Annamayya
-
తల్లీకుమారులపై మూకుమ్మడి దాడి
మదనపల్లె టౌన్ : తల్లీకుమారులపై ప్రత్యర్థులు మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటన ములకలచెరువు మండలంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. ములకలచెరువు మండలం వేపూరి కోటకు చెందిన దంపతులు రవణమ్మ, చెంగల్రాయుడుల కుమారుడు శంకరప్ప తన ఇంటి నిర్మాణం కోసం పునాది రాళ్లను ఇంటి ముందు తోలుకున్నాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన తన ప్రత్యర్థులు గుడికి వెళ్లే దారిలో రాళ్లను అడ్డంగా తోలాడనే సాకుతో శంకరప్పపై గొడవకు దిగారు. కొడుకుతో గొడవ పడుతుండటం గమనించిన రవణమ్మ వెళ్లి అడ్డుకుంది. దీంతో రెచ్చిపోయిన వెంకటరమణ, రామచంద్ర, ఓబులప్ప, అప్పళ్ల, కిట్ట, రవి, ఆది తదితరులు రవణమ్మ ఇంటి పైకి వచ్చి గేట్లు విరచి తల్లీబిడ్డలపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన బాధితులను కుటుంబీకులు వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చి చికిత్సలు అందించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
దివ్యాంగుడు శంకర్ది హత్యే
మదనపల్లె టౌన్ : మదనపల్లె సిటిఎం రోడ్డులోని తట్టివారిపల్లె చెరువు కట్టపై అనుమానాస్పద స్థిలో మృతి చెందిన దివ్యాంగుడు శంకర్ ది హత్యేనని తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. సోమవారం సీఐ మాట్లాడుతూ కొత్తపల్లె పంచాయతీ కొత్త ఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్(45) ఆదివారం స్థానిక తట్టివారిపల్లె చెరువు కట్టపై ఉన్న గంగమ్మ గుడి నీటి తొట్టి వద్ద అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండటం తెలిసిందే అన్నారు. ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించి సమాచారం అందించగా వెంటనే వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి, పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం స్థానిక జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించామన్నారు. అయితే మృతుడి తల్లి రత్న ఇచ్చిన ఫిర్యాదులో ఆటో డ్రైవర్ సాదిక్, వినయ్ కాంత్లు తన బిడ్డను సిటిఎం రోడ్డులోని ఓ కల్యాణ మండపం వద్దకు తీసుకెళ్లి వారే చంపేసి ఉంటారని పేర్కొనడంతో ఇద్దరిపై హత్య కేసు నమోదు చేశామని చెప్పారు. అంతే కాకుండా డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించి శంకర్ ఒంటిపై బలమైన గాయాలు ఉన్నాయని, బలంగా కొట్టడంతో తలకు దెబ్బతగిలి ప్రాణాలు కోల్పోయాడని నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో దివ్యాంగుడు శంకర్ ది అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చడం జరిగిందన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీఐ చెప్పారు. -
ప్రజల మనిషి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి
● ఆయన వ్యక్తిత్వం మహోన్నతం ● మైదుకూరు మాజీ శాసనసభ్యుడు రఘురామిరెడ్డికడప ఎడ్యుకేషన్ : జిల్లాలో అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి, వారి కోసం పని చేసే నాయకుడిగా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేరు పొందారని మైదుకూరు మాజీ శాసనసభ్యుడు శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలిపారు. సోమవారం ప్రొద్దుటూరులోని తమ స్వగృహంలో వైఎస్ అవినాష్రెడ్డి వ్యక్తిత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తవ్వా వెంకటయ్య రాసి, వ్యాఖ్యానించి, రూపొందించిన డిజిటల్ డాక్యుమెంటరీని రఘురామిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వైఎస్ అవినాష్రెడ్డిపై కొందరు రాజకీయ స్వార్థం, వ్యక్తిగత ప్రయోజనాలు, తమ ప్రాబల్యం పెంచుకోవడం కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అటువంటి వారికి వెంకటయ్య రూపొందించిన డాక్యుమెంటరీ కనువిప్పు కలిగిస్తుందన్నారు. వైవీయూ పాలక మండలి సభ్యుడు, జిల్లా రచయిత సంఘం అధ్యక్షుడు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ తన శిష్యుడు తవ్వా వెంకటయ్య వైఎస్ కుటుంబం పైన అపారమైన అభిమానం ఉన్నవాడని, గత ఎన్నికల సమయంలో అవినాష్రెడ్డి పైన పాట రాసి, తానే స్వయంగా గానం చేశారని అన్నారు. ప్రస్తుతం కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న తరుణంలో.. వారి నోళ్లు మూయించడానికి వైఎస్ అవినాష్రెడ్డి వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైందో కళ్లకు కట్టినట్టు డాక్యుమెంటరీ రూపొందించి, వ్యాఖ్యానించారన్నారు. వైఎస్ జగన్ అడుగుజాడల్లో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎప్పుడూ ఎవరికి కీడు చేయకుండా ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి తన అన్న జగన్మోహన్రెడ్డి అడుగుజాడల్లో నడిచే గొప్ప ప్రజా నాయకుడు అవినాష్రెడ్డి అని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ జిల్లా అధ్యక్షుడు వల్లంబాయి హృషికేశవరెడ్డి మాట్లాడుతూ భూమికి ఎంత సహనం, ఓర్పు ఉందో అవినాష్రెడ్డికి అంతటి ఓర్పు, సహనం ఉన్నాయని అన్నారు. అవినాష్రెడ్డి వ్యక్తిత్వం గురించి కడప జిల్లాలో ప్రతి ఒక్కరికీ తెలుసు కానీ ఆయన అక్కలైన సునీతమ్మ, షర్మిలమ్మకు తెలియకపోవడం శోచనీయం అన్నారు. తవ్వా రూపొందించిన వీడియో ద్వారా అయినా వాళ్లు ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లాలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న వైఎస్ అవినాష్రెడ్డి తనకు మొట్టమొదట రాజకీయాలు పరిచయం చేశాడని, ఆయన వ్యక్తిత్వం మహోన్నతమైందన్నారు. అనంతరం వారు డాక్యుమెంటరీ రూపకర్త తవ్వా వెంకటయ్యను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్త జింకా సుబ్రహ్మణ్యం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ కార్యదర్శి నారాయణరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేశ్వర్ రెడ్డి, తవ్వారుపల్లె మాజీ సర్పంచ్ అమరేశ్వర్రెడ్డి, మైదుకూరు నాయకులు శ్రీనివాస్రెడ్డి, రాజశేఖరరెడ్డి, మైదుకూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రవి, సుబ్బరాయుడు యాదవ్, మైలవరం మండల కన్వీనర్ మహేశ్వరరెడ్డి, సుబ్బారావు, ముద్దనూరు మండల నాయకులు శివప్రసాద్, ప్రొద్దుటూరు పార్టీ అభిమానులు రాజేష్, ఆల్ప్రైడ్, ఓబులేసు, మోషా తదితరులు పాల్గొన్నారు. -
కోదండరామాలయం ప్రభుత్వ ఆధీనంలోకి చర్యలు
పుంగనూరు : పట్టణంలోని నాగపాళెంలో వెలసిన శ్రీ కళ్యాణ కోదండరామస్వామి ఆలయాన్ని, ఆలయ ఆస్తులను దేవదాయశాఖ పరిధిలోకి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా దేవదాయశాఖాధికారి విశ్వనాథ్ తెలిపారు. సోమవారం ఆయన స్థానిక గ్రూపు టెంపుల్స్ కార్యనిర్వాహణాధికారి రమణ, దేవస్థాన సిబ్బందితో కలసి ఆలయాన్ని, ఆలయ ఆస్తులను పరిశీలించారు. త్వరలోనే ఆలయాన్ని దేవదాయ శాఖ పరిధిలోకి చేర్చుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు. -
●50 శాతం తగ్గిన దిగుబడి
● వేరుశనగ రైతుకు భారీ నష్టం ● మూడు నెలలుగా సగానికి పడిపోయిన ధరలు ● సిండికేట్గా మారిన వ్యాపారులు గుర్రంకొండ: జిల్లాలో రబీసీజన్లో వేరుశనగ పంట సాగు చేసిన రైతులు భారీగా నష్టపోయారు. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం 50శాతం మాత్రమే దిగుబడి వచ్చింది. దీనికి తోడు గత మూడు నెలలుగా మార్కెట్లో ధరలు సగానికిపైగా తగ్గిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలోని వేరుశనగ వ్యాపారులు, దళారులు సిండికేట్గా మారి ఇష్టానుసారంగా ధరల్లో కోతలు విధిస్తున్నారనే విమర్శలున్నాయి. అయితే బయట ప్రాంతాల్లో దిగుబడులు వస్తుండడంతో జిల్లాలో ధరలు తగ్గుతున్నాయని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఆరుగాలం కష్టపడి పంట సాగు చేసిన రైతులకు మాత్రం ప్రస్తుతం నిరాశే మిగిలింది. జిల్లాలో రబీసీజన్ల్లో సాధారణ సాగు విస్తీర్ణం 5324 ఎకరాలు ఉండగా ఈ సీజన్లో 1234 ఎకరాల్లో మాత్రమే రైతులు పంట సాగు చేపట్టారు. జలవనరులు, నీటి వసతి పుష్కలంగా ఉన్న పొలాల్లో మాత్రమే రబీసీజన్లో వేరుశనగ సాగు చేపడుతుంటారు. గత ఏడాది 2147 ఎకరాల్లో సాగు చేపట్టగా ఈ సంవత్సరం 1234 ఎకరాల్లో మాత్రమే పంట సాగు చేపట్టడం గమనార్హం. ఎకరం పొలంలో వేరుశనగ పంట సాగు చేపట్టడానికి రైతు ఆర్థిక పరిస్థితిని బట్టి రూ. 70 వేల నుంచి రూ. 80 వేల వరకు ఖర్చు వస్తుంది. దుక్కుల దగ్గర నుంచి విత్తనాలు, ఎరువులు, డ్రిప్ పరికరాలు, పైప్లైన్లు, పంట అదునుకొచ్చాక కోత కూలీలు, కాయలను మార్కెట్కు తరలించే వరకు రూ. 80 వేల వరకు ఖర్చు వస్తుంది. ఎకరం పంట నూర్పిడికి రూ. 15 వేలు.. ప్రస్తుతం ఎకరం పొలంలో వేరుశనగ పంట నూర్పిళ్ల కు కోతల దగ్గర నుంచి యంత్రాలతో కాయలు వేరు చేసే వరకు రూ.15 వేలు వరకు ఖర్చు వస్తోంది. మొ దట పొలంలో చెట్లను పీకీ కుప్పలు వేయాలంటే కూలీలకు రూ.6200, తర్వాత పంట నూర్పిడి చేయాలంటే గంటకు యంత్రానికి రూ. 2200 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఎకరం పొలంలో సాగైన దిగుబడికి సుమారు నాలుగు గంటల పాటు యంత్రాలు పనిచేయాల్సి ఉంటుంది. దీంతో ఎకరానికి యంత్రాలకు అయ్యే ఖర్చు రూ. 8800 వరకు వస్తోంది. సిండికేట్ ఎఫెక్ట్తో ధరల్లో భారీ కోతలు ఓవైపు సగానికి పైగా పంట దిగుబడి తగ్గిపోయి రైతులు నష్టాల్లో ఉంటే మార్కెట్లో మూడునెలలుగా ధరల్లో భారీ కోతలు విధిస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిల్లాలోని వ్యాపారులు, దళారులు సిండికేట్గా మారి నట్టేట ముంచున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది మార్కెట్లో వేరుశనగ బస్తా ధర ఫిబ్రవరిలో రూ. 5 వేల వరకు పలికింది. అయితే పంట కోతలు సీజన్ పుంజుకోవడంతో ధరల్లో భారీగా కోతలు విధించడం దారుణమని రైతులు అంటున్నారు. ప్రస్తుతం 3100లోపే ధరలు పలుకు తుండడం గమనార్హం. దీంతో మూడునెలల క్రితం ఉన్న ధరలతో పోల్చితే ఒక బస్తాపై రూ.1900 నుంచి రూ.2100 వరకు రైతులు నష్టపోతున్నారు. బయట ప్రాంతాల్లో మొదలైన దిగుబడులే కారణమా? జిల్లాలో వేరుశనగ ధరలు పతనమవడానికి బయట ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే మొదలైన పంట దిగుబడులే కారణమని వ్యాపార వర్గాలు అంటున్నాయి. జిల్లాలో ఫిబ్రవరిలో దిగుబడులు ప్రారంభమైన సమయంలో బయట ప్రాంతాల్లో అసలే దిగుబడులు రాలేదని, అందువల్లే ఆనెలలో బస్తా ధర రూ. 5 వేలు వరకు పలికినట్లు వారు చెబుతున్నారు. ప్రస్తుతం అన్నమయ్యతో పాటు తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్, పుట్టపర్తి, అనంతపురం జిల్లాల్లో వేరుశనగ పంట దిగుబడులు ప్రారంభభమయ్యాయి. వాటి ప్రభావంతో ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. రైతుల వాదన మరో విధంగా ఉంది.. ఫిబ్రవరిలో పంటదిగుబడులు కొద్దిగా రావడం, మార్కెట్లో వేరుశనగకు డిమాండ్ ఉండడంతో వ్యాపారులు బస్తా ధర రూ. 5 వేలు పెట్టి కొనుగోలు చేశారని అంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో పంటకోతలు ఊపందుకున్నాయి. దిగుబడులు ఎక్కువగా వచ్చాయి. దీంతో వ్యాపారులు సిండికేట్గా మారి ధరలను ఇష్టానుసారం తగ్గించేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో రబీలో వేరు శనగ సాగు విస్తీర్ణం రూ.70 వేలు ఎకరం పంటసాగుకు అయ్యే ఖర్చుజిల్లాలో ఈ ఏడాది వేరుశనగ పంట దిగుబడి సగానికి పడిపోయింది. గత సంవత్సరంతో పోల్చితే 50 శాతం దిగుబడి మాత్రమే రైతుకు అందింది. . గత ఏడాది ఒక చెట్టుకు సుమారు 30 నుంచి 40 కాయల వరకు దిగుబడి వస్తే.. ప్రస్తుతం ఒక చెట్టుకు 15 నుంచి 20 కాయల దిగుబడి మాత్రమే రావడంతో రైతులకు నష్టం వాటిల్లింది. సాధారణంగా ఎకరం పంట సాగు చేస్తే 40 బస్తాల కాయల దిగుబడి రావాల్సి ఉంది. ప్రస్తుతం 18 నుంచి 20 బస్తాల లోపే పంట దిగుబడి రావడం గమనార్హం. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నెల ధరలు (43 కేజీల బస్తా) ఫిబ్రవరి రూ. 5000 మార్చి రూ.4100 ఏప్రిల్ రూ.3000 8421234 5324 ఎకరాలు ప్రస్తుతం మార్కెట్లో వేరుశనగ పంటకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. మూడునెలల కిందట మార్కెట్లో ఒక బస్తా ధర రూ. 5 వేలకు పైగా పలికింది. పంట దిగుబడులు చేతికొచ్చాక ఇప్పుడు బస్తా రూ. 3 వేలే అంటున్నారు. మార్కెట్లో ధరలు ఇష్టానుసారంగా తగ్గించేయడం ఎంతవరకు సమంజసం. కాయకష్టం చేసి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధరల కల్పించాలి. – వెంకటస్వామి, గుర్రంకొండ. నేను ఎకరం పొలంలో వేరుశనగ సాగు చేశాను. ప్రస్తుతం కోతలు, పంట నూర్పిడి పనులు పూర్తయ్యాయి. తీరా లెక్కిస్తే ఎకరానికి 20 బస్తాల లోపే దిగుబడి వచ్చింది. గత ఏడాది ఎకరం పంటకు సుమారు 40 బస్తాలు వచ్చాయి. ఈ సంవత్సరం దిగుబడి తగ్గిపోయింది. దీంతో పంట సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదు. – నాగార్జున, తలారివాండ్లపల్లె రూ.8.63 కోట్లు -
కేజీబీవీల్లో ప్రవేశాలకు గడువు పెంపు
మదనపల్లె సిటీ: గ్రామీణ ప్రాంతాల్లోని పేద, అనాథ, డ్రాపౌట్, వెనుకబడిన తరగతుల బాలికలకు ఉచితంగా విద్య అందించాలనే ఉద్దేశంతో కస్తూర్బాగాంధీ విద్యాలయాలను(కేజీబీవీ) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునే అవకాశం ఉంది. జిల్లాలో 17 కేజీబీవీల్లో 6వ తరగతిలో 680 సీట్లు, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి 680 ఖాళీ సీట్ల కోసం బాలికలు అధికంగా పోటీ పడుతున్నారు. 6వ తరగతిలో ఇప్పటివరకు 1252 మంది నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 1348 మంది నుంచి దరఖాస్తులు అందాయి. జిల్లాలోని కేజీబీవీల్లో 2026–27 విద్యా సంవత్సరానికి దరఖాస్తు ప్రక్రియ ఈనెల 10వతేదీతో ముగిసింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థుల అభ్యర్థన మేరకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 20వతేదీ వరకు గడువు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 17 కేజీబీవీలు ఉన్నాయి. ఇందులో ఒక్కో కేజీబీవీల్లో 40 సీట్లు చొప్పున 680 సీట్లు ఇంటర్ మొదటి సంవత్సరంలో 40 సీట్ల చొప్పున 680 సీట్లు ఉన్నాయి. ఎంపిక ప్రక్రియ, పర్యవేక్షణ ఇలా... అడ్మిషన్లకు విద్యార్థులు (ఏపీకేజీబీవీ.ఏపీ.సీఎఫ్ఎస్ఎస్.ఇన్)వెబ్ౖసైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికై న విద్యార్థులకు వారి రిజిస్టర్ మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపుతారు. ఎంపిక జాబితాను సంబంధిత పాఠశాలల నోటీసు బోర్డులలో ప్రదర్శిస్తారు. పారదర్శకంగా ఎంపిక జిల్లాలోని కేజీవీవీల్లో అడిషన్లకు ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఎస్సీడీ ఆదేశాల మేరకు ఈనెల 20వతేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచారు.ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది. అర్హులైన బాలికలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. – డాక్టర్ ఎన్.అనురాధ, ఏపీసీ, సమగ్రశిక్ష శాఖ -
ఇళ్లు ఇవ్వకపోతే అద్దెలు కట్టండి
● టిడ్కో గృహాలు ఎప్పుడు ఇస్తారు? ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్యమదనపల్లె : కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇళ్లు మంజూరు చేయాలని, లేనిపక్షంలో వారు ఉంటున్న అద్దె ఇళ్లకు అద్దె చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తే, తాము అధికారంలోకి వస్తే పట్టణాల్లో రెండు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు ఇస్తానని చంద్రబాబు చెప్పి మోసం చేశారన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో లక్షల దరఖాస్తులు ఇళ్ల స్థలాల కోసం ఇస్తే ఇంత వరకు ప్రభుత్వం స్పందించలేదన్నారు. 6.50 లక్షల పింఛన్లు తొలగించి కొత్త పింఛన్లు ఒకటీ ఇవ్వలేదన్నారు. తీసుకుంటున్న వాళ్లు చనిపోతే కానీ.. కొత్త పింఛన్లు ఇవ్వరా అని ప్రశ్నించారు. విద్యుత్ ట్రూ ఆఫ్ చార్జీలు పెంచి కరెంట్ బిల్లులు బాదుతున్నారని అన్నారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఎప్పుడు అప్పగిస్తారని నిలదీశారు. మంత్రి నారాయణ మాటలు నిలబెట్టుకోవాలన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్లు విమానాల్లో తిరుగుతూ ఖజానా కొల్లగొడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపుతారని అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామానాయుడు మాట్లాడుతూ జిల్లాలో పేదలు రెండేళ్లుగా ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు చేసుకున్నా, వాటిని పట్టించుకునే దిక్కు లేదన్నారు. ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్నా ఎవరికీ పట్టడం లేదన్నారు. బి.కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలో 1,050 మందికి ఎన్నికల ముందు పట్టాలు ఇచ్చినా స్థలాలు చూపలేదన్నారు. ఆన్లైన్లో కొత్త దరఖాస్తులు స్వీకరించడం లేదని అన్నారు. ములకలచెరువు మండలం గూడుపల్లి పంచాయతీలో 200 ఎకరాల సోత్రియం భూములను భూస్వాముల నుంచి రెవెన్యూ యంత్రాంగం కాపాడి పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మహేష్, యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు మనోహర్రెడ్డి, సాంబశివ, సిద్ధిగల శ్రీనివాసులు, సుమిత్రమ్మ, టీఎల్ వెంకటేష్, కోటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఒంగిమల్ల రంగారెడ్డి, సలీం బాషా, జక్కల వెంకటేష్, హరికుమార్, తరుణ్, రెడ్డి శేఖర్, నరేష్, సూరి, తిరుమల, దేవా, రఘునాథ్, అంజనప్ప, జగన్బాబు, అంజి, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. -
విషతుల్య మేత తిని 40 గొర్రెల మృతి
గాలివీడు : మండల పరిధి నూలివీడు గ్రామంలోని టౌన్ సచివాలయం సమీపంలో పాడి రైతు ఆదినారాయణ చెందిన 40 గొర్రెలు మృతి చెందినట్లు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మాలకొండయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ శివారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం విషతుల్యమైన మేత తినడం వల్ల గొర్రెలు మృత్యువాత పడినట్లు వారు స్పష్టం చేశారు. అనంతరం మృతి చెందిన గొర్రెల నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపినట్లు తెలిపారు. పొలాల వద్ద మేపు కోసం పశువులను తరలించే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇంత పెద్ద ఎత్తున గొర్రెలు చనిపోవడం బాధాకరమంటూ విచారం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్ ఉమాపతిరెడ్డి గొర్రెల రైతును పరామర్శించి, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పశువైద్యుడు నాగరాజు, ఎల్ఎస్ఏలు సురేష్, ఆకాష్ తేజ, ఖాజా తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర క్రీడా అకాడమీలో ప్రవేశాలకు దరఖాస్తులు
మదనపల్లె సిటీ: రాష్ట్ర క్రీడా అకాడమీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఏప్రిల్ 26 నుంచి ఎంపికలు జరుగుతాయన్నారు. శాప్ ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ క్రీడా అకాడమీల్లో ప్రవేశాలకు అర్హులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వాలీబాల్ కబడ్డీ, అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో ఎంపికలు జరుగుతాయన్నారు. ఇందులో పాల్గొనే క్రీడాకారులు 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలని, 1.1.2008 నుంచి 1.1.2011 మధ్య జన్మించి ఉండాలన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నవారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. క్రీడాకారులు https:// sports.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మదనపల్లె ఆర్ఓకు స్టేషన్ బెయిల్ బి.కొత్తకోట: మదనపల్లె మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ (ఆర్ఓ) జీవి. పల్లవికి స్టేషన్ బెయిలు ఇచ్చామని స్థానిక సీఐ గోపాల్ రెడ్డి సోమవారం చెప్పారు. హైకోర్టులో నడుస్తున్న ఓ కేసుకు సంబంధించి పల్లవి ఆన్ లైన్ విచారణకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దాంతో పల్లవి పోలీస్ స్టేషన్లకు వచ్చి సొంత పూచికత్తు సమర్పించగా బెయిల్ ఇచ్చినట్టు సిఐ చెప్పారు. ఈనెల 30న హైకోర్టులో జరిగే విచారణకు తప్పనిసరిగా హాజరవుతానని ఈ మేరకు ఆమె అఫిడవిట్ ఇచ్చారని సిఐ చెప్పారు. హైకోర్టుకు హాజరు కాకపోతే చర్యలు తీసుకుంటామని ఈ మేరకు ఆర్ఓకు స్పష్టం చేసినట్లు సీఐ తెలిపారు. రేపటి నుంచి ఇజితిమా ధార్మిక సభలు కలికిరి: కలికిరి సమీపం మదనపల్లి–తిరుపతి జాతీయ రహదారి టేకలకోన వద్ద ఈ నెల 15, 16 తేదీల్లో రాయచోటి జిలేకా మైదానీ ఇజితిమా ధార్మిక కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సభలకు సంబంధించి అన్నమయ్య జిల్లాతో పాటు పరిసర జిల్లాల్లో జమాత్ సభ్యులు సుమారు రెండు మాసాలుగా ప్రచారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు హాజరు కానున్నారు.దీంతో ఏపీఐఐసీ స్థలంలో మైదానాన్ని చదును చేసి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు లక్ష మందికి పైగా ముస్లిం సోదరులు హాజరవ్వనున్నట్లు సమాచారం. కాగా ఈ ధార్మిక సభలకు ఉన్నత స్థాయి ఇస్లాం బోధకులు, మత గురువులు హాజరై ధార్మిక ఉపన్యాసాలు చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. గురువారం రాత్రి దువా ప్రార్థనలతో ఇజితిమా కార్యక్రమం ముగియనుంది. ఎయిడ్స్ నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు మదనపల్లె టౌన్: ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ రాధిక హెచ్చరించారు. సోమవారం మదనపల్లె అర్బన్హెల్త్ సెంటర్ లో ఐసీటీసి, ల్యాబ్ టెక్నీషియన్లతో పాటు ఐసీటీసీ కౌన్సిలర్లు, ఏఆర్టీ డాక్టర్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన అడిషనల్ డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. మిషన్ ఎయిడ్స్ సురక్షా కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలను సమర్థ వంతంగా అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా పరీక్షలు, కౌన్సెలింగ్, మందుల సరఫరాలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. క్లస్టర్ ఇన్చార్జి భాస్కర్ మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రులలో కూడా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ రోగులకు సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసీటీసీ సిబ్బంది పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప–తిరుపతి మధ్య తి రుగుతున్న ఏసీ ఎలక్ట్రికల్ బస్సును నడిపేందుకు అర్హులైన డ్రైవర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తె లియజేశారు. ఆసక్తి, అర్హులైన వారు తమ ఆధార్, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ (18 నెలలు పూర్తయి ఉండాలి), ఆర్టీవో క్లియరెన్స్, 8వ తరగతి ఉత్తీర్ణులైన సర్టిఫికెట్, మూడు పాస్పోర్టు సైజ్ ఫో టోలతో తిరుపతిలోని అలిపిరి డిపోకు రావాలని తెలిపారు. ఇతర వివరాలకు 73828 74600, 99598 53427 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
అర్జీలకు సత్వరమే పరిష్కారం
మదనపల్లె టౌన్: పీజీఆర్ఎస్ అర్జీలకు సత్వరమే పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పసరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లాలోని ఆయా మండలాల నుంచి ప్రజలు మొత్తం 392 అర్జీలను కలెక్టర్కు సమర్పించారు.వాటిని పరిశీలించి సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల నుంచి అందిన అర్జీల్లో కొన్ని.. ● మదనపల్లె పట్టణం, నీరుగట్టువారిపల్లెలోని రామిరెడ్డి లేఔట్కు చెందిన లక్ష్మిదేవి తన భర్త మరణించి రెండేళ్లు అయిందని, కుటుంబం గడవటం కష్టంగా మారింది. పీఆర్ఎస్లో కలెక్టర్కు అర్జీ అందజేసింది. తనకు పెన్షన్ ఇప్పించండయ్యా అంటూ విజ్ఞప్తి చేసింది. ● భర్త, పిల్లలు మరణించడంతో నలుగురు మనవ ళ్లను పోషించుకుంటూ కాలం వెలదీస్తున్న తనకు కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలి. తన మన వ ళ్లను రోషన్ కార్డులో చేర్చాలని కురబబల కోట మండలం, తెట్టు పూజారివారిపల్లెకు చెందిన గు ర్రాల వెంకటటలక్ష్మీ కలెక్టర్ కు అర్జీ అందజేసింది. ● తంబళ్లపల్లెకు చెందిన ఎల్లప్పకు కాలు లేదు. నడవ లేని తనకు పింఛన్ ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఇవ్వడం లేదు. కలెక్టర్ స్పందించి పింఛన్ వచ్చేలా చూడాలని వేడుకున్నాడు. ● మదనపల్లె మెప్మా ఆర్పిలకు పనికి తగ్గ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆర్పీలు నిరసన తెలిపారు. 2007 నుంచి 70 మంది రూ.8 వేల జీతంతోనే సేవలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం తమ కస్టాన్ని గుర్తించి, పనికి తగ్గ వేతం రూ.24 వేలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. వెబ్ ల్యాండ్ సమస్యలకు చెక్ అన్నమయ్య జిల్లాలో దీర్ఘకాలంగా పెడింగ్లో ఉన్న వెబ్ ల్యాండ్ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఏళ్లుగా పరిష్కరారం కాని రైతుల వెబ్ ల్యాండ్ సమస్యలను పరిష్కరించి సోమవారం సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఇద్దరు రైతులకు మదనపల్లె కలెక్టరేట్లో వన్–బి పత్రాలను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాత రికార్డులను పరిశీలించి గత కొన్నేళ్లుగా సర్వే నెంబర్ల సవరణలు, కొత్త సర్వే నెంబర్ల చేర్పులు, అడంగల్ వివరాలను సరిదిద్దడం, వంటి సమస్యలతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులకు ఊరట ఇప్పుడు లభించిందన్నారు. భూ రికార్డులను సరిగా ఉంచడంతో రైతులకు అత్యంత కీలకమైన పంట రుణాలు, భూ లావాదేవీలు, ప్రభుత్వ పథకాల లబ్ధి వంటి వాటికి ఉపయోగ పడతాయన్నారు. మిగిలిన ధరఖాస్తులను కూడా వేగవంతంగా పరిష్కరిస్తామని తెలిపారు. రెవిన్యూ శాఖ అధికారులు బాధ్యతతో పనిచేసి ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ -
సబ్స్టేషన్లో షిఫ్ట్ స్కాం !
● కూటమి ప్రభుత్వంలో అమ్మకానికి ఆపరేటర్ పోస్టులు ● ముఖ్యనేతల సిఫార్సులతో సబ్స్టేషన్లోకి ఎంట్రీ ● నకిలీపత్రాల కుంభకోణం వ్యవహారంతో జారుకున్న వైనం రాజంపేట: ఎపీఎస్పీడీసీఎల్ రాజంపేట డివిజన్ పరిధిలోని కడపజిల్లా, తిరుపతి జిల్లా రైల్వేకోడూరు పరిధిలో సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ల స్కాం బట్టబయలైంది. కూటమి ప్రభుత్వంలో సబ్స్టేషన్లలో ఆపరేటర్ పోస్టులు అమ్మకానికి పెట్టారు. ఎపీఎస్పీడీసీఎల్ ఉన్నతస్థాయినుంచి ఒత్తిడి పెట్టి తమకు అనుకూలమైన వారికి ఆపరేటర్ పోస్టులలో భర్తీ చేయించుకున్నారు. అర్హతకు సంబంధించిన పత్రాలను పరిశీలించకుండా డివిజన్ స్థాయి ఉన్నతాధికారి ఒకరు ఏ విధంగా జాయిన్ చేసుకున్నారనే అనుమానాలు తలెత్తాయి. 38 మంది షిఫ్ట్ ఆపరేటర్ల పత్రాల విచారణకు ప్రత్యేకంగా ఎస్పీని నియమించినట్లు చెప్పుకుంటున్నారు. అన్నమయ్య జిల్లాలో రాజంపేట డివిజన్ ఉన్నప్పుడు సబ్స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల్లో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. డివిజన్లోని రెండు నియోజకవర్గాల ముఖ్యనేతలకు షిఫ్ట్ ఆపరేటర్ నియామకంలో భాగంగా ఒక్కో పోస్టుకు రూ.3లక్షల నుంచి రూ.8లక్షల వరకు వసూలు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్ధులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శలు వచ్చాయి. రైల్వేకోడూరు ముఖ్యనేత బామ్మర్ది కనుసన్నల్లో షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టుల నియామకం జరిగిందనే ఆరోపణలు వెలువడ్డాయి. నకిలీపత్రాలతో.. కూటమి ప్రభుత్వంలో నకిలీపత్రాలతో తమకు అనుకూలమైన వారిని సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ కుర్చీల్లో కూర్చొబెట్టారనే అపవాదు మూటకట్టకుంది. వీరిలో ఎక్కువగా నకిలీ ధ్రువీకరణపత్రాలతో ఉన్నారనే విషయం ఇటీవల ఎపీ ఎస్పీడీసీఎల్ చేసిన విచారణలో వెల్లడైంది.ఇలాంటి వారు ముందస్తు సమాచారంతో తమ పోస్టులకు గుడ్బై చెప్పి వెళ్లిపోయారు. పత్రాలను సంబంధిత విద్యాసంస్థలు వెరిఫైకి వెళ్లిన నేపథ్యంలో నకిలీ పత్రాల వ్యవహారం బహిర్గతమైంది. సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ల నియామకం అవినీతితో కూడుకున్నదన్న సమాచారం ట్రాన్స్కో వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రైల్వేకోడూరు నియోజకవర్గంలో చిట్వేలి మండలం కందులవారిపల్లె సబ్స్టేషన్లో చేరిన నలుగురు, నకిలీపత్రాలతో చేరిన వారు విచారణ సమాచారంతో ఆ పోస్టుల నుంచి అపాయిట్మెంట్ ముందే వెనుదిరిగారు. రైల్వేకోడూరు (ఒకప్పుడు అన్నమయ్య జిల్లా )పెనగలూరు, రాజంపేట, నందలూరులో కొంతమంది షిప్ట్ ఆపరేటర్లపై కూడా దృష్టి సారించారు. ఇందులో కొన్ని సబ్స్టేషన్లలో ఉన్న వారు సర్దుబాటు కూడా చేసుకున్నట్లు తెలిసింది. విచారణ నుంచి తప్పించుకున్నారనే ఆరోపణలు వెలువడ్డాయి. అయితే అధికారికంగా కడప జిల్లాలో 38 అనర్హత కలిగిన షిఫ్ట్ ఆపరేటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు చీఫ్ మేనేజర్ రామచంద్రరావు విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. తీగలాగితే డొంక కదిలినట్లుగా అన్ని సబ్స్టేషన్లలో ఏళ్లతరబడి పనిచేస్తున్న వారి విద్యార్హత పత్రాలను పరిశీలించనున్నట్లు ఎపీఎస్పీడీసీఎల్లో ప్రచారం జరుగుతోంది. ఎపీఎస్పీడీసీఎల్ సబ్స్టేషన్ తిరుపతిలోని ఎపీఎస్పీడీఎల్ సీఎండీ కార్యాలయం రాజంపేట డివిజన్లోని రైల్వేకోడూరు, రాజంపేట పరిధిలోనే కాకుండా జిల్లాలోని ఇతర సబ్స్టేషన్లలో ఖాళీ అయిన షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులపై టీడీపీ నేతల కన్నుపడింది. 2014లో టీడీపీ ప్రభుత్వంలో షిఫ్ట్ ఆపరేటర్లుగా చేరిన వారిని తొలగించి, ఇప్పుడు తమకు అనుకూలమైన వారిని నియమించాలని ఎపీఎస్పీడీసీఎల్ డివిజన్న్ స్ధాయి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. బదిలీ చేయాలని ముఖ్యనేత ప్రయత్నిస్తే పచ్చ కాంట్రాక్టర్ అడ్డపడటం చూస్తుంటే ఏ మేరకు లావాదేవీలు కొనసాగుతున్నాయో అవగతమవుతుందని పలువురు సిబ్బంది చెబుతున్నారు. డివిజన్ స్ధాయి అధికారి ఓ టీడీపీ నేత పచ్చ కాంట్రాక్టర్తో సఖ్యతగా ఉంటూ ఇద్దరు తమకు జేబులు నింపే వ్యవహారాలను చక్కబెట్టుకున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి.ఈ విషయం గురించి ఏపీఎస్పీసీఎల్ రాజంపేట డివిజనల్ ఇంజినీర్ రాజశేఖర్రెడ్డిని వివరణ కోరగా అనర్హత కలిగిన, నకిలీ ధ్రువీకరణపత్రాలతో పనిచేసే షిఫ్ట్ ఆపరేటర్లు డివిజన్ పరిధిలో లేరన్నారు. కడప జిల్లాలో రాజంపేట, పాత అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరులో నకిలీపత్రాలతో చేరిన షిఫ్ట్ ఆపరేటర్లు లేరని వెల్లడించారు. -
మావిగన్–అమరావతిపై ప్రజలు ఆలోచించాలి
● ఏది మేలో నిర్ణయం తీసుకోవాలి ● ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డిజమ్మలమడుగు : రాష్ట్ర రాజధానిగా మావిగన్–అమరావతిలలో ఏది మేలో ప్రజలు ఆలోచించి, సరైన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మెల్సీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణా నది ప్రాంతంలో అమరావతి నిర్మాణం జరగుతోందని, ఏటా రాజధానిలోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో, ఆ నీటిని ఎత్తిపోయటానికి ప్రతి ఏడాది 600 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మావిగన్ పేరుతో ప్రతిపాదించిన ప్రాంతంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రాంతాల్లో జాతీయ రహదారులతోపాటు గన్నవరం ఎయిర్ పోర్టులు ఉన్నాయని, ఇలాంటి ప్రాంతంలో నిర్మిస్తే మనకు ఒక రాజధాని త్వరగా ఏర్పడుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు అవుతోందని, ఇంత వరకు రాజధాని కూడా లేని పరిస్థితి ఉందన్నారు. రాజధానిని కొత్తగా ఏర్పాటు చేయాలంటూ.. లక్షల కోట్ల అవసరం అని కూటమి ప్రభుత్వం చెబుతోందన్నారు. అంత డబ్బులు అప్పులు తీసుకుని వచ్చి రాజధాని నిర్మాణం చేపడితే, తీర్చడం ఎలా సాధ్యం అవుతుందన్నారు. అప్పుల మీద అప్పులు తెచ్చి రాజధాని నిర్మాణం చేపడితే భవిష్యత్తులో ఇతర ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయని అన్నారు. అమరావతిలో పెట్టే ఖర్చులో, 20 శాతం పెడితే మావిగన్ ప్రాంతంలో రాజధాని నిర్మాణం అవుతుందని పేర్కొన్నారు. ఏబీఎన్ వార్తలు సరికావు వైఎస్ జగన్మోహన్రెడ్డి మావిగన్ను సూచన చేస్తే.. దానిపై చర్చించాల్సింది పోయి మీడియా ద్వారా జగన్మోహన్రెడ్డిపై అసత్య ప్రచారం చేయడం తగదన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మరింత దిగజారి కార్యకర్తలు, నాయకుల మనోభావాలు దెబ్బతినే విధంగా మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలతో వార్తలు ప్రసారం చేయడం దారుణమన్నారు. ప్రజలు ఒక్క సారి ఆలోచించాలని, మావిగన్ వల్ల రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉంటుందా, లేదా అమరావతి లక్షల కోట్లు రూపాయలు అప్పులు తెచ్చి నిర్మించుకోవడం కరెక్టా అని సూచించారు. బాధ్యతాయుమైన జాతీయ పార్టీలో ఉన్న వైఎస్ షర్మిల.. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గొడ్డలి అంటూ వెటకారంగా మాట్లాడటం సరైంది కాదన్నారు. నిజంగా షర్మిల జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి స్థానంలో ఉండి మావిగన్పై ఒక కమిటీని ఏర్పాటు చేయించి, ఏది మంచిదో తెలుసుకోవాలని తెలిపారు. కేవలం చంద్రబాబు మాయలో పడి వారి ప్రాపగండం కోసం పాకులాడటం తగదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్రెడ్డి, వద్దిరాల రామాంజనేయుల యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు సత్వర న్యాయం చేయండి
మదనపల్లె టౌన్ : బాధితులకు సత్వర న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశించారు. సోమవారం మదనపల్లె జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ హాజరై ఫిర్యాదుదారుల నుంచి నేరుగా అర్జీలు స్వీరించారు. తంబళ్లపల్లె నియోజకవర్గం పిటిఎం మండలం మల్లెలకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ విశ్వనాథ్ ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.4.5 లక్షలకు సైబర్ నేరగాళ్లు మోసం చేయడంతో తన బాధను ఎస్పీకి వివరించి న్యాయం చేయాలని కోరారు. ఇదే కాకుండా ఇంకా భూ వివాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, నకిలీ పత్రాలతో మోసాలు, అధిక వడ్డీలతో వేధించడం, ప్రేమ పేరుతో మోసాలు, మైనర్లను పెళ్లిళ్లు చేసుకోవడం వంటి ఇతరత్రా సమస్యలను ప్రజలు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందించిన ఎస్పీ వెంటనే సంబంధిత ప్రాంత పోలీస్ అధికారులకు ఫోన్ చేసి బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని ఆదేశించారు. సమస్యలపై ఆలస్యం చేయరాదని సూచించారు. చట్టపరమైన చర్యలు తీసుకున్న వెంటనే, ఆ వివరాలతో కూడిన నివేదికలను జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి అందజేయాలని ఎస్పీ ఆదేశించారు. ప్రయివేట్ సంస్థపై ఫిర్యాదు మదనపల్లె పట్టణంలో ఉన్న టీవీఎఫ్ ప్రయివేటు ఫైనాన్స్ సంస్థ వేధింపులపై బాధి తురాలు సోమవారం స్థానిక జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి ఫిర్యాదు చేసింది. పట్టణానికి చెందిన అంజలీ టీవీఎఫ్ ప్రయివేట్ ఫైనాన్స్లో రూ.40 వేలు రుణంగా తీసుకుంది. ఆ అప్పును సకాలంలో చెల్లిస్తున్నా వడ్డీ అసలు ఇకే సారి కట్టాలని వేధిస్తుండడంతో బాధను తాళలేక బాధితురాలు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది. తనను ఆదుకోవాలని కోరింది. ఇళ్ల స్థలాలు లాకున్నారు.. పెద్దమండ్యం మండలం బండ్రేవుకు చెందిన బషీర్ బాషా తన ఇంటి స్థలం అదే ఊరికి చెందిన ఖాదర్ బాషా లాక్కొన్నాడని పీజీఆర్ఎస్లో ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. -
కీర్తన హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి
ఖాజీపేట : మండలంలోని అగ్రహారం గ్రామంలో రామకీర్తన దారుణ హత్యపై ఆదివారం ప్రజా సంఘాల నాయకులు నిజనిర్ధారణ నిర్వహించారు. కీర్తన హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం బాలిక తల్లిదండ్రులు, బంధువులు, చుట్టపక్కల వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ కీర్తన ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఇంట్లోకి వెళ్లి దాడి చేసి గొంతు కోసి చంపాడని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారన్నారు. ఏడాది ముందు నిందితుడు కీర్తనను ప్రేమించమని బలవంతం చేశాడు. బాలిక తండ్రి, సోదరులు వెంకటేష్ను హెచ్చరించారన్నారు. వెంకటేష్, ప్రవీణ్కుమార్ తమ్ముడు తనపై దాడి చేశారని కీర్తన చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. ఇద్దరిపై ఫిర్యాదు చేస్తే కేవలం వెంకటేష్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. మృతురాలి ఇంటి దగ్గర కెనరా బ్యాంక్ సీసీ టీవీ పుటేజీని కొందరి ఒత్తిడి మేరకు తొలగించారన్నారు. నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించాడని, ఇద్దరు పోలీసులపై రాళ్లతో దాడి చేశాడని, అతన్ని ఆపడానికి జరిపిన కాల్పులలో కాలికి బుల్లెట్ గాయమైందని పోలీసులు తెలిపారన్నారు. కానీ పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు ఎలా దాడి చేయగలిగాడని ప్రశ్నించారు. వైద్యులు ఇచ్చిన నివేదికలో ఫ్రాక్చర్ అనే మాట వినిపిస్తోందని, బుల్లెట్ లభ్యమైనట్లు తెలియలేదన్నారు. కీర్తన అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటలకే నిందితుడి తల్లి మీడియాతో తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారన్నారు., కీర్తన, వెంకటేష్ల ప్రేమ వ్యవహారం తనకు తెలియదని, ఘటన జరిగిన రోజు తన కుమారుడు ఇంటికి వచ్చి ప్రేమ విషయంలో కీర్తన తనను మోసం చేసిందని తెలిపాడన్నారు. ఈ విషయం అడగడానికి వెళితే కత్తితో గొంతు కోసుకుంటానని బెదిరించిందని, పెనుగులాటలో గొంతు కోసుకుందని చెప్పాడని ఆమె తెలిపారు. దీనిని బట్టి నిందితుడిని రక్షించే ప్రయత్నం ప్రారంభమైనట్లు తెలుస్తోందని ప్రజాసంఘాల నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండాలని, వారికి అవసరమైన సహాయ సహకరాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్, ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్, చైతన్య మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పద్మ, కమిటీ సభ్యురాలు అనిత, జేవీవీ సమత అధ్యక్షురాలు అరుణ, రాయలసీమ మహిళా శక్తి కార్యదర్శి వడ్ల లక్ష్మీదేవి, సీపీఎం మండల ఇన్చార్జి రాజశేఖర్, సాగర్, వెంకీ తదితరులు పాల్గొన్నారు.నిజనిర్ధారణ కమిటీ సభ్యులు -
రెడ్డెమ్మా..చల్లంగా చూడవమ్మా
గుర్రంకొండ: రెడ్డెమ్మతల్లీ చల్లంగా చూడవమ్మా అంటూ భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయానికి ఆదివారం ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో పవిత్ర స్నానమాచరించారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన వారు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.హిందువులతో పాటు ముస్లింలు అమ్మవారి ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించారు. -
తాళం వేసిన ఇంట్లోచోరీ
ములకలచెరువు : తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన సంఘటన శనివారం రాత్రి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుడు, పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కాలువపల్లెకు చెందిన సురేష్ స్థానికంగా ఉన్న వినాయక్నగర్లోని ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడు. శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి కాలువపల్లెకు వెళ్లారు. గమనించిన దుండగులు గేటు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగలగొట్టి అందులోని రూ. 85 వేల నగదు, 35 గ్రాముల బంగారు ఆభరణాలు, 150 గ్రాముల వెండి దొంగలించారు. ఆదివారం ఉదయం ఇంటి యజమాని గమనించి బాధితుడికి సమాచారం అందించారు. అదేవిధంగా పక్కనే ఉన్న రమణ ఇంటిలోకి జొరబడేందుకు దొంగలు ప్రయత్నించారు. కానీ ఇంట్లో మనుషులను చూసి వెళ్లిపోయినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. -
కారు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : కారు ఢీకొని ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. ఘటనపై బాధితులు, వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని మాలేపాడు పంచాయతీ. ఆవులపల్లెకు చెందిన వెంకటేష్, గంగరాజు, శివలు బైక్లో స్థానిక టమాటా మార్కెట్యార్డు వద్ద ఉన్న కుటుంబ సభ్యుల వద్దకు వెళుతుండగా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కారు ఢీకొని ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి చికిత్స అనంతరం గంగరాజుకు కాలు విరగడంతో తిరుపతికి రెఫర్ చేశారు. కాగా ప్రమాదానికి కారణమైన కారు నిలపకుండా వెళ్లిపోయినట్లు బాధితులు తెలిపారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొని.. పీలేరురూరల్ : రోడ్డు ప్రమాదంలో యువకునికి తీవ్రగాయాలైన సంఘటన మండలంలోని మొరవవడ్డిపల్లె వద్ద చోటు చేసుకుంది. వివరాలిలావున్నాయి. పీలేరు పట్టణం నాగిరెడ్డి కాలనీకి చెందిన వాసిఫ్ (30) ద్విచక్రవాహనంలో తలపులకు బయలుదేరాడు. ముందు వెలుతున్న ఆటోను ఓవర్టేక్ చేయబోయి తలపుల నుంచి పీలేరు వైపు ఎదురుగా వచ్చిన కారును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో వాసిఫ్కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్సనిమిత్తం ఆయన్ను పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరో ప్రమాదంలో.. మదనపల్లె టౌన్ : రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. వినుకొండకు చెందిన తిరుపాల్ కుమారుడు తిరుమల దావీదురాజు(26) బైకులో సొంతపనిపై మదనపల్లె మీదుగా పుంగనూరు రోడ్డులో వెళుతుండగా స్థానిక తట్టి వారిపల్లె బైపాస్ రోడ్డులో హైవే రోడ్డు పనులు గమనించ కుండా వేగంగా వెళ్లాడు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితున్నిస్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించడంతో కోలుకుంటున్నాడు. -
అయోమయం.. అటవీ పాలన !
