రాజంపేట (154), రైల్వేకోడూరు(35), నందలూరు (24), పులివెందుల (24), కమలాపురం (20), మైదుకూరు (16), జమ్మలమడుగు(30), రాయచోటి (113), ప్రొద్దుటూరు(316), బద్వేలు (69) , ఉన్నాయి. మాడల్బైలాస్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఎన్నికల నిర్వహిస్తామని ప్రస్తుత కార్యవర్గం హైకోర్టుకు నివేదించింది. ఇప్పటికే ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని వివరించింది. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు..ఆ షెడ్యూల్ ప్రకారం ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతవరణంలో ఎన్నికలు నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. -
7 శాతం వడ్డీ...
రైతు తన వ్యవసాయ అవసరాల కోసం లక్ష రుపాయలు రుణం తీసుకుంటే సంవత్సరానికి 7 శాతం వడ్డీ అంటే రూ. 7 వేలు రూపాయలు వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కేంద్రం 3, రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం వాటా ఉంటుంది. అంటే రైతు చెల్లించాల్సిన వడ్డీ మొత్తంలో కేంద్ర భరించాల్సిన 3 శాతం వడ్డీ అంటే 3 వేలు యథావిధిగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా స్థానిక సహకార సంఘాలకు చెల్లిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద చెల్లించాల్సిన 4 శాతం అంటే రూ.4 వేలు మాత్రం ఈ 18 నెలలగా ఇవ్వడం లేదు. ఉమ్మడి వైఎస్సార్జిల్లాలో 72 సహకారం సంఘాలతోపాటు డీసీసీబీ బ్రాంచిల ద్వారా రైతులు చాలా మంది వ్యవసాయ రుణాలు తీసుకున్నారు. వీరికి సంబంధించిన వడ్డీమాత్రం చెల్లించలేదు. వడ్డీ చెల్లించడం ఆలస్యమైతే వడ్డీకి వడ్డీ కూడా కలిసి బ్యాంకులు వసూలు చేస్తాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే సహకార సంఘాలు కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. -
చింతకాయల కోసం వెళ్లి..
– చెట్టు పైనుంచి జారి పడి యువకుడు మృతి వాల్మీకిపురం : చింతకాయల కోసం వెళ్లిన ఓ యువకుడు చెట్టుపై నుంచి జారి పడి మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకొంది. వివరాలు.. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన శివకుమార్ (32) చింతకాయల కోసం స్థానిక తరిగొండ రోడ్డులోని ఓ చెట్టు ఎక్కాడు. ప్రమాదవ శాత్తు చెట్టుపై నుంచి జారి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమ నించిన స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళపై దాడిచేసిన వ్యక్తిఅరెస్ట్ చౌడేపల్లె : మహిళపై కొడవలితో దాడిచేసిన వ్యక్తిని అరెస్ట్చేసినట్లు ఎస్ఐ నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. ఈనెల 3వతేదీ రాత్రి బోయకొండ సమీపంలోని యానాదిపాళ్యంకు చెందిన గంగలమ్మపై అదేగ్రామానికి చెందిన నాగరాజ కొడవలితో దాడిచేసి గాయపరిచాడు.ముఖం, తల, చేతిపై తీవ్రగాయాలయ్యాయి. ఆమెఫిర్యాధు మేరకు నాగరాజపై కేసు నమోదుచేశారు.కొలింపల్లె బస్సుస్టాప్ వద్ద ఉండగా అందిన సమాచారం మేరకు అరెస్ట్చేసి కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి రిమాండుకు ఆదేశించినట్లు ఎస్ఐ తెలిపారు. టైలర్షాప్ దగ్ధం – రూ.2 లక్షలు నష్టం కలకడ : మండలంలోని నిడిమిచెర్లరో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో టైలర్షాపు దగ్ధమైంది. బాధితుడి కథనం మేరకు వివరాలు..కలకడ మండలం, నడిమిచెర్ల పంచాయతీ వడ్డిపల్లె గ్రామానికి చెందిన రెడ్డెప్ప జీవనోపాధికోసం నడించెర్లలో గది అద్దెకు తీసుకుని టైలర్షాపు నిర్వహిస్తున్నాడు. బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.ఆ సమయంలో అతను దుకాణం లేదు. స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో అతను అక్కడికి చేరుకున్నాడు. అయితే అప్పటికే షాపులోని సామగ్రి కాలి బూడిదైంది. సుమారు రూ. 2లక్షల వరకు నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు. స్థానికులు మంటలు ఆర్పేశారు. వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఫిర్యాదు మదనపల్లె టౌన్ : మదనపల్లె జిల్లా ఆస్పత్రి అత్యవసర విభాగంలో నలుగురు డాక్టర్లతోనే వెట్టి చాకిరి చేపిస్తున్నారని, క్యాజువాలిటీ విధులు నిర్వర్తించే డాక్టర్లు జిల్లా కల్టెక్టర్ నిశాంత్ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు క్యాజువాలిటి డాక్టర్లు సయ్యద్ హదీద్, లక్ష్మీకళ తదితరులు బుధవారం మదనపల్లె కలెక్టరేట్కు వెళ్లి జిల్లా కలెక్టర్ను కలసి, స్థానిక జిల్లా ఆస్పత్రిలోని డాక్టర్లపై ఫిర్యాదు చేశారు. గతంలో పది మంది డాక్టర్లు అత్యవర సేవలకు పనిచేసేవారని, తర్వాత నలుగురిని తగ్గించి.. ఆరుగురితో పనిచేయిస్తూ ఉండేవారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ ఆరుగురిలో మరో ఇద్దరిని తగ్గించి ప్రస్తుతం నలుగురితోనే పని చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు ఎముకల డాక్టర్లు క్యాజువాలిటీకి వచ్చే అత్యవసర కేసులను ఏడాది కాలంగా ఏనాడు చూడటం లేదని చెప్పారు. ఎములకల డాక్టర్లు ఉదయం 10 గంటలకు ఓపీకి వచ్చి మధ్యాహ్నం 12 గంటల తరువాత పత్తా ఉండరన్నారు. వాస్తవానికి వారిద్దరినే క్యాజువాలిటీకి వేయాలని కల్టెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు తెలిపారు. -
● సాగునీటిపై ఆశలు
మదనపల్లె: మదనపల్లెను జిల్లా కేంద్రం చేశాక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్లో అభివృద్ధికి ప్రాధాన్యత దక్కుతుందా లేదా అని జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హఠాత్తుగా జిల్లా కేంద్రం మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. కొత్త జిల్లా కేంద్రం మదనపల్లైపె ఏ మేరకు ప్రభుత్వం చిత్తశుద్ధి చూపుతుందో బడ్జెట్ కేటాయింపుల్లో తేలనుంది. ప్రధానంగా నిధుల సాధనకు జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు నల్లారి కిశోర్కుమార్రెడ్డి, షాజహాన్బాషాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సి ఉంది. తమ నియోజకవర్గాల అభివృద్ధికి, తంబళ్లపల్లె, పుంగనూరుల్లో ఆగిపోయిన పరిశ్రమలు, ప్రాజెక్టులను పూర్తి చేయించే బాధ్యత వీరిపైనే ఉంది. అధికార పార్టీనేతలు జిల్లా ప్రగతికి కృషి చేయాలని, నిరక్ష్యం చేస్తే అభివృద్ధిలో తిరోగమనం తప్పదని ప్రజలు అంటున్నారు. ప్రాధాన్యం ఇవ్వాల్సినవి ● వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీటీ కళాశాలను విశ్వవిద్యాలయం చేస్తూ జీవో జారీ చేసింది. దీన్ని అమలుచేసి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలి. ● మదనపల్లె టమాట మార్కెట్ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఇంతవరకు దాని ఊసేలేదు. టమాట ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తామని హామీ అమలు కాలేదు. ● మదనపల్లె పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకొస్తామని లోకేష్ హామీ అమలు కాలేదు. ● జిల్లాలో ఏకై క పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ను టీడీపీ పాలనలో 2000లో టౌన్షిఫ్ చేశారే కాని పైసా నిధులు ఇవ్వలేదు. కమిటీకి సొంత ఆదాయ వనరులున్నా సమస్యలను పట్టించుకోవడం లేదు. కొండపై హెలిప్యాడ్, రోప్వే ప్రతిపాదన సాధ్యం కాదని తేలింది. మరోసారి దీనిపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ● కూటమి పాలన రాకతో తంబళ్లపల్లెలో ఆగిపోయిన వందల కోట్ల విలువైన రహదారుల పనులను చేపట్టాలి. ● వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బురకాయలకోట, కడపక్రాస్, కలిచర్లకు ప్రాథమిక వైద్యకేంద్రాలు మంజూరు చేయగా వాటిని ఆపేశారు. వీటిని ప్రారంభించాలి. ● బెంగళూరు–చైన్నె ఎక్స్ప్రెస్ హైవేనుంచి పుంగనూరు మీదుగా రొంపిచర్ల క్రాస్ వరకు హైవేరోడ్డు అనుసంధాన పనులు మంజూరై గత ప్రభుత్వంలో మొదలయ్యాయి. కూటమిపాలన రాకతో వీటిని రద్దు చేశారు. ఈ పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ● పుంగనూరులో జర్మన్ పెప్పర్మోషన్ ఎలక్ట్రికల్ బస్సులు, ట్రక్కులు తయారీ పరిశ్రమను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టగా కూటమిపాలనలో ఆగిపోయింది. ఈ పరిశ్రమను చేపట్టి పూర్తి చేయాలి. ● పుంగనూరులో స్టేడియం ఏర్పాటుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అనుమతి వచ్చే సమయంలో ప్రభుత్వం మారడంతో ఆగిపోయింది. ● పుంగనూరులో మైనార్టీ జూనియర్ కళాశాల మంజూరు, ఏర్పాటుకు భూ కేటాయింపును వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసింది. దీన్ని ప్రారంభించాలని మైనార్టీలు కోరుతున్నారు. ● వెలిగల్లు నుంచి రాయచోటికి తాగునీటిని తరలించేందుకు రూ.100 కోట్లతో గత ప్రభుత్వంలో చేపట్టిన పనులు 60శాతం పూర్తయిన ప్రభుత్వం పూర్తి చేయించలేదు. వీటిని పూర్తి చేయించాల్సివుంది. ● గత ప్రభుత్వంలో రాయచోటిలో చేపట్టిన క్రికెట్ స్టేడియం పనులు పూర్తి చేయించాలి. ● రాయచోటిలో ఆగిపోయిన అండర్గ్రౌడ్ డ్రైనేజి పనులు చేపట్టి పూర్తి చేయాలి. ● రాయచోటిలో విద్యా సంస్థల కోసం కేటాయించిన భూమిలో విద్యాసంస్థలను నెలకోల్పి, శిల్పారామం పనులు పూర్తి చేయించాలి. మదనపల్లెలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసి చేపట్టిన మెడికల్ కళాశాలను కిల్ చేయుద్దంటూ ప్రజలు వేడుకుంటున్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా అందే వైద్యానికి సమాధి చేయొద్దంటూ వేడుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్.జగన్ 95 ఎకరాల భూమిని కేటాయించి, అందులో భవన నిర్మాణాలకు రూ.475 కోట్లలో రూ.80 కోట్ల పని పూర్తయ్యింది. మిగిలిన పనులు పూర్తి చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కళాశాలను నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాలకు ఈ మెడికల్ కళాశాల ఎంతో ప్రయోజనకరం. హంద్రీ–నీవా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలి. పనులు పూర్తి చేయించేందుకు రూ.2,500 కోట్లు కావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇందులో జిల్లాలో రూ.925 కోట్ల పనులకు ప్రతిపాదించారు. ఈ నిధులను కేటాయిస్తే పనులు పూర్తి చేసేందుకు అవకాశం దక్కుతుంది లేదంటే నిధుల కొరతతో పనులు పడకేస్తాయి. ఇప్పటిదాకా పుంగనూరు ఉపకాలువకు మాత్రమే నీటిని అందించారు. ఇంకా ప్రధాన కాలువ, నీవా, తంబళ్లపల్లె ఉపకాలువలు, చింతపర్తి, వాయల్పాడు డి స్ట్రిబ్యూటరీలకు, వీటి పరిధిలోని శ్రీనివాసపురం, అడివిపల్లి రిజర్వాయర్లకు చుక్కనీరు అందలేదు. గాలేరు–నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టుల అనుసంధాన పనులను నిలిపివేసిన ప్రభుత్వం దీన్ని చేపట్టి పూర్తి చేయాలని కరువు ప్రాంత రైతాంగం కోరుతోంది. సాగునీటి ప్రాజెక్టులకు నిధులపై ఆశలు చంద్రబాబు, లోకేష్ హామీలు నెరవేరుస్తారా.. పుంగనూరులోఎలక్ట్రికల్ బస్సులపరిశ్రమను చేపట్టాలి బడ్జెట్లో నిధులు కేటాయిస్తారా..ఎగనామం పెడతారా? ప్రభుత్వం హడావుడిగా మదనపల్లె పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి చేతులు దులుపుకుంది. రాయచోటిలోని ప్రభుత్వ జిల్లా కార్యాలయాలను ఇక్కడికి తరలించి కేంద్రంగా మార్చింది. అయితే ఒకరోజు ముందు జిల్లా కేంద్రం అమలులోకి వస్తున్నట్టు ప్రభుత్వం డిసెంబర్ 30న జీవో జారీచేసి, 31 నుంచి పాలన ప్రారంభించింది. అప్పటి సబ్కలెక్టర్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంగా మార్పుచేయగా పాలన ప్రారంభమైంది. ఇక్కడి సబ్కలెక్టర్ కార్యాలయాన్ని డీడీఓ భవనంలోకి తరలించగా జిల్లా కార్యాలయాలకు భవనాలు, వసతులు లేవు. అధికారులు కార్యాలయాల్లో కుదు రుగా కూర్చునే పరిస్థితిలేదు. బీటీ కళాశాల, బీటీ ట్రస్ట్కు చెందిన భవనాలను స్వాఽధీనం చేసుకుని అందులోని గదులపై ఫలానా జిల్లా కార్యాలయం అంటూ కాగితాలు అంటించారు, అక్కడ కార్యాలయాలు లేవు. జిల్లా కేంద్రం స్థాయికి తగినట్టుగా అభివృద్ది ప్రణాళిక మాటేలేదు. -
కుమార్తెను కొట్టారని ఫిర్యాదు
రాయచోటి టౌన్ : రెండో తరగతి విద్యార్థి నోట్ బుక్లో పదం (స్పెలింగ్) తప్పుగా రాసిందని శ్రీచైతన్య స్కూల్ (4 బ్రాంచ్) టీచర్ విశ్వదీప వాతలు వచ్చేలా కొట్టిందని సంబేపల్లె మండలం పెద్ద పుత్త సబియా అనే మహిళ రాయచోటి అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపుత్త నబియా కుమార్తె పెద్ద పుత్త సమీహా (7) రాయచోటి పట్టణంలోని మదనపల్లె రోడ్డులో ఉండే శ్రీచైతన్య స్కూల్లో 2వ తరగతి చదువుతోంది. బుధవారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది. నీరసంగా ఉన్నట్లు గమనించి ఏమైందని తల్లి ప్రశ్నించగా టీచర్ కొట్టిందని చెప్పింది. దీంతో తల్లి చూడా ఒళ్లంతా వాతలు కనిపించాయని ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదుపై పోలీసులు స్పందించి సంబంధిత టీచర్పైనే కాకుండా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రౌడీషీటర్ హత్య కేసులో మదనపల్లెలోనూ మూలాలు మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా పుంగనూరుకు చెందిన రౌడీషీటర్ డీజే భాస్కర్ కర్ణాటక నంగిలి పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యకు గురి కావడం తెలిసిందే. ఈ కేసులో మూలాలు మదనపల్లెలో ఉన్నట్లు బయటపడింది. భాస్కర్ తలలేని మొండెం ఆంధ్ర సరిహద్దులోనూ.. తల కర్ణాటక లోనూ.. ఉండటంతో కేసు నమోదు చేసిన కర్ణాటక నంగిలి పోలీసులు, ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్నారు.సీఐ, ఎస్ఐల బృందం విభిన్న కోణాల్లో లోతుగా దర్యాప్తు సాగించారు. ఈ నేపథ్యంలో సెల్ ఫోన్ ద్వారా కొన్ని ఆధారాలను సేకరించారు. మదనపల్లె పట్టణం, బెంగుళూరు రోడ్డులోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న యువతిని అనుమానంతో బుధవారం సాయంత్రం పట్టుకెళ్లారు. దీంతో మదనపల్లెలోనూ పుంగనూరు రౌడీషీటర్ డీజే భాస్కర్ హత్య కేసుకు మూలాలు ఉన్నట్లు బయటపడింది. హంతకులు మదనపల్లె కు చెందిన వారు కూడా ఉన్నట్లు అక్కడి పోలీసులు అనుమానం వ్యక్తం చేయడం చర్చినీయాంశంగా మారింది. కమలాపురం : కమలాపురం పట్టణ పరిధిలోని అప్పాయపల్లె గ్రామానికి చెందిన మార్పురి సుధీకర్ను 2017లో హత్య చేసిన నిందితలకు గౌరీగాలే ఈశ్వరమ్మ, షిండే చంద్ర అలియాస్ చందు, సయ్యద్ ముబారక్ అలియాస్ పండులకు కడప 4వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి జి.దీనబాబు జీవిత ఖైదుతో పాటు రూ. 5వేలు జరిమానా విధించారు. కేసుకు సంబంధించిన పూర్వ పరాలు పరిశీలిస్తే 2017లో వివాహేతర సంబంధం, ఇతర కుటుంబ కలహాల నేపథ్యంలో మార్పురి సుధీకర్ను నిందితులు పెద్దచెప్పలికి చెందిన గౌరీగాళ్ల ఈశ్వరమ్మ, కమలాపురానికి చెందిన షిండే చంద్ర అలియాస్ చందు, అప్పాయపల్లె కు చెందిన సయ్యద్ ముబారక్ అలియాస్ పండు కలసి పథకం ప్రకారం కత్తితో పొడిచి, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. ఈ సంఘటనపై అప్పట్లో కమలాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి ఆధారాలతో కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ ప్రవేశ పెట్టిన సాక్ష్యాలను, దర్యాప్తు అధికారుల నివేదికలను నిశితంగా పరిశీలించిన న్యాయమూర్తి జి.దీనబాబు నిందితులపై మోపిన హత్యా నేరం రుజువైనట్లు నిర్ధారించారు. దీంతో ముగ్గురు నిందితులకు జీవిత కాల కఠిన కారాగాన శిక్షతో పాటు రూ.5వేలు జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించారు. కాగా ఈ కేసులో నిందితులకు శిక్ష పడేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలాజీ సమర్థవంతంగా వాదనలు వినిపించారు. ఈ కేసులో సాక్షులను సకాలంలో హాజరుపెట్టిన కమలాపురం ఎస్ఐ విద్యా సాగర్ను వీరికి సహకరించిన కోర్టు మానిటరింగ్ పోలీస్ సిబ్బంది సుబ్బరాయుడు, వెంకటేశ్వర్ రెడ్డి, నరసింహ రాయుడులను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేకంగా అభినందించారు. ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్కడప అర్బన్ : కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చౌటపల్లి రైల్వే గేట్ సమీపంలో షేక్ దర్బార్ వల్లి అనే దొంగను రెడ్డెప్ప ఆధ్వర్యంలో ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్ తమ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనానికి పాల్పడిన 10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్ వివరాలను తెలియజేశారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, వరుస మోటర్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని అరెస్ట్ చేసామన్నారు. సత్యసాయి జిల్లా గౌకనపల్లి చెందిన షేక్ దర్బార్ వల్లి (42) గతంలో సెల్ఫోన్ దొంగతనాల కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. -
సున్నా వడ్డీకి సున్నం!
వడ్డీ రాయితీకి ఎగనామం...కడప అగ్రికల్చర్: వ్యవసాయానికి పెద్దపీట వేస్తాం...అన్నదాతలను ఆదుకుంటామంటూ ప్రగల్భాలు పలికిన కూటమి ప్రభుత్వం అధికారంలోని వచ్చిన తర్వాత రైతన్నలను అడుగడుగునా మోసం చేస్తూనే ఉంది. ఎన్నికలకు ముందు తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లించే రైతులకు ఇస్తున్న సున్నా వడ్డీ రాష్ట్ర ప్రభుత్వమే ఎసరు పెట్టింది. అంతేకాకుండా మోసపూరిత వాగ్దా నాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మొదటి ఏడాదే అన్నదాత సుఖీభవ నిధులను(రైతు భరోసా) ఎగరగొట్టింది. అది చాలదన్నట్లు అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 18 నెలల కాలంలో ఇప్పటి వరకు నయా పైసా కూడా వడ్డీ రాయితీ విడుదల చేయలేదు. ఫలితంగా ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో దాదాపు లక్షల మంది రైతులు నష్టపోయారు. వైఎస్ జగన్ హయాంలో నిరాటంకంగా.. వడ్డీ రాయితీ పథకంలో భాగంగా రైతులు తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లిస్తే 4 శాతం వడ్డీ రాయితీ ప్రభుత్వం చెల్లించాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సకాలంలో రైతులకు వడ్డీ రాయితీ అందచేసింది. వ్యవసాయ అవసరాలకు కోసం రైతులు తీసుకున్న రుణాలకు పావలా వడ్డీని ప్రభుత్వమే భరించింది. ఐదేళ్లపాటు నిరాటంకంగా ఈ పథకాన్ని జగనన్న సర్కాలు అమలు చేసింది. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ సున్నా వడ్డీ పథకాన్ని పూర్తిగా విస్మరించింది. ఉమ్మడి జిల్లాలో... ఉమ్మడి జిల్లాలో 72 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్)లు ఉన్నాయి. ఈ సంఘాల్లో సుమారు 1,65,000 మంది సభ్యులున్నారు. వీరంతా కనిష్టంగా లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వ్యవసాయ అవసరాల కోసం పంట రుణాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా 2024–25 సంవత్సరంలో ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో వ్యవసాయ పంట రుణాల కింద రైతులు సుమారు రూ. 530 కోట్లు తీసుకున్నారు. అలాగే 2025–26 సంవత్సరంలో కూడా 550 కోట్లు పంట రుణాల తీసుకున్నట్లు డీసీసీబీ అధికారులు తెలిపారు. వీరికి ప్రభుత్వం వడ్డీ రాయితీ ఇవ్వడం వల్ల రైతులకు కొంతమేర ఉపశమనం కలుగుతుంది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ ధపా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు వడ్డీ రాయితీకి ఎగనామం పెట్టింది. వెంటనే విడుదల చేయాలి లక్ష రూపాయలలోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. ఇటీవల రుణాల కోసం బ్యాంకులకు వెళ్తున్న రైతులను ప్రభుత్వం వడ్డీ రాయితీ విడుదల చేయలేదని రుణాలపై వడ్డీని వసూలు చేస్తున్నారు. వెంటనే వడ్డీ రాయితీ బకాయిలు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి. – సంబటూరు ప్రసాద్రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు రుణాలు చెల్లించినా అందని వడ్డీ రాయితీ... ఏటా పంట రుణాలను సక్రమంగా చెల్లిస్తున్నా వడ్డీ రాయితీ అందడం లేదు. రెడేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. బ్యాంకులు రుణాలిస్తున్నాయే తప్ప రాయితీ విషయం మాట్లాడటం లేదు. బ్యాంకు అధికారులు ఒత్తిడి తెస్తుండటంతో మరో గత్యంతరం లేక వడ్డీ కూడా చెల్లిస్తున్నాం. రైతులకు ఇచ్చే రుణాలకు సున్నావడ్డీ పథకాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. –నాగేశ్వర్ రెడ్డి, కంచన్నగారిపల్లె, కమలాపురం మండలం రైతులను దగా చేయడమే ఏటా రుణాలు సక్రమంగా చెల్లించడంతో బ్యాంకులు తిరిగి రుణాలివ్వడంతోపాటు ప్రభుత్వ వడ్డీ రాయితీ కూడా సక్రమంగా అందేది. రెండేళ్లుగా రైతులు రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నా వడ్డీ రాయితీ రావడం లేదు. దీంతో చాలా మంది రైతులు నష్టపోయారు. ఇది రైతులను దగా చేయడమే. – దస్తగిరిరెడ్డి, జిల్లా రైతు సంఘ నాయకుడు సకాలంలో రుణాలు చెల్లించినా రైతులకు ఫలితం శూన్యం 18 నెలలుగా పైసా విదిల్చని కూటమి ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో చాలా మంది రైతులకు నష్టం రైతులపై కోట్లలో భారం ... ఆందోళనలో అన్నదాతలు -
కన్నతల్లిని కడతేర్చిన కొడుకు అరెస్టు
ఎర్రగుంట్ల : అప్పు కట్టమని చెప్పిన కన్నతల్లి చాప సుందరమ్మపై పెట్రోల్ పోసి కాల్చి చంపిన కేసులో కుమారుడు జాకోబ్ను అరెస్టు చేసినట్లు ఎర్రగుట్ల సీఐ విశ్వనాథ్రెడ్డి తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.... పోట్లదుర్తి గ్రామం క్రిస్టియన్లేన్ కాలనీలో నివాసం ఉన్న చాప సుందరమ్మ (80), అబ్రహాం(లేట్)లకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. సుందరమ్మ తన కుమారుడైన జాకోబ్ వద్ద ఉంటుంది. జాకోబ్ బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జాకోబ్కు నలుగురు సంతానం. వీరిలో ముగ్గురు కుమారులు. కుమార్తె లత ఉన్నారు. లతను ప్రొద్దుటూరు మండల పరిధిలోని కానపల్లెకు ఇచ్చి వివాహం చేశారు. పోట్లదుర్తిలోని తన ఇంటి నిర్మాణంనకు కుమార్తె లత వద్ద రూ.18 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పుగా ఇచ్చిన డబ్బును ఇవ్వాలని లత తన తండ్రి జాకోబ్ను అడిగింది. ఈ విషయంలో జాకోబ్ కుమార్తెతో గొడవ పడ్డాడు. ఈ విషయంపై జాకోబ్ తల్లి సుందరమ్మ మనవరాలు లతతో గొడవ వద్దు.. అప్పుగా తీసుకున్న డబ్బును త్వరగా ఇవ్వమని కుమారుడైన జాకోబ్కు చెప్పింది. మనవరాలికి సపోర్టు చేస్తావా అని సుందరమ్మపై ఇంటిలో ఎవరూ లేని సమయంలో పెట్రోల్ పోసి నిప్పుంటించాడు. బంధువులు గమనించి సుందరమ్మను ప్రొద్దుటూరు ఆసుపత్రికి చికిత్సకు తీసుకెళ్లారు. అక్కడ సుందరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాకోబ్పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కానీ మెరుగైన వైద్యం కోసం సుందరమ్మను కడప రిమ్స్కు తరిలించగా అక్కడ చిక్సిత పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. సుందరమ్మ చనిపోయిన కారణంగా జాకోబ్పై హత్య కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగమురళితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రహదారులే కీలకం
జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ములకలచెరువు : రహదారుల నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ అన్నారు. బుధవారం ఆయన మండలంలో నరేగా నిధులతో మెయిన్రోడ్డు నుంచి కనుగొండరాయస్వామి ఆలయం వరకు నిర్మించిన రహదారిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... ఈ ఆర్థిక సంవత్సరం మార్చిలోగా రూ.75 కోట్లు నరేగా నిధుల ద్వారా మంజూరైన రహదారులు పూర్తి చేయించాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కార్యక్రమంలో పూర్తి చేయాల్సిన 17 పనులను నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యతా ప్రమాణాలను పాటించి పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు మౌలిక సదుపాయాల నిర్మాణమే కీలకమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి మదనపల్లె : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేలా డ్రోన్ సేవలను పెంచి, పంట నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్ నుంచి వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్, ఏపీఎమ్ఐపీ, పశుసంవర్ధక, మత్స్య, సహకార, మార్కెటింగ్, డీఆర్డిఏ, మార్క్ఫెడ్, ప్రైమరీ సెక్టార్ల అధికారులు, మండల ఏఓ, విలేజ్ అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ–పంట నమోదు కార్యక్రమాన్ని వెనుకబడిన మండలాల్లో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయించకపోతే, మార్చి నెలలో పీఎం–కిసాన్ నిధులు జమ కావని, సంబంధిత రైతులకు గుర్తింపు ఇవ్వాలన్నారు. డ్రోన్ సేవలను రైతులు పొలాల్లో తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో మందుల పిచికారీ చేసుకోవచ్చని తద్వారా ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు. రైతులు ఆధునిక సాంకేతిక సేవలను సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం వ్యవసాయశాఖ క్యాబ్ బుకింగ్ తరహాలో వ్యవసాయ యంత్ర సేవలు పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. -
