breaking news
Annamayya
-
అధ్యాపకుడికి అవార్డు
వాల్మీకిపురం : స్థానిక ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జువాలజీ అధ్యాపకుడు గురుమూర్తి ప్రతిష్టాత్మక ‘ఇండియన్ అచీవ్మెంట్ అవార్డు–2026’ అందుకున్నారు. కై ్లమేట్ యాక్షన్ ఛేంజ్, మదనపల్లె నగరవనం పరిధిలో మొక్కలు నాటడం, విత్తన బంతులు వెదజల్లడం, రక్తదాన శిబిరాల వంటి విస్తృత సేవా కార్యక్రమాలను ఆయన చేపట్టారు. గురుమూర్తి సేవలను గుర్తించిన ‘హోమ్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ సంస్థ ఏటా ఇచ్చే ఈ అవార్డును (అకడమిక్ ఎక్స్లెంట్ కేటగిరీ) ఆయనకు అందజేసింది. ఈ సందర్భంగా మంగళవారం కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థులు ఆయనను ఘనంగా అభినందించారు. 2న అథ్లెటిక్స్ పోటీలుప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 2న ఉదయం 9 గంటలకు అండర్ 18, 20 విభాగాల్లో సీ్త్ర, పురుషులకు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 16 ఏళ్లు నిండిన వారు ఆధార్, బర్త్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. వివరాలకు 99496 86586, 80198 80995 నంబర్లను సంప్రదించవచ్చు. మదనపల్లె టౌన్ : చెక్, క్లీన్, కవర్ పాటిద్దాం, డెంగీ వ్యాప్తిని నియంత్రిద్దామని జిల్లా మలేరియా అధికారి రామచంద్రారెడ్డి, డీహెచ్ఈఓ మహమ్మద్ రఫీ తెలిపారు. డెంగీ వ్యతిరేక మాసోత్చావాల సందర్భంగా మదనపల్లి సొసైటీ కాలనీ, నెహ్రు మున్సిపల్ హైస్కూల్, హోప్ మున్సిపల్ హైస్కూల్లలో హెచ్ఎంలు శీనప్ప, రఘు ఆధ్వర్యంలో విద్యార్థులకు డెంగీపై అవగాహన కల్పించారు. డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందే మలేరియా, డెంగీ, మెదడువాపు, ఫైలేరియా, చికున్గున్యా వ్యాధుల నివారణకు మూడు పద్ధతులు ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. పరిశీలించండి, శుభ్రపరచండి, మూతలు పెట్టండి ఈ పద్ధతులను పాటిస్తే డెంగీని ఒడించవచ్చని తెలిపారు. ప్రస్తుతం డెంగీ జ్వరాలు ఒక ప్రజా ఆరోగ్య సమస్యగా ఉందని ప్రజల్లో చైతన్యం, అవగాహన తోనే దోమల నియంత్రణ సాధ్యం అని అన్నారు. ప్రతీ శుక్రవారం డ్రైడేగా పాటిస్తూ, ఇంటి పరిసరాలు పరిశీలించి నీటి నిల్వలు లేకుండా శుభ్ర పరచుకోవాలని నీటి నిల్వల పైన మూతలు ఉంచాలన్నారు. అనంతరం డెంగీ వ్యతిరేక మాసోత్చవాలపై ప్రతిజ్ఞ చేయించారు. -
అంకాలమ్మ చెరువుకు హద్దులు లేవు..!
● చెరువు విస్తీర్ణం తేల్చని అధికారులు ● నోటీసు బోర్డు పెట్టి చేతులు దులుపుకొన్న సిబ్బందికలకడ : కలకడ అంకాలమ్మ చెరువు ఆక్రమణలకు గురవుతోంది. అక్రమణను నుంచి కాపాడేందుకు అధికారులు చెరువు విస్తీర్ణాన్ని తేల్చాలని ప్రయత్నించారు. అయితే రోజుంతా శ్రమించిన రెవెన్యూ అధికారులు చెరువు హద్దులు తేల్చలేక చేతులెత్తేశారు. చెరువు ఆక్రమణను గురవుతోందని స్థానికులు రెవెన్యూ, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎంత ఆక్రమణకు గురైంది.. విస్తీర్ణం ఎంత ఉందో తేల్చాని మంగళవారం రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. చెరువు ఆక్రమణపై 2018లో అప్పటి చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేయగా.. అప్పటి నుంచి ఎవరూ చెరువు ఆక్రమించలేదు. తిరిగి 2022లో మరికొందరు ఆక్రమణకు ప్రయత్నించగా.. అప్పటి కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్ ఆక్రమణ దారులకు నోటీసులు ఇచ్చి చెరువును కాపాడారని మంగళవారం తహసీల్దార్ మహేశ్వరిబాయి దృష్టి తెచ్చారు. అంకాలమ్మ చెరువు సర్వే నంబర్ 436లో 27 ఎకరాల 0–63 సెంట్లు విస్తీర్ణంలో ఉందని ఎవ్వరూ ప్రవేశించరాదని నోటీస్ బోర్డు ఏర్పాటు చేశారే తప్పా.. మొత్తం అంకాలమ్మ చెరువు విస్తీర్ణం కొలచి హద్దులు మాత్రం చూపలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. చెరువు హద్దులు, కాలువలు చూపాలని కోరుతున్నారు. -
యువకుడిపై దాడి
మదనపల్లె టౌన్: మదనపల్లి పట్టణంలో ఓ యువకుడిపై ప్రత్యర్థులు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మంగళవారం చోటు చేసుకున్న ఘటనపై బాధితుడు వన్టౌన్ పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. స్థానిక త్యాగరాజ వీధిలో కాపురం ఉంటున్న సలీం (30) పట్టణంలోని ఇందిరానగర్లో ఉంటున్న ఓ యువతిని ప్రేమిస్తున్నాడని యువతి సంబంధీకులు దాడి చేశారని బాధితుడు ఆరోపించాడు. దాడి ఘటనపై వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు టమాటా లారీ బోల్తా సంబేపల్లె : చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై మంగళవారం ఎర్రగుంట్ల సమీపంలో టమాటాలు తరలిస్తున్న లారీ బోల్తా పడింది. పోలీసుల వివరాల మేరకు.. కలకడ నుంచి హర్యానాకు టమాటా లోడుతో వెళుతున్న లారీ ఎర్రగుంట్ల బస్టాప్ దగ్గరకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. లారీలో ఉన్న టమాటా బాక్స్లు చెల్లాచెదురుగా పడ్డాయి. లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. గుర్తుతెలియని వ్యక్తి మృతి మదనపల్లె టౌన్: మదనపల్లె టమాటా మార్కెట్ యార్డ్ ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. 2 టౌన్ ఏఎస్ఐ కథనం ప్రకారం, సుమారు 60 ఏళ్ల వయసు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి వారం రోజులుగా మార్కెట్ యార్డులోని మండీల వద్ద ఉంటున్నట్లు మండి నిర్వాహకులు తెలిపారు. అనారోగ్యం కారణంగానో, లేదా సరిగా ఆహారం తీసుకోక పోవడం వల్లనో చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వెంటనే 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు కోరారు. దొంగతనం నెపంతో వ్యక్తిపై దాడి మదనపల్లి టౌన్: మదనపల్లె పట్టణంలోని సంత గేటు వద్ద ఎరగ్రడ్డల వ్యాపారం చేస్తున్న ఎస్కేఎం ట్రేడర్స్ యజమాని కరీం బాషా దుకాణంలో చోరీకి పాల్పడ్డాడని ఒక యువకుడిని రాతి స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన కలకలం రేపింది. మంగళవారం రాత్రి మదనపల్లి మండలం, వేంపల్లి గ్రామానికి చెందిన సి. నాగేంద్ర అనే వ్యక్తిపై ఎస్కేఎం ట్రేడర్స్ యజమాని సిబ్బందితో కలసి రాతి స్తంభానికి కొట్టారు. దుకాణంలో రూ. 20 వేల అపహరించాడనే అనుమానంతో దాడి చేసినట్లు తెలుస్తోంది. మదనపల్లి టూటౌన్ పోలీసులు వెంటనే సంఘటన జరిగిన సంత వద్దకు చేరుకుని నాగేంద్ర విడిపించి, పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పరిశ్రమల స్థాపనకు పూర్తి సహకారం: కలెక్టర్
మదనపల్లె : జిల్లా పారిశ్రామికాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ నిశాంత్కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో దక్షిణ కొరియాకు చెందిన ‘బూయంగ్’ కంపెనీ ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్శర్మతో ఆయన సమావేశమయ్యారు. వాల్మీకిపురం మండలం తాటిగుంటపల్లి ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటు చేయనున్న ఫుట్వేర్ పరిశ్రమపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బూయంగ్ కంపెనీ, ఎస్కేఐ కార్ప్ గ్రూప్తో కలిసి మూడు దశల్లో ఎగుమతుల ఆధారిత ఫుట్వేర్ కాంపోనెంట్స్ (షూ లేసులు, వెబ్బింగ్స్) తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులను అంతర్జాతీయ ప్రముఖ బ్రాండ్లకు సరఫరా చేస్తారని వెల్లడించారు. జిల్లాలోని భౌగోళిక అనుకూలత, విద్యుత్, నీటి లభ్యత, రవాణా సౌకర్యాలను ప్రతినిధులకు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి పారా ఒలింపిక్స్ స్పోర్ట్స్లో సత్తా
● 15 పతకాలు సాధించిన విద్యార్థులు ● జాతీయ స్థాయికి ఐదుగురు విద్యారుల ఎంపిక మదనపల్లె సిటీ: జిల్లా ప్రత్యేక ప్రతిభావంతుల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పారా ఒలింపిక్స్ స్పోర్ట్స్ మీట్లో విశేష ప్రతిభ కనబరిచి 15 పతకాలు సాధించారు. వీరిని మంగళవారం సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ అనురాధ ప్రత్యేక ప్రతిభావంతుల విద్యార్థులను అభినందించారు. జిల్లా సహిత విద్యా సమన్వయకర్త జనార్దన్ మాట్లాడుతూ ఈనెల 20వతేదీ నుంచి 22 తేదీ వరకు ఏలూరు జిల్లా అగిరిపల్లె హిల్ పార్యడైజ్లో జరిగిన రాష్ట్ర స్థాయి పారా ఒలింపిక్స్ స్పోర్ట్స్ పోటీల్లో కలకడ మండలానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి బి.దిలీప్కుమార్ 100 మీటర్ల పరుగు పందెం,షాట్ఫుట్లలో బంగారు పతకం సాధించారన్నారు. పెద్దమండ్యం జెడ్పీ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి హర్షవర్ధన్ 100 మీటర్ల పరుగుపందెంలో బంగారు,లాంగ్ జంప్ నందు వెండి పతకాలను సాధించినట్లు తెలిపారు. రాయచోటి మాసాపేట జెడ్పీ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి వెంకటమనోజ్ లాంగ్జంప్లో బంగారు, 100 మీటర్ల పరుగు పందెంలో వెండి, 2000 మీటర్ల పరుగుపందెంలో కాంస్య పథకం సాధించినట్లు తెలిపారు. ఐదుగురు విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయులు వెంకటనారాయణ, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. -
చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలలు జైలు
పుంగనూరు: చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన వ్యక్తికి ఆరు నెలలు జైలుశిక్ష, రూ.5.50 లక్షల జరిమానా విధిస్తూ పుంగనూరు అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి కృష్ణవంశి తీర్పునిచ్చారు. పట్టణానికి చెందిన పి.కేశవరెడ్డికి మదనపల్లెకి చెందిన కెనరాబ్యాంకు ఉద్యోగి నాగరాజు 2016లో రూ.5 లక్షలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. అయితే నాగరాజు చెక్కును కేశవరెడ్డికి ఇచ్చి డబ్బులు డ్రా చేసుకోమని సూచించాడు. దీనిపై కేశవరెడ్డి పుంగనూరులోని తన ఖాతాలో చెక్కును డబ్బు వసూలుకు దాఖలు చేశాడు. నాగరాజు చెల్లని చెక్కు ఇవ్వడంతో కేశవరెడ్డి మనస్తాపానికి గురై నాగరాజుపై పుంగనూరు కోర్టులో సీసీ నంబరు 455/2016గా కేసు దాఖలు చేశారు. దీనిపై పదేళ్లపాటు కేసు సుధీర్ఘవిచారణ సాగింది. సోమవారం విచారణ ముగియడంతో న్యాయమూర్తి కృష్ణవంశి తీర్పును వెలువరించారు. ఈ తీర్పులో నాగరాజు ఇవ్వాల్సిన చెక్కు డబ్బు రూ.5 లక్షలతో పాటు రూ.5.50 లక్షలు జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చారు. అలాగే చెల్లని చెక్కు ఇచ్చి మోసగించినందుకు 6 నెలల జైలుశిక్ష విధించారు. వ్యవసాయ మోటార్ల కేబుల్ వైర్ చోరీ గుర్రంకొండ: మండలంలోని సరిమడుగులో రైతుల వ్యవసాయ మోటార్ల వైర్ చోరీకి గురయ్యాయి. పంచాయతీ పరిధిలోని కృష్ణాపురం, సరిమడుగు గ్రామాల పరిధిలో సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పదిబోర్ల వద్ద 250 మీటర్ల కేబుల్ను చోరీ చేశారు. మంగళవారం ఉదయాన్నే పొలాల వద్దకు బోరుమోటారు ఆన్చేయడానికి వెళ్లిన రైతులకు కేబుల్ కత్తిరించినట్లు గుర్తించారు. ప్రతి మోటర్కు రూ.4వేలు ఖర్చు చేసి కేబుల్ వైరు కొనాల్సి వస్తుందని, మళ్లీ ఏ రోజు దొంగలు ఎత్తుకెళ్తారో కూడా తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిఘా పెట్టి దొంగలను పట్టుకొని రైతులను కాపాడాలని వారు వేడుకుంటున్నారు. విగ్రహాల చోరీ కేసులో వ్యక్తి అరెస్ట్ పుంగనూరు: వివిధ ఆలయాల్లో ఇత్తడి, రాగి, పంచలోహాల విగ్రహాలను చోరీ చేసిన వ్యక్తిని పట్టుకుని, అతడి వద్ద నుంచి విగ్రహాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సుబ్బరాయుడు తెలిపారు. మంగళవారం సీఐ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పీలేరు మండలం ఎర్రగుంట్లపల్లెకి చెందిన ఎలకపల్లి ప్రభాకర్ (39) అనే వ్యక్తి ఆలయాల్లో రాగి, ఇత్తడి, పంచలోహాల విగ్రహాలు, వస్తువులు చోరీ చేసుకుని బయట ప్రాంతాల్లో విక్రయించేవాడు. ఆటోలో విగ్రహాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని, ఆటోను సీజ్ చేశామని సీఐ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. -
ఆటా మహాసభలకు ఆహ్వానం
కడప సెవెన్రోడ్స్ : అమెరికా తెలుగు సంఘం (ఆటా) మహాసభలకు జిల్లాకు చెందిన ప్రముఖ వైమానిక అత్యవసర వైద్య చికిత్స నిపుణులు, ‘రియాక్ట్’ సంస్థ అధినేత డాక్టర్ నీల్ రోహిత్రెడ్డికి ఆత్మీయ ఆహ్వానం అందింది. ఈ నెల 31 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు అమెరికాలో జరగనున్న ఈ సభల్లో పాల్గొనేందుకు ఆయన మంగళవారం బయలుదేరి వెళ్లారు. చెన్నూరుకు చెందిన వైవీయూ తెలుగు ఆచార్యులు తప్పెట రాంప్రసాద్రెడ్డి, ఆచార్య రమాదేవి కుమారుడైన నీల్ రోహిత్రెడ్డి వైద్య రంగంలో విశేష గుర్తింపు పొందారు. -
వసతిగృహాలపై సవతిప్రేమ!
హాస్టళ్ల మూసివేతకు రంగం సిద్ధంమదనపల్లె సిటీ : పేద, సామాన్య కుటుంబాల పిల్లల చదువుల కోసం వెలిసిన సంక్షేమ వసతి గృహాలు ఇప్పుడు మూతబాట పట్టాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై ఒకటిన్నర నెల గడుస్తున్నా కనీస వసతులు కల్పించకపోగా, జిల్లాలో ఏకంగా 14 బీసీ సంక్షేమ వసతి గృహాలను మూసివేసేందుకు హడావుడిగా రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే హాస్టళ్లలో చేరిన నిరుపేద విద్యార్థులు ఇప్పుడు తమ భవిష్యత్తు ఏంటో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. విద్యార్థులు లేరనే సాకు.. జిల్లాలో బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఆశించిన సంఖ్యలో విద్యార్థులు లేరనే సాకు చూపిస్తూ అధికారు లు ఏకంగా 14 హాస్టళ్లను శాశ్వతంగా మూసివేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. నిరుపేద విద్యార్థుల చదువులకు ఆసరాగా నిలవాల్సిన ఈ వసతి గృహాలకు తాళాలు వేయాలని చూడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.వాస్తవానికి తంబళ్లపల్లెలోని బీసీ సంక్షేమ బాలుర వసతి గృహాన్ని గత ఏడాది నుంచే మూసి ఉంచారు. అలాగే నిమ్మనపల్లెలోని వసతి గృహాన్ని గతంలోనే మదనపల్లెకు మార్చేశారు. ఈ క్రమంలో మిగిలిన హాస్టళ్లలోని విద్యార్థులను సమీపంలోని ఇతర హాస్టళ్లలో గానీ లేదా రాయచోటిలోని మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ వెల్ఫేర్ గురుకుల హాస్టల్లో గానీ చేర్పించాల్సిందిగా అధికారుల నుంచి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. స్థానికంగా ఉంటూ చదువుకునే పేద పిల్లలను కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయచోటి పంపమనడం అధికారుల బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. సమీప హాస్టల్స్లో చేర్పిస్తాం!అధికారులు సిద్ధం చేసిన నివేదిక ప్రకారం జిల్లాలో తాళాలు పడనున్న 14 బీసీ వసతి గృహాల వివరాలు ఇలా ఉన్నాయి తంబళ్లపల్లె (బీసీ బాలుర వసతి గృహం) ములకలచెరువు (బీసీ బాలికల వసతి గృహం) బీ.కొత్తకోట (బీసీ బాలుర వసతి గృహం) నిమ్మనపల్లె (బీసీ బాలుర వసతి గృహం) మేడికుర్తి (బీసీ బాలుర వసతి గృహం) రైల్వే కోడూరు (బీసీ బాలుర వసతి గృహం) నందలూరు (బీసీ బాలుర వసతి గృహం) తాళ్లపాక (బీసీ బాలుర వసతి గృహం) లక్కిరెడ్డిపల్లె (బీసీ బాలికల వసతి గృహం) వగళ్ల (బీసీ బాలుర వసతి గృహం) వాల్మీకిపురం (బీసీ బాలికల వసతి గృహం) రామసముద్రం (బీసీ బాలుర వసతి గృహం) పీటీఎం (బీసీ బాలుర వసతి గృహం) వీరబల్లి (బీసీ బాలుర వసతి గృహం) -
దొంగల చేతివాటం.. కేబుల్ వైర్లు మాయం
● 15 బోరు మోటార్లు వద్ద కేబుల్ తీగలు అపహరణ ● ఆలయాలను సైతం వదలని దుండగులు ● పోలీసులు నిఘా పెంచాలంటున్న అన్నదాతలుపెద్దమండ్యం : పెద్దమండ్యం పంచాయతీలోని బిక్కావాండ్లపల్లె, చెరువుకిందపల్లె గ్రామాలలో శనివారం రాత్రి బోరు మోటార్ల వద్ద కేబుల్ వైర్ల చోరీ జరిగింది. కొన్ని రోజులుగా మండలంలోని ఆలయాలు, వ్యవసాయ బోర్ల వద్ద ఉన్న కేబుల్ వైర్లను టార్గెట్ చేసిన దొంగలు వాటిని అపహరిస్తున్నారు. రెండు గ్రామాల్లో సుమ ఆరు 15 వ్యవసాయ బోర్ల వద్ద కేబుల్ వైర్లు చోరీ కాగా, అక్కడికి సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఆంప్లిఫైర్, మైకులు, హుండీలు చోరీకి గురయ్యాయి. నెలరోజులుగా వరుస చోరీలు గత నెల రోజులుగా వ్యవసాయ బోర్ల వద్ద కేబుల్ వైర్లు చోరీలు జరుగుతున్నాయి. వ్యవసాయబోరు మోటారు నుంచి స్టార్టర్ వరకు ఉన్న కేబుల్ వైర్ను అందిన కాడికి కట్ చేసుకుని వెళుతున్నారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క మీటరు కేబుల్ వైరు రూ. 210 వరకు పలుకుతోంది. కేబుల్ వైర్ రేటు ఎక్కువగా ఉండడంతో దొంగలు వ్యవసాయ బోర్లను టార్గెట్ చేశారు. రైతుల బోర్లే కాకుండా పంచాయతీ బోర్ల వద్ద కేబుల్ వైర్ను కట్ చేస్తున్నారు. ఒక్కో బోరు వద్ద కేబుల్ వైరు, స్టార్టర్ నుంచి పీజు క్యారియర్ల వరకు కనెక్షన్ ఇచ్చిన కాపర్ వైర్ చోరీ జరిగితే రైతుకు రూ.5 వేల వరకు నష్టం కలుగుతోంది. రోడ్డు పక్కనున్న మోటార్లే లక్ష్యం వ్యవసాయ బోర్ల వద్ద కేబుల్ వైర్లు చోరీ చేస్తున్న ముఠా రోడ్డు పక్కనున్న వాటినే వాటిని లక్ష్యంగా చేసుకున్నారు. మండలంలోని బండమీదపల్లె, వెలిగల్లు, శిద్దవరం, కలిచెర్ల, ఎన్వోపల్లె, పాపేపల్లె, పెద్దమండ్యం గ్రామాలలో నెల రోజులుగా కేబుల్ వైర్ల చోరీలు జరుగుతున్నాయి. పలువురు రైతులకు ఈ గ్రామాలలో రోడ్డుకు ఇరువైపులా వ్యవసాయబోర్లు వేశారు. ఆరుతడి పంటలు, టమోటా, వేరుశెనగ సాగు చేశారు. అయితే దొంగలు మోటార్లు వద్ద కేబుల్ వైరు చోరీ చేస్తుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావంతో పంటలకు నీరు అంతంత మాత్రమే వస్తుంటే దొంగల బెడద ఎక్కువైందని ఆందోళన చెందుతున్నారు. ఆలయాలను కూడా దొంగలు వదలడం లేదు. హుండీలు, ఆంప్లిఫైర్లు, మైక్లు ఇలా అందిన కాడికి దోచుకుంటున్నారు. పోలీసుల అదుపులో ద్విచక్రవాహనాలు..? వ్యవసాయ బోర్ల వద్ద కేబుల్ వైర్లు, ఆలయంలో ఆంప్లిఫైర్లు, మైకులు, హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు ఉపయోగించిన ద్విచక్రవాహనాలు శనివారం అర్ధరాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దొంగలించిన వైర్లు, ఆలయంలోని హుండీ, ఆంప్లిఫైర్లు ద్విచక్రవాహనాలలో తీసుకెళుతుండగా పోలీసులను చూసిన దొంగలు ద్విచక్రవాహనాలు వదిలి పరారైనట్లు తెలిసింది. అర్ధరాత్రి బీట్ నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లకు దొంగలు పెద్దమండ్యం–గుర్రంకొండ రహదారిలోని యర్రగుట్టపల్లె వద్ద కనిపించారు. పోలీసులను గుర్తించిన దొంగలు రెండు ద్విచక్రవాహనాలు (స్కూటీలు) అక్కడే వదిలి పారిపోయారు. దొంగలు వినియోగించిన ద్విచక్రవాహనాలలో ఒక్కటి కొత్తది కావడంతో నెంబర్ ప్లేటు ఉంది. మరో వాహనానికి నెంబర్ ప్లేటు లేదు. కేబుల్ వైరు చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ చేసిన దుండగులు బిక్కావాండ్లపల్లె సమీపంలో వ్యవసాయ బోరు వద్ద కట్ చేసిన కేబుల్ వైరు -
కమనీయం.. రమణీయం.. సౌమ్యనాథుని కల్యాణం!
● కిటకిటలాడిన భక్తజనం ● టీటీడీ తరపున ముత్యాల తలంబ్రాల సమర్పణనందలూరు : నందలూరు క్షేత్రంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి కల్యాణ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన ఈ కమనీయ వేడుకను తిలకించేందుకు వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది. కల్యాణోత్సవం నిమిత్తం వివిధ రకాల అరుదైన పుష్పాలతో వేదికను శోభాయమానంగా ముస్తాబు చేశారు. అభిజిత్ లగ్నంలో మాంగల్యధారణ ఆలయ ప్రధాన అర్చకులు సాయికృష్ణ, సునీల్కుమార్, పాంచరాత్ర ఆగమ పండితులు మనోజ్, పవన్, పార్థసారథి, రంగనాథాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా సర్వాంగ సుందరంగా అలంకరించి, మంగళవాయిద్యాల మధ్య కల్యాణ వేదికపైకి వేంచేపు చేశారు. వేద పండితులు సంతోష్ కృష్ణశర్మ, లావణ్య రామశర్మల మంత్రోచ్ఛారణలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఉదయం ’అభిజిత్ లగ్నం’లో స్వామివారు అమ్మవార్ల మెడలో మాంగల్యధారణ చేశారు. టీటీడీ తలంబ్రాలు.. పారిశ్రామికవేత్త అన్నదానం ఈ దివ్య కల్యాణ వేడుకకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఆలయ ఏఈఓ రవి విచ్చేసి, సంప్రదాయబద్ధంగా ముత్యాల తలంబ్రాలను అర్చకులకు అందజేశారు. అనంతరం ముత్యాల తలంబ్రాల క్రతువు కన్నులపండువగా సాగింది. కల్యాణానికి విచ్చేసిన వేలాది మంది భక్తులకు ప్రముఖ పారిశ్రామికవేత్త సోమరాజు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భారీగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లకీ ఊరేగింపు.. గజవాహన సేవ కల్యాణ మహోత్సవం ముగిసిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత సౌమ్యనాథ స్వామిని ఆలయం ప్రదక్షిణగా పల్లకీలో వైభవంగా ఊరేగించారు. ఆ తర్వాత మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. రాత్రి స్వామివారు విశేషమైన గజవాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. భక్తులు స్వామివారికి కాయకర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వెల్లివిరిసిన మతసామరస్యం.. కల్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులకు ఎస్.టి.ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి కలీముల్లాఖాన్ ఆధ్వర్యంలో మతసామరస్యం చాటుతూ శీతల పానీయాలు, తాగునీటి బాటిళ్లను పంపిణీ చేశారు. అలాగే ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రాఘవేంద్ర, నందలూరు మేనేజర్ కల్యాణిల ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు అందజేశారు. -
గంజాయి స్మగ్లర్పై పిట్ ఎన్డీపీఎస్ అస్త్రం
మదనపల్లె టౌన్: గుర్రంకొండ కేంద్రంగా గంజాయి దందా సాగిస్తున్న ఓ కరుడుగట్టిన స్మగ్లర్ ఆటను పోలీసులు కట్టించారు. యువతే లక్ష్యంగా గంజాయి విక్రయిస్తున్న కలకడ ముబారక్ బాషా కుమారుడు కలకడ ఆదిల్ (22)పై ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్– 1988 చట్టం (పిట్ ఎన్డీపీఎస్)ను ప్రయోగించారు. అలాగే గుర్రంకొండ పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు. మంగళవారం మదనపల్లె జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అడిషనల్ ఎస్పీ వేంకటాద్రితో కలసి అరెస్ట్ వివరాలను మీడియాకు వెల్లడించారు. కళాశాలల విద్యార్థులే లక్ష్యంగా గుర్రంకొండకు చెందిన కలకడ ముబారక్బాషా కుమారుడు కలకడ ఆదిల్ రహస్యంగా గంజాయి అమ్ముతున్నట్లు గుర్రంకొండ పోలీసుల విచారణలో తేలిందని ఎస్పీ వివరించారు. గతంలో నమోదైన కేసులివే.. ఆదిల్పై ఇప్పటివరకు 5 గంజాయి కేసులు నమోదయ్యాయని, గతంలో అతని నుంచి 28 కిలోల గంజాయిని పట్టుకున్నామని ఎస్పీ వివరించారు. ఇవే కాకుండా దొంగతనాలు, దాడులు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తనకు సంబంధించి మరో 5 క్రిమినల్ కేసులు ఇతనిపై ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిందితుడిపై తరచూ కేసులు నమోదై అరెస్ట్ అవుతున్నా బెయిల్పై బయటకు వస్తున్నాడు. అయినా అతని తీరు మారకపోవడం, చట్టం అంటే ఏమాత్రం భయం లేకుండా వ్యవహరిస్తుండ డంతో అతని కార్యకలాపాలపై ఎస్పీ ప్రత్యేక నిఘా పెట్టారు. ఇతడు సరఫరా చేస్తున్న గంజాయి వల్ల యువత ఆరోగ్యం దెబ్బతింటోందని, సమాజానికి ముప్పుగా మారాడని పోలీసుల నివేదిక మేరకు అతడిని పక్కా ‘డ్రగ్ అఫెం డర్’గా పరిగణిస్తూ ఎస్పీ ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపారు. సాధారణ చట్టాలతో ఇతని నేరాలను తక్షణమే నిలువరించడం కష్టమని భావించిన ప్రభుత్వం పీడీ యాక్ట్కు సమాన మైన ‘పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్–1988’లోని సెక్షన్ 3(1)ని ప్రయోగించింది. జిల్లాలో మాదక ద్రవ్యాలు, కూల్ లిప్స్ అమ్మినా, రవాణా చేసినా వదిలి పెట్టబోమని ఎస్పీ హెచ్చరించారు. రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కష్ణమోహన్, వాయల్పాడు సీఐ రాఘవరెడ్డి, గుర్రంకొండ ఎస్ఐ, రవీంద్ర బాబు పాల్గొన్నారు. ఏటీఎం చోరీ నిందితులను పట్టుకుంటాం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మదనపల్లె ఏటీఎం చోరీ కేసులో నిందితులను త్వరలో పట్టుకుంటామని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. మంగళవారం మదనపల్లి జిల్లా ఎస్పీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ఆయన మాట్లాడుతూ.. ఈ కేసులో నిందితులు హర్యానాకు చెందిన వ్యక్తులే అయి ఉంటారని అనుమానిస్తున్నామని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిందితులు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఏటీఎంల చోరీలకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఏటీఎం చోరీ కేసులో ఐదుగురు నిందితులు ఉన్నారని స్పష్టం చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయని తెలిపారు. నకిలీ పాస్ పుస్తకాల గుట్టురట్టు నకిలీ పట్టాదారు పాసుపుస్తకాల తయారి గుట్టును పోలీసులు రట్టు చేశారు. మదనపల్లెలో కొందరు డాక్యుమెంట్ రైటర్లు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఫేక్ సీళ్లతో ఎమ్మార్వో సంతకం ఫోర్జరి చేసి, నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేస్తున్నట్లు గుర్తించామని ఎస్పీ ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. మంగళవారం ఎస్పీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మదనపల్లెలో విలువైన భూములను నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి చేస్తున్న మోసాలపై సోమవారం పీజీఆర్ఎస్కు ఫిర్యాదు అందినట్లు తెలిపారు. కొందరు బ్రోకర్లు, మధ్యవర్తులు చేస్తున్న మోసాలపై వస్తున్న ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని తెలిపారు. మోసాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నట్లు తేలితే రెవెన్యూ అధికారులపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే కొందరిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గంజాయి స్మగ్లర్ కలకడ ఆదిల్ అరెస్ట్ కడప సెంట్రల్ జైలుకు తరలింపు నిందితుడిపై గుర్రంకొండ పీఎస్లో సస్పెక్ట్ షీట్ ఓపెన్: ఎస్పీ -
నారమాకుల తండాలో ఇరువర్గాల ఘర్షణ
మదనపల్లె టౌన్: మదనపల్లి మండలంలోని నారమాకుల తండాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో గాయపడ్డ ఇరువర్గాలు మంగళవారం స్థానిక జిల్లా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తాలూకా సీఐ కళా వెంకటరమణ కథనం ప్రకారం నారమాకుల తండాకు చెందిన అప్పానాయక్, తావరే నాయక్ల మధ్య ఆర్థిక వ్యవహారాల విషయంలో వివాదం తలెత్తింది. మాట మాట పెరిగి ఇరువురు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన వారు గాయపడ్డారు. కుటుంబీకులు వెంటనే వారిని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. -
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం
గుర్రంకొండ : అక్రమంగా తరలిస్తున్న 750 కేజీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఆటోను సీజ్ చేసిన సంఘటన గుర్రంకొండలో సోమవారం చోటు చేసుకుంది. గుర్రంకొండ పరిసరాల్లో ఎస్ఐ రవీంద్రబాబు ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దమండ్యం నుంచి కలకడకు రేషన్ బియ్యంతో వెళుతున్న ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. వెంటనే ఆటోను పోలీస్స్టేషన్ వద్దకు తీసుకెళ్లి 750 కేజీల బియ్యాన్ని సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న కలకడకు చెందిన అక్బర్బాషాపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ట్రాక్టర్ను ఢీకొన్న బస్సు – మహిళ మృతి సదుం : బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పీలేరు–కలికిరి రహదారిపై అంకాళమ్మ ఆలయ సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద ఆదివారం రాత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ట్రాక్టరును వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో తన కుమారుడు మదన్మోహన్రెడ్డితో కలిసి ట్రాక్టర్లో వెళుతున్న పులిచర్ల మండలం చెరుకువారిపల్లెకి చెందిన యశోదమ్మ (65) గాయపడ్డారు ఆమెను పీలేరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. పోలీసులు బస్సును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి వివాదంపై ఎస్పీకి ఫిర్యాదు మదనపలె టౌన్: తమ ఇంటిపైకి 20 మందితో కలిసి వచ్చి భౌతిక దాడులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా జేసీబీతో ఇల్లు కూల్చివేసి బంగారం, నగదు దోచుకెళ్లారని, సోమవారం చిన్నతిప్పసముద్రం గ్రామానికి చెందిన చాంద్ బాషా ఎస్పీ ధీరజ్కు ఫిర్యాదు చేశారు. మండలంలోని చిన్నతిప్పసముద్రంలో తాత ముస్తాన్ సాహెబ్ నుంచి వారసత్వంగా ఇచ్చిన ఆస్తిపై జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కేసు పెండింగ్లో ఉందన్నారు. 2024 డిసెంబర్ 13న షేక్ వజీర్ బాషా మరికొందరితో కలిసి ఆయుధాలతో ఇంట్లోకి ప్రవేశించి తమ కుటుంబ సభ్యులపై దాడికి దిగారని ఆరోపించారు. వెంటనే 100కు కాల్ చేయగా, పోలీసులు వారందరినీ స్టేషన్న్కు పిలిచారన్నారు. తాము పోలీస్ స్టేషనన్లో ఉండగానే, ప్రత్యర్థులు జేసీబీతో వచ్చి ఇంటిని కూల్చివేసి, బంగారం, నగదు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి తమకు న్యాయం చేయమని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదన్నారు. తమపై దాడి చేసి, ఇల్లు కూల్చివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆయన ఎస్పీని కోరారు. భూ ఆక్రమణలు అడ్డుకోవాలని వినతి మదనపల్లె టౌన్ : కబ్జాదారుల నుంచి తమ భూమిని ఇప్పించాలని ఓ శ్రీ విద్య అనే యువతి సోమవారం ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. మదనపల్లె పట్టణం అమ్మినేని వీధికి చెందిన విశ్వనాథ్ 2004లో పొన్నెటిపాలెంలో జంగాల వెంకటస్వామి పేరున ఉన్న 11 సెంట్ల భూమిని కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకున్నట్లు బాధితురాలు తెలిపారు. తండ్రి విశ్వనాథ్, తమకు భూమి అమ్మిన వ్యక్తి చనిపోయిన అవకాశాన్ని వాడుకుని చంద్రిశేఖర్ అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి భూమిని కబ్జా చేసి ఇతరులకు విక్రయించారని ఆరోపించారు. తమ భూమిని కాపాడుకోవడానికి వెళితే తమనే భూమిని వదిలేసి వెళ్లాలని రఘుపతి నాయుడు మరికొందరు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం చేసి, కబ్జాదారుల నుంచి తమ భూమిని కాపాడాలని ఎస్పీని కోరారు. ఫిర్యాదు స్వీకరించిన ఎస్పీ, సంబంధిత అధికారులతో విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
హార్టికల్చర్ హబ్కు భూముల పరిశీలన
ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత ఉండాలి ● 90 శాతం పనులు పూర్తయినా కాలయాపన ● 1.6 కి.మీ. పైప్లైన్ వేయని సర్కార్ ● ఎండిపోయిన మున్సిపల్ బోర్లు సాక్షి, మదనపల్లె: నిత్యం కరువు రక్కసి కోరల్లో చిక్కుకుని, అడుగంటిన భూగర్భ జలాలతో తల్లడిల్లే మదనపల్లె పట్టణ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విజన్కు ప్రస్తుత కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం చంద్రగ్రహణంలా చుట్టుకుంది. నాటి ప్రతిపక్ష నేతగా మదనపల్లె ప్రజల నీటి కష్టాలను కళ్లారా చూసిన వైఎస్సార్.. 2004లో ముఖ్యమంత్రి కాగానే ఈ ప్రాంత దాహార్తిని తీర్చడానికి అపర భగీరథుడిలా ప్రణాళికలు రచించారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా మదనపల్లె పట్టణానికి కృష్ణా జలాలను తరలించే బృహత్తర కార్యాన్ని భుజానికెత్తుకున్నారు. 2005– 2009 మధ్యకాలంలోనే 59వ ప్యాకేజీ పరిధిలో చిప్పిలి (0.08 టీఎంసీ), గుంటివారిపల్లి(0.131 టీఎంసీ) సమ్మర్ స్టోరేజ్ (ఎస్ఎస్) ట్యాంకులు, నీటి శుద్ధి ప్లాంటు (ఫిల్టర్ బెడ్స్) నిర్మాణ పనులు దాదాపు 90 శాతం పూర్తి చేసి పరుగులెత్తించారు. కానీ, వైఎస్సార్ మరణానంతరం వచ్చిన చంద్రబాబు హయామంతా ఈ ప్రాజెక్టుపై నిర్లక్ష్యం ప్రదర్శించడంతో మదనపల్లె ప్రజలకు నీటి కష్టాలు శాపంగా మారాయి. కుప్పంపై ఉన్న ప్రేమ.. మదనపల్లైపె లేదు! గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది మార్చి వరకు కృష్ణా జలాలను హంద్రీనీవా పుంగనూరు ఉప కాలువలోకి పారించారు. చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి దాదాపు ఆరు టీఎంసీల నీటిని అన్నమయ్య, చిత్తూరు జిల్లాల మీదుగా సాగే పుంగనూరు ఉపకాలువ ద్వారా చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పానికి తరలించుకుపోయారు. కుప్పంలోని చెరువులు, కాలువలను నింపుకునేందుకు చూపిన శ్రద్ధ, ఆ కాలువ పక్కనే ఉన్న మదనపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపడంపై చంద్రబాబుకు కలగలేదు. మదనపల్లె పట్టణ ప్రజలకు తాగునీటిని అందించాలన్న కనికరం కూడా చూపకుండా ట్యాంకులను నిలువునా ఎండబెట్టారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును కృష్ణా జలాలతో నిండుగా నింపగా.. ప్రస్తుత కూట మి ప్రభుత్వం తాము కూడా నీళ్లిచ్చామని కేవలం బోర్డులు చెప్పుకోవడానికి కొద్దిపాటి నీటిని మళ్లించి చేతులు దులుపుకుంది. ఆ నీరు కనీసం దేనికీ వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. 1.6 కిలోమీటర్ల పైప్లైన్ వేయలేక ..చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిండుగా ఉంటే చుట్టుపక్కల భూగర్భ జలాలు అద్భుతంగా వృద్ధి చెందుతాయి. అయితే, చిప్పిలి ట్యాంక్ నుంచి సమీపంలోని గుట్టపైకి నిర్మించాల్సిన కేవలం 1.6 కిలోమీటర్ల పైప్లైన్, ఇన్టెక్ బావి నిర్మాణ పనులను పూర్తి చేయడంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైంది. ప్రస్తుతం పనులు చేపట్టే అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, ఇప్పటిదాకా ‘ప్రతిపాదనలు, డిజైన్లు’ చేస్తున్నారన్న సాకుతో కాలం గడిపేస్తున్నారు తప్ప పనులు ముందుకు కదలడం లేదు. ఫలితంగా కోట్ల రూపాయల ప్రజాధనంతో వైఎస్సార్ నిర్మించిన ఆస్తులు వృధాగా పడి ఉన్నాయి. ఈ పనులు పూర్తి చేసి ఉంటే ప్రస్తుతం పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య అనే మాటే వినబడేది కాదు. ఇప్పుడు దాహం కేకలు: సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను సక్రమంగా వినియోగంలోకి తీసుకువచ్చి ఉంటే మదనపల్లె పట్టణంలో నీటి సమస్య అనే మాటే వినిపించేది కాదు. పాలకులు చేసిన పాపానికి ఇప్పుడు పట్టణంలో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. అధికారుల లెక్కల ప్రకారమే పట్టణంలో ఏకంగా 59 మున్సిపల్ బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. బోర్లు ఎండిపోవడంతో ప్రజల దాహం కేకలను ఆసరాగా చేసుకుని కూటమి నేతలు ‘ప్రైవేట్ ట్యాంకర్ల దందా’కు తెరలేపారు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి మున్సిపల్ సంపులకు తరలిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం వల్ల అసలు ట్యాంకర్లతో నీటి సరఫరా చేయాల్సిన అవసరమే రాలేదు. కానీ ఇప్పుడు ట్యాంకర్ల కొనుగోళ్ల వల్ల మున్సిపల్ ఖజానాకు భారీగా గండి పడుతోంది. పట్టణ అభివృద్ధి కోసం, రోడ్లు, డ్రైనేజీల కోసం ఖర్చు చేయాల్సిన ప్రజల పన్నుల డబ్బులను కాస్తా.. ఇప్పుడు ట్యాంకర్ల బిల్లుల రూపంలో ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి మళ్లిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి కాలయాపన ఆపి, చిప్పిలి మిగులు పనులను పూర్తి చేసి కృష్ణా జలాలతో మదనపల్లె దాహం తీర్చాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పెద్దతిప్పసముద్రం: మండలంలోని పట్టెంవాండ్లపల్లి సమీపంలోని ఒకటో నంబర్ సర్వేలోని వ్యాసరాజ మఠం భూములను సోమవారం కలెక్టర్ నిశాంత్కుమార్ పరిశీలించారు. సదరు సర్వే నంబర్లో 727 ఎకరాల భూములు ఉండగా రైతులకు కేటాయించిన భూములు పోగా 500 ఎకరాల మిగులు భూములు ఉన్నాయి. కాగా వ్యాసరాజ మఠం భూములకు సంబంధించి క్రయ, విక్రయాలు జరిగినా తమకు వన్బీ, అడంగల్ రాలేదని పలువురు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, తహశీల్దార్ శ్రీరాములు నాయక్, ఎంపీడీవో చంద్రశేఖర్రెడ్డి, మండల సర్వేయర్ శ్రీవాణి, ఆర్ఐ హుస్సేన్, వీఆర్వో శేఖర్ తదితరులు ఉన్నారు. రాయచోటి : ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నెలవారీ తనిఖీలలో భాగంగా సోమవారం రాయచోటి మార్కెట్ యార్డులో ఉన్న ఈవీఎం గోదామును రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. వివిధ అంశాలలో రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన సందేహాలకు కలెక్టర్ సమాధానం ఇచ్చారు. వైఎస్సార్ తెచ్చిన భాగీరథిబాబుతో అధోగతివృధాగా నీటి శుద్ధి ప్లాంటు చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు సమీపంలో ముట్టపై నీటి శుద్ధి ప్లాంటును నిర్మించారు. 15 ఏళ్లుగా ఈ ప్లాంట్ వృథాగా ఉంది. యంత్రాలు, పరికరాల నిర్వహణ లేకపోవడంతో తిరిగి మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడికి నీటిని తరలించేందుకు చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద ఇంటెక్ నుంచి 1.6 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణ పనులు జరగాల్సి ఉంది. ఈ పనులు చేపట్టేందుకు టెండర్లు పూర్తి చేసినప్పటికీ డిజైన్లు అప్రూవల్ కాలేదని తెలుస్తోంది. ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది. -
ఆటోను ఢీకొన్న బస్సు
– ఒకరి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు పీలేరురూరల్ : బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన పీలేరు – చిత్తూరు మార్గం షఫీ ప్యారడైజ్ సమీపంలో చోటు చేసుకుంది. మండలంలోని కాకులారంపల్లె పంచాయతీ ఆర్బీఐ కాలనీకి చెందిన సింహాద్రి (18), శరత్నాయక్ (18), సాయి (27) గాండ్లపల్లె సమీపంలోని ఓ వాటర్ప్లాంట్లో పని చేసేవారు. సోమవారం ఉదయం ముగ్గురు ఆటోలో పీలేరుకు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి కాణిపాకం వెళుతున్న ట్రావెల్ బస్సు ఎదురుగా వచ్చి ఆటోను ఢీకొంది. ప్రమాదంలో సింహాద్రి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన శరత్నాయక్, ఆటో డ్రైవర్ సాయిని చికిత్స నిమిత్తం 108లో పీలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. శరత్నాయక్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. సమాచారం అందుకున్న ఆర్బీఐ కాలనీ వాసులు, బంధువులు పెద్దఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుని విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. మనస్తాపంతో యువకుడి బలవన్మరణం రామసముద్రం : రామసముద్రం మండలం బీసీ కాలనీలోని శ్రీ దుర్గలమ్మ ఆలయం వెనుక ఉన్న దయ్యాలమడుగు వద్ద చెట్టుకు ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. రామసముద్రంలోని వాల్మీకి వీధికి చెందిన సీవీ రెడ్డిశేఖర్ (33) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఈ క్రమంలో బీసీ కాలనీలోని శ్రీ దుర్గలమ్మ ఆలయం సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. రెడ్డిశేఖర్ మృతితో కుటుంబీకులు విలపించారు. ప్రమాదానికి గురైన ఆటో మృతి చెందిన సింహాద్రి -
పీజీఆర్ఎస్పై పెదవి విరుపు
● ప్రతి సోమవారం అదే గోడు.. పరిష్కారం కాక వేదన ● భూ సమస్యల పరిష్కారంలో అలసత్వం ● సుదీర్ఘ కాలంగా కొత్త ఫించన్లు పెండింగ్ ● ప్రజల్లో సడులుతున్న నమ్మకం మదనపల్లి (కురబలకోట) : మదనపల్లి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సోమవారం వివిధ సమస్యలతో వచ్చిన అర్జీదారులతో కిక్కిరిసింది. అదేతీరు..అదే వరుస అన్నట్లుగా ప్రహసనంగా సాగింది. భూ సమస్యల పరిష్కారంలో తీవ్ర అలక్ష్యం ప్రదర్శించడం, కొత్త ఫించన్లు రాకపోవడం, వివిధ సమస్యలు సకాలంలో పరిష్కారం కాకపోవడంతో వచ్చిన అర్జీలే మళ్లీ ఇవ్వాల్సి రావడంతో అర్జీదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పీజీఆర్ఎస్ అంటే క్రమంగా ప్రజల్లో నమ్మకం సడలుతోందా అనే సందేహం కలుగుతోంది. జిల్లా నలుమూలల నుంచి వ్యయ ప్రయాసలకు ఓర్చి అర్జీదారులు తమ సమస్యలపై ఏకరువు పెడుతున్నా ఆశించిన స్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదనే నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా రెవెన్యూ, భూ వివాదాలు, ఫించన్లు, ఇతర సామాజిక సమస్యలపై అర్జీలు నమోదయ్యాయి. ఒక్కొక్కరు ఐదారు సార్లు అర్జీ ఇచ్చినా పరిష్కారం కాలేదని వాపోతున్నారు. అయినా ఏదో ఒక రోజు సమస్య తీరుతుందన్న చిన్న ఆశతో మళ్లీ మళ్లీ అర్జీలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఇతర ఉన్నతరాధికారులు ప్రజల నుంచి వివిధ సమస్యలపై 310 అర్జీలను స్వీకరించారు. క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 20 ఏళ్లుగా సేవలు అందిస్తున్నా కనికరం లేదు 20 ఏళ్లుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉద్యోగ భద్రత కల్పించడం లేదు. వివిధ కేటగిరిలలో ఆరోగ్యశాఖలో సేవలు అందిస్తున్న తమను రెగ్యులర్ చేయాలని నూరు శాతం గ్రాస్ వేతనం చెల్లించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పీజీఆర్ఎస్లో వారు అర్జీ ఇచ్చారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు అంకాలమ్మ చెరువును కాపాడాలి హైవేకి ఆనుకుని ఉన్న కలకడ గ్రామ అంకాలమ్మ చెరువును కబ్జా చేస్తున్నారని వారి నుంచి సంరక్షించాలని ఆయకట్టుదారులు పీజీఆర్ఎస్లో నిరసన తెలిపారు. ఇదివరలో అర్జీ ఇవ్వగా సదరు స్థలంలో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినా మళ్లీ కబ్బాదారు పది రోజులుగా చెరువులోకి ప్రవేశించి మట్టి తోలి చదును చేస్తున్నారన్నారు. దీనిని అడ్డుకోవాలని కోరారు. వెంటనే చెరువు దురాక్రమణను అడ్డుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దివ్యాంగుడి భూమి ఆక్రమణ కలకడ మండలం ముడివారిపల్లిలో 40 ఏళ్లుగా సాగుచేసుకుంటూ వారసత్వంగా సోదరులతో పాటు దివ్వాంగుడుకి వచ్చిన ఎకరా 91 సెంట్లు డికేటీ భూమిని అదే ఊరికి చెందిన ఒకరు ఇటీవల ఆక్రమించుకుని కంచె వేశారని భూమిలోకి రానియ్యకుండా దౌర్జన్యం చేస్తున్నారని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు కూడా ఈ భూమి తమదేనని చెప్పినా దురాక్రమణదారు భూమిని వదలడం లేదని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. విచారించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. -
శేషవాహనంపై శ్రీ సిద్దేశ్వరుడు
రాజంపేట: తాళ్లపాక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమ వారం శేషవాహనంపై శ్రీ సిద్దేశ్వరస్వామి పురవీధుల్లో ఊరేగారు. అలాగే ఉదయం శ్రీ చెన్నకేశవ స్వామివార్లకు పల్లకీ సేవ నిర్వహించారు. రాత్రికి శ్రీ చెన్నకేశవస్వామి సింహవాహనంపై గ్రామపురవీధుల్లో ఊరేగారు. సూర్య, చంద్రప్రభ వాహనంపై శ్రీ సౌమ్యనాథ స్వామి నందలూరు : శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజు సోమవారం ఉదయం కూర్మాలంకారంలో సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై శ్రీ సౌమ్యనాధ స్వామి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నేడు సౌమ్యనాథ స్వామి కళ్యాణం సౌమ్యనాథాలయంలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటలోపు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథుడు (చొక్కనాథుడు) కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఈ మేరకు టీటీడీ దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తూర్పుగాలిగోపురం ద్వారా మాత్రమే భక్తులు ఆలయంలోకి ప్రవేశించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
దివ్యాంగుల భూమి ఆక్రమణ
పుంగనూరు మండలం చెదళ్లకు చెందిన విష్ణువర్ధన్, మునిలక్ష్మి దివ్వాంగులు. ప్రేమ వివాహం చేసుకున్న వారికి వారసత్వంగా రావాల్సిన నాలుగు ఎకరాల భూమిని కూడా అతడి సోదరుడు ఆక్రమించేశాడని, తమపై దౌర్జన్యానికి రావడంతో పాటు భూమిలోకి వస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడని పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వారి నుంచి రక్షణ కల్పించడంతో పాటు తన వాటా భూమి వచ్చేలా చర్యలు తీసుకోవాలని పీజీఆర్ఎస్లో కోరారు. వీరికి రక్షణ కల్పించడంతో పాటు భూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. -
ఎంపీ కృషితో చిన్నారుల వైద్యానికి ఆర్థికసాయం
సాక్షి, మదనపల్లె: పేదలకు వైద్య సహకారం అందించడంలో, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం మంజూరు చేయించడంలో మానవత్వంతో వ్యవహరించే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి ఇద్దరు చిన్నారుల వైద్యం కోసం ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున 6 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. తంబళ్లపల్లె మండలం గోపిదిన్నెకు చెందిన వెంకటేశ్వర కుమారుడు శ్రీదర్శన్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. అలాగే పుంగనూరు పట్టణంలోని రహమత్నగర్కు చెందిన ఎస్.బావాజాన్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వీరి కుటుంబ పరిస్థితులను స్థానిక నేతల ద్వారా తెలుసుకున్న ఎంపీ మిథున్ రెడ్డి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి ద్వారా నిధుల మంజూరు కోసం ప్రధానమంత్రి కార్యాలయానికి నివేదించారు. అక్కడినుంచి వైద్యానికి అయ్యే ఖర్చు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు మంజూరు చేయిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. ఆస్పత్రి వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న పేద కుటుంబానికి ఈ నిధుల మంజూరు ఊరట కలిగించింది. తమకు ఆర్థిక సహాయం మంజూరు చేయించిన మిథున్ రెడ్డికి చిన్నారుల కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కరాటే పోటీలకు ఎంపిక పుంగనూరు: జపాన్ దేశంలో సెఫ్టెంబర్లో జరిగే అంతర్జాతీయ కరాటే పోటీలకు పుంగనూరు నుంచి క్రీడాకారులు ఎంపికయ్యారని కరాటే మాస్టర్ మహేష్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 25, 26 తేదీల్లో మైసూర్లో జరిగిన ఆల్ఇండియా షిటోర్యూ కరాటే చాంపియన్ పోటీల్లో పట్టణానికి చెందిన తాన్వేశ్వర్కుమార్రెడ్డి, శశాంత్, త్రివిక్రమ్, జుహాఫాతిమా, ఎం.రెడ్డిమహేష్ ప్రతిభ చూపి అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు
గాలివీడు : గాలివీడులోని ప్రధాన రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మల్లమ్మ అనే మహిళ రోడ్డు దాటుతుండగా బస్టాండ్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనం ఆమెను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అమెను స్థానికులు గాలివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపట్టారు. చెట్లను నరికేస్తున్నారని ఆవేదన పుంగనూరు : మండల పరిధి రాగానిపల్లె సమీపంలోని మల్లుపల్లె క్రాస్లో సోమవారం రాత్రి చెట్లు నరికి తీసుకెళ్లారని గ్రామస్థులు తెలిపారు. కొందరు చెట్లను నరికి తీసుకెళ్తున్నారని, ఈ విషయమై రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాల్లో ఉన్న చెట్లను కాపాడి, పర్యావరణ కాలుష్యానికి ముప్పు వాటిల్లకుండా చూడాలని కోరారు. -
అంకాలమ్మ చెరువులో ఆక్రమణల జోరు
● కలకడలో కాలువలు మాయం ● నిద్రావస్థలో రెవెన్యూశాఖ అధికారులు ● కోర్టులో ఉన్నా తేలని లెక్కలు కలకడ : కలకడలో ఆక్రమణలకు హద్దులేకుండా పోతోంది. అధికారి మన మాటవింటే చాలు రికార్డులు ఎక్కడ ఉన్నా భూమి మనదే అన్నట్లు కలకడ అంకాలమ్మ చెరువు, సిద్దేశ్వరస్వామి ఆలయం చెరువు కాలువను ఇష్టారాజ్యంగా ఆక్రమిస్తున్నట్లు మండల కేంద్రమైన కలకడలోని స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నారు. చెరువులు, కాలువలు, ఆలయ భూములు సైతం ఆక్రమణలకు గురవుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కొంతమంది బడా నాయకులు చెరువుమట్టిని ఎత్తి వేసి ఇంటి స్థలాలుగా ప్లాట్లు వేస్తున్నారని వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. చిత్తూరు –కర్నూలు జాతీయ రహదారి ఆనుకుని ఉన్న కలకడ అంకాలమ్మ చెరువు రెవెన్యూ రికార్డుల మేరకు 27 ఎకరాల 50 సెంట్లు ఉన్నట్లు రెవెన్యూ శాఖ అధికారులు తెలిపినా సగం చెరువు ఆక్రమణకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. దరఖాస్తు పట్టాలు ఉన్నట్లు కొందరు, కొనుగోలు చేసినట్లు మరికొందరు చెరువు పక్కన సర్వే నెంబర్లు చూపి చెరువును ఆక్రమించి ఇంటి స్థలాలకు విక్రయించడానికి సిద్ధపడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆక్రమిస్తే అనుభవ పట్టా మొదట స్థలం ఆక్రమిస్తే చాలు, రాత్రికి రాత్రి రేకులషెడ్డు, అనంతరం సెలవు రోజుల్లో పునాది, ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారి ఆనుకుని ఉండటంతో మొదట స్థలంలో పాగా వేసి తర్వాత సొంతం చేసుకుంటున్నారు. కలకడ అంకాలమ్మ చెరువులో నిర్మాణాలు చేపట్టిన వారికి గతంలో అనేక మార్లు రెవెన్యూశాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. కానీ ఆక్రమణలు తొలగించలేకపోయారు. నిర్మాణం చేపట్టే సమయంలో నిలువరించలేకపోతే చాలు ఎవరూ అడ్డుకోలేరు అనే చందంగా ఆక్రమణలు కొనసాగుతున్నాయి. కోర్టులో స్టే తీసుకుంటే చాలు చెరువు, కాలువలు ఆక్రమణకు గురైనా పూర్తిగా తొలగించిన దాఖలాలే లేవు. హడావుడి అంతా ఒక్క రోజే. మరుసటిరోజు మామూలే. నివేదికలకే పరిమితం. చెరువులు, కాలువలు, ఆలయ భూములు, చెరువు మనుగడ భూములు రెవెన్యూ రికార్డులకే పరిమితమయ్యాయి. కోర్టులో స్టే తీసుకుంటే సరిపోతుంది అనుకునే ఽవారు అధికమయ్యారు. అంకాలమ్మ చెరువును సుందరీకరించాలి మండల కేంద్రమైన కలకడ ఆనుకుని ఉన్న అంకాలమ్మ చెరువును పూర్తిగా సర్వే చేసి ఆక్రమణలు తొలగించి చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపడితే కలకడ వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు చెరువును కాపాడినట్లు అవుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికమౌతున్న ఆక్రమణలు అంకాలమ్మ చెరువులో చెరువుబండ నుంచి ఆక్రమణలు జరిగినట్లు అనేక మార్లు ఫిర్యాదులు అందినా నివాసులకు కూడా పట్టాలు మంజూరు కాలేదు. సాగుభూమి ఆయకట్టు దారులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. 2018లో అప్పటి చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్కు, 2022లో జిల్లా కలెక్టర్కు కలకడ తహాసీల్దార్ వారికి ఫిర్యాదులు చేసినా ఆక్రమణలు జరగలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని నివేదికలు పంపారు తప్ప ఆక్రమణలు పూర్తిగా తొలగించిన దాఖలాలు లేవు. చెరువు మరింత ఆక్రమణకు గురవడంతో సోమవారం అన్నమయ్య జిల్లా వైఎస్సార్ సీపీ నాయకులు షావత్అల్లిఖాన్, పీలేరు నియోజకవర్గ మైనార్టీ సంఘం అధ్యక్షులు మస్తాన్ అహమ్మద్, నాయకులు సద్దాం, నాయకులు ఆక్రమణలపై కలకడ తహసీల్దార్కు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు చేశారు. చెరువులు, కాలువలు ఆక్రమణకు గురైతే అడ్డుకుంటామని, గతంలో హెచ్చరిక బోర్డులను అంకాలమ్మ చెరువులో ఏర్పాటు చేశాం. కాలువలు, కబ్జా స్థలాలపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. రీ సర్వే జరుతుంది. మండలంలోని అన్ని పంచాయతీలలో రీ సర్వే పూర్తి కాగానే ప్రభుత్వ భూ ములు, చెరువులు, ఆక్రమణదారులపై చర్యలు తప్పవు. అంకాలమ్మ చెరువు, కాలువలు పరిశీలించి ఆక్రమణలపై జిల్లా కలెక్టర్కు నివేదికలు పంపుతాం. ఆక్రమణలకు అడ్డుకట్టవేస్తాం. – మహేశ్వరిభాయ్, తహసీల్దార్, కలకడ 2018లో జాయింట్ కలెక్టర్, కలకడ రెవెన్యూశాఖ అధికారులు ప్రభుత్వ స్థలంగా బోర్డు ఏర్పాటు చేశారు. ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కానీ నేడు బోర్డు ఉన్నా మట్టి మాత్రం చదును చేశారు. చెరువులోకి ఇతరులకు ప్రవేశం లేకుండా జెసీబీతో కాలువ తీశారు. కలకడ ప్రభుత్వ పశువుల ఆసుపత్రికి ఉన్న దారికి కంచె వేశారు. కలకడ రెవెన్యూ శాఖ కార్యాలయం ముందు ఉన్న కాలువ కలకడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుంచి సత్యవతి నదిలోకి వాననీరు చేరే కాలువ ఉన్నా పూర్తి ఆక్రమణకు గురైంది. జాతీయరహదారిపై ఉన్న కల్వర్టులు సైతం పూడ్చివేసి చదును చేస్తున్నా రెవెన్యూ కార్యాలయం ముందు ఆక్రమణ జరుగుతున్నా ఎవరూ అపడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ ఆక్రమణలపై తహసీల్దార్కు సోమవారం గ్రీవెన్స్ సెల్లో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు చేసినట్లు స్థానికులు తెలిపారు. పంచాయతీ స్కీంబోర్కు ఏర్పాటు చేసిన స్టాటర్, విద్యుత్ సర్వీసులు కూడా ఆక్రమించి, తొలగించినట్లు పంచాయతీ అధికారులు, సిబ్బంది తెలిపారు. -
విద్యాహక్కు చట్టం పక్కాగా అమలు చేయాలి
పుంగనూరు : ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం విద్యార్థులు కదం తొక్కారు. ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత జ్యోతిరావుపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ ఇందిరా సర్కిల్ నుంచి ఎంబీటీ రోడ్డు, బస్టాండ్, గోకుల్ సర్కిల్ మీదుగా సాగింది. ఈ సందర్భంగా సంఘ జాతీయ అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. దేశభవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని, ప్రతి చిన్నారి నాణ్యమైన విద్య పొందడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని తెలిపారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు కల్పించాల్సిన హక్కులను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు భార్గవ్సాయి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రతినిధులు కోటేశ్వరరావు, వెంకట్రమణారెడ్డి, రామమూర్తి, మున్న, ఓబీసీ విద్యార్థి సంఘ జిల్లా అధ్యక్షుడు వెంకటయాదవ్, సురేష్, పవన్, మునిసాయి తదితర నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
భక్తితో ప్రణమిల్లి.. భుక్తి లేక తల్లడిల్లి !