● మూడుజిల్లాల్లో రాజంపేట ఫారెస్టు ● తేలని జిల్లాల అటవీ విభజన వ్యవహారం ● పత్తాలేని రీ ఆర్గనైజేషన్ కమిటీ ● ఆందోళనలో అటవీ సిబ్బంది రాజంపేట: అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన రాయలసీమలోని ఎర్రచందనానికి నిలయమైన రాజంపేట అటవీ డివిజన్ మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. దీంతో పాలనలో సందిగ్ధత నెలకొందన్న వాదన అటవీశాఖలోనే వినిపిస్తోంది. మూడు జిల్లాల్లో రాజంపేట అటవీ ప్రాంతం విస్తరించిన నేపథ్యంలో ఎవరి జిల్లా పాలన వారే చేయాలా..లేక ఇతర జిల్లాకు చెందిన పాలన రాజంపేటలోనే చేయాలా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. సమస్యను రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకెళ్లలేని పరిస్ధితిలో ఉన్నారని తెలుస్తోంది. తేల్చని కూటమి ప్రభుత్వం... అటవీపాలన విడ్డూరంగా తయారైందన్న విమర్శలున్నాయి. జిల్లా సరిహద్దులకు సంబంధించి కూడా రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించలేదు. రాజంపేట, మార్కాపురం లాంటి ప్రాంతాల్లో పాలనకు సంబంధించి సమస్యలు తలెత్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రీ ఆర్గనైజేషన్ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు అటవీవర్గాలు చెపుతున్నాయి. ఆ కమిటీ పత్తాలేకుండా పోయింది. అటవీశాఖ మంత్రి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అటవీపాలనపై పట్టుకోల్పోతున్నారనే విమర్శలు అటవీవర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అటవీసిబ్బందిలో ప్రాంతీయ ఆందోళన కొత్త జిల్లాల స్వరూపం మారిన నేపథ్యంలో రాజంపేట అటవీ డివిజన్ సిబ్బందిలో ప్రాంతీయ ఆందోళన నెలకొంది. ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది తమ విధులను మూడుజిల్లాలో అందిస్తున్నారు. ఏ జిల్లా పరిధిలో ఉంటే అక్కడేఊ జిల్లా అటవీశాఖాధికారి పర్యవేక్షణలో పాలన జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్ధితులు కనిపించడంలేదు. తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల పరిధిలో రాజంపేట ఫారెస్టు డివిజన్ ప్రాంతం ఉంది. రాజంపేట అటవీ డివిజన్ కడప జిల్లాలో ఉంది. డివిజన్కు చెందిన రేంజ్లు తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలో ఉన్నాయి. కడపలో అన్నమయ్య అటవీ జిల్లా కార్యాలయం.. అన్నమయ్య జిల్లా (మదనపల్లె)అటవీ కార్యాలయం వైఎస్సార్ కడప జిల్లాలో ఉంది. ఇక్కడి నుంచి పాలన కొనసాగుతోంది. అయితే ఈ కార్యాలయం జిల్లా కేంద్రమైన మదనపల్లెలో ఏర్పాటుకావాల్సి ఉంది. అక్కడి నుంచే జిల్లా అటవీపాలన కొనసాగించాల్సి ఉంటుందని అటవీ వర్గాలే అంటున్నాయి. ఇక్కడి అటవీ పాలన కడప డీఎఫ్ఓ పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ అలా ఇప్పుడు జరగడంలేదని అటవీ వర్గాలు అంటున్నాయి. రేంజ్ ఇక్కడ...జిల్లా అక్కడ... రాజంపేట డివిజన్ పరిధిలో రేంజ్లు ఇక్కడ ఉన్నాయి. జిల్లా వేరుగా ఉంది. రైల్వేకోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలోకి వెళ్లిపోయింది. దీని పరిధిలో ఉన్న చిట్వేలి రేంజ్, రైల్వేకోడూరు సబ్డీఎఫ్ఓ, బాలపల్లె రేంజ్లు ఒకప్పుడు రాజంపేట ఫారెస్టు డివిజన్లో కొనసాగాయి. ఇప్పుడు ఈరేంజ్ తిరుపతి జిల్లా పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం అన్నమయ్య అటవీజిల్లాలో కొనసాగుతోంది. తిరుపతి డీఎప్ఓ కంట్రోల్లోకి ఈ రేంజ్లు వెళ్లాల్సి ఉంటుందని అటవీ వర్గాలు చెబుతున్నాయి. ఏ జిల్లాకు ..ఆ జిల్లా రేంజ్లను అప్పగిస్తే గందరగోళ పరిస్థితులు ఉండవని సిబ్బంది అంటున్నారు. జిల్లా పరిధి రేంజ్లు అన్నమయ్య పీలేరు, రాయచోటి, మదనపల్లె కడప రాజంపేట, సానిపాయి తిరుపతి చిట్వేలి, కోడూరు, బాలపల్లె 1966 నుంచి రాజంపేట ఫారెస్టు డివిజన్ కొనసాగింది. ముందుగా కడప జిల్లాలోనే ఉండేది. తిరిగి కడప జిల్లాలోకి వెళ్లింది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు క్రమంలో అన్నమయ్య జిల్లాలోకి రాజంపేట ఫారెస్టు డివిజన్ చేరింది. మళ్లీ ఇప్పుడు జిల్లాల విభజన క్రమంలో రాజంపేట ఫారెస్టు డివిజన్ కడపలోకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే అన్నమయ్య జిల్లా అటవీ పాలన ఇక్కడి నుంచి కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఐఎఫ్ఎస్ల రాజ్యం కొనసాగింది. డీఎఫ్ఓ కార్యాలయం సబ్డీఎఫ్ఓ కార్యాలయంగా మారనుందని సంకేతాలు వస్తున్నాయి. -
ఇరు వర్గాల మధ్య ఘర్షణ
మదనపల్లె టౌన్ : మదనపల్లె మండలంలోని గుడిసివారిపల్లెలో ఆదివారం రెండు వర్గాల మద్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలోఅన్నా చెల్లెలు కత్తిపోట్లకు గురైయ్యారు. బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై సీఐ కళా వెంకటరమణ తెలిపిన వివరాలు.. మండంలోని కొత్తవారిపల్లె పంచాయతీ, గుడిసివారిపల్లెకు చెందిన ఏ.పవన్ కుమార్(30), అతని చెల్లెలు ఏ.భవాని (25) లకు అదే ఊరికి చెందిన అన్నదమ్ములు నవీన్. అనూప్ వర్గానికి పాత గొడవలు ఉన్నాయి. ఆదివారం ఇరు వర్గాలు మాటామాట పెంచుకుని దూషణలకు దిగారు. ఈ గొడవ తారా స్థాయికి చేరి ఒకరిపై మరొకరు కర్రలు, కత్తులతో పర్సపర దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో అన్నా చెల్లెలు పవన్ కుమార్, భవాని కత్తి పోట్లకు గురికాగా పవన్కుమార్ తల్లి అంజమ్మ, మేన మామ రెడ్డెప్ప లపై ప్రత్యర్థులు నవీన్, అనూప్ లు కర్రలు, కత్తులతో దాడులు చేశారని తెలిపారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి పవన్ కుమార్, అతని చెల్లెలును తిరుపతికి రెఫర్ చేశారు. కాగా గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. నవీన్ బైక్ను పవన్ కుమార్ వర్గీయులు తగల బెట్టడంతో మంటల్లో కాలి పోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అన్నా చెల్లెలుకు కత్తి పోట్లు -
పనిలేని పర్యాటకశాఖ
● జిల్లా పరిధిలో హార్సిలీహిల్స్ ఒక్కటే యూనిట్ ● ఇది తిరుపతి డీవీఎం పరిధిలోకి వస్తుంది ● ఇక్కడి జిల్లా అధికారులకు పనిలేదుమదనపల్లె : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన పర్యాటకశాఖకు ఇప్పుడు పని లేకుండా పోతోంది. అంతేకాదు ఉనికి కోల్పోయే పరిస్థితికి వచ్చింది. రూ.కోట్లాది ఆదాయంతో కళకళలాడిన టూరిజం యూనిట్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. పర్యాటకశాఖపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో ఆ శాఖ మనుగడ కోల్పోయే పరిస్థితికి వచ్చింది. భవిష్యత్తులో ఇంకెలాంటి పరిస్థితులు దాపురిస్తాయోనని అధికారులు, శాఖను నమ్ముకుని జీవిస్తున్న సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు ఒక్కటే అన్నమయ్య జిల్లాలో పర్యాటక ప్రాంతాలు లేవు. ఉన్న ప్రాంతాలను పర్యాటకశాఖ పరిధిలోకి తీసుకొని అభివృద్ధి చేయాలన్న ధ్యాస ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. దీంతో జిల్లా స్థాయిలో ఉన్న పర్యాటకశాఖకు ఏమాత్రం పని లేకుండా పోయింది. జిల్లాలో ఉన్న ఏకై క పర్యాటక ప్రాంతం హార్సిలీహిల్స్. ఇది బి.కొత్తకోట మండల పరిధిలోకి వస్తుంది. పాలనాపరంగా తిరుపతి పర్యాటకశాఖ డివిజన్ పరిధిలో ఉంది. అన్నమయ్య జిల్లాకు ఒక పర్యాటక అధికారిని, ఒక జూనియర్ అసిస్టెంట్ను నియమించగా వీరికి ఒక కార్యాలయాన్ని కూడా కేటాయించారు. అధికారి ఉన్నారన్న మాటేకాని చేతికి పనిలేదు. జిల్లా అధికారి పరిధిలో పర్యాటక ప్రాంతాలు లేవు. పీలేరు, బోయకొండ కొన్నిచోట్ల పర్యాటకశాఖ అతిథి గృహాలు నిర్మించాలని ప్రయత్నాలు చేస్తోంది కానీ ఇంతవరకు వాటి మంజూరు జరగలేదు. దీంతో అధికారులతో పని లేక కార్యాలయంలో ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది. ప్రైవేటుకు అప్పగింత ఉమ్మడి చిత్తూరు జిల్లాకు తిరుపతి కేంద్రంగా పనిచేస్తుంది. ఇక్కడి నుంచి డివిజనల్ అధికారి టూరిజం యూనిట్లను పర్యవేక్షిస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వం ఈ అధికారి పరిధిలోని ముఖ్యమైన టూరిజం యూనిట్లను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది. చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు, నగరి టూరిజం యూనిట్లు, తిరుపతిలోని అలిపిరి హోటల్ను ఓ అండ్ ఎం పద్ధతిలో ప్రైవేట్ వాళ్లకు ఇచ్చేశారు. ఇప్పుడు పర్యాటకశాఖ పర్యవేక్షణలో ఇవి లేవు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున టూరిజంకు కేటాయిస్తున్న దర్శనం టికెట్లను రద్దు చేయడంతో భారీ నష్టం వాటిల్లుతోంది. దర్శనం టికెట్ల ఆధారంగా టూరిజం రవాణా శాఖ కోట్లాది ఆదాయం అర్జించేది. కూటమి ప్రభుత్వం వచ్చాక దర్శనం టికెట్లు రద్దు చేయడంతో రవాణ యూనిట్ దారుణంగా దెబ్బతింది. రూ.కోట్ల నష్టం రావడమే గాక నమ్ముకున్న కార్మికులకు ఉపాధి కష్టతరమైంది. తిరుమలలో టూరిజంకు కేటాయించిన అతిథి గృహాలను టీటీడీ స్వాధీనం చేసుకుంది. దాంతో డివిజన్ కార్యాలయానికి పని భారం తగ్గిపోయింది. ఉన్నవి ఇవే తిరుపతి డివిజన్ పరిధిలో ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోని హార్సిలీ హిల్స్, తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లాలోని పులిగుండు, కై లాసనాథకోన యూనిట్లు మాత్రమే నడుస్తున్నాయి. ఇందులో హార్సిలీహిల్స్, శ్రీకాళహస్తి మాత్రమే ఆదాయంలో ముందున్నాయి. మిగిలిన మూడు యూనిట్ల ఆదాయం అంతంత మాత్రమే. దీంతో పర్యాటక శాఖ పూర్వ వైభవం కోల్పోయి కళ తప్పింది. హార్సిలీహిల్స్పై నిర్లక్ష్యం అన్నమయ్య జిల్లాలో ఉన్నది ఒకే ఒక పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్. దీని అభివృద్ధి పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదు. వస్తున్న ఆదాయం తీసుకోవడమే తప్ప అభివృద్ధి కోసం తిరిగి నిధులు ఇవ్వడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అతిథిగృహాల ఆధునికీకరణకు రూ.10 కోట్లతో పనులు చేపట్టారు. కూటమి ప్రభుత్వం రాగానే పనులపై నిర్లక్ష్యం చూపడమే గాక తీవ్ర జాప్యం చేసింది. దాని ఫలితంగా పర్యాటక శాఖకు భారీ నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వస్తున్న రూ.కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది. వేతనాలు, ఖర్చుకు తప్ప అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా, కనీసం పట్టించుకోవడం లేదు. ఫలితంగా హార్సిలీహిల్స్ యూనిట్ కూడా కళతప్పే పరిస్థితి కనిపిస్తోంది. -
నేడు డయల్ యువర్ సీఎండీ
మదనపల్లె: జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనున్నట్లు సీఎండీ పేర్కొన్నారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి విద్యుత్ వినియోగదారులు 8977716661కు ఫోన్చేసి సమస్యలను తెలిపితే పరిష్కరిస్తామని తెలిపారు. మదనపల్లెలో జిల్లా కేంద్రం మదనపల్లెలో డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సర్కిల్ స్థాయిలో సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఎస్ఈ సోమశేఖర్రెడ్డి తెలిపారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను 9440817449 నంబర్కు తెలియజేసి పరిష్కారం పొందాలని కోరారు. జిల్లా జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక మదనపల్లె సిటీ : పట్టణంలోని బీటీ కాలేజీ హాకీ గ్రౌండ్లో ఆదివారం అన్నమయ్య జిల్లా జూనియర్ బాలికల హాకీ జట్టు సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 32 మంది క్రీడాకారిణులు పాల్గొన్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి శివప్రసాద్ తెలిపారు.ఈ సెలక్షన్ ట్రయల్స్లో ప్రతిభ కనబరిచిన 18 మందిని ఎంపిక చేసి,ఏప్రిల్ 16 నుంచి 18 వరకు చిత్తూరులో జరిగే రాష్ట్రస్థాయి హాకీ పోటీలలో అన్నమయ్య జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు. జిల్లా జాయింట్ సెక్రటరీ జలజ, ట్రెజరర్ ప్రసాద్ రెడ్డి, జనరల్ సెక్రటరీ బి.శివప్రసాద్, డీఎస్డీఓ చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించారు. కార్యక్రమంలో నేషనల్ అంపైర్లు పవన్,దిలీప్,సీనియర్ హాకీ క్రీడాకారులు,వ్యాయామ విద్యా సహాయకులు నరేష్ బాబు,గౌస్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లె ఆర్ఓకు అరెస్ట్ వారెంట్ సాక్షి, అమరావతి: అన్నమయ్యజిల్లా బి.కొత్తకోట మున్సిపల్ కమిషనర్గా పనిచేసి ప్రస్తుతం మదనపల్లె మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ (ఆర్ఓ) జీవి.పల్లవి అరెస్ట్కు హైకోర్టు ఈనెల 2న ఉత్తర్వు జారీ చేసింది. ఆమెను అరెస్ట్ చేసి ఈనెల 30న న్యాయస్థానం ముందు హజరుపర్చాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. మున్సిపాలిటీలో ఒక వ్యక్తి ప్లాన్ అప్రూవల్ లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టారని, అక్రమంగా జరుగుతున్న ఈ పనిని కమిషనర్ అడ్డుకోలేదని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చూపారని పేర్కొంటూ రెడ్డెప్ప అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు నడుస్తుండగా విచారణ కోసం పల్లవిని ఆన్లైన్లో హజరుకావాలని తెలియజేసినప్పటికి హజరుకాలేదని కోర్టు దృష్టికి వచ్చింది. దీన్ని కోర్టు ధిక్కారంగా భావిస్తూ ఆమెకు బెయిలబుల్ వారంట్ను జారీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల 30 జరిగే తదుపరి విచారణ రోజు ఆమె కోర్టు ఎదుట హజరుకావాలని ఆదేశించింది. ఈ వారెంట్ను అమలు చేయాలని జిల్లా ఎస్పీకి కోర్టు ఆదేశాలను పంపారు. ఒకవేళ అరెస్ట్చేస్తే రూ.10వేల బాండు, ఇద్దరి పూచికత్తుపై బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానం సూచించింది. అలాగే ఈనెల 30న జరిగే కేసు వాయిదాకు హజరవుతానని, ఆ తర్వాత కూడా కోర్టు ఆదేశించే వరకు హజరువుతానని ఆమె ప్రమాణపత్రం ఇవ్వాలని ఆదేశాల్లో న్యాయస్థానం పేర్కొంది. వెలుగు అక్రమాలపై విచారణ బి.కొత్తకోట: స్థానిక వెలుగు కార్యాలయంలో జరిగిన అక్రమాలపై విచారణ లోతుగా జరుగుతున్నట్టు తెలిసింది. ఏడాదిన్నర కాలంగా ఇక్కడ నెలకొన్న పరిస్థితులు, ఫర్నిచర్ మాయం కావడం, మంజూరు చేసిన రుణాలు రికవరీ కాకపోవడం, సీ్త్రనిధి రుణాలకు సంబంధించి కొన్ని గ్రామాల నుంచి నిధులు రికవరీ కాకపోవడం, ఓ గ్రామంలో రుణాలు ఇచ్చినా పైసా వసూలు చేయకపోవడంపై డీఆర్డీఏ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. రుణాల రికవరీ సంబంధించి ఇప్పటికే విచారణలో అధికారులు నివేదికలో సిద్ధం చేసినట్లు తెలిసింది. ఆ నివేదికలపై ఇప్పటిదాకా చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏమిటి అన్న కోణంలో విచారణ చేస్తున్నట్టు తెలిసింది. ప్రధానంగా కార్యాలయంలోని కుర్చీలు, ఫర్నిచర్ మాయం కావడానికి ఏపీఎంను బాధ్యుని చేసి రూ.54 వేలు రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు. కోటావూరు డెయిరీ పేరుతో ఖర్చు చేసిన నిధుల వివరాలు, బి.కొత్తకోట డెయిరీకి సంబంధించిన నిధుల వ్యయంపైనా విచారణ జరగనున్నట్టు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక లావాదేవిలకు సంబంధించి అక్రమాలు జరిగి ఉండే అవకాశం ఉందని దానిపై లోతుగా విచారించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. -
రంగస్వామి మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగింత
ప్రొద్దుటూరు క్రైం : ఆత్మహత్య చేసుకున్న ఆవుల రంగస్వామి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆదివారం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమీల కుటుంబ సభ్యులు రాకపోవడంతో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం జరగలేదు. కుటుంబ సభ్యుల రాక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన రంగస్వామి, ప్రమీల అనే వివాహిత కొన్ని రోజులుగా ప్రొద్దుటూరు మండలంలోని లింగాపురం గ్రామంలో ఓ ఇంటిని బాడుగకు తీసుకొని సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇరువురూ శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే రూరల్ పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత రంగస్వామి కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరుకు వచ్చారు. వారు రాగానే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. రంగస్వామి తండ్రి రామాంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వీళ్లిద్దరూ సహజీనం చేస్తున్న విషయం ఇన్ని రోజులుగా తమకు తెలియదని, ఇటీవలే తెలిసినట్లు ఆయన పోలీసులకు తెలిపాడు. పోస్టుమార్టం అనంతరం రూరల్ పోలీసులు రంగస్వామి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమీల మృతదేహం కోసం రాని కుటుంబ సభ్యులు ప్రమీల మృతి చెందిన విషయాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు తెలిపినా వాళ్లు ఎవ్వరూ ప్రొద్దుటూరుకు రాలేదు. ఆదివారం కూడా రూరల్ పోలీసులు పలుమార్లు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడినా వాళ్లు రావడానికి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో ప్రమీల మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. మృతదేహాన్ని ఆస్పత్రిలో ని మార్చురీలో భద్రపరిచారు. సోమవారం ఆమె కుటుంబ సభ్యులు రాకుంటే పోస్టుమార్టం నిర్వహించి ప్రొద్దుటూరులోనే ప్రమీల మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రమీల ఇద్దరు కుమారులు ముత్తు అలియాస్ రంగస్వామి, ప్రకాష్లను పోలీసులు కడపలోని చైల్ట్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. -
●2021 నుంచి ఆసంపూర్తిగా...
కడప అగ్రికల్చర్: నెలల తరబడి వేలకు వేలు ఖర్చు చేసి కంటికి రెప్పలా పంటలను కాపాడుకుని మంచి దిగుబడులు సాధిస్తే వాటిని మద్దతు ధరకు అమ్ముకునేందుకు మార్కెట్ యార్డుకు తెచ్చుకుంటే ఇక్కడ సరైన వసతులు లేక రైతులు అవస్థలు పడాల్సి వస్తోంది. రాయలసీమలోనే ఏకై క పసుపు యార్డు కడప వ్యవసాయ మార్కెట్లో ఉంది. ఇక్కడికి కడపజిల్లా నలు మూలల నుంచే కాకుండా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి కూడా రైతులు పసుపు, వేరుశనగ కాయలు తెచ్చి అమ్ముకుంటారు. అయితే మార్కెట్యార్డులో సరైన మౌలిక వసతులు లేక రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మార్కెట్యార్డులోని షెడ్లతోపాటు ఆరుబయట ఉత్పత్తులను రాసులు పోసుకుని అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో ఉన్నట్లుండి అకాల వర్షాలు పడితే దిగుబడులు వర్షార్పణం అయితే నష్టపోవాల్సి వస్తుందని రైతుల ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్లు లేక.. మార్కెట్యార్డుకు సీజన్లో పసుపు, వేరుశనగ దిగుబడులను అమ్ముకునేందుకు రైతులు అధిక సంఖ్యలో వస్తారు. వీరితోపాటు మార్కెట్యార్డులో వ్యాపారులు, హమాలీలు, మహిళా కూలీలు ఇలా చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ వసతులు సరిగా లేవు. ఒక్క మరుగుదొడ్డి లేక అవస్థలు పడాల్సి వస్తోంది. అలాగే మంచినీటికి సంబంధించి ఒకే ఆర్వో ప్లాంట్ ఉంది. అంతమంది ఉన్న మార్కెట్యార్డులో ఒక్క ఆర్వో ప్లాంట్ ఉంటే ఎలా పరిపోతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు మార్కెట్యార్డుకు వచ్చే రైతులు విశ్రాంతి తీసుకునేందుకు గతంలో భవనాన్ని ఏర్పాటు చేశారు. అది శిథిలావస్థకు చేరుకుంది. దీంతో దీనిని ఎవరూ వినియోగిండం లేదు. మార్కెట్యార్డుకు వచ్చే రైతులు చెట్ల కింద, భవనాల పంచన బస్తాలపైన విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రూ. 38 కోట్ల వ్యాపార లావాదేవీలు... ఈ ఏడాది ఫిబ్రవరి 6 నుంచి కడప మార్డులో పసుపు కొనుగోలు ప్రారంభించారు. మొదట్లో క్వింటా పసుపు ఫింగర్, బల్ప్ ధర రూ. 13500 ధర పలికింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా క్వింటా రూ. 11 వేల నుంచి రూ. 11500 వరకు ధర పడిపోయింది. ప్రస్తుతం పసుపు ఽనాణ్యతను బట్టి దర పెరిగి ఫింగర్ కనిష్ట ధర క్వింటాల్ రూ. 11196 నుంచి గరిష్ట ధర రూ. 13,262 పలుకుతోంది. అలాగే బల్ప్ రకం కనిష్ట ధర క్వింటాల్ 8800 నుంచి గరిష్ట ధర 12388 వరకు పలుకుతోంది. అయితే మార్కెట్ యార్డు ప్రారంభం నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు వైఎస్సార్జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి రైతులు తీసుకొచ్చిన పసుపుకు సంబంధించి 38,307 క్వింటాళ్ల విక్రయాలు జరిగాయి. దాదాపు 38 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరిగాయి. దీంతో కడప మార్కెట్యార్డుకు సెస్ రూపంలో 38 లక్షలు రూపాయలు వచ్చింది. కానీ మౌలిక వసతులు మాత్రం కరువయ్యాయి. తమ గురించి పట్టించునే వారే కరువయ్యారని పలువురు రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు జెడ్పీ సమావేశంలో... కడప పసుపుమార్డులోని మౌలిక వసతుల గురించి జిల్లా పరిషత్తు కో ఆప్షన్ సభ్యులు అచ్చుకట్ల కరీముల్లా పలుమార్లు జెడ్పీ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన సమావేశంలో కూడా సంబంధిత సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అచ్చుకట్ల కరీముల్లా చెప్పారు. కడప మార్కెట్ యార్డ్లో వసతులు కరువు సేద తీరాలంటే చెట్లు, పసుపు బస్తాలే గతి ఆగిపోయిన జంబో షెడ్ నిర్మాణం ఆరు బయటే పసుపు, వేరుశనగ విక్రయాలు కడప మార్కెట్యార్డుకు 2021లో రూ. 84 లక్షలతో జంబో షెడ్డు మంజూరు చేసింది. దీనిని కాంట్రాక్టర్ కొంత నిర్మాణం చేపట్టి తర్వాత పనులు చేయకుండా వదిలేశారు.ఫలితంగా కడప మార్కెట్యార్డుకు రైతులు పసుపు, వేరుశన కాయలను అమ్మకాల కోసం తీసుకుని వస్తే ఆరుబయట, రోడ్లుపై పోసి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అన్నదాతలు అందోళన చెందుతున్నారు. కడప పసుపుమార్కెట్ యార్డులో రైతులకు సరైన మౌలిక వసతులు లేవు. కొద్దిసేపు సేద తీరుదామంటే నిలువ నీడలేదు. ఎండసెగకు సంచులపైనే కూర్చోవాల్సి వస్తుంది. అధికారులు స్పందించి వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి. – సుదర్శన్, రైతు, చిట్వేల్ మార్కెట్యార్డుకు పసుపు తీనుకుని వచ్చాను. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామంటే సరైన వసతి లేదు. దీంతో బస్తాలౖపైనే పడుకోవాల్సి వస్తోంది. అధికారులు స్పందించి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి. కల్పించాలి. – క్రిష్ణయ్య, చింతమరాసుపల్లె, ఒంటిమిట్ట మండలం, మార్కెట్యార్డులో మరుగుదొడ్లు లేవు. దీంతో పసుపు, వేరుశనగ కాయలను తీసుకొచ్చే రైతులు మలమూత్ర విసర్జనకు ఇబ్బంది పడాల్సి వస్తోంది.వెంటనే మరుగుదొడ్లు నిర్మించాలి. అధికారులు స్పందించి మార్కెట్ యార్డులో వసతులు కల్పించాలి. – మునిస్వామి, రైతు -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ఒంటిమిట్ట : మండలపరిధిలోని పెద్దకొత్తపల్లిలో శనివారం పలుకూరు మురళి(47) అనే రైతు అప్పుల బాధ తాళలేక విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు...మురళి తనకున్న భూమితో పాటు ఇతరులకు చెందిన భూములు కౌలుకు తీసుకుని పంటలు పండిస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా 10 ఎకరాల్లో చామంతి సాగుచేశాడు. పూలకు గిట్టుబాటు ధరలేక నష్టం వచ్చింది. అప్పుల భారం పెరిగింది. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచక పొలంలోనే విషద్రావణం తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు మురళిని 108 సహాయంతో కడప రిమ్స్కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడపలోని ఓ ప్రైవేట్ అసుపత్రికి తీసుకెళ్లారు.అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. మృతునికి భార్య లక్ష్మీ, నలుగురు సంతానం ఉన్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కార్మికుల సమస్యలపై పోరాటం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు పేర్కొన్నారు. ఆదివారం కడపలోని పాత రిమ్స్లో సీఐటీయూ 10వ జిల్లా మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .ఒకపక్క ప్రభుత్వంతోనూ మరోపక్క యాజమాన్యంతోను పోరాటం చేయడంలో సీఐటీయూ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.ప్రభుత్వాలు కార్మిక వర్గంపై దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. కార్మికులకు సరైన వేతనాలు ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు. అధికారం రాకముందు ప్రస్తుత ఉన్నటువంటి పాలకులు కార్మిక వర్గానికి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి వ్యతిరేకంగా చేయడం దారుణమని ఘాటుగా విమర్శించారు. సీఐటీయూ 17 వ రాష్ట్ర మహాసభలు నంద్యాలలో 17, 18, 19 తేదీల్లో జరుగుతున్నాయని తెలిపారు. మొదటి రోజు జరిగే మహాసభలకు కడప జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
మిద్దె పైనుంచి పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి
మదనపల్లె టౌన్ : మిద్దె పైనుంచి పడి భవన కార్మికుడు మృతి చెందిన సంఘటన ఆదివారం మదనపల్లె మండలంలో వెలుగు చూసింది. స్థానిక తాలూకా పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని పొన్నేటి పాళ్యం పంచాయతీ, బెంగళూరు రోడ్డులోని చిప్పిలికి చెందిన వీరభద్ర (55) భవన కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి మిద్దైపెన పడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని కుటుంబీకులు స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్స అందించారు. అయినా అతని ఆరోగ్యం కుదుటపడక పోవడంతో అక్కడి నుంచి తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. కుటుంబ సభ్యులు బాధితున్ని తిరుపతి రుయాకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నేడు వైఎస్ అవినాష్ రెడ్డిపై డాక్యుమెంటరీ ఆవిష్కరణకడప ఎడ్యుకేషన్ : వైఎస్ అవినాష్రెడ్డి పై షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ డాక్టర్ తవ్వా వెంకటయ్య డాక్యుమెంటరీ రూపొందించారు. ఏడు నిమిషాలు నిడివిగల డాక్యుమెంటరీని సోమవారం మాజీ శాసనసభ్యులు శెట్టిపల్లె రఘురామి రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా తవ్వా వెంకటయ్య మాట్లాడుతూ వర్తమాన రాజకీయ నేతలలో వైఎస్ అవినాష్ రెడ్డి వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైందో బయట ప్రపంచానికి తెలియ చెప్పడానికి దీనిని రూపొందించామన్నారు. షర్మిల కేవలం తన రాజకీయ స్వార్థం కోసమే ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని చెప్పారు. ‘నిజం గుమ్మం దాటే లోపు అబద్ధం ఊరంతా చుట్టేసి వస్తుంది‘అన్నట్లు వైఎస్ అవినాష్రెడ్డి కడప జిల్లా ప్రజలకు గత ఒకటిన్నర దశాబ్ద కాలంగా చేస్తున్న అభివృద్ధి సంక్షేమం గురించి తెలిసేలోపు ఆయన గురించి అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. వీటిని ఖండిస్తూ ఆయన గురించి వాస్తవాన్ని ఈ డాక్యుమెంటరీ ద్వారా ఆవిష్కరించబోతున్నట్లు తవ్వా చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శెట్టిపల్లె రఘురామి రెడ్డి, గౌరవ అతిధిగా ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి, ఆత్మీయ అతిథిగా మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షులు వల్లంబాయి హృషికేశవరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైదుకూరు నియోజకవర్గం నాయకులు పాల్గొంటారని చెప్పారు. ఆర్టీపీపీలో లైనర్ల ప్లేట్లు చోరీఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని కోల్ ప్లాంట్లో ఉన్న లైనర్ ప్లేట్లు (ఇనుప ప్లేట్లు) చోరీకి గురయ్యాయి.వీటిని స్టేజీ–1లోని విద్యుత్ ఉత్పత్తిలో వినియోగిస్తారు. కోల్ప్లాంట్లో పనిచేస్తున్న ముద్దనూరుకు చెందిన సురేష్ అనే కాంట్రాక్టు కార్మికుడు అదివారం తెల్లవారుజామున మూడు లైనర్ ప్లేట్లను దొంగతనం చేసి స్కూటీలో తీసుకెళుతుండగా ఆర్టీపీపీ విజిలెన్స్ సీఐ నారాయణ యాదవ్ తన సిబ్బందితో కలసి పట్టుకొన్నారు. స్కూటీని, ఇనుపప్లేట్లను కలమల్ల పోలీస్స్టేషన్కు అప్పగించారు. కలమల్ల ఎస్ఐ మాట్లాడుతు విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గుర్తు తెలియని మృతదేహంకడప అర్బన్ : కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో గతనెల 24వ తేదీన గుర్తు తెలియని మహిళ (36) అనారోగ్యంతో వైద్యసేవలకు వచ్చింది. ఈనెల 10వ తేదీన మృతి చెందింది. ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని రిమ్స్ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. -
ఉత్సాహంగా టీ20 మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్: టీ20 మ్యాచ్లు ఉత్సాహంగా జరిగాయి.ఆదివారం జరిగిన మ్యాచ్ల్లో అనంతపురం, కడప జట్లు విజయం సాధించాయి. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఉదయం జరిగిన మ్యాచ్లో చిత్తూరు–అనంతపురం జట్లు తలపడ్డా యి. టాస్ గెలిచిన చిత్తూరు జట్టు బ్యాటింగ్ ఎంకుంది. 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 157 పరుగులు చేసింది. ఆ జట్టులోని పృధ్వీరాజ్ 42, ధరణికుమార్ నాయుడు 45 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని దీపక్ 2, ప్రమోద్కుమార్ 2, ఎస్ఎండీ కమిల్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు నిర్ణీత 19.4 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఆ జట్టులోని రోహిత్ రోన్ 74, విజయ్కుమార్ 38 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని శ్రీకాంత్ 5 వికెట్లు తీశాడు. గిరిష్ కుమార్ రెడ్డి 2, దీపన్ సాయినాఽథ్ 2 వికెట్లు తీసుకున్నారు. దీంతో అనంతపురం జట్టు 1 వికెట్ తేడాతో విజయం సాధించింది. ● వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో మధ్యా హ్నం జరిగిన మ్యాచ్లో కడప–కర్నూలు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. ఆ జట్టులోని ధృవకుమార్రెడ్డి 53 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 129 పరుగులు చేశాడు. జయవర్దన్ 58, ధనుష్ 45 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని ఎస్కె కమరుద్దీన్ 2, ఆంజనేయులు 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కర్నూలు జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఆ జట్టులోని గిరినాఽథ్ 11 ఫోర్లు, 9 సిక్సర్లతో 121 పరుగులు చేశాడు. కరణ్ షిండే 84 పరుగులు చేశాడు,కడప జట్టులోని సుదర్శన్ 2, ఆరిష్ భాష 1, మహ్మద్ రఫీ 1 తీశారు. దీంతో కడప జట్టు 1 పరుగు తేడాతో విజయం సాధించింది.అనంతపురం, కడప జట్ల విజయం -
దివ్యాంగుడు అనుమానస్పద మృతి
మదనపల్లె టౌన్ : మదనపల్లెలో ఓ దివ్యాంగుడు ఆదివారం అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఇందుకు సంబంధించి తాలూకా పోలీసులు, మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మదనపల్లె మండలం, కొత్తపల్లె పంచాయతీ, రంగారెడ్డి కాలనీ (కొత్త ఇండ్లు)కి చెందిన ఎల్.లక్ష్మినారాయణ కుమారుడు దివ్యాంగుడు ఎల్.శంకర్ (49) సిటిఎం రోడ్డులోని తట్టివారిపల్లె చెరువు కట్టపై ఉన్న గంగమ్మ గుడి నీళ్ల తొట్టిలో పడి చనిపోయి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా అనంతరం పోస్టు మార్టం కోసం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. శంకర్ స్థానికంగా ఉన్న ఓ ప్లాస్టిక్ కవర్ల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. భార్య సునీత అలియాస్ భారతి భర్తతో మనస్పర్థల కారణంగా గత కొన్నేళ్లుగా దూరంగా ఉంటోందని శంకర్ తల్లి రత్నమ్మ తెలిపింది. తనతో పాటు మనవళ్లు పవన్, కార్తీక్ లను శంకర్ పోషించుకుంటూ ఉన్నాడని చెప్పింది. అయితే శనివారం రాత్రి సీటీఎం రోడ్డులోని ఓ కల్యాణ మండపంలో జరుగుతున్న బంధువుల పెళ్లికి వెళ్లాని చెప్పి, తన దగ్గర రూ.200 డబ్బు తీసుకుని రాత్రి వెళ్లిన తన కుమారుడు ఆదివారం ఉదయం తట్టివారిపల్లె చెరువు కట్టపై చనిపోయి ఉన్నాడని పోలీసులు ఫోన్ చేసినట్లు తెలుపుతూ రత్నమ్మ విలపించింది. తలకు, శరీరంపైన బలమైన రక్త గాయాలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని, చంపేసి ఆత్మహత్యగా చిత్రీక రించారని మృతుని తల్లి ఆరోపించడంతో ఎవరైనా పథకం ప్రకారం శంకర్ను కొట్టి చంపేసి నీళ్ల తొట్టిలో పడేసి వెళ్లారా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈశ్వర్ మృతిపై అనుమానం ఉందని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా శంకర్ది హత్య లేక మరే ఇతర కారణాలతో మృతి చెందాడా అన్నది తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
అడ్డొచ్చిన కుక్క.. అదుపు తప్పిన బైక్
మదనపల్లె టౌన్ : కుక్క అడ్డు రావడంతో బైకు అదుపు తప్పి పడి బోరు మెకానిక్ తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం మదనపల్లె మండలంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని కోటవారిపల్లె పంచాయతీ బండకాడపల్లెకు చెందిన నాగరాజు(24) మదనపల్లెలోని ఓ బోర్ మెకానిక్ దుకాణలో మెకానిక్గా పని చేస్తున్నాడు. రోజూ విధులకు మదనపల్లెకు బైకులో వచ్చి పోయేవాడు. రోజూ మాదిరిగానే శుక్రవారం మదనపల్లెకు వచ్చిన నాగరాజు విధులు ముగించుకుని రాత్రి 11 గంటల సమయంలో బండకాడపల్లెకు బైకుపై వెళుతుండగా, మార్గంమధ్యలోని నాయునివారిపల్లె మలుపు వద్ద కుక్క అడ్డు రావడంతో బైకు అదుపు తప్పి కింద పడి కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో కుటుంబీకులు బాధితున్ని వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చి చికిత్సలు అందించడంతో కోలుకుంటూ ఉన్నాడు. -
కుదుటపడని పాలన
స్థానిక బెంగళూరు రోడ్డులోని పట్టు పరిశ్రమ శాఖ భవనంలో సహకార శాఖది విచిత్ర పరిస్థితి. జిల్లా సహకార శాఖకు, జిల్లా సహకార శాఖ ఆడిట్ కార్యాలయం ఒక గదిలో ఏర్పాటు చేశారు. గది మధ్యలో రికార్డులను అడ్డుగా ఉంచి కుడివైపు ఆడిట్ శాఖ, ఎడమవైపు సహకార శాఖ జిల్లా అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా కార్యాలయాల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి సహకార శాఖ పరిస్థితి అద్దం పడుతోంది. మదనపల్లె: మదనపల్లె జిల్లా కేంద్రంగా ఏర్పడి వందరోజులైంది. అయితే అధికారులకు మాత్రం కార్యాలయాల ఏర్పాటుకు వంద అవస్థలు పడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు. దీనికి ప్రభుత్వం ముందుచూపులేకపోవడం, జిల్లా కేంద్రం రాయచోటినుంచి మదనపల్లెకు తరలించే విషయంలో కనీస సన్నద్ధతకు అవకాశం ఇవ్వకపోవడమే కారణం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం లో కొత్త జిల్లాలు ఏర్పాటు విషయంలో ప్రణాళిక బద్ధంగా వ్యవహరించింది. కొత్త జిల్లాలను 2022 ఏప్రిల్ 4నుంచి మనుగడలోకి వస్తాయని ముందుగానే ప్రకటించింది. ప్రభుత్వ వ్యవస్థలు జిల్లా కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకొని ఏర్పాటు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం మదనపల్లెను జిల్లా కేంద్రం చేసే నిర్ణయం హఠాత్తుగా తీసుకుని ఇప్పటికీ ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. జిల్లా కేంద్రం పాలన మొదలై 100 రోజులు గడిచిన ఇంకా కార్యాలయాలు కుదురుకోలేదు. అస్తవ్యస్త పరిస్థితుల మధ్య పనిచేస్తున్నాయి. ఇంకా పూర్తిస్థాయి కార్యాలయాలు రాయచోటి నుంచి తరలి రాలేదు. ఒకరోజులో పాలన కేంద్రం మార్పు 2025 డిసెంబర్ 30న అన్నమయ్య జిల్లాకు మదనపల్లెను జిల్లా కేంద్రం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. అప్పటిదాకా రాయచోటి కేంద్రంగా పనిచేస్తున్న జిల్లా కేంద్రం మదనపల్లెకు మారాల్సి వచ్చింది. ఉత్తర్వు జారీ అయిన మరుసటి రోజు అంటే డిసెంబర్ 31న జిల్లా కేంద్రం మనుగడలోకి రాగా కలెక్టర్ కలెక్టరేట్ను ప్రారంభించారు. అదేరోజు నుంచి జిల్లా పాలన మొదలైంది. తర్వాత ఇక్కడికి రాయచోటిలోని జిల్లా కార్యాలయాల తరలింపు ప్రక్రియ మొదలైంది. జిల్లాస్థాయి కార్యాలయాల ఏర్పాటుకు కావాల్సినంత, అవసరమైనస్థాయి కలిగిన కార్యాలయాలు అందుబాటులో లేకపోవడంతో అధికారులు స్థిమితంగా కూర్చుంటున్నది లేదు. సిద్ధం కాకనే ప్రకటన మదనపల్లెను జిల్లా కేంద్రం చేసే విషయం గత ఏడాది డిసెంబర్ లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అంతకుముందు మదనపల్లె పేరుతోనే జిల్లా ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే రాజకీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేసింది. పుంగనూరును అన్నమయ్య జిల్లాలో కలిపి మదనపల్లెను జిల్లా కేంద్రం చేసింది. కాస్త గడువు ఇచ్చాక లేదంటే జిల్లా అధికారులు మదనపల్లె తరలేందుకు మానసికంగా సిద్ధమయ్యే సమయం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం డిసెంబర్ 30న జీవో జారీ చేసింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగంలో హడావిడి మొదలైంది. ఆయా జిల్లా శాఖల అధికారులు మదనపల్లెలో ఎక్కడ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలో దిక్కుతోచగా రాయచోటి కేంద్రంగా పనిచేస్తూనే మదనపల్లెలో కార్యాలయం ఏర్పాటు కోసం పరుగులు తీశారు. బీటీ కళాశాల భవనాల్లోనే.. మదనపల్లెలో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన వసతులు, సౌకర్యాలతో పాటు ప్రభుత్వ భవనాలు లేవు. అధికారులు ఎంత ప్రయత్నించినా, వేట సాగించినా సౌకర్యవంతమైన భవనాలు కనిపించలేదు. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో సత్వరమే కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నందున బీటి కళాశాల ట్రస్టుకు చెందిన వసతి గృహాలు, పట్టు పరిశ్రమశాఖ, సిఎల్ఆర్సీసి భవనాలు, సెరికల్చర్ రీలర్స్ ట్రైనింగ్ సెంటర్, బీటీ కళాశాల మహిళా హస్టల్, ఇలా అందుబాటులో ఉన్న భవనాల్లో జిల్లా కార్యాలయాలకు గదులు కేటాయించారు. బీఈడీ కళాశాల భవనాలు, బీటీ కళాశాల ఆవరణలోని భవనాలను అధికార యంత్రాంగం స్వాధీనం చేసుకుంది. వాటిలోనే వీలైన మేరకు కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. కూర్చునే సౌకర్యం లేకున్నా.. మదనపల్లెలో జిల్లా కార్యాలయాల పరిస్థితి ఎలా ఉందంటే సౌకర్యవంతంగా నలుగురు కూర్చునే పరిస్థితి లేదు. కిందిస్థాయి ఉద్యోగికి కేటాయించే చిన్నగది లాంటి గదే జిల్లా కార్యాలయాలుగా మారాయి. అందులోనే డెస్క్టాప్లు, జిల్లా అధికారి టేబుల్, కుర్చీ, కార్యాలయానికొచ్చే వారికి కుర్చీలు, ఇలా అన్ని ఒక చిన్నగదిలోనే సమకూర్చుకుని విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. దేవదాయ శాఖ, జిల్లా క్రీడల శాఖ, పర్యాటకశాఖ, మెప్మా, ఇలాంటి కార్యాలయాలకు ఒక గదిలోనే కేటాయించారు. ఈ కార్యాలయాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బీటీ కళాశాల వసతి గృహంలో, పట్టు పరిశ్రమ శాఖ భవనంలో ఎక్కువ జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఒక చిన్న గదిలో జిల్లాకు సంబంధించిన రికార్డులు, పనిచేసే సిబ్బంది, అధికారులకు ఏమాత్రం సరిపోదు. ఈ కార్యాలయాలకు వాష్రూమ్లు లేవు. ఇది ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మదనపల్లె జిల్లా కేంద్రానికి వంద రోజులు ఇప్పటికీ కుదురుకోని కార్యాలయాలు ఒక గదిలో రెండు జిల్లా ఆఫీసులు బోర్డులు తప్ప ప్రారంభంకాని వైనం జిల్లా కేంద్రం మదనపల్లెలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ, డీఆర్డీఏ, డ్వామా, సీపీఓ, డీపీఓ తదితర ముఖ్య ప్రభుత్వశాఖల అధికారులు ప్రభుత్వ ఉత్తర్వు జారీ అయిన వెంటనే ఇక్కడినుంచి పాలన మొదలు పెట్టారు. మొట్టమొదట కలెక్టర్ నిశాంత్కుమార్ జిల్లా కేంద్రం అమలులోకి వచ్చిన డిసెంబర్ 31 నుంచి మదనపల్లె కేంద్రంగానే పాలన సాగిస్తున్నారు. పూర్తిస్థాయి పాలన కలెక్టరేట్ నుంచి సాగిస్తూ ప్రభుత్వశాఖలతో సమన్వయం చేస్తున్నారు. ఆయా శాఖలతో సమీక్షలు, సమావేశాలను నిత్యం నిర్వహిస్తూనే క్షేత్రస్థాయిలో పర్యటనలు, తనిఖీలు చేస్తున్నారు. అయితే పలుశాఖల జిల్లా అధికారుల పాలన ఇంకా కుదుటపడలేదు. కొన్నిజిల్లాశాఖలు ఇంకా రాయచోటిలో కొనసాగుతుండటంతో అధికారులు అక్కడికి రాకపోకలు సాగిస్తున్నారు. ఇంకా తరలిరావాల్సిన కార్యాలయాలు పూర్తిస్థాయిలో తరలించి ఇక్కడి కార్యాలయాల నుంచే పాలన సాగిస్తే..అప్పటికి పూర్తిస్థాయిలో జిల్లా పాలన మొదలవుతుంది. -
అటల్ ల్యాబ్లను ఆవిష్కరణ కేంద్రాలుగా తీర్చిదిద్దాలి
రాయచోటి : అటల్ టింకరింగ్ ల్యాబ్లను క్రియాత్మక ఆవిష్కరణ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం ప్రధానోపాధ్యాయులకు సూచించారు. రాయచోటిలోని మాసాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న అటల్ బూట్ క్యాంపును డీఈఓ శనివారం సందర్శించారు. అక్కడ విలేకరులతో మాట్లాడుతూ అటల్ ల్యాబ్లలోని మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని విద్యార్థులతో నిరంతరం ప్రయోగాలు చేయించి నైపుణ్యాభివృద్ధిని పెంపొందించాలని, తద్వారా నైపుణ్యాలు కల్గిన విద్యార్థులను అన్వేషణలవైపు నడిపించవచ్చని సూచించారు. జిల్లాలోని 24 అటల్ ల్యాబ్లలో సుమారు వెయ్యి మంది విద్యార్థులకు మూడురోజులపాటు ప్రత్యక్షానుభవన కార్యాశాలను నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ఆయన విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించారు. ప్రతిభ కనబరిచిన నలభై మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్అధికారి మార్ల ఓబుల్ రెడ్డి, స్పోర్ట్స్ కార్యదర్శి వీరాంజనేయులు, ఏపీఓ రవీంద్ర, పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి, అటల్ డీఆర్పీ సెట్టెం ఆంజనేయులు, మెంటార్ అంకిత తదితరులు పాల్గొన్నారు. డీఈఓ సుబ్రమణ్యం -
మదనపల్లెలో తమిళనాడు వాసి బలవన్మరణం
మదనపల్లె టౌన్ : హోటల్లో టీ మాస్టర్గా పని చేస్తున్న తమిళనాడుకు చెందిన వ్యక్తి మదనపల్లెలో బలవన్మరణం చెందాడు. శనివారం వెలుగు చూసిన విషాదకర ఘటనపై మృతుడి కుటుంబీకులు, రెండవ పట్టణ పోలీసులు తెలిపిన వివరాలు.. తమిళనాడు రాష్ట్రం గుడియాతంకు చెందిన గోవిందం హరిబాబు (52) గత 20 ఏళ్ల క్రితం కుటుంబీకులతో కలసి బతుకు దెరువు నిమిత్తం మదనపల్లెకు వలస వచ్చాడు. ఆయనకు భార్య మంజుల, కుమార్తె గాయత్రి, కుమారుడు కిషోర్ ఉన్నారు. పట్టణంలోని రామారావు కాలనీలో ఓ అద్దె ఇంట్లో ఉంటూ.. స్థానిక కోట వీధిలో ఉన్న ఓ టీ హోటల్లో టీ– మాస్టర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం పలమనేరులో ఉన్న తన కూతురు గాయత్రి ప్రసవించడంతో హరిబాబు భార్య మంజుల కూతురు చెంతకు వెళ్లింది. కొడుకు కిషోర్ బెంగుళూరు లోని ఓ కంపెనీలో పని చేస్తుండగా, హరిబాబు ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. ఇంతలో హరిబాబుకు ఏం కష్టం వచ్చిందో ఏమో..? జీవితంపై విరక్తి చెంది తను ఉంటున్న ఇంట్లోనే ఫ్యానుకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారిన తర్వాత ఇరుగు పొరుగు వారు గమనించి స్థానిక టూ టౌన్ పోలీసులకు, మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లెకు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు పంచనామా చేపట్టి, ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గంజాయి ముఠా గుట్టురట్టు
● నలుగురు నిందితుల అరెస్ట్ ● రూ.లక్ష విలువైన గంజాయి స్వాధీనంమదనపల్లె టౌన్ : మదనపల్లె పరిధిలో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును తాలూకా పోలీసులు రట్టు చేశారు. ఉల్లిగడ్డల లోడు ముసుగులో భారీ ఎత్తున గంజాయిని తరలిస్తున్న పాత కేసులో నిందితులుగా ఉండి పరారీలో ఉన్న నలుగురు నిందితులను శనివారం పోలీసులు అరెస్ట్ చేశా రు. వారి వద్ద నుంచి రూ.లక్ష విలువైన నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.వెంకటాద్రి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. తనిఖీల్లో దొరికిపోయారు.. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి (మదనపల్లి సబ్ డివిజన్ ఇన్చార్జి) పర్యవేక్షణలో మదనపల్లె తాలూకా సీఐ కె.కళావెంకటరమణ తన సిబ్బందితో కలిసి శనివారం ఉదయం బసినికొండ పంచాయతీ పరిధిలోని కనుమలో గంగమ్మ గుడి వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో పుంగనూరు వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు దిగి, అనుమానాస్పదంగా నల్లటి కవర్లతో పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరి వ్యక్తులతోపాటు మరో ఇద్దరు మహిళలను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ చేయడంతో ఇటీవల స్థానిక సిటిఎం రోడ్డు, ఎరగాని మిట్టపై ఎర్రగడ్డల మాటున 179 కిలోల గంజాయిని తరలిస్తూ పోలీసులను చూసి పారిపోయిన కేసులో పరారీలో ఉన్న నిందితులుగా నిర్ధారించారు. మదనపల్లి తాలూకా పోలీస్స్టేషన్లో గతంలో నమోదైన 179 కేజీల గంజాయి స్మగ్లింగ్ కేసులో వీరంతా పరారీలో ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడిన వారిలో శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలానికి చెందిన మల్లెల మహేష్, మల్లెల అమరావతితోపాటు, పుంగనూరు పట్టణానికి చెందిన మల్లెల రాజమ్మ, మల్లెల చంటి ఉన్నారు. వారి నుంచి నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో చంద్రా కాలనీకి చెందిన వదినా మరిది నాగరాజు, సుగుణలను రిమాండ్కు తరలించామని అదనపు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రధానంగా గంజాయి విక్రయించిన మరో నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. యువత భవిష్యత్తును చిదిమేస్తే కఠిన చర్యలు ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు, రవాణా, విక్రయాల మీద ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ముఖ్యంగా యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. గంజాయి విక్రేతలపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలను ప్రయోగిస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరచిన మదనపల్లె తాలూకా సీఐ, పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఏఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
ఆవేదన.. ఆందోళన
ఓ వైపు బిడ్డ చనిపోయిందన్న ఆవేదన.. మరోవైపు కిరాతకుడిని ఎన్కౌంటర్ చేయాలని ఆందోళన వెరసి ఖాజీపేట ఉద్రిక్తంగా మారింది. తమకు కడుపుకోత మిగిల్చిన ఉన్మాదిని ఉరితీసేవరకు తమ శోకం తీరదంటూ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆందోళన చేస్తున్న మహిళలకు సర్దిచెబుతున్న పోలీసులు ఖాజీపేట బస్టాండ్ వద్ద ధర్నా చేస్తున్న స్థానికులుఖాజీపేట : ప్రేమోన్మాదిని ఎన్కౌంటర్ చేయాలని.. బాలికకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని రామకీర్తన కుటుంబ సభ్యులు, బంధువులు శనివారం నిరసనకు దిగారు. అంత్యక్రియలు చేసేది లేదంటూ ధర్నా చేపట్టారు. వివరాలు.. ఖాజీపేట మేజర్ పంచాయతీలోని అగ్రహారం గ్రామంలో రామకీర్తన (16) అనే బాలికను ఆంజనేయ కొట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్ శుక్రవారం ఉదయం ఇంటిలోనే అతి కిరాతకంగా గొంతు కోసి చంపాడు. ఈ కేసు విషయంలో బాలిక తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శనివారం శవ పరీక్షలు పూర్తి చేసి రామకీర్తన మృతదేహాన్ని స్వగ్రామం అగ్రహారానికి అంత్యక్రియలు చేసేందుకు తీసుకొచ్చారు. అయితే అంత్యక్రియలు చేస్తే తమ కుమార్తెకు న్యాయం జరగదని రామకీర్తన తల్లిదండ్రులు, బంధువులు భావించారు. అందరూ ఖాజీపేట బస్టాండ్ కూడలికి చేరుకుని ధర్నాకు దిగారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకూ ధర్నా చేశారు. మైదుకూరు డీఎస్సీ వెంకటేశ్వర్లు, కడప దిశా డీఎస్పీ బాలస్వామిరెడ్డి బాలిక బంధువులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. నిందితుడికి చట్టప్రకారం శిక్షపడేలా చేస్తాం.. ఇందులో ఎవరి భాగస్వామ్యం ఉన్నా వదిలేది లేదని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే హత్య చేసిన వ్యక్తితోపాటు ఇందులో ఇతరులు కూడా ఉన్నారని, వారి పేర్లు కూడా కేసులో నమోదు చేయాలని బాలిక బంధువులు కోరారు. వారి విజ్ఞప్తి మేరకు తిరిగి ఫిర్యాదు తీసుకుని పేర్లు నమోదు చేసేందుకు హామీ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన హామీ మేరకు ధర్నా విరమించారు. భారీ పోలీసు బందోబస్తు శుక్రవారం జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు అగ్రహారంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు, ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు చేపట్టారు. రామకీర్తన అంత్యక్రియలు ఆదివారం జరుగుతాయని బంధువులు తెలిపారు. బాలిక తల్లిదండ్రులకు పరామర్శ అతి కిరాతకంగా హత్యకు గురైన రామకీర్తనకు న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. మృతి విషయం తెలుసుకుని బాలికకు నివాళి అర్పించారు. తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హంతకుడికి ఊరిశిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.ప్రేమోన్మాదిని ఎన్కౌంటర్ చేయాలి అప్పుడే బాలికకు న్యాయం జరుగుతుంది బాలిక బంధువుల ధర్నా నేడు అంత్యక్రియలు కడప కార్పొరేషన్: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీసు వ్యవస్థ మొద్దు నిద్ర పోతోందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖాజీపేటలో బాలికను పాశవికంగా హత్య చేయడం దారుణమన్నారు. ఆడపిల్లలు బయటికి వెళ్తే సురక్షితంగా ఇంటికి వస్తారా లేదా అనే అనుమానం కలుగుతోందన్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. కూటమి సర్కార్ వచ్చాక ఏపీని మద్యాంధ్ర ప్రదేశ్ మార్చేసిందని, డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతున్నాయన్నారు. దీనివల్లే నేరాలు పెరుగుతున్నాయన్నారు. మొన్న ఆలంఖాన్పల్లెలో దస్తగిరిని హత్య చేశారని, దీనిపై లోతైన విచారణ జరపాలన్నారు. ఈ హత్యల వెనుక ఉన్న వారిని వెలికి తీసి శిక్షపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
విప్లవాత్మక సంఘ సంస్కర్త పూలే
మదనపల్లె: సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, అభివృద్ధి కోసం విప్లవాత్మక సంస్కరణలు, సమాజంలో మార్పు తేవడం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు జ్యోతిరావుపూలే అని కలెక్టర్ నిశాంత్కుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పూలే జయంతిని నిర్వహించారు. పూలే చిత్రపటానికి కలెక్టర్, ఎమ్మెల్యే షాజహాన్బాషా, ఇన్చార్జి డీఆర్ఓ చంద్రశేఖర్రెడ్డి, పౌరసరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ పర్వీన్తాజ్, అధికారులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సామాజిక అసమానతలను రూపుమాపేందుకు జీవితాన్ని ధారపోసిన పూలే అడుగుజాడలే స్ఫూర్తిగా పయనిద్దామని పిలుపునిచ్చారు. 1848లో దేశంలో తొలి బాలికల పాఠశాలను స్థాపించడం ద్వారా మహిళా విద్యకు నాంది పలికారని అన్నారు. మహిళా విద్యపై అపోహలు, భయాలను తట్టుకుని ముందుకు సాగడం ఆయన పట్టుదలకు నిదర్శనమన్నారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి తేజస్విని, జంగం కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్, శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ భావన, పాలఏకరి చైర్మన్ నాగేశ్వర్ నాయుడు, బీసీ సంఘం నాయకులు బోడెం రాజశేఖర్, గంగులప్ప, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ‘సౌర’ వెలుగు
చిన్నమండెం : ఎస్సీ, ఎస్టీ కుటుంబాల ఇళ్లకు ఉచితంగా సౌర విద్యుత్ వెలుగులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్, మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం దేవగుడిపల్లె గ్రామంలోని బాపూజీనగర్లో ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారుల గృహాలకు పీఎం సూర్యఘర్ పథకం కింద అమర్చిన 2 కిలోవాట్ సామర్థ్యం గల సోలార్ రూఫ్టాప్ యూనిట్లను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా 36 మంది లబ్ధిదారుల గృహాలపై ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ యూనిట్లను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ పథకం గ్రామీణ ప్రజల జీవితాల్లో ఆర్థికం భారం తగ్గిస్తూ శాశ్వత విద్యుత్ పరిష్కారాన్ని అందిస్తోందని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి కుటుంబం వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా జలధార ప్రాజెక్టు దేశానికే ఆదర్శం అన్నమయ్య జిల్లాలో అమలు చేసిన ‘జలధార’ ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తెలిపారు. అతి తక్కువ సమయంలో జిల్లా వ్యాప్తంగా సమర్థవంతంగా జలధార ప్రాజెక్టు అమలు పరిచి అద్భుతమైన ఫలితాలు రావడానికి కృషి చేసిన కలెక్టర్ నిశాంత్కుమార్ను మంత్రి మండిపల్లి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో బేసిన్ ఆధారిత నీటి సంరక్షణ విధానాన్ని అనుసరించి నదీ పరివాహక ప్రాంతాలను గుర్తించి, మిగులు లోటు ప్రాంతాలకు మళ్లించే చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. 49 ఉప పరివాహక ప్రాంతాల గుర్తింపు, 532 కాస్కేడ్స్ ద్వారా 3082 చెరువుల అనుసంధానం, 962 ఎండిపోయిన చెరువుల పునరుద్ధరణ, ఉపాధి హామీ పథకం ద్వారా విస్తృత పనులు తదితర చర్యల వల్ల వృథాగా పోయే నీటిని సమర్థంగా వినియోగంలోకి తీసుకురాగాలిగారన్నారు. జలధార జలహారతి ప్రాజెక్టు అధ్యయనం చేయడానికి కేంద్రం నుంచి కూడా ఒక బృందం త్వరలో జిల్లాకు రానున్నట్లు మంత్రికి కలెక్టర్ వివరించారు. -
ఉపాధిలో అవినీతి కంపు
● రూ.17.70 లక్షలు అవినీతి జరిగినట్లు ప్రజావేదికలో వెల్లడి ● ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్పై క్రమశిక్షణ చర్యలు గాలివీడు: మండలంలో జాతీయ ఉపాధి హామీ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయి. రూ.17.70 లక్షల నిధులను ఉపాధి హామీ సిబ్బంది పక్కదారి పట్టించినట్లు ఆడిట్ టీమ్ నిర్ధారించింది.స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో శనివారం డ్వామా పీడీ వెంకటరత్నం అధ్యక్షతన సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీ బృదం 17 గ్రామ పంచాయతీల్లో 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు జరిగిన పనులకు సంబంధించి జరిగిన అక్రమాలను ప్రజావేదికలో వెల్లడించింది. గ్రామాల వారిగా అరవీడు (రూ.56857), గోరాన్ చెరువు (రూ.195507), గరుగుపల్లి (రూ.95503), తలముడిపి(రూ.68743), తూముకుంట(రూ.46420), పూలింకుంట(రూ.226450), గుండ్లచెరువు(రూ.458891), నూలివీడు(రూ.3902), గాలివీడు (రూ.1000),పేరంపల్లి (రూ.9229), కొర్లకుంట(రూ.186956), సీసీ పల్లె(రూ.34844), గోపనపల్లె (రూ.6077),పందికుంట (రూ.254188), బొరెడ్డిగారిపల్లి (రూ.112840), ఎగువగొట్టివీడు(రూ.12051)అవినీతి జరిగినట్లు నిర్ధారించారు.ప్రధానంగా కూలీల సంతకాల్లో వ్యత్యాసాలు ,పనుల కొలతల్లో తేడాలు బయటపడ్డాయి. నిబంధనలకు తూట్లు పొడిచి అడ్డగోలుగా చెల్లింపులు జరిపారు. ఉపాధి హామీ పథకంలో రూ.17,29,774 అవినీతి జరగ్గా, పీఆర్ ఇంజినీరింగ్ విభాగంలో 40,289 అవినీతి జరిగినట్లుగా నిర్ధారించారు. మొత్తం రూ.17,70,063 కాగా అందులో రూ.55,000 రికవరీ జరిగిందన్నారు.ఈ వ్యవహారంలో టెక్నికల్ అసిస్టెంట్లు రత్నకుమార్, ఖాదర్ భాషా, కంప్యూటర్ ఆపరేటర్ మణి కుమార్ పై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లుగా అధికారులు స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో ఏపీడీ మధుబాబు, ఎస్ఆర్పీ సూర్య తదితరులు పాల్గొన్నారు. -
మూల విరాట్ నర్మదా నది నుంచి..
