Annamayya
-
పూర్తయిన పనులను ఉగాది రోజున ప్రారంభించాలి
● జిల్లా కలెక్టర్ శ్రీధర్ రాయచోటి: పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో పూర్తయిన పల్లె పండుగ పనులను ఉగాది రోజున ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ శాఖ సిబ్బంది, వీఆర్ఓలు, సర్వే సిబ్బంది, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖ సిబ్బంది తదితరులతో పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలు, రెవెన్యూ సదస్సుల ద్వారా అందిన అర్జీలు, రీ సర్వే, ఇళ్లపట్టాల రీ వెరిఫికేషన్, పల్లె పండుగ కార్యక్రమాలు, ఎన్టీఆర్ హౌసింగ్, పి–4 సర్వే తదితర అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పూర్తయిన పల్లె పండుగ పనుల ప్రారంభోత్సవానికి ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని ఉగాది రోజున ప్రారంభించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్ఓ మధుసూదన్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యువతకు ఉచిత శిక్షణ కడప కోటిరెడ్డిసర్కిల్: డీడీయూ జీకేవై ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, జూనియర్ సాఫ్ట్వేర్ వెబ్ డెవలపర్, బ్యూటీషియన్ కోర్సు ల్లో 4 నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని అడ్మిషన్స్ కో–ఆర్డినేటర్ హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 18–35 ఏళ్లలోపు కలిగి టెన్త్ ఉత్తీర్ణులై ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ పాస్ లేదా ఫెయిల్ అయిన వారు ఇందుకు అర్హులని పేర్కొన్నారు. కడప నగరంలోని నిహార్ స్కిల్ సెంటర్లో శిక్షణ ఇస్తామన్నారు. ఈనెల 24 నుంచి బ్యాచ్ ప్రారంభిస్తున్నామన్నారు. -
రామయ్య క్షేత్రానికి రైళ్లేవి?
ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని క్షేత్రంలో ఉన్న రైల్వేస్టేషన్ దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఓ వైపు టీటీడీ వార్షిక బ్రహ్మోత్సవాలను కోట్లాది రూపాయిలు వెచ్చించి వైభవంగా నిర్వహిస్తుంటే.. దూర ప్రాంతాలకు చెందిన వారు ఈ వైభవం, ఆలయం ప్రాశ్యస్తంను తెలుసుకునేందుకు రావాలంటే రైలు సౌకర్యం లేదు. టీటీడీ చొరవతో అయినా ఒంటిమిట్ట రైల్వేస్టేషన్ బాగుపడుతుందా అని భక్తులు ఎదురుచూస్తున్నారు. రాజంపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు భద్రాచలం అధికారిక రామాలయంగా భాసిల్లింది. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఆంధ్రా భద్రాచలంగా ఒంటిమిట్ట కోదండరామాలయం అధికారిక రామాలయంగా ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలను చేపడుతూ వస్తోంది. రెండవ అయోధ్యగా..ఏకశిలానగరంగా పిలవబడుతున్న ఒంటిమిట్ట రైల్వేస్టేషన్కు భక్తులు చేరుకునేందుకు రైలే లేదు. ఉన్న ఏ రైలూ ఆగదు. ఏటా ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈయేడాది ఏప్రిల్ 5 నుంచి ఉత్సవాలను వైభవంగా ప్రారంభించేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది. కానీ సౌత్ సెంట్రల్ రైల్వే తమ వంతు బాధ్యతగా ఒంటిమిట్టకు భక్తులు చేరుకునేందుకు కల్పించిన రైలు సౌకర్యం శీతకన్ను పెట్టిందనే విమర్శలున్నాయి. ఒంటిమిట్ట రామయ్య చెంతకు చేరుకునేందుకు భక్తులకు వీలులేని పరిస్థితులు దాపురించాయి. భద్రాచలం తరహాలో స్టేషన్ అభివృద్ధి ఏదీ? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భద్రాచలం రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేసిన తరహాలోనే ఒంటిమిట్ట రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే దక్షిణ మధ్య రైల్వే శీతకన్ను చూపుతోందనే అపవాదును మూటకట్టుకుంది. ముంబాయి–చైన్నె కారిడార్ రైలుమార్గంలో నడిచే ప్రతి రైలుకు ఒంటిమిట్టలో స్టాపింగ్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని భక్తులు, ఆధ్యాత్మిక వేత్తలు అంటున్నారు. ప్రస్తుతానికి డెమో ఒక్క రైలు మాత్రం ఉదయం, సాయంత్రం ఆగుతుంది. కోవిడ్ ముందు నడుస్తున్న ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒంటిమిట్టను ఆంధ్రా భద్రాదిగా గుర్తించి, అభివృద్ధి చేస్తుంటే రైల్వేశాఖ తన వంతు పాత్రను పోషించడం లేదు. పల్లె స్టేషన్లాగే రైల్వేశాఖ భావిస్తోంది. ఒక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఒంటిమిట్టను పరిగణనలోకి తీసుకోలేదు. ఒంటిమిట్ట, భద్రాచలం రెండు పుణ్యక్షేత్రాలు దక్షిణ మధ్య రైల్వేలోనే ఉండేది. భద్రాచలం స్టేషన్కు ఇస్తున్న ప్రాధాన్యతను ఒంటిమిట్టకు ఇవ్వడం లేదంటే వివక్షను ప్రదర్శించినట్లేనని భక్తులు భావిస్తున్నారు. రైలు సౌకర్యంపై దృష్టి పెట్టని టీటీడీ .. ఒంటిమిట్ట రామాలయం టీటీడీలో విలీనమైంది. అయితే ఎంతసేపు రామాలయం అభివృద్ధి వరకు దృష్టి కేంద్రీకరించింది. అయితే రామయ్య క్షేత్రానికి భక్తులు వచ్చేందుకు అవసరమైన సౌకర్యాలపై దృష్టి సారించలేదన్న విమర్శలున్నాయి. ఒంటిమిట్టకు భక్తులు వచ్చేలా రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని టీటీడీ రైల్వేబోర్డును కోరితే తప్పకుండా స్పందిస్తుందని రైల్వే వర్గాలు చెపుతున్నాయి. ఈవో భక్తులకు రైలు సౌకర్యం కల్పించే విషయంసౌ దృష్టిపెట్టాలని రాష్ట్రంలోని పలు ప్రాంతాల భక్తులు కోరుతున్నారు. కొత్తజోన్లో అయినా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఎస్సీ రైల్వేలో ఏపీకి ప్రత్యేకంగా జోన్ ఏర్పాటైంది. విశాఖజోన్కే తలమానికం ఒంటిమిట్ట రామాలయం. అధికారికంగా గుర్తించిన రామాలయం ఇదే. అటువంటప్పుడు కొత్త జోన్ వల్ల రామాలయం ఉన్న ఒంటిమిట్ట స్టేషన్కు గుర్తింపు వస్తుందన్న ఆశలున్నాయి. దూరప్రాంత భక్తులెలా వచ్చేది.. దూర ప్రాంత భక్తులు రైలుమార్గంలో రామయ్య చెంతకు వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు ఒంటిమిట్ట రామయ్య దర్శనానికి వస్తున్నారు. భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్ మీదుగా భక్తులు వచ్చేందుకు వీలుగా రైళ్లు నడుస్తున్నాయి. ఒంటిమిట్ట స్టేషన్పేరుకు మాత్రమే ఉంది. నవమి బ్రహ్మోత్సవాలు, స్వామివారి కళ్యాణం రోజున లక్ష లాది మంది భక్తులు ఒంటిమిట్టకు చేరుకుంటారు. ఒంటిమిట్ట స్టేషన్ అభివృద్ధి చేయాలంటూ ప్రజాప్రతినిధులు గళం విప్పుతున్నారు. అయినా రైల్వేశాఖలో ఎటువంటి స్పందన కనిపించలేదన్న విమర్శలున్నాయి. ఒంటిమిట్ట కోదండ రామాలయానికి రైలుమార్గంలో వచ్చేదెలా..? భద్రాచలం తరహాలోస్టేషన్ అభివృద్ధి ఏదీ? మొన్నటి వరకు ఒంటిమిట్ట, భద్రాచలం రెండు ఎస్సీ రైల్వేలోనే .. విశాఖ జోన్కే తలమానికంఒంటిమిట్ట రామాలయం ఒంటిమిట్టపై రైల్వేశాఖ వివక్ష భక్తులకు రైలు సౌకర్యంపై దృష్టిపెట్టని టీటీడీ రైల్వే మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళతాం టీటీడీ ఒంటిమిట్ట కోదండ రామాలయంకు ప్రత్యేక గుర్తింపు ఇస్తోంది. మరి ఎందుకు రైల్వేశాఖ వివక్ష చూపుతోంది. రాజంపేట ఎంపీ పీవీ మిథున్రెడ్డి ద్వారా ఒంటిమిట్ట రైల్వేస్టేషన్లో రైళ్ల హాల్టింగ్, స్టేషన్ అభివృద్ధి అంశాలను రైల్వే మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళతాం. తెలంగాణాలో ఉన్న భద్రాచలం రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేసి, రైలు సౌకర్యం కల్పించినప్పుడు ఆంధ్రా భద్రాచలం రైల్వేశాఖకు కనిపించలేదా. భక్తులు ఒంటిమిట్టకు చేరుకునేందుకు ఒక్కరైలు కూడా అందుబాటులో లేదు. – తల్లెం భరత్రెడ్డి, డీఆర్యుసీసీ సభ్యుడు భక్తుల రాకకు రైలు మార్గమే అనుకూలం దూరప్రాంతాల నుంచి భక్తులు ఒంటిమిట్టకు చేరుకునేలా రైలు సౌకర్యం కల్పించాలి. భక్తులకు ఏ విధంగా భద్రాచలం రైల్వేస్టేషన్ సౌకర్యంగా ఉందో, అలాగే ఒంటిమిట్టను మార్చాలి. ఏపీకి అధికారిక రామాలయంగా గుర్తించారు. అదే రీతిలో రైల్వేపరంగా భక్తులకు సౌకర్యాల ఏర్పాటుకు కృషిచేయాలి. కనీసం కళ్యాణం రోజైనా స్టాపింగ్ కల్పించాలి. ఎంపీలు పీవీ మిథున్రెడ్డి, మేడా రఘునాఽథ్రెడ్డిల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళతాం. –తంబెళ్ల వేణుగోపాల్రెడ్డి, డీఆర్యుసీసీ సభ్యుడు -
జెడ్పీ ఛైర్మన్ ఎన్నికలపై మంతనాలు
కడప కార్పొరేషన్: జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈనెల 27వ తేది నిర్వహించే జెడ్పీ చైర్మన్ ఎన్నికలపై వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు చర్చించారు. గురువారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి అధ్యక్షతన వారు సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షుడు అకేపాటి అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇస్రో పిలుస్తోంది... వెళ్దాం రండి..!
మదనపల్లె సిటీ: అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏటా యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) నిర్వహిస్తోంది. ఈ ఏడాది చేపట్టబోయే కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా తొమ్మిదో తరగతి విద్యార్థులను ఆహ్వానిస్తోంది. ఆ సంగతులేంటో తెలుసుందాం రండి. అంతరిక్ష పరిశోధనల్లో ఇటీ వల ఇస్రో వంద ప్రయోగాలను పూర్తి చేసుకుంది. ఈ విజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజెప్పేందుకు ఇస్రో ఈ కార్యక్రమం చేపడుతోంది. 23 వరకు గడువు: విద్యార్థులు మార్చి 23వ తేదీలోగా ఠీఠీఠీ.జీటటౌ.జౌఠి.జీ ుఽ లో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల వడబోత అనంతరం ఏప్రిల్7న ఎంపికై న విద్యార్థుల జాబితా విడుదల చేస్తారు. మే 18 నుంచి విద్యార్థుఽలను ఆహ్వానిస్తారు. మే 19 నుంచి 30 వరకు యువికా–25 కార్యక్రమం నిర్వహిస్తారు. మే 31న ముగింపు కార్యక్రమం ఉంటుంది. 7 కేంద్రాల్లో నిర్వహణ: ఇస్రో ఈ కార్యక్రమాన్ని ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), సూళ్లూరుపేట ( ఏపీ), బెంగళూరు (కర్నాటక), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), షిల్లాంగ్( మేఘాలయ). ఎవరు అర్హులు: 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 8 లో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తా రు. స్పేస్, సైన్సు క్లబ్లలో ఉంటే 5 శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, ఎన్సీసీ, స్కౌట్స్ గైడ్స్ విభాగాల్లో ఉంటే 5 శాతం, పల్లె ప్రాంతాల వారికి 20 శాతం ప్రాధాన్యం ఇస్తారు. ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న విద్యార్థి కూడా ఉన్నత స్థాయిని అధిరోహించడానికి కల్పిస్తున్న అవకాశాల్లో ఇది ఒకటి. ఈ అవకాశాన్ని విద్యార్థులు అందిపుచ్చుకునేలా సైన్సు టీచర్లు కృషి చేయాలి. ఆసక్తి ఉన్న వారు మార్చి 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. –మార్ల ఓబుల్రెడ్డి, జిల్లా సైన్సు అధికారి అన్నీ ఉచితంగానే... ఇస్రో నిర్వహించే యువికా కార్యక్రమానికి ఎంపికై న విద్యార్థులకు ప్రయాణం, భోజన, వసతి సౌకర్యాలను ఇస్రో ఉచితంగా అందజేస్తుంది. ఎంపికై న విద్యార్థులను మే నెలలో కేటాయించిన రోజులలో ఇస్రోకు చెందిన స్పేస్ సెంటర్లకు తీసుకెళ్తారు. అక్కడ సైన్స్కు సంబంధించిన అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం విద్యార్థులకు కల్పిస్తారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు అవకాశం ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులతో ప్రతిభా అన్వేషణ్ పరీక్షలు రాయించడం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. ఇలాంటి అరుదైన అవకాశాన్ని విద్యార్థి దశలోనే పొందితే కచ్చితంగా దేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదుగుతారు. ప్రధానోపాధ్యాయులు దీనిని బాధ్యతగా తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించాలి. – సుబ్రమణ్యం, జిల్లా విద్యాశాఖ అఽధికారి -
22న కుల, చేతివృత్తుల సంఘాల నేతల సమావేశం
రాయచోటి అర్బన్: ఈ నెల 22వ తేదీన జిల్లాలోని బీసీ కులాల చేతి, కులవృత్తుల సంఘాల నేతలతో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్. జయసింహా ఒక ప్రకటనలో తెలిపారు. రాయచోటి పట్టణంలోని ఎంపీడీఓ సభాభవనంలో నిర్వహించే సమావేశంలో ఆదరణ–3 పథకం కింద అవసరమైన కుల, చేతివృత్తి పనిముట్లకు నేతల సలహాలు, సూచనలను స్వీకరించనున్నామన్నారు. సమావేశానికి నాయిబ్రహ్మణులు, రజకులు, వడ్డెరలు, మత్స్యకారులు, చేనేత, స్వర్ణకారులు, వడ్రంగులు, పాల వ్యాపారం, కల్లు గీత కార్మికులు, కుమ్మర, మేదర, వాల్మీకి, బోయ , కృష్ణ బలిజ, పూసలు, సగర, ఉప్పర తదితర కులాల నేతలతో పాటు శిల్పి, కరెంటు, ప్లంబింగ్ తదితర చేతివృత్తుల వారు హాజరు కావాలన్నా రు. 26 నుంచి అన్నమయ్య 522వ వర్ధంతి కార్యక్రమాలు రాజంపేట: ఈనెల 26 నుంచి తాళ్లపాక, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల 522 వ వర్ధంతి కార్యక్రమాలను టీటీడీ నిర్వహించనుంది. ఈ మేరకు బుధవారం వర్ధంతి కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేశారు. 26న తాళ్లపాకలో నగర సంకీర్తన, గోష్ఠిగానం, అన్నమాచార్య సంకీర్తన, హరికథ కార్యక్రమాలు ఉంటాయి. 27, 28, 29న అన్నమాచార్య సంకీర్తన, హరికథలు ఉంటాయి. అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద రెండురోజుల పాటు మాత్రమే వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య సంకీర్తన, హరికథలు నిర్వహించారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో ఆధ్యాత్మిక సంగీత సభలను నిర్వహిస్తారు. జూడాల సంఘం నూతన కమిటీ ఏర్పాటు కడప అర్బన్: ప్రభుత్వ వైద్య కళాశాల జూనియర్ డాక్టర్ల సంఘం (జీఎంఎస్కె– జూడా) కొత్త కమిటీ ఏర్పాటైంది. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. సురేఖ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. విజయభాస్కర్ రెడ్డి కొత్త కమిటీని అభినందించారు. అధ్యక్షుడిగా ఎన్నికై న డాక్టర్ ఎస్. విష్ణు వర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ బి. విజయ్, డాక్టర్ చరిత, డాక్టర్ పూజ, డాక్టర్ ప్రతిభ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎ. నిఖిల్ సింగ్, డాక్టర్ సుబ్బారెడ్డి కళాశాలలోని సమస్యల గురించి వినతిపత్రం అందజేశారు. కళాశాల సమస్యల గురించి ప్రస్తావించారు. సానుకూలంగా స్పందించిన ప్రిన్సిపల్ వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దూరవిద్య కోర్సుల ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ కడప ఎడ్యుకేషన్: యోగి వేమన యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (సీడీవోఈ) ద్వారా పలు కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 30 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి తెలిపారు. బుధ వారం ఆయన ప్రిన్సిపల్ ఎస్ రఘునాథరెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. పద్మ తో కలిసి మాట్లాడారు. వైవీయూ గుర్తింపునిచ్చిన అధ్యయన కేంద్రాల్లో ఎంఏ ఎకనామిక్స్, ఇంగ్లీష్, హిస్టరీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, తెలు గు, ఎం కామ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. బ్యాచిలర్ డిగ్రీలో ఎకనామిక్స్ చదివిన వారికి మాత్రమే ఎంఏ ఎకనామిక్స్ లో ప్రవేశాలు ఉంటాయని అలానే బీకాం, బీబీఏ, బీబీఎం డిగ్రీ చేసిన వారు ఎంకామ్లో ప్రవేశాలకు అర్హులన్నారు. మిగిలిన అన్ని కోర్సులకు ఏదేని డిగ్రీ పాసైతె చాలన్నారు. ఈ ఏడాది నూతనంగా బ్యాచిలర్ ఆఫ్ ఫైనార్ట్స్ ( బీఎఫ్ ఏ ఆనర్స్) మ్యూజిక్ నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ప్రారంభించామన్నారు. ఈ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్, సమాన అర్హత గల వారు ప్రవేశానికి అర్హులన్నారు. -
నాటు బాంబుల కేసులో నలుగురు బైండోవర్
పీలేరు రూరల్ : వేరుశనగ రక్షణ కోసం నాటు బాంబులు, విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన కేసులో నలుగురు నిందితులను బైండోవర్ చేసినట్లు సీఐ యుగంధర్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అగ్రహారం పంచాయతీ ఎనుములవారిపల్లెకు చెందిన కౌలు రైతు గుట్టమీద వెంకటేశ్వర్రాజు ఒక ఎకరా వేరుశనగ సాగు చేశాడు. పంట రక్షణకు పొలం చుట్టూ విద్యుత్ తీగలతోపాటు నాటు బాంబులు ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం అడవిపంది నాటుబాంబు పేలి మృతి చెందింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులకు అందిన సమాచారంతో ఎనుమలవారిపల్లెకు చెందిన గుట్టమీద వెంకటేశ్వర్రాజు, జయచంద్రారెడ్డి, ఎస్. భాస్కర్రెడ్డి, వెంకటేశ్వర్రాజులను బుధవారం స్థానిక తహసీల్దార్ భీమేశ్వర్రావు ఎదుట బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
వాతావరణ మార్పు.. మామిడి రైతు కుదుపు
పెనగలూరు : ఈ ఏడాది వాతావరణంలో మార్పుల వల్ల సంక్రాంతి వరకు వర్షాలు పడటంతో మామిడి రైతుల్లో ఆందోళన మొదలైంది. రైతులతోపాటు వ్యాపారుల్లో కూడా గుబులు పుట్టింది. మామిడి తోటలనే నమ్ముకొని జీవిస్తున్న రైతులకు తీవ్ర నష్టం జరుగుతున్నట్లు ఇప్పటికే తేలిపోయింది. మండలంలో 3992 ఎకరాలలో మామిడి సాగు చేస్తున్నారు. శివరాత్రికి పిందెలు పుట్టి ఉగాదికి ఊరగాయంత పచ్చడి కాయలు కావాల్సి ఉంది. కానీ నేటికీ మామిడి తోటల్లో పూత దశలోనే ఉండటంతో పిందె వస్తుందా రాదా అన్న సందేహంలో రైతులు ఉన్నారు. తోటల్లో పూత విపరీతంగా వచ్చింది. పూత వచ్చిందన్న ఆనందంలో రైతులు ఉన్నప్పటికీ ఇప్పటికే పూత మాడిపోతూ రాలిపోతోంది. ఇక పిందె వస్తుందా రాదా అన్న సందిగ్ధంలో రైతులు ఉన్నారు. కొంతమంది వ్యాపారులు పూత రాకముందే తోటలను కొనుగోలు చేశారు. గత సంవత్సరం మామిడి కాయలు కాయకపోవడంతో ఈ ఏడాది కాపు వస్తుందని ఇటు వ్యాపారులు, అటు రైతులు ఆనందంగా ఉండేవారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పూతను చూసి ఇప్పటికే మూడు, నాలుగుసార్లు మందును పిచికారీ చేశారు. రైతులు బయట అప్పులు తెచ్చుకోవాలన్నా, బ్యాంకు రుణాలు తీసుకోవాలన్నా మామిడి తోటలపైనే ఆధారపడుతున్నారు. పూతకు పిందెలు నిలబడి మంచి ఫలితం రావాలని రైతులు ఆశిస్తున్నారు. మూలిగే నక్కపై తాటికాయపడ్డట్టు.. మామిడి తోటలో కాపురాక పూతకు తగ్గ పిందె లేకపోవడంతో రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు తయారైంది. 2023లో కాపు అధికంగా రావడంతో ధరలు లేక టన్ను రూ. 6 వేలు నుంచి రూ. 7 వేలుకు రైతులు అమ్మకాలు చేశారు. 2024లో కాపు 20 శాతం కూడా రాకపోగా కొంతమంది రైతులకు ఎకరాలలో మామిడి తోటలు ఉన్నా కాయలు కాయని పరిస్థితి. గత మూడు సంవత్సరాలుగా మామిడి రైతులు నష్టాన్ని చవిచూస్తున్నారు. దీంతో మండలంలోని మామిడి రైతు పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయపడ్డట్టు తయారైంది. ఆలస్యంగా పూత రావడంతో రైతుల్లో గుబులు -
వాహనం ఢీకొని జింకపిల్ల మృతి
బి.కొత్తకోట : రోడ్డు దాటుతున్న మూడు నెలల వయసున్న జింక పిల్లను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందింది. ఈ సంఘటన బుధవారం బి.కొత్తకోట సమీపంలోని బాలసానివారిపల్లి వద్ద జరిగింది. జింకపిల్ల రోడ్డుపై గాయాలతో పడి ఉండగా స్థానికులు గుర్తించి పశువైద్యశాలకు తీసుకొచ్చారు. వైద్యులు విరిగిన కాలుకు కట్టుకట్టి మందులు తాపించారు. అయినప్పటికి మృతి చెందింది. అటవీశాఖ బీటు అధికారి ప్రకాష్ వివరాలను సేకరిస్తున్నారు. గిరిజనులపై దాడులు అరికట్టాలి రాయచోటి జగదాంబసెంటర్ : అన్నమయ్య జిల్లాలో గిరిజనులపై జరిగే దాడులను అరికట్టాలని ఏపీ బంజారా సంఘం జాతీయ అధ్యక్షుడు నాగేంద్రనాయక్ చౌహాన్ డిమాండ్ చేశారు. రాయచోటిలో బుధవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో రోజు రోజుకు గిరిజనులపై దాడులు అధికమయ్యాయని తెలిపారు. గుర్రంకొండ, మదనపల్లెలలో కొంత మంది గుండాలు దాడులు చేసినా ఇప్పటివరకు అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు. చిన్నారి సంబంధీకులు స్పందించాలి రాయచోటి జగదాంబసెంటర్ : అన్నమయ్య జిల్లా ములకలచెరువు ఉమాశంకర్కాలనీ ఆదర్శ పాఠశాల వద్ద గుట్టలో వదిలేసి వెళ్లిన చిన్నారి సంబంధీకులు 30 రోజుల్లోగా తమను సంప్రదించాలని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ సాధికారత అధికారిణి పి.రమాదేవి తెలిపారు. బుధవారం ఆమె రాయచోటిలో మాట్లాడుతూ 3 నుంచి 5 రోజుల ఆడ శిశువును ములకలచెరువు ఆదర్శ పాఠశాల వద్ద వదిలి వెళ్లిపోయారన్నారు. ఆ చిన్నారి తమ సంరక్షణలో ఉందన్నారు. ఎవరూ స్పందించకుంటే ఈ పాపను అనాథగా ప్రకటించి, ప్రభుత్వ షరతులు, నియమాల ప్రకారం మరొకరికి దత్తత ఇస్తామన్నారు. కందిపంటకు నిప్పు పెద్దమండ్యం : గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 3 ఎకరాలలో ఓ రైతు సాగుచేసిన కందిపంట అగ్నికి ఆహుతైంది. మండలంలోని ఎన్ఓ పల్లె పంచాయతీ గౌనివారిపల్లెకు సమీపంలో ఈ ఘటన జరిగింది. రైతు కథనం మేరకు.. కలిచెర్ల పాతూరుకు చెందిన సయ్యద్ అలీ అక్బర్ తనకున్న 3 ఎకరాలలో కందిపంటను సాగు చేశాడు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కందిపంట మొత్తం కాలిపోయింది. ప్రత్యామ్నాయ పంటగా సాగుచేసిన కందిపంట చేతికి వచ్చే సమయంలో అగ్నికి ఆహుతి కావడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. రూ. 1 లక్ష నష్టం జరిగినట్లు తెలిపాడు. ఈ మేరకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా కాలిపోయిన పంటను వీఆర్ఓ పరిశీలించారు. -
జీతం బకాయిలను చెల్లించాలి
రాయచోటి అర్బన్ : కూటమి ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు 15 నెలలుగా జీతం బకాయిలను చెల్లించకుండా వేధిస్తోందని, వారికి వెంటనే జీతాలు చెల్లించి ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు డిమాండ్ చేశారు. బుధవారం ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులతో కలసి ఆయన డీఆర్ఓ మధుసూదన్ను కలసి సమస్యలపై విన్నవించారు. ఆయన మాట్లాడుతూ సకాలంలో జీతాలందకపోవడంతో ఉద్యోగుల కుటుంబ పోషణ, పిల్లల చదువులకు ఇబ్బందిగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు జీతాలు విడుదల చేయించాలని కోరారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల సంఘం నాయకులు వెంకట్రామయ్య, క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ్లైయాష్ వ్యవహారంపై విచారణ ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)లో ఫ్లైయాష్ రవాణా వ్యవహారంపై ఏపీజెన్కో యాజమాన్యం రహస్యంగా విచారణ చేపట్టింది. గురువారం ఏపీజెన్కో నుంచి కొందరు అధికారులు విచారణ నిమిత్తం ఆర్టీపీపీకి వచ్చారు. గతంలో ఫ్లైయాష్ విషయంలో అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలడంతో ముగ్గురు అధికారులపై వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఫ్లైయాష్ వ్యవహారంపై రహస్యంగా విచారణ చేపట్టడం ప్రాముఖ్యత సంతరించుకుంది. -
పదో తరగతి విద్యార్థినికి అస్వస్థత
గుర్రంకొండ : పదవ తరగతి ప రీక్షా కేంద్రంలో అందరిలాగే పరీ క్ష రాస్తున్న ఓ విద్యార్థిని అకస్మాత్తుగా అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలిన సంఘటన బుధవారం అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో జరిగింది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హుటాహుటిన 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేవలం ఒక గంట మాత్రమే హిందీ పరీక్ష రాసి విద్యార్థిని కుప్పకూలడం అందరిని కలచివేసింది. వివరాలు ఇలా ఉన్నా యి. గుర్రంకొండ ఉర్దూ జెడ్పీహైస్కూల్లో 178 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాస్తున్నారు. మండలంలోని ఎల్లుట్ల పంచాయతీ నల్లగుట్టపల్లెకు చెందిన కె. రామచంద్ర కుమార్తె కె. రజిత చెర్లోపల్లె జెడ్పీ హైస్కూల్లో పదవ తరగతి చదివి గుర్రంకొండ ఉర్దూ జెడ్పీ హైస్కూల్లోని పరీక్షా కేంద్రంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తోంది. బుధవారం అందరిలాగే రామచంద్ర తన కుమార్తెను గుర్రంకొండకు తీసుకొచ్చి పరీక్షా కేంద్రంలో వదిలి తాను అక్కడి పరిసరాల్లోనే ఉన్నాడు. హిందీ పరీక్షను విద్యార్థులు రాయడం ప్రారంభించిన గంట తరువాత పరీక్షా కేంద్రంలో విద్యార్థిని రజిత కుప్పకూలిపోయింది. గమనించిన ఉపాధ్యాయులు అక్కడే ఉన్న ఆరోగ్య సిబ్బందికి సమాచారం అందించారు. ఆరోగ్య సిబ్బంది విద్యార్థినికి చికిత్స చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో వైద్యాధికారి చైతన్య అక్కడికి చేరుకొని వైద్యసేవలు అందించారు. ఎంతకూ విద్యార్థిని కోలుకోకపోవడంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లెకు తరలించాల్సిందిగా సూచించారు. ఎంఈఓ సురేంద్రబాబు, పరీక్షా కేంద్రం చీఫ్ రమణ 108 వాహనంలో విద్యార్థినిని మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షా కేంద్రంలోనే కుప్పకూలిన వైనం -
బాలుడికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు
నందలూరు : ‘మా బిడ్డను కాపాడండయ్యా’ శీర్షికన బుధవారం సాక్షిలో ప్రచురితమైన వార్తపై అధికారులు స్పందించారు. మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ నాగిరెడ్డిపల్లి దళితవాడకు చెందిన నాయనపల్లి హరిప్రసాద్, స్వర్ణలత దంపతుల కుమారుడు నవీన్ తేజ (14) గుండె జబ్బుపై కథనం ప్రచురితమైన విషయం విదితమే. నందలూరు ప్రభుత్వ వైద్యాధికారులు శరత్ కమల్, కార్తీక్ విశ్వనాథ్, ఏఎన్ఎం నాగలక్ష్మీ బాధితుని ఇంటికి వెళ్లి నవీన్ తేజ తల్లిదండ్రులతో మాట్లాడారు. విషయాన్ని అన్నమయ్య జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవ డిస్ట్రిక్ట్ కో–ఆర్డినేటర్ లోకవర్దన్కు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నవీన్ తేజను ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు తరపున సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు పంపించి అవసరమైన చికిత్స చేయిస్తామని వారు తెలిపారు. -
ఉపవాస దీక్ష.. ఆరోగ్య రక్ష
రాజంపేట టౌన్ : ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఆచరించే ఇస్లాం మార్గదర్శకాల్లో రంజాన్ ఉపవాసాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. రంజాన్ నెలలో 30 రోజుల పాటు కఠోర ఉపవాసాలు ఆచరించడంతో పాటు ఐదుపూటలా ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. నెలవంక కనిపించిన మరుసటి రోజు నుంచి ప్రారంభమయ్యే రోజా (ఉపవాసాలు) షవ్వాల్ నెలవంక దర్శనంతో ముగుస్తాయి. ప్రతి ముస్లీం నమాజు చేయడంతో పాటు ఉపవాసాలు పాటించాలని ఇస్లాం సూచిస్తుంది. వేకువ జామునే ఉపవాస దీక్ష (సహర్) ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయమయ్యాక (ఇఫ్తార్) వరకు ఉపవాసం పాటిస్తారు. పగలంతా ఉపవాసం పాటించిన దీక్షాపరులు సాయంత్రం నిర్ణీత వేళలో తొలుత పండ్లు తిని దీక్ష విరమిస్తారు. ఉపవాసం విరమించే వారికి అనేక మంది వివిధ రకాల ఆహార పదార్థాలను ఇస్తుంటారు. అయితే రాజంపేట పట్టణం ఉస్మానగర్కు చెందిన షేక్ సాదిక్పాషా రంజాన్ మాసమంతా యాష్ (గంజి) పంపిణీ చేస్తారు. గంజికి విశేష ఆదరణ.. సాదిక్పాషా పంపిణీ చేసే గంజి రాజంపేట పట్టణంలో విశేష ఆదరణ పొందింది. అందువల్ల రోజా ఉండే ముస్లీంలే కాక ముస్లిమేతరులు కూడా గంజిని తీసుకెళతారు. దాదాపు 15 సంవత్సరాలుగా సాదిక్పాషా గంజిని పంపిణీ చేస్తున్నారు. రోజుకు పదివేల రూపాయల చొప్పున నెలకు మూడు లక్షల వరకు సాదిక్పాషా గంజికోసం ఖర్చు చేస్తారు. నిత్యం సాయంత్రం వేళల్లో గంజిని పంపిణీ చేస్తారు. పట్టంంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు దాదాపు ఐదు వందల మందికి పైగా గంజిని తీసుకెళుతుంటారు. పోషకాలకు నెలవురోజంతా ఉపవాసం ఉండటం వల్ల మనిషి శరీరం నీరసిస్తుంది. అందువల్ల సాదిక్పాషా అనేక పోషక పదార్థాలతో గంజిని తయారు చేయిస్తారు. ఇందులో ప్రధానంగా పెసరబేడలు, బార్లీ బియ్యం, కొబ్బరి, పుదీన, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటాలు, లవంగాలు, దాల్చిన చెక్క వంటి పదార్థాలను గంజి తయారీలో ఉపయోగిస్తారు. దాదాపు నాలుగు గంటల పాటు కట్టెల పొయ్యి మీద బాగా ఉడికించి తయారు చేస్తారు. ఈ గంజి హలీం రుచికి ఏమాత్రం తీసిపోదని ముస్లీంలు చెబుతున్నారు. గంజి బలవర్థకమైన పానీయమని అందువల్ల ఉపవాస దీక్షాపరులకు గంజి వెంటనే శక్తిని ఇవ్వడమే కాక ఆరోగ్యానికి కూడా మంచిదని వారు పేర్కొంటున్నారు. ఉపవాస దీక్ష విరమించేవారికి ఉచితంగా గంజి పంపిణీ రంజాన్ మాసమంతా కొనసాగనున్న కార్యక్రమం రూ.3 లక్షలు సొంత డబ్బులు ఖర్చు చేస్తున్న షేక్ సాదిక్పాషా మొదటి నుంచి ఈ గంజి తాగుతున్నా ఉస్మాన్ నగర్లో పంపిణీ చేసే గంజిని నేను మొదటి నుంచి తాగుతున్నాను. ఎంతో రుచిగా ఉంటుంది. అందువల్ల మా ఇంట్లో వాళ్లు అందరు కూడా ఎంతో ఇష్టంగా గంజిని తాగుతారు. ముఖ్యంగా ఉపవాసం ఉండేవారికి ఈ గంజి శక్తినిచ్చే ఔషధంగా పనిచేస్తుంది. – సయ్యద్ బాషా, రాజంపేట అల్లాహ్ కృపవల్లే.. దాదాపు 15 ఏళ్ల క్రితం ఇఫ్తార్ సమయంలో ఉపవాసం ఉండేవారికి గంజి పంపిణీ చేశాను. అప్పుడు గంజి తాగిన వారంతా ఎంతో రుచిగా ఉందన్నారు. మీరు ఎప్పుడైనా ఇఫ్తార్ సమయంలో ఆహారం పంపిణీ చేయాలనుకుంటే గంజినే పంపిణీ చేయమని ఉపవాసం ఉంటున్న వారు చెప్పారు. అల్లాహ్ నాకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఉపవాస సమయంలో అల్లాహ్ స్మరణలో ఉండేవారికి రోజూ గంజి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ప్రతి ఏడాది గంజి ఉచితంగా పంపిణీ చేస్తున్నా. ఇదంతా అల్లాహ్ కృపవల్లే జరుగుతోంది. – షేక్ సాదిక్పాషా, ఉస్మాన్ నగర్, రాజంపేట -
సస్యరక్షణ పాటిస్తే మంచి దిగుబడులు
రైల్వేకోడూరు అర్బన్ : మామిడి రైతులు సస్యరక్షణలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని జిల్లా ఉద్యానశాఖ అధికారి రవిచంద్రబాబు బుధవారం పేర్కొన్నారు. స్థానిక అనంతరాజుపేట వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానంలో మామిడి రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మామిడి పిందె నిలబడటంపై సస్యరక్షణ, మార్కెటింగ్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మామిడిలో అధిక దిగుబడులు పొందేందుకు సమగ్ర పోషణ, నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. అలాగే రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువులు వాడాలని సూచించారు. ప్రారంభ దశలో తేనెమంచు పురుగు నివారణకు వేపనూనె, అజాడిరెట్టీన్ జిగురు మందు అధికారుల సూచనల మేరకు పిచికారీ చేయాలన్నారు. మామిడి పిందెలు రాలుతున్నప్పుడు అధికారుల సూచనల మేరకు ప్లానోఫిక్ మందు 500 లీటర్లకు 100 ఎంఎల్ కలిపి పిచికారీ చేయాలన్నారు. మామిడి కాయలకు ఉపయోగించే కవర్లు సబ్సిడీతో అందిస్తున్నామని, కావాల్సిన రైతులు రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెగుళ్ల నివారణ శాస్త్రవేత్త సందీప్ నాయక్, రాజంపేట ఉద్యాన అధికారులు వెంకటభాస్కర్, సురేష్ బాబు, సుధాకర్, రైతులు పాల్గొన్నారు. -
రైల్వే మంత్రి దృష్టికి రైళ్ల హాల్టింగ్ సమస్య
రాజంపేట : రాజంపేట, రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, నందలూరు తదితర రైల్వే స్టేషన్లలో రైళ్ల హాల్టింగ్స్ విషయాన్ని మంగళవారం రైల్వే మంత్రి అశ్వినిౖ వెష్ణవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి తెలిపారు. పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో దేశ రాజధానికి వెళ్లే ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్, తిరుపతి– కొల్హాపూర్ మధ్య నడిచే హరిప్రియ ఎక్స్ప్రెస్ రైలుకు హాల్టింగ్ సౌకర్యం త్వరగా కల్పించాలని కోరామన్నారు. అలాగే రైల్వేకోడూరులో హరిప్రియ, ఎంజీఆర్ చైన్నె ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్డింగ్ ఇవ్వాలన్నారు. జిల్లాలో రైల్వే పరంగా ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వే కేంద్రానికి పూర్వ వైభవం కల్పించాలన్నారు. తిరుపతి–హుబ్లీ ప్యాసింజర్ రైలును బ్రిటీష్ కాలం నాటి రెడ్డిపల్లె రైల్వే స్టేషన్లో హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని కోరినట్లు తెలిపారు. రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ పేర్కొన్నారు. ఎంపీ మిథున్రెడ్డి -
గిరిజన మహిళపై దాడి హేయమైన చర్య
మదనపల్లె : గిరిజన మహిళ అలివేలమ్మ పై జరిగిన దాడి హేయమైన చర్య అని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు తెలిపారు. అగ్రవర్ణాల దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని సీపీఎం నాయకులు హరింద్రనాథ్ శర్మ, నాగరాజు, రాష్ట్ర గిరిజన సమాఖ్య వ్యవస్థాపకుడు కోనేటి దివాకర్, బాస్ నేత ముత్యాల మోహన్ లు మంగళవారం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కన్వీనర్ పి. శ్రీనివాసులు మాట్లాడుతూ అలివేలమ్మ ఒకే కుటుంబం శీలంవారిపల్లిలో ఉంటోందన్నారు. ఆమెను అక్కడి నుంచి పంపించేయాలని దురుద్దేశంతో అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు అకారణంగా గొడవ పెట్టుకుని ఆమెను వివస్త్రను చేసి విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. దాడిని అడ్డుకోబోయిన కోడలు బాలింత అని కూడా చూడకుండా దాడి చేయడం దుర్మార్గమన్నారు. బాధిత మహిళకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు నిందితులను కాపాడేందుకు ప్రయత్నించడం ఏంటని ప్రశ్నించారు. గుర్రంకొండ ఎస్ఐను వెంటనే సస్పెండ్ చేసి డీఎస్పీ స్థాయి అధికారిని విచారణకు ఆదేశించాలన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ ప్రజలపై చిన్నచూపు తగదని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆయన కూడా పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు. -
●క్లస్టర్తో ఉద్యోగుల కోత
రెండు సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్గా చేస్తున్న ప్రభుత్వం సాంకేతిక విభాగం కింద పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్యను సగానికి తగ్గించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒక క్లస్టర్ పరిధిలో రెండు సచివాలయాలు ఉంటే.. అందులో రెండు సచివాలయాల్లో పని చేస్తున్న సాధారణ పరిపాలన ఉద్యోగులు ఐదుగురు యథావిధిగా ఉంటారు. అయితే సాంకేతిక విభాగానికి చెందిన ఏడుగురు ఉద్యోగులు మాత్రమే విధుల్లో ఉండే అవకాశం ఉంటుంది. రెండు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఒక సచివాలయ ఉద్యోగులను తగ్గించి రెండు సచివాలయ బాధ్యతలను ఒక ఉద్యోగికి అప్పగించేలా ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీంతో ఒక సచివాలయానికి చెందిన ఏడుగురు ఉద్యోగులను బాధ్యతల నుంచి తప్పించినట్టవుతుంది. తద్వారా సచివాలయ వ్యవస్థకు జిల్లాలో 1,757 మంది ఉద్యోగులను దూరం చేసే అవకాశం ఉంది. ఈ ప్రభావం ప్రజలకు అందించే క్షేత్రస్థాయి సేవలపై తీవ్రప్రభావం చూపిస్తుంది. -
పుట్టిన రోజే.. ఆఖరి రోజు !
పెద్దతిప్పసముద్రం : పుట్టిన రోజే ఆ యువకుడికి ఆఖరి రోజు అవుతుందని కలలో కూడా ఊహించి ఉండడు. యువకుడితో పాటు అతని స్నేహితుడు సైతం రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఈ దుర్ఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా సినిమాకు వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంలో ఇంటికి బయలుదేరిన ఇద్దరు యువకులను మార్గమధ్యంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఓ యువకుడు చనిపోగా ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో మరో యువకుడు మృత్యువాత పడ్డాడు. దీంతో స్థానిక అంబేడ్కర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. కాలనీకి చెందిన సాదిలి చందూకుమార్ (20) ట్రాక్టర్ డ్రైవర్గా పని చేసేవాడు. ఇదే కాలనీకి చెందిన దండు శీనూ (21) ఆటో డ్రైవర్గా పని చేసేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం దండు శీనూ జన్మదినం కావడంతో వీరిద్దరూ పుట్టిన రోజు వేడుక సందర్భంగా బి.కొత్తకోటలో సెకండ్ షో సినిమా చూసేందుకు సోమవారం రాత్రి పీటీఎం నుంచి ద్విచక్ర వాహనంలో బయలు దేరారు. సినిమా చూసిన అనంతరం 12 గంటల తరువాత ద్విచక్ర వాహనంలో పీటీఎంకు వస్తున్నారు. ఈ క్రమంలో బి.కొత్తకోట రోడ్డులోని ఓ కోళ్ల ఫారం సమీపంలో గుర్తు తెలియని వాహనం వీరి వాహనాన్ని ఢీకొంది. దీంతో దండు శీనూ అక్కడికక్కడే మృతి చెందాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న మరో యువకుడు సాదిలి చందూను మదనల్లె ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలిస్తుండగా పీలేరు సమీపంలో మృతి చెందాడు. అయితే ఘటన స్థలం వద్ద ఓ అడవి పిల్లి మృతి చెంది ఉండటాన్ని బట్టి చూస్తే పిల్లిని తప్పించి వాహనాన్ని పక్కకు తిప్పి వెళుతుండగా ఎదురుగా వస్తున్న వాహనం యువకులను ఢీకొందా.. వెనుక నుంచి వాహనం ఢీకొని ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ హరిహర ప్రసాద్ మంగళవారం మృతదేహాలకు పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకువి.. కాటికి కాళ్లు చాపే వయసులో మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటావనుకుంటే ఇలా అర్ధంతరంగా వెళ్లిపోయావా నాయనా.. అంటూ సాదిలి చందూ తల్లిదండ్రులు విలపిస్తుంటే చూపరులు సైతం కంట తడి పెట్టారు. కాలనీలో ఇద్దరు యువకుల అకాల మరణంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు యువకులను బలిగొన్న రోడ్డు ప్రమాదం పీటీఎం అంబేడ్కర్ కాలనీలో విషాద ఛాయలు -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
సిద్దవటం : మండలంలోని తురకపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న ఎల్లకూరి చంద్రశేఖర్రెడ్డి (36) అనే వ్యక్తి అప్పుల బాధతో మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దవటం మండలం చాముండేశ్వరిపేట గ్రామానికి చెందిన ఎల్లకూరి చంద్రశేఖర్రెడ్డి ఆరేళ్ల నుంచి కడపకు చెందిన తోట నాగార్జున తురకపల్లెలో నిర్మించిన వెంగమాంబ సిమెంటు ఇటుకల తయారీ కేంద్రంలో వాచ్మెన్, డ్రైవర్గా పనిచేసేవాడు. కడపకు చెందిన షేక్ షబానాను భర్త వదిలేయడంతో చంద్రశేఖర్రెడ్డి ఆమెను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఇతను భార్య షేక్ షబానా, ఆమె మొదటి భర్త కుమారుడు మస్తాన్వలీతో కలిసి తురకపల్లిలో నివాసం ఉంటున్నాడు. మృతుడి యజమాని వద్ద రూ. 2లక్షలు అప్పు తీసుకున్నాడు. మంగళవారం ఉదయం బాత్రూమ్కు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి ఎంతసేపటికి రాక పోవడంతో భార్య షబానా అక్కడికి వెళ్లి చూసింది. అయితే అప్పటికే చీరతో ఉరివేసుకుని ఉన్నాడు. వెంటనే ఆమె చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చి ఆమె కుమారుడి సాయంతో మృతదేహాన్ని కిందకు దింపారు. మృతుడి తల్లి మల్లేశ్వరమ్మ కుమారుడి మృతదేహాన్ని చూసి తన కుమారుడికి మద్యం తాగే అలవాటు ఉందని, భార్యతో గొడవ పడేవాడని తెలిపింది. ఈ సంఘటనపై విచారించి న్యాయం చేయాలని సిద్దవటం ఇన్చార్జి ఎస్ఐ శివప్రసాద్కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కడప రిమ్స్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
ఉప రాష్ట్రపతిని కలిసిన రాజ్యసభ సభ్యుడు మేడా
రాజంపేట : ఉపరాష్ట్రపతి జగదీప్ధన్కర్ను రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి మర్యాదపూర్వకంగా మంగళవారం ఆయన చాంబరులో కలిశారు. తనను ఎథిక్స్కమిటీ సభ్యునిగా నామినేట్ చేసిన సందర్భంగా ఉపరాష్ట్రపతిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అక్కడ అదృశ్యం.. ఇక్కడ ప్రత్యక్షం కలకడ : కదిరాయచెర్వులో అదృశ్యమైన ద్విచక్రవాహనం పీలేరులో ప్రత్యక్షమైనట్లు వీఆర్ఓ పుల్లయ్య తెలిపారు. కలకడ మండలం కె.బాటవారిపల్లె సచివాలయంలో వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న గుర్రంకొండ మండలం సరిమడుగుకు చెందిన పుల్లయ్య సోమవారం తన ద్విచక్రవాహనం హోండా ఆక్టివాను కదిరాయచెర్వు గ్రామంలో నిలిపి బస్సులో కలకడకు చేరుకున్నారు. సాయంత్రం విధులు ముగించుకుని తిరిగి కదిరాయచెర్వుకు చేరుకుని పరిశీలించగా తన ద్విచక్రవాహనం కనిపించలేదు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మంగళవారం పీలేరులోని సంత ప్రదేశంలో ద్విచక్రవాహనాన్ని గుర్తించి బాధితుడికి అందజేశారు. నీటి సంపులో పడి బాలుడి మృతి మదనపల్లె : ప్రమాదవశాత్తు నీటిసంపులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. చంద్రాకాలనీకి చెందిన రాజశేఖర్రెడ్డి, గీత దంపతులకు సాత్విక్రెడ్డి, చార్విక్రెడ్డి(5) ఇద్దరు కుమారులు ఉన్నారు. మంగళవారం సాయంత్రం కాలనీలో నీటిసరఫరా జరుగుతున్న సమయంలో నీళ్లను పట్టుకునేందుకు తల్లి, నానమ్మ హడావిడిలో ఉండగా, ఇంటి ముందు ఆడుకుంటున్న చార్విక్రెడ్డి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని బయటకు తీసి మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగ వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. కారు బోల్తా – ముగ్గురికి గాయాలు గుర్రంకొండ : కారు బోల్తా పడి ముగ్గురు గాయపడిన సంఘటన మండలంలోని చెర్లోపల్లె పంచాయతీ సూరప్పగారిపల్లె వద్ద జరిగింది. మంగళవారం బెంగళూరుకు చెందిన నంజుండప్ప తమ కుటుంబంతో కలిసి కారులో రాయచోటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో సూరప్పగారిపల్లెకు సమీపంలోని పెట్రోల్ బంకు వద్దకు చేరుకోగానే అడ్డంగా వచ్చిన ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ సంఘటనలో నంజుండప్పతోపాటు ప్రకాష్, హేమావతిలకు రక్తగాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో వాల్మీకిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కమనీయం...లక్ష్మీనరసింహుని కల్యాణం
గుర్రంకొండ : తరిగొండ గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళవారం స్వాతి నక్షత్రంతో పాటు స్వామివారి జన్మదినం కావడంతో టీటీడీ ఆధ్వర్యంలో కల్యాణోత్సవం కనుల పండువగా జరిపారు. ఆలయంలో చలువ పందిళ్లు, పచ్చని తోరణాలతో పెళ్లి వేదికను అందంగా అలంకరించారు. ముందుగా మూలవర్లకు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి పాలతో క్షీరాభిషేకం చేశారు. రంగురంగుల పుష్పాలతో స్వామివార్లను అలంకరించిన తీరు అందరిని ఆకట్టుకుంది. ముత్యాల తలంబ్రాలతో స్వామివారి పెళ్లివేడుక వైభవంగా నిర్వహించారు. రూ.300 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు టీటీడీ వారు పట్టువస్త్రాలు, కంకణాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. పెద్ద ఎత్తున భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి, సిబ్బంది నాగరాజ, ఆలయ అర్చకులు కృష్ణరాజ బట్టార్, అనిల్ స్వామి, గోకుల్ స్వామి పాల్గొన్నారు. భార్య గర్భిణి.. మరో యువతితో భర్త పరారీ బి.కొత్తకోట : బి.కొత్తకోట పట్టణానికి చెందిన ఓ యువకుడు కట్టుకున్న భార్యను వదిలి మరో యువతితో వెళ్లిపోయిన ఉదంతంపై బాధితురాలు మంగళవారం పోలీసులను ఆశ్రయించింది. భర్తపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. పట్టణానికి చెందిన డ్రైవర్ అనిల్కు ములకలచెరువు మండలానికి చెందిన 21 ఏళ్ల యువతితో గతేడాది ఆగస్టులో వివాహమైంది. పెద్దలు కుదిర్చిన ఈ వివాహం అనిల్ ఇంటివద్దే జరిగింది. రెండు నెలలపాటు వీరి సంసారం సజావుగా సాగింది. తర్వాత స్థానికురాలైన ఓ యువతితో అనిల్ సన్నిహితంగా ఉంటున్న విషయం గమనించి భార్య ప్రశ్నించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపో అంటూ తిట్టేవాడు. సర్దుకుపోతున్న భార్య గర్భం దాల్చగా ఇప్పుడు ఆరోనెల. ఈ పరిస్థితుల్లో భర్త అనిల్ ఈనెల 4న ఇంటినుంచి బయటకు వెళ్లగా పనికి వెళ్తున్నాడని అనుకున్నారు. అప్పటినుంచి ఇంటికి రాకపోవడంతో భార్య ఆందోళనకు గురైంది. అయితే భర్తతో సన్నిహితంగా ఉంటున్న యువతి ఇన్స్టాలో పెడుతున్న ఫొటోలు చూసి అసలు విషయం గుర్తించింది. దీనితో తన భర్త మరో యువతితో వెళ్లాడని, చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాయచోటి కేసులో 12 మందికి బెయిల్ కడప అర్బన్ : అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంపై మార్చి 9వ తేదీ పోలీసులు కొంతమందిని అరెస్టు చేశారు. కడప సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న 12 మంది మంగళవారం బెయిలుపై విడుదలయ్యారు. 9 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు మదనపల్లె : కులం పేరుతో దూషించి, దౌర్జన్యం చేసి దాడికి పాల్పడిన ఘటనలో తొమ్మిది మంది నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. మండలంలోని మాలేపాడు పంచాయతీ నల్లరాజుగానిపల్లెకు చెందిన బి.మునివెంకటరమణ, (69) కు సంబంధించిన పొలాన్ని స్థానికులైన కొందరు ఆక్రమించుకున్నారు. ఈ విషయమై గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో సోమవారం మునివెంకటరమణ పొలం వద్ద ఇల్లు నిర్మించుకునే ప్రయత్నం చేస్తుండగా, అదే గ్రామానికి చెందిన భూ ఆక్రమణకు పాల్పడిన మరో వర్గంలోని వ్యక్తులు ఆర్.బాలకృష్ణమనాయుడు, కాంతమ్మ, రవికాంత్నాయుడు, ఆదెమ్మ, శ్రీనివాసులునాయుడు, సోమశేఖర నాయుడు, సంజు, కృష్ణమూర్తిలు దౌర్జన్యం చేసి కులం పేరుతో దాడికి పాల్పడ్డారు. దాడి ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో అపశ్రుతి ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల–తిరుపతి దేవస్థానం వారు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ ఏర్పాట్లలో రామాలయం వెనుకవైపు ఉన్న అంగన్వాడీ కేంద్రం వద్ద 30 అడుగుల భారీ కటౌట్ ఏర్పాట్లలో భాగంగా పనిచేస్తున్న తిరుపతి టౌన్కు చెందిన ఎం. నరసింహ (50) అనే వ్యక్తికి మూర్ఛ రావడంతో 25 అడుగులపై నుంచి కిందపడ్డాడు. అదృష్టవశాత్తు పడినచోట ఎలాంటి రాళ్లు, గట్టినేల లేకపోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తోటి కూలీలు వెంటనే స్థానిక పీహెచ్సీకి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం తిరుపతికి తీసుకెళ్లారు. -
మా బిడ్డను కాపాడండయ్యా.!