22న లేఖరచన పోటీలు
మదనపల్లె అర్బన్: కడప డివిజన్ తపాలాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 14న నిర్వహించ తలపెట్టిన లేఖారచనా పోటీని అనివార్య కారణాలతో ఈనెల 22వతేదీకి వాయిదా వేసినట్లు డీఈవో సుబ్రహ్మణ్యం చెప్పారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తపాలాశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ–2026 లేఖారచనా పోటీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించి పోటీకి సన్నద్ధం చేయాల్సిన బాధ్యత డీవైఈవోలు, ఎంఈవోలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. అలాగే విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని ప్రతిభ కనబరచాలన్నారు. మదనపల్లె అర్బన్: జిల్లా ప్రొగ్రాం మేనేజ్మెంట్ ఆఫీసర్(డీపీఎంవో)గా సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమేష్బాబు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యసేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల వ్యాప్తి, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ పథకాల వినియోగం, లబ్ధి, వైద్యారోగ్యశాఖ కల్పిస్తున్న ప్రయోజనాలు, ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. రాజంపేట టౌన్: పవిత్ర పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న హత్యరాలలోని త్రేతేశ్వర స్వామి బ్రహోత్సవాలు అంకురార్పణతో బుధవారం ప్రారంభమయ్యాయి. వేకువ జాము నుంచే స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇదిలావుంటే త్రేతేశ్వర స్వామి బ్రహోత్సవాలను మండలంలోని హత్యరాలతో పాటు పోలి, మందరం, సీతారాంపురం పంచాయితీల పరిధిలోని గ్రామాల ప్రజలు సంక్రాంతి పండుగ తరహాలో జరుపుకుంటారు. కాగా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని హత్యరాల గ్రామంలో వివిధ జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గ్రామంలో కోలాహల వాతావరణం నెలకొంది. మదనపల్లె రూరల్: రెవెన్యూ శాఖలో తాత్కాలిక షరతులతో సీనియర్ అసిస్టెంట్లుగా పదో న్నతి పొంది, శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 19 మందిని తిరిగి గ్రేడ్–1 వీఆర్వోలుగా రివర్షన్ చేస్తూ కలెక్టర్ సుమిత్కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. బుధవారం చిత్తూ రు జిల్లా కలెక్టరేట్ విడుదల చేసిన ఉత్తర్వుల్లో..ఉమ్మడి చిత్తూరుజిల్లాలో 48 మంది గ్రేడ్–1 వీఆర్వోలను జీఓ.ఎం.ఎస్.నెం.154, రెవెన్యూ సర్వీసెస్ తేదీ.05.7.2021 ప్రకారం తాత్కాలిక షరతులతో సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. అందులో భాగంగా పదోన్నతి పొందిన గ్రేడ్–1 వీఆర్వోలు రెండేళ్లు.. కలెక్టరేట్, ఆర్డీ, మండల తహసీల్దార్ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేయాలి. రెవెన్యూ ఇన్స్పెక్టర్గా క్షేత్రస్థాయి విధులు నిర్వహించకూడదు. శాఖా పరంగా నిర్వహించే రెవెన్యూ పరీక్షలు–1,2,3, 42 రోజుల సర్వే శిక్షణ, పంట నమూనా, అకౌంట్స్ టెస్ట్ ఫార్ సబార్డినేట్ ఆఫీసర్స్ పార్ట్–1 ఉత్తీర్ణత సాధించాలి. ఏపీపీఎస్సీ నిర్వహించే కంప్యూటర్, అనుబంధ సాఫ్ట్వేర్ వినియోగంలో ప్రావీణ్యం పరీక్ష పాస్ అవ్వాల్సి ఉంది. ఈ మూడు షరతులు పూర్తిచేసిన తర్వాత సీనియర్ అసిస్టెంట్ హోదాలో రెగ్యు లర్ నియామకం పొందుతారు. పదోన్నతి పొందిన 48 మంది సీనియర్ అసిస్టెంట్లలో షరతులు పూర్తిచేయని 19 మందిని తిరిగి పూర్వ హోదా అయిన వీఆర్వో (గ్రేడ్–1)కు రివర్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. రివర్షన్ పొందిన గ్రేడ్–1 వీఆర్వోలు తదుపరి పోస్టింగ్ల కోసం చిత్తూరు జిల్లా కలెక్టర్ లేదా నోడల్ అధికారి ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. -
ఎంట్రీఫీజు వసూలుకు టెండర్ రికార్డు
బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్పై ఉన్న అటవీశాఖ సముదాయంలోకి ప్రవేశ రుసుం వసూలుకు బుధవారం రాజంపేట డీఎఫ్ఓ కార్యాలయంలో నిర్వహించిన టెండర్లలో రికార్డుస్థాయి ధర దాఖలైంది. వివరాలు. హార్సిలీహిల్స్పై అటవీశాఖ పర్యావరణ సముదాయంలో జంతుప్రదర్శనశాల, మొసళ్లపార్కు, ప్రకృతి అధ్యయన కేంద్రం, పురాతన నీలగిరి వృక్షం ఉన్నాయి. వీటిని తిలకించేందుకు పర్యాటకులు అధికసంఖ్యలో వస్తుంటారు. ఇక్కడికి వచ్చేవారి నుంచి రూ.20 ఎంట్రీఫీజును నిర్దేశించిన అటవీశాఖ వాటిని వసూలు చేసుకునేందుకు ఏటా టెండర్లు నిర్వహిస్తోంది. 2026–27 ఏడాదికి నిర్వహించిన టెండర్లలో ఆరుగురు పాల్గొన్నారు. టెండర్ ధర రూ.29.90 లక్షలుగా నిర్ణయించగా వీరిలో కాండ్లమడుగుకు చెందిన ఇడగొట్టు రమేష్బాబు 31 లక్షల ఐదు రూపాయలకు టెండర్ దాఖలు చేయగా ఇదే అత్యధిక టెండర్ కావడంతో అధికారులు దీన్నే ఖరారు చేశారు. అలాగే క్యాంటిన్ నిర్వహణ కోసం రూ.1.75 లక్షలతో టెండర్లకు ఆహ్వనించగా శివన్న అనే వ్యక్తి అత్యధికంగా రూ.3.25 లక్షలకు టెండర్ దాఖలు చేయడంతో ఖరారు చేశారు. కాగా కొండపై అటవీశాఖ ఎంట్రీఫీజు వసూలుకు 2018 నుంచి అమలు చేస్తోంది. 2022 వరకు ఏటా రూ.ఆరేడు లక్షల ఆదాయం దక్కేది. 2022–23లో తొలిసారిగా 13,000,786 పలికింది. తర్వాత వరుగా పెరుగుతూ వస్తున్న ఆదాయంలో 2023–24లో రూ.14 లక్షలు, 2024–25లో రూ.16.50 లక్షలు, 2025–26లో రూ.19.60 లక్షలు పలికింది. ఇప్పుడు 2026–27కు 40శాతానికిపైగా ఆదాయంతో రూ.31లక్షలు పలకడం రికార్డు. కాగా మొదట రూ.10గా ఎంట్రీ రుసుము, రూ.20కి పెంచగా ప్రస్తుతం రూ.25గా చేయడంతో ఈ స్థాయిలో రూ.31 లక్షలు పలికింది. -
లక్ష్యాలను మించి రుణాలు ఇచ్చాం: ఎల్డీఎం
మదనపల్లె టౌన్: రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ముందుగానే పూర్తి చేసి, ప్రణాళికా బద్ధంగా బ్యాంకులకు రు ణాలు మంజూరు చేసిన ట్లు అన్నమయ్య జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ ఆంజనేయులు తెలిపారు. బుధవారం ఆయన మదనపల్లె ఎల్డీఎం ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 2025–26 సంవత్సరానికి ప్రభుత్వం రూ.16.619 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్దేశించడంతో ఆ లక్ష్యాలను సిబ్బంది సమష్టి కృషితో ప్రాధాన్యత, అప్రాధాన్యత పద్ధతుల్లో రూ.18.42 కోట్ల రుణాలను లబ్ధిదారులకు మంజూరు చేసినట్లు తెలిపారు. వీటిలో రూ.30 లక్షల వరకు గృహ రుణాలు, రూ.25 లక్షల వరకు విద్యా రుణాలు, పీఎం స్వానిధి, సూర్య ఘర, విశ్వకర్మ, ముద్ర రుణా లు, ఎస్హెచ్జి రుణాలు రూ.20 లక్షల కు మించకుండా మంజూరు చేసినట్లు తెలిపారు.మిగిలిన సంవత్స రాంతంలోపు రూ.20 కోట్ల రుణాలను ఇస్తామన్నారు. -
రోడ్డు ప్రమాదంలో స్కూటరిస్టుకు తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : గుర్రంకొండలో మంగళవారం రాత్రి రోడ్డు క్రాస్ చేస్తున్న స్కూటరిస్టును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో హర్షద్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం మేరకు గుర్రంకొండకు చెందిన హర్షద్(35) స్థానికంగా ఉన్న ఓ దుకాణంలో అర్థరాత్రి వరకు పనులు చేశాడు. అనంతరం షాపు మూసుకుని ఇంటికి బైకులో వెళుతుండగా బస్టాండు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి కుటుబ సభ్యులకు సమాచాం అందించారు. వారు బాధితున్ని ఓ ప్రైవేట్ వాహణంలో చికిత్సల కోసం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి చికిత్సల అనంతరం అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో, అక్కడి నుంచి ఓ ప్రైవేట్ ఆస్పతికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవీంద్ర తెలిపారు. చింత చెట్టు పైనుంచి కిందపడి .. మదనపల్లె టౌన్ : బి.కొత్తకోట మండలంలో రైతు రామప్ప చింత చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనకు సంబధించి బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాలు.. బయపప్పగారిపల్లి పంచాయతి, పామూరోళ్లపల్లెకు చెందిన రైతు రామప్ప(55) ఊరికి సమీపంలోని తన వ్యవసాయ బోరు వద్దకు బుధవారం కుటుంబీకులతో కలసి వెళ్లాడు. అక్కడ ఉన్న చింత చెట్టు ఎక్కి చింత కాయలు కోస్తుండగా, ప్రమాద వశాత్తు కింద పడ్డాడు. ఈ ఘటనలో కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడడంతో కుటుంబీకులు అతన్ని కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముక్కు, నోట్లో రక్తం ఆగకుండా కారుతుండడంతో డాక్టర్ల సలహా మేరకు అక్కడి నుంచి 108లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి చికిత్సల అనంతరం రైతు పరిస్థితి విషమంగా ఉందని తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. -
శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు
తంబళ్లపల్లె : మాహాశివరాత్రి ఉత్సవాలకు మల్లయ్యకొండకు వచ్చే భక్తులకు ఎక్కడ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావులేకుండా పోలీసుబందోబస్తు ఏర్పాటు చేస్తామనిమ జిల్లా ఎస్పీ ధీరజ్కునుబిల్లి పేర్కొన్నారు. బుధవారం మదనపల్లె డిఎస్పీ మహేంద్రతో కలిసి మల్లయ్యకొండను సందర్శించారు. పూజారులు ఈశ్వరప్ప, మల్లికార్జునలు వారికి స్వాగతం పలికారు. స్వామి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం కొండపైన మహాశివరాత్రి ఏర్పాట్లపై ఎస్పీ ఆరా తీశారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు సైతం ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్వామి దర్శనం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మల్లయ్యకొండ కింద అన్నదాన ట్రస్టు ఏర్పాట్లును పరిశీలించారు. ట్రస్టు చైర్మన్ రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో ఎస్పీ,డీఎస్పీలను సత్కరించారు.ట్రస్టు ఏర్పాటు, నిర్వహణ తదితర అంశాలపై సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ములకలచెరువు సీఐ వెంకటేశులు, ఎస్.ఐ అనిల్కుమార్, సర్పంచుల సంఘం అధ్యక్షులు సుధాకర్రెడ్డి, బెంగుళూరు మల్లికార్జునరెడ్డి, ట్రస్టు సభ్యులు భాస్కర్రెడ్డి, నారాయణరెడ్డి, విజయభాస్కర్రెడ్డి, సుబ్రమణ్యం, మురళి, శివారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్కునుబిల్లి -
మంత్రి ఇలాకాలో ‘104’ వాహనాలు మాయం
సాక్షి, అన్నమయ్య జిల్లా: మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇలాకా రాయచోటిలో ‘104’ వాహనాలు మాయమయ్యాయి. మరమ్మతులు ఉన్నాయని పక్కన పెట్టిన నాలుగు 104 వాహనాలు అదృశ్యమయ్యాయి. రాయచోటి ప్రభుత్వాసుపత్రి ఆవరణ నుంచి 104 వాహనాలు మాయం కాగా.. ఎవరి అనుమతి లేకుండానే డంపింగ్ యార్డుకు కొంతమంది సిబ్బంది తరలించినట్లు సమాచారం.104లను ధ్వంసం చేసి వాటి సామాన్లు అమ్ముకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డంపింగ్ యార్డులో 104లను ధ్వంసం చేస్తున్న వీడియో.. సాక్షి చేతికి చిక్కింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. సిబ్బంది సహకారం లేకుండా ప్రభుత్వాసుపత్రి నుంచి డంపింగ్ యార్డుకు 104 వాహనాలు ఎలా వెళ్లాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, 104లను దొంగలించారంటూ ఆరు నెలల తర్వాత పోలీసులకు జిల్లా వైద్యాధికారి ఫిర్యాదు చేశారు. -
ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమైన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు 10వ తేదీతో ముగిశాయి. చివరిరోజు మంగళవారం 36 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 796 మంది విద్యార్థులు హాజయ్యారు ఆర్ఐవో వెంకటేశ్వర్లతోపాటు స్క్వాడ్్ బృందాలు, డీఈసీ సభ్యులు జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి సిబ్బందికి తగిన సూచనలు, సలహాలను ఇచ్చినట్లు తెలిపారు. కడప అగ్రికల్చర్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో దక్షిణ మండల స్థాయి ( కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల స్థాయిలో) భారీ ‘‘ కిసాన్ మేళా ’ ఫిబ్రవరి 12న తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వి. సుమతి కేవీకే సమన్వయకర్త అంకయ్యకుమార్లు తెలిపారు. ‘సమగ్ర వ్యవసాయం – లాభదాయకం‘ అనే నినాదంతో జరిగే ఈ మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కడప కోటిరెడ్డిసర్కిల్: ఇప్పటివరకు యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా ప్లాట్ఫాం, జనరల్ టిక్కెట్టు కొనేవారని, మార్చి 1 నుంచి వాటిని నిలిపి వేస్తున్నామని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యూటీఎస్ స్థానంలో రైల్ వన్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. మార్చి 1వ తేది నుంచి ఈ యాప్ ద్వారా ప్లాట్ఫాం, జనరల్టిక్కెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గుర్తిస్తూ ఆయా టిక్కెట్లను యాప్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. కడప అగ్రికల్చర్: జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి బుక్కే చంద్రానాయక్ తెలిపారు. మంగళవారం జిల్లాకు 1710 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని ఆయన తెలిపారు. ఇందులో 1150 మెట్రిక్ టన్నుల యూరియాను మార్క్ఫెడ్కు కేటాయించగా మరో 560 మెట్రిక్ టన్నులను ప్రైవేటు డీలర్లకు కేటాయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కడప అర్బన్: మిస్ గ్రాండ్ – ఏపీ–2026 మొదటి రన్నరప్గా బోడగల మహిమాన్విత విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రామదాస్పల్లెలో ఈనెల 7న జరిగిన ఫైనల్స్లో మొదటి రన్నర్ గా కిరీటం గెలుపొందారు. కడప జిల్లా కొత్త మాధవరం గ్రామానికి చెందిన డాక్టర్ శ్రీనివాసులు,రమ్యశ్రీల కుమార్తె అయిన మహిమాన్విత ప్రస్తుతం నెల్లూరులో బీడీఎస్ అభ్యసిస్తున్నారు. మహిమాన్వితను తల్లిదండ్రులు, అన్న డాక్టర్ హరికష్ణ కౌశిక్, సహచర విద్యార్థులు అభినందించారు. చాపాడు: మండలంలోని అల్లాడుపల్లె శ్రీవీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం శాశ్వత హుండీ ఆదాయాలను లెక్కించారు. అన్నమయ్యజిల్లా దేవాదాయశాఖ అసిస్టెట్ కమిషనర్ విశ్వనాథ్ పర్యవేక్షణలో హుండీల ఆదాయాన్ని లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పెరుగు వీరనారాయణ యాదవ్, ఏఓ శంకర్ బాలాజీ మాట్లాడుతూ 3 నెలల 28 రోజులకు సంబంధించిన హుండీలను లెక్కించగా రూ.8,59,761 నగదు, 1.500 గ్రాముల బంగారు, 416.500 గ్రాముల వెండి, అన్నదాన సత్రంలో ఉన్న హుండీని లెక్కించగా రూ.62,390 వచ్చిందన్నారు. మొత్తం నగదు రూ.9,22,151 వచ్చిందని వారు తెలిపారు. కమిటీ సభ్యులు, రెవెన్యూ, బ్యాంక్ సిబ్బంది, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. -
రెట్టింపు డబ్బులు ఇస్తామంటూ మోసం
ప్రొద్దుటూరు క్రైం : రూ.35 లక్షలు ఇస్తే ఆన్లైన్ ద్వారా బ్యాంక్ ఖాతాలో రూ. 50 లక్షలు జమ చేస్తామని మోసగాళ్లు నమ్మించారు. వారి ట్రాప్లో పడిన గంగాప్రసాద్ రూ.35 లక్షలు ఇచ్చాడు. డబ్బు చేతికి అందగానే కత్తితో బెదిరించి మోసగాళ్లు పరారయ్యారు. ఏడాది తర్వాత ప్రొద్దుటూరు పోలీసులు వారి ఆటకట్టించారు. ఈ కేసులోని ఐదుగురు అంతర్రాష్ట్ర మోసగాళ్లను ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 8.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ విభూకృష్ణ మంగళవారం రాత్రి అరెస్ట్ వివరాలను మీడియాకు వెళ్లడించారు. ప్రొద్దుటూరులోని గోకుల్నగర్కు చెందిన చెందిన ఆదిమూలం గంగాప్రసాద్ క్లర్క్గా పని చేస్తున్నాడు. గతేడాది జనవరి 7న కొందరు వ్యక్తులు అతని వద్దకు వచ్చి ఎంత డబ్బు నగదు రూపంలో ఇస్తే అంతకు రెట్టింపు డబ్బును ఆన్లైన్ ద్వారా బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేస్తామని నమ్మించారు. దీంతో ఆశపడిన గంగాప్రసాద్ అందుకు అంగీకరించి రూ. 33 లక్షల నగదును వారికి ఇచ్చాడు. అతను ఇచ్చిన డబ్బును బ్యాగ్లో నింపి ప్రసాద్ ఎదురుగానే వారు ఒక షూట్కేసులో పెట్టుకున్నారు. కొద్ది సేపటి తర్వాత ఆన్లైన్లో డబ్బు పంపడం ఆలస్యం అవుతోందని నీ డబ్బు వాపసు తీసుకో అని చెప్పి మరో బ్యాగ్ను ప్రసాద్కు ఇచ్చారు. అతను ఇంటికి వెళ్లి బ్యాగ్ తెరచి చూసుకోగా అందులో తెల్లకాగితాల బండిళ్లు ఉన్నాయి. దీంతో మోసపోయానని గ్రహించిన ప్రసాద్ టూ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఐదుగురు అంతర్రాష్ట్ర మోసగాళ్లు అరెస్ట్ ఈ క్రమంలో నిందితులను మంగళవారం ప్రొద్దుటూరులోని దానంబట్టి క్రాస్రోడ్డు సమీపంలో టూ టౌన్ సీఐ వంశీనాథ్, ఎస్ఐ రాఘవేంద్రారెడ్డిలు సిబ్బందితో కలసి అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో పులివెందుల మండలంలోని పెద్దరంగాపురం గ్రామానికి చెందిన కొమ్మడ్డి గంగులయ్య, బెంగళూరుకు చెందిన పఠాన్సత్తార్, శ్రీకాకుళం జిల్లా రాజాం గ్రామానికి చెందిన అంకం నాగేశ్, హైదరాబాద్లో ఉంటున్న మల్రెడ్డి గోపాల్రెడ్డి, నెల్లూరు జిల్లా ఆల్లూరు మండలానికి చెందిన తిరుపతి పెంచలయ్యలు ఉన్నారు. వారి వద్ద నుంచి రూ. 8.50 లక్షల నగదుతో పాటు కత్తి, షూట్ కేసును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ ముఠా సభ్యులు రైస్పుల్లింగ్, పవర్కాయిన్స్ లాంటి మోసపూరిత విధానాల ద్వారా అమాయకు ప్రజలను మోసగిస్తునట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆశకు పోయి మోసపోవద్దన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ, ఎస్ఐ, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. రూ. 33 లక్షలతో ఉడాయించిన మోసగాళ్లు ఏడాది తర్వాత పోలీసులకు దొరికిన నిందితులు ఐదుగురు అరెస్ట్, రూ.8.50 లక్షలు స్వాధీనం అరెస్ట్ వివరాలను వెల్లడించిన ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ -
ప్రేమ పెళ్లి చేసుకున్నోడు వదిలేశాడని ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి కట్టుకున్నోడు మోసం చేసి వదిలేశాడు. పుట్టినింటోళ్లు, మెట్టి నింటోళ్లు పట్టించుకోక పోవడంతో.. అద్దె ఇంటిలో ఉంటున్న ఆ యువతి పస్తులతో గడపలేక బతుకు దుర్భరంగా మారింది. దీంతో జీవితంపై విరక్తి చెంది తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. మంగళవారం మదనపల్లెలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి బాధితురాలు తెలిపిన వివరాలు.. మదనపల్లె చంద్రా కాలనీలో ఉంటున్న అములు(20) ఫేస్ బుక్, ఇన్స్టా గ్రామ్ ద్వారా పట్టణంలో ఉండే ఓ స్కూటర్ మెకానిక్ హేమంత్ ప్రేమలో పడింది. ఏడాది కూడా తిరగకనే ఇద్దరూ కుటుంబ సభ్యులకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇన్నాళ్లు ఒక అద్దె ఇంటిలో ఉంటూ జీవనం గడిపారు. ఇంతలోనే ప్రియురాలు పై మోజు తీరిపోవడంతో హేమంత్ పది రోజుల క్రితం ఫోన్ స్విఛ్చాప్ చేసుకుని ఉడాయించాడు. భర్త కోసం ఎదురు చూసి, పస్తులతో ఉండలేక, జరిగిన విషయం అత్త మామలతో పాటు పుట్టినింట్లో చెప్పింది. వాళ్లు అములు ను ఛీదరించుకున్నారు. దీంతో ఆ యువతి చేసేది లేక స్థానిక తాలూక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. వారం రోజులుగా స్టేషన్ చుట్టు తిరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోక పోవడంతో ఆమె తాను తీవ్రంగా మోసపోయానని భావించింది. స్థానికంగా లభించిన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. స్థానికులు గమనించి బాధితురాలిని చికిత్సల కోసం జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ఇప్పటికై నా పోలీసులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది. ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన -
రామసముద్రంలో విషాదఛాయలు
రామసముద్రం : బి.కొత్తకోటలో సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న సుబ్రహ్మణ్యం(36) సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ మేరకు పోస్టుమార్టం అనంతరం మంగళవారం మృతదేహాన్ని స్వగ్రామమైన రామసముద్రంకు తీసుకురావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని చూసిన కుటుంబీకులు, బంధుమిత్రులు బోరున విలపించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అతనికి కన్నీటి వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు నడుమ సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే చిన్నపిల్లలు తమ తండ్రి ఇంక రాడు అనే విషయం తెలియడంతో కన్నీరుమున్నీరయ్యారు. -
బద్వేలులో దొంగల హల్చల్
– ఒకే రోజు మూడు ఇళ్లలో చోరీ బద్వేలు అర్బన్ : బద్వేలు పట్టణంలో దొంగలు మంగళవారం పట్టపగలే ఒకే రోజు మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. పట్టణంలోని చెన్నంపల్లె మిట్టకు చెందిన చిన్నవీరయ్య అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. పని నిమిత్తం ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లగా దుండగులు లోనికి ప్రవేశించి బీరువా పగులకొట్టి 9 తులాల బంగారు ఆభరణాలు, రూ.44 వేలు నగదు, కొన్ని వెండి వస్తువులు అపహరించుకుని పోయారు. అలాగే సురేంద్రనగర్లోని గొడుగునూరు గోపి ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. తన భార్యకు పరీక్ష ఉండటంతో ఇంటికి తాళం వేసి కడపకు వెళ్లి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో పాటు బీరువా పగులకొట్టి ఉంది. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. గోపి ఇంట్లో 6 తులాలు బంగారు ఆభరణాలు, రూ.20 వేలు నగదు, కొంత వెండి సామాగ్రి ఎత్తుకెళ్లారు. అలాగే చెన్నంపల్లె సమీపంలోని తిరుపతమ్మ అనే మహిళ ఇంట్లో కూడా దుండగులు చోరీకి పాల్పడ్డారు. 5 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.3 వేలు నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా సురేంద్రనగర్లోని ప్రైవేటు ఉపాధ్యాయుడు గోపి ఇంట్లో గల సీసీ కెమెరాలో ఇంట్లోకి ఒక వ్యక్తి ప్రవేశిస్తున్నట్లు నమోదు కావడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
లోకానికి వెలుగు చుక్క లూర్దుమాత
కడప సెవెన్రోడ్స్: లోకానికి వెలుగు చుక్క పరిశుద్ధ లూర్దుమాత అని వికార్ జనరల్ ఫాదర్ ఎండీ ప్రసాద్రావు అన్నారు. లూర్దుమాత తిరునాల మహోత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక డాన్ బోస్కో ఐటీఐలో ఉన్న అంతోని చర్చిలో ఫాదర్ ప్రసాద్ రావు దివ్యబలి పూజ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భక్తులందరికీ మేరిమాత మార్గదర్శకంగా ఉందన్నారు. పూర్వం నౌకా యాత్రికులకు మరియమాత సముద్రపు నక్షత్రంలా దారి చూపేదని చెప్పారు. అందుకే ఆమెకు సముద్రపు నక్షత్రమని పేరు కూడా ఉందని చెప్పారు. అనంతరం ఆ పూజలో డయాసిస్ ప్రొక్యురేటర్ ఫాదర్ ఎస్.సురేష్ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. అనంతరం సంధ్య సర్కిల్ వద్ద ఉన్న అంతోని వారి చర్చీ నుంచి భక్తిశ్రద్ధలతో మరియమాత ను నగరంలోని ప్రధాన కూడళ్లు గుండా మరియాపురం పాత చర్చి ఆవరణం వరకు భారీగా ఊరేగిం పు చేశారు.అనంతరం దువ్వూరు విచారణ గురువు సల్లా మనోహర్ ఆధ్వర్యంలో అక్కడున్న ఫాదర్ క్రంబ్లిష్ వేదిక పై యువకులు, పిల్లల చేత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విచారణ గురువు ఈరి లూర్ధు మరియన్న, సహాయ గురువు జంపంగి సుధాకర్,ఫాద ర్ సిప్రియన్,, ఫాదర్ జార్జ్ ,తిరుణాల కమిటీ అధ్యక్షుడు గుంతమళ్ళ బాలయ్య, ప్రధాన కార్యదర్శి వారాది జోసఫ్ ,ఉపాధ్యక్షుడు పి.లూర్ధు ,ట్రెజరర్ నంది మండలం విజయరాజు, పుల్ల గుజ్జు శేఖర్లతోపాటు మహిళలు, యువ కులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