నందీశ్వరాలయంలో ప్రతిష్ఠించిన మూల విరాట్ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది మొలచిన విగ్రహం కాదు. మధ్యప్రదేశ్లోని నర్మద నదిలో స్వయంభుగా వెలిసిన శివలింగాన్ని గజ ఈతగాళ్లతో వెలికి తీసి తెప్పించారు. ఈ విగ్రహానికి రూ.4 లక్షలకు పైగా వెచ్చించారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. సాలేగ్రామ్ విగ్రహం కావడంతోపాటు స్వయంభుగా వెలిసినట్లు తెలుస్తోంది. మధ్యలో ఎరుపు రంగు ఉండి మిగతాదంతా తెల్ల రంగుతో ఉండటం విశేషం. మాములుగా శివలింగం అంటేనే నలుపు రంగులో ఉండటం సహజం. నర్మద నది శివలింగాలకు పుట్టినిల్లని ప్రతీతి. మిగతా వినాయకుడు, పార్వతీదేవి విగ్రహాలను టీటీడీ నుంచి తెప్పించారు. ప్రధాన ముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన నంది విగ్రహం ఆళ్లగడ్డలో తయారు చేయించారు. -
అద్భుతం.. నందీశ్వరాలయం
● నందిపల్లెలో రూ.7 కోట్లతో నిర్మాణం ● వైఎస్ జగన్, వైఎస్ అవినాష్రెడ్డి సహకారం ● మారం శ్రీకాంత్రెడ్డి రూ.3 కోట్లకు పైగా వ్యయం ● నేడు మండల పూజకడప సిటీ/వేంపల్లె : ఆ యువకుడు లండన్కు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన భార్య లక్ష్మీదేవి కూడా లండన్ కంపెనీలోనే ఇంటి దగ్గరి నుంచే (వర్క్ ఫ్రం హోమ్) విధులు నిర్వర్తిస్తూ ఆలయ నిర్మాణానికి సిద్ధమయ్యారు. తన తల్లి నందిపల్లె గ్రామ సర్పంచ్ (ప్రస్తుతం మాజీ సర్పంచ్)గా ఉన్న మారం సులోచన, ఆయన భార్య లక్ష్మీదేవి అతనికి చేదోడు వాదోడుగా ఉండి ఆలయ నిర్మాణానికి సహకరించారు. రూ.35 లక్షలుగా అనుకున్న ఆలయ నిర్మాణం చివరకు రూ.7 కోట్లకు పైగా వెచ్చించి పూర్తి చేశారు. దాదాపు మూడు సంవత్సరాలకుపైగా సమయం పట్టింది. వేంపల్లె సమీపంలో పులివెందుల రోడ్డులో నందిపల్లె గ్రామ పరిసరాల్లో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రాచీన కళ ఉట్టిపడేలా.. విజయనగర సామ్రాజ్యం కాలం నాటి గుడి నిర్మాణాలతో పోల్చకుండా.. ఆ తర్వాత నిర్మించిన ఆలయాల్లో దక్షిణ భారతదేశంలోనే నందిపల్లె నందీశ్వరాలయం పేరు గాంచింది. ఎక్కడా కూడా సిమెంటు, ఇటుక వాడకుండానే గుడి నిర్మాణం చేపట్టారు. దీంతో ప్రాచీణ కళ ఆలయ పరిసర ప్రాంతాల్లో వెల్లివిరుస్తోంది. 43 వేల టన్నుల గ్రానైట్ రాళ్లు ఈ ఆలయ నిర్మాణానికి 43 వేల టన్నుల గ్రానైట్ రాయి (బ్లాక్ పెరల్)ని వాడారు. కోటప్పకొండలోని వీరభద్ర క్వారీ నుంచి 100 లారీలకు పైగా 43 వేల టన్నుల గ్రానైట్ రాయిని తీసుకొచ్చి నిర్మాణానికి ఉపయోగించారు. తమిళనాడుకు చెందిన ముత్తుకుమార్ నేతృత్వంలో ఆలయ నిర్మాణం జరిగింది. చదరపు అడుగు రూ. 400 రేటు పడగా, మొత్తం రూ.3.50 కోట్లు గ్రానైట్ రాళ్లకు ఖర్చు చేశారు. విగ్రహ ప్రతిష్ఠకు హాజరైన మాజీ సీఎం ఈ నందీశ్వరాలయ నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సహకారం అందించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వారు దాదాపు 1.40 కోట్ల రూపాయలను ఆలయ నిర్మాణానికి అందించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీ వరకు నందీశ్వరాలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వాహకులు, గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 25వ తేదీన ఇక్కడ నిర్వహించిన యజ్ఞంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిలు భక్తజన సందోహం మధ్య పాల్గొన్నారు. విశేష పూజలు నిర్వహించారు. వీరితోపాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా పాల్గొన్నారు. ప్రతిష్ఠ చేసిన కంచి కామకోటి పీఠాధిపతి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 26వ తేదీన 70వ కంచికామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలను ఆలయ చైర్మన్ మారం శ్రీకాంత్రెడ్డి నిర్వహించారు. మండల పూజకు సర్వం సిద్ధం ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిగి నేటికి (ఆదివారం) 48 రోజులు అనగా మండలం పూర్తి కావడంతో అందుకు సంబంఽధించిన పూజలకు సర్వం సిద్ధం చేశారు. కొత్తగా శంకరాచార్యుల విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించనున్నారు. రుద్రాభిషేకం, జలాభిషేకం, పంచామృతాభిషేకం తదితర పూజాధికాలు పక్కన తాత్కాలికంగా నిర్మించిన యజ్ఞశాలలో నిర్వహించనున్నారు. ఇంకా యాగశాల, పార్కు, కల్యాణ మండపం, రెయిలింగ్ తదితర నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని ఆలయ చైర్మన్ మారం శ్రీకాంత్రెడ్డి తెలిపారు. -
మనస్తాపంతో యువతి ఆత్మహత్య
మైలవరం : మండల పరిధిలోని వేపరాల గ్రామానికి చెందిన ఉమ్మడి శెట్టి జయవాణి(29) మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేపరాల గ్రామం కొత్త కొట్టాలలో జయరాముడు, లక్ష్మీదేవిలకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇటీవల కాలంలో కుటుంబ సమస్యలు ఎక్కువ కావడంతో జయవాణి శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనను గమనించిన తండ్రి జయరాముడు వెంటనే ఆమెను జమ్మలమడుగులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
తమ్ముడిపై అన్న దాడి
మదనపల్లె టౌన్ : ఆస్తిలో వాటా అడిగిన తమ్ముడిపై అన్న కత్తితో దాడి చేసిన సంఘటన గురువారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. బాధితుడు తాలుకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. పొన్నేటి పాళ్యం పంచాయతీ చిప్పిలికి చెందిన నాగిరెడ్డి(46)కి తన తల్లిదండ్రులకు వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూమిలో వాటా రావాల్సి ఉంది. ఈ క్రమంలో రాత్రి నాగిరెడ్డి తన అన్న చెన్నకేశవరెడ్డి ఇంటికి వెళ్లి ఆస్తిలో వాటా పంచాలని నిలదీశాడు. ఈ విషయమై ఇద్దరూ గొడవ పడ్డారు. మాటకుమాట పెరగడంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన చెన్నకేశవరెడ్డి ఇంట్లో ఉన్న కత్తి తీసుకొచ్చి తమ్ముడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచాడు. కుటుంబీకులు సమాచారం తెలుసుకుని వెళ్లి.. బాధితుడిని వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నాడు. ఘటనపై తాలుకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కురబలకోట ఎంపీపీ తనయుడికి గాయాలు
కురబలకోట : కురబలకోట ఎంపీపీ ఎంజీ భూదేవి కుమారుడు ఎంజీ అభిషేక్ (20) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఇతను అంగళ్లులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. మండలంలోని విశ్వం కళాశాల సమీపంలో బైక్పై వెళుతుండగా గురువారం కారు ఢీకొంది. ఈ సంఘటనలో అభిషేక్కు గాయాలు కాగా మదనపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చెట్టుపై నుంచి పడి.. నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్) : చింత కాయలు కోయడానికి వెళ్లిన రైతు చెట్టుపై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. నిమ్మనపల్లె మండలంలో శుక్రవారం జరిగిన ఘటనపై జల్లా ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు, బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. నిమ్మనపల్లె మండలం గారబురుజుకు చెందిన రైతు ఖలీల్ (58) ఊరి సమీపంలోని తన చింత చెట్టెక్కి కాయలు కోస్తుండగా, కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితున్ని వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం రుయాకు వెళ్లాలని రెఫర్ చేశారు. రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు మదనపల్లె టౌన్ : నీళ్ల ట్యాంకర్ను తప్పించబోయిన ఓ రైతు రోడ్డు పక్కనున్న గుంతలో పడి కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగిన ఘటనపై బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. పెంచుపాడు పంచాయతీ కట్టుబావి గొల్లపల్లెకు చెందిన రైతు గుణశేఖర్ (40) సొంత పని మీద మదనపల్లెకు బైకులో వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి అదే రోజు రాత్రి స్వగ్రామానికి బైకుపై వస్తుండగా, మార్గంమధ్యలోని బంగోళ్లపల్లె దగ్గర ఎదురుగా వస్తున్న నీళ్ల ట్యాంకర్కు సైడు ఇవ్వబోయి బైకు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడి కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితున్ని ట్యాంకర్ డ్రైవర్, స్థానికులు గుర్తించి వెంటనే జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సలు అందించి, వెంటనే తిరుపతి రుయాకు వెళ్లాని రెఫర్ చేశారు. కేసు దర్యాప్తులో ఉందని తాలుకా పోలీసులు తెలిపారు. -
అటవీ శాఖ ఉన్నా.. వన్యప్రాణుల రక్షణ సున్నా
● దప్పిక తీర్చుకునేందుకు వచ్చి మృత్యువాత పడుతున్న జింకలు ● అటవీ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కరువు మృతి చెందిన జింక (ఫైల్) గాయపడిన జింక పిల్ల (ఫైల్) కందుకూరు సమీపంలో ఏర్పాటు చేసిన సూచిక బోర్డు పెద్దతిప్పసముద్రం : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కర్ణాటక రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లాలకు సరిహద్దులో వున్న పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట, ములకలచెరువు మండలాలలో సంచరిస్తున్న వివిధ రకాల జింకలు వాహనాల్లో వెళ్లే వారికి కనువిందు చేస్తున్నాయి. ఒక వైపు మండుతున్న ఎండలు, మరో వైపు తగలబడుతున్న అటవీ ప్రాంతాల తద్వారా వన్య ప్రాణులు తల దాచుకునేందుకు కూడా సౌకర్యాలు లేవు. ఆఖరికి మూగజీవాలు అటవీ ప్రాంతాల నుంచి జనావాసాల్లోకి వచ్చి దప్పిక తీర్చుకుంటున్నాయి. మరి కొన్ని చోట్ల రైతుల వ్యవసాయ పొలాల వద్దకు వచ్చి గుళికల మందు కలిపిన నీళ్లు తాగి, ఇంకొన్ని రోడ్డు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోతున్నాయి. దీంతో రోజురోజుకు వన్యప్రాణులు కనుమరుగు అవుతున్నాయి. అటవీ శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జింకలు చనిపోతే అటవీ అధికారులు రావడం, సమీప అడవుల్లో ఖననం చేసి చేతులు దులుపుకొని వెళుతున్నారే గానీ మూగ జీవాలకు అటవీ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం కల్పించడంలో తీవ్రంగా విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ఈ మండలాల్లో ఒకప్పుడు లెక్కకు మించి వున్న జింకల గుంపులు నేడు చేతి వేళ్ల మీద లెక్కించాల్సి వస్తోంది. అటవీ శాఖ వున్నా కూడా వన్య ప్రాణుల రక్షణ నామమాత్రమే. పలు చోట్ల అత్యధికంగా నివసిస్తున్న జింకలు అటవీ ప్రాంతం లేకున్నా గుట్టలనే ఆసరాగాగా చేసుకుని గడుపుతున్నాయి. జింకలను కాపాడి వాటి సంతతిని పెంపొందించే విషయంలో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి. ఉదాహరణకు పీటీఎం మండలంలోని కందుకూరు, సంపతికోట, మద్దయ్యగారిపల్లి, పులికల్లు, బూచిపల్లి, పట్టెంవాండ్లపల్లి, బూర్లపల్లి, ములకలచెరువు మండలంలో సోంపాళ్యం, కదిరినాయునికోట, గూడుపల్లి, బత్తలాపురం ప్రాంతాలలో జింకలు నిత్యం సంచరిస్తుంటాయి. కనీసం ఇప్పటికై నా అటవీ అధికారులు వన్యప్రాణుల దాహార్తి కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
పంచాయతీ కార్మికుల హక్కుల సాధనకు పోరాటం
మదనపల్లె : గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులు వెట్టిచాకిరీ చేస్తున్నారని, వారికి దక్కాల్సిన హక్కులను సాధించుకునేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని ఏపీ గ్రామపంచాయతీ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకట్రామయ్య, సీఐటీయూ జిల్లా కోశాధికారి టి.హరిశర్మ అన్నారు. శుక్రవారం స్థానిక ఎన్జీఓ హోంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా రెండవ మహాసభ జరిగింది. వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో పంచాయతీ కార్మికులకు నిధులు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. గ్రామ పంచాయతీల్లో పని చేసే కార్మికులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంచాయతీల నిధులతో కాకుండా ప్రభుత్వమే ట్రెజరీ వేతనాలు చెల్లించాలన్నారు. మున్సిపల్ కార్మికుల తరహాలో రూ.21 వేల వేతనం ఇవ్వాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం, మృతి చెందిన కార్మికుల అంతిమ సంస్కారాలకు రూ.20 వేలు చెల్లించాలని కోరారు. పనిముట్లు, బట్టలు, కొబ్బరి నూనె, సబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలపై మంత్రి పవన్కళ్యాణ్ స్పందించకుంటే పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి ఎస్.సురేంద్రబాబు గత మూడు సంవత్సరాల నుంచి సంఘం చేపట్టిన కార్యకలాపాలు, నిర్మాణ నివేదికను ప్రవేశపెట్టారు. ఈ నివేదికపై పలువురు ప్రతినిధులు చర్చలు జరిపి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు. జిల్లా కమిటీ ఎన్నిక ఏపీ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ అన్నమయ్య జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా మహాసభ ఎన్నుకుంది. అధ్యక్షులుగా బి.వి.రమణ (పీలేరు), ప్రధాన కార్యదర్శిగా ఎస్.సురేంద్రబాబు (పిటియం), కోశాధికారిగా విజయకుమార్ (కలకడ), వర్కింగ్ ప్రెసిడెంట్గా డి.గోపాల్ (మదనపల్లి) వీరితోపాటు ఆరుగురు ఆఫీస్ బేరర్లు, 11 మంది కమిటీ సభ్యులను మహాసభ ఎన్నుకుంది. -
జలధార ప్రాజెక్ట్ విజయవంతం చేయాలి
అధికారులతో సమీక్షలో కలెక్టర్ నిశాంత్ కుమార్ మదనపల్లె: వంద రోజుల జలధార ప్రాజెక్టును జిల్లాలో అధికార యంత్రాంగం విజయవంతం చేయాలని కలెక్టర్ నిశాంత్కుమార్ అధికారులను కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో వందరోజుల కార్యాచరణ ప్రణాళిక అమలకు తీసుకోవాల్సిన చర్యలపై జల వనరులశాఖ, డ్వామా, భూగర్భ జలాలు, సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఏపీడీలు, ఇంజినీరింగ్, ఫీల్డ్ అసిస్టెంట్లతగో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో జలధారకు ముందు పరిస్థితులు, తర్వాత వచ్చిన ఫలితాలు, ప్రస్తుతం తీసుకోవాల్సిన చర్యల గురించి కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో ప్రతి మండలంలో భూగర్భ జలాలు 6 నుంచి 3 మీటర్ల స్థాయికి చేరుకోవడమే అంతిమ లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ఫలితాలోస్తాయన్నారు. జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఇన్చార్జి డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ విఠల్ ప్రసాద్, డ్వామా పిడి వెంకటరత్నం, జిఎస్డబ్ల్యూఎస్ అధికారి లక్ష్మీపతి, ఆర్డీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. జిల్లాలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమాల ద్వారా ఈ నెల 23 వరకు అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ స్థాయిలో పౌష్టికాహారం లోపంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో ఐసీడీఎస్ శాఖ పోషణ పక్వాడ ప్రచార పోస్టర్లను అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల జననం నుంచి రెండు సంవత్సరాల దశలోనే మెదడు అభివృద్ధిలో 80 శాతం పూర్తవుతుందని తెలిపారు. ఈ సమయంలో సరైన పోషకాహారం, సంరక్షణ చాలా అవసరమని అన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూసీడబ్ల్యూ ఈఓ కె.హైమావతి, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, సీడీపీఓలు పాల్గొన్నారు. -
బడాయి బాబు పాలనలో రక్షణ మృగ్యం!
సాక్షి ప్రతినిధి, కడప: సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. క్రమం తప్పకుండా హత్యలు, అత్యాచారాలు తెరపైకి వస్తున్నాయి. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలికను అత్యాచారం ఆపై హత్య ఉదంతం మరుకముందే.. పుంగనూరులో ముస్లిం కుటుంబానికి చెందిన మరో బాలికను హత్య చేసి చెరువులో పడేశారు. ఆపై మదనపల్లెలో స్వర్ణకుమారి అనే మహిళ హత్యోదంతం తెరపైకి వచ్చింది. అంతలోనే బద్వేల్లో ప్రేమ పేరుతో మైనర్ బాలిక (విద్యార్థిని) భయానక హత్య వెలుగు చూసింది. పర్యాటక ప్రాంతమైన గండికోటలో గత ఏడాది జూలై 14న మరో మైనర్ బాలిక హత్య చోటుచేసుకుంది. తర్వాత మదనపల్లె సమీపంలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన ఏడేళ్ల చిన్నారి హత్యోదంతం ఫిబ్రవరి16న చోటుచేసుకుంది. తాజాగా ఖాజీపేట అగ్రహారంలో మైనర్ బాలికను ఉన్మాది గొంతు కోసి హత్య చేశారు. సీఎం చంద్రబాబు బడాయి పాలనలో యువతులు, మహిళలు సమిధలవుతున్నారు. ● ఖాజీపేటలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఓ మైనర్ బాలిక హత్య శుక్రవారం వెలుగు చూసింది. గ్రామస్తులు నిందితున్ని అప్పగించాలంటూ బాధిత కుటుంబం పక్షాన ఖాజీపేట వద్ద జాతీయ రహాదారిపై బైఠాయించారు. నిరాటకంగా ఆందోళన కొనసాగించారు. పోలీసు అధికారుల విన్నపంతో శాంతించారు. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు మహిళలకు రక్షణ మృగ్యమవుతోంది. వేధింపులు తట్టుకోలేక నలుగురు ఆత్మహత్యలు చేసుకున్నట్లు క్రైమ్ రికార్డు వెల్లడిస్తోంది. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో మైనర్ బాలిక అత్యాచారం, హత్య, పుంగనూరులో ముస్లిం బాలిక హత్య, పీఠాపురంలో యువతిపై అత్యాచారం, హిందూపురంలో అత్తా, కోడళ్లుపై సామూహిక అత్యాచారం ఇలా వరస ఘటనలు తెరపైకి వస్తున్న ప్రభుత్వంలో సత్వర చర్యలు లోపించడంతోనే క్రమం తప్పకుండా ఘటనలు ఉత్పన్నమవుతున్నాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఐదు రోజుల్లో నాలుగు సంచలన హత్యలు... వైఎస్సార్ కడప జిల్లాలో ఐదురోజుల వ్యవధిలో నాలుగు సంచలన హత్యలు వెలుగు చూశాయి. ఘర్షణ నేపథ్యంలో కుటుంబ సభ్యుల్ని చికిత్సలకు రిమ్స్కు తీసుకెళ్లిన ఆలంఖాన్పల్లెకు చెందిన పెద్ద దస్తగిరిని(53) వేటాడి, వెంటాడి రిమ్స్లో సోమవారం వేకువజామున హత్య చేశారు. ఈ హత్య మరువక ముందే బుధవారం రాత్రి వల్లూరు బస్టాప్ వద్ద వెంకటసుబ్యయ్య(45) అనే వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు. శుక్రవారం మధ్యాహ్నం మైనర్బాలికను గొంతు కోసి హత్య చేసిన ఉదంతం ఖాజీపేటలో వెలుగు చూసింది. రాజుపాలెం మండలం పర్లపాడు గ్రామంలో మహేష్ అనే యువకుడ్ని చరణ్ కత్తితో గొంతులో పొడిచి హత్యచేశాడు. ఈ హత్యోదంతాలు పరిశీలిస్తే పోలీసుల ప్రతిష్ట మంటగలుస్తోంది. శాంతి భద్రతలు కాపాడాల్సిన వ్యవస్థలో అవినీతి తాండవం చేస్తుండడమే కారణమని పరిశీలకులు ఆరోపిస్తున్నారు. కొల్కిరాని మైనర్ బాలిక హత్య కేసు... గండికోట మైనర్ బాలిక హత్య కేసు దర్యాప్తులో పోలీసు అధికారుల క్షేత్రస్థాయి కృషి నీరుగారిపోయింది. ఇప్పటీకీ కేసు కొల్కిరాలేదు. అప్పటి ఎస్పీ అశోక్కుమార్తో పాటు ప్రస్తుత ఎస్పీ షల్కే నచికేత్ విశ్వనాథ్ పర్యవేక్షించినా ఎలాంటి ప్రయోజనం లేదు. పలు రకాలుగా విశ్లేషణ చేశారు. సీసీ పుటేజీల ఆధారంగా అనుమానితులను విచారించారు. టవర్ లోకేషన్ ద్వారా ఫోన్కాల్స్ విశ్లేషణ చేశారు. అనేక సాంకేతిక వ్యవహారాలు పొందుపర్చి దర్యాప్తు చేసినా ఫలితం లేదు. దీనిని బట్టి పోలీసు వ్యవస్థ ఎలాంటి దుస్థితిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చునని విశ్లేషకులు వాపోతున్నారు. హత్యకు గురైన పెద్ద దస్తగిరి (ఫైల్)హత్యకు గురైన వెంకట సుబ్బయ్య పోలీసుశాఖలో కొంతమంది అధికారులపై నిత్యం అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. మరికొంతమంది అధికారులు చట్టాన్ని విస్మ రించి, ఏకపక్ష చర్యలే ఏకై క అజెండాగా పనిచేస్తున్నారు. ఇంకొంతమంది వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి తదనుగుణంగా చర్యలకు దిగుతున్నారు. పోలీసుశాఖలో అంతర్గతంగా అనేక ఆనైతిక చర్యలు తెరపైకి వస్తున్నాయి. గతంలో కడప టూటౌన్, జమ్మలమడుగు సీఐలుగా పనిచేసిన అధికారులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మరోవైపు పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ, సింహాద్రిపురం ఎస్ఐ అనిల్కుమార్లు రూ.1.5లక్షలు లంచం తీసుకుంటుండడగా రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఇలాంటి ఇరోపణలు తెరపైకి రాగానే ప్రక్షాళన దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టిన దాఖలాలు లేవని పలువురు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసుశాఖ పట్ల సామాన్యులకు గౌరవం లోపించి అసాంఘిక శక్తులు అవతరిస్తున్నట్లు పలువురు వెల్లడిస్తున్నారు. ఇప్పటికై నా ‘కన్పించని నాలుగో సింహం’ప్రజల మాన, ప్రాణ, ఆస్తి రక్షణకు చర్యలు చేపట్టాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. మొన్న దస్తగిరి, నిన్న వెంకటసుబ్బయ్య, నేడు మైనర్ బాలిక హత్య వరుస హత్యలతోమసకబారుతున్న పోలీస్ ప్రతిష్ట ప్రక్షాళన దిశగాఅడుగులు వేయని యంత్రాంగం ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టినామార్పు శూన్యం లంచావతారాలుగా డబుల్,ట్రిపుల్ స్టార్ అధికారులు రెడ్ బుక్ పాలనతో రాష్ట్రంలో అటవిక రాజ్యం కొనసాగుతోందని మహిళాలోకం ఆరోపిస్తోంది. మహిళలపై సామూహిక అత్యాచారాలు, చిన్నారుల హత్యోదంతాలు అందుకు నిదర్శనంగా చెప్పుకొస్తున్నారు. దిశ యాప్ కొనసాగి ఉంటే బద్వేల్ విద్యార్థిని దస్తగిరమ్మకు రక్షణ లభించేదని పలువురు అప్పట్లో ఆరోపించారు. మద్యం వ్యాపారం పట్ల ఉన్న ఆసక్తి యువతులు, మహిళలలు మాన ప్రాణాలు రక్షించడంలో కన్పించడం లేదని పలువురు వాపోతున్నారు. పైగా ఏకపక్ష చర్యలతో పోలీసుశాఖ అభాసుపాలవుతోంది. ప్రత్యేకించి పోలీసు అధికారులు చట్టానికి లోబడి విధులు నిర్వర్తించడం కంటే కొంతమంది అధికారులు అధికారంలో ఉన్న నేతల మొప్పు కోసం పనిచేసేందుకే ఇష్టపడుతున్నారు. ఈక్రమంలో అక్రమ కేసులు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు లాంటి అత్యున్నత న్యాయ స్థానం తప్పుబట్టినా అలాంటి పోలీసు అధికారుల తీరులో మార్పు లభించలేదని పలువురు వెల్లడిస్తున్నారు. -
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు
ఖాజీపేట: మైనర్ బాలిక హత్యతో జిల్లా ఉలిక్కి పడింది. ఖాజీపేట చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదు. శుక్రవారం అగ్రహారం గ్రామంలోని మైనర్ బాలిక ఇంటిలోకి ఆంజనేయకొట్టాలుకు చెందిన వ్యక్తి వెళ్లి పట్టపగలు హత్య చేయడం సంచలనంగా మారింది. వివరాలు.. ఖాజీపేట మేజర్ పంచాయతీలోని అగ్రహారం గ్రామంలో ఇళ్లూరు శ్రీనివాసులు, నాగమణిలకు ముగ్గురు సంతానం. అందులో రెండో సంతానం రామకీర్తన(16) ఖాజీపేటలోని మోడల్ స్కూల్లో చదువుతూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసింది. బాలికను ఆంజనేయకొట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్ (19) రెండు సంవత్సరాల నుంచి ప్రేమ పేరుతో వేధించే వాడు. మీ కూతురు ఇతరులతో ఫోన్లో మాట్లాడుతోందంటూ తండ్రికి పలుమార్లు ఫిర్యాదు చేశాడు. ‘మా కూతురు సంగతి మేం చూసుకుంటాం.. నీవు జోక్యం చేసుకోవద్ద’ని పలుమార్లు బాలిక తండ్రి శ్రీనివాసులు నిందితునికి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈనెల 10వ తేదీ ఉదయం వెంకటేష్ బాలికతో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేశాడు. అయితే అందుకు స్పందించక పోవడంతో ఆవేశంతో ఇంటికి వెళ్లి కొడవలితో గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. రక్తపు మడుగులో కూతురును చూసి చలించిన తండ్రి మైదుకూరుకు వెళ్లిన బాలిక తండ్రి, సోదరుడు 11 గంటలకు ఇంటికి చేరుకున్నారు. రెండవ గదిలో రక్తపు మడుగులో ఉన్న కూతురుని చూసి తండ్రి చలించిపోయాడు. అప్పటికీ కుమార్తె మాట్లాడుతుండటంతో కాపాడుకునేందుకు ప్రయత్నం చేశాడు. గొంతు నుంచి రక్తస్రావం జరగకుండా టవల్ను చుట్టి కూతురిని చేతుల్లో ఎత్తుకుని చికిత్స నిమిత్తం ఆటోలో కడపకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇంతలో హైవేపైకి రాగానే 108 వాహనం రావడంతో అందులో కడప రిమ్స్కు తీసుకెళ్లారు. అప్పటికే బాలిక మృతి చెందడంతో తండ్రి, అన్న బోరున విలపించారు. హత్యోదంతంలో ఒక్కడే ఉన్నట్లు అధికారులతోపాటు అందరూ భావించారు. అయితే బాలిక తండ్రి శ్రీనివాసులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆవుల వెంకటేష్ తోపాటు తన కూతురు మరొకరి పేరు తనకు చెప్పిందని పేర్కొన్నాడు. అతను ఎవరూ అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అయితే ఆ వ్యక్తి ఎవరో తమకు తెలియదని బాలిక తల్లిదండ్రులు అంటున్నారు. తమ కూతురు చెప్పిందని, అందుకే ఫిర్యాదులో చేర్చినట్లు పోలీసులకు చెప్పారు. బాలికకు న్యాయం జరగాలని కోరుతూ గ్రామస్తులు ధర్నా చేశారు. హంతకుడికి ఉరిశిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. మూడు గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. ఫిర్యాదు స్వీకరించడంలో ఆలస్యం ఫిర్యాదు స్వీకరించడంలో పోలీసులు తీవ్ర జాప్యం చేశారు. పోస్టుమార్టం జరిగే ప్రదేశానికి బాలిక తండ్రితోపాటు పలువురు బంధువులు వెళ్లారు. వారితో ఫిర్యాదు తీసుకుని ఉంటే సరిపోయేది. కానీ అలా చేయక పోవడంతో ఫిర్యాదు సాయంత్రం తీసుకోవాల్సి వచ్చింది. దీంతో బాలిక మృతదేహానికి పోస్టుమార్టం శనివారం జరగనుంది. ● మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఖాజీపేట: కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ హత్యాంధ్రప్రదేశ్గా మారిందని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. అగ్రహారంలో మైనర్ బాలిక హత్యను తీవ్రంగా ఖండించారు. మదనపల్లె హత్య మరువక ముందే ఖాజీపేటలో బాలిక హత్యకు గురి కావడం తీవ్రంగా కలచి వేందన్నారు. హత్యకు కారకుడై ఆవుల వెంకటేషకు కఠిన శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పుడే బాధిత కుంటుంబాలకు న్యాయం జరుగుతుందన్నారు. కూటమి ప్రభత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడ చూసినా గంజాయి, మధ్యం ఏరులై పారుతోందని అన్నారు. మహిళ హోంమంత్రిగా ఉన్నా మహిళలపైనే హత్యలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని సూటిగా ప్రశ్నంచారు. ప్రేమోన్మాదం వెర్రితలలు వేసి యమపాశమవుతోంది. తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశల గొంతు కోస్తోంది. ఇష్టం లేకున్నా వెంటపడి ఉసురు తీస్తోంది. ఆడబిడ్డ కాలు బయటపెడితే తిరిగి వచ్చే వరకు ఆ అమ్మానాన్నలు గుండెలు గుప్పిట్లో పెట్టుకుని ఎదురుచూడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం ఖాజీపేటలో ఓ యువకుడు అత్యంత పాశవికంగా ఓ యువతిని కొడవలితో గొంతు కోసిన ఘటనతో జిల్లా ఉలిక్కిపడింది. ఘాతుకానికి పాల్పడిన యువకుడు ఉలిక్కిపడిన జిల్లా వెల్లువెత్తిన నిరసన కడప అర్బన్: ఖాజీపేట మండలంలోని అగ్రహారం గ్రామంలో బాలికను హత్య చేసిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని కీర్తన తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ భరోసా ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం కడపలో బాలిక తల్లిదండ్రులు ఎస్పీ కలిశారు. తమకు న్యాయం చేయాలని విన్నవించారు. ఈ సందర్భంగా ఎస్పీ, బాలిక తల్లిదండ్రులను ఓదార్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. -
భర్తపై భార్య ఇనుప రాడ్డుతో దాడి
మదనపల్లె టౌన్ : తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో గొడవపడి, ఇనుప రాడ్డుతో దాడి చేసి తీవ్రంగా గాయపరచింది. మదనపల్లె పట్టణంలో శుక్రవారం చోటుచేసుకున్న ఘటనపై బాధితుడు తెలిపిన వివరాలు.. స్థానిక శ్రీవారి నగర్లో కాపురం ఉంటున్న పట్టుదారం తీసే రెడ్డి బాబు (48) అదే ప్రాంతానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తన భార్య ధనలక్ష్మి అనుమానం పెంచుకుంది. దీంతో భర్తతో తరచూ గొడవ పడుతోంది. ఈ విషయమై రెడ్డి బాబు తన బావ మరుదులకు తన భార్య రాద్ధాంతం చేస్తోందని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన ధనలక్ష్మి చేసిన ఘన కార్యంపై ఇంటో వాళ్లకు చెబుతావా అంటూ నిలదీసి గొడవపడింది. ఆవేశంతో ఇంట్లో ఉన్న ఇనుప రాడ్డుతో భర్త తలపై మోదడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సాయంతో బాధితుడు వెంటనే జిల్లా ఆస్పత్రికి చేరుకుని వైద్య చికిత్సలు పొంతున్నాడు. ఘటనపై రెండవ పట్టణ పోలీసులు విచారణ చేస్తున్నారు. -
మదనపల్లె నూతన డీఎస్పీగా పావని
మదనపల్లె టౌన్: మదనపల్లె నూతన డీఎస్పీగా పావనిని నియమిస్తూ డీజీపీ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మదనపల్లె డీఎస్పీగా మహేంద్ర విధులు నిర్వర్తించేవారు. ఆయన సెలవులో వెళ్లడంతో ఆయనస్థానంలో కృష్టా జల్లా గన్నవరం ఎస్డీపీఓగా పనిచేస్తున్న పావనిని మదనపల్లెకు బదిలీ చేశారు. పుంగనూరు: పుంగనూరు సమీపంలోని చీమనపల్లె వద్ద ఉన్న హజ్రత్జాన్ పాక్షావలిబాబా, ఫకీర్షావలిబాబా వారి ఉరుసు శుక్రవారం రాత్రి గంధంతో ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఉరుసు కోసం దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించారు.ఫకీర్ల వాయిద్యాలతో దర్గాలో దువ్వా చేశారు. శని, ఆదివారాలలో ముంబైకి చెందిన అఫ్రిన్సుల్తానా, మైసూర్కు చెందిన సలీంరిష్టి, గుజరాత్కు చెందిన ఆసిఫ్అజ్మీర్, ఇంతేజుర్రిష్టిలతో ఉరుసు , ఖవ్వాలి పాటల పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఉరుసుకు వచ్చే వేలాది మంది భక్తులకు ప్రతి రోజు దర్గా వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉరుసులో కులమతాలకతీతంగా హిందూముస్లింలు పాల్గొనడం గమనార్హం. కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈ నెల 26 నుంచి ఆంధ్ర ప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ 2026–27 విద్యా సంవత్సరానికి విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి జిల్లాల్లో రాష్ట్ర క్రీడా అకాడమీల పున:స్థాపన ప్రక్రియ ప్రారంభించిస్తున్నట్లు డీఎస్డీఓ గౌస్ బాషా తెలిపారు. శుక్రవారం కడపలోని డీఎస్ఏ క్రీడామైదానంలో విలేకరుతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడాకారుల అభివద్ధికి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం,నాణ్యమైన శిక్షణ వసతులు కల్పించడం దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. 15 సంవత్సరాలు పైబడిన, 19 సంవత్సరాల లోపు వయసుగల క్రీడాకారులు (2008 జనవరి1 నుంచి 2011 జనవరి 1 జన్మించినవారు ) క్రీడాకారుల ప్రవేశానికి అర్హులని తెలిపారు. సిద్దవటం: రెండు దశల్లో 2027 జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం ఉంటుందని జిల్లా సెన్సెస్ ఇన్చార్జి మోహన్ రమణ తెలిపారు. సిద్దవటం జెడ్పీ హైస్కూల్లో 2027 సెన్సెస్ కార్యక్రమంపై ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శుక్రవారం శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మోహన్ రమణ, చీఫ్ ప్లానింగ్ అధికారి హజరతయ్యలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఓ శివప్రసాద్ మాట్లా డుతూ సెన్సెస్ మొదటి దశ ఆంధ్రప్రదేశ్లో మే 1 నుంచి 30 వరకు ఉంటుందన్నారు. జన గణన రెండో దశ 2027 జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరుగుతుందన్నారు. ఎవరికి వారే స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు చేసుకోవచ్చన్నారు. ప్రొద్దుటూరు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మావిగన్ను రాజధానిగా ప్రతిపాదన చేసినప్పటి నుంచి ప్రకంపనలు మొదలయ్యాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అటు టీడీపీలోనూ, ఇటు జనసేన పార్టీలోనూ, పచ్చ మీడియాకు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు ఇలా .. వారందరి హృదయాల్లో ప్రకంపనలే వీస్తున్నాయని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణం సాధ్యం కాదని చెప్పడంతోపాటు రాజధాని నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు అవసరమవుతుందని, కేవలం రూ.20 వేల కోట్లతో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం పరిధిలో మావిగన్ను నిర్మించవచ్చని జగన్ సూచించారన్నారు. రాష్ట్రానికి ఇది గ్రోత్ ఇంజిన్గా పని చేస్తుందని జగన్ తెలిపారన్నారు. ఈ ప్రతిపాదనను పచ్చ మీడియా, కూటమి ప్రభుత్వం ఏమాత్రం అంగీకరించే పరిస్థితుల్లో లేవన్నారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మావిగన్ ప్రతిపాదన చేసి జగన్ జోకర్ అయ్యారని విమర్శించారన్నారు. జగన్ జోకర్ కాదని, మంచిని సూచించే మెంటర్ అని స్పష్టం చేశారు. ఏనాడో శివరామకృష్ణన్ కమిటీ అమరావతి నిర్మాణం ఏమాత్రం ఆచరణ సాధ్యం కాదని తెలిపిందన్నారు. ఇక్కడ రాజధానిని నిర్మిస్తే భూకంపాల ప్రమాదం ఉంటుందని, వరదలతో ఇబ్బందులు ఎదురవుతాయని, పునాదులు నిర్మించడానికి వీలు కాదని చెప్పడం జరిగిందన్నారు. మూడు కారులు పండే పొలాలను నాశనం చేస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల కారణంగా అమరావతిలో రాజధానిని నిర్మించడం సాధ్యం కాదని చెప్పడం జరిగిందన్నారు. ఇక్కడ రాజధాని నిర్మాణం చేపడితే అందరికీ నష్టం వస్తుందన్నారు. -
తాగునీరు అందించండి.. మహాప్రభో !