● సౌమ్యనాథాలయంలో అన్న ప్రసాదం కరువు.. ● టీటీడీ చర్యలు తీసుకోవాలని భక్తుల విన్నపం చోళుల కాలంలో నిర్మించిన నందలూరు సౌమ్యనాథాలయం రాజంపేట: అక్కడ అడుగుపెట్టగానే రాజసం ఉట్టిపడే గోపురం కనువిందు చేస్తుంది.. మూలవిరాట్ను దర్శించుకోగానే మనసంతా భక్తిభావంతో నిండిపోతుంది.. చరిత్రకు నిలువుటద్దం ఆ ఆలయం.. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వైష్ణవాలయం.. అదే చోళుల కాలంలో నిర్మితమైన నందలూరు సౌమ్యనాథాలయం. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాకుండా కర్నూలు, తిరుపతి భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఆలయంలో 108 ప్రదక్షిణలు చేసి నిండైన భక్తిభావంలో మునిగిపోతారు. పిడికెడు అన్న ప్రసాదం కరువు... చరిత్రకు ఘనకీర్తిగా... ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి సజీవ సాక్ష్యంగా అలరారుతున్న ఈ ఆలయంలో అన్న ప్రసాదం కరువైంది. నిండైన భక్తితో ప్రదక్షిణలు చేశాక.. చుట్టూ చూస్తే పిడికెడు భుక్తి కానరాక ఆకలితోనే వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. తిరుమల తిరుపతి దేవస్థ్ధానం అనుబంధ ఆలయాల వద్ద ఆకలి అనే మాటకు చోటులేకుండా 56 ఆలయాల్లో మార్చి నుంచి రెండుపూటలా అన్నదానం చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు అన్న ప్రసాదాలను వడ్డించడానికి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. నందలూరులోని సౌమ్యనాథాలయంలో అన్నప్రసాదం మాటే కరువైంది. ఇదివరకు దేవదాయ శాఖ పరిధిలో ఉన్నప్పుడు స్థానికంగానే దాతలు, భక్తులు ట్రస్టు పేరిట ఆలయంలో అన్నప్రసాదం చేసేవారు. టీటీడీలోకి విలీనమైన తర్వాత బయటివారు అన్న ప్రసాదాలు చేయడానికి వీల్లేదన్న అధికారుల సంకేతాలతో ఆ కార్యక్రమాలు ఆగిపోయాయి. కేంద్ర పురావస్తుశాఖ అడ్డుపుల్ల! ఆలయానికి ప్రతి రోజూ వందలాది మంది భక్తులు వస్తారు. శనివారం రోజైతే ఆ సంఖ్య రెట్టింపవుతుంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భక్తజనంతో ఆలయ ఆవరణ కిటకిటలాడుతోంది. అన్నప్రసాదం లేకపోవడం భక్తకోటి ఆకలితోనే వెనుదిరుగుతోంది. కాగా సౌమ్యనాథాలయంలో ఒక్క పూటైనా అన్నప్రసాదం పంపిణీ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థ్ధానం ముందుకొచ్చినా కేంద్రపురావస్తు శాఖ అనుమతి ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే టీటీడీ ఉన్నతాధికారి ఒకరు కేంద్రపురావస్తుశాఖకు అన్నప్రసాదాల పంపిణీకి అనుమతి ఇవ్వాలని కోరినట్లు టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. మరి అక్కడి నుంచి అనుమతులు వచ్చి.. ఆపై టీటీడీ వెనువెంటనే అన్నప్రసాదాల పంపిణీకి చర్యలు చేపడితే భక్తులకు భుక్తి బాధలు తప్పినట్లే. సౌమ్యనాథుడే అనుగ్రహించాలని భక్తులు కోరుతున్నారు. సౌమ్యనాథాలయానికి వచ్చిన భక్తులు ఆకలితో వెనుదిరిగితే ఎలా. ఒంటిమిట్టలో మాదిరి ఒక పూట పెట్టినా భక్తుల ఆకలి తీరుతుంది. చాలా మంది భక్తులు నందలూరు బస్టాండుకెళ్లి భోంచేస్తున్నారు. అలా కాకుండా ఆలయంలో అన్నప్రసాదాలు పెడితే బాగుంటుంది. – వల్లకొండు పద్మావతి, భక్తురాలు ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తులకు అన్నప్రసాదాలను అందచేయాలి. ఆలయంలో 108 ప్రదక్షిణలు చేసేందుకు జిల్లా నుంచే కా కుండా అనేక జిల్లాల నుంచి భక్తులు తరలివస్తున్నా రు. వారికి సకాలంలో ఆకలి తీర్చేందుకు అన్నప్రసాదాల పంపిణీ దోహదపడుతుంది. టీటీడీ చర్యలు తీసుకోవాలి. – శివపార్వతి, భక్తురాలు, ముద్దనూరు -
కురబలకోటలో జనసేన, టీడీిపీకి షాక్
కురబలకోట: మండలంలోని మట్లివారిపల్లి గ్రామంలో జనసేన, టీడీపీకి చెందిన వివిధ క్రియాశీలక కుటుంబాలు ఆదివారం వైఎస్సార్ సీపీలో చేరాయి. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీలో చేరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు, కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన వైఎస్సార్సీపీ పట్ల తాము ఆకర్షితులమైనట్లు తెలిపారు. రానున్న రోజుల్లో వివిధ ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీతో కలసి పని చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా అందరూ ఐక్యంగా పనిచేయాలన్నారు. గ్రామాల అభివృద్ది, ప్రజా సంక్షేమమే పార్టీ ప్రధాన ధ్యేయమన్నారు. ప్రతి కార్యకర్త పార్టీకి వెన్నెముకలాంటి వారేనన్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరడంతో గ్రామంలో వైఎస్సార్ సీపీ మరింత బలోపేతమైందని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక -
రెడ్డెమ్మ ఆలయం.. భక్తజన సందోహం
గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది.రెడ్డెమ్మతల్లీ చల్లంగా చూడమ్మ అంటూ వేడుకున్నారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. పలువురు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు. భక్తులు ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కర్ణాటక, తమిళనాడుతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి ఆలయానికి తరలిరావడం గమనార్హాం. నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ సాక్షి, మదనపల్లె: ప్రజల సమస్యలకు సంబంధించిన వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని (పీజీఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో వినతులు అందించవచ్చని తెలిపారు. అక్కడ పరిష్కారం కాని సమస్యలను కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు రావొచ్చని సూచించారు. ఆన్లైన్లోనూ ఆర్జీలను నమోదు చేసుకోవచ్చని, వాటి స్థితిని పరిశీలించుకునే అవకాశం ఉందని తెలిపారు. అనంత వేరుశనగకు జీఐతో మరింత విలువ కురబలకోట: అనంతపురం వేరుశనగకు భౌగోళిక (జీఐ) ట్యాగ్ కోసం చైన్నె జీఐ రిజిస్ట్రీలో అధికారికంగా దరఖాస్తు సమర్పించినట్లు మిట్స్ డీమ్డ్ టుబీ యూనివర్సిటీ వీసీ యువరాజ్ తెలిపారు. మిట్స్,ఐపీఎఫ్సీ సాంకేతిక సహకారంతో అవని ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ధరఖాస్తు నేతృత్వంలో అందజేసినట్లు తెలిపారు.అనంతపురంలో ప్రత్యేక భౌగోళిక పరిస్థితులు,ఎర్రనేలలు, తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత కారణంగా అక్కడి వేరుశనగకు ప్రత్యేక నాణ్యత, 45–52 శాతం నూనె శాతం, విశిష్ట రుచి, ఎక్కువ కాలం నిల్వ సామర్థ్యం ఉండే లక్షణాలు ఉన్నాయన్నారు. జీఐ గుర్తింపు లభిస్తే అనంత వేరుశనగకు చట్టపరమైన సంరక్షణతో పాటు రైతులకు అధిక ఆదాయం, మార్కెటింగ్, జాతీయ స్థాయిలో అధిక విలువ పెరుగుతుందన్నారు. డాక్టర్ తులసీరామ్ నాయుడు, శివయ్య, పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు జేఎన్టీయూలో అందుబాటులో ఏఐ కోర్సులు కలికిరి: కలికిరి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరం నుంచి కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్(ఏఐ) కోర్సు అందుబాటులోకి వచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, అత్యాధునిక పరి/్ఞానం, నైపుణ్యాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగానికి ఉన్న డిమాండ్తో సీట్ల సంఖ్యను రెట్టింపు చేసినట్లు పేర్కొన్నారు. కళాశాలల వివిధ విభాగాలకు సంబంధించి 528 సీట్లుం అందుబాటులో ఉన్నాయని, అభ్యర్థులు ఈఏపీసె ట్ కౌన్సెలింగ్లో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కడప వైఎస్ఆర్ సర్కిల్ : అమరావతి ఇన్ క్లూజివ్ క్రికెట్ కప్ – 2026 కోసం నిర్వహించిన జిల్లా స్థాయి దివ్యాంగ క్రికెటర్ల ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం నెట్స్లో డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలకు ఉమ్మడి జిల్లా నుంచి అధిక సంఖ్యలో దివ్యాంగ క్రికెటర్లు హాజరయ్యారని డీసీఏఏ జిల్లా కన్వీనర్ మనోహర్ రాజు తెలిపారు. అనంతరం క్రీడాకారుల నైపుణ్యం ఆధారంగా జట్టు ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. -
చెరువులను మింగేస్తున్న కాసుల కక్కుర్తి
● ఆక్రమణకు గురైన మురాద్బీ కుంట చెరువు ● యథేచ్చగా అక్రమ కట్టడాలు ● వంకనూ వదలని కబ్జాదారులు గుర్రంకొండ పరిసరాల్లో గుట్టలను చదును చేసి ఫెన్సింగ్ ఏర్పాటు ఆక్రమణలకు గురైన మురాద్బీ కుంటలో చేపట్టిన అక్రమ నిర్మాణం గుర్రంకొండ: మండలంలోని ఖండ్రిగ గ్రామంలోని మురాద్బీ కుంట చెరువు కబ్జాకోరల్లో చిక్కుకుంది.రూ. ఆరు కోట్లు విలువ చేసే రెండున్నర ఎకరాల కుంటచెరువు స్థలం యథేచ్చగా ఆక్రమణలకు గురైంది. మరోవైపు కబ్జాలతో మురాద్బీ కుంట వంక రూపురేఖలు కోల్పోయింది.రూ.2కోట్లు విలువచేసే వంకను చదును చేసి ప్లాట్లుగా మార్చేశారు. గుర్రంకొండ పరిసరాల్లోని గుట్టలను పలువురు ఆక్రమణ దారులు జేసీబీలతొ చదును చేసేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. గుర్రంకొండ మార్కెట్యార్డుకు సమీపంలో మూడురోడ్ల కూడలి ఉంది. ఈ సర్కిల్ వ్యాపార వాణిజ్యపరంగా అభివృద్ధి చెందింది. ఈ సర్కిల్ పక్కనే కండ్రిగ గ్రామానికి చెందిన మురాద్బీ కుంట ఉంది. సర్వే నంబర్ 16/1లో 3.37 ఎకరాల్లో కుంట విస్తరించి ఉంది. గత మూడేళ్లుగా కుంట పరిసరాల్లోని స్థలాలకు విలువ పేరిగిపోయి రియల్ఎస్టేట్ బాగా పుంజుకొంది. ఈ పరిసరాల్లో కుంట(రెండుసెంట్లు) స్థలం విలువ రూ. 8లక్షల నుంచి రూ. 12లక్షల వరకు ధరలు పలుకుతోంది. ఈనేపథ్యంలో పలువురు ఆక్రమణదారుల కళ్లు ఈ కుంటపై పడింది. గత మూడేళ్లుగా కొద్దిగా కొద్దిగా చెరువును వ్యవసాయం, నిర్మాణాలపేరుతో ఆక్రమించేశారు. ఇప్పటికే సుమారు రెండు ఎకరాల చెరువును ఆక్రమించేశారు. దీని విలువ మార్కెట్లో సుమారు రూ. 6 కోట్ల వరకు ఉంటుంది. ఎలాంటి పట్టాలు లేక పోయినా అందులోనూ ప్రకృతి సహజ సిద్ధమైన చెరువులో నిర్మాణాలు చేపట్టారు. ఓవైపు కబ్జాలు, మరోవైపు ఆక్రమణలతో మురాద్బీ కుంట చెరువు ఉనికి నామమాత్రంగా ఉండడం గమనార్హం రూపురేఖలు కోల్పోయిన వంక సర్వే నంబర్ 503లో మురాద్బీ కుంటకు వర్షపునీరు చేర్చే వంక ఉంది. కుంటకు ఎగువవైపు ఉన్న పొలాలు, గుట్టల్లో కురిసే వర్షపునీరు ఈ వంక ద్వారా మురాద్బీ వంకకు చేరుతుంది. అయితే ఆక్రమణదారులు వంకను వదలకుండా ఆక్రమించేశారు.ప్రస్తుతం వంక రూపురేఖలు కోల్పోయింది. వర్షపునీరు చేరే మార్గాలు మూసుకుపోయాయి. మురాద్బీ కుంటలో ఆక్రమించుకున్న స్థలాలకు ఏకంగా సరిహద్దు రాళ్లు నాటేశారు. కుంటను జేసీబీలతో చదునుచేసేశారు. ప్రస్తుతం మురాద్బీ కుంట ఆనవాళ్లు లేకుండా పోయాయి. మురాద్బీకుంట వంక 503–8లో వంక పోరంబోకు స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకొని చదును చేసుకున్నారు. జేసీబీలతో వంకను ధ్వంసం చేసి ప్లాట్లు విక్రయించడానికి సిద్దం చేసుకొన్నారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు వీఆర్వోలు, సర్వేయర్లు రెండునెలల క్రితం వంకస్థలాన్ని సర్వేచేశారు. రూ.2 కోట్లు విలువచేసే మొత్తం 50 సెంట్ల మేరకు ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారుల విచారణలో తేల్చారు. అయితే ఇంతవరకు రెవెన్యూ అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. గుట్టలను వదలలేదు.. గుర్రంకొండ పట్టణ పరిసరాల్లోని తలారివాండ్లపల్లె మార్గం, జీవనతోపు ప్రాంతాల్లో కబ్జాకోరులు ప్రకృతి సహజ సిద్ధమైన గుట్టలను వదలడంలేదు. ఆయ ప్రాంతాల్లో పలుచోట్ల ఇప్పటికే గుట్టలను ఆక్రమించుకుని జేసీబీలతో చదును చేసేశారు. అనుభవంలో ఉన్న పొలాలతో పాటు పక్కనున్న గుట్టలను కబ్జా చేసేస్తున్నారు. కొంతమంది రియల్ఎస్టేట్ వ్యాపారులు రైతుల దగ్గర డీకేటీ భూములను కొనుగోలు చేసి ఇష్టానుసారంగా గుట్టలను తవ్వేస్తున్నారు. పశువులకు గడ్డి, ఇతర పశుగ్రాసం అందించే గుట్టలు రియల్ఎస్టేట్ వ్యాపారుల కబ్జాలతో వాటి రూపురేఖలు కోల్పోతున్నాయి. కొంతమంది గుట్టపైన ఫెన్సింగ్లు ఏర్పాటు చేసి కబ్జా చేస్తున్నారు. అసలు గుట్టలు, కొండలకు రెవెన్యూ అఽధికారులు ఎలా పట్టాలు ఇచ్చారో అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోతోంది. తూతూ మంత్రంగా చర్యలు ఓవైపు చెరువులు, కుంటలు, మరోవైపు గుట్టలు కబ్జాలకు గురువుతున్నా రెవెన్యూ అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలున్నాయి. ఆక్రమణలపై ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఫిర్యాదు చేసినా రైతులు, గ్రామస్తులు చెబుతున్నారు. అధికారుల ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ఆక్రమణదారులు యథేచ్చగా తమ కార్యకలాపాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే గుట్టలను చదును చేసి అటువైపు ఎవరూ రాకుండా ఫెన్సింగ్లు ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. మురాద్బీ కుంటలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను ఇప్పటికే ఆడ్డుకున్నాం. ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగిస్తాం. మురాద్బీ కుంటను, వంకను సర్వేచేసి సరిహద్దులుగా కందకాలు తవ్వించి రక్షణ చర్యలు చేపడతాం. చెరువులు, వంకలు, గుట్టలను ఆక్రమించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. – ఫణీకుమార్, తహసీల్దార్, గుర్రంకొండ. -
రాత్రిళ్లు.. తోడేస్తున్నారు!
● చెరువు మట్టి అక్రమంగా తరలింపు ● వారం రోజులుగా కొనసాగుతున్న తంతు ● ఫిర్యాదు చేసినా ప్రయోజనం శూన్యం గుర్రంకొండ : రాత్రిళ్లు జేసీబీలతో చెరువుల్లోని మట్టిని తోడేస్తున్నా సంబంధిత అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గత వారం రోజులుగా గుర్రంకొండ, ఖండ్రిగ పరిసరాల్లోని చెరువులు, కుంటల్లో వ్యాపారులు, దళారులు మట్టిని తోడేసి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా బయటి ప్రాంతాలకు తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకొంటున్నారు. ఈ విషయమై మూడు రొజుల కిందట గ్రామస్తులు పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు చెరువుల వద్దకు చేరుకొని గ్రామస్తులు ఫిర్యాదు చేస్తేనే వచ్చామని లేకుంటే తమకు అభ్యంతరం లేదని సాకులు చెబుతూ చెరువుల్లో నుంచి వెళ్లిపోవాలని అభ్యర్థించడం గమనార్హం. దీంతో విరామం ఇచ్చిన దళారులు పగలు అయితే కదా ఫిర్యాదులు చేసేది అంటూ తమ కార్యకలాపాలు రాత్రికి మార్చుకొన్నారు. దీంతో రెండు రోజులుగా గుర్రంకొండ, కండ్రిగ పరిసరాల్లోని చెరువులు, కుంటల్లో లైట్లు వేసుకొని మరీ మట్టిని తోడేస్తున్నారు. ఈ విషయంపై ఫిర్యాదు చేద్దామంటే అధికారులు ఎవ్వరూ అందుబాటులో ఉండడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గుర్రంకొండ, ఖండ్రిగ గ్రామాలకు ఏళ్ల తరబడి వీఆర్ఏలు ఒక్కరు కూడా నియమితులు కాలేదు. ఆర్వోలు, ఆర్ఐ, తహసీల్దార్లకు ఫిర్యాదు చేద్దామంటే వారు స్థానికంగా నివాసం ఉండడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో ఓవైపు ఇసుకాసురులు, మరో వైపు మట్టి మాఫియా ఇష్టానుసారంగా చెలరేగి పోతున్నారు. వీళ్ల దోపిడికి అడ్డుఆపూ లేకుండా పోతోందని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఈవిషయమై తహసీల్దార్ ఫణీకుమార్ను వివరణ కోరగా ఆర్ఐను పంపించి మట్టిని తోడుతున్న జేసీబీలు, తరలిస్తున్న ట్రాక్టర్లపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఇకపై వారం రోజుల పాటు ఇద్దరు వీఆర్ఏలను, ఇద్దరు పోలీసులను చెరువుల వద్ద కాపాలా ఉంచుతామని పేర్కొన్నారు. -
నియామకం
సాక్షి, మదనపల్లె : బి.కొత్తకోటకు చెందిన బీజేపీ నాయకులు కావడి రవీంద్ర ఆ పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన నియామకంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం రవీంద్రను బీజేపీ సీనియర్ నేతలు గోల్డెన్వ్యాలీ రమణారెడ్డి, గోపాల్రెడ్డిలు సత్కరించారు. పీలేరు రూరల్ : గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో పోలీసు, రెవెన్యూ అధికారుల సూచనలతో వైద్యులు హరీష్కుమార్ పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మేము సైతం సమాజం కోసం స్వచ్ఛంద సంస్థ వారు దహనక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దీపిక, వీఆర్ఏ మల్లికార్జున, స్వచ్ఛంద సంస్థ సభ్యులు మోదీన్బాషా, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లె టౌన్ : కుటుంబ సమస్యలతో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన ఆదివారం గుర్రంకొండ మండలంలో జరిగింది. కుటుంబీకుల కథనం మేరకు.. మండలంలోని ముట్టుకు చెందిన రోజా(25) కుటుంబ సమస్యల కారణంగా మనస్తాపానికి గురైంది. జీవితంపై విరక్తి చెందిన ఆమె ఇంట్లో ఉన్న పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తల్లిదండ్రులు బాధితురాలిని వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా డాక్టర్లు మెరుగైన వైద్యం అందించడంతో కోలుకుంటూ ఉంది. మదనపల్లె టౌన్ : మదనపల్లి పట్టణం ఎస్టేట్లో నిషేధిత కూల్ లిప్స్, గుట్కా, కై ని, పాన్ పరాగ్ వంటి మత్తు పదార్థాలను విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. నిందితుడి అరెస్టుకు సంబంధించి టూ టౌన్ ఎస్ఐ నాగేశ్వరావు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద పెద్ద ఎత్తున కూల్ లిప్స్, గుట్కా, కై ని, పాన్ పరాగ్ వంటివి విక్రయిస్తున్నట్లు సీఐ మహమ్మద్ రఫీకి సమాచారం అందిందన్నారు. వెంటనే ఎస్ఐ నాగేశ్వరరావు, సిబ్బందితో వెళ్లి స్థానిక ఎస్టేట్లో కాపురం ఉంటున్న వాల్మీకిపురం మండలం సాకిరేవుపల్లికి చెందిన వారాదిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతడి ఇంట్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న రూ.27 వేల విలువైన మూడు బస్తాలను సీజ్ చేసి, కేసు నమోదు అనంతరం అరెస్టు చేసినట్లు తెలిపారు. -
ఫ్యాక్టరీ కోసం జనసేన నేత దౌర్జన్యం
మదనపల్లె టౌన్: వలసపల్లి గ్రానైట్ ఫ్యాక్టరీ లీజు వివాదంలో తమపై దాడి చేసి చంపుతామని బెదిరించిన జనసేన నేత అతికారి దినేష్పై పోలీసులు చర్యలు తీసు కోవాలని బాధితురాలు లక్ష్మీదేవి డిమాండ్ చేశారు. ఆదివారం మదనపల్లె ప్రెస్క్లబ్లో వైఎస్ఆర్సీపీ నేత బీరంగి రేవతితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. మండలంలోని వలసపల్లి గ్రానైట్ ఫ్యాక్టరీకి తమకు ఇంకా 2 సంవత్సరాల పాటు లీజు గడువు ఉందని తెలిపారు. అయినా సరే బలవంతంగా ఫ్యాక్టరీని ఖాళీ చేయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ప్రశ్నించడానికి వెళ్లగా జనసేన నేత అతికారి దినేష్ 20 మంది అనుచరులతో వచ్చి తమపై దాడి చేశారని, చంపుతామని బెదిరించారని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు. బి.కొత్తకోటకు చెందిన వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకురాలు బీరంగి రేవతి కూడా బాధితురాలికి మద్దతుగా మాట్లాడి పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చంపుతామని బెదిరిస్తున్నారని బాధితురాలు ఆవేదన పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి -
భర్తే హంతకుడు
● అనుమానంతో భార్యను కడతేర్చిన వైనం ● నిందితుడి అరెస్ట్ ములకలచెరువు : అనుమానం పెను భూతంగా మారడంతో.. భర్తనే భార్యను హత్య చేశాడు. భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని భావించి, అతిగా మద్యం తాగి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన గురువారం పెద్దతిప్పసముద్రం మండలం రాపూరివాండ్లపల్లె సమీపంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు భర్తే అనే తేల్చారు. విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సీఐ దస్తగిరి తెలిపారు. సీఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పీటీయం మండలం మల్లెల ఎస్సీ కాలనీకి చెందిన సురేష్(34)కు బి.కొత్తకోట మండలం దయ్యాలవారిపల్లెకు చెందిన రమాదేవి(28)తో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత మూడేళ్లగా రమాదేవి ప్రవర్తనలో మార్పు వచ్చి వేళాపాళా లేకుండా మోబైల్లో మల్లెలకు చెందిన నరేష్ అనే వ్యక్తితో మాట్లాడుతూ ఉండగా.. గమనించిన భర్త పలుమార్లు మందలించాడు. రమాదేవి భర్త సురేష్తో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చి సంసారం చేసుకునేలా చేశారు. అనంతరం రాపూరివాండ్లపల్లెకు చెందిన ప్రతాప్రెడ్డి కొబ్బరితోటలో ఇద్దరూ పనిలో చేరి అక్కడే ఉండేవారు. గత గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో ఫోన్లో మాట్లాడడాన్ని గమనించిన సురేష్ సహించలేక భార్య రమాదేవిని హత్య చేయాలని భావించి, కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోసి గోడకు తల బాదాడు. కేకలు వేస్తుండగా తాడును మెడకు బిగుతుగా చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేసి పారిపోయాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం నిందితుడిని రంగసముద్రం జెడ్పీ హైస్కూల్ వద్ద అరెస్టు చేశారు. విచారణ చేసిన అనంతరం అతన్ని ములకలచెరువు సర్కిల్ కార్యాలయంలో అరెస్టు చూపించారు. తంబళ్లపల్లె కోర్టుకు నిందితుడిని తరలించగా జడ్జి రిమాండ్కు ఆదేశించారు. ఈ కేసును ఛేదించిన సీఐ దస్తగిరి, ఎస్ఐలు పరమేష్నాయక్, ఉమామహేశ్వర్రెడ్డి, సిబ్బంది శంకర్నాయక్, వెంకటేష్, ఖదీర్, బావాజాన్లను జిల్లా ఎస్పీ అభినందించినట్లు సీఐ చెప్పారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడికి గాయాలు
మదనపల్లె టౌన్ : తంబళ్లపల్లె మండలం రెడ్డికోట బస్టాండ్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని రెడ్డికోటకు చెందిన రైతు వెంకటప్ప(75) మదనపల్లెకు రావడానికి రెడ్డికోటలోని ఆర్టీసీ బస్టాండుకు వచ్చారు. అదే సమయంలో బస్టాండుకు వచ్చిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి వెంకటప్ప పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆయనకు రెండు కాళ్లు విరిగి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే 108కు సమాచారం ఇవ్వడంతో గుర్రంకొండ 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రున్ని చికిత్సల నిమిత్తం హుటాహుటిన మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్సల అనంతరం అతన్ని తిరుపతి రుయాకు తీసుకెళ్లాలని వైద్యులు రెఫర్ చేశారు. తంబళ్లపల్లె ఎస్ఐ అనీల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ ఢీకొని రైతుకు గాయాలు మదనపల్లె టౌన్ : టిప్పర్ ఢీకొని రైతు తీవ్రంగా గాయపడ్డ సంఘటన ఆదివారం బి.కొత్తకోట మండలంలో జరిగింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని గందోళ్లపల్లికి చెందిన రైతు లక్ష్మినారాయణ(56) బైక్పై వస్తుండగా గుమ్మసముద్రం వద్ద టిప్పర్ ఢీకొట్టడంతో కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితున్ని 108లో వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం డాక్టర్ల సలహా మేరకు బెంగళూరుకి తరలించారు. బి కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
తంబళ్లపల్లె : మండలంలోని కన్నెమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1978–79 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 48 ఏళ్ల తరువాత ఆదివారం అదే పాఠశాలలో కలుసుకున్నారు. ప్రస్తుతం ఎక్కడెక్కడో స్థిరపడ్డవారు పూర్వ విద్యార్థుల సమావేశానికి హాజరయ్యారు. అలనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలు కలియ తిరుగుతూ అనాడు చేసిన అల్లరిని నెమరు వేసుకున్నారు. తోటి మిత్రలతో పోటాపోటీగా సెల్పీలు తీసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉల్లాసంగా గడిపారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల క్రితం బడిలో చేసిన అల్లరిని, మధురానుభూతులను గుర్తు చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు తలచుకున్నారు. తమతోపాటు చదువుకుని మృతి చెందిన తమ బాలమిత్రుల ఆత్మశాంతి కోసం కొద్ది సేపు మౌనం పాటించారు. ప్రస్తుత పాఠశాల హెచ్ఎం మదన్మోహన్కు ఘనంగా సన్మానించారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. తిరుపతి, హైదరాబాదు, బెంగుళూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పూర్వపు విద్యార్థులు పాల్గొన్నారు. -
పొరుగు రాష్ట్రాలకు ఏటీఎం దొంగలు పరారీ
మదనపల్లె టౌన్ : మదనపల్లెలో ఏటీఎంను అపహరించిన దొంగల ముఠా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు పారిపోయి తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. మదనపల్లి పట్టణం సిటిఎం రోడ్డు శివాజీ నగర్లో ఉన్న ఎస్బీఐ ఏటిఎం యంత్రాన్ని చోరీ చేసిన ముఠా హర్యానాకు చెందినదిగా అనుమానిస్తున్నామని తెలిపారు. ఏటిఎం దొంగల మొదటి దొంగతనం బైక్ అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించిన దొంగలు జిల్లా అంతటా అన్వేషణ చేసినట్లు తెలుస్తోందన్నారు. దొంగల అన్వేషణ ఎంత కాలం నుంచి సాగుతుందో తెలుసుకుంటున్నట్లు చెప్పారు. మదనపల్లిలోనూ పక్కా రెక్కీ నిర్వహించిన తర్వాతనే పథకం ప్రకారం ఈ దొంగతనం జరిగినట్లు అనుమానిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. రెక్కి కోసం వెళ్లిన దొంగల ముఠా మొదటి కేవి పల్లిలో బైక్ను దొంగలించిందన్నారు. ఆ తరవాత బొలెరో వెంట బైక్పై దొంగల ముఠా పీలేరు, కందూర్, నిమ్మనపల్లె మీదుగా మదనపల్లెకు చేరుకుని ముందే వేసుకున్న పథకం ప్రకారం మదనపల్లెలో ఏటిఎం చోరీ చేశారన్నారు. ముందే దొంగలించిన బొలెరోలో పరారీ కందూరు నుంచి నిమ్మనపల్లికి వచ్చిన దొంగలు వశిష్ఠ స్కూల్ వద్ద సీసీ కెమెరాలో కనిపించారు. బైపాస్ నుంచి ఇసుకనూతిపల్లెకు వచ్చి, ఆ తరవాత బొలెరోలో సీటీఎం రోడ్డుకు చేరుకుని, రాత్రి గస్తీ పోలీసులు వెళ్లిన తరవాత దొంగలు ఏటిఎం చోరీ చేసినట్లు చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాల్లో వారి కదలికలు రికార్డయ్యాయి. ఏటిఎం అపహరించిన అనంతరం వాల్మీకిపురం రోడ్డు మీదుగా వెళ్లి, తిరిగి నిమ్మనపల్లి మండలానికి చేరుకుని అక్కడ ఏటిఎంను ధ్వంసం చేసినట్లు నిర్ధారించామన్నారు. కెవిపల్లిలో దొంగలించిన బైక్ ను కూడా నిమ్మనపల్లెలోనే వదిలేసిన దొంగలు తమిళనాడు, కర్ణాటక సరిహద్దులకు పారిపోయారు. 5 ప్రత్యేక బృందాలు దొంగలను పట్టుకోవడానికి నిష్టాతులైన 5 ప్రత్యేక పోలీసు బృందాలను కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు పంపినట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితులు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, త్వరలోనే అరెస్టు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. చోరీలో ఐదుగురు ఏటిఎంను దొంగలించిన ముఠాలో ఐదుగురు ఉన్నారని ఎస్పీ స్పష్టం చేశారు. ఘటన జరిగిన వెంటనే జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేసి రోడ్లపై నాకాబందీ తనిఖీలు ముమ్మరం చేయడంతో దొంగలు రూట్ మార్చినట్లు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు ప్రతి సీసీటీవి ఫుటేజ్ను పరిశీలించడంతోపాటు అనుమానిత వాహనాలను తనిఖీ చేస్తున్నామని తెలుకుని దొంగలు రూటు మార్చి ఏమార్చినట్లు తెలిపారు. టెక్నికల్ ఆధారాలతో దొంగల కదలికలను ట్రాక్ చేస్తున్నామన్నారు. ఇప్పటికే సెల్ఫోన్ల డంప్ తీసి ఆ దిశగా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. సవాల్గా స్వీకరించాం మదనపల్లి ఏటిఎం చోరీ కేసును సవాల్గా తీసుకున్నామని, చురుకై న బృందాలు పని చేస్తున్నాయని ఎస్పీ తెలిపారు. పారిపోయిన నిందితులు ఎయిర్ పోర్టుల్లో ఉన్నట్లు తెలసుకుని అక్కడికి రెండు బృందాలు వెళ్లాయని, అనుమానితుల ఆచూకీ తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. రంగంలోకి పోలీస్ ప్రత్యేక బృందాలు త్వరలోనే పట్టుకుంటాం : ఎస్పీ ధీరజ్ -
డిగ్రీ విద్యార్థిని అదృశ్యంపై ఫిర్యాదు
కడప అర్బన్ : కడప నగరం టూ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని బిస్మిల్లా నగర చెందిన ఓ యువతి (20) ఈ నెల 25వ తేదీ నుంచి కనిపించడం లేదని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కడప నగరంలోని ఓ మహిళా డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఈ నెల 25వ తేదీ ఉదయం 8 గంటలకు కళాశాలకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ తెలిసినవారు తమకు తెలియజేయాలని కడప టూ టౌన్ సీఐ శ్రీహరి తెలియజేశారు. మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా మదనపల్లె కొత్త ఇండ్లకు చెందిన రియల్టర్ షేక్ ఇస్మాయిల్(58) శ్రీకాకుళంలో ఆదివారం రైలు దిగే క్రమంలో కాలు జారి పడి మృతి చెందిన ఘటన విషాదం నింపింది. ఇస్మాయల్ మృతిపై కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మదనపల్లె కొత్త ఇండ్లకు చెందిన ఇస్మాయిల్ తన స్నేహితులతో కలిసి శుక్రవారం మదనపల్లె మండలంలోని సిటిఎం రెల్వే స్టేషన్ నుంచి 8 మందితో కలిసి శ్రీకాకుళంలోని హరివిల్లి శివాలయానికి వెళ్లారు. ఆదివారం స్వామివారిని దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణానికి శ్రీకాకుళం రైల్వే స్టేషన్కు అందరూ వచ్చారు. స్నేహితులతో కలిసి రైలు ఎక్కే సమయంలో పొరపాటున వేరే రైలు ఎక్కిన ఇస్మాయిల్, చైన్ లాగి రైలు నుంచి దిగే క్రమంలో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. సహచరులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించినా చికిత్స ఫలించక ఇస్మాయిల్ మృతి చెందాడని కుటుంబీకులకు సమాచారం అందించారు. ఇస్మాయిల్ మరణ వార్త తెలిసి కొత్త ఇండ్ల ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మదనపల్లె టౌన్ : తండ్రిపై తనయుడు కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన ఆదివారం రాత్రి గుర్రంకొండ మండలంలో చోటుచేసుకుంది. మదనపల్లె జిల్లా ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసుల కథనం మేరకు.. గుర్రంకొండ మండలం మర్రిపాడుకు చెందిన అబ్దుల్ గనితో కుమారుడు గొడవపడి ఆవేశంలో కత్తితో దాడి చేశాడని తెలిసింది. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితికి చేరుకున్న అబ్దుల్గనిని కుటుంబీకులు మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్స అనంతరం అతని పరిస్థితి విషమంగా ఉందని, తిరుపతి రుయాకు వెల్లాలని రెఫర్ చేశారు. ఘటనకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. -
చెరువు మట్టి.. కొల్లగొట్టి
టాస్క్ఫోర్స్ : ‘ఇప్పుడు కాకపోతే మరెప్పుడు సంపాదించుకుంటాం. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి’ అన్నట్లుగా కొందరు కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. ఎంతో విలువైన మట్టిని ఆదాయ వనరులుగా మార్చుకున్నారు. ‘మా ప్రభుత్వంలో మమ్మల్ని అడిగేదెవరు.. ఆపేదెవరు’ అంటూ ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. సంబేపల్లె మండలంలోని కొండావాండ్లపల్లె చెరువు, మోటకట్ల చెరువు, లాభం చెరువులలో జేసీబీలు, ప్రొక్లెయిన్లతో యథేచ్ఛగా రాత్రి, పగలు మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. నిబంధనలకు పాతర వేసి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్లు, టిప్పర్లతో అక్రమంగా మట్టిని అమ్ముకొని జేబులు నింపుకొంటున్నారు. నారాయణరెడ్డిపల్లె గ్రామం అభం చెరువులో మట్టి తవ్వకాలతో.. 20 నుంచి 30 మీటర్ల లోతుతో వంద మీటర్ల వెడల్పుతో భారీగా గుంతలు పడ్డాయి. ఇలాంటి గుంతలు చెరువులలో తీస్తుంటే సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదంటే.. పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. సంబేపల్లె మండలంలోని ఏపి కొండ సమీపం నుంచి గ్రావెల్, మోటకట్ల సమీపంలోని చెరువు నుంచి వందల సంఖ్యలో టిప్పర్లతో మట్టిని తరలించారు. లేవుట్ల వేస్తున్నారంటే ఈ ప్రాంతం నుంచి రాత్రిపూట మట్టిని తరలిస్తారు. ప్లాట్ల చదును కోసం దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం అటు వైపు చూడటం లేదంటే.. వారికి ఏ స్థాయిలో ముడుపులు వెళ్లుతున్నాయో నని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమంగా తరలిస్తున్న మట్టి మాఫియాను అడ్డుకోవాలని వారు కోరుతున్నారు. మాఫియాగా మారిన కొందరు కూటమి నేతలు పట్టించుకోని అధికారులు -
డీసెట్ కౌన్సెలింగ్కు 51 మంది హాజరు
రాయచోటి : 2026–28 విద్యా సంవత్సరానికి డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాల కోసం రాయచోటి డైట్లో నిర్వహిస్తున్న కౌన్సెలింగ్కు 51 మంది అభ్యర్థులు హాజరైనట్లు డైట్ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి తెలిపారు. ఆదివారం తొలి విడత కౌన్సెలింగ్ నిర్వహించినట్లు చెప్పారు. డైట్లో తెలుగు మాధ్యమంలో 50 సీట్లకు గాను 17 మంది, ఆంగ్ల మాధ్యమంలో 50 సీట్లకు గాను 9 మంది, ఉర్దూ మాధ్యమంలో 50 సీట్లకు గాను 16 మంది అభ్యర్థులు ప్రవేశం పొందారన్నారు. అలాగే బద్వేల్లోని ఎస్వీసీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్లో ఆంగ్ల మాధ్యమం 50 సీట్లకు గాను 9 మంది అభ్యర్థులు ప్రవేశం పొందినట్లు తెలిపారు. తొలి విడత కౌన్సెలింగ్ ఈ నెల 29 వరకు నిర్వహిస్తామన్నారు. అర్హత కలిగిన వారు నిర్ణీత గడువులోగా హాజరై ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసుకోవాలన్నారు. ధృవపత్రాల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులకు ప్రవేశపత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అధ్యాపకులు వెంకటసుబ్బారెడ్డి, శివప్రసాద్, గిరిబాబుయాదవ్, కేదార్నాథ్, వైసి రెడ్డప్పరెడ్డి, మోహన్నాయక్, కార్యాలయ సిబ్బంది జగదీష్, తిరుమలరావు, రవికిరణ్, వెంకటేష్, అనర్, శ్వేత తదితరులు పాల్గొన్నారు. -
గరుడ వాహనంపై సౌమ్యనాథుడు
నందలూరు : సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని ప్రధాన అర్చకులు సాయిక్రిష్ణ, సునీల్కుమార్ నిర్వహించారు. అనంతరం స్వామివారు మోహినీఅలంకారంలో శేషవాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి సౌమ్యనాథ స్వామి శ్రీ మహావిష్ణువు అలంకారంలో గరుడ వాహనంపై విహరించారు. గరుడసేవ తిలకించేందుకు విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం శ్రీ సౌమ్యనాథ స్వామి ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్ తెలిపారు. -
ఈత కొమ్మకు తోడు గిజిగాడి గూళ్లలా కొమ్మ కొమ్మకో ఊయల చిరుగాలుల జోలలా చిటారుకొమ్మల ఆలన తల్లిపిట్టల లాలనలా
● కొమ్మకొమ్మకో గూడు ! ప్రకృతి గీసిన అత్యద్భుతమైన సజీవ చిత్రమిది. ఏ సివిల్ ఇంజనీరుకూ సాధ్యం కాని రీతిలో, కేవలం తన ముక్కుతో ఒక్కో గడ్డిపోచను తెచ్చి, అద్భుతమైన నిర్మాణ నైపుణ్యంతో ఈత చెట్టు చిటారుకొమ్మలకు గిజిగాడు అల్లిన ఈ గూళ్లు చూసేకొద్దీ కనువిందు చేస్తున్నాయి. గాలివానలొచ్చినా, తుఫానులు చుట్టుముట్టినా చెక్కుచెదరని రీతిలో ఈ గూళ్లను నిర్మించుకోవడం ప్రకృతిలోని ఒక వింత రహస్యం. ఆ పచ్చని ఈత ఆకుల మధ్య, దోరగా పండుతున్న ఈతగెలల నడుమ వేలాడుతున్న ఈ చిట్టిగూళ్ల లోగిలి నుంచి వినవచ్చే లేత పిట్టల కిలకిలారావాలు తోటంతా కొత్త ప్రాణాన్ని నింపుతున్నాయి. ఎండనక, వాననక రెక్కలొచ్చిన పిల్లల ఆకలి తీర్చేందుకు తల్లిపిట్టలు పడే ఆరాటం, వాటి నిరంతర రాకపోకలతో ఆ గూళ్లు ఓ సజీవ కావ్యమై మెరుస్తున్నాయి. యాంత్రికమైన నగర జీవితపు ఒత్తిళ్లలో కాస్త సేదతీరి చూస్తే.. ఈ పచ్చని ప్రకృతి, ఆ పక్షుల గూటి సవ్వడి మనసును తేలికపరిచే ఒక అద్భుతమైన అనుభూతి! – మురళీకృష్ణ, గుర్రంకొండ -
●నిరాశ పడొద్దు.. ఓపికతో శ్రమిస్తే కొలువు మీదే!