14 నుంచి బ్రహ్మంగారి కల్యాణ మహోత్సవాలు
● 15న గోవిందమాంబ, వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం ● కల్యాణంను నిర్వహించనున్న నూతన మఠాధిపతి దంపతులు బ్రహ్మంగారిమఠం : కాలజ్ఞాన ప్రబోధకర్త శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబల కల్యాణ మహోత్సవాలు మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 14 నుంచి 18 వరకు బ్రహ్మంగారిమఠంలో ఘనంగా ఉత్సవాలను నిర్వహించనున్నారు. నూతన మఠాధిపతి వెంకటాద్రిస్వామి ఆధ్వర్యంలో మఠం మేనేజర్ ఈశ్వరాచారి ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవ కార్యక్రమంలో 14న ఉదయం 6 గంటలకు నామ సంకీర్తన , ఉపనిషత్ పారాయణం, 8 గంటలకు అభిషేకం, 12 గంటలకు వీరమాంబ ఆరాధన, సాయంత్రం 4 గంటలకు హరికథ, రాత్రి 8 గంటలకు కలశోత్సవం, 9 గంటలకు హరికథ, 10 గంటలకు శేషవాహనోత్సవం తదితర పూజలు నిర్వహించనున్నారు. 15వ తేదీ ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం సుప్రభాతం, 12 గంటలకు దీక్షాబంధనాలంకారోత్సవం, 2గంటలకు నామసంకీర్తన , భజనలు, సాయంత్రం 4 గంటలకు హరిప్రియ కర్నూల్ వారిచే సంగీత విభావరి, 4 గంటలకు ఉత్సవం, 6 గంటలకు స్థానిక ఆస్థాన పండితుడిచే ఉపన్యాసం, రాత్రి 9 గంటలకు పెద్దపుత్త గ్రామ ఉభయదాతలుచే గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కల్యాణంను నూతన మఠాధిపతి వెంకటాద్రిస్వామి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. 11 గంటలకు నరనంది ఉత్సవం, 12 గంటలనుంచి జాగారణ ఉంటుంది. 16వ తేదీ సోమవారం ఉదయం నామసంకీర్తనలు, 8 గంటలకు అభిషేకం, 10 గంటలకు మోహినీ అలంకారోత్సవం, 12 గంటలకు భజనలు, రాత్రి 7గంటలకు హరికథ, 8 గంటలకు నంది ఉత్సవం చేపట్టనున్నారు. 17వ తేదీ మంగళవారం ఉదయం పారాయణం, అభిషేకం, 10 గంటలకు నిత్యహోమం, గజోత్సవం, మధ్యాహ్నం 12 గంటలకు మహాప్రసాద వినియోగం, రాత్రి 9 గంటలకు పుష్పరథోత్సవం కనులపండువగా నిర్వహించనున్నారు. 18వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు వసంతోత్సవం, రాత్రి 8 గంటలకు బలిహరణ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
రోడ్డు ప్రమాదంలో కలెక్టర్కు తప్పిన ప్రమాదం
చాపాడు : మైదుకూరు – ప్రొద్దుటూరు జాతీయ రహదారిలో మంగళవారం రాత్రి వైఎస్సార్ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రొద్దుటూరులోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశానికి హాజరైన కలెక్టర్ తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో చాపాడు మీదుగా కడపకు వెళుతుండగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో కలెక్టర్ కారు ముందు వెళుతున్న స్కూటీ, లారీ వాహనాలు ఒక్కసారిగా వేగం తగ్గించాయి. దీంతో కలెక్టర్ కారు సైతం వేగం తగ్గించింది. దీని వెనకాలే వస్తున్న అశోక్ లేలాండ్ వాహనం(ట్రక్కు) కలెక్టర్ కారును వెనుకవైపు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు వెనుకవైపు దెబ్బతింది. కారులో ఉన్న కలెక్టర్కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ విషయం తెలుసుకున్న చాపాడు పోలీసులు సంఘటన స్థలం చేరుకొని అశోక్ లేలాండ్ వాహనాన్ని పోలీస్స్టేషన్కు తరలించారు. ఈయనతోపాటు పలువురు జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. -
లేని కల్తీ సృష్టికర్త చంద్రబాబే
● గత టీడీపీ పాలనలో బోలే బాబా డెయిరీకి అనుమతి ● ఇప్పుడు కల్తీ అంటూ కూటమి నేతల కుట్ర ఆరోపణలు ● కల్తీ లేదని తేలడంతో ఇప్పుడు రసాయనాలని బరితెగింపు ● ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి బి.కొత్తకోట : తిరుమల లడ్డూ ప్రసాదంలో లేని కల్తీని సృష్టించిన సీఎం చంద్రబాబు భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతున్నారని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందని చంద్రబాబు, కూటమి నేతలు ఆరోపిస్తే అలాంటిదేమీ లేదని ల్యాబ్ రిపోర్టులు తేల్చిచెప్పాయన్నారు. దీనితో కూటమినేతల కల్తీ ఆరోపణల్లో పసలేదని తేలడంతో ఇప్పుడు రసాయనాలు కలిపారంటూ ఆరోపించడంతోనే వీరి కుట్రలను భక్తులు, ప్రజలు పసిగట్టారన్నారు. నెయ్యిలో కల్తీ జరిగిందన్న కేసుకు చంద్రబాబు హయాంలో సరఫరా జరిగిన నెయ్యి ట్యాంకర్ల నుంచి తీసుకున్న శాంపిళ్లపై జరిపిన పరీక్షల చుట్టూనే ఈ కేసు సాగుతోందన్న విషయాన్ని అందరూ గుర్తించారన్నారు. కాబట్టి ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబేనన్నారు. 2024 జులై 6న వచ్చిన 2 ట్యాంకర్లు, జులై 12న వచ్చిన మరో 2 ట్యాంకర్ల నెయ్యి నాణ్యతపై టీటీడీ స్థానిక ల్యాబులో పరీక్షలు నిర్వహించి నాణ్యత ప్రమాణాలు పాటించలేదని నిర్దారించి వెనుక్కు పంపేయగా దొడ్డిదారిలో వాటినే తిరిగి టీటీడీకి పంపడం నిజంకాదా అని ప్రశ్నించారు. భోలే బాబా డెయిరీకి అవకాశం కల్పించిన చంద్రబాబు 2019 మార్చి 6న భోలేబాబాకు టెక్నికల్ క్వాలిఫై పర్మిషన్ ఇచ్చారని ఇది నిజం కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. అంటే కల్తీ నెయ్యి వచ్చింది చంద్రబాబు పాలనలోనేకదా దీనికి సమాధానం చెప్పాల్సింది ఆయనే కదా అని నిలదీశారు. ఈ ఆరోపణలపై నిజాలు తేల్చాలంటూ టిటిడి మాజీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా చంద్రబాబు తీరును తప్పుపట్టింది నిజం కాదా అని అన్నారు. కల్తీ ఆరోపణలను సమర్దించుకునేందుకు జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలను పరిశీలించాలన్నారు. 2019 ఏడాది ప్రారంభంలో నెయ్యి టెండర్ల వ్యవహారాన్ని పటిష్టం చేశామని చెప్పుకొచ్చారు. అంటే ఇది అనుమానాలకు తావిచ్చినట్టే కదా, 2014 నుంచి 2019 దాక నెయ్యి టెండర్లుకు కఠినమైన నింబంధనలు లేవనేకదా దానర్థం, దానికి మంత్రే అంగీకరించినట్టు కాదా అని ప్రశ్నించారు. నెయ్యి కిలో రూ. 320లకు లభిస్తుందా అని ప్రశ్నిస్తున్న చంద్రబాబు, తన హయాంలోనే రూ.320, రూ. 321లకే చాలాసార్లు నెయ్యి సరఫరా అయ్యింది నిజం కాదా అని ప్రశ్నించారు. లేని ఆరోపణలు చేసి దాన్ని సమర్దించుకునేందుకు మళ్లీ మళ్లీ తప్పుడు ఆరోపణలతో ప్రజలను, భక్తులను తప్పుదోవ పట్టించడం చంద్రబాబు, కూటమి నేతలు మానుకోవాలని పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి కోరారు. -
పీపీపీ.. వద్దే వద్దు
కడప కార్పొరేషన్: పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్షిప్(పీపీపీ) విధానం వద్దే వద్దంటూ కడప నగరపాలక వర్గం ఏకగ్రీవంగా తీర్మాణించింది. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలోని వీడియోకాన్ఫరెన్స్ హాలులో మేయర్ పాకా సురేష్ కుమార్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి ఈ సమావేశానికి హాజరుకాకపోవడంతో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి సర్వసభ్య సమావేశం సజావుగా సాగింది. ఎజెండాలో మొత్తం 65 అంశాలను పొందుపరచగా, వాటిలో కొన్నింటిని తిరస్కరించారు. నగరంలోని వైఎస్సార్ ఆడిటోరియం, నేక్నామ్ ఖాన్ కళాక్షేత్రం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవన్, పాత మున్సిపల్ కార్యాలయాలను పీపీపీ పద్దతిలో అప్పగించి అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనను నిర్ద్వందంగా తోసిపుచ్చారు. ● 30వ డివిజన్ కార్పొరేటర్ షఫీ మాట్లాడుతూ పీపీపీ అంశాన్ని ఎవరు ఎజెండాలో చేర్చారో చెప్పాలని పట్టుబట్టారు. పీపీపీని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కమిషనర్ మనోజ్రెడ్డి సమాధానమిస్తూ వీటి నుంచి కార్పొరేషన్కు ఆదాయం రావడం లేదని, పైగా అవి పాడుబడిపోతున్నాయని అందుకే చేర్చామని తెలిపారు. ● చిన్నచౌకు గ్రామ పరిధిలో 95 ఎకరాల విస్తీర్ణం గల భూమిలో 20 మెగావాట్ గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పవర్ ప్రాజెక్టును పీపీపీ, రెస్కో మోడల్ ద్వారా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనపై కార్పొరేటర్ చంద్రహాస రెడ్డి మాట్లాడుతూ గతంలో ఒక సోలార్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపామని, దాన్ని తీసివేసి దీన్ని ఎందుకు చేర్చారని ప్రశ్నించారు. పీపీపీ పద్దతిని వ్యతిరేకిస్తున్నానని మరో కార్పొరేటర్ మల్లికార్జున అన్నారు. దీనిపై ఎస్ఈ చెన్నకేశవరెడ్డి సమాధానమిస్తూ గతంలో అమోదం తెలిపిన ప్రాజెక్టు ద్వారా కార్పొరేషన్కు ఒనగూరే ప్రయోజనాలను పొందుపరచలేదని, ప్రస్తుత ప్రాజెక్టు వల్ల ఏడాదికి రూ.29.45లక్షల లీజు, ఉచిత విద్యుత్ సరఫరా ద్వారా ఏడాదికి 90లక్షల యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా లభిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో మేయర్ మట్లాడుతూ దీనిపై ఒక కమిటీ వేసి వారు ఇచ్చే నివేధిక అధారంగా బీఓటీ పద్దతిలో ప్రాజెక్టు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ● నగరంలోని మున్సిపల్ స్థలాలు, ప్రభుత్వ స్థలాలను కాపాడాలని కార్పొరేటర్లు ఎస్ఏ షంషీర్, సుజాత కోరారు. మాచుపల్లి బస్టాండు, ఆర్ట్స్ కాలేజీ, 47వ డివిజన్లోని కొన్ని స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని, కంచె వేసి వాటిని కాపాడాలని కోరారు. ఎర్రముక్కపల్లె వద్ద నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ సుజాత కోరారు. వీఎల్టీ ఉంటేనే ఖాళీ స్థలాలను రిజిస్టర్ చేసేలా రిజిస్ట్రార్కు లేఖ రాయాలని కార్పొటర్ బాలస్వామిరెడ్డి కోరారు. ● రెండో గాంధీ బొమ్మ దగ్గర రోడ్డు విస్తరణ కాకుండా 9 మంది కోర్టును ఆశ్రయించారని, 2023లో రూ.1.20 కోట్లు పరిహారం చెల్లించేందుకు అధికారులు సమ్మతించారు. దాన్ని జనరల్ ఫండ్ నుంచి చెల్లించి రోడ్డు విస్తరణ చేపట్టాలని 31వ డివిజన్ కార్పొరేటర్ అజ్మతుల్లాఖాన్ కోరారు. రెండో గాంధీ బొమ్మ వద్దనేగాక రాజారెడ్డి వీధి, ఎర్రముక్కపల్లె, అప్సర కూడలిలో కూడా విస్తరణ చేసి నష్ట పరిహారం చెల్లించాలని కార్పొరేటర్ మగ్బూల్బాషా సూచించారు. ● ప్లానింగ్ సెక్రటరీలు, ఎల్టీపీలు కుమ్మకై ్క బీపీఎస్ అని గుర్తించిన భవన నిర్మాణ దారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని 9వ డివిజన్ కార్పొరేటర్ గంగాదేవి ఆరోపించారు. ఎవరు చేశారో వివరాలు ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ మనోజ్రెడ్డి సమాధానమిచ్చారు. రంజాన్ మాసంలో తాగునీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా, మసీదుల వద్ద పారిశుద్ద్య కార్యక్రమాలు చేపట్టాలని కార్పొరేటర్లు అరీఫుల్లా బాషా, షఫీ కోరారు. ● డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి మాట్లాడుతూ విశ్వనాథపురం రోడ్డు, మామిళ్లపల్లె మెయిన్ రోడ్లు 60 అడుగులు విస్తరించాలని ప్రతిపాదించారని, 40 అడుగులు చేస్తే సరిపోతుందని తెలిపారు. మాట్లాడుతున్న కార్పొరేటర్ మగ్బూల్బాషా కమిషనర్ మనోజ్రెడ్డి 2024–25 సంవత్సరం సవరించిన బడ్జెట్, 2025–26 బడ్జెట్ అంచనాలను సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. రూ.514.84కోట్లతో రూపొందించిన బడ్జెట్కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. రూ.447.65కోట్లు ఆదాయం, రూ.447.28 కోట్లు ఖర్చుగాను చూపారు. 65 శాతం బడ్జెట్ తగ్గిపోయిందని కార్పొరేటర్ మగ్బూల్బాషా ఆవేదన వ్యక్తం చేశారు. క్యాపిటల్ అకౌంట్లో 15వ ఆర్థిక సంఘం నిధులు, కుడా నిధులు తప్పా మరేవీ రాలేదన్నారు. నగరపాలకవర్గం ఏకగ్రీవ తీర్మాణం కొత్త మాస్టర్ ప్లాన్ తయారీకి ప్రతిపాదన ఆర్థిక సంక్షోభం నుంచి గట్ట్టెక్కేందుకు నిధులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి హాజరు కాని ఎమ్మెల్యే ఆర్.మాధవిరెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిప్రజా సమస్యలపై సమగ్ర చర్చ -
ప్రభుత్వ భూమి ఆక్రమణ.. ముగ్గురికి మెమోలు
రొంపిచెర్ల: అనంతపురం– చైన్నై జాతీయ రహదారిలోని రొంపిచెర్ల మండలం బండకిందపల్లె గ్రామ పంచాయతీలో రూ.3 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. దీనిపై కమోళ్లపల్లె, మట్లోళ్లపల్లె గ్రామస్థులు కలెక్టర్ సుమిత్కుమార్కు ఫిర్యాదు చేశారు. జాతీయ రహదారి పక్కన భూముల ధరలు కోట్లలో పలుకుతున్నాయి. రెవిన్యూ అధికారులు సకాలంలో స్పందించక పోవడంతో అక్రమణ దారులు రెండు మూడు రోజు లుగా సర్వే నెంబరు 36లో సుమారు రూ.75 సెంట్ల భూమిని జేసీబీతో చదును చేసి చుట్టూ ముళ్ల కంచె ఏర్పాటు చేసి మామిడి మొక్కలు కూడా నాటేశారు. 20 రోజుల క్రితం అదే భూమిలో ఎర్రబాబన్న చెరువుకు పోతున్న సప్లయ్ చానల్ను పూడ్చి వేసి క్రితం మామిడి మొక్కలు నాటారని, చెరువుకు నీరు రావడం లేదని కలెక్టర్కు రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆక్రమణదారుడిపై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను అదేశించారు. దీంతో ఇరిగేషన్ ఏఈ మునిశేఖర్ సదరు సప్లయ్ చానల్ను పరిశీలించగా.. ఆ చానల్ ఆనవాళ్లే కనిపించలేదు. సదరు సప్లెయ్ చానల్ను గుర్తించాలని వారు రెవెన్యూ అధికారులను కోరారు లూర్దుమాత ఊరేగింపు ర్యాలీలో విశ్వాసులు భక్తిశ్రద్ధలతో వేడుక -
వ్యక్తి అదృశ్యం
వాల్మీకిపురం : పట్టణంలోని నాయక్వీధికి చెందిన షేక్ మొహద్దీన్ బాషా కుమారుడు షేక్ అన్వర్ బాషా గత నెల రోజులుగా కనిపించడం లేదని భార్య షబానా బేగం తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త గత నెల రోజులుగా ఇంటికి రాలేదని, కనిపించడం లేదని వాపోయింది. తన భర్త ఆచూకి తెలిసిన వారు 98668 10788, 90597 60939కు సమాచారం అందించాలని కోరింది. మిద్దైపెనుంచి పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి మదనపల్లె టౌన్ : మిద్దైపె నుంచి పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన సంఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది. ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు .. నిమ్మనపల్లె మండలం, ముస్టూరు గ్రామం, గౌనిగారిపల్లెకు చెందిన ప్రభాకర్(40), రోజూ మాదిరిగానే మంగళవారం మదనపల్లె మండలంలోని కొత్తపల్లెకు భవన నిర్మాణం పనులు చేయడానికి వచ్చాడు. సహచరులతో కలసి పనులు చేస్తుండగా మిద్దైపె నుంచి ప్రమాద వశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితున్ని వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం అందించే లోపే ప్రభాకర్ మృతి చెందాడు. మృతునికి భార్య పిల్లలు ఉన్నారు. మృత దేహాన్ని ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు మార్చురీలో ఉంచి తాలూక పోలీసులకు సమాచారం అందించడంతో వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో వృద్ధుడికి తీవ్ర గాయాలు మదనపల్లె టౌన్ : తంబళ్లపల్లె మండలంలో ఓ వృద్ధుడు మంగళవారం అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై మదనపల్లె జిల్లా ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తంబళ్లపలె మండలం, కోటకొండ గ్రామం, బిఎస్ఆర్ పల్లికి చెందిన నాగప్ప(80) గత కొంత కాలంగా మంచం పట్టి అనారోగ్యంతో లేవలేనిస్థితిలో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బీడి తాగిన నాగప్ప పొరపాటున మంచంపైనే కాలుతున్న బీడి ముక్కను వదిలేశాడు. దీంతో మంటలు అంటుకుని కాలి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితున్ని చికిత్స నిమిత్తం హుటా హుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వైద్యం అందించి మెరుగైన వైద్యం అవసరం ఉందని తిరుపతికి రెఫర్ చేశారు. ఘటనపపై తంబళ్లపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బేకరి మాస్టర్ ఆత్మహత్యాయత్నం మదనపల్లె టౌన్ : మదనపల్లెలోని ఓ బేకరీలో పనిచేసే యువకుడు ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం వెలుగుచూసిన ఘటనపై బాధితుని కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలు.. పొన్నేటి పాళ్యంకు చెందిన ఆనంద్(25) స్థానిక చిత్తూరు బస్టాండులో కాపురం ఉంటూ సీటీఎం రోడ్డులోని ఓ బేకరి షాపులో మాస్టర్ గా పని చేస్తున్నాడు. భార్య పిల్లలను పోషించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో నెలకొన్న సమస్యలు తాళలేక ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితున్ని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆనంద్ను తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కడప–బెంగుళూరు రైల్వే పనులకు కేంద్రమే నిధులు ఇవ్వాలి
గువ్వలచెరువు సొరంగం నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ కడప సెవెన్రోడ్స్: కడప–బెంగుళూరు రైల్వే మార్గం పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వమే వంద శాతం నిధులను ఇవ్వాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కోరారు. మంగళవారం ఆయన ఈ అంశంపై లోక్సభలో మాట్లాడుతూ 2010లో ఈ రైల్వేలైన్ పనులను రూ. 2700 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారని తెలిపారు. నేటికీ 10 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టు పరిపూర్తికి కేంద్రం 50 శాతం, రాష్ట్రం 50 శాతం నిధులు కేటాయించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తన వాటాగా ఇవ్వాల్సిన 50 శాతం నిధులను కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉందని తెలిపారు. కేంద్రమే వంద శాతం నిధులను విడుదల చేసి రైల్వే లైన్ పనులు వేగవంతంగా పూర్తి చేయా లని కోరారు. ఏపీ విభజన చట్టం 2014 లో హామీ ఇచ్చిన విధంగా కడపలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. పలుమార్లు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి వచ్చినట్లు ఆయన వివరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సీమ ప్రాజెక్టులకు ప్రాణప్రదమైందన్నారు. కేంద్ర బృందం రీ విజిట్ నిర్వహించి ఈ పథకానికి అవసరమైన పర్యావరణ అనుమతులు మంజూరు చేయా లని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాలేదని చెప్పారు. కడప కార్పొరేషన్: కడప– రాయచోటి రహదారిలో గువ్వల చెరువు ఘాట్ వద్ద సొరంగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి 2025 డిసెంబర్ 17న రాసిన లేఖకు కేంద్ర రోడ్డు, రవాణా, హైవేస్ మంత్రి నితిన్ గడ్కరీ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. కడప– రాయచోటి మార్గంలో 4లేన్ల రహదారి, దాని అనుబంధ మార్గాల నిర్మాణానికి సంబంధించి పీఎంసీ సేవలు, డీపీఆర్ తయారీ, నిర్మాణానికి ముందు పనులు, నిర్మాణం, నిర్వహణ పర్యవేక్షణ కోసం రూ.10.95కోట్లు మంజూరు చేశామని మంత్రి పేర్కొన్నారు. సొరంగం నిర్మాణ పనులు 2025–26, 2026–27 వార్షిక ప్రణాళికలో చేర్చామని అందులో వివరించారు. దీని అలైన్మెంట్కు సంబంధించి మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందన్నారు. తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపాలి రాజంపేట: తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానసర్వీసులు నడపాలని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి కోరారు. ఈ అంశంపై పార్లమెంటులో మంగళవారం డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కడప, అన్నమయ్య, నెల్లూరు. చిత్తూరు జిల్లాలకు చెందిన ప్రజల అత్యధిక సంఖ్యలో గల్ఫ్, యూరప్ , పాశ్చాత్య దేశాలకు ఉపాధి పొందుతున్నారన్నారు. తిరు పతి విమానాశ్రయం నుంచి గల్ఫ్, యూరప్, అమెరికా దేశాలకు నేరుగా అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించాలని కేంద్రాన్ని కోరారు. ‘సీమ’ఎత్తిపోతలకు అనుమతులు ఇవ్వాలి కడప స్టీల్ ప్లాంటు నిర్మించాలి కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి లేఖకి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం -
అయ్యో పాపం..
● గుండెపోటుతో తండ్రి మృతి ● అనాథలైన ముగ్గురు పిల్లలు పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని కడప రోడ్డు సమీపంలోని హెచ్పీ గ్యాస్ గోడౌన్ వద్ద మోపూరి రాజా అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం ఉదయం రాజా ఛాతి నొప్పితో బాధపడుతూ గుండె పోటుతో మృతి చెందారని బంధువులు తెలిపారు. మృతుడు రాజా భార్య ఆరేళ్ల క్రితం కరోనాతో మృతి చెందింది. రాజాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా, ప్రస్తుతం వారు అనాథలయ్యారు. దీంతో పిల్లలు అనాథలు కావడంతో అయ్యో పాపమంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గంగమ్మ దేవత హుండీ ఆదాయం రూ. 5,28,846 లక్కిరెడ్డిపల్లి : మండలంలోని అనంతపురం గ్రామంలో వెలసిన శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ దేవత హుండీ ఆదాయాన్ని మంగళవారం కడప దేవాదాయశాఖ తనిఖీ అధికారి శివయ్య ఆధ్వర్యంలో లెక్కించినట్లు ప్రత్యేకాధికారి శ్రీనివాసులు, ఆలయ చైర్మన్ సోడి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. జూన్ 2025 నుండి ఫిబ్రవరి 2026 వరకు ఆలయంలో పర్మినెంటుగా ఉన్న హుండీల ఆదాయం లెక్కింపు చేయగా రూ. 5, 28, 846లు వచ్చినట్లు వారు తెలిపారు. ఈ నగదు మొత్తం ఆలయ ఖాతాకు జమ చేసి ఆలయ అభివృద్ధికి ఉపయోగించనున్నట్లు ఆలయ ప్రత్యేక అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు ఆదిమూలం చంద్ర, గంగయ్య, రెడ్డిశేఖర్, బోస్ యాదవ్, పోలీసులు, ఆలయ కమిటీ నిర్వహకులు, భక్తులు పాల్గొన్నారు. మిట్స్కు జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు కురబలకోట : మద్రాస్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎన్పీటీఈఎల్ సంయుక్తంగా నిర్వ హించిన స్వయం ఆన్లైన్ పరీక్షలలో అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు 7155 మంది ప్రతిభ కనపరిచారని కళాశాల ప్రిన్సిపాల్ రామనాథన్ తెలిపారు.142 మంది గోల్డ్ రేటింగ్, 1419 మందికి సిల్వర్, 3623 మందికి ఎల్తేట్, 312 మంది టాపర్లుగా నిలిచారని తెలిపారు. దీంతో కళాశాలకు త్రిబుల్ ఏ రేటింగ్తో పాటు టాప్ 20లో మిట్స్ కళాశాలకు 11వ ర్యాంకు గుర్తింపు లభించినట్లు తెలిపారు. చైన్నెలో జరిగిన కార్యక్రమంలో షీల్డ్తో పాటు ప్రశంస పత్రాన్ని అందుకున్నటు్ల్ తెలిపారు. -
పుంగనూరు రౌడీ షీటర్ కర్నాటకలో దారుణ హత్య
కర్నాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో పలు కేసుల్లో నేరస్తుడు పుంగనూరు : రౌడీషీటర్, అంత ర్ రాష్ట్ర నేరస్తుడు పుంగనూరు స మీపంలోని కర్నాటక సరిహద్దు హెబ్బిణి గ్రామ పొలాల్లో హత్య కు గురయ్యాడు. ఈ సంఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగు చూసింది. పుంగనూరు మండలం కురప్పల్లెకి చెందిన చిరంజీవి కుమారుడు భాస్కర్(25) అనే వ్యక్తి చిన్నతనం నుంచి పలు నేరాల్లో నిందితుడిగా ఉన్నాడు. పుంగనూరు స్టేషన్లో 6 కేసులు, రామసముద్రం, బెంగళూరు, నంగిలి పోలీస్స్టేషన్లలో 4 కేసులు ఉన్నాయి. స్థానిక పోలీస్స్టేషన్లో ఇతనిపై రౌడీషీటర్ 794 నెంబరుతో షీటు ఓపెన్ చేశారు. ఇలా ఉండగా ఇతని తండ్రి కూడా గతంలో హత్యకు గురయ్యాడు. భాస్కర్ను ఈనెల 8న సాయంత్రం అతని స్నేహితులు ఇంటి నుంచి ద్విచక్రవాహనంలో తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తరువాత ఇంటికి రాలేదు. ఇలా ఉండగా మంగళవారం ఉదయం కర్నాటక హెబ్బిణి పొలాల్లో మృతదేహాం పడి ఉండటాన్ని గ్రామస్తులు కొనుగొని నంగిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. భాస్కర్ను గొంతుకోసి హత్య చేసినట్లు నిర్ధారించారు. కాగా హత్యకు ముందు మద్యం సేవించారని, అక్కడ మద్యం బాటిళ్లు పడిఉండటాన్ని చూసి నిర్ధారించారు. కాగా నిందితుడు పలు నేరాల్లో రౌడీషీటర్గా ఉండటంతో ఆ కేసులకు సంబంధించిన వారు ఎవరైన హత్య చేశారా..? లేక ఆర్థిక లావాదేవీలా, వివాహేతర సంబంధాలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టంకు తరలించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. -
టీడీపీలో పాలకమండలి మంటలు!