● నీరు పుష్కలంగా ఉన్నా ఉపయోగం సున్నా ● శుభ్రం చేయని కాలువలు ● లబోదిబోమంటున్న స్థానికులు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తున్న స్థానికులు వాల్మీకిపురం : తాగునీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు పట్టణంలోని కోనేటివీధి, కొత్త ఇందిరమ్మ కాలనీకి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు బాగా కురిసి చెరువులు, వాగులు, వంకల్లో నీరు పుష్కలంగా ఉన్నా.. బోర్లలో నీరు ఉన్నా గ్రామస్తులకు అందించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా ఉపయోగం లేదని, తాగునీరు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువలు శుభ్రం చేయడం లేదని, దోమలు పెరిగి ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. దీంతో శుక్రవారం స్థానికులు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. కోనేటివీధిలో నెల రోజులుగా నీరు సరఫరా కావడం లేదని, కొత్త ఇందిరమ్మ కాలనీలో వారానికి ఒక రోజు నీరు వస్తున్నట్లు వారు తెలిపారు. పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ తాగునీరు సరఫరా చేయడంలో చూపకపోవడం దారుణమన్నారు. కొన్ని చోట్ల పైప్లైన్ దెబ్బతినడం, బోర్లకు మోటార్లు లేకపోవడం తదితర కారణాలతో నీరు సరఫరా చేయడం లేదని ఆరోపించారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకొని, తాగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు కదీరున్నిసా, మాబుజాన్, క్రిష్ణవేణమ్మ, మస్తాన్బి, నూర్జహాన్, హస్మత్, శబమ్, అనసూయమ్మ, ఫర్తాజ్, ఈశ్వరమ్మ, సిరాజున్నిసా, తదితరులు పాల్గొన్నారు. కొత్త ఇందిరమ్మ కాలనీలో శుభ్రం చేయని కాలువ పట్టణంలో కాలువలు శుభ్రం చేయడం లేదు. దీంతో రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తున్నాయి. దీంతో దోమలు పెరుగుతున్నాయి. రాత్రి సమయాల్లో నిద్రపట్టడం లేదు. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. చెత్త సేకరణ కూడా చేయడం లేదు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. – రవిశంకర్, కోనేటివీధి, వాల్మీకిపురం గత నెల రోజులుగా తాగు నీరు వదలడం లేదు. దీంతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మహిళలకు ఇబ్బంది లేకుండా తాగునీరు ఇప్పించండి. ఎండలు ఎక్కువ అవుతున్నాయి. తాగు నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి. – మస్తాన్ బీ, కోనేటివీధి, వాల్మీకిపురం -
చైన్ స్నాచింగ్
సదుం : వృద్ధురాలి మెడలో గుర్తు తెలియని వ్యక్తి బంగారు చైన్ చోరీ చేసిన సంఘటన సదుం మండలంలో శుక్రవారం జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. దిగువ జాండ్రపేటలో వంతెన వద్ద రెడ్డెమ్మ నివసిస్తోంది. ఆమె మధ్యాహ్నం నిద్రిస్తుండగా ఎవరో తలుపు తట్టడంతో లేచి తీసింది. బురఖా ధరించిన వ్యక్తి మొహంపై కారం కొట్టి మెడలో ఉన్న 25 గ్రాముల బంగారు చైన్ లాక్కొని వెళ్లాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేశారు. పాము కాటుతో మహిళకు అస్వస్థత మదనపల్లె టౌన్ : పూలు కోస్తుండగా విష సర్పం కాటేసి మహిళ తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన శుక్రవారం మదనపల్లె పట్టణంలో జరిగింది. బాధితురాలి కుటుంబీకుల కథనం మేరకు వివరాలు.. పట్టణంలోని సిటిఎం రోడ్ ఎస్టేట్లో కాపురం ఉంటున్న ఆదెప్ప భార్య అంజమ్మ(36) తన ఇంటి సమీపంలో ఉన్న పూల చెట్టులో పూలు కోయడానికి వెళ్లింది. పూలు కోస్తుండగా చేతిపై ఏదో కరచినట్లు అయింది. రక్తం కారుతుండటంతో.. వెంటనే ఆమెను స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి పాము కరిచిందని గుర్తించారు. ప్రథమ చికిత్సలు అందించి తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చాపాడు : మైదుకూరు –ప్రొద్దుటూరు జాతీయ రహదారిలోని చాపాడు మండలం నాగులపల్లె గ్రామ సమీపంలో ప్రొద్దుటూరు వైపు వెళ్లే దారిలో శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. నాగులపల్లె సమీపంలోని రైస్ మిల్లు ఎదురుగా ప్రొద్దుటూరు వైపు వెళుతున్న 50 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తిని వాహనం ఢీకొనగా.. అక్కడికక్కడే మృతి చెందినట్లు చాపాడు పోలీసులు తెలియజేశారు. మృతుడి ఒంటిపై తెల్లటి చొక్కా, ఎర్రటి లుంగీ ధరించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు వారు తెలియజేశారు. మృతుడి ఆచూకీ గుర్తించేందుకు వారు చర్యలు చేపట్టారు. జమ్మలమడుగు : మైలవరం మండలంలోని దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన పల్లా బాలుగ్రం అనే న్యాయవాది కనిపించడం లేదంటూ ఆయన భార్య సుదర్శనదేవి మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 6వ తేదీ ఇంటి నుంచి వెళ్లి అతను తిరిగి రాలేదు. బంధువులను విచారణ చేసినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది. సమగ్ర విచారణ చేపడుతున్నామని మైలవరం ఎస్ఐ శ్యాంసుందర్రెడ్డి తెలిపారు. -
కత్తితో పొడిచి యువకుడి హత్య
● ఘటనకు దారి తీసిన దాయాదుల మధ్య గొడవ ● సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు రాజుపాళెం : మండల పరిధి పర్లపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం రాత్రి బంగి మహేష్ అలియాస్ పండు (23) అనే యువకుడు కత్తిపోట్లతో హత్యకు గురయ్యాడు. అదే గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన వరుసకు దాయాదులైన మరో యువకుడితో జరిగిన చిన్నపాటి ఘర్షణ కారణంగా చినికి చినికి గాలి వానలాగా మారడంతో హత్యకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే... మధ్యాహ్న సమయంలో మహేష్ ఎందుకు అంత స్పీడ్గా వెళ్తున్నావని చరణ్ను వారించినట్లు తెలిసింది. ఈ విషయమై అక్కడ ఇరువురి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అయితే ఇదే విషయమై రాత్రి రెండు కుటుంబాలకు చెందిన వాళ్లు గొడవ పడ్డారు. ఈ క్రమంలో మహేష్ను చరణ్ కత్తితో పొడిచి హత్య చేసినట్లు తెలిసింది. అయితే మహేష్ను చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ప్రొద్దుటూరు రూరల్ సీఐ నాగభూషణం, ఎస్ఐ ప్రణయ్కుమార్రెడ్డిలు శుక్రవారం రాత్రి పరిశీలించారు. హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుడికి తల్లిదండ్రులతోపాటు అన్న కూడా ఉన్నారు. మృతుడు వృత్తి రీత్యా డ్రైవరుగా పని చేస్తున్నాడు. హత్య జరిగిందని తెలియడంతో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కిపడింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వడదెబ్బతో వ్యక్తి మృతి
లక్కిరెడ్డిపల్లి : అన్నమయ్య జిల్లా చౌటపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు (36) అనే వ్యక్తి శుక్రవారం వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం గొల్లపల్లికి చెందిన గంగాదేవితో రామాంజులుకు వివాహమైంది. మూడు సంవత్సరాలు ఇద్దరు కలిసి ఉండి తరువాత విడిపోవడంతో రామాంజులు మద్యానికి బానిసయ్యాడు. రాయచోటి–కడప జాతీయ రహదారి టోల్గేట్ వద్ద అంబులెన్సులో పని చేస్తూ జీవనం సాగించేవాడు. శుక్రవారం డ్యూటీ దిగాడు. మధ్యాహ్నం గుగ్గుళ్ల గుట్టవద్దకు వెళ్లి మద్యం తాగాడు. అక్కడే అపస్మారక స్థితిలో పడిపోయాడు. ప్రేమకుమార్ అనే వ్యక్తి వచ్చి నీ కుమారుడు అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నాడని చెప్పాడు. వెంటనే అక్కడికి వెళ్లి 108లో లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించారు. ఎండవేడికి తట్టుకోలేక..నోరు ఆరిపోయి వడదెబ్బ వల్ల మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు లక్కిరెడ్డిపల్లి పోలీసులు తెలిపారు. -
మూడు పాఠశాలల బస్సులు దగ్ధం
కమలాపురం : మండల పరిధిలోని కోగటం గ్రామంలో గురువారం అర్ధరాత్రి మూడు ప్రైవేటు పాఠశాలలకు చెందిన మూడు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పలు ప్రైవేటు పాఠశాలలకు పాఠశాలల యాజమాన్యాలు ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా ప్రతి రోజూ మండల పరిధిలోని పలు గ్రామాల నుంచి విద్యార్థులను తరలిస్తారు. పాఠశాల ముగిసిన తరువాత తిరిగి వారిని వారి గ్రామాలకు చేరుస్తారు. అనంతరం బస్సులను కోగటం గ్రామం వద్ద వున్న ఖాళీ ప్రదేశంలో వుంచి డ్రైవర్లు మాత్రం ఇంటికి వెళ్లి మరుసటి రోజు ఉదయం యథావిధిగా విద్యార్థులను పాఠశాలలకు తరలిస్తుంటారు. ఈ క్రమంలో గురువారం విద్యార్థులను గమ్య స్థానాలకు చేర్చిన డ్రైవర్లు వివిధ ప్రైవేటు పాఠశాలకు చెందిన ఐదు బస్సులను కోగటం వద్ద ఉంచి తమ ఇళ్లకు వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో బస్సులు మంటలకు కాలిపోతూ ఉండడాన్ని స్థానికులు గమనించారు. వారు ఇచ్చిన సమాచారం అందుకున్న కమలాపురం అగ్నిమాపక, పోలీసు శాఖ వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. అప్పటికే మూడు బస్సులు ఆహుతి కాగా వాటి పక్కనే వున్న మరో రెండు బస్సులను పూర్తిగా కాపాడారు. దగ్ధమైన బస్సులు ప్రొద్దుటూరులోని గీతాంజలి స్కూల్, ఐడియల్ పబ్లిక్ స్కూల్, గోపీ కృష్ణ మాంటిస్సోరి విద్యా సంస్థలకు చెందినవిగా గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.43 లక్షల మేర వుంటుందని పాఠశాల యాజమన్యాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అగ్నిమాపక శాఖ అఽధికారి జనార్దన్రెడ్డి తెలిపారు. కాగా ఈ సంఘటనకు కారణాలు తెలియరాలేదు. ఎవరైనా ఆకతాయిలు నిప్పు పెట్టడం వల్ల ప్రమాదం జరిగిందా లేక బస్సులో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్ల గానీ మరే ఇతర కారణంతో ప్రమాదం జరిగిందో పోలీసుల విచారణలో తెలియాల్సి వుంది. -
పోలీసుల అదుపులో నిందితుడు
బాలికను హత్య చేసిన ఆవుల వెంకటేష్ వెంటనే ఆంజనేయ కొట్టాలుకు వెళ్లాడు. హత్య చేసే సమయంలో వేసుకున్న దుస్తులు తీసేసి పారిపోవడానికి సిద్ధమవుతుండగా పోలీసులు అతన్ని ఆదుపులోకి తీసుకున్నారు. హత్య సమయంలో ఉపయోగించిన ఆయుధంతోపాటు మరి కొన్ని క్లూస్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే బాలిక బంధువులు, తల్లిదండ్రులు స్టేషన్కు వస్తారని ముందుగానే గుర్తించి నిందితుడిని మరో స్టేషన్కు తరలించి విచారణ జరుపుతున్నారు. విచారణలో తానే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. -
న్యాయవాది హత్యకు పాతకక్షలే కారణం
● ఐదుగురు నిందితులు అరెస్టు ● పరారీలో మరొకరు.. ట్రాక్టర్లు, బైకులు స్వాధీనం ● జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి రాయచోటి : న్యాయవాది హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. గ్రామంలో ఆధిపత్యపోరు, పాత కక్షల కారణంగా పథకం ప్రకారం న్యాయవాది పూజారి ఎల్లయ్యను హత్య చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. గురువారం రాయచోటిలోని పాస్పోర్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు. కేవీపల్లె మండలం, పాత వడ్డిపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది పి ఎల్లయ్యకు అదే గ్రామానికి చెందిన నిందితులకు మధ్య గత కొంతకాలంగా ఆధిపత్యపోరు నడుస్తోందన్నారు. ఎల్లయ్య తన హోదానుఅడ్డుపెట్టుకొని తమను తక్కువచేసి చూస్తున్నాడని, పాత కేసుల ప్రస్తావన తెస్తూ గ్రామస్తులు ముందు అవమానిస్తున్నాడని నిందితులు కక్షపెంచుకున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఈనెల 6వ తేదిన ఎల్లయ్య ఇంటిముందు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు విషయంలో జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసిందన్నారు. పథకం ప్రకారం దాడి... హత్యచేయాలనే ఉద్దేశంతో నిందితులు కడప–పీలేరు రహదారిలోని మఠంపల్లి క్రాస్ వద్ద సమావేశమై స్కెచ్ వేశారని ఎస్పీ తెలిపారు. పథకం ప్రకారం ఎల్లయ్య ఇంటికి వెళ్లే దారికి అడ్డంగా ట్రాక్టర్లను నిలిపి దిగ్భంధనం చేసినట్లు వివరించారు రాత్రి 11 గంటల సమయంలో ఇంటిపై దాడి చేసి అడ్డువచ్చిన ఎల్లయ్యను, తల్లిదండ్రులను బయటకు లాగి కొట్టారన్నారు. అనంతరం ఎల్లయ్యను పట్టుకొని కదలకుండా చేతులు, కాళ్లు నొక్కిపెట్టి పెద్ద బండరాళ్లతో తలపై బలంగా మోది ప్రాణాలు తీసినట్లు ఎస్పీ వివరించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన యల్లయ్య తల్లిదండ్రులు ప్రస్తుతం తిరుపతిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అరెస్టు వివరాలు... రాయచోటి డిఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ పర్యవేక్షణలో కలకడ సీఐ లక్ష్మన్న బృందం గురువారం ఉదయం గడి క్రాస్ బస్టాప్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కుంచెపు శ్రీనివాసులు (39), కుంచెపు మోహన్ బాబు (27), కుంచెపు పురుషోత్తం (28), పూజారి శంకరయ్య (26), బండి శివ (35)లను అరెస్టు చేయగా మరో నిందితుడు కుంచెపు నాగేశ్వర్ పరారీలో ఉన్నట్లు వివరించారు. హత్యకు ఉపయోగించిన రెండు బండరాళ్లు, ఐదు కట్టెలు, రెండు బైక్లు, రెండు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను పట్టుకున్న రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, కలకడ సీఐ లక్ష్మన్న, కేవీపల్లె ఎస్ఐ శివకుమార్, కలకడ ఎస్ఐ రామాంజనేయులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వ్యక్తిగత కక్షలతో దాడులకు పాల్పడే వారికి స్థానం లేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు. -
రోడ్డున పడిన టమాటా
గుర్రంకొండ: ఒకప్పుడు దొంగల బారి నుండి టమాటాలను కాపాడుకొనేందుకు రైతులు రాత్రిళ్లు పొలాల వద్దనే జాగారం చేసేవాళ్లు. కష్టాలుపడి తోటల వద్ద నుంచి మార్కెట్కు తరలించేవారు. నేడు మార్కెట్లో టమాటా ధరలు రోజు రోజుకు పతనం అవుతుండడంతో ఏం చేయాలో దిక్కుతోచని రైతులు కాయలు కోయకుండా తోటల్లో వదిలేస్తున్నారు. మరికొంతమంది అతి తక్కువ ధరలకు జ్యూస్ ఫ్యాక్టరీలకు తరలించేస్తున్నారు. మార్కెట్కు తరలిస్తే కమీషన్లు, రవాణా చార్జీల భారానికి భయపడి మార్కెట్యార్డు పరిసరాల్లో రోడ్లపైనే క్రీట్లు దించేస్తున్నారు. జ్యూస్ ఫ్యాక్టరికి తరలించేవారు వాటిని రోడ్లపైనే రాత్రింబవళ్లు ఉంచేసి తరువాత తీరుబడిగా తీసుకెళుతున్నారు. ఒకప్పుడు దొంగలు రాత్రిళ్లు తోటల వద్దకు వెళ్లి టమాటాలను ఎత్తుకెళ్లగా.. నేడు రోడ్లపైనే రాత్రింబవళ్లు ఎక్కడపడితే అక్కడ వదిలేసినా తీసుకెళ్లే వారు కరువయ్యారు. రోడ్లపైనే క్రీట్లు టమాటా ధరలు పతనమవడంతో టమాటాలను క్రీట్లలో నింపి వ్యాపారులు రోజుల తరబడి రోడ్లపైనే ఏక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. అయితే కళ్లుముందు టమాటాలు కనిపిస్తున్నా వాటిని ఎవరూ తాకడం లేదు. మండలకేంద్రంలో మార్కెట్యార్డుకు నాలుగు మండలాలకు చెందిన రైతులు టమాటాలను తీసుకొస్తుంటారు. ఆయా మండలాల పరిధిలో 2140 ఎకరాల్లో ఇప్పటికే పంట సాగు చేశారు. దిగుబడులు పుష్కలంగా వస్తున్నాయి. అయితే మార్కెట్లో ధరలు అశించినంతగా లేక పోవడం గమనార్హం ప్రస్తుతం 25కేజీల టామాటా క్రీట్ ఽ(బాక్సు) ధర రూ. 150 నుంచి రూ. 180 లోపే పలుకుతోంది. దీంతో రైతులకు పంటసాగుకు ఖర్చు చేసిన పెట్టుబడి రాకపోగా మార్కెట్కు తరలించే ఖర్చులు కూడా రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో పలువురు రైతులు జ్యూస్ఫ్యాక్టరీలకు తరలించే వ్యాపారులకు తోటల వద్దనే కాయలు విక్రయిస్తున్నారు. వ్యాపారులు సరాసరి 25కేజీల క్రీట్ రూ. 70 నుంచి రూ.80కు టమాటాలను కొనుగోలు చేసి తోటల వద్దనే లోడింగ్ చేసి అక్కడి నుంచి వాహనాల్లో జ్యూస్ఫ్యాక్టరీలకు తరలించేస్తున్నారు. గతంలో తోటలవద్ద కాపాలా: గతంలో టమాటా ధరలు ఆకాశానంటున్న తరుణంలో దొంగల బారి నుంచి కాయలను కాపాడుకొనేందకు రైతులు రాత్రిళ్లు తోటల వద్దనే కాపాలాగా పడుకొనేవారు. గతంలో క్రీట్ ధర రూ.2500 నుంచి రూ. 3500 వరకు ధరలు పలికాయి. మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్న కాలమంతా రైతులు కష్టాలు పడి కాయల్ని తోటల వద్ద కాపాడుకొన్న సంఘటనలు చోటు చేసుకొన్నాయి. అయితే అందుకు భిన్నంగా నేడు రోడ్లపైనే వదిలేస్తున్నా దొంగలు కాదుకదా కనీసం సాధారణ ప్రజల కూడా వాటవైపు కన్నెత్తిచూడడం లేదు. టమాటా రైతుల దుస్థితికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ధరల పతనంతో రహదారి పక్కనే వదిలేస్తున్న రైతులు -
టిన్నర్ తాగి రెండేళ్ల చిన్నారికి అస్వస్థత
మదనపల్లె టౌన్: తాగే నీళ్లు అనుకుని రెండేళ్ల చిన్నారి టిన్నర్ తాగి తీవ్ర అస్వస్థతకు గురైంది. గురువారం కురబలకోట మండలంలో చోటుచేసుకున్న ఘటనపై బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. అంగళ్లు కు చెందిన లక్ష్మి కుమార్తె లిఖిత ప్రియ(2) ఇంట్లో ఆడుకుంటూ టిన్నర్ బాటిల్ కనిపించడంతో నీళ్లు అనుకుని పొరబటున తాగేసింది. చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు గమనించి వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి చికిత్స అందించారు. చిన్నారి ఆరోగ్యం కుదుట పటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఉరివేసుకొని టీచర్ ఆత్మహత్య లక్కిరెడ్డిపల్లి: మండలంలోని కోనంపేట గ్రామానికి చెందిన ఎలుగోటి రామకృష్ణ (55) అనే వ్యక్తి మనస్థాపానికి గురై గురువారం ఉదయం ఇంటిలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు లక్కిరెడ్డిపల్లి పోలీసులు తెలిపారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతుడు రామకృష్ణ ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తుండేవాడు. ఇటీవల పాఠశాలలో పని చేయడం మానేసి ఇంటివద్దే ఉండేవారన్నారు. ప్రతిరోజూ పొలం వద్దకు వెళ్లి పొలం పనులు చూసుకునేవడాడు. తన ఆరోగ్య పరిస్థిత సరిగా లేకపోవడంతో చికిత్స పొందుతున్నాడు. గురువారం ఇంటికి వచ్చి ఉదయం ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యచేసుకున్నట్లు బంధువులు తెలిపారని పోలీసులు తెలియజేశారు. కుటుంబ సమస్యలతో వ్యక్తి.. జమ్మలమడుగు రూరల్: పట్టణంలోని దిగువపట్నం కాలనీకి చెందిన డేరంగుల సుధాకర్ (40) అనే వ్యక్తి బుధవారం రాత్రి ఫ్యాన్కు ఉరి వేసుకొని అత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దిగువపట్నం కాలనీకి చెందిన సుధాకర్ ట్రాక్టర్ డ్రైవరుగా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల కుటుంబ సమస్యలు అధికమయ్యాయి. దీంతో బుధవారం రాత్రి భోజనం చేసిన తరువాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. తాళ్లప్రొద్దుటూరులో చోరీ కొండాపురం: మండల పరిధి తాళ్లప్రొద్దుటూరులోని శివాలయం వీధిలో నివాసం ఉంటున్న షేక్ అమీర్బాష ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు ఎస్ఐ మంజునాథ గురువారం తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు తాళ్లప్రొద్దుటూరుకు చెందిన షేక్. అమీర్బాష ఓ వివాహానికి వెళ్లాడు. బుధవారం రాత్రి ఇంటిలో ఎవరూ లేరు ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి ప్రవేశించి తులం చెంపచారీలు ,రూ. లక్ష నగదు దొంగలించినట్లు ఎస్ఐ తెలిపారు. కేసునమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రతి మహిళా సభ్యురాలికి సీ్త్రనిధి రుణం
తంబళ్లపల్లె: వెలుగు మహిళా సంఘాలలోని ప్రతి మహిళా సభ్యురాలికి సీ్త్ర నిధి రుణం పంపిణీ చేయాలని సీ్త్ర నిధి కడప జోనల్ మేనేజర్ వెంకటప్రసాద్ సూచించారు. గురువారం ఆయన వెలుగు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీ్త్ర నిధి రుణాల పంపిణీలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని రికవరీలో మూడోస్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో సీ్త్ర నిధి రుణాల పంపిణీ 12వేల కోట్లు లక్ష్యం కాగా జిల్లాలో 508 కోట్లు లక్ష్యమన్నారు. రుణాలు పొందిన మహిళా సభ్యులు డిజిటల్ పేమెంట్ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లిస్తారన్నారు. ఎక్కడ అవకతవకలు అవినీతికి చోటు ఉండదన్నారు. కార్యక్రమంలో ఏజీఎం సంతోష్కుమార్, ఏపిఎం గంగాధర్, సీ్త్ర నిధి మేనేజర్ అమరావతి, సీసీలు ఆదిలక్ష్మి, నరసింహులు, రమణ పాల్గొన్నారు. -
బైక్, ఇన్నోవా ఢీ: ఇద్దరు దుర్మరణం
మదనపల్లె టౌన్: మదనపల్లె మండలంలో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బైకును ఢీకొనడంతో ఇద్దరు అక్కడి అక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపిన వివరాలు.. కొత్తవారిపల్లె పంచాయతీ, పూలవాండ్లపల్లెకు చెందిన శేషాద్రి రమణ(36), సీటీఎం ఇండియన్ బ్యాంకులో అటెండర్గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని స్కూటీలో పూలవాండ్లపల్లెకు వెళుతుండగా, కంకర ఫ్యాక్టరీ వద్ద గుర్రంకొండకు వెళ్లి తిరిగి మదనపల్లెకు వస్తున్న ఇన్నోవా కారు వేగంగా వచ్చి ఢీకొని అక్కడి నుంచి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కూటరిస్టు శేషాద్రిరమణతో పాటు కారులోని ఈశ్వరమ్మ కాలనీకి చెందిన ఇషాక్ (13) అనే బాలుడు చనిపోయాడు. కారులో ఇరుక్కుపోయిన మదనపల్లె దేవతా నగర్కు చెందిన జావీద్ (22), ముజీబ్ నగర్కు చెందిన అస్లాం (19), ముబారక్(27) లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు వెలికితీసి మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జావీద్, అస్లాంల పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబీకులు వీరిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరో ముగ్గురు యువకులకు తీవ్రగాయాలు మృతిచెందిన శేషాద్రి రమణ, ఇషాక్ -
9 మందిపై వేధింపుల కేసు నమోదు
మదనపల్లె టౌన్: భార్యను అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్న భర్తతో పాటు ఆమె కుటుంబీకులు మరో ఎనిమిది మందిపై పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదుచేశారు. ఇందుకు సంబంధించి తాలూకా సిఐ కళా వెంకరమణ గురువారం తెలిపిన వివరాలు.. మదనపల్లె మండలంలోని మదనపల్లె కొత్తపల్లె పంచాయతీ, కొత్త ఇండ్లకు చెందిన ఫాతిమాను ఆమె భర్త అబ్దుల్ అబూ బకర్ అదనపు కట్నం వేధింపులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టి అబ్దు అబూబకర్ తో పాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బైక్ల ఢీ: యువకుడికి తీవ్ర గాయాలు మదనపల్లె టౌన్: రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం తాలూక పోలీసులు తెలిపిన వివరాలు.. చౌడేపల్లె మండలం, బోయకొండకు చెందిన కళ్యాణ్ (24) బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంలో సొంత పని మీద మదనపల్లెకు వచ్చాడు. పని ముగించుకుని తిరిగి అదేరోజు రాత్రి స్వగ్రామానికి బయలేదేరాడు. పుంగనూరు రోడ్డు, బసినికొండ ఆర్చి వద్దకు వెళ్లగానే ఎదురుగా వచ్చిన మరో బైక్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు బాధితుడికి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా పోలీసులు తెలిపారు. రొంపిచెర్ల: అనంతపురం–చైన్నె జాతీయ రహదారిలోని రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో గురువారం కారు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ మధుసూధన్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో రోడ్డు దాటుతున్న ఇటుకల బట్టీలో కూలీగా పని చేస్తున్న పీలేరు మండలం అరుమానిపల్లెకు చెందిన విశ్వనాఽథ్(45)ను పీలేరు నుంచి వేగంగా వచ్చిన కారు (ఏపీ03 ఎఎక్స్ 3375) ఢీకొంది. ఈ ప్రమాదంలో అతని తల, ఎడమ కాలుకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎసై మధుసూధన్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కారు పీలేరు చెందిన రూకేష్కు చెందినగా గుర్తించారు. క్షతగాత్రుడిని పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి రెఫర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుసూధన్ తెలిపారు. మదనపల్లె టౌన్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం కురబలకోట మండలంలో జరిగింది. బాధితుల కుటుంబీకులు తెలిపిన వివరాలు.. తంబళ్లపల్లె నియోజక వర్గంలోని పెద్దతిప్పసముద్రానికి చెందిన రైతు బాబూలాల్ (60) అదే ఊరికి చెందిన నూర్ అహమ్మద్ తో కలసి తన బైకులో సొంత పనిమీద మదనపల్లెకు బయలు దేరారు. కురబలకోట మండలం, సర్కారుతోపు వద్దకు రాగానే బైకు అదుపు తప్పి, రోడ్డు పక్కన ఉన్న సేఫ్టీవాల్ ను ఢీకొని ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి బాబులాల్ ను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి వెళ్లాలని రెఫర్ చేశారు. ఘటనపై ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
● రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి
సాక్షి నెట్వర్క్: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. రాధాకృష్ణ ‘చెత్త’పలుకులు మానుకుని మహిళలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. రాధాకృష్ణ వ్యాఖ్యలు నిరసిస్తూ వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా అన్ని స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు ఇచ్చారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు సీఐకి ఫిర్యాదు చేశారు. బద్వేల్ అర్బన్ పోలీస్స్టేషన్లో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను చిత్రపటానికి చెప్పుల దండ వేసి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డా. నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన అబద్దాలన్నీ టీడీపీ నాయకులు విన్నారు కాబట్టి వారంతా వెన్నెముక లేనివారేనని అనుకోవాలా...అని అన్నారు. కమలాపురంలో నియోజకవర్గ ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ విద్యాసాగర్కు ఫిర్యాదు చేశారు. మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో అర్బన్ పోలీస్స్టేషన్ సీఐ రమణారెడ్డికి ఫిర్యాదు చేశారు. -
మార్కెట్లో 15 కేజీల క్రేట్లు తప్పనిసరి
కురబలకోట: జిల్లాలోని అన్ని టమాటా మార్కెట్లు, మండీలలో 15 కేజీల టమాటా క్రేట్లనే అమలు చేయాలని అలాగే జాక్ పాట్ విధానాన్ని పూర్తిగా నిలిపివేయాలని అన్నమయ్య జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఏడీ టి.త్యాగరాజు సూచించారు. గురువారం అంగళ్లు మార్కెట్ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన టమాటా మండీల నిర్వాహకులతో సమావేశంలో మాట్లాడారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి, ములకలచెరువు, కలకడ, గుర్రంకొండ, చింతపర్తి మార్కెట్లలో ఇప్పటికే 15 కేజీల క్రేట్ల విధానాన్ని పాటిస్తున్నారన్నారు. ఇదివరలో వినియోగించిన 30 కేజీల పెద్ద క్రేట్ల వల్ల రైతులకు నష్టం వాటిల్లేదని దానిని నియంత్రించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు. చిన్న క్రేట్లు మోయడానికి రైతులు, కూలీలకు సులభతరంగా ఉంటాయన్నారు. కాయలు నలగకుండా నాణ్యతగా ఉంటాయన్నారు. ఇక నుంచి అంగళ్లు మార్కెట్లో కూడా చిన్న క్రేట్ల విధానాన్ని విధిగా పాటించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. పెద్ద క్రేట్ల నష్టం ఎలా..? చిన్న క్రేట్ల విధానం వల్ల తమ వద్ద ఏళ్లుగా ఉన్న పెద్ద క్రేట్లను ఏం చేయాలని అంగళ్లు మండీల నిర్వాహ కులు అధికారులను ప్రశ్నించారు. ఏడాది క్రితమే చెప్పి ఉండాల్సి ఉందన్నారు. ఈ నష్టం ఎవరు భరిస్తారన్నారు. చిన్న క్రేట్ల అమలుకై గడువు ఇవ్వాలని అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. అంగళ్లు, మదనపల్లి, ములకలచెరువు మార్కెట్ కమిటీల కార్యదర్శులు వి. మదన్మోహన్ రెడ్డి, జగదీష్, నవీన్కుమార్ రెడ్డితో పాటు మండీల నిర్వాహకులు సాయప్పీర్, శ్రీనివాసులరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణ, రైతులు అమరనాథరెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. జాక్ పాట్ నిర్వహిస్తే లైసెన్స్ రద్దు అన్నమయ్య జిల్లా ఏడీ త్యాగరాజు -
హుండీ ఆదాయం లెక్కింపు
గుర్రంకొండ: మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి హుండీ ద్వారా రూ.16,20,150ల ఆదాయం సమకూరింది. గురువారం స్థానిక ఆలయంలో టీటీడీ సూపరింటెండెంట్ మునిబాల ఆధ్వర్యంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఈకార్యక్రమంలో టీటీడీ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, టీటీడీ విజిలెన్స్అధికారి మల్లికార్జున, సిబ్బంది నాగరాజ, ఆలయఅర్చకులు గోపాలాబట్టర్, కృష్ణ, రాజు, గోకుల్, వరదరాజ స్వాములు పాల్గొన్నారు. మదనపల్లె సిటీ: జిల్లా జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపికలు ఈనెల 12వతేదీ మదనపల్లె బీటీ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్నట్లు హాకీ అన్నమయ్య జిల్లా జనరల్ సెక్రటరీ బి.శివప్రసాద్ తెలిపారు. క్రీడాకారులు ఉదయం 8 గంటలకు హాజరు కావాలన్నారు. క్రీడాకారులు జనన సర్టిఫికెట్, ఆధార్కార్డు, 10వ తరగతి మార్కుల జాబితా, స్టడీ సర్టిఫికెట్, తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ఎంపికై న జట్టు ఏప్రిల్ 16 నుంచి 18 వరకు చిత్తూరులో జరిగే రాష్ట స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. మరిన్ని వివరాలకు 98800 92188 నంబర్లో సంప్రదించాలన్నారు. మదనపల్లె సిటీ: మదనపల్లెలోని కేంద్రీయ విద్యాలయం(కేవీకే(లో గురువారం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రవేశాలకు ఎంపికలు జరిగాయి. ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, ఇన్చార్జ్ డీఆర్ఓ చంద్రశేఖర్రెడ్డి, ఉపాధ్యాయులు మల్లికార్జున, సురేంద్రనాయక్, పేరెంట్స్ కమిటీ నుంచి రెడ్డప్ప, చాణక్య,ఆసిఫా సమక్షంలో ఎంపిక ప్రక్రియ జరిగింది. ఇందులో 200 సీట్లు లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేశారు. పుంగనూరు: పుంగనూరు సమీపంలోని చీమనపల్లె వద్ద వెలసిన హజ్రత్జాన్పాక్షావలి బాబా, ఫకీర్షావలి బాబా వారి ఉరుసు శుక్రవారం రాత్రి నుంచి ప్రారంభం కానుంది. మూ డు రోజుల పాటు ఉరుసు, ఖవ్వాలి పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీ అధ్యక్షుడు అష్రఫ్ తెలిపారు. గురువారం దర్గాను విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. 11, 12వ తేదీలలో ముంబైకి చెందిన అఫ్రిన్సుల్తాన, మైసూర్కు చెందిన సలీంరిష్టి, గుజరాత్కు చెందిన ఆసిఫ్అజ్మీర్, ఇంతేజుర్రిష్టి లచే రెండు రోజుల పాటు ఉరుసు, ఖవ్వాలి పోటీలు జరుగుతాయని వివరించారు. బయట ప్రాంతాలకు చెందిన వందలాది మంది ముస్లింలు ఉరుసు మహోత్సవంలో పాల్గొనేందుకు దర్గా ప్రాంతం చేరుకుంటున్నారు. మదనపల్లె: ఇళ్లు, ఆస్తుల గణన కార్యక్రమంలో గణకులు, సూపర్వైజర్లు పక్కాగా వ్యవహరించాలని ఇన్చార్జ్ డీఆర్ఓ చంద్రశేఖర్రెడ్డి కోరారు. గురువారం స్థానిక జెడ్పీ హైస్కూల్లో గణకులు, సూపర్వైజర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు గణన పనులపై సమగ్ర అవగాహన కల్పించారు. మొబైల్ యాప్ వినియోగంపై పరిజ్ఞానం కల్పించారు. ప్రతి గణన బ్లాక్ లోని కుటుంబాలు, గృహాలు, వాటి వివరాల ను క్రమబద్ధంగా నమోదు చేసే విధానంపై దృష్టి సారించాలని సూచించారు. భవనాలకు సంఖ్యలు కేటాయించడం, మ్యాపింగ్ చేయడం, సంబంధిత వివరాలను యాప్లో నమోదు చేయడం వంటి అంశాలు వివరించారు. ఈ శిక్షణ గణన ప్రక్రియను వేగవంతం చేసి, ఖచ్చితమైన సమాచారం సేకరణకు దోహదపడుతుందని ఆయన అన్నారు. జిల్లా గణన అధికారి విష్ణుప్రియ, కమీషనర్ కే.ప్రమీల, జిల్లా అధికారి లక్ష్మీపతి పాల్గొన్నారు. -
కిడ్నీలపై డీహైడ్రేషన్ ప్రభావం
వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా డీహైడ్రేషన్ కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయి. ఇన్ఫెక్షన్లు రావ డానికి ఆస్కారం ఉంటుంది. ఈ సీజన్లో కిడ్నీలను కాపాడుకోవాలంటే ఒక రోజుకు 2.5 లీటర్ల నుంచి 3 లీటర్ల నీరు తాగాలి. ఎండలో ఎక్కువగా తిరిగేవారు ఇంకా ఎక్కువ నీరు తాగితే మంచిది. ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, ఫైబర్ ఎక్కువుగా ఉండే పదార్ధాలు ఉండేలా చూడాలి, తీసుకునే ఆహరంలో ఉప్పును తగ్గించాలి. – డాక్టర్ ఎన్ దినేష్కుమార్రెడ్డి, మూత్రపిండాల వైద్య నిపుణులు, కడప. -
సంపు పనుల పరిశీలన
పెద్దమండ్యం: వాటర్గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా చేపడుతున్న సంప్ పనులను మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి గురువారం పరిశీలించారు. మండలంలోని కలిచెర్ల పంచాయతీ పోలేరమ్మ గుడికి సమీపంలో వాటర్గ్రిడ్ సంప్ పనులను ఇటీవల చేపట్టారు. అక్కడ జరుగుతున్న పనులను సబ్ కలెక్టర్ పరిశీలించారు. గండికోట రిజర్వాయర్ నుంచి తాగునీటిని అందించేందుకు 2,370 కోట్లతో పనులు చేపడుతున్నట్లు సబ్ కలెక్టర్కు అధికారులు వివరించారు. సంప్ నిర్మాణం, సామర్థ్యం గురించి ఆమె అధికారులను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం ఎన్వోపల్లె గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. ప్రజలకు వాట్సప్ గవర్నెన్స్ ద్వారానే సేవలను అందించాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అక్కడున్న సిబ్బందిని శాఖల వారీగా అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సచివాలయ సిబ్బంది ఫేషియల్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా పాటించాలన్నారు. తహసీల్దార్ తేజస్వి, ఎంపీడీఓ శ్రీధర్రావు, ఆర్డబ్ల్యుఎస్ డీఈ చంద్రశేఖరరెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ నాగరాజునాయక్, విఆర్వో ఆంజినేయులు నాయక్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు. కడప కార్పొరేషన్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్ కలిశారు. గురువారం విజయవాడ తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన్ను కలిసి జిల్లాలోని వివిధ అంశాలను ఆయన దృష్టికి తెచ్చారు. -
బాబోయ్.. కరెంటు కోతలు
రాయచోటి: విద్యుత్ కోతలు ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యమో లేక ప్రభుత్వం పెట్టిన కోతలో తెలియదుకానీ రాయచోటిలో బుధవారం నుంచి మొదలైన విద్యుత్ కోతలు రాత్రి 11 గంటల వరకు జనాలను ఉక్కిరిబిక్కిరి చేసి చెమటలు పట్టించాయి. నిమిషాల వ్యవధిలోనే సరఫరాలో ఏర్పడిన అంతరాయాలు జనాలను రోడ్డుపై పరుగులు తీయించాయి. అసలే సూర్యుడి ప్ర‘తాపా’నికి ఉడికిపోతుంటే దీనికితోడు విద్యుత్ కోతలు భయపెట్టిస్తున్నాయి. నాణ్యమైన నిరంతరాయంగా విద్యుత్ను అందిస్తా మని కూటమి ప్రభు త్వం చెబుతున్న మాటలు స్థానికంగా జరుగుతున్న విద్యుత్ సరఫరా కోతలకు పొంతన లేకుండా పోతోంది. ఇళ్లల్లో నుంచి బయటకు రాని వృద్దులు, అనారోగ్య ప్రజలు, ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉడికిపోతున్నారు. 24 గంటలు మెరుగైన విద్యుత్ను అందిస్తున్నామని ప్రలోభాలు పలుకుతుంటే రాయచోటిలో మాత్రం అందుకు భిన్నంగా సరఫరా అవుతోంది. ఓ వైపు కొత్తపేట, జగదాంబ సెంటర్, కొత్తపల్లి, ఎస్ఎన్ కాలనీ తదితర ప్రాంతాలలో లోఓల్టేజీ సమస్యతో గంటకు పది సార్లకుపైగా సరఫరాలో అంతరాయాలు కనిపించాయి. మూల్యాంకనకు తప్పలేదు.... అన్నమయ్య జిల్లా పరిధిలోని పదోతరగతి పరీక్ష ప్రశ్నపత్రాల దిద్దు బాటు కూ కరెంటు కష్టాలు తప్ప లేదు. రాయచోటిలో నాలుగు రోజుల నుంచి జరుగుతున్న మూ ల్యాంకన కేంద్రంలో విద్యుత్ సరఫరాలో నెలకొంటున్న అంతరాయం అక్కడి ఉపాధ్యాయులకు చెమటలు పట్టిస్తున్నాయి. 19 గదులలో జరుగుతున్న మూల్యాంకనానికి సరఫరాలో అంతరాయం అడుగడుగునా కనిపించింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండటంతో ఆన్లైన్ అప్లోడుకు సర్వర్ సమస్యగా మారింది. దీంతో మూల్యాంకనానికి వచ్చిన ఉపాధ్యాయులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. విద్యుత్ సమస్య పరిష్కారంలో స్థానిక సిబ్బంది సహకారం లేకపోవడంతో జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం సమస్యను ఎస్ఈ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన తక్షణం రాయచోటి ట్రాన్స్కో ఈఈను ఆదేశించారు. ఎస్ఈ ఆదేశాలతో స్థానిక ట్రాన్స్కో అధికారులు మూల్యాంకన కేంద్రానికి వెళ్లి అక్కడ నెలకొన్న సమస్యను చక్కబెట్టారు. స్థానికంగా ఏర్పడుతున్న చిన్న చిన్న సమస్యలను క్షేత్రస్థాయిలోని సిబ్బంది, ఆపై స్థాయి అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో కరెంటు కష్టాలు అధికమవుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై రాయచోటి ట్రాన్స్కో ఈఈ లివింగ్ స్టన్ డేవిడ్ను వివరణ కోరగా 11కేవీ లైన్ తెగి ట్రాన్సుఫారమర్ మీద పడటంతో సరఫరాలో సమస్యలు తలెత్తాయన్నారు. సాంకేతికంగా నెలకొన్న సమస్యను సిబ్బంది సకాలంలో గుర్తించకపోవడంతో బుధవారం సరఫరాలో అంతరాయాలు నెలకొన్నాయన్నారు. మూల్యాంకన కేంద్రం, పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించామని మున్ముందు కూడా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఈఈ తెలిపారు. అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలకు అవస్థ పది మూల్యాంకన కేంద్రానికి తప్పని తిప్పలు రాయచోటిలో మొదలైన విద్యుత్ కష్టాలు -
ఆరోగ్యానికి సెగ!