నందలూరు : మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ నాగిరెడ్డిపల్లి దళితవాడకు చెందిన నాయనపల్లి హరిప్రసాద్, స్వర్ణలత దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కుమారుడు నవీన్ తేజ (14) పుట్టిన కొన్ని రోజులకే తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాదులోని నిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి గుండెలో రంధ్రం ఉందనడంతో ఆందోళన చెందారు. పది కిలోల బరువు ఉంటేనే శస్త్ర చికిత్స చేసేందుకు వీలవుతుందని చెప్పడంతో వెనక్కు వచ్చారు. తిరిగి ఏడేళ్ల అనంతరం నిమ్స్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా గుండెలో రక్త ప్రసరణ సరిగా లేదని, ఊపిరితిత్తుల్లోకి రక్తం చేరుతుందని, అవయవాలు సైతం దెబ్బతిన్నాయని శస్త్ర చికిత్స చేయలేమని, చేసినా ప్రయోజనం లేదని తేల్చి చెప్పారు. దీంతో అప్పటి నుంచి కేవలం మందులతోనే నెట్టుకొస్తున్నారు. నవీన్ తేజ గత ఏడాది స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న సమయంలో తలనొప్పితో బాధపడుతూ కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేయగా మెదడులో కణతి ఉందని చికిత్స చేశారు. అయినా నాలుగు అడుగులు నడిచినా ఆయాసంతో పడిపోతున్నాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలి పనులకు వెళితేనే గాని తమకు పూట గడవదని, అలాంటిది తమ కుమారుడి మందులకు నెలకు రూ. 6 వేలు వరకు ఖర్చు అవుతోందని వాపోతున్నారు. ఇప్పటి వరకు సుమారు పది లక్షల రూపాయల వరకు అప్పులు చేసి ఆసుపత్రుల చుట్టూ తిరిగామని, ప్రస్తుతం ఆర్థిక స్థోమత లేకపోవడంతో మందులుసైతం కొనలేని దుస్థితిలో ఉన్నామని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇటీవల తమ కుమార్తె ఆరోగ్యం కూడా బాగోలేదని ఆసుపత్రుల వెంట తిరుగుతూ కూలి పనులకు వెళ్లలేక వేదనతో బతుకీడుస్తున్నామని చెబుతున్నారు. దాతలు స్పందించి ఆర్థిక సాయం అందించి తమ కుమారుడిని కాపాడాలని, ప్రభుత్వం పింఛను అందించి ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. అనారోగ్యంతో అల్లాడుతున్న బిడ్డను ఆదుకోవాలని వేడుకోలు మందులకు డబ్బులు లేక తల్లిదండ్రుల ఆవేదన -
రోడ్డు ప్రమాదంలో దుస్తుల వ్యాపారి దుర్మరణం
కురబలకోట ; కడప నగరంలోని జెడ్ఆర్ ఫ్యాషన్ వరల్డ్ నిర్వాహకుడు షేక్ జహీర్ (28) మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో జరిగిన ఈ విషాదకర సంఘటనకు సంబంధించి ముదివేడు ఎస్ఐ దిలీప్కుమార్ కథనం మేరకు.. కడప నగరానికి చెందిన జహీర్ రెండేళ్లుగా కడపలో జెడ్ఆర్ ఫ్యాషన్ వరల్డ్ పేరిట రెడీమేడ్ దుస్తుల షాపు నిర్వహిస్తున్నాడు. గతంలో ట్రావెల్స్లో పనిచేసేవాడు. ఇతనికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు సంతానం. భార్య ప్రస్తుతం గర్భిణి. రంజాన్ సందర్భంగా విక్రయానికి అవసరమైన దుస్తులు కొనుగోలు చేసేందుకు తమ్ముడు షమీర్ (26)తో కలిసి షేక్ జహీర్ కారులో బెంగళూరు బయలుదేరాడు. తనే కారు నడుపుకుంటూ వస్తుండగా కురబలకోట మండలంలోని మధ్యాహ్నంవారిపల్లె–రామిగానిపల్లె మధ్యలో మదనపల్లె–2 డిపోకు చెందిన గాలివీడు ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చింది. ప్రమాదవశాత్తు బస్సును కారు ఢీకొంది. ఈ సంఘటనలో జహీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తమ్ముడు షమీర్ కారులో వెనుక సీట్లో ఉండడంతో గాయాలతో బయటపడ్డాడు. అతన్ని చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం జహీర్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతుడిపైనే కేసు.! ఇదిలా ఉండగా ప్రమాదానికి మృతుడు జహీర్ కారణమని కేసు నమోదు చేయాల్సి వచ్చిందని ముదివేడు ఎస్ఐ దిలీప్కుమార్ తెలిపారు. డ్రైవింగ్ చేస్తున్న జహీర్ కారును నిద్రమత్తులో అదుపు చేయలేక వేగంగా బస్సును ఢీ కొట్టడం వల్లే ఈ సంఘటన జరిగినట్లు అటు విచారణలోను ఇటు సంఘటన స్థల పరిశీలనలోను వెల్లడైందన్నారు. చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం ఇదేమి.. విచిత్రం స్వామీ అంటూ పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. మృతుడి స్వస్థలం కడప బెంగళూరుకు వెళుతుండగా దుర్ఘటన -
బరితెగించిన టీడీపీ రౌడీ మూకలు
రామాపురం: వైఎస్సార్సీపీ వర్గీయులను చిల్లర కొట్టు దగ్గర కూర్చోబెట్టుకోవడమే.. వికలత్వం కలిగిన వృద్ధుడు డేరంగుల వెంకటరమణ (74) చేసిన తప్పు. పర్యవసానంగా స్థానికంగా ఉన్న టీడీపీ రౌడీ మూకలు.. చిల్లర బంకే జీవనాధారంగా, నడవలేని స్థితిలో జీవనం సాగిస్తున్న అతనిపై కక్ష కట్టారు. ఎన్నికల తర్వాత ఒకటి కాదు, రెండు కాదు, మూడు పర్యాయాలు.. ఆ బంకుపైకి దాడికి తెగబడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి కొంత మంది టీడీపీ రౌడీ మూకలు.. అతనితోపాటు బంకుపై దాడి చేశారు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సురకవాండ్లపల్లిలో 74 ఏళ్ల వృద్ధుడు డేరంగుల వెంకటరమణ వేరే జీవనాధారం లేక.. చిల్లర కొట్టు దుకాణాన్ని ఏర్పాటు చేసుకొని స్వయం శక్తితో జీవనం సాగిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో.. గ్రామంలోనీ వైఎస్సార్సీపీకి చెందిన కొంత మంది వర్గీయులను బంకు దగ్గర కూర్చోబెట్టుకోవడం అతను చేసిన పాపంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. స్థానికంగా ఉన్న అధికార పార్టీకి చెందిన కొంత మంది నాయకులు అతనిపై కక్ష కట్టారు. 40 ఏళ్లుగా వున్న బంకును తొలగించాలని ఆరు నెలల నుంచి వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో అతను ఇటీవల జాయింట్ కలెక్టర్ను ఆశ్రయించడంతో తహసీల్దార్ ద్వారా విచారణ చేసి.. న్యాయం చేశారని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సోమవారం అర్ధరాత్రి ఆటోలలో వచ్చి తమపై దాడి చేసి బంకు పేకిలించే ప్రయత్నం చేశారని, బంకులోని సామగ్రిని బయటపడేసి, అరుగు బండలను ధ్వంసం చేశారని ఎస్పీకి అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని ప్రజా సంఘాలతో కలిసి వృద్ధుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వృద్ధ వికలాంగుడిపై దాడి అతని జీవనాధారం చిల్లర బంకు ధ్వంసం వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు అంగడి దగ్గర కూర్చుంటున్నారని కక్ష బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు -
రోడ్డుపై నిర్మించిన గోడ తొలగింపు
మదనపల్లె : పట్టణంలోని నక్కలదిన్నెలో రోడ్డుకు అడ్డంగా కొందరు వ్యక్తులు నిర్మించిన గోడను మంగళవారం మున్సిపల్ సిబ్బంది తొలగించారు. నక్కలదిన్నె తండాలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు వీధిలో ఇతరులు రాకపోకలు సాగించకుండా అడ్డుగా గోడను నిర్మించారు. దీనిపై ఇంకో వర్గానికి చెందిన వ్యక్తులు మున్సిపల్ కార్యాలయం, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదేశాల మేరకు, మున్సిపల్ కమిషనర్ కె.ప్రమీల ఆధ్వర్యంలో టీపీఓ జకీరాబేగం పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బంది పోలీస్ బందోబస్తు మధ్య గోడను తొలగించారు. తొలగింపు సందర్భంగా ఎలాంటి గొడవలు, ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. -
వేగంగా భూముల రీ సర్వే
కలికిరి(వాల్మీకిపురం): భూముల రీ సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టరు శ్రీధర్ ఛామకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వాల్మీకిపురం మండల పరిధిలోని బూడిదవేడు గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన రీ సర్వే ప్రక్రియను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. జనవరి 20 నుంచి గ్రామంలో రీ సర్వే ప్రక్రియ ప్రారంభించామని, ఇప్పటి వరకు వెయ్యి ఎకరాలకు పైగా పూర్తి చేసినట్లు తహసీల్దారు పామిలేటి కలెక్టరుకు వివరించారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా రైతుల సమక్షంలోనే సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, పట్టా భూములు తదితరాలను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో మండల సర్వేయరు, వీఆర్ఓలు పాల్గొన్నారు. నిర్దేశించిన లక్ష్యం సాధించాలి గుర్రంకొండ: అధికారులు, సిబ్బందికి నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రగతి సాధించాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలో ఏ గ్రామంలో సర్వే చేస్తు న్నారు, ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి, అందులో డ్రైల్యాండ్, వెట్ల్యాండ్ ఎంత మేరకు విస్తీర్ణంలో ఉన్నాయో ఆరా తీశారు. సదరు గ్రామంలో రీసర్వే ఎప్పుడు చేపట్టారు, ఎన్ని టీములు సర్వే చేస్తున్నాయి, ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల్లో పూర్తి చేశారు, ఇంకా ఎంత మేరకు పెండింగ్లో ఉంది అనే వివరాలను తహసీల్దార్, మండల సర్వేయర్ను అడిగి తెలుసుకొన్నారు. మండలంలోని టి.పసలవాండ్లపల్లెలో రీసర్వే ప్రక్రియ జరుగుతోందని, గ్రామాన్ని 11 బ్లాకులూగా విభజించి 3356 ఎకరాలు సర్వే చేస్తున్నామని తహసీల్దార్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, సర్వేయర్ కిరణ్మయి, వీఆర్వోలు పాల్గోన్నారు. కలెక్టరు శ్రీధర్ ఛామకూరి -
వైఎస్సార్సీపీ పాలన ముద్ర.. రాష్ట్రంపై చిరకాలం ఉండరాదని కూటమి కక్ష కట్టింది. ఇందుకోసం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మానస పుత్రిక అయిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది. వీటి ద్వారా జనానికి అందించే సేవల్లో కోత విధించింది. తాజాగా ర
బి.కొత్తకోట: మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపన దిశగా గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థపై.. కూటమి ప్రభుత్వం కక్ష కడుతోంది. ప్రజలకు మంచి చేయాలన్న సమున్నత ఆశయంతో అమలు చేసిన సచివాలయ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేలా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిపై ఆదేశాలు ఇవ్వడంతో క్షేత్రస్థాయిలో కార్యాచరణ మొదలైంది. ఫలితంగా ప్రజల ముంగిటకు పాలనను తీసుకొచ్చి.. వందల సంఖ్యలో ప్రభుత్వ సేవలు అందించిన సచివాలయాలను నిర్వీర్యం చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది. వలంటీర్ల వ్యవస్థను అటకెక్కించిన ప్రభుత్వం.. వైఎస్సార్సీపీ సర్కారు ప్రజల కోసం తీసుకొచ్చిన కార్యక్రమాలను ఒక్కొక్కటిగా దూరం చేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. వైఎస్సార్సీపీ హయాంలో.. జిల్లాలో ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక సచివాలయం ఉండేలా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరింది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాలు, 30 మండలాలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో 502 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో ప్రజలకు కలిగిన ప్రయోజనం అంతా ఇంతా కాదు. ప్రతి పనికి మండల కేంద్రానికి రావాల్సిన అవసరం తప్పింది. ఎక్కడికక్కడ సేవలు పొందే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ప్రజలకు ప్రయాణ భారం, సమయం వృథా తప్పింది. అందులోనూ మండల కేంద్రంలోని కార్యాలయాలకు వెళ్తే అధికారులు అందుబాటులో లేకుంటే మళ్లీ వెళ్లాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం దూరం చేసింది. కొత్తగా క్లస్టర్లు జిల్లా సచివాలయ వ్యవస్థను క్లస్టర్లుగా మార్చేందుకు చర్యలను అధికారులు చేపట్టారు. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి రెండు సచివాలయాలను ఒక క్లస్టర్గా చేస్తున్నారు. వీటికి మ్యాపింగ్ కూడా చేస్తున్నారు. అంటే 502 సచివాలయాలను 251 క్లస్టర్లుగా మార్చుతారు. ప్రస్తుతం ఒక్కో సచివాలయంలో సాంకేతిక విభాగానికి చెందిన ఉద్యోగులు గ్రామ రెవెన్యూ అధికారి, ఏఎన్ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, వ్యవసాయ (అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్), పశుసంవర్ధక (వెటర్నరీ, ఫిషరీష్), ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగులు ఏడుగురు, సాధారణ పరిపాలనకు సంబంధించి పంచాయతీ కార్యదర్శి–గ్రేడ్ 1–5, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, గ్రామ మహిళ పోలీసు ఉద్యోగులు ఐదుగురు ఉంటారు. ఒక్కో సచివాలయానికి మొత్తం 11 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోప్రజల ముంగిటకే సేవలు జిల్లాలో 502 సచివాలయాల ఏర్పాటు కొత్తగా రెండింటిని కలిపి ఒక క్లస్టర్గా మ్యాపింగ్ సాంకేతిక సిబ్బంది కుదింపు 1,757 మందిని తొలగించే అవకాశం ఇప్పటికే 372 సేవల తొలగింపు -
జెడ్పీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
కడప సెవెన్రోడ్స్: కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 23న జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జెడ్పీ చైర్మన్ను ఎన్నుకునేందుకు ఉద్దేశించిన ప్రత్యేక సమావేశం ఏర్పాటు కోసం నోటీసు జారీ చేస్తారు. ఈ నోటీసు జెడ్పీ సభ్యులందరికీ అధికారులు అందజేయాల్సి ఉంటుంది. ఈనెల 27వ తేది ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించి జెడ్పీ చైర్మన్ను ఎన్నుకుంటారు. ఆరోజు ఉదయం 10 గంటల ముందు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 12.00 గంటల్లోపు స్క్రూటినీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అర్హతగల నామినేషన్ల జాబితా విడుదల చేస్తారు. 1 గంటవరకు నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది. ఆపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. సమావేశం ముగిసిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. ఏదైనా కారణాల వల్ల ఆరోజు ఎన్నిక జరగకపోతే మరుసటిరోజు ఉదయం 11 గంటలకు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే ఉమ్మడి కడపజిల్లాలోని ఖాజీపేట, ఒంటిమిట్ట, రాయచోటి మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్ష ఎన్నికలను కూడా నిర్వహిస్తారు. జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన ఆకేపాటి అమర్నాథరెడ్డి రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్ సీపీ తరఫున గెలుపొందడంతో ఈ ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం ఇన్చార్జి చైర్ పర్సన్గా జేష్ఠాది శారద వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో జిల్లా పరిషత్కు కొత్త అధ్యక్షుడు ఎన్నిక కానుంది. -
దరఖాస్తుల ఆహ్వానం
రాయచోటి జగదాంబసెంటర్: అన్నమయ్య జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సర ప్రవేశానికి గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖా ధికారి కె.సుబ్రమణ్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18 నుంచి మే 22లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ఆసక్తి గల విద్యార్థిని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ముగిసిన నామినేషన్ల పర్వం రాజంపేట: రాజంపేట బార్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం నామినేషన్ల పర్వం ముగిసింది. బుధవారం నామినేషన్ల స్క్రూట్నీ కార్యక్రమం నిర్వహించనున్నారు. సీఈవో సురేష్కుమార్ నేతృత్వంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. కాగా రెండవ రోజు కృష్ణకుమార్ తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. హనుమంతనాయుడు, కృష్ణకుమార్ ప్యానల్ల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. 29న న్యాయవాదుల సంఘం ఎన్నికలు రాయచోటి అర్బన్: ఏపీ బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఈ నెల 29న రాయచోటి బార్ అసోసియేషన్కు సాధారణ ఎన్నికలు జరిగేలా రాయచోటి బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించినట్లు అధ్యక్షుడు ఎన్.ప్రభాకరరెడ్డి, కార్యదర్శి పి.రెడ్డెయ్య తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సీనియర్ న్యాయవాది రాజకుమార్రాజు, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా ఇలియాస్ బాషాను ఎగ్జిక్యూటివ్ కమిటీ నియమించిందన్నారు. ఈ నెల 20, 21, 22 తేదీలలో నామినేషన్లు దాఖలు చేయవచ్చునని పేర్కొన్నారు. 24న ఽనామినేషన్ల పరిశీలన, 25న ఉపసంహరణకు సమయం ఉంటుందన్నారు. 29న పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ మేరకు ఎన్నికల అధికారి రాజకుమార్రాజు నోటిఫికేషన్ విడుదల చేశారు. మెరుగైన పరిహారం ఇవ్వాలి గాలివీడు: భూ నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మండల పరిధి తూముకుంట గ్రామ పంచాయతీలోని దిగువమూలపల్లిలో సీపీఎం మంగళవారం రైతులతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామంలో దాదాపు 60 కుటుంబాలు నివసిస్తున్నాయని, వీరికి 40 ఏళ్ల నుంచి సాగులో ఉన్న భూమిని సోలార్ ప్రాజెక్టు పేరుతో తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడిందని తెలిపారు. అయితే వీరికి 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించిన తర్వాతే భూములు తీసుకోవాలని పేర్కొన్నారు. భూమికి భూమి, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఇంటికి ఒక ఉద్యోగం, పునరావాసం తదితరాలు ప్రభుత్వాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. సర్వేయర్ సస్పెన్షన్ బి.కొత్తకోట: పీటీఎం మండలం టీ.సదుం సచివాలయంలో సర్వేయర్గా విధులు నిర్వహిస్తున్న రాజేంద్రను సస్పెన్షన్ చేస్తూ జిల్లా సర్వే విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ జయరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. బి.కొత్తకోట మండలం గుమ్మసముద్రం పంచాయతీలో జరిగిన భూముల వ్యవహరంపై తహసీల్దార్ అజారుద్దీన్, సర్వే డెప్యూటీ ఇన్స్పెక్టర్ పంపిన నివేదికల ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. గుమ్మసముద్రం పంచాయతీలో జరిగిన భూముల రీసర్వేలో రాజేంద్ర పని చేశారు. గండువారిపల్లె గ్రామానికి చెందిన భూముల విషయంలో అన్ని సర్వే నంబర్లు జాయింటు భాగాలు, విస్తీర్ణంలో తేడాలు వేయడం, ప్రభుత్వ భూమిని తల్లిపేరుతో ఆన్లైన్ చేయించుకోవడంపై గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. గండువారిపల్లె సచివాలయంలో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనిపై విచారణ చేసిన అధికారులు వేర్వేరుగా నివేదికలను పంపగా చర్యలు తీసుకున్నారు. దీనిపై మంగళవారం తహసీల్దార్ అజారుద్దీన్ మాట్లాడుతూ రాజేంద్రను సస్పెన్షన్ చేయడంతోపాటు ఆరోపణలపై సమగ్ర విచారణకు సర్వే డెప్యూటీ ఇన్స్పెక్టర్ను అధికారులు నియమించారని చెప్పారు. -
తండ్రి మరణంలోనూ కుమార్తెకు ‘పరీక్ష’!
అన్నమయ్య జిల్లా: తండ్రి మరణించడంతో పుట్టెడు దుఃంఖంలోనూ ఆ విద్యార్థిని పది పరీక్షలకు హాజరైంది. అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం కందుకూరు పంచాయతీ గొడుగు వారి పల్లికి చెందిన కొత్తోళ్ల వెంకట్రమణ(55) ఆదివారం చింతచెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడి ప్రాణాలు విడిచాడు. ఆయన భార్య పదేశ్ల కిందటే అదృశ్యమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు గణేష్, కుమార్తె గిరిజ. అయితే దుఃఖాన్ని దిగమింగుకుని గిరిజ సోమవారం పదో తరగతి పరీక్షలకు హాజరైంది. పరీక్షల అనంతరం తండ్రి కడచూపు కోసం కన్నీటితో ఇంటికి వెళ్లింది. మద్యం మత్తులో ఎంఈవో!ఓ వైపు పదో తరగతి పరీక్షలు జరుగుతున్నా ఆ ఎంఈవో మాత్రం మద్యం మత్తులో మునిగితేలుతున్నాడు. శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరు జిల్లా ఉలవపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం శివనాగేశ్వరరావు ఉలవపాడు–1 ఎంఈవోగా ఉన్నారు. ఆయన సోమవారం వి«ధి నిర్వహణలో ఉండగానే యథేచ్ఛగా మద్యం తాగారు. ఉదయం 9.30 నుంచి స్థానికంగా ఉన్న బ్రాందీషాపు పక్కనే ఉన్న దుకాణం వద్ద కూర్చుని దాదాపు గంట సేపు మద్యం తాగారు. అంతేకాదు.. రాత్రి వేళల్లో ఉలవపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే నివాసం ఉంటూ.. రాత్రివేళ పాఠశాలలో సైతం మద్యం తాగుతుంటారని స్థానికులు, విద్యార్థులు చెబుతున్నారు. అదేమంటే.. తనకు మంత్రి అనగాని సత్యప్రసాద్ మిత్రుడని.. చెబుతుండటంతో ఫిర్యాదు చేసేందుకు ఉపాధ్యాయులు, చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సైతం వెనుకాడుతున్నారు. -
● భూమి ఆన్లైన్ చేయరూ..
పుల్లంపేట మండలం గొల్లపల్లె రంగంపల్లె. నాపేరు బూసిరెడ్డి ఆదిలక్షుమ్మ. నాకొడుకు రెడ్డయ్యరెడ్డికి నాకు సంబంధించిన ఎకరాన్నర భూమిని రాయిచ్చాను. అయితే 172/3లో 26 సెంట్లు ఆన్లైన్లోకి ఎక్కలేదు. మ్యుటేషన్ చేయిస్తామనుకుంటే కంప్యూటర్ తీసుకోవడం లేదని సారోళ్లు చెబుతున్నారు. ఆరేడు నెలల నుంచి సచివాలయానికి, తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరిగుతున్నా. నాపని మాత్రం కావడం లేదు. ఈ వయస్సులో ఎండలకు ఆఫీసుల చుట్టూ తిరగాలంటే అయ్యేపనేనా అయ్యా. ఏమైనా సమస్య ఉంటే ఇదోమ్మా ఈ సమస్య ఉంది అందువల్ల నీపని కాదు అని చెప్పొచ్చు కదా. ఎకరాన్నర భూమిలో 26 సెంట్లు మాత్రమే ఎందుకు ఆన్లైన్ చెయ్యరు. -
తొలి రోజు ప్రశాంతం
రాయచోటి : అన్నమయ్య జిల్లాలో పదో తరగతి పరీక్షలు మొదటి రోజున ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన పరీక్షలు మధ్యాహ్నం 12.30 వరకు జరిగాయి. జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు. జిల్లాలో జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 22, 296 మందికి గాను 21,711 మంది హాజరు కాగా.. 530 మంది గైర్హాజరైనట్లు డీఈఓ సుబ్రమణ్యం తెలిపారు. పరీక్షలకు 97.62 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. తెలుగుకు బదులుగా హిందీ పేపర్ పదోతరగతి పరీక్షలలో ముగ్గురు విద్యార్థులకు హాల్ టికెట్లు ముద్రణలో తెలుగు సబ్జెక్టుకు బదులు హిందీ సబ్జెక్టు ముద్రణ కావడంతో.. జిల్లాలోని మూడు సెంటర్లలో కొద్దిసేపు హైరానా నెలకొంది. హిందీ ప్రశ్నాపత్రాన్ని అందుకున్న ఆ విద్యార్థులు తొలుత ఆందోళనకు గురయ్యారు. విద్యార్థుల ఆవేదన, హాల్టికెట్టు పరిస్థితులను స్థానిక పరీక్ష నిర్వహణ అధికారి జిల్లా విద్యాశాఖ అధికారికి సమాచారం అందించారు. ముద్రణలో పొరపాటు జరిగి ఉంటుందని, వెంటనే వారికి తెలుగు ప్రశ్నాపత్రాన్ని ఇచ్చి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించడంతో.. కొన్ని నిమిషాల వ్యవధిలో సమస్యకు పరిష్కారం లభించింది. ఈ పరిస్థితి జిల్లాలోని మూడు ప్రాంతాలలో నెలకొనడంతో సమస్యకు పరిష్కారం చూపామని డీఈఓ తెలిపారు. కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు పదో తరగతి పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టంగా భద్రాతా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు పోలీసులు పగడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. రాయచోటి టౌన్ నేతాజీ సర్కిల్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి.. డీఈఓ డాక్టర్ కె. సుబ్రమణ్యంతో కలిసి సందర్శించారు. అనంతరం మాసాపేట జిల్లా పరిషత్ హైస్కూల్, లక్కిరెడ్డిపల్లి మోడల్ స్కూల్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించారు. కేంద్రాల చుట్టూ ఉన్న పరిసరాలు, పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ప్రారంభమైన పది పరీక్షలు 97.62 శాతం విద్యార్థుల హాజరు -
● దేవుడా.. ఇదేం ‘పరీక్ష’
బి.కొత్తకోట : బి.కొత్తకోటలో పదవ తరగతి విద్యార్థి తీవ్రంగా గాయపడి కాలు కదపలేని స్థితిలో మంచంపై పరీక్షా కేంద్రానికి హాజరైన ఉదంతం ఇది. సోమవారం పదవ తరగతి పరీక్షలు ప్రారంభమై మొదటి రోజు తెలుగు పరీక్ష నిర్వహించారు. మండలలోని ఆకులవారిపల్లెకు చెందిన లహిత్కుమార్రెడ్డి గట్టు జెడ్పీ హైస్కూల్లో పదవ తరగతి పూర్తి చేయగా స్థానిక మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రంలో పరీక్షలకు హజరుకావాల్సి వుంది. ఆయితే విద్యార్థి లహిత్కుమార్రెడ్డి శనివారం బైక్పై ఆకులవారిపల్లె నుంచి గట్టుకు వస్తుండగా హైస్కూల్ వద్ద ప్రమాదానికి గురయ్యాడు. కుడి కాలుకు తీవ్ర గాయాలు కావడంతో కాలంతా కట్టు కట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి పరీక్షలు రాయాల్సి ఉండటంతో కుటుంబ సభ్యులు కారులో స్కూల్కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి పరీక్షా కేంద్రంలోకి మోసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో మంచంపై తీసుకెళ్లారు. విద్యార్థి పరిస్థితి గమనించిన నిర్వాహకులు ఉపాధ్యాయుల విశ్రాంతి గదిలో పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు. అయితే రాసేందుకు వీలుకావడం లేదని చెప్పడంతో ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిని సహాయంగా నియమించడంతో లహిత్కుమార్రెడ్డి పరీక్ష పూర్తి చేశాడు. -
చేదెక్కిన చెరకు
చెరకు సాగు చేసిన రైతుల బతుకు చేదెక్కుతోంది. షుగర్ ఫ్యాక్టరీల మూసివేతతో దిగుబడిని విక్రయించుకోవడానికి వారు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. మద్దతు ధర ప్రకటనలో ప్రభుత్వ ప్రోత్సాహం కరువు అవుతోంది. దీంతో చాలా మంది ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. పర్యవసానంగా జిల్లాలో చెరకు సాగు గణనీయంగా తగ్గిపోయింది. అమ్ముకునే వెసులుబాటు కల్పించాలి ఆరుగాలం కష్టపడి పండించిన చెరుకును అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. చెరుకు విక్రయాలపై ఎకై ్సజ్ అధికారుల తీరు మారాలి. ప్రభుత్వం నల్లబెల్లం తయారీని అమ్ముకునే వెసులుబాటు కల్పించాలి. చెరకు పంటకు మార్కెట్ సౌకర్యం కల్పించి, గిట్టుబాటు ధర కల్పించాలి. అప్పుడే రైతులు చెరుకు సాగు చేయగలరు. – రెడ్డిబాషా, రైతు, కొత్త కురవపల్లె, తంబళ్లపల్లె మండలం పలు సమస్యలతోనే అనాసక్తి ఒకప్పుడు.. చెరుకు పంట దీర్ఘకాలికమైనా నికరమైన ఆదాయం వచ్చేది. ఇప్పుడు పలు సమస్యలు తలెత్తడంతో రైతులు చెరకు సాగుపై ఆసక్తి చూపడం లేదు. పక్క జిల్లాలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ మూతపడటం, మార్కెట్ సౌకర్యాలు లేకపోవడం, బెల్లం తయారీ సమయంలో కూలీల సమస్యతో రైతులు చెరుకు సాగును చేయలేకపోతున్నారు. – రమణకుమార్, వ్యవసాయ అధికారి, తంబళ్లపల్లె ఎలుకలు ఉన్నాయని ఇంటినే తగలేసిన చందంగా తయారైంది.. ఎకై ్సజ్ అధికారుల తీరు. సారా తయారీకే బెల్లం వినియోగిస్తున్నారని భావిస్తే.. కచ్చితంగా అలాంటి వ్యాపారులపై చర్యలకు ఉపక్రమించాలి. కానీ పిండి వంటలు, ఇతర గృహ అవసరాలకు ఉపయోగపడే బెల్లాన్ని పూర్తిగా వద్దనడంపై విమర్శలు వస్తున్నాయి. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటూ ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అయినా గ్రామాల్లో అక్రమంగా మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉన్నాయి. మరో వైపు ప్రభుత్వమే అధికారికంగా మద్యం అమ్మకాలు నిర్వహిస్తోంది. ఆరోగ్యానికి మేలు కలిగించే బెల్లం అమ్మకాలపై మాత్రం నిషేధం విధించింది. ఒకప్పుడు బెల్లం తయారీకి నియోజకవర్గం ప్రసిద్ధి. ఇక్కడ పండించే బెల్లం ముంబయి, చైన్నె, గుజరాత్ రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అనంతపురం, వైఎస్సార్ జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లాల నుంచి వ్యాపారులు పల్లెల్లో ముమ్మరంగా తిరిగి కొనుగోలు చేసి తీసుకెళ్లే వారు. ఎకై ్సజ్ అధికారుల తీరుపై విమర్శలు -
● నా పేరుతో ఇల్లు.. బిల్లులు ఎవరికో ఇచ్చి..
నా పేరు జి.రామక్క. నా పేరుతో గత ప్రభుత్వం ఇల్లు నిర్మించుకునేందుకు మంజూరు చేసింది. అయితే స్థోమత లేక అప్పట్లో ఇల్లు కట్టుకోలేదు. ఇప్పుడు ఇల్లు కట్టుకొందామని అధికారుల దగ్గరకు వెళ్లి అడిగితే.. ఎప్పుడో ఇల్లు కట్టుకున్నానని దానికి బిల్లులు కూడా తీసుకున్నావని చెప్పుతున్నారు. నా బ్యాంక్ పాస్ బుక్, రికార్డులు తీసుకెళ్లి చూస్తే బిల్లులు పడినట్లు లేదు. మళ్లీ అడిగితే మళ్లీ అదే సమాధానం, ఎవరికి వేశారో రికార్డులు చూపాలని కోరితే నా పేరు జి.రామక్క అయితే.. సీ రామక్క అనే పేరుతో బిల్లులు వేసినట్లు రికార్డులు చూపెట్టారు. అయితే ఆమె ఎక్కడుందో చెప్పితే ఆమె దగ్గరకు వెళ్లి అడుగుతానని కోరితే.. ఎక్కడుందో వారికి తెలియదంటా. అది నేనే తెలుసుకొని వారి దగ్గరికి తీసుకెళ్లాలంట. ఆమె ఎవరో ఏ జిల్లాలో ఉందో నాకెలా తెలుస్తుంది. బిల్లులు ఇచ్చిన అధికారులకు వారి ఇచ్చిన పేపర్ల ఆధారంగా చూడొచ్చు కదా.. డబ్బులు వాళ్లు ఇచ్చి.. ఆమె ఎవరో నేను తెలుసుకొని తీసుకురమ్మంటున్నారు. -
● ఇక ఎవరికి చెప్పుకోవాలో..
‘నాపేరు జగన్నాథ అరుణ్బాబు. మాఊరు కలికిరి నూర్ కాలనీ. నాకు రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మాతల్లి చనిపోయింది. నేను పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. మాలాంటి వికలాంగులకు న్యాయం జరగాలంటే ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ప్రజావేదికలో అర్జీ ఇచ్చేందుకు వచ్చాను. సార్..సార్.. నాకు పింఛన్ ఇప్పించండి’ అని అక్కడికి వచ్చిన అధికారులను అరుణ్ బాబు ప్రాథేయపడుతున్నా.. ఫలితం దక్కడం లేదు. ● పెన్షన్ ఇవ్వండి మహాప్రభో.. నాపేరు వీభద్రాచారి. మా ఊరు పీలేరు బాలమారుపల్లె. నా వయసు 65 సంవత్సరాలు. నాకు కళ్లు సరిగా కనపడవు. ఆసుపత్రికి వెళ్లి ఒక కన్నుకు వైద్యం చేయించుకున్నాను. నాకు ఏ ఆధారము లేదు. సంబంధిత పత్రాల కోసం అధికారుల చుట్టూ తిరగాను. సార్.. ఇప్పటికై నా నాకు పింఛన్ మంజూరు చేయాలి. -
● మానవత్వంతోనైనా న్యాయం చేస్తారని..
నా పేరు టి.నందిని, మేము మండల కేంద్రమైన గాలివీడు టౌన్ చిలకలూరిపేటలో నివసిస్తున్నాం. 2024 నవంబర్ ఆరో తేదీన నా భర్త హరినాథ్ పక్కిరవాండ్లపల్లి సమీపంలో మామిడి తోటలో ట్రాక్టర్ మిల్లరులో పడి మృతి చెందాడు. దీనికి కారణమైన వారు అరవిటి వాండ్లపల్లిలో ఉన్నారు. దాదాపు 5 నెలలు కావస్తున్నా నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. నేను నా పిల్లలు కలిసి చనిపోవడానికి సిద్ధమవుతున్నాము. మా కుమార్తె సాహితీకి నాలుగేళ్లు, కుమారుడు జన్నేశ్వర్కు ఏడాది.. నా పరిస్థితి బాగా లేకనే ఇంత దూరం ఇద్దరి పిల్లల్ని వేసుకొని అధికారుల దగ్గరికి వచ్చా.. కనీసం మానవత్వంతో అన్న న్యాయం చేస్తారని కలెక్టర్కు సార్ విన్నవించుకోగా .. ఆయన గాలివీడు పోలీసులకు ఫోన్ చేసి అవతలి వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పారు.. నేను ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను. న్యాయం కోసమే ఇక్కడికి వచ్చాను. -
● కొన్నేళ్లుగా తిరుగుతున్నా..
అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లోకి ఇలా పాకుకుంటూ వస్తున్న దివ్యాంగుడిని చూస్తే బాధేస్తుంది. మండు వేసవిలో కాళ్లు చేతులతో పాకుతూ... రోడ్డు ఎండలకు కాలుతుండడంతో అలాగే ముందుకు వచ్చి అతి కష్టం మీద కలెక్టరేట్లోకి వచ్చిన ఇతని పేరు ఎలిశెట్టి పార్థసారథి. ఊరు జిల్లా కేంద్రంలోని మాసాపేట. ‘నా వయసు 25 సంవత్సరాలు, డిగ్రీలో బీజెడ్సీ పట్టా పొందాను. నేను అడిగేది నాకు పెన్షన్ ఇవ్వండి. చదువుకు తగ్గట్టు ఉద్యోగం కల్పించండి... పోయిన కొన్ని సర్టిఫికెట్లు ఇప్పించండి.. ఇలా ఒక్కసారి కాదు చాలాసార్లు వచ్చి కలెక్టర్ కార్యాలయంలో వినతులు ఇస్తూనే ఉన్నాను. ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా ఫలితం మాత్రం దక్కడం లేదు. రెండు కాళ్లు లేవు నడవలేని స్థితిలో దేకుకుంటూ కలెక్టర్ కార్యాలయం వరకు రావాల్సి వస్తోంది.. ఈ స్థితిలో ఇలా కొన్నేళ్లుగా తిరుగుతున్నా అధికారుల నుంచి స్పందన రాకపోవడం, ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం దారుణం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు పార్థసారథి. -
హాల్ టికెట్లో తప్పిదం.. అధికారుల హైరానా
వీరబల్లి : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్ష హాల్ టికెట్లో తప్పుగా ముద్రించడంతో పరీక్ష కేంద్రంలో అధికారులు హైరానా పడ్డారు. స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో పదోతరగతి చదువుతున్న నమృత హాల్ టికెట్లో తెలుగు పరీక్షకు బదులు హిందీ అని ముద్రించడంతో పరీక్ష కేంద్రంలో ఆ బాలికకు తెలుగు ప్రశ్నాపత్రం బదులు హిందీ ప్రశ్నా పత్రం ఇచ్చారు. ఇది గమనించిన విద్యార్థిని అవాకై ్కంది. వెంటనే ఆమె ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లగా అధికారులు వెంటనే డీఈఓకు విషయాన్ని తెలిపారు. ఆయన స్పందించి హిందీ ప్రశ్నాపత్రం ప్రక్కన పెట్టి తెలుగు ప్రశ్నాపత్రం ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ఆ విద్యార్థిని తెలుగు పరీక్ష రాసింది. -
జ్యోతి క్షేత్రంలో ఆశ్రమాలు తిరిగి నిర్మించాలి
కడప సెవెన్రోడ్స్ : జ్యోతి క్షేత్రంలో ఇటీవల ప్రభుత్వం కూల్చివేసిన ఆశ్రమాలను తిరిగి నిర్మించాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య కళాక్షేత్రం, హిందూస్ ఫర్ ఫ్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంయుక్తాధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర్స్వామి, హెచ్పీఈ జాతీయప్రధాన కార్యదర్శి కొవ్వూరు లోకనాథ్ మాట్లాడుతూ కాశిరెడ్డి నాయన జ్యోతి క్షేత్రం ఎంతో ప్రసిద్ధిగాంచిందన్నారు. ఆశ్రమ వసతి గృహాలను అటవీ అధికారులు కూల్చివేసిన సంఘటన లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కూల్చివేతలు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జై భారత జాతీయ ఉపాధ్యక్షుడు వంశీ, గురవయ్య, పలువురు భజన కళాకారులు పాల్గొన్నారు. అనంతరం జేసీకి వినతిపత్రం అందజేశారు. రేపు విజయవాడలో మహా ధర్నాపులివెందుల టౌన్ : మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీన విజయవాడలోని ధర్నా చౌక్లో మహా ధర్నా నిర్వహించనున్నట్లు యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చాంద్ బాషా తెలిపారు. సోమవారం పులివెందుల పట్టణంలో ఆయన మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథక కార్మికులకు నెలకు రూ.10వేలు వేతనం ఇవ్వాలని, ఎలాంటి కారణాలు లేకుండా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కామాక్షమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆటోను ఢీకొన్న ఐచర్ వాహనం ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మండల పరిధిలోని ప్రొద్దుటూరు రోడ్డులో ఎస్వీ కల్యాణ మండపం సమీపంలో ఉన్న శ్రీ ఆంజనేయస్వామి గుడి దగ్గర ఆటోను గుర్తు తెలియని ఐచర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ చంగల రామాంజనేయులుతో పాటు ఆటోలో ఉన్న మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరు పట్టణంలోని డ్రైవర్ కొట్టాల కాలనీకి చెందిన అల్లం లక్ష్మీనారాయణమ్మ, అల్లం జగన్నాథం, అల్లం నాగ పద్మ, అల్లం నాగ బిందు, జి.నాగముని, జి. రామాంజనేయులు ప్రొద్దుటూరులోని ఒకే కుటుంబానికి చెందినవారేరు. వీరంతా ప్రొద్దుటూరు వెళ్లేందుకు చంగల రామాంజనేయులుకు చెందిన ఆటో ఎక్కారు. ఎస్వీ కల్యాణ మండపం వద్దకు రాగానే ఆటో వెనుక వైపు గుర్తు తెలియని ఐచర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చంగల రామాంజనేయులు కాళ్లకు తీవ్ర గాయాలు కాగా, ఆటోలో ఉన్న మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లింగాల సబ్ స్టేషన్లో అగ్నిప్రమాదం లింగాల : మండల కేంద్రంలోని 133 కేవీ సబ్ స్టేషన్లో సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సబ్ స్టేషన్ సిబ్బంది ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సబ్ స్టేషన్ ఆవరణలో భారీగా ముళ్ల పొదలు ఉండటంతో ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటల తీవ్రత ట్రాన్స్ఫార్మర్లకు తగలకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది అనిల్ కుమార్, రవీంద్రారెడ్డి, డ్రైవర్ ఆపరేటర్ బుజ్జిబాబు పాల్గొన్నారు. 133 కేవీ సబ్ స్టేషన్కు ఎలాంటి ప్రమాదం లేదని ఏఈ రమేష్ తెలిపారు. ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశామన్నారు. -
కూటమి సర్కారు కట్టుకథ మదనపల్లె ఫైల్స్
మదనపల్లె : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాద ఘటనను, రాజకీయ దురుద్దేశంతో కుట్ర పూరితంగా జరిగిందనే కోణంలో ప్రజలను నమ్మించేందుకు కూటమి సర్కార్ అల్లిన కట్టుకథే మదనపల్లె ఫైల్స్ అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్తిప్పారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ మనూజారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. మదనపల్లె ఫైల్స్ ఘటనలో ప్రధాన నిందితుడుగా ఉన్న గౌతమ్తేజ్కు నిర్వహించిన పాలీగ్రాఫ్ పరీక్షలో నేర నిరూపణ నిర్ధారణ కాలేదని నివేదికలో వెల్లడించడంతో పాటు ఎవరి ప్రమేయం లేదని హైకోర్టు నిర్ధారించిందన్నారు. అగ్నిప్రమాద ఘటన రాత్రి 11.30 గంటలకు జరిగితే.. గౌతమ్తేజ్ 10.40 గంటలకు సబ్ కలెక్టరేట్ నుంచి బయటకు వచ్చినట్లు స్పష్టంగా నివేదికలో పేర్కొన్నారని, సీసీ కెమెరా ఆధారాలు ఉన్నాయన్నారు. ఘటనలో ప్రభుత్వం పేర్కొన్న ఏ–1 ముద్దాయి గౌతమ్తేజకు ప్రమేయం లేదని తెలుస్తుంటే, ఎవరి ప్రోద్బలంతోనే జరిగిందని ఎంపీ మిథున్రెడ్డి కుటుంబ సభ్యులపై అభియోగాలు మోపడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎల్లో మీడియాలో పెద్దిరెడ్డి కుటుంబంపై 20 నుంచి 30 అసత్య కథనాలు, అభియోగాలు మోపారని, వాటిలో ఏ ఒక్కటి రుజువు చేయలేకపోయారన్నారు. రెండురోజుల క్రితం పుంగనూరు నియోజకవర్గం కృష్ణాపురంలో వ్యక్తిగత విభేదాలతో దాయాదుల మధ్య గొడవ జరిగి హత్యకు దారితీస్తే.. వైఎస్సార్ సీపీకి ఆపాదిస్తూ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా వైఎస్సార్సీపీకి ఆపాదిస్తూ మాట్లాడటం కూటమి నాయకులకు అలవాటైపోయిందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు హర్షవర్దన్రెడ్డి, కొమ్మేపల్లె శ్రీనివాసులురెడ్డి, జన్నే రాజేంద్రనాయుడు, నీరుగట్టి మేరీ, బి.రేవతి, ఈశ్వర్నాయక్, సురేంద్ర, మస్తాన్రెడ్డి, కోటూరి ఈశ్వర్, అంబేద్కర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
● బీమా లేని బతుకులు
వారు నిరాశ్రయులు.. కన్నవారిని.. కన్న ఊరును వదిలేసి వచ్చిన వలస జీవులు. పగలంతా ఏదో ఒక పని చేసుకుని.. రాత్రయ్యే సరికి ఇదిగో ఇలా ఫుట్పాత్లపై నిద్రిస్తుంటారు. అయిన వారికి.. ఆత్మీయులకు దూరంగా ఉంటున్న వీరి బతుకులకు ఎలాంటి ధీమా లేదు.. వీరు సేద తీరుతున్న చోట గోడపైన ఉన్న జీవిత బీమా ప్రకటన చూసిన వారు ఏ బీమా వర్తించని బతుకులు వీరివే కదా అంటూ ఓ క్షణం ఆగి.. ఆలోచించి వెళ్లిపోతున్నారు. కడప నగరంలో ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్కు వెళ్లే మార్గంలో సాక్షి కంట పడిన దృశ్యమిది. – ఎస్కే మొహమ్మద్ రఫీ, సాక్షి సీనియర్ ఫొటోగ్రాఫర్, కడప. -
భద్రకాళీ సమేతుడికి పల్లకీ సేవ
రాయచోటి టౌన్ : రాయచోటిలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామికి పల్లకీ సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం రాత్రి స్వామి వారికి, అమ్మవారికి అభిషేకాలు, పూజలు నిర్వహించి అందంగా అలంకరించి పల్లకీలో ఉంచి ఆలయ మాఢవీధులలో, ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఈ పల్లకీ సేవ ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణయ్య స్వామి, శంకరయ్య స్వామి, శేఖరయ్య స్వామి, వేదపండితులు రాచరాయ యోగీ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. వ్యక్తి ఆత్మహత్యాయత్నంమదనపల్లె : కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన సోమవారం మదనపల్లె మండలంలో జరిగింది. అంకిశెట్టిపల్లె పంచాయతీ నారమాకుల తండాకు చెందిన చినరెడ్డెప్ప నాయక్ కుమారుడు దొరస్వామి నాయక్(38) కుటుంబ సమస్యలతో ఇంటివద్దే విషపు గుళికలు మింగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
ప్రకృతి పంటలకు మంచి డిమాండ్
రాయచోటి టౌన్ : ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన పంటలకు మంచి డిమాండ్ ఉందని మార్కెటింగ్ ఎన్ఎఫ్ పవన్ కుమార్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన పంటలను విక్రయించేందుకు ఒక స్టాల్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సోమవారం ఈ స్టాల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గణనీయంగా కొనుగోళ్లు జరిగి రైతులు పండించిన పంటలకు డిమాండ్ పెరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఎంపీ పద్మావతి పాల్గొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ఉద్యోగుల నిరసనరాయచోటి టౌన్ : తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఎన్టీఆర్ వైద్య సేవ ఉద్యోగులు సోమవారం జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, క్యాడర్ కల్పించాలని కోరారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆ శాఖ అధికారులకు అందజేశారు. -
అడవి పందిని ఢీకొని వ్యక్తికి గాయాలు
ఓబులవారిపల్లె : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో అడవి పందిని ఢీ కొని బైకుపై నుంచి కింద పడటంతో డీకాల పవన్ అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో అడవి పందులు అధికంగా సంచరిస్తున్నాయి. చీకటి పడగానే అడవి పందులు మందలుగా వీధుల్లోకి వస్తున్నాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు. ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి అడవి పందుల బెడదను నివారించాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు. గండి దేవస్థాన భూములకు వేలం పాట చక్రాయపేట : మండలంలోని మారెళ్ల మడక గ్రామ పంచాయతీలో ఉన్న గండి వీరాంజనేయస్వామి ఆలయంలో సోమవారం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో గండి దేవస్థాన భూములకు వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో ఇడుపులపాయ గ్రామ సర్వే నెంబర్ 469లో గల 8.72 ఎకరాల భూమిని ఏడాది కాలానికి రూ.1.51 లక్షలకు పి.జి.మహేష్ దక్కించుకున్నారు. అలాగే వీరన్నగట్టుపల్లె గ్రామంలోని 98 సెంట్ల భూమిని రూ.4 వేలకు ఆర్.తేజేశ్వర దక్కించుకున్నారు. అలాగే గండి దేవస్థానానికి సంబంధించిన సులభ్ కాంప్లెక్స్ను రూ.20 వేలకు ఇడుపులపాయకు చెందిన పి.వెంకటరత్నం దక్కించుకున్నారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ కృష్ణతేజ, మాజీ చైర్మన్ వెంకటస్వామి, దేవస్థాన ఉప ప్రధాన అర్చకుడు రాజా రమేష్, ఆలయ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు బి.కొత్తకోట : బి.కొత్తకోట మండలంలోని హార్సిలీ హిల్స్ క్రాస్ సమీపం రామాపురం వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు వివరాలు. స్థానిక బీసీ కాలనీకీ చెందిన జయచంద్ర (58), సువర్ణ (50) భార్యాభర్తలు. జయ చంద్ర చిత్తూరు ఆర్టీసీ డిపోలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. వీరు బైక్ పై మదనపల్లెకు వెళ్లి తిరిగి బి.కొత్తకోటకు వస్తున్నారు. హార్సిలీ హిల్స్ క్రాస్ దాటుకుని రామాపురం వద్దకు రాగానే పీటీఎం నుంచి మదనపల్లికి టమాటా లోడుతో వెళ్తున్న ఐచర్ వాహనం ఢీకొంది. ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జయచంద్ర కాలికి పలుచోట్ల ఫ్రాక్చర్లు అయ్యాయి, సువర్ణకు తల, పలుచోట్ల గాయాలయ్యాయి. వీరిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం జయచంద్రను బెంగళూరుకు, సువర్ణను వేలూరుకు తీసుకెళ్లారు. -
భక్తి పారవశ్యం.. ప్రేమ వాత్సల్యం
మదనపల్లె సిటీ : మానవుల ఆలోచనాత్మక శిక్షణ.. ఆచరణాత్మక సంస్కరణ.. ఆధ్యాత్మిక వికాసం.. ఆత్మీయత, అనురాగాల అనుబంధం.. ఆకలి నుంచి ఔన్నత్యానికి దైవం అందించిన మహత్తర అవకాశం రంజాన్ మాసం. పవిత్ర వాతావరణంలో శారీరక, మానసిక, సాధనతో నైతిక ప్రగతి సుసాధ్యం అని ఇస్లాం బోధిస్తుంది. భక్తి పారవశ్యానికి ప్రతీక అయిన ఈ మాసం ప్రేమ.. వాత్సల్యాన్ని పంచుతోంది. విధిగా దానం(జకాత్) ద్వారా పేదలను అక్కున చేర్చుకునే శుభాల వసంతం రంజాన్ మాసం. జిల్లాలో రంజాన్ మాసం సందర్భంగా శారీరక, ఆధ్యాత్మిక వికాసానికి సాధనమైన ఉపవాసాలు కొనసాగుతున్నాయి. మసీదుల్లో రంజాన్ సూచికగా తరావీల రూపంలో దివ్యఖురాన్ ఆయత్లు ప్రతి చోట వినిపిస్తున్నాయి. రంజాన్ నెల వంక దర్శనమైనప్పటి నుంచి మసీదు కమిటీల ఆధ్వర్యంలో ఇఫ్తార్, సహర్ వేళలను పాటిస్తూ ఉపవాసాలు చేస్తున్నారు. సహనం, క్రమశిక్షణ లాంటి మహోన్నత వ్యక్తిత్వాలను అలవర్చే రోజా వ్రతాలను ఉపవాసదీక్షాపరులు భక్తిశ్రద్ధలతో పాటిస్తున్నారు. ఆధ్యాత్మిక వికాసానికి స్వాగత ద్వారం.. రంజాన్ నెల ఆధ్యాత్మిక స్వాగత ద్వారం లాంటిదని ముస్లింల భావన. అన్ని దుష్టకార్యాల నుంచి రక్షణ పొందేందుకే రంజాన్ శిక్షణగా భావిస్తారు. నెల రోజులు పాటించే ఆచరణలు మిగిలిన జీవితంలో కూడా చేపట్టాలన్నదే రంజాన్ శిక్షణ ధ్యేయం. ఉపవాసాలు పాటించే ముస్లింలు ఈర్ష్య, ద్వేషం, అసత్యం పలకడం తదితర దుర్గుణాలను త్యజిస్తారు. ఉపవాసదీక్షాపరుల్లో పవిత్రత నెలకొంటుంది. రాగద్వేషాలకు తావులేని వాతావరణం వెల్లివిరిస్తుంది. ఎలాంటి చెడులు లేని ప్రశాంత జీవితం దక్కుతుంది. ఉపవాసదీక్ష పాటించిన ప్రతి ముస్లింని రోజా పరిణితి కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. ఆత్మీయత, అనురాగాలు.. రంజాన్ నెలంతా ప్రతి ముస్లిం ఇంట్లో దైవారాధనలు, పవిత్ర ఉపవాసదీక్షలు, పుణ్యకార్యాలు, ఆధ్యాత్మిక చింతన వెల్లివిరుస్తుంది. ఉపవాసం పాటించేవారు తెల్లవారకముందే లేచి భోజనం ఆరగించాలి. దీన్ని సహరి అంటారు. సూర్యాస్తమయం వరకు మంచినీళ్లు సైతం ముట్టరు. అనంతరం మసీదు సైరన్తో ఉపవాసం ముగిస్తారు. దీన్ని ఇఫ్తార్ అంటారు. మసీదులన్నీ నమాజులతో కిటకిటలాడుతున్నాయి. పవిత్ర ఖురాన్ పఠనంతో తన్మయులవుతారు. దయాగుణం అలవడుతుంది.. రంజాన్మాసం కొందరు ముస్లింలలో ఉన్న పిసినారితనం, ధనార్జన గుణం తదితర దుర్గుణాలను పోగొట్టి, దానగుణాన్ని పెంపొందిస్తుంది. ఈ నెలలో దానధర్మాలు అధికంగా చేయాలని మహమ్మద్ ప్రవక్త బోధించారు. ఒక్కొక్క పుణ్యకార్యానికి 70 రెట్లు అధిక పుణ్యఫలం ప్రసాదిస్తాడని ప్రవక్త బోధించారు. దీంతో ఆర్థికంగా సహాయం అందుతుంది. తమ సంపాదనలో 2.5 శాతం ధనాన్ని పేదలకు పంచాలని అల్లాహ్ ఖురాన్లో శాసనం చేశారు. సదఖా, జకాత్, ఫిత్రా దానాల ద్వారా పేదలకు రంజాన్ నెలలో ఆనందోత్సవాలతో పండుగ జరుపుకుంటారు. దీంతో వారి అవసరాలు తీరుతాయి. ఫలితంగా సమసమాజ స్థాపన జరుగుతుంది. ఆర్థిక సమస్యలకు పరిష్కారంగా జకాత్ ఉపయోగపడుతుంది. రంజాన్ నెలంతా ఇలా భయ, భక్తులతో ఉపవాసాలను పాటిస్తూ నమాజులను ఆచరిస్తూ ధాన, ధర్మాలను చేస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో ముస్లింలు గడుపుతారు. తరావీ నమాజులో ఇమామ్ల ద్వారా ఖురాన్లో కొంత భాగాన్ని రోజూ ఆలకిస్తారు. ఇలా చేయడం పుణ్యప్రదంగా భావిస్తారు. త్రికరణ శుద్ధిగా ఖురాన్ బోధనలను పఠిస్తారు. మృదు స్వభావం.. సమాజంలో పేదసాదల ఆకలిదప్పులను రోజా(ఉపవాసదీక్షలు)లు తెలుపుతాయి. తోటివారి వ్యథాభరిత జీవితాన్ని కళ్లకు కడుతుంది. దీంతో తమ తోటివారు అనాథలు, అణగారిన వారిపై జాలి కలుగుతుంది. తద్వారా మృదుస్వభావం అలవడుతుంది. దీంతో వారి బాధలను కష్టాలని తీర్చేందుకు పాటుపడతారు. వ్యవసనాలకు దూరంగా.. తాగుడు, జూదం, మత్తు పదార్థాలను నమలడం లాంటి దురలవాట్లు 16 గంటల పాటు దూరమైతే ఆ వ్యక్తిలో ఆయా వ్యసనాలను త్యజించే మానసిక సంసిద్ధత ఉద్భవిస్తుందని నమ్మకం. ఉపవాసాలు మనిషి అన్ని చెడులను దూరంగా చేసి, సత్కార్యాలను దగ్గర చేస్తాయి. అత్యుత్తమ శిక్షణనిస్తాయి. దివ్య సుగంధాలను వెదజల్లుతున్న రంజాన్ ఉపవాసదీక్షాపరులతో మసీదులు కళకళ ఎటుచూసినా ఆధ్యాత్మిక వాతావరణంప్రవక్త బోధనలు పాటించాలి.. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాసదీక్షలతో పాటు మహమ్మద్ ప్రవక్త బోధనలు పాటించాలి. రంజాన్ మాసంలో 30 రోజుల పాటు చేపట్టే ఉపవాసదీక్షలతో పేదల ఆకలి, బాధ తెలుస్తుంది. దీంతో పేదలను ఆదుకోవడం జరుగుతుంది. రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం ఏదో విధంగా పేదలను ఆదుకోవాలి. పేదరికం లేని సమాజ నిర్మాణమే రంజాన్ ఆశయం. –మౌలానా జలాలుద్దీన్సాహెబ్, ప్రభుత్వఖాజీ, మదనపల్లె -
స్థలం కబ్జా చేసిన టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలి
కేవీపల్లె : మండలంలోని గర్నిమిట్టలో ఏపీ ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ స్థలాన్ని కబ్జా చేసిన టీడీపీ నాయకుడు గంగిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డి సురేష్ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ నాయకులు సోమవారం తహసీల్దార్ నరేంద్రకుమార్కు ఫిర్యాదు చేశారు. 20 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉండి కార్యక్రమాలు జరుపుకుంటున్న స్థలాన్ని కబ్జా చేయడం సమంజసం కాదన్నారు. అధికారులు తక్షణం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. తహసీల్దార్ ఆదేశాలతో వెంటనే రెవెన్యూ సిబ్బంది సంబంధిత స్థలాన్ని పరిశీలించారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ స్థలంలో ఎవరూ ప్రవేశించరాదని, ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గడికోట గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
దేవుడా.. మాకిక దిక్కెవరు!
పెద్దతిప్పసముద్రం: ‘అమ్మ చిన్నప్పుడు నిన్ను, మమ్మల్ని వదిలి వెళ్లిపోయినా.. తల్లి లేని లోటు లేకుండా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడావు. రేపటి నుంచి జరిగే పది పరీక్షలకు వెంట తీసుకెళతాను అన్నావు కదా లేనాన్న’.. అంటూ తండ్రి మృతదేహం వద్ద ఆ బాలిక వెక్కివెక్కి ఏడ్చటం చూపరులను కంట తడి పెట్టించింది. ఈ విషాద సంఘటన మండలంలోని కందుకూరు పంచాయతీ గొడుగువారిపల్లిలో చోటు చేసుకుంది. గొడుగువారిపల్లికి చెందిన కొత్తోళ్ళ వెంకటరమణ (55)కు గణేష్ (20), గిరిజ (15)లు సంతానం. వెంకటరమణ భార్య 10 ఏళ్ల క్రితమే భర్త, పిల్లలను వదిలి ఎటో వెళ్లిపోయింది. అప్పటి నుంచి కూలి పని చేస్తూ పిల్లలను పోషించేవాడు. కుమారుడు గణేష్ చిన్నా, చితకా పనులు చేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. కుమార్తె కందుకూరు జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదివి రేపటి నుంచి జరిగే పబ్లిక్ పరీక్షలకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం గ్రామంలోని చింతచెట్టు ఎక్కి కాయలు కోసే క్రమంలో.. వెంకటరమణ చెట్టు కొమ్మల పట్టు తప్పి ప్రమాదవశాత్తు కింద పడి గాయాల పాలై స్పృహ కోల్పోయాడు. ఆయనను గ్రామస్తులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృత్యువాత పడ్డాడు. ‘దేవుడా మాకిక దిక్కెవరు, మేము చేసిన పాపమేమి’ అంటూ ఆ పిల్లల రోదనలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా మూగబోయి విషాదంతో నిండిపోయింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చెట్టుపై నుంచి పడి తండ్రి మృతి పదేళ్ల క్రితమే భర్త, పిల్లలను వదిలి వెళ్లిన భార్య -
● పకడ్బందీగా నిర్వహించండి
రాయచోటి టౌన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని 10వ తరగతి పరీక్షల అడిషనల్ డైరెక్టర్ ఎస్ఎస్సీ పరీక్షల రాష్ట్ర అబ్జర్వర్ డి.మధుసూదన్ రావు సూచించారు. రాయచోటిలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ఆయన ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు తాగునీటి, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు. కార్యక్రమంలో డీఈఓ డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఉప విద్యాశాఖాధికారి శివప్రకాష్రెడ్డి, ఓపెన్ స్కూల్స్ జిల్లా కో ఆర్డినేటర్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలో ఏప్రిల్ 5 నుంచి 15 వరకు జరగనున్న శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తెలిపారు. ఒంటిమిట్ట కోదండ రామాలయం వద్ద చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీలు, సీఐలకు పలు సూచనలు చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలన్నారు. కడప–ఒంటిమిట్ట మార్గంలోని ఉప్పరపల్లె వద్ద ఏర్పాటు చేయనున్న పార్కింగ్ ప్రదేశం, కల్యాణ వేదిక, సాలాబాద్ వద్ద ఉన్న పార్కింగ్ ప్రవేశం, టీటీడీ గెస్ట్ హౌస్, వీవీఐపీ గెస్ట్ హౌస్, ఆలయ పరిసరాలు పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై కడప డీఎస్పీ వెంకటేశ్వర్లుతో మాట్లాడారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. కల్యాణ వేదిక సమీపంలోని పార్కింగ్ స్థలం వద్ద వాహనాలు క్రమ పద్ధతిలో నిలిపి ఉంచేలా పర్యవేక్షించాలన్నారు. భారీ కేడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట సీఐ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థీ.. విజయోస్తు
సాక్షి రాయచోటి/రాజంపేట టౌన్: ఏడాది కాలంగా కష్టపడి చదివిన విద్యార్థులు.. ఇక పేపరుపై రాయడానికి సమయం ఆసన్నమైంది. పది పరీక్షలకు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. విద్యార్థులందరికీ విజయీభవ. పట్టుదలతో చదివిన అంశాలను.. మానసిక ఒత్తిడికి లోనుకాకుండా.. పేపరుపై విశదీకరిస్తే సులువుగా ఉత్తమ ఫలితం సాధిస్తారని విద్యావేత్తలు అభివర్ణిస్తున్నారు. ‘పది’ పరీక్షలు అనగానే ఏదో లోలోపల టెన్షన్ పడకుండా.. ప్రశాంతమైన మనసుతో రాయడమే విజయానికి నాందిగా మేధావులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు, గురువుల ఆశయాలు, ఆకాంక్షలకు అనగుణంగా రాణించేందుకు.. ప్రతి విద్యార్థి ప్రయత్నం చేయాలని ‘సాక్షి’ ఆకాంక్షిస్తోంది. ఇప్పటికే పదవ తరగతికి సంబంధించి సీబీఎస్ఈ పరీక్షలు ఈ నెల 12వ తేదీతో ముగిశాయి. స్టేట్ సిలబస్కు సంబంధించి సోమవారం (17వ తేది) నుంచి ప్రారంభమై ఈ నెల 31వ తేదీతో ముగియనున్నాయి. రోజూ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30కి పరీక్ష ముగియనుంది. 1250 ఇన్విజలేటర్లు నియామకం పరీక్షా కేంద్రాలను అఽధికారులు నో సెల్ఫోన్ జోన్గా ప్రకటించారు. చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరు కూడా సెల్ఫోన్ను పరీక్షా కేంద్రంలోకి తీసుకు వెళ్లకూడదని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 1250 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. అంతేకాకుండా పరీక్షల్లో మాస్ కాపీయింగ్, బయట నుంచి కాపీయింగ్కు పాల్పడకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కాపీయింగ్ను అరికట్టేందుకు ఎనిమిది ఫ్లయింగ్ స్క్వాడ్లతోపాటు 25 సిట్టింగ్ స్క్వాడ్లను వినియోగిస్తున్నారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు చోటు లేకుండా.. కేంద్రాల సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను పరీక్షల సమయంలో మూతవేసేలా ఆదేశాలు ఇచ్చారు. కంట్రోల్ రూము ద్వారా పర్యవేక్షణ జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తింపు పొందిన పలు సెంటర్లలో పరీక్షలు నిఘా నీడలో కొనసాగనున్నాయి. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ఈసారి పకడ్బందీగా పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. అందుకు సంబంధించి ఎనిమిది సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను అమర్చి కంట్రోల్ రూము ద్వారా పర్యవేక్షిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ముక్కావారిపల్లెలో రెండు కేంద్రాలు, కలికిరి బాలికల ఉన్నత పాఠశాల, గాలివీడు ఉర్దూ ఉన్నత పాఠశాలతోపాటు చక్రంపేట, పాటూరు, చిన్నతిప్పసముద్రం, చింతపర్తి కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా ఉన్నాయి. ఓపెన్ టెన్త్ పరీక్షలు కూడా.. ఓపెన్ టెన్త్ పరీక్షలు కూడా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12:45 గంటల వరకు జరగనున్నాయి. ఇందుకోసం 19 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 834 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. సర్వం సిద్ధం విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సర్వం సిద్ధం చేశాం. ఏ చిన్న తప్పిదం జరిగిగా అందుకు ఆయా పరీక్షా కేంద్రాల అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. విద్యార్థులను 8:30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తాం. ఏ పరీక్షా కేంద్రంలో అయినా వసతులు సరిగా లేకున్నా, సమస్యలు ఉన్నా విద్యార్థులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ 9100040686 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. – సుబ్రమణ్యం, డీఈఓశుభాశీస్సులు అన్నమయ్య జిల్లాలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాభినందనాలు. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ ప్రశాంత మనసుతో పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలి. ‘కలలు కనాలి.. సాకారం చేసుకోవాలి’ అని చెప్పిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్ఫూర్తితో ముందుకు సాగాలి. ఆత్మవిశ్వాసం, అకుంఠిత పట్టుదలతో పరీక్షలు రాసి అత్యుత్తమ ఫలితాలతో జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకు రావాలి. పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థికి ఆల్ ది బెస్ట్! – ఛామకూరి శ్రీధర్, కలెక్టర్ అసౌకర్యాల నీడలో.. జిల్లాలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న అనేక పాఠశాలల్లో సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రధానంగా వెలుతురు సరిగా లేకపోవడం, ఇరుకు గదులు, బెంచీలు అంతంత మాత్రంగా ఉండటం లాంటివి కనిపిస్తున్నాయి. ఇవేకాకుండా అనేక అసౌకర్యాలు విద్యార్థులకు పరీక్షలు పెడుతున్నాయి. చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులను ఎలా అధిగమించి ముందుకు వెళతారనేది వేచి చూడాల్సిందే. 22,355 మంది విద్యార్థులు హాజరు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు సంబంధించి మొత్తం 22,355 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. జిల్లాలో 502 ఉన్నత పాఠశాలలు ఉండగా, అందులో రెగ్యులర్ విద్యార్థులు 22,355 మంది పదో తరగతి పరీక్షలకు సిద్ధమయ్యారు. 121 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయితే ఒకేషనల్ విద్యార్థులకు సంబంధించి 3855 మంది పరీక్షలు రాయనున్నారు. విద్యార్థుల పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నేటి నుంచి పదో తరగతి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 121 కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా 25 సిట్టింగ్, 11 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉదయం 9.30 నుంచి 12.30 వరకు నిర్వహణ -
●టీడీపీకి తిరుగులేని దెబ్బ
బి.కొత్తకోట: డ్యామిట్.. టీడీపీ అల్లిన కథ అడ్డం తిరిగింది. రాజకీయంగా బలమైన నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని బలహీనం చేయాలన్న చంద్రబాబు వ్యూహం బెడిసికొట్టింది. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా మిథున్రెడ్డి హ్యాట్రిక్ సాధించగా పుంగనూరు, తంబళ్లపల్లెలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిలు గెలుపొందడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజంపేట పార్లమెంటు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేని చంద్రబాబు.. మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో గతేడాది జూలై 21న రాత్రి జరిగిన అగ్నిప్రమాదం ఘటనను.. పెదిరెడ్డి కుటుంబానికి, వారి మద్దతుదారులకు ఆపాదించి రాజకీయ కక్ష తీర్చుకోవాలన్న పన్నాగం పారలేదు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేయడం ద్వారా వైఎస్సార్సీపీని రెండు జిల్లాల్లో బలహిన పర్చాలని చేసిన ప్రయత్నాలు, ప్రయోగించిన అస్త్రాలు విఫలమయ్యాయి. తొలుత ఈ ఘటనలో ఏమో జరిగిపోయిందంటూ సీఎం చంద్రబాబు నుంచి మంత్రులు, టీడీపీ నేతలు ఊపిరాడని విధంగా ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మద్దతుదారుల భూ ఆక్రమణల వ్యవహారాలు జరిగాయని, అందుకే ఫైళ్లను కాల్చేశారంటూ నిరాధార ఆరోపణలు చేశారు. ఈ ఘటన జరిగిన రోజు నుంచి రెండు నెలల వరకు మదనపల్లె సహా రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. అందరి దృష్టిని ఆకర్షించి ఏమి జరిగిందో తెలుసుకోవాలన్న ఉత్కంఠ నెలకొంది. అయితే ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదని నిరూపించేందుకు ప్రభుత్వం శాయశక్తులా శ్రమించింది. చివరకు ఈ కేసులో ప్రధాన నిందితుడు గౌతంతేజ్కు జరిపిన పాలీగ్రాఫ్ పరీక్ష ఫలితం, బెయిలు మంజూరు ఉత్తర్వులో న్యాయస్థానం వ్యాఖ్యలు పరిశీలిస్తే.. ఈ కేసులన్నీ వేధింపులకే అన్నది అర్థమైపోతోంది. ఆధారాల్లేకనే సాగదీత గత జూలై 21న ఘటన జరిగితే ఇప్పటి దాక ఈ కేసులో ఎవరి పాత్ర ఉంది, దీని వెనుక ఎవరున్నారు, కాలిపోయిన ఫైళ్లు ఏ పార్టీకి చెందిన నాయకులవి ఉన్నాయి, వాటి వివరాలేమిటి అనే అంశాల్లో ఒక్కదానిపైనా స్పష్టత ఇవ్వలేదు. ఆరోపణలపై ఆధారాలు లభ్యమయ్యాయా లేదా, ఎవరిపై ఆధారాలు లభ్యమయ్యాయి అన్నది కూడా రహ్యసంగానే మిగిలిపోయింది. పెద్దిరెడ్డి కుటుంబంపై భూ అక్రమణ, ఫ్రీహోల్డ్లో అక్రమాలు జరిగాయని పదేపదే టీడీపీ మంత్రులు, నేతలు తప్పుడు ఆరోపణలు చేసి చేతులు కాల్చుకున్నారు. ఆ ఫ్రీహోల్డ్ భూములు ఎవరివో, అందులో ఎవరి ప్రమేయం ఉందో వెలుగులోకి తేలేదు. ఘటన జరిగినప్పటి నుంచి గడచిన ఎనిమిది నెలలుగా ప్రభుత్వం విచారణను సాగదీస్తోంది. రాజంపేట ఎంపీగా మూడోసారి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మిథున్రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. అందులో గత ఎన్నికలో ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి కూటమి పార్టీల తరఫున బీజేపీ అభ్యర్థిగా మిథున్రెడ్డితో పోటీ పడటం రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా గమనించారు. భారీ స్థాయిలో బెట్టింగ్లు జరిగాయి. మిథున్రెడ్డిని ఓడిస్తానని కిరణ్ కొన్ని అభ్యంతకర అంశాలను ఆరోపణలతో గెలుపు కోసం శ్రమించినా ఓటర్లు ఆయన్నే ఓడించారు. తొలి ఎన్నికలో 2014లో ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరీని ఓడించారు. 2019లో టీడీపీ అభ్యర్థి సత్యప్రభను ఓడించి వరుస విజయాలతో సాగిపోతున్నారు. దీనికితోడు తంబళ్లపల్లె పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని ఓడించాలని చంద్రబాబు కుల రాజకీయాలను తెరపైకి తెచ్చినా.. ఓటర్లు టీడీపీనే ఓడించారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించడం సాధ్యం కాదని తేలిపోయింది. 2024లో రాష్ట్రంలో అత్యంత మెజార్టీ సాధించినా.. పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఓడించలేకపోవడం, రాజకీయంగా ఎదుర్కొలేని స్థితిలో టీడీపీలో నైరాశ్యం నెలకొంది. దీనితో మదనపల్లె ఘటనను అనుకూలంగా మలుచుకుని రాజకీయంగా దెబ్బ తీయాలని చంద్రబాబు సర్కారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మదనపల్లె ఆర్డీవో కార్యాలయ ఘటనను సాకుగా తీసుకుని ప్రభుత్వం వైఎస్సార్సీపీ మద్దతుదారులను వెంటాడి వేధించింది. అగ్నిప్రమాదం ఘటన దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వ వ్యవస్థలు మదనపల్లెలో మకాం వేశాాయి. ఘటనపై దర్యాప్తు చేసి ఆధారాలను సేకరించాల్సిన ప్రభుత్వం ఆ విషయాని కంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతుదారులను వేధించేందుకే ప్రాధాన్యత ఇచ్చింది. ఘటనలో ప్రమేయం లేని, స్థానికంగా లేని వారిపైనా కక్ష కట్టింది. తొలుత మదనపల్లెలో ఉంటున్న మాధవరెడ్డి ఇంటి నుంచి పోలీసులు మొదలు పెట్టిన సోదాలు వరుసగా.. మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతి, బాబ్జాన్, మాజీ ఎమ్మెల్యే నవాజ్బాషా, హైదరాబాద్లో ఉంటున్న శశికాంత్, అమెరికాలో ఉన్న తుకారాం తిరుపతి నివాసంలో సైతం నిర్వహించారు. ఈ సోదాలు జరిగిన వాళ్లందరిపైనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు తీవ్రమైనవి కానప్పటికీ.. శశికాంత్, తుకారాంపై లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం గమనించాల్సిన విషయం. జూలై 21న ఘటన జరగడానికి ముందే తుకారాం అమెరికా వెళ్లారు. అయితే ఘటన జరిగాక వెళ్లినట్టుగా తప్పుడు ప్రచారం కూడా చేశారు. ఈ దాడులతో ఎప్పుడు ఎవరి ఇంటిలో సోదాలు నిర్వహిస్తారో అనే ఆందోళనకు గురిచేశారు. ఈ సోదాల్లో ప్రభుత్వం ఆశించినట్టుగా ఆధారాలు దొరక్కపోవడం నిరాశకు గురి చేయగా, రాజకీయంగా దెబ్బతీయాలన్న ప్రయత్నాలకు అడ్డుపడింది. వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఇళ్లలో జరిపిన సోదాల్లో ప్రభుత్వం ఆశించినట్టు భూముల అక్రమ కార్యకలాపాలు, కబ్జాలకు సంబంధించి ఆధారాలు లభ్యం కాలేదని సమాచారం. దీనితో జిరాక్స్ కాపీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మాధవరెడ్డి ఇంటి నుంచి 658 జిరాక్స్ కాపీలను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆధార్ కార్డు నుంచి భూముల డాక్యమెంట్ల కాపీలు ఉన్నాయి. ఎలాంటి ఆధారాలు లభ్యమైవున్నా ప్రభుత్వం ఈపాటికి చర్యలకు పూనుకునేది. మిగత వారి ఇళ్లలో జరిపిన సోదాల్లోనూ ఇలాంటి డాక్యుమెంట్లు లభించినట్టు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్నవి జిరాక్స్ వెంటాడి.. వేధించి.. పెద్దిరెడ్డి కుటుంబంపై బెడిసికొట్టిన బాబు వ్యూహం రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు కుట్ర మదనపల్లె ఘటనను అస్త్రంగా వాడుకునేందుకు అష్టకష్టాలు మద్దతుదారుల ఇళ్ల సోదాల్లోనూ లభించని ఆధారాలు అవన్నీ నిరాధార ఆరోపణలని తేలుతున్న వైనం -
‘దేవుడా మాకిక దిక్కెవరు, మేము చేసిన పాపమేమి’
అన్నమయ్య: ‘అమ్మ చిన్నప్పుడు నిన్ను, మమ్మల్ని వదిలి వెళ్లిపోయినా.. తల్లి లేని లోటు లేకుండా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడావు. రేపటి నుంచి జరిగే పది పరీక్షలకు వెంట తీసుకెళతాను అన్నావు కదా లేనాన్న’.. అంటూ తండ్రి మృతదేహం వద్ద ఆ బాలిక వెక్కివెక్కి ఏడ్చటం చూపరులను కంట తడి పెట్టించింది. ఈ విషాద సంఘటన మండలంలోని కందుకూరు పంచాయతీ గొడుగువారిపల్లిలో చోటు చేసుకుంది. గొడుగువారిపల్లికి చెందిన కొత్తోళ్ళ వెంకటరమణ (55)కు గణేష్ (20), గిరిజ (15)లు సంతానం. వెంకటరమణ భార్య 10 ఏళ్ల క్రితమే భర్త, పిల్లలను వదిలి ఎటో వెళ్లిపోయింది. అప్పటి నుంచి కూలి పని చేస్తూ పిల్లలను పోషించేవాడు. కుమారుడు గణేష్ చిన్నా, చితకా పనులు చేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. కుమార్తె కందుకూరు జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదివి రేపటి నుంచి జరిగే పబ్లిక్ పరీక్షలకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం గ్రామంలోని చింతచెట్టు ఎక్కి కాయలు కోసే క్రమంలో.. వెంకటరమణ చెట్టు కొమ్మల పట్టు తప్పి ప్రమాదవశాత్తు కింద పడి గాయాల పాలై స్పృహ కోల్పోయాడు. ఆయనను గ్రామస్తులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృత్యువాత పడ్డాడు. ‘దేవుడా మాకిక దిక్కెవరు, మేము చేసిన పాపమేమి’ అంటూ ఆ పిల్లల రోదనలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా మూగబోయి విషాదంతో నిండిపోయింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
పవన్ను పిచ్చాసుపత్రిలో చేర్చాలి: నారాయణ
బి.కొత్తకోట: రోజుకో మాట మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను పిచ్చాసుపత్రిలో చేర్చాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో సీపీఐ శత వార్షికోత్సవ సభ ఆదివారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ ఒకసారి చేగువేరా, మరొకసారి సావర్కర్, ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నారని అన్నారు. ‘సనాతన ధర్మంలో భర్త చనిపోతే భార్య చితి మంటల్లో ఆహుతి అవుతుంది. ఇలాంటి ధర్మాన్ని ఒప్పుకుంటారా.. మూడు పెళ్లిళ్ల పవన్ కళ్యాణ్’ అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న చంద్రబాబు, పవన్ ఆయన మాటలకు తలూపుతున్నారని అన్నారు. -
‘నాకు రక్షణ కల్పించండి’
సిద్దవటం : తనను హతమార్చేందుకు యత్నిస్తున్నారని, రక్షణ కల్పించాలని సిద్దవటం మండలం కడపాయపల్లె గ్రామానికి చెందిన బత్తల శివకుమార్ కడప డీఎస్పీ, ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. మండల కేంద్రమైన సిద్దవటంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ తనతో పాటు బొంత రమాదేవి 2002 సంవత్సరంలో ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా సర్వేనెంబర్ 164 లింగంపల్లె రెవెన్యూ గ్రామ పొలంలో పట్టా పొందామన్నారు. ఈనెల 14వ తేదీన భూమి సాగు చేసుకునేందుకు జేసీబీతో పని చేయిస్తుండగా వెన్యూ వారు వచ్చి రికార్డులను పరిశీలించి వెళ్లారన్నారు. అయితే లింగంపల్లె గ్రామ మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు ఫోన్ చేసి తనను అడగకుండా భూమి సాగు చేసేందుకు ఎంత ధైర్యం నీకు అంటూ బెదిరించాడన్నారు. ఆ తరువాత కొంత మంది లింగంపల్లె దళితులను తన వద్దకు పంపి తనపై దౌర్జన్యం చేసి పనిని నిలుపుదల చేశారన్నారు. అంతటితో ఆగకుండా వెంకటేశ్వర్లు తన మనుషులైన ఈరిశెట్టి సురేష్, ఈరిశెట్టి మునిసుబ్బరాయుడు, ఈరిశెట్టి నాగరాజు, పిట్టి గోపాల్ల చేత తనపై హత్యాయత్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. రిమ్స్లో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహంకడప అర్బన్ : కడప రిమ్స్లో ఈనెల 9వ తేదీన ఓ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. అతను ఈనెల 5న తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు తెలిపారు. -
మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి చర్యలు
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలోని మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మేజర్ జనరల్ అజయ్మిశ్రా అన్నారు. ఆదివారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన మాజీ సైనికుల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశానికి భారీ సంఖ్యలో హాజరైన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు చెందిన వ్యక్తులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మేజర్ జనరల్ అజయ్మిశ్రా, బ్రిగేడియర్ వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని చిన్న సమస్యలను అక్కడే పరిష్కరించారు. కల్నల్ మాథ్యూ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మాజీ సైనికులకు పరీక్షలు నిర్వహించి ఉచిత వైద్య సేవలు అందించారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలకు చెందిన తొమ్మది మంది దివంగత సైనికుల సతీమణులను ఘనంగా సత్కరించారు. వారికి చీర, మెమెంటో, సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లు బహూకరించారు. అలాగే తొమ్మిది మంది మాజీ సైనికులకు ట్రై ప్యాడ్, వాకింగ్ స్టిక్స్, ఐదుగురికి వీల్ చైర్లు అందజేశారు. మేజర్ జనరల్ అజయ్మిశ్రా -
ఆలయం ముసుగులో ఆక్రమణకు యత్నం
ఒంటిమిట్ట : ఒంటిమిట్టలోని నడివీధి గంగమ్మ ఆలయం వద్ద పురాతనమైన బ్రిటీష్ కాలం నాటి గ్రామ రెవెన్యూ కార్యాలయాన్ని (ప్రభుత్వ గ్రామ రెవెన్యూ చావిడి) టీడీపీ నాయకులు కూల్చివేశారు. వివరాల్లోకి వెళితే.. 1500–బి1 సర్వే నెంబరులో లక్షలు విలువ జేసే రెవెన్యూ చావిడితో కలిసి తొమ్మిది సెంట్లు ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలాన్ని కొన్ని నెలల నుంచి ఒంటిమిట్టలోని టీడీపీ నాయకులు నడివీధి గంగమ్మ ఆలయం ముసుగులో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామ రెవెన్యూ చావిడిని కూల్చి నడివీధి గంగమ్మకు ఇవ్వమని జిల్లా కలెక్టర్కు వినతిపత్రాలు కూడా అందజేశారు. కానీ కలెక్టర్ వద్ద నుంచి ఎలాంటి అనుమతులు రాలేదు. అయినా తమ ప్రభుత్వం అధికారంలో ఉందనే కారణంగా ఎలాంటి అనుమతులు లేకపోయినా ఆదివారం అక్రమంగా కూల్చివేతకు పాల్పడ్డారు. ఒంటిమిట్ట గ్రామ రెవెన్యూ సిబ్బంది అడ్డుకోగా వారిని లెక్కచేయకుండా వారిపట్ల అనుచితంగా ప్రవర్తించి కూల్చి వేశారు. దీంతో మండల రెవెన్యూ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కూల్చివేత పనులను మధ్యలో నిలుపుదల చేయించారు. కూల్చివేతకు పాల్పడిన ఉగ్గురారపు వెంకటరమణ, అంగదాల వెంకటసుబ్బయ్య, పత్తి కృష్ణయ్య, గుర్తుకొండ శ్రీను, పసుపులేటి కృష్ణయ్యలపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయితే గ్రామ రెవెన్యూ కార్యాలయం కూల్చివేతలో ప్రధాన పాత్ర పోషించిన మాడా వీధికి చెందిన ఓ యువకుడి పేరు తొలుత ఫిర్యాదులో పేర్కొని తరువాత తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ గ్రామ రెవెన్యూ కార్యాలయాన్ని కూల్చివేసిన టీడీపీ నాయకులు కూల్చివేతను అడ్డుకోబోయిన రెవెన్యూ సిబ్బందిపై అనుచిత ప్రవర్తన నడివీధి గంగమ్మ ఆలయం ముసుగులో లక్షలు విలువచేసే ప్రభుత్వ స్థలం కబ్జాకు కుట్ర -
మల్లూరమ్మ హుండీ ఆదాయం రూ.2,93,890
చిన్నమండెం : చిన్నమండెం మండలం మల్లూరు, కొత్తపల్లె గ్రామాల సరిహద్దు మాండవ్యనది ఒడ్డున ఉన్న మల్లూరమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడం ఇటీవలే అమ్మవారి జాతర వైభవంగా జరగడంతో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. అదే విధంగా మల్లూరమ్మ తల్లి ఆలయ హుండీలను లెక్కించగా రూ.2,93,890 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ కొండారెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలుమదనపల్లె సిటీ/బి.కొత్తకోట : రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటనలు ఆదివారం జరిగాయి. బి.కొత్తకోట మండలం గొళ్లపల్లి పంచాయతీ కనికలతోపుకు చెందిన షేక్ మౌలాలి(35) పేపర్బాయ్గా పని చేస్తున్నాడు. ఉదయం పేపర్ ద్విచక్రవాహనంలో వేస్తుండగా ఎదురుగా వచ్చి కారు ఢీకొనడంతో గాయపడ్డాడు. స్థానికులు గమనించి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. గుర్రంకొండ మండలం చెరువుముందరపల్లెకు చెందిన నారాయణ (45) ద్విచక్రవాహనంలో కలకడ క్రాస్ వద్ద వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏప్రిల్ 2 నుంచి సీపీఎం జాతీయ మహాసభలు కడప వైఎస్ఆర్ సర్కిల్ : సీపీఎం జాతీయ మహాసభలు ఏప్రిల్ 2 నుంచి తమిళనాడులోని మధురైలో నిర్వహించనున్నట్లు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్ తెలిపారు. ఆదివారం ఆర్కే నగర్లోని సీపీఎం కార్యాలయంలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో దేశంలో, రాష్ట్రంలో జరిగే ఎలాంటి ఎన్నికల్లోనా సీపీఎం పొత్తులు ఒకే రకంగా ఉండవని తెలిపారు. స్థానిక పరిస్థితులను బట్టి ఉంటాయన్నారు. ఏప్రిల్ 2 నుంచి 6వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో జరిగే 24వ సీపీఎం జాతీయ మహాసభల్లో స్పష్టమైన రాజకీయ విధానం రూపొందించనున్నట్లు తెలిపారు. నేడు దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మత ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. దీనికి వ్యతిరేకంగా లౌకిక ప్రజాస్వామ్య శక్తులను ఐక్యం చేయడం సీపీఎం భవిష్యత్తు కార్యాచరణ అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ.రామ్మోహన్, బి.మనోహర్, వి.అన్వేష్, జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్ రెడ్డి, బి.దస్తగిరి రెడ్డి, పి.చాంద్ బాషా, కె.సత్యనారాయణ, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు మండలం, బుడుగుంటపల్లి పంచాయతీ, రైల్వేస్టేషన్ సమీపంలో అనంతపురం దొనగిరికి చెందిన లక్ష్మీనారాయణ (35) అనే యువకుడు విద్యుత్ హై టెన్షన్ స్తంభానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా.. రెండేళ్ల క్రితం రైల్వేకోడూరుకు బేల్దారీ పనులు చేసుకునేందుకు భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చి బాలానగర్లో నివాసం ఉండేవాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆ యువకుడు ఉరివేసుకున్నాడు. దీంతో కుటుంబమంతా వీధిన పడింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మోటారు వైర్లు చోరీ రాజంపేట రూరల్ : మండల పరిధిలోని ఆకేపాడు గ్రామ పంచాయతీలో శనివారం రాత్రి బోర్ వైర్ కేబుళ్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు వాపోయారు. రాయచోటికి వెళ్లే దారిలో ఉన్న వీరంరెడ్డి నారాయణరెడ్డి పొలంలోని 2 బోర్లకు చెందిన మోటర్ వైర్లు, స్టార్టర్లు దొంగిలించారు. అలాగే వీరంరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, మందకాల శ్రీనివాసులు, బొమ్మ రంగారెడ్డికి చెందిన మోటార్ వైర్లు, స్టార్టర్లు కూడా ఎత్తుకెళ్లారు. గొళ్ల విజయరెడ్డికి చెందిన 3 మోటాటర్ వైర్ కేబుళ్లు, గోళ్ల సుజాతారెడ్డికి చెందిన 2 మోటార్ వైర్ కేబుళ్లు చోరీకి గురయ్యాయి. పోలీసులు దొంగలను పట్టుకోవాలని బాధితులు కోరుతున్నారు. గోవా మద్యం బాటిళ్లు పట్టివేతప్రొద్దుటూరు క్రైం : స్థానిక జమ్మలమడుగు రోడ్డులో వైఎస్సార్ సర్కిల్ వద్ద 18 గోవా మద్యం బాటిళ్లను ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారి నీలకంఠేశ్వరరెడ్డి, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ సురేంద్రారెడ్డి, సిబ్బందితో ఆదివారం వాహనాలను తనిఖీ చేపట్టారు. ఒక స్విఫ్డ్ డిజైర్ కారును తనిఖీ చేయగా అందులో 750 ఎంఎల్ గల 18 గోవా మద్యం బాటిళ్లు దొరికాయి. కాటం వీరేంద్ర, ఉప్పు రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు వీటిని తరలిస్తున్నారని, వారిపై కేసు నమోదు చేసి మద్యం బాటిళ్లను, కారును స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. ప్రైవేట్ డిగ్రీ అండ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కార్యవర్గం కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ అండ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని స్క్వేర్ సమావేశ మందిరంలో జరిగిన అసోసియేషన్ నాయకుల సమావేశంలో నూతన అధ్యక్షుడిగా రాజంపేట గీతాంజలి డిగ్రీ కాలేజ్ కరస్పాండెంట్ సంభావు వెంకటరమణ, కార్యదర్శిగా ముద్దనూరు వెంకటేశ్వర డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ జి.శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా నాగేశ్వరరెడ్డి, జయప్రకాశ్రెడ్డి, కోశాధికారిగా ఆలీ అక్బర్, సంయుక్త కార్యదర్శిగా ఎన్.సంజీవరెడ్డి, రవి శేఖర్ రెడ్డి మిగిలిన సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో మాజీ అధ్యక్షులు మదనమోహన్ రెడ్డి, రవి శేఖర్ రెడ్డి, సుబ్బారెడ్డి, పెంచలయ్య, రాజగోపాల్ రెడ్డి, పోలా రమణారెడ్డి, రాష్ట్ర నాయకులు పి.సురేష్, విజయ్ కుమార్, మనోహర్ రెడ్డి, రాఘవరెడ్డి, సంజీవరెడ్డి, నరసింహులు, వివిధ కళాశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు. -
సూరప్పగారిపల్లెలో భారీ చోరీ
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె పంచాయతీ సూరప్పగారిపల్లెలో భారీ చోరి జరిగింది. వ్యవసాయపనుల నిమిత్తం పొలాల వద్దకు వెళ్లిన ఓ రైతు ఇంట్లో దుండగులు ప్రవేశించి 150 గ్రాముల బంగారు నగలు, రూ.50 వేలు నగదు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన కుమ్మర మునిస్వామి వ్యవసాయం చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటికి తాళాలు వేసుకొని గ్రామానికి సమీపంలోని తన పొలం వద్దకు వెళ్లారు. రైతు దంపతులు సాయంకాలం వరకు వ్యవసాయ పనులు చేసుకొని ఇంటికి తిరిగి వచ్చారు. అప్పటికే ఇంటి తాళాలు పగులగొట్టి తలుపులు తెరిచి ఉన్నట్లు గుర్తించి పరుగున ఇంట్లోకి వెళ్లారు. ఇంట్లోని ఓ గదిలో ఉన్న బీరువాను అప్పటికే బద్దలు కొట్టి అందులో వస్తువులు చిందర వందరగా పడేసిన దృశ్యాలు కనిపించాయి. దీంతో గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకొన్నారు. మొత్తం పరిశీలించగా బీరువాలో దాచి ఉంచిన రూ. 13లక్షలు విలువచేసే బంగారు నగలు, రూ.50 వేలు నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఆరుగాలం కష్టపడి పనిచేసి దాచి ఉంచుకొన్న నగలు, సొమ్ము చోరికి గురికావడంతో రైతు దంపతులు బోరున విలపించారు. జరిగిన సంఘటనపై బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కొండలకు నిప్పు.. పంటలకు ముప్పు!