● 3 గంటలు ఆలస్యంగా ఎమ్మెల్యే రాక ● వెనుదిరిగిన టీడీపీ, బీజేపీ సీనియర్లుమదనపల్లె : మదనపల్లె యోగభోగేశ్వరస్వామి ఆలయ పాలకమండలి నియామకం మంటలు పుట్టిస్తోంది. ఎమ్మెల్యే వర్గీయులకు ఈ కమిటిలో స్థానం దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, ప్రమాణస్వీకారానికి ఆహ్వనించిన సమయానికి ఎమ్మెల్యే రాకపోవడంతో టీడీపీ, బీజేపీ సీనియర్లు వెనుదిరిగి వెళ్లారు. శనివారం రాత్రి నుంచి సోమవారం దాకా జరిగిన నాటకీయ పరిణామాలు టీడీపీలో చర్చనీయాంశమైంది. ఈనెల ఆరున ఆలయానికి కె.వెంకటరమణ, సి.భవాని, ఎం.నాగరమ్య, డి.మల్లికారాణి, సి.మల్లిక, కే.ప్రకాష్నాయుడు, పి.వరప్రసాద్, ఎస్.లక్ష్మినరసింహ మూర్తి, బి.శివకుమార్లను పాలక మండలి సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఈ ఉత్తర్వు రావడమే ఆలస్యం అన్నట్టుగా ఎమ్మెల్యేకు, పార్టీ వర్గాలకు కనీస సమాచారం ఇవ్వకుండా శనివారం రాత్రే బాధ్యతల స్వీకరించడం, ఆదివారం ఎమ్మెల్యేను కలిసిన కమిటీ సభ్యులు విషయం చెప్పడంతో అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై ఎమ్మెల్యేకు చెప్పకుండా బాధ్యతలు తీసుకోవడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దీంతో సోమవారం ఉదయం 10.30 గంటలకు యోగభోగేశ్వస్వామి ఆలయంలో పాలకమండలి సభ్యులు ప్రమాణస్వీకార కార్యక్రమం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేను ఆహ్వనించారు. ఇలాగే టీడీపీ, బీజేపీ సీనియర్లను ఆహ్వనించారు. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, మరో మాజీ ఎమ్మెల్యే రాటకోండ శోభ భర్త, సీనియర్ టిడిపినేత బాబురెడ్డి, టిడిపి తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు చినబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ఖాన్, బిజెపీ సీనియర్ నేత చల్లపల్లి నరసింహారెడ్డి, యల్లంపల్లి ప్రశాంత్, టిడిపినేతలు రాటకొంట గుర్రప్పనాయుడు, ఎన్సి.నందకుమార్, మల్లికార్జున నాయుడు, పట్టణ, రూరల్ అధ్యక్షులు అరుణ్తేజ్, శ్రీనివాసులు తదితర నేతలు హజరయ్యారు. ఎమ్మెల్యే రాక ఆలస్యం కావడం, కార్యక్రమం ప్రారంభించకపోవడంతో వీరంతా అసహనంతో వెళ్లిపోయారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఎమ్మెల్యే రావడంతో పాలకమండలి సభ్యులు, అధికారులు, సిబ్బందితో ప్రమాణస్వీకార కార్యక్రమం ముగించారు. -
ముగిసిన క్రికెట్ పోటీలు
కమలాపురం: మండలంలోని నల్లలింగాయపల్లెలో వెలసిన భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణంలోని క్రికెట్ మైదానంలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ అట్టహాసంగా ముగిసింది. ఫైనల్ పోరులో కడప వారియర్స్ జట్టు ట్రోఫీని అందుకుంది. గత మూడు రోజులుగా భారతి సిమెంట్స్ క్రీడా మైదానంలో ఆల్ ఓవర్ ఇండియాలోని వైకాట్కు చెందిన 7 టీములు నాకౌట్ మ్యాచ్లు ఆడాయి. చివరి రోజు సోమవారం కడప వారియర్స్, పులి ప్యాకర్స్ జట్లు ఫైనల్లో తల పడ్డాయి. ఇందులో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన పులి ప్యాకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన కడప వారియర్స్ 173 పరుగులు చేసి గెలుపొందింది.. కాగా తమ స్టేడియంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ పండుగలా జరిగిందని ప్లాంట్ హెడ్ రామమూర్తి తెలిపారు. తమ సిబ్బంది ఇంటర్నేషనల్ స్థాయి క్రీడల్లాగా నిర్వహించారని అభినందించారు. -
యువకుడు అనుమానాస్పద మృతి
మదనపల్లె టౌన్ : మదనపల్లె మండలానికి చెందిన ఓ యువకుడు అనుమానస్పదస్థిలో మృతి చెందాడు. డంబెల్తో కొట్టడంతో చనిపోయాడని కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం వెలుగు చూసిన ఘటనపై మృతుడి సోదరి తాలూకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. సీటీఎం గ్రామానికి చెందిన రామకృష్ణ, రమాదేవిల కుమారుడు కిరణ్ కుమార్(25) తల్లి దండ్రులు లేక పోవడంతో అక్క రమాదేవి, మరో అక్క మూగమ్మ దగ్గర ఉంటున్నాడు. కిరణ్ కుమార్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ అక్కకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న సురేష్ కుటుంబలో ఉండే ఆడ పిల్లను కిరణ్ కుమార్ ఏడిపించాడన్న అనుమానంతో మూడు రోజుల క్రితం, సురేష్ అతని స్నేహితులు ఊరి చివరకు తోడుకెళ్లి డంబెల్స్తో దారుణంగా కొట్టారని, దీంతో కిరణ్కుమార్ తలకు బలమైన గాయాలు ఏర్పడి మంచం పట్టినట్లు రమాదేవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. గొంతు కింద చారలు ఉండడంతో గుర్తించి, ప్రశ్నించడంతో టవల్తో గొంతుకు బిగించి సురేష్ , మరికొంత మంది కొట్టి దూరం ఈడ్చుకు పోయి చంపేందుకు ప్రయత్నించారని కిరణ్ తనకు తెలిపినట్లు ఆమె ఆరోపించింది. సురేష్ తన అనుచరులతో కొట్టడం వల్లే తన తమ్ముడు చనిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. -
‘వక్ఫ్’పై పచ్చ కుట్ర
● భూములు అన్యాక్రాంతం చేస్తున్న నేపథ్యంలో తిరుగుబాటు ● భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి ● జేసీ శివనారాయణశర్మకు వినతిసాక్షి అన్నమయ్య : ముస్లిం సమాజ అభివృద్ధికి, పలువురు దాతలు స్వచ్ఛందంగా దానం చేసిన వక్ఫ్భూములను కాజేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అన్నమయ్యజిల్లా వైఎస్సార్ సీపీ మైనారిటీ అధ్యక్షులు బేపారి ఖాదర్ఖాన్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాకు చెందిన ముస్లిం, మైనారిటీ నాయకులతో కలిసి కలెక్టరేట్లో జరుగుతున్న పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వక్ఫ్భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకుముందు పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వస్తూ నినాదాలు చేశారు. కలెక్టరేట్ వద్ద వక్ఫ్ చట్టానికి తూట్లు పొడుస్తున్న చంద్రబాబు సర్కార్ ఇప్పటికై నా కళ్లు తెరవాలని, వక్ఫ్ భూములను రెవెన్యూ పరిధిలోకి తెచ్చి అనుకూలమైన వ్యక్తులకు కట్టబెట్టేందుకు జరుగుతున్నపచ్చకుట్రపై నినదించారు.అనంతరం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఉన్న జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ స్టేట్ మైనారిటీ కార్యదర్శి ఎస్.ఏ.కరీముల్లా, జిల్లా ఉపాధ్యక్షులు రహంతుల్లా, హజ్కమిటీ మాజీ మెంబర్ పుంగనూరు ఖాదర్, రఫీ, మున్సిపల్ వైస్చైర్మన్ నూర్ఆజం, కౌన్సిలర్ బి.ఏ.ఖాజా, పట్టణ మైనారిటీ అధ్యక్షులు యూనస్, నాసిర్, నవాజ్ఖాన్, మహమ్మద్ యాసీన్, సాదిక్, జావిద్, షానవాజ్, నిమ్మనపల్లె నవాజ్ఖాన్, నూర్ మొహియుద్ధీన్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ భూముల అన్యాక్రాంతం తగదు మంగళగిరిలోని అంజుమన్ ఇ ఇస్లామియా సంస్థకు చెందిన 71.57 ఎకరాలు, మల్లారెడ్డిపాలెంలో 232 ఎకరాల వక్ఫ్భూములను ప్రభుత్వం అన్యాయంగా భూసేకరణ చేసి ఏపీఐఐసీకి ఇచ్చేందుకు ప్రయత్నించడం దుర్మార్గం. ఆన్లైన్ రికార్డుల్లో వక్ఫ్భూమిగా ఉండాల్సిన దాన్ని ప్రభుత్వ భూమిగా మార్పు చేయడం దారుణం. వక్ఫ్భూములు ప్రభుత్వ భూములు కావని, వందల కోట్లు విలువ చేసే వాటిని ప్రభుత్వం ఏపీఐఐసీకి కేటాయించడాన్ని ముస్లిం మైనారిటీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వక్ఫ్భూములను అడ్డగోలుగా స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. వైఎస్సార్ సీపీ పాలనలో ముస్లింలు సుభిక్షంగా ఉన్నారని, కూటమిపాలనలో ముస్లిం సమాజంలో అభద్రతా భావం చోటుచేసుకుంది. బేపారి ఖాదర్ఖాన్, జిల్లా వైఎస్సార్ సీపీ మైనారిటీ అధ్యక్షులు, అన్నమయ్య జిల్లా -
ముగ్గరిపై కేసు నమోదు
ములకలచెరువు: వ్యవసాయం చేసుకుంటున్న తండ్రి కొడుకులపై దాయాదులు దాడిచేసిగాయపరిచిన సంఘటనపై పోలీసులు ముగ్గరిపై సోమవారం కేసునమోదు చేశారు. ఎస్ఐ ప్రతాప్ కథనం మేరకు... మండలంలోని పాతముకలచెరువుకు చెందిన రెడ్డెప్ప, సతీష్లపై విజయ్కుమార్, సునీల్, విజలక్ష్మిలు రాళ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచినట్లు చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గరిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. బార్యను మోసం చేసిన కేసులో భర్తకు జైలుశిక్ష సంబేపల్లె : భార్యను మోసం చేసిన కేసులో భర్త వెంకటేశ్వర్లకు కడప నాలుగో అదనపు జిల్లా జడ్జికోర్టు (స్పెషల్ ఎస్సీ,ఎస్టీ కోర్ట్) న్యాయమూర్తి జి.దీనబాబు జైలుశిక్ష విధించినట్లు సంబేపల్లె పోలీసులు తెలిపారు. పోలీసలు వివరాలమేరకు మండల పరిధిలోని దేవపట్ల గ్రామానికి చెందిన డి. రాధను పెళ్లి చేసుకున్న బి. వెంకట్రమణ అమెకు తెలియకుండా అదనపు కట్నం కోసం మరో వివాహం చేసుకొన్నాడు. రాధను వేధిస్తూ, కులంపేరుతో అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నట్లు 2018 జనవరి 6న సంబేపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. -
ఆటో బోల్తా: వ్యక్తి మృతి
మదనపల్లె టౌన్ : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం అర్ధరాత్రి మదనపల్లె మండలంలో జరిగిన ఘటనపై తాలూకా పోలీసులు తెలిపిన వివరాలు.. గుర్రంకొండ మండలం, మర్రిపాడు గ్రామం. మొరవపల్లెకు చెందిన గంగారాజు(48) తన భార్య నాగమణి, కూతుళ్లు దివ్య, దీప, సునీత, తోబుట్టువు జ్యోతి అదే ఊరికి చెందిన సయ్యద్ బాష ఆటోలో సీటీఎంలోని నలవీర గంగా భవాని అమ్మవారిని దర్శించు కోవడానికి వచ్చారు. అక్కడ మొక్కులు చెల్లించుకుని మదనపల్లెకు వచ్చి, తిరిగి స్వగ్రామానికి ఆటోలో బయలుదేరారు. ఆటో కాశీరావు పేట వద్దకు వెళ్లగానే అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయడిన వారిని స్థానికులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స అందిస్తుండగా గంగరాజు మృతిచెందాడు. మిగిలిన వారు ఆస్పత్రిలో చేరి చికిత్సలు పొందుతున్నారు. కేసు దర్యాప్తులో ఉందని సీఐ కళావెంకటరమణ తెలిపారు.కారు ఢీకొని గాయాలుపుంగనూరు : మండలంలోని కృష్ణాపురం గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె నుంచి బోయకొండకు వెళ్తున్న కారు, మదనపల్లె వైపు వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం పై ప్రయాణిస్తున్న గంగిరెడ్డి(40), బాలకృష్ణ(35)లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి క్షతగాత్రులను 108 సహాయంతో ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేపట్టారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మదనపల్లె టౌన్ : కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం పుంగనూరు మండలంలో జరిగింది. మదనపల్లె జిల్లా ఆసుపత్రి ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు.. చౌడేపల్లె మండలం, మర్రిమాకులపల్లె పెద్దూరుకు చెందిన గంగిరెడ్డి(38), బాలకృష్ణ(40)లు సొంత పనిమీద బైకులో మదనపల్లెకు వచ్చారు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా పుంగనూరు మండలం, చండ్రమాకులపల్లె పంచాయతి, కృష్ణాపురం వద్ద బోయకొండ కొండ నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొంది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం వారిని తిరుపతికి రెఫర్ చేశారు. ఘటనపై పుంగనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.బైక్, ఆటో ఢీకొని..సంబేపల్లె : చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి.పోలీసలు వివరాలమేరకు .. చిన్నమండెం మండలం దిగువగొట్టివీడుకు చెందిన అన్నదమ్ములు ప్రభాకర్రెడ్డి, జయపాల్రెడ్డిలు ద్విచక్రవాహనంలో దేవపట్ల నుంచి రాయచోటికి వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఎర్రగుంట్లకు చెందిన సయ్యద్సాబ్ ఆటోలో రాయచోటి నుంచి సొంతగ్రామానికి వెళతుండగా నారాయణరెడ్డిపల్లె జగనన్న ఆర్చీ సమీపంలోకి రాగానే బైక్ –ఆటో ఢీకొన్నాయి. క్షతగాత్రులను 108 సహాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.నియామకంకడప ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆదిరెడ్డి శ్యాంసుందరరెడ్డిని 7,8 తేదీలలో విజయవాడ లో జరిగిన ఏపీటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు ఖాదర్బాషా, శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
నీకు.. బిడ్డలకు నరకాన్ని ఇచ్చి వెళ్లిపోతున్నా!
● బర్త్డే కేక్ తేస్తానని కూతురు పుట్టినరోజు నాడే ఆత్మహత్య ● బి.కొత్తకోటలో వెల్ఫేర్ అసిస్టెంట్ ఉదంతంబి.కొత్తకోట : ఆఫీసుకు వెళ్తున్నా.. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు బిడ్డ పుట్టినరోజుకు బర్త్డే కేక్ తీసుకొస్తానని చెప్పిన భర్త కానరాని లోకానికి వెళ్లిపోయాడు. నా పుట్టినరోజుకు కేక్ తీసుకొస్తాడని వెళ్లిన నాన్న ఇంకెప్పటికి కేక్ తీసుకురాలేడని ఆ బిడ్డకు, సాయంత్రం తిరిగి వస్తానని చెప్పిన వెళ్లిన భర్త ఇక ఎన్ని సాయంత్రాలు గడిచినా ఆ మాటలు ఇక వినిపించవని తెలిసి ఆ కుటుబం కుప్పకూలిపోయింది. నీకు..బిడ్డలకు నరకాన్ని ఇచ్చి వెళ్లిపోతున్నా అని భార్యకు మెసేజ్ పెట్టి ఆత్మహత్యకు పాల్బడిన భర్త గురించి గంటల వ్యవధిలో మరణవార్త వినడం ఆ కుటుంబాన్ని కలచివేసింది. అభంశుభం తెలియని ఇద్దరు ఆడపిల్లలు, భార్య తనపై ఆధారపడి ఉన్నారన్న విషయం తెలిసినా, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడిన సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ బి.సుబ్రమణ్యం (36) ఉదంతం ఆవేదనకు గురి చేస్తోంది. సోమవారం ఉదయం బి.కొత్తకోటలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు వివరాలు. రామసముద్రానికి చెందిన బి.సుబ్రమణ్యం సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. గతేడాది జూలైలో బి.కొత్తకోట నగర పంచాయతీ తాకాటంవారిపల్లె సచివాలయానికి బదిలీ అవ్వగా స్థానిక బైపాస్రోడ్డులో కుటుంబంతో నివాసం ఉంటూ విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య సౌమ్య, ఐశ్వర్య (4), హైందవి (2) సంతానం. తల్లి నీలమ్మ ఉండగా తండ్రి రత్నప్ప మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ఆదివారం సెలవు కావడంతో సుబ్రమణ్యం కుటుంబంతో కలిసి బి.కొత్తకోట సమీపంలోని కర్ణాటకకు చెందిన నాగిరెడ్డిపల్లెలోని అత్తారింటికి వెళ్లాడు. రాత్రి అక్కడే ఉండగా సోమవారం ఉదయం ఏడు గంటలకు ఆఫీసుకు బి.కొత్తకోట వెళ్తున్నానని, కుమార్తె ఐశ్వర్య జన్మదినం కావడంతో సాయంత్రం వచ్చేటప్పుడు కేక్ తీసుకొస్తానంటూ చెప్పి ఉదయం ఏడు గంటలకు నాగిరెడ్డిపల్లె నుంచి బి.కొత్తకోటకు బయలుదేరాడు. ఇంటికి చేరుకున్న తర్వాత 7.50 గంటలకు రామసముద్రంలో ఉంటున్న తల్లి నీలమ్మతో ఫోన్లో మాట్లాడాడు. ఈరోజు బిడ్డ ఐశ్వర్య పుట్టినరోజని, కేక్ తీసుకోవాలని చెబుతూనే ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయని భారంగా మాట్లాడాడు. డబ్బులు లేవని, ఇబ్బందులు పడుతున్నట్టుగా చెప్పుకున్నాడు. ఈ మాటలకు ఆందోళనకు గురైన నీలమ్మ విషయాన్ని కోడలు సౌమ్యకు చెప్పడంతో 8 గంటలకు సౌమ్య, నీలమ్మ, కుటుంబీకులు ఫోన్లో మాట్లాడేందుకు కాల్ చేసినా తీయలేదు. ఆత్మహత్యకు సిద్ధం కావడంతో అంతకుముందు భార్య సౌమ్య ఫోన్కు.. నీకు, బిడ్డలకి నరకాన్ని ఇచ్చి నేను వెళ్లిపోతున్నాను.. క్షమించండి అంటూ మెసేజ్ టైప్ చేశాడు కాని సెండ్ చేయలేదు. ఆ తర్వాత ఇంటిలోనే శ్లాబుకు ఉన్న కొక్కీకి వేసిన చీర, తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం 8–9.15 గంటల మధ్య ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. సుబ్రమణ్యం ఆత్మహత్యకు పాల్బడిన విషయాన్ని స్థానికులు గుర్తించి ఇంటి యజమానికి, పొరుగు వాళ్లకు చెప్పడంతో వారు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ కరీముల్లా సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారించారు. తల్లి నీలమ్మ ఫిర్యాదు మేరకు.. సుబ్రమణ్యం అర్థిక ఇబ్బందులతో ఉన్నాడని, ఇప్పటికే పలుమార్లు ఆర్థికంగా సహయ పడ్డామని, మళ్లీ ఆర్థిక సమస్యలతో తమతో చెప్పుకోలేని ఆత్మహత్యకు పాల్బడినట్టు పేర్కొనడంతో కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.ఆత్మహత్యకు పాల్బడిన సుబ్రమణ్యమొబైల్లో పెట్టిన మెసేజ్ -
ప్రాణం తీసిన ఈత సరదా
మదనపల్లె టౌన్ : ఈత సరదా ఓ పసివాడి ప్రాణాన్ని బలితీసుకుంది. తల్లి దండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది. క్వారీ గుంతలో గల్లంతై ప్రాణాలు విడచిన విద్యార్థి మృతికి సంబంధించి మదనపల్లె తాలూక పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని అప్పారావు తోటకు చెందిన లప్సర్బాషాకొడుకు అసన్ (14) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం స్నేహితులు ఏడుగురితో కలసి పోతపోలు గ్రామం, టిడ్కో ఇళ్లకు సమీపంలో ఉన్న జబ్బల క్వారీలోని నీళ్లలోకి వెళ్లారు. అంతకు ముందు స్విమ్మింగ్పూల్ తలపించేలా నీళ్లు జబ్బల క్వారీలో ఉన్నట్లు ఓ వ్యక్తి సోషల్ మీడియలో పెట్టిన పోస్టుకు ఆకర్షితులై వీరంతా వెళ్లారని సమాచారం. వారిలో ముగ్గరు స్నేహితులు ఇంటికి వచ్చేయగా, మరో నలుగురు క్వారీ గుంతలో ఈత కొడుతుండగా అనస్ గల్లంతయ్యాడు. స్నేహితులు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. చీకటి పడటంతో సోమవారం ఉదయం అగ్ని మాపక అధికారి శివప్ప తన సిబ్బందితో వెళ్లి క్వారీ వద్దకు వెళ్లి నీటి గుంతలో వెతికి అనస్ మృతదేహం వెలికితీశారు. బాగా చదివి తల్లి దండ్రులను ఆదుకుంటాడనుకున్న కొడుకు చనిపోవడంతో తల్లి దండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. పిల్లలు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మి ఈతకు వెళ్లరాదని సీఐ కళా వెంకటరమణ తెలిపారు. కేసు నమోదు అనంతరం దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.క్వారీ గుంతలో గల్లంతై ప్రాణాలు విడిచిన విద్యార్థి -
వక్ఫ్భూమిలో ఈ నిర్మాణాలు ఎవరివి?
సాక్షి టాస్క్ఫోర్స్ : మదనపల్లె పట్టణంలోని వక్ఫ్భూమిలో జరుగుతున్న నిర్మాణాలపై ముస్లిం వర్గాల్లో చర్చ సాగుతోంది. టిప్పు సుల్తాన్ మైదానంలో తూర్పున నివాస ప్రాంతాలున్న చోట యంత్రాలతో పనులు చేస్తున్నారు. కోట్ల విలువైన ఈ భూమిలో జరుగుతున్న నిర్మాణాలపై ముస్లింలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ వక్ఫ్భూమిలో చేస్తోంది ప్రభుత్వ నిర్మాణాలా లేక ప్రైవేట్ నిర్మాణాలా?. ప్రభుత్వ నిర్మాణాలైతే అధికారులు ఎవరైనా అనుమతి ఇచ్చారా, ప్రైవేట్ నిర్మాణాలైతే వక్ఫ్బోర్డు అధికారులు అనుమతి ఇచ్చారా అని ముస్లిం వర్గాలు చర్చించుకొంటున్నాయి. అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహరంపై వక్ఫ్బోర్డు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ముస్లీం వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఇకపై చిన్నక్రేట్లలో టమాట విక్రయాలు
మదనపల్లె : మార్చి నుంచి జిల్లాలోని అన్ని మార్కెట్యార్డుల్లో టమాట విక్రయాలు 15కిలో చిన్న క్రేట్ల ద్వారానే జరగాలని మార్కెటింగ్శాఖ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు స్పష్టం చేశారు. దీన్ని ఉల్లంఘించి క్రయ విక్రయాలు సాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం స్థానిక మార్కెట్యార్డు కార్యాలయంలో మదనపల్లె, ములకలచెరువు, వాల్మీకిపురం మార్కెట్ చైర్మన్లు, కార్యదర్శులు, మండీల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములకలచెరువు, మదనపల్లె, అంగళ్లు, వాయల్పాడు, గుర్రంకొండ టమాట మార్కెట్లలో చిన్న క్రేట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మార్కెట్లో టమాటాలు విక్రయాలు చేసే రైతులకు ఏరోజు విక్రయాలకు ఆరోజే నగదు చెల్లింపు చేయాలని ఆదేశించారు. మార్కెట్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మండి యజమానులు, వ్యాపారస్తుల సమస్యలు, అందించాల్సిన సహకారంపై మదనపల్లె చైర్మన్ జంగాల శివరామ్ జేడీ దృష్టికి తెచ్చారు. వాల్మీకిపురం చైర్మన్ కోసూరు చంద్రశేఖర్, మార్కెట్ కార్యదర్శులు జగదీష్, ఎన్.నవీన్ కుమార్, ఎం.మదన్ మోహన్ రెడ్డి, వాయల్పాడు కార్యదర్శి సునీల్ పాల్గొన్నారు. మార్కెటింగ్ ఆర్జేడీ రామాంజనేయులు -
ఉలవసాగుతో నష్టపోయాం
ఈఏడాది ఉలవ పంటసాగు చేసి భారీగా నష్టపోయాం. నేను రెండు ఎకరాల్లో ఉలవపంట సాగు చేశాను. వర్షాలు, వాతావరణం మార్పుల కారణంగా సాగుకు ఖర్చు చేసిన పెట్టుబడి కుడా ఈ ఎడాది రాలేదు. నాలుగునెలల పాటు పడిన కష్టం నేలపాలైంది.గత ఏడాదితో పోల్చితే 35శాతం దిగుబడి తక్కువగా వచ్చింది. ధరలు సగానికి పడిపోయాయి. – నరసింహులు, ఉలవరైతు, పాతకోటపల్లె, ఈసంవత్సరం సాగు చేసి న ఉలవపంట సరిగ్గా పండలేదు. వర్షాలకు సక్రమంగా కురవక వాతావరణం సరిగ్గా లేకపోవడంతో దిగుబడి తగ్గిపోయింది. ప్రస్తు తం పంటకోతలు చేపట్టినా ఎకరానికి ఒక క్వింటా దిగుబడి కూడా వచ్చే పరిస్థితిలేదు. కూలీల ఖర్చు లెక్కిస్తే ఇంకా చేతి నుంచి అదనంగా డబ్బులు భరించాల్సి వస్తోంది. దీంతో దిక్కుతోచక పండిన పంటను పశుగ్రాసంగా పొలాలపైనే వదిలేశాను. – రమణ, ఉలవరైతు, గంగిరెడ్డిపల్లె -
అ పరిష్కారవేదిక
● సమస్యలతో పదేపదే కలెక్టరేట్కు వస్తున్న బాధితులు ● ఎన్నిమార్లు తిరిగినా కనిపించని ప్రయోజనం సాక్షి అన్నమయ్య : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలోని కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తమ బాధతలను చెప్పుకునేందుకు పరుగులు పెడుతూ వస్తున్నారు. అనేక రకాల సమస్యలతో సతమతమవుతూ ఉన్నతాధికారులకు విన్నవించుకుంటే తీరుతాయని ఆశతో వస్తున్నారు. ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తున్నా కిందిస్థాయిలో పెద్దగా పట్టించుకోక పోవడంతో వచ్చిన వారే పదేపదే వస్తున్నారు. చంద్రబాబు సర్కార్ ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తోంది. అయితే, సమస్యలు పరిష్కారం కాకుండా వచ్చిన వారే మళ్లీ వస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. భారీగా దరఖాస్తుదారులు మదనపల్లె జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని అధికారులు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.పెద్ద ఎత్తున బాధిత ప్రజలు వస్తున్నా చిన్నపాటి సమస్యలకు కూడా పరిష్కారం లభించడం లేదు. ఎక్కువగా భూములకు సంబంధించిన సమస్యలు, నూతన పెన్షన్లు, రేషన్కార్డులు, ఇంటి స్థలాల ఆక్రమణ తదితర అంశాలపై ఎక్కువ మంది వస్తున్నారు. మదనపల్లెలోని కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి వారం 200–300 మంది వస్తున్నారు. సమస్యలు పరిష్కారం కాకుండా వచ్చినవారే మళ్లీమళ్లీ వస్తున్ననేపధ్యంలో అధికారులు పునరాలోచన చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. రేషన్ కార్డు పునరుద్ధరించాలి తన రేషన్ కార్డు 2023 సంవత్సరంలో రద్దు కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. పేద వర్గానికి చెందిన తమ కుటుంబం కార్డు కోల్పొవడంతో ఉచిత బియ్యం పొందలేక పోతున్నాం. అలాగే రేషన్ కార్డు లేకపోవడం వల్ల పింఛన్కు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. నూతన రేషన్ కార్డు మంజూరు చేయడంతో పాటు పింఛన్ మంజూరు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలి. – తలారి రెడ్డెమ్మ, వృద్దురాలు, పూజారివారిపల్లె, కురబలకోట మండలం భూమి విషయంగా తగిన న్యాయం చేయాలి తనకు చెందిన సర్వేనెంబర్ 1458 లో 1.75 విస్తీర్ణం గల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగించేవాడిని. ప్రభుత్వం చేపట్టిన రీసర్వే ప్రక్రియలో తాను సాగు చేస్తున్న భూమి తనదికాదని వీఆర్ఓ, మండల సర్వేయర్ తెలిపారు. ఈ నేపథ్యంలో, సంబంధిత రికార్డులను పరిశీలించి, వీఆర్ఓ లేదా సర్వేయర్ సమక్షంలో మళ్లీ రీసర్వే నిర్వహించి తనకు చెందిన వాస్తవ భూమిని చూపించాలని కోరుతున్నాను. – వై.నరసింహులు నాయుడు, ఎర్రమద్దువారిపల్లె, కురబలకోట మండలం ఆక్రమణలపై అధికారుల నిర్లక్ష్యం మదనపల్లె మండలం కోళ్లబైలు గ్రామంలో ప్రభుత్వభూముల ఆక్రమణ లపై రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కోళ్లబైలు సర్వే నంబర్.672–1లో ప్రభుత్వభూమి ఆక్రమణలు గుర్తించి నోటీసులు జారీచేసి నెలలు గడుస్తున్నా తొలగించేందుకు చర్యలు తీసుకోలేదు. హైవే పక్కన కోట్ల విలువచేసే ప్రభుత్వభూమి ఆక్రమణపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో కబ్జాదారులు వేరొకరికి విక్రయించి సొమ్ములు చేసుకుంటున్నారన్నారు. కొనుగోలు చేసిన పేదలు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. – పునీత్కుమార్, బహుజన యువసేన నాయకులు -
ఉలవ..వెలవిల !
ఉలవ పంటైనా గట్టెక్కిస్తుందని గంపెడాశలు పెట్టుకొన్న రైతులకు నిరాశే మిగిలింది. అసలే దిగుబడి రాక.. ఆపై ఉలవకు ‘వెల’ లేక.. నష్టాలే పలకరించడంతో రైతన్న కంట కన్నీరే మిగిలింది. చివరికి పంట పశుగ్రాసంగా మారింది. గుర్రంకొండ : ఈ ఏడాది ఉలవ సాగు చేసిన రైతులకు నష్టాలే మిగిలాయి. జిల్లాలో వేరుశనగ సాగు అదును దాటిపోయిన తరువాత ప్రత్యామ్నాయ పంటగా ఇక్కడి రైతులు ఉలవసాగును ఎంచుకుంటారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పాటు విభిన్న వాతావరణ పరిస్థితులు కారణంగా ఉలవ పంట ఎకరానికి రెండుక్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో ధర రూ.32వరకు పలుకుతోంది. దీంతో జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది రూ. 5.60 కోట్ల మేరకు రైతులు ఉలవసాగుతో నష్టపోయారు. గత రెండేళ్లుగా మార్కెట్లో ఇవే ధరలు పలుకుతుండడంతో రైతులకు కనీసం సాగు ఖర్చు కూడా మిగలకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పలువురు రైతులు తమ పొలాల్లో సాగు చేసిన పంటను కోయకుండా అలాగే వదిలేసి పశుగ్రాసంగా వినియోగించుకోవడం గమనార్హం. జిల్లాలో 8650 ఎకరాల్లో సాగు జిల్లాలో ఈ ఏడాది 8650 ఎకరాల్లో ఉలవపంటను సాగు చేశారు. సాధారణంగా వేరుశనగ పంట సాగు అదును దాటిపోయినాక ఉలవసాగుపై దృష్టిసారిస్తా రు. సెప్టెంబర్, అక్టోబర్నెలలో ఉలవపంట సాగు ప్రారంభమవుతుంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పంట నూర్పిళ్లు ఉంటాయి. సాధారణంగా సాగు ప్రారంభమైన తరువాత రెండు నెలల పాటు సక్రమంగా వర్షాలు కురిస్తే ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల ఉలవ దిగుబడి వస్తుంది. మార్కెట్లో మంచి ధరలు ఉంటే రైతు సాగుకు ఖర్చుచేసిన పెట్టుబడి పోను మంచి లాభాలు వస్తాయి. ఈఏడాది 35 శాతానికి పడిపోయిన దిగుబడి జిల్లాలో ఉలవ పంట సాగు గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 35శాతం పంట దిగుబడి మాత్రమే వచ్చింది. గత ఎడాది సగటున ఎకరానికి రెండున్నర క్వింటాళ్ల పంట దిగుబడి వచ్చింది. అయితే ఈ ఎడాది విభిన్న వాతావరణ పరిస్థితులు, అదనుదాటి కురిసిన వర్షాల కారణంగా సగటున ఎకరానికి రెండు క్వింటాళ్ల పంట దిగుబడి మాత్రమే వచ్చింది. కాగా వచ్చిన పంట దిగుబడిలో గింజల బరువుశాతం భారీగా తగ్గిపోయి తేలిపోయింది. దీనికితోడు ధర కూడా పాతాళానికి పడిపోయింది. రెండేళ్ల క్రితం మార్కెట్లో ఉలవ ధర రూ.57నుంచి రూ.60 వరకు పలికాయి. ఈ ఏడాది రూ. 32కి పడిపోవడంతో ఎకరానికి రూ. 6500 చొప్పున రైతులు నష్టపోయారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 8650 ఎకరాల్లో పంటసాగు చేపట్టిన రైతులు రూ. 5.62 కోట్ల మేరకు నష్టపోయారు. వ్యాపారులకు సైతం నష్టాలే.. రెండేళ్ల క్రితం ఉలవలు వ్యాపారులకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో కొంతమంది వ్యాపారులు భారీఎత్తున కొనుగొలు చేసి కోల్డ్స్టోరేజీల్లో నిల్వ ఉంచారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో ఒక్క ఏడాది కూడా మన రాష్ట్రంలో కోల్డ్స్టోరేజిల్లో వ్యాపారులు నిల్వ ఉంచిన ఉలవలను కొనుగో లు చేయలేదు. కర్ణాటకలో తక్కువ ధరకు కొనుగోలు చేసి మన రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీపై పంపిణీ చేసింది.ప్రస్తుతం మార్కెట్లో ఉలవ ధర రూ.32మాత్రమే ఉంది. దీంతో కోల్డ్స్టోరేజిల్లో స్టాకు ఉంచుకొన్న వ్యాపారులు ఉలవలను ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దిగుబడి రాక.. ధర లేక ఈఏడాది నష్టాలు మిగిల్చిన ఉలవసాగు! జిల్లాలో 8650 ఎకరాల్లో సాగైనపంట రూ.5.62 కోట్ల మేర రైతులకు పంటనష్టం -
●భూపేష్ బాధ్యతలు చేపట్టిన వెంటనే...