కడప రూరల్: సూర్యుడు ‘చుర్రు’మంటున్నాడు.. మాడు పగిలేలా భగభగమంటున్నాడు. ఇటీవల కాలంలో వాతావ‘రణం’ రణరంగంగా మారింది. దీంతో ప్రజల ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటోంది. ఇప్పటికే జిల్లాలో 42–43 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్నరోజుల్లో 48 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావర ణ శాఖ అంచనా. ఈ నేపధ్యంలో వడదెబ్బ తగలకుండా..ఆరోగ్య జాగ్రత్తలు పాటించాడం శ్రేయస్కరం. జాగ్రత్తలతోనే అడ్డుకట్ట... ఎండ తీవ్రత వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దీంతో మెదడు మీద తీవ్ర ప్రభావం పడుతుంది. దీనివల్ల మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం (హైపో ధలామన్) దెబ్బతింటుంది. ఫలితంగా సదరు వ్యక్తి వడదెబ్బకు గురవుతాడు. దీనినే ‘హీట్ స్ట్రోక్’ లేదా ‘సన్ స్ట్రోక్’ అంటారు. ఈ దశ ప్రమాదకరం, ప్రాణాంతకం. లక్షణాలు..కారణాలు.. ● చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం ● వణుకు పుట్టడం. మగత నిద్ర లేదా కలవరింత. ● ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి కలగడం. ● శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తి కావడం. శరీరం ఉష్ణాన్ని కోల్పోవడం జరుగుతుంది. శరీరంలో కలిగే మార్పులు... ● వేడి వలన చెమట పట్టి శరీరంలోని లవణాలు (సోడియం క్లోరైడ్) తగ్గిపోతుంది. లేదా శరీరంలోని నీటి నిష్పత్తి తగ్గితుంది. ● ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాల్లో శ్రమతో కూడిన పని చేస్తున్నప్పుడు ప్రతి గంటకు 3–4 లీటర్ల నీటిని చెమట రూపంలో శరీరం కోల్పోతుంది. అధికంగా అనారోగ్యానికి గురయ్యేవారు .. ● 65 ఏళ్ల వయస్సు పై బడిన వారు. ● గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, పసిపిల్లలు ● అనారోగ్యంతో బాధపడుతున్న వారుఎండ ఎరుపు రంగు పూసుకుంది.. ఉదయం ఏడింటికే సుర్రుమంటోంది. సాయంత్రం చీకటిపడేదాకా తాపం ఆగనంటోంది. ఇంకేముంది భానుడి సెగ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోంది. మండుటెండల కారణంగా వడ‘దెబ్బ’ పొంచి ఉంది. ఇప్పటికే చాలాచోట్ల వడదెబ్బలు నమోదవుతున్నాయి.. ఎండల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అనూహ్యంగా మారిన వాతావరణం ఇప్పటికే 42–43 గరిష్ట ఉష్ణోగ్రతలు.. పొంచిఉన్న వడ‘దెబ్బ’..ఆరోగ్యంపై పెను ప్రభావం -
హత్యకేసులో నలుగురు అరెస్ట్
చౌడేపల్లె: అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భర్త ఉండగా పరాయిమగాడి మోజులో పడి ఈనెల 5న బోయకొండ సమీపంలోని పక్షిరాజపురం వద్ద రాళ్లు, కట్టెలతో కొట్టి గాంఽధీని హతమార్చిన ఘటనలో నలుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు.సర్కిల్ కార్యాలయంలో సీఐ సాయిప్రసాద్, ఎస్ఐ చిన్నరెడ్డెప్పలు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా గుడియాత్తం తాలూకా కోసవంపుధూర్ఇరులర్ కాలనీకి చెందిన జి. గాంధీ(37) అతని భార్య రాసాతితో కలిసి ఊటూరు వద్ద గల ఓ కోళ్లఫాంలో కూలీపనులకోసం వచ్చారు. రాసాతి బోయకొండ ఆర్ఆర్కాలనీకి చెందిన నరసింహులు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.ఈక్రమంలో భార్యను భర్త పలుమార్లు హెచ్చరించినా మార్పురాలేదు. రాసాతి ప్రియుడితో సహజీవనం చేస్తుండేంది. స్వగ్రామానికి వెళ్ళిపోయిన గాంధీ పదిరోజులక్రితం ఆర్ఆర్కాలనీకి వచ్చాడు.తన వెంట రమ్మని రాసాతిని బతిమలాడారు. ప్రియుడి మోజులో ఉన్న రాసాతి ఆమె ప్రియుడు నరసింహులు,అతని తమ్ముళ్లు లక్ష్మిపతి,నాగరాజఅలియాస్ నాగులు కలిసి పథకం ప్రకారం మద్యం తాపించి గాంధీను రాళ్లు, కట్టెలతో కొట్టి చంపేశారు. మృతుడి కుమారుడు సందీప్ అంగన్వాడీ టీచర్కు జరిగిన ఘటనను వెల్లడించడంతో హత్య ఉదంతం బయటపడింది. మృతుడి సోదరుడు సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసలు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నలుగురిని అరెస్ట్చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. అనాథగా మిగిలిన చిన్నారి గాంధీ హత్య విషయం బయటకు రావడానికి మృతుడి కుమారుడు సందీప్ కీలకమయ్యాడు. ఈ కేసులో రాసాతి ప్రియుడి మోజులో పడి నేరంలో భాగస్వామి కావడంతో కటకటలాపాలైంది. చివరికి ఐదేళ్ల సందీప్ అనాథగా మిగలడం కంట తడి పెట్టించింది. -
విద్యార్థిని మృతిపై అధికారుల విచారణ
పెద్దమండ్యం: మండలంలోని ముసలికుంటలో విద్యార్థిని మృతిపై గురువారం అధికారులు విచారణ నిర్వహించారు. కేజీబీవీలో 7 వతరగతి చదువుతున్న విద్యార్థిని మల్లీశ్వరి (13) జ్వరంతో బాధపడుతూ బుధవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఎంఈవో మనోహర, సబ్యూనిట్ అధికారి శ్రీనివాసులు నాయక్లు కెజిబివిలో విచారణ నిర్వహించారు. విద్యార్థిని జ్వరంతో ఎన్ని రోజులుగా బాదపడుతోంది..ఎక్కడైనా విద్యార్థినికి చికిత్సలు చేయించారా ఆనే విషయాలపై విచారణ చేశారు. అలాగే జ్వరంతో ఇంకా ఎవరైనా బాధపడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో వైద్యశిబిరం నిర్వహించి విద్యార్థినులకు చికిత్స అందించారు. కాగా జ్వరంతో బాధపడుతున్న నలుగురు విద్యార్థినులను బుధవారం వారి ఇళ్లకు పంపించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తన బిడ్డ మృతిపై సమగ్ర విచారణ నిర్వహించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు, తహసీల్దార్ తేజస్వికి ఫిర్యాదు చేశారు. జ్వరంతో బాధపడుతున్న తన బిడ్డను చావు బతుకుల మధ్య ఉన్న సమయంలో తమకు సమాచారం ఇచ్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జ్వరం బారిన పడిన వెంటనే తమకు సమాచారం ఇచ్చింటే తన బిడ్డను కాపాడుకొనేవాళ్లమని వారు కన్నీటి పర్వంతమయ్యారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరివర్మ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
బద్వేలు అర్బన్ : స్థానిక ఎన్జీవో కాలనీలో బుధవారం ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎన్జీవో కాలనీలో నివసిస్తున్న ఊసుపల్లిఅమ్ములు (23)కు 8 సంవత్సరాల క్రితం బాబు అనే వ్యక్తితో వివాహమైంది. బాబు బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. బుధవారం బాబు పనికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి నిద్రపోతుండగా రేకుల ఇంటిలోని పైపునకు అమ్ములు ఉరి వేసుకుంది. సుమారు 6 గంటల సమయంలో బాబు నిద్ర లేచి చూసే సరికి అమ్ములు ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. దీంతో అర్బన్ పోలీసులకు సమాచారమివ్వగా అర్బన్ ఎస్ఐ ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఇరువురికి వేరొకరితో అక్రమ సంబంధాలు ఉండటంతో భార్యభర్తలు తరచూ గొడవ పడుతుండేవారని తెలిసింది. కుక్క దాడి – 20మందికి గాయాలు కడప కోటిరెడ్డిసర్కిల్: కడప నగరం మారుతినగర్ ప్రాంతంలో బుధవారం ఓ కుక్క స్వైర విహారం చేసింది.20 మంది తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై నడుచుకుంటూ, ద్విచక్ర వాహనంలో వెళుతున్న వారిని కరవడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. బాధితులు సమీపంలోని ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో శునకాలు సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సత్వరమే స్పందిచి కుక్కలను పట్టుకోవాలని, నివాస ప్రాంతాలకు దూరంగా తరలించాలని కోరుతున్నారు. దాడిఘటనలో 8మందిపై కేసు కొండాపురం: మండలం పరిధిలోని కొండాపురం గ్రామంలోని శాంతినగర్ లో నివాసం ఉంటున్న కంబాల నాగేష్ కుటుంబ సభ్యులపై రమేష్ అతని అనుచరులు దాడి చేసిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. ఈ ఘటనపై 8 మందిపై కేసు నమోదు చేసినట్లు కొండాపురం ఎస్ఐ జయరాజులు బుధవారం తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు శాంతినగర్కు చెందిన కంబాల నాగేష్కు అతని బంధువు రమేష్కు పాత కక్షలు ఉండేవి.ఈ కారణంతో గురువారం రాత్రి నాగేష్ కుటుంబ సభ్యులపై రమేష్ అతని అనుచరులు కలసి దాడి చేశారు. నాగేష్కు అతనికుమారుడు, తల్లికి సోదరుడు లకు గాయాలయ్యాయి. ఈఘటన పై 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మల్లయ్యకొండ అగ్నికి ఆహుతి తంబళ్లపల్లె: తంబళ్లపల్లెకు సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండ అటవీసముదాయం అగ్నికి ఆహుతవుతోంది. మంగళవారం సాయంత్రం ఆకతాయిలు అడవికి నిప్పు పెట్టడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అడవిలో బోద, గడ్డి ఏపుగా పెరిగి ఉండటంతో మంటలు ఎగిసిపడ్డాయి. వందల ఎకరాల్లో అడవి కాలిపోయింది. విలువైన ఔషధమొక్కలు, వన్యప్రాణులు, వృక్షసంపద అగ్నికి ఆహుౖతైంది. అగ్నికీలలు ఉవ్తెతన ఎగిసిపడంతో అటవీసిబ్బంది మంటలు అర్పడానికి వీలుకాలేదు. -
భారీగా సెల్ఫోన్ల రికవరీ
కడప అర్బన్: ‘ఆపరేషన్ మొబిట్రాక్’ద్వారా కడప జిల్లా సైబర్ క్రైమ్ టీం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్వర్క్ నిఘా, డేటా విశ్లేషణా పద్ధతులు ఉపయోగించి భారీ మొబైల్ ఫోన్ రికవరీ ఆపరేషన్న్లో సఫలమయ్యారు.సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా, మొత్తం 505 మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. వీటి విలువ సుమారు రూ. 70 లక్షలు. ఇప్పటి వరకు 8 విడతల్లో మొత్తం రూ.11,76,00,000/– విలువైన 5877 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు వైఎస్సార్కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలియజేశారు. వైఎస్ఆర్ జిల్లాలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడం వల్ల ఐఏంఈఐ ఆధారిత ట్రాకింగ్ , డేటా అనలిటిక్స్ పద్ధతుల ద్వారా ఫోన్లు త్వరితగతిన రికవరీ చేశారు. మొబైల్ రికవరీ విషయంలో రాష్ట్ర స్థాయిలో కాకినాడ జిల్లా మంచి ప్రగతి సాధించినట్లు ఎస్పీ తెలిపారు. పోలీసుల సూచనలు: ● సైబర్ మోసాల నుండి రక్షణ కోసం, అపరిచిత వీడియో కాల్స్ లేదా ఫిషింగ్ కాల్స్ / ఇమెయిల్స్కు ప్రతిస్పందించ వద్దు. ● సైబర్ నేరగాళ్ల మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 లేదా సమీపంలో గల పోలీస్ స్టేషన్ సంప్రదించాలి లేదా ఎన్సీఆర్పీ వెబ్సైట్లో ఫిర్యాధు చేయండి. ● మొబైల్ మిస్ అయినప్పుడు (లేదా) దొంగతనం జరిగినప్పుడు బ్యాంకు ఖాతాలను తక్షణమే బ్లాక్ చేయించాలి. సిమ్ కార్డ్ నెంబర్ను ఆలస్యం చేయకుండా డిసేబుల్ చేయించుకోవాలి. ● గూగుల్పే, ఫోన్పే వంటి యాప్లకు, అప్లికేషన్లను 2–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ లేదా బయోమెట్రిక్ సెక్యూరిటీ వినియోగించాలి. ● మొబైల్ పోయిన తక్షణమే గూగుల్ / ఆపిల్ ఐడీ, బ్యాంకింగ్ యాప్స్, వాట్సాప్, మెయిల్, సోషల్ మీడియా వంటి వాటి పాస్వర్డ్లు మార్చాలి. ● ఆండ్రాయిడ్ ఫోన్లకు, ఫైండ్ మై డివైస్, ఐఫోన్లకు, ఫైండ్ మై ఐ ఫోన్ (ఐ క్లౌడ్) ద్వారా ఫోన్న్ను ట్రాక్ చేయడం, రింగ్ చేయడం, లాక్ చేయడం, లేదా డేటా డిలీట్ చేయడం చేయొచ్చు. సీఈఐఆర్.జీవోవి.ఐఎన్ పోర్టల్ ద్వారా పోయిన మొబైల్ ఫోన్ వివరాలతో ఫిర్యాదు చేయవచ్చు. సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేటప్పుడు జాగ్రత్త.. ఫోన్ బిల్లు, సెల్ ఫోన్ బాక్స్, ఫోన్ అమ్మే వ్యక్తి గురించి పరిశీలించాలి. అపరిచితుల నుంచి ఫోన్లు కొనుగోలు చేయడం ద్వారా సైబర్ నేరాలకు గురయ్యే ప్రమాదం ఉంది. జిల్లా లో సైబర్ క్రైమ్ బృందం ఆధ్వర్యంలో మొబైల్ ఫోన్ల రికవరీకి సంబంధించిన డిజిటల్ ఫోరెన్సిక్స్ ఆధారిత సాంకేతికతను ఉపయోగించడంతో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, సైబర్ క్రైమ్ టీం ఇన్స్పెక్టర్ ఏ. మధు మల్లేశ్వర రెడ్డి, సంబంధిత సిబ్బందిని అభినందించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ , అడిషనల్ ఎసీప కె. ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పి ఎన్. సుధాకర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ యు. సదాశివయ్య పాల్గొన్నారు. -
పదోన్నతులపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి
రాయచోటి : జోన్ – నాలుగు పరిధిలోని స్కూల్ అసిస్టెంట్లు, సమాన హోదాల గ్రేట్–టు ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల సీనియార్టీలు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో కూడిన పత్రాలతో ఈమెయిల్ ద్వారా ఈనెల 11వ తేదిలోగా సమర్పించాలని అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి కె సుబ్రమణ్యం పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ స్కూల్ అసిస్టెంట్లు సమాన హోదా నుంచి గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల విషయమై సవరించిన తాత్కాలిక సీనియారిటీ జాబితాను ప్రభుత్వ వెబ్ సైట్లో ఉంచినట్లు తెలిపారు. కావున జోన్–4 పరిధిలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు పూర్వపు జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ యాజమాన్యాలకు సంబంధించిన స్కూల్ అసిస్టెంట్లు సమాన హోదాల నుంచి గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల కోసం సవరించిన తాత్కాలిక సీనియారిటీ జాబితాను వెబ్సైట్లో ఉంచామన్నారు. సైట్ను పరిశీలించి అభ్యంతరాలు ఉన్న ఉపాధ్యాయులు వారికి సంబంధించిన సర్వీసు వివరాలు, సీనియార్టీకి సంబంధించి ఏమైనా అభ్యంతరాలున్నా తగిన ఆధారాలతో కార్యాలయం అధికారిక మెయిల్ ద్వారా సమర్పించాలన్నారు. గడువు అనంతరం పరిగణలోకి తీసుకోవడం జరగదని డీఈఓ తెలియజేశారు. భూమిని ఆక్రమించి.. చంపాలని చూస్తున్నారు – ఎస్ఐకి ఫిర్యాదు చేస్తే తననే జైలులో వేస్తానన్నాడు మదనపల్లె టౌన్: ప్రత్యర్థులు తన భూమిని ఆక్రమించి, గుడిసెను సైత ధ్వంసం చేశారు. అన్నీ రికార్డు పరంగా ఉన్నా కూడా తననే జైలులో వేస్తానని ఎస్ఐ ఆపోజిట్ వాళ్లకు ఫేవర్ చేస్తున్నాడని బాధితురాలు పద్మ మదనపల్లె ప్రెస్ క్లబ్లో బుధవారం ఆరోపించింది. అన్నమయ్య జిల్లా, చౌడేపల్లె మంలం, బోయకొండ గంగాపురానికి చెందిన పద్మ (45)కు భర్త 20 ఏళ్ల క్రితం చనిపోవడంతో తన ఒక్కగా నొక్క కుమారున్ని కూలి పనులు చేసుకుంటూ పోషించు కుంటోంది. ఈ క్రమంలో తన భర్త తల్లి దండ్రుల నుంచి సంక్రమించిన కొంత ఆస్తి గంగాపురంలో ఉందని తెలిపింది. ఆ ఆస్తిపై కన్నేసిన పక్క భూమి యజమాని వేణు,హేమసుందర్, పుష్పలత తదితరలు వచ్చి మమ్మల్ని వెళ్లగొట్టి, బంకు తొలగించి నష్టపరచారని తెలిపింది. భూమిని కబ్జా చేసి ఆక్రమించడమేకాకుండా తమను చంపాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దాడి చేసి కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఎస్ఐ నిన్నే జైలులో వేస్తానని బెదిరిస్తున్నట్లు కంటతడి పెట్టింది. తహసీల్దార్ వద్దకు వెళితే మేము వేణు వాళ్లకు ఎలాంటి పట్టాలు ఇవ్వలేదని చెప్పినట్లు తెలిపింది. ఎలాంటి రికార్డులు లేని వారికి వత్తాసు పలుకుతున్న అధికారులపై జిల్లా ఎస్పీ, కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, తమ భూమి తమకు దక్కేలా న్యాయం చేయాలని బాధితురాలు వేడుకొంది. భూ కబ్జాను అడ్డుకున్న మహిళపై దాడి మదనపల్లె టౌన్: తన భూమిని కబ్జా చేస్తుంగా అడ్డుకున్న ఒంటరి మహిళపై భూ కబ్జా రాయుళ్లు మూకుమ్మడిగా దాడిచేసి తీవ్రంగా గాయపరచారు. బుధవారం మదనపల్లె మండలంలో జరిగిన ఘటనపై బాధితురాలు తెలిపిన వివరాలు.. పట్టణంలోని నక్కల దిన్నె తాండాకు చెందిన వెంకటరమణ నాయక్ భార్య బి.మునెమ్మ(44)కు మండలంలోని కోళ్లబైలు గ్రామం, ఎగువ కురంకలోని సరస్వతి నగర్లో సుమారు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అన్ని రెవెన్యూ రికార్డులు ఉన్నప్పటికీ.. ఆమెకు వెనకా ముందు ఎవరూలేరని ఆ భూమిపై కన్నేసిన పట్టణంలోని గాంధీపురంలో ఉండే రామకృష్ణ, రామయ్య, రెడ్డెప్ప తదితరులు మునెమ్మ ఒంటరిగా పొలం పనులు చేసుకుంటూ ఉండగా వెళ్లారు. భూమిని దౌర్జన్యంగా ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించడానికి పూనుకున్నారు. దీంతో మునెమ్మ వారిపై తిరగ బడడంతో మూకుమ్మడిగా ఆమైపె దాడిచేసి, కొట్టారు. స్థానికులు గమనించి బాధితు రాలిని వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉంది. బాధితురాలు తాలూక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ.చంద్రమోహన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నెల్లూరు, అనంతపురం జట్ల విజయం
రోషన్ పవన్కుమార్రెడ్డి, 72 పరుగులు హానీష్ వీరారెడ్డి, 74 పరుగులు సుబ్రమణ్యం, 4 వికెట్లు సాయి సూర్యతేజరెడ్డి, 85 పరుగులు రేవంత్రెడ్డి, 71 పరుగులు కడప వైఎస్ఆర్ సర్కిల్: ఏసీఏ సౌత్జోన్ సీనియర్స్ మెన్ టీ20 మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. బుధవారం వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఉదయం జరిగిన టీ20 మ్యాచ్లో కర్నూలు–నెల్లూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కర్నూలు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. జట్టులోని సాయి సూర్యతేజ రెడ్డి 85, నయిముల్లా 29 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని సుబ్రమణ్యం 4, సాకేత్ రామ్ 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 18.4 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. జట్టులోని రేవంత్రెడ్డి 71, రోషన్ పవన్కుమార్ 72 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని ఎస్కె కమరుద్దీన్ 2 వికెట్లు తీశాడు. దీంతో నెల్లూరు జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మధ్యాహ్నం వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్లో కడప–అనంతపురం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. జట్టులోని ధనుష్ 55, ధృవకుమార్రెడ్డి 32 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని వినయ్కుమార్ రెడ్డి 2, దీపక్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ను ప్రారంభించిన అనంతపురం జట్టు 11.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ఆ జట్టులోని హానీష్ వీరారెడ్డి 74, దత్తరెడ్డి 43 పరుగులు చేశారు. కడప జట్టులోని ఆరిఫ్ భాష 3 వికెట్లు తీశాడు. దీంతో అనంతపురం జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
విద్యుత్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
కడప కార్పొరేషన్: విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళీ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక బీసీ భవన్లో నిర్వహించిన 3వ రాష్ట్ర మహాసభలను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలకు, లక్షలాది వ్యవసాయ భూములకు విద్యుత్తు సరఫరా సేవలందిస్తున్న కార్మికులను దశాబ్దాలు గడుస్తున్న పర్మినెంట్ చేయకపోవడం పాలకుల ప్రజా వ్యతిరేక చర్యలకు నిదర్శనమన్నారు. దేశంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి విద్యుత్తు రంగంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ ప్రోత్సహిస్తున్నాయని ఆ కారణంగానే ప్రతి ఏడు రెండు మూడు దఫాలు విద్యుత్ చార్జీలు పెంచి ప్రైవేటు వ్యక్తులకు సూపర్ లాభాలు తెచ్చి పెడుతున్నారని విమర్శించారు. విద్యుత్తు శాఖలోని ఖాళీ పోస్టులను ఇప్పటికే పని చేస్తున్న కార్మికులతోనే వారి విద్యార్హతను బట్టి భర్తీ చేయాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సర్వీస్ కాలానికి రూ. 10 లక్షలు చెల్లించాలని కోరారు. తెలంగాణ తరహా ఒక కోటి ఇన్సూరెన్న్స్ ఏపీలోనూ అమలు చేయాలని అన్నారు. ఈ మహాసభల్లో యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ ముజాఫర్ అహ్మద్, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు డి సూరిబాబు, వి సుదర్శన్రెడ్డి, కాంట్రాక్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్ ఉపాధ్యక్షులు కే శ్రీనివాసులు, ఎస్పీడీసీఎల్ అధ్యక్షులు కార్యదర్శులు సుబ్రహ్మణ్యం రాజు, సుమన్. సి పి డి సి ఎల్ కన్వీనర్ నాగరాజు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి అనిల్,పాల్గొన్నారు. -
వినూత్న ఆలోచన..పంటకు రక్షణ
● పంటలను కాపాడుకొనేందుకు పొలాల్లో విద్యుత్ కాంతులు ● అడవిజంతువుల బెడదతో తప్పని పాట్లు లైట్ల కోసం ఏర్పాటు చేసిన స్తంభాలు తలారివాండ్లపల్లెలో వేరుశనగ పొలం వద్ద రాత్రిళ్లు వెలుగుతున్న విద్యుత్ లైట్లు గుర్రంకొండ: ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలను అడవి జంతుల బారినుంచి కాపాడుకొనేందుకు రైతులు విన్నూత్నప్రయోగాలు చేపట్టారు. పొలం చూట్టూ రాత్రిళ్లు విద్యుత్లైట్లను, మరికొన్ని చోట్ల పొలాల్లో ఎఫ్ఎమ్ రెడియోలు, స్పీకర్లను ఏర్పాటు చేస్తున్నారు. మరికొంతమంది రాత్రిళ్లు పొలం చుట్టూ ఆక్కడక్కడ కట్టెలతో మంటలు ఏర్పాటు చేసుకొంటున్నారు. పలుచోట్ల రైతులు చేపట్టిన పద్ధతులు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ప్రస్తుతం రబీసీజన్లో రైతులు పలు గ్రామాల్లో వేరుశనగ సాగు చేశారు. అక్కడక్కడ అడవిజంతువుల బెడదను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో ఈ ఏడాది రైతులు వీటి బారినుంచి పంటను కాపాడుకొనేందకు కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. వేరుశనగ పంట చుట్టూ , మధ్యలో స్తంభాలు అమర్చి విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. రాత్రిళ్లు విద్యుత్ కాంతులతో పొలం మొత్తం వెలుతురు ఉండడంతో అడవి జంతువులు అటువైపు వెళ్లడం లేదని రైతుల చెబుతన్నారు. పంటలకు కాపలాగా ఎఫ్ఎమ్రేడియోలు.. కొంతమంది రైతులు కర్బూజాతో పాటు మరికొన్ని పంటల వద్ద ఎఫ్ఎమ్ రేడియోలను ఏర్పాటు చేశారు. ఓ చెట్టుకుగానీ, ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొన్న పందిళ్ల వద్ద ముందుగా ఎఫ్ఎమ్ రేడియోలను ఏర్పాటు చేసి, దానిని రెండు స్పీకర్లకు కనెక్షన్ ఇస్తున్నారు. ఇవి కరెంటు సౌకర్యం లేకున్నా రాత్రిళ్లు పనిచేయడానికిగాను బ్యాటరీలను అమర్చారు. సాయంకాలం పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో ఎఫ్ఎమ్ రెడియోలను ఆన్ చేసి వెళుతున్నారు.రాత్రిళ్లు ఎఫ్ఎమ్ రెడియోలలో వచ్చే కార్యక్రమాలతో పొలమంతా శబ్దాలు వస్తుంటాయి. దీంతో జనసంచారం ఉంటుందని అడవి జంతువులు పంటల పొలాలవైపు వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నాయి. దీంతో రాత్రిళ్లు పంటకు కాపాలా కాసే బాధ నుంచి రైతులు ఉపశనమనం పొందుతున్నారు. వేరుశేనగ పంటను కాపాడుకొనేందుకు రాత్రిళ్లు పొలాల చుట్టూ అక్కడక్కడ కట్టెలను కుప్పగా పోసి మంటలను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు ఆరు గంటల పాటు కట్టెలు రగులుతూనే ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు దీంతో పొలాల వద్ద జనసంచారం ఉంటుందని భావించి అడవి జంతులు పొలాల వైపు రావడం లేదని రైతులు అంటున్నారు. మరికొంతమంది రైతులు పొలాల్లో అక్కడక్కడ కట్టెలను నాటి పాలథిన్షీట్లు. దారాలు కట్టెలకు కడుతున్నారు. ఖాళీ గాజుసీసాలను కూడా వాటికి జతచేసి ఒక వరుస క్రమంలో అమర్చుతున్నారు. పగలు, రాత్రిళ్లు అని తేడా లేకుండా అవి గాలివీచినపుపడుల్లా చప్పుళ్లు చేస్తుండడంతో జంతువులు అటువైపు రావడం లేదు. గాలిసన్నగా వీచినా రాసుకొంటుండడంతో పెద్ద శబ్దాలు వస్తున్నాయి. ఉన్న కాస్త పంటనైనా కాపాడుకోవడానికి ఇలా కష్టాలు పడాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. -
ఓవైపు పసికందు.. మరోవైపు ఊరకుక్కలు
చెట్టుకింద ఒంటరిగా ఉన్న చిన్నారి చిన్నారిపై దాడి చేయడానికి చూస్తున్న ఊరకుక్కల గుంపు గుర్రంకొండ: ఓవైపు నెలల పసికందు చెట్టుకింది కూర్చుని ఉన్నాడు...ఇదే సమయంలో అటువైపు వెళుతున్న ఊర కుక్కల గుంపుకు చిన్నారి ఒంటరిగా కనిపించింది. దాడి చేసేందుకు సిద్దమవుతుండగా గమించిన కొంతమంది వాటిని తరిమి వేయడంతో చిన్నారికి ప్రాణపాయం తప్పింది. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా గుర్రంకొండ పట్టణ శివార్లలో బుధవారం జరిగింది. చూట్టు ఎవరూ లేరు. నెలలు కూడా నిండని ఓ పసికందు మాత్రం చెట్టుకింద మండుటెండలో ఒంటిరిగా ఆడుకొంటోంది. చిన్నారి పక్కనే ఓ వాటర్ బాటిల్, పాలసీసా ఉన్నాయి. పెద్దగా జనసంచారం లేని ప్రాంతం కావడంతో అసలు ఆపాప అక్కడ ఎందుకు ఉంది. ఎవరు వదిలిపెట్టి వెళ్లారో అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. ఇంతలోనే రక్తం రుచి మరిగిన ఊరకుక్కల గుంపు అటువైపు వెళుతోంది. వాటి చూపు ఒంటరి చిన్నారిపై పడింది. అక్కడే కొద్ది దూరంలొ మాటు వేశాయి. అదును చూసి దాడి చేయడానికి సిద్ధమవుతుండగా అదృష్టం కొద్ది అప్పుడే అటువైళుతున్న ఓ వ్యక్తి కంట ఈ దృశ్యం పడింది. అనుమానం కలిగి ఊరకుక్కల గుంపును చెదరగొట్టాడు. కొద్దిసేపు ఈ చిన్నారి ఎవరనే విషయం వాకబు చేశాడు. విధి విచిత్రం ఏ గూడు లేని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారిగా గుర్తించాడు. పట్టణంలో కవర్లు ఏరుకొనే కుటుంబం ఉదయాన్నే కవర్లు ఏరుకోవడానికి వెళుతూ మండుటెండకు తాళలేదని నెలలు నిండని చిన్నారిని పట్టణ శివార్లలోని ఓ చెట్టుకింద వదిలిపెట్టి వెళ్లారు. ఈ చిన్నారికి తోడుకు మరో ఇద్దరు చిన్నారులను ఉంచి వెళ్లారు. తోడుగా ఉన్న మిగిలిన ఇద్దరు ఆడుకొంటూ ఎటో వెళ్లిపోయారు. దీంతో చిన్నారి చెట్టు కింద ఒంటరిగా మిగిలిపోవడంతో ఈ సంఘటన నెలకొంది. సమయానికి స్పందించడంతో ప్రాణపాయం తప్పింది. త్రుటిలో తప్పిన ప్రాణపాయం -
ప్రతి కూలీకి పని కల్పించండి
ములకలచెరువు: ఉపాధిహామీ పథకంలోని ప్రతి కూలీకి పని కల్పించాలని డ్వామా పీడీ వెంకటరత్నం సిబ్బందికి ఆదేసించారు. బుధవారం ఆయన సిబ్బందితో కలిసి పాతములకలచెరువులోని ఫీడర్ చానల్ వర్క్ను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. జాబ్కార్డు కలిగిన ప్రతిఒక్కరూ పనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం సీఎల్ఆర్సీ భవనంలో తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఉపాధిహామీ సిబ్బందితో పనులపై సమీక్షించారు. ములకలచెరువు క్లస్టర్ పరిధిలోని ఆరు మండలాల్లో 10895 మంది కూలీలు పనులకు హాజరుకావాల్సివుండగా 3963 మంది మాత్రమే హాజరవుతున్నట్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది పనితీరు మార్చుకోవాలని లేకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. 100 శాతం కూలీలు పనులకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, 26 రకాల పనులు కులీలకు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ చందన, ఏపీఓలు, సిబ్బంది పాల్గొన్నారు.డ్వామా పీడీ వెంకటరత్నం -
ఆలయ రూములు కూల్చివేత
పుంగనూరు: పట్టణ సమీపంలోని గూడూరుపల్లె వద్ద వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన లక్షలాది రూపాయలు విలువ చేసే మూడు అంగడి రూములను కొందరు మంగళవారం రాత్రి జేసీబీలతో కూల్చివేశారు. బుధవారం స్థానిక ప్రజలు గమనించి ఆందోళన చేపట్టారు. 30 సంవత్సరాల క్రితం ఆలయానికి దాతలు ఇచ్చిన అంగడి రూముల స్థలానికి విలువ రావడంతో కొంత మంది దీనిపై కన్నేసి అర్ధరాత్రి కూల్చివేసి ఆస్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయమై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, రూములు కూల్చివేసిన వారిపై కేసులు నమోదు చేయాలని , ఆలయ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. -
ఊపిరి తీశారు !
● బి.కొత్తకోట సీఎహెచ్సీలో నిరుపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్ ● రూ.70 లక్షల నిధులతో ప్రారంభించిన ఎంపీ మిథున్రెడ్డి బి.కొత్తకోట: కోవిడ్ సమయంలో రోగులకు ఆక్సిజన్ కొరత లేకుండా చేసి ప్రాణాలు కాపాడేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి కృషితో ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.70 లక్షల నిధులు మంజూరు చేశారు. దీంతో స్థానిక సీహెచ్సీలో ఆక్సిజన్ ప్లాంట్ను నిర్మించగా ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించి వినియోగంలోకి తెచ్చారు. ఇక్కడ చేరిన కోవిడ్ రోగులకు ఆక్సిజన్తో ప్రాణాలు నిలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే తీసుకున్న చర్యలు కోవిడ్ రోగులు మదనపల్లె, తిరుపతి వెళ్లకుండా స్థానిక సీహెచ్సీలోనే వైద్యం పొందేలా చేశారు. అయితే కూటమి ప్రభుత్వ రాకతో ఈ ప్లాంట్పై నిర్లక్ష్యం నెలకొంది. రోగులకు నిత్యం అవసరమైన ఆక్సిజన్ కోసం ప్లాంట్ను వినియోగించుకోవాల్సి ఉంది. అయితే ఈ ప్లాంట్ను నిర్వహించే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉంచేయడంతో ప్లాంటు నిరుపయోగమైంది. ఫలితం విలువైన పరికరాలు వృథాగా పడి ఉన్నాయి. ప్రభుత్వం టెక్నికల్ అసిస్టెంట్ను నియమిస్తే ఇది వినియోగంలోకి వస్తుంది. ఈ విషయంలో స్థానికులు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడంతో అధికారుల నుంచి వివరణ కోరింది. ప్లాంట్ నిర్వహణ సిబ్బంది కోసం ఖాళీల భర్తీ చేసే సమయంలో ఆక్సిజన్ ప్లాంట్ పై చర్యలు తీసుకుంటామని అధికారులు లేఖ ద్వారా తెలియజేశారు. ఈ ప్లాంట్ను వినియోగంలోకి తీసుకొస్తే బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు మండలాల రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సమస్యపై మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్కుమార్ మాట్లాడుతూ ఆక్సిజన్ ప్లాంట్ను వినియోగంలోకి తెవాలంటే సాంకేతిక పరిజ్ఙానం కలిగిన సిబ్బంది ఉండాలని, ఆ పోస్టును భర్తీ చేస్తే సమస్య ఉండదని చెప్పారు. ఆస్పత్రికి వస్తున్న రోగులకు ఆక్సిజన్ సమస్య లేదని, అవసరమైనంతగా అందుబాటులో ఉందని చెప్పారు. అయినప్పటికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి ఆక్సిజన్ ప్లాంటును వినియోగంలోకి తీసుకోచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
బాబు హుకుం.. ఖాకీ జులుం!
కడప కార్పొరేషన్: నిబంధనలకు నిలువెల్లా తూట్లు పొడుస్తూ.. ప్రజాస్వామ్య విలువలను పట్టపగలే బేఖాతరు చేస్తూ పోలీసులు జులుం ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను కించప రిచేలా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్య లను నిరసిస్తూ బుధవారం ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన ఆ పార్టీ నాయకులను ఖాకీలు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడికెక్కడ తెల్లవారుజాము నుంచే గృహ నిర్బంధం చేశారు. పోలీస్ స్టేషన్లకు తరలించి ఓవర్ యాక్షన్ చేశారు. ● తెల్లవారుజాము నుంచే మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్, ఎస్ఈసీ సభ్యులు యానాదయ్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య తదితరులను గృహనిర్భంధం చేశారు. నాగరాజుపేటలో ఉన్న ఆంధ్రజ్యోతి కార్యాలయంపై ఈగ కూడా వాలనీకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు వేసి మూడంచెల భద్రత కల్పించారు. ఉదయం 9 గంటల నుంచే సన్రైజ్ హాస్పిటల్, మైత్రి హాస్పిటల్, బ్లూడైమండ్ హోటల్, శివశంకర్ హాస్పిటల్ల వద్ద బారికేడ్లు వేసి రాకపోకలను అడ్డుకున్నారు. సామాన్య ప్రజానీకాన్ని ఆసుపత్రులకు కూడా వెళ్లనీకుండా అడ్డుపడ్డారు. సుమారు 50 మందికిపైగా పోలీసులు, ఒక వ్యాన్, వజ్ర వాహనం, నాలుగైదు పెట్రోలింగ్ వాహనాలతో కాపు కాశారు. ఽ11.20 గంటలకు ధర్నా చేసేందుకు వచ్చిన మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, పార్టీ సీఈసీ సభ్యులు కె. సురేష్ బాబుల ఆధ్వర్యంలో వచ్చిన మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఉమైర్, జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, నగర అఽధ్యక్షుడు గుంటి నాగేంద్ర, నగర మైనార్టీ అధ్యక్షుడు షఫీ, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శివప్రసాద్, ఈస్ట్ జోన్ అధ్యక్షుడు రామ్మోహన్రెడ్డి తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. రాధాక్రిష్ణ డౌన్, డౌన్, బూత్ ఛానెల్ ఏబీఎన్ డౌన్ డౌన్ అంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో వారిని బలవంతంగా పోలీస్వ్యాన్లో కుక్కి వన్టౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. ● అంతకుముందు ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్దకు ధర్నాకు వస్తున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, సీహెచ్ వినోద్, మల్లికార్జున కిరణ్, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎన్. శివరామ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు బండి దీప్తిరెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యురాలు బి. మరియలు, పత్తిరాజేశ్వరి, చైతల్య, నారాయణమ్మ, మల్లీశ్వరి, పార్టీ నాయకులు త్యాగరాజు, అక్బర్ అలీ, కంచుపాటి బాబు తదితరులను లాక్కుంటూ వెళ్లి అరెస్ట్ చేశారు. బీసీ నేత శివరామ్ను వికలాంగుడని కూడా చూడకుండా ఈడ్చుకుంటూ వెళ్లారు. అలాగే ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డా. నాగార్జునరెడ్డి, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు జాషువా, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సాయిదత్తలను ఈడ్చుకుపోయి అరెస్ట్ చేశారు. మొత్తం 57 మంది వైఎస్సార్సీపీ నాయకులను అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై మధ్యాహ్నం విడుదల చేశారు. కడప అర్బన్: వైఎస్ఆర్సీపీ మనోభావాలను దెబ్బతీసేలా, మహిళలను అవమానించేలా తప్పుడు, దురుద్దేశపూరిత వార్తలు ప్రచురించిన రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. కడప నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మాజీ డిప్యూటీ సీఎం, కడప నియోజకవర్గ సమన్వయకర్త ఎస్బీ అంజద్బాషా, సీఈసీ సభ్యులు కె. సురేష్ బాబుతో పాటు, నాయకులు ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తూ, మహిళల గౌరవాన్ని దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్న వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, జిల్లా, నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
స్వల్పంగా పెరిగిన టమాట ధర
మదనపల్లె: స్థానిక వ్యవసాయ మార్కెట్లో బుధవారం టమాట ధరలు స్వల్పంగా పెరిగాయి. ఒకటవ రకం కిలో రూ.11.50 నుంచి రూ.13, రూ.14 పలగ్గా, రెండో రకం కిలో ధర రూ.9 నుంచి రూ.10, రూ.11 పలికింది. విక్రయానికి 157 టన్నుల టమాట వచ్చింది. వివిధ ప్రాంతాలకు ఎగుమతి అయ్యింది. మదనపల్లె టౌన్: అసాంఘిక శక్తులపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టినట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. జిల్లాలోని అసాంఘీక శుక్తుల ఆట కట్టించేందుకు పోలీస్ యంత్రాంగం సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసుకుంది. నేరస్థులు ఏ పొదలో దాక్కున్నా.. పసిగట్టేలా డ్రోన్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. నేరం చేసినోడు తప్పించుకోవడం అసాధ్యం అన్నట్లుగా డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచామని ఎస్పీ తెలిపా రు.హైటెక్ గస్తీలతో నేరస్థుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తేలా పోలీసులు పనిచేసి ప్రజలకు నమ్మ కా న్ని కలిగించాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు. మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లాలో శాంతి భద్రల పరిరక్షణతో పాటు పెండింగ్లో ఉన్న, క్లిష్టమైన నేర పరిశోధనలను త్వరితగతిన కొలిక్కి తెచ్చేందుకు బుధవారం మదనపల్లెలో క్రైం పోలీస్ స్టేషన్ను ప్రారంభించినట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లె బి.టి కళాశాల ఆవరణలో క్రైం పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయడంవల్ల దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి, చోరీల కేసు ఛేదించడానికి వీలు ఉంటుందని తెలిపారు. క్రైం సీఐ చంద్ర శేఖర్ మాట్లాడుతూ టెక్నాజీని వాడుకుంటూ నేరస్థులను ఎప్పటికప్పుడు పట్టుకుని, అరెస్టు చేసి శిక్షించడానికి సిబ్బంది సహకారం ఎంతో అవసరం ఉందని చెప్పారు. సీఐలు రాజారెడ్డి, కళా వెంకటరమణ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఆదినారాయణ రెడ్డి, రెడ్ శాండి టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్, ఎస్ఐలు పాల్గొన్నారు. -
సచివాలయ సేవల్లో పారదర్శకతకు ప్రాధాన్యం
పెద్దమండ్యం: సచివాలయ సేవల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్కుమార్ అన్నారు. మండలంలోని కోటకాడపల్లె గ్రామ సచివాలయాన్ని బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న సిబ్బందిని శాఖల వారీగా అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సిబ్బంది హాజరు, ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డుల నిర్వహణ, వినతులు–ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ సిబ్బంది ఫేషియల్ హాజరు విధానాన్ని సిబ్బంది తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేస్తే ప్రజలకు అందించే సేవలలో పారదర్శకత, బాధ్యత పెరుగుతుందన్నారు. ప్రజల నుంచి వచ్చే వినతులు, ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. సచివాలయ సేవలు ప్రజలకు సులభంగా, వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ రికార్డులను సక్రమంగా నవీకరించాలని అధికారులకు సూచించారు. ఇంటి పన్నులు, చెత్త సేకరణ, పశువైద్యం, రైతులకు ఎరువుల పంపిణీ, పక్కాగృహాల నిర్మాణం, పీజీఆర్ఎస్లో వచ్చిన భూసమస్యల పరిష్కారంపై ఎంపీడీఓ, తహశీల్దార్, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలతో మట్లాడారు. తహసీల్దార్ తేజస్వి, ఎంపీడీఓ శ్రీధర్రావు, హౌసింగ్ ఏఈ అక్రం, వీఆర్వోలు మంజునాథ రెడ్డి, ఆంజినేయులునాయక్, పంచాయతీ కార్యదర్శులు పి జగన్మోహన్, జనార్దన్ పాల్గొన్నారు. కలెక్టర్ నిశాంత్కుమార్ -
సీఎం రిలీఫ్ ఫండ్లో తమ్ముళ్ల పర్సెంటేజీల గోల
సాక్షి, అన్నమయ్య: రాబందువులుగా మారిన కూటమి పార్టీల నేతలు.. ప్రజలను పీక్కుతిన్నంత పని చేస్తున్నారు. తాజాగా సీఎం రిలీఫ్ ఫండ్లోనూ తెలుగుదేశం తమ్ముళ్లు ప్రదర్శించిన చేతివాటం బాధితుడి ఫిర్యాదుతో బయటకు వచ్చింది. ఓ బాధితుడికి మంజూరైన సొమ్ములో సగానికి పైగా తమ అకౌంట్లో జమ చేసుకున్నాడు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్. రాజంపేటకు చెందిన తుంటి ఎల్లయ్య అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కన్ను పోగొట్టుకున్నాడు. బాధితునికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 14 లక్షలు మంజూరు అయ్యింది. అయితే ఆ డబ్బులు ఇప్పిస్తామని తెలుగు దేశం పార్టీ నేతలు ఎల్లయ్యను బ్యాంకుకు తీసుకెళ్లారు. అటుపై అతనితో సంతకాలు పెట్టించుకుని.. డబ్బులు అకౌంట్లో పడ్డాయని చెప్పి పంపించారు. అయితే.. ఇంటికొచ్చి ఫోన్ చూసిన ఎల్లయ్యకు మతిపోయింది. ఎల్లయ్య అకౌంట్కు తొలుత రూ. 14 లక్షలు జమ కాగా.. ఆ వెంటనే 20 నిమిషాల వ్యవదిలో రూ.8 లక్షలు బదిలీ అయ్యాయి. ఆ బదిలీ అయ్యింది టీడీపీ నేత వేణుగోపాల్ అకౌంట్కేనని తెలిసి నిలదీశాడు ఎల్లయ్య. అయితే.. తమకూ ఖర్చులు ఉంటాయని, అందరికి పర్సెంటేజీలు ఇవ్వాలని టీడీపీ నేతలు చెప్పడంతో ఎల్లయ్య తీవ్ర ఆవేదనకు గుయ్యాడు. -
పుంగనూరుకు నూతన కోర్టు మంజూరు
పుంగనూరు: పుంగనూరు కోర్టు సముదాయంలో రెండవ అదనపు సివిల్జడ్జి, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ఆఫ్ ఫస్ట్క్లాస్ కోర్టును ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న మూడు కోర్టులతో కలిపి పట్టణంలో నాలుగు కోర్టుల్లోను కేసులు పరిష్కరించనున్నారు. కేసులను వేగంవంతంగా పరిష్కరించేందుకు పట్టణానికి అదనపు కోర్టు మంజూరు కావడంపై న్యాయవాదు ల సంఘ అధ్యక్షుడు ఎం.విజయ్కుమార్తో పాటు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. రాయచోటి టౌన్: రాష్ట్ర వ్యాప్తంగా డీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. మంగళవారం రాయచోటి బాలికల ఉన్నత పాఠశాలలో డీఎడ్ ప్రవేశాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ డిస్ట్రిక్టు ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆండ్ ట్రైనింగ్ (డీఐఈటీ) ప్రైవేట్ ఎలి మెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లలో అందిస్తున్న రెండేళ్ల కోర్సులో ప్రవేశం కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. నోటిఫికేషన్అర్హత ప్రమాణాలు, ఆన్లైన్ దరఖాస్తు విధానానికి సంబంధించి వివరాలు https://cse. ap.gov.in and https://apdeecet. apcfss.in ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు న్నారు. దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల 15వ వరకు చివరి తేది అన్నారు. మరిన్ని వివరాల కోసం డైట్ ఇన్చార్జి ప్రిన్సిపల్ 944024 6825కు సంప్రదించాలని కోరారు. పెద్దమండ్యం: అత్యాధునిక సాంకేతికపై విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించడం కోసం అటల్ బూట్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి ఎం ఓబుల్రెడ్డి అన్నారు. మండలంలోని కలిచెర్ల తెలుగు జెడ్పీ ఉన్నత పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్లో జరుగుతున్న బూట్ క్యాంప్ను మంగళవారం ఆయన పరిశీలించారు. జిల్లాలో 24 టింకరింగ్ ల్యాబ్లలో విద్యార్థులకు సాంకేతికపై ప్రత్యక్ష అనుభవం కోసం ఈ క్యాంప్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్యాంపుల ద్వారా విద్యార్థులలో సృజనాత్మకత, ఆవిష్కరణలను పెంపొందించవచ్చని అన్నారు. డిజైన్ ఽథింకింగ్, ప్రోటో టైపింగ్ నైపుణ్యాలను అభివృద్ధి చేయవచ్చని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. పలువురు విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం మీనా నాగలక్ష్మి, ఉపాధ్యాయులు హేమంత్కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. జమ్మలమడుగు: పర్యాటక కేంద్రమైన గండికోటలో మరోసారి చిరుతపులుల కలకలం మొదలైంది. మంగళవారం రెండు చిరుత పులులు నాలుగు గొర్రెలపై దాడి చేసి చంపడంతో గొర్రెల కాపరులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొంత కాలం కిందట చిరుత పులుల సంచారం ఉండటంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బయటకి వెళ్లాలన్న భయంతో అల్లాడిపోయారు. దీంతో ఫారెస్టు అధికారులు రంగంలోకి దిగి బోను పెట్టి చిరుతను పట్టుకుని తిరు పతి జూ పార్కుకు తరలించారు. ఇటీవల జమ్మలమడుగు–ముద్దనూరు రహదారిలో, అలాగే ముద్దనూరు– తాడిపత్రి రహదారిలో ఉన్న గాలేరు–నగరివరద కాలువపైన ఆటో డ్రైవర్లు వాహనదారులు చిరుతలను చూసి స్థానికులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో మంగళవారం గండికోటలో చిరుత పులులు 4 గొర్రెల పై దాడి చేసి చంపేయడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పర్యాటకులు సైతం భయాందోళన చెందుతున్నారు -
కుక్కల దాడిలో గొర్రెల మృతి
పెద్దమండ్యం : ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం దొడ్డిలో ఉన్న గొర్రెలపై కుక్కలు దాడి చేయడంతో 3 గొర్రెలు, 8 గొర్రె పిల్లలు మృతి చెందాయి. పెద్దమండ్యం గ్రామం చిన్నకురవపల్లెలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. వివరాలలోకి వెళితే.. గ్రామానికి చెందిన సాంబ గొర్రెలు మేపుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఒక జత గొర్రెలు రూ.25 వేలు చొప్పున కొనుగోలు చేశాడు. రోజువారీగా గొర్రెలను మేపుకొని వచ్చి ఇంటికి సమీపంలోని రోడ్డు పక్కనే ఉన్న దొడ్డిలో తోలేవాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉండడంతో గొర్రెలను దొడ్డిలో తోలి ఇంటికి వెళ్లాడు. అంతలోనే దొడ్డిలోకి కుక్కలు చొరబడ్డాయి. కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో 8 గొర్రె పిల్లలు, రెండు గొర్రెలు మృతి చెందాయి. గొర్రెలు, గొర్రెపిల్లలు కుక్కల దాడిలో మృతి చెందడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
న్యాయవాది హత్యపై నిరసన
వాల్మీకిపురం : పీలేరు నియోజకవర్గంలో న్యాయవాది యల్లయ్య హత్యకు గురి కావడం అత్యంత దారుణమైన సంఘటన అని వాల్మీకిపురం జూనియర్ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు రవిప్రకాష్ అన్నారు. మంగళవారం స్థానిక జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల పై దాడులను ప్రభుత్వం అరికట్టాలన్నారు. రో జు రోజుకు ఎక్కడో ఒక చోట న్యాయవాదులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు విభాకర్రెడ్డి, రమణ, ఆర్వీ ప్రసాద్, అశోక్ కుమార్రెడ్డి, రమణారెడ్డి, ద్వారకనాథరెడ్డి, ఆనంద కుమార్, మహిత, కరీముల్లా బేగ్, సదాశివరెడ్డి, పాల్గొన్నారు. నిందితులకు కఠినంగా శిక్షించాలి పీలేరు రూరల్ : ప్రాక్టీస్ న్యాయవాది పూజారి యల్లయ్యను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.సి.పురుషోత్తంరెడ్డి, ఆర్. చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం స్థానిక కోర్టు వద్ద న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూజారి యల్లయ్య గత ఐదు సంవత్సరాలుగా పీలేరులో ప్రాక్టీస్ న్యాయవాదిగా పని చేస్తూ జీవనం సాగించేవాడని తెలిపారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి వారి స్వగ్రామం పాతవడ్డిపల్లెలో దారుణ హత్యకు గురి కావడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎం. మదన్మోహన్రెడ్డి, వి.చిన్నరెడ్డెప్ప, శ్రీకాంత్, శేషాద్రి, పి.నిరంజన్, ప్రవీణ్కుమార్, ఎస్. నిరంజన్ తదితరులు తెలిపారు. -
● నిఘా నేత్రం.. తూతూమంత్రం
కడప నగరంలో డ్రోన్ కెమెరాలతో పెడుతున్న నిఘా నేత్రం తూతూ మంత్రంగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్పీ షెల్కే నచ్చికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీ పోలీసులతో, ఆయా పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెడుతున్నా కేవలం ప్రచారానికే పరిమితమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆయా ఫొటోలను తమ ఉన్నతాధికారికి పంపిస్తూ తామేదో చేస్తున్నామనే ఆర్భాటమే తప్పా.. ఆచరణలో నిఘా కరువైందని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఇప్పటికై నా చిత్తశుద్ధితో వ్యవహరించి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని.. గంజాయి బ్యాచ్ ఆకృత్యాలను అణచి వేయాలని ప్రజలు కోరుతున్నారు. -
మృతదేహాన్ని సంబంధీకులు తీసుకెళ్లండి
మదనపల్లె టౌన్ : చికిత్సకు వచ్చిన ఓ వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. ఘటనపై ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు.. కురబలకోట మండలం సర్కారు తోపునకు చెందిన సూరి(50) మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలోని రింగు రోడ్డులో గత 20 ఏళ్లుగా ఉంటున్నాడు. మతి స్థిమితం సరిగా లేక స్వగ్రామ మైన సర్కారు తోపు నుంచి మదనపల్లెకు వచ్చేశాడు. రింగు రోడ్డులో ఉంటూ ఎవరైనా ఏదయినా పని చెబితే చేసి వారు ఇచ్చే చిల్లరతో తిని గుడి, బడి, ఏదైనా వసారాల్లో నిద్దర పోయేవాడు. స్థానికులకు అందరికీ సూరి పేరుతో సుపరచితుడు. రోజూ అందరితో అభిమానంతో మాట్లాడే సూరికీ ఆరోగ్యం బాగ లేక పోవడంతో జాలితో రింగు రోడ్డులో ఉంటున్న సిద్దేశ్వర, రమణారెడ్డి తదితరులు తీసుకు వచ్చి వారం రోజుల క్రితం స్థానిక జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతునికి బంధువులు ఎవరైనా ఉంటే వచ్చి టూటౌన్ పోలీసులను ఆశ్రయించి మృతదేహం తీసుకెళ్లాలని సీఐ మహ్మద్ రఫీ తెలిపారు. మూడు రోజుల్లో తీసుకువెళ్లక పోతే మునిసిపాలిటీకి అప్పగిస్తామని తెలిపారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
మదనపల్లె టౌన్ : తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన మదనపల్లెలో మంగళవారం వెలుగు చూసింది. ఘటనపై రెండవ పట్టణ సీఐ మహ్మద్ రఫీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని చంద్రా కాలనీలో కాపురం ఉంటున్న ఫాతిమా టైలరింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఇంటికి తాళం వేసుకుని బట్టలు, దారాలు కొనుక్కొని రావడానికి వెళ్లింది. తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా.. దొంగలు అప్పటికే ఇంటి తాళాలు పగలగొట్టి, లోపల ఉన్న రూ.లక్షకు పైగా విలువైన డబ్బు, బంగారాన్ని అపహరించారు. ఈ మేరకు బాధితురాలు స్థానిక 2 టౌన్ పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
వైఎస్ జగన్ను కలిసిన పార్టీ నేతలు
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలువురు జిల్లా నేతలు కలిశారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన్ను కలిసి జిల్లాలోని రాజకీయ పరిస్థితులను, పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యల గూర్చి వివరించారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, పార్టీ సీఈసీ సభ్యులు కె. సురేష్ బాబు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి, జిల్లా బూత్ లెవల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాడే శివయ్యనాయుడు తదితరులు ఉన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
వేర్వేరు ప్రాంతాల్లో ఈత సరదాతో ఇద్దరు ప్రాణం కోల్పోయారు. చౌడేపల్లె మండలం పొదలపల్లెలో గంగ జాతరకు బంధువుల ఇంటికి వచ్చిన ఓ యువకుడు బావిలోకి దిగి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ములకలచెరువు మండలం మద్దినాయునిపల్లి పంచాయతీ యర్రంరెడ్డిగారిపల్లెకు చెందిన ఓ బాలుడు చెక్డ్యాంలో మృత్యువాత పడ్డాడు. చౌడేపల్లె : గ్రామంలో గంగ జాతర వేడుకకు బంధువులు ఆహ్వానించారు. బంధువుల ఇంటికి వచ్చిన అతను.. వేసవి తాపానికి సేద తీరడానికి ఈతకెళ్లి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన మంగళవారం పొదలపల్లె సమీపంలోని పంట పొలాల్లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తిరుపతి పట్టణం జీవకోనకు చెందిన ఎం.చంద్రశేఖర్రెడ్డి(37) అన్నమయ్య జిల్లా చౌడేపల్లె మండలం పొదలపల్లెలో బంధువుల ఇంటికి వచ్చాడు. చిట్రెడ్డిచెర్వు కింద గల గోపన్న బావి వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడే ఈత ఆడుతున్న యువకులతో కలిసి అతను కూడా బావిలోకి దిగి ఈత కొడుతూ ఒక్కసారిగా మునిగిపోయాడు. గమనించిన సహచరులు కేకలు వేయగా చుట్టుపక్కల ఉన్న యువకులు, దిగి బావిలో వెతికినా ఫలితం లేకపోయింది. వెంటనే పుంగనూరు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రెస్క్యూ టీం ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ సురేష్ ఆధ్వర్యంలో సిబ్బంది సుబ్రమణ్యం, లోకేష్రెడ్డి, ప్రకాష్, ఆనంద్ల బృందం బావిలో పాతాళ బైరవి సహకారంతో గంట సేపు గాలించి శవాన్ని వెలికి తీశారు. జాతర రోజు పొదలపల్లెలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. బట్టలు ఉతకడానికి వెళ్లి.. ములకలచెరువు : తల్లితో కలిసి బట్టలు ఉతకడానికి చెక్డ్యాం వద్దకు వెళ్లి ఈత ఆడుతూ ఓ బాలుడు మృత్యువాత పడిన సంఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు.. మండలంలోని మద్దినాయునిపల్లి పంచాయతీ యర్రంరెడ్డిగారిపల్లెకు చెందిన కె.వెంకటరమణారెడ్డి కుమారుడు కె.అభిషేక్(17) తన తల్లి లక్ష్మిదేవితో కలిసి ఊరికి దగ్గరలోనే చెక్డ్యాం వద్దకు బట్టలు ఉతకడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఈత ఆడటానికి చెక్డ్యాంలోకి దూకిన కె.అభిషేక్ నీటిలో మునిగి మృత్యువాత పడ్డాడు. గమనించిన తల్లి చుట్టు పక్కల వారికి కేకలు వేసి పిలవగా.. స్థానికులు చెక్డ్యాంలోకి దూకి బాలుడిని బయటికి తీసుకురాగా అప్పటికే మృత్యువాత పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.చంద్రశేఖర్రెడ్డి మృతదేహంమృతి చెందిన కె.అభిషేక్వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మృతి -
ఊరెళ్తున్నారా.. దొంగలతో జాగ్రత్త
మదనపల్లె టౌన్ : వేసవి సెలవుల్లో ఊర్లు, విహార యాత్రలు వెళుతున్నారా? అయితే దొంగలతో జర జాగ్రత్తగా ఉండి, తమ ఆస్తులను రక్షించుకోవాని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి కోరారు. మంగళవారం ఆయన అన్నమయ్య జిల్లా ప్రజలను ఉద్దేశించి పలు కీలక సూచనలు జారీ చేశారు. ఇల్లు భద్రంగా ఉండాలంటే.. ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు ప్రధాన ద్వారంతోపాటు వెనక తలుపులు, కిటికీలు సరిగ్గా మూసి వెళ్లాలన్నారు. ఫలాన ఊరు వెళుతున్నాం, ఇప్పుడు అక్కడ ఉన్నాం అంటూ ఫేస్ బుక్, వాట్సప్లలో ఫొటోలు వీడియోలు షేర్ చేస్తే దొంగలకు సమాచారం ఇచ్చినట్లు అవుతుందని ఎస్పీ హెచ్చరించారు. రాత్రి వేళల్లో ఇంట్లో, బయట లైట్లు వెలిగేలా చేయాలన్నారు. పక్కింటి వారు, నమ్మకస్తులకు సమాచారం ఇస్తే మన ఇంటిపై వారు నిఘా ఉంచుతారని తెలిపారు. నగదు, బంగారం వంటి విలువైన వస్తువులు ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లో ఉంచడం సేఫ్టి అన్నారు. పిల్లల భద్రత తల్లిదండ్రులదే.. పరీక్షలు ముగిసి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో తల్లిదండ్రులు, తమ పిల్లల భద్రతపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ సూచించారు. సరదా కోసం పిల్లలు ప్రమాదకరమైన చెరువులు, బావులు, వాగులు, ఉధృతంగా పారే కాలువల్లో నది లోతు తెలియ కుండానే ఈతకు వెళ్లడం మంచిది కాదని.. జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తమ పిల్లలు ఎవరతో తిరుగుతున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించాలన్నారు. కథల పుస్తకాలు, సమ్మర్ క్యాంపుల వైపు వారి దృష్టిని మరల్చి సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని చెప్పారు. పోలీసులకు సహకరించాలి జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసులతో నిఘా పెంచామని.. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 100, 112 కు గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు, ఓటిపి వంటి వివరాలు చెప్పద్దని సూచించారు. అలాగే హెల్మెట్ ధరించే ప్రయణాలు చేయాలని ఎస్పీ పేర్కొన్నారు. -
ట్రాన్స్ఫార్మర్ తరలింపు గొడవతోనే హత్య
పీలేరు రూరల్: కేవీపల్లె మండలం తీతవగుంటపల్లె పంచాయతీ పాతవడ్డిపల్లెలో ట్రాన్స్ఫార్మర్ తరలింపు విషయమై కొందరు గొడవపడి ప్రాక్టీస్ న్యాయవాది పూజారి యల్లయ్యను హత్య చేశారని రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ అన్నారు. మంగళవారం స్థానిక ఏరియా ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో పాతవడ్డిపల్లెలో ట్రాన్స్ఫార్మర్ తరలింపు విషయమై అదే గ్రామానికి శ్రీనివాసులు వర్గీయులు కర్రలు, రాళ్లతో యల్లయ్యపై దాడి చేశారని తెలిపారు. అడ్డు వచ్చిన యల్లయ్య తల్లి రెడ్డెమ్మ, తండ్రి వెంకటరమణపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. యల్లయ్య సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, గాయపడ్డ రెడ్డెమ్మ, వెంకటరమణను చికిత్స నిమిత్తం తిరుపతి స్విమ్స్కు తరలించినట్లు తెలిపారు. తండ్రి వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కడప ఎడ్యుకేషన్: రాయలసీమ పరిధిలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు పూర్వ జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాలకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్లు, సమాన హాదాల నుంచి గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల కోసం సవరించబడిన తాత్కాలిక సీనియారిటీ జాబితా కార్యాలయ అధికారిక వెబ్ సైట్ https://rjdsekadapa.blogspot. comలో ఉంచినట్లు పాఠశాల విద్య ఆర్జేడీ కాగిత శ్యాముల్ తెలిపారు. ఉపాధ్యాయులు తమ సర్వీసు వివరాలు, సినియారిటీ స్థానాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు. తమ సర్వీస్ వివరాలు లేదా సీనియాటికి సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆధార పత్రాలతో rjdsekadapa@apschool edu.inద్వారా ఈ నెల 11వ తేదీ లోగా సమర్పించాలని పాఠశాల విద్య ఆర్జేడీ తెలిపారు. -
దాడి కేసులో రెండేళ్లు జైలు శిక్ష
మదనపల్లె టౌన్ : ఆస్తి కోసం మాజీ భార్య, ఆమె భర్తను చంపాలని జరిపిన ప్రాణాంతక దాడి కేసులో ముగ్గురి నిందితులకు రెండేళ్ల జైలు శిక్షను మదనపల్లె ఏడవ అదనపు జిల్లా కోర్టు జడ్జి ఆర్.శ్రీలత మంగళవారం తీర్పును వెలువరించారు. ఇందుకు సంబంధించి అన్నమయ్య జల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో సిబ్బంది తెలిపిన వివరాలు.. పుంగనూరుకు చెందిన ఎం.యోసు తన భార్య నీలిమాతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నాడు. అనంతరం చౌడేపల్లెకు చెందిన వెంకటేష్ను నీలిమ వివాహం చేసుకుని జీవిస్తోంది. అయితే నీలిమ తల్లి పేరున గుర్రంకొండ మండలంలో ఉన్న ఆరు ఎకరాల వ్యవసాయ పొలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని యోసు పథకం పన్నాడు. ఈ క్రమంలో నీలిమ, వెంకటేష్ దంపతులు 11 డిసెంబర్ 2022లో చౌడేపల్లె నుంచి పలమనేరుకు వెళుతుండగా నీలిమ మాజీ భర్త యోసు తన స్నేహితులు టి.నాగరాజు, ఎం.మునిరాజలతో కలసి వారిని దారిలో అటకాయించారు. విచక్షణా రహితంగా దాడి చేసి చంపడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. వారి చేతిలో తీవ్రంగా గాయపడిన బాధిత దంపతులు తప్పించుకుని వచ్చి జరిగిన విషయాన్ని చౌడేపల్లె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నిందితులు యోసు, నాగరాజు, మునిరాజలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు మదనపల్లె ఏడవ అదనపు జిల్లా జడ్జి కోర్టులో విచారణ సాగింది. కోర్టులో నిందితులపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఆర్ శ్రీలత ఏ1 యోసు, ఏ2 నాగరాజ, ఏ3 మునిరాజలకు ఐపిసి సెక్షన్ 324 కింద రెండేళ్లు, సెక్షన్ 506 కింద ఒక ఏడాది, సెక్షన్ 341 కింద ఒక నెల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సంచలన తీర్పు చెప్పారు. ఈ కేసులో ఏపిపిగా శైలజ వ్యవహరించారని తెలిపారు. ఇద్దరు మైనర్లు అరెస్ట్వేంపల్లె : స్థానిక శ్లోక పాఠశాల సమీపంలోని జిమ్మి చెట్టు వద్ద ఉన్న ఇంట్లో దొంగతనం చేసిన కేసులో ఇద్దరు బాలురలను అరెస్టు చేసి జువైనెల్ హాంకు తరలించినట్లు సీఐ నరసింహులు తెలిపారు. గతనెల 28వ తేదీన వేంపల్లెలోని జిమ్మి చెట్టు వీధిలో నివాసముంటున్న అఖిల అనే మహిళ ఇంటికి తాళం వేసి డ్యూటికి వెళ్లింది. ఇంటి తలుపులను ఇనుప కడ్డీతో పగుల కొట్టి బీరువాలో ఉన్న బంగారు కమ్మలు, వెండి గజ్జలు దొంగలించారన్నారు. చోరీకి పాల్పడిన ఇద్దరు మైనర్లను విచారించగా చోరీ చేసిన విషయం బయట పడినట్లు తెలిపారు. -
ఏపీలో అభినవ ధృతరాష్ట్రుడి పాలన
● పేట్రేగిన అవినీతి, అరాచకం ● ‘మావిగన్’పై సర్వత్రా చర్చ ● వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్కుమార్రెడ్డిరాయచోటి : ఆంధ్రప్రదేశ్లో అభినవ ధృతరాష్ట్ర పాలన సాగుతోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే, హిందూపురం పార్లమెంటరీ పరిశీలకులు ఆర్.రమేష్కుమార్రెడ్డి ఆరోపించారు. మంగళవారం రాయచోటిలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రెండు సంవత్సరాల పాలనలో రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని గాలికి వదిలిన కూటమి నేతలు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విష ప్రచారం చేయడం, విధ్వంస పాలనతో రాష్ట్రంలో అరాచక పాలనను కొనసాగించడం వారి వంతైందని మండిపడ్డారు. అన్ని వ్యవస్థలను విధ్వంసం చేయడంతోపాటు చట్టాన్ని సైతం వారి కనుసన్నల్లో నడిచేలా చేశారన్నారు. రాజకీయాలలో తానే సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు కళ్లెదుట ఇంత అవినీతి, అరాచకం, విధ్వంస పాలన సాగుతున్నా అభినవ ధృతరాష్ట్రునిలా నటించడం ఆయనకే సాధ్యమైందన్నారు. సీఎం చంద్రబాబు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సభలు, సమావేశాలు పెట్టి చేయని అభివృద్ధిని సైతం తానే చేశానని ప్రచారం చేసుకోవడం, వైఎస్ జగన్పై దుష్ప్రచారం చేయడం తప్ప సాధించిన ప్రగతి ఏమీ లేదన్నారు. అమరావతిని ఎవరూ కాదనలేదని రమేష్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. దీనికితోడు తనకున్న పత్రికల ద్వారా నీచాతి నీచంగా మహిళలను సైతం కించపరుస్తూ కథనాలు రాయించడం సిగ్గుచేటన్నారు. ఒక విధంగా పత్రికలు కూటమి ప్రభుత్వం పట్ల ఓనర్షిప్ను చాటుకుంటున్నాయని విమర్శించారు. ‘మావిగన్’తో ఎంతో మేలుఅమరావతి కూడా పరిపాలన రాజధానిగా పెట్టాలన్న ఆలోచన వైఎస్ఆర్సీీపీకి ఉందన్నారు. రాజధానిని వెయ్యి లేదా రెండు వేల ఎకరాలలో బ్రహ్మాండంగా నిర్మాణాలు కట్టొచ్చని వేల ఎకరాలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దెబ్బతగలకుండా మాజీ సీఎం జగన్ ‘మావిగన్’ ప్రతిపాదన ప్రస్తావనను బయటకు తెచ్చారన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు (మావిగన్) ప్రాంతాలను కలిపి అభివృద్ధి చేయడం ద్వారా రెవెన్యూ కూడా వస్తుందని జగన్ ప్రతిపాదంచారన్నారు. మావిగన్పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడంతోపాటు మేధావులు, విద్యావంతులు, వ్యాపారులు స్వాగతిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు జిల్లాల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం, పరిపాలన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును జగన్మోహన్రెడ్డి గతంలో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలా చేస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసినట్లు అవుతుందని గతంలో ప్రకటించారన్నారు. అమరావతి పేరుతో దోపిడీ ఈ రోజు రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలను వదిలి ఒక అమరావతి పైన వేల కోట్ల రూపాయలు వెచ్చించి కమీషన్ల కోసం నిర్మాణం చేస్తున్నారన్నారు. ఒక చదరపు అడుగు నిర్మాణానికి రూ.4 వేల నుంచి రూ.5 వేల ఖర్చుతో అయ్యే పనికి 12 నుంచి 14000 ఖర్చు చేయడం ఇంతకంటే దోపిడీ ఎక్కడైనా చూశారా? అని ప్రశ్నించారు. కన్స్ట్రక్షన్ కోసం అంత డబ్బులు పెట్టడమే కాక వాటి కోసం విద్యుత్, రోడ్లకు జీఎస్టీలో మినహాయింపు ఇవ్వడం వారి దోపిడీకి తార్కాణమన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని చెప్పిన చంద్రబాబు నేడు వారి మందిమాగాదులకు మేలు చేకూరేలా ప్రభుత్వ నిధులను ఖర్చుచేస్తున్నారని విమర్శించారు. అమరావతిలో జరుగుతున్న దోపిడీని అంకెలతో సహా జగన్మోహన్రెడ్డి ప్రజలకు వివరించడంతో కూటమి పాలకులలో ఆందోళనలు మొదలయ్యాయన్నారు. బెల్టు షాపుల ఏర్పాటు, ఇంటింటికీ లిక్కర్ బాటిల్ డెలివరీ, గంజాయి విక్రయాలు, అందిన కాడికి ఇసుక, మట్టి, గ్రానైట్ను దోచుకునే వాటిల్లో చంద్రబాబు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరు, కార్పొరేట్ ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు రాష్ట్రంలో లేవన్నారు. -
ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తే పోరాటం తప్పదు
మదనపల్లె సిటీ : విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీ దశల వారీగా ప్రైవేటు పరం చేయాలని చేస్తే ఆందోళనలు తప్పవని ఎంప్లాయీస్ యూనియన్ (ఏపీపీటీడీ) రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం మదనపల్లె ఆర్టీసీ–1 డిపో ఆవరణలో జిల్లా అధ్యక్షులు ఎస్పి బాబు, ప్రధాన కార్యదర్శి సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఆర్టీసీలో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టాలని చూస్తోందని ఆరోపించారు. ఆ నిర్ణయాల వల్ల ఆర్టీసీ దశలవారీగా ప్రైవేటుపరం అవుతుందని, ఇది సరైన విధానం కాదని తేల్చిచెప్పారు. సీ్త్ర శక్తి పథకం విజయవంతం కావాలంటే మూడు వేల బస్సులను పెంచాలన్నారు. కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్ల నియామకం చేపట్టాలన్నారు. తనిఖీ అధికారులు రాసే అక్రమ కేసులపై పనిష్మెంట్ ఇచ్చే విధానాలు మానుకోవాలన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన పెండింగ్ డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ అరియర్స్, పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ ప్రకటించి వెంటనే 12వ ీీపీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్ లీవ్ ఎన్క్యాష్మెంట్ను ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర పధాన కార్యదర్శి జీవీ నరసయ్య మాట్లాడుతూ అరకొర పాత బస్సులతో అధిక పనిభారాలతో డ్రైవర్లు, కండక్టర్లు, మెయింటెన్స్ సిబ్బంది పని ఒత్తిడితో నిబద్ధతగా పని చేస్తున్నారన్నారు. విధి నిర్వహణలో సిబ్బందిపై దాడులు జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. సమావేశంలో జోనల్ అధ్యక్ష, కార్యదర్శులు పీఎస్.ఖాన్, రాజశేఖర్, విజయకుఆమర్, పీఎన్బి రెడ్డి, విటి.నాథ్ తదితరులు పాల్గొన్నారు. -
● పోలీసుల అదుపులోహత్య కేసు నిందితులు..