గుర్రంకొండ : పీలేరు నియోజకవర్గంలోని రైతులు, ప్రజలు రాత్రంతా జాగారం చేసే పని తప్పడం లేదు. నియోజకవర్గంలోని ఆరుమండలాల పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు కొండలు, గుట్టలకు నిప్పు అంటిస్తున్నారు. దీంతో 1835 ఎకరాల్లో కొండలు, గుట్టలు కాలి బూడిదయ్యాయి. వీటితోపాటు మామిడితోటలు, టమటా తోటలతోపాటు పలు రకాల పంటలు దగ్ధమవుతున్నాయి. ఆయా పరిసర పొలాలకు చెందిన రైతులు మంటలు పొలాల వైపు రానీయకుండా రాత్రిళ్లు పొలాల వద్దే జాగారం చేస్తున్నారు. నీళ్ల ట్యాంకర్ల ద్వారా పొలాలవైపు వస్తున్న మంటల్ని రైతులు అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొంతమంది రైతులు గుట్టల కింద ఉన్న పొలాలవైపు మంటలు రాకుండా జేసీబీలతో కందకాలు తవ్వుకుంటున్నారు. 1678 ఎకరాల్లో కాలిపోయిన కొండలు, గుట్టలు.. గత వారం రోజులుగా నియోజకవర్గంలోని కొండలు, గుట్టలకు కొంతమంది దుండగులు కావాలనే నిప్పు పెడుతున్నారు. అన్ని మండలాల్లో ఇప్పటివరకు 21 మార్లు అగ్నిప్రమాదాలు జరిగి మొత్తం 1678 ఎకరాల్లో కొండలు, గుట్టలతోపాటు మామిడితోటలు, పొలాలు కాలిబూడిదయ్యాయి. పొలాల్లో అమర్చిన డ్రిప్ పరికరాలు, టమాటా సీడ్స్ కట్టెలు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో లక్షలాది రూపాయలు రైతులు నష్టపోయారు. రాత్రిళ్లు ఉన్నట్టుండి కొండలు, గుట్టల్లో మంటలు చెలరేగుతున్నాయి. అవి కింది భాగాన ఉన్న పొలాలు, మామిడితోటలవైపు దూసుకొస్తున్నాయి. సంబంధిత పొలాల రైతులు హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. చెట్లు, పొదలతో పాటు పక్షులు, సర్పాలు, అడవి జంతువులు అగ్నికి ఆహుతి అయ్యాయి. నియోజకవర్గంలోని జాతీయ రహదారులకు ఇరువైపులా ఉన్న కొండలు, గుట్టలు రాత్రి పగలు అనే తేడా లేకుండా కాలుతూనే ఉండడం గమనార్హం. రాత్రిళ్లు జాగారమే.! కాలుతున్న కొండలు, గుట్టల కింది భాగంలో పెద్ద ఎత్తున మామిడితోటలు, ఇతర ఉద్యానవన తోటలతోపాటు పలురకాల పంటలు సాగవుతున్నాయి. దీంతో రైతులు రాత్రిళ్లు పొలాల దగ్గరే కాపలా కాస్తూ జాగారం చేస్తున్నారు. టెంకాయపట్టలు, పచ్చి వేపకొమ్మలు, దుమ్ముధూళితో గుట్టల దిగువ వైపు వస్తున్న మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేశారు. ఆయా ప్రాంతాల్లో చుక్కనీరు లేక పోవడంతో పట్టణం నుంచి వాటర్ ప్యాకెట్ల బస్తాలను తీసుకెళ్లారు. మరికొందరు గుట్టల్లో నుంచి వచ్చే మంటలు పొలాలవైపు రానీయకుండా జేసీబీతో పొలాల సరిహద్దుల్లో కందకాలు తవ్వారు. ఇలా రాత్రిళ్లూ రైతులు నానా కష్టాలు పడ్డారు. కొంతమంది కావాలనే పరిసరాల్లో ఇష్టానుసారం కొండలు, గుట్టలకు నిప్పు అంటిస్తూ రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. నీళ్ల ట్యాంకర్లు, స్ప్రే పంపులతో మంటలు అదుపు .. పొలాల వైపు వస్తున్న మంటల్ని అదుపు చేసేందుకు పొలాల వద్ద నీళ్ల ట్యాంకులు సిద్ధం చేసుకొంటున్నారు. నీళ్ల ట్యాంకులతో పాటు పంటలపై మందులు స్ప్రే(పిచికారీ) చేసే పెట్రోల్ పంపులు, ఇంజిన్లను పొలాల వద్దకు తీసుకెళుతున్నారు. మంటలు కొండలు, గుట్టల నుంచి పొలాలవైపు వచ్చే సమయంలో నీళ్ల ట్యాంకుల నుంచి నీటిని ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నింపి తద్వారా పెట్రోల్ ఇంజిన్లు, పైపుల ద్వారా నీటిని మంటలపై స్ప్రే చేస్తూ అదుపు చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. వందల ఎకరాల్లో కాలిపోయిన, కొండలు గుట్టలు దిగువ పొలాల రైతులకు రాత్రిళ్లు తప్పని జాగరణ నీళ్ల ట్యాంకర్లు, స్ప్రే మిషన్ల ద్వారా మంటలు అదుపు చేస్తున్న వైనంరాత్రిళ్లు జాగారం తప్పడం లేదు కొన్ని రోజులుగా మా పొలాల సమీపంలో ఉన్న కొండలు, గుట్టల్లో మంటలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మంటలు పొలాల వైపు రాకుండా రాత్రిళ్లు అక్కడే జాగారం చేయాల్సి వస్తోంది. మాతో పాటు పరిసర పొలాల రైతుల కూడా పొలాల వద్దనే ఉంటున్నారు. రోజుల తరబడి మంటలు వస్తూనే ఉన్నాయి. అటవీశాఖ అధికారులు, సిబ్బంది మాకు సహాయం చేశారు. – రెడ్డెప్ప, రైతు, చిట్టిబోయనపల్లెకావాలనే నిప్పు పెడుతున్నారు కొండలు, గుట్టలకు గత పది రోజులుగా కావాలనే నిప్పు పెడుతున్నారు. కొంతమంది వ్యక్తులు పొలాల వద్ద చెత్తా చెదారం కాల్చివేయాలనే ఉద్దేశంతో నిప్పు పెడుతున్నారు. దీంతో అవి పెద్ద ఎత్తున ఎగిసి పడుతూ పరిసర పొలాలతో పాటు కొండలు, గుట్టల్ని కాల్చి బూడిద చేస్తున్నాయి. మంటలు అదుపు చేసే వారే లేక పదిరోజులుగా కొండలు, గుట్టలు, అడ్డూ ఆపులేకుండా కాలుతూనే ఉన్నాయి. – గయాజ్ అహ్మద్, గుర్రంకొండ -
బంధువుల గృహప్రవేశానికి వెళుతూ..
మదనపల్లె : బంధువుల ఇంట గృహప్రవేశ వేడుకకు హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంలో వెళుతూ, మార్గమధ్యంలో బైక్ అదుపుతప్పి ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. మదనపల్లె పట్టణం భవానీనగర్కు చెందిన వెంకటరమణ(55), చీకలబైలు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం ప్రారంభమయ్యే పదోతరగతి పరీక్షలకు సంబంధించి రామసముద్రం మండలానికి చీఫ్ సూపర్వైజర్గా నియమితులయ్యారు. ఆదివారం మధ్యాహ్నం రామసముద్రంలో పదోతరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించాల్సి ఉంది. ఈలోపు పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లెలో బంధువుల ఇంట గృహప్రవేశానికి వెళ్లాలని కుటుంబ సభ్యులు చెప్పడంతో...అక్కడకు వెళ్లి అటునుంచే రామసముద్రం వెళ్లేందుకు నిర్ణయించుకుని ఇంటి నుంచి బయలుదేరారు. చౌడేపల్లెకు వెళుతుండగా, మార్గమధ్యంలోని కృష్ణాపురం వద్ద రోడ్డుపై ఉన్న స్పీడ్బ్రేకర్ను గమనించిక బైక్ను వేగంగా నడపటంతో, వాహనం గాల్లోకి ఎగిరింది. దీంతో బైక్ బోల్తాపడటంతో వెంకటరమణ తీవ్రంగా గాయపడటంతో పాటు తలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వెంకటరమణ మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య సుశీల, కూతురు చరిత, కుమారుడు కృష్ణకాంత్ ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు జిల్లా ఆస్పత్రికి చేరుకుని వెంకటరమణ మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.బైక్ అదుపుతప్పి ఉపాధ్యాయుడి మృతి -
బి.కొత్తకోటలో సీపీఐ శత వార్షిక వేడుకలు
బి.కొత్తకోట : సీపీఐ శత వార్షిక వేడుకలను ఆదివారం బి.కొత్తకోటలో ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ముఖ్య అతిథిగా హజరయ్యారు. స్థానిక జ్యోతిచౌక్ నుంచి మెయిన్రోడ్డు, దిగువబస్టాండ్, పంచాయతీ వీధి, బైపాస్రోడ్డు, రంగసముద్రంరోడ్డు మీదుగా ప్రదర్శన నిర్వహించారు. నారాయణ డప్పుకొట్టి ప్రదర్శనను ప్రారంభించారు. అంతకుముందు జ్యోతిచౌక్ చేరుకున్న నారాయణ ఇక్కడి సాదిక్బాషా బిర్యానీ హోటల్ వద్దకు వచ్చి సాధారణ వ్యక్తిలా గ్లాసుతో నీళ్లు తాగారు. వెనక్కి ఇస్తూ ఏం వండారు అని నిర్వాహకున్ని ప్రశ్నించగా బిర్యాని అని చెప్పడంతో కొద్దిగా అన్నం పెట్టమని ప్లేటులో తీసుకుని రుచి చూశారు. అక్కడే ఉన్న ఓ విలేకరి చికెన్ తినరా అని ప్రశ్నించగా తింటాను ఓ ముక్క పెట్టమని చెప్పి పెట్టించుకుని తిన్నారు. ర్యాలీ సందర్భంగా స్థానికులు ఆయనతో మాట్లాడేందుకు ఆసక్తి చూపారు. నారాయణ ఉమ్మడి చిత్తూరు జిల్లా కమిటిలో సభ్యునిగా పనిచేస్తున్న కాలం నుంచి బి.కొత్తకోటతో అనుబంధం ఉంది. దీంతో పాతతరం సీపీఐ నాయకులను పేరుతో పలకరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరసింహులు, రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామానాయడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గంగాధర, ఉపపధాన కార్యదర్శి సలీంబాషా, ఉపాధ్యక్షులు వేణుగోపాల్రెడ్డి, కార్యదర్శి సాంబశివ, రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కృష్ణప్ప, ప్రజానాట్యమండలి కార్యదర్శి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.హాజరైన జాతీయ కార్యదర్శి నారాయణ -
ప్లాస్టిక్రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలి
రాయచోటి అర్బన్: స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లాను ప్లాస్టిక్రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని రాష్ట్ర రవాణా, క్రీడల శాఖమంత్రి మండిపల్లె రాంప్రసాద్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని వీరభద్రాలయం ఎదురుగా ఉన్న కూరగాయల మార్కెట్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర –స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, జిల్లా ప్రత్యేకాధికారి వాడరేవు వినయ్చంద్, జేసీ ఆదర్స్ రాజేంద్రన్లతో కలసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రతినెలా 3వ శనివారం జరిగే ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రతి ఒక్కరూ పాల్గొని రాయచోటి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని కోరారు. ● జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు. కాలుష్య కారకమైన ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించి ప్లాస్టిక్ రహిత జిల్లాగా గుర్తింపు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాసుబాబు, పలుశాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి రాయచోటి: రాయచోటిలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లా ప్రత్యేక అధికారి వాడరేవు వినయ్చంద్ పాల్గొన్నారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీధర్తో కలిసి పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వీరభద్రస్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ మండపంలో తీర్థప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న సచ్ఛాంధ్ర,స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా డైట్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థి దశ నుంచే విద్యార్థులు పరిశుభ్రతను అల వాటు చేసుకోవాలన్నారు. అనంతరం ఆర్టీసీ బస్సు కూడలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యత మున్సిపల్, పంచాయతీ కార్మికులది మాత్రమే కాదని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ ప్రజలందరితో చేయించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, మున్సిపల్ కమిషనర్ వాసు, ఆలయ ఈఓ విశ్వనాథ్ తదితరలు పాల్గొన్నారు. -
వైభవం.. పుష్పయాగం
మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. స్వామివారి బ్రహోత్సవాల్లో భాగంగా చివరి రోజైన శనివారం ఉదయం తోమాలసేవ, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపారు. అనంతరం సుదూర ప్రాంతాల నుంచి రంగురంగుల పుష్పాలను తెప్పించి గ్రామోత్సవం నిర్వహించారు. వాటితో స్వామివారిని అందంగా అలంకరించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పుష్పయాగం నిర్వహించారు. స్వామివారికి అలంకరించిన పుష్పాలను అర్చకులు భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. –గుర్రంకొండ -
సాంకేతిక విద్యతో బంగారు భవిత
మదనపల్లె సిటీ: పదో తరగతి విద్యార్హతతో సాంకేతిక విద్యకు పునాది వేసే పాలిసెట్కు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు లభిస్తాయి. మార్చి 17వతేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు మార్చి నెలలో పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు, సాంకేతక నిపుణులు సూచిస్తున్నారు. గ్రామీణ విద్యార్థులకు ఉపయుక్తం గ్రామీణ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంజినీరింగ్ వంటి అత్యున్నత సాంకేతిక చదువులను అందుకోవాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. వీరికి తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే దానిని పునాదిగా చేసుకుని భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. దీనికి పాలిటెక్నిక్ కోర్సులు వేదికగా నిలుస్తాయి. పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్ కోర్సులో చేరి విలువైన సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకుని సత్వర ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. పాలిసెట్–2025కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఏప్రిల్ 15వ తేదీ పాలిటెక్నిక్ కోర్సులకు నిర్వహించే పాలిసెట్ దరఖాస్తులకు తుది గడువు. కోర్సుల వివరాలు: పాలిటెక్నిక్ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో కంప్యూటర్, ఎలక్ట్రానిక్ అండ్ కంప్యూటర్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆటో మొబైల్ ఇంజనీరింగ్, అర్కిటెక్చర్ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. జిల్లాలో మదనపల్లె (జీఎంఆర్ పాలిటె క్నిక్ కాలేజీ), రాయచోటి, రాజంపేట, కలికిరి, ఓబులవారిపల్లెలలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు నడుస్తున్నాయి. దీంతో పాటు మదనపల్లె సమీపంలోని గోల్డన్వ్యాలీ ఇంజినీరింగ్ కాలేజీ, పీలేరులోని ఎంజేఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో పాలిటెక్నిక్ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సు కాల వ్యవధి మూడు సంవత్సరాలు. దీనిలో భాగంగా ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకునే శిక్షణ సైతం ఇస్తారు. పాలిసెట్ ఎంట్రెన్స్లో క్వాలిఫై మార్కులు 35 గా నిర్ణయించారు. పరీక్ష ఇలా... పాలిసెట్ పరీక్షను 120 మార్కులకు నిర్వహిస్తారు. వీటిలో గణితం 50, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30 మార్కులకు ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఎంట్రన్స్ పరీక్ష ఉంటుంది. ఈ ఏడాది మే 10న పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష జరుగుతుంది. ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు రూ.100, ఓసీ,బీసీ విద్యార్థులు రూ.400 పరీక్ష ఫీజు కట్టాలి. పలు ప్రయోజనాలు: పాలిటెక్నిక్లో కోర్సును పూర్తి చేసినా ఉద్యోగం, ఉపాధి సులభంగా దొరుకుతుంది. ఈ కళాశాలల్లో ఇటీవల తరచూ ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రభుత్వ పా లిటెక్నిక్ కోర్సు చేయడానికి మూడేళ్లకు రూ.13 వేలు ఖర్చువుతుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్ సెకండియర్లో చేరవచ్చు. లేదా ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు. ముఖ్యమైన తేదీలు దరఖాస్తులకు గడువు: ఏప్రిల్ 15 ప్రవేశ పరీక్ష : ఏప్రిల్ 30ఫలితాలు : మే 10కౌన్సెలింగ్ : జూన్ నెలలో పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల పదో తరగతి విద్యార్థులకు చక్కటి అవకాశం ఎన్నో ఉద్యోగావకాశాలు టెన్త్ తర్వాత పాలిటెక్నిక్ చేస్తే చిన్న వయసులోనే ఉద్యోగావకాశాలు లభి స్తా యి. ఉన్నత విద్యతో పాటు స్వయం ఉపాధికి తోడ్పడుతుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. –ఓబులేసు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, మదనపల్లె -
ఘనంగా ముగిసిన దర్గా ఉత్సవాలు
రామాపురం: మండలంలోని నీలకంట్రావుపేట సమీపంలోని దర్గా వద్ద శ్రీ సద్గురు హజరత్ దర్బార్ అలీషావలి, రమతుల్లా అలైబాబా శ్రీ జలీల్ మస్తాన్ వలీ బాబా ఉరుసు ఉత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. గురువారం గంధంతో ప్రారంభమైన ఉరుసుకు రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి బెంగళూరుకు చెందిన ఆస్మానిఖత్, నాగపూర్కు చెందిన సలీం సైదా మధ్య గొప్ప ఖవాలీ పోటీ జరిగింది. అంతకు ముందు జెండా ఊరేగింపు జరిగింది. శనివారం రాత్రి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. చదివింపులు, చాదర్తో దర్గాలో ఫాతేహా నిర్వహించారు. -
జిల్లా అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేయండి
రాయచోటి: జిల్లా ఆర్థికాభివృద్ధికి అన్ని ప్రభుత్వ శాఖలు ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా రానున్న ఐదు సంవత్సరాలకు, 2047 నాటికి జిల్లా అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళలు డాక్యుమెంటరీ సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసే విధంగా ఆయా శాఖలు ప్రణాళికలు రూపొందించుకొని లక్ష్య సాధన కోసం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ -
మోదీ పాలనలో అభివృద్ధి శూన్యం
మదనపల్లె : నరేంద్ర మోదీ మూడవసారి ప్రధానమంత్రి అయినా, 11 ఏళ్ల పాటు దేశాన్ని పాలించినా, ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఆయన మాత్రం పదివేల జతల బట్టలు మార్చాడే తప్ప దేశాభివృద్ధికి చేసింది శూన్యమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ విమర్శించారు. శనివారం స్థానిక ప్రెస్క్లబ్లో పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రెడ్డి సాహెబ్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలోని పెద్దలు కుల,మత ప్రాంతీయ భేదాలు సృష్టి్ంచి విష బీజాలు నాటుతూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. ప్రజలు జాగ్రత్త పడకపోతే ముప్పు తప్పదన్నారు. ఎస్సీ వర్గీకరణకు తాను వ్యతిరేకమని, రాజకీయ ప్రయోజనాల కోసం రెండు వర్గాల మధ్య పెద్దలు పెడుతున్న చిచ్చుగా అభివర్ణించారు. వర్గీకరణకు ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేయడం తగదన్నారు. మదనపల్లెలోని శానిటోరియం టీబీ ఆసుపత్రి నేడు అధ్వాన స్థితికి చేరుకోవడం చాలా బాధాకరమన్నారు. అదేవిధంగా మదనపల్లి బీటీ కాలేజ్ కూడా నేడు ఇదే స్థితికి చేరడానికి నాయకుల నిర్లక్ష్యమే కారణమన్నారు. శానిటోరియం టీబి ఆసుపత్రి, బీటీ కాలేజ్ లను పునరుద్ధరించాలన్నారు. మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతామోహన్ -
అగ్నిప్రమాదంలో మామిడిచెట్లు దగ్ధం
కేవీపల్లె : అగ్నిప్రమాదంలో మామిడిచెట్లు దగ్ధమైన సంఘటన మండలంలోని వగళ్ల పంచాయతీ నారమాకులమిట్టలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పీలేరు సర్పంచ్ డాక్టర్ హబీబ్బాషాకు చెందిన మామిడితోట పక్కన ఉన్న కొండకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. మంటలు పక్కనే ఉన్న మామిడి తోటకు వ్యాపించాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో హబీబ్బాషా పీలేరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. అయితే అప్పటికే 40 మామిడి చెట్లు, 20 కొబ్బరిచెట్లు, రెండు మోటార్లు, డ్రిప్ పైపులు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ట్రాక్టర్ ఢీ కొని వ్యక్తి మృతి చిట్వేలి : చిట్వేలి గుంజన నది సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిమ్మయ్యగారిపల్లి దళితవాడకు చెందిన వళ్లెం పాపయ్య (40) మృతి చెందినట్లు ఎస్ఐ రఘురాం తెలిపారు. వివరాల మేరకు పెనగలూరు మండలం, రాచవారిపల్లికి చెందిన నువ్వుల సురేష్ (30) రాజంపేట వైపు నుంచి ట్రాక్టర్ (ఏపీ04బికె2431)లో ఇసుక తీసుకొని చిట్వేలి వైపు వస్తున్నాడు. ఇదే సమయంలో స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన పదోతరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న పాపయ్య రాజంపేట వైపు ద్విచక్ర వాహనంలో వెళుతుండగా ట్రాక్టర్ ఢీ కొంది. తీవ్రంగా గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రఘురాం తెలిపారు. మిద్దైపె నుంచి కిందపడి.. రామాపురం : మండలంలోని కసిరెడ్డిగారిపల్లె పంచాయితీ కొత్తరోడ్డునారాయణపురం వినాయక స్టోన్ క్రషర్లో పని చేస్తున్న ఉత్తరప్రదేశ్ వారణాసికి చెందిన రాజేష్యాదవ్(40) మద్యం మత్తులో మిద్దైపె నుంచి కిందపడి మృతి చెందాడు. ఎస్ఐ వెంకటసుధాకర్రెడ్డి కథనం మేరకు వివరాలు.. రాజేష్ యాదవ్ కొత్తరోడ్డు నారాయణపురంలో ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటూ సమీపంలోని వినాయక స్టోన్ క్రషర్లో పని చేస్తుండేవాడు. శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా రాత్రి తోటి సిబ్బందితో కలిసి అతిగా మద్యం సేవించి అర్థరాత్రి సమయంలో మద్యం మత్తులో మిద్దైపె నుంచి కిందిపడి మృతి చెందాడు. మృతుడి బంధువులు వచ్చిన వెంటనే వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తామన్నారు. కొనసాగుతున్న పెట్రోలు, డీజిల్ నిక్షేపాల సర్వే లింగాల : లింగాల మండలంలో డీజిల్, పెట్రోలు నిక్షేపాలను గుర్తించేందుకు అన్వేషణ కొనసాగుతోంది. రైతులకు తెలియకుండా వారి పొలాల్లో బోర్లు వేయబోమని కాంట్రాక్టర్లు మాధవరెడ్డి, సురేష్ తెలిపారు. హైదరాబాద్కు చెందిన అక్షయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు లేబర్ కాంట్రాక్టు పొంది ఈ అన్వేషణలో భాగంగా లింగాల, తొండూరు మండలాల్లో బోరుబావుల తవ్వకం నిర్వహిస్తున్నామన్నారు. అయితే ఆ గ్రామాల వీఆర్ఓలకు, సర్పంచ్లకు తెలియజేసి దండోరా వేయించి రైతులకు తెలియపరుస్తామన్నారు. -
హత్యకు నిరసనగా రాస్తారోకో
మదనపల్లె : చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చంద్రమాకులపల్లె పంచాయతీ కృష్ణాపురానికి చెందిన రామకృష్ణ (55) శనివారం తన సోదరుడు వెంకటరమణ చేతిలో హత్యకు గురికావడాన్ని నిరసిస్తూ మృతుని బంధువులు, గ్రామస్తులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఎదుట నడిరోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కృష్ణాపురం వద్ద శనివారం స్థానికుడైన రామకృష్ణను పాత కక్షల కారణంగా అతని సోదరుడు వెంకటరమణ కొడవలితో నరికి దాడి చేశాడు. ఈ ఘటనలో కొన ఊపిరితో ఉన్న రామకృష్ణను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి మెరుగైన వైద్యం కోసం రిఫర్ చేశారు. అంబులెన్స్ వాహనంలో తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో రామకృష్ణ మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం రామకృష్ణ మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే ఈ ఘటనకు రాజకీయ రంగు పులుముకోవడంతో, పెద్ద ఎత్తున మృతుని బంధువులు సన్నిహితులు, కృష్ణాపురం గ్రామస్తులు జిల్లా ఆసుపత్రికి చేరుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక్కసారిగా ఆసుపత్రి ఎదుట కదిరి రోడ్డులో వాహనాలను అడ్డుగా ఉంచి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తమ ఫిర్యాదులను సీఐ,ఎస్ఐ, డీఎస్పీ పట్టించుకోలేదని వారిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. తాలూకా సీఐ కళా వెంకటరమణ, వన్టౌన్ సీఐ ఎరీషా వలీ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని ధర్నా విరమింపజేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆసుపత్రిలోని మృతదేహాన్ని పరిశీలించారు. బాధితుల వద్దకు వచ్చి తగిన న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమరనాథ్రెడ్డి, మదనపల్లె మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు తదితరులు మృతదేహాన్ని పరిశీలించి, మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
మహిళపై దాడి కేసులో నిందితుడి అరెస్టు
కమలాపురం : కమలాపురం పట్టణం గిడ్డంగివీధిలో ఈ నెల 13వ తేదీన లక్ష్మీదేవి అనే మహిళపై జరిగిన దాడి కేసులో నిందితుడు ఆకుల రెడ్డి నవీన్ను అరెస్ట్ చేసినట్లు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన దాడికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. నిందితుడు నవీన్ ఇంటర్ వరకు చదువుకుని ఏడాది పాటు ఏఐఎల్ డిక్సన్ కంపెనీలో పని చేసి మానేశాడు. అనంతరం క్రికెట్ బెట్టింగు, ఆన్లైన్ బెట్టింగ్లతో పాటు మద్యం తదితర వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో అప్పులు చేసి తీర్చలేని స్థితికి చేరుకున్నాడు. తన ఇంటి పక్కనే ఉన్న కరంగుడి లక్ష్మీదేవి వద్ద తన మొబైల్ను కుదువ పెట్టి రూ.30వేలు అప్పు తీసుకున్నాడు. సెల్ఫోన్ కూడా విడిపించుకోలేక లక్ష్మిదేవిని చంపేసి ఆమె వద్ద ఉన్న సెల్ఫోన్తో పాటు ఒంటిపై ఉన్న నల్లపూసల దండ, తాళిబొట్టు సరుడులను బలవంతంగా లాక్కుని వెళ్లి వాటిని అమ్ముకుని అప్పు తీర్చాలనుకున్నాడు. దీంతో ఈ నెల 13వ తేదీ ఉదయం ఇంట్లో లక్ష్మీదేవి ఒంటిరిగా ఉన్న విషయం తెలుసుకుని, ఇంట్లోకి చొరబడి ఆమెను కత్తితో పొడిచి మెడలో ఉన్న బంగారు నల్లపూసల దండ, తాళిబొట్టు సరుడు బలవంతంగా లాక్కొని పారిపోయాడు. ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన సీఐ ఎస్కే రోషన్, సీసీఎస్ సీఐ భాస్కర్రెడ్డి, ఎస్ఐ ప్రతాప్రెడ్డి, సిబ్బంది తో కలసి దర్యాప్తు చేపట్టి శనివారం వల్లూరు మండలం తోళ్లగంగన్నపల్లె వద్ద నిందితుడిని అరెస్ట్ చేశారు. అలాగే అతడి వద్ద నుంచి బంగారు తాళిబొట్టు సరుడు, నల్లపూసల దండతో పాటు, నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు వివరించారు. కాగా కేవలం రెండు రోజుల్లోనే దాడి కేసులో నిందితుడుని పట్టుకుని అరెస్ట్ చేసిన సీఐ రోషన్, ఎస్ఐ ప్రతాప్రెడ్డి, సిబ్బందిని ఆయన అభినందించారు. అలాగే వారికి రివార్డులకు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు. -
‘నా బిడ్డను చంపేస్తానంటున్నాడు’
మదనపల్లె : కట్టుకున్న భర్త తన బిడ్డను చంపేస్తాను అంటూ బెదిరిస్తూ.. స్వగ్రామానికి రానీయకుండా... వేధింపులకు గురి చేస్తూ చిత్రహింసలు పెడుతున్నాడని... తనకు తన బిడ్డకు రక్షణ కల్పించి కాపాడాలని వివాహిత తన చంటి బిడ్డతో పాటు జన జాగృతి సంస్థ అధ్యక్షురాలు, బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు బాలజ్యోతితో కలిసి శనివారం ప్రెస్క్లబ్లో తన గోడు విన్నవించింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ బి.కొత్తకోట పట్టణానికి చెందిన కృష్ణ, అమృత దంపతులకు భువనేశ్వరి ఒక్కటే కుమార్తె. ఈమె చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో బి.కొత్తకోటకు చెందిన మేనత్త శంకరమ్మ చేరదీసి పెంచి పెద్ద చేసింది. అయితే అనాథ కావడంతో పెళ్లీడు రాకుండానే బంధువులు 13వ ఏట మైనర్గా ఉన్న భువనేశ్వరి(17)కి మొలకలచెరువు మండలం, కొక్కంటి క్రాస్ ఎరచ్రెరువుపల్లెకు చెందిన శివకుమార్ కు ఇచ్చి బలవంతపు వివాహం జరిపించారు. పైళ్లెన నాటినుంచే భువనేశ్వరికి వేధింపులు మొదలయ్యాయి. భర్త, అత్త, ఆడపడుచు చిత్రహింసలకు గురి చేయడం, తీవ్ర ఇబ్బందులు పెట్టడం చేశారు. ఏడాది తర్వాత భువనేశ్వరి గర్భం దాల్చగా ఇది ఇష్టం లేని అత్తింటి వారు ఇంటి నుంచి గెంటేశారు. అప్పటి నుంచి మేనత్త శంకరమ్మ ఇంటివద్దే కుమార్తె జాహ్నవి (02) కి జన్మనిచ్చింది. అప్పటినుంచి కూలి పనులు చేసుకుంటూ జీవనం చేస్తోంది. కొన్నాళ్ల క్రితం పెద్ద మనుషులు పంచాయితీ చేయడంతో , భర్త శివకుమార్తో బి.కొత్తకోటలో వేరు కాపురం పెట్టారు. అయితే చంటి బిడ్డను మేనత్త శంకరమ్మ వద్ద ఉంచారు. భర్త జులాయిగా మారి వేధింపులకు గురి చేయడంతో, కుమార్తెను శంకరమ్మ వద్ద ఉంచి నాలుగు నెలల క్రితం ఉపాధి కోసం బెంగళూరు వెళ్లింది. అప్పటినుంచి బి.కొత్తకోటకు నిన్ను రానివ్వనని ఒకవేళ వస్తే నీతో పాటు నీ బిడ్డను కూడా చంపేస్తానంటూ శివ కుమార్ తీవ్రంగా ప్రతిరోజు బెదిరింపులకు పాల్పడేవాడు. ఈ క్రమంలో శంకరమ్మ వద్ద ఉన్న జాహ్నవిని శివకుమార్ తన బంధువులతో కలిసి వచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా ఆమె అడ్డుకుంది. ఈనేపథ్యంలో బాధితురాలు భువనేశ్వరి తనకు, తన బిడ్డకు, మేనత్తకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరుతోంది. -
కేసులతో వేధించడం సరికాదు
కడప అర్బన్ : ఎక్కడైనా రెండు వర్గాల మధ్య సమస్యలు ఉన్నప్పుడు శాంతియుతంగా ఆ సమస్యను పరిష్కరించాల్సిందిపోయి ఒకే వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని విపరీతమైన సెక్షన్లతో కేసులు పెట్టి వేధించడం అనేది చాలా దారుణమని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అన్నారు. ఇటీవల రాయచోటిలో జరిగిన సంఘటనకు సంబంధించి అక్రమ కేసుల ద్వారా రిమాండ్లో ఉన్న బాధితులను శనివారం ఆయన కడప కేంద్ర కారాగారానికి వచ్చి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేతలు ఇలాంటి ఘటనలపై స్పదించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తపడాలన్నారు. సారా రహిత జిల్లాగా చేద్దాం కలకడ : అన్నమయ్య జిల్లాను సారా రహిత జిల్లాగా చేద్దామని, సారాతో వ్యక్తి, కుటుంబం, గ్రామం అభివృద్ధికి దూరమవుతారని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జోగేంద్ర అన్నారు. శనివారం మండలంలోని దిగువతాండాలో సర్పంచ్ స్వరూప అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. సారా రహిత గ్రామాలతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు, ఉన్నత విద్య సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో పీలేరు ఎకై ్సజ్ ఎస్ఐ సీహెచ్వీ సుబ్బారెడ్డి, జహీర్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్ర గాయాలు మదనపల్లె : వేర్వేరు ప్రమాదాల్లో శనివారం ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కురబలకోట మండలం మట్లివారిపల్లె పంచాయతీ గుడ్లవారిపల్లెకు చెందిన ఆదినారాయణ (55), నాగమల్లిరెడ్డి (54) ద్విచక్రవాహనంలో సీటీఎం నుంచి పెద్దపల్లెకు వస్తుండగా మార్గమధ్యంలోని బాటమారెమ్మ క్రాస్ వద్ద ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా మండలంలోని తట్టివారిపల్లె పంచాయతీ తిరుపతిరోడ్డులోని ఎర్రగానిమిట్టకు చెందిన మధుకర్రెడ్డి (40) వ్యక్తిగత పనులపై పట్టణంలోకి వచ్చి ద్విచక్రవాహనంలో తిరిగి ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలోని ఎస్టేట్ వద్ద ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు. ఎర్రగుంట్లలో చోరీ ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని వినాయకనగర్ కాలనీలో అబ్దుల్ సత్తార్ ఇంటిలో చోరీ జరిగింది. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ నరేష్కుమార్ శనివారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్టీం వచ్చి సంఘటన స్థలంలో వేలి ముద్రలు సేకరించారు. బాధితుతు తెలిపిన వివరాలకు మేరకు ...అబ్దుల్ సత్తార్ రెండు రోజుల క్రితం తన కూతురు వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోనికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న రెండు జతల కమ్మలు, వెండి పట్టీలు, గజ్జెలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. వాహనాలు సీజ్ కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప నగర శివారులోని చిన్నచౌక్ గ్రామ సర్వే నెంబర్ 919లో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వాహనాలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. రెండు టిప్పర్లు, ఒక ట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ తరలిస్తుండగా సీజ్ చేశారు. పట్టుబడిన వాహనాలను కడప నగరంలోని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. -
అతి వేగం.. రెండు కుటుంబాల్లో విషాదం !
కురబలకోట : అతి వేగం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కృష్ణపట్నం నుంచి గాలివీడుకు కడప బండలతో లారీ వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కంటైనర్ మండలంలోని తానామిట్ట వద్ద శుక్రవారం వేకువ జామున వేగంగా ఢీకొన్న విషయం తెలిసిందే. రెండు వాహనాల ముందు భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో ఈ వాహనాలలోని కంటైనర్ డ్రైవర్ భాస్కర్ (36) లారీ క్లీనర్ సయ్యద్ హసన్ (28) క్యాబిన్లోనే ఇరుక్కుపోయి విగతజీవులుగా మారారు. జేసీబీల సాయంతో అతి కష్టం మీద వీరిని బయటకు తీశారు. లారీ డ్రైవర్ నాగేశ్వరరావు (36)కు తీవ్ర గాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడు, రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాద కారణాలను పరిశీలించారు. సంఘటన స్థలాన్ని బట్టి పరిశీలిస్తే కంటైనర్ అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా స్పష్టమవుతోంది. మంగళూరు నుంచి ఎన్పీ కుంటలో సోలార్ ప్యానల్ను అన్లోడు చేసి తిరిగి ఇది ఖాళీగా వెళుతోంది. ముదివేడు సమీపంలోని తానా మిట్ట వద్ద డౌన్లో ఇది వేగంగా వెళుతుండగా లోడుతో మెల్లగా మిట్ట ఎక్కుతున్న లారీని ఒక్కసారిగా ఢీకొన్నట్లు సంఘటన స్థలాన్ని బట్టి గమనిస్తే తెలుస్తోంది. దూసుకు వచ్చిన కంటైనర్ను పసిగట్టిన లారీ డ్రైవర్ రెప్పపాటులో అప్రమత్తమై లారీని ఒక్కసారిగా పక్కకు తిప్పడంతో అతను తీవ్ర గాయాలతో బయట పడ్డాడు. పక్కనున్న క్లీనర్ మృతి చెందాడు. లారీ ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. గేర్ బాక్సు కూడా ఊడి బయటపడిందంటే కంటైనర్ ఎంత వేగంగా వచ్చి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ దుర్ఘటన రెండు కుటుంబాల్లో విషాదానికి కారణమైంది. -
నియమావళితోనే సజావుగా పరీక్ష
మదనపల్లె సిటీ /రాజంపేట టౌన్ : జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు ఈనెల 17వతేదీ నుంచి పరీక్షలు జరగనున్నాయి. నియమ, నింబంధనలు పాటిస్తే పరీక్షలు సజావుగా రాయవచ్చు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రత్యేక సూచనలు.. ● విద్యార్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రం ఎక్కడ ఉన్నదన్న విషయాన్ని ఒక రోజు ముందుగా తెలుసుకుని ఆ కేంద్రాన్ని పరిశీలించి రావాలి. ● పరీక్ష రోజు ఉదయం 8.30 గంటలకు కేంద్రానికి చే రుకోవాలి. పరీక్షలు రాయడానికి ప్యాడ్లు తీసుకెళ్లాలి. ● పరీక్షకు అవసరమైన మేరకు పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్, స్కేలు తీసుకెళ్లాలి. పరీక్షా కేంద్రంలో ఇతర విద్యార్థులను అడిగి వారిని ఇబ్బంది పెట్టకూడదు. ● పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు కేటాయించిన స్థానంలో 9 గంటలకే కూర్చోవాలి. ● ఇన్విజిలేటర్ ఇచ్చిన మెయిన్ జావాబుపత్రం, ఓఎంఆర్ పత్రం తమదేనా? కాదా అన్న విషయాన్ని ధ్రువీకరించుకుని పరీక్ష రాయాలి. ● అడిషనల్ జవాబు పత్రాన్ని దారంతో గట్టిగా కట్టి ఇవ్వాలి. ● మెయిన్ జవాబు పత్రంపై ఉన్న నంబర్ను, అడిషనల్ జవాబుపత్రం, గ్రాఫ్, మ్యాప్, బిట్ పేపర్లపై తప్పనిసరిగా రాయాలి. విద్యార్థులు వీటి జోలికి వెళ్లకూడదు.. ● పరీక్షా కేంద్రానికి సెల్ఫోన్, క్యాలికులేటర్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకు వెళ్లకూడదు. ● హాల్టిక్కెట్ తప్ప ఏ విధమైన కాగితాలు వెంట తీసుకువెళ్లకూడదు. ● ఎట్టి పరిస్థితుల్లోనూ జవాబు పత్రాలను పరీక్ష కేంద్రం నుంచి బయటకు తీసుకెళ్లరాదు. ● హాల్టిక్కెట్ నంబర్ను జవాబుపత్రం, అడిషనల్, బిట్, మ్యాప్, గ్రాఫ్ల్లో ఎక్కడా కూడా రాయకూడదు. ● విద్యార్థి పేరుగాని, సంతకం తదితర ఏ విధమైన గుర్తింపు చిహ్నాలు, నినాదాలు జవాబు పత్రాలపై రాయరాదు. తల్లిదండ్రులు ఇవి పాటించాలి.. ● తమ పిల్లలకు కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని ముందు రోజు చూపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ● రోజూ పరీక్ష కేంద్రాలకు 8.30 గంటలలోపు చేరుకునేలా చూడాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే. మాల్ప్రాక్టీస్ వద్దని సూచించాలి. ● పుకార్లను నమ్మి విద్యార్థులను భయపెట్టకూడదు.విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచనలు తల్లిదండ్రుల పాత్ర కీలకం పరీక్షకు ముందు రోజు రాత్రి పొద్దుపోయే వరకు చదవమని పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి చేయకూడదు. పరీక్షా కేంద్రానికి వెళ్లే ముందు హాల్టికెట్, పెన్నులు, పెన్సిల్, స్కేల్, రబ్బరు వంటివి ఉన్నాయా లేవా అని తల్లిదండ్రులు ఒకసారి విధిగా పరిశీలించాలి. పరీక్షలు ముగిసే వరకు ఆందోళన కలిగించే విషయాలు పిల్లలకు తెలియకుండా చూసుకోవాలి. పరీక్షల సమయంలో పిల్లలపై ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కోప్పడకూడదు. ఏదైనా తప్పు చేస్తే అది తప్పని సున్నితంగా చెప్పే ప్రయత్నం చేయాలి. పిల్లలకు నిజమైన కౌన్సిలర్లు తల్లిదండ్రులే. ఈ విషయాలన్నింటిని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. – కాశిగారి ప్రసాద్, అసోసియేట్ ప్రొఫెసర్, అన్నమాచార్య యూనివర్సిటీ, రాజంపేట -
బ్యాంకు ఖాతా నుంచి రూ.4.89 లక్షలు కాజేశారు
బి.కొత్తకోట : గుర్తు తెలియని వ్యక్తి నుంచి మొబైల్కు వచ్చిన మేసేజ్ ఓపెన్ చేయగానే రూ.4.89 లక్షలు కాజేశారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు శనివారం పోలీసులు తెలిపారు. మండలంలోని నాయనబావికి చెందిన దాదం లోకనాథరెడ్డి మొబైల్కు గతనెల 14న ఓ మెసేజ్ వచ్చింది. దాన్ని చూసిన లోకనాథరెడ్డి క్లిక్ చేసి తెరిచాడు. అప్పటికప్పుడు గట్టు కెనరా బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా రూ.4,89,858 నగదు వేరే ఖాతాలకు బదిలీ అయిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన బాధితుడు నెల తర్వాత ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు మదనపల్లె : ఆత్మహత్య కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని పోతబోలు పంచాయతీ సిద్దమ్మగారిపల్లెలో ఫిబ్రవరి 20న స్థలం విషయమై వివాదం ఏర్పడగా స్థానికుడైన హసినాబీ కుమారుడు గిరిబాబు (42) పై కొందరు వ్యక్తులు దాడి చేసి కొట్టారు. దీంతో మనస్థాపం చెందిన గిరిబాబు ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలను, వ్యక్తుల వివరాలను సూసైడ్ నోట్లో తెలిపాడు. ఆత్మహత్య సంఘటనపై తల్లి హసినాబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం శనివారం నిందితులైన మదనపల్లెకు చెందిన గంగులప్ప కుమారుడు అనిల్ (25), గంగులప్ప భార్య అరుణ(45), వారి బంధువైన వెంకటరమణ కుమారుడు శివప్రసాద్ (32)లను దేవతానగర్ వద్ద అరెస్టు చేశామన్నారు. వారిని రిమాండు నిమిత్తం కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు. హార్సిలీహిల్స్ రోడ్డుకు మరమ్మతులు బి.కొత్తకోట : మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డుకు శనివారం మరమ్మతు పనులు చేపట్టారు. రహదారి భవనాలశాఖ అధికారులు ఘాట్రోడ్డపై దెబ్బతిన్న చోట్ల గుర్తించి వాటికి ప్యాచ్లు వేశారు. ఈ రోడ్డు అభివృద్ధి కోసం అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. నిధులు మంజూరైతే కొత్తగా రోడ్డు వేయనున్నారు. -
రాజకీయ కక్షతోనే నిప్పంటించారు
ప్రొద్దుటూరు : స్థానిక పాత బస్టాండ్లోని వైఎస్సార్సీపీ కార్యకర్తలు అయిన కొండారెడ్డి, సుధాకర్ షాపులు దగ్ధం కావడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కేవలం రాజకీయ కక్ష సాధింపే ఈ సంఘటనకు కారణమని భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యర్తలు కొండారెడ్డి, సుధాకర్ పాతబస్టాండ్లో షాపులు నిర్వహిస్తున్నారు. కొండారెడ్డి కూల్ డ్రింక్ షాపు, సుధాకర్ ఫ్యాన్సీ స్టోర్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఊహించని రీతిలో శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఇరువురి దుకాణాలు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ నెల 12న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన యువత పోరు కార్యక్రమానికి కొండారెడ్డి కార్యకర్తలతో కలసి వాహనాల్లో కడపకు వెళ్లారు. ఈ కారణంగానే వీరి షాపులకు నిప్పు అంటించారని తెలుస్తోంది. శనివారం మున్సిపల్ వైస్ చైర్మన్లు ఆయిల్ మిల్ ఖాజా, పాతకోట బంగారు మునిరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటన ఎలా జరిగిందని బాధితులను అడిగి తెలుసుకున్నారు. -
భక్త కన్నప్ప గుడిని అభివృద్ధి చేస్తా: మంచు విష్ణు
సాక్షి, రాజంపేట: హీరో మంచు విష్ణు (Vishnu Manchu) అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలోని ఊటుకూరు భక్తకన్నప్ప గుడిని శనివారం సందర్శించాడు. కన్నప్ప చిత్రబృందంతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు. తమ గ్రామానికి విచ్చేసిన విష్ణుకు.. స్థానికులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.చరిత్ర తెలియజేయాలనే..ఆలయ దర్శనానంతరం మంచు విష్ణు మాట్లాడుతూ.. భక్తకన్నప్ప చరిత్రను నేటి తరానికి తెలియజేయాలనే కన్నప్ప సినిమా (Kannappa Movie) తీశాం. ఏప్రిల్ 25న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఊటుకూరు భక్త కన్నప్ప గుడి అభివృద్ధికి కృషి చేస్తాను. ఆలయ పెద్దలతో మాట్లాడి గుడికి కావాల్సిన అవసరాలను తీరుస్తాను అని హామీ ఇచ్చాడు.కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం కన్నప్ప. ప్రీతి ముకుందన్ కథానాయిక. కన్నప్ప పాత్రలో విష్ణు, రుద్రుడిగా ప్రభాస్, మహా శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్ కనిపించనున్నారు. మోహన్బాబు, మోహన్లాల్ కీలక పాత్రలు పోషించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్బాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న భారీ స్థాయిలో విడుదల కానుంది.చదవండి: నితిన్ వల్లే ఐటం సాంగ్ చేశా.. ఇప్పటికీ ఇబ్బందిగా అనిపిస్తుంది: గుత్తా జ్వాల -
236 కేసులు నమోదు.. రూ.16.19 లక్షల రికవరీ
మార్చి 1వ తేదీ వరకు 236 కేసులు నమోదు చేసి 16.19 లక్షల రూపాయలను అపరాధ రుసుం ద్వారా వసూలు చేశాం. తూనికలు కొలతల జిల్లా ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. అలాగే ఏడాది కాటాలకు ముద్రణ ద్వారా 17.19 లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. తూకాలు, ధరలు, తేదీలు కొనుగోలు వస్తువుపైన రశీదు పొందే విషయాలపై వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చౌకదుకాణాలు, తోపుడుబండ్లు, బస్టాండు, చిల్లర దుకాణాలు, కూల్డ్రింక్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, చికెన్ సెంటర్లలో ప్రజలు ఎక్కువగా మోసపోతుంటారు. ఎక్కడైనా ఎవరికై నా కొనుగోలు అన్యాయం జరిగిందని తెలిసిన వెంటనే 9885217776కు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే వెంటనే ఆ షాపుల, కేంద్రాలపైన దాడులు చేసి చర్యలు తీసుకుంటాం. వేయింగ్ మిషన్లలో జీరో చూసిన తర్వాతనే తూనికలు, కొలతతు వేయించుకోవాలి. – ఎం.నాగరాజు, తూనికలు కొలతల ఇన్స్పెక్టర్, అన్నమయ్య జిల్లా -
తూకాల్లో మోసాన్ని పసిగట్టలేకపోతున్నాం
తూకాల్లో వ్యాపారులు చేసే మోసాలను పసిగట్టలేకపోతున్నాం. తూనికల కొలతల అధికారుల పర్యవేక్షణ లోపంతో వ్యాపారులు ఇష్టానుసారంగా మోసాలు చేస్తూ దండుకుంటున్నారు. నాణ్యతలేని సరుకులను అందజేస్తున్నారు. ఎలక్ట్రానిక్తోపాటు మామూలు కాటా తూకాల్లో కూడా వినియోగదారులను నట్టేట ముంచే విధంగా వ్యాపారు. వ్యవహరిస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు దృష్టి సారించాలి. మోసాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. –గంగిరెడ్డి, వినియోగదారుడు, కోనంపేట, లక్కిరెడ్డిపల్లి మండలం -
పర్యవేక్షణ కొరవడింది
నేను చాలా సార్లు తూనికలు, కొలతలకు సంబంధించి వ్యత్యాసాలు చూశాను. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల వ్యాపారులు ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు వ్యవహరించి మోసం చేస్తున్నారు. గతంలో కొలతల రాళ్ల (ఇనుముతో ఉండేటివి) కు కింద భాగంలో సీసం ఉండేది. వాటి స్థానంలో ఎలక్ట్రానిక్ మిషన్లు వచ్చిన తరువాత తూకాల్లో కచ్చితత్వం ఉంటుందని అనుకొన్నారు. వాటిలో కూడా ముందుగా తూకం సరిచేసి సిద్ధం చేసి ఉంచుకొంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీటిలో ప్రభుత్వ చౌక దుకాణాలలో ఎక్కువగా మోసం చేస్తున్నారు. –కె. జీవానందం, రాయచోటి -
భద్రత హక్కు