సాక్షి ప్రతినిధి, కడప : కూటమి పాలన ‘కమ్మ’గా సాగుతోందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కావాలనే ఈ వ్యాఖ్యలు చేశారా... ఇంటా బయట పెరిగిన రాజకీయ ముప్పే అందుకు కారణమా అంటే... ‘అవును’ అనే విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఓ వైపు అనకాపల్లి ఎంపీ రమేష్నాయుడు జమ్మలమడుగులో పైచేయి సాధించడం, మరోవైపు పక్కలో బల్లెంలాగా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా భూపేష్రెడ్డి నియామకం .. ఈ రెండు ప్రధాన కారణాలుగా చెప్పుకొస్తున్నారు. భవిష్యత్లో రాజకీయ ఉనికి ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదం ఉండడంతోనే వాంటెడ్ అటాక్కు సిద్ధమయ్యారని రాజకీయ పండితులు చెబుతున్నారు. తిరుపతిలో బీజేపీ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పక్కనే ఉండగా, కేవలం ‘కమ్మ’ వారికి ప్రయోజనం కలిగేలా కూటమి పాలన సాగుతోందని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. ఎందుకిలా కఠినంగా, కుల కోణంలో మాట్లాడారనే విషయమై ఎన్డీయే కూటమిలో అంతర్గతంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అందుకు అనేక కారణాలు లేకపోలేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ‘నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా’ అన్నట్లుగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీరు కన్పిస్తోందని వివరిస్తున్నారు. ఎమ్మెల్యే ఆది సొంత నియోజకవర్గమైన జమ్మలమడుగులో అనకాపల్లి ఎంపీ రమేష్నాయుడు కాంట్రాక్టు పనులతో పై చేయి సాధించారు. మరోవైపు సోదరుడు కుమారుడు భూపేష్రెడ్డికి టీడీపీలో అత్యంత ప్రాధాన్యత దక్కింది. ఇది జీర్ణించుకోలేకే ఆది ఇలా మాట్లాడుతున్నారని పలువురు చెప్పుకొస్తున్నారు. బీజేపీ, టీడీపీలో సీఎం రమేష్ హవా... బీజేపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్నాయుడు స్వగ్రామం పోట్లదుర్తి. తన పరపతితో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదానీ హైడెల్ ప్రాజెక్టు పనులు చేజేక్కించుకున్నారు. ఆ పనుల్లో వాటా కోసం ఎమ్మెల్యే ఆది పెద్ద ఎత్తున రచ్చ చేశారు. ఏకంగా తన అనుచరులు వెళ్లి రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. అయినప్పటికీ పనుల్లో ఎలాంటి వాటాలు దక్కలేదు. అటు బీజేపీలోనూ ఇటు టీడీపీలో ఎంపీ రమేష్నాయుడు హవా కన్పిస్తోంది. మరోవైపు సోలార్ పనులు ఎర్త్వర్క్ పనులు కూడా ఎమ్మెల్యేగా ఆదినారాయణరెడ్డి చొరవ నామమాత్రమే అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ‘అత్తమీద కోపం దుత్త మీద చూపినట్లు’గా పలువురు చెప్పుకొస్తున్నారు. ఎమ్మెల్యే ఆది వ్యాఖ్యలు ప్రభుత్వ పెద్దలకు ఓ హెచ్చరిక సంకేతమని ఆయన వర్గీయులు అంటున్నారు. ప్రభుత్వ పెద్దలు తెలుసుకుని సీఎం రమేష్ను కట్టడి చేయకపోతే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నేరుగా హెచ్చరికలు చేస్టున్నట్లు తెలుస్తోంది. జమ్మలమడుగు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ చేజారడం.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు... వెరసి చదిపిరాళ్ల భూపేష్రెడ్డికి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. ఈనెల 7న జిల్లా అధ్యక్షుడిగా భూపేష్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరుసటి రోజే అంటే 8వ తేదిన తిరుపతిలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సీఎం చంద్రబాబు సర్కార్ను టార్గెట్ చేశారు. జమ్మలమడుగులో ఇదివరకే దేవగుడి కుటుంబం నుంచి ఆదినారాయణరెడ్డికి ప్రత్యామ్నాయంగా భూపేష్రెడ్డి రాజకీయంగా నిలదొక్కుకున్నారు. చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థిగా ఆది తెరపైకి వచ్చి అవకాశాన్ని తన్నుకుపోయారు. కాగా, ఇటీవల తన కుమారుడు సుధీర్రెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల్లో తీసుకొస్తానంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రకటించారు. అంతలోనే టీడీపీ అధ్యక్షుడు భూపేష్రెడ్డిని బలోపేతం చేయాలనే ఎత్తుగడ ఆ పార్టీ అధిష్టానం అవలంబించడం ఎమ్మెల్యే గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యిందని పరిశీలకులు భావిస్తున్నారు. ‘ఆది’ వ్యాఖ్యలు ఎంతవరకెళ్లి అంతమవుతాయో వేచి చూడాలి. -
ఉచిత విద్యకు దరఖాస్తు చేసుకోండి
మదనపల్లె సిటీ : విద్యా హక్కు చట్టం–2009 ఉచిత నిర్భంద హక్కు చట్టం ప్రకారం 2026–27 విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్ర మణ్యం తెలిపారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న, బలహీన వర్గాల పిల్లలకు సమీప ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థుల జాబితా వివరాలను సంబంధిత పాఠశాలల్లో చూసుకోవచ్చునని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ సచివాలయం, మండల వనరుల కేంద్రం, సంబంధిత పాఠశాలల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు ఎంఈఓలను సంప్రదించాలని సూచించారు. ఇద్దరు సచివాలయ ఉద్యోగుల సస్పెన్షన్ పెద్దతిప్పసముద్రం : విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్న ఇద్దరు సచివాలయ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఈ నెల 5న ఆయా శాఖల మండల స్థాయి అధికారులకు కలెక్టర్ నిశాంత్కుమార్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కమ్మచెరువు సచివాలయ పరిధిలో ఎనర్జీ అసిస్టెంట్గా పని చేస్తున్న శ్రీనివాసులు, మల్లెల సచివాలయ పరిధిలో వెటర్నరీ అసిస్టెంట్గా పని చేస్తున్న జ్నానప్రకాష్ ప్రభుత్వం అప్పగించిన వివిధ సర్వే బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం, విధుల్లో అలసత్వం వహించడంతో కలెక్టర్ వారిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. సీఐల బదిలీ మదనపల్లె టౌన్ : జిల్లాలో తొమ్మిది మంది సీఐలను బదిలీ చేస్తూ కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా మదనపల్లె వన్ టౌన్ సీఐ మహ్మద్ రఫీ టూటౌన్కు, టూ టౌన్ సీఐ వన్ టౌన్కు బదిలీ అయ్యారు. అలాగే జిల్లాలో మరికొంత మందికి బదిలీ ఉత్తర్వులు అందాయి. వెనుకబడిన విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ ప్రోగ్రాం – డీఈఓ సుబ్రహ్మణ్యం మదనపల్లె సిటీ : పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక మోతీనగర్ వద్దనున్న గిరిజన గురుకుల విద్యాలయంలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో భాగంగా జిల్లాలో 182 మంది విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పని చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆయన వెంట ఎంఈఓ రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. రిమ్స్ పీజీ విద్యార్థుల ప్రతిభ – ప్రిన్సిపల్ డాక్టర్ టి.జమున అభినందనలు కడప : కడప ప్రభుత్వ వైద్య కళాశాల(రిమ్స్ )జనరల్ సర్జరీ విభాగ పీజీ విద్యార్థులు జాతీయస్థాయి సదస్సు ప్రతిభ కనబరిచారు. జాతీయస్థాయి–85 వ జనరల్ సర్జరీ విజ్ఞాన సదస్సు డిసెంబర్ 17, 18,19 తేదీలలో కలకత్తాలో నిర్వహించారు. ఈ సదస్సులో రిమ్స్ జనరల్ సర్జరీ పీజీ విద్యార్థులు పోస్టర్ విభాగంలో డాక్టర్ వంశీ కళ్యాణ్ మొదటి స్థానం, డాక్టర్ సత్యబ్రత్ పాణిగ్రహి, డాక్టర్ ఉపేంద్ర రెడ్డి ద్వితీయ స్థానం, డాక్టర్ వైష్ణవి మూడో స్థానం సాధించారు. వీరిని సోమవారం ప్రిన్సిపాల్ డాక్టర్ టి జమున ప్రత్యేకంగా అభినందించారు. వీరిని గైడ్ చేసిన జనరల్ సర్జరీ హెచ్ ఓ డి డాక్టర్ వినయ్, ఫ్యాకల్టీలందరినీ అభినందించారు. విద్యార్థుల డేటా మార్పునకు మరో అవకాశం కడప ఎడ్యుకేషన్ : ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల డేటాలో కొన్ని మార్పులకు యూడైస్ ప్లస్ పోర్టల్లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చారని వైఎస్సార్ జిల్లా డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. -
నీకు, బిడ్డలకు నరకాన్ని ఇచ్చి వెళ్లిపోతున్నా!
బి.కొత్తకోట(అన్నమయ్య జిల్లా): ఆఫీసుకు వెళ్తున్నా సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు బిడ్డ పుట్టినరోజుకు బర్త్డే కేక్ తీసుకొస్తానని అని చెప్పిన భర్త కానరాని లోకానికి వెళ్లిపోయాడు. నా పుట్టినరోజుకు కేక్ తీసుకొస్తాడని వెళ్లిన నాన్న ఇంకెప్పటికి కేక్ తీసుకురాలేడని ఆ బిడ్డకు, సాయంత్రం తిరిగి వస్తానని చెప్పిన వెళ్లిన భర్త ఇక ఎన్ని సాయంత్రాలు గడచినా ఆ మాటలు ఇక వినబడవని తెలిసి ఆ కుటుబం కుప్పకూలిపోయింది. నీకు..బిడ్డలకు నరకాన్ని ఇచ్చి వెళ్లిపోతున్నా అని భార్యకు మెసేజ్ పెట్టి ఆత్మహత్యకు పాల్బడిన భర్త గురించి గంటల వ్యవధిలో మరణవార్త వినడం ఆ కుటుంబాన్ని కలచివేసింది. అభంశుభం తెలియని ఇద్దరు ఆడపిల్లలు, భార్య తనపై ఆధారపడి ఉన్నారన్న విషయం తెలిసినా, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్బడిన సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ బి.సుబ్రమణ్యం (36) ఉదంతం ఆవేదనకు గురి చేస్తోంది. సోమవారం ఉదయం బి.కొత్తకోటలో చోటుచేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించి పోలీసుల కథనం మేరకు వివరాలు. రామసముద్రానికి చెందిన బి.సుబ్రమణ్యం సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. గతేడాది జూలైలో బి.కొత్తకోట నగర పంచాయతీ తాకాటంవారిపల్లె సచివాలయానికి బదిలీ అవ్వగా స్థానిక బైపాస్రోడ్డులో కుటుంబంతో నివాసం ఉంటూ విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య సౌమ్య, ఐశ్వర్య (4), హైందవి (2) సంతానం. తల్లి నీలమ్మ ఉండగా తండ్రి రత్నప్ప మతి చెందాడు. ఈ నేపథ్యంలో ఆదివారం సెలవు కావడంతో సుబ్రమణ్యం కుటుంబంతో కలిసి బి.కొత్తకోట సమీపంలోని కర్ణాటకకు చెందిన నాగిరెడ్డిపల్లెలోని అత్తారింటికి వెళ్లాడు. రాత్రి అక్కడే ఉండగా సోమవారం ఉదయం ఏడు గంటలకు ఆఫీసుకు బి.కొత్తకోట వెళ్తున్నానని, కుమార్తె ఐశ్వర్య జన్మదినం కావడంతో సాయంత్రం వచ్చేటప్పుడు కేక్ తీసుకొస్తానంటూ చెప్పి ఉదయం ఏడు గంటలకు నాగిరెడ్డిపల్లె నుంచి బి.కొత్తకోటకు బయలుదేరాడు. ఇంటికి చేరుకున్న తర్వాత 7.50 గంటలకు రామసముద్రంలో ఉంటున్న తల్లి నీలమ్మతో ఫోన్లో మాట్లాడాడు. ఈ రోజు బిడ్డ ఐశ్వర్య పుట్టినరోజని కేక్ తీసుకోవాలని చెబుతూనే ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయని భారంగా మాట్లాడాడు. డబ్బులు లేవని, ఇబ్బందులు పడుతున్నట్టుగా చెప్పుకున్నాడు. ఈ మాటలకు ఆందోళనకు గురైన నీలమ్మ విషయాన్ని కోడలు సౌమ్యకు చెప్పడంతో 8 గంటలకు భార్య సౌమ్య, తల్లి నీలమ్మ, కుటుంబీకులు ఫోన్లో మాట్లాడేందుకు కాల్ చేసినా తీయలేదు. ఆత్మహత్యకు సిద్దంకావడంతో అంతకుముందు భార్య సౌమ్య ఫోన్కు..నీకు, బిడ్డలకి నరకాన్ని ఇచ్చి నేను వెళ్లిపోతున్నాను క్షమించండి అంటూ భార్య ఫోన్ నంబర్కు మెసేజ్ టైప్ చేశాడు కాని సెండ్ చేయలేదు. ఆ తర్వాత ఇంటిలోనే శ్లాబుకు ఉన్న కొక్కికి వేసిన చీర, తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్బడ్డాడు. ఉదయం 8–9.15 గంటల మధ్య ఆత్మహత్యకు పాల్బడినట్టుగా పోలీసులు గుర్తించారు. సుబ్రమణ్యం ఆత్మహత్యకు పాల్బడిన విషయాన్ని స్థానికులు గుర్తించి ఇంటి యజమానికి, పొరుగు వాళ్లకు చెప్పడంతో వారు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే మతి చెందినట్టు నిర్దారించారు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ కరీముల్లా సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారించారు. తల్లి నీలమ్మ ఫిర్యాదు మేరకు..సుబ్రమణ్యం అర్థిక ఇబ్బందులతో ఉన్నాడని, ఇప్పటికే పలుమార్లు ఆర్థికంగా సహయపడ్డామని, మళ్లీ ఆర్థిక సమస్యలతో తమతో చెప్పుకోలేని ఆత్మహత్యకు పాల్బడినట్టు పేర్కొనడంతో కేసు నమోదు చేశారు. మతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. AP: పని ఒత్తిడి.. ఇద్దరు సచివాలయ ఉద్యోగుల ఆత్మహత్మ -
AP: పని ఒత్తిడి.. ఇద్దరు సచివాలయ ఉద్యోగుల ఆత్మహత్మ
విజయవాడ: పని ఒత్తిడి భరించలేక ఇద్దరు సచివాలయ ఉద్యోగులు వరుసగా ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఏపీలో అలజడి సృష్టిస్తున్నాయి. రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లా మోపిదేవి సచివాలయంలో ఏఎన్ఎంగా పని చేస్తున్న దాసి సబిత ఆత్మహత్యా యత్నం చేయగా, చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. ఇదిలా ఉంచితే, మరో సచివాలయ ఉద్యోగి ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 9వ తేదీ) ఆత్మహత్య చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా బి. కొత్తపేటలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానిక బైపాస్ రోడ్ లోని తన ఇంటిలో ఇవాళ ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు సుబ్రహ్మణ్యం అనే వెల్ఫేర్ అసిస్టెంట్. మృతుడి స్వగ్రామం రామసముద్రం మండలం ఇటీవల బదిలీల్లో భాగంగా బి.కొత్తకోట వచ్చాడు సుబ్రహ్మణ్యం. అయితే సుబ్రహ్మణ్యంకు పని ఒత్తిడి పెరిగిపోయింది. డబ్యూఈఏ(వార్డు ఎడ్యకేషన్ అసిస్టెంట్), డీఏ(డేటా అనాలిసిస్), పీఎస్(పబ్లిక్ సర్వీసెస్), బీఎల్ఓ(బూత్ లెవల్ ఆఫీసర్, ఈఎన్ఏ(ఎంక్వరీ యాక్టివిటీ) తదితర బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో యూఎఫ్ఎస్(అర్బన్ ఫ్రేమ్ సర్వే)లో భాగంగా 888 గృహాలు అతనికి కేటాయించారు. ఇలా పనిభారం పెరిగిపోయింది. దాంతో విరామం లేకుండా పనిచేసి అత్యధిక బాధ్యతల ఒత్తిడి తట్టుకోలేక పోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై బి.కొత్తపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.వలంటీర్ల వ్యవస్థను అటకెక్కించేసిన కూటమి ప్రభుత్వం..ఏపీలో పైరవీలు, పక్షపాతానికి తావులేకుండా ఐదేళ్ల పాటు లబ్దిదారుల ఇళ్ల వద్దనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి దేశవ్యాప్తంగా ప్రశంసలందుకున్న వలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం అటకెక్కించేసింది ఎన్నికల ముందు.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం, వారి గౌరవ వేతనం రెట్టింపు చేస్తామని ఊరూవాడా హోరెత్తించిన కూటమి పెద్దలు అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థను చిదిమేశారు. పెద్దఎత్తున ఉపాధి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకు విజయవంతంగా కొనసాగిన వలంటీర్ల వ్యవస్థ ద్వారా పేద నిరుద్యోగ యువత పెద్దఎత్తున ఉపాధి పొందారు. అప్పట్లో 20–25 ఏళ్ల మధ్య వయస్సు వారు 27 శాతం మంది, 26–30 ఏళ్ల మధ్య వారు 36 శాతం, 31–35 ఏళ్ల మధ్య వారు 28 శాతం కలిపి మొత్తం 91 శాతం మంది 35 ఏళ్లలోపు వారే ‘వలంటీర్’గా ఉపాధి పొందారు.మరోవైపు.. వలంటీర్లుగా అప్పటి ప్రభుత్వం నియమించిన వారిలో 49 శాతం మంది బీసీలు, 27 శాతం మంది ఎస్సీలు, ఏడు శాతం మంది ఎస్టీలున్నారు. అలాగే, మొత్తం మీద 1,25,781 మంది మహిళలు ఉపాధి పొందారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆ వ్యవస్థ కాస్త తెరమరుగై పోయింది. దాంతో లెక్కల్లో మాత్రమే ఉన్న సచివాలయ ఉద్యోగులపై పని భారం అధికమైంది. తాజాగా జరిగిన ఈ రెండు ఆత్మహత్మ ఘటనలే అందుకు అద్దం పడుతున్నాయి. -
పీ..పీ..పీ.. డుం డుం డుం..
కడప సెవెన్రోడ్స్: కడప నగరపాలక సంస్థకు చెందిన వందల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులపై అధికార టీడీపీ నేతలు కన్నేశారు. ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాల్సిన ఆస్తులను ఎంచక్కా కాజేసేందుకు చకచకా పావులు కదుపుతున్నారు. ఇందుకోసం పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్) విధానాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఈ నెల 10 తేదీ జరగనున్న నగరపాలక సంస్ద సర్వసభ్య సమావేశ ఎజెండాలో కమిషనర్ దీనిని 13వ అంశంగా చేర్చారు. ఇది తీవ్ర దుమారం రేపుతోంది. వైఎస్ఆర్సీపీ సహా, వామపక్షాలు, దళిత, ఇతర ప్రజా సంఘాలు ప్రభుత్వ పీపీపీ ప్రతిపాదనపై భగ్గుమంటున్నాయి. ● కడప నగర నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ భవన్, వైఎస్ఆర్ ఆడిటోరియం, నేక్నామ్ఖాన్ కళాక్షేత్రం, పాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలను కబళించేందుకు అధికార పార్టీ నేతలు బరి తెగించారు. ఇందుకు పీపీపీ ముసుగు తగిలించారు. కడప నగర పాలక సంస్థ అభివృద్ధి, మౌళిక వసతులు విస్తరణ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలంటే కార్పొరేషన్కు సంబంధించిన కీలక ఆస్తులను పీపీపీ విధానంలోకి తీసుకురావాల్సి ఉంటుందని కలరింగ్ ఇస్తున్నారు. ఈ మేరకు టీడీపీ నేతలు ఈ ప్రతిపాదనను మున్సిపల్ కమిషనర్ ద్వారా ఎజెండాలో చేర్పించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సంస్థ ఆస్తు లు పరాధీనం కాకుండా కాపాడుతూ వాటిని అభివృద్ధి చేసి ప్రజోపయోజానికి వినియోగించాల్సిన ప్రభుత్వ ఆస్తులను కాజేయాలని యత్నించడం దారుణమని పలువురు పచ్చ నేతల తీరును విమర్శిస్తున్నారు. అది ప్రభుత్వ ఎజెండా నగరపాలక సంస్థ ఆస్తులను పీపీపీ మోడ్లోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ ఎజెండానే తప్ప మాదికాదు. మేం ఆ ఆంశాన్ని ఎజెండాలో చేర్చలేదు. రానున్న జనరల్ బాడీ సమావేశంలో ఆ ఆంశాన్ని తిరస్కరిస్తాం. నగరపాలక కమిషనర్ ప్రభు త్వం తరఫున ఆ ప్రతిపాదనను ఎజెండాలో పొందుపరిచారు. ప్రజలకు అవసరమైన దాన్నే వైఎస్ఆర్సీపీ పాలకవర్గం ఆమోదిస్తుంది. పీపీపీ విధానాన్ని తొలి నుంచి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తోంది. –పాకా సురేష్ కుమార్, మేయర్, కడప కడప సెవెన్రోడ్స్: కడప నగరపాలక సంస్దకు చెందిన అంబేద్కర్ భవన్, వైఎస్ఆర్ ఆడిటోరియం, నేక్నామ్ఖాన్ కళాక్షేత్రం, పాత మున్సిపల్ కార్యాలయాలను పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తే సహించబోమని, దశల వారీగా ఆందోళనలు నిర్వహిస్తామని ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ సంఘాలకు చెందిన నాయకులు సృష్టం చేశారు. హేతువాద సంఘం జిల్లా కార్యదర్శి సీఆర్వీ ప్రసాద్ అధ్యక్షతన ఆదివారం కడప నగరంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు మాట్లాడారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్త విధానంలో భాగంగానే పీపీపీ కింద ఇటీవల మెడికల్ కళాశాలలను ప్రైవేట్కు ఇస్తోందన్నారు. ఇప్పుడు కడప మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన ఆస్తులను కూడ అదే పద్ధతిలో ప్రైవేట్కు అప్పజెప్పే కుట్రపన్నడం దారుణమన్నారు. ిపీపీపీ కింద ఆస్తులను అప్పగించబోమంటూ మంగళవా రం జరగనున్న కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో తీర్మానించాలని డిమాండ్ చేశారు. వివిధ సంఘాల నాయకులు కారు ఆంజనేయులు, వినోద్, బాషా, జేవీ రమణ, షిండే భాస్కర్, సీపీఐఎంఎల్ నాయకులు ఓబయ్య, డీఎం ఓబులేసు యాదవ్, లోక్సత్తా నాయకుడు దేవర శ్రీకృష్ణ, ఆప్ నాయకులు డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడారు. విలువైన ప్రభుత్వ భవనాలకుస్కెచ్ వేసిన పచ్చ నేతల్లో కల్యాణకల! కడప కార్పొరేషన్ పరిధిలోనిపలు భవనాలపై టీడీపీ నేతల కన్ను నగరపాలక సంస్థ సమావేశఎజెండాలో చేర్చిన కమిషనర్ -
మదనపల్లెలో చీటీల బాగోతం
మదనపల్లె టౌన్ : మదనపల్లెలో చీటీల మోసం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆదివారం ఇద్దరు మహిళల మధ్య ఈ సంఘటన చోటుచేసుకుంది. ‘నువ్వు మోసం చేశావని ఒకరు.. కాదు నువ్వే మోసం చేశావు’ అంటూ రోడ్డుపైకి వచ్చి వాగ్వాదానికి దిగారు. మండలంలోని చిప్పిలికి చెందిన లక్ష్మీసుకన్య స్థానికంగా ఉండే రాజేశ్వరి వద్ద చీటీలు వేశానని, అంతేకాకుండా పది మంది వద్ద చీటీలు కట్టించానని తమకు రూ.1.20 కోట్ల డబ్బులు ఇవ్వకుండా రాజేశ్వరి మోసం చేసినట్లు ఆరోపిస్తూ.. రాజేశ్వరి ఇంటి ముందు కూర్చొని ఆందోళనకు దిగారు. దీనికి స్పందించిన రాజేశ్వరి తనకు లక్ష్మీ ప్రసన్ననే అన్యాయం చేసిందన్నారు. నమ్మి వేరొకరి వద్ద పూచీలు పడి చీటీలు వేయిస్తే రూ.60 లక్షల చీటీ డబ్బులు కట్టకుండా మోసగించిందన్నారు. ఆ డబ్బు ఎగ్గొట్టేందుకు తనపై బురద చల్లుతోందని రాజేశ్వరి ఆరోపించారు. ఇద్దరూ వాదోపవాదాలకు దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. తరువాత కొంత సేపటికి పరిస్థితి సద్దుమణిగింది.ఇంటి వద్ద బాధితుల బైఠాయింపు -
11నుంచి అత్తిరాల బ్రహ్మోత్సవాలు ప్రారంభం
రాజంపేట రూరల్: జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటయిన అత్తిరాలలోని శ్రీకామాక్షి సమేత త్రేతేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 11వ తేది నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. 19వ తేది వరకు జరిగే ఈ ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా 15,16,17వ తేదీల్లో నిర్వహించే ముఖ్య కార్యక్రమాల కోసం ఆర్టీసీ సంస్థ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. సబ్కలెక్టర్ భావన, తహసీల్దార్ పీర్మున్నీ, మున్సిపల్ కమిషనర్ జీ.శ్రీనివాసులు, దేవస్థాన కమిటీ చైర్మన్ పూల నాగమణీ, మన్నూరు సీఐ మస్తాన్లతో సమావేశమై సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 15వ తేదీ శివరాత్రి, 16న కామాక్షి సమేత త్రేతేశ్వరస్వామి కల్యాణం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు వైభవంగా నిర్వహించనున్నారు. 17వ తేది ఉదయం 10 గంటలకు స్వామివారి రథోత్సవం ఉంటుంది. 15న శివరాత్రి, 16న కళ్యాణం, 17న రథోత్సవం ముస్తాబవుతున్న ఆలయం -
108లో ప్రసవం
మదనపల్లె టౌన్ : కురబలకోట మండలంలో శనివారం రాత్రి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేరాడు. ఘటనపై ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కురబలకోట మండలం ఎరబల్లికి చెందిన భాస్కర్రెడ్డి కుమారుడు నితీష్రెడ్డి(18) ఇంట్లో ఉన్న పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు బాధితుడిని వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చి, ప్రాథమిక చికిత్సలు అందించారు. బాధితుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో.. డాక్టర్లు అక్కడి నుంచి రుయాకు వెళ్లాలని రెఫర్ చేశారు. పీలేరు రూరల్ : 108 అంబులెన్స్ వాహనంలో ఓ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. వివరాలిలా ఉన్నాయి. పీలేరు పట్టణం కావలిపల్లెకు చెందిన రాములమ్మ శనివారం పురిటి నొప్పులతో బాధపడుతూ కాన్పు కోసం పీలేరు ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. పరిశీలించిన వైద్యులు కాన్పు కష్టమవుతుందని తిరుపతికి రెఫర్ చేశారు. ఆమెను 108 అంబులెన్స్ వాహనంలో తిరుపతికి తరలిస్తుండగా.. మార్గంమధ్యలో భాకరాపేట సమీపంలో కవలపిల్లలకు జన్మనిచ్చింది. 108 సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి సురక్షిత ప్రసవం చేశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. అంబులెన్స్లో 108 ఈఎంటీ అశోక్, పైలట్ ఎం.శ్రీనివాసులు వైద్య సేవలు అందించారు.ఆస్తి కోసం అన్నదమ్ముల ఘర్షణమదనపల్లె టౌన్ : మదనపల్లె పట్టణంలో అన్నదమ్ములు ఆస్తి కోసం కొట్టుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజీవ్ నగర్లో కాపురం ఉంటున్న సుహేల్(26), రియాజ్(24) అన్నదమ్ములు. వీరికి తన తండ్రి కొనిచ్చిన ఇంటి స్థలాలు ఉన్నాయి. తండ్రి చనిపోవడంతో వాటిని పంచుకోవడంలో వాటాలు కుదరక కొంత కాలంగా గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో రాత్రి ఇద్దరూ గొడవపడి ఒకరిపై మరొకరు కర్రలతో కొట్టుకుని తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబీకులు గమనించి బాధితులను స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఒకరిపై మరొకరు వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ మహమ్మద్ రఫి కేసు విచారణ చేస్తున్నారు.చేపల కోసం వెళ్లి బాలుడి మృతిపులిచెర్ల(కల్లూరు) : చేపల కోసం వెళ్లి ఈతరాక నీటిలో మునిగి బాలుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కల్లూరు దాసరి గూడెంకు చెందిన రవితేజ(19) పూరేడు వారిపల్లె దగ్గర ఉన్న హంద్రీ–నీవా కాలువలో చేపలు పట్టడానికి వల తీసుకొని వెళ్లాడు. ఈ క్రమంలో వల తీస్తుండగా వల కాలికి తగులు కోవడంతో ఈత రాని తాను బోర్ల పడి బురదలో కూరుకుపోయాడు. కొంత సేపటి తరువాత స్థానికులు గుర్తించి హుటాహుటిన కల్లూరు ప్రైవేటు హాస్పిటల్కు తీసుకువచ్చారు. పరీక్షలు చేసిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. దీంతో బాధిత కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.అగస్త్యేశ్వరస్వామిఆలయంలో చోరీరాజంపేట : చెయ్యేరు నది ఒడ్డున వెలసిన శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. దొంగలు మొదట సోలార్ లైటింగ్ సిస్టమ్ను లాగేశారు. తలుపుల తాళాలు పగులగొట్టారు. ఆలయంలో ఉన్న హుండీ ఎత్తుకెళ్లారు. ఉదయం 6 గంటల సమయంలో ప్రధాన అర్చకులు శివయ్యస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ తలుపులు తెరిచి వుండటం చూసి, దొంగతనం జరిగిందని భావించారు. వెంటనే ఆలయ ధర్మకర్త నూకా చెంగల్రెడ్డి, మన్నూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మన్నూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ విచారణ చేశారు. హుండీ దగ్గరలో వేసి ఉంటారని పలువురు గాలించారు. అయినా దొరకలేదు. -
మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు
రొంపిచెర్ల: మత్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు కూడా ఇస్తామని..ఈ ఆవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా మత్యశాఖ అధికారి పుల్లయ్య కోరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్వేటినగరం, పలమనేరు ప్రాంతాల్లో చేప పిల్లలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వేలంపాటలో చెరువులను దక్కించుకున్న వారు చేపలను పెంచుకోవచ్చున్నారు. మత్యకారులకు చెరువులను కేటాయిస్తామని తెలిపారు. మత్యకారులు ముందుకు రాకపోతే గ్రామ పంచాయతీలకు అప్పగించి వేలం పాటలు నిర్వహిస్తామని వెల్లడించారు. వేలం పాటల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇరిగేషన్శాఖకు 50 శాతం, గ్రామ పంచాయతీలకు 30 శాతం ఇస్తామని వివరించారు. గుర్రంకొండ: రెడ్డెమ్మతల్లీ.. చల్లంగా చూడు తల్లీ అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఈసందర్భంగా భక్తుల ఆలయంలో అమ్మవారికి ఉదయాన్నే నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. హిందువులతో పాటు ముస్లింలు సైతం పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించడం విశేషం. కడప కోటిరెడ్డి సర్కిల్: మహా శివరాత్రి పండుగ నేపథ్యంలో కడప పాత బస్టాండ్ నుంచి సోమ వారం పొలతలకు ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు కడప డిపో మేనేజర్ కన్యాకుమారి తెలిపారు. కడప పాత బస్టాండ్ నుంచి ఉదయం 6.30, 9 గంటలకు, 11.30, 2.15, 4.45 గంటలకు ఈ ప్రత్యేక బస్సులు బయల్దేరుతాయ న్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆమె కోరారు. మదనపల్లె: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు డయల్ యువర్ ఎపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. మదనపల్లెలో డయల్ యువర్ ఎస్ఈ డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని సర్కిల్ స్థాయిలో సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు జరుగుతుందని ఎస్ఈ సోమశేఖర్రెడ్డి తెలిపారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను 9440817449 నంబర్కు ఫోన్ చేసి తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం పొందాలని కోరారు. కడప సెవెన్రోడ్స్: కడప నగరంలోని మరియాపురంలో ఈ నెల 10, 11 తేదీల్లో జరగనున్న లూర్దుమాత మహోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు నవదిన పూజా ప్రార్థనలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఏడవ రోజు స్థానిక మరియాపురం నుంచి గురువులుగా అభిషిక్తులైన ఫాదర్లు జ్యోతి ప్రజ్వలన చేసి పూజను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫాదర్ స్వర్ణ బెర్నార్డ్ దివ్యబలిపూజను సమర్పించగా, వల్లూరు విచారణ ఫాదర్ శరత్ దైవ సందేశమిచ్చారు.సాతానుతో సహవాసం నరకానికి మూలమని, ఏసుక్రీస్తు సువార్త సందేశం రక్షణ మార్గమని అన్నారు. దేవుని తల్లి అయిన మరియమాత సన్నిధిలో విశ్వాసం తో వేడుకుంటే మనకున్న అన్ని సమస్యలు సమసిపో తాయని చెప్పారు. సెయింట్ మేరీస్ కెథిడ్రల్ విచారణ గురువు ఈరి లూర్దు మరియన్న, సహాయ గురువు జంపంగి సుధాకర్, ఫాదర్లు హృదయ రాజు, ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. -
జాతీయ స్థాయిలో ‘ఆర్కే వ్యాలీ’ ప్రతిభ
వేంపల్లె : అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాక్ థాన్ జాతీయ స్థాయిలో ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ విద్యార్థులు ఘన విజయం సాధించినట్లు డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా పేర్కొన్నారు. ఈనెల ఆరో తేదీన జాతీయ హ్యాక్ థాన్లో తమ కళాశాల విద్యార్థులు ప్రథమ బహుమతిని కై వసం చేసుకోగా, ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్కు చెందిన రెండు జట్లు రన్నర్గా నిలిచాయన్నారు. 10 ముఖ్యమైన క్వాంటం అంశాలపై ఈ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఆరు రాష్ట్రాల నుంచి దాదాపు 50 వేల మంది విద్యార్థులు ఈ హ్యాక్ థాన్లో పాల్గొనగా.. ఉత్తమంగా 100 జట్లు జాతీయస్థాయి ఎంపికై అర్హత సాధించినట్లు తెలిపారు. ప్రతి జట్టులో ఆరుగురు సభ్యులు ఉండగా మొత్తం 600 మంది యువ ఆవిష్కర్తలు తమ ప్రతిభను ప్రదర్శించారన్నారు. విజేతలకు ప్రతి సమస్యకు 50 వేల రూపాయల నగదు బహుమతి, రన్నర్స్కు 30 వేల రూపాయలు నగదు బహుమతితోపాటు జాతీయస్థాయి గుర్తింపు సర్టిఫికెట్లు అందజేశారన్నారు. ఈ విజయానికి కొనసాగింపుగా గత శనివారం ఏడవ తేదీన అమరావతిలో నిర్వహించిన అమరావతి క్వాంటం వ్యాలీ ఫౌండేషన్ కార్యక్రమంలో విజేతలకు, రన్నర్స్– అప్లను ప్రముఖులు సత్కరించి అభినందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి రవికుమార్, డీన్ రీసెర్చ్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ రత్నకుమారి, డీన్ అకాడమిక్స్ రమేష్ కై లాస్, ఫైనాన్స్ ఆఫీసర్ జి.రమేష్, పరీక్ష నియంత్రణ అధికారి అరుణ్కుమార్రెడ్డి, క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ కోఆర్డినేటర్ సుధాకర్రెడ్డి, క్వాంటం టెక్నాలజీస్ కోఆర్డినేటర్ భాస్కరయ్య పాల్గొన్నారు. -
బోయకొండ పైకి వాహనాలు రయ్ రయ్
● భక్తులపై దాడికి యత్నిస్తున్న డ్రైవర్లు ● ప్రమాదాలు జరిగితే కానీ పట్టించుకోరా? చౌడేపల్లె : బోయకొండపై వెలసిన గంగమ్మ అమ్మవారి ఆలయం వద్దకు వాహనాలు రయ్ రయ్మని పోతున్నా.. పోలీసులు, ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదు. సెలవులు, పండుగ రోజుల్లో ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివస్తుంటారు. బోయకొండ గంగాపురం నుంచి బోయకొండపై ఆలయం వద్దకు యాత్రికులను అద్దె సుమో వాహనాల్లో టికెట్టు వసూలు చేసి తరలిస్తుంటారు. కొండపై ఏటవాలుగా ఉన్న ఘాట్ రోడ్డులో వాహనాల్లో పరిమితికి మించి యాత్రికులకు తరలించడం, అధిక వేగంగా వవెళ్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మార్గంలోని రణభేరి గంగమ్మ ఆలయం సమీపంలో ఏటవాలు రోడ్డుపై సుమోలు ఒకదానికి ఒకటి పొటీ పడి వెళ్తుండటంతో భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సుమోలు వేగంగా, ప్రమాదకర పరిస్థితిలో వెళ్తుండటంతో నడిచి వెళ్తున్న భక్తులు హడలి పోతున్నారు. ఇటీవల బోయకొండ ఆలయం వద్దకు మదనపల్లెకు చెందిన ఓ కుటుంబం వచ్చింది. వారు ఉన్న బైక్ వద్దకు డ్రైవర్ సుమోను వేగంగా తీసుకెళ్లారు. ప్రశ్నించిన వారిపై డ్రైవర్ దాడికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొండపై ఆలయం వద్దకు ఆటోలు నిషేధించినా భక్తులను తరలిస్తున్నా పట్టించుకోవడం లేదు. వారం క్రితం బోయకొండ దర్శనం చేసుకొని ఆటోలో కిందకు వస్తున్న ఆటో అదుపు తప్పి 12 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. -
హార్సిలీహిల్స్పైప్లాస్టిక్ వద్దంటూ ర్యాలీ
కొండపైకి స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల ట్రెక్కింగ్ బి.కొత్తకోట: జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ చెందిన 400 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ఆదివారం మండలంలోని హార్సిలీహిల్స్పైకి ట్రెక్కింగ్ నిర్వహించారు. స్కౌట్స్ విద్యా విషయక క్యాలెండర్ ప్రకారం విద్యార్థులలో ధైర్య సాహసాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించే చర్యల్లో భాగంగా పర్వతారోహణ, ట్రెక్కింగ్ నిర్వహించినట్లు జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా సెక్రెటరీ ఎం.నరసింహారెడ్డి తెలిపారు. ట్రెక్కింగ్తో కొండపైకి చేరుకున్న విద్యార్థులు పర్యావరణాన్ని కాపాడాలంటూ ప్లాస్టిక్కు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించారు. గాలిబండపై ప్లాస్టిక్ వ్యర్థాలను, గాజు ముక్కలను ఏరివేసి శుభ్రపరిచారు. కొండపైన స్కౌట్స్ ప్రాంతీయ శిక్షణ కేంద్రాన్ని సందర్శించి అక్కడ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ కొండపై ఉన్న శిక్షణ కేంద్రం భవనాలు కూలిపోయే దశలో ఉన్నాయని, వీటిస్థానంలో కొత్త భవనాల నిర్మాణం అవసరం ఉందన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కతిక కార్యక్రమాలు, పిరమిడ్ విన్యాసాలు ఆకర్షించాయి. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్డబ్ల్యూబి లక్ష్మీకర్, అసిస్టెంట్ సెక్రటరీ భాస్కర్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, సిద్ధారెడ్డి, స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు పాల్గొన్నారు. -
మద్యం బాకీ విషయమై పరస్పర దాడులు
బద్వేలు అర్బన్ : మద్యం బాకీ విషయమై ఆదివారం మద్యంషాపు యజమాని, కొనుగోలుదారుడు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో మద్యంషాపు యజమానికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని కొండారెడ్డివీధికి చెందిన విష్ణుమోహన్రెడ్డి పోరుమామిళ్ళ బైపాస్ రోడ్డులో కార్తీక్ వైన్స్ పేరుతో మద్యం షాపు నిర్వహిస్తున్నాడు. బి.కోడూరు మండలానికి చెందిన రామిరెడ్డి రోజూ కార్తీక్ వైన్స్లోనే మద్యం కొనుగోలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో రామిరెడ్డి కార్తీక్ వైన్స్లో మద్యం అప్పునకు తీసుకుని వెళ్లాడు. దీనిపై మద్యం దుకాణ నిర్వాహకుడు విష్ణుమోహన్రెడ్డి తన దుకాణంలో పని చేసే గుమస్తాతో బాకీ విషయమై రామిరెడ్డికి ఫోన్ చేయించాడు. దీంతో దుకాణం వద్దకు వెళ్లిన రామిరెడ్డికి, షాపు నిర్వాహకుడికి మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో రామిరెడ్డి తన గ్రామం నుంచి బంధువులను పిలిపించి ఆదివారం సాయంత్రం హెచ్పీ పెట్రోలు బంకు సమీపంలో ఉన్న విష్ణుమోహన్రెడ్డిపై దాడి చేశారు. ఈ ఘటనలో విష్ణుమోహన్రెడ్డి తలకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు ఘటన స్థలానికి వచ్చేసరికి గొడవ సద్దుమణిగింది. గాయపడిన విష్ణుమోహన్రెడ్డిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విష్ణుమోహన్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామిరెడ్డితోపాటు మరో నలుగురిపై అర్బన్ పోలీస్స్టేషన్ ఎస్ఐ చిరంజీవి కేసు నమోదు చేశారు. ఏమార్చి.. ఏటీఎం కార్డు మార్చి.. వేంపల్లె : స్థానిక పుల్లయ్య తోట నగర్కు చెందిన రిటైర్డ్ లెక్చరర్ అందలం రంగనాయకులు ఏటీఎం కార్డును గుర్తుతెలియని వ్యక్తులు మార్చి 30 వేలు అపహరించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం బాధితుడు తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. రిటైర్డ్ ఉద్యోగి రంగనాయకులు ఈ నెల రెండవ తేదీన తన పెన్షన్ డబ్బుల కోసం వేంపల్లిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం వద్దకు వెళ్లారు. పెన్షన్ డబ్బులు పడ్డాయా, లేదా అని తమ పక్కనే ఉన్న వ్యక్తులకు ఏటీఎం కార్డు ఇచ్చి చూడమన్నారు. ఆ తర్వాత ఆ గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు పడలేదు అని తమ వద్ద ఉన్న ఏటీఎం కార్డును మార్చి ఇచ్చారు. ఆ రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి వెళ్లిన గంట తర్వాత రూ.20 వేలు డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. మరలా రూ.10 వేలు డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో బ్యాంకు వద్దకు వెళ్లి చూడాలని కోరారు. మీకు వచ్చిన పెన్షన్ డబ్బులు గంట క్రితమే డ్రా చేశారని బ్యాంకు సిబ్బంది చెప్పారు. దీంతో ఆ రిటైర్డ్ ఉద్యోగి అవాక్కయ్యారు. స్టేట్ బ్యాంక్ మేనేజర్ తన వద్ద ఉన్న ఏటీఎం కార్డును పరిశీలించగా.. ఇది మీది కాదని మీ ఏటీఎం కార్డు ఎవరో దొంగలించారని వివరించారు. ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వృద్ధుడు తెలిపారు. ఏ విధంగానైనా పోయిన డబ్బులను ఇప్పించి న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నారు.మద్యం షాపు యజమానికి తీవ్ర గాయాలు -
సమయానికి వైద్యం అందక వ్యక్తి మృతి
● ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం ఎవరూ లేని వైనం ● మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుబ్రహ్మంగారిమఠం : సకాలంలో వైద్య సేవలు అందకపోవడంతో తమ కుటుంబ సభ్యుడు మృతి చెందాడంటూ బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఎవరూ లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బ్రహ్మంగారిమఠంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దర్శనం కోసం శ్రీకాళహస్తి నుంచి శనివారం రాత్రి రామయ్యతో పాటు కూతురు, కోడలు కారు తీసుకొని వచ్చారు. దేవస్థానం పరిధిలో ఉన్న గోవిందమ్మ సదనంలో రూమ్ తీసుకుని ఉన్నారు. ఆదివారం ఉదయం స్వామిని దర్శించుకొని సిద్దయ్యమఠం వెళ్లాలని అనుకున్నారు. ఉదయం 8 గంటల సమయంలో రామయ్య ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. బి.మఠంలో ఎక్కడా ఎంబీబీఎస్ డాక్టర్లు లేరు. ఆర్ఎంపీలు ఉన్నారు. ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. అక్కడికి రామయ్యను తీసుకొని కుటుంబ సభ్యులు వెళ్లగా.. డోర్ తీసి ఉంది తప్ప, ఏ ఒక్కరూ లేరు. కనీసం స్టాఫ్ నర్సు కూడా లేరు. రామయ్య కుటుంబ సభ్యులు అరుస్తున్నా పలికే దిక్కులేకపోవడంతో.. కారులో మైదుకూరుకు తరలించారు. దారిలోనే రామయ్య(61) ప్రాణాలు విడిచారు. అనంతరం బి.మఠం చేరుకున్న కుటుంబ సభ్యులు మాట్లాడుతూ బ్రహ్మంగారిమఠంలో ఉన్న ఆసుపత్రిలో కనీసం నర్సు ఉన్నా ప్రాణాలు దక్కేవని ఆవేదన వెలిబుచ్చారు. అక్కడ ఎవరూ లేకపోవడంతోనే తమ పెద్ద దిక్కు మృతి చెందినట్లు వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికై నా బి.మఠం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
తవ్వేకొద్దీ.. అవినీతి
కడప అర్బన్ : వైఎస్సార్ జిల్లా కడప జీజీహెచ్తోపాటు ప్రొద్దుటూరు కేంద్రంగా జిల్లా ఆసుపత్రి, నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఆసుపత్రుల్లో దివ్యాంగుల రీ వెరిఫికేషన్ ప్రక్రియ ఇంకా కొన్ని చోట్ల కొనసాగుతోంది. రీ వెరిఫికేషన్ తర్వాత మరలా దివ్యాంగుల విజ్ఞప్తితో రీ–రీ వెరిఫికేషన్ పెట్టారు. రిమ్స్లో దివ్యాంగుల సర్టిఫికెట్లలో ప్రధానంగా అర్హులైన వారిలో కొందరికి అన్యాయం జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. కొందరు అంతంత మాత్రం అర్హులు, పూర్తి స్థాయిలో అనర్హులకు మాత్రం కొందరు దళారుల పుణ్యమా అంటూ పింఛన్ దక్కినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అధికారులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది దివ్యాంగుల సర్టిఫికెట్లను డబ్బులు వసూలు చేసుకుంటూ జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కొన్ని విభాగాలలో ఈఎన్టీ, ఆర్థోపెడిక్ తదితర విభాగాలతోపాటు, మరికొన్ని విభాగాలలో కూడా దళారులు వెంపర్లాడి సర్టిఫికెట్లను చేయించుకోవడంలో తమ వంతుగా కృషి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గతంలో ఉన్న కొందరు దళారులే మళ్లీ రంగ ప్రవేశం చేశారు. గతంలో ఒక్కో రీవెరిఫికేషన్ సర్టిఫికెట్కు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశారని, తర్వాత రీ–రీ వెరిఫికేషన్ సమయానికి తమకు న్యాయం జరగలేదని కొందరు దివ్యాంగులు దళారులే తమకు ముక్తి ప్రసాదిస్తారని వారిని ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాలు, మండలాలలో దాదాపు 150 నుంచి 180 మంది దళారులుగా మారి గతంలో దివ్యాంగుల సర్టిఫికెట్ల మంజూరులో లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు అక్రమార్జన చేసినట్లుగా రుజువులు కూడా బయటపడ్డాయి. ఏడుగురు ఉద్యోగులకు నోటీసులు వైఎస్సార్ జిల్లా కడప కేంద్రంగా ఉన్న జీజీహెచ్లో ఓపీ విభాగంలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు దివ్యాంగుల సర్టిఫికెట్ల కోసం దళారుల ద్వారా లక్షలాది రూపాయలను అక్రమంగా వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ లక్షలు కాస్త కోట్ల రూపాయల అక్రమార్జనకు దారి తీసినట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలుపత్రికలు, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు.. రిమ్స్ అధికారులు కొందరు ఉద్యోగులపై ఇటీవల చర్యలకు సిద్ధమయ్యారు. ఏడుగురు ఉద్యోగులకు నోటీసులు ఇచ్చి విచారణ చేశారు. వీరిలో ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అనే ముగ్గురిపై ప్రాథమికంగా వారి తప్పులు రుజువు కావడంతో సస్పెన్షన్ వేటు వేశారు. పై ముగ్గురు తమ ఫోన్ పేలలో దివ్యాంగుల సర్టిఫికెట్లకు సంబంధించి పలువురి దళారుల దగ్గర నుంచి డబ్బులు వేయించుకున్నట్లు సమాచారం తెలిసింది. వీరిలో ఒక ఉద్యోగి అకౌంట్లో ఏకంగా కోటి 86 లక్షలు, ఒక ఉద్యోగి అకౌంట్లో కోటి రూపాయలకు పైగా డబ్బులు దళారుల నుంచి లావాదేవీలు జరిగినట్లుగా తెలుస్తోంది. మరో ఉద్యోగి ఖాతాలో కూడా డబ్బులు విరివిగా దళారులు వేసినట్లుగా సమాచారం. ఇంకా కొందరు చిరుద్యోగులు ఇందులో దళారులుగా వ్యవహరించి దివ్యాంగుల సర్టిఫికెట్ల వ్యవహారంలో తమ వంతుగా అక్రమార్జనకు పాల్పడినట్లు సమాచారం. దివ్యాంగుల సర్టిఫికెట్లలో అవినీతి, అక్రమార్జన అంశాలపై అధికారులు సమగ్రంగా విచారణ చేపడుతున్నట్లు సమాచారం. ఒకవైపు అధికారులు తమ వంతుగా చర్యలు చేపడుతున్నా.. సస్పెన్షన్కు గురైన ఉద్యోగులు మాత్రం కొందరు కీలక అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమకు అనుకూలంగా చర్యలు ఉండేందుకు అన్ని విధాలుగా వారు గట్టిగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమకు అనుకూలమైన దళారుల ద్వారా ‘పైసా వసూల్’ చేస్తూనే వున్నారని తెలుస్తోంది. ముగ్గురిపై విచారణకు ఏసీబీకి సిఫారసు దివ్యాంగుల సర్టిఫికెట్ల వ్యవహారంలో ముగ్గురు అవినీతి ఉద్యోగుల పట్ల విచారణ కోసం అధికారులు మరింత చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ముగ్గురు అవినీతి ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాల సేకరణ సమగ్రంగా జరిపించేందుకు అవినీతి నిరోధక శాఖకు రిమ్స్ పరిపాలన అధికారులు ఇప్పటికే సిఫారసు చేశారు. విచారణకు సంబంధించి రిమ్స్ అడ్మినిస్ట్రేటర్ రంగస్వామి మాట్లాడుతూ దివ్యాంగుల సర్టిఫికెట్ల వ్యవహారంలో అవినీతి ఉద్యోగులపై చర్యలకు అవినీతి నిరోధక శాఖ విభాగానికి సిఫారసు చేశామని తెలియజేశారు. తాజాగా ఏసీబీ దాడులతో హడల్ కడప జీజీహెచ్లో బుధవారం మధ్యాహ్నం సదరం సర్టిఫికెట్ కోసం వీరపునాయునిపల్లెకు చెందిన వీరపుశేఖర్ తన భార్య చెవుడుకు సంబంధించిన సర్టిఫికెట్ కోసం ఆ విభాగానికి సంబంధం లేని ఆఫీస్ సూపరింటెండెంట్ మేదర సుబ్బయ్యకు రూ.30 వేలు లంచంగా ఇచ్చాడు. అతను ఆ డబ్బులను తీసుకుని వెళ్లి సదరం కార్యాలయంలో ఇన్చార్జిగా వున్న మాదా వెంకటేశ్వర్లుకు రూ.25 వేలు ఇచ్చి, తాను మిగిలిన రూ.5 వేలను తీసుకున్నాడు. ఆ సమయంలో ఏసీబీ డిఎస్పీ సీతారామారావు, సీఐ నాగరాజు, సిబ్బంది రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సంఘటనతో రిమ్స్ పరిపాలన విభాగంలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏసీబీ అధికారులు ఓపీ పరిపాలనా విభాగంలో పని చేస్తున్న అధికారులు, సిబ్బందితో స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఏసీబీకి పట్టుబడిన ఉద్యోగులు కేవలం చిన్నపాటి చేపలతో సమానం అని, ఇంకా అవినీతి తిమింగలాలు కొన్ని పట్టుబడితేనే బాధితులకు, నిజమైన దివ్యాంగులకు సరైన న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. దివ్యాంగుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో అక్రమాలు ప్రధాన విభాగాల్లో దళారులదే హవా కలెక్టర్ ఆదేశాలతో విచారణ ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్ తాజాగా ఏసీబీ దాడులతో ఉలిక్కిపడ్డ జీజీహెచ్ యంత్రాంగందివ్యాంగుల సర్టిఫికెట్ల మంజూరులో తవ్వేకొద్దీ.. అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయి. కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన అధికారులు.. కడప జీజీహెచ్లో ఏడుగురు ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. వారిలో ముగ్గురిని సస్పెన్షన్ చేశారు. సమగ్ర దర్యాప్తునకు ఏసీబీకి సిఫారసు చేశారు. తాజాగా ఏసీబీ దాడులు నిర్వహించడంతో.. రిమ్స్ యంత్రాంగం ఉలిక్కిపడింది. అయితే ఇప్పటి వరకు దొరికింది చేపలేనని, తిమింగళాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. -
బొలెరో బోల్తా పడి ముగ్గురు కూలీల దుర్మరణం
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా నుంచి కర్ణాటకకు చింతకాయల కోత పనులకు వెళ్లిన కూలీల్లో ముగ్గురిని ప్రమాదం బలితీసుకుంది. బొలెరోలో వెళ్లినవారు పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా ఆ వాహనం బోల్తాపడడంతో ఈ విషాదం నెలకొంది. కర్ణాటకలోని శ్రీనివాసపురం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు.. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంబకూరు గ్రామంలోని పూలకుంట్లపల్లెకు చెందిన 15 మంది కూలీలు బొలెరో వాహనంలో కర్ణాటకలోని శ్రీనివాసపురం వద్ద చింతకాయలు కోయడానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా శ్రీనివాసపురం వద్ద బ్రేక్ ఫెయిలవడంతో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది.ఈ ప్రమాదంలో శ్రీనివాసులు (25), మునెప్ప (65) అక్కడికక్కడే మృతిచెందారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఏడుగురిని వేర్వేరు వాహనాల్లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు చికిత్స చేసేలోపే వెంకటమ్మ (60) మృతిచెందింది. ఆరుగురు మదనపల్లెలోను, మరో ఆరుగురు శ్రీనివాసపురంలో చికిత్స పొందుతున్నారు. కూలి పనులకు వెళ్లిన ముగ్గురు ప్రాణాలు కో ల్పోవడంతో పూలకుంట్లపల్లెలో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంపై శ్రీనివాçసపురం పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి : కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు కూలీలు మృత్యువాత పడడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటక శ్రీనివాసపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన కూలీలు మరణించడం విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. -
Annamayya: బర్డ్ఫ్లూ కలకలం.. 28వేల కోళ్లు మృతి
సాక్షి, అన్నమయ్య: ఏపీలో బర్డ్ఫ్లూ కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లాలోని పలు మండల గ్రామాలకు చెందిన కోళ్లలో బర్డ్ఫ్లూను ఉన్నట్లు తేలింది.సుదుం మండలంలో కోళ్లకు బర్డ్ఫ్లూ నిర్ధారణయ్యింది. పుట్టవారిపల్లి,అమ్మగారిపల్లి,కంభంవారిపల్లికి చెందిన కోళ్లల్లో బర్డ్ఫ్లూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బర్డ్ఫ్లూతో 28వేల కోట్లు చనిపోయినట్లు సమాచారం. చనిపోయిన కోళ్లను జేసీబీ సాయంతో అధికారులు పూడ్చేశారు. మూడు కోళ్ల ఫామ్లను సీజ్ చేశారు. -
ఆత్మహత్యలకు ప్రేరేపించే విధంగా పనిభారం
నాటి కొఠారి కమిషన్ నుంచి నేటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వరకు ఏ కమిషనైనా ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని చెప్పినా ప్రభుత్వం మారడం లేదు. ఉపాధ్యాయులను రకరకాల యాప్లతో, వెబ్ కాన్ఫరెన్స్లతో, రిపోర్టులతో ఉపాధ్యాయులను బోధనేతర పనులతో ఒత్తిడి పెంచి ఆత్మహత్యకు ప్రేరేపిస్తోంది. ఇప్పటికై నా ఉపాధ్యాయులను ప్రశాంత వాతావరణంలో విద్యార్థులతో మమేకమై బోధించే వాతావరణాన్ని కల్పించాలి. అలాగే బోధనేతర పనులకు ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. – లెక్కల జమాల్ రెడ్డి, ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. -
కుట్రకు బూడిదైన టమాట సీడ్ కట్టెలు
రూ. 1.65 లక్షల నష్టంకురబలకోట : టమాట సాగుకు వినియోగించే సీడ్ కట్టెలకు నిప్పంటించడంతో.. కాలి పూర్తిగా బూడిదైన సంఘటన కురబలకోట మండలం కమతంపల్లి సమీపంలో శనివారం వేకువ జామున చోటు చేసుకుంది. బాధిత రైతు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని అంగళ్లు గ్రామం కమతంపల్లికి చెందిన ఆవుల రవీంద్ర ఊరికి సమీపంలోని బైపాస్ పక్కన పొలంలో ఏడు వేల టమాట సీడ్ కట్టెలు నిల్వ చేశారు. టమాట సాగుకు, కుటుంబ భవిష్యత్తుకు ఎంతో ఆశతో వీటిని భద్రపరిచారు. శనివారం వేకువ జామున ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి. సమాచారంతో ఆగమేఘాలపై వెళ్లి చూశారు. అప్పటికే చూస్తుండగానే మంటలకు కట్టెలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. కళ్లెదుటే రైతు కష్టార్జితం మంటల్లో కాలిపోతుంటే నిస్సహాయుడిగా మిగిలారు. రూ.1.65 లక్షల విలువ చేసే కట్టెలు ఉన్నపాటున కాలిపోవడంతో ఆ రైతుకు వేదన మిగిల్చింది. ఇతనికి మరో రైతు మధ్య భూ వివాదం నడుస్తోంది. ఈ కారణం చేత గిట్టని వారు టమాట కట్టెలకు నిప్పంటించి ఉంటారని బాధిత రైతు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తగు చర్యలు తీసుకుని నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మధు రామచంద్రుడు తెలిపారు. -
విచారణకు పిలిచి.. చేతి వేళ్లు విరిచి..