● జిల్లాలో పేట్రేగిపోతున్నగంజాయి బ్యాచ్లు ● ఆ మత్తులోనేపెద్దదస్తగిరి దారుణ హత్య ● డ్రగ్స్కు యువత బానిస ● నిద్దురపోతున్న ఖాకీలు కడప అర్బన్: జిల్లాలో గంజాయి ముఠా అరాచకం హద్దులు దాటింది. కడప, ప్రొద్దుటూరులాంటి ప్రధాన నగరాల్లో యువత గంజాయి, డ్రగ్స్కు బానిసగా మారుతుండడం కలవరపరుస్తోంది. వీరి ‘మత్తు’సమాజానికి చేటుగా మారింది. తాజాగా కడప నగరంలో గంజాయి బ్యాచ్ పైశాచికత్వానికి ఒక నిండు ప్రాణం గాల్లో కలిసింది. ఇంత జరుగుతున్నా కొంతమంది ఖాకీలు తమ సొంతలాభాల్లోనే మునిగి తేలుతున్నారు. కేసు కట్టడానికో రేటు కడుతున్నారు.. ‘ఫైలు’క్లోజుకో రేటు చెబుతున్నారు.. ఫలితంగా శాంతిభద్రతను గాలికొదిలేస్తున్నారు. పోలీసులందరూ ఇలానే ఉన్నారని కాదు.. మెజార్టీ ఖాకీలు తమ అసలు డ్యూటీని మరిచి.. నిత్యం పచ్చ గూటిలోనే కాలం గడిపేస్తున్నారు. కడప రిమ్స్ పీఎస్ పరిధిలో రిమ్స్లో గత ఆదివారం అర్ధరాత్రి (సోమవారం తెల్లవారుజామున) అలంఖాన్ పల్లెకు చెందిన పెద్ద దస్తగిరి (53)ను వెంకటేష్, రాజా, రవి, జాకి, ఇంకా పలువురు కత్తులతో వెంటాడి దారుణంగా పొడిచి హత్య చేసిన సంఘటన జిల్లాలో సంచలనం కలిగించింది. ఈ గంజాయి బ్యాచ్పై పోలీసుల నిఘా ఉండి ఉంటే ఈ దారుణమైన సంఘటన జరిగి ఉండేది కాదు. ఈ ఒక్క సంఘటనే కాదు ఇటీవల అనేక ఘటనలు జరిగాయి.. ఆయా కాలనీల్లో గంజాయి మత్తులో నిత్యం గొడవలు.. దాడులూ జరుగుతూనే ఉన్నాయి. రిమ్స్ పీఎస్తో పాటు కడప నగరంలోని కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటీవల గంజాయి గ్యాంగుల చేసిన వీరంగ సంఘటనలు గమనిస్తే... రిమ్స్ పీఎస్ పరిధిలో చలమారెడ్డి పల్లికి చెందిన ఓ యువకుడికి కొంతమంది గంజాయి బ్యాచ్తో దోస్తీ కుదిరింది.. అంతే సదరు యువకుడికి గంజాయి అలవాటు చేయాలని ఆ బ్యాచ్ భావించింది. అనుకున్నదే తడవుగా ఆ యువకుడికి ‘మత్తు’మాటలేవో చెప్పి చలమారెడ్డి పల్లె ట్యాంకు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి గంజాయిని సేవింప చేశారు. దెబ్బకు ఆ యువకుడు కోమాలోకి వెళ్లిపోయాడు. భయపడిన మిగతా యువకులు రహస్యంగా చికిత్స కోసం తిరుపతిలోని ఓ హాస్పిటల్కు తీసుకెళ్లారు. యువకుడి పరిస్థితిని గ్రహించిన డాక్టర్లు అతని తల్లిదండ్రులను పిలిపించారు. తామే ట్రీట్మెంట్ ఖర్చు భరిస్తామని సదరు యువకుడి తల్లిదండ్రులు వైద్యులతో బతిమలాడి చికిత్స చేయించారు. కొన్ని రోజులకు యువకుడు కోలుకున్నాడు. ఈ సంఘటనపై పోలీసులకు ఎలాంటి సమాచారం, నిఘా లేకపోవడం గమనార్హం. ఇదే రిమ్స్ పీఎస్ పరిధిలో చలమారెడ్డి పల్లె ప్రాంతానికి చెందిన మనోజ్ అనే యువకుడికి సంబంధించిన కారు అద్దాలను కడప రవీంద్ర నగర్కు చెందిన గంజాయి ముఠా ధ్వంసం చేసింది. తమ ఊర్లోకి వచ్చి దాడి చేయడంతో స్థానికులు తిర గబడి ఆ నలుగురిని పోలీసులకు అప్పగించారు. కడపవన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ సమీపంలో గత నెలలో మేరీ నగర్, అంగడి వీధికి చెందిన ఇద్దరు యువకులపై, గంజాయి బ్యాచ్ కత్తులతో దాడి చేశారు. ఉక్కాయ పల్లె సమీపంలో పది రోజుల కిందట వైన్ షాప్ సమీపంలో ఉక్కాయ పల్లె, మాసాపేటకు చెందిన రెండు బ్యాచులు ఘర్షణ పడ్డాయి. రెండు వైపులా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా గంజాయి మత్తు ఘటనలు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి. వైజాగ్ టు కడప కడప నగరానికి వైజాగ్ నుంచి ఓ రైలులో ప్రతిరోజు సరాసరి 10 కేజీల మేరకు గంజాయి సరఫరా అవుతోందని విశ్వసనీయ సమాచారం. ఈ గంజాయిని భద్రంగా కడపకు తీసుకొచ్చినందుకు కమీషన్ రూపంలో వేలాది రూపాయలు ముట్ట చెబుతున్నట్లు సమాచారం. కడప నగరంలో రిమ్స్ పీఎస్ పరిధిలో తిలక్ నగర్, తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో రవీంద్ర నగర్, వన్ టౌన్ పీఎస్ పరిధిలో గుర్రాల గడ్డ, చిన్న చౌక్ పీఎస్ పరిధిలో శంకరాపురం గంజాయి బ్యాచ్లకు అడ్డాగా మారాయి. అలాగే కడప నగరంలోని బైపాస్లో ఓ స్విమ్మింగ్ పూల్ వెనుక భాగాన గంజాయి బ్యాచ్ స్థావరంగా ఏర్పరచుకున్నారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాసాపేట, పోలీస్ స్టేషన్కు కూత వేట దూరంలో ఉన్న కేసీ కెనాల్ పరిసర ప్రాంతాలలో గంజాయి ముఠా సభ్యులు విచ్చలవిడిగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. చలమారెడ్డి పల్లి ప్రాంతంలో పదిమంది, ఆర్కే నగర్ లో 10 నుంచి 15 మంది, తిలక్ నగర్ లో ఐదు నుంచి 6 మంది, కేంద్ర కారాగారం సమీపంలో 5 నుంచి 6 సభ్యుల చొప్పున గంజాయి బ్యాచ్ లుగా తమ కార్యకలాపాలను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. కడప రిమ్స్ ఆవరణలో దారుణంగా హత్యకు గురైన పెద్ద దస్తగిరి (53) కేసులో నిందితులు వెంకటేశు, రవి,రాజా, జాకీ లతో పాటు మరికొందరు వున్నారు. ఈ హత్య కేసును రిమ్స్ ఇన్ఛార్జ్ సీఐ ఓబులేసు, తమ సిబ్బందితో కలిసి సమగ్రంగా దర్యాప్తు చేపట్టారు. వీరిలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం. -
● రెండు లేదా మూడు
మదనపల్లె: అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పెంపుపై కేంద్రప్రభుత్వ ప్రకటనతో ఆశావాహుల్లో ఆశలు చిగురించాయి. కొత్త అసెంబ్లీ స్థానాలు పెరిగితే ఎమ్మెల్యేలుగా పోటీచేయాలన్న ఆశలు పెట్టుకున్న పార్టీల నేతలకు ఇది శుభవార్తే. ఈ పరిస్థితుల్లో కొత్త అసెంబ్లీ స్థానాలు ఏవి రావొచ్చు, ఏవి మారవచ్చు అన్న చర్చ రాజకీయ వర్గాల్లోనే కాక సాధారణ ప్రజల్లోనూ తీవ్రంగా నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో అన్నమయ్యజిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే.. 10 నుంచి మొదలై 14 వరకు మద్రాస్ స్టేట్ పరిధిలోని ఉమ్మడి చిత్తూరుజిల్లాలో తొలి సార్వత్రిక ఎన్నికలు 1952లో జరిగాయి. స్వాతంత్య్రం వచ్చాక జరిగిన ఈ ప్రథమ ఎన్నికలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 10, ఆ తర్వాత అసెంబ్లీ స్థానాల సంఖ్య తగ్గుతూ, నియోజకవర్గాలు మారుతూ, మళ్లీ తగ్గి, మళ్లీ పెరుగుతూ వచ్చాయి. 1995లో 14, 1962లో 16, 1967లో 15, 1972లో 15, 1978లో 15, 1983లో 14, 1985లో 15, 1989లో 15, 1994లో 15, 1999లో 15, 2009లో 14 అసెంబ్లీ స్థానాలు మనుగడ సాగించాయి. 2009లో జరిగిన నియోజకవర్గాల విభజన, చేర్పులు మార్పుల తర్వాత ఇప్పటిదాకా తిరిగి జరగలేదు. 2009లో వాయల్పాడు, లక్కిరెడ్డిపల్లె మాయం యూపీఏ–1 ప్రభుత్వంలో చేపట్టిన నియోజకవర్గాల పునర్ విభజన, చేర్పులు, మార్పుల కారణంగా అప్పటి ఉమ్మడిచిత్తూరులోని వాయల్పాడు, ఉమ్మడికడపలోని లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గాలు కనుమరుగయ్యాయి. మిగతా నియోజకవర్గాల్లో మండలాల మార్పుతో భౌగోళిక స్వరూపం మారిపోయింది. ఈ మార్పు ఇప్పటికి కొనసాగుతోంది. మారిన అసెంబ్లీలు, మాయమైన నియోజకవర్గాలు ఇలా ఏర్పడ్డాయి. ● మదనపల్లె అసెంబ్లీ నుంచి బి.కొత్తకోట, కురబలకోట మండలాలను తొలగించగా పుంగనూరులోని రామసముద్రం కలిసింది. ● పుంగనూరు నుంచి పెద్దపంజాణి తొలగించగా పీలేరులోని సదుం, సోమల, రొంపిచర్ల, చంద్రగిరిలోని పులిచర్ల మండలాలు కలిశాయి. ● వాయల్పాడు నియోజకవర్గంలోని వాయ ల్పాడు, కలికిరి, కలకడ, గుర్రంకొండ, కేవిపల్లె మండలాలను పూర్తిగా పీలేరు నియోజకవర్గంలోకి కలిపారు. దాంతో వాయల్పాడు నియోజకవర్గం కనుమరుగైంది. ● పీలేరులోని చిన్నగొట్టిగల్లు, యర్రావారిపాళెం మండలాలను చంద్రగిరి నియోజకవర్గంలోకి కలిపారు. లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గంలోని సీకెదిన్నె మండలం కమలాపురంలో, చక్రాయపేట మండలం పులివెందులలో, వీరబల్లి మండలం రాజంపేటలో, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె మండలాలను రాయచోటిలో కలిపారు. దీంతో లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం కనుమరుగైంది. ● మదనపల్లెలోని బి.కొత్తకోట, కురబలకోట మండలాలను పూర్తిగా తంబళ్లపల్లెలో కలిపారు. నియోజకవర్గాల పునర్ విభజన విషయంలో కనుమరుగైన వాయల్పాడు, లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గాలు మళ్లీ ఏర్పడతాయా లేదా అన్నది ఇప్పట్లో తేలదు. అయితే వాయల్పాడు నియోజకవర్గాన్ని తిరిగి ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ కొత్తవి ఏర్పాటు చేయాల్సి వస్తే కొత్త నియోజకవర్గ కేంద్రాలకు డిమాండ్లు పెరిగే అవకాశం ఉంది. పాత నియోజకవర్గాలతో యధాస్థితి కొనసాగిస్తే పాత భౌగోళిక స్వరూపంలాగా, కొత్తగా విభజన చేబడితే భౌగోళిక స్వరూపాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానాల పెంపుపై రాజకీయనేతల్లో ఆశలు 2004 ఎన్నిక తర్వాత కనుమరుగైనవాయల్పాడు, లక్కిరెడ్డిపల్లె స్థానాలు కొత్తస్థానాల లెక్కల్లో ఉమ్మడిజిల్లాకుఆరు లేదా ఏడుస్థానాలు ఇప్పటి జిల్లాకై తే మూడు స్థానాలుపెరిగే అవకాశం ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన అసెంబ్లీ నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తే ఏడు లేదా ఎనిమిది కొత్త స్థానాలు ఏర్పాట అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త జిల్లాలు కలుపుకొని 28 కావడంతో వాటి సంఖ్య తగ్గుతుంది. రాష్ట్రవ్యాప్తంగా పెరిగే 88 స్థానాల్లో కొత్త జిల్లా ప్రాతిపదికన అన్నమయ్య జిల్లాకు కొత్తగా మూడు స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 14.22 లక్షల మంది జనాభా ఉన్నారు. ఒక నియోజకవర్గానికి 1.60 లక్షల ఓట్లకు ఒక నియోజకవర్గాన్ని చేస్తే ప్రస్తుతం ఉన్న ఐదు నియోజకవర్గాలకు అదనంగా రెండు లేక మూడు కొత్తవి ఏర్పాటు కావొచ్చు. 2024 ఎన్నికల మేరకు ఈ నియోజకవర్గాల పరిధిలో 11.81 లక్షల ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కన రెండు ఖచ్చితంగా, మూడవ స్థానానికి అవకాశం ఉంటుంది. కాగా ఇప్పుడున్న ఐదు నియోజకవర్గాల్లో అత్యధిక ఓటర్లు రాయచోటిలో 2.55 లక్షల మంది ఉన్నారు. తర్వాత పుంగ నూరులో 2.42 లక్షలు. మదనపల్లిలో 2.36 లక్షలు, పీలేరులో 2.34 లక్షలు. తంబళ్లపల్లెలో 2.14 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా మున్సిపల్ పట్టణాల్లో మదనపల్లిలో అధిక మంది ఓటర్లు ఉన్నారు. పీలేరు, బి.కొత్తకోట పట్టణాల్లోనూ జనాభా పెరిగింది. జరగబోయే జనగణనలో జనాభా లెక్క, ఓటర్ల సంఖ్య స్పష్టంగా తెలుస్తుంది. ఈ పెరిగే ఓటర్ల సంఖ్య ఆధారంగా కూడా స్థానాల సంఖ్య పెరగడంపైనా స్పష్టత వస్తుంది. -
ఏబీఎన్ రాధాకృష్ణ సభ్యత, సంస్కారం నేర్చుకోవాలి
కడప కార్పొరేషన్: ఏబీఎన్ రాధాక్రిష్ణ సభ్యత, సంస్కారంతో మాట్లాడటం నేర్చుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు హితవు పలికారు. రాధాక్రిష్ణ వైఎస్సార్సీపీ నాయకుల భార్యలనే కాకుండా యావత్ మహిళా సమాజాన్ని కించపరిచేలా మాట్లాడారన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా నీచమైన, నికృష్టమైన భాష ఉపయోగించడం అనాగరికమన్నారు. మీడియా ముసుగులో రాధాక్రిష్ణ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకప్పుడు సైకిల్ మీద తిరిగే ఆయనకు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. మంచి, మర్యాద మరిచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల మెప్పు కోసం ఇలా దిగజారి వ్యాఖ్యలు చేయడం దారుణమని మండిపడ్డారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే నీవు జాకీలు పెట్టి లేపే పార్టీకి మహిళలే సమాధి కడతారని హెచ్చరించారు. అలాగే ఉమ్మడి జిల్లాలో పలువురు నిరసన తెలిపారు. లేనిపక్షంలో గుణపాఠం తప్పదు వైఎస్సార్సీపీ నేతల హెచ్చరిక -
న్యాయవాది దారుణ హత్య
కేవీ పల్లె: న్యాయవాది దారుణహత్యకు గురైన ఘటన అన్నమయ్య జిల్లా కేవీ పల్లె మండలం పాతవడ్డిపల్లెలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకట శివకుమార్ కథనం ప్రకారం.. పాతవడ్డిపల్లెకు చెందిన పూజారి యల్లయ్య (36) పీలేరు కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్గా చేస్తున్నారు. సోమవారం పాతవడ్డిపల్లెలో యల్లయ్య ఇంటికి సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మరోచోటకు మార్చే విషయమై అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు వర్గం ఆయనతో ఘర్షణకు దిగింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో యల్లయ్యపై శ్రీనివాసులు వర్గం విచక్షణా రహితంగా దాడి చేసింది. కర్రలు, రాళ్లతో కొట్టి న్యాయవాది యల్లయ్యను హత్య చేశారు. అడ్డువెళ్లిన యల్లయ్య తల్లిదండ్రులు రెడ్డెమ్మ, వెంకటరమణపైనా దాడికి పాల్పడటంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ చికిత్స నిమిత్తం తిరుపతి స్విమ్స్కు తరలించారు. యల్లయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసులు వర్గంలో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. కాగా.. యల్లయ్య భార్య 6 నెలలుగా భర్తకు దూరంగా ఉంటోంది. దీంతో వారిపిల్లలు రితిక (7), గోకుల్కృష్ణ (5) అవ్వాతాత దగ్గర ఉంటున్నారు. తండ్రి హత్యకు గురికావడం, అవ్వాతాతలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరడంతో పిల్లలిద్దరూ బిక్కుబిక్కుమంటున్నారు. -
రాధాకృష్ణ ఒళ్లు దగ్గరపెట్టుకొని వ్యాఖ్యలు చేయాలి
కడప కార్పొరేషన్ : ఏబీఎన్ ఛానెల్ ఎండీ రాధాకృష్ణ ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యాఖ్యలు చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి హెచ్చరించారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘రేపు ... మీ భార్యలు.. మీ భార్యలు కాదని జగన్మోహన్ రెడ్డి చెబితే గుడ్డిగా నమ్మేసి... కట్టుకున్నదాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు కూడా చూడటానికి వెరవని వెన్నుముక లేని బ్యాచ్ వైఎస్సార్సీపీలో తయారైందని రాధాకృష్ణ మాట్లాడటం చాలా అభ్యంతరకరమన్నారు. ఆ మాటలు వింటుంటే ఒంటినిండా కులగజ్జితో , ఎంగిలి మెతుకులు ఏరుకుంటూ, బతుకుతున్న నీ స్వభావం గురించి నువ్వే చెప్పుకున్నట్టు అనిపించడం లేదా... అని ప్రశ్నించారు. ఏ పార్టీ అయినా నాయకుడి అడుగుజాడల్లో నడుస్తుందని, అది పార్టీ శ్రేణుల కర్తవ్యమన్నారు. అంతమాత్రానికే తల్లికి, భార్యకు తేడా తెలియని నీలాంటి వారు పార్టీ శ్రేణుల విధేయతను కించపరుస్తూ మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. జర్నలిజం ముసుగులో అక్షర వ్యభిచారం చేస్తున్న నీలాంటి వారు సూక్తులు చెబితే జనం నోటితో నవ్వడం లేదని, అడవులు సంరక్షణ గురించి వీరప్పన్, ప్రపంచ శాంతి గురించి బిన్లాడెన్ ఉపన్యాసం ఇచ్చినంత చండాలంగా ఉందన్నారు. ఏ పార్టీ అభిమానులు ఎలా ఉండాలో చెప్పడానికి నీవు ఎవరని ప్రశ్నించారు. మీరు ఎన్టీఆర్ను రాముడిగా చూపిస్తే మొక్కాలి, అదే వ్యక్తిని డ్రామారావు, కామారావుగా చూపిస్తే అసహ్యించుకోవాలా...చెప్పులు వేయించి పైకి పంపిస్తే చప్పట్లు కొట్టాలా అని సూటిగా ప్రశ్నించారు. మీరు ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చెబితే... మేము తలలు ఊపాలి, హోదా వల్ల ఉపయోగం లేదు..ప్యాకేజీ ముద్దు అంటే అవునంటూ వెనక నడవాలా అని నిలదీశారు. మీరు కాంగ్రెస్తో జట్టు కట్టి మోడీని తిడితే మీకు జేజేలు పలకాలి, మీరు బీజేపీతో ఉంటూ సోనియాను తిడితే చప్పట్లు కొట్టాలా...రాష్ట్రం అప్పుల్లో ఉంది , ఆర్థిక పరిస్థితి బాగోలేదు , వచ్చిన ఆదాయం జీతాలకే సరిపోవడం లేదు అని మీరు చెబితే నమ్మాలి, మళ్లీ అదే నోటితో లక్ష ఎకరాల విస్తీర్ణంలో కొన్ని లక్షల కోట్లు తగలబెట్టి ... 50 ఏళ్ల పాటు ప్రపంచస్థాయి రాజధానిని కడతామని చెబితే ఊకొట్టాలా ఇదేం నీతి అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లి . ప్రధాని ని కలిస్తే .‘అమ్మ జగనా‘అంటూ హెడ్డింగ్ పెట్టి . కేసులు మాఫీ కోసం వెళ్ళాడని రాస్తారు, మీ కులపోడు ప్రతిపక్షనేతగా ఢిల్లీ వెళ్లి అక్కడ అందరి కాళ్ళు పట్టుకుంటే.. మావాడు ఢిల్లీని వణికించాడని ... అక్కడ చక్రం తిప్పాడని ... లుచ్చా రాతలు రాస్తారన్నారు. ఇప్పటికై నా అక్షర వ్యభిచారం మానుకోవాలని.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వార్తలు, వ్యాఖ్యలు చేయాలని హితవు పలికారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా వైద్య విభాగం సభ్యులు డాక్టర్ పి పెంచలయ్య పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి -
చోరీ కేసులో నిందితుడికి జైలు శిక్ష
పెద్దతిప్పసముద్రం : మండలంలోని పులికల్లు పంచాయతీ చలిమామిడివారిపల్లికి చెందిన వెంకట్రమణారెడ్డి (65) అనే వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనం గత ఏడాది అపహరణకు గురైన విషయం పాఠకులకు తెలిసిందే. అప్పటి ఎస్ఐ హరిహర ప్రసాద్ చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీకి పాల్పడిన పుంగనూరు మండలం చండ్రమాకులపల్లికి చెందిన నిందితుడు పులి వెంకటరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అప్పటి నుంచి తంబళ్లపల్లె కోర్టులో ఈ కేసు నడుస్తోంది. ఈ తరుణంలో సోమవారం జరిగిన తుది విచారణలో నిందితుడు చోరీకి పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో సివిల్ జడ్జి ఏ. ఉమర్ ఫరూక్ ముద్దాయికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.1,000ల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్ఐ పరమేశ్ నాయక్, కోర్టు కానిస్టేబుల్ బావాజాన్లు పేర్కొన్నారు. -
అవినీతి పర్యవసానమా!.. రాజకీయ వ్యూహమా?
● మదనపల్లె తహసీల్దార్ బదిలీ వేటుపై తీవ్ర చర్చ ● బహిరంగం అవ్వని అటాచ్మెంట్ ఉత్తర్వుమదనపల్లె : మదనపల్లె తహసిల్దార్ కిషోర్ కుమార్ రెడ్డిని కలెక్టరేట్ కు అటాచ్ చేస్తూ జిల్లా అధికారులు తీసుకున్న నిర్ణయం రాజకీయ, అధికార వర్గాలతో పాటు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన పై తీసుకున్న చర్యకు సంబంధించి ఆదివారం రాత్రి నుంచి సోషల్ మీడియా వేదికగా విస్తత ప్రచారం జరిగింది. ఓ విజిల్ బ్లోయర్ చేసిన ఫిర్యాదు కాపీ చక్కర్లు కొట్టింది. తహసిల్దార్ ను అటాచ్ చేసినట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నప్పటికీ, ఆ ఉత్తరం కాపీ మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు. అధికారులు జారీ చేసే ఉత్తర్వులు సాధారణంగా అందరికీ అందుబాటులోకి వచ్చేస్తాయి. తహసిల్దార్ అటాచ్ కు సంబంధించిన ఉత్తర్వు మాత్రం రహస్యంగానే ఉండిపోయింది. అసలు అటాచ్ చర్యకు కారణం ఏమిటి అన్న విషయం ఆ ఉత్తర్వుల్లో ఉండే అవకాశం ఉంటుందన్నది స్థానికంగా జరుగుతున్న చర్చ. బహిర్గతం కాకపోవడంతో ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. విజిల్ బ్లోయర్ ఫిర్యాదు కారణమా.. విజిల్ బ్లోయర్ పేరుతో కలెక్టర్, సీసీఎల్ఏకు వెళ్లిన ఫిర్యాదు కిషోర్ కుమార్ రెడ్డి పై చర్యకు కారణమా అన్న చర్చ జరుగుతోంది. ఓ భూమికి సంబంధించి ఓ వ్యక్తికి అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు రూ.10 లక్షలు చెల్లించేలా ఓ వీఆర్ఓ మధ్యవర్తిత్వంతో ఒప్పందం కుదిరింధన్నది అందులోని ఫిర్యాదు. ఇందులో రూ.5 లక్షలను తహసిల్దారు చెప్పిన అకౌంట్ కు జమ చేసినట్టు, ఆ రసీదు ఫిర్యాదుకు జత చేయబడి ఉంది. ఈ ఫిర్యాదు ఈనెల రెండున చేశారు. ఇదే కాక మరికొన్ని ఆరోపణలు కూడా అందులో ఉన్నాయి. ఈ ఫిర్యాదు చేసిన విజిల్ బ్లోయర్ తక్షణమే తహసిల్దార్ ను సస్పెండ్ చేయాలని, క్రిమినల్ చర్యలు చేపట్టాలని అందులో కోరారు. ముందు ఎమ్మెల్యే ఫిర్యాదు మదనపల్లె తహసీల్దార్ పై మార్చి 8, 10 తేదీల్లో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. బసినికొండ, వేంపల్లి గ్రామాలకు సంబంధించిన భూముల వ్యవహారంలో తహసిల్దార్, వీఆర్వోలు అవినీతికి పాల్పడ్డారని, రికార్డులు తారుమారు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సస్పెండ్ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్న ఫిర్యాదుపై కలెక్టర్ విచారణకు ఆదేశించగా సబ్ కలెక్టర్ విచారణ చేయగా, ఈ విచారణలో ఏమీ తేలిందో అధికారులకు తప్ప ఎవరికి తెలియదు. కాగా తహసిల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి అటాచ్మెంట్ వ్యవహారంపై ఎమ్మెల్యే సోమవారం మీడియాతో మాట్లాడుతూ కిషోర్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈయన అవినీతిపై సిఐడి విచారణ చేయాలని కోరుతూ సీఎంకు లేఖ రాస్తున్నట్లు ప్రకటించారు. ఆ రెండు కారణమేనా? తహసిల్దార్ కిషోర్ కుమార్ రెడ్డిని మదనపల్లి నుంచి తప్పిస్తూ కలెక్టరేట్ కు అటాచ్మెంట్ చేయడం వెనక తీవ్రమైన అవినీతి ఆరోపణలు, రాజకీయాలు కారణమై ఉంటాయని చర్చ జరుగుతోంది. సాధారణంగా ఇక్కడి ఎవరు పనిచేసిన అవినీతి ఆరోపణలను మూట కట్టుకోవాల్సిందే. రాజకీయ అండ ఉన్నా లేకున్నా ఏదో ఒక తప్పుడు వ్యవహారంలో చిక్కుకోక తప్పదు. కిషోర్ కుమార్ రెడ్డికి ఇలాంటి వ్యవహారం ఏదో మెడకు చుట్టుకుని ఉంటుందన్న అనుమానాలు ఉన్నాయి. అలాగే రాజకీయ కోణంలో చూస్తే తమకు రెవెన్యూ వ్యవహారాల్లో ప్రాధాన్యత లేదన్న అసంతృప్తితో చర్యలకు రాజకీయ ఒత్తిళ్లు పనిచేసే అవకాశం లేకపోలేదు. అవినీతి ఆరోపణలను తెరపైకి తేవడం ద్వారా తహసీల్దార్ పై వేటుకు వ్యూహం పన్ని ఉండవచ్చు. ఎందుకంటే విజిల్ బ్లోయర్ చేసిన ఫిర్యాదు బహిరంగం కావడమే ఇందుకు నిదర్శనం. అదే సమయంలో అటాచ్మెంట్ జరిగిన దానికి సంబంధించిన ఉత్తర్వు మాత్రం బహిరంగం కాలేదు. ఈ చర్యకు ఎమ్మెల్యే ఫిర్యాదు విచారణలో వాస్తవాలు తేలి ఉంటే చర్యలు తీసుకున్నారా లేక విజిల్ బ్లోయర్ ఫిర్యాదు ఆధారంగా విచారించి చర్యలు తీసుకున్నారా అన్నది స్పష్టంగా తెలియదు. -
‘శ్రీరామ’ విద్యార్థినికి గోల్డ్ మెడల్
తిరుపతి సిటీ : కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఎస్.భావన ఉత్తమ ప్రతిభను కనబరిచారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్న్స్– డేటా సైన్స్లో 87.58శాతం మార్కులతో బంగారు పతకం సాధించారు. సోమవారం ఈమేరకు అనంతపురం జేఎన్టీయూలో నిర్వహించిన స్నాతకోత్సవంలో గవర్నర్అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రం అందుకున్నారు. కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి, సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవింద్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ జయచంద్ర, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వాసు, విభాగాధిపతి డాక్టర్ స్వప్నసుధ అభినందనలు తెలిపారు. -
ప్రజా సమస్యలను పరిష్కరించండి
మదనపల్లెఅర్బన్: ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలంటూ జాయింట్ కలెక్టర్ శివ్నారాయణశర్మ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీలను వేగవంతంగా, నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఇందులో ఎలాంటి అలసత్వం ఉండకూడదన్నారు. సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సిన బాధ్యత అఽధికారులపై ఉందన్నారు. అలాగే లక్ష్యాలను చేరుకోవాలంటూ జేసీ పిలుపునిచ్చారు. ఇందులోభాగంగా మొత్తం 388 అర్జీలు స్వీకరించినట్లు జేసీ పేర్కొన్నారు. సబ్కలెక్టర్ చల్లా కళ్యాణి, ఎస్డీసీ చంద్రశేఖర్రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు, సర్వేశాఖ ఏడీ భరత్కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. తమ కాలనీకి వెళ్లే రోడ్డును శ్రీదేవి, నరసయ్య అనే దంపతులు వారి అనుచరులతో కలసి జేసీబీతో ధ్వంసం చేసి ఆక్రమణకు యత్నించారని మదనపల్లె మండలం కొండామర్రిపల్లె పంచాయతీ టీఎన్ఆర్కాలనీ వాసులు అర్జీ సమర్పించారు. ప్రశ్నించిన స్థానికులను చంపుతామని బెదిరించారని అందులో పేర్కొన్నారు. పోలీసులు ఆక్రమణదారులకు వత్తాసు పలుకుతూ గొడవ చేసే వారిపై కేసులు పెడతామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని దారి సౌకర్యం కల్పించాలంటూ స్థానికులు అర్జీలో పేర్కొన్నారు. ● కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన నాయిబ్రాహ్మణులు అర్జీ సమర్పించారు. కడపకు చెందిన ఓ వ్యక్తి తమ షాపులపై కన్నేశాడన్నారు. చిన్న షాపులను తొలగించి, అక్కడ కార్పొరేట్ తరహాలో పెద్ద సెలూన్ ప్లాజా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. ఇదే జరిగితే తామంతా రోడ్డునపడతామన్నారు. ముఖ్యంగా 50 కుటుంబాలు ఇదే వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి షాపుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలంటూ కార్మికులు కోరారు. ● తమ రెండో కుమారుడికి కాళ్లుచేతులు, శరీర అవయవాలు సరిగా పనిచేయకపోవడంతో ఆర్థిక పరిస్థితికి మించి వైద్యం చేయిస్తున్నామని మదనపల్లె పట్టణానికి చెందిన గాయత్రి అర్జీ సమర్పించారు. అప్పులు భారమై చికిత్స చేయించలేకపోతున్నామని, తన బిడ్డకు ఉచిత వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలంటూ జేసీకి విన్నవించారు. జేసీ శివ్నారాయణశర్మ -
సమగ్రశిక్షలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి
మదనపల్లె సిటీ: సమగ్రశిక్షలో ఏఏఎంఓ(ఉర్దూ), ఏపీఓ, ఎఎస్ఓ పోస్టులకు జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ అనూరాధ తెలిపారు. సహాయ విద్యా సంబంధమైన పర్యవేక్షణ అధికారి (ఎఎఎంఓ) ఉర్దూ, ఒక పోస్టు, అసిస్టెంట్ ప్రొగ్రాం ఆఫీసర్ (ఏపీఓ) ఒక పోస్టు, అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్ (ఎఎస్ఓ) పోస్టులు రెండు ఉన్నాయన్నారు. అర్హతలు కలిగిన ఉపాధ్యాయులు సమగ్రశిక్ష లో పని చేయుటకు బయోడేటాతో పాటు డిగ్రీ,బీఈడీ, పీజీ, ఎంఈడీ, ఇతర సర్టిఫికెట్లుజత చేసి ఈనెల 7 నుంచి 13వతేదీలోపు సంబంధిత ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాశాఖ అధికారి ద్వారా జిల్లా ప్రాజెక్టు అధికారి, సమగ్ర శిక్ష, మదనపల్లె, అన్నమయ్య జిల్లా కార్యాలయం నందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సత్వరమే ఫిర్యాదుల పరిష్కారం మదనపల్లె టౌన్: ప్రజా సమస్యల పరష్కార వేదిక పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీల పరిష్కారంలో పోలీసు అధికారులు జాప్యం చేయకూడదని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జిల్లాలోని పోలీస్ అధికారులను ఆదేశించారు. మదనపల్లె జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్కు 141 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జల్లాలోని పోలీసులు సమస్యలపై పోలీస్ స్టేషన్లకు వచ్చేవారి సమస్యలను విని అక్కడే పరష్కరించాలని దేశించారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మారుస్తున్న చంద్రబాబు
పులివెందుల : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనారోగ్యశ్రీగా మారుస్తున్నాడని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి దుయ్యబట్టారు. సోమవారం పులివెందులలోని తన స్వగృహం వద్ద ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి నెట్వర్క్ ఆసుపత్రులకు దాదాపు రూ.3వేల కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించలేదన్నారు. దీంతో వారం రోజులుగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు సమ్మె ప్రకటించి ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలకు అందించడం లేదన్నారు. దీంతో పేద ప్రజలు వైద్య చికిత్సలు అందక తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు నిలిచిపోవడంతో పేద ప్రజలు వైద్య సేవలు పొందడానికి అప్పులు చేసే పరిస్థితి నెలకొందన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం విచారకరమని మండిపడ్డారు. ఇప్పటికే మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేయాలనుకుంటున్న చంద్రబాబు ఆరోగ్య పథకాన్ని కూడా అటకెక్కించాలని చూడటం దారుణమని ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని జగనన్న రూ.5లక్షల నుంచి రూ25లక్షలకు పెంచారని గుర్తు చేశారు. అమరావతికి పెట్టే ఖర్చులో ఒక్క శాతం నిధులను ఖర్చు చేసినా రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలు పూర్తవుతాయన్నారు. కేవలం 29గ్రామాల రియల్ ఎస్టేట్ కోసం చంద్రబాబు అమరావతి పేరుతో రూ.2లక్షల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు అమరావతి పేరుతో కమీషన్ల రూపంలో వేల కోట్లు దోచుకునేందుకే అమరావతి పేరుతో నాటకాలాడుతున్నారని విమర్శించారు. జగనన్న ప్రతిపాదించిన ‘మావిగన్’ సమన్యాయం చేస్తుందన్నారు. కానీ తమ ఎల్లో మీడియా ద్వారా టీడీపీ నాయకులు విష ప్రచారం చేయటం సిగ్గు చేటన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
‘అగమ్య’ ప్రయాణం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ప్రైవేట్ బస్సుల ప్రమాదాలు ఆగడం లేదు. ఇటీవల కాలంలో కర్నూల్, అరకు, చిత్తూరు జిల్లా గంగసాగరం ప్రాంతాల్లో జరిగిన ఘటనలు మరువక ముందే మార్కాపురం వద్ద మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి ప్రయాణాలపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. వైయస్సార్ జిల్లా కేంద్రం మీదుగా విజయవాడ, బెంగళూరు హైదరాబాద్ విశాఖపట్నం వంటి ప్రాంతాలకు దాదాపు 500 పైగా ప్రైవేట్ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ ప్రయాణంలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలపై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు. జిల్లాలోని గువ్వల చెరువు ఘాట్రోడ్డు, దువ్వూరు, మైదుకూరు, ఖాజీపేట ప్రాంతాల్లోని రోడ్లు ప్రమాదాలకు నిలయం మారాయి. ఈ మార్గాల్లో ప్రమాదాలు జరగకుండా రవాణాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. బస్సులను నిత్యం తనిఖీలు చేస్తున్నారు. అయినా ప్రాథమికంగా వెలుగులోకి వస్తున్న అంశాలు అందోళన కలిగిస్తున్నాయి. అధిక వేగం, డ్రైవర్ల ఆలసట, నిర్లక్ష్య డ్రైవింగ్, వాహనాల్లో లోపాల వల్ల ఎక్కడో ఒక చోట ప్రమాదాలకు దారి తీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ బస్సుల వాస్తవ పరిస్థితి అనుమానాస్పదంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రంగంలోని రవాణాశాఖ మార్కాపురం ప్రమాదాల పరంపర నేపథ్యంలో రవాణాశాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలకు శ్రీకారం చుట్టింది. చెక్పోస్ట్లు, హైవేలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రైవర్ల లైసెన్స్లు, వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్, ఇన్సూరెన్స్ పత్రాలను పరిశీలిస్తున్నారు. ఓవర్లోడింగ్, ఓవర్ స్పీడ్పై ప్రత్యేక నిఘా పెట్టారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు సష్టం చేస్తున్నారు. తీవ్ర లోపాలు ఉన్న వాహనానలు సీజ్ చేయడం, కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే అనుమతులను రద్దు చేసే చర్యలకు వెనుకాడబోమని అంటున్నారు. భద్రతే లక్ష్యం ప్రయాణికుల భద్రతే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ్దలో క్రమశిక్షణ తీసుకురావడమే ఈ తనిఖీల లక్ష్యమని పేర్కొంటున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ వైపు పెరుగుతున్న అనుమానాలు వరుస ప్రమాదాలతో రవాణాశాఖ అలర్ట్ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు -
●తోటలలో మాగిపోతున్న అరటి గెలలు
వేముల : పాతాళానికి పడిపోయిన అరటి ధర... రైతన్న లాభాల కలల్ని తుంచేసింది. ఓ సారి ప్రకృతి వైపరీత్యం నిలువునా దెబ్బతీస్తే... మరోసారి ధరాఘాతం అరటి రైతుకు శాపమైంది. పంట బాగొచ్చినా ధర లేక శ్రీగెలశ్రీగిల్లాడుతున్న దుస్థితి నెలకొంది. ఈ ఏడాది అరటి సాగు లాభదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో రైతులు విస్తారంగా పంట సాగు చేశారు. జిల్లాలో వేల ఎకరాలలో అరటి గెలలు కోతకు వచ్చాయి. ఒక్కసారిగా మార్కెట్ ధరలు పతనం కావడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. అరటి సాగులో ఎకరానికి లక్ష రూపాయల మేర పెట్టుబడులు పెట్టారు. తోటలలో అరటి గెలలు మాగిపోవడంతో ఎకరాకు 10 టన్నులకు మించి దిగుబడులు లేవని రైతులు అంటున్నారు. సాగులో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రూ.30వేల నుంచి రూ.40వేలు ఆదాయం వస్తే ఎకరాకు రూ.60వేల మేర నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. జిల్లాలో 15వేల ఎకరాలలో అరటి తోటలు జిల్లాలో 40వేల ఎకరాలలో మొదటి, రెండవ, మూడవ అరటి పపంటలు సాగులో ఉన్నాయి. ఇందులో 30వేల ఎకరాలలో ఒక పులివెందుల నియోజకవర్గంలో సాగులో ఉంది. ఇప్పటికే రెండు, మూడు పంటలు అరటి కోతలు పూర్తయ్యాయి. ప్రస్తుతం మొదటి పంట జిల్లాలో 15వేల ఎకరాల్లో సాగులో ఉంది. మొదటి పంటలో అరటి గెలలు కోతకు వచ్చాయి. జూన్, జులై మాసాలలో సాగు చేసిన అరటి పంటలో గెలలు కోతకు వస్తున్నాయి. గెలలు కోతకు వచ్చే సమయానికి ధరలు పడిపోవడంతో రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. అరటికి ధరాఘాతం అరటికి మార్కెట్లో ధరలు పూర్తిగా పడిపోయాయి. టన్ను అరటి రూ.3వేల నుంచి రూ.4వేలకు మించి ధరలు లేకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వరకు టన్ను అరటి రూ.22వేలకుపైనే ధరలు ఉండేవి. ధరలు స్థిరంగా ఉంటాయని సాగులో ఆదాయం ఉంటుందని ఆశించిన రైతులకు నిరాశే మిగులుతోంది. రెండవ, మూడవ పంటలలో అరటి గెలలు కోతకు వచ్చిన సమయంలో ధరలు ఉండటంతో ఆదాయం వచ్చింది. మొదటి పంట రైతులకు ధరల్లేక తీవ్రంగా నష్టపోతున్నారు. శాసిస్తున్న దళారీ వ్యవస్థ మరోవైపు అరటి ధరలపై దళారుల ప్రభావం తీవ్రంగా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే మార్కెట్లో అరటి ధరలను దళారీ వ్యవస్థ శాసిస్తోందని చెప్పవచ్చు. అరటి కొనుగోళ్లకు ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చినా దళారులు లేనిదే కొనుగోలు చేయరు. దళారులేమో వ్యాపారులు ఇచ్చే డబ్బులకు ఆశపడి సిండికేట్గా ఏర్పడి అరటి ధరలను నిర్ణయిస్తూ రైతులను దోచుకుంటున్నారు. వ్యాపారులు తోటలను చూసి దళారీ ఎంత ధరకు చెబితే అంతే ధరలకు రైతులు అమ్ముకోవాల్సి వస్తోంది. కొనుగోళ్లకు ముందుకురానీ వ్యాపారులు అరటి ధరలు మార్కెట్లో పడిపోవడంతో అరటి కొనుగోళ్లకు వ్యాపారులు ముందుకు రావడంలేదు. మార్కెట్ ధరలు ఉంటే స్థానిక వ్యాపారులు నేరుగా తోటల వద్దకు వచ్చి రైతులతో మాట్లాడి అరటి కొనుగోలు చేసేవారు. ధరలు పతనం కావడంతో స్థానికంగా ఉన్న వ్యాపారులు తోటలవైపు చూడటంలేదు. ధరలు ఉన్నప్పుడు తోటల వద్దకు వచ్చిన వ్యాపారులు ధరలు పడిపోగానే అటువైపు కన్నెత్తి చూడలేదని రైతులు వాపోతున్నారు. పాతాళానికి పడిపోయిన అరటి ధరలు జిల్లాలో 15వేల ఎకరాలలో కోతకు వచ్చిన అరటి తోటలు మార్కెట్లో టన్ను రూ.3వేల నుంచి రూ.4వేలకు పలుకుతున్న వైనం కొనుగోళ్లకు ముందుకు రాని వ్యాపారులు -
అగ్నిప్రమాదంలో కొబ్బరి, మామిడిచెట్లు దగ్ధం
కేవీపల్లె : అగ్నిప్రమాదంలో కొబ్బరి, మామిడి చెట్లు దగ్ధమైన సంఘటన మండలంలోని వగళ్ల పంచాయతీ గంటావారిపల్లెలో చోటు చేసుకుంది. బాధితుని కథనం మేరకు వివరాలిలావున్నాయి. గంటావారిపల్లెకు చెందిన పూజారి శంకర పీలేరులో నివాసం ఉంటున్నాడు. సొంత గ్రామంలో తన భూమిలో కొబ్బరి, మామిడి చెట్లు సాగు చేశాడు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సమీపంలో కంచెకు నిప్పు పెట్టడంతో కొబ్బరి, మామిడి చెట్లకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సుమారు 25 కొబ్బరి, 20 మామిడి చెట్లు తోపాటు పీవీసీ పైపులు, డ్రిప్, స్ప్రింక్లర్ పైపులు కాలిపోయినట్లు బాధితుడు తెలిపాడు. కారు ఢీకొని వృద్ధుడికి తీవ్ర గాయాలుమదనపల్లె టౌన్ : కారు ఢీకొని వృద్ధుడు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం చౌడేపల్లె మండలంలో జరిగింది. బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాలు..మండలంలోని చారాలకు చెందిన కె.చెంగప్ప(65) రోడ్డుపై నడచి వెళుతుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలం వద్దకు వెళ్లి బాధితున్ని చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, చికత్స అనంతరం తిరుపతికి రెఫర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్నునటు ఎస్ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు. పల్సర్ మోటార్ బైకు దగ్ధంవేంపల్లె : పులివెందుల రోడ్డు నుండి గండికి వెళ్లే బైపాస్ రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున ట్యాంకు నుంచి పెట్రోలు లీకై పల్సర్ బైకు దగ్ధమైంది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాలు. వేంపల్లె మేదర వీధికి చెందిన కమల్బాషా అనే వ్యక్తి గండి బైపాస్ రోడ్డులోని ఒక ఫంక్షన్ హాలులో జరిగే వివాహానికి బైకులో వెళ్లాడు. ఆదివారం రాత్రి 2గంటల సమయంలో బైక్ యజమాని కమల్బాషా స్నేహితుడు మహమ్మద్ బైకును తీసుకుని స్పీడ్గా వెళ్లడంతో బైక్ నుంచి పెట్రోల్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో మహమ్మద్ అనే వ్యక్తి భయపడి బైకును అక్కడ పడేసి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకపోవడంతో మంటలు ఎగసిపడి పూర్తిగా ఏపీ39సీహెచ్ 1934 నంబరు గల పల్సర్ బైకు పూర్తిగా కాలిపోయిందని సీఐ నరసింహులు తెలిపారు. మహిళ అనుమానాస్పద మృతికలసపాడు : మండలంలోని పుల్లారెడ్డిపల్లెలో ఓ మహిళ మృతి అనుమానాస్పదంగా మారింది. గ్రామానికి చెందిన యంబడిశ్యామల (47) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతిచెందింది.గ్రామస్తుల సమాచారం మేరకు మృతికి ముందు రోజు రాత్రి భార్యాభర్తలకు గొడవ జరిగినట్లు తెలిసింది.దీంతో గ్రామస్తులు శ్యామల బంధువులకు సమాచారం ఇచ్చారు. శనివారం వారు వచ్చి చూసేటప్పటికీ మంచం పడి ఉందిం. ఎంతసేపటికీ లేవకపోవడంతో అనుమానం వచ్చి పరిశీలించారు. ఆమె మృతి చెందినట్లు నిర్దారించుకుని అదేరోజు అంత్యక్రియలు నిర్వహించారు. శ్యామల మృతిపై విచారణ చేయాలని పుల్లారెడ్డిపల్లె వీఆర్ఓ వెంకటసుబ్బమ్మ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కలసపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జల సంరక్షణలో సాగునీటి సంఘాలే కీలకం
చిన్నమండెం : జిల్లాలో నీటి కొరతకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ‘జలధార– జలహారతి’ కార్యక్రమాన్ని మిషన్ మోడ్లో అమలు చేస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్కుమార్ తెలిపారు. నేటి నుంచి జులై 14 వరకు 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించినట్లు వెల్లడించారు. చిన్నమండెం మండలం కేశాపురం పంచాయతీ పరిధిలోని రెడ్డివారిపల్లి గొలుసుకట్టు చెరువు వద్ద సోమవారం ఘనంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రధాన సమస్యలపై సమగ్ర అధ్యయనం చేపట్టగా నీటికొరత అత్యంత తీవ్రమైన సమస్యగా గుర్తించామన్నారు. పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు లేని జిల్లాలో చిన్న చెరువులు, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను నీటినిల్వ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జలధార కార్యక్రమం విజయవంతం కావాలంటే సాగునీటి సంఘాలు, రైతులు, ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్ సాగునీటి సంఘాల ప్రతినిధులు, రైతులతో కలిసి రెడ్డివారిపల్లి గొలుసుకట్టు చెరువును సందర్శించి చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ వెంకటరత్నం, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ విఠల్ప్రసాద్, రిటైర్డ్ ఎస్ఈ వెంకట్రామయ్య, జల వనరుల శాఖ అధికారులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
శివాలయంలో అవినీతి విచారణలో హైడ్రామా
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అగస్త్యేశ్వరస్వామి (శివాలయం) ఆలయంలో జరిగిన అవినీతిపై సోమవారం చేపట్టిన విచారణ రసాభాసగా జరిగింది. అవినీతిపై ఆలయ చైర్మన్ వంగల నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు దేవదాయశాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ఆదేశాల మేరకు ఆరుగురితో విచారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ సభ్యుల్లో ముగ్గురు గైర్హాజరయ్యారు. ప్రొద్దుటూరు దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ రవికిరణ్కుమార్రెడ్డి, మదనపల్లె ఇన్స్పెక్టర్ శశికుమార్, తిరుపతి ఇన్స్పెక్టర్ ఫణిరాజశయనలు విచారణకు హాజరయ్యారు. దీంతో ఆలయ కమిటీ చైర్మన్ ఈ విచారణపై అభ్యంతరం తెలిపారు. అధికారులకు ఆయన ఆధారాలు అందించారు. బంగారు హారం, వెండి ఆభరణాలు మాయమైనా సంబంధిత అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జనసేన పార్టీ నాయకులు మాదాసు మురళి, అల్లం చంద్రశేఖర్, బీజేపీ పట్టణాధ్యక్షుడు వంకదారి నరేంద్రరావు అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలయంలో జరిగే వినాయక చవితి ఉత్సవాల్లో దేవదాయశాఖ అధికారులు ఎలాంటి నిధులు ఇవ్వలేదని, ఉత్సవాల పేరుతో నిధులు స్వాహా చేశారని గణపతి మహోత్సవ కమిటీ ప్రతినిధులు మారెళ్ల మల్లికార్జునరావు, సుబ్రహ్మణ్యం, చంద్రగుప్తా, సేతురావు అధికారులకు తెలిపారు. గత ఐదేళ్లలో గణపతి మహోత్సవ కమిటీ పేరుతో రూ.2.80 లక్షలు స్వాహా చేశారన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ ఆలయంలో జరిగిన అవినీతిపై పలువురు భక్తులు తన దృష్టికి తెచ్చారన్నారు. దీనిపై విచారించగా బంగారు హారం, 290 గ్రాముల వెండి ఆభరణాలు మాయమయ్యాయని, బంగారు హారం రికవరీ జరిగిందన్నారు. అయితే వెండి వస్తువులు ఇంత వరకు రికవరీ కాలేదన్నారు. జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ ఉన్నతాధికారులతో కలసి పలు చెక్కుల ద్వారా దాదాపు రూ.కోటి నిధులు దుర్వినియోగం, స్వాహా చేశారని పేర్కొన్నారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రొద్దుటూరు దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ రవికిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ ఆలయంలో జరిగిన అవినీతిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం విచారణ చేయనున్నట్లు చెప్పారు. విచారణలో ఆలయ ఈఓ రమణ, అర్చకులు భక్తులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.విచారణకు ముగ్గురు కమిటీ సభ్యులు గైర్హాజరు -
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.