● సంకల్పం ఉంటే కొలువులకు కొదవలేదు ● ఒకే ఏడాదిలో 13 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కడప కుర్రాడు ● కరోనా సంక్షోభం.. ప్రైవేట్ అభద్రతను అధిగమించి అపూర్వ విజయం ● ప్రస్తుతం మహబూబ్నగర్ ఈఎస్ఐసీ బ్రాంచ్ మేనేజర్గా నాగేంద్రసాయి కడప ఎడ్యుకేషన్: సాధించాలనే బలమైన సంకల్పం, పట్టుదలే పెట్టుబడిగా శ్రమిస్తే సొంతం కాని విజయం లేదని నిరూపించాడు వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప నగరానికి చెందిన యువకుడు లొమడ నాగేంద్రసాయి. తన తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని స్ఫూర్తిగా తీసుకుని, పట్టువిడవని విక్రమార్కుడిలా పోరాడి ఏకంగా ఒకే సంవత్సరంలో 13 కేంద్ర ప్రభుత్వ కొలువులు కై వసం చేసుకుని నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడు. విద్యాభ్యాసంలో టాప్ కడప నగరంలోని రాజారెడ్డి వీధికి చెందిన అశ్వనికుమార్ (ఏపీఎస్ఆర్టీసీ పదవీ విరమణ పర్సనల్ ఆఫీసర్), రాజరాజేశ్వరి (పెండ్లిమర్రి జెడ్పీ హైస్కూల్ స్కూల్ అసిస్టెంట్)ల కుమారుడైన నాగేంద్రసాయి ప్రాథమిక విద్యాభ్యాసం నుంచే చదువులో ప్రతిభ కనబరిచాడు. కడప భారతి స్కూల్లో 1 నుంచి 7వ తరగతి, విద్యాధరి స్కూల్లో 8 నుంచి 10వ తరగతి (10వ తరగతిలో 9.7 జీపీఏ) చదివాడు. హైదరాబాద్ ఎన్ఆర్ఐ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసి 974 మార్కులు సాధించాడు. ఆ తర్వాత జేఈఈ అడ్వాన్స్డ్లో ఉత్తమ ర్యాంకుతో పశ్చిమ బెంగాల్లోని ప్రతిష్టాత్మక ఐఐటీ ఖరగ్పూర్లో ఇండస్ట్రియల్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు (బీటెక్ + ఎంటెక్) పూర్తి చేశాడు. సాఫ్ట్వేర్పై కరోనా దెబ్బ.. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా.. నాగేంద్రసాయి చదువు ముగిసే సమయానికే ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికించింది. ఆ తరుణంలో ఐటీ రంగం సంక్షోభంలో పడి, పలు కంపెనీలు చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను కొలువుల నుంచి తొలగించాయి. ఎంతోమంది నిరుద్యోగులుగా మారడం కళ్లారా చూసిన సాయి.. ప్రైవేటు ఉద్యోగాల్లో భద్రత ఉండదని గ్రహించాడు. తన తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో, వారి బాటలోనే నడవాలనే బలమైన బీజం అతని మనసులో నాటుకుంది. కరోనా తగ్గుముఖం పట్టే వరకు ఇంట్లోనే ఉండి స్వయంగా ప్రిపరేషన్ సాగించాడు. తొలి ఓటమి నేర్పిన పాఠం మొదటిసారి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష రాసినప్పుడు కేవలం ఒకే ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేయడం, నార్మలైజేషన్ ప్రక్రియ వల్ల స్కోర్ తగ్గడంతో తృటిలో ప్రభుత్వ కొలువును మిస్ చేసుకున్నాడు. ఈ తొలి ఓటమికి ఏమాత్రం కుంగిపోకుండా, తన లోపాలను సరిదిద్దుకుని మరింత పట్టుదలతో తదుపరి పరీక్షలకు సిద్ధమయ్యాడు. 2025లో కొలువుల జాతర ఆ తర్వాత 2025లో హైదరాబాద్లోని ఓ కోచింగ్ సెంటర్లో చేరుకుని.. నోటిఫికేషన్ పడిన ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటూ కఠిన ప్రిపరేషన్ సాగించాడు. ఒక్కసారి లోపాలు తెలుసుకున్న నాగేంద్రసాయి, ఆ తర్వాత జరిగిన పరీక్షల్లో విశ్వరూపం ప్రదర్శించి ఒకే ఏడాదిలో వరుసగా 13 కేంద్ర ప్రభుత్వ కొలువులను సాధించి రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం నాగేంద్రసాయి తాను సాధించిన ఉద్యోగాలలో అత్యుత్తమమైన దాన్ని ఎంచుకుని, తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లాలో ఎంప్లాయిస్ స్టేట్ ఇన్య్సూరెన్స్ కార్పొరేషన్లో బ్రాంచ్ మేనేజర్ హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కడప జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలిపిన నాగేంద్రసాయి ప్రతిభపై పలువురు విద్యావంతులు, ఉన్నతాధికారులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఒకే ఏడాదిలో సాధించిన 13 కేంద్ర ప్రభుత్వ కొలువులు ఇవే: ఎయిమ్స్ : సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ఎయిమ్స్ , అప్పర్ డివిజనల్ క్లర్క్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అప్పర్ డివిజనల్ క్లర్క్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్–2స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సర్వేయర్ ఆఫ్ సెలక్షన్ కమిషన్, అసిస్టెంట్ కమ్యూనికేషన్ ఆఫీసర్ ఆఫ్ సెలక్షన్ కమిషన్ , అప్పర్ డివిజనల్ క్లర్క్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, టెలికాం అసిస్టెంట్ ఆఫ్ సెలక్షన్ కమిషన్, ఫ్యూమిగేషన్ అసిస్టెంట్ ఆఫ్ సెలక్షన్ కమిషన్, సర్వైలెన్స్ అసిస్టెంట్ ఆఫ్ సెలక్షన్ కమిషన్, ఫీల్డ్మెన్ ఆఫ్ సెలక్షన్ కమిషన్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ అండ్ హెచ్ఆర్ సెలక్షన్ కమిషన్, అసిస్టెంట్ విలేజ్ ఇండస్ట్రీ అడ్మినిస్ట్రేటర్.ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే నైపుణ్యంతో పాటు ఎంతో ఓపిక, సహనం అవసరం. మొదటి ప్రయత్నంలోనే విజయం రాలేదని ఏమాత్రం కుంగిపోకూడదు. ఓటమిని ఒక పాఠంగా మార్చుకుని, పట్టుదలతో మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. అప్పుడే లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలం. ప్రతిరోజూ క్రమం తప్పకుండా 10 నుంచి 12 గంటల పాటు ప్రిపరేషన్కు కేటాయించాలి. కేవలం చదవడం మాత్రమే కాదు, అన్ని సబ్జెక్టులపై సంపూర్ణమైన అవగాహన, పట్టు సాధించాలి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు కుటుంబం, ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి లభించే మానసిక మద్దతు, ప్రోత్సాహం ఎంతో కీలకం. – లొమడ నాగేంద్రసాయి -
ధరల పతనం దాచిపెడతారా !
సాక్షి, మదనపల్లె: మదనపల్లె టమాటా మార్కెట్లో ధరలు పతనమైతే చూస్తూ ఏం చేస్తున్నారని మార్కెటింగ్ శాఖ ఏడీ త్యాగరాజుపై మార్కెటింగ్ శాఖ కమిషనర్, డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాక్షిలో ‘ఠారుమన్న టమాటా’, ‘టమాటా రేటింగ్..మార్ కటింగ్’ శీర్షికలతో సాక్షి ప్రధాన, జిల్లా సంచికల్లో కథనాలు, శుక్రవారం చేతికందిన పంట..ధర దిగజారి తంటా కథనం ప్రచురితమయ్యాయి. మదనపల్లె మార్కెట్లో ధరలు పతనమై రైతులు పడుతున్న అవస్థలను సాక్షి కళ్ల కట్టినట్టు తెలియజేసింది. కిలో ధర రూ.3 పడిపోతే దాన్ని అధిక ధరలు పలికినట్టు మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలను వెలుగులోకి తెచ్చింది. స్పందించిన మార్కెటింగ్ శాఖ కమిషనర్, డైరెక్టర్, కడప ఆర్జేడీలు అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన టమాటా మార్కెట్ల కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మార్కెట్లలో టమాటా ధరలపై ఆరా తీశారు. మదనపల్లెలో ధరలు ఎందుకు పడిపోయాయని ఇన్చార్జి కార్యదర్శి అయిన ఏడీ త్యాగరాజను ప్రశ్నించారు. ఈ సందర్భంగా సాక్షి కథనాలపై ఏడీ తప్పదారి పట్టించే ప్రయత్నం చేయగా ఉన్నతాధికారులు స్పందిస్తూ అలాగైతే వాస్తవ విషయాలను ఎందుకు దాచి పెట్టారని చీవాట్లు పెట్టారని సమాచారం. దీనికి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలినట్టు తెలిసింది. అనంతరం మార్కెట్ల వారీగా ధరలను సమీక్షించారు. 150 టన్నుల టమాటా కొనుగోలు టమాటా మార్కెట్లనుంచి శనివారం 150 టన్నుల టమోటా కొనుగోలు చేసినట్లు మార్కెటింగ్ శాఖ కడప ఆర్జేడీ రామాంజనేయులు తెలిపారు. అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు, పుంగనూరు, సోమల, కలికిరి నుంచి 60 టన్నులు, అనంతపురం జిల్లా నుంచి 90 టన్నుల టమాటా కొనుగోలు చేసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. 20 మొబైల్ రైతు బజార్ల ద్వారా టమాటా విక్రయాలు చేస్తున్నామని చెప్పారు. టమాటా రైతులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దీనికి సంబంధించి మార్కెట్ యార్డ్ కార్యదర్శులకు సూచనలు చేశామని తెలిపారు. అన్నమయ్య మార్కెటింగ్ ఏడీ తీరుపై తీవ్ర ఆగ్రహం -
ఘనంగా ప్రారంభమైన తాళ్లపాక బ్రహ్మోత్సవాలు
రాజంపేట: పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలి అయిన తాళ్లపాక గ్రామంలో శనివారం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడి చారిత్రక శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయం, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయాలలో ఉత్సవాల వేళ శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు, విశేషార్చనలు జరిపి, విచ్చేసిన భక్తులకు పెద్ద ఎత్తున తీర్థప్రసాదాలను అందజేశారు.సాయంత్రం వేళ అలంకృత వాహనాల్లో కామాక్షి సమేత సిద్ధేశ్వరస్వామి వారిని, శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి వారిని తాళ్లపాక మాఢవీధుల్లో వైభవంగా ఊరేగించారు. ఈ గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కర్పూర హారతులు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ బాలాజీ, వేదపండితులు భక్తవత్సలం, మహేశ్, నరేష్లతో పాటు ఉత్సవాలకు ప్రత్యేకంగా విచ్చేసిన పలువురు వేదపారాయణ పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
తుపాకులతో బెదిరించి ఏటీఎం అపహరణ
● సినీ ఫక్కీలో రెండే నిమిషాల్లో చోరీ ● స్థానికులు చూస్తుండగా ఏటీఎం ఎత్తుకెళ్లిన దుండగులు మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శనివారం వేకువజామున సినీ ఫక్కీలో రెండే నిమిషాల్లో ఏటీఎం చోరీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. మదనపల్లె పట్టణం, శివాజీనగర్ లోని ఏటీఎం కేంద్రంలోకి నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం వేకువజామున ప్రవేశించారు. ఏటీఎం యంత్రాన్ని బొలెరో వాహనంలో ఎక్కిస్తుండగా అడ్డుకునేందుకు వచ్చిన స్థానికులను తుపాకులతో బెదిరించారు. రెండే నిమిషాల్లో చోరీ దొంగలు ఏటీఎం యంత్రాన్ని రెండే నిమిషాల్లో ఎత్తుకెళ్లారు. ఎవరైనా బయటకు వస్తే కాల్చేస్తామని బైక్పై ఉన్న ఇద్దరు దొంగలు తుపాకులు చూపించి స్థానికులను భయపెట్టి ఓ పథకం ప్రకారం ఎస్బీఐ ఏటీఎం యంత్రాన్ని అపహరించారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో టూ టౌన్, వన్ టౌన్, తాలూకా, క్రైం బ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. చోరీ ఎలా జరిగిందని స్థానికులను విచారించి దొంగల వాహనాన్ని పట్టుకునేందుకు వెంబడించారు. దొంగల దగ్గర తుపాకులు ఉన్నాయని స్థానికులు పోలీసులు చెప్పారు. సునాయాసంగా తప్పించుకున్న దుండగులు పోలీసులు ఘటనాస్థలనికి చేరుకునే సమయంలోనే దొంగలు సునాయాసంగా తప్పించుకుని వాల్మీకిపురం మీదుగా నిమ్మనపల్లె మండలంలోని అగ్రహారం వద్ద ఉండే నూరుకుప్పల కొండ వద్దకు చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ముక్కలు చేసి అందులోని నగదుతో పరారయ్యారు. డ్రోన్ కెమెరాలతో గాలింపు దొంగల వాహనం నిమ్మనపల్లి మండలానికి చేరుకున్నట్లు తెలుసుకుని డ్రోన్ కెమెరాలతో పోలీసులు గాలించినా ఫలితం లేకపోయింది. ఎస్పీ ధీరజ్, అడిషనల్ ఎస్పీ వేంకటాద్రి నిమ్మనపల్లి వద్ద దొంగలు పగలగొట్టిన ఏటీఎంను పరిశీలించారు. దొంగలు జిల్లా సరిహద్దులు దాటి పారిపోకుండా ఉండేందుకు అన్ని చెక్ పోస్టులు, రహదారులపై నాకాబందీ ఏర్పాటు చేసి నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. హర్యానాకు చెందిన గ్యాంగ్ చోరీకి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగలు వినియోగించిన బొలెరో వాహనం కూడా చోరీ చేసిన కేసులోనిదేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆయుధాలతో దోపిడీకి పాల్పడిన ఘటనతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెండో పట్టణ పోలీసులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అలజడి మదనపల్లెలో ఏటీఎం యంత్రం చోరీ రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టించింది. చోరీ వెనుక విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దొంగల ముఠా ఏటీఎంను ఎత్తుకెళ్లే సమయంలో అందులో రూ.13.05 లక్షల నగదు ఉన్నట్లు ఏటీఎంల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ మురళీకష్ణ, ఎస్బిఐ చీఫ్ మేనేజర్ సుగుణకుమార్ మీడియాకు తెలిపారు. సిఎంఎస్ ఏజెన్సీ శుక్రవారం ఏటీఎంలో రూ. 13.05 లక్షల నగదును లోడింగ్ చేసిందని, లోడింగ్ చేసిన డబ్బు మొత్తం దొంగలు ఎత్తుకెళ్లారని స్పష్టం చేశారు. ఏటీఎంను ఎత్తుకెళ్లిన వాహనంతో పాటు నిందితులు నూరుకుప్పలకొండ పరిసరాలలోనే నక్కి ఉన్నట్లు గుర్తించారు. ఇందుకోసం స్పెషల్ పార్టీ పోలీసులు ఎస్టిఎఫ్ బలగాలను రంగంలోకి దింపారు. అగ్రహారం పరిసరాలలోని తోటలు, నూరుకుప్పలకొండ వద్ద ఉన్న మామిడి తోటల్లో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఆధారాలు సేకరించిన క్లూస్ టీం మదనపల్లి సీటిఎం రోడ్డులో దొంగలు చోరీ చేసిన ఎస్బిఐ ఎటిఎంను సిఆర్ఎస్ ఏజన్సీ ఎనిమిదేళ్లుగా నడుపుతున్నారు. చోరీ జరిన గదిలో క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. అలాగే పరిసరాలలో సీసీ కెమెరా ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లాలోని పోలీసు యంత్రాంగం మొత్తం దొంగలను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. నిమ్మనపల్లి నూరుకుప్పలకొండ ప్రాంతాల్లో అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ ధీరజ్, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిందితులను పట్టుకునేందుకు 28 పోలీస్స్టేషన్ల సీఐ, ఎస్ఐలతో పాటు ప్రత్యేక బందాలు ముమ్మరంగా కూంబింగ్ చేపట్టి గాలిస్తున్నాయి. సవాల్గా మారిన ఏటీఎం చోరీ అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె దొంగలు ఏటిఎంను సునాయాసంగా దొంగిలించి డబ్బుతో పారిపోవడం జిల్లా ఎస్పీకి సవాలుగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో నక్కదిన్నె వద్ద ఏటీఎంను కట్టర్తో ధ్వంసం చేసిన కేసులోనే పోలీసులు కేసును ఛేదించలేకపోయారు. ఏది ఏమైనా జిల్లా ఎస్పీకి మదనపల్లె ఏటిఎం చోరీ సవాలుగా మారనుందని చర్చ సాగుతోంది. -
నా కళ్లు... కలల లోగిళ్లు
రాయచోటి టౌన్: ‘నేను మరణించినా నా కళ్లు ఈ లోకాన్ని చూస్తూనే ఉండాలి’ అన్న భర్త ఆశయాన్ని నెరవేరుస్తూ ఒక భార్య తీసుకున్న నిర్ణయం అన్నమయ్య జిల్లా రాయచోటిలో అందరి హృదయాలను కదిలించింది. రాయచోటి పట్టణ పరిధిలో స్కూటర్పై వెళ్తున్న తిరుమల సత్యకుమార్ అనే వ్యక్తి.. అడ్డువచ్చిన ఓ వృద్ధురాలిని తప్పించబోయి రోడ్డు బారికేడ్లను ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందారు. భర్త ఆకస్మిక మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ, ఆయన ఆశయం ప్రకారం నేత్రదానం చేయాలని భార్య తిరుమల ఆశాజ్యోతి లయన్స్ క్లబ్ ప్రతినిధులను ఆశ్రయించారు. లయన్స్ ఆర్గాన్ డొనేషన్ చైర్మన్ కొత్త సుదర్శన్ తక్షణమే స్పందించి కడప ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రి బృందాన్ని రప్పించి మృతుడి నుంచి నేత్రాలను సేకరించారు. ఈ నేత్రాలను చూపులేని మరో ఇద్దరికి అమర్చివారికి పునర్జన్మ ప్రసాదిస్తామని హాస్పిటల్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ కె. ప్రశాంత్కుమార్ తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఎవరైనా మరణానంతరం నేత్రదానం చేయాలనుకుంటే 9701078269, 9848366706 నంబర్లను సంప్రదించాలని లయన్స్ క్లబ్ ప్రతినిధులు కోరారు. లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు హరినాథరెడ్డి, వీరభద్రస్వామి ఆలయ కమిటీ చైర్మన్ మనోజ్కుమార్ పాల్గొన్నారు. -
గోతులు తీసి మొక్కలు నాటారు
రాయచోటి : రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమంపై మున్సిపల్ అధికారులు స్పందించారు. శుక్రవారం ‘సాక్షి’లో ‘మానులవుతున్న అవినీతి మొక్కలు’ శీర్షికతో ప్రచురితమైంది. దీనిపై సంబంధిత ఇంజినీర్లు, మున్సిపల్ కమిషనర్ స్పందించారు. డివైడర్స్ మధ్యలో నాటిన మొక్కలు ప్రాంతాలను పరిశీలించారు. డివైడర్ల మధ్యలో ఎర్రమట్టిని తోలించి, లోతైన గోతులు తవ్వించి మిగిలిన ప్రాంతాలలో మొక్కలు నాటించే కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే గతంలో నాటిన మొక్కల స్థానంలో కూడా ఎర్రమట్టిని తోలి ట్యాంకర్ల సాయంతో సమృద్ధిగా నీటిని అందించారు. -
విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకం
పెద్దమండ్యం: విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ అన్నారు. మండలంలోని కలిచెర్ల జిల్లా పరిషత్ తెలుగు ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్–టీచర్స్ 4.0 మీటింగ్ జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యను అభ్యసించే ఏడు సంవత్సరాల్లో కష్టపడి చదివితే 70 సంవత్సరాలు సుఖంగా ఉండవచ్చని అన్నారు. 13 నుంచి 16 సంవత్సరాల వయస్సులో సోషల్మీడియా ప్రభావం, తప్పుడు స్నేహాలు, మాదక ద్రవ్యాలు, చెడు అలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. ఈ కీలక సంవత్సరాలను విద్యార్థులు వృథాచేస్తే భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పాఠశాలలో పిల్లల హాజరును తల్లిదండ్రులు క్రమం తప్పకుండా పరిశీలించాలన్నారు. పాఠశాల అభివృద్ధికి దాతలు, గ్రామ ప్రజలు అందిస్తున్న సహకారం అభినందనీయమని అన్నారు. గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల అభివృద్ధిలో భాగస్వామ్యులైన మాజీ ఎమ్యెల్యే కలిచెర్ల ప్రభాకరరెడ్డి కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. మండలంలోని కేజీబీవీ, కలిచెర్ల ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల కోసం తాగునీటి బోర్లు వేశామని మోటార్లు మంజూరు చేయాలని ఎంపీపీ పూర్ణచంద్రిక కలెక్టర్ను కోరారు. రెండు బోర్లకు మోటార్లు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. తల్లికి వందనం రాలేదని ఓ విద్యార్థి, తల్లితో కలిసి కలెక్టర్కు విన్నవించు కోవడానికి రాగా ప్రాసెస్లో ఉందని అధికారులు వారిని నిలిపేశారు. పెద్దమండ్యం ఉన్నత పాఠశాలలో ప్రహరీగోడ నిర్మాణం పనులు ఆగిపొవడంపై ‘సాక్షి’లో శుక్రవారం వెలువడిన వార్త కథనంపై ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రహరీగోడ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకొవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాతీయస్థాయిలో జరిగే పోటీలకు ఎంపికై న పెద్దమండ్యం ఉన్నత పాఠశాలకు చెందిన సి హర్షవర్దన్ అనే విద్యార్థిని కలెక్టర్ ఆభినందించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు కలెక్టెర్ వడ్డించారు. స్థలదాత, మాజీ సింగిల్ విండో ఛైర్మన్ కడప సుధాహరరెడ్డి, హెచ్ఎం మీనానాగలక్ష్మి, ఎస్ఎంసి ఛైర్మన్ ఎం గిరిజాపతి, వైస్ ఛైర్మన్ స్వర్ణ, తహశీల్దార్ తేజస్వి, ఎంపీడీవో శ్రీధర్రావు, ఎంఈవోలు మనోహర, రామక్రిష్ణ, మాజీ సర్పంచ్లు జింకా విశ్వనాధ, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ -
జాతీయ స్థాయిలో మిట్స్కు అరుదైన గుర్తింపు
కురబలకోట: అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ఇండియా బెస్ట్ కాలేజెస్ ర్యాంకింగ్స్లో జాతీయ స్థాయిలో విశిష్ట స్థానాలను దక్కించుకున్నట్లు చాన్స్లర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి తెలిపారు. డీ వీక్–హంసా రీసెర్చ్ సర్వే–26 విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్లో మిట్స్ స్థానం దక్కించుకుందన్నారు. మిట్స్కు ఆలిండియా ఇంజినీరింగ్ కళాశాలల విభాగంలో140 ర్యాంకు, దేశంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో 114 ర్యాంకు, దక్షిణ భారత ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో 74వ ర్యాంకు, రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలలో 11 ర్యాంకు లభించడం సంతోషంగా ఉందన్నారు. ఇది యూనివర్సిటీ విద్యా ప్రమాణాలకు, ప్రగతికి నిదర్శనంగా నిలుస్తోందన్నారు. -
ఏపీఐఐసీ భూముల్లో పరిశ్రమల స్థాపనకు చర్యలు
కలికిరి: వాల్మీకిపురం మండలం తాటిగుంటపల్లి పంచాయతీ పరిధిలోని తిరుపతి–మదనపల్లి జాతీయ రహదారి పక్కన గల ఏపీఐఐసీ భూము లను కలెక్టరు నిశాంత్కుమార్, స్థానిక ఎమ్మెల్యే కిశోర్కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఇక్కడ ఉన్న 1200 ఎకరాల ఏపీఐఐసీ భూముల్లో, లేఔట్ల ఏర్పాటు తర్వాత ఇంకా 600 ఎకరాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. ఖాళీగా ఉన్న భూముల్లో పరిశ్రమల స్థాపనకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలికిరిలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలకు జూనియర్ కళాశాల మంజూరైన నేపథ్యంలో.. సీఎల్ఆర్సీ కేంద్రంలో జరుగుతున్న కళాశాల మరమ్మతు పనులను వారు తనిఖీ చేశారు. కలికిరి పెద్దచెరువును సందర్శించిన కలెక్టర్ నీటి నిల్వ సామర్థ్యం, క్యాస్కేడ్ అభివృద్ధి, ఆయకట్టు విస్తీర్ణం వివరాలను ఇరిగేషన్ ఏఈ శ్రీనివాసులును అడిగి తెలుసుకున్నారు. అనంతరం తుమ్మలపేట వడ్డిపల్లి వద్ద గల దండువాని ఒడ్డు చెరువు కట్ట పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెలఫేర్ ఈఈ కరీముల్లా ఖాన్, ఏఈ రమేష్, తహశీల్దారు సయ్యద్ అహ్మద్, డిప్యూటీ ఎంపీడీఒ రియాజుద్దీన్, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. నేటి మెగా పీటీఎంకు హాజరుకావాలి సాక్షి, మదనపల్లె: జిల్లావ్యాప్తంగా శుక్రవారం నిర్వహించనున్న మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (పీటీఎం) సమావేశాలకు తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ హాజరుకావాలని కలెక్టర్ ఒక ప్రకటనలో కోరారు. మొత్తం 2,259 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్న ఆయన, విద్యాశాఖ అధికారులు ఈ మెగా పీటీఎంకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. -
రాయంచపై రమణ విహారం
నందలూరు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజైన గురువారం స్వామివారు భక్తులకు అద్భుత దర్శనమిచ్చారు. ఉదయం ఆలయ అర్చకులు, ఆగమ పండితుల ఆధ్వర్యంలో పల్లకీసేవ, స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత సౌమ్యనాథ స్వామి మత్స్యావతారంలో పల్లకీపై మాడవీధుల్లో విహరించారు. రాత్రి సరస్వతి దేవి అలంకారంలో హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాయకర్పూరాలు సమర్పించారు. నేటి ఉత్సవాలు: బ్రహ్మోత్సవాలలో నాల్గో రోజైన శుక్రవారం ఉదయం పల్లకీసేవ, గ్రామోత్సవం, తిరుమంజనం ఉంటాయని ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్ తెలిపారు. రాత్రికి స్వామివారు సింహ వాహనంపై కొలువై మాడవీధుల్లో ఊరేగనున్నట్లు పేర్కొన్నారు. -
చెరువులో బోర్లు వేస్తే ఊరుకోం
● మున్సిపల్ కమిషనర్ను అడ్డుకున్న రైతులు ● 500 మంది రైతులు రోడ్డున పడతారని ఆవేదనమదనపల్లె టౌన్ : మదనపల్లె మున్సిపాలిటీకి తాగునీరు సరఫరా చేసేందుకు వేంపల్లె చెరువులో బోర్లు వేస్తే తాము నష్టపోతామని, సుమారు 500 మంది రైతులు వీధిన పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం వేంపల్లె చెరువు వద్దకు పరిశీలనకు వచ్చిన మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఎంపీడీఓ తాజ్ మన్సూర్ను గ్రామస్తులు అడ్డుకున్నారు. చెరువులో బోర్లు వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. చెరువు నీటిపై ఆధారపడి తాము వ్యవసాయం చేసుకుంటున్నామని, బోర్లు వేస్తే భూగర్భజలాలు తగ్గి పంటలు ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాలూకా పోలీసుల జోక్యం వేంపల్లె వద్ద రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం గ్రామస్తులను పోలీస్ స్టేషన్న్కు పిలిపించి బోర్లు వేసేందుకు ఒప్పించే ప్రయత్నం చేశారు. ఎంపీడీవో తాజ్ మన్సూర్, సీఐ కళా వెంకటరమణ గ్రామస్తులతో మాట్లాడి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మున్సిపాలిటీకి తాగునీటి అవసరం, రైతుల సమస్యలపై చర్చించారు. అయితే తమ పొలాలకు నష్టం చేసే బదులు చిప్పిలి సమ్మర్ స్టోరేజీకి తీసుకున్న భూముల్లో బోర్లు వేసుకొని పట్టణంలో నెలకొన్న తాగినీటి సమస్యను పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు. అంతేకాకుండా అప్పుడు స్వాధీనం చేసుకున్న బోర్లు కూడా పదుల సంఖ్యలో ఉన్నాయని వాటిని కూడా స్వాధీనం చేసుకొని ప్రభుత్వం తాగినీటి సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
ఎయిడ్స్ సురక్షపై డాక్యుమెంటేషన్ సక్రమంగా నిర్వహించాలి
మదనపల్లె టౌన్ : ఏపీ ఎయిడ్స్ నియంత్రణ మండలి నిర్వహిస్తున్న మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాలను ఏఆర్టీ సెంటర్లో డాక్యుమెంటేషన్ పక్కాగా నిర్వహించాలని ఏపీ శాక్స్ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్, ప్రిఫర్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ సూచించారు. గురువారం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఏఆర్టీ కేంద్రాన్ని వారు తనిఖీ చేశారు. ఎయిడ్స్ సురక్ష కార్యక్రమంలోని పలు అంశాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సోచ్లో వివరాలు ఎలా పొందుపరచాలో తెలిపారు. ఏఆర్టీ ఇండికేటర్స్లో గ్యాపులు లేకుండా చూసుకోవాలన్నారు. టార్గెట్లను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. కౌన్సెలింగ్, మందుల సరఫరా విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. హెచ్ఐవీ స్క్రీనింగ్ లక్ష్యాలను 95 శాతం వరకు చేరుకోవాలని, అలాగే హెచ్ఐవీ ఉన్న వారిలో 95 శాతం మందికి చికిత్స అందించాలన్నారు. కార్యక్రమంలో ఏపీ శాక్స్ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభు సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్ నాగార్జున, ఉమ్మడి జిల్లాల క్లస్టర్ ఆఫీసర్ భాస్కర్ పాల్గొన్నారు.ఏపీ శాక్స్ రిటైర్డ్ జేడీ డాక్టర్ రాజేంద్రప్రసాద్ -
మానులవుతున్న అవినీతి మొక్కలు!
రాయచోటి: రాయచోటి మున్సిపాలిటీలో అవినీతి మొక్కలు వృక్షాలై తాండవిస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని ఏ విభాగంలోకి వెళ్లి తొంగి చూసినా అవినీతి కంపుకొడుతోంది.ప్రస్తుతం పాలకవర్గం లేకపోవడంతో, అధికార పార్టీ నేతల అండ చూసు కుని కార్యాలయ పరిధిలోని కొంతమంది అధికారు లు, సిబ్బంది దీన్ని ఒక వరంలా మార్చుకున్నారు. స్థాయికి మించి జోక్యం.. కార్యాలయంలో పనిచేస్తున్న సచివాలయ స్థాయి ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ సిబ్బంది తాము చేసే ఉద్యోగం కంటే వివిధ విభాగాల విధినిర్వహణలలో తమ స్థాయికి మించి జోక్యం చేసుకుంటున్నారు. ఉన్నతాధికారులను సైతం రాజకీయ నేతల పేర్లు చెప్పి భయపెడుతూ తమకు నచ్చినట్లు పనులు చేయించుకుంటూ, తప్పుడు బిల్లులు పాస్ చేయించుకుంటున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలో 104 వాహనాల విక్రయం, నిరుపయోగంగా ఉన్న వాహనాల అమ్మకం, శానిటేషన్ సామగ్రి కొనుగోలు, వాహనాలకు డీజి ల్, అద్దె ట్రాక్టర్ల బాడుగ చెల్లింపులు, ఫాగింగ్.. ఇలా అన్నిట్లోనూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అనుమతులు దేవుడెరుగు.. నిధుల స్వాహా! ఏదైనా అభివృద్ధి పనులను చేపట్టాలంటే ముందుగా ప్రతిపాదనలను సిద్ధం చేసి పాలనా అనుమతులు లేదా ఉన్నతాధికారుల అనుమతులు పొందాల్సి ఉంటుంది. కానీ రాయచోటి మున్సిపల్ పరిధిలో ఎవరి అనుమతులు లేకపోయినా అక్కడ పనిచేస్తున్న ఒకరిద్దరు అధికారులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో అధికార పార్టీ నేతల పేర్లు చెప్పుకొని అభివృద్ధి పేరుతో లక్షల రూపాయల నిధులను కా జేస్తున్నారన్న విమర్శలు కార్యాలయంలో బహిరంగంగానే వినపడుతున్నాయి. రాయచోటి పట్టణ పరిధిలోని రాయచోటి–కడప, రాయచోటి–సుండు పల్లె మార్గాలలోని డివైడర్స్లో చేపడుతున్న ప్లాంటేషన్, సర్కిల్స్లోని ఫౌంటెయిన్ల పనులే దీనికి నిదర్శనం. దుమ్ము, ధూళిలోనే మొక్కలు.. 30 శాతమే ఖర్చు! సాధారణంగా ప్లాంటేషన్ నిర్మాణం చేపట్టాలంటే డివైడర్ మధ్యన ఉన్న మట్టిని ఒక అడుగు లోతు వరకు తొలగించి ఎర్రమట్టి (గ్రావెల్)తో ఫిల్లింగ్ చేయాలి. కానీ కాంట్రాక్టర్ మాత్రం డివైడర్లో ఉన్న దుమ్ము ధూళి మట్టిని కొంతమేర బయటకు తీసి, అదే మట్టిలో గాడి తీసి తెచ్చిన మొక్కలను నాటేశారు. మొక్కలు నాటిన తర్వాత అయినా ఎర్రమట్టిని వేయకుండానే, బయటకు తీసిన పాత మట్టినే తిరిగి నింపి నీటిని పడుతుండటం విశేషం. ఇలా చేయడం వల్ల మొక్కలకు సరైన బలం అందదని నిపుణులు చెబుతున్నారు. నామమాత్రంగా చేపట్టిన ఈ పనులకు 20 నుంచి 30 శాతం కంటే ఖర్చు కాదని, కానీ అధికార పార్టీ అండతో బిల్లు మాత్రం పూర్తి స్థాయిలో వంద శాతం రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. రూ.10 లక్షలతో అనుమతులు లేకుండా ప్లాంటేషన్ నిబంధనలకు విరుద్దంగా బిల్లులు అధికార పార్టీ నేతల పేర్లు చెప్పికింది స్థాయి సిబ్బంది హల్చల్ నిబంధనల ప్రకారం లేకుంటే చర్యలు! రూ.10 లక్షలతో పట్టణంలో ప్లాంటేషన్, ఫౌంటెయిన్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. వీటికి ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు లేవు. మొక్కలు నాటక ముందే అడుగులోతు మట్టిని తొలగించి ఆ భాగాన్ని ఎర్రమట్టితో నింపాలని సూచించాము. మొక్కలు నాటిన తర్వాత తిరిగి ఎర్రమట్టిని వేసి నీటిని బాగా పట్టాలని కాంట్రాక్టర్కు చెప్పాము. త్వరలోనే చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా లేకపోతే తగు చర్యలు తీసుకుంటాం. – మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, రాయచోటి -
నేడు మెగా పీటీఎం – 4.0
మదనపల్లె సిటీ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 1,803 ప్రభుత్వ పాఠశాలల్లో ‘మెగా పీటీఎం–4.0’ (తల్లిదండ్రుల–ఉపాధ్యాయుల సమావేశం) నిర్వహిస్తున్నట్లు డీఈఓ సుబ్రమణ్యం, సమగ్రశిక్ష ఏసీపీ అనూరాధ తెలిపారు. గురువారం డీఈఓ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పాఠశాలల అభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. సమావేశానికి వచ్చే ప్రతి తల్లిదండ్రుల మొబైల్లో శ్రీలీప్ యాప్శ్రీ డౌన్లోడ్ చేయించి, అవగాహన కల్పిస్తామన్నారు. హాజరైన వారందరికీ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాయలు తోలిన రైతుందరికి సహాయం పులిచెర్ల(కల్లూరు): మామిడికాయలు ఫ్యాక్టరీలకు తోలిన రైతులందరికీ ప్రభుత్వం అదనంగా ఇచ్చేరూ.4ను సహాయం అందేలా చూస్తామని ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టరు కోటేశ్వర రావు తెలిపారు. గురువారం పులిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సమావేశంలో మాట్లాడారు. ప్రతి రైతు సేవా కేంద్ర సిబ్బంది గ్రామాల్లో పర్యటించి మామిడి కాయలు ఫ్యాక్టరీలకు తోలిన రైతుల వివరాలు ర్యాంపుల దగ్గర నమోదు చేసిన పేర్లు, వారి, భూమి వివరాలు, ఇంటిలో ఎవరి పేరున తోలారు తదితరాలను రికార్డు చేయాలన్నారు. ప్రభుత్వసాయం కాయలు తోలిన ప్రతి రైతుకు అందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారిణి సంతోషి కుమారి, మండల వ్యవసాయ శాఖాధికారిణి లీలాకుమారి, రైతు సేవా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. -
నాణ్యత పాటించకుంటే టెండర్లు రద్దు
రాయచోటి టౌన్ : టెండర్ల ద్వారా దక్కించుకున్న అభివృద్ధి పనులలో నాణ్యత పాటించకుంటే ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే టెండర్లు రద్దు చేస్తామని రాయచోటి శ్రీ వీరభద్ర స్వామి పాలక మండలి అధ్యక్షడు తిరుమల మనోజ్ కుమార్ హెచ్చరించారు. శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో పలు రకాల సేవా, సాంకేతిక అభివృద్ధి పనులకు బహిరంగ టెండర్లు నిర్వహించారు. ఈ ప్రక్రియలో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుండి మొత్తం 32 మంది కాంట్రాక్టర్లు తరలివచ్చారు. లడ్డు బాక్సులు, హై–రిజల్యూషన్ సీసీ కెమెరాల ఏర్పాటు! స్వామి వారి ప్రసాద విక్రయాల కోసం ఒక లడ్డు, రెండు లడ్డూల బాక్స్లు, లడ్డు కవర్లు (జయో కంపెనేషపర్, 6X6 సైజు బటర్ పేపర్తో పాటు రెండు వైపులా ఆలయ పేరు ప్రింటింగ్) సరఫరాకు టెండర్లు జరిగాయి. అలాగే భక్తుల భద్రత దృష్ట్యా ఆలయంలో ప్రస్తుతం ఉన్న 42 పాత సీసీ కెమెరాల (2ఎంపీ) స్థానంలో అత్యాధునిక 5 ఎంపీ, 8 ఎంపీ ఐపీ కెమెరాలు, ఎన్వీఆర్, ఎస్ఎస్డీ హార్డ్ డిస్క్ల ఇన్స్టాలేషన్తో పాటు అదనంగా మరో 16 కొత్త సీసీ కెమెరాల ఏర్పాటుకు టెండర్లు నిర్వహించారు. ఆలయ నిబంధనల ప్రకారం అత్యంత తక్కువ ధర (ఎల్1) కోట్ చేసిన వారికే ఈ టెండర్లు ఖరారు చేస్తామని, ఎక్కడా నాణ్యత ప్రమాణాలు లోపించకుండా వస్తువులను సరఫరా చేయాలని స్పష్టం చేశారు. శ్రావణ మాసం నాటికి వసతుల కల్పన ఆలయ అభివృద్ధి పనులలో భాగంగా భక్తుల తాగునీటి సమస్య నివారణకు దాతల సహకారంతో రెండు ప్రత్యేక నీటి ప్లాంట్లను ఏర్పాటు చేశామని పాలక మండలి అధ్యక్షుడు తెలిపారు. వీటితో పాటు రూ.7 లక్షల వ్యయంతో రెండు రేకుల షెడ్లు, మాడవీధులలో రెండు భారీ కేడ్లను నిర్మించినట్లు వివరించారు. ఈ పనులన్నింటినీ వచ్చే శ్రావణమాసం ప్రారంభం నాటికే పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ జూనియర్ అసిస్టెంట్ ఇంద్ర, పాలక మండలి సభ్యులు గిరి, ఇతర సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ వీరభద్రస్వామి ఆలయ పాలక మండలి అధ్యక్షుడు తిరుమల మనోజ్ కుమార్ లడ్డు బాక్సులు, సీసీ కెమెరాల ఏర్పాటుకు భారీగా తరలివచ్చిన కాంట్రాక్టర్లు శ్రావణ మాసం నాటికి భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామని వెల్లడి -
జూదస్థావరంపై దాడి
చౌడేపల్లె : మండలంలోని పుదిపట్ల పంచాయతీ మిట్టూరు సమీపంలోని మంచూరుకుంట వంక వద్ద జూద స్థావరంపై గురువారం పోలీసులు దాడులు చేసి ముగ్గరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు పరారైనట్లు ఎస్ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు. వారి నుంచి రూ:42,500 నగదుతో పాటు ఐదు బైక్లు, మూడు సెల్ఫోన్లను సీజ్ చేశామన్నారు. ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యసదుం : మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ చంద్రమోహన్ వివరాల ప్రకారం.. తవణంపల్లె మండలం ద్వారకాపురం ఎస్టీ కాలనీకి చెందిన సాంబయ్య (18) కూలీ పనుల కోసం సదుం మండలానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇంటిపై తీసుకున్న రుణం ఎలా తీర్చాలో తెలియక కొంతకాలంలో మనోవేదనకు గురయ్యేవారు. బూరగమంద–చీకలచేను మార్గమధ్యంలోని ఓ మామిడితోటలో బుధవారం సాయంత్రం చీరతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బంధువులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆధార్ కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు మదనపల్లె టౌన్ : ఆధార్కార్డు నమోదు, అప్డేట్ సేవల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో మదనపల్లె తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని శాశ్వత ఆధార్ కేంద్రం వద్దకు తరలివస్తున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ఆధార్ శాశ్వత నమోదు కేంద్రం వద్ద ఉదయం నుంచే బారులు తీరారు. మీ సేవ కేంద్రంలో ఆధార్లో మొబైల్ నంబర్ అప్డేట్, చిరునామా మార్పు, పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ వంటి సేవల కోసం రోజూ వందలాది మంది వస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఒకే కేంద్రంపై ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. ఆధార్ సేవలకు డిమాండ్ పెరగడంతో అదనపు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజలు అనవసరంగా పదేపదే రాకుండా అవసరమైన డాక్యుమెంట్లతో రావాలని సూచించారు. దేవదాయశాఖ పరిధిలోకి రాజనాలబండ ఆలయం చౌడేపల్లె : సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాల బండ శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనం నుంచి దేవదాయశాఖకు బదిలీ చేస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేవాదాయశాఖ కమీషనర్ కన్నబాబు ఉత్తర్వులు జారీచేశారు. ఆలయం వద్ద టీటీడీ నిబంధనల ప్రకారం ఆగమశాస్త్రాలకు విరుద్ధంగా ఉండడంతోనే ఈ ఆలయాన్ని టీటీడీ నుంచి దేవాదాయశాఖకు బదలాయించినట్లు జీవోలో పేర్కొన్నారు. -
లారీ ఢీకొని యువకుడు దుర్మరణం
మదనపల్లె టౌన్ : ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. తాలూకా సీఐ కల వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లె చంద్ర కాలనీకి చెందిన రాధాకష్ణ (29) సొంత పనిపై సుబ్బారెడ్డి లేఅవుట్లోని అత్తగారి ఇంటికి వెళ్లాడు. పని ముగించుకుని బైక్పై బైపాస్ రోడ్డు మీదుగా చంద్ర కాలనీకి వస్తుండగా వెన్నెల రెస్టారెంట్ సమీపంలో వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన రాధాకష్ణను స్థానికులు గుర్తించి వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను గుర్తించే పనిలో ఉన్నామని సీఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలోనే ఎకై ్సజ్ కానిస్టేబుల్ మృతి
● నిర్ధారించిన పోలీసుల ● మహారాష్ట్రకు చెందిన లారీగా గుర్తింపుపుంగనూరు : పుంగనూరు సమీపంలోని ఎంబీటి రోడ్డు జాతీయ రహదారిపై ఈ నెల 14న అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఎకై ్సజ్ కానిస్టేబుల్ దేవేంద్ర (32) అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై పలు అనుమానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఎస్ఐలు అన్సర్బాషా, రమణ రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజీలు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సమయంలో రహదారిపై ఉన్న బారికేడ్లను దేవేంద్ర ద్విచక్రవాహనంపై వెళుతూ ఢీకొట్టారు. అదే సమయంలో మహారాష్ట్రకు చెందిన లారీ వేగంగా వచ్చి అతడిని ఢీకొట్టి వెళ్లినట్లు నిర్ధారించారు. ఈ మేరకు మహారాష్ట్రకు చెందిన లారీని సీజ్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. దేవేంద్ర మృతికి ఇతర కారణాలు ఏవీ లేవని పోలీసులు నిర్ధారించారు. త్వరలోనే డ్రైవర్ను అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించనున్నారు. పది రోజులుగా తీవ్ర సంచలనం కలిగించిన దేవేంద్ర మృతి రోడ్డు ప్రమాదమేనని నిర్ధారణ చేసి వెల్లడించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. -
శునకాలు పట్టేస్తున్నాయ్..