● ఓ వృద్ధుడిపై ఖాకీల ప్రతాపం ● మదనపల్లె పోలీసులపై సీఐ విచారణ మదనపల్లె టౌన్ : భార్య ఫిర్యాదు చేసిందని పోలీస్స్టేషన్కు రప్పించిన పోలీసులు.. భర్త చేతి వేళ్లను విరిగేలా కొట్టిన ఉదంతం శనివారం మదనపల్లెలో జరిగింది. ఘటనకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కలకడ మండలం కొండకింద గొల్లపల్లెకు చెందిన ముద్దలమేని వెంకటరమణ(57) భార్య నరసమ్మ(47)గత కొంత కాలంగా మానసిక స్థితి బాగలేక తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో నరసమ్మ పలు విధాలుగా ప్రవర్తించేది. గ్రామంలో స్థానికులతో గొడవలకు దిగేది. ఇందులో భాగంగానే భర్త, బిడ్డలతో ఇబ్బందికరంగా వ్యవహరించేది. గతంలో ఓ ఇంటికి నిప్పు పెట్టడంతో భర్త వెంకటరమణ తన భార్య పిల్లలతో మదనపల్లెలోని అనపగుట్టకు వచ్చి నివాసం ఉంటున్నాడు. అయినప్పటికీ నరసమ్మ మానసికస్థితిలో మార్పు రాలేదని వెంకటరమణ పేర్కొన్నాడు. ఈ పరిస్థితిలో నరసమ్మ రెండు రోజుల క్రితం కలకడలోని గొల్లపల్లెకు వెళ్లి స్థానికులతో గొడవ పడి, బసినికొండలోని పుట్టింటికి వచ్చేసింది. అనంతరం టూటౌన్లో తన భర్త ఓ మహిళతో వివాహేతర బంధంతో తనను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన టూటౌన్ పోలీసులు వెంకటరమణను స్టేషన్కు తీసుకొచ్చారు. అక్కడ ఏమి జరిగిందో కానీ చితకబాది, చేతివేళ్లు విరిగేలా గాయపరిచారు. తర్వాత బాధితున్ని పోలీసులే జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందించారు. ఎడమ చేయి వేలు విరిగిందని, దానికి శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు నిర్ధారించారు. అలాగే పెదవి లోపల అయిన గాయానికి ఆరు కుట్లు వేశారు. ఈ మేరకు బాధితుడు రాత్రి టూటౌన్ పోలీస్స్టేషన్కు వచ్చి తన గోడు చెప్పుకొన్నాడు. ఈ విషయమై సీఐ రాజారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా వెంకటరమణపై సిబ్బంది చేయి చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వాస్తవాలపై విచారణ చేస్తున్నామని చెప్పారు. -
తీవ్ర మానసిక ఒత్తిడి
కూటమి ప్రభుత్వం బోధనేతర కార్యక్రమాల పేరుతో ఉపాధ్యాయులను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తోంది. బోధనకు మాత్రమే పరిమితం చేస్తామంటూనే.. నిరంతరం బోధనేతర కార్యక్రమాల పేరుతో ఉపాధ్యాయులను వేధిస్తున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేయలేక, మరో పక్క ప్రభుత్వం ప్రవేశపెడుతున్న యాప్లతో పాటు బోధనేతర కార్యక్రమాలను నిర్వహించలేకపోతున్నారు. చివరకు ఆత్మహత్యకు కూడా యత్నిస్తున్నారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ఉపాధ్యాయులను వేధింపులకు గురి చేస్తోంది. –విజయకుమార్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
మహిళ ఆత్మహత్యాయత్నం
మదనపల్లె అర్బన్ : తీవ్రమైన కడుపునొప్పి భరించలేక మనస్తాపం చెందిన ఓ మహిళ క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యకు యత్నించింది. తంబళ్లపల్లె మండలం కుక్కరాజుపల్లెకు చెందిన నాగరత్నమ్మ(44) కూలీ పనులు చేస్తుండేది. ఈ నేపథ్యంలో ఈమె కొద్ది రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. అయితే శనివారం నొప్పి అధికం కావడంతో మనస్తాపం చెంది క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబీకులు బాధితురాలిని 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. కోడి పందెం స్థావరంపై దాడులు వాల్మీకిపురం : మండల పరిధిలోని తాటిగుంటపల్లి సమీపంలో కోడి పందెం స్థావరంపై పోలీసు లు శనివారం దాడులు నిర్వహించారు. ఓ మామి డి తోటలో కోడి పందెం ఆడుతున్న 16 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1,80,270 నగదు, 14 సెల్ఫోన్లు, నాలుగు కార్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడుల్లో ఎస్ఐ తిప్పేస్వామితోపాటు సిబ్బంది పాల్గొన్నారు. యువతి అదృశ్యం బి.కొత్తకోట : స్థానిక బీసీ కాలనీకి చెందిన యువతి అదృశ్యమైందని తండ్రి ఫి ర్యాదుపై కేసు నమోదు చేసినట్టు శనివారం పోలీసులు తెలిపారు. కూలీ పనులతో జీవిస్తున్న మహ్మద్ హుస్సే న్ సాబ్ కుమార్తె అర్షియా (18) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటోంది. ఈ నెల 5న ఇంటి నుంచి వెళ్లిన అర్షియా తిరిగి రాలేదు. ఆచూకీ కోసం వెతికినా కనిపించకపోవడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు
మదనపల్లె అర్బన్ : జిల్లాలో శనివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన వెంకటరమణ(45)వ్యవసాయం చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో శనివారం సొంత పనులపై ద్విచక్రవాహనంలో మదనపల్లెకు బయలుదేరాడు. దారిలో సర్కార్తోపు వద్ద వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆటోలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ద్విచక్రవాహనం ఢీకొని మదనపల్లె టౌన్ : ద్విచక్రవాహనం ఢీకొని రైతు తీవ్రంగా గాయపడ్డ సంఘటన శనివారం నిమ్మనపల్లె మండలంలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. బాలినాయునిపల్లెకు చెందిన రైతు శ్రీనివాసులు(70) సొంత పని మీద బైకుపై సోమల మండలంలోని కందూరుకు వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా, మార్గంమధ్యలోని మఠంతోపు వద్ద మరో బైకు ఢీకొని కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితున్ని స్థానికులు 108లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించడంతో డాక్టర్లు వైద్యం అందించారు. నిమ్మనపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండు బైకులు ఢీకొని.. పుంగనూరు : మండలంలోని కృష్ణదేవరాయ సర్కిల్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనా లు ఢీకొనడంతో ఒక వ్యక్తి గాయపడిన సంఘటన జరిగింది. బైరెడ్డిపల్లె మండలం బాపలనత్తంకు చెందిన వెంకటేష్(30) ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వెళ్తుండగా మార్గంమధ్యలో ప్రమాదం జరిగింది. బా ధితున్ని 108లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఆటో– కారు ఢీ.. వాల్మీకిపురం : ఆటో – కారు ఢీకొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని చింతలవారిపల్లి సమీపంలోని హైవేపై చోటు చేసుకొంది. తిరుపతి నుంచి మదనపల్లి వైపు వెళ్తున్న ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్ నగేష్కు కుడి కాలు విరిగిపోయింది. దీంతో హైవే అంబులెన్స్లో నగేష్ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నగేష్ను మదనపల్లికి రెఫర్ చేశారు. ఈ మేరకు ఎస్సై తిప్పేస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతున్న శ్రీనివాసులు గాయపడిన నగేష్ -
రంగ రంగ..వైభవంగా..
● కదిలింది శ్రీరంగనాథుని బ్రహ్మరథం ● దారిపొడవునా గోవింద నామస్మరణలు, భజనలు ● ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన పులివెందుల టౌన్: పులివెందుల పట్టణంలో శ్రీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథస్వామి రథోత్సవ వేడుకలు కనుల పండువగా జరిగాయి. రథోత్సవ వేడుకలను తిలకించేందుకు పట్టణ పరిధిలోని భక్తులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి కాయ కర్పూరాలు సమర్పించారు. స్వామి వారి తేరు (రథం) కింద గుమ్మడికాయలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. పూజాద్రవ్యాలు సమర్పించారు. ఆ దేవదేవుడిని దర్శించి తరించారు. దారి పొడవునా గోవింద నామస్మరణతో రథాన్ని కదిలించారు. భక్తి పారవశ్యంలో ఓలలాడారు. అక్కడక్కడా భక్తులకు ప్రసాదాలు, శీతల పానీయాలను పంపిణీ చేశారు. తేరు ప్రారంభానికి ముందు అర్చకులు కృష్ణరాజేష్శర్మ విశేష పూజలు జరిపించారు. ఉభయదారులకు అర్చనలు చేశారు. తేరు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మెన్ వరప్రసాద్, వైఎస్సార్సీపీ పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లె కిశోర్, కో–ఆప్షన్ మెంబర్ చంద్రమౌళి పాల్గొన్నారు. -
సిండికేటా.. పరోక్ష ఒత్తిళ్లా?
మదనపల్లె: మదనపల్లె దినసరి, వారపు సంత మార్కెట్ల గుత్తల అప్పగింత టెండర్లను శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కే.ప్రమీల నిర్వహించారు. దీనికి కేవలం ఇద్దరే హాజరయ్యారు. క్రితం సారి వేలంలో పలికిన ధరకు అనుగుణంగా మరుసటి ఏడాది గుత్తలకు ధర నిర్ణయించి వేలంపాటల ద్వారా అప్పగించడం సాధారణంగా జరిగే ప్రక్రియ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గుత్తల వ్యవహరం గందరగోళానికి దారితీసిన విషయం విదితమే. 2024–25లో దినసరి మార్కెట్ రూ.1.18 కోట్లు, వారపుసంత రూ.42 లక్షలు పలికింది. దీనికి అనుగుణంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి వారపుసంతకు రూ.45 లక్షలు, దినసరి మార్కెట్కు రూ.1.20 కోట్లుగా నిర్ణయించి వేలంపాటను ప్రారంభించారు. కమిషనర్ నిర్వహించిన ఈ వేలంపాటలో ఇద్దరు మాత్రమే పాల్గొనడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం నిర్ణయిచిన ధర అధికమని హాజరైన ఇద్దరు కమిషనర్ దృష్టికి తెచ్చారు. నిర్ణయించిన ధరకు అదనంగా 18శాతం జీఎస్టీ చెల్లించాలని కమిషనర్ చెప్పగా ఆ మొత్తం చెల్లించలేమని పాటదారులైన ఆ ఇద్దరు పేర్కొన్నారు. గతంలోనూ ప్రతి వేలానికి సంబంధించిన గుత్తకు 18శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నామని, ఇది జీఎస్టీ అమలులోకి వచ్చినప్పటి నుంచి అమలవుతోందని కమిషనర్ వారికి వివరించారు. అయినప్పటికీ ఈ నిర్ణీత ధరను తగ్గించాలన్న ప్రతిపాదన చేయగా... ఇది సాధ్యంకాదని స్పష్టం చేశారు. దీంతో ఆ ఇద్దరు వెనుదిరిగి వెళ్లిపోయారు. మొదటి వేలంలో ఎవరూ పాల్గొనకపోవడంతో మరోసారి వేలంపాటలకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ వెల్లడించారు. మదనపల్లె సంత, డైలీ మార్కెట్ వేలానికి ఇద్దరే హాజరు ఽఆపై ధర భరించలేమంటూ వెనక్కు.. -
డ్రగ్స్ వద్దు.. భవిష్యత్తు ముద్దు
– జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి కురబలకోట : యువత, విద్యార్థులు డ్రగ్స్ మత్తులో పడకుండా డ్రీమ్స్ నెరవేర్చుకోవడంపై దృష్టి సారించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. శనివారం ఉదయం అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ సహకారంతో అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్–ఎస్ టు లైఫ్ నినాదంతో త్రీకే రన్ నిర్వహించారు. కురబలకోట మండలంలోని రిషివ్యాలీ క్రాస్ నుంచి అంగళ్లు సర్కిల్ వరకు ఉత్సాహంగా ఉత్తేజంతో ఈ రన్ నిర్వహించారు. ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ అంటే ఆనందం కాదన్నారు. అది భవిష్యత్తును విచ్ఛిన్నం చేసే మరణ శాసనం లాంటిదన్నారు. వివిధ అనర్థాలకు దారి తీస్తుందన్నారు. తద్వారా జీవితం నాశనం అవుతుందన్నారు. కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. ఆరోగ్యకర జీవితం, ఆపై ఉజ్వల భవిత కోసం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. చదువులో రాణించి, క్రీడలు, వ్యాయామం, సానుకూల ఆలోచనలతో జీవితాన్ని ముందుకు సాగించాలన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వారుంటే సమాచారం ఇస్తే గోప్యంగా ఉంచుతామన్నారు. వారికి తగిన కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మీరిచ్చే సమాచారం ఓ కుటుంబానికి కొత్త వెలుగును ఇస్తుందన్నారు. డ్రగ్స్ సరఫరా విక్రయదారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా మిట్స్ ఏంఎస్ఆర్ క్లబ్ డ్రగ్స్పై నిర్వహించిన స్కిట్ ఆలోచింపజేసింది. హృదయాన్ని కదిలించింది. పలువురు కంటతడి పెట్టారు. విద్యార్థుల్లో నూతన చైతన్యాన్ని నింపిన ఈ కార్యక్రమంలో వీసీ యువరాజ్, ప్రదీప్, రామనాథన్, డాక్టర్ తులసీ రామ్నాయుడు, మారుతీ ప్రసాద్, శ్రీనివాసులు, ముస్తఫా, యుగంధర్, పోరెడ్డి శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొండకు నిప్పు.. చారిత్రక సంపదకు ముప్పు
కాలిపోతున్న కొండ కొండలో చెలరేగుతున్న మంటలు గుర్రంకొండ : చారిత్రాత్మక గుర్రంకొండ కొండకు నిప్పు పెట్టడంతో.. చారిత్రక సంపదకు ముప్పు ఏర్పడింది. ఈ కొండలోనే చారిత్రాత్మక కట్టడాలతోపాటు పురాతన భవనాలు, కోటగోడలు ఉన్నాయి. సుమారు 500 ఎకరాల్లో కొండ విస్తరించి ఉంది. శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండుగులు కొండకు వెనుకవైపు నిప్పు అంటించారు. దీంతో కొండలో సగానికిపైగా కాలిబూడిదైంది. కొండ ముందు భాగంలో ఉన్న కోటగోడలు, కొండపై భాగం వరకు మంటలు వ్యాపించాయి. దీంతో చెట్లు మొత్తం కాలిపోయాయి. మంటల్లో చిక్కుకొని అడవి జంతులు, పక్షులు అగ్నికి ఆహుతి అయ్యాయి. కొండ పరిసరాల్లో ఉన్న కొత్తపేట వీధి, పోలేరమ్మ వీధుల్లో దట్టమైన పొగలు కమ్ముకొన్నాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ప్రజలు భయాందోళన చెందారు. మంటలు అదుపు చేయడానికి పురావస్తు శాఖ సిబ్బంది, అధికారులు విశ్వప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కనీసం అగ్నిమాపక వాహనమైనా వస్తుందేమోనని గ్రామస్తులు ఫోన్ ద్వారా వారికి సమాచారం అందించారు. ఆయితే కొండలు, గుట్టల్లో చెలరేగే మంటలను తాము అదుపుచేయలేమని వారు తేల్చిచెప్పారు. దీంతో చేసేదేమీలేక మంటలను అలాగే వదిలేశారు. దీంతో దాదాపు కొండ మొత్తం కాలిబూడిదయ్యింది. గత కొన్ని రోజులుగా దుండుగులు కావాలనే గుర్రంకొండ పట్టణం చుట్టూ ఉన్న కొండలకు నిప్పు అంటిస్తుండడంతో.. కొండలు, గుట్టల్లో ఉన్న వృక్ష, జంతు సంపద కాలిబూడిదవుతోంది. -
ఉపాధ్యాయుడు సస్పెన్షన్
గుర్రంకొండ: మండలంలోని తరిగొండ జెడ్పీహైస్కూల్లో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన బయాలజీ ఉపాధ్యాయుడు జాకీర్ను డీఈవో సుబ్రమణ్యం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు హెడ్మాస్టర్ రామచంద్ర తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల ఉపాధ్యాయుడిపై తీరుపై విద్యార్థినిలు ఫిర్యాదు చేశారన్నారు. ఈసంఘటనపై రెండు రోజుల క్రితం మదనపల్లె డీవైఈవో లోకేశ్వరరెడ్డి విచారణ జరిపారన్నారు. ఈనేపథ్యంలో శనివారం సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు. మదనపల్లె సిటీ: విద్యార్థుల్లో నాయకత్వ లక్షణా లు, సృజనాత్మకత, వికసిత్ భారత్కు అవసరమైన దృక్పఽథాన్ని పెంపొందించేందుకు ప్రేరణ ఉత్సవ్ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోను తప్పకుండా నిర్వహించాలన్నారు. సీబీఎస్సీ, కేవీకే, జేఎన్వీ పాఠశాలలో పాటు అన్ని పాఠశాలలు స్కూల్ లెవల్ ప్రేరణ ఉత్సవ్లో పాల్గొనాలన్నారు. ఈనెల 10న పాఠశాల స్థాయిలో 8,9,11 తరగతుల విద్యార్థులకు వికసిత్ భారత్, సమాజం, దేశం కోసం నా భాగస్వామ్యం అంశాలపై తమ ప్రతిభను ప్రదర్శించేలా పోటీలు నిర్వహించాలన్నారు. విద్యార్థుల్లోని నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, సృజనాత్మకత వంటి ప్రమాణాల ఆధారంగా పాఠశాలకు ఇద్దరిని ఎంపిక చేస్తామని వివరించారు. పీలేరు రూరల్: పీలేరులో ఏర్పాటు చేసిన ఆర్డీవో కార్యాలయాన్ని జేసీ శివ నారాయణ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న పరిపాలన గదులను సందర్శించి, కేటాయించిన సిబ్బంది, పరిధిలోని మండలాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ప్రజల వద్ద నుంచి వచ్చే సమస్యలను సత్వరం పరిష్కరించాలన్నారు. రికార్డులను పరిశీలించి, కార్యాలయ ఆవరణలో పచ్చదనం పెంచాలన్నారు. అనంతరం తిరుపతి మార్గంలోని ఆయిల్ సీడ్స్ను సందర్శించి, దానికి కేటాయించిన భూమి వంటి వివరాలను తహసీల్దార్ శివకుమార్ను అడిగి తెలుసుకున్నారు. -
ఎఫ్ఎన్హెచ్డబ్ల్యూతో జీవన ప్రమాణాలు పెంపు
మదనపల్లె రూరల్: మహిళా స్వయంసహాయక బృందాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు దీనదయాళ్ అంత్యో దయ యోజన–నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్స్ మిషన్ చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమమే ఆహారం, పోషణ, ఆరోగ్యం, వాష్ (ఎఫ్ఎన్హెచ్డబ్ల్యూ) అని డీఆర్డీఏ పీడీ నాగేశ్వరరావు తెలిపారు. శనివారం మదనపల్లె మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో 15 మండలాలకు చెందిన వెలుగు ఏపీఎం, సీసీలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్ఎన్హెచ్డబ్ల్యూ ద్వారా కేవలం జీవనోపాధి కల్పన మాత్రమే కాకుండా ఆరోగ్యం, పారిశుధ్యంపై అవగాహన పెంచి, కుటుంబాల ఆరోగ్యాన్ని పెంచడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో భాగంగా స్వయంసహాయక బృందాల సభ్యు లు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు ఇంటింటికీ వెళ్లి గ్రామ సమావేశాల్లో అవగాహన కల్పించాలన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టులో మహిళలకు అందుతున్న సంక్షేమ పథకాలు, మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టిన రెండేళ్ల వరకు వేయి రోజుల కార్యక్రమం, గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, కిచెన్ గార్డెన్, సేంద్రియ వ్యవసాయం పథకాల్లో మహిళల పాత్రపై వివరించారు. సీడీపీఓ నాగవేణి, డీపీఎం ధర్మరాజు, ఏపీఎం ఖిజర్ హయత్ ఖాన్ పాల్గొన్నారు. డీఆర్డీఏ పీడీ నాగేశ్వరరావు -
● రూ.187 కోట్ల పనులు
మదనపల్లె: మదనపల్లె సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీకి మంజూరైన 15వ ఆర్థిక సంఘం నిధులు సద్వినియోగం ప్రశ్నార్థకమవుతోంది. మార్చి 31 నాటికి నిధులు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతే వెనక్కు వెళ్లే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నిధుల సద్వినియోగం బాధ్యత అధికారులపై ఉంది. ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. వివిధ కార్యక్రమాలు, అభివృద్ధి కోసం కౌన్సిలర్లు నిత్యం ప్రతిపాదనలు చేస్తూనే ఉన్నారు. రూ.45 కోట్ల నిధులు మదనపల్లె మున్సిపాలిటీకి 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరం వరకు రూ.45,11,28,679 నిధులు 15వ ఆర్థిక సంఘం నుంచి మంజూరయ్యాయి. ఇందులో టైడ్, అన్టైడ్ నిధులు కేటాయించారు. టైడ్ నిధులను స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ద్వారా చేపట్టే పనుల కోసం ఖర్చు చేస్తారు. ఇక్కడి నిధులను కార్పొరేషన్కు చెల్లిస్తే సంస్థ పనులు చేపడుతుంది. ఆన్టైడ్ నిధులను మున్సిపల్ అధికారులు కౌన్సిల్ తీర్మాణాల ఆధారంగా అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం టైడ్కు కేటాయించిన నిధులు అధికంగా ఉన్నాయి. ఈ మొత్తం నిధుల్లో రూ.16,57,36,372లు ఖర్చు చేశారు. ఇంకా రూ.28,53,92,302లు నిల్వ ఉన్నాయి. ఈ నిధులను పూర్తిగా వినియోగించుకునేందుకు మిగిలింది 52 రోజులే. మార్చి 31 సమీస్తున్నందున అధికారులు నిధులను ఎలా సద్వినియోగం చేస్తారన్న దానిపై ఆందోళన నెలకొంది. ఈ నిధులు పూర్తిగా సద్వినియోగం అవుతాయా .. వెనక్కు వెళ్తాయా అనేది అధికారుల పనితీరుపైనే ఆధారపడి ఉంది. రూ.4.82 కోట్ల పనులు రద్దు 2020–21లో 15వ ఆర్థిక సంఘం నిధులు సద్వినియోగం కాలేదు. ఈ నేపథ్యంలో అన్టైడ్కు సంబంధించి రూ.37 లక్షలు, టైడ్కు సంబంధించిన రూ.2.63 కోట్లు, కొత్త ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ఇవ్వాలన్న కారణంతో రూ.1.09 కోట్ల విలువైన 14 పనులను కాంట్రాక్టర్లు రద్దు చేసుకున్నారు. 2021–22లో రూ.63.10 లక్షల విలువైన 11 పనులు రద్దయ్యాయి. దీంతో ఆర్థిక సంఘ నిధులు రూ.4.82 కోట్లను సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. రెండేళ్లు కోవిడ్ కష్టాలు ప్రస్తుత మున్సిపల్ పాలకవర్గానికి కోవిడ్ కష్టాలు వెంటాడాయి. రెండేళ్లపాటు అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపింది. అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు కోవిడ్ నిబంధనలను పాటించాల్సి వచ్చింది. దానికితోడు లాకౌట్ పరిస్థితులు అభివృద్ధికి, 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి అడ్డంకిగా ఏర్పడింది. ఈ కారణంగా నిధుల వినియోగంలో కొంత జాప్యం జరిగింది. ఈ రెండేళ్లు నిధులను ఖర్చు చేయలేని పరిస్థితి వల్ల నిధులు నిల్వ పెరగడానికి కారణమైంది. మదనపల్లె మున్సిపాలిటీ పర్సులో రూ.కోట్ల నిధులు.. ఖర్చుకు మార్చి 31 వరకు గడువు వినియోగించకుంటే వెనక్కి వెళ్లే అవకాశం ప్రయత్నిస్తున్నాం నిధులను మార్చి 31లోగా వినియోగించుకునేలా ప్రయత్నాలు చేస్తు న్నాం. ఇప్పటికే అభివృద్ధికి వినియోగానికి సంబంధించిన చర్యలు చేపట్టాం. జరుగుతున్న పనులపై చర్యలు వేగవంతం చేశాం. కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయించేలా కృషి చేస్తున్నాం. –కే.ప్రమీల, కమిషనర్ ప్రస్తుత కౌన్సిల్ హయాంలో ఇప్పటిదాకా రూ.187.62 కోట్ల అభివృద్ధి చేపట్టింది. పట్టణ ప్రజలకు అవసరమైన మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంది. తాగునీరు, మురికినీటి కాలువలు, రోడ్లు, నీటి సరఫరా మెరుగు, పారిశుధ్యం తదితర వాటికి నిధులను వెచ్చించేందుకు కౌన్సిల్ తీర్మాణాలను ఆమోదించింది. సొంత నిధులు, జీజీఎంపీ, 15వ ఆర్థిక సంఘం నిధులతో ఈ వ్యయం చేశారు. తాజాగా రూ.10.96 కోట్లతో పనులు చేపడుతున్నారు. అందులో రూ.2.32 కోట్లతో 59 పనులు, రూ.3.67 కోట్లతో 40 పనులు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఇవిగాక రూ.4.96 కోట్లతో 110 పనులకు టెండర్లు నిర్వహిస్తున్నారు. వీటిలో పైప్లైన్, తాగునీటి బోర్లు, మురికినీటి కాలువల పనులు ఉన్నాయి. -
26న నూతన మఠాధిపతికి పట్టాభిషేకం