తక్కువ తూకం..నాణ్యత లోపం..గడువుకు ముందే దెబ్బతినడం.. నిర్లక్ష్యసమాధానం.. బాధ్యతారాహిత్యం.. నిత్యావసర వస్తువుల మొదలు అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాల వరకు ముందు..వెనుక దగా..తాగే నీళ్లు, పాలలో కూడా నాణ్యత లేకుండా పోయింది. తూకాల్లో భారీగా తేడాలు ఉన్నాయి. చివరకు నష్టపోయేది వినియోగదారుడే. వీటిపై ఎవరైనా ప్రశ్నిస్తే తప్ప న్యాయం జరగడం లేదు. ఈ తరహా మోసాలను అరికట్టాలంటే వినియోగదారులు మేలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.కొనుగోలుదారుడికి రక్షణగా చట్టం ఉంది.మనం చేయాల్సింది వినియోగించుకుని మేలుకోవడమే. నేడు (మార్చి 15) ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. రాయచోటి: జిల్లా కేంద్రం రాయచోటిలోని వీధుల్లో తిరుగుతున్న బండిపై ఓ మహిళ వంద రూపాయలకు 4 కిలోల ఉల్లిపాయలు కొనుగోలు చేసింది. వ్యాపారి ఎలక్ట్రానిక్ యంత్రంపై తూకం వేసి ఇచ్చాడు. అనుమానం రావడంతో పక్కనే ఉన్న దుకాణంలో నాలుగు కిలోల ఉల్లిగడ్డలను తూకం వేసి పరీక్షించింది. 600 గ్రాములు తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. జిల్లా కేంద్రంలో ఇలా ప్రతి రోజు వినియోగదారులు వ్యాపార కేంద్రాలలో ఏదో విధంగా మోసాలకు గురవుతూ వస్తున్నారు. ఆటో, తోపుడు బండిలలోనే కాకుండా చిల్లర దుకాణాలు, చౌకదుకాణాలు, ఫర్టిలైజర్స్ షాపులు, కూల్డ్రింక్స్, మందులు, మాత్రలు, సంతలలో ఇలాంటి మోసాలు అధికంగా కనిపిస్తున్నాయి. అధిక ప్రాధాన్యత కస్టమర్లకు వ్యాపార సంస్థలు సైతం ఎక్కువ ప్రాధాన్యతను అందిస్తాయి. మార్కెట్లో వినియోగదారులు సరసమైన ధరలతో పాటు స్వచ్ఛమైన, నాణ్యమైన ఉత్పత్తులను కోరుకుంటుంటారు. వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు వినియోగదారుల చట్టం ఉంది.ఇందులో ప్రాథమిక హక్కులను కల్పించింది. సమాచార హక్కు ఏదైనా ఉత్పత్తి గురించి కావాల్సిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు వినియోగదారులకు చట్టం కల్పించింది. ఉదాహరణకు ప్రొడక్ట్ నాణ్యత, పరిమాణం, ధర, క్వాలిటీ, ఎక్స్పైరీ తేదీ వంటి వివరాలను అడిగి తెలుసుకోవచ్చు. వినియోగదారుల చట్టం ప్రకారం.. కస్టమర్లు తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించే హక్కును కలిగి ఉంటారు. కస్టమర్ కొనుగోలు చేసిన ఉత్పత్తిపై ఏదైనా లోపం ఉంటే అభ్యంతరం తెలియజేయవచ్చు. కస్టమర్ తాము మోసపోయామని భావిస్తే.. వారు వినియోగదారుల ఫోరమ్లో సదరు వ్యాపార సంస్థ లేదా కంపెనీపై ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుల పరిష్కారం తమకు మోసం జరిగితే అది ఉత్పత్తి ప్రొఫెషనల్ లేదా కంపెనీకి సంబంధించిన ఫిర్యాదైనా వినియోగదారు చట్టం ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారుల ఫోరం లేదా వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కేంద్రం దీనిని పరిష్కరిస్తుంది. సిబ్బంది కొరత జిల్లాలో తూనికలు, కొలతల శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. జిల్లా అధికారితో పాటు, టెక్నికల్ అసిస్టెంట్, అటెండర్ మరో కానిస్టేబుల్ అవసరం ఉంది. ఇప్పటి వరకు వారిని నియమించకపోవడంతో తగిన రీతిలో దాడులు చేయలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అందుబాటులో హెల్ప్లైన్వినియోగదారుడికి హక్కులపై అవగాహన కల్పించి మోసపోకుండా ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా వినియోగదారుల మేళాలు, శిబిరాలు, వర్క్షాప్లను కూడా నిర్వహిస్తోంది. వినియోగదారుల హక్కుల కోసం దేశంలో హెల్ప్లైన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. కస్టమర్లు తన ఫిర్యాదును నేషనల్ కన్సూమర్ హెల్ప్లైన్ 1800114000 టోల్ఫ్రీ నంబర్లో నమోదు చేయవచ్చు. నిలువు దోపిడీ చేస్తున్న వ్యాపారులు అధిక ధరకు అమ్మకాలు నాణ్యతా, ప్రమాణాలు పాటించని వైనం నష్టపోతున్న వినియోగదారులు ఫిర్యాదులుంటేనే చర్యలంటున్న అధికారులు సేఫ్ షాపింగ్ అనేది వినియోగదారుడి ఉన్న ప్రధాన హక్కు. కొనుగోలు చేసిన ఉత్పత్తి భద్రతకు తయారీదారు బాధ్యత వహించాలి. మార్కెట్లో సెల్లర్స్ ఎల్లప్పుడూ నాణ్యమైన వస్తువులను విక్రయించాలి. వినియోగదారులు కూడా నాణ్యమైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. ఐఎస్ఐ మార్క్, ఐఎస్ఓ సర్టిఫైడ్ ఉత్పత్తులను ఉపయోగించాలి. వస్తువుల నాణ్యత, దానితో పాటు సేవల గురించి సమాచారాన్ని పొందే హక్కు వినియోగదారులకు చట్టం కల్పించింది. ఏ కంపెనీకి చెందిన ఉత్పత్తిని కొనుగోలు చేయాలనే హక్కును కస్టమర్లకు చట్టం కల్పించింది. షాపింగ్ సమయంలో కస్టమర్ల నిర్ణయానికి విరుద్ధంగా వేరే బ్రాండ్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని వ్యాపారి బలవంతం చేసినట్లయితే వినియోగదారులు దీనిపై ఫిర్యాదు చేసేందుకు చట్టం వెసులుబాటు కల్పించింది. -
నేడు జిల్లాకు ప్రత్యేకాధికారి వినయ్ చంద్
రాయచోటి: ప్రభుత్వం జిల్లాకు నియమించిన ప్రత్యేక అధికారి వాడరేవు వినయ్ చంద్ శనివారం జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం ఉదయం రాయచోటిలోని డైట్ ఉన్నత పాఠశాల, మున్సిపల్ కార్యాలయం, గవర్నమెంట్ జూనియర్ కళాశాల, కాటిమాయకుంట తదితర ప్రాంతాల్లో జరగనున్న స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారని జిల్లా కలెక్టర్ తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శిగా కరీముల్లా కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా, మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎస్ఏ కరీముల్లాను రాష్ట్ర మైనార్టీ విభాగ కార్యదర్శిగా నియమించారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన కార్యవర్గం కడప సెవెన్రోడ్స్: ఏపీ శారీరక వికలాంగుల ఉద్యోగ సంక్షేమ సంఘానికి కొత్త కార్యవర్గ ఎన్నిక శుక్రవారం కడప నగరంలోని విద్యుత్ విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా బి.సుధాకర్, అధ్యక్షుడిగా పులిమి జేమ్స్, ప్రధాన కార్యదర్శిగా చిన్నకొట్టి చంద్ర, ట్రెజరర్గా బత్తుల చంద్రశేఖర్, సమాచార కార్యదర్శిగా పి.సుబ్బరాజు, కార్యదర్శులుగా వై.గుర్రప్ప, హెచ్.నరసింహులు, కన్వీనర్గా ఎం.రవిశంకర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 21న మెగా జాబ్మేళా రాయచోటి జగదాంబసెంటర్: ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ), సీడాప్, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే ఉద్యోగమేళాలో టెక్మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండిగో ఎయిర్లైన్స్, అడక్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆధ్య హెచ్ఆర్ సొల్యూషన్స్, నియో లింక్, ముత్తూట్ ఫైనాన్స్, టాటా క్యాపిటల్, బిగ్ సీ, ఫోన్ పే ఫ్లిప్కార్ట్, అపోలో ఫార్మసీ తదితర కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. మరిన్ని వివరాలకు 9550104260, 9618971075 నంబర్లలో సంప్రదించాలని కలెక్టర్ వివరించారు. మహిళల భద్రతకు ‘శక్తి యాప్’ రాయచోటి: మహిళలు, బాలికల భద్రత కోసం శక్తియాప్ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో యాప్ వినియోగం గురించి ఎస్పీ వివరించారు. జిల్లాలో ప్రతి మహిళ, గృహిణులు, విద్యార్థినులు, బాలికలు వారి మొబైల్లో శక్తియాప్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఆపద సమయంలో పోలీసుల నుంచి తక్షణ సహాయ సహకారాలు పొందాలన్నారు. ఆపదలో ఉన్న మహిళలు ఎవరైనా ఏస్ఓఎస్ బటన్ ప్రెస్ చేస్తే వారు ఉన్న ప్రాంతం వివరాలు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు డయల్ 112 నంబర్కు చేరుతుందని, వెంటనే పోలీసులు అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకొని వారికి రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపడతారని ఎస్పీ వివరించారు. శాస్త్రోక్తంగా చక్రస్నానం గుర్రంకొండ: మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి బ్రహోత్సవాల్లో భాగంగా తొమ్మిదోరోజైన శుక్రవారం ఉదయం తోమాలసేవ, తిరుచ్చి ఉత్సవం, ఊంజల్సేవలు జరిగాయి.అర్చకులు రంగునీళ్లు, పుసుపునీళ్లు ఒకరిపై ఒకరు చల్లుకొంటూ కోలాహాలంగా వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం స్నపన తిరుమంజనం జరిపించారు. స్వామివారి ఆయుధాలైన శంఖు,చక్రాలను పవిత్ర జలాలతో శుద్ధి చేస్తూ చక్రస్నాన మహోత్సవం నిర్వహించారు. రంగురంగుల పుష్పాలతో అలంకరించిన తిరుచ్చి వాహనంలో స్వామివారిని కొలువుదీర్చి గ్రామపురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అర్చకులు ధ్వజావరోహణ కార్యక్రమం జరిపారు. ఏకాంత సేవతో ఈరోజు ఉత్సవాలు ముగిశాయి. పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారికి పూజలు నిర్వహించారుకార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. -
తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి
కొనే ప్రతి వస్తువులోనూ లోపం లేకుండా సరైన ధర, తూకం, నాణ్యత పొందడానికి వినియోగదారులు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలి. గుండు సూది నుంచి విమాన ప్రయాణం వరకు కొనేవారు, ఖర్చు చేసే వారంతా వినియోగదారులే. మనం తాగే పాలు, నీరు, కొనుగోలు చేసే ప్రతి వస్తువు నాణ్యతపై ప్రశ్నించే తత్వాన్ని ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలి. వినియోగదారుడు ఎలాంటి కొనుగోళ్లు చేసినా తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. కొనుగోలు చేసిన వస్తువుల్లో లోపాలు ఉంటే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి రక్షణ పొందవచ్చు. –మేకల దర్బార్బాషా, జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు -
యథేచ్ఛగా ఇసుక దోపిడీ
● ప్రభుత్వ నిర్దేశిత ధరల కంటే అదనంగా వసూళ్లు ● టిప్పర్ అసోసియేషన్ పేరుతో కృత్తిమ కొరత ● ఇతర టిప్పర్లు పట్టణంలోకి రాకుండా అడ్డగింత ● చోద్యం చూస్తున్న రెవెన్యూ, మైనింగ్ అధికారులు మదనపల్లె: పట్టణంలో ఇసుక దోపిడీ యథేచ్చగా కొనసాగుతోంది. ఉచిత ఇసుక విధానంతో సామాన్యుడికి ఇసుక అందుబాటులోకి తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న కూటమిప్రభుత్వం, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దోపిడీని మాత్రం చూసీ చూడనట్లు వదిలేస్తోంది. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే టిప్పర్ యజమానులు వినియోగదారుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇసుక కృత్రిమ కొరతను సృష్టించి, తాము చెప్పిందే ధర, తాము తోలిందే ఇసుక అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. భవన నిర్మాణ యజమానులు ఎవరైనా నేరుగా రీచ్ నుంచి ఇసుక తోలుకునేందుకు ప్రయత్నిస్తే, వాహనాలను అడ్డుకోవడం, బెదిరింపులకు పాల్పడటం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నేషనల్ హైవేపై అసోసియేషన్ కార్యాలయం ఎదుట 15కు పైగా టిప్పర్లను నిలుపుకుని బహిరంగంగా విక్రయాలు జరుపుతున్నారు. ఇసుక అక్రమరవాణా, బ్లాక్ మార్కెటింగ్ నివారణకు ఏర్పాటుచేసిన విజిలెన్స్ విభాగం, గనులశాఖ, రెవెన్యూ అధికారుల కళ్లెదుటే ఇదంతా జరుగుతున్నప్పటికీ పట్టించుకున్న దాఖలా లేదు. ● ప్రభుత్వ పోర్టల్లో కానీ లేదా స్థానిక గ్రామ,వార్డు సచివాలయాల్లో వెళ్లి భవన నిర్మాణ అనుమతులు చూపించి ఇసుకను పొందే వీలును ప్రభుత్వం కల్పించింది. ఇందుకు వినియోగదారుడు ఇసుక లోడింగ్ చేసేందుకు, రీచ్ నుంచి ఇంటి వరకు రవాణా చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. దీనికి సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో రవాణా చార్జీలను ఖరారుచేసి, సరఫరాలో ఎలాంటి అవినీతి జరగకుండా విజిలెన్స్ మానిటరింగ్, మైనింగ్ చెక్పోస్ట్లు, పోలీస్ తనిఖీలు చేయాలని ఆదేశించింది. అయితే క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. అన్నమయ్యజిల్లా రాజంపేట మండలం బాలరాజుపల్లె వద్ద ఇసుకరీచ్ ఉంది. మదనపల్లె నుంచి ఇసుకరీచ్కు 132 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పట్టణంలో భవన నిర్మాణపనులు అధికంగా జరుగుతుండటం, డిమాండ్ ఉండటంతో కొద్దిరోజుల క్రితం వరకు రాయచోటి, పీలేరు, వాల్మీకిపురం, మదనపల్లెకు చెందిన టిప్పర్ యజమానులు రూ.18వేలకు టిప్పర్ ఇసుక తోలేవారు. ప్రజల నుంచి ఈ ధరలపై ఎక్కడా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అయితే..ఈనెల 2న బైపాస్రోడ్డులో మదనపల్లె టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ పేరుతో ఓ కార్యాలయాన్ని ఏర్పాటుచేసి, సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలు పెట్టి... టీడీపీ తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబుతో ప్రారంభించారు. అధికారపార్టీ అండతో ఇసుక రవాణాను తమ చేతుల్లోకి తీసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, అధికారికంగా బిల్లులు ఉన్న ఇతర ప్రాంతాల ఇసుక టిప్పర్లను పట్టణంలోకి రానివ్వకుండా అడ్డుకోవడం మొదలుపెట్టారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించి, ఎవరికై నా ఇసుక కావాల్సి వస్తే తమనే సంప్రదించాలని, టిప్పర్ ఇసుకకు 22 నుంచి 24 వేల ధర నిర్ణయించి, తమవద్దే కొనుగోలుచేయాల్సిందిగా హుకుం జారీచేశారు. దీంతో ఇసుక అవసరమైన వారు వారు చెప్పిన ధరలు చెల్లించి, కిమ్మనకుండా తోలుకుంటున్నారు. వాస్తవానికి ఇసుక రీచ్ నుంచి బయలుదేరిన టిప్పర్ నేరుగా వినియోగదారుడికి డెలివరీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే..తప్పుడు బిల్లులతో తీసుకువచ్చిన సుమారు 15 లారీలకు పైగా ఇసుక నింపుకున్న టిప్పర్లు అసోసియేషన్ కార్యాలయం ఎదుట నేషనల్ హైవేపై నిలుపుకుని బహిరంగ విక్రయాలు చేస్తున్నారు. ఈ విషయమై టిప్పర్ అసోసియేషన్ నాయకులను వివరణ కోరితే...టిప్పర్ యజమానులు నష్టపోకూడదనే తాము అసోసియేషన్ ఏర్పాటుచేసుకున్నామని, ప్రభుత్వం 18,400 ధర నిర్ణయించిందని, తాము 3వేలు మాత్రమే అదనంగా వసూలుచేస్తున్నామన్నారు. ఇతర ప్రాంతాల టిప్పర్లు వస్తే అసోసియేషన్ మెయింటెన్స్కు డబ్బులు కట్టించుకుని వదులుతున్నామన్నారు. దోపిడీని అరికట్టాలి... ఇసుక రవాణాకు సంబంధించి ప్రధాన రహదారుల్లో మైనింగ్, విజిలెన్స్, పోలీసు అధికారుల తనిఖీలు, చెక్పోస్ట్ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా దోపిడీ జరుగుతోంది. తక్కువ ధరకు ఇసుక తోలేందుకు వస్తున్న టిప్పర్ యజమానులను, టిప్పర్ అసోసియేషన్ సభ్యులు బెదిరించడం తగదు. పోలీస్, మైనింగ్ అధికారులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని, ఇసుక మాఫియాపై కఠినచర్యలు తీసుకోవాలి. – సాంబశివ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి -
దోస రైతుకు నిరాశ
లక్ష రూపాయలు భూమిలో పోసిన రైతుకు ఏటా నిరాశే మిగులుతోంది. వేసవి కావడంతో దోస పంటకు మంచి డిమాండ్ ఉంటుందని కష్టపడి పండించిన అన్నదాతలు దళారుల మాయకు దిగాలు పడుతున్నారు. ఉన్నపాటుగా ధర భారీగా పతనమవడంతో దిక్కుతోచక ఆందోళన చెందుతున్నారు. ఓబుళవారిపల్లె : వాణిజ్య పంటలకు పేరుగాంచిన రైల్వేకోడూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఏటా 650 ఎకరాల్లో దోస పంట సాగు చేస్తారు. అప్పు తెచ్చి దుక్కులు చేసి పంట సాగు చేసిన రైతుకు తీరా దిగుబడి చేతికందే సమయంలో దళారుల చేతుల్లో నష్టపోతున్నారు. ఎగుమతి చేసే దళారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ ఏడాది పంట పండించిన రైతు కంటే దళారులే ధర నిర్ణయించడం పరిపాటిగా మారింది. రంజాన్ మాసం ముందుగానే రావడంతో దోస పంట చేతికందింది. ఈ సమయంలో మంచి ధర పలుకుతుందని రైతులు ఎంతో ఆశపడ్డారు. ధర పతనం దోస కాయల ధర మార్కెట్లో టన్నుకు రూ. 22 వేలు పలుకుతోంది. అయితే హోలీ పండగ అడ్డుపెటుకొని కొందరు దళారులు సిండికేట్గా మారి ఒకేసారి టన్నుపై రూ.7 వేలు తగ్గించేశారు. కోహినూర్ రకం దోస టన్ను రూ.54 వేలు ఉండగా, రూ.30 వేలకు పడిపోయింది. రైతు చేసేదేమీలేక.. చేతికందిన పంట వదిలేయలేక దళారులు చెప్పిన కాటికే అమ్మి తీవ్రంగా నష్టపోతున్నారు. దోస పంట సాగుచేసినప్పటి నుంచి విత్తనం, ఎరువులు, కూలీలు, మందులు, మల్చింగ్ ఖర్చులు ఒక ఎత్తయితే.. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పంట దిగుబడులు తీశాడు. ఎకరాకు లక్ష రూపాయల నుంచి రూ.1.20 లక్షలు ఖర్చు చేశారు. ఇపుడు చేతికందే సమయంలో ధరలేక దళారుల చేతుల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో వ్యవసాయమే ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు. ఒకటేసారి టన్నుకు ఏడువేల రూపాయలు నుంచి తొమ్మిదివేల రూపాయల వరకు రైతు నష్టపోతున్నాడు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని దోస రైతులు కోరుతున్నారు. వారం లోపు రూ.7 వేలు తగ్గింపు దళారులు అందరూ సిండికేట్గా ఏర్పడి హోలీ పండగ పేరుతో దోస దిగుబడులు టన్నుకు రూ.7 వేలు తగ్గించారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి పంట సాగు చేస్తే రైతులను మోసం చేసి దోచుకుంటున్నారు. దళారులపై చర్యలు తీసుకోవాలి. – బండారు వెంకటరమణ, రైతు, చెన్నరాజుపోడు, ఓబులవారిపల్లి మండలం దళారులు కోట్లు సంపాదిస్తున్నారు పంట చేతికేందే సమయంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోయాను. ఏటా దళారుల చేతుల్లో మోసపోవాల్సి వస్తోంది. వారు నిర్ణయించిన సిండికేట్ ధరతో మేము పంట అమ్మాల్సి వస్తోంది. అధికారులు చర్యలు తీసుకొని రైతును కాపాడకపోతే భవిష్యత్తులో వ్యవసాయం చేయలేం. – నందలూరు వెంకటసుబ్బారెడ్డి, ఓబులవారిపల్లి దళారుల సిండికేట్తో ధర తగ్గింపు టన్నుకు ఏడు వేల రూపాయల నష్టం ఈ ఏడాది మోసపోయిన రైతులు -
ఆలయంలో మైక్ సెట్ చోరీ
మదనపల్లె : ఆలయంలో మైక్ సెట్ చోరీకి గురైన సంఘటన గురువారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. అంకిశెట్టిపల్లె పంచాయతీ గాంధీపురంలోని కోదండరామస్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆలయానికి అమర్చిన మైక్ సెట్ను ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం గమనించిన స్థానికులు చోరీ ఘటనపై టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైక్ సెట్ విలువ సుమారు రూ.11వేలు ఉంటుందని పేర్కొన్నారు. తాలూకా సీఐ కళావెంకటరమణ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. గిరిజన మహిళపై దాడి మదనపల్లె : భూ వివాదంలో కొందరు వ్యక్తులు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని గిరిజన మహిళ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్కు వెళితే న్యాయం చేయకపోగా, తనపైనే కేసు బనాయించారని ఆరోపించారు. ఆమె వివరాల మేరకు.. పట్టణంలోని చంద్రా కాలనీకి చెందిన కృష్ణా నాయక్, సునీత దంపతులు దినసరి కూలీలు. వారికి స్థానికుడు బాల్ రెడ్డితో స్థల వివాదం ఉంది. అదే స్థలంలో తాము నిర్మించుకున్న పునాదులను గురువారం సాయంత్రం కొందరు తొలగిస్తున్నారని చెప్పడంతో అక్కడకు వెళ్లినట్లు సునీత తెలిపారు. ఆ సమయంలో బాల్రెడ్డి, కుటుంబ సభ్యులు తనపై కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారన్నారు. అపస్మారకస్థితిలో పడిన తనను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లి తన చెల్లెలు చికిత్స అందించిందన్నారు. టూటౌన్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా, పోలీసులు ఫిర్యాదు తీసుకోకుండా, బాల్రెడ్డి ఫిర్యాదుమేరకు తనపై కేసు నమోదుచేశారని ఆరోపించారు. తనకు న్యాయం జరగకపోతే, సీఎం, హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లి సాయం కోరతానని తెలిపారు టిప్పర్ డ్రైవర్పై దాడి మదనపల్లె : రాయచోటి నుంచి మదనపల్లెకు ఇసుక తీసుకుని వచ్చినందుకు టిప్పర్ డ్రైవర్పై మదనపల్లె టిప్పర్ అసోసియేషన్ సభ్యులు దాడి చేసిన ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. రాయచోటికి చెందిన సుబ్రహ్మణ్యం టిప్పర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాజంపేట రీచ్ నుంచి ఇసుక లోడ్ చేసుకుని, మదనపల్లెలో అన్లోడ్ చేసి తిరిగి రాయచోటికి వెళుతున్నాడు. చౌడేశ్వరి సర్కిల్ వద్ద అసోసియేషన్ సభ్యులు బిల్డప్ భరత్, పీఎస్ఆర్.ప్రసాద్రెడ్డి, అంకిశెట్టిపల్లె రమేష్, మణి, గొల్లపల్లెశివ, ముబారక్బాషా, ఏఎన్ఎస్ అమర తదితరులు బండిని అడ్డుకుని తాళాలు లాక్కోవడమే గాక, తనపై దాడిచేసి, చొక్కాను చించివేసి గాయపరిచారన్నారు. మదనపల్లెలో టిప్పర్ అసోసియేషన్ లారీలు తప్ప వేరెవ్వరూ తక్కువ ధరకు ఇసుక అమ్మరాదని, తాము రూ.24 వేలు అమ్ముతుంటే, నీవు రూ.18,500కు ఎలా దించుతావంటూ గదమాయిస్తూ విచక్షణారహితంగా కొట్టారన్నాడు. బాధితుడు టిప్పర్ను అక్కడే విడిచిపెట్టి, తెలిసిన వారి సహాయంతో టూటౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకుని, సీఐ రామచంద్రకు ఫిర్యాదు చేశాడు. దాడి ఘటనపై విచారణ చేసి కేసు నమోదుచేస్తామని తెలిపారు. బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి గుర్రంకొండ : బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని తరిగొండ వద్ద జరిగింది. మదనపల్లె రూరల్ మండలం సీటీఎంకు చెందిన సుబ్బమ్మగారి నాగరాజు(45) శుక్రవారం మండలంలోని తరిగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చాడు. స్వామిని దర్శించుకుని తిరిగి ఆటోలో స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో వాల్మీకిపురం వైపు వెళుతున్న బొలెరో వాహనం ఢీకొంది. వెనుక కూర్చున్న నాగరాజుకు తీవ్రరక్తగాయాలయ్యాయి. తిరుపతికి స్విమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా నాగరాజు మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధురామచంద్రుడు తెలిపారు. ప్రమాదంలో భార్యాభర్తలు మృతి మైదుకూరు : లారీ దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడిన భార్య, భర్తలు తిరిగిరాని లోకాలకు చేరారు. వారి కుమారుడు గాయాలతో చికిత్స పొందుతున్నాడు. చాపాడు మండలం తప్పెట ఓబాయపల్లెకు చెందిన పసుపులేటి చలమయ్య పట్టణంలోని నంద్యాల రోడ్డు సీతారామాంజనేయనగర్లో నివాసముంటున్నారు. వీరికి మల్లేష్, వినోద్ కుమార్ కుమారులు. చలమయ్య కేశలింగాయపల్లె వద్ద ఉన్న పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వినోద్ వ్యవసాయంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. శుక్రవారం భార్య, కుమారుడు వినోద్తో కలిసి చలమయ్య పొలానికి వెళ్లారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లాలనిమైదుకూరు–పోరుమామిళ్ల రహదారిపైకి చేరుకొని ముగ్గురు ఆటో కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో మాచర్ల నుండి సిమెంట్ లోడుతో వస్తున్న లారీ వీరిపైకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో చలమయ్య (55), ఆయన భార్య లక్ష్మీదేవి (50) అక్కడికక్కడే మృతి చెందారు. వినోద్ కుమార్కు గాయాలవడంతో కడప రిమ్స్కు తరలించారు. అర్బన్ సీఐ హాసం పరిశీలించారు. వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పశువైద్య విద్యార్థులకు న్యాయం చేయండి
మంత్రి రాంప్రసాద్రెడ్డికి పీడీఎస్యూ నేతల వినతి రాయచోటి అర్బన్ : ఎంబీబీఎస్ విద్యార్థులతో సమానంగా పశువైద్య విద్యార్థులకు గౌరవ వేతనం చెల్లించే విధంగా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని పీడీఎస్యూ నాయకులు అంకన్న డిమాండ్ చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లె రాంప్రసాద్రెడ్డిని శుక్రవారం వారు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అంకన్న మాట్లాడుతూ 2013 వరకూ రాష్ట్రంలో పశు వైద్య విద్యార్థులకు రూ.5 వేల గౌరవవేతనం అందించామన్నారు. ప్రస్తుతం ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు రూ.25వేల గౌరవ వేతనం అందిస్తున్నారని, పశు వైద్య విద్యార్థులపై మాత్రం వివక్ష చూపుతున్నారన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చి పశు వైద్య విద్యార్థులకు రూ.25వేల గౌరవ వేతనం అందించాని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ ఉమ్మడి జిల్లా నేతలు రవీంద్ర, మ హేష్, చిన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులకు అండగా ఉంటాం ఉద్యోగులకు అన్ని రకాలుగా అండగా ఉంటానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లె రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ఎన్నికై న ఏపీ ఎన్జీఓ జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు శుక్రవారం మంత్రిని ఆయన స్వగృహంలో కలిసి సమస్యలను విన్నవించారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేలా చూస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైన లబ్ధిదారులకందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.ప్రసాద్యాదవ్, కడప జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాసులు, జాయింట్ సెక్రటరీ నరసింహారెడ్డి, శ్రీనివాసన్, పద్మనాభం, బలరామరాజు, వెంకటేశ్వరరెడ్డి, ఆర్.జయచంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాకు ఒంటిమిట్ట రామయ్య తలంబ్రాలు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండరామాలయం నుంచి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను అమెరికాకు పంపనున్నారు. సాలాబాద్కు చెందిన మల్లారెడ్డి కుమారుడు వెంకటసుబ్బారెడ్డి శుక్రవారం కోదండరాముడికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. పూజలు పూర్తయిన అనంతరం వాటిని అమెరికా దేశంలోని చికాగోలోని లెమోంట్ రామాలయంలో జరగబోయే శ్రీరామనవమి వేడుకల్లో రఘునందుడికి సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముమ్మడి మల్లారెడ్డి, లలితమ్మ, భానుశ్రీ, తన్వీ, ఈక్షిత, సుదర్శన్రెడ్డి, వాసవీ, జశ్వంత్రెడ్డి పాల్గొన్నారు. వెంకట శివసాయి ఆలయం గొప్పది సంబేపల్లె : మోటకట్ల వెంకటశివసాయి ఆలయం ఎంతో పేరుగాంచిన గొప్ప ఆలయమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే అకేపాటి అమరనాథ్రెడ్డి పేర్కొన్నారు. ఆలయాన్ని శుక్రవారం వారు సందర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన ఆలయం నిర్మించి, విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటనాథరెడ్డి విష్ణువర్దన్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, రామచంద్రారెడ్డి, అమర్నాథ్రెడ్డి వీవీ.రమణారెడ్డి, నాగభూషణ్రెడ్డి, ప్రతాప్రెడ్డి, బానుమెర్తి, ఉదయ్రెడ్డి, వాసుదేవరెడ్డి, మురళీధర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. వైభవంగా మల్లూరమ్మ తిరుణాల చిన్నమండెం : చిన్నమండెం మండలం మల్లూరు కొత్తపల్లె సరిహద్దున వెలసిన మల్లూరమ్మ జాతర శుక్రవారం వైభవంగా ముగిసింది. అమ్మవారి మూలవిరాట్ను పలు రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. భక్తులు చాందినీబండ్లతో వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. రాయచోటి డీఎస్పీ కొండయ్యనాయుడు, రూరల్ సీఐ వరప్రసాద్ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా 250 మంది పోలీసులు పర్యవేక్షించారు. పలు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భార్యా, పిల్లలను నిర్భంధించారని ఫిర్యాదు కడప అర్బన్ : తన భార్య, పిల్లలను బాకీ డబ్బుల కోసం నిర్భంధించారని రాంబాబు అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. వేంపల్లికి చెందిన రాంబాబు కడప జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఈజీ.అశోక్కుమార్ను కలిసేందుకు వచ్చారు. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో విలేకరులతో రాంబాబు మాట్లాడుతూ ఓ వ్యక్తి నుంచి తన భార్య గంగాదేవి రూ.45లక్షలు రూ.2కు వడ్డీకి తెచ్చి కార్పొరేషన్ ద్వారా వడ్డీలకు ఇచ్చిందన్నారు. ఆ డబ్బు చెల్లించలేదంటూ వారు తన భార్య, పిల్లలను తీసుకెళ్లి నిర్భంధించారన్నారు. -
దోస రైతుకు నిరాశ
లక్ష రూపాయలు భూమిలో పోసిన రైతుకు ఏటా నిరాశే మిగులుతోంది. వేసవి కావడంతో దోస పంటకు మంచి డిమాండ్ ఉంటుందని కష్టపడి పండించిన అన్నదాతలు దళారుల మాయకు దిగాలు పడుతున్నారు. ఉన్నపాటుగా ధర భారీగా పతనమవడంతో దిక్కుతోచక ఆందోళన చెందుతున్నారు. ఓబుళవారిపల్లె : వాణిజ్య పంటలకు పేరుగాంచిన రైల్వేకోడూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఏటా 650 ఎకరాల్లో దోస పంట సాగు చేస్తారు. అప్పు తెచ్చి దుక్కులు చేసి పంట సాగు చేసిన రైతుకు తీరా దిగుబడి చేతికందే సమయంలో దళారుల చేతుల్లో నష్టపోతున్నారు. ఎగుమతి చేసే దళారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ ఏడాది పంట పండించిన రైతు కంటే దళారులే ధర నిర్ణయించడం పరిపాటిగా మారింది. రంజాన్ మాసం ముందుగానే రావడంతో దోస పంట చేతికందింది. ఈ సమయంలో మంచి ధర పలుకుతుందని రైతులు ఎంతో ఆశపడ్డారు. ధర పతనం దోస కాయల ధర మార్కెట్లో టన్నుకు రూ. 22 వేలు పలుకుతోంది. అయితే హోలీ పండగ అడ్డుపెటుకొని కొందరు దళారులు సిండికేట్గా మారి ఒకేసారి టన్నుపై రూ.7 వేలు తగ్గించేశారు. కోహినూర్ రకం దోస టన్ను రూ.54 వేలు ఉండగా, రూ.30 వేలకు పడిపోయింది. రైతు చేసేదేమీలేక.. చేతికందిన పంట వదిలేయలేక దళారులు చెప్పిన కాటికే అమ్మి తీవ్రంగా నష్టపోతున్నారు. దోస పంట సాగుచేసినప్పటి నుంచి విత్తనం, ఎరువులు, కూలీలు, మందులు, మల్చింగ్ ఖర్చులు ఒక ఎత్తయితే.. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పంట దిగుబడులు తీశాడు. ఎకరాకు లక్ష రూపాయల నుంచి రూ.1.20 లక్షలు ఖర్చు చేశారు. ఇపుడు చేతికందే సమయంలో ధరలేక దళారుల చేతుల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో వ్యవసాయమే ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు. ఒకటేసారి టన్నుకు ఏడువేల రూపాయలు నుంచి తొమ్మిదివేల రూపాయల వరకు రైతు నష్టపోతున్నాడు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని దోస రైతులు కోరుతున్నారు. వారం లోపు రూ.7 వేలు తగ్గింపు దళారులు అందరూ సిండికేట్గా ఏర్పడి హోలీ పండగ పేరుతో దోస దిగుబడులు టన్నుకు రూ.7 వేలు తగ్గించారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి పంట సాగు చేస్తే రైతులను మోసం చేసి దోచుకుంటున్నారు. దళారులపై చర్యలు తీసుకోవాలి. – బండారు వెంకటరమణ, రైతు, చెన్నరాజుపోడు, ఓబులవారిపల్లి మండలం దళారులు కోట్లు సంపాదిస్తున్నారు పంట చేతికేందే సమయంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోయాను. ఏటా దళారుల చేతుల్లో మోసపోవాల్సి వస్తోంది. వారు నిర్ణయించిన సిండికేట్ ధరతో మేము పంట అమ్మాల్సి వస్తోంది. అధికారులు చర్యలు తీసుకొని రైతును కాపాడకపోతే భవిష్యత్తులో వ్యవసాయం చేయలేం. – నందలూరు వెంకటసుబ్బారెడ్డి, ఓబులవారిపల్లి దళారుల సిండికేట్తో ధర తగ్గింపు టన్నుకు ఏడు వేల రూపాయల నష్టం ఈ ఏడాది మోసపోయిన రైతులు -
కువైట్లో కొండావాండ్లపల్లె మహిళ మృతి
సంబేపల్లె : మండలంలోని నారాయణరెడ్డిపల్లె పంచాయతీ కొండావాండ్లపల్లెకు చెందిన చంద్రగిరి లక్ష్మీదేవి(36) కువైట్లో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. ఏడాది కిందట బతుకుదెరువుకోసం లక్ష్మీదేవి కువైట్కు వెళ్లారు. భర్త శ్రీనివాసులు ఆటో డ్రైవర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున కువైట్ లక్ష్మీదేవి చనిపోయిందని మృతురాలి బంధువులకు కువైట్ నుంచి సమాచారం అందినట్లు తెలిపారు. ఈ వార్త వినగానే గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. గురువారం లక్ష్మీదేవి తన కుమార్తె హారతి, కుమారుడు చెన్నకేశవ, కుటుంబ సభ్యులతో మాట్లాడిందని బంధువులు తెలిపారు. ఒక్క రోజులోనే తల్లి మృతి వార్త విన్న పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కడసారైన తమ తల్లిని చూపాలని ప్రభుత్వ పెద్దలను వేడుకుంటున్నారు. మిద్దైపె నుంచి పడి గాయాలు మదనపల్లె : మిద్దైపె నుంచి పడి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం ఉదయం పట్టణంలో జరిగింది. నక్కలదిన్నెకు చెందిన వెంకటరమణ(62) మిద్దైపె ఆరబోసిన మిరప కాయలను కిందకు తెచ్చేందుకు వెళ్లాడు. కిందకి దిగే క్రమంలో ప్రమాదవశాత్తూ కాలు జారి కింద పడ్డాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బొలెరో ఢీకొని ఆర్టీసీ డ్రైవర్కు.. బొలేరో వాహనం ఢీకొని ఆర్టీసీ డ్రైవర్కు గాయాలయ్యాయి. మదనపల్లి మండలం చీకలబైలు పంచాయతీ బార్లపల్లెకు చెందిన రామన్న కుమారుడు సుధాకర(50) ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంలో మదనపల్లెకు వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. ప్రమాదంలో సుధాకర్కు గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తాలూకా పోలీసులు కేసు విచారిస్తున్నారు. -
విషద్రావణం తాగి విద్యార్థిని ఆత్మహత్య
జమ్మలమడుగు రూరల్ : పట్టణంలోని నాగులకట్ట వీధిలోని ఎస్సీ హస్టల్లో ఉంటున్న అక్షయ(19) శుక్రవారం విష ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. పెద్దముడియం మండలం కొండసుంకేసుల గ్రామానికి చెందిన అక్షయ పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ ఎస్సీ హాస్టల్లో ఉంటోంది. గురువారం రాత్రి వసతి గృహంలో వి ద్యార్థినుల మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడం, కాసేపటి తరువాత విద్యార్థి నులు క్షమాపణలు చెప్పుకోవడం జరిగినట్లు తెలిసింది. అయితే శుక్రవారం మ ధ్యాహ్నం అందరూ భోజనం చేయడానికి వెళ్లగా అక్షయ మాత్రం వెళ్లలేదు. అప్ప టికే తెచ్చుకున్న విష ద్రావణాన్ని(వాస్మోల్) తాగింది. విషయం తెలుసుకున్న వార్డెన్ బత్తుల ప్రభావతి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూ చన మేరకు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 8.45 గంటల మధ్యలో చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ప్రజా సంఘాల ఆగ్రహం అక్షయ అత్మహత్యపై ప్రజాసంఘాల నాయకులు అగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు వసతిగృహనికి చేరుకోని విద్యార్థిని మృతికి హస్టల్ వార్డన్ బత్తుల ప్రభావతి, సిబ్బంది కారణం అని హస్టల్స్ ఏఎస్డబ్ల్యూ గురుప్రసాద్, సీఐ లింగప్పకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది నవంబరు 7న కూడా వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు వాస్మాల్ తాగి అత్మహత్య యత్నానికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. ఇంత జరుగతున్నా అధికారులు చర్యలు చేపట్టలేదన్నారు. సీఐ ఎస్.లింగప్ప వసతి గృహానికి వెళ్లి విద్యార్థినులను విచారించారు. దర్యాప్తు అనంతరం అక్షయ ఆత్మహత్యయత్నానికి కారణాలు తెలియజేస్తామని సీఐ తెలిపారు. -
ఒప్పంద కార్మికులను తొలగించవద్దు
రాజంపేట రూరల్ : విశాఖ స్టీల్ ఫ్లాంట్లో పని చేసే ఒప్పంద కార్మికుల అక్రమ తొలగింపును నిలిపివేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గంగాధర్, సీపీఐ జాయింట్ సెక్రటరీ పి.మహేష్, భవన నిర్మాణ సంఘం జిల్లా అద్యక్షుడు గాలి చంద్ర, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఇ.సికిందర్ డిమాండ్ చేశారు. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ఫ్లాంట్లో 15వేలకు పైగా ఒప్పంద కార్మికులు పనిచేస్తున్నారని గుర్తుచేశారు. అధిక శాతం కార్మికులు స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులే అన్నారు. వారిలో ఇప్పటికే 900 మంది కార్మికులను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మూడు నెలలకోసారి 1400 మంది చొప్పున మొత్తం 5600 మందిని తొలగించే కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఒక పక్క రక్షిస్తామని చెబుతూనే మరోక వైపు ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్లు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. -
బాల భటులు ప్రపంచస్థాయి పౌరులుగా ఎదగాలి
రాయచోటి అర్బన్ : బాలభటులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని ప్రపంచ స్థాయి పౌరులుగా ఎదగాలని స్కౌట్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి కోరారు. రాయచోటి పట్టణంలోని అర్చన కళాశాలలో ఈ నెల 10వ తేదీ నుంచి నిర్వహిస్తున్న పెట్రోల్ లీడర్స్ శిక్షణ ముగింపు సమావేశం శుక్రవారం జరిగింది. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎంపికై న 36 పీఎంశ్రీ పాఠశాలల నుంచి వచ్చిన 272 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను విరవించారన్నారు. రోడ్డుప్రమాదాలు జరిగి నప్పుడు ప్రథమ చికిత్స అందించి సమీపంలోని ఆసుపత్రికి చేర్చడం, స్వచ్ఛందంగా సేవలందించడం, మంచి అలవాట్లను నేర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ లక్ష్మికర్, హెచ్డబ్ల్యూఓ నిర్మల, ఓబులరెడ్డి, నాగరాజు, సుజాత, గోవిందమ్మ, స్వర్ణలత పాల్గొన్నారు. -
23న రాయలసీమ మాలల సింహగర్జన
రాజంపేట రూరల్ : తిరుపతిలో ఈ నెల 23న ఎస్సీ వర్గీకరణ, క్రిమిలేయర్ను వ్యతిరేకిస్తూ రాయలసీమ మాలల సింహగర్జన నిర్వహిస్తున్నట్లు రాయలసీమ మాలల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక ఆర్అండ్బీ కార్యాలయం వద్ద శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కి విరుద్ధంగా ప్రధాని మోదీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిందన్నారు. మాలలు అంతా ఏకమై సింహగర్జనలో దీనిని వ్యతిరేకించాలన్నారు. ఈ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పూతలపట్టు ప్రభాకర్, లింగం సంజీవ్, ధన శేఖర్, పూలమరెడ్డి మల్లికార్జున, జట్టి చిరంజీవి, జనార్ధన, చౌడవరం సుబ్బనరసయ్య, సిగి చిన్నయ్య, ఈబిలి పెంచలయ్య, సుబ్బయ్య, దండప్రసాద్, కాంతయ్య, కే.హరినాథ్, రవిశంకర్, రైటర్ పుండ్రిక, కె.సుధాకర్, ఒ.పెంచలయ్య, కన్నయ్య, శ్రీను, మనోహర్, ఈశ్వరయ్య, కె.హరి, తదితరులు పాల్గొన్నారు. -
హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలి
– జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు రాయచోటి : హోలి పండుగను సురక్షితం, సంతోషం, బాధ్యతతో ఆనందంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో పండుగ సందర్భంగా ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలిగించరాదని ఎస్పీ సూచించారు. ఎలాంటి గొడవలకు తావులేకుండా పండుగను జరుపుకోవాలన్నారు. పండుగ పేరుతో హద్దులు దాటితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎవరి స్వేచ్ఛకు భంగం కలిగించకుండా హోలీ పండుగను కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. హోలీ పండుగ సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని తెలిపారు. చర్మానికి, పర్యావరణానికి హానికరం కాని సహజ రంగులను ఉపయోగించాలన్నారు. వదంతులు వ్యాప్తి చేస్తే చర్యలు.. సామాజిక మాధ్యమాలలో వదంతులు వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అన్నారు. తప్పుడు సమాచారాన్ని పంపినా, షేర్ చేసినా అలాంటి వారిమీద చర్యలు ఉంటాయన్నారు. ప్రజలు సూచనలు వాటించి పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ విగ్రహం ధ్వంసం పీలేరు : స్థానిక జగనన్న కాలనీలోని మూడో వీధిలో ప్రతిష్టించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దెల అమృతతేజ ఈ చర్యను ఖండించారు. గురువారం ఈమేరకు పీలేరు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా ప్రజల మనుషుల్లో నిలిచిన వ్యక్తి వైఎస్సార్ అని కొనియాడారు. అధికారులు స్పందించి వైఎస్సార్ విగ్రహం పునఃప్రతిష్టించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయిసంపత్కుమార్, సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ నిధులపై విచారణ వీరబల్లి : మండలంలోని సానిపాయ పంచాయతీలో నిధులు దుర్వినియోగమయ్యాయంటూ స్థానిక నాయకులు కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఆర్డబ్ల్యుఎస్ క్వాలిటీ కంట్రోల్ అధికారి జాకప్ పాల్, ఏఈ విశ్వనాథ మంచినీటి పనులు, గ్రామాలలో ఏర్పాటు చేసిన నిధులపై గురువారం విచారణ జరిపారు. నిధుల రికార్డులను పరిశీలించారు. ఈ విషయంపై వారు మాట్లాడుతూ నిధులకు సంబంధించి రికార్డులన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత పూర్తి సమాచారం ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నేతి ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, అధికార పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్టు మదనపల్లె : గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 4 కిలోల గంజాయి సీజ్ చేసినట్లు టుటౌన్ సీఐ రామచంద్ర తెలిపారు. గురువారం ముందస్తుగా అందిన సమాచారం మేరకు న్యూబైపాస్రోడ్డు చంద్రకాలనీ క్రాస్ వద్ద బీకే పల్లి లక్ష్మినగర్కు చెందిన ఆవుల మునిరాజు(34), అతని భార్య ఆవుల సుజాత(28) అక్రమంగా గంజాయి తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. పోలీసు స్టేషన్కు తరలించి విచారించగా గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అంగీకరించారన్నారు. వారి వద్ద నుంచి రూ.80 వేల నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. కేబుల్ వైర్ల చోరీ కేసులో ఇద్దరి అరెస్టు నిమ్మనపల్లె : కేబుల్ వైర్ల చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 200 మీటర్ల కేబుల్ వైర్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో నిందితుల వివరాలు తెలిపారు. ఇటీవల మండల పరిధిలో నిమ్మనపల్లె, తవళం, అగ్రహారం, సామకోటవారిపల్లె గ్రామాలలో పదుల సంఖ్యలో వ్యవసాయ బోర్ల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కేబుల్ వైర్లు చోరీ చేశారు. ఘటనపై బాధిత రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. ప్రత్యేక నిఘా ఉంచి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన ఎస్.చంద్రశేఖర్ (22), మదనపల్లె చంద్రాకాలనీకి చెందిన పి.నాగార్జున(20) కేబుల్ వైర్లను చోరీ చేస్తున్నట్లు నిర్ధారణ అయిందన్నారు. గురువారం నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచామన్నారు. -
శ్రీరాముని చరిత్ర సరళంగా రాసిన ఘనత మొల్లది
రాయచోటి : సకల గుణాభిరాముడు శ్రీరాముని చరిత్రను సరళంగా రాసిన ఘనత కవయిత్రి మొల్లదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. గురువారం స్థానిక రాయచోటి కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేసీ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్ఓ మధుసూదన్ రావు హాజరై పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కడప జిల్లా గోపవరంలో జన్మించిన ఆతుకూరి మొల్ల 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి అన్నారు. ఆమె రచన శైలి చాలా సరళమైననది, రమణీయమైనదన్నారు. తాళ్లపాక అన్నమాచార్య సతీమణి తాళ్లపాక తిమ్మక్క తరువాత చెప్పుకోదగ్గ రెండో తెలుగు కవయిత్రి మొల్ల అని కీర్తించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర, లీగల్ అడ్వైజర్ భద్రయ్య, కలెక్టరేట్ ఏఓ నాగభూషణం, వెనుకబడిన తరగతుల శాఖ సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ -
బహిరంగంగా మద్యం సేవిస్తున్న ఇద్దరి అరెస్టు
సిద్దవటం : మండల కేంద్రమైన సిద్దవటంలోని శ్రీ రంగనాయకస్వామి ఆలయం వద్ద, భాకరాపేటలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద గురువారం సాయంత్రం మద్యం తాగుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఏఎస్ఐ సుబ్బరామచంద్ర తెలిపారు. సిద్దవటంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయం వద్ద శ్రీనివాసులు అనే వ్యక్తిని, భాకరాపేటలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద చంద్రశేఖర్ అనే వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు. కుక్కల దాడిలో జింక మృతి ములకలచెరువు : కుక్కల దాడిలో ఒక కృష్ణ జింక మృతి చెందిన సంఘటన గురువారం మండలంలో జరిగింది. ఫారెస్టు అధికారుల కథనం మేరకు.. మండలంలోని కదిరినాథునికోట సమీపంలో మేత మేస్తున్న జింకల గుంపుపై కుక్కలు దాడికి యత్నించాయి. ఈ దాడిలో ఒక జింకను కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. స్థానికంగా ఉన్న రైతులు గమనించి కుక్కల నుంచి జింకను కాపాడి ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి ఫారెస్టు అధికారులు చేరుకునే లోపే జింక మృతి చెందింది. అనంతరం వెటర్నరీ డాక్టర్తో పోస్టుమార్టం నిర్వహించి కనుగొండలో జింక కళేబరాన్ని ఖననం చేసినట్లు ఫారెస్టు అధికారి గోపాల్ పేర్కొన్నారు. -
రంజాన్ నియమాలు.. ముక్తికి మార్గాలు
● ఐదు సూత్రాలు అనుసరించాలంటున్న ఇస్లాం ● ఈమాన్, నమాజ్, రోజా, జకాత్, హజ్ యాత్ర చేయాలని సూచన ● అల్లాహ్ మార్గంలో నడవాలంటున్న పెద్దలు రాజంపేట టౌన్ : పవిత్ర రంజాన్ మాసం ఆరంభమైంది. అందువల్ల అనేక మంది ఉపవాసాలు ఉంటూ అల్లాహ్ స్మరణలో ఉంటున్నారు. అయితే కొంతమంది తమ విధుల నిర్వహణ వల్ల రంజాన్ మాసంలో చేపట్టే పవిత్ర కార్యక్రమాలు చేపట్ట లేకపోతున్నారు. ఇంకొంత మంది పెద్దల మాట పెడచెవిన పెట్టి ఈ పవిత్ర మాసంలో చేపట్టాల్సిన పుణ్యకార్యాలను చేయడం లేదు. అయితే పవిత్ర రంజాన్ మాసంలో కనీసం కొన్ని రోజులైనా ఉపవాసాలు ఉంటూ అల్లాహ్ స్మరణలో ఉండాలని ముస్లీం మతపెద్దలు చెబుతున్నారు. అప్పుడే మనిషి మంచి మార్గంలో పయనించి ఇతరుల పట్ల ప్రేమ, దయ కలిగి వుండటంతో పాటు పేదల ఆకలి బాధలు కూడా తెలుసుకోగలరని, తద్వారా ఆకలితో బాధపడే పేదల ఆకలి తీర్చగల గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారని వారు చెబుతున్నారు. సర్వమానవాళి శాంతిమార్గంలో నడవాలని ఇస్లాం సూచిస్తుంది. ప్రతి ఒక్కరు చెడుకు దూరంగా, సన్మార్గంలో నడవాలని బోధిస్తుంది. అల్లాహ్ ప్రసాదించిన పవిత్ర గ్రంధం దివ్యఖురాన్. ఈ గ్రంధం అవతరించింది రంజాన్ మాసంలోనే. ఈ మాసంలో ముస్లీంలు భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మికంగా గడిపేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. తమ జీవితంలో పాటించాల్సిన పంచ నియమాలను మహమ్మద్ ప్రవక్త సూచించారు. అవే ఈమాన్, నమాజ్, రోజా, జకాత్, హజ్ యాత్ర. వీటిలో నమాజ్, రోజా, జకాత్ను ప్రతి ముస్లీం రంజాన్ మాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో పాటించాలి. మరోవైపు మంచి విద్య నేర్చుకునేందుకు, ఇతరులకు బోధించేందుకు అల్లాహ్ మార్గంలో నడుచుకోవాలని మతపెద్దలు చెబుతున్నారు. ఈమాన్.. ఇస్లాం మత మొదటి నియమం ఈమాన్. లాయిలాహ ఇల్లల్లాహ్ మహమ్మదూర్ రసూలల్లా (సొల్లెల్లాహు అలైహి వసల్లం) అని కలిమా తయ్యిబా చదివి ఇస్లాం మతాన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరు అందుకు కట్టుబడి ఉండాలి. అల్లాయే భగవంతుడని, ఇతరులకు దైవారాధన చేయరాదని ఈ విషయం చెబుతుంది. ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాపై మాత్రమే విశ్వాసాన్ని ఉంచాలి. నమాజ్.. కలిమా తయ్యిబా చదివి ఈమాన్తో ఇస్లాం స్వీకరించిన ప్రతి ముస్లీం రోజుకు ఐదు పూటలా విధిగా నమాజ్ చదవాలి. సూర్యోదయానికి ముందు ఫజర్, మధ్యాహ్నం ఒంటిగంట తరువాత జోహర్, సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అసర్, సూర్యాస్తమయం తరువాత మగ్రిబ్, రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇషా నమాజు చేయాలి. రోజా..రోజా అంటే ఉపవాస దీక్ష. మానసిక పరిపక్వత కలిగి, ఆరోగ్యకరంగా ఉన్న ప్రతి ముస్లీం రంజాన్ మాసంలో రోజా పాటించాలి. ఈ మాసంలో ఉండే రోజాలను ఫజర్ రోజా అంటారు. నెలంతా నియమ, నిష్టలతో ఉపవాస దీక్ష ఆచరించాలి. సూర్యోదయం కంటే ముందు నుంచి సూర్యాస్తమయం తరువాత వరకు ఆహారం, నీరు, ఇతర ఎలాంటి తినుబండారాలు, పానీయాలను సైతం తీసుకోకుండా రోజా ఆచరించాలని ఇస్లాం చెబుతుంది. ఏడాదిలో 12 నెలల్లో ఒకనెల అల్లా కోసం ఆయన సూచించిన మార్గంలో నడిచి మిగతా నెలల్లో అదే స్ఫూర్తితో నడుచుకోవాలి. జకాత్..ధనవంతులు, దానం చేయగల ఆర్థిక స్థోమత కలిగిన వారందరు విధిగా వస్తు, ధన రూపాల్లో పేదలకు దానం చేయడాన్నే జకాత్ అంటారు. ఒక కుటుంబంలో 7.5 తులాల బంగారం, 52.5 తులాల వెండి ఆభరణాలు, తత్సమానమైన ధనం ఉంటే అందులో 2.5 శాతం విలువగల వాటిని దాన, ధర్మాలు చేయాలి. హజ్ యాత్ర..ఆర్థిక స్థోమత కలిగిన ముస్లీంలు విధిగా హజ్ యాత్ర చేయాలి. 40 రోజుల పాటు సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా ప్రాంతాలకు వెళ్లి అక్కడ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. బక్రీదు పండుగ సమయంలో హజ్ జరుగుతుంది. అప్పు చేసి హజ్ యాత్ర చేయాల్సిన అవసరం లేదు. హజ్యాత్రకు వెళ్లినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు కుటుంబ పోషణకు అవసరమైన నిధులు ముందుగానే సమకూర్చుకోవాలి. అల్లాహ్ మార్గంలో నడవాలి..ఇస్లాం ధర్మాలు, నియమ నిబంధనలు, పాటించాల్సిన సూత్రాలు, ఆచరించాల్సిన పద్ధతులను తెలుసుకోవడం చాలా అవసరం. నేర్చుకున్న అంశాలను ఇతరులకు పంచి అందరు మంచి మార్గంలో నడిచేలా కృషి చేయాలని ఇస్లాం సూచిస్తుంది. అవకాశాన్ని చేజార్చుకోవద్దు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ఏడాదికి ఒక్కమారు వస్తుంది. ఈ మాసంలో ప్రతి ఒక్కరు తమ అనుకూలతను బట్టి విధిగా కొన్ని రోజులైనా రోజా ఉండి అల్లాహ్ స్మరణలో గడపాలి. అప్పుడే మనిషిలో మంచి ఆలోచనలతో సన్మార్గం వైపు పయనించగలడు. అలాగే ధనవంతులు ఈ మాసంలో దాన ధర్మాలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. – మౌలానా అబుసయిద్, ఇమామ్, ఆయేషా మసీదు,రాజంపేట -