● కుక్క కాటుతో బెంబేలెత్తుతున్న ప్రజలు ● ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న బాధితులు ● పట్టించుకోని అధికారులుభయం.. భయం..లక్కిరెడ్డిపల్లి: కుక్కలు బాబోయ్.. కుక్కలంటూ లక్కిరెడ్డిపల్లి పట్టణ వాసులతోపాటు గ్రామీణ ప్రాంత ప్రజలు భయంతో వణుకుతున్నారు. కుక్కకాటు బాధితులు వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రిల వైపు పరుగులు పెడుతున్నారు. రెండు రోజుల క్రితం పలువురిపై పిచ్చి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాడి ఆవులపై దాడి చేయడంతోపాటు గొర్రెలు, మేకలు కోళ్లను సైతం వదలడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిచ్చి కుక్కల దాడిలో గాయపడిన పలువురు లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వైద్యంకోసం వెళ్లగా ఒక్కో ఇంజక్షన్ ఐదుగురికి వేయాలని, ముగ్గురికి, ఇద్దరికి ఇక్కడ రాబిస్ ఇంజక్షన్లు వేయలేమని.. బాధితులకు ఇంజక్షన్లు వేయకుండా పంపించి వేసినట్లు వారు తెలిపారు. దీంతో చేసేదేమీలేక రాయచోటి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వేలరూపాయలు ఖర్చుపెట్టుకొని కుక్కకాటు ఇంజక్షన్లు వేయించుకున్నామంటూ తెలియజేశారు. ● ఎటునుంచి వస్తాయో... లక్కిరెడ్డిపల్లె టౌన్ పరిధిలోని గద్దగుండ్లరాచపల్లి, బాలయోగి గురుకుల పాఠశాల ఏరియా, బస్టాండ్, దర్గా, మిస్సా చర్చి, పాతకోర్టు ప్రాంతాలలో రోడ్డుపై ఉన్న వ్యక్తులనే కాకుండా ద్విచక్ర వాహనాలలో వెళ్తున్న వారిని సైతం వదలకుండా కుక్కలు మీదపడి గాయపరుస్తున్నాయని పట్టణ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. రోడ్లపై తిరగాలంటే కుక్కల బెడదతో ప్రజలు పరుగులు పెడుతున్నారు. ● పట్టించుకోని కార్యదర్శులు... పంచాయతీ కార్యాలయంకు వెళ్లి కుక్కల విషయం సిబ్బందితోపాటు పంచాయతీ కార్యదర్శులకు తెలియజేసినా పట్టించుకోకుండా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● ఈ మధ్యకాలంలోనే ఒకేరోజులో లక్కిరెడ్డిపల్లికి చెందిన వెంకటేశ్వర్లు, యోగీశ్వరీ, అన్వర్ బాష, మౌలానా భీ, రామచంద్ర, శివ, బాబ్జీ, బాబు, రజాక్, జాబిర్ బాష, శ్రీనివాసులు, వెంకటరమణ, మస్తాన్ వల్లి, అబ్దుల్ అలంలను కుక్కలు గాయపరిచాయి. పాడి ఆవులపై దాడులు .. మాకు జెర్సీ ఆవులు ఉన్నాయి. మేము పాడిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. మేతకోసం పాడి ఆవులను పంట పొలాలపై వదిలి ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కుక్కల మంద దాడి చేస్తున్నాయి. లేగ దూడలు కుక్కల కాట్లకు గురై మృత్యువాత పడుతున్నాయి. గ్రామ పంచాయతీ అధికారులు చొరవచూపి కుక్కల దాడులు నుండి రక్షించాలి. – రేపన ప్రతాప్, పాడి రైతు, చాగల గుట్టపల్లి, లక్కిరెడ్డిపల్లి మండలం కుక్కల బెడద నివారిస్తాం.. లక్కిరెడ్డిపల్లి టౌన్ పరిధిలో కుక్కల బెడద ఈ మధ్యకాలంలో అధికంగానే ఉంది. పిచ్చికుక్కలను ఏరివేత కార్యక్రమం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. చాలా మంది కుక్కల బారిన పడి కుక్కకాటుకు గురవుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. పై అధికారులు చొరవతో త్వరలోనే పిచ్చి కుక్కల ఏరివేత కార్యక్రమం చేపడుతాం. – సుబ్బారెడ్డి, పంచాయతీ కార్యదర్శి, లక్కిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ●ఆసుపత్రికి వెళ్తే సూదులు వేయలేదు.. పిచ్చికుక్క దాడిలో గాయపడి వె వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్తే కుక్క సూదులు వేయలేదు. కుక్క కాటుకు మందు ఐదు మందికి పైబడి వేయాలని, మీకు ఒకరి కీ, ఇద్దరి కోసం మందు ఓపెన్ చేస్తే మిగతాది మేము ఎవరికి వేయాలంటూ వైద్యులు అసహనం వ్యక్తం చేశారు. మేము చేసేదేమీ లేక రాయ చోటి ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకొని సూదు లు వేయించుకున్నాం. – రమణ, గద్దగుండ్లరాచపల్లి ● -
రాయితో కొడుకుపై దాడి చేసిన తండ్రి
కలసపాడు : మండలంలోని ముద్దంవారిపల్లె గ్రామానికి చెందిన సగిలిఫ్రాన్సిస్ తన కుమారుడు సగిలిసర్వేష్ను రాయితో తలపై కొట్టడంతో గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే సర్వేష్ కడపలోని నాగరాజు హైస్కూల్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. గురువారం సర్వేష్ తన భార్యను కడపకు తీసుకెళ్లి అక్కడే కాపురం పెట్టాలని చెప్పాడు. ఈ విషయమై తండ్రి ఫ్రాన్సిస్, సర్వేష్కు వాగ్వాదం జరిగింది. వాగ్వాదం తీవ్ర రూపం దాల్చగా ఫ్రాన్సిస్ సమీపంలో ఉన్న రాయితో సర్వేష్ తలపై కొట్టడంతో అతనికి రక్తగాయాలయ్యాయి. అతను ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని అనంతరం కలసపాడు పోలీసుస్టేషన్కు వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఫ్రాన్సిస్ తన కోడలు వేలాంగినితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో తండ్రీకొడుకుల మధ్య గత కొంతకాలంగా విబేధాలు కొనసాగుతున్నట్లు తెలిసింది. విద్యార్థిని అదృశ్యంపోరుమామిళ్ల : కాలేజీకి పోతున్నా అంటూ బుధవారం ఇంటి నుంచి వెళ్లిన తన కూతురు హరిత (17) ఇంతవరకు తిరిగి రాలేదని ఆమె తల్లి తులసి గురువారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిందని ఎస్ఐ హనుమంతు తెలిపారు. దీనిపై మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆమెను గుర్తించిన వారు తమకు తెలియజేయాలని కోరారు. తులసి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. యువకుడి దారుణ హత్య మైదుకూరు : మైదుకూరు మండలం గంజికుంట పంచాయతీ పరిధిలోని బోంచేనుపల్లె వద్ద యెన్నం వెంకటేశ్వర్లు అలియాస్ ఏసుబాబు అనే 19 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం రాత్రి జరిగినట్టుగా భావిస్తున్న ఈ సంఘటనలో హత్యకు పాల్పడిన వారు యువకుని తలపై రాళ్లతో మోదడంతో రక్తగాయాలై మృతి చెందాడు. బోంచేనుపల్లెకు చెందిన యెన్నం సుబ్బారావు, జ్యోతిల ఒక్కగానొక్క కుమారుడైన వెంకటేశ్వర్లు పదో తరగతి వరకు చదివి మానేశాడు. బేల్దారి పనులకు వెళుతుంటాడు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో తాను వనిపెంటకు వెళుతున్నట్టు తల్లిదండ్రులకు చెప్పాడు. రాత్రి 10 గంటలైనా కుమారుడు ఇంటికి రాకపోవడంతో తండ్రి సుబ్బారావు వెంకటేశ్వర్లుకు ఫోన్ చేశాడు. అతని వద్ద ఉన్న రెండు ఫోన్ నంబర్లకు ఫోన్ చేయగా రింగ్ అవుతున్నా ఫోన్ ఎత్తలేదు. ఆందోళనతో చుట్టుపక్కల వాకబు చేశారు. గురువారం ఉదయం గ్రామానికి ఉత్తరం దిక్కున కిలోమీటర్ దూరంలో నివాసాలు లేని గంజికుంట జగనన్న కాలనీ ఇళ్ల మధ్య వెంకటేశ్వర్లు మృతదేహం ఉన్నట్టు తెలిసిన వారు చెప్పారు. అక్కడికి చేరుకున్న యువకుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మైదుకూరు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి, ఎస్ఐ కత్తి వెంకటరమణ, సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుని తల్లిదండ్రులను, గ్రామస్తులను విచారించారు. యువకుని దుస్తుల్లో ఉన్న సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం వద్ద రక్తం అంటిన ఒక కొండ రాయిని, శరీరాన్ని ఈడ్చిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. వేలి ముద్రలు నిపుణులు సంఘటన స్థలంలో ఆధారాల కోసం పరిశీలించారు. ఎవరైనా ఆడ పిల్ల తల్లిదండ్రులు కానీ ఇంకెవరైనా తన కుమారుడిని హత్య చేసి ఉంటారని యువకుని తండ్రి సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు దర్యాప్తు చేపట్టామని సీఐ రమణారెడ్డి తెలిపారు. ఇటుకల ఫ్యాక్టరీ యజమాని ఆత్మహత్య ప్రొద్దుటూరు క్రైం : స్థానిక రామేశ్వరం రోడ్డులో పఠాన్ నాయబ్రసూల్ (40) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాయబ్రసూల్ కొన్నేళ్లుగా బైపాస్ రోడ్డులో సిమెంట్ ఇటుకల ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నాడు. ఇటీవల అతను అధికంగా అప్పుడు చేశాడు. డబ్బు ఇవ్వమని రుణదాతలు ఒత్తిడి చేయసాగారు. ఈ క్రమంలో అతను గురువారం తన ఇటుకల ఫ్యాక్టరీ పక్కన ఉన్న గదిలోకి వెళ్లి తాడుతో ఉరేసుకున్నాడు. కూలీలు గమనించి అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించాడు. తల్లి ఫాతిమా ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పడగవిప్పిన సర్పం... వణుకుతున్న జనం
మదనపల్లె టౌన్ : మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో గత ఆరు నెలల్లో పాముకాటుకు గురై చికిత్స పొందిన వారి సంఖ్య 185కు చేరినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. వీరిలో 11 మంది మృతి చెందగా, మరికొందరు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మూడు రోజుల కిందట బి.కొత్తకోట మండలానికి చెందిన మహిళా రైతు శివమ్మ పాముకాటుకు గురై చికిత్స పొందుతూ మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో మృతి చెందారు. ఈ ఘటన పాముకాట్ల తీవ్రతకు అద్దం పడుతోంది. నెలల వారీగా కేసుల వివరాలు మదనపల్లె జిల్లా ఆస్పత్రి రికార్డుల ప్రకారం ఈ ఏడాది జనవరిలో 20 మంది, ఫిబ్రవరిలో 22, మార్చిలో 22, ఏప్రిల్లో 32, మేలో 43, అత్యధికంగా జూన్న్లో 46 మంది పాముకాట్లతో ఆస్పత్రిలో చేరారు. వేసవి, వర్షాకాలం ప్రారంభంలో పాముకాట్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పాము కాట్లపై వైద్యుల సూచన వర్షాకాలం సమీపిస్తుండటంతో పాములు పొలాలు, ఇళ్లలోకి వస్తుంటాయని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పాముకాటుకు గురైన వెంటనే ఆస్పత్రికి తరలిస్తే ప్రాణాపాయం తప్పించవచ్చని, అశాసీ్త్రయ పద్ధతిలో చికిత్స చేయొద్దని హెచ్చరిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో యాంటీ స్నేక్ వెనమ్ అందుబాటులో ఉందని పేర్కొన్నారు. మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో పెరిగిన పాముకాట్ల కేసులు ఆరు నెలల్లో 185 మందికి చికిత్స వైద్యం అందక 11 మంది మృతి అత్యధికంగా జూనన్లోనే 46 కేసులు నమోదు -
అండర్–19 క్రికెట్ పోటీలు ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–19 మెన్ మల్టీ డే అంతర్ జిల్లా ఐదో విడత మ్యాచ్లు ప్రారంభం అయ్యాయి. గురువారం వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో కడప–చిత్తూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన చిత్తూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 80 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఆ జట్టులోని హర్షవర్దన్ 195 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 135 పరుగులు చేయగా మరో బ్యాట్స్మెన్ వరుణ్ 71 పరుగులు చేశాడు. కడప జట్టులోని గైబు 2 వికెట్లు తీశాడు. దీంతో తొలి ఇరోజు ఆట ముగిసింది. కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. అదే విధంగా కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో నెల్లూరు–అనంతపురం జట్టు తలపడ్డాయి. టాస్ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 60 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని మిథున్కళ్యాణ్ 68, సుశాంత్ 50 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని టీవీ సాయి ప్రతాప్ రెడ్డి 4, కిరణ్కుమార్ 4 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన అనంతపురం జట్టు 20.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఆదినారాయణ 30 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని తేజసాయి 2 వికెట్లు తీశాడు. దీంతో అనంతపురం జట్టు 139 పరుగు వెనుకంజలో ఉంది. దీంతో తొలి ఇరోజు ఆట ముగిసింది. ఇద్దరు యువకులపై పోక్సో కేసుకడప అర్బన్ : కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక పట్ల, వెంకట్, చిన్న అనే ఇద్దరు యువకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వీరిపై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి పోక్సో యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
చేతికందిన పంట.. ధర దిగజారి తంటా!
మదనపల్లె మార్కెట్లో టమాట ధరలు (కిలో) తేది అధికం తక్కువ టన్నులు జూన్15 రూ.23 రూ.10 1,340 జూన్16 రూ.20 రూ.9 1,478 జూన్17 రూ.18 రూ.9 1,451 జూన్18 రూ.16 రూ.8 1,,403 జూన్19 రూ.15 రూ.8 1,463 జూన్20 రూ.14 రూ.7 1,412 జూన్21 రూ.14 రూ.7 1,380 జూన్22 రూ.12 రూ.5 1,260 సాక్షి, మదనపల్లె: ఆకాశాన్ని తాకిన టమాటా ధరలు ఒక్కసారిగా పాతాళానికి పడిపోవడంతో అన్నదాతల ఆశలు నిలువునా అడియాశలయ్యాయి. ధరలపై ఎన్నో ఆశలతో లక్షలాది రూపాయల పెట్టుబడికి వెనకడుగు వేయకుండా జిల్లా రైతులు అత్యధిక విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేశారు. అయితే దేశంలోనే అతిపెద్ద టమాటా మార్కెట్గా పేరుగాంచిన మదనపల్లెలో ఊహించని విధంగా ధరలు పడిపోవడం రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. కిలో టమాటా ధర ఏకంగా ఐదు రూపాయలకే పడిపోవడంతో.. పెట్టిన పెట్టుబడి దేవుడెరుగు, కనీసం కోత ఖర్చులు, కూలీలు, మార్కెట్కు తెచ్చే రవాణా చార్జీలు కూడా తిరిగి దక్కే పరిస్థితి లేదని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దాదాపు 7,548 ఎకరాల భారీ విస్తీర్ణంలో టమాటా పంట సాగులో ఉంది. ఈ సాగులో అత్యధిక విస్తీర్ణం మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలదే. మార్కెట్ మాయాజాలం! సాధారణంగా వ్యాపారుల మధ్య పోటీ వల్ల ఇక్కడ ధరలు కొంతమేర ఆశాజనకంగానే ఉంటాయి. కానీ, ప్రస్తుతం ధరలు ఒక్కసారిగా ఎందుకు పతనమయ్యాయో ఎవరికీ అర్థం కావడం లేదు. మార్కెట్లో చూపించే అత్యధిక ధర అనేది కేవలం కొన్ని బాక్సుల ఉత్తమ రకం టమాటాలకే వర్తిస్తుంది. మిగతా సాధారణ రైతుల పంట మొత్తానికి అతి తక్కువ ధరలే కడుతున్నారు. చిత్రమేమిటంటే, దిగుబడి అత్యధికంగా వచ్చినప్పుడు కూడా ఇంత తక్కువ ధర పలకలేదు. కానీ ఇప్పుడు మార్కెట్కు దిగుబడి తగ్గినప్పటికీ, రేట్లు పడిపోతుండటం వ్యాపారుల సిండికేట్ దందాను స్పష్టం చేస్తోంది. మదనపల్లె మార్కెట్లో గత వారం రోజులుగా ధరల పతనాన్ని పరిశీలిస్తే.. ఈ నెల 19వ తేదీన ఒక్కసారిగా కిలో ధర రూ.8 లకే పడిపోయింది. ఆ తర్వాత రోజుల్లో రూ.7 పలకగా, బుధవారం నాటికి ఊహించని విధంగా ఏకంగా రూ.5 లకే పడిపోయింది. మార్కెటింగ్ శాఖ ఏం చేస్తోంది?.. టమాటా ధరలు పతనమవుతుంటే తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన కనీస బాధ్యత మార్కెటింగ్ అధికారులపై ఉంది. గతంలో పుంగనూరు, పలమనేరు మార్కెట్లలో ఇలా ధరలు పతనమైనప్పుడు ప్రభుత్వం తక్షణమే స్పందించి తానే నేరుగా కొనుగోలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంది. అయితే మదనపల్లెలో ఇంత దారుణంగా ధరలు పతనమవుతున్నా మార్కెటింగ్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. శ్రమపడి పంటను తీసి, మార్కెట్కు తరలించి ఇబ్బందులు పడే కంటే.. పొలాల్లోనే పంటను వదిలేయడం మంచిదని చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికే సగం పంట పూర్తయిన రైతులు పంటను కోయకుండా గాలికొదిలేస్తుండగా.. ఇప్పుడిప్పుడే దిగుబడి మొదలైన కొత్త పంటలు పెట్టిన రైతులు మాత్రం ఆశ చంపుకోలేక టమాటాను మార్కెట్కు తరలిస్తున్నారు. మార్కెట్లలో పతనమైన ధరలు కిలో రూ.5లకే కొనుగోలు ఖర్చులు రాక పంటను వదిలేస్తున్న రైతులు ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని డిమాండ్ -
కుటుంబ కలహాలతో కార్మికుడు బలవన్మరణం
మదనపల్లె టౌన్ : కుటుంబ కలహాలతో భవన నిర్మాణ కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన గురువారం రాత్రి మదనపల్లె మండలం బసినికొండలో చోటుచేసుకుంది. తాలూకా పోలీసుల కథనం ప్రకారం.. బసినికొండకు చెందిన భవన కార్మికుడు కూలర్ పాపన్న (32) కుటుంబ సమస్యలతో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన పిల్లలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని బాధితుడిని కిందకు దించారు. వెంటనే ఆటోలో స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించగా, అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి అప్పటికే మార్గమధ్యంలో మృతి చెందినట్లు నిర్ధారించారు. అతడికి భార్య మహతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బంధువులు చనిపోవడంతో భార్య కోలార్కు వెళ్లి గురువారం రాత్రి తిరిగి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఇంతలోనే పాపన్న ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తాలూకా పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. -
గర్భిణి అని కూడా చూడకుండా..
ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య: పైళ్లెన పది నెలలకే అత్తింటి వేధింపులు భరించలేక నాలుగు నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తంబళ్లపల్లె మండలంలో చోటు చేసుకుంది. మృతురాలి తల్లి దండ్రులు తంబళ్లపల్లె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు... కోటకొండ పంచాయతీ, బీఎస్ఆర్ వడ్డిపల్లికి చెందిన మహేష్, రవళి (18)ని 10 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. పైళ్లెన మూడు నెలల నుంచే అత్త అరుణ వేధింపులు ప్రారంభించింది. దీంతో రవళి తీవ్ర మనోవేదనకు గురైంది.గర్భిణి అని కూడా చూడకుండా..రవళి ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి. అయినప్పటికీ అత్త అరుణ వేధింపులకు గురిచేసేది. వేధింపులు భరించలేక రవళి ఈనెల 15 ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించగా, డాక్టర్లు చికిత్సలు అందించి పరిస్థితి విషమించడంతో రుయాకు రెఫర్ చేశారు. అక్కడి నుంచి బెంగళూరుకు తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి మరింత విషమించడంతో మంగళవారం రాత్రి స్వగ్రామానికి తీసుకు వచ్చారు. బుధవారం ఉదయం నాలుగు నెలల గర్భిణి రవళి మృతి చెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తంబళ్లపల్లె ఎస్ఐ అనీల్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం దుకాణాలపై నిఘా ఉంచాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లాలోని మద్యం బెల్ట్ షాపులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజు అధికారులకు సూచించారు. బుధవారం నగరంలోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల ప్రొహిబిషన్ – ఎక్సైజ్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమంగా తయారు చేసే నాటుసార, సుంకం చెల్లించని మద్యం, బెల్ట్ షాపుల నిర్మూలనపై చేపట్టిన చర్యలు, నమోదైన కేసులు, భవిష్యత్ కార్యాచరణతో పాటు ఎకై ్సజ్ ఆదాయం లక్ష్యాల సాధనపై సమగ్రంగా సమీక్షించారు. బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించేందుకు నిరంతర తనిఖీలు, ఆకస్మిక దాడులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, సూపరింటెండెంట జె.రమేష్, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ప్రొహిబిషన్ – ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. అనంతరం ఇటీ వల రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ప్రొహిబిషన్ – ఎకై ్సజ్ శాఖ క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన వైఎస్సార్ కడప జిల్లా జట్టును డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ అభినందించారు. -
వైభవం.. ధ్వజారోహణం
నందలూరు : నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సాయిక్రిష్ణ, సునీల్కుమార్, పాంచరాత్ర ఆగమ పండితులు మనోజ్, పవన్, పార్థసారథి, రంగనాధాచార్యులు, వేదపారాయణం, సంతోష కృష్ణశర్మ, లావణ్య రామశర్మల ఆధ్వర్యంలో గజ స్తంభంపై గరుడ చిహ్నంతో ఉండే పతాకాన్ని ఎగరవేసి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు.రాత్రి యాలివాహనంపై శ్రీసౌమ్యనాథుడు శ్రీదేవి భూదేవితో కలిసి పురవీధుల్లో ఊరేగుతూ భక్తజన కోటికి దర్శనమిచ్చారు. కార్యక్రమంలో ఏఈఓ ఎన్.రవి, డిప్యూటీ ఈఓ ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్ పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం పల్లకీసేవ, తిరుమంజనం రాత్రికి హంస వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
జిల్లాలో 32 గ్రామాల్లో ఐదో విడత భూ రీసర్వే
పీలేరురూరల్ : జిల్లాలో 32 గ్రామాల్లో ఐదో విడత భూ రీసర్వే చేస్తున్నట్లు జిల్లా సర్వేయర్, భూముల రికార్డు అధికారి శాంతరాజ్.పి.యస్. అన్నారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఐదో విడత 22 మండలాల్లో 32 గ్రామాల్లో సర్వే జరుగుతున్నట్లు తెలిపారు. 1.50 లక్షల ఎకరాల్లో రీసర్వే చేపడుతున్నట్లు చెప్పారు. పీలేరు రెవెన్యూ డివిజన్లో 8 మండలాల్లోని 11 గ్రామాల్లో రీసర్వే జరుగుతోందని తెలిపారు. పీలేరు మండలం దొడ్డిపల్లె గ్రామంలో రీసర్వే జరుగుతున్నట్లు చెప్పారు. భూసర్వేలో తప్పు ఒప్పులు లేకుండా ప్రతి గ్రామంలోనూ రైతులకు ముందే సమాచారం ఇచ్చి, రైతుల సంక్షేమంలో భూరీసర్వే చేపట్టాలన్నారు. ఆగష్టు నెల ఆఖరులోపు రీసర్వే పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఎం. శివకుమార్, డీఐఓస్ టి. బాలకుళ్ళాయస్వామి, డీటీ ప్రసాద్, ఆర్ఐ మురగయ్య, సర్వేయర్ రెడ్డిశేఖర్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
●చర్యలు తీసుకుంటాం!
గుర్రంకొండ: ఏ వ్యాపారమైనా సప్లయ్, డిమాండ్ సూత్రంపైనే నడుస్తుంది. మార్కెట్లో డిమాండ్ పెరిగినప్పుడు భారీగా లాభాలు గుంజేయవచ్చనే సూత్రాన్ని ఇక్కడి అక్రమార్కులు వంటబట్టించుకున్నారు. గుర్రంకొండ మండలంలో ప్రకృతి సంపదను నిలువునా కొల్లగొడుతూ, మట్టి, మొరం అక్రమ రవాణాతో లక్షలు గడిస్తున్నారు. గుట్టలు, చెరువులు కరిగిపోతున్నా.. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎండిన చెరువులే లక్ష్యంగా.. రాత్రింబవళ్లు తోడివేత! ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక, చెరువుల్లో నీరు పూర్తిగా ఇంకిపోయింది. జీవచ్ఛవంలా మారిన ఈ జలాశయాలనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మట్టి మాఫియా తమకు అనుకూలంగా మార్చుకుంది. గుర్రంకొండ, ఖండ్రిగ గ్రామాల పరిసరాల్లోని పలు గుట్టలు, చెరువుల్లో ఎటువంటి అనుమతులు లేకుండా, నిబంధనలను తుంగలో తొక్కి జేసీబీలతో రాత్రింబవళ్లు తేడా లేకుండా తవ్వకాలు జరుపుతున్నారు. వారం రోజులుగా వ్యాపారులు, దళారులు ఇదే పనిగా పెట్టుకుని గుట్టలను ధ్వంసం చేస్తుండటంతో ఇవి తమ అసలు రూపురేఖలను కోల్పోతున్నాయి. ఇటుక బట్టీలు, రియల్ ఎస్టేట్ వెంచర్ల జోరు! పట్టణంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఇటుకల బట్టీల కోసం వందల లోడ్ల మట్టిని తరలిస్తూ నానా అడ్డదారులు తొక్కుతున్నారు. వీరే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ ప్లాట్లను, మరికొందరు వాణిజ్య సముదాయాల ఏర్పాటు కోసం భూములను చదును చేసుకోవడానికి చెరువులను అక్రమంగా తోడేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రాత్రి పగలు తేడా లేకుండా ట్రాక్టర్ల జాతర నెలకొంది. ఈ దందా అక్రమార్కులకు కాసుల వర్షంకురిపిస్తోంది. హెచ్చరించినా బేఖాతర్.. సాగుతున్న దందా! గుట్టలు, చెరువుల్లో అక్రమంగా మట్టి తరలించకూడదంటూ స్థానిక రెవెన్యూ అధికారులు పలుమార్లు ఆదేశాలు జారీ చేస్తున్నా రియల్ వ్యాపారులు, దళారులు అస్సలు ఖాతరు చేయడం లేదు. ఇటీవల వారం రోజుల క్రితం ఓ రియల్ఎస్టేట్ వ్యాపారి జేసీబీ తీసుకొచ్చి ఖండ్రిగ గ్రామ పరిధిలోని ఓ గుట్టను ఇష్టానుసారంగా తవ్వేశారు. రాత్రింబవళ్లు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తరలించి తన భూమిని చదును చేసుకున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి సదరు రియల్ వ్యాపారులను మందలించినా.. వారు లెక్కచేయకుండా యథేచ్ఛగా దందాను కొనసాగించడం గమనార్హం. కొరవడిన పర్యవేక్షణ.. అధికారుల ‘నెపాల’ పర్వం! గ్రామాల్లో దళారులు ఇష్టానుసారంగా ప్రకృతి సంపదను దోచేస్తున్నా సంబంధిత అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం కంటిముందే ఈ అక్రమ రవాణా బహిరంగంగా సాగుతున్నా.. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు, రెవెన్యూ అధికారులు మాత్రం ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ కాలం సాగదీస్తున్నారు. అధికారుల ఉదాసీనత వల్లే అక్రమ మట్టి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోందని ప్రజలు మండిపడుతున్నారు. గుర్రంకొండలో యథేచ్ఛగా ప్రకృతి దోపిడీ! జేసీబీలతో ఇష్టానుసారంగా చెరువులు, గుట్టల ధ్వంసం అనుమతులు లేకుండానే మట్టి, మొరం అక్రమ రవాణా అధికారుల ఆదేశాలు బేఖాతర్ రాత్రింబవళ్లు టిప్పర్ల జాతర చర్యలు తీసుకోకుండా కాలం సాగదీస్తున్న పోలీసులు, రెవెన్యూ విభాగం -
ఇసుకటిప్పర్లతో.. గాలిలో ప్రాణాలు!
● సుండుపల్లెలో బైక్ను ఢీ కొన్న టిప్పర్ ● ఇద్దరు దుర్మరణం..వీధినపడ్డ కుటుంబాలురాజంపేట/సుండుపల్లె : చెయ్యేరు, మాండవ్యనది, పెన్నానది పరిధిలో ఉన్న ఇసుక రీచ్ల నుంచి తీసుకెళ్లే టిప్పర్లు అతివేగంగా సమీప గ్రామాల మీదుగా వెళుతుంటే స్ధానికుల గుండెల్లో భయాందోళన. ఈ సమస్య గురించి పట్టించుకునే అధికారే కరువయ్యారన్న విమర్శలు ఉన్నాయి. వినతులు, పిర్యాదులు చెత్తబుట్టలో పడిపోయాయి. ఇసుకరీచ్. గ్రామాల మీదుగా ఉండే రోడ్డు మీద వెళ్లాలంటే పాదచారులు, వాహనాదరులు భయపడుతున్నారు. ఏ వైపు నుంచి ఇసుకటిప్పర్లు మీద పడతాయోనని ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు ఆగస్టు 15వతేదీ వరకు ఇసుకరీచ్ల నుంచి ఇసుకను తరలించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీచేసినప్పటి టీడీపీ ఇసుకాసురులు మాత్రం ఖాతరు చేయలేదని ఇసుకరీచ్ బాధితులు విమర్శిస్తున్నారు. ఇసుక తరలింపు మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల నుంచి ఇసుకటిప్పలు అడ్డూ అదుపులేకుండా దూసుకుపోతున్నాయి. సుండుపల్లెలో జరిగే సంతకు వెళుతూ.. తాజాగా సుండుపల్లె–సానిపాయి మార్గంలోని ఉప్పరపల్లె వద్ద వెనుక నుంచి గొర్రెల పెంపకదారులు జయరామ,(45), రవీంద్ర (47) సుండుపల్లెలో జరిగే సంతకు బయలుదేరారు. తమ వెనుక (ఇసుక టిప్పర్)మృత్యువు వెంటాడుతుందనే విషయం గమనించలేదు. బైక్పై వెళుతున్న జయరామ,రవీంద్రను టిప్పరు ఢీ కొంది. అక్కడక్కడికే మృతిచెందారు.స్థానికులు, కుటుంబీకులు ఈ సంఘటనపై ఆందోళనకు దిగారు.మృతదేహలను తరలించేందుకు వీలులేదని రహదారిపై బైఠాయించారు. సీఐ సురేష్ సంఘటనస్ధలానికి చేరుకొని మృతదేహలను తరలించాలని వాహనంతో పాటు వచ్చేశారు. సీఐ రాక తమను విస్మయానికి గురిచేసిందని వాపోతున్నారు. తర్వాత పోస్టుమార్టరం నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి అండగా నిలిచారు.మృతుల కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్. జిల్లా ఎస్పీలను ఫోన్ ద్వారా కోరారు. జీవాలే జీవనాధరం మృతిచెందిన జయరామ, రవీంద్రలకు జీవాల వ్యాపారమే జీవనాధారం. జీవాలు(పొట్టేళ్లు) కొనుగోలు చేయడం, వాటిని పెంచడం, అమ్మడం చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నారు. సుండుపల్లె వారపు సంతకు ఇరువురు బైకులో బయలుదేరి, మృత్యుఒడికి చేరుకున్నారు. రవీంద్రకు భార్య సంపూర్ణ, ఇంటర్పూర్తి చేసుకున్న కుమార్తె, టెన్త్ చదువుకునే కుమారుడు ఉన్నారు. భార్య జీవనోపాధి కోసం కువైట్కు వెళ్లింది. మరో మృతుడు అబ్బన్నగారి జయరామకు భార్యప్రభావతి, కుమారుడు ఒకరు ఉన్నారు. భార్య కువైట్లో ఉండగా కుమారుడు ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఇరుకుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబాలో విషాదచాయలు అలుముకున్నాయి.వందలాది టిప్పర్లతో ఇసుక తరలింపు తమ గ్రామమీదుగా వందలాది టిప్పర్లతో ఇసుక తరలింపు జరుగుతోంది. వర్షాలు కురవక, తాగునీరు లేక గ్రామాల్లోని ప్రజలు ఇబ్బందులకు గురవుతుంటే ప్రతిరోజు వందలాది టిప్పర్లతో ఇసుకను తరిలించారు. గ్రామాల్లో రోడ్లపై నడవాలన్నా, వాహనదారులు వెళ్లాలన్నా జనం భయపడుతున్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి. – బాలయ్య, చిన్నగొల్లపల్లె, సుండుపల్లె మండలం -
మిస్సింగ్ కేసు సుఖాంతం
గాలివీడు : గాలివీడు టౌన్ పరిధిలోని నూలివీడు రోడ్డుకు చెందిన ఈశ్వరమ్మ, ఆమె రెండున్నర సంవత్సరాల కుమారుడు రంజిత్కుమార్రెడ్డి అదృశ్యమైన ఉదంతం సుఖాంతమైంది. తల్లి, కుమారుడు క్షేమంగా తిరిగి కుటుంబ సభ్యుల చెంతకు చేరనున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గాలివీడు నూలివీడు రోడ్డుకు చెందిన ఈశ్వరమ్మ, తన కుమారుడు రంజిత్ కుమార్ రెడ్డితో కలిసి ఈనెల 14వ తేదీన అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు గాలివీడు పోలీసులు 21వ తేదీ మంగళవారం కేసు నమోదు చేశారు. కేసు నమోదైన 24 గంటలలోపే కడప జిల్లా వేంపల్లెలో ఇద్దరి ఆచూకీ లభ్యమైంది. వేంపల్లెలో తల్లి, కుమారులను సురక్షితంగా గుర్తించిన పోలీసులు, వారిని వెంటనే గాలివీడు పోలీస్స్టేషన్కు తరలించారు. త్వరలోనే ఎస్ఐ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో వారిని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. పోలీసులను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రత్యేకంగా అభినందించారు. -
మదనపల్లెలో భూ వివాదం
● రెతు కుటుంబంపై మూకుమ్మడి దాడి ● భూ సర్వే అడ్డుకుని ఆపై దాడి చేసిన ప్రత్యర్థులు మదనపల్లె టౌన్ : మండలంలోని పోతబోలు గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో రైతు కుటుంబంపై ప్రత్యర్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. బాధితులు తాలూక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోతబోలు గ్రామం, వండాడివారిపల్లికి చెందిన కె.లక్ష్మన్న, కృష్ణయ్యలకు పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన కొంత వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమికి సంబంధించి కె.లక్ష్మన్న, కె.కృష్ణయ్యలు భూ సర్వే చేయించేందుకు పొలం వద్దకు వెళ్లారు. అయితే అదే ఊరికి చెందిన ప్రత్యర్థి వర్గంలోని ఎన్.శ్రీనివాసులు వర్గీయులు భూమిని సర్వే చేయనీకుండా అడ్డుకున్నారు. తమకు కోర్టు స్టే ఇచ్చినా కూడా ఎన్. శ్రీనివాసులు వర్గీయులు కావాలనే తమ భూమిపైకి వచ్చి అనుచరులతో దౌర్జన్యం చేసి కరల్రతో దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. కె.లక్ష్మన్న, కృష్ణయ్య, శ్రీనివాసులు, ఈశ్వరమ్మ తీవ్రంగా గాయపడ్డట్లు తెలిపారు. గాయపడ్డవారిని కుటుంబీకులు వెంటనే స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ దాడుల్లో ఎన్.శ్రీనివాసులు, రాధ కూడా గాయపడ్డారని ఇరు వర్గాల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు ప్రారంభించామని తాలూక పోలీసులు తెలిపారు. -
26న దివ్యాంగుల క్రికెట్ ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్: అమరావతి ఇన్క్లూజివ్ క్రికెట్ కప్–2026 పోటీల్లో పాల్గొనే ఉమ్మడి వైఎస్సార్ జిల్లా శారీరక దివ్యాంగుల క్రికెట్ జట్టు ఎంపికలు ఈ నెల 26న కడప నగరంలోని వైఎస్ఆర్ఆర్ ఏసీఏ స్టేడియం నెట్స్లో జరగనున్నాయి. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లా అసోసియేషన్ కన్వీనర్ మనోహర్రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన క్రీడాకారులు తమ సొంత క్రికెట్ కిట్తో పాటు ఆధార్ కార్డు, సదరం సర్టిఫికేట్, యూడీఐడీ కార్డు జిరాక్స్ ప్రతులు మరియు రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలతో హాజరుకావాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు 9885254432 లేదా 9160008447 నంబర్లను సంప్రదించవచ్చు. మదనపల్లెలో టమాట ధర పతనం – కిలో రూ.5 సాక్షి, మదనపల్లె: దేశంలోనే అతిపెద్ద టమాట మార్కెట్ మదనపల్లెలో బుధవారం టమాట ధరలు పతనమయ్యాయి. బుధవారం కిలో టమాట రూ.5 పలికింది. అత్యధిక ధర కిలో రూ.12 పలికినప్పటికీ, ఈ గ్రేడ్ స్థాయి టమాట కొద్దిపాటిగానే ఉంటుంది. కిలో రూ.5 పలకడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విక్రయానికి 1,260 టన్నుల టమాట వచ్చింది. ఈ ధరలు మరింత పతనమై రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ధరల పతనంపై మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. వాహనం ఢీ కొని కృష్ణజింక మృతి ములకలచెరువు : గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో కృష్ణజింక మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. ఫారెస్టు బీటు అధికారి శ్రీనివాసులు కథనం మేరకు.. మండలంలోని కనుగొండరాయస్వామి ఆర్చి వద్ద జింకల మంద రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొందన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జింక సంఘటన స్థలంలోనే మృతిచెందింది. గమనించిన ప్రయాణికులు ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న బీటు అధికారి జింకను స్వాధీనం చేసుకుని వెటర్నరీ డాక్టర్ వద్ద పోస్టుమార్టం నిర్వహించి కనుగొండ అడవిలో ఖననం చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు పులిచెర్ల(కల్లూరు) : మండలంలోని వీసీ వడ్డెపల్లెకు చెందిన 16 సంవత్సరాల మైనరు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితునిపై పోక్సోకేసు నమోదు చేసినట్లు కల్లూరు సీఐ జయరామయ్య, ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పోలీసు కథనం మేరకు వివరాలు... పూతలపట్టు మండలం తలపలపల్లె వడ్డిపల్లెకు చెందిన డేరంగుల రోహిత్(21) భాదిత బాలికను కొంతకాలంగా ఫోన్లో మాట్లాడుతూ ఆమెను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం 28.6.26న బాధితురాలి ఇష్టానికి విరుద్ధంగా ఇంటిలోకి తీసుకెళ్ళి లైంగిక దాడికిపాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. జరిగిన విషయం ఎవరికై నా చెపితే చంపేస్తానని బెదిరంచడంతో ఆబాలిక తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పోలీస్టేషన్కు వచ్చి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేశామన్నారు. 24 గంటలు గడవక ముందే నిందితుడు రోహిత్ను పులిచెర్ల మండలం కొమ్మిరెడ్డిగారిపల్లె క్రాస్వద్ద బుధవారం అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరిగిందని పోలీసులు తెలిపారు. -
టీడీపీనేత మహేశ్నాయుడు, అనుచరుల ఓవరాక్షన్!
టాస్క్ఫోర్స్ : సుండుపల్లె–సానిపాయ మార్గ మధ్యలో ఉప్పరపల్లె వద్ద ఇసుక టిప్పర్ ఢీ కొనడంతో మృతి చెందిన గొర్రెల పెంపకందార్లు జయరామ, రవీంద్ర కు టుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు, కుటుబీకులు ఆందోళన చేపట్టారు. ప్రమాదం సమాచారం తె లుసుకున్న రాజంపేట ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి సంఘటన స్ధలాని కి చేరుకున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించి ఆందోళన కార్యక్రమంలో బైఠాయించారు. టీడీపీకి ఎక్కడ చెడ్డపేరు వస్తుందో అని.. ఇసుక టిప్పర్ కిందపడి ఇద్దరు మృతి సంఘటనలో టీడీపీ ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డపేరు వస్తుందనే భావనతో గతంలో పలు ఎర్రచందం స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న మహేష్నాయుడు, ఆయన అనచరులు ఆందోళనకు అడ్డంగా నిలిచారు. ధర్నాలు చేయవద్దంటూ, బైఠాయించిన వారు లేచిపోవాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి మర్నాడు మళ్లీ ధర్నా చేస్తామని, మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఆగేది లేదన్నారు. ఇసుకరీచ్లో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. కాగా మహేశ్నాయుడు ఓవరాక్షన్ చూసిన స్థానికులు నివ్వెరపోయారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరగాలని ఎమ్మెల్యే బైఠాయించి,ఆందోళన చేస్తుంటే, మహేశ్నాయుడు, వారి అనుచరులు వీరంగంపై పలువురు విమర్శిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసిన క్రమంలో సుండుపల్లె ఎస్ఐ మహేశ్ రంగప్రవేశం చేసి ఈ కేసు విషయంలో పూర్తిస్ధాయి విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. మహేశ్నాయుడు ఓవరాక్షన్ సోషల్మీడియాలో వైరల్ కావడంతో నెటిజెన్లు మృతుల కుటుంబాలకు అండగా నిలవాల్సిందిపోయి, ధర్నా చేయొద్దు అంటూ అరచడం చూసి నె పెదవి విరిస్తున్నారు. ఈ ప్రమాదం విషయంలో టీడీపీ అభాసుపాలు కావడానికి మహేష్ నాయుడు వైఖరే కారణమని విమర్శలు వెలువడుతున్నాయి. -
బెల్ట్ షాపుపై పోలీసుల దాడి
మదనపల్లె టౌన్ : నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్న మహిళపై మదనపల్లె తాలూకా పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. తాలూకా సీఐ కళా వెంకటరమణ కథనం మేరకు.. మండలంలోని యనమల వారి పల్లికి చెందిన అంగజాల రమాదేవి (54) నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు సిబ్బందితో కలిసి రమాదేవి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. అక్కడ అక్రమంగా విక్రయానికి సిద్ధంగా ఉంచిన 12 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. బెల్ట్ షాపు నిర్వాహకురాలు రమాదేవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కళా వెంకటరమణ తెలిపారు. అక్రమ మద్యం విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని ఈ సందర్భంగా సీఐ హెచ్చరించారు. మండల కార్యాలయం పరిశీలనరామాపురం : స్థానిక మండల కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ బుధవారం సందర్శించారు. కార్యాలయంలోని రికార్డులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజిఆర్ఎస్) నిర్వహణను పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో నిబంధనలు పాటించాలన్నారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని మండల కార్యాలయ సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం గోపగుడిపల్లి గ్రామాన్ని సందర్శించిన స్థానిక సమస్యలపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్ఐ సమ్మాద్ ఖాన్, మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మహిళ అదృశ్యంపై కేసు నమోదుపెద్దమండ్యం : ఓ మహిళ అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిహరప్రసాద్ తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వెలిగల్లు గ్రామం పాపదాతగారిపల్లెకు చెందిన కొంకల రెడ్డెప్పరెడ్డి రెండవ భార్య ఇరగమ్మ (53) కనబడలేదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఆదివారం ఈమె ఇంటి నుండి గ్రామానికి సమీపంలో ఉన్న ఓ పల్లెకు వెలుతున్నట్లు చెప్పి వెళ్లినట్లు భర్త పోలీసులకు తెలిపారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ప్రామిషరీ నోట్ రాయించుకొనేందుకు ఓ పల్లెకు వెళ్లి అదృశ్యమైనట్లు తెలిసింది. ఆర్థిక లావాదేల నేపథ్యంలో ఆమెను ఎవరైనా ఏమైనా చేశారా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పెద్ద మొత్తంలోనే సమీప గ్రామాలలోని రైతుల వద్ద ఆర్థిక లావాదేవీలు ఈమెకు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఆమె నివసిస్తున్న ఇంటికి ఓ తాళం వేసి ఉండగా, తాజాగా మరో తాళం వేయడంతో ఆర్థిక లావాదేవిల గురించి గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. మహిళ అదృశ్యంపై విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం పెద్దముడియం(జమ్మలమడుగు) : పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పెద్దముడియం మండలం మేడిదిన్నె గ్రామానికి చెందిన కొమ్మ ఓబులేసు ఈనెల 13న మృతి చెందాడు. ఇ తని మృతిపై అనుమానాలు ఉన్నాయని, పోస్టు మార్టం నిర్వహించాలని ఎమ్మార్పీఎస్ నాయకు డు చిన్నయ్య మాదిగ ఆధ్వర్యంలో ఆర్డీఓకు విన తి పత్రం సమర్పించారు. ఆర్డీఓ నొస్సం పోలీసులకు రెఫర్ చేశారు.దీంతో సంజామల మండలంలోని పోలీసులను దళిత సంఘాల నాయకులు క లిశారు. ఈసందర్భంగా కొమ్మ ఓబులేసుకు మో కాళ్ల నొప్పులతో బాధపడుతూ నొస్సంలోని ఆర్ఎంపీ వైద్యుడిని సంప్రదించాడు. సూది వేయించుకుని ఓబులేసు తిరిగి గ్రామానికి వచ్చాడు. రా గానే వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడి శరీరంపై బొబ్బలు వచ్చాయి. సూది వేసిన నాలుగు గంటలలోపే ఓబులేసు మృతిచెందాడు. ఇది తెలి యని బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. -
గురువులను దర్శించుకోవడం ఆనందదాయకం
కడప సిటీ: కడప అమీన్పీర్ దర్గా గురువులను తొలిసారి దర్శించుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని, ప్రశాంతతను ఇచ్చిందని ప్రముఖ సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం దర్గాకు విచ్చేసిన ఆయనకు ముజావర్ సంప్రదాయబద్ధంగా తలపాగా చుట్టి స్వాగతం పలికారు. దర్గాలోని ప్రధాన గురువు హజరత్ పీరుల్లామాలిక్తో పాటు ఇతర గురువుల మజార్లను దర్శించుకున్న హీరో.. చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు, ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా ప్రతినిధులు ఆయనకు ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం దర్గా ఆవరణలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. తాను నటిస్తున్న తాజా చిత్రం ‘హైందవ’ షూటింగ్ ప్రస్తుతం ప్రొద్దుటూరులో కొనసాగుతోందని, అంతకుముందు గండికోటలో కూడా షూటింగ్ జరిగిందని తెలిపారు. ప్రేక్షకులంతా తన ‘హైందవ’ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. కాగా, హీరో రాక తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో దర్గాకు చేరుకుని హీరోతో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ -
దేవాలయ స్థలాన్ని పరిశీలించిన జేసీ
కలికిరి : మర్రికుంటపల్లిలోని అక్కదేవతల ఆలయంలోనికి స్థానిక గ్రామస్తులను రానివ్వకుండా సీ ఆర్పీఎఫ్ అధికారులు గేటు వేస్తుండటంతో గ్రామస్తుల ఫి ర్యాదు మేరకు బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆలయస్థలాన్ని పరిశీలించారు. జేసీ గ్రామస్తులతో పాటు సీఆర్పీఎఫ్ అధికారులతో మా ట్లాడారు. ఆలయానికి గ్రామస్తుల రాకపోకలకు అనువుగా ఉండేటట్లు, అలాగే సీఆర్పీఎఫ్ కేంద్రానికి మరో చోట భూమి కేటాయింపునకు చర్య లు తీసుకుంటామన్నారు. అనంతరం పత్తేగడ, కొ ర్లకుంట రెవెన్యూ గ్రామాల పరిధిలో రెండు పెట్రో బంకుల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులకు సంబందించి భూములను జేసీ పరిశీలించారు. ఆ యన వెంట పీలేరు ఆర్డీఒ నారాయణ రెడ్డి, తహశీల్దారు సయ్యద్ అహ్మద్, మండల సర్వేయరు రెడ్డె ప్ప, విఆర్ఒలు సురేష్కుమార్రెడ్డి, నరేంద్రరెడ్డి, విలేజ్ సర్వేయర్లు పాల్గొన్నారు. -
పంచాయతీల నిధుల వినియోగంపై ఆంక్షల కత్తి..!
మదనపల్లి (కురబలకోట) : డబ్బున్నా..ఖర్చుపెట్టలేని నిస్సహాయత.. చేతిలో వెన్న పెట్టుకుని నెయ్యి కోసం ఊరంతా వెతికినట్లుగా గ్రామ పంచాయతీల పరిస్థితి తయారైంది. గ్రామాల అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలవాల్సిన పంచాయతీలకు కూటమి ప్రభుత్వం ఆంక్షల కత్తి వేలాడదీసింది. ఇక నుంచి పంచాయతీలలో వివిధ అభివృద్ధి పనుల బిల్లుల మంజూరు, నిధుల వినియోగానికి జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) అనుమతి ఆమోదం తప్పనిసరని ఇటీవల ఆంక్షలు విధించారు. దీంతో గ్రామ పంచాయతీల ఖాతాల్లో నిధులున్నా బిల్లుల ఆమోదం ఽజిల్లా పంచాయతీ అధికారికే పరిమితం చేయడంతో కార్యదర్శులు చేతులుకట్టుకుని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో పంచాయతీలలో జరిగే వివిధ అభివృద్ధి పనులపై ప్రభావాన్ని చూపనుందని భావిస్తున్నారు. గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనుల బిల్లులకై నా ఆన్లైన్లో డీపీఓ అనుమతి తప్పనిసరి చేశారు. వారు పరిశీలించి అనుమతి ఇచ్చిన తర్వాతే బిల్లులు మంజూరవుతాయి. జిల్లాలో 25 మండలాలు ఉన్నాయి. వీటిలో 411 పంచాయతీలు ఉన్నాయి. 342 మంది కార్యదర్శులు ఉన్నారు. ఇదివరలో సర్పంచులకు చెక్ పవర్ ఉండేది. కార్యదర్శులు బిల్లులు పరిశీలించి చెల్లింపులు చేసేవారు. వారి పదవీ కాలం ముగియడం స్పెషలాఫీసర్లు రావడంతో గ్రామంలో చేపట్టదలచిన పనులను కార్యదర్శులకు అధికారం ఉండేది. ఇప్పుడు కొత్త విధానం ద్వారా బిల్లుల చెల్లింపులకు డీపీఓ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ఈ ప్రక్రియలో ఒక్కోసారి జాప్యం చోటుచేసుకునే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. అత్యవసర సమయాల్లో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొనే ప్రమాదం ఉంది. నిధుల దుర్వినియోగం అరికట్టాలని అక్రమాలకు తావుండరాదని ప్రభుత్వం కొత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రతి పనికి కూడా జిల్లా కేంద్రంలోని పంచాయతీ అధికారి కార్యాలయం వైపు చూడాల్సి రావడం అసహనాన్ని కలిగిస్తోందన్న భావన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం పారదర్శకత, జవాబుదారితనం కోసం ఇలా అమలు చేస్తున్నామని చెబుతోంది. అయితే అధికారిక అనుమతులు ఆలస్యం కాగలవని అభివృద్ధి పనులు మందగించే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. పంచాయతీలకు 15 ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్స్, వివిధ పన్నులు, ప్లాన్ అప్రూవల్ తదితర నిధులు వస్తాయి. చేతిలో నిధులున్నా ఖర్చు పెట్టలేని దుస్థితి రావడం పట్ల విచారం వ్యక్తమవుతోంది. అక్రమాలకు అడ్డుకట్టవేయడం అవసరమే కాని ఏకంగా కొత్త విధానంతో అభివృద్ధికే ఆటంకంగా పరిణమించే చర్యలకు ఉపక్రమించడం ఎంత వరకు సమంజసమన్నది ప్రశ్నగా మారింది. జిల్లా అధికారి అనుమతి తీసుకోవాలన్న నిర్ణయాన్ని పునరాలోచించాలన్న డిమాండ్ బలంగా విన్పిస్తోంది ఖాతాల్లో నిధులున్నా.. ఖర్చు పెట్టలేని పరిస్థితి జిల్లా పంచాయతీ అధికారికి ‘గ్రీన్ సిగ్నల్’ పవర్ కార్యదర్శుల చేతులు కట్టేసిన కూటమి ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధిపై ప్రభావంఅక్రమాలకు ఆస్కారం ఉండదు వివిధ అభివృద్ధి పనుల్లో నిధులు దుర్వినియోగం, అక్రమాలు, అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 30 వేల పరిమితి వరకు బిల్లులకు కార్యదర్శులకు అనుమతి కొనసాగుతుంది. అంతకంటే ఎక్కువ విలువైన బిల్లులను ఆన్లైన్ లాగిన్కు ఎంబుక్కులు, బిల్లుల వివరాలు నమోదు చేస్తారు. వాటిని సమగ్రంగా పరిశీలించి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. పారదర్శకంగా పర్యవేక్షణ ఉంటుంది. అక్రమాలకు తావుండదు. దొంగ బిల్లులకు చెక్ పడుతుంది. –రాధమ్మ, డీపీఓ, మదనపల్లి -
● వెలవెలబోతున్న బజార్లు ● క్షీణించిన కొనుగోళ్లు ● కరువును తలపిస్తున్న పరిస్థితులు
మదనపల్లి (కురబలకోట): ఒకప్పుడు ఉదయం షట్టర్ ఎత్తితే చాలు కస్టమర్లతో కళకళలాడుతూ, రద్దీగా కనిపించే దుకాణాలు.. నేడు బోణీ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూడాల్సిన దుస్థితికి చేరాయి. జిల్లాలో ప్రధాన వాణిజ్య కేంద్రాలైన మదనపల్లి, రాయచోటి, పీలేరు, పుంగనూరు తదితర ప్రాంతాలలో రెండేళ్లుగా వ్యాపారాలు తీవ్రంగా తగ్గుముఖం పట్టాయి. ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు, కిరాణా, హోటళ్లు, ఫర్నిచర్, బంగారం, చెప్పుల షాపులతో పాటు వేలాది చిరు వ్యాపారాలపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. పండగలు, నెలలో మొదటి వారంలో తప్ప మిగిలిన రోజుల్లో మార్కెట్ ఆశాజనకంగా లేద ని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వెన్నెముక విరిగిన వ్యవసాయం.. అన్నమయ్య జిల్లా ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముక. ముఖ్యంగా టమాటా, కూరగాయలు, మామిడి, నేరేడు వంటి పంటలకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వర్షాభావ పరిస్థితులు తీవ్రమవడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఇప్పటివరకు వేరుశనగ విత్తనం వేయని ఊర్లు ఎన్నో ఉన్నాయి. దీనికి తోడు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతాంగం తీవ్రంగా అప్పులపాలవుతోంది. ఎరువుల ధరలు, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగినప్పటికీ, ఉత్పత్తులకు మాత్రం సరైన ధర దక్కడం లేదు. రైతుల్లో ఆర్థిక అనిశ్చితి నెలకొనడంతో, వారు మార్కెట్లో విలాసాలకు పోకుండా కేవలం అత్యంత అవసరమైన వస్తువుల కొనుగోళ్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఇది నేరుగా స్థానిక వ్యాపారాలను దెబ్బతీసింది. కూటమి పాలనలో ‘కలత’! గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా పేద, దిగువ మధ్యతరగతి వర్గాల చేతికి సకాలంలో నగదు అందింది. కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారాలకు ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందించడంతో పాటు, సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండాయి. ఉత్పత్తులకు మంచి ధరలు లభించడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగి జిల్లా జీడీపీ గణనీయమైన వృద్ధి సాధించింది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆశించిన స్థాయిలో సంక్షేమ పథకాలు లేకపోవడం మార్కెట్ను దెబ్బతీసింది. మరోవైపు ఇళ్లు, వాహనాలు, విద్య, వైద్యం ఖర్చులు పెరిగాయి. వీటికి తోడు ఈఎంఐల భారం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఛార్జీల వడ్డనతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆన్లైన్, కార్పొరేట్ల దెబ్బ! స్థానిక వ్యాపారాలు పడిపోవడానికి తోడు డీమార్ట్, రిలయన్స్ వంటి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు, ఈ–కామర్స్ సైట్లు విస్తరిస్తూ స్థానిక మార్కెట్లను శాసిస్తున్నాయి. ఆన్లైన్ సంస్థలు డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లు, క్యాష్బ్యాక్లు మరియు తక్కువ ధరలతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. వినియోగదారులు కాలు బయట పెట్టకుండా, ఆర్డర్ బుక్ చేస్తే వస్తువులు నేరుగా ఇంటి తలుపు తట్టి డెలివరీ అయ్యే సంస్కృతి పెరిగిపోవడంతో స్థానిక చిన్న దుకాణదారుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దుకాణాల బాడుగలు, కరెంట్ ఛార్జీలు కట్టడానికి దిక్కులు చూడాల్సి వస్తోందని, వేరే ప్రత్యామ్నాయ పనులు తెలియక, దశాబ్దాలుగా అలవాటైన సొంత వ్యాపారాన్ని వదల్లేక నష్టాల్లోనే కాలం వెల్లదీస్తున్నామని వ్యాపారులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
పులిరాజాకై నా ఎయిడ్స్ గ్యారెంటీ !