కడప ఎడ్యుకేషన్ : ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆర్థిక హామీల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సహేతుకం కాదని, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఫ్యాప్టో కడపజిల్లా చైర్మన్ సంగమేశ్వరరెడ్డి, సెక్రటరీ జనరల్ అబ్దుల్లాలు హెచ్చరించారు. ఫ్యాప్టో ఇచ్చిన మలిదశ పోరాట ఉద్యమంలో భాగంగా సోమవారం కడపలోని మున్సిపల్ మెయిన్ స్కూల్ పదోతరగతి మూల్యాంకన కేంద్రం వద్ద ఫ్యాప్టో కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో విధులకు హాజరవుతున్న ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యేలా చైతన్య పరిచారు. ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు సకాలంలో 12వ పీఆర్సి అమలు చేస్తానని, 11వ పీఆర్సీలో జరిగిన నష్టాన్ని సవరిస్తామని, 12వ పీఆర్సీ కమిటీ వచ్చే లోపు జరిగే ఆలస్యానికి భర్తీగా మధ్యంతర భృతిని ప్రకటిస్తామని అన్నారన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లుల బకాయిలు, పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలు, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల రోడ్డు మ్యాప్ ప్రకటించి విడుదల చేస్తామని హమీ ఇచ్చారన్నారు. అలాగే కారుణ్య నియామకాల విషయంలో ఉపాధ్యాయుల పిల్లలకు జిల్లా యూనిట్గా నియామకాలు చేపడతామని, ధరల పెరుగుదలకు అనుగుణంగా డీఏను ఎప్పటికప్పుడు ప్రకటిస్తామని హామీ ఇచ్చిన కూటమి పాలకులు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఎలాంటి అతీగతి లేదన్నారు. రాష్ట్ర సంఘం ఇచ్చిన మలి దశ ఉద్యమంలో భాగంగా 9వ తేదీ సాయంత్రం మూల్యాంకన కేంద్రం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 25 నుంచి 27 తేదీల మధ్యలో విజయవాడలో చేపట్టే రిలే నిరాహార దీక్షలో పెద్ద ఎత్తున కడప జిల్లా నుంచి పాల్గొంటామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుల సంఘం నుంచి వెంకట సుబ్బారెడ్డి, చంద్రశేఖర్, ఎస్టీయు నుంచి ఇలియాస్బాషా, పాలకొండయ్య, రామ్మోహన్, ఏపీటీఎఫ్ నుంచి ఖాదర్ భాషా, శ్రీనివాస్ రెడి, యుటిఎఫ్, రూటా, బి టి ఏ,ఆఫ్టా అసోసియేషన్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.ఫ్యాప్టో కడపజిల్లా చైర్మన్ సంగమేశ్వర్ రెడ్డి -
పెన్నాలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
వల్లూరు: వల్లూరు మండల పరిధిలోని పుష్పగిరి వద్ద పెన్నా నదిలో ఆదివారం గల్లంతైన ముగ్గురు యువకులకు సంబంధించి సోమవారం మూడో మృతదేహం లభించింది. ఇన్స్టాలో పరిచయమైన పలు ప్రాంతాలకు చెందిన 8 మంది షార్ట్ ఫిల్మ్లు, రీల్స్ చేసే క్రమంలో కడప నగర పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుని ఆదివారం భోజనం పార్సిళ్లతో పుష్పగిరి వద్దకు వచ్చి సరదాగా పెన్నా నదిలో దిగగా హరిబాబు (25), హర్ష వర్దన్ (22), కృష్ణ చైతన్య(20) లు నీటిలో మునిగి గల్లంతైన విషయం విదితమే. పోలీసులు స్థానిక జాలర్లు, ఫైర్ సిబ్బందితో కలిసి చేపట్టిన గాలింపు చర్యల్లో అదే రోజు సాయంత్రం హర్ష వర్దన్, హరిబాబు మృతదేహాలు లభ్యం కాగా చీకటి పడే వరకు గాలించినా కృష్ణ చైతన్య ఆచూకీ లభించలేదు. ఎస్ఐ శివ నాగిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఫైర్ సిబ్బంది, జాలర్ల సహాయంతో తిరిగి గాలింపు చర్యలు చేపట్టగా సంఘటన జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో కృష్ణ చైతన్య మృతదేహం లభ్యమైంది. పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మహిళలను కించపరచడం నీచమైన చర్య
బద్వేలు అర్బన్ : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన మావిగన్పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ప్రసారం చేసిన చర్చలో మహిళలను కించపరిచేలా ప్రసారం చేయడం నీచమైన చర్య అని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎన్జీవో కాలనీలోని ఆమె నివాసంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్పై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ చర్చను పక్కదారి పట్టించేందుకు ఏబీఎన్ ఛానల్ ఎండీ రాధాకృష్ణ ద్వారా వైఎస్సార్సీపీ నేతల కుటుంబ సభ్యులపై ముఖ్యంగా మహిళలపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో సిద్దాంతపరమైన విభేధాలు, విమర్శలు సహజమే అయినప్పటికీ ఒక రాజకీయ ప్రతిపాదనను విమర్శించే క్రమంలో కుటుంబ సభ్యులను, ముఖ్యంగా మహిళలను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. జర్నలిజం అనేది సమాజానికి దిశా నిర్ధేశం చేసే ఒక పవిత్రమైన వృత్తి అని, ఒక ఛానల్ ఎండీగా సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిందిపోయి ఇతరుల వ్యక్తిగత జీవితాలను, మహిళల గౌరవాన్ని కించపరచడం ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణకు తగదని అన్నారు. తక్షణమే ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని ఆమె కోరారు.ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ -
బోయకొండలోపోటెత్తిన భక్తులు
చౌడేపల్లె: పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ ఊహించని రీతిలో పెరగడంతో బోయకొండపై ఎటుచూసినా భక్త జన సందోహంతో పోటెత్తింది. సెలవు దినం కావడం, పరీక్షలు పూర్తి కావడంతో అధిక సంఖ్యలో విద్యార్థులు,యువత, ఉద్యోగస్తులు కుటుంబ సమేతంగా హాజరై మొక్కులు చెల్లించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయ అర్చకులు అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరణ చేసి దర్శన భాగ్యం కల్పించారు. ఆలయంలో భక్తుల రద్దీ -
పువ్వులు విరిసె..సీతాపతి మురిసె
పుష్పయాగానికి తరలి వచ్చిన భక్తులు స్వామివారికి పుష్పయాగం ఒంటిమిట్ట: ఏకశిలానగరి కోదండ రామయ్య సన్నిధిలో ఆదివారం పుష్పయాగాన్ని వేడుకగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత పుష్పయాగం, ఏకాంతసేవ నిర్వహించడం సాంప్రదాయం. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన నయనమనోహరమైన పుష్పాలతో కోదండరాముడిని అర్చించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించి పులకించిపోయారు. పుష్పాభిషేకం.. కోదండ రాముడి సన్నిదిలో పుష్పయాగం సందర్భంగా రంగురంగుల పుష్పాలతో జగదభిరాముడికి పుష్పాభిషేకం చేశారు. ఉదయం సుప్రభాత సేవ జరిగింది. ఆలయశుద్ధి, ఆరాధన చేపట్టారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం భాగ్యం కల్పించారు. సాయంత్రం 6 గంటలకు ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పుష్పప్రదర్శన చేశారు. బెంగులూరు, నాగర్కోయిల్, శ్రీరంగం, చైన్నె, తిరుపతి, కడప నగరాల నుంచి 3 టన్నుల 12 రకాల పూలు, 6 పత్రాలు పుష్పాలను తెప్పించారు. గులాబి, చామంతి, నూరువరహాలు, సంపంగి, మల్లె, గన్నేరు, మొగలిరేకులు, కనకాంబరాలు, తామర పూలు తీసుకొచ్చారు. తులసిదళాలు, దవనం, పన్నీరు, మరవంపత్రాలతో సీతారామలక్ష్మణ మూర్తులకు పుష్ప నీరాజనం చేశారు. ఈ యాగం నిర్వహించడంతో సమస్త దోషాలు తొలగిపోతాయని వేదపండితులు రాజేష్ భట్టార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉద్యాన అధికారి శ్రీనివాసులు, ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ కోదండ రామాలయంలో నయనానందకరంగా పుష్పయాగం -
నేడు వాక్–ఇన్ ఇంటర్వ్యూ
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన యూనివర్సిటీ కళాశాల వాణిజ్య శాస్త్ర విభాగానికి గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం క్యాంపస్లో సోమవారం ఉదయం 10 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రధానాచార్యులు ప్రొ టి.శ్రీనివాస్ తెలిపారు. అభ్యర్థులు ఎం.ఎస్.సి. (కంప్యూటర్ సైన్స్) / ఎం.సి.ఎ. /ఎం.టెక్. కంప్యూటర్స్ అర్హత ఉండాల న్నారు. నెట్/సెట్/ పీహెచ్డీ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు నేరుగా విశ్వవిద్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. వివరాల కోసం www.yvu.edu.inని సందర్శించాలని సూచించారు. మదనపల్లె: ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు సోమ వారం ఉదయం పది గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్న్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని మదనపల్లె కలెక్టరేట్తో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలను కలెక్టరేట్కు వచ్చే అవసరం లేకుండా వెబ్సైట్లోనూ నమోదు చేసుకోవచ్చని, వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఫిర్యాదుల స్థితికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100 నెంబర్ కు సంప్రదించవచ్చని తెలిపారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావాలని సూచించారు. మదనపల్లె: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 89777 16661కు ఫోన్చేసి తమ విద్యుత్ సమస్యలను తెలపవచ్చని తెలిపారు. సర్కిల్ స్థాయిలో... డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సర్కిల్ స్థాయిలో సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఎస్ఈ సోమశేఖర్రెడ్డి తెలిపారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను 94408 17449 నంబర్కు తెలియజేసి పరిష్కారం పొందాలని కోరారు. గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి భక్తులు ఆదివారం భకి్త్శ్రశద్ధలతో పూజలు నిర్వహించారు. భక్తుల ఆలయంలో అమ్మవారికి ఉదయాన్నే నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కుబడులు చెల్లించుకొన్నారు. కురబలకోట: మదనపల్లి దగ్గరున్న అంగళ్లు లోని మిట్స్ డీమ్స్ యూనివర్సిటీలో విద్యార్థులకు లక్షల చొప్పున స్కాలర్ షిప్లు మంజూరు కావడం ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. ఎంసీఏ, ఎంబీఏ విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేషనల్ స్కాలర్షిప్లు లభించినట్లు వీసీ యువరాజ్ ఆదివారం తెలిపారు. పేద ఆపై ప్రతిభావంతులైన ఏడు మంది ఎంసీఏ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున రూ.21 లక్షలు లభించినట్లు తెలిపారు. ఇద్దరి ఎంబీఏ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.లక్ష 50 వేలు చొప్పున, స్కాలర్ షిప్ లభించిందని వెల్లడించారు. ఇలా తొమ్మిది మందికి మొత్తం రూ.రూ. 24 లక్షలు స్కాలర్షిప్ రావడం విశేషంగా మారింది. చాన్స్లర్ డాక్టర్ ఎన్. విజయభాస్కర్ చౌదరి, ప్రో చాన్స్లర్ నాదేళ్ల ద్వారకనాధ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదేళ్ల స్టూడెంట్ అఫైర్స్ సీనియర్ మేనేజర్ డాక్టర్ పి.అథాహర్ సమీనా విద్యార్థులను అభినందించారు. -
కడపకు ఏడు జిల్లాల సరిహద్దు
మదనపల్లె: గతేడాది డిసెంబర్లో కొత్తగా జిల్లాల చేర్పులు, మార్పులతో జిల్లాల సరిహద్దులు మారిపోయాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2022 ఏప్రిల్ 4న 26 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయగా ఆ రోజునుంచి మనుగడలోకి వచ్చాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేయగా, అన్నమయ్య జిల్లా రూపురేఖలను మార్చేసింది. ఒకజిల్లాలోని నియోజకవర్గాలను మూడుజిల్లాల్లో కలిపింది. దీంతో జిల్లా సరిహద్దులు మారిపోయాయి. రాష్ట్రంలో ఏడు జిల్లాల సరిహద్దు కలిగిన ఏకై క జిల్లాగా వైఎస్సార్ కడపజిల్లా నిలిచింది. ఈ జిల్లాకు గతంలో తిరుపతిజిల్లా సరిహద్దుగా ఉండేదికాదు. అన్నమయ్యలోని రైల్వేకోడూరును తిరుపతిలోకి, రాజంపేటను వైఎస్సార్కడపజిల్లాలోకి కలపడంతో సరిహద్దు మారింది. దాంతో వైఎస్సార్కడపజిల్లాకు చుట్టూ అన్నమయ్య, తిరుపతి, మార్కాపురం, నెల్లూరు, సత్యసాయి, అనంతపురం, నంద్యాల జిల్లాలు ఉన్నాయి. వైఎస్సార్ కడపజిల్లా రాయలసీమ నడిబొడ్డను ఉండటంతో ఇలా ప్రాధాన్యత దక్కింది. అన్నమయ్యజిల్లాకు చిత్తూరు, వైఎస్సార్కడప, సత్యసాయి, తిరుపతిజిల్లాలు, కర్ణాటక సరిహద్దుగా ఉన్నాయి. అన్నమయ్యకు నాలుగుజిల్లాల సరిహద్దు -
జగ్జీవన్రామ్ సేవలు చిరస్మరణీయం
మదనపల్లె: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి, పార్లమెంట్ సభ్యుడిగా మూడు దశాబ్దాలకుపైగా సేవ చేశారని చెప్పారు. అణగారిన కులాలకు అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేశారన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ మధుసూదనరావ్, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి దామోదర్ రెడ్డి, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి వెంకటసుబ్బయ్య, వివిధ శాఖల అధికారులు, రాష్ట్ర మాల మహానాడు ప్రెసిడెంట్ వై.సుదర్శనం, డివిఎంసి మెంబర్లు పి.శ్రీనివాసులు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జేసీ శివ్ నారాయణ్ శర్మ -
భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుక
కడప సెవెన్రోడ్స్ : తన పునరుత్తానంతో తానే జీవమునని క్రీస్తు ఏసు లోకానికి చాటారని మరియాపురం సెయింట్ క్యాథడ్రల్ చర్చి బిషప్ సగినాల పాల్ ప్రకాశ్ అన్నారు. ఆదివారం క్రీస్తు పునరుత్తానం (ఈస్టర్) పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెల్లవారుజామునే పెద్ద ఎత్తున విశ్వాసులు చర్చి ఆవరణలోకి తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిషప్ ఆధ్యాత్మిక సందేశమిచ్చారు. ద్వేషం ఉన్నచోట ప్రేమను, అశాంతి ఉన్నచోట సమాధానాన్ని నెలకొల్పి సత్యాన్ని స్థాపించడమే ఈస్టర్ పండుగ అసలైన పరమార్థమని వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఈస్టర్ వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు -
● గవర్నర్ వస్తే మార్పు వస్తుందేమో
బి.కొత్తకోట: ఆంధ్రాఊటిగా పేరుగాంచిన ప్రఖ్యాత హార్సిలీహిల్స్లో రాష్ట్ర ప్రథమ పౌరుడైన గవర్నర్కు వేసవి విడిది కేంద్రం ఉంది. ఉమ్మడి రాష్ట్రం కాలం నుంచే గవర్నర్కు వేసవి విడిది కేంద్రంగా గుర్తించగా ఎందరో గవర్నర్లు ఇక్కడ విడిదిచేశారు. ప్రథమ పౌరుడి పేరుతో ఉన్న ఈ అతిథిగృహం సకల సౌకర్యాలతో అలరారుతూ ఉంటుందనుకుంటే ‘ఘోస్ట్’ హౌస్లో అడుగుపెట్టినట్లే. ఈ అతిథి గృహం పర్యాటకశాఖ చేతికి వెళ్లాక నిర్వహణ దరిద్రంగా తయారైంది. ప్రస్తుతం ఈ భవనాన్ని చూస్తే ఇది గవర్నర్ విడిదిచేసే బంగ్లానా అని ఆశ్చర్యపోక తప్పదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సముద్ర మట్టానికి 4,141 అడుగుల ఎత్తులోని హార్సిలీహిల్స్ గవర్నర్తో పాటు సామాన్యులకు వేసవి విడిది కేంద్రం. 1962లో గవర్నర్ బంగ్లా రాష్ట్రపతికి విడిది కేంద్రం ఉన్నట్టుగా గవర్నర్కు వేసవి విడిది కేంద్రం ఉండాలని 1961లో హార్సిలీహిల్స్పై అప్పటి ప్రభుత్వం గవర్నర్ బంగ్లా నిర్మాణం చేపట్టి ఏడాదిలో పూర్తి చేసింది. అప్పటినుంచి వేసవిలో గవర్నర్లు ఇక్కడికి వచ్చి విడిదిచేసి వెళ్తుంటారు. వారిలో కుముద్బెన్జోషి, కృష్ణకాంత్, రంగరాజన్, నరసింహన్ ఇలా గవర్నర్లు ఇక్కడ విడిది చేశారు. మాజీ ప్రధాని ఐకే.గుజ్రాల్, సీఎం హోదాలో నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కర్రెడ్డి తదితరులు ఈ బంగ్లాలోనే విడిది చేయగా ఇక్కడ విడిదిచేసిన మంత్రుల సంఖ్యకు లెక్కలేదు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ బంగ్లాలో విడిది చేసేందుకు అత్యున్నత స్థాయి వ్యక్తు లు ఆసక్తి చూపుతుంటారు. అలాంటి గవర్నర్ బంగ్లా ఇప్పుడు భూత్ బంగ్లాగా మారిపోయింది. బంగ్లా ఇలా మారిపోయింది గవర్నర్ బంగ్లా పైకప్పంతా వర్షానికి ఉరుస్తోంది. నీళ్లు చుక్కచుక్కలుగా కారుతూ అతిథిగృహాల డోర్లు తడిసి బుడపలు కట్టాయి. డోర్లపై అతికించిన షీట్లు దెబ్బతిన్నాయి. శ్లాబుపైన పెచ్చులూడిపోతున్నాయి. విద్యుత్ సరఫరా వైర్లు కాలిపోయి నల్లగా మాసిబారింది. గోడలపై కారిన వర్షపునీటితో మట్టిపెళ్లలు ఊడినట్టుగా ఉన్నాయి. గోడలకు అతికించిన అట్టషీట్లు ఊడిపోతున్నాయి. రంగులు పూర్తిగా వెలసిపోయాయి. గోడలపై మచ్చలు, చారలు దర్శనమిస్తున్నాయి. హార్సిలీసూట్ డోర్, గోడలది ఇదే పరిస్థితి. వర్షం కురిసేటప్పుడు ముట్టుకుంటే విద్యుత్ షాక్ కొడుతుందని టూరిజం సిబ్బంది భయపడుతున్నారు. ఇలా మారిపోయిన గవర్నర్ బంగ్లాలో పర్యాటకశాఖ సందర్శకులకు గదులు కేటాయిస్తూ ఆదాయం ఆర్జిస్తోంది. వేసవి విడది కేంద్రంగా హార్సిలీహిల్స్పై గవర్నర్ కోసం బంగ్లా నిర్మించి, వారు విడిది చేసినప్పుడు సేవకుల కోసం ప్రత్యేక క్వార్టర్లు, ఇళ్లను నిర్మించారు. అయితే రహదారి భవనాలశాఖ ఆధీనంలోని ఈ బంగ్లాను పర్యాటకశాఖకు అప్పగించడంతో పూర్తి వాణిజ్యపరంగా మారిపోయింది. గవర్నర్ కోసం ఏర్పాటుచేసిన డైనింగ్హాల్, విజిటర్స్ హాలు, మీటింగ్ హాలు ఇవన్ని తొలగించి గదులుగా చేసి అద్దెకు ఇస్తున్నారు. ఒకప్పుడు బంగ్లా మొత్తం గవర్నర్ కోసమే ఉండగా ఇప్పుడు కేవలం గవర్నర్ సూట్ అని పిలుచుకునే ఒక గదిని మాత్రమే ఆయన పేరుతో కేటాయించారు. ఇదికూడా గవర్నర్ పేరుకు మాత్రమే. మంత్రులు, ప్రభుత్వస్థాయి అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్లు వస్తే వారికి కేటాయిస్తున్నారు. పేరుకు గవర్నర్ బంగ్లానే మిగిలిపోయింది. ఆ పేరుకు కనీస గౌరవం కూడా లేదు. భూత్ బంగ్లాను తలపిస్తున్న గవర్నర్ గెస్ట్ హౌస్! వర్షానికి లీకేజీలతోపాచికట్టిన గోడలు, డోర్లు గోడలపై బూజు పట్టినాదులిపే దిక్కులేదు నరసింహన్ తర్వాత గవర్నర్లు ఇక్కడికి రాలేదు. దాంతో పర్యాటకశాఖ గవర్నర్ బంగ్లాను పూర్తిగా ఆదాయ వనరుగా చూస్తోంది. పాత డిజైన్ ఎంతో చక్కగా ఉండేది. వాణిజ్య అవసరంగా గుర్తించడంతో ప్రభుత్వ అనుమతి లేకుండానే పర్యాటకశాఖ అధికారులు ఇష్టమొచ్చినట్టు మార్పులు చేసుకుంటున్నారు. లక్షల ఆదాయం పొందుతున్నా గవర్నర్ గౌరవార్థం తీసుకున్న చర్య ఒక్కటిలేదు. గవర్నర్ బంగ్లా పేరుతో పర్యాటకశాఖ వ్యాపారం చేసుకుంటోంది. ఈ బంగ్లాలో 1965 నుంచి సినిమా షూటింగులు జరిగాయి.దీన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం, ఉన్నతస్థాయి అధికారులు పట్టించుకోకపోవడం ఈ దుస్థితికి కారణమైంది. మరి ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బంగ్లాను బాగు చేస్తారేమో చూడాలి. -
నిఘా నీడలో
మూల్యాంకనం మదనపల్లె: పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనానికి సర్వం సిద్ధమైంది. రాయచోటి కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను విద్యాశాఖ అధికారులు సిద్ధం చేశారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 6 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వచ్చిన సమాధాన పత్రాలకు కోడింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ పేపర్ల మూ ల్యాంకనానికి జిల్లావ్యాప్తంగా759 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరిలో జవాబు పత్రాలకు మూల్యాంకన నిర్వహించే అసిస్టెంట్ ఎగ్జామినర్లతోపాటు వాటిని పరిశీలించేందుకు చీప్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్లను సిద్ధం చేశారు. ఈ మూల్యాంకనానికి పక్రియకు సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం క్యాంపు ఆపీసర్గా వ్యవహరించనున్నారు. మూల్యాంకన కేంద్రంలో అన్ని గదులతోపాటు ఆవరణంలో కూడా సీసీ కెమోరాలను ఏర్పాటు చేశారు. దీంతో మూల్యాంకన ప్రక్రియ మొత్తం నిఘా నీడలో జరగనుంది. రీ వెరిఫికేషన్లో ఏవైనా తప్పులు దొర్లితే ఏ అసిస్టెంట్ ఎగ్జామినర్ వద్ద పొరపాటు జరిగిందో అమరావతిలో తెలుసుకునే ఏర్పాట్లు చేశారు. ట్యాబ్తో మూల్యాంకనం మొదటి సారి చేస్తున్నారు. విడతల వారీగా.. ఈ ఏడాది వివిధ జిల్లాల నుంచి వచ్చిన జవాబు పత్రాలను ఇక్కడ మూల్యాంకనం చేయ నున్నారు. ఇందుకోసం 759 మంది సబ్జెక్టు టీచర్లను విద్యాశాఖ నియమించింది. వీరికి మూల్యాంకన నిర్వహణపై శిక్షణను కూడా ఇచ్చారు. నిబంధనలు ఇలా... ● ఉపాధ్యాయులు సెల్ఫోన్, స్మార్ట్ఫోన్లు, ఎరైజర్, వైట్నర్ తదితర వస్తువులను మూల్యాంకన కేంద్రంలోకి తీసుకువెళ్లరాదు ● ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు మూల్యాంకనం జరుగుతుంది. మూల్యాంకన కేంద్రంలో ఎటువంటి తప్పిదాలు జరిగినా ఉపాధ్యాయులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ● మూల్యాంకన కేంద్రంలో విధులకు హాజ రయ్యే సిబ్బంది సమయానికి హాజరు కావాలి. లేకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ● మూల్యాంకనంలో పాల్గొనే సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేశారు. గుర్తింపు కార్డు ఉన్న వారినే ఆ ప్రాంతంలోకి అనుమతించనున్నారు. నేటి నుంచి పది మూల్యాంకనం ఏర్పాట్లు సిద్ధం చేసిన విద్యాశాఖ జిల్లాకు జవాబుపత్రాలు రాక 759 మందిసిబ్బందితో మూల్యాంకనం -
రేపటి నుంచి చౌడేపల్లెలో గంగ జాతర
చౌడేపల్లె : మండల కేంద్రంలో వెలసిన శ్రీ నడివీధి గంగమ్మ జాతర ఈ నెల 7, 8వ తేదీల్లో జరుగనుంది. ఈ మేరకు జాతర నిర్వాహక కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం రాత్రి అమ్మవారి ఊరేగింపు అనంతరం అమ్మవారికి చాకలివారి ఇంట కల్యాణోత్సవం కార్యక్రమం నిర్వహిస్తారు. జిల్లా లో జరిగే గంగజాతరలో చౌడేపల్లె జాతరలోనే కల్యాణోత్సవం జరగడం విశేషం. గ్రామంలో గత రెండు రోజులుగా దున్నపోతుకు ప్రతి ఇంటి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి వీధుల్లో ఊరేగిస్తున్నారు.గ్రామపెద్దలు తెలిపిన ప్రకారం అమ్మవారి జాతర ప్రారంభానికి ముందు సంప్రదాయ ప్రకారం సారె గంపను తీసుకెళ్లి నాయునివారి పాళ్యంలో ఉన్న శిలకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అనంతరం జాతర మొదలవుతుంది. కుమ్మర వీధికి చెందిన వెంకటరమణ ఇంట్లో అమ్మవారిని పెళ్లికుమార్తెను చేసి పురవీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లి చాకల వీధిలోని మడివిలిరాజు ఇంట మడవిలి రాజుతో వైభవంగా కల్యాణోత్సవం జరుగుతుంది. అమ్మవారిని తీసుకెళ్లి నడివీధిలో కొలువుతీర్చి బెస్తవాని ఇంటి నుంచి ఏర్పాటు చేసిన గట్టం కుంటలను తీసుకొచ్చి సమర్పిస్తారు. అనంతరం నల్ల గంగమ్మ, మారెమ్మ, బోయకొండ గంగమ్మ, గ్రామదేవత అయిన చౌడేశ్వరీ దేవీలకు పట్టణ మహిళలు పిండిదీపాలతో ఆరాధన చేసి మొక్కులు చెల్లిస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సీఐ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్ఐ చిన్నరెడ్డెప్ప పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. -
ఆలయం.. సర్వాంగ సుందరం
చక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామి సన్నిధి సకల హంగులతో మహా కుంభాభిషేకానికి ముస్తాబవుతోంది.ఆలయ జీర్ణోద్ధరణ పనుల కారణంగా గత నాలుగేళ్లకు పైగా బాలాలయంలోని దారువు విగ్రహానికి పూజలు చేస్తున్న భక్తులు ఇక నుంచి మూల విరాట్ దర్శనంతో పరవశించి పోనున్నారు. ఆలయాన్ని పునరుద్ధరించి సర్వాంగ సుందరంగా తీర్చేందుకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రు.28 కోట్లు మంజూరు చేసింది.ఈనిధులతో గండి రూపు రేఖలు మారిపోయాయి.సంస్కృతి వెలిగేలా తరాలు మురిసేలా ప్రాంగణంలోకి అడుగిడగానే భక్తి భావం పెంపొందేలా ఆలయాన్ని నిర్మించారు. 2021 అక్టోబర్ 27 నుంచి మూల విరాట్ దర్శనం లేక బాలాలయంలోని దారువు విగ్రహానికి భక్తులు పూజలు చేస్తూ వచ్చారు. వైఎస్సార్ మార్క్ గండి అభివృద్ధిలో వైఎస్ మార్క్ కనిపిస్తుంది.దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆలయాన్ని టీటీడీలో విలీనం చేయించారు.దీంతో అర్చకుల క్వార్టర్స్ భక్తుల వసతి గృహ సముదాయాలు.వీఐపీ క్వార్టర్స్,కార్యాలయం గది,పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహంతోపాటు రాయచోటి వేంపల్లె ప్రధాన రహదారి గండి పరిధి వరకు నాలుగు వరుసలతో సిమెంటు రోడ్లు వేయించారు.ఆయన మరణానంతరం ఆలయ అభివృద్ధి పడకేసింది.ఆలయం తిరిగి దేవదాయశాఖలోకి మారింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి,మండల ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డిలు ప్రత్యేక చొరవ చూపి గండి ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో టీటీటీలోకి మార్పించారు.మరో అరగంటలో ఆలయం టీటీడిలోకి చేరుతుందనగా హైకోర్టు స్టే అడ్డుపడింది.దీంతో జగనన్న మరో అడుగు ముందు కేసి రు.28 కోట్లు పైగా సీజీఎఫ్ నిధులు మంజూరు చేయించడంతో ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.పనులు ప్రారంభమయ్యాక వేంపల్లె జెడ్పీటీసి రవికుమార్ రెడ్డిలు పర్యవేక్షిస్తు వచ్చారు.అనంతరం బాలాలయం నిర్మించి అందులో దారువుతో చేయించిన స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేసి 2021 అక్టోబర్ 27 నుంచి భక్తులకు స్వామి దర్శనం చేయిస్తు వస్తున్నారు. నూతన ఆలయంలో సుమారు 120కి పైగా దేవతా మూర్తుల విగ్రహాలతో తయారు చేసిన రాతి స్థంభాలతో నిర్మించారు. రాజ గోపురాలు కూడా పలు విగ్రహాలతో అందంగా నిర్మించారు.పడమర రాజగోపురంతో పాటు కొద్ది మేర ప్రహారీ గోడ పనులు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. గోపురాలకు సంబంధించి రంగులు,తలుపులు వంటివి దాతల సహకారంతో వేయించినట్లు ఆలయ అధికారి గురుప్రసాద్ తెలిపారు.మేనెల 8నుంచి 13 వరకు కుంభాభి షేకం కార్యక్రమం నిర్వహణకు తేదీని ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు.ఈమేరకు త్వరలోనే కుంభాభి షేకానికి ఆహ్వాన పత్రికలను ముద్రించి ముఖ్యులకు అందించి ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు. టెండర్లకు ఆహ్వానం గండి ఆలయం జీర్ణోద్ధరణ,మహాకుంబాభిషేకం నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల నిమిత్తం టెండర్లకు ఆహ్వానించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి,దేవదాయశాఖ కర్నూలు డిప్యూటి కమిషనర్ గురుప్రసాద్ తెలిపారు.చలువపందిళ్లు, విద్యుద్దీపాలంకరణ, బారికేడ్ల ఏర్పాటు,రాజగోపురాలపై కలశాలు, సారవ కొయ్యలు ,పూల అలంకరణ,యాగశాల ఏర్పాటు తదితరాలకు సంబంధించి ఈనెల 13 ఉదయం 10 గంటలకు టెండర్ల నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
క్షణికావేశం.. చిన్నాభిన్నం
అప్పుల ఊబిలో చుక్కుకుని ఛిద్రమైన కుటుంబంగాలివీడు : క్షణికావేశంతో తీసుకున్న అనాలోచిత నిర్ణయం ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. అప్పుల భారంతో మనస్తాపానికి గురైన దంపతులు తీసుకున్న ఆత్మహత్య నిర్ణయం రెండు ప్రాణాలను బలి తీసుకోగా, ఇద్దరు అమాయక చిన్నారులను అనాథలుగా మార్చింది. ఈ ఘటన గాలివీడు పట్టణంలో విషాదాన్ని నింపింది. శెట్టివారిపల్లెకు చెందిన మారువేణి మల్లికార్జున (35), ఆయన భార్య రాణి దంపతులకు ఐదేళ్ల జాన్వీ, మూడు నెలల చిన్నారి ఉన్నారు. మల్లికార్జున ఓ ప్రైవేట్ హౌసింగ్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మొదట సాఫీగా సాగిన జీవితం, కుటుంబ అవసరాల పెరుగుదలతో ఆర్థిక ఒత్తిళ్లు అధికమయ్యాయి. అవసరాల కోసం తీసుకున్న అప్పులు క్రమంగా పెరుగుతూ, వాటి మీద వడ్డీలు భారంగా మారాయి. ఒకవైపు అప్పు తీర్చేందుకు మరొక అప్పు తీసుకోవడం, మరోవైపు అధిక వడ్డీలతో అవస్థలు ఏర్పడ్డాయి. చివరికి వడ్డీ వ్యాపారుల ఒత్తిడి తట్టుకోలేక దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.ఈ నేపథ్యంలో ఏప్రిల్ 3వ తేదీ రాత్రి విషద్రావణం తాగారు. వెంటనే వారిని కడప, కర్నూలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించినప్పటికీ, ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో లిద్దరూ విగతజీవులుగా పడివున్న తల్లిదండ్రులను చిన్నారులు విలపించారు. ఏమి జరిగిందో అర్థం కాని ఆ పసిపాపల పరిస్థితి ప్రతి ఒక్కరినీ కదిలించింది. వారిని ఎవరు చూసుకుంటారు? వారి విద్య, భవిష్యత్తు ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నలు సమాజం ముందున్నాయి. ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా, అనాథలుగా మిగిలిన చిన్నారులకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సహాయం చేయాలని గ్రామస్తులు, మానవతావాదులు కోరుతున్నారు. మనస్తాపంలో తీసుకునే ఒక్క తప్పుడు నిర్ణయం ఎన్నో జీవితాలను చీకటిలోకి నెట్టేస్తుందని ఈ ఘటన మళ్లీ గుర్తుచేసింది. భాదతప్త హృదయాలతో అంత్యక్రియలు ఆత్మహత్య చేసుకున్న మారువేణి మల్లికార్జున, ఆయన భార్య రాణి మృతదేహాలు మండల కేంద్రమైన శెట్టివారిపల్లెకు చేరుకున్న వెంటనే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బోరున విలపించారు. బాధాతప్త హృదయంతో భార్యభర్తల అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం పూర్తి చేశారు. -
‘సర్’ సర్వే చాలా ప్రమాదకారి
● వైఎస్సార్సీపీ బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి ● మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషకడప కార్పొరేషన్ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) సర్వేతో చాలా ప్రమాదం పొంచి ఉందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం నగర పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సర్వే జరిగిన 12 రాష్ట్రాల్లో లక్షల ఓట్లను తొలగించారని, ప్రక్కనున్న తమిళనాడులో 93లక్షల ఓట్లు తొలగించారన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి భరించలేక ఉత్తరప్రదేశ్లో 7 మంది బీఎల్ఓలు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. 24 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం జరగలేదన్నారు. డబుల్ ఎంట్రీలు, చనిపోయిన వారి ఓట్లను ఇందులో తొలగిస్తారన్నారు. ఈనెల 15వ తేది నుంచి రాష్ట్రంలో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశముందని, లేదా కొంత జాప్యం జరగవచ్చన్నారు. ఉద్యోగ నిమిత్తం వేరే చోట ఉన్నవారు, విదేశాలకు వెళ్లిన వారి ఓట్లు తొలగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇలా జరగాలంటే సమర్థులైన వారిని బీఎల్ఏలుగా నియమించుకోవాలన్నారు. బీఎల్ఓలతోపాటు వైఎస్సార్సీపీ నియమించిన బీఎల్ఏలు కూడా ఈ వెరిఫికేషన్లో పాల్గొంటే ఉపయోగముంటుందని తెలిపారు. -
బైక్ రేసర్లపై కేసు నమోదు
మదనపల్లె టౌన్ : మదనపల్లె తాలూకా పోలీసులు ఆదివారం బైక్ రేసర్లతో పాటు వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. సీఐ కళా వెంకటరమణ తెలిపిన వివరాలు .. స్థానిక జగన్ కాలనీలో ఉంటున్న మైనర్ బాలుడు దీక్షిత్ స్థానిక బైక్ రేసర్లు శనివారం ఢీకొట్టడంతో కాలు విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వార్తను ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైంది. బాలుని తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆదివారం బైక్ రేసర్లతో పాటు వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. యువతి ఆత్మహత్యాయత్నంమదనపల్లె టౌన్ : ఎలుకల మందు తాగి యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి సంఘటన ఆదివారం కురబల కోట మండలంలో జరిగింది. బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. అంగళ్లుకు చెందిన సి.హేమలత (29) మదనపల్లెలోని ఓ స్వచ్ఛంద సంస్థలో గత కొన్నేళ్లుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం సెలవు కావడంతో ఇంటి పట్టునే ఉన్న హేమలతకు ఏం కష్టం వచ్చిందో ఏమో..! తాను ఉంటున్న ఇంట్లోనే ఎలుకల మందు తాగింది. కుటుంబీకులు గమనించి బాధితురాలినికి స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం ఆమెను తిరుపతికి తీసుకెళ్లాలని సూచించారు. కేసు దర్యాప్తులో ఉందని, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదని ముదివేడు పోలీసులు తెలిపారు. -
మద్యం షాపులో దారుణం..