ఘనంగా గంధం ఉత్సవం
రామాపురం : మండలంలోని నీలకంట్రావుపేట గ్రామ పంచాయతీ సద్గురు సాయి దర్బార్ నగర్లో వెలసిన సద్గురు హజరత్ దర్బార్ అలీషా వలీ, రహమతుల్లా అలై బాబా, జలీల్మస్తాన్ వలీ బాబా గార్ల గంధం ఉత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. మొక్కులు గల భక్తులు జెండాలకు గంధం పూసి ఇంటి వద్ద నుంచి డప్పు వాయిద్యాల నడుమ దర్గా వద్దకు చేరుకొని చెట్ల దగ్గర జెండాలను ఏర్పాటు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్గాలో ఉదయం నుంచే భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ ఇతర ఏ సమస్యలు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉరుసులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లక్కిరెడ్డిపల్లె సీఐ కొండారెడ్డి, మండల ఎస్ఐ వెంకటసుధాకర్రెడ్డిలు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కొండకు నిప్పు పెట్టిన ఆకతాయిలు సిద్దవటం : మండలంలోని ఫారెస్టు చెక్ పోస్టు సమీపంలో గరువారం సాయంత్రం ఆకతాయిలు కొండకు నిప్పు పెట్టడంతో కొండ తగలబడింది. వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉండటంతో చెట్ల ఆకులు రాలిపోయి అటవీ సంపద మంటల ధాటికి తగల బడింది. దీంతో అడవిలో ఉన్న వన్యప్రాణులు, జంతువులు, పక్షులు ఎగిసిపడిన మంటలకు కకావికలమయ్యాయి. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా మంటలు ఎగిసి పడటంతో ప్రయత్నం ఫలించలేదని స్థానికులు తెలిపారు. రెండు లారీలు ఢీ సిద్దవటం : మండలంలోని కడప– చె న్నై ప్రధాన రహదారిలోని మందగిరి శనేశ్వరస్వామి ఆలయం సమీపంలో గురువారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొనడంతో ఒకలారీ అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. చైన్నె నుంచి కర్ణాటకకు వెళుతున్న లారీ, ఎర్రగుంట్ల నుంచి రాజంపేట వైపు వెళుతున్న మరో లారీ శనేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఢీకొన్నాయి. కర్ణాటకకు వెళుతున్న డ్రైవర్ నాగరాజు నిద్రమత్తులో ఉన్నందు వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ఈ విషయమై ఒంటిమిట్ట సీఐ బాబును వివరణ కోరగా గురువారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. భూ వివాదం కారణంగా ఘర్షణ – ఏడుగురికి గాయాలు మదనపల్లె : భూవివాదం కారణంగా జరిగిన ఘర్షణలో ఏడుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం కురబలకోట మండలంలో జరిగింది. మండలంలోని అంగళ్లుకు చెందిన రెడ్డప్ప రెడ్డి స్థానికంగా రైస్ మిల్ నిర్వహిస్తున్నాడు. అతనికి తన భార్య పార్వతమ్మ పేరుపై స్థానికంగా సర్వే నెంబర్ 235, 236లలో కొంత భూమి ఉంది. ఈ భూమిపై తుమ్మచెట్లపల్లెకు చెందిన పులగంటి రెడ్డప్ప, శ్రీనివాసులు , మొలకవారిపల్లెకు చెందిన శ్రీనివాస్ రెడ్డి లతో కొంతకాలంగా వివాదం ఉంది. భూవివాదానికి సంబంధించి కోర్టులో రెడ్డప్ప రెడ్డికి అనుకూలంగా తీర్పు రావడంతో, తన భూమి సర్వే చేయాల్సిందిగా రెవెన్యూ అధికారులను కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. అందులో భాగంగా గురువారం రెవెన్యూ అధికారులు సర్వేకు వస్తున్న విషయం తెలుసుకున్న మరో వర్గంలోని పులగంటి రెడ్డప్ప, శ్రీనివాసులు, మొలకవారిపల్లి శ్రీనివాసులు రెడ్డిలు రైస్ మిల్ యజమాని రెడ్డప్పరెడ్డితో గొడవకు దిగారు. తమ అనుచరులతో వచ్చి కరల్రు సమ్మెట, చురకత్తులతో దాడికి పాల్పడ్డారు. దాడిలో రెడ్డప్ప రెడ్డి (60), ఆయన భార్య పార్వతమ్మ(55), వారి బంధువులు శంకర్ రెడ్డి(46), భార్గవ్ రెడ్డి (28), సాంబశివరెడ్డి (27), చిన్నపరెడ్డి(55), పాలకొండ్రెడ్డి (28) తీవ్రంగా గాయపడ్డారు.ముదివేడు పోలీసులు కేసు నమోదు చేశారు. -
దళితులపై దాడి జరిగినా కేసు నమోదు చేయని పోలీసులు
మదనపల్లె : దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వారిపై పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడంపై బాధితులు బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్చార్జి మిద్దేపల్లి బాలాజి ఆద్వర్యంలో గురువారం మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ను ఆశ్రయించి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు మిద్దేపల్లి బాలాజీ మాట్లాడుతూ ఈనెల 9 తేదీన మండలంలోని వలసపల్లె పంచాయతీ బొగ్గిటివారిపల్లెలో గ్రామకంఠం భూమి విషయమై, వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన కొందరు దళితులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు. దాడిలో వెంకటస్వామి తీవ్ర గాయపడి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఇతనితో పాటు నారాయణ, రజిత, రత్నమ్మ, కృష్ణవేణి తదితరులు గాయపడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై, గురువారం తాలూకా సీఐ కళా వెంకటరమణను సంప్రదించగా, సీఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ విషయమై ఎక్కువ మాట్లాడితే మీపైనే కేసులు పెడతానని తీవ్రంగా హెచ్చరించారన్నారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ను ఆశ్రయించి దాడి చేసిన వారిపై వెంటనే ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయడంతో పాటు అరెస్ట్ చేసి న్యాయం చేయాలని కోరామన్నారు. సబ్ కలెక్టర్ను కలిసిన వారిలో బీఎస్పీ నాయకులు ఉదయ్, నరసింహులు, బాధితులు నారాయణ, వెంకటస్వామి, రత్నమ్మ, సురేంద్ర తదితరులు ఉన్నారు. -
అవగాహనతోనే కమ్యూనికేషన్ స్కిల్స్పై పట్టు
రాయచోటి అర్బన్ : టెక్నికల్ ఫెస్ట్లలో పాల్గొని వివిధ అంశాలపై అవగాహన ల్పించుకోవడం ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్పై పట్టు సాధించవచ్చని కలికిరి జేఎన్టీయూ ఎలక్ట్రానిక్ సెమీ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాధిపతి కె.అపర్ణ అన్నారు. గురువారం స్థానిక సాయి ఇంజినీరింగ్ కళాశాలలో నేషనల్ లెవల్ టెక్నికల్ ఫెస్ట్ సాయినైపుణ్య –2కె25ను నిర్వహించా రు. సదస్సులో ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన 172 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలన్నారు. వివిధ కళాశాలలు నిర్వహించే వర్క్షాపులు, సెమినార్, వెబినార్లు, టెక్నికల్ క్విజ్ వంటి అంశాల పోటీలలో పాల్గొనాలన్నారు. తద్వారా ఆత్మన్యూనత భావం తొలగి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవచ్చన్నారు. అనంతరం ఈ సింపోజియంలో పాల్గొని ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేశారు.కార్యక్రమంలో కళాశాల ఏడీ సుధాకరరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ బాలచంద్ర, ప్రొఫెసర్ వెంకటరమణ, వివిధ కళాశాలల విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
21న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
కడప సెవెన్రోడ్స్: జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈనెల 21వ తేది జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య నిర్వాహణాఽధికారి ఓబులమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశాలకు ఉమ్మడి వైఎస్సార్ జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, ఇరు జిల్లాల అధికారులు హాజరు కావాలని ఆమె కోరారు. 17న చలో విజయవాడ మదనపల్లె సిటీ: పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 17వతేదీన సీఐటీయూ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమం జరగనుంది. దీనిని జయప్రదం చేయాలని గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామయ్య కోరారు. గురువారం మదనపల్లె డీఎల్పీఓ కార్యాలయం వద్ద దీనికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వేతనాలు పెంచాలని, కోర్టు తీర్పు ప్రకారం జిల్లాలోని అందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని చోట్ల జరుగుతున్న అక్రమాలను అరికట్టాలన్నారు. అనంతరం డీఎల్పీఓ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్,రవి, శీను, రాజు, ఆనంద తదితరులు పాల్గొన్నారు. వెబ్ ఆప్షన్లు పూర్తి చేయండి కడప రూరల్: ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధుల డీఎస్సీ ఉచిత కోచింగ్కు సంబంధించి వెబ్ ఆప్షన్లను పూర్తి చేయాలని వైఎస్సార్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి తెలిపారు. ఇందుకు సంబంధించి జ్ఞానభూమి వెబ్ ఆప్షన్ సర్వీస్ ప్రారంభమైందన్నారు. ఇప్పటికే 1000 మంది షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్ధులుతమ వెబ్ ఆప్షన్లను పూర్తి చేశారని తెలిపారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్ధులందరూ సకాలంలో వారి వెబ్ ఆప్షన్లను పూర్తి చేయాలని తెలిపారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్ధులు 15న లేదా అంతకుముందు వెబ్ ఆప్షన్ సర్వీస్ ద్వారా ఎంప్యానెల్డ్ కోచింగ్ సంస్ధలకు తమ ప్రాధాన్యతలను తెలియజేయాలని పేర్కొన్నారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితాను ఏపీసీఎఫ్ఎస్ఎస్ వెబ్ పోర్టల్లో చూడవచ్చని తెలిపారు. 15న బద్వేలులో జాబ్మేళా కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లా ఉపాధి కార్యాలయం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 15న ఉదయం 10 గంటలకు వైఎస్ఆర్ జిల్లా బద్వేలులోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని వెలుగు కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పేటీఎం కంపెనీలో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, డొనో బీపీఓ అండ్ ఐటీ సొల్యూషన్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో టెలీ కాలింగ్ ఆఫీసర్, ఆల్ డిక్సన్ కంపెనీలో అసెంబ్లింగ్ ఆపరేటర్, క్వాలిటీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. అభ్యర్థులు టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ చదివి 18–45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. ఎంపికై న వారికి అర్హతను, అనుభవాన్ని బట్టి రూ. 12–25 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. అభ్యర్థులు విద్యార్హతలు, ఫోటోలతో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. అవసరమైనప్పుడు పోలీసులను ఆశ్రయించండి రాయచోటి జగదాంబసెంటర్/ అర్బన్ : విద్యార్థులు అవసరమైనపుడు పోలీసులను ఆశ్రయించాలని అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి పేర్కొన్నారు. ఎస్పీ విద్యాసాగర్నాయుడు ఆదేశాల మేరకు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో 250 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థిని, విద్యార్థులకు గురువారం పోలీసు అధికారులు ‘ఓపెన్ హౌస్’కార్యక్రమం నిర్వహించారు. విధి నిర్వహణలో పోలీసులు వినియోగిస్తున్న వివిధ రకాల అత్యాధునిక ఆయుధాలు, బాంబ్ డిస్పోజల్ పరికరాల గురించి పోలీసు సిబ్బంది అవగాహన కల్పించారు. మొబైల్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు, సైబర్ క్రైమ్, మహిళల స్వీయ రక్షణ, శక్తి యాప్ గురించి, డయల్ 100/112 గురించి, 1098 నంబర్ల గురించి అదనపు ఎస్పీ వివరించారు. ఆర్ఐ, అడ్మిన్ విజె రామకృష్ణ, ఆర్ఎస్ఐలు అమరనాథ్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కూటమి కక్ష.. విద్యార్థులకు శిక్ష
బి.కొత్తకోట: మదనపల్లె ప్రాంత విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించాలన్న సదుద్దేశంతో రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి పదేళ్లు కేంద్రంతో పోరాడి సాధించిన ప్రతిష్టాత్మక కేంద్రీయ విద్యాలయం తరగతులు ఈ ఏడాది ప్రారంభం కాకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. విద్యార్థులతో కూటమి ప్రభుత్వం చెలగాటం అడేందుకు సిద్ధమైపోయింది. పలు కేంద్రీయ విద్యాలయాల్లో విద్యార్థుల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలవ్వగా మదనపల్లె కేంద్రీయ విద్యాలయం విషయంలో మాత్రం కక్ష కట్టారు. అత్యంత ప్రతిష్టాత్మక విద్యాలయం ఏర్పాటు చేయడంపై సహకరించాల్సిన ప్రభుత్వం ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం అడుతోంది. సీబీఎస్ఈ విద్యను అందించే ఈ కేంద్రంలో ఒకటి నుంచి ప్ల్స్ టూ వరకు విద్యను బోధిస్తారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)లాంటి సంస్థల సహకారంతో విద్యలో ప్రయోగాలు చేపట్టి నూతన ఆవిష్కరణలతో విద్యార్థులను ప్రోత్సహిస్తారు. ఇలాంటి విద్యాలయానికి నోటిఫికేషన్ రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. అన్ని ఏర్పాట్లు సిద్ధం మదనపల్లెలో 2025–26 విద్యాససంవత్సరంలో కేంద్రీయ విద్యాలయంలో తరగతుల ప్రారంభం కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ ఏడాదే తరగతులు ప్రారంభమయ్యేలా స్థానిక సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్ భవనాలను అభివృద్ధి చేయించారు. గదులు, భవన ఆధునీకరణ పనుల కోసం ఎంపీ మిథున్రెడ్డి ఎంపీల్యాడ్స్ నుంచి రూ.40 లక్షలు మంజూరు చేసి పనులు చేయించారు. అన్ని వసతులతో భవనం రూపుదిద్దుకొంది. గ్రౌండ్, పైన ఫ్లోర్లు సిద్ధం చేశారు. తరగతులు, కార్యాలయ కార్యకలాపాల నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.దీంతో మదనపల్లె ప్రాంత విద్యార్థులు విద్యాలయంలో చేరికకు ఆసక్తి చూపుతున్నారు. కాగా శాశ్వత భవనాల నిర్మాణం కోసం పుంగనూరు రహదారిలోని వలసపల్లె వద్ద 6.09 ఎకరాల భూమికి కేటాయించారు. నవోదయ విద్యాలయానికి సమీపంలోనే ఈ కేంద్రీయ విద్యాలయం ఉంటుంది. మరమ్మతుల పేరుతో అడ్డంకులుకేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి అంతా సిద్ధమైనప్పటికి చిన్నపాటి మరమ్మతు పనుల పేరిట నోటీఫికేషన్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటివల కేంద్రీయ విద్యాలయాలకు చెందిన దక్షిణ భారత జోన్ ఇన్చార్జి కేవి.సంఘటన్ బృందం వసతులు, ఏర్పాట్లను పరిశీలించి వెళ్లింది. ఈ బృందం వెళ్లి రోజులు గడుస్తున్నా ఇంకా పనుల పేరిట జాప్యం చేస్తుండటం చూస్తుంటే కావాలనే నోటిఫికేషన్ జారీ కాకుండా ఆడ్డుపడుతున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ ఒకటి నుంచి అడ్మషన్ల ప్రక్రియ మొదలవుతుంది..ఈలోగా విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయితే మదనపల్లెకు నోటిఫికేషన్పై ఆశలు పెట్టుకున్న విద్యార్థులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మిథున్రెడ్డికి పేరు వస్తుందని... రాజంపేట ఎంపీగా హ్యట్రిక్ సాధించిన మిథున్రెడ్డి మదనపల్లెను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలన్న కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మెడికల్ కళాశాలను మంజూరు చేయించడమే కాకుండా చారిత్రిక బీటీ కళాశాలను విశ్వవిద్యాలయంగా చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేయించారు. విద్యార్థుల సమస్యలు, విద్యాభివృద్ధికి గత ప్రభుత్వంలో చిత్తశుద్ధితో పనిచేశారు. అలాగే పదేళ్లుగా మదనపల్లెలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయించి విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేసేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. కేంద్రీయ విద్యాలయంలో తరగతులు ప్రారంభమైతే మదనపల్లె విద్యా చరిత్రలో కలికితురాయిగా మిగిలిపోతుంది. ఈ ఘనత మిథున్రెడ్డికి దక్కుతుందన్న అక్కసుతో ప్రభుత్వం తరగతులను ప్రారంభించేందుకు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించే నోటిఫికేషన్కు అడ్డుపడుతున్నట్టు తెలుస్తోంది. మదనపల్లె కేంద్రీయ విద్యాలయం తరగతులు ప్రారంభం కాకుండా అడ్డంకులు భవనం సిద్ధమైనా మరమ్మతుల పేరుతో జాప్యం ఎంపీ మిథున్రెడ్డి ప్రతిష్ట పెరుగుతుందని అక్కసు విద్యార్థులకు అండగా ఉంటాం పేద విద్యార్థులకు విద్యే భవిష్యత్తు, వారికి ఉన్నతమైన విద్యను అందించేందుకు అండగా ఉంటాం. మదనపల్లెను విద్యపరంగా అగ్రగామిగా నిలపాలన్నదే ఆశయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మదనపల్లెలో విద్య కేంద్రాలను మంజూరు చేయించాం. విద్యార్థులకు నష్టం కలగకుండా ఈ ఏడాదే తరగతులు ప్రారంభించాలని కోరుతున్నాం. వైద్యపరంగా పేదలకు మెరుగైన సేవల కోసం మెడికల్ కళాశాలను కూడా మంజూరు చేయించాం. విద్య, వైద్యం అభివృద్ధికి కృషి చేస్తాం. –పీవీ.మిథున్రెడ్డి, రాజంపేట ఎంపీ -
మల్లూరమ్మ తిరునాల ప్రారంభం
చిన్నమండెం: మండల పరిధిలోని మల్లూరు కొత్తపల్లె గ్రామాల్లో వెలసిన శ్రీ మల్లూరమ్మ తల్లి తిరునాల గురువారం వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారిని తిమ్మారెడ్డిగారిపల్లె నుంచి మంగళవాయిద్యాలతో ఆలయం వద్దకు పల్లకీలో తీసుకువచ్చారు. గురువారం ఉదయం అమ్మవారికి సిద్దలపూజ జరిపారు. సంతానం లేని వారు అమ్మవారికి వరపడ్డారు.మల్లూరమ్మ తల్లికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. రాయచోటి డీఎస్పీ కొండయ్యనాయుడు ఆధ్వర్యంలో రూరల్ సీఐ వరప్రసాద్ పర్యవేక్షణలో నలుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలు, 250 పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి 22 చాందినీబండ్లు ఏర్పాటు చేశారు. వీటిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. -
చెత్తరహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
రాయచోటి టౌన్/ రాయచోటి జగదాంబసెంటర్: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీన స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాలను విస్తృత్తంగా నిర్వహించి చెత్త రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సూచించారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర,, పీ4 సర్వే, గృహ నిర్మాణ ప్రగతి తదితర అంశాలపై వివిధశాఖ అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24, 25 తేదీల్లో విజయవాడలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సమావేశం జరుగుతుందని, జిల్లాకు సంబంధించిన లక్ష్యాలను 20వ తేదీలోగా పూర్తి చేయాలని తెలిపారు.గృహ నిర్మాణాల్లో ప్రగతి సాధించాలని తెలిపారు. పీ4, వర్క్ ఫ్రం హోం, సర్వేలు, పక్కాగా చేయాలని సూచించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజలనుంచి అందిన అర్జీలను త్వరగా పరిష్కరించాలన్నారు. ప్రతి మండలంలో కంప్రెసెడ్ బయో గ్యాస్, విద్యుత్ సబ్ స్టేసన్ల వద్ద సోలార్ విద్యుత్ ఫ్లాంట్ ఏర్పాటు కోసం భూములు గుర్తించి నివేదిక పంపాలని కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్స్ రాజేంద్రన్, డీఆర్ఓ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. ● ఎన్టీఆర్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ హౌసింగ్ పథకం ద్వారా ఇంటి నిర్మాణంలో పూర్తిగా కాకుండా నిర్మాణదశలో ఉన్న ఇళ్లకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల లబ్ధిదారులకు అదనపు ఆర్థికసాయాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్టీ వర్గానికి చెందిన వారికి రూ.75 వేలు, ఎస్సీ, బీసీ వర్గాల వారికి రూ.50 వేలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆర్థికసాయం మొత్తాన్ని వివిధ దశల్లో అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో దాదాపు 19672 మందికి వంద కోట్ల రూపాయల అదనపు ఆర్థికసాయం అందుతుందని తెలిపారు. హౌసింగ్ శాఖ పీడీ సాంబశివయ్య పాల్గొన్నారు. ● జిల్లా ఆర్థికాభివృద్ధిలో బ్యాంకర్ల భాగస్వామ్యం ఎంతో కీలకమని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. గురువారం కలెక్టరేట్ చాంబర్లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2024–2025 ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికం డిసెంబర్ 31 నాటికి క్రిడెట్ ప్లాన్ లక్ష్యం రూ.10,290 కోట్లకు రూ.13,544 కోట్ల రుణాలు మంజూరు చేసి 131.62 శాతం, ప్రాధాన్యత రంగంలో రూ.8,804 కోట్లకు రూ.10,929 కోట్లు మంజూరు చేసి 124.31 శాతం, వ్యవసాయ రంగంలో రూ. 7,573 కోట్లకు రూ. 9,741 కోట్లు మంజూరు చేసి 132 శాతం ఆర్థిక ప్రగతి సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ జి. ఆంజనేయులు, ఏఎల్డీఎం వన్నూర్బాషా. ఎస్బీఐ నాబార్డు ఏజీఎం విజయ్ విహారి. ఆర్బీఐ ఎల్డీఎం రోహిత్ అగర్వాల్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి -
కడప–రేణిగుంట నేషనల్హైవే పనులు త్వరలో ప్రారంభం
రాజంపేట: ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోని కడప–రేణిగుంట నేషనల్హైవే (716) పనులు త్వరలోనే ప్రారంభిస్తామని కేంద్ర రోడ్డురవాణా, హైవే మంత్రి నితిన్ జైరాం గడ్కారీ హామీ ఇచ్చారని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి బుధవారం ఇక్కడి విలేకర్లకు తెలిపారు. రాజ్యసభలో కడప–రేణిగుంట జాతీయరహదారి మంజూరై రెండేళ్లు అయిందని ప్రశ్నోత్తరాల సమయంలో అంశాన్ని ప్రస్తావించామన్నారు .ఇందుకు కేంద్రమంత్రి సమాధానంలో భాగంగా త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారన్నారు. ఈ నేషనల్హైవే నిర్మాణానికి సంబంధించి మొదటి దశ అటవీశాఖ నుంచి క్లియరెన్స్ వచ్చిందన్నారు. వన్యప్రాణులు ఎకోసెన్సిటివ్ జోన్ నుంచి అనుమతులు రావాల్సి ఉంటుందన్నారు. వైల్డ్లైఫ్ అనుమతులు వచ్చాక ఎన్హెచ్ నిర్మాణానికి మార్గం సుగమవుతుందన్నారు. రెండు ప్యాకేజీల్లో రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. కడప–చిన్నఓరంపాడు, చిన్నఓరంపాడు–కడపల వారీగా నాలుగురోడ్ల నిర్మాణం కొనసాగుతుందన్నారు. త్వరగా వైల్డ్లైఫ్ అనుమతులు వచ్చేలా కేంద్రం త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. బహిరంగవేలం: రూ.21.93 లక్షల ఆదాయం కలికిరి: కలికిరి గ్రామ పంచాయతీకి సంబంధించి వారపుసంత, దినసరి కూరగాయల మార్కెట్, ప్రైవేట్ బస్టాండ్, మాంసం దుకాణాలకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి బుధవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో బహిరంగ వేలం పాట నిర్వహించారు. దీనివల్ల పంచాయతీకి గరిష్టంగా రూ. 21.93లక్షల ఆదాయం సమకూరినట్లు డీఎల్పీఒ నాగరాజు తెలిపారు. వారపుసంతకు రూ.16లక్షలు, దినసరి కూరగాయల మార్కెట్కు రూ.3లక్షలు, ప్రైవేటు బస్టాండ్కు సంబంధించి రూ.2.03 లక్షలు, మాంసం దుకాణాలకు రూ.90వేలు, మొత్తం 21.93 లక్షలు ఆదాయం రాగా గత ఏడాది 15.23 లక్షలు మాత్రమే ఆదాయం వచ్చింది. సర్పంచ్ ఎల్లయ్య, ఈఓ అశోక్, యోగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్రమంత్రి హామీ ఇచ్చారు ఎంపీ మేడా రఘునాథరెడ్డి -
అన్ని వర్గాలను మోసం చేశారు
అన్ని వర్గాలను అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది. ప్రతి విద్యార్థికి తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఈ ఏడాది పంగనామం పెట్టింది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి నిధులు ఇవ్వకపోవటంతో వారంతా అప్పుల పాలు అవుతున్నా రు. ఉద్యోగం ఇవ్వకుంటే నిరుద్యోగభృతి అంటూ హామీలిచ్చి, ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడం దారుణం. –ఆకేపాటి అమరనాథరెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, రాజంపేట ఎమ్మెల్యే జాబ్ క్యాలెండర్ ఊసే లేదు జనవరిలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఆర్భాటంగా చేసిన ప్రకటన నేటికీ అమ లు కాలేదు. నిరుద్యోగభృతి మరచిపోయారు. నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది. నిద్ర మత్తులో ఉన్న ఈ ప్రభుత్వానికి పోరుబాటతో మేల్కొలుపుతాం. –జె.కిషోర్దాస్, వైఎస్ఆర్సీపీ జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షుడు నిరుద్యోగభృతి ఎప్పుడో... ? సూపర్ సిక్స్లో భాగంగా నిరుద్యోగభృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామన్న హామీ ఇచ్చారు. అమలు చేయడం లేదు. ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న యువత పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. కూటమి ప్రభుత్వం నిరుద్యోగభృతి అందించి నిరుద్యోగులను ఆదుకోవాలి. ఆ దిశగా ముందడుగు వేయాలి. – శివప్రసాద్రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు -
తేడా వస్తే ‘రంగుపడుద్ది’
మదనపల్లె సిటీ/రాజంపేటటౌన్: హోలీ..అందరిలో ఉత్సాహం నింపుతుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ రంగుల్లో మునిగి తేలుతుంటారు. నాటితరం జరుపుకొనే వేడుకలకు నేటి యువత చేసుకుంటున్న సంబరాలకు పోలిక ఉండటం లేదు. గతంలో సహజ రంగులతో హుందాగా జరపుకుంటే.. నేడు రసాయనాలతో తయారు చేసిన రంగులు పూసుకుంటున్నారు. ప్రస్తుతం వాడుతున్న రంగుల్లో ప్రమాదకరమైన క్రోమియం, అల్యూమినియం, మెర్క్యురీ ఆకై ్సడ్లు కలుస్తున్నాయి. ఇలాంటి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ’రంగుపడుద్డి‘అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇలా చేద్దాం పలు రకాల పూలు, పండ్లతో ఇళ్లల్లోనే సహజసిద్ధమైన రంగులు తయారు చేసుకోవచ్చు. వీటితో చర్మానికి మేలు కలగగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. ఎర్ర గులాబీ, మందారం పూలు, ఎర్రచందనం, టమటా గుజ్జు, క్యారెట్, బీట్రూట్లతో ఎరుపు రంగు తయారవుతుంది. పసుపు పొడి, తంగేడు,బంతి, చామంతి,తుమ్మపూలతో పసుపురంగు ద్రావకం సిద్ధమవుతుంది. వేసవిలో విరివిగా లభించే మోదుగ పూలతో కాషాయరంగు ద్రావణం తయారు చేసుకోవచ్చు. ఎండిన గోరింటాకు పొడి లేదా పచ్చి గోరింటాకు, పాలకూర, పుదీనా, కొత్తిమీర వంటి ఆకుకూరలను మెత్తగా రుబ్బి నీరు కలిపితే ఆకుపచ్చ రంగు తయారు చేసుకోవచ్చు. చిన్నపిల్లలను దూరంగా ఉంచాలి హోలీ అంటే చిన్నపిల్లల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. రంగులు ఎలా చల్ల్లుకో వాలో వారికి తెలియదు. నోరు, ముక్కుల్లోకి పోయే అవకాశం ఉంది. దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పిల్లలను హోలీకి దూరంగా ఉంచాలి. – వీరయ్య, వైద్యులు, రాజంపేట కళ్లల్లో పడితే ప్రమాదం మార్కెట్లో లభిస్తున్న రంగుల్లో రసాయనాలు కలుస్తున్నాయి. ఇవి కళ్లల్లో పడితే కంటి చూపునకే ప్రమాదం. కళ్లకు రక్షణగా అద్దాలు ధరించాలి. కళ్లల్లో రంగుపడితే వెంటనే నీటితో కడిగి వైద్యున్ని సంప్రదించాలి. –వెంకటరామయ్య, వైద్యులు ఇవీ సూచనలు హోలీ ఆడటానికి ముందు శరీరానికి మాయిశ్చరైజర్ని, తలకు నూనెను రాసుకోవాలి. దీనివల్ల రంగులు శరీరంలోకి ఇంకవు. ముఖంపై పడిన రంగులను శుభ్రం చేసుకోవడానికి సబ్బు కన్నా డ్లైన్సింగ్ మిల్క్ ఉత్తమమైనది. చాలా మంది హోలీ ఆడే సమయంలో రంగులలో ఆయిల్స్ కలుపుతారు. ఈకారణంగా రంగులను శుభ్రం చేసుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. రంగుల్లో ఎలాంటి నూనెలు, నీళ్లు కలపకుండా చల్లుకుంటే మంచిది. జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్య హోలీ -
ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం
రాయచోటి/రాయచోటి అర్బన్: వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. బుధవారం ఉదయం జిల్లా కేంద్రం రాయచోటితో పాటు జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాల పార్టీ కార్యాలయాల ఆవరణాలలో పార్టీ నాయకులు, అభిమానుల నడుమ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజవర్గ కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల వద్ద ఆ పార్టీ నాయకులు పార్టీ జెండాలను ఆవిష్కరించి, అభిమానుల కోలహాల మధ్య కేకులను కట్ చేశారు. వైఎస్సార్ ఆశయాల సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నాటి నుంచి నేటి వరకు తమ భుజస్కందాలపై మోస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీ శ్రేణులు ఒకరికి ఒకరు పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రెపరెపలాడిన పార్టీ జెండా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15 ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని జిల్లాలోని అన్ని నియోజకవర్గ కార్యాలయ ఆవరణాల్లో పార్టీ జెండా రెపరెపలాడింది. రాయచోటి లోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, చింతల రామచంద్రారెడ్డిలు కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ప్రజాక్షేత్రంలో పురుడుపోసుకున్న పార్టీ వైఎస్ఆర్సీపీ అని అన్నారు. రాయచోటి నియోజవర్గ పార్టీ కా ర్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మున్సిప ల్ చైర్మన్ ఫయాజ్బాషాలతో కలిసి జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మున్సిపల్ వైస్ౖచైర్మన్ ఫయాజుర్ రహిమాన్, మాజీ ఎంపిపిలు పోలు సుబ్బారెడ్డి, అంబాబత్తిన రెడ్డెయ్య, ఎంపిపి సుదర్శన్రెడ్డి, నేతలు ఆవుల వేణు గోపాల్రెడ్డి, యధుభూషణ్రెడ్డి, పడమటికోన బాబురెడ్డి, జడ్పిటిసిలు ఎం.వెంకటరమణ, వెంకటేశ్వరరెడ్డి, పల్లపు రమేష్, రవిశంకర్రెడ్డి, కర్ణపు విశ్వనాథరెడ్డి, కొలిమి హారూన్బాష, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు బేపారి మహమ్మద్ఖాన్ పాల్గొన్నారు. ● రాజంపేటలోని పార్టీ భవన్లో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డితో కలిసి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. ● కోడూరులోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు స్థానిక నాయకులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరణ చేసి వేడుకలు నిర్వహించారు. ● తంబళ్ళపల్లి పార్టీ కార్యాలయం లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందుగా పట్టణ కేంద్రంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూల దండలతో సత్కరించారు . ఈ సందర్భంగా దివంగత నేతకు నివాళులర్పించారు. ● పీలేరు నియోజకవర్గ పరిధిలోని వాల్మీకిపురం లో ఉన్న పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ● మదనపల్లెలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నియోజవర్గ పార్టీ ఇన్చార్జి నిస్సార్ అహ్మద్, మున్సిపల్ చైర్మన్ మనుజా రెడ్డిలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు.నియోజవర్గ పరిధిలోని రామసముద్రం మండల కేంద్రంలో స్థానిక నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించి వేడుకలను నిర్వహించారు. -
కువైట్లో కోడూరు వాసి ఆత్మహత్య
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణం రంగనాయకులపేటకు కొల్లా శ్రీనివాసులు (38) కువైట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా.. కష్టాలు, అప్పుల బాధలు తట్టుకోలేక సూరపురాజుపల్లిలో ఉన్న సొంత ఇంటిని అమ్మేసి భార్యా భర్తలు ఇరువురూ జీవనోపాధికి కువైట్కు వెళ్లారు. అయినప్పటికీ అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య అన్నపూర్ణ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబాన్ని ఆదుకోవాల్సిన వ్యక్తి మృతి చెందడంతో కుటుంబమంతా రోడ్డున పడింది. రైతు ఆత్మహత్యాయత్నం మదనపల్లె : కుటుంబ సమస్యలతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం కురబలకోట మండలంలో జరిగింది. సింగన్నగారిపల్లెకు చెందిన రైతు ఆంజనేయులు(45) కుటుంబ సమస్యలతో ఇంట్లో గొడవపడి పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముదివేడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. కారు ఢీకొని పాదయాత్రికుడి దుర్మరణం పుల్లంపేట : తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్న వ్యక్తిని కారు ఢీ కొనడంతో మృతి చెందిన సంఘటన బుధవారం పుల్లంపేట మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలం అనిమెల గ్రామానికి చెందిన కొందరు తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. రెడ్డిపల్లి చెరువుకట్ట వద్దకు రాగానే రైల్వేకోడూరుకు చెందిన కారు పాదయాత్రికునిపై దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో చాట్ల కొండయ్య (42) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మల్లేల వెంకటేష్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్ తెలిపారు. మద్యం విక్రయంపై కేసు నమోదు పెద్దతిప్పసముద్రం : స్థానిక బి.కొత్తకోట రోడ్డులోని ఓ రేకుల షెడ్డులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిహర ప్రసాద్ తెలిపారు. బుధవారం షెడ్డులో ఎనిమిది క్వార్టర్ బాటిళ్లతో పాటు పట్టుబడిన గూని రమేష్ (31) అనే నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రెండు లారీలు ఢీ ఓబులవారిపల్లె : ముక్కావారిపల్లె జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఎదురెదురుగా రెండు లారీలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో లారీల ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఆయిల్ ట్యాంకర్ లారీలో ఉత్తరప్రదేశ్కు చెందిన రామ్ జనక్ పటేల్ చిక్కుకు పోయాడు. స్టీరింగ్ సందులో ఇరుక్కుపోవడంతో బయటకు రాలేకపోయాడు. ఎస్ఐ మహేష్ నాయుడు ప్రమాద స్థలానికి చేరుకొని జేసీబీ సాయంతో లారీలను తొలగించి లారీలో ఇరుక్కుపోయిన వ్యక్తిని బయటకు తీసి 108 వాహనంలో తిరుపతికి తరలించారు. రెండు లారీలు వేగంగా రావడంతో మలుపు వద్ద అదుపు చేయలేక ఢీ కొన్నాయి. రోడ్డుకు అడ్డంగా ఉన్న లారీలతో గంటల తరబడి ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు ప్రమాద స్థలానికి చేరుకొని వాహనాలను తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. -
క్రమశిక్షణ, సేవాభావానికి ప్రతీక స్కౌట్
రాయచోటి అర్బన్ : విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పాటు దేశభక్తి, సామాజిక సేవాభావాలను పెంపొందించేందుకు బాలభటుల ఉద్యమం ( స్కౌట్ అండ్ గైడ్స్) తోడ్పడుతుందని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. బుధవారం పట్టణంలోని అర్చన కళాశాలలో స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులకు నిర్వహిస్తున్న పెట్రోల్ లీడర్ శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం మధ్యాహ్నం ఆయన సందర్శించారు. గార్డ్ ఆఫ్ హానర్తో స్కౌట్ విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ స్కౌట్అండ్ గైడ్స్ శిక్షణ పొందిన విద్యార్థులకు శారీరక దారుఢ్యంతో పాటు బంగారు భవిష్యత్తు సమకూరుతుందన్నారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ద్వారా వారు ప్రపంచ స్థాయి పౌరులుగా ఎదిగేందుకు స్కౌట్ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందన్నా రు. స్కౌట్లో చేరడం ద్వారా విద్యార్థుల్లో నైతిక విలువలు, మానవతా విలువలు పెంపొందుతాయని చెప్పారు. విద్యార్థి దశనుంచే తల్లిదండ్రులు, గురువులతో మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తూ సమాజం పట్ల బాధ్యతగా మెలిగేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. అనంతరం శిక్షణ పూర్తిచేసుకున్న స్కౌట్మాస్టర్లు, గైడ్ కెప్టెన్లకు ఆయన సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ మదన్మోహన్రెడ్డి, స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి, ఏఎస్ఓసీ లక్ష్మీకర్, హెచ్డబ్ల్యు నిర్మల, స్కౌట్ మాస్టర్లు ఓబుళరెడ్డి, నాగరాజు, గైడ్ కెప్టెన్లు సుజాత, గోవిందమ్మ, స్వర్ణలతతో పాటు స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు -
కర్ణాటక సరిహద్దులో రెండు ప్రైవేట్ బస్సులు ఢీ
మదనపల్లె : కరకర్ణాటక రాష్ట్ర సరిహద్దు, మదనపల్లెకు సమీపంలో మంగళవారం అర్ధరాత్రి రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఏడుగురికి తీవ్రగాయాలతో పాటు 40 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నుంచి బెంగళూరుకు వెళుతున్న సువర్ణముఖి(సబర్వాల్) ప్రైవేట్ బస్సు మదనపల్లె మీదుగా బెంగళూరుకు వెళుతోంది. అదే సమయంలో బెంగళూరు నుంచి నంద్యాలకు వెళుతున్న ఏఆర్బీసీవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కర్ణాటక సరిహద్దు రాయల్పాడు సమీపంలోని గెలిజగూరు వద్ద రాత్రి 1 గంట సమయంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఏఆర్ ట్రావెల్స్ బస్సు ముందువైపు వెళుతున్న వాహనాలను ఓవర్టేక్ చేస్తూ, ఎదురుగా వచ్చిన సువర్ణముఖి బస్సును ఢీకొంది. ప్రమాదంలో మదనపల్లె కమ్మవీధికి చెందిన సువర్ణముఖి ప్రైవేట్ బస్సు కండక్టర్ గంగాధర్ అలియాస్ బాబు (59) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. డ్రైవర్ వెను కసీటులో ఉన్న మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గా యపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీ నివాసపురం ఆస్పత్రికి తరలించారు. 22 మంది ప్ర యాణికులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి త రలించారు. వారిలో చింతామణికి చెందిన వెంకటేష్ (40), కడపకు చెందిన అలీ(38), నంద్యాలకు చెందిన జవహరుద్దీన్(35), బెంగళూరుకు చెందిన జయకుమారి(30), ఆనందరెడ్డి(54), రాంప్రసాద్(57), రా యచోటికి చెందిన నిర్మల(38) తీవ్రంగా గాయపడగా, మెరుగైన వైద్యం కోసం వారిని తిరుపతి, బెంగళూరు ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న కర్ణాటక రాయల్పాడు పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులను మదనపల్లె, బెంగళూరు, కోలారు, శ్రీనివాసపురం ఆస్పత్రులకు 108 వాహనాల్లో తరలించారు. ప్రమాదఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకరి మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు నలుగురి పరిస్థితి విషమం 40మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు -
వైభవంగా లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవం
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజైన బుధవారం ఉదయాన్నే రథారోహణం నిర్వహించారు. ఆలయంలోని స్వామివార్లను స్థానిక బస్టాండు కూడలిలోని స్వామివారి తేరు(రథం) వద్దకు తీసుకొచ్చి అందులో కొలువుదీర్చారు. ఆలయంలో ధూళీ ఉత్సవం నిర్వహించారు. రంగురంగుల పుష్పాలతో స్వామివారి రథాన్ని అందంగా అలంకరించారు. అనంతరం హరినామస్మరణ, గోవింద సంకీర్తనలు నడుమ రథోత్సవం సాగింది. స్వామివారి రథోత్సవానికి అడుగడుగునా ప్రజలు, భక్తులు స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు గ్రామానికి చేరుకొని గోవిందా, గోవిందా ఆంటూ భక్తి తన్మయత్వంతో స్వామివారి రథాన్ని లాగారు. రథోత్సవాన్ని పురస్కరించుకొని పలు కార్యక్రమాలు చేపట్టారు. పలువురు అన్నదానం నిర్వహించారు. మేళతాళాలు, కోలాటాలు, టీటీడీ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలతో రథోత్సవం పురవీధుల గుండా వైభవంగా సాగింది. మంగళవారం రాత్రి స్వామివారి తిరునాల ఘనంగా నిర్వహించారు. తరిగొండతో పాటు పరిసర గ్రామాల ప్రజలు చాందినీ బండ్లు, అన్నం, టెంకాయ బండ్లు ఆలయం చుట్టూ తిప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఆలయంలో నేడు.. మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజైన గురువారం సూర్యప్రభ వాహనం, ఊంజల్సేవ, చంద్రప్రభ వాహనం, పార్వేట ఉత్సవం, అశ్వవాహనం కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ అర్చకుడు గోపాల బట్టార్ తెలిపారు. -
భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం
జేసీ ఆదర్శ రాజేంద్రన్మదనపల్లె : హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించేందుకు కృషి చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అన్నారు. బుధవారం మండలంలోని తట్టివారిపల్లె వద్ద నేషనల్ హైవే భూసేకరణకు సంబంధించి నిర్వాసితులతో మాట్లాడారు. హైవే నిర్మాణానికి సహకరించాల్సిందిగా కోరారు. తర్వాత పోతబోలు పంచాయతీలో ఎంఐజీ లే అవుట్ కోసం రెవెన్యూ అధికారులు ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు. స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక అందించాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పీకేఎం–ఉడా కార్యాలయంలో చైర్పర్సన్ హోదాలో కార్యకలాపాలపై సమీక్షించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, తహసీల్దార్ ధనంజయులు, మున్సిపల్ కమిషనర్ కె.ప్రమీల, పీకేఎం–ఉడా సిబ్బంది మధు, సంధ్య తదితరులు పాల్గొన్నారు. -
గురు సన్నిధి.. ఆధ్యాత్మిక పెన్నిధి
రామాపురం : ఆరు దశాబ్దాల క్రితం నిర్జీవంగా ఉండి సమాధుల చుట్టూ గోడలు ఉండే ప్రదేశం నేడు ఎందరో భక్తులకు మానసిక ఉల్లాసం కలిగిస్తూ, వారి కోర్కెలు తీర్చే ఆలయంగా మారింది నీలకంట్రావుపేట దర్గా. ఆరు దశాబ్దాల క్రితం అదో నిర్జన ప్రదేశం. అందులో రెండు సమాధులు, చుట్టూ గోడలు, సాయంత్రం వేళల్లో ఫకీరులు పక్క గ్రామమైన నీలకంట్రావుపేట, చుట్టు పక్కల గ్రామాల్లో భిక్షమడిగి తెచ్చుకుని అక్కడే తిని, అక్కడే బస చేస్తుండేవారు. దర్గా అని పిలువబడే ఇక్కడికి భక్తులు వచ్చి తమ మొక్కులు తీర్చుకుని వెళుతుండేవారు. ఈ దర్గా అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నీలకంట్రావుపేట సమీపంలో దక్షిణ దిశగా ఒక కిలోమీటరు దూరంలో ఉంది. ఏటా ఘనంగా దర్గా ఉరుసు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. దర్గా సంక్షిప్త చరిత్ర.. హిందూ, ముస్లిం సమైక్యతకు ప్రతీకగా ఓ పవిత్ర దర్శనీయ స్థలంగా నేడు ఈ దర్గా వెలుగొందుతోంది. కడప –చిత్తూరు ప్రధాన జాతీయ రహదారికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ దర్గాలో ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున ఎంతో వైభవంగా ఉరుసు ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుపుతారు. సద్గురు హజరత్ దర్బార్ వలీ అలీషా వలీ, రహంతుల్లా అలైహి బాబా, శ్రీ జలీల్ మస్తాన్వలీ గార్ల ఉరుసు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కనుల పండువగా జరుగుతాయి. అత్యంత మహత్యం కలిగిన ఈ ప్రదేశం శివత్వమని, శివైక్యం పొందిన దర్బారు నగరు పీఠాధిపతి గురువు సద్గురు దర్గాస్వామీజీ తెలిపారు. దత్త పీఠానికి చెందిన మహాపూర్ణత్వ పురుషులైన హజరత్ దర్బారు అలీషావలీ 147 వ సంవత్సరంలో ఈ నిర్జన స్థలంలో సజీవ సమాధిగా సిద్ధి పొందారని స్వామీజీ వివరించారు. అప్పటి అరేబియా దేశస్తులైన హజరత్ దర్బారు షావలి తన భారత దేశ యాత్ర సందర్భంగా ఈ నిర్జన ప్రదేశ విశేష మహత్యానికి తపోసిద్ధి పొంది ఇక్కడ సమాధి పొందారు. దర్గా దర్బారులో సాయి మందిరం, విద్యాలయం.. ఇదే ఆశ్రమ సన్నిధిలోనే షిర్డీ సాయినాథుని పంచలోహ విరాట్ విగ్రహంతో కూడిన మందిరం నిర్మించారు. అలాగే పంచలోహ ఉత్సవ విగ్రహం కూడా ఉంది. అలాగే 1–10వ తరగతి వరకు సుందరమైన భవనాలలో తరగతి గదులు, ప్రార్థనా మందిరం ఇక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ ఒక పూట ఉచిత భోజనంతో కూడిన విద్యాదానం చేస్తున్నారు. మాతాజీ మందిరం.. స్వామీజీకి అహర్నిశలు చేదోడువాదోడుగా ఉండి అంతా తానై వచ్చే భక్తులను ఎంతో ఆప్యాయత అనురాగాలతో ప్రేమగా పలకరించే ఆయన అర్ధాంగి రంగనాయకమ్మ తుదిశ్వాస వదిలారు. అక్కడికి వచ్చే భక్తులందరూ అమ్మ అంటూ మాతృమూర్తి సమాధి దర్గాలో ఏర్పాటు చేసి నిత్యం ఆరాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉరుసు ఉత్సవం.. సద్గురు హజరత్ దర్బార్ అలీషావలి, రహంతుల్లా అలైబాబా జలీల్ మస్తాన్ వలీ బాబా గార్ల ఉరుసు ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు గంధమహోత్సవం, 14న శుక్రవారం జెండా మెరవణి , ఉరుసు, రాత్రి హిందూ, మహమ్మదీయ సోదరుల సహకారంతో బ్రహ్మాండమైన వాయిద్యాల నడుమ బెంగళూరుకు చెందిన అస్మా నిఖత్, నాగపూర్కు చెందిన సలీం సైదాలతో గొప్ప ఖవాలీ పోటీ ఉంటుంది. 15న తహలీల్ ప్రసాదం అందించడంతో ఉత్సవం ముగుస్తుంది. హిందూ, ముస్లిం సమైక్యతకు ప్రతీక నీలకంట్రావుపేట దర్గా నేటి నుంచి ఉరుసు ప్రారంభం -