మదనపల్లె టౌన్: ఎయిడ్స్ నియంత్రణ పేరుతో జిల్లాలో పనిచేస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ నిధులను నిలువు దోపిడీ చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాణాంతక వ్యాధిపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఫలితాలు శూన్యంగా కనిపిస్తున్నాయి. ఖాళీ బాక్సులే సాక్ష్యం.. కోట్లలో గోల్మాల్! జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ఆర్టీసీ బస్టాండ్లు, రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన కండోమ్ బాక్సులు నెలల తరబడి ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉచితంగా కండోమ్లు అందించాల్సిన బాధ్యతను స్వచ్ఛంద సంస్థలు పూర్తిగా గాలికొదిలేశాయి. క్షేత్రస్థాయిలో బాక్సులు శిథిలావస్థకు చేరి, తుప్పుపట్టి కనిపిస్తుండటమే ఈ సంస్థల నిర్లక్ష్యానికి నిదర్శనం. గత ఐదేళ్లలో టార్గెట్ గ్రూపులకు అవగాహన, ఉచిత కండోమ్ల పంపిణీ, వైద్య పరీక్షల కోసం కోట్ల రూపాయల నిధులు విడుదలైనా.. క్షేత్రస్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు జరగకుండానే నిధులన్నీ అక్రమార్కుల జేబుల్లోకి చేరుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. కాగితాలకే పరిమితమైన కళాజాతాలు ఎయిడ్స్పై గ్రామీణ ప్రాంత ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కళాజాతాలు, వీధి నాటకాలు, అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన సంస్థలు కేవలం రికార్డులకే పరిమితమయ్యాయి. ఫ్లెక్సీలు కట్టి, ఫొటోలు తీసి నిధులు డ్రా చేసుకోవడమే పనిగా పెట్టుకున్నాయి. ప్రచారం సన్నగిల్లి..మహమ్మారి విజృంభణ! అధికారుల నిర్లక్ష్యం, స్వచ్ఛంద సంస్థల మోసాలు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం వెరసి ఎయిడ్స్ రోగుల పాలిట శాపంగా మారింది. ఎయిడ్స్పై క్షేత్రస్థాయి ప్రచారం పూర్తిగా సన్నగిల్లడంతో జిల్లా వ్యాప్తంగా ఈ మహమ్మారి విజృంభించి వేల మంది ఎయిడ్స్ బారిన పడ్డారని, వారిలో సగం మంది ఇప్పటికే మృత్యువాత పడ్డారని స్థానికుల సమాచారం. వివరాలు ఇవ్వకుండా దాటవేత! ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల నిధులు, జిల్లాలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల వివరాలపై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ రాధికను వివరణ కోరగా.. తాము ఎలాంటి వివరాలు ఇవ్వడానికి లేదని చెబుతూ విషయాన్ని దాటవేయడం గమనార్హం. స్వచ్ఛంద సంస్థల పనితీరుపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఎయిడ్స్ నియంత్రణ విభాగం అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, వెంటనే జిల్లాలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల వివరాలు, వాటి కార్యకలాపాలు, ఖర్చు చేసిన నిధులపై ‘శ్వేతపత్రం’ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపి నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాగితాల్లోనే అవగాహన సదస్సులు జేబుల్లోకి కోట్ల రూపాయల నిధులు నియంత్రణ పేరుతో నిలువు దోపిడీ -
ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేటీకరించొద్దు
మదనపల్లె సిటీ : ఏపీఎస్ ఆర్టీసీలో ప్రవేశపెడుతున్న ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మదనపల్లె ఆర్టీసీ డిపో కార్యాలయం వద్ద మంగళవారం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వ హించారు.. జేఏసీ జిల్లా కన్వీనర్లు పి.వి.భయ్యారెడ్డి, బాబ్జి, వినోద్లు మాట్లాడుతూ ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ బాద్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ద్వారా ఆర్టీసీ క్రమంగా ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరగుతున్నాయని ఆరోపించారు. ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణను ఆర్టీసీకే అప్పగించాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగులకు 30 శాతం మధ్యంతర ఐఆర్ ప్రకటించాలని, 11వ పీఆర్సీ వేతన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు ఎన్.వి.కుమార్, బిఎస్ఎస్ రెడ్డి, కెఎల్ దేవి, సెల్వి పాల్గొన్నారు. -
వెట్టిచాకిరీ, కార్మికుల అక్రమ రవాణాపై నిఘా పెంచండి
మదనపల్లె టౌన్ : వెట్టిచాకిరీ, కార్మికుల అక్రమరవాణాను సమూలంగా నిర్మూలించే దిశగా అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ కఠిన చర్యలు చేపట్టిందని అదనపు ఎస్పీ వెంకటాద్రి స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో మంగళవారం మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) మాట్లాడుతూ.. పేదరికం, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని అమాయకులతో బలవంతంగా వెట్టిచాకిరీ చేయిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ’వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం–1976’ ప్రకారం అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మానవ అక్రమ రవాణా ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, బాధితులను గుర్తించి రక్షించడంతో పాటు నిందితులకు చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా ప్రతి కేసును పకడ్బందీగా దర్యాప్తు చేయాలని పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఐజేఎం ప్రతినిధుల సూచనలు సదస్సులో పాల్గొన్న ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (ఐజేఎం) ప్రతినిధులు రాష్ట్రంలో కార్మికుల అక్రమ రవాణా జరుగుతున్న తీరు, క్షేత్రస్థాయిలో బాధితులను గుర్తించే విధానంపై పోలీస్ అధికారులకు వివరించారు. పోలీసు శాఖ సమన్వయంతో వెట్టిచాకిరీ బాధితులకు ఉచిత న్యాయ సాయం అందించడం తో పాటు, ప్రభుత్వ పథకాల ద్వారా పునరావాసం కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఐజేఎం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
మిట్స్ విద్యార్థినుల ప్రతిభకు రూ.83 లక్షల నజరానా
కురబలకోట : అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ బీటెక్ విద్యార్థినులకు స్కాలర్షిష్ల పంట పండింది. ఏకంగా 166 మంది విద్యార్థినులకు రూ.83 లక్షలు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని న్యూఢిల్లీ ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్షిప్ పథకం కింద ఈ ఆర్థిక సాయాన్ని అందజేసింది. ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున లభించించినట్లు వీసీ యువరాజ్ మంగళవారం తెలిపారు. ప్రతిభకు ఆర్థిక ఇబ్బందులు అవరోధం కాకుడదన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏఐసీటీఈ ద్వారా ఈ ప్రగతి స్కాలర్షిప్లను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ, పట్టుదల ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత విద్యకు విద్యార్థినులు దూరం కాకూడదని వారికి అండగా నిలవాలన్న ఉద్దేశ్యంతో వీటిని అందజేస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల ఆర్థిక భరోసాతో పాటు ఉన్నత విద్యలో ముందుకు సాగేందుకు ప్రోత్సాహకంగా ఉంటోందన్నారు. విద్యార్థినులకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్న ఈ స్కాలర్షిప్లు రావడంపై మిట్స్ యూనివర్సిటీ చాన్స్లర్ డాక్టర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి, ప్రో చాన్స్లర్ నాదేళ్ల ద్వారకనాథ్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినులు ప్రతిభను మరింత మెరుగుపరచుకుని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి సమాజ ప్రగతికి పాటుపడాలని ఆకాంక్షించారు.166 మందికి ఏఐసీటీఈ ప్రగతి మెరిట్ స్కాలర్షిప్లు -
మహిళాలోకం కన్నెర్ర
టీడీపీ నేతల దుశ్శాసన పర్వంపై మహిళాలోకం కన్నెర్ర చేసింది.. రాత్రింబవళ్లు తేడా లేకుండా .. చిన్నారులు.. వృద్ధులన్న కనికరం లేకుండా ఆకృత్యాలకు తెగబడుతున్న కూటమి నేతల తీరును దునుమాడింది. మహిళల మాన.. ప్రాణాలు గాల్లో కలుస్తున్నా..మౌనంగా చూస్తున్న కూటమి పెద్దల తీరును ఎండగట్టింది. మంగళవారం వైఎస్సార్, అన్నమయ్య జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మహిళలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ● మహిళలకు రక్షణ కల్పించాలని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన● మదనపల్లెలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సాక్షి, మదనపల్లె : రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ దుశ్శాసనుల్లా వ్యవహరిస్తున్న టీడీపీ నేతలకు చట్టం వర్తించదా అని వైఎస్సార్సీపీ మహిళా నేతలు ఆగ్రహంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హోం శాఖ మంత్రి అనిత సాటి మహిళలకు ఎందుకు న్యాయం చేయడం లేదని నిలదీశారు. వైఫల్యానికి బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయా లని డిమాండ్ చేశారు. మహిళలపై టీడీపీ నేతల అఘాయిత్యాలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం మదనపల్లెలో జిల్లా మహిళా విభా గం ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. నల్లరిబ్బన్లు ధరించి.. ప్లకార్డులు చేతబట్టి.. మదనపల్లె గొల్లపల్లి రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు నిరసన వ్యక్తం చేశారు. నల్లరిబ్బన్లు ధరించి, ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, మీరు రాసిన రాజ్యాంగం పరిహాసమవుతోందని విన్నవించారు. అంతకు ముందు ర్యాలీగా విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే, టీడీపీ నేతలే కీచకులు టీడీపీ ఎమ్మెల్యేలే కీచకులుగా మారిపోతున్నారని వైఎస్ఆర్సీపీ మదనపల్లె సమన్వయకర్త నిసార్ అహ్మద్ ధ్వజమెత్తారు. నిరసన కార్యక్రమం సందర్భంగా ఆయనకు మాట్లాడుతూ గుంటూరు, కోడూరు, కావలి, ఆముదాలవలస, బద్వేలు, తుని, హిందూపురం నియోజకవర్గాల్లో మహిళలపై ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు దారుణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హోం మంత్రి అనిత పదవికి రాజీనామా చేయాలి డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి అనీషారెడ్డి మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దారుణాలను అరికట్టే విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. జగనన్న పాలనలో మహిళలకు భద్రత ఉండేదని, ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగితే నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దారుణాలను అరికట్టే వారిని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో లేదని, కేవలం మాటలు, ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. అంబేడ్కర్ను వేడుకుంటున్నాం రాష్ట్రంలో మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు, మీరు రాసిన రాజ్యాంగం అమలు అయ్యేలా చూడాలని కోరుతూ అంబేడ్కర్ ను వేడుకుంటున్నామని మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు జి.షమీం అస్లాం అన్నారు. ఎక్కడైనా మహిళలపై అఘాయిత్యం జరిగితే.. వారు వైఎస్ఆర్సీపీకి చెందిన వారంటూ నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. వీరికి చట్టభద్రత ఉండదా, వారికి చట్టాలు అమలు చేయరా అని ప్రశ్నించారు. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా, ఈ ఘటనలను చూసి ప్రభుత్వం సిగ్గుపడాలని విమర్శించారు. అధికారంలోకి రాకముందు మహిళల భద్రత గురించి మాట్లాడిన బాబు, పవన్, లోకేష్ ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. జగనన్న పాలన చూడండి జగనన్న పాలనలో ప్రతి సచివాలయానికి ఒక మహిళా పోలీసులు నియమించి భద్రత ఇచ్చారని మున్సిపల్ మాజీ చైర్మన్ వి.మనోజ అన్నారు. వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని ఆరోపించిన పవన్ కళ్యాణ్, ఆ మాటలపై ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మహిళల భద్రతకు దిక్కు లేకుండా పోయిందని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహిత, రాష్ట్ర కార్యదర్శులు బీరంగి రేవతి, మల్లేశ్వరీ, మొరుసు లక్ష్మీ, నియోజకవర్గాల మహిళా విభాగాల అధ్యక్షులు పద్మజారెడ్డి, మేరీ, హరిత, శ్రీదేవి, జిల్లా ఉపాధ్యక్షురాలు డిష్ కుమారి, జిల్లా కార్యదర్శి సయ్యద్ షహనాజ్ బేగం, మాజీ కౌన్సిలర్ మొబీనా, అమ్మాజాన్, నక్కా రమాదేవి, శారదరెడ్డి, వినుతాబాయి, మంజుల, ధనలక్ష్మి, నాగమణీ, రమారెడ్డి, లక్ష్మీ, భానుప్రియ, అరుణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఒకే భూమి.. డీ ఫాం పట్టాలు ముగ్గురికి!
● మొదటి పట్టాను రద్దు చేయకుండానే మరో ఇద్దరికి పట్టా ● మదనపల్లిలో రెవెన్యూ అక్రమాలు బట్టబయలుమదనపల్లి (కురబలకోట) : ఒకే భూమిని ముగ్గురికి డీఫాం పట్టాలు ఇచ్చిన నిర్వాకం మదనపల్లి రెవెన్యూ కార్యాలయంలో వెలుగు చూసింది. బాధితుల కథనం మేరకు.. మదనపల్లి మండలం వేంపల్లె గ్రామం బండకాడపల్లి దగ్గర డేగాని నారాయణమ్మకు 2.95 ఎకరాలు ఎస్సీ రిజర్వుడు డీకేటీ భూమి ఉంది. 1993లో డీఫాం పట్టా ఇచ్చారు. ఆమె ఐదేళ్ల క్రితం చనిపోయారు. భర్త శంకరయ్య పేరుతోనే ఇప్పటికీ ఈ భూమి రెవెన్యూ రికార్డులతో పాటు ఆన్లైన్లో కూడా ఉంది. వన్బీ కూడా వస్తోంది. అయితే వీరి డీఫాం పట్టాను రద్దు చేయకుండానే అప్పటి రెవెన్యూ అధికారులు ఇదే భూమిని 2007లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి డీఫాం పట్టాతో పాటు మ్యాన్యువల్ పాసు బుక్కు ఇచ్చారు. ఒకరికి ఎకరా 95 సెంట్లు, మరొకరికి ఎకరం ఇచ్చారు. అప్పటి నుంచి ఈ భూమి వివాదాస్పదం కావడంతో తగాదాలు ప్రారంభమయ్యాయి. మాదంటే మాదని గొడవలు పడసాగారు. మొదట ఒకరికి చట్టబద్దంగా పట్టా ఇచ్చి ఆ పట్టాను రద్దు చేయకుండా అదే భూమిని మరో ఇద్దరికి పట్టాలు జారీ చేయడం ప్రశ్నార్థకంగా మారింది. రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొదటి పట్టాను రద్దు పరచినట్లు ఎక్కడా రెవెన్యూ రికార్డులలో నమోదుకాలేదని వెల్లడవుతోంది. ఇందులో రెవెన్యూ తప్పిదం స్పష్టంగా కన్పిస్తోంది. మొదటి పట్టాను రద్దు చేయకపోవడం ఇదే భూమిని ఇద్దరికి ఇవ్వడం అక్రమంగా రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి. రెవెన్యూ అధికారుల విధి నిర్వహణ లోపం స్పష్టమవుతోంది. దీనిపై బాధితుడు డేగాని శంకరయ్య పీజీఆర్ఎస్లో న్యాయం చేయాలని అర్జీ ఇచ్చారు. దీనిపై సమగ్రంగా విచారించి నివేదిక పంపాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయమై తహసీల్దార్ మాధవిని విచారించగా ఇరువర్గాల స్టేట్మెంట్లు నమోదు చేయడంతో పాటు రికార్డులను పరిశీలించామన్నారు. తగు చర్యల నిమిత్తం జిల్లా కలెక్టర్కు నివేదిక పంపుతున్నట్లు తెలిపారు. -
రెండో రోజు లేఖరుల నిరసన
సాక్షి, మదనపల్లె : ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు నిరసనగా దస్తావేజు లేఖరులు చేపట్టిన పెన్డౌన్ కార్యక్రమం మంగళవారం రెండోరోజు కొనసాగింది. మదనపల్లెలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట శిబిరం ఏర్పాటు చేసి నిరసన కొనసాగించారు. జీఓ నంబర్ 396 రద్దు చేసేదాక వివిధ రకాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని దస్తావేజు లేఖరుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కంగేరి నంద చెప్పారు. కార్యక్రమంలో రంగు గుణశేఖర్, నాగమణింద్ర, మొహమ్మద్ ఖాన్, రంగు రాజేంద్ర, వెంకటేష్, శ్రీరాములు పాల్గొన్నారు. తల్లీకుమారుల అదృశ్యంపై కేసు నమోదు గాలివీడు : అన్నమయ్య జిల్లా గాలివీడుకు చెందిన ఈశ్వరమ్మ, ఆమె కుమారుడు రంజిత్కుమార్ రెడ్డి ఈ నెల 14వ తేదీ నుంచి కనిపించడం లేదని గాలివీడు పోలీసులు తెలిపారు. వీరు గాలివీడు టౌన్ నూలివీడు రోడ్డులోని తమ ఇంటి నుంచి 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు బయటకు వెళ్లి తిరిగి రాలేదన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మంగళవారం గాలివీడు పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. వీరి ఆచూకీ తెలిసిన వారు గాలివీడు ఎస్ఐ (9121100556), లక్కిరెడ్డిపల్లి సర్కిల్ సీఐ (9121100554) లేదా సమీప పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. శిశు మరణాల నివారణకు చర్యలు: డీఎంహెచ్ఓకడప రూరల్ : శిశు మరణాల నివారణకు ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యుగంధర్ అన్నారు. మంగళవారం స్థానిక ఆ శాఖ జిల్లా కార్యాలయంలో శిశుమరణాలపై ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, సూపర్ వైజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో డీఎంహెచ్ఓ మాట్లాడారు. పలు సూచనలు చేశారు. డాక్టర్ అరిఫుల్లా, డాక్టర్ మొహమ్మద్ తాహ, డాక్టర్ హిరేంద్ర సింగ్, డిప్యూటీ డెమో ప్రసన్న లత, సిహెచ్ఓ మునిరెడ్డి పాల్గొన్నారు. పురాతన బావికి పూర్వ వైభవం రాజుపాళెం : పురాతన బావి పూర్వ వైభవం సంతరించుకుంది. మండల పరిధి అర్కటవేముల గ్రామంలోని ఊరి బావిలో ఉన్న పూడిక, చెత్తాచెదారాన్ని మహిళలు, యువకులు, ప్రజలు వారం రోజులుగా కష్టపడి పరిశుభ్రం చేశారు. సుమారు 24 అడుగుల లోతు వరకు ఉన్న మురుగు నీటిని, అలాగే పూడికను డీజిల్ ఇంజన్ల సహాయంతో తొలగించారు. వారి శ్రమ ఫలించి ఊర బావిలో ఊట నీరు ఉబికి బయటికి వచ్చింది. ఈ బావికి పెద్ద చరిత్రే ఉందని గ్రామ పెద్దలు చెబుతున్నారు. గత యాభై ఏళ్ల క్రితం నీటి ఎద్దడితో అల్లాడిపోయిన సమీపంలోని చిన్నశెట్టిపల్లె, పొట్టిపాడు గ్రామాల ప్రజలు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అర్కటవేముల గ్రామానికి వచ్చి.. ఈ బావి వద్దకు వచ్చి తాగునీటిని తీసుకొని వెళ్లే వారిని గ్రామస్తులు తెలిపారు. ఇటీవలి కాలంలో గత మే నెల ఆఖరున బలమైన ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు నేలవాలి నాలుగు రోజుల పాటు విద్యుత్ రాలేదు. దీంతో గ్రామస్తులు నీటి కోసం అవస్థలు పడ్డారు. రాబోవు అవసరాలను గుర్తుకు తెచ్చుకొని శిథిలావస్థ, అపరిశుభ్రంగా ఉన్న ఈ బావిని శుభ్రం చేస్తే బాగుంటుందని ఆలోచన రావడంతో పరిశుభ్రం చేయడంతో పలువురు వారిని అభినందిస్తున్నారు. -
పెద్దేరు ప్రాజెక్టు సందర్శన
తంబళ్లపల్లె : తంబళ్లపల్లె మండలం జుంజురుపెంట సమీపంలోని పెద్దేరు ప్రాజెక్టును మంగళవారం హైడ్రాలజీ అధికారులు సందర్శించారు. హైడ్రాలజీ ఈఈ విజయకుమార్, డీఈ సత్యవతి, ఇరిగేషన్ డీఈ చెన్నకేశవులు ఏఈ సతీష్కుమార్, ఆయుకట్టు ఛైర్మన్ శివకుమార్తో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు గేట్లు పని తీరు, తూములు, కట్ట స్థితి, లాక్లు, నీటిమట్టం, లీకేజీలు, కాలువలు, రెయిన్గన్, గ్యాలరీ అంశాలనుపరిశీలించారు. ప్రాజెక్టు గురించి వివరాలను ఏఈ, చైర్మన్లను అడిగి తెలుసుకున్నారు. త్వరలో పెద్దేరు ప్రాజెక్టును కేంద్ర బృందం పరిశీలించనుందని ఏఈ తెలిపారు. లష్కర్ శ్రీనివాసులు, ఆయకట్టు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.ఏఐ–ఎంఎల్తో విప్లవాత్మక మార్పులుకురబలకోట : ప్రపంచ వ్యాప్తంగా విప్లవాత్మక మార్పులకు దారి తీస్తున్న ఏఐలో నైపుణ్యం సాధించి భవిష్యత్తును ఉన్నతంగా నిర్మించుకోవాలని చైన్నెలోని క్యాప్ జెమినీ సంస్థ సీనియర్ డెవ్ఓప్స్ ఇంజినీరు బి.సురేంద్ర రెడ్డి కోరారు. అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్, మెషిన్ లర్నింగ్ ఆపరేషన్స్–భవిష్యత్తుకు సిద్దమైన ఇంజినీర్ల నిర్మాణం అంశంపై మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక యుగంలో కేవలం ప్రోగ్రామింగ్ పరిజ్ణానం మాత్రమే సరిపోదని, మెషిన్ లర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి అత్యాధునిక సాంకేతికతల్లోనూ ప్రావీణ్యం సాధించాలన్నారు. నిరంతరం కొత్త సాంకేతికతతో పాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరచుకుంటే అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చన్నారు -
జెండా మోస్తూనే ఉండాలా!
సాక్షి, మదనపల్లె: టీడీపీ కోసం జీవితాంతం జెండా మోస్తూనే ఉండాలా, కనీస గౌరవం, గుర్తింపు ఎందుకివ్వరని ఆ పార్టీ సీనియర్ నేతలు జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ.జనార్దనరెడ్డిని ప్రశ్నించారు. సోమవారం మదనపల్లెలోని పార్లమెంట్ పార్టీ కార్యాలయంలో మంత్రితో నియోజకవర్గానికి చెందిన 30 మంది ముఖ్యనేతలు సమావేశమై తమ గోడు వెల్లబోసుకున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు..పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు ప్రసాద్ ఈ సమావేశంలో కొద్దిసేపు ఉండి వెళ్లిపోగా, ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్ ఉన్నారు. ఈ సందర్భంగా నేతలు ఒక్కొక్కరు తమ గళం విప్పారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా పార్టీకోసం పనిచేసిన వారిని గుర్తించి పార్టీలో, ప్రభుత్వ నామినేటేడ్ పదవుల్లో అవకాశం ఇవ్వడం అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్త నుంచి నాయకుని వరకు ఇక్కడ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు, వాటిని ఎవరు పరిష్కరిస్తారని నిలదీశారు. నియోజకవర్గ పార్టీ స్థితిగతులపై సమీక్షించి పట్టించుకోవాలని, కష్టకాలంలో అండగా నిలిచిన శ్రేణులను గుర్తించి వారికి సముచిత గౌరవం ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. ఇలాంటి నిర్లక్ష్యం కొనసాగితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు పార్టీ దూరం కావడం ఖాయమని స్పష్టంగా చెప్పేశారు. ఇప్పటికే ముఖ్యనాయకులు, సీనియర్లు దూరమైన విషయాన్ని మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందన్నారు. పార్టీకోసం ధైర్యంగా నిలబడే కార్యకర్తలు ఉండరని, ఇది పార్టీకి తీరని నష్టంగా మారుతుందని మంత్రితో తెగేసిచెప్పిన నాయకులు, వెంటనే నమ్ముకున్న వారికి న్యాయం చేయాలని పట్టుపట్టారు. మదనపల్లె నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని తాము భావించలేదని, పార్టీకి మరింత నష్టం కలగకముందే జాగ్రత్త పడాలని సూచించారు. ఈ పరిస్థితులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. పార్లమెంటు అధ్యక్షులు ప్రసాద్ ఈ విషయాలు పట్టించుకుంటున్నారా అని మంత్రి ఆరా తీసినట్టు తెలిసింది. పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు, తిరుపతి ఘటనలను మంత్రి ప్రస్తావించి, మదనపల్లెలో ఇలాంటì పరిస్థితి రాకుండా క్యాడర్లో నెలకొన్న అసంతృప్తిని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిసింది. -
పడిగాపులు.. ప్రదక్షిణలు
● అవస్థల పీజీఆర్ఎస్ ● అర్జీలు కొండంత..పరిష్కారం గోరంత అర్జీదారుల్లో అసహనం మదనపల్లె(కురబలకోట): మదనపల్లె కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సోమవారం వివిధ సమస్యలతో వచ్చిన అర్జీదారులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి అర్జీదారులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. వారం వారం వచ్చిన అర్జీలే మళ్లీ వస్తున్నాయి. ప్రతి సోమవారం అదే సీను పునరావృతం అవుతోందని బాదితులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. పలువురు విసుగు, అసహనం వ్యక్తం చేశారు. మదనపల్లె పీజీఆర్ఎస్ చాలా మటుకు అవే అర్జీలు..అదే గోడు..అదే నిరీక్షణలా సాగుతుండడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా భూ సమస్యల పరిష్కారం కోసం, ఫించన్లు కోరుతూ అర్జీలు వచ్చాయి. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఉన్నతాధికారులు వెంకటేష్, చంధ్రశేఖర్ రెడ్డి, శాంతరాజ్ ప్రజల నుండి అర్జీలు 324 అర్జీలను స్వీకరించారు. క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెద్ద చెరువుకు నీరు నింపాలి ఎందరికో జీవనాధారంగా ఉన్న కురబలకోట మండలం చింతమాకులపల్లి గ్రామం పరిధిలోని పెద్ద చెరువు (నార్లపల్లి చెరువు)కు 12 ఏళ్లుగా వర్షపు నీరు చేరక ఆయకట్టు రైతులు సాగునీటి కోసం అవస్థలు పడుతున్నామని ఆయకట్టు రైతులతో పాటు సిద్దల ఎల్లమ్మ పీజీఆర్ఎస్లో జాయింట్ కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. చెరువుకు నీరు చేరేలా తగు చర్యలు తీసుకోవాలని కోరగా జాయింట్ కలెక్టర్ సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నల్లమాండ్లపల్లిలో దాహం.దాహం.. మదనపల్లె రూరల్ మండలం పోతబోలు గ్రామం నల్లమాండ్లపల్లిలో బోరు ఎండిపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, అలాగే మూగజీవాలు కూడా తాగునీటికి అలమటించే పరిస్థితి నెలకొందని కొత్త బోరువేయాలని పీజీఆర్ఎస్లో అర్జీ ఇచ్చారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని కలెక్టరేట్లో నిరసన నీళ్లు వదిలే లైన్మ్యాన్ లేక టిడ్కో కాలనీలో 20 రోజులుగా తాగు నీరు రావడం లేదని బాధితులు సోమవారం పీజీఆర్ఎస్లో అర్జీ ఇచ్చారు. సమస్య తీర్చాలని, అలాగే టిడ్కో ప్రాంతంలో కనీస వసతులు కల్పించాలని కోరారు. వెంటనే నీటి సమస్య పరిష్కరించాలని జేసీ ఆదేశించారు. -
మాటపడిపోయిన అభాగ్యురాలిని ఆదుకోవాలి
ఈమె పేరు అనూరాధ. మదనపల్లి పట్టణం అమ్మచెరువు మిట్ట. 15 ఏళ్లఽ క్రితం పక్షవాతంతో నోటి మాట పడిపోయింది. కాలు చెయ్యి కూడా కదపలేదు. మంచానికే పరిమితం. సొంత ఇళ్లు కూడా లేదు. వికలాంగుల ఫించన్ ఆరువేలు వస్తోంది. ఎలాంటి ఆధారం లేదు. బాడుగ ఇంటిలో కాపురం. ముగ్గురు పిల్లలు. భర్త కూలిపనులకు వెళతాడు. మంచానికే పరిమితమైన ఈమెకు ఆర్థిక భరొసా కల్పించడంతో పాటు పక్కా ఇంటిని మంజూరు చేయడం, రూ. 15 వేల డీఎంఅండ్హెచ్ఓ పింఛన్ ఇప్పించాలని మూడు చక్రాల బండిలో తెలిసినవారి సాయంతో వచ్చి జాయింట్ కలెక్టర్ను పీజీఆర్ఎస్లో కోరారు. -
11 సార్లు అర్జీ ఇచ్చినా..
ఇతని పేరు పాలెం వెంకట్రమణ. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఇతను భూ సమస్య పరిష్కారం కోసం పీజీఆర్ఎస్లో 11 సార్లు అర్జీ ఇచ్చారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.ఇతనికి తంబళ్లపల్లి మండలం రేణిమాకులపల్లిలో సర్వే నంబర్ 144/2లో ఎకరా 85 సెంట్ల డీకేటీ భూమి ఉంది. పట్టా కూడా ఉంది. ఇప్పటికీ ఇతని అనుభవంలోనే ఉంది.వన్బీ కోసం దరఖాస్తు చేయగా ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఇదే భూమికి మరో ఫోర్జరీ పట్టా పొందిన వ్యక్తి వైపు రెవెన్యూ అధికారులు మొగ్గు చూపుతున్నారు. ఇది ఫోర్జరీ పట్టా అని అధికారుల విచారణలో వెల్లడైనా తనకు న్యాయం చేయడం లేదని వృద్ధుడు వాపోతున్నారు. మరోసారి పీజీఆర్ఎస్లో అర్జీ ఇచ్చారు. -
48 గంటల్లోనే చోరీ కేసు ఛేదన
● పక్కా స్కెచ్తో దొంగతనం ● కటకటాల్లోకి ఇద్దరు నిందితులు లక్కిరెడ్డిపల్లి: అన్నమయ్య జిల్లా, గాలివీడు మండలంలో జరిగిన గృహచోరీ కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు.జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి, ఐపీఎస్ ఆదేశాల మేరకు పక్కా వ్యూహంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను అరెస్టు చేశారు. సోమవారం లక్కిరెడ్డిపల్లి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ వివరాలను వెల్లడించారు. బాధితులు కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రతి గురువారం లక్కిరెడ్డిపల్లి మండలం, కోనంపేట సంతకు వెళ్లి అక్కడే రాత్రి బస చేసి మరుసటిరోజు ఇంటికి రావడం వారి దినచర్య. ఈ క్రమంలో ఈనెల 16న ఉదయం 8.30 గంటలకు సంతకు వెళ్లిన దంపతులు, 17వ తేదీ ఉదయం పది గంటలకు గాలివీడులోని తమ ఇంటికి చేరుకున్నారు. ఇంటి వెనుక తలుపులు, బీరువా తాళాలు పగులకొట్టి ఉండటాన్ని గమనించి షాక్కు గురయ్యారు. బీరువాలో భద్రపరిచిన కుటుంబ సభ్యులకు (కుమారుడు, కోడలు, మనువడు, మరదలు, అల్లుడు, భార్య) చెందిన సుమారు 210 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. వెంటనే గాలివీడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు గాలివీడు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాయచోటి సబ్ డివిజన్ పోలీస్ అధికారి ఎంఆర్ కృష్ణమోహన్ పర్యవేక్షణలో లక్కిరెడ్డిపల్లి సీఐ హెచ్ కృష్ణంరాజు నాయక్ రంగంలోకి దిగారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వేగంగా దర్యాప్తు పూర్తి చేసి సోమవారం ఉదయం గాలివీడు మండలం, పేరంపల్లి గ్రామం, రెడివారిపల్లి క్రాస్ రోడ్డు వద్ద నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 210 గ్రాముల బంగారు ఆభరణాలు, బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
అర్జీలకు సత్వరమే పరిష్కారం
మదనపల్లె టౌన్: మదనపల్లె లో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రజల నుంచి 72 అర్జీలు స్వీకరించారు. సమస్యల వీటిని పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సీఐ, ఎస్ఐలను ఆదేశించారు.వీటిలో భూవివాదాలు (39), ఆర్థిక లావాదేవీలు(15), కుటుంబ కలహాలు(6), మోసం(5), సైబర్(1), ఇతర సమస్యలు(6) ఉన్నాయి. నడవలేని స్థితిలో వచ్చిన బాధితుల వద్దకు ఎస్పీ స్వయంగా వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు. పోక్సో కేసులో అరెస్టు సదుం: బాలికను వేధించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసిన ట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ఓ యువకుడు ఓ బాలికను ఈనెల 15న బలవంతంగా ఇంటి నుంచి తీసుకుని వచ్చి అత్యాచార యత్నం చేయపోయాడని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. పాముకాటుతో మహిళా రైతు మృతి మదనపల్లె టౌన్: వ్యవసాయ పనులు చేస్తుండగా పాముకాటుకు గురై మహిళా రైతు మృతి చెందిన విషాదకర సంఘటన బి.కొత్తకోట మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలం లోని మోగసాలమర్రి గ్రామానికి చెందిన రైతు శంకర్ రెడ్డి భార్య, మహిళా రైతు శివమ్మ (53) రోజూ మాదిరిగానే వ్యవసాయ బోరు వద్దకు వెళ్లింది. ఉద్యాన పంటలో పనులు చేస్తుండగా విష సర్పం కాటేసింది. అస్వస్థతకు గురైన శివమ్మను కుటుంబ సభ్యులు మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. లారీ బోల్తా : డ్రైవర్కు గాయాలు గాలివీడు : గాలివీడు మండలం నూడివీడి గ్రామం సమీపంలో సోమవారం లారీ బోల్తా పడింది. డ్రైవర్ వేగాన్ని అదుపు చేయలేక బోల్తా పడిందని స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ఎరచ్రందనం దుంగలు స్వాధీనం తిరుపతి అన్నమయ్యసర్కిల్: అన్నమయ్య జిల్లా పీలేరు రోడ్డు మార్గంలో, గుడిపాల – రాణీపేట హైవేలో రెండోచోట్ల కారులో తరలిస్తున్న 18 ఎర్రచందనం దుంగలను టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారు అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాలను సీజ్ చేశారు. ఏఆర్ఎస్ఐ కె.మహేశ్వరనాయుడు బృందం స్థానిక అటవీ సిబ్బంది జగదీష్, ఆషాబీతో కలసి అన్నమయ్య జిల్లా కేవీ పల్లి–పీలేరు మార్గంలో పొంతల చెరువు క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున ఒక కారు వేగంగా వస్తూ టాస్క్ఫోర్స్ బృందాన్ని గమనించి కారును ఆపి అందులోని వ్యక్తులు దిగి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని వెంబడించి ఇద్దరిని పట్టుకున్నారు. మరో వ్యక్తి పారిపోయాడు. అదుపులోకి తీసుకున్న వారు తమిళనాడు తిరుపత్తూరు, తిరువన్నామలై జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. 11 ఎర్రచందనం దుంగలు, కారును తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసు స్టేషన్కు తరలించారు. రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి రొంపిచెర్ల: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన అనంతపురం– చైన్నై జాతీయ రహదారిలోని రొంపిచెర్ల క్రాస్ రోడ్డుకు సమీపంలో సోమవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నగొట్టిగల్లు మండలం జంగావాండ్లపల్లె గ్రామ పంచాయతీ అప్పేపల్లెకు చెందిన ఎల్లయ్య(40) జాతీయ రహదారిలోని గంగా డాబా నుంచి రొంపిచెర్ల క్రాస్ రోడ్డుకు నడిచి వెళుతుండగా ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో ఎల్లయ్య అక్కడిక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానికులు రొంపిచెర్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుసూధన్ తెలిపారు. -
విద్యార్థులను ప్రోత్సహించేందుకే షైనింగ్ స్టార్స్
సాక్షి, మదనపల్లె : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకే షైనింగ్ స్టార్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి బీసీ.జనార్దనరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మదనపల్లెలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన 157 మంది, ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబరిచిన 31 మందిని ఎంపిక చేశామన్నారు. విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున రూ.37.60 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందించామన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని కలెక్టర్, డాక్టర్, ఇంజనీర్, ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నత రంగాల్లో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సెల్ఫోన్ల వినియోగాన్ని నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఆహార నాణ్యతపై పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్బాషా, డీఈఓ సుబ్రమణ్యం, ఏసీపీ అనురాధ పాల్గొన్నారు.జిల్లా ఇన్చార్జ్ మంత్రి జనార్దనరెడ్డి -
పెట్రోలు చల్లి ఇంటికి నిప్పు
● ప్రమాదం నుంచి బయటపడిన చిన్నారులు ● బోరు మోటారు దొంగతనం నెపంతో వివాదం పెద్దమండ్యం: బోరు మోటారు దొంగతనం జరిగిందనే నెపంతో వచ్చిన వివాదం ఓ ఇంటికి పెట్రోలు చల్లి నిప్పు పెట్టేవరకు వెళ్లింది. మాటలతో మొదలైన వివాదం చివరకు పెద్దదిగా మారింది. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడిన ఇద్దరు పెట్రోలు చల్లి నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. చిన్నారులు గట్టిగా కేకలు వేయడంతో అప్పుడే పొలం దగ్గరికి వెలుతున్న బాధితులైన తల్లి, కూతురు గ్రామస్తులు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆదివారం సాయంత్రం సంఘటన జరగ్గా, సోమవారం బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా కోటకాడపల్లె పంచాయతీ యర్రసానివారిపల్లెకు చెందిన ఎం గంగులప్ప వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి కుమారుడు మహేశ్వర, కుమార్తె ఉన్నారు. కుమారుడు బెంగళూరులో డ్రైవర్గా పనిచేసుకుంటూ భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బెంగళూరులో ఉన్న కుమారుని వద్దకు రెండు నెలల కిందటే గంగులప్ప వెళ్లి అక్కడే వాచ్మెన్గా పని చేస్తున్నారు. అయితే ఇదే గ్రామంలోని తాటిమాకులపల్లెకు చెందిన శివయ్య కుటుంబ సభ్యులతో భూమి విషయమై వివాదం ఉంది. ఇదిలా ఉండగా శివయ్యకు చెందిన బోరు మోటరు చోరీ జరిగినట్లు ఇతని కుమారుడు మణికంఠ గంగులప్పపై అనుమానం వ్యక్తం చేస్తూ అల్లుడైన జయరాంను అడిగారు. ఈ విషయం బెంగళూరులో ఉన్న మామ గంగులప్ప, బామ్మర్ధి మహేశ్వరలకు అల్లుడు జయరాం తెలిపారు. దీంతో మహేశ్వర తన తల్లి రామాంజులమ్మ కు జరిగిన విషయమై శివయ్య కుటుంబ సభ్యులను అడగాలని కోరాడు. బెంగళూరులో ఉన్న నా భర్త మీ బోరు మోటారు ఎందుకు దొంగతనం చేశాడని శివయ్య కుటుంబ సభ్యులను రామాంజులమ్మ నిలదీసింది. దీంతో అక్కడ చిన్నపాటి గొడవ జరిగింది. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి శివయ్య కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు గంగులప్ప కుమారుడు మహేశ్వరకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇద్దరం బెంగళూరులో ఉన్నామని, స్టేషన్కు వస్తామని పోలీసులకు సమాధానం ఇచ్చారు. కాగా స్టేషన్లో ఫిర్యాదు చేసి తిరిగి ఇంటికి వెలుతున్న శివయ్య భార్య, కుమారుడు ఇద్దరు పెట్రోల్ కొనుగోలు చేసుకొని వెళ్లి గంగులప్ప ఇంట్లోకి వెళ్లి పెట్రోలు చల్లి నిప్పు పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంట్లో ఉన్న మహేశ్వర, చెల్లెలు బిడ్డలు ఐదుగురు చిన్నారులు కేకలు వేయడంతో పొలం దగ్గరికి వెళుతున్న గంగులప్ప భార్య, కుమార్తె ఇద్దరు ఇంటి వద్దకు పరుగున వచ్చారు. గ్రామస్తులు అక్కడికి చేరుకుని చిన్నారులను మంటలనుండి రక్షించారు. మంటల్లో ఇంట్లో ఉన్న ధాన్యం పాక్షికంగా కాలిపోయాయి. గ్రామస్తులు మంటలను అదుపు చేయకుంటే చిన్నారులు, ఇంట్లో ఉన్న ధాన్యం, దుస్తులు సర్వం కోల్పోయే వాళ్లమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ హరిహరప్రసాద్ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. సమగ్ర విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
మంత్రి కాన్వాయ్కి అడ్డొచ్చిన మహిళ
మదనపల్లె టౌన్: మతిస్థిమితం లేని ఓ మహిళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కాన్వాయ్కి అడ్డుగా రావడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోమవారం మదనపల్లెలో ఈ ఘటన జరిగింది. షైనింగ్ స్టార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మదనపల్లెకు వచ్చారు. ఆయన కాన్వాయ్ పట్టణంలోని ప్రధాన రహదారిపై వెళ్తుండగా, హఠాత్తుగా ఓ మహిళ కారుకు అడ్డంగా వచ్చి నిలుచుంది. అప్రమత్తమైన ఎస్కార్ట్ పోలీసులు, భద్రతా సిబ్బంది ఆ మహిళను జాగ్రత్తగా పక్కకు జరిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కాన్వాయ్ని ముందుకు పంపించారు. మంత్రి కారుకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. -
విద్యుదాఘాతంతో బెంగాల్వాసి మృతి
సదుం: జీవనోపాధి కోసం పనులకు వచ్చిన కూలీ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పుంగనూరు రూరల్ సీఐ సాయిప్రసాద్ కథనం మేరకు..మండలంలో గత కొద్ది రోజులుగా గ్రామాలకు త్రీఫేజ్ సరఫరా చేసేలా నూతన విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం బెంగాల్కు చెందిన కొందరు కూలీపనులకు వచ్చారు. గొంగివారిపల్లె వద్ద పనులు చేపడుతుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో తఫీజుల్ (26) షాక్కు గురయ్యాడు. అతన్ని తిరుపతికి తరలిస్తుండగా ఆదివారం రాత్రి మార్గమధ్యంలో మృతి చెందాడు. మహిళ అదృశ్యంమదనపల్లె టౌన్: మహిళ అదృశ్యంపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ కళా వెంకటరమణ కథనం మేరకు.. మదనపల్లె మండలం చిప్పిలికి చెందిన జంగాల దేవేంద్ర భార్య జంగాల సుకన్య బజారుకు వెళుతున్నానని చెప్పి నాలుగు రోజుల క్రితం వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పిల్లలు పుట్టలేదని ఆత్మహత్య రొంపిచెర్ల: పిల్లలు పుట్టలేదని మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన రొంపిచెర్ల గ్రామ పంచాయతీలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఇందిరమ్మ కాలనికి చెందిన మల్లెల ముస్కాన్(26) అజంతుల్లాకు 8 ఏళ్ల కిందట వివాహం జరిగింది. అయితే వారికి పిల్లలు పుట్టలేదు. ఈ విషయమై మానసిక వేదనతో ఆదివారం రాత్రి ఇంట్లో భర్త లేని సమయలో ఫ్యాన్కు ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుసూధన్ సోమవారం తెలిపారు. -
24న మెగా పీటీఎం–3.1
మదనపల్లె సిటీ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 24న మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (మెగా పీటీఎం 3.1) కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ అనురాధ తెలిపారు. జిల్లాలోని 1785 ప్రభుత్వ, 7 ఎయిడెడ్ పాఠశాలల్లో జరుగుతుందన్నారు. సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతి, హోలిస్టిక్ ప్రొగ్రెస్ కార్డు, లీప్యాప్ ద్వారా విద్యార్థుల అభ్యసన స్థాయి, ఫౌండేషన్ లిటరసీ దీక్షా యాప్ వినియోగం, పాఠశాలల్లో అమలవుతున్న వివిధ విద్యా సంస్కరణలపై తల్లిదండ్రులతో సమగ్ర అవగాహన కల్పించబడుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి మెగా పీటీఎం కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. పీలేరు పంచాయతీకి ఐఎస్ఓ గుర్తింపు పీలేరు : జిల్లాలో పీలేరు పంచాయతీకి ఐఎస్ఓ గుర్తింపు లభించింది. సోమవారం కలెక్టర్ నిశాంత్కుమార్ మదనపల్లె కలెక్టరేట్ కార్యాలయంలో పీలేరు గ్రామ పంచాయతీ ఈవో రవీంద్రరెడ్డి, ప్రత్యేకాధికారి యుగంధర్లకు ఐఎస్ఓ సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోనే ఐఎస్ఓ గుర్తింపు పొందిన తొలి పంచాయతీగా పీలేరు మేజర్ పంచాయతీ నిలిచిందని అభినందించారు. ఇకపై యాప్లోనే లావాదేవీలుసాక్షి, మదనపల్లె : స్వయం సహాయక సంఘాల సభ్యులకు మన డబ్బులు–మన లెక్కలు యాప్ వినియోగంపై మెప్మా ఆధ్వర్యంలో సోమవారం మదనపల్లెలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా టీఈఐబీ నాగరాజు, టీఈ సీయంయం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ యాప్ ద్వారా సంఘ సభ్యులు తమ పొదుపులు, రుణాలు, చెల్లించిన, చెల్లించాల్సిన వాయిదాల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చన్నారు. మెప్మా కార్యక్రమాలు, జీవనోపాధి అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా యాప్ ద్వారా పొందవచ్చని తెలిపారు. యాప్లోని మొబైల్ బుక్ కీపింగ్ విధానాన్ని ఉపయోగించి సంఘాల ఆర్థిక లావాదేవీలన్నింటినీ తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. వచ్చే నవంబర్నాటికి స్వయం సహాయక సంఘాల సభ్యులందరూ తమ ఆర్థిక లెక్కలను యాప్లో స్వయంగా చూసుకునే స్థాయికి చేరేలా అవగాహన పెంచుకోవాలని కోరారు. ఈ శిక్షణలో సంఘ సభ్యులకు యాప్ వినియోగం, మొబైల్ బుక్ కీపింగ్, ఆర్థిక లావాదేవీల నమోదు తదితర అంశాలపై అవగాహాన కల్పించారు. సీఓలు అనిత, నాగేంద్ర, ఆర్పి పుష్ప, సంఘ సభ్యులు హాజరయ్యారు. ప్రభుత్వ భూముల పరిశీలన రామసముద్రం : జిల్లాలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ భూములను గుర్తించే ప్రక్రియలో భాగంగా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం రామసముద్రం మండలంలోని చొక్కాండ్లపల్లి గ్రామ సమీపంలో ఉన్న 60 ఎకరాల ప్రభుత్వ పశువుల మేత బీడు భూమిని పరిశీలించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణితో కలిసి సర్వే నంబర్ 177లోని భూమిని సందర్శించి, హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు అనుకూలతపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మదనపల్లె నియోజకవర్గ పరిధిలోని అనువైన ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సందర్భంగా భూమి విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, రహదారి అనుసంధానం, సరిహద్దులు, నీటి వనరులు, విద్యుత్ సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాలపై రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. హార్టికల్చర్ హబ్ ఏర్పాటు ద్వారా ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం లభించడంతో పాటు, పంటల నిల్వ, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉందన్నారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ అజారుద్దీన్, సర్వేయర్ నరేంద్ర, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
ఖరీఫ్ ఖతం
సాక్షి, మదనపల్లె : ఎల్నినో జిల్లా ఖరీఫ్ వ్యవసాయాన్ని నిలువునా ముంచేసింది. జిల్లాలో ఏ ఖరీఫ్లోనూ నెలకొనని పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. సాధారణంగా వర్షాభావ పరిస్థితులు, కరువు వచ్చినా ఇంతటి దారుణమైన పరిస్థితులు ఎదురు కాలేదు. ఎల్నినో తెచ్చిన ఉపద్రవంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్ రైతాంగాన్ని వెంటాడి వేధిస్తోంది. ఈ దారుణమైన వర్షాధార పరిస్థితిల మధ్య ఖరీఫ్ సీజన్ ముగిసిపోయింది. జూలై 15 తర్వాత పంటలు సాగుచేసిన దిగుబడి ఉండదు. ఇప్పుడు వర్షం లేకపోవడం వల్ల పంటలు సాగు అసాధ్యంగా మారింది. ఇకపై వర్షాలు కురిసినప్పటికీ ఖరీఫ్ పంటలు సాగు చేయడం ఏమాత్రం సాధ్యం కాదు. ఈ పరిస్థితుల మధ్య జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు ఎల్ నినో ముగింపు పలికింది. దారుణమైన సాగు గతంలో వచ్చిన కఠినమైన కరువులోనూ ఇప్పటి సాగు పరిస్థితులు లేవు. సాగు విస్తీర్ణంలో కనీసం సగమైన పంటలు విత్తడం జరిగేది. ఇప్పుడా పరిస్థితి కనుచూపుమేర లేదు. జిల్లాలో 46,055 హెక్టార్లలో వేరుశనగ సహా అన్ని రకాల పంటలు సాగు అవుతాయని, అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ఖరీఫ్ ప్రణాళికను అమలు చేసింది. సాధారణంగా జూన్లోనే 70 శాతానికి పైగా సాగు పూర్తయ్యేది. మిగతాది జూలై నెలలో జరిగేది. ఖరీఫ్ లో ఇప్పటిదాకా పంటల సాగు చేసింది కేవలం 2,428 హెక్టార్లలోనే. మిగిలిన 43,627 హెక్టార్ల భూమి బీడుగానే మిగిలింది. సాగు చేస్తున్న విస్తీర్ణం 5.27 శాతమే. అన్ని రకాల పంటలు వీటిలో సాగు చేశారు. వేరుశనగ అధికం జిల్లాలో సాగు అయిన 2,428 హెక్టార్లలో వేరుశెనగ 1,647 హెక్టార్లలో సాగు చేశారు. మిగిలిన 781 హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేశారు. అయితే వేరుశనగ సాగు కావాల్సిన 27,016 హెక్టార్లలో 25,369 హెక్టార్లలో సాగుకు నోచుకోలేదు. జిల్లాలో సాగుచేసిన వేరుశనగ పంటలో పెద్దమండ్యం మండలం మొదటి స్థానంలో నిలిచింది. ఈ మండలంలో 919 హెక్టార్లలో వేరుశనగ సాగు కావాల్సివుండగా 375 హెక్టార్లలో సాగై జిల్లాలోని మొదటి స్థానంలో నిలిచింది. దీనికి మించిన సాగు విస్తీర్ణం ఇతర ఏ మండలంలోనూ లేదు. బి.కొత్తకోట మండలంలో 1 ,115 హెక్టార్లకు గాను 105 హెక్టార్లలో, కంభం వారిపల్లె మండలంలో 1,842 హెక్టార్లకు గాను 180 హెక్టార్లలో, పీలేరు మండలంలో 1,312 హెక్టార్లకుగాను 200 హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. జిల్లాలో అతి తక్కువగా రామసముద్రం మండలంలో 789 హెక్టార్లకుగాను కేవలం నాలుగు హెక్టార్ల హలోనే సాగు చేశారు. గుర్రంకొండ జీరో జిల్లాలోని 25 మండలాల్లో అరకొరగా పంటలు సాగు చేసినప్పటికీ.. గుర్రంకొండ మండలంలో మాత్రం ఒక్క సెంటు భూమి కూడా సాగు చేసినట్టు నమోదు కాలేదు. ఈ మండలంలో 954 హెక్టార్లలో పంటలు సాగు కావాలి. అందులో వేరుశనగ 506 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉంది. అయితే ఈ మండలంలో ఏ పంట కూడా సాగుకు నోచుకోలేదు. ఈ ఖరీఫ్లో ఒక ఎకరా కూడా సాగు కానీ మండలంగా గుర్రంకొండ రికార్డులకు ఎక్కింది. 37 రోజులుగా చుక్క వర్షం లేదు జిల్లాలో ఖరీఫ్లో ఇంతటి సుదీర్ఘమైన రోజులు వర్షాభావ పరిస్థితులు నెలకొనడం చూస్తున్నాం. జూన్ 13న జిల్లాలో వర్షపాతం నమోదైంది. తర్వాత 14వ తేది నుంచి జూలై 20 వరకు జిల్లాలోని 25 మండలాల్లో ఎక్కడా చుక్కవర్షం కురవలేదు. మేఘాలు కనిపిస్తున్నా వర్షం కురిసింది లేదు. 37 రోజులుగా వర్షం /ాడలేదంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో, మున్ముందు ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో స్పష్టంగా తెలుస్తోంది.పంట చేతికొచ్చేలా లేదు వర్షాలు నమ్ముకుని మూడు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాను. ఎకరాకు రూ.20 వేలు చొప్పున రూ.60 వేలు పెట్టుబడి పెట్టాను. పంట వేశాక వర్షాలు కురవలేదు. ఇప్పుడు పంట వాడు మొఖం పట్టింది. వర్షం కురిసే పంట చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పంట నష్టపోతే ప్రభుత్వం ఆదుకోవాలి. – పెద్దరెడ్డప్ప, రైతు, తంబళ్లపల్లె మండలం జిల్లాలో సాధారణ సాగు 46,055 హెక్టార్లు సాగు చేసింది 2,428 హెక్టార్లు వేరుశనగ సాగు లక్ష్యం 27,016 హెక్టార్లు, సాగైంది 1,647 హెక్టారు -
జిల్లాలో స్తంభించిన రిజిస్ట్రేషన్లు
సాక్షి, మదనపల్లె : కూటమి ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని దస్తావేజు లేఖరులు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. ఈనెల 31 వరకు ఈ నిరసన కార్యక్రమం కొనసాగించనున్నారు. తొలిరోజు దస్తావేజు లేఖరులు వారి కార్యాలయాల పరిధిలో నిరసనలు చేపట్టి ధర్నాలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దస్తావేజులపై ఆధారపడి జీవిస్తున్న తమ కుటుంబాలను రోడ్డుపాలు చేయొద్దంటూ నినదించారు. చంద్రబాబు సర్కార్ ప్రజల విలువైన ఆస్తులతో ముడిపడిన రిజిస్ట్రేషన్ల వ్యవహారాన్ని ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో వారికి అప్పగించేలా జీవో నెంబర్ 396 జారీ చేసింది. ఈ జీవో వల్ల ఇప్పుడు జిల్లాలో 150 మందికి పైగా దస్తావేజు లేఖలు తమ జీవనభృతిని కోల్పోనున్నారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. తొలుత జిల్లా కేంద్రాల్లో, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. విలువైన ప్రజల ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల విషయంలో తమకు భాగస్వామ్యం కల్పించకపోవడంపై ఇప్పుడు పనిచేస్తున్న దస్తావేజు లేఖరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో రిజిస్ట్రేషన్ల శాఖను పెడితే, వారు వివాదాస్పదంగా వ్యవహరించి సామాన్యుల ఆస్తులకు భంగం కలిగించే అవకాశాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయవద్దని, ఇప్పుడున్న యధాతధ పరిస్థితిని కొనసాగించాలని దస్తావేజు లేఖరులు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. స్తంభించిన కార్యకలాపాలు దస్తావేజు లేఖరుల పెన్డౌన్ కార్యక్రమంతో సోమవారం జిల్లాలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. జిల్లా కేంద్రంలోని మదనపల్లె, బి.కొత్తకోట, తంబళ్లపల్లె, పుంగనూరు, వాయల్పాడు, పీలేరు, కలికిరి, రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, సుండుపల్లి, రాజంపేట, చిట్వేలి, పుల్లంపేట కార్యాలయాల పరిధిలోని దస్తావేజు లేఖరులు పెన్ డౌన్ నిర్వహించారు. దాంతో ప్రతిరోజు జరిగే 150 నుంచి 200 రిజిస్ట్రేషన్లు పూర్తిగా ఆగిపోయాయి. క్రయవిక్రయాలు జరుపుకునే ప్రజలు కూడా కార్యాలయాల వైపునకు రాలేదు. దాంతో నిత్యం కిటకిటలాడే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు బోసిపోయాయి. దీనివల్ల సోమవారం ఒకరోజు తమ శాఖకు రూ.కోటి ఆదాయానికి నష్టం వాటిల్లిందని జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖ అధికారి ఉమామహేశ్వరి చెప్పారు. బోసిపోయిన 13 కార్యాలయాలు ఆగిపోయిన 200 రిజిస్ట్రేషన్లు, రూ.కోటి ఆదాయం నష్టం జిల్లా వ్యాప్తంగా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు ప్రజలే డాక్యుమెంట్లు చేసుకోవచ్చని అధికారుల సూచనహెల్ప్ డెస్కులు ఏర్పాటు దస్తావేజు లేఖరులు సమ్మె చేస్తుండడంతో రిజిస్ట్రేషన్లు జరుపుకునే ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అధికారి ఉమా మహేశ్వరి చెప్పారు. ఈ మేరకు జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు. ఒక్కో కార్యాలయంలో ఒక్కో ఉద్యోగిని నియమించారు. వీరు రిజిస్ట్రేషన్లకు వచ్చే ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారు. దస్తావేజులు తయారు చేసుకునే తీసుకువస్తే వాటిని స్లాట్ విధానంలో ఆమోదించి రిజిస్ట్రేషన్లు చేస్తారు. ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదని వీటిని ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. -
అరణ్య రోదన!