మదనపల్లె టౌన్ : మదనపల్లె మద్యం షాపుల్లో యుకులపై దాడులు రోజురోజుకు పెరిగి పోతున్నాయి. స్థానిక దేవతా నగర్ మద్యం షాపులో ఇటీవల ఓ కానిస్టేబుల్ భర్తపై పలువురు యువకులు మద్యం తాగేందుకు వచ్చి కర్రతో కొట్టి హత్యాత్నానికి పాల్పడిన ఘటన మరవకనే సీటీఎం రోడ్డులోని దాము వైన్స్లో మరో సంఘటన శనివారం అర్థరాత్రి జరిగింది. దీంతో పట్టణ ప్రజలు త్రీవ్ర భయాందోళన చెందుతున్నారు. దాడి ఘటనపై టూ టౌన్ పోలీసులు ఆదివారం తెలిపిన వివరాలు.. పట్టణంలోని రెడ్డీస్ కాలనీకి చెందిన శివసాయి (27) దాము వైన్స్లో మందు తాడానికి రాత్రి వెళ్లాడు. పర్మిట్ రూములో కూర్చోని మద్యం తాగుతుండగా, సుమారు 15 మంది యువకులు కలసి వచ్చి బీరుబాటిళల్లతో మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శివసాయిని స్థానికులు గమనించి చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు శివసాయికి మెరుగైన వైద్యం అందించి, తలకు బలమైన గాయాలు కావడంతో వెంటనే తిరుపతికి తరలించాలని సూచించారు. సమాచారం అందుకున్న రెండో పట్టణ పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని దాడికి గల కారణాలపై ఆరాతీశారు. అనంతరం దాము వైన్స్ వద్దకు వెళ్లి సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే సీసీ కెమెరాల్లో ఎలాంటి డేటా లేకుండా తారుమారు చేసినట్లు తెలసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నా మన్నారు. ఆటో ఢీకొని యువకునికి.. మదనపల్లె టౌన్ : ఆటో ఢీకొని యువకుడు తీవ్రంగా గాయపడి నంఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. తాలూక పోలీసులు తెలిపిన వివరాలు.. చౌడేపల్లె మండలం, బోయకొండకు చెందిన హరిబాబు నాయుడు(30) సొంత పనిమీద బైకులో మదనపల్లెకు వచ్చాడు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా వలసపల్లె వద్దకు వెళ్లగానే ఎదురుగా వస్తున్న ఆటో హరిబాబు నాయుడు బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు 108 వాహనంలో మదన పల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు బాధితునికి ప్రథమ చికిత్సలు అందించి, అతనికి మెరుగైన వైద్యం అవసరం ఉందని తిరుపతికి వెళ్లాని రెఫర్ చేశారు. కుటుంబీకులు బాధితున్ని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా పోలీసులు తెలిపారు.మందు తాగడానికి వచ్చిన యువకుడిపై 15మంది దాడి -
30 శాతం ఐఆర్ వెంటనే ప్రకటించాలి
మదనపల్లె సిటీ : 12వ వేతన సవరణ అమలు ఆలస్యం అవుతున్న కారణంగా 30 శాతం మద్యంతర భృతి వెంటనే ప్రకటించాలని అఖిల భారత సెకండరీ టీచర్స్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మదనపల్లెలో ఎస్టీయూ భవన్లో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. 2023 జులై నుంచి 12 పీఆర్సీ అమలు కావాల్సి ఉండగా ఆలస్యమైనందున ప్రస్తుత ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్ను నియమించాలన్నారు. 12 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక,పెన్షనర్లు మధ్యంతర భృతి కోరుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ,పెన్షనర్లకు ఆర్థిక బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్, జీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల మధుసూదన్, డివిజన్ కన్వీనర్లు శ్రీనాథ్, బ్రహ్మానందం, రాజారెడ్డి,శేఖర్రెడ్డి, లింగమూర్తి, ఎల్లారెడ్డి, అశోక్, చలపతి, హరీష్ తదితరులు పాల్గొన్నారు. మందుగా బాబు జగజ్జీవన్రాం జయంతి, ఎస్టీయూ ఉద్యమకారులైన వీణవిజయరామరాజు వర్ధంతి ప్రత్యేకతను తెలియజేస్తూ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
భ్యార్య ప్రియుడితో లేచిపోయిందని..
మదనపల్లె టౌన్ : కట్టుకున్న భార్య నమ్మక ద్రోహం చేసి మరొకడితో లేచిపోవడం జీర్ణించుకోలేక, తన ఎడమ కాలును కొడవలితో రెండుగా తెగ నరికేసుకుని చనిపోవాలి అనుకున్నాడు. కలకలం రేపే ఈ ఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. ఇందుకు సంబంధించి బాధితుని సోదరి దేవి, తాలూకా పోలీసులు తెలిపిన వివరాలు.. కర్ణాటక రాష్ట్రం, చింతామణి తాలూకా నారాయణహల్లికి చెందిన ఎన్.వెంకటేశప్ప కుమారుడు శ్రీరాములు(35) శ్రీనివాసపురం జేవీ కాలనీకి చెందిన పవిత్రను 15 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. భవన కార్మికుడిగా పనిచేస్తూ సజావుగా సాగుతున్న వారి కాపురంలో భార్య వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. తమ 14 ఏళ్ల కుమార్తె, 10 ఏళ్ల వయసున్న కొడుకు కోసమైనా తీరు మార్చుకోవాలని భర్త భార్యను పలు మార్లు మందలించి హెచ్చరించాడు. అయినా పవిత్రలో కాస్తంత కూడా మార్చు రాలేదు. భర్తను మోసం చేయడమే కాకుండా నెల రోజుల క్రితం ఏకంగా అదే ఊరికి చెందిన తన ప్రియుడు సిద్దప్పతో లేచి పోయింది. తనను వదిలేసి మరొకడితో వెళ్లి పోవడంతో శ్రీరాములు భవన నిర్మాణం పనికి వెళ్లడం మానేసి ఇంట్లోనే తన పిల్లలకు అన్నీ తానై సమర్యలు చేస్తూ మానసికంగా కుంగిపోయాడు. ఉన్న ఊర్లో తలెత్తుకు తిరగలేక పోయాడు. తీవ్ర అవమానంగా భావించి, తన ఇద్దరు బిడ్డలను వెంట తీసుకుని ఐదు రోజుల క్రితం మదనపల్లె బసినికొండ వడ్డిపల్లెలో ఉన్న తన తోబుట్టువు దేవి ఇంటికి వచ్చాడు. చెల్లీ తన బిడ్డలను నువ్వే చూసుకోవాలని పదేపదే చెబుతూ వచ్చాడు. ఆవేదనలో శ్రీరాములు తనతో ఇలా అంటున్నాడులే అనుకుని దేవి ఆ విషయాన్ని సీరియస్గా తీసు కోలేదు. ఆదివారం ఇంట్లో బావ, తోబుట్టవు తన పిల్లలతో ఆడుకుంటూ ఉండగా.. చెల్లి ఇంట్లో ఉన్న ఓ కొడవలి తీసుకుని సమీపంలోని మాదిని కొండ అడవిలోకి వెళ్లాడు. అక్కడ చనిపోవాలని నిర్ణయించు కున్నాడు. వెంట తెచ్చుకున్న కత్తితో కాలును రెండుగా తెగ నరికేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. మద్యం మత్తులో ఉన్న కారణంగా కొంత సేపు నొప్పిని భరించి, ఆ తరువాత కేకలు పెట్టడంతో స్థానికులు గమనించి బాధితున్ని బైకులో స్థానిక జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్స అనంతరం రుయాకు రెఫర్ చేశారు. కుటుంబీకులు బాధితున్ని తిరుపతికి తీసుకెళ్లారు. శ్రీరాములు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విచారణ చేపట్టినట్లు తాలూకా పోలీసులు తెలిపారు.కాలును రెండుగా తెగ నరుక్కున్న భర్త -
యువకుడు ఆత్మహత్య
సంబేపల్లె : సంబేపల్లె మండలంలో సలీంద్ర అనిల్ కుమార్ (25) అనే యువకుడు శనివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాలమేరకు దుద్యాల గ్రామం పెద్దకోడివాండ్లపల్లెకు చెందిన అనిల్కుమార్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటిలో ఎవరూ లేని తాడుతో ఇంటిపైకప్పు కొక్కీకి ఉరివేసుకున్నాడు. ఇంటి తలుపులు వేసి ఉండటంతో ఆదివారం మధ్యాహ్నం గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికిన పోలీసులు చేరుకొని విచారించి మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తలరించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.ఈతకు వెళ్లి విద్యార్థి మృతి గాలివీడు : ఈతకు వెళ్లిన విద్యార్థి కొత్తకోట రోహిత్(14) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. గ్రామస్తుల కథనం మేరకు గోరాన్ చెరువు గ్రామం కుమ్మరపల్లెకు చెందిన కొత్తకోట సుధాకర్ కుమారుడు రోహిత్ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.ఆదివారం సెలవు కావడంతో స్నేహితులతో కలిసి సమీపంలోని పెద్ద చెరువుకు ఈత కొట్టడానికి వెళ్లాడు. తనతో పాటు తెచ్చుకున్న బైక్ ట్యూబ్ను నడుముకు కట్టుకుని నీటిలోకి దిగిన రోహిత్, ప్రమాదవశాత్తు ట్యూబ్ జారిపోవడంతో ఒక్కసారిగా నీటిలో మునిగి గల్లంతయ్యాడు. అప్రమత్తమైన తోటి పిల్లలు గ్రామస్తులకు సమాచారం అందించారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.ఫలితం లేకపోవడంతో అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు స్థానికుల సహకారంతో విద్యార్థి మతదేహాన్ని వెలికితీశారు. ఫుట్బాల్ లీగ్ ప్రారంభం మదనపల్లె సిటీ : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏపీ ఫుట్బాల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో జిల్లా లెజెండ్స్ ఫుట్బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయస్థాయి పుట్బాల్ చరిత్రలో లెజెండ్స్గా నిలిచిన మెస్సి, రోనాల్డోపీలే, మారడానో, బూటియా,ఛత్రిల పేర్లతో ఆరు జట్లు బాల, బాలికలు, మిక్స్ జెండర్ విభాగాల్లో ఆండర్–12,అండర్–4 స్థాయిల్లో పోటీలు జరుగుతాయని పుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మురళీధర్ తెలిపారు. కార్యక్రమంలో డీఎస్డీఓ చంద్రశేఖర్, క్రీడాభారతి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నరేష్బాబు, హెచ్ఎం సుబ్బారెడ్డి, సభ్యులు దిలీప్, కమలేష్, మహేంద్రనాయక్, కిరణ్ పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగిని ఆత్మహత్య రాయచోటి టౌన్ : భర్తతో చిన్న పాటి మనస్పర్థలతో భార్య ఆత్మహత్య చేసుకొంది. రాయచో టి అర్బన్ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి పట్టణ పరిధిలోని మాసాపేకు చెందిన రియాజ్ భార్య రోషిణి (25) రాయచోటి ఆర్టీసీ బస్టాండ్లో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తోంది. వీరికి గత ఐదు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి మధ్య గత కొన్ని రోజులుగా మనస్ఫర్థలు ఏర్పడ్డాయి. దీంతో శనివారం రోషిణి ప్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొంది. రాయచోటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెవెన్యూ అవినీతిపై ఫిర్యాదు
మదనపల్లె టౌన్ : మదనపల్లె రెవెన్యూ కార్యాలయ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఓ రహస్య వ్యక్తి జిల్లా కలెక్టర్, సీసీఎల్ఏకు చేసిన ఫిర్యాదు కాపీ ఆదివారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ వీఆర్ఓ మధ్యవర్తిగా రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయని, ఓ వ్యక్తి వద్ద రూ.ఐదు లక్షలు బ్యాంకు ఖాతాకు జమ చేయించుకున్నారని.. సంబంధించిన పత్రాలు ఫిర్యాదు కాపీలో ఉన్నాయి. భూమి లావాదేవీలు, విధులకు సంబంధించి అవినీతి ఆరోపణలు చేసినట్లు అందులో ఉన్నాయి. అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలపై విచారణ జరిపి సంబంధిత అధికారిపై క్రిమినల్ కేసు పెట్టి సస్పెండ్ చేయాలని అందులో కోరారు. ఈ ఫిర్యాదు కాపి వ్యవహరాం పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది. దీన్ని ఎవరు ఫిర్యాదు చేశారు. అన్నది పేరు లేదు. విజిల్ బ్లోయర్ పేరుతో ఫిర్యాదు పంపారు. ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృతిముద్దనూరు : మండలంలోని పెద్దదుద్యాల గ్రామ సమీపంలో ఆదివారం ట్రాక్టర్ నడుపుతూ ప్రమాదవశాత్తు అదే ట్రాక్టర్ క్రింద పడి డ్రైవరు శ్రీనివాసులు(44) దుర్మరణం చెందాడు.ఎస్ఐ మధుసూదన్రెడ్డి సమాచారం మేరకు ముద్దనూరులోని యానాది కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాసులు తన కుటుంబంతో కలిసి సుంకేసుల, పెద్దదుద్యాల గ్రామాల్లో తాడిపత్రికి చెందిన వ్యక్తి పొలాల్లో పనిచేస్తున్నాడు.ఆదివారం సాయంత్రం సుంకేసుల నుంచి పెద్దదుద్యాలలోని పొలంలోకి ట్రాక్టర్ నడుపుకుంటూ వస్తున్నాడు.ప్రధాన రహదారి నుంచి పక్కకు వెళ్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి పడిపోయింది.ఈ ప్రమాదంలో శ్రీనివాసులు ట్రాక్టర్ క్రింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు.మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్ఐ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.ఉప్పుగుంటపల్లెలో పురాతన విగ్రహం మైదుకూరు : వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలంలోని ఉప్పుగుంటపల్లెలో ఆదివారం పురాతన అమ్మవారి విగ్రహం బయటపడింది. గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి అబ్బిరెడ్డి వారసుల పొలాల వద్ద ఈ విగ్రహంతోపాటు నాగుల విగ్రహాలు వెలుగు చూశాయి. పెద్దిరెడ్డి అబ్బిరెడ్డి కుటుంబీకులు పూజలు నిర్వహిస్తూ పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీసే పుట్ట శనివారం కుంగడాన్ని గమనించారు. ఈ విషయాన్ని దువ్వూరు మండలం జొన్నవరం రామాలయం పూజారికి తెలపగా, తవ్వకాలు జరపకుండా ఆ ప్రాంతాన్ని నీటితో నింపాలని సూచించినట్టు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు పెద్దిరెడ్డి దశరథరామిరెడ్డి తెలిపారు. తాము ఆ విధంగా చేయడంతో మట్టి కరిగి తొలగిపోయి అమ్మవారి విగ్రహం నాగులు విగ్రహాలు బయటపడ్డాయని వివరించారు. ఈ విషయాన్ని మైదుకూరుకు చెందిన ఔత్సాహిక చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్కు తెలిపామని ఫొటోలను పంపామని తెలిపారు. ఆయన బయటపడిన విగ్రహం చాముండి విగ్రహం అని, 17వ శతాబ్దానికి చెందినదై ఉండవచ్చని తెలిపారన్నారు. అమ్మవారి విగ్రహం బయటపడిన విషయాన్ని అమెరికాలో ఉంటున్న తమ బంధువులకు తెలియజేశామని దశరథరామిరెడ్డి తెలిపారు. -
బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం
పుంగనూరు: చౌకదుకాణంలో రేషన్ సరుకులు తీసుకునేందుకు వెళ్తున్న బాలికను ఓ ఆటో డ్రైవర్ శనివారం ఆటోలో ఎక్కించుకుని అత్యాచారం చేసినట్లు బాధిత కుటుంబం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెంది న 35 ఏళ్ల ఆటో డ్రైవర్ అటవీ ప్రాంతంలోకి తీసు కెళ్లి దాడి చేసి అత్యాచారం చేశాడని, తిరిగి ఆటో లో తీసుకొచ్చి ఇంటి వద్ద వదిలాడని బాధిత కు టుంబం ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసి, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. -
‘తహలిల్’తో ముగిసిన ఉరుసు ఉత్సవాలు
కమలాపురం: పట్టణంలో వెలసిన శ్రీ హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి, హజరత్ దస్తగిరి షా ఖాద్రి, హజరత్ మౌలానా మౌల్వీ ఖాదర్ మొహిద్ధీన్ షా ఖాద్రి, హజరత్ జహీరుద్ధీన్ షా ఖాద్రి ఉరుసు మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 1వ తేదీ నుంచి దర్గా పీఠాధిపతి (ముతవల్లి) సజ్జాద్–ఏ–నషీన్ మహమ్మద్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రి ఆధ్వర్యంలో, దర్గా కన్వీనర్ షేక్ ఇస్మాయిల్ పర్యవేక్షణలో జరుగుతున్న ఉత్సవాలు శనివారం తహలిల్ కార్యక్రమంతో ముగిశాయి. ఉదయం స్థానిక పాత బస్టాండు సమీపంలోని గంధం ఇంటి నుంచి పీఠాధిపతి ఆధ్వర్యంలో పూలచాదర్ తదితర వాటిని ప్రతేక్యంగా అలంకరించిన చాందినిలో ఊరేగింపుగా దర్గాకు తీసుకువచ్చారు. అనంతరం దర్గాలో వెలసి ఉన్న స్వాముల వారి మజార్లపై పూల చాదర్లు సమర్పించి ప్రత్యేక ఫాతెహ నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. నషాన్ రోజున దర్గా ఆవరణలో ఆవిష్కరించిన జెండాను తొలగించారు. దీంతో ఉరుసు మహోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి సోదరులు దస్తగిరి షా ఖాద్రి, మౌలానా ఖాద్రి, గౌస్ పాక్, జియా, ఇస్మాయిల్, సర్ఫరాజ్, పెద్ద సంఖ్యలో భక్తులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. కాగా భక్తులకు నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. -
మదనపల్లెలో రెచ్చిపోతున్న బైక్ రేసర్లు..
మదనపల్లె టౌన్ : మదనపల్లెలో బైక్ రేసర్లు రెచ్చి పోతున్నారు... కట్టడి చేయల్సిన పోలీసులు చేష్టలుడిగారు. ప్రతి రోజు మైనర్లు, స్థానికంగా ఉన్న కొందరు యువకులు సైలెన్సర్లు తొగించి బైకులపై పెద్ద శాబ్దాలతో పుర వీధుల్లో స్పీడుగా తిరుగుతున్నారు. పురప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నా.. జిల్లా ఎస్పీ,గానీ, స్థానిక పోలీసులు గానీ బైక్ రేసర్లను పట్టించుకోక పోడంతో విచ్చలవిడి తనంతో బైకులు నడిపి శనివారం స్థానికంగా ఉన్న దీక్షిత్ అనే బాలుడి కాలు విరిగి పోయిందని సీపీఐ అన్నమయ్య జల్లా సహాయ కార్యదర్శి క్రిష్ణప్ప తెలిపారు. ఎవరైనా చస్తేగానీ పోలీసులు స్పందించరా..? అని ప్రశ్నించారు.కాలు విరిగిన బాధిత బాలుడితో కలసి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయల ఎదుట ధర్నా చేయనున్నట్లు పేర్కొన్నారు.ప్రభుత్వ భూమి కబ్జాపుంగనూరు : మండలంలోని గుడిసెబండ గ్రామానికి చెందిన సర్వే నంబరు: 291/3లో గల రూ.2 కోట్లరూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని క్వారీ యజమాని కబ్జా చేశాడు. కొంత మంది రెవెన్యూ అధికారులు అవినీతి అక్రమాల ఫలితమే కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని బాహాటంగా కబ్జా చేశారు. శనివారం భూమి వద్ద ఉన్న క్వారీ యజమాని వెంకటేష్ ప్రభుత్వ భూమి 2.50 ఎకరాల భూమిని జేసీబీలతో చదును చేసి క్వారీలోకి కలుపుకున్నాడు. దళిత సంఘ నాయకులు రాజు, పెంచుపల్లి కృష్ణప్ప తదితరులు ఆప్రాంతాన్ని సందర్శించి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రాజు మాట్లాడుతూ సదరు స్థలాన్ని ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ల పట్టాలకు మంజూరు చేయాలని పలుమార్లు రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. కానీ రెవెన్యూ వారు పట్టించుకోకుండా క్వారీ యజమానితో లాలూచి పడటంతో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా కబ్జా చేశారని ఆరోపించారు.ఈ విషయమై జిల్లా కలెక్టర్ తక్షణమే విచారణ జరిపి, ప్రభుత్వ భూమిని కాపాడాలని, లేకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు.బైక్రేసర్లు ఢీకొట్టడంతో కాలు విరిగి ఆస్పత్రి పాలైన బాలుడు.. -
కమనీయం.. లక్ష్మీనరసింహుని కల్యాణం
గుర్రంకొండ: మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ నరసింహాస్వామి వారి కల్యాణోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. శని వారం స్వాతి నక్షత్రంతో పాటు స్వామివారి జన్మ దినం కావడంతో టీటీడీ వారి ఆధ్వర్యంలో స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహించారు. కల్యాణమండపం వద్ద చలువపందిళ్లు, పచ్చని తోరణాలతో పెళ్లివేదికను అందంగా అలంకరించారు. ముందుగా మూలవర్లకు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు జరిపారు. ముత్యాల తంబ్రాలతో స్వామివారి పెళ్లివేడుక నిర్వహించారు. వేదపండితులు మంత్రోచ్ఛారణల మధ్య మేళతాళాలతో శాస్త్రోక్తంగా మాంగల్యధారణ కావించారు. రూ.300 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు టీటీడీ వారు పట్టువస్త్రాలు, కంకణాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయఅర్చకులు,టీటీడీ అధికారులు పాల్గోన్నారు. -
సూక్ష్మ నీటి పారుదలకు రూ.71.15 కోట్లు
మదనపల్లె: జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో రైతాంగానికి సూక్ష్మనీటి పారుదలశాఖ ద్వారా రూ.71.15 కోట్ల లబ్ధి చేకూరిందని జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి లక్ష్మీ ప్రసన్న చెప్పారు. శనివారం ఆమె మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా బిందు, తుంపర సేద్య పరికరాలను 7691 మంది, 8622.82 హెక్టార్ల విస్తీర్ణంలో రైతులకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీనికోసం రూ.71.15కోట్ల సబ్సిడీ మంజూరు చేయగా, రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా ఐదో స్థానంలో నిలిచిందని చెప్పారు. బిందు, తుంపర సేద్య పద్దతుల ద్వారా సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే సుమారు 40–50 శాతం వరకు నీటి ఆదా అవుతుందని, ఎరువుల వినియోగ సామర్థ్యం 30–50 శాతం తగ్గి ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మరింత విస్తృతంగా లక్ష్యాలను అమలు చేయనున్నట్టు చెప్పారు. కడప సెవెన్రోడ్స్: జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఆర్.రామచంద్రారెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. కర్నూలు జిల్లా పత్తికొండలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారిగా పనిచేస్తూ పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. గాలివీడు: విధి నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ హెచ్చరించారు. శనివారం ఉదయం ఆయన గాలివీడు పీహెచ్సీని తనిఖీ చేసి పలు లోపాలను గుర్తించారు.ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది హాజరు, వైద్య సేవల పనితీరు, మందుల నిల్వలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. తనిఖీ సమయంలో హాజరు పట్టిక సక్రమంగా నిర్వహించకపోవడం,పలువురు సిబ్బంది గైర్హాజరు కావడం గమనించిన కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ప్రసూతి గది (లేబర్ రూమ్) పరిశీలనలో అత్యవసర మందులు సక్రమంగా నిల్వ చేయకపోవడం, అవసరమైన ఔషధాల ట్రేలను ప్రొటోకాల్కు అనుగుణంగా నిర్వహించకపోవడం వంటి లోపాలను గుర్తించారు. అలాగే డ్రగ్ స్టోర్లో మందుల నిర్వహణలో కూడా లోపాలు ఉన్నట్లు గుర్తించి, స్టాక్ రిజిస్టర్ సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. -
హోంమంత్రి అనిత నోరు అదుపులో పెట్టుకోవాలి
కడప కార్పొరేషన్ : రాష్ట్ర హోంమంత్రి అనిత నోటిని అదుపులో పెట్టుకొని సభ్యతగా మాట్లాడాలని వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ హెచ్చరించారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి 11 సీట్లు వచ్చాయని పదే పదే ఎద్దేవా చేస్తున్నారని, 40 శాతం ఓట్లు వచ్చాయని గుర్తించకపోవడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. కేవలం 11 సీట్లు ఉన్న వైఎస్ జగన్కు మీరెందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని పాలించడం చేతగాక లక్షల కోట్ల అప్పులు చేస్తూ ప్రజలపై భారం వేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలు, చిన్నారులు, దళితులపై జరుగుతున్న ఆకృత్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. హోంమంత్రిగా వాటిని నియంత్రించాల్సిన అనిత ఆ పని చేయకుండా వైఎస్ జగన్ను విమర్శిస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారన్నారు. రైల్వేకోడూరులో నడిరోడ్డుపై మహిళపై దాడి చేస్తే ఎలాంటి చర్యలు లేవని, సాక్షాత్తు అసెంబ్లీ స్పీకరే దళితున్ని కొట్టారని, జిల్లా ఎస్పీ కార్యాలయానికి వె ళ్లి టీడీపీ ఎమ్మెల్యే బెదిరించి, హంగామా చేస్తే వారిపై ఏం చర్యలు తీసుకోలేదన్నారు. ఇంతటి అరాచకాలు జరుగుతున్నా హోంమంత్రి స్పందించరని, వైఎస్ జగన్ను విమర్శించి చంద్రబాబు, లోకేష్ల మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రెండేళ్లకే ఈ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. -
కన్నులపండువగా చక్రస్నానం
ఒంటిమిట్ట: ఏకశిలానగరి కోదండ రాముడి బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టమైన చక్రస్నానం కన్నులపండువగా సాగింది. తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలు యజ్ఞంలా జరిగాయి. లక్షల మంది భక్తులు తరలివచ్చి జగదభిరాముడిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా చక్రస్నానాన్ని శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించా రు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శనివారం ఉదయం సుప్రభాత సేవ నిర్వహించారు. భక్తుల సర్వదర్శనానికి అనుమతిచ్చారు. సీతారామలక్ష్మణ దివ్య మూర్తులను పట్టువస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. 9:30 గంటలకు సుదర్శన చక్రత్తాశ్వర్ పల్లకిలో ఆలయం ఎదురుగా నిర్మించిన నూతన పుష్కరిణికి శోభాయాత్ర ప్రారంభమైంది. 9:30 నుంచి 10:30 గంటల వరకు సీతారామలక్ష్మ ణ ఉత్సవ మూర్తులకు ఉత్సవ కంకదారు రాజేష్ ఆధ్వర్యంలో స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీతారామలక్ష్మణుల సరసన చక్రత్తాళ్వార్కు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనాలతో అభిషేకాలు చేశారు. 10:30 నుంచి 11:00 గంటల వరకు అర్చకులు వేదమంత్రోచ్ఛారణతో చక్రస్నాన కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. టీటీడీ అధికారులు, ఉద్యోగులు సిబ్బంది, కళాకారులు, భక్తులు పుణ్యస్నానాలు చేశారు. పుష్కరిణి నుంచి ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నేత్రపర్వంగా సాగింది. ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, సివిల్ విభాగం అధికారులు డీఈ నాగరాజు, ఏఈ అమర్ నాథ్ రెడ్డి, సీఐ నరసింహారాజు, ఒంటిమిట్ట ఎస్ఐ శ్రీనివాసులు, సిద్దవటం ఎస్ఐ హారిక వేదపండితులు, అర్చకులు, ఇతర అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం ఏకశిలానగరి కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. తొమ్మిదో రోజు శనివారం రాత్రి రుత్వికులు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం నిర్వహించారు. ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి పూజా సామగ్రిని సమర్పించారు. ఈ సందర్భంగా కంకణదారు రాజేష్ భట్టార్ ఆధ్వర్యంలో యాగశాలలో హోమాలు నిర్వహించారు. ధ్వజావరోహణంలో ధ్వజ స్థంభం పై నుంచి గరుడ పతకాన్ని కిందికి దించారు. కలశాలను కోదండ రామయ్యకు సమర్పించారు. ఆదివారం సాయంత్రం 6 నుంచి పుష్పయాగం జరుగుతుంది. -
సమస్యలపై స్పందించకుంటే భూములు ఇవ్వలేం..
ఎర్రగుంట్ల : చాగలమర్రి నుంచి వేంపల్లె, రాయచోటి మధ్య నిర్మించే జాతీయ రహదారి కోసం భూముల సేకరణ విషయంపై శనివారం ఎర్రగుంట్ల మండల పరిధిలోని పెద్దనపాడు, వై కోడూరు, పోట్లదుర్తి, ఎర్రగుంట్ల గ్రామాలకు చెందిన భూనిర్వాసితులతో డిప్యూటీ కలెక్టర్ వెంకటపతి ఆధ్వర్యంలో తాహసీల్దార్ అమరేశ్వరి, జాతీయ రహాదారి శాఖ డీఈ చంద్రశేఖర్రెడ్డిలు సమావేశం నిర్వహించారు. వై కోడూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వాసుదేవరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డిలు రైతుల పక్షాన మాట్లాడారు. అధికారులకు ఒత్తిళ్లు ఉన్నాయంటూ హడావిడిగా సమావేశం పెట్టి రైతులతో బలవంతంగా భూములు సేకరణ చేస్తుంన్నారన్నారు. ముందు రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. రోడ్డు వేస్తే మా భూములలో నుంచి నీరు పోవడానికి డ్రైనేజీతో పాటు సర్వీస్ రోడ్లును ఏర్పాటు చేయాలన్నారు. మా తాతా ముత్తాలు సంపాదించిన భూములను మీకు అప్పనంగా ఇవ్వలేమన్నారు. దీంతో అధికారులు ఏమీ మాట్లాడకుండా సమావేశం నుంచి వెళ్లిపోయారు. అలాగే పెద్దనపాడు గ్రామంలో రైతులు ఎకరాకు రూ.1.20 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. అయితే ప్రభుత్వం తరుపున రూ.92 లక్షలు ఇస్తామని చెప్పడంతో నష్టపరిహారంలో తేడాలు ఉండటంతో భూములు ఇవ్వలేమని రైతులు చెప్పారు. ఎర్రగుంట్ల పోట్లదుర్తి గ్రామాలకు చెందిన రైతులతో కూడా అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనూ రైతుల వద్ద నుంచి భూ సేకరణ విషయంలో ఆనాసక్తి ఎదురైంది. -
అక్రమ లేఔవుట్లపై కొరడా!
● పీకెఎం ఉడా పరిధిలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అధికారులు ● నివేదిక సిద్ధం చేశాక చర్యలుమదనపల్లె: మదనపల్లె కేంద్రంగా పనిచేస్తున్న పలమనేరు, కుప్పం, మదనపల్లె పట్టణాభివృద్ధి సంస్థ (పీకేఎం ఉడా) అక్రమ లేఔట్లపై దృష్టి సారించింది. దీని పరిధిలో తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో బి.కొత్తకోట నగర పంచాయతీ, సెలక్షన్ గ్రేట్ మదనపల్లె మున్సిపాలిటీ, పుంగనూరు, పలమనేరు, కుప్పం మున్సిపాలిటీలు, 18 మండలాలు ఉన్నాయి. వీటిలో ఏ నిర్మాణం చేపట్టాలన్నా, లేఔవుట్ వేయాలన్నా అనుమతి తీసుకోవడం తప్పనిసరి. నిబంధన మేరకు ఉన్న విస్తీర్ణం నుంచి పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన నిర్మాణాలకు పట్టణాభివృద్ధి సంస్థ నుంచి అనుమతి పొందాలి. ఆ తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాలి. అయితే ఈ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. సంస్థ ఉందన్న విషయాన్ని కూడా ఎవరు గుర్తించడం లేదు. స్థానికంగా గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలో వాటి పరిధికి సంబంధించిన విస్తీర్ణ నిర్మాణ అనుమతి ఎంతుందో ఆ మేరకు మాత్రమే చూపించి అనుమతులు పొందుతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా పట్టణాభివృద్ధి సంస్థ వరకు అనుమతుల కోసం దరఖాస్తులు రావడం లేదు. అలాగే కోట్ల విలువైన లేఔట్లు వేసిన రియల్టర్లు కూడా అనుమతి పొందేందుకు సుముఖత చూపడం లేదు. లేఒట్లు వేసేసి ప్లాట్లను విక్రయించుకుంటున్నారు. దాంతో సంస్థ ఆదాయం లేకుండా పోయింది. దీనికి చైర్మన్ గా రాజకీయ నాయకుడు బిఆర్.సురేష్ బాబు చైర్మన్గా వ్యవహరిస్తుండగా, వైస్ చైర్మన్గా జాయింట్ కలెక్టర్ ఉన్నారు. క్షేత్రస్థాయిలో లెక్క ఐదు నియోజకవర్గాల పరిధిలో క్షేత్రస్థాయిలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయన్న అంశంపై సంస్థ అధికారులు పరిశీలనలను చేపట్టారు. ఒక్కో నియోజకవర్గంలో అనుమతిలేని లేఔవుట్లు ఎన్ని ఉన్నాయి, అనుమతి పొందని వాణిజ్యపరమైన సంస్థలు ఎన్ని ఉన్నాయన్నవాటిని గుర్తించి నివేదికను రూపొందించేందుకు సిద్ధమయ్యారు. మూడు రోజులుగా ఈ క్షేత్రస్థాయి పరిశీలన సాగుతోంది. రెండు, మూడు రోజుల్లో ఈ పరిశీలన పూర్తికానుంది. తర్వాత అక్రమ లేఔవుట్లు, నిర్మాణాలను గుర్తించి లెక్క తేల్చనున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో నివేదిక సిద్ధంచేసి తదుపరి చర్యలపై సమీక్షించే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీం అమలు చేస్తున్నప్పటికీ అక్రమంగా లేఅవుట్లు వేసిన వారు స్పందించడం లేదు. వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల నిర్లక్ష్యం లేదా సహకారంతో అక్రమ లేఔవుట్లు వెలుస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. మున్సిపల్ శివారుల్లో.. పట్టణాల పరిధిలో రియల్టర్లు లేఔవుట్లు వేసే అవకాశం లేదు. అందుకు ఎకరాల భూమి అందుబాటులో ఉండదు. కాబట్టి మున్సిపల్ శివారు ప్రాంతాల్లో లేదా కొంత దూరంలో లేఔట్ల ఏర్పాట్లు జరుగుతోంది. ఈ లేఔట్లు పంచాయతీల పరిధిలోకి వెళుతున్నాయి. దాంతో పంచాయతీ అధికారులు, మండల స్థాయి అధికారులు వీటిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వారి నుంచి చర్యలు ఉండకపోవడంతో ఈ విషయం పట్టణాభివృద్ధి సంస్థ దృష్టికి రావడం లేదు. కొంతకాలం మండలాల పరిధిలో లేఔట్లు, అనుమతి లేని నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలంటూ ఎంపీడీవోలకు ఆదేశాలు ఇచ్చారు. అయితే వారి నుంచి ఇలాంటి సమాచారం అందలేదని తెలిసింది. ఈ పరిస్థితుల్లో సంస్థ అధికారులే క్షేత్రస్థాయి పరిశీలనలు చేపట్టడంతో ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో స్పష్టంగా తేలిపోనుంది. ఆ తర్వాత పట్టణాభివృద్ధి సంస్థ ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి. -
వాల్మీకిపురాన్ని నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలి
వాల్మీకిపురం : గొప్ప చారిత్రక నేపథ్యం రాజకీయ చరిత్ర కలిగిన వాల్మీకిపురాన్ని తిరిగి నియోజకవర్గ కేంద్రంగా పునరుద్ధరించాలని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ బ్రిటీష్ కాలం నుంచి నియోజకవర్గ కేంద్రంగా వాయల్పాడు ఉందని, 1986 ప్రాంతంలోనే రెవెన్యూ పరిపాలన పరంగా సబ్ రిజిస్ట్రారు కార్యాలయం, తాలూకా కార్యాలయాలు చంద్రగిరి వరకు విస్తరించి సేవలు అందించినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. 120 సంవత్సరాల ముందు నుంచే రైళ్ల రాకపోకలు జరిగాయన్నారు. ఐదు దశాబ్దాల పాటు నియోజకవర్గ కేంద్రంగా ఉన్న వాల్మీకిపురం 2009లో జరిగిన నియోజకవర్గ పునర్విభజనలో కనుమరుగైందన్నారు. నియోజకవర్గ కేంద్రం నుంచి మండల కేంద్రంగా నిలిచిపోవడం దురదృష్టకరమన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రానికి వాల్మీకిపురం 20 కిలోమీటర్లకులోపే ఉందని, నేషనల్ హైవేకు అత్యంత దగ్గరగా ఉందన్నారు. దీనిని నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని డీలిమిటేషన్ కమిటీనీ కోరనున్నట్లు తెలిపారు. ఇప్పటికే వాల్మీకిపురంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు తరలిపోయాయన్నారు. నియోజకవర్గ కేంద్రంగా వాల్మీకిపురాన్ని తిరిగి పునరుద్ధరించాలని, త్వరలో జరగబోయే నియోజకవర్గాల విభజనను డీలిమిటేషన్ పరిశీలించి, నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని వైఎస్సార్సీపీ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోందన్నారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రితో సహా డీలిమిటేషన్ కమిటీకి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. పార్టీలకు, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలు పాల్గొని, వాల్మీకిపురాన్ని నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు నీళ్లభాస్కర్, కేశవ రెడ్డి, శ్రీధర్రాయల్, ఇబ్రహిం, శివారెడ్డి, రవీంద్ర రెడ్డి, గంగిరెడ్డి, అశోక్ కుమార్ రెడ్డి, రవి, ఎల్.వి రమణ, యల్లప్ప, మునిభాస్కర, చలపతి, రఘు, రాజబాబు, విశ్వనాథ, శ్రీనివాసులు శెట్టి, శివ, అషర్, వెంకటస్వామి, హరి, సుధాకర, సదాశివ కుమార్, షాహెద్, రామక్రిష్ణారెడ్డి, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి -
జగన్ వస్తేనే అభివృద్ధి
● అమరావతికి చట్టబద్ధత కూటమి భ్రమే ● రాజధాని డ్రామాలపై మండిపడ్డ ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డిజమ్మలమడుగు : వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తేనే కోస్తాతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాజధానికి చట్టబద్ధత అంటూ కూటమి ప్రభుత్వం ప్రజలను భ్రమల్లో ముంచెత్తుతోందన్నారు. అమరావతిలో రాజధాని నిర్మించాలని ఇప్పటికే కూటమి ప్రభుత్వం రైతుల వద్ద నుంచి 50 వేల ఎకరాలు పంట పొలాలను తీసుకొని ఇంత వరకు వారికి న్యాయం చేయలేదని విమర్శించారు. మరో 50 వేల ఎకరాల భూమిని తీసుకోనే ప్రయత్నం చేస్తోందని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం 2 వేల ఎకరాలు ఉంటే సరిపోతుందని తెలిపారు. అలా కాకుండా లక్షల ఎకరాల భూములను తీసుకొని ఇష్టమైన కంపెనీలకు ఎకరా రూపాయికి ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సీఆర్డీఏ ఏర్పాటు చేసుకొని అవినీతికి పాల్పడుతున్నారన్నారు. గతంలో హైదరాబాద్ తరహలో జరిగిన తప్పిదాన్ని మరోసారి జరగవద్దని వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచిస్తున్నారని గుర్తుచేశారు. మచిలీపట్నంలో పోర్ట్ నిర్మాణం ఉందని, అంతే కాకుండా అన్ని వసతులు, భవనాలు ఉన్నాయని అటువంటి చోట రాజధాని నిర్మాణం చేపడితే ఖర్చు తక్కువతో పూర్తి ఆవుతుందన్నారు. అలా కాకుండా అమరావతిలో నిర్మాంచాలంటే లక్ష కోట్ల బడ్జెట్ అవసరం అవుతుందని, ఎప్పడు పూర్తవుతుందో చెప్పలేమన్నారు. గతంలో శివరామకృష్ణ కమిటీ రాజధాని నిర్మాణానికి అమరావతి సరియైన ప్రదేశం కాదని, అన్ని సంస్థలు ఒకే చోట నిర్మించవద్దని సూచించిందని చెప్పారు. గతంలో విజయవాడలో దిగువ ప్రాంతంలో వరదనీరు వచ్చి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. వరదనీరు తొలగించడానికి సుమారు 600 కోట్టు ఖర్చు చేయడం జరిగిందన్నారు. వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమను బుందేల్ఖండ్ తరహలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజీని కానీ కూటమి నాయకులు సాధించలేదన్నారు. ఇప్పడు ఏదో సాధించినట్లు సంబరాలు చేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని ఆయన ఎద్దేవాచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మునిసిపల్ విభాగం అధ్యక్షుడు వల్లభాయి హృషికేశవరెడ్డి, మాజీ కౌన్సిలర్ ముల్లా జాని, మాజీ మార్కెట్యార్డ్ చైర్మన్ రమణారెడ్డి, ఎర్రగుంట్ల రాజారెడ్డి, సుబ్రమణ్యం, చంద్రశేఖర్రెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజనం పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
పుంగనూరు : పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పంపిణీలో నిరక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చిన్నపిల్లల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు వెంకటపద్మలత, గాంధీబాబు హెచ్చరించారు. శనివారం డీఈవో సుబ్రమణ్యం, డొక్కాసీతమ్మ మధ్యాహ్నభోజనం అడిషినల్ డైరెక్టర్ రవికుమార్తో కలసి సభ్యులు పలు పాఠశాలలను సందర్శించారు. గత వారం నగరివీధిలోని యూపీస్కూల్లో భోజనంలో బల్లిరావడం, విద్యార్థులు అస్వస్థతకు గురికావడం విధితమే. దీనిపై సభ్యులు, అధికారులు విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పరిశీలించారు. అలాగే నక్కబండలో గల కస్తూర్బా పాఠశాల, అడవినాథునికుంటలోని మోడల్స్కూల్ను పరిశీలించారు. బాలికల హాస్టల్ను సందర్శించారు. వెంకటపద్మలత మాట్లాడుతూ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందించే విషయంలో రాజీపడరాదన్నారు. ఈ విషయాలపై నివేదికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండ చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో నటరాజారెడ్డి, తహసీల్దార్ రాము పాల్గొన్నారు. -
కుక్కల నివాసమా!
పర్యాటక కేంద్రమా.. హార్సిలీ హిల్స్ రోడ్డుపై కుక్కల స్వైర విహారంబి.కొత్తకోట: రాష్ట్రంలో ప్రముఖ వేసవి విడిది కేంద్రమైన బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ గ్రామ సింహాలకు నివాసంగా మారిపోయింది. అందం, ఆహ్లదంతో పర్యాటకులను అలరిస్తున్న చల్లని కొండపై ఈ గ్రామసింహాలు చేస్తున్న అలజడి అంతాఇంతా కాదు. కొన్నినెలల క్రితం ఒకటో రెండో కనిపిస్తుండగా ఇప్పుడు పదులసంఖ్యలో జనంతో పోటీపడి గుంపులుగా సంచరిస్తున్నాయి. వాటి సంఖ్య స్థానిక జనాభాతో పోటీపడుతూ సందర్శకులను హాడలెత్తిస్తున్నాయి. కొండపై ఇక్కడా అక్కడా అనికాదు ప్రతిచోట ఇవి తమ ప్రతాపం చూపిస్తున్నాయి. సందర్శకులు సంచరించే ప్రతిచోట ఇవి కనిపిస్తున్నాయి. ప్రకృతి సందర్శనా ప్రాంతాలైన అన్నిచోట్ల సందర్శకులు నడిచి వెళ్లేటప్పుడు వారివెంట పడుతూ దాడి చేస్తున్నాయి. దీంతో పర్యాటకులు భయభ్రాంతులకు గురై పరుగులు తీస్తున్నారు. గాలిబండ, ప్రధాన రహదారి, అతిథి గృహాలు, అటవీశాఖ పర్యావరణ సముదాయం, మానస సరోవరం, అటవీశాఖ అతిథి గృహాలు, పార్కులు..ఇలా అన్నిచోట్ల కుక్కలు గుంపులు ఉన్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు వీటివల్ల భయపడుతున్నారు. కాగా సాయంత్రం వేళల్లో కుక్కల అరుపులతో పర్యాటకులకు ప్రశాంతత కరువైంది. బిగ్గరగా అరుస్తున్న కుక్కల శబ్దాలతో సాయంత్రం వేళల్లో సందర్శకులు స్వేచ్ఛగా బయట తిరగలేకపోతున్నారు. సందర్శకులు ఎటు వెళ్తే అటుగా వారిపై పడుతున్నాయి. సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులోని హార్సిలీహిల్స్ పై చల్లదనం మాట దెవుడెరుగు కాని, ఇప్పుడు కుక్కలకు నివాసంగా మారిపోయింది. పొరుగున పరువుపోతోంది ఆహ్లాదకరమైన వాతావరణంలో పకృతి అందాలను తిలకించేందుకు, నిత్యం ఒత్తిళ్లతో సతమతమయ్యే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపారులు, కుటుంబాలతో వచ్చేందుకు ఇష్టపడే అతిథులు ఇక్కడికి వచ్చేందుకు వణికిపోతున్నారు. ఇక్కడ సేద తీరేందుకు వస్తున్న పర్యాటకులు కుక్కల కారణంగా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి అత్యధిక మంది ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నారు. వీరు ఇక్కడ అతిథి గృహాల్లో బసచేస్తున్నారు. పగలంతా కుక్కల హడావుడి, సందర్శకులపైకి దాడికి దిగడం. భయభ్రాంతులకు గురిచేయడంలాంటి ఘటనలతో ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రివేళ అయితే ఇక నిద్ర పోవాల్సిన పనిలేదు. కుక్కల అరుపులతో నిద్రపోని పరిస్థితి నెలకొంది. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న పర్యాటకులు ఈ కుక్కల సంచారం, వాటి వల్ల కలుగుతున్న ఇబ్బందులను చూసి అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వీటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పెదవి విరుస్తున్నారు. దీని కారణంగా పర్యాటక కేంద్రానికి ఉన్న పేరు దెబ్బతింటోంది. ఇక్కడికి వచ్చి వెళ్లిన సందర్శకులు ఈ కుక్కల బెడద గురించి చెప్పుకునే పరిస్థితి నెలకొంది. స్పందన లేని యంత్రాంగం హార్సిలీహిల్స్ పైకి ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రభుత్వస్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు వచ్చిపోతూ, ఇక్కడ విడది చేస్తుంటారు. అయితే ఇక్కడి పరిస్థితులపై పట్టించుకోకపోవడంతో ఈ కుక్కల సమస్యకు పరిష్కారం లేకపోయింది. స్థానిక అధికారులు, టౌన్షిప్కమిటి కనీసం స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కుక్కలను పట్టి ఇక్కడనుంచి తరలించాలని కోరుతున్నారు. హార్సిలీహిల్స్పై గ్రామ సింహాలస్వైర విహారం రాత్రివేళ భీకర అరుపులతోఉలిక్కిపడుతున్న అతిథులు రోడ్లపై నడవాలంటే భయం 15రోజుల క్రితం దుప్పిపై కుక్కల దాడి బెదిరిపోతున్న పర్యాటకులు హార్సిలీహిల్స్ చుట్టూ దట్టమైన అటవీప్రాంతం ఉంది. కుక్కులు అధికం కావడంతో ఘాట్రోడ్డుపైన, అడవిలో వీటి సంచారం అధికమైంది. వన్యప్రాణులు కనిపిస్తే వాటిపై దాడి చేస్తున్నాయి. కొంతకాలం కిత్రం వరకు కుందేళ్లు, జింకలు రోడ్లపై యధేచ్చగా సంచరిస్తూ కనిపించేవి. ప్రస్తుతం కనిపించడం లేదు. 15రోజుల క్రితం కుక్కలు ఓ దుప్పిని చుట్టుముట్టి దాడి చేసినట్టు స్థానికులు తెలిపారు. ఎత్తులో ఉండి, పరిగెత్తే దుప్పిలాంటి వన్యప్రాణిపైనే దాడి చేశాయంటే ఇక చిన్నచిన్న వాటిపై కుక్కల దాడి ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు కుక్కల బారినుంచి వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. -
వడ్డీలు కట్టలేక.. అప్పులు తీర్చేదారిలేక..
గాలివీడు: అధిక వడ్డీలు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. వడ్డీలు కట్టలేక.. అప్పులు తీర్చే దారిలేక.. వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ ఇద్దరూ తనువు చాలించారు. దీంతో పిల్లలు దిక్కులేని వారయ్యారు. వివరాలు.. అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కేంద్రంలోని శెట్టివారిపల్లెలో నివాసం ఉంటున్న మారువేణి మల్లికార్జున (35), అతని భార్య రాణి (30) కుటుంబ అవసరాల కోసం పరిసర ప్రాంతాల వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకున్నారు. భారీ మొత్తాలు చెల్లించినప్పటికీ అప్పుల భారం తగ్గ లేదు. వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిడి పెరగడం.. అప్పులు తీర్చేదారి లేక శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో భార్యభర్తలిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు గమనించి 108 ద్వారా రాయచోటి ప్రభుత్వఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శనివారం ఉదయం మల్లికార్జున మృతి చెందాడు. ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతూ రాణి కూడా శనివారం రాత్రి తుది శ్వాస విడిచింది. కాగా తాము ఆత్మహత్య చేసుకోవడానికి వడ్డీకి ఇచ్చినవారి వేధింపులే కారణమని చికిత్స పొందుతున్న సమయంలో రాణి వీడియో ద్వారా వెల్లడించింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పిల్లలకు ఎవరు దిక్కుఅంటూ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
మిస్టర్ ఇండియాగా డాక్టర్ ఎంసీ సందీప్
హైదరాబాద్: మిస్టర్ ఇండియాగా మదనపల్లికి చెందిన డాక్టర్ ఎంసీ సందీప్ ఎంపికయ్యారు.వీపీఆర్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీలో శనివారం జరిగిన ఫైనల్లో సందీప్ ఎన్నికైయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లికి చెందిన సందీప్ బెంగళూరుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో చీఫ్ కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నారు.బెంగళూరుతో పాటు దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో అనేక విజయవంతమైన గుండె శస్త్రచికిత్సలు చేశారు. మిస్టర్ ఇండియా టైటిల్ను గెలుచుకున్న డాక్టర్ సందీప్ను. మిస్సెస్ ఇండియా విజేత(2025) కవ్వం విజయలక్ష్మీరెడ్డి అభినందించారు. మారుమూల రాయలసీమ నుండి వచ్చి డాక్టర్తో పాటు మిస్టర్ ఇండియా టైటిల్ గెలిచుకోవటం రాయలసీమవాసులందరి విజయం అని ఆమె పేర్కొన్నారు. -
కాళీయమర్దనుడిగా కోదండరామడు
ఒంటిమిట్ట: ఏకశిలానగరిలో కొలువైన కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు శుక్రవారం ఉదయం కాళీయమర్దన అలంకారంలో జగదభిరాముడిని ముస్తాబు చేశారు. పట్టు వస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో అందంగా అలంకరించారు. ఉదయం 7:30 నుంచి 9:30 గంటల వరకు స్వామివారి ఊరేగింపు జరిగింది. భజన బృందాలు భజనలు, కోలాటాలు అడుతుండగా స్వామి వారు పురవీధుల్లో విహరించారు. అనంతరం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులకు అభిషేకం చేశారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ నిర్వహించారు. ఆశ్వవాహనంపై సీతాపతి శుక్రవారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉపనిషత్తుల ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్ముడు అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. బ్రహ్మోత్సవాల్లో నేడు: కోదండ రాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు శనివారం ఉదయం 10:30 నుంచి 11:15 గంటల వరకు చక్రస్నానం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. సాయంత్రం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు కు ధ్వజావరోహణం ఉంటుందని ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి తెలిపారు.