ధర్మాన్ని రక్షిస్తూ ఉండాలి
మదనపల్లె సిటీ : ధర్మాని రక్షిస్తూ ఉండాలని జగద్గురు పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి అన్నారు. మదనపల్లె మండలం చిప్పిలిలోని శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో బుధవారం అఖిల బ్రాహ్మణ సేవా సమాఖ్య సహకారంతో నూతనంగా నిర్మించిన సత్యదేవ సదన్ భవన్ను ప్రారంభించారు. ఆలయంలో భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. ధర్మాన్ని వదిలివేస్తే లక్ష్మిదేవి నిన్ను వదిలివేస్తుందన్నారు. అయిదు గుణాలు ఉన్నవారిని లక్ష్మి వరిస్తుందన్నారు. ప్రతి నిత్యం కర్మలను ఆచరిస్తూ ఉండాలన్నారు. ఫలకాంక్ష లేని కర్మలను ఆచరించాలన్నారు. ఉదయం ఆలయంలో గోపూజ, గణపతి పూజ, వాస్తుపూజ, హోమం, వాస్తుబలి నిర్వహించారు. ఆలయం ఆవరణంలో సత్యదేవుని వ్రతం కనుల పండువగా జరిగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు అమరనాథ్, కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి దివాకర్, కో ఆర్డినేటర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సంరక్షణ కేంద్రానికి చిన్నారి అప్పగింత
ములకలచెరువు : మండల కేంద్రంలో లభ్యమైన ఆడ శిశువును రాయచోటి శిశు సంరక్షణ కేంద్రానికి అప్పగించామని ఐసీడీఎస్ సూపర్వైజర్ మంజుల బుధవారం తెలిపారు. చిన్నారికి మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. అక్కడి నుంచి రాయచోటికి ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లి కేంద్రంలోని సంరక్షకులకు అప్పగించామన్నారు. పాప ఆరోగ్యంగా ఉన్నట్లు వివరించారు. సంబంధీకులు సంప్రదించాలి రాయచోటి జగదాంబసెంటర్ : అన్నమయ్య జిల్లా మొలకలచెరువు ఉమాశంకర్కాలనీ ఆదర్శ పాఠశాల వద్ద గుట్టలో బ్యాగులో ఓ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లినట్లు జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ సాధికారత అధికారిణి పి.రమాదేవి తెలిపారు. బుధవారం ఆమె రాయచోటిలో మాట్లాడుతూ 3 నుంచి 5 రోజుల ఆడ శిశువును మొలకలచెరువు ఆదర్శ పాఠశాల వద్ద వదిలి వెళ్లిపోయారన్నారు. విషయం తెలుసుకున్న పోలీసు, ఐసీడీఎస్ అధికారులు చిన్నారిని శిశుగృహంలో ఉంచారన్నారు. తల్లిదండ్రులు, సంబంధీకులు పాపను గుర్తించేందుకు తగిన ఆధారాలతో 30 రోజుల్లోగా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ సాధికారత అధికారి వారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. లేని పక్షంలో ఈ పాపను అనాథగా ప్రకటించి, ప్రభుత్వ షరతులు, నియమాల ప్రకారం మరొకరికి దత్తత ఇస్తామని ఆమె వివరించారు. నిధుల ఖర్చుపై విచారణ వీరబల్లి : వంగిమల్ల పంచాయతీలోని గ్రామాలలో తాగునీటికోసం ఖర్చుచేసిన నిధులపై బుధవారం అధికారులు విచారణ చేపట్టారు. క్వాలిటీ కంట్రోల్ డీఈఈ జాకప్ పాల్, అసిస్టెంట్ ఇంజినీర్ విశ్వనాథన్లు ఈ విచారణ జరిపారు. 14, 15వ ఫైనాన్స్ నిధులతో ఖర్చుచేసిన పనులను, సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గతంలో పనిచేసిన ఆర్డబ్ల్యుఎస్ ఏఈ కృష్ణయ్య, సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, స్థానిక గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హత్య కేసులో ఇద్దరి అరెస్టు సంబేపల్లె : హత్య కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు రూరల్ సీఐ వరప్రసాద్, ఎస్ఐ భక్తవత్సలం తెలిపారు. ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని నారాయణరెడ్డి గ్రామంలో ఇటీవల వారాధి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడన్నారు. పోలీసులు విచారణ చేపట్టడంతో వాస్తవాలు బయటి వచ్చాయని తెలిపారు. అదే గ్రామానికి చెందిన చిన్నికృష్ణ, ఆనంద్రెడ్డిలు ఓ కాంట్రాక్ట్ పని విషయమై వారాధితో గొడవపడ్డారన్నారు. దీంతో పథకం ప్రకారం వారాధి నిద్రిస్తున్న సమయంలో బండరాయితో కొట్టి చంపినట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తప్పిన పెను ప్రమాదం సిద్దవటం : మాచుపల్లె– కడప రహదారి బండికనుమ సమీపంలో లింగంపల్లె గ్రామం నుంచి కడప వైపు బుధవారం లారీలో ఇటాచ్ యంత్రాన్ని తీసుకెళుతుండగా విద్యుత్ వైర్లు తెగి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వివిధ పనులపై జిల్లా కేంద్రానికి ఆ రహదారిపై ప్రయాణిస్తుంటారు. విద్యుత్ వైర్లు తెగిపడి, విద్యుత్ స్తంభం ఒరిగి, మామిడి చెట్టు రోడ్డుకు అడ్డంగా పడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఈ విషయమై సిద్దవటం ట్రాన్స్కో ఏఈ జయచంద్రను వివరణ కోరగా లింగంపల్లె గ్రామం నుంచి లారీలో ఇటాచ్ యంత్రాన్ని కడపకు తీసుకెళుతుండగా విద్యుత్ వైర్లు తగులుకొని తెగిపోయాయన్నారు.ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని లారీ యజమానిపై కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. కాలిపోయిన గుర్రంకొండ గుర్రంకొండ : చరిత్రాత్మక గుర్రంకొండ కొండ కాలిబూడిదైంది. ఈ కొండలోనే చరిత్రాత్మక కట్టడాలతో పాటు పురాతన భవనాలు, కోటగోడలు ఉన్నాయి. సుమారు 500 ఎకరాల్లో గుర్రంకొండ కొండ విస్తరించి ఉంది. గత రాత్రి గుర్తుతెలియని దుండుగులు కొండకు వెనుకవైపు నిప్పు అంటించారు. దీంతో కొండలు సగానికిపైగా కాలిబూడిదయ్యాయి. కొండ ముందు భాగంలో ఉన్న కోటగోడలు, కొండపైభాగం వరకు మంటలు వ్యాపించాయి. దీంతో చెట్లు మొత్తం కాలిపోయాయి. మంటల్లో చిక్కుకొని అడవి జంతువులు, పక్షులు, అగ్నికి ఆహుతి అయ్యాయి. గత కొన్ని రోజులుగా దుండుగులు కొండలు, గుట్టలకు నిప్పు పెడుతున్నారు. -
ఇద్దరు సీఐల బదిలీ
● ముగ్గురి నియామకం రాయచోటి: పొలీస్ శాఖలో సీఐల బదిలీలు, నియామకాలు చేపట్టారు. మంగళవారం రాత్రి కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ అన్నమయ్య జిల్లా పరిధిలో ఇద్దరిని బదిలీ చేస్తూ, ముగ్గురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాయచోటి అర్బన్ సీఐ పి.చంద్రశేఖర్ను కర్నూలు వీఆర్కు బదిలీ చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు సీఐగా పని చేస్తున్న బి.వి.చలపతిని రాయచోటి అర్బన్ సీఐగా నియామకం చేశారు. రాజంపేట మన్నూరు సీఐగా పని చేస్తున్న కె.మహమ్మద్ అలీని అన్నమయ్య సైబర్ సెల్ సీఐగా, కడప వీఆర్లో పని చేస్తున్న ఎస్.కులాయప్పను మన్నూరు సీఐగా, కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్టులో పని చేస్తున్న సీఐ జి.శంకరమల్లయ్యను అన్నమయ్య జిల్లా ఉమెన్స్ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. -
17న గ్రామ పంచాయతీ కార్మికుల చలో విజయవాడ
రాయచోటి అర్బన్ : గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకట్రామయ్య తెలిపారు. మంగళవారం రాయచోటి మండలం చెన్నముక్కపల్లె గ్రామం పీటీఎం పల్లెలో జరిగిన జిల్లా స్థాయి పంచాయతీ కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చలో విజయవాడ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను కార్మికులతో కలిసి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కార్మికులకు 3 నుంచి 9 నెలల వరకు వేతన బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. కార్మికుల పేరుమీద ఈఎస్ఐ, పీఎఫ్లకు నిధులు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు రామాంజులు, ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రీన్ అంబాసిడర్లకు జీతాలుగా కొన్ని పంచాయతీలు పూర్తిగా చెల్లించలేదన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు దేవరాయలు, ఏ.వి.రమణ, అంజి, మురళి, రెడ్డెయ్య, సుభద్ర, లక్ష్మిదేవి, గంగులు, శ్రీరాములుతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు. -
బాధ్యతాయుతంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి
– జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు రాయచోటి : రోడ్డు భద్రత, వ్యక్తిగత భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ బాధ్యతగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు ప్రజలకు సూచించారు. మంగళవారం రాయచోటిలో పత్రికలకు అందజేసిన ప్రకటనలో డ్రైవింగ్ లైసెన్సులతో వాహనాలు నడిపి ప్రమాదాల నివారణకు సహకరించాలని ఎస్పీ కోరారు. చట్టపరమైన అవసరమే కాకుండా రోడ్డు భద్రతకు, వ్యక్తిగత భద్రతకు కూడా చాలా ముఖ్యమన్నారు. దేశంలో మోటారు వాహనాలను నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరి అన్నారు. డ్రైవింగ్ లైసెన్సు ఒక ముఖ్యమైన గుర్తింపు పత్రమన్నారు. చట్టప్రకారం 18 సంవత్సరాలు నిండని వారు వాహనం నడపరాదన్నారు. మైనర్లు వాహనం నడపటం వల్ల వారికి, ఇతరులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. మైనర్లకు వాహనం ఇచ్చిన వారి మీద చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. -
రైలుకింద పడి గుర్తుతెలియని యువకుడి మృతి
మదనపల్లె : గుర్తు తెలియని యువకుడు రైలు కింద పడి మృతి చెందిన ఘటన మంగళవారం మదనపల్లె మండలంలో జరిగింది. ధర్మవరం నుంచి నరసాపురం వెళుతున్న రైలు కిందపడి సీటీఎం వద్ద యువకుడు మృతి చెందడంతో గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వివరాలు తెలియలేదు. కాగా, మృతుడు గళ్లచొక్కా, నీలిరంగు ప్యాంటు ధరించి సుమారు 25 ఏళ్ల వయస్సు కలిగి ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు కదిరి రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ రహీం తెలిపారు. దేవతానగర్లో చోరీ మదనపల్లె : పట్టణంలోని దేవతానగర్లో చోరీ జరిగింది. మంగళవారం చోరీపై బాధితులు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డ్రైవర్గా పనిచేస్తున్న చిన్నరెడ్డెప్ప దేవతానగర్లో భార్య అరుణతో కలిసి నివసిస్తున్నాడు. ఈనెల 9న గుర్రంకొండ మండలం శెట్టివారిపల్లె పంచాయతీ అరిగెలవారిపల్లెకు భార్యతో కలిసి వ్యక్తిగత పనులపై వెళ్లారు. పనులు ముగించుకుని పదోతేదీ ఉదయం ఇంటికి రాగా, ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువా తలుపులు తెరచి ఉండటంతో చోరీ జరిగిందని నిర్ధారించుకున్నారు. 74 గ్రాముల బంగారు ఆఽభరణాలు చోరీకి గురయ్యాయని తాలూకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. క్లూస్టీమ్ సభ్యులు ఆధారాలు సేకరించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. టీడీపీ మండల అధ్యక్షుడి కారు దగ్ధం రామసముద్రం : మండల టీడీపీ అధ్యక్షుడు విజయగౌడ్ కారును సోమవారం అర్థరాత్రి గుర్తుతెలియని దుండగులు కాల్చివేశారు. సమాచారం అందుకున్న మదనపల్లె రూరల్ సీఐ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని ఎస్ఐ రవికుమార్తో కలిసి పరిశీలించి వివరాలు సేకరించారు. అర్థరాత్రి కారుకు నిప్పు పెట్టడంతో టైర్లు పగిలిన శబ్దానికి మెలకువ వచ్చి చూడగా కారు కాలుతోందని బాధితుడు తెలిపారు. వెంటనే పుంగనూరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో మంటలు అదుపు చేశారు. విషయం తెలుసుకున్న సీఐ సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అలాగే ఎమ్మెల్యే తనయుడు జునైద్ అహ్మద్, టీడీపీ రాజంపేట అధికార ప్రతినిధి ఆర్.జె. వెంకటేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనుమానితులపై కేసు నమోదు చేశామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని సీఐ తెలిపారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే అక్రమాలపై ఆగ్రహం
మదనపల్లె : పాతికేళ్ల క్రితం తాము కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాలకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ అధికార బలంతో అక్రమంగా పొందిన 1బీ అడంగల్ను రద్దుచేసి తమకు న్యాయం చేయాలని చేనేత కార్మికులు వేడుకున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటిస్థలాలను ఆక్రమించి, దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడంపై మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నాకు దిగారు. కార్యాలయం ఎదుట బైఠాయించి, లోపలకి ఎవ్వరిని వెళ్లనీయకుండా అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీకే.పల్లె రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ 423/2లో కొండుపల్లె యశోదమ్మ, కొండుపల్లె శ్రీనివాసులు, కె.రెడ్డెప్ప నుంచి 77 మంది చేనేత కార్మికులు ప్లాట్ల రూపంలో వేసిన లే అవుట్లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశామన్నారు. ఇందులో కొందరు ఇళ్లు నిర్మించుకోగా, మరికొందరు పునాదులు వేసుకుని, స్థలాన్ని కాపాడుకుంటూ వస్తున్నామన్నారు. ఈ స్థలాన్ని ఎలాగైనా కాజేయాలనే దురుద్దేశంతో రికార్డులు తనిఖీ చేసుకోకుండా, తమను సంప్రదించకుండా 2020 సంవత్సరం డిసెంబర్ 1న దేశిరెడ్డి హరినాథరెడ్డి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ(జీపీఏ) తీసుకుని, ప్లాట్ల రూపంలో అమ్మిన భూమిని, వ్యవసాయభూమిగా పేర్కొంటూ 2025 జనవరి 29న టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ డాక్యుమెంట్ నెంబర్.962/2025 కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. తర్వాత అక్రమంగా భూమిలోకి ప్రవేశించి, పాతికేళ్లుగా ఉన్న తమను ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా బెదిరిస్తూ దౌర్జన్యంతో చుట్టూ కంచె నిర్మించాడన్నారు. ఈ విషయమై తాము ఎమ్మెల్యే షాజహాన్బాషా, జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, తహసీల్దార్లను కలిసి తమగోడును వివరించి న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థించామన్నారు. ఎమ్మెల్యే షాజహాన్బాషా, సబ్ రిజిస్ట్రార్ గురుస్వామిని పిలిచి రిజిస్ట్రేషన్ రద్దుచేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని ఆదేశించారన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో 1బీ, అడంగల్ ఆన్లైన్లో ఉన్నందునే తాను రిజిస్ట్రేషన్ చేశానని సబ్ రిజిస్ట్రార్ చెప్పిన నేపథ్యంలో వాటిని రద్దుచేయాల్సిందిగా అధికారులకు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశామన్నారు. అయితే మూడు వారాలు అవుతున్నా ఇప్పటివరకు అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. తమకు న్యాయం జరగని పక్షంలో తమకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయ తలుపులు మూయడంపై వివాదం.. న్యాయం చేయాలని బాధితులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట కూర్చుని నిరసన తెలుపుతుంటే, అధికారులు పట్టించుకోకపోగా.. లోపలకు ఎవ్వరినీ అనుమతించకుండా .కార్యాలయం తలుపులు వేసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆడవాళ్లు, చేనేతకార్మి కులు నిరసన తెలుపుతున్నా, పట్టించుకోకపోవడంపై నిలదీశారు. దీంతో తహసీల్దార్, కార్యాలయం ఎదుట న్యూసెన్స్ చేస్తున్నారని, పోలీసులను పిలిపించారు. నిరసన తెలిపిన వారిని అదుపులోకి తీసుకోవాల్సిందిగా కోరారు. దీనిపై బాధితులు తాము న్యాయం కోసం మాత్రమే వచ్చామని, తమ భూమిపై అక్రమంగా మంజూరుచేసిన 1బీ అడంగల్ను రద్దుచేస్తే చాలని వేడుకున్నారు. తహసీల్దార్ ధనంజయులు మాట్లాడుతూ...పని ఒత్తిడి అధికంగా ఉండటంతో కార్యాలయం తలుపులు వేసుకుని లోపల పనిచేస్తున్నామని, ఆఫీసు వేళల్లో ఇబ్బంది పెట్టడం భావ్యం కాదన్నారు. ఈ విషయమై ఇప్పటికే జిల్లా కలెక్టర్, బాధితులతో మాట్లాడారని, ఆయన ఆదేశాల ప్రకారం నడుచుకోవాల్సిందిగా సూచించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితుల ధర్నా అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని ఆవేదన -
సచివాలయ దారికి అడ్డంగా కంచె
సాక్షి టాస్క్ఫోర్స్ : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కూటమి నాయకులు రెచ్చిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ రైల్వేకోడూరు నియోజకవర్గ ఇన్చార్జి ముక్కా రూపానందరెడ్డి అనుచరులు చిట్వేలి మండలం, మార్గోపల్లి సచివాలయానికి వెళ్లే దారికి అడ్డంగా సిమెంటు దిమ్మెలను నాటి ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై తహసీల్దార్, ఎంపీడీఓలను వివరణ కోరగా గుడి కోసం కంచె వేశారని చెబుతున్నారు. కాగా గుడి పేరుతో గ్రామకంఠం కబ్జాలకు పాల్పడుతున్నారని సచివాలయానికి వెళ్లేదారిలో కంచె ఏర్పాటు చేస్తుంటే అధికార పార్టీ నాయకులకు అధికారులు అండదండగా నిలుస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సచివాలయానికి ప్రత్యామ్నాయంగా సిమెంటు రోడ్డు ఉందని, అయితే సంవత్సరాలుగా సచివాలయానికి వెళ్లే రహదారిలో కంచె ఏర్పాటు చేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు కలెక్టర్, సబ్ కలెక్టర్ ఈ విషయంపై విచారించి చర్యలు తీసుకోవాలని, సచివాలయానికి గతంలో ఉన్న దారిని వదిలి గుడి నిర్మించుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. గ్రామకంఠం కబ్జా చేసేందుకు కూటమి నాయకుల యత్నం పట్టించుకోని అధికారులు -
ప్రశాంతంగా ఉరుసు నిర్వహించాలి
రామాపురం : మండల పరిధిలోని నీలకంట్రావుపేట పంచాయతీ సమీపంలో సద్గురు సాయి దర్బార్ నగర్లో వెలసిన సద్గురు హజరత్ దర్బార్ అలీషా వలీ, రహమతుల్లా అలై బాబా, జలీల్ మస్తాన్ వలీ బాబా ఉరుసు ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని తహసీల్దార్ రామాంజనేయులు, లక్కిరెడ్డిపల్లె సీఐ కొండారెడ్డి, ఎస్ఐ వెంకటసుధాకర్రెడ్డిలు తెలిపారు. ఉత్సవాల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ 13న గంధం, 14న ఉరుసు ఉత్సవాలు, రాత్రికి బెంగళూరుకు చెందిన అస్మా నిఖిత్ ఖవ్వాలి, అలాగే నాగపూర్కు చెందిన సలీం షైదా ఖవ్వాలి నిర్వహించనున్నారు. 15న తీర్థ ప్రసాదాలతో ఉరుసు ముగుస్తుందన్నారు. ఉరుసు ఉత్సవాలను హిందూ ముస్లిం ఐకమత్యంతో జరుపుకోవాలని సూచించారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలసపాడు : కలసపాడు మండలంలోని పెండ్లిమర్రి వద్ద ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న భార్గవి సోమవారం రాత్రి పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్రంగా గాయపడిన ఆ బాలికను చికిత్స నిమిత్తం సిబ్బంది పోరుమామిళ్లలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం అక్కడి నుంచి కడప రిమ్స్కు, ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు తిరుపతి స్విమ్స్కు తరలించారు. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపల్ రెడ్డిజ్యోతిని వివరణ కోరగా విద్యార్థిని ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి కింద పడిందని, వెంటనే అక్కడ ఉన్న సిబ్బందికి తెలియజేసి పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించామని తెలిపారు. దాడి ఘటనలో కేసు నమోదు కడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీస్స్టేషన్ పరిధిలో పులివెందుల రోడ్డు సాక్షి సర్కిల్ సమీపంలో ఈనెల 10వ తేదీన పాతసామాన్ల అంగడిని నిర్వహిస్తున్న విక్రమ్ వద్దకు మాట్లాడేందుకు మల్లికార్జున అనే వ్యక్తి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడున్న కిషోర్, ప్రకాష్, ఇంకా ముగ్గురు మల్లికార్జునను ఎగతాళి చేశారు. దీంతో ఈ విషయాన్ని మల్లికార్జున తన సోదరుడు, సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి మద్దిలేటికి తెలియజేశాడు. మద్దిలేటి వారిని అడిగేందుకు సంఘటన స్థలానికి వెళ్లగా వారు మద్దిలేటి, అతని సోదరుడు మల్లికార్జునపై దాడి చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కడప తాలూకా ఎస్ఐ తాహీర్హుసేన్ కేసు నమోదు చేశారు. -
ఇష్టపడి చదివితేనే ఉత్తీర్ణత
సిద్దవటం : బీసీ వసతి గృహంలో ఉండి చదువుకునే విద్యార్థులు క్రమశిక్షణతో, ఇష్టపడి చదివితే అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించగలరని జిల్లా బీసీ సంక్షేమాధికారి భరత్కుమార్రెడ్డి తెలిపారు. సిద్దవటం మండలం పార్వతీపురంలో ఉన్న బీసీ బాలుర వసతి గృహంలో మంగళవారం రాత్రి 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి నైతిక విలువలను పెంచుకోవాలన్నారు. 10వ తరగతి విద్యార్థులు ఏకాగ్రతతో చదివి మంచి మార్కులను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీబీవీడి సభా హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఎం.డి. మధుసూదన్, తెలుగు పండిట్ పోలిరెడ్డి, ఉపాధ్యాయులు, జిల్లా బీసీ వెల్ఫేర్ కార్యాలయం సూరింటెండెంట్ ఆంజనేయులు, స్థానిక వసతి గృహం అధికారి రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆడ్డుకోవాల్సిన వారే.. ఆడించేస్తున్నారు..!
● అంతర్ జిల్లాల పేకాటకు అడ్డాగా రాయచోటి ● జోరుగా జూద స్థావరాలు ● నిర్వాహకులకు కొందరు ఖాకీల సహకారం ● పోలీసుల అదుపులో ప్రధాన గ్యాంబ్లర్ ● ఎస్పీ విచారణలో గుట్టు రట్టు టాస్క్ ఫోర్స్: అధికారమే అండగా.. శిక్షించాల్సిన రక్షక భటులే అసాంఘిక కార్యకలాపాలకు రక్షణగా ఉండటంతో.. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పేకాట స్థావరాలకు అడ్డాగా మారింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన జూదరులకు జిల్లా కేంద్రం, పరిసర ప్రాంతాలు వేదికలయ్యాయి. మొబైల్ పేకాట, స్థానికంగా ఉన్న తోటలు, గుట్టల్లో రోజూ కోట్ల రూపాయలు చేతులు మారే జూదం నడుస్తోంది. కొందరు పోలీసులు, ఉన్నతాధికారులు.. నిర్వాహకులు అందించే మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఒక్కో ఆట నిర్వహణకు ముడుపుల రూపంలో లక్ష రూపాయలు ముడుతున్నట్లు ప్రచారం ఉంది. ఇలా రోజుకు రెండు, మూడు క్యాంపులు నిర్వహించి.. అంతే మొత్తంలో గ్యాంబర్లు అశోక్రెడ్డి, నర్సరీ రమణ మరికొందరి నుంచి ఓ కానిస్టేబుల్, హోంగార్డు ద్వారా కొందరు పోలీసు అధికారులకు అందుతున్నట్లు తెలియవచ్చింది. ఈ పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నా రాయచోటి కేంద్రంగా అధికంగా కనిపిస్తోంది. దీంతో ఎస్పీ నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. స్పెషల్ పార్టీ పోలీసుల దాడులు జిల్లా వ్యాప్తంగా ఎస్పీకి అనుబంధ శాఖలు, వేగుల నుంచి అందుతున్న సమాచారం మేరకు నేరుగా స్పెషల్ పార్టీ పోలీసులతో పేకాట స్థావరాలపై దాడులు చేస్తూ తనదైన శైలిలో చర్యలు చేపట్టారు. దాడుల సమయంలో జూదరులు అందిస్తున్న సమాచారం మేరకు.. పోలీస్ శాఖ పరిధిలోని ఇంటి దొంగల పేర్లు బయటకు వస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఒక కానిస్టేబుల్, హోంగార్డు, ఒక డబుల్, త్రిబుల్ స్టార్ల అధికారుల పేర్లు కూడా ఆధారాలతో సహా రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. అందుపులో అంతర్ జిల్లా గ్యాంబ్లర్ అన్నమయ్య జిల్లా కేంద్రంగా పేకాట పక్క జిల్లాలు, ప్రాంతాల నుంచి జూదరులను సేకరించే గ్యాంబ్లర్ అశోక్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రాయచోటి సమీపంలో రెండు రోజుల క్రితం పేకాట స్థావరంపై దాడి చేసి 12 మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దాడి చేసిన సమయంలో మరో ఐదుగురు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నట్లు సమాచారం. వారిలో ప్రధానంగా గ్యాంబర్లు అశోక్ రెడ్డి, నర్సరీ రమణ, కానిస్టేబుల్ కోసం ఎస్పీ పార్టీ వలపన్నగా.. అశోక్రెడ్డి చిక్కినట్లు తెలుస్తోంది. అశోక్రెడ్డి ద్వారా జాదరులకు సహకరిస్తున్న పోలీసులు, పోలీసు అధికారుల వివరాలను రాబడుతున్నట్లు తెలియవచ్చింది. గ్యాంబర్ల నుంచి డబ్బుల చేరవేతలో మధ్యవర్తిగా ఉన్న హోంగార్డును కూడా స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి తొలగించి ఎస్పీ కార్యాలయానికి అటాచ్మెంట్ చేసినట్లు వినికిడి. -
●మనుషులు, పాడి ఆవులు మృత్యువాత
వేటగాళ్లు వినియోగించే నాటుబాంబులు, విద్యుత్ తీగెల వల్ల మనుషులతోపాటు పాడిఆవులు బలి అవుతున్న సంఘటనలు ఉన్నాయి. మండలంలోని మర్రిపాడు గ్రామ కస్పాకు చెందిన నందమహారెడ్డి గ్రామానికి సమీపంలోని తన పొలంలో వేరుశనగ పంట సాగు చేశాడు. ఆయన రెండేళ్ల క్రితం రాత్రి వేళ పొలానికి కాపలాగా వెళ్తుండగా.. పరిసరాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగెల్లో చిక్కుకొని మృతి చెందాడు. కలకడ మండలం ఎనుగొండ పాళెం తండాకు చెందిన సిద్దులు నాయక్, లీలాభాయ్లు గుర్రంకొండకు పక్కనున్న సుంకర వాండ్లపల్లెకు నడకదారిన వెళుతూ.. విద్యుత్ తీగెల మధ్యలో చిక్కుకొని మృతి చెందారు. వారం రోజుల క్రితం చెర్లోపల్లె పంచాయతీ కిలారివాండ్లపల్లె సమీప పొలాల్లో విద్యుత్ తీగెల వల్ల రమేష్నాయడు అనే వ్యవసాయ కూలీ మృత్యువాత పడ్డాడు. యల్లంపల్లెలో ఇరువురు వ్యక్తులు రక్తగాయాలతో బయట పడి ఆస్పత్రుల పాలయ్యారు. మామిళ్లవారిపల్లె నాగరాజుకు చెందిన పాడిఆవు పొలాల వద్ద ఉన్న నాటుబాంబును నమిలి నోరు మొత్తం పేలిపోయి మృతి చెందింది. యల్లంపల్లె, సరిమడుగు, నడిమిఖండ్రిగ గ్రామాల్లో విద్యుత్ తీగెల్లో చిక్కుకొని నాలుగు పాడిఆవులు మృతి చెందాయి. -
ప్రకృతి వ్యవసాయం.. లాభదాయకం
రాజంపేట రూరల్: ప్రకృతి వ్యవసాయం రైతులకు ఎంతో లాభదాయకమని జిల్లా డీఆర్సీ ఏడీఏ అశోక్రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ఊటుకూరు గ్రామ సచివాలయంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మంగళవారం వీఏఏ, వీహెచ్ఏ, వీఏఓలతోపాటు ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి జి.రాజకుమారి, వెలుగు ఏపీఎం గంగాధర్, ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ వేల్పుల సిద్దయ్య, డీఆర్సీ ఏఓ సుచరిత, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి పాఠశాలలో స్కౌట్స్ ఏర్పాటురాయచోటి అర్బన్: అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో స్కౌట్ యూనిట్ ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం అన్నారు. పట్టణంలోని అర్చన కళాశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు నిర్వహిస్తున్న పెట్రోల్ లీడర్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన మంగళవారం ఉదయం పరిశీలించారు. పీఎంశ్రీ పాఠశాలల నుంచి వచ్చిన 250 మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ విధానంలో 5 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అర్చన విద్యాసంస్థల కరస్పాండెంట్ మదనమోహన్రెడ్డి, హెచ్డబ్ల్యూ బి.నిర్మల, స్కౌట్స్ మాస్టర్ నాగరాజ, గైడ్ కెప్టెన్లు సుజాత, గోవిందమ్మ, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. మిట్స్ కళాశాలకు అరుదైన గౌరవం కురబలకోట: అంగళ్లులోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలకు అరుదైన గౌరవం దక్కింది. సివిల్ విభాగానికి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కొలాబరేషన్ ల్యాబొరెటరీస్ (ఎన్ఎబీఎల్) గుర్తింపు నాలుగేళ్ల పాటు లభించింది. ఇందుకు సంబంధించిన పత్రాన్ని ప్రిన్సిపాల్ యువరాజ్తోపాటు ప్రొఫెసర్లు మంగళవారం మీడియాకు విడుదల చేశారు. ఉన్నత విద్యా ప్రమాణాలకు ఎన్ఎబీఎల్ మార్గదర్శకమవుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు. దీని ద్వారా పరిశోధన సామర్థ్యాలు పెంచుకోవడంతోపాటు పరిశ్రమలలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చన్నారు. విద్యార్థులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. -
పేద విద్యార్థులను విస్మరించిన ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యం చేయడం వల్ల వారు చదువులు ఆపాల్సి వస్తోంది. దీని ప్రభావం సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై పడుతోంది. పిల్లల ఫీజులకు డబ్బులు లేక తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారు. గతంలో 2018–19లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం బకాయి పెట్టిన 1800 కోట్ల రూపాయలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. అదే విధంగా 2023–24లో ఎన్నికల కోడ్ కారణంగా ఏర్పడిన బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత నుంచి ప్రస్తుత కూటమి ప్రభుత్వం పక్కకు తప్పుకోవడం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే. ఆ బకాయిలతో కలిపి, ఇప్పటి వరకు 3900 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. లక్షలాది మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశంలో ఇంకా జాప్యం చేయకుండా ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన డబ్బులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. – జంగంరెడ్డి కిశోర్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు, అన్నమయ్య జిల్లా నిరుద్యోగులపై నిర్లక్ష్య వైఖరి కూటమి సర్కారు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకపోగా, సీఎం చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకార సమయంలో మొదటి సంతకం పెట్టిన మెగా డీఎస్సీ ఇంత వరకు అతీ గతీ లేదు. ఏవేవో సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారు. మరోపక్క 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి.. కల్పించని సమయంలో నిరుద్యోగ భతి ఇస్తామని కబుర్లు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు పట్ల నిర్లక్ష్య వైఖరి కనబరుస్తున్నారు. నిరుద్యోగ భృతికి అవసరమైన డబ్బులను బడ్జెట్లో ఒక రూపాయి కూడా కేటాయించలేదు. – శివప్రసాద్రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు న్యూస్రీల్ -
●మదనపల్లె మెడికల్ కళాశాలపై నీలినీడలు
● నేడు రాయచోటిలో యువత పోరు వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యారు. కూటమి సర్కారు పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడం, నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోకపోవడం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి చెల్లించకపోవడం, ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం, మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు అప్పగించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 10 గంటలకు రాయచోటిలోని జాతీయ రహదారి నుంచి కలెక్టర్ చాంబర్ వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. కార్యక్రమం విజయవంతానికి ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు పోస్టర్లను ఆవిష్కరించారు. యువత పోరుకు పెద్దఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యో గులు తరలిరావాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. సాక్షి రాయచోటి: సార్వత్రిక ఎన్నికల అనంతరం అఽధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు నిరుద్యోగులను గాలికి వదిలేసింది. అధికారంలోకి రాకమునుపు ఒకటేమిటి? అది చేస్తాం, ఇది చేస్తామంటూ బురిడీ కొట్టించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు.. అదీ లేకపోతే నిరుద్యోగ భృతి, చదువుకునే వారికి ఫీజు రీయింబర్స్మెంట్.. ఇలా ఎన్నో చెప్పి చివరకు సూపర్ సిక్స్ లేకపోగా, మిగతావి కూడా అమలు చేయకుండా మాయమాటలతో ముందుకు సాగుతోంది. ఇప్పుడే కాదు.. 2014లో కూడా హామీలిచ్చి అధికారంలోకి రాగానే ఎగనామం పెట్టింది. అయితే 2019 వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు పరిశ్రమలు, మరోవైపు నిరుద్యోగులకు ఉపాధి, ఇంకోవైపు చదువులకు వైఎస్సార్ విద్యాదీవెన ఎప్పటికప్పుడు త్రైమాసికంలోనే అందిస్తూ అన్ని విధాలా ఆదుకోవడం జరిగింది. అంతేకాకుండా అందరి ఆరోగ్యానికి భరోసా నింపుతూ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించడం ఒక ఎత్తయితే, మెడికల్ కళాశాలలు నిర్మించి వైద్య విద్యకు పెద్దపీట వేశారు. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా ముందడుగు పడని పరిస్థితుల్లో.. వైఎస్సార్ సీపీ పోరుబాటకు సంకల్పించింది. చదువుకేదీ భరోసా వైఎస్సార్సీపీ హయాంలో చదువులకు భరోసా ఉండేది. ఇంజినీరు కావాలన్నా.. డాక్టర్ కోర్సు చేయాలన్నా.. ఇతర పెద్ద చదువులకు చదవాలన్నా ప్రోత్సాహం అందించింది. గడిచిన ఐదేళ్లలో వైఎస్సార్ విద్యా దీవెన కింద 1,50,934 మందికి సుమారు రూ.378.75 కోట్లు అందించారు. వైఎస్సార్ వసతి దీవెన కింద రూ. 1,28,290 మందికి రూ.150.33 కోట్ల సొమ్మును అందించారు. పేద విద్యార్థులకు వైఎస్ జగన్ సర్కారు అండగా నిలుస్తూ వచ్చింది. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు అన్నమయ్య జిల్లాలో రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు లేక, ప్రైవేటు కొలువులు దొరకక అవస్థలు తప్పడం లేదు. డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, బీఈడీ తదితర కోర్సులు చేసిన వారు నిరుద్యోగులుగా మారుతున్నారు. అధికారంలోకి రాకమునుపు కూటమి నేతలు ప్రతి ఒక్కరికీ ఉద్యోగం లేకపోతే.. నిరుద్యోగ భృతి రూ.3 వేలు అందిస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తీరా ఇప్పుడు చూస్తే తొమ్మిది నెలలు అవుతున్నా అతీగతీ లేని పరిస్థితి కనిపిస్తోంది. కొత్త పరిశ్రమల జాడ జిల్లాలో లేకపోగా, నిరుద్యోగులకు ఉద్యోగాలకల్పన మాటలకే పరిమితమైనట్లు కనిపిస్తోంది. జిల్లాలో సుమారు 2,45,000కు పైగా యువత, నిరుద్యోగులు ఉన్నారు. ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రభుత్వ పెద్దలు ఇంతకుముందు ప్రకటించినా ఇప్పటికీ ఆ ఊసే ఎత్తలేదు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇదిగో, అదిగో అంటున్నారే తప్ప అడుగులు ముందుకు పడని పరిస్థితిపై నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యువతను నిట్టనిలువునాముంచిన కూటమి నిరుద్యోగులకు భృతి లేదు.. ఉపాధి కానరాదు ఫీజురీయింబర్స్మెంట్ చెల్లించని ప్రభుత్వం ఐదు త్రైమాసికాలకు రూ.212 కోట్లకు పైగా బకాయిలు మదనపల్లె మెడికల్ కళాశాలకు మంగళం నేడు కలెక్టరేట్ ఎదుటవైఎస్సార్సీపీ ‘యువత పోరు’ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైద్య విద్యకు ప్రాధాన్యతనిస్తూ.. వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెకు మెడికల్ కళాశాలలు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టింది. గతేడాది జూన్ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించాలని, అందుకు తగ్గట్టు భవనాలను కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కళాశాలకు 150 సీట్లు వస్తాయని అంచనా వేసిన తరుణంలో.. కూటమి అధికారంలోకి రాగానే వైద్య కళాశాలలపై నీలినీడలు కమ్ముకున్నాయి. పులివెందుల, మదనపల్లెలో సిబ్బందిని తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నా.. కూటమి ప్రభుత్వం కళాశాలలను ప్రైవేటుకు అప్పగించే ఆలోచన నేపథ్యంలో ఉన్న వారందరినీ ఇతర ప్రాంతాలకు పంపించేసింది. ఒకపక్క మెడికల్ కళాశాలకు సంంధించిన సీట్లను కోల్పోగా.. మరోపక్క మదనపల్లె మెడికల్ కళాశాల నిర్మాణంపై సందేహాలు నెలకొన్నాయి. -
అర్జీలకు సత్వరమే పరిస్కారం
– జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లోని పీజిఆర్ఎస్ హాల్లో పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న బియాండ్ ఎస్ఎల్ఏ దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకుని పరిష్కరించాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రం రాయచోటికి వచ్చిన అర్జీదారులకు జిల్లా సంయుక్త కలెక్టర్ స్నాక్స్, వాటర్ బాటిల్స్, టీ సౌకర్యాలను కల్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మధుసూదన్ రావు, ఎస్డీసీ రమాదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. డీఎస్సీ పరీక్షలకు ఆన్లైన్ ద్వారా శిక్షణ కడప రూరల్ : మెగా డీఎస్సీ పరీక్షలకు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ జిల్లా సంచాలకులు యం భరత్కుమార్రెడ్డి తెలిపారు. బీసీ, ఈడబ్ల్యూఎస్ (ఈబీసీ) కేటగిరీకి చెందిన అభ్యర్ధులు ఉచిత శిక్షణ కోసం ఈ నెల 10వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్ధులు టెట్ పరీక్షలో అర్హత సాధించిన మార్కుల జాబితా నేటివిటీ, కుల, ఆదాయం ధృవీకరణ పత్రాలతో రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు జతపరచి కడప పాత రిమ్స్లో గల ఏపీ బీసీ స్టడీ సర్కిల్, బీసీ భవన్ రెండో అంతస్తులోని కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో లేదా 9849919221 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. -
ఒత్తిడికి లోనుకావొద్దు : డీఈఓ సుబ్రమణ్యం
పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఒత్తిడికి లోనుకావొద్దని జిల్లా విద్యాశాఖ అఽధికారి సుబ్రమణ్యం తెలిపారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 505 ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలల్లో 22,355 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఇందు కోసం 121 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 1200 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. ఆరు సమస్మాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులు తమ హాల్టిక్కెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునన్నారు. హాల్టిక్కెట్లను వాట్సప్ మనమిత్ర 9552300009 నంబర్ల నుంచి పొందవచ్చని తెలిపారు. -
అత్యాచారం కేసులో నిందితుల అరెస్టు
మదనపల్లె : నిమ్మనపల్లె మండలంలో ఓ వివాహితపై అత్యాచారం చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు మదనపల్లె రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. సోమవారం స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం నిమ్మనపల్లి మండలం తవళం గ్రామం నాయనవారిపల్లెకు చెందిన ఓ వివాహిత (21) పాలు పోసేందుకు తమ గ్రామం నుంచి పక్కనే ఉన్న నల్లంవారిపల్లెకు వెళ్లి డిపోలో పాలు పోసి తిరిగి వస్తుండగా, నల్లంవారిపల్లెకు చెందిన పి.రమణ కుమారుడు పల్లపు నాగేంద్ర (23), డి.వెంకటరమణ కుమారుడు దేవర ఇంటి సురేంద్ర (33), కాపు కాచి బాధితురాలిపై అత్యాచారం చేశారు. ఆ సమయంలో జరిగిన విషయం బయటకు చెబితే బాధితురాలిని, ఆమె భర్తను చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో బాధిత మహిళ వారం రోజుల తర్వాత నిమ్మనపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో, డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు సూచనలతో కేసు దర్యాప్తు చేశామన్నారు. నిందితులను సోమవారం అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. -
కారు కల్వర్టును ఢీకొని దంపతులకు గాయాలు
రామాపురం : కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిలోని బండపల్లె గ్రామం టోల్గేటు సమీపంలో సోమవారం కారు కల్వర్టును ఢీ కొనడంతో నాగిరెడ్డి, వనజ దంపతులకు గాయాలైనట్లు మండల ఎస్ఐ వెంకటసుధార్రెడ్డి తెలిపారు. తిరుపతికి చెందిన నాగిరెడ్డి, వనజలు కడప నుంచి కారులో రాయచోటికి వస్తుండగా మార్గమధ్యంలో బండపల్లి టోల్గేట్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొని కాలువలో పడింది. పోలీసు క్షత్రగాత్రులను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ములకలచెరువు : రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం మండల కేంద్రంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు... సత్యసాయి జిల్లా చీకుచెట్టుపల్లెకు చెందిన ఆదినారాయణ పనుల నిమిత్తం ములకలచెరువుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో రోడ్డు దాటుతుండగా మదనపల్లె వైపు నుంచి కదిరికి వెళ్తున్న ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆదినారాయణ(56) సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భార్య ఉత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెట్టుబడి సాయాన్ని అందించాలిరాయచోటి అర్బన్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా రైతులకు ఇస్తామన్న పెట్టుబడి సాయం రూ. 20 వేలు ఎప్పుడిస్తారని ఏపీ రైతు సంఘం నాయకులు ప్రశ్నించారు. ఏపీ రైతుసంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి, కౌలురైతుల సంఘం జిల్లా కార్య దర్శి రమేష్బాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ పంటలకు ఽగిట్టుబాటు ధరను కల్పించి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ముదివేడు రిజర్వాయరు నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.రామాంజులు, రైతు సంఘం నాయకులు వేమనారాయణ రెడ్డి, శ్రీనివాసులు, రమణప్ప, రత్నమ్మ, లక్షుమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అసంపూర్తి గృహాలకు అదనపు ఆర్థిక సహాయం
– జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ రాయచోటి : 2019–24 మధ్య కాలంలో బీసీ,ఎస్సీ,ఎస్టీలకు మంజూరైన గృహాలు పూర్తి కాకుండా అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేయడానికి అదనంగా ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందని సోమవారం అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ చెప్పారు. స్వర్ణాంధ్ర–2047 విజన్ సాకారంలో భాగంగా 2029 నాటికి అందరికీ ఇల్లు ఏర్పరచాలనే దృఢ నిశ్చయంతో అసంపూర్తి ఇళ్ల నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో దాదాపు 25 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల గృహాల వివిధ దశల్లో నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. నిర్మాణం పూర్తికి ఎస్సీలు, బీసీలు అందరికీ రూ. 50 వేలు, ఎస్టీలకు రూ.75వేలు చొప్పున అదనంగా ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. లబ్దిదారులు ఇల్లు పూర్తి చేసుకోవడానికి తక్షణణే అవసరమైన చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీ శివయ్యను కలెక్టర్ ఆదేశించారు. దరఖాస్తుల ఆహ్వానం ఓబులవారిపల్లె : ఉమ్మడి కడప జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఆంజనేయరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి గురుకులంలో 6,7,8వ తరగతులకు సంబంధించి ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు ఎపీఆర్ఎస్టీఏటీ– 2025 ద్వారా ప్రవేశ పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు.ఉమ్మడి జిల్లాలోని బాలురకు ముక్కవారిపల్లి గురుకుల పాఠశాలలో, బాలికలకు మైలవరం గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తికల వారు ఏపీఆర్ఎస్.సీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 31 వరకు గడువు ఉందన్నారు. ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్షను ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాలకు 8712625056 నంబర్లో సంప్రదించాలని కోరారు. యువతకు శిక్షణ కడప కోటిరెడ్డిసర్కిల్ (వైఎస్సార్ జిల్లా): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో డీడీయూ–జీకేవై పథకం ద్వారా సి–డ్యాప్ సౌజన్యంతో 18–32 సంవత్సరాల మధ్య వయస్సుగల యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిహార్ స్కిల్ ఎడ్యుకేషన్ రీజినల్ కో ఆర్డినేటర్ ఎం.సుబ్బరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు నెలల కాల వ్యవధిలో ఎలక్ట్రానిక్ కంప్యూటర్ హార్డ్వేర్, హెల్త్కేర్, ఎమెర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్, ఐటీ సెక్టార్, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, బ్యూటీ వెల్నెస్ సెక్టార్, బ్యూటీ థెరఫీ కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఇతర వివరాలకు 90630 82227 నంబబర్లో సంప్రదించాలన్నారు. ఎస్ఎస్ఏలో నూతన నియామకం కడప కోటిరెడ్డి సర్కిల్ : అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులలో కెరీర్ మానసిక ఆరోగ్య కౌన్సెలర్గా కడప నగరానికి చెందిన డాక్టర్ సుష్మితారెడ్డిని నియమించారు. ఈ మేరకు సోమవారం ఆమెకు అధికారికంగా ఉత్తర్వులు అందాయి. ఈ సందర్భంగా డాక్టర్ సుష్మితారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సరైన కెరీర్ మార్గదర్శకత్వం, మానసిక ఆరోగ్య సలహాలు అందించడం ద్వారా వారి భవిష్యత్ను మెరుగుపరిచేందుకు తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు. వైభవం..పల్లకీ ఉత్సవం రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేతుడికి పల్లకీ సేవ నిర్వహించారు.సోమవారం ప్రధాన అర్చకులు శంకరయ్యస్వామి, కృష్ణయ్య స్వామి, రాచరాయయోగీ స్వామి, శేఖర్ స్వామిల ఆధ్వర్యంలో మూల విరాట్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు.అనంతరం ఉత్సవమూర్తులకు రంగురంగుల పూలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. ఆలయమాఢవీధులోల ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో డీవీ రమణారెడ్డి, భక్తులు పాల్గొన్నారు. -
టీడీపీ ‘బెల్ట్’ మద్యంపై ఎస్ఐ వేటు!