అట్లూరు ప్రజల వేదన..అట్లూరు మండలం తూడూరు గ్రామానికి చెందిన పల్లె లక్ష్మమ్మకు రాత్రి 10గంటల సమయంలో గుండెల్లో తీవ్రమైన నొప్పి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఓ వాహనంలో ఎక్కించుకుని కడప ఆస్పత్రికి బయలుదేరారు. అట్లూరు– సిద్దవటం మార్గంలోని చెక్పోస్టు వద్దకు రాగానే చెక్పోస్టు సిబ్బంది అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల అనుమతి లేనిదే ఈ టైంలో వెళ్లడానికి వీల్లేదన్నారు. అత్యవసర పరిస్థితి అని వేడుకున్నా పంపించే ప్రసక్తే లేదన్నారు. చేసేదిలేక ఉన్నతాధికారులను ఆశ్రయించారు. అనుమతి తీసుకోవడానికి సుమారు గంట పట్టింది.. ఆపై ఆస్పత్రికి చేరే లోపు లక్ష్మమ్మ ఊపిరాగింది. ఫారెస్టు చెక్పోస్టు వద్ద వృధా అయినా ఆ గంట సమయం ఆమె ప్రాణాలు మీదకు తెచ్చింది. లక్ష్మమ్మ కుటుంబానికి ఇప్పటికీ చెక్పోస్టు బాధ వెంటాడుతోంది. ఆ దారి వేదన.. ఇప్పటికీ అరణ్యరోదనే అయింది.సాక్షి ప్రతినిధి కడప : సిద్దవటం–అట్లూరు మార్గంలోని ఫారెస్ట్ చెక్పోస్టు సమస్య దశాబ్దాల కాలంగా వేధిస్తోంది. అట్లూరు, బద్వేల్ పరిసర ప్రాంతాల ప్రజల ప్రాణాలమీదకు తెస్తోంది.అర్ధరాత్రి అపరాత్రి ఆకస్మిక ప్రమాదాలు ముంచుకొస్తే ఆ మార్గంలో అనేక వ్యయ ప్రయాసాలకు గురి కావాల్సి వస్తోంది. 2013 నుంచి ఇప్పటివరకూ అనేక కుటుంబాలు ఆవేదన భరిస్తూనే ఉన్నారు. ● సిద్దవటం–అట్లూరు మధ్యలో 9కిలోమీటర్లు వన్యప్రాణులు సంచరిస్తున్న ప్రాంతంగా ఫారెస్టు యంత్రాంగం గుర్తించింది. అభయారణ్యంలో రాత్రి సమయాల్లో వన్య ప్రాణాలు సంచరిస్తూ రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోతున్నాయని, ఈ పరిస్థితి నిరోధించాలనే ఉద్దేశంతో గెజిట్ నెంబర్ 05/2013 అమలు చేశారు. 2013 ఫిబ్రవరి 14 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయంతో రాత్రి 9 దాటితే సిద్దవటం–అట్లూరు మార్గంలో రహదారి బంద్ చేస్తారు. వన్యప్రాణులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంటోంది. కాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించకుండా ఏళ్ల తరబడి అదే పరిస్థితి కొనసాగడం విచారకరం. వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రమైన కడపకు వచ్చే అట్లూరు మండల ప్రజలు పని జరిగినా.. జరగకున్నా రాత్రి 9 కంటే ముందే ఆ చెక్పోస్టు దాటేలా చూసుకోవాలి. తీరిగ్గా పనులు ముగించుకొని బయలుదేరదామనుకుంటే కడప, ఖాజీపేట, బద్వేల్ మీదుగా చుట్టూ తిరిగి అట్లూరు చేరుకోవాల్సి వస్తోంది. ఎన్హెచ్–565లో అండర్పాస్ బ్రిడ్జిలు.. నెల్లూరు–వైఎస్సార్ జిల్లాలోని వెలుగొండను కలుపుతూ పెనుశిల లక్ష్మీనరసింహా స్వామి అభయారణ్యంగా గుర్తించారు. ఈమార్గంలో నేషనల్ హైవే–565గా గుర్తించారు. 8.5కిలోమీటర్లు అభయారణ్యం ప్రాంతం విస్తరించి ఉంది. నేషనల్హైవే రహదారికి ఏమాత్రం ఆటంకం లేకుండా, వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 8.5 కిలోమీట ర్లు పొడవునా రోడ్డుకు ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, మరో 5చోట్ల 10 అడుగుల వెడల్పు, 6 అడుగులు ఎత్తుతో అండర్పాస్ బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు. వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరిగేందుకు అన్నీ చర్యలు చేపట్టారు. అలాంటి ఆలోచనే సిద్దవటం–అట్లూరు మార్గంలో అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. చీకట్లు పడితే సిద్దవటం–అట్లూరు మార్గంలో ప్రయాణాలు నిషిద్ధం రాత్రి వేళ మెడికల్ ఎమర్జెన్సీవస్తే చావే శరణ్యమా! నిబంధనల పేరిట ప్రజల ఆవేదనను పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు -
నేడు ’డయల్ యువర్ సీఎండీ’
కడప కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ’డయల్ యువర్ సీఎండి’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సిఎండి దృష్టికి తీసుకురావచ్చు. సర్కిల్ స్థాయిలోనూ డయల్ యువర్ ఎస్ఈ సర్కిల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు ’డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజనీర్ దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా అన్నమయ్య జిల్లా వినియోగదారులు 9440817449 నంబర్కు వైఎస్సార్ జిల్లా వినియోగదారులు 08562242457 నంబర్లో సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు. రైతులకు అందుబాటులో ఎరువులుసాక్షి, మదనపల్లె : జిల్లాలో రైతులకు అవసరమైనంత ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీఎయిమ్స్ యాప్ ద్వారా ఎరువుల లభ్యత, పంపిణీ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. జిల్లాలో 20,860 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లాలో 23,015 మంది రైతులకు యాప్ ద్వారా 45,403 బస్తాల యూరియా, 4,445 బస్తాల డీఏపీ విక్రయించినట్టు తెలిపారు. మిగిలిన నిల్వలు ఆగస్టు చివరి వరకు జిల్లా అవసరాలకు సరిపోతాయని తెలిపారు. పక్కాగా ప్రశస్త్ 2.0 స్క్రీనింగ్మదనపల్లె సిటీ : జిల్లాలో ప్రత్యేక అవసరాల విద్యార్థులను ముందస్తుగా గుర్తించి, వారికి అవసరమైన విద్యా,వైద్య, పునరావాస సేవలను అందించేందుకు విద్యామంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ప్రశస్త్ 2.0 స్క్రీనింగ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు డీఈఓ సుబ్రమణ్యం సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ అనూరాధ తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతి చదువతున్న విద్యార్థులందరికీ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు జులై 31లోపు ప్రశస్త్ 2.0 యాప్లోని శిక్షణ వీడియోలను పూర్తిగా వీక్షించాలని, అలాగే ఆగస్టు 15లోపు యూడైస్ వివరాలను నవీకరించాలని సూచించారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు పార్ట్–1 స్క్రీనింగ్ , అనంతరం ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా పార్ట్–2 స్క్రీనింగ్ చేపట్టి, గుర్తించిన ప్రతి విద్యారికి ఇండివిడ్యువల్ ఎడ్యుకేషన్ ప్లాన్ రూపొందించాలని తెలిపారు.నేడు షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం మదనపల్లె సిటీ : జిల్లా వ్యాప్తంగా గతేడాది పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సోమవా రం షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం తెలిపారు. స్థానిక ఎన్జీఆర్ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి జనార్థన్రెడ్డి, జిల్లా మంత్రి రాంప్రసాద్రెడ్డిలు విద్యార్థులకు అవార్డులు అందజేస్తారన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు రూ.20 వేలు నగదు, పతకం, అందజేస్తారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 188 ముంది విద్యార్థులను ఎంపిక చేశామని వివరించారు. మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవం రాయచోటి: ఏపీఎన్జీఓస్ అసోసియేషన్ అనుబంధ సంఘం ‘తెలుగునాడు మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్’ అన్నమ య్య జిల్లా కార్యవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం రాయచోటి ఎన్జీఓ హోమ్లో ఏపీ ఎన్జీఓస్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అధ్యక్ష, కార్యవర్గ ఎన్నికలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రాజేంద్ర, సహాధ్యక్షులు పి రమణమ్మ, ఉపాధ్యక్షులుగా నీలిమ, సావిత్రి, అంజమ్మ, రఘునాథ్ నాయక్, పార్వతమ్మ, అమరను ఎన్నుకున్నారు. వీరితో పాటు ఇతర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. ఎన్జీఓ నాయకులు శివారెడ్డి, మహదేవ, రాజశేఖర్ రెడ్డి, ప్రతిభాకుమారి పాల్గొన్నారు. -
పాము కాటుతో వ్యక్తికి అస్వస్థత
మదనపల్లె టౌన్: పాము కాటుతో వ్యక్తి అస్వస్థతకు గురైన సంఘటన ఆదివారం మదనపల్లి మండలంలో జరిగింది. బాధితుడి కుటుంబీకుల కథనం మేరకు.. మండలంలోని వలసపల్లెకు చెందిన ఖాదరబాషా (40), స్కూటర్ మెకానిక్ పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం తన వ్యవసాయ బోరు వద్దకు వెళ్లిన అతన్ని విష సర్పం కాటేసింది. కుటుంబ సభ్యులు గమనించి అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.వైద్యులు చికిత్స అందించ డంతో కోలుకుంటూ ఉన్నాడు. అలాగే వేర్వేరు ప్రాంతాలకు చెందిన మరో నలుగురిని విష సర్పాలు కాటేయడంతో స్థానిక జిల్లా ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందారు. సంబేపల్లె : మండల పరిధిలోని గున్నికుంట్ల పంచాయతీ లో పేకాట స్థావరంపై ఎస్ఐ రవికుమార్ తమ సిబ్బందితో ఆదివారం దాడులు నిర్వహించారు. 10మంది జూదరులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 50,180 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.అరెస్ట్ చేసిన వారిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. గుర్రంకొండ: రెడ్డెమ్మతల్లీ చల్లంగా చూడు తల్లీ అంటూ భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు.కర్ణాటక, తమిళనాడుతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. మదనపల్లె టౌన్: ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను తోబుట్టువు దొంగిలించుకుని వెళ్లిందని మనస్తాపం చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గుర్రంకొండ మండలంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. మండలంలోని రామాపురం పంచాయతీ, కొత్తపల్లికి చెందిన నరసింహులు కుమారుడు సంతోష్ కుమార్ (19). తల్లిదండ్రులు చనిపోవడంతో అతనికి పినతల్లి కుమార్తె విజయలక్ష్మి చేదోడు వాదోడుగా ఉంటోంది. ఈ క్రమంలో విజయలక్ష్మి సంతోష్ కుమార్కు చెందిన బంగారు ఆభరణాలను తీసుకుని వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న సంతోష్ తన అక్క విజయలక్ష్మిని నిలదీయగా, ఆమె అతడిని దూషించిందని తెలిపాడు. దీంతో మనస్తాపానికి గురైన సంతోష్ కుమార్ పురుగులమందు తాగాడు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని 108 అంబులెన్న్స్లో మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు గుర్రంకొండ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు అరెస్టు
ఎర్రగుంట్ల : గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 150 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. అదివారం ఇక్కడ ఆయన విలేకరులో మాట్లాడుతూ జిల్లా షెల్కే ఎస్పీ నచికేత్ విశ్వనాఽథ్ జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు ఎర్రగుంట్ల లోని వై జంక్షన్లో వాహనాలు తనిఖీ చేస్తుండుగా అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గరిని అరెస్టు చేశామన్నారు. అరెస్టు అయిన వారిలో ప్రొద్దుటూరుకు చెందిన ఎస్ జహీర్, గుంతకల్ పట్టణానికి చెందిన షేక్ మహ్మద్ తాహీర్, షేక్ ఆసిఫ్లు ఉన్నారన్నారు. వీరు గుంతకల్లులోని షికారి కాలనీ చెందిన కమల, మఽధుమతి, జీవా అనే వారి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. వీరి వద్ద నుంచి 150 గ్రాముల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు, రూ.1900 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. గంజాయి సరఫరా చేసే నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామాంజనేయులుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. చింతకొమ్మదిన్నె మండలంలో.. చింతకొమ్మదిన్నె: మండల పరిధిలోని రోడ్డు క్రిష్ణాపురంలోగల కేఎస్ఆర్.ఎం ఇంజినీరింగ్ కళాశాల బస్టాప్ వద్ద నిషేదిత గంజాయి విక్రయిస్తున్న అయిదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.చింతకొమ్మదిన్నె సీఐ బాల మద్దిలేటి తెలిపిన వివరాల మేరకు కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాల బస్టాప్ వద్ద గంజాయి అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ శ్రీనివాసుల రెడ్డి సిబ్బందితో వెళ్లి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా రాజస్థాన్కు చెందిన, ప్రస్తుతం బద్వేలులో నివాసం ఉంటున్న పరమార్ గణపత్ సింగ్, పార్వతిపురం, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి గంజాయి తీసుకొచ్చి అతని స్నేహితులైన బద్వేలులోని రూపురాంపేటకు చెందిన చిన్నం శ్రీను, బద్వేలు కుమ్మరకొట్టాలుకు చెందిన షేక్ మస్తాన్ వల్లి, బద్వేలు మండలం బయనపల్లికి చెందిన మామిళ్ళ కార్తిక్, చెన్నూరు మండలానికి చెందిన మేసే దినేష్ల ద్వారా రోడ్డు క్రిష్ణాపురం, కొప్పర్తి గ్రామం ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఐదుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1.396 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.నిందితులను కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. -
ప్రశ్నిస్తే.. జైలుకు పంపుతారా..?
● ఇంత నీచమైన పరిపాలన ఎక్కడ లేదు ● ప్రతిపక్షాలను అణచివేసేందుకు కుట్ర ● మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహంపుంగనూరు : రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతారా...? బెయిల్పై వస్తే మరో కేసు అంటూ మరో స్టేషన్కు తీసుకెళ్తారా... ఇంత నీచమైన పరిపాలన ఎక్కడ లేదు....తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని అణచివేయాలని చూస్తోంది. దీనిని జరగనివ్వం . ప్రభుత్వ అరాచకాలకు ముగింపు వస్తుందని రాష్ట్ర మాజీ మంత్రి, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం అన్నమయ్య జిల్లా పుంగనూరులో జగన్ 2.0 యాప్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేసే అక్రమాలను ప్రశ్నించే వారిని చూసి సరిదిద్దుకోవడం పద్ధతి అన్నారు. కానీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ప్రశ్ని స్తే కేసు పెడతాం.....నిలదీస్తే జైలుకు పంపుతాం....అన్న రీతిలో బెదిరింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీకి చెందిన ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్లను ప్రభుత్వం ఫ్రీజ్ చేసిందని, దీనిపై పార్టీ పోరాటం చేసి, తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు. టీడీపీ 2024లో అధికారంలోకి రాగానే ప్రతిపక్షాలను అణచివేసే కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు యథేచ్చగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈసమావేశంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నాగభూషణం, ఆవుల అమరేంద్ర, ఎంపిపి భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. కార్యకర్తలను వేధిస్తే.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను, నాయకులను, సామాన్య ప్రజలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేధిస్తున్నారని, వాటిని జగన్ 2.0 యాప్లో సంక్షిప్తం చేయాలన్నారు. అలాగే పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసుల ఆగడాలను కూడా యాప్లో నమోదు చేయాలన్నారు. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన కుటుంబంపైన తప్పుడు హత్యాప్రయత్నం కేసులు నమోదు చేయడం, విజయవాడలో ఒక యువకుడిని చంపివేయడం లాంటి కేసులలో ప్రధాన కారకులైన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మహిళలను వేధించే వారిని వదిలిపెట్టం తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలు పలు రకాల వేధింపులకు గురౌతున్నారని, అలాంటి వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్.జగన్మోహన్రెడ్డి తెలిపారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. -
గొంతు కోసి యువకునిపై హత్యాయత్నం
మదనపల్లె టౌన్: మదనపల్లె పుంగనూరు రోడ్డు, బసినికొండ బైపాస్ రోడ్డు వద్ద ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో ఓ యువకుడిపై ప్రత్యర్తులు కత్తితో గొంతుకోసి హత్యాయత్నాకి పాల్పడ్డారు. ఈ ఘటన కలకలం రేపింది.. తాలూకా పోలీసుల కథనం మేరకు ..పట్టణంలోని నక్కలదిన్నెకు చెందిన భాస్కర్ (35) భార్య బసినికొండలోని పుట్టినింటికి ఇటీవల వెళ్లిపోయిందన్నారు.భాస్కర్ బసినికొండకు వచ్చి, భార్యను కాపురానికి రావాలని గొడవ పడిన సంఘటనలు ఉన్నాయన్నారు. కాగా ఆదివారం రాత్రి నక్కలదిన్నెలో ఉన్న భాస్కర్కు బసినికొండలో ఉంటున్న రఫి, చిన్నా ఫోన్ చేసి మాట్లాడే పని ఉందని బైపాస్ రోడ్డుకు సమీపానికి రప్పించారు. అక్కడ భాస్కర్తో రఫి, చిన్నా మధ్య జరిగిన ఘర్షణ తారస్థాయికి చేరడంతో ఒకరిపై మరొకరు పరస్పర దాడులకు దిగి కొట్టుకున్నారు. ఈ క్రమంలో నిందితులు ముందుగానే వెంట తెచ్చుకున్న మచ్చు కత్తితో భాస్కర్ గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయారని స్థానికులు ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర రక్తస్రావం కావడంతో భాస్కర్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు అతన్ని స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు రుయారు రెఫర్ చేశారు. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పాత కక్షలే ఈ దాడికి కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.హత్యా యత్నానికి పాల్పడిన యువకుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్: విషం తాగి వివాహిత ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం రాత్రి మదనపల్లె మండలంలో చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబీకుల కథనం మేరకు.. మండలంలోని కొత్తపల్లి పంచాయతీ, సంధి రెడ్డి పల్లెకు చెందిన భవన కార్మికుడు నాగార్జున భార్య శ్రావణి (30), భర్తతో గొడవపడి పంచాయతీని తాలూకా పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లింది. సీఐ కళా వెంకటరమణ భార్యా భర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి ఇంటికి పంపించాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో మనస్తాపానికి గురైన శ్రావణి ఇంట్లో ఉన్న పురుగుమందు తాగింది. స్థానికులు గమనించి బాఽధిరాలిని స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించడంతో, డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నిబద్ధతతో నిలిచే కార్యకర్తలే పార్టీకి బలం
రాయచోటి అర్బన్ : రాజకీయాల్లో కండువాలు మార్చుకోవడం , స్వార్థపరులు, జంప్ జిలానీలు పార్టీలు మారడం గొప్ప విషయం కాదని, అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఎంత అభివృద్ధి ,సంక్షేమం చేశామన్నదే రాజకీయాలకు అసలైన కొలమానమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో పలు అంశాలను వివరించారు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడే వారితో వైఎస్సార్సీపీకి ఎలాంటి నష్టం ఉండదని , పార్టీని నమ్మి కష్టకాలంలో అండగా నిలిచిన వారే రేపటి నాయకులని అన్నారు. పార్టీ ఎంతో మందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిందని , అనేక కీలక పదవులు, సముచిత గౌరవాలు కల్పించిందని ఆయన గుర్తుచేశారు. గ్రామాలు , వార్డుల్లో యువతలో ప్రజా సేవ పట్ల ఆసక్తి ఉన్న వారిని , నిబద్ధతతో ప్రజజల కోసం పనిచేసే నాయకత్వాన్ని తయారు చేసి స్వార్థ రాజకీయాలు చేసే వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. గత స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున గెలిచిన వారికి కండువాలు కప్పి పార్టీలో చేర్చుకుంటున్నారంటే టీడీపీకి స్థానిక ఎన్నికల్లో వారే దిక్కు అయినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. ● వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీల సాధికారత కోసం చరిత్రాత్మకంగా 57 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి డైరెక్టర్లు , వేలాది మందికి అవకాశాలు కల్పించిందని గుర్తుచేశారు. ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడుకు బీసీల కోసం 57 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా రాలేదని విమర్శించారు. జగన్ హయాంలో వచ్చిన జీవోతోనే ఇప్పుడు కూడా బీసీ కార్పొరేషన్ల పదవులను భర్తీ చేశారన్నారు. రాయచోటి ప్రాంతంలో కూడా బడుగు, బలహీన వర్గాలకు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్ కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్లు రాష్ట్ర కార్పొరేషన్ల డైరెక్టర్లు వంటి అనేక పదవులు కల్పించామని తెలిపారు. వడ్డెర్లకు రాష్ట్ర స్థాయిలో రెండు డైరెక్టర్లు, పాల ఏకరి, మత్స్యకార , కురబ సామాజిక వర్గాలకు , మైనార్టీ సామాజిక వర్గాలకు కూడా రాష్ట్ర స్థాయి అవకాశాలు ఇచ్చామని గుర్తు చేశారు. మాట ఇచ్చినట్లుగానే మైనార్టీలకు ఎమ్మెల్సీతో పాటు డిప్యూటీ చైర్మన్ పదవిని కూడా వైఎస్సార్సీపీ కల్పించిందని పేర్కొన్నారు. ఓ దళిత మహిళకు శ్రీశైలం బోర్డు మెంబర్గా ఇచ్చిన ఘనత గత జగన్ ప్రభుత్వానిదే అని అన్నారు. ఈ విధంగా మీరు చేయగలుగుతారా అని ఆయన ప్రశ్నించారు. ● గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తమ ఇళ్లపై దాడులు చేశారని , ఇళ్లలోపలికి వచ్చి మహిళలను సైతం అవమానించారని, ఆస్తులను ధ్వంసం చేశారని, వ్యక్తిగతంగా హించించారని చెప్పిన వారే ఈ రోజు అదే పార్టీలో చేరడం ప్రజలు గమనిస్తూ ఉన్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం చేసిన అభివృద్ధి , సంక్షేమం గురించి చెప్పుకోవాలే కానీ, కండువాలు మార్చాం...మాకు బలం పెరిగిందని చెప్పుకునేవారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఎంత మందిని పార్టీలో చేర్చుకున్నామనేది రాజకీయ విజయానికి కొలమానం కాదని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. – వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి -
‘కొండ’ంత భక్తి
ప్రత్యేక అలంకరణలో అమ్మవారు చౌడేపల్లె: కోరిన కోర్కెలు తీర్చే బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలనుంచి భక్తులు తరలివచ్చారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రద్దీ కొనసాగింది. ఆదివారం రోజు మాత్రమే సుమారు 50 వేల మందికి పైగా అమ్మవారిని దర్శించుకొన్నట్లు ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. ఆషాడమాసం అత్యంత శుభకరమైన నెలగా భావించి వేల సంఖ్యలో కర్ణాటక భక్తులు ఆలయానికి తరలిరావడం గమనార్హం. ఈ సఽంధర్భంగా అమ్మవారిని అర్చకులు సుందరంగా అలంకరణ చేసి దర్శన భాగ్యం కల్పించారు. కోర్కెలు ఫలించిన వారు మొక్కులు చెల్లించారు. అమ్మవారి దర్శనం కోసంగంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. ప్రధాన గర్భాలయంనుంచి ఆలయం బయట గల గాలిగోపురం వరకు క్యూలైన్లు బారులు తీరాయి. దీనికారణంగా వయసు పైబడినవారు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడ్డారు. తాగునీటి కోసం ఇక్కట్లు పడ్డారు. మొరాయించిన సర్వర్లు టికెట్లు జారీచేసే కౌంటర్ల వద్ద సర్వర్లు మొరాయించడంతో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. చివరికి మ్యాన్యువల్ టికెట్లు జారీచేసి భక్తులను దర్శనానికి పంపారు. రద్దీ రోజుల్లో టెక్నికల్ సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు అధికారులు తీసుకోకపోవంపై పలు ఆరోపణలకు దారితీసింది. స్తంభించిన ట్రాఫిక్..... వేలాది వాహనాలు బోయకొండకు తరలిరావడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంది. ఎక్కడి వాహనాలు అక్కడే ముందస్తుగా సీఐ సాయిప్రసాద్ ఆదేశాలమేరకు ఎస్ఐ చిన్నరెడ్డప్ప , సిబ్బంది పర్యవేక్షణ చేసినా తిప్పలు తప్పలేదు. బోయకొండ దేవస్థానం వద్ద ఆదివారం ఒక్కరోజు మాత్రమే విక్రయించిన వివిధ సేవా టికెట్ల ద్వారా రూ:18.87 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. ఒక్కరోజే 50 వేలమంది దర్శనం క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షణ -
అండర్–19 క్రికెట్ పోటీలు ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్: ఏసీఏ సౌత్జోన్ అండర్–19 మెన్ మల్టీ డే నాలుగో విడత అంతర్ జిల్లాల మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో చిత్తూరు–అనంతపురం జట్టు తలపడ్డాయి. తొలి రోజు టాస్ గెలిచిన చిత్తూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 90 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 355 పరుగులు చేసింది. జట్టులోని కృష్ణ ప్రసాద్ 111, ఎంహెచ్వి రెడ్డి 42 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని కిరణ్కుమార్ 4, సంజయ్కుమార్ 2 వికెట్లు తీశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో..... అదే విధంగా కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో కడప–కర్నూలు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కర్నూలు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 54.3 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని రోహిత్ గౌడ్ 55, విఖ్యాత్ 52 పరుగులు చేశారు. కడప జట్టులోని శివశంకర్ 4, వికెట్లు, నాగకుళ్ళాయప్ప 5 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన కడప జట్టు 5 ఓవర్లకు తొలి వికెట్ కోల్పోయి 21 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. -
బాధితులకు వరం.. ఏఆర్టీ కేంద్రం
మదనపల్లె టౌన్ : మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నడుస్తున్న ఏఆర్టీ (యాంటీ రెట్రోవైరల్ థెరపీ) కేంద్రం హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులకు సంజీవనిలా మారుతోంది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్,డిపార్ట్మెంట్ ఆఫ్ ఎయిడ్స్ కంట్రోల్ జిల్లా పర్యవేక్షణలో పనిచేస్తున్న ఈ కేంద్రంలో బాధితులకు సమీకృత సలహాలు, చికిత్సలు ఉచితంగా అందుతున్నాయని వైద్యాధికారి హుమాయూన్ తెలిపారు. అందుబాటులో ఉన్న ఉచిత వైద్య సేవలు ఐసీటీసీ నిఘా : అనుమానితులకు అత్యంత గోప్యంగా రక్త పరీక్షలు నిర్వహించి, మానసిక ధైర్యాన్ని ఇచ్చేలా కౌన్సెలింగ్ అందిస్తారు. జీవితాంతం ఉచిత మందులు : ఇక్కడ హెచ్ఐవీ పాజిటివ్గా నిర్ధారణ అయిన వారికి జీవితాంతం అవసరమయ్యే యాంటీ రెట్రోవైరల్ మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అధునాతన ల్యాబ్ పరీక్షలు : రోగులలో వ్యాధి నిరోధక శక్తిని, వైరస్ తీవ్రతను క్రమం తప్పకుండా పర్యవేక్షించేందుకు ల్యాబ్ టెక్నీషియన్ల ద్వారా సీడీ4, వైరల్ లోడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సురక్ష క్లినిక్ : ఆసుపత్రి ఆవరణలోనే సురక్ష క్లినిక్ ద్వారా లైంగికంగా సంక్రమించే సుఖ వ్యాధులకు కూడా ఉచిత పరీక్షలు, వైద్యం అందిస్తున్నారు. అవగాహనతోనే సుదీర్ఘ జీవనం : హెచ్ఐవీ అనేది అంటువ్యాధి కాదని.. బాధితులను తాకడం వల్ల, కలిసి భోజనం చేయడం వల్ల లేదా ఒకే బాత్రూమ్ ఉపయోగించడం వల్ల ఇది ఒకరి నుండి ఒకరికి వ్యాపించదని ప్రజలు గ్రహించాలని కేంద్రం సిబ్బంది పుల్లయ్య నాయుడు, సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సకాలంలో వ్యాధి ని గుర్తించి, క్రమం తప్పకుండా ఏఆర్టీ మందులు వాడితే బాధితులు సాధారణ వ్యక్తుల లాగే సుదీర్ఘ కాలం జీవించవచ్చని స్పష్టం చేశారు. లైంగిక సుఖ వ్యాధులు లేదా హెచ్ఐవీపై ఏమాత్రం అనుమానం ఉన్నవారైనా ఎలాంటి భయం లేకుండా ఏఆర్టీ కేంద్రాన్ని సంప్రదించవచ్చని వైద్యాధికారులు తెలిపారు.ఉచితంగా ‘న్యాకో’ సేవలు, సురక్ష క్లినిక్ చికిత్సలు -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
● ఐదుగురికి గాయాలు ముద్దనూరు: ముద్దనూరు–తాడిపత్రి జాతీయ రహదారిలో మండలంలోని చెన్నారెడ్డిపల్లె గ్రామ సమీపంలో ముందు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది.ఈ ఘటనలో నలుగురికి స్వల్పగాయాలు కాగా మరొకరిని 108 వాహనంలో జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోలీసుల సమాచారం మేరకు అనంతపురం జిల్లా రాయదుర్గంనుంచి కడపకు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు చెన్నారెడ్డిపల్లె వద్దకు సమీపించగానే ముందువైపు గొర్రెలు రావడంతో బస్సును స్లో చేసాడు.ఇంతలో బస్సుకు వెనుకవైపు వస్తున్న లారీ బస్సును ఢీకొంది.దీంతో బస్సు వెనుకవైపు పాక్షికంగా దెబ్బతింది.బస్సులో సుమారు 67 మంది ప్రయాణికులున్నారు.ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్పగాయాలవడంతో వారు స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చికిత్సచేయించుకుని వెళ్లిపోయారు.కమలాపురానికి చెందిన వెంకట సుబ్బరాయుడును 108 వాహనంలో జమ్మలమడుగుకు తరలించారు.లారీ డ్రైవరుపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. లారీ తాడిపత్రి నుంచి ఎర్రగుంట్లకు ప్రయాణిస్తున్నట్లు,లారీ డ్రైవరు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. బైక్ బోల్తా: దంపతులకు .. నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్): బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా అదుపుతప్పి ద్విచక్ర వాహనం బోల్తా పడిన ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. నిమ్మనపల్లె మండలం, తవళం పంచాయతీ నల్లంవారిపల్లికి చెందిన రైతు సురేంద్ర వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య రెడ్డెమ్మ, కుమార్తె లావణ్య (9వ తరగతి), కుమారుడు వైష్ణవ్ (6వ తరగతి) ఉన్నారు. శనివారం సురేంద్ర తన భార్య రెడ్డెమ్మతో కలిసి వాయల్పాడు మండలం జరావారిపల్లిలోని బంధువుల ఇంటికి పని నిమిత్తం బైక్లో వెళ్లాడు. తిరిగి వస్తుండగా నిమ్మనపల్లె మండలం, కొండయ్యగారిపల్లి సమీపంలో బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సురేంద్ర తలకు, శరీర భాగాలకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. రెడ్డెమ్మకు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు ఇద్దరినీ నిమ్మనపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సురేంద్రను మదనపల్లె జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుదాటుతుండగా.. మదనపల్లె,: రోడ్డు దాటుతున్న తండ్రీకొడుకులను బైక్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. గుర్రంకొండ మండలం రామాపురానికి చెందిన శ్రీనివాసులు (70), ఆయన కుమారుడు వెంకటరమణ ఆదివారం బోరు పాయింట్ పెట్టడానికి నక్కలదిన్నె వద్దకు వచ్చారు.అక్కడ రోడ్డు దాటుతుండగా సాయికుమార్, అజయ్, నవీన్ అనే ముగ్గురు విద్యార్థులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు శ్రీనివాసులు, వెంకటరమణతో పాటు బైక్పై ఉన్న సాయికుమార్, అజయ్, నవీన్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఐదుగురిని 108 వాహనంలో మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని ఆటో యజమానికి.. మదనపల్లె టౌన్: ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో ఆటో యజమాని తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం బి.కొత్తకోట మండలంలో చోటుచేసుకుంది. బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. బి.కొత్తకోట మండలం, ఉలవలవారిపల్లెకు చెందిన ఆటో యజమాని విశ్వనాథ్ (48) కొత్తకోట నుంచి ప్రయాణికులను మండలంలోని గట్టుకు చేర్చాడు.తిరగి కొత్తకోటకు ఆటోలో వస్తుండగా, మొగసాల మర్రి సమీపంలో ఆర్టీసీ బస్సు ఆటోను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో విశ్వనాథ్కు కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి 108 అంబులెన్స్లో మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఘటనపై బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తుండగా ఆటో డ్రైవర్ పూటుగామద్యం తాగి బస్సును ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు. -
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి
పుంగనూరు: వాల్మీకులను ఎస్టీల జాబితాలో చేర్చాలని రాష్ట్ర అధ్యక్షుడు పులిశ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక వాల్మీకి సర్కిల్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాల్మీకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పులిశ్రీనివాసులు మాట్లాడుతూ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వాల్మీకులను ఎస్సీ, ఎస్టీలుగా గుర్తించి , రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. మన రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం , తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో వాల్మీకులు ఎస్టీలుగా కొనసాగుతున్నారని తెలిపారు. 8 జిల్లాల్లో మాత్రమే బీసీలుగా ఉన్నారని తెలిపారు. ప్రాంతీయ వ్యత్యాసాలు లేకుండా రాష్ట్రం మొత్తం ఎస్టీలుగా ఉండేలా తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామిలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎస్టీలుగా గుర్తించాలని లేకపోతే వాల్మీకుల ఆగ్రహానికి కూటమి ప్రభుత్వం బలికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘ నాయకులు శేఖర్, రామకృష్ణ, జయసింహ, ఉడుంశేఖర్, దొరస్వామి, వెంకట్రమణ, శంకర, రెడ్డెప్ప, గంగాధర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘నీట్’లో మెరిసిన దీక్షిత
పెద్దతిప్పసముద్రం : మండలంలోని కందుకూరుకు చెందిన శ్రీపురం లక్ష్మినారాయణ, కోమల దంపతుల కుమార్తె శ్రీపురం దీక్షిత నీట్ పరీక్షా ఫలితాల్లో సత్తా చాటింది విజయవాడలోని శ్రీ గోశాలైట్స్ మెడికల్ అకాడమీలో కోచింగ్ తీసుకున్న దీక్షిత శుక్రవారం వెలువడిన ఫలితాల్లో 642 మార్కులతో ఆల్ ఇండియా 2,080 ర్యాంకు సాధించింది. యు వతి తండ్రి చిల్లర దుకాణం నడుపుతుండగా తల్లి గృహిణిగా పని చేస్తోంది. భవిష్యత్తులో తాను డాక్టర్నై ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని దీక్షిత అభిప్రాయం వ్యక్తం చేసింది. ఏటీఎంలో చోరీకి విఫలయత్నం పుంగనూరు: పట్టణంలోని కొత్తయిండ్లలో గల హిటాచిమోటార్స్ ఏటీఎంలో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. ఏటీఎంను పగులగొట్టే ప్రయత్నం విఫలం కావడంతో ఎలాంటి నష్టం జరగలేదు. దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలిసిన వెంటనే సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో క్లూస్టీమ్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జాతీయ రహదారిపై ఉన్న ఏటిఎంలో దొంగలు పడటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. టీచర్లు బోధనా సామర్థ్యాలు పెంచుకోవాలిపీలేరు రూరల్ : మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు సరికొత్త టెక్నాలజీతో బోధనా పద్ధతులను అలవర్చుకోవాలని జిల్లా పరీక్షల నిర్వహణ శాఖ కార్యదర్శి గంగాధరం పిలుపునిచ్చారు. శనివారం పీలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీలేరు డివిజన్ పరిధిలోని (పీలేరు, కలికిరి, కేవీపల్లె, కలకడ, సదుం, సోమల) మండలాల గణిత, భౌతిక, జీవ, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ తరగతులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం లిప్ యాప్, హోల్ వీల్ కార్డులు, విద్యార్థుల 100 రోజుల విద్యా కార్యక్రమంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంఈఓలు బాబునాయక్, నాగార్జున, హెచ్ఎంలు ప్రేమరాణి, రేణుకాదేవి, రీసోర్స్ పర్సన్లు శ్రీనివాసులరెడ్డి, ఆంజనేయులు, గోవిందు తదితరులు పాల్గొన్నారు. హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు కసరత్తురామసముద్రం : మదనపల్లె నియోజకవర్గ పరిధిలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రామసముద్రం మండలంలోని చొక్కాండ్లపల్లి గ్రామ సమీపంలో, కర్ణాటక సరిహద్దులో గల సర్వే నంబర్ 177లోని 60 ఎకరాల ప్రభుత్వ పశువుల మేత బీడు భూమిని మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ స్థలం విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, రహదారి సౌకర్యాలు మరియు మౌలిక వసతులపై రెవెన్యూ అధికారులతో కలిసి ఆమె సమగ్ర సర్వే జరిపారు. ఈ స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. ఈ హబ్ ఏర్పాటు ద్వారా ఉద్యానవన పంటల నిల్వ, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్తో పాటు రైతులకు ఆధునిక సాంకేతికత, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ అజారుద్దీన్, ఆర్ఐ వసీమ్, సర్వేయర్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
కడప షెహర్ నుంచి ఆయా క్రికెట్కా షేర్!
నాన్న కుస్తీ పట్టులోని బలాన్ని తన ఒంటి నిండా నింపుకున్నాడు.. అన్న అందించిన ప్రోత్సాహాన్ని గుండెల్లో దాచుకున్నాడు.. వేదిక ఏదైనా.. జట్టు ఏదైనా.. బ్యాటు చేతబట్టి గ్రౌండులో దిగితే బంతి స్టాండ్లోకి వెళ్లాల్సిందే.. అతని ధనాధన్ ఇన్నింగ్స్కి జనం ఫిదా అవ్వాల్సిందే. అతనే కడప నగరానికి చెందిన క్రికెటర్ జహీర్ అబ్బాస్కడప వైఎస్సార్ సర్కిల్ : కడప నగరం అల్మాస్ పేటకు చెందిన జహీర్ అబ్బాస్ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. ఇటీవల జరిగిన ఏపీఎల్లో టోర్నీ ఆద్యంతం చక్కటి ఇన్నింగ్స్లతో అలరించాడు. వరుసగా రెండో ఏడాది సూపర్ స్ట్రైకర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. కడపలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ స్టేడియంలో సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన రెండు మ్యాచ్ల లో ధనాధన్ ఇన్నింగ్స్తో అందరినీ ఆశ్యర్యపరిచాడు. నాన్న బలం.. అన్న ప్రోత్సాహం అల్మాస్పేటకు చెందిన షేక్ అన్సర్, షేక్ గౌసియా బేగం దంపతుల కొడుకు జహీర్ అబ్బాస్. తండ్రి కుస్తీ పహిల్వాన్. తల్లి గృహిణి. వీరి ముగ్గురు కుమారుల్లో జహీర్ మూడో వాడు. తమ్ముడిలోని క్రికెట్ నైపుణ్యం చూసిన ఇద్దరన్నలు రవూఫ్, జాఫర్ మున్సిపల్ స్టేడియంలో క్రికెట్ కోచింగ్కు పంపించా రు. అక్కడి సీనియర్ కోచ్ ఖాజా మెలకువలు జహీర్ లోని నైపుణ్యాన్ని సానబెట్టాయి. అలాగే కడప క్రికెట్ అసోసియేషన్ అధికారుల, సిబ్బంది అండ తోడైంది. ఒక్కో మెట్టు ఎదుగుతూ.. కడప క్రికెట్ అసోసియేషన్లోని భరత్రెడ్డి, రెడ్డి ప్రసాద్ తదితరులు ఇచ్చిన ప్రోత్సాహంతో జహీర్ అబ్బాస్ వేగంగా ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చా డు. తొలుత అండర్–16స్టేట్కు ఆడిన జహీర్, 2019–20లో అండర్–19 స్టేట్ జట్టుకు ప్రాతి నిధ్యం వహించాడు. ఇందులో 3 అర్థ సెంచరీలతో రాణించిన జహీర్ 200 స్ట్రైక్ రేట్ కలిగి ఉండడం విశేషం. ఆ ఏడాది అండర్ –19 ప్రపంచకప్ కోసం ఇండియన్ సెలెక్టర్ల నుంచి పిలుపునందుకున్న జహీర్ గ్వాలియర్లో ఎంపికలకు సైతం హాజరయ్యాడు. ఏపీఎల్తో వెలుగులోకి.. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ జహీర్ అబ్బాస్లోని క్రికెట్ నైపుణ్యాన్ని ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఇప్పటివరకు ఏపీఎల్ ఐదు సీజ న్లు జరగగా.. తొలి సీజన్ నుంచి ఆడుతున్న జహీర్ వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. తొలి సీజన్లోనే చాంపియన్ జట్టులో సభ్యుడుగా ఉండడం విశేషం. కాగా 2025లో సూపర్ స్ట్రైకర్ ఆప్ టోర్నీగా నిలిచిన జహీర్, తాజాగా జరిగిన ఐదో సీజన్లోనూ సూపర్ స్ట్రైకర్ అవార్డు కై వసం చేసుకున్నాడు. ఇప్పటివరకు అతి తక్కువ బంతుల్లో అర్థ సెంచరీ ఇతని పేరుమీదే ఉండడం విశేషం. టీం ఇండియాకు ఎంపికవడమే లక్ష్యం.. ఇండియన్ క్రికెట్ టీంకు ఎంపికవడమే తన ఆశయమని జహీర్ తెలిపాడు. ఇప్పటికే ఐపీఎల్లో ప్రధాన జట్లయిన చైన్నె, కేకేఆర్లు ట్రయల్స్ కోసం తన పేరును రిజిస్టర్ చేసుకున్నాయని.. ఈ ఏడాది అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
పశ్చిమ ప్రాంతం.. పచ్చదనం శూన్యం
ముంచేసిన ఎల్ నినో.. అడుగంటిన జలాలు గత ఏడాది కురిసిన వర్షాలతో పెరిగిన నీటిమట్టాలే ఇప్పటివరకు జిల్లాను కాపాడుతూ వచ్చాయి. అయితే ప్రస్తుత వర్షాభావం కారణంగా జిల్లా సగటు నీటిమట్టం ఏకంగా 12.32 మీటర్లకు పడిపోయింది. గత నాలుగేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ పతనం భీతి గొలిపుతోంది.సాక్షి, మదనపల్లె : అన్నమయ్య జిల్లా పశ్చిమ ప్రాంతాన్ని ఎల్ నినో భూతం కరవు కోరల్లోకి నెట్టేసింది. జూన్ నెలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, జులైలో అసలు చినుకే రాలకపోవడంతో జిల్లావ్యాప్తంగా భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. గత కొన్నేళ్లతో పోలిస్తే నీటిమట్టాలు అత్యంత ప్రమాదకర స్థాయికి దిగజారడంతో వ్యవసాయ బోర్లతో పాటు తాగునీటి పథకాలు సైతం ఆగిపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆగస్టు నాటికి జిల్లా అంతటా అన్ని రంగాలు కుదేలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. 14 మండలాల్లో పాతాళానికి గంగ.. రామసముద్రం టాప్! తాజా ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలోని 14 మండలాల్లో జలమట్టాలు దారుణంగా పడిపోయాయి. నీటిమట్టం భారీగా దిగజారుతున్న మండలాల్లో రామసముద్రం ఏకంగా 25.39 మీటర్ల (సుమారు 83 అడుగులు) లోతుతో జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కలికిరి, నిమ్మనపల్లి, కలకడ, గుర్రంకొండ, గాలివీడు, పుంగనూరు, రాయచోటి, పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు, తంబళ్లపల్లె, వాయల్పాడు, సంబేపల్లి, కురబలకోట మండలాలు ఉన్నాయి. అయితే, జిల్లాలో కొన్ని మండలాల్లో నీటిమట్టం ఇంకా పైనే ఉంది. చౌడేపల్లిలో 1.36 మీటర్లు, లక్కిరెడ్డిపల్లెలో 2.60 మీటర్లు, పెద్దమండ్యంలో 5.86 మీటర్ల లోతులోనే నీటి లభ్యత ఉంది. జిల్లా సగటు నీటిమట్టం 12.32 మీటర్లు రామసముద్రంలో 25.39 మీటర్ల లోతులో 14 మండలాల్లో పాతాళంలోకి జలం 2022లో 7.46, 2023లో 6.02 మీటర్లకే నీటి లభ్యత మున్ముందు మరింత దారుణ పరిస్థితులు 71 పల్లెల్లో ట్యాంకర్ల ద్వారా నీటి రవాణా! -
క్రికెట్ నీలాకాశంలో ‘ధ్రువ’తార
అతను ఓపిగ్గా సింగిల్, డబుల్స్ తీయగలడు.. జట్టుకు అవసరమైనప్పుడు బౌండరీలతో చెలరేగిపోగలడు.. అంతేనా కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించగలడు.. అతనే ప్రొద్దుటూరు శ్రీరాములపేటకు చెందిన క్రికెటర్ ఎస్. ధ్రువకుమార్ రెడ్డి. ఇటీవల జరిగిన ఏపీఎల్లో తన బ్యాటింగ్తో శభాష్ అనిపించాడు.ప్రొద్దుటూరు కల్చరల్ : పట్టణంలోని శ్రీరాములపేటకు చెందిన ఎస్.ధ్రువకుమార్రెడ్డి క్రికెట్లో ఒపెనింగ్ రైట్హ్యాండ్ బ్యాట్స్మన్గా రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన తండ్రి సిగినేని లక్ష్మిరెడ్డి హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తుండగా తల్లి శారదదేవి గృహిణి. చిన్నప్పటి నుంచి క్రికెట్పై ఉన్న ఆసక్తితో 2006లో యూత్క్రికెట్ క్లబ్లో చేరి సాధన ప్రారంభించాడు. శిక్షణలో అన తి కాలంలోనే కోచ్ల నుంచి మెళకువలు నేర్చుకుని ఫొర్లు, సిక్సర్లు కొడుతూ మంచి రైట్హ్యాండ్ బ్యాట్స్మన్గా పేరు పొందాడు. జిల్లా, రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచాడు. అండర్–22 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొన్నాడు. సౌత్ ఇండియా అండర్–19 పోటీల్లో పాల్గొని తన బ్యాటింగ్తో అందరి మన్ననలు చూరగొన్నాడు. రంజీ, వన్ డే, 20–20, టెస్ట్ మ్యాచ్లలో ఆడాడు. ఐదేళ్లుగా ఆంధ్రా ప్రీమియర్లీగ్ క్రికెట్ పోటీల్లో ఆడుతున్నాడు. క్రికెట్ పోటీల్లో మంచి నైపుణ్యంతో బ్యాట్స్మన్గా రాణిస్తుండటంతో ధ్రువకుమార్రెడ్డిని రాయల్స్ ఆఫ్ రాయలసీమ మేనేజ్మెంట్ జట్టు కెప్టెన్గా బాధ్యతలు అప్పగించింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా 5 మ్యాచ్లు ఆడి రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టును విజయం సాధించడంలో ముందుండి నడిపించాడు. వైజాగ్ లయన్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 218 పరుగుల భారీ లక్షసాధనలో ఒంటరి పోరాటం చేస్తూ కేవలం 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు బాది కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టులో స్ఫూర్తి నింపాడు. కాగా ప్రస్తుతం ధ్రువ కుమార్రెడ్డి సికింద్రాబాద్ రైల్వేలో సీనియర్ క్లర్క్గా విధులు నిర్వహిస్తున్నాడు. -
71 పల్లెల్లో నీటి కష్టాలు.. రాయచోటిపై అధిక ప్రభావం
జిల్లాలో తాగునీటి సంక్షోభం ఏప్రిల్ నుంచే మొదలైంది. ప్రస్తుతం 71 పల్లెల్లో పరిస్థితి తీవ్రంగా మారడంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు ట్యాంకర్లు, ప్రైవేట్ బోర్ల టైఅప్ ద్వారా నీటిని రవాణా చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి ఈ మండలాల్లోని మరో 32 పల్లెల్లో నీటి సమస్య వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ జల సంక్షోభ ప్రభావం రాయచోటి నియోజకవర్గంపై ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ భూగర్భజల మట్టం కొంత ఊరటనిచ్చినా, భౌగోళిక పరిస్థితుల వల్ల తాగునీటి సమస్యలు ఇక్కడే అధికంగా ఉన్నాయి. ఆగస్టులోనూ వర్షాలు కురవకపోతే జిల్లావ్యాప్తంగా సాగు, తాగునీటి రంగాలు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం. -
ఆకాశమంతా మేఘాలు ముసురుకుంటున్నా.. ఎల్నినో రక్కసి ప్రభావంతో ఒక్క చినుకూ రాలడం లేదు. పొడి గాలుల ధాటికి భూమిలోని తేమ ఆవిరైపోతుండటంతో జిల్లాలో కరువు నీడలు కమ్ముకొస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ సగానికి వస్తున్నా ఎగువన వర్షాల్లేక జిల్లావ్యాప్తంగా సాగు పూర్తిగా ప్రశ
సాక్షి, మదనపల్లె: జిల్లాలో ఎల్నినో ప్రభావం నుంచి రైతుల పంటల సాగును ప్రత్యామ్నాయం వైపు మళ్లించినట్టు ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు చెబుతున్నప్పటికీ.. వాటి వాస్తవికతపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖరీఫ్ వర్షాలకు ముందే ప్రీ మాన్సూన్ డ్రై సూయింట్ (పీఎండీఎస్) కార్యక్రమాన్ని చేపట్టారు. నేషనల్ మిషన్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్ పథకం ద్వారా జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టారు. మూడు నెలలపాటు ఈ పంట సాగులో ఉండి, దిగుబడి ఇవ్వాలి. జిల్లాలో ఈ ప్రకృతి సేద్యాన్ని మార్చి నుంచి చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు. దీని ముఖ్యఉద్దేశ్యం ఏమంటే వర్షాలు కురిసేందుకు ముందే చిరుధాన్యాలు, పశువుల గడ్డి పెంపకం చేపడితే వర్షాలు కురిశాక ఆ పంటలను భూమిలోనే కలిపేస్తూ దుక్కులు దున్నుకునేలా దీనిని అమలు చేశారు. ప్రకృతి సేద్యానికి సంబంధించి అంకెలు బాగున్నప్పటికీ.. వాటి ఫలితాలు, ప్రయోజనం ఏమీ లేదని తెలుస్తోంది. జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విభాగం కింద 450 మంది గౌరవ వేతనంతో కమ్యూనిటీ క్యాడర్లుగా పనిచేస్తున్నారు. ఏపీ రైతు సాధికార సంస్థ వీరికి నెలకు రూ.4,500 గౌరవ వేతనం ఇస్తోంది. ఇదీ లక్ష్యం జిల్లాలో ఎల్నినో ప్రభావం ఉండటం, వర్షాభావ పరిస్థితులు తీవ్రమైన దృష్ట్యా వ్యవసాయ భూముల్లో చిరుధాన్యాల పంటలు, పశువుల గడ్డి పెంపకానికి ప్రకృతి వ్యవసాయ విభాగం చర్యలు చేపట్టింది. దీనివల్ల వర్షం ఎప్పుడు కురిస్తే అప్పుడు ఇవి మొలకెత్తి పంటలుగా ఉపయోగపడతాయని రైతులకు అవగాహన కల్పించారు. ఇవి మొలకెత్తాక దుక్కులు దున్ని భూమిలో కలిపి వేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అధికారులు వివరించారు. అయితే వర్షాలే కురవనప్పుడు వీటి సాగు ప్రశ్నార్థకంగా మారింది. 50వేల కిట్లు విక్రయం ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి అధికారులు చెబుతున్న దాన్నిబట్టి.. బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్ ద్వారా జిల్లాలో 26 కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనిద్వారా 20 నుంచి 25 రకాలు కలిగిన చిరుధాన్యాలు 15 కిలోల సంచి రూ.1,050, పది రకాలు కలిగిన వాటిని రూ.620 చొప్పున రైతులకు విక్రయించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 50 వేల కిట్లు రైతులు కొనుగోలు చేయగా వాటిని పొలాల్లో వేసినట్లు ప్రకృతి వ్యవసాయ అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఈ కిట్లతో 50,154 ఎకరాల్లో పశువుల గడ్డి, చిరుధాన్యాల పంటలు సాగు చేశారని చెబుతున్నారు. ఈ స్థాయిలో చిరుధాన్యాల సేకరణ, పంపిణీ వ్యవహారాలు ఎలా ఉన్నప్పటికీ.. 50వేల ఎకరాల్లో వీటిని సాగు చేశారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ● జిల్లాలో ఈ ఖరీఫ్లో 46,055 హెక్టార్లలో (1,15,137 ఎకరాలు) పంటలు సాగు కావాల్సి ఉంది. అయితే వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం వల్ల జిల్లాలో ఇప్పటిదాకా కేవలం 1,970 (4,925 ఎకరాలు) హెక్టార్లకు మాత్రమే ఖరీఫ్ సాగు పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్కు ముందు ప్రారంభమైన ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీడీఎంఎస్) కార్యక్రమం ద్వారా చేపట్టిన ప్రకృతి సాగు 50,154 ఎకరాల్లో చేపట్టారంటే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అధికారులు చెబుతున్న లెక్కలకు, జిల్లాలో కనిపిస్తున్న సాగుకు స్పష్టమైన తేడా తెలుస్తోంది. ● ప్రకృతి సేద్యం ద్వారా పంటలు సాగు చేయిస్తున్నామని చెబుతున్న అధికారులు నీటి ఆధారిత పశువుల గడ్డి దిగుబడి బాగుందంటున్నారు. వర్షాధారంతో వేసిన పశువుల గడ్డి విత్తనాలు ఆశించిన మేరకు ఎదగలేదని వారే అంగీకరిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పశువుల గడ్డి సాగుపై సత్ఫలితాలు లేదన్న విషయం స్పష్టం అవుతోంది. దాంతో ప్రకృతి సేద్యం అంకెల గారడీయేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ● ప్రకృతి వ్యవసాయం సాగాలంటే కనీస వర్షపాతం ఉండాలి. జూన్ 14 నుంచి జూలై 17 వరకు జిల్లాలో చినుకు కురవలేదు. జూలైలో 90.5 మిల్లీమీటర్లు కురవాలి. ఒక్క మిల్లీమీటర్ వర్షం కూడా కురవలేదు. ఈ లెక్కన చూస్తే ప్రకృతి వ్యవసాయం పండేందుకు వర్షపాతం లేకుండా ఎలా సాధ్యమవుతుంది అన్నది ముఖ్యమైన అనుమానం. నీటి ఆధారంతో బోర్లకింద సాగుచేసిన పశువుల గడ్డి వర్షాధారంలో సాగుచేసిన పశువుల గడ్డి ప్రకృతి సేద్యం అంకెల్లో బాగు జిల్లాలో 50,154 ఎకరాల్లో సాగు చేసినట్లు లెక్క ఈ విస్తీర్ణం ఇప్పటి ఖరీఫ్ సాగు కంటే అత్యధికం అయితే గడ్డి మినహా కనిపించని పంటలునియోజకవర్గం రైతులు సాగు (ఎకరాల్లో) మదసపల్లె 6,239 6,605.22 పీలేరు 8,565 8,665.08 పుంగనూరు 5,342 4,530.18 రాయచోటి 19,622 22,539.65 తంబళ్లపల్లె 7,477 7,814.02 మొత్తం 47,245 50,154 జిల్లాలో ప్రకృతి వ్యవసాయం కింద చేపట్టిన సాగులో పశువుల గడ్డి అధికం. మొత్తం సాగులో 70శాతం నీటి ఆధారంతో, 30 శాతం వర్షాధారంతో పంటలు సాగు చేయించాం. రైతులకు దీనికి ఎలాంటి ప్రోత్సాహం అందించలేదు. వర్షాధార ప్రకృతి సేద్యంలో ఫలితాలు తక్కువే. విత్తనాలు మొక్కలైతే వాటిని భూమిలోనే దున్నేస్తారు. – వెంకటమోహన్, ప్రకృతి సాగు జిల్లా అధికారి -
సిద్ధార్థలో ఏఐసీటీఈ ఐడియా ల్యాబ్ ప్రారంభం
నారాయణవనం: మండలంలోని సిద్ధార్థ ఇన్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి కళాశాలలో ఏఐసిటిఇ ఏఐసీటీఇ ఐడియా ల్యాబ్ను శుక్రవారం తిరుపతి ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ ప్రారంభించారు. ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లారుతూ ఐడియా ల్యాబ్లో సిఎస్సి మెషన్కటింగ్, త్రీడి ప్రింటింగ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, ఐఓటి ల్యాబ్లతో విద్యార్థులు తమ నైపుణ్యతను పెంచుకోవాలని అన్నారు. కేంద్రప్రభుత్వం ఇన్నోవేటివ్ టెక్నాలజికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందనిఅన్నారు. యువ ఇంజనీర్లు స్టార్టప్లను, ఇంకుబేషన్ కార్యక్రమాలలో పాల్గొని మంచి ఎంటర్ప్రెన్యువర్లుగా ఎదగాలని అన్నారు. ఐడియా ల్యాబ్ కోఆర్డినేటర్ రత్నకమల మాట్లాడుతూ సాంకేతిక పరమైన ఐడియాల ట్రాన్స్ఫర్మేషన్, ఇన్నోవేషన్, ఇంప్లిమెంటేషన్, స్టార్టప్స్ అంశాలపై పరిజ్ఞానం పెంచుకోవచ్చునని అన్నారు. కళాశాల చైర్మన్ అశోకరాజు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులు అధునాతన సాంకేతిక విజ్ఞనానికి ఐడియాను, టెక్నాలజిని జోడించి అభివృద్ధి పరచడానికి ఐడియా ల్యాబ్ ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు. ప్రిన్సిపాళ్లు రమేష్ కుముద్, జనార్థనరాజు, కో కోఆర్డినేటర్ సునీల్ కుమార్ రెడ్డి, హెచ్వోడీలు. అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
నీట్గా మెరిశారు
రిత్వికారెడ్డి చేతన్రెడ్డి షేక్ నూర్ ఉల్ హేస్సేన్ మోహిత్ రోహిత్మదనపల్లె సిటీ: వైద్య,విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్(యూజీ) పునః పరీక్ష ఫలితాల్లో మదనపల్లెకు చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. మంచి ర్యాంకులు సాధించారు. సత్తా చాటిన రిత్వికారెడ్డి లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో శ్రమిస్తే విజయాన్ని ఎవరూ ఆపలేరని మదనపల్లెకు చెందిన రిత్వాకారెడ్డి నిరూపించారు. నీట్ ప్రవేశ ఫలితాల్లో 652 మార్కులు సాధించి ఆల్ ఇండియా 1311 ర్యాంకు సాధించింది. ఇంటర్మీడియట్ విజాయవాడలోని ప్రైవేటు కాలేజీలో చదివింది. రిత్వికరెడ్డి తల్లిదండ్రులు డాక్టర్ ఎస్.రామలింగారెడ్డి, సునీత. రామలింగారెడ్డి మదనపల్లెలోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్గా ఉన్నారు. నీట్ పరీక్షకు క్రమబద్దంగా సిద్దమై ప్రతి రోజూ ప్రణాళిక ప్రకారం చదవడం , మాక్ టెస్టులు రాయడం, పునశ్చరణకు ప్రాధాన్యం ఇవ్వడం, సమయాన్ని సమర్ధవంతంగా వినియోగించుకోవడంతో తన విజయానికి దోహదపడిందన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల మార్గదర్శకం ఉపయోగపడినట్లు తెలిపారు. చేతన్రెడ్డి ప్రతిభ గ్రామీణ ప్రాంతమైన తంబళ్లపల్లెకు చెందిన సీతి చేతన్రెడ్డి నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 591 మార్కులు సాధించి 13041 ర్యాంకు దక్కించుకున్నారు. తంబళ్లపల్లెకు చెందిన మెడికల్స్టోర్ యజమాని నారాయణరెడ్డి, పల్లవి తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచి మదనపల్లెలో విద్యాభ్యాసం చేశారు. ఇంటర్మీడియట్ తిరుపతిలోని ప్రైవేటు కాలేజీలో చదివారు. మొదటి ప్రయత్నంలో మంచి ర్యాంకు సాధించారు. కార్డియాలజిస్టు కావడమే తన ధ్యేయమన్నారు. నూర్కు ర్యాంకు నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో మదనపల్లె పట్టణం ఇందిరానగర్కు చెందిన షేక్ మహమ్మద్ నూర్ ఉల్ హుస్సేన్ 665 మార్కులు సాధించి 663 ర్యాంకు దక్కించుకున్నారు. తల్లిదండ్రులు డాక్టర్ అలీ, తస్కిన్. తండ్రి దంత వైద్యులు కావడంతో చిన్నప్పటి నుంచి నూర్ను ప్రోత్సహించాడు. తండ్రి సహకారంతో విద్యలో రాణించాడు. మొదటి ప్రయత్నంలోనే 663 ర్యాంకు సాధించి అందరి మన్ననలు పొందారు. కార్డియాలజిస్టు కావడము తన లక్ష్యమన్నారు. మోహిత్కు 36 వేల ర్యాంకు పుంగనూరు: పట్టణంలోని బెస్తవీధికి చెందిన మంజుల కుమారుడు బి.మోహిత్ నీట్ ఫలితాలలో 36 వేల ర్యాంకు సాధించాడు. 750 మార్కులకు 550 మార్కులను సాధించాడు. అలాగే క్యాటగిరి కోటాలో 18 వేల ర్యాంకు సాధించాడు. మోహిత్ తండ్రి చిన్నతనంలోనే మృతి చెందాడు. తల్లి మంజుల పాలవ్యాపారం చేస్తూ కుమారుడిని చదివించింది. ఈసందర్భంగా స్నేహితులు మోహిత్కు అభినందనలు తెలిపారు. రోహిత్ సత్తా.. పీలేరు : నీట్ పరీక్షా ఫలితాల్లో పీలేరుకు చెందిన రోహిత్ అనే విద్యార్థి ఆల్ ఇండియా ర్యాంక్లో 316 సాధించి ప్రతిభను చాటాడు. పీలేరుకు చెందిన ఉపాధ్యాయులు పరమేశ్వర్రాజు, విజయలక్ష్మీ కుమారుడు రోహిత్ 720 మార్కులకు 680 మార్కులు సాధించి ఆల్ ఇండియా ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా రోహిత్ను పలువురు అభినందించారు. -
21 నుంచి సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు
నందలూరు : సౌమ్యనాథస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతుంది. జులై 21 నుంచి 31వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ ఈఓ ప్రశాంతి, ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్లు శుక్రవారం తెలిపారు. 21వ తేదీ ఉదయం తిరుమంజనం, రాత్రికి అంకురార్పణ, 22న ఉదయం ధ్వజారోహణం, రాత్రి యాలివాహనం, 23న ఉదయం పల్లకీసేవ, రాత్రి హంస వాహనం, 24న ఉదయం పల్లకీసేవ, రాత్రి సింహవాహనం, 25న ఉదయం పల్లకీసేవ, రాత్రి హనుమంతవాహనం, 26న ఉదయం శేషవాహనం, రాత్రి గరుడ వాహనం, 27న ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనం, 28న ఉదయం కళ్యాణోత్సవం, రాత్రి గజవాహనం, 29న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 30న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణం, 31న సాయంత్రం పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అన్ని చర్యలు చేపట్టామని వారు తెలిపారు. -
‘పదేళ్లలో రాష్ట్రమంతటా ప్రకృతి సేద్యం’
సాక్షి, మదనపల్లె: రాబోవు పదేళ్లలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రకృతి సేద్యం విస్తరింపజేయడమే రైతు సాధికార సంస్థ లక్ష్యమని సంస్థ సీనియర్ అడ్వైజర్ మురళీ తెలిపారు. మదనపల్లె మండలంలోని అంకిశెట్టిపల్లి గ్రామంలో నిర్వహించిన కమ్యూనిటీ మేనేజ్మెంట్ సెంటర్ సందర్శన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, భూసారాన్ని పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రకృతి ఆధారిత సాగు పద్ధతులను అవలంబించడం ద్వారా ఆరోగ్యకరమైన ఉత్పత్తులతో పాటు ఖర్చులు తగ్గుతాయని వివరించారు.అనంతరం జిల్లా ప్రాజెక్టు నిర్వహణ విభాగం కార్యాలయంలో మెంటార్లు, రైతు శాస్త్రవేత్తలు, యువ రైతు సహాయకులు, ప్రకృతి వ్యవసాయ సహాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వెంకట మోహన్, వ్యవసాయ శాఖ అధికారులు, పులివెందుల అకాడమీ ప్రతినిధులు, రైతు సాధికార సంస్థ సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ క్షేత్రస్థాయి సిబ్బంది, రైతులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
టెన్త్ టాపర్లకు షైనింగ్ స్టార్ అవార్డులు
మదనపల్లె సిటీ: జిల్లా వ్యాప్తంగా గత విద్యా సంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 157 మందికి షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికా రి డాక్టర్ సుబ్రమణ్యం శుక్రవారం తెలిపారు. ఈ నెల 20వ తేదీ స్థానిక ఎన్జీఆర్ కల్యాణ మండపంలో జరిగే కార్యక్రమంలో వీరికి రూ.20 వేలు నగదు, పతకం అందజేస్తామన్నారు. ఓపెన్ స్కూల్ ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలి రాయచోటి టౌన్ : ఓపెన్ స్కూల్ ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఓపెన్ స్కూల్ కో –ఆర్డినేటర్ కొండూరు శ్రీనివాస రాజు తెలిపారు. శుక్రవారం రాయచోటి డైట్ కళాశాలలో ఓపెన్ స్కూల్ 2026–2027 సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన కరపత్రాలను విడదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 సంవత్సరాలు పూర్తయి, చదవడానికి, రాయడానికి వచ్చిన వారు పదోతరగతిలో ప్రవేశానికి అర్హులని చెప్పారు. అలాగే 15 సంవత్సరాలు నిండిన వార ఇంటర్మీడియట్ చేరేందుకు అర్హులని తెలిపారు. వీరికి ఉచితంగా స్వయం అభ్యాస పాఠ్యసామగ్రి ఇంటికే పంపించనున్నట్లు చెప్పారు.ఎలాంటి అపరాధ రుసుం చెల్లించకుండా ఈ నెల 31లోగా ఏపీ ఆన్లైన్ ప్రవేశాలు పొందవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో డైట్ ఇన్చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి, డైట్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆశాజనకంగా టమాట ధరలు సాక్షి, మదనపల్లె: సీజన్ ముగుస్తున్నా టమోటా ధరలు ఆశాజనకంగా ఉండగా దిగుబడి కూడా భారీగా పెరిగింది. దీంతో పనులు కూడా తగ్గకుండా ఉన్నాయి. మదనపల్లి మార్కెట్లో శుక్రవారం 1,451 టన్నుల టమాట రాగా అత్యధికంగా కిలో ధర రూ.18 పలికింది. ఇదే మార్కెట్లో సోమవారం 1,210 టన్నుల టమాట అనగా అత్యధిక కిలో ధర రూ.19 పలికింది. మంగళవారం 1,190 టన్నుల టమాట రాగా అత్యధికంగా కిలో ధర రూ.23 పలికింది. బుధవారం 1,340 టన్నుల టమాట రాగా అత్యధిక కిలో ధర రూ.23 పలికింది. గురువారం 1,478 టన్నుల టమాట విక్రయానికి రాగా అత్యధిక కిలో ధర రూ.20 పలికింది. దీన్ని బట్టి చూస్తే ఈ నెలలో అత్యధిక ధర కిలో రూ.23 పలికితే, అత్యల్ప ధర రూ.18 పలికింది. టమోటా దిగుబడి ఇంకా పెరుగుతుండటంతో ధరలు ఇలాగే నిలకడగా ఉంటాయా లేదా అన్నది చూడాలి. కేసులు సత్వరమే పరిష్కరించాలి: డీఐజీ మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా మదనపల్లె జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ శుక్రవారం తనిఖీ చేశారు. శుక్రవారం మదనపల్లెకు విచ్చేసిన డీఐజీకి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) వెంకటాద్రి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో జరుగుతున్న నూతన భవన నిర్మాణ పనులను డీఐజీ పరిశీలించారు. నిర్మాణ పనుల నాణ్యత, పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుని సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయ రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలను సమీక్షించి డీఐజీ.. కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా సత్వర చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. పిల్లలకు తప్పనిసరిగా టీకా వేయించాలి మదనపల్లె టౌన్: మీసిల్స్, రూబెల్లా (పొంగు, మూడు రోజుల తట్టు) వ్యాధుల నివారణకు నిర్వహిస్తున్న టీకాల ప్రత్యేక శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఉషశ్రీ పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లె డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. 9 నెలల నుంచి 15 ఏళ్ల లోపు పిల్లలందరికీ మీసిల్స్–రూబెల్లా (ఎంఆర్) టీకా తప్పనిసరిగా వేయించాలన్నారు. గతంలో టీకా వేయించినా సరే, ప్రత్యేక శిబిరాల్లో మరో అదనపు డోసు ఇస్తున్నామని తెలిపారు. భారత ప్రభుత్వం 2026 డిసెంబర్ నాటికి దేశం నుంచి మీసిల్స్, రూబెల్లా వ్యాధులను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో పనిచేస్తోందని వారు పేర్కొన్నారు. ఈ లక్ష్యం సాధనకు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
ప్రాణం కాపాడిన హెల్మెట్
● కారు ఢీకొని తీవ్ర గాయాలు పుంగనూరు : ఓ నిండు ప్రాణాన్ని హెల్మెట్ కాపాడింది. కానీ ప్రమాదంలో ఎడమ కాలు పాదం కోల్పోయాడు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం భగత్సింగ్కాలనీ మలుపు వద్ద జరిగింది. వివరాలిలా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన చక్రనాథ్(30) ద్విచక్రవాహనంలో కోర్టుకు వెళ్లేందుకు మదనపల్లెకు బైపాస్లో వెళ్తుండగా.. ఎదురుగా అతివేగంగా వస్తున్న తమిళనాడుకు చెందిన కారు ఢీకొంది. ఈ సమయంలో చక్రనాథ్కు హెల్మెట్ ఉండటంతో తలకు ఎలాంటి దెబ్బలు తగలక ప్రాణపాయం నుంచి బయటపడ్డాడు. కానీ కాలు పాదం మాత్రం తెగిపడి పోయింది. ఈ సంఘటనను స్థానికులు గమనించి బాధితున్ని 108లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బాధితున్ని మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధతో యువకుడి బలవన్మరణం
పుంగనూరు : అప్పుల బాధతో ఓ యువకుడు బలవన్మరణం చెందిన సంఘటన పట్టణ సమీపంలోని నక్కబండలో గురువారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. డ్రైవర్గా పని చేస్తున్న రెడ్డిప్రసాద్(32) తన కుటుంబ అవసరాల నిమిత్తం అప్పులు చేశాడు. అప్పులు చెల్లించలేక పోవడంతో వడ్డీ వ్యాపారుల వేధింపులు తీవ్రం కావడం వల్ల రాత్రి ఇంటిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లె టౌన్ : అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన మదనపల్లె మండలం యనమలవారిపల్లె భాగ్యనగర్లో చోటు చేసుకుంది. బాధితురాలు తాలూకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. భాగ్యనగర్లో ఉంటున్న సూర్యకుమారి ఇంటి స్థలంలో వీఆర్ఏ వెంకటరమణ దౌర్జన్యంగా షెడ్డు వేయడానికి యత్నించడాన్ని ఆమె అడ్డుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన వీఆర్ఏ, అతని కుటుంబ సభ్యులు అర్ధరాత్రి సూర్యకుమారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. గాయపడిన బాధితురాలిని వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మదనపల్లె టౌన్ : వైద్యం కోసం ఆసుపత్రికి బయలుదేరిన వృద్ధురాలిని బైక్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం బి.కొత్తకోట మండలంలో చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దతిప్పసముద్రం మండలం బూసుపల్లికి చెందిన లక్ష్మమ్మ (72)కు ఆరోగ్యం బాగోలేదు. దీంతో కొడుకు మల్లికార్జున, మనవడు సురేష్ ఆమెను బైక్పై బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. బైక్ బి.కొత్తకోటకు చేరుకోగానే ఎదురుగా వేగంగా వచ్చిన మరో బైక్ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న లక్ష్మమ్మ కిందపడి తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. మనవడు సురేష్కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు, కుటుంబ సభ్యులు లక్ష్మమ్మను బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్: వివాహిత విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం బి.కొత్తకోట మండలంలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. మండలంలోని వలసగుట్లపల్లికి చెందిన చంద్ర భార్య మమత (40) కొంతకాలంగా కుటుంబ కలహాలతో బాధపడుతోంది. ఈ క్రమంలో మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న పురుగుమందు తాగింది. పిల్లలు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది మమతను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు స్పందించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం మమత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కురబలకోట: ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న ఏఐ యుగంలో విద్యార్థులు ఉన్నతంగా రాణించాలన్నా జీవితంలో విజయం సాధించాలన్నా ఏఐ ఆధారిత నైపుణ్యాలను తప్పనిసరిగా అలవర్చుకోవాలని బెంగళూరులోని హెచ్ఆర్ఎఫ్వై కంపెనీ డైరెక్టర్ మనోజ్ కుమార్ సోడా వెల్లడించారు. అంగళ్లు మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో కళాశాల క్యాంపస్ నుంచి కార్పొరేట్ ప్రపంచానికి అంశంపై జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా మాట్లాడుతూ డిగ్రీతో పాటు కార్పొరేట్ స్కిల్స్ సాధించాలన్నారు. పరిశ్రమల్లో ఎదురయ్యే సవాళ్లను అవకాశాలుగా మలచుకుంటే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. విజయవంతమైన కేరీర్ నిర్మాణానికి కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, సమస్యలు పరిష్కరించే సామర్థ్యం అవసరమన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏఐ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తోందని మిట్స్ యూనివర్సిటీ అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ జి. నాగశ్వేత అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ నేర్చుకోవడం ద్వారా జీవితంలో రాణింపునకు దోహదపడుతుందన్నారు. -
వెలుగులోకి కొన్నే.. కనిపించనివి ఎన్నో..!
● కడపలో మొదలు.. రాష్ట్రమంతా కేసులు ● ప్రభుత్వానికి పట్టని కరోనా ప్రమాద సంకేతాలు కడప రూరల్ : వైఎస్సార్ జిల్లాలో జూలై మొదటి వారం నుంచి కరోనా కేసులు మొదలయ్యాయి. ఇప్పుడు రాష్ట్రమంతా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మాటల్లోనే అని, చేతల్లో కనిపించడం లేదనే అభిప్రాయం కలుగుతోంది. విస్తరిస్తున్న కోవిడ్ వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు వెలుగు చూశాయి. అందులో ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారు. వల్లూరు మండలానికి చెందిన 66 ఏళ్ల వద్ధుడు మరణించాడు. ఆ వ్యక్తి కిడ్నీ వ్యాధిగ్రస్తుడని, డయాలసిస్ చికిత్స పొందుతూ తిరుపతిలో మరణించాడని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం సాయంత్రం నాటికి మొత్తం 14 కేసులకు పైగా వెలుగు చూశాయి. ఈ కేసులన్నీ గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, వెస్ట్, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో నమోదయ్యాయి. ఇక్కడ పరిశీలించాల్సిన అంశం ఏమంటే 2020 మార్చి నెలలో రాష్ట్రం అంతా కేసులు వెలుగు చూశాయి. వైఎస్సార్ కడప జిల్లా మినహా రాయలసీమ జిల్లాల్లో పాజిటివ్ కేసులు విరివిగా నమోదయినాయి. కడపలో మాత్రం ఆ ఏడాది మార్చి 30న కేసులు నమోదు కావడం మొదలైంది. అంటే ఇక్కడ ఆలస్యంగా పాజిటివ్ కేసులు వచ్చాయి. కాగా ఈ కేసులకు సంబంధించి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని అధికారులు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. సమస్యగా మారిన నిర్ధారణ జలుబు, దగ్గు, జ్వరం తదితర లక్షణాలు కోవిడ్ను పోలి ఉంటాయి. ఈ లక్షణాలు సర్వసాధారణంగా చాలామందిలోనే కనిపిస్తాయి. అలాగని అందరినీ కరోనా కింద జమ కట్టలేం. నిర్ధారణ పరీక్షల ద్వారా పాజిటివ్ వస్తే కోవిడ్ గా పరిగణించడానికి ఆస్కారం ఉంటుంది. గతంలో కరోనా వచ్చినప్పుడు రాపిడ్ కిట్స్, ట్రూనాట్, ఆర్టిపీసీఆర్ ద్వారా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేవారు. వీటిల్లో ఆర్టిపీసీఆర్ ద్వారా జరిపే పరీక్షలు మెరుగైనవని వైద్యుల అభిప్రాయం. అయితే ప్రాథమికంగా ఒక అంచనాకు రావడానికి రాపిడ్ కిట్స్, ట్రూ నాట్ పరీక్షలు ఉపయోగపరంగా ఉంటాయి. అయితే ఈ పరీక్ష పరికరాలు ఇంతవరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరని పరిస్థితి నెలకొంది. అలాంటప్పుడు వ్యాధి నిర్ధారణ కాకముందే, కరోనాను ఎలా కనిపెట్టగలరనే ప్రశ్న తలెత్తుతోంది. సాధారణంగా వ్యాధులు చలికాలం, వానాకాలంలో వెలుగు చూస్తాయి. అయితే కరోనా కేసులు మాత్రం ఎండల్లో నమోదు కావడం విశేషం. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి దృష్టి పెట్టకుండా, కరోనా మహమ్మారిపై కరుణ చూపుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2020లో లాగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకపోయినా పర్వాలేదు. కరోనా విస్తరించకుండా.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటే చాలని సగటు మనిషి అభిప్రాయపడుతున్నాడు. -
పేద.. ఆపై పెద్ద బాధ
● రమ్యశ్రీ ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రుల ఆవేదన ● ఊపిరితిత్తుల వ్యాధి ● చికిత్సకు రూ.50 లక్షలు ఖర్చు పుంగనూరు: సాధారణ రైతు కుటుంబంలో వెంకటరమణ, లక్ష్మీ దంపతులకు మూడో కుమారైగా జన్మించిన రమ్యశ్రీ సీఏ పూర్తి చేసుకుని బెంగళూరులో చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర శిక్షణలో ఉండగా ఒక్కసారిగా ఆమెకు ప్రాణాంతమైన ఎల్ఏఎం ఊపిరితిత్తుల వ్యాధిసోకింది. ఆసుపత్రులకు తిరిగినా ఫలితం లేదని, ఊపిరితిత్తులు మార్చాలని వైద్యులు తెలపడంతో ఆమె భవిష్యత్తు కుదేలైంది. రూ.50 లక్షలు ఖర్చు.. రమ్యశ్రీకి ఊపిరితిత్తులు రెండు తీవ్రంగా దెబ్బతినడంతో వాటికి చికిత్స చేయించేందుకు చైన్నె అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఊపిరితిత్తుల మార్పిడికి రూ.50 లక్షలు ఖర్చు అవుతుందని తెలపడంతో ఆకుటుంబం కన్నీరుమున్నీరౌతోంది. అంత డబ్బు సమకూర్చలేని తల్లిదండ్రులు బిడ్డను పోగొట్టుకోలేక, చికిత్స అందించలేక దాతల సాయంకోసం ఎదురుచూస్తున్నారు. దాతలు ఆదుకుని , తమ బిడ్డ ప్రాణాలను కాపాడాలని ప్రాధేయపడుతున్నారు. దాతలు 7569298992 నంబర్ కు విరాళాలు అందించాలని కోరుతున్నారు. -
తాళం వేసిన ఇంటికి కన్నం
గాలివీడు : గాలివీడులోని హైస్కూల్ దగ్గర ఉన్న పూసల కాలనీలో ఓ ఇంట్లో గురువారం రాత్రి దొంగలు పడ్డారు. బంగారు నగలు, నగదు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. చెప్పలి అలియాస్ కూరగాయల చంద్ర, రాణమ్మలు 40 ఏళ్ల నుంచి చిరు వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో కుమారుడు ఉద్యోగంలో స్థిరపడగా, రామచంద్ర సంతల్లో కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారంలో సంపాదించినదే కాకుండా కుమారుడి వివాహానికి అత్త ఇచ్చిన బంగారు అంతా ఇంట్లో బీరువాలో భద్రపరచుకొని సంతలో వ్యాపారానికి వెళ్లారు. ఈ క్రమంలో గురువారం కోనంపేట సంతకు వెళ్లి తిరిగి రావడానికి బస్సు లేక కుమార్తె ఇంటికి వెళ్లారు. ఉదయం లేచి ఇంటికి వచ్చే సరికి తలుపులు, బీరువా పగులగొట్టి 30 తులాల బంగారు ఆభరణాలు, 50 వేల నగదు దోచుకెళ్లారు. సంఘటనను గమనించిన రామచంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా లక్కిరెడ్డిపల్లి సీఐ, గాలివీడు ఎస్ఐ సిబ్బంది డాగ్ స్క్వాడ్తో వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 30 తులాల బంగారు, రూ.50 వేల అపహరణ -
‘సీమ’ జోనల్ పోటీల్లో విజేత రొంపిచెర్ల జట్టు
రొంపిచెర్ల: రాయలసీమ జోనల్ క్రికెట్ పోటీల్లో విన్నర్స్గా రొంపిచెర్ల ఫ్రెండ్స్ ఎలెవన్ జట్టు నిలిచింది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో రాయలసీమ జోనల్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 73 టీంలు పాల్గొన్నాయి. శుక్రవారం జరిగిన ఫైనల్లో రొంపిచెర్ల ఫ్రెండ్స్ ఎలెవన్, బబ్లు ఎలెవన్ జట్లు తలపడ్డాయి. బబ్లు ఎలెవన్ జట్టు 12.2 ఓవర్లలో 80 పరుగులకు అలౌటు అయింది. రొంపిచెర్ల జట్టు 8.4 ఓవర్లలో 84 పరుగులు చేసి విజయం సాధించింది. ఎస్.కె.అహ్మద్ 23 బంతుల్లో 3 సిక్స్లు, రెండు పోర్లతో 33 రన్స్ చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. దీంతో విజేత జట్టుకు నగదు బహుమతిగా రూ.1.50 లక్షల చెక్ను ఆర్గనైజర్ బాలాజీ అందజేశారు. ఈ పోటీల్లో జట్టు సభ్యులు ఉమ మహేశ్వర్, గుర్రప్ప, హర్ష, మణి, ఎస్.కె. అహ్మద్ కిషోర్, బాలు, రాజు, పవన్, భార్గవ్,షమీ, దిలీప్, తిప్పాస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
లారీ యజమానిపై బీరు బాటిల్తో దాడి
మదనపల్లె టౌన్ : మద్యం మత్తులో లారీ యజమానిపై డ్రైవర్ బీరు బాటిల్తో దాడి చేసి గాయపరిచాడు. అర్ధరాత్రి మదనపల్లిలో జరిగిన ఘటనపై బాధితుడి కుటుంబీకులు, పోలీసుల కథనం.. బసినికొండలో కాపురం ఉంటున్న విజయభాస్కర్ నాయుడు(42)కు లారీలు ఉన్నాయి. స్థానిక సాయిబాబా మందిరం సమీపంలోని షెడ్డు వద్ద లారీ ఉండగా అక్కడికి వెళ్లాడు. డ్రైవర్ అక్బర్తో కలసి మద్యం తాగాడు. ఇంతలో ఇద్దరి మధ్య చిన్న వివాదం తలెత్తి బీరు బాటిళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో విజయభాస్కర్ నాయుడుకు తీవ్ర గాయాలు కాగా అక్బర్కు స్వల్ప గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. బాధితులను జిల్లా ఆసుపత్రికి తరలించి, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ● ఇద్దరికి తీవ్ర గాయాలు మదనపల్లె టౌన్ : అర్ధరాత్రి కారు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ముదివేడు ఎస్ఐ మధురామ చంద్రుడు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన శ్యాం కుమార్ (23), కోడూరుకు చెందిన వెంకటరమణ(41) కారులో ముందు సీట్లో, ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్న పిల్లలు వెనుక సీట్లో కూర్చొని బెంగళూరుకు వెళ్తున్నారు. మార్గంమధ్యలోని కురబలకోట రైల్వే ఫ్లైఓవర్ వద్దకు రాగానే, ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ వచ్చింది. ఈ రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయి, అందులో ప్రయాణిస్తున్న శ్యాంకుమార్, వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను కురబలకోట 108 వాహనంలో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పరేషాన్లో మీ‘సేవ’లు
మదనపల్లె (కురబలకోట): ప్రజలకు సత్వరం ప్రభుత్వ సేవలను అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మీసేవ కేంద్రాలు జిల్లాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సచివాలయాల పేరును కూటమి ప్రభుత్వం స్వర్ణ వార్డు–స్వర్ణ గ్రామంగా మార్చింది. వీటి లోగోలతో కొత్త ధ్రువీకరణ పత్రాలు సరఫరా చేయడంలో తీవ్ర జాప్యం నెలకొంది. నెలరోజులుగా రైతులు, విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కులం, ఆదాయం, జనన, ఈడబ్ల్యూఎస్, జనన, మరణ, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ వంటి అత్యవసర సర్టిఫికెట్లు లేక మీసేవ నిర్వాహకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీస్ సర్టిఫికెట్లు, వన్బీ, ఆడంగళ్లకు కూడా ఎక్కువగా రైతులు వీటిపై ఆధారపడతారు. ప్రింటింగ్ ధ్రువీకరణ పత్రాలు లేక అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 89 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి రోజు వివిధ ప్రాంతాల వారు వీటిని ఆశ్రయిస్తారు. వీరికి ఇవ్వడానికి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో మీసేవ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. కొందరికి రెండు నెలలుగా, మరికొందరికి నెలరోజులుగా వీటిని ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఇంత అధ్వాన పరిిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదని మీ సేవ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా కూడా నష్టపోతున్నామని వీటి కోసం డబ్బులు చెల్లించినా ఇంత వరకు రాకపోవడంతో వినియోగదారులకు సమాధానం చెప్పలేకపోతున్నట్లు వ్యధ చెందుతున్నారు. సచివాలయాల్లో కూడా కొరతే... జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ధ్రువీకరణ పత్రాల కొరత వెంటాడుతోంది. అరకొరగానే వీటిని ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయమై జిల్లా మేనేజర్ నరేంద్రను విచారించగా జూన్ పది నుంచి పాత సర్టిఫికెట్లను వినియోగించరాదని ఆదేశాలు వచ్చాయన్నారు. దీంతో స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు సచివాలయాల పేరిట కొత్తవి ప్రింట్ చేయడంలో కొంత జాప్యం జరిగిందన్నారు. ఇప్పటికే వీటిని కొందరికి పంపిణీ చేయడం జరిగిందని మిగిలిన వారికి కూడా త్వరలో అందజేస్తున్నట్లు తెలిపారు. సచివాలయాలనూ వెంటాడుతున్న కొరత కొత్త ధ్రువీకరణ పత్రాల కోసం ఎదురు చూపు -
బలమైన పార్లమెంటరీ వ్యవస్థతోనే ప్రాంతీయ సహకారం సాధ్యం
● దక్షిణాసియా అధ్యయన పర్యటన ఫలవంతం ● వాతావరణం, సాంకేతికత, నూతన ఆవిష్కరణలపై పరస్పర సహకారం ● ప్రతినిధుల బృంద ప్రతినిధి ఎంపీ మిథున్రెడ్డి సాక్షి, మదనపల్లె : బలమైన పార్లమెంటరీ వ్యవస్థతోనే దేశాల మధ్య ప్రాంతీయ సహకారం సాధ్యమవుతుందన్న అభిప్రాయంతో సింగపూర్, ఇండోనేషియాలో జరిగిన అధ్యయన పర్యటన తెలియజేసిందని వైఎస్సార్సీపీ లోక్సభ పక్షనేత పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి అన్నారు. ఈ నెల 12 నుంచి 16 వరకు ద్వారా విధాన రూపకల్పన నుండి ఆచరణ వరకు సింగపూర్, ఇండోనేషియా అనుసరిస్తున్న వినూత్న విధానాలను దక్షిణాసియా దేశాల పార్లమెంటేరియన్లు అధ్యయనం చేసే అవకాశం లభించిందని అన్నారు. పర్యటన ముగిసిన సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడుతూ సింగపూర్, ఇండోనేషియాలో జరిగిన అధ్యయన పర్యటనలో బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, నేపాల్, శ్రీలంక దేశాల పార్లమెంటేరియన్లతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిథుల బృందంలో మనదేశం తరపున తాను భాగస్వామి అయ్యానని చెప్పారు. సింగపూర్, ఇండోనేషియాలోని ప్రభుత్వ సంస్థలు, పరిశోధనా సంస్థలు, ఆర్థిక సంస్థలతో జరిగిన సమావేశాల ద్వారా వాతావరణ చర్యలు, ఇంధన పరివర్తన, స్థిరత్వం కోసం సాంకేతికత, విధాన ఆవిష్కరణలు, ప్రాంతీయ సహకారంపై పార్లమెంటరీ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా అధ్యయన సమావేశాలు, చర్చలు జరిగాయన్నారు. ఈ చర్చల్లో ప్రాంతీయ సమైక్యత, సహకార విధాన రూపకల్పనలోని అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోవడం ద్వారా, సాక్ష్యాధారిత విధానాలు, బలమైన పార్లమెంటరీ నెట్వర్క్లు మరియు దక్షిణాసియాను స్థిరమైన, తక్కువ–కార్బన్ మరియు సుస్థిర భవిష్యత్తు వైపు నడిపించే ఆచరణాత్మక పరిష్కారాలను ఈ అధ్యయన పర్యటన ప్రోత్సహిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. సింగపూర్ సస్టైనబిలిటీ, ఎన్విరాన్మెంట్ మంత్రిత్వ శాఖ అధికారులు సింగపూర్ గ్రీన్ ప్లాన్–2050 నాటికి నెట్–జీరో సాధించే రోడ్మ్యాప్ గురించి తెలుసుకున్నట్టు వివరించారు. సస్టైనబుల్ సింగపూర్ గ్యాలరీ, వరద నివారణ కట్టడం, జలాశయం, పార్క్, గ్రీన్ రూఫ్గా ఉపయోగపడే మెరీనా బ్యారేజ్, దేశ వాతావరణ వ్యూహాన్ని ఎలా ప్రతిబింబిస్తుందో ప్రత్యక్షంగా పరిశీలించామన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హబ్ను సందర్శించి డీకార్బనైజేషన్, క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలపై జరుగుతున్న అత్యాధునిక పరిశోధనలను ల్యాబ్ టూర్ల ద్వారా పరిశీలించామన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్లో జరిగిన చర్చ, రౌండ్ టేబుల్లో జరిగిన కీలక ప్రసంగాల్లో భాగమై మనదేశం తరపున ఆ వేదికపై అభిప్రాయాలను పంచుకున్నట్టు తెలిపారు. ఈ పర్యటన ఫలవంతమైందని, మనదేశం పొరుగు దేశాలతో కోరుకుంటున్న ప్రాంతీయ సహకారం, పరస్పర అవగాహన, మిత్రత్వం గురించి వేదికలపై ప్రసంగించడం జరిగిందని చెప్పారు. ఈ అధ్యయన పర్యటన దక్షిణాసియా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరం పెరిగిందన్నారు. -
సైన్స్పై విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలి
మదనపల్లె సిటీ : విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించాలని నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ ఎం.గీత అన్నారు. శుక్రవారం స్థానిక వలసపల్లి వద్దనున్న నవోదయ విద్యాలయంలో క్లస్టర్ స్థాయి విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి సైన్సు పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్వహించే ఎగ్జిబిట్లో పాల్గొని తమ ప్రతిభ చూపాలన్నారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రదర్శనలో స్థానిక నవోదయ విద్యాలయంతోపాటు కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, ప్రకాశం, మార్కాపురం, కారేకల్, పుదుచ్చేరికి చెందిన విద్యాలయాల నుంచి 59 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యాలయ అధ్యాపకులు శైలజ,. శారదా, జగదీష్కుమార్, శ్రీనివాసమూర్తి, వెంకటేశులు, సుమతి, కౌన్సిలర్ శంకరప్ప, తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిబిట్లో ప్రదర్శనలు సుస్థిర వ్యవసాయం, వ్యర్థపదార్థాల నిర్వహణ, ప్లాస్టిక్కు ప్రత్నామ్యాయం, గ్రీన్ ఎనర్జీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వినోదాత్మక గణిత నమూనాలు, మంచి ఆరోగ్యం, పరిశుభ్రత, నీటి సంరక్షణ, నిర్వహణపై ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. శనివారం ముగింపులో విజేతలను ప్రకటిస్తామని ప్రిన్సిపాల్ గీత తెలిపారు. -
వైఎస్సార్సీపీకి బీసీలను చేరువ చేయాలి
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బీసీలను చేరువ చేయాలని ఆ పార్టీ రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షుడు రాచగొల్ల రమేష్ యాదవ్ అన్నారు. గురువారం విజయవాడలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి కోడాలి నాని, బీసీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్లతో కలిసి బీసీ విభాగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్సార్ కడప జిల్లా నుంచి బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు నేట్లపల్లి శివరామ్ హాజరయ్యారు. జిల్లాలో బీసీల యొక్క ప్రధాన సమస్యలు, కూటమి ప్రభుత్వంలో బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, ఎన్నికల హామీలు, మొదలగు విషయాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. రెండు సంవత్సరాల కాలంలో బీసీ విభాగం చేసిన కార్యక్రమాలు పరిశీలించారు. భవిష్యత్లో ఎలా ముందుకు వెళ్ళాలి, బీసీలను పార్టీకి చేరువ చేసేందుకు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. -
దక్షిణాయనం ఆరంభం
● ప్రారంభమైన ఆషాఢమాసం ● తొలి ఏకాదశి, వ్యాసపౌర్ణమి పండుగలు మదనపల్లె సిటీ: ఆషాడమాసం ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఆగస్టు 12వతేదీ వరకు కొనసాగుతుంది. ఈ మాసంలో అనేక విశిష్టతలు ఉన్నాయి. తొలి ఏకాదశి, గురుపౌర్ణమి(వ్యాస పౌర్ణమి), పూరీలో జగన్నాథయాత్ర ఈ మాసంలో నిర్వహిస్తారు. ఎటువంటి శుభకార్యాలు ఈ మాసంలో ఉండనందు వల్ల శూన్యమాసంగా పేర్కొంటారు. మాస విశేషాలు, ప్రాముఖ్యత పూర్వాషాడ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాఢమాసంగా చెబుతారు. వర్షబుతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఆషాఢంలో చేసే సముద్ర స్నానాలు ఎంతో ముక్తిదాయకాలుగా భావిస్తారు. పాదరక్షలు, గొడుగు, ఉప్పుదానం చేయడం మంచి ఫలితాలనిస్తుంది. ఈ మాసంలో వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. ఇక పూర్వకాలం నుంచి ఆషాఢంలో కొత్త కోడలు పుట్టింటిలోనే ఉండాలి. అల్లుడు అత్తవారింటికి వెళ్లకూడదు అనే నియమం కూడా ఉంది.ఈ మాసంలోనే వారాహి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు,అభిషేకాలు చేస్తారు. ఆషాఢంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకంలోని సూర్యుడు ప్రవేశించడంతో దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకరరాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. ఆ ఆయనంలో సూర్యుడు భూమద్యరేఖకు దక్షిణంగా సంచిరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతల ప్రీతికరమని కూడా చెబుతారు. గురుపౌర్ణమి త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం ఈనెల 29తేదీన గురుపూర్ణిమ నిర్వహిస్తారు. దీనినే వ్యాసపూర్ణిమ అని అంటారు.ఆషాడ శుద్ధ పంచమి స్కంధ పంచమిగా చెప్తారు. సుబ్రమణ్యస్వామిని ఈ రోజు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆషాఢషష్టిని కుమారషష్టి గా జరుపుకుంటారు. ఆషాడసప్తమిని భానుసప్తమిగా జరుపుకుంటారు. తొలి ఏకాదశి: ఈనెల 25న శనివారం తొలి ఏకాదశి వస్తుంది. ఉత్తరం నుంచి దక్షిణ దిశగా పయనిస్తున్న ప్రభాకరుడు మూడు నెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఈ రోజున పగలు, రాత్రి,నిమిషం ,ఘడియ, విఘడియల తేడా లేకుండా సరిసమానంగా ఉంటాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని అంటారు. ఈ రోజు చాతుర్మాస వ్రతం ఆరంభమవుతుంది. దీనినే మతీత్రయ ఏకాదశి అని అంటారు. ఆషాఢ శుద్ద ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోని వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వాషాడ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలయే ఆషాఢమాసం.దీనిని శూన్యమాసమని అంటారు. హిందూ సంప్రదాయంలో ఈ మాసానికి విశిష్ట స్థానం ఉంది. శుభకార్యాల కంటే వ్రతాలు, దైవారాధన, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. – ఆలూరి ఫణికుమార్శర్మ, వేదపండితులు,మదనపల్లె. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
బి.కొత్తకోట(పెద్దతిప్పసముద్రం): స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గురువారం జిల్లా రిజిస్ట్రార్ ఉమా మహేశ్వరి అకస్మికంగా తనిఖీ చేశారు. కీలకమైన రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరూ అంకితభావంతో పని చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించినా, ప్రజలతో దురుసుగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. అనంతరం ఆమె కార్యాలయానికి వచ్చిన ప్రజలతో మమేకమై సిబ్బంది పని తీరు, సేవలు సంతృప్తికరంగా ఉన్నాయా, కాలయాపన చేస్తూ పనుల కోసం తిప్పుకుంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో సబ్ రిజిస్ట్రార్ అర్జీదారులతో దురుసుగా ప్రవర్తిస్తూ, లెక్కలేనితనంతో మాట్లాడుతున్నారని పలువురు జిల్లా రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేశారు. -
ఉత్సాహంగా ఏసీఏ అండర్–19 మల్టీ డే మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్: ఏసీఏ అండర్–19 మల్టీ డే మెన్ మ్యాచ్లు రెండవ రోజు ఉత్సాహంగా కొనసాగాయి. గురువారం వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్లో 78 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన అనంతపురం జట్టు 65.3 ఓవర్లకు 221 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సాత్విక్ 111 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 105 (సెంచరీ) చేశాడు. కిరణ్కుమార్ 36 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని మల్లికార్జున 5, జితేస్ వర్ధన్ 2, సాయి విఘ్నేష్ 2 వికెట్లు తీశారు. అనంతరం అనంతపురం జట్టు ఫాలోఆన్లో పడటంతో రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించింది. దీంతో రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించిన అనంతపురం జట్టు 57 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఆదినారాయణ 62, సందీప్రెడ్డి 56 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని మల్లికార్జున అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. సాయి విఘ్నేష్ 2 వికెట్లు తీశాడు. అయితే కర్నూలు జట్టు బౌలర్ మల్లికార్జున తొలి ఇన్నింగ్స్లో 5 , రెండవ ఇన్నింగ్స్ 4 వికెట్లు తీయడం కొసమెరుపు. దీంతో అనంతపురం జట్టు 41 పరుగులు ముందజలో ఉంది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. అదే విధంగా కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో 20 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 83.1 ఓవర్లకు 270 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని లోకేష్ 98, సుశాంత్ 59 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని యశ్వంత్ చక్కటి లైనఫ్తో బౌలింగ్ వేసి 4 వికెట్లు తీశాడు. జయంత్, తేజేష్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 13 ఓవర్లకు 4 వికెట్లు నష్టానికి 78 పరుగులు చేసింది. ఆ జట్టులోని రోహిత్ 28 పరుగులు చేవాడు. నెల్లూరు జట్టులోని లోకేస్ 3 వికెట్లు తీశాడు. చిత్తూరు జట్టు 121 పరుగుల ముందజలో ఉంది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. సాత్విక్, 105 పరుగులు యశ్వంత్, 4 వికెట్లు మల్లికార్జున, 5 వికెట్లు ఆదినారాయణ, 62 పరుగులు -
ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్: కురబలకోట మండలంలోని అంగళ్లు భారత్ కల్యాణ మండపం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.స్థానికుల కథనం ప్రకారం, వేగంగా వచ్చిన ఓ ట్రాక్టర్ అదుపుతప్పి ముందు వెళుతున్న మండలంలోని తెట్టు నాగలాపురానికి చెందిన గోపి(31), వెంకటరమణ(36) వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు కిందపడి తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న కురబలకోట 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పుంగనూరు: బోయకొండ గంగమ్మను దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్న భక్తుల ఆటోను ఆర్టీసీ బస్సు మండలంలోని కృష్ణాపురం వద్ద ఢీకొనడంతో ఐదుగురు గాయపడిన సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మదనపల్లెకు చెందిన ఐదుగురు ఆటోలో బోయకొండకు వెళ్లి తిరిగి వెళ్తుండగా కృష్ణాపురం సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడి, అందులో ప్రయాణిస్తున్న సతీష్, కుమార్, మల్లికార్జున, చంద్ర, శ్రీరాములు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సతీష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. స్థానికులు గమనించి బాధితులను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లె టౌన్: కురబలకోట మండలంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.స్థానికుల కథనం ప్రకారం.. సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం లోని కొక్కంటి క్రాస్కు చెందిన సాయి కిరణ్ (28) బైక్పై సొంత పనిమీద మదనపల్లెకు బయలు దేరాడు. కురబలకోట మండలం, కంటేవారిపల్లి వద్దకు రాగానే, ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇచ్చే క్రమంలో అదుపు తప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించారు. కురబలకోట 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్కూటర్ ఢీకొని వృద్ధ రైతుకు...మదనపల్లె టౌన్: స్కూటర్ ఢీకొనడంతో ఓ వృద్ధ రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం రాత్రి ములకలచెరువు మండలంలో చోటుచేసుకుంది. బాధిత రైతు కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని యేసువారిపల్లికి చెందిన రైతు రవణప్ప (65) సొంత పనిమీద తన బైకులో ములకలచెరువుకు బయలు దేరాడు. మార్గమధ్యంలోని చీకటిమనుపల్లి వద్దకు రాగానే, గుర్తుతెలియని స్కూటర్ వేగంగా వచ్చి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవణప్ప కిందపడి తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన స్కూటర్ డ్రైవర్ పరారైనట్లు సమాచారం. ఘటనపై ములకలచెరువు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టపగలే భారీ చోరీ
– బంగారు నగలు అపహరణ గుర్రంకొండ: పట్టపగలే దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో దాచి ఉంచిన 120 గ్రాముల బంగారు నగలను చోరీ చేసుకెళ్లిన సంఘటన మండలంలోని గుర్రంకొండ మేజర్ పంచాయతీ తలారివాండ్లపల్లెలో జగిరింది. గ్రామానికి చెందిన రాజన్న దంపతులు వ్యవసాయం చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామానికి పక్కనే పొలాలు ఉండడంతో ఉదయం పొలం వద్దకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి చేరుకొంటారు. ఈనేపథ్యంలో గురువారం పొలం వద్దకు వెళ్లి వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి చేరుకొన్నారు. తలుపు తాళాలు బద్దలు కొట్టిన దృశ్యాలు కనిపించాయి. ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. బీరువాతలుపులు తెరచి లాకర్ను బద్దలు కొట్టినట్లు గుర్తించారు. లాకర్లో ఉన్నబంగారునగలు కనిపించక పోవడంతో బాధితులు ఆందోళన చెందారు. గుర్తుతెలియని దుండగులు ఇంట్లో చొరబడి 120 గ్రాముల బంగారు నగలు చోరిచేసుకెళ్లినట్లు బాధితులు పేర్కొన్నారు. ఈ సంఘటనపై స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రొంపిచెర్ల: రొంపిచెర్ల గ్రామ పంచాయతీలోని జాండ్రవీధిలో నగదు, పట్టు చీరలు, బంగారు నగలు చోరీకి గురైనట్లు బాధితులు రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జాండ్రవీధికి చెందిన రామస్వామి, మునెమ్మ బుధవారం వ్యవసాయ పనుల కోసం స్వగ్రామం చెంచెంరెడ్డిగారిపల్లెకు వెళ్లారు. దీంతో ఇంట్లో ఎవరు లేరని తెలుసుకున్న దొంగలు బుధవారం రాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి రూ.30 వేలు నగదు, నాలుగు గ్రాములు బంగారు నగలు, రూ.80 వేలు విలువ చేసే నాలుగు పట్టు చీరలు ఎత్తుకెళ్లారు. గురువారం సాయంత్రం ఇంటికి వచ్చిన దంపతులకు ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటం గమనించారు.లోపలికి వెళ్లి చూడగా బీరువా పగల గొట్టి చోరీ చేశారని గుర్తించారు. అనంతరం రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుసూధన్ తెలిపారు. ఆర్టీసీ బస్సులో బంగారు గొలుసు చోరీ సదుం: మండలానికి చెందిన ఓ మహిళ బంగారు గొలుసు చోరీకి గురైంది. బాధితురాలి కథనం మేరకు..నడిగడ్డకు చెందిన సంపూర్ణమ్మ చంద్రగిరి బైపాస్ రోడ్డులో సదుం వచ్చేందుకు పుంగనూరుకు వెళ్లే ఏపీ03టీడీ8667 నంబరు గల ఆర్టీసీ బస్సు ఎక్కింది. రద్దీగా ఉండటంతో నిలుచుని ప్రయాణం చేసిన ఆమె మార్గ మధ్యంలో సీటు ఖాళీ కావడంతో కూర్చుంది. ఆమె పక్కన కూర్చున్న ఇద్దరు మహిళల్లో ఒకరు తనకు వాంతి అయ్యేలా ఉందని, జరగాలని చెప్పింది. సంపూర్ణమ్మ జరిగి కూర్చున్న కొద్ది సేపటికే వారిద్దరు బస్సు దిగారు. పాకాల సమీపంలో తన మెడలోని 28 గ్రాముల బంగారు బొట్టుగొలుసు కనిపించక పోవడంతో బస్సు ఆపాలని కండెక్టరును కోరింది. కానీ ఆమె బస్సు ఆపేందుకు నిరాకరించింది. మార్గమధ్యంలో ఏదో ఒక పోలీసు స్టేషన్ వద్ద ఆపాలని మొరపెట్టినా పట్టించుకోలేదని ఆమె కన్నీటి పర్యంతం అయింది. చివరకు సదుం పోలీసు స్టేషన్ వద్ద ఆపాలని కోరినా ఆపకుండా బస్టాండులో ఆపారని బాధితురాలు తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పింది. -
మిట్స్ ప్రొఫెసర్కు అరుదైన గుర్తింపు
కురబలకోట: మదనపల్లె సమీపంలోని అంగళ్లులోని మిట్స్ డీమ్ట్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, అలుమ్ని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ గుత్తి నాగశ్వేత ఐఈఈఈ సీనియర్ మెంబర్ గ్రేడ్ సాధించి గౌరవాన్ని అందుకున్నట్లు వీసీ యువరాజ్ గురువారం తెలిపారు. ఇంజినీరింగ్, సాంకేతిక రంగాల్లో పదేళ్లకు పైగా అనుభవం, పరిశోధనల్లో చేసిన కృషి, సాంకేతిక సేవలు, నాయకత్వ లక్షణాలు, వృత్తి పరమైన నైపుణ్యాలును గుర్తిస్తూ ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించిందన్నారు. డాక్టర్ గుత్తి నాగశ్వేత అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పరిశోధన పత్రాలను సమర్పించడమే కాకుండా విద్యార్థులలో పరిశోధన దృక్పథాన్ని పెంపొందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. చాన్స్లర్ డాక్టర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి, ప్రోచాన్స్లర్ నాదేళ్ల ద్వారకనాఽథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదేళ్ల, రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్కుమార్, ఐఈఈఈ కోఆర్డినేటర్ సి.కుమార్ అధ్యాపకులు, సిబ్బంది నాగశ్వేతను అభినందించారు. -
నల్లని మేఘం తెల్లముఖం వేసింది.. జోడెద్దుల కాడి మూలనపడి మూలుగుతోంది.. పొలంలో పడాల్సిన విత్తనం సంచుల్లోనే ఉండిపోయింది..వెరసి నేలతల్లి బీడుగా మారింది.నింగీనేల కేసి చూస్తూ రైతు ముఖం నిలువునా వాడిపోయింది. ఖరీఫ్ ముంగిట దరువేయడానికి ‘కరువు’రాకాసిలా దూసుకొస్తోంద
సాక్షి, మదనపల్లె : ఖరీఫ్ పంటల సాగు పాతికేళ్ల చరిత్రలో ఎన్నడూ చూడని దుర్భిక్ష పరిస్థితి ప్రస్తుతం జిల్లా రైతాంగాన్ని వెంటాడుతోంది. ఎల్నినో రూపంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, రైతులు కనీసం తమ ఇంటి అవసరాల కోసం అవసరమైన పంటలను కూడా సాగు చేయలేని పరిస్థితికి వచ్చారు. కూటమి ప్రభుత్వం రాక ముందు వరకు ఈ పరిస్థితి రైతులకు ఎదురు కాలేదు. 2024 ఖరీఫ్ నుంచి వరుసగా రైతులకు ఎదురు దెబ్బలు పడుతున్నాయి. పంటలు సాగు చేయలేని నిస్సహస్థితికి వచ్చారు. గత రెండేళ్ల ఖరీఫ్ లో కరువు పరిస్థితుల్లో వెంటాడితే, ఇప్పుడు ఎల్నినో వెంటాడింది. తీవ్రమైన కరువు, దుర్భిక్షాన్ని తీసుకొచ్చింది. ఖరీఫ్ ముగిసిందిసాధారణంగా ఖరీఫ్ పంటల సాగుకు జూలై 15 వరకు అనుకూలం. జూన్లో వర్షాలు కురవకపోతే జూలై వర్షాలపై ఆధారపడి పంటలు సాగవుతాయి. ఏప్రిల్ మూడో వారం నుంచి దుక్కులు దున్ని, మీ చివరి నాటికి పంటలు విత్తడం, జూలై నెలాఖరుకు అన్ని పంటల సాగు పూర్తి చేస్తారు. ప్రస్తుత ఖరీఫ్లో ఈ పరిస్థితి లేదు. జూన్లో వర్షపాతం 77.5 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 31.2 మిల్లీమీటర్ల లోటు నమోదైంది. జూలై వర్షపాతం ఒక మిల్లీమీటర్ కూడా కురవలేదు. ప్రధానంగా జూన్ 14 నుంచి (జూలై 16) వరకు జిల్లాలో చినుకు జాడలేదు. ఈ నెలలో 90.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా రెండు వారాలైనా ఒక్క మిల్లీమీటర్ వర్షం కూడా పడలేదు. దీంతో తీవ్ర వర్షాభావం మధ్య ఖరీఫ్ కథ ముగిసిపోయింది. దారుణమై పంటల సాగుజిల్లాలో గత రెండు ఖరీఫ్లలో కరువు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అంతో ఎంతో పంటలు సాగయ్యాయి. ప్రస్తుత ఖరీఫ్లో మాత్రం పంటసాగన్న మాటే లేకుండా పోయింది. జిల్లాలో ఇప్పటి ఖరీఫ్లో 46,055 హెక్టార్లలో ప్రధాన పంటలు సాగుతాయని అంచనా వేశారు. గత ఖరీఫ్లతో పోలిస్తే ఈ విస్తీర్ణం తక్కువ. అయినప్పటికీ జూలై 11 నాటికి సాగైన విస్తీర్ణం కేవలం 4.28 శాతమే. అంటే కేవలం 1,970 హెక్టార్లలోనే పంటలు సాగు చేశారు. ఇందులో అత్యధిక పంట వేరుశనగ 27,015 హెక్టార్లలో సాగవ్వాల్సి ఉండగా 1,442 హెక్టార్లకే పరిమితమైంది. ఇలా అన్ని ప్రధాన పంటలు కొద్దిపాటి విస్తీర్ణంలోనే సాగయ్యాయి. అంచనా వేసిన సాధారణ విస్తీర్ణంలో 44,085 హెక్టార్ల భూమి బీడుగా మిగిలిపోయింది. ప్రత్యామ్నాయం లేనట్లేఓ మోస్తారు వర్షాలు కురిస్తే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేందుకు అనువుగా ఉంటుంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉండడం వల్ల ప్రత్యామ్నాయ పంటలు కూడా సాగు కాని పరిస్థితి నెలకొంది. సాధారణంగా జూలై తరువాత ప్రత్యామ్నాయ పంటగా ఉలవలను సాగు చేయాలని ప్రభుత్వం వాటిని పంపిణీ చేస్తుంది. అయితే ఆగస్టు వరకు వర్షాలే లేనప్పుడు ప్రత్యామ్నాయ పంటలు ఎలా సాగుతాయి అన్నది ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో పంటల సాగుపై ఆశలు పెట్టుకోవడం ఇబ్బందికరంగానే ఉంటుంది. ప్రత్యా మ్నాయ పంటలు కూడా సాగు చేయలేనంత దుర్భిక్ష పరిస్థితి ఈ ఖరీఫ్ లో నెలకొంది. జిల్లాలో 2024 ఖరీఫ్లో 19 మండలాలు, 2025 ఖరీఫ్లో 9 మండలాలను కూటమి ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించింది. అయితే ప్రస్తుతం జిల్లా అంతటా కరువు పరిస్థితులు నెలకొన్నాయి.● ఎల్నినో దెబ్బకు ఖరీఫ్ ఖతం ● 46,055 హెక్టార్లకు.. సాగైంది 1,970 హెక్టార్లలోనే ● ఖరీఫ్ చరిత్రలోనే దారుణమైన పరిస్థితి ● బీడుగా 44,985 హెక్టార్లురూ.7 లక్షలతో సాగు చేశా వర్షాలను నమ్ముకుని మూడున్నర ఎకరాల్లో రూ.7 లక్షలు ఖర్చు చేసి ఖరీఫ్లో టమాట సాగు చేస్తున్నా. సకాలంలో వర్షాలు కురిస్తే పంట, పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. లేనిపక్షంలో పంటసాగుకు నీళ్లలేక ఎండిపోక తప్పదు. దేవుడిపై భారం వేసి పంటలవైపు చూసుకొంటున్నా. –సుధాకర్రెడ్డి, టమాట రైతు, తంబళ్లపల్లెపంట పోయినట్టే నెల క్రితం వర్షానికి రెండున్నర ఎకరాల్లో వేరుశనగ సాగు చేశా. విత్తనం వేసిన తర్వాత చినుకు జాడలేదు. కళ్లముందే పంట ఎండిపోయింది. ఇప్పుడు వర్షం కురిసినా పంట పండదు, దిగుబడి రాదు. పెట్టిన పెట్టుబడి, కష్టం నష్టపోవడం తప్ప మరో మార్గం లేదు. వర్షాలు కురిసి పంటలు సాగయ్యే పరిస్థితులు లేవు. ప్రభుత్వం పంట సాగు చేసిన రైతులకు పరిహారం చెల్లించాలి. –గౌతం కుమార్ రెడ్డి, చెన్నామర్రి రైతు, కురబలకోట -
ఎన్సీసీతో క్రమశిక్షణ.. సేవాభావం
కడప ఎడ్యుకేషన్ : ఎన్సీసీ ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తితోపాటు సేవాభావం పెంపొందుతాయని ఎన్సీసీ క్యాంపు కమాండెంట్ కల్నర్ ఎన్. సూర్యనారాయణమూర్తి తెలిపారు. కడప నగరంలోని తెలుగు గంగ కాలనీలో క్యాంప్ కమాండెంట్ కల్నల్ ఎన్. సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో సీఏటీసీ– 5 ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరం గురువారం ఉత్సాహంగా కొనసాగింది. జూలై 15 నుంచి 24 వరకు పది రోజులపాటు జరుగుతున్న ఈ శిబిరంలో కడప, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన సుమారు 600 మంది ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఎన్. సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ నాలుగు జిల్లాల నుంచి టీఎస్సీ (తాల్ సైనిక్ క్యాంప్) రాష్ట్రస్థాయి ఎంపికలకు అర్హత సాధించిన క్యాడెట్లకు మ్యాప్ రీడింగ్, ఫైరింగ్ తదితర విభాగాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని వివరించారు. అలాగే రిపబ్లిక్ డే క్యాంప్ (డీఆర్సీ) కోసం డ్రిల్, ఫైరింగ్, బెస్ట్ క్యాడెట్ తదితర విభాగాల్లో జరిగే ఎంపికలకు క్యాడెట్లను సన్నద్ధం చేసేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. -
నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు చర్యలు
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన జెడ్పీ స్టాండింగ్ కమిటీల సమావేశంలో నీటి ఎద్దడిపై ఆయన సమీక్షించారు. ప్రజలకు తాగునీరు అందించేందుకు తొలుత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాలో వీరబల్లి, సుండుపల్లె, చక్రాయపేట మండలాల్లోని 40 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఏడుకొండలు తెలిపారు. సుమారు 180 మీటర్ల లోతులో భూగర్భ జలం ఉందన్నారు. అందుకే బోర్ల లోతు పెంచుతున్నామన్నారు. దువ్వూరు మండలంలోని చింతకుంట చెరువు నింపగలిగితే పలు గ్రామాలకు తాగునీరు అందించవచ్చన్నారు. దీనిపై చైర్మన్ మాట్లాడుతూ తెలుగుగంగలో అంతర్భాగమైన ఎస్ఆర్–1లో నీరు లేదన్నారు. శ్రీశైలం, వెలుగోడు నుంచి నీరు వస్తేనే చెరువులు నింపగలుగుతామన్నారు. వరికుంట గ్రామంలో తాగునీరు సరఫరా చేయాలని కాశినాయన మండల జెడ్పీటీసీ సత్యంరెడ్డి కోరారు. తహసీల్దార్ కార్యాలయం పక్కన బోరు ఎండిపోయి తాగునీటికి ప్రజలు అవస్థలు పడుతున్నారని పెనగలూరు జెడ్పీటీసీ పెద్ద సుబ్బరాయుడు తెలిపారు. బక్కన్నగారిపల్లె బీసీ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. దప్పేపల్లె దళితవాడ, ఎం.దళితవాడలో బోర్లు వేశాక నీళ్లు పడ్డాయని, ఇక మోటార్లు ఏర్పాటు చేయాలని లక్కిరెడ్డిపల్లె జెడ్పీటీసీ కోరారు. శెట్టిపల్లె తూర్పుపల్లెలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కొత్త బోరు ఏర్పాటు చేయాలని సంబేపల్లె జెడ్పీటీసీ కోరారు. ఆరుతడి పంటలు వేసుకోవాలి ఎల్నినో నేపధ్యంలో శ్రీశైలం నీటి విడుదల పరిస్థితి ఏంటని జెడ్పీ చైర్మన్ కేసీ కెనాల్ కడప జేఈని ప్రశ్నించారు. అందుకు జేఈ బదులిస్తూ జిల్లాలో 92 వేల ఎకరాల కేసీ ఆయకట్టు ఉందని పేర్కొన్నారు. శ్రీశైలం రిజర్వాయర్లో కేవలం 45 టీంఎసీలు ఉన్నాయని తెలిపారు. అందుకే రైతులను ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని సూచిస్తున్నామని పేర్కొన్నారు. ● ఖాజీపేట బైపాస్ వద్ద ఆర్అండ్బీ రోడ్డు చాలా అధ్వానంగా ఉందని, మరమ్మతులు నిర్వహించాలని పలుమార్లు కోరినా అధికారులు స్పందించకపోవడంపై జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు అచ్చుకట్ల కరీముల్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ● చిలమకూరు–కోనాపురం మధ్య ఏడు కిలోమీటర్ల రహదారి మంజూరైందని, పనులు వెంటనే చేపట్టాలని ఎర్రగుంట్ల జెడ్పీటీసీ బాలయ్య కోరారు. సీతారాంపురం వెళ్లాలంటే ఘాట్రోడ్డులో ప్రయాణించాల్సి వస్తుందని, అందుకు తగ్గట్లు బస్సులు కండీషన్లో లేవని పోరుమామిళ్ల జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ అన్నారు. ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందన్నారు. ● ప్రొద్దుటూరుకు బస్సుల సంఖ్య పెంచాలని కో ఆప్షన్ సభ్యులు కోరారు. కడప–వేంపల్లె మధ్య బస్సులు ఏర్పాటు చేయాలని జెడ్పీటీసీ రవికుమార్రెడ్డి కోరారు. ● గనులు భూగర్బశాఖపై జరిగిన చర్చలో చైర్మన్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా సుమారు రూ. 50 కోట్లు సెస్సు రూపంలో జెడ్పీకి రావాల్సి ఉందన్నారు. ఒక మండలంలోని ఒక గ్రామంలో ఎంతమంది చదువు నేర్చుకున్నారో పేర్లతోసహా తనకు ఇవ్వాలని వయోజన విద్య డీడీని చైర్మన్ ఆదేశించారు. పీఎంజీఎస్వై, నాబార్డు పనులకు బిల్లులు వస్తున్నాయా? అంటూ చైర్మన్ ఆరా తీశారు. ఉపాధి హామి, పీఎంజీఎస్వైలో నిధులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని ఉపయోగించి రహదారుల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని జెడ్పీ సీఈఓ సుబ్రమణ్యం సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు బాలయ్య, పలువురు జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి -
వైఎస్సార్సీపీలో నియామకాలు
సాక్షి, మదనపల్లె : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్టీ అనుబంధ విభాగాల పదవుల్లో జిల్లాకు చెందిన పలువురు నేతలను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా లింగం వాణి (కోడూరు), రైతు విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా కాకులారం భాస్కర్ రెడ్డి (పీలేరు), రైతు విభాగం జిల్లా కార్యదర్శిగా కరిమిరెడ్డి నిరంజన్ రెడ్డి (రాయచోటి), ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శిగా కొప్పుల బాలాజీ (రాయచోటి), రజక విభాగం రాజంపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా పెనగలూరు రాజా, చిన్నమండ్యం మండల కార్యదర్శిగా బెల్లం చక్రపాణి రెడ్డి నియమితులయ్యారు. ఏర్పాట్ల పరిశీలనమదనపల్లె టౌన్ : ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు మదనపల్లె పర్యటన నేపథ్యంలో గురువారం కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్, ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో కలిసి సభా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం పాల్గొనే బహిరంగ సభా వేదిక, కార్యకర్తల సమావేశ ప్రాంగణం, వాహ నాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. అలా గే వెంకటమ్మ చెరువులో నిర్వహించనున్న ‘జలధార’ కార్యక్రమానికి సంబంధించిన పనుల పురోగతిని అధికారులు అడిగి తెలుసుకున్నారు. కాగా సీఎం పర్యటన ఎప్పుడనేది అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు. జిల్లా సైన్సు అధికారిగా శ్రీధర్కుమార్మదనపల్లె సిటీ : జిల్లా సైన్సు అధికారిగా జి.శ్రీధర్కుమార్ను నియమించినట్లు డీఈఓ సుబ్రమణ్యం తెలిపారు. పెద్దమండ్యం మండలం గుర్రంవాండ్లదపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా శ్రీధర్ పనిచేస్తున్నారు. గురువారం ఆయన డీఈఓను మర్యాదపూర్వకంగా కలిసి అభినందలు తెలియజేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో సైన్సు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఆకతాయిల కట్టడికి డ్రోన్ నిఘామదనపల్లె టౌన్ : విద్యాసంస్థల వద్ద విద్యార్థినులను వేధించే ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా ముమ్మరం చేశారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా స్కూళ్లు, కళాశాలల వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా మదనపల్లె పట్టణంలో ప్రతిరోజూ డ్రోన్ కెమెరాలతో ఆకాశ మార్గం నుంచి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. డ్రోన్లతో పాటుగా మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ’శక్తి’పోలీస్ టీమ్స్ కూడా స్కూళ్లు, కళాశాలల వద్ద నిరంతరం గస్తీ తిరుగుతున్నాయి. ఆకతాయిలు ఎవరైనా విద్యార్థినులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని, వెంటనే డయల్–112 లేదా సమీప పోలీస్ స్టేషన్న్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. దరఖాస్తుల ఆహ్వానంమైదుకూరు : మైదుకూరు మండలం వనిపెంటలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ వి.నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాల మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులకు అధ్యాపకులుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 22 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం వనిపెంటలోని గురుకుల పాఠశాల, కళాశాలలో సంప్రదించాలని ప్రిన్సిపల్ తెలిపారు. గడుపు పొడిగింపు కడప అగ్రికల్చర్ : జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి వాతావరణ ఆధారిత బీమా కింద ప్రీమియం చెల్లింపునకు ఈ నెల 24 వరకు గడువు పొడించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరావు తెలిపారు. ప్రీమియం చెల్లింపునకు ఈ నెల 15తో ముగిసిన గడువును రైతుల విజ్ఞప్తి వరకు పొడిగించినట్లు వివరించారు. ఇందులో పత్తి, వేరుశనగ, అరటి, చీని పంటలకు సంబంధించిన ప్రీమియం చెల్లింపుకు అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
అప్పాజోస్యులకు ‘గడియారం’ పురస్కారం
కడప సెవెన్రోడ్స్: చీరాలకు చెందిన ప్రముఖకవి, అజో–విభొ–కందాళం ఫౌండేషన్ నిర్వాహకులు, ప్రసిద్ధ కంప్యూటర్ శాస్త్రవేత్త ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ ‘మహాకవి’ డాక్టర్ గడియారం వేంకట శేషశాస్త్రి 45వ సాహిత్య పురస్కారానికి ఎంపికయినట్లు రచన సాహిత్య వేదిక కార్యదర్శి డాక్టర్ భూతపురి గోపాలకృష్ణశాస్త్రి ఒక ప్రకటనలో తెలిపారు. పురస్కార ప్రదాన సభ రచన సాహిత్య వేదిక, గడియారం కుటుంబీకుల సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబరులో ప్రొద్దుటూరులో జరుగుతుందన్నారు. 1982 నుండి ప్రతి ఏటా ఒక ఉత్తమ కావ్యానికి బహూకరిస్తూ వస్తున్న ఈ అవార్డుకు 2025 సంవత్సరానికి ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ రచించిన ‘పంచవటి’ (పంచభూత తారావళులు) అనే పద్యకృతి ఎంపికై నట్లు తెలిపారు. పురస్కార ప్రదాన సభలో ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణకు అవార్డు, రూ.10,000 నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. -
చుడా భూములను పరిశీలించిన జేసీ
పీలేరురూరల్ : స్థానిక ఏపీఐఐసీ ఇండస్ట్రీయల్ పార్క్లోని చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (చుడా) భూములను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్ పరిశీలించారు. నాలుగేళ్ల క్రితం టౌన్షిప్ అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ఏపీఐఐసీ ఇండస్ట్రీయల్ పార్క్కు 30 ఎకరాలు కేటాయించింది. అందులో లేఅవుట్ వేసి మధ్యతరహా ఆదాయం కల్గిన వారికి విక్రయించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. పలు కారణాలతో ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో గురువారం చిత్తూరు జేసీ పరిశీలించారు. ప్రభుత్వం నుంచి అందిన కేటాయింపులు, ఉత్తర్వులు, భూరికార్డులు, సరిహద్దు తదితర వివరాలపై ఆరా తీశారు. ఆర్ఐ మురగయ్య, సర్వేయర్ రెడ్డిశేఖర్, వీఆర్వోలు ఎల్లప్ప, సిద్ధయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు. నీటి సమస్యపై కంట్రోల్ రూంసాక్షి, మదనపల్లె : మదనపల్లె పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యపై మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కమిషనర్ కే.ప్రమీల గురువారం తెలిపారు. పట్టణ పరిధిలో ఏ ప్రాంతంలోనైనా నీటి సమస్య ఉత్పన్నమైనా, నీటి సరఫరా జరగకపోయినా తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. నీటి సమస్యలపై ప్రజలు 08571–222280 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదు అందుకున్న తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. -
కలగానే.. ఇంటర్ కళాశాల!
● జిల్లా కేంద్రంలో కానరాని ప్రభుత్వ బాలుర ఇంటర్ కాలేజీ ● దూరప్రాంతాలకు వెళుతున్న విద్యార్థులుమదనపల్లె సిటీ : జిల్లా కేంద్రమైన మదనపల్లెలో ఇంటర్మీడియట్ ప్రభుత్వ బాలుర కాలేజీ కలగానే మిగిలిపోయింది. స్థానికంగా ఇంటర్ కళాశాల లేకపోవడంతో పదో తరగతి పూర్తయిన విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. లేదా స్థానికంగా ప్రైవేటు కళాశాలల్లోనే చేరాల్సి వస్తోంది. విద్యా కేంద్రంగా పేరు పొందిన మదనపల్లెలో కో ఎడ్యుకేషన్ ప్రభుత్వ ఇంటర్ కాలేజీ లేకపోవడంపై విద్యావేత్తలు మండిపడుతున్నారు. ఇక్కడ ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ ఉంది. ఈ కాలేజీలో అమ్మాయిలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. బీటీ కాలేజీలో మూతపడిన ఇంటర్కోర్సులు చారిత్రక నేపథ్యం ఉన్న బిసెంట్ థియోసాఫిక్ కాలేజీలో ఇంటర్ కోర్సులు ఎత్తివేశారు. కాలేజీలో గతంలో ఇంటర్మీయడ్ విభాగంలో బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ కోర్సులు నడిపారు. ఎంతో మంది పేద,మద్య తరగతి విద్యార్థులు కాలేజీలో అభ్యసించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ కాలేజీలు ప్రభుత్వంలో విలీనం చేయాలని లేకుంటే ప్రైవేటు సంస్థలే నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేయడంతో బీటీ కాలేజీ కొంత భాగాన్ని ప్రభుత్వపరం చేశారు. దీంతో బీటీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీగా మారింది. ఫలితంగా ఐదేళ్లుగా కాలేజీలో ఇంటర్ విద్య మూతపడింది. దూర ప్రాంతాలకు వెళుతున్న విద్యార్థులు మదనపల్లె పరిసర ప్రాంతాల్లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు కొందరు తిరుపతి, విజయవాడకు వెళుతుంటే ,మరికొందరు స్థానికంగా ప్రైవేటు కాలేజీలో చేరుతున్నారు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని పేద, మధ్య తరగతి విద్యార్థులు వాపోతున్నారు. -
రూ.కోట్లు విలువ చేసే ఆస్తిపై పోలీసుల కన్ను
● అనంతపురం ఆస్తి పంచాయతీ.. అన్నమయ్య జిల్లాలో ... ● సంబేపల్లె పోలీస్ స్టేషన్ కేంద్రంగా సివిల్ పంచాయతీ సెటిల్ మెంట్స్. సాక్షి టాస్పోర్ట్స్ : శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక శక్తుల అరాచకాలను అనిచివేయడం, మాదకద్రవ్యాల విక్రయాలను నిలువరించడంతో పాటు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు పోలీస్ స్టేషన్లనే సెటిల్మెంట్ కేంద్రాలుగా మార్చి సివిల్ పంచాయతీలు చేస్తూ రూ.లక్షలు, కోట్ల ఆదాయాలను గడిస్తున్న వైనం చర్చనీయాంశంగా మారింది. కూటమి పాలనలో పోలీసులు వారి విధులను పక్కనబెట్టి అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులు వత్తుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రతి పక్షపార్టీలకు చెందిన వారిపై అధికార పార్టీ నేతలు ఆదేశించినదే తడువుగా అక్రమ కేలసు పెట్టి వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ఇలాంటి పరిస్థితుల్లో రాయచోటి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ట్రిపుల్, డబుల్ స్టార్ల అధికారులు స్టేషన్లనే కేంద్రాలుగా ఏర్పాటు చేసుకొని సివిల్ పంచాయతీలను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు సోషల్మీడియా, వాట్సాప్, దినపత్రికలలో హల్చల్ చేస్తున్నాయి. ఈ కోవలోనే అనంతపురం జిల్లా కేంద్రం నడిబొడ్డున కోట్ల రూపాయాల విలువచేసే ఆస్తి విషయమై జిల్లా రాయచోటి రూరల్ పోలీసులు చేసిన పంచాయితీ, కేసు నమోదు రూపంలో నడిపిన దందా ఇటు పోలీసు అటు ప్రజలలో విమర్శలకు తావిస్తోంది. ఈ పంచాయతీ తాము అనుకున్న రీతిలో దారికి రాకపోవడంతో రాయచోటి రూరల్ స్టేషన్ పరిధిలోని సంబేపల్లె పోలీస్ ఠాణాలో కేసు నమోదు చేసి తమదైన రీతిలో బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమ వద్దకు వచ్చిన వారికి అండగా రాయచోటి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో క్రిమినల్ కట్టు కథను అల్లి ప్రత్యర్థిపై కేసులు నమోదు చేసి బెదిరింపులకు దిగిన సంఘటన పోలీస్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. వివరాలలోకి వెలితే... అనంతపురం పట్టణానికి చెందిన నిస్సార్అహమ్మద్ (డ్రైవర్) అనే వ్యక్తి తనకు వారసత్వంగా వచ్చిన రూ. కోట్ల (8.5సెంట్లు) ఆస్తిని వదిలి కూలీపనుల చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నిస్సార్ అహమ్మద్ అమాయకత్వాన్ని పసిగట్టిన కడప జిల్లా ప్రొద్దుటూర్కు చెందిన షేక్ మహబూబ్లాల్ (ట్రాన్స్కో కార్యాలయంలో పోలీస్) ఆస్తిపై కన్నేశాడు. క్రమంగా అతనితో పరిచయం పెంచుకున్నాడు అన్ని రికార్ఢులు తయారు చేయించి ఆస్తిని విక్రయిస్తే మంచి డబ్బులు వస్తాయని నమ్మపలికాడు. ఫలితంగా తన పేరుపై 8,5 సెంట్ల ఆస్తిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసుకెళ్లి తన పేరున పవర్ ఆఫ్ పట్టాను చేయించుకున్నాడు. త్వరలోనే భూమిని అమ్మి కోట్లకు అధిపతిని చేస్తానని, దీంతో నీ కష్టాలు తీరుతాయని నమ్మపలికించాడు. పవర్ ఆఫ్ పట్టాను పొందిన పోలీసు మరొకరి పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. స్థానికుల ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్న నిస్సార్ అహ్మద్ పోలీస్ దగ్గరకు వెళ్లి కన్నీరు మున్నీరై విలపించారు. జరగుతున్న ఈ తతంగాన్ని గమనించిన ఒక మహిళ వీరిద్దరి నుంచి ఆస్తిని ఎలా కాజేయాలన్న విషయంపై ఆలోచించి నిషార్ అహమ్మద్ తో కలిసి రాయచోటి రూరల్ సీఐని ఆశ్రయించారు. ఈ పంచాయతీ చేస్తే కోట్ల రూపాయలు సమకూరుతుందన్న ఆశతో ఆయన తనకున్న మేధాశక్తిని, అధికారాన్ని ఉపయోగించారు. పవర్ ఆఫ్ పట్టాను పొందిన ప్రొద్దుటూరులోని పోలీసులు పిలిపించి అన్యాయంగా రాయించుకున్న ఆస్తిని తిరిగి రాసివ్వాలని లేక పోతే మీ పై చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం. స్థానిక సీఐ బెదింపులకు లొంగని పోలీసు అక్కడి నుంచి వెల్లి పోయినట్లు సమాచారం. చేసిన పంచాయతీ ఫలించక పోదవడంతో సంబేపల్లె పోలీస్ స్టేషన్లో పోలీస్ మహబూబ్ లాల్ తో పాటు మరో 5 గురిపై ఈ నెల 7 వతేదిన సంబేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే మామిడికాయల లోడు కోసం సంబేపల్లె మండల పరిధిలోని శెట్టిపల్లి గ్రామం సమీపంలోకి మామిడికాయల లోడు కోసం లారీ డ్రైవర్గా నిస్సార్ వచ్చాడు. నిస్సార్ సంబేపల్లె మండల పరిధిలో ఉన్నారన్న విషయం తెలుసుకుని ప్రొద్దుటూరు పోలీసు తన అనుచరులైన మునాఫ్, ఇనాయత్, మహబూబ్లాల్, వహిదాబాను, మహమ్మద్ ఇంతియాజ్, ఎస్ఎంబి ఖాజాలు అక్కడికి వచ్చి భయపెట్టడంతో పాటు కత్తితో చంపుతామని బెదిరించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పొందుపరచారు. అలాగే వచ్చిన వారు తనను కొట్టడంతో కిందపడ్డానని కత్తి చూపించి నా మాటను కాదంటే చంపుతామని బెదిరించామని పేర్కొన్నారు. నాదగ్గర ఉన్న పవర్ ఆఫ్ పట్టా లాక్కొని వారి వెంట తెచ్చుకున్న 100 రూపాయల ఖాళీ డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారని పోలీసులు అల్లిన కథలో ఉంది. ఈ సంఘటన మే 30 వతేదీ జరగగా ఈ నెల7 వ తేదీన కేసు నమోదు చేయడంపై పలు అనుమానాలకు దారి తీస్తోంది. కేసు నమోదుపై తీవ్రంగా స్పందించిన ప్రొద్దుటూరు పోలీస్ రాయచోటి పోలీసులపై చిందులు వేయడంతో పాటు చట్టం తనకూ తెలుసునని తనకు వస్తున్న కోట్ల రూపాయలలో కొంత ఉన్నతాధికారులకు ఖర్చు చేస్తే నాకు ఏమి కాక పోగా మీ ఉద్యోగాలు పోతాయని తిరగబడినట్లు సమాచారం. దీంతో కథ అడ్డం తిరిగిందన్న భయం స్థానిక రాయచోటి రూరల్ పోలీసుల్లో పట్టుకొంది. గుట్టు చప్పుడు కాకుండా జరిగిన ఈ సంఘటన పోలీసులలోనే ఆనోటా..ఈ నోటా ..వ్యాపించి జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలియవచ్చింది. ఈ పంచాయతీ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో పోలీస్స్టేషన్లు సివిల్ పంచాయతీలకు కేంద్రాలుగా మారతాయని నీతి, నిజాయతీ కలిగిన కొంత మంది పోలీసు అధికారులు వ్యాఖ్యానిసుం్తడటం విశేషం. సమస్య చేతులు దాటి ఉన్నతాధికారుల చేతుల్లోకి వెళ్లడంతో స్థానిక పోలీసు అధికారులు ఇరువర్గాలతో మాట్లాడి కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలియ వచ్చింది. రాయచోటి కేంద్రంగా జరుగుతున్న రూ.లక్షలు, కోట్ల రూపాయల సివిల్ సంచాయతీల దందా కారణంగా అనేక మంది నిజాయితీ, అసలైన వారు నష్టాలను, కష్టాలను భరించాల్సి వస్తోంది. ఉన్నత స్థాయి పోలీసు అధికారులు స్పందించి నిజాతీ గల అధికారి ద్వారా విచారణ జరిపిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని స్థానిక ప్రజలు కోరుకొంటున్నారు. ఈ విషయంపై రాయచోటి డీఎస్పీ క్రిష్ణమోహన్ను వివరణ కోరగా ఈ విషయం తనకు తెలియదని, విచారించి వారిపై తగుచర్యలు తీసుకుంటామని చెప్పారు. -
నాణ్యత పాటించకపోతే టెండర్లు రద్దు చేస్తాం
రాయచోటి టౌన్ : టెండర్ల ద్వారా దక్కించుకున్న పనుల్లో నాణ్యత పాటించకుంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా టెండర్లు రద్దు చేస్తామని రాయచోటి శ్రీ వీరభద్ర స్వామి పాలక మండలి అధ్యక్షులు తిరుమల మనోజ్ కుమార్ హెచ్చరించారు. బుధవారం శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో పలు రకాల అభివృద్ధి పనులకు టెండర్లు నిర్వహించారు. స్వామి వారికి ఒక లడ్డూ, రెండు లడ్డూల బాక్స్లు, లడ్డూల కవర్లకు సంబంధించిన వాటికి టెండర్లు నిర్వహించారు. ఈ టెండర్లలో మొత్తం 32 మంది పాల్గొన్నారు. ఆలయ నిబంధనల ప్రకారం తక్కువ ధరలకు (ఎల్1) కోట్ చేసిన టెండర్లు ఖరారు చేస్తామని చెప్పారు. కవర్లు, బాక్స్లకు ఆలయం పేరు కూడా మద్రించాలని సూచించారు. అలాగే ఆలయంలో 42 సీసీ కెమెరాల స్థానంలో 5 ఎంపీ, 8 ఎంపీ ఐపీ కెమెరాలు, ఎన్వీఆర్, ఎస్ఎస్డీ హార్డ్ డిస్క్ల ఇన్స్టాలేషన్, అదనంగా మరో 16 సీసీ కెమెరాల ఏర్పాటుకు కూడా టెండర్లు నిర్వహించారు. వీటిలో కూడా తక్కువ కోట్ చేసిన వారికి ఈ టెండర్ అప్పగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్ ఇంద్ర, పాలక మండలి సభ్యులు గిరి, ఇతరా సభ్యులు పాల్గొన్నారు. -
ముగ్గురు అంతర్రాష్ట్ర గంజాయి నిందితుల అరెస్ట్
● రూ.45 లక్షల విలువ చేసే 6 కిలోల గంజాయి, ఒక బైకు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం ● పోర్టర్ యాప్ ద్వారా బుకింగ్స్.. బెంగళూరు కేంద్రంగా గంజాయి విక్రయం ● వివరాలను వెల్లడించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లిరాయచోటి / రామాపురం : గంజాయి ఇతర మాదకద్రవ్యాల అక్రమరవాణా, వ్యాపారులపై మరింత కఠినచర్యలు చేపడతామని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తీవ్రంగా హెచ్చరించారు. రాయచోటి డివిజన్ పరిధిలోని రామాపురం ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.45 లక్షల విలువ చేసే 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న వివరాలను ఎస్పీ బుధవారం రాయచోటిలో మీడియాకు వివరించారు. అక్రమరవాణాలో భాగస్వాములైన ముగ్గురు అంతర్ రాష్ట్ర నిందితులను అరెస్టు చేసి వారి నుంచి తరలించడానికి సిద్ధంగా ఉంచిన ఆరు కిలోల గంజాయి, ఐదు సెల్ఫోన్లు, ఒక బైకును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడి సమాచారం మేరకు వైజాగ్కు చెందిన బోడన్నా, రాయచోటికి చెందిన ఖాదర్బాషా, బీహార్కు చెందిన ప్రకాష్లు అక్రమరవాణాలో ప్రధాన పాత్రధారులుగా గుర్తించామన్నారు. వీరి ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. వీరు వైజాగ్ నుంచి రాయచోటికి తరలిస్తూ స్థానికంగా విక్రయించడంతో పాటు గుజరాత్, బీహార్, బెంగళూరు ప్రాంతాలకు తరలించనున్నట్లు పోలీసు విచారణలో తేలిందన్నారు. యాప్ ద్వారా బుకింగ్స్ అక్రమ గంజాయి వ్యాపారులు అందుబాటులో ఉన్న ఆదునిక పరిజ్ఞానంతో వ్యాపారాన్ని విస్తరించారన్నారు. ఈ క్రమంలోనే పోర్టర్ యాప్ ద్వారా బుకింగ్స్ చేయడం, విక్రయాలను సాగిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా బెంగళూరు కేంద్రంగా గంజాయి విక్రయాలను అధికంగా కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల సమాచారం ఉంటే ప్రజలు వెంటనే డయల్ 100/112 లేదా టోల్ఫ్రీ 1972కు కాల్ చేసి పోలీసులకు సహకరించాలని ఎస్సీ విజ్ఞప్తి చేశారు. గంజాయి ముఠాను అరెస్టు చేసిన పోలీసులు, అధికారులకు నగదు రివార్డును ఎస్పీ అందజేశారు. మీడియా సమావేశంలో రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, లక్కిరెడ్డిపల్లి సీఐ కృష్ణంరాజునాయక్, రామాపురం ఎస్ఐ కెబి శివకుమార్, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.