● మూడు రోజుల పాటు కార్యక్రమాలు ● ఘనంగా ఏర్పాట్లు బ్రహ్మంగారిమఠం(వైఎస్ఆర్ జిల్లా) : కాలజ్ఞాన ప్రభోదకర్త శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మఠం నూతన మఠాధిపతిగా శ్రీ వెంకటాద్రిస్వామి పట్టాభిషేకం ఈ నెల 26న ఘనంగా నిర్వహించనున్నారు. పూర్వపు మఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి 2021 మే 8న శివైక్యం చెందారు. తదుపరి మఠాధిపతి పదవీ కోసం వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి కుమారులు ఒకరికొకరు పోటీ పడటంతో జాప్యం జరిగింది. ప్రధానంగా పూర్వపు మఠాధిపతి పెద్ద భార్య జ్యేష్ట పుత్రుడు వెంకటాద్రిస్వామి, రెండవ భార్య మారుతి మహాలక్షుమ్మ పెద్ద కుమారుడు గోవిందస్వామి తీవ్రంగా పోటీ పడ్డారు. కోర్టు కేసులు నడిచాయి. చివరికి ధార్మిక పరిషత్ వెంకటాద్రిస్వామిని మఠాధిపతిగా నియమించింది. ఆయన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి 8వ తరం మునిమనవడు. ఇప్పటి వరకు బ్రహ్మంగారిమఠానికి 11 మంది మఠాధిపతులుగా బాధ్యతలు నిర్వర్తించారు. వెంకటాద్రిస్వామి 12వ మఠాధిపతి. 24 నుంచి కార్యక్రమాలు వెంకటాద్రిస్వామి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలు ఈ నెల 24 నుంచి 26 వరకు జరగనున్నాయి. 24న ఉదయం సుప్రభాతం, మంగళతోరణ బంధన, మృత్తికా స్నపనం, సర్వ ప్రాయశ్చిత్తాలు, ప్రత్యక్ష కృఛ్రత్రయాలు, వేదోపనిషత్ పారాయణ, మంగళద్రవ్యాలతో అధిష్టాన మూర్తి దైవదర్శనం, అనుజ్ఞ, సప్త గోప్రదక్షిణ పూర్వక గోపూజ, ప్రధాన సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవాచన, పంచగవ్య ప్రాశన, రక్షాబంధన, అఖండ స్థాపన, రుత్విగ్వరణ, ధీక్షాధారణ, ప్రధాన కలశ స్థాపన, ఆయుష్య సూక్త పారాయణ, రుగ్వేద, యజుర్వేద పారాయణ, సర్వతోభద్ర మండల, కాలచక్ర, నవగ్రహ, దిక్పాలక, అధిష్టాన మూర్తుల, పూర్వ మఠాధిపతుల స్మరణ ఆవాహన, అగ్ని ప్రతిష్టాపన, అష్ట ద్రవ్య సహిత విశేష గణపతి హోమం, షోడశోపచార పూజలు, మంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం అంకురార్పణ, నిత్య విధులు, వేద పారాయణం, నిత్య హోమం, మంత్రపుష్ప చతుర్వేద స్వస్తి, తీర్థ ప్రసాద వినియోగం తదితరాలు నిర్వహించనున్నారు. ● 25న ఉదయం వేదోపనిషత్ పారాయణ, గోపూజ, గణపతి పూజ, పుణ్యాహ వాచన, పంచగవ్య ప్రాశన, ఆవాహిత మండపార్చనలు, కూష్మాండ సూక్త పారాయణ, సూర్యోపాశన, సూర్య నమస్కారాలు, హోమం, సప్తసాగర జీవనదుల వైదిక పూర్వక కలశా వాహనములు, రుద్రహోమం, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాముల వారి కాలజ్ఞాన చూర్ణికా హోమాలు, దూపదీప నైవేద్య మంత్ర పుష్ప నీరాజన తీర్థ ప్రసాదాలు తదితర కార్యక్రమాలు చేపట్టనున్నారు. సాయంత్రం నిత్య విధులు, సామ్రాజ్య మహాలక్ష్మీ సూక్త పారాయణం, హోమాలు, సప్తసాగర జీవ నదులు మంత్ర జలాలతో విశేష స్నపనం, వైదిక హోమం, వేదపారాయణం, మంత్ర పుష్పం, చతుర్వేద స్వస్తి, తీర్థ ప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు ఉంటాయి. ● 26న ఉదయం వేద సూక్త పారాయణ, గణపతి పూజ, పుణ్యాహ వాచన, ఆవాహనాది దేవతా హోమాలు, సర్వశాంతర్థ్యం, రుద్రహోమం, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాముల వారి బీజాక్షర సహిత చూర్ణికా హోమం, జయాది హోమం, మహా పూర్ణాహుతి, సాగర నదీ జలాల ఆవాహిత జలాలను సమంత్రకంగా, ప్రధాన కలశంలోనికి సమ్మేళన చేయుట, అవబృథస్నానం, పట్టాభిషేక వేదిక ప్రవేశం, కిరీట, ఛత్ర, చామర, ఆందోళిక అంగుళ్యీభరణ, మకరకుండల, శిఖాముద్రిక, సింహతలాట, సంహాసనాది, పేనదండ, రుద్రాక్షమాల, పాదుకా పూజ, సుమూర్తానికి ధారణ, అధిష్టాన మూర్తిదర్శనం, వేద స్వస్తి పండిత సత్కారం కార్యక్రమాలు చేపడుతారు. సాయంత్రం నూతన మఠాధిపతుల అనుగ్రహ భాషణం, వేదోక్త మంగళశాసనాలు ఉంటాయి. అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి బ్రహ్మంగారిమఠం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని నూతన మఠాధిపతి శ్రీ వెంకటాద్రిస్వామి తెలిపారు. ఇంత వరకు అభివృద్ధి పనులు ఎంత వరకు జరిగాయి, ఇంకా ఏమి చేయాలి అనే దానిపై దృష్టి సారిస్తామని ఆయన పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఉండాలి అనే దానిపై పరిశీలిస్తామన్నారు. మఠం ప్రగతి కోసం కందిమల్లయ్యపల్లె పుర ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎండోమెంట్ అధికారుల సహకారం తీసుకుంటామన్నారు. బ్రహ్మంగారిమఠంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానం పట్టాభిషేకంపై చర్చిస్తున్న మఠాధిపతి, ఆస్థాన పండితులు (ఫైల్) మూడు రోజుల పాటు జరిగే పట్టాభిషేక మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మఠం అధికారులు, సిబ్బంది, స్వామి వారి శిష్యులు ఈ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనాలని పీఠాధిపతులు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులకు ఆహ్వాన పత్రికలను మఠం వారు అందజేసి పిలుస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉండటంతో.. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. -
నలుగురు అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్
రాయచోటి : బంగారు నగలు, మోటారుబైకుల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ము ఠాను అన్నమయ్య జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ .10.62 లక్షల విలువ చేసే నగలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. శుక్రవారం రాయచోటిలోని కార్యాలయంలో ఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించారు. రా యచోటి, రామాపురం మండలాల పోలీసులు సమన్వయంతో పని చేసి రెండు వేర్వేరు ఆపరేషన్లలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠాలను అరెస్టు చేశారన్నారు. రామాపురం పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న దర్సినాల ఏడుకొండలు, పందిటి ఉదయ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.10,62,320 విలువ గల 62 గ్రాముల బంగారం, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. అలాగే రాయచోటి బస్టాండ్ ప్రాంతంలో ప్రయాణికులను మోసగించి సొత్తు దోచుకుంటున్న జోగిరి వెంకటలక్ష్మి, జోగిరి అంజనమ్మను అరెస్టు చేశామన్నారు. వారి నుంచి లాంగ్ చైన్, చోకర్ కమ్మలు, నెక్లెస్లను రికవరీ చేసినట్లు వివరించారు. బంగారు ఆభరణాల విషయంలో ప్రజలు స్వయం రక్షణ పా టించాలని ఎస్పీ సూచించారు. బస్టాండ్, రైల్వేస్టేషన్ల లో విలువైన ఆభరణాలు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి వ్యాపారి సంస్థ, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరస్తులను త్వరగా పట్టుకోవచ్చని తెలియపరిచారు. మీ వీధి లేదా పరిసరాలలో కొత్త వ్యక్తులు అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే 112కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. నేరస్తులను చాకచక్యంగా పట్టుకున్న అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు బహుమతులు అందజేశారు. రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణ మోహన్, లక్కిరెడ్డిపల్లి సీఐ హెచ్ కృష్ణమరాజు నాయ క్, రాయచోటి ఇన్స్పెక్టర్ బీవీ చలపతి, రామాపురం ఎస్ఐ కేవీ శివకుమార్, రాయచోటి ఎస్ఐ విష్ణువర్దన్, పీసీలు అబ్దుల్ కలాం, శ్రీనివాసులు, రవీంద్రరాజు, నవీన్ కుమార్, సీసీఎస్ సిబ్బంది బర్కత్, మహేంద్ర, హోంగార్డులు గంగిరెడ్డి, తహర్బాషాలకు ఎస్పీ నగదు రివార్డులు ఇచ్చి ప్రోత్సహించారు. రూ .10.62 లక్షల నగలు స్వాధీనం -
నాటు ఆవుకు పుంగనూరు దూడ జననం
చౌడేపల్లె మండలంలోని దుర్గసముద్రం పంచాయతీ దాదేపల్లెకు చెందిన షేక్ రాహుల్కు చెందిన నాటుఆవు(అల్లికారుజాతి)కు శుక్రవారం పుంగనూరు జాతి దూడ జన్మించింది. పశువైద్య సిబ్బంది సూచనల మేరకు పుంగనూరు జాతి సెమన్ వేయించామని, అంతేకాక వారి సలహాలు పాటించడంతో పుంగనూరు జాతి పేయిదూడ జన్మించిందని రాహుల్ తెలిపారు. చిన్నపాటి ఎత్తు గల పుంగనూరు మేలు జాతి దూడను చూసేందుకు గ్రామస్తులు క్యూకట్టారు. ఈ జాతి దూడలు, ఆవులకు మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంది. – చౌడేపల్లె ఆక్రమణల తొలగింపు షురూ మదనపల్లె : మదనపల్లె పట్టణంలోని రోడ్లకు ఇరువైపులా ఆక్రమణల తొలగింపు చర్యలు మొదలయ్యాయి. శుక్రవారం పటేల్రోడ్డులో అక్రమంగా నిర్మించిన కట్టడాలను జేసీబీలతో తొలగించారు. దుకాణ దారులు రహదారిని ఆక్రమించి దానిపై మెట్లు, బోర్డులు, వాహనాల పార్కింగ్ కోసం, దుకాణాలకు వచ్చేవారికి విశాలమైన స్థలం ఉండేలా ఇలాంటి ఆక్రమణలను చేశారు. వీటిని ఇప్పుడు తొలగిస్తున్నారు. ఈ రహదారి పక్కనే ఆస్పత్రి ఉండగా దాని కాంపౌండ్ గోడవైపు మొత్తం రోడ్డు ఆక్రమించారు. వాటిపై నిర్మాణాలు, బంకులు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీటిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకొంటారో అని స్థానికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, వీధుల్లో ఇలాగే ఆక్రమణలను తొలగిస్తారా లేదా అని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. పూర్తి స్థాయి చర్యలపై అనుమానాలు -
భక్తిశ్రద్ధలతో లక్ష కుంకుమార్చన
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో మాఘమాసం నెలలో అత్యంత వైభవంగా నిర్వహించే లక్ష కుంకుమార్చన పూజలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా వేద పండితులు, అర్చకుల మంత్రోచ్చారణల మధ్య ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు చేసి, దంపతులకు పూజా సామగ్రి అందజేశారు. అమ్మవారి ఉత్సవమూర్తి ఎదుట ప్రత్యేక పూజలు, గణపతి, చండీహోమం, పూర్ణాహుతి, మహా మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుమునుపే రూ.1500 చెల్లించిన ఉభయదారుల దంపతులతో వేద పురోహితులు అమ్మవారి సన్నిధిలో పూజలు చేయించారు. ఈ కార్యక్రమానికి 332 జంటల దంపతులు హాజరై భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయంలో రద్దీ నెలకొంది. పూజా కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రమాదాల నివారణపై అవగాహన అవసరం కలకడ : హెచ్పీసీఎల్ గ్యాస్, పెట్రోల్, డీజిల్ పైప్లైన్ వద్ద ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని కడప డీఎఫ్ఓ ఆదినారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని దేవుపల్లె పంచాయతీలో సర్పంచ్ వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించిన ఆఫ్సైట్ మాక్డ్రిల్ కార్యక్రమం హెచ్పీసీఎల్ కంపెనీ చీఫ్ మేనేజర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. డీజిల్ పైప్ లీకేజీ అయినా, ప్రమాదం సంభవించినా ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు సమాచారం అందించడం, ప్రమాదం జరిగినా తీసుకోవాల్సిన జాగ్రత్తలను మాక్డ్రిల్లో చేసి చూపించారు. రైతుల పొలాల్లో తీసిన డీజిల్ పైప్లైన్ గత 10 ఏళ్లుగా ఎక్కడా లీకేజీలు లేవని, ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్లాంట్ చీఫ్ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, రైతుల అభివృద్ధికి సంస్థ నుంచి నిధులు కేటాయింపునకు కృషి చేస్తుట్లు మేనేజర్ చిన్నారావు తెలిపారు. తహసీల్దార్ మహేశ్వరిభాయ్, ఎస్ఐ రామాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు. నాలుగు 104 అంబులెన్స్లు అపహరణ – డీఎంహెచ్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు రాయచోటి : దొంగల కన్ను నిల్వ ఉంచిన ప్రభుత్వ వాహనాలపై పడింది. సర్వీసు ముగిసి శిథిలావస్థకు చేరిన వాహనాలను డీఎంహెచ్ఓ కార్యాలయ అధికారులు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణం నుంచి పట్టణ పరిధిలోని డంపింగ్ యార్డ్ ఆవరణలోకి తరలించారు. యార్డులో నిల్వ ఉంచిన నాలుగు 104 వాహనాలను గుట్టు చప్పుడు కాకుండా తరలించుకుపోయినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం అన్నమయ్య జిల్లా డీఎంహెచ్ఓ లక్ష్మీనరసయ్య ఫిర్యాదు మేరకు రాయచోటి అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు 108తోపాటు 104 (గ్రామీణ సంచార వైద్యశాల) వాహనాలను వినియోగంలోకి తెచ్చారు. ఈ వాహనాలలో నాలుగు వాహనాలకు సర్వీస్ ముగియడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రి ఆవరణలో నిల్వ ఉంచారు. ఆసుపత్రి ఆవరణ పరిధిలో నిర్మాణ పనులు ఉండడంతో.. వాటిని మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ ఆవరణలోకి తరలించారు. కొన్ని నెలలుగా వాటిపై దృష్టి పెట్టకపోవడంతో పసిగట్టిన దొంగలు ఆ వాహనాలను గుట్టు చప్పుడు కాకుండా తరలించుకు వెళ్లినట్లు సమాచారం. శిథిలావస్థ దశకు చేరుకున్న ఈ వాహనాల విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. యార్డులో సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా.. నిల్వ ఉంచిన వాహనాలను ఎప్పుడు? ఎలా? తీసుకెళ్లారన్న విషయం అర్థం కావడం లేదు. శుక్రవారం ఉదయం అందిన సమాచారం మేరకు లక్ష్మీనరసయ్య ఆ ప్రాంతాన్ని పరిశీలించి అనంతరం రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఉపాధ్యాయుడి తీరుపై డీవైఈవో విచారణ
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ జెడ్పీ హైస్కూల్లో బయాలజీ సైన్స్ ఉపాధ్యాయుడు జాకీర్ తీరుపై మదనపల్లె డీవైఈవో లోకేశ్వర్రెడ్డి విచారణ చేశారు. తదుపరి చర్యల కోసం ఆయన డీఈవోకు నివేదిక పంపారు. కాగా ఉపాధ్యాయుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక జెడ్పీ హైస్కూల్లో జాకీర్ కొంత కాలంగా బయాలజీ సైన్స్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. వారం రోజుల క్రితం షీటీమ్ సభ్యులు స్థానిక జెడ్పీ హైస్కూల్లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుడ్టచ్, బ్యాడ్టచ్లపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. దీంతో హైస్కూల్లో చదువుతున్న కొంత మంది విద్యార్థినులు సదరు ఉపాధ్యాయుడి తీరుపై ఫిర్యాదు చేశారు. దీంతో హెడ్మాస్టర్ రామచంద్ర జరిగిన సంఘటనపై విద్యార్థినులు, వారి తల్లిదండ్రులను విచారణ చేశారు. విచారణ నివేదికను డీవైఈవో, డీఈవోకు అందజేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం స్థానిక జెడ్పీ హైస్కూల్కు మదనపల్లె డీవైఈవో లోకేశ్వర్రెడ్డి వచ్చారు. ముందుగా ఎంఈవో సురేంద్రబాబుతో కలిసి హెడ్మాస్టర్, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడి ప్రవర్తన, తీరుపై పూర్తి స్థాయిలో విచారణ చేశారు. ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేసిన విద్యార్థినులతో వేర్వేరుగా విచారించారు. ఓ ప్రత్యేక గదిలో విద్యార్థినులకు తెల్లకాగితాలు ఇచ్చి సదరు ఉపాధ్యాయుడి తీరుపై లిఖిత పూర్వకంగా వారి వద్ద నుంచి వివరాలు సేకరించారు. మరో గదిలో విద్యార్థినుల తల్లిదండ్రులకు తెల్లకాగితాలు ఇచ్చి ఉపాధ్యాయుడి తీరుపై అభిప్రాయాలు సేకరించారు. ఈ మొత్తం విచారణ నివేదికలను డీఈవోకు సమర్పిస్తామని డీవైఈవో పేర్కొన్నారు. జిల్లా సీ్త్రశిశు సంక్షేమ శాఖ అధికారులు, మహి ళా పోలీసులు, మండల విద్యా శాఖ అధికారులు ఈ సంఘటనపై విచారణ జరపడం గమనార్హం. పోక్సో కేసు నమోదు మండలంలోని తరిగొండ జెడ్పీ హైస్కూల్లో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు జాకీర్పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవీంద్రబాబు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయుడు జాకీర్ పలువురు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్నారు. బాధిత విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తమకు శుక్రవారం ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వివరించారు. చర్యలకు డీఈవోకు నివేదిక -
అత్యాచారయత్నంపై ఫిర్యాదు
మదనపల్లె టౌన్ : కురబలకోట మండలం తుమ్మచెట్లపల్లెలో గురువారం రాత్రి స్థానికుడైన సురేంద్ర (59)పై అదే గ్రామానికి చెందిన రమణ వర్గీయులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన వెనుక పాత కక్షలు కారణమని తెలుస్తోంది. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి డీఎస్పీ కార్యాలయాలనికి శుక్రవారం వచ్చి తనపై అత్యాచారయత్నం చేశారని ఆరోపిస్తూ డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. నిందితులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరింది. ఒంటరి వ్యక్తిపై అమానుష దాడి – పార్టీ స్టిక్కర్ తీయకపోవడంతో కొట్టిన వైనం మదనపల్లి టౌన్/కురబలకోట : అయిన వారు ఎవరూ లేక ఒంటరిగా జీవిస్తున్న మండలంలోని తుమ్మచెట్లపల్లికి చెందిన జరిపిటి సురేంద్ర(56)పై అమానుష దాడి జరగడంతో పలువురిలో విచారం వ్యక్తమవుతోంది. గురువారం రాత్రి ఇతనిపై సమీప బంధువులే విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్ర రక్తగాయాలకు గురి చేసిన విషయం తెలిసిందే. తిరుపతి ఆసుపత్రిలో దయనీయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. జరిపిటి సురేంద్రకు తల్లిదండ్రులు చనిపోయారు. భార్య ఎప్పుడో వెళ్లిపోయింది. అతని వద్ద ఎవ్వరూ లేరు. ఒంటరిగా ఉంటున్నాడు. ఇల్లు తప్ప ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. గతంలో మద్యం తాగేవాడు. ఆరేళ్లుగా మద్యం కూడా మానేసి మారిన మనిషిగా ఊరిలో పేరు తెచ్చుకున్నాడు. తెలిసిన వారు పిలిస్తే పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. కలకలం రేపిన సంఘటనపై శుక్రవారం గ్రామంలో ఎస్ఐ మధు రామచంద్రుడు విచారణ జరిపారు. బాధితుడు సురేంద్రకు టూవీలర్ ఉంది. దీనిపై ఓ పార్టీకి చెందిన స్టిక్కర్ వేసుకున్నాడు. గురువారం రాత్రి ఇంటికి వచ్చిన అతన్ని పక్కింట్లో ఉన్న రమణయ్య టూవీలర్పై ఉన్న స్టిక్కఽర్ తొలగించాలన్నాడు. దీంతో మాటకుమాట పెరిగి వివాదం చోటుచేసుకుంది. ఇది కాస్తా దాడికి దారి తీసింది. ప్రత్యర్థులు రమణయ్యతోపాటు ఐదుగురు ఇతనిపై అమానుషంగా కట్టెలు, రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. తీవ్ర రక్తగాయాలు అయినట్లు విచారణలో తేలినట్లు ఎస్ఐ తెలిపారు. ఒక చెయ్యి కూడా విరిగిపోయింది. శుక్రవారం ముదివేడు పోలీసులు తిరుపతి ఆసుపత్రికి వెళ్లి స్టేట్మెంట్ రికార్డు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రమణయ్యతోపాటు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా ఈ సంఘటన పరిసర ప్రాంతాల్లో కలకలాన్ని సృష్టించింది. యువతి అదృశ్యం రాయచోటి : మతిస్థిమితం లేని యువతి షేక్ షమీమ్(31) రాయచోటిలో అదృశ్యమైనట్లు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. గురువారం సాయంత్రం కడపకు వెళ్లడానికి నారాయణరావు కుమార్తె షమీమ్తో కలిసి ఇంటి నుంచి బస్టాండుకు చేరుకున్నారు. కుమార్తెను బస్టాండులో వదిలి బైక్ పార్క్ చేసి తిరిగి వెళ్లే సమయానికి కుమార్తె కనిపించలేదు. రోజంతా వెతికినా కనిపించకపోవడంతో శుక్రవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తండ్రి నారాయణరావు తెలిపారు. ఫిర్యాదు పై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు అర్బన్ పోలీసులు పేర్కొన్నారు. -
ఆపుకోలేని ఆవేదన
రాజంపేట: ఉమ్మడి జిల్లా రైలుమార్గంలో నంద్యాల–రేణిగుంట మధ్య నడిచే డెమోరైలులో ప్రయాణికులకు కనీస వసతులు కరువయ్యాయి. మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేకపోవడంతో కాలకృత్యాలు తీర్చుకునేందుకు అవస్థలు పడుతున్నారు. మహిళలు చెప్పుకోలేని పరిస్థితిలో అల్లాడిపోతున్నారు. ఒక్కోసారి చాలా మంది మరుగుదొడ్లలో ఉండగానే రైలు వెళ్లిపోయిన సంఘటనలు ఉన్నాయి. ప్రయాణికులు సంక్షేమానికి పెద్దపీట అని చెప్పుకునే మోదీ ప్రభుత్వంలో రైల్వేశాఖ పనితీరుకు డెమోలో నరకప్రయాణం అద్దంపడుతోంది. సప్తగిరిలో పెట్టిన తరహాలో.. తిరుపతి–చైన్నె మధ్య నడిచే సప్తగిరిలో మరుగుదొడ్లు ఏర్పాటుచేశారు. ఆ తరహాలో డెమోలో ఏర్పాటుచే యాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు ప్రయాణికులు కూడా సప్తగిరిలో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడ్డారు. అయితే వారు ఈ విషయంపై తరచూ ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు స్పందించి మరుగుదొడ్లు ఏర్పాటుచేశారు. అదే విధంగా ప్రయాణికుల ఆవేదనను అర్థం చేసుకొని పరిష్కారదిశగా విశాఖ జోన్ అధికారులు నిర్ణయాలు తీసుకోవాలి. డెమోకు పెరుగుతున్న ఆదరణ పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు ప్రాముఖ్యత కలిగిన స్టేషన్లలో హాల్టింగ్స్ను ఎత్తివేశారు. కోవిడ్–19 ముందు ఉన్న హాల్టింగ్స్ ఇప్పుడు లేకపోవడంతో ప్రయాణికులు నంద్యాల–రేణిగుంట ఽమధ్య నడిచే డెమో రైలుపై ఆధారపడుతున్నారు. ఫలితంగా ఈ రైలు రద్దీగానే తిరుగుతోంది. 8 గంటల ప్రయాణంలో నరకం.. నంద్యాలలో 5.30కు బయలుదేరి రేణిగుంటకు 12.30 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి 1.45 కు బయలుదేరి రాత్రి 9.30గంటలకు నంద్యాలకు చేరుకుంటుంది. దాదాపు 8 గంటలకుపైగా డెమోలో ప్రయాణం కొనసాగుతుంది. నంద్యాల, వైఎస్సార్, తిరుపతి జిల్లా వాసులు ఈ రైలును ఆశ్రయిస్తున్నారు. మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. రైలు ఆగితే స్టేషన్లోకి పరుగులు.. మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేని పరిస్థితుల్లో తమ అవససరాలు తీర్చుకునేందుకు రైలు ఆగగానే సేష్టన్లో ఉన్న మరుగుదొడ్ల వద్దకు పరుగులు తీసుకున్నారు. ఇటీవల రాజంపేట, రైల్వేకోడూరు స్టేషన్లో ఇటాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రయాణికుల చెప్పుకోలేని ఆవేదనను రైల్వేశాఖపరిగణనలోకి తీసుకోలేదు. స్టేషన్ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదు. నీటిసౌకర్యం, మరుగుదొడ్లు లేకపోవడం వల్ల గంటలతరబడి వృద్ధులు, పిల్లలు, మహిళలు అవస్థలు పడుతున్నారు. డెమో ప్యాసింజర్ డెమో రైలులో ప్రయాణికులు డెమో రైలును కాకుండా సాధారణ బోగీల (ఫార్మిసిన్)తో నడిపించాలని నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. డెమో రైలులో ప్రయాణం ఇబ్బందికరంగా ఉందని వాపోతున్నారు. అయితే యాత్రీకులు డెమోలాంటి రైళ్లలో ప్రయాణం బరువని, జనరల్ బోగీలతో నంద్యాల–రేణిగుంట రైలును నడిపించే అంశాన్ని రైల్వేశాఖ పరిశీలించాలని కోరుతున్నారు. డెమో రైలులో మరుగుదొడ్లు కరువు ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు పట్టించుకోని రైల్వేశాఖ మౌలిక సదుపాయాలు కల్పించాలి డెమో రైలు బాత్రూం, మరుగుదొడ్లు లేకపోవడంతో ఆపుకోలేని ఆవేదనతో ప్రయాణం చేయాల్సిన దుస్ధితి నెలకొంది. ఈ రైలు ప్రారంభం నుంచి సమస్య కొనసాగుతోంది. రైల్వే అధికారులు స్పందించి డెమోలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. –షమీవుల్లాఖాన్, న్యాయవాది, నందలూరు రైల్వే అధికారులు స్పందించాలి కడప, నంద్యాల, తిరుపతి జిల్లాలను కలుపుతూ నడిచే డెమో రైలులో ప్రయాణికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ రైలులో మరుగుదొడ్డు ఏర్పాటుచేయాలి..లేదా ఫార్మిసిన్ మార్చాలి. సమస్యలపై రైల్వే అధికారులు వెంటనే స్పందించాలి. –రాజశేఖర్రెడ్డి, డీఆర్యూసీసీ మాజీసభ్యుడు, నందలూరు -
భారీగా నష్టపోయా
గత ఏడాది నవంబరు నెలలో దుక్కి చేసి నారు నాటి, కర్రలు కట్టి, ఎరువులు వేసి నాలుగు ఎకరాల్లో టమాట పంట సాగు చేశాను. పెట్టుబడిగా రూ.11 లక్షల వరకు ఖర్చు చేసి పంటను సాగు చేశాను. గత జనవరిలో పంట చేతికి రాగా 15 కిలోల ట్రే ధర రూ.100 పలికింది. దూర ప్రాంతాల మార్కెట్కు తరలిస్తే కనీసం వాహన అద్దె, కూలీలకు సరిపోదు. నేడు మరీ దారుణంగా బాక్సు రూ.20కు కూడా కొనేవారు లేరు. టమాట సాగు చేసి రూ. 5 లక్షల వరకు నష్టపోయాను. – టీఎస్ సుహైల్బాషా, రైతు, కలకడ వ్యవసాయం దండగ అనిపిస్తోంది అప్పు చేసి పెట్టుబడులు పెట్టడం, అర్ధరాత్రి వరకు కాపలా, ఇంటిల్లిపాది కష్టపడితే నేడు కొనుగోలు చేసేవారు లేరు. తోటపై వదిలేస్తే ఉన్న చెట్టుకు నష్టం వాటిల్లుతుంది. మార్కెట్కు తరలించాలన్నా వాహనాల అద్దె, ఇతర ఖర్చులు రావడం లేదు. పంట సాగు కోసం చేసిన రూ.2 లక్షల అప్పు అలాగే ఉంది. పరిస్థితులు గమనిస్తే వ్యవసాయమే దండగ అనిపిస్తోంది. కష్టానికి తగ్గ కూలి కూడా మిగలడం లేదు. – మద్దిపట్ల సిద్దయ్యనాయుడు, రైతు, కలకడ మండలం -
నానో ఎరువులతో పెరగనున్న పంటల దిగుబడి
మదనపల్లె రూరల్: నానో ఎరువుల వాడకంతో పంటల నాణ్యత, దిగుబడి గణనీయంగా పెరుగుతాయని జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వ్యవసాయశాఖ, ఇఫ్కో సహకార సంస్థ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా ఎరువులు, పురుగుమందుల వ్యాపారులకు నానో ఎరువులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ శివనారాయణ మాట్లాడుతూ... జిల్లాలోని పలు పంటల్లో నిర్వహించిన క్షేత్రపరీక్షల ఫలితాల ఆధారంగా నానో ఎరువులు మంచి దిగుబడులు ఇస్తున్నాయని తెలిపారు. వీటి పోషకాల శోషణ సామర్థ్యాన్ని పెంచి, పర్యావరణ హితంగా ఉంటూ, సంప్రదాయ రసాయన ఎరువుల వాడకాన్ని 20 నుంచి 25 శాతం తగ్గిస్తాయన్నారు. మొక్కలకు అవసరమైన పోషకాలను నేరుగా అందించడంతో పంట ఆరోగ్యం పెరుగుతుందన్నారు. నానో యూరియా వాడకం వల్ల నేల ఆరోగ్యం బాగుంటుందన్నారు. మండల వ్యవసాయాధికారి నవీన్రెడ్డి మాట్లాడుతూ..విచక్షణా రహితంగా వాడుతున్న ఎరువుల కారణంగా నేలకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. ప్రత్యామ్నాయ ఎరువులైన నానో ఎరువులు, జీవ ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.