కురబలకోట : ముదివేడు ఎస్ఐ దిలీప్కుమార్ బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించారు. బెల్ట్ మద్యం విక్రయిస్తూ ఇద్దరు పట్టుబడినట్లు ఎస్ఐ సోమవారం తెలిపారు. పి. సుబ్రమణ్యం (65), జి. వెంకట్రమణ (60) మండలంలోని కంటేవారిపల్లె వద్ద అధిక ధరలకు మద్యం అమ్ముతుండగా పట్టుకున్నట్లు తెలిపారు. మద్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ బెల్ట్ మద్యాన్ని అంగళ్లులోని సూరి వైన్స్, రుద్ర వైన్స్ నుంచి కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. దీంతో మద్యం షాపు ఓనర్లు, టీడీపీ నాయకులు సూరి, బాలకృష్ణను కూడా నిందితులుగా చేర్చి కేసు నమోదు చేశామన్నారు. బెల్ట్ షాపుల వ్యవహారంలో అధికార టీడీపీ మద్యం షాపు ఓనర్లపై కూడా కేసు నమోదు కావడంతో ఆ పార్టీ శ్రేణులు ఉలిక్కి పడుతున్నాయి. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఎక్కడైనా మద్యం బెల్ట్ షాపులు ఉన్నట్లయితే 9440900705 మొబైల్ నెంబరుకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. మద్యం షాపు ఓనర్లపైనా కేసు నమోదు మరో ఇద్దరి అరెస్టు -
యువతను వంచించిన చంద్రబాబు
రైల్వేకోడూరు అర్బన్ : ఎన్నికల ముందు యువత, నిరుద్యోగులు, విద్యార్థులకు మాయమాటలు చెప్పి హామీలు ఇచ్చి అధికారం చేపట్టాక చంద్రబాబు, పవన్కల్యాణ్, లోకేష్లు యువత, నిరుద్యోగులను నయవంచన చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఈనెల 12న జరిగే యువత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది అవుతున్నా ఒక్కహామీ ఊసు కూడా లేదన్నారు. యువత, విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు ఆడుకొంటున్నారని ధ్వజమెత్తారు. ఫీజు ఈ ఎంబర్స్మెంట్ లేక విద్యార్థుల చదువులు కుంటు పడుతున్నాయని తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యం ఇచ్చి, ఫీజు రీ ఎంబర్స్మెంట్, అమ్మ ఒడి, నాడునేడు, ఇంగ్లీష్ మీడియం ఇలా చదువుకు అండగా ఉండి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తమకు వద్దని కేంద్రానికి తెలియజేసిన ఏకై క ముఖ్యమంత్రి చంద్రబాబేనని విమర్శించారు. యువత, నిరుద్యోగుల కోసం ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించి, నిరుద్యోగులకు రూ.2000 నిరుద్యోగ భృతి ఇవ్వకుంటే చొక్కా పట్టుకోవాలని లోకేష్ నాడు సభల్లో చెప్పాడని, అలాగే కూటమి చెప్పే మాటలకు తాను హామీగా ఉండి ప్రశ్నిస్తానన్న ఉప ముఖ్యమంత్రి పవనన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లాడని ప్రశ్నించారు. చంద్రబాబు వంచనకు నిరసనగా ఈనె 12న రాయచోటిలో జరిగే నిరసన, కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు యలగచెర్ల శివప్రసాద్రెడ్డి, జెడ్పీటీసీ రత్నమ్మ, రమేష్, మందల నాగేంద్ర, అన్వర్బాషా, తల్లెం భరత్కుమార్రెడ్డి, కౌరెడ్డి సిద్దయ్య, ఉమామహేశ్వర్రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల -
ఒత్తిడి వద్దు..పదిని జయించు
మదనపల్లె సిటీ : వార్షిక పరీక్షలు సమీపిస్తున్న సమయాన విద్యార్థుల్లో భయాన్ని తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని కలిగించేలా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరీక్షలు సమీపిస్తున్న వేళ ఎక్కువ మార్కులు సాధించాలని, మంచి ర్యాంకు రావాలని తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ తరుణంలో మోదీ మాటలను ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందే. జిల్లాలో గత ఏడాది మార్కులు తక్కువ వచ్చాయని కొందరు విలువైన జీవితాన్ని కోల్పోయారు. పది మార్కులే జీవితం కాదన్న సత్యాన్ని అంతా గ్రహించాలి. ఇంకా వారం రోజులు సమయం ఉందని, ఒత్తిడికి లోను కావద్దని, పక్కా ప్రణాళికతో చదివితే మంచి మార్కులు, ర్యాంకు సాధించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. నిత్యం పాఠశాలలో రాసే పరీక్షల వంటివే అన్న భావనతో సిద్ధమవ్వాలని చెబుతున్నారు. ఏం చేయాలంటే.. సమయానికి ఆహారం తీసుకోవాలి. పండ్లు ఎక్కువగా తినాలి. పరీక్ష వేళ ఒత్తిడికి గురికాకుండా తగిన నిద్ర అవసరం. అన్ని సబ్జెక్టులకు సమయాన్ని కేటాయించుకుని చదువుకోవాలి. కష్టమైన సబ్జెక్టుని ఇష్టంగా చదువుకోవాలి. బృందపఠనం అవసరం. ఏకాగ్రత కోసం ఉదయాన్నే ధ్యానం వంటి సాధనలు చేయాలి. అనుమానాలను ఉపాధ్యాయులతో చర్చించి నివృత్తి చేసుకోవాలి. పక్కా ప్రణాళకతో చదవాలి నిపుణుల సూచన -
ఖాళీ బిందెలతో నిరసన
సాక్షి రాయచోటి : జిల్లాలో తాగునీటికి ప్రమాద ఘంటికలు కళ్లేదుటే కనిపిస్తున్నాయి. వేసవి తాపం భయపెడుతుండగా ప్రజలు తీరని దాహంతో అల్లాడిపోతున్నారు. జిల్లాకేంద్రమైన రాయచోటిలో ఇప్పటికే ప్రజలు మంచినీరో రామచంద్రా...అంటున్నారు. అనేక కాలనీల్లో నీరు రావడానికి నాలుగైదు రోజుల సమయం పడుతుందంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతున్నాయి. భూగర్బ జలాలు అడుగంటడం ప్రారంభమైన నేపథ్యంలో చెరువులు, కుంటల్లో ఉన్న నీరు ఇంకిపోతే బోర్లలో కూడా కనీస నీటిమట్టం గగనమవుతుంది. ఇప్పటికే తాగునీటి బోర్లలో రోజురోజుకు నీరు ఇంకిపోతుండడం ఆందోళన కలిగించే పరిణామం. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా రానున్న కాలంలో విపత్కర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి ఆశాజనకంగా వర్షాలు లేకపోవడంతో పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో చెరువులు, కుంటలు కనిపించడం లేదు. ఇప్పుడిప్పుడే తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చుతున్నా ఏప్రిల్, మే నెలల్లో మరింత తీవ్రం కానుందని తెలుస్తోంది. పరిస్థితి తీవ్రతను ముందే అంచనా వేసి ఈ పాటికే నివారణ చర్యలు చేపట్టి ఉంటే ప్రజలకు తాగునీటి కష్టాలు కొంతవరకై నా తప్పేవి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి డైవర్షన్ పాలిటిక్స్, ప్రచార పటాటోపాలపై ఉన్న ఆసక్తి ప్రజల పట్ల లేకపోవడమే ఈ దుస్థితికి కారణమన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాయచోటి మున్సిపాలిటీలో దాహం...దాహం జిల్లా కేంద్రమైన రాయ చోటిలో ప్రజల నుంచి దాహం కేకలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా రా యచోటిలోని పలు కాల నీలకు సంబంధించి నీటి కోసం వారం రోజులు పడుతోంది. అంతేకాకుండా కొనుగోలు చేస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. ప్రధానంగా వెలిగల్లు ప్రాజెక్టుకు సంబంధించి రెండో పైపులైన్ పనులు నిలిచిపోవడంతో రాయచోటికి తాగునీటికి ఇబ్బందులు ఎ దురవుతున్నాయి. అంతో, ఇంతో నీరు లభిస్తున్నా పూ ర్తి స్థాయిలో రెండో పైపులైన్ ఉంటేనే ప్రజలకు ఇబ్బంది లేకుండా అందించేందుకు అవకాశం ఉంటుంది. 8గ్రామాలను తాకుతున్న తాగునీటి సమస్య పట్టణాల్లోని శివారు ప్రాంతాలే కాకుండా గ్రామాలను తాగునీటి ఎద్దడి తాకింది. నందలూరు మండలంలోని ఎస్టీ కాలనీల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఎక్కడో పొలాల వద్దకు వెళ్లి మంచినీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. అలాగే మిగిలిన నియోజకవర్గాల్లోని అనేక గ్రామాల్లో రానున్నరోజుల్లో తాగునీటి సమస్య తీవ్రమయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే స్కీముల్లోని బోర్లు కూడా ఎండ సెగ తగిలి భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఏది ఏమైనా ఈ వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడడం అధికారులకు తలకుమించిన భారంగా మారనుంది. ఇప్పటికే రాయచోటిలో దాహం కేకలు పల్లెల్లో సైతం మోగుతున్న తాగునీటి సైరన్ ఎండిపోతున్న సీజనల్ బోర్లు జిల్లాలో వేసవి కాలం వచ్చిందంటే సీజనల్ బోర్లు ఎండిపోతున్నాయి. కేవలం వర్షాకాలం, ఇతర సీజన్లలో నీరు ఉన్నప్పుడు మాత్రమే బోర్లు పనిచేస్తున్నాయి. వేసవి ప్రారంభమైందంటే భూగర్బ జలాలు అడుగంటి సీజనల్ బోర్లు పనికుండా ఉన్నాయి. 10 సీపీడబ్ల్యూ, 4896 పీడబ్ల్యూఎస్ స్కీములు ఉన్నాయి. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా 8946 బోర్లు ఉండగా, అందులో 2980 సీజనర్ బోర్లు ఎండిపోయాయి. సమస్య తలెత్తకుండా చర్యలు జిల్లాలో ఎక్కడా కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఎక్కడెక్కడా ప్రమాదం ఉంటుందన్న విషయం తెలుసుకుని పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాం. వేసవి నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల్లో కొంత నీటికి ఎక్కువ డిమాండ్ ఏర్పడనుంది. అందుకు అనుగుణంగా పరిష్కారానికి అన్ని చర్యలు చేపడుతున్నాం. – ప్రసన్నకుమార్, సూపరింటెండెంట్ ఇంజినీరు, ఆర్డబ్ల్యూఎస్, రాయచోటి, అన్నమయ్య జిల్లా సిద్దవటం : మండలంలోని వెంకటేశ్వరపురం, మాధవరం–1 గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆయా ప్రాంతాల ప్రజలు సోమవారం ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ వెంకటేశ్వరపురంలోని ప్రజలకు 2 వారాలకు ఒక సారి తాగునీరు వస్తోందని, అవికూడా 3,4 బిందెలు మాత్రమే వస్తున్నాయన్నారు. తాము రోడ్డు అవతలికి వెళ్లి మంచినీళ్లు తెచ్చుకుంటున్నామన్నారు. మరికొందరు ఒకక్యాన్ రూ. 10 చెల్లించి తాగుతున్నామని వాపోయారు. తాగునీరు రావడం లేదని సర్పంచ్ను అడిగితే 2నెలల వరకు రావంటాడు, మా సమస్యను ఎవరికి చెప్పుకోవాలన్నారు. మాధవరం–1 గ్రామ ప్రజలు తాగునీరు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. తాగునీటి కోసం కొళాయిల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని, ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
వీఆర్వో అక్రమాలపై బాధితుల గగ్గోలు
గాలివీడు : అవినీతి వీఆర్వో బాగోతం తవ్వేకొద్దీ అక్రమాలు కోకొల్లలుగా బయటకు వస్తున్నాయి. ‘వీఆర్వో రూటే సప‘రేటు’శీర్షికతో ఆదివారం సాక్షిలో వెలువడిన కథనంతో సోమవారం బాధితులు మూకుమ్మడిగా రెవెన్యూ కార్యాలయం వద్దకు చేరుకుని తహసీల్దార్ ముందు వీఆర్వో రవీంద్రారెడ్డి చేసిన అవినీతి అక్రమాలపై గగ్గోలు పెట్టుకున్నారు. బాధితులు కొండ్రెడ్డి చిన్న రెడ్డన్న తన అనుభవంలో ఉన్న సర్వే నంబర్ 900బీ1లో 40 సెంట్ల భూమి ఇతరుల పేరుపై ఆన్లైన్ చేయించారని, అలాగే దాదినేని నారాయణ పట్టా భూమి సర్వే నంబర్ 2343/4, 2344/4, 2344/6 లలో మొత్తం 75 సెంట్ల భూమిని సదరు వీఆర్వో మామూళ్లకు ఆశపడి వేరొకరి పేరుపై ఆన్లైన్ చేయించాడని వాపోయారు. ఇలా చాలామంది బాధితులు తహసీల్దార్ భాగ్యలత ముందు తమ గోడును వినిపించగా వారి స్టేట్మెంట్ను రాతపూర్వకంగా రికార్డు చేశారు. వీఆర్వోపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపుతామని, ఉన్నతాధికారులకు నివేదిక పంపుతానని తహసీల్దార్ తెలిపారు. ఇదిలా ఉండగా వీఆర్వో అర్హులకు న్యాయం చేయకుండా ముడుపులు తీసుకుని అనర్హులకు మేలు చేస్తున్నాడని కొందరు వాపోతున్నారు. వీఆర్వో బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, మండల స్థాయి అధికారులను ప్రభావితం చేస్తుండటంతో చాలామంది స్వేచ్ఛగా ముందుకొచ్చి వారికి జరిగిన అన్యాయాన్ని చెప్పుకోలేకపోతున్నారు. జిల్లా స్థాయి అధికారులు స్పందించి.. క్షేత్రస్థాయిలో పర్యటించి వీఆర్వో అక్రమాలపై విచారణ చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. ‘సాక్షి’కథనంతో విచారణ చేపట్టిన తహసీల్దార్ -
అల్లాహ్ ప్రార్థనకు పిలుపు.. అజాన్
కడప కల్చరల్ : తెల్లవారుజాము సమయం. చిరు చీకట్లను తరిమివేస్తూ వెలుగు రేఖలు విచ్చుకుంటున్న వేళ. ఆ ప్రశాంత సమయంలో ‘అల్లాహు అక్బర్’ అంటూ గంభీరమైన స్వరం. అల్లాహ్ను ప్రార్థించేందుకు రమ్మంటూ ఇస్తున్న పిలుపు హృదయాన్ని తాకుతున్న ఆ ఆహ్వానాన్ని అందుకుని మనసారా దైవ ప్రార్థనలు చేసేందుకు సిద్ధమవుతున్న ముస్లింలు. మసీదులలో దైవ ప్రార్థనలకు రావాలంటూ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఐదుమార్లు ఇలా అజాన్ పిలుపు వినిపించడం అందరికీ తెలిసిందే. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు ప్రతిరోజు ఐదుసార్లు నమాజ్ను అధిక సంఖ్యలో మసీదులకు తరలివచ్చి ఆచరిస్తారు. ఇందులో భాగంగా ఆజాన్ గురించి కడప నగరానికి చెందిన ధర్మ పరిచయ కమిటీ ప్రతినిధి హజరత్ సయ్యద్ అహ్మద్ (బాబుభాయ్) ఇలా వివరిస్తున్నారు. ప్రపచంలోని ముస్లింలందరికీ ఈ పవిత్ర రంజాన్ మాసం ప్రాణప్రదమైనదిగా భావిస్తారు. ఈ జన్మకు ముక్తిని ప్రసాదించే దివ్య వరంగా భావించి ఈ సందర్భంగా దైవం సూచించిన మార్గాలలో తప్పక అనుసరిస్తారు. సాధారణ రోజుల్లో ఆచరించే ప్రార్థనలతోపాటు ప్రతిరోజు తరావీ ప్రార్థనలు చేయడం ఈ మాసం ప్రత్యేకతగా చెప్పవచ్చు. కేవలం రంజాన్ మాసంలోనే గాక మిగతా రోజుల్లో కూడా ముస్లింలు రోజూ ఐదు మార్లు ప్రార్థనలు చేస్తారు. రోజువారి పనుల్లో నిమగ్నమైన వారికి ప్రార్థనా సమయం ఆసన్నమైందని తెలుపుతూ మసీదుల్లోని మౌజన్లు ‘అల్లాహు అక్బర్’ అంటూ పిలుపునిస్తారు. అజాన్ విన్న వెంటనే వీలైనంత త్వరగా మసీదులకు చేరుకుని ప్రార్థనలు చేస్తారు. ఆజాన్లో వచ్చే వాక్యాలు అరబ్బీ భాషలో ఉన్నాయి. ఐదు పూటల నమాజుకు ముందు సమీపంలోని ముస్లింలందరికీ ప్రార్థనలకు వేళ అయిందని సూచిస్తూ ఇచ్చే ఈ పిలుపు ముస్లింల రోజువారి జీవితంలో ఒక భాగమైంది. ఈ పిలుపు వినగానే అసంకల్పితంగా ముస్లింలు మసీదు వైపు వెళతారు. అజాన్ అర్థం తెలిసిన వారు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అజాన్ వెనుక కథ ఏకేశ్వరుడైన అల్లాహ్ను సామూహికంగా ఆరాధించేందుకు ప్రజలందరికీ ఎలా సమీకరించాలన్న విషయంపై ప్రవక్త తన అనుచరులతో సంప్రదింపులు జరిపారు. ‘బూర’ ఊది గుర్తించాలని కొందరు, డోలు మోగిస్తే బాగుంటుందని మరికొందరు, జెండా ఊపితే మంచిదని మరికొందరు ఇలా రకరకాల సలహాలు ఇచ్చారు. ఈ విషయంగా అబ్దుల్లా బిన్ జైద్ ర.జి. దీర్ఘంగా ఆలోచించడం ప్రారంభించారు. ఒక రాత్రి కలలో ఇప్పుడు మనం వింటున్న అజాన్ పిలుపులోని మాటలను ఆయన అనుభూతించారు. ఈ విషయాన్ని మహా ప్రవక్తకు తెలిపారు. హజరత్ ఉమర్ ర.జి.లు కూడా ఇదే కలగన్నారు. విషయం తెలుసుకున్న ప్రవక్త మహనీయుడైన ఉమర్ను పిలిచి వచ్చిన కల గురించి అడిగారు. తనకంటే ముందు అబ్దుల్లా బిన్ జైద్ ఈ కలగన్నారని, కనుక ఆయన ద్వారానే వివరాలు వినడం మంచిదని భావిస్తున్నామని ఉమర్ తెలిపారు. ప్రవక్త తన ప్రియ సహచరుడు హజరత్ బిలాల్ ర.జి.ని పిలిచి అబ్దుల్ బిన్ జైద్ ఏ వాక్యాలు పలుకుతారో వాటిని మీరు గొంతెత్తి గట్టిగా పలకాలని ఆదేశించారు. ఆ వాక్యాలకు అజాన్ అనే పేరు ఖరారైంది. మసీదుల్లో అజాన్ పిలుపునిచ్చే వ్యక్తిని మౌజన్ అంటారు. ఈ పిలుపు ద్వారా ‘ఓ మానవులారా అల్లాహ్ సర్వోన్నతుడు.. గుణ విశేషణాలలో అద్వితీయుడు.. స్వయం ప్రభువు, ఆది మధ్యాంత రహితుడు, అనంతుడు, పోలిక లేనివాడు, నిర్వికారుడు, సమస్త సృష్టికి నిర్దేశకుడు, సర్వశక్తివంతుడు, అంతర్యామి, సృష్టికర్త’ అని వివరిస్తాడు.రంజాన్ ఉపవాసాల నేపథ్యంలో కథనంఅజాన్.. దాని అర్థం ఇలా ఉంది అల్లాహు అక్బర్...అల్లాహు అక్బర్... అల్లాహు అక్బర్....అల్లాహు అక్బర్... (అల్లాహ్ సర్వోన్నతుడు) అష్హదు అన్ లాయిలాహ ఇల్లల్లాహ్ అష్హదు అన్ లాయిలాహ ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కాదని నేను సాక్ష్యం ఇస్తున్నాను) అష్హదు అన్న మహమ్మదర్రసూలుల్లాహ్ అష్హదు అన్న మహమ్మదర్రసూలుల్లాహ్ (మహమ్మద్(సొ.అ.వ) అల్లాహ్ సందేశ హరులు అని నేను సాక్ష్యం పలుకుతున్నాను) హయ్య అలస్సలాహ్....హయ్య అలస్సలాహ్ (రండి నమాజ్ వైపునకు రండి) హయ్య అలల్ఫలాహ్...హయ్య అలల్ఫలాహ్ (రండి సాఫల్యం వైపునకు) అస్సలాతు ఖైరుమ్ మిన్నన్నౌమ్ అస్సలాతు ఖైరుమ్ మిన్నన్నౌమ్ (నిద్రకన్నా నమాజ్ ఉత్తమమైనది) అల్లాహు అక్బర్....అల్లాహు అక్బర్ (అల్లాహ్ సర్వోన్నతుడు) లా ఇలాహ ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్యులు లేరు) ‘అస్సలాతు ఖైరుమ్ మిన్నన్నౌమ్’– ఈ వాక్యాలను తెల్లవారుజామున ఇచ్చే అజాన్లో మాత్రమే పలుకుతారు. -
కుటుంబ సమస్యలతో కూలీ ఆత్మహత్య
మదనపల్లె : మద్యానికి బానిసై తరచూ కుటుంబ సభ్యులతో గొడవపడుతూ, మనస్థాపం చెంది కూలీ ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం రాత్రి మదనపల్లెలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ఎరగ్రుంట్లపల్లెకు చెందిన సుంకప్ప, విజయలక్ష్మి దంపతుల కుమారుడు ఎస్.రాజు (38), 20 సంవత్సరాల క్రితమే ఉపాధి కోసం మదనపల్లెకు వచ్చాడు. పట్టణంలోని గజ్జలకుంట తిలక్వీధిలో నివసిస్తూ నీరుగట్టువారిపల్లె టమాటా మార్కెట్లో కూలీగా పని చేస్తున్నాడు. తల్లిదండ్రులు మృతి చెందడం, భార్య తనని వదిలేసి వెళ్లిపోవడంతో, 10 సంవత్సరాల క్రితం గజ్జలకుంటకు చెందిన దేవితో సహజీవనం చేస్తున్నాడు. ఆమెకు వాణిశ్రీ మౌనిక ఇద్దరు కుమార్తెలు ఉండగా ఆరు నెలల క్రితం వాణిశ్రీకి వివాహం చేశారు. ప్రస్తుతం దేవి మరో కుమార్తెతో కలిసి రాజు ఉంటున్నాడు. కొంతకాలంగా మద్యానికి తీవ్రంగా బానిసై ప్రతిరోజు ఇంట్లో భార్యతో గొడవ పడేవాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగేది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన రాజు భార్య దేవితో గొడవపడి కొట్టాడు. దెబ్బలు తాళలేక ఆమె కుమార్తె మౌనికను తీసుకుని గజ్జల గుంటలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఉదయం తిరిగి ఇంటికి వచ్చి చూడగా తలుపులు కిటికీలు మూసి ఉండడంతో, బయట నుంచి కిటికీ తలుపులు తోసి లోపలికి చూడగా, రాజు ఇంట్లో చీరతో ఉరి వేసుకుని వేలాడుతూ ఉండడాన్ని గమనించి కేకలు వేసింది. దీంతో స్థానికులు టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సమస్యల కారణంగా తీవ్ర మనస్తాపం చెంది ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు, దేవి పోలీసులకు తెలిపారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ రామచంద్ర తెలిపారు. వేతనాలు పెంచాలంటూ అంగన్వాడీల ధర్నా రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేశారు. కార్యకర్తలకు చట్ట ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలన్నారు. కనీస వేతనాలు చెల్లించాలని కోరారు. శాంతియుతంగా ధర్నా చేసేందుకు విజయవాడ వెళుతున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి జాన్ ప్రసాద్, అధ్యక్షురాలు రమాదేవి, రాధాకుమారి, శిరీషా, లీలావతి పాల్గొన్నారు. అంగన్వాడీల అరెస్టులు దుర్మార్గంరాజంపేట రూరల్ : విజయవాడలో తలపెట్టిన మహాధర్నాకు బయలు దేరిన అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి ఈ. సికిందర్ పేర్కొన్నారు. స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజమండ్రి, కోనసీమ జిల్లాలలో రిజర్వేషన్ చేసుకొని బస్సు ఎక్కిన అంగన్వాడీలను దించివేయడం కూటమి ప్రభుత్వానికి తగదన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు, నరసింహ, జమాల్, రమణ, రవి, రాఘవ, తదితరులు పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
రాయచోటి : తాళం వేసిన ఇళ్లే టార్గెట్గా పట్ట పగలు దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 200 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. సోమవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కచ్చిలేట్ వెంకటేశ్వర్లు తిరుపతి జిల్లా అంబేద్కర్ కాలనీ ఆటోనగర్లో ఉంటున్నాడని తెలిపారు. ఇతనిపై తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాలో దొంగతనాలకు పాల్పడినట్లు 19 కేసులు నమోదయ్యాయన్నారు. రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2024 అక్టోబర్ 8వ తేదీన దొంగతనానికి పాల్పడిన కేసులో వెంకటేశ్వర్లు నిందితుడిగా ఉన్నాడన్నారు. పోలీసులకు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాయచోటి సీసీఎస్, రైల్వేకోడూరు పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టి ఈనెల 9న అదుపులోకి తీసుకున్నారన్నారు. తాళం వేసిన ఇంటిలో పగటిపూట దొంగతనాలు చేయడం వృత్తిగా అలవర్చుకున్నట్లు తెలిపారు. వెంకటేశ్వర్లుపైన 19 కేసులు నమోదు కాగా అందులో ఒక మర్డర్ కేసు, హత్యాయత్నం కేసు, మిగిలిన 17 దొంగతనం కేసులు నమోదయ్యాయన్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న సమయంలో నిందితుడికి ప్రమాదం జరిగి కుడి కాలుకు సర్జరీ చేసి రాడ్లు వేశారన్నారు. అతని వద్ద నుంచి సుమారు 200 గ్రాముల బంగారం నగదు, ఒకసోని ఏ7 కెమెరాను స్వాధీనం చేసుకున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న నగల విలువ రూ.17.50 లక్షలుగా ఉందన్నారు. నిందితుడు నడవ లేని స్థితిలో చికిత్స పొందుతుండటం వలన 35(3) బీఎన్ఎస్ యాక్టు కింద నోటీసు ఇచ్చామన్నారు. ఈ కేసును ఛేదించడంలో రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, సీసీఎస్ సీఐ ఎం.చంద్రశేఖర్, రైల్వేకోడూరు సీఐ హేమసుందర్, సీసీఎస్ ఎస్ఐ రామకృష్ణారెడ్డి, కోడూరు ఎస్ఐ నవీన్, సీసీఎస్ కోడూరు పోలీసు సిబ్బందిని అభినందించారు. సీసీ కెమెరాలతో ప్రయోజనం.. ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల గుర్తింపు, నేరాల పరిశీలనకు సీసీ కెమెరాలు ఏర్పాటుతో చెక్ పెట్టవచ్చని, వీటి ఏర్పాటు వలన అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. మార్కెట్లు, బస్టాండు, రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్, ఇళ్లు, అపార్ట్మెంట్లు, దేవాలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అవసరమన్నారు. ప్రతి సమస్యకు చట్ట పరిధిలో పరిష్కారం రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులకు చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చట్ట పరిధిలో బాధితులకు న్యాయం జరిగేలా భరోసా కల్పించాలని, పోలీసులు నిష్పక్షపాతంగా చట్టప్రకారం దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఫోన్ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. పట్టపగలే చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు 200 గ్రాముల బంగారు నగలు, కెమెరా స్వాధీనం ఎస్పీ విద్యాసాగర్ నాయుడు -
● వైభవం.. తిరుచ్చి ఉత్సవం
గుర్రంకొండ మండల పరిధి తరిగొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తిరుచ్చి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన ఆదివారం ఉదయాన్నే మూలవర్లకు శుద్ధితోమాల సేవ నిర్వహించారు. ఆలయంలో స్వామి వారికి ఊంజల్సేవ నిర్వహించారు. తిరుచ్చిలో స్వామివారికి అలంకరణ కావించారు. ఈ సందర్భంగా తిరుచ్చి ఉత్సవం గ్రామ వీధుల మీదుగా మేళతాళాలతో, జానపద కళాకారుల భజనలతో కనుల పండువగా నిర్వహించారు. అనంతరం స్నపన తిరమంజనం కావించారు. వాహన మండపంలో స్వామివారి వాహనాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. స్వామివారు పెద్దశేషవాహనంపై కొలువుదీరి గ్రామ వీధుల్లో విహరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. – గుర్రంకొండ● గంగమ్మ ఆలయం.. పోటెత్తిన భక్తజనంభక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ అనంతపురం గంగమ్మ తల్లికి బోనాలు ఎత్తికుని వేలాది మంది భక్తులు ఆదివారం మొక్కులు తీర్చుకున్నారు. జాతర ముగిసిన తరువాత మొదటి ఆదివారం కావడంతో ఇటు గ్రామంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. క్యూలైన్లు కిటకిటలాడాయి. అమ్మవారి దర్శనానికి గంటల కొద్దీ వేచి ఉండాల్సి వచ్చింది. ఆలయ పూజారులు చెల్లు గంగరాజు, దినేష్ యాదవ్, రామచంద్ర, వెంకటేష్, గురుస్వామి, రెడ్డిశేఖర్,బోస్ యాదవ్, సాయిలు తీర్థప్రసాదాలు అందజేశారు. లక్కిరెడ్డిపల్లి పోలీసులతోపాటు ఆలయ ప్రత్యేకాధికారి శ్రీనివాసులు భక్తులకు సౌకర్యాలు కల్పించారు. జాతర సందర్భంగా ఏర్పాట్లు చేసిన శీతల పానియాలు, దుకాణాలు, మిఠాయి కొట్టులు, చెరుకుల బండ్లు ఇంకా ఉండటంతో భక్తులు కొనుగోలు చేశారు. కొందరు తలనీలాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, వేలాది మంది భక్తులు తదితరులు పాల్గొన్నారు. – లక్కిరెడ్డిపల్లి● క్షేత్రం.. తిరునాల శోభితంసంబేపల్లె మండల పరిధి శెట్టిపల్లె గ్రామం అడవికమ్మపల్లె సమీపంలో కొలువైన శ్రీ అక్కదేవతల తిరునాల ఆదివారం వైభవంగా జరిగింది. ఆలయాన్ని వివిధ రకాల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అక్కదేవతలతోపాటు ఆలయంలో శివలింగేశ్వరులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. గ్రామంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాత్రి చాందినీ బండ్ల మెరవణితోపాటు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఉత్సవ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. – సంబేపల్లె -
పేద విద్యార్థులకు మద్దతుగా పోరుబాట
రాజంపేట టౌన్ : పేద విద్యార్థులకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పడుతున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి తెలిపారు. లక్షలాది మంది విద్యార్థులు, యువతను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వం తీరును ఎండగట్టేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 12వ తేదీ తలపెట్టిన ‘యువత పోరు’ పోస్టర్లు ఆదివారం రాజంపేట పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్రెడ్డితో కలిసి ఆకేపాటి విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా పేద విద్యార్థులపై సీఎం చంద్రబాబునాయుడు కక్షగట్టారని అన్నారు. ఐదు త్రైమాసికాలుగా చెల్లించక పోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలలకు ఫీజులు చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద విద్యార్థులు చదువులు మానేసి కూలీ పనులకు వెళ్లే దయనీ పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేద పిల్లలకు పెద్ద చదువుల కల సాకారం చేసిన వైఎస్సార్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి పేద పిల్లలు పెద్ద చదువులు చదివే కలను సాకారం చేశారని తెలిపారు. నిరుపేద ఇళ్ల నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, సైంటిస్టులు తయారు కావాలన్న సమున్నత లక్ష్యంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. అయితే అనంతరం వచ్చిన ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చుతూ వచ్చాయన్నారు. 2014–2019 మధ్య కాలంలో సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తిలోదకాలు ఇచ్చారని దుయ్యబట్టారు. పకడ్బందీగా అమలు చేసిన జగన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో మేలు చేకూరిందని తెలిపారు. అంతేకాక జగనన్న వసతిదీవెన పథకం ద్వారా పేద విద్యార్థులు హాస్టల్లో ఉంటూ చదువుకునేందుకు నెలకు రెండు వేల రూపాయిల చొప్పున ఇచ్చినట్లు పేర్కొన్నారు. పిల్లల తలరాతలు మారాలంటే ఒక విద్యతోనే సాధ్యం అని గట్టిగా విశ్వసించి జగన్ ప్రభుత్వం పేద విద్యార్థులకు ఎనలేని మేలు చేసినట్లు తెలిపారు. ఆ దిశగా జగన్ తన హయాంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు జగన్ ప్రభుత్వం 18 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిందన్నారు. ఫీజురీయింబర్స్మెట్పై చంద్రబాబు కుట్ర పేదలు చదువుకోకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబునాయుడు ఫీజు రీయింబర్స్మెంట్పై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పేద విద్యార్థులు చదువుకుంటే పేదరికం నుంచి బయటపడితే తమ అడ్రస్ ఎక్కడ గల్లంతు అవుతుందో అన్న భయంతో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదని ఆరోపించారు. యువతకు ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 20 లక్షల ఉద్యోగాలు.. లేకుంటే ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారన్నారు. అయితే వాటిని అమలు చేయలేదని విమర్శించారు. యువత పోరును విజయవంతం చేయండి ఈనెల 12వ తేదీన జిల్లా కేంద్రమైన రాయచోటిలో చేపట్టే ‘యువతపోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని నలుమూలల నుంచి విద్యార్థులు, నిరుద్యోగులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలి రావాలని తెలిపారు. అలాగే మార్చి 12న వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవమైనందున అన్ని మండలాలు, గ్రామాల్లో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఓ పండుగ వాతావరణంలో నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మర్రి రవి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కిషోర్రెడ్డి, వైఎస్సార్సీపీ వివిధ విభాగాల కన్వీనర్లు వడ్డే రమణ, డి.భాస్కర్రాజు, డీలర్ సుబ్బరామిరెడ్డి, శ్రీను, వివేకానందరెడ్డి, శివప్రసాద్రెడ్డి, దండు గోపి, జీవీ సుబ్బరాజు, మిర్యాల సురేఖ, ఖాజా మోహిద్దీన్, జాహీద్ అలీ, మసూద్, అబ్దుల్మునాఫ్, నరేష్, చింతల హరీష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘యువత పోరు’ ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాఽథ్రెడ్డి -
పౌల్ట్రీ ఫారం మూసివేత
గాలివీడు : హైకోర్టు ఆదేశాలతో గ్రామసభ తీర్మానం మేరకు శ్రీ షిరిడీ సాయి పౌల్ట్రీ ఫారాన్ని ఆదివారం మూసివేసినట్లు గోరాన్చెరువు పంచాయతీ కార్యదర్శి సరోజమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామస్తుల విన్నపం మేరకు ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించిన గ్రామసభలో ఈ మేరకు తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. గోరాన్ చెరువు గ్రామం దాసరివాండ్లపల్లెలో ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఫారం ద్వారా వెలువడే వ్యర్థాలు, దుర్వాసనతో స్కూల్ విద్యార్థులు, గ్రామస్తులు అనారోగ్యం పాలవుతున్నారన్న కారణంగా కోళ్ల ఫారాన్ని మూసివేస్తున్నట్లు పంచాయతీ అధికారులు తెలిపారు. నూతన కార్యవర్గం ఎన్నికకడప వైఎస్ఆర్ సర్కిల్ : రవాణాశాఖలో రాయలసీమ స్థాయిలో నాన్ టెక్నికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీటీడీ ఎన్టీఈఏ)కు సంబంధించి సీమ అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి లక్ష్మికర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన ప్రొద్దుటూరులో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. ఎన్నికకు సంబందించి ఫిబ్రవరి 22న నోటిఫికేషన్, 9న నామినేషన్ ప్రక్రియను ఎన్నికల అధికారి ఎం. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. జోన్ అసోసియేట్ ప్రెసిడెంట్గా ఈవై ప్రకాశ్ (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కడప), జోన్ వైస్ ప్రెసిడెంట్–1గా కె.సువర్ణకుమారి (అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, అనంతపురం), జోన్ వైస్ ప్రెసిడెంట్–2గా టీఎన్ పురుషోత్తంరెడ్డి (సీనియర్ అసిస్టెంట్, చిత్తూరు), జోన్ వైస్ప్రెసిడెంట్–3గా ఎస్.మనోహర్బాబు (జూనియర్ అసిస్టెంట్, ఆదోని), జోన్సెక్రటరీగా టి.విజయ్కుమార్ (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, మదనపల్లె), జోన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఓ.యువ కిశోర్ (సీనియర్ అసిస్టెంట్, తిరుపతి), జోన్ జాయింట్ సెక్రటరీ–1గా డి.నసీరుద్దీన్ (సీనియర్ అసిస్టెంట్, కర్నూలు), జోన్ జాయింట్ సెక్రటరీ–2 ఓ.నాగరాజ (సీనియర్ అసిస్టెంట్, మదనపల్లె), జోన్ జాయింట్ సెక్రటరీ–3 పి.చక్రపాణి (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, చిత్తూరు), జోన్ ట్రెజరర్గా ఎన్.రవిప్రకాశ్ (సీనియర్ అసిస్టెంట్, హిందూపురం)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కడపలోని రవాణా శాఖ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికై న 11 మందిని పలువురు రవాణాశాఖలో పనిచేసే ఉద్యోగులు, టెక్నికల్ సిబ్బంది సత్కరించారు. -
సంతోషం.. క్షణాల్లో బుగ్గి..
మదనపల్లె : చిక్కబళ్లాపురం జిల్లా చింతామణి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సొంతూరులో బంధువులను పలకరించి సంతోషంగా బెంగళూరుకు వస్తున్న కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. తల్లీ కుమారుడు సజీవ దహనమయ్యారు. చింతామణి సమీపంలోని కంచార్లపల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని మదనపల్లి రోడ్డులో జోగ్యానహళ్లి–గోపల్లి మధ్య ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో దుర్ఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న బ్యాలెనో కారును ప్రైవేటు బస్సు ఢీకొనడంతో కారు మంటల్లో కాలిపోయింది. బంధువుకు కొడుకు పుట్టాడని.. ధనుంజయరెడ్డి (30), ఆయన తల్లి కళావతి (52), ధనుంజయరెడ్డి భార్య శోభారాణి, కొడుకు మాన్విత్రెడ్డి (3), శోభారాణి తల్లి మహాలక్ష్మీ కారులో బెంగళూరుకు బయల్దేరారు. ధనుంజయరెడ్డి కారు నడుపుతున్నారు. ఆయన తండ్రి గోపాల్రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కడప నగరంలోని రాఘవేంద్ర టౌన్షిప్లో నివాసముంటూ ఆకాశవాణిలో ఉద్యోగం చేస్తున్నారు. ధనుంజయరెడ్డి, భార్య ఐటీ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తూ మహదేవపురలో నివాసముంటున్నారు. కడపలో శోభారాణి అన్న సుబ్బారెడ్డికి కొడుకు పుట్టడంతో శనివారం అందరూ వెళ్లి చిన్నారిని చూసి సంతోషంగా గడిపారు. బెంగళూరుకు తిరిగి వస్తుండగా చింతామణి దగ్గర ఎదురుగా బెంగళూరు నుంచి తిరుపతికి వెళుతున్న శ్రీ భారతి ప్రైవేటు బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. కారు రోడ్డు పక్కన పడి మంటల్లో చిక్కకుంది. అప్పటికే కారులోని వారు బయటకు ఎగిరిపడ్డారు. ధనుంజయరెడ్డి, తల్లి కళావతికి మంటలు అంటుకుని సజీవ దహనమయ్యారు. మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. బస్సు కూడా బోల్తా పడింది. అందులోని కొందరికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. కారు పూర్తిగా దగ్ధం స్థానికులు చేరుకుని క్షతగాత్రులకు సాయం చేశారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేసేటప్పటికి కారు పూర్తిగా దహనమైంది. జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సి, డీఎస్పీ మురళీధర్, సీఐ వెంకటరమణప్ప తదితరులు పరిశీలించారు. మృతదేహాలకు చింతామణి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. శోభారాణి, కొడుకు మాన్విత్, మహాలక్ష్మీలకు ప్రథమ చికిత్స నిర్వహించి బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. ఆస్పతి దగ్గర బంధువుల రోదనలు మిన్నంటాయి. కర్ణాటకలో కడపవాసుల కారుకు ప్రమాదం తల్లీ కుమారుడు సజీవ దహనం భార్య, కొడుకు, అత్తకు గాయాలు -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
చిన్నమండెం : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. చిన్నమండెం మండలంలోని మల్లూరుకు చెందిన ఉస్మాన్బాషా కుమారుడు రఫీ(34) ట్రాక్టర్ కింద పడి మృత్యువాత పడ్డాడు. గత పది సంవత్సరాలుగా ట్రాక్టర్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న రఫీ దేవగుడిపల్లె గ్రామ పంచాయతీలోని శ్రీ మండెం లక్ష్మీనరసింహస్వామి ఆలయం వెనుక ఉన్న మాండవ్య నదిలో.. ఆదివారం ట్రాక్టర్లో ఇసుక లోడు వేసుకుని తిరిగి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రఫీ ట్రాక్టర్ కిందపడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి వివాహమై ఇద్దరు కుమారులు ఉన్నారు. రఫీ మృతదేహం వద్ద తల్లిదండ్రులు, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ ఢీకొని.. ఓబులవారిపల్లె : బొమ్మవరం అడ్డరోడ్డు జాతీయ రహదారిపై లారీ ఢీకొనడంతో ఆర్. వెంకటేష్ (21) అనే యువకుడు మృతి చెందాడు. పుల్లంపేట మండలం అప్పారాజుపేట దళితవాడ గ్రామానికి చెందిన ఆర్.వెంకటేష్ స్కూటర్పై తన బంధువుల అబ్బాయి విజయ్తో కలిసి కోడూరుకు బయలుదేరాడు. మంగంపేట ఏపీఎండీసీ దాటిన అనంతరం బొమ్మవరం అడ్డరోడ్డు వద్దకు రాగానే వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో వెంకటేష్ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విజయ్ తీవ్ర గాయాల పాలయ్యాడు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. కళాశాల వార్షికోత్సవానికి వెళ్లి వస్తుండగా.. మదనపల్లె : రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి దుర్మరణం పాలైన సంఘటన శనివారం రాత్రి మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని ఎస్టేట్ శివాజీనగర్కు చెందిన శ్రీనివాసులు, శ్రీదేవి దంపతుల కుమారుడు సీవీ ఉదయ్కిరణ్(20) స్థానికంగా వివేకానంద కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. పుంగనూరు రోడ్డులోని ఆదిత్య కాలేజీలో జరిగిన వార్షికోత్సవానికి హాజరై రాత్రి తిరిగి ద్విచక్రవాహనంలో ఇంటికి వస్తుండగా, మార్గంమధ్యలోని కనుమలో గంగమ్మ గుడి సమీపంలో వాహనాన్ని అదుపుచేయలేక రోడ్డు పక్కన ఉన్న సైన్బోర్డును ఢీకొని, ఎగిరి అదే వేగంతో పక్కనున్న బంక్పై పడ్డాడు. ప్రమాదంలో తలకు, ముఖంపై తీవ్రగాయాలై అపస్మారక స్థితికి వెళ్లాడు. గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగ వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ గదికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు. -
అధికార బలంతో చెట్లు నరికివేస్తారా?
ఓబులవారిపల్లె : అధికారం ఉంది కదా తమను అడిగేవారే లేరని పచ్చటి మామిడి చెట్లను నరికి వేయడం దారుణమని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం. జయరామయ్య అన్నారు. బొమ్మవరం రెవెన్యూ పరిధిలోని ఎన్.పృథ్వీరాజ్ అనే రైతుకు చెందిన పది ఎకరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు నరికేసిన మామిడి చెట్లను బీకేఎంయూ నాయకులు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా జయరామయ్య మాట్లాడుతూ పృథ్వీరాజ్ అనే రైతుకు సంబంధించిన పది ఎకరాల పట్టా భూమికి కోర్టు అనుమతించినా.. తెలుగుదేశం పార్టీ నాయకులు బరితెగించి మామిడి చెట్లను నరికివేశారని పేర్కొన్నారు. కూటమి నాయకులు చివరకు కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి భూఆక్రమణలకు పాల్పడుతున్నారని, అడ్డుకోవాల్సిన అధికారులు ఏమీ చేయలేకపోతున్నారని విమర్శించారు. భూ ఆక్రమణలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకొని, కేసులు నమోదు చేసి నష్టపోయిన రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రమణ పాల్గొన్నారు.వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు